Adilabad
-
● ఔట్సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపు నోటిఫికేషన్పై అభ్యంతరాలు ● నిబంధనలు పాటించలేదంటున్న పలు ఏజెన్సీల నిర్వాహకులు ● రద్దు చేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు ● నేడు దరఖాస్తుకు చివరి తేది
సాక్షి, ఆదిలాబాద్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కొంత మంది ఔట్సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకులు కలెక్టర్ను కలిశారు. నూతన ఎంప్యానల్మెంట్ ఏర్పాటు కోసం ఇటీవల విడుదల చేసిన టెండర్ నోటిఫికేష న్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. జీవో 4459 ప్రకా రం నిబంధనలు జారీ చేయాల్సి ఉండగా, ఆ జీవో ను బేఖాతరు చేస్తూ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారని, అందులో అడ్డగోలు నిబంధనలు పెట్టడంతో అనేక ఏజెన్సీలకు కనీసం దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఉందని వాపోయారు. ఇది కేవలం ప్రస్తు తం కొనసాగుతున్న కొన్ని ఏజెన్సీలకు మేలు చేసే లా నోటిఫికేషన్ రూపొందించినట్లు ఆ నిర్వాహకులు నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దరఖాస్తుకు మంగళవారం తుది గడువు కావడంతో ఆ నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరారు. నిబంధనల ప్రకారం కొత్తది జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన కలెక్టర్ ప్రజావాణిలో జిల్లాఇన్చార్జి ఉపాధికల్పన అధికారి మిల్కా అందుబాటులో లేకపోవడంతో ఫోన్ చేసి అక్కడినుంచే మాట్లాడారు. అభ్యంతరాలు ఇలా.. టెండర్ నోటిఫికేషన్లో పొందుపర్చిన పలు నిబంధనల విషయంలో ఏజెన్సీ నిర్వాహకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. 2006లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 4459ను పూర్తిగా బేఖాతరు చేస్తూ కొందరికి మాత్రమే మేలు చేసేలా ఈ నిబంధనలు రూపొందించారని పలువురు ఏజెన్సీల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. అందులో ప్రధానంగా దరఖాస్తు ఫీజు రూ.10వేలు, ఈఎండీ రూ.5లక్షలు చెల్లించాలని, రెండేళ్లలో రూ.కోటి టర్నోవర్ కలిగి ఉండాలని, వంద మంది ఉద్యోగుల నిర్వహణ చేసిన అనుభవం ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ విషయంలో పలువురు ఏజెన్సీ నిర్వాహకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా కొత్త ఏజెన్సీలకు ఈ నిబంధనల కారణంగా ఎలా అవకాశం లభిస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా వంద మంది ఉద్యోగుల నిర్వహణ కంటే తక్కువ సంఖ్యలో అనుభవం ఉన్న ఏజెన్సీల పరిస్థితి ఏమిటని అంటున్నారు. ప్రభుత్వ జీవోలో అసలు ఈఎండే తీసుకోవద్దని ఉన్నప్పటికీ రూ.5లక్షలు ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నిస్తున్నారు. నామమాత్రంగా దరఖాస్తు ఫీజు ఉండాల్సి ఉండగా, ఏకంగా రూ.10వేలు ఎలా నిర్ణయించారని ప్రశ్న లేవనెత్తుతున్నారు. అంతేకాకుండా నూతన ఎంప్యానల్మెంట్ రూపొందించేందుకు టెండర్లు నిర్వహిస్తుండగా, కమిటీ ఆమోదంతోనే ఈ నోటిఫికేషన్ జారీ అయ్యిందా అని అడుగుతున్నారు. ‘ఔట్సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపునకు సంబంధించిన టెండర్ నోటిఫికేషన్పై ఫిర్యాదులు వస్తున్నాయి.. ఈ విషయంలో ఏజెన్సీ నిర్వాహకులతో మంగళవారం సమావేశమై చర్చించి కొలిక్కి తేవాలి..’ ఇది జిల్లా ఇన్చార్జి ఉపాధికల్పన అధికారి మిల్కాకు కలెక్టర్ రాజర్షిషా ఫోన్లో చేసిన ఆదేశాలు. పరిశీలిస్తున్నాం.. ప్రజావాణిలో కొంత మంది ఏజెన్సీ నిర్వాహకులు నోటిఫికేషన్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దరఖాస్తు ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పరిశీలన చేస్తున్నాం. ఉపాధికల్పన అధికారి సోమవారం అందుబాటులో లేకపోవడంతో మంగళవారం ఈ విషయంలో ఆమె నుంచి స్పష్టత తీసుకొని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. అనంతరం తదుపరి చర్యలు చేపడతాం. – శ్యామలాదేవి, అదనపు కలెక్టర్ -
‘ఇందిరమ్మ’ కోసం ప్రత్యేక కౌంటర్
కై లాస్నగర్: ఇందిరమ్మ ఇళ్ల ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టరేట్ సమావేశ మందిరం వద్ద సోమవారం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. జెడ్పీ, మున్సిపల్, హౌసింగ్ శాఖల ఉద్యోగులు మధ్యాహ్నం 2గంటల వరకు అందుబాటులో ఉండి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆదిలాబాద్ పట్టణంతో పాటు వివిధ మండలాల నుంచి 25 ఫిర్యాదులు అందాయి. ఇందులో అత్యధికంగా అనర్హులకే ఇళ్లు కేటా యించారని పేర్కొనడం గమనార్హం. కాగా గత సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో ఇందిర మ్మ ఇళ్లపైనే అత్యధిక ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో కలెక్టర్ స్పందించి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తదుకనుగుణంగా మున్సిపల్ ఆధ్వర్యంలో ఈ కౌంటర్ అందుబాటులోకి తెచ్చారు. ‘విద్యుత్ గ్రీవెన్స్’ సద్వినియోగం చేసుకోండి ● ఎస్ఈ జేఆర్ చౌహాన్ఆదిలాబాద్టౌన్: వి ద్యుత్ వినియోగదా రుల సమస్యల పరి ష్కారామే ధ్యేయంగా చేపట్టిన విద్యుత్ ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రాన్స్కో ఎస్ఈ జేఆర్. చౌ హాన్ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ, 2024 జూన్ 17న శ్రీ కారం చుట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ఇ ప్పటి వరకు 754 ఫిర్యాదులు అందగా 699 ప రిష్కరించామన్నారు. విద్యుత్ బిల్లులు, మీ టర్లు, కరెంట్ సరఫరాలో హెచ్చు తగ్గులు, కేట గిరీ, పేరు మార్పు, ప్రమాద భరిత స్తంభాలు వంటి ఫిర్యాదుల్లోని సమస్య తీవ్రత ప్రకారం అప్పటికప్పుడు పరిష్కరించినట్లు తెలిపారు. కొన్ని సమస్యలను సమయం తీసుకొని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సర్కిల్ పరిధిలోని డివిజన్ ఆఫీస్, ఈఆర్వో, సబ్డివిజన్ ఆఫీస్, సెక్షన్ ఆఫీస్లలో ఈ ప్రజావాణి ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సర్కిల్ ఆఫీస్లో అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఫిర్యాదులు అందించవచ్చని తెలిపారు. గ్రీవెన్స్లో అందిన ఆయా సమస్యలను సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి
ఆదిలాబాద్: ఈ నెల 20న దేశవ్యాప్తంగా ని ర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్ర ధాన కార్యదర్శి దేవేందర్ కోరారు. జిల్లా కేంద్రంలోని యూనియన్ జిల్లా కార్యాలయంలో సమ్మెకు సంబంధించిన పోస్టర్ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని సంఘటి త, అసంఘటిత రంగాల కార్మికులంతా పా ల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఇందులో ఖాసీం, అఫ్రోజ్, మహేందర్, సలీం, జమీల్ తదితరులు పాల్గొన్నారు. -
బారులు తీరి.. సమస్యలు నివేదించి
● ప్రజావాణికి 107 దరఖాస్తులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్కైలాస్నగర్: ప్రజాసమస్యల పరిష్కారం కోసం కలె క్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్కు అర్జీదారులు బారులు తీరారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారంతా కలెక్టర్ రాజర్షి షాకు తమ గోడు విన్నవించి దరఖాస్తులు అందజేశారు. వాటిని కలెక్టర్ సంబంధిత అధికారులకు అందజేస్తూ పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు. పెండింగ్లో ఉంచొద్దని సూచించారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, ఆర్డీవో వినోద్కుమార్తోపాటు ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ వారం మొత్తం 107 అర్జీలు అందాయి. ఇందులో భూ సమస్యలు, పింఛన్, విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు వంటి సమస్యలే అధికంగా ఉన్నాయి. కాగా, ఈ వారం వచ్చిన దరఖాస్తుదారుల్లో కొందరి నివేదన వారి మాటల్లోనే.. -
సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ
ఆదిలాబాద్టౌన్: బాధితుల సమస్యలను సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 30 మంది తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. ఈ మేరకు ఆయన సంబంధిత అధికారులతో వెంటనే ఫోన్లో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఎలాంటి అత్యవసర సమయంలో అయినా బాధితులు డయల్ 100లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలు దృష్టికి వస్తే ‘డయల్ ఎస్పీ’ కార్యక్రమంలో భాగంగా 8712659973 నంబర్కు సమాచారం అందించాలని సూచించారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో సీసీ కొండ రాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి కవిత తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ -
సర్కారు బడుల్లోనే చేర్పించాలి..
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లల్ని అందులోనే చేర్పించాలి. ఇటీవల పదో తరగతి ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు 97శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇందులో 58 బడుల్లో వందశాతం ఉత్తీర్ణత నమోదైంది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన అందిస్తున్నాం. మరింత నాణ్యమైన బోధన అందించేందుకు ఐదు రోజుల పాటు వారికి శిక్షణ కల్పిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టారు. – ఏనుగు శ్రీనివాస్రెడ్డి, డీఈవో -
సైనికుల సేవలు చిరస్మరణీయం
ఆదిలాబాద్: భారత్–పాకిస్తాన్ సరిహద్దులో విధి నిర్వహణలో వీరమరణం పొందిన సైనికుల సేవలు చిరస్మరణీయమని మాజీ మంత్రి జోగు రామ న్న అన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన భారతీయులు, సరిహద్దుల్లో మరణించిన సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆదివారం వినాయక్ చౌక్లోని కార్గిల్ అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న సైనికుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఇందులో సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్ దాస్, మజారుద్దీన్, వామన్రెడ్డి, రమేశ్, వినోద్, నాయకులు అలాల్ అజయ్, మెట్టు ప్రహ్లాద్, యూనుస్ అక్బానీ, కస్తాల ప్రేమల, చందాల రాజన్న, దాసరి రమేష్, సలీం పాషా, కొండ గణేశ్ తదితరులున్నారు. -
భూసర్వే సమస్యకు ఇక చెక్
● త్వరలోనే లైసెన్స్డ్ సర్వేయర్లు ● శిక్షణ కోసం దరఖాస్తుల స్వీకరణ ● ఈ నెల 17వరకు గడువుశిక్షణ ఫీజు వివరాలు అభ్యర్థులు ఫీజు ఓసీ రూ.10వేలు బీసీ రూ.5వేలు ఎస్సీ, ఎస్టీ రూ.2,500 కై లాస్నగర్: జిల్లాలో సర్వేయర్ల కొరత వేధిస్తోంది. సరిపడా లేకపోవడంతో భూసర్వే పనులకు ఆటంకం కలుగుతుంది. ధరణితో ఏర్పడ్డ భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు మండల సర్వేయర్ల కోసం కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. దరఖాస్తు చేసుకుని నెలలు గడిచినా సర్వేయర్ వచ్చే పరిస్థితి లేదు. ఈ ఇక్కట్లను దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకంపై దృష్టి సా రించింది. ప్రైవేట్ సర్వేయర్లతో పాటు ఆసక్తి, అర్హత గల వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఎంపిక చేసిన వారికి శిక్షణ ఇచ్చి లైసెన్స్లు జారీ చేయాలని నిర్ణయించింది. మండలానికి కనీసం ఇద్దరు ఉండేలా ... భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకంపై దృష్టి సారించింది. 60 శాతం మార్కులతో గణితం ఓ సబ్జెక్టుగా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన వారు, ఐటీఐ డ్రాఫ్ట్మెన్(సివిల్), డిప్లొ మా, బీటెక్ సివిల్ లేదా తత్సమాన అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. పాత సర్వేయర్లతో పాటు ఆసక్తి గల వారు ఈ నెల 17లోపు మీసేవ కేంద్రాల్లో రూ.100 చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందులో అర్హులైన వారిని ఎంపిక చేసి వారికి ఈ నెల 26 నుంచి జూలై 26వరకు జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఒక్కో మండలానికి కనీసం ఇద్దరు చొప్పున నియమించనున్నట్లుగా తెలుస్తోంది. మూడు విడతల్లో శిక్షణ ... ఎంపిక చేసిన వారికి మూడు దశల్లో శిక్షణ ఇవ్వనున్నారు. థియరీ, టిప్పన్ ప్లాటింగ్, ఫిల్డ్ లెవల్లో ట్రెయినింగ్ ఉంటుంది. అనంతరం 40 రోజుల పాటు మండల సర్వేయర్ కింద ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. విజయవంతంగా పూర్తి చేసిన వారికి జిల్లా స్థాయిలో పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఫైనల్ అసెస్మెంట్ టెస్టు నిర్వహిస్తారు. ప్రతిభ కనబరిచిన వారికి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ విభాగం ద్వారా లైసెన్స్లు జారీ చేస్తారు. అలాంటి వారికి రైతుల భూములను సర్వే చేసేందుకు అధికారికంగా గుర్తింపు లభించనుంది. సర్వేయర్ల కొరత లేకుండా ... ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లాలో సర్వేయర్ల కొ రత తీరనుంది. ప్రస్తుతం 21 మండలాలకు గాను 8మంది మండల సర్వేయర్లు, ఇద్దరు డిప్యూటీ సర్వేయర్లు మాత్రమే పనిచేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్ర భుత్వం తెచ్చిన ధరణి చట్టంతో జిల్లాలో భూ సమస్యలు కుప్పలుగా పేరుకుపోయాయి. ల్యాండ్ మి స్సింగ్, పట్టాదారు పేరు తారుమారు, విస్తీర్ణంలో తేడా వంటి అనేక సమస్యలున్నాయి. దీంతో సర్వే కోసం అందిన దరఖాస్తులు వందల సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయి. దీనికి తోడు రియల్ ఎస్టేట్ కారణంగా జిల్లాలో వ్యవసాయ భూములు పెద్ద ఎత్తున వెంచర్లుగా మారుతున్నాయి. నాలా కన్వర్షన్ కోసం సైతం అప్లికేషన్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో లైసెన్స్డ్ సర్వేయర్లు అందుబాటులోకి వస్తే భూ సర్వే పనులు వేగవంతంగా సాగే అవకాశముంది. సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న భూభారతి చట్టంలో అర్హులైన వారి సేవలను సర్వేయర్లుగా వినియోగించుకో వాలని భావిస్తోంది. వారికి శిక్షణ ఇచ్చి లైసెన్స్లు జారీ చేయనుంది. నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం. అర్హులైన వారు ఈనెల 17వరకు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. – ఎం.రాజేందర్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ, ఆదిలాబాద్ -
పర్యవేక్షణపై దృష్టి సారించాలి
అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు, ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలి. ఎంఈవో, డిప్యూటీ ఈవో, డీఈవో పోస్టులు భర్తీ చేస్తేనే సర్కారు విద్య గాడిన పడుతుంది. డైట్ కళాశాలలో లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యావ్యవ్థ కుంటుపడుతుంది. వీటిపై దృష్టి సారిస్తే సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. – బి.రవీంద్ర, ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
ఆ వ్యాపారులకు సహకరిస్తే కేసులు
● కలెక్టర్ రాజర్షి షా ● జొన్నల విక్రయాలపై అధికారులతో సమీక్ష కైలాస్నగర్: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మ ద్దతు ధరతో జొన్నలు విక్రయించే వ్యాపారులకు సహకరించే రైతులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. జొన్న ల కొనుగోళ్లపై సంబంధిత శాఖ అధికారులతో ఆదివారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 15 కేంద్రాల్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోళ్లు చేపడుతున్నట్లు తెలిపారు. క్వింటాల్కు రూ.3,371 మద్దతు ధరతో రైతుల నుంచి విక్రయిస్తున్నట్లు తెలిపారు. అయితే కొంతమంది వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు జొన్నలను తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. విజిలెన్స్ బృందాల ద్వారా నిరంతర నిఘా ఉంచినట్లు తెలిపారు. అక్రమంగా తీసుకువస్తే జొన్న బస్తాలతో పాటు వాహనాలను సీజ్ చేసి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఇప్పటికే భీంపూర్ మండలంలో రెండు బొలేరో వాహనాలు, ట్రాక్టర్, అలాగే ఇచ్చోడలోని మాదాపూర్లో 500 బస్తాల జొన్నలు, ఇంద్రవెల్లిలో 87 బస్తాలు, బజార్హత్నూర్లో 54 బస్తాలను సీజ్ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 7780 మంది రైతుల నుంచి రూ.83.21 కోట్ల విలువైన 2.46లక్షల క్వింటాళ్ల జొన్నలను కొనుగోలు చేసినట్లు వివరించారు. సమావేశంలో డీఏవో శ్రీధర్ స్వామి, డీసీవో మోహన్, మార్కెటింగ్ అధికారి గజానంద్, మార్క్ఫెడ్ డీఎం ప్రవీణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సైన్యానికి మద్దతుగా పూజలు
తాంసి: ఉగ్రవాద నిర్మూలనలో భాగంగా సరి హద్దులో పోరాటం చేస్తున్న భారత త్రివిధ దళాలకు, ఆపరేషన్ సిందూర్కు ప్రతి ఒకరూ మద్దతుగా నిలవాలని ఎంపీ గోడం నగేశ్ కోరారు. త్రివిధ దళాలకు మద్దతుగా మండలంలోని పొన్నారి సంకట్యోచన్ హనుమా న్ ఆలయంలో ఎంపీ ఆదివారం ప్రత్యేక పూ జలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, పాక్ ఉగ్రవాదులు సరిహద్దు వెంట దాడులకు పాల్పడుతుండగా భారత త్రి విధ దళాలు ధీటుగా తిప్పికొడుతున్నాయన్నారు. ఇందులో మాజీ జెడ్పీటీసీ రాజు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంతోష్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు చంద్రకిరణ్, నాయకులు సదానంద్, అరుణ్, నారాయణ, ప్రవీణ్ రెడ్డి తదితరులున్నారు. -
‘యువ వికాసం’పై కసరత్తు
కై లాస్నగర్: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగా రూ.50వేల నుంచి రూ.4.లక్షల వరకు ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించింది. ఇందుకోసం గత నెల 7నుంచి 14వరకు ఆఫ్లైన్, ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించింది. జిల్లాలో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇందులో అర్హులను గుర్తించేందుకు చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలన ముమ్మరంగా సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో వార్డు ఆఫీసర్లు ఇంటింటికీ వెళ్లి దరఖాస్తుదారుల వివరాలు, స్థితిగతులను ఆరా తీస్తున్నారు. వారు ఎంపిక చేసిన జాబితాలను సోమవారం (నేటి)లోగా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్కు అందజేయాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ సంక్షేమశాఖలన్నింటివి కలిపి 47,762 దరఖాస్తులు అందగా, ఇప్పటివరకు 39,727 పరిశీలించారు. మిగతా దరఖాస్తులు పరిశీలించాల్సి ఉంది. వాటి పరిశీలనను నేటితో పూర్తిచేసేందుకు అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ విషయమై కలెక్టర్ ఇటీవల సంబంధిత శాఖల అధికారులు, బ్యాంకర్లతో పలుమార్లు సమీక్షించారు. ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. 13 నుంచి మండల స్థాయిలో.. ఎంపీడీవోలకు అందిన దరఖాస్తుల ఆధారంగా ఈనెల 13 నుంచి 19వరకు మండల స్థాయిలో లబ్ధిదారుల ఎంపికకు మండల కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఎంపీడీవో నేతృత్వంలోని ఈ కమిటీలో ఎంపీవో, మండల ప్రత్యేక అధికారి, బ్యాంక్ మేనేజర్లు సంబంధిత శాఖల నుంచి ఎంపిక చేసిన అధికారులు ప్రాతినిధ్యం వహిస్తారు. సంక్షేమ శాఖలకు సంబంధించి మండల స్థాయి కమిటీలో హెచ్డబ్ల్యూవోలను నియమించారు. మున్సిపాలిటీలో గెజిటెడ్ అధికారులను కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు. వీరి ఆధ్వర్యంలో అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి మండలాలకు కేటాయించిన యూనిట్ల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఇలా ఎంపిక చేసిన వారి వివరాలను జిల్లా కమిటీకి ప్రతిపాదిస్తారు. అయితే యూనిట్ల సంఖ్య తక్కువగా ఉండి, దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో లబ్ధిదారుల ఎంపిక అధికారులకు తలనొప్పిగా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అర్హులను గుర్తిస్తేనే నిరుద్యోగులకు లబ్ధి చేకూరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 20 నుంచి జిల్లా స్థాయిలో.. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ఈనెల 20 నుంచి 30 వరకు మండల కమిటీలు అందజేసిన అర్హుల వివరాలను జిల్లా కమిటీ పరిశీలిస్తుంది. ఈ కమిటీకి కలెక్టర్ చైర్మన్గా, అడిషనల్ కలెక్టర్ వైస్ చైర్మన్గా, డీఆర్డీవో నోడల్ అధికారిగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల అధికారులు, బ్యాంకు ఉన్నతాధికారులు కమిటీ సభ్యులుగా ఉండనున్నారు. ఈ కమిటీ మండల స్థాయి నుంచి అందిన దరఖాస్తులను, వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అర్హత ఆధారంగా యూనిట్ల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. ఈ ప్రక్రియను ఈనెల 25 నుంచి 30వ తేదీ వరకు పూర్తి చేయనుంది. ఆయా తేదీల్లోనే ప్రొసీడింగ్లను సైతం సిద్ధం చేయనుంది. జిల్లా కమిటీ ఎంపిక చేసిన లబ్ధిదారులకు జూన్ 2న మంజూరు పత్రాలు అందజేయనున్నారు. తొలివిడతలో రూ.50వేలు, రూ.లక్ష లోపు రుణాలు అందజేయనున్నట్లుగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వారి సంఖ్య తక్కువగా ఉండటంతో తొలివిడతలోనే వారికి లబ్ధి చేకూరే అవకాశముంది. నేటితో ముగియనున్న క్షేత్రస్థాయి పరిశీలన 13 నుంచి మండలస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ 20 నుంచి జిల్లా స్థాయిలో గుర్తింపు శాఖల వారీగా అందిన దరఖాస్తులు, పరిశీలన వివరాలు శాఖ అందిన పరిశీలించినవి దరఖాస్తులు ఎస్సీ కార్పొరేషన్ 9804 8143 ఎస్టీ సంక్షేమ శాఖ 12855 11039 బీసీ 18581 15773 ఈబీసీ 653 376 మైనార్టీ 5814 4364 క్రిస్టియన్ మైనార్టీ 55 32 జిల్లాలో కులాల వారీగా కేటాయించిన యూనిట్లు ఎస్సీ 2,662 ఎస్టీ 6,480 బీసీ 2,403 ఈబీసీ 724 ముస్లిం మైనారిటీ 1,003 క్రిస్టియన్ మైనారిటీ 31 పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ రాజీవ్ యువ వికాసం పథకం కింద ప్రభుత్వ ఆర్థికసాయం కోసం అందిన దరఖాస్తులకు సంబంధించిన వివరాల క్షేత్రస్థాయి పరిశీలన సోమవారంలోగా ముగియనుంది. ఈ నెల 13 నుంచి 20వరకు మండల స్థాయిలో లబ్ధిదారుల ఎంపికకు మండల కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు ఉంటాయి. 20 నుంచి 30వరకు జిల్లా స్థాయిలో ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. కలెక్టర్ నేతృత్వంలో పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. ఎంపికై న లబ్ధిదారులకు జూన్ 2న రుణ మంజూరు పత్రాలు అందించేలా ముందుకు సాగుతున్నాం. – మనోహర్రావు, రాజీవ్ యువ వికాసం జిల్లా కన్వీనర్ -
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం●
● డీఎస్పీ జీవన్రెడ్డి ఆదిలాబాద్టౌన్: అసాంఘిక కార్యకలాపాల పై ఉక్కుపాదం మోపుతామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి అన్నారు. పట్టణంలోని వడ్డెర కాలనీలో ఆదివారం కమ్యూనిటీ కాంటాక్ట్ కమ్ కార్డెన్సెర్చ్ నిర్వహించారు. ఇళ్లలో సోదాలు చేపట్టారు. కాలనీకి చెందిన ఒల్లెపు బాబన్న బైక్ నంబర్ మార్ఫింగ్ చేసి మరో నంబర్ బిగించినట్లు గుర్తించారు. ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాలనీకి చెందిన దారంగుల గంగమ్మ ఇంట్లో సోదాలు చేయగా 17దేశీదారు బాటిళ్లతో పా టు ఒక బీర్ లభించినట్లు పేర్కొన్నారు. ఆమె పై కూడా కేసు నమోదు చేసినట్లు వివరించారు. స్క్రాప్ యజమానులు దొంగతనం చేసిన వస్తువులను కొనుగోలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రెండు రోజుల పాటు ఆదిలాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని స్క్రాప్ దుకాణాలను తనిఖీ చేయగా, సర్వీస్ వైర్లు, అగ్రికల్చర్కు సంబంధించిన సబ్మెర్సిబుల్ మో టార్లు, కాపర్ తీగలు కొనుగోలు చేసినట్లు తేలిందన్నారు. తొ మ్మిది మందిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ఎవరైనా కాపర్వైర్లు, ఇతర వస్తువులు అమ్మడానికి వస్తే వారి వివరాలు, ఫోన్ నంబర్లు నమోదు చేయాలని సూచించారు. అలాగే దుకాణాల్లో సీసీ కెమెరాలు బిగించుకోవాలన్నారు. డీఎస్పీ వెంట టూ టౌన్ ఎస్సైలు తిరుపతి, విష్ణుప్రకాశ్, హెడ్కానిస్టేబుల్ బబిత తదితరులున్నారు. -
ఎనిమిది కాళ్ల వింత మేకపిల్ల జననం
ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని బొక్కల్గూడలో నివాసం ఉంటున్న రాజలింగుకు చెందిన మేక ఆదివారం ఎనిమిది కాళ్లతో వింత మేకపిల్లకు జన్మనిచ్చింది. కొద్ది సేపటికే మృతి చెందింది. మేక ఈత కోసం యజమాని పశువైద్యశాలకు తీసుకెళ్లాడు. వైద్యుడు దూద్రాం రాథోడ్ సిజేరియన్ అవసరం ఉందని గ్రహించి ఆపరేషన్ చేశాడు. ఒక తల, ఎని మిది కాళ్లతో వింతగా జన్మించింది. జన్యులోపం కారణంగా ఇలాంటివి జన్మిస్తాయని, శాస్త్ర పరిభాషలో అక్టోగోట్ ఫీటస్, పాలిమేలియా అంటారని వైద్యుడు తెలిపారు. మేక కు శస్త్ర చికిత్స చేసిన వారిలో రాథోడ్ లావణ్య, సిబ్బంది ఉన్నారు. -
పట్టుదలకు ప్రోత్సాహం
బెల్లంపల్లి: తాండూర్ మండలం మాదారం టౌన్షిప్కు చెందిన ఎనగంటి శ్యామలకు దేశమన్నా.. దేశభక్తి అన్నా ఎనలేని అభిమానం. అణువణువునా మాతృదేశంపై మమకారం పెంచుకుంది. ఎనగంటి శ్యామల, సమ్మిరెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. సమ్మిరెడ్డి సింగరేణి కంపెనీలో కార్మికుడిగా పని చేసేవారు. పిల్లలు చిన్నతనంలో ఉండగానే 1988లో అకాల మరణం చెందారు. దీంతో కుటుంబ బాధ్యతలు శ్యామలపై పడ్డాయి. భర్త వారసత్వంగా వచ్చిన సింగరేణి ఉద్యో గం చేస్తూ ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేసింది. చిన్న కుమారుడు రాజశేఖర్ డిగ్రీ చదువుతూనే 2006లో ఇండియన్ ఎయిర్ఫోర్స్లో ఉద్యోగం సాధించాడు. తల్లి ఆశించినట్లుగానే దేశ రక్షణలో విధులు నిర్వర్తిస్తున్నాడు. రాజశేఖర్ పెద్దనాన్న కుమారులు ఒకరు ఇండియన్ ఎయిర్ఫోర్స్, మరొకరు నేవీలో పని చేసేవారు. వారి స్ఫూర్తితో మూ డో ప్రయత్నంలో ఎయిర్ఫోర్స్లో ఉద్యోగం సాధించి తల్లి కలను సాకారం చేశాడు. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో సార్జెంట్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. దేశ సేవ చేయాలనే పట్టుదల కుమారుడికి ఉండడంతో ప్రోత్సహించింది. రెండు సార్లు విఫలమైనా వెన్నుతట్టి అండగా నిలబడడంతో నేడు దేశ సేవలో ముందున్నాడు. -
తండ్రిని రోకలితో కొట్టి చంపిన తనయుడు
● నిర్మల్ జిల్లా రాజూరలో ఘటన లోకేశ్వరం: తండ్రిని రోకలితో కొట్టి తనయుడు చంపాడు. నిర్మల్ జిల్లా మండలంలోని రాజూర గ్రామంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ముధోల్ సీఐ మల్లేశ్ కథనం ప్రకారం.. రాజూర గ్రామానికి చెందిన గన్నారం భూమన్న(80)కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు భూమన్న, రెండో కుమారుడు సుదర్శన్, మూడో కుమారుడు సాయికృష్ణ. సుదర్శన్ మూడేళ్ల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నాడు. సాయికృష్ణ హైదరాబాద్లో పనిచేస్తూ జీవిస్తున్నాడు. పెద్దకుమారుడు భూమన్న భార్య సునీతకు ఏడాది క్రితం గొడవల కారణంగా పుట్టింటికి నిజామాబాద్ జిల్లా అంకాపూర్కు వెళ్లిపోయింది. రాజురాలో తనకున్న మూడెకరాల్లో పెద్దకుమారుడు వ్యవసాయంతోపాటు కూలీ పని వెళ్లి తండ్రి భూమన్నకు పోషించుకుంటున్నాడు. ఇద్దరు ఇంట్లో ఉంటున్నారు. మూడు రోజులుగా తిండి పెట్టటం లేదని తండ్రి, పెద్దకుమారుడి మధ్య గొడవ జరిగింది. శనివారం తెల్లవారుజామున ఇద్దరు గొడవపడ్డారు. క్షణికావేశానికి లోనైన కుమారుడు రోకలితో తండ్రి తలపై కొట్టి హత్య చేశాడు. మృతుడి కుమారై సుజాత ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అంతకుముందు భైంసా ఏఎస్పీ అవినాష్కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ముధోల్ సీఐ మల్లేశ్, లోకేశ్వరం ఎస్సై అశోక్ను అడిగి తెలుసుకున్నారు. ఈ కేసుపై విచారణ జరిపి నిందితుడిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
అదృష్టంగా భావిస్తున్నా
బోథ్: నాపేరు తక్కల స్వరూప. నాకు కుమారుడు, కూతురు ఉన్నారు. భర్త మృతిచెందిన కొంతకాలానికి కుమారుడు శైలన్ రెడ్డికి ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. ఆర్మీలో విధులు నిర్వహించడం ఆనందంగా ఉంది. దేశం కోసం పోరాడే అవకాశం రావడం సంతోషంగా ఉంది. బోథ్: నా పేరు కదం అనసూయ. నాకు ఐదుగురు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు ఆర్మీలో విధులు నిర్వహిస్తారు. రెండవ కుమారుడు ప్రవీణ్ కుమార్, మూడవ కుమారుడు ప్రతాప్లు ఆర్మీలో పనిచేస్తున్నారు. నా ఇద్దరు కుమారులు ఆర్మీలో విధులు నిర్వహించడం ఆనందంగా ఉంది. అదృష్టంగా భావిస్తున్నా. తానూరు: భోసికి చెందిన బాయి లక్ష్మి బాయి–భూమన్న దంపతుల కుమారుడు సాయినాథ్. 2004లో ఆర్మీలో ఉద్యోగం సాధించి విరమణ పొదాడు. తల్లి ఆశయం నెరవేర్చేందుకు 2024లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికై నిజామాబాద్లో విధులు నిర్వహిస్తున్నాడు. తల్లి కల నేరవేర్చడంతో తల్లి సంతోషం వ్యక్తం చేస్తోంది. – లక్ష్మిబాయి సంతోషంగా ఉంది. నా కల నెరవేర్చాడు -
బైక్పై నుంచి పడి మహిళ మృతి
లోకేశ్వరం: ప్రమాదవశాత్తు బైక్పై నుంచి పడి మహిళ మృతి చెందింది. ఎస్సై ఆశోక్ కథనం ప్రకారం.. కుంటాల మండలం కల్లూర్ గ్రామానికి చెందిన పసుల సాయన్న– పసుల గోదావరి (40) దంపతులు. వీరు ఈనెల 6న బావమరిది కూతురు పెళ్లికి మండలంలోని పిప్రి గ్రామానికి బైక్పై వచ్చారు. పెళ్లి ముగించుకుని శనివారం బైక్పై స్వగ్రామానికి బయల్దేరారు. మండలంలోని హవర్గ సమీపంలోని శ్మశానవాటిక వద్ద బైక్పై నుంచి కళ్లు తిరిగి గోదావరి కింద పడడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలు గోదావరి తమ్ముడు దాస శేఖర్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
లైంగికవేధింపులకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: ఓ మహిళ పేరిట సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వన్టౌన్ సీఐ సునీల్కుమార్ తెలిపారు. శనివారం పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన ఓ మహిళ బంధువులు పంజాబ్లో నివసిస్తున్నారు. కొన్ని అవసరాల నిమిత్తం అమృత్సర్కు చెందిన అసిస్టెంట్ ట్రెజరర్ మునీష్ కుమార్ను వీరు సంప్రదించారు. సదరు అధికారి డబ్బులు ఆశించాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో పనులు చేసేందుకు నిరాకరించాడు. దీంతో అతన్ని మహిళ తరపు బంధువులు విజిలెన్స్ అధికారులకు పట్టించారు. వారిపై కక్ష పెంచుకున్న మునీష్ కుమార్ ఆదిలాబాద్కు చెందిన మహిళ పేరిట పేస్బుక్లో ఫేక్ ఐడీని క్రియేట్ చేసి, సదరు మహిళ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆదిలాబాద్ సైబర్ క్రైమ్ బృందం సహకారంతో, వన్టౌన్ పోలీసులు నిందితుడిని గుర్తించి అమృత్సర్ నుంచి ఆదిలాబాద్కు తీసుకువచ్చారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. -
అమ్మా వందనం..
తల్లులకు పిల్లలన్నా.. ఇల్లన్నా ఎంతో ప్రేమ. ఆ తల్లుల ప్రేమ ఇల్లు, పిల్లలకే పరిమితం కాలేదు. దేశాన్నీ ప్రేమించారు. మాతృభూమిపై మమకారంతో దేశ సేవ కోసం పిల్లలకు ఉగ్గుపాల నుంచే దేశభక్తిని నూరిపోశారు. నేడు ఎంతోమంది సైనికులు సరిహద్దులో దేశ సేవ చేస్తున్నారంటే ఆ మాతృమూర్తులే కారణం. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న సైనికుల విజయం వెనుక ఉన్నది ఆ తల్లులే. దేశానికి ఎంతోమంది వీర సైనికులను అందించిన తల్లులపై నేడు మదర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. ● దేశ సేవకు పిల్లలను పంపిన మాతృమూర్తులు ఎందరో.. ● నేడు మదర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. -
ఎడారి దేశంలో జిల్లావాసి జైలు జీవితం
● చేయని నేరానికి గల్ఫ్ బాధితుడి నరకయాతన ● న్యాయ సహాయం కోసం కుటుంబసభ్యుల వేడుకోలు నిర్మల్ఖిల్లా: చేయని నేరానికి అకారణంగా ఎడారి దేశంలో జైలుశిక్ష అనుభవిస్తున్న తమ కుటుంబ సభ్యుడికి న్యాయ సహాయం అందించాలని గల్ఫ్ బాధిత కుటుంబ సభ్యులు కోరారు. జిల్లా కేంద్రంలో శనివారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ స్వదేశ్ వర్కిపండ్లతో కలిసి కలిసి వివరాలు వెల్లడించారు. కుంటాల మండలం అంబకంటి గ్రామానికి చెందిన గజకరెడ్ల సాయన్న (51) ఉపాధి నిమిత్తం గతేడాది దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఏప్రిల్ 16న స్థానిక పోలీసులు అరెస్టు చేసి అబుదాబీ జైలుకు తరలించారు. సమాచారం తెలిసిన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై ఎవరిని సంప్రదించాలని తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో ఎన్ఆర్ఐ రాష్ట్ర అడ్వైజరీ కమిటీ సభ్యుడు స్వదేశ్ పరికిపండ్లను కలిసి సమస్యను వివరించారు. నిరక్షరాస్యత కారణంగా తన పేరిట ఇతరులకు తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో అక్కడి పోలీసులు అరెస్టు చేసి జైలులో వేసినట్లు కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వదేశ్ మాట్లాడుతూ బాధితుడి సమగ్ర వివరాలతో అక్కడి ఎంబసీకి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చామన్నారు. న్యాయసహాయం ద్వారా జైలు నుంచి విడిపించే ప్రయత్నం చేస్తామని కుటుంబసభ్యులకు భరోసానిచ్చారు. బాధితుడి తల్లి భోజవ్వ, భార్య మంజుల, కుమారుడు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
దేశ సేవకే అంకితమయ్యాడు
నా పెద్ద కొడుకు రంగారావ్ ఆర్మీలో చేరి దేశ రక్షణ కోసం పోరాడాడు. విధి నిర్వహణలోనే ప్రాణాలొదిలాడు. 2005లో హిమాచల్ ప్రదేశ్లో సట్లేజ్ నది దాటుతున్న క్రమంలో అందులో పడి అమరుడయ్యాడు. కనీసం మృతదేహం కూడా లభ్యం కాలేదు. అయినా దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ను కన్న తల్లిగా నేను గర్వపడుతున్నా. బిడ్డ గుర్తుకు వచ్చినప్పుడల్లా కన్నీళ్లు ఆగవు. అయినా వాటిని దిగమింగుతా. నా కొడుకు విగ్రహాన్ని సమాఖా చౌరస్తాలో ఏర్పాటు చేశారు. గుర్తుకొచ్చినప్పుడల్లా అక్కడికి పోతా. విగ్రహాన్ని తాకుతా. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటా. – అంతర్వేది దాసోదిబాయి (రంగారావ్ తల్లి), గోపాల్సింగ్తండా, ఇంద్రవెల్లి -
ఆలయం వెనుక ఆలయం!
● వేంకటేశ్వర టెంపుల్ వెనుకాల కొత్త మందిరం ● గతంలో వివాదాలతో పనులకు బ్రేక్ ● పదేళ్లుగా ముందుకు సాగని ప్రక్రియ ● అరిష్టమంటున్న భక్తులు సాక్షి, ఆదిలాబాద్: ప్రస్తుతం ఉన్న ఆలయం శాస్త్రప్రకారం లేదని దాని వెనుకాలే కొత్త ఆలయం నిర్మించాలని పదేళ్ల క్రితం తలపెట్టారు. మండలం, అంతరాలు, అన్ని నియమాలతో కట్టాలని నిర్ణయించారు. రూ.80లక్షలతో పనులకు శ్రీకారం కూడా చుట్టారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే పనులు తుది దశకు వచ్చాయి. ముందుగా అనుకున్నట్లే కొత్త ఆలయం పూర్తవుతుందని భక్తులు భావించారు. ఆ తర్వాత ఏమైందో కానీ ప్రక్రియ నిలిచిపోయింది. ఏళ్లు గడుస్తున్నా ముందుకు సాగని పరిస్థితి. పాత ఆలయం యథావిధిగా కొనసాగుతోంది. కొత్త ఆలయంపై మొక్కలు దర్శనమిస్తున్నాయి. పట్టించుకునే వారే లేరు. అయితే అశాసీ్త్రయాన్ని శాసీ్త్రయం చేసే విషయంలో నాడు అడ్డుపుల్ల వేసిన వారికే ఇది మంచిది కాదని కొంతమంది భక్తులు అంటున్నారు. ఆలయం వెనకాల కొత్త ఆలయాన్ని నిర్మించి మధ్యలోనే వదిలిపెట్టడం ఆదిలాబాద్కు అరిష్టమని పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీవేంకటేశ్వర ఆలయం దేవాదాయశాఖ, ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంయుక్తంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే సంయుక్త నిర్ణయాలు ఆలయ అభ్యున్నతికి తోడ్పడకపోగా, అరిష్టాలను మూటగట్టుకుంటుందని భక్తులు పేర్కొంటున్నారు. తాజాగా రూ.7.30 కోట్లతో నిర్మాణం తలపెట్టడం, ఆ టెండర్ నోటిఫికేషన్లో దేవాదాయశాఖ ప్రస్తావన లేకపోవడం వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’లో శనివారం ‘గోవిందా.. గోవింద’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ క్రమంలో పలువురు భక్తులు ‘సాక్షి’కి ఫోన్ చేసి ఆలయంలో ప్రణాళికాబద్ధంలేని పనుల విషయాన్ని వివరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆలయం వెనుక ఆలయం నిర్మించి వదిలేసిన తీరు సరికాదని పేర్కొన్నారు. వైఫల్యమా.. నిధుల వృథా ప్రయాసా జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్చౌక్లో ఉన్న ఈ ఆలయానికి నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. ఈ క్రమంలో హుండీ ఆదాయం కూడా అధికమే. తాజాగా ఆలయ ఆవరణలో ఫంక్షన్ హాల్ నిర్మిస్తుండగా, ఆ వ్యయం రూ.7.30 కోట్లు హుండీ నుంచి వచ్చిన డబ్బులేనని దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే పదేళ్ల క్రితం ఆలయం వెనుకాల మరో ఆలయం నిర్మించే విషయంలో ఓ దాత ముందుకు వచ్చి దాని వ్యయాన్ని భరించారని పేర్కొంటున్నారు. అయితే ఆ దాత ట్రస్ట్కు సంబంధం లేకుండా ఆలయ నిర్మాణం చేపట్టడం, దీంతో ప్రధాన ట్రస్టీ ఈ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేశారనేది ప్రచారంలో ఉంది. పాత ఆలయం ప్రాశస్త్యం మరుగున పడుతుందనే కోణంలో ట్రస్టీ అలా వ్యవహరించారని చెప్పుకుంటారు. ఈ విషయంలో అప్పట్లో ట్రస్టీ, సభ్యుల మధ్య కూడా విభేదాలు వచ్చి వర్గాలుగా విడిపోయారని, దేవాదాయశాఖ కూడా ఈ విషయంలో సమన్వయం సాధించలేక మిన్నకుండిపోయిందనే ప్రచారం ఉంది. అంతే కాకుండా ఆలయం విషయంలో రాజకీయాలు కూడా తోడవడంతో అప్పట్లో పనులు తుది దశకు వచ్చినా చివరకు నిలిచిపోయిందని పలువురు పేర్కొంటున్నారు. మొత్తంగా విభేదాల కారణంగా ఏళ్లుగా నిర్మాణ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆలయానికి పెద్ద మొత్తంలో ఆదాయం ఉన్నా పర్యవేక్షణలోపం, ప్రణాళిక అమలుపర్చడంలో వైఫల్యం చెందారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నిధులు వృథా ప్రయాస అవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారనే ఆరోపణలు బాహాటంగానే వ్యక్తమవుతున్నాయి. ఆ విషయం నాకు తెలియదు కొత్త ఆలయం ఎందుకు అసంపూర్తిగా ఆగిపోయిందో తెలియదు. ఈ విషయంలో నాకు స్పష్టత లేదు. ఫంక్షన్ హాల్ నిర్మాణానికి సంబంధించిన టెండర్ నోటిఫికేషన్లో దేవాదాయశాఖ అని ప్రస్తావించకపోవడం ఐఅండ్పీఆర్లో లోపం. మేము ఇక్కడి నుంచి ఇచ్చిన దాంట్లో దేవాదాయశాఖ అని వారికి పంపించాం. – రమేశ్, ఈవో, దేవాదాయశాఖ, ఆదిలాబాద్ -
జిల్లావాసికి డాక్టరేట్
ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని కేఆర్కే కాలనీకి చెందిన తస్కండే లక్ష్మణ్–గంగ దంపతుల కుమార్తె ప్రియాంకకు డాక్టరేట్ లభించింది. జియో ఫిజిక్స్లో చేసిన పరిశోధనలకు గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పట్టా అందుకోనున్నారు. ఈమె ప్రొఫెసర్ వీరయ్య మార్గదర్శకత్వంలో పరిశోధనలు చేశారు. నిర్మల్ జిల్లాలోని సుద్దవాగు బేసిన్లో జలాశయ సంభావ్య మండలాల మూల్యాంకనంతో పరిశోధనలు చేశారు. జియో మార్పోలాజికల్, జియో ఎలక్ట్రికల్ , జియో కెమికల్ విధానాలు ఉపయోగించి సమగ్ర అధ్యయనం చేశారు. ఇందుకు గాను ఓయూ డాక్టరేట్ ప్రకటించింది. ప్రస్తుతం ఈమె హైదరాబాద్లోని స్వయంకృషి స్పెషల్ బీఎడ్ కళాశాలలో కో ఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. డాక్టరేట్ రావడంపై కుటుంబసభ్యులు, స్థానికులు వ్యక్తం చేఽశారు. -
భారత్ మాతాకీ జై..
● ఉగ్రవాదంపై త్రివిధ దళాలది అద్వితీయ పోరాటం : ఎంపీ నగేశ్ ఆదిలాబాద్: అమాయకుల ప్రాణాలు బలిగొన్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై త్రివిధ దళాలది అద్వితీయ పోరాటమని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం త్రివిధ దళాలకు, ఆపరేషన్ సిందూర్కు సంఘీభావంగా భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకీ జై.. జైహింద్ నినాదాలు హోరెత్తాయి. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, భారత్ సంయమనంతో వ్యవహరిస్తుంటే పాక్ ఉగ్రవాదంతో రెచ్చగొడుతుందన్నారు. వారిని దీటుగా ఎదుర్కొనేందుకు చేసిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిందన్నారు. మనపై ఎన్ని రకాలుగా దాడులు చేయాలని యత్నిస్తున్నా, సైనికులు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారన్నారు. వారందరికీ ప్రతి భారతీయుడు మద్దతుగా నిలవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, భారత త్రివిధ దళాలు పాక్ కుయుక్తులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు ఆదినాథ్, వేద వ్యాస్, ప్రమోద్ కుమార్ ఖత్రి తదితరులు పాల్గొన్నారు. -
అమ్మే నా రోల్మోడల్..
అఖిల్ మహాజన్, ఎస్పీ అమ్మ ఉర్మిల్ నాకు రోల్మోడల్. ప్రతీ విజయం వెనుక ఆమె ప్రోత్సాహం ఎంతో ఉంది. సివిల్స్కు సిద్ధమవుతున్న సమయంలో ఎంతగానో మోటివేట్ చేశారు. కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యం సాధించవచ్చని పదే పదే చెప్పేవారు. ఏ పనిలోనూ వెనుకడుగు వేయద్దనే వారు. ఇప్పటికీ అమ్మ మాటలు గుర్తుకొస్తాయి. క్రమశిక్షణ, ఎదుటి వ్యక్తులతో ఎలా ఉండాలనే విషయాలను చిన్నప్పటి నుంచే నేర్పించారు. ఉద్యోగం సాధించేంత వరకు వెన్నుదన్నుగా నిలిచారు. అందరి జీవితాల్లో అమ్మ ప్రత్యేకమే. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. – ఆదిలాబాద్టౌన్ -
ఇంకుడుగుంతలు.. మరుగుదొడ్లు
కై లాస్నగర్: గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉంచాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం స్వచ్ఛభారత్ గ్రామీణ మిషన్(ఎస్బీఎం) ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగానే 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాకు రూ.17.06 కోట్ల నిధులను ఆ విభాగానికి కేటాయించింది. వాటి ద్వారా వివిధ కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణను సిద్ధం చేసింది. ఏడాది లోపు పూర్తిచేసేలా మండలాల వారీగా లక్ష్యాలను నిర్దేశిస్దూ కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశా రు. తదనుగుణంగా పనులు ప్రారంభించే దిశగా అఽ దికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రతీ ఇంటిలో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మింపజేసేలా ప్రజలను చైతన్యవంతులు చేయడంతో పాటు ఇంకుడుగుంతలు నిర్మించేలా అధికారులు ముందుకు సాగుతున్నారు. స్వచ్ఛత.. పరిశుభ్రతే లక్ష్యం ప్రతీ ఇంటిలో వ్యక్తిగత మరుగుదొడ్డితో పాటు ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. తద్వారా పరిశుభ్రతతో పాటు వర్షపునీటిని ఒడిసిపట్టి భూగర్భజలాలు పునరుద్ధరించే దిశగా నిర్మాణాలను ప్రోత్సహిస్తోంది. వీటి నిర్మాణాలకు రూ.12వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తోంది. అ లాగే మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో కమ్యూనిటీ టాయ్లెట్స్కు రూ.3లక్షల చొ ప్పున వెచ్చిస్తోంది. అలాగే భారీ కమ్యూనిటీ సోక్పి ట్స్ సైతం చేపట్టనున్నారు. గ్రామాల్లో పోగైన చెత్త ను సేకరించి సెగ్రిగేషన్ చేసేందుకు వీలుగా షెడ్లను నిర్మించనున్నారు. జిల్లాలో కొత్తగా ఐదు గ్రామ పంచాయతీలు ఏర్పడగా తలమడుగు మండలంలోని పూనగూడ, ఇచ్చోడ మండలంలోని ఎల్లమ్మగూడలో వీటిని నిర్మించాలని ప్రతిపాదించారు. వీటితో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రాసెస్ చేసేందుకోసం ఈ సారి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్పై కేంద్రం దృష్టి సారించింది. జిల్లాలో తొలిసారిగా మూడు యూ నిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో యూనిట్కు రూ.64లక్షల చొప్పున కేటాయించనున్నారు. పైలట్ ప్రాజెక్ట్గా ఇచ్చోడ మండలం ముఖరా(కే)లో నిర్మించాలని భావిస్తున్నారు. కార్యదర్శులకు దరఖాస్తు చేసుకోవాలి .. వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలనే ఆసక్తి గల కుటుంబాలు సంబంధిత పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలి. వాటిని పరిశీలించి మంజూరు చేస్తారు. నిర్మాణాలు పూర్తయ్యాక రూ.12వేల చొప్పున నిధులు మంజూరు చేస్తారు. ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే ఉంటుంది. అలాగే కమ్యూనిటీ టాయ్లెట్స్, సోక్పిట్స్ నిర్మాణాలను ఎక్కడ చేపట్టాలనే దానిపై ఎంపీడీవోలు నిర్ణయించనున్నారు. అందుకు ప్రభుత్వ స్థలాలు అవసరమున్నందున రెవెన్యూ అధికారులతో కలిసి వాటిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. బహిరంగ మల విసర్జన రహితంగా గ్రామాలను తీర్చిదిద్దడంతో పాటు నీటి వనరులు సంరక్షించేదిశగా నిర్మాణాలు సాగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. స్వచ్ఛభారత్ మిషన్ వార్షిక లక్ష్యం ఖరారు జిల్లాకు రూ.17.06 కోట్ల నిధులు పనుల ప్రారంభానికి అధికారుల కసరత్తు ఇంద్రవెల్లి మండలం ముత్నూర్లో ఓ కుటుంబం తమ ఇంటి వద్ద ఎస్బీఎం నిధులతో నిర్మించుకున్న ఇంకుడుగుంత ఇది. వర్షపునీటిని సంరక్షించి బోరులో నీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు దోహదపడుతుంది. ఇక్కడ కనిపిస్తున్న చేదబావి నీరు వృథాగా పోకుండా చూడటంతో పాటు వర్షపునీటిని ఒడిసిపట్టేలా చేపట్టిన కమ్యూనిటీ ఇంకుడుగుంత ఇది. ఇచ్చోడ మండలం ముఖరా (కే)లో నిర్మించారు. భూగర్భజలాలు పెంపొంది బావిలో నీటి ఎద్దడి తలెత్తకుండా దోహదపడుతుంది. రూ.94వేల వ్యయంతో దీన్ని నిర్మించుకోవచ్చు.సద్వినియోగం చేసుకోవాలి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేనటువంటి వారికి ఎస్బీఎం మంచి అవకాశం. ఈ నిధులను సద్వినియోగం చేసుకుని ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి నిర్మించుకోవాలి. అలాగే కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారు తప్పనిసరిగా ఇంటి ఆవరణలో ఇంకుడుగుంత నిర్మించుకోవాలి. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వాటి నిర్మాణాలు చేపట్టాలి. – రాథోడ్ రవీందర్, డీఆర్డీవోకంపోనెంట్ యూనిట్లు నిధులు (రూ.లక్షల్లో ) వ్యక్తిగత మరుగుదొడ్లు 5,573 668.76 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ 14 29.4 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ 03 192.00 కమ్యూనిటీ మరుగుదొడ్లు 5,522 358.93 డ్రెయిన్ల చివరన ఇంకుడుగుంతలు 376 348.73 ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడుగుంతలు 47 43.59 సామాజిక ఇంకుడుగుంతలు 393 49.41 సెగ్రిగేషన్ షెడ్లు 02 3.00 -
అమ్మ.. సృష్టికి మూలం. పదాలు తెలియని పెదవులకు ఓ అమృతం. పేరులో ప్రేమని, పిలుపులో మాధుర్యాన్ని పంచే కనిపించే దైవం. ఆ అనుబంధాన్ని ఎంత వర్ణించినా తక్కువే. దేశ రక్షణకు పేగుబంధాన్ని సైతం లెక్కచేయని వారెందరో. పొత్తిళ్ల నుంచి బిడ్డకు లోకం చూపి.. సరిహద్దు పోరుబాటకు
మాతృమూర్తులంతా త్యాగధునులే.. చిన్నప్పటి నుంచే ప్రకాశ్ సైన్యంలో పనిచేయాలని అంటుండేవాడు. ఇందుకు తగ్గట్టుగానే ఆర్మీలో జాయిన్ అయ్యాడు. మూడేళ్ల పాటు పనిచేశాడు. జమ్మూ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో విధులు నిర్వహించాడు. ఈ క్రమంలో 2003 నవంబర్ 16న దేశంలోకి ప్రవేశించడానికి యత్నించిన ఉగ్రవాదులతో పోరాడాడు. వారిలో కొంతమందిని చంపి, ఇద్దరు సైనికులను కాపాడి వీరమరణం పొందాడు. నా కొడుకు త్యాగాన్ని గుర్తించి 2004లో రాష్ట్రపతి చేతుల మీదుగా శౌర్య చక్ర అవార్డు అందుకున్నాను. నా లాంటి ఎంతోమంది తల్లులు దేశ రక్షణ కోసం తమ బిడ్డలను సరిహద్దుకు పంపిస్తున్నారు. వారంతా త్యాగధునులే. – లారీ బాయి, సైనిక అమరుడు గోతి ప్రకాశ్ తల్లి, అందునాయక్తండా, ఇంద్రవెల్లి -
పత్రిక స్వేచ్ఛపై దాడి
కై లాస్నగర్: సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై ఏపీ ప్రభుత్వం పోలీసులతో దౌర్జన్యం చేయించడాన్ని ఆదిలాబాద్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండించారు. ఏపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. నల్లబ్యాడ్జీ లు ధరించి ప్రెస్క్లబ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ప్రధాన ద్వా రం ఎదుట ధర్నా చేశారు. ఏపీ ప్రభుత్వానికి, పోలీ సులకు వ్యతిరేకంగా నినదించారు. ఈసందర్భంగా సాక్షిపత్రిక స్టాఫ్ రిపోర్టర్ గొడిసెల కృష్ణకాంత్గౌడ్, టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం.సురేశ్, టీయుడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు, ఎడిటర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్ మాట్లాడారు. సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేయడం సరికాదన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసులతో తనిఖీలు చేసి భయభ్రాంతులకు గురిచేయడం పత్రిక స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకు అణచివేత వైఖరి అవలంభించడం దుర్మార్గమమని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశా రు. లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతా మని హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో బి.వినోద్కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో ప్రెస్క్లబ్ కన్వీనర్ వై.సుధాకర్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సారంగపాణి, సత్యనారాయణ, సందేశ్, వినోద్, వెంకటేశ్, రాజేష్, రాజేశ్వర్, రవి, ప్రవీణ్, సుభాష్, శ్రీకాంత్, నీలేష్, అభిలాష్, విజ య్రెడ్డి, మహేష్, సతీశ్రెడ్డి, అరుణ్రెడ్డి, మహేందర్, శ్రీనివాస్, పవన్, దీపక్, నరేష్, జైపాల్, అశోక్, రాజు, అస్మత్, రాకేశ్, నర్సింగ్, రాము, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ పోలీసుల తీరుపై జర్నలిస్టుల ఆందోళన కలెక్టరేట్ ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన -
● వేంకటేశ్వర ఆలయ ఆస్తులు సురక్షితమేనా..? ● ఆవరణలో చేపట్టిన ఫంక్షన్హాల్ నిర్మాణం వివాదాస్పదం ● దేవాదాయ శాఖ ప్రస్తావన లేకుండానే టెండర్ నోటిఫికేషన్ ● ఓ ట్రస్ట్ తీరుపై సర్వత్రా విమర్శలు
రెండంతస్తులకే అన్ని రూ. కోట్లా..? వేంకటేశ్వర ఆలయ ఆవరణలో 70 x 130 చదరపు అడుగుల స్థలంలో సెల్లార్తో కూడిన రెండంతస్తుల్లో ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్నారు. దీనికి రూ.7.30 కోట్ల అంచనా వ్య యం చూపిస్తున్నారు. అయితే అందులో ఎ లాంటి హంగులు కల్పిస్తున్నారు.. రాజ భవ నం ఉట్టిపడేలా ఏవైన సదుపాయాలు కల్పి స్తున్నారా.. రెండంతస్తులకే అన్ని కోట్లు ఎందుకు.. అనేది ఇప్పుడు అందరిలో వ్యక్తమవుతున్న సందేహాలు. కాగా, ట్రస్ట్ సభ్యులు భారీగా స్వాహా చేసేందుకు యత్నిస్తున్నారనే విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి.జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ అంటేనే ప్రధాన మార్కెట్ ప్రాంతం. వ్యాపార, వాణిజ్య సముదా యాలతో నిండిపోయి ఉంటుంది. అలాంటి చోట ఓ రెండెకరాల స్థలం దేవాదాయ శాఖ, ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంయుక్తంగా కొనసాగుతుంది. స్థలం మధ్యలో వేంకటేశ్వర ఆలయం ఉండగా, చుట్టూ 46 వ్యాపార దుకాణాలు కొనసాగుతున్నాయి. వీటి ద్వారా ఏటా సుమారు రూ.50లక్షల ఆదాయం సమకూరుతుంది. అంతే కాకుండా గుడిహత్నూర్ మండలం సీతాగోందిలో ఈ ఆలయానికి సంబంధించి ఆరెకరాల భూమి కూడా ఉంది. మొత్తంగా ఏడాదికి సుమారు కోటి రూపాయల ఆదాయం వరకు లభిస్తుందని అధికారులే చెబుతున్నారు. విలువైన ఆస్తులే కాకుండా నిత్యం ఆలయానికి వచ్చే భక్తుల ద్వారా పెద్ద ఎత్తున హుండీ ఆదాయం సమకూరుతుంది. అయితే సంయుక్త నిర్వహణలో ఉన్నప్పుడు దేవాదాయ శాఖ ప్రస్తావనే లేకుండా ట్రస్ట్ పేరిట టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడం, ఆలయ ఆవరణ స్థలంలో ఫంక్షన్హాల్ నిర్మిస్తుండటం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. సంయుక్తంగా నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే ఇది వివాదాస్పదమయ్యేది కాదు. తద్వారా ఆలయం ఉన్న ఈ భూములపై ట్రస్ట్ కన్నేసిందా.. పూర్తిగా ఆ ఆస్తిని కాజేయాలనే కుటిల యత్నాలకేమైనా పాల్పడుతుందా అనే అనుమానాలు పట్టణ ప్రజలకు కలుగుతున్నాయి. దీంతో ఆలయ భూములు సురక్షితమేనా.. లేని ప క్షంలో అన్యాక్రాంతం అయ్యే ప్రమాదమేమైన ఉందా.. అనే సందేహాలు భక్తుల్లో వ్యక్తమవుతున్నాయి. హుండీ ఆదాయంతో నిర్మాణం.. సాధారణంగా ఆలయానికి వచ్చే భక్తుల ద్వారా కానుకలు, డబ్బులు వంటివి వచ్చినప్పుడు దా నికి సంబంధించిన లెక్కలు స్పష్టంగా ఉండాలి. సంయుక్త నిర్వహణలో ఉన్నప్పుడు అసలు ఇవి అటు దేవాదాయ శాఖకు, ఇటు ట్రస్ట్కు ఎంత చెందాలనే విషయాల్లోనూ ఒక స్పష్టత ఉండా లి. అంతే కాకుండా వీటిని అభివృద్ధి పనులకు వెచ్చించినప్పుడు అందులో దేవాదాయ శాఖ సొమ్ము ఎంత..? ట్రస్ట్ భాగస్వామ్యం ఎంత అనే వివరాలు స్పష్టంగా ఉంటే భవిష్యత్తులో వివాదాలకు ఆస్కారం ఉండదనే అభిప్రాయం పలువురు భక్తుల్లో ఉంది. అయితే ట్రస్ట్ ఏకపక్షంగా నోటిఫికేషన్ ఇవ్వడం, అందులో ఒక అధికారి హోదాను ప్రస్తావించినప్పటికీ కనీసం ఆయనది ఏ శాఖ అనేది కూడా దానికింద పేర్కొనకపోవడం అనుమానాలకు తావిస్తోంది.ఆ టెండర్పై స్పష్టత లేదు..టెండర్ నోటిఫికేషన్లో దేవాదాయ శాఖ ప్రస్తావన ఎందుకు లేదనే విషయంలో నాకు స్పష్టత లేదు. అయితే దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తిగా ఇక్కడి నుంచి జరిగిన తర్వాత హెడ్ ఆఫీస్ నుంచి టెండర్ ఆన్లైన్ ద్వారా నిర్వహించారు. ఈవో వద్దే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంది. – నవీన్కుమార్, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, ఆదిలాబాద్శాఖ పేరు రాశాం.. ప్రచురణల్లో మారింది టెండర్ నోటిఫికేషన్కు సంబంధించి మేము శాఖాపరంగా రాసిచ్చిన దాంట్లో ఎగ్జిక్యూటి వ్ ఆఫీసర్, దేవాదాయశాఖ అని పొందుపరి చాం. ఐఅండ్పీఆర్లో మారి ఉండవచ్చు. ట్రస్ట్వాళ్లకు పూర్తిగా ఇచ్చే అధికారం లేదు. – రమేశ్, ఈవో, దేవాదాయ శాఖ -
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయండి
● కలెక్టర్ రాజర్షి షా కై లాస్నగర్: నీతి ఆయోగ్ ఆస్పరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో భాగంగా నార్నూర్ మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను వర్షాలు కురిసేలోపు వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. రీచార్జ్ స్ట్రక్చర్స్, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాల పనుల పురోగతిపై శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పూడికతీతలో భాగంగా ఇంకా ప్రారంభం కాని చెరువుల్లో వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. కమ్యూనిటీ సోక్పిట్స్ను 63 గ్రామాలకు మంజూరు చేశామని వాటిని ప్రారంభించేలా చూడాలన్నారు. స్వచ్ఛభారత్లో భాగంగా గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు ప్రారంభించి ప్రతి ఒక్కరూ నిర్మించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సామ్.. మామ్ పిల్లల పురోగతి, ఐరన్ ఫోలిక్ మాత్రలు, ఫాంపాండ్, బోర్వెల్స్, తాగునీరు, పొలంబాట, ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఇందులో డీఆర్డీవో రవీందర్ రాథోడ్, డీడబ్ల్యూవో మిల్కా, పీఆర్ ఈఈ రాథోడ్ శివరాం, బీఏఐఎఫ్ ఎన్జీవో ప్రతినిధులు సాయి, సుధాకర్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
ఆదిలాబాద్టౌన్: విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే తప్పకుండా విజయం సాధిస్తారని తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లభోజు గోపీకృష్ణ అన్నారు. ఇటీవల వెల్లడైన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల నుంచి టాపర్లుగా నిలిచిన ముగ్గురు విద్యార్థులను సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. బంగా రుగూడ మోడల్ స్కూల్ విద్యార్థి చిల్కూరి రమ(578 మా ర్కులు), జెడ్పీఎస్ఎస్ కజ్జర్ల విద్యార్థి గిజ్జ అ నుశ్రీ (576 మార్కులు), బంగారుగూడ మోడ ల్ స్కూల్ విద్యార్థి సట్లావార్ హరీష్(575మార్కులతో) టాపర్లుగా నిలిచా రు. వారిని శాలువాలతో సత్కరించారు. జ్ఞాపికలు అందజేసి అభినందించారు. మున్ముందు మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంఘం మహిళా అధ్యక్షురాలు జీజాబాయి, కప్పర్ల పాఠశాల ప్రధానోపాధ్యా యుడు ఆనంద్, బంగారుగూడ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజశేఖర్, విశ్రాంత అధ్యాపకులు విజయబాబు, తపస్ నాయకులు కృష్ణ సాగర్, గోపీచంద్, గంభీర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్టౌన్: కేసుల దర్యాప్తులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని నేరస్తుల ను పట్టుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన సెంట్రల్ డిటెక్టివ్ ద్వారా స్థానిక పోలీస్ హెడ్క్వార్టర్స్లోని సమావేశ మందిరంలో నూతన ఎస్సైలు, సిబ్బందికి రెండు రోజుల శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరస్తులు వినియోగించే ఆపరేటింగ్ సిస్టం, ఐపీ అడ్రస్, లొకేషన్ వంటివి కనుగొనే పద్ధతులను వివరించారు. అలాగే న్యాయస్థానంలో నేరస్తులకు శిక్షలు పడేందుకు కావాల్సిన పంచనామా రాసే విధానం, ముఖ్యంగా మహిళల మి స్సింగ్ కేసులు, సైబర్ క్రైమ్ ఫ్రాడ్ కేసుల్లో విచారణ చేసే పద్ధతులపై పూర్తి పరిజ్ఞానం సంపాదించాలని సూచించారు. ఇందులో జైనథ్ సీఐ డి.సాయినాథ్, రూరల్ సీఐ కె.ఫణిదర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి.వెంకటి, అఖిలేష్రావు, సైబర్ ఎక్స్పర్ట్ శ్రీధర్, డిజిటల్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ మహేందర్రెడ్డి, సీడీఆర్, ఐపీడీఆర్ ఎక్స్పర్ట్ హైదరాబాద్, సిబ్బంది పాల్గొన్నారు. మట్టి తవ్వకాలకు దరఖాస్తుల స్వీకరణకై లాస్నగర్: జిల్లాలో మట్టి తవ్వకాల అనుమతి కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవా లని కలెక్టర్ రాజర్షి షా ప్రకటనలో తెలి పారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ గనులు, భూగర్భశాఖ, నిజామాబాద్ (mines.telangana.go v.in) వెబ్సైట్లో సంప్రదించాలని పేర్కొన్నారు. మొద టి మట్టి/గ్రావెల్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించి, మండల సర్వేయర్, లైసెన్స్ సర్వేయర్తో స్కెచ్ గీయించుకుని, పాస్బుక్, ఆధార్కార్డుతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వాటిని పరిశీలించి సర్వే, తనిఖీ అనంతరం ఆదిలాబాద్ ఉప సంచాలకులకు పంపించనున్నట్లు తెలిపారు. అనంతరం అనుమతులు మంజూరు చేస్తారని పేర్కొన్నారు. -
‘సెర్ప్’ బదిలీలకు గ్రీన్సిగ్నల్
● ప్రత్యేక జీవో జారీ చేసిన ప్రభుత్వం ● మార్గదర్శకాల కోసం ఉద్యోగుల నిరీక్షణ ● నెలాఖరు వరకు ప్రక్రియ పూర్తయ్యే అవకాశంజిల్లాలో సెర్ప్ ఉద్యోగుల వివరాలు ఏడీఆర్డీవో: 01 డీపీఎంలు : 07 ఏపీఎంలు : 23 సీసీలు (ఎల్1, ఎల్2): 68 ఎంఎస్సీసీలు : 45 అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు : 06 ఆఫీస్ అసిస్టెంట్లు : 03 కై లాస్నగర్: సెర్ప్ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇందులో అన్ని కేటగిరీల వారు ఉంటారని ఇటీవల ప్రత్యేక జీవో జారీ చేసింది. విధి విధానాలు ఖరారు చేసి త్వరలోనే మరో ఉత్తర్వు జారీ చేస్తామని అందులో స్పష్టం చేసింది. దీంతో ఏడేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న వారికి స్థానచలనం కలగనుంది. ఇతర జిల్లాల్లో పనిచేసే వారు సొంత జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ ఈ నెలాఖరులోపు పూర్తి కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏడేళ్లుగా తప్పని ఎదురుచూపులు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో సెర్ప్, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ వంటి రెండు విభాగాల్లో ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. సెర్ప్ పరిధిలో పనిచేసే ఏపీడీలు, డీపీఎంలు, ఏపీవో పోస్టులకు జోనల్ స్థాయిలో, ఏపీఎంలు, సీసీలకు జిల్లాస్థాయిలో బదిలీలు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారిలో ఏపీవో, ఈసీలు, టీసీ, డీఆర్పీ, డీడీ సీఎల్ఆర్సీ, డీబీటీ మేనేజర్, ప్లాన్డ్ సూపర్వైజర్ పోస్టులకు జోనల్ స్థాయిలో, అలాగే టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు జిల్లాస్థాయిలో బదిలీలు చేపట్టాల్సి ఉంటుంది. ఇతర అన్ని ప్రభుత్వ శాఖల్లో మాదిరిగానే మూడేళ్లకోసారి వీరికి కూడా బదిలీలు నిర్వహించాలనేది ప్రభుత్వ నిబంధన. అయితే ఆయా విభాగాల్లో ఏడేళ్లుగా ఈ ప్రక్రియ నిర్వహించలేదు. దీంతో సదరు ఉద్యోగులు దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తూ బదిలీ కోసం నిరీక్షిస్తున్నారు. నిరీక్షణకు తెరపడే అవకాశం సెర్ప్, ఈజీఎస్ ఉద్యోగులకు చివరిసారిగా 2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బదిలీల ప్ర క్రియ నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వ వచ్చాక గతేడాది జూలై, ఆగస్టు నెలల్లో అన్ని ప్రభుత్వ శా ఖల్లో బదిలీలు చేపట్టింది. అయితే తమకు కూడా బదిలీ అవుతుందని ఆయా విభాగాల్లో పనిచేసే అ ధికారులు, ఉద్యోగులు ఆశపడ్డారు. డీఆర్డీఏ అధికా రులు కసరత్తు కూడా చేపట్టారు. అయితే ప్రభుత్వం వారి బదిలీలకు నాడు అవకాశమివ్వలేదు. అప్పటి నుంచి వారు మంత్రి సీతక్కతో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులకు విన్నవిస్తూనే ఉ న్నారు. వారి విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఎట్టకేలకు బదిలీల ప్రక్రియకు గ్రీన్సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్గదర్శకాలు అందిన వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించేలా జిల్లా గ్రామీ ణాభివృద్ధిశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. తద్వారా జిల్లాలో దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేసిన ఉద్యోగులకు స్థానచలనం కలగనుండగా ఇతర జిల్లాల్లో పనిచేసే వారు సొంత జిల్లాకు వచ్చే అవకాశముంది. కొత్తగా ఏర్పడ్డ మండలాల్లోనూ పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ అయ్యే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే ఉపాధి హామీ ఉద్యోగుల బదిలీల నిర్వహణకు సంబంధించి మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టతనివ్వలేదు.నెలాఖరులోపు పూర్తయ్యే అవకాశంసెర్ప్ ఉద్యోగుల బదిలీల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. త్వరలోనే మార్గదర్శకాలను ప్రకటింనుంది. వాటి ఆధారంగా ఈ నెలాఖరులోపూ ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది. ‘ఉపాధి’ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు రానప్పటికి వారిని కూడా బదిలీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే అందుకు సంబంధించిన ఉత్తర్వులు అందే అవకాశముంది. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా కౌన్సెలింగ్ ప్రక్రియ పారదర్శకంగా చేపడుతాం. – రాథోడ్ రవీందర్, డీఆర్డీవో -
‘మహా’జొన్నలు రాకుండా తనిఖీలు
తలమడుగు: మహారాష్ట్ర నుంచి తెలంగాణకు అక్రమంగా జొన్నలు రాకుండా పకడ్బందీ తనిఖీలు చే పడుతున్నట్లు వ్యవసాయాధికారి ప్రమోద్రెడ్డి తెలి పారు. గురువారం మండలంలోని లక్ష్మీపూర్ చెక్పోస్టు వద్ద ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాన్ని పరిశీ లించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మ హారాష్ట్ర నుంచి కొందరు దళారులు తక్కువ ధరకు జొన్నలు కొనుగోలు చేసి ఆదిలాబాద్ మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మహారాష్ట్ర నుంచి అనుమతి లేకుండా జొన్నలు తరలిస్తే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లక్ష్మీపూర్ చెక్పోస్టుతోపాటు రెవెన్యూ, పోలీస్, వ్యవసాయశాఖల ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతున్నామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి మహారాష్ట్రకు అనుమతి లేకుండా పత్తి విత్తనాలు తీసుకువెళ్లేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం చెక్పోస్ట్ సిబ్బంది ద్వారా వివరాలు తెలుసుకున్నారు. పోలీస్, వ్యవసాయ, రెవెన్యూ, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
● జిల్లాలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపు కమిటీ తీరుపై విమర్శలు ● నోటిఫికేషన్లో ప్రస్తావించకుండానే ఈఏండీ రూ.5లక్షలకు పెంపు ● దరఖాస్తు ఫారం కూర్పుపై సందేహాలు ● బోరుమంటున్న ఏజెన్సీ నిర్వాహకులు
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపునకు సంబంధించి కొత్త ఎంప్యానల్మెంట్ టెండర్ల వ్యవహారంలో ఉపాధికల్పన శా ఖ, ఏజెన్సీల గు ర్తింపు కమిటీ తీ రుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో దరఖాస్తు ఫీ జు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు ఉండేది. ఈ ఎండీ రూ.2లక్షలుండే ది. తాజా టెండర్లలో ఎ న్నో రెట్లు అధికంగా నిర్ధారించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కమిటీలో కలెక్టర్ చైర్మన్గా, జిల్లా ఉపాధికల్పన అ ధికారి మెంబర్ కమ్ కన్వీనర్గా, కోశాధికారి, లేబర్ అధికారి సభ్యులుగా ఉంటారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు ఫీజు, ఈఎండీ పెంపునకు సంబంధించి నిర్ణయం కమిటీ తీసుకున్నదా.. ఉపాధికల్పన శాఖ నుంచి దీన్ని రూపొందించారా.. అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈఎండీ రూ.5లక్షలా? జిల్లాలోని వివిధ ప్రభుత్వ శా ఖల్లో అవుట్సోర్సింగ్ స ర్వీసులు ఏర్పాటుకు కొ త్త ఎంప్యానల్మెంట్ కు నమోదిత ఏజెన్సీల నుంచి ఈనె ల 2నుంచి 13వర కు జిల్లా ఉపాధికల్పన కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. టెండర్ నోటిఫికేషన్లో దరఖాస్తు ఫారం కో సం రూ.10వేల డీడీ చెల్లించి ఆఫీసులో తీసుకోవచ్చని స్పష్టంగా పేర్కొన్నారు. ఈఎండీ ఎంత చెల్లించాలనే విషయాన్ని దరఖాస్తులో ఎక్కడా ప్రస్తావించలేదు. ఇటీవల ఓ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు డీడీ చెల్లించి దరఖాస్తు ఫారం తీసుకున్నాడు. దాంట్లో రూ.5లక్షల ఈఎండీ దరఖాస్తు ఫారంతో పాటు జతచేసి ఇవ్వాలని నిబంధనల్లో పేర్కొనడంతో నిర్ఘాంతపోయాడు. అసలు ఇంత పెద్దమొత్తంలో ఈఎండీ చెల్లించాలని నోటిఫికేషన్లో పేర్కొని ఉంటే దరఖాస్తు ఫారం కొనుగోలు చేసేవాడిని కాదని లబోదిబోమంటున్నాడు. అడ్డగోలు నిబంధనలెలా? టెండర్ నోటిఫికేషన్లో ఈఎండీ ప్రస్తావన లేదు. దరఖాస్తు ఫారం కొన్న తర్వాత అందులో ఈఎండీ ప్రస్తావన, అడ్డగోలు నిబంధనలున్నాయి. ఈఎండీ కోసం రూ.5లక్షలు చెల్లించలేని పరిస్థితుల్లో ఆ ఏజెన్సీ నిర్వాహకుడు దరఖాస్తు ఫారం కోసం చెల్లించిన రూ.10వేలు నష్టపోవాల్సి వస్తోంది. రూ.కోటి టర్నోవర్ రెండేళ్లలో కలిగి ఉండాలని, అది కూడా గడిచిన మూడేళ్లదే పరిగణనలోకి తీసుకోనున్నట్లు దాంట్లో పేర్కొన్నారు. ఇదివరకు 100 మంది ఉద్యోగుల నిర్వహణ చేసిన అనుభవం కలిగి ఉండాలని వివరించారు. ఏజెన్సీ ఎంపికైన తర్వాత ఏదైన శాఖ లో అవుట్సోర్సింగ్ నిర్వహణ కల్పించినప్పుడు ఉ ద్యోగుల సంఖ్యకు అనుగుణంగా ఏజెన్సీ ముందుగానే ఒకనెల వేతనాల డబ్బులను డిపాజిట్ చేయాలని దాంట్లో పేర్కొన్నారు. ఈ నిబంధనలన్నీ దరఖాస్తు ఫారంలో పేర్కొని ఉండాల్సిందనే అభిప్రాయం ఏజెన్సీ నిర్వాహకులు వ్యక్తంజేస్తున్నారు. కొన్ని ఏజెన్సీలకు మేలు చేసేందుకే.. ఇతర జిల్లాల్లోనూ ఇలాగే.. జీవోలో ఈ నిబంధనలు లేకపోయినా ఇతర జిల్లాల్లో కొనసాగుతున్న విధానాన్నే మేము ఫాలో అయ్యాం. అక్కడ లేని అభ్యంతరాలు ఇక్కడే ఎందుకు. జిల్లా అవుట్సోర్సింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాల మేరకే వీటిని అమలు చేస్తాం. – మిల్కా, జిల్లా ఇన్చార్జి ఉపాధికల్పన అధికారి జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న కొన్ని ఏజెన్సీలకు మేలు చేసేందుకే కొత్త ఎంప్యానల్మెంట్ ఏర్పాటులో ఇలా అడ్డగోలు నిబంధనలు రూపొందించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2006లో అవుట్సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్టీ నంబర్ 4459 ప్రకారమే వెళ్తున్నామని అధికారులు చెబుతుండగా, దాంట్లో ఈఎండీ, ఇతర నిబంధనలు ఇలా రూపొందించాలని లేదని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. కొన్నేళ్లుగా జిల్లాలో యాక్టివ్గా ఉన్న కొన్ని ఏజెన్సీలకు మేలు చేసేలా జిల్లా అధికారులు కుయుక్తులకు పాల్పడుతున్నారని వారు నేరుగా ఆరోపిస్తున్నారు. -
అర్హులకే ఇళ్లు కేటాయించాలి
నార్నూర్: అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించా లని రెండోరోజు గురువారం దరఖాస్తుదారులు మండల కేంద్రంలోని ప్రధాన మార్కెట్ గాంధీ చౌక్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం వీరికి సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ కమిటీలో కాంగ్రెస్ నాయకులే ఉండడంతో వారి కుటుంబ సభ్యులకే ఇళ్లు కేటాయించుకున్నారని ఆరోపించారు. కలెక్టర్ సూచన మేరకు కమిటీలో అన్ని వర్గాల వారికి భాగస్వామ్యం కల్పించాలని కోరారు. పాత కమిటీలు రద్దు చేసి, అన్ని వర్గాల వారితో కొత్త కమిటీలు వేసి అర్హులకే ఇళ్లు దక్కేలా చూడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ గంగాసింగ్ ఆందోళన వద్దకు చేరుకుని ఉన్నతాధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్తానని చెప్పగా ఆందోళన విరమించారు. కలెక్టర్, జెడ్పీ సీఈవో ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో డీఎల్పీవో ప్రత్యేకంగా ఇందిరమ్మ కమిటీ సభ్యులతో పా టు దరఖాస్తుదారులతో సమావేశమయ్యారు. అ క్కడా ఇందిరమ్మ కమిటీ రద్దు చేయాలని పట్టుపట్టారు. ఇందిరమ్మ కమిటీ నిర్ణయం ప్రకారమే ఇళ్లు కేటాయించామని, మార్పు ఉండదని డీఎల్పీవో చెప్పారు. రాని వారికి మరో విడతలో మంజూరు చేయనున్నట్లు చెప్పడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబితాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ దృష్టికి సమస్య తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడంతో శాంతించారు. బీజేపీ మండలాఽ ద్యక్షుడు భిక్షపతి రాథోడ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు చాల్కుర్ ప్రకాశ్, పెసా చట్టం కోఆర్డినేటర్ రాథోడ్ సీకేందర్, అన్నాభావు సాఠె కమిటీ మాజీ మండలాధ్యక్షుడు రాజ్పంగే రాజు తదితరులున్నారు. -
బహిరంగ ప్రదేశాల్లో ఫ్లెక్సీలొద్దు
ఆదిలాబాద్టౌన్: అనుమతి లేకుండా బహిరంగ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఏడాది జైలు, రూ.5వేల వరకు జరిమానా విధించే అవకాశముందని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి హెచ్చరించారు. గురువారం వన్టౌన్లో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ శాఖ తరఫున ఏర్పాటు చేసిన ప్రదేశంలో రుసుం చెల్లించి అనుమతి తీసుకున్నాకే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు మాట్లాడుతూ.. ప్రమాదాలకు కారణమయ్యే ప్లాస్టిక్ ఫ్లెక్సీల ఏర్పాటు నిషేధమని తెలిపారు. వన్టౌన్ సీఐ సునీల్కుమార్ పాల్గొన్నారు. -
23 ఏళ్లు.. 108 సామూహిక వివాహాలు
● పోలీసులు ‘మీ కోసం’లో భాగంగా ఇచ్చోడలో సామూహిక వివాహాలు ఇచ్చోడ: నేటికీ సరిగ్గా 23 ఏళ్ల క్రితం మండల కేంద్రంలో 108 ఆదివాసీ జంటలకు పోలీసులు సా మూహిక వివాహాలు జరిపించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ జంటలను ఏకం చేశారు. అప్పట్లో ఉమ్మడి జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లోని యువతపై నక్సలిజం ప్రభావం ఉండేది. కొందరు సానుభూతిపరులుగా, మరికొందరు నక్సలిజంలో పనిచేయడానికి ఆసక్తి చూపేవారు. వారు అటు వైపు మళ్లకుండా ప్రజాజీవితంలో అడుగులు వేయించడానికి అప్పటి ఎస్పీ మహేశ్ భగవత్ చర్యలు చేపట్టారు. ఆదివాసీ పెద్దలు, రాయి సెంటర్ సార్ మేడిలతో చర్చించి ఆదివాసీ యువతకు సంప్రదాయంగా సామూహిక వివాహాలు జరిపించడానికి నిర్ణయించారు. ఇందులో భాగంగా చాలా మంది నక్సల్స్ సానుభూతిపరులకు వివాహాలు జరిపించి వారి దృష్టి మళ్లించడంలో సఫలీకృతులయ్యారు. రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసికెళ్లి కొంతమందికి హోంగార్డ్ ఉద్యోగాలిప్పించారు. నక్సలిజం వైపు నుంచి దృష్టి మళ్లించేందుకే.. జిల్లాలో యువత నక్సలిజానికి ఆకర్షితులవడం, అందులో చేరడంతో వారి కార్యకలాపాలు జిల్లాలో ఉధృతంగా కొనసాగేవి. దీంతో యువతను గుర్తించి అప్పటి ఎస్పీ మహేశ్ భగవత్, కలెక్టర్ రామకృష్ణారావు (ప్రసుత సీఎస్) అప్పటి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. ‘పోలీసులు మీ కోసం’ కార్యక్రమం చేపట్టి 2002 మే 9న 108 ఆదివాసీ జంటల కు వివాహాలు జరిపించారు. తాళి, నూతన వస్త్రాలు అందించారు. 20వేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. వధూవరులను మూడు ప్రత్యేక బస్సుల్లో తిరుపతికి తీసుకువెళ్లి వేంకటేశ్వరస్వామి దర్శన భా గ్యం కల్పించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2002లో ప్రారంభమైన ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇచ్చోడలో నిర్వహించిన సాముహిక వివాహాలకు ఉమ్మడి అంధ్రప్రదేశ్ సమాచారశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, జౌళిశాఖ మంత్రి పడాల భూమ న్న, గిరిజన శాఖ మంత్రి, ప్రస్తుత ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, కలెక్టర్ రామకృష్ణారావు, ఎస్పీ మహేశ్ భగవత్, ఓఎస్టీ దేవేంద్రసింగ్ చౌహాన్, ఆదివాసీ సంఘాల నాయకులు హాజరయ్యారు. -
● నాలుగేళ్లుగా విత్తన సబ్సిడీ ఎత్తివేత ● ప్రైవేట్లో ఏటా పెరుగుతున్న ధరలు ● జిల్లాలో తగ్గుతున్న సాగు విస్తీర్ణం
ఈ ఫొటోలోని రైతు పేరు రాథోడ్ రాందాస్. ఇతనిది ఇచ్చోడ మండలం దేవుల్నాయక్ తండా. ఇతడు నాలుగేళ్లుగా వానాకాలంలో 6 నుంచి 8 ఎకరాల్లో సోయా సాగు చేస్తున్నాడు. ప్రభుత్వం నాలుగేళ్లుగా సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయకపోవడం, ప్రైవేట్లో విత్తనాల ధరలు భారీగా పెరగడంతో ఈ ఏడాది రెండెకరాల్లోనే సోయా సాగు చేశాడు. జిల్లాలో ఇలా అనేక మంది రైతులు సోయా సాగును తగ్గిస్తున్నారు. ఇచ్చోడ: జిల్లాలో సోయాసాగు నాలుగేళ్లుగా తగ్గు తూ వస్తోంది. పత్తికి ప్రత్యామ్నాయ పంటగా జిల్లాలో చాలామంది రైతులు సోయా సాగు చేసేవారు. సోయా విత్తనాలపై ప్రభుత్వంసబ్సిడీ ఎత్తివేయడం, ఏటేటా ప్రైవేట్లో విత్తనాల ధరలు పెరగడంతో రైతులు సాగుకు ముందుకు రావడంలేదు. జిల్లాలో గతంలో పత్తికి సమానంగా సోయా సాగయ్యేది. నాలుగేళ్లుగా సోయా సాగు సగానికి పడిపోయింది. పెరుగుతున్న విత్తనాల ధర ప్రభుత్వం 30కిలోల సోయా విత్తనాల సంచినిఽ రూ.1,718కు పంపిణీ చేసేది. ఎకరాకు 30 కిలోల విత్తనాలు సరిపోయేది. దీంతో రైతులు పత్తికి ప్రత్యామ్నాయంగా సోయా సాగు చేశారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు సరఫరా చేయడంలేదు. ప్రైవేట్లో సోయా విత్తనాల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. 2023–24లో 30 కిలోల విత్తనాల సంచి ధర రూ.2.650, 2024–25లో రూ.2,800కు పెరిగింది. 2025–26లో ప్రైవేట్ కంపెనీలు ఇంకా ధరలు నిర్ణయించలేదు. ప్రైవేట్లో విత్తనాల ధరలు ఏటేటా పెరుగుతుండడం రైతులకు భారంగా మారింది. ఐదెకరాల్లో సాగు చేయాలంటే ఐదు సోయా విత్తనాల బస్తాలకు ప్రైవేట్లో రూ.14 వేలు అవుతుండగా, ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తే రూ.8,590 మాత్రమే అయ్యేది. ఐదెకరాల్లో సాగు చేసే రైతుపై రూ.5,410 అదనపు భారం పడుతోంది. సబ్సిడీ విత్తనాల సరఫరా నిలిచిపోవడం, ప్రైవేట్లో విత్తనాల ధర ఏటా పెరిగిపోతుండడంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో సోయా సాగును తగ్గిస్తున్నారు. నీటి సౌకర్యముండి వానాకాలం, రబీలోనూ సోయా సాగు చేసిన రైతులు ఇప్పుడు ఒక్క సీజన్లో కూడా సాగు చేసేందుకు ముందుకు రావడంలేదు. జిల్లాలో సోయా సాగు వివరాలు సంవత్సరం విస్తీర్ణం (ఎకరాల్లో) 2023–24 1,32,363 2024–25 65,464 2025–26 62,500 -
ఆదిలాబాద్కు చేరిన రథయాత్ర
ఆదిలాబాద్రూరల్: బీసీలకు 42శాతం రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని, దేశ వ్యాప్తంగా కులగణన ప్రక్రియ శాసీ్త్రయ పద్ధతిలో వెంటనే చేపట్టాలని బీసీ ఆజాదీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ మేలుకో రథయాత్ర గురువారం ఆదిలాబాద్కు చేరింది. బీసీ స్టడీ సర్కిల్ సెంటర్ ఆవరణలోని జ్యోతీబాఫూలే విగ్రహానికి ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కని సంజయ్కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యమాన్ని ప్రతీ పల్లెలో బలోపేతం చేసి బీసీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో రథయాత్ర ప్రారంభించినట్లు చెప్పారు. సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్, నాయకులు జక్కుల సత్యనారాయణ, దాసరి రమేశ్, బొమ్మకంటి రమేశ్, చిలుక విలాస్, ఎర్రం నర్సింగ్రావ్, ఉదారి నగేశ్, అల్లూరి భూమన్న, దర్శనాల నగేశ్, తన్నీరు నవత, అసం రమాదేవి, ఊషన్న, కుర్ర రవి, చిప్ప గంగన్న, దాసరి రమేశ్ తదితరులున్నారు. -
తాగునీటి సమస్య రానివ్వద్దు
కై లాస్నగర్: గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా ఆ దేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తాగునీటి సరఫరాపై ఎంపీడీవోలు, ఎంపీవోలు, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. స్థానిక నీటి వనరులు, వా టర్ ట్యాంకర్లను వినియోగించుకోవాలని సూ చించారు. మిషన్ భగీరథ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల్లో క్లోరినేషన్ చేసి నీటిని సరఫరా చేయాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో మిషన్ భగీరథ నీరు వృథా కాకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. లాండసాంగ్వి ఇన్టెక్వెల్ పంప్హౌస్ వద్ద రూ.40లక్షలతో చేపట్టిన మరమ్మ తు పనుల అనంతరం సరిపడా నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. 170 సర్వే ప్లాట్ల వద్ద వి ద్యుత్ సరఫరా లేని కారణంగా ట్యాంకుల ద్వారా నీటిని అందించాలని సూచించారు. లీకేజీలుంటే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేసి నిరంతరం నీటి సరఫరా చేయాలని సూచించారు. చేతిపంపులకు సంబంధించిన విడిభాగాల టెండర్లను పూర్తి చేసి ఏరోజుకారోజు మరమ్మతు చేపట్టాలని ఆదేఽశించారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రావణ్కుమార్, డీపీవో శ్రీలత, డీఎల్పీవో ఫణీందర్రావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాజర్షిషా అధికారులతో సమీక్ష -
ట్రాక్టర్ల కొను‘గోల్మాల్’
కైలాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ట్రాక్ట ర్ల కొనుగోలుమాల్ చోటుచేసుకుంది. వాటిని సరఫ రా చేసిన కాంట్రాక్టర్కు బల్దియా అధికారులు బహిరంగ మార్కెట్ కంటే అధిక ధర చెల్లించడం ఇందు కు బలాన్ని చేకూరుస్తుంది. ఏదైన పనిచేసిన కాంట్రాక్టర్కు బిల్లు చెల్లించేందుకు నెలల తరబడి తి ప్పుకునే అధికారులు ట్రాక్టర్లను సరఫరా చేసిన కాంట్రాక్టర్కు మాత్రం ట్రాలీలు అందించకుండానే అ డ్వాన్స్గా బిల్లులు పూర్తిగా చెల్లించడం అనుమానా లకు తావిస్తోంది. బల్దియాలోని ఓ కీలక అధికారి వెనుకుండి ఈ వ్యవహారాన్ని నడిపించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలోని పలు వార్డు ల నుంచి చెత్త సేకరణ కోసం మూడు కొత్త ట్రాక్టర్లు కొనుగోలు చేయాలని బల్దియా అధికారులు నిర్ణయించారు. వాటి సరఫరా కోసం గతేడాది డిసెంబ ర్లో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆదిలాబా ద్కు చెందిన ఇద్దరు టెండర్లు దాఖలుచేశారు.ఇందు లో చింతామణి ఏజెన్సీకి చెందిన కాంట్రాక్టర్కు టెండర్ కట్టబెట్టారు. సదరు కాంట్రాక్టర్ సోనాలిక కంపెనీకి చెందిన డిఐ35ఆర్ఎక్స్ 40హెచ్పీ సామర్థ్యంతో కూడిన మూడు ట్రాక్టర్లను ఈ ఏడాది జనవరిలో మున్సిపాలిటీకి అప్పగించారు. కేవలం ఇంజన్లను మాత్రమే అందించారు. చెత్తసేకరణలో కీలకమైన ట్రాలీలను సరఫరా చేయకపోవడంతో మూడు నెలలుగా బల్దియా కార్యాలయ సమీపంలోని వాటర్ ట్యాంక్ సమీపంలో వృథాగా దర్శనమిస్తున్నాయి. షోరూం కంటే అధిక ధరకు ... సోనాలిక కంపెనీ ట్రాక్టర్ ఇంజన్, ట్రాలీతో కలిపి షోరూం ధర రూ.9లక్షలుగా ఉంది. ఓ రైతు సంబంధిత ట్రాక్టర్ కొనుగోలు చేసేందుకు వెళ్లగా షోరూం ప్రతినిధులు ఆ ధరతో ట్రాక్టర్ డెలివరీ చేసేందుకు కొటేషన్ అందించారు. ఇందులో డీఐ 35 ఆర్ఎక్స్–హెచ్పీ 40 సామర్థ్యంతో కూడిన ఇంజన్తో పాటు టెంపరరీ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ కలిపి రూ. 6,70,000, ట్రాలీకి రూ.2,30,000కి గా అందులో పేర్కొన్నారు. బేరమాడితే ఇందులో నుంచి రూ. 50వేలు తగ్గించే అవకాశమున్నట్లు షోరూం ప్రతి నిధులు సదరు రైతుకు వెల్లడించారు. ఇదిలా ఉంటే బల్దియా అధికారులు కేవలం ఒక్కో ట్రాక్టర్ ఇంజన్కే రూ.8.70లక్షల చొప్పున మూడింటికి కలిపి రూ.26,10,000లను సదరు కాంట్రాక్టర్కు చెల్లించారు. జీఎస్టీతో కలిపి రూ.31,10,598లను బిల్లుగా అందజేశారు. వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ ను బల్దియా నుంచే చెల్లించాల్సి ఉంటుందని ము న్సిపల్ అధికారులు చెబుతున్నారు. ట్రాలీ అందజే స్తే దానికి అందనంగా మరో సుమారు రూ.2.30లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈలెక్కన ఒక్కో ట్రాక్టర్కు రూ.11లక్షలను చెల్లించాల్సి వస్తోంది. ఇన్సూరెన్స్తో కలిపితే ఆ నిధులు మరింత అధికమమయ్యే అవకాశముంది. కంపెనీ షోరూం ధరతో పోల్చితే ఒక్కో ట్రాక్టర్కు సుమారు రూ.2.20లక్షలు అధికంగా చెల్లించినట్లైందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. నిబంధనల ప్రకారం టెండర్ దాఖలు చేసే కాంట్రాక్టర్ మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు ఇస్తేనే తీసుకోవాల్సి ఉంటుంది. పైగా పలు కంపెనీలకు సంబంధించిన ధరలను పరిశీలించాకే టెండర్లో వాటి ధరను నమోదు చేసి టెండర్ దాఖలు చేయాల్సి ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బినామీగా.. ఆ అధికారి? నిబంధనలకు విరుద్ధంగా సాగిన ఈ కోనుగోల్మాల్లో బల్దియాకు సంబంధించిన ఓ అధికారి చక్రం తిప్పినట్లుగా ఆరోపణలున్నాయి. సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీ పేరిట సదరు అధికారే బినామీగా టెండర్ దాఖలు చేసి ఈ వ్యవహారాన్ని నడిపించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫలితంగానే షోరూం కంటే అధిక ధరకు వాటిని కొనుగోలు చేయడంతో పాటు ట్రాలీలు సరఫరా చేయకుండానే అడ్వాన్స్గా కాంట్రాక్టర్కు బిల్లులు పూర్తిగా చెల్లించారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి ప్రజాధనం వృథా కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. షోరూం ధర కంటే అధికంగా చెల్లింపు చక్రం తిప్పిన ఓ బల్దియా అధికారి? ట్రాలీలు లేకుండానే అడ్వాన్స్గా బిల్లుల చెల్లింపు ఆదిలాబాద్ బల్దియాలోని పరిస్థితి నిబంధనలకు అనుగుణంగానే .. ట్రాక్టర్ల కొనుగోలు కోసం నిబంధనల ప్రకారమే టెండర్ల ప్రక్రియ నిర్వహించాం. తక్కవ ధరకు కోడ్ చేసిన కాంట్రాక్టర్కే వాటి సరఫరా బాధ్యతలు అప్పగించాం. ఇంజన్లు మాత్రమే సరఫరా చేశారు. ట్రాలీలు రెండు మూడు రోజుల్లో రానున్నాయి. బహిరంగ మార్కెట్ ధర కంటే ఎక్కువకు కొనుగోలు చేశారనే దాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. – సీవీఎన్ రాజు, మున్సిపల్ కమిషనర్, ఆదిలాబాద్ -
పహల్గాం బాధితులకు సిందూర్తో నివాళి
ఆదిలాబాద్: పహల్గాం బాధితులకు ఆపరేషన్ సిందూర్ ఘన నివాళి అందించింది అని సనాతన హిందూ ఉత్స వ సమితి జిల్లా అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి అ న్నారు. ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ విజయవంతం అవడంపై సమితి ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో సంబరాలు నిర్వహించా రు. జాతీయ జెండాలను చేతబూని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు ఇస్తూ టపాసులు కాల్చారు. ఇందులో శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగా నంద సరస్వతిస్వామి, సమితి సభ్యులు కె.రవీందర్, ఆర్. రవీందర్, వేణు, సత్యం, నర్సింలు, మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్ దాస్, అశోక్రెడ్డి, దేవన్న, ఎల్వి రావు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
దేశ రక్షణకు ఎప్పుడూ సిద్ధమే..
అమాయకులైన పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదుల స్థావరాలను తుద ముట్టించడమే లక్ష్యంగా భారత సేనలు ముందుకు వెళ్లడం గొప్ప విషయం. ఆ దేశ పౌరులకు ఎలాంటి హాని చేయకుండా సైనిక క్యాంపులకు ఎలాంటి నష్టం కలిగించకుండా కేవలం ఉగ్రవాద శిక్షణ శిబిరాలే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయింది. భారత సైన్యంలో 21ఏళ్ల పాటు పని చేసిన అనుభవం ఉంది. దేశభద్రత బాధ్యతలు చేపట్టడంలో ఎప్పుడైనా సిద్ధంగానే ఉంటా. ఈ విషయమై ఇండియన్ ఆర్మీకి రిక్వెస్ట్ లెటర్ సైతం పంపించాను. – గడ్డం అశోక్, మాజీ సైనిక ఉద్యోగి, మద్రాస్ ఇంజినీర్స్ రెజిమెంట్, ఆదిలాబాద్ -
భూభారతితో సమస్యలు పరిష్కారం
సాత్నాల: భూభారతి చట్టం ద్వారా రైతుల భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. భోరజ్ మండలంలోని బా లాపూర్లో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలు సుకున్నారు. అలాగే గణేశ్పూర్ శివారులోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన రెవెన్యూ చట్టం ద్వారా రైతులకు వేగవంతంగా నాణ్యమైన సేవలు అందించనున్నట్లు తెలిపారు. రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్ చేసి వివరాలను సంబంధిత అధికారులకు పంపి క్షేత్రస్థాయిలో పరి ష్కరించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే అర్హులై న వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా మ రోసారి జాబితాలు పరిశీలించాలన్నారు. అనంతరం గణేశ్పూర్ శివారులోని సర్వేనంబర్–1లో కాస్తు, సాదాబైనామాలో పట్టాకోసం వచ్చి న దరఖాస్తులను, స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో వినోద్ కుమార్, తహసీల్దార్ రఘునాథ్రావ్, ఏఈ, డీటీ పాల్గొన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక పకడ్బందీగా చేపట్టాలి ఇచ్చోడ: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాజర్షిషా అన్నా రు. మండలకేంద్రంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, అధికారులతో మాట్లాడారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలన్నారు. ఆయన వెంట జెడ్పీసీఈవో జితేందర్రెడ్డి, ఎంపీడీవో లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి సూర్యప్రకాశ్ ఉన్నారు. సంస్కృతిని భావితరాలకు అందించాలి గుడిహత్నూర్: ఆదివాసీ సంస్కృతిని భావితరా లకు అందించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండలంలోని శంభుగూడలో కొద్ది రోజులుగా ఆదివాసీ సకల కళా వెల్ఫేర్ సొసైటీ డైరెక్టర్ కాత్లే శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గుస్సాడీ, ఇతర ఆదివాసీ కళల శిక్షణ శిబిరంలో పాల్గొని మాట్లాడారు. ఇందులో ఎస్పీ అఖిల్ మహాజన్, డీటీ భాగ్యలక్ష్మి, ఎంపీడీవో అబ్ధుల్ హై, ఆర్ఐ అరుణ్, గ్రామ మాజీ సర్పంచ్ శంభు, ఆదివాసీ సంగీత విధ్వాంసులు పాల్గొన్నారు. -
పక్కా ప్రణాళికతో ప్రతీకారం
ఆపరేషన్ సిందూర్ ఎంతో పకడ్బందీగా చేపట్టారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పక్కా ప్రణాళికతో చేసిన మెరుపు దాడి ఇది. ఇప్పటివరకు జరిగింది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది. నేను ఉద్యోగ విధుల్లో ఉన్నప్పుడు చిన్నపాటి సంఘటనలు జరి గాయి. అయితే ఇన్ని సన్నాహాలు ఎప్పుడూ చూడలేదు. కార్గిల్ తర్వాత మొదటిసారి చూస్తున్నాను. యుద్ధం వచ్చినా ధీటుగా ఎదుర్కొనేందుకు మన సైన్యం సమర్ధంగా ఉంది. దేశ సరిహద్దు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – నారాయణ, మాజీ సైనిక ఉద్యోగి, ఆర్టీలరీ రెజిమెంట్, ఆదిలాబాద్ -
యుద్ధానికి సిద్ధం
18 ఏళ్ల పాటు సైనికుడిగా ఆర్మీలో విధులు నిర్వహించాను. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ప్రతిగా భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్తో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రస్థావరాలపై దాడులు నిర్వహి ంచడం గర్వంగా ఉంది. ఒకవేళ యుద్దమే వ స్తే మాజీ సైనికుడిగా అందులో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నా. ఇండియన్ ఆర్మీలో పని చేయడం గర్వంగా ఫీలవుతున్నా. దేశానికి హానిచేసే ఉగ్రవాదులను వదిలిపెట్టవద్దు. – రాసం ప్రవీణ్ కుమార్, మాజీ సైనికుడు, బోథ్ -
● భారత సేనల ఆపరేషన్పై హర్షాతిరేకాలు ● పహల్గాం ఉగ్రదాడికి సరైన సమాధానమని అభిప్రాయం
ఆదిలాబాద్/బోథ్: అది కశ్మీర్లోని పహల్గాం బైసారన్ వ్యాలీ. మినీ స్విట్జర్లాండ్గా పిలిచే పర్యాటక ప్రదేశంలో టూరిస్టుల తాకిడి ఎక్కువ. అయితే ఏప్రిల్ 22న ఆ పచ్చనిప్రాంతం ఎరుపెక్కింది. ప్రకృతిలో సేదతీరుతున్న పర్యాటకులతో ఉత్సా హంగా నిండిన ఆ ప్రాంతం ఒక్కసారిగా హాహాకారాలతో నిండిపోయింది. మనిషి ముసుగులో ముష్కరులు మారణ హోమం సృష్టించారు. మతాన్ని అడిగి మరీ రాక్షసత్వంతో మహిళల సింధూరాలను చెరిపేశారు. భార్యల ముందే వారి భర్తలను కిరాతకంగా కాల్చి చంపారు. ఈ ఉగ్రదాడిని దేశం అంతా ముక్తకంఠంతో ఖండించింది. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని నినదించింది. ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరుస్తూ ఏప్రిల్ 7న భారత సేనలు అర్ధరాత్రి సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్,పాక్లోని 9 ముష్కర స్థావరాలపై ముప్పేట దాడి చేసింది. ఆపరేషన్ సిందూర్ పేరిట ఉగ్రస్థానాలను నేలమట్టం చేసింది. ఈ ఆపరేషన్ విజయవంతం అవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. జిల్లాకు చెందిన మాజీ సైనికులు మరోసారి బార్డర్కు వెళ్లేందుకు సిద్ధమంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన పలువురి అభిప్రాయాలు.. -
నాన్న కోరిక నెరవేర్చా..
– యనకి మధుకృష్ణ, ఎస్హెచ్వో, గుడిహత్నూర్ కుటుంబనేపథ్యం: మాది ఆర్మూర్. అమ్మ సరస్వతి గృహిణి. నాన్న ఉదయాద్రి కాంట్రాక్టర్. తమ్ముడు మనోన్ చదువుతున్నాడు. చెల్లి వివాహం అయ్యింది. విద్యాభ్యాసం: ఇంటర్వరకు ఆర్మూర్లోనే సాగింది. బీటెక్ హైదరాబాద్లో పూర్తయింది. లక్ష్యసాధన: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలేది నాన్న కోరిక. అది తీర్చడమే నా కర్తవ్యంగా భావించా. బీటెక్ పూర్తికాగానే ప్రిపరేషన్ మొదలుపెట్టా. మొదట బీట్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది. 2019 నుంచి 2023 వరకు ఉద్యోగం చేస్తూనే ఎస్సైకి ప్రిపరేషన్ అయ్యా. విజయం సాధించా. సమాజంలో మీరు కోరుకుంటున్న మార్పు: మానవుడు సంఘ జీవి. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండా లి. లా అండ్ ఆర్డర్ పాటించాలి. నిరుద్యోగులకు మీరిచ్చే సూచన..: లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందు సాగితే తప్పకుండా విజయం వరిస్తుంది. -
బావ ప్రోత్సాహంతో..
– జి. జీవన్రెడ్డి, గాదిగూడ కుటుంబ నేపథ్యం..: మాది నిజామాబాద్. వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్న రాజమణి– హన్మండ్లు. విద్యాభ్యాసం: ఒకటి నుంచి డిగ్రీ వరకు నిజామాబాద్లోనే సాగింది. లక్ష్యసాధన: 2002లో ఆర్మీలో చేరా. 2020లో రిటైర్ అయ్యా. మా బావ ఫైర్ ఆఫీసర్. ఆయన స్ఫూర్తితో ఎస్సై ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యాను. ఈ జనరేషన్తో పోటీపడి ఉద్యోగానికి ఎంపికయ్యా. సమాజంలో మీరు కోరుకునే మార్పు..: యువత గంజాయి, డ్రగ్స్వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇందు కోసం నా వంతు కృషి చేస్తా.. నిరుద్యోగులకు మీరిచ్చే సూచన: లక్ష సాధన కోసం విరామం లేకుండా ప్రయత్నం చేయాలి. -
రెండో ప్రయత్నంలో విజయం
కష్టాలను దిగమింగుతూ ఒకరు.. కన్నీళ్లు కనిపించకుండా మరొకరు.. అందరిదీ ఒకే లక్ష్యం.. యూనిఫామ్ జాబ్. పరిస్థితులు ఎలా ఉన్నా తమకు అనుకూలంగా మార్చుకున్నారు.. పుస్తకాలతో కుస్తీ పట్టి.. మైదానంలో చెమటోడ్చారు.. ప్రతీ క్షణం అదే ధ్యాసలో ఉండి కొలువు కోసం ఓ యజ్ఞమే చేశారు. విజయ తీరాలకు చేరువై కల సాకారం చేసుకున్నారు. వారే జిల్లాలో ఇటీవల విధుల్లో చేరిన ప్రొబేషనరీ ఎస్సైలు. ఎస్హెచ్వోలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారి మనోగతం ‘సాక్షి’తో పంచుకున్నారు ఇలా.. ఆదిలాబాద్టౌన్/తాంసి/ఇచ్చోడ/బజార్హత్నూర్/ ఆదిలాబాద్రూరల్/సిరికొండ/గుడిహత్నూర్/ ఉట్నూర్రూరల్/నార్నూర్– బోడ పీర్సింగ్నాయక్, ఎస్హెచ్వో, భీంపూర్ కుటుంబ నేపథ్యం..: మాది వ్యవసాయ కుటుంబం. సొంతూరు నిజామాబాద్ జిల్లాలోని మోపాల్. అమ్మానాన్న లక్ష్మీబాయి–రాయిచంద్. వ్యవసాయంలో వాళ్ల కష్టాన్ని దగ్గరిగా చూశా. ఎలాగైనా సర్కారు కొలువు సాధించాలనుకున్నా. విద్యాభ్యాసం : ఇంటర్ వరకు నిజామాబాద్లోనే సాగింది. కరీంనగర్లో బీటెక్ పూర్తి చేశా. లక్ష్య సాధన..: నాకు చిన్నప్పటి నుంచి పోలీస్ యూనిఫాం ధరించాలనే ఫ్యాషన్ ఉండేది. ఆ దిశగా లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ప్రిపేర్ అయ్యా. మొదటి ప్రయత్నంలో తృటిలో తప్పింది. నిరాశ చెందలే. మళ్లీ సన్నద్ధమయ్యా. రెండో ప్రయత్నంలో కొలువు సాధించా. సమాజంలో మీరు కోరుకునే మార్పు.. : అందులో మీ పాత్ర: అందరికీ సమన్యాయం జరగాలి. పేద, ధనిక తేడాలుండొద్దు. అలాంటి మార్పు కోసం నావంతు కృషి చేస్తా. నిరుద్యోగులకు మీరిచ్చే సూచన..: లక్ష్యసాధనకు లాంగ్టర్మ్ ప్రిపరేషన్ దోహదపడుతుంది. అపజయాలు ఎదురైనా కుంగిపోవద్దు. పట్టుదల వీడకుండా కష్టపడితే విజయం వరించడం ఖాయం. -
అమ్మానాన్నల కష్టమే నాకు దారి చూపింది
– గడ్డం రమ్య, జైనథ్, ఎస్హెచ్వో కుటుంబ నేపథ్యం..: స్వగ్రామం నిజా మాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని దేగామ. నాన్న భోజన్న వ్యవసాయ కూలీ. అమ్మ పద్మ బీడీ కార్మికురాలు. విద్యాభ్యాసం: 10వ తరగతి వరకు జెడ్పీఎస్ఎస్ దేగామలో చదివా. బాసర ట్రిపుల్ఐటీలో రెండేళ్లు చదివాను. ఆ తర్వాత ఓపెన్ డిగ్రీ బీఏ(ఈపీపీ) చేశా. నిజాం కళాశాలలో ఎంఏ పూర్తి చేశాను. లక్ష్యసాధన : 2021 నుంచి గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యాను. పేద కుటుంబం కావడంతో ఆర్థిక పరిస్థితులు బాగా లేకుండే. అన్నయ్య చదువుతూనే హైదరాబాద్లో పార్ట్టైమ్ జాబ్ చేస్తూ తమ్ముడిని, నన్ను చదివించారు. అమ్మ నాన్నల కష్టమే నాకు దారి చూపించింది. గ్రూప్స్ ప్రిపరేషన్లో భాగంగా పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది. ఎస్సై, కానిస్టేబుల్ రెండింటికీ ఎంపికయ్యా. ఎస్సై ఉద్యోగం ఎంచుకున్నాను. సమాజంలో మీరు కోరుకునే మార్పు..: పోలీసుస్టేషన్కు రావడానికి చాలామంది భయపడుతుంటారు. వారికి అవగాహన కల్పించి న్యాయపరమైన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తాను. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాను. నిరుద్యోగులకు మీరిచ్చే సూచన..: కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు. గమ్యం చేరేంత వరకు వదిలిపెట్టద్దు. -
‘హస్తం’లో కదలిక
● ఇక కాంగ్రెస్ కమిటీలు ● నేడు నియోజకవర్గ సమావేశాలు ● గ్రామ, మండల, బ్లాక్ కమిటీ అధ్యక్షుల ఎంపికకు.. ● ఒక్కోదానికి ఐదుగురి పేర్లు ● 20లోగా ఖరారు చేయనున్న పీసీసీ ● ఆ తర్వాత డీసీసీ అధ్యక్షుడి ఎంపిక సాక్షి,ఆదిలాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరవుతోంది. అయినా తమకు పదవుల పరంగా న్యాయం దక్కడం లేదని వాపోతున్న కార్యకర్తలకు త్వరలోనే తీపికబురు అందనుంది. ఎట్టకేలకు పార్టీలో అన్ని స్థాయిల్లో కమిటీల భర్తీకి అధిష్టానం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా టీపీసీసీ ఆదేశాల మేరకు జిల్లాకు కేటాయించిన పరిశీలకుల ద్వారా ఈ కమిటీల ఎంపికకు ముందడుగు పడింది. నేడు నియోజకవర్గం వారీగా హస్తం పార్టీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఆదిలాబాద్ సమావేశం జిల్లా కేంద్రంలోని విద్యుత్ తరంగిణి ఫంక్షన్ హాల్లో ఉదయం 9 గంటలకు ఖరారు చేశారు. బోథ్ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు ఇచ్చోడలోని అభినందన్ గార్డెన్స్లో నిర్వహించనున్నారు. టీపీసీసీ నుంచి పరిశీలకులుగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హుందాన్, టీపీసీసీ కార్యదర్శి చిట్ల సత్యనారాయణలను జిల్లాకు నియమించిన విషయం తెలిసిందే. వీరి ఆధ్వర్యంలో గతనెల 20న జిల్లా కేంద్రంలో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అందులోనే ఈ కమిటీల నియామకం విషయాన్ని స్పష్టం చేశారు. మే 3 నుంచి ఎంపిక ప్రక్రియ షురూ అవుతుందని చెప్పారు. అందుకు అనుగుణంగా బుధవారం ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ సమావేశాలను వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. అన్ని స్థాయిల్లో కమిటీలు.. రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలాంటి కమిటీలు లేకపోవడంతో పార్టీలో నిస్తేజం కనిపించింది. కార్యకర్తల్లో ఉత్సాహం కొరవడింది. ప్రధానంగా రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో డీసీసీ అధ్యక్ష పదవే ఖాళీగా ఉండడంతో కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే వారే కరువయ్యారు. నియోజకవర్గ ఇన్చార్జీలు వారి వారి పరిధిలో కార్యకర్తలకు అండగా ఉంటూ వచ్చారు. అయితే పార్టీ పరంగా ఎలాంటి కమిటీలు లేకపోవడంతో వారిలో నిరాశ వ్యక్తమైంది. ఈ పరిస్థితిలో అధిష్టానం అన్ని స్థాయిల్లో కమిటీలను నియమించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామ, మండల, బ్లాక్ కమిటీలకు మొదట అధ్యక్షులను నియమించనున్నారు. ఇందుకోసమే నియోజకవర్గం వారీగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో కమిటీకి ఐదుగురి పేర్లు.. గ్రామ, మండల, బ్లాక్ కమిటీలకు సంబంధించి ఒక్కో దాని కోసం ఐదుగురి పేర్ల చొప్పున పరిశీలకులు సేకరించనున్నారు. ఆ పేర్లను టీపీసీసీకి నివేదిస్తారు. ఆ తర్వాత అందరి ఆమోదంతో ఆ కమిటీలకు అధ్యక్షులను నియమిస్తారు. ఇదిలా ఉంటే పార్టీలో మొదటి నుంచి జెండా మోసిన కార్యకర్తలకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ జిల్లాలో అనేక మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో కొన్ని మండలాలు మినహాయిస్తే అనేక చోట్ల ఇతర పార్టీల నాయకులు పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందనేది అందరిలో ఆసక్తి కలిగిస్తుంది. పాత, కొత్త నాయకులను కలుపుకొని వెళ్తుందా.. లేనిపక్షంలో మొదటి నుంచి పార్టీ జెండా మోసిన వారికే ప్రాధాన్యతనిస్తుందా.. అలా అయిన పక్షంలో కార్యకర్తల మద్దతు ఎలా ఉంటుంది.. ఇలా అన్ని అంశాలు పార్టీలో ప్రస్తుతం ప్రాధాన్యత కలిగిస్తున్నాయి. డీసీసీ అధ్యక్షుడు కూడా.. గ్రామ, మండల, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలను ఈనెల 20లోగా ఎంపిక చేయనున్నారు. అవి పూర్తయిన వెంటనే పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని ముఖ్య నాయకులు పేర్కొంటున్నారు. అందులో డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం ముగ్గురి పేర్లను పరిశీలకులు సేకరిస్తారని చెబుతున్నారు. టీపీసీసీకి నివేదించి, ఈనెల చివరిలోగా జిల్లా అధ్యక్షుడిని ఖరారు చేయనున్నట్లు పేర్కొంటున్నారు. తద్వారా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ పరంగా అన్ని స్థాయిల్లో కమిటీలను పటిష్టం చేయడం ద్వారా ముందుకెళ్లాలని అధిష్టానం భావిస్తుంది. ఆ మేరకు కార్యాచరణ మొదలైంది. -
అధిక కేసులు పరిష్కరించేలా చూడాలి
● జిల్లా జడ్జి ప్రభాకరరావుఆదిలాబాద్టౌన్: జాతీయ లోక్అదాలత్లో అధిక కేసులు పరిష్కరించేలా చూడాలని జిల్లా జడ్జి ప్రభా కరరావు అన్నారు. జిల్లా కోర్టులో పోలీసు అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆ యన మాట్లాడారు. జూన్ 14న జాతీయ లోక్అదా లత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. గతంతో పోల్చి తే ఈసారి మరిన్ని అధిక కేసులు పరిష్కరించేలా ప్ర తిఒక్కరూ కృషి చేయాలన్నారు. స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకోవాలన్నారు. రాజీ పడదగ్గ కేసుల కక్షిదారులతో మాట్లాడాలని సూచించారు.ఇందులో జడ్జిలు కుమార్వివేక్,లక్ష్మికుమారి, హుస్సేన్, పీపీలు రమణారెడ్డి, రహీం, డీఎస్పీ జీవ న్రెడ్డి, వన్టౌన్, టూటౌన్ సీఐలు సుని ల్కుమార్, కరుణాకర్, ఎక్సైజ్ సీఐ విజేందర్ పాల్గొన్నారు. -
అమ్మ కోరిక.. నాన్న ప్రోత్సాహం
– కే అఖిల్, ఎస్హెచ్వో, నార్నూర్ కుటుంబ నేపథ్యం..: మాది నిజామాబాద్ లోకల్. అమ్మ జ్యోతి పోలీస్శాఖలో సూపరింటెండెంట్గా పనిచేశారు. 2019లో లోకం విడిచారు. నాన్న రమేశ్ ఏఎస్సై నిజామాబాద్లో పని చేస్తున్నారు. తమ్ముడు సాఫ్ట్వేర్ ఉద్యోగి. విద్యాభ్యాసం: ఇంటర్ వరకు నిజామబాద్లోనే సాగింది. బీటెక్ హైదరాబాద్లో పూర్తి చేశా. లక్ష్యసాధన: కొంతకాలం సాఫ్ట్వేర్గా పనిచేశా. అది సంతృప్తి లేకుండే. అమ్మ కోరిక, నాన్న ప్రోత్సాహంతో పోలీస్ జాబ్ కోసం మళ్లీ ప్రిపరేషన్ మొదలుపెట్టా. తొలిప్రయత్నంలో ఓటమి ఎదురైంది. నిరాశ చెందలేదు. ప్రణాళికాబద్ధంగా చదివా. రెండో ప్రయత్నంలో ఎస్సై జాబ్ సాధించా. సమాజంలో మీరు కోరుకునే మార్పు..: సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొనాలి. ఇందుకోసం నావంతు ప్రయత్నం చేస్తా. నిరుద్యోగులకు మీరిచ్చే సూచన: లక్ష్యాన్ని ఏర్పర్చుకొని ప్రణాళికాబద్ధంగా సాధన చేస్తే విజయం తప్పకుండా సొంతమవుతుంది. -
ఏడేళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టా..
– కోట రాజశేఖర్రెడ్డి, ఎస్హెచ్వో, బజార్హత్నూర్ కుటుంబ నేపథ్యం: సొంతూరు పాత నిజామాబాద్ జిల్లా సాలంపాడ్ గ్రామం. మాది వ్యవసాయ కుటుంబం. నాన్న సాయిరెడ్డి, అమ్మ అచ్చమ్మ. విద్యాభ్యాసం: పాఠశాల, ఇంటర్ విద్య బోధన్లో, డిగ్రీ హైదరాబాద్లోని ప్రైవేటు కళాశాలలో పూర్తి చేశాను. లక్ష్యసాధన: డిగ్రీ పూర్తి కాగానే ఎస్సై ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో చదివాను. హైదరాబాద్ అశోక్నగర్లోనే ఏడేళ్లు పుస్తకాలతోనే కుస్తీ పట్టా. 2019లో మొదటి ప్రయత్నంలో 1.5 మార్కుల తేడాతో చేజారింది. నిరాశ చెందకుండా మళ్లీ ప్రణాళికాబద్ధంగా చదివా. విజయం సాధించా. సమాజంలో మీరు కోరుకునే మార్పు..: యువత సన్మార్గంలో నడవాలి. ఆ దిశగా నావంతు ప్రయత్నం చేస్తా. నిరుద్యోగులకు మిరిచ్చే సూచన: లక్ష్యసాధనలో ఓటమి ఎదురైనా నిరాశ చెందొద్దు. ప్రణాళికాబద్ధంగా నిరంతర సాధన చేస్తే విజయం ఖాయం. -
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
కై లాస్నగర్: అర్హులైన వారినే ఇందిరమ్మ లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని, ఇందులో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చూడాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. పట్టణంలోని కేఆర్కే, రాంనగర్, భాగ్యనగర్ కాలనీల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల దరఖాస్తులను మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీ లించారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదులపై మండుటెండను సైతం లెక్క చేయకుండా ఇంటింటికి వెళ్లి దరఖాస్తులను, చెక్లిస్ట్ను పరిశీలించారు. ప్రా థమిక జాబితాలో ఉన్న పేర్లను మరోసారి అన్ని కోణాల్లో పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజను ఆదేశించారు. అంతకు ముందు గూగుల్ మీట్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై అధికారులతో సమీక్షించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులని గుర్తిస్తే వారి పేర్లను చేర్చాలని సూచించారు. తాంసిలో.. తలమడుగు(తాంసి):తాంసి మండలంలోని హస్నాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను కలెక్టర్ పరిశీలించారు. అర్హులైనప్పటికీ తమపేరు జాబితాలో రాలేదని పలువురు దరఖాస్తుదారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండో విడతలో అర్హులందరికీ మంజూరు చేస్తామన్నారు. వారి వెంట జెడ్పీసీఈవో జితేందర్రెడ్డి, ఎంపీడీవో మోహన్రెడ్డి, తహసీల్దార్ లక్ష్మి, హౌసింగ్ ఏఈ నజీర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉన్నారు. ● కలెక్టర్ రాజర్షి షా -
అక్క స్ఫూర్తితో..
– సాల్లురి శ్రీసాయి, ఎస్హెచ్వో, సిరికొండ కుటుంబ నేపథ్యం : మాది నిజామాబాద్. నాన్న సాల్లురి కిషన్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమ్మ లక్ష్మి గృహిణి. అక్క శ్రీలత, పంచాయతీ కార్యదర్శి. విద్యాభ్యాసం : ఒకటి నుంచి ఐదో తరగతి వరకు నిజామాబాద్లోని ప్రభుత్వ పాఠశాలలోనే సాగింది. నవోదయలో ఇంటర్ వరకు చదివి హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేశా. మైసూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశా. లక్ష్యసాధన : కరోనా సమయంలో నేను వర్క్ఫ్రం హోం చేస్తుండగా.. అక్క పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుంది. గ్రామస్తుల సమస్యలను పరిష్కరిస్తున్న తీరు చూసి నేను కూడా సర్కారు కొలువు సాధించాలనుకున్నా. అక్క స్ఫూర్తితో ఇంటి వద్ద ప్రిపరేషన్ మొదలుపెట్టా. 2023 ఎస్సై ఫలితాల్లో విజయం సాధించా. చిన్నప్పుడు స్పోర్ట్స్ బాగా ఆడేది. ఉద్యోగ సాధనలో అది కలిసివచ్చింది. సమాజంలో మీరు కోరుకునే మార్పు..: మత్తు పదార్థాలతో కలిగే దుష్పరిణామలపై ప్రజలకు అవగాహన కల్పిస్తా. వాటిని పూర్తిస్థాయిలో రూపుమాపడంలో నా వంతు కృషి చేస్తా. నిరుద్యోగులకు మీరిచ్చే సూచన : కష్టపడి చదవాలి. లక్ష్యం సాధించే వరకు పట్టు సడలనివ్వొద్దు. -
కానిస్టేబుల్గా ఉంటూనే ప్రిపేరయ్యా..
– బి.సంజయ్కుమార్,ఎస్హెచ్వో,ఇచ్చోడ కుటుంబ నేపథ్యం: సొంతూరు నిజామాబాద్ జిల్లాలోని ఇత్వర్పేట్. మాది వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్న భూదేవి– చిన్నగంగారాం. విద్యాభ్యాసం..: ఏడో తరగతి వరకు ఊరి లోని ప్రభుత్వ పాఠశాలలోనే సాగింది. బాల్కొండలోని సర్కారు బడిలో టెన్త్ వరకు చదివా. ఇంటర్ ఆర్మూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తి చేశా. బీటెక్ హైదరాబాద్లో పూర్తయింది. లక్ష్యసాధన: బీటెక్ పూర్తి కాగానే ప్రిపరేషన్ మొదలుపెట్టా. 2020లో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. నిజామాబాద్లో విధులు నిర్వర్తిస్తూనే ఎస్సై కోసం ప్రిపేర్ అయ్యా. నాలుగేళ్ల తర్వాత నా కల ఫలించింది. సమాజంలో మీరు కోరుకునే మార్పు.. : అందరికీ సమన్యాయం దక్కాలి. అందుకోసం నావంతు కృషి చేస్తా. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నాకు సమాజ పరిస్థితులపై అవగాహన ఉంది. నిరుద్యోగులకు మీరిచ్చే సూచన: కష్టపడితే ఫలితం దక్కుతుంది. అందుకు నేనే ఉదాహరణ. -
హేళన చేశారు.. ఆ కసితోనే చదివా
– పిల్లి ప్రణయ్కుమార్, ఎస్హెచ్వో, మావల కుటుంబ నేపథ్యం..: మాది నిజామాబాద్ జిల్లా భీంగల్. నాన్న సత్యనారాయణ వ్యాపారవేత్త, అమ్మ నర్సు గృహిణి. అన్నయ్య సాఫ్ట్వేర్ ఉద్యోగి. అక్కకు పెళ్లయింది. నేను చివరి సంతానం. విద్యాభ్యాసం: పదో తరగతి వరకు ఊరిలోని ప్రభుత్వ పాఠశాలలోనే సాగింది. ఇంటర్ కూడా భీంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే పూర్తి చేశా. ఓపెన్ వర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాను. లక్ష్యసాధన: డిగ్రీ పూర్తి కాగానే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నా. అందులో భాగంగా పోలీస్ కొలువును ఎంచుకున్నా. ప్రిపేర్ అవుతున్న క్రమంలో కొంతమంది ‘ఏం ఉద్యోగం సాధిస్తావని’ హేళన చేశారు. అదే నాలో కసిని పెంచింది. దీంతో పట్టుదల పెరిగింది. ఉద్యోగం సాధించి వారికి సమాధానం చెప్పా. సమాజంలో మీరు కోరుకునే మార్పు..: తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలి. వారి లక్ష్యసాధనలో వెన్నంటి నిలవాలి. నిరుద్యోగులకు మీరిచ్చే సూచన: ప్రణాళికాబద్ధంగా చదివితే సర్కారు కొలువు సాధించడం సులువే. -
తొలి ప్రయత్నంలోనే సక్సెస్
–పూజ,ఎస్హెచ్వో, ఉట్నూర్ కుటుంబ నేపథ్యం: మాది నిజామాబాద్ జిల్లా ఆర్మూ ర్. నిరుపేద కుటుంబం. అమ్మ సాయమ్మ, నాన్న ముత్తన్న ఇద్దరూ కూలీలే. నేను ఒక్కదాన్నే సంతానం. విద్యాభ్యాసం: పదో తరగతి వరకు ఆర్మూర్ ప్రభుత్వ పాఠశాలలోనే చదివా. టెన్త్లో మండల టాపర్గా నిలిచా. ట్రిపుల్ ఐటీ బాసరలో బీటెక్ పూర్తి చేశాను. కొద్ది రోజులు సాఫ్ట్వేర్ జాబ్ చేశాను. అనంతరం యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాను. ఈ క్రమంలో ఎస్సై నోటిఫికేషన్ రావడంతో పరీక్ష రాశాను. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించా. సమాజంలో మీరు కోరుకుంటున్న మార్పు : మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి. నిరుద్యోగ యువతకు మీరిచ్చే సలహా: చిన్నతనంలోనే లక్ష్యం ఎంచుకోవాలి. ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగితే విజయం సొంతమవుతుంది. -
నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి
తాంసి: రైతులు వానాకాలం సాగుకు సంబంధించి నాణ్యమైన విత్తనాలు, ఎరువుల ను ఎంపి క చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ స్వామి అన్నారు. మండలంలోని పొన్నారి గ్రా మంలో కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. పంచాయ తీ కార్యాలయ ఆవరణలో రైతులతో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రైతులు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సా ధించే పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. పంటమార్పిడితో దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం సేంద్రియ ఎరువులు, రసాయనాల వినియోగం,సాగునీటిఆదా, మట్టి పరీక్షలు తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగా హన కల్పించారు. ముందుగా రైతులతో కలిసి ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ వై.ప్రవీణ్కుమార్,శాస్త్రవేత్తలు రాజ శేఖర్, మోహన్దాస్, శేషా ద్రి, సునీల్ కుమార్, జి.శివచరణ్, వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు రాజేందర్ రెడ్డి, ప్రవీణ్, తాంసి ఇన్చార్జ్ ఏడీఏ రవీందర్, మాజీ సర్పంచ్ అశోక్, మాజీ ఎంపీటీసీ రఘు, రైతులు పాల్గొన్నారు. -
ప్రజావాణిలో ‘ఇందిరమ్మ’ గోడు
● భారీగా తరలివచ్చిన దరఖాస్తుదారులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ కై లాస్నగర్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లు ప్రజావాణిపై ప్రభావం చూపాయి. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి గతంలో ఎన్నడు లేని విధంగా భారీగా తరలివచ్చారు. ఇందులో అత్యధికులు ఇందిరమ్మ ఇళ్లు రాలేదని నివేదించిన వారే కావడం గమనార్హం. మండుటెండను సైతం లెక్కచేయకుండా తరలివచ్చిన వారు ఉన్నతాధికారుల ఎదుట తమగోడు వెల్లబోసుకున్నారు. కలెక్టర్ రాజర్షి షా బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం 2గంటలు కావడంతో కార్యక్రమం ముగించినట్లుగా కలెక్టర్ ప్రకటించడంతో అధికారులంతా సమావేశ మందిరం నుంచి వెళ్లిపోయారు. కలెక్టర్ సైతం బయలుదేరుతుండగా అప్పటికే బయట పెద్ద సంఖ్యలో ఉన్న అర్జీదారులు ఒక్కసారిగా సమావేశ మందిరంలోకి వచ్చారు. దీంతో కలెక్టర్ అరగంట పాటు నిలబడే వారి నుంచి వినతులు స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో జరిగిన పొరపాట్లపై విచారణ జరిపించి అర్హులకు న్యాయం చేస్తామని కలెక్టర్ భరోసానిచ్చారు. అధికారికంగా 148 అర్జీలు అందినట్లుగా అధికారులు చెబుతున్నప్పటికీ మరో 80 మంది వరకు ఆన్లైన్ చేయకుండానే చివ రి నిమిషంలో నేరుగా అందజేశారు. ఇందులో జెడ్పీ సీఈవో జితేందర్రెడ్డి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, కలెక్టరేట్ ఏవో వర్ణ, వివిధశాఖల అధికారులు పా ల్గొన్నారు. ఈవారం అర్జీదారుల్లో కొందరి నివేదన.. పనివేళలు కుదించాలి ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో పనిచేసే పారిశుధ్య కార్మికులతో ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పనిచేయిస్తున్నారు. ఎండల తీవ్రత రోజురోజుకు పెరగడంతో కార్మికులు అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కార్మికుల ఆరోగ్యం దృష్ట్యా పని వేళలు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకే కుదించాలి. – టీఎమ్మార్పీఎస్ నాయకులు, ఆదిలాబాద్ ఈ మేరకు స్పందించిన కలెక్టర్ వెంటనే కమిషనర్ రాజుతో మాట్లాడారు. కార్మికులతో ఉదయం 11గంటల వరకు మాత్రమే పనులు చేయించాలని ఆదేశించారు. -
సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి
కై లాస్నగర్: ఈ నెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని గ్రా మ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూని యన్ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న కోరారు. ఈ మేరకు సోమవారం సంఘం ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ కార్యాలయ ఉద్యోగి శ్రీనివాస్ గౌడ్ కు సమ్మె నోటీసు అందజేశారు. పంచాయతీ కా ర్మికులకు అమలు చేస్తున్న మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ఉద్యోగ, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపడుతున్న సమ్మెలో జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఇందులో యూనియన్ నాయకులు అశోక్, వెంకట్రావు, సోనేరావు, గంగన్న, కిరణ్, సంతోష్, రాజేందర్, శంకర్ ఉన్నారు. మున్సిపల్ కమిషనర్కు సమ్మె నోటీసు ఈ నెల 20న దేశవ్యాప్త కార్మిక సమ్మెలో ఆదిలా బాద్ మున్సిపాలిటీ కార్మికులు పాల్గొనాలని మున్సిపల్ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ నాయకులు కోరారు. ఈమేరకు సోమవారం ఆ సంఘం ఆధ్వర్యంలో కమిషనర్ సీవీఎన్.రాజును కలిసి సమ్మె నోటీసు అందజేశారు. ఇందులో సంఘ బాధ్యులు జనార్దన్, భిక్షపతి, శ్యామ్ తదితరులున్నారు. -
● వానాకాలం పంటల కోసం.. ● దుక్కులు సిద్ధం చేస్తున్న రైతులు ● అంచనాకు మించి విత్తనాలు.. సరిపడా ఎరువులు ● ప్రణాళిక రెడీ అంటున్న వ్యవసాయశాఖ
సాక్షి,ఆదిలాబాద్: వానాకాలం పంటల సాగుకు జిల్లా రైతాంగం సన్నద్ధమవుతోంది. దుక్కులు దున్ని చేలను చదును చేసే పనుల్లో బిజీగా మా రారు. మరోవైపు భూసారం పెంచేందుకు అందుబాటులో ఉన్నవారు సేంద్రియ ఎరువులతో పాటు చెరువు మట్టిని పొలాల్లో వేస్తున్నారు. జిల్లాలో పరిస్థితి.. జిల్లాలో యాసంగితో పోల్చితే వానాకాలంలోనే పంటల సాగు అధికంగా ఉంటుంది. కేవలం వర్షాధారంగానే 70 శాతం వరకు సాగవుతుంటుంది. దీంతో ఈ సీజన్ వస్తుందంటే జిల్లా రైతులంతా బిజీ అవుతారు. ప్రధానంగా జిల్లాలో పత్తిని ఎక్కువగా పండిస్తారు. ఆ తర్వాత సోయా, కందులు, ఇతరత్రా పంటలు సాగు ఉంటుంది. గత వానాకాలంలో 5లక్షల 79వేల 124 ఎకరాల్లో పంటలు సాగు కాగా, ఈ ఏడాది 5లక్షల 85వేల 350 ఎకరాల్లో సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. పెరగనున్న పత్తి విస్తీర్ణం.. జిల్లాలో ఈ ఏడాది కూడా పత్తి, సోయా, కంది పంటలు అధిక విస్తీర్ణంలో సాగు కానున్నాయి. ఇందులో 75 శాతం వరకు పత్తి ఉండనుంది. గతేడాదితో పోల్చితే ఈ సారి పత్తి సాగు విస్తీర్ణం పెరగనుందని, అలాగే సోయా కొంత తగ్గే అవకాశముందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు ఈ ఏడాది పత్తి విత్తనాలు విరివిగా లభ్యమయ్యే పరిస్థితి ఉండడంతో రైతులు అటువైపే మొగ్గుచూపే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రణాళిక సిద్ధం.. వానాకాలం పంటల సాగు కోసం వ్యవసాయ శాఖ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ సీజన్లో ఏయే పంటలు ఎంత సాగవుతాయి.. దానికి అనుగుణంగా విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయా.. అనే అంశంలో ఇప్పటికే ఆయా విత్తన కంపెనీలతో వ్యవసాయ శాఖ సమావేశాలు పూర్తి చేసింది. ఈ సీజన్లో పత్తి విత్తనాల ప్యాకెట్లు అంచనాకు మించి అందజేసేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో మాదిరి విత్తనాల కొరత ఏర్పడేందుకు ఆస్కారమే లేదని పేర్కొంటున్నారు. కలెక్టర్ రాజర్షిషా ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసి నకిలీ విత్తనాల విక్రయాలు అరికట్టేందుకు యంత్రాంగం పాటుపడుతుంది. దుక్కిదున్ని చేనును సాగుకు సిద్ధం చేస్తూ..జిల్లాలో వానాకాలం పంటల సాగు విస్తీర్ణం (ఎకరాల్లో).. పంట 2024లో 2025లో అవసరమయ్యే (అంచనా) విత్తనాలు(క్వింటాళ్లలో) పత్తి 4,36,473 4,40,000 11,00,840 ప్యాకెట్లు సోయాబీన్ 65,464 62,500 18,725 కంది 57,258 55,000 21,960 జొన్న 1493 1600 66 మొక్కజొన్న 15066 23000 1,834 వరి 2030 1900 489 పెసర 546 550 22 మినుము 561 550 44 ఇతరత్రా 231 250 12అవసరమయ్యే ఎరువులు (మెట్రిక్ టన్నుల్లో) ఎరువులు అవసరం అందుబాటులో ఉన్నది యూరియా 35,000 18,000 డీఏపీ 13,000 4,000 కాంప్లెక్స్ 36,000 24,000 ఎంఓపీ 7,000 1,134 ఎస్ఎస్పీ 4,000 1,071కొరత లేదు.. వానాకాలం సాగు కోసం రైతులకు పూర్తిస్థాయిలో విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాం. ఈసారి పత్తి విత్తనాలను అంచనాకు మించి సరఫరా చేసేందుకు ఆయా కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఎలాంటి కొరత లేదు. ఇతర విత్తనాలు కూడా అందుబాటులో ఉంచుతున్నాం. ఎరువులను కోటా మేరకు సరిపడా ఉండేలా చర్యలు చేపడుతున్నాం. – శ్రీధర్ స్వామి, జిల్లా వ్యవసాయ అధికారి -
ఆరోగ్య పాఠశాలతో విద్యార్థుల్లో మార్పు
● కలెక్టర్ రాజర్షిషా ● ‘పది’లో సత్తా చాటిన విద్యార్థులకు సన్మానం ఆదిలాబాద్టౌన్: ఆరోగ్య పాఠశాల కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో మార్పులు వచ్చాయని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. పదో తరగతిలో ఉత్తమ మా ర్కులు సాధించిన విద్యార్థులను జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందరి సహకారంతో జిల్లా పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిందన్నారు. రాష్ట్రస్థాయిలో 97.18 శాతం ఉత్తీర్ణతతో 9వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించడం అభినందనీయమని కొనియాడారు. ఇందులో డీఈవో శ్రీనివాస్ రెడ్డి, డీఐఈవో జాదవ్ గణేశ్కుమార్, డీసీఈబీ సెక్రెటరి గజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
మరిన్ని రహదారులు నిర్మించాలి
తెలంగాణ రాష్ట్రానికి పక్కన ఉన్న మహారాష్ట్రతో అనుసంధానిస్తూ మరిన్ని జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాలి. జిల్లాలో 300 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణం చేపట్టిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుంది. అదే తరహాలో ఆదిలాబాద్ నుంచి ఉట్నూర్, ఆసిఫాబాద్ మీదుగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అల్లాపల్లి వరకు జాతీయ రహదారి నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలి. తద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. పెండింగ్ పనులు పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి.– ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ -
శిక్షణతో పిల్లల్లో ప్రత్యేక ప్రావీణ్యం
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: శిక్షణతో పిల్లల్లో ప్రత్యేక ప్రావీణ్యం లభిస్తుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీల అభివృద్ధి విద్యార్థి దశ నుంచే ప్రారంభం కావాలని అన్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో నాలుగు చోట్ల ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆదిలాబాద్లోని పోలీస్ హెడ్క్వార్టర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, నార్నూర్లలో వీటిని ప్రారంభించినట్లు చెప్పారు. నాలుగు కేంద్రాల్లో 470 మంది విద్యార్థులకు యోగా, కరాటే, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, బాస్కెట్ బాల్ తదితర కీడాంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. తద్వారా చిన్నారుల్లో మానసిక, శారీరక దృఢత్వం పెంపొందుతుందన్నారు. అలాగే పోలీసు స్టేషన్ల సందర్శన, సిబ్బంది విధుల నిర్వహణ, జైలు సందర్శన, ఆయుధాల ఉపయోగం, వాటి పనితీరు, పోలీసులు తీసుకుంటున్న కఠోర శిక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేందర్రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్.జీవన్రెడ్డి, ఇన్స్పెక్టర్లు కరుణాకర్, వెంకటి, చంద్రశేఖర్, శిక్షకులు పాల్గొన్నారు. బోథ్ పోలీస్ స్టేషన్ తనిఖీ బోథ్:అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయా లని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. స్థానిక పోలీ స్స్టేషన్ను సోమవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాల ని సిబ్బందికి సూచించారు. డయల్ 100, బ్లూకోర్ట్ సిబ్బంది గ్రామాలను సందర్శిస్తూ సమాచార సేకరణలో ముందుండాలని సూచించారు. ఆయన వెంట సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై ప్రవీణ్ ఉన్నారు. -
● కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ● జాతీయ రహదారి– 363 ప్రారంభం.. జాతికి అంకితం ● నాగ్పూర్ టు హైదరాబాద్కు ఆరు వరుసల రహదారి నిర్మాణానికి హామీ ● హాజరైన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు
రెబ్బెన(ఆసిఫాబాద్): ‘ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన జిల్లా, ఈ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉంది. ఇక్కడ నివసించే ఆది వాసీలు భూమి కోసం, భుక్తి కోసం ఎన్నో పోరాటా లు చేశారు. అలాంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం’ అని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కుమురంభీం జిల్లా రెబ్బెన మండలంలోని కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద సోమవారం ఏర్పాటు చేసిన ఎన్హెచ్– 363 ప్రారంభోత్సవ సభ విజయవంతమైంది. కుమురంభీం జిల్లాతోపాటు మంచిర్యాల, ఆది లాబాద్ జిల్లాల నుంచి బీజేపీ కార్యకర్తలు, ప్రజలు ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. ‘అందరికీ నమస్కారం.. బాగున్నారా’ అంటూ కేంద్ర మంత్రి ప్రజ లను ఆత్మీయంగా తెలుగులో పలకరించారు. మంచిర్యాల జిల్లా నుంచి మహారాష్ట్ర సరిహద్దులోని కు మురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి వరకు నిర్మించిన నాలుగు వరుసల జాతీయ రహదారితోపాటు పలు సెక్షన్లలో చేపట్టిన పనులను కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించి జాతికి అంకితం చేశారు.అంతకుముందు ఉదయం 10.48 గంటలకు నాగ్పూర్ నుంచి హెలికాప్టర్ ద్వారా కాగజ్నగర్ ఎక్స్రోడ్డు వద్దకు చేరుకున్నారు. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక్క, అధికారులు ఘన స్వాగతం పలికారు. పోలీస్ సిబ్బంది గౌర వ వందనం స్వీకరించిన అనంతరం సభాస్థలికి చేరుకుని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఉదయం 11.47 గంటలకు రూ.3,900 కోట్లతో చేపట్టిన జాతీయ రహదారుల పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గడ్కరీ మాట్లాడుతూ రాను న్న మూడేళ్లలో రూ.2లక్షల కోట్లతో రోడ్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. గడిచిన పదేళ్లలో దేశంలో జరిగిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని, అసలైన సి నిమా ముందుందన్నారు. జాతీయ రహదారుల వి స్తరణతో అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. అన్ని రాష్ట్రాలను జాతీయ రహదారులతో అనుసంధా నం చేస్తామని, తెలంగాణలో రహదారులను మరింత అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. రాష్ట్రంలో రూ.లక్ష కోట్లతో గ్రీన్వే నిర్మాణానికి కృషి చేస్తున్నామని, నాగ్పూర్ టు విజయవాడ వరకు చేపట్టే రహదారితో మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, విజయవాడ మీదుగా రహదారి నిర్మిస్తున్నామన్నారు. నాగ్పూర్ నుంచి హైదరాబాద్కు ఆరు వరుసల రహదారికి కృషిచేస్తున్నామని తెలిపారు. 2014 తర్వాత రాష్ట్రంలో రూ.వేల కోట్లతో రహదారులను అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని నరేంద్రమోదీదన్నారు. మధ్యాహ్నం 12.20 గంటల వరకు ప్రసంగించి, 12.30 గంటలకు కాగజ్నగర్ ఎక్స్రోడ్ నుంచి కేంద్ర మంత్రి బయలుదేరి వెళ్లిపోయారు. కార్యక్రమాల్లో ఎంపీలు గోడం నగేశ్, గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీలు దండె విఠల్, మల్క కొమురయ్య, అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్బాబు, పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు, రామారావు పటేల్, ప్రేంసాగర్రావు, రోడ్డు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్రావు, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, అదనపు ఎస్పీ ప్రభాకర్రావు, ఏఎస్పీ చిత్తరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
కాగజ్నగర్లో హైవే-363ని జాతికి అంకితమిచ్చిన గడ్కరీ
సాక్షి, సిర్పూర్ కాగజ్నగర్: వెనుకబడిన జిల్లాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. చీకటి ఉన్న చోటనే వెలుగులు నింపాలని చెప్పుకొచ్చారు. అలాగే, ఉమ్మడి ఆదిలాబాద్ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు.సిర్పూర్ కాగజ్నగర్లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటిస్తున్నారు. జిల్లాలో జాతీయ రహదారి 363ని గడ్కరీని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ..‘జాతీయ రహదారులతో దేశాన్ని అనుసంధానిస్తున్నాం. వెనుకబడిన జిల్లాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. కేంద్రమంత్రిగా ప్రజల సమస్యలను అర్థం చేసుకునే అవకాశం వచ్చింది. గడ్చిరోలి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. నేను ఇంజనీర్ను కాదు.. కానీ, 13 డాక్టరేట్లు వచ్చాయి. చీకటి ఉన్న చోటనే వెలుగులు నింపాలి. అమృత్ సరోవర్ పేరుతో నీటి నిల్వను పెంచుతున్నాం. తెలంగాణలో కూడా నీటి నిల్వలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. రైతులు ఆత్మహత్యలు చేసుకునే విదర్భ ప్రాంతంలో పనిచేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఉమ్మడి ఆదిలాబాద్ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే అభివృద్ధి చేస్తామన్నారు.అంతకుముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ..‘కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనెక్టివిటీని పెంచడం మోదీ సర్కార్ లక్ష్యం. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తీర్ణం 5వేల కి.మీ దాటింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రూ.3,900 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జాతీయ రహదారుల విస్తరణ వల్ల రోడ్డు ప్రమాదాలు, ప్రయాణ సమయం భారీగా తగ్గాయి. రోడ్డు, రైల్వే, విమాన కనెక్టివిటీ పెంచేందుకు కేంద్రం అంకితభావంతో పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా 7 టెక్స్టైల్ పార్కులు మంజూరు చేస్తే తెలంగాణకు కూడా ఒకటి దక్కింది. రూ.6,330 కోట్లతో రామగుండంలో యూరియా ఉత్పత్తి పరిశ్రమను పునరుద్ధరించుకున్నాం. ఇచ్చిన హామీ ప్రకారం నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు మంజూరు చేశాం. ఆదిలాబాద్లో డిఫెన్స్ ఎయిర్పోర్టు ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దేశంలో 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా రేషన్ బియ్యాన్ని మోదీ ప్రభుత్వం అందజేస్తోంది అని చెప్పుకొచ్చారు. -
ప్రశాంతంగా ‘నీట్’
ఆదిలాబాద్టౌన్: వైద్యవిద్య కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) ఆదివారం ప్రశాంతంగా ముగి సింది. జిల్లా కేంద్రంలో ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అభ్యర్థులను లోనికి అనుమతించారు. అందరూ నిర్దేశిత సమయానికి ముందుగానే చేరుకున్నారు. ఆయా సెంటర్ల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించారు. కాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రాల్లోకి బ్యాగ్లు, ఆభరణాలు, లోహ, ఎలక్ట్రానిక్ తదితర వస్తువులను అనుమతించమని అధికారులు ముందుగానే ప్రకటించారు. అయితే కొందరు అభ్యర్థులు ఆభరణాలతో రాగా అవి తీసిన తర్వాతే సిబ్బంది వారి ని లోనికి అనుమతించారు. 1,621 మంది హాజరు.. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఏడు కేంద్రాల్లో 1,659 మంది విద్యార్థులకు గాను 1,621 మంది హాజరయ్యారు. 38 మంది గైర్హాజరయ్యారు. పట్ట ణంలోని బంగారుగూడ తెలంగాణ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో 360 మందికి గాను 348 మంది హాజరు కాగా, 12 మంది గైర్హాజరయ్యారు. బంగారుగూడ మైనార్టీ రెసిడెన్షియల్లో 264 మందికి గాను 256 మంది హాజరుకాగా, 8 మంది గైర్హాజరయ్యారు. బాలి కల రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో 240 మందికి గాను 237 మంది హాజరు కాగా, ముగ్గురు గైర్హాజరయ్యారు. ప్రభు త్వ బాలికల పాఠశాలలో 240 మందికి గాను 234 మంది హాజరుకాగా, ఆరుగురు గైర్హాజరయ్యారు. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో 240 మందికి గాను 236 హాజరు కాగా, నలుగురు గైర్హాజరయ్యారు. ట్రైబల్ వెల్ఫే ర్ రెసిడెన్షియల్ కళాశాలలో 340కి గాను 238 మంది హాజరు కాగా, ఇద్దరు గైర్హాజరయ్యారు. మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల కేంద్రంలో 75 మందికి గాను 72 మంది హాజరు కాగా, ముగ్గురు గైర్హాజరయ్యారు. ఆయా కేంద్రాలను కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షించారు. ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ముందుగానే చేరుకున్న విద్యార్థులు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ -
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు
ఆదిలాబాద్టౌన్: ఆరుగాలం కష్టపడి పంటలు పండించే అన్నదాతలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ‘రైతుల ముగింట్లో శాస్త్రవేత్తలు’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని ఆయా గ్రామాల్లోకి శాస్త్రవేత్తలు వెళ్లి రైతులకు పలు సలహాలు, సూచనలు అందించనున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి ఏవిధంగా సాధించాలనే విషయాలపై అవగాహన కల్పించనున్నారు. తాంసి మండలం పొన్నారి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించనున్నారు. జిల్లాలోని 44 గ్రామాల్లో కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొంటారు. వీరితో పాటు వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ అధికారులు రైతులకు సూచనలు అందించనున్నారు. రైతులను చైతన్యపర్చేందుకు.. రైతులను చైతన్యపర్చేందుకు ప్రభుత్వం రైతు ముగింట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈనెల 5 నుంచి 13 వరకు రైతుల చెంతకు శాస్త్రవేత్తలు వెళ్లనున్నారు. తొమ్మిది బృందాలుగా గ్రామాల్లో పర్యటిస్తారు. సాగు పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించడం, సస్యరక్షణ చర్యలు, ఏయే భూముల్లో ఏయే పంటలు వేయాలి తదితర విషయాలను రైతులకు తెలియజేస్తారు. వారి సందేహాలను నివృత్తి చేస్తారు. కాగా కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఆరుగురు శాస్త్రవేత్తలు, వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ఐదుగురు శాస్త్రవేత్తలు, వ్యవసాయ కళాశాల నుంచి ఏడుగురు శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యవసాయ కళాశాలకు సంబంధించి 14 గ్రామాల్లో, కృషి విజ్ఞాన శాస్త్రవేత్తలు 18 గ్రామాల్లో, వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు 12 గ్రామాల్లో పర్యటిస్తారు. నేటి నుంచి ఈనెల 13 వరకు.. అన్నదాతలకు అవగాహన నేడు పొన్నారిలో ప్రారంభం ఈనెల 13 వరకు కార్యక్రమాలు ఈనెల 5 నుంచి 13 వరకు రైతు ముగింట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని చేపడుతున్నాం. రైతుల చెంతకు వెళ్లి అవగాహన కల్పిస్తాం. అధిక దిగుబడులు ఏవిధంగా సాధించాలి, రసాయనాల వాడకం తగ్గించడం, ఏయే పంటలు సాగు చేయాలి, వాటికి ఆశించే చీడపీడల గురించి తెలియజేస్తాం. సోమవారం పొన్నారి గ్రామంలో ప్రారంభిస్తున్నాం. రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – రాజశేఖర్, కేవీకే శాస్త్రవేత్త -
● పైలట్ ప్రాజెక్ట్గా భోరజ్ మండలం ఎంపిక ● నేటి నుంచి గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు ● మూడు ప్రత్యేక బృందాల నియామకం
కై లాస్నగర్: భూ సమస్యలు పరిష్కరించి రైతుల కు భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టం అమల్లో భాగంగా జి ల్లాలో కొత్తగా ఏర్పడిన భోరజ్ మండలాన్ని పైల ట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేశారు. నేటినుంచి ఈ నెల 16వరకు గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. షెడ్యూల్ ఖరారుతో పాటు తహసీల్దార్ల ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను నియమిస్తూ కలెక్టర్ రాజర్షిషా ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులే స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లనున్న నేపథ్యంలో తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. తహసీల్దార్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు.. భోరజ్ తహసీల్దార్ ఎల్.రాజేశ్వరీ, భీంపూర్ తహసీల్దార్ కె.నలంద ప్రియ, బేల తహసీల్దార్ రఘునాథ్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో టీంలో నాయబ్ తహసీల్దార్, ఇద్దరు ఆర్ఐలు, సర్వేయర్, సీనియర్ అసిస్టెంట్/జూనియర్ అసిస్టెంట్, ఎంపీఎస్వో స్థాయి కలిగిన ఎనిమిది మంది ఉద్యోగులను నియమించారు. వీరితో పాటు జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్లతో కూడిన ఎనిమిది మంది ఉద్యోగులతో మరో మూడు హెల్ప్ డెస్క్లను నియమించారు. జిల్లాలోని పలు తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ బాధ్యతలను అప్పగించారు. ఒక్కో గ్రామాన్ని ఈ 16 మంది అధికారులు, ఉద్యోగులు సందర్శించి అక్కడి రైతులకు భూ భారతి చట్టం విధి విధానాలపై అవగాహన కల్పిస్తారు. వారి నుంచి భూ సమస్యలపై అర్జీలు స్వీకరించనున్నారు. ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు వీరంతా గ్రామంలోనే ఉండనున్నారు. సంబంధిత రైతులు రాతపూర్వక దరఖాస్తులను అందించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే నిర్ణీత ప్రొఫార్మాను జిల్లాకు పంపించింది. అధికారులు వాటిని అందజేయనున్నారు. దాన్ని పూర్తి చేసి అవసరమయ్యే ధ్రువీకరణ పత్రాలను జతచేసి అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. వాటిని విచారణ అనంతరం పోర్టల్లో నమోదు చేయనున్నారు. సమస్యలు బోలేడు.. గత ప్రభుత్వం అమలు చేసిన ధరణిలో పలు సమస్యలకు సంబంధించి ఆప్షన్లు లేకపోవడంతో గ్రామాల్లో భూ సమస్యలు పేరుకుపోయాయి. వాటి పరిష్కారం కోసం కొన్నేళ్లుగా బాధితులు అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇలాంటి వారంతా కొత్త చట్టంపై ఆశలు పెట్టుకున్నారు. సర్వేనంబర్లలో తప్పిదాలు, భూమి మిస్సింగ్, సరిహద్దుల వివాదం, పేర్ల మార్పిడి, డిజిటల్ సిగ్నిచర్, భూ విస్తీర్ణంలో తేడాలు, విరాసత్, సాదాబైనామా వంటి సమస్యలు ఈ సదస్సుల ద్వారా పరిష్కారమై తమకు లబ్ధి చేకూరుతుందని ఆశపడుతున్నారు. కోర్టా గ్రామంలో ఇటీవల రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు(ఫైల్) సద్వినియోగం చేసుకోవాలి భూభారతి చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు సమస్యలను పరిష్కరించేందు కోసమే గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. సంబంధిత రైతులు సదస్సుకు వచ్చి నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తులు అందజేయాలి. సమస్యలను క్షేత్రస్థాయిలోనే విచారించి జూన్ 2లోగా వాటిని పరిష్కరిస్తాం. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలి. – ఎల్.రాజేశ్వరి, తహసీల్దార్, భోరజ్ సదస్సుల నిర్వహణ షెడ్యూల్ ఇలా.. భోరజ్ మండలంలో మొత్తం 28 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఒక్కోరోజు మూడు గ్రామాల్లో సదస్సులు కొనసాగనున్నాయి. తొలిరోజున కోర్టా, గణేశ్పూర్, పూసాయి గ్రామాల్లో నిర్వహించనున్నారు. 6న మిర్జాపూర్, కేదార్పూర్, అవాల్పూర్, 7న బాలాపూర్, మాండగడ, అకోలి, 8న పిప్పర్వాడ, హత్తిఘాట్, హషంపూర్, 9న గిమ్మ(కే), శేఖాపూర్, సావాపూర్, 12న గిమ్మ(బి), డోల్లారా, దాదాపూర్, 13న లేఖర్వాడ, కామాయి, సిర్సన్న, 14న పౌజ్పూర్, గూడ, పెండల్వాడ, 15న తరోడా, కరన్వాడీ, రాంపూర్(టి), 16న భోరజ్ గ్రామాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. వీటి నిర్వహణకు నోడల్ అధికారిగా ఆదిలాబాద్ ఆర్డీవో బి.వినోద్కుమార్ వ్యవహరించనున్నారు. -
ఘనంగా భగీరథ మహర్షి జయంతి
కై లాస్నగర్: భగీరథ మహర్షి జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉప్పరసగర కులస్తులు, బీసీ సంక్షేమ శాఖ ఉద్యోగులతో కలిసి భగీరథుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ, భగీరథ మహర్షిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు కృషి చేయాలన్నారు. ఇందులో జిల్లా బీసీ సంక్షేమాధికారి కె. రాజలింగు, సూపరింటెండెంట్ సంజీవ్కుమార్, ఉప్పరసగర సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్ పాల్గొన్నారు. -
మందుబాబులపై కొరడా●
● బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన పలువురిపై కేసు ● జిల్లా కేంద్రంలో పోలీసుల విస్తృత తనిఖీలు ఆదిలాబాద్టౌన్: మందుబా బులపై పోలీసులు కొరడా ఝుళిపించారు. బహిరంగ ప్రదేశాలు, రోడ్ల పక్కన కూ ర్చొని మద్యం తాగే వారిపై కేసులు నమోదు చేశారు. ‘రో డ్లపైనే సిట్టింగ్’ శీర్షికన ‘సాక్షి’లో ఆదివారం కథనం ప్రచురితమైంది. ఈ మేరకు స్పందించిన వన్టౌన్, టూటౌన్ సీఐలు పట్టణంలో విస్తత తనిఖీలు చేపట్టా రు. టూటౌన్ పరిధిలో గల ఆర్అండ్బీ విశ్రాంతి భవనం, రవితేజ హోటల్, పంజా బ్ హోటల్, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో మద్యం తాగుతున్న వారిని పట్టుకున్నారు. 10 మందిపై కేసులు నమోదు చేసినట్లు టూ టౌన్ సీఐ కరుణాకర్రావు తెలిపారు. అలాగే వన్టౌన్ సీఐ సునిల్కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి
కై లాస్నగర్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు పాల్గొని జయప్రదం చే యాలని ఏఐటీయుసీ జిల్లా అధ్యక్షుడు చిరంజీవి, ప్రధాన కార్యదర్శి దేవేందర్ కోరారు. తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్, వర్క ర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కమిషనర్ సీవీ ఎన్ రాజును శనివారం కలిసి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కార్మికులు ఎన్నో పోరాటాలు, ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న 44 చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి 4 కోడ్లుగా విభజించడాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఇందులో యూనియన్ నాయకులు అశోక్, ఉషన్న, నరేందర్ తదితరులున్నారు. -
లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి●
ఆదిలాబాద్టౌన్: జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జూన్ 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి కె. ప్రభాకరరావు సూచించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని తన చాంబర్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. రాజీమార్గం ద్వారా కేసులు పరి ష్కరించేందుకు లోక్ అదాలత్ ఎంతో తోడ్ప డుతుందన్నారు. రాజీపడదగ్గ కేసులన్నింటి నీ ఇందులో పరిష్కరించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని కోర్టుల్లో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని సద్విని యోగం చేసుకో వాలని సూచించారు. ఇందులో డీఎల్ఎస్ఏ ఇన్చార్జి సెక్రటరీ సీహెచ్ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
నిధులు సరే.. పనులెప్పుడో?
● టెండర్లు పూర్తయినా షురూ కాని ‘అమృత్–2’ ● ఎస్టీపీల స్థల సేకరణలో తీవ్ర జాప్యం ● జిల్లా కేంద్రంలో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణాల తీరిది కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ము రుగునీటి సమస్య పరిష్కరించేలా కేంద్ర ప్రభుత్వం అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం చేపట్టాల ని నిర్ణయించింది. ఇందుకోసం అమృత్–2 పథకం కింద రూ.225 కోట్ల నిధులు మంజూరు చేసింది. సంబంధించిన టెండర్ల ప్రక్రియ సైతం పూర్తయిఎనిమిది నెలలవుతుంది. అయినా పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. మురుగునీటిని శుద్ధి చేసే (ఎస్టీపీ) నిర్మాణాలకు అవసరమైన స్థలాల సేకరణ సమస్యగా మారింది. ఫలితంగా నిధులు ఉండి కూడా పనుల ప్రారంభంలో జాప్యమవుతోంది. భూసేకరణే ప్రధాన సమస్య.. జిల్లా కేంద్రంలో అయిదు చోట్ల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ)లను నిర్మించాలని నిర్ణయించారు. చిల్కూరిలక్ష్మినగర్లో 24 ఎంఎల్డీల సామర్థ్యంతో ఆరు ఎకరాల్లో, ఖానాపూర్ చెరువులోనే ఎకరం విస్తీర్ణంలో 4 ఎంఎల్డీల సామర్థ్యం, కేఆర్కే కాలనీలో 1.5 ఎంఎల్డీల సామర్థ్యంలో 1.5 ఎకరం స్థలంలో, ఇందిరమ్మ కాలనీ, బంగారుగూడ కాలనీల్లో ఒక్కో ఎంఎల్డీ సామర్థ్యంతో కూడిన ఎకరం విస్తీర్ణంలో వీటిని నిర్మించాలని నిర్ణయించారు. ఖానాపూర్ చెరువులో నిర్మించనుండగా దీనికి ఎలాంటి స్థల సమస్య లేదు. మిగతా నాలుగు చోట్ల నిర్మాణాలకు అవసరమైన స్థలాలను గుర్తించినప్పటికీ భూ సేకరణ కొలిక్కి రావడం లేదు. దీంతో పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. సెప్టిక్ ట్యాంకుల నిర్మాణాల అవసరం లేకుండా.. భవిష్యత్తులో ఇళ్లలో సెప్టిక్ ట్యాంకుల నిర్మాణాల అవసరం లేకుండా ఈ పథకాన్ని రూపొందించారు. చిల్కూరిలక్ష్మినగర్లో నిర్మించే ఎస్టీపీకి పట్టణంలోని దుర్గానగర్ కాలనీలోని వాగు పక్క నుంచి దస్నాపూర్, టీచర్స్కాలనీ, న్యూ హౌసింగ్బోర్డు, సుభాష్నగర్ మీదుగా వెళుతున్న వాగు ఇరు పక్కల ప్రధాన పైపులైన్ లేదా భారీ డ్రెయినేజీ నిర్మించనున్నారు. టైలర్స్ కాలనీ వద్ద రెండు లైన్లను ఒకే లైన్గా మార్చి నేరుగా చిల్కూరిలక్ష్మీనగర్లో నిర్మించే ఎస్టీపీ కేంద్రం వరకు పైపులైన్ వేయనున్నారు. పట్టణ నడిబొడ్డున ఉన్న కాలనీలన్నింటి మురుగు పంజాబ్చౌక్ నుంచి మహాలక్ష్మివాడవైపు వెళ్తుండటంతో ఈ మార్గాన్ని ఆ ఎస్టీపీకి అనుసంధానించనున్నారు. జిల్లా కేంద్రంలోని హౌసింగ్బోర్డు, రవీంద్రనగర్, శాంతినగర్ వంటి కాలనీల నుంచి వచ్చే మురుగు ఖానాపూర్ చెరువులో నిర్మించే ఎస్టీపీకి మళ్లించనున్నారు. కేఆర్కే, ఇందిరమ్మకాలనీ, బంగారుగూడలోనూ చుట్టుపక్కల కాలనీలను కలిపి పైపులైన్ వేస్తారు. ఇలా అయిదు ఎస్టీపీలు వాటి కోసం నిర్మించే 14 కిలోమీటర్ల మేర ఉండనున్న పైపులైన్ నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. ప్రతిపాదనలు పంపించాం ఎస్టీపీల నిర్మాణాలకు సంబంధించి నాలుగు చోట్ల స్థలాలను గుర్తించాం. వాటికి భూ సేకరణ చేయాల్సి ఉంది. రెవెన్యూ శాఖ ద్వారా భూములను సేకరించేందుకు అవసరమైన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది. భూ సేకరణ ప్రక్రియ ఎప్పుడు పూర్తయితై అప్పుడే పనులు ప్రారంభిస్తాం. – ఎం.గంగాధర్, పబ్లిక్ హెల్త్ ఈఈ -
భూభారతి పైలట్ మండలంగా భోరజ్
● రేపటి నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు ● కలెక్టర్ రాజర్షి షా కై లాస్నగర్: భూభారతి నూతన రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా పైలట్ ప్రాజెక్ట్గా జిల్లాలోని భోరజ్ మండలాన్ని ఎంపిక చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శనివారం తన క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భోరజ్ మండలంలో 28 గ్రామాల్లో ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు నిర్వహణ కోసం మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సదస్సుల్లో భూసమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. గ్రామానికి వెళ్లే ముందు రోజు గ్రామస్తులకు తెలిసేలా టామ్ టామ్ వేయించాలన్నారు. సంబంధిత అఽధికారులు ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. జూన్ 2 వరకు పైలెట్ ప్రాజెక్ట్ కింద వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ భూముల్లో పొజిషన్లో ఉన్నవారు, పట్టాలు ఉండి పొజిషన్లో లేని వారి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. హైకోర్టు అనుమతులు రాగానే సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలని, ఈమేరకు అవసరమైన కార్యాచరణ పూర్తిచేయాలన్నారు. ఇందులో అదనపు కలెక్టర్ కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్కుమార్, తహసీల్దార్లు, సర్వేల్యాండ్ రికార్ుడ్స ఏడీ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
మైనర్లకు బైకులివ్వొద్దు
● నిబంధనలు ఉల్లంఘిస్తే తల్లిదండ్రులపై కేసు ● ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్టౌన్: మైనర్లకు బైక్లు ఇచ్చే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ అఖిల్ మహా జన్ అన్నారు. బైక్లు నడుపుతూ పట్టుబడ్డ మైనర్ల తల్లిదండ్రులకు పోలీస్ హెడ్క్వార్టర్స్లో శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మైనర్ డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరమన్నారు. పద్దెనిమిదేళ్లలోపు వారికి బైక్లిస్తే వాహన యజమానితో పాటు తల్లిదండ్రులు కేసుల పాలవుతారన్నారు. ఒకవేళ మైనర్ ప్రమాదానికి కారణమైతే ఇన్సూరెన్స్ సైతం రాకుండా పోతుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను రాత్రిపూట, రోడ్లపై అనవసరంగా తిరగకుండా గమనించాలన్నారు. ఇటీవల నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో 295 మంది మైనర్లు బైక్లు నడుపుతూ పట్టుబడగా ఆ వాహనాలను సీజ్ చేశామన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్రెడ్డి, పట్టణ సీఐలు సీహెచ్ కరుణాకర్, ప్రణయ్కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి. వెంకటి, టి మురళి, బి శ్రీపాల్, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో క్రమశిక్షణతో వ్యవహరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ప్రతీ శనివారం స్థానిక పోలీస్ హెడ్క్వార్టర్స్లో నిర్వహించే పరేడ్, యోగా కార్యక్రమాలను ఈ వారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరేడ్ నిర్వహణ ద్వారా సత్సంబంధాలు మెరుగుపడతాయన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేలా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని సూచించారు. ఆయుధాల వినియోగం, ట్రాఫిక్ సిబ్బందికి సిగ్నల్స్పై శిక్షణనిచ్చారు. ఇందులో అదనపు ఎస్పీ బి.సురేందర్రావు, డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, పట్టణ సీఐలు బి.సునీల్కుమార్, సీహెచ్ కరుణాకర్, కే.ఫణిధర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు టి.మురళి, బి.శ్రీపాల్, ఎన్.చంద్రశేఖర్, మావల ఎస్సై వి విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నూతన కార్యవర్గం
కైలాస్నగర్: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జిల్లా నూ తన కార్యవర్గాన్ని స్థానిక టీఎన్జీవోస్ భవన్లో శని వారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్గా ఎస్. అశోక్, సెక్రటరీ జనరల్గా కే.శివకుమార్, అడిషన ల్ సెక్రటరీ జనరల్గా కే. కృష్ణ కుమార్, కోచైర్మన్లుగా కె.కిష్టన్న, మూగ శ్రీనివాస్, సొగల సుదర్శన్, ఎం.శ్రీనివాస్, కే.లక్ష్మారెడ్డి, బి.ప్రవీణ్కుమార్, వైస్ చైర్మన్లుగా ఆర్.శివకుమార్, నవీన్యాదవ్, కాంబ్లీ విజయ్ కుమార్, డిప్యుటీ సెక్రటరీ జనరల్గా నవీన్కుమార్, రాథోడ్రామారావు, కాంబ్లీ విజయ్ కుమా ర్, సెక్రటరీలుగా సప్దార్అలీ, జాయింట్ సెక్రటరీ గా తిరుమల్రెడ్డి, కృష్ణ,సంజీవరెడ్డి ఎన్నికయ్యారు. -
ఆర్టీసీ ద్వారా మెరుగైన సేవలు
ఆదిలాబాద్: ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రయాణికులకు అందిస్తున్న మెరుగైన సేవలను తెలియజేయాలనే ఉద్దేశంతోనే కీచైన్స్ పంపిణీ చేస్తున్నట్లు డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణికులకు శనివారం క్యూఆర్ కోడ్ కీచైన్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆర్టీసీ అందిస్తున్న సేవలు, సమగ్ర సమాచారాన్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ పోశెట్టి, రిజర్వేషన్ ఇన్చార్జి హుస్సేన్, దేవిదాస్, పాల్గొన్నారు. -
నాన్న చూపునకూ నోచుకోకుండానే..!
నిర్మల్/పెంబి: ‘నాన్న.. నువ్వేం ఫికర్ చేయకు. ఇటేం మనసు పెట్టుకోకు. అమ్మా మేము మంచిగనే ఉన్నం. మంచిగ చదువుకుంటున్నం. నువ్వు జాగ్రత్తగా ఉండు. తొందరలనే మనకు మంచి రోజులు వస్తయ్..’ అంటూ నిత్యం తమ తండ్రి మనసులో ఆశలు వెలిగించే ఆ ‘దీపాలు’ అవి నెరవేరకముందే అర్ధంతరంగా ఆరిపోయాయి. తన బిడ్డల చివరిచూపు కోసం ఆ తండ్రి దేశంకాని దేశంలో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. రెక్కల కష్టంతో పెంచుకున్న బిడ్డలిద్దరూ అసువులు బాయడంతో ఆ తల్లి గుండె చెరువైంది. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అర్గుల్ సమీపంలో ఎన్హెచ్ 44పై శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో నిర్మల్ జిల్లా పెంబి మండలం లోతొర్యతండాకు చెందిన అక్కాచెల్లెళ్లు అశ్విని(21), మంజుల(17) మృతిచెందారు. మారుమూల తండా నుంచి..గ్రామస్తులు, జక్రాన్పల్లి ఎస్సై ఎండీ మాలిక్ రహమాన్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతమైన పెంబి మండలం లోతొర్య తండాలో మట్టిగోడలతో రేకుల ఇంట్లో ఉంటున్న బానావత్ సుగుణ, రెడ్డి దంపతులకు ముగ్గురు కూతుళ్లు కుమార్తెలు అశ్విని, మంజుల, నిహారికలతోపాటు కుమారుడు ఆకాశ్ ఉన్నారు. అందరూ చదువుకుంటున్నారు. ఎకరం భూమి మాత్రమే ఉండటంతో రోజువారీ వ్యవసాయ కూలీలుగా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. స్థానికంగా సరైన ఉపాధి లేకపోవడంతో మూడేళ్లక్రితం బానావత్ రెడ్డి దుబాయి వెళ్లాడు.ఎలాగైనా చదవాలని..తమకోసం తమ తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూస్తూ పెరిగిన పిల్లలు బాగా చదివి మంచి ఉద్యోగాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెద్దకూతురు అశ్విని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇటీవల ఫైనలియర్ పూర్తిచేసింది. రెండోకూతురు మంజుల ఇచ్చోడలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేసింది. మంజులకు ఈఏపీ ఎంట్రన్స్ టెస్ట్ ఉండటంతో అక్క అశ్విని సమీప బంధువు జాదవ్ హంసరాజుతో కలిసి గురువారం కారులో హైదరాబాద్ వెళ్లారు. అక్కడ పరీక్ష రాసి, శుక్రవారం తండాకు తిరిగి వస్తుండగా నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అర్గుల్వద్ద కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో అక్కాచెలెళ్లు అక్కడే చనిపోగా, బంధువు జాదవ్ హంసరాజు కాలు, చేయి విరిగాయి. అతడిని ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై తెలిపారు.చివరిచూపునకూ నోచుకోలేక..మూడేళ్లక్రితం దుబాయి వెళ్లిన బాణావత్ రెడ్డి ఏడాదిపాటు ఓ కంపెనీలో పనిచేశాడు. ఆ ఏడాది పనిచేసినా కంపెనీ ఆయనకు డబ్బులు ఇవ్వలేదు. మోసపోయానని తెలుసుకున్న రెడ్డి బయటకు వచ్చి కలివెల్లి వీసాపై చిన్నచితకా పనులు చేసుకుంటున్నాడు. ఏడాదికాలంగా ఖర్చుల కోసం భార్య సుగుణనే ఇక్కడి నుంచి డబ్బులను పంపిస్తోంది. ప్రస్తుతం ఆయన స్వదేశానికి తిరిగి రావడానికీ డబ్బులు లేవు. తన కన్నబిడ్డలను చివరిచూపు కూడా చూడలేని దయనీయ పరిస్థితి. కనీసం విమాన చార్జీలకు డబ్బులు ఇస్తే.. తన బిడ్డల చివరిచూపైనా చూస్తానంటూ రెడ్డి విలపిస్తున్నాడు. -
వేసవి శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి
ఉట్నూర్రూరల్: గిరిజన విద్యార్థులు వేసవి క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా సూచించారు. మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్లో గల క్రీడామైదానంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ, వేసవి శిక్షణను సద్వినియోగం చేసుకుని క్రీడా సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. విద్యార్థులకు క్రీడా పరికరాలను పంపిణీ చేశారు. ఇటీవల స్కోచ్ అవార్డు అందుకున్న పీవోను అధికారులు, పీడీలు, క్రీడా పాఠశాల సిబ్బంది సన్మానించారు. కార్యక్రమంలో డీడీ అంబాజీ, ఏసీఎంవో జగన్, ఏపీవో పీవీటీజీ మెస్రం మనోహర్, గిరిజన క్రీడాధికారి పార్థసారధి తదితరులున్నారు. ● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా -
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్క్వార్టర్స్లో శుక్రవారం వైద్యశిబిరం నిర్వహించారు. 400 మంది సిబ్బంది వారి కుటుంబీకులకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఇందులో డీఎస్పీలు పో తారం శ్రీనివాస్, ఎల్.జీవన్రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మురళి, నవీన్కుమార్, కార్తీక్, పోలీస్ అసో సియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మహిళల భద్రత కోసమే షీటీంలు మహళల భద్రత కోసం షీటీం నిర్వహణ చేపడుతున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో షీటీంలకు సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించారు. జిల్లాలో విస్తృతంగా షీటీం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. గతనెలలో 110 గ్రా మాలను ఆయా బృందాలు సందర్శించాయని పేర్కొన్నారు. నాలుగు ఎఫ్ఐఆర్, 10 పీటీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఆపత్కాల సమయంలో షీటీం కోసం 8712659953 నంబర్పై సంప్రదించాలని సూచించారు. వీడీసీల అక్రమాలపై ఉక్కుపాదం.. వీడీసీల అక్రమ కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని ఎస్పీ అన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, అక్రమ దందాలు, వసూళ్లు, సెటిల్మెంట్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించాలని తెలిపారు. వీడీసీ బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని పే ర్కొన్నారు. చట్టం చేయాల్సిన పనిని పలుచోట్ల వీడీసీలు తమ చేతిలోకి తీసుకొని పోలీసు, న్యా యస్థానాన్ని ఆశ్రయించకుండా చూస్తున్నారని, వారు చెప్పింది వినకపోతే కొందరు గ్రామాల నుంచి వెలివేస్తామని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వాటిపై కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లాలో ఐదు కేసులు నమోదు చేసినట్లు వివరించారు. బేల, జైనథ్, బోథ్, ఇచ్చోడ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలిపారు. -
20న సార్వత్రిక సమ్మె
ఆదిలాబాద్టౌన్: ఈనెల 20న చేపట్టనున్న సా ర్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సిర్ర దేవేందర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం రిమ్స్ కృష్ణ ఏజెన్సీ సూపర్వైజర్కు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పోరాడి సాధించుకున్న 44 చట్టాలను ప్రభుత్వం రద్దు చేసి నాలుగు కోడ్లుగా తీసుకురావడాన్ని ఖండిస్తున్నామని అ న్నారు. దేశ వ్యాప్త సమ్మెలో శానిటేషన్ సిబ్బంది, పేషెంట్కేర్, సెక్యూరిటీ గార్డులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇందులో సంఘం నాయకులు చందు, రమేశ్, సంగీత, పద్మ, సుశీల తదితరులు పాల్గొన్నారు. -
● అనుమతి లేకుండా వాటర్ ప్లాంట్లు ● నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ● క్యాన్లలో అపరిశుభ్ర నీరే సరఫరా ● చోద్యం చూస్తున్న అధికారులు
ఇక్కడ కనిపిస్తున్న వాటర్ ప్లాంట్ ఆదిలాబాద్లోని విద్యానగర్ లోనిది. ఈ యజమాని మరో చోట నుంచి వాహనంలో నీటిని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నాడు. ప్యూరిఫైడ్ చేయకుండానే ప్రజలకు విక్రయిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. 20 లీటర్ల క్యాన్కు రూ.30 చొప్పున వసూలు చేస్తున్నాడు.ఆదిలాబాద్టౌన్: జిల్లాలో ప్యూరిఫైడ్ వాటర్ పేరిట ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వేసవి కా వడంతో నీటి దందా జోరందుకుంది. అయితే వీటికి అనుమతులు ఉండవు.. ప్రమాణాలు పాటించరు.. నిర్వహణ సైతం ఇష్టారీతిన కొనసాగుతోంది. రక్షిత నీటిని తాగాలనే ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకుని ప్యూరిఫైడ్ పేరిట ఏటా లక్షలాది రూపాయలు అర్జిస్తున్నారు కొందరు. ప్రజలకు క్యా న్లలో కలుషిత నీటిని అందిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ‘మామూలు’గా వ్యవహరించడం గమనార్హం. నీటి నిర్ధారణ పరీక్షలు చేయకుండానే... జిల్లాలో సుమారు 700 వరకు వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కదానికి కూడా అనుమతి లేదు. ఐఎస్ఐ నిబంధనలు సైతం పాటించడం లేదు. ఏడాదికోసారి రెన్యూవల్ చేసుకోవాల్సి ఎక్కడా అలాంటి దాఖలాలు కనిపించడం లేదు. ఇళ్లు, దుకాణాలు, పాత గదుల్లోనే ప్లాంట్లను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారు. నిర్ధారణ పరీక్షలు సైతం ఎక్కడా నిర్వహించడం లేదు. ఏటా వేసవిలో ప్యూరిఫైడ్ నీటికి గిరాకీ ఉంటుంది. వీటిని ఆసరాగా చేసుకుని కొందరు అనుమతి లేకుండా ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. గతంలో పట్టణాలకు పరిమితం కాగా ప్రస్తుతం గ్రామాలకు సైతం విస్తరించాయి. క్యాన్కు రూ.20 నుంచి రూ.40 వరకు వసూలు చేస్తున్నారు. వాస్తవంగా 20 లీటర్ల నీటి శుద్ధికి రూ.2 నుంచి రూ.3 మాత్రమే ఖర్చవుతుంది. ఈ క్రమంలో ఖర్చు తక్కువ.. ఆదాయం ఎక్కువగా ఉన్న ఈ వ్యాపారం వైపు మొగ్గుచూపుతున్నారు. కొన్ని ప్లాంట్లలో క్యాన్లు శుద్ధి చేయకుండానే సాధారణ నీటిని నింపి సరఫరా చేస్తున్నారు. కాలం చెల్లిన క్యాన్లు ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆదిలాబాద్లోని ఓ వాటర్ ప్లాంట్ నిర్వహణ తీరిలా.. ఇక్కడ కనిపిస్తున్న వాటర్ ప్లాంట్ ఆదిలాబాద్లోని కొత్త కుమ్మర్వాడ సమీపంలోనిది. ఇక్కడి నుంచి రోజుకు వందలాది క్యాన్లు సరఫరా అవుతున్నాయి. అయితే రోజుకు 4వేల లీటర్ల నీటిని బోరు నుంచి తోడితే ఇందులో 25 శాతం మాత్రమే ప్యూరిఫైడ్ అవుతుంది. మిగతా 75 శాతం వృథా అవుతుంది. ఇలా నీటి వృథాతో కాలనీలోని ఇళ్లలో ఉన్న బోర్లకి నీరు రావడం లేదని స్థానికులు వాపోతున్నారు. జిల్లా కేంద్రంలో గల్లీకి ఒకట్రెండు చొప్పున ఇలా ప్లాంట్లు అక్రమంగా వెలిసినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నిబంధనలు ఇవి.. వాటర్ ప్లాంట్కు మున్సిపల్/గ్రామపంచాయతీ అనుమతి తీసుకోవాలి. పరిశ్రమల శాఖ నుంచి పార్టు–1 లైసెన్సు పొందాలి. నిర్వహణకు బీఎస్ఐ అనుమతి ఉండాలి. ఐఎస్ఐ నిబంధనలు పాటించాలి. ప్లాంట్లో మైక్రోబయాలజీ, కెమిస్ట్రి సిబ్బంది తప్పనిసరిగా ఉండాలి. పీహెచ్ స్థాయి 7 కంటే తగ్గకుండా చూడాలి. తగ్గితే ఆ నీరు తాగిన వారికి కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయి. ప్లాంట్లో ప్రయోగశాలతో పాటు ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి. నీటిని సరఫరా చేసే క్యాన్ అపరిశుభ్రంగా ఉండకూడదు. ప్రతిరోజు పొటాషియం పర్మాంగనేట్తో క్లీనింగ్ చేయాలి. అలాగే ప్రతి క్యాన్పై శుద్ధి చేసిన తేది, బ్యాచ్ నంబర్ ఉండాలి. శుద్ధి చేసిన నీటిని 304 గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన పెద్ద ట్యాంకులో నింపి ఓజోనైజేషన్ చేయాలి. అయితే జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క ప్లాంట్లో కూడా ఈ నిబంధనలు పాటించడం లేదు.అనుమతి లేని ప్లాంట్లపై చర్యలు జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లను తనిఖీ చేస్తాం. అనుమతులు లేకుండా, నిబంధనలు పాటించని వాటిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – సీవీఎన్ రాజు, మున్సిపల్ కమిషనర్ -
‘నీట్’ పకడ్బందీగా నిర్వహించాలి
ఆదిలాబాద్టౌన్: నీట్ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. ఈనెల 4న నిర్వహించనున్న పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించా రు. ఆయా కేంద్రాలను ఎస్పీతో కలిసి తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 4న మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల, సాంఘిక సంక్షేమ గు రుకుల బాలికల పాఠశాల, ప్రభుత్వ బాలికల పాఠశాల, ప్రభుత్వ ఆర్ట్స్అండ్ కామర్స్ డిగ్రీ కళా శాల, బంగారుగూడ మోడల్ స్కూల్, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్లో రెండు కేంద్రాలు ఏర్పా టు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షకు 1,659 మంది హాజరుకానున్నారని తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు కేంద్రంలోనికి అనుమతించనున్నట్లు తెలిపారు. ఆయా కేంద్రాల్లో తాగునీరు, వైద్యసేవలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఇందులో అదనపు ఎస్పీ సురేందర్రావు, డీఎస్పీ జీవన్రెడ్డి, కేంద్రీయ విద్యాలయం కోఆర్డినేటర్ అశోక్, వాగ్మారే, ఎంఈవోలు ఉన్నారు. కలెక్టర్ రాజర్షిషా -
జనగణనతోపాటు కులగణన
ఆదిలాబాద్: దేశంలో జనగణనతో పాటు కులగణన సైతం ఎంతో ముఖ్యమైనదని ఆదిలా బాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. కులగణ నపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్తో కలిసి ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని వర్గాలకు లబ్ధి చేకూరేలా కుల గ ణన జరుగుతుందన్నారు. ఈ దిశగా కేంద్ర ప్ర భుత్వం చర్యలు తీసుకోనుందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మా నంద్, పట్టణ అధ్యక్షుడు వేద వ్యాస్, రవి, రవి రెడ్డి, భూమేశ్, రాకేశ్, సుభాష్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. -
● జిల్లాలో పడిపోతున్న భూగర్భజలాలు ● ఇచ్చోడలో 30మీటర్ల లోతులోకి.. ● పలుచోట్ల పనిచేయని బోర్లు ● ఇబ్బందులు పడుతున్న జనం ● జూన్ వర్షాలపైనే ఆశలు
ఇది నార్నూర్ మండలంలోని బలాన్పూర్ గ్రామంలోని చెరువు. నెల రోజుల క్రితమే ఎండిపోయింది. ఇటీవల పూడికతీత పనులు మొదలుపెట్టారు. ఈ ఏడాది ఎండల తీవ్రత కారణంగా చాలా చెరువులు ఏప్రిల్లోనే ఎండిపోయిన పరిస్థితులు కనిపించాయి.ఇది సిరికొండ మండల కేంద్రంలోని చిక్మాన్ ప్రాజెక్ట్. ఈ ఏడాది ఎండల తీవ్రత కారణంగా ఇది పూర్తిగా ఎండిపోయింది. 2004లో నిర్మించిన ఈ చెరువు ఇప్పటివరకు ఎప్పుడు ఎండిపోలేదు. తొలిసారిగా ఎండిపోవడంతో దీని కింద ఉన్న 2వేల ఎకరాల ఆయకట్టుకు యాసంగిలో నీళ్లు అందని పరిస్థితి. ●సాక్షి,ఆదిలాబాద్: ఇచ్చోడలోని విద్యానగర్, సుభా ష్నగర్, టీచర్స్ కాలనీల్లో నీటి ఇక్కట్లు నెలకొన్నా యి. పలు ఇళ్లలో బోర్లలో నుంచి నీరు సరిగా రావ డం లేదు. దీంతోస్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోర్లు కనీసం 15నిమిషాలకు మించి నడవడం లేదని పేర్కొంటున్నారు. గత్యంతరం లేక పలువురు ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. మరికొందరు ద్విచక్రవాహనాలపై సమీపంలోని వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. ఈ మండలంలో జనవరిలో 8.10 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండగా, ఫిబ్రవరికి ఏకంగా 28.85 మీటర్ల లోతులోకి పడిపోయాయి.తాజాగా 30మీటర్ల లోతుకంటే అధి కంగా నమోదవడం పరిస్థితికి అద్దం పడుతోంది. 30 మీటర్ల లోతునకు.. జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకు మరింత ప డిపోతున్నాయి. వేసవిలో ఎండల తీవ్రత పెరగడంతో కఠిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇచ్చోడలో భూగర్భ జలాల పరిస్థితి తీవ్రంగా ఉంది. ఏకంగా 30 మీటర్ల లోతునకు పడిపోయాయి. ఇక్కడ ఇళ్లలో బోర్లు పావుగంట మించి నడవని పరిస్థితి. దీంతో స్థానికుల ఇక్కట్లు వర్ణనాతీతంగా మారాయి. ఇక ఆదిలాబాద్ పట్టణంలో 10 మీటర్ల లోతులోకి చేరుకున్నాయి. జిల్లా కేంద్రంలో ప్రస్తు తం కొంత పర్వాలేదనుకున్నా ఈనెల చివరిలో మ రింత లోతులోకి పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. దీంతో నీటి సమస్య తీవ్రమవుతుందా అనే పట్టణ వాసుల్లో కనిపిస్తుంది. ఇదీ పరిస్థితి.. గతేడాది మే నెలలో జిల్లాలో భూగర్భలాలు 10.59 మీటర్లకు పడిపోయాయి. దీంతో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది ఏప్రిల్ వరకే ఆ పరిస్థితి కనిపించింది. ప్రస్తుత మే నెలలో పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే చాలా చోట్ల చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. నెర్రెలు బారి దర్శనమిస్తున్నాయి. పలుచోట్ల పూడిక తీత పనులు చేపడుతున్నారు. గతేడాది వర్షాకాలం ముగిసిన తర్వాత జిల్లాలో నవంబర్ నెలలో 5.14 మీటర్ల లోతులోనే జలాల లభ్యత కనిపించింది. ఈ నేపథ్యంలో జూన్ వర్షాలపైనే జిల్లావాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. జిల్లాలో సగటున భూగర్భ జలాల పరిస్థితి (భూఉపరితలం నుంచి లోతులోకి.. మీటర్లలో) జనవరి : 7.06 ఫిబ్రవరి : 8.54 మార్చి : 8.68 ఏప్రిల్ : 8.82 ఏప్రిల్ నెలలో వివిధ ప్రాంతాల్లో భూగర్భ జలాల పరిస్థితి (మీటర్లలో) ఇచ్చోడ : 30.05 గాదిగూడ : 18.35 గుడిహత్నూర్ : 14.50 భోరజ్ : 14.10 ఇంద్రవెల్లి : 13.10 యాపల్గూడ : 10.50 ఆదిలాబాద్ : 10.50 వర్షాలు పడితేనే రీచార్జ్ సమయానికి వర్షాలు కురువని పక్షంలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి వెళ్లిపోయే పరిస్థితి ఉంది. బోర్లు ఎండిపోతున్నాయి. మళ్లీ మంచి వర్షాలు పడినప్పుడే రీచార్జ్ అవుతాయి. ప్రజలు నీటిని పొదుపుగా వాడాలి. – శ్రీవల్లి, భూగర్భజల అధికారి, ఆదిలాబాద్ -
ఆర్టీసీలో ఐఎన్టీయూసీ జెండా ఎగరేయాలి
ఆదిలాబాద్: రానున్న ఆర్టీసీ ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో ఐఎన్టీయూసీ జెండా ఎగురవేయాలని యూనియన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు సయ్యద్ మహమూద్, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ జక్కుల మల్లేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో శుక్రవారం నిర్వహించిన ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగులు కాకుండా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు యూనియన్ ముఖ్య పదవుల్లో ఉండాలని సూచించారు. యూనియన్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా తీర్మానించి ఈనెల 7నుంచి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమ్మెకు మద్దతు తెలుపవద్దని తీర్మానించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనకు సానుకూలంగా స్పందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం యూనియన్ జాతీయ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. ఇందులో కాంగ్రెస్ నాయకులు దేవిదాస్చారి, పార్టీ పట్టణ అధ్యక్షుడు నగేష్, ఆర్టీసీ ఐఎన్టీయూసీ నాయకులు సురేందర్, భాస్కర్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
కొత్త రేషన్కార్డులకు గ్రీన్ సిగ్నల్
● మార్పులు, చేర్పులకు అవకాశం ● ప్రారంభమైన క్షేత్రస్థాయి విచారణ ● నిరుపేదల నిరీక్షణకు ఎట్టకేలకు తెర కై లాస్నగర్: కొత్త రేషన్ కార్డుల జారీపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దృష్టి సారించింది. అర్హులందరికీ కార్డులు అందించాలని నిర్ణయించింది. అలాగే ప్రస్తుతం ఉన్న కా ర్డుల్లోనూ మార్పులు, చేర్పులకు సై తం అవకాశం కల్పించింది. ఇందుకో సం ప్రజాపాలన, మీ సేవ కేంద్రాల ద్వారా అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణకు ఆదేశించింది. అందుకు అనుగుణంగా రంగంలోకి దిగి న రెవెన్యూ యంత్రాంగం ము న్సిపల్, గ్రామీణ ప్రాంతాల్లో అర్హుల గుర్తింపునకు శ్రీకారం చుట్టింది. దరఖాస్తుదారుల కుటుంబసభ్యుల వివరాలతో పాటు, వారి సమగ్ర సమాచారం సేకరిస్తూ ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నారు. త్వరలోనే వారికి కొత్త కార్డులు జారీ అయ్యే అవకాశముంది. కాగా పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసిన గ్రామాల్లోని 1,652 మందిని రేషన్కార్డుల్లో చేర్చారు. వారి కోసం 10 క్వింటాళ్ల బియ్యం కేటాయించారు. వీరంతా ఈనెలా కోటాలో బియ్యం పొందనున్నారు. జిల్లాలో 51,903 దరఖాస్తులు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్కార్డుల జారీ కోసం ప్రజాపాలన, మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. దీంతో వాటి కోసం ఆశగా ఎదురుచూస్తున్న పేదలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 51,903 దరఖాస్తులు రావడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇందులో ప్రజాపాలన కార్యక్రమంలో 47,075, మీసేవ కేంద్రాల ద్వారా 4,860 దరఖాస్తులు వచ్చాయి. కొత్త కార్డులు జారీ చేయకపోవడంతో పాటు ఉన్న వాటిలోనూ కొత్తగా సభ్యుల పేర్లను చేర్చకపోవడం, వివరాల మార్పులకు సైతం అవకాశం ఇవ్వకపోవడంతో కొత్తగా పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చిన మహిళలు, పుట్టిన పిల్లల పేర్లు కార్డుల్లో నమోదుకు నోచుకోలేదు. ఇలాంటి వారికి కూడా అవకాశం కల్పించడంతో వాటికి కూడా పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి. కుటుంబ సభ్యుల పేర్లను చేర్చేందుకు 22,963, కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం 19,562 దరఖాస్తులు వచ్చాయి. క్షేత్రస్థాయి విచారణ షురూ... ప్రజాపాలన, మీసేవ కేంద్రాల ద్వారా రేషన్కార్డుల కోసం అందిన దరఖాస్తుల్లో అర్హుల గుర్తింపునకు క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. నూతన కార్డుల జారీ, మార్పులు, చేర్పులకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా రెవెన్యూ యంత్రాంగం దానిపై దృష్టి సారించారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి విచారణ చేపడుతున్నారు. అర్హులను గుర్తించేందుకు వివరాలు సేకరిస్తున్నారు. సాగునీటి వసతి కలిగిన భూమి అయితే 3 ఎకరాలు, సాగునీటి వసతి లేనటువంటి అయిదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారిని జాబితా నుంచి తొలగిస్తున్నారు. కుటుంబ సభ్యులు, ఆధార్, మొబైల్ నంబర్, భూమి విస్తీర్ణం, కారు, బైక్ ఉన్నాయా? తదితర వివరాలతో పాటు వారి ఆస్తుల వివరాలను పరిశీలిస్తూ ఫుడ్ సెక్యూరిటీ కార్డు యాప్లో నిక్షిప్తం చేస్తున్నారు. ఒక కుటుంబానికి అయిదెకరాల భూమి ఉండి యాప్లో తక్కువ నమోదైతే పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగా తిరిగి నమోదు చేస్తున్నారు. ఇలాంటి వివరాల ఆధారంగా అనర్హులను ఏరివేస్తున్నారు. సర్వేలో సాంకేతిక సమస్యలు సర్వేకు వెళ్లిన రెవెన్యూ ఉద్యోగులకు అర్హుల గుర్తింపులో సాంకేతిక సమస్యలు తప్పడం లేదు. మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసిన సమయంలో ఆధార్కార్డు నంబర్కు బదులుగా ఇతరత్రా నంబర్లను నమోదు చేశారు. దీంతో యాప్లో ఆధార్కార్డును నమోదు చేస్తే అది నమోదు కావడం లేదు. కొంతమంది పాత కార్డుల్లో తమ పేర్లను తొలగించుకోకుండానే కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేశారు. ఇలాంటి వారి వివరాలు సైతం యాప్లో అప్లోడ్ కావడం లేదు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు కొన్ని గ్రామాల్లో నెట్వర్క్ సమస్య తలెత్తడంతో యాప్లో వివరాల నమోదుకు ఇబ్బందిగా మారుతున్నట్లు తెలుస్తోంది.జిల్లాలో కొత్తకార్డులకోసం అందిన దరఖాస్తుల వివరాలుప్రజాపాలనలో అందిన దరఖాస్తులు 47,075 అధికారులు పరిశీలించినవి 8,824 అర్హులుగా గుర్తించినవి 8,460 అనర్హులుగా తేలినవారు 311 మీ సేవ కేంద్రాల ద్వారా అందిన దరఖాస్తులు 4,860 అధికారులు పరిశీలించినవి 76 పెండింగ్లో ఉన్న దరఖాస్తులు 4,784సరైన సమాచారమివ్వాలి కొత్త రేషన్ కార్డుల జారీకోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తహసీల్దార్ల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నారు. ఇంటి వద్దకు వచ్చే రెవెన్యూ సిబ్బందికి దరఖాస్తుదారులు వాస్తవంతో కూడిన సమాచారం అందించాలి. తప్పుడు సమాచారమిస్తే కార్డులు ఇవ్వకపోగా బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అనర్హులు స్వచ్ఛందంగా వారి కార్డులను అధికారులకు సరెండర్ చేయాలి. – ఎండీ వాజీద్ అలీ, డీసీఎస్వో, ఆదిలాబాద్ -
కలెక్టరేట్ ఎదుట తుడుందెబ్బ ధర్నా
కైలాస్నగర్: ఆదివాసీలపై జరుగుతున్న మారణహోమం, దమనకాండను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే నిలిపివేసి మావోయిస్టులతో శాంతిచర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్ మాట్లాడుతూ ఆపరేషన్ కగార్తో మావోయిస్టుల పేరిట వేలాది మంది ఆదివాసీలను హతమార్చడం శోచనీయమన్నారు. ఆదివాసీ మహిళలపై అత్యాచారం, హత్యలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం రాజ్యాంగంలో పొందుపర్చిన చట్టాలను ఉల్లంఘించడమేనన్నారు. అనంతరం అధికారులెవరూ రాకపోవడంతో కలెక్టరేట్ మెయిన్ గేట్కు వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు వెట్టి మనోజ్, గోడం రేణుక, ఉయిక ఇందిర, ఆత్రం గణపతి, కుడ్మెత జంగు, దుర్వ జుగాదిరావు, తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి
ఆదిలాబాద్టౌన్: న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్గౌడ్ అన్నా రు. గురువారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు బార్ అసోసియేషన్ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు కేటాయించిందని, కానీ అవి బార్ కౌన్సెలింగ్కు రాలేదన్నారు. న్యాయవాదులకు ఆరోగ్యపరంగా ప్రైవేట్ చికిత్సలు చేయించుకోవడానికి రూ.10లక్షల వరకు నిధులు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్, ప్రధాన కార్యదర్శి డీఎస్పీ శర్మ, బార్ అసోసియేషన్ సభ్యులు చందుసింగ్, రమణయ్య, అఖిలేశ్, ముజాహి ద్, తదితరులు పాల్గొన్నారు. -
పత్తి విత్తనాల కొరత లేకుండా చూడాలి
కై లాస్నగర్: రానున్న వానాకాలం సీజన్లో పత్తి విత్తనాల కొరత లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాల ని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పత్తి విత్తనాల లభ్యతపై కంపెనీ లు, డిస్ట్రిబ్యూటర్ల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈఏడాది జిల్లాలో 4లక్షల 40వేల ఎకరాల్లో పత్తి పండించవచ్చని అంచనా ఉందని, ఇందుకు 11 లక్ష ల విత్తన ప్యాకెట్లు అవసరం కాగా వివిధ కంపెనీలు 21లక్షల 61వేల ప్యాకెట్లు అందుబాటులో ఉంచా యన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు విత్తన డీలర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి నకిలీ విత్తనాలు అరికట్టేలా చూడాలన్నారు. ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు గ్రామాల వారీగా షెడ్యూల్ రూపొందించి విత్తన కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, ఆర్డీవో వినోద్ కుమార్, డీఎస్పీ జీవన్ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్స్వామి, తదితరులు పాల్గొన్నారు. ● కలెక్టర్ రాజర్షి షా -
గిరిజన గురుకులాల్లో 99 శాతం ఉత్తీర్ణత
ఉట్నూర్రూరల్: పది ఫలితాల్లో గిరిజన గురుకులాలు 99 శాతం ఉత్తీర్ణత సాధించాయని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు. గత విద్యాసంవత్సరం 96.33 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈసారి మూడు శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 గిరిజన బాల, బాలికల గురుకులాల్లో బాలికలు 591 మంది, బాలురు 253 మంది ఉత్తీర్ణత సాధించారు. గురుకులాల్లో మిషన్ లక్ష్యం కార్యక్రమాన్ని అమలు చేయడంతో ఉత్తమ ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది కృషి ఉందంటూ పీవో, ఆదిలాబాద్ ఆర్సీవో అగస్టిన్ అభినందించారు. ‘పరిహారం అందేలా చూస్తాం’నెన్నెల: వడగళ్ల వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు పరి హారం అందేలా చూస్తామని బెల్లంపల్లి ఆర్డీఓ హరికృష్ణ అన్నారు. గురువారం వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో కలిసి గుండ్లసోమారం, బొప్పారం, చిత్తాపూర్, ఆవుడం, గంగారాం, మైలారం, గొల్లపల్లి గ్రామాల్లో నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. రై తులతో మాట్లాడారు. గుండ్లసోమారంలో ఇళ్లు కూ లిపోయిన బాధితులకు పరిహారం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. భీమిని ఏడీ ఏ సురేఖ మాట్లాడుతూ మండలంలో సుమా రు 150 ఎకరాల్లో వరి, ఐదు ఎకరాల్లో జొన్న పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక పరి శీలనలో తేలిందని అన్నారు. సుమారు 300 ఎకరాల్లో వందమంది రైతులకు సంబంధించిన మామిడి కాయలు నేలరాలినట్లు గుర్తించామని ఉద్యానవన అధికారి అరుణ్ తెలి పారు. తహసీల్దార్ మహేంద్రనాథ్, ఏఓ సృజన, ఏఈఓలు రాంచందర్, శైని, మాజీ జెడ్పీటీసీ సింగతి శ్యామలరాంచందర్ పాల్గొన్నారు. పోలీసుల అదుపులో పశువుల దొంగలు!మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలో రోడ్లపై పడుకుని ఉన్న పశువులను ఎత్తుకెళ్లిన దొంగలు పో లీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం. జన్మభూమినగర్ ప్రాంతంలోఓ పశువును కొ ందరు ఎత్తుకెళ్లి ఆటోలో తరలిస్తుండగా పోలీ సులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఆటోడ్రైవర్తోపాటు మరో ముగ్గురిని అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. -
ఇసుక రాయల్టీ తీసుకున్న వీడీసీ సభ్యులపై కేసు
ఆదిలాబాద్టౌన్(జైనథ్): ఇసుక రాయల్టీ తీసుకున్న పెండల్వాడ, సాంగ్వి వీడీసీ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు జైనథ్ సీఐ సాయినాథ్ తెలిపారు. గురువారం పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. గతనెల 13న భోరజ్ మండలం పెండల్వాడ గ్రామ శివారులో పెన్గంగా నది నుంచి ఇసుక తీసుకోవడానికి ట్రాక్టర్ డ్రైవర్ వచ్చాడు. వీడీసీ సభ్యులు భూమారెడ్డి, అతని సోదరుడు రామ్రెడ్డితోపాటు మరికొంత మంది సభ్యులు అతని వద్ద రూ.500 రాయల్టీ అక్రమంగా తీసుకున్నారు. దీంతోపాటు ఆయనతో దుర్భాషలాడి బెదిరించారు. సాంగ్వి గ్రామంలో ఇసుక తరలింపులో వసూళ్లకు పాల్పడుతున్న అశోక్, మరికొందరిపై ట్రాక్టర్ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో జైనథ్లో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు అక్రమ దందాలు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. -
సీపీఆర్ఎంఎస్లో గందరగోళం
శ్రీరాంపూర్: సింగరేణిలో రిటైర్డ్ అయిన కార్మికులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు సంస్థ కాంట్రీబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ స్కీం(సీపీఆర్ఎంఎస్) సదుపాయం కల్పించింది. ఈ స్కీం కింద హెల్త్కార్డులు పొందిన కార్మికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. తమకు కార్డులో ఎంత మొత్తం ఖర్చయిందో, ఇంకా ఎంత మిగిలి ఉందో తెలియక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కార్మికులకు ఈ స్కీం కింద చేరాలంటే రూ.60 వేలు ముందుగా చెల్లించాలి. గతంలో ఈ మొత్తం రూ.40 వేలుగా మాత్రమే ఉండేది. ఈ మొత్తాన్ని సర్వీసులో ఉండగానే రికవరీ చేస్తారు. ఈ స్కీం రాక ముందు రిటైర్డ్ అయిన వారు తర్వాత డబ్బులు చెల్లిస్తే వారికి కూడా కార్డులు అందించారు. ఈ కార్డు కింద రిటైర్డ్ కార్మికునికి, ఆయన భార్యకు కలిపి రూ.8 లక్షల వైద్యం చేయించుకోవచ్చు. ఈ మొత్తం ఖర్చయితే ఇక అంతే. మళ్లీ రూ.60 వేలు చెల్లిస్తామన్నా కూడా కార్డు ఇవ్వరు. వన్టైం కిందే కార్డు ఇస్తారు. సింగరేణి పరిసర ప్రాంతాల్లోని ప్రముఖ ఆసుపత్రులు, కరీంనగర్, వరంగల్, ఖమ్మంతోపాటు హైదరాబాద్లోని పలు కార్పొరేట్ ఆసుపత్రులతో కంపెనీ ఈ కార్డుతో చికిత్స అందించేలా అనుసంధానం చేసుకుంది. ఆ ఆసుపత్రులకు కార్డు పట్టుకుని రిటైర్డ్ కార్మికుడు వెళ్తే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందుతుంది. భార్యాభర్తలిద్దరికి కలిపి రూ.8 లక్షల విలువ గల చికిత్స పొందవచ్చు. బ్యాలెన్స్ వివరాలు లేవు.. రిటైర్డ్ కార్మికుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు ముందుగా అతను అక్కడ కార్డు చూపించి అడ్మిట్ అవుతారు. దాని ప్రకారం ట్రీట్మెంట్ చేయడానికి ముందు సదరు ఆసుపత్రి యాజమాన్యం కంపెనీ సీఎంఓకు వైద్య ఖర్చుల బిల్లులను ఎస్టిమేట్ చేసి పంపుతారు. అక్కడి నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాతే ట్రీట్మెంట్ మొదలవుతుంది. ఐతే ట్రీట్మెంట్ జరిగిన తర్వాత సదరు రిటైర్డ్ ఉద్యోగికి తన కార్డులో ఎంత మొత్తం ట్రీట్మెంట్ కింద కట్ అయిందో తెలియడం లేదు. కంపెనీ వారు చెప్పడం లేదు. ఆసుపత్రి వారు చెప్పే అంచనే తప్ప, డిశ్చార్చి అయిన తర్వాత తన వైద్యానికి ఆసుపత్రుల్లో కార్డు నుంచి ఎంత మొత్తం కట్ అయిందో తెలియక వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఏ కార్యాలయం వద్దకు వెళ్లి అడిగిన కూడా వివరాలు ఇవ్వడం లేదు. మళ్లీ ఏదైనా జబ్బు పడ్డప్పుడు దానికి సరిపడా డబ్బులు కార్డులో ఉన్నాయా లేవో అని గందరగోళపడుతున్నారు. ఖర్చు, మిగులు ఎంతో తెలియదు లెక్క చెప్పాలంటున్న రిటైర్డ్ కార్మికులు ఆసుపత్రుల వద్ద ఇబ్బందులు ఎస్ఎంఎస్ అలర్ట్ పెట్టాలి రిటైర్డ్ కార్మికుడు ఆసుపత్రిలో డిశార్చి అయిన వెంటనే అతని సెల్ఫోన్కు ఎంత మొత్తం కార్డు నుంచి వైద్యానికి కట్ అయిందో వారి ఫోన్కు మెసేజ్ వచ్చేలా యజమాన్యం ఏర్పాటు చేయాలి. కనీసం జీఎం కార్యాలయానికి వెళ్లి అడిగిన అక్కడ వివరాలు చెప్పేలా ఏర్పాటు చేయాలి. ఇవేవి లేకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. – నాతాడి శ్రీధర్రెడ్డి, బీఎంఎస్ ఎస్సార్పీ బ్రాంచి ఉపాధ్యక్షుడు -
‘సీఐటీయూ పోరాటాలతోనే వేసవి సెలవులు’
ఆదిలాబాద్: సీఐటీయూ ఐక్య పోరాటాల ఫలితంగానే అంగన్వాడీ కేంద్రాలకు మేలో వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణ యం తీసుకుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం కేక్ కట్చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన రాజీలేని ఆందోళనలతోనే మంత్రి సీతక్క సెలవులు ప్రకటించారన్నారు. అయితే కొంతమంది అధికారులు మాత్రం అ ధికారికంగా సర్క్యులర్ రాలేదని అనడం సరి కాదన్నారు. ఇదే స్ఫూర్తితో సమస్యల పరిష్కా రం కోసం, హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు దర్శనాల మల్లేశ్, నాయకులు మల్లి కాంబ, మధునిక, కవిత, ప్రియాంక, మనీషా, పద్మ, జయశ్రీ, శకుంతల, లక్ష్మి, పాల్గొన్నారు. జూన్ 3 నుంచి ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలుఆదిలాబాద్టౌన్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలి పారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల 16 వరకు పాఠశాలల్లో ఫీజు చెల్లించాలని, ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని సూచించారు. -
ఇంటర్నేషనల్ కరాటే సెమినార్లో ప్రతిభ
బెల్లంపల్లి: కేరళ రాష్ట్రంలో గతనెల 26, 27 తేదీల్లో నిర్వహించిన 12వ ఇంటర్నేషనల్ సిటోరియా కరాటే స్కూల్ ఆఫ్ ఇండియా టెక్నికల్ సెమినార్లో మాస్టర్లు ప్రతిభకనబర్చారు. పలు రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది పాల్గొనగా, రాష్ట్రం నుంచి ఏడుగురు మాస్టర్లు హాజరయ్యారు. టెక్నికల్ సెమినార్లో నైపుణ్యత కనబర్చిన మాస్టర్లకు జపాన్కు చెంనని కేఎస్కేఎస్ఐ ఫౌండర్ గ్రౌండ్ మాస్టర్ సోకే కేఎన్యూమ భూని ప్రతిభ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. సర్టిఫికెట్లు అందుకున్న వారిలో రమేశ్కుమార్, విజ్జగిరి రవి, సారిక రాజు, మారపాక దేవయ్య, ఎస్.సురేశ్, సోలంకి అశోక్, నారాయణ శెట్టి శ్రీనివాస్ ఉన్నారు. వీరిని పలువురు అభినందించారు. -
లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి
కై లాస్నగర్: ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా చేపట్టాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. గురువారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో బల్దియా వార్డు ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలకు లబ్ధి చేకూర్చాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. సర్వేను పారదర్శకంగా నిర్వహించి అర్హులైన వారికే ఇళ్లు దక్కేలా చూడాలన్నారు. అనర్హుల పేర్లను జాబితా నుంచి తొలగించాలని సూచించారు. లబ్ధి దారుల ఎంపికలో ఎలాంటి అక్రమాలు జరి గినా అందుకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో మున్సిపల్ డీఈ కార్తీక్ పాల్గొన్నారు. -
దగ్ధమైన జొన్నపంట పరిశీలన
బజార్హత్నూర్: మండలంలోని దేగామ గ్రామానికి చెందిన 11 మంది రైతులకు సంబంధించిన పదెకరాల్లో ప్రమాదవశాత్తు దగ్ధమైన జొన్న పంటను తహసీల్దార్ శ్యాంసుందర్ గురువారం పరిశీలించారు. జొన్న పంటతోపాటు రెండు టార్పాలిన్, 40 స్పింక్లర్లు, 85 పైప్లు, 27 స్పింక్లర్ నౌజల్స్, 1 సోలార్ ఫెన్సింగ్ పలక, బ్యాటరీ కాలిబూడిదైందని తెలిపారు. మొత్తం నష్టం విలువ రూ.8.83 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశామని, రిపోర్టు తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. తహసీల్దార్ వెంట ఎంఆర్ఐ నూర్సింగ్, బాధిత రైతులు కొడారి నరేశ్, సట్ల రమేశ్, లక్ష్మి, రాజేందర్, శ్రీకాంత్, మహేశ్, ప్రవీణ్ ఉన్నారు. -
జిల్లాలో గంజాయిని కనుమరుగు చేస్తాం
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్:జిల్లాలో గంజాయిని కనుమరుగు చేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గురువారం గంజాయి కేసులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. జిల్లాలో మార్చి 10 నుంచి ఇప్పటి వరకు 34 కేసులు నమోదు చేశామని, 12 కిలోల డ్రై గంజాయి, 181 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని 56 మంది నిందితులను అరెస్టు చేసినట్లు వివరించారు. వాటి విలువ రూ.23,21,550 ఉంటుందన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో గంజాయిని నిర్మూలించేందుకు పోలీసు యంత్రాంగం తగు చర్యలు చేపడుతోందని, గంజాయి వ్యాపారులను, పండించే వారిని, వినియోగదారులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ప్రభుత్వం నుంచి లబ్ధిపొందే సౌకర్యాలను నిలిపివేసేలా కలెక్టర్కు నివేదిస్తామన్నారు. తప్పు చేసిన ప్రతిఒక్కరిని శిక్షిస్తామని, ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. గంజాయి సాగు చేసిన నలుగురిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. -
అధికార లాంఛనాలతో సీఆర్పీఎస్ జవాన్ అంత్యక్రియలు
● హాజరైన సీఆర్పీఎఫ్ అధికారులు, జవాన్లుభీమారం: గుండెపోటుతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ జవాన్ రామళ్ల సాగర్కు అధికార లాంఛనాలతో గురువారం భీమారంలో అంత్యక్రియలు నిర్వహించారు. భీమారం మండలకేంద్రానికి చెందిన సాగర్ సీఆర్పీఎఫ్ జవాన్గా శిక్షణ పొందుతున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. బుధవారం ఆయన మంచిర్యాలలోని ఫంక్షన్కు వెళ్లగా గుండెపోటుతో మృతిచెందాడు. హకీంపేట్లోని సీఆర్పీ ఎఫ్ అసిస్టెంట్ కమాడెంట్ రాకేశ్ దేహార్య, జవాన్లు అంత్యక్రియలకు హాజరై తల్లిదండ్రులు గట్టయ్య, కళ, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతిమయాత్రలో అధికారులు పాల్గొని పాడె మోశారు. శ్మశానవాటికలో మృతదేహానికి జాతీయజెండా కప్పి పూలమాలలు వేశారు. అనంతరం మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపి నివాళులర్పించారు. అంత్యక్రియలకు గ్రామస్తులు తరలివెళ్లారు. -
పంప్హౌజ్ వద్ద ప్రత్యేక పూజలు
కై లాస్నగర్: ఆదిలాబాద్ పట్టణానికి 6 ఎంఎల్డీల నీటిని సరఫరా చేసే లాండసాంగ్వి పంప్హౌజ్ ఇటీవల పూర్తిగా ఎండిపోయిన విషయం తెలిసిందే. అయితే కలెక్టర్ చొరవతో రూ.40 లక్షల వ్యయంతో పూడికతీత, ఇన్టెక్వెల్ మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో భూగర్భజలాలు ఆశించిన దానికంటే అధికంగానే ఉబికి వచ్చాయి. వర్షాకాలంలాగే పూర్తిస్థాయిలో పట్టణానికి నీటి సరఫరా చేసే అవకాశం లభించింది. దీంతో గురువారం మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రావణ్ కుమార్, ఎంఈ పేరి రాజు పంప్హౌజ్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ సంప్రదాయబద్ధంగా గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి హారతినిచ్చారు. అనంతరం పట్టణానికి నీటిని సరఫరా చేసే మోటార్లను ప్రారంభించారు. దేవుని ఆశీస్సులతో పట్టణానికి నీటి సమస్య తప్పిందని వారు అభిప్రాయపడ్డారు. వేసవిలోనూ 6 ఎంఎల్డీల నీరు పట్టణంలోని 19 వార్డులకు సరఫరా అవుతుందని వారు పేర్కొన్నారు. -
భార్య కాపురానికి రావడం లేదని..
తానూరు: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ట్రెయినీ ఎస్సై నవనీత్రెడ్డి తెలిపారు. మండలంలోని బోల్సా గ్రామానికి చెందిన అక్కం రమేశ్ గతకొన్నేళ్లుగా మద్యానికి బానిసై పని చేయకుండా తిరుగుతున్నాడు. భర్త తాగుడు మానడం లేదని కుమారుడు, కుమార్తెతో కలిసి భార్య స్వరూప పుట్టిల్లు అయిన ముధోల్కు వెళ్లింది. రెండునెలల క్రితం రమేశ్ ముధోల్కు వెళ్లి భార్యతో ఉంటున్నాడు. భార్య కాపురానికి రావాలని అడిగితే రాకపోవడంతో ఒక్కడే రెండురోజుల క్రితం బోల్సా గ్రామానికి వెళ్లాడు. భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపం చెంది బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతుడి తల్లి లక్ష్మిబాయి ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసినట్లు ట్రెయినీ ఎస్సై తెలిపారు. -
● ఎస్సీ వసతిగృహాల్లో నియామకం ● కాళేశ్వరం జోన్లో 19మంది రిపోర్టు
మంచిర్యాలఅర్బన్: ఎస్సీ వసతిగృహా సంక్షేమాధికారులుగా ఎంపికై పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచిర్యాల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రవీందర్రెడ్డి బుధవారం రాత్రి నియామక పత్రాలు అందజేశారు. గత ఏడాది జూన్ 24నుంచి 29వరకు కంప్యూటర్ ఆధారిత(సీఆర్బీటీ) విధానంలో పరీక్షలు నిర్వహించగా సెప్టెంబర్ 20న ఫలితాలు విడుదలయ్యాయి. కాళేశ్వరం జోన్ పరిధిలో 24మంది అభ్యర్థులను టీజీపీఎస్సీ ఎంపిక చేసిన పంపగా.. ఐదుగురు అభ్యర్థులు వివిధ కారణాలతో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు రాలేదు. దీంతో 19మందికి నియామక పత్రాలు అందజేయగా.. గురువారం కేటాయించిన వసతిగృహాల్లో రిపోర్టు చేశారు. వీరిలో 12మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. మంచిర్యాల జిల్లాకు 8, పెద్దపల్లికి 5, ఆసిఫాబాద్కు 4, ములుగుకు 1, జయశంకర్ భూపాలపల్లికి 1 అభ్యర్థిని ఎస్సీ వసతిగృహా సంక్షేమ అధికారులుగా ప్రభుత్వ నిబంధనలను అనుసరించి అభ్యర్థుల ఆప్షన్ల మేరకు పోస్టింగ్లు కేటాయించారు. నియామకపత్రాలు అందజేస్తున్న ఎస్సీ డీడీ రవీందర్రెడ్డి, ఏఎస్డబ్ల్యూవో రవీందర్గౌడ్ కాళేశ్వరం జోన్లో ఇలా.. మంచిర్యాల జిల్లాలో.. అభ్యర్థి పేరు కేటాయించిన పోస్టింగ్ యాసం శ్రీనివాస్ ఎస్సీ బాయ్స్హాస్టల్, కోటపల్లి చీపెల్లి శ్రీనివాస్ ఎస్సీ బాయ్స్ హాస్టల్, మందమర్రి చండి రజనీకాంత్ ఎస్సీ బాయ్స్ హాస్టల్, తాండూర్ చిందికింది ప్రశాంత్ ఎస్సీ బాయ్స్ హాస్టల్, దండేపల్లి అల్గూనూరి భార్గవ్ ఎస్సీ బాయ్స్ హాస్టల్, చెన్నూర్ డి.శ్రీనివాస్ ఎస్సీ బాయ్స్ హాస్టల్, చింతగూడ టి.రాజు ఎస్సీ కాలేజ్ బాయ్స్ హాస్టల్, బెల్లంపల్లి సద్గుణ, కూడెల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్, లక్సెట్టిపేట ఆసిఫాబాద్ జిల్లా.. రాహుల్కుమార్ ఎస్సీ కాలేజీ బాయ్స్ హాస్టల్, ఆసిఫాబాద్ జలంపల్లి ప్రేమ్కుమార్ కాలేజీ బాయ్స్ హాస్టల్, కాగజ్నగర్ ఈశ్వరి ఎస్సీ కళాశాల గర్ల్స్ హాస్టల్, ఆసిఫాబాద్ రత్నం కవిత ఎస్సీ కాలేజీ గర్ల్స్ హాస్టల్ కాగజ్నగర్ పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో.. తోట శైలజ ఎస్సీ ఐడబ్ల్యూహెచ్సీ(గర్ల్స్), పెద్దపల్లి ఇసంపల్లి రమ్య ఎస్సీ గర్ల్స్ హాస్టల్, మంథని ప్రశాంత్ ఎస్సీ ఐడబ్ల్యూహెచ్సీ బాయ్స్ హాస్టల్, మంథని డి.తిరుపతి ఎస్సీడబ్ల్యూహెచ్సీ బాయ్స్ హాస్టల్, మంథని సాధుల రమేష్ ఎస్సీ కాలేజీ బాయ్స్ హాస్టల్, మంథని ఎ.స్వాతి ఎస్సీ గర్ల్స్ హాస్టల్ రేగోండ డి.మమత ఎస్సీ గర్ల్స్ హాస్టల్, ఏటూరునాగారం -
● రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం చర్యలు.. ● రూ.68 కోట్లతో అభివృద్ధి పనులు ● ఈనెల 5న ఆసిఫాబాద్కు రానున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ● అక్కడి నుంచే వర్చువల్గా శంకుస్థాపన ● గుడిహత్నూర్, సీతాగోంది వద్ద కిలోమీటర్ మేర అండర్ పాస్లు ● మావల వద్ద సర్వీస్
సాక్షి,ఆదిలాబాద్: మహారాష్ట్రలోని నాగ్పూర్ మీదుగా హైదరాబాద్కు వెళ్లే దారిలో ఎన్హెచ్ 44పై మధ్యలో ఆదిలాబాద్ జిల్లాలో ఈ జాతీయ రహదారి సుమారు 80 కిలో మీటర్లకు పైగా విస్తరించి ఉంది. ఈ రహదారిపై సరైన వెహికిల్ అండర్పాస్ లు, సర్వీస్ రోడ్ల నిర్మాణం లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటి నివారణ కోసం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జిల్లా పరిధిలో వివిధ పనులకు శంకుస్థాపనలు జరగనున్నాయి. గుడిహత్నూర్, సీతాగోంది వద్ద అండర్పాస్లు.. గుడిహత్నూర్ వద్ద కిలోమీటర్ మేర అండర్పాస్లు నిర్మించనున్నారు. సీతాగోంది వద్ద కూడా కిలోమీటర్ మేర ఆరువరుసల అండర్పాస్ నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ హైవే వెంబడి పలుచోట్ల సర్వీస్ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అవి పూర్తయిన తర్వాత వెహికిల్ అండర్పాస్ నిర్మించనున్నారు. ప్రధానంగా సరైన వెహికిల్ అండర్పాస్లు లేకపోవడంతో హైవేను ఒకపక్క నుంచి మరో పక్కకు దాటే విషయంలో గ్రామాల వద్ద పలు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతోంది. అంతేకాకుండా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ అండర్పాస్ల నిర్మాణం పూర్తయితే జాతీయ రహదారిపై ప్రమాదాలను నివారించేందుకు ఆస్కారం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జాతీయ రహదారి 44పై పెరుగుతున్న ప్రమాదాల నివారణకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు సన్నద్ధమైంది. జిల్లా పరిధిలో విస్తరించి ఉన్న హైవేకు సంబంధించి రూ.68 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈనెల 5న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు రానున్న కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి చేతుల మీదుగా అక్కడ ప్రారంభోత్సవాలు జరగనుండగా జిల్లా పనులకు సంబంధించి శంకుస్థాపన వారి చేతుల మీదుగా వర్చువల్ పద్ధతిలో అక్కడి నుంచి జరగనుంది.మావల వద్ద సర్వీస్ రోడ్, రిటైనింగ్ వాల్.. మావల వద్ద సర్వీస్ రోడ్, రిటైనింగ్ వాల్ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన పనులను ఇటీవలే మొదలుపెట్టారు. సర్వీస్ రోడ్డు లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా హైవే నుంచి కిందికి దిగి గ్రామానికి వెళ్లే సందర్భంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సర్వీస్ రోడ్ నిర్మాణంతో ఇక్కడ ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు.ఈ సంవత్సరంలోగా పూర్తి.. ఈ పనులను ఈ సంవత్సరంలోగా పూర్తి చేస్తాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే పూర్తయిన పలు రహదారుల ప్రారంభోత్సవాలతో పాటు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించేందుకు కేంద్ర మంత్రులు ఈనెల 5న ఆసిఫాబాద్ రానున్నారు. ఆదిలాబాద్కు సంబంధించిన పనులను అక్కడి నుంచే వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. – శ్రీనివాస్, పీడీ, ఎన్హెచ్ఏఐ, కామారెడ్డి అంచనా వ్యయాలు ఇలా.. వర్క్ అంచనా వ్యయం గుడిహత్నూర్ (అండర్పాస్) : రూ.24 కోట్లు సీతాగోంది (అండర్పాస్) : రూ.26 కోట్లు మావల (సర్వీస్ రోడ్, రిటైనింగ్ వాల్) : రూ.18 కోట్లు -
బస్సును ఢీకొన్న ట్యాంకర్
● కోకస్మాన్నూర్ వద్ద ఘటన ● ఒకరు మృతి ● 22 మందికి గాయాలు ఇచ్చోడ: బస్సును ట్యాంకర్ ఢీకొన్న ఘటన మండలంలోని కోకస్మాన్నూర్ వద్ద 44వ జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 22 మందికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. నిర్మల్ వైపు నుంచి ఆదిలాబాద్ వైపు ఆర్టీసీ బస్సు వస్తుంది. పశువులు అడ్డు రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. వెనుకాల నుంచి వస్తున్న ట్యాంకర్ వేగంగా బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు డివైడర్ పైకి ఎక్కింది. ట్యాంకర్ రోడ్డు పక్క ఆటో, టీవీఎస్ ఎక్స్ఎల్ను ఢీకొని పక్కనున్న గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న జైనథ్ మండలం మండగడకు చెందిన భీమక్క(56) తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను ఆదిలాబాద్ రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది, అటోలో 5గురు, టీవీఎస్ ఎక్స్ఎల్పై ఇద్దరు మొత్తం 22 మందికి గాయాలయ్యాయి. వీరిని ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. ఈ ఘటనలో నాలుగు పశువులు అక్కడిక్కడే మృతిచెందాయి. ప్రమాదానికి కారణమైన పశువుల యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. -
పాఠశాలల్లో మరమ్మతు పూర్తిచేయాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ● ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష ఉట్నూర్రూరల్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సెలవులు ముగియకముందే మరమ్మతు పూర్తిచేయాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాల డీఈలు, ఏఈలతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో, ఏజెన్సీ గ్రామాల్లో చేపడుతున్న మరమ్మతులు ఎంతవరకు పూర్తి చేశారని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న గేట్లను, ఆర్వో ప్లాంట్ల మరమ్మతు చేయించాలని సూచించారు. భోజనశాలల భవనాల షెడ్ల నిర్మాణాలు వెంటనే పూర్తిచేయాలన్నారు. అదనపు తరగతి గదులు నిర్మించాలని, అంగన్వాడీ మోడల్ స్కూల్, మరుగుదొడ్లు, సెప్టిక్ ట్యాంక్, డార్మంటరీ గదుల మరమ్మతు పూర్తి చేయాలని ఆదేశించారు. పీహెచ్సీల్లో గదుల నిర్మాణాలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఈఈ తానాజీ, డీఈ శివప్రసాద్, ఏఈలు పాల్గొన్నారు. -
నరేందర్కు శ్రమశక్తి అవార్డు
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని కేకే–5 గనిలో విధులు నిర్వర్తిస్తున్న రాంశెట్టి నరేందర్ను మేడే సందర్భంగా ప్రభుత్వం శ్రమశక్తి అవార్డుకు ఎంపిక చేసింది. గురువారం హైదరాబాద్లోని రవీంద్రబారతిలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కనీసవేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ప్రసాద్ చేతులమీదుగా అవార్డుతోపాటు ప్రశంసపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ శ్రమశక్తి అవార్డు ప్రదానం చేసినందుకు ప్రభుత్వానికి రుణపడి ఉంటానన్నారు. తనకు సహకరించిన ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి, సెక్రెటరీ జనరల్ జనక్ప్రసాద్, నాయకులు కాంపెల్లి సమ్మయ్య తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్రూరల్: వేసవి సెలవుల్లో ఉచిత ంగా అందిస్తున్న శిక్షణను విద్యార్థులు సద్వి నియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం యాపల్గూడ ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధా కంప్యూటర్ ల్యాబ్ (ఏఐ) వేస వి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమ ంలో భా గంగా విద్యార్థులకు తరగతిని బట్టి కంప్యూటర్, డ్యాన్స్, డ్రాయింగ్, ఇండోర్ గేమ్స్, పాటలు, తదితర శిక్షణ ఇవ్వనున్న ట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు సుజాత్ఖాన్, శ్రీకాంత్గౌడ్, ప్రధానోపాధ్యాయుడు తూరాటి గంగన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
టీజీహెచ్వో రాష్ట్ర అధ్యక్షునిగా సందీప్కుమార్
ఉట్నూర్రూరల్: తెలంగాణ రాష్ట్ర ఉద్యా న అధికారుల సంఘం (టీజీహెచ్వో) రాష్ట్ర అధ్యక్షునిగా ఉట్నూర్ ఐటీడీఏ ఉద్యాన అధికారి సందీప్కుమార్ ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని గెజిటెడ్ భవన్లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, కార్యదర్శి సత్యనారాయణ, ఎన్నికల అధికారి శ్రీరాంరెడ్డి, సహాయ ఎన్నికల అధికారి శ్రీనిశ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఎన్నికల్లో తనను ఉద్యాన అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు సందీప్కుమార్ తెలిపారు. ఉద్యాన అధికారుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా తనవంతు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఉద్యాన అధికారుల సంక్షేమం కోసం ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. -
తాత్విక ధోరణితో సమున్నత జీవితం
● ’జీవితమే ఒకపుస్తకం’ గ్రంథ పరిచయ కార్యక్రమంలో సాహితీవేత్తలు ● జిడ్డు కృష్ణమూర్తి ఆంగ్ల పుస్తకాన్ని అనువదించిన జిల్లా కవి నిర్మల్ఖిల్లా: తాత్విక ధోరణి ద్వారానే సమున్నత జీవితం సిద్ధిస్తుందని జిల్లాకు చెందిన పలువురు సాహితీవేత్తలు అభిప్రాయపడ్డారు. జిల్లాకేంద్రంలోని కావేరి ఫౌండేషన్ గ్రంథాలయంలో మంగళవారం రాత్రి ‘జీవితమే ఒక పుస్తకం’గ్రంథ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అనువాదకర్త కె.మచ్చేందర్..ప్రపంచ తాత్వికవేత్త జిడ్డు కృష్ణమూర్తి ప్రసంగాల సమాహార గ్రంథం ‘ది బుక్ ఆఫ్ లైఫ్’అనే ఆంగ్ల పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. కార్యక్రమంలో పాల్గొన్న సాహితీవేత్తలు మాట్లాడుతూ రెండున్నరేళ్ల పాటు కష్టపడి ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించడం ప్రశంసనీయమని కొనియాడారు. కావేరి ఫౌండేషన్ చైర్మన్ అప్పాల చక్రధారి, సాహితీవేత్తలు టి.సంపత్ కుమార్, నరసయ్య, రవీంద్రబాబు, తుమ్మల దేవరావు, కృష్ణంరాజు, మునిమడుగుల రాజారావు, ఆకుల సుదర్శన్, అంబటి నారాయణ, అనిత, నాగరంజని, నూకల విజయ్కుమార్, దీపక్, పోలీస్ భీమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎల్ఆర్ఎస్ గడువు మళ్లీ పొడిగింపు
● ఈ నెల 3వరకు అవకాశం ● ఈ సారైనా స్పందించేనా? కై లాస్నగర్: అక్రమ లేఅవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎల్ఆర్ఎస్–2020 స్కీం కింద ఫీజు చెల్లించే గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. 25శాతం రాయితీతో కూడిన ఫీజు చెల్లింపు గడువు బుధవారంతో ముగియగా దాన్ని మే 3వరకు పొడిగిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్యదర్శి టి కే. శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ప్రభుత్వం ఇప్పటికే నెల గడువు పొడిగించగా జిల్లాలో ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. ఫీజు చెల్లింపులో సాంకేతిక సమస్యలు తలెత్తడం, పలు ప్లాట్లను నిషేధిత భూముల జాబితాలో చూపడం, వాటిని సరిదిద్దాల్సిన సంబంధిత అధికా రుల మధ్య సమన్వయం కొరవడడం వంటి కారణాలతోనే ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఎల్ఆర్ఎస్ కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు అందినప్పటికీ ఫీజు చెల్లించేందుకు మాత్రం చాలా మంది ముందుకు రాలేదు. సర్కారు ఖజానాకు భారీగా ఆదాయం చేకూరుతుందని భావించినప్పటికీ నిరాశే ఎదురైంది. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో రుసుం రూపేణ రూ.7.60 కోట్ల ఆదాయం సమకూరింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఆదాయం వచ్చింది, ఎన్ని దరఖాస్తులకు ఫీజు చెల్లించారనే వివరాలు పంచాయతీ అధికారుల వద్ద అందుబాటులో లేకపోవడం చూస్తుంటే ఈ ప్రక్రియపై వారు ఎంత చిత్తశుద్ధి కనబరుస్తున్నారనేది స్పష్టమవుతోంది. దరఖాస్తుల సంఖ్య పరంగా చూస్తే ఆదిలాబాద్ మున్సిపల్తో పాటు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి. కాగా మరో మూడు రోజులు అవకాశం కల్పించడంతో దరఖాస్తుదారులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే. -
మహనీయుడు బసవేశ్వరుడు
ఆదిలాబాద్రూరల్: సమసమాజ స్థాపనకు కృషి చేసిన బసవేశ్వరుడు మహనీయుడని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలో ని బసవేశ్వర చౌక్లో బసవేశ్వరుడి జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, వివిధ సంఘాల నాయకులతో కలిసి ఆయన బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సమాజంలో కుల, వర్ణ వివక్షణను రూపుమాపడం కోసం బసవేశ్వరుడు చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజలింగు, జంగమ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి జగదీశ్వర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దత్తు, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మూడు కిలోమీటర్లు వెళ్తేనే నీరు
ఇంద్రవెల్లి మండలంలోని తేజాపూర్ పంచాయతీ పరిధిలోని సాలేగూడలో నీటి కోసం గ్రామస్తులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. గ్రామశివారులో వ్యవసాయ బోరు బావుల నుంచి, ట్యాంకర్ ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం బోరుబావులు అడుగంటడంతో నీళ్లు రావడం లేదు. అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. గ్రామానికి 3 కి.మీ దూరంలో సిరికొండ మండలం రాంపూర్కు బైక్లు, ఎడ్లబండ్లపై నీటిని తెచ్చుకుంటున్నారు. కలెక్టర్ రాజర్షి షా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ స్పందించి గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. – ఇంద్రవెల్లి -
గుండెపోటుతో ట్రెయినీ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి
భీమారం: మండల కేంద్రానికి చెందిన రామళ్ల సాగర్ ట్రెయినీ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతిచెందాడు. అతని బంధువులు తెలిపిన వివరాలు.. కొన్నినెలల క్రితం సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా ఎంపికై న సాగర్ (29) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురంలో శిక్షణ పొందుతున్నాడు. శిక్షణలో భాగంగా కాలికి దెబ్బతగలంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలనడంతో గతనెల 26న స్వగ్రామానికి వచ్చాడు. బంధువుల వివాహం ఉండటంతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి బుధవారం మంచిర్యాలకు వెళ్లాడు. అక్కడ ఒక హోటల్ వద్ద కూర్చున్న సాగర్ అకస్మాత్తుగా కిందపడిపోయాడు. వెంటనే గమనించి అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. సాగర్ మృతితో భీమారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
మన పాత కలెక్టరే.. కొత్త సీఎస్
‘నన్ను ప్రేమతో, ఆప్యాయతతో స్వాగతించినందుకు కృతజ్ఞతలు.. చాలా సంవత్సరాల తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. అప్పటికి.. ఇప్పటికీ చాలా మార్పు చోటు చేసుకుంది. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న జిల్లా ఇది.. అప్పటి రాజకీయ నాయకులు ఇప్పటికీ క్రియాశీలకంగా ఉన్నారు..’ ఈ మాటలన్నది కొత్త సీఎస్ కె.రామకృష్ణారావు. ఏప్రిల్ 18న భూభారతి అవగాహన సదస్సు కోసం రాష్ట్ర మంత్రులు జిల్లాలోని భోరజ్ మండలం పూసాయి గ్రామానికి వచ్చినప్పుడు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో రామకృష్ణారావు కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా వేదిక పైనుంచి ఆయన జిల్లాతో అనుబంధాన్ని పంచుకున్నారిలా. – సాక్షి,ఆదిలాబాద్కొత్త సీఎస్గా నియమితులైన కె.రామకృష్ణారావుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో అనుబంధం ఉంది. ఆయన 2000 సంవత్సరం జూలై 7 నుంచి 2002 అక్టోబర్ 25 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. రెండేళ్లకు పైగా జిల్లాలో విధులు నిర్వహించిన ఆయన ఈ ప్రాంతవాసులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అప్పట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 52 మండలాలు ఉండగా, ఆయన విస్తృతంగా పర్యటించి ప్రజలతో మమేకమయ్యే వారు. దీంతోనే ఆయన ఇక్కడినుంచి వెళ్లిపోయి ఏళ్లు దాటినా ప్రజలు ఇప్పటివరకు గుర్తుంచుకున్నారంటే ఆ అనుబంధమే కారణం. అభివృద్ధికి తోడ్పాటు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక అభివృద్ధి పనులకు ఆయన తోడ్పాటునందించారు. ప్రధానంగా అప్పట్లో జిల్లా కేంద్రానికి తొలిసారి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసింది రామకృష్ణారావు హయాంలోనే. అప్పట్లో జిల్లా మీదుగా విస్తరించి ఉన్న జాతీయ రహదారి నం.7 ఒక వరుస రహదారిగా ఉండేది. ఆ సమయంలో నిర్మల్ జిల్లా వద్ద వేకువజామున ఓ భారీ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా కేంద్రం నుంచి సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుల సహాయార్థం ఆయన తీసుకున్న చొరవ ఇప్పటికీ జనం గుర్తు చేసుకుంటారు. అలాగే జిల్లాలో వరదలు పోటెత్తిన సమయంలో కారు వెళ్లలేని గ్రామాల్లో ఆయన ద్విచక్ర వాహనంపై వెళ్లి వరద బాధితుల సహాయార్థం చర్యలు తీసుకున్నారు. ఈవిధంగా రామకృష్ణారావు జిల్లాపై చెరగని ముద్ర వేశారు. ఆయన కొత్త సీఎస్గా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి వస్తున్నారు. ఉమ్మడి జిల్లాతో రామకృష్ణారావుకు అనుబంధం 23 ఏళ్ల క్రితం ఇక్కడే విధులు ఇటీవల ‘భూ భారతి’ సదస్సుకు హాజరు -
ఆరోగ్యంపై దృష్టి సారించాలి
ఇంద్రవెల్లి: వ్యవసాయ మార్కెట్ యార్డు ద్వారా ఉపాధి పొందుతున్న హమాలీలు తమ ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఉట్నూ ర్ సబ్కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. ఇంద్రవెల్లి, నార్నూర్ మార్కెట్ యార్డులకు హమాలీల ఎంపిక ప్రక్రియను స్థానిక మా ర్కెట్ యార్డులో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతీ హమాలీ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో డీసీవో బి మోహన్, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, పీఏసీఎస్ చైర్మన్ మారుతి డొంగ్రె, ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం, ఏఎంసీ కార్యదర్శి శ్రీనివాస్, పీఏసీఎస్ సీఈవో ధరంసింగ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రమాదవశాత్తు జొన్న పంట దగ్ధం
బజార్హత్నూర్: మండలంలోని దేగామ గ్రామంలో బుధవారం ప్రమాదవశాత్తు దాదాపు 10 ఎకరాల జొన్న పంట దగ్ధమైంది. ఎంఆర్ఐ నూర్సింగ్ కథనం ప్రకారం.. గ్రామంలో మధ్యాహ్నం కొత్తకొండ లక్ష్మీ పంటచేనులో జొన్నపంటకు మంటలు అంటుకున్నాయి. కొన్ని క్షణాల్లో చుట్టుపక్కల చేలకు మంటలు విస్తరించి దాదాపు 10 ఎకరాల జొన్న పంటతోపాటు 100 పైపులు, స్పింక్లర్లు కాలి బూడిదయ్యాయి. ఘటన స్థలాన్ని సీఐ వెంకటేశ్వర్రావు, ఆడె గజేందర్, జల్కే పాండురంగ్, నారాయణ పరిశీలించారు.ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. తాంసిలో రెండెకరాలు.. తాంసి: మండల కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం నిప్పంటుకుని రెండెకరాల్లో జొన్న పంట దగ్ధమైంది. వివరాలు ఇలా ఉన్నాయి..సోమ గంగారెడ్డి పంటచేను పక్కన ట్రాన్స్ఫార్మర్ వద్ద చెలరేగిన నిప్పురవ్వలతో మంటలు వ్యాప్తి చెందాయి. దీంతో రెండెకరాల్లో జొన్న పంట దగ్ధమైంది. స్థానికులు నీళ్లను చల్లి మంటలార్పివేశారు. అగ్ని ప్రమాదంలో రూ.లక్ష వరకు నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన మరో రైతు సతీశ్ చేనులో అకస్మాత్తుగా మంటలు వ్యాప్తి చెంది పదికి పైగా స్పింక్లర్ల పైపులు దగ్ధమయ్యాయి. -
ఉమెన్స్ హ్యాండ్బాల్ విజేత ఉమ్మడి ఆదిలాబాద్
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో మూడు రోజులు జరిగిన రాష్ట్రస్థాయి 54వ సీనియర్ మహిళల తెలంగాణ హ్యాండ్బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు విజేతగా, రంగారెడ్డి జట్టు రన్నరప్గా నిలిచింది. బుధవారం ఫైనల్మ్యాచ్లో ఈ జట్లు తలపడగా ఆదిలాబాద్ జట్టు 13, రంగారెడ్డి జిల్లా జట్టు 11 గోల్స్ వేసింది. మూడో స్థానంలో వరంగల్, నాలుగో స్థానంలో ఖమ్మం జట్లు నిలిచాయని, గెలిచిన జట్లకు నిర్వాహకులు షీల్డ్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హ్యాండ్బాల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేశ్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి జట్టు కోసం 20 మందిని ఎంపిక చేసి వరంగల్లో కోచింగ్ ఇస్తామన్నారు. గుజరాత్లోని బూజ్లో ఈనెల 21 నుంచి 27 వరకు నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రజట్టు పాల్గొంటుందన్నారు. ఈ పోటీల్లో తెలంగాణ ఉమ్మడి 10 రాష్టాల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పవన్కుమార్, టోర్నమెంట్ ఆర్గనైజర్ కాంపెల్లి సమ్మయ్య, కోశాధికారి రమేశ్రెడ్డి, గ్రౌండ్ ఇన్చార్జి నస్పూరి తిరుపతి పాల్గొన్నారు. ● రన్నరప్గా రంగారెడ్డి జట్టు -
ఆనాటి చరిత్ర కాలగర్భంలోకి..
కడెం:మండలంలోని బెల్లాల్ సమీపంలో గోదావరి, కడెం నది కలిసే ప్రాంతంలో 1200 ఏళ్ల క్రితం నాటి మల్లికార్జున స్వామి ఆలయ చరిత్ర కాలగర్భంలోకి కలిసిపోతుంది. ఆలయ గర్భంలో నిధులు, నిక్షేపాలు ఉన్నాయని వందల ఏళ్ల క్రితం ఆలయాన్ని, దేవతమూర్తుల విగ్రహాలను నాడు కొందరు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో స్తంభాలు పడి ఓ వ్యక్తి మృతిచెందినట్లు పెద్దలు చెబుతున్నా రు. పురాతన ఆలయాన్ని పరిరక్షించకపోవడంతో అనాటి చరిత్రాక ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి. విగ్రహాల తలభాగాలు లేకుండా పోగా, రాతిస్తంభాలు గోదావరి ఒడ్డున కుప్పలుగా ఉన్నా యి. ప్రస్తుతం పురాతన ఆలయం ఉన్నచోట గ్రా మానికి చెందిన వారు నూతన ఆలయ నిర్మాణం చేపడుతున్నారు. 1200 ఏళ్ల క్రితం నాటి చరిత్రని, శివ సాహిత్యం పొందడానికి ఆత్మహుతి చేసుకున్న వీరగల్లు విగ్రహంగా భావిస్తున్నట్లు తెలంగాణ చరిత్రబృందం కన్వీనర్ హరగోపాల్, రాజ్కుమార్ తెలిపారు. -
ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ టీంకు పురస్కారం
ఆదిలాబాద్టౌన్: ఉత్తమ సేవలందించిన జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ బృందానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది. ఈమేరకు బుధవారం హైదరాబాద్లోని అబ్కారీభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ కమలాసన్రెడ్డి చేతుల మీదుగా నగదు బహుమతి అందజేశారు. బహుమతి అందుకున్న వారిలో సీఐలు గంగారెడ్డి, అక్బర్ హుస్సేన్, హెడ్ కానిస్టేబుళ్లు ఇంతియాజ్, రవికుమార్, అశ్వక్, సాయిప్రసాద్, కానిస్టేబుళ్లు సిద్ధేశ్వర్, అరవింద్, సందీప్ జమీర్, ఈశ్వర్, సతీష్, మేరి, విజయశ్రీ ఉన్నారు. బృందాన్ని జిల్లా డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, అసిస్టెంట్ కమిషనర్ హిమశ్రీ అభినందించారు. -
‘ఇందిరమ్మ’కు ఉచిత ఇసుక
● ప్రభుత్వ అవసరాలకు సైతం.. ● పెన్గంగ పరీవాహక ప్రాంతాల్లో పది రీచ్ల గుర్తింపు ● తహసీల్దార్ల పర్యవేక్షణలో సరఫరా ప్రక్రియ బేల మండలం కాంగర్పూర్లో ఇసుక నిల్వలు కై లాస్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇందిరమ్మ ఇళ్లతో పాటు ప్రభుత్వపరంగా చేపట్టే నిర్మాణాలకు ఉచితంగా ఇసుక అందించా లని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. పెన్గంగలో ఇసుక లభ్యతపై ఇటీవల సంయుక్త పరిశీలన చే పట్టిన మైనింగ్, ఇరిగేషన్, గ్రౌండ్వాటర్, రెవెన్యూ శాఖల అధికారులు జైనథ్, భీంపూర్, తాంసి, బేల మండలాల్లోని నది పరీవాహక ప్రాంతాల్లోని పది ఇసుక రీచ్లను గుర్తించారు. వాల్టా చట్టం అనుసరించి ఇసుక వెలికితీయాలని నిర్ణయించారు. తహసీల్దార్ల పర్యవేక్షణలో సరఫరా ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక రీచ్లు ఇవే.. ఉచితంగా ఇసుక అందించేందు కోసం పెన్గంగలో మొత్తం పది ఇసుక రీచ్లను ఎంపిక చేశారు. భీంపూర్ మండలం అంతర్గాంలో ఇసుక మందం 1.5 మీటర్లుగా గుర్తించిన అధికారులు గుబిడి, వడూర్, తాంసి–కే గ్రామాల్లో, అలాగే జైనథ్ మండలంలోని సాంగ్వి–కే, ఆనంద్పూర్, భోరజ్ మండలంలో డో ల్లరా, పెండల్వాడలో 0.5 మీటర్లుగా, బేల మండలంలో మణియర్పూర్, సాంగిడి గ్రామాల్లో 1.5 మీ టర్లుగా ఉన్నట్లు గుర్తించారు. ఆయా గ్రామాల్లో ను ంచి ఇసుకను ఉచితంగా సరఫరా చేయనున్నారు. సరఫరా ప్రక్రియ ఇలా... ఆయా మండలాల తహసీల్దార్ల ఆధ్వర్యంలో ఉచిత ఇసుక సరఫరా చేపట్టనున్నారు. ఇసుక అవసరము న్న ఇందిరమ్మ లబ్ధిదారులు, ప్రభుత్వ భవనాల ని ర్మాణాలు చేపట్టే కాంట్రాక్టర్లు ముందుగా సంబంధి త తహసీల్దార్లకు దరఖాస్తు చేసుకోవాలి. వారికి ప్రా ధాన్యత క్రమంలో తహసీల్దార్లు వే బిల్లులు జారీ చే స్తారు. వాటిఆధారంగా నిర్దేశించిన సమయాల్లో ఇ సుకను తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆయా వా హనాల డ్రైవర్లకు లైసెన్స్తో పాటు వాహనానికి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఇసుకను ఎక్కడికి తీసుకెళ్తున్నారనేది తహసీల్దార్లకు తప్పనిసరిగా సమాచారమందించాలి. ఎక్కడ డంప్ చేశారనేది వారు స్వయంగా పరిశీలిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా డంప్చేసినా, నిర్దేశిత పనులకు కాకుండా ఇతర వాటికి తరలించినా చట్టప్రకారం ఆ డంప్ల ను సీజ్ చేయడంతో పాటు బాధ్యులపై చర్యలుంటాయని ఆర్డీవో వినోద్కుమార్ తెలిపారు. ఇసుక అవసరమున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని ఆయన సూచించారు. -
ఆశ్రమ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు
ఉట్నూర్రూరల్: ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. బుధవారం ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తన క్యాంపు కార్యాలయంలో డీడీ అంబాజీ, ఏసీఎంవో జగన్ను అభినందించారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి 96 శాతం ఫలితాలు సాధించినట్లు ఏసీఎంవో జగన్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 108 పాఠశాలలు, అందులో 65 పాఠశాలలు వంద శాతం వచ్చాయని పేర్కొన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పదిలో ఉత్తమ ఫలితాలు సాధనకు ఐటీడీఏ పీవో సారథ్యంలో చేపట్టిన మిషన్ లక్ష్యం ఎంతో మేలు చేసిందన్నారు. వచ్చే ఏడాదిలో పదిలో వందశాతం ఫలితాలు సాధించేలా కృషిచేయాలని ఐటీడీఏ పీవో పేర్కొన్నారు. -
విత్తనపూజకు వేళాయె
● జంగుబాయి సన్నిధిలో ఆదివాసీల పూజలు ● ఆలయంలో రేపటి నుంచి నెలరోజులు ఉత్సవాలుకెరమెరి(ఆసిఫాబాద్): ఆనాదిగా వస్తున్న ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడంలో ఆదివాసీలు ముందుంటున్నారు. జూన్ 8న మృగశిరకార్తె ప్రవేశించనుండడంతో ఆదివాసీలు తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని మహరాజ్గూడ అడవుల్లో కొలువైన జంగుబాయికి పుణ్యక్షేత్రంలో విత్తన పూజకు శ్రీకారం చుట్టారు. అక్కడి గుహలోకి వెళ్లి దీపం వద్ద పూజలు చేస్తారు. రావుడ్, పోచమ్మ, మైసమ్మకు విత్తనాలు చూపించి మొక్కి అమ్మవార్లకు నైవేద్యం చూపిస్తారు. విత్తన పూజల అనంతరం తమ పొలాల్లో విత్తనాలు నాటడం ప్రారంభిస్తారు. దీన్ని గోండి భాషలో ‘మొహతుక్’అంటారు. అదేవిధంగా గిరి గ్రామాల్లో ఏటా జరిగే విత్తన పూజల ముందుగా జంగుబాయి అమ్మవారికి విత్తనాలు చూపెట్టాక పొలాల్లో నాటడంతో అధిక దిగుబడి వస్తాయని భక్తుల నమ్మకం. నేడు దీపోత్సవం జంగుబాయి సన్నిధిలో గురువారం దీపోత్సవం, శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు నెల రోజుల పాటు నిర్వహిస్తారు. వివిధ గ్రామాలకు చెందిన మోళంలు తరలివచ్చి పూజలు చేస్తాయి. దుక్కిలతో దున్ని విత్తనాలు వేసేందుకు తమ పొలాలను రైతులు సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, కుమురం భీం జిల్లాలోనే ఆదివాసీలు అధికంగా ఉన్నారు. దేవతలకు విత్తనాలు చూపిస్తారు మే మాసంలో అన్ని గ్రామాల్లో గ్రామ పటేల్ ఇంట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆదివాసీల కులదైవమైన పాటేరు అమ్మోరు, జంగుబాయి, గాంధారి కిల్ల, పద్మాల్పురి కాకో వద్దకు వెళ్లి విత్తనాలను చూపిస్తారు. అక్కడే దేవతల ఆశీర్వాదం తీసుకుని తిరుగుపయనమవుతారు. అనంతరం గ్రామంలో ఉన్న ఆకిపేన్, అమ్మోరు, పోచమ్మ వద్దకు వెళ్లి విత్తనాలతో పూజలు చేస్తారు. అదే రోజు రాత్రి 2.5 కిలోల జొన్నలతో గట్క తయారు చేసి ఆరగిస్తారు. అర్ధరాత్రి అడవికి వెళ్లి (కుమ్ముడ్) చెట్టు ఆకులను తీసుకువచ్చి డొప్పలు తయారు చేసి ఇళ్లల్లో ఇస్తారు. అందులో పూజ చేసిన విత్తనాలు వేస్తారు. ఈ కార్యక్రమంతా మృగశిర మాసానికి కొద్ది రోజుల ముందుగా నిర్వహిస్తారు. విత్తన పూజలు(మొహతుక్) విత్తన పూజ చేయాలన్న రోజు రైతు కుటుంబమంతా ఉదయాన్నే పొలం బాట పడుతారు. ఉదయం ఇంటిని శుభ్రం చేసి పేడతో అలుకు చల్లుతారు. పొలానికి వెళ్లాక జొన్నతో గట్కా తయారు చేసి కులదైవంతోపాటు నేల తల్లికి సమర్పిస్తారు. అనంతరం పొలంలో విత్తనాలు చల్లి అరకకు ప్రత్యేక పూజలు చేసి విత్తనాలు నాటుతారు. గ్రామ పటేల్ ఇంటి ఎదుట మహిళలు సంప్రదాయ నృత్యాలు చేస్తారు. పురుషులు గిల్లిదండా ఆట ఆడుతారు. తర్వాత సహపంక్తి భోజనం చేస్తారు. చంచి భీమల్ దేవుడి కల్యాణంతో.. ఆదివాసీల ఇష్టదైవమైన చంచి భీమల్ దేవుడి కల్యాణం సందర్భంగా ఏటా ఏప్రిల్, మే మాసంలో విత్తనాలను దేవుడికి చూపిస్తారు. ఆరోజు ఆదివాసీలు భీమల్ దేవుడికి సంప్రదాయ పూజలు చేస్తారు. అడవుల్లో లభించే ఆకులతో ఆరు డొప్పలను తయారు చేస్తారు. అందులో అన్ని విత్తనాలను కలిపి భీమల్ దేవునికి చూపిస్తారు. అనంతరం వాటిని ఇళ్లకు తీసుకెళ్లి దాచి పెడ్తారు. ఆరోజు పిండి వంటలు చేసి ఆరగిస్తారు. మృగశిర కార్తె ప్రారంభంతో ఆ విత్తనాలను తమ పొలాల్లో చల్లుతారని పలువురు చెబుతున్నారు. దేవతలకు చూపించాకే.. పొలాల్లో విత్తనాలు నాటే కొన్నిరోజుల ముందు కుల దేవతలకు వాటిని చూపిస్తాం. ప్రత్యేక పూజలు చేశాకే పొలానికి వెళ్లి జొన్నగట్కాను వండి ఆరగిస్తాం. నేలతల్లికి ప్రత్యేక పూజలు చేసి విత్తనాలు నాటడం ప్రారంభిస్తాం. – సలాం శ్యాంరావు, జంగుబాయి ఉత్సవ కమిటీ చైర్మన్ ఆచారాలు పాటిస్తున్నాం ఆదివాసీలు ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తూ వస్తున్నారు. ఏళ్ల క్రితం నుంచి ప్రారంభమైన విత్తన(మొహతుక్) పూజలు ఇప్పుడు కూడా చేస్తున్నాం. పూజలు చేయందే విత్తనాలు నాటం.– పుర్క బాపూరావు, జంగు బాయి ఉత్సవ కమిటీ, ప్రచార కార్యదర్శి -
● ఫలితాల్లో బాలికలదే పైచేయి ● జిల్లాలో 97.40 శాతం ఉత్తీర్ణత ● గతేడాదితో పోల్చితే 4.47 శాతం పెరుగుదల ● రాష్ట్రస్థాయిలో తొమ్మిదో స్థానం ● 65 ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం పాస్
వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పిప్పర్వాడ జెడ్పీఎస్ఎస్ విద్యార్థులుఆదిలాబాద్టౌన్: పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో 97.40 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గతేడాది జిల్లా 17వ స్థానంలో నిలవగా, ఈసారి 8 స్థా నాలు మెరుగుపర్చుకొని రాష్ట్రస్థాయిలో 9వ స్థా నానికి ఎగబాకింది. సీఎం రేవంత్రెడ్డి ఎస్సెస్సీ ఫలి తాలను బుధవారం విడుదల చేశారు. జిల్లాలో బా లుర కంటే బాలికలే పైచేయి సాధించారు. ప్రభుత్వ యాజమా న్య పాఠశాలలు ఈ సారి మంచి ఫలితా లు సాధించాయి. 65 పాఠశాలల్లో వంద శాతం ఉ త్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది ఫలితాలు గ్రేడింగ్లో కాకుండా మార్కుల రూపంలో విడుదలయ్యాయి. మెరుగైన ఫలితాలు.. జిల్లాలో మొత్తం 10,028 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 9,767 మంది ఉత్తీర్ణత సాధించారు. 97.40 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలురు 5,049 మంది హాజరు కాగా, 4,890 మంది ఉత్తీర్ణులయ్యారు. 96.85 శాతం ఉతీర్ణత నమోదైంది. బాలికలు 4,979 మంది హాజరు కాగా, 4877 మంది పాస్ అయ్యారు. 97.95 ఉత్తీర్ణత శా తం నమోదైంది. ఉత్తీర్ణత శాతం పరంగా మెరుగుపడగా, రాష్ట్రస్థాయిలో టాప్–10లో నిలిచారు. ఆ శ్రమ పాఠశాలల్లో 98.73 శాతం, బీసీ వెల్ఫేర్లో 99.69, ప్రభుత్వ యాజమాన్యంలో 87.70, కేజీబీ వీల్లో 97.64, మోడల్ స్కూళ్లలో 99.82, ప్రైవేట్ పాఠశాలల్లో 98.76, మినీ రెసిడెన్షియల్లో 97.12, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 100 శాతం, ట్రైబ ల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో 99.76, జెడ్పీ యాజమాన్యంలో 96.02 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జూన్ 3నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ.. పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13 వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు 15 రోజుల గడువు ఉంది. రీకౌంటింగ్, జవాబు పత్రాల జిరాక్స్ కాపీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, వాటిని డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రీకౌంటింగ్ కోసం సబ్జెక్టుకు రూ.500 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈనెల 16 వరకు గడువు ఉందని సూచించారు. వందశాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలలు.. జిల్లాలో 65 పాఠశాలల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. మోడల్ స్కూల్ బంగారుగూడ, పొచ్చర, ప్రభుత్వ పాఠశాల ఖానాపూర్, తాటిగూడ, హిందీ హైస్కూల్, కేజీబీవీ ఆదిలాబాద్రూరల్, స్పోర్ట్స్ స్కూల్, మోడల్స్కూల్ బజార్హత్నూర్, దహెగావ్, పిప్పిరి, కేజీబీవీ బేల, సిర్సన్న, సాంగిడి, కొగ్దూర్, కరంజి, పిప్పల్కోటి, భీంపూర్, ప్రభుత్వ పాఠశాల బోథ్, మోడల్ స్కూల్ బోథ్, ధన్నూర్(బి), కౌఠ(బి), మర్లపల్లి, పొచ్చర, కన్గుట్ట, బోరిగామ, కేజీబీవీ ఇచ్చోడ, కోకస్మన్నూర్, కేజీబీవీ గాదిగూడ, ప్రభుత్వ పాఠశాల గుడిహత్నూర్, కేజీబీవీ తోషం, కొల్హారి, మన్నూర్, కేజీబీవీ ఇంద్రవెల్లి, ముత్నూర్, మోడల్స్కూల్ జైనథ్, దీపాయిగూడ, గిమ్మ, కౌట, పెండల్వాడ, అడ, పిప్పర్వాడ, బాలాపూర్, కూర, సరస్వతినగర్, వాగాపూర్, కేజీబీవీ నార్నూర్, మోడల్స్కూల్ నార్నూర్, జెడ్పీఎస్ఎస్ నార్నూర్, తడిహత్నూర్, భీంపూర్, నేరడిగొండ, వాంకిడి, తేజాపూర్, కేజీబీవీ తలమడుగు, బరంపూర్, కుచులాపూర్, తలమడుగు, కజ్జర్ల, లింగి, పల్లి(బి), ఘోట్కురి, కప్పర్ల, తాంసి, పొన్నారి పాఠశాలలు ఇందులో ఉన్నాయి. మంచి ఫలితాలు సాధించాం పదో తరగతిలో జిల్లా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. గతేడాదితో పోల్చితే ఈ సారి దాదాపు ఐదు శాతం ఉత్తీర్ణత పెరిగింది. కలెక్టర్ రాజర్షిషా పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. కరదీపికలను అందజేశారు. రాష్ట్రస్థాయిలో జిల్లా 9వ స్థానంలో నిలిచింది. 97.40 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వచ్చే విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తాం. – శ్రీనివాస్రెడ్డి, డీఈవో సబ్జెక్టుల వారీగా.. జిల్లాలో సబ్జెక్టుల వారీగా ఫలితాలను చూస్తే.. తెలుగులో 99.02 శాతం, సెకండ్ లాంగ్వేజ్లో 99.75 శాతం, ఇంగ్లీష్లో 99.35 శాతం, గణితంలో 98.87 శాతం, సామాన్య శాస్త్రంలో 98.58 శాతం, సాంఘిక శాస్త్రంలో 99.56 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కలెక్టర్ ప్రశంసఆదిలాబాద్టౌన్: పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించడంపై కలెక్టర్ రాజర్షిషా హర్షం వ్యక్తం చేశారు. విద్యా శాఖ అధికారులను ప్రశంసించారు. డీఈవో శ్రీనివాస్రెడ్డి, డీసీఈబీ సెక్రెటరి కందుల గజేందర్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. వచ్చే సంవత్సరం మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూ చించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు శుభా కాంక్షలు తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులపై శ్రద్ధ వహించాలని, సప్లిమెంటరీ పరీక్షల్లో వారు కూడా ఉత్తీర్ణులయ్యేలా చూడాలన్నారు.సర్కారు విద్యార్థుల సత్తా..పదో తరగతి ఫలితాల్లో ఈ సారి జిల్లా విద్యార్థులు అత్యుత్తమంగా రాణించారు. గతంతో పోల్చితే మెరుగైన ఫలితాలు సాధించడంతో డీఈవో శ్రీనివాస్రెడ్డితో పాటు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అభినందించారు. బంగారిగూడ మోడల్ స్కూల్కు చెందిన చిల్కూరి రమ 578 మార్కులు సాధించగా.. సట్లవార్ హర్ష్ 575, హర్షవర్ధన్ 569, కేజీబీవీలో నేరడిగొండకు చెందిన విద్యార్థిని హార్థిక 564, తలమడుగు కేజీబీవీ విద్యార్థిని శైలజ 563, ఆదిలాబాద్రూరల్ కేజీబీవీలో వైశాలి 557, సంస్కృతి 556, మయూరి 550, గాదిగూడ కేజీబీవీకి చెందిన విద్యార్థిని లత 552, భోరజ్ మండలం పిప్పర్వాడ జెడ్పీ పాఠశాలకు చెందిన వగాడే అమృత 560 మార్కులు సాధించారు. -
భూభారతితో సమస్యలు పరిష్కారం●
ఆదిలాబాద్టౌన్: రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జైనథ్ మండల కేంద్రంలోని శ్రీలక్ష్మి నారాయణ స్వా మి ఆలయ ఆవరణలో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అ తిథిగా హాజరయ్యారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు. చట్టం విధివిధానాలపై పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రత్యేక కౌంటర్ల ద్వారా రైతుల సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం తెచ్చిన భూ భారతి చట్టం ద్వారా రైతులకు న్యాయం జరుగనుందన్నా రు. కార్యక్రమంలో ఆర్డీవో వినోద్కుమార్, జైనథ్ పీఏసీఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, తహసీల్దార్ నారాయణ, ఎంపీడీవో శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. బేల: భూభారతి చట్టంపై రైతులు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మండలకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. అదనపు కలెక్టర్ శ్యా మలాదేవి, ఎమ్మెల్యే శంకర్, ఆర్డీవో వినోద్కుమార్, జైనథ్ మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ విలా స్, మండల ప్రత్యేకాధికారి మనోహర్రావు, తహసీల్దార్ రఘునాథ్రావు, డీటీవామన్రావు, ఎంపీడీవో మహేందర్కుమార్, ఏవో సాయితేజరెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ‘ఎర్లీబర్డ్’ గడువుకై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ముందస్తు ఆస్తి పన్ను వసూలు కోసం ప్రభుత్వం అమలు చేసిన ఎర్లీబర్డ్ స్కీం గడువు బుధవారంతో ముగిసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నులను ముందస్తుగా చెల్లించిన వారికి ఈ స్కీం కింద ప్రభుత్వం ఐదు శాతం రాయితీ కల్పించింది. పన్ను చెల్లింపునకు చివరి రోజు కావడంతో బల్దియా యంత్రాంగం, బిల్ కలెక్టర్లు మండుటెండ సై తం లెక్క చేయకుండా తమకు కేటాయించిన కాలనీల్లో విస్తృతంగా తిరిగారు. ఇంటింటికి వెళ్లి పన్ను చెల్లించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశా రు. అయితే ఈనెల వ్యవధిలో ఎంత పన్ను వ సూలైంది ఇంకా లెక్కతేలలేదు. గతేడాదితో పో ల్చితే అధికంగా ఉంటుందా.. వెనకబడ్డారా అనేది గురువారం వెల్లడయ్యే అవకాశముంది. -
మాతాశిశు మరణాలు తగ్గించాలి
● డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ ఆదిలాబాద్టౌన్: జిల్లాలో మాతాశిశు మరణాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. డీఎంహెచ్వో సమావేశ మందిరంలో మెడికల్ ఆఫీసర్లు, మిడ్లెవల్ హెల్త్ ప్రొవైడర్లకు సంకల్ప్ కార్యక్రమంపై మంగళవారం అవగాహన కల్పించారు. ఇందులో మాతా శిశు మరణాలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాతృ మరణాలు నివారించేందుకు గర్భం దాల్చిన వెంటనే పీడీ వ్యాక్సిన్ వేయాలని తెలిపారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయాలని సూచించారు. శిశు సంరక్షణలో భాగంగా పుట్టిన గంటలోపు పసికందుకు తల్లిపాలు పట్టించాలని సూచించారు. అలాగే వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో వేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి వైసీ శ్రీని వాస్, సంకల్ప్ కార్యక్రమ నోడల్ అధికారి తన్నిజై, వైద్యాధికారులు పాల్గొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల తనిఖీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను మంగళవారం తనిఖీ చేశారు. పోలీసు, సఖీ, ఎన్జీవో, రిమ్స్ ప్రతినిధులతో ఏర్పాటైన బృందాలతో ఆస్పత్రుల్లో వసతులు, వైద్యం వివరాలు, లింగనిర్ధారణ, ఫైర్సేఫ్టీ, రిజిస్ట్రేషన్ తది తర వాటిని పరిశీలించారు. నక్షత్ర ఆస్పత్రిలో ఏఎన్సీ చెకప్ చేయడం లేదని తెలుసుకున్న డీఎంహెచ్వో ఫ్రోమ్ సీజ్ చేసి కస్టడీలో పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రిజిస్టర్ అయిన ఆస్పత్రులు నిబంధనలు పాటించాలని సూచించారు. ఎవరైనా ఉల్లంఘిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోగులు, వారి సహాయకులకు కనిపించేలా ఆస్పత్రిలో ధరల పట్టికలు ప్రదర్శించాలన్నారు. వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, ఫైర్సేఫ్టీ పరికరాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆయన వెంట యశోద, సరస్వతి, వైద్య సిబ్బంది ఉన్నారు. -
● మూడో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించా.. ● ఆత్మవిశ్వాసంతో సాగితే లక్ష్యసాధన సులువే ● ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా మనోగతం
‘నన్ను కలెక్టర్గా చూడాలనేది మా నాన్న కల.. దాన్ని ఎలాగైనా నెరవేర్చాలని పాఠశాల స్థాయిలోనే నిర్ణయించుకున్నా.. ఆయన అందించిన ప్రోత్సాహంతో ముందుకు సాగా.. రెండుసార్లు విఫ లమయ్యా.. అయినా నిరాశ చెందలేదు.. రాత్రింబవళ్లు మరింత కష్టపడి చదివా.. లోటుపాట్లు సవరించుకుని ముందడుగు వేశా. మూడో ప్రయత్నంలో విజయం సాధించా.. 2023 యూపీఎస్సీ ఫలి తాల్లో జాతీయ స్థాయిలో 29వ ర్యాంకు సాధించా.. ఐఏఎస్గా తెలంగాణ క్యాడర్కు ఎంపికయ్యా.. నాన్న కల నెరవేర్చడం నాకెంతో ఆనందానిచ్చింది.. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకా లను అమలు చేసి, పేదలకు సేవ చేయడమే లక్ష్యమని అంటున్నారు జిల్లాకు నూతనంగా విచ్చేసిన ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా. ‘సాక్షి’కి మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలు వెల్లడించారు. – కై లాస్నగర్సాక్షి: ‘గుడ్ మార్నింగ్ మేడమ్.. వెల్కమ్ టు ఆదిలాబాద్. ట్రెయినీ కలెక్టర్గా జిల్లాకు విచ్చేసిన మీకు మరోసారి ప్రత్యేక అభినందనలు. మీ కుటుంబ నేపథ్యం వివరాలు.. ట్రెయినీ కలెక్టర్: మాది హర్యానా రాష్ట్రంలోని గురుగ్రాం. నాన్న ఇంద్రజిత్, అమ్మ సీమ. ఇద్దరూ బిజినెస్ చేస్తుంటారు. అన్న దక్ష్. గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాడు. ఊరిలోనే అమ్మనాన్నలకు తోడుగా ఉంటూ వ్యాపారం చూసుకుంటారు. సాక్షి: మీ విద్యాభ్యాసం ఎక్కడెక్కడ సాగింది.. ట్రెయినీ కలెక్టర్: ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వర కు గురుగ్రాంలోని బ్లూ బెల్స్లో చదివా. చిన్నత నం నుంచే చదువులో ముందుండేదాన్ని. స్కూ ల్లో నిర్వహించే డిబేట్లు, ఎక్స్ట్రా కరి క్యూలమ్లో పాల్గొంటూ ప్రతిభ కనబర్చుతుండేది. చదువులో ఎప్పుడూ ముందుండే నేను టెన్త్, ఇంటర్లో ఫస్ట్క్లాస్లో పాసయ్యా. అనంతరం ఢిల్లీలోని శ్రీరాం కాలేజ్ ఆఫ్ కామర్స్ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్ ఎకానామిక్స్ పూర్తి చేశాను. ఆ వెంటనే సివిల్స్ పరీక్షలపై దృష్టి సారించాను. సాక్షి: యూపీఎస్సీ కోచింగ్ ఎక్కడ తీసుకున్నారు.. ఎన్నోసారి విజయం సాధించారు.. ట్రెయినీ కలెక్టర్: పదో తరగతిలోనే ఐఏఎస్ సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నా. ఆ దిశగా అడుగులు వేశాను. ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లో ఏడాది పాటు శిక్షణ పొందాను. ఆప్షనల్ సబ్జెక్ట్గా సోషియాలజీని ఎంచుకున్నా. ప్రణాళి కాబద్ధంగా చదివా. 2021లో తొలిసారి యూపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యా. ఇంటర్వ్యూ వరకు వెళ్లా ను. అయితే కొద్దిపాటి తేడాతో విజయం సాధించలేకపోయాను. మరో ప్రయత్నంలో ప్రిలిమ్స్లోనే ఆగిపోయాను. అయినా ఏమాత్రం నిరాశ చెందలేదు. మూడో ప్రయత్నం 2023లో జాతీయస్థాయిలో 29వ ర్యాంకు సాధించాను. ఐఏఎస్ కావాలనే నా సంకల్పంతో పాటు నాన్న కలను నెరవేర్చాను. తెలంగాణ క్యాడర్కు ఎంపికై ప్రస్తుతం ట్రైనింగ్ నిమిత్తం ఆదిలాబాద్కు రావడం జరిగింది. ఏడాది పాటు జిల్లాలో పనిచేయాల్సి ఉంటుంది. రెండు సార్లు విఫలమైన సమయంలో నేను ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అమ్మనాన్నలు అండగా నిలి చా రు. వెన్నుతట్టారు. వారందించిన ప్రోత్సాహంతోనే విజయం సాధించాను. సాక్షి: జిల్లాలో మీరు ఏడాది పాటు ఉండనున్నారు.. ఏయే అంశాలపై దృష్టి సారిస్తారు.. ట్రెయినీ కలెక్టర్: కలెక్టర్ సూచనలు, సలహాలు తీసుకుంటూ క్షేత్రస్థాయిలో పథకాల అమలు తీరును క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తాను. శిక్షణ అనంతరం ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ, అభివృద్ధి పథకాలను అట్టడుగుస్థాయికి అందించేలా నావంతు కృషి చేస్తాను. సాక్షి: సివిల్స్, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు మీరిచ్చే సలహా.. ట్రెయినీ కలెక్టర్: సివిల్ సర్వీసెస్కు సన్నద్ధమయ్యే అభ్యర్థుల్లో చాలా మంది ఒకటి, రెండు ప్రయత్నాలకే నిరాశకు లోనవుతారు. ఇక మా వల్ల కాదంటూ వెనుకడుగు వేస్తుంటారు. అపజయాలను చూసి నిరాశ చెందొద్దు. సంకల్పం వీడకుండా ముందుడుగు వేయాలి. పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా చదివితే తప్పకుండా విజయం సాధించవచ్చు. రోజుకు కనీసం 8 నుంచి 10 గంటలు చదవాలి. ముఖ్యంగా సెల్ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. ప్రతిరోజు పత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలి. వర్తమాన అంశాలపై పట్టు సాధించాలి. గత ప్రశ్నాపత్రాలను విశ్లేషించుకోవాలి. సందేహాలుంటే ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. ఆత్మవిశ్వాసం, సంకల్పబలంతో ప్రయత్నిస్తే తప్పకుండా లక్ష్యాన్ని సాధించవచ్చు. -
గంజాయి సాగుచేస్తే కఠిన చర్యలు
● ఎస్పీ అఖిల్ మహాజన్ఇచ్చోడ: గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. స్థానిక సీఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చోడ మండలం చిన్న సల్యాద గ్రామంలో గంజాయి సాగు చేస్తున్న పలువురిని సోమవారం రాత్రి గుర్తించి 180 మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపా రు. చహకటి సోనేరావు పొలంలో 17 మొక్కలు, దుర్వాడ లవకుశ్ పొలంలో 86, ఆర్క జంగుబాపు పొలంలో 31, దుర్వ అరుణ్ పొలంలో 46 మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీటి విలువ సుమారు రూ.18 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. గంజాయి సరఫరా, విక్రయాలను గుర్తించేందుకోసం జిల్లాలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమాచారం తెలిసిన వారు 8712659973 నంబర్లో సంప్రదించాలని సూచించారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఎవరైనా గంజాయి సాగు చేసినా, విక్రయించినా వారికి ప్రభుత్వ పథకాలు నిలిపివేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇందులో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్, ఇచ్చోడ సీఐ భీమేశ్, ఎస్సై తిరుపతి పాల్గొన్నారు. -
దేశవ్యాప్త బంద్ జయప్రదం చేయండి
ఆదిలాబాద్టౌన్: మే 20న తలపెట్టిన దేశ వ్యాప్త బంద్ జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.ప్రసాద్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో మూ డో సారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. అలాగే 44 కార్మి క చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి కార్మి కులను బానిసలుగా మార్చే కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. వీటిని నిరసిస్తూ చేపట్టనున్న దేశవ్యాప్త గ్రామీణ హడ్తాల్, బంద్ను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్నాయక్, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సచిన్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బండి దత్తాత్రి, ఆయా సంఘాల నాయకులు స్వామి, చిన్నన్న, విష్ణు, నగేశ్, నవీన్, ఆశన్న, గంగారాం, నాగారావు తదితరులు పాల్గొన్నారు. -
వడ్డీ వ్యాపారులకు చెక్పడేనా?
ఆదిలాబాద్లో ఓ ముఖ్య నేతకు సంబంధించిన బంధువు గ్రా మంలో వ్యవసాయ చేస్తుంటాడు. జిల్లా కేంద్రంలోని ఓ విత్తన దుకాణ యజమాని నుంచి రూ.15 లక్షల విలువైన విత్తనాలు, పురుగుల మందులను గతంలో అరువుపై తీసుకున్నాడు. దీనికి సంబంధించి ఆ వ్యాపారి అసలు సొమ్ముపై వడ్డీ, చక్రవడ్డీ రూపేనా మొదట రూ.25లక్షల వరకు పెంచేశాడు. ఆ తర్వాత దాన్ని రూ.కోటి 25 లక్షల వరకు తీసుకెళ్లాడు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన సమయంలో ఆ వ్యాపారి ఇదే అదునుగా అతడిపై డబ్బులు చెల్లించాలని ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో ఆయన తన భూమిలో నుంచి రెండెకరాలు వ్యాపారి పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. అప్పట్లో రూ.కోటి విలువ చేసే ఎకరం చేను ప్రస్తుతం రూ.కోటిన్నరకు పైగా ఉంది. వడ్డీ వ్యాపారుల అక్రమ దందాకు ఈ ఘటన ఓ నిదర్శనం. జిల్లాలో ఇలాంటి ఘటనలు ఇటీవల కొన్ని బయటపడగా చాలా వరకు వెలుగులోకి రావాల్సి ఉంది. – సాక్షి,ఆదిలాబాద్జిల్లాలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఇటీవల వడ్డీ వ్యాపారుల నివాసాల్లో పోలీసు శాఖ ఆకస్మిక దాడులు చేసింది. తొలిరోజే ఏకంగా 31 కేసులు నమోదు చేసింది. ప్రామిసరీ నో ట్లు, సేల్డీడ్లు, బ్యాంక్ చెక్కులను భారీగా స్వాధీ నం చేసుకున్నారు. ఈ క్రమంలో జైనథ్ పోలీసుస్టేషన్లో ఈనెల 27న ఓ వడ్డీ వ్యాపారిపై నమోదైన రెండు కేసులు సంచలనం కలిగించాయి. రూ.3లక్షలు అప్పు ఇచ్చి దానికి 25 శాతం వడ్డీ తీసుకోవడం, ఆ రైతుకు సంబంధించి 1.36 ఎకరాల భూమిని తన తమ్ముడి పేరిట రాయించుకోవడం వంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడు డబ్బులు కట్టినా తిరిగి భూమి ఇవ్వాలని అడిగితే నిరాకరించిన నేపథ్యంలో అతను పోలీసులను ఆశ్రయించడంతో ఆ వడ్డీ వ్యాపారిపై కేసు నమోదైంది. అతడి వద్ద ఏకంగా 32 సేల్డీడ్లు స్వాధీనం చేసుకోవడం సంచలనం రేపింది. ఇలా అప్పులు ఇవ్వడం, అలా ఆస్తులు తమ పేరిట చేసుకోవడం, మొత్తంగా వడ్డీ వ్యా పారం పేరిట అమాయకుల నడ్డీ విరుస్తున్న సంఘటనలు కోకొల్లాలుగా జిల్లాలో ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హద్దేలేని సంపాదన.. ఆదిలాబాద్లో ఇలా వడ్డీ వ్యాపారం చేసేవారికి హద్దేలేని సంపాదన ఉందని జనం చెప్పుకుంటున్నారు. ఆస్తులపత్రాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అధిక వడ్డీ వసూలు చేయడం ద్వారా అప్పు ఇచ్చిన వడ్డీ వ్యాపారి నష్టపోయిన దాఖ లాలు ఆదిలాబాద్లో ఇప్పటివరకు లేదు. అదే సందర్భంలో ఇలా వడ్డీకి రుణం తీసుకున్న వ్యక్తులు దాన్ని కట్టలేని పరిస్థితిలో సర్వం కోల్పోతున్నారనే నేపథ్యమే ఆందోళన కలిగిస్తుంది. మరో వైపు వ్యాపారులు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. పూర్తిగా చెక్ పెట్టాలనే అభిప్రాయం.. ఆదిలాబాద్లో వడ్డీవ్యాపారులపై దాడులు, కేసు ల నమోదు నేపథ్యంలో సామాన్య జనం నుంచి హర్షం వ్యక్తమవుతుంది. మామూలు వడ్డీ వసూలు చేసేవారు కాకుండా అధిక వడ్డీ, ఆస్తులు కై వ సం చేసుకునే విధంగా వ్యవహరించే వడ్డీ వ్యాపారుల భరతం పట్టాలని కోరుతున్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ విషయంలో పూర్తిస్థాయిలో చెక్ పెట్టేవరకు ఆపరేషన్ కొనసాగించాలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు బాధితుల నుంచి అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా బాస్ కొరడా ఝళిపిస్తున్నట్లు తెలుస్తోంది. బాధితులను జలగల్లా పీల్చుతున్న వైనం బయటపడ్డవి కొన్నే.. వెలుగులోకి రావాల్సినవి ఎన్నో అక్రమదందాపై ఫోకస్ పెంచిన ఎస్పీ చట్ట ప్రకారం చర్యలు మనీలెండర్స్ చట్టం ప్రకారం వడ్డీ వ్యాపా రం చేసేవారు తప్పనిసరిగా తహసీల్దార్ నుంచి లైసెన్స్ తీసుకోవాలి. జిల్లాలో అనధికారికంగానే పలువురు ఈ వడ్డీ వ్యాపా రం నిర్వహిస్తున్నారు. తాజాగా నెలకు 15శాతం పైబడి వడ్డీ వసూలు చేస్తున్న ఓ వ్యాపారి వ్యవహారం నా దృష్టికి వచ్చింది. పలువురు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నారు. – అఖిల్ మహాజన్, ఎస్పీ -
బార్ల ఎంపికకు లక్కీ డ్రా
కై లాస్నగర్: ఆదిలాబాద్ పట్టణంలో గతంలో రెన్యూవల్ కాకుండా మూతపడ్డ మూడు బార్ల స్థానంలో కొత్తవాటి ఏర్పాటు కోసం జిల్లా ఎకై ్సజ్శాఖ ఆధ్వర్యంలో ఇటీవల దరఖాస్తులు స్వీకరించారు. 61 మంది వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. వాటి కేటాయింపు కోసం మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో లక్కీ డ్రా ప్రక్రియ నిర్వహించారు. కలెక్టర్ స్వయంగా డ్రా తీసి ఎంపిక చేశారు. నార్నూర్ మండలం భీంపూర్ గ్రామానికి చెందిన జే.విక్రమ్నాయక్, ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్కు చెందిన జైస్వాల్ శుభం, పట్టణంలోని సుందరయ్యనగర్కు చెందిన ఎ.కళ్యాణిలను అదృష్టం వరించింది. ఎంపికైన వారికి కలెక్టర్ చేతుల మీదుగా కేటాయింపు ఉత్తర్వులు అందజేశారు. ఇందులో డీపీఈవో వై.హిమశ్రీ, సీఐలు విజేందర్, అక్బర్ హుస్సేన్, గంగారెడ్డి, ఎస్సై అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ● ముగ్గురికి కేటాయింపు పత్రాలు అందజేత -
పార్టీ పటిష్టతకు పాటుపడాలి
ఇచ్చోడ: పార్టీ పటిష్టత కోసం నాయకులు, కా ర్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని పీసీసీ జిల్లా పరిశీలకులు తాహెర్బిన్ హందాన్ అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజ ల్లోకి తీసుకెళ్లాలని కోరారు. పార్టీ కోసం కష్టపడే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు. అనంతరం ఆయనను స్థానిక నాయకులు శాలువాతో సన్మానించారు. ఇందులో పార్టీ మండల అధ్యక్షుడు కళ్లెం నారాయణ రె డ్డి, నాయకులు ముస్తాఫా, భీంరెడ్డి, మహబూ బ్, ఆసీఫ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
మే డే ఘనంగా నిర్వహించాలి
ఆదిలాబాద్టౌన్: జిల్లా వ్యాప్తంగా అసంఘటిత కార్మికులు మే డేను ఘనంగా నిర్వహించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సిర్ర దేవేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మే డే పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. మున్సిపల్, రిమ్స్, సివిల్సప్లై, అంగన్వాడీ, ఆశ, ఆటో, బీడీ, బ్యాంకింగ్ తదితర సంఘటిత, అసంఘటిత కార్మికులంతా మే డే ఘనంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. కార్మికులు పో రాడి సాధించుకున్న 44 చట్టాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు కోడ్లుగా తీసుకొచ్చిందని తెలిపారు. 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు పెంచిందన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రాజు, గంగయ్య, రమేశ్, చందు, ముజీబ్, శంకర్, సురేశ్, ప్రశాంత్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. జాతీయస్థాయి పోటీలకు ‘స్పోర్ట్స్’విద్యార్థులుఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ క్రీడా పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయస్థాయి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పోటీలకు ఎంపికయ్యారు. మహారాష్ట్రలోని పూణేలో జనవరిలో నిర్వహించిన నేషనల్ కేడెట్స్ జూడో చాంపియన్షిప్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి టాప్–16లో నిలిచిన నలుగురు స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారుల్లో ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకు చెందిన ఈ నలుగురు క్రీడాకారులే ఉండడం విశేషం. జాతీయస్థాయికి ఎంపికై న వారిలో కొంపెల్లి అక్షయ, రమావత్ తరుణ్, మోతం హర్షవర్ధన్, లావూరి సతీష్ ఉన్నారు. మొదటి ముగ్గురు ఇటీవలే క్రీడా పాఠశాల నుంచి పదో తరగతి పరీక్షలు రాయగా, సతీష్ జిల్లా కేంద్రంలోని విద్యార్థి కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. మే 4నుంచి 8వరకు పాట్నా వేదికగా నిర్వహించనున్న పోటీల్లో పాల్గొననున్నట్లు జూడో కోచ్ రాజు తెలిపారు. -
నిరంతర సాధనతోనే కళల్లో ప్రావీణ్యం
ఆదిలాబాద్: నిరంతర సాధనతోనే కళల్లో ప్రావీణ్యం సాధ్యమని డీఈవో శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాల కేంద్రంలో వేసవి ఉచిత శిక్షణ శిబిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో భాగంగా బాల కేంద్రంలో అందజేస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఇటీవల జాతీయ స్థాయిలో విజేతగా నిలిచిన పలు వురు బాలకేంద్రం చిన్నారులను సన్మానించా రు. ఇందులో బాల కేంద్రం పర్యవేక్షకుడు మిట్టు రవి, తల్లిదండ్రుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
● నెక్కర్ వస్త్రం వచ్చింది.. షర్ట్ బట్ట రాకపాయే ● ఏటా ఆలస్యమవుతున్న వైనం ● ఈ సారి కూడా అనుమానమే.. ● బడి పునఃప్రారంభం నాటికి అందిస్తామంటున్న అధికారులు
ఆదిలాబాద్టౌన్: సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు యూనిఫాం కుట్టించేందుకు విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. అయితే పాఠశాలలు పునఃప్రారంభం నాటికి ఒక జత పంపిణీ చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది ఆలస్యం కాగా ఈసారి ముందస్తుగానే నెక్కర్కు సంబంధించిన వస్త్రం వచ్చినప్పటికీ, షర్ట్ వస్త్రం ఇంకా రాలేదు. ఈ జాప్యం కుట్టుపై ప్రభావం పడనుంది. ఏటా బడులు తెరిచే నాటికి విద్యార్థులకు యూనిఫాం అందజేస్తామని అధికారులు చెబుతున్నా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. అయితే తొలిరోజునే యూనిఫాం అందిస్తే విద్యార్థులు చిరిగిన డ్రెస్సులతో కాకుండా కొత్త బట్టలతో హుషారుగా బడిబాట పట్టే అవకాశం ఉంటుంది. 66,282 మంది విద్యార్థులకు.. జిల్లాలో యూనిఫాం అందించే ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో 66,282 మంది చదువుతున్నారు. ఇందులో బాలురు 31,780 మంది ఉండగా, బాలికలు 34,502 మంది ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం ఏటా రెండు జతల యూనిఫాం ఉచితంగా అందజేస్తుంది. గతంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఆధ్వర్యంలో కుట్టించి అందించేవారు. గతేడాది నుంచి స్వయం సహాయక సంఘాల ద్వారా కుట్టిం చి విద్యార్థులకు అందజేస్తున్నారు. ఈ కుట్టుకు సంబంధించిన బాధ్యతలను ప్రభుత్వం డీఆర్డీఏకు అప్పగించింది. వారు స్వయం సహాయక సంఘాల ద్వారా కుట్టించి పాఠశాలలకు అందజేయనున్నారు. గతేడాది మండలానికి సంబంధించి వస్త్రం రాగా, ఈసారి ఆయా పాఠశాలలకు సంబంధించి వస్త్రం వచ్చింది. దీంతో కొంత ఇబ్బందులు తప్పనున్నాయి. బట్ట సరిపోక గతేడాది టైలర్లు ఇబ్బందులు పడ్డారు. ఈసారి ఆ సమస్య లేదని అధికారులు చెబుతున్నారు. కుట్టుడు షురూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, విద్యా శాఖ అధికారులు యూనిఫాం కుట్టించడంపై దృష్టి సారించారు. ప్రతి మండలానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఎంపీడీవో, ఎంఈవో, ఏపీఎంలు ఉన్నారు. యూనిఫాం కుట్టడం ఎక్కడివరకు వచ్చిందనే వివరాలను సంబంధిత ప్రధానోపాధ్యాయులతో కలిసి పర్యవేక్షిస్తారు. సకాలంలో పాఠశాలలకు అందేలా చూస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఏడాది నెక్కర్కు సంబంధించిన వస్త్రం వచ్చినప్పటికీ షర్ట్కు సంబంధించిన బట్ట రాకపోవడంతో కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. గతేడాది టైలర్లకు మేలో వస్త్రం ఇవ్వగా, వారు ఒక జత జూలై, ఆగస్టు మాసాల్లో విద్యార్థులకు అందించారు. రెండో జత అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈసారి ఆ సమస్య తలెత్తకుండా చర్యలు చేపడతామని అధికారులు పేర్కొంటున్నారు. పెరిగిన కుట్టు కూలి.. జిల్లాలో.. యూనిఫాం అందించే పాఠశాలలు: 1,145 కుట్టాల్సిన యూనిఫాం జతలు : 1,32,564 స్వయం సహాయక సంఘాలు : 10,756 ఆయా సంఘాల్లోని సభ్యులు : 1,16,885బడులు తెరిచేనాటికి అందిస్తాం.. పాఠశాలలు పునఃప్రారంభమైన మొదటి రోజు వి ద్యార్థులకు ఒక జత యూనిఫాం అందించేలా చర్యలు చేపడుతున్నాం. ప్యాంట్, లహంగాలకు సంబంధించిన వస్త్రం 31 శాతం వచ్చింది. జిల్లాకు మొత్తం బట్ట 2,71,420 మీటర్లు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 84,022 మీటర్లు వచ్చింది. ఈ వస్త్రాన్ని స్వయం సహాయక సంఘాల ద్వారా టైలర్లకు అందించాం. త్వరలోనే షర్ట్ బట్ట కూడా రానుంది. – సుజాత్ ఖాన్, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి యూనిఫాంకు సంబంధించి ప్రభుత్వం కుట్టు కూలి పెంచింది. ఇదివరకు ఒక జతకు రూ.50 ఉండగా, ప్రస్తుతం రూ.75 చెల్లించనుంది. ఇదిలా ఉండగా 1 నుంచి 5వ తరగతి బాలురకు నెక్కర్, షర్ట్, 6 నుంచి 12వ తరగతి వారికి షర్ట్, ప్యాంట్, అలాగే 1 నుంచి 3వ తరగతి చదివే బాలికలకు స్కర్ట్, 4,5 తరగతుల వారికి షర్ట్, లహంగా, 6 నుంచి 12వ తరగతి విద్యార్థినులకు పంజాబీ డ్రెస్సు ఇవ్వనున్నారు. -
నాణ్యమైన సేవల కోసమే గ్రీవెన్స్
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకే ప్రజా ఫిర్యాదుల నిర్వహణ (గ్రీవెన్స్) చేపడుటున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ ముఖ్య కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వారం మొత్తం 15 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో సీసీ కొండ రాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి కవిత, సిబ్బంది తది తరులు పాల్గొన్నారు. కానిస్టేబుల్ శ్రీనివాస్కు ప్రశంస మాదకద్రవ్యాల నిర్మూలన, విధి నిర్వహణలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ గామ శ్రీని వాస్ను ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. స్థానిక పోలీస్ ముఖ్య కార్యాలయంలో ప్రశంసా పత్రం అందజేశారు. -
అస్మదీయులకే అందలం!
● క్రీడాశిక్షకుల ఎంపికలో ఇష్టారాజ్యం ● నచ్చినవారికి ‘వేసవి’ కేంద్రాల కేటాయింపు ● శిబిరాల్లో పారదర్శక శిక్షణపై నీలినీడలు ఆదిలాబాద్: చిన్నారుల్లో క్రీడా నైపుణ్యాలు పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఏటా వేసవి సెలవుల్లో నెల పాటు ఉచిత శిక్షణ శిబి రాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈసారి సైతం వాటి ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా 10 శిబిరాలకు అనుమతి ఇచ్చింది. అయితే క్షేత్రస్థాయిలో క్రీడా శిక్షకుల ఎంపికలో సంబంధిత అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరించారనే చర్చ సాగుతోంది. రాజకీయ నాయకులు, అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గి నచ్చిన వారికి కేటా యించారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. మౌఖికంగానే శిక్షకుల ఎంపిక.. నిబంధనల ప్రకారం ఈ శిబిరాల ఏర్పాటుకు ముందుకు వచ్చే శిక్షకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రకటనలు జారీ చేయాలి. అయితే ఇవేమీ లేకుండానే తమకు నచ్చిన వారికి కేంద్రాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో అర్హులైన తాము నష్టపోయామని పలువురు శిక్షకులు, సీనియర్ క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది శిబిరాలకు మాత్రమే అనుమతి రాగా, ఇష్టారీతిన ఎంపిక చేయడంతో శిక్షణ కేంద్రాల సంఖ్య ఏకంగా 34 దాటింది. జిల్లాలోని ప్రతీ మండలానికి ఓ కేంద్రం ఏర్పాటు చేసినా 21 మండలాలకు ఒక్కో శిక్షణ కేంద్రం ఏర్పాటు అవ్వాలి. అయితే ఇందుకు విరుద్ధంగా ఒకే ఆటకు పలు ప్రాంతాల్లో మూడు కేంద్రాలు ఏర్పాటు చేయడం గమనార్హం. ఒక్క ఆదిలాబాద్ రూరల్ మండలంలోనే ఏడు కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. మరోవైపు సిరికొండ, తాంసి, గాదిగూడ, భోరజ్, భీంపూర్, సాత్నాల మండలాలకు కేంద్రాలు లేవు. అన్ని ఆటలకు, మండలాలకు ప్రాధాన్యమిస్తే వివిధ క్రీడాంశాల్లో చిన్నారులకు మెరుగైన శిక్షణ అందేది. శిక్షకుల ఎంపిక కోసం స్పష్టమైన ప్రకటన విడుదల చేసి ఉంటే ఉత్సాహవంతులైన శిక్షకులు ముందుకు వచ్చే అవకాశం ఉండేదని పలువురు చర్చించుకుంటున్నారు. నిర్వహణపై ఆందోళన.. శిక్షకుల ఎంపికలో తమకు నచ్చిన వారిని అందలం ఎక్కించడం విషయంలో శ్రద్ధ చూపిన అధికారులు శిక్షణ సమయంలో ఏ మేరకు పర్యవేక్షిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో శిక్షణ కేంద్రాలు హడావుడిగా జిల్లా ఉన్నతాధికారుల చేతుల మీదుగా ప్రారంభించి తర్వాతి రోజుల్లో వాటిని నడపకుండా పలువురు శిక్షకులు నిర్లక్ష్యం వహించడంపై ‘సాక్షి’లో సైతం కథనాలు ప్రచురితమయ్యాయి. ఫలితంగా ఎంతో మంది చిన్నారులు వేసవి శిక్షణకు దూరమయ్యారు. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు క్రీడాకారులు, క్రీడాభిమానులు, తల్లిదండ్రులు, క్రీడా సంఘాల బాధ్యులు, శిక్షకులు అభిప్రాయపడుతున్నారు. ముందుకు వస్తే ఎంపిక చేస్తాం.. శిక్షణ కేంద్రాలు ప్రారంభమయ్యే ముందు ఎవరైనా శిక్షణ ఇవ్వడానికి ముందుకు వస్తే నిబంధనలకు అనుగుణంగా పరిగణలోనికి తీసుకుంటాం. ఈనెల 31వరకు దరఖాస్తులు అందించవచ్చు. శిక్షకుల ఎంపిక విషయంలో వ్యాయా మ ఉపాధ్యాయుల సంఘం, క్రీడా శిక్షకులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. – వెంకటేశ్వర్లు, డీవైఎస్వో ఒకే కోచ్కు రెండు కేంద్రాలు.. జిల్లా కేంద్రంలో ఓకే క్రీడకు సంబంధించి, రెండు వేర్వేరు ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలను ఒకే శిక్షకుని కి కేటాయించడం ఎంపికలో అధికారుల పక్షపా త ధోరణిని స్పష్టం చేస్తుంది. ఒకే సమయంలో రెండు ప్రాంతాల్లో శిక్షకుడు ఏ విధంగా శిక్షణ ఇ వ్వడం సాధ్యమవుతుందో అధికారులకే తెలియా లి. శిక్షకునికి రూ.4వేల గౌరవ వేతనం అందజేస్తారు. అయితే ఎంపికలో పారదర్శకతకు పాతరేయడం అనుమానాలకు తావిస్తోంది. -
‘భూ భారతి’తో రైతులకు మేలు
● కలెక్టర్ రాజర్షి షా ● యాపల్గూడ, తాంసిలో అవగాహన సదస్సులు ఆదిలాబాద్రూరల్: భూ భారతి చట్టంతో రైతులకు మేలు చేకూరుతుందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్రూరల్ మండలంలోని యాపల్గూడ గ్రామంలో భూభారతి చట్టంపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నూతన చట్టంపై ప్రతీ రైతు అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం పలువురు రైతులు తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించారు. దహిగూడ పంప్హౌస్ పరిశీలన అనంతరం మండలంలోని దహిగూడ పంప్హౌస్ను కలెక్టర్ పరిశీలించారు. నీటి సరఫరా తీరుపై ఆరా తీశారు. తాగునీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినో ద్ కుమార్, తహసీల్దార్ గోవింద్ నాయక్, ఎంపీడీవో నాగేశ్వర్, మిషన్ భగీరథ ఏఈ ఆదిత్య తది తరులు పాల్గొన్నారు. తాంసి: మండల కేంద్రంలోని రామేశ్వర ఫంక్షన్ హాల్లో నిర్వహంచిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. నూతన చట్టంతో పెండింగ్ భూసమస్యలు పరిష్కారం కానున్నట్లు తెలిపారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడు తూ.. భూభారతి చట్టంపై రైతులు అవగాహన పెంచుకోవాలన్నారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్కుమార్, డీసీసీబీ చైర్మన్ భో జారెడ్డి, ట్రెయినీ కలెక్టర్ సలోని, ప్రత్యేకాధికారి వెంకటరమణ, తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీవో మోహన్రెడ్డి, ఏవో రవీందర్,మాజీ జెడ్పీటీసీలు గణే శ్రెడ్డి,రాజు,మాజీఎంపీపీ శ్రీధర్రెడ్డి,రైతులు తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ విధేయులకు పదవులు
కైలాస్నగర్: కాంగ్రెస్కార్యకర్తల కష్టంతోనే రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, పార్టీకి విధేయులుగా ఉన్న వారందరికి త్వరలోనే నామినేటెడ్ పదవులతో సముచితస్థానం కల్పిస్తామని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, పీసీసీ పరిశీలకులు తాహెర్బిన్ హందాన్, చిట్ల సత్యనారాయణ అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్ లో సోమవారం నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి వారు అతిథులుగా హాజరయ్యా రు. తొలుత పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు సంతాప సూచకంగా మౌనం పాటించారు. అనంతరం వారు మాట్లాడారు. పార్టీ పరంగా జిల్లాకు ఎంతో చరిత్ర ఉందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఎంతో మంది జాతీయ నాయకులుగా ఎదిగారని గుర్తు చేశారు. జిల్లాలో పార్టీని బూత్స్థాయి నుంచి ప్రక్షాళన చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మే 3నుంచి 10వరకు ఆయా మండలాల అధ్యక్షుల ఎంపిక ఉంటుందన్నారు. ఒక్కో పదవికి మూడు పేర్లను పరిగణలోకి తీసుకుని నాయకులు కార్యకర్తల అభిప్రాయం మేరకు ఎంపిక చేస్తామన్నారు. పార్టీని నమ్ముకుని పనిచేసే ప్రతీ కార్యకర్తకు పదవులు వెతుక్కుంటూ వస్తాయని భరోసానిచ్చారు. జిల్లాలోని నాయకులు, కార్యకర్తలందరికి ఆమోదయోగ్యంగా ఉండేలా మే 30లోపు డీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని వెల్లడించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్ని కల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీఎమ్మెల్యే రాథోడ్ బా పూరావు, ఏఐసీసీ సభ్యులు నరేష్ జాదవ్, ఆత్రం సుగుణ, ఆదిలాబాద్, బోథ్, ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, శ్యాంనాయక్, నాయకులు గోవర్ధన్రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, గణేష్రెడ్డి, అశోక్రెడ్డి, శ్రీధర్, చంటి తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక పీసీసీ జిల్లా పరిశీలకులు తాహెర్బిన్ హందాన్, సత్యనారాయణ -
భూభారతిపై అవగాహన అవసరం
ఇచ్చోడ: భూభారతి చట్టంపై ప్రతీ ఒక్కరికి అవగా హన కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాజర్షిషా అన్నా రు. మండల కేంద్రంలోని షార్ప్గార్డెన్లో ఆదివా రం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. భూభారతి చట్టంతో భూసమ స్యలకు సత్వర పరిష్కారం లభించనుందని అన్నా రు. అనంతరం పలువురు రైతులు తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించగా పరిష్కార దిశగా ఆయన సూచనలు చేశారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదే వి, ఆర్డీవో వినోద్కుమార్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, మార్కెట్ చైర్పర్సన్ సత్యవతి తదితరులు పాల్గొన్నారు. సిరికొండలో.. సిరికొండ: మండల కేంద్రంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి భూ సమస్య ఉన్న భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చని అన్నారు. -
బొట్టు బొట్టు ఒడిసి పట్టేలా..
8లోu కైలాస్నగర్: మండుతున్న ఎండల తీవ్రతతో భూగర్భజలాలు ప్రమాదఘంటికలను మోగిస్తున్నాయి. జిల్లాలోని పలు మండలాల్లో 18 నుంచి 20 మీటర్ల లోతు వరకు నీటిమట్టం పడిపోయింది. ప్రస్తుతం 150 నుంచి 300 అడుగుల లోతు వరకు బోర్లు వేస్తే కానీ నీరు పడని పరిస్థితి. మరి కొన్నిచోట్ల అంతకు మించి వేయాల్సిన దుస్థితి. ఇదే కొనసాగితే భవిష్యత్తులో నీటి ఎద్దడి మరింత తీవ్రరూపం దాల్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో భూగర్భజలాల సంరక్షణపై జిల్లా గ్రామీ ణాభివృద్ధి శాఖ దృష్టి సారించింది. వర్షపునీటిని ఒడిసిపట్టి సంరక్షించే చర్యలకు శ్రీకారం చుట్టింది. ఉపాధి హామీ నిధులతో బోర్వెల్ రీచార్జి స్ట్ర క్చర్స్ (భూగర్భ జల పెంపు నిర్మాణాలు), రూప్ టాప్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్(పైకప్పు నీటి సంరక్షణ నిర్మాణాలు), ఫాం పాండ్స్(నీటికుంటలు), కమ్యూనిటీ ఫోక్ఫిట్స్ (సామాజిక ఇంకుడుగుంతలు) నిర్మించేందుకు సంకల్పించింది. 2025– 26 సంవత్సరానికి గాను ఆయా నిర్మాణాలకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. వీటిని సద్వినియోగం చేసుకుని లక్ష్యం మేరకు నిర్మాణాలు చేపట్టినట్లేతే భూగర్భజలాలను సంరక్షించిన వారమవుతామనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. బోర్వెల్ రీచార్జి స్ట్రక్చర్స్.. వర్షపునీటితో పాటు ఇతర భూమిపై ఉన్న నీటిని సంరక్షించేలా ఇప్పటికే ఉన్న బోర్వెల్స్ వద్ద నీటి ని లోనికి మళ్లించడం ద్వారా భూగర్భజలాల ను తిరిగి నింపేందుకు ఇవి తోడ్పడుతాయి. ఈ ఏడా ది జిల్లా వ్యాప్తంగా 240 స్ట్రక్చర్స్ నిర్మించాలని నిర్ణయించగా ఇప్పటివరకు 85 మంజూరు చేశా రు. ఒక్కో స్ట్రక్చర్స్ను రూ.25వేలతో నిర్మించుకునే అవకాశముంది. ఇప్పటి వరకు ఆరు నిర్మాణాలను గ్రౌండింగ్ చేశారు. ఫాంపాండ్స్ పంటచేలల్లో నీటిని నిల్వ చేసేందుకు చిన్నపాటి కుంటలను నిర్మిస్తారు. వీటినే ఫాంపాండ్స్ అని పిలుస్తారు. వర్షాకాలంలో వచ్చే నీటిని నిల్వ చే సుకోవడం ద్వారా వేసవిలో పంటలకు నీరందించేందుకు తోడ్పడుతుంది. జిల్లావ్యాప్తంగా 392 నిర్మించాలని నిర్ణయించిన అధికారులు 332 మంజూరు చేశారు. అందులో 94 నిర్మాణాలు పూర్తయ్యాయి. ఒక్కోదానికి రూ.2.50లక్షల ఉపాధి నిధులు వెచ్చిస్తారు. కమ్యూనిటీ సోక్పీట్స్.. గ్రామీణ, పట్టణప్రాంతాల్లోని చేతిపంపుల వద్ద వీటిని నిర్మించనున్నారు. జిల్లాలో కమ్యూనిటీ సోక్పిట్స్ నిర్మాణలక్ష్యం 183 కాగా 45 మంజూరు చేశారు. ఒక్కో దాన్ని రూ.12వేల వ్యయంతో నిర్మించనున్నారు. ఇందులో ఇప్పటి వరకు ఏడు గ్రౌండింగ్ చేశారు. మిగతా వాటిని ఈ ఆర్థికసంవత్సరంలో పూర్తిచేసేలా ముందుకు సాగుతున్నారు. వీటి నిర్మించడం ద్వారా వర్షపునీటితో పాటు చేతిపంపుల నుంచి వచ్చే వృథానీటిని తిరిగి భూమిలోకి ఇంకేలా చేస్తాయి. రూప్టాప్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ వర్షాకాలంలో భవనాలపై పడే నీటిని నిల్వచేసేందుకు ఈ స్ట్రక్చర్స్ తోడ్పడనున్నాయి. గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, ఇతరత్రా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న 31చోట్ల నిర్మించాలని నిర్ణయించగా ఇందులో 8 మంజూరు చేశారు. ఒక్కోదాన్ని రూ.25వేలతో నిర్మిస్తారు. ఇప్పటి వరకు ఒకటి పూర్తి చేశారు. ఆయా కార్యాలయాలపైపడిన వర్షపునీరు వృథాగా పోకుండా భూ మిలోకి ఇంకించేలా ఈ స్ట్రక్చర్ నిర్మించనున్నారు. భూగర్భజలాల పెంపుపై ఫోకస్ నీటి కుంటలు, ఇంకుడుగుంతలు మంజూరు ఉపాధి హామీ నిధులతో నిర్మాణాలు సద్వినియోగం చేసుకుంటే జల సంరక్షణకు దోహదం భూగర్భ్బజలాల పెంపునకు చర్యలు జిల్లాలో భూగర్భజలాలు అడుగంటి పలుచోట్ల బోరుబావులు, చేదబావులు ఎండిపోయాయి. నీటిని సంరక్షించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేలా భూగర్భజలాలను పెంపొందించేలా ఉపాధి నిధులతో ప్రత్యేక నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈమేరకు లక్ష్యాలను నిర్ణయించాం. వందశాతం సాధించేలా చర్యలు చేపడుతున్నాం. ప్రజలు, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – రాథోడ్ రవీందర్, డీఆర్డీవో -
అధిక వడ్డీ వసూలు చేస్తే కఠిన చర్యలు
● డీఎస్పీ జీవన్రెడ్డి ● జైనథ్లో వడ్డీ వ్యాపారిపై కేసు ఆదిలాబాద్టౌన్(జైనథ్): అధిక వడ్డీ వసూలు చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి హెచ్చరించారు. అమాయక ప్రజ లు, రైతుల వద్ద అధిక వడ్డీ వసూలు చేస్తూ వారి భూములను వడ్డీ పేరుతో రాయించుకుంటున్న ఓ వడ్డీ వ్యాపారిపై జైనథ్ పోలీస్స్టేషన్లో రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జైనథ్ స్టేషన్లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జైనథ్ మండలం కేదార్పూర్ గ్రామానికి చెందిన బోయర్ రమేశ్ 2011లో 25 శాతం వడ్డీతో రూ.3 లక్షలు ఇచ్చి తన 1.36 ఎకరాల భూమిని తన తమ్ముడు గజాణన్ పేరిట రా యించుకున్నాడని జైనథ్ రైతు గోస్కుల నర్సయ్య ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. 2013లో బాధితుడు రూ.2 లక్షలు, 2017 సంవత్సరంలో రూ.2 లక్షలు చెల్లించాడు. తిరిగి తన భూమిని తనకు ఇచ్చేయాలని చెప్పినా నిరాకరించడంతో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వ్యాపారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అలాగే అతడి ఇంటి వద్ద తనిఖీ చేయగా సంతకం చేసిన రెండు ఖాళీ బ్యాంకు చెక్కులు, 32 సేల్ డీడ్లు, రెండు ధరణి సేల్డీడ్లు, 31 ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వాటి విలువ దాదాపు రూ.కోటి 55 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. మనీ లెండర్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో జైనథ్ సీఐ డి.సాయినాథ్, ఎస్సై పురుషోత్తం పాల్గొన్నారు. -
ఆదివాసీలపై దమనకాండను ఆపాలి
ఆదిలాబాద్రూరల్: అమాయక ఆదివాసీలపై ప్రభుత్వాలు చేపడుతున్న దమనకాండను వెంటనే నిలిపివేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ విశ్రాంతి భవనం నుంచి కుమురంభీంచౌక్ వరకు ఆదివారం కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివాసీ అమాయకులపై జరుగుతున్న ఎన్కౌంటర్లను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి శాంతి చర్చలు జరిపించాలన్నారు. ఇందులో వివిధ సంఘాల నాయకులు గోడం గణేశ్, సాజిద్ఖాన్, మల్లేశ్, శంకర్, సచిన్, తదితరులు పాల్గొన్నారు. -
● గతేడాది లక్ష్యంతో పోల్చితే ఈ సారి 28లక్షలు తగ్గింపు ● కూలీలకు తీవ్ర నష్టం ● కొత్త జాబ్ కార్డులకు పెరిగిన డిమాండ్
కై లాస్నగర్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ఆధారపడ్డ కూలీలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. 2025–26 సంవత్సరానికి గాను చేపట్టా ల్సిన పనిదినాల్లో భారీగా కోత విధించింది. గతేడాది లక్ష్యానికి మించి పనులు జరగడంతో కూ లీలకు వేసవిలో ఉపాధి లభించింది. జిల్లావ్యాప్తంగా 5,378 కుటుంబాలు వంద రోజుల పాటు పని చేశాయి. అయితే ఈ ఏడాది రాష్టవ్యాప్తంగా ఉపాధి పనిదినాలను తగ్గించగా జిల్లాకు కేటాయించిన లక్ష్యంలోనూ భారీగా గండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో చేసిన పనుల ఆధారంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అ మలు చేస్తుండటంతో జాబ్కార్డుల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పనిదినాలు తగ్గడంతో కూలీల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. గతేడాది లక్ష్యానికి మించి.. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాకు 52.35 లక్షల పనిదినాలను కేంద్ర ప్రభుత్వం కేటా యించింది. గ్రామీణ ప్రాంత కూలీలు ఈ అవకా శాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నారు. కూలీల సంఖ్య పెరుగడంతో జిల్లావ్యాప్తంగా 54.84లక్షల పనిదినాలు జరిగాయి. దీంతో 104.75శాతం నమోదైంది. లక్ష్యానికి మించి పనులు జరగడంతో కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ప్రత్యేక బృందాలను పంపించి పనుల ప్రగతిపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. క్షేత్రస్థాయిలో పనులకు కూలీలు వాస్తవంగా హాజరవుతున్నారా లేక బోగస్ హాజరు నమోదు చేస్తున్నారా అనే దాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. కొన్ని పనులు కేంద్ర నిబంధనల ప్రకారం జరగకపోవడంతో పనిదినా లను భారీగా తగ్గించినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ ఏడాదికి కేవలం 23.81లక్షల పని దినాలు మాత్రమే నిర్దేశించింది. గతేడాదితో పో ల్చితే 28లక్షల పనిదినాలను తగ్గించింది. దీంతో ఉపాధి హామీ పనులపై ఆధారపడ్డ కూలీలు కేంద్ర నిర్ణయంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రశ్నార్థకంగా ‘ఉపాధి’ ఈ ఏడాదికి 23.81 లక్షల పనిదినాలను లక్ష్యంగా కేటాయించగా అందులో ఇప్పటికే 11.21 లక్షల పనిదినాలు పూర్తయ్యాయి. వ్యవసాయ పనులు జరగకపోవడంతో మే నెలంతా ఉపాధి పనులు ముమ్మరంగా సాగనున్నాయి. రుతుపవనాల ఆగమనంతో వర్షాలు కురిసే జూన్ వరకు కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యే అవకాశముంది. వ్యవసాయ పనులు ప్రారంభమైతేనే కూలీల సంఖ్య తగ్గే అవకాశముంటుంది. అయితే ఈ రెండు నెలల్లోనే జిల్లాకు కేటాయించిన పనుల లక్ష్యం పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో లక్ష్యం పూర్తయితే మిగతా సమయాల్లో ఉపాధి పనులను చేపట్టి కూలీలకు పనులు కల్పిస్తారా లేక నిలిపివేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి జాబ్ కార్డుల ఆధారంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద కూలీలకు రూ.12వేల ఆర్థికసాయం అందజేయాలని నిర్ణయించింది. దీంతో కొత్తగా జాబ్కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అలాగే జాబ్ కార్డు కలిగి ఉండి పనులకు హాజరుకానుటువంటి వారు కూడా పనులకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పనిదినాల లక్ష్యం పెంచాల్సిన అవసరముందనే అభిప్రాయం కూలీల నుంచి వ్యక్తమవుతోంది. ఉపాధి పనుల్లో నిమగ్నమైన కూలీలు జిల్లాలోని ఉపాధి పనుల వివరాలు.. గ్రామీణ మండలాలు : 20 పంచాయతీలు : 473 జాబ్కార్డుల సంఖ్య : 1.74లక్షలు నమోదు చేసుకున్న కూలీలు: 3.47లక్షలు యాక్టివ్ జాబ్కార్డులు : 1.09 లక్షలు పనులకు హాజరయ్యే కూలీలు : 2.04 లక్షలు లక్ష్యం మేరకు పనులు కల్పిస్తాం గతేడాదితో పోల్చితే కేంద్ర ప్రభుత్వం ఈ సారి పనిదినాలను తగ్గించింది. రాష్ట్రవ్యాప్తంగా పనిదినాలను తగ్గించగా జిల్లాకు కేటాయించిన లక్ష్యంలో కోత పడింది. అయితే దరఖాస్తు చేసుకున్న ప్రతీ కూలీకి ప్రస్తుతం పనులు కల్పించేలా శ్రద్ధ వహిస్తున్నాం. నిర్దేశిత లక్ష్యం మేరకు పనులు కల్పిస్తాం. అప్పటికీ కూలీల నుంచి పనుల కోసం డిమాండ్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటాం. – రాథోడ్ రవీందర్, డీఆర్డీవో -
వాతావరణం
మధ్యాహ్నం ఎండతీవ్రత పెరగనుంది. వడగాలులు వీస్తాయి. ఉక్కపోత ప్రభావం కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నది నార్నూర్ మండలంలోని పొలాల్లో గల బోర్వెల్ వద్ద ఉపాధి హామీ నిధులతో చేపట్టిన బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్. వర్షపునీటిని సంరక్షించి బోర్వెల్లో నీటిమట్టం పెరిగేందుకు దోహదపడేలా నిర్మిస్తున్నారిలా.