Adilabad
-
ముందస్తు చర్యలు చేపట్టాలి
కైలాస్నగర్: రానున్న వేసవి దృష్ట్యా జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. 97 హ్యాబిటేషన్లలో తాగునీటి ఇక్కట్లు గుర్తించి బోరు బావులు, బావులు, పైపులైన్ల మరమ్మతులు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయనే దానిపై నివేదిక అందజేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారిని ఆదేశించారు. ముఖ్యంగా ఇంద్రవెల్లి, గాదిగూడ, ఉట్నూర్, అదిలాబాద్ రూరల్ మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ చేయాలని సూచించారు. నీటి సమస్య ఎక్కువగా ఉన్నచోట ట్యాంకర్లతో సరఫరా చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో ఐటీడీఏ ిపీవో ఖుష్బూ గుప్తా, ట్రెయినీ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, ఆర్డీవో వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
24న సేవాలాల్ జయంతి వేడుకలు
కై లాస్నగర్: బంజారాల ఆరాధ్యదైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను ఈ నెల 24న పట్టణంలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికా రులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ నిబంధనలు అనుసరించి వేడుకలు నిర్వహించాలన్నారు. హాజరయ్యే వారికి ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించాలని, విద్యుత్ శాఖ ద్వారా నిరంతర కరెంట్ సరఫరా చేయాలన్నారు. అలాగే మున్సిపల్ ద్వారా రెండు రోజుల ముందు నుంచే శానిటేషన్ పనులు చేపట్టాలన్నారు. పంచాయతీ శాఖ ద్వారా ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సౌకర్యం, వైద్య శాఖ ద్వారా మెడికల్ క్యాంప్, పోలీస్ శాఖ ద్వారా బారికేడ్లు, బందో బస్తు, పార్కింగ్ ప్రాంతాలు వంటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, డీఎస్పీ ఎల్. జీవన్రెడ్డి, ఆర్డీవో వినోద్కుమార్, బంజారా ఉత్సవ కమిటీ చైర్మన్ భీమ్రావ్, ఐటీడీఏ డీడీ వసంత్రావు, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, ఉత్సవ కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. టీబీ రోగులకు పౌష్టికాహార కిట్లు క్షయ రోగులకు పోషకాహార కిట్లు అందించేందుకు గ్లాండ్ పార్మా అనే కంపెనీ ముందుకు వచ్చింది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులతో కలిసి డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి డా.స్నేహ శుక్లా మంగళవారం కలెక్టర్ రాజర్షి షాను తన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఇటీవల చేపట్టిన వంద రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 1,332 మంది క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. వారందరికీ ఆరు నెలల పాటు పోషకాహార కిట్లను ఆ కంపెనీ ద్వారా అందించనున్నట్లుగా కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ను కలిసిన వారిలో డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, జిల్లా క్షయ నియంత్రణాధికారి సుమలత తదితరులున్నారు. ● కలెక్టర్ రాజర్షి షా -
హీరాసుక జయంతి విజయవంతం చేయండి
ఆదిలాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో ఈ నెల 23న నిర్వహించనున్న హీరా సుక జయంతిని ఉమ్మడి జిల్లా ఆదివాసీ పర్ధాన్ సమాజ్ కులస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజ యవంతం చేయాలని ఆదివాసీ పర్ధాన్ సమాజ్ జాతీయ నాయకుడు సిడాం రాంకిషన్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మెస్రం శంకర్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గల హీరాసుక దేవస్థాన మందిరం ఆవరణ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పూసం ఆనంద్రావ్, సెడ్మకి సుభాష్, గేడం మా ధవ్, ప్రకాశ్, రామాకాంత్ తదితరులున్నారు. ఇంద్రవెల్లి: జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో నిర్వహించే హీరాసుక జయంతికి భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పర్ధాన్గూడ పటేల్ గేడం జ్ఞానేశ్వర్, పర్ధాన్ సమాజ్ మండల అధ్యక్షుడు గేడం భరత్ కోరారు. మండలకేంద్రంలోని పర్ధాన్గూడలో ఆయా గ్రామాల సమాజ్ పెద్దలతో మంగళవారం సమావేశమయ్యారు. ఇందులో నాయకులు పాల్గొన్నారు. -
● ఎస్హెచ్జీలకు విరివిగా సీ్త్రనిధి రుణాలు ● ‘బ్యాంకు లింకేజీ’ కూడా 98 శాతం పూర్తి ● అతివలకు అండగా నిలుస్తున్న మెప్మా ● మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత
స్వయం సహాయక సంఘ సభ్యులతో సమావేశం (ఫైల్) పట్టణంలోని సంఘాలు, రుణాల ప్రగతి వివరాలు మొత్తం వార్డులు: 49 జనాభా : 155747 స్వయం సహాయక సంఘాలు: 2,536 అందులోని సభ్యులు: 25,722 మొత్తం రుణలక్ష్యం : రూ.26.36 కోట్లు ఇప్పటి వరకు అందించిన రుణాలు 26.37కోట్లు పకడ్బందీ ప్రణాళికతోనే లక్ష్యసాధన ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే రుణ లక్ష్యాలను సాధించే దిశగా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశాం. పట్టణంలోని ప్రతీ వార్డులో ఎస్ఎల్ఎఫ్లతో సమావేశాలు నిర్వహించి బ్యాంకు లింకేజీకి అర్హులైన ఎస్హెచ్జీల సమాచారం సేకరించాం. ఏదైనా యూనిట్ ఏర్పాటు చేయాలనుకునే వారికి అత్యవసరమైన రుణాలను సీసీఎల్ కింద అందజేశాం. టీజీబీ, యూబీఐ బ్యాంకుల ఆధ్వర్యంలో ప్రతి నెలలో లాగిన్ డే నిర్వహించి బ్యాంకులిచ్చిన సమాచారం ప్రకారం ఎన్ని ఎస్హెచ్జీలు రికవరీకి ఉన్నాయి.. రుణాల చెల్లింపు ఎంత పూర్తయిందనే వివరాలు తెలుసుకుని లింకేజీ రుణాలు ఇప్పించాం. వారం రోజుల్లోనే వారి ఖాతాల్లో జమయ్యేలా చర్యలు చేపట్టాం. ఫలింగానే వందశాతం రుణా లక్ష్యాలను సాధించాం. – శ్రీనివాస్, డీఎంసీ, మెప్మా కై లాస్నగర్: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. ప్రధానంగా బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలతో పాటు సీ్త్ర నిధి ద్వారా ఆర్థికసాయం అందజేస్తూ వారికి అండగా నిలుస్తోంది. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్దేశించిన రుణ లక్ష్యాలను వందశాతం సాధించే దిశగా మెప్మా ముందుకు సాగుతోంది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను చైతన్యపరుస్తూ ఇప్పటికే సీ్త్ర నిధి రుణాలను లక్ష్యానికి మించి అందజేశారు. అలాగే బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యాన్ని 98శాతం సాధించారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో 40 రోజుల గడువు ఉండటంతో దానిని కూడా త్వరలోనే అధిగమించేలా కృషి చేస్తున్నారు. బ్యాంకు లింకేజీ రుణాలిలా.. బ్యాంకు లింకేజీ ద్వారా పట్టణంలోని 330 సంఘాలకు రూ.19కోట్ల 91లక్షల 15వేల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు 177 సంఘాలకు గాను రూ.19కోట్ల 67లక్షల 14వేల రుణాలు అందజేశారు.98.79శాతం లక్ష్యాన్ని సాధించగా ఇంకా సమయం ఉన్నందున వీటి ప్రగతి కూడా వందశాతానికి మించి నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే స్వయం ఉపాధి కార్యక్రమం (సెప్–1) కింద రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు సభ్యులకు ఆర్థిక చేయూతనందించాలని నిర్ణయించారు. దీని కింద 24 యూనిట్లను లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటి వరకు 25 యూనిట్లకు రుణాలు అందజేసి అందులోని వందశాతం మించి ప్రగతిని సాధించారు. మహిళాశక్తిలో తడబాటు... బ్యాంకు లింకేజీ, సీ్త్ర నిధికి సంబంధించి వందశా తం రుణాలు అందజేస్తూ ఆదర్శంగా నిలిచిన మెప్మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మాత్రం తడబాటుకు గురవుతోంది. ఈ పథకం కింద వ్యక్తిగత రుణాలు 144మందికి అందించాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 96 మందికి మాత్రమే అందజేశారు. మరో 48 యూనిట్లను సాధించాల్సి ఉంది. అలాగే గ్రూపులకు 25 యూనిట్లకు రుణాలు అందించాల్సి ఉండగా 18 యూనిట్లకు అందజేసి వివిధ వ్యాపారాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. మరో ఏడు యూనిట్లను సాధించాల్సి ఉంది. అయితే ఇంకా సమయం ఉన్నందున వీటిని కూడా వందశాతం సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఆసక్తిగల మహిళలను ఎంపిక చేసి వారికి రుణాలందించేలా శ్రద్ధ వహిస్తున్నారు. తద్వారా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వహణ తో పాటు టైలరింగ్, సెంట్రింగ్ వంటి తదితర వ్యా పారాలు ప్రారంభించేలా చొరవ చూపుతున్నారు. సీ్త్రనిధి రుణాలు.. 103 శాతం స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అండగా నిలుస్తోంది. బ్యాంకుల ద్వారా విరివిగా రుణాలు అందజేస్తూ వారు ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను సీ్త్ర నిధి రుణ లక్ష్యం రూ.6 కోట్ల 28 లక్షల 64వేలు ఉండగా ఇప్పటి వరకు రూ. 6 కోట్ల 52లక్షల 23వేలను అందించారు. లక్ష్యానికి మించి 103 శాతం రుణాలు అందజేశారు. ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు 150 శాతం వరకు చేరుకుంటామని మెప్మా అధికారులు చెబుతున్నారు. -
సీఎంను కలిసిన డీసీసీబీ చైర్మన్
కైలాస్నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మంగళవా రం సీఎం రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. టెస్కాబ్ చైర్మన్తో పాటు రా ష్ట్రంలోని ఆయా సహకార బ్యాంకుల చైర్మన్లతో కలిసి హైదరాబాద్లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాయంలో సీఎంను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. తమ పదవీ కాలం మరో ఆరునెలల పాటు పొడిగింపుపై హ ర్షం వ్యక్తం చేస్తూ సీఎంకు కృతజ్ఞతలు తెలి పారు. జిల్లాలో సాంకేతిక కారణాలతో రుణ మాఫీ కాని రైతుల రుణాలు మాఫీ చేసేలా చూడాలని విన్నవించగా, సీఎం సానుకూల త వ్యక్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలి
తాంసి: విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని అదనపు ఎస్పీ సురేందర్రావు అన్నారు. జాతీయ సైన్స్డే పురస్కరించుకుని మండలంలోని కప్పర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం సైన్స్ఫేర్ ఏర్పా టు చేశారు. ఈసందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎగ్జిబిట్లను సందర్శించి విద్యార్థుల ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని వారికి సూచించారు. కార్యక్రమంలో ఎస్సై రాధిక, ప్రధానోపాధ్యాయుడు ఆనంద్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పంటల లెక్క.. ఇక పక్కా
● పకడ్బందీగా డిజిటల్ క్రాప్ సర్వే ● క్షేత్రస్థాయిలో వివరాలు నమోదు చేస్తున్న ఏఈవోలు ● నివేదిక ఆధారంగా పంట దిగుబడి కొనుగోళ్లు బోథ్: పంటల లెక్క పక్కాగా తేల్చేందుకే ప్రభుత్వం ఈ నెల 3న డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం జిల్లాలోని 101 క్లస్టర్లలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతుల చేలల్లోకి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే ఆయా పంటల సాగు వివరాలు పక్కాగా తేలనున్నాయి. వీటి ఆధారంగానే రైతుల పంట దిగుబడులను ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశశం ఉంటుంది. ఏఈవోలు తమ క్లస్టర్ పరిధి లో 18వందల నుంచి 2వేల ఎకరాల వరకు సర్వే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సర్వే ఇలా.. ఈ సర్వే నిర్వహణకు గాను ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ యాప్ను రూపొందించింది. ఇందులో భా గంగా ఏఈవోలు రైతుల చేల వద్దకు వెళ్తున్నారు. పంటల సాగు విస్తీర్ణం వివరాలను అందులో నమోదు చేస్తున్నారు. సర్వేనంబర్ ఎంట్రీ చేయగానే ఆ పరిధిలో ఉన్న రైతుల వివరాలు కనిపిస్తాయి. కావాల్సిన రైతు పేరు ఎంచుకోగానే వారి పేరిట ఉన్న భూమి వివరాలు దర్శనమిస్తాయి. అందులో రైతు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నాడో నమోదు చేయాలి. అలాగే సాగు ఫొటోను యాప్లో అప్లోడ్ చేయాలి. ఒకవేళ సాగులో లేని భూమి ఉంటే వాటిని నాన్క్రాప్ కింద నమోదు చేస్తున్నారు. పంటల నమోదు ఆధారంగానే కొనుగోళ్లు.. ఈ సర్వేతో రైతులు సాగు చేసే పంటల వివరాలు పక్కాగా తేలనున్నాయి. తదనుగుణంగా వచ్చే దిగుబడిని మార్కెట్లో ప్రభుత్వ రంగ సంస్థకు మద్దతు ధరతో విక్రయించేందుకు అవకాశం ఉంటుంది. పలు చోట్ల ఇబ్బందులు.. సర్వేలో భాగంగా ఏఈవోలకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేకపోవటంతో యాప్ ఓపెన్ కావడం లేదు. అలాగే పలు చోట్ల సర్వర్ నెమ్మదించటం, మరికొన్ని చోట్ల రైతుల చేలల్లో లొకేషన్ తప్పుగా చూపించడం, సర్వే నంబర్లు కనిపించకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఏఈవోలు చెబుతున్నారు. సర్వేతో పక్కాగా సాగు లెక్క జిల్లాలో డిజిటల్ క్రాప్ సర్వే కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఏఈవోలు రైతుల చేలల్లోకి వెళ్లి పంటల సాగు వివరాలు అక్కడే నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే జిల్లా వ్యాప్తంగా రైతులు ఏయే పంటలు, ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారో లెక్కలు పక్కాగా రానున్నాయి. – శ్రీధర్ స్వామి, జిల్లా వ్యవసాఽయాధికారి -
ముస్లింలను బీసీల్లో చేరిస్తే స్పందించరా?
● కేంద్రం నిధులపై చర్చకు సిద్ధమా? ● కేంద్ర మంత్రి బండి సంజయ్ ● మంచిర్యాలలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం సాక్షిప్రతినిధి, మంచిర్యాల/మంచిర్యాలటౌన్: ‘బీసీ లకు 42శాతం రిజర్వేషన్లు అని చెప్పి.. 10 శాతం ముస్లింలను కలిపితే బీసీలకు అన్యాయం జరిగిన ట్లు కాదా.. కాంగ్రెస్ నేతలు స్పందించరా..? బీసీల్లో ముస్లింలను కలిపితే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదు. ..’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ‘రంజాన్కు ముస్లిం ఉద్యోగులందరికీ సాయంత్రం 4గంటలలోపే విధులు ముగించుకుని వెళ్లిపోవచ్చని మినహాయింపు ఇచ్చారు. అయ్యప్ప, హనుమాన్, భవానీ భక్తులు ఏం పాపం చేశారని.. కాంగ్రెస్లోని హిందువులారా.. మీలో నిజంగా హిందూ రక్తమే ప్రవహిస్తే సమాధానం చెప్పాలి..’అంటూ డిమాండ్ చేశారు. మంగళవారం మంచిర్యాల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. అంతకు ముందు పట్టణంలో కార్యకర్తలు, నాయకులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షు డు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు కే.వెంకటరమణారెడ్డి, పాల్వాయి హరీశ్బాబు, ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజ య్ మాట్లాడుతూ.. మూడుస్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఏ సర్వే చూసినా స్పష్టం చేస్తున్నాయని అన్నారు. కేంద్రం రూ.12.75లక్షల ట్యాక్స్ మినహా యింపు, పదేళ్లలో రూ.12 లక్షల కోట్లకుపైగా నిధులను తెలంగాణకు ఇచ్చిందన్నారు. కేంద్రం నిధులివ్వడం లేదని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ బహిరంగ చర్చకు సిద్ధమా..? ఈ అంశాన్ని రెఫరెండంగా తీసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి రావాలని కాంగ్రెస్కు సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలనే ఆలోచనే ఆ పార్టీ ఎమ్మెల్యేలకు లేదన్నారు. సొంత కాలేజీ స్టాఫ్ను పట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు. మంచిర్యాలలో దాదాగిరి మంచిర్యాలలో కొందరు దాదాగిరి చేస్తున్నారని, ఆరు నెలల కంటే ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే పరిస్థితి లేదని కేంద్రమంత్రి సంజయ్ అన్నారు. ప్రభుత్వంలో టాప్ 5లో ఉన్న వాళ్ల దోపిడీ, అవి నీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోందని, కమీషన్లకు కక్కుర్తిపడుతున్నారని విమర్శించారు. అవినీ తి జరుగుతుందడానికి సీఎం వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. 15శాతం కమీషన్లు ఇస్తే మాత్రం కాంట్రాక్టర్లకు అప్పటికప్పుడు బిల్లులు క్లియర్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ బీసీ కాదని ఆయన కులం గురించి అవాకులు పేలుతున్నారని, రాహు ల్ ఖాన్ గాంధీ తండ్రి పేరు ఏమిటి? ఫిరోజ్ఖాన్ గాంధీ...అసలు గాంధీ అని పేరు యాడ్ చేసుకుని గాంధీ పరువు తీస్తున్నారని విమర్శించారు. మహా త్మాగాంధీ ఆత్మ బాధపడుతోందని, ఫిరోజ్ఖాన్ గాంధీ కొడుకు, మనవడు ఏమైతరు? హిందువులై తే కానే కాదన్నారు. మీరు హిందువులేనా? మీలో హిందువు రక్తం ప్రవహిస్తుందా? అని ప్రశ్నించారు. నిరుద్యోగులు, ఉద్యోగుల పక్షాన పోరాడింది తామే అని, నిరుద్యోగులకు మోచేతికి బెల్లం రాసి నాకిచ్చి నంత పనిచేశారని అన్నారు. 2లక్షలకుపైగా ఖాళీలు ఉన్నాయని, ఓట్లకోసం వచ్చే కాంగ్రెస్ నేతలను గల్లా పట్టి నిలదీయాలని అన్నారు. కోడ్ లేని జిల్లాల్లో వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.. అబద్ధాలు చెప్పి మోసం చేసి ఓట్లు దండుకోవడంలో కాంగ్రెసోళ్లు కేసీఆర్ను మించి పో యిర్రని తెలిపారు. ఇవన్నీ ప్రశ్నిస్తే హిందూ ముద్రవేస్తున్నారన్నారు. కాళేశ్వరం, డ్రగ్స్ కేసు, ఫార్ములా ఈ రేస్ స్కాం కేసులో ఇదిగో అరెస్ట్...అదిగో అరెస్ట్ అంటూ మీడియాలో వార్తలు రాయించుకుంటూ కాలయాపన చేయడం తప్ప కాంగ్రెస్ సాధించిందేమిటి అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ స్కాంలు ఢిల్లీలో ని కాంగ్రెస్ నేతలకు ఏటీఎంలాగా మారాయని, ఒక్కో స్కాం ఢిల్లీ పెద్దలకు రూ.వెయ్యి కోట్లకుపైగా పైసలు దండుకుంటున్నారని అన్నారు. -
‘ప్రజా సమస్యలపై ఉద్యమిస్తాం’
ఎదులాపురం: ఎన్నికల కోడ్ అనంతరం ప్ర జా సమస్యలపై ఉద్యమిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జిల్లాకు తీరని అన్యాయం చేసిందన్నా రు. ఆర్మూర్–ఆదిలాబాద్ రైల్వేలైన్, విమానాశ్రయం ఏర్పాటు, సిమెంట్ ఫ్యాక్టరీ తెరి పించడం వంటి ప్రధాన హామీలతో జిల్లావాసులను ఏళ్లుగా మోసం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల కోడ్ అనంతరం ఆయా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామన్నా రు. కార్యక్రమంలో నాయకులు రా ములు, అరుణ్కుమార్, నర్సింగ్రావు, మహబూబ్ఖాన్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
ఇంద్రవెల్లి: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహా ల్లో చదువుతున్న విద్యార్థినుల ఆరోగ్యంపై వైద్యఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుంద ని ఏజెన్సీ అదనపు వైద్యాధికారి కుడ్మెత మనోహర్ అన్నారు. మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. మొత్తం 100 మంది విద్యార్థినుల రక్తనమానాలు సేకరించారు. విద్యార్థినులకు వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్యులు పూజిత, సీహెచ్వో సందీప్, పీహెచ్ఎన్ జ్యోతి, హెల్త్ సూపర్వైజర్ నరేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ప్రజలు ‘కేసీఆర్ ప్రభుత్వాన్ని’ కోరుకుంటున్నారు
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ‘జోగు’ ● ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఆదిలాబాద్టౌన్: తెలంగాణ ప్రజలు మరో సారి కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామ న్న అన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో కేక్ కట్ చేశారు. అనంతరం గంగపుత్ర శివాలయంలో పూజలు చేసి అన్నదానం ప్రారంభించారు. ఈద్గా మై దానంతో పాటు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మొక్కలు నాటారు. పార్టీ కార్యాలయంలో ఒక్కో కార్యకర్తకు మూడు మొక్కలు అందించి నాటాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని పదేళ్లలో దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు అజ య్, నారాయణ, మెట్టు ప్రహ్లాద్, యూనిస్ అక్బాని, సాజి తోద్దీన్, స్వరూప రాణి, మమత, కరుణ, తదితరులు పాల్గొన్నారు. అలాగే జైనథ్లోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో రామన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట నాయకులు నారా యణ, లింగారెడ్డి, వెంకటరెడ్డి, గణేశ్యాదవ్ తదితరులున్నారు. చిత్రం గీసి.. శుభాకాంక్షలు తెలిపి తాంసి: కేసీఆర్ జన్మదినం సందర్భంగా మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన చిత్రకారుడు గట్టు రాజు స్వయంగా మాజీ సీఎం చిత్రపటాన్ని పెన్సిల్తో గీశాడు. ఇలా శుభాకాంక్షలు తెలిపి తన అభిమానాన్ని చాటుకున్నాడు. -
వేడుకలు శాంతియుతంగా నిర్వహించుకోవాలి
ఆదిలాబాద్టౌన్: ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని ఏఎస్పీ సురేందర్ రావు అన్నారు. జిల్లాకేంద్రంలోని వన్టౌన్లో సీఐలు, ఎస్సైలతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 19న శివాజీ జయంతి సందర్భంగా ర్యాలీ కోసం మూడు సంఘాలు వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నాయన్నారు. షరతులతో కూడిన ర్యాలీకి అనుమతి ఇచ్చేందుకు ఆర్డీవోకు పంపినట్లు తెలిపారు. ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బాధ్యత వహించాలని నిర్వాహకులకు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ పాటించాలని పేర్కొన్నారు. ఇందులో డీఎస్పీ జీవన్రెడ్డి, టూటౌన్, రూరల్, జైనథ్ సీఐలు కరుణాకర్రావు, ఫణిందర్, సాయినాథ్, ఎస్సైలు, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ఎదుట సీపీఐ ధర్నా
కైలాస్నగర్: ఆదిలాబాద్ రూరల్ మండలం నిఘా న్ఘాట్లోని ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు మౌలిక వసతులు కల్పించాల ని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరుకు సోమవారం కాలనీవాసులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదేళ్లుగా పేదలు అక్కడ గుడిసెల్లో నివసిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడం శోచనీయమన్నారు. కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి తాగునీరు, విద్యుత్ సౌకర్యం వంటివి కల్పించాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామన్నారు. అనంతరం కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతిపత్రం అందజేశారు. -
అర్జీలిచ్చి.. ఆవేదన వెలిబుచ్చి
● ప్రజావాణికి 69 దరఖాస్తులు ● స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షా కై లాస్నగర్: భూ సమస్య పరిష్కరించాలని ఒకరు.. పింఛన్ అందడం లేదని ఇంకొకరు.. రైతుభరోసా సాయం కోసం మరొకరు.. ఇలా తమ సమస్యల గోడును బాధితులు కలెక్టర్ రాజర్షి షాకు వినిపించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో బాధితుల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. వాటిని అధికారులకు అందజేస్తూ పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించేలా శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఈ వారం మొత్తం 69 అర్జీలు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ ఆర్డీవో వినోద్కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. బాధితుల్లో కొందరి నివేదన.. అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేయాలి నా పేరు సిర్రా దేవేందర్. ఏఐటీయుసీ రాష్ట్ర కార్యదర్శిని. రిమ్స్లోని మలేరియా విభాగంలో రెండు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఉండగా పీహెచ్సీల్లో పనిచేసే ముగ్గురిని డీఎంహెచ్వో అక్కడికి డిప్యూటేషన్పై నియమించారు. దీంతో వారు వంతుల వారీగా విధులకు హాజరవుతున్నారు. ముగ్గురు పనిచేయాల్సి ఉండగా ఒక్కరు మాత్రమే విధుల్లో ఉంటున్నారు. అది కూడా సమయపాలన పాటించడం లేదు. అక్రమ డిప్యూటేషన్లతో అటు మండల ప్రజలకు ఇటు రిమ్స్కు వచ్చే రోగులకు సరైన సేవలు అందడం లేదు. అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేయాలని కలెక్టర్కు విన్నవించాను. -
ప్రత్యేక తరగతులను పర్యవేక్షించాలి
కై లాస్నగర్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు పదో తరగతి విద్యార్థుల కు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను నిత్యం పర్యవేక్షించాలని మండల ప్రత్యేకాధికారులను కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్ స మావేశ మందిరంలో సోమవారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, స్నాక్స్ అందేలా దృషి సారించాలన్నారు. అలాగే వారు ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రతిరోజు ప్రత్యేక తరగతులకు హాజరై విద్యార్థులకు సూచనలు, సలహాలు అందజేయాలన్నారు. అనంతరం జన్మన్ యోజన కింద చేపడుతున్న అంగన్వాడీ భవనాలకు మంజూరైన వాటి నివేదికలు త్వరగా పంపాలని డీడబ్ల్యూవోను ఆదేశించా రు. కార్యక్రమంలో ఆర్డీవో వినోద్కుమార్, డీఈవో ప్రణీత, డీడబ్ల్యూవో సబిత, డీఆర్డీవో రవీందర్ రాథోడ్ పాల్గొన్నారు. పోస్టర్ ఆవిష్కరణనేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 24న నిర్వహించనున్న శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి పోస్టర్ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని ఆయన నివాసంలో సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. -
● పదవుల విషయంలో పలువురిలో అసంతృప్తి ● ప్రాధాన్యత ఇవ్వలేదంటున్న సీనియర్లు ● ఎంపీ గోడం, ఎమ్మెల్యే ‘పాయల్’పైనే సమన్వయ భారం ● ‘స్థానిక’ ఎన్నికల ముందు పార్టీలో అంతర్గత లొల్లి
● పార్టీ ఆదిలాబాద్ పట్టణ అధ్యక్షులుగా తొలిసారి ఇద్దరిని నియమిస్తూ నిర్ణయం తీసుకోవడంపై కార్యకర్తల్లో విస్మయం వ్యక్తమవుతుంది. మొదట ముగ్గురిని నియమించాలని భావించినప్పటికీ ఈ విషయంలో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఇద్దరితో సరిపెట్టినట్లు పార్టీలో చర్చ సాగుతోంది. ప్రస్తుతం పట్టణ అధ్యక్షులుగా వేదవ్యాస్, గండ్రత్ మహేందర్ ఉన్నారు. ● నేరడిగొండ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్న సాబ్లే సంతోష్ సింగ్ రెండు రోజుల క్రితం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. మండల అధ్యక్షులకు కనీస మర్యాద, సమాచారం ఇవ్వకుండా అవమానించడం బాధకు గురి చేసిందని, విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదని సంతోష్ సింగ్ తన రాజీనామా పత్రంలో పేర్కొన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ కార్యకర్తలు, నాయకులు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనై ఉన్నారని అందులో పేర్కొనడం గమనార్హం. ● నెల క్రితం కొన్ని మండలాలకు అధ్యక్షులను నియమిస్తూ పార్టీ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. అయితే ఈ నియామకాలు ఏకపక్షంగా సాగాయని పలు మండలాల్లో ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అంతే కాకుండా పార్టీలో పాత నాయకులను విస్మరించి కొత్తవారికి అవకాశం కల్పించారని పలువురు ఆరోపించారు. భీంపూర్ మండల బీజేపీ నూతన అధ్యక్షుడు అంకం అశోక్ను మార్చాలంటూ పార్టీ క్యాడర్ మండలానికి వచ్చిన ఎంపీ గోడం నగేశ్కు వినతి పత్రం అందజేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బేల మండలంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఆ నాయకుడిని మండల అధ్యక్షుడిగా నియమించడం అభ్యంతరాలకు దారి తీసింది. ● బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా గుడిహత్నూర్కు చెందిన బ్రహ్మానంద్ను మరోసారి కొనసాగిస్తూ ఇటీవల పార్టీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే పార్టీలో సీనియర్ నాయకులు ఈ ని యామకంపై నారాజ్గా ఉన్నారని ప్ర చారం సాగుతోంది. ప్రధానంగా జిల్లా అధ్యక్ష నియామకానికి సంబంధించి కనీసం పార్టీలో అభిప్రా య సేకరణ చేయలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని సీనియర్లు వాపోతున్నారు. సాక్షి,ఆదిలాబాద్: బీజేపీలో లుకలుకలు బయట ప డుతున్నాయి. ప్రధానంగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ నాలుగు ఎమ్మెల్యే స్థానాలు కలిగి ఉండటం, ప్రస్తుతం పదవీకాలం ముగిసినప్పటికీ గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు జెడ్పీటీసీ, అటు ఎంపీటీసీ, బల్దియాలో కౌన్సిలర్లుగా పలు వు రు కాషాయ పార్టీ నుంచి గెలుపొందారు. ప్రసు తం స్థానిక సంస్థల ఎన్నికల ముందు పటిష్టంగా ఉండాల్సిన పార్టీలో అంతర్గతంగా విభేదాలు బయటపడుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా ఎంపీ గోడం నగేశ్, ఆదిలాబాద్ ఎమ్మె ల్యే పాయల్ శంకర్ ఈ పరిస్థితులను చక్కదిద్ది పార్టీ లో సమన్వయం తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. విభేదాలు ఇలా.. ఇదివరకు పార్టీ అధ్యక్ష పదవిని సీనియర్ నేతలు చిట్యాల సుహాసినిరెడ్డి, ఆదినాథ్, వేణుగోపాల్, జ్యోతిరెడ్డి ఆశించారు. అయితే అనూహ్యంగా ఎమ్మె ల్యే పాయల్ శంకర్ అనుచరుడు బ్రహ్మానంద్ను పార్టీ నియమించడంపై అప్పట్లోనే ఈ సీనియర్ నే తలు నిరుత్సాహానికి గురయ్యారు. తాజాగా జిల్లా అధ్యక్షుడిగా తిరిగి ఆయననే కొనసాగించడం, ఈ నిర్ణయంపై తమకు కనీసం సమాచారం ఇవ్వకపోవడం, పోటీ ఆసక్తిపై అడగకపోవడంపై వారు పెద వి విరుస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలను విస్మరించి ఇలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదన్న విమర్శలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సీనియర్ నేతలు ప్రస్తుతం పార్టీ వ్యవహారాల్లో సైలెంట్ కావడం, పలు కార్యక్రమాల్లో అంటిముట్టనట్లు వ్యవహరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల వరకు పట్టణ అధ్యక్షుడిగా కొనసాగిన లాలామున్నా కొంతకాలంగా ము ఖ్య నేతకు దూరంగా ఉంటూ వచ్చారనే ప్రచారం పార్టీలో ఉంది. తాజాగా మున్నాను మరోసారి పట్ట ణ అధ్యక్షుడిగా కొనసాగించకుండా పార్టీలో వేరే వారికి అవకాశం కల్పించారు. మొత్తంగా పార్టీలో సీనియర్ నేతలకు, ముఖ్య నేత మధ్య సఖ్యత లే దన్న ప్రచారం సాగుతోంది. అంతే కాకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే కార్యకర్తలు ప్రస్తుతం ఇటు పార్లమెంట్ పరిధిలో, అటు నియోజకవర్గ స్థా యిలో ఏమైనా పనుల కేటాయింపులోనూ నేతలు తమను విస్మరిస్తున్నారనే అసంతృప్తి వారిలో ఉంది. అంతేకాకుండా పార్టీలో ఒక నాయకుడికి ఎలాంటి పదవులు లేకున్నప్పటికీ ముఖ్య సమావేశాల్లో ఆయనను వేదికలపై కూర్చోబెట్టడం, రాష్ట్రనేతలను కలిసినప్పుడు కూడా అత ను వెంట ఉండటంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆ నాయకుడిని తూర్పారా బడుతూ పార్టీ నాయకులే పోస్టులు పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా ప్రస్తుతం బీజేపీలో అంతర్గతంగా సాగుతున్న ఈ కలహాలు ఎప్పుడో బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
వాతావరణం
కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు తలమడుగు మండల కేంద్రంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. సోమవారం సుదర్శన మహాయజ్ఞం నిర్వహించారు. వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరగనుంది. ఉక్కపోత ప్రభావం కనిపిస్తుంది. మళ్లీ కంప్యూటర్ విద్య పాఠశాలల్లో మళ్లీ కంప్యూటర్ విద్య అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పీఎంశ్రీ పథకం కింద ఎంపికై న పాఠశాలలకు కంప్యూటర్లు సరఫరా చేసింది. 9లోu మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20258లోu వలలు తొలగించారు.. పక్షులను రక్షించారుఇంద్రవెల్లి: పంటల రక్షణ కోసం రైతులు ఏర్పాటు చేసిన వలలకు చిక్కుకుని చనిపోతున్న పక్షులపై ‘సాక్షి’లో సోమవారం ‘పంటలకు రక్షణ.. పక్షులకు ప్రా ణాంతకం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అటవీ అధికారులు స్పందించారు. మండల కేంద్ర శివారుతో పాటు అంజీ, మామిడిగూడ గ్రామాలను సందర్శించారు. రైతులు పంటల రక్షణ కోసం ఏర్పాటు చేసిన వలలను తొలగించారు. ఈ సమయంలో పలు పక్షులు అందులో చిక్కుకొని ఉండగా వాటిని రక్షించి అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఎఫ్ఎస్వో చంద్రారెడ్డి మాట్లాడుతూ, అటవీ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఆయన వెంట ఎఫ్బీవోలు నిషంత్, పద్మజ, నికిత, అఖిల్ తదితరులున్నారు. ఆ నిర్మాణ పనులకు.. బ్రేక్ కైలాస్నగర్: మున్సిపల్ నుంచి అనుమతులు లేకుండా పట్టణంలోని ఓంకార్మాల్ జిన్నింగ్మిల్లులో అక్రమంగా కమర్షియల్ కాంప్లెక్స్ భవన నిర్మాణం చేపడుతుండడాన్ని వివరిస్తూ ‘దర్జాగా.. అక్రమం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి బల్దియా అధికారులు స్పందించారు. మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది రాజన్న, క్రాంతి సోమవారం జిన్నింగ్మిల్లులోని అక్రమ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. పనులు నిలిపివేయాలని పేర్కొంటూ భవన యజమానికి నోటీసు అందజేశారు. కాగా, అనుమతుల్లేకుండా ఎలాంటి కట్టడాలు చేపట్టవద్దని కమిషనర్ పేర్కొన్నారు. ఇసుకాసురులపై పోలీసుల కొరడా ఆదిలాబాద్టౌన్: ఇసుక అక్రమార్కులపై పోలీసులు కొరడా ఝుళిపించారు. పెన్గంగ నుంచి ఇసుక అక్ర మ రవాణాకు సంబంధించి ‘తోడేస్తున్నారు..’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం కథనం ప్రచురితమైంది. ఈ మేరకు పోలీసు అధికారులు స్పందించారు. పలుచోట్ల తనిఖీలు చేపట్టారు. బేలలోని కాంగర్పూర్ సమీపంలోని ఘాట్ వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్ను సీజ్ చేశారు. వాటిని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించినట్లు డీఎస్పీ జీవన్రెడ్డి పేర్కొన్నారు. అలాగే మైనింగ్ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. పెన్గంగ నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మొదటిసారి జరిమానా విధిస్తామని, రెండోసారి పట్టుబడితే ఇసుక దొంగతనం కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఎక్కడైనా ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ దాడుల్లో జైనథ్ సీఐ సాయినాథ్, బేల ఏఎస్సై లింగన్న, కానిస్టేబుళ్లు దత్తు, వెంకటేశ్ పాల్గొన్నారు. సాలెగూడకు.. ట్యాంకరొచ్చిందిఇంద్రవెల్లి: మండలంలోని తేజాపూర్ గ్రామపంచాయతీ పరిధి సాలెగూడలో తాగునీటి ఇక్కట్లపై ‘సాక్షి’లో సోమవారం ‘గొంతెండుడేనా.., సాలెగూడలో నీటిగోస’ శీర్షి కన ప్రచురితమైన కథనాలకు అధికారులు స్పందించా రు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భానుకుమార్, ఎంపీవో జీవన్రెడ్డి ఉదయాన్నే గ్రామాన్ని సందర్శించారు. తాగునీటి కోసం గ్రామస్తుల ఇక్కట్లను పరిశీలించారు. వెంటనే ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా ప్రారంభించారు. అధికారులు మాట్లాడుతూ, వేసవి ముగిసేంత వరకు నిరంతరం ట్యాంకర్ల ద్వా రా నీటిని సరఫరా చేస్తామన్నారు. వారి వెంట పంచాయతీ కార్యదర్శి పూర్ణ, మాజీ సర్పంచ్ కామేశ్వరి ఉన్నారు. పత్తి కొను‘గోల్మాల్’పై తనిఖీలు ఆదిలాబాద్టౌన్: పత్తి కొనుగోళ్ల గోల్మాల్ వ్యవహారంలో ‘తిలా పాపం.. తలాపిడికెడు’ శీర్షికన ఈనెల 14న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ రాజర్షిషా స్పందించారు. విచారణ అధికారులుగా నియమితులైన జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్స్వామి, జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్లు ఇచ్చోడ వ్యవసాయ కార్యాలయంలో సోమవారం తనిఖీలు చేపట్టారు. టీఆర్లను స్వా ధీనం చేసుకున్నారు. ఇచ్చోడ ఏవో కై లాస్, పలువురు ఏఈవోలను విచారించారు. వారి నుంచి వివరాలు సేకరించారు. ఇచ్చోడతో పాటు జిల్లాలోని ఆయా మండలాల్లో టీఆర్ బుక్లను పరిశీలించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి పేర్కొన్నారు. ఎఫెక్ట్.. -
అంగట్లో ఓటర్ల ఫోన్ నంబర్లు!
సాక్షి ప్రతినిధి,మంచిర్యాల: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ కే మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలంటూ పట్టభద్రులు, టీచర్ల ఓటర్లకు నిత్యం పదుల సంఖ్యలో కాల్స్, మెసేజ్లు వస్తున్నాయి. కాల్ లిఫ్ట్ చేసే వర కూ ఫోన్లు మోగుతూనే ఉంటున్నాయి. ఒకరిద్ద రు కాదు లక్షలాది మంది ఓటర్ల ఫోన్ నంబర్లకు ఇలా ఫోన్లు వస్తున్నాయి. కొందరు చాటుగా ఫోన్ నంబ ర్లు తీసుకుని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో నిత్యం ఓటర్లకు కాల్స్ వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లంతా విద్యావంతులే. కానీ, వారికి తెలియకుండానే ఫోన్ నంబర్లు సేకరించి నేరుగా అభ్యర్థుల ఫోన్లు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఫోన్ నంబర్లను సైతం పైసలకు అమ్ముకోవడం గమనార్హం. ప్రైవేటు వ్యక్తుల చేతిలో.. ఓటరు నమోదు సమయంలో ఎన్నికల సంఘం అధికార వెబ్సైట్, మాన్యువల్గా దరఖాస్తు చేసిన సమయంలో ఫోన్ నంబర్లను కూడా పేర్కొన్నారు. అలా అనేక మంది ఓటర్ల ఫోన్ నంబర్లు నిక్షిప్తమయ్యాయి. అయితే అధికార వెబ్సైట్లో నమోదు చేసిన వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచాలి. కానీ జిల్లాల్లో ఎన్నికల విభాగంలో పని చేస్తున్న కొందరు అధికారులు బయటకు ఇస్తున్నారు. బరిలో ఉన్న అభ్యర్థులు వివరాలు వాటిని కొనుగోలు చేసి వాడుకుంటున్నారు. ప్రచారం నుంచి సర్వేలదాకా పలు సంస్థలు, సోషల్మీడియా వేదికగా వాడుకుంటున్నాయి. చాలా మందికి ఒకటికి రెండుసార్లు ఫోన్లు చేస్తూ ఓటర్లకు చిరాకు తెప్పిస్తున్నారు. తక్కువ స మయంలో ఎక్కువ మందిని పలకరించేలా, నేరుగా ఫోన్ నంబర్లపైనే అభ్యర్థులు ఆధాపడుతున్నారు. లక్షలాది ఫోన్ నంబర్ల సేకరణ ఓట్ల కోసం లక్షలాది మంది ఓటర్ల వివరాలు సేకరించారు. ఎన్నికలు ముగిసినప్పటికీ వివిధ వ్యాపా ర ప్రకటనలు, ఇతరత్రా అవసరాల కోసం కూడా ఈ ఓటర్ల ఫోన్ నంబర్లు ఉపయోగించుకునే అవకాశం ఉంది. మహిళల ఫోన్ నంబర్లతోపాటు వారి సోషల్ మీడియా అకౌంట్లు లింకు ఉన్న వాటికి కూడా ప్రకటనలు పంపుతున్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్తో సైబర్ నేరాలకు ఆస్కారం ఉంటుంది. అయితే కొందరు ఆ నంబర్ల నుంచి కాల్ రాగానే బ్లాక్ లేదా, స్పామ్గా రిపోర్టు చేస్తున్నారు. ఓటరు నమోదు సందర్భంగా లక్షలాది మందివి సేకరణ ఒక్కో పీడీఎఫ్ కాపీకి రూ.20 వేల నుంచి రూ.50 వేలు కొనుగోలు చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు ఓటర్లకు నిత్యం కాల్స్, మెసేజ్లు ‘నేను మీ ఎమ్మెల్సీ అభ్యర్థిని.. బ్యాలెట్ పేపర్లో నాది ఫలానా నంబర్. మీ పోలింగ్ బూత్ నంబర్ ఇదీ.. మీ మొదటి ప్రాధాన్యత ఓటు నాకే వేసి గెలిపించగలరు’ ఇదీ మంచిర్యాలకు చెందిన ఓ పట్టభద్రుడికి వచ్చిన ఫోన్. ఇలా అతడికి రోజూ పదుల సంఖ్యలో కాల్స్ వస్తున్నాయి. కానీ సదరు ఓటరు ఏ అభ్యర్థికీ తన ఫోన్ నంబర్ ఇవ్వలేదు. అయినా కాల్స్ ఎలా వస్తున్నాయో అర్థం కాక తల పట్టుకుంటున్నాడు. టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు సైతం ఇదే తరహాలో ఫోన్లు, మెస్సేజ్లు చేస్తున్నారు. ‘మా వద్ద పట్టభద్రులు, టీచర్ ఓటర్ల పేర్లు, అడ్రస్, ఫోన్ నంబర్ సహా వివరాలు ఉన్నా యి. మీకు కావాలంటే చెప్పండి. రూ.30 వేలు ఇస్తే మీకు పీడీఎఫ్ కాపీ పంపుతాం’ అని ఓ స్వతంత్ర అభ్యర్థికి ఓ వ్యక్తి ఆఫర్ చేశాడు. ‘నేను అంత ఇవ్వలేను’ అని ఆ అభ్యర్థి చెబితే.. ‘రాజకీయ పార్టీల వాళ్లు మాకు ఒక్కో పీడీఎఫ్కు రూ.50 వేలు ఇచ్చారు. ఇప్పటికే వారందరూ ఓటర్లకు ఫోన్లు, మెసేజ్లు, వాట్సాప్లో సందేశాలు పంపుతున్నారు. మీరు కూడా అలాగే ప్రచారం చేసుకోవచ్చు’ అని సూచించాడు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం●
● జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క కై లాస్నగర్: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అ న్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్–నిజామాబాద్ పట్టభద్రు ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వూట్కూ రి నరేందర్రెడ్డి ప్రచార సభలో పాల్గొన్నా రు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేవుడు వేరు, రాజకీయం వేరని అన్నారు. బీజేపీ.. దేవుడిపై, కులమతాలపై రాజకీ యం చేస్తుందన్నారు. మోదీ బీసీ కాదన్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు కొందరు బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ కులమేంటని అడుగుతున్నారన్నారు. దేశ కోసం సర్వం త్యాగం చేసిన మోతీలాల్ నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు రా హుల్గాంధీ అని గుర్తు చేశారు. పట్టభద్రులంతా నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్సీఅభ్యర్థి నరేందర్రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి శ్రీనివాసరెడ్డి, కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ మల్లేశ్, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీధర్, ఆత్రం సుగుణ, పార్లమెంట్ కోఆర్డినేటర్ నరేశ్జా దవ్, మాజీ ఎమ్మెల్యే సక్కు, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ గోవర్ధన్రెడ్డి, ఆనంద్రావు, తదితరులు పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండాలిఆదిలాబాద్టౌన్: నకిలీ బాబాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి అన్నారు. టూటౌన్ లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నకిలీ బాబాల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఎవరైనా నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తే పోలీసులకు సమాచారం అందించాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని సూచించారు. -
రాష్ట్రస్థాయి పోటీలు విజయవంతం చేయాలి
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈనెల 18, 19 తేదీల్లో నిర్వహించనున్న ఖేలో ఇండియా ఉషూ రాష్ట్ర స్థాయి పోటీల ను విజయవంతం చేయాలని జిల్లా గిరిజన క్రీడ ల అధికారి కోరెడ్డి పార్థసారథి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆదివారం రాష్ట్రస్థాయి పోటీలకు సంబంధించిన పోస్టర్ ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఈ పోటీలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అమెచ్యూర్ ఉషూ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఉమర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అజ్మీరా గణేశ్, వేముల సతీశ్, సంఘం ఆర్గనైజింగ్ చైర్మన్ అన్నారపు వీరేశ్, శృతి, సాయికుమార్, హ్యాండ్ బాల్ సెక్రెటరీ హరిచరణ్, కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర పాల్, శివప్రసాద్, శివకుమార్, ప్రణయ్ కుమార్, మాధవి, వనిత, దివ్య తదితరులు పాల్గొన్నారు. -
పంటలకు రక్షణ.. పక్షులకు ప్రాణాంతకం
పంట రక్షణ చర్యలు పక్షుల పాలిట ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇంద్రవెల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఈ సీజన్లో రైతులు జొన్న, మొక్కజొన్న, గోదుమ పంటలు సాగు చేశారు. పంట రక్షణ కోసం ఇలా వలలు అమర్చడంతో నిత్యం వందలాది పక్షలు వాటిలో చిక్కుకుని చనిపోతున్నాయి. రామచిలుకలు, గద్దలు, గుడ్లగూబలతో పాటు అరుదైన పక్షులు సైతం తనువు చాలిస్తున్నాయి. దృష్టి సారించాల్సిన అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని పక్షి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా తగు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. – ఇంద్రవెల్లి -
దర్జాగా.. ‘అక్రమ’ం
● అనుమతి లేకుండా భవన నిర్మాణం ● ‘మామూలు’గా వ్యవహరిస్తున్న అధికారులు కై లాస్నగర్: ‘ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ఆక్రమణలతో పాటు అక్రమాలు సైతం సహించం.. టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..’ ఇది మూడు రోజుల క్రితం కలెక్టర్ రాజర్షి షా అధికారికంగా చేసిన ప్రకటన. ఆక్రమణ లతో పాటు అక్రమాలకు కళ్లెం వేయాల్సిన బల్దియా అధికారులు సాక్షాత్తు మున్సిపల్ కార్యాలయాన్ని ఆనుకునే అనుమతి లేకుండా భవన ని ర్మాణం చేపడుతున్నా చర్యలు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో ఏకంగా రూ.50లక్ష ల డీల్ కుదిరినట్లుగా సమాచారం. అధికార పార్టీకి చెందిన ఓ మాజీ కౌన్సిలర్ ఇందులో చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. అనుమతి లేకుండానే పనులు ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయానికి ఆనుకుని ఉన్న ఓంకార్మాల్ జిన్నింగ్ ఏరియాలో సదరు వ్యాపారి కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టా రు. మున్సిపల్ అనుమతుల్లేకుండానే దర్జాగా పనులు చేపడుతున్నారు. మొదటి అంతస్తు పనులు ఇప్పటికే పూర్తికాగా రెండో అంతస్తుకు సంబంధించి సెంట్రింగ్ పనులు కొనసాగుతున్నాయి. పట్టణంలోని ఎలాంటి ప్రాంతంలోనైనా భవన నిర్మాణం చేపట్టాలంటే మున్సిపల్ నిబంధనలకు అనుగుణంగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేకపోవడం గమనార్హం. భారీ డీల్.. పట్టణ నడిబొడ్డున ఉన్న ఈ ప్రాంతానికి భారీ డి మాండ్ ఉంది. ఇక్కడ నిర్మించే మడిగెలు పూర్తికాక ముందే అద్దెకు పోనున్నాయి. ప్రతి నెలా రూ.లక్షల్లో ఆదాయం సమకూరనుంది. దీనిని గుర్తించిన సద రు వ్యాపారి బల్దియా అధికారులు సహకరించేలా చూడాలని సదరు వార్డు మాజీ కౌన్సిలర్ను వేడుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో సదరు వ్యాపారికి అభయమిచ్చిన ఆ మాజీ ప్రజాప్రతినిధితో పా టు బల్దియాలో అనుమతులు ఇచ్చే అధికారులందరికీ కలిపి సుమారు రూ.50లక్షల వరకు ముట్టజెప్పినట్లు సమాచారం. ఫలితంగానే అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నోటీసులు జారీ చేశాం.. పట్టణంలోని భుక్తాపూర్ శివారు రాణీసతీజీ కాలనీలో చేపట్టిన వాణిజ్యపరమైన భవన నిర్మాణానికి మున్సిపల్ నుంచి ఎలాంటి అనుమతుల్లేవు. అక్రమంగా సాగుతున్న నిర్మాణాన్ని నిలిపివేయాలని యజమానికి నోటీసులు జారీ చేశాం. నిర్మాణ పనులు సైతం నిలిపివేశాం. అక్రమంగా పనులు చేపట్టినట్లైతే చట్టపరంగా తగు చర్యలు తీసుకుంటాం. – సీవీఎన్.రాజు, మున్సిపల్ కమిషనర్ -
తోడేస్తున్నారు..
ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాంఅక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు. కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు ఇసుక, మొరం తవ్వకాలపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. బేల, జైనథ్, భీంపూర్ మండలాల్లోని నది పరీవాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టకుండా చర్యలు చేపడుతున్నాం. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. చెక్పోస్టులు ఏర్పాటు చేశాం. మొదటిసారి జరిమానా విధించి వదిలిపెడుతున్నాం. పునరావృతమైతే కేసులు నమోదు చేస్తాం. సీజ్ చేసిన ట్రాక్టర్లను మైనింగ్ అధి కారులకు అప్పగిస్తున్నాం. – ఎల్.జీవన్రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీబేల మండలంలోని కంగార్పూర్ శివారులో ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టగా జైనథ్, బేల ఎస్సైలు శనివారం రాత్రి తనిఖీలు చేపట్టారు. నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. మైనింగ్ అధికారులకు సమాచారం అందించారు. మరోసారి ఇసుక అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జైనథ్ మండలంలోని ఆనంద్పూర్లో అక్రమార్కులు బోట్లో ఆయిల్ ఇంజిన్ ఏర్పా టు చేసి నదిలో ఉన్న ఇసుకను ఒడ్డుకు చేర్చుతున్నారు. పైపులైన్ ద్వారా ఇసుకతో పాటు నీరు ఒడ్డున పడుతుంది. జల్లెడ ద్వారా వేరయిన ఇసుకను ట్రాక్టర్ యజమానులకు విక్రయిస్తారు. అయితే ఏడు నెలల క్రితం పోలీసులు దాడులు నిర్వహించి బోట్తో పాటు ఆయిల్ ఇంజిన్ను సీజ్ చేశారు. అయినా అక్రమార్కుల తీరులో మార్పు రాకపోవడం గమనార్హం. తాజాగా మళ్లీ ఇసుక అక్రమ తవ్వకాలు జోరందుకున్నాయి. రాత్రి వేళల్లో ఈ దందా సాగుతుందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు తనిఖీలు చేసినప్పుడు స్తబ్ధుగా ఉండి ఆ తర్వాత వారి పని కానిచ్చేస్తున్నారు.ఆదిలాబాద్టౌన్: జిల్లాలో మహారాష్ట్రకు సరిహద్దున ఉన్న పెన్గంగ నదిలో కొందరు అక్రమ తవ్వకాలు చేపట్టి ఇసుకను తోడేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. మైనింగ్ అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తుండడంతో వీరి దందా ‘మూడు టిప్పర్లు.. ఆరు ట్రాక్టర్లు’ అన్న చందంగా మారిందనే విమర్శలున్నాయి. ఇక పోలీసు, రెవెన్యూ అధికారులు తని ఖీలకు వెళ్తున్నారంటే వారికి ముందుగానే సమాచా రం అందుతుంది. అధికారులు అక్కడికి చేరుకున్నా క అసలు అక్కడ తవ్వకాలే జరగనట్టుగా ఉంటుంది. ఈ దందా రాత్రి వేళల్లో జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ ఆదేశాలతో పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. అక్రమార్కులపై కొరడా ఝుళిపించేందుకు సమాయత్తమయ్యారు. ఇటీవల జైనథ్, బేల, భీంపూర్, తాంసి మండలాల పరిధిలో ఇసుక తవ్వకాలు జరిగే ప్రాంతాలను పరి శీలించారు. ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. నది పరీవాహక ప్రాంతాల్లో.. పెన్గంగ నది పరీవాహక ప్రాంతాలైన జైనథ్, భీంపూర్, బేల మండలాల్లోని తాంసి(కె), వడూర్, అంతర్గావ్, ఆనంద్పూర్, పెండల్వాడ, డొల్లార, సాంగ్వి, కౌట, పూసాయి, పిప్పర్వాడ, కామాయి, కంగార్పూర్, సాంగిడి, బెదోడతో పాటు తదితర గ్రా మాల్లో ఇసుక అక్రమ దందా సాగుతోంది. వానా కాలం ముందు వరకు పెన్గంగ నుంచి తోడిన ఇసుకను అనుకూలంగా ఉన్న చోట్ల కుప్పలుగా నిల్వ ఉంచుతున్నారు. వర్షాలు ముగిసిన తర్వాత సెప్టెంబర్ నుంచి తిరిగి నది పరీవాహక ప్రాంతాల్లోని ఇసుకను భారీ యంత్రాలతో తోడేస్తున్నారు. ఆయా గ్రామాల్లోని వీడీసీలు, గ్రామ పెద్దల ద్వారా వేలం నిర్వహించి ఎవరో ఒకరు టెండర్ దక్కించుకుంటా రు. ఆ తర్వాత టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇక మైనింగ్ అధికారులు నామమాత్ర తనిఖీలకే పరిమితమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు, పోలీ సులు పట్టుకున్న వాహనాలకు జరిమానా విధించ డం తప్పా అక్రమ దందాకు అడ్డుకట్ట వేయలేకపోవడం గమనార్హం. జిల్లాలో మైనింగ్ అధికారితో పాటు ఓ టెక్నికల్ అధికారి ఉన్నారు. మైనింగ్ అధి కారికి నిర్మల్ జిల్లా అదనపు బాధ్యతలు ఉండడంతో ఆయన ఇటువైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరో పణలు ఉన్నాయి. ఇక టెక్నికల్ అధికారి ని మరో జిల్లాకు డిప్యూటేషన్ ఇవ్వడంతో పది రో జులుగా అందుబాటులో లేకుండా పోయారు. ఉన్న అధికారి సైతం కార్యాలయంలో ఉండకపోవడం, ఎవరైన సమాచారం అందించేందుకు ఫోన్ చేసినా స్పందించపోవడం ఈ అక్రమార్కులకు కలిసి వస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి గండి.. జిల్లా సరిహద్దున ఉన్న పెన్గంగ నది సుమారు 70 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంది. బేల, భీంపూర్, జైనథ్ మండలాల పరిధిలోని పరీవాహక ప్రాంతాల్లో అక్రమార్కులు పొక్లెయిన్లు, ఇతర యంత్రాలతో ఇసుకను తోడేస్తున్నారు. ఈ తవ్వకాలతో ఎక్కడబడితే అక్కడ లోతైన గుంతలు దర్శనమిస్తున్నా యి. దీంతో భూగర్భజలాలు అడుగంటిపోయే పరి స్థితి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు అక్రమార్కులు వందల సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్లను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండల కేంద్రాలు, మహారాష్ట్రకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమార్కులపై నిఘా.. జిల్లాలోని బేల,భీంపూర్, తాంసి, తలమడుగు, జై నథ్ మండలాల్లో అక్రమంగా ఇసుక, మొరం తవ్వకాలు జరుపుతున్న వారిపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కలెక్టర్, ఎస్పీ ఆదేశాలతో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ప్రత్యేకంగా రాత్రి వేళల్లో పెట్రోలింగ్తో పాటు చెక్పోస్టులను ఏర్పా టు చేశారు. ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. పెన్గంగలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు రాత్రి వేళల్లో జోరుగా అక్రమ రవాణా పట్టించుకోని మైనింగ్ అధికారులు రంగంలోకి దిగిన పోలీసు శాఖ దొడ్డిదారిన వేలం..జిల్లాలో ఇసుక పాలసీ లేకపోవడంతో ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం సమకూరే పరి స్థితి లేకుండా పోయింది. గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ)లు దొడ్డి దారిన వేలం నిర్వహిస్తున్నాయి. స్థానిక అవసరాల కోసం ఇసుకను ఉపయోగిస్తామని తెలుపుతూ ఈ వేలం ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఏడాదికి రూ.అరకోటి పైగా ఆదాయం సమకూరుతుంది. గతేడాది బేల మండలం కాంగార్పూర్లో ఇసుక తవ్వకాల కోసం ఓ కాంట్రాక్టర్ రూ.62 లక్షలు, సాంగిడిలో రూ.30లక్షలు, ఆనంద్పూర్లో రూ.22 లక్షలు అందించినట్లు సమాచారం. జల్లెడ పట్టిన ఇసుక ట్రాక్టర్కు రూ.1500 వరకు, అలాగే కొన్ని వీడీసీలు రూ.300 నుంచి రూ.500 చొప్పున అక్రమంగా వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్ యజమానులు ఆ ఇసుకను ఆదిలాబాద్ పట్టణంలో రూ.4వేల వరకు విక్రయిస్తున్నారు. -
● పంచాయతీలకే తాగునీటి పథకాల పర్యవేక్షణ ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మాత్రం విడుదల కాని నిధులు ● ఇప్పటికే ఏజెన్సీల్లో మొదలైన నీటి ఎద్దడి ● ఎండలు పెరిగే కొద్ది తీవ్రమయ్యే అవకాశం ● సమ్మర్ యాక్షన్ ప్లాన్పై దృష్టి సారించని యంత్రాంగం
కైలాస్నగర్/ఇంద్రవెల్లి: మార్చి ఇంకా రానే లేదు.. అప్పుడే భానుడి ప్రతాపం మొదలైంది. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మ రోవైపు భూగర్భజలాలు క్రమంగా అడుగంటుతున్నాయి. ఎండలు ముదిరే కొద్ది జిల్లాలో నీటి సమ స్య తీవ్రమయ్యేలా కనిపిస్తోంది. ప్రజల దాహార్తి తీర్చేలా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన యంత్రాంగం ఇప్ప టి వరకు ఆ దిశగా ప్రత్యేక దృష్టి సారించనట్లు తెలు స్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 3 నుంచి 12వరకు అన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. నీటి ఎద్దడి తలెత్తే ఆవాసాలు, మరమ్మతులకు గురైన నీటి వనరులను గుర్తించారు. అయితే వాటిని బాగు చేసేందుకు పంచాయతీల్లో నిధులు లేకపోవడం గమనా ర్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు విడుదల చేస్తే తప్ప నీటి సమస్య తీరదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జీపీల్లో నిధుల కటకట.. ప్రజలకు అవసరమైన తాగునీటిని ప్రస్తుతం మిషన్ భగీరథ పథకం ద్వారా అందజేస్తున్నారు. అయితే సరఫరాలో అంతరాయంఏర్పడితే స్థానికంగా ఉన్న నీటి వనరుల ద్వారా అందించాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీలదే. చెడిపోయి న పైపులైన్లు, చేతి పంపులు, వాటర్ ట్యాంక్లు, విద్యుత్ మోటార్ల మరమ్మతులను వేసవి రాకముందే చేపట్టా ల్సి ఉంటుంది. అయితే ఏడాదిగా జీపీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కా వడం కాలేదు. దీంతో ఆయా పనులు చేపట్టడం పంచాయతీలకు భారంగా మారుతోంది. అత్యవసర పరిస్థితుల్లో కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు ప డాల్సి వస్తోంది. విధి లేని పరిస్థితుల్లో తమ జే బుల్లోంచి చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. గతేడాది నిధులే విడుదల కాలే... గతేడాది వేసవి దృష్ట్యా గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేలా ప్ర భుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. నీటి సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించి ఎస్డీఎఫ్ కేటాయిస్తున్నట్లుగా ప్రకటించింది. దీంతో సమస్య ఉన్న గ్రామాలను గుర్తించి నివేదిక అందజేశారు. వాటికనుగుణంగా ఆయా గ్రామాల కు నిధులను మంజూరు చేస్తామని ప్రభుత్వం తెలి పింది. ఈక్రమంలో జిల్లాలోని పలు గ్రామాల్లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తాగునీటి వనరుల మరమ్మతులు చేపట్టారు. చేదబావులు, బోరుబావులు ఎండిపోయినట్లయితే ప్రత్యేకంగా ట్యాంకర్ల ద్వారా కూడా నీటిని సరఫరా చేశారు. స్థానిక వనరులకు ప్రత్యేక పైపులైన్లు కూడా వేశారు. కొత్తగా బోర్లు సైతం వేయించారు. విద్యుత్ మోటార్లకు మరమ్మతులు చేయించారు. జిల్లా వ్యాప్తంగా రూ.3.65 కోట్ల వ్యయంతో 614 పనులు చేశారు. ఇందులో రూ.1.50 కోట్లతో కూడిన బిల్లులను ప్రభుత్వానికి నివేదించారు. అయితే ఏడాది గడిచినా ఇంకా విడుదల కాలేదు. దీంతో ప్రస్తుతం పనులు చేయాలంటే అధికారులు వెనుకడుగు వేస్తున్నారు.జిల్లాలో ఇదీ పరిస్థితి..పంచాయతీలదే బాధ్యత.. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత పంచాయతీలదే. చేతి పంపులు, విద్యుత్ మోటార్లు, బోరుబావుల మరమ్మతులు చేపట్టి ప్రజలకు నీటి సమస్య రాకుండా వారే చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఆర్డబ్ల్యూఎస్ పరంగా ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. గతేడాది చేసిన పనులకే ఇంకా బిల్లులు విడుదల చేయలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల 10 రోజుల పాటు స్పెషల్డ్రైవ్ నిర్వహించి నీటి ఎద్దడి తలెత్తే గ్రామాలను గుర్తించాం. – చంద్రమోహన్, ఈఈ, ఆర్డబ్ల్యూఎస్ గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్లతో ఇటీవల నిర్వహించిన సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. దీంతో ఈ నెల 3నుంచి 12వరకు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. నీటి ఎద్దడి తలెత్తే ఆవాసాలు, వేసవిలో సమస్యాత్మకంగా మారే నీటి వనరులను గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 208 చేతిపంపులు ఉపయోగంలో లేనట్లు నిర్ధారించారు. ఎండలు ముదిరేకొద్ది మరో 327 చేతిపంపుల్లో నీరు రాని పరిస్థితి తలెత్తే అవకాశమున్నట్లుగా తేల్చారు. అలాగే సింగిల్ ఫేజ్ విద్యుత్ మోటార్లు 45 పనికిరాకుండా పోగా, సీజనల్గా 113 మోటార్లకు ఇబ్బందులు తలెత్తే అవకాశమున్నట్లుగా గుర్తించారు. ఇక త్రీఫేజ్ విద్యుత్ మోటార్ల పరంగా ఏడు పనిచేయని పరిస్థితిలో ఉండగా ఐదు సమస్యాత్మకంగా మారే అవకాశమున్నట్లుగా గుర్తించి అధికా రులకు నివేదించారు. వీటితో పాటు జిల్లాలోని 88 చేదబావులు ఎండల తీవ్రతతో అడుగుంటిపోయే పరిస్థితి ఉందని గుర్తించారు. -
టెండర్లకు దరఖాస్తుల ఆహ్వానం
ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో పరిధిలో ని బస్ స్టేషన్లలో పక్కా స్థలం, ఖాళీ ప్రదేశాల్లో వ్యాపారాల నిర్వహణకు సంబంధించి టెండ ర్లు ఆహ్వానిస్తున్నట్లు డిపో మేనేజర్ కల్పన ప్రకటనలో పేర్కొన్నారు. ఆక్షన్, మ్యానువల్ టెండర్ల విధానాల్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్, గుడిహత్నూర్, జైనథ్, ఇచ్చోడ బస్స్టేషన్లలో మొత్తం 19 స్థలాలకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తు ఫారాలు ఈనెల 19వరకు డిపో మేనేజర్ కార్యాలయంలో అందుబాటులో ఉంటా యని పేర్కొన్నారు. ఈనెల 20న మధ్యాహ్నం 2గంటల వరకు రీజియన్ కార్యాలయంలో సమర్పించవచ్చని, అదే రోజు 3గంటల వరకు టెండర్లు ఫైనల్ అవుతాయని పేర్కొన్నారు. -
● క్రమబద్ధీకరణపై యంత్రాంగం దృష్టి ● పూర్తయిన వీధి వ్యాపారుల గుర్తింపు సర్వే ● 353 మంది ఉన్నట్లు తేలిన లెక్క ● త్వరలోనే వారికి ప్రత్యామ్నాయ స్థలాలు
ప్రత్యేక సర్వే.. కలెక్టర్, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఆయా ప్రాంతాల్లో వ్యాపారులు నిర్వహిస్తున్న వీధి వ్యాపారులు ఎంత మంది ఉన్నారనే దాన్ని గుర్తించేందుకు ప్రత్యేక సర్వే చేపట్టారు. ఐదుగురు రెవెన్యూ అధికారులు, ఐదుగురు టౌన్ప్లానింగ్ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆయాచౌక్ల్లో సర్వే నిర్వహించారు. వీధి వ్యాపారి పేరు, సెల్నంబర్, వారు నిర్వహించే వ్యాపారం వంటి వివరాలు సేకరించారు. సర్వే అనంతరం వారిని అక్కడి నుంచి తరలించనున్నారు. ఇప్పటికే గుర్తించిన గణేశ్ థియేటర్ స్థలం, పాత వెంకటేశ్వర సామిల్ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా స్థలాలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆయా చౌక్లను సుందరంగా మార్చేందుకు సైతం ఈ ప్రక్రియ తోడ్పడుతుందనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కై లాస్నగర్: పట్టణంలోని వ్యాపార, వాణిజ్య ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఇక్కట్లు తొలగేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మున్సిపల్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో చర్యలకు శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంలోని రహదారులపై భారీ డివైడర్లతో పాటు వాటికిరువైపులా తోపుడుబండ్లు ఏర్పాటు చేసుకుని వీధి వ్యాపారులు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా మార్గాల్లోని రోడ్లన్నీ ఇరుకుగా మారి ట్రాఫిక్కు తరచూ అంతరాయం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆటోలు వెళ్లిన సమయంలో మరో వాహనం వెళ్లలేని పరిస్థితి. పాదాచారులు నడిచేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని తొలగించే దిశగా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. వీధి వ్యాపారుల గుర్తింపునకు ప్రత్యేక సర్వే చేపట్టారు. మొత్తం 353 మంది ఉన్నట్లు లెక్క తేలింది. ఈ సమాచారాన్ని మున్సిపల్ కార్యాలయంలో అందజేశారు. వివరాలను కమిషనర్ పరిశీలించి కలెక్టర్కు నివేదిక అందజేయనున్నారు. అనంతరం వారికి నిర్దేశిత ఎంపిక స్థలాల్లో వ్యాపారాల కోసం స్థలాలు కేటాయించనున్నారు. జిల్లా కేంద్రంలో ఇదీ పరిస్థితి.. ఆదిలాబాద్ పట్టణంలోని దేవీచంద్చౌక్ నుంచి గాంధీచౌక్ మీదుగా అంబేడ్కర్చౌక్ వరకు, అలాగే అంబేడ్కర్ చౌక్ నుంచి శివాజీచౌక్ వరకు వ్యాపార, వాణిజ్య పరంగా ప్రధాన కూడళ్లు. వివిధ పనుల నిమిత్తం పట్టణవాసులే కాకుండా చుట్టు పక్కల గ్రా మాల నుంచి నిత్యం జనం భారీగా వస్తుంటారు. ఆయా ప్రాంతాల్లోని రోడ్లు అసలే చిన్నవిగా ఉండగా, వాటిపై డివైడర్లు నిర్మించడం, అలాగే వాటికి ఇ రువైపులా వీధి వ్యాపారులు తోపుడుబండ్లు ఏర్పా టు చేయడంతో మరింత ఇరుకుగా మారుతున్నా యి. దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలను రోడ్లపై, షాపుల ఎదుట పార్కింగ్ చేస్తుండడంతో సమస్య మరింత జఠిలమవుతుంది. ఈ పరిస్థితిని తొలగించాలనే ఉద్దేశంతో కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇటీవల మున్సి పల్, పోలీస్, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమీ క్ష నిర్వహించారు. వీధి వ్యాపారులను అక్కడి నుంచి తొలగించడంతో పాటు భారీగా ఉన్న డివైడర్ల ఎత్తు, వెడల్పు తగ్గించాలని ఆదేశించారు. తద్వారా ట్రాఫిక్ సమస్యను నియంత్రించవచ్చని తెలిపారు. వ్యాపారులు సహకరించాలిప్రజలకు ఇబ్బందికరంగా మారిన ట్రాఫి క్ సమస్యను తొలగించే దిశగా ప్రత్యేక దృష్టి సారించాం. ప్రధానచౌక్ల్లో ఉన్న వీధి వ్యాపారుల గుర్తింపు సర్వే పూర్తయింది. 353 మంది ఉన్నట్లుగా లెక్క తేలింది. వీరికి గణేశ్ థియేటర్, వెంకటేశ్వర సామిల్ స్థలాలు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వ్యాపారులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. వారు కూడా సహకరించాలి. – సీవీఎన్ రాజు, మున్సిపల్ కమిషనర్ -
ఈవీఎంల గోదాం తనిఖీ
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతీ నెల తనిఖీల్లో భాగంగా శనివారం స్థానిక శాంతినగర్లో గల ఈవీఎంల గోదాంను కలెక్టర్ రాజర్షి షా తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూం సీలు తెరిపించి గోదాంలో భద్రపర్చిన ఈవీఎంల స్థితిగతులను స్వయంగా పరిశీలించారు. అనంతరం స్ట్రాంగ్ రూంకు యథావిధిగా సీల్ వేయించి, తనిఖీ రిజిస్టర్లో సంతకం చేశారు. గోదాం పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాథోడ్ పంచపూల, సిబ్బంది దేవరాజ్, తదితరులున్నారు. -
వేధింపులకు గురిచేస్తే సమాచారమివ్వండి
ఆదిలాబాద్టౌన్: యువతులు, మహిళలను వేధింపులకు గురిచేస్తే షీటీంకు ఫిర్యాదు చేయాలని షీటీం ఇన్చార్జి సునీత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్కళాశాల వసతి గృహంలో కొనసాగుతున్న భీంపూర్, మావల మండ ల కేజీబీవీ విద్యార్థులకు శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ, విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పోకిరీలు వేధిస్తే డయల్ 100కు సమాచారమివ్వాలన్నారు. వివరాలు గోప్యంగా ఉంచుతామని, అలాగే కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పోక్సో, బాల్యవివాహ, ఇతర చట్టాలను వివరించారు. ఇందులో డీఈవో టి.ప్రణీత, పాఠశాలల ప్రత్యేకాధికారులు సీహెచ్.రజనీ, సువర్ణ, సీఆర్టీలు తదితరులు పాల్గొన్నారు. -
ఫలించిన నిరీక్షణ
● రూ.4.90 కోట్ల పెండింగ్ ఎంపీ ల్యాడ్స్ విడుదల ● బిల్లుల చెల్లింపునకు అధికారుల కసరత్తు ● కాంట్రాక్టర్లు, నాయకుల హర్షంకై లాస్నగర్: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గత ఎంపీ హయాంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టి బిల్లుల కోసం ఎదురుచూస్తున్న కాంట్రాక్టర్లు, స్థానిక మాజీ ప్రజాప్రతినిధుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. 17వ లోక్సభకు సంబంధించి మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న రూ.4.90 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగానైనా విడుదల చేసింది. వాటి చెల్లింపునకు జిల్లా ముఖ్య ప్రణాళికశాఖ విభాగం అధికారులు కసరత్తు ప్రారంభించారు. వారం, పది రోజుల్లో పనులు చేసిన వారందరికీ బిల్లులు అందించేలా చర్యలు చేపడుతున్నారు. కేంద్ర నిర్ణయంపై ఈ నిధులతో పనిచేసిన వారిలో హర్షం వ్యక్తమవుతోంది. మూడేళ్ల క్రితం పనులు పూర్తి... 2019–24కి సంబంధించి 17వ లోక్సభకు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా సోయం బాపూరావు కొనసాగారు. ఈ సమయంలో ఎంపీ ల్యాడ్స్ ద్వారా నియోజకవర్గ పరిధిలోని ఉమ్మడి ఆదిలాబా ద్ జిల్లాలో రూ.4.90 కోట్లతో కూడిన 160 పనులను ప్రతిపాదించారు. ఇందులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, గ్రావెల్ రోడ్లు, కమ్యూనిటీ హాల్స్ వంటి తది తర పనులున్నాయి. ఎంపీ ప్రతిపాదించగా వాటికి కలెక్టర్ ఆమోద ముద్ర వేశారు. పరిపాలన అనుమతులు మంజూరు కావడంతో కాంట్రాక్టర్లు, బీజేపీ నాయకులు, అప్పటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్లు ఈ పనులను తమతమ ప్రాంతాల్లో చేపట్టి పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో.. ఆదిలాబాద్ జిల్లాలో రూ.3.90 కోట్లతో 137 పనులు చేపట్టారు. అలాగే నిర్మల్ జిల్లాలో రూ.52లక్షలతో 11 పనులు, కుమురంభీం జిల్లాలో రూ.43లక్షలతో 11 పనులు, మంచిర్యాల జిల్లాలో రూ.4లక్షలతో కూడిన ఒక పనిని పూర్తి చేశారు. ఈ పనులు పూర్తయి ఏళ్లు గడిచినప్పటికీ నిధుల విడుదలలో కేంద్రం తీవ్ర జాప్యం చేసింది. ఎంపీగా సోయం పదవీ కాలంలో ఎంత ప్రయత్నించినప్పటికీ విడుదల కాలేదు. ఏళ్లుగా బిల్లులు రాకపోవడంతో పనులు చేసిన వారంతా ఇప్పటి వరకు అధికారులు, కార్యాలయాల చుట్టు తిరిగి ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు విడుదల... గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా గోడం నగేశ్ బీజేపీ తరఫున గెలుపొందారు. ఆయన గెలిచిన రెండు నెలలకే తన నియోజకవర్గ నిధికి సంబంధించి కేంద్రం రూ.5కోట్ల ఎంపీ ల్యాడ్స్ విడుదల చేసింది. అయితే సోయం పదవీ కాలానికి సంబంధించిన నిధులు మాత్రం పెండింగ్లోనే పెట్టింది. ఎంపీ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలవ్వడంతో ఆ నిధులు విడుదలవుతాయో లేవోనని పనులు పూర్తి చేసిన వారిలో ఆందోళన వ్యక్తమైంది. వాటి కోసం గంపెడాశతో ఎదురుచూస్తుండగా వారి నిరీక్షణకు తెరదించుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు పెండింగ్లో ఉన్న రూ.4.90 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ బిల్లులను చెల్లించే దిశగా ప్రణాళిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. వారం, పది రోజుల్లో పూర్తిస్థాయిలో చెల్లించేలా చర్యలు చేపడుతున్నారు. ఏళ్లుగా బిల్లుల కోసం నిరీక్షిస్తున్న వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఫైర్స్టేషన్కు నూతన వాహనాలు
ఆదిలాబాద్టౌన్: విపత్తు సమయాల్లో బాధితులను త్వరితగతిన సురక్షిత ప్రాంతాలకు తరలించేందు కోసం ఆదిలాబాద్ ఫైర్స్టేషన్కు ఒక బస్సు, ట్రక్ మంజూరైంది. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఫైర్స్టేషన్లో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సురేశ్కుమార్ శనివారం వాటిని ప్రారంభించారు. పని తీరును పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విపత్తు సమయంలో సామగ్రితో పాటు ఇతర వస్తువులను తరలించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ఫైర్ స్టేషన్లకు వాహనాలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ప్రమాదాలు జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టేందుకు ఇవి ఎంతగానో దోహదపడుతాయన్నారు. కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్, సిబ్బంది పాల్గొన్నారు. -
శ్రీవేంకటేశ్వర బ్రహ్మోత్సవాలు ప్రారంభం
బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులు, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తలమడుగు: మండల కేంద్రంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శని వారం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్ఛరణ నడుమ హోమం, యజ్ఞం నిర్వహించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పూజలు చేసి ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇందులో కాటిపెల్లి వసంత్ రెడ్డి, పిడుగు సంజీవరెడ్డి, వెంకటేశ్, కిరణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
కైలాస్నగర్: ఈనెల 27న నిర్వహించనున్న నిజా మాబాద్–కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణపై పీవోలు, ఏపీవోలకు జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే మండలి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొంత భిన్నంగా ఉంటుందన్నారు. బ్యాలెట్ పద్ధతిన చేపట్టే ఓటింగ్ నిర్వహణకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నందున ఓపిగ్గా, సంయమనంతో వ్యవహరించాలన్నారు. 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వర కు పోలింగ్ ఉంటుందన్నారు. నిర్దేశిత సమ యం లోపు కేంద్రం పరిధిలో క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించాలన్నారు. పోలింగ్కు ఒక రోజు ముందుగానే ఈ నెల 26న ఉదయం 8గంట లకు ప్రిసైడింగ్ అధికారులు తమ బృందంతో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకోవాలని సూచించారు. పంపిణీ కేంద్రాల వద్ద అందించే పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సులను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, చెక్లిస్ట్లో పొందుపర్చిన మెటీరియ ల్ ఉందా లేదా అన్నది జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. అనంతరం బృందంతో కలిసి యంత్రాంగం సమకూర్చిన వాహనంలోనే నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఎలాంటి సందేహాలున్నా శిక్షణ తరగతుల్లో మాస్టర్ ట్రైనర్లను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రెయినీ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పోస్టర్ ఆవిష్కరణ ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ గురుకుల డిగ్రీ కళా శాల ప్రవేశాల ప్రచార పోస్టర్ను కలెక్టర్ తన కార్యాలయ చాంబర్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శివకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాజర్షి షా ఎన్నికల నిర్వహణపై పీవో, ఏపీవోలకు శిక్షణ -
17ఏళ్ల కల.. నెరవేరిన వేళ
● డీఎస్సీ–2008 అభ్యర్థులకు పోస్టింగ్ ● హైకోర్టు ఉత్తర్వులతో కాంట్రాక్ట్ టీచర్ కొలువు ● అభ్యర్థుల్లో ఆనందోత్సాహాలు ● జిల్లాలో 10 మందికి ప్రయోజనం ఆదిలాబాద్టౌన్: 2008–డీఎస్సీ బీఎడ్ అభ్యర్థుల న్యాయ పోరాటం ఫలించింది. ఎట్టకేలకు కాంట్రాక్ట్ కొలువు దక్కింది. రెండు, మూడు నెలల క్రితం అభ్యర్థుల సర్టిఫికెట్లను విద్యాశాఖ అధికారులు పరిశీలించిన విషయం తెలిసిందే. అయితే ప్రక్రియ పూర్తయినప్పటికీ ప్రభుత్వం నుంచి వీరికి పోస్టింగ్ విషయంలో గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో జాప్యం అయింది. దీంతో సదరు అభ్యర్థులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును ఈ నెల 17వ తేదీలోగా పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆదేశించింది. దీంతో విద్యాశాఖ అధికారులు ఆగమేఘాల మీద నియామక ప్రక్రియ చేపట్టారు. అభ్యర్థులకు శనివారం కౌన్సెలింగ్ నిర్వహించి నియామక పత్రాలు అందజేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 74 మందికి ప్రయోజనం చేకూరగా ఆదిలా బాద్ జిల్లాలో 10 మంది ఉన్నారు. వీరిలో తొమ్మిది మంది కౌన్సెలింగ్కు హాజరుకాగా వారికి వివిధ పాఠశాలల్లో పోస్టింగ్ కల్పించారు. ఏళ్లుగా నిరీక్షిస్తున్న వారిలో హర్షం వ్యక్తమవుతుంది. కాంట్రాక్ట్ పద్ధతిలోనైనా ప్రభుత్వ కొలువు దక్కడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా వీరికి డీఈవో ప్రణీత నియామక ఉత్తర్వులు అందజేశారు. కార్యాలయ ఉద్యోగులు తుషార్, సతీష్, సాయితేజ, గోవర్దన్ ఇందులో పాల్గొన్నారు. ఫలించిన నిరీక్షణ ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం 2008లో డీఎస్సీ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ సమయంలో కామన్ నియమాకాలు చే పట్టారు. దీంతో ఎస్జీటీ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో 70:30 నిష్పత్తిలో డీఎడ్, బీఎడ్ అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 135 మంది అభ్యర్థులు ఎంపికై నప్పటికీ 70: 30 కారణంగా ఉద్యోగా లకు దూరమయ్యారు. అప్పటి నుంచి వీరు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు వీరికి కాంట్రాక్ట్ పద్ధతిలోనైనా ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో విద్యాశాఖ ఆ దిశగా చర్యలు చేపట్టింది. అభ్యర్థుల వివరాలను సేకరించింది. చాలా మంది ఇతర శాఖల్లో కొలువులు పొందారు. అర్హులుగా గుర్తించిన వారిలో ప్రస్తుతం ఉ మ్మడి జిల్లా పరిధిలో 74 మంది మాత్రమే మిగిలిపో యారు. ఆదిలాబాద్ జిల్లాకు 10 మంది, మంచిర్యాలకు 14 మంది, నిర్మల్కు 20 మంది, కుమురంభీం ఆసిఫాబాద్కు 30మందిని ఎంపిక చేశారు. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తయినప్పటికీ పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ క్రమంలో వారు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు అధికారులు నియామక ప్రక్రియ పూర్తి చేశారు.కాంట్రాక్ట్ పద్ధతిన.. 2008 డీఎస్సీ బీఎడ్ అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిన పోస్టింగ్ ఇచ్చారు. జిల్లాలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి, ఉపాధ్యాయులు లేని పాఠశాలలను ఎంపిక చేసి పోస్టింగ్ కల్పించారు. బోథ్, గాదిగూడ మండలానికి ఇద్దరు చొప్పున, భీంపూర్, జైనథ్, బేల, నేరడిగొండ, బజార్హత్నూర్, సిరికొండ మండలాలకు ఒకరు చొప్పున కేటాయించారు. వీరికి నెలకు రూ.31,040 వేతనం చెల్లించనున్నారు. 2024–25 విద్యా సంవత్సరం ముగిసే వరకు ఈ వేతనంపై వీరు సేవలందించాల్సి ఉంటుంది. నూతన సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో మళ్లీ వీరంతా తిరిగి రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నియామకం పొందిన కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు సంబంధిత ఎంఈవో కార్యాలయాల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అగ్రిమెంట్ బాండ్లను సైతం అందించాల్సి ఉంటుందని అధికారులు తెలి పారు. కాగా 17 ఏళ్ల తర్వాత పాఠాలు బోధించేందుకు బడిబాట పట్టడంతో వారిలో ఆనందం వ్యక్తమవుతుంది. -
డిజిటలైజేషన్తో రికార్డులు మరింత భద్రం
ఆదిలాబాద్టౌన్: కోర్టులోని కేసుల రికార్డులను భ ద్రంగా ఉంచేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిజిటలైజేషన్ చేస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకర్రావు అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసొసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన డిజిటలైజేషన్ కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఇప్పటి వరకు మ్యానువల్గా ఉన్న రికార్డులను కంప్యూటరీకరిస్తూ భద్రపరుస్తున్నామన్నారు. అనంతరం కోర్టు హాలులో పెండింగ్ కేసులపై పో లీసు అధికారులతో సమీక్షించారు. అలాగే మార్చి 8న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో అత్యధి కంగా రాజీపడదగ్గ కేసులను పరిష్కరించేలా చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు ప్రమీళజైన్, డీఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, అదనపు ఎస్పీ సురేందర్ రావు, బార్ అసొసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేశ్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దుఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దని, వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే చికిత్స పొందవచ్చని జిల్లా జడ్జి కె.ప్రభాకరరావు అన్నారు. కోర్టు ఉద్యోగులు, సి బ్బంది కోసం కోర్టుప్రాంగణంలో శనివారం ఏర్పా టు చేసిన ప్రత్యేక వైద్యశిబిరాన్ని జడ్జి ప్రారంభించి మాట్లాడారు. ప్రతి మూడు నుంచి ఆరు నెలలకు ఒక సారి వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు ప్రమీళ జైన్, డీఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజ న్య, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, క్షయ నియంత్రణ అధికారి సుమలత, బార్ అసొసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేశ్ పాల్గొన్నారు. -
‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం కావాలి
● కలెక్టర్ రాజర్షి షా ● ఆర్వో, ఏఆర్వోలకు శిక్షణ కై లాస్నగర్: స్థానిక సంస్థలైన పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఎన్నికల రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు జెడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా ఎన్నికల విధులు జాగ్రత్తగా నిర్వర్తించాలన్నారు. ఈసీ షెడ్యూల్కు అనుగుణంగా ఆర్వోలు నోటిఫికేషన్ జారీ చేసి సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలను మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు. సమయపాలన పక్కాగా పాటించాలన్నారు. అంతకుముందు ఆర్వోలు, ఏఆర్వోల విధులు, పాటించాల్సిన నిబంధనలపై మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, జెడ్పీ సీఈవో జి.జితేందర్రెడ్డి, డీఎల్పీవో ఫణిందర్రావు, మాస్టర్ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఈ ఆర్థిక సంవత్సరంలో మండలాల వారీగా పన్నుల వసూళ్ల తీరు ఇలా..
మండలం పంచాయతీలు లక్ష్యం వసూలైంది వసూలు కావాల్సింది (రూ.లక్షల్లో)ఆదిలాబాద్రూరల్ 34 39,00,752 27,47,405 11,53,347 బజార్హత్నూర్ 30 31,24,169 22,13,678 9,10,491 బేల 37 43,61,373 32,40,931 11,20,442 భీంపూర్ 26 23,40,456 18,31,241 5,09,215 బోథ్ 33 76,96,465 46,15,491 30,80,974 గుడిహత్నూర్ 26 31,03,667 18,02,037 13,01,630 ఇచ్చోడ 32 56,51,388 38,64,119 17,87,269 జైనథ్ 42 41,96,433 27,09,594 14,86,839 మావల 03 9,36,005 6,08,506 3,27,499 నేరడిగొండ 32 41,24,531 25,15,680 16,08,851 సిరికొండ 19 18,81,664 10,79,090 8,02,574 తలమడుగు 28 31,94,463 17,13,528 14,80,935 తాంసి 13 28,57,117 16,96,202 11,60,915 గాదిగూడ 25 17,57,474 12,66,000 4,91,474 ఇంద్రవెల్లి 28 55,23,969 30,88,389 24,35,580 నార్నూర్ 23 29,11,741 17,17,011 11,94,730 ఉట్నూర్ 37 109,46,667 32,90,198 76,56,469 -
అమరుల త్యాగాలు చిరస్మరణీయం
ఆదిలాబాద్: పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్ల త్యాగం చిరస్మరణీయమని సనాత న హిందూ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షుడు ప్ర మోద్ కుమార్ ఖత్రి అన్నారు. జిల్లా కేంద్రంలో ని కార్గిల్ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద మాజీ సైనికులు, సమితి ఆధ్వర్యంలో శుక్రవా రం కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం సురక్షితంగా ఉంటుందంటే సైనికుల త్యాగాలే కారణమన్నారు. ఉగ్రవాదుల ఉనికిని తుద ముట్టించినప్పుడే అమరుల త్యాగాలకు సార్థకత చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో మా జీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్ దాస్, ఉత్సవ సమితి సభ్యులు, మాజీ సైనికులు పాల్గొన్నారు. -
సొసైటీ పాలకవర్గాల గడువు పెంపు
కై లాస్నగర్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) పాలకవర్గాల గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈనెల 14తో పాలకవర్గాల గడువు ముగిసింది. దీంతో పంచాయ తీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీల మాదిరిగానే సొసైటీల్లోనూ ప్రత్యేకాధికారుల పాలనను అమలు చే స్తారనే చర్చ సాగింది. అయితే తమ పదవీకా లం పొడిగించాలంటూ రాష్ట్రంలోని డీసీసీబీ చై ర్మన్లు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి విన్నవించారు. వారి విజ్ఞప్తిని పరిగణలో కి తీసుకున్న ప్రభుత్వం పీఏసీఎస్ పాలకవర్గా ల పదవీకాలాన్ని మరో ఆరు నెలల పాటు పొ డిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీసీసీబీ చైర్మన్లకు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఉత్తర్వులు అందజేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లతో పాటు 77 సహకార సంఘాల చై ర్మన్లు, డైరెక్టర్లు మరో ఆరు నెలల పాటు ఆయా పదవుల్లో కొనసాగనున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
● కంది పంట దిగుబడి అమ్మేందుకు వెనుకంజ ● కొనుగోళ్లు మొదలై పది రోజులైనా.. నామమాత్రంగానే విక్రయాలు ● పరిమితి పెంపు, ధర హెచ్చుపై రైతుల ఆశలు
సాక్షి,ఆదిలాబాద్: ఇది జిల్లాలో కంది రైతుల పరి స్థితి. ఈ పంట దిగుబడులు చేతికొచ్చి రోజులు గ డుస్తున్నాయి. మార్కెట్లో కొనుగోలు కేంద్రాలు ప్రా రంభించి పది రోజులవుతుంది. అయితే రైతులు మాత్రం కంది పంట దిగుబడులను మార్కెట్కు తీసుకొచ్చేది లేదు.. అమ్మేది లేదన్నట్టుగా తమ ఇంట్లో, లేనిపక్షంలో చేనులోనే నిల్వ చేసేశారు. దీనికి కారణం లేకపోలేదు. ప్రభుత్వం ఎకరానికి కేవలం 3.31 క్వింటాళ్ల చొప్పున రైతు నుంచి పంట దిగుబడి కొనుగోలు చేస్తామని పరిమితి విధించింది. గతేడాది కందులకు మార్కె ట్లో మద్దతు ధర మించి మంచి ధర లభించింది. కొనుగో ళ్లు ప్రారంభం కాకముందు మార్కెట్లో కందులు క్వింటా లుకు రూ.8వేల నుంచి రూ.8,500 వరకు ధర లభించగా, సీజన్ మొదలు కాగానే ఈ ధర అమాంతం తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో రూ.7,200 వరకు మాత్రమే లభిస్తుంది. దీంతో కంది రైతులు ఇటు పరిమితి పెంపు కోసం నిరీక్షిస్తూనే మరోపక్క మార్కెట్లో కందులకు ధర పెరుగుతుందని ఆశతో దిగుబడులను ఇళ్లలోనే నిల్వ చేసేశారు. ఇదీ పరిస్థితి.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నాఫెడ్కు అనుబంధంగా మార్క్ఫెడ్ రాష్ట్రంలో కందులను కొనుగోలు చే స్తుంది. జిల్లాలో పది రోజుల క్రితం కొనుగోళ్లు ప్రా రంభించింది. అయితే ఇప్పటివరకు మార్కెట్లో నా మమాత్రంగానే రైతులు కందులను విక్రయించారు. ఇదిలా ఉంటే ఒక్కో రైతు నుంచి రోజుకు 40 క్వింటాళ్ల వరకు మార్క్ఫెడ్ కొనుగోలు చేస్తుంది. అయి తే ఎకరానికి పరిమితి నిబంధన కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఆదిలా బాద్ ఎమ్మెల్యే శంకర్ వ్యవసాయ శాఖమంత్రి తు మ్మల నాగేశ్వర్రావును ఫోన్లో సంప్రదించి ఎకరా నికి 8క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలని కోరా రు. త్వరలోనే ఈ పరిమితి పెంచుతామని మంత్రి భరోసానిచ్చారు. ఈనేపథ్యంలో ఆ పెంపు ఎప్పుడు జరుగుతుందా అని రైతులు ఎదురుచూస్తున్నారు. ‘సాక్షి’ ఎఫెక్ట్.. జిల్లాలో పది రోజుల క్రితం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొదట నాలుగు కొనుగోలు కేంద్రాలు ఆదిలా బాద్, జైనథ్, ఇంద్రవెల్లి, బోథ్లో ఏర్పాటు చేసి కందుల కొనుగోళ్లు ప్రారంభించారు. అయితే గతేడాది ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈసారి సగానికి తగ్గించారని ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోనూ రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తాము మరో చోటికి వెళ్లి పంటను అమ్ముకోవడం ద్వారా దూరభారం, రవాణా ఖర్చు పెరుగుతుందని వారిలో ఆందోళన కనిపించింది. తిరిగి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ వ్యక్తమైంది. ఈ డిమాండ్కు తలొగ్గిన మార్క్ఫెడ్ గతేడాది మాదిరిగానే తిరిగి బేల, తాంసి, నార్నూర్, ఇచ్చోడ సెంటర్లను పునరుద్ధరించి కొనుగోళ్లను ప్రారంభించారు. ‘సాక్షి’ చొరవను అభినందిస్తూ పలువురు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.జిల్లాలో..కంది సాగు విస్తీర్ణం 57,258 ఎకరాలు సాగు చేసిన రైతులు 68,581దిగుబడి అంచనా 3,43,549 క్వింటాళ్లు మార్క్ఫెడ్ కొనుగోలు లక్ష్యం 1,85,000 క్వింటాళ్లు ఇప్పటివరకు కొనుగోలు చేసింది 3వేల క్వింటాళ్లు ప్రభుత్వ మద్దతు ధర రూ.7,550 (క్వింటాలుకు) ప్రైవేట్ ధర రూ.7,200 (క్వింటాలుకు)పరిమితి పెంపుపై ప్రతిపాదనలు పంపించాం..రైతుల నుంచి ఎకరా నికి 6 క్వింటాళ్ల కందుల దిగుబడులను కొనుగోలు చేసే విధంగా పరిమితి పెంచాలని ఇదివరకే ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించడం జరిగింది. ప్రభుత్వం నుంచి నిర్ణయం రావాల్సి ఉంది. – ప్రవీణ్రెడ్డి, మార్క్ఫెడ్ డీఎం, ఆదిలాబాద్ -
న్యాయవాదుల నిరసన
ఆదిలాబాద్టౌన్: రంగారెడ్డిలోని ఎల్బీనగర్ కోర్టులో జడ్జిపై నిందితుడు దాడి చేయడాన్ని నిరసిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శు క్రవారం విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు నగేశ్ మా ట్లాడుతూ, న్యాయమూర్తిపై ట్రయల్ నిందితు డు దాడి చేయడం పోలీసుల వైఫల్యమే కారణమని పేర్కొన్నారు. నిందితుడిపై చర్యలు తీసుకోవడంతో పాటు కోర్టులో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చ ర్యలు చేపట్టాలన్నారు. ఇందులో ప్రధాన కార్యదర్శి సంతోష్, సభ్యులు చందుసింగ్, అమరేందర్రెడ్డి, ప్రదీప్, సుధీర్, మహేందర్, రవీందర్, గంగారెడ్డి, దిలీప్దేశ్ముఖ్, అబ్దుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
సమయపాలన పాటించకుంటే చర్యలు
● రిమ్స్ డైరెక్టర్ను వివరణ కోరిన కలెక్టర్ ● ‘సాక్షి’ కథనంపై ఆరా..ఆదిలాబాద్టౌన్: రిమ్స్ వైద్యులు, సిబ్బంది సమ య పాలన పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవని డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్లో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదని ఈనెల 13న ‘వీళ్లింతే.. మారరంతే..!’ ‘సాక్షి’లో శీర్షికన ప్రచురితమైన కథనానికి కలెక్టర్ రాజర్షిషా స్పందించారు. రిమ్స్ డైరెక్టర్ను వివరణ కోరారు. వైద్యులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. ఈ మే రకు రిమ్స్ డైరెక్టర్ ఆస్పత్రిలోని ప్రొఫెసర్లు, ఆయా విభాగాల హెచ్వోడీలు, అసోసియేషన్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. రిమ్స్కు వచ్చేది పేదలే అధికమని, జిల్లాలో ఎక్కువ శాతం మంది ఆదివాసీ, గిరిజనులు ఉన్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ విధులు సక్రమంగా నిర్వహించాలని, అలాగే సమయపాలన పాటించాలన్నారు. నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
పన్ను వసూళ్లపై దృష్టి
● ఫోకస్ పెంచిన పంచాయతీ సిబ్బంది ● ఇప్పటి వరకు 58.39 శాతమే వసూలు ● శతశాతం దిశగా శ్రమిస్తున్న కార్యదర్శులుజిల్లాలో.. గ్రామ పంచాయతీలు 468 ఆస్తి పన్ను బకాయిలు రూ.58,51,923 ఇందులో వసూలైంది రూ.17,44,264 ఈ సంవత్సర పన్ను లక్ష్యం రూ.6,26,56,411 ఇప్పటివరకు వసూలైంది రూ.3,82,54,836 వసూలు చేయాల్సింది రూ.2,85,09,234కై లాస్నగర్: గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలిచ్చే నిధులు ఎంత కీలకమో, పంచాయతీ ల్లో వసూలయ్యే పన్నులు అంతే అవసరం. అయితే ఏడాదిగా ఎస్ఎఫ్సీ, 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల పూర్తిగా నిలిచిపోయింది. దీంతో జీపీలు ఆర్థికంగా సతమతమవుతున్నాయి. గ్రామాల్లో స మస్యలు పరిష్కరించుకోవాలంటే పన్నులే ప్రధాన ఆదాయ వనరు. ఇన్నాళ్లు వివిధ ప్రభుత్వ కార్యక్రమాలతో బీజీగా గడిపిన కార్యదర్శులు ప్రస్తుతం పన్ను వసూళ్లపై దృష్టి సారించారు. ఉదయం 8గంటలకే గ్రామాలకు చేరుకుంటున్నారు. సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరుగుతూ పన్ను వసూలు చేస్తున్నారు.ఈ ఆర్థిక సంవత్సరం పన్ను వసూళ్ల లక్ష్యం (బకాయిలతో కలిపి) రూ.6కోట్ల 85లక్షల8వేల334. ఇందులో ఇప్పటి వరకు వసూలైంది రూ.3కో ట్ల 99లక్షల 99వేల100. ఇది 58.39 శాతం మాత్ర మే. ఆర్థిక సంవత్సరం మరో 43 రోజుల్లో ముగియనుంది. గడువులోపు శతశాతం లక్ష్యసాధన కోసం సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సర్వేల ప్రభావం.. గ్రామ పాలనలో పంచాయతీ కార్యదర్శులదే కీలకపాత్ర. వీరంతా మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రజాపాలన, ఇందిరమ్మ ఇళ్ల సర్వేల్లో బీజీబీజీగా గడిపారు. ఫలితంగా పన్నుల వ సూళ్లపై ఈ ప్రభావం పడింది. ఇప్పటికే 80 శాతా నికి పైగా వసూలు కావాల్సి ఉండగా కేవలం 58 శా తానికి పరిమితం కావడం గమనార్హం. ఇన్నాళ్లు సర్వేల్లో బీజీగా గడిపిన కార్యదర్శులు ప్రస్తుతం పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. 66 పంచాయతీల్లో వందశాతం జిల్లాలో 468 గ్రామ పంచాయతీలుండగా ఇందులో 66 జీపీలు ఇప్పటికే వందశాతం పన్ను వసూలు చేసి ఆదర్శంగా నిలిచాయి. వీటిలో అత్యధికంగా నార్నూర్ మండలంలో 12 జీపీలుండగా, ఆదిలా బాద్ రూరల్లో 10, భీంపూర్లో ఏడు, ఇచ్చోడలో ఆరు, ఇంద్రవెల్లిలో ఐదు, బజార్హత్నూర్, బేలలో నాలుగు చొప్పున, నేరడిగొండ, ఉట్నూర్, గాదిగూడల్లో మూడుచొప్పున, బోథ్, తలమడుగు, సిరికొండల్లో రెండు చొప్పున, తాంసిలో ఒకటి ఉన్నాయి. ఇక పన్ను వసూళ్లలో అత్యంత వెనుకబడిన పంచాయతీలను పరి శీలిస్తే.. గుడిహత్నూర్ మండలం మచ్చాపూర్లో సున్న శాతం ఉండగా, ఇచ్చోడ మండలం బొరిగా మలో 9శాతం, ఇంద్రవెల్లి మండలం హీరాపూర్, సిరికొండ మండలంలోని ఖానాపూర్ 11 శాతంతో వెనుకబడి ఉన్నాయి. -
పాఠశాలల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
కై లాస్నగర్: పాఠశాలల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని విద్యాశాఖ అధికారులను కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. పీఎంశ్రీ పథకం కింద ఎంపికై న 24 పాఠశాలలకు మంజూరైన నిధులను వసతుల కల్పన కోసం సత్వరమే వినియోగించాలని స్పష్టం చేశారు. తరగతి గదులు, కిచెన్గార్డెన్, ఫీల్డ్ విజిట్, ఎల్ఈడీ లైటింగ్, తదితర పనులకు వినియోగించుకోవాలన్నారు. సమగ్ర శిక్ష, పీఎంశ్రీ ఫండ్స్పై విద్యాశాఖ కార్యదర్శి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో పీఎంశ్రీ పథకం నిధుల వినియోగం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా పాఠశాలల్లో కేటాయించిన నిధులను సకాలంలో వినియోగించాలని సూచించారు. -
కష్టపడి చదవాలి
ఆదిలాబాద్టౌన్: విద్యార్థులు కష్టపడి చదివి కళాశాలతో పాటు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అదనపు కలెక్టర్ శ్యామలాదే వి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఏర్పడి 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం నిర్వహించిన వేడుకలకు ఆమె హాజరై మాట్లాడారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకునేందు కు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నా రు. ముందుగా విద్యార్థులు రక్తదానం చేశారు. సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. అ నంతరం పూర్వ ప్రిన్సిపాళ్లు నారాయణరావు, సంతోష్ కుమార్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అతీఖ్ బేగం, వైస్ ప్రిన్సిపాల్ రఘు, ఎన్సీసీ కేర్టేకర్ చంద్రకాంత్, ప్రోగ్రాం అధికారులు, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆక్రమణలా.. డయల్ చేయండి
● ఫిర్యాదుల స్వీకరణకు టోల్ఫ్రీ నంబర్ 94921 64153 ● భూ కబ్జాల కట్టడికి ప్రత్యేక టాస్క్ఫోర్స్ ● సద్వినియోగం చేసుకోవాలంటున్న కలెక్టర్ కై లాస్నగర్: ప్రభుత్వ, అసైన్డ్ భూములను ఎవరైనా కబ్జా చేశారా.. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వాటిని విక్రయించేస్తున్నారా.. ఇలాంటి వాటిపై ఎ వరికి ఫిర్యాదు చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇకపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. భూ ఆక్రమణలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు జిల్లా ఉన్నతాధికారులు టోల్ఫ్రీ నంబర్ ను అందుబాటులోకి తెచ్చారు. ప్రత్యేక టాస్క్ఫోర్స్ టీంను సైతం నియమించారు. కలెక్టర్ రాజర్షి షా ఆ దేశాల మేరకు చేపట్టిన ఈ చర్యలపై సర్వత్రా హ ర్షం వ్యక్తమవుతుంది. అయితే భూ ఆక్రమణలకు ఇ ప్పటికై నా అడ్డుకట్ట పడుతుందా.. లేదా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పాత పరిస్థితే పునరావృతమవుతుందా అనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లా కేంద్రం రోజురోజుకు విస్తరిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పట్టణంలో స్థిర నివాసం ఏ ర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఓపెన్ ప్లాట్లకు డిమాండ్ ఏర్పడుతోంది. తదనుగుణంగా రియల్ వ్యాపారం విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో కొంత మంది అక్రమార్కులు అసైన్డ్, ఇ నాం, ప్రభుత్వ భూములపై కన్నేస్తున్నారు. పట్టణంతో పాటు బట్టిసావర్గాం, మావల గ్రామాల్లోని మున్సిపల్ పరిధిలో ఎక్కడ ఖాళీస్థలం కనిపిస్తే చా లు అక్కడ గద్దల్లా వాలిపోతున్నారు. చర్యలు చేపట్టాల్సిన అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. అక్రమార్కులు పలువు రు అధికారులను మచ్చిక చేసుకుని తప్పుడు ధ్రువీ కరణపత్రాలు సృష్టిస్తున్నారు. వాటి ద్వారా క్రయ, విక్రయాలు జరుపుతూ బోగస్ డాక్యుమెంట్స్తోనే రిజిస్ట్రేషన్లు చేసి అమాయకులకు విక్రయించేస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ స్థలాలు ఎక్కువగా ఉన్న సర్వే నంబర్ 170, ఇందిరమ్మ కాలనీ, కేఆర్కే కాలనీ, బట్టిసావర్గాం, మావలల్లో ఈ దందా య థేచ్ఛగా సాగుతోంది. కొంతమంది మాజీ కౌన్సిలర్ల బంధువులు, దళారులు ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే పనిలో లీనమవుతున్నారంటే ఆక్రమణల పర్వం ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఎలా ఫిర్యాదు చేయాలంటే... కలెక్టర్ ఆదేశాల మేరకు భూ ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందు కోసం 94291 64153తో ప్రత్యేక టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నాగరాజును ఇన్చార్జిగా నియమించారు. ప్రజలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. ఈ ఫిర్యాదులను రిజిస్టర్లో నమోదు చేయడంతో పాటు సమాచారాన్ని ఎప్పటికప్పుడు టౌన్ప్లానింగ్ అధికారి, కమిషనర్కు చేరవేస్తారు. వారు వాటిపై విచారించి చర్యల నిమిత్తం టాస్క్ఫోర్స్ బృందానికి సమాచారమందిస్తారు. 12 మందితో టాస్క్ఫోర్స్ ప్రజా ఫిర్యాదుల ఆధారంగా సత్వర చర్యలు చేపట్టేందుకోసం మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖల కు సంబంధించి 12మంది సభ్యులతో కూడిన ప్ర త్యేక టాస్క్ఫోర్స్టీం ఏర్పాటు చేశారు. ఈ టీంకు ప్రత్యేక వాహనం సైతం కేటాయించనున్నారు. టో ల్ ఫ్రీకి అందిన ఫిర్యాదులను పరిశీలించిన మున్సి పల్ కమిషనర్, టీపీవో సూచనలకనుగుణంగా టా స్క్ఫోర్స్ టీం క్షేత్రస్థాయికి వెళ్లి వాటిని పరిశీలిస్తుంది. విచారణ చేపట్టి ఆక్రమణలు నిజమని నిర్ధారణ అయితే వాటిపై సత్వరమే చర్యలు చేపడుతుంది. ఫిర్యాదులను టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్, మున్సిపల్ డీఈలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా బాధ్యతలను అప్పగించారు. ఇక్కడి వరకు భాగానే ఉన్నా ఇది ఎంతవరకు అమలుతుందనేది సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. ఆక్రమణలను ఉపేక్షించబోం..భూ ఆక్రమణలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం. ఆది లాబాద్ మున్సిపల్ పరి ధిలో వాటిని కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధి కారులతో టాస్క్ఫోర్స్టీంను నియమించాం. అలాగే ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశాం. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఇలా అందిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టి ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటాం. – రాజర్షి షా, కలెక్టర్ -
అర్థం చేసుకుంటేనే ఆనందం
పెద్దలు కుదిర్చిందయినా ప్రేమ వివాహమైనా జీవి త భాగస్వామిని అర్థం చేసుకుంటేనే ఆనందంగా ఉండవచ్చు. లవ్ మ్యారేజ్లో పరస్పర ప్రేమ, ఆకర్షణ, అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటుంది. అరేంజ్ మ్యారేజ్లో అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం అనే ల క్షణాలు ఉన్నప్పుడు సంతోషంగా ఉంటారు. – రితిక్ చౌదరి లక్ష్యం నెరవేర్చాలి ఆర్థికంగా స్థిరపడ్డాక ప్రేమ పెళ్లయినా, పెద్దలు నిశ్చయించిన పెళ్లయిన చేసుకోవడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ముందుగా కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలను నెరవేర్చాలి. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే కలకాలం నిలిచి ఉంటున్నాయి. – ప్రియాంక, లెక్చరర్, డైట్ కళాశాల -
● జీవితంలో స్థిరపడ్డాకే ప్రేమైనా.. పెళ్లయినా ● కుటుంబ సభ్యులను ఒప్పించి లవ్ మ్యారేజ్ చేసుకోవడం మంచిదే ● యుక్త వయస్సులో ఆకర్షణకు గురికావొద్దు ● ఆన్లైన్ ప్రేమలోపడి మోసపోవద్దు ● నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా డైట్ ఛాత్రోపాధ్యాయులతో ‘సాక్షి’ డిబేట్
నేటి యువత ప్రేమ ముసుగులో విలువైన జీవితాలను నాశనం చేసుకుంటోంది. టీనేజ్లో చదువుపై శ్రద్ధపెట్టి అనుకున్న లక్ష్యాలను సాధించుకోవాల్సిన సమయంలో ఆకర్షణకు గురై పక్కదారి పడుతున్నారు. తెలిసీ తెలియని వయస్సులో ప్రేమలో పడుతున్నారు.. అయితే చాలా మంది ప్రేమ పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖపడలేక పోతున్నారు.. జీవితంలో స్థిరపడ్డాక పెద్దలు నిశ్చయించిన పెళ్లయినా.. ప్రేమ వివాహమైనా మంచిదని డైట్ ఛాత్రోపాధ్యాయులు పేర్కొంటున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో డిబెట్ నిర్వహించింది. ఇందులో డైట్ ఛాత్రోపాధ్యాయులు ‘అరేంజ్ మ్యారేజ్.. లవ్ మ్యారేజ్’ గురించి వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొందరి జీవితాల్లో ప్రేమ ఆనందాన్ని నింపుతుండగా, మరికొందరి జీవితాల్లో విషాదం నెలకొంటోంది. ప్రేమించాలని వేధిస్తూ కొందరు అఘాయిత్యాలకు పాల్పడుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే జీవితంలో స్థిరపడ్డాకే ‘ప్రేమ’కు ప్రాధాన్యం ఇస్తే బాగుంటుందని, పెద్దలు కుదిర్చిన పెళ్లి తర్వాతే జీవితం బాగుంటుందని చెబుతున్నారు. డిబేట్లో ఛాత్రోపాధ్యాయుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. – ఆదిలాబాద్టౌన్ -
వాతావరణం రోజంతా ఎండగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. చలి ప్రభావం తగ్గుతుంది.
పెద్దలను ఒప్పించే ధైర్యం ఉండాలి నిజమైన ప్రేమ మనల్ని తల్లిదండ్రుల నుంచి దూరం చేయదు. ప్రేమిస్తే పెద్దలను ఒప్పించే ధైర్యం ఉండాలి. చిన్ననాటి నుంచి అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రుల ఆశయాలను వమ్ముచేయొద్దు. వారి ఆలోచనలకు విలువ ఇవ్వాలి. – మమత, డైట్ కళాశాల సూపరింటెండెంట్ నమ్మకం అనే పునాది పైన.. జీవితం అనేది నమ్మకం అనే పునాదిపై ఉంటుంది. ఇద్దరి మధ్య నమ్మకం ఉంటేనే ఏ పెళ్లయినా సాఫీగా సాగుతుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో కష్టసుఖాల్లో తోడుగా ఉంటారు. యుక్త వయస్సులో పుట్టేది ప్రేమ కాదు.. ఆకర్షణే. దీనివల్ల భవిష్యత్ నాశనం అవుతుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. – ఎం.ప్రజ్ఞవి సంస్కృతిని మరువొద్దు చాలా మంది మన సంస్కృతిని మర్చిపోయి పాశ్యాత్య సంస్కృతికి అలవాటుపడుతున్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేది ప్రేమ. పెళ్లికి ముందు ఉండేది కాదు.. పెళ్లి తర్వాత ప్రేమించుకుంటే వారి జీవితం సాఫీగా ఉంటుంది. తెలిసీ తెలియని వయస్సులో ప్రేమలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు. జీవితంలో ఓ స్థాయికి ఎదిగిన తర్వాతే ప్రేమ పెళ్లయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లయినా చేసుకోవడం మంచిది. – ప్రణిత, జిల్లా విద్యాశాఖాధికారి -
ఎంపీ, ఎమ్మెల్యేలతోనే అప్రతిష్ట పాలు
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ ఎంపీ, ఎమ్మెల్యేలతోనే ఆదిలాబాద్ పత్తి మార్కెట్ అప్రతిష్ట పాలైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆసియాలోనే పత్తి కొనుగోళ్లలో రెండవ ప్రాధాన్యం ఉన్న ఆదిలాబాద్ మార్కెట్కు మచ్చ తీసుకొచ్చారని మండిపడ్డారు. సీసీఐ పత్తి కొనుగోళ్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా అవినీతి జరగడం దారుణమన్నారు. ఈ విషయంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో దాదాపు 25 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేయగా, భారీగా అవినీతి జరగడం, మార్కెట్ సెక్రెటరీని సస్పెండ్ చేసే పరిస్థితికి కారణమేంటని ప్రశ్నించారు. కొనుగోళ్ల విషయంలో కనీస శ్రద్ధ చూపలేదని, అధికారులతో కనీసం ఒక్క సమీక్ష సమావేశాన్ని సైతం నిర్వహించలేదన్నారు. గత పదేళ్లలో ఇంతకంటే భారీ ఎత్తున కొనుగోళ్లు జరిగినా ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదని గుర్తు చేశారు. సమావేశంలో నాయకులు ఇజ్జగిరి నారాయణ, మెట్టు ప్రహ్లాద్, మార్శెట్టి గోవర్ధన్, ధమ్మపాల్, కొండ గణేశ్, బట్టు సతీశ్, గంగయ్య, దాసరి రమేశ్, బుట్టి శివకుమార్, దేవిదాస్, అడప తిరుపతి, శ్రీనివాస్, ఉగ్గే విఠల్, కలీమ్, తదితరులు పాల్గొన్నారు. -
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా
బేల: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు నూతన విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేశామని జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ జైవంత్రావు చౌహాన్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని సిర్సన్న గ్రామంలో రూ.1.54కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సబ్స్టేషన్తో సిర్సన్న, సింగాపూర్, అవాల్పూర్ రెవెన్యూ గ్రామ శివారుల్లో వ్యవసాయ సాగు కోసం రైతుల సౌలభ్యానికి మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందన్నారు. కార్యక్రమంలో ఎంఆర్టీ డీఈ ప్రభాకర్, ఆదిలాబాద్ డివిజన్ డీఈ హరికృష్ణ, ఏఈలు శ్రావణ్కుమార్, సంతోష్, లైన్ ఇన్స్పెక్టర్ రమేశ్, ఏఎల్ఎం మహేష్, తదితరులు పాల్గొన్నారు.సబ్స్టేషన్ ప్రారంభిస్తున్న ఎస్ఈ జైవంత్రావు చౌహాన్ -
భూకబ్జాలపై ఉక్కుపాదం
కై లాస్నగర్ : ఆదిలాబాద్ పట్టణ పరిధిలో పెరుగుతున్న భూకబ్జాలపై ఉక్కుపాదం మోపాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. మున్సిపల్ పరిధిలో జరుగుతున్న ఆక్రమణలను సీరియస్గా పరిగణించిన కలెక్టర్ రాజర్షిషా గురువారం రాత్రి మున్సిపల్, రెవెన్యూ, పోలీస్శాఖల అధికారులతో కలెక్టరేట్లో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. భూ ఆక్రమణల తీరుపై ఆరా తీసి వాటికట్టడికి అనుసారించాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. భూకబ్జాలు, ఆక్రమణలపై ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకంగా 94921 64153 టోల్ఫ్రీ నంబర్ కేటాయించారు. ‘అంతర్గత మూల్యాంకన విధుల నుంచి తప్పించాలి’కైలాస్నగర్: పదోతరగతి అంతర్గత మా ర్కుల మూల్యాంకన విధుల నుంచి అన్ని ఉ పాధ్యాయ సంఘాల మండల, జిల్లా, రాష్ట్ర నాయకులను తప్పించాలని టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్. శ్రీకాంత్, ఎం.జలంధర్రెడ్డి డిమాండ్ చేశా రు. గురువారం ఆ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్నేళ్లుగా ఉన్న కమిటీ సభ్యులను యూటీఎఫ్ సంఘ బాధ్యులనే ఉద్దేశంతో విఽ దుల నుంచి తొలగించి ఫైరవీకారులను రివైజ్డ్ లిస్టులో చేర్చారన్నారు. ప్రభుత్వం ఈఏడాది గ్రే డింగ్ విధానాన్ని రద్దు చేసి మార్కుల విధానాన్ని అమలు చేస్తున్నందువల్ల పైరవీల మేరకు కొన్ని సంఘాల బాధ్యులను కమిటీల్లో ఉంచారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సంఘబాధ్యులెవరూ విధుల్లో ఉండకుండా చూడాలని కోరారు.‘చలో హైదరాబాద్’ విజయవంతం చేయండిఎదులాపురం: ఎన్నికలకు ముందు సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హమీలను వెంటనే అమలు చేయాలని డి మాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఈనెల 20న నిర్వహించను న్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజ యవంతం చేయాలని ఆపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని కుమురం భీమ్ భవనంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో పా ర్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.వెంకట్ నారాయణ, నాయకులు సుభాష్, నర్సింగ్, దేవిదాస్, హరీష్, గణేశ్, దత్తు, మారుతి, సుంగు, తదితరులు పాల్గొన్నారు. -
పోస్టర్ ఆవిష్కరణ
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో ఈ నెల 23న హీరాసుక జయంతిని ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. శుక్రవారం శ్రీ 14 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025నాణ్యమైన విద్యాబోధన చేయాలిఆదిలాబాద్టౌన్(జైనథ్): విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత అన్నారు. గురువారం జైనథ్ మండలంలోని కెనాల్ మేడిగూడ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల చదువును పరిశీలించి రాత నైపుణ్యం బాగుందని అభినందించారు. పిల్లలచే హిందీ అక్షరాలు చదివించారు. ‘బడి కోసం నా వంతు‘ కార్యక్రమం ద్వారా వసతులు సమకూర్చుకోవడం అభినందనీయమన్నారు. ఆమె వెంట కాంప్లెక్స్ హెచ్ఎం సంజీవరెడ్డి, సెక్టోరియల్ అధికారి సుజాత్ ఖాన్, డీఈవో సీసీ రాజేశ్వర్, హెచ్ఎం వినోద్రావు, ఉపాధ్యాయులు ఉన్నారు. న్యూస్రీల్కుష్ఠురహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలిఆదిలాబాద్టౌన్: కుష్ఠురహిత సమాజ ని ర్మాణానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని జి ల్లా కుష్టు నివారణ అధికారి డాక్టర్ గజానన్ అన్నారు. స్పర్శ్ కుష్ఠు నివారణ పక్షోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని తాటిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స తీసుకుంటే ఎ లాంటి అంగవైకల్యం రాదన్నారు. అన్ని ప్ర భుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా మందులు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అపోహలు వీడి స్వచ్ఛందంగా పరీక్షలు చేసుకో వాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూ టీ పారామెడికల్ అధికారులు వామన్రావు, రమేశ్, సీవో రణిత పాల్గొన్నారు. -
భూకబ్జాలపై ఉక్కుపాదం
కై లాస్నగర్ : ఆదిలాబాద్ పట్టణ పరిధిలో పెరుగుతున్న భూకబ్జాలపై ఉక్కుపాదం మోపాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. మున్సిపల్ పరిధిలో జరుగుతున్న ఆక్రమణలను సీరియస్గా పరిగణించిన కలెక్టర్ రాజర్షిషా గురువారం రాత్రి మున్సిపల్, రెవెన్యూ, పోలీస్శాఖల అధికారులతో కలెక్టరేట్లో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. భూ ఆక్రమణల తీరుపై ఆరా తీసి వాటికట్టడికి అనుసారించాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. భూకబ్జాలు, ఆక్రమణలపై ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకంగా 94921 64153 టోల్ఫ్రీ నంబర్ కేటాయించారు. ‘అంతర్గత మూల్యాంకన విధుల నుంచి తప్పించాలి’కైలాస్నగర్: పదోతరగతి అంతర్గత మా ర్కుల మూల్యాంకన విధుల నుంచి అన్ని ఉ పాధ్యాయ సంఘాల మండల, జిల్లా, రాష్ట్ర నాయకులను తప్పించాలని టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్. శ్రీకాంత్, ఎం.జలంధర్రెడ్డి డిమాండ్ చేశా రు. గురువారం ఆ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్నేళ్లుగా ఉన్న కమిటీ సభ్యులను యూటీఎఫ్ సంఘ బాధ్యులనే ఉద్దేశంతో విఽ దుల నుంచి తొలగించి ఫైరవీకారులను రివైజ్డ్ లిస్టులో చేర్చారన్నారు. ప్రభుత్వం ఈఏడాది గ్రే డింగ్ విధానాన్ని రద్దు చేసి మార్కుల విధానాన్ని అమలు చేస్తున్నందువల్ల పైరవీల మేరకు కొన్ని సంఘాల బాధ్యులను కమిటీల్లో ఉంచారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సంఘబాధ్యులెవరూ విధుల్లో ఉండకుండా చూడాలని కోరారు.‘చలో హైదరాబాద్’ విజయవంతం చేయండిఎదులాపురం: ఎన్నికలకు ముందు సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హమీలను వెంటనే అమలు చేయాలని డి మాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఈనెల 20న నిర్వహించను న్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజ యవంతం చేయాలని ఆపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని కుమురం భీమ్ భవనంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో పా ర్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.వెంకట్ నారాయణ, నాయకులు సుభాష్, నర్సింగ్, దేవిదాస్, హరీష్, గణేశ్, దత్తు, మారుతి, సుంగు, తదితరులు పాల్గొన్నారు. -
టీనేజ్లోనే పక్కదారి..!
● ప్రేమ పేరిట వేధింపులు ● రోజురోజుకూ పెరుగుతున్న ఘటనలు ● ఆకర్షణకు గురవుతున్న బాలికలు ● యువకులపై పోక్సో కేసులు నమోదు ఆదిలాబాద్టౌన్: కొంతమంది యువత టీనేజ్లో పక్కదారి పడుతున్నారు. ఏది మంచో.. ఏది చెడో తెలియక యుక్త వయస్సులో ప్రేమలో పడి భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు. ఇంటి నుంచి వెళ్లిపోయి సాఫీగా జీవితాలను సాగించాలనుకుంటున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు, విభేదాలతో విడిపోతున్నారు. మరి కొంతమంది మైనర్లు ప్రేమలో పడి ప్రియుడితో ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు యువకులపై పోక్సో కేసులు పెట్టడంతో వారు జైలు జీవితం గడుపుతున్నారు. చదువు మధ్యలో మానేసి జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకుంటున్నారు. అయితే ఇంకొంత మంది యువకులు యువతులను ప్రేమ పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రేమించాలని వెంటబడుతున్నారు. వారు ఒప్పుకోకపోతే దాడులకు దిగుతున్నారు. దీంతో జిల్లాలో అఘాయిత్యాలు, అత్యాచారం, వేధింపుల కేసులు నమోదవుతున్నాయి. పెరుగుతున్న కేసులు.. మహిళలను వేధిస్తున్న వారి భరతం పట్టేందుకు జిల్లాలో షీటీమ్ బృందాలు పనిచేస్తున్నాయి. డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. 2023లో షీటీమ్లో 103, 2024లో 204 కేసులు నమోదయ్యాయి. 2023లో 7 ఎఫ్ఐఆర్ కాగా 2024లో 6 కేసులు నమోదయ్యాయి. మిగితావి పీటీ కేసులు నమోదు చేశారు. 2024లో బాలికలను వేధించినందుకు 59 పోక్సో కేసులు నమోదు కాగా 2023లో 55 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువ ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన కేసులే నమోదు కావడం గమనార్హం. సఖీ కేంద్రం ద్వారా 2023లో 264 కేసులు, 2024లో 293 కేసులు నమోదయ్యాయి. 2024లో 4 రేప్ కేసులు, 185 గృహహింస కేసులు, మైనర్ బాలికలను శారీరకంగా వేధించినందుకు 25 పోక్సో కేసులు, రెండు బాల్య వివాహాలు, 26 మిస్సింగ్ కేసులు, 11 ప్రేమ పెళ్లిలు, చీటింగ్ కేసులు నమోదయ్యాయి. పెరుగుతున్న వేధింపులు.. మైనర్ బాలికలు, యువతులపై వేధింపులు పెరిగిపోతున్నాయి. కళాశాలలు, పాఠశాలలు, పనిచేసే ప్రదేశాల్లో పోకిరీలు, కీచకులు వేధింపులకు పాల్పడుతున్నారు. కొంతమంది గురువులు సైతం విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చుట్టుపక్కల వారు చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చట్టాలు కఠినంగా ఉన్నప్పటికీ చాలా మందిలో మార్పు రావడం లేదు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను బయటకు పంపించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వేధిస్తే కఠిన చర్యలు యువతులు, బాలికలు, మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. బాలికలను వేధిస్తే పోక్సో కేసులు నమోదు చేస్తాం. యువతులు ప్రేమ పేరిట ప్రలోభాలకు గురికావొద్దు. విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దు. మహిళల రక్షణ కోసం షీటీమ్ పనిచేస్తుంది. ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే డయల్ 100కు సమాచారం అందించాలి. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతాం. – ఎల్.జీవన్రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ -
తిలా పాపం.. తలా పిడికెడు
● పత్తి కొను‘గోల్మాల్’ వ్యవహారంలో ఇప్పటికే మార్కెటింగ్ శాఖ అక్రమాలు బట్టబయలు ● వ్యవసాయ శాఖలోనూ దొడ్డిదారి మూలాలు ● ధ్రువీకరణ పత్రాల జారీలో ఇష్టారాజ్యంఇచ్చోడ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ఆడే మంజేష్ సిరికొండ మండలంలోని పోచంపల్లిలో ఇదివరకే మృతి చెందిన రైతు మడావి రాజు పేరిట ఉన్న పదెకరాల భూమిని గత వానాకాలంలో కౌలుకు తీసుకున్నాడు. పంట దిగుబడి చేతికి వచ్చిన తర్వాత మార్కెట్లో సీసీఐకి ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించి ప్రయోజనం పొందాలంటే సహజంగా ఆ క్లస్టర్ పరిధిలోని ఏఈవో ద్వారా ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంది. కానీ డిసెంబర్ 28న ఇచ్చోడ ఏవో నుంచి ఈ రైతు ఆ ధ్రువీకరణ పత్రం పొందాడు. సిరికొండ మండలానికి చెందిన వ్యవసాయ భూమికి సంబంధించి ఇచ్చోడ ఏవో జారీ చేయడం గమనార్హం. అంతకుముందు సిరికొండ ఏవో పోస్టు ఖాళీగా ఉండడంతో ఇచ్చోడ ఏవో ఈ మండలానికి ఇన్చార్జిగా వ్యవహరించారు. అయితే రెగ్యులర్ అధికారి రావడంతో ఆయన బాధ్యతలు తొలిగిపోయాయి. అయినప్పటికీ దొడ్డిదారిన ధ్రువీకరణ పత్రం జారీ చేయడం ద్వారా అక్రమాలకు పాల్పడ్డాడు. వ్యవసాయ శాఖలో జరిగిన అక్రమాలకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ఇలాంటి పత్రాలు వందల్లో ఇక్కడినుంచి జారీ కావడం గమనించదగిన విషయం.సాక్షి,ఆదిలాబాద్: వానాకాలం సీజన్లోని పత్తి పంట దిగుబడుల విక్రయాల్లో రైతుల ముసుగులో మధ్య దళారులు సీసీఐకి మద్దతు ధరతో విక్రయించి అక్రమంగా ప్రయోజనం పొందారు. మార్కెటింగ్ శాఖలో టెంపరరీ రిజిస్ట్రేషన్ (టీఆర్)ల పరంగా అక్రమాలకు పాల్పడినట్లు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. వ్యవసాయ శాఖ నుంచి జారీ చేసే పత్తి పంట ధ్రువీకరణ పత్రాలకు, మార్కెటింగ్ శాఖ నుంచి ఇచ్చే టీఆర్లలో ఎకరాల విస్తీర్ణం అధికంగా చూపడం ద్వారా మార్కెటింగ్ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారించిన విషయం విదితమే. మంగళవారం ఈ వ్యవహారంలో రాష్ట్రంలో ఏడుగురు మార్కెట్ కార్యదర్శులను సస్పెండ్ చేయడం సంచలనం కలిగించింది. అందులో ఆదిలాబాద్ కార్యదర్శి మధుకర్ కూడా ఉండడం గమనార్హం. దీంతో జిల్లా మార్కెటింగ్ శాఖ అప్రతిష్ట పాలైంది. తాజాగా ఈ వ్యవహారంలో వ్యవసాయ శాఖ అక్రమ బాగోతాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇచ్చోడలో వ్యవసాయ అధికారి (ఏవో) అడ్డగోలుగా పత్తి పంట ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం ద్వారా అక్రమాలకు పాల్పడ్డారు. ఈ పత్రాలు క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో) మాత్రమే క్షేత్రస్థాయి పరిశీలన జరిపి జారీ చేయాలని వ్యవసాయ శాఖ నుంచి స్పష్టంగా నిబంధన ఉంది. అయినప్పటికీ ఇచ్చోడ ఏవో అడ్డగోలుగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పక్క మండలానికి గతంలో ఇన్చార్జిగా వ్యవహరించినప్పటికీ అక్కడ రెగ్యులర్ అధికారి రావడంతో తనకు ఆ మండలంలో పత్రాల జారీ అధికారం లేకున్నప్పటికీ అవేమి పట్టకుండా అనేక పత్రాలు జారీ చేయడమే వ్యవసాయ శాఖలో ప్రస్తుతం వివాదం అవుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రభుత్వం, విజిలెన్స్ విచారణ చేసినట్టు తెలుస్తోంది. దళారుల దందా.. ప్రస్తుత సీజన్లో దళారులు రైతుల పేరుతో పెద్దమొత్తంలో పత్తిని తీసుకొచ్చి సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించినట్లు ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీంతో రాష్ట్ర అధికారులు రాష్ట్రంలోని మార్కెట్ కమిటీల వారీగా సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇటు వ్యవసాయ శాఖ నుంచి జారీ చేసిన ధ్రువీకరణ పత్రాల్లో, అటు మార్కెటింగ్ శాఖ నుంచి ఇచ్చినటువంటి టీఆర్లలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మధ్య దళారులు వందలాది క్వింటాళ్ల పత్తిని అక్రమంగా సీసీఐకి మద్దతు ధరతో విక్రయించారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆయా శాఖల అధికారులను ప్రలోభాలకు గురిచేసి దళారులు లక్షల రూపాయలను మద్దతు ధర రూపంలో కొల్లగొట్టారు. తద్వారా అసలైన రైతులకు నష్టం కలిగించారు. మొత్తంగా ఈ వ్యవహారంలో ప్రభుత్వం విచారణ కొనసాగిస్తుండడంతో ఇంకెన్ని అక్రమాలు బయటకొస్తాయో చూడాల్సిందే. పరిశీలన చేస్తాం.. పత్తి పంట ధ్రువీకరణ పత్రాలను కేవలం క్లస్టర్ స్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు మాత్రమే జారీ చేయాలి. ఇచ్చోడలో ఏవో జారీ చేసినట్లు మీడియా ద్వారానే తెలుస్తోంది. దీనిపై పరిశీలన చేస్తాం. రాష్ట్ర అధికారులు, విజిలెన్స్ నేరుగా విచారణ చేస్తున్నారు. – శ్రీధర్స్వామి, జిల్లా వ్యవసాయ అధికారి, ఆదిలాబాద్ -
వివరాల నమోదు ప్రక్రియ వేగవంతం
● ‘రేషన్’ డేటా ఎంట్రీ 70 శాతం పూర్తి కై లాస్నగర్: జిల్లాలో రేషన్కార్డు దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఈనెల 12 వరకు వందశాతం పూర్తి చేయాలనే కలెక్టర్ ఆదేశాలకనుగుణంగా తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. 24 గంటల పాటు ప్రక్రియ కొనసాగేలా విధులు కేటాయించారు. దీంతో నమోదు ప్రక్రియ వేగంగా సాగుతోంది. 40,650 దరఖాస్తుల వివరాలు నమోదు.. కొత్త రేషన్కార్డులు, మార్పులు, చేర్పుల కోసం జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన, వార్డు, గ్రామసభల్లో 57,800 దరఖాస్తులు అందాయి. అందులో ఇప్పటి వరకు 40,650 దరఖాస్తుల వివరాల నమోదు పూర్తయినట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి వాజీద్ అలీ తెలిపారు. ఇంకా 17,150 దరఖాస్తుల వివరాలు ఎంట్రీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. గురువారం సాయంత్రంలోగా వంద శాతం పూర్తయ్యే అవకాశముందని తెలిపారు. ఆయా మండలాల నుంచి కార్యాలయానికి అందిన దరఖాస్తులను పరిశీలించి ఆమోదం కోసం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయానికి పంపిస్తామని ఆయన వెల్లడించారు. గడిచిన పదేళ్లలో ఇప్పటి వరకు కొత్త రేషన్కార్డుల కోసం కానీ, మార్పులు, చేర్పుల కోసం కానీ దరఖాస్తు చేసుకోని వారు మాత్రమే మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. -
పది దాటనిదే రారు.. పన్నెండైందంటే ఉండరు
● రిమ్స్లో చాలా మంది వైద్యుల తీరిది ● లక్షల్లో వేతనం ఉన్నా సమయపాలన పాటించరు ● వైద్యుల రాక కోసం రోగులకు తప్పని నిరీక్షణ ● సిబ్బంది తీరూ అదే పరిస్థితిగురువారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025కంటి విభాగం వద్ద వేచి చూస్తున్న రోగులువైద్యుల రాక కోసం నిరీక్షిస్తున్న రోగులు, ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు డెంటల్ విభాగం వద్ద నిరీక్షిస్తున్న పేషెంట్లుఆంగ్లంతో ఉజ్వల భవిష్యత్ కై లాస్నగర్: విద్యార్థులు ఆంగ్లభాషపై పట్టు సాధిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, ఆ దిశగా ఉపాధ్యాయులు వారికి ప్రోత్సాహం అందించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఇటీవల ఇంగ్లిష్ లాంగ్వేజ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని అనురాగ్ యూనివర్సిటీలో రాష్ట్రస్థాయి ఇంగ్లిష్ ఒలింపియాడ్ నిర్వహించారు. ఇందులో జిల్లాకు చెందిన మన్నూర్ పాఠశాల, బంగారుగూడ మోడల్ స్కూల్ విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచారు. కలెక్టర్ రాజర్షితో పాటు డీఈవో ప్రణీతను విద్యార్థులు బుధవారం కలిశారు. విద్యార్థులతో పాటు గైడ్ టీచర్లు సవితాదేవి, అజయ్ను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. రిమ్స్లో కొంత మంది వైద్యుల తీరు మార డం లేదు. ఇందులో పనిచేసే చాలా మంది డాక్టర్లకు జిల్లా కేంద్రంలో ప్రైవేట్ క్లినిక్లు ఉన్నాయి. ఉదయం అక్కడ రోగులను పరీ క్షించిన తర్వాత రిమ్స్కు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత మళ్లీ క్లినిక్లోనే దర్శనమిస్తారు. ఇలా వారు రెండు చే తుల సంపాదిస్తున్నారే తప్ప సర్కారు దవా ఖానాకు వచ్చే పేదలకు మాత్రం న్యాయం చేయలేకపోతున్నారు. ఎమర్జెన్సీ ఉంటే తప్పా అక్కడికి రావడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో కొంత మంది రోగులు మృత్యువాత పడుతున్న ఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి. సమయపాలన పాటించని వైద్యులపై అధికారులు చర్యలు చేపట్టకపోవడంతోనే వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఉదయం బయోమెట్రిక్ హాజరు పెట్టిన తర్వాత మధ్యాహ్నం కనిపించకుండా పోతారు. ఒకేసారి హాజరు ఉండడంతో విధులకు డుమ్మా కొడుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు వీరిపై దృష్టి సారిస్తే తప్పా రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందే పరిస్థితి లేదని పలువురు పేర్కొంటున్నారు.పోషకాహారంతో రక్తహీనత నియంత్రణ కై లాస్నగర్: సంపూర్ణ పోషకాహారంతో రక్తహీనత నియంత్రించవచ్చని డీఆర్డీవో రవీందర్ రాథోడ్ అన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం ఆ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వెయ్యి రోజుల కార్యక్రమ నిర్వహణపై జిల్లాలోని ఏపీఎంలు, సీసీలు, మండల సమాఖ్య ఆఫీస్ బేరర్లకు పట్టణంలోని టీటీడీసీలో బుధవారం అవగాహన కల్పించా రు. కార్యక్రమ లక్ష్యాలు, విధానాలపై ఏపీడీ గంగన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు. ఇందులో డీపీఎం హేమలత తదితరులు పాల్గొన్నారు. చిల్డ్రన్ ఓపీ వద్ద వైద్యుల కోసం నిరీక్షిస్తున్న తల్లిదండ్రులు, చిన్నారులుకష్టపడి చదవాలి ఆదిలాబాద్టౌన్: విద్యార్థులు కష్టపడి చది వి పదో తరగతిలో మంచి ఫలితాలు సా ధించాలని ట్రెయినీ కలెక్టర్ అభిగ్యాన్ మా ల్వియా అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించారు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించేలా వారికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట డీఈవో ప్రణీత, ఉపాధ్యాయులు ఉన్నారు. జిల్లాలో ఆదివాసీ, గిరిజనులు అధికంగా ఉంటారు. ఈ ప్రాంతంతో పాటు మహారాష్ట్ర వాసులకు రిమ్స్ పెద్ద దిక్కుగా ఉంది. సుస్తీతో ఇక్కడికి వచ్చే రోగులు వైద్యుల రాకకోసం నిరీక్షించాల్సిన దుస్థితి. ఉద యం 9గంటలకు విధులకు హాజరై సాయంత్రం 4 గంటలవరకు వైద్యసేవలు అందించాల్సి ఉంటుంది. ఇందులో కొంత మంది మాత్రమే సక్రమంగా వి ధులు నిర్వహిస్తుండగా, చాలా మంది పది దాటినా విధులకు హాజరు కారు.. మధ్యాహ్నం పన్నెండు తర్వాత కనిపించరు. బయోమెట్రిక్ హాజరు ఉన్నా వీరిలో మార్పు రావడం లేదు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ను బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకు ‘సాక్షి’ విజిట్ చేసింది. 9.30 గంటల వరకు కూడా ఏ ఒక్క వైద్యుడు ఆస్పత్రికి చేరుకో లేదు. 10 గంటల తర్వాత ఒకరిద్దరు రావడం కని పించింది. డాక్టర్ల రాక కోసం రోగులు గంటల తరబడి నిరీక్షించారు. అప్పటి వరకు పీజీ విద్యార్థులు, హౌజ్ సర్జన్లు పేషెంట్లను పరీక్షించారు. 10 గంటల వరకు కానరాని వైద్యులు.. ● గైనిక్ వార్డులో ఉదయం 9.30 తర్వాత కూడా డాక్టర్లు రాలేదు. సిబ్బంది మాత్రమే అందుబా టులో ఉన్నారు. ● మెడికల్ వార్డులో హౌజ్సర్జన్, పీజీ విద్యార్థులు ఉన్నారు. డ్యూటీ డాక్టర్లు కానరాలేదు. ఆర్థోపెడి క్ వార్డులోనూ వైద్యులు కనిపించలేదు. ● రోగులకు మందులు పంపిణీచేసే ఫార్మసిలోనూ అదే పరిస్థితి. ఫార్మసిస్టులు 9.30 వరకు రాలేదు. 9.45గంటలకు ఒకరు వచ్చారు. అప్పటివరకు అటెండర్ మాత్రలు సరిచేస్తూ కనిపించాడు. మందుల కోసం రోగులు వేచి ఉన్నారు. ● ఏఆర్టీ సెంటర్కు వైద్యులు, సిబ్బంది 9.45 గంటల వరకు చేరుకోలేదు. గది ఎదుట రోగులు నిరీక్షించారు. ● ఆప్తమాలజీకి సంబంధించి ఒక హౌజ్ సర్జన్ రో గులకు పరీక్షలు చేస్తూ కనిపించారు. రెండు వి భాగాలు ఉన్నప్పటికీ ఆయన ఒక్కరే అందుబా టులో ఉన్నారు. అప్పటికే పదుల సంఖ్యలో రో గులు ఉన్నారు. టెక్నీషియన్లు కూడా సమయపాలన పాటించలేదు. శిక్షణ విద్యార్థులు రోగులకు కంటి పరీక్షలు నిర్వహిస్తూ కనిపించారు. ● మలేరియా విభాగంలో సిబ్బంది 10 గంటల వరకు రాలేదు. ఓపీలో హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించే సిబ్బంది లేకపోవడంతో గంటల తరబడి రోగులు, గర్భిణులు వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల నుంచే తమ వంతు కోసం గది ముందుర పడిగాపులు కాశారు. ● డెంటల్ విభాగంలో వైద్యులు రాకపోవడంతో పదుల సంఖ్యలో రోగులు అక్కడ ఉన్న కుర్చీల్లో నిరీక్షించారు. ఈ డాక్టర్లు కూడా 10 గంటల వరకు రాలేదు. ● చిల్డ్రన్ ఓపీలో 9.45 గంటల తర్వాత ఒక హౌ జ్ సర్జన్ విధులకు హాజరయ్యారు. పిల్లలకు వైద్య పరీక్షలు చేయించేందుకు తల్లిదండ్రులు గది ఎదుట బారులు తీరినప్పటికీ వైద్యులు కనిపించలేదు. ● ఆర్బీఎస్కే విభాగంలో ముగ్గురు సిబ్బంది మా త్రమే ఉన్నారు. బ్లడ్బ్యాంక్లో శిక్షణ పొందే విద్యార్థులతో పాటు ఒక ల్యాబ్ టెక్నీషియన్ అందుబాటులో ఉన్నారు. 10 గంటల వరకు మెడికల్ ఆఫీసర్ విధులకు హాజరు కాలేదు. ● 10 గంటల సమయంలో ఎమర్జెన్సీ ఇన్వార్డును పరిశీలించగా.. వైద్యులు కనిపించారు. రోగులకు వైద్య సేవలు అందించారు. ● ట్రామాకేర్లో 10గంటల వరకు వైద్యులు రాలేదని రోగులు తెలిపారు. హౌస్సర్జన్ మాత్రమే వచ్చి పరీక్షలు చేశారని పేర్కొన్నారు. ● గైనిక్ ఇన్వార్డులో ఒక పీజీ వైద్యురాలు మాత్ర మే అందుబాటులో ఉన్నారు. 10 గంటలు దాటినా మిగతా వైద్యులు రాలేదని అక్కడి సిబ్బంది తెలిపారు. ఫారెస్ట్లో ఫైర్లైన్స్ అడవిలో వేసవిలో అగ్ని ప్రమాదాలు నివారించేందుకు అటవీశాఖ చర్యలు చేపడుతోంది. మూడేళ్లుగా కూలీల ద్వారా ఫైర్లైన్స్ ఏర్పాటు చేస్తోంది. 8లోu న్యూస్రీల్ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా రిమ్స్లో వైద్యుల తీరు మాత్రం మారడం లేదు. మేమింతే.. మారమంతే అన్న చందంగా మారింది చాలా మంది పరిస్థితి. సమయ పాలన విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పది దాట నిదే రావడం లేదు.. అలాగే పన్నెండయిందంటే చాలు ఉండడం లేదు. రూ.లక్షల్లో వేతనం తీసుకుంటున్నా ప్రైవేట్ ప్రాక్టీస్కే ప్రాధాన్యమిస్తున్నారు. రిమ్స్లో వైద్య సిబ్బంది సమయపాలనపై బుధవారం ‘సాక్షి’ విజిట్ నిర్వహించింది. చాలా మంది విధులకు ఆలస్యంగా రావడం.. నిర్దే శిత సమయానికి ముందే ఇంటి బాట పట్టడం కనిపించింది. – ఆదిలాబాద్టౌన్మారని తీరు.. -
అక్రమాలు నిజమే..
● జిల్లాలో పత్తి కొనుగోళ్లలో గోల్మాల్ ● నిర్ధారించిన అధికారులు ● వరంగల్ రీజియన్లో ఏడుగురిపై వేటు ● అందులో ఆదిలాబాద్ మార్కెట్ కార్యదర్శిపై కూడా.. ● టీఆర్లలో తేడాల ఆధారంగా చర్యలు ● అక్రమాలపై ముందే చెప్పిన ‘సాక్షి’ సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో పత్తి కొనుగోళ్లలో అక్రమాలు నిజమే అని తేలింది. ఈ మేరకు విచారణ చేపట్టిన అధికారులు పలువురిపై వేటు వేశారు. వ రంగల్ రీజియన్ పరిధిలో ఏకంగా ఏడుగురిని సస్పెండ్ చేయగా అందులో ఆదిలాబాద్ మార్కెట్ కార్యదర్శి కూడా ఉండడం గమనార్హం. ఈ అక్రమాలపై ‘సాక్షి’ సైతం వరుస కథనాలను ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. అక్రమాల తీరిది.. ఒక రైతుకు చెందిన వ్యవసాయ భూమిని మరో రైతు కౌలుకు తీసుకొని సాగు చేశాడు. వచ్చిన దిగుబడిని మార్కెట్లో సీసీఐకి విక్రయించి మద్దతు ధర పొందాంటే పట్టా రైతుభూమికి సంబంధించి క్రాప్ బుకింగ్లో పేరు నమోదై ఉండాలి. దాని ఆధారంగా కౌలు రైతు తాను సాగు చేయగా వచ్చిన దిగుబడిని మద్దతు ధరకు అమ్ముకునేందుకు తన పేరిట పత్రం జారీ చేయాలని వ్యవసాయ అధికారులకు దరఖాస్తు చేసుకుంటాడు. ఆ ప్రకారం కౌలు రైతుకు వ్యవసాయ శాఖ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తుంది. ఆ పత్రాన్ని మార్కెటింగ్ అధికారులకు ఇస్తే ఆ దిగుబడిని సీసీఐకి విక్రయించుకునేందుకు వారు టెంపరరి రిజిస్ట్రేషన్ (టీఆర్) జారీ చేస్తారు. అయితే వ్యవసాయ శాఖ జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలకు, మార్కెటింగ్ అధికారులు ఇచ్చిన ఇలాంటి టీఆర్లలో భారీ తేడాలు ఉన్నట్లు రాష్ట్ర మార్కెటింగ్ అధికా రులు విచారణలో తాజాగా గుర్తించారు. సస్పెన్షన్ వేటు.. ఈ విచారణ ఆధారంగా రాష్ట్ర మార్కెటింగ్ అధికా రులు మంగళవారం వరంగల్ రీజియన్ పరిధిలో ఏడుగురు మార్కెట్ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు వేశారు. అందులో ఆదిలాబాద్ సెక్రెటరి మధుకర్ కాంబ్లే కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇది సంచలనం కలిగిస్తుంది. ఆదిలాబాద్ మార్కెట్లో ఈ టీఆర్లు ఈ ఏడాది వేలాదిగా జారీ అయ్యాయి. మొత్తంగా వీటి జారీలో భారీగా అవకతవకలు చోటు చేసుకు న్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంకెన్ని అక్రమాలు బయటకొస్తాయో చూడాల్సిందే. కాగా వ్యవసాయ శాఖ జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలతో పోల్చితే మార్కెటింగ్ శాఖ జారీ చేసిన టెంపరరి రిజిస్ట్రేషన్ పత్రాలలో వ్యవసాయ భూమి విస్తీర్ణం పరంగా ఎక్కువగా చూపించడం ద్వారా ఈ అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. అధిక దిగుబడిని దళారులు సీసీఐకి మద్దతు ధరతో విక్రయించడం ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని తేలు స్తోంది. రాష్ట్ర మార్కెటింగ్ అధికారులు మాత్రం ఈ పత్రాల పరంగా తేడా ఉన్నట్లు స్పష్టం చేసినప్పటికీ ఆ తేడా ఏ విధంగా ఉందనేది పేర్కొనలేదు. ఇదిలా ఉంటే జిల్లా మార్కెటింగ్ అధికారుల నుంచి రాష్ట్ర మార్కెటింగ్ అధికారులు ఎలాంటి నివేదిక కోరనట్లు తెలుస్తోంది. రాష్ట్రస్థాయిలోనే ఈ అక్రమాన్ని గుర్తించి చర్యలు తీసుకున్నట్లు జిల్లా అధికారులు అభిప్రాయ పడుతున్నారు. వేలాది టీఆర్ల జారీ.. జిల్లాలోని ఇతర మార్కెట్లలో కూడా ఇలాంటి అక్రమాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర మార్కెటింగ్ అధికా రులు వాటిపై కూడా దృష్టి సారిస్తారా అనేది ప్రస్తు తం చూడాల్సిందే. ఈ సీజన్లో జిల్లా పరంగా ఐదు వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఆదిలాబాద్, బోథ్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, జైనథ్ పరిధిలో 11 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సీసీఐ రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేసింది. అయితే ఆదిలాబాద్ మార్కెట్లోనే సీసీఐ పత్తి కొనుగోళ్లు పెద్ద మొత్తంలో జరిగాయి. దీంతో మార్కెటింగ్ అధికారులు ఈ మార్కెట్పై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఈ సీజన్లో పత్తి కొనుగోళ్ల వివరాలు మొత్తం కొనుగోలు చేసిన పత్తి 27,07,479 క్వింటాళ్లు సీసీఐ కొనుగోలు చేసింది 25,41,278 క్వింటాళ్లు ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసింది 1,67,017 క్వింటాళ్లు మద్దతు ధర (క్వింటాలుకు) రూ.7,421 (రూ.100 తగ్గింపు తర్వాత) జారీ అయిన టీఆర్ల సంఖ్య సుమారు 5వేల వరకు ఆదిలాబాద్ మార్కెట్లో టీఆర్లు : 3,457జారీరాష్ట్ర అధికారులే విచారణ చేశారు పత్తి పంట ద్రువీకరణ పత్రాలు, టెంపరరి రిజిస్ట్రేషన్ (టీఆర్)లలో తేడాలు ఉన్నట్లు రాష్ట్ర అధికారులు విచారణలో నిర్ధారించి నేరుగా చర్యలు తీసుకున్నారు. జిల్లా మార్కెటింగ్ కార్యాలయం నుంచి దీనికి సంబంధించి ఎలాంటి నివేదిక కోరలేదు. రాష్ట్ర అధికారులు ఏవిధంగా విచారణ జరిపారు. నిర్ధారణ ఎలా చేసుకున్నారో అనే విషయాలు మా దృష్టిలో లేవు. – గజానంద్, జిల్లా మార్కెటింగ్ అధికారి -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండగా ఉంటుంది. రాత్రివేళలో చలి ప్రభావం తగ్గనుంది. ఎనిమిది గంటలకే వచ్చాం.. నా మనువడికి జ్వరం రావడంతో ఉదయం ఎనిమిది గంటలకే ఇక్కడికి వచ్చాం. 10 దాటినా డాక్టర్లు రాలేదు. ఇప్పుడిప్పుడే ఓ ట్రెయినీ డాక్టర్ వచ్చారు. డాక్టర్ల కోసం గంటల తరబడి చూడాల్సి వస్తుంది. చానా ఇబ్బందులు పడుతున్నాం. – చంద్రకళ, కేఆర్కే కాలనీ వచ్చి రెండు గంటలు దాటింది.. రక్త పరీక్షల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నాం. మంగళవారం చూసిన డాక్టర్లు ఈ రోజు ఉదయం 8 గంటలకే టెస్టులు చేసుకో వాలని చెప్పడంతో పొద్దుగాల వచ్చాం. పదయినా ఇంకా సిబ్బంది రాలే. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. – అర్చన, ఇచ్చోడ -
‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
● ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డిఆదిలాబాద్టౌన్: పదోతరగతి పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా సన్నద్ధం చేయాలని వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి అన్నా రు. జిల్లా కేంద్రంలోని లిటిల్ఫ్లవర్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, సెక్టోరియల్ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి వారి ప్రగతి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. అలాగే విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, సెక్టోరియల్ అధికారులు తమ పరిధిలోని పాఠశాలలను పరి శీలించాలన్నారు. ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా తరగతులు బోధించాలని, ప్రతిరోజు రెండు మూడు తరగతులను పరిశీలించాలని సూచించా రు. పర్ఫామెన్స్ విధంగా చూస్తే జిల్లాల పరంగా ఆదిలాబాద్ వెనుకబడి ఉందని తెలిపారు. సమావేశంలో డీఈవో ప్రణీత, ఏడీ వేణుగోపాల్ గౌడ్, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ వేణుగోపాల్రెడ్డి, డీసీఈబీ కార్యదర్శి కందుల గజేందర్, సెక్టోరియల్ అధికారి ఉదయశ్రీ, సుజాత్ ఖాన్, నారాయణ, శ్రీకాంత్ గౌడ్, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
Telangana: రూ.150 బీరు.. రూ.180కి విక్రయం..!
భైంసాటౌన్: బీర్ల ధరల పెంపునకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కానీ ఎంతమేర పెంచాలన్న దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయినా పట్టణంలో కొందరు వైన్స్ నిర్వాహకులు బీర్ల ధరలు పెంచి విక్రయిస్తున్నారు. మంగళవారం పట్టణంలోని బాసర రోడ్డులో గల ఓ వైన్స్షాపులో రూ.150 ఎమ్మార్పీ ఉన్న బీరును రూ.180కి విక్రయించినట్లు ఓ మద్యం ప్రియుడు వాపోయాడు. ఈ మేరకు తన ఫోన్పే నంబర్ ద్వారా డబ్బులు చెల్లించినట్లు రశీదు చూపాడు. ధరల పెరుగుదలకు ముందే పెంచి విక్రయించడం ఎంతవరకు సబబని అతడు ప్రశ్నిస్తున్నాడు. బీర్ల ధరల పెంపు విషయమై ఎక్సైజ్ సీఐ నజీర్హుస్సేన్ను ఈ సందర్భంగా వివరణ కోరగా తమకు అధికారికంగా ఎలాంటి ఆదేశాలు లేవన్నారు. పాత స్టాకును పాత రేట్లకే విక్రయించాల్సి ఉండగా ఎలాంటి ఆదేశాలు లేకుండానే అధిక ధరలకు విక్రయించడంపై మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఫుడ్సేఫ్టీ అధికారుల తనిఖీలు
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని దేవి ఫ్యామిలీ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సో మవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఉట్నూర్కు చెందిన పెందూర్ ఉషారాణి అక్కడికి భోజనం చేసేందుకు వెళ్లగా, మంచూరియాలో కుళ్లిన వాసన రావడంతో డయల్ 100కు ఫోన్ చేశారు. విషయాన్ని పోలీసులు స్థానిక మున్సిపల్ కమిషనర్కు సమాచారం అందించారు. దీంతో ఫుడ్సేఫ్టీ అధికారి డాక్టర్ శ్రీధర్తో పాటు శానిటరి ఇన్స్పెక్టర్ నరేందర్ హోటల్కు వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఆరు నమూనాలను సేకరించారు. వాటిని ల్యాబ్కు పంపించినట్లు పేర్కొన్నారు. -
రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేపట్టాలి
● మార్కెటింగ్శాఖ అదనపు డైరెక్టర్ రవికుమార్ ఆదిలాబాద్టౌన్: రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలని మార్కెటింగ్ శాఖ అదనపు డైరెక్టర్ రవికుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డును మంగళవారం సందర్శించారు. రైతులతో మాట్లాడి కొనుగోళ్లకు సంబంధించిన విషయాలపై ఆరా తీశారు. అనంతరం మార్కెటింగ్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో సీసీఐ ద్వారా ఎంతమేర పత్తి కొనుగోళ్లు చేపట్టారు.. ప్రైవేట్ వ్యాపారులు ఎంత కొనుగోలు చేశారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం సాంకేతిక సమస్యతో దేశవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయినట్లు తెలిపారు. మంగళవారం ప్రైవేట్ వ్యాపారులు వేలం ద్వారా పత్తి క్వింటాలుకు రూ.6,930 ధర నిర్ణయించగా, వేలం ప్రక్రియను పరిశీలించారు. అనంతరం కందుల కొనుగోళ్లను పరిశీలించి రైతుల ద్వారా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మార్కెటింగ్ ఏడీ గజానంద్, కార్యదర్శులు మధుకర్, శ్రీకాంత్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు. -
చుక్కలదుప్పిపై వీధికుక్కల దాడి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): వనం నుంచి జనావాసాల్లోకి వచ్చిన ఓ చుక్కలదుప్పిపై వీధికుక్కలు దాడిచేయడంతో గాయాలయ్యాయి. మంగళవారం ఉదయం ముల్కల్ల అటవీ బీట్ పరిధి నుంచి చుక్కలదుప్పి గుడిపేట గ్రామ శివారులోని ఎస్సీ కాలనీలోకి ప్రవేశించింది. కాలనీలోని వీధికుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. గమనించిన స్థానికులు వాటి బారి నుంచి కాపాడి అటవీ అధికారులకు సమాచారం అందించారు. పాతమంచిర్యాల అటవీ బీట్ సెక్షన్ అధికారి అతావుల్లా, బీట్ అధికారి రాజేందర్ గ్రామానికి చేరుకుని దుప్పి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వైపు వెళ్లేలా చేశారు. ఇటీవల కరీంనగర్ నుంచి తీసుకువచ్చి హాజీపూర్ మండలం గఢ్పూర్ పంచాయతీ పరిధిలోని జంగల్ సఫారీలోకి వదిలి పెట్టిన చుక్కలదుప్పిగా గుర్తించారు. -
కళాకారుల డిమాండ్లు అసెంబ్లీలో ప్రస్తావిస్తా
● నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి నిర్మల్టౌన్: అసెంబ్లీ సమావేశాల్లో కళాకారుల డిమాండ్లను ప్రస్తావించి పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో తెలంగాణ సాంస్కృతిక కళా సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కళా ఉత్సవం అవార్డు ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే కళాకారులకు ఉద్యోగ ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన గత ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ఆ ప్రభుత్వం తోవలోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగుతోందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కళాకారులను తప్పకుండా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం కళాకారులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు హరినాయక్, ఒడిసెల అర్జున్, సుంకరి సాయి, కళా సంస్థ అధ్యక్షురాలు పాట రాజశ్రీ, జిల్లా అధ్యక్షుడు దిగంబర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్, కళాకారులు పసుల రవి, మాడ సతీశ్, మగ్గిడి సురాజ్, జానా అజయ్, పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు. -
నామినేషన్ల పరిశీలన పూర్తి
● గ్రాడ్యుయేట్ స్థానానికి 68, టీచర్ స్థానానికి 16 మంది బరిలో.. సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్–మెదక్–నిజా మాబాద్–ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన ము గిసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 100 మంది అభ్యర్థులు 192 నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో వివిధ కారణాల వల్ల 32 నామినేషన్లు తిరస్కరణకు గురికాగా 68 ఆమోదించారు. టీచర్ ఎ మ్మెల్సీ స్థానానికి 17 మంది 38 నామినేషన్లు దా ఖలు చేయగా ఒక నామినేషన్ రిజెక్ట్ అయింది. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ అభ్యర్థులు నామినేషన్లు సమర్పించిన సందర్భంలో ఏవైనా లోపాలు ఉంటే గుర్తించి అభ్యర్థులకు షార్ట్ మెమోలు ఇచ్చి సరిచేసుకునేందుకు అవకాశం కల్పించామని అన్నారు. సరైన ఫార్మాట్లో సమర్పించని నామినేషన్లను తిరస్కరించినట్లు వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంజయ్ రామన్, అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్, ఏవో నరేందర్, తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. -
మార్కెట్ కార్యదర్శుల సస్పెన్షన్●
● వరంగల్ రీజియన్లో ఏడుగురిపై వేటు ● సీసీఐ కొనుగోళ్లపై ఆరా.. టీఆర్లో తేడాలే కారణం వరంగల్: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై వరంగల్ రీజియన్లోని ఏడుగురు మార్కెట్ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర మార్కెటింగ్ అధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. (సీసీఐ) పత్తి కొనుగోళ్ల కోసం జారీ చేసిన టెంపరరీ రిజిస్ట్రేషన్(టీఆర్)లో తేడాలు గుర్తించిన అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెన్షన్కు గు రైన వారిలో ఆదిలాబాద్, చెన్నూర్, పెద్దపల్లి, వరంగల్, జనగామ, భద్రాచలం, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మార్కెట్ కార్యదర్శులు ఉన్నట్లు వరంగల్ రీ జియన్ జేడీఎం ఉప్పుల శ్రీనివాస్ తెలిపారు. వ్యవసాయ అధికారులు జారీ చే సిన ధ్రువీకరణ పత్రాల్లో, మార్కెట్ జారీ చేసిన టీఆర్లో తేడాలు ఉన్నట్లు గు ర్తించిన ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ వ్యవసాయ మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.నిర్మల, జనగామ మార్కెట్ కార్యదర్శిశ్రీనివాస్సస్పెన్షన్కు గురైనట్లు ఆయన పేర్కొన్నారు. పెద్ద మొత్తంలో కొనుగోళ్లు.. ప్రస్తుత సీజన్లో దళారులు రైతుల పేరుతో పెద్ద మొత్తంలో పత్తిని తీసుకొచ్చి సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించినట్లు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీంతో అఽధికారులు రాష్ట్రంలోని మార్కెట్ కమిటీల వారీగా సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయాలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. గతేడాదికంటే రెట్టింపుగా ఈఏడాది సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు జరగడంతో ఫిర్యాదులకు బలం చేకూరింది. పత్తి సాగు చేసిన సమయంలోనే ఆయా మండలాల్లోని వ్యవసాయ అధికారులతో రైతులు తమపేర్లను నమోదు చేసుకోవాలి. విషయం తెలియని పత్తి రైతులు సీసీఐ కేంద్రాల్లో పత్తిని అమ్ముకునేందుకు సంబంధిత ఏఓలతో ధ్రువీకరణ పత్రాలు పొంది మార్కెట్కు వస్తే టెంపరరీ రిజిస్ట్రేషన్(టీఆర్)లను మార్కెట్ అధికారులు జారీ చేస్తారు. ఈ టీఆర్ల ప్రకారం సీసీఐ పత్తిని కొనుగోలు చేస్తుంది. వెసులుబాటే ఆసరాగా.. ఈ సీజన్లో మార్కెటింగ్ శాఖ టీఆర్ల జారీ అధికారం మార్కెట్ కార్యదర్శులకు అప్పగించినట్లు తెలిసింది. ఈ వెసులుబాటును ఆసరాగా చేసుకున్న దళారులు ఇతర జిల్లాల నుంచి పత్తిని కొనుగోలు చేసి ఇక్కడ జారీ చేసిన టీఆర్లలో విస్తీర్ణం నమోదు చేసి మార్కెట్ అధికారులను తప్పుదోవ పట్టించినట్లుగా తెలిసింది. విషయం సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో డాటా ఎంట్రీ చేసిన సిబ్బంది గుర్తించినప్పటికీ దళారులతో కుమ్మకై ్కనందునే ఈదందా కొనసాగినట్లుగా తెలుస్తోంది. ఈకారణంగా మార్కెట్ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటుపడినట్లు సమాచారం. -
చేపలవేటకు వెళ్లి వ్యక్తి మృతి
భైంసారూరల్: చేపలవేటకు వెళ్లి చెక్డ్యాంలో నీటమునిగి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై మాలిక్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని వాలేగాం గ్రామానికి చెందిన పల్లపు నర్సయ్య (45) సోమవారం చేపలు పట్టేందుకు మాటేగాం స మీపంలోని చెక్డ్యాంకు వెళ్లాడు. రాత్రయినా ఇంటికి తిరిగిరాకపోవంతో మంగళవారం కు టుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా గజ ఈతగాళ్లలో గాలించి మృతదేహా న్ని బయటకు తీయించారు. మృతునికి భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. టాస్క్ఫోర్స్ ఓఎస్డీ పర్యటన లక్ష్మణచాంద: టాస్క్ఫోర్స్ ఓఎస్డీ శ్రీధర్రెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటించారు. లక్ష్మ ణచాంద మండలంలోని తిర్పెల్లి రైస్మిల్లులో సోమవారం సివిల్ సప్లయ్ అధికారులు, పోలీ సులు సంయుక్తగా దాడులు నిర్వహించగా 3,011 మెట్రిక్ టన్నుల వరిధాన్యం గోల్మాల్ అయినట్లు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్డీ శ్రీధర్రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. తిర్పెల్లి, లక్ష్మణచాంద, పొట్టపెల్లి, రాచాపూర్, వడ్యాల్, కనకాపూర్ గ్రామాల్లోని రేషన్ షాపులను తనిఖీ చేశారు. అనంతరం సోన్ మండలంలోని కూచన్పెల్లిలో రేషన్షాపును తనిఖీ చేశారు. నిర్మల్ మండలంలోని ఎంఎల్ఎస్ పాయింట్ను సందర్శించినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ డీఎస్పీ శేఖర్ రెడ్డి, ఎస్సై శ్రీనివాస్రావు, ఎన్ఫోర్స్మె ట్డీటీ కార్తీక్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధి అందుగులపేట సమీపంలోని ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లాలోని (బసంత్నగర్) కన్నాల గ్రామానికి చెందిన కనుకయ్య (40) ఎన్టీపీసీలో లారీలో జిప్సం నింపుకుని మహారాష్ట్రలోని మణిగఢ్కు వెళ్లి వస్తుండగా అందుగులపేట వద్ద జాతీయ రహదారిపై నీళ్ల ట్యాంకర్ను ఢీకొట్టాడు. లారీ క్యాబిన్ నుజ్జునుజ్జు కావడంతో కనుకయ్య అందులో ఇరుక్కుని ఊపిరాడక మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యుత్ తీగలకు తగిలి వృద్ధుడు, గేదె..కాసిపేట: పెరటిచుట్టూ అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి వృద్ధుడు, గేదె మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల మేరకు కోనూర్కు చెందిన అంకతి మల్లయ్య (64)కు చెందిన గేదె కనిపించకపోవడంతో మంగళవారం వెతికేందుకు వెళ్లాడు. ఎంతకూ తిరిగిరాకపోవడంతో అతని కుమారుడు శ్రీకాంత్ తన తండ్రికోసం వెతుకుతుండగా అంకతి రాజయ్య ఇంటి వెనకాల పెరటిచుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్వైరు తగిలి మల్లయ్య, గేదె మృతిచెంది ఉండడాన్ని గమనించారు. మృతుని కుమారుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు నిందితుడు అంకతి రాజయ్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మందమర్రి సీఐ శశిధర్రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదుమంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని వందఫీట్ల రోడ్డు మూల మలుపు వద్ద 2024 డిసెంబర్ 9న రాత్రి 10 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. హాజిపూర్ మండలం ముల్కల్లకు చెందిన జెట్టి శ్రీనివాస్ ద్విచక్ర వాహనంపై మంచిర్యాలలోని గణేశ్నగర్కు వెళ్తుండగా సీసీసీ వైపు నుంచి మంచిర్యాలకు బైక్పై వస్తున్న జెట్టి శ్రీనివాస్ను అతివేగంగా ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ముందుగా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్కు తరలించారు. శ్రీనివాస్ తండ్రి ఐలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రాణం తీసిన అప్పు గొడవ మంచిర్యాలక్రైం: అప్పు ప్రాణానికి ముప్పు అంటారు పెద్దలు..కుటుంబ అవసరం నిమిత్తం భార్యాభర్తలు కలిసి తీసుకున్న రుణం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన జిల్లా కేంద్రంలోని వడ్డెరకాలనీలో చోటు చేసుకుంది. ఎస్సై వినీత తెలిపిన వివరాల మేరకు జైపూర్ మండలం ఇందారంకు చెందిన భాగ్యరేఖ(32)కు వడ్డెర కాలనికి చెందిన మనుబోతుల సురేష్తో పదేళ్లక్రితం వివాహమైంది. కొద్దిరోజుల క్రితం కుటుంబ అవసరాల నిమిత్తం తెలిసిన వారి వద్ద లక్షా 50వేలు అప్పుగా తీసుకున్నారు. ఈ విషయంలో ఇద్దరికీ తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 10న మళ్లీ గొడవ జరగడంతో సురేష్ భీమారంలో ఉంటున్న అక్క ఇంటికి వెళ్లగా భాగ్యరేఖ స్థానికంగా ఉంటున్న అత్తగారింటికి వెళ్లింది. మంగళవారం ఉదయం తాము ఉంటున్న ఇంటికి వచ్చిన భాగ్యరేఖ ఇంటిపైకప్పుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి గంట లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. యువతి అదృశ్యంమంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఏసీసీ కాలనీకి చెందిన బూడిద తిరుపతి–సుమలత దంపతుల కుమార్తె శునిష (22) అదృశ్యమైనట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. సదరు యువతి తరచూ ఫోన్లో మాట్లాడుతుండగా తల్లి సుమలత మందలించింది. దీంతో మనస్తాపానికి గురై ఈ నెల 4న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు తెలిసిన చోట వెతికినా ఆ చూకీ లభించకపోవడంతో మంగళవారం సుమలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
పెళ్లి సందడి
● మొదలైన శుభ ముహూర్తాలు... ● మోగుతున్న పెళ్లి భాజాలు ● మాఘం, ఫాల్గుణ మాసాల్లో కల్యాణ ఘడియలు రికార్డుస్థాయిలో బంగారం ధర నిర్మల్ఖిల్లా: పసిడి ధరలు రోజురోజుకూ ౖపైపెకి పోతున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మంగళవారం నాటికి మార్కెట్లో 10 గ్రాములకుగానూ రూ.89,200 కొనసాగింది. మేలిమి బంగారం 12 గ్రాములు రూ.1,04,040 ధర పలుకుతోంది. గత ఏడాది ఇదే సమయంలో బంగారం తులానికి ఇంచుమించు రూ.65 వేలు ఉండగా ఈ ఏడాది ఏకంగా రూ.90 వేలకు చేరువలో ఉంది. వివాహ ముహూర్తాలు విరివిగా ఉన్న ప్రస్తుత తరుణంలో బంగారం కొనుగోళ్లతో కళకళలాడాల్సిన దుకాణాలు వెలవెలబోతున్నాయి. వధువుకు పెళ్లి ఆభరణాలు చేయించేందుకు గతంలో పది తులాల వరకు కొనుగోలు చేస్తుండగా ప్రస్తుతం రెండు మూడు తులాలకే పరిమితమవుతున్నారు. దీంతో బంగారు ఆభరణాలు తయారుచేసే స్వర్ణకారులకు కూడా తగినంత పనులులేక ఉపాధి కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బులియన్ మార్కెట్లో హెచ్చుతగ్గులు, రూపాయి మారకవిలువ తగ్గడం వల్లే పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని బంగారం వర్తక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకేరోజు మూడుసార్లు పెరుగుదల సోమవారం రికార్డు స్థాయిలో ఒకేరోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడుసార్లు బంగారం ధర పెరిగింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో రూ. 87,800 ధర నమోదు కాగా మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో రూ.88,000 చేరువైంది. ఇక 3 గంటల ప్రాంతంలో ఏకంగా రూ.88,400 ధర పలికింది. గంటల వ్యవధిలోనే బంగారం ధర మారుతుండడంతో వినియోగదారులు విస్మయం చెందుతున్నారు. మంగళవారం నాటికి రూ.89,200 కు చేరింది. నిర్మల్ఖిల్లా: పెళ్లంటే నూరేళ్లపంటగా భావిస్తుంటారు. భారతీయ సంప్రదాయ వ్యవస్థలో వివాహ వేడుకకు ప్రత్యేక స్థానముంది. ఎందరో యువతీయువకుల జీవితకాల స్వప్నం పెళ్లివేడుక. ఇలాంటి జంటలు ఏకమయ్యేది వివాహబంధంతోనే. ఆ తరుణం మొదలైంది.. ఈ నెల మొదటి నుంచే శుభ ముహూర్తాలు మొదలైనట్లు పంచాంగకర్తలు, పురోహితులు పేర్కొంటున్నారు. శుభ ముహూర్తాల కోసం ఇప్పటికే పెళ్లిళ్లు ఖరారు చేసుకుని వేచి చూస్తున్న కుటుంబాల వారెందరో ఉన్నారు. మాఘం అంటే ఫిబ్రవరి మొదలుకుని జూన్ మొదటివారం వరకు పెళ్లిళ్లకు శుభ ముహూర్తాలు ఉన్నట్లు వేదపండితులు పేర్కొంటున్నారు. దీంతో పెళ్లిళ్లకు, భాజా భజంత్రీలు, సన్నాయి మేళాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే మాట ముచ్చట, పెళ్లిచూపులు, సంప్రదింపులు పూర్తయిన ఇరు కుటుంబాల పెద్దలు వివాహ వేడుకల కోసం సిద్ధమవుతున్నారు. ఇక నూతనంగా పెళ్లిళ్లు ఖరారు చేసుకున్న యువతీ యువకులు ఏ తేదీల్లో పెళ్లిళ్లు పెట్టుకోవాలో ఆలోచన చేస్తున్నారు. ఈనెల 1న మొదలైన పెళ్లిళ్లు వచ్చే జూన్ 7వ తేదీ వరకు వివాహ ముహూర్తాలు ఉన్నట్లు చెబుతున్నారు. మాఘ మాసంలో మొదలయ్యే సుముహూర్తాలు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో శుభలగ్నాలు ఎక్కువగా ఉన్నాయి. మొదలైన సందళ్లు ... శుభలగ్నాలతో పెళ్లి పెద్దలు, సంబంధిత కుటుంబాల వారు వేడుకలకు సన్నద్ధమవుతున్నారు. వివాహ వేదికలు, ఫంక్షన్ హాల్లు ఖరారు నుంచి మొదలుకుని భోజన సదుపాయాలు, డెకొరేషను, పెళ్లి వేడుకలకు అవసరమయ్యే నూతన వస్త్రాల కొనుగోలు, బంగారు ఆభరణాల తయారీ నిమిత్తం సమాయత్తమవుతున్నారు. పెళ్లిలో ఏర్పాట్లకు వ్యూహరచన చేస్తున్నారు. ఫొటోషూట్, ప్రీవెడ్డింగ్ షూట్ వంటి వాటికి వధూవరులు సిద్ధమవుతున్నారు. ఇక వివాహాలు నిర్వహించే ఫంక్షన్ హాళ్లలో డెకరేషన్ల హంగామా మొదలైంది. వేడుకల నిర్వహణ అనుబంధ రంగాలవారికి ఉపాధి దొరికేందుకు అనువైన సమయమని భావిస్తున్నారు. మూడేళ్లలో బంగారం ధరలు (10 గ్రాములకు) నెల సంవత్సరం ధర (రూ.లలో) ఫిబ్రవరి 11 2023 56,800 ఫిబ్రవరి 11 2024 64,500 ఫిబ్రవరి 11 2025 రూ.89,200 ఐదు నెలల్లో శుభముహూర్తాలివే... ఫిబ్రవరి 13, 14, 15, 18, 19, 20, 21, 23, 25.. మార్చి 1, 2, 6, 7, 12, ఏప్రిల్ 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30.. మే 1, 5, 6, 8, 15, 17, 18, జూన్ 1, 2, 4, 7...ఐదు నెలలు సుముహూర్తాలు నూరేళ్లపాటు గుర్తుండిపోయే వివాహ వేడుక నిర్వహించేందుకు వధూవరులు, ఇరువర్గాల పెద్దలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జనవరి 30 నుంచి మాఘ మాసం ప్రారంభమవుతోంది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్లో వివాహాది శుభలగ్నాలకు దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి. రానున్న కాలంలో విరివిగా వివాహ వేడుకలు సాగే అవకాశం ఉంది. – సముద్రాల శ్రీకాంతాచార్యులు, పంచాంగకర్త నిర్మల్ -
రూ.5.70 లక్షల నగదు పట్టివేత
తానూరు: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని బెల్తరోడా సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద మంగళవారం రూ.5.70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్సై శాముల్ తెలిపారు. కరీంనగర్ నుంచి మహారాష్ట్రలోని భోకర్కు వెళ్తున్న బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా నగదు పట్టుబడినట్లు ఆయన పేర్కొన్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువల్ల ఎవరైనా రూ.50 వేలకు మించి తీసుకెళ్లవద్దని, ఒకవేళ తీసుకువెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు. -
● ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ● రూ.7.48 లక్షల విలువైన 208 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం
అక్రమార్కులపై కఠిన చర్యలు●ఆసిఫాబాద్: అక్రమార్కులపై కఠిన చర్యలు తప్పవని కుమురంభీం జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 208 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుకున్నట్లు తెలిపారు. మంగళవారం సిర్పూర్(టి)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సిర్పూర్(టి) పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వోకు అందిన పక్కా సమాచారం మేరకు సిబ్బందితో కలిసి హుడ్కిలి చెక్పోస్ట్ ప్రాంతంలో ఐచర్ వ్యాన్ను తనిఖీ చేయగా 108 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం లభ్యమైనట్లు తెలిపారు. డ్రైవర్ ఇషాక్ అహ్మద్ను విచారించగా తన యజమాని మహ్మద్ రజాక్ రహెమాన్ ఆదేశాల మేరకు మహారాష్ట్రలోని వీరూర్ గ్రామానికి చెందిన ఉప్పరె సంతోష్ వద్దకు తీసుకెళ్తున్నట్లు తెలిపాడు. సంఘటన స్థలానికి కిలోమీటర్ దూరంలో ఒక రెడ్ కలర్ మినీ మహింద్రా వాహనాన్ని తనిఖీ చేయగా 42 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం లభ్యమైనట్లు తెలిపారు. డ్రైవర్ మహ్మద్ కలీంను విచారించగా మహారాష్ట్రలోని వీరూర్ గ్రామానికి చెందిన ఉప్పరె సంతోష్ వద్దకు తీసుకెళ్తున్నట్లు తెలిపాడు. ఈ రెండు వాహనాలకు ఒకరే యజమాని అని గుర్తించామన్నారు. మధ్యాహ్నం సమయంలో వచ్చిన సమాచారం మేరకు ఇటికల పహడ్ గ్రామానికి వెళ్తున్న దారిలో గ్రౌండ్ వద్ద చెట్ల పొదల్లో ఒక మినీ మహీంద్రా వ్యాన్ గుర్తించామన్నారు. అక్కడికి వెళ్లి చూడగా మరో వాహనం కనిపించిందన్నారు. అందులోనూ 58 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఉన్నట్లుగా గుర్తించామన్నారు. కాగజ్నగర్లోని తైబానగర్కు చెందిన సయ్యద్ ఆరిఫ్ ఆ వాహనం తనదేనని, తానే డ్రైవర్, యజమాని అని ఒప్పుకున్నాడు. ఈబియ్యం మహారాష్ట్రలోని వీరూర్ గ్రామానికి చెందిన ఉప్పరె సంతోష్కు అప్పగించేందుకు వెళ్తున్నట్లు తెలిపాడు. వాహనాల యజమాని మహమ్మద్ రజిక్ రెహమాన్తో పాటు సయ్యద్ ఆరిఫ్లను విచారించగా అతను కూడా భీమిని మండలం జనకాపూర్ గ్రామానికి చెందిన రాకేష్, అశోక్ వద్ద కొనుగోలు చేసినట్లు తెలిపారు. పంచనామా నిర్వహిస్తున్న క్రమంలో ఇందులోని కొన్ని బియ్యం బస్తాలు డైరెక్ట్గా తెలంగాణ ప్రభుత్వం రాయితీపై ఇస్తున్న రేషన్ డీలర్ షాపులో నుంచి వచ్చినట్లుగా గుర్తించామన్నారు. దీనిపై పూర్తి విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. మూడు వాహనాల్లో కలిపి 208 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం లభ్యమైనట్లు ఎస్పీ పేర్కొన్నారు. వాటి విలువ రూ.7,48,800 ఉంటుందన్నారు. మొదటి వాహన డ్రైవర్ ఇషాక్ అహెమద్, రెండో వాహన డ్రైవర్ మహమ్మద్ కలీం, మూడో వాహన డ్రైవర్, యజమాని సయ్యద్ ఆరిఫ్లపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై, కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు. -
తరలిపోనున్న ఏసీబీ కార్యాలయం!
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కార్యాలయం మంచిర్యాల జిల్లాకు తరలిపోనుంది. ఈ నెల 14న ఇక్కడి నుంచి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మంచిర్యాలలోని సింగరేణి క్వార్టర్స్లో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు పనిచేసిన అధికారులు జిల్లాలో ఉన్న కార్యాలయాన్ని మంచిర్యాలకు తరలించేందుకు ఉన్నతాధికారులకు లేఖ రాయడంతో అనుమతి వచ్చినట్లు సమాచారం. ఇదివరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొనసాగిన స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సైతం అధికారులు మంచిర్యాల జిల్లాకు తరలించారు. ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఉన్న ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల జిల్లాకు కార్యాలయాలను తరలించడంపై జిల్లా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ కేసులు ఎక్కువగా నమోదు కావడం లేదని, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లోనే ఎక్కువగా నమోదు అవుతుండడంతో ఈ కార్యాలయాన్ని అక్కడికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఏసీబీ అధికారులకు జిల్లా అనుకూలంగా లేకపోవడం, మంచిర్యాల ప్రాంతంలో రైల్వే స్టేషన్ ఉండడంతో వారి జిల్లాలకు వెళ్లేందుకు అనుకూలంగా ఉండడంతోనే అక్కడికి తరలిస్తున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఆదిలాబాద్ వాసులకు ఇబ్బందులు జిల్లా కేంద్రంలో ఉన్న ఏసీబీ కార్యాలయాన్ని మంచిర్యాలకు తరలిస్తుండడంతో జిల్లా వాసులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జిల్లాలో అధిక శాతం మంది గిరిజనులు ఉండడం, అమాయక ప్రజలను కొంతమంది అధికారులు, ఉద్యోగులు అక్రమ వసూళ్లు చేసినప్పుడు ఏసీబీని ఆశ్రయించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు జిల్లా కేంద్రంలో ఉన్నతాధికారులు లేకపోవడంతో బాధితులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పలువురు పేర్కొంటున్నారు. అయితే ఇదివరకు జిల్లాకు ఇన్చార్జి డీఎస్పీ ఉండగా ప్రస్తుతం రెగ్యులర్ డీఎస్పీని ప్రభుత్వం నియమించింది. ఇద్దరు సీఐలతో పాటు నలుగురు కానిస్టేబుళ్లు, నలుగురు హోంగార్డులు పనిచేస్తున్నారు. ముఖ్య కార్యాలయాన్ని మంచిర్యాలకు తరలించి నామ్కే వాస్తేగా జిల్లా కేంద్రంలో సబ్ కార్యాలయాన్ని అందుబాటులో ఉంచుతారనే చర్చ సాగుతోంది. ఇద్దరు హోంగార్డులు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయమై ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ను సంప్రదించగా ఆదిలాబాద్తో పాటు మంచిర్యాలలో ఏసీబీ కార్యాలయం కొనసాగుతుందని పేర్కొన్నారు. మంచిర్యాల కేంద్రంగా నిర్వహణ.. ఈనెల 14న తరలించనున్నట్లు సమాచారం -
● ప్రజావాణిలో అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్
కై లాస్నగర్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ శ్యామలాదేవికి విన్నవించి దరఖాస్తులు అందజేశారు. అర్జీలను స్వీకరించిన ఆమె వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ సత్వరం పరిష్కరించేలా శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఇందులో ఆర్డీవో వినోద్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆయా సమస్యలపై ఈ వారం మొత్తం 77 అర్జీలు అందాయి. ఇందులో కొందరి నివేదన.. అర్జీలు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, పక్కన ఆర్డీవో వినోద్కుమార్ తదితరులుఉద్యోగ భద్రత కల్పించండి మేమంతా జైనథ్ మండలంలోని పిప్పర్వాడ టోల్ప్లాజా కార్మికులం. 2012 నుంచి వివిధ కేటగిరీల్లో 75 మందిమి పనిచేస్తున్నాం. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టిన మార్పుల కారణంగా కాంట్రాక్టర్ 65 మందినే కొనసాగిస్తామని చెబుతున్నారు. దీంతో మిగతా వారికి అన్యాయం జరుగుతుంది. ప్రస్తుతం పనిచేస్తున్న వారందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని అర్జీ సమర్పించాం. బోర్వెల్ సౌకర్యం కల్పించాలి జైనథ్ మండలం కరంజి గ్రామానికి చెందిన మేము దళితబస్తీ లబ్ధిదారులం. గ్రామంలోని 40 మందికి గత ప్రభుత్వం మూడెకరాల చొప్పున భూమిని పంపిణీ చేసింది. అందులో విద్యుత్ సౌకర్యంతో పాటు బోర్బావులు తవ్విస్తామని అధికారులు తెలిపారు. సర్వే కూడా చేశారు. ఏడాది గడుస్తున్నా పురోగతి లేదు. మాకు న్యాయం చేయాలని కోరాం. భూకబ్జాపై చర్యలు తీసుకోవాలి మేమంతా గుడిహత్నూర్ మండలం శాంతాపూర్ గ్రామానికి చెందిన విశ్మకర్మసంఘ సభ్యులం. గ్రామంలో పోతులూరి వీరబ్రహ్మంద్రస్వామి ఆలయానికి ఓ దాత విరాళంగా అందజేసిన స్థలాన్ని ఆలయ వెనుకభాగంలో నివసిస్తున్న ఆనంద్ ఆక్రమించుకున్నాడు. దీనిపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విన్నవించాం. ఉద్యోగాలు కల్పించండి మేము ఉట్నూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన చెందిన ఆదివాసీలం. ఏడేళ్ల క్రితం స్టాఫ్ నర్సు కోర్సు పూర్తి చేశాం. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పోస్టులకు పలుమార్లు దరఖాస్తు చేసినా మాకెందుకో ఇవ్వడం లేదు. ఏ పీహెచ్సీకి పోస్టింగ్ ఇచ్చినా విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. విచారణ జరిపించండి డీఎస్సీలో స్పెషల్ ఎస్జీటీగా ఎంపికై న సౌజన్య ఒకే విద్యాసంవత్సరంలో రెండు రెగ్యులర్కోర్సులు కలిగి ఉన్నారు. 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న విద్యాసంస్థల్లో రెండు రెగ్యులర్ కోర్సుల తరగతులకు హాజరవ్వడం ఎలా సాధ్యపడింది. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. – కె.నవీన్కుమార్, తాంసి -
డేటా ఎంట్రీ ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తి చేయాలి
● కలెక్టర్ రాజర్షి షాకై లాస్నగర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల డేటా ఎంట్రీ ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కొన్నిచోట్ల ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుందని, నిర్లక్ష్యం వహించే తహసీల్దార్లపై చర్యలు తప్పవని హెచ్చరించా రు. రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలతో పాటు పైలెట్ ప్రజావాణి బహిరంగ విచారణపై సోమవారం సాయంత్రం సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన సంక్షే మ పథకాల అమలుకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్రామ, వార్డుసభల్లో స్వీకరించిన దరఖాస్తుల డేటా ఎంట్రీ గడువులోపు పూర్తి చేయాలన్నారు. పైలట్ ప్రజావాణిలో భా గంగా గాదిగూడ, నార్నూర్, తాంసి, ఇచ్చోడ, సిరికొండ, గుడిహత్నూర్లో మంగళవారం బహిరంగ విచారణ ఉంటుందన్నారు. జిల్లాలో మండల స్థాయిలో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. సంబంధిత అధికారులు అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరించడంతో పాటు తక్షణ పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అలాగే పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్కుమార్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు. -
నేడు ‘డయల్ యువర్ డీఎం’
ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో పరిధి లో మంగళవారం డయల్ యువర్ డీఎం కా ర్యక్రమం నిర్వహిస్తున్నట్లు మేనేజర్ కల్పన ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలు, సలహాలు, సూచనలు చేయవచ్చని పే ర్కొన్నారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగే కార్యక్రమానికి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు ఇచ్చేవారు 9959226002 నంబర్లో సంప్రదించాలని సూచించారు. పత్తి కొనుగోళ్ల నిలిపివేతకైలాస్నగర్: ఆధార్ సర్వర్డౌన్ కారణంగా ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్యార్డులో సీసీఐ ద్వారా చేపడుతున్న పత్తి కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి మధుకర్ ప్రకటనలో తెలి పారు. రైతులు విషయాన్ని గమనించి యా ర్డుకు పత్తిని తీసుకురావద్దని సూచించారు. సర్వర్ పునరుద్ధరణ తర్వాత కొనుగోళ్లు ప్రారంభించే సమాచారం తెలియజేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు మార్కెట్ కమిటీకి సహకరించాలని కోరారు. -
‘స్వగృహ’కు మోక్షమెప్పుడో?
రియల్ ఎస్టేట్ రంగంలో ప్రభుత్వం తొలిసారి అడుగుపెట్టింది. వెంచర్ ఏర్పాటు చేసి ప్లాట్ల విక్రయాలు చేపట్టింది. లేఅవుట్లో అన్ని వసతులు కల్పిస్తామని భరోసా ఇవ్వడంతో జనం పోటీపడి మరి వేలంలో పాల్గొని ప్లాట్లను సొంతం చేసుకున్నారు. ఈ ప్రక్రియ ముగిసి 25 నెలలు దాటింది. ఇప్పటికీ అందులో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో కొనుగోలు చేసిన వారు ఆందోళనకు గురవుతున్నారు. ప్లాట్ కొనుగోలుతో పాటు ఇంటి నిర్మాణానికి కలిపి పలువురు బ్యాంకుల నుంచి అప్పట్లో రుణాలు పొందారు. నెలలు గడిచినా నిర్మాణ పనులు షురూ కాకపోవడంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు. నిర్దేశిత సమయంలో నిర్మాణ పనులు మొదలు కాని పక్షంలో హౌసింగ్ లోన్ కాస్త పర్సనల్ లోన్గా మారిపోతుందేమోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. జిల్లా కేంద్రంలోని రాజీవ్ స్వగృహ వెంచర్లో ప్రస్తుతం పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. మరో పక్క ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు విడుదల కాకపోవడంతో ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. – సాక్షి, ఆదిలాబాద్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 నవంబర్లో రాజీవ్ స్వగృహ పథకం కింద జిల్లా కేంద్రంలోని దుబ్బగూడలో గల 29 ఎకరాల్లో 362 ప్లాట్లతో వెంచర్ను రూపొందించింది. వేలం ప్రక్రియ ద్వారా ఇందులో ప్లాట్లను విక్రయించింది. ప్రభుత్వ వెంచర్లో అన్ని రకాల మౌలిక వసతులు ఉంటాయని చెప్పడంతో పోటీ పెరిగింది. ప్లాట్ల వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.97.14 కోట్ల ఆదాయం సమకూరింది. ఏడాదిలోపు రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్ సరఫరా, తాగునీరు వంటి వసతులు అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. అయితే నెలలు గడుస్తున్నా సదుపాయాల కల్పన పూర్తికాకపోవడంతో బ్యాంకు రుణాలు తీసుకున్న వారు చెల్లింపుపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదీ పరిస్థితి.. రాజీవ్ స్వగృహ పథకం ద్వారా వేలం ప్రక్రియ నుంచి వచ్చిన డబ్బులు ప్రభుత్వ ఖాతాలోకి చేరాయి. కలెక్టర్ ఆధ్వర్యంలో వెంచర్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అప్పట్లో ఆదేశించింది. టీజీఐఐసీ నిజామాబాద్కు నోడల్ ఏజెన్సీగా బాధ్యతలు అప్పగించింది. రూ.20కోట్ల అంచనా వ్యయంతో వివిధ పనులకు సంబంధించి ఈ సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అనంతరం ఇందులో రూ.5.75 కోట్లు వెచ్చించి ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రహదారులను నిర్మించింది. అయితే ఇప్పటి వరకు సంస్థకు కేవలం రూ.3.93 కోట్లు మాత్రమే నిధులు విడుదలయ్యాయి. మిగతా నిధులు విడుదల కాకపోవడంతో ఈ పనులు నెమ్మదిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లు దాటినా సిద్ధం కాని వెంచర్ ప్లాట్ల కొనుగోలుదారులకు తప్పని ఎదురుచూపులు ఇప్పటికే బ్యాంకుల నుంచి రుణాలు ఇంటి నిర్మాణ పనులు జాప్యమవుతుండడంతో ఆందోళనసదుపాయాలు కల్పించాలి ప్లాట్లు కొనుగోలు చేసిన వారు త్వరగా ఇళ్లను నిర్మించాలనుకున్నప్పటికీ వెంచర్లో సదుపాయాలు కల్పించకపోవడంతో నిర్మాణ పనులు ఇంకా షురూ చేయలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం త్వరగా మౌలిక సదుపాయాలు కల్పించాలి. – ఎన్.స్వామి, ప్లాట్ కొనుగోలుదారు త్వరగా పూర్తయ్యేలా చర్యలు ప్రస్తుతం వెంచర్లో రూ.3.93 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. మార్చిలోగా పనులు పూర్తయ్యేలా చూస్తాం. మిగతా పనులను ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులకనుగుణంగా చేపడుతాం. – రాందాస్, డీజెడ్ఎం, టీజీఐఐసీ, నిజామాబాద్ -
● గాడి తప్పుతున్న బాల్యం ● చెడు వ్యసనాల బారిన విద్యార్థులు ● వెకిలి చేష్టలతో ఇబ్బందుల పాలు ● గురువులకూ గౌరవం ఇవ్వని వైనం ● టీచర్లు దండిస్తే.. బెదిరింపులు, కేసులు
● ఆదిలాబాద్రూరల్ మండలంలోని ఓ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఇటీవల పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత విద్యార్థి కుటుంబీకులకు విషయాన్ని తెలిపాడు. దీంతో వారు పోలీసు స్టేషన్లో ఫి ర్యాదు చేయగా, ఆ బాలుడిపై పోక్సో కేసు నమోదైంది. కోర్టులో హాజరుపర్చి పునరావాస కేంద్రానికి తరలించారు. ● మావల మండలంలోని ఓ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయురాళ్ల గురించి గోడలపై అసభ్యకర రాతలు రాశారు. ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆ రాతలను చూసి ఖంగు తిన్నారు. ఇద్దరు ఉపాధ్యాయురాళ్లు మనోవేదనకు గురై కన్నీరుమున్నీరయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ● ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివే ఓ విద్యార్థి ఇంటి నుంచి స్కూల్ బ్యాగ్లో కత్తి తీసుకువచ్చాడు. పాఠశాల ముందు ఉండే గుప్చుప్ బండి నిర్వాహకుడిని గుప్చుప్ ఇవ్వాలని కత్తితో బెదిరించాడు. అదే పాఠశాలకు చెందిన విద్యార్థులు బాలికల విషయంలో రెండు గ్రూప్లుగా ఏర్పడి దాడులకు పాల్పడ్డారు. ● ఇటీవల జిల్లాలో పలువురు మైనర్ అమ్మాయిలు యువకులతో ప్రేమలో పడుతున్నారు. కుటుంబీకులను వదిలేసి వారితో వెళ్లిపోతున్నారు. దీంతో సదరు యువకులపై పోక్సో, రేప్ కేసులు నమోదవుతున్నాయి. విలువైన జీవితా లను నాశనం చేసుకుంటున్నారు. సమాజంలో ఉన్న గుర్తింపును పోగొట్టుకుంటున్నారు. తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో ఇటీవల చోటు చేసుకుంటూనే ఉన్నాయి.ఆదిలాబాద్టౌన్: బాల్యం గాడి తప్పుతోంది. వి ద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడుతూ తమ వి లువైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మంచిని పెడచెవిన పెడుతూ చెడు వైపు ఆకర్షితులవుతున్నారు. తెలిసీ తెలియని వయసులో తప్పులు చేసి చదువుకు దూరమవుతున్నారు. కొంత మంది విద్యార్థులు సిగరేట్లు, మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. ఈ మత్తులో ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదు. గొడవలు పడటం, అమ్మాయిలను వేధించడం, ఇత ర వాటికి పాల్పడుతున్నారు. కేసుల్లో ఇరుక్కొని వా రితో పాటు వారి తల్లిదండ్రులు చెడు పేరును తీసుకొస్తున్నారు. కౌమర దశలోనే విద్యార్థులు నేరాల వైపు అడుగులు వేస్తున్నారు. కొంతమంది బాలలు దొంగతనాలకు సైతం అలవాటు పడుతున్నారు. గాడిన పెట్టేందుకు టీచర్లు ప్రయత్నిస్తే వారికే ఎదురు తిరుగుతున్నారు. ఉపాధ్యాయులు దండిస్తే కొంత మంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. బెదిరింపులకు పాల్ప డడంతో పాటు పోలీసు స్టేషన్లో కేసులు పెడుతున్నారు. దీంతో గురువులు చూసీ చూడనట్లుగా ఉండడంతో విద్యార్థుల బాల్యం నాశనమవుతోంది. గురువులంటే గౌరవం లేదు.. ఒకప్పుడు చదువు చెప్పిన ఉపాధ్యాయులు కనిపిస్తే వారికి కనిపించకుండా విద్యార్థులు పరుగులు తీసేవారు. పాఠశాలకు వచ్చిన తర్వాత దండిస్తారనే భయం వారిలో ఉండేది. ఉపాధ్యాయులు క్రమశిక్షణ చెబుతూ దండించడంతోనే తాము ప్రయోజకులమయ్యామని అప్పటి విద్యార్థులు చెబుతుంటారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఉపాధ్యాయులు, పెద్దలంటే చాలా మంది విద్యార్థులకు గౌరవం లేకుండా పోయింది. ఇందుకు కొంత మంది తల్లిదండ్రుల తీరే కారణమని తెలుస్తోంది. విద్యార్థులు చదవకపోతే దండించినా పాఠశాలకు వెళ్లి వారిని బెదిరించడం, కేసులు నమోదు చేయించడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఇచ్చోడ మండలంలో ఇలాంటి సంఘటనే జరిగింది. అయితే చాలా మంది ఉపాధ్యాయులు క్రమశిక్షణ కోసం విద్యార్థులను దండించకుండా చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారు. చిన్న మాట అన్న కొందరు విద్యార్థులు ఎదురుతిరగడం, తల్లిదండ్రులకు చెప్పడం పరిపాటిగా మారింది. చెడువ్యసనాల వైపు..విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు పడి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. కొంత మంది యువకులు మైనర్ అమ్మాయిలను ప్రేమ పేరిట వేధిస్తూ వారిని బయటకు తీసుకెళ్తున్నారు. దీంతో వారిపై పోక్సో కేసులు నమోదవుతున్నాయి. అమ్మాయిలు చదువుపైనే దృష్టి సారించాలి. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. కేసుల్లో ఇరుక్కొని విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. – ఎల్.జీవన్రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ పుస్తకాల బ్యాగు భుజంపై వేసుకొని స్కూల్కు వెళ్లాల్సిన విద్యార్థులు చెడు వ్యసనాలకు బానినవుతున్నారు. గంజాయి, సిగరేట్ మత్తులో తూగుతున్నారు. తరగతులకు ఎగనామం పెడుతున్నారు. ఇంట్లో బడికి, కళాశాలకు వెళ్తున్నామని చెప్పి సినిమాలు, పార్కుల బాట పడుతున్నారు. తోటి వారితో జల్సాలు చేస్తూ చిన్న చిన్న నేరాలకు పాల్పడుతున్నారు. కేసులు నమోదైన తర్వాత ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకరిద్దరు కుమారులు ఉండడంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులు వారిని ఏమనలేక పోతున్నారు. చాలా మంది విద్యార్థులకు పేరెంట్స్ అటే భయం లేకపోవడం, పాఠాలు చెప్పే గురువులంటే కనీస మర్యాద లేకపోవడంతో దారి తప్పుతున్నారు. సెల్ఫోన్లలో రీల్స్ చేయడం, యూట్యూట్, ఇన్స్ట్రాగామ్లు చూస్తూ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. అయితే కొంత మంది తల్లిదండ్రులకు విషయం తెలిసినప్పటికీ దండిస్తే పిల్లలు అఘాయిత్యానికి పాల్పడతారనే భయంతో చూసీచూడనట్లుగా ఉంటున్నారు. -
పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి
కై లాస్నగర్: విద్యార్థులు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని జిల్లా పొగాకు నియంత్రణ కార్యక్రమ అధికారి ఎం. శ్రీధర్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ గెజిటెడ్ నంబర్–2 ఉన్నత పాఠశాల, ఆర్ట్స్అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలను సోమవారం సందర్శించారు. పొగాకు రహిత విద్యాసంస్థల మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాటు చేయాల్సి న సౌకర్యాలను పరిశీలించారు. హెచ్ఎం, ప్రి న్సిపాల్తో సమావేశమై పలు సూచనలు చేశా రు. అనంతరం మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్తో కలిసి విద్యాసంస్థల వద్ద ఎల్లో లైన్ ను గుర్తించారు. ఆయన వెంట జిల్లా పొగాకు నియంత్రణ విభాగం సైకాలజిస్ట్ శ్రీకాంత్, సోషల్ వర్కర్ చిరంజీవి తదితరులున్నారు. మాంగ్ కులస్తుల ఆందోళనకై లాస్నగర్: తమను ఎస్సీ బి–కేటగిరిలోని గ్రూప్–ఏ నుంచి గ్రూప్–బి లోకి చేర్చాలని డిమాండ్ చేస్తూ మాంగ్ కులస్తులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్యామలాదేవిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో ఎమ్పార్పీఎస్ నాయకులు, మాంగ్ కులస్తులు పాల్గొన్నారు. -
సామాజిక సేవ అభినందనీయం
ఆదిలాబాద్టౌన్: డెంటల్ అసోసియేషన్ సభ్యులు సామాజిక సేవ కార్యక్రమాల్లో ముందుండటం అభినందనీయమని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఇండియన్ డెంటల్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధ్యక్షుడు సాయిరాం, కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకా రం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుమూల గిరిజన గ్రా మాల్లో వైద్యసేవలు అందించేలా కృషి చే యాలని సూచించారు. అలాగే అసోసియే షన్ అందిస్తున్న సామాజిక సేవా కార్యక్ర మాలను కొనసాగించాలన్నారు. ఇందులో వైద్యులు కళ్యాణ్రెడ్డి, ప్రకాశ్, ప్రమోద్ రెడ్డి, సమీయోద్దిన్, ఐడీఏ కోశాధికారి సంజీవ్కుమార్, ఉపాధ్యక్షులు స్వప్నిల్,రత్న,సంయు క్త కార్యదర్శి నిఖిల్రెడ్డి పాల్గొన్నారు.