Adilabad
-
టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
తాంసి: ఆదిలాబాద్ను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా భీంపూర్ పీహెచ్సీలో మంగళవారం ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం నిర్వహించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రచార వాహనాన్ని అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం వ్యాధిగ్రస్తులకు కళావతి పౌండేషన్ ఆధ్వర్యంలో నిక్షయ్ మిత్ర కిట్లు పంపిణీ చేశారు. వ్యాధి నియంత్రణకు కృషి చేస్తున్న ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటికే 24 గ్రామాలను టీబీ రహితంగా ప్రకటించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి మరిన్ని గ్రామాలు ఈ జాబితాలో చేరేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్యాధికారులు సాధన, మనోహర్, టీబీ ప్రోగ్రాం జిల్లా అధికారి సుమలత, తహసీల్దార్ రమేశ్, ఎంపీడీవో గోపాలకృష్ణారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు రంజన, కేశవ్, లక్ష్మి, మండల వైద్యాధికారి నిఖిల్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాల తనిఖీ మండలంలోని అందర్బంద్ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రమేశ్,వైద్యసిబ్బంది, తదితరులు ఉన్నారు. -
ఇబ్బందులకు గురిచేస్తే ఫిర్యాదు చేయండి
ఆదిలాబాద్టౌన్: మహిళా ఉద్యోగులను ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే ఫిర్యాదు చేయాలని పాల్ యాక్షన్ యాక్ట్ ప్రోగ్రాం అధికారి వందన అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆడిటోరియంలో రిమ్స్లో పనిచేస్తున్న ఉద్యోగులు, మెడికోలు, నర్సింగ్ విద్యార్థులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విధులు నిర్వహించే చోట వేధింపులు, ఇబ్బందులకు గురైతే రిమ్స్ డైరెక్టర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. పురుష ఉద్యోగులు మహిళలపై మర్యాదపూర్వకంగా మెదలాలని, స్నేహపూర్వకంగా విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. ఇబ్బందులకు గురిచేస్తే నమోదు చేసే చట్టాలు, కే సుల వివరాలను వివరించారు. ఇందులో రి మ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, మున్సిపల్ చైర్ ప ర్సన్ బండారి అనూష, వైస్ ప్రిన్సిపాల్ సరోజ, విద్యావిల్సన్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ నరేందర్, సూపర్ స్పెషాలిటీ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ దీపక్ పుష్కర్, మర్సకోల సరస్వతి తదితరులు పాల్గొన్నారు.మండలాల వారీగా లక్ష్యం వివరాలిలా... మండలం జీపీలు నాటాల్సిన నర్సరీలు ఆదిలాబాద్ రూరల్ 34 55,000 16 బజార్హత్నూర్ 30 52,000 15 బేల 37 50,000 28 భీంపూర్ 26 86,000 26 భోరజ్ 17 21,000 07 బోథ్ 33 50,000 06 ఇచ్చోడ 32 52,000 17 గాదిగూడ 25 57,500 25 గుడిహత్నూర్ 26 50,000 22 ఇంద్రవెల్లి 28 75,000 06 జైనథ్ 42 25,200 05 మావల 03 25,000 02 నార్నూర్ 23 56,000 08 నేరడిగొండ 32 50,000 10 సాత్నాల 17 25,000 05 సిరికొండ 19 26,300 06 సొనాల 11 27,000 04 తలమడుగు 28 50,000 11 తాంసి 14 50,000 13 ఉట్నూర్ 38 1,00,000 05 -
నేర పరిశోధనలో సీసీ నిఘా కీలకం
ఆదిలాబాద్టౌన్: నేర పరిశోధనలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్క్వార్టర్స్ సమావేశ మందిరంలో పోలీసు అధికారులతో మంగళవారం నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపే దిశగా విధులు నిర్వర్తించాలన్నారు. స్టేషన్కు వచ్చే బాధితుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతీ గ్రామానికి కేటాయించిన వీపీవో ద్వారా సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాలన్నారు. గంజాయి, గుడుంబా, మాదకద్రవ్యాలు, గ్యాంబ్లింగ్ వంటివి జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆన్సైడ్ ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని, రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని, స్టేషన్లో నెలరోజుల పరిధిలో నమోదైన కేసుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నిందితులకు కోర్టులో శిక్ష పడేలా చూడాలన్నారు. వివిధ పోలీసు స్టేషన్లలో ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇందులో అదనపు ఎస్పీలు సురేందర్ రావు, మౌనిక, రుత్విక్ సాయి, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ పోతారం శ్రీనివాస్, ఎల్.జీవన్ రెడ్డి, సీఐలు తదితరులు పాల్గొన్నారు. -
వనమహోత్సవ లక్ష్యం ఖరారు
కై లాస్నగర్: గ్రామాల్లో పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏటా వానాకాలంలో మొక్కలు నాటుతున్నారు. వన మహోత్సవంలో భాగంగా 2026–27 సంవత్సరానికి సంబంధించి లక్ష్యాన్ని ఆ శాఖ ఖరారు చేసింది. జిల్లా వ్యాప్తంగా 9లక్షల 83వేల మొక్కలు నాటేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఆయా పంచాయతీల్లో నర్సరీల్లో విత్తనాలు నాటేందుకు వీలుగా చర్యలు చేపట్టారు. బ్యాగుల్లో మట్టి నింపే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. గతేడాదితో పోల్చితే తగ్గిన లక్ష్యం గ్రామ పంచాయతీలు, నాటాల్సిన మొక్కలకనుగుణంగా లక్ష్యాలను నిర్ణయించారు. అయితే గతేడాది పొల్చితే లక్ష్యాన్ని భారీగా తగ్గించారు. గతంలో ఒక్కో మండలానికి 3లక్షల వరకు నాటాలనే టార్గెట్ ఉండగా, ఈసారి 25వేల నుంచి లక్షకు తగ్గించారు. తదనుగుణంగా రానున్న జూన్, జూలై మాసాల్లో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటనున్నారు. సిద్ధమవుతున్న నర్సరీలు లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను సరఫరా చేసేందుకు వీలుగా ఆయా గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 473 గ్రామపంచాయతీలు ఉండగా, 237 నర్సరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే పలు నర్సరీల్లో సంచుల్లో మట్టి నింపే ప్రక్రియ కూడా పూర్తి చేశారు. వన మహోత్సవంలో భాగంగా వేప, మర్రి, రావి, చింతతో పాటు గులాబీ, మల్లె, మందార, చామంతి వంటి పూల మొక్కలు, జామ, సీతాఫలం, అల్లనేరేడు వంటి పండ్ల మొక్కలు అందించేలా ప్రణాళికను సిద్ధం చేశారు. కొన్నిచోట్ల విత్తనాలు నాటే ప్రక్రియ కూడా పూర్తి చేశారు. నర్సరీ పనులకు ఉపాధి హామీ పథకం కింద నిధులు చెల్లించనున్నారు. లక్ష్యానికి అనుగుణంగా ఏర్పాట్లు.. రానున్న వార్షిక సంవత్సరానికి సంబంధించి 9లక్షల 83వేల మొక్కలు నాటేలా కార్యాచరణ సిద్ధం చేశాం. ఈ మేరకు జిల్లాలోని ఆయా గ్రామాల్లో 237 నర్సరీలను ఉపాధి హామీ పథకం కింద ఏర్పాటు చేశాం. ఇప్పటికే బ్యాగుల్లో మట్టి నింపే పనులు పూర్తయ్యాయి. లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – రాథోడ్ రవీదర్, డీఆర్డీవో -
అసెంబ్లీ స్థానాలు..15!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అసెంబ్లీ, లోక్సభ స్థా నాల పునర్విభజన(డీ లిమిటేషన్)పై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 2029లో జరిగే ఎన్నికల నాటికి శాసనసభ, లోక్సభ స్థానాలు పెంచాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం మొదలైన జనగణన ప్రక్రియ ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు. దీంతో 2011 జనాభా ప్రాతిపదికనే కొత్త స్థానాలు పెంచేందుకు ప్రణాళికలు సాగుతున్నా యి. నాటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో మరో ప్రస్తు తం ఉన్న 119 శాసనసభ స్థానాలకు మరో సగం శాతం అంటే 60వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ప్రస్తు తం ఉన్న పది శాసనసభ స్థానాలకు మరో ఐదు స్థానాలు పెరిగి మొత్తం 15 స్థానాలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఉమ్మడి జిల్లా నుంచి శాసనసభ్యుల సంఖ్య పెరగనుంది. రిజర్వు స్థానాల్లో మార్పులు కొత్త స్థానాల ఏర్పాటుతో ఉమ్మడి జిల్లా ముఖ చిత్రమే పూర్తిగా మారిపోనుంది. 2009 చివరలో నియోజకవర్గాల పునర్విభజనలో కేవలం సర్దుబాటు చేయగా, రిజర్వేషన్లు మాత్రమే మారాయి. కానీ సంఖ్యలో మార్పు రాలేదు. తాజాగా 15 స్థానాలకు చేరితే చట్టసభలకు ప్రజాప్రతినిధుల సంఖ్య మరింత పెరగనుంది. ఇక కొత్తగా ఏర్పాటయ్యే స్థానాల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, జనరల్ స్థానాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023 ప్రకారం అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో 33శాతం మహిళలకు రిజర్వు చేయాల్సి ఉంది. జిల్లా యూనిట్గా ఎస్టీ జనాభా ఆ వర్గాలకు స్థానాల రిజర్వు జరగనుంది. ఎస్సీ స్థానాలకు రాష్ట్ర యూనిట్గా రిజర్వు అయ్యే అవకాశం ఉంది. ఇక మహిళా రిజర్వేషన్ రాష్ట్ర, జిల్లా జనాభా ప్రాతిపదికన ఇస్తారా? లేక లాటరీ ప్రాతిపదికన కేటాయిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఎక్కడెక్కడ కొత్తవి? ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లా కేంద్రాలైన అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనే అత్యధిక జనాభాతో ఉన్నాయి. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల పరిధి మండలాలను కలుపుతూ మళ్లీ కొత్తగా స్థానాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్తోపాటు విస్తీర్ణంలో పెద్దదైన బోథ్ స్థానం, ఖానాపూర్ పరిధి ఏజెన్సీ ఉట్నూర్లో మార్పు జరగనుంది. మంచిర్యాల నియోజకవర్గ పరిధి నగర ప్రాంతం, గ్రామీణ ప్రాంతాలైన లక్సెట్టిపేట, ఇక ఆసిఫాబాద్, సిర్పూర్ రెండు నియోజకవర్గాల పరిధి మండలాల్లోనూ కొత్తగా ఒక స్థానం ఏర్పడనుంది. రాష్ట్రం యూనిట్గా లోక్సభ స్థానాలు మరో వైపు రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉండగా, మరో తొమ్మిది పెరగనున్నాయి. అయితే రాష్ట్ర స్థాయి జనాభా యూనిట్గా లోక్సభ స్థానాలు ఏర్పాటు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఆదిలాబాద్(ఎస్టీ), పెద్దపల్లి(ఎస్సీ) ఎంపీ స్థానాలతోపాటు మరోస్థానం కొత్తగా ఏర్పాటవుతుందా? లేదా? అనేది డీలిమిటేషన్ ప్రక్రియ మొదలైతేనే స్పష్టత రానుంది. కొత్త జిల్లాల ప్రకారమే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. దీంతో భౌగోళికంగా నియోజకవర్గాలు వేర్వేరు జిలాల్లో కాకుండా ఒకే జిల్లాలోనే ఉండనున్నాయి. 2016లో కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉమ్మడి జిల్లాలోని పది స్థానాలు అటు ఇటుగా మారాయి. ఆదిలాబాద్ జిల్లా పరిధిలో పూర్తిగా స్థాయి ఆదిలాబాద్, బోథ్లు ఉండగా, ఆసిఫాబాద్ నియోజకవర్గం నార్నూర్, గాదిగూడ మండలాలు ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో నిర్మల్, ముథోల్ ఉండగా, పాక్షికంగా ఖానాపూర్ నియోజకవర్గంలోని పెంబి, దస్తూరాబాద్, కడెం మండలాలు ఉన్నాయి. మిగతా ఉట్నూరు, ఇంద్రవెల్లి మండలాలు ఆదిలాబాద్ జిల్లాలో, జన్నారం మండలం ఒక్కటి మంచిర్యాల జిల్లాలో ఉంది. ఇక మంచిర్యాల జిల్లా పరిఽధిలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు పూర్తి స్థాయిలో ఉన్నాయి. ముథోల్, సిర్పూర్ నియోజకవర్గాల పరిధిలో గ్రామాలు సైతం పక్క జిల్లాల్లో ఉన్నాయి. దీంతో పాలనలో ఇబ్బందులు రాకుండా ఒకే జిల్లా పురిధిలోనే నియోజకవర్గాల పునర్విభజన పూర్తయ్యేలా కసరత్తు జరుగుతన్నట్లు తెలుస్తోంది.ఉమ్మడి జిల్లా అసెంబ్లీ స్థానాలు జిల్లా 2011 జనాభా పాతవి కొత్తగా ఏర్పడేవి ఆదిలాబాద్ 7,08,972 02 02 కుమురంభీం 5,15,812 02 01 మంచిర్యాల 8,07,037 03 01 నిర్మల్ 7,09,418 03 01 -
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలు
ఆదిలాబాద్టౌన్: వేసవిలో విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన సేవలు అందిస్తున్నామని ఆ శాఖ ఆపరేషన్ వరంగల్ డైరెక్టర్ మధుసూదన్ అన్నారు. జిల్లాకేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్పై మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవిలో వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో చీఫ్ ఇంజినీర్ అశోక్, ఎస్ఈ శేషారావు, డీఈ రాంసుబ్బారెడ్డి, శ్రీనివాస్, జనార్దన్రెడ్డి, శ్రావణ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
క్షయ నియంత్రణలో భేష్
● రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానం ● అవార్డు అందుకున్న డీఎంహెచ్వో ఆదిలాబాద్టౌన్: క్షయ నియంత్రణలో జిల్లా రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. వైద్యశాఖ అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు మందుల పంపిణీ, వ్యాధి నిర్ధారణలో ముందు వరుసలో నిలిచింది. 2025 సంవత్సరంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ను పకడ్బందీగా అమలు చేశారు. ప్రపంచ టీబీ నివారణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రజుమంలో వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ చేతుల మీదుగా డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ ఫ్యామిలీ అవార్డు అందుకున్నారు. వైద్యాధికారులు, ఉద్యోగులు ఆయనకు అభినందనలు తెలిపారు. -
ఉచిత శిక్షణ.. దేశ రక్షణ
జన్నారం: మండలంలోని పొనకల్ గ్రామ పంచాయతీ కిష్టాపూర్ తండాకు చెందిన బానోత్ రాజు నాయక్, లత దంపతుల ఇద్దరు కుమారులు వంశీ కృష్ణ, సాయికృష్ణ 2018లో ఒకేసారి ఆర్మీలో చేరా రు. వంశీకృష్ణ జవాన్గా సాయికృష్ణ పూణేలోని ఆర్మీ మెడికల్ డిపార్టుమెంటులో రేడియాలజీలో పనిచేస్తున్నాడు. ఇద్దరు కుమారులు ఇంటిని విడిచి వెళ్ల డం ఇష్టంలేని తల్లిదండ్రులు పెద్దకుమారుడిని తిరి గి రావాలని కోరగా వంశీకృష్ణ ఉద్యోగం వదిలి ఇంటికి వచ్చాడు. ఖాళీగా ఉండడం ఇష్టంలేక 2023 లో ఆర్మీ ఉద్యోగంపై ఆసక్తి ఉన్న పరిసర గ్రామాల్లోని పది మంది యువకులకు గ్రామంలోనే శిక్షణ ఇచ్చా డు. అందులో నలుగురు ఆర్మీకి ఎంపికయ్యారు. ఉచితంగా శిక్షణ ఇక్కడితో శిక్షణ ఆపకూడదనే సంకల్పంతో ఆదిలా బాద్ జిల్లా కేంద్రంలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించా డు. శిక్షణలో చేరిన కొందరు నగదు రూపేనా ఇవ్వడంతో వాటితో నిరుపేదలు, ఆదివాసీలు, గిరిజనులకు శిక్షణలో ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పించాడు. సెలవులపై ఇంటికి వచ్చిన సాయికృష్ణ ఖా ళీగా ఉండకుండా ఫిజికల్ ఈవెంట్లో వారికి మెలకువలు నేర్పించాడు. మూడేళ్లలో అతని వద్ద శిక్షణ పొందిన 146 మంది యువకులు ఆర్మీ, నేవీలో ఉద్యోగం సాధించారు. దేశానికి సేవ చేసేందుకు వెళ్లి తల్లిదండ్రుల కోరిక మేరకు తిరిగి వచ్చిన యువకుడు తనలాంటి ఎందరినో దేశానికి అందించాలనే ఉద్దేశంతో ఉచితంగా శిక్షణ ఇచ్చి దేశ సేవ కోసం పంపిస్తున్నాడు. జన్నారం మండలానికి చెందిన ఈ యువకుడి వద్ద శిక్షణ పొందిన 146 మంది యువకులు ఆర్మీ, నేవీలలో ఉద్యోగంలో చేరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని స్టేడియంలో ఈనెల 26 నుంచి మరో బ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కథనం. -
దివ్యాంగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరపాలి
ఆదిలాబాద్: దివ్యాంగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరపాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్లో అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. నెలవారీ పెన్షన్ను పెంచాలని, దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ తక్షణమే మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, కాగజ్నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, దివ్యాంగుల సంఘం రాష్ట్ర నాయకులు ముస్తాపూర్ అశోక్, తదితరులు పాల్గొన్నారు. -
షార్ట్సర్క్యూట్తో సామగ్రి దగ్ధం
తాంసి: మండలంలోని పొన్నారిలో మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇంట్లోని సామగ్రి దగ్ధమైంది. దేవల్ల ఓమక్క ఇంట్లో ఫ్రిజ్ వద్ద షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లో నుంచి భారీగా పొగలు రావడంతో కుటుంబసభ్యులు బయటకు వచ్చి అప్రమత్తమయ్యారు. స్థానికులు బిందెలతో నీళ్లుచల్లి మంటలు ఆర్పివేశారు. అప్పటికే ఫ్రిజ్తో పాటు ఇంట్లోని బట్టలు, నిత్యావసర వస్తువులు కాలిపోయాయి. ఘటనలో రూ.లక్ష మేర ఆస్తినష్టం జరిగిందని బాధితురాలు వాపోయింది. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతోంది. -
రైలు ఢీకొని మహిళ మృతి
తాండూర్: మండలంలోని తాండూర్ ఐబీ చౌరస్తా సమీపంలోని రైల్వేట్రాక్పై రైలు ఢీకొని మహిళ మృతి చెందింది. జీఆర్పీహెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలి పిన వివరాల ప్రకారం... బెల్లంపల్లిలోని సుభాష్నగర్కు చెందిన ఫర్హానా(29) కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతోంది. మంగళవారం రైల్వేట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. చేపల వేటకు వెళ్లి ఒకరు..కుభీర్: మండలంలోని హల్దా గ్రామానికి చెందిన కె.మారుతి(40) మంగళవారం గ్రామ సమీపంలోని సుద్దవాగులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. మృతునికి భార్యతో పాటు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ట్రాక్టర్ పైనుంచి కిందపడి ఒకరు..లక్ష్మణచాంద: ట్రాక్టర్ పైనుంచి కిందపడి ఒకరు మృతి చెందిన సంఘటన సోన్ మండలంలోని పాక్పట్లలో మంగళవారం చోటు చేసుకుంది. సోన్ మండలంలోని పాక్పట్లకు చెందిన ఓల్లెపు మహేష్ (36) కట్టెలు కొట్టడానికి వెళ్లి ట్రాక్టర్ పైన ముందుభాగంలో కూర్చున్నాడు. ఆ సమయంలో ఫిట్స్ రావడంతో కిందపడ్డాడు. గాయాలు కావడంతో నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య ఓల్లెపు లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సోన్ ఎస్సై గోపి తెలిపారు. -
‘అడెల్లి’ ఆదాయం రూ.53.97 లక్షలు
సారంగపూర్: ఉత్తర తెలంగాణ ప్రజల వరప్రదాయినిగా పేరుగాంచిన అడెల్లి మహాపోచమ్మ ఆలయ హుండీని మంగళవారం దేవాదాయ శాఖ నిర్మల్ డివిజన్ ఇన్స్పెక్టర్ రంగు రవికిషన్గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ భోజాగౌడ్ ఆధ్వర్యంలో లెక్కించారు. అమ్మవారికి భక్తులు నగదు రూపేణా సమర్పించిన రూ.53, 97,520 నగదు, 125.49 గ్రాముల మిశ్రమ బంగారం, 3 వేల గ్రాముల మిశ్రమ వెండి సమకూరినట్లు ఆలయ ఈవో కె.భూమయ్య తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ దండు సాయన్న, ఎస్సై శ్రీకాంత్, పాల్గొన్నారు. గూడెం ఆలయ హుండీ లెక్కింపుదండేపల్లి: మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణస్వామి ఆలయానికి 2025 డిసెంబర్ 20 నుంచి 2026 మార్చి 23 హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మంగళవారం లెక్కించినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. 94 రోజులకు రూ.6,67,205 ఆదాయం సమకూరినట్లు ఆయన పేర్కొన్నారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ నవీన్ పర్యవేక్షణలో లెక్కింపు చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్, అర్చకులు, సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు. బడ్జెట్లో విద్యారంగానికి నిరాశే నిర్మల్ఖిల్లా: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపుల్లో నిరాశే మిగిలిందని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్)జిల్లా అధ్యక్షుడు ఆరేపల్లి విజయ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశా రు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లుకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్లో కేవలం 26 వేల కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించిందని, వాస్తవానికి రాష్ట్ర బడ్జెట్లో కనీసం 15 శాతం నిధులు కేటాయిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పేర్కొందని గుర్తుచేశారు. దానికి భిన్నంగా కేవలం 8 శాతం మాత్రమే కేటాయింపులు జరపడం ఆక్షేపణీయమన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు క్షీణిస్తోందని, విద్యా ప్రమాణాలు సైతం పడిపోతున్నాయని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయని, సౌకర్యాల కల్పనకు క్షేత్రస్థాయిలో నిధులు అవసరమని తెలిపారు. ఉపాధ్యాయులకు పీఆర్సీ, డీఏలు, రిటైర్ అయిన ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతుందని గుర్తుచేశారు. విద్యారంగానికి బడ్జెట్లో 20 శాతం కేటాయింపులు చేయాలన్నారు. విద్యారంగంలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి, రెగ్యులర్ పద్ధతిలో నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నగదు రహిత వైద్య సదుపాయాన్ని ఉపాధ్యాయులకు అందుబాటులోకి తేవాలని సూచించారు. -
● గత డిసెంబర్లో మృతి చెందిన విద్యార్థిని ● తండ్రి ఫిర్యాదుతో పోస్టుమార్టం ● ఆదిలాబాద్ జిల్లా తాంసిలో ఘటన
మూడునెలల తర్వాత పోస్టుమార్టం తాంసి: గతేడాది అనారోగ్యంతో మృతి చెందిన విద్యార్థిని సాయినిఖిత మృతదేహనికి మూడు నెలల తర్వాత మంగళవారం తాంసిలో పోస్టుమార్టం నిర్వహించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు తాంసికి చెందిన దేవునూరి లింగన్న కుమార్తె సాయినిఖిత (14) నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. మూడు నెలల క్రితం అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 17న మృతి చెందింది. మృతదేహనికి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా తన కుమార్తె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించే వరకూ తమకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని విద్యార్థిని తండ్రి లింగన్న రెండు రోజుల క్రితం గురుకుల పాఠశాల సిబ్బందిపై మెండోరా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంగళవారం తాంసిలోని శ్మశానవాటికలో తహసీల్దార్ లక్ష్మి, మెండోరా ఎస్సై సుహాసిని ఆధ్వర్యంలో వైద్యులు అంకిత్రావు, అరవింద్ మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించారు. ల్యాబ్ పరీక్షల నిమిత్తం ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నివేదిక రావడానికి దాదాపు నెలరోజులు పట్టవచ్చని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆదిలాబాద్ జట్టుకు చాంపియన్షిప్
ఆదిలాబాద్: సీఎం కప్ రెండో ఎడిషన్ పోటీల్లో అన్ని అంశాల్లో సత్తా చాటిన ఆదిలాబాద్ జట్టు చాంపియన్షిప్ కై వసం చేసుకుంది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన వేడుకలో జిల్లా జట్టుకు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ చాంపియన్ ట్రోఫీ అందజేశారు. టోర్నీ మొదలైనప్పటి నుంచి ప్రచారం, నిర్వహణ, పతకాల్లో ఆదిలాబాద్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు మంగళవారం డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాల విద్యార్థులు ట్రోఫీని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, క్రీడా పాఠశాల శిక్షకులు రాజు, కబీర్ దాస్, శ్రీధర్, కొమ్ము కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
ఈదురుగాలుల బీభత్సం
ఇంద్రవెల్లి/బజార్హత్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి, బజార్హత్నూర్ మండలాల్లో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఇంద్రవెల్లి మండలంలోని ఇన్కార్గూడలో షేక్ జాకీర్, రేఖాబాయి, అనిల్రెడ్డితో పాటు పలువురి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. దీంతో ఇంట్లో ఉన్న నిత్యావసరాలు తడిసి ముద్దయ్యాయి. జొన్న, మొక్కజొన్న, గోధుమ పంటలు నేలకొరిగాయి. వ్యవసాయ మార్కెట్యార్డులో కంది పంట తడిసిపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. బజార్హత్నూర్లో సల్ల ముత్తన్న, సల్ల సాయికి చెందిన మొక్కజొన్నపంట నేలకొరిగింది. కొలారిలో బుర్కులే నిర్మల, సల్ల రాములు, షెడ్కే మంతబాయి, షెడ్కె గంగా, తొర్కడే శకుంతల, బిస్సే సంగీత, డోలే అంజనాబాయి, దేశముక్ రుక్మబాయి, టార్పే వనిత, రేకేవాడ్ కుష్మాలకు చెందిన ఇళ్ల పైకప్పులు ఎగరిపడ్డాయి. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యుత్ తీగలపై చెట్టు పడటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. -
ప్రేమ పేరుతో మోసం
యువకుడిపై పోక్సో కేసు నమోదు ఐ.పోలవరం: ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ బాలికను మోసగించిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఐ.పోలవరం ఎస్సై రవీంద్రబాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఐ.పోలవరం మండలం పరిధి ఎదుర్లంక గ్రామానికి చెందిన బాలిక (17)ను అదే గ్రామానికి చెందిన యువకుడు కమిడి హరినారాయణ ప్రసాద్ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పలుసార్లు శారీరకంగా దాడి చేసినట్టు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. దీనిపై అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఐ.పోలవరం పోలీస్ స్టేషన్కు వచ్చి విచారించారు. నిందితుడిని అరెస్ట్ చేస్తామని డీఎస్పీ ప్రసాద్ విలేకరులకు తెలిపారు. పనిముట్లు ధ్వంసం చేస్తున్న ముఠా అరెస్ట్ నల్లజర్ల: సింగరాజుపాలెంలో ఈ నెల 23న అర్ధరాత్రి కొఠారు నారాయణరావుకు చెందిన పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు పొలంలో చొరబడి పంటను, వ్యవసాయ పనిముట్లను ధ్వంసం చేస్తున్న సమయంలో కాపలాదారులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇదే గ్రామానికి చెందిన కొఠారు ప్రదీప్ చక్రవర్తి, ఉంగుటూరుకు చెందిన జీవరత్నం, రాంబాబుతో పాటు మరో ఆరుగురు ఆటోపై వచ్చి నారాయణరావు పొలంలో దోసపాదులు, ఆయిల్పామ్ మొక్కలు, బొప్పాయి తదితర పంటలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పొలం కాపలాదారులు ఇందులో ఆరుగురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు. -
ఊరంతా మొక్కి..
ఇనుగంటివారిపేటలో నాలుగు రోడ్ల కూడలి మధ్య ధ్వజస్తంభం ఫ ఇనుగంటివారిపేట గ్రామం మధ్యలో ధ్వజస్తంభానికి విశిష్టత ఫ ఆలయాలు లేకుండానే ఏర్పాటు ఫ కోరిన కోర్కెలు తీరతాయని ప్రజల నమ్మకం ఫ ప్రత్యేకతను చాటుతున్న వైనం సీతానగరం: ఆలయాల్లో ధ్వజస్తంభం ఎంతో పవిత్రమైంది.. ఇది గర్భగుడికి ఎదురుగా ఉంటోంది.. భక్తుని చూపుని నేరుగా దేవునిపై పడేలా చేస్తోంది. మూలవిరాట్కు, భక్తులకు మధ్య వారధిగా ఉంటోంది. ఆలయానికి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. అయితే ఆ గ్రామంలో ధ్వజస్తంభానికి ఎంతో విశిష్టత ఉంది. ఇది ఆలయానికి ఎదురుగా కాకుండా, ఊరి మధ్యలో ఉండడం ప్రత్యేకతను చాటుతోంది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఇనుగంటివారిపేటలో ఊరి మధ్యలో ఉన్న ధ్వజస్తంభం ఆధ్యాత్మికతను చాటుతుంది. ఆ విశేషమేమిటో తెలుసుకుందాం రండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ గ్రామంలో లేని విధంగా సీతానగరం మండలం ఇనుగంటివారిపేట గ్రామం నడిబొడ్డున కూడలి మధ్యలో పెరుమాళ్ల ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. దీనిని తొంభై మూడేళ్ల్ల కిందట ప్రతిష్ఠించారు. కాలానుగుణంగా అది శిథిలావస్థకు చేరుకోవడంతో 2019 జూన్లో పునర్నిర్మించారు. ఇక్కడి ధ్వజస్తంభానికి విశిష్టత ఉంది. ఏ గ్రామంలోనైనా ఆలయాల వద్ద ధ్వజస్తంభం ప్రతిష్ఠించడం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఏ ఆలయమూ ఉండదు. నాలుగు రోడ్ల కూడలి మధ్యలో ధ్వజస్తంభం ఉంటోంది. ప్రధానంగా విష్ణాలయం, శివాలయం, రామాలయం వంటి పలు దేవాలయాల వద్ద ధ్వజస్తంభం ప్రతిష్ఠిస్తారు. అయితే ఇనుగంటివారిపేటలో పలు ఆలయాలున్నా, వాటి వద్ద ధ్వజస్తంభం మాత్రం లేదు. గ్రామం నడిబొడ్డున మాత్రం ఉంటోంది. ఆలయాలు ఉన్నా.. ఇనుగంటివారిపేట గ్రామం మధ్యలో ఉన్న పెరుమాళ్ల ధ్వజస్తంభానికి ఉత్తర, దక్షిణ దిక్కుల్లో రామాలయాలు, తూర్పున శ్రీశాంతి దుర్గమ్మ వారి ఆలయం, పడమర దిక్కున శ్రీలంకాలమ్మ వారు కొలువై ఉన్నారు. ఇవే కాకుండా గ్రామంలో శ్రీలక్ష్మీ గణపతి ఆలయం, షిర్డీసాయిబాబా ఆలయం, భక్తాంజనేయ స్వామివారి ఆలయం ఉన్నా, ఏ ఆలయం వద్ద ధ్వజస్తంభం ప్రతిష్ఠించలేదు. పదహారేళ్ల క్రితం ముగ్గళ్ల పంచాయతీ నుంచి విడిపోయి ఇనుగంటివారిపేట పంచాయతీగా మారింది. 1933లో ప్రతిష్ఠించిన పెరుమాళ్ల ధ్వజస్తంభం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తుల సహకారంతో 2019 జూన్ 20న తిరిగి పునః ప్రతిష్ఠించారు. ఇక్కడ భక్తితో కొలిస్తే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడ పూజలు చేస్తుండడం ఆచారంగా వస్తోంది. ఎందుకు నెలకొల్పారంటే.. పూర్వ కాలంలో ముగ్గళ్ల, ఇనుగంటివారిపేట గ్రామాలు ఇనుగంటి మహారాజు పాలనలో ఉండేవి. అయితే ముగ్గళ్లలో శివాలయం ఉన్నందున, అక్కడ ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు. శైవ, వైష్ణవ ఆగమాలను అనుసరించి ఏ గ్రామంలోనైనా శివాలయం, లేకుంటే ధ్వజస్తంభం ఉండాలి. ఇనుగంటివారిపేటలో శివాలయం లేనందున 1933లో గ్రామ పెద్దలు గ్రంథి పుల్లయ్య, సత్యం మావయ్యకాపు, బిక్కిన వెంకట్రావులు ఆగమాలను అనుసరించి, ఆ గ్రామ నడిబొడ్డులో ఉన్న కూడలి మధ్యలో పెరుమాళ్ల ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ధ్వజస్తంభం ఉన్న గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని, సకల దేవతలు కొలువై ఉంటారని, విజయానికి సంకేతమని ఆ రోజుల్లో ప్రజలు విశ్వసించి గ్రామం మధ్వలో ఈ ధ్వజస్తంభం నెలకొల్పారు. ఎంతో విశిష్టమైంది తొంభై మూడేళ్ల్ల కిందట గ్రామం మధ్య కూడలి వద్ద పెరుమాళ్ల ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు. దానిని 2019 జూన్లో పునః ప్రతిష్ఠించారు. పెరుమాళ్ల ధ్వజస్తంభం వద్దకు వచ్చి అనుకుంటే ఏ పనైనా జరుగుతుందని, విజయం చేకూరుతుందని ప్రజల ప్రగాఢ నమ్మకం. గ్రామం మధ్యలో ఉన్న ధ్వజస్తంభం ఎంతో విశిష్టమైంది. –ఆరాధ్యుల వెంకట నారాయణ, ఇనుగంటివారిపేట కోరిన కోర్కెలు నెరవేరతాయి పెరుమాళ్ల ధ్వజస్తంభం వద్ద కోరిన కోర్కెలు నెరవేరతాయి. గ్రామంలో శివాలయం లేకుంటే ధ్వజస్తంభం లేని గ్రామాలు ఏమీ ఉండవు. ఆనాటి పెద్దలు ఆలోచించి శివాలయం లేని కారణంగా ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకూ పూజలు అందుకుంటుంది. ప్రతి ఏడాది కార్తిక మాసంలో ఆకాశ దీపం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. –సత్యం రాంపండు, సర్పంచ్, ఇనుగంటివారిపేట -
మెరిసిపోయి.. మురిసిపోయి
ఫ ఆధ్యాత్మిక కాంతుల్లో నిర్మలగిరి ఫ కనువిందు చేస్తున్న పుణ్యక్షేత్రం దేవరపల్లి: ఆధ్యాత్మిక కాంతులతో నిర్మలగిరి పుణ్యక్షేత్రం మెరిసిపోతోంది.. చూసిన భక్తుల మది మురిసిపోతోంది.. గౌరీపట్నం నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో మేరీమాత ఉత్సవాల సందర్భంగా ఏర్పాటైన విద్యుత్ దీపకాంతులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. క్రైస్తవులే కాకుండా ఇతర మతస్తులు కూడా పుణ్యక్షేత్రానికి తరలివచ్చి వీక్షిస్తున్నారు. పుణ్యక్షేత్రంలోని కలవర కొండపై ఉన్న క్రీస్తు ఆలయం, దిగువన ప్రార్థనా మందిరం, అఖండ దేవాలయం, ప్రధాన ద్వారం వద్ద మరియ తల్లి స్వరూపం, ప్రధాన ద్వారం ఎదురుగా ఫాతిమా టవర్ విద్యుత్ దీపకాంతులతో కొత్త శోభను అద్దుకున్నాయి. ఈ నెల 22న ప్రారంభమైన నిర్మలగిరి మేరీమాత ఉత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి ప్రార్థనలు చేస్తున్నారు. మరియ తల్లికి పూజలు చేసి కొబ్బరి కాయలు కొట్టి, తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఏసుక్రీస్తు ఆలయానికి మెట్లపై మెకాళ్లతో నడిచి వెళ్లి మొక్కులు చెల్లించురకుంటున్నారు. రెండు రోజుల నుంచి భక్తుల రద్దీ పెరిగింది. రాత్రి 8 గంటల నుంచి పుణ్యక్షేత్రం భక్తజన సంద్రం అవుతుంది. ఉత్సవాల చివరి రోజు బుధవారం భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. చివరి రోజు రాత్రి పుణ్యక్షేత్రంలో పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర, శ్రీకాకుళం పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ విజయ్ కుమార్, పుణ్యక్షేత్రం డైరెక్టర్ ఎస్.జాన్పీటర్, వివిధ ప్రాంతాలకు చెందిన గురువులు, ఫాదర్లు సమిష్ఠి దివ్యబలిపూజ సమర్పిస్తారని నిర్వాహకులు తెలిపారు. ఏలూరు కథోలిక్ తొలి పీఠాధిపతులు, నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం వ్యవస్థాపకుడు మోస్ట్ రెవరెండ్ జాన్ ములగాడ స్వరూపాన్ని పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర, విజయ్కుమార్ ఆవిష్కరిస్తారని పుణ్యక్షేత్రం డైరెక్టర్ జాన్పీటర్ తెలిపారు. -
పులి చిక్కకుండా.. యంత్రాంగం ఆగకుండా..
ఫ బంధించేందుకు విశ్వ ప్రయత్నాలు ఫ రిజర్వ్ ఫారెస్ట్లో సెర్చ్ ఆపరేషన్ గంగవరం: పెద్ద పులి చిక్కకుండా తిరుగుతుంటే.. ఎలాగైనా పట్టుకోవాలని అధికార యంత్రాంగం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మంగళవారం కూడా పెద్ద పులి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. గంగవరం మండలం గొరగుమ్మి, వేములవాడ, ఉయ్యాల మడుగు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పెద్ద పులి సంచారాన్ని అటవీ శాఖ అధికారులు రేడియో ట్రాకింగ్ ద్వారా కనుగొన్నారు. ఉదయం నుంచి సెర్చ్ ఆపరేషన్ను ఏపీసీసీఎఫ్ శాంతి ప్రియ పాండే ఆధ్వర్యంలో అటవీ శాఖ సిబ్బంది కొనసాగిస్తున్నారు. వేములోవ ప్రాంతంలో మకాం వేసిన పెద్ద పులి సోమవారం రాత్రి నుంచి ఉయ్యాలమడుగు, గొరగుమ్మి, పెదగార్లపాడు శివారు మీదుగా గంగవరం శివారు పోతురాజు బాబు గుడి వద్ద అటవీ ప్రాంతంలోకి సాయంత్రం 6.30 సమయానికి దాటింది. గంగవరం– కొత్తపల్లి ప్రధాన రహదారి దాటి దొరమామిడి జంక్షన్ నుంచి ధర్మాడి వద్ద గల ప్రధాన కొండ వద్ద ఉంది. గంగవరం శివారు పోతురాజు బాబు గుడి సమీపంలో రూట్లో దొరమామిడి వెళ్లే రూట్లో ఓ చింత చెట్టు కింద పెద్దపులి విశ్రాంతి తీసుకుంటుంది. దానిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రోన్ కెమెరా సహాయంతో పులి కదలికలను గుర్తిస్తున్నారు. గంగవరం– కొత్తపల్లి ప్రధాన రహదారికి 200 మీటర్ల దూరంలోనే పెద్ద పులి ఉంది. ఆ సమీపంలోనే షూటర్లు మాటువేసి ఉన్నారు. ఈ సందర్భంగా సబ్ డీఎఫ్ఓ వెంకట సుబ్బారెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ గొరగుమ్మి సమీపంలో ఒక ఆవు దూడపై పులి దాడి చేసిందని తెలిపారు. సుమారు 60 మంది సిబ్బంది ఐదు బృందాలుగా ఏర్పడి ఉదయం నుంచి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారన్నారు. దొరమామిడి గ్రామంలోకి ఎవరినీ వెళ్లకుండా నిలుపుదల చేశామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్ధరాత్రయినా సరే పెద్ద పులిని బంధిస్తామని ఆయన తెలిపారు. రాజమహేంద్రవరం సీసీఎఫ్ శ్రీకంఠనాథ్ రెడ్డి, డీఎఫ్ఓ శివకుమార్, కాకినాడ, చింతూరు డీఎఫ్ఓలు రామచంద్రరావు, రవీంద్రనాథ్ రెడ్డి, సబ్ డీఎఫ్ఓ సుబ్బారెడ్డి, అనూష తదితరులు పాల్గొన్నారు. బినామీ అప్పుల వల్లే ముప్పు ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): బినామీ రుణాల కారణంగానే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు సహకార సంఘాలు అధికారులపై మండిపడ్డారు. కాకినాడలోని డీసీసీబీ కార్యాలయంలో మంగళవారం టర్న్ ఎరౌండ్ యాక్షన్ ప్లాన్ – టీఏపీ) సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బినామీ వ్యవసాయ రుణాలు ఇచ్చి వాటిని వసూలు చేయడంలో జిల్లాలోని ఆరేడు సహకార సంఘాలు చూపిస్తున్న నిర్లక్ష్యం కారణంగా డీసీసీబీ బ్యాంకులో పనిచేస్తున్న సిబ్బంది, సహకార సంఘాల్లో పనిచేస్తున్న సుమారు రెండువేల మంది ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు. ఒత్తిళ్లు ఉంటే తమకు వ్యక్తిగతంగా చెప్పాలే కానీ బినామీ రుణాలు వసూలు చేయడంలో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోనసీమ, రాజమహేంద్రవరంలలో రికవరీలు బాగా ఉన్నాయని కాకినాడ జిల్లాలో ఏలేశ్వరం, కిర్లంపూడి, గోకవరం తోపాటు పలు బ్రాంచ్ల్లో బినామీ రుణాలు ఇవ్వడంతో అక్కడ రికవరీ కష్టంగా మారిందన్నారు. సహకార సంఘాలకు వెళ్లి రికార్డులు ఎందుకు తనిఖీ చేయలేదని బ్యాంకు ఇన్చార్జి సీఈవో ప్రవీణ్కుమార్ను ఆప్కాబ్ చైర్మన్ నిలదీశారు. తాము వెళ్లినా అక్కడి సీఈవోలు రికార్డులు చూపించడం లేదని ప్రవీణ్కుమార్ తెలిపారు. ఏలేశ్వరం శాఖలో రెండువేల మందికి రైతులకు రుణాలు ఇవ్వగా 700 మందికి రుణాలు ఇచ్చిన ఫైల్స్ మాత్రమే ఉన్నాయన్నారు. మిగిలినవి తమకు ఇవ్వడం లేదని ఆప్కాబ్ చైర్మన్కు ప్రవీణ్ వివరించారు. నాబార్డు జీఎం కేవీఎస్ ప్రసాద్, అప్కాబ్ ఎండీ ఆర్.రామకృష్ణ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి ట్రెజరీ డీడీగా పాషా కాకినాడ లీగల్: ఉమ్మడి జిల్లా ఇన్చార్జి ట్రెజరీ డీడీగా జిల్లా ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఆర్.పాషాను నియమించారు. జిల్లా ట్రెజరీ డీడీ ఎ.గణేష్ వ్యక్తిగత కారణాల వల్ల ఏప్రిల్ 18వ తేదీ వరకు సెలవు పెట్టారు. మంగళవారం డీడీ గణేష్ బాధ్యతలు పాషాకు అప్పగించారు. -
సమస్యల పరిష్కారం కోరుతూ రణభేరి
అడ్డతీగల: అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ అడ్డతీగలలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం రణభేరి పేరిట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక పాత ఎంపీడీఓ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. దీనికి నాయకత్వం వహించిన యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ పలు అంశాల్లో ప్రభుత్వ వైఖరిని తూర్పారపట్టారు. పీఆర్సీ కమిషన్ చైర్మన్ నియామకం వెంటనే జరపాలన్నారు. 29 శాతం ఐఆర్ ప్రకటించాలన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిల చెల్లింపునకు రూట్మ్యాప్ ప్రకటించాలన్నారు. సీపీఎస్ రద్దుచేసి మెమో 57 ప్రకారం పాత పెన్షన్ అమలు చెయ్యాలన్నారు. హెల్త్ కార్డులు, మెడికల్ బిల్లులు వెంటనే పరిష్కరించాలన్నారు. కోవిడ్ కాలంలో చనిపోయిన ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలకు కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలన్నారు. ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కారానికి కమిటీని నియమించాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సరెండర్ లీవ్ల బకాయిలు చెల్లించాలన్నారు. అడ్డతీగల మండల శాఖ అధ్యక్షుడు అన్నంరెడ్డి గాంఽధీ, ప్రధాన కార్యదర్శి రాఘవులు తదితరులు పాల్గొన్నారు. -
సృజనమేవ జయతే
ఆలోచనకు సృజన తోడైతే.. పనికికాని పుల్లలతోనూ అద్భుత కళాఖండాలు తయారు చేయవచ్చు.. అందరితో ఔరా అనిపించుకోవచ్చు. రాజానగరం మండలం వెలుగుబంద జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు బి.పవన్కుమార్ సారథ్యంలో విద్యార్థులు పనికిరాని వస్తువులతో వివిధ బొమ్మలను తీర్చిదిద్దారు. పారేసిన ఐస్క్రీం పుల్లలు, స్ట్రాలతోపాటు అగ్గి పుల్లలు, ధారం, అట్టముక్కలను ఉపయోగించి అందమైన బొమ్మలను చేసి అబ్బురపరిచారు. ‘నో కాస్ట్, నో లాస్’ విధానంలో బోధనోపకరణాలను కూడా రూపొందించవచ్చని పవన్కుమార్ అన్నారు. పాఠశాలలో ప్రతి శనివారాన్ని ‘నో బ్యాగ్ డే’గా అమలు చేస్తున్న తరుణంలో విద్యార్థులచే ఇటువంటివి తయారు చేయించడం ద్వారా సృజనాత్మకతను వెలికితీయవచ్చని అంటున్నారు. –రాజానగరం -
రోడ్డెక్కి.. నిరసన తెలిపి..
దుశ్చర్తి రోడ్డు కోసం గిరిజనుల ఆందోళన అడ్డతీగల: ఆ దారుల్లో వెళ్లేందుకు నరకం చూస్తున్నారు.. చివరికి విసిగిపోయి రోడ్డెక్కారు.. దుశ్చర్తి రోడ్డు సాధన కోసం మంగవారం అడ్డతీగలలో గిరిజనులు ఆందోళనకు దిగారు. దుశ్చర్తి, దాకోడు, డి.రామవరం పంచాయతీల్లోని 13 గ్రామాల ప్రజలు ఆదివాసీ గిరిజన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు ఆధ్వర్యంలో స్థానిక ఆదివాసీ భవనం నుంచి ఫ్లకార్డులు చేతబూని ర్యాలీ నిర్వహించారు. దేవీ సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారుల వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు మాట్లాడుతూ మూడేళ్లుగా ఏనుగుకొమ్ము కాలువ నుంచి దుశ్చర్తికి ఏడు కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులను అసంపూర్తిగా వదిలేశారన్నారు. మెటల్, వెట్మిక్స్ వేసి మిన్నకుండడంతో రాళ్లు లేచిపోయి రాకపోకలకు ఇబ్బందికరంగా మారిందన్నారు. ఆ రోడ్డును సరిచేసి పూర్తి స్థాయిలో బీటీ రోడ్డు నిర్మించాలని కోరారు. అనంతరం ఆందోళనకారులతో ఎంపీడీఓ ఏవీవీ కుమార్, ఐటీడీఏ ఇంజినీరింగ్ అధికారులు చర్చించారు. త్వరలోనే రోడ్డును పూర్తి స్థాయిలో పునర్నిర్మిస్తామని చెప్పారు. దీంతో గిరిజనులు ఆందోళన విరమించారు. -
గాలీ వానా బీభత్సం
ఫ విరిగిపడిన చెట్లు, స్తంభాలు ఫ పలు గ్రామాలకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా ఎటపాక: మన్యంలో గాలీ వాన బీభత్సంతో పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది. ఈదురు గాలులకు మండలంలోని నందిగామ, మురుమూరు, గౌరిదేవిపేట గ్రామాల పరిధిలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. 11 కేవీ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. సోమవారం రాత్రి నుంచి తోటపల్లి ఫీడర్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంగళవారం ఉదయం విద్యుత్ శాఖ సిబ్బంది శ్రమించి తోటపల్లి నుంచి గౌరిదేవిపేట, బండిరేవు గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. రాత్రి కూడా నందిగామ, మురుమూరు, చలంపాలం, ఎర్రగట్టు, బండారుగూడెం గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. ఆ గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ సాధ్యం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సరఫరా నిలిచిపోయింది. సెల్ఫోన్లకు చార్జింగ్ లేక మూగబోయాయి. అయితే పదో తరగతి పరీక్షలు జరుగుతుండటంతో విద్యార్థులు చదువుకునేందుకు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షం కారణంగా కళ్లాల్లో ఆరబోసిన మిర్చి, పాకల్లో ఎండబెట్టిన పొగాకు తడిసిపోయింది. దీంతో ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాదనే ఆందోళనలో రైతులు ఉన్నారు. -
క్షయ వ్యాధిని నిర్మూలించే బాధ్యత అందరిదీ
గుర్తేడులో గంజాయి స్వాధీనం వై.రామవరం: ఉమ్మడి వై.రామవరం మండలం గుర్తేడు పోలీసు స్టేషన్ పరిధిలోని కడారికోట రోడ్డు జంక్షన్లో సుమారు రూ.3.60 లక్షల విలువైన 24 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు ఎస్సై రాజకోటి తెలిపారు. సరిహద్దు ప్రాంతం నుంచి గంజాయి అక్రమ రవాణా అవుతుందన్న సమాచారం మేరకు తనిఖీలు నిర్వహిస్తుండగా, ఈ గంజాయి పట్టుబడినట్లు ఆయన తెలిపారు. గంజాయితోపాటు రెండు మొబైల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీన పరుచుకున్నారు. గంజాయిని మైదాన ప్రాంతానికి తరలిస్తున్న చిలకలూరిపేటకు చెందిన కొడాబత్తుల బాలస్వామి నాయక్ (27), అదే ప్రాంతంలోని బలుసుపాడుకు చెందిన రెడ్డిబత్తుల వేణుగోపాల్రెడ్డి (35), నూజివీడుకు చెందిన షేక్ నూరుల్ రహీమ్ (37)లను అరెస్ట్ చేశామన్నారు. వారిని సోమవారం సాయంత్రం కోర్టుకు తరలించగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు. ఈ కేసులో నాలుగో వ్యక్తి మైనర్ కావడంతో జువైనల్ హోమ్కు తరలించినట్లు వివరించారు. రంపచోడవరం: క్షయ మహమ్మారిని నిర్మూలించే బాధ్యత అందరిపై ఉందని జిల్లా జేసీ బచ్చు స్మరణ్రాజ్ అన్నారు. రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణంలో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ క్షయ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వచ్చిన వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లి టీబీ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రతి గ్రామంలోని టీబీ నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండు వారాల పాటు దగ్గు తగ్గకుండా ఉంటే దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి వెళ్లి టీబీ పరీక్షలు చేయించుకుని, నిర్ధారణ అయితే క్రమం తప్పకుండా మందులు వాడాలన్నారు. క్షయ వ్యాధి వస్తే ఆందోళన చెందవద్దని మందులు, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా వ్యాధిని దూరం చేయవచ్చన్నారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ పి.సరిత, వైద్యాధికారులు సుజిత, వినోద్, ఈక్షిత్, సీహెచ్ ఒ.అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. -
జగన్ హయాంలో జిల్లాల పునర్విభజన
వైఎస్సార్సీపీ సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక 2023లో జిల్లాల పునర్విభజన చేపట్టారు. పార్లమెంటు స్థానం ఒక జిల్లాగా తూర్పుగోదావరి, కాకినాడ, అమలాపురం జిల్లాలు ఏర్పాటు చేశారు. రంపచోడవరం నియోజకవర్గాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విలీనం చేయగా ఈ నియోజకవర్గాన్ని చంద్రబాబు ప్రభుత్వం పోలవరం పేరుతో ప్రత్యేక జిల్లాగా చేసింది. ఇదిలా ఉండగా జగన్ హయాంలో రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటైన తూర్పుగోదావరి జిల్లాలోకి కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాలు కలిశాయి. ఇలా ఏడేసి నియోజకవర్గాలతో ఒక జిల్లాను జగన్ ఏర్పాటు చేశారు. పోలవరం జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గంతో కలిపి ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 22 అసెంబ్లీ స్థానాలు, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. -
కూటమి ప్రభుత్వంలో కుల వివక్ష ఘటనలు
పి.గన్నవరం: కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు, కుల వివక్ష వంటి సంఘటనలు పెరిగాయని భారత రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కార్యదర్శి డీబీ లోక్ అన్నారు. కుందాలపల్లిలో కాట్రు శ్రీనివాస్ అనే దళితుడి మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తుండగా, అడ్డుకోవడం క్షమించరాని నేరమన్నారు. బాధిత కుటుంబాన్ని మంగళవారం ఆయన పరామర్శించారు. లోక్ మాట్లాడుతూ దీనిని ప్రత్యేకమైన సంఘటనగా గుర్తించి, కారకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. దళితులపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని కోరారు. వారికి న్యాయం జరుగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్నారు. గ్రామంలో ఇరువర్గాలూ సంయమనం పాటించాలని, శాంతి భద్రతలను కాపాడాలని డీబీ లోక్ విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట దళిత ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ ములపర్తి సత్యనారాయణ, బొక్కే ప్రసాద్ తదితరులు ఉన్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
ఫ చెరువులో ఈతకెళ్లిన ఆరుగురు స్నేహితులు ఫ ఇందులో ఇంటర్ విద్యార్థి మృతి కాకినాడ రూరల్: ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణం తీసుకుంది.. తిమ్మాపురం పెద్ద చెరువులో ఈ ఘటన జరిగింది. ఈత కోసం ఆరుగురు స్నేహితులు వెళ్లగా ఇందులో ఇంటర్ విద్యార్థి ప్రాణాలను కోల్పోయాడు. తిమ్మాపురం పోలీసుల కథనం ప్రకారం.. రమణయ్యపేట పంచాయతీ పరిధి కొత్తూరు బర్మాకాలనీ చెందిన రెడ్డి మురళీకృష్ణ (16) మరో ఐదుగురు కలసి మంగళవారం మధ్యాహ్నం సరదాగా ఈత కొట్టేందుకు తిమ్మాపురం శివాలయం వద్ద ఉన్న పెద్ద చెరువు దగ్గరకు వెళ్లాడు. ఆ ఆరుగురు సరదాగా ఈత కొడుతుండగా, అంతతో ఊబిలో మురళీకృష్ణ మునిగిపోయాడు. స్నేహితులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మిగతా స్నేహితులు ఒడ్డుకు చేరుకుని స్థానికులకు సమాచారం అందించారు. స్థానికులు, గ్రామస్తులు, సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ తదితరులు చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. తిమ్మాపురం పోలీసులు చెరువు వద్దకు చేరుకుని విద్యార్థి కోసం గాలించారు. అనంతరం కాకినాడ అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి తాళ్లు పట్టుకుని నీటి లోపల గాలించడంతో మురళీకృష్ణ మృతదేహం లభ్యమైంది. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తిమ్మాపురం ఎస్సై గణేష్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బర్మాకాలనీలో విషాదం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఇటీవలే రాసి రెండో సంవత్సరంలోకి చేరుకున్న రెడ్డి మురళీకృష్ణ మృతితో కొత్తూరు బర్మాకాలనీలో విషాదం అలముకుంది. మురళీకృష్ణ తల్లిదండ్రులు మృతి చెందడంతో అమ్మమ్మ సంరక్షణలో ఉన్నాడు. ఈత కోసం తోటి స్నేహితులతో తిమ్మాపురం చెరువు వద్దకు వెళ్లి మనమడు మృతి చెందినట్టు తెలుసుకున్న అమ్మమ్మ, ఇతర కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. -
ఆటల్లో మెరికలు..!
బజార్హత్నూర్: పేద కుటుంబ నేపథ్యం ఉన్న ఆదివాసీ గిరిజన బిడ్డ కోట్నాక్ జాకేష్ జాతీయ స్థాయి అథ్లెటిక్స్ క్రీడల్లో రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. జాకేష్ది ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలోని జాతర్ల గ్రామం. తండ్రి కొట్నాక్ జంగు ఆటో డ్రైవర్ కాగా, తల్లి రేణుక వ్యవసాయ కూలీ. జాకేష్ సొంత గ్రామంలోనే గిరిజన ఆదర్శ క్రీడల ఆశ్రమ పాఠశాల ఉంది. ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్ తన స్వగ్రామం జాతర్లలో 2016లో కేంద్ర ప్రభుత్వ నిధులతో గిరిజన ఆదర్శ క్రీడల ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేయించారు. దీంతో మారుమూల గిరిజన విద్యార్థులకు క్రీడల్లో రాణించేందుకు అవకాశం దక్కింది. స్థానికంగా ఉన్న క్రీడా పాఠశాలలో 9వ తరగతి చదువుతూ క్రీడా అవకాశాలను జాకేష్ సద్వినియోగం చేసుకున్నాడు. జాకేష్లో క్రీడా నైపుణ్యాన్ని గుర్తించిన కోచ్ సాహుల్ అతన్ని క్రీడల్లో శిక్షణ ఇచ్చి సానబెట్టారు. మంచిర్యాలఅర్బన్: పాఠశాల స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ కనబరిచి ఆదర్శంగా నిలుస్తోంది గోలేటికి చెందిన తిమ్మయ్య– స్వరూప దంపతుల కుమార్తె శ్రీవాణి. ఆమె మంచిర్యాల శ్రీహర్ష డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. తండ్రి చిన్నప్పుడే మృతి చెందినా తల్లి వ్యవసాయ కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. గోలేటి సింగరేణి పాఠశాలలో పరుగు పందెం, ఖోఖోలో శ్రీవాణి ఉత్తమ ప్రతిభ కనబర్చింది. ఆమె 9వ తరగతి చదువుతున్నప్పుడు ఆటల్లో ఆమె నైపుణ్యాన్ని గుర్తించిన అప్పటి వ్యాయామ ఉపాధ్యాయుడు బ్యాడ్మింటన్పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కొన్ని రోజుల్లోనే స్కూల్ గేమ్ ఫెడరేషన్, జిల్లా బ్యాడ్మింటన్ ఆసోసియేషన్ తరఫున జిల్లా నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రతిభ చాటింది. కష్టాలు అధిగమిస్తూ..సాధారణ కుటుంబం నుంచి వచ్చిన శ్రీవాణి డిగ్రీ చదువుతూనే పార్ట్టైంగా బ్యాంకులో పనిచేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తోంది. ఇప్పటి వరకు బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నిర్వహించిన జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మెమొంటోలతో పాటు ప్రశంసలు అందుకుంది. శ్రీవాణి ప్రతిభను గుర్తించి ఉమ్మడి ఆదిలాబాద్ బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి తిరుపతి ప్రోత్సహించారు. గతేడాది డిసెంబర్లో నిర్వహించిన పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో మెరిసింది. నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్, ఢిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో నైపుణ్యత ప్రదర్శించి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగింది. ఇండోనేషియాలో బాల్బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఆసియా ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14 నుంచి 19వ వరకు నిర్వహించిన పోటీల్లో అత్యంత ప్రతిభ చూపి గోల్డ్ మెడల్ సాధించి దేశానికే వన్నె తెచ్చింది. దేవల్ల శ్రీవాణి ప్రభుత్వం సహకారం అందించాలి కోచ్ సాహుల్ శిక్షణ, ప్రధానోపాధ్యాయులు కిషన్రెడ్డి, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, జిల్లా అథ్లెటిక్స్ కార్యదర్శి రాజేశ్, వార్డెన్ కృష్ణరావుల ప్రోత్సాహంతో క్రీడల్లో రాణిస్తున్నాను. తల్లిదండ్రుల ఆర్థిక కష్టాలు నన్ను మానసికంగా కుంగదీస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మా కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వాలి. అప్పుడు ఎలాంటి ఆటుపోటులు లేకుండా అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి పట్టుదలతో కృషి చేస్తా. – కోట్నాక్ జాకేష్, క్రీడాకారుడు సాధించిన ఘనతలు.. -
రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
నేరడిగొండ: నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని బోథ్ ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని ప్రధానరోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. బోథ్లో బీటీ రోడ్లు, సీసీ రింగ్ రోడ్డు, వీధిదీపాల నిర్మాణానికి రూ.5 కోట్లు, పొచ్చర ఎక్స్ రోడ్డు నుంచి బోథ్ పట్టణం వరకు ఫోర్ లేన్, సెంట్రల్ లైటింగ్, మైనర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.38 కోట్లు, ఇచ్చోడలో ఫోర్లేన్ పనుల్లో భాగంగా సైడ్ డ్రెయిన్ నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపాదించిన రోడ్ల పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఈఎన్సీకి సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మంత్రి అజారుద్దీన్ను కలిసిన ఎమ్మెల్యే ఇచ్చోడ: మంత్రి అజారుద్దీన్ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇచ్చోడ మండల కేంద్రంలో షాదీఖానా కోసం రూ.3 కోట్ల 65లక్షల నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రికి వినతి పత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే వివరించారు. -
● స్పందించిన చైల్డ్హెల్ప్లైన్ ● చిన్నారిని శిశుగృహకు తరలింపు
శిశువును వదిలేసిన తల్లి ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ బస్టాండ్ సమీపంలో మద్యం మత్తులో ఉన్న ఓ తల్లి తన రెండు నెలల శిశువును వదిలేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. పాపను గమనించిన వన్టౌన్ కానిస్టేబుల్ రాజేశ్ 1098 చైల్డ్ హెల్ప్లైన్కు సమాచారం అందించారు. చైల్డ్ హెల్ప్లైన్ కేస్ వర్కర్లు శ్రీకాంత్, రామకృష్ణ స్పందించి బాల రక్షక్ వాహనంలో అక్కడికి చేరుకున్నారు. అనంతరం శిశువును శిశు గృహ ఆయా లక్ష్మమ్మకు అప్పగించారు. ప్రస్తుతం శిశువు శిశు గృహలో సురక్షితంగా ఉన్నట్లు జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ తెలిపారు. అటవీ సంరక్షణ అందరి బాధ్యత ఆదిలాబాద్టౌన్: అటవీతో పాటు వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ విశ్వనాథ చిన్నబూసరెడ్డి అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా సోమవారం బైక్ ర్యాలీ చేపట్టారు. అటవీ శాఖ కార్యాలయం వద్ద ర్యాలీని ఎఫ్డీవో జెండా ఊపి ప్రారంభించారు. అటవీ సంరక్షణలో ఉద్యోగుల కృషి అభినందనీయమని కొనియాడారు. అటవీ రక్షణలో ప్రజల సహకారంతో పాటు నూతన సర్పంచులు భాగస్వామ్యం అందిస్తున్నారని వివరించారు. -
ఆర్యూబీ పనులు చేపట్టాలి
ఆదిలాబాద్టౌన్: రైల్వే అండర్ బ్రిడ్జి పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలో చేపడుతున్న రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను నాయకులతో కలిసి పార్టీ జిల్లా అధ్యక్షు డు జోగు రామన్న సోమవారం పరిశీలించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు రాజ కీయాలు మాని ప్రజల పక్షాన నిలవాలన్నారు. ఫిబ్రవరి 13న ఎంపీ, ఎమ్మెల్యేలు భూమిపూజ చేసి రైల్వే అండర్బ్రిడ్జి పనులు ప్రారంభించారని, ప్రస్తుతం పనులు ఆగిపోవడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కలెక్టర్ తక్షణమే చొరవ తీసుకొని గుంతలు పూడ్చి రాకపోకలు జరిగేలా చూడాలన్నారు. లేనిపక్షంలో సొంత ఖర్చుతో గుంతలను పూడ్చుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు యాసం నర్సింగ్రావు, నారాయణ, ప్రహ్లాద్, సాజిదొద్దీన్, ప్రకాశ్, వెంకటేశ్, ధమ్మపాల్, ఇమ్రాన్, గణేశ్, రమేశ్, ప్రేమల, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
లోకేశ్వరం: మండలంలోని హథ్గాం గ్రామ పంచాయతీ పరిధి పోట్పల్లి(ఎం) గ్రా మానికి చెందిన లిఖిత(33) అనే యువతి సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. లోకేశ్వరం ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. పోట్పల్లి (ఎం) గ్రామానికి చెందిన కల్యాబాయి –వినాయక్రావుల కూతరు లిఖిత కొంత కాలంగా అనారోగ్యంతో పెళ్లి చేసుకోకుండా ఇంటి వద్దనే ఉంటుంది. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా కడుపునొప్పి నయం కాలేదు. ఈక్రమంలో ఆదివారం రాత్రి అన్నం తినకుండానే పడుకుంది. సోమవారం ఉదయం చూసే సరికి లిఖిత మృతి చెంది ఉంది. సమాచారం అందుకున్న ఎస్సై మృతదేహాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. మృతురాలు సోదరి అర్చన అనుమానాస్పద మృతిగా పేర్కొన్నారు. అర్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఉపాధికి దూరం
సాక్షి,ఆదిలాబాద్: ఉపాధి హామీ పథకంలో గడిచిన మూడు సంవత్సరాల పని దినాలను పరిగణలోకి తీసుకొని కొత్త ఏడాదిలో లక్ష్యాన్ని నిర్ధారిస్తారు. అయితే జిల్లాలో వేలాది కుటుంబాలు జాబ్కార్డు ఉన్నప్పటికీ పనులకు దూరంగా ఉంటున్నారు. నామ్కే వాస్తేగా కార్డును మెయింటేన్ చేస్తున్నారు. ఇక ఏడాదిలో వంద రోజుల పనులు కొన్ని కుటుంబాలు మాత్రమే పూర్తి స్థాయిలో చేస్తున్నాయి. సగటున కుటుంబానికి 48 పనిదినాలు మాత్రమే నమోదవుతున్నాయి. మరో వైపు వార్షిక సంవత్సరం ముగింపునకు చేరువవుతోంది. జిల్లాలో వేలాది కుటుంబాలు జాబ్కార్డు ఉన్నప్పటికీ ఉపాధి పనులకు దూరంగా ఉండడం గమనార్హం. వందల రకాల పనులు.. ఉపాధిహామీ పథకం కింద 230 రకాల పనులను ప్రభుత్వం చేపడుతోంది. ముఖ్యంగా కందకాలు తవ్వడం, మట్టి రోడ్ల నిర్మాణం, రాళ్ల కట్టలు నిర్మించడం, గుట్టల రాళ్లు ఏరడం, ఫిష్పాండ్స్, చెక్డ్యాంలు, పశువుల పాకల నిర్మాణం, పాఠశాలలకు ప్రహరీలు, భోజన గదులు, అంగన్వాడీ, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం వంటివి ప్రస్తుతం ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నారు. గ్రామాల్లో జాబ్కార్డు ఉన్నవారు పనులు నిర్వహిస్తుండగా వారికి రూ.307 వేతనం అందుతుంది. వివిధ కారణాలతో... వివిధ కారణాలతో పలువురు జాబ్కార్డు దారులు ఉపాధిహామీ పనులకు దూరంగా ఉన్నారు. ప్రతీ మూడు సంవత్సరాల పని దినాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం కొత్త ఏడాదిలో లక్ష్యం నిర్దేశిస్తుంది. – రవీందర్, డీఆర్డీవోఇదీ పరిస్థితి.. జిల్లాలో .. మొత్తం జాబ్కార్డులు : లక్ష 75వేలు యాక్టీవ్గా ఉన్నవి : లక్ష 11వేలు ఉపాధి కూలీలు : 3లక్షల 46వేలు యాక్టీవ్గా ఉన్నవారు : 2లక్షల 7వేలుజిల్లాలో 2025–26 వార్షిక సంవత్సరంలో మొత్తం 44లక్షల 79వేల పని దినాలు మంజూరయ్యాయి. దీని కింద రూ.119 కోట్ల 70లక్షల వేతనాలు చెల్లించాలి. వార్షిక సంవత్సరం ముగింపునకు చేరువ కాగా, ఇప్పటివరకు 95 శాతం లక్ష్యం పూర్తయింది. కూలీల వేతనాల కింద ఇప్పటివరకు రూ.113 కోట్ల 94లక్షలు చెల్లించారు. మరో రూ.5.76 కోట్ల వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఈ మిగిలిన రోజుల్లో లక్ష్యం పూర్తి చేసే దిశగా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వేలాది మంది కుటుంబాలు ఉపాధి హామీకి దూరంగా ఉండడంతో ఈ పనులు చేపట్టేందుకు అనాసక్తి కనబర్చుతున్నారనేది స్పష్టమవుతుంది. -
బ్యాడ్మింటన్లో రాణిస్తూ ప్రభుత్వ ఉద్యోగం
మంచిర్యాలటౌన్: మంచిర్యాలకు చెందిన శ్రీహర్షవర్ధ్దన్ తన తండ్రి కృష్ణ స్ఫూర్తితో బ్యాడ్మింటన్పై చిన్ననాటి నుంచి ఆసక్తిని పెంచుకుని, శిక్షణ తీసుకుని జాతీయస్థాయిలో రాణిస్తున్నాడు. అండర్ 15, అండర్ 17, అండర్ 19 విభాగాల్లో జిల్లాస్థాయిలో ప్రాతినిధ్యం వహించి, పురుషుల విభాగంలో కాకతీయ విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించేందుకు మూడుసార్లు ఎంపికయ్యాడు. ప్రస్తుతం మాస్టర్స్ 35 ప్లస్ విభాగంలో పోటీ పడుతూ గత రెండేళ్లుగా వరుసగా మిక్స్డ్ డబుల్స్లో రన్నరప్గా నిలుస్తున్నాడు. స్పోర్ట్స్ కోటాలో రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కంట్రోల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ విభాగంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా చేరారు. హైదరాబాద్లో విధులను నిర్వహిస్తూనే ప్రతీ రెండేళ్లకు ఒకసారి జరిగే అఖిల భారత రక్షణ ఖాతాల విభాగం బ్యాడ్మింటన్ టోర్నమెంట్లలో పాల్గొని తన సత్తా చాటుతున్నాడు. -
ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: ప్రతీ సోమవారం ప్రజావాణి కా ర్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఉట్నూ ర్ ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తమ గ్రామానికి రోడ్డు మంజూరు చేయాలని, మహిళ సంఘ భవనం నిర్మించాలని, గిరిజన ఆశ్రమ పాఠశాలలో వంట మనిషిగా నియమించాలని, పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా అందించాలని కోరారు. స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు. డిజిటలైజ్ పద్ధతిలో ఫిర్యాదుల స్వీకరణ..ప్రజల సమస్యలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించేందుకు ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను డిజిటలైజ్ చేసినట్లు పీవో అన్నారు. సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేశారు. ప్రతీ ఫిర్యాదుదారునికి ఒక ’ఎలక్ట్రానిక్ ఫిర్యాదు కార్డు’ జారీ చేస్తామన్నారు. ఈ కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా సంబంధిత వ్యక్తి తన ఫిర్యాదు ప్రస్తుత స్థితిని నేరుగా తెలుసుకోవచ్చన్నారు. -
నెలరోజుల్లోపు పరిష్కరించాలి
కై లాస్నగర్: ప్రజావాణి పోర్టల్లో నమోదైన ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా నెల రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారి నుంచి అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతితో కలిసి ఆయన అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేస్తూ 30 రోజుల్లోపు పరిష్కరించాలన్నారు. ఎంపీడీవోలు, మండల ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, యాక్షన్ టేకెన్ రిపోర్ట్ను పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. పదేపదే ఒకే సమస్యపై ఫిర్యాదులు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, సామాజిక భద్రత పెన్షన్లు, ఉపాధి హామీ పనులు, భూభారతి సమస్యలు వంటి అంశాలకు సంబంధించి మొత్తం 93 అర్జీలు అందాయి. వాటిలో కొందరి నివేదన.. రాష్ట్ర ప్రభుత్వం 2020లో జీవో ఎంఎస్ నంబర్ 3 ప్రకారం 17 వెనుకబడిన కులాలను గుర్తించింది. ఇందులో 13 కులాలను బీసీ(ఏ)లో, నాలుగు కులాలను బీసీ(బి)లో చేర్చింది. బీసీ(ఏ)లో సీరియల్ నంబర్ 64లో ఉన్న ఓడ్ కులస్తులైన మేము అన్నింటిలో వెనుకబడి ఉన్నాం. కేంద్ర జాబితాలో గల ఓబీసీలో మా కులం లేనందున సైనిక్, నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో మా పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వడం లేదు. విషయాన్ని పరిగణలోకి తీసుకుని న్యాయం చేయాలని కోరుతున్నాం. – ఓడ్ కులస్తులు, ఆదిలాబాద్ -
క్రీడల్లో మాస్టారు అదరహో!
దండేపల్లి: అతను విద్యార్థులకు ఆటలు నేర్పించే మాస్టారు. ఆటలు నేర్పించడంతో పాటు ఆటల్లోనూ అదరగొడుతున్నాడు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో దూసుకెళ్తున్న దండేపల్లి మండలం రెబ్బనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల పీడీ గాజుల శ్రీనివాస్ తన ఆటలతో ఎందరిలోనో స్ఫూర్తి నింపుతున్నాడు. ఏటా ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీల్లో సత్తా చాటుతున్నాడు. మూడేళ్లుగా సివిల్ సర్వీసెస్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీల్లో 400 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. 2018లో చత్తీస్గడ్ రాష్ట్రంలోని రాయపూర్లో నిర్వహించిన ఆల్ఇండియా సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్ పోటీల్లో ఐదోస్థానంలో నిలిచాడు. గత సెప్టెంబర్లో ఢిల్లీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. విద్యార్థులను క్రీడల్లో తీర్చిదిద్ది వారిని సైతం రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. -
సుద్దవాగులో పడి ఒకరి మృతి
కుభీర్: మండలంలోని నిగ్వా గ్రామానికి చెందిన జాదవ్ మోహన్(45) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. మహారాష్ట్రలోని కోల్గాం గ్రామానికి చెందిన జాదవ్ మోహన్ గత కొన్ని సంవత్సరాలుగా నిగ్వాలో ఉండి పాలేరుగా పనులు చేస్తున్నాడు. ఆదివారం గేదెలు మేపడానికి వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఉదయం సుద్దవాగులో వెతకగా వాగు గట్టున చెప్పులు, నీళ్లలో మృతదేహం లభ్యమైంది. భార్య దేవికాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి కుమారుడు ఉన్నారు. ఉరేసుకొని వృద్ధురాలి ఆత్మహత్య నస్పూర్: ఒంటరి జీవితాన్ని భరించలేక మానసిక ఒత్తిడికి గురైన ఓ వృద్ధురాలు ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని బల్లార్షకు చెందిన పల్లపు సుబ్బమ్మ(70) బతుకు దెరువు కోసం సీసీసీలోని ఆర్టీసీ కాలనీలో ఓ హోటల్లో పని చేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తుంది. ఈ క్రమంలో వృద్ధురాలు నివాసం ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టు పక్కల వారు సోమవారం స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా ఇంటిలో ఉరేసుకోగా మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. సుమారు మూడు రోజుల క్రితం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కూతురు స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రశాంత్ తెలిపారు. బైక్ కొనివ్వలేదని యువకుడు.. కడెం: బైక్ కొనివ్వలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై సాయి కిరణ్ తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని సారంగాపూర్ గ్రామానికి చెందిన పోతరాజు రాకేశ్ (27) తన తండ్రి రమేశ్ను పొలాలకు వెళ్లడానికి బైక్ కొనివ్వాలని కోరాడు. కుటుంబ పరిస్థితుల కారణంగా బైక్ కొనివ్వలేకపోయారు. దీంతో మనస్తాపానికి గురైన రాకేశ్ ఆదివారం సాయంత్రం పొలానికి వెళ్తానని చెప్పి గోదావరి ప్రాంతానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సీఎం కప్ విజేతలకు కలెక్టర్ అభినందన
కై లాస్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన రెండో ఎడిషన్ సీఎం కప్ క్రీడా పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటి ఓవరాల్ చాంపియన్గా నిలిచారు. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ పారామీటర్ల ఆధారంగా నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లా క్రీడాకారులు అత్యధికంగా 82 పాయింట్లు సాధించి రాష్ట్రంలో ప్రథమస్థానం కై వసం చేసుకున్నారు. ఈ మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో క్రీడాకారులకు కలెక్టర్ రాజర్షిషా మెడల్స్ అందజేసి అభినందించారు. ఇందులో అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, డీవైఎస్వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘గుర్తింపు సంఘం విఫలం’
శ్రీరాంపూర్: కార్మికుల సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘం నాయకులు విఫలమయ్యారని ఐఎన్టీయూసీ నాయకులు విమర్శించారు. సోమవారం నస్పూర్ కాలనీలోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ యూనియన్ కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షుడు ధర్మపురి, కేంద్ర ఉపాధ్యక్షుడు జట్టి శంకర్రావులు మాట్లాడారు. ఎన్నికల సమయంలో కార్మికులకు వారు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. ప్రాతినిధ్య సంఘంగా తాము కార్మికులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, యజమాన్యంతో తమ యూనియన్ నేత జనక్ ప్రసాద్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ డి మాండ్ల సాధన కోసం కృషి చేస్తున్నారన్నారు. సింగరేణిని అధోగతి పాలు చేసిన టీబీజీకేఎస్కు తమను విమర్శించే అర్హత లేదన్నారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏనుగు రవీందర్ రెడ్డి, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ నరేందర్, నాయకులు భీంరావు, గరిగే స్వామి, తిరుపతిరాజు, బాపు, సత్యనారాయణ, భీమన్న తదితరులు పాల్గొన్నారు. -
ట్రాన్స్ఫార్మర్ దొంగతనం.. నిందితుడి అరెస్ట్
తాండూర్: మంచిర్యాల జిల్లా కోర్టులో కొనసాగుతున్న ట్రాన్స్ఫార్మర్ దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న తంగళ్లపల్లికి చెందిన గోగు బాలకృష్ణ కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతుండడంతో సోమవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు తాండూర్ ఎస్సై ప్రసాద్ తెలిపారు. జిల్లా న్యాయమూర్తి ముందు హాజరుపర్చి కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని లక్సెట్టిపేట జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. ప్రజలు చట్టాలను గౌరవించి కోర్టు వాయిదాలకు నిందితులు తప్పకుండా హాజరుకావాలని తెలిపారు. -
తైక్వాండోలో ‘రాణి’ంపు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరానికి చెందిన రాము –జయంతి దంపతుల కూతురు అస్మిత తైక్వాండోలో రాణించి స్పోర్ట్స్ కోటాలో వరంగల్లోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో సీటు సంపాదించి బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. చిన్ననాటి నుంచే క్రీడల్లో మక్కువ ఉన్న అస్మిత మూడేళ్లుగా తైక్వాండోలో రాణించి, జిల్లా, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొంది, జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించింది. స్కూల్ ఫెడరేషన్ గేమ్స్లో పసిడి పతకం, రాష్ట్రస్థాయిలో తైక్వాండో అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో రజత పతకం, జెఎన్టీయూహెచ్ ఎంపిక పోటీల్లో బంగారు పతకం సాధించి, తన సత్తా చాటుతోంది. ఆసక్తితో పట్టు..మంచిర్యాలకు చెందిన వెంకటేశ్ –లతల కుమార్తె కార్ల శ్రీజ తైక్వాండోపై ఉన్న ఆసక్తితో క్రీడలో పట్టు సాధించింది. మూడో తరగతిలో ఉండగానే శిక్షకుడు మండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శిక్షణను ప్రారంభించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో సత్తాను చాటి, జాతీయస్థాయి పోటీల్లోనూ పాల్గొంది. 2016లో జాతీయస్థాయిలో పాల్గొని తన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఆ తరువాత కేరళలో నిర్వహించిన సౌత్జోన్ నేషనల్స్లో ఆడి మొదటిసారిగా బంగారు పతకాన్ని సాధించింది. ఎస్జీఎఫ్ పోటీల్లోనూ పాల్గొని రెండుసార్లు కాంస్య పతకాన్ని సాధించింది. స్పోర్ట్స్ కోటాలో కోటి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ సీటు పొందింది. -
ప్రతిపాదనలు సిద్ధం చేయండి
కై లాస్నగర్: ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అధికారులను ఆదేశించారు. ఇటీవల జిల్లాలో పర్యటించిన ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్రెడ్డి, వేం నరేందర్రెడ్డిలను కాంగ్రెస్ ని యోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కలిశారు. చనాఖా–కొరటా నుంచి తాగునీటి సరఫరా కోసం రూ.54కోట్లు, సీసీరోడ్లు, డ్రైనేజీలు, కల్వర్ట్లు, బీటీరోడ్ల నిర్మాణాలకు రూ.100 కోట్లు మంజూరు చేయాలని విన్నవించారు. ఈ క్రమంలో అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాల ని కలెక్టర్ రాజర్షి షాను ఇన్చార్జి మంత్రి ఆదేశించా రు. ఈనేపథ్యంలో చైర్పర్సన్ సోమవారం మున్సి పల్ కమిషనర్, ఇంజినీరింగ్ అధికారులతో కార్యాలయ చాంబర్లో సమావేశం నిర్వహించారు. అధి కారులు మంగళవారం నుంచి పట్టణంలోని వార్డు ల వారీగా పర్యటించి అవసరమైన అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వారం రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక అందించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రూ.100 కోట్లు నాలుగు విడతలుగా మంజూరు చేసేలా మంత్రి హా మీ ఇచ్చినట్లుగా వెల్లడించారు. ఇందులో వైస్ చైర్మ న్ రోహిత్, కమిషనర్ జి.రాజు, కౌన్సిలర్ సాయిచరణ్ గౌడ్, నాయకులు సతీశ్ తదితరులున్నారు. -
బాధితులకు అండగా పోలీసు వ్యవస్థ
ఆదిలాబాద్టౌన్: బాధితులకు పోలీసు వ్యవస్థ అండగా నిలుస్తుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 28 మంది ఫిర్యాదుదారులు ఎస్పీకి నేరుగా తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరించి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, సిబ్బంది పాల్గొన్నారు. పోలీసు విధులు ఆటంకపర్చిన వారిపై చర్యలు పోలీసుల విధులు ఆటంకపర్చిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. 24 గంటల పాటు పోలీసులు ప్రజా రక్షణలో విధులు నిర్వహిస్తున్నారని తెలి పారు. సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడటం, విధులు అడ్డుకునే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. ఇటీవల నార్నూర్, ఉట్నూర్, ఇచ్చోడ పోలీసు స్టేషన్ల పరిధిలో వేర్వేరు ఘటనల్లో పోలీసు విధులను ఆటంకపర్చిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాలను అరికట్టేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు, ఘటనలపై సమీప పోలీసు స్టేషన్లో సమాచారం అందించాలని సూచించారు. -
బీజేపీ వర్సెస్ పోలీసులు
గృహ నిర్బంధం పిరికిపంద చర్య ఆదిలాబాద్: బీజేపీ నాయకులను నిర్బంధించడం పిరికిపంద చర్య అని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఘటిక క్రాంతి కుమార్ అన్నారు. పార్టీ పిలుపుమేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో సోమవారం పలువురు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి టూటౌన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలకు పాల్పడడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. అరెస్ట్ అయిన వారిలో కౌన్సిలర్లు పద్మవార్ రాకేశ్, గంట జీవన్ తదితరులున్నారు. గుడిహత్నూర్: బీజేపీ అసెంబ్లీ ముట్టడి పిలుపు మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ సహా పలు వురు నాయకులు హైదరాబాద్ తరలివెళ్లేందుకు సమాయత్తం అవుతున్న విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు సీఐలతో పాటు స్థానిక ఎస్సై శ్రీకాంత్ సుమారు 20 మంది సిబ్బందితో బ్రహ్మానంద్ ఇంటికి చేరుకున్నారు. ఆయనను స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇంట్లోకి వెళ్లిన బ్రహ్మానంద్ తప్పించుకొని బయటకు వెళ్లి పోయాడు. ఎంతకీ రాకపోవడంతో పోలీసులు చేసేది లేక బయట ఉన్న ఆయన కారు టైర్లకు చువ్వ గుచ్చి గాలి తీసి వెనుదిరిగారు. అంతకు ముందే పార్టీ మండలాధ్యక్షుడు కేంద్రే శివాజీని, బీజేవైఎం అధ్యక్షుడు రాజేందర్తో పాటు ఇతర నాయకులను పోలీసులు స్టేషన్కు తరలించారు. ఉదయం స్టేషన్కు చేరుకున్న బ్రహ్మానంద్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, తన కారు టైర్లను పాడు చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రహ్మానంద్ పోలీసులపై ఫిర్యాదు చేశారు. శాంతియుతంగా చేపడుతున్న నిరసనపై పోలీసులు అత్యుత్సాహంతో నిర్భందించడం సరికాదని ఆయన విలేకరులకు తెలిపారు. పోలీసులు కారు టైర్ల నుంచి గాలి తీసేశారిలా.. -
నిర్మలగిరికి భక్తుల తాకిడి
● ప్రారంభమైన మేరీమాత ఉత్సవాలు ● సందర్శించిన ఎస్పీదేవరపల్లి: గౌరీపట్నం నిర్మలగిరి మేరీమాత మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం సెలవు కావడంతో తొలి రోజే భక్తుల తాకిడి ఏర్పడింది. ఉభయ గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా తరలి వచ్చి, మరియ తల్లిని దర్శించుకుని, దీవెనలు పొందారు. ఈ ఉత్సవాలు ఈ నెల 25వ తేదీ వరకూ జరుగనున్నాయి. ఏలూరు పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర పర్యవేక్షణలో పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎస్.జాన్పీటర్ ఆధ్వర్యాన ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సాయంత్రం 6 గంటల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అర్ధరాత్రి వరకూ పుణ్యక్షేత్రంలో గడిపి ప్రార్థనలు, పూజలు చేస్తారు. తొలి రోజు సహాయ గురువులు ఫాదర్ ప్రేమ్కుమార్ దివ్య బలి పూజ సమర్పించారు. పలువురు గురువులు, ఫాదర్లు పాల్గొన్నారు. పుణ్యక్షేత్రంలో ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ మళ్లింపు గుండుగొలను – కొవ్వూరు రాష్ట్ర ప్రధాన రహదారికి ఇరువైపులా నిర్మలగిరి పుణ్యక్షేత్రం విస్తరించినందున భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ను మళ్లించినట్టు సీఐ నాయక్ తెలిపారు. దేవరపల్లి, దుద్దుకూరు, గౌరీపట్నం, పంగిడి గ్రామాల్లో ట్రాఫిక్ను 16వ నంబర్ జాతీయ రహదారి మీదుగా మళ్లిస్తున్నామని చెప్పారు. 215 మందితో బందోబస్తు మేరీ మాత ఉత్సవాలకు 215 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు దేవరపల్లి సీఐ బీఎన్ నాయక్ తెలిపారు. ఉత్సవాలు నాలుగు రోజులూ పుణ్యక్షేత్రానికి సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని నిర్వాహకులు చెప్పారన్నారు. అదనపు ఎస్పీ ఇన్చార్జిగా ముగ్గురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 21 మంది ఎస్సైలు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారని వివరించారు. పుణ్యక్షేత్రంలోని 30 ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఐదు డ్రోన్ కెమెరాలు, క్రైం పార్టీని కూడా ఏర్పాటు చేశామన్నారు. పాత నేరస్తులను గుర్తించడానికి ఈ ఏడాది అత్యాధునికమైన 50 ఫింగర్ ప్రింట్ డివైజ్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. వీటి ద్వారా అనుమానితులను గుర్తిస్తామన్నారు. ఫేస్ రికవరీ పరికరాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. -
గంగవరం వైపు పులి అడుగులు
గంగవరం: పెద్ద పులి సంచారంతో సుమారు నెల రోజులుగా జిల్లాలోని అటవీ శాఖ ఉన్నతాధికారులకు, సిబ్బందికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఇటు ప్రజలు కూడా ఆ పులి ఎప్పుడు ఏ ప్రాంతానికి వస్తుందో తెలియక భయాందోళనలకు గురవుతున్నారు. ఏజెన్సీ నుంచి ఈ పులి గత నెలలో కాకినాడ జిల్లాకు మకాం మార్చి, మళ్లీ యూటర్న్ తీసుకుంది. ప్రస్తుతం రాజవొమ్మంగి, అడ్డతీగల మండలాల సరిహద్దు అటవీ ప్రాంతాన్ని దాటుకుని, గంగవరం మండలం వైపు పయనిస్తోంది. దీంతో, మండల ప్రజల్లో వణుకు పుడుతోంది. రేడియో ట్రాకింగ్ సిగ్నల్స్ సహకారంతో పులి ఎక్కడ సంచరిస్తోందో అటవీ అధికారులు గమనిస్తున్నారు. ఇటు సిబ్బందిని మరోవైపు ప్రజలను, రైతులను అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పశువులపై దాడి చేస్తే నష్టపరిహారం అందిస్తున్నారు. పులి సంచారంపై అప్రమత్తంగా ఉన్నామని అడ్డతీగల్ సబ్ డీఎఫ్ఓ వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం రాత్రి నుంచి పులి గంగవరం మండలం రాముల్దేవుపురం, పిడతమామిడి, వేములోవ అటవీ ప్రాంతాల్లో సంచరించిందని చెప్పారు. తొలిసారి ఫస్ట్ ర్యాంక్ అన్నవరం: రాష్ట్రంలోని ఏడు ప్రముఖ ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అందిస్తున్న సేవలపై ఫిబ్రవరి 22 నుంచి మార్చి 21 వరకూ వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా నిర్వహించిన సర్వేలో అన్నవరం దేవస్థానం 73.7 శాతం భక్తుల సంతృప్తితో ప్రథమ స్థానంలో నిలిచింది. దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు ఆదివారం ఈ విషయం తెలిపారు. దేవస్థానాలకు ప్రభుత్వం ర్యాంకులు ప్రకటించడం ప్రారంభించాక అన్నవరం ప్రథమ స్థానంలో రావడం ఇదే తొలిసారి. తాజా సర్వేలో 65.9 శాతంతో శ్రీశైలం ఏడో స్థానంలో నిలిచింది. 73.6 శాతంతో రెండో స్థానంలో నిలచిన ద్వారకా తిరుమల కన్నా అన్నవరం దేవస్థానం 0.1 శాతం మాత్రమే ఎక్కువ పొందింది. స్వామివారి దర్శనంపై 76.6 శాతం, మౌలిక వసతుల కల్పనపై 71.5 శాతం, ప్రసాదం నాణ్యతపై 79.9 శాతం, పారిశుధ్య ఏర్పాట్లపై 66.3 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. రత్నగిరికి పోటెత్తిన భక్తులు అన్నవరం: రత్నగిరికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వివాహ బృందాలు, ఇతర భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయంలో సాయంత్రం వరకూ విపరీతమైన రద్దీ ఏర్పడింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని వ్రతాలు 2,500 జరిగాయి. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. వ్యవసాయ కూలీ నిజాయితీనిడదవోలు: కనిపించిన వస్తువును ఎవ్వరూ చూడకుండా సొంతం చేసుకుందామనుకునే ఆలోచనలు చాలా మందిలో ఉంటాయి. కానీ, ఆ వ్యవసాయ కూలీ తాను ఈ చోరధోరణికి అతీతమని నిరూపించుకున్నాడు. తన నిజాయితీని చాటుకున్నాడు. వివరాలివీ.. ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలోని బంధువుల ఇంట ఆదివారం జరిగిన వివాహ వేడుకకు నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామానికి చెందిన చెందిన ఎన్.నాగేశ్వరరావు వెళ్లారు. ఆ సందర్భంగా ఆయన మెడలోని సుమారు రూ.2.70 లక్షల విలువైన రెండున్నర కాసుల బంగారు గొలుసు పడిపోయింది. ఆ దారి వెంట నడిచి వెళ్తున్న అదే గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ అరిగెల శేషారావు కంట ఆ గొలుసు పడింది. దానిని ఎవరు పోగొట్టుకున్నారో, వారికి ఎలా అందజేయాలో తెలియక ఆలోచనలో శేషరావు పడ్డారు. అంతలో తన చైన్ పడిపోయిందంటూ నాగేశ్వరరావు లబోదిబోమంటూ వీధుల్లో వెతుకుతున్నారు. విషయం తెలిసిన శేషారావు నిజాయితీతో ఆ బంగారు గొలుసును నాగేశ్వరరావుకు అప్పగించారు. శేషారావు నిజాయితీని అందరూ అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు. -
వడగళ్ల వర్షం
అడ్డతీగల: ఆకాశంలో హఠాత్తుగా కారుమబ్బులు కమ్ముకోవడంతో ఆదివారం మధ్యాహ్నం అడ్డతీగలలో భారీ వడగళ్ల వర్షంన కురిసింది. దీనికి ఈదురు గాలులు తోడవ్వడంతో చెట్ల కొమ్మలు ఎక్కడికక్కడ విరిగిపడి, ప్రజా జీవనం స్తంభించింది. సుమారు గంట పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. అప్పటి వరకూ ఎండ వేడిమికి ఇబ్బంది పడిన ప్రజలు ఒక్కసారిగా ఏర్పడిన చల్లటి వాతావరణంతో సేద తీరారు. ఈదురు గాలుల తీవ్రంతకు అడ్డతీగల – వేటమామిడి రోడ్డులోని ఏకలవ్య పాఠశాల వద్ద చెట్ల కొమ్మలు పడిపోయి 33 కేవీ లైన్లు తెగిపడ్డాయి. దీంతో, అడ్డతీగల, రాజవొమ్మంగి, వై.రామవరం, గంగవరం మండలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏపీ ఈపీడీసీఎల్ అధికారులు వెంటనే స్పందించి లైన్లు సరి చేసి, స్తంభాలపై ఇన్సులేటర్లు అమర్చారు. విద్యుత్ సరఫరాను సాయంత్రానికి పునరుద్ధరించారు. ఈదురు గాలులు, భారీ వర్షం వల్ల అడ్డతీగల చుట్టుపక్కల గ్రామాల్లో అరటి తోటల రైతులకు నష్టం వాటిల్లింది. అరటి తోటలు ఒరిగిపోయాయి. -
చెల్లించండి ప్లీజ్..
● ఆస్తిపన్ను వసూళ్లకు సిబ్బంది పరుగులు ● మొండి బకాయిల వసూళ్లకు చర్యలు ● రేపటి వరకూ గడువురంపచోడవరం: పంచాయతీల్లో కొండలా పేరుకుపోతున్న పన్ను బకాయిల వసూలుకు ప్రభుత్వం గడువు విధించింది. వెంటనే పన్నులు వసూలు చేయాలని ఆదేశాలిచ్చింది. దీంతో, సచివాలయ సిబ్బంది పన్ను వసూళ్ల కోసం పరుగులు తీస్తున్నారు. ఈ నెల 24వ తేదీలోగా బకాయిలు పూర్తి స్థాయిలో వసూలు చేయాలని నిర్ణయించారు. బకాయిలు ఇలా.. జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఇంటి పన్ను బకాయిలు కూడా వసూలు కావాల్సి ఉంది. జిల్లాలోని రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలో మొత్తం 186 పంచాయతీలున్నాయి. వీటి పరిధిలో 29,901 మందికి సంబంధించి రూ.3.33 కోట్ల మేర ఇంటి పన్ను వసూలు కావాల్సి ఉంది. కాగా, ఇందులో ఇప్పటికే రూ.2.04 కోట్ల మేర ప్రజలు చెల్లించారు. మరో 7,064 మందికి సంబంధించి రూ.1.29 కోట్లు ఇంకా వసూలు కావాల్సి ఉంది. జిల్లా కేంద్రమైన రంపచోడవరం పంచాయతీ కార్యాలయానికి రూ.60.93 లక్షల మేర పన్ను బకాయి చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన బకాయిలు మొత్తం రూ.45.13 లక్షలుండగా, ఇందులో రూ.8.50 లక్షల మేర మాత్రమే చెల్లింపులు జరిగాయి. రంపచోడవరం పంచాయతీ మినహా మిగిలిన అన్ని పంచాయతీలు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల్లోపు మాత్రమే పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి పన్ను బకాయిలు సక్రమంగా చెల్లించకపోవడంతో అవి ఏళ్ల తరబడి కొండలా పేరుకుపోతున్నాయి. రంపచోడవరంలోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)కు సంబంధించి ఐటీడీఏ భవనం, ప్రభుత్వ క్వార్టర్లకు పన్ను చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనివలన పంచాయతీలో గ్రామాల అభివృద్ధికి పరోక్షంగా విఘాతం కలుగుతోంది. రిసార్ట్స్పై పన్నులు స్వల్పమే.. జిల్లాలో పుట్టగొడుగుల్లా ఏర్పాటు చేసిన రిసార్ట్స్ నుంచి పంచాయతీలకు ఆదాయం రావడం లేదు. రిసార్ట్స్, గెస్ట్హౌస్లకు పూర్తి స్థాయిలో లెక్కలు కట్టి పన్నులు విధించాల్సి ఉండగా.. అరకొరగా లెక్కలు వేసి తోచిన విధంగా చాలా తక్కువ మొత్తంలో పన్నులు విధించారు. ఫలితంగా పెద్ద పెద్ద రిసార్ట్స్ యజమానులు సైతం ఏడాదికి రూ.600 నుంచి రూ.1,000 వరకూ మాత్రమే పన్ను చెల్లిస్తున్నారు. జిల్లాలో సుమారు 500 వరకూ రిసార్ట్స్, గెస్ట్హౌస్లలో గదుల సౌకర్యం ఉంది. రిసార్ట్స్ నిర్వహకులు పర్యాటకుల నుంచి వసతి కోసం ఒక్కో రూముకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకూ వసూలు చేస్తున్నారు. వారాంతాలు, సెలవులు, పండగ రోజుల్లో వీటి అద్దెలను మరింత పెంచుతున్నారు. కానీ, దీనికి తగిన రీతిలో పన్నులు విధించడం లేదు. ఫలితంగా పంచాయతీల ఆదాయానికి గండి పడుతోంది. రంపచోడవరం, మారేడుమిల్లి, సున్నంపాడు పంచాయతీల పరిధిలో ఎన్ని రిసార్ట్స్ ఉన్నాయి, అద్దెలు ఎలా వసూలు చేస్తున్నారు, ఇందులో జీఎస్టీకి ఎంత వెళ్తుంది, పంచాయతీకి ఎంత చెల్లిస్తున్నారు వంటి అంశాలపై పంచాయతీ కార్యదర్శులు పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సి ఉంది.పన్ను బకాయిలు ఇలా.. జిల్లాలో పంచాయతీలు 186 పన్ను వసూలు లక్ష్యం రూ.3.33 కోట్లు చెల్లించాల్సిన వారు 29,901 వసూలైనది రూ.2.04 కోట్లు బకాయి రూ.1.29 కోట్లు దీనిని చెల్లించాల్సిన వారు 7,064 ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు రూ.45.13 లక్షలు వసూలు రూ.8.50 లక్షలుపంచాయతీలకు ఆస్తిపన్ను బకాయిలు గుదిబండగా మారుతున్నాయి. ఏళ్ల తరబడి పేరుకుపోయిన మొండి బకాయిల వసూలు అధికారులకు కత్తి మీద సాములా మారింది. ఈ ఆర్థిక సంవత్సరం ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పన్నులు వసూలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ప్రస్తుతం ఈ పనిలో పంచాయతీ యంత్రాంగమంతా నిమగ్నమైంది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ హడావుడే కనిపిస్తోంది. -
కూటమి పాలనలో దళితులపై దాడులు
● దీనికి పవన్ కల్యాణ్ బాధ్యత వహించాలి ● చంద్రబాబు కేసులన్నీ రీ ఓపెన్ చేయిస్తాం ● జడ శ్రావణ్ కుమార్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దళిత, బహుజనులపై దాడులు పెరిగిపోయాయని జైభీమ్రావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ విమర్శించారు. ముఖ్యంగా జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో దళితులపై అమానుష దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కాకినాడలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పి.గన్నవరం నియోజకవర్గంలో దళితుని మృతదేహాన్ని తన ఇంటి ముందు నుంచి తీసుకెళ్లకూడదంటూ ఓ వ్యక్తి దురహంకారానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహకారం అందిస్తున్నారని ఆరోపించారు. రాజకీయాలలో మార్పు తెస్తానని చెప్పి, ప్రజల చేత ఓట్లు వేయించుకున్న పవన్ కల్యాణ్ అదే ప్రజలకు న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులపై ఇప్పటి వరకూ ఎటువంటి కేసులూ నమోదు కావడం లేదని చెప్పారు. అప్పుడే శిక్షించి ఉంటే.. పిఠాపురం మండలం మల్లాం సంఘటనకు బాధ్యులైన వారిని శిక్షించి ఉంటే ఉప్పాడ కొత్తపల్లిలో మరో సంఘటన జరిగి ఉండేది కాదని శ్రావణ్ కుమార్ అన్నారు. ఇలా శిక్షలు పడనందువల్లనే దళితులపై దాడులు నిరంతరం కొనసాగుతున్నాయని అన్నారు. వీటన్నింటి వెనుక పవన్ కల్యాణ్ హస్తం ఉందని ఆరోపించారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లిలో హెడ్మాస్టర్, ఇన్చార్జ్ హెడ్మాస్టర్ ఎస్సీ పిల్లలను అనేక ఇబ్బందులకు గురి చేసినా.. ఆ పిల్లల తల్లిదండ్రులు రోజుల తరబడి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా కేసు నమోదు చేయకుండా సీఐ క్లీన్చిట్ రిపోర్టు ఇవ్వడాన్ని శ్రావణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఎస్సీ, ఎస్టీ కేసులను డీఎస్పీ స్థాయి అధికారి విచారించాలని, సీఐ కాదని చెప్పారు. తన నియోజకవర్గ ప్రజలకే న్యాయం చేయని పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని ప్రజలకు ఏవిధంగా చేస్తారని ప్రశ్నించారు. తల్లిదండ్రులు రాజీ పడితే తానేమీ చేయలేనని, నిలబడితే కేసును ఎంతవరకూ అయినా తీసుకువెళ్తానని చెప్పారు. వారు కోర్టుకు రావాల్సి ఉంటుంది జిల్లా కలెక్టర్ పిఠాపురం నియోజకవర్గానికి కలెక్టర్లా వ్యవహరిస్తున్నారని శ్రావణ్ కుమార్ ఆరోపించారు. జిల్లాలో ఎక్కడ దళితులపై దాడులు జరుగుతున్నా కేసులు నమోదు కాకుండా చూస్తున్నారని, త్వరలో కలెక్టర్, ఎస్పీ కూడా హైకోర్టుకు రావాల్సి ఉంటుందని అన్నారు. దళితులపై దాడులు జరుగుతూంటే కండిషన్ బెయిల్ ఇప్పించే పాత్రను వీరు తీసుకుంటున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ చెప్పినట్లు పని చేసే అధికారులకు తిప్పలు తప్పవని అన్నారు. పవన్ మాటలు సిగ్గుచేటు జిల్లాలో 20 మందికి పైగా అగ్ని ప్రమాదంలో చనిపోతే వారికి చెక్కులిచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకొందని శ్రావణ్ కుమార్ విమర్శించారు. ఒక కుటుంబం పెద్ద వ్యక్తిని కోల్పోతే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఉప ముఖ్యమంత్రికి తెలియదని అన్నారు. రాష్ట్రంలో 67 శాతం పరిశ్రమలకు పొల్యూషన్కు సంబంధించి అనుమతుల్లేవని, వాటిని తీసుకుని ఫ్యాక్టరీలు నడపాలంటే ఉపాధి కల్పించలేమని అసెంబ్లీలో పవన్ కల్యాణ్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. పొల్యూషన్, ఫైర్ శాఖలకు చెరో రూ.10 లక్షలు లంచాలివ్వాల్సి వస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారన్నారు. రాష్ట్ర హోం మంత్రి అనితపై ఆరోపణలు చేసి రూ.10 కోట్లకు పైగా తన సంపదను పెంచుకున్నారని, కలెక్టర్లకు, ఎస్పీలకు ఫోన్ చేసి కేసులు కట్టవద్దనే స్థాయికి పవన్ కల్యాణ్ దిగజారిపోయారని విమర్శించారు. రెండున్నరేళ్లలో సంవత్సరం కాలం పాటు షూటింగ్లకు కేటాయించిన ఆయన రాష్ట్ర ప్రజలకు ఏ న్యాయం చేస్తారని ప్రశ్నించారు. దేశంలో ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ షూటింగ్లలో పాల్గొనే ఏకై క వ్యక్తి పవన్ కల్యాణ్ అని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసులన్నీ రీ ఓపెన్ చేయించే పనిని తమ పార్టీ తీసుకుంటుందని,, దానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభించామని తెలిపారు. గంటకు రూ.కోటి చెల్లించి వాదించే సుప్రీంకోర్టు లాయర్లను చంద్రబాబు తీసుకొస్తున్నారని, తనకు ఎవరైనా ఫర్వాలేదని, చేస్తున్న పాపాల నుంచి ఆయన తప్పించుకునే ప్రసక్తే లేదని అన్నారు. విజయవాడ వరకూ వచ్చి తనను కలవలేని వారెవరైనా సరే కాకినాడలోని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, న్యాయవాది జగ్గారపు మల్లికార్జునను కలవవచ్చని శ్రావణ్ కుమార్ చెప్పారు. పేదల పక్షాన పోరాడటమే తమ పార్టీ లక్ష్యమన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో తమ అనుచరులను నియమిస్తామన్నారు. సమావేశంలో జగ్గారపు మల్లికార్జున, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరస సురేష్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గుగ్గిలపు హరీష్, జిల్లా ఉపాధ్యక్షుడు దడాల బాబ్జీ పాల్గొన్నారు. -
యుద్ధంతో ప్రపంచ దేశాలన్నింటికీ నష్టమే
ఏలేశ్వరం: ప్రస్తుతం జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ దేశాలన్నింటికీ నష్టమేనని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు వి.రాంభూపాల్ అన్నారు. యూటీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అప్పారి వెంకటస్వామి 26వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి స్మారకోపన్యాసం పట్టణంలో ఆదివారం నిర్వహించారు. యూటీఎఫ్ మండల కమిటీ ఆధ్వర్యాన, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు అధ్యక్షతన ‘అమెరికా యుద్ధోన్మాదం – అంతర్జాతీయ పరిణామాలు’ అనే అంశంపై రాంభూపాల్ ప్రసంగించారు. 23 రోజుల క్రితం మొదలైన ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇజ్రాయెల్, ఆమెరికాలు ఇరాన్పై ఏకపక్షంగా యుద్ధం చేస్తూ సామాన్య ప్రజానీకంపై పెనుభారం మోపుతున్నాయని అన్నారు. ఇరాన్ ఉన్మాద స్థితికి చేరుకుంటే ప్రపంచానికే నష్టమన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ, కరోనా ముందు ప్రభుత్వ పాఠశాలల్లో 46 లక్షల మంది విద్యార్థులుండగా ప్రస్తుతం 31.50 లక్షల మంది ఉన్నారని అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. తొలుత యూటీఎఫ్ మండల శాఖ భవనాన్ని వెంకటేశ్వర్లు, ప్రసాద్ ప్రారంభించారు. యూటీఎఫ్ సభ్యులకు ఉచిత ఆరోగ్య శిబిరం, వివిధ విభాగాలను ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి, మాజీ ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, ఇళ్ల వెంకటేశ్వరరావు ప్రారంభించారు. యూటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించి, ఉద్యమ గీతాలు ఆలపించారు. అనంతరం, యుద్ధం ఆపాలంటూ పట్టణంలోని పలు వీధుల్లో ఉపాధ్యాయులు శాంతి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సూరిబాబు, నగేష్, జిల్లా నాయకులు జట్ల సోమరాజు, కె.రవి, ఆదివిష్ణు తదితరులు పాల్గొన్నారు. -
బడ్జెట్ ప్రతులు దహనం
పాతమంచిర్యాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించలేదని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ అన్నారు. ఈమేరకు ఆదివారం జిల్లా కేంద్రంలో బడ్జెట్ ప్రతులు దహనం చేశారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ కే టాయిస్తామని హామీ ఇచ్చి వివక్ష చూపిస్తుందన్నా రు. జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు అశోక్, రాజన్న, చారి, అలేఖ్య, నటేశ్వర్, సదానందం, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
‘ఎన్నికల హామీలు నెరవేర్చాలి’
శ్రీరాంపూర్: ఎన్నికల్లో ప్రజలకు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చాలని బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం నస్పూర్ కాలనీలోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, టీబీ జీకేఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డిలు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకుందన్నారు. కార్మికులకు సాధారణ ఎన్నికల్లో, గు ర్తింపు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 50వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి మెరుగు పవన్ కుమార్, కౌన్సిలర్ గుమ్మడి శ్రీనివాస్, టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బండి రమేశ్, నాయకులు పానుగంటి సత్తయ్య, వంగ తిరుపతి, బాకం నగేశ్, గుంట జగ్గయ్య, జనార్ధన్, కాటం రాజు, పొగాకు రమేశ్, ఆకునూరి సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
గోదావరిలో మృతదేహాల కలకలం
బాసర: గోదావరి నదిలో బాసర వద్ద ఆదివారం రెండు మృతదేహాలు లభ్యమైన ఘటన కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికులు బాసర బ్రిడ్జి కింద గోదావరిలో తేలియాడుతున్న రెండు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. ఒక మృతదేహం నిజామాబాద్ జిల్లా కేంద్రం గాజులపేటకు చెందిన వ్యక్తిదిగా గుర్తించారు. లభ్యమైన మహిళ మృతదేహం వివరాలు ఇంకా తెలియరాలేదని బాసర సీఐ కిరణ్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి
కాసిపేట: సింగరేణి యాజమాన్యం పనులు ప్రారంభించకముందు ఇచ్చిన హామీల మేరకు ఓపెన్కాస్ట్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్వాసిత యువకులు డిమాండ్ చేశారు. ఆదివారం కాసిపేట ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండలంలోని కోమటిచేను, పల్లంగూడ, సోమగూడం ప్రాంతాలలో ఇంటికో ఉద్యోగం, విద్య, వైద్యం, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి రైతుల వద్ద భూమిని యాజమాన్యం కాసిపేట –2 ఓపెన్కాస్ట్లకు సేకరించి నేడు నిర్వాసితులకు మొండి చేయి చూపించిందన్నారు. ఓపెన్కాస్ట్లో గత పదేళ్లుగా దుర్గ, ఆర్వీఆర్ కంపెనీలలో డంపర్ ఆపరేటర్లుగా పని చేసిన తమను మరిచి ఇతర ప్రాంతాల నుంచి కొత్తగా వచ్చిన ఎక్స్ప్రెస్వే కంపెనీ కార్మికులను తీసుకుంటూ నిర్వాసితులకు అన్యాయం చేస్తుందన్నారు. నేతకాని సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రజా సంఘాల నాయకులు దుర్గం గోపాల్, బాధిత యువకులు కుమ్మరి శ్రీకాంత్, కుడిమెత చంద్రమౌళి, వెడ్మ కృష్ణ, తిరుపతి పాల్గొన్నారు. -
దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
లక్ష్మణచాంద: సోన్ మండలం కడ్తాల్ గ్రామ శివారులో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు సోన్ ఎస్సై గోపి పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ పట్టణానికి చెందిన ఎలుగు సుధాకర్ జనవరిలో తన బైక్ని కడ్తాల్ గ్రామ శివారులో పార్క్ చేసి పని నిమిత్తం వెళ్లగా కుచంపల్లి లక్ష్మణ్ బైక్ని దొంగతనం చేశాడు. ఎలుగు సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సై గోపి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈక్రమంలో లక్ష్మణ్ని ఆదివారం గంజల్ టోల్ప్లాజా వద్ద పట్టుకొని విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పు కున్నాడు. అతని వద్ద నుంచి మూడు మో టార్ సైకిల్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామన్నారు. లక్ష్మణ్ ఇప్పటికే ఆరు కేసులలో నిందితుడిగా ఉన్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఏఎస్సై దేవన్న, పీసీలు రాజు, వినోద్ ఉన్నారు. -
సెల్ఫోన్ గొడవ.. స్నేహితుడి హత్య
మంచిర్యాలక్రైం: సెల్ఫోన్ విషయంలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసిన ఘటన జిల్లాకేంద్రంలో చోటు చేసుకుంది. సంబంధిత వివరాలను సీఐ ప్రమోద్ రావు ఆదివారం వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన దీపక్(35), భీమిని సంజీవ్, కాసిపేట మండలం సిడం దీపక్లు జిల్లా కేంద్రంలోని చిందం శ్రీనివాస్ అనే బిల్డర్ వద్ద కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 19న జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో దీపక్, సంజీవ్, సిడం దీపక్లు రాత్రి మద్యం తాగుతుండగా సెల్ఫోన్ విషయంలో గొడవ పడ్డారు. ఈక్రమంలో సంజీవ్, సిడం దీపక్లు దీపక్ను రాడుతో తలపై మోదీ హత్య చేశారు. నిందితులు సంజీవ్, సిడం దీపక్లను ఆదివారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చి 14 రోజుల రిమాండ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. -
అడవుల్లో శివంగులు
చెన్నూర్రూరల్: ఆడవాళ్లు అంటే వంటింటికే పరిమతం అనేది ఒకప్పటి మాట. ప్రస్తుత రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. టీచర్లు, పోలీసులు, అటవీశాఖ, ఎకై ్సజ్శాఖ ఇలా అనేక రంగాలలో ఎంతో కష్టపడి ఉద్యోగాలు సాధించారు. అటవీశాఖలో మహిళలు మగవారికి తీసిపోకుండా ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నారు. చెన్నూర్ డివిజన్, చెన్నూర్ రేంజ్ పరిధిలో ఏడుగురు మహిళలు వివిధ పోస్టుల్లో చెన్నూర్, కోటపల్లి, నీల్వాయి పరిధిలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇందులో ఇద్దరు డీవైఆర్వో (డిప్యూటీ రేంజ్ అధికారులు), ఒక్కరు ఎఫ్ఎస్వో(ఫారెస్టు సెక్షన్ అధికారి), నలుగురు ఎఫ్బీవో (ఫారెస్టు బీట్ అధికారులు)లు ఉన్నారు. విధులు, బాధ్యతలు.. నెలలో రెండుసార్లు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పరేడ్ చేయడంతోపాటు పురుషులతో సమానంగా ప్రతీరోజు అడవుల్లో కనీసం ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం అడవిలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్ లైన్లను గమనించడంతో పాటు వన్యప్రాణులను వేటాడేందుకు విద్యుత్ తీగలు, ఉరులు, ఉచ్చులు పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అడవిలో స్మగ్లర్లు కలప దొంగతనం చేయకుండా అప్రమత్తంగా ఉండడం, వన్యప్రాణుల మేత కోసం గడ్డి, తాగునీటి సౌకర్యం కల్పించేందుకు తొట్లు, కుంటలు ఏర్పాటు చేయడం, అడవిని అభివృద్ధి చేసేందుకు వివిధ రకాల మొక్కల ప్లాంటేషన్ ఏర్పాటు చేయడం వంటివి చేస్తున్నారు. అటవీ సంపద కాపాడేందుకు రాత్రి పెట్రోలింగ్ చేయడం, అడవిలో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా రక్షణ చర్యలు చేపట్టడం, అటవీ ప్రాంతం సమీపంలోని గ్రామాల ప్రజలకు వన్యప్రాణుల, అడవుల సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. చెన్నూర్ మండలం సోమనపల్లి గ్రామ శివారు గోదావరి నదిలో మొసళ్ల కేంద్రం సంరక్షణ బాధ్యతలను కూడా చేపడుతున్నారు. జంతుగణన, బర్డ్వాచ్, బటర్ఫ్లై వాచ్లో పాల్గొంటున్నారు. అటవీశాఖ చెక్ పోస్టుల వద్ద, ఆకుల కల్లాల వద్ద పకడ్బందీగా విధులు నిర్వహిస్తున్నారు. -
‘సుందిళ్లకు నీటి తరలింపు మరో విపత్తు’
పాతమంచిర్యాల: తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ల బ్యారేజీకి నీటి తరలింపు కాళేశ్వరం వంటి మరో విపత్తుగానే పరిగణించాలని వామ పక్షాల, ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మార్స్క్ భవనంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ జల సాధన సమితి కన్వీనర్ నైనాల గోవర్ధన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తుమ్మిడిహెట్టి నుంచి నీటిని సుందిళ్ల బ్యారేజీకి తరలించే క్రమంలో సంభవించే పరిణామాలు, విపత్తులపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆధారిటీ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కినాకిని చంద్రఘోష్ ఏక సభ్య కమిషన్ పేర్కొన్న విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వామపక్షాల, ప్రజా సంఘాల ఐక్యవేదిక నిర్ణయించిందన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోయకుండా సుందిళ్లకు తరలించడం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీవ్రమైన తప్పిదమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీనివాస్, సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి సంకె రవి, సీపీఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యదర్శి బాబన్న, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా నాయకులు జైపాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
సాహిత్య ఫెస్టివల్కు ఆహ్వానం
ఆదిలాబాద్రూరల్: న్యూఢిల్లీలో ఈ నెల 25, 26వ తేదీలలో నిర్వహించనున్న 10వ రాష్ట్రీయ జనజాతీయ, లోక్ సంస్కృతి సాహిత్య ఫెస్టివల్కు తనకు ఆహ్వానం అందినట్లు మావల మండలంలోని వాఘాపూర్ గ్రామానికి చెందిన గోండి భాష రచయిత తొడసం కై లాష్ తెలిపారు. మానవహక్కుల చైర్మన్కు ఘన స్వాగతంజన్నారం: మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ డా.జస్టిస్ షమీమ్ అక్తర్ తన పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం జన్నారం చేరుకున్నారు. జన్నారం హరిత రిసార్ట్కు వచ్చిన ఆయనకు కలెక్టర్ కుమార్ దీపక్ మొక్క అందజేసి స్వాగతం పలికారు. రాత్రి ఇక్కడే బస చేసి సోమవారం ఉదయం సఫారీ ద్వారా అడవిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం గిరిజనులను కలిసి వారి స్థితిగతులు అడిగి తెలుసుకోనున్నారు. ఇంధన్పల్లి రేంజ్ పరిధిలో గిరిజనులు చేస్తున్న వెదురు కళావృత్తులను పరిశీలించనున్నారు. కలెక్టర్తో పాటు సీపీ అంబర్ కిషోర్ ఝా, ఎఫ్డీపీటీ శాంతారాం, జిల్లా అటవీ అధికారి శివ్ఆషిశ్ సింగ్, జిల్లా అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. -
● జిల్లాలో పెరిగిన కొత్తకార్డులు ● అందుబాటులో లేని చౌక దుకాణాలు ● ఉచిత బియ్యం కోసం తప్పని తిప్పలు
కై లాస్నగర్: జిల్లాలో కొత్త గ్రామపంచాయతీలు ఏ ర్పడి ఎనిమిదేళ్లవుతోంది. ఆయా జీపీల్లో ఇంకా చౌకధరల దుకాణాలు మాత్రం ఏర్పాటు చేయలేదు. దీంతో రేషన్ లబ్ధిదారులు బియ్యం కోసం ఇతర గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేక ఆదివాసీల ఇక్కట్లు వర్ణనాతీతంగా మారుతున్నాయి. తమ గ్రామాల్లోనే దుకాణాలు ఏర్పాటు చేయాలంటూ స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అధికారులకు ఏళ్లుగా విన్నవిస్తూనే ఉన్నారు. కార్డుల సంఖ్య పెరిగినా .. రేషన్కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం నిరంతరంగా కొనసాగిస్తోంది. జిల్లాలో కొత్తగా పెరిగిన 33,905 కార్డులతో కలిసి ఈ సంఖ్య 2,26,048కి చేరింది. అయితే కార్డుల సంఖ్యకు అనుగుణంగా చౌక ధరల దుకాణాలు ప్రజలకు అందుబాటులో లేవు. జిల్లాలో 356 రేషన్ షాపులు మాత్రమే ఉన్నాయి. ఈలెక్కన ఒక్కో షాపు పరిధిలో సగటున 631 కార్డులున్నాయి. అయితే 350 కార్డుల వరకే ఒక దుకాణం ఉండాలని డీలర్లు అభిప్రాయపడుతున్నారు. అదనంగా కార్డులు ఉండటం ద్వారా బియ్యం పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. కార్డుదా రులు దేశంలో ఎక్కడైన బియ్యం తీసుకోవచ్చనే నిబంధన తమకు అదనపు భారంగా మారుతుందని చెబుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా అవే తిప్పలు .. గూడేలు, తండాలను రాష్ట్ర ప్రభుత్వం 2018లో గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా 227 జీపీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఎనిమిదేళ్లవుతున్నప్పటికీ ఇప్పటికి ఆయా గ్రామాల్లో రేషన్ షాపులను ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ఈ గ్రామాలన్నీ గతంలో అనుబంధ గ్రామాలుగా ఉన్నవే కావడం, స్థానికంగా షాపులు ఏర్పాటు చేయకపోవడంతో కార్డుదారులు సమీపంలోని గ్రామాలకు ఆటోలు, ద్విచక్రవాహనాలపై వెళ్లి బియ్యం తెచ్చుకుంటున్నారు. రోడ్డు సౌకర్యం లేని మారుమూల గ్రామాల్లోని ఆదివాసీ, గిరిజనులు కిలోమీటర్ల మేర కాలినడకనే వెళ్లి నెత్తిన బియ్యం మూటలతో తెచ్చుకోవాల్సిన దుస్థితి. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి తమ ఇబ్బందులు తీర్చాలని వారు కోరుతున్నారు. రాళ్లదారిలో బియ్యం మూటలు ఎత్తుకుని వెళ్తున్న ఆదిలాబాద్ రూరల్ మండలం మాంగ్లీ గ్రామస్తులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. ఇటీవలే నేను రెవెన్యూ అదనపు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించా. జిల్లాలో ఏయే గ్రామాల్లో రేషన్షాపులు లేవనే వివరాలను డీఎస్వో నుంచి తెలుసుకుంటాను. వారిచ్చే నివేదిక ఆధారంగా కొత్త షాపుల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించే ప్రయత్నం చేస్తాను. ప్రభుత్వ తదుపరి ఆదేశాలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకుంటాం. – ఎస్.రాజేశ్వర్, రెవెన్యూ ఇన్చార్జి అదనపు కలెక్టర్ ‘రేషన్ షాపులు లేని గ్రామాల్లో వెంటనే కొత్తవి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. తద్వారా కార్డుదారులకు స్థానికంగానే బియ్యం అందించవచ్చు..’ ఇవి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ నెల 6న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక అమలుపై నిర్వహించిన సమీక్షలో జిల్లా అధికారులకు చేసిన ఆదేశం.జిల్లాలో.. రేషన్ కార్డులు : 2,26,048 రేషన్ దుకాణాలు :356 ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో : 53గ్రామీణ మండలాల పరిధిలో : 303 -
జిల్లా అభివృద్ధికి తోడ్పడేలా బడ్జెట్
కై లాస్నగర్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో జిల్లాలోని దీర్ఘకాల పెండింగ్ సమస్యలను పరిష్కరించేలా నిధుల కేటాయింపులు చేయడం హర్షనీయమని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి బాలురి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్లపాలనలో నిరాదరణకు గురైన సీఆర్ఆర్ కొరట–చెనక బ్యారేజీని పూర్తిచేసి 50వేల ఎకరాల ఆయకట్టుకు నిరందించడమే లక్ష్యంగా రూ.177.54 కోట్లను బడ్జెట్లో కేటాయించిందన్నారు. ఇందులో రూ.90 కోట్లు భూసేకరణకు, రూ.87 కోట్లు అదనపు నిర్మాణాలకు కేటాయించారన్నారు. సాత్నాల ప్రాజెక్ట్కు రూ.కోటి, మత్తడి వాగు ప్రాజెక్ట్కు రూ.4.62 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రేషన్ కార్డు గల ప్రతీ పేద కుటుంబానికి రూ.5 లక్షల జీవితబీమా ప్రకటించి యావత్ దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఏటీసీలను అభివృద్ధి చేసి విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన శిక్షణను అందించాలనే ఉద్దేశంతో రూ.5వేల కోట్లు కేటాయించారన్నారు. పేదలకు కార్పోరేట్ స్థాయి విద్యను అందించేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు రూ.5వేల కోట్లు కేటాయించడం అభినందనీయమన్నారు. విద్య, వైద్యం, సాగునీటి రంగాలకు పెద్దపీట వేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు బండి దేవదాస్ చారి, గౌలి సంజయ్ కుమార్, నాయకులు సిరాజ్, రవి, పరమేశ్వర్, మొయిన్, ఇర్షద్, రాజ్ మొహమ్మద్, తదితరుల పాల్గొన్నారు. -
‘నేటి ర్యాలీ విజయవంతం చేయాలి’
ఆదిలాబాద్టౌన్: భగత్సింగ్ స్ఫూర్తితో అందరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, సీఐటీయూ, టీఏవీఎస్, ఐద్వా, తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సీఐటీయూ జిల్లా కార్యాలయం నుంచి భగత్సింగ్చౌక్ వరకు నిర్వహించనున్న ర్యాలీ విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్ 22 ఏళ్ల వయసులోనే బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించిన మహనీయుల ని కొనియాడారు. వారి 95వ వర్ధంతిని పురస్కరించుకుని సమసమాజ నిర్మాణం, అందరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ, సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువజనులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, ఐ ద్వా జిల్లా కార్యదర్శి మంజుల, టీఏవీఎస్ జిల్లా కా ర్యదర్శి ఆత్రం కిష్టు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాం
బోథ్లో ఫైర్స్టేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి తీసుకురావడం వల్లే ఇది సాధ్యమైంది. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జరిగిన ప్రతీ అసెంబ్లీ సమావేశాల్లో బోథ్లో ఫైర్స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రస్తావించా. పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశా. ప్రభుత్వం దిగివచ్చి ఫైర్స్టేషన్ మంజూరు చేసింది. – అనిల్ జాదవ్, ఎమ్మెల్యే, బోథ్ కాంగ్రెస్ ప్రభుత్వంవల్లే మంజూరు కాంగ్రెస్ పార్టీ వల్లే బోథ్ నియోజకవర్గ కేంద్రంలో ఫైర్ స్టేషన్ మంజూరైంది. ఎన్నో ఏళ్ల పోరాటాన్ని మా ప్రభుత్వం గుర్తించింది. ప్రజల ఆకాంక్షను పరిగణలోకి తీసుకుని ఫైర్స్టేషన్ మంజూరు చేసింది. ఫైర్స్టేషన్ మంజూరుకు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి సైతం కృషి చేశారు. – ఆడె గజేందర్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి -
శిక్షణ సరే.. మరి విధులేవి?
కై లాస్నగర్: భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూమాత పోర్టల్ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. భూ సర్వే ప్రక్రియను ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ రైతులకు సమస్యల్లేకుండా చూడాలనే ఉద్దేశంతో లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో రెండు విడతల్లో 110 మందిని ఎంపిక చేసి లైసెన్స్డ్ సర్వేయర్లుగా నియామకపత్రాలను అందజేశారు. అయితే నెలలు గడుస్తున్నప్పటికీ వారు చేయాల్సిన పనులపై విధి విధానాలు ఖరారు చేయకపోవడం, ఎలాంటి సర్వే పనులు అప్పగించకపోవడంతో వాటి కోసం ఆశగా నిరీక్షిస్తున్నారు. తమకు విధులు కేటాయించాలంటూ అధికారులను కలిసి వేడుకుంటున్నారు. రెండు విడతల్లో ఎంపిక .. వ్యవసాయ భూముల సర్వే చేయాల్సిన మండల సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉంది. జిల్లాలోని 21 మండలాలకు గానూ కేవలం పది మంది సర్వేయ ర్లు మాత్రమే ఉన్నారు. భూముల సర్వే కోసం రైతులు దరఖాస్తు చేసుకుని నెలలు గడిచినా వారి చేలవైపు చూసే పరిస్థితి లేదు. దీంతో రైతులు వారి చు ట్టూ కాళ్లరిగేలా తిరిగినా పనికాని పరిస్థితి ఉంది. ఇ లాంటి పరిస్థితిని దూరం చేసి భూ సర్వేలో పారదర్శకతను తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వారికి 45 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మొదటి బ్యాచ్కు మే 26 నుంచి జూలై 25 వరకు, రెండో బ్యాచ్కు ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి జేఎన్టీయూ ఆధ్వర్యంలో రాత పరీక్షతో పాటు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. ఈ రెండు పరీక్షల్లో ప్రతిభ చాటిన వారిని సర్వేయర్లుగా ఎంపిక చేసి వారికి లైసెన్స్లు జారీ చేశారు. జిల్లాలో రెండు విడతలుగా 110 మందిని ఎంపిక చేసి వారికి హైదరాబాద్ శిల్పాకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామకపత్రాలను అందజేశారు. తొలి విడతలో 44 మందికి లైసెన్స్లను జారీ చేయగా మలి విడతలో 65 మందిని ఎంపిక చేశారు. హైదరాబాద్లో శిక్షణ పొందినప్పటికీ జిల్లా వాసి కావడంతో ఒకరిని మన జిల్లాకు కేటాయించారు. నెలలు గడుస్తున్నా .. తొలి విడతలో ఎంపికై న వారికి గతేడాది అక్టోబర్ 19న, రెండో విడతలో ఎంపికై న వారికి ఈ ఏడాది ఫిబ్రవరి 27న హైదరాబాద్ శిల్పాకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామకపత్రాలను అందజేశారు. నెలలు గడుస్తున్నప్పటికీ వారు చేయాల్సిన పనులపై ఎలాంటి విధివిధానాలు ప్రభుత్వం స్పష్టం చేయలేదు. వారికి ఎలాంటి సర్వే పనులు కూడా అప్పగించడం లేదు. అయితే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో పారదర్శకతను పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రిజిస్ట్రేషన్కు సర్వే మ్యాపును ప్రభుత్వం తప్పనిసరి చేసినట్లుగా తెలి సింది. ఇందుకోసం లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా రై తులు తమ భూములను సర్వే చేయించి నిర్దిష్ట ఫీజు లను చెల్లించాల్సి ఉంటుంది. రెండెకరాల్లోపూ విస్తీర్ణాన్ని సర్వే చేసి మ్యాప్ అందించడానికి గానూ రై తులు రూ.1000 ఫీజుగా చెల్లించాలి. ఇందులో 5 శాతం ప్రభుత్వం మినహాయించుకుని 95 శాతం సర్వేయర్లకు చెల్లించాలని భావించినట్లుగా తెలిసింది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించకపోవడం, విధులు కేటా యించకపోవడంతో లైసె న్స్ పొందిన సర్వేయర్లు తమకు విధులు కేటాయించాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు అర్హులైన వారికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు శిక్షణనిచ్చాం. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి లైసెన్స్లను జారీ చేశాం. తదుపరిగా వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాలనే దానిపై ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి స్పష్టమైన మార్గదర్శకాలు రాలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకుంటాం. – ఎల్.ప్రభాకర్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ -
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
ఇంద్రవెల్లి: గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప టేల్ అన్నారు. డీసీసీ కార్యదర్శులుగా ఎంపికై న ఇంద్రవెల్లి మండలానికి చెందిన ఎండీ మ సూద్, మెస్రం నాగ్నాథ్ను ఆదివారం ఉట్నూర్లోని క్యాంప్ కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ హైకమాండ్కు, ఎమ్మెల్యే బొజ్జుకు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచులు రాథోడ్ మోహన్సింగ్, రాథోడ్ రోహిదాస్, కుంర రాజేశ్వర్, నాయకులు జహీర్, కొమురయ్య పాల్గొన్నారు. ఉత్సవాలు విజయవంతం చేయాలి ఉట్నూర్రూరల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు విజయవంతం చేయాలని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏప్రిల్లో నిర్వహించనున్న వేడుకలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి దాసండ్ల ప్రభాకర్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య, ఆర్టీఐ జిల్లా మెంబర్ దూట రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. -
రైతు భరోసా నిధులు విడుదల
ఆదిలాబాద్టౌన్: కొంతకాలంగా రైతుభరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు ప్ర భుత్వం తీపి కబురు అందించింది. ఆదివారం సిద్ది పేటలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవ ంత్రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేశారు. సోమవారం నుంచి ఎకరాకు రూ.6 వేలకు సంబంధించి రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఇదివరకు మొదటి విడతలో ఎకరం వరకు ఉన్న రైతులకు డబ్బులు జమ చేసేవారు. కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా పట్టాపాస్బుక్ ఉన్న ప్రతీ రైతుకు ఎకరంతో సంబంధం లేకుండా ఒక ఎకరానికి సంబంధించి డబ్బులు జమ చేయనున్నారు. ఏప్రిల్ మూడో వారం వరకు రైతులందరికీ ఈ డబ్బులు జమ అవుతాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఆదివారం వ్యవసాయ అధికారులు, రైతులు రైతు వేదికల్లో సంబరాలు జరిపారు. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిలకించారు. జిల్లాలో లక్షా 63వేల మంది రైతులు ఉండగా, వీరందరికీ ఒక ఎకరం డబ్బులు జమ కానున్నాయి. వీరితో పాటు ఫిబ్రవరి 28 వరకు పట్టాపాస్ బుక్ తీసుకున్న రైతులకు సైతం రైతుభరోసా నిధులు జమ చేయనున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో లక్షా 63వేల మంది రైతులు ఉండగా ఇందుకు గానూ రూ.3.20 కోట్ల నిధులు అవసరం ఉన్నాయి. ఎకరం నుంచి 5 ఎకరాల్లోపు రైతులు లక్షా 28వేల 650 మంది ఉండగా, 5 నుంచి 10 ఎకరాల్లోపు 30,607 మంది రైతులు, 10 నుంచి 20 ఎకరాల వరకు 3,832 మంది, 20 ఎకరాలకు పైగా 250 మంది వరకు రైతులు ఉన్నారు. -
నేడు విద్యుత్ ప్రజావాణి
ఆదిలాబాద్టౌన్: వినియోగదారుల వి ద్యుత్ సమస్యల పరి ష్కారానికి ప్రతీ సోమవారం విద్యుత్ ప్రజా వాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని విద్యుత్ శాఖ ఎస్ ఈ ఆర్.శేషారావు తెలి పారు. సర్కిల్, డివిజన్, సబ్డివిజన్, సెక్షన్ కార్యాలయాల స్థాయిలో వినియోగదారుల ఫిర్యాదులను స్వీకరించి వాటికి పరిష్కారం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. వినియోగదారులు నేరుగా అధికారులను కలిసి తమ సమస్యలను వివరించే అవకాశం లభిస్తుందన్నారు. సమస్య తీవ్రతను బట్టి నిర్ణీత గడువులోగా పరిష్కారం కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రతీ సోమవారం డివి జన్ ఆఫీసులు, ఈఆర్వో, సబ్డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, సర్కిల్ కార్యాలయంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. ఇప్పటి వరకు విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం ద్వారా 1,469 సమస్యలు పరిష్కరించినట్లు చెప్పారు. వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను సమీప కార్యాలయంలో నమోదు చేసుకొని పరిష్కారం పొందాలని కోరారు. -
మెరుగ్గానే ఉపాధిహామీ
గ్రామీణులకు పని కల్పించే ఉపాధిహామీ పథకంలో కూలీల పని దినాలు నమోదు మెరుగ్గానే ఉంది. రాష్ట్రంలో పలు జిల్లాలతో పోలిస్తే అధికంగా ఉంది. గతేడాది వెల్లడించిన సామాజిక ఆర్థిక సర్వేతో పరిశీలిస్తే 89.2శాతం అత్యధికంగా ఉండగా, ఈసారి అంతకంటే మెరుగ్గానే నాలుగు జిల్లాలు నమోదయ్యాయి.ఉపాధి కూలీ పని దినాలు (లక్షల్లో..)జిల్లా లక్ష్యం నమోదు సాధించిన శాతం ఆదిలాబాద్ 44.8 41.2 92.00 ఆసిఫాబాద్ 28.3 25.1 91.80 మంచిర్యాల 21.0 18.8 89.40 నిర్మల్ 32.0 28.0 87.40 -
సంస్థాగత ప్రక్షాళన
సాక్షి, ఆదిలాబాద్: కాంగ్రెస్లో సంస్థాగత ప్రక్షాళన మొదలైంది. ఇటీవల నూతన డీసీసీ అధ్యక్షులకు వికారాబాద్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పేర్కొన్న విధంగా క్షేత్రస్థాయిలో పార్టీలో సమూల మార్పులకు సిద్ధమవుతోంది. రాష్ట్రస్థాయిలో పొలిటికల్ ఎఫైర్ కమిటీ ఉండగా, ప్రస్తుతం జిల్లా స్థాయిలోనూ ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించిన ప్రక్రియ తాజాగా మొదలైంది. రాహుల్గాంధీ సూచన మేరకు.. జిల్లాలో పలు నామినేటేడ్ పదవులు ఉన్నాయి. వాటిని పార్టీలో అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు ఇవ్వాలి. అలా కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు తాము సూచించిన వ్యక్తులకు ఆ పదవీని ఇవ్వ డం,ఆ విషయంలో ఇతర ముఖ్య నాయకులు వ్యతి రేకించినా చెల్లకపోవడం వంటివి సామాన్యంగా చూస్తాం. ఒక నామినేటెడ్ పదవుల విషయం అనే కాకుండా పార్టీలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో సమష్టి నిర్ణయం కోసమే ఏర్పాటు చేస్తున్నది జిల్లా పొలిటికల్ ఎఫైర్ కమిటీ. సంఘటన్ సృజన్ అభియాన్లో భాగంగా ఇటీవల వికారాబాద్లో డీసీసీ అధ్యక్షులకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ పాల్గొని పార్టీలో తీసుకువస్తున్న సంస్థాగత ప్రక్షాళన విషయంలో దిశానిర్దేశం చేశారు. తదనుగుణంగా పొలిటికల్ ఎఫైర్ కమిటీ అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తుండగా ఆదిలాబాద్లోనూ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ కమిటీలో ఎవరెవరూ.. డీసీసీ అధ్యక్షుడు చైర్మన్గా వ్యవహరించే ఈ కమి టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు, మాజీ ప్రజాప్రతినిధులు ఉండనున్నారు. జిల్లాలో కమిటీ ఏర్పాటుకు సంబంధించి వివిధపేర్లతో అధిష్టానానికి ప్రతిపాదన పంపించినట్లు డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ తెలి పా రు. పార్టీలో ఒకరి పెత్తనం కాకుండా ఏదైనా సమష్టిగా నిర్ణయం తీసుకుని అధిష్టానానికి తెలియజేయడం, దాని విషయంలో ఎలాంటి అభ్యంతరా లు తలెత్తకుండా చూడటమే ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథ కాలను ప్రవేశపెట్టడం, అవి ప్రజల వరకు చేరుతున్నాయా లేదా అనే విషయంలో రాష్ట్రస్థాయిలో కో ఆర్డినేషన్ కమిటీ ఉన్నట్లుగానే జిల్లా స్థాయిలోనూ ఈ పొలిటికల్ ఎఫైర్ కమిటీ సమన్వయం చేసే విధంగా వ్యవహరిస్తుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. రాహుల్ గాంధీ ఆలోచనల నుంచే వచ్చిందని అభిప్రాయపడుతున్నా రు. ఇదిలా ఉంటే ఇందులో సభ్యులుగా ఎవరెవ రూ ఉంటారనేది ప్రస్తుతం పార్టీలో ఆసక్తికరంగా మారింది. -
నిరంతర శ్రమతోనే లక్ష్యసాధన
నేరడిగొండ: విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధి రోహించాలంటే నిరంతర శ్రమ, పట్టుదల అవసరమని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. మండలంలోని కుంటాల బాలికల ఆశ్రమ పాఠశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆ యన అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థి నులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హెచ్ఎం అంబారావ్, సర్పంచ్ రాథోడ్ సావిత్రి బాయి, రాజు, రైల్వే బోర్డు డైరెక్టర్ జీవీ రమణ, నాయకులు రమేశ్, శంకర్, రాజశేఖర్, ధనరాజ్, చందర్సింగ్, మార్కండేయ, నారాయణ, వంశీ, అర్జున్, జీవన్, సోమన్న, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తిగతంగా అధిక విస్తీర్ణంలో..
1,33,051వ్యవసాయ భూములు, వ్యక్తిగతంగా లేదా ఉమ్మడి, సంస్థల వారీగా ఉన్న సాగులో యూనిట్లుగా ఉన్న పరిధిని పరిశీలిస్తే ఏజెన్సీ అధికంగా ఉన్న ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో వ్యక్తుల చేతులో అధిక మొత్తంలో భూములున్నాయి. మొత్తంగా వ్యక్తిగత, ఉమ్మడి, సంస్థల పరిధిలో భూమిని చూసినప్పుడు రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లా ముందువరుసలో ఉంది. 1,85,262.041,84,8961,61,314.381,16,4781,52,964.561,65,277 -
మహిళల భద్రతకు ప్రాధాన్యం
బోథ్: జిల్లాలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ను శనివారం ఆయన సందర్శించారు. మహిళా సి బ్బంది కోసం ఏర్పాటు చేసిన విశ్రాంతి గదిని మహిళా కానిస్టేబుళ్ల చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. రికార్డులు ఎప్పటికప్పుడు నవీకరించాలని, పెండింగ్ కేసులు పరిష్కరించి చార్జి షీట్లు దాఖలు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్రెడ్డి, సీఐ గురుస్వామి, ఎస్సైలు పురుషోత్తం, సంజయ్ తదితరులున్నారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
కై లాస్నగర్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండే ళ్లు దాటినా హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎంపీ గోడం నగేశ్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హా మీలను అమలు చేయాలనే డిమాండ్తో పార్టీ రా ష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్ ఎ దుట నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ రాజ ర్షి షాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, రైతు భరోసా ఇవ్వని కారణంగా అన్నదాతలు పెట్టుబడికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మనంద్ తదితరులు పాల్గొన్నారు. -
భూసేకరణ అంశమే లేదు..
వరంగల్ విమానాశ్రయం కోసం భూసేకరణ పూర్తి చేసి నిర్మాణ పనులు వేగవంతం చేస్తాం.. ఆదిలాబాద్ విమానాశ్రయ మాస్టర్ ప్లాన్ తుది దశలో ఉందని భట్టి వివరించారు. ఈ నేపథ్యంలో భూసేకరణ అంశం ఇప్పట్లో లేనట్టేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాస్టర్ ప్లాన్ తర్వాతే ఈ అంశంలో ముందడుగు పడే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఇక జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు కొరటా–చనాఖా బ్యారేజ్, పిప్పల్కోటి రిజర్వాయర్లకు సంబంధించి ఆశించిన స్థాయిలో నిధులు విడుదల కాలేదు. ఇక కుప్టి ప్రాజెక్ట్కు సంబంధించి నామమాత్రంగా నిధులు కేటాయించడం గమనార్హం. సాక్షి,ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. జిల్లాకు ప్రత్యక్ష కేటా యింపుల్లో మొండి చెయ్యి ఎదురైందన్న అభిప్రా యం ఎక్కువగా వినిపిస్తోంది. అయితే వివిధ పథకాల ద్వారా జిల్లాకు కూడా ప్రయోజనం దక్కనుండడం కొంత ఊరటనిచ్చే అంశం. మరోవైపు ఈ బ డ్జెట్ సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసిందని అధి కార కాంగ్రెస్ నేతలు అభిప్రాయ పడుతుండగా.. అంకెల గారెడీగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎయిర్పోర్ట్ నిధుల కేటాయింపుపై నిరాశ 2026–27 బడ్జెట్ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. జిల్లాకు సంబంధించి ఎయిర్పోర్టు భూసేకరణకు నిధుల కేటాయింపు విషయంలో అనేక ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆ ప్రస్తావన లేకపోవడం నిరాశ కలిగించింది. పెండింగ్ ప్రాజెక్టులకు స్వల్ప నిధుల కేటాయింపులు జరిపారు. దీంతో ఆ పథకాలు నిర్మాణం పూర్తి దాల్చడం అనుమానంగానే కనిపిస్తోంది. రాష్ట్ర పథకాల ద్వారా ప్రయోజనం.. ఈ బడ్జెట్లో ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాను రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. రూ.5లక్షల వరకు బీమా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ అమలు పర్చనున్నట్లు పేర్కొన్నారు. ఇది జిల్లాలోని అనేక మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చనుంది. ఇక ప్రతీ ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు ఇవ్వనున్నట్లుగా వెల్లడించారు. కొత్తగా పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి తీపి కబురు అందించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారికి అందజేస్తామని పేర్కొన్నారు. రైతు భరోసాకు నిధులు కేటాయించారు. ఈనెల 22 నుంచి అవసరమైన నిధులు విడుదల చేయనున్నట్లుగా ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. అలాగే ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి పథకం, సన్నబియ్యానికి బోనస్, గృహజ్యోతి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు నిధులు కేటాయించింది. ఐటీఐ, ఏటీసీలలో చదివే విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 274 మొబైల్ అంగన్వాడీలను ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్లో పొందుపర్చింది. రాష్ట్ర పథకాల్లో జిల్లాకు ప్రయోజనం ఇలా.. పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్: 58,943 మంది విద్యార్థులకు జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం : 6,050 మంది విద్యార్థులకు మోడల్ స్కూళ్లలో : 800 మంది విద్యార్థులకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా : 1,56,683 (2011 జనాభా లెక్కల ప్రకారం)ప్రాజెక్టులకు కేటాయింపులు.. కుప్టి : రూ.50 లక్షలు లోయర్ పెన్గంగ : రూ.177.54 కోట్లు -
జనగణన పకడ్బందీగా చేపట్టాలి
కై లాస్నగర్: జనగణన ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అధి కారులను ఆదేశించారు. సెన్సస్–2027 నిర్వహణ పై టెక్నికల్ అసిస్టెంట్లు, చార్జ్క్లర్కులకు స్థానిక టీటీడీసీలో మూడు రోజుల శిక్షణ తరగతులను శు క్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందుకోసం సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ప్రత్యేక యాప్ లు, పోర్టల్స్ అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ కింద ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ప్రజలు స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపా రు. హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ కింద మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో ఇళ్ల జాబితా నమోదు ప్రక్రియ చేపడతారని అ న్నారు. ఇందులో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, కలెక్టరేట్ పర్యవేక్షకురాలు నలందప్రియ, మాస్టర్ ట్రైనర్లు వినయ్, జగన్, శ్రీహరి పాల్గొన్నారు. యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి జిల్లా కేంద్రంలోని టీటీడీసీ భవనంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం ప్రారంభించారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన టెక్నికల్,నాన్–టెక్నికల్ కో ర్సుల్లో ఇక్కడ ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి మిల్కా, ఈడీఎం రవి, టాస్క్మేనేజర్ సాయి, బోధన సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ గృహ ప్రవేశానికి హాజరు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భా గంగా పట్టణంలోని 33వ వార్డులో ఇందిరమ్మ ఇంటి ప్రవేశానికి కలెక్టర్ హాజరయ్యారు. రొడ్డ వాసవి–రవి దంపతులు నిర్మించుకున్న ఇంటిని ఆయన ప్రారంభించారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, పాల్గొన్నారు. ‘ఉపాధి’లక్ష్యాలు గడువులోపు పూర్తి చేయాలి ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావే శ మందిరంలో ఎన్ఆర్ఈజీఎస్ మెటీరియల్ వ్య యం, వివిధ పెండింగ్ పనుల పురోగతిపై సమీక్షించారు. పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. ఇందులో డీఆర్డీవో రవీందర్ రాథోడ్, పంచాయతీరాజ్ ఈఈ రాథోడ్ శివరాం, ఏఈఈలు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి ఆదిలాబాద్టౌన్: మెడికల్ క్యాంపుల్లో అందించే వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్థానిక శాంతినగర్ పీహెచ్సీలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని శుక్రవారం సందర్శించారు. అవసరమైన వారికి మెరుగైన చికిత్స కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు. ఆయన వెంట డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ రాజు, కౌన్సిలర్లు మౌనిక, సయ్యద్ మెహబూబ్, సుచిత, జ్యోతి, నర్మదా, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నేడే రంజాన్
వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ ప్రభావం కనిపిస్తుంది. గాలిలో తేమశాతం పెరగనుంది. ఆదిలాబాద్: రంజాన్ ఉపవాస దీక్షలు శుక్రవారంతో ముగిశాయి. సాయంత్రం ఆకాశంలో నెలవంక దర్శనమివ్వడంతో శనివారం ఈద్ ఉల్ ఫితర్ను జరుపుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. జిల్లాలోని ఈద్గాలు, మసీదులను ముస్తాబు చేశారు. ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పటిష్ట బందోబస్తు..: ఎస్పీ అఖిల్ మహాజన్ రంజాన్ పురస్కరించుకుని జిల్లాకేంద్రంలోని ఈద్గా మైదానం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈద్గా మైదానా న్ని శుక్రవారం సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పట్టణంలోని ప్రధాన ఈద్గాతో పాటు అన్ని మసీదులు, ముఖ్యమైన కూడళ్ల వద్ద ప్రత్యేక పికెట్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సుమారు 250 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శుక్రవారం రాత్రి నుంచే నిఘా పెంచుతున్నామని తెలిపారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. శనివారం ఉదయం ఈద్గా మైదానం వద్ద ప్రార్థనలు జరిగే సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని, పట్టణ ప్రజలు అంతర్గత రోడ్లను, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని కోరా రు. ఆయన వెంట డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు బి. సునీల్ కుమార్, కె. నాగరాజు, ప్రణయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముస్లింలకు కలెక్టర్ శుభాకాంక్షలు కైలాస్నగర్: పవిత్ర రంజాన్ పురస్కరించుకుని జిల్లాలోని ముస్లింలకు కలెక్టర్ రాజర్షి షా ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. -
సగం మంది లెక్క చెప్పలే!
కై లాస్నగర్: మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ పదవికి పోటీ చేసిన అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచార ఖ ర్చుల వివరాలు విధిగా ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటంది. నిబంధనల మేరకు వాటిని సంబంధిత మున్సిపల్ కార్యాలయంలో అందజేయాలి. గడువులోపు సమర్పించని పక్షంలో పదవి లో ఉన్న వారు అనర్హతకు గురికానున్నారు. ఓటమి పాలైన వారు భవిష్యత్తులో మూడేళ్ల పాటు ఏ ఎ న్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉండదు. ఈమేరకు మరో వారం రోజుల్లో గడువు ముగియనుంది. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో పోటీ చేసిన వారిలో సగం మంది ఇప్పటికీ వివరాలు సమర్పించనేలేదు. అధికారులు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ పలువురు నుంచి స్పందన లేదు. ఇందులో ఓటమి పాలైన వారితోపాటు గెలిచిన వారు కూడా ఉండటం గమనార్హం. వివరాలు ఇవ్వాల్సిందే.. ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికలు ఈ ఏడాది ఫిబ్రవ రి 11న జరిగాయి. అదే నెల 13న ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసీ నిబంధనల ప్రకారం పోటీ చేసిన అభ్యర్థులు ఫలితాలు ప్రకటించిన రోజు నుంచి 45 రోజుల్లోపు తమ ప్రచార వ్యయ నివేదికలను అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. నామినేషన్ సమయంలో తెరిచిన బ్యాంక్ ఖాతా ఆధారంగా వారు చేసిన వ్యయ వివరాలను నిర్ణీత ప్రొఫార్మాలో సమర్పించాల్సి ఉంది. 27తో ముగియనున్న గడువు.. మున్సిపల్ పరిధిలోని 49వార్డులకు గాను 314 మంది పోటీ చేశారు. వారు ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన వ్యయం వివరాలు సమర్పించేందుకు ఈనెల 27వరకు అవకాశముంది. ఇప్పటి వరకు కేవలం 161మంది మాత్రమే వివరాలు అందజేశారు. ఇంకా 153 మంది సమర్పించాల్సి ఉంది. గడువు ఇంకా వారమే ఉండగా ఇప్పటి వరకు రెండు సార్లు నోటీసులు జారీ చేసిన అధికారులు మరోసారి జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. గడువులోపు అందజేయాలి కౌన్సిలర్ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతీ అభ్యర్థి తమ ప్రచార వ్యయ వివరాలను నిర్ణీత ప్రొఫార్మా ప్రకారం విధిగా సమర్పించాల్సిందే. ఈసీ నిబంధనల మేరకు ఈ నెల 27వరకు అవకాశముంది. లేకుంటే గెలిచిన వారు పదవి కోల్పోవడంతో పాటు ఓడిన వారు భవిష్యత్తులో పోటీకి అనర్హులయ్యే అవకాశం ఉంటుంది. – జి.రాజు, మున్సిపల్ కమిషనర్ -
కళాశాలల్లో ‘మధ్యాహ్న భోజనంౖ’పె హర్షం
ఆదిలాబాద్టౌన్: జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించడంపై లెక్చరర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. జిల్లా కేంద్రంలోని మూల్యాంకన కేంద్రంలో తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. డీఐఈవో జాదవ్ గణేశ్ కుమార్ మాట్లాడు తూ, పథకం అమలుతో పేద విద్యార్థులకు మేలు చేకూరుతుందన్నా రు. ఇందులో చట్ల ప్రవీణ్కుమార్, గోవర్ధన్, అశోక్, రవికాంత్, నరేశ్, సురేశ్, నరేందర్రెడ్డి, ఐలయ్య, అనిల్, రమేశ్ పాల్గొన్నారు. -
సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎస్పీ
తలమడుగు: మండలంలోని కజ్జర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన 21 సీసీ కెమెరాలను ఎస్పీ అఖి ల్ మహాజన్ గురువారం ప్రారంభించారు. గ్రా మంలోని ఆదర్శ యువ రైతులను శాలువాలతో సన్మానించి బహుమతులు ప్రదానం చేశా రు. ఉగాదిని పురస్కరించుకుని స్థానిక రామాలయంలో పూజలు చేశారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు పండు గ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాల్లో ఆది లాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి, రూరల్ సీఐ ఫణిదర్, ఎస్సై రాధిక, అగ్రికల్చర్ ఏడీ నర్సయ్య, సర్పంచ్ ఎల్మా నారాయణరెడ్డి, ఉప సర్పంచ్ అగ్గిమల్ల గంగన్న, నాయకులు చితలపెల్లి దేవరెడ్డి, గణేశ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
ఆదిలాబాద్రూరల్: పెంచికల్పేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ యు వతి ఆత్రం సమ్మక్క హత్యపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నింది తులను కఠినంగా శిక్షించాలని ఆదివాసీ హక్కు ల పోరాట సమితి (తుడుం దెబ్బ) రాష్ట్ర వ ర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్ డిమాండ్ చేశా రు. గురువారం మావల మండలం కుమురంభీంగూడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. సమ్మక్కను ప్రేమ పేరిట మోసగించి హత్య చేసిన నిందితుడితోపాటు అతడికి సహకరించినవారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కే సులు నమోదు చేయాలని కోరారు. బాధిత కు టుంబానికి రూ.25లక్షల ఎక్స్ గ్రేషియా, కు టుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఐదెకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక, ఉపాధ్యక్షురాలు ఉయిక ఇంది ర, డివిజన్ అధ్యక్షురాలు సోయం లలిత, తు డుం దెబ్బ డివిజన్ అధ్యక్షుడు ఆత్రం గణపతి, మావల మండలాధ్యక్షుడు వేడమ ముకుంద్రావ్, నాయకులు గోవిందరావ్, నాగోరావ్, వెట్టి బొజ్జు, సోము తదితరులున్నారు. -
‘శ్రీపరాభవ’ వేడుక
వ్యర్థాలతో ఆదాయం జిల్లా కేంద్రంలోని మహిళా సమాఖ్య సభ్యులు వ్యర్థాలతోనూ ఆదాయం ఆర్జించవచ్చని నిరూపిస్తున్నారు. డంప్యార్డులో యూనిట్ నెలకొల్పి ఆదర్శంగా నిలిచారు. బుల్లిపిట్ట.. కనుమరుగైతే ఎట్టా? ప్రకృతిలో మనిషితో అత్యంత సన్నిహితంగా ఉండే పక్షి పిచ్చుక. ఒకప్పుడు పెరటిలోని చెట్లపై కిలకిలరావాలతో సందడి చేయగా నేడు మచ్చుకై నా కనిపించడంలేదు.ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. వాతావరణం చల్ల బడుతుంది. అక్కడక్కడా వర్షం కురిసే అవకాశముంది. శుక్రవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2026పచ్చడి పంపిణీ చేస్తున్న కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్పంచాంగ పఠనం చేస్తున్న వేదాంతి రిమ్స్ మహాగణపతి గుడిలో పూజలు చేస్తున్న భక్తులువిశ్వావసు నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. శ్రీపరాభవ నామ సంవత్సరానికి జిల్లా ప్రజలు గురువారం ఘనస్వాగతం పలికారు. తెలుగువారి నూతన సంవత్సర ఉగాది వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఇంటి గుమ్మాలను మామిడి తోరణాలతో అలంకరించారు. షడ్రుచుల ఉగాది పచ్చడి చేసి ఇంటిల్లిపాది సేవించారు. పిండివంటలు చేసుకుని ఆరగించారు. రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో పంచాంగ పఠనం నిర్వహించారు. శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని భక్తులకు ఉగాది పచ్చడి, గుడాలు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మఠాధిపతి శ్రీశ్రీయోగానంద సరస్వతీస్వామి, సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్కుమార్ కత్రి పాల్గొన్నారు. – ఆదిలాబాద్ -
అడుగు ముందుకు పడని ‘కుప్టి’
సాక్షి, ఆదిలాబాద్: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టువిక్రమార్క నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై జిల్లావాసులు గంపెడాశలు పెట్టుకున్నా రు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్ట నున్న ఈ బడ్జెట్లో భట్టి జిల్లాపై వరాలు కురిపిస్తారా..? లేదా.. మొండి చెయ్యి చూపుతారా? అనేది శుక్రవారం తేలిపోనుంది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు రాష్ట్ర గవర్నర్ శివ్ప్రతాప్ శు క్లా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. వరంగల్, ఆదిలాబాద్లో ఎయిర్పోర్టుల నిర్మాణ పనులు వేగిరం చేస్తామని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో భూసేకరణ కోసం రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశాలున్నట్లు స్థానిక ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. పెండింగ్లో ‘కొరాటా–చనాకా’ పనులు తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో పెన్గంగా నదీ భూభాగంలో ఇరు రాష్ట్రాల సరిహద్దులు.. కొరా టా–చనాకా గ్రామాల మధ్య నిర్మించిన బ్యారేజ్ పూర్తయింది. దీని కింద పంప్హౌస్, ఎల్పీపీ కెనాళ్ల నిర్మాణాలూ పూర్తయ్యాయి. ఇక పంటచేల వరకు సాగునీరు సరఫరా చేసేందుకు చేపట్టిన డిస్ట్రిబ్యూటరీ పనులు పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ఈ బ్యారేజ్ నుంచి నీళ్లను ఎత్తిపోసి ప్ర ధాన కెనాల్లోకి పారేలా ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారా వు కూడా పర్యటించి కొరాటా–చనాకా బ్యారేజ్ ప నులపై సమీక్షించారు. మిగులు పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటరీ పనుల కోసం భూసేకరణ, నిర్మాణ పనులన్నింటికీ కలిపి సుమారు రూ.800 కోట్ల వరకు ఇంకా పనులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని పూర్తి చేసిన పక్షంలో ఎల్పీపీ కెనాల్ ద్వారా సుమారు 37వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశముంది. మొదటిదశలోనే నిలిచిన ‘పిప్పల్కోటి’ కొరాటా–చనాకా బ్యారేజ్ కిందనే పిప్పల్కోటి రి జర్వాయర్ నిర్మాణం కూడా చేపట్టాల్సి ఉంది. గ తంలో రిజర్వాయర్ పనులు ప్రారంభించి నా మొదటి దశలోనే నిలిచిపోయాయి. బ్యారేజ్ నుంచి నీళ్లు ఎత్తిపోయడం ద్వారా పిప్పల్కోటి రిజర్వాయర్ను నింపుతున్నారు. అక్కడి నుంచి మరో 10వేల ఎకరాల వరకు సాగునీరు అందించేలా దీని డీపీఆర్ రూపొందించారు. ఎల్పీపీ, కొరాటా–చనాకా కెనాళ్లు కలిపి 50వేల ఎకరాల వరకు సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్ట్ రూపకల్పనలో ఉంది. అయితే, పిప్పల్కోటి రిజర్వాయర్ పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఆటంకంగా మారింది. ఆదిలాబాద్లోని విమానాశ్రయ మైదానం (ఫైల్) కుప్టి ప్రాజెక్ట్ ప్రతిపాదిత స్థలం (ఫైల్)కొరాటా–చనాకా బ్యారేజ్ (ఫైల్)బోథ్ నియోజకవర్గంలో కుప్టి ప్రాజెక్ట్ నిర్మించాలని 2018లో జీవో జారీ చేశారు. అప్పట్లో రూ.700కోట్ల అంచనా వ్యయం, 5.3 టీఎంసీలతో ఈ ప్రాజెక్ట్ నిర్మించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఒక్క అడుగు కూడా దీంట్లో ముందుకు పడలేదు. ఏటా దీని ఎస్ఎస్ఆర్ రేట్లు మారుతూ వచ్చాయి. 2024–25 అంచనా వ్యయం రూ.1,700 కోట్లకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్ఎస్ఆర్ రేట్లు పెరగాల్సి ఉంది. ఇప్పటికై నా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అడుగు పడుతుందా..? లేదా..? అనేది చూడాల్సిందే. పీపుల్స్ మార్చ్ పాదయాత్రను సీఎల్పీ నేతగా మల్లు భట్టివిక్రమార్క బజార్హత్నూర్ మండలం నుంచి ప్రారంభించారు. 8వేల ఎకరాలకు సాగునీరు అందించేలా అప్పట్లో పిప్రి వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ప్రతిపాదన చేశారు. అయితే, దానికి ఇప్పటివరకు అతీగతి లేదు. ఈ బడ్జెట్లోనైనా పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుదలవుతాయో.. లేదో.. చూడాల్సిందే. -
పదవుల పందేరం షురూ
కైలాస్నగర్: అధికార కాంగ్రెస్లో పదవుల పందేరం మొదలైంది. నామినేటెడ్ పోస్టులతో పాటు పార్టీ పదవులనూ త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటించిన పార్టీ అధిష్టానం ఆ దిశగానే ముందుకు సాగుతోంది. తాజాగా 61 మందితో కూడిన జంబో జిల్లా కార్యవర్గాన్ని ఖరారు చేసింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నరేశ్ జాదవ్ పంపించిన పేర్లను ఆమోదిస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాను పరి శీలిస్తే జిల్లాలోని ముఖ్య నాయకులందరికీ సమ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయా నాయకు ల ముఖ్య అనుచరులుగా ఉన్న వారందరినీ పదవులు వరించడమే ఇందుకు నిదర్శనం. వారితో పాటు పలువురు సీనియర్ నాయకులకూ ప్రాధాన్యతని స్తూ జిల్లా కార్యవర్గంలో చోటు కల్పించారు. దీంతో పదవులు దక్కిన నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంతుంది. కొద్దికాలంగా ఎదురుచూస్తున్న వారి నిరీక్షణకు తెరపడింది. కాగా, మండలాధ్యక్షులతోపాటు పూర్తిస్థాయి కార్యవర్గాలనూ త్వరలో ప్రకటించనున్నట్లు, ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా నూతన కార్యవర్గం ఉపాధ్యక్షులుగా సుధాకర్గౌడ్, లింగంపల్లి చంద్ర య్య, బ్రిజులాల్, బొల్లారం బాబన్న, మాధవ్రావు పటేల్, ఎ.దీపక్రావు, ప్రధాన కార్యదర్శులుగా సోయం తులసీదాస్, రాందాస్ నాక్లే, రజినీకాంత్, ఎన్.సుమ, సయ్యద్ ఇక్బాల్, బానోత్ ప్రణీత, ఎం. కరుణాకర్, ఆడె వసంత్, లక్ష్మారెడ్డి, ఎ.లక్ష్మణ్, రా మన్న యాదవ్, ఆత్రం సుశీల, ఉయికె అనసూయ, గౌళి సంజయ్, దరంపూరి చంద్రశేఖర్, బండి దేవి దాస్చారి, మహ్మద్ ముజాహిద్, బి.వెంకటి, అను పటేల్, అఖ్తర్ అలీ, కోశాధికారిగా ఎ.హిమాభిషేక్ రెడ్డి, అధికార ప్రతినిధులుగా బాలూరి గోవర్ధన్రె డ్డి, కుమ్రం కోటేశ్, పసుల చంటి, కార్యదర్శులుగా శ్రీకాంత్, ఎన్.ప్రమోద్రెడ్డి, మహ్మద్ రఫీక్, మిర్జా ఇమ్రాన్ బేగ్, ఎండీ సిరాజొద్దీన్, మంచికట్ల ఆశ మ్మ, మహ్మద్ అఫ్రోజ్, ఖాడె సంతోష్, కన్నె ప్రభాకర్, ఫైజుల్లాఖాన్, దాసరి రమేశ్, చిందం రఘువంశీ, భగత్ సంగీత, అన్నపూర్ణ, ఎ.మందాకిని, సామ ప్రభాకర్రెడ్డి, మెస్రం భాగ్యలక్ష్మి, జాదవ్ జగదీశ్, మెస్రం నాగనాథ్, ఎండీ.మసూద్, రాయిసిడాం ఎత్మారావ్, మెస్రం జైతు, ఎల్మ వినయ్రెడ్డి, చౌహాన్ హరిసింగ్, మేకల గంగాకిషన్, షేక్ ఇమ్రాన్, కృష్ణవేణి, వెన్నెల నరేశ్, ఎ.రమేశ్, పురుషోత్తంరెడ్డి, లోలపు పోశెట్టి నియమితులయ్యారు. -
రెవెన్యూ ఆపరేటర్ల సేవలకు మంగళం!
కై లాస్నగర్: జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ల సేవలకు రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడింది. వారిని విధుల నుంచి తొలగిస్తూ జీవో జారీ చేసింది. ఇక నుంచి జూని యర్ అసిస్టెంట్లు, జీపీవోలకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆందోళనకు గురైన ఆపరేటర్లు జిల్లా ఉన్నతాధికారులను కలిసి తమను కొనసాగించేలా చూడాలని వే డుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. రెండురోజులుగా వారు విధులకు దూరంగా ఉండగా కుల, ఆదాయ, నివా సం తదితర ధ్రువీకరణ పత్రాల జారీ నిలిచింది. ఏళ్ల తరబడి విధులు నిర్వహించినా.. కాంట్రాక్ట్ పద్ధతిన రెవెన్యూ శాఖలో మీసేవ ఆపరేటర్లుగా నియామకమైన 20మంది కొన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో తహసీల్దార్ కార్యాలయానికి ఒకరు చొప్పున 18మంది పనిచేస్తుండగా జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఇద్దరు చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఒక్కొక్కరికి ప్రభుత్వం నెలకు రూ.20వేల వే తనాన్ని చెల్లిస్తోంది. అయితే, ప్రభుత్వం ఇటీవల గ్రూప్–3లో ఎంపికై న వారిని తహసీల్దార్ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్లుగా నియమించింది. వీఆర్వో, వీఆర్ఏలుగా పనిచేసిన వారిని గ్రామ పాలన అధికారులు (జీపీవో) గాను తిరిగి రెవెన్యూ శాఖకు తీసుకువచ్చింది. వీరిలో ఉన్నత విద్యావంతులు, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారిని ప్రభుత్వం గుర్తించింది. దీంతో కంప్యూటర్ ఆపరేటర్లు అందిస్తున్న సేవలను ఇక నుంచి వీరికే అప్పగించా లని నిర్ణయించిన ప్రభుత్వం కాంట్రాక్ట్ ప్రాతి పది కన పనిచేస్తున్న వారినితొలగిస్తూ జీవోజారీచేసింది. ఆందోళనలో ఆపరేటర్లు ప్రభుత్వ నిర్ణయంతో కంప్యూటర్ ఆపరేటర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఏళ్లుగా విధులు నిర్వహించిన తమను ఒక్కసారిగా రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. అయితే, ప్ర భుత్వం వారిని తొలగి స్తూ జీవో జారీ చేయడంతో జిల్లా అధికారులూ ఏమి చేయలేని ప రిస్థితి ఏర్పడింది. దీంతో రాష్ట్రస్థాయి నాయకత్వం ఆధ్వర్యంలో ప్ర భుత్వ పెద్దలను కలిసి తమ గోడు వెల్లబోసుకునేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటిని కలిసి ఆవేదన వెలిబుచ్చేందుకు నిర్ణయించారు. -
ఎట్టకేలకు ‘భరోసా’
ఆదిలాబాద్టౌన్: రైతు భరోసాపై ఎట్టకేలకు ప్ర భుత్వం తీపి కబురు అందించింది. ఈనెల 22న రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులు వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపించారు. ఈనెల 22న ఆదివారం సీఎం రేవంత్రెడ్డి సిద్దిపేట జిల్లాలోని నర్మెట్ట వేదికగా తొలివిడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. సోమవారం నుంచి అన్నదాతల ఖా తాల్లో జమ కానున్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ మఽ ద్యలో రెండో విడత, ఏప్రిల్ నెలాఖరులో మూడో విడత నిధులు జమ చేయనున్నారు. జిల్లాలో 1.63లక్షల మంది రైతులుండగా వారి ఖాతాల్లో రూ.3.20 కోట్లు జమ కానున్నాయి. ఎకరం నుంచి ఐదెకరాల్లోపు 1,28,650 మంది, ఐదు నుంచి పదెకరాల్లోపు 30,607 మంది, 10 నుంచి 20 ఎకరాల వరకు 3,832మంది, 20ఎకరాలకు పైగా 250 మంది వరకు రైతులున్నారు. కాగా, కొద్ది నెలలుగా రైతుభరోసా కోసం ఎదురుచూస్తున్న అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. నష్టపోయిన రైతులకు ఊరట కొందరు రైతులు రైతుభరోసా నిధులు జమ కాకపోవడంతో అప్పులు తెచ్చి రబీలో పంటలు సాగు చేశారు. ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక నష్టపోయారు. ప్రస్తుతం రైతుభరోసా నిధులు జమ కానుండగా వీరికి కొంత ఊరట లభించనుంది. రబీ సీజన్ ముగిసినప్పటికీ వచ్చే వానాకాలం సాగుకు సంబంధించి ఈ డబ్బులు ఉపయోగపడే అవకాశముంది. కొత్త మార్గదర్శకాలు ఇలా.. ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతీ రైతును సంతోషపరిచేలా నిర్ణయం తీసుకుంది. ఇదివరకు ఎకరం లోపు ఉన్న రైతులకే మొదటి విడతలో డబ్బులు జమయ్యేవి. ఈ సారి ఎకరానికి కంటే ఎక్కువ ఉన్న రైతులకూ మొదటి విడతలో ముందుగా రూ.6వేలు జమ చేయనుంది. అయితే, కొత్త పట్టాపాస్బుక్ కలిగిన రైతుల ఖాతాల్లోనూ పెట్టుబడి సాయం జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి28 వరకు కటాఫ్ డేట్గా ప్రకటించి అప్పటివరకు పట్టాపాస్బుక్లు పొందిన రైతులు ఏఈవోలకు పాస్బుక్లు, ఆధార్, బ్యాంక్ ఖాతా జిరాక్స్ ప్రతులు అందజేయాల్సి ఉంటుంది. -
‘ఈ–ఆఫీస్’తో ఫైళ్ల పరిష్కారం వేగవంతం
ఉట్నూర్రూరల్: ప్రజాపాలన–ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ–ఆఫీస్ వినియోగించడం ద్వారా ఫైళ్ల పరిష్కారం వేగవంతం అవుతుందని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. బుధవారం ఐటీడీఏ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఈ–ఆఫీస్ ద్వారా కార్యాలయ ఫైళ్లను బాధ్యతాయుతంగా, పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యాలయ పనితీరు మెరుగుపడుతుందన్నారు. అన్ని శాఖలు, విభాగాల అధికారులు, సిబ్బంది ఈ–ఆఫీస్ వ్యవస్థను వినియోగించుకోవాలని సూచించారు. -
ట్రిపుల్ఐటీలో గందరగోళం
భైంసా: బాసర ట్రిపుల్ఐటీలో విద్యార్థిని తేజస్విని మృతితో మంగళవారం ప్రారంభమైన విద్యార్థుల నిరసన బుధవారం వరకు కొనసాగింది. ట్రిపుల్ఐటీలో వైద్య సేవలు మెరుగుపరిచి మౌలిక వసతులు కల్పించాలన్న డిమాండ్తో విద్యార్థులు నిరసనకు దిగారు. మంగళవారం సాయంత్రం నుంచి వీసీ కార్యాలయం వద్ద బైటాయించిన విద్యార్థులంతా రాత్రి వీసీ ఇంటి ముందుకు చేరుకున్నారు. గేటు వద్దే నిద్రించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ట్రిపుల్ఐటీకి చేరుకుని భారీగా పోలీసులను మోహరించి పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించారు. వినతిపత్రం ఇచ్చిన విద్యార్థులు బాసర ట్రిపుల్ఐటీలో నెలకొన్న సమస్యలపై తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ ఆధ్వర్యంలో వీసీకి వినతిపత్రం ఇచ్చారు. యాజమాన్యం స్పందించి ఇప్పటికై నా సమస్యను పరిష్కరించాలని విద్యార్థి సంఘం డిమాండ్ చేశారు. ఇందుకు యాజమాన్యం సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చినట్లు తెలిపారు. దీంతో విద్యార్థి సంఘం నిరసనను విరమించింది. వీసీకి మద్దతుగా.. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బాసర ట్రిపుల్ఐటీలో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల జేఏసీ వీసీకి మద్దతుగా నిలిచారు. జేఏసీ బుధవారం సమావేశమై వీసీ గోవర్ధన్పై వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. క్యాంపస్ అభివృద్ధి కోసం పని చేస్తున్న వీసీ, ఓఎస్డీలకు పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. రాత్రంతా నిరసనలు పోలీసులు భారీగా మోహరించినా విద్యార్థులు అక్కడే నిరసన కొనసాగించారు. మరోవైపు మంగళవారం రాత్రి ట్రిపుల్ఐటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ బయటకు వచ్చి తాను రాజీనామా చేస్తున్నానని ప్రకటించినట్లు తెలిసింది. నిరసనకు కూర్చున్న విద్యార్థులు రాజీనామా కోరడంలేదని సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మరోవైపు విద్యార్థులపై ఒత్తిడి పెంచారన్న ఆరోపణలు వచ్చాయి. జిల్లా ఎస్పీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ఈ వీడియో తాము పోస్టు చేయలేదని విద్యార్థి సంఘం ప్రకటించింది. -
రైతులకు ఆశాజనకం
ఈ సంవత్సరం నవనాయకులలో ఏడు శుభ గ్రహాలే ఉన్నాయి. ఇది దేశానికి, ప్రజలకు ఎంతో శుభసూచకం. రాజా, నీరసాధిపతి గురుడు కావడం వల్ల ప్రభుత్వ పాలన ప్రజా రంజకంగా ఉంటుంది. అభివృద్ధి పథకాలు సమర్థవంతంగా అమలవుతాయి. మంత్రి కుజుడు కావడం వల్ల రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, ఐటీ రంగా లు అద్భుతమైన వృద్ధిని సాధిస్తాయి. భూముల ధరలు పెరుగుతాయి. నాలుగు కుంచాల వర్షం వల్ల జలాశయాలు నిండుతాయి. వరి, పత్తి, మిర్చి, వాణిజ్య పంటలకు అనుకూలంగా ఉంది. రైతులకు మంచి లాభాలు వస్తా యి. శత్రువుల పన్నాగాలను మన సైన్యం తిప్పికొడుతుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ విజయం మనదే అవుతుంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పిడుగులు పడే అవకాశం ఉంది. వేసవిలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. – శివశ్రీ సాయికుమార్, వేద పండితులు, ఆదిలాబాద్ -
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
ఆదిలాబాద్టౌన్: బాధిత కుటుంబాలకు జిల్లా పోలీసుశాఖ అండగా ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. అనారోగ్యంతో మృతిచెందిన హోంగార్డు లక్ష్మి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బుధవారం రాంనగర్లోని ఆమె నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తక్షణ సహాయార్థం రూ.10వేలు కుటుంబ సభ్యులకు అందజేశారు. హోంగార్డు ఇన్చార్జి చంద్రశేఖర్, వార్డు కౌన్సిలర్ చరణ్గౌడ్, హోంగార్డులు పాల్గొన్నారు. విద్యుత్ తీగ తగిలి రైతుకు గాయాలుదహెగాం: వన్యప్రాణులను వేటాడేందుకు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి రైతుకు గాయాలైనట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. మండలంలోని లగ్గాం గ్రామానికి చెందిన మొరె సాయిప్రభు పంబాపూర్ శివారులోని పొలానికి మంగళవారం సాయంత్రం వెళ్లాడు. పంబాపూర్ గ్రామానికి చెందిన కొడిపె శ్రీను అడవి జంతువులను వేటాడడానికి అమర్చిన విద్యుత్ తీగలకు తగలడంతో గాయాలయ్యాయి. బుధవారం సాయిప్రభును చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. బాధితుడి తమ్ముడు సాయిదేవా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. స్కూల్ బస్సు, లారీ ఢీ భైంసారూరల్: మండల పరిధిలోని నిర్మల్–భైంసా జాతీయ రహదారిపై మాటేగాం వద్ద బుధవారం స్కూల్ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి... ఎగ్గాం నుంచి సుమారు 15 మంది విద్యార్థులతో భైంసా వైపు వెళ్తున్న బ్రిలియన్స్ స్కూల్ బస్సు మాటేగాం వద్దకు రాగానే డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఘటనలో బస్సులో ఉన్న నలుగురు విద్యార్థులు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి గాయపడిన వారిని భైంసా ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎంఈవో సుభాష్, ఎస్సై సుప్రియ ఆస్పత్రికి చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. రైతులకు కూరగాయల విత్తనాలు పంపిణీ -
రైల్వే ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తిచేయాలి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. బుధవారం పార్లమెంటు సమావేశంలో ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక రైల్వే సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్–గడ్చందుర్ మధ్య కొత్త రైల్వేలైన్ సర్వే ఇప్పటికే పూర్తయిందని, డీపీఆర్ను వెంటనే ఆమోదించి పనులు ప్రారంభించాలని, ముద్ఖేడ్–పిప్పల్కోటి (ఎల్సీ33), కాజీపేట–బల్హార్షా (ఎల్సీ71) వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని, ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు 36 కిలోమీటర్ల మేర డీపీఆర్ సిద్ధంగా ఉందని, దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. బాసర సరస్వతీదేవి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అక్కడ మరిన్ని రైళ్లకు స్టాపేజీలు కల్పించాలని, కాజీపేట నుంచి కాగజ్నగర్ మీదుగా హౌరా వరకు కొత్త రైలును ప్రారంభించాలని విన్నవించారు. ప్రాంతీయ అభివృద్ధికి ఈ రైల్వే ప్రాజెక్టులు ఎంతో కీలమని, కేంద్ర ప్రభుత్వం వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. -
మచ్చలుంటే వైద్యులను సంప్రదించాలి
ఆదిలాబాద్టౌన్: శరీరంపై మచ్చలు ఉంటే వైద్యులను సంప్రదించాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని చిల్కూరిలక్ష్మినగర్ పట్టణ ఆరోగ్యకేంద్రంలో బుధవారం కుష్ఠు గుర్తింపు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఈనెల 18 నుంచి 31వరకు కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఆశ కార్యకర్తలతో ఇంటింటి సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. శరీరంపై పాలిపోయిన, రాగి రంగు గల మొద్దుబారిన మచ్చలు, కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు ఉంటే కుష్ఠుగా అనుమానించి ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎండీటీతో వ్యాధి పూర్తిగా నయం అవుతుందన్నారు. కుష్ఠు రహిత సమాజం కోసం ప్రతి ఒక్క రూ కృషి చేయాలన్నారు. ఇందులో కుష్ఠు నివారణ అధికారి ఈశ్వర్రాజ్, వైద్యాధికారి దీపిక, డిప్యూటీ పారామెడికల్ అధికారులు వామన్రావు, రమేశ్, విష్ణు, నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు వేగవంతంగా వైద్య సేవలు ప్రజలకు వేగవంతంగా వైద్యసేవలు అందించినందుకు కృషి చేస్తున్నట్లు డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ తెలిపారు. డీఎంహెచ్ఓ సమావేశ మందిరంలో అంబులెన్స్ సేవలపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని కొన్ని మండలాల్లో అంబులెన్స్ వాహన సేవలను విస్తరించినందుకు కృషి చేస్తున్నామన్నారు. సిబ్బంది పనితీరును అభినందించారు. సమావేశంలో 108 జిల్లా మేనేజర్ శేఖర్, 102 జిల్లా మేనేజర్ మనోహర్, పీఎం సామ్రాట్ పాల్గొన్నారు. -
గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
ఆదిలాబాద్టౌన్: గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని, గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జిల్లా కేంద్రంలోని సెంట్రల్ గార్డెన్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలన, రహదారి భద్రత, సీసీ కెమెరాల ప్రాముఖ్య తపై సర్పంచులు, కౌన్సిలర్లు, విద్యార్థులకు బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యువత డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. సర్పంచులు, కౌన్సిలర్లు తమ పరిధిలోని గ్రామాలు, వార్డులను గంజాయి రహితంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతీ గురువారం ఆరోగ్య పాఠశాలలో భాగంగా యాంటీ డ్రగ్స్డే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసు శాఖ పనిచేస్తుందన్నారు. గంజాయి సాగు చేస్తే పదేళ్ల జైలు శిక్షపడే అవకాశం ఉంటుందన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్బెల్టు ధరించాలని, మద్యం సేవించి నడపొద్దని సూచించారు. మహిళల భద్రత కోసం, బాల్య వివాహాలు అరికట్టేందుకు పోలీసు శాఖ నిరంతరం పనిచేస్తుందన్నారు. గడిచిన మూడు నెలల్లో 25 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు తెలిపారు. అనంతరం అధికారులతో కలిసి ప్రజాప్రతినిధులు, విద్యార్థులు ప్రతి జ్ఞ చేశారు. కార్యక్రమంలో ఈగల్ ఫోర్స్ ఎస్పీ పి.సీతారాం, అదనపు ఎస్పీ పి.కృష్ణమూర్తి, సీఐ పి.ప్రకాశ్రెడ్డి, జిల్లా అదనపు ఎస్పీలు బి.సురేందర్ రావు, పి.మౌనిక, ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మిల్కా, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వరరావు, విజేందర్, పొగాకు నియంత్రణ అధికారి శ్రీకాంత్, మున్సిపల్ వైస్చైర్మన్ మహమ్మద్ రోహిత్, డౌవ్ ఎండీ చంద్రశేఖర్రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు, యువత, ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
యువకుడిపై అడవిపంది దాడి
ఉట్నూర్రూరల్: ఇంటి ముందు నిలబడి ఉన్న యువకుడిపై అడవిపంది దాడి చేసిన ఘటన బుధవారం మండలంలోని హస్నాపూర్లో చోటు చేసుకుంది. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్ర కారం మండలంలోని హస్నాపూర్ గ్రామానికి చెందిన జాదవ్ ప్రవీణ్ తన ఇంటి ముందు నిలబడి ఉండగా పంట పొలాల నుంచి వచ్చిన అడవిపంది దాడి చేసింది. యువకుడు కేకలు వేయడంతో కు టుంబ సభ్యులు వచ్చే సరికి అక్కడి నుంచి పరుగులు తీసింది. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ను వెంటనే ఆటోలో ఆస్పత్రికి తరలించారు. జనావాసాల్లో అడవిపంది వచ్చి దాడులు చేయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జ నావాసాల్లోకి రాకుండా అటవీశాఖ అధికారుల త గు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
అధ్యక్షా.. నిధులు మంజూరు చేయండి
● అసెంబ్లీలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఇచ్చోడ :బోథ్ నియోజకవర్గ అభి వృద్ధికి ప్రభుత్వం సహకరించి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్పీకర్ ద్వారా అసెంబ్లీలో కోరారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా పలు సమస్యలను బుధవారం సభ దృష్టికి తీసుకెళ్లారు. దేగామ ప్రాజెక్టులో భాగంగా పెండింగ్లో ఉన్న 200 కుటుంబాలకు తక్షణమే పరిహారం చెల్లించాలన్నారు. బోథ్లో ఫైర్స్టేషన్ లేకపోవడంతో తలెత్తుతున్న ఇబ్బందులను వివరించి వెంటనే మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గ కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రిలో వైద్యుల కొరత తీర్చాలని, ఆసుపత్రి భవన నిర్మాణ బిల్లులందక పనులు నిలిచిపోయే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. వెంటనే బిల్లులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. బోథ్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు, ఇచ్చోడలో షాదీఖానా నిర్మాణానికి రూ.3 కోట్ల ఫైనాన్స్ అనుమతి ఇవ్వాలని కోరారు. నియోజకవర్గంలో పత్తి, సోయా పంటలు పండిస్తున్న రైతులకు బోనస్ అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
శ్రీపరాభవ.. ఆగమనం
షడ్రుచుల పండుగ వచ్చేసింది. నేటి నుంచి శ్రీపరాభవ నామ సంవత్సరం షురూ కానుంది. ఉగాదిని సంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేందుకు జిల్లా వాసులు సిద్ధమయ్యారు. రైతులు తమ పొలాలకు వేకువజా మున వెళ్లి ప్రత్యేక పూజలతో పాటు ఆరుకోవడం ఆనవా యితీ. ప్రతీ ఇంటా షడ్రుచుల పచ్చడితో పాటు భక్షాలను స్వీకరిస్తారు. సనాతన హిందూ ఉత్సవ సమితితో పాటు రామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఉదయం ఉగాది పచ్చడితో పాటు గుడాలు పంపిణీ చేపట్టనున్నారు. సాయంత్రం గోపాలకృష్ణ మఠంతో పాటు జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో పంచాంగ శ్రవణం నిర్వహించనున్నా రు. ఈమేరకు ఆయా ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. – ఆదిలాబాద్ -
హరితం అంతం.. పార్కింగ్కు సొంతం
చెట్లను నరికేసిన అనంతరం పార్కింగ్ కోసం ఏర్పాటు చేస్తున్న కంచెఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో గల ఎన్టీఆర్ చౌక్ నుంచి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వరకు గత ప్రభుత్వం హరితహారంలో భాగంగా కోట్లాది రూపాయలు వెచ్చించి గ్రీన్బెల్టును అభివృద్ధి చేసింది. కొంతమంది స్వార్థపరులు తమ స్వలాభం కోసం మొక్కలను కొట్టేసి పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వద్ద గల ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు పార్కింగ్ స్థలం కోసం పచ్చని చెట్లను కొట్టేసి ప్రత్యేక కంచెను ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై చర్యలు చేపట్టాల్సిన బల్దియా అధికారులు మామూలుగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
కల్లు తాగిన డబ్బులు ఇవ్వలేదని కట్టేశాడు..
జైపూర్: కల్లు తాగిన డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తిని గీత కార్మికుడు స్తంభానికి కట్టేశాడు. మానవత్వానికి మచ్చ తెచ్చే ఈ అనాగరిక ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుందారం గ్రామానికి చెందిన ఎర్ర చంద్రయ్య అనాథ. ఇదే గ్రామానికి చెందిన గీత కార్మికుడు వొల్లాల మల్లాగౌడ్ వద్ద తాటికల్లు తాగేవాడు. ప్రతిఫలంగా ఆయన చెప్పిన పనులు, అవసరమైన పనుల్లో సహాయం చేసేవాడు. ఈ క్రమంలో రోజువారీగా ఆయన వద్ద పని చేస్తూ ఇచ్చిన ఆహారం తీసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల మల్లాగౌడ్ చెప్పిన పనులు చేయకపోవడంతో ఇంతకాలం తన వద్ద తాగిన కల్లుకు డబ్బులు ఇవ్వాలని చంద్రయ్యను స్తంభానికి కట్టేసి దాడి చేశాడు. ఇష్టారీతిగా దుర్భాషాలాడాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. చివరికి స్థానికుల జోక్యంతో విడిచిపెట్టాడు. కాగా, చంద్రయ్య అనాథ కావడం, ఎవరూ లేకపోవడం వల్ల మల్లాగౌడ్ దాడి చేశాడంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జాతీయ స్థాయికి ఎదగడం అభినందనీయం
బజార్హత్నూర్: గిరిజన క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదగడం అభినందనీయమని ఏజెన్సీ డీఈవో గోడం చందన్ అన్నారు. ఇటీవల హన్మకొండలో నిర్వహించిన 60 మీటర్ల పరుగుపందెం రాష్ట్రస్థాయి పోటీల్లో జాతర్ల ఆదర్శ క్రీడా పాఠశాల విద్యార్థి కోట్నాక్ జాకేష్ ఉత్తమ ప్రతిభ కనబర్చి గోల్డ్మెడల్ సాధించాడు. ఈ నెల 28న హర్యానలో జరుగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. మంగళవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏజెన్సీ డీఈవో గోడం చందన్ సదరు విద్యార్థిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేశ్, జిల్లా గిరిజన క్రీడాల అధికారి పార్థసారథి, ఏసీఎంవో అర్క జగన్, ఏటీడీవో సుచంత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిభ కనబర్చిన నిర్మల్ జిల్లా విద్యార్థులు
తానూరు: జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలవగా మండలకేంద్రంలోని వాసవి పాఠశాల విద్యార్థి అవదుత్వార్ గణేశ్ ప్రతిభ కనబర్చి కాగజ్నగర్లోని జవహర్ నవోదయ విద్యాలయానికి ఎంపికై నట్లు పాఠశాల డైరెక్టర్ నర్సయ్య, ప్రిన్సిపాల్ లక్ష్మణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు. కుభీర్: మండలకేంద్రంలోని ప్రగతి విద్యానికేతన్ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు శ్రీబిందు, సొప్పరి పూజ నవోదయ విద్యాలయంలో చదివేందుకు ఎంపికయ్యారు. వీరిని పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఆనంద్, కరస్పాండెంట్ గంగాధర్, ఉపాధ్యాయులు గంగాకిశోర్ తదితరులు ఉన్నారు. -
విద్యుత్ వైరు దొంగలపాలు
కోటపల్లి: మిషన్ భగీరథ నీటిని అందించేందుకు గత ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి విద్యుత్లైను ఏర్పాటు చేయగా అధికారుల నిర్లక్ష్యంతో తీగలు చోరీకి గురవుతున్నాయి. వేమనపల్లి మండలం ముల్కల్లపేట నుంచి జనగామ వరకు మిషన్ భగీరథ ట్యాంక్ నుంచి నీటిని అందించేందుకు గత ప్రభుత్వం జనగామ వద్ద ట్యాంక్లను ఏర్పాటు చేసి మోటార్ల సహాయంతో సమీప గ్రామాలకు నీటిని అందించేలా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా జనగామ నుంచి ముల్కల్లపేట వరకు విద్యుత్ లైన్ ఏర్పాటు చేశారు. అధికారుల పట్టింపులేమితో దుండగులు విద్యుత్ వైరును కట్ చేసుకుని వెళ్తుండడంతో ముల్కల్లపేట నుంచి సుపాక వరకు ఖాళీ స్తంభాలు దర్శనమిస్తున్నాయి. విషయాన్ని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతోనే రెచ్చిపోయిన దుండగలు దాదాపు 5 కిలోమీటర్ల మేర విద్యుత్ వైరును కత్తిరించుకు వెళ్లారు. ఈ విషయమై ఏఈ వెంకటేశ్వర్లును వివరణ కోరగా విద్యుత్ వైరు చోరీకి గురైంది నిజమేనని, మరుసటి రోజే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారణ చేస్తున్నామని పోలీసులు పేర్కొంటున్నారని ఏఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి దుండగులను వెంటనే పట్టుకుని విద్యుత్ లైన్ పునరుద్ధరణ జరిగేలా చూడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
ట్రిపుల్ఐటీలో వైద్య సదుపాయాలపై నిరసన
భైంసా/బాసర: బాసర ఆర్జీయూకేటీలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. మెదక్ జిల్లా రా మచంద్రపురానికి చెందిన పీయూసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని మల్లిపూడి తేజస్విని (17) సోమవారం మృతి చెందిన ఘటనతో క్యాంపస్లో తీవ్ర కలకలం రేగింది. తేజస్విని మార్చి 13న జ్వరం, నోటి పుండ్లతో క్యాంపస్ ఆస్పత్రిలో చికిత్స పొందింది. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు ఆమెకు లుకేమియా (రక్త క్యాన్సర్)గా నిర్ధారించారు. చికిత్స పొందుతూ చివరికి ఆమె కన్నుమూశారు. వీసీ కార్యాలయం ముట్టడించిన విద్యార్థులు తేజస్విని మృతి వార్తతో క్యాంపస్లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మంగళవారం సుమారు 100 మందికి పైగా విద్యార్థులు ఏకమై వీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. వీసీ రావాలి.. మాకు న్యాయం చేయాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాత్రి వరకు ఈ నిరసన కొనసాగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రాణాల మీదకు తెస్తున్న సదుపాయాల లేమి! క్యాంపస్లోని ఆరోగ్య కేంద్రం కేవలం నామమాత్రంగానే ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వేలాది మంది విద్యార్థులు ఉన్న విశ్వవిద్యాలయంలో ఆధునిక డయాగ్నస్టిక్ సదుపాయాల కొరత ఉందన్నారు. నిపుణులైన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో లేరన్నారు. ప్రాథమిక దశలో వ్యాధులను గుర్తించడంలో వైఫల్యం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్నా రు. చిన్న ఆరోగ్య సమస్యతో వెళ్తే మాత్రలు ఇచ్చి పంపిస్తున్నారని, పరిస్థితి విషమించిన తరువాతే పెద్ద ఆసుపత్రులకు తరలిస్తున్నారని ఆవేదన వ్య క్తం చేశారు. డాక్టర్లు క్యాంపస్ ఆసుపత్రిలో రక్త సంబంధిత తీవ్రమైన వ్యాధులను ముందుగానే గుర్తించేపరికరాల కొరత ఉందని చెప్పినట్లు సమాచారం. నిర్లక్ష్యమే కారణమా? క్యాంపస్ ఆసుపత్రిలో సరైన వైద్య సేవలు అందకపోవడం, నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగిందని తేజస్విని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో విద్యార్థులు పలు డిమాండ్లు ముందుకు తెచ్చారు మృతురాలి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని, క్యాంపస్ ఆసుపత్రిని అత్యాధునిక పరికరాలతో వెంటనే అభివృద్ధి చేయాలని కోరారు. విద్యార్థుల భద్రత కోసం సమగ్ర ఆరోగ్య వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
విద్యార్థుల ప్రభంజనం
కుంటాల: కుంటాలలోని సృజన విద్యాలయం నుంచి 37 మంది విద్యార్థులు ప్రతిభ కనబర్చి నవోదయలో చదివేందుకు ఎంపికయ్యారు. ఇందులో కాగజ్నగర్లోని జవహర్ నవోదయ పాఠశాలకు 23 మంది, నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ జవహర్ నవోదయ పాఠశాలకు 13 మంది, వరంగల్, జగిత్యాల జిల్లాల జవహర్ నవోదయ పాఠశాలలకు ఒక్కొక్కరు చొప్పున ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ కొత్తకాపు గంగన్న తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా టాపర్గా ఒడ్నం సహర్ష్, నిజామాబాద్ జిల్లా టాపర్గా రాజారాం లేక్షన నిలిచారు. కల్లూరులోని ఎస్ఎంఎస్ పాఠశాల నుంచి 17 మంది, కుంటాలలోని శాంతినికేతన్ పాఠశాల నుంచి 11 మంది విద్యార్థులు ఎంపికై నట్లు ప్రిన్సిపాళ్లు గజానన్, సంతోష్ తెలిపారు. ఎంపికై న విద్యార్థులను పలువురు అభినందించారు. రాజారాం లేక్షన, నిజామాబాద్ జిల్లా టాపర్ఒడ్నం సహర్ష్, ఆదిలాబాద్ జిల్లా టాపర్ -
ముగిసిన గోవింద్నాయక్ అంత్యక్రియలు
దండేపల్లి/ఆదిలాబాద్టౌన్: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే గోవింద్నాయక్ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్లోని స్వగృహంలో అనా రోగ్యంతో సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతిక కాయాన్ని మంగళవారం మాజీ మంత్రులు జీవన్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్జాదవ్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్రావు, రేఖానాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, డీసీసీ మాజీ అధ్యక్షుడు రవీందర్రావు, ఖానాపూర్ బీఆర్ఎస్ ఇన్చార్జి జాన్సన్ నాయక్, వివిధ పార్టీల నాయకులు సందర్శించి నివాళులర్పించారు. ప్రజల సందర్శనాంతరం సాయంత్రం గ్రామ సమీపంలో ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఆయన పెద్దకుమారుడు అరవింద్ తండ్రి చితికి నిప్పు పెట్టి అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. -
ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య
లోకేశ్వరం: మండలంలోని వట్టోలిలో ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. గ్రామానికి చెందిన శివరాత్రి భోజన్న(35) ఏపనీ చేయకుండా ఖాళీగా తిరుగుతుండేవాడు. ఈక్రమంలో మద్యానికి బానిసయ్యాడు. ఈ విషయమై శనివారం అతని భార్య రుచిత మందలించి పిల్లలతో కలిసి తీర్థయాత్రకు వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన భోజన్న సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మంగళవారం భోజన్న సోదరుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
‘నవోదయ’ ఫలితాలు విడుదల
కాగజ్నగర్టౌన్:పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యాసంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. విద్యాలయంలో ఖాళీగా ఉన్న 80 సీట్లను భర్తీ చేసేందుకు డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష నిర్వహించగా మంగళవారం ఫలితాలు వెల్లడించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి 6,196 మంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా 4,478 మంది హాజరయ్యారు. రిజర్వేషన్, మార్కుల ఆధారంగా ఆదిలాబాద్ నుంచి 17 మంది, నిర్మల్ నుంచి 37 మంది, మంచిర్యాల నుంచి 19 మంది, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఏడుగురు మొత్తంగా 80 మంది ఎంపికై నట్లు ఆయన పేర్కొన్నారు. -
దేశానికి వన్నె తెచ్చిన శ్రావణి
మంచిర్యాలఅర్బన్: పట్టణంలోని శ్రీహర్ష డిగ్రీ కళాశాల విద్యార్థిని ఇండోనేషియాలో నిర్వహించిన బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ కనబర్చి గోల్డ్మెడల్ సాధించింది. కళాశాలలో డిగ్రీ బీజెడ్సీ తృతీయ సంవత్సరం చదువుతున్న దేవల్ల శ్రావణి ఫిబ్రవరి 14 నుంచి 19 వరకు బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఏషియా ఆధ్వర్యంలో ఇండోనేషియాలో నిర్వహించిన పోటీల్లో ఇండియా తరుపున పాల్గొని ప్రతిభ కనబర్చి దేశానికి వన్నె తెచ్చింది. సదరు విద్యార్థినిని మంగళవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల చైర్మన్ పల్లె భూమేష్ సన్మానించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు మనోహర్రెడ్డి, తనుగుల శ్రావణ్, కళాశాల ప్రిన్సిపాల్ అనిత, తదితరులు పాల్గొన్నారు. -
చిట్ ఫండ్స్ నిర్వాహకుడి అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: చిట్ఫండ్స్ పేరుతో వందలాది మందిని నమ్మించి రూ.కోట్లలో మోసం చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. హన్మకొండ జిల్లా వడ్డేపల్లికి చెందిన అక్షర చిట్ఫండ్స్ ఎండీ పేరాల శ్రీనివాస్ తన సంస్థ ద్వారా అధిక లాభాలు వస్తాయని ప్రజలను నమ్మబలికి రాష్ట్రవ్యాప్తంగా చిట్ స్కీముల ద్వారా డిపాజిట్లు సేకరించాడని పేర్కొన్నారు. గడువు ముగిసిన తర్వాత కూడా డబ్బులు చెల్లించకుండా పరారయ్యాడని తెలిపారు. ఆదిలాబాద్ టూటౌన్లో నిందితుడిపై 12 కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. జిల్లాకు చెందిన బాధితులు రూ.99 లక్షలు చెల్లించారని, వీరికి వడ్డీతో కలిపి సుమారుగా రూ.1.11 కోట్లు చెల్లించాల్సి ఉందని వివరించారు. నిందితుడిపై రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 96 చీటింగ్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ ఘరానా మోసగాడు ఆరు నెలలుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతుండగా, సోమవారం ప్రత్యేకబృందం సాంకేతిక ఆధారాలతో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి 5 మొబైల్ ఫోన్లు, ఒక ఐపాడ్, డొంగల్ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. ప్రజలు అధిక లాభాల ఆశతో ప్రభుత్వ అనుమతులు లేని ప్రైవేట్ చిట్ఫండ్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని సూచించారు. అనుమానాస్పద పథకాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. సమావేశంలో డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, టూటౌన్ సీఐ కె. నాగరాజు, ఎస్సై అఖిల్, ఆర్ఎస్సై గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
హోటళ్లు, రెస్టారెంట్లకు జరిమానా
బెల్లంపల్లి: పరిశుభ్రత ప్రమాణాలు పాటించని హో టళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లకు బెల్లంపల్లి ము న్సిపల్ కమిషనర్ జె.సంపత్ మంగళవారం జరి మానా విధించారు. కాల్టెక్స్ ఏరియాలోని అరేబి యన్ క్లాసిక్ నైట్ మండి హౌజ్, అబ్దుల్ రహెమాన్ మండి హౌజ్, పాతబస్టాండ్ ఏరియాలో ఉన్న వినా యక టిఫిన్ సెంటర్, బిర్యానీ హోటళ్లు, రెస్టారెంట్లను తనిఖీ చేశారు. పరిశుభ్రత పాటించకుండా ఆ హార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించా రు. ఈమేరకు సదరు హోటల్ యాజమానులకు రూ. 20 వేలు జరిమానా విధించారు. పునరావృతమైతే దుకాణాలను స్వాధీనం చేసుకు ని మున్సిపల్ చట్టం 2019 ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తీవ్రంగా హెచ్చరించారు. -
పన్ను చెల్లించలేదని దుకాణం సీజ్
బెల్లంపల్లి: పన్ను చెల్లించలేదని ఓ వ్యక్తి షాపును మంగళవారం మున్సిపల్ ఽఅధికారులు సీజ్ చేశారు. మున్సిపాలిటీలోని రణగంబాల బస్తీకి చెందిన కె.వెంకటరమణ సకాలంలో పన్ను చెల్లించకపోవడంతో మున్సిపల్ చట్టం 2009 ప్రకారం దుకాణాన్ని మున్సిపల్ కమిషనర్ జే.సంపత్ సీజ్ చేయించారు. పుర ప్రజలు సకాలంలో ఇంటి పన్ను చెల్లించి మున్సిపాలిటీకి సహకరించాలని సూచించారు. ‘ఆకార్’ నేషనల్ ఫెస్ట్లో ప్రతిభబాసర: ఈ నెల 15న బాంబే ఐఐటీలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘ఆకార్’ ఫెస్ట్లో బాసర ఆర్జీయూకేటీ సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన విద్యార్థులు ‘ఓపెన్ రోడ్స్ డిజైన్’ పోటీలో పాల్గొని ప్రథమ బహుమతి సాధించారు. ఐఐటీ బాంబే, బెంట్లీ సిస్టమ్స్ సంయుక్తంగా నిర్వహించిన పోటీల్లో సూపర్ లేటివ్ బృందంలో రిత్విక్ గోషికే, మనీషా బండారి, శివ సా యి, గణేశ్, ట్రాన్సిషన్ బృందంలో తేజస్విని మల్లోజు, అక్షిత్ రసపల్లి, సిరి, ట్రేల్ బ్రేజర్స్ బృందంలో మహేష్ గురుస్వామి, వైష్ణవి కర్నాటి, శ్రీకర్ పాల్గొన్నారు. సదరు విద్యార్థులను మంగళవారం వీసీ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్, స్పెషల్ డ్యూటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ ఇ.మురళీ దర్శన్ అభినందించారు. -
మట్టి బతుకులు
రంజన్ల తయారీలో మహిళ రంజన్ తయారీలో మహిళలే కీలకం. మట్టి తీసుకువచ్చింది మొదలు పొడిగా మార్చడంతో పాటు వాటికి తుది రూపునిచ్చేది అతివలే. కుండ ఆకారాన్ని, తమకు వారసత్వంగా వస్తున్న కళతో ఒడుపుగా తీర్చిదిద్దుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తయారీలో నిమగ్నమవుతారు. రోజుకు 10 నుంచి 12 వరకు తయారు చేస్తామని తయారీదారులు చెబుతున్నారు. మార్కెటింగ్ సౌకర్యం కరువు.. వీటికి వేసవిలో తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మంచి డి మాండ్ ఉంది. అయితే సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడంతో వ్యాపారులకు వీరు త యారు చేసిన రంజన్లను తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. దశాబ్దాలుగా కులవృత్తిని న మ్ముకున్నా ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి ప్రోత్సాహం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంజన్ల తయారీపై ఆధారపడి ఉన్న కుటుంబాలనుఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తయారీ ఎంతో ప్రత్యేకం.. రంజన్ల తయారీ వెనుక కుమ్మరుల హస్తకళా నైపుణ్యంతో పాటు ఎంతో శ్రమదాగి ఉంటుంది.వేసవికి ముందే అనుకూలమైన నల్ల మట్టినిదిగుమతి చేసుకుంటారు. మట్టి గడ్డలను కర్రలతో కొట్టి మెత్తని పొడిగా చేసి, ఎండబెడతారు. దానికి గుర్రపు లద్దిని కలిపి, మట్టిలో తగుపాళ్లలో మిశ్రమంలా మారుస్తారు. దానిని నీటితో తడిపి రంజన్ తయారీకి అనుగుణమైన ఆకృతిలో తీర్చిదిద్దుతారు. మహిళలు సలపతో కొడుతూ తుది రూపునిస్తారు. వాటిని పచ్చిదనం పోయేంతవరకు ఎండబెడతారు. తర్వాత వాటికి జాజును అద్దుతారు. అనంతరం భట్టీలో కాలుస్తారు. అందులోని లద్దిలోని చిన్న చిన్న గడ్డి ముక్కలు కాలిపోయి, కంటికి కనిపించని చిన్న రంధ్రాలు ఏర్పడతాయి. ఇవే రంజన్ చల్లగా ఉండడానికి ప్రధాన కారణం. వేసవి వచ్చిందంటే జనం తాపంతో అల్లాడి పోతారు. చల్లదనం అందించే ఫ్రిజ్లు, కూలర్ల వైపు మొగ్గు చూపుతుంటారు. మరికొందరు మట్టి పాత్రలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ క్రమంలో అందరికి గుర్తుకు వచ్చేది ఆదిలాబాద్ రంజన్. ఇప్పటికీ పేదవాడి ఫ్రిజ్కు ఆదరణ తగ్గలేదు. మరోవైపు ఈ మట్టి వస్తువుతో జిల్లాకు గుర్తింపు వచ్చినా.. వాటి తయారీలో కీలకమైన కుమ్మరుల బతుకులు మాత్రం మారకపోవడం గమనార్హం. – ఆదిలాబాద్ -
‘ఆశా’ల దీక్ష విరమణ
కై లాస్నగర్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తమ సమస్యలపై చర్చించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్తో ఆశా కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన 48 గంటల దీక్షను మంగళవారం విరమించారు. డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆశాలు సమస్యలతో కూడిన వినతిపత్రంను డీఎంహెచ్వోకు అందజేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇందులో సీఐటీయూ, ఆఽశా వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గుట్కా విక్రయాలు అరికట్టాలిఆదిలాబాద్: విద్యాసంస్థల పరిసరాల్లో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న గుట్కా, సిగరెట్ షాపులు వెంటనే తొలగించాలని ఏబీవీపీ ఆదిలాబాద్ శాఖ నాయకులు కోరారు. ఈమేరకు వన్టౌన్, టూటౌన్ సీఐలకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని ఆయా ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల సమీపంలో గుట్కా, సిగరెట్ షాపులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కారణంగా విద్యార్థులు చిన్న వయసులోనే చెడు అలవాట్ల బారిన పడుతున్నారని అన్నారు. ఈమేరకు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆదిత్య, సాయి, అభిచరణ్, హరి, రేవంత్, క్రాంతి, వంశీ తదితరులున్నారు. -
క్యాలెండర్ ఆవిష్కరణ
ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం (పీఎస్హెచ్ఎంఏ) ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను డీఈవో రాజేశ్వర్ మంగళవారం ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడారు. ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి, విద్యార్థుల బంగా రు భవితకు బాటలు వేయాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కొమ్ము జ్యోతి, జిల్లా అధ్యక్షుడు సు భాష్పాటిల్, గౌరవాధ్యక్షుడు రంజిత్, ప్రధా న కార్యదర్శి జాదవ్ గోవింద్, మల్లేశ్, మునేశ్వర్, మదన్మోహన్, సాహెబ్ రావు పవార్, దినేష్రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
కూలీలందరికీ పని కల్పించాలి
కైలాస్నగర్: గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన కూలీ లందరికీ వందరోజుల పాటు తప్పనిసరిగా పని క ల్పించాలని డీఆర్డీవో రాథోడ్ రవీందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో ఉపాధి హామీ ఏపీవో లు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లతో మంగళవారం జిల్లాస్థాయి సమీక్ష నిర్వహించారు. మండలాల వా రీగా ఉపాధి హామీ పనులు, హాజరవుతున్న కూలీల ప్రగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పనులకు హాజరయ్యే కూలీల సంఖ్యను పెంచాల్సిన అవసరముందన్నారు. దరఖా స్తు చేసుకున్న ప్రతి కూలీకి పని కల్పించేలా శ్రద్ధ వ హించాలన్నారు. 2026–27 వార్షిక సంవత్సరానికి సంబంధించి పనుల ప్రణాళికను యుక్తధార పోర్టల్లో పక్కాగా నమోదు చేయాలన్నారు. రానున్న వర్షాకాలానికి సంబంధించి పూర్తిస్థాయిలో మొక్కలు అందించేలా నర్సరీలను సిద్ధం చేయాలన్నారు. ఎండల తీవ్రతకు మొక్కలు వాడిపోకుండా ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధి కూలీల సంఖ్య పెంపుతోపాటు పనులు వేగంగా జరిగేలా శ్రద్ధ వహించాలన్నారు. సమావేశంలో అదనపు డీఆర్డీవో కుటుంబరావు, ఏపీడి గజానన్రావు, కృష్ణారావు, ఏవో గంగాధర్ తదితరులు పాల్గొన్నారు -
ఉగాది ఘనంగా నిర్వహించుకోవాలి
ఆదిలాబాద్: ఉగాది పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి స్వామిజీ అన్నారు. జిల్లా కేంద్రంలోని మఠంలో మంగళవారం సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి తెలుగు నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. గోపాలకృష్ణ మఠంలో ఈనెల 19న ఉదయం 9 గంటలకు షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి, గుడాల పంపిణీ చేపట్టనున్నట్లు వివరించారు. సాయంత్రం 5 గంటలకు ప్రముఖ పంచాంగకర్త చికిలి వెంకటేశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్య లో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఇందులో ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, రవీందర్, నర్సిములు, రవీందర్, దశరత్, రాజు, సుభాష్, మహిపాల్, రాజు, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాటు వైద్యం నమ్మొద్దు
సిరికొండ: నాటు వైద్యం నమ్మొద్దని, ఎలాంటి అనా రోగ్య సమస్యలైనా వైద్యులను సంప్రదించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలోని కుంటగూడ పంచాయతీ పరిధి పాలవాగు గ్రామంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎస్పీ హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మూఢ నమ్మకాలు వీడాలన్నారు. యువత చదువుపై దృష్టి సారించి ఉన్నతంగా ఎదగాలని సూచించారు. అనంతరం ఆదిలాబాద్ నుంచి విచ్చేసిన ప్రైవేట్ వైద్యులు సుమారు 100 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఇందులో ఉట్నుర్ ఏఎస్పీ రుత్విక్ సాయి, ఇచ్చోడ సీఐ రమేశ్, స్థానిక ఎస్సై పూజ, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. రంజాన్ క్రమశిక్షణకు ప్రతీక ఆదిలాబాద్టౌన్: రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ముస్లిం పోలీస్ సిబ్బంది కోసం మంగళవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో మతసామరస్యాన్ని పెంపొందించేలా పండుగలను నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు బి.సురేందర్రావు, పి. మౌనిక, శిక్షణ ఐపీఎస్ రాహుల్కాంత్, డీఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ట్రాన్స్‘ఫార్మర్’పై ఓవర్లోడ్!
బోథ్: జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ సరఫ రాపై రోజురోజుకు భారం పెరుగుతోంది. ముఖ్యంగా అనధికారిక కనెక్షన్లు అధికమవడం, అనుమతించిన సామర్థ్యాన్ని మించి మోటార్లు వినియోగించడం వల్ల ట్రాన్స్ఫార్మర్లు (డీటీఆర్లు) తరచూ కాలిపోతున్న పరిస్థితి. ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్న నేపథ్యంలో కొంతమంది రైతులు నిబంధనలు పాటించకుండా అక్రమంగా కనెక్షన్లు తీసుకుంటున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో సుమారు ఐదు వేల వరకు ఇలాంటి కనెక్షన్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. 7 హెచ్పీ మోటార్ల వినియోగం.. అనుమతులు 5 హెచ్పీ మోటార్లకు తీసుకుని, వాటి స్థానంలో 7 హెచ్పీ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల వాటిని నడపడం విస్తృతంగా జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో 25కేవీ ట్రాన్స్ఫార్మర్పై ఆరు వరకు మాత్రమే వినియోగించాల్సి ఉండగా మరో ఐదారు వరకు అదనంగా నడుస్తున్నట్లుగా విద్యుత్ అఽధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిణామాల వల్ల అనూహ్యంగా లోడ్ పెరిగి ట్రాన్స్ఫార్మర్లు తరచూ దెబ్బతింటున్నాయి. ఇబ్బందులు పడుతున్న రైతులు.. ట్రాన్స్ఫార్మర్లు చెడిపోవడంతో అధికారికంగా కనెక్షన్లు ఉన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అనధికారికంగా వినియోగిస్తున్న వారు రైతులే కావడతో వారిని ఏమి అనలేకపోతున్నామని పలువురు పేర్కొటున్నారు. విద్యుత్ అధికారులే సర్వే చేసి అనధికార కనెక్షన్లు తొలగించాలని వారు కోరుతున్నారు. జిల్లాలో మొత్తం విద్యుత్ కనెక్షన్లు : 2.87 లక్షలు అధికారికంగా కనెక్షన్ తీసుకోవాలి రైతులు అనధికారికంగా విద్యుత్ వాడకూడదు. దీంతో ట్రాన్స్ఫార్మర్లపై లోడు పెరిగి పాడయ్యే అవకాశం ఉంటుంది. సంబంధిత డీడీ చెల్లించి అధికారికంగా వినియోగించుకోవాలి. అవసరమైతే కెపాసిటీ పెంచి సరిపడా అందించే చర్యలు చేపడతాం. – లక్ష్మణ్, ఏడీఈ, విద్యుత్శాఖ బోథ్ మండలంలోని ఓ గ్రామ శివారులో 63 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఉంది. దీని పరిధిలో గరిష్టంగా 10 వరకు 5హెచ్పీ మోటార్లు పనిచేసే వీలుంది. అయితే అక్రమంగా మరో ఐదారు కనెక్షన్లు ఉన్నాయి. ఈ క్రమంలో ట్రాన్స్ఫార్మర్పై లోడు పెరిగి ఇటీవల చెడిపోయింది. విద్యుత్శాఖ అధికారులు దానిని బాగు చేసేందుకు వారం పట్టింది. ఈ సమయంలో రైతులు పంటలకు నీరందించేందుకు ఇబ్బందులు పడ్డారు. ఇదొక్క చోటే కాదు.. జిల్లాలో చాలా ప్రాంతాల్లో అనధికార కనెక్షన్లతో రైతులకు ఇబ్బందులు తప్పని పరిస్థితి. -
ఎకరాకు రూ.25లక్షల పరిహారం చెల్లించాలి
సాత్నాల: కొరటా–చనాఖా సబ్ కెనాల్లో భాగంగా భూములు కోల్పోతున్న తమకు ఎకరానికి రూ.25లక్షల పరిహారం చెల్లించాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. భోరజ్ మండలం గిమ్మ పంచాయతీ కార్యాలయంలో ప్రాజెక్టు డి–14 సబ్కెనాల్లో భూములు కోల్పోతున్న రైతులతో అదనపు కలెక్టర్ రాజేశ్వర్ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, 2016 లో నిర్వహించిన సర్వే ప్రకారం ఎకరానికి రూ.10 లక్షల 40వేలు నెల క్రితం అకౌంట్లో జమ చేశారని, అయితే ఇప్పుడున్న ధరల ప్రకారం ఎకరానికి రూ.25 లక్షలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మొదటి సర్వే ప్రకారమే పనులు కొనసాగించాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పరిహారం పెంపు విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడతానని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాథోడ్ రాజేశ్వరి, మనోహర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన వైద్యసేవలే లక్ష్యం
తాంసి/తలమడుగు: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తాంసి, తలమడుగు మండలకేంద్రాల్లోని పీహెచ్సీల్లో ఎస్బీఐ, మిత్ర ఎన్జీవో సహకారంతో ఏర్పాటు చేసిన నూతన పరికరాలను మంగళవారం ప్రారంభించారు. తాంసి పీహెచ్సీలో మరుగుదొడ్డి అస్తవ్యస్తంగా ఉండటంతో సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, ఎస్బీఐ ఆర్ఎం రాంచంద్రరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఉత్పల్ కుమార్, మైత్రి హలిస్టిక్ హెల్త్ సొసైటీ చైర్మన్ లక్ష్మిరెడ్డి, తహసీల్దార్లు లక్ష్మి, రాజ్ మోహన్, ఎంపీడీవో మోహన్రెడ్డి, వైద్యాధికారులు శ్రావ్య, నర్మద, హరీష్, శ్రీధర్, ఏఈ నజీర్, సర్పంచ్ సంతోష్రెడ్డి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. అనంతరం తలమడుగులోని పశువైద్యశాలలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం గ్రంథాలయంతో పాటు పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రామారావు, వైద్యులు లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఖోడద్ గ్రామంలో ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్, గ్రామ ఉద్యోగుల సంఘం సభ్యులు వెంకట్, నర్సింలు, చంద్రారెడ్డి, అనిల్రెడ్డి, స్వామి తదితరులు పాల్గొన్నారు. -
● ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో.. ● రోడ్లు, కల్వర్టులు నిర్మించాలంటున్న ప్రజాప్రతినిధులు ● ప్రభుత్వానికి నివేదిస్తున్న అధికారులు
సాక్షి, ఆదిలాబాద్: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. 99 రోజుల పాటు జూన్ 12 వరకు 10 ప్రధాన అంశాలతో నిర్వహించనున్నారు. పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల పరిష్కారంతో పాటు ఇతర అంశాలను ఇందులో పొందుపరిచారు. తక్కువ అంచనా వ్యయంతో పూర్తయ్యే పనులకు ప్రాధాన్యత ఇస్తూ పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నారు. గ్రామపంచాయతీ, పట్టణంలోని వార్డులకు సంబంధించి రూ.10వేలు, మండలం, మున్సిపాలిటీలో రూ.రెండు లక్షలు, నియోజకవర్గ స్థాయిలో రూ.10 లక్షలు, జిల్లాస్థాయిలో రూ.50 లక్షలు బడ్జెట్ను ప్రతిపాదించారు. ఖర్చు చేసిన తర్వాత డీటెయిల్ ఓచర్ బిల్లు పెట్టుకున్న పక్షంలో ఆ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుంది. వ్యయంతో కూడుకున్న ప్రతిపాదనలు.. పారిశుద్ధ్యం, ఆరోగ్యం సంబంధిత కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మున్సిపల్ వార్డుల్లో, గ్రామ పంచాయతీల్లో అనేక సమస్యలు తీష్ట వేసి కూర్చున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజా ప్రతినిధులు రోడ్లు, మురుగు కాలువలు, కల్వర్టులు నిర్మించాలని మున్సిపాలిటీతో పాటు జీపీల్లో ప్రతిపాదనలు అందజేస్తున్నారు. ఇటీవలే కొత్తగా ఎన్నికై న స్థానిక ప్రజాప్రతినిధులు సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని కోరుతున్నారు. ఇవి పెద్ద మొత్తం వ్యయంతో కూడుకున్నవి కావడంతో అధికారులు వాటిని ప్రభుత్వానికి పంపుతున్నారు. ఇలాంటివి కూడా.. తమ ఇళ్ల ముందు అసౌకర్యంగా ఉన్న చెట్లు, విద్యుత్ స్తంభాలు తొలగించాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. వీధి దీపాలు అమర్చాలని కోరుతున్నారు. సాధారణ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకు వెళుతున్నారు. వాటి పరిష్కారంలో జాప్యం అవుతుండడంతో ప్రజా ప్రతినిధులు ప్రజాపాలన కార్యక్రమంలో అధికారులకు ఈ సమస్యలను పరిష్కరించాలని జాబితాలు అందజేస్తుండడం గమనార్హం. అదిలాబాద్ పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ వద్ద ప్రైవేట్ బస్సుల పార్కింగ్ను తొలగించాలని స్థానిక ప్రజా ప్రతినిధి అధికారులకు విన్నవించారు. ఇలా దీర్ఘకాలికంగా పరిష్కారం కాని చిన్న చిన్న సమస్యలను కూడా అధికారుల దృష్టికి తీసుకు వెళ్తున్నారు. మరి ఇవి పరిష్కారం అవుతాయే లేదో వేచి చూడాల్సిందే. ‘బీటీ రోడ్లు, సీసీరోడ్లు, డ్రైయిన్లు, కల్వర్టులు, సర్వీస్ రోడ్లు నిర్మించాలి.. సీసీ కెమెరాలు బిగించాలి.. వీధి పేరుకు సంబంధించి సైన్ బోర్డులు పెట్టాలి.. ఓపెన్ జిమ్లను రిపేర్ చేయించాలి.. కొత్తవి ఏర్పాటు చేయాలి..’ ఆదిలాబాద్ పట్టణంలోని 43వ వార్డు కౌన్సిలర్ కలాల శ్రీనివాస్ మంగళవారం మున్సిపల్ కమిషనర్ జి.రాజుకు అందజేసిన ప్రతిపాదనల జాబితా ఇది. ఈ ఒక్క వార్డు నుంచే కాదు.. మరికొన్ని వార్డుల నుంచి ఇలాంటి ప్రతిపాదనలే అందుతున్నాయని బల్ధియా అధికారులు పేర్కొంటున్నారు. -
మార్కెటింగ్ సౌకర్యం లేక తిప్పలు
రంజన్లకు గిరాకీ బానే ఉంటుంది. అయితే మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో ఎంత శ్రమించినా తక్కువ లాభానికి అమ్ముకోవాల్సి వస్తుంది. రాష్ట్రంలో ఆదిలాబాద్ రంజన్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తే మాలాంటి వారికి మేలు చేకూరుతుంది. – రాధారపు సంగీత, కుమ్మరివాడ, ఆదిలాబాద్ పింఛన్ సౌకర్యం కల్పించాలి చిన్నప్పటి నుంచి ఇదే వృత్తిలో ఉన్నా. తయా రు నుంచి మొదలుకొని, అమ్మే వరకు ఎన్నో ఇబ్బందులు ఉంటున్నాయి. ఆర్థికంగా సమస్యలు అనేకం. వీటన్నింటినీ దాటి వృత్తిని కాపాడుకుంటూ, రంజన్ల తయారీ, అమ్మకాలు కొనసాగిస్తున్నాం. మాలాంటి వృద్ధులకు ప్రభుత్వం పింఛన్ సౌకర్యం కల్పించాలి. – ఎన్. గంగారాం, బంగారిగూడ, ఆదిలాబాద్ -
నివేదనలు.. వేడుకోలు
కై లాస్నగర్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సో మవారం నిర్వహించిన గ్రీవెన్స్లో అర్జీలు వెల్లువెత్తాయి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ బాధితులు ఉన్నతాధికారులను వేడుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వారి నుంచి అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, సామాజిక భద్రతా పింఛన్లు, ఉపాధి హామీ పనులు, భూభారతి తదితర సమస్యలపై ఈ వారం మొత్తం 85 దరఖాస్తులు అందాయి. కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, ఏవో వర్ణ, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన.. సమస్యలు త్వరగా పరిష్కరించాలి ఆదిలాబాద్టౌన్: బాధితుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించి పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీస్ ముఖ్య కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. వాటిపై సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారిణి జైస్వాల్ కవిత, సిబ్బంది పాల్గొన్నారు. -
‘ఆశా’ల 48 గంటల దీక్ష
కై లాస్నగర్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా కార్యకర్తల సమస్యలపై చర్చించి పరిష్కరించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం 48గంటల నిరసన దీక్ష చేపట్టారు. పలువురు నాయకులు మాట్లాడుతూ, ఆశాల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆశాలకు రూ.18 వేల కనీస వేతనం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ, ఆఽశా వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో పలువురి చేరిక
కై లాస్నగర్: బోథ్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన సుమారు 200 మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో సోమవారం నిర్వహంచిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడె గజేందర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ వారికి కండువా కప్పి స్వాగతించారు. పార్టీలో చేరిన వారిలో చిలుకూరి భూమయ్య, ఆత్రం నాగో రావు, చాకటి మహేశ్, గడ్డం కాశీనాథ్, విజేందర్, వెంకటరమణ, రమేశ్, గణేశ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, నాయకులు తుల అరుణ్కుమార్ తదితరులున్నారు. -
మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్
ఆదిలాబాద్రూరల్: ఇఫ్తార్ మత సామరస్యానికి ప్ర తీక అని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం స్థానిక టీఎన్జీవో గార్డెన్లో ఏర్పాటు చేసిన ‘దావత్–ఏ–ఇఫ్తార్ కార్యక్రమానికి ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పేద ముస్లింలకు గిఫ్ట్ ప్యాక్లు అందిస్తున్నామని తెలిపారు. ఇందులో భా గంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో 1500 ప్యాక్లు, బోథ్ నియోజకవర్గంలో 750 ప్యాక్లు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. అనంతరం పలువురికి గిఫ్ట్ ప్యాక్లు అందజేశారు. కార్యక్రమంలో మున్సి పల్ వైస్చైర్మన్ రోహిత్, మైనారిటీ సంక్షేమ అధి కా రి కలీమ్, ప్రజాప్రతినిధులు, ముస్లిం మతపెద్దలు, జిల్లా అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు. -
‘హామీల అమలులో కాంగ్రెస్ సర్కారు విఫలం’
నేరడిగొండ: ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత ఎక్కడ..? కాంగ్రెస్ సర్కారుకు ప్రజల పట్ల నిబద్ధత లేదని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. సోమవారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి హైదరాబాద్లోని గన్పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ సర్కారు ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై నిరసన వ్యక్తం చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమవుతోందని విమర్శించారు. -
రూ.1,500 కోట్ల అంచనాతో..
రూ.1500 కోట్ల అంచనా వ్యయంతో ఆదిలాబాద్లో విమానా శ్రయ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. భూసేకరణ, ఇతర వాటి కోసం నిధులు కేటాయించాల్సి ఉంటుంది. గవర్నర్ ప్రసంగంలో ఈ అంశం ప్రస్తావించడం ద్వారా మనకు పూర్తి రైట్ వచ్చినట్టే. ఆదిలాబాద్ అభివృద్ధికి ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకెళ్తున్నాం. ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుకు రూ.2వేల కోట్లతో ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం. అందుబాటులోకి వస్తే ఆదిలాబాద్ దశ మారనుంది. – పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే -
‘సాక్షి’ చొరవ..
ఆదిలాబాద్లో విమానాశ్రయ ఏర్పాటులో మరో కీలక అడుగు పడింది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తన ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ఆదిలాబాద్ అభివృద్ధిపై గవర్నర్ ప్రస్తావించారని, ఇది శుభసూచకమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అభిప్రాయపడ్డారు. జూన్ 2న శంకుస్థాపనకు అవకాశం ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జూన్ 2న ప్రధాని చేతుల మీ దుగా ప్రత్యక్షంగా శంకుస్థాపన నిర్వహించేలా ప్రయత్నిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ‘సాక్షి’కి తెలిపారు. ఆదిలాబాద్లో రక్షణ శాఖకు సంబంధించి ఇప్పటికీ 369 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. తొలుత విమానాశ్రయం ఏర్పాటుతో పాటు రానున్న రోజుల్లో వైమానిక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ఇదివరకే ప్రకటించింది. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ విషయంలో నిధుల మంజూరు జరగాల్సి ఉంది. దీనికి బడ్జెట్ కేటాయిస్తే ముందడుగు పడుతుంది. ఆదిలాబాద్ విమానాశ్రయ మైదానం ‘తెలంగాణ ప్రాంతంలో విమాన అనుసంధానతను మెరుగుపర్చడానికి కేంద్రం చొరవ చూపుతుంది.. ఇందులో భాగంగా వరంగల్, ఆదిలాబాద్లలో ఎయిర్పోర్ట్ల ఏర్పాటు ప్రతిపాదనలను ఆమోదించింది.. పనుల వేగవంతానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది..’ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా సోమవారం ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్న మాటలివి. – సాక్షి,ఆదిలాబాద్ ఆదిలాబాద్లో విమానాశ్రయ ఏర్పాటు విషయంలో గతంలో ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో పట్టణంలోని మేధావులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించి చర్చా వేదిక నిర్వహించిన విషయం విదితమే. ఈ క్రమంలో స్థానిక ఎంపీ గోడం నగేశ్ పలుమార్లు అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించడం, అలాగే స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా అసెంబ్లీలో ప్రస్తావనకు తీసుకురావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాయి. మరోవైపు సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఆదిలాబాద్లో విమానాశ్రయం ఏర్పాటు తన బాధ్యతగా పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. రాష్ట్ర ప్రభుత్వం సైతం తదనుగుణంగా చర్యలు చేపట్టడంతో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. -
‘భగీరథ’ పైపులైన్ మార్పు
కై లాస్నగర్: జిల్లా కేంద్రంలో చేపట్టిన రైల్వే అండర్, ఓవర్ బ్రిడ్జిల వద్ద గల మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ మార్చేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. కొత్త నిర్మాణాలు పూర్తయితే అడుగుభాగంలో ఉన్న పైపులైన్లో తలెత్తే లీకేజీలకు మరమ్మతులు చేయడం కష్టతరంగా మారనుంది. దీనిని గుర్తించిన వాటర్గ్రిడ్, మున్సిపల్ అధికారులు పైపులైన్లను పక్కకు మార్చాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆయా శాఖలు రూ.కోటి 2లక్షల వ్యయంతో వేర్వేరుగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. బ్రిడ్జిల నిర్మాణం పూర్తయ్యేలోగా అనుమతి తీసుకువచ్చి పనులు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. సమస్య ఉత్పన్నం కాకుండా.. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండలం మాటేగాం వద్ద గల పంప్హౌస్ నుంచి ఆదిలాబాద్ ఫిల్టర్బెడ్కు మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతుంది. ఇటీవల రైల్వే ఓవర్ బ్రిడ్జి పిల్లర్ కోసం తవ్వకాలు చేపట్టగా స్థానిక సంజయ్నగర్ కాలనీ వద్ద గల ప్రధాన పైపులైన్ ఽస్వల్పంగా దెబ్బతింది. దీంతో అధికారులు మూడు రోజులు శ్రమించి మరమ్మతులు చేపట్టారు. చిన్నపాటి సమస్యకే ఇంత ఇబ్బంది ఏర్పడగా బ్రిడ్జిల నిర్మాణంలో భాగంగా వాటి కింద వెళ్లే పైపులైన్ల పరిస్థితి ఏంటనే దానిపై మున్సిపల్ ఇంజినీరింగ్, మిషన్ భగీరథ (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు పరిశీలన చేపట్టారు. నిర్మాణాలు పూర్తయితే పైపులైన్ పూర్తిగా అడుగుభాగంలో ఉంటుంది. బ్రిడ్జి నుంచి వెళ్లే వాహనాల వేగానికి పైపులు కదలి లింకుల్లో గ్యాప్ తలెత్తే అవకాశముంటుందని భావించారు. అదే జరిగితే ఫిల్లర్ల వద్ద మరమ్మతులు చేయడానికి ఆస్కారముండకపోవచ్చని నిర్ధారించారు. ఈమేరకు పైపులైన్లను పూర్తిగా బ్రిడ్జిల పక్కకు మార్చాలని నిర్ణయించారు. రూ.1.02 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు .. -
సమన్వయంతో పనిచేయాలి
కైలాస్నగర్: జిల్లాను గంజాయి రహితంగా మా ర్చేందుకు సంబంధిత శాఖల అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గంజా యి సాగు, మాదకద్రవ్యాల నిర్మూలనపై ఎస్పీ అఖి ల్ మహాజన్తో కలిసి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, మా దక ద్రవ్యాల వ్యాప్తిని అరికట్టేందుకు పోలీస్శాఖతో పాటు విద్య, రెవెన్యూ, ఆరోగ్యశాఖలు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరముందన్నారు. యాంటీ డ్రగ్ కమిటీల ద్వారా గ్రామాలు, పట్టణాలు, పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించిన రైతులపై చట్టపరమైన చర్యలతో పాటు ప్రభుత్వ పథకాలు అందకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, జిల్లాలో గంజాయి, మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు పోలీస్శాఖ కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తుందన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, ఆర్టీవో శ్రీనివాస్, డీపీవో రమే శ్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, డీఏవో శ్రీధర్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ, ఆర్అండ్బీ ఈఈ నర్సయ్య పాల్గొన్నారు. ప్రమాదాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రోడ్డు భద్రతపై ఎస్పీ అఖి ల్ మహాజన్తో కలిసి సోమవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, రహదారి ప్రమాదాల నివారణకురవాణా, పోలీస్శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల పై కఠిన చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. ఎస్పీమాట్లాడుతూ, పోలీస్ శాఖ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు విస్తృ త అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ముందుగా మండలాల వారీగా రహదారి ప్రమాదా లు జరిగే హాట్ స్పాట్లను, నివారణ చర్యలపై పవర్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. ఇందులో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. వైద్యశిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి సాత్నాల: వైద్యశిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మండలంలోని సైద్పూర్ పీహెచ్సీలో ఏర్పాటు చేసిన వైద్య శిబి రంతో పాటు మేడిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో రిమ్స్సహకారంతో ఏర్పాటు చేసిన ఉచి త వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వైద్యులు రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. అనంతరం మేడిగూడలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారు నూత న గృహ ప్రవేశానికి కలెక్టర్ హాజరయ్యారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, తహసీల్దార్ రామారావు, ఇన్చార్జి ఎంపీడీవో వెంకట్రాజు,చాంబర్ ఆఫ్కామర్స్ అండ్ ట్రేడ్స్ అసోసియేషన్ ప్రతినిధులు శివ ప్రసా ద్, సర్పంచ్ లక్ష్మి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఒకే చితిలో తల్లీకుమారుడు… కన్నీటి మడుగైన మందమర్రి
మందమర్రి(మంచిర్యాల జిల్లా): తల్లీకుమారుడి అంత్యక్రియలు ఒకే రోజు ఘటన మందమర్రిలో అందరినీ కంటతడి పెట్టించింది. వివరాలు ఇలా ఉ న్నాయి.. పట్టణంలోని రెండోజోన్కు చెందిన వీరవేణి–సత్యనారాయణ దంపతులకు ప్రసాద్, నాగసత్యవేణి సంతానం. నాగసత్యవేణికి హైదరాబాద్ (బోరబండ)కు చెందిన మురళీవేణుతో 13 మార్చి 2019లో వివాహమైంది. రుద్రాన్ష్ (5), ధన్విక (2) సంతానం. కొంతకాలం వీరి దాంపత్యం సాఫీగా సాగింది. పెళ్లయిన ఏడాది తర్వాత మురళీవేణుకు జెన్కోలో ఇంజినీర్గా ఉద్యోగం వ చ్చింది. అప్పటినుంచి భార్యను వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు కట్నం వచ్చేది. నిన్ను చేసుకున్నందుకు కట్నం ఇవ్వలేదనే, భార్యను పుట్టింటివారితో మాట్లాడనిచ్చేవాడు కాదు. అదనపు కట్నం తేవాలని వేధించసాగాడు. తల్లిగారింటికి వెళ్తే త్వరగా తిరిగి రావాలని ఆంక్షలు విధించేవాడు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి తన అన్న ప్రసాద్కు ఫోన్చేసి అమ్మను, తన కుమారుడు (మేనల్లుడు)ని బాగా చూసుకోవాలని చెప్పింది. మళ్లీ రాత్రి 9:30 గంటలకు మురళీవేణు మందమర్రిలోని ప్రసాద్ ఫోన్చేసి మీ చెల్లి ఆత్మహత్య చేసుకుందని చెప్పగా హైదరాబాద్ వెళ్లాడు. గాంధీ ఆసుపత్రిలో నాగసత్యవేణి, రుద్రాన్ష్ మృతదేహాలు, ధన్విక నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని పోలీసులు చెప్పారు. శనివారం సాయంత్రం పోసుమార్టం అనంతరం మృతదేహాలను అప్పగించారు. ఆదివారం స్వగ్రామానికి తీసుకువచ్చి శ్మశానవాటికలో అంత్యక్రియలు చేశారు. తల్లికుమారుడి మృతి కారకులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. -
ఆదివాసీల సంస్కృతి గొప్పది
ఆదిలాబాద్రూరల్: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివాసీ పర్ధాన్ సమాజ్ గోండి ధర్మ గురు హీరా సుకా జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలో ఆది వారం నిర్వహించారు. రాంలీలా మైదానంలో అధి కారికంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆదివాసీలు భారీగా తరలివచ్చారు. ముందుగా బస్టాండ్ ఎదుట గల హీరా సుకా దేవస్థానం ఆవరణలో కలెక్టర్ పాల్గొని సంప్రదాయ పూజలు చేపట్టారు. ఆది వాసీలతో కలిసి థింసా నృత్యం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆదివాసీ యువత విద్యపై దృష్టి సారించాలన్నారు. జల్, జంగల్, జమీన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ, ఆదివాసీ పర్ధాన్ కులస్తుల సమస్యల పరిష్కరం కోసం కృషి చేస్తానని అన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ పర్ధాన్ కులస్తుల సంక్షేమం, అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందన్నారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, పర్ధాన్ కులస్తుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని తెలిపారు. అనంతరం పర్ధాన్ కులస్తుల సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వేడుకల కమిటీ అధ్యక్షుడు మెస్రం శంకర్, ప్రధాన కార్యదర్శి గేడం మాధవ్, సమాజ్ నాయకులు డాక్టర్ మెస్రం మనోహార్, గేడం తులసీరాం, మడావి శంకర్, మెస్రం శంకర్, కుర్సేంగే తానాజీ, గేడం నిరంజన్, పూసం ఆనంద్రావ్, ఉయిక సుదర్శన్, మెస్రం కేశవ్, మెస్రం నాగేశ్వర్రావ్, దుర్వ నగేశ్, సిడాం రాంకిషన్, సిడాం భీంరావ్, ఉయిక విఠల్, మెస్రం మారుతి, గేడం ప్రకాశ్, కుమ్ర సంగీత, మెస్రం సంగీత, గేడం వనిత, గోవింద్ రావ్, కుమ్ర రాజు, తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధికి కృషి
తలమడుగు: గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. మండలంలోని నందిగామ గ్రామంలో రూ.1.01కోట్ల వ్యయంతో చేపట్టిన రహదారి పనులకు ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, దేశంలోని అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ సడక్ యోజన పథకం చేపట్టిందన్నారు. రోడ్డు సౌకర్యం ఉన్నప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటస్వామి, సర్పంచ్లు భీంరావు, సంతోష్, నాయకులు గంగాధర్రావు, చంద్రకాంత్, డీఈ రాజేశ్వర్, కాశీరాం తదితరులు పాల్గొన్నారు. -
సమ్మర్ యాక్షన్ ప్లాన్
కై లాస్నగర్: ఈ వేసవిలో జిల్లాకేంద్రంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఈమేరకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. గత అనుభవాల దృష్ట్యా కసరత్తు చేసిన ఇంజినీరింగ్ అధికారుల ప్రతిపాదనల మేరకు ప్రత్యేకంగా రూ.76లక్షలు కేటాయించారు. ఇటీవల నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానిస్తూ ఆమోదించారు. ఈమేరకు టెండర్ల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈనెల 17న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. వారం పాటు ఆన్లైన్లో టెండర్లు స్వీకరించనున్నారు. పనుల వారీగా కేటాయింపులు ఇలా.. తాగునీటికి ఇబ్బంది రానివ్వం ఈ వేసవిలో పట్టణ పరిధిలో ఎక్కడా తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నాం. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి కాంట్రాక్టర్ల ద్వారా ఆయా పనులు చేయిస్తాం. మావల చెరువుతో పాటు లాంగసాంగ్వి నుంచి పూర్తిస్థాయిలో నీరు సరఫరా అవుతుంది. గ్రిడ్ నుంచి కూడా 16 ఎంఎల్డీలు అందుతుంది. – అరుణ్కుమార్, మున్సిపల్ ఇంజినీర్ -
వినియోగదారుల చట్టాలపై అవగాహన అవసరం
ఆదిలాబాద్రూరల్: వినియోగదారుల చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు, జడ్జి జబేజ్ శామ్యూల్ అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మండలంలోని చాందా (టి) పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గడిచిన ఎనిమిదేళ్లలో జిల్లాలో 1,600 కేసులు పరిష్కరించామన్నారు. వినియోగదారులు తమ సమస్యలపై సరైన ఆధారాలతో కమిషన్ కార్యాలయాన్ని సంప్రదిస్తే అక్కడ ఉన్న సిబ్బంది సలహాలు, సూచనలు ఇస్తారన్నారు. కార్యక్రమంలో వినియోగదారులు పాల్గొన్నారు. -
బాధితుల వద్దకే పోలీస్
ఆదిలాబాద్టౌన్: పోలీస్ శాఖ ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు సంస్కరణలు చేపడుతోంది. ఫిర్యాదుదారులకు సులభంగా, నాణ్యమైన సేవలు అందేలా రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ఇకపై పలు కేసుల్లో స్టేషన్కు వెళ్లకుండానే సంఘటనా స్థలంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధానానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ పక్కాగా అమలు చేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే.. ఆన్సైట్ ఎఫ్ఐఆర్ విధానం ద్వారా బాధితుల వద్ద కే పోలీసులు వచ్చి కేసు నమోదు చేస్తారు. ఫిర్యాదుదారులు సమాచారం ఇచ్చినా, డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేసినా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంటారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. ట్యాబ్ ద్వారా ఆన్లైన్లో కేసు నమోదు చేస్తారు. రోడ్డు ప్రమాదాలు, గొడవలకు సంబంధించి గాయాలైతే బాధితులను ఆస్పత్రికి తరలిస్తారు. ఈ విధానం ద్వారా రోడ్డు ప్రమాదాలు, గొడవలు, దొంగతనాలు, భార్యభర్తల పంచాయతీలు, వేధింపులు, అనుమానాస్పద మృతి వంటి వాటిపై అప్పటికప్పుడే కేసులు నమోదు చేస్తారు. జిల్లాలో గత 15 రోజులుగా కార్యక్రమం అమలు కాగా, ఇప్పటివరకు 15 కేసులు నమోదైనట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. వాట్సాప్లో ఎఫ్ఐఆర్.. నేరం జరిగిన తర్వాత బాధితులు శారీరకంగా, మానసికంగా కుంగిపోయి ఉంటారు. ఈ క్రమంలో వారిని తిరిగి పీఎస్కు పిలిచి సమయం వృథా చేయకుండా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఘటన జరిగిన వెంటనే స్పాట్ వద్దకు చేరుకునే పో లీసులు పీఎస్లో ఉండే సిబ్బందికి దీనిపై సమాచారం అందిస్తారు. ఘటనా స్థలంలో సేకరించిన వివరాలను ఎస్హెచ్వో ద్రువీకరించిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసి, ఆ తర్వాత బాధితులకు వాట్సాప్ లో పంపిస్తారు. దర్యాప్తులో పురోగతి ఆఽ దారంగా ఫిర్యాదుదారులకు సమాచారం అంది స్తారు. బాధితులు ఎక్కడ ఫిర్యాదు చేయాలనుకుంటే అక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా చర్యలు చేపడుతారు. ముఖ్యంగా మహిళలకు ఈ విధానం ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే బాలికలు, యువతులు, మహిళలు అదృశ్యమైనప్పుడు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే కొంత ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఈ కార్యక్రమం ద్వారా ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంటున్నారు.ఆన్సైట్ ఎఫ్ఐఆర్ కేసుల వివరాలు.. స్టేషన్ నమోదైన ఎఫ్ఐఆర్లు ఆదిలాబాద్ వన్టౌన్ 03 ఆదిలాబాద్ టూటౌన్ 01ఆదిలాబాద్రూరల్ 02 తలమడుగు 03 మావల 01 బేల 01 భీంపూర్ 01 బోథ్ 02 బజార్హత్నూర్ 01 మొత్తం 15ఘటనా స్థలానికే పోలీసులు బాధితులకు తక్షణ న్యాయం అందించడంలో భాగంగా డీజీపీ ఆన్సైట్ ఎఫ్ఐఆర్ను అమలులోకి తీసుకొచ్చారు. బాధితులు డయల్ 100, స్టేషన్కు సమాచారం ఇచ్చినా వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. వాంగ్మూలం రికార్డు చేయడం జరుగుతుంది. దీంతో బాధితులకు సమయం ఆదా అవుతుంది. జిల్లాలో ఇప్పటివరకు 15 కేసులు నమోదు చేశాం. – ఎల్.జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ -
ఏడుగురికి ఏవోలుగా పదోన్నతి
ఆదిలాబాద్టౌన్: వైద్యారోగ్య శాఖలో ఏడుగు రు కార్యాలయ సూపరింటెండెంట్లకు అడ్మిని స్ట్రేటీవ్ ఆఫీసర్ (ఏవో)గా పదోన్నతి లభించింది. ఈమేరకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామి లీ వెల్ఫేర్ శనివారం కౌన్సెలింగ్ నిర్వహించి ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో డీఎంహెచ్వో కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న గుజరాతి గోపికి రిమ్స్ ఆస్పత్రిలో ఏవో గా పదోన్నతి కల్పించారు. అలాగే రిమ్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఎ.మహేందర్కు రిమ్స్ మెడికల్ కళాశాలలో, రిమ్స్ ఆస్పత్రిలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న టి.గోపికి రిమ్స్ న ర్సింగ్ కళాశాలలో ఏవోగా పదోన్నతి లభించింది. నిర్మల్లోని మెడికల్ కళాశాలలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న కె.రవీందర్కు ఆదిలా బాద్ రిమ్స్ మెడికల్ కళాశాలలో ఏవోగా, ఆది లాబాద్ నర్సింగ్ కళాశాలలో సూ పరింటెండెంట్గా పనిచేస్తున్న సందీప్కు నిర్మల్ జీజీహెచ్ ఏవోగా, డీఎంహెచ్వో కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న సి. మధుసూదన్ ను నిర్మల్కు కేటాయించారు. వీరి కి పదోన్నతి లభించడంపై కార్యాలయ ఉద్యోగులు, అధికా రులు అభినందనలు తెలిపారు. -
కాన్షీరాం ఆశయ సాధనకు కృషి
ఆదిలాబాద్రూరల్: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, కాన్షీరామ్ ఆశయ సాధనకు అంద రూ కృషి చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ జి ల్లా కోఆర్డినేటర్, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అ ధ్యక్షుడు అగ్గిమల్ల గణేశ్ మహరాజ్ అన్నారు. కాన్షీరామ్ జయంతిని జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ ఆవరణలో ఆదివారం ఘ నంగా నిర్వహించారు. కాన్షీరాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బహుజ నుల కోసం కాన్షీరామ్ అందించిన సేవలను కొనియాడారు. ఇందులో నాయకులు అన్నెల ఆడేల్లు, శ్రీనివాస్, వెంకటేశ్, దర్శనాల సుష్మ, నవీన్, రవి, సాయికుమార్, శ్రీనివాస్, అఖిల్, పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ కొరత లేదు.. ఆందోళన వద్దు
కై లాస్నగర్: జిల్లాలో గృహావసరాలకు సంబంధించి గ్యాస్ కొరత లేదు.. ఇండెంట్ ప్రకారం ఆయిల్ కంపెనీలు సరఫరా చేస్తున్నాయి.. సోషల్ మీడియాలో వదంతులు నమ్మవద్దు.. నిబంధనల ప్రకారం బుకింగ్ చేసుకుంటే డోర్ డెలివరీ కొనసాగుతుంది.. సిలిండర్లను నిల్వ చేసినా, బ్లాక్ మార్కెటింగ్కు తరలించినా వారిపై కఠినంగా వ్యవహరిస్తాం.. గ్యాస్ సరఫరాలో ఎలాంటి సమస్యలున్నా టోల్ఫ్రీ నంబర్ 18004251939లో సంప్రదించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నందిని సూచించారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు వివరాలు వెల్లడించారు. సాక్షి: జిల్లాలో గ్యాస్ కొరత ఉందనే ప్రచారం సాగుతుంది.. ఇది వాస్తవమేనా..? డీఎస్వో: కమర్షియల్ సిలిండర్ల కొరత ఉన్నమాట వాస్తవమే. కేంద్ర ప్రభుత్వమే ఆ సరఫరాపై ఆంక్షలు విధించింది. అయితే గృహావసరాలకు వినియోగించే గ్యాస్కు సంబంధించి ఎలాంటి కొరత లేదు. జిల్లా నుంచి పంపిన ఇండెంట్ ప్రకారం ఆయిల్ కంపెనీలు యథావిధిగా సిలిండర్లను సరఫరా చేస్తున్నాయి. దీనిపై వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాక్షి: కొరత లేకుంటే ఏజెన్సీల వద్ద నియోగదారులు ఎందుకు బారులు తీరాల్సి వస్తోంది.. దీనిపై ఎలాంటి దృష్టి సారించారు? డీఎస్వో: వంటగ్యాస్కు ఎలాంటి కొరత లేదు. అయితే కొందరు గ్యాస్ దొరకదేమోననే ఉద్దేశంతో ముందస్తుగా ఏజెన్సీల వద్దకు వస్తుండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీనిపై వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నాం. బారులు తీరకుండా సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాం. సాక్షి: గ్యాస్ బుకింగ్ కావడం లేదని వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. కారణమేంటి..? డీఎస్వో: గ్యాస్ బుకింగ్ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఇది వరకు సిలిండర్ తీసుకున్న 21 రోజులకే బుకింగ్ చేసుకునే అవకాశం ఉండేది. తాజా పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని వారికి 45 రోజులు, పట్టణ ప్రాంతాల్లోని వారికి 25 రోజుల గడువు పొడిగిస్తూ కేంద్రం నిర్ణ యం తీసుకుంది. ఈ ప్రకారమే వినియోగదారులు బుక్ చేసుకోవాలి. అందరూ ఒకేసారి బుకింగ్ చేసుకోవడంతో సర్వర్లో సమస్య తలెత్తింది. ఆందోళన చెందకుండా నిదానంగా బుక్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. సాక్షి: కమర్షియల్ గ్యాస్ సరఫరా లేకపోవడంతో హోటళ్ల నిర్వాహకులు గృహావసర సిలిండర్లను వినియోగిస్తున్నారు. దీన్ని ఎలా కట్టడి చేస్తారు? డీఎస్వో: వంటగ్యాస్ సిలిండర్లను వ్యాపారాలకు వినియోగించడం నిబంధనలకు విరుద్ధం. హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్సెంటర్లలో డొమెస్టిక్ సిలిండర్ల వాడకాన్ని నియంత్రించేలా రెవెన్యూ, పోలీస్ అధికారులకు కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు. వారు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ అక్రమంగా వంటగ్యాస్ వినియోగించే వారిపై తగు చర్యలు తీసుకుంటారు. సాక్షి: జిల్లాలో వంటగ్యాస్ కనెక్షన్లు ఎన్ని ఉన్నాయి.. వినియోగం, సరఫరా పరిస్థితి ఎలా ఉంది? డీఎస్వో: జిల్లా వ్యాప్తంగా 2,45,438 కనెక్షన్లు ఉ న్నాయి. వాటికి 17 ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుంది. సగటున రోజుకు 2500 చొప్పున నెలకు సుమారు 70 వేల సిలిండర్ల విని యోగం అవుతుంది. తదనుగుణంగానే ప్రస్తుతం జిల్లాకు సి లిండర్లు సరఫరా అవుతున్నాయి. బుకింగ్ చేసుకు న్న వినియోగదారులకు రూ.992లకే డోర్ డెలివరీ చేయబడుతుంది. అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు. సాక్షి: కొంతమంది కృత్రిమకొరత సృష్టిస్తూ ప క్కదారి పట్టిస్తున్నట్లుగా తెలుస్తోంది.. అలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు.? డీఎస్వో: ఈ పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంతో ఒక్కో ఏజెన్సీకి ఒక డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐల ను కలెక్టర్ నియమించారు. వారు బుకింగ్, సిలిండర్ల సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. ఏజెన్సీల గోడౌన్లను తనిఖీ చేస్తున్నారు. అక్రమంగా నిల్వ ఉంచినట్లు తేలితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశముంటుంది. -
ఎమ్మెల్యేకు లైసెన్స్డ్ సర్వేయర్ల వినతి
నిర్మల్చైన్గేట్: ఆరు నెలలుగా సరైన విధి విధానాలు లేక లైసెన్స్డ్ సర్వేయర్ల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని, తమ సమస్యలను అసెంబ్లీలో చర్చించి, పనికి తగిన వేతనం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జిల్లా లైసెన్స్డ్ సర్వేయర్ల కమిటీ తరఫున ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డికి శనివారం వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్రస్థాయిలో మొత్తం 6,500 మంది సర్వేయర్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యామని, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా లైసెన్స్లను పొంది దాదాపు 3,500 మంది అభ్యర్థులకు, మండలాలు కేటాయించారని తెలిపారు. సొంత డబ్బులు పెట్టుకుని విధులకు హాజరవుతున్నామన్నారు. మండల కార్యాలయాల్లో ఎటువంటి పని కల్పించడం లేదన్నారు. ఉన్న ఉద్యోగాలు వదులుకుని, లైసెన్స్ సర్వేయర్లుగా పనిచేస్తున్నామని, ప్రభుత్వం నుండి సరైన విధి విధానాలు లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. ఏలేటి మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలలోపు ప్రభుత్వం సర్వేయర్లపై తన వైఖరిని ప్రకటించాలని లేనిపక్షంలో లైసెన్సుడ్ సర్వేయర్ల తరఫున అసెంబ్లీలో పోరాడుతామన్నారు. చెక్బౌన్స్ కేసులో ఒకరికి ఏడాది జైలు మంచిర్యాలక్రైం: చెక్బౌన్స్ కేసులో ఒకరికి ఏడాది జైలుశిక్షతో పాటు తీసుకున్న మొత్తం చెల్లించాలని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి నిరోష శనివారం తీర్పు వెలువరించారు. మాజీమంత్రి బోడ జనార్దన్ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా బాలయ్యపల్లెకు చెందిన రమేశ్ చౌదరి అనే వ్యక్తికి వ్యాపార నిమిత్తం రూ.7లక్షలు అప్పుగా ఇచ్చారు. తిరిగి చెల్లించక పోవడంతో అతను ఇచ్చిన చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేశారు. చెక్కు బౌన్స్ కావడంతో జనార్దన్ న్యాయం కోసం 2025లో కోర్టును ఆశ్రయించారు. అతని తరపు న్యాయవాది చిరంజీవి న్యాయమూర్తి ఎదుట వాదనలు వినిపించారు. సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితునికి ఏడాది జైలుశిక్షతో పాటు తీసుకున్న అప్పు మొత్తాన్ని చెల్లించాలని తీర్పునిచ్చారు. -
జెండాగూడకు కరెంటొచ్చిందోచ్..
తాంసి: దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు ఆ ఊరికి కరెంటొచ్చింది. గ్రామ సమస్యను రెండేళ్ల క్రితం ‘సాక్షి’ ‘ఈ అంధకారం నుంచి స్వాతంత్య్రం ఎప్పుడు?’ శీర్షికన ఏప్రిల్ 4, 2024న వెలుగులోకి తెచ్చింది. ఈ మేరకు స్పందించిన అధికారులు వెంటనే గ్రామాన్ని సందర్శించారు. అవసరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. రెండేళ్ల పాటు కృషి చేసి ప్రత్యేక విద్యుత్ లైన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ గిరి గ్రామానికి వెలుగులు రావడంతో ఆ ఊరంతా సంబురపడుతోంది. ‘సాక్షి’కి ప్రత్యేక అభినందనలు తెలిపింది. డీఏజేజీయూఏ పథకం కింద.. భీంపూర్ మండలంలోని కమట్వాడ పంచాయతీ పరిధిలో గల జెండాగూడ గ్రామానికి శనివారం తొలిసారిగా విద్యుత్ సరఫరా చేశారు. ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (డీఏజేజీయూఏ) పథకం కింద విద్యుదీకరణ పనులు విజయవంతంగా పూర్తి చేసి సరఫరా చేసినట్లు చీఫ్ ఇంజినీర్ (కన్స్ట్రక్షన్) సీఈ చౌహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో మొత్తం 13 సర్వీస్ మీటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 1.5 కిలోమీటర్ల మేర 6.3 కేవీలైన్ నిర్మాణం, 0.4 కిలోమీటర్ల ఎల్టీ లైన్, 25 కేవీ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. కాగా, గ్రామానికి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాల నిరీక్షణ ఫలించిందని పేర్కొన్నారు. అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈ రాథోడ్ శేషారావు, డీఈ ప్రభాకర్, ఏఈ తిరుపతి రెడ్డి, విద్యుత్ సిబ్బంది ఉన్నారు. -
వంటగ్యాస్ కొరత లేదు
కై లాస్నగర్: జిల్లాలో గృహ అవసరాలతో పాటు వి ద్యాలయాలు, ఆసుపత్రులకు అవసరమైన ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని, సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్తో కలిసి గ్యాస్ ఏజెన్సీల డీలర్లు, ఆయిల్ కంపెనీల సేల్స్ అధికారులు, వివిధ శాఖల అధికారులతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్త వం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవస రం లేదన్నారు. ప్రతిరోజూ బుకింగ్, సరఫరా వివరాలపై నివేదిక సమర్పించాలని డీలర్లను ఆదేశించారు. గృహ అవసరాలకు కేటాయించిన సిలిండర్ల ను వాణిజ్య అవసరాలకు మళ్లించినా లేదా అక్రమంగా నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టేందుకు పౌర సరఫరాల అధికారులు, డీటీలు, ఎస్సైలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలి పారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే నిత్యావస ర వస్తువుల చట్టం కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు సకాలంలో సరఫరా చేయాలని, డెలివరీ బాయ్స్ సిలిండర్లను దారి మళ్లించకుండా డీలర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే సిలిండర్లలో గ్యాస్ తూకం కచ్చితంగా ఉండాలని, తూని కల కొలతల శాఖ అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ సురేందర్రావు, అటవీశాఖ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటి ల్, ఆర్డీవో స్రవంతి, జిల్లా పౌర సరఫరాల అధికారి నందిని, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నూతన ఆవిష్కరణలకు ముందుకు రావాలి
కై లాస్నగర్: గ్రామీణ ప్రాంతాల్లోని నూతన ఆవి ష్కరణలను వెలికితీసి వాటిని వ్యాపార మార్గాలుగా మలిచేందుకు యువత ముందుకు రావాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమం నిర్వహించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 40 మందికి పైగా యువ ఆవిష్కర్తలు, విద్యార్థులు వ్యవసాయానికి ఉపయోగపడే పరికరాలు, పర్యావరణహి త ఇంధన వనరులు, ఆరోగ్య రంగానికి సంబంధించిన వినూత్న నమూనాలు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి కేవలం మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉన్న ప్రతిభను వెలికితీయాల్సిన అవసరముందన్నారు. స్థానికంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్లకు ప్రో త్సాహం అందించేందుకు జిల్లాలో ప్రత్యేకంగా ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చిన నిపుణుల బృందం ఆవిష్కర్తలతో ప్రత్యక్షంగా చర్చించి వారి ఆలోచనలను మరింత మెరుగుపరుచుకునేలా మార్గనిర్దేశం చేసింది. ఐడియా వ్యాలిడేషన్, ప్రోటోటైపింగ్, గోటు మార్కెట్ స్ట్రాటజీ, నిధుల సమీకరణ, మార్కెటింగ్, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీపీవో రమేశ్, డీపీఆర్వో విష్ణువర్ధన్, తహసీల్దార్ శ్రీనివాస్, ఈడీఎం రవి, రెడ్కో డీఎం శ్రీనివాస్, వివేకానంద కళాశాల ప్రిన్సిపాల్ నికినీ వర్మ, టీజీఐసీ ప్రతినిధులు ప్రణయ్, రమేశ్గౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
వదంతులు నమ్మొద్దు
ఆదిలాబాద్టౌన్: వంట గ్యాస్ విషయంలో సోషల్ మీడియాలో వచ్చే వదంతులు ప్రజలు నమ్మవద్దని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పట్టణంలోని విమల్ గ్యాస్ ఏజెన్సీని శనివారం పరిశీలించారు. నిర్వాహకులతో మాట్లాడి స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆన్లైన్ బుకింగ్, ఇతర అంశాలపై పలు సూచనలు చేశారు. వంట గ్యాస్ను అక్రమంగా, అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని శాఖల సమన్వయంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే టోల్ఫ్రీ నం.18004251939పై సంప్రదించాలని సూచించారు. ఆయన వెంట ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, వన్టౌన్ ఎస్సై సునిల్ కుమార్, సిబ్బంది తదితరులు ఉన్నారు. రంజాన్ క్రమశిక్షణ, దాతృత్వానికి ప్రతీకఆదిలాబాద్: రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి ప్రతీక అని ఎస్పీ అఖిల్ మహా జన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఖిజార మసీద్లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్లో ఆయన పాల్గొన్నారు. పవిత్ర మాసంలో నిరుపేదలకు అండగా నిలబడటం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో మసీద్ కమిటీ సభ్యులు, పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. -
తాళం వేసి ఉన్న రెండిళ్లలో చోరీ
తానూరు: మండలంలోని భోసి గ్రామంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలిపారు. గ్రామానికి చెందిన అర్ధాపూర్ గంగాధర్ కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లగా, సాయినాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి మరో ఇంట్లో పడుకున్నారు. గుర్తు తెలి యని దుండగులు ఇళ్ల తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. గంగాధర్ ఇంట్లో బీరువాలో ఉన్న రూ.79 వేలు, సాయినాథ్ గౌడ్ ఇంట్లో రూ.వెయ్యి నగదు అపహరించారు. శనివారం ఉదయం బాధిత కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ముధోల్ సీఐ రవీందర్నాయక్, ఎస్సై షేక్ జుబేర్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
గుండు గీయించారని నిలదీత
ఖానాపూర్: పట్టణంలోని హైటెక్ సిటీ కాలనీలో గల మైనార్టీ పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్న విద్యార్థికి తల్లిదండ్రుల అనుమతి లేకుండా పాఠశాల సిబ్బంది గుండు గీయించారు. విషయం తెలుసుకున్న సదరు విద్యార్థి తండ్రి రవి శనివారం పాఠశాలకు చేరుకుని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సంప్రదాయం ప్రకారం తల్లి దండ్రులు చనిపోయినప్పుడు లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మాత్రమే గుండు చేయించుకుంటారని, ఇలాంటి చర్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ హైమద్ను వివరణ కోరగా గుండు తీసిన విషయం తన దృష్టికి రాలేదని, ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. -
కట్నం ఇడే కాద్ తోద్.. అంటున్న ‘కొలాం’
● సమాజ మార్పునకు ఆదివాసీల శ్రీకారం ● ఉమ్మడి జిల్లాలో గోండు, కొలాం, పర్ధాన్ పెద్దల తీర్మానం ● ఇప్పటికే పలు గ్రామాల్లో అమలులోకివరకట్నం.. వివాహ సమయంలో వధువు కుటుంబం నుంచి వరుడి కుటుంబా నికి నగదు, బంగారం, ఆస్తుల రూపేణ బదిలీ చేసే ఒక సామాజిక దురాచారం. ఆడపడుచు కుటుంబా నికి ఇబ్బందిగా మారిన దీనిని రూపుమాపేందుకు ప్రభుత్వాలు చట్టాలెన్ని చేసినా క్షేత్రస్థాయిలో అమలుకు మాత్రం నోచుకోని దుస్థితి. ఈ క్రమంలో సామాజిక బాధ్యతగా గుర్తించిన ఆదివాసీ తెగలు వరకట్నం నిషేధం వైపు మొగ్గు చూపుతున్నాయి. కట్నం ఇవ్వొ ద్దు.. తీసుకోవద్దు అని గ్రామాల్లో తీర్మానాలతో పాటు అమలుకు శ్రీకారం చుడుతున్నాయి. ‘హైరి కీవల్ సిల్లే’ ‘కట్నం ఇదే కాద్ తోద్’ వంటి తీర్మానాలతో ముందడుగు వేస్తున్న ఆయా తెగలపై ఈ వారం సండే స్పెషల్. సిరికొండ: ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లంటే ఆ కుటుంబంపై ఆర్థిక భా రం చెప్పనవసరం లేదు. కట్నా లు, కానుకలు, ఆర్భాటాలు వంటివి చెప్పుకుంటే పోతే పెద్ద లిస్టే అవుతోంది. అలాంటిది తమ గూడెంలో అమ్మాయి పెళ్లిని ఆర్భాటం లేకుండా సంప్రదాయబద్ధంగా నిర్వహించాలని ఊరి పెద్దలు భావించారు. ఈనెల 9న సమావేశమయ్యారు.‘హైరి కీవల్ సిల్లే’ వరకట్నం నిషేధించడంతో పాటు పెళ్లి కూతురు కుటుంబానికి తలా కొంత ఆర్థికంగా చేదోడుగా నిలవాలని నిర్ణయించారు. వెంటనే అమలులోకి తెచ్చారు సిరికొండ మండలంలోని కోసుపటేల్ గూడవాసులు. సాత్నాల: వరకట్న సమస్య కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుందని కొలాం తెగ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పెళ్లి అనేది పవిత్ర బంధమని.. దానిని డబ్బు, ఆస్తులతో కొలవకూడదని భావించింది. ఇకపై వరకట్నం ఇవ్వొద్దు.. తీసుకోవద్దని నిర్ణయించింది. ఇందులో భాగంగా సాత్నాల మండలంలోని టెంబ్రీగూడలో పటేళ్లు, కులస్తులు ఇటీవల సమావేశమయ్యారు. సాత్నాల, బేల, జైనథ్, ఇంద్రవెల్లి మండలాల్లోని ఆయా గ్రామాలకు చెందిన దాదాపు 150 పాల్గొన్నారు. వరకట్నం అనేది తమ సంస్కతిలో భాగం కాదని నిషేధించాలని తీర్మానం చేశారు. ఆడంబరాలకు వెళ్లి అప్పుల పాలు కావద్దన్నారు. పెళ్లిళ్లు సాంప్రదాయబద్ధంగా ఉండాలని, రూ.లక్షలు ఖర్చయ్యే రెడీమేడ్ మండపాలకు దూరంగా ఉండడంతో పాటు మద్యపానం నిషేధించాలన్నారు. డీజేలు వంటి వాటి జోలికి వెళ్లకుండా పిప్రి వాయిద్యాలతో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. పెళ్లిలో చదివింపుల్లో భాగంగా వస్తువులు కాకుండా నగదు రూపంలో అందిస్తే కుటుంబాలనికి ఆసరాగా ఉంటుందని తీర్మానించారు.ఆడబిడ్డ పెళ్లికి ఊరంతా సాయం -
ట్రిపుల్ఐటీలో రెండో రోజు అంతఃప్రజ్ఞ
బాసర: బాసర ఆర్జీయూకేటీలో శనివారం రెండోరోజు అంతఃప్రజ్ఞ 2కే–26 నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతి చిన్న వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలవత్ పూర్ణ తన జీవిత ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లు, విజయానికి దారితీసిన పట్టుదల గురించి వివరించారు. కార్యక్రమంలో భాగంగా కార్లు, బైక్ల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్చాన్స్లర్ గోవర్ధన్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఈ.మురళీదర్శన్, ఫ్యాకల్టీ కన్వీనర్ స్వప్నిల్ జంగలే విద్యార్థులు రూపొందించిన వినూత్న ప్రాజెక్టులను పరిశీలించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో నినా ఏఐ ఏజెంటిక్ ఫ్రేమ్వర్క్, పిల్లల కోసం రూపొందించిన ఏఐ ఆధారిత లెర్నింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో స్మార్ట్ వాటర్ ఫ్లో అండ్ పైప్లైన్ లీకేజ్ డిటెక్షన్ సిస్టమ్, స్మార్ట్ డ్రగ్ డిస్పెన్సర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగంలో హెలియో ఆక్వా రిఫైనర్ , ఈవీ ఛార్జింగ్ స్టేషన్ వంటి ప్రాజెక్టులు ప్రదర్శించబడ్డాయి. పోస్టర్ ప్రజెంటేషన్ విభాగంలో క్వాంటం కమ్యూనికేషన్ ప్రాజెక్ట్ విజేతగా నిలిచింది. బహుమతులు అందజేతఅంత ప్రజ్ఞలో కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన క్రీడాపోటీల్లో విజేతలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బహుమతులు అందజేశారు. -
పోస్టల్ శాఖ ద్వారా రాములోరి తలంబ్రాలు
భైంసా: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి కళ్యాణోత్సవానికి సంబంధించిన తలంబ్రాలు, ప్రసాదాలు భక్తులకు సులభంగా అందించేలా పోస్టల్ శాఖ ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భద్రాచలం దేవస్థానం నుంచి పంపించే తలంబ్రాలు, ప్రసాదాలను పోస్టల్ శాఖ భక్తుల ఇళ్లకు చేరవేసే ఏర్పాట్లు చేశారు. ఇందులోభాగంగా భైంసాలో శనివారం ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి పోస్టల్ అధికారులు ప్రసాదాలు బుక్ చేశారు. ఈ సందర్భంగా పోస్టల్ సబ్ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్ మాట్లాడుతూ భక్తులు పోస్టాఫీసుల ద్వారా తలంబ్రాలు, ప్రసాదాలను బుక్ చేసుకుని ఇంటి వద్దే పొందవచ్చని తెలిపారు. భక్తులు భద్రాచలం వెళ్లలేని పరిస్థితుల్లో ఈ సేవల ద్వారా సులభంగా తలంబ్రాలు అందుకుంటారని చెప్పారు. ఇప్పటి వరకు భైంసా సబ్ డివిజన్ పరిధిలో 540కిపైగా ప్రసాదాలు బుక్ అయ్యాయని పేర్కొన్నారు. ఈనెల 20 వరకు అన్ని పోస్టాఫీసుల్లో ఈ సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భైంసా సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోస్టాఫీసుల్లో ఈ బుకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. భక్తులు ముందుగా బుక్ చేసుకుంటే తలంబ్రాలు ప్రసాదాలు పోస్టల్ శాఖ భద్రంగా వారి చిరునామాలకు చేరవేస్తుంది చెప్పారు. కార్యక్రమంలో పోస్టల్ అసిస్టెంట్ సీహెచ్.వినోద్కుమార్, పోస్టల్ ఎంవో డి.నరేష్కుమార్, బీపీఎంలు, ఏబీపీఎంలు పాల్గొన్నారు. -
పశుగ్రాసం సాగు ఎంతో మేలు
చెన్నూర్రూరల్: వరి కోసేందుకు రైతులు ఎక్కువగా యంత్రాలను వినియోగిస్తున్నారు. దీంతో వరిగడ్డి ముక్కలు, ముక్కలుగా కావడంతో ఎక్కువగా పశువుల మేతకు పనికిరాకుండా పోతోంది. దీంతో వేసవిలో పశుగ్రాసం కొరత ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు రైతులు గడ్డిజొన్నను సాగుచేస్తే పశుగ్రాసానికి కొరత ఏర్పడకుండా ఉంటుంది. జిల్లా కేంద్రంలోని వెటర్నటీ ఆసుపత్రి స్టోర్లో గడ్డిజొన్న ఎస్హెచ్జీ రకం విత్తనాలు 8.9 టన్నులు అందుబాటులో ఉన్నాయని, రైతులకు 75 శాతం సబ్సిడీపై అందించనున్నట్లు జిల్లా పశువైద్యాధికారి యాకూబ్రెడ్డి తెలిపారు. జిల్లాలో 12,09,436 మూగజీవాలుజిల్లాలో 1,38,536 ఆవులు, 1,04,080 గేదెలు, 2,42,616 ఎద్దులు, 5,36,913 గొర్రెలు, 1,87,291 మేకలు ఉన్నాయి. మండలాల వారీగా పశువుల సంఖ్యను బట్టి గడ్డిజొన్న విత్తనాలు పంపిణీ చేయనున్నారు. రైతులు సూపర్ నేవియర్ అనే గడ్డిజాతి రకాన్ని పెంచుకుంటే ఏళ్ల తరబడి పశువులకు గ్రాసం లభిస్తుంది. డెయిరీ ఫాంలు ఉన్న రైతులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ గడ్డి రకం కట్ చేసిన కొద్దీ పెరుగుతుంది. చిన్నచిన్నగా కట్ చేసిన ముక్కలను రెండున్నర ఫీట్లకు ఒకటి చొప్పున భూమిలో నాటుకుంటే ఇవి మొలకెత్తుతాయి. అలాగే హెడ్జ్ లూసర్న్ రకం మొక్కలలో మాంసకృత్తులు అధికంగా ఉండి ఆవులు, గేదెలు పాలను అధికంగా ఉత్పత్తి చేస్తాయి. విత్తనాలు విత్తిన 45 రోజులకు ఈ గడ్డిజొన్న కోతకు వస్తుంది. కోత కోసి పశువులకు మేతగా వేసిన తర్వాత మళ్లీ పిలకలు వచ్చి మొక్కలు ఎదుగుతాయి. ఏళ్లతరబడి పశుగ్రాసం లభిస్తుంది. బహు వార్షికాలను కూడా పెంచవచ్చు. ఇవి విత్తనాలు కాకుండా మొక్కలను లేదా కాండపు పిలకలను నాటగానే కలుపు పెరగకుండా ఉండేందుకు 30 నుంచి 60 రోజులకు ఒకసారి అవసరాన్ని బట్టి నీటితడులు ఇవ్వాలి. యాజమాన్య పద్ధతులు పాటిస్తూ పశుగ్రాసం సాగు చేసుకుంటే వేసవిలో కూడా పశువులకు గ్రాసం కొరత ఏర్పడకుండా ఉంటుంది. ఎస్హెచ్జీ ఏక వార్షిక గడ్డిజొన్న సాగు చేస్తే ఏడాది పాటు పశువులకు గ్రాసం లభిస్తుంది.రైతులు దృష్టి సారించాలి వేసవిలో పశువులకు మేత సరిగా దొరకదు. కాబట్టి రైతులు పశుగ్రాసం సాగుపై దృష్టి సారించాలి. ఎస్హెచ్జీ రకం గడ్డి జొన్న విత్తనాలు సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా డెయిరీఫాంలు నడిపించే రైతులు పశుగ్రాసాలను తప్పకుండా సాగు చేయాలి. అలాగే వేసవిలో పశువులు, జీవాల పట్ల తగు జాగ్రత్తలు పాటించాలి. – యాకూబ్రెడ్డి, జిల్లా పశువైద్యాధికారి, మంచిర్యాల


