Adilabad
-
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు
కై లాస్నగర్: రైతులకు ఇబ్బందులు కలుగకుండా యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అ ధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచి వాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి ఆయన సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు కేంద్రాల్లో తగు చర్యలు చేపట్టాలన్నారు. సరిపడా టార్పాలిన్లు, తేమనిర్ధారణ యంత్రాలను అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటా యించిన రైస్ మిల్లులకు వెంటవెంటనే పంపించాలన్నారు. ఇందులో కలెక్టర్ రాజర్షిషా, అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రు, పౌర సరఫరాల శాఖ అధికారులు నందిని, సుధారాణి, తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీ నృత్యోత్సవంలో మెరిసిన ‘బాలకేంద్రం’
ఆదిలాబాద్: దేశ రాజధానిలో జిల్లా బాల కేంద్రం చిన్నారులు తమ కూచిపూడి నృత్య ప్రతిభతో సత్తా చాటారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్, అంబేద్కర్ ఆడిటోరియంలో ఆదివారం రాత్రి నిర్వహించిన జాతీయ నృత్య పురస్కార మహోత్సవంలో అద్భుత ప్రదర్శన ఇచ్చి అవార్డులు సొంతం చేసుకున్నారు. తెలుగు ఉద్యోగుల సంక్షేమ సంఘం, న్యూఢిల్లీ, హైదరాబాద్కు చెందిన సాంస్కృతిక లలిత కళల సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో నృత్యోత్సవం నిర్వహించారు. ఇందులో గడ్డం శ్రీనిధి, క్షీరసాగర జాహ్నవి, లింగంపల్లి సాయి కార్తీక, పడాల ధన్విక ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. వీరి ప్రతిభను గుర్తించిన నిర్వాహకులు వారికి పురస్కారాలు అందజేయడమే కాకుండా, మలేషియాలో నిర్వహించే అంతర్జాతీయ నృత్య పోటీలకు ఎంపిక చేసినట్లు ప్రకటించారు. అలాగే హాలీవుడ్ ఫిలిం డైరెక్టర్ సత్యరెడ్డి తన తదుపరి సినిమాలో వీరికి నటించే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విజేతలను మాస్టర్స్, తల్లిదండ్రులు, బాల కేంద్రం పర్యవేక్షకుడు మిట్టు రవి ప్రత్యేకంగా అభినందించారు. -
పోలీసుల స్పెషల్డ్రైవ్
ఆదిలాబాద్టౌన్: జిల్లావ్యాప్తంగా ఆదివారం రాత్రి పోలీసులు భారీ ‘స్పెషల్ డ్రైవ్’ నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి10 గంటల వరకు 20 పోలీస్ స్టేషన్ల పరిధిలో తనిఖీలు చేపట్టారు. 1,558 వాహనాలను తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఇందులో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారు 79 మంది (డ్రంకెన్ డ్రైవ్), నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వాహనాలు 61, మైనర్ డ్రైవింగ్కు సంబంధించి 9 కేసులు నమోదయ్యాయి. అలాగే అర్ధరాత్రి వేళ అనుమానాస్పదంగా తిరుగుతున్న 200 మంది వ్యక్తుల వేలిముద్రలను పోలీసులు సేకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ రహదారి ప్రమాదాల నివారణకు, ప్రజల భద్రతకే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. -
పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట
ఆదిలాబాద్టౌన్: పశువుల అక్రమ రవాణాను పూర్తి గా అడ్డుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వన్టౌన్లో చెక్పోస్టు సిబ్బందికి సోమవారం పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బక్రీద్ సందర్భంగా జిల్లాలో ఏడు చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిప్పర్వాడ, ఆనంద్పూర్, శంకర్గూడ, లక్ష్మిపూర్, లోకారి, ఉట్నూర్, ఘన్పూర్లో 24 గంటల పాటు తనిఖీలు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎస్సై స్థాయి అధికారి పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న పశువులు లభిస్తే వెంటనే గోశాలకు తరలించాలన్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎస్పీ వెంట ఆది లాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు సునిల్ కుమార్, నాగరాజు, ప్రేమ్కుమార్, శ్రావణ్, రమేష్ తదితరులున్నారు. శిక్షణతో పిల్లల్లో ప్రత్యేక ప్రావీణ్యం శిక్షణతో పిల్లల్లో ప్రత్యేక ప్రా వీణ్యం లభిస్తుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన వేసవి శిబి రాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఐదు చోట్ల 550 మంది విద్యార్థులతో వేసవి శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ ఏఆర్ హెడ్క్వార్టర్స్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, నార్నూర్, బోథ్లో ఏ ర్పాటు చేసిన శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీలు ఎల్.జీవన్ రెడ్డి, ఇంద్రవర్ధన్, మావల ఎస్హెచ్ఓ రాహుల్కాంత్, సీఐలు నాగరాజు, సునిల్ కుమార్, ప్రేమ్కుమార్, శ్రావణ్, చంద్రశేఖర్, వెంకటి పాల్గొన్నారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలిమాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ అఖి ల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డవ్ (డీఅడిక్షన్ అండ్ వెల్నెస్) సెంటర్ను సోమవారం సందర్శించారు. మాదకద్రవ్యాల వ్యసనానికి గురైన వారికి ఈ సెంటర్ ఒక మంచి అవకాశమని తెలిపా రు. ఆయన వెంట ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, మావల ఎస్హెచ్వో రాహుల్ కాంత్, టూటౌన్ సీఐ నాగరాజు, మావల సీఐ కె.స్వామి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసు అధికారులకు సూ చించారు. సోమవారం పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. 24 మంది తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసి సత్వరమే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.ఇందులో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, సిబ్బంది పాల్గొన్నారు. -
రైతుల సమస్యలపై రాజకీయాలు వద్దు
ఆదిలాబాద్టౌన్: రైతుల సమస్యలపై రాజకీయాలు చేయవద్దని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో తలమడుగు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్రెడ్డితో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ. 3,180 (హైబ్రిడ్) మద్దతు ధరతో కొనుగోళ్లు చేపడుతోందని, రైతులు 14 శాతం తేమ మించకుండా పంటను తీసుకురావాలని సూచించారు. దళారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఇందులో మున్సిపల్ చైర్ పర్సన్ అనూష, బీజేపీ నాయకులు దయాకర్, మార్కెట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
పసిడి ధర పెరగడంతోనే..
ఇలా కేటుగాళ్లు దుకాణాలు, ఏటీఎంలను ఎక్కువగా టార్గెట్ చేస్తూ తమ పని కానిచ్చేస్తున్నారు.ఆదిలాబాద్టౌన్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ జ్యూయలరీ షాపులో పట్టపగలే దుండగులు లూ టీకి పాల్పడ్డ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. జిల్లా వ్యాపారుల్లోనూ ఇది గుబులు రేపుతోంది. మనమెంత భద్రం అనే దానిపై సర్వత్రా చ ర్చ మొదలైంది. పసిడి ధరలు ఆకాశాన్ని అంటడంతో కేటుగాళ్లు బంగారు దుకాణాలపై కన్నేస్తున్నారు. అలాగే మహిళల మెడలో నుంచి ఆభరణాలు సైతం ఎత్తుకెళ్తున్నారు. అంతేకాకుండా వ్యాపార సముదాయాల్లోనూ చోరీలకు పాల్పడుతున్నారు. ఏటీఎం సెంటర్లను దోచుకెళ్తున్నారు. ఈక్రమంలో పో లీసు శాఖ ఇటీవల వ్యాపారులంతా తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించా రు. చోరీలు, సంఘటనలు జరిగినప్పుడు నిందితులను త్వరితగతిన గుర్తించడంతో పాటు పట్టుకునేందుకు ఆస్కారం ఉంటుందని పేర్కొంటున్నారు. భద్రత పాటిస్తేనే చోరీలకు చెక్.. జ్యూయలరీ షాపులు, సూపర్ మార్కెట్లు, ఏటీఎం సెంటర్లు, బ్యాంకులు, వైన్స్లు, ఇతర వ్యాపార, వా ణిజ్య సముదాయాల్లో భద్రత చర్యలు పాటిస్తేనే చో రీలకు చెక్ పడనుంది. ప్రతీ దుకాణంలో లోపల, బ యట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పో లీసులు సూచిస్తున్నారు. ఏటీఏంలు, జ్యూయలరీ షాపుల్లో సెక్యూరిటీ గార్డులను నియమించుకోవ డం మంచిదని పేర్కొంటున్నారు. అలాగే షాపుల్లో సైరన్ అలారం ఏర్పాటు చేసుకుంటే తుపాకులు, ఇతర ఆయుధాలతో లోనికి చొరబడినప్పుడు వాటి ని నొక్కితే సైరన్ మోగి దొంగలు పారిపోయే అవకాశం ఉంటుంది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని అప్రమత్తం అవ్వడంతో వారి ఆగడాలకు చెక్ పెట్టవచ్చని పోలీసు అధికారులు చెబుతున్నారు. జిల్లా కేంద్రంలోని వ్యాపార సముదాయాలుబంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం తులం ధర రూ.లక్ష 50వేలకు పైగా పలుకుతుంది. తక్కువ మొత్తంలో దోపిడీకి పాల్పడినా ఎక్కువ మొత్తంలో డబ్బులు రాబట్టుకోవచ్చనే భావనతో దుండగులు ఇలాంటి చోరీలకు యత్నిస్తున్నారు. అలాగే మహిళల మెడలో నుంచి సైతం కేటుగాళ్లు బంగారు గొలుసులను ఎత్తుకెళ్తున్నారు. రోజుకో కొత్త పుంతల్లో చోరీలకు పాల్పడుతున్నారు. -
తెలంగాణలోనూ బీజేపీ అధికారం ఖాయం
ఆదిలాబాద్: తెలంగాణలోనూ బీజేపీ అధికారంలో కి రావడం ఖాయమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూల ఫలి తాలు రావడంతో జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం సంబరాలు నిర్వహించారు. పార్టీ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి, మి ఠాయిలు పంచారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్ని కల ఫలితాల్లో దాదాపు 90 శాతం బీజేపీకి అనుకూలంగా ఉండటం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇందులో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు లాలా మున్నా, జోగు రవి, దినేష్ మటోలియా, ఘటిక క్రాంతి, సుమన్, మయూర్ చంద్ర, కృష్ణ యాదవ్, శ్రీకాంత్, ఉదయ్, సూర్య, కిరణ్ సాయి పాల్గొన్నారు. -
అర్జీలు పెండింగ్లో ఉంచొద్దు
కై లాస్నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలు పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని అదనపు కలెక్టర్లు ఎస్.రాజేశ్వర్, ఆర్ఎస్. చిత్రు అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పింఛన్లు, ఉపాధి హామీ పథకం పనులు, భూ సమస్యల పరిష్కారం వంటి సమస్యలపై పలు అర్జీలు అందాయి. అందులో కొందరి నివేదన ఇలా.. మేమంతా ఎలాంటి జీవనాధారం లేని నిరుపేదలం. పక్కా ఇండ్లు లేవు. ఉన్న స్థలంలో చిన్నపాటి గుడిసెలు వేసుకుని ఏళ్లుగా కాలం వెల్లదీ స్తున్నాం. మాలాంటి వారి కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం ఆనందంగా ఉంది. ఎల్–2 జాబితాలో పేర్లు కలిగిన మాకు ఇళ్లు మంజూరు చేయాలని కోరుతున్నాం. – డొప్టాల గ్రామస్తులు, బేల మండలం సర్వేనంబర్ 70నుంచి 8వరకు గల 2 కిలో మీటర్ల మేర పంటచేలకు వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉంది. ఈ సర్వేనంబర్ల పరిధిలో మండలంలో ఆరు గ్రా మాల రైతులకు సంబంధించి వెయ్యి ఎకరాలకు పైగా పంట చేలు ఉన్నాయి. సరైన రోడ్డు సౌకర్యం లేక వానాకాలంలో తీవ్ర ఇబ్బందులు ప డుతున్నాం. పొలంబాటలో భాగంగా రోడ్డు నిర్మా ణం చేపట్టి సమస్య పరిష్కరించాలని కోరుతున్నాం. – గిర్నూర్ రైతులు, బజార్హత్నూర్(మం) మేమంతా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వచ్ఛ కార్మికులం. మండుతున్న ఎండల తీవ్రతకు పాఠశాలల్లోని మొక్కలను సంరక్షించాల్సి న బాధ్యత మాపై ఉంటుంది. దీంతో సెలవు రోజుల్లోనూ పచ్చదనం, పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించే మాకు ప్రభుత్వం వేసవి సెలవుల్లో వేతనాలు మాత్రం మంజూరు చేయడం లేదు. మా కు న్యాయం చేసేలా చూడాలని కోరుతున్నాం. – ప్రభుత్వ పాఠశాలల స్వచ్ఛ కార్మికులు -
గస్తీ మరింత పటిష్టం చేయాలి..
బంగారం ధర పెరగడంతో దొంగలు రెచ్చిపోతున్నారు. పోలీసులు ప్రస్తుతం గస్తీ నిర్వహిస్తున్నప్పటికీ మరింతగా పెంచాలి. సీసీ కెమెరాలు సంఘం, పోలీసుల ఆధ్వర్యంలో మరిన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. బంగారు దుకాణాల యజమానులు అప్రమత్తంగా ఉండడంతోనే చోరీలను నియంత్రించవచ్చు. – లక్ష్మణ్రాజు, శ్రీనిధి జ్యూయలరీ యజమాని, ఆదిలాబాద్ ఎమర్జెన్సీ సైరన్ ఏర్పాటు చేసుకోవాలి.. జ్యూయలరీ షాపుల యజమానులు, ఏటీఎం సెంటర్ల వద్ద ఎమర్జెన్సీ సైరన్ ఏర్పాటు చేసుకోవాలి. దీంతో దుండగులు లోనికి చొరబడి ఆయుధాలతో బెదిరించినప్పుడు అలారం మోగితే చుట్టుపక్కల వారితో పాటు పోలీసులు అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రతీ షాపు వద్ద సెక్యూరిటీ గార్డులతో పాటు ఎంట్రీవద్ద మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేసుకోవాలి. దీంతో ఆయుధాలు ఉన్నవారిని లోనికి రాకుండా అడ్డుకోవచ్చు. కరీంనగర్లో జరిగిన ఘటనకు సంబంధించి దుండగులు జిల్లా మీదుగా వెళ్తే వారిని పట్టుకోవడానికి పిప్పర్వాడ టోల్ప్లాజా వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేశాం. – ఎల్.జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ -
నీటి దాత.. సుఖీభవ
ఓ వైపు ఎండల తీవ్రత పెరిగింది. భూగర్భ జలాలు అడుగంటి ప్రజలకు నీటి ఇక్కట్లు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఇచ్చోడ టీచర్స్కాలనీలో గల ఈ బోరు స్థానికుల నీటి అవసరాలు తీర్చుతోంది. ఒక్కటి కాదు.. రెండు కాదు ఏకంగా 15 కనెక్షన్లతో సుమారు 50 ఇళ్లకు నీటిని అందిస్తోంది. రిటైర్డ్ ఆర్మీ జవాన్ జాదవ్ అశోక్ ఇంటి వద్ద ఉన్న ఈ బోరు బావికి మండు వేసవిలోనూ నీటి లభ్యత పుష్కలంగా ఉంటుంది. దీంతో కాలనీవాసులను వాడుకోవాలని సూచించగా వారు ఇలా ఇద్దరు ముగ్గురు కలిపి ఓ కనెన్షన్ చొప్పున ఏర్పాటు చేసుకున్నారు. నాలుగేళ్లుగా దాదాపు 50 కుటుంబాలకు 24 గంటల పాటు నీటిని అందిస్తున్న అశోక్ను పలువురు అభినందిస్తున్నారు. – ఇచ్చోడ -
‘ఉపాధి’ నిర్వీర్యానికి కేంద్రం కుట్ర
కై లాస్నగర్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను ఐక్యంగా ఎండగట్టాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. వీబీజీ రామ్జీ పేరిట తీసుకువస్తున్న కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్జీ పేరిట కార్మికుల హక్కులను దెబ్బతీయాలని చూస్తోందన్నారు. గతంలో 95 శాతం వరకు నిధులు కేటాయించిన కేంద్రం, ప్రస్తుతం కేవలం 60 శాతానికి పరిమితం చేస్తూ పథకాన్ని క్రమంగా కనుమరుగుచేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఉపాధి హామీ కార్మికుల సంక్షేమం కోసం సీపీఎం చేపడుతున్న పోరాటాలకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఇందులో నాయకులు మల్లేశ్, రాఘవులు, కిరణ్, దత్తు తదితరులు పాల్గొన్నారు. -
త్వరలోనే అందుబాటులోకి..
మున్సిపల్ పరిధిలో వందలాది వాహనాలు ఉన్నాయి. ప్రతినెలా వాటి నిర్వహణ పేరిట లక్షల్లో ఖర్చవుతుంది. ఇందులో వేలాది రూపాయల దుర్వినియోగం అవుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే బల్దియా ఆధ్వర్యంలో సొంతంగా గ్యారేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం రూ.50లక్షలు కేటాయించాం. సామగ్రితో పాటు షెడ్ నిర్వహణకు అవసరమైన టెండర్లు నిర్వహిస్తున్నాం. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే సంబంధిత కాంట్రాక్టర్కు పనులు కేటాయించి త్వరితగతిన అమలులోకి తెచ్చేలా చూస్తాం. – బండారి అనూష, మున్సిపల్ చైర్పర్సన్ -
సీసీఐ నిర్వాసితులకు న్యాయం చేయాలి
ఆదిలాబాద్టౌన్: సీసీఐ భూ నిర్వాసితులకు న్యా యం చేస్తూ సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభించాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని యాదవ సంఘ భవనంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ‘సీసీఐ పరిశ్రమ కొత్త పరిణామాలు– మన కర్తవ్యం’ అంశంపై ఆదివారం చర్చావేదిక ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడా రు. పరిశ్రమ పునరుద్ధరణతో యువతకు ఉపాధి అవకాశాలతో పాటు అనేక కుటుంబాలు జీవనోపాధి పొందుతాయని అన్నారు. ప్రస్తుతం పరిశ్రమను తుక్కు కింద అమ్మే ప్రయత్నం జరుగుతుందని, దానిని సహించబోమని పేర్కొన్నారు. అవసరమైతే నిర్వాసితులతో కలిసి ఎంపీ, ఎమ్మెల్యే ఇళ్లను ము ట్టడిస్తామన్నారు. సమావేశంలో సీసీఐ సాధన కమి టీ నాయకులు విజ్జగిరి నారాయణ, కొండ రమేశ్, బండి దత్తాత్రి, నర్సింగ్, అరుణ్కుమార్, చారి, రాఘవులు, కిరణ్, తరుణ్కుమార్, రమేశ్, వెంకట్నారాయణ, పోశెట్టి, ప్రహ్లాద్, ప్రేమల, ఈశ్వర్, నర్సింగ్, శివ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రైతుల విషయంలో రాజకీయం వద్దు
జైనథ్: రైతులు పండించిన పంట కొనుగోలు విషయంలో రాజకీయం చేయొద్దని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మండల కేంద్రంలో ని మార్కెట్ కార్యాలయంలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ సహకారంతో ఏర్పాటు చేసి న జొన్న పంట కొనుగోలు కేంద్రాన్ని ఆదివా రం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అధి కారులు జొన్న పంట కొనుగోలు చేపడుతున్న విషయం తెలుసుకొని బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగడం సరికాదన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్రెడ్డి, పీఏసీఎస్ సీఈవో గంగన్న, ఉపసర్పంచ్ సుభాష్, వివిధ పార్టీల నా యకులు లింగారెడ్డి, జగదీశ్రెడ్డి, వెంకట్రెడ్డి, గణేశ్యాదవ్, రుకేష్రెడ్డి, రాందాస్ పాల్గొన్నారు. -
బల్దియా గ్యారేజ్
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపాలిటీకి ఇక సొంత వాహన గ్యారేజీ అందుబాటులోకి రానుంది. చెత్త సేకరణ, నీటి సరఫరా, ఇతరత్రా వాహనాల మరమ్మతులు, సర్వీసింగ్కు బల్దియా ఏటా లక్షలా ది రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. చిన్నపాటి మరమ్మతులకు సైతం కొన్నిసార్లు వేలాది రూపాయలు చెల్లిస్తున్నారు. దీంతో బల్దియాపై ఆర్థిక భా రం పడుతుంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలని భావించిన మున్సిపల్ నూతన కౌన్సిల్ సొంతంగా గ్యారేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇటీవల నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో రూ.50లక్షలు కేటాయిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించింది. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖర్చులు తగ్గించుకునేలా.. మున్సిపల్ పరిధిలో చెత్త సేకరణ, నీటి సరఫరాకు సంబంధించిన ట్రాక్టర్లు, ట్రాలీఆటోలు, పొక్లెయిన్లు, ట్యాంకర్లు వందలాదిగా ఉన్నాయి. వీటి నిర్వహణను ప్రైవేట్గా చేయిస్తున్నారు. దీంతో ప్రతినెలా మున్సిపల్ నుంచి రూ.లక్షల్లో వెచ్చించాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో అవసరం లేనప్పటికీ ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది తప్పుడు బిల్లులు సృష్టించి అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితులను గుర్తించిన నూతన కౌన్సిల్ సొంతంగా బల్దియా గ్యారేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గతనెల 29న నిర్వహించిన మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో రూ.50లక్షలు కేటాయిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. టెండర్లు నిర్వహణకు ఇంజినీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థలం ఎంపిక.. పట్టణంలోని 44వ వార్డు పరిధిలోకి వచ్చే సుందరయ్యనగర్లోని రక్షిత మంచినీటి స్థలంలో గల మున్సిపల్ ప్రాంతాన్ని అధికారులు ఎంపిక చేశారు. ఇప్పటికే అక్కడ తాత్కాలికంగా ప్రహరీ నిర్మించి ఉంది. దీన్ని పూర్తిస్థాయిలో గ్యారేజీగా రూపుదిద్దనున్నారు. మరమ్మతులకు ప్రత్యేక షెడ్లతో పాటు వాటర్ వాషింగ్ కోసం మిషన్ కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుతం మరమ్మతు పనులను ఇద్దరు కార్మికులు చేపడుతుండగా, గ్యారేజ్ అందుబాటులోకి వస్తేమరో ఇద్దరిని ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమించనున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే సంబంధిత కాంట్రాక్టర్ ద్వారా అవసరమైన సామగ్రి తెప్పించాలని భావిస్తున్నారు. మొత్తంగా బల్దియాకు సొంతంగా గ్యారేజ్ ఏర్పాటు కానుంది. -
జిల్లాలో..
ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వ పాఠశాలలను బలోపే తం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే బడుల్లో మౌలిక వసతులపై దృష్టి సారించింది. అలాగే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ సైతం బడులు తెరిచే రోజు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే 85 శాతం పుస్తకాలు జిల్లా కేంద్రంలోని గోదాములకు చేరాయి. ఈనెల 15 నుంచి వాటిని మండల పాయింట్లకు చేర్చేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే వీటిని రవాణా చేసేందుకు నిధులు విడుదల కాకపోవడంతో అయోమయంలో ఉన్నారు. చేరుకున్న పాఠ్య పుస్తకాలు.. పాఠ్యపుస్తకాల్లో తెలుగు, ఉర్దూ మీడియం వారికి పార్ట్–1 పుస్తకాలను పంపిణీ చేస్తారు. మొదటి విడ త జూన్లో పంపిణీ చేయనుండగా, నాలుగైదు నెలల తర్వాత పార్ట్–2 పుస్తకాలు రానున్నాయి. వీటిలో తెలు గు, ఉర్దూ ఒకవైపు ఉండగా, ఇంగ్లిష్లో మరోవైపు ముద్రించబడి ఉంటుంది. దీంతో ఆంగ్ల మాధ్య మం చదివే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం కొన్నేళ్లుగా ఈ విధానాన్ని అమలు చేస్తుంది. ఇంగ్లిష్, మరాఠీ, హిందీ మీడియంకు సంబంధించి ఒకేసారి సరఫరా అవుతా యి. అయితే ఈ పుస్తకాలను పార్ట్–1గా విభజించడం ద్వారా బరువు సైతం తగ్గిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. వీటితో పాటు విద్యార్థులకు నోట్బుక్లను సైతం ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఇవి నేరుగా పాఠశాలలకే సరఫరా కానున్నాయి. మొదటిరోజే పంపిణీ.. ప్రభుత్వం విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తుగానే పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రింటింగ్ ప్రెస్ల నుంచి జిల్లా కేంద్రాలకు సరఫరా చేసింది. అయితే ఇక్కడి నుంచి ఎంఆర్సీ పాయింట్లకు, అక్కడినుంచి స్కూళ్లకు సరఫరా చేయాల్సి ఉంది. గ తేడాది పాఠ్య పుస్తకాల పంపిణీలో కొంత ఆలస్యమైంది. ఈసా రి అలా జరగకుండా పుస్తకాలను సరఫరా చేసేందుకు విద్యా శాఖాధికారులు చర్యలు చేపడుతున్నాయి. పుస్తకాల పంపిణీకి గడువు సమీపిస్తుండడంతో పూర్తిస్థాయిలో సరఫరా అవుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న మండలాల ఎంఈవోలు గోదాం నుంచి పుస్తకాల ను తీసుకెళ్తుండగా, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ, బోథ్, ఇంద్రవెల్లి దూర ప్రాంతాల మండలాలకు సకాలంలో సరఫరా చేస్తే విద్యార్థులకు మొదటిరోజే పుస్తకాలను పంపిణీ చేసే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రాథమిక స్థాయికి సంబంధించిన పుస్తకాలు ఇంకా పూర్తిస్థాయిలో సరఫరా కాలేదు. సకాలంలో పుస్తకాలు పాఠశాలలకు చేరుకుంటే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. జిల్లాలో.. మొత్తం పాఠశాలలు : 1,439 రావాల్సిన పాఠ్యపుస్తకాలు : 4,80,700 ఇప్పటివరకు చేరుకున్నవి : 4,10,000 ఇంకా రావాల్సినవి : 70,700డీఈవో పరిధిలో 702 పాఠశాలలు ఉండగా, మిగతా అన్ని యాజమాన్యాలు కలిపి 1,439 ఉన్నాయి. కాగా ప్రైవేట్ మినహా మిగతా యాజమాన్యాలకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుంది. జిల్లాకు అవసరమైన పుస్తకాలు 4లక్షల 80వేల 700 పుస్తకాలు అవసరం ఉండగా, ఇప్పటివరకు 4లక్షల10వేల పుస్తకాలు చేరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్వీఎం గోదాంతో పాటు మార్కెట్ యార్డులో వీటిని భద్రపర్చారు. ఈనెల 15 నుంచి ఆయా పాఠశాలలకు సరఫరా చేసేందుకు అధికారులు నిర్ణయించారు. అయితే రవాణా చార్జీలు విడుదల కాకపోవడంతో సరఫరా ఏవిధంగా చేయాలనే ఆలోచనలో పడ్డారు. గతేడాది డీసీఈబీ నుంచి నిధులను సమకూర్చారు. -
ప్రశాంతంగా నీట్
● 48 మంది విద్యార్థుల గైర్హాజరు ● కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ కై లాస్నగర్: వైద్య విద్యలో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ ప్రవేశ అర్హత పరీక్ష (నీట్) ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 1700 మంది దరఖాస్తు చేసుకోగా వారి కోసం జిల్లా కేంద్రంలో ఏడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు సాగింది. బయోమెట్రిక్ అటెండెన్స్ నేపథ్యంలో విద్యార్థులను ఉద యం 11నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతించారు. నిర్ణీత సమయం ము గిసిన వెంటనే గేట్లను మూసివేశారు. ఎండ తీవ్రత నేపథ్యంలో విద్యార్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. వారిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చే సిన లోనికి అనుమతించారు. పరీక్షకు 1652 మంది హాజరుకాగా 48 మంది గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా కేంద్రాల వద్ద పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ సంయుక్తంగా పరిశీలించారు. నిర్వహణపై ఆరా తీఽశారు. వారి వెంట అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రు, ఆర్డీవో జగదీశ్వర్రావు, కో–ఆర్డినేటర్ అశోక్ పాల్గొన్నారు. ముగిసిన టీజీఆర్జేసీ ప్రవేశ పరీక్ష ఆదిలాబాద్టౌన్: టీజీ ఆర్జేసీసెట్ ఆదివారం ప్ర శాంతంగా ముగిసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఇందు కోసం జిల్లా కేంద్రంలో 19 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎంపీసీ, బైపీసీ కోర్సుల కోసం మొత్తం 4,617 మంది దరఖాస్తు చేసుకోగా, 3,426 మంది హాజరైనట్లు డీఈవో రాజేశ్వర్ తెలిపారు. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
బోథ్: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా 439 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను, బోథ్ మండలానికి చెందిన 235 మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను ఆయన పంపిణీ చేశారు. త్వరలోనే బోథ్లో నూతన ఫైర్ స్టేషన్ నిర్మాణం కానున్నట్లు పేర్కొన్నారు. ఇందులో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఆత్మ చైర్మన్ రాజు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని నేరేడిపల్లి, పరుపులపల్లె గ్రామస్తులు ఎమ్మెల్యేను కలిసి సమస్యలు విన్నవించారు. పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. శ్రీధర్ రెడ్డి, శంకర్, సర్పంచ్లు విశ్వేశ్వర్రావ్,కృష్ణ, ఉప సర్పంచ్ దర్ము తదితరులు పాల్గొన్నారు. రైతులకు తక్షణ సాయం అందించాలి నేరడిగొండ: నియోజకవర్గంలో ఇటీవల అగ్నిప్రమాదాలతో పంట పొలాల్లో వ్యవసాయ పనిము ట్లు, స్ప్రింక్లర్ పైపులు అగ్నికి ఆహుతైన ఘటనపై ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్పందించారు. జిల్లా హార్టికల్చర్ అధికారులతో శనివారం చర్చించారు. తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. -
సమన్వయంతోనే జిల్లా అభివృద్ధి
కై లాస్నగర్: జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం ఆదిలాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని స్థానిక ఎస్టీయూ భవన్లో నిర్వహించారు. ఎమ్మెల్యే శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ అనూషతో కలిసి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయా లేదా తెలుసుకునేందుకు యంత్రాంగం నిరంతరం గ్రామాలను సందర్శించాలన్నారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలన్నారు. ప్రజల నుంచి అందిన ప్రతీ దరఖాస్తును నిర్దేశించిన గడువులోపు పరిష్కరించాలని, ఇందులో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అలాగే దరఖాస్తుల స్థితిగతులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయాలన్నారు. పారదర్శకమైన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు వివిధ పథకాల ప్రయోజనాలను అందజేశారు. అక్కడ ఏర్పాటు చేసిన అంగన్వాడీల స్టాళ్లను తిలకించారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇందులో టీజీఎస్సీపీసీఆర్ సభ్యురాలు ప్రేమలత అగర్వాల్, అదనపు ఎస్పీ పి.సురేందర్రావు, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్రావు, డీపీవో రమేశ్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నీటి ఎద్దడి నియంత్రణపై ఫోకస్
కై లాస్నగర్: పట్టణ పరిధిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం.. అలాగే ఆదిలాబాద్ను క్లీన్ అండ్ గ్రీన్గా మార్చేందుకు చర్యలు చేపడుతాం.. బల్దియా ఆదాయం పెంచే దిశగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతామని అన్నారు ఇటీవల కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన జగదీశ్వర్గౌడ్. శనివారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. సాక్షి: మరో వారం, పది రోజుల్లో పట్టణంలోని పలు కాలనీల్లో నీటి ఎద్దడి తీవ్రమయ్యే అవకాశముంది.. నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపడుతారు? కమిషనర్: ప్రస్తుతం మిషన్ భగీరథ నీటితో పాటు లాండసాంగ్వి, మావల నుంచి కూడా నీటి సరఫరా జరుగుతుంది. సమస్య తలెత్తితే ఆయా ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తాం. సాక్షి: పట్టణంలోని 49 వార్డులకు ఒకే శానిటరీ ఇన్స్పెక్టర్ ఉండటంతో పర్యవేక్షణ లోపించి పారిశుద్ధ్య నిర్వహణ గాడి తప్పుతుందనే విమర్శలున్నాయి.. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కమిషనర్: త్వరలోనే శానిటరీ ఇన్స్పెక్టర్తోపాటు జవాన్లతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తా. అలాగే చెత్త సేకరణ కోసం కొత్తగా ఐదు ఎలక్ట్రికల్ ఆటోలు, ట్రాక్టర్లను కొనుగోలు చేయాలనుకుంటున్నాం. ప్రజలు ఎక్కడపడితే అక్కడ చెత్త వేయొద్దు. ఇళ్ల వద్దకు వచ్చే మున్సిపల్ సిబ్బందికే అప్పగించాలి. పట్టణ పరిశుభ్రతకు అందరూ సహకరించాలి. సాక్షి: గ్రేడ్–1 స్థాయి కలిగిన మున్సిపల్లో ఆదాయం పెంపుకోసం ఎలాంటి కార్యాచరణ చేపడుతారు..? కమిషనర్: ఇంటి పన్ను, ట్రేడ్ లైసెన్స్, నల్లా బిల్లులు సకాలంలో వసూలు చేసేలా ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తాను. ప్రధానంగా జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా ఇళ్లను సర్వే చేయిస్తాను. అలాగే ప్రచార హోర్డింగ్లకు సంబంధించి పన్నులను సైతం రెగ్యులర్గా రాబట్టేలా చూస్తాను. తద్వారా ఆదాయం పెరిగే అవకాశముంటుంది. సాక్షి: కార్యాలయంలో పలువురు అధికారులతో పాటు ఉద్యోగులు సైతం సమయపాలన పాటించడం లేదనే విమర్శలున్నాయి.. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.. ఈ సమస్యను ఎలా అధిగమిస్తారు? కమిషనర్: క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే అధికారులు, ఉద్యోగులు మినహా మిగతా వారంతా సమయపాలన పాటించాలి. కార్యాలయంలో విధిగా అందుబాటులో ఉండాలి. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై తప్పకుండా తగు చర్యలు తీసుకుంటాం.సాక్షి: పలు కాలనీల్లో లీకేజీల ద్వారా మిషన్ భగీరథ నీరు వృథాగా పోతుంది.. వాటిని ఎలా అరికడుతారు? కమిషనర్: లీకేజీలు గుర్తించేందుకు వార్డుల వారీగా స్పెషల్ డ్రైవ్తో పాటు అవసరమైన చర్యలు చేపడుతాం. ప్రజలు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలి. సాక్షి: పట్టణంలో చాలా చోట్ల ఆక్రమణలు పెరిగి రోడ్లు ఇరుకుగా మారాయి.. వాటిపై ఎలాంటి చర్యలు చేపడుతారు? కమిషనర్: ఆక్రమణల విషయాన్ని చైర్పర్సన్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటాం. -
రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు
సాక్షి, ఆదిలాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రైతులకు సాగు సంబంధిత అంశాల్లో అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1600 గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 60 జీపీల్లో చేపడుతుండగా, ఇప్పటికే 10 గ్రామాల్లో పూర్తయ్యాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా వ్యవసాయ వర్సిటీ ఆదేశాల మేరకు జిల్లాలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏప్రిల్ 27న మొదలు కాగా, మే 23 వరకు కొనసాగనున్నాయి ప్రధాన ఉద్దేశాలు.. యూరియా వాడకం తగ్గించడం, పంట మార్పిడి పాటించడం, సేంద్రియ సాగు పద్ధతులు అవలంబించడాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామాల్లో పర్యటించి రైతులను అవగాహన పరిచే దిశగా కృషి చేస్తున్నారు. ఆరు బృందాలుగా.. జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్. రాంగోపాల్ వర్మ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, ఆరు బృందాలు ఇందులో పాల్గొంటున్నాయి. ఇందులో వ్యవసాయ పరిశోధన స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, జిల్లాలోని వ్యవసాయ కళాశాల బోధన సిబ్బంది పాల్గొని రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తూ చైతన్య పరుస్తున్నారు. ప్రాధాన్యత అంశాలు.. -
రోడ్డెక్కిన రైతులు
కై లాస్నగర్(బేల): జొన్న, శనగ పంటలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు శనివారం రోడ్డెక్కి ఆందోళనకు దిగా రు. బేల మండలంలోని సిర్సన్న, కొబ్బాయి జాతీ య రహదారిపై బైఠాయించారు. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడటంతో సమాచారం అందుకున్న పో లీసులు అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారుల ను సముదాయించారు. మార్కెటింగ్ అధికారులతో మాట్లాడించి ఆందోళన విరమింపజేవారు. వీరి ఆందోళనకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడు తూ, పంట కొనుగోళ్ల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్ర భుత్వాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. ఇందులో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భోరజ్లో.. సాత్నాల: జొన్న కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. భోర జ్ మండలం మాండగడ జాతీయ రహదారిపై రా స్తారోకో నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ, పంటకోత పూర్తయినా కొనుగోలు కేంద్రాలు ప్రా రంభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. నాఫెడ్ అధికారులు వచ్చి కొనుగోళ్లు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఇందులో రైతులు ప్రహ్లాద్, ఊషన్న, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ‘రైతులు రోడ్డెక్కితేనే పంటల కొనుగోళ్లు’ ఆదిలాబాద్టౌన్: రెతులు తమ పంటలను కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కితే తప్ప ప్రభుత్వంలో చలనం రావడం లేదని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాద వ్, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ నిరసనలు చేపట్టడంతోనే ప్రభుత్వం దిగివచ్చి కొనుగోళ్లు ప్రారంభించేందుకు చర్యలు చేపడతుందన్నారు. ఇందులో పార్టీ నాయకులు నారాయణ, ప్రహ్లాద్, రమేష్, గంగయ్య, ప్రశాంత్, దయానంద్, ఎస్కే కలీమ్ తదితరులున్నారు. కై లాస్నగర్: రహదారిపై బైఠాయించిన రైతులు, బీఆర్ఎస్ నాయకులు -
అప్రమత్తతతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట
ఆదిలాబాద్టౌన్: అప్రమత్తతతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో గడిచిన వారం రోజుల్లో చోటుచేసుకున్న సైబర్ నేరాల వివరాలను శనివారం వెల్లడించారు. ప్రస్తుతం అనేక రకాలుగా సైబర్ నేరాలు జరుగుతున్నాయని, ఈ మేరకు ప్రజలు అప్రమత్తతగా ఉండాలని సూచించారు. బాధితులు మోసానికి గురైన గంటలోపు 1930లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ‘గోల్డెన్ అవర్‘ లోపు స్పందిస్తే పోగొట్టుకున్న సొమ్ము తిరిగి రాబట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే ఆలోచనతో ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం జాబ్ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, లోన్ ఫ్రాడ్, ఓటీపీ ఫ్రాడ్, ఏపీకే ఫైల్స్ ఫ్రాడ్, బిజినెస్ లోన్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, హనీ ట్రాప్, మనీలాండరింగ్ వంటి వాటితో ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈమేరకు అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు. ఎలాంటి సందేహలున్నా సంబంధిత పోలీస్స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. గంజాయి రహిత జిల్లా లక్ష్యం ఆదిలాబాద్టౌన్: జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జి ల్లా పోలీస్ కార్యాలయంలో గత నెల రోజుల్లో నమోదైన గంజాయి కేసుల వివరాలను శని వారం వెల్లడించారు. గత నెలలో 16 కేసులు నమోదు కాగా 28 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే గంజాయికి బానిసైన 14 మందిని కోర్టు ద్వారా 30 రోజులపాటు డి అడిక్షన్ సెంటర్కు తరలించినట్లు తెలిపారు. జిల్లాలో గంజాయిని కనుమరుగు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గత నెలలో 60 మంది సస్పెక్ట్ షీటర్లు, రౌడీ షీటర్ల ను తనిఖీ చేయగా 15 మంది గంజాయి సేవించినట్లు తనిఖీలో తెలిందన్నారు. వారిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
● ఐటీడీఏ పీవో మంద మకరందు ● ఇంద్రవెల్లి మండలంలో పర్యటన
ఇంద్రవెల్లి: ఉపాధి హామీ పథకాన్ని కూలీలు సద్వి నియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. మండలంలోని సమాక గ్రామాన్ని శనివారం ఉదయం సందర్శించి ఉపాధి హామీ ప నులను పరిశీలించారు. కూలీలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమాక, పాటగూడ గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందని, బోరుబావులు మంజూరు చేయాలని విన్నవించగా పంచా యతీ తీర్మానాలు ఇస్తే మంజూరుకు కృషి చేస్తానని పీవో పేర్కొన్నారు. అక్కడి నుంచి ఐఎఫ్పీసీఎల్ జిన్నింగ్ మిల్లును సందర్శించిన ఆయన కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. సంస్థ నిర్వహణ పై చర్చించారు. అనంతరం ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపాన్ని సందర్శించారు.అమరులకు నివా ళులర్పించి స్థానికులను స్మృతి వనం వివరాలు అడి గి తెలుసుకున్నారు. అక్కడి నుంచి స్థానిక ప్రభు త్వ ఆస్పత్రికి చేరుకున్నారు. రోగులతో మాట్లాడి వైద్యసేవల తీరుపై ఆరా తీశారు. గర్భిణులకు మె రుగైన సేవలందించాలని వైద్యాధికారులకు సూచించారు. ఆయన వెంట ఏజెన్సీ అదనపు వైద్యాధికారి మనో హర్, వైద్యులు పూజిత, సర్పంచ్లు మోహన్సింగ్, రాజేశ్వర్,ఏపీవో శ్రీనివాస్,ఆయా గ్రామాల ప్రజ లు, తదితరులు ఉన్నారు. -
ఎర్లీబర్డ్ @ రూ.2.34 కోట్లు
కై లాస్నగర్: పట్టణంలో ఆస్తి పన్ను బకాయిలు పే రుకుపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అ మలు చేసిన ఎర్లీబర్డ్ స్కీంకు ఆదిలాబాద్ మున్సిప ల్ పరిధిలో ఆశించిన స్పందన లభించలేదు. 2026 –27 ఆర్థిక సంవత్సరానికిగాను ముందస్తుగా పన్ను చెల్లించే వారికి ఐదు శాతం రాయితీ వర్తింపజేసింది. నివాస, నివాసేతర భవనాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి పాత బకాయిలు లేనటువంటి వారిని ఈ రాయితీకి అర్హులుగా ప్రకటించింది. గత నెల 1నుంచి అమలు చేసిన ఈ స్కీం గడువు 30వ తేదీతో ముగిసింది. అయితే పట్టణవాసులు స్వచ్ఛంద పన్ను చెల్లింపుపై అంతగా ఆసక్తి చూపలేదు. గతంతో పోల్చితే పన్ను వసూలు స్వల్పంగా పెరిగినా ఆశించిన స్థాయిలో కాకపోవడం గమనార్హం. మున్సిపల్ పరిధిలో ఇలా.. పట్టణంలో మొత్తం 49 వార్డులున్నాయి. వీటిలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఎలాంటి బకాయిలు లేని అసెస్మెంట్లకు సంబంధించి రూ.16.5 కోట్ల ఆస్తి పన్ను డిమాండ్ ఉంది. ఎర్లీబర్డ్ అమల్లో భాగంగా ఈ పన్నుల వసూలు కోసం బల్దియా అధికారులు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో బిల్ కలెక్టర్, అసిస్టెంట్ బిల్ కలెక్టర్ను నియమించారు. వీరు ఉదయం, సాయంత్రం తమకు కేటాయించిన వార్డుల్లో తిరుగుతూ పన్నుల వసూళ్లకు యత్నించారు. స్కీం అమలుకు గత నెల 30వరకు గడువు ఉండగా పట్టణ వ్యాప్తంగా రూ.2.34 కోట్లు వసూలయ్యాయి. కాగా, గతేడాదితో పోల్చితే కేవలం రూ.10 లక్షలు మాత్రమే అదనంగా వసూలవడం గమనార్హం. ఆశించిన ప్రచారం లేకపోవడమేనా.. ఈ స్కీం గడువుపై క్షేత్రస్థాయిలో ఆశించిన ప్రచా రం లేకపోవడంతో పట్టణ ప్రజలు అంతగా ఆసక్తి చూపనట్లుగా తెలుస్తోంది. ఐదు శాతం రాయితీపై అవగాహన కల్పించాల్సిన యంత్రాంగం అంతగా పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతేడాది మున్సిపల్ కార్యాలయంతో పాటు పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లతో ప్రత్యేక ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. అలాగే మైక్తో కూడిన ఆటో ద్వారా ప్రచారం కల్పించారు. ఈ సారి అలాంటి కార్యక్రమాలేవి చేపట్టలేదు. దీంతోనే ఆశించిన మేర పన్ను వసూలు కాలేదని తెలుస్తోంది. గతేడాదితో పోల్చితే పెరిగిన వసూళ్లు పన్నులు సకాలంలో వసూలు చేసేందుకు ప్రభుత్వం ఎర్లీబర్డ్ స్కీం అమలు చేస్తోంది. గత నెల 30వరకు పన్ను చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ కల్పించాం. పట్టణ పరిధిలో 6,673 మంది ఆస్తి పన్నును స్వచ్ఛందంగా ముందస్తుగా చెల్లించారు. గతేడాదితో పోల్చితే రూ.10 లక్షలు అదనంగా వసూలయ్యాయి. – బి.కళ్యాణ్, బల్దియా రెవెన్యూ అధికారి ఆదిలాబాద్ పట్టణంలోని.. అసెస్మెంట్లు : 48,448 ఆస్తి పన్ను డిమాండ్ : రూ.16.5 కోట్లు పన్ను చెల్లించిన అసెస్మెంట్లు : 6,673 వసూలైన పన్ను మొత్తం : రూ.2.34 కోట్లు -
బల్దియా కమిషనర్గా జగదీశ్వర్ బాధ్యతలు
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ నూతన కమిషనర్గా ఏ.జగదీశ్వర్గౌడ్ శుక్రవారం బా ధ్యతలు స్వీకరించారు. ఇది వరకు పనిచేసిన జి.రాజును మంచిర్యాల కార్పొరేషన్ కమిషనర్గా బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో నిర్మల్ కమిషనర్గా పనిచేసిన జగదీశ్వర్గౌడ్ను ఇక్కడ నియమించిన విషయం తెలిసిందే. ఈమేరకు ఉదయం కార్యాలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. రాజు నుంచి బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ అనూషను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. -
‘ప్రాణహిత’మే!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. 150మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణం, వంద టీఎంసీల నీటి వినియోగానికి ఇటీవల రాష్ట్ర సాగునీటి శాఖ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి ఆమోదం తెలిపారు. మహారాష్ట్రలోముంపు ఏర్పడితే పరిహారం చెల్లింపులకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపనున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసుల ఏళ్లనాటి సాగునీటి కల సాకారం వైపు మళ్లీ ఆశలు చిగురిస్తున్నా యి. ఈ నెల 7న సీఎం రేవంత్రెడ్డి స్వయంగా బరా జ్ నిర్మించే కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి శివారు ప్రాణహిత నది వద్దకు రానున్నారు. 18ఏళ్లుగా ఎదురుచూపులు.. ఉమ్మడి జిల్లా రైతాంగానికి సాగునీరు అందించేందుకు జలయజ్ఞంలో భాగంగా 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు తుమ్మిడిహెట్టి వద్ద శంకుస్థాపన చేశారు. 152 అడుగుల ఎత్తులో బరాజ్ నిర్మించి ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాలకు నీరందించాలి. ఆ తర్వాత ఎల్లంపల్లి వరకు నీటిని తరలించి అక్కడ నుంచి ఆరు జిల్లాలకు నీరివ్వాలి. ఇందుకోసం భూసేకరణ, 71కిలోమీటర్ల కాలువల నిర్మాణానికి రూ.11వేల కోట్లు వెచ్చించారు. అయితే 152మీటర్ల ఎత్తులో నిర్మిస్తే మహారాష్ట్రలోని చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల్లో 30 గ్రామాల ముంపు ఏర్పడుతుందని అభ్యంతరాలు రావడంతో ఆగిపోయింది. ఉమ్మడి రాష్ట్రం, తెలంగాణ వచ్చాక కూడా రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయి. చివరగా 2015లో నాటి నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావుతో జరిగిన చర్చల్లో 148మీటర్ల ఎత్తు వరకు అంగీకరించారు. పూర్తి స్థాయి ఎత్తుకు ఒప్పుకోకపోవడంతో ప్రాజెక్టును పూర్తిగా పక్కనపెట్టారు. రీడిజైన్లో గోదావరి–ప్రాణహిత కలిసే మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. తర్వాత వార్దా నదిపై బరాజ్ కట్టి మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో రెండు లక్షల ఎకరాల సాగునీటికి డిజైన్లు చేసినా ముందుకు సాగలేదు. భారీగా పెరగనున్న వ్యయం గతంతో పోలిస్తే బరాజ్ నిర్మాణం, కాలువలు, భూ సేకరణ ఇతర వ్యయం ఎల్లంపల్లి వరకే భారీగా అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బరాజ్ ఎత్తు విషయంలో స్పష్టత వచ్చినప్పటికీ ఇంకా తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని తరలించే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికీ డీపీఆర్ సిద్ధం కాలేదు. గోదావరిపై ఉన్న సుందిళ్ల బరాజ్కు తరలించడమా, లేక పాత డిజైన్ ప్రకారమే ముందుకు వెళ్తారా? అనేది తుది ప్రతిపాదన వెల్లడి కావాల్సి ఉంది. దీంతో పెరిగిన ఖర్చులతో రూ.20వేల కోట్ల వరకు అవుతుందనే అంచనా ఉంది. తుమ్మిడిహెట్టికి రెండో ముఖ్యమంత్రి 2008లో నాటి కాంగ్రెస్ సర్కారు హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి తుమ్మిడిహెట్టి ప్రాంతాన్ని ప్రారంభ సమయంలో సందర్శించారు. మళ్లీ 18ఏళ్ల తర్వాత ఓ ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి వస్తున్నారు. ఈ నెల 7న ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద సీఎం రేవంత్రెడ్డి స్వయంగా పరిశీలించనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
మెరుగైన వైద్యసేవలందించాలి
ఉట్నూర్రూరల్: రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నా రు. మండలంలోని దంతన్పల్లి, శ్యాంపూర్ పీహెచ్సీలను శుక్రవారం తనిఖీ చేశారు. రోగులతో మా ట్లాడి ఆరోగ్య సేవలపై ఆరా తీశారు. అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి విద్యార్థులు చదువుతో పాటు అన్నిరంగాల్లో రాణించాలని పీవో మకరందు అన్నారు. కుమురం భీం కాంప్లెక్స్లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను శుక్రవారం సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి పార్థసారథి, క్రీడా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగారాం, శిక్షకులు పాల్గొన్నారు. పీవోకు శుభాకాంక్షల వెల్లువ ఇటీవల పీవోగా బాధ్యతలు చేపట్టిన మకరందును గిరిజన సహకార సంస్థ డివిజనల్ మేనేజర్ గుడిమళ్ల సందీప్కుమార్తో పాటు సిబ్బంది శుక్రవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
చట్టాలపై అవగాహన అవసరం
ఆదిలాబాద్టౌన్: కార్మికులు తమ హక్కులతో పా టు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జిల్లా కేంద్రంలోని ద్వారకానగర్లో గల మేస్త్రి సంఘ భవనంలో శుక్రవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తు న్న వివిధ సంక్షేమ పథకాలను కార్మికులు సద్వి నియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో పా యల్ ఎమ్మెల్యే శంకర్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ దాసరి గంగారాం, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రాజేశ్వరి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందన్ కుమార్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అశోక్, ఐటీఐ ఏటీఓ శ్రీనివాస్, మేసీ్త్ర సంఘం నా యకులు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. దత్తత చట్టబద్ధంగా ఉండాలి పిల్లల దత్తత చట్టబద్దంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్లో లీగల్ అడప్షన్ హెల్ప్డెస్క్, శిశు సంరక్షణ ఊయల కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. జిల్లాలో గు ర్తించిన ఐదేళ్లలోపు పిల్లలు 40మంది ఉన్నారని తెలి పారు. పిల్లల సంరక్షణకు ఏర్పాటు చేసిన ఊ యల ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, జిల్లా సంక్షేమ అధి కారి మిల్కా, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, డీసీ పీవో రాజేంద్ర ప్రసాద్,రాధిక,ఆనంద్ పాల్గొన్నారు. శిశుగృహను సందర్శించిన కలెక్టర్.. జిల్లా కేంద్రంలోని శిశుగృహను కలెక్టర్ సందర్శించా రు. పిల్లల సంరక్షణ విషయంలో ఎలాంటి అలసత్వం వహించవద్దని సిబ్బందిని ఆదేశించారు. శిశుగృహలో నూతనంగా నిర్మించిన అదనపు గదు ల భవనాన్ని ప్రారంభించి పిల్లల సంరక్షణపై ఆరా తీ శారు. ఆయన వెంట పంచాయతీరాజ్ ఈఈ రాథో డ్ శివరాం, బాలసంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసా ద్, స్వామి, విజయలక్ష్మి, స్వప్న తదితరులున్నారు. లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ సాత్నాల: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా భోరజ్ మండలం రాంపూర్ (టి) గ్రామంలో డ బుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే శంకర్ హాజరై లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. గతంలో నిర్వహించిన రెవె న్యూ సదస్సులో వచ్చిన విన్నపాలను పరిశీలించి లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసినట్లు కలెక్టర్ వెల్లడించా రు. కార్యక్రమంలో జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, అదనపు కలెక్టర్ ఆర్ఎస్.చిత్రు, ఆర్డీవో జగదీశ్వర్ రావు, హౌసింగ్ నోడల్ అధి కారి శంకర్, పంచాయతీ రాజ్ ఈఈ శివరాం, తహసీల్దార్ రాజేశ్వరి, జైనథ్ వ్యవసాయ మార్కెట్ చైర్మ న్ అశోక్రెడ్డి, సర్పంచ్ వెంకటమ్మ, పాల్గొన్నారు. రైతు వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలి కై లాస్నగర్: ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కా ర్యక్రమంలో భాగంగా ఈనెల 4 నుంచి 9 వరకు రైతు వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రులు అధికారులను ఆదేశించారు. శు క్రవారం సాయంత్రం రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్రెడ్డి, రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక, రైతు వారోత్సవాలు, వరి ధాన్యం కొ నుగోలు, జనగణన స్వీయ నమోదు, నీట్ నిర్వహణ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి కలెక్టర్ రాజర్షిషా వీడియో కాన్ఫరె న్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ జిల్లాలో రైతు వారోత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు వివరించారు. ఉపాధి హామీ పథకం పకడ్బందీగా అమలవుతోందని, కూలీలకు నిరంతరం పని కల్పిస్తున్నట్లు చెప్పారు. జనగణనలో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఇందులో అదనపు కలెక్టర్ చిత్రు, ఏఎస్పీ సురేందర్ రావు, ఆర్డీవో జగదీశ్వర్ రావు, డీఆర్డీవో రవీందర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
విచారణ నామమాత్రం..
సాక్షి,ఆదిలాబాద్: గ్రామపంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు ఏర్పడిన తర్వాత పెండింగ్లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు రెండు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన విషయం తెలిసిందే. జిల్లాకు మూడు విడతల్లో కలిపి సుమారు రూ.40 కోట్ల వరకు నిధులు వచ్చాయి. వీటిని అడ్డగోలుగా స్వాహా చేస్తున్నారని, పెండింగ్ బిల్లులు తమకు వచ్చేవి ఉన్నాయంటూ పలువురు కార్యదర్శులు నిబంధనలు ఉల్లంఘించి హాంఫట్ చేసిన తీరును ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. అప్పట్లో దీనిపై విచారణ చేస్తున్నామని, వ్యక్తిగత ఖాతాల్లోకి నిధులు మళ్లిస్తే చర్యలు తప్పవని చెప్పిన అధికారులు నామమాత్రంగా వ్యవహారాన్ని ముగించేందుకు యత్నిన్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమాలు ఇలా.. ప్రస్తుత పాలకవర్గాలు ఏర్పడక ముందు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో కార్యదర్శుల ఆధ్వర్యంలో జీపీల నిర్వహణ కొనసాగిన విషయం తెలిసిందే. గత సర్పంచుల పదవీ కాలం ముగిసిన తర్వాత ఈ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. ఆ సమయంలో కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచి పోవడం, రాష్ట్రం నుంచి కూడా ప్రత్యేక ఫండ్స్ రాకపోవడంతో పారిశుధ్యం, విద్యుత్ బిల్లులు, ట్రాక్టర్ల నిర్వహణ కోసం కార్యదర్శులుగా వ్యవహరించిన వారు తమ జేబుల్లో నుంచి వెచ్చించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో కొత్త పాలకవర్గాలు ఏ ర్పడిన తర్వాత పెండింగ్ నిధులు కోట్లలో వచ్చాయి. అయితే వాటిని సరైన బిల్లులు లేకుండానే ఫోరం, ఏజెన్సీల పేరిట కాకుండా నేరుగా వ్యక్తిగత ఖాతా ల్లోకి చాలా మంది కార్యదర్శులు మళ్లించుకున్నారు. ఈ అక్రమాలను ‘సాక్షి’ మార్చి 31న ‘నిధులు స్వాహా’ శీర్షికన వెలుగులోకి తెచ్చింది. ఏజెన్సీల పేరిట కాకుండా వ్యక్తిగత ఖాతాల్లోకి లక్షల నిధులను మళ్లించుకుంటున్నారని కథనంలో పేర్కొంది. కొత్త పేమెంట్స్ నిలుపుదల.. జిల్లాకు రూ.40 కోట్ల పెండింగ్ నిధులు రాగా ‘సాక్షి’లో ఈ అక్రమాలకు సంబంధించి కథనం ప్రచురితమైన సమయానికే అందులో నుంచి సగానికి పైగా పేమెంట్లు అడ్డగోలుగా చేపట్టారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. అప్పట్లో విచారణ చేపడుతున్న క్రమంలోనే కొత్త పేమెంట్లను నిలుపుదల చేశారు. ఇప్పటికీ అదే పరిస్థితి. అయితే విచారణ మమ అనిపించేలా కొనసాగిందన్న విమర్శలు లేకపోలేదు. జిల్లా యంత్రాంగం దీనిపై దృష్టి సారిస్తే పెద్ద ఎత్తున జరిగిన అక్రమాలు బయటపడతాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. చిన్న చిన్న తప్పులే.. గ్రామపంచాయతీల్లో నిధులను డ్రా చేసుకునే క్రమంలో చిన్న చిన్న తప్పులకు పాల్పడినట్లు మా విచారణలో తేలింది. ఇంకా విచారణ కొనసాగుతుంది. కొత్త పేమెంట్లను నిలిపివేశాం. పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేస్తున్నాం. – రమేశ్, జిల్లా పంచాయతీ అధికారిఈ విషయంపై డీపీవో రమేశ్ను నాడు వివరణ కోరగా.. విచారణ జరుపుతామని, ఎవరైనా వ్యక్తిగతంగా నిధులు స్వాహా చేస్తే చర్యలు తప్పవని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఈ విచారణ నామమాత్రంగా ముగించి, చిన్న తప్పులే జరిగాయని నివేదిక తయారు చేసినట్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద మొత్తంలో జరిగిన అక్రమాలకు సంబంధించి విచారణ అధికారులు నామమాత్రంగా ముగించి కప్పిపుచ్చాలని చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
అతివలకు రక్షణగా షీటీమ్
ఆదిలాబాద్టౌన్: అతివలకు రక్షణగా షీటీమ్ పనిచేస్తుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ నివేదికను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 24 గంటల పాటు షీటీమ్ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 50 మంది ఆకతాయిలకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. గతనెలలో 59 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. పోలీసు అక్కా కార్యక్రమం ద్వారా పాఠశాల, కళాశాల విద్యార్థులకు బాల్య వివాహాలు, సైబర్క్రైమ్, మోసపోతున్న సంఘటనలపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. హాట్స్పాట్లలో తనిఖీల సందర్భంగా గుర్తించిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించామని, అలాగే 40 మందిపై ఈపెట్టి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, చెడు మార్గంలో పయనించవద్దని సూచించారు. షీటీమ్ సభ్యులు సుశీల, వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధికి కృషి
బజార్హత్నూర్: నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని కొత్తపల్లి గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు. ఆరు దశాబ్దాలుగా గ్రామానికి రోడ్డు వసతి లేక స్థానికులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. బండ్రేవ్ వాగుపై వంతెనతో పాటు రహదారి సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రాంపూర్కు చేరుకున్న ఆయన పలువురు బీఆర్ఎస్లో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఇందులో సర్పంచ్లు ప్రియాంకభీమేష్, సాయన్న, సు భాష్, ప్రవీణ్, రాజారాం, చంద్రశేఖర్, రాజేందర్, మారుతి, వినిల్, మురళీకృష్ణ, నర్సయ్య, రాజన్న, రమణ, రాజేశ్వర్, రమేశ్, కవీందర్ పాల్గొన్నారు. కొత్త కోడళ్ల భేటీకి ఎమ్మెల్యే.. ఇచ్చోడ: మండలంలోని గుబ్బ గ్రామంలో గురువారం రాత్రి నిర్వహించిన సిడాం కొత్త కోడళ్ల భేటీకి ఆయన హాజరయ్యారు. గ్రామ సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఇందులో పార్టీ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, నాయకులు పాండురంగ్, రమేశ్ తదితరులున్నారు. -
25 శాతం కోటా అమలు చేయాలి
కై లాస్నగర్: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ము న్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు 25 శాతం కోటా తప్పనిసరిగా అమలు చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకుని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యా రు. ఐదు వస్తువులతో కూడిన కిట్లను చైర్పర్సన్ అనూషతో కలిసి కార్మికులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మున్సి పల్ పారిశుద్ధ్య కార్మికుల కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కమిషనర్ ఏ.జగదీశ్వర్గౌడ్ , ఎస్సై శంకర్, కౌన్సిలర్లు సాయి చరణ్గౌడ్, నరేష్కుమార్, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
జెడ్పీలో కారుణ్య నియామకాలు
ఒంగోలు టౌన్: జిల్లా ప్రజా పరిషత్లో పనిచేస్తూ మరణించిన సిబ్బంది కుటుంబ సభ్యులకు జెడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ నియామక పత్రాలు అందజేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో జూనియర్ సహాయకులుగా నియామకపత్రాలు అందజేశారు. ఒంగోలు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో దాసిరి అమూల్య, ఎం రామకృష్ణ, కొండపి మండల పరిషత్లో కె.వెంకటరెడ్డి, వలేటివారిపాలెం మండల పరిషత్ కార్యాలయంలో డి.శివ కార్తీక్, రాచర్ల మండల పరిషత్ కార్యాలయంలో బి.అశోక్రెడ్డి, కురిచేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శేషం సరళ కుమారి, వీరభద్రాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీహెచ్ వంశీకృష్ణ, కామేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్.మెర్సీ, సంజీవరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షేక్ గౌసియాలను నియమించారు. కార్యక్రమంలో జెడ్పీ ముఖ్య కార్య నిర్వాహణాధికారి బి.చిరంజీవి, ఉప ముఖ్య కార్యానిర్వాహణాధికారి పి.బాలమ్మ పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: జిల్లా ప్రజా పరిషత్లో పరిధిలో వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న నలుగురు సీనియర్ సహాయకులకు పరిపాలనాధికారులుగా పదోన్నతులు కల్పిస్తూ జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తపట్నం మండల ప్రజా పరిషత్ కార్యలయంలో పీఐయూ (పీఆర్)లో విధులు నిర్వహిస్తున్న టి.మారుతీరాం, కందుకూరు పీఆర్ఐ డివిజన్లో విధులు నిర్వహిస్తున్న షేక్ జాఫర్ బాషా, యర్రగొండపాలెం పీఆర్ఐ సబ్ డివిజన్లో పనిచేస్తున్న సయ్యద్ ఖలీముద్దిన్ ఖాద్రీ, ఒంగోలు జిల్లా ప్రజా పరిషత్లో పనిచేస్తున్న టీవీఎస్ సూరిలకు పదోన్నతుల ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ పి.బాలమ్మ, పరిపాలనాధికారి చల్లా శ్రీనివాస కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సత్తా చాటిన జిల్లా విద్యార్థులు
బీవీ సుబ్బయ్య పాఠశాలలో అభినందనలుడ్రీమ్స్ స్కూల్లో..నిర్మల పాఠశాల విద్యార్థులతో..జీఎమ్ఎస్లో అభినందనలుక్విస్ విద్యార్థులను అభినందిస్తున్న దృశ్యం ఒంగోలు సిటీ: పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో గురువారం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఒంగోలు నగరంలో కర్నూలు రోడ్డులోని క్విస్ హైస్కూల్ విద్యార్థిని పున్నాల అమృత (592) మార్కులు సాధించింది. 18 మంది 550 పైగా, 28 మంది విద్యార్థులు 500 కు పైగా మార్కులు సాధించారు. క్విస్ విద్యాసంస్ధల అధినేత డాక్టరు నిడమానూరు సూర్య కళ్యాణ్ చక్రవర్తి, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టరు నిడమానూరి గాయత్రిదేవి, ప్రిన్సిపాల్ కమలేశ్వరి, ప్లానింగ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. నారాయణ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.. నారాయణ స్కూల్ విద్యార్థి వేముల రామకృష్ణ 598 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ప్రతిభ సాధించారు. పది మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటారు. ప్రతి ఇద్దరిలో ఒకరికి 550 మార్కులు సాధించారని తెలిపారు. నారాయణ స్కూల్స్ ఏజీఎం పెద్దిరెడ్డి, డీజీఎం పిచ్చిరెడ్డి మాట్లాడుతూ ఇంతటి ఘన విజయానికి కారణమైన విద్యార్ధుల కఠోర శ్రమ, ఉపాధ్యాయుల అంకితభావాన్ని తల్లిదండ్రుల సహకారాన్ని కొనియాడారు. క్లస్టర్ ప్రిన్సిపాల్స్, అకడమిక్ డీన్స్, ఉపాధ్యాయులు, విద్యార్ధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మాంటిస్సోరి ప్రతిభ... రేవేండ్ల టాప్సీ 592 మార్కులు, కె.ధన్వీన్ 590 మార్కులు సాధించి ప్రతిభ చూపినట్లు కరస్పాండెంట్ ప్రకాష్, డైరెక్టర్ శబరీనాథ్, ప్రిన్సిపాల్ నూరుద్దీన్ తెలిపారు. 23 మంది వి 580 మార్కులు పైగా సాధించినట్లు తెలిపారు. ప్రతిభ విద్యాసంస్థలు మారం ఈశ్వరరెడ్డి 583 మార్కులు, నారు అరుణ్కుమార్రెడ్డి 557, పి.జగన్సాయి 551, లోకండె వెంకటశ్రీలక్ష్మి 550 మార్కులు సాధించినట్లు విద్యాసంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ నల్లూరి సీతారామాంజనేయులు, సీఈఓ నల్లూరి జయప్రకాష్నారాయణ్, ఉపాధ్యాయ, సిబ్బంది అభినందనలు తెలిపారు. సత్తా చాటిన ఎస్ఆర్ స్కూల్.. ఎం. బాలాదిత్య 590, ఎన్.బ్రహ్మేశ్వర్ 586, డి.నాగఅంజలి 583, ఆర్.గణేష్ 574 మార్కులతో సత్తా చాటారని ఎస్.ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరస్పాండెంట్ ములకా రామిరెడ్డి, డైరెక్టరు ములకా రత్నకుమారి, ప్రిన్సిపాల్స్ విజయ, ప్రశాంతి,రెహమాన్, జానీ, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. కేరళ హైస్కూల్.. వై.విమల జానకి 596 మార్కులతో సత్తా చాటారని కరస్పాండెంట్ సీబీ మైఖేల్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. పి.జ్యోతిర్మయి 592, డి.హేమంత్బాబు 591, ఇ.వి.సాయి మహిత 590 మార్కులతో సత్తా చాటారు. 39 మంది విద్యార్ధులు 500 పైగా మార్కులు సాధించారని తెలిపారు. సీబీ మైఖేల్, షైమా సిబి ప్రత్యేక అభినందనలు తెలిపారు. డ్రీమ్స్ విద్యార్థుల విజయదుందుభి ఎస్కే షహీన్ 586, పి.సంయుక్త ప్రియ 579, సాయి కార్తిక 575, బి. కుసుమాంజలి 574,పి. భార్గవరామ్ 553 మార్కులు సాధించారని స్కూలు కరెస్పాండెంట్ లక్ష్మీదేవి తెలియజేశారు. జీఎంఎస్ విద్యార్థుల హవా.. జి.భాను ప్రసాద్ 590, జి. మోక్షిత్ సాయి తేజ 589, బి.వెంకట సాయి జ్యోతిక 588 మార్కులతో ప్రతిభ కనబర్చారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 42 శాతం మంది 550 మార్కులు, 69 శాతం మంది 500 కి పైగా మార్కులు సాధించారని కరస్పాండెంట్ ఎం. కొండయ్య తెలిపారు. ప్రిన్సిపాల్, డీన్స్ పి.రామారావు, అలెక్స్, సీహెచ్ సుజిత తదితరులు పాల్గొన్నారు. బీవీ సుబ్బయ్య స్కూలు విద్యార్థులు ప్రతిభ విద్యార్థులు అత్యుతమ ఫలితాలు సాధించారని స్కూలు కరెస్పాండెంట్ బొడ్డు కోటిలింగం తెలిపారు. ఎం. మాధవ రెడ్డి 589, ఎం.రాము 583, ఎస్. సాయికృష్ణారెడ్డి 584 మార్కులు సాధించారన్నారు. శ్రీ విశ్వేశ్వరయ్యి ఎడ్యుకేషనల్ సొసైటీ ట్రెజరర్ బి. రవిప్రసాద్, స్కూలు హెచ్ఎం వై. వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రా హైస్కూలు విద్యార్థుల సత్తా పదో తరగతి పరీక్షల్లో ఆంధ్ర హై స్కూల్ విద్యార్థి డి. ప్రవళిక కే. భానుతేజ 586 మార్కులు సాధించారని స్కూల్ కరస్పాండెంట్ జి. శ్రీనివాసరావు , డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. అలాగే రోజారమణి 580, యన్ ఆశ్రిత 577 మార్కులు వచ్చాయని వారు చెప్పారు. నిర్మల హైస్కూలు.. ఉత్తమ ఫలితాలు సాధించారని స్కూలు కరెస్పాండెంట్ ఎన్. సురేంద్ర, చీఫ్ అకడమిక్ అడ్వైజర్ ఎన్.హరిబాబు తెలిపారు. కె. జాగృతి 596, ఏఎన్ఎస్ వైష్ణవి 594, ఎల్ హిమబిందు, కే మేఘనలకు 591 మార్కులు వచ్చాయన్నారు. ప్రిన్స్పల్ ఎస్. విక్టర్ పాల్, ఎన్. పద్మజ పాల్గొన్నారు. -
మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య
లక్ష్మణచాంద: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గోపి తెలిపిన వివరాల మేరకు మండలంలోని గంజాల్ గ్రామానికి చెందిన మూడారపు ప్రణయ్కుమార్ (28) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. బుధవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. మద్యం మత్తులో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుని భార్య వినీత పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. బైకును తప్పించబోయి.. ఎడ్లబండిని తాకి.. వేమనపల్లి: ఎదురుగా వచ్చిన బైకును తప్పించబోయిన ఆర్టీసీ బస్సు పక్కనే నిలిచి ఉన్న ఎడ్లబండిని తాకడంతో విద్యుత్ స్తంభం విరిగి బస్సుపై పడింది. దీంతో గ్రామంలో మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద వారసంత జరుగుతోంది. సుంపుటం నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు బస్టాండ్ సమీపంలోకి రాగానే డ్రైవర్ ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయి మరోవైపు నిలిపి ఉన్న ఎడ్లబండిని తాకించాడు. ఎడ్ల బండి విద్యుత్ స్తంభానికి తాకడంతో స్తంభం విరిగి ఆర్టీసీ బస్సుపై పడిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో పెను ప్రమాదం తప్పింది. వార సంత జరిగే ప్రదేశంలోనే ఈ ఘటన జరగడం, ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో వ్యాపారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ శాఖ ఏఈ దీక్షిత్, సబ్ ఇంజినీర్ ఆకాష్, నీల్వాయి ఎస్సై జగదీష్రెడ్డి సహాయక చర్యలు చేపట్టారు. -
బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి రిమాండ్
జన్నారం: ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితునిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై ఉదయ్కిరణ్ తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన ఓ బాలిక వేసవి సెలవులో పిన్ని, బాబాయి ఇంటికి వచ్చింది. జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన డోంగరి లక్ష్మణ్ సదరు బాలికతో సాన్నిహిత్యం ఏర్పర్చుకొని ఆమెతో పొటోలు దిగాడు. ఫొటోలు సోషల్ మీడియాలో పెడుతానని, కుటుంబ సభ్యులకు చూపిస్తానని బెదిరించి ఆమైపె అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో బాలిక తల్లి గత నెల 28న పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేశారు. సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో విచారణ జరిపి 29న నిందితుడిని అరెస్ట్ చేసి లక్సెట్టిపేట కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు తెలిపారు. -
‘పది’లో గిరిజన ఆశ్రమ పాఠశాలల ప్రతిభ
ఉట్నూర్రూరల్: ఇటీవల విడుదలైన పదోతరగతి పరీక్ష ఫలితాల్లో గిరిజన ఆశ్రమ పాఠశాలలు అత్యుత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణమని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. గురువారం పీవో చాంబర్లో మాట్లాడుతూ ఈ విజయానికి ఉపాధ్యాయుల నిబద్ధత, తల్లిదండ్రుల ప్రోత్సాహం కారణమన్నారు. భవిష్యత్తులో కూడా ఆశ్రమ పాఠశాలలు ఇదే విధంగా ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అదుపుతప్పి ఆటో బోల్తానర్సాపూర్ (జి): మండలంలోని నసీరాబాద్ వద్ద గురువారం అదుపుతప్పి ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. దిలావర్పూర్ నుంచి కూలీలతో భైంసా వైపు వెళ్తున్న ఆటో నసీరాబాద్ వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓబేద్ అనే యువకుడికి గాయాలు కావడంతో 108 కు సమాచారం అందించారు. ఈఎంటీ ఆనంద్, పైలట్ సాయికిరణ్ బాధితుడికి ప్రథమ చికిత్స చేసి భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
శ్రమశక్తి అవార్డుకు ఎంపిక
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియా వాటర్ ట్యాంక్ ప్రాంతానికి చెందిన కార్మిక నాయకుడు జక్కుల రాజేశం శ్రమశక్తి అవార్డుకు ఎంపికయ్యారు. శుక్రవారం రవీంద్రభారతిలో జరిగే మేడే వేడుకల్లో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. 1986లో సింగరేణి సంస్థలో చేరిన రాజేశం సాజక్, ఏఐటీయూసీ, టీఎన్టీయూసీ, టీబీజీకేఎస్ సంఘాల్లో క్రీయాశీలకంగా పని చేశారు. సికాస ఉద్యమం బలంగా ఉన్న సమయంలో వారితో కలిసి పోరాడి శ్రీరాంపూర్ ఏరియాలోని అరుణక్కనగర్, సుందరయ్యనగర్, తదితర సింగరేణి భూముల్లో కార్మికులకు గుడిసెలు వేయించారు. తాళ్లపల్లి ఎంపీటీసీగా, సర్పంచ్గా సేవలందించారు. అమరులైన కార్మికులను స్మరించుకోవాలనే ఉద్దేశంతో శ్రీరాంపూర్ బస్టాండ్లో కార్మిక విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. ఎన్టీఆర్ విగ్రహం, బస్టాండ్ ఆయన సర్పంచ్గా ఉన్న సమయంలో ఏర్పాటు చేసినవే. 2018లో రిటైర్డ్ అయినప్పటికీ ఇప్పటికీ కార్మికుల సమస్యలపై తన గళం విప్పుతూనే ఉన్నారు. కార్మికవర్గ పోరాటాల్లో ఆయన చేసిన కృషిని గుర్తించిన ప్రభుత్వం శ్రమశక్తి అవార్డుకు ఎంపిక చేసింది. శ్రీరాంపూర్: ఐఎన్టీయూసీ కేంద్ర, బ్రాంచి ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్రావు శ్రమశక్తి అవార్డుకు ఎంపికయ్యారు. 1987లో సింగరేణిలో ఉద్యోగంలో చేరిన శంకర్రావు ప్రస్తుతం శ్రీరాంపూర్ సీహెచ్పీలో ఎలక్ట్రీషియన్గా విధులు నిర్వహిస్తున్నారు. 40 సంవత్సరాలుగా ఒకే సంఘంలో పని చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. కార్మికుల సమస్యల పరిష్కారంలో ముందుండడమే కాకుండా అందరితో సన్నిహితంగా మెలుగుతారు. తనకు అవార్డు రావడం సంతోషకరంగా ఉందన్నారు. -
అధ్యాపకుడికి అంతర్జాతీయ గుర్తింపు
కై లాస్నగర్(బేల): బే ల మండలంలోని కీర్తన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.వేముగంటి వరప్రసాద్రావు బోధన, సేవ, పరిశోధన రంగాల్లో చేస్తున్న సేవలకుగానూ అంతర్జాతీయ గుర్తింపు పొందారు. యునైటెడ్ కింగ్డమ్లోని క్వాలిటీ ఎడ్యుకేషన్ అసెస్మెంట్ కౌన్సిల్ నుంచి ఫెలో రాయల్ మెంబర్ ఆఫ్ ఇంటిగ్రేటేడ్ సైంటిఫిక్ ఇన్నోవేషన్ పేరిట విశిష్ట గౌరవాన్ని కల్పిస్తూ ధృవీకరణ పత్రం అందజేసింది. సమీకృత శాసీ్త్రయ అభివృద్ధి, వివిధ విభాగాల్లో అసాధారణమైన కృషి , ఆవిష్కరణలు, నిబద్ధతను ప్రదర్శించిన వ్యక్తులకు ఈ పురస్కారం ప్రకటిస్తున్నట్లుగా స్పష్టం చేసింది. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలుఉట్నూర్రూరల్: ఆస్ట్రేలియా, జర్మనీ, ఒమన్ వంటి దేశాల్లో ఉద్యోగాల కోసం గిరిజన నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీవో మంద మకరందు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్ మాన్పవర్ కంపెనీ లిమిటెడ్ హైదరాబాద్ ద్వారా ఈ నియామకాలు జరుగుతాయని పేర్కొన్నారు. చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్, డైరెక్టర్ ఆఫ్ స్టడీస్ వంటి ఉన్నత స్థాయి పోస్టులతో పాటు స్ప్రే పెయింటర్ (100), ప్యానెల్ బీటర్ (100), ఆటోమోటివ్ మెకానిక్ (100), వెల్డర్ (100), ఎలక్ట్రీషియన్ (120), నర్సులు (90), ట్రాన్స్మిషన్ లైన్ టెక్నీషియన్ (20), అగ్రికల్చర్ ఇంజనీర్ తదితర పోస్టులు ఉన్నాయన్నారు. 25 నుంచి 45 ఏళ్ల లోపు వయస్సువారు అర్హులన్నారు. ఆసక్తి కలవారు ధ్రువీకరణ పత్రాలతో మే 1 నుంచి 10లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
కార్మికుల బతుకు పోరు
రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు గడుపుతున్నారు కార్మికులు. నిద్ర నుంచి మేల్కొనగానే పనికోసం అన్వేషణ మొదలవుతుంది. పనిదొరికితే ఆ రోజు గడుస్తుంది. లేదంటే పస్తులే. ఎండైనా వానైనా, చలినైనా తట్టుకుని కష్టపడాల్సిందే. తమ కుటుంబాల పోషణ కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి, కష్టమైనా ఇష్టంగా పనులు చేస్తున్నారు. ప్రభుత్వం కార్మికుల కోసం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా వారి రాత మాత్రం మారడం లేదు. మేడే సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో పనిలో నిమగ్నమైన కార్మికుల బతుకుపోరాట చిత్రాలు ఇవీ. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్ -
అనాథలకు అమ్మానాన్నగా..
ఉట్నూర్రూరల్: కాలం కాఠినంగా మారింది. తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన ఆ శిశువును కళ్లు తెరవకుండానే అనాథను చేసింది. ఉట్నూర్ మండలం రాంజీగోండ్కు చెందిన గిరిజన మహిళ ఆత్రం గంగుబాయి ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసింది. నాలుగు నెలల క్రితం భర్త విఠల్కూడా మృతి చెందాడు. తాజాగా తల్లి మృతితో మూడేళ్ల బాలుడు, పుట్టిన శిశువు అనాథలయ్యారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ స్పందించారు. గురువారం బాధిత నివాసానికి చేరుకుని చిన్నారుల నానమ్మను ఓదార్చారు. ‘మీరు అనాథలు కాదు, నా పిల్లలు’ అని మాటిచ్చి, పసి బాలుడిని తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఆవిర్భావ్ నామకరణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భార్య దృపదతో కలిసి పసి బాలుడికి ‘ఆవిర్భావ్’ అని నామకరణం చేశారు. పెరిగి పెద్దయ్యే వరకు పోషణ, పాలు, ఖర్చులు తాను భరిస్తానని ప్రకటించారు. ప్రభుత్వం తరపున రూ.1,90,000 చెక్కు అందజేశారు. సొంత పిల్లల్లా భావించి బాధ్యతలు చేపట్టిన ఈ దంపతుల చర్య స్థానికుల్లో సంతోషాన్ని రేకెత్తించింది. ఆవిర్భావ్ జీవితంలో కొత్త వెలుగు పుట్టాలనే ఆశతో పేరు పెట్టారు. ఈ మానవత్వం సమాజానికి ప్రేరణగా నిలిచింది. -
వేర్వేరు చోట్ల జొన్న పంట దగ్ధం
బోథ్: మండల కేంద్రంలోని లాల్పిచ్ మైదానం సమీపంలో సాగుచేసిన 13 ఎకరాల జొన్నపంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. గురువారం సాయంత్రం పంటచేలలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సింగం వెంకటరమణకు చెందిన ఎనిమిది ఎకరాలు, గోవింద్కు చెందిన రెండెకరాలు, మాధవ్కు చెందిన మూడెకరాల్లో పంట పూర్తిగా కాలిపోయింది. గమనించిన స్థానికులు ఇచ్చోడలోని ఫైర్స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. సింగం వెంకటరమణకు రూ.4 లక్షలు, గోవింద్కు రూ.1.50 లక్షలు, మాధవ్కు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతులు వాపోయారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మెడిగూడలో (ఆర్)లో.. సాత్నాల: మండలంలోని మెడిగూడ (ఆర్)లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో జొన్నపంట దగ్ధమైంది. గ్రామానికి చెందిన చిట్యాల రాములు రెండెకరాల్లో సాగు చేసిన జొన్నపంటను కోసి పంటచేలోనే ఉంచాడు. గురువారం పంటచేల పైనుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు ఒకదానికి ఒకటి తాకి నిప్పులు ఎగిసి పడడంతో పంటకు నిప్పంటుకుని క్షణాల్లో మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానిక రైతులు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అదుపులోకి రాకపోవడంతో జొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. దాదాపు రూ.1,50,000 నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. సమాచారం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ లైన్లను సరిచేయాలని డిమాండ్ చేశారు. కుంటాలలో.. లోకేశ్వరం(కుంటాల): కుంటాల మండలంలోని కల్లూర్లో 11 కేవీ విద్యుత్ తీగలు గాలికి ఒకదానికి ఒకటి తాకడంతో నిప్పురవ్వలు ఎగిసిపడి గ్రామానికి జొన్నపంట దగ్ధమైంది. బాధిత రైతులు తెలిపిన వివరాల మేరకు అందకూర్కు చెందిన వెంకట్ వారం రోజుల క్రితం జొన్నచేను కోసి పంటను కల్లూర్లోని సాయిరాం చేనులో ఆరబెట్టాడు. పంటచేను పైనుంచి వెళ్లిన 11 కేవీ విద్యుత్ తీగలు ఒకదానికి ఒకటి తాకడంతో నిప్పురవ్వలు ఎగిసిపడి మంటలు చెలరేగాయి. జొన్నపంటతో పాటు రైతులు సాయిరాం, బలిరాంకు చెందిన వ్యవసాయ పరికరాలు దగ్ధమయ్యాయి. జొన్న పంట విలువ రూ.20 వేలు, వ్యవసాయ పరికరాల విలువ రూ.10 వేలు ఉంటుందని బాధిత రైతులు తెలిపారు. -
భవన నిర్మాణానికి భూమిపూజ
ఆదిలాబాద్రూరల్: మండలంలోని చించుఘా ట్ పంచాయతీ పరిధిలో రాయి సెంటర్ గిరి జన భవన్ నిర్మాణానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయి సెంట ర్లు గిరిజన యువతకు సాంకేతిక, నైపుణ్యాభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని తెలిపా రు. రాయి సెంటర్లతో ఉపాధి అవకాశాలు పెంపొందించి గిరిజనుల ఆర్థిక స్థితి మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఆదిలాబాద్ నియోజకవర్గానికి 106 రాయిసెంటర్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇంకా 46 రాయి సెంటర్ల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. -
ఆస్పత్రి అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష
బోథ్: నియోజకవర్గ కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి అభివృద్ధి సమీక్షా సమావేశాన్ని గురువారం ఎమ్మె ల్యే అనిల్ జాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. వంద పడకల నూతన ఆస్పత్రి భవన నిర్మాణ పనుల పు రోగతిని ఎమ్మెల్యే సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఆస్పత్రి ప్రారంభానికి అవసరమైన అత్యాధునిక వైద్య పరికరాలు, మౌలిక సదుపాయా ల కల్పనపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఐసీ యూ బెడ్లు, ఇన్ పేషెంట్ పడకలు, వీల్ చైర్లు, ఇత ర ఫర్నిచర్ అవసరాలను గుర్తించి నివేదిక సిద్ధం చేశారు. మెడికల్ సూపరింటెండెంట్ రవీంద్రప్ర సాద్, సర్పంచ్ కె.అన్నపూర్ణ మహేందర్, ఆర్ఎంవో, అకౌంట్స్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి పరామర్శ బోథ్ మండల కేంద్రానికి చెందిన పుండ్రు గంగా రెడ్డి ఇటీవల మరణించగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్జాదవ్ ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గంగారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట స్థానిక నాయకులున్నారు. -
ఎట్టకేలకు కదిలారు!
సాక్షి, ఆదిలాబాద్: ఎట్టకేలకు ఎకై ్సజ్ శాఖలో విధులు నిర్వహిస్తున్న పలువురు కానిస్టేబుళ్లు బదిలీ అ య్యారు. కొద్దిరోజుల క్రితం జిల్లా నుంచి 70మంది వరకు నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలకు ట్రాన్స్ఫర్ అయ్యారు. అలాగే, ఆయా జిల్లాల నుంచి అంతే సంఖ్యలో మన జిల్లాకు కానిస్టేబుళ్లు బదిలీ పై వచ్చారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఎకై ్సజ్ శాఖలో బదిలీలు చోటుచేసుకోవడం గమనార్హం. రాష్ట్ర ఎకై ్స జ్ శాఖలో సుదీర్ఘ కాలంగా కానిస్టేబుళ్లు ఒకేచోట పాతుకుపోయారు. అసలు బదిలీల ప్రక్రియే లేకపోవడంతో అవినీతి, అక్రమాలపై ఆ శాఖలో ఫిర్యాదులు పెరిగిపోయాయి. అంతే కాకుండా కొంత మంది కానిస్టేబుళ్లు లిక్కర్, గంజాయి స్మగ్లర్లతో చేయి కలిపి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్ల దాడిలో కానిస్టేబుల్ సౌమ్య మృతి తర్వాత ఈ శాఖలో ఇలాంటి అంశాలపై కమిషనర్ హరికిరణ్ నిశితంగా దృష్టి సారించడం, ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శాఖ లో ప్రక్షాళన విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుళ్ల బదిలీలు చోటుచేసుకున్నాయని ఆ శాఖలో చర్చ సాగుతోంది. ఎనిమిదేళ్లకు పైగా ఒకేచోట.. ఎకై ్సజ్ శాఖలో సుమారు ఎనిమిదేళ్ల నుంచి ఒకేచోట విధులు నిర్వహిస్తున్న పలువురు కానిస్టేబుళ్లు ట్రా న్స్ఫర్ అయ్యారు. జిల్లా నుంచి పెద్ద మొత్తంలో బాసర జోన్ పరిధిలోని ఆయా జిల్లాలకు బదిలీపై వెళ్లారు. కాగా, శాఖలో ప్రక్షాళన కారణంగా బదిలీ పై ఇతర జిల్లాల నుంచి వచ్చిన కానిస్టేబుళ్లు తిరిగి సొంత జిల్లాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ విషయంలో కమిషనర్ కఠినంగా ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బదిలీ స్థానాల్లో చేరి నట్లు ప్రచారం జరుగుతోంది. ఇతర జిల్లాల నుంచి ఆదిలాబాద్ జిల్లాకు బదిలీపై వచ్చిన పలువురు కానిస్టేబుళ్లకు తమ సొంత జిల్లాల్లో రాజకీయంగా పలుకుబడి ఉండడంతో ఇక్కడి అధికారులతో కొంత వైరం కొనసాగుతుందనే ప్రచారం కూడా లేకపోలేదు. మొత్తంగా ఎకై ్సజ్ శాఖలో కానిస్టేబుళ్ల బదిలీ ల అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. -
నీట్కు పకడ్బందీ ఏర్పాట్లు
కై లాస్నగర్: జిల్లాలో ఈ నెల 3న నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమన్వయ సమావే శం నిర్వహించి మాట్లాడారు. నీట్ విద్యార్థుల భవి ష్యత్తో కూడుకున్నదని, ఏ చిన్న పొరపాటుకు తా వులేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప రీక్షాకేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీ రు, తగినంత వెలుతురు, ఫర్నిచర్ ఉండేలా చూడాలని తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతీ కేంద్రం వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, ఏఎన్ఎంలతో పాటు అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూ చించారు. అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప రీక్షాకేంద్రాల వద్ద భద్రత, క్రమశిక్షణ విషయంలో రాజీ పడకూడదని, 144 సెక్షన్ను కఠినంగా అమలు చేయాలని సూచించారు. పరీక్ష సమయంలో జి రాక్స్ సెంటర్లు తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించారు. నిర్ణీత సమయానికంటే నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించే ప్రసక్తి లేదని తెలి పారు. అడిషనల్ కలెక్టర్లు ఆర్ఎస్ చిత్రు, ఎస్.రాజేశ్వర్, ఆర్డీవో జగదీశ్వర్రావు పాల్గొన్నారు. ప్రణాళిక పనులు పక్కాగా పూర్తి చేయాలి జిల్లాలో చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను పక్కాగా నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న పనుల పురో గతి, నిధుల వినియోగంపై ఆరా తీశారు. పనుల్లో జాప్యం చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. ని యోజకవర్గ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. సి విల్ పనులు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవో, డీఆర్డీవో పాల్గొన్నారు. రేపు మీ సేవా అర్హత పరీక్ష జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మీ సేవా కేంద్రాల నిర్వహణ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 2న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా ఓ ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని సాత్నాల బస్టాండ్ సమీపంలోగల ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఉదయం 11నుంచి మధ్యాహం 12గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు హాల్టికెట్లను https:// adilabad. nic. in నుంచి లేదా తహసీల్దార్ కార్యాలయం నుంచి పొందవచ్చని తెలిపారు. కంప్యూటర్స్ బేసిక్స్, ఎం.ఎస్ ఆఫీస్పై 40 మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయని పేర్కొన్నారు. -
ఆదిలాబాద్ అగ్నిగుండం
కైలాస్నగర్: ఆదిలాబాద్ జిల్లా అగ్నిగుండంలా మారింది. మే ప్రారంభానికి ముందే భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. గురువారం రాష్ట్రంలోనే జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ పట్టణంలో 46 డిగ్రీలు నమోదైంది. మిగతా మండలాల్లో 44 నుంచి 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఉదయం 10గంటలకే భానుడు భగ్గుమంటున్నాడు. భగభగ మండే ఎండల తీవ్రతకు జనాలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లే వారు గొడుగులు, రక్షణ కవచాలు ధరిస్తున్నారు. ఎండల తీవ్రతతో ఇళ్లలోని కూలర్లు, ఫ్యాన్లు పని చేయని పరిస్థితి ఉంది. మనుషులతోపాటు పశుపక్షాదులు, మూగజీవాలు ఎండ తీవ్రతకు అల్లాడుతున్నాయి. ఎండలకు తోడు ఉక్కపోతతో వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల వడదెబ్బ బారిన పడి మరణాలు కూడా సంభవిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నందునా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. -
శిక్షణ తరగతులకు మున్సిపల్ చైర్పర్సన్
కై లాస్నగర్: ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వరంగల్ రీజియన్ పరిధిలోని మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లకు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హోటల్లో సీడీఎంఏ టీకే.శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ తరగతులకు ఆదిలాబా ద్ మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష హాజరయ్యారు. మున్సిపాలిటీ పాలనా వ్యవహారాల నిర్వహణ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇంజినీరింగ్, శానిటేషన్ విభాగాల్లో జరుగుతున్న కార్యకలాపాలు వాటిపై పర్యవేక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. చెత్త సేకరణ, మున్సిపాలిటీకి సొంత ఆదాయాన్ని సమకూర్చుకునే ట్రేడ్ లైసెన్సులు, వాటర్ టాక్స్, ప్రాపర్టీ టాక్స్, యూజర్స్ చార్జీల వసూలు లాంటి వివిధ అంశాలపై వారికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన చైర్పర్సన్ బండారి అనూష ఆదిలాబాద్ మున్సిపల్ పరిస్థితిని సమగ్రంగా వివరిస్తూ.. ప్రత్యేక నిధులు కేటాయించేలా చూడాలని కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. -
మున్సిపల్ కమిషనర్గా జగదీశ్వర్గౌడ్
కైలాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్గా జగదీశ్వర్గౌడ్ నియమితులయ్యారు. ప్రస్తుతం కమి షనర్గా పని చేస్తున్న రా జును మంచిర్యాల మున్సి పల్ కార్పొరేషన్ కమిషనర్గా ప్రభుత్వం బ దిలీ చేసింది. ఆయన స్థానంలో నిర్మల్ ము న్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న జగదీశ్వర్గౌ డ్ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, జగదీశ్వర్గౌడ్ ఇదివరకు ఆది లాబాద్ మున్సిపాలిటీలో శానిటరీ ఇన్స్పెక్టర్గా సుదీర్ఘకాలం పాటు పని చేశారు. ఆయన ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్ వాస్తవ్యుడు కావడం గమనార్హం. శుక్రవారం ఆయన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. -
రైతు కంట కన్నీరు.. కళ్ల ముందే కష్టం బుగ్గిపాలు
నిర్మల్ జిల్లా: మండల కేంద్రం పెంబి శివారులో మంగళవారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్సర్క్యూట్తో పదెకరాల మొక్కజొన్న దగ్ధమంది. స్థానికులు తెలిపిన వివరా ల మేరకు పెంబి శివారులో మంగళవారం మధ్యాహ్నం విద్యుత్ తీగలు తాకి నిప్పురవ్వలు ఎగిసిపడటంతో గోస్కూల శ్రీనివాస్, గోస్కూల తిరుమల, ఎలిగేటి అనిల్ కుమార్, కోప్పుల జ్యోతి, ఒద్నాల ఉమకు చెందిన పదెకరాల మొక్కజొన్న పూర్తిగా కాలి బూడిదయ్యింది.విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్ని వివరణ కోరగా.. సంఘటన స్థలాన్ని పరిశీలించా మని, షార్ట్సర్క్యూట్తో జరిగిన ఆనవాళ్లు లేవన్నా రు. సంఘటన స్థలాన్ని ఎంఆర్ఐ శ్రావణ్ రెడ్డి, ఏఈవో నాగమణి, జీపీవో భాస్కర్ పరిశీలించారు. రూ.7.56 లక్షలనష్టంవాటిల్లినట్లు అంచనా వేశారు.మాలేగాంలో..కుభీర్: మండలంలోని మాలేగాంలో మంగళవారం ఉదయం బండారి భోజన్న అనే రైతుకు చెందిన 2ఎకరాల 30 గుంటల్లో మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. సుమారు రూ.2లక్షల నష్టం జరిగినట్లు రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతు భోజన్న కోరుతున్నాడు.స్పందించిన సీఎం..షార్ట్ సర్క్యూట్ కారణంగా నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో చేతికొచ్చిన మొక్కజొక్క పంట కాలిపోయి రైతులు ఆవేదనలో ఉన్నారన్న సమాచారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ఆ సంఘటన పూర్తి వివరాలు పరిశీలించి నష్టపోయిన రైతులకు తగిన విధంగా ఆదుకోవాలని.. ఆర్థిక సహాయం అందించాలని సీఎం.. సీఎంఓ అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు, జిల్లా కలెక్టర్ అవసరమైన చర్యలు చేపట్టారు. -
నకిలీ విత్తనాలపై నిఘా పెంచాలి
ఆదిలాబాద్టౌన్: నకిలీ విత్తనాలు, నిషేధిత గడ్డి మందుపై నిఘా పెంచాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్క్వార్టర్స్ సమావేశ మందిరంలో పోలీసు సిబ్బందితో బుధవారం నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు, గడ్డి మందుల విక్రయాలపై నిఘా పెంచాలన్నారు. రైతులను మోసం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. స్టేషన్లలో సిబ్బంది పనితీరు మెరుగుపడేలా ఎస్హెచ్వోలు చొరవ చూపాలన్నారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లపై నిరంతరం నిఘా కొనసాగించాలని, రాత్రి సమయాల్లో గస్తీ పెంచాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, గ్యాంబ్లింగ్ వంటి చట్టవిరుద్ధ చర్యలు, ఆర్థిక నేరాలను అడ్డుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందులో అదనపు ఎస్పీలు మౌనిక, సురేందర్ రావ్, ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, శిక్షణ ఐపీఎస్ రాహుల్కాంత్, డీఎస్పీలు జీవన్ రెడ్డి, పోతారం శ్రీనివాస్, ఇంద్రవర్ధన్, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. -
● మున్సిపల్ ఆర్డీ విచారణ ● అక్రమార్కుల్లో గుబులు
మళ్లీ తెరపైకి.. అక్రమ అసెస్మెంట్లుకైలాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీల్లో చోటు చేసుకున్న అక్రమ అసెస్మెంట్ల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఎస్పీ అఖిల్ మహాజన్ విజ్ఞప్తి మేరకు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఇందులో భాగంగా వరంగల్ రీజినల్ డైరెక్టర్ (ఆర్డీ) షాహిద్ మసూద్ మున్సిపల్ కార్యాలయంలో పోలీసులు, మున్సిపల్ అధికారులతో తాజాగా విచారణ చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మేరకు అక్రమార్కుల్లో గుబులు మొదలైంది. గత కౌన్సిల్ హయాంలో పట్టణంలోని కేఆర్కే, ఎంప్లాయీస్ కాలనీ, సర్వే నం.170, టీచర్స్ కాలనీ, మావల, సర్వేనం.68, ఖానాపూర్, దుబ్బగూడ తది తర కాలనీల్లో వందలాది ప్రభుత్వ స్థలాలతో పా టు పేదలకు సర్కారు కేటాయించిన స్థలాలను కొంత మంది ఆక్రమించేశారు. వాటికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో మున్సిపల్ కార్యాలయంలో అసెస్మెంట్ (డోర్ నంబర్) పొందారు. ఆందోళనకు గురైన బాధితులు అప్పట్లోనే ఎస్పీ అఖిల్ మహా జన్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన జిల్లా పోలీస్ బాస్ సీడీఎంఏకు లేఖ రాశారు. ఈమేరక ఆ శాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. దీంతో మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఆర్డీ మంగళవారం విచారణ జరిపారు. మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీల్లో జరిగిన అక్రమ అసెస్మెంట్లు, వాటికి జతచేసిన డాక్యుమెంట్లను పరిశీలించారు. మున్సిపల్, పోలీసు అధికారుల వద్ద ఉన్న డాక్యుమెంట్ల వివరాలు పరిశీలించారు. వాటిని ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపై ఆరా తీశారు. కాలనీల వారీగా అక్రమ అసెస్మెంట్లపై నిర్ణీత ప్రొఫా ర్మాలో నివేదిక అందజేయాలని మున్సిపల్ కమిషనర్ రాజును ఆదేశించారు. అక్రమాలు జరిగినట్లుగా గుర్తించడంతో అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. చర్యలు తప్పవనే అధికారుల సూచనతో వాటి నుంచి ఏవిధంగా బయటపడాలనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో గతంలో ముగ్గురు మున్సిపల్ అధికారులపై వేటుపడిన విషయం తెలిసిందే. మరింత సమగ్రంగా విచారణ జరిపితే మరింత మందిపై చర్యలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. నివేదిక సిద్ధం చేస్తున్నాం.. గతంలో జరిగిన అక్రమ అసెస్మెంట్ల వ్యవహారంపై వరంగల్ ఆర్డీ విచారణ చేపట్టారు. పూర్తిస్థాయిలో ఆరా తీసి డాక్యుమెంట్లను పరిశీలించారు. కాలనీల వారీగా ప్రభుత్వ స్థలాలు, అసైన్డ్ ల్యాండ్లు, పట్టా కలిగిన ప్లాట్లను అక్రమంగా కబ్జా చేసి అసెస్మెంట్ చేసుకున్న వారి వివరాలతో కూడిన నివేదిక అందించాలని ఆదేశించారు. తదనుగుణంగా దృష్టి సారించాం. పూర్తిస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పిస్తాం. – జి.రాజు, మున్సిపల్ కమిషనర్ -
నీటి కరువు తీరేలా.. పచ్చదనం పెంచేలా
కై లాస్నగర్: ఆదిలాబాద్ పట్టణంలోని గాంధీ పా ర్కులో నెలకొన్న నీటి కరువు దూరం చేసి పచ్చదనం పెంపొందించే దిశగా కలెక్టర్ రాజర్షి షా ప్ర త్యేక దృష్టి సారించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జిల్లాకు ప్రకటించిన జల్శక్తి జన్ బాగీదారి నగదు పురస్కారం కింద అందించిన నిధుల ద్వారా నీటి సంరక్షణ చర్యలు చేపట్టారు. రూ.7.94లక్షల వ్యయంతో నీటి కుంటలు, బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్లు నిర్మించే పనులకు శ్రీకారం చుట్టారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా చేపట్టిన ఈ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. త్వరితగతిన పూర్తిచేసేలా ముందుకు సాగుతున్నారు. పార్కులో నీటి కటకట.. పట్టణంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజ లకు ఆహ్లాదం పంచే ఏకై క పార్కు ఇది. వారాంతపు సెలవులు, పండుగ రోజుల్లో చిన్నపిల్లలతో కిటకిట లాడుతుంది. అయితే ఈ ఉద్యానవననంలో తర చూ నీటి కటకట నెలకొంటుంది. ముఖ్యంగా వేసవి లో సమస్య జఠిలమవుతుంది. పార్కులో పచ్చద నం పంచేందుకు, నీటి అవసరాలు తీర్చేందు కోసం ఏడు బోర్లు ఉన్నప్పటికీ అందులో వేసవిలో ఒక్కటి మాత్రమే పనిచేయడం గమనార్హం. భూగర్భజలాలు అడుగంటి మిగతా వాటి నుంచి చుక్కనీరు రాని పరిస్థితి. ఈ క్రమంలో మొక్కలను సంరక్షించుకోవడం సమస్యాత్మకంగా మారుతుంది. ఆహ్లాదం పంచాల్సిన పచ్చదనం ఎండలకు కరువవుతోంది. దీంతో సందర్శకులకు నిరాశ తప్పని పరిస్థితి. వర్షపునీటిని ఒడిసిపట్టేలా..పార్కులో నీటి ఎద్దడి పరిస్థితిని గమనించిన కలెక్టర్ ఇటీవల జల్శక్తి జన్ బాగీదారి కేంద్ర పురస్కారం ద్వారా జిల్లాకు వచ్చిన నిధులను వినియోగించాలని భావించారు. వర్షపునీటిని వందశాతం ఒడిసిపట్టి సంరక్షించేలా ఏడు నీటి కుంటలు నిర్మించాలని నిర్ణయించారు. పార్కులో ని ఉసిరివనంలో నిర్మించే వీటిలో ఒక్కో దానికి రూ.92వేలు వెచ్చించనున్నారు. కుంట చుట్టూరా వర్షపునీరు నిలిచి ఉంచేలా ప్రత్యేకంగా రాళ్ల కట్టలను కూడా ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు పార్కులోని ఆరు బోరు బావుల్లో నీటిని నిల్వ ఉంచేలా ప్రత్యేకంగా బోర్వెల్ రీచార్జి స్ట్రక్చర్స్ నిర్మించనున్నారు. ఇందుకోసం ఒక్కో దానికి రూ.30వేల చొప్పున వెచ్చించనున్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గల స్విమ్మింగ్ పూల్లో వృథా నీటిని వేసవిలో ఇందులోకి మళ్లించేలా ప్రతిపాదనలు చేస్తున్నట్లుగా తెలు స్తోంది. ఈ చర్యలతో పార్కులో నీటి సమస్య పూర్తిగా తొలగిపోనుందని డీఆర్డీఏ అధికారి గోరఖ్నాథ్ చౌహన్ తెలిపారు. -
సర్కారు బడులకు వందనం
ఆదిలాబాద్టౌన్: సర్కారు బడుల్లో చదివిన విద్యార్థులు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించా రు. జిల్లాలోని 59 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీ ర్ణత నమోదైంది. వివరాలిలా ఉన్నాయి. 44 జెడ్పీ స్కూళ్లలో.. 44 జెడ్పీ పాఠశాలల్లో శతశాతం ఫలితాలు వచ్చా యి. ఇందులో పొచ్చర(ఆదిలాబాద్రూరల్), లాండసాంగ్వి, పిప్పిరి, దహెగాం, సాంగిడి, కొగ్దూర్, చప్రాల, అర్లి(టి), పిప్పల్కోటి, కరంజి, భీంపూర్, సొనాల, కౌఠ(బి), మర్లపల్లి, పొచ్చర(బోథ్), ఉర్దూ మీడియం బోథ్, బోరిగాం, కోకస్మన్నూర్, గిమ్మ, జైనథ్, పెండల్వాడ, దీపాయిగూడ, గూడ, కాన్ప మేడిగూడ, కూర, బాలాపూర్, పిప్పర్వాడ, లక్ష్మిపూర్, అడ, కౌట, భీంపూర్(నార్నూర్), వడూర్, తేజాపూర్, వాంకిడి, కుమారి, కుచులాపూర్, ఖోడద్, లింగి, తాంసి, కప్పర్ల, పొన్నారి, ఘోట్కు రి, శ్యామ్పూర్, సాలెవాడ(కె) ఉన్నాయి. తొమ్మిది కేజీబీవీల్లో .. ‘మోడల్’లో 99 శాతం ఉత్తీర్ణత.. ప్రభుత్వ యాజమాన్యంలో ఒక పాఠశాల.. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో కేవలం ఒకే పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఆది లాబాద్ పట్టణంలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో విద్యార్థులంతా పాస్ అయ్యారు. రావుల స్ఫూర్తి, బంగారుగూడ మోడల్ స్కూల్ (587) దుక్రే వైశాలి, తోషం కేజీబీవీ (564) -
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దు
కై లాస్నగర్: సాంకేతికత విస్తరిస్తున్న క్రమంలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కా ర్యాచరణలో భాగంగా స్థానిక టీటీడీసీలో సైబ ర్ నేరాలపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చదువుకున్న వారితో పాటు ఉన్నత పదవుల్లో ఉన్నవారు సైతం సైబర్ మోసాలకు గురవుతున్నారని అన్నారు. బ్యాంకు ఖాతాల వివరాలు, పాస్వర్డ్, ఓటీపీ వంటివి ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు చెప్పకూడదన్నారు. అనంతరం సైబర్ నేరాలపై అవగాహన, జాబ్మేళాకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఇందులో అదనపు ఎస్పీ సురేందర్రావు, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, పొలీస్, మహిళా, శిశు సంక్షేమ, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా అందించాలిఆదిలాబాద్టౌన్: వినియోగదారులకు అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్లో గల విద్యుత్ డివిజన్ కార్యాలయాన్ని బుధవారం తనిఖీ చేశారు. పలు విభాగాలను సందర్శించి రిజిస్టర్లు, విద్యుత్ సరఫరాకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అధికారుల పనితీరుపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగిన నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతర సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ వెంట విద్యుత్ శాఖ ఎస్ఈ ఆర్.శేషారావు, ఏఈలు, ఇతర అధికారులు ఉన్నారు. -
నాలుగేళ్లుగా జిల్లా ఉత్తీర్ణత శాతం వివరాలు ఇలా..
ఆదిలాబాద్టౌన్: అక్షర క్రమంలో ముందు వరుసలో ఉన్న ఆదిలాబాద్ జిల్లా పదో తరగతి ఫలితాల్లో వెనుకబడింది. రాష్ట్ర స్థాయిలో జిల్లా 21వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోల్చితే 12 స్థానాలు పడిపోయింది. టెన్త్ ఫలితాలను ప్రభుత్వం సలహాదారు కే.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా బుధవారం విడుదల చేశారు. ఈ సారి ప్రైవేట్కు ధీటుగా సర్కారు బడుల్లో చదివిన విద్యార్థులు సైతం అత్యుత్తమ మార్కులు సాధించారు. తగ్గిన ఉత్తీర్ణత శాతం.. గతేడాదితో పోల్చితే ఈ సారి 0.5 శాతం ఉత్తీర్ణత తగ్గింది. గత ఏడాది 97.40 శాతం విద్యార్థులు ఉత్తీ ర్ణులు కాగా ఈసారి 96.90 శాతం నమోదైంది. గతేడాది జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో 9వ స్థానంలో నిలువగా ఈ సారి 21 స్థానానికి పడిపోవడం గమనార్హం. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 10,875 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 10,538 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 5,439 మంది హాజరు కాగా 5,227 మంది పాస్ అయ్యారు. 91.1 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 5,436 మంది పరీక్షకు హాజరు కాగా 5,311 మంది పాస్ అయ్యారు. 97.7 శాతం ఉత్తీ ర్ణత నమోదైంది. ఉత్తీర్ణత శాతం పరంగా 0.5 శా తం తగ్గినప్పటికీ స్థానం మాత్రం 9 నుంచి 21వ స్థానానికి పడిపోవడం ఫలితాల్లో నమోదైన వెనుకబాటుకు నిదర్శనంగా నిలుస్తోంది. నేటి నుంచి రీకౌంటింగ్కు అవకాశం.. మార్కుల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్కు సంబంధించి విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది. ఇందుకు ఈ నెల 30 నుంచి జూన్ 14 వరకు గడువు విధించింది. రీకౌంటింగ్ కోసం రూ. 500, రీవెరిఫికేషన్ కోసం సబ్జెక్టుకు రూ.1,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. సబ్జెక్టుల వారీగా.. తెలుగులో 99.43 శాతం, సెకండ్ లాంగ్వేజ్లో 99.83, ఇంగ్లీష్లో 98.41, గణితంలో 99.23, సైన్స్లో 98.79, సాంఘిక శాస్త్రంలో 99.61 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అయితే తెలుగులో 62 మంది, సెకండ్ లాంగ్వేజ్లో 19, ఇంగ్లీష్లో 173, గణితంలో 84, సైన్స్లో 132, సోషల్లో 42 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. యాజమాన్యాల వారీగా.. ఆశ్రమ పాఠశాలల్లో 98.88 శాతం, బీసీ వెల్పేర్లో 99.50, ప్రభుత్వ పాఠశాలల్లో 86.97, కేజీబీవీల్లో 98.40, మోడల్ స్కూళ్లలో 99.82, ప్రైవేట్ స్కూళ్లలో 98.59, రెసిడెన్షియల్ మినీలో వంద శాతం, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో వంద శాతం, ట్రైబ ల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో 98.99 శాతం, జెడ్పీలో 95.02 శాతం ఉత్తీర్ణత సాధించారు. డీఈవో కార్యాలయంసంవత్సరం ఉత్తీర్ణత శాతం జిల్లా స్థానం 2022-23 88.68 19 2023-24 92.23 172024-25 97.40 92025-26 96.90 21మెరుగైన ఫలితాల సాధనకు చర్యలు జిల్లాలో ఈసారి ఫలితాల్లో కొంత వెనుకబడ్డాం. వచ్చే విద్యా సంవత్సరంలో మెరుగైన ఫలితాలు సాధించేలా ముందు నుంచే ప్రత్యేక దృష్టి సారిస్తాం. కేజీబీబీవీలతో పాటు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో మంచి ఫలితాలు సాధించాం. ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం. – ఎస్.రాజేశ్వర్, అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో జూన్ 5 నుంచి సప్లిమెంటరీ..పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం జూన్ 5 నుంచి 12 వరకు అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఈ నెల 30 నుంచి మే 14 వరకు ఫీజు చెల్లించేందుకు గడువు ఉంది. మే 15 వరకు ప్రధానోపాధ్యాయులు ఎన్ఆర్లను ఆన్లైన్ ద్వారా డీఈవో కార్యాలయంలో సమర్పించాలి. -
పంట దిగుబడులు దళారులకు విక్రయించొద్దు
బోథ్: రైతులు పంట దిగుబడులను దళారులకు విక్రయించి నష్టపోవద్దని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రంలోనే మద్దతు ధర లభిస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ధార్మిక కార్యక్రమాలు సంప్రదాయాలకు ప్రతీక నేరడిగొండ: ధార్మిక కార్యక్రమాలు సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని సేవాదాస్నగర్లో బుధవారం నిర్వహించిన జగదాంబదేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, సర్పంచ్ వినేశ్, నాయకులు రవీందర్ రెడ్డి, పవన్, ప్రతాప్ సింగ్, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అంగన్వాడీ సిబ్బందికి మొబైల్ ఫోన్లు పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బందికి 5జీ మొబై ల్ ఫోన్లను ఇటీవల మంజూరు చేసింది. ఈమేరకు గుడిహత్నూర్ మండల అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు మండల కేంద్రంలోని తన నివాసంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం పంపిణీ చేశా రు. కార్యక్రమంలో సీడీపీవో సౌందర్య, సూపర్వైజ ర్ జయశ్రీ, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది తది తరులు పాల్గొన్నారు. -
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
తాంసి: పంట విక్రయించేందుకు యార్డుకు వచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ చిత్రు అన్నారు. మండల కేంద్రంలోని సబ్మార్కెట్ యార్డులో చేపడుతున్న మొక్కజొన్న కొనుగోళ్లను బుధవారం ఆయన పరిశీలించారు. రైతులతో మా ట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తా గునీరు, నీడ వసతి కల్పించాలని, ప్రతీ రైతు పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట సీఈవో శ్రీనివాస్, రాంరెడ్డి, దత్తు, సొసైటీ కా ర్యదర్శులు సుధాకర్, సిద్ధాంత్, ఇంతియాజ్, అఖిల్ తదితరులున్నారు. -
మున్సిపల్ అభివృద్ధికి సహకారం
కై లాస్నగర్: కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకువచ్చి ఆదిలాబాద్ పట్టణాభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్పర్సన్ బండారి అనూష అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కౌన్సిల్ సర్వసభ్య సమావేశానికి ఆయన తొలిసారిగా హాజరయ్యారు. పట్టాణాభివృద్ధిలో ఆయా శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు, నిధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగంపై ఆరా తీశారు. ఇబ్బందులు తలెత్తకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. కేంద్రం నుంచి అదనంగా నిధులు తీసుకువస్తానన్నారు. అమృత్ పథకంలో వివిధ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఉచిత బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బల్దియాకు సొంత గ్యారేజ్ .. మున్సిపల్ వాహనాల మరమ్మతులు, సర్వీసింగ్, వాటర్ వాషింగ్ పనులను సొంతంగా నిర్వహించేలా రూ.50 లక్షలతో ఏర్పాటు చేయనున్న సొంత గ్యారేజ్కు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అలాగే అన్ని కమ్యూనిటీల శ్మశానవాటికల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించింది. నీటి సరఫరా మోటర్ల మరమ్మతు, వీధి దీపాలు, కాంట్రాక్ట్ వర్కర్స్ వేతనాల కోసం నిధులు కేటాయిస్తూ కౌన్సిల్ ఆమోదించింది. 16 అంశాల ఎజెండాతో సమావేశం నిర్వహించగా వినాయక్ చౌక్, ఓల్డ్ బస్టాండ్ ప్రాంతంలోని వీధి వ్యాపారుల దుకాణాల అద్దె పెంపును వాయిదా వేయగా.. మిగతా అన్ని అంశాలకు కౌన్సిల్ పచ్చజెండా ఊపింది. సమావేశానికి మున్సిపల్ అధికారులతో పాటు హౌసింగ్, రెవెన్యూ, డీఆర్డీఏ, విద్యుత్శాఖల అధికారులు తొలిసారిగా హాజరయ్యారు. సమావేశంలో కమిషనర్ జి.రాజు, ఎంఈ అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గండి పోశమ్మ ఆలయంలో వేలం వాయిదా
దేవీపట్నం: గండి పోశమ్మ అమ్మవారి ఆలయంలో బుధవారం నిర్వహించిన వేలం వాయిదా పడింది. అమ్మవారికి భక్తులు సమర్పించిన కొబ్బరికాయలో సగభాగం పొందడానికి, చీరలు, రవికెలకు, ఆలయ ప్రాంగణంలో పూజాద్రవ్యాలు, అమ్మవారి ఫొటోల విక్రయానికి, లడ్డూ ప్రసాదం తయారీకి వేలం నిర్వహించారు. ఈ పాటలో ఎవరూ పాల్గొనకపోవడంతో దేవదాయ శాఖ అధికారులు వేలం వాయిదా వేశారు. తిరిగి మే 4వ తేదీ ఉదయం 11 గంటలకు ఆలయ ప్రాంగణంలో వేలం నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ఆ ఉత్తర్వులు మత స్వేచ్ఛకు విఘాతం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా ఉన్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ వేలాదిగా క్రైస్తవులు కాకినాడలో బుధవారం ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. కాకినాడ డిస్ట్రిక్ట్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యాన స్థానిక భానుగుడి సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా కాకినాడ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దొమ్మేటి శామ్యూల్ సాగర్, జోషఫ్ బెన్నీ మాట్లాడుతూ, 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేసి, దళిత క్రైస్తవులకు మత స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్ చేశారు. పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు వారికి సంఘీభావం తెలుపుతూ క్రైస్తవుల న్యాయ పోరాటానికి తన పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. ర్యాలీ, ధర్నా అనంతరం క్రైస్తవ సంఘాల నాయకులు కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్కు వినతిపత్రం సమర్పించారు. జూన్ నెలాఖరు నాటికి నూతన టెర్మినల్ భవనం పూర్తి కోరుకొండ: జూన్ నెలాఖరు నాటికి మధురపూడి విమానాశ్రయంలో నిర్మాణ దశలోఉన్న నూతన టెర్మినల్ భవనం పూర్తవుతుందని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.రాజ్కిషోర్ తెలిపారు. విమానాశ్రయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పరిశీలన నిమిత్తం బుధవారం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఇక్కడికొచ్చారు. సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకుని ఇంజినీర్లకు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ప్రయాణికుల సౌకర్యార్థం మెరుగైన వసతులు కల్పించనున్నట్టు తెలిపారు. ఇక్కడి నుంచి ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, తిరుపతికి సర్వీసులున్నట్టు, దానికణుగుణంగా అయోధ్య, వారణాసి నగరాలకు నిర్వహించడానికి ఎయిర్లైన్స్ సంస్థతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో అథారిటీ జనరల్ మేనేజర్ వసుంధర, ఎయిర్పోర్టు డైరెక్టర్ కె.ప్రీతి, ప్రాజెక్టు ఇన్చార్జి వి.శ్రీనివాసు పాల్గొన్నారు. చినవెంకన్న కల్యాణానికి భారీగా ఏర్పాట్లు ద్వారకా తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాన్ని గురువారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా లక్షలాది రూపాయలు వెచ్చించి ఆలయ తూర్పు రాజగోపురం వద్ద భారీ వేదికను నిర్మిస్తున్నారు. ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు పర్యవేక్షణలో ఈ పనులు జరుగుతున్నాయి. కల్యాణ మండప ప్రాంతంతో పాటు, క్షేత్ర పరిసరాలను ఇప్పటికే సిబ్బంది శోభాయమానంగా అలంకరించారు. ఇదిలా ఉంటే కల్యాణ వేడుకను వీక్షించేందుకు విచ్చేసే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఈ వేడుక కన్నుల పండువగా జరగనుంది. స్వామివారు ఆలయం నుంచి తూర్పురాజగోపురం మీదుగా కల్యాణ వేదిక వద్దకు గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో చేరుకుంటారు. 8 గంటల నుంచి కల్యాణ మహోత్సవం ప్రారంభం అవుతుంది. శుక్రవారం రాత్రి రథోత్సవం జరగనుంది. -
సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
చింతూరు: ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని క్షేత్రస్థాయి అధికారులను ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ ఆదేశించారు. స్థానిక కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నాలుగు మండలాల ప్రజల నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. ప్రజలు ఇచ్చిన 68 దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో నాలుగు మండలాల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆప్షన్–2 నిర్వాసితులకు ఒకే విడతలో చెల్లింపు పునరావాస కాలనీల నిర్మాణంలో భాగంగా స్వయంగా ఇళ్లు నిర్మించుకునేందుకు ఆప్షన్–2 ఎంచుకున్న నిర్వాసితులకు ఒకే విడతలో సొమ్ములు జమ చేస్తామని ఐటీడీఏ పీవో, ఆర్అండ్ఆర్ అధికారి శుభం నొఖ్వాల్ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనితో పాటు ఆప్షన్–2 ఎంచుకున్న నిర్వాసితులు ఏడాదిలోగా ఇళ్లు నిర్మించకుంటే సొమ్ములను రికవరీ చేస్తామనే నిబంధనను సడలిస్తున్నట్లు పీవో తెలిపారు.ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ -
రబ్బరు రైతులకు ప్రోత్సాహం
రంపచోడవరం: ఏజెన్సీలో రబ్బరు రైతుల ప్రోత్సాహానికి చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ దినేష్కుమార్ పేర్కొన్నారు. మారేడుమిల్లి మండలం పూజారిపాకలు గ్రామంలో బుధవారం రబ్బరు ప్రొసెసింగ్ యూనిట్ను, ఐటీడీఏ ద్వారా ఏర్పాటు చేసిన రబ్బర్ ప్లాంటేషన్ను ఆయన పరిశీలించి మాట్లాడారు. పూజారిపాకలులో మరో వెయ్యి ఎకరాలలో రబ్బరు ప్లాంటేషన్కు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుని కార్యాచరణ సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడి రబ్బరు ప్లాంటేషన్ ద్వారా రైతులు ఏ మేరకు అభివృద్ధి చెందినదీ ఆయన తెలుసుకున్నారు. ఈ రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే రబ్బరు బోర్డు అధికారులను, డీహెచ్ఓను సంప్రదించాలని ఆయన సూచించారు. స్మోక్ రూమ్ల ఏర్పాటుకు రైతులు 50 శాతం వాటా చెల్లిస్తే మరో పది స్మోక్ రూమ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. మారేడుమిల్లి మండలంలోని నేషనల్ రబ్బర్ ప్రాసెసింగ్ ఫార్మింగ్ యూనిట్ మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ యూనిట్లో మొత్తం 830 మంది రైతులలో ఒక్కొక్క రైతు రూ.5 వేల చొప్పున వాటా ధనం చెల్లించాలన్నారు. పందిరిమామిడి గ్రామంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడి యువత కోరిక మేరకు క్రీడా మైదానం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటమని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యురాలు గొర్లె సునీత, డీహెచ్ఓ దేవదానం, ఎంపీడీవో మడకం కుమారి, జెడ్పీటీసీ గొర్లె బాలాజీ బాబు తదితరులు పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ దినేష్కుమార్ -
జీడిమామిడికి గిట్టుబాటు ధర కల్పిస్తాం
● పిక్కల కోనుగోలుకు లైసెన్సులు తప్పనిసరి ● సిండికేట్గా మారిన వ్యాపారులపై చర్యలు ● కలెక్టర్ దినేష్కుమార్ రంపచోడవరం: జిల్లాలో జీడిమామిడి రైతులు దళారుల మోసాలకు గురికాకుండా గిట్టుధర లభించేలా చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ కె.దినేష్కుమార్ తెలిపారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో బుధవారం హార్టికల్చర్, అగ్రికల్చర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీడిపిక్కల కొనుగోలుదారులు తప్పనిసరిగా ఐటీడీఏ ద్వారా లైసెన్సులు తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాలు వద్ద ప్రతీ రోజు ధరలను బోర్డుపై ప్రదర్శించాలన్నారు. తూకాలలో మోసపోకుండా డిజిటల్ కాటాలు ఏర్పాటు చేయాలని, సిండికేట్గా ఏర్పడి ధర తగ్గించేవారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గతంలో జీడి పిక్కలను ఎలా కొనుగోలు చేసేవారన్న విషయాన్ని వెలుగు అధికారులను అడిగి తెలుసుకున్నారు. జీడి పిక్కల నాణ్యతపైనా ఆయన చర్చించారు. అలాగే తూకాల్లోనూ లీగల్ మెట్రలాజీ సర్టిఫికెట్లను పరిశీలించాలని తహసీల్దార్ సీహెచ్ బాలాజీని కలెక్టర్ ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలోని జీడి మామిడి పిక్కల ఫ్యాక్టరీల యాజమాన్యాలతో ధరల విషయమై చర్చించామని సుమారు ఐదు వేల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలుకు ఇక్కడకు వారు రానున్నట్టు ఆయన తెలిపారు. పందిరిమామిడి దగ్గరలో జీడి పిక్కల గొడౌన్ను ఏర్పాటు చేయనున్నామని, రైతులు సైతం వాటిని పర్యవేక్షించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. దేవీపట్నం, రంపచోడవరం, మారేడుమిల్లి, గంగవరం మండలాల రైతులు ఆ గొడౌన్లో సరకు భద్రపరుచుకుని, వాటిని కొనుగోలు చేసిన సంస్థలే డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జిల్లాలో ఎన్ని వీడివీకేలు ఉన్నాయి, ఎన్ని జీడి పిక్కల ప్రాసెసింగ్ చేస్తున్నాయో ఆరా తీశారు. కాగా జీడి పిక్కలకు మద్దతు ధర కల్పించాలని ఎంపీపీ బంధం శ్రీదేవి, స్వామి దొర కలెక్టర్ను కోరారు. ముందుగా పెద్దగద్దాడ గ్రామంలోని జీడి మామిడి తోటలను కలెక్టర్ పరిశీలించారు. సమావేశంలో డీహెచ్ఓ దేవదానం, డీఆర్డీఏ పీడీ దాసరి రత్నాకరరావు, ఏడీఏ సావిత్రి తదితరులు పాల్గొన్నారు. -
జీడి పిక్కలను ప్రభుత్వమే కొనాలి
వై.రామవరం: ఏజన్సీలో జీడిపిక్కలను గిరిజన రైతుల వద్ద ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆదివాసీ గిరిజన చైతన్య వేదిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వెదుళ్ల లచ్చిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం వై.రామవరం మండలం సింహాద్రిపాలెం గ్రామంలో గిరిజన జీడి మామిడి రైతులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఏజన్సీలో కొందరు దళారులు జీడిపిక్కల కంపెనీ యాజమాన్యాలతో కుమ్మకై ్క జీడి పిక్కలకు వైరస్ వచ్చిందని వంకలు పెడుతూ గిట్టుబాటు ధర కల్పించకుండా మోసగిస్తున్నారని ఆరోపించారు. ఒక సింహాద్రిపాలెం గ్రామంలోనే రైతుల వద్ద సుమారు 4 వందల బస్తాలు జీడిపిక్క నిల్వలు ఉండిపోయాయన్నారు. గతంలో కేజీ రూ.150కు కొనుగోలు చేసి, ప్రస్తుతం రూ.వందకు కూడా కొనుగోలుకు ముందుకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఈ దళారులంతా సిండికేట్గా ఏర్పడి గిరి రైతులను మోసగిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం స్పందించి రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసినట్లే, జీడిపిక్కలు కూడా కొనుగోలు చేసి ఇక్కడి రైతులను ఆదుకోవాలని కోరారు. అలాగే తమ సంఘం రైతులకు అండగా ఉండి పోరాడుతుందని భరోస ఇచ్చారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్ను కలసి విన్నవించనున్నట్లు లచ్చిరెడ్డి తెలిపారు. గిరిజన రైతులను మోసగిస్తున్న దళారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసి, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన చైతన్య వేదిక సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి మడిగొంట వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు పుడిగి లక్ష్మణరావు, మాజీ సర్పంచ్లు వేట్ల జోగిరెడ్డి, వేట్ల సన్యాసిరెడ్డి జీడిమామిడి రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వమే కొనుగోలు చేయాలి గిరిజనులు సేకరించిన జీడిపిక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. సిండికేటుగా మారి రైతులను మోసం చేస్తున్న దళారులపై అధికారులు చర్యలు తీసుకోవాలి. దళారుల ఆగడాలతో పేరుకుపోతున్న నిల్వలు వైరస్ వచ్చిందని దుష్ప్రచారం చేస్తూ గిట్టుబాటు ధరకు ఎసరు ఆదివాసీ గిరిజన చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు లచ్చిరెడ్డి -
రత్నగిరిపై ప్రతిధ్వనించిన వేదఘోష
అన్నవరం: రత్నగిరిపై వేద ఘోష ప్రతిధ్వనించింది. వార్షిక దివ్యకల్యాణ మహోత్సవాల్లో భాగంగా నవ దంపతులు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల సమక్షంలో బుధవారం వేద పండిత సదస్యం ఘనంగా జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లను, పెళ్లి పెద్దలు సీతారాములను అనివేటి మండపం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చి వేదికపై ప్రతిష్ఠించి, సర్వాంగ సుందరంగా అలంకరించి, పూజలు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచీ వచ్చిన వేద పండితులు సాయంత్రం 6 గంటలకు స్వామివారి ముందు తమ నాలుగు వేదాలు పఠించి, తమ విద్వత్తును ప్రదర్శించారు. అనంతరం, సత్యదేవుడు, అమ్మవార్లకు దేవస్థానం వేద పండితులు వేదాశీస్సులందజేశారు. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన చెందిన ప్రవా రామకృష్ణ సోమయాజి, రామ్లాల్శర్మలతో పాటు 180 మంది వేద పండితులను, దేవస్థానం వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగాధరభట్ల గంగబాబు, శివ తదితరులను, ఆలయ ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యశర్మ, విశ్రాంత ప్రధానార్చకులు ఇంద్రగంటి గోపాలకృష్ణ, నాగాభట్ల సత్యనారాయణ, విశ్రాంత వ్రత పురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, మంగళంపల్లి కృష్ణభగవాన్జీలను దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మంజులాదేవి, ఏఈఓ కృష్ణారావు ఘనంగా సత్కరించారు. ఘనపాఠులకు రూ.4 వేలు, క్రమపాఠులు, విశ్రాంత అర్చకులు, వ్రత పురోహితులకు రూ.3 వేల చొప్పున పారితోషికాన్ని వారి అకౌంట్లలో జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పొన్నచెట్టు వాహనంపై ఘనంగా ఊరేగింపు కల్యాణోత్సవాల్లో భాగంగా సత్యదేవుడు, అమ్మవారిని పొన్నచెట్టు వాహనం మీద ఘనంగా ఊరేగించారు. రాత్రి 8.30 గంటలకు స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా రత్నగిరి తొలి పావంచా వద్దకు తీసుకువచ్చి, పొన్నచెట్టు వాహనంపై వేంచేయించి, పండితులు పూజలు చేయించారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ దర్శించి, పూజలు చేశారు. అనంతరం, రత్నగిరి తొలి పావంచా నుంచి ఆంధ్రా బ్యాంక్ సెంటర్ వరకు.. అక్కడి నుంచి తిరిగి తొలి పావంచా వరకు ఊరేగింపు సాగింది. పలువురు కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శించారు. అసిస్టెంట్ కమిషనర్ మంజులాదేవి, వేద పండితులు, అర్చకులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. -
భానుడు..అలసిపోలే!
ఆదిలాబాద్టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎండ తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన వారు వడదెబ్బకు గురవుతున్నారు. జ్వరం, వాంతులు, విరేచనాల బారిన పడుతున్నారు. మంగళవారం ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలోని బేలలో 45.9 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా నిర్మల్ జిల్లాలోని అక్కాపూర్లో 45.9, మంచిర్యాల జిల్లాలోని బీమారంలో 45.8, కుమురంభీం ఆసిఫాబాద్లో 45.8, నిర్మల్లోని తానూర్లో 45.8, ఆదిలాబాద్లోని ఇంద్రవెల్లి మండలం హీరాపూర్లో 45.8, కుమురంభీం జిల్లా కెరమెరిలో 45.7, బేలలోని చప్రాలలో 45.7, సిర్పూర్(టి)లో 45.7 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఉదయం 9 దాటింతంటే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నా డు. దీంతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. సాయంత్రం 7 దాటినా వడగాలు లు తగ్గడం లేదు. రాత్రి ఉక్కపోత ఇక్కట్లు వర్ణనాతీతం. కూలర్లు సైతం చల్ల గాలినివ్వడం లేదని పలువురు పేర్కొంటున్నారు. -
డీలర్ల వద్దే కొనుగోలు చేయాలి
రైతులు అధికృత డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. తప్పనిసరిగా రశీదు పొందాలి. విత్తనాలు విత్తిన తర్వాత ఆ ప్యాకెట్లను పారేయవద్దు. సీజన్ అయ్యేంత వరకు భద్రపర్చాలి. ఒకవేళ మొలకెత్తకపోయినా, కాత రాకపోయినా సంబంధిత కంపెనీ నుంచి నష్టపరిహారం పొందవచ్చు. గ్రామాల్లో నకిలీ విత్తనాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశాం. – శివకుమార్, ఏడీఏ, వ్యవసాయ శాఖ కార్యాలయం నకిలీలపై ఉక్కుపాదం నకిలీ విత్తనాలు అమ్మేవారిపై ఉక్కుపాదం మోపుతాం. ఇటీవల బేలలో గుజరాత్కు చెందిన నిందితుడి నుంచి 150 నకిలీ విత్తన ప్యాకెట్లను సీజ్ చేశాం. అలాగే నలుగురిపై కేసులు నమోదు చేశాం. లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దనే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలి. – ఎల్.జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ -
‘గిరిజన’ స్పెషల్ చీఫ్ సెక్రెటరీని కలిసిన పీవో
ఉట్నూర్రూరల్: ఉట్నూర్ ఐటీడీఏ పీవో మందా మకరందు మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్ను హైదరాబాద్లో మర్యాద పూర్వకంగా కలిశా రు. గిరిజన సంక్షేమానికి సంబంధించిన ప్రస్తు త పరిస్థితులు, ఐటీడీఏ పరిధిలో అభివృద్ధి కా ర్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికల పై విస్తృతంగా చర్చించారు. గిరిజన ప్రాంతా ల్లో విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాల మెరుగుదల, మౌలిక సదుపాయాల విస్తరణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. -
శాస్త్ర సాంకేతికతతో వ్యవసాయ రంగం అభివృద్ధి
ఆదిలాబాద్టౌన్: వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు, పరిశోధనల ఫలాలు క్షేత్రస్థాయిలో సామాన్య రైతులకు చేరినప్పుడే సాగు లా భసాటిగా మారుతుందని కలెక్టర్ రాజర్షిషా అన్నా రు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉత్తర తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా సంఘం 2026–27 సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సాగులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించేలా శాస్త్రవేత్తలు సమయానుకూల సూచనలు అందించాలన్నారు. సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆయిల్పామ్ వంటి వాణిజ్య, అంతర పంటలపై దృష్టి సారించాలన్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సమన్వయంతో పనిచేసి విత్తనశుద్ధి నుంచి పంట కోత వరకు రైతులకు అండగా నిలవాలన్నారు. అనంతరం సోయాబీన్ విత్తనోత్పత్తి, పంట చీడపీడలపై రూపొందించిన అవగాహన కరదీపికను ఆవిష్కరించారు.ఇందులో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, పీజేటీఎస్ఏయూ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎం.బాల్రాజ్, విస్తరణ సంచాలకులు డాక్టర్ యాకాద్రి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్, వ్యవసాయ మిషనరేట్ ప్రతినిధి అనిత, వివిధ జిల్లాల అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. జిల్లాలో సరిపడా పెట్రో నిల్వలు ఆదిలాబాద్టౌన్: జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, ప్రజలకు అవసరమైన మేర నిల్వలు అందుబాటులో ఉ న్నాయని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రుతో కలిసి చమురు కంపెనీల సేల్స్ అధికారులు, బంక్ డీలర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జి ల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నా రు. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రవాణా ఇబ్బందులు వెంటనే పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో బంకుల వద్ద ఇంధన లభ్యతను నిరంతరం పర్యవేక్షించా లని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హె చ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలు, పుకార్లు నమ్మి ప్రజలు బంకుల వద్ద బారులు తీరవద్దని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు చమురు కంపెనీ ప్రతినిధులతో నిర్వహించిన గూగుల్ మీట్లో డిపోల నుంచి బంకులకు చేరుతున్న సరఫరా తీరుపై సమీక్షించారు. ఇందులో జిల్లా పౌర సరఫరాల అధికారి నందిని, వివిధ శాఖల అధికారులు, ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధులు, ఇంధన డీలర్లు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో ఇలా..
● పార్టీ పటిష్టతపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫోకస్ ● మండల, పట్టణ కమిటీలపై దృష్టి సారిస్తున్న ‘హస్తం’ ● బీఆర్ఎస్లో అన్ని కమిటీలు రద్దు ● సభ్యత్వ నమోదుకు ప్రణాళిక ‘హస్తం’ పార్టీలో సంస్థాగత నిర్మాణంలో భాగంగా మండల, పట్టణ, బ్లాక్కాంగ్రెస్ కమిటీలను ఒకట్రెండు రోజుల్లో నియమించనున్నారు. దీనికి సంబంధించి కమిటీలు అన్నింటిని రూపొందిం చి టీపీసీసీకి పేర్లు పంపించారు. ప్రస్తుతం పార్టీలో జిల్లా కమిటీ మినహా ఇతర కమిటీలేమి కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేసే కమిటీలపై శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా సంస్థాగత నిర్మాణ పరంగా ఆలస్యమవుతుండడంపై పార్టీ శ్రేణుల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా త్వరగా పూర్తి చేయాలని వారు అభిప్రాయ పడుతున్నారు. పార్టీ పటిష్టతకు క్షేత్రస్థాయిలో కమిటీలే కీలకమని పేర్కొంటున్నారు. -
నకి‘లీలలు’
ఆదిలాబాద్టౌన్: వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే జిల్లాలో నకిలీ విత్తనాలు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. అక్రమార్కులపై పోలీసులు, వ్యవసాయ అధికారులు ఏటా కొరడా ఝుళిపిస్తున్నా ఈ దందాకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. కొన్ని ప్రై వేట్ కంపెనీలు పల్లెల్లో ప్రచారం నిర్వహిస్తూ రైతులకు వీటిని అంటగడుతున్నాయి. నాటిన తర్వాత మొలకెత్తకపోవడం, మొలకెత్తినా కాత రాకపోవడంతో రైతులకు ఏటా నష్టాలు తప్పని పరిస్థితి.ఇటీవల బేలలో నకిలీ విత్తన రాకెట్ను పోలీసులు బట్టబయలు చేశారు. 150 ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలతో పాటు రూ.60వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో.. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 5లక్షల 91వేల ఎకరాలుగా ఉంది. ఇందులో అత్యధికంగా 4లక్షల 30వేల ఎకరాల్లో పత్తి ఉండగా.. తర్వాత 90వేల ఎకరాల్లో సోయా, 50వేల ఎకరాల్లో కంది, 25వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతున్నాయి. రాష్ట్రంలోనే ఆదిలాబాద్లో అత్యధికంగా పత్తి సాగవుతుండడంతో దళారులు ఈ విత్తనాలపై దృష్టి పెట్టారు. ఏటా ఖరీఫ్కు ముందు పల్లెల్లో తిరగడం, కంపెనీల ప్రచారం చేపట్టడం, పేరున్న రైతులకు ఉచితంగా అందించడం వంటివి చేస్తున్నారు. గిఫ్టులు, ఆఫర్లతో మభ్యపెడుతూ ఆకర్షిస్తున్నారు. తర్వాత కనిపించకుండా ఉడాయిస్తున్నారు. అధిక దిగుబడి అంటూ.. తమ కంపెనీ విత్తనాలతో అధిక దిగుబడులు వస్తాయని దళారులు రైతులను నమ్మిస్తున్నారు. ము ఖ్యంగా గుజరాత్కు చెందిన కేటుగాళ్లు జిల్లాలోని పలువురు డీలర్లు, వ్యాపారులు, ఏజెంట్లను నియమించుకొని వారి దందా సాగిస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే కాకుండా మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లోనూ వీరి వ్యాపారం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎకరానికి 15 నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అంటగడతారు. బ్రాండెడ్ బీటీ విత్తనాల పేర్లలోని అక్షరాలను అటుఇటూ చేస్తూ అదే మాదిరి పలికే పేర్లతో తయారు చేస్తున్నారు. వీటిని పసిగట్టని రైతులు కొనుగోలు చేసి మోసపోతున్న ఘటనలు అనేకంగా ఉన్నాయి. గతంలో జిల్లాకు కర్నూల్, విజయవాడ, ఒంగోలు, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి నకిలీ విత్తనాలు వచ్చాయనే ప్రచారం ఉంది. ఇటీవల బేలలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన నకిలీ విత్తనాలను విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ బృందాలు ఏర్పాటు.. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది. మండలానికొకటి చొప్పున నియమించింది. ఇందులో తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారి, ఎస్సై ఉంటారు. డివిజన్ స్థాయిలో ఆర్డీవో, ఏడీఏ, డీఎస్పీ ఉంటారు. జిల్లా టాస్క్ఫోర్స్లో అదనపు కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి, అదనపు ఎస్పీ సభ్యులు గా ఉంటారు. వీరంతా గోదాములు, విత్తన దుకా ణాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ట్రాన్స్పోర్టులలో తనిఖీలు చేపడతారు. ఆయా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతులు నకిలీ విత్తనాల వైపు వెళ్లకుండా చర్యలు చేపడతారు. ఎక్కడైనా విక్రయించినట్లు సమాచారం అందితే వెంటనే దాడులు జరిపి కేసులు నమోదు చేస్తారు. మూడేళ్లుగా జిల్లాలో నకిలీ విత్తన కేసుల వివరాలు సంవత్సరం కేసులు పట్టుబడిన స్వాధీనం చేసుకున్న 2024 5 18 776 కిలోలు 2025 9 22 170 కిలోలు 2026 1 4 150 విత్తన ప్యాకెట్లు -
బీఆర్ఎస్లో ఇలా..
కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఆయా పార్టీల పటిష్టత కోసం సంస్థాగత నిర్మాణం చేపడుతున్నాయి. ‘హస్తం’ పార్టీలో ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది. నేడో.. రేపో మండల, పట్టణ, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలను ప్రకటించనున్నారు. ఇక బీఆర్ఎస్లో జిల్లా, మండల, పట్టణ కమిటీలన్నింటినీ తాజాగా రద్దు చేశారు. పూర్తి స్థాయిలో సంస్థాగత నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. – సాక్షి,ఆదిలాబాద్బీఆర్ఎస్ రజతోత్సవ ముగింపు వేడుకలు ఇటీవల హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన విషయం తెలిసిందే. అధినేత కేసీఆర్ అందులో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై నేతలు, శ్రేణు లకు దిశానిర్దేశం చేశారు. రానున్న రోజుల్లో పార్టీ పునర్ నిర్మాణంలో భాగంగా రాష్ట్ర కమిటీ మినహా మిగతా అన్ని కమిటీలను రద్దు చేశారు. జిల్లా, మండల, పట్టణ కమిటీలు ప్రస్తుతం రద్దయ్యాయి. త్వరలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. దానికి సంబంధించి అధిష్టానం నుంచి ఆదేశాలు వెలువడిన వెంటనే క్షేత్రస్థాయిలో నమోదు కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి జోగు రామన్న కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక పార్టీ పరంగా యువతపై ప్రత్యేక దృష్టి సారించాలని కేసీఆర్ పేర్కొన్న నేపథ్యంలో ఇంటర్మీడియెట్ నుంచి మొదలుకుంటే ఇంజినీరింగ్ కళాశాలల వరకు పార్టీ పరంగా కమిటీల యోచన చేస్తోంది. మొత్తంగా రానున్న రోజుల్లో పార్టీని అన్ని విభాగాల పరంగా పటిష్టపర్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. -
తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాటం
ఆదిలాబాద్టౌన్: తెలంగాణ ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాటం చేస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రా మన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండా ఆవిష్కరించారు. పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మెట్టు ప్రహ్లాద్, దాసరి రమేశ్, కస్తాల ప్రేమల, స్వరూపరాణి, మమత, కరుణ, సలీమ్, ధమ్మపాల్, గణేష్, పరమేశ్వర్, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
వేసవి శిబిరాలొచ్చేసినయ్
జిల్లా క్రీడాప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో మే 1నుంచి జూన్ 7వరకు జిల్లాలోని 21 కేంద్రాల్లో విద్యార్థు ల కోసం ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. అథ్లెటిక్స్, కుస్తీ, కబడ్డీ, విలువిద్య, నెట్బాల్, సాఫ్ట్బాల్, బేస్బాల్, ఖోఖో, హాకీ, హ్యాండ్బాల్, వాలీబాల్ వంటి వివిధ క్రీడాంశాల్లో ప్రత్యేక కోచ్లతో శిక్షణ ఇవ్వనున్నారు. అథ్లెటిక్స్ శిక్షణను ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని చాందా(టి), భీంపూర్ మండలంలోని అర్లి(టి)లో, కుస్తీ శిక్షణను తలమడుగు మండలం సుంకిడి, ఉట్నూరులో నిర్వహిస్తారు. కబడ్డీ మావలలో, విలువిద్య ఆది లాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్, తలమడుగు మండలం బరంపూర్లో అందుబాటులో ఉంటుంది. వాలీబాల్ శిక్షణను గాదిగూడ, నార్నూరు, ఇంద్రవెల్లి, సాత్నాల మండలంలోని లోకారిలో, ఖోఖో తలమడుగు మండలం కుచులాపూర్లో, హాకీ బోథ్మండలం మర్లపెల్లిలో అందిస్తారు. సాఫ్ట్బాల్ శిక్షణ నేరడిగొండ, బజార్హత్నూర్లో, బేస్ బాల్ ఇచ్చోడ, ఆదిలాబాద్ గ్రామీణ మండలం తంతోలిలో, నెట్బాల్ ఇచ్చోడలో, హ్యాండ్బాల్ శిక్షణ ను ఆదిలాబాద్లోని మహాలక్ష్మివాడ, ఆదిలాబాద్ రూరల్మండలం అంకోలిలో నిర్వహించనున్నారు. ఆసక్తిగల క్రీడాకారులు https:// sat gasc. telan gana. gov. in/ stadiums వెబ్సైట్లో పేర్లు నమో దు చేసుకోవాలని డీవైఎస్వో శ్రీనివాస్ తెలిపారు. వేసవి సెలవులు వచ్చేశాయి. ఏడాదిపాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన పిల్లలు ఆటపాటలకు సిద్ధమయ్యారు. జిల్లాలో ఇప్పటికే పలు శిక్షణ శిబిరాలు ప్రారంభం కాగా.. త్వరలోనే మరిన్ని షురూ కానున్నాయి. ఆయా క్యాంపులు చిన్నారులతో కిటకిటలాడుతున్నాయి. చిచ్చరపిడుగులకు కొత్త అంశాలు నేర్పడంతో పాటు, భవిష్యత్తులో ఆయా రంగాల్లో రాణించేందుకు ఇవి దోహదపడనున్నాయి. సృజనాత్మకత వెలికితీసే కేంద్రాలుగా నిలుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న వేసవి శిక్షణ శిబిరాలపై ఓ లుక్కేద్దామా మరి. – ఆదిలాబాద్క్రీడా శిక్షణా శిబిరాలు బాలకేంద్రంలో.. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో.. ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది కూడా చిన్నారులకు ప్రత్యేక శిక్షణ కా ర్యక్రమాలు నిర్వహించేందుకు పోలీసు శాఖ సిద్ధమైంది. జిల్లావ్యాప్తంగా 2వ తరగతి నుంచి 10 వ తరగతి చదువుతున్న బాలబాలికలు ఈ శిబి రా ల్లో పాల్గొనేందుకు అర్హులని ఇటీవల ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మే 4నుంచి 30వరకు ఐదు చోట్ల ఈ క్యాంపులు నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్క్వార్టర్స్ తోపాటు ఇచ్చో డ, ఇంద్రవెల్లి, నార్నూర్,బోథ్ పోలీస్స్టేషన్ల పరి ధిలో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ఈ శిక్షణ తరగతులు కొనసాగుతాయి. కరాటే, యోగా, ఫిజికల్ ఎఫిషియన్సీ ట్రైనింగ్, కబడ్డీ, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, ఆర్చరీ క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నా రు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 30లోపు సమీ పంలోని పోలీస్స్టేషన్లో పేర్లు నమోదు చేసుకోవ చ్చు. వివరాలకు నోడల్ ఆఫీసర్ వెంకటిని 87126 59961 నంబర్లో సంప్రదించవచ్చు. వేసవి సెలవుల సందర్భంగా పట్టణంలోని బాలకేంద్రం 5 నుంచి 16 ఏళ్ల లోపు బాలబాలికలకు ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. ఏప్రిల్ 27న ప్రారంభమయ్యాయి. మే 31 వరకు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 4:30 నుంచి 7:30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఇందులో కూచిపూడి, జానపద నృత్యం, సంగీతం (లలిత, కర్ణాటక), వాయిద్య పరికరాలు (తబలా, హార్మోనియం), చిత్రలేఖనం, కుట్లు–అల్లికలలో నిపుణులతో శిక్షణ కార్యక్రమాలు చేపడతారు. ఆసక్తి, అర్హులైన చిన్నారులు రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలు, ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలతో కలెక్టరేట్ చౌక్ సమీపంలోని బాలకేంద్రంలో పేర్లు నమోదు చేసుకోవచ్చు. వివరాలకు బాలకేంద్రం సూపరింటెండెంట్ మిట్టు రవిని 9703686368 నంబర్లో సంప్రదించవచ్చు. -
వానాకాలం సాగు ప్రణాళిక
సాక్షి,ఆదిలాబాద్: ఈ వానాకాలం సాగు విస్తీర్ణాన్ని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. పత్తి, సోయా, కంది, జొన్న, మొక్కజొన్న, వరి, పెసర, మినుము ఇతరత్రా పంటలు సాగు కానున్నాయి. గతేడాదితో పోల్చితే ఈసారి పత్తి విస్తీర్ణం స్వల్పంగా తగ్గనుంది. ఇక సోయా, కందుల విస్తీర్ణం కొంత పెరుగనుంది. ఓ వైపు వ్యవసాయ శాస్త్రవేత్తలు పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో అన్ని పంటలు కలిపి గతేడాది సుమారు 5లక్షల 85వేల 350 ఎకరాల్లో సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా 73 శాతం పత్తి సాగైంది. ఈఏడాది కూడా పత్తి పంటనే అత్యధికంగా సాగు చేయనున్నారు. అయితే గతంతో పోల్చితే స్వల్పంగా తగ్గనున్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. సోయా, కందుల విస్తీర్ణం స్వల్పంగా పెరగనుంది. దీనికి తగ్గట్టుగా విత్తనాల ఆవశ్యకతపై వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. గంపెడాశలు.. జిల్లాలో ప్రధానంగా వానాకాలమే ఎక్కువగా పంటలు సాగవుతాయి. యాసంగి సాగు అంతంత మాత్రంగానే ఉంటుంది. వానాకాలంలో సాగు చేసే పత్తి, సోయా, కంది దిగుబడులపై రైతులు ఎన్నో ఆశలతో ముందుకు సాగుతారు. ఈ ఏడాది కూడా ఈ మూడు పంటలే ప్రధానంగా సాగయ్యే అవకాశం ఉంది. గతేడాది అధిక వర్షాలతో రైతులు పంట నష్టం చవిచూశారు. అయితే ఈ సారి ప్రకృతి సహకరించాలని వారు వేడుకుంటున్నారు. నకిలీల బెడద.. వానాకాలం సాగు సమీపిస్తుండగా, ప్రస్తుతం నకిలీ విత్తనాల బెడద మార్కెట్ను ముంచెత్తుతుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల వీటిని పోలీసులు పట్టుకున్నారు. లూజ్ విత్తనాలతో పాటు కంపెనీలకు సంబంధించిన బ్రాండ్లతో పూర్తిగా నకిలీ విత్తనాల ప్యాకెట్లను తయారు చేసి విక్రయిస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. పంటల సాగు అంచనా విస్తీర్ణం ఇలా.. (ఎకరాల్లో) పంట 2025 2026 పత్తి 4,32,285 4,26,500 సోయా 72,235 78,000 కంది 44,447 45,000 మొక్కజొన్న 38,630 39,000 ఇతరత్రా 2,735 2,500 విత్తనాల అవసరం.. పత్తి : 11లక్షల 50వేల ప్యాకెట్లు (450 గ్రాములు) మొక్కజొన్న: 3,200 క్వింటాళ్లు కంది: 1800 క్వింటాళ్లు సోయా: 23వేల క్వింటాళ్లుసరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచుతాం వానాకాలం సాగు విస్తీర్ణాన్ని అంచనా వేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా విత్తనాలను అందుబాటులో ఉంచుతాం. పత్తి విత్తనాలకు సంబంధించి ఎలాంటి కొరత లేకుండా రైతులకు నాణ్యమైనవి అందుబాటులోకి తీసుకొస్తాం. నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు. – శ్రీధర్ స్వామి, జిల్లా వ్యవసాయ అధికారి, ఆదిలాబాద్ -
ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలి
ఆదిలాబాద్టౌన్: పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో అధికారులు, సిబ్బంది మర్యాదగా వ్యవరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలను విన్న ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదులను సత్వరం పరిష్కరించినప్పుడు బాధితుల్లో పోలీసులపై గౌరవం, నమ్మకం పెరుగుతుందన్నారు. అలాగే జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల సమాచారం ఉన్నా నేరుగా 8712659973 నంబర్కు వాట్సప్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఇందులో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారిని కవిత, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆగ్రో డీలర్ల నిరసన
ఆదిలాబాద్టౌన్: ఎరువుల కంపెనీలు డీలర్లపై ఒత్తిడి తెస్తున్నాయని పేర్కొంటూ జిల్లా కేంద్రంలో ఆగ్రో డీలర్లు సోమవారం నిరసన వ్య క్తం చేశారు. పంజాబ్ చౌక్లోని రైతు విగ్రహాని కి పూలమాలలు వేశారు. అనంతరం ప్రదర్శన చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా గల ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల దుకా ణాలను సోమవారం మూసివేశారు. వీరికి ఆదిలాబాద్ ఆత్మ డివిజన్ చైర్మన్ గిమ్మ సంతోష్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తాటిపెల్లి శివప్రసాద్ మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్కు ముందు కంపెనీలు డీలర్లపై ఎరువులు, యూరియా కొనుగోళ్లలో ఇతర ఉత్పత్తులను అంటగడుతున్నాయని తెలిపారు. దీంతో రైతులకు ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. బస్తాపై రూ.40 నుంచి రూ.50 వరకు అదనపు భారం పడుతుందని తెలిపారు. ఇందులో అగ్రో డీలర్లు ప్రశాంత్, సందేశ్, శ్రీనివాస్, బాలాజీ, సంతోష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ నిర్మాణాలు వేగవంతం చేయాలి
ఆదిలాబాద్టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామిలు అధికారులను ఆదేశించారు. హిమాయత్నగర్లోని హౌసింగ్ కా ర్పొరేషన్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో మంత్రులు సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల ఆత్మగౌరవానికి ప్ర తీక అని అన్నారు. నిర్మాణ ప్రక్రియలో అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. లబ్ధిదారుల దరఖాస్తులను పెండింగ్ పెట్టవద్దని, అధికారుల వద్ద ఫైల్ వారం రోజులకు మించి ఉండవద్దని పేర్కొన్నారు. సిబ్బంది కొరత ఉంటే తక్షణమే అధికారులను డిప్యూటేషన్పై తీసుకొని పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రతీ దశలో పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు. స్థోమతలేని నిరుపేద లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాలు, బ్యాంకుల నుంచి రుణాలు పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. దశల వారీగా హౌసింగ్ కార్పొరేషన్ నుంచి మంజూరయ్యే నిధుల ద్వారా రుణం తీర్చేలా చూడాలని తెలిపారు. సమావేశంలో ఎంపీలు నగేశ్, గడ్డం వంశీ, ఎమ్మెల్సీలు దండే విఠల్, అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్రావు, గడ్డం వినోద్, రామారావు పటేల్, పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు, పాల్వాయి హరీష్బాబు, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేష్ కుమార్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీసీ గౌతమ్, ఆదిలాబాద్, కుమురంభీం, నిర్మల్, మంచిర్యాల కలెక్టర్లు రాజర్షిషా, హరిత, భవేష్ మిశ్రా, కుమార్ దీపక్ తదితరులు పాల్గొన్నారు. -
● నిప్పులకుంపటిలా ఆదిలాబాద్ ● జిల్లాలో 45.9 డిగ్రీల సెల్సియస్ ● ఇళ్లకే పరిమితమవుతున్న జనం ● సాయంత్రం వరకు వడగాలులు
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. పక్షం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆదివారం 45.3 డిగ్రీ సెల్సియస్ మార్కు దాటగా సోమవారం 45.9 డిగ్రీ సెల్సియన్గా నమోదైంది. ఒక్కసారిగా ఆదిలాబాద్ నిప్పుల కుపంటిలా మారింది. దీంతో జనం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఉదయం 9 దాటిందంటే భానుడి భగభగలు మొదలవుతున్నాయి. మధ్యాహ్న సమయంలో జిల్లాకేంద్రంలోని ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అప్రకటిత కర్ఫ్యూ వాతవరణం దర్శనమిస్తోంది. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎండ కారణంగా ఉపాధిహామీ కూలీలు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు. జిల్లాలో సోమవారం బేలలో జైనథ్ మండలంలో 45.9 డిగ్రీ సెల్సి యస్ నమోదవగా.. సా త్నాలలో 44.4, ఇచ్చోడలో 44.3, భోరజ్లో 44.2, బోథ్లో 43.9 ఇలా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బ బారిన పడుతున్న జనం జిల్లాలో వడదెబ్బతో ఇటీవల ఇ ద్దరు మృత్యువాత పడ్డారు. పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతల దృష్ట్యా ఎండలో పనిచేసే వారు, తిరిగే వారు త్వరగా వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉంటాయని వైద్యులు పేర్కొంటున్నారు. అప్రమత్తంగా ఉండాలని గొ డుగు, ఇతర రక్షణ కవచాలు ధరించాలని సూచిస్తున్నారు. శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీ ఫారన్హిట్ దా టడం, కళ్లు తిరగడం, తీవ్రమైన తలనొప్పి, గుండె దడ, చెమట ఎక్కువగా రావడం, ఫిట్స్ తదితరల క్షణాలు బయట పడితే వడదెబ్బగా గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించాలని పేర్కొంటున్నారు. జంకుతున్న జనం ఎండ వేడిమి తట్టుకోలేక జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. కూలర్లు, ఏసీలకు విరామం లేకుండా నడుస్తున్నాయి. మధ్యాహ్న సమయంలో తప్పనిసరి బయటకు వెళ్లే వారు శీతలపానియాలు, కొబ్బరి బోండాలు, తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. ఇదిలా ఉండగా ఎండ తీవ్రత కారణంగా జిల్లాలో వాగులు, చెరువులు ఎండిపోతున్నాయి. మూగజీవాలు దాహార్తితో అల్లాడుతున్నాయి. జిల్లాకేంద్రంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి జిల్లాలో రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలోనే అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, వృద్ధుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. నీటిని ఎక్కువ తాగాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలి. ఎండలో వెళ్లేవారు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వేడి ప్రదేశాల వద్ద పనిచేసే వారు జాగ్రత్తలు పాటించాలి. – నరేందర్ రాథోడ్, డీఎంహెచ్వో -
శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో...
ఈ సమితి ఆధ్వర్యంలో ఏటా వివేకానంద బాల సంస్కార్ పేరిట వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తోంది. ఈ ఏడాది సైతం నైతిక, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక విషయాలతో కూడిన వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈనెల 24న మున్సిపల్ చైర్ పర్సన్ అనూష శిబిరాన్ని ప్రారంభించారు. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న వారు ఇందులో చేరేందుకు అర్హులు. యోగా, ధ్యానం, శ్రీమద్భాగవత కథలు, భగవద్గీత శ్లోకాలు, ఏకాగ్రత పెంచే ఆటలు, భజనలు, వేద గణితం, చిత్రలేఖనం, చేతిరాత వంటి అంశాల్లో ఉదయం 7 నుంచి 10.45 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. సంజయ్నగర్లోని శ్రీరామకృష్ణ సేవా సమితి కార్యాలయంలో శిబిరం కొనసాగుతుందని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూమన్న, లెనిన్ పేర్కొంటున్నారు. వివరాలకు 9490052842, 90328833582 నంబర్లలో సంప్రదించవచ్చని సూచిస్తున్నారు. -
వాసవీమాతకు ప్రత్యేక పూజలు
ఆదిలాబాద్: వాసవీమాత చూపిన మానవ సేవ, అహింసా మార్గం అనుసరణీయమని క లెక్టర్ రాజర్షి షా అన్నారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జయంతి వేడుకలను ఆదివారం అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం తన దృష్టికి తెచ్చిన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇందులో డీవైఎస్వో శ్రీనివాస్, పర్యాటక శాఖ అధి కారి రవి కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొత్తవార్ రాజేశ్వర్, భక్తులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే అనిల్ జాదవ్కు సన్మానం
బోథ్: అమెరికన్ యూనివర్సిటీ నుంచి ప్రతిష్ఠాత్మక గౌరవ డాక్టరేట్ అందుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను సొనాల మండల నాయకులు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. విద్య , సామాజిక సేవా రంగాల్లో ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా డాక్టరేట్ లభించడంపై నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న అనిల్ జాదవ్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం బోథ్ నియోజకవర్గానికే గర్వకారణమని మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేరడిగొండ: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డాక్టరేట్ పట్టా పొందిన సందర్భంగా మండలంలోని వడూ ర్ గ్రామంలో సంబురాలు జరుపుకున్నారు. సర్పంచ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చిత్రపటానికి క్షీ రాభిషేకం చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నాయకత్వంలో బోథ్ ప్రాంతం మ రింత అభివృద్ధి చెందుతుందని ఆశభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భూ షన్, ఫయాజ్, సుజిల్, రాములు, నవీన్, అస్మత్, రమణ, స్వామి, ఊషన్న, భూమన్న పాల్గొన్నారు. -
స్వీయ జనగణన ప్రారంభం
బజార్హత్నూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చే పట్టిన జనగణన కార్యక్రమంలో భాగంగా ఎ న్యూమరేటర్ చందన్ బాబు, తహసీల్దార్ శ్యా ంసుందర్ ఆదివారం మండల కేంద్రంలో జి ల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లేపూల నర్స య్య నివాసంలో అతని కుటుంబవివరాలు నమో దు చేసి స్వీయ జనగణన ప్రారంభించారు. ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంఇచ్చోడ: మండలంలోని ముఖరా(కె) గ్రా మంలో ఆదివారం బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎడ్ల బండిపై కేసీఆర్ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి, ప్రధాన విధుల గుండా ఊరేగించారు. మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సూభాష్లు మాట్లాడారు. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం ఏర్పాటు కోసం టీఆర్ఎస్ చేసిన కృషి చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కేసీఆర్ తన ప్రాణాలను సైతం పణంగా పెట్టారని గుర్తుచేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. విద్యుత్ వినియోగదారులకు అవగాహన కల్పించాలిఇంద్రవెల్లి: విద్యుత్ వినియోగదారులు ఆన్లైన్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించే విధంగా అవగాహన కల్పించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ రాథోడ్ శేషారావ్ అన్నారు. ఆదివారం మండలంలోని హీరపూర్ విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. విద్యుత్ సరఫరా, బిల్లుల రికవరీ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆన్లైన్ బిల్లులు చెల్లింపు కోసం టీజీఎన్పీడీసీఎల్ డిజిటల్ చెల్లింపు విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఇంద్రవెల్లి ఏఈ జాదవ్ రోహిదాస్, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. వైభవంగా వాసవీ మాత జయంతి వేడుకలుబోథ్: మండల కేంద్రంలోని ధర్మశాలలో వాసవీ కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలను కమిటీ సభ్యులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆదివారం నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, పూజా కార్యక్రమాలను శాస్తోక్త్రంగా నిర్వహించారు. లోక కల్యాణార్థం, వర్తక వాణిజ్య రంగాల్లో అందరికీ శుభం కలగాలని కోరు తూ మాతాజీని భక్తులు కోరుకున్నారు. కార్యక్రమంలో వాసవీమాత కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. పోడియం అందజేత జైనథ్: పాఠశాలకు అవసరాల నిమిత్తం పూర్వ విద్యార్థి బోల్లెం రమేశ్ ఆదివారం 6 వేల విలువ గల పోడియాన్ని పాఠశాలకు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోరెడ్డి అశోక్ మాట్లాడుతూ.. పాఠశాలకు అవసరమైన సమస్యలను తెలుసుకుని గ్రామస్తులు సాయం చేయడం చాలా సంతోషకరమన్నారు. పాఠశాలకు గ్రామస్తులు ఇలా తోడ్పాటు అందించడం వల్ల పాఠశాలను అభివద్ధి చేసుకోగలమని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గజానన్, గంగన్న, సామల రాజవర్ధన్, దాసరి రాములు, స్వామి, తదితరులు పాల్గొన్నారు. -
మహిళా రిజర్వేషన్ల అమలు ఖాయం
ఆదిలాబాద్: దేశంలో మహిళా సాధికారతకు పట్టం కడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల అమలు ఖాయమని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మహిళా ఆగ్రహ సభలో ఆయన మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ల అమలే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఇందు కోసం ఆర్టికల్ 81కు 131వ రాజ్యాంగ సవరణను ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపారు. దీనిపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో దేశ జనాభాకు అనుగుణంగా లోక్సభ స్థానాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను 815కి పెంచే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ పునర్విభజన ప్రక్రియ వల్ల ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో భారీ మార్పులు వస్తాయని వివరించారు. పెరిగిన స్థానాల్లో మహిళలకు 33 శాతం కేటాయించడం ద్వారా అణగారిన వర్గాలకు చట్టసభల్లో అధిక ప్రాతినిధ్యం లభిస్తుందని, ఇది నిజమైన సామాజిక న్యాయమని అభిప్రాయపడ్డారు. 1971 జనాభా లెక్కల ప్రకారం 1976లో నిర్ణయించిన 543 సీట్లనే ఇప్పటికీ కొనసాగించాలని చూడటం హాస్యాస్పదమన్నారు. 50 ఏళ్లు గడిచినా నియోజకవర్గాల పెంపును కాంగ్రెస్ వ్యతిరేకించడం వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన వాటా కావాలని కోరుతున్న రాహుల్ గాంధీ, నియోజకవర్గాల పెంపును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కోవిడ్ వల్ల ఆలస్యమైన దేశవ్యాప్త జనగణన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని వివరించారు. ఇది 2027–28 నాటికి పూర్తవుతుందని వెల్లడించారు. ఆ గణాంకాల ఆధారంగానే శాసీ్త్రయంగా పునర్విభజన ప్రక్రియ జరుగుతుందని, ఆ వెంటనే 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎమ్మెల్యే పాయల్ శంకర్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సుమన్ రాథోడ్, ధోని జ్యోతి, చిలుకూరి జ్యోతిరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముస్తాపురే అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
జనగణన సర్వేలో పాల్గొన్న ఎమ్మెల్యే
ఉట్నూర్రూరల్: ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మె ల్యే వెడ్మ బొజ్జు ఆదివారం తన స్వగ్రామమైన ఉ ట్నూర్ మండలం కల్లూరిగూడ గ్రామంలో నిర్వహించిన జనగణన సర్వేలో పాల్గొన్నారు. కుటుంబసభ్యులతో కలిసి సర్వే అధికారులకు పూర్తి వివరాలు అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సర్వేలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రజలు అధికారులకు సహకరించి కచ్చితమైన వివరాలను నమోదు చేయించాలని సూచించారు. అధికారులకు నేరుగా చెప్పడమే కాకుండా, తమ మొబైల్ ఫోన్ల ద్వారా కూడా ఆన్లైన్లో నమోదు చేసుకునే సదుపాయం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ చేరాలంటే సర్వే ఎంతో కీలకమని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్విని యో గం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ కోట్నాక్ రఘునాథ్రావు, సర్వే సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
వడ్డీ వ్యాపారులపై కొరడా
ఆదిలాబాద్టౌన్: అధిక మిత్తీలతో ప్రజల నడ్డి విరుస్తున్న వడ్డీ వ్యాపారులపై జిల్లా పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. అమాయక ప్రజలు, రైతుల అవసరాలు ఆసరా చేసుకొని అప్పులు ఇచ్చి వ్యవసాయ భూములు, ఇంటి స్థలాలు, బంగారు ఆభరణాలు, ఇతర ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఎక్కువ మొత్తంలో వడ్డీ వసూలు చేయడంతో కొంత మంది చేసిన అప్పులు తీర్చలేక వారు కుదుపెట్టిన అస్తులు వ్యాపారుల పాలవుతున్నాయి. జిల్లాలో ఇలాంటి ఘటనలు ఇటీవల అనేకంగా చోటు చేసుకున్నాయి. పిల్లల చదువు, కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగా లేకపోవడం, ఆడపిల్లల పెళ్లి, వ్యవసాయం తదితర పనుల కోసం అప్పులు చేస్తున్నారు. సాధారణ వడ్డీ తీసుకుంటే అప్పు చెల్లించడానికి వీలుంటుంది. కానీ చాలా మంది నెల వారీగా 6నుంచి 10శాతం వరకు తీసుకుంటున్నారు. ఈ వ్యాపారులు అప్పు తీసుకున్న వారిని మానసికంగా వేధించడంతో అవమానభారంతో కొందరు ఆత్మహత్య చేసుకుని తనవు చాలిస్తున్నారు. బాధిత కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోవడంతో రోడ్డున పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇటీవల పలువురు బాధితులు తమ గోడును ఎస్పీ అఖిల్ మహాజన్ దృష్టికి తీసుకెళ్లడంతో పోలీసులు వ్యాపారుల ఇళ్లపై దాడులు చేసి అప్పు పత్రాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి అక్రమ ఆగడాలకు చెక్ పెడుతున్నారు. దీంతో బాధితుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రజల నడ్డి విరుస్తున్న వ్యాపారులు.. జిల్లాలో వడ్డీ వ్యాపారుల దందా జోరుగా సాగుతుంది. జిల్లా కేంద్రంతో పాటు, గ్రామీణ ప్రాంతా ల్లో చోటామోటా వ్యాపారులు, కొంత మంది ప్రభు త్వ ఉద్యోగులు, మరికొంత మంది టీచర్లు ఈ అక్రమార్జనపై దృష్టి సారిస్తున్నారు. మధ్యవర్తుల ద్వారా డబ్బులు వడ్డీకి ఇస్తున్నారు. సామాన్యుల, రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక మిత్తీ వసూలు చేస్తున్నారు. అప్పు ఇచ్చే సమయంలో ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు, చెక్కులు, స్టాంప్పేపర్లు, ఇంటి స్థలాల పత్రాలను వారి వద్ద కుదువ పెట్టుకుంటున్నారు. ఇటీవలభూములు, ఖాళీ ప్లాట్లను రిజిస్ట్రేషన్, మార్టిగేజ్ చేసుకుంటున్నారు. అప్పు చెల్లింపు కోసం నిర్ణీత గడువు రాసుకుంటున్నారు. అ లోపు తిరిగి ఇవ్వకపోతే వారి అస్తులు వ్యాపారుల పాలవుతున్నాయి. ఇలా భూములు, బంగారు ఆభరణాలు పోగొట్టుకున్న వారు అనేకం ఉన్నారు. -
● స్వీయ నమోదు ప్రక్రియ షురూ ● వివరాలు అందజేసిన ప్రముఖులు ● మే 11 నుంచి ఇంటింటి జనగణన ● ఎస్ఈ ఐడీతో ప్రక్రియ వేగవంతం
జనగణనకు శ్రీకారంకై లాస్నగర్: వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన ప్రక్రియకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. తొలు త స్వీయ గణన చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ప్రముఖులు తమ వివరాలు నమో దు చేసుకున్నారు. ప్రతీ కుటుంబం ఈ ప్రక్రియలో బాధ్యతగా పాల్గొని సరైన సమాచారం అందించా లని కలెక్టర్ రాజర్షిషా కోరారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఎస్పీ అఖిల్ మహజాన్, అదనపు కలెక్టర్లు ఆర్ఎస్ చిత్రు, రాజేశ్వర్తో కలిసి వివరాలు వెల్లడించారు. మే 11నుంచి ఇంటింటి గణన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న జనగణన. ఈ ప్రక్రియను రెండు విడతల్లో డిజిటల్ విధానంలో చేపడుతున్నారు. మొద టి దశలో ఇళ్ల జాబితా, ఇళ్ల గణనను మే 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహిస్తారు. ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు, గృహ ని ర్మాణం, తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, వి ద్యుత్, నివాస స్థితి వంటి అంశాలపై సమగ్ర సమాచారం సేకరిస్తారు. రెండో దశలో 2027 ఫిబ్రవరిలో జనాభా గణన చేపడతారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతీ వ్యక్తి వివరాలు నమోదు చేస్తారు. 33 ప్రశ్నలతో సమాచారం సేకరణ తొలుత స్వీయ ఎన్యూమరేషన్కు అవకాశం కల్పించారు. ఆదివారం ప్రారంభమైన ఈ ప్రక్రియ మే 10 వరకు కొనసాగనుంది. https://se.censu s.gov.in పోర్టల్ ద్వారా ప్రజలు స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. మొబైల్ నంబర్తో లాగిన్ అయి కుటుంబ సభ్యుల వివరాలు, చిరునామా, విద్య, వృత్తి, సామాజిక పరిస్థితులు వంటి మొత్తం 33 ప్రశ్నలతో కూడిన సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది. ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు తెలుగు, ఆంగ్ల భాషల్లో సమాచారం నమోదు చేయవచ్చు. ఎస్ఈ ఐడీతో ప్రక్రియ వేగవంతం స్వీయ నమోదు ప్రక్రియ పూర్తయ్యాక 11 అంకెలతో కూడిన ఎస్ఈ ఐడీ వస్తుంది. దానిని విధిగా భద్రపరచుకోవాల్సి ఉంటుంది. మే 11 తర్వాత ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్లకు ఆ ఐడీ నంబర్ చూపించాలి. తద్వారా ఇంటింటి గణన వేగంగా పూర్తి అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష తమ వివరాలను స్వీయ నమోదు ద్వారా పూర్తి చేశారు. వివరాలు పూర్తిగా గోప్యం..జనాభా లెక్కల చట్టం ప్రకారం ప్రజలు అందించే వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర శాఖలకు లేదా ఇతర అవసరాలకు వినియోగించరని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాలు, అపోహలు లేకుండా సరైన వివరాలు ఇవ్వాలని సూచించారు. ‘మన జనగణన–మన అభివృద్ధి’ నినాదంతో జిల్లాలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పాఠశాలలు, గ్రామ సభలు, పట్టణ ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రజలు అధికారులకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. -
సీపీఎం పోరాట ఫలితమే పాట్నాపూర్ ఏర్పాటు
సాత్నాల: సీపీఎం పోరాట ఫలితమే సాహెజ్ పాట్నాపూర్ గ్రామం ఏర్పాటు చేయడం జరిగిందని సీపీఎం జిల్లా నాయకులు లంక రాఘవులు అన్నారు. ఆదివారం గ్రామంలో ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాయకులకు ఘన స్వాగతం పలికి, పూలమాలతో సన్మానించారు. గిరిజనుల అవసరాలు తెలుసుకొని, పాట్నాపూర్ గ్రామ ఏర్పాటుకు కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టామన్నారు. నూతనంగా ఏర్పడిన గ్రామానికి తాగునీరు, రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు బండి దత్తాత్రి, జాదవ్ కాలురామ్, ఉప సర్పంచ్ కడప అయ్యు, ఆత్రం జంగు, ఆత్రం లేతుబాయి, ఆత్రం నాగుబాయ్, ఆత్రం రామారావు, స్వామి పాల్గొన్నారు. -
ఆడబిడ్డ పెళ్లికి ఆర్థికసాయం
బోథ్: మండలంలోని బిర్లాగొంది సర్పంచ్ రాథోడ్ రాజేశ్వర్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాడు. సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా పంచాయతీ పరిధిలో జరిగే ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ. 10,116 ఇస్తానని హామీ ఇచ్చారు. హామీ ప్రకారం ఆడపిల్లల పెళ్లిల్లకు నగదును అందజేస్తున్నారు. కాగా గ్రామానికి చెందిన రాథోడ నందు కుమార్తె ఉమా (విజయలక్ష్మి) వివాహానికి నగదు సాయం అందజేశారు. కార్యక్రమంలో రవీందర్, పవన్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. పంట కొనుగోళ్లు నిలిపివేతబోథ్: బోథ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న జొన్న, మొక్కజొన్న. శనగల కొనుగోలు కేంద్రాల్లో పంట నిల్వలు పేరుకుపోవడం వల్ల కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సెంటర్ ఇన్చార్జి బారె నాగబూషణం ఒక ప్రకటనలో తెలిపారు. కొనుగోలు ప్రక్రియకు అంతరాయం కలుగుతుందని, రైతులు గమనించి సహకరించాలని కోరారు. -
మద్యం అమ్మకాలపై నిషేధం
● గ్రామసభలో దప్పాపూర్ గ్రామస్తులు తీర్మానం నార్నూర్: మండలంలోని దుప్పాపూర్ గ్రామం ఆ దర్శ మార్గంలో పయనిస్తోంది. గ్రామంలో మద్యం నిషేధిస్తూ.. గ్రామస్తులందరూ ఏకగ్రీవంగా తీర్మా నం చేశారు. ఆదివారం సర్పంచ్ కనక సత్యనారా యణ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో, ఇప్ప టి నుంచి గ్రామంలో మద్యం, సారా విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ తీర్మానం చేశారు. గ్రామస్తుల సంక్షేమం, యువత భవిష్యత్ను దృష్టిలో ఉంచుకు ని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తీర్మానాన్ని ధిక్కరించి ఎవరైనా గ్రామంలో మద్యం విక్రయిస్తూ.. కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మద్యరహిత గ్రామంగా తీర్చి దిద్దేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో దూత్రాజు విశ్వజిత్ (ఉప సర్పంచ్), కనక ప్రభాకర్ (గ్రామ పటేల్), శ్రీరంగ వాగమారె, జ్ఞానోబా తిబొటే, రమేశ్, రామకిషన్, దుత్రాజ్ మధుకర్ ధుతరాజ్, శంకర్ కామ్లె, డి. ప్రేమానంద్, బుద్ధాజి, డిగాంబర్, ఉత్తం, త్రీముక్, రవిరాజ్ పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలి
ఆదిలాబాద్: నిజామాబాద్ జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బేస్బాల్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు రాణించాలని బేస్ బాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు కలాల శ్రీనివా స్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆదివారం జిల్లా క్రీడాకారు ల ఎంపిక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈనెల 27నుంచి నిజామాబాద్లో నిర్వహించనున్న పోటీల్లో జిల్లా జట్లు సత్తా చాటాలని ఆకాంక్షించారు. అనంతరం ఎంపికై న క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు. ఇందులో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జ్యోతి అజయ్, కోశాధికారి గౌతమ్, హరిచరణ్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పొంచి ఉన్న ప్రమాదం
ఆకర్షిస్తున్న పూల వనంబోనమెత్తిన తాంసి తాంసి మండల కేంద్రంలో ఆదివారం గ్రామదేవతలకు గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో సామూహిక బోనాలను సమర్పించారు. డప్పుచప్పుళ్లతో ప్రధానవీధుల గుండా ఊరేగింపుగా పోచ్చమ్మ ఆలయానికి చేరుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పోచమ్మకు ప్రత్యేకంగా వండిన బోనాలను సమర్పించారు. బోనాల పండుగతో గ్రామంలో పండుగా వాతావరణ నెలకొంది. – తాంసి ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డు సమీపంలో జలాంతండా చౌక్ వద్ద నిర్మించిన కల్వర్టు గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు కోతకు గురైంది. తరచు ప్రమాదాలు జరుగుతున్నా.. అధికారులు స్పందించడం లేదు. కల్వర్టుకు మర్మతులు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. – ఇంద్రవెల్లి భోరజ్ మండలం తర్ణం శివారు వాగులో ప్రకృతి అరుదైన అందాన్ని ఆవిష్కరించింది. వాగు నిండా తామర పూలు విరబూసి చూపారులను ఆకట్టుకుంటున్నాయి. మండు వేసవిలో నిండు పూల తోటలా ఉందని కొందరు మొబైల్ ఫోన్లో తామర పూలను బంధిస్తున్నారు. – సాత్నాల -
బుద్ధుడి మార్గంలో నడవాలి
జైనథ్ : బుద్ధుడు చూపిన మార్గంలో నడవాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. మండలంలోని లక్షి్మ్పూర్ గ్రామంలో ఆదివారం నూతనంగా నిర్మించిన బుద్ధ విహార్, భగవాన్ గౌతమ బుద్ధ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం బుద్ధుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ.. గౌతమ బుద్ధుడు ప్రపంచానికి శాంతి, అహింస, సమానత్వం అనే సందేశాలను అందించడం జరిగిందన్నారు. బుద్ధుడు బోధించిన బోధనలు సమాజానికి మార్గదర్శకంగా ఉంటాయన్నారు. గ్రామంలో బుద్ధ విహార్ నిర్మాణం పూర్తిచేసుకుని విగ్రహ ప్రతిష్ఠాపన చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బౌద్ధ సమాజ్ అధ్యక్షుడు భీమ్ రావు, ఉపాధ్యక్షుడు ఆనందరావు, కోశాధికారి భగత్ అశోక్, సంఘం పెద్దలు భగత్ గౌతమ్, దుర్గే ఆజానంద్, నాందేవ్, గ్రామస్తులు అడప తిరుపతి, దాసరి రాములు, గజంగుల స్వామి, నర్సింగ్ రావు, ఇజ్జగిరి నారాయణ పాల్గొన్నారు -
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
నార్నూర్: రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖాడే ఉత్తమ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ నార్నూర్ ద్వారా వ్యవసాయ మార్కెట్ ఇన్ఫ్రా సబ్ మార్కెట్యార్డ్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. క్వింటాలుకు రూ. 2400 మద్దతు ధరతో కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. తేమ 14 శాతం లోపు ఉండాలన్నారు. రైతులు తమ పంటను శుభ్రంగా, ఎండబెట్టి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తీసుకురావాలని సూచించారు. అలాగే ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, జమాబంది పత్రాలు వంటి అవసరమైన డాక్యుమెంట్లను వెంట తీసుకురావాలని తెలిపారు. కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్ చైర్మన్ ఆడే సురేష్, ఉప సర్పంచ్ మహ్మద్ ఖురేషి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖషీమ్, భిక్షపతి రాథోడ్, సీఈవో ఆడే గణేష్, తదితరులు పాల్గొన్నారు. -
● 353(బి) హైవే పనులు ● కంకర రోడ్డుపై వాహనదారుల అవస్థలు ● కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం ● కరువైన అధికారుల పర్యవేక్షణ
కై లాస్నగర్: జిల్లాలో చేపట్టిన జాతీయ రహదారి 353(బి) నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్ల క్రితం ప్రారంభం కాగా, ఈఏడాది మే చివరి లోపు పూర్తి చేయాల్సి ఉంది. ఓ వైపు గడువు సమీపిస్తున్నా పనుల ప్రగతిని పరిశీలిస్తే సకాలంలో పూర్తికావడం గగనమే అనిపిస్తోంది. కాంట్రాక్టర్ పనుల్లో తీవ్ర జాప్యం చేస్తుండటంతో పాటు నిబంధనలు పాటించడం లేదనే విమర్శలున్నాయి. అధికారుల పర్యవేక్షణ కరువవడమే కారణంగా తెలుస్తోంది. పనుల్లో తీవ్ర జాప్యం.. భోరజ్ మండలకేంద్రంలోని ఎక్స్రోడ్ నుంచి జైనథ్, బేల మీదుగా మహారాష్ట్రలోని అష్టి వరకు గల ఆర్అండ్బీ పరిధిలోని రోడ్డును కేంద్రం భారత్మాల పథకం కింద జాతీయ రహదారిగా మార్చింది. అక్కడి నుంచి ఇక్కడి వరకు 141కిలోమీటర్లు ఉండగా, జిల్లాలో 33 కిలోమీటర్లు మాత్రమే విస్తరిస్తున్నారు. మహారాష్ట్ర ప్రాంతంలో ఎన్హెచ్ఏఐ నిర్మాణం పూర్తి చేయగా, ఇక్కడ పది మీటర్ల మేర రోడ్డును విస్తరిస్తున్నారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే చేపడుతున్న నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. టెండర్ పొందిన కాంట్రాక్టర్ 2024 అక్టోబర్లో పనులు ప్రారంభించారు. ఈ ఏ డాది మే చివరి నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే పనుల్లో తీవ్ర జాప్యం చేస్తుండటంతో గడువులోపు పూర్తి చేయడం కష్టతరంగా మారింది. లోపించిన పర్యవేక్షణ.. గడువులోపు పనులు పూర్తయ్యేలా పర్యవేక్షించాల్సి న సంబంధిత అధికారులు ఆ దిశగా దృష్టి సారించడం లేదు. దీంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా ప నులు చేపడుతున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్ర కారం రోడ్డుకు ఇరువైపులా మొరం నింపాల్సి ఉండగా, పక్కనే పొక్లెయిన్లతో తవ్వుతూ నల్లమట్టితో నింపుతున్నారు. ఇది కనిపించకుండా ౖపైపెన మొ రం వేస్తున్నారు. దీంతో వర్షాకాలంలో మట్టి కొట్టుకుపోయే అవకాశముంది. అలాగే తర్నం, జైనథ్, కొబ్బాయి సమీపంలో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులపై పర్యవేక్షణ లోపించింది. ఈ పనులు కూడా నిబంధనల మేరకు సాగడం లేదనే విమర్శలున్నాయి. నాణ్యతతో జరిగేలా చూస్తాం..జాతీయ రహదారి నిర్మాణ పనులను ఈ ఏడాది మే నాటికి పూర్తి చేయాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఉండడంతో కూలీల కొరత ఏర్పడి పనులు సకాలంలో సాగలేదు. పలుచోట్ల భూసేకరణ చేయాల్సి ఉండటం, బ్రిడ్జి పనులు కొనసాగుతున్నందున గడువు మరో ఆరు నెలలు పొడిగించే అవకాశం ఉంది. నాణ్యత ప్రమాణాల మేరకు పనులు జరిగేలా దృష్టి సారిస్తాం. ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపడతాం. – సుభాష్, డీఈ, ఎన్హెచ్నిత్యం అవస్థలే..అంతర్రాష్ట్ర రహదారి కావడంతో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. బేల, జైనథ్ మండలాల ప్రజలు జిల్లా కేంద్రానికి ఈ మార్గం గుండానే ప్రయాణిస్తారు. నత్తనడకన సాగుతున్న ఈమార్గంలో ప్రయాణం వాహనదారుల పాలిట శాపంగా మారుతుంది. తేలిన కంకరతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. -
చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి
ఇంద్రవెల్లి: చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి.. నాణ్యత విద్యను సద్వినియోగం చేసుకోవాలని వడగామ్ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విరేందర్ అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆది వా రం మండలంలోని వడగామ్ గ్రామంలో బడిబాట నిర్వహించారు. ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి పిల్లల వివరాలు సేకరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆత్రం లక్ష్మణ్, ఆత్రం సీతా రాం, జాదవ్ రాజు, అంగన్వాడీ టీచర్ ఆత్రం నా గుబాయి, విద్యార్థులు పాల్గొన్నారు. బడిబాటతో చదువుకు ప్రోత్సాహంనేరడిగొండ: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా ఐటీడీఏ విభాగం ఆధ్వర్యంలో సంక్షేమ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. లఖంపూర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఆదివారం మండలంలోని రోడ్ లఖంపూర్, గోండ్ లఖంపూర్ గ్రామాల్లో శ్రీబడి బాటశ్రీ నిర్వహించారు. గ్రామ వీధుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి విద్య ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ సెడ్మకి సుజాత, గంగారాం, ఉప సర్పంచ్ రేంగెపూజ సిద్దేశ్వర్, ప్రధానోపాధ్యాయులు ఎ.మధుకర్, ఉపాధ్యాయులు వి.రాజేశ్వర్, టి.గంగాభవాని, ఎ.రాజునాయక్ పాల్గొన్నారు. బోథ్: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా బోథ్ మండలంలోని పట్నాపూర్ గ్రామంలో ఆది వారం బడిబాట కార్యక్రమాన్ని ఎంపీడీవో రమేశ్ ప్రారంభించారు. బడీడు పిల్లలందరినీ తప్పకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, విద్యాభ్యాసం పట్ల నిర్లక్ష్యం వహించకూడదని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు మరియు సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల కోసం ప్రభుత్వం కల్పి స్తున్న ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ పంద్రం సుగుణ శంకర్, పర్యవేక్షకులు రాజేశ్వర్, ప్రధానోపాధ్యాయులు ఆత్రం శంకర్, శే ఖర్, ఉపాధ్యాయులు సాయిరెడ్డి, ఇందల్ సింగ్, మోహన్ సింగ్, మారుతి, లక్ష్మణ్ నాగోరావు, రామచందర్, లాఖాన్ సింగ్, బలిరాం, గోపీచంద్, జైతు పాల్గొన్నారు. సాత్నాల: ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన నాణ్య మైన విద్య లభిస్తుందని ఆశ్రమ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గణేష్ అన్నారు. బడిబాట ముగింపు సందర్భంగా సైద్పూర్ ఆశ్రమ పాఠశాల ఆధ్వర్యంలో ఆదివారం సలయితండా, పలైతండా గ్రామాల్లో విద్యార్థులతో బడిబాట ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల విద్యాబోధనపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల వార్డెన్ ప్రేమ్సింగ్, శంకర్, కరుణాకర్, ప్రభు, శిల్ప, తదితరులు పాల్గొన్నారు. విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించాలినార్నూర్: మండలంలోని మాన్కాపూర్ గ్రామంలో ఆదివారం బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ తొడసం రేణుక నాగోరావు పా ల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలకు అవగా హన కల్పించారు. ప్రతీ చిన్నారికి విద్య ఎంతో ముఖ్యమని, పాఠశాలకు హాజరు కావడం ద్వారా వారి భవిష్యత్ బలపడుతుందన్నారు. ప్రభుత్వ పా ఠశాలలో అందుతున్న సౌకర్యాలను సద్విని యో గం చేసుకోవాలని, ఉపాధ్యాయులతో సమన్వ యం చేసుకుని పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పె ట్టాలన్నారు. విజయ్కుమార్ ఎస్సీఈఆర్పీ, ఉపాధ్యాయులు సుభాష్ చౌహాన్, ప్రకా ష్, మనిక్, నివేదిక, జేవంత, సరోజ, జ్యోతి పాల్గొన్నారు. -
గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు
బజార్హత్నూర్: మండల కేంద్రంలో మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గ్రామ దేవతలకు సల్లనంబలి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మహలక్ష్మీ, పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, పోతరాజు దేవతలకు బోనాలు సమర్పించారు. అనంతరం మహ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు నాగభూషన్, కొత్త శంకర్, చట్ల గజ్జారాం, చట్ల వినిల్, చిల్కూరి భూమన్న, కొత్తనర్సయ్య, బొమ్మెడి సంజీవ్, చట్ల ఉత్తం, వొర్ని రమణ, చట్ల సుఖ్దేవ్, దీసీ రమణ, తురాటీ భోజన్న, అల్లం శంకర్, కర్వల గంగయ్య పాల్గొన్నారు. -
‘సన్’డే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. సాధారణంగా మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానుండగా... ఈసారి ముందస్తుగానే నమోదవుతున్నాయి. ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటింది. అత్యధికంగా ఆదిలాబాద్లో 45.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇతర ప్రాంతాల్లోనూ 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలాచోట్ల సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. మరోవైపు వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్, కుమ్రుం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు నమోదు కావొచ్చని చెప్పింది. -
నకిలీ పత్తి విత్తనాల గుట్టు రట్టు
కై లాస్నగర్(బేల): నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న రాకెట్ను బేల పోలీసులు ఛేదించారు. అక్రమంగా విక్రయిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 150 నకిలీ విత్తన ప్యాకెట్లతో పాటు వారి వద్ద నుంచి రూ.60 వేల నగదు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. శనివారం బేల పోలీస్ స్టేషన్లో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి ఈ మేరకు వివరాలు వెల్లడించారు. బేల మండలం సాంగిడి శివారులో రోడ్డు పక్కన కొందరు నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ విత్తనాలు నకిలీవా కావా అనేదాన్ని నిర్ధారించేందుకు వ్యవసాయ అధికారిని సంఘటన స్థలానికి పిలిపించి పరిశీలించగా అవి నకిలీవని నిర్ధారించినట్లు డీఎస్పీ తెలిపారు. పత్తి విత్తన ప్యాకెట్ తయారీ చేసి.. నిందితుడు సాంగిడి గ్రామానికి చెందిన జిట్టావార్ కిశోర్రెడ్డి గుజరాత్కు చెందిన నరేశ్ క్రాప్ సైన్స్ కంపెనీలో కమిషన్ ఏజెంట్గా పని చేస్తున్నాడు. అదే కంపెనీలో పని చేసే ధర్మేష్ కచ్చడియాతో కలిసి కుట్రపన్ని మౌళి 555తో ఉన్న నిజమైన పత్తి విత్తన ప్యాకెట్ను తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. రెండు నెలలుగా గుజరాత్ నుంచి నవత ట్రాన్స్పోర్ట్ ద్వారా సుమారు 4,500 నకిలీ విత్తనాల ప్యాకెట్లు తెప్పించారని డీఎస్పీ తెలిపారు. అందులో 4 వేల ప్యాకెట్లను మహారాష్ట్రలోని ఝరి జామ్ని గ్రామానికి చెందిన రక్తావర్ పవన్ ద్వారా 350 ప్యాకెట్లను సాంగిడికి చెందిన నవగరే కునాల్, మణియార్పూర్కు గ్రామానికి చెందిన కుల్దీప్ టాక్రె ద్వారా రైతులకు అసలైన విత్తనాలుగా నమ్మించి విక్రయించినట్లు విచారణలో తేలింది. రెండు ప్యాకెట్లను నమూనా తీసుకుని పరీక్షకు పంపించి, మిగతా వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో ఆది లాబాద్ రూరల్ సీఐ కె. ఫణిదఽర్, ఎస్సై మధుకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఆపరేషన్ క్రాక్డౌన్లో భారీ సైబర్ మోసాలు
ఆదిలాబాద్టౌన్: జిల్లా పోలీసులు ఆపరేషన్ క్రాక్డౌన్లో భాగంగా భారీ సైబర్ మోసం గుట్టురట్టు చేశారు. 74 అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను గుర్తించారు. 12 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. రూ.7 కోట్లకు పైగా జరిగిన బ్యాంకు లావాదేవీలను గుర్తించారు. మ్యూల్ అకౌంట్ల ద్వారా ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, ఫేక్ ట్రేడింగ్ మోసాలను గుర్తించారు. శనివారం స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఈమేరకు వివరాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా నమోదైన ఎన్సీఆర్పీ ఫిర్యాదులతో ఈ అకౌంట్లు అనుసంధానమై ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రజలు తమ బ్యాంక్ ఖాతాలను స్నేహితులు, బంధువులు, ఇతరులకు ఇవ్వడం నేరమని స్పష్టం చేశారు. అలా చేసిన వారిపై అరెస్ట్, ఖాతాల ఫ్రీజింగ్, ఎన్సీఆర్పీలో నమోదు వంటి చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు. సైబర్ నేరాలపై, మ్యూల్ అకౌంట్ హోల్డర్లపై, గేమింగ్కు సంబంధించిన అక్రమ ఆర్థిక లావాదేవీలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, సైబర్ క్రైమ్ ఎస్సై గోపికష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. నిందితుల రిమాండ్ ఈ కేసులో నిందితులను గుర్తించి రిమాండ్కు పంపినట్లు ఎస్పీ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అవేస్ ఖాన్, మడావి ఘన్శ్యామ్, జాధవ్ సంతోష్, సురం ఆశమ్మ, జక్కుల ప్రవీణ్, సురం విశ్వేశ్వర్, రాథోడ్ మనోజ్, జి.ఆర్యన్గౌడ్, జాధవ్ గోవర్ధన్, షేక్ సమీర్, చౌహన్ గోపాల్ గేమింగ్ యాప్స్, బెట్టింగ్ ప్లాట్ఫార్మ్స్, ఫేక్ ట్రేడింగ్, టాస్క్, రివ్యూ మోసాల ద్వారా అక్రమ డబ్బు మార్పిడి జరిపినట్లుగా విచారణలో వెల్లడైంది. షెర్ల రాజవర్ధన్, పేట్లశ్రీ అక్షయ్, రాజేందర్, షేక్ సమీర్ను రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. -
జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తుల కొనుగోలు
ఉట్నూర్రూరల్: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా అటవీ ఉత్పత్తుల కొనుగోలు ప్రారంభించామని జీసీసీ డివిజనల్ మేనేజర్ గుడిమళ్ల సందీప్ కుమార్ అన్నారు. ఉట్నూర్ డివిజనల్ కార్యాలయంలో మేనేజర్లు, సిబ్బందితో శనివారం సమావేశమై మాట్లాడారు. గిరిజనులు, ఆదివాసీలు సేకరించిన ఇప్ప పువ్వు, ఇప్ప పరక, తేనె, మైనం, చింతపండును జీసీసీ సొసైటీ కార్యాలయాలు, డిఆర్ డిపోల వద్దకు తీసుకువచ్చి విక్రయించాలన్నారు. గిరిజన సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్, ఐటీడీఏ పీవో యువరాజు మర్మాట్ ఆదేశాల మేరకు అటవీ ఉత్పత్తుల కొనుగోలు వెంటనే ప్రారంభించామన్నారు. సీనియర్ మేనేజర్లు సంతోష్ కుమార్, తారాచంద్, మేనేజర్లు ఇస్తారి, రమేశ్, మనోహర్, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
నేటి నుంచి స్వీయ గణన షురూ
కై లాస్నగర్: కేంద్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా తలపె ట్టిన జనగణన–2027 ప్ర క్రియ ఆదివారం నుంచి షురూ కా నుంది. తొలివిడతలో భాగంగా ఈ నెల 26నుంచి మే 10 వరకు స్వీయ గణనకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రజలు ఇంటి నుంచే ప్రత్యేక యాప్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. http://se.census.gov.in లింక్ను ఓపెన్ చేసి వివరాలను తొమ్మిది స్టెప్లలో నమోదు చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఒక కుటుంబానికి ఒకే మొబైల్ నంబర్ వినియోగించాలని, అలాగే సరైన వివరాలు నమోదు చేయాలని సూచించారు. మే 11 తర్వాత ఎన్యూమరేటర్లు ఇళ్లవద్దకు వస్తారని, వారికి ఆన్లైన్లో నమోదు చేసిన ఎస్ఈ ఐడీ చూపిస్తే దానిని పరిశీలించి ఆమోదిస్తారని పేర్కొన్నారు. -
ఇంటర్ ఫలితాల్లో పురోగతి సాధించాలి
కై లాస్నగర్: ఇంటర్ ఫలితాల్లో పురోగతి సాధించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీ క్షల నిర్వహణ, ఈ ఏడాది పరీక్షల ఫలితాలు, ఇతర అంశాలపై శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇటీవల ప్రకటించిన పరీక్ష ఫలితాలు జిల్లాకు సంబంధించి ఆశించిన స్థాయిలో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రానున్న విద్యాసంవత్సరంలో ఫలితాల్లో గణనీయమైన మెరుగుదల ఉండాలని ఆదేశించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజర య్యే విద్యార్థుల కోసం సబ్జెక్టుల వారీగా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో డీఐఈ వో గణేశ్ జాదవ్, సెక్టోరియల్ అధికారి ప్రత్యూష, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాళ్లు తది తరులు పాల్గొన్నారు. శిక్షణ శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా బాల కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరం ప్రచార పోస్టర్ను శనివారం ఆవిష్కరించారు. కూచిపూడి, జానపద నృత్యం, చి త్రలేఖనం, సంగీతం (లలిత, కర్ణాటక, హిందూస్తా నీ), వాయిద్య పరికరాలు (తబల, హార్మోనియం, పియానో), కుట్లు–అల్లికలు, మెహందీ వంటి అంశాలపై శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఈ నెల 27 నుంచి మే 30 వరకు ప్రతిరోజు సాయంత్రం 4:30 నుంచి 7:30 గంటల వరకు ఈ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఐదు నుంచి 16ఏళ్ల లోపు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతేడాది కరాటేలో అంతర్జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచిన మాస్టర్లు మిట్టు దత్తు, గాజుల జగన్నాథ్ రుషి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సాధించగా వారికి మెమొంటో అందజేసి అభినందించారు. ఇందులో డీఐఈవో గణేశ్ జాదవ్, బాల కేంద్రం ప్రతినిధులు మెట్టు రవి, ట్రైనర్లు, తదితరులు పాల్గొన్నారు. -
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్కు డాక్టరేట్
నేరడిగొండ: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్కు శనివా రం యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ లీడర్షిప్ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ప్రజాసేవలో ఆయన చూపిన నిబద్ధత, గ్రామీణ ప్రాంతాల్లో చేసిన విశేష సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందజేసినట్లు వర్సిటీ ప్రతినిధులు తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన అవార్డు ప్రదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే హాజ రై డాక్టరేట్ను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడం తనకు ఆనందంగా ఉంటుందని తెలిపారు. ఆ సేవలే ఈ గౌరవాన్ని అందించిందని ఆనందం వ్యక్తం చేశారు. -
రసవత్తరం
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్లో కోఆప్షన్ పదవులకు తీవ్రపోటీ నెలకొంది. నాలుగింటికి గా ను 28దరఖాస్తులు అందాయి. ప్రధాన పార్టీలైన బీ జేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ నుంచి భారీగా రాగా ఎంపిక ప్రక్రియ రసవత్తరంగా మారనుంది. పోటా పోటీ.. నాలుగు కోఆప్షన్ పదవుల్లో రెండు జనరల్, రెండు మైనార్టీలకు కేటాయించారు. చైర్పర్సన్ ఎన్నిక స మయంలో కూటమిగా ఏర్పడి చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల్లో విబేధాలు తలెత్తినట్లుగా తెలు స్తోంది. అందుకే కోఆప్షన్ కేటాయింపుపై ఆయా పార్టీల్లో ఇప్పటి వరకు సఖ్యత కుదరలేదు. ఈ క్ర మంలో బీఆర్ఎస్ మొత్తం నాలుగింటికి తమ పార్టీ వారితో దరఖాస్తు చేయించడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నుంచి పదవీని ఆశిస్తూ ఏకంగా తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంఐఎం నుంచి ఇద్దరు దరఖాస్తులు అందజేసినట్లుగా తెలి సింది. ఇలా ఆయా పార్టీల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు అందిన నేపథ్యంలో పదవీ ఎవరికి దక్కుతుందనేది సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. పక్కా వ్యూహంతో బీజేపీ .. చైర్పర్సన్, వైస్చైర్మన్ఎన్నిక సమయంలో కూటమి తీరుతో భంగపడ్డ బీజేపీ ఈసారి పక్కా వ్యూహంతో ముందడుగు వేస్తుంది.ఆ పార్టీ తరపున నలుగురిని మాత్రమే బరిలో నిలిపింది. ఎమ్మెల్యే తనయుడు పాయల్ శరత్ స్వయంగా అభ్యర్థులను మున్సిపల్ కార్యాలయానికి తీసుకువచ్చి దరఖాస్తు చేయించ డం రాజకీయంగా కొత్త చర్చకు దారితీసింది. కూట మిలో అనైక్యతను సద్వినియోగం చేసుకోవాలని క మలం పార్టీభావిస్తోంది. ఆదిశగా వ్యూహాలకు పదు ను పెడుతూ సభ్యులగెలుపునకు అవసరమైన మద్ద తు కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చైర్పర్సన్ అనుమతితో .. దరఖాస్తు గడువు ముగియడంతో మూడు రోజుల పాటు మున్సిపల్ అధికారులు వాటి పరిశీలన చేపట్టనున్నారు. అనంతరం అర్హుల జాబితా సిద్ధం చేసి చైర్పర్సన్ అనూష ముందు ఉంచనున్నారు. ఆమె అనుమతితో కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారు. చేతులెత్తే విధానంలో ఈ ఎన్నిక చేపట్టనున్నారు. మే మొదటి వారంలో ప్రత్యేక సమావేశం ఉండే అవకాశం ఉంది. -
● ఆదివాసీ టూరిజం ఎక్స్పోజర్ ద్వారా.. ● గూడేలు దాటి.. హైదరాబాద్ సందర్శన ● తొలిసారి నగరాన్ని చూసి పులకింత ● అడవి జీవితాల్లో వినూత్న అనుభూతి
అడవితల్లి ఒడి దాటని జీవితాలవి.. గూడేల్లో సాగు, అటవీ ఉత్పత్తుల సేకరణకే పరిమితమైన ఆ గిరిపుత్రులు ఊరు దాటడమే అరుదు.. పట్టణాలకు వెళ్లడం తక్కువే. ఇక నగరాన్ని చూడని వారెందరో.. అలాంటి వారు హైదరా బాద్ సందర్శనతో పులకించిపోయా రు.. ఎత్తైన భవంతులు, విశాలమైన రోడ్లు, చారిత్రక కట్టడాలు, పర్యాటక స్థలాలను సందర్శించి కొత్త బంగారు లోకంలో విహరించారు. – సాక్షి, ఆదిలాబాద్ ఆదివాసీలకు కొత్త అనుభవాలను ఇవ్వడం, నగర జీవన విధానం పరిచయం చేయడం, ఆత్మవిశ్వాసం పెంచడం, భిన్న సంస్కృతుల మధ్య అవగాహన ఏర్పరచడం, సాంస్కృతిక మార్పిడి, అంతిమంగా గిరపుత్రుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రివర్స్ టూరిజం పేరిట సరికొత్త ప్రయోగం చేశారు. ఆదివాసీ టూరిజం ఎక్స్పోజర్ ప్రోగ్రాంను గడిచిన బుధవారం ఉట్నూర్ మండలం గొండుగూడలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఆ రోజు గొండుగూడ పంచాయతీ పరిధిలోని కొలాంగూడ, మారుతీగూడ, గొండుగూడలకు చెందిన ఆదివాసీలు 250 మంది తెలంగాణ టూరిజం ఏర్పాటు చేసిన ఐదు ఏసీ బస్సుల్లో హైదరాబాద్కు బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. మంత్రి జూపల్లితో పాటు ఖా నాపూర్ ఎమ్మెల్యే బొజ్జు వారితో కలిసి ప్రయాణం చేశారు. రెండు రోజుల పాటు సాగిన తొలి విడత పర్యటన పూర్తయింది. విమానాశ్రయం, చార్మినార్, హుస్సేన్సాగర్, జూపార్క్, శిల్పారామం, బుద్ధవనంలో తదితర పర్యాటక ప్రాంతాలను సందర్శించిన ఆదివాసీలు కొత్త అనుభూతులను తమ మదిలో పదిలపరుచుకున్నారు. ఆ జ్ఞాపకాల తోడుగా తిరిగి గూడేలకు చేరుకున్నారు. రెండో విడతలో దొంగచింత జీపీ పరిధిలోని కుమ్మరికుంట, భీంజీ గూడ వాసులు సుమారు 500 మంది 11 బస్సుల్లో శుక్రవారం బయలుదేరి వెళ్లారు. ఇలా ఎక్కువ మంది ఆదివాసీలను నగర సందర్శన చేయించాలనే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగుతుంది. బుద్ధవనంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కుటుంబ సభ్యులతో ఆదివాసీలుహైదరాబాద్ సందర్శనకు బయలుదేరిన ఆదివాసీ మహిళలతో బస్సులో ముచ్చటిస్తున్న మంత్రి జూపల్లిజూపార్కులో జంతువులను చూస్తూ ఫొటో తీస్తున్న ఆదివాసీలు -
రైట్.. రైట్
ఆదిలాబాద్: తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు మూడు రోజుల పాటు చేసిన సమ్మె శనివారంతో ముగిసింది. ఈ నెల 22నుంచి 24వరకు వినూత్న ఆందోళనలతో ని రసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రజా రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే కార్మిక జేఏసీతో ప్రభుత్వం శుక్రవారం జరిపిన చర్చలు సఫలం కావడంతో బస్సులు పూర్తిస్థాయిలో రోడ్డెక్కాయి. మరోవైపు తమ డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో కార్మికుల్లో హర్షం వ్యక్తమైంది. ఆయా డిపోలు, బస్టాండ్ల వద్ద సంబరాల్లో మునిగితేలారు. బస్సులన్నీ అందుబాటులోకి.. సమ్మె ముగియడంతో అన్ని బస్సులు రోడ్డెక్కాయి. ఉదయం నుంచే కార్మికులు విధుల్లో చేరారు. దీంతో ప్రయాణికులతో బస్టాండ్లు కిటకిటలాడాయి. సమ్మె జరిగిన మూడు రోజుల్లో అరకొరగా బస్సులు నడవగా, శనివారం పల్లె వెలుగు మొదలుకొని రాజధాని వరకు అన్ని సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. రీజియన్ వ్యాప్తంగా ఉన్న మొత్తం 641 బస్సులు నడిచినట్లు అధికారులు తెలిపారు. కార్మికుల సంబరాలు.. కార్మిక జేఏసీ నాయకులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆదిలాబాద్ డిపో వద్ద కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. నర్సంపేటలో నిప్పంటించుకుని అమరుడైన శంకర్గౌడ్ చిత్రపటానికి ముందుగా నివాళులర్పించారు. అనంతరం సీఎం, మంత్రుల ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. డిపో నుంచి బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లారు. టపాసులు కాల్చి స్టెప్పులేస్తూ హర్షం వ్యక్తం చేశారు. -
ఆదివాసీల అభివృద్ధికి కృషి
ఉట్నూర్రూరల్: ఆదివాసీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. ఉట్నూరు మండలం దొంగచింత, కుమ్మరికుంట గ్రామాల ‘ఆదివాసీ టూరిజం ఎక్స్పోజర్’ రెండో విడత కార్యక్రమాన్ని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఆదివాసీ విజ్ఞాన యాత్ర పేరిట మూడు విడతలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండో విడతలో భాగంగా 450 మందిని 11 టూరిస్ట్ బస్సుల్లో యాత్రకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్లోని విమానాశ్రయం, గోల్కొండ తదితర నగర అందాలను వివిధ పర్యాటక ప్రదేశాలను చూపించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ఆదివాసీలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శిక్షణ అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో స్థానిక వైటీసీలో నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు, ఐటీడీఏ పీవో యువరాజ్తో కలిసి కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో ఐటీడీఏ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
చిన్నారుల్లో సంస్కారం పెంపొందాలి
ఆదిలాబాద్: చిన్నారుల్లో సంస్కారం పెంపొందించాలని మున్సిపల్ చైర్పర్సన్ అనూష అ న్నారు. స్థానిక సంజయ్నగర్లోని శ్రీరామకృష్ణ సేవాసమితి కార్యాలయంలో సమితి ఆధ్వర్యంలో బాలసంస్కార్ వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె శిబిరాన్ని ప్రారంభించి మట్లాడారు. వేస వి సెలవుల్లో విద్యార్థులకు సంస్కృతి, సాంప్రదాయాలపై అవగాహన కల్పించడం అభినందనీయమని నిర్వాహకులను కొనియాడారు. అనంతరం సేవా సమితి సభ్యులు చైర్ పర్సన్ ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు భూమన్న, ప్రధాన కార్యదర్శి లెనిన్, సభ్యులు లస్మయ్య, కోటేశ్వరరావు, హన్మండ్లు, శ్రీధర్, ఉపాధ్యాయులు పూర్ణచందర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
వంద రోజులపై ఆశలు
కై లాస్నగర్: ఉద్యోగ విరమణ పొంది ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వ పరంగా రావాల్సిన బకాయిలు అందడం లేదు. వాటిని చెల్లించాలంటూ రిటైర్డ్ ఉద్యోగులు కొంత కాలంగా ఆందోళనలు చేపడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. బకాయిలను వంద రోజుల్లో చెల్లించాలని నిర్ణయించిన సర్కారు ఇందుకు గాను ప్రత్యేకంగా మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. నిర్దిష్ట కాల పరిమితి ప్రకటించడంపై రిటైర్డ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తదనుగుణంగా ప్రయోజనాలు అందించాలని కోరుతున్నారు. 2024 నుంచి పెండింగ్లో.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయస్సును కేసీఆర్ సర్కారు మూడేళ్ల పాటు పెంచిన విషయం తెలిసిందే. 2021 మార్చి 31న రిటైర్డ్ అయ్యే వారి సర్వీసును మూడేళ్లు పొడిగించింది. అప్పటికే ఉన్న బకాయిలను చెల్లించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక 2024 ఏప్రిల్ 30 నుంచి ఉద్యోగ విరమణ ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి జిల్లాలో వందలాది మంది ఉద్యోగులు ఏటా రిటైర్ అవుతున్నారు. వారికి అర్జిత సెలవులు, జీపీఎఫ్, గ్రాట్యూటీ, కంటేషన్ వంటి ప్రయోజనాలను ఉద్యోగ విరమణ పొందిన వెంటనే చెల్లించాల్సి ఉంది. అయితే ప్రభుత్వ ఖజానా ఖాళీ ఉందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తూ వస్తోంది. ఉద్యోగులకు చట్టపరంగా రావాల్సిన ప్రయోజనాలతో పాటు వారు దాచుకున్న సొమ్మును కూడా పొందలేని పరిస్థితి. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు ఈ ప్రయోజనాలను పొందకుండానే పరలోకానికి పయనమయ్యారు. ఎట్టకేలకు స్పందన.. జిల్లాలో ఫ్యామిలీ పెన్షనర్స్, సర్వీస్ పెన్షనర్స్ కలిపి 4,273 మంది ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరికి సగటు న రూ.60లక్షల నుంచి రూ.70లక్షల వరకు రా వాల్సి ఉంది. మూడేళ్లుగా ప్రభుత్వం వీటి చెల్లింపులో జాప్యం చేస్తోంది. సుమారు రూ.2,563 కోట్ల 80లక్షలు చెల్లించాల్సి ఉంది. ఈ ప్రయోజనాలను వెంటనే చెల్లించాలంటూ రిటైర్ అయిన వారు దశల వారీగా ఆందోళనలు చేస్తున్నారు. పిల్లల చదువు, ఆ రోగ్యం, పెళ్లిళ్లు, ఇతరత్రా అవసరాల నిమిత్తం దా చుకున్న జీపీఎఫ్ సొమ్ము సైతం విడుదల కావడం లేదు. దీంతో చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు మానసికంగా కుంగిపోతున్నారు. కొంత మంది ఈ వేదన భరించలేక ప్రయోజనాలు పొందకుండానే మరణించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు వాటిపై స్పందించింది. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపుల కోసం డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. వంద రోజుల్లో బకాయిల సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. సర్కారు నిర్ణయంపై జిల్లాలోని రిటైర్డ్ ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి. జిల్లాలో.. సర్వీస్ పెన్షనర్స్ 2,345 ఫ్యామిలీ పెన్షనర్స్1,928 ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వ పరంగా రావా ల్సిన ప్రయోజనాలు మూడేళ్లుగా అందడం లేదు. దీంతో మానసిక వేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి వంద రోజుల్లో చెల్లించేలా మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడాన్ని స్వాగతిస్తున్నాం. బకాయిలన్నీ గడువులోపు విడుదల చేయాలి. – సాయిరి శశికాంత్, ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు -
ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి
నేరడిగొండ: ఉపాధిహామీ పథకంలో కూలీల సంఖ్య పెంచాలని డీఆర్డీవో రవీందర్ అన్నా రు. వడూర్, నేరడిగొండ పంచాయతీల్లో కొనసాగుతున్న ఉపాధి పనులను శుక్రవారం పరి శీలించారు. కూలీల హాజరు నమోదుపై అధికా రులకు పలు సూచనలు చేశారు. ప్రతి జీపీలో కనీసం 150 మంది కూలీలు పనులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో శేఖర్, ఏపీవో వసంతరావు, వడూర్ సర్పంచ్ శ్రీకాంత్, కార్యదర్శి సద్దాం హుస్సేన్ తదితరులున్నారు. పలుచోట్ల పనుల పరిశీలన బోథ్: మండల కేంద్రంలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను డీఆర్డీవో రవీందర్ పరిశీలించారు. కూలీలతో మాట్లాడి హాజరు విధానంపై అవగాహన కల్పించారు. అనంతరం జీడిపల్లిలో ఉపాధి పనులను పరిశీలించారు.ఇందులో పంచాయతీ కార్యదర్శి అంజయ్య, ఈసీ మధుకర్, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మెట్లు,సిబ్బంది పాల్గొన్నారు. -
నైపుణ్యంతోనే ఉజ్వల భవిష్యత్తు
ఆదిలాబాద్టౌన్: యువత ఆయా రంగాల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆడిటోరియంలో శుక్రవారం ఆధునిక నైపుణ్యాభివృద్ధిపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు.యువత స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. జిల్లా యంత్రాంగం, కళా అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో నిపుణులు పవర్పాయింట్ ద్వారా ఐటీ, సేవా, స్వయం ఉపాధి విభాగాల్లో ఉన్న ఉపాధి అవకాశాలను వివరించారు. ఇంటర్వ్యూ, డిజిటల్ స్కిల్స్పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఐఈవో గణేశ్జాదవ్, డీడబ్ల్యూవో మిల్కా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.మనోహర్ రావు, మైనార్టీ సంక్షేమ అధికారి కలీం, డీవైఎస్వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.జనగణన పకడ్బందీగా చేపట్టాలి కై లాస్నగర్: జనగణన–2027 ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఆదిలాబాద్ పట్టణంలోని టీటీడీసీలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు రెండో విడత శిక్షణ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈసారి జనగణనను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం సమర్థంగా ఉపయోగించడం ద్వారా గణాంకాల్లో ఖచ్చితత్వం పెరుగుతుందన్నారు. నమోదు ప్రక్రియను రెండు విడతల్లో చేపడుతున్నట్లుగా వివరించారు. ముందుగా ప్రజలు స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. అనంతరం మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి గృహాల జాబితాను సేకరిస్తారన్నారు. అనంతరం అధికారులకు జనగణన కిట్లను అందజేశారు. ఇందులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్కుమార్, మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు. -
కోఆప్షన్ దక్కేదెవరికో?
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ కోఆప్షన్ పదవులపై నెలకొన్న ఉత్కంఠ వీడటం లేదు. నాలుగు పదవుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు గడువు శనివారంతో ముగియనుంది. అయినా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలతో కూడిన కూట మిలో పదవుల పంపకాలపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతాయనే దానిపై సందిగ్ధం వీడని పరిస్థితి. ఒక్కో పదవిని ఆశిస్తున్న కాంగ్రెస్, ఎంఐఎంలు తమ అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో కీలకపాత్ర పోషించిన బీఆర్ఎస్లో మాత్రం పదవులను ఎవరికి కేటాయిస్తారనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. నాలుగు పదవుల్లో మూడు పదవులు తమకే కావాలని ఆ పార్టీ నాయకత్వం పట్టుబడుతుండటంతో చివరి వరకు ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఆయా పా ర్టీలు తమ అభ్యర్థులతో దరఖాస్తు చేయించేందుకు రంగం సిద్ధం చేశాయి. ఈ మేరకు పోటీలో నిలిపే వారికి సమాచారం కూడా ఇప్పటికే అందజేశాయి. వారు దరఖాస్తు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మూడు పదవులపై బీఆర్ఎస్ పట్టు.. కోఆప్షన్ పదవులు మున్సిపాలిటీలో నాలుగు ఉండగా రెండు జనరల్, మరో రెండు మైనార్టీ కోటా కింద భర్తీ చేయనున్నారు. ఇందులో మూడు పదవులను బీఆర్ఎస్ కోరుతున్నట్లుగా చర్చ సాగుతుంది. మరోవైపు తమకు ఒక్కో సీటు కావాలని కాంగ్రెస్, ఎంఐఎంలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాలపై కూటమిలో శుక్రవారం రాత్రి వరకు కూడా ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. ఇదిలా ఉంటే ఎంఐఎం తరఫున రాంనగర్ వార్డు మాజీ కౌన్సిలర్ శనవాజ్ ఉర్ రహమాన్ను కోఆప్షన్ మెంబర్గా ఎంపిక చేయగా, కాంగ్రెస్ తరఫున గతంలో అదే వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేసి ఓటమి పాలైన ఖయ్యుంను ఎంపిక చేసినట్లుగా సమాచారం. ఇప్పటికే వారికి సమాచారం అందించిన ఆయా పార్టీల నాయకులు దరఖాస్తు చేసుకోవాలని సూచించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే బీఆర్ఎస్లో మాత్రం ఇప్పటివరకు అభ్యర్థులు ఎవరు అనేదానిపై స్పష్టత రాలేదు. దీంతో ఆశావహుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ పార్టీ నుంచి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేనట్లుగా తెలుస్తోంది. బీజేపీ సైతం.. మొత్తం 49 వార్డులకు గాను 21 మంది కౌన్సిలర్లను గెలుచుకొని బీజేపీ బల్దియాలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీకి ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్అఫీషియో ఓట్లు సైతం ఉన్నాయి. 23 సంఖ్యాబలం ఉన్నప్పటికి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకోవడంలో ఆ పార్టీ విఫలమైంది. అయితే కోఆప్షన్ పదవుల్లో మాత్రం సత్తా చాటాలని కమలం పార్టీ భావిస్తోంది. నాలుగు పదవుల కోసం పోటీ చేయాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. పార్టీలో సీనియర్ నాయకులను బరిలో నిలపాలని యోచిస్తోంది. ఎమ్మెల్యే శంకర్ ఈ విషయమై శుక్రవారం రాత్రి ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, ముఖ్య నాయకులతో చర్చించినట్లుగా సమాచారం. కూటమికే మెజార్టీ ఉండగా, సీట్ల పంపకాలపై ఏకాభిప్రాయం రాకపోవడం బీజేపీకి కలిసిరానుందనే అభిప్రాయం ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. నాలుగు పదవుల్లో కనీసం ఒక్కటైనా దక్కించుకొని తమ ఉనికి చాటుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దరఖాస్తు గడువు నేటితో ముగియనుండగా ఏ పార్టీకి పదవులు దక్కుతాయి.. ఎవరు దరఖాస్తు చేస్తారనేది తేలిపోనుంది. -
‘తీర్పును స్వాగతిస్తున్నాం’
ఆదిలాబాద్టౌన్: కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ జి ల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించడం న్యాయ వ్య వస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలపర్చిందని చెప్పారు. కమిషన్ నిబంధనలు పాటించలేదని కో ర్టు పేర్కొనడం ద్వారా నిజం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కుట్ర తో బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు ఆరోపణలు చే స్తోందని విమర్శించారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జా దవ్ మాట్లాడుతూ.. కేసీఆర్ను బద్నాం చేయడానికే సీఎం రేవంత్రెడ్డి కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వారి వెంట పట్టణాధ్యక్షుడు అజయ్, నాయకులు వెనగంటి ప్రకాశ్, కేమ శ్రీకాంత్, మొట్టే కిరణ్, చందల రాజన్న, దాసరి రమేశ్, కొండ గణేశ్, ధమ్మపాల్, సలీమ్, దివిటి రాజు, మహేశ్ కలీమ్ తదితరులున్నారు. -
అతివేగంతోనే ప్రమాదాలు
అతి వేగం కారణంగానే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడుతుండగా బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంటోంది. జిల్లాలో నిర్వహించిన అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సులు నిర్వహించాం. నేరడిగొండ నుంచి పెన్గంగా వరకు బ్లాక్స్పాట్లు గుర్తించి రోడ్డు భద్రత చర్యలు చేపట్టాం. దీంతో 20శాతం వరకు రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. అందరి సహకారంతో రోడ్డు ప్రమాదాలు అరికట్టవచ్చు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలిచ్చి ప్రమాదాలకు కారకులు కావొద్దు. – అఖిల్ మహాజన్, ఎస్పీ -
బడికి టాటా..
ఆదిలాబాద్టౌన్: ఇన్నిరోజులు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు బడికి బై..బై.. చెప్పారు. పాఠశాల విద్యాశాఖ శుక్రవారం నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది. గురువారం ఈ వి ద్యాసంవత్సరం చివరిరోజు కావడంతో ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి వారి సమక్షంలోనే వార్షిక పరీక్షల ప్రోగ్రెస్ కా ర్డులను విద్యార్థులకు అందజేశారు. వేసవి సెలవుల్లో పిల్లలను బయట తిరగనివ్వకుండా చూడాలని, చెరువులు, వాగులకు ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వేసవి సెలవులు నేటి నుంచి జూన్ 11వరకు ప్రకటించడంతో విద్యార్థులు 49రోజుల పాటు ఇళ్లకే పరిమితం కానున్నారు. ఇక ఆటాపాట పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు చదువులకు టాటా చెప్పారు. ఇక ఆటాపాటలతోనే సెలవులు ఎంజాయ్ చేయనున్నారు. జిల్లాలోని ఆయా గురుకులాలు, వసతిగృహాల నుంచి విద్యార్థులు ఇంటిముఖం పట్టారు. విద్యార్థుల తల్లి దండ్రులు, బంధువులు పాఠశాలలకు వచ్చి వారిని ఇళ్లకు తీసుకెళ్లారు. వేసవి సెలవుల్లో కొందరు విద్యార్థులు సరదాగా ఇంటి వద్దే గడపనుండగా, ఇంకొందరు అమ్మమ్మలు, బంధువుల ఇళ్లల్లో సెలవులు ఎంజాయ్ చేసేందుకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. వివిధ కోర్సుల వైపు.. కొందరు తల్లిదండ్రులైతే తమ పిల్లలకు సెలవుల్లో ఏదైన కోర్సు నేర్పించాలని భావిస్తున్నారు. కంప్యూటర్ శిక్షణ, స్విమ్మింగ్, క్రికెట్, డ్యాన్స్, కూచిపూడి నాట్యం తదితర కోర్సుల్లో శిక్షణ ఇప్పించేందుకు సి ద్ధమవుతున్నారు. వేసవి సెలవుల్లో కొందరు ట్యూ షన్లు చెబుతూ వచ్చే విద్యాసంవత్సరం సిలబస్ ఇ ప్పటినుంచే బోధించేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు తల్లిదండ్రులు పిల్లలను ట్యూషన్కు పంపించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. -
రెండోరోజూ.. అదే తీరు
ఆదిలాబాద్: ఆర్టీసీ కార్మికులు సమ్మె విషయంలో ప ట్టు వీడకపోవడంతో రెండోరోజూ బస్సులు నిలిచి పోయాయి. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం కూడా కార్మికుల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆదిలాబాద్ డిపో ఎదుట, పట్టణంలోని కుమురం భీమ్ చౌక్లో ఆందోళన నిర్వహించి కుమురంభీం విగ్రహానికి వినతిపత్రం అందించారు. తమ ఎంప్లాయ్ ఐడీలపై టికెట్లు జారీ చేస్తూ తామంతా విధుల్లో ఉంటున్నట్లు చిత్రీకరిస్తున్నారని ఆర్టీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తంజేశారు. తమ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోకుండా తమకు వ్యతిరేకంగా ముందుకెళ్తున్నారని మండిపడ్డారు. కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ మాజీ కన్వీనర్ సుభాష్ రాథోడ్, జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి తదితరులు సంఘీభావం ప్రకటించారు. కార్మికుల న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డు మెంబర్ పదవులకు ఇద్దరు కార్మికుల రాజీనామా వెల్ఫేర్ బోర్డు మెంబర్లుగా గతంలో నియమితులైన ఇద్దరు ఆర్టీసీ కార్మికులు రాజీనామా చేశారు. కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న కె.ప్రమిళ, డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న సాయిబాబా గురువారం రా జీనామా లేఖను సంస్థ ఉన్నతాధికారులకు అందజేశారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చేదాకా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రయాణికులకు తప్పని పాట్లు ప్రయాణికుల సౌకర్యార్థం అధికారులు కొన్ని బస్సులు నడిపినా వారికి అవస్థలు తప్పలేదు. మరోవైపు వేసవి సెలవులు ప్రకటించడంతో విద్యాసంస్థలు, వసతిగృహాల నుంచి విద్యార్థులు సొంతూళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. ఇదే అదనుగా ప్రైవేట్ వాహనదారులు రెట్టింపు చార్జీలు వసూలు చేశారు. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి లబ్ధిదారుల కన్నా టికెట్ తీసుకున్న వారికే ప్రాధాన్యం ఇవ్వడంతో మహిళల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. నిర్మల్ జిల్లా సోన్ మండలం జాఫ్రాపూర్ గ్రామానికి చెందిన భానుశ్రియా అనుకుంటా గ్రామంలోని మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల పాఠశాలలో ఐదోతరగతి చదువుతుండగా వేసవి సెలవులు ప్రకటించడంతో ఆమె తండ్రి రమేశ్ బైక్పై 95 కిలోమీటర్లు ప్రయాణించి చిన్నారిని ఇంటికి తీసుకువెళ్లాడు. ఈ ఘటనతో క్షేత్రస్థాయిలో సమ్మె ప్రభావం ప్రయాణికులపై ఏ మేరకు పడుతుందో తెలుసుకోవచ్చు. -
సాలేగూడ.. ఏది నీటి జాడ!
ఇంద్రవెల్లి మండలం తేజాపూర్ పంచాయ తీ పరిధి సాలేగూడ గ్రామస్తులు నీటి కోసం కోటి కష్టాలు పడుతున్నారు. గ్రామానికి మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచింది. ఇతర నీటి పథకాలు నిరుపయోగమయ్యాయి. సర్పంచ్ కోవ రాజేశ్వర్ ట్యాంకర్ ద్వారా ఇంటింటా తాగునీరు సరఫరా చేస్తున్నారు. కానీ, ఇతర అవసరాలకు నీరు లేక పనులు పక్కనపెట్టి ఆదివాసీలు పొద్దంతా భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ఊరికి దూరంగా ఉన్న వ్యవసాయ బావులు, బోర్ల నుంచి ఎడ్లబండ్లు, ద్విచక్ర వాహనాలపై నీటిని తెచ్చుకుని అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇప్పుడే ఇట్లుంటే మే, జూన్ మాసాలను తలచుకుని గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. – ఇంద్రవెల్లి -
‘రోడ్డు భద్రత’ భేష్..
ఆదిలాబాద్టౌన్: రోడ్డు భద్రతపై పోలీస్శాఖ ఫోకస్ పెట్టింది. ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎస్పీ అఖిల్ మ హాజన్ జిల్లాలో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. అరైవ్–అలైవ్లో భాగంగా జనవరి నుంచి జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు ని ర్వహించారు. 500 రోడ్డు సేఫ్టీక్లబ్లు ఏర్పాటు చేసి సీపీఆర్పై శిక్షణ ఇచ్చారు. ప్రథమ చికిత్స కిట్లు అందజేశారు. అత్యవసర పరిస్థితుల్లో వీరు క్షతగాత్రుల కు ప్రథమ చికిత్స అందించి ఆస్పత్రికి తరలిస్తారు. దీంతో ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు 20శాతం తగ్గుముఖం పట్టగా, ఇటీవల జిల్లాకు వచ్చిన డీజీపీ శివధర్రెడ్డి జిల్లా పోలీసులను అభినందించారు. బ్లాక్స్పాట్లపై దృష్టి జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతా లను బ్లాక్స్పాట్లుగా గుర్తించారు. నేరడిగొండ నుంచి పెన్గంగా వరకు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక ఫోకస్ పెట్టారు. తరచూ ప్రమాదాలు జరిగే చోట స్పీడ్ బ్రేకర్లు, రంబుల్స్టిక్స్, పోలీస్ కటౌట్లు ఏర్పాటు చేశారు. రోడ్డు పక్కన ప్రమాదాలకు గురై న కారును ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. గుడిహత్నూర్ నుంచి సీతాగోంది వరకు డౌనల్గా ఉండడంతో వాహనదారులు న్యూ ట్రల్లో వెళ్లడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సీతాగోంది, మేకలగండి, వాఘాపూర్ ఎక్స్రోడ్ ప్రాంతాల్లో అనేక ప్రమాదాలు జరి గి విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వే గాన్ని నియంత్రించేందుకు గుడిహత్నూర్ డౌనల్ నుంచి సీతాగోంది వరకు రంబుల్స్టిక్స్, స్పీడ్ బ్రేక ర్లు ఏర్పాటు చేశారు. నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి అప్రోచ్ రోడ్డు నిర్మించేలా చర్యలు చేపట్టా రు. కుప్టి, గుడిహత్నూర్ శర్మ దాబా వద్ద రోడ్డు ప్ర మాదంలో నుజ్జునుజ్జయిన కారును ప్రదర్శనకు పె ట్టారు. మేకలగండి వద్ద ట్రాఫిక్ పోలీస్కు సంబంధించి వాహన కటౌట్ ఏర్పాటు చేశారు. దీంతో రా త్రివేళ పోలీసులున్నారని వాహనదారులు వేగాన్ని నియంత్రిస్తున్నారు. మేకలగండి నుంచి సీతాగోంది ప్రాంతంలో రాత్రి ప్రమాదాలు జరగకుండా ఎన్హె చ్ అధికారులతో సోలార్ లైటింగ్ ఏర్పాటు చేశారు. గ్రామాల్లోనూ అవగాహన సదస్సులు విద్యార్థి దశ నుంచే రోడ్డు నియమాలు తెలిసేలా జి ల్లా కేంద్రంలో ట్రాఫిక్ పార్కు ఏర్పాటు చేశారు. రో డ్డు నిబంధనలు పుస్తకాల్లో కాకుండా నేరుగా అధికా రులు విద్యార్థులకు తెలియజేస్తున్నారు. జిల్లాలోని 38 గ్రామపంచాయతీల్లో సర్పంచుల ద్వారా రోడ్డు నిబంధనలు పాటించేలా తీర్మానాలు తీసుకున్నా రు. డ్రంకెన్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం చే సేవారికి జరిమానా విధించేలా చర్యలు చేపడుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండల కేంద్రాలు, ముఖ్య కూడళ్లలో ఉదయం, రాత్రి నిత్యం డ్రంకెన్డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల పలువురికి జైలు శిక్ష విధించిన విషయం విధితమే. దీంతో కొంత మందిలోనైనా మార్పు వస్తుందని పోలీసులు భా విస్తున్నారు. మండలానికో కానిస్టేబుల్తో ఖాకీ కి డ్స్ ఏర్పాటు చేసి మూడ్రోజుల పాటు పాఠశాలలు, మరో మూడ్రోజుల పాటు గ్రామాల్లో అవగాహన స దస్సులు నిర్వహిస్తున్నారు. మారుమూల గ్రామాల యువతకు డ్రైవింగ్ మేళా ద్వారా లైసెన్స్లు జారీ చే స్తున్నారు. ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్యశిబిరా లు, ‘మైట్యాక్సీ సేఫ్’ అనే వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మైనర్లు వాహనాలు నడిపించకుండా తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. సంవత్సరాల వారీగా రోడ్డు ప్రమాద వివరాలు సంవత్సరం రోడ్డు మృతుల 2021 245 145 2022 234 137 2023 286 126 2024 349 127 2025 381 117 -
గణిత సబ్జెక్ట్పై భయం వీడాలి
● కలెక్టర్ రాజర్షి షా ● కలెక్టరేట్ అధికారులతో సమావేశం ● పొన్నారిలో ‘ఉపాధి’ పనుల పరిశీలన కైలాస్నగర్: విద్యార్థులు భయం వీడి గణితంపై పట్టుసాధించేలా ప్రత్యేక దృష్టి సారించాల ని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. గురువారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన కా ర్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థులు పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా విమర్శనాత్మక ఆలోచన, తార్కిక విశ్లేషణ లాంటి నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. 1988నుంచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ‘ఫ స్ట్ ఇన్ మ్యాథ్’ ద్వారా గణితాన్ని సులభంగా, ఆసక్తికరంగా నేర్చుకునే అవకాశం ఉందని పే ర్కొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రా జేశ్వర్, ఉపాధ్యాయులు, విద్యార్థులున్నారు. పథకాలు పక్కా అమలు చేయాలి దివ్యాంగుల సంక్షేమ పథకాలను పక్కాగా అ మలు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మంది రంలో జిల్లా స్థాయి దివ్యాంగుల కమిటీ స మావేశం నిర్వహించి మాట్లాడారు. 4శాతం రిజ ర్వేషన్లను అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో కచ్చి తంగా అమలు చేయాలని, పింఛన్లు, యూడీఐడీ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని, అర్హులకు స్వయం ఉపాధి పథకాల కింద రుణాలివ్వాలని, దుకాణాల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అంత్యోదయ కార్డుల జారీ, బస్సు, రైలు ప్రయాణ రా యితీలు, ఉపాధి పనుల్లో సౌకర్యాలపై దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా సంక్షేమాధికారి మిల్కా, ము న్సిపల్ కమిషనర్ రాజు, జిల్లా ఎస్సీ సంక్షేమాభివృద్ధి అధికారి సునీత, ఈడీ మనోహర్, డీ ఎండబ్ల్యూవో కలీం, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రా థోడ్, డీసీఎస్వో నందిని, మెప్మా డీఎంసీ శ్రీని వాస్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. కూలీల సంఖ్య పెంచాలి తాంసి: ఉపాధిహామీ పనుల్లో కూలీల సంఖ్య మరింత పెంచాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మండలంలోని పొన్నారి గ్రామంలో చేపట్టిన పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాస్టర్ రోల్స్ను తనిఖీ చేసి, హాజరైన కూలీల సంఖ్యను సరిచూశారు. అనంతరం కూలీలతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. పని ప్రదేశంలో కూలీలకు నీడ, తాగునీటి సౌకర్యం క ల్పించాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. కలె క్టర్ వెంట సర్పంచ్ భూమన్న, ఉపసర్పంచ్ వెంకట్రెడ్డి, డీఆర్డీవో రవీందర్, ఏపీడీ కుటుంబరావు, ఎంపీడీవో మోహన్రెడ్డి, తహసీల్దార్ లక్ష్మి, ఏపీవో విజయ, ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. -
మౌనికకు అదనపు ఎస్పీగా ప్రమోషన్
ఆదిలాబాద్టౌన్: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అడ్మిన్ ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న పి.మౌనిక అదనపు ఎస్పీగా ప్రమోషన్ పొందారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆమెను అభినందించారు. ఆమె భుజంపై అదనపు ఎస్పీ హోదా చిహ్నాలు అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. మౌనిక ప్రమోషన్ పొందినప్పటికీ ఆమె ప్రస్తుతం నిర్వహిస్తున్న అడ్మిన్ అదనపు ఎస్పీ హోదాలోనే కొనసాగుతారని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది ఆమెను కలిసి అభినందనలు తెలిపారు. అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) సురేందర్రావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాస్, ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి, సీసీ కొండరాజు, పలువురు ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
మొక్కలను సంరక్షించాలి
ఉట్నూర్రూరల్: ఐటీడీఏ పరిధిలోని ఉద్యాన నర్సరీల్లో అవకాడో మొక్కలను సంరక్షించాల ని పీవో యువరాజ్ మర్మాట్ సూచించారు. బు ధవారం ఉట్నూర్ పరిధిలోని ఉద్యాన నర్సరీని సందర్శించారు. వివిధ మొక్కల వివరాలు, సంరక్షణ చర్యలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యాన నర్సరీల్లో అవకాడో పంటపై రైతులకు అవగాహన కల్పించి, సాగు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. వేసవిలో మొక్కలకు తప్పనిసరిగా నీరు పట్టాలని తెలిపారు. 50 ఎకరాల ఉద్యాన నర్సరీని సుందరంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోనున్న ట్లు పేర్కొన్నారు. మొక్కల సంరక్షణలో భాగంగా నీటి వనరుల వివరాలను ఉద్యాన అధికారి సందీప్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
సాత్నాల: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాద వ్ హామీ ఇచ్చారు. భోరజ్ మండలం సావాపూ ర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన ‘ఇందిరమ్మ’ గృహప్రవేశాలకు హాజరయ్యారు. లబ్ధి దారులకు శుభాకాంక్షలు తెలిపి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదవారి సొంతింటి కల నెరవేరుస్తున్నామని చెప్పారు. జిల్లాలోని ప్రతీ పేదవారికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షు డు దీపక్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సంజీవ్రెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఆసిఫ్ఖాన్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శాంతన్రావు, టీటీడీ బోర్డు మాజీ మెంబర్ బెజ్జంకి అనిల్, డీసీసీ ప్రధాన కార్యదర్శులు మల్యాల కరుణాకర్, ధర్మపురి చంద్రశేఖర్, మామిడి మల్లారెడ్డి, భూమారెడ్డి, ఉషమల్ల శంకర్, ఆడే జైపాల్, పొట్టు అశోక్, రాదేశ్యాం తదితరులు పాల్గొన్నారు. -
‘కో ఆప్షన్’పై ఉత్కంఠ
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ కో ఆప్షన్ పదవుల ఎంపిక వ్యవహారం ఉత్కంఠను రేకిత్తిస్తోంది. మొత్తం నాలుగు పదవులను భర్తీ చేయనుండగా అవి కూటమిలోని ఏ పార్టీకి దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులు దక్కించుకునేందుకు కూటమిగా ఏర్పడ్డ బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం తిరిగి కో ఆప్షన్ పదవులు ద క్కించుకోవాలని ప్రయత్నిస్తుండటం రాజకీయంగా వేడిని రాజేస్తోంది. ప్రధానంగా చైరపర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ నాలుగు కో ఆప్షన్ పదవులు తమకే కావాలంటూ పట్టుబడుతోంది. కాగా, తమకూ కా వాల్సిందేనని ఎంఐఎం, కాంగ్రెస్ అడుగుతుండటంతో ఈ పదవులు ఏ పార్టీకి దక్కుతాయనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సమీపిస్తున్న గడువు గ్రేడ్–1 స్థాయి కలిగిన ఆదిలాబాద్ మున్సిపాలిటీలో నాలుగు కో ఆప్షన్ మెంబర్ల పదవులు భర్తీ చేసేందుకు అవకాశముంది. ఇందులో రెండు జనరల్ వి భాగంలో, మరో రెండు మైనార్టీలకు కేటాయించా రు. వీటి ఎంపికకు ఈ నెల 17వ తేదీన మున్సిపల్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. వారం గడువిచ్చిన అధికారులు ఈ నెల 25న సాయంత్రం ఐదు గంట్లలోపూ అ ర్హులైన వారు దరఖాస్తు చేసుకోవా లని సూచించారు. ఇందుకు సంబంధించిన గడువు సమీపిస్తుండగా ఇప్పటివరకు ఆయా పార్టీల తరఫున ఎవరినీ ఎంపిక చేయలే దు. మరో రెండ్రోజుల గడువే మిగిలి ఉండటంతో ఈ పదవుల కోసం ఏయే పార్టీల తరఫున దరఖాస్తులు అందజేశారనేది రాజకీయంగా ఉత్కంట రేకిత్తిస్తోంది. కూటమిలోని పార్టీలన్నీ ఈ పదవులు దక్కించుకుంటాయా? లేదా.. ఒకే పార్టీకి నాలుగు పదవులు కేటయిస్తారా? అనేది మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు రాజకీయవర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. అన్నీ తమకేనని బీఆర్ఎస్ పట్టు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులుండగా 21కౌన్సిలర్ స్థానాలను గెలుచుకుని బీజేపీ బల్ది యాలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీనికి తో డు ఎమ్మెల్యే, ఎంపీల ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి ఈ సంఖ్య 23కు చేరింది. అయినప్పటికీ 11 స్థానా లు గెలుచుకున్న కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్, స్వతంత్రుల మద్దతుతో చైర్పర్సన్ పదవిని దక్కించుకుంది. ఎంఐఎంకు వైస్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. ఈ ప్రక్రియలో కీలకపాత్ర పోషించిన తమ పార్టీకే నాలుగు కో ఆప్షన్ పదవులు ఇవ్వాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పట్టుబడుతున్నట్లు తెలిసింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సహకరించినందున తమకు ఈసా రి సహకరించాలంటూ కూటమిలోని పార్టీలకు ఆయన తేల్చిచెప్పినట్లు చర్చ సాగుతోంది. ఇదే విషయంపై బుధవారం జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఫోన్లో మాట్లాడిన జోగు రామన్న దీనిపై కుండబద్దలు కొట్టినట్లు రాజకీయాల్లో చర్చ సాగుతోంది. అయితే, కూటమిలో భాగస్వాములు గా ఉన్న తమకు కో ఆప్షన్ పదవులు కావాలంటూ అధికార కాంగ్రెస్, ఎంఐఎం కూడా అడుగుతున్నాయి. కాంగ్రెస్ రెండు పదవులు ఆశిస్తుండగా ఎంఐఎం ఒక పదవి కోరుకుంటోంది. మరోవైపు ఆయా పార్టీల తరఫున పదవులు ఆఽశిస్తున్న మాజీ కౌన్సిలర్లు తమకే దక్కేలా చూడాలంటూ ఆయా పార్టీల నేతలపై ఒత్తడి తీసుకువస్తున్నారు. ఈసారి ఎలాగైనా అవకాశం కల్పించాలంటూ వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ పదవులు ఏ పార్టీకి దక్కుతాయనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు రెండే దరఖాస్తులు ఇప్పటివరకు మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ పదవుల కోసం రెండు దరఖాస్తులు మాత్రమే అందాయి. పార్టీ 11వ వార్డు మాజీ కౌన్సిలర్ తుర్పాటి సుజాత, ఖానాపూర్ (అంబేడ్కర్నగర్) మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ కో ఆప్షన్ మెంబర్ పదవుల కోసం మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేశారు. పార్టీలపరంగా వారికి ఎలాంటి అంగీకారం లేనప్పటికీ దరఖాస్తు చేయ డం ప్రాధాన్యత సంతరించుకుంది. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్, ఎంఐఎం, స్వతంత్రులను కూడగట్టడంలో కీలకపాత్ర పోషించిన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి గురువారం జిల్లా కేంద్రానికి రానున్నారు. పార్టీ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులతో చర్చించి వారి అభిప్రాయాలు స్వీకరించే అవకాశముంది. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పార్టీ ముఖ్య నాయకులతో ఆయన నేరుగా సంప్రదింపులు జరిపే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాలుగు పదవుల్లో ఏ పార్టీకి ఎన్ని ఇవ్వాలి.. కాంగ్రెస్కు పదవులు దక్కుతాయా.. లేదా? అనేదానిపై చర్చించి నిర్ణయానికి రానున్నట్లు తెలిసింది. -
‘కెనాల్ నిర్మాణానికి భూములివ్వం’
సాత్నాల: భోరజ్ మండలం సావాపూర్ గ్రామ స మీపాన కొరాటా–చనాకా, డీఎల్ 17 కెనాల్ నిర్మాణానికి అధికారులు భూ సేకరణ చేపట్టిన నేపథ్యంలో స్థానిక రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రా మంలో సమావేశమైన రైతులు జీపీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వందేళ్లుగా తమ కుటుంబాలు పూర్తిగా వ్య వసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నట్లు తెలి పారు. సారవంతమైన భూములు కోల్పోతే కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారుతుందని వాపోయారు. తమకు సాగు భూములే జీవనాధారమని, 20 ఏళ్లుగా సాత్నాల ప్రాజెక్ట్ ద్వారా నీరు పుష్కలంగా అందుతోందని, బోరు బావుల్లోనూ నీరుంటుందని తె లిపారు. నీటి వసతుల్లేని భూముల వైపు కెనాల్ను మళ్లించి వారికి సాగునీరు అందించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కెనాల్ నిర్మాణానికి భూములిచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. శ్రీనివాస్, సల్ల శీ ను, పబ్బత్ సంజీవ్, బోయర్ కవీశ్వర్, మార్చెట్టి నా గేశ్, సునీల్, వానికర్ బుద్ధప్రకాశ్ పాల్గొన్నారు. -
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
ఆదిలాబాద్టౌన్/ఆదిలాబాద్రూరల్: విద్యార్థులు విజ్ఞానశాస్త్రంపై ఆసక్తి పెంచుకుని శాస్త్రవేత్తలుగా ఎ దగాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. బుధవా రం ఆదిలాబాద్రూరల్ మండలంలోని బంగారిగూ డ కేజీబీవీలో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులతో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, నవార్స్ ఎడ్యుటెక్ సహకారంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఖగోళ, అంతరిక్ష ప్ర యోగశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ ప్రయోగశాల విద్యార్థుల్లో జిజ్ఞాసను పెంచి భవి ష్యత్లో వారు అంతరిక్ష శాస్త్రవేత్తలుగా, స్పేస్ స్టార్టప్లు ప్రారంభించే స్థాయికి ఎదగడానికి ప్రేరణని స్తుందని తెలిపారు. ఇది జాతీయ విద్యా విధానంలో ముఖ్య భాగమని వివరించారు. గతంలో బిర్లా ప్లానిటోరియం లాంటి ప్రదేశాల్లోనే ఇలాంటి సౌకర్యాలుండేవని, ఇప్పుడు పాఠశాల స్థాయిలోనే వి ద్యార్థులకు ప్రయోగాత్మక విద్య అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు. విద్యార్థులు ఇన్నోవేటివ్ ఆలోచనలతో ముందుకు వస్తే తె లంగాణ ఇన్నోవేషన్ కౌన్సిల్, వీ హబ్ లాంటి వేదిక ల ద్వారా ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని తెలి పారు. అనంతరం పట్టణ కేజీబీవీలో ఖగోళ, అంతరిక్ష ప్రయోగశాలతో పాటు గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అంతకుముందు అధికారులతో కలిసి పా ఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. అవసరమైన మరమ్మతులు, మౌలిక వసతులపై చర్చించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో రాజేశ్వర్, ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి డా క్టర్ మృణాల్ జైవంత్, టీడీఎఫ్ ప్రతినిధులు రాజేశ్వర్రెడ్డి, వినీల్రెడ్డి, నవార్స్ ఎడ్యుటెక్ ప్రతినిధులు శశాంక కూన, అరుణ్, తహసీల్దార్లు శ్రీనివాస్, గో వింద్, సెక్టోరల్ అధికారి ప్రత్యూష, ప్రత్యేకాధికారులు కవిత, దీప్తి, అధికారులు, సిబ్బంది ఉన్నారు. విత్తన కొరత రానివ్వొద్దు కైలాస్నగర్: ఖరీఫ్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ, టాస్క్ఫోర్స్ బృందాలు, విత్తన కంపెనీల ప్రతినిధులు, డీలర్లతో సమీక్ష నిర్వహించారు. డీలర్లు నిబంధనలు పాటించాలని, రైతులను మోసం చేస్తే అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలను ఎలా గుర్తించాలో రైతులకు అవగాహన కల్పించాల ని సూచించారు. ఎస్పీ అఖిల్ మహాజన్, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ ఆర్ఎస్.చిత్రు, ఆర్డీవో జగదీశ్వర్రావ్, జేఏవో శ్రీధర్స్వామి తదితరులున్నారు. -
నేడు భగీరథ మహర్షి జయంతి
కై లాస్నగర్: భగీరథ మహర్షి జయంతిని గురువా రం అఽధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజ ర్షి షా ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10.30గంటలకు నిర్వహించనున్న కార్యక్రమానికి జిల్లాలోని సాగర, ఉప్పర కులస్తులు, బీసీ సంఘాల నాయకులు, బీసీ కులస్తులు అధికసంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఘనంగా సీపీఐఎంఎల్ ఆవిర్భావ వేడుకలుఆదిలాబాద్టౌన్: సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ఆ ధ్వర్యంలో సీపీఐ ఎంఎల్ 57 ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. లెనిన్ జయంతి సందర్భంగా బుధవారం నిషాన్ ఘాట్లో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ ఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ కార్యదర్శివర్గ స భ్యు డు జగన్సింగ్ మాట్లాడారు. భారతదేశ వి ము క్తి కోసం మార్క్సిజం, లెనినిజం, మావో ఆ లో చన విధానాల వెలుగులో అనేకమంది ప్రా ణా లు త్యాగం చేశారని గుర్తుచేశారు. భూమి, భు క్తి, దేశ విముక్తి కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాల ను మాస్ లైన్ ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తామన్నారు. నాయకులు నితిన్, వామన్, శీను, రేణుక, లక్ష్మి, వనిత తదితరులున్నారు. -
ఉన్నతస్థాయికి ఎదిగేలా చూడాలి
ఇంద్రవెల్లి: విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదిగేలా కృషి చేయాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ సూ చించారు. మండలకేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు రవీంద్రాచారి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా రవీంద్రచారి దంపతులను శాలువాలతో సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాట లు వేసేది ఉపాధ్యాయులేనని, ఆ దిశగా ఉపాధ్యాయులు వృతి ధర్మంలో విధులు నిర్వహించి విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేవిధంగా కృషి చేయాలని సూచించారు. ప్రధానోపాధ్యాయుడు రవీందర్రెడ్డి, సర్పంచులు మెస్రం తుకారాం, లఖన్, రాజేశ్వర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మౌనికకు అదనపు ఎస్పీగా ప్రమోషన్
ఆదిలాబాద్టౌన్: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అడ్మిన్ ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న పి.మౌనిక అదనపు ఎస్పీగా ప్రమోషన్ పొందారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆమెను అభినందించారు. ఆమె భుజంపై అదనపు ఎస్పీ హోదా చిహ్నాలు అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. మౌనిక ప్రమోషన్ పొందినప్పటికీ ఆమె ప్రస్తుతం నిర్వహిస్తున్న అడ్మిన్ అదనపు ఎస్పీ హోదాలోనే కొనసాగుతారని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది ఆమెను కలిసి అభినందనలు తెలిపారు. అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) సురేందర్రావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాస్, ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి, సీసీ కొండరాజు, పలువురు ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
గ్రామీణాభివృద్ధిశాఖ జేఏసీ రాష్ట్ర కన్వీనర్గా రాజు
కై లాస్నగర్: తెలంగాణ రూరల్ డెవలప్మెంట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా జిల్లా కేంద్రానికి చెందిన పి.రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం హైదరాబాద్లోని నాంపల్లి ఎన్జీవో భవన్లో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ గెజిటెడ్ అధికా రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం జేఏసీ ప్రతినిధులు గ్రామీణాభివృద్ధి శాఖ క మిషనర్ దివ్య దేవరాజ న్ను ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకలగా కలిసి పూలమొక్క అందజేశారు. ఈ సందర్భంగా సమస్యలతో కూడిన వి నతిపత్రం అందజేసి పరి ష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్లు లింగంపల్లి నర్సయ్య, శ్రీనివాసరావు, జిలీల్ ఖాన్, ప్రతినిధులు పార్థసారథి, నాగయ్య, నారాయణ, ఫిరోజ్ఖాన్ తదితరులున్నారు. -
గంజాయి గుప్పుచుప్గా..
గంజాయి మొక్కలు ● ఆగని గంజాయి రవాణా ● పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నా మళ్లీ మామూలే ● ఏజెన్సీలో మకాం వేస్తున్న ఇతర రాష్ట్రాల ముఠాలు రంపచోడవరం: గంజాయి రవాణా గుట్టుగా సాగిపోతోంది.. ఆగకుండా సరిహద్దులు దాటుతోంది.. అటవీ ప్రాంతం అక్రమార్కులకు వరంలా మారింది.. ఇది వారికి రూ. కోట్లు తెచ్చిపెడుతోంది.. పోలీసుల తనిఖీలు జరుగుతున్నా, మళ్లీ మామూలే అన్నట్లు జరిగిపోతోంది.. ఏజెన్సీలో ఇతర రాష్ట్రాల ముఠాలు మకాం వేసి మరీ పంట పండించే దగ్గర నుంచి, సరకు తరలించడం వరకూ యథేచ్ఛగా జరిగిపోతూనే ఉంది. అయినా వేళ్లూనుకుపోయిన వ్యవస్థను పెకిలించడం పోలీసు వ్యవస్థకు సవాలుగా మారుతోంది. ఒడిశా ప్రాంతంలో పండించిన గంజాయిని ఆంధ్రా సరిహద్దులు దాటించి స్మగ్లర్లు రూ.కోట్లు సంపాదిస్తున్నారు. గంజాయి ముఠాలు ఏజెన్సీలో మకాం వేసి అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు గంజాయిని తరలిస్తున్నారు. ఈ రవాణాపై పోలీసులు నిఘా పెట్టి స్మగ్లర్లను పట్టుకుంటున్నా మళ్లీ మామూలుగానే సాగిపోతోంది. తాజాగా గంజాయి స్మగ్లర్లు కారులో గంజాయితో గుర్తేడు వైపు నుంచి రావడంతో పోలీసులకు ముందుగా సమాచారం అందింది. పోలీస్ స్టేషన్ వద్ద కారును ఆపే ప్రయత్నం చేయడంతో, వారు ఆగకుండా రంపచోడవరం వైపు వెళ్లి, తిరిగి మారేడుమిల్లి స్టేషన్ వైపు వేగంగా వస్తూ ఆవును, ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. ఇలా గంజాయి స్మగ్లర్లు దేనికై నా తెగిస్తున్నారు. చివరికి కారులో గంజాయితో పాటు కేరళకు చెందిన ముగ్గురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సోమవారం వెల్లడించారు. అలాగే గంగవరం పోలీస్ స్టేషన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, రెండు వాహనాల్లో గంజాయి తరలిస్తూ నిందితులు పట్టుబడ్డారు. ఇతర రాష్ట్రాల వారే నిందితులు తాజాగా దొరికిన గంజాయి కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, ముంబయికి చెందిన నిందితులే పట్టుబడ్డారు. గంగవరం పోలీస్ స్టేషన్ వద్ద వాహనాల తనిఖీలో మహారాష్ట్రకు చెందిన ఖంబం శేరంజిన్ పిట్చేశ్రావు, అనిష్ అహ్మద్ రియాజ్, సుచిత్ర జాదవ్, ముంబాయికి చెందిన మహిళా, నితిన్ హనుమంత మునతిలు పట్టుబడ్డారు. కాకినాడ జిల్లాకు చెందిన కోలా ప్రభు కూడా వారితో ఉన్నాడు. ఈ కేసులో రెండు కార్లలో 120 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ రూ. 60 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. రెండు రోజుల కిందట గుర్తేడు వైపు నుంచి వాహనంలో వస్తూ పట్టుబడిన నిందితులు కేరళకు చెందిన వారే. గతంలో కూడా చైన్నె, బెంగళూరుకు చెందిన వారు కూడా గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు. రెండు నెలలు ముందే వచ్చి.. గంజాయి పండించే ఆంధ్రా, ఒడిశా సరిహద్దు గ్రామాలకు రెండు నెలల ముందే ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు చేరుకుంటున్నారు. ఒడిశా గిరిజనులతో మమేకమై వారితో గంజాయి సాగు చేయించేందుకు సిద్ధం చేస్తారు. ఏటా అక్టోబర్ పంట వేస్తారు. మూడు నెలల్లో గంజాయిని కటింగ్ చేసి ప్యాకింగ్ చేస్తారు. అంటే జనవరి ఆఖరి నాటికి గంజాయి రవాణాను ప్రారంభిస్తారు. మూడు నెలల కాలానికి గంజాయి సాగు కోసం అవసరమైన ఎరువులను వ్యాపారులే సరఫరా చేస్తారు. విత్తనాల సేకరణ ఒడిశా గిరిజనులే చూసుకుంటారు. చిత్రకొండ, పప్పులూరు, కుర్మానూరు, జోడం, గుర్రాల ఊరు, సరిగట్టు సీలేరు సరిహద్దులోని ఒడిశా గ్రామాల్లో గంజాయి సాగు జోరుగా సాగుతోంది. గంజాయి సాగులో తమిళనాడు, ఒడిశా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఎక్కువగా ఉంటారు. గంజాయిలో శీలావతి మొదటి రకం గంజాయిని పండించిన చోటే కిలో రూ. 5 వేలకు విక్రయిస్తారు. రెండో రకం కిల్లీ కిలో రూ. 2 వేలు, గుండ రెండు రకాల్లో మిగిలిన గుండ రూ. 2 వేలు పలుకుతుంది. రవాణా సమయంలో గంజాయి పాడవకుండా ప్లాస్టిక్ కవర్లలో నింపి వాటికి చుట్టూ ప్లాస్టర్ వేస్తారు. వారి రూటు.. సపరేటు గంజాయి రవాణాపై స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. గతంలో గంగవరం మీదుగా మల్లిసాల అటవీ ప్రాంతానికి చేర్చి అక్కడి నుంచి హైవేకు వాహనాన్ని తీసుకువెళ్లేవారు. హైవేకు వచ్చిన వాహనం గమ్యస్థానం చేరడం చాలా సులువు. ఎక్కడ తనిఖీలు లేకపోవడంతో స్మగ్లర్ల పని సులభంగా అవుతుంది. ఒడిశా ప్రాంతంలో పండించిన గంజాయిని సీలేరు నది దాటించి కాలినడకన పాతకోట మీదుగా వై.రామవరం సరిహద్దు గ్రామాల నుంచి గంగవరం మీదుగా మైదాన ప్రాంతాలకు తరలిస్తారు. అలాగే టవర్ లైన్ ద్వారా మారేడుమిల్లి ఘాట్ రోడ్డుకు చేర్చి అక్కడి నుంచి అనుకూలంగా ఉంటే అటుగా భద్రాచలం మీదుగా తెలంగాణ హైదరాబాద్కు చేరుతుంది. తర్వాత కేరళ, బెంగళూరు, ముంబయి వంటి నగరాలకు తరలిస్తారు. అక్కడకు చేరిన గంజాయికి రూ.కోట్లలో ధర పలుకుతుంది. గంజాయి రవాణాలో గిరిజనులు, మధ్యవర్తులు, పైలెట్లే కీలకంగా వ్యవహరిస్తారు. వ్యాపారులు రాజమహేంద్రవరం వంటి నగరాల్లో మకాం వేసి పర్యవేక్షణ చేస్తారు. గంజాయి రవాణా చేస్తూ ఎంతోమంది గిరిజనులు పట్టుబడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పనికి వెళ్లి ఇలా వారు పట్టుబడుతుంటే, వ్యాపారులు చల్లగా జారుకుంటున్నారు. అంతా తెలిసినా.. గంజాయిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అవుతోంది. అసలు పంట వేయకుండా ఆపగలిగితే రవాణాపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒడిశా– ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి సాగు జరుగుతున్నా, అడ్డుకోవడంలో ప్రభుత్వం చోద్యం చూస్తుంది. ముందుగా సాగును అరికట్టాల్సి ఉందని అంతా సూచిస్తున్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
రంపచోడవరం: ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం సమావేశ భవనంలో పీజీఆర్ఎస్ నిర్వహించారు. కలెక్టర్తో పాటు చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి శుభం నొఖ్వాల్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటికి తక్షణ పరిష్కారం చూపడం అధికారుల ప్రధాన బాధ్యత అని అన్నారు. పెండింగ్లో ఉన్న రీ–ఓపెన్ చేసిన అర్జీల పరిష్కారానికి సంబంధిత అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాలని ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్కు అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. పిల్లలను బడికి పంపండి జిల్లా వ్యాప్తంగా 2026–27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు లక్ష్యంగా ‘బాలల్లారా బడికి రండి – ప్రభుత్వ బడి పిలుపు, భవితకు మలుపు’ కార్యక్రమాన్ని కలెక్టర్ కె.దినేష్ కుమార్ ప్రారంభించారు. ఈ మేరకు రంపచోడవరంలో వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. విద్యా వారోత్సవాలు ఈ నెల 16 నుంచి 23 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన విద్యతో పాటు ఉచిత సౌకర్యాలను ప్రజలకు తెలియజేయాలని అన్నారు. డిజిటల్ ఎడ్యుకేషన్, భవిత సెంటర్లు, తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం వంటి పలు కార్యక్రమాల ద్వారా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలను పాఠశాలలో చేర్పించాలని ఆదేశించారు. చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి శుభం నొఖ్వాల్, జిల్లా రెవెన్యూ అధికారి పి.అంబేద్కర్, జిల్లా విద్యా శాఖ అధికారులు రామకృష్ణ, వై.మల్లేశ్వరరావు, మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
హుందా మరచి.. దూషణల పంథా
సాక్షి, రాజమహేంద్రవరం: వ్యక్తిగత ప్రయోజనమో.. సొంత అజెండాయో.. అధినాయకుల మెప్పు కోసమో.. పదవీ లాలసో తెలీదు కానీ.. కొన్నాళ్లుగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. విపక్ష నాయకులపై దూషణల పంథా పట్టారు. సినిమాల్లో ప్రతినాయకుల మాదిరిగా ‘చంపుతా.. నరుకుతా..’ అంటూ శివాలెత్తిపోతున్నారు. సభ్యతను పూర్తిగా పక్కన పెట్టేసి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులపై దిగజారుడు వ్యాఖ్యలకు దిగుతున్నారు. అధికారంలో ఉన్న నాయకులు ప్రతిపక్ష నేతలను విమర్శిస్తూంటారు. కానీ, ఆ విమర్శలు, ఆరోపణలు విధానపరమైన అంశాలకు పరిమితమైతే ఫర్వాలేదు. కానీ, బుచ్చయ్య మాత్రం తరచుగా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. మాజీ సీఎం అనే కనీస గౌరవం లేకుండా ఇష్టమొచ్చినట్లు దూషణలకు దిగడం ఆయనకు పరిపాటిగా మారుతోంది. విలేకర్ల సమావేశాలు, టీవీ డిబేట్లలో పదేపదే అవే విమర్శలు చేస్తూ తన రాజకీయ అనుభవానికి సమాధి కట్టుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధినేతల మెప్పు కోసమేనా? టీడీపీ మహానాడు అనంతరం చంద్రబాబు ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆ సందర్భంగా కొందరు మంత్రులకు ఉద్వాసన పలకనున్నారని తెలుస్తోంది. వారి స్థానంలో సీనియర్లకు మంత్రి పదవులిచ్చి, మాజీ సీఎం, వైఎస్సార్ సీపీని విమర్శించేలా ప్రణాళిక సిద్ధం చేశారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఓ రాయేస్తే పోలా.. అనే రీతిలోనే బుచ్చయ్య ఇలా రెచ్చిపోతున్నారని అంటున్నారు. మాజీ సీఎం జగన్ను, వైఎస్సార్ సీపీని గట్టిగా విమర్శిస్తే తనకు బెర్త్ ఖాయమవుతుందని భావించారో.. ఏమో కానీ కొన్ని నెలలుగా ఎన్నడూ లేని విధంగా దారుణమైన దూషణలకు దిగుతున్నారు. విజయవాడలో ప్రెస్మీట్లు పెట్టి మరీ విమర్శలు చేస్తున్నారు. తద్వారా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ల దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారని విశ్లేషకులు అంటున్నారు. స్వపక్షంలో అవమానాలు మర్చిపోయారా? సీనియర్ నేత అయినప్పటికీ టీడీపీలో బుచ్చయ్య చౌదరి ఆది నుంచీ అవమానాలే ఎదుర్కొంటున్నారు. దివంగత ఎన్టీఆర్కు ఆయన అత్యంత సన్నిహితుడు. ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన సమయంలో బుచ్చయ్య ఎన్టీఆర్ వర్గంలోనే ఉన్నారు. తనకు అన్యాయం జరిగితే అధినాయకత్వాన్నే ప్రశ్నించే తత్వం ఆయన సొంతం. ఆయన వ్యవహార శైలిని చంద్రబాబు జీర్ణించుకునే వారు కాదు. ఇష్టం లేకపోయినా పార్టీలో సీనియర్ అనే కారణంగా పట్టించుకోకుండా వదిలేసేవారు. టీడీపీపై ఉన్న అభిమానంతో గోరంట్ల సైతం పార్టీలో అలాగే కొనసాగేవారు. మంత్రి పదవి రాని సమయంలో ‘పార్టీలో పదవులు అమ్ముకుంటున్నార’ని గతంలో తీవ్ర స్థాయిలో ఆరోపించారు కూడా. ఈ నేపథ్యంలో ఆయనను చంద్రబాబు పెద్దగా నమ్మరనే ప్రచారం ఉంది. అందువల్లనే చంద్రబాబు ప్రభుత్వంలో బుచ్చయ్యకు మంత్రి పదవి దక్కలేదని అంటారు. తనను అంతగా అవమానించినప్పటికీ.. ఇప్పటికీ వారినే పొగడటం, మాజీ సీఎంను దూషించడం వంటివన్నీ మంత్రి పదవి కోసమేననే అభిప్రాయాన్ని కలిగించక మానవు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్య సమాజం తలదించుకునేలా బుచ్చయ్య తీరు ‘నిన్ను చంపితే తప్పేముంది?’ అంటూ మాజీ సీఎంపై గతంలో శివాలు సభ్యత వదిలి తాజాగా ‘నరుకుడు’ వ్యాఖ్యలు రూరల్ ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా నిరసనలు వైఎస్సార్ సీపీ నేతలు గరంగరం బుచ్చయ్య చౌదరి దూషణలపై వైఎస్సార్ సీపీ నేతలు మండిపడుతున్నారు. మహిళలను కించపరుస్తూ ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్ సీపీ శ్రేణులు ఉద్యమించిన విషయం తెలిసిందే. అలాంటి వ్యక్తిని సమర్థిస్తూ మాజీ సీఎంపై దూషణలకు దిగడంపై వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి పదవి కోసమే బుచ్చయ్య నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, వయసును, అనుభవాన్ని పక్కన పెట్టి మరీ మత్రి భ్రమించి దూషిస్తున్నారని ఆ పార్టీ నేతలు జక్కంపూడి రాజా, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మార్గాని భరత్రామ్ తదితరులు ఆరోపిస్తున్నారు. ‘నరుకుతామంటున్నారు. ఎక్కడి రావాలో టైమ్, డేట్ చెప్పాలంటూ సవాల్ విసురుతున్నారు. మంత్రి పదవి కోసం ‘నరుకుతా, చంపుతా, ఉరి తీయాలి’ మాట్లాడటమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాల్సింది పోయి.. ప్రతిపక్ష నేతలపై ఇలాంటి దూషణలు తగవని హెచ్చరిస్తున్నారు. బుచ్చయ్య తీరు ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. -
ముగ్గురు నిందితుల అరెస్ట్
రంపచోడవరం: మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 18న బీభత్సం చేసిన గంజాయి తరలింపు నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ టీజీఎన్ ప్రసాద్, ఎస్సై కె.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు వారిని మారేడుమిల్లి శివారు జీఎం వలస జంక్షన్లో సోమవారం పట్టుకున్నామన్నారు. ఇందులో అప్సల్ ఆర్ఏ (కర్ణాటక), నఫ్రాజ్ (కేరళ), ఫైజాన్ రజాక్ సికే (కర్ణాటక) ఉన్నారన్నారు. వీరు ధారకొండ ప్రాంతం నుంచి 152 కిలోల గంజాయిని కారులో మారేడుమిల్లి మీదుగా బెంగళూరు తరలిస్తున్నారు. మార్గం మధ్యలో ఫారెస్ట్ చెక్పోస్టును చూసి పోలీసులు తనిఖీ చేస్తారనే భయంతో వెనకు తిప్పి మారేడుమిల్లి సెంటర్లో ఆర్టీసీ బస్సును ఢీకొని కారును వదిలి ఆ ముగ్గురూ పరారయ్యారు. ఈ మేరకు వారిని పట్టుకున్నట్లు సీఐ, ఎస్సై వివరించారు. అదృశ్యమై.. ఆపై శవమై రాజవొమ్మంగి: అదృశ్యమైన ఓ వృద్ధురాలు ఆపై శవమై కనిపించడం ఆ గ్రామంలో కలకలం రేపింది. రాజవొమ్మంగి మండలం దూసరపాము గ్రామానికి చెందిన మరిసే దేవుడమ్మ (65) ఇంటి నుంచి వెళ్లి సుమారు ఐదు రోజులు అవుతోంది. కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలిస్తుండగా, సూరంపాలెం సెల్ టవర్ వద్ద దేవుడమ్మ మృతిచెంది పడి ఉన్నట్లు గుర్తించారు. ఆమె భర్త గతంలోనే మరణించగా, ఇటీవల కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ మనోవేదనతో దేవుడమ్మ ఇల్లు వదిలి ఎక్కడెక్కడో తిరుగుతూ, చివరికి విగత జీవిగా కనిపించడంతో దూసరపాములో విషాదం అలముకుంది. వీఆర్వో భూలక్ష్మి పంచనామా నిర్వహించి దేవుడమ్మ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తిండి లేక, దాహార్తి, వడగాడ్పుల వల్ల ఆమె మరణించి ఉంటుందని భావిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయమే మేలు రాజవొమ్మంగి: ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయమే మేలని ప్రకృతి వ్యవసాయ జిల్లా డీపీఎం రాబిన్ సుదర్శన్ అన్నారు. సోమవారం రాజవొమ్మంగి మండలం ఉర్లాకులపాడులో మాస్టర్ ట్రైనర్ అప్పలరాజు ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. మండల వ్యవసాయాధికారి చక్రధర్, ఉపాధి ఏపీఓ శ్రీనివాసరావు, శిక్షకులు పాల్గొన్నారు. -
సమ్మె బాటలో..
రీజియన్ పరిధిలో బస్సుల వివరాలు.. లహరి ఏసీ సీటర్/స్లీపర్ : 12 లహరి నాన్ ఏసీ సీటర్/స్లీపర్ : 14 రాజధాని : 11 సూపర్ లగ్జరీ : 95 సెమీ డీలక్స్ : 3 ఎక్స్ప్రెస్ : 44 ప్రైవేట్ ఎక్స్ప్రెస్ : 83 పల్లెవెలుగు : 167 ప్రైవేట్ పల్లెవెలుగు : 212 ఆదిలాబాద్: సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ ఉ ద్యోగులు సమ్మె బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యంతో మంగళవారం రాత్రి వరకు జరిపి న చర్చలు విఫలం కావడంతో ఆందోళనకే సై అ న్నారు. నేటి ఉదయం నుంచి బస్సులు డిపోలకే పరిమితం కానుండగా.. ప్రజారవాణా వ్యవస్థకు ఆటంకం కలగనుంది. ప్రయాణికులకు ఇబ్బందులతో పాటు, సంస్థ ఆదాయానికి సైతం భారీగా గండిపడే అవకాశం ఉంది. ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో సర్దుబాటు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 641 ఆర్టీసీ బస్సులున్నా యి. వీటిలో సంస్థ సొంత వాహనాలతో పాటు అ ద్దెబస్సులు కూడా నడుస్తున్నాయి. ప్రస్తుతం రెగ్యులర్ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో రీజియన్ పరి ధిలోని 162మంది ఔట్సోర్సింగ్ సిబ్బందితో బస్సులు నడిపేందుకు సంస్థ సమాయత్తమవుతోంది. ప్ర యాణికులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే సమ్మెకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా కలిసిరావాలని కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు. మరో వైపు ఉన్నతాధికారులు మాత్రం ఈ సిబ్బంది సమ్మెకు మద్దతు తెలపకుండా చర్యలు చేపట్టారు. ఇప్పటికే వారి నుంచి సమ్మెలో పాల్గొనబోమని సంతకాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ సొంత బస్సులు 346 ప్రైవేట్ అద్దె బస్సులు 295 మొత్తం బస్సులు : 641 -
ఆర్డీవోగా జగదీశ్వర్రావు బాధ్యతలు
కై లాస్ నగర్: ఆదిలాబాద్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్(ఆర్డీవో)గా పి.జగదీశ్వర్రావు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇది వరకు ఆర్డీ వోగా పనిచేసిన స్రవంతి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అంతకు ముందు కలెక్టర్ రాజర్షిషాను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ఇక్కడ ఖాళీగా కనిపిస్తున్నది తాంసి పీహెచ్సీ వైద్యాధికారి కుర్చీ. ఉదయం 11 గంటలకు ఈ సెంటర్ను ‘సాక్షి’ పరిశీలించగా వైద్యాధికారి అందుబాటులో లేరు. ఈ మెడికల్ ఆఫీసర్ ఉన్నత చదువు నిమిత్తం ఈనెల 1నుంచి లాంగ్లీవ్లో వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సు మాత్రం విధుల్లో ఉన్నారు. ఫార్మసిస్టు 11 గంటల తర్వాత విధులకు వచ్చారు. స్టాఫ్ నర్సు రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ ఒక్క పీహెచ్సీలోనే కాదు.. జిల్లాలో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితులే ఉన్నట్లుగా ‘సాక్షి’ విజిట్లో తేలింది. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంగళవారం ‘సాక్షి’ విజిట్ చేసింది. పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండకపోవడం, సమయపాలన పాటించకపోవడం, మందుల కొరత తదితర సమస్యలు దర్శనమిచ్చాయి. ఆదిలాబాద్టౌన్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వైద్యుల కొరత వేధిస్తోంది. దీంతో రోగులకు పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందని పరిస్థితి. జిల్లాలో 27 పీహెచ్సీలకు గాను 50 వైద్యపోస్టులు ఉన్నా యి. ఇందులో 25 మంది మాత్రమే పనిచేస్తుండగా, మిగతా పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉన్న వైద్యులతో సర్దుబాటు చేస్తూ రోగులకు సేవలు అందిస్తున్నారు. ఇందులో కొంత మంది సమయపాలన పాటించకపోవడం, మధ్యాహ్నమే ఇంటిముఖం పట్టడంతో రోగుల అవస్థలు వర్ణనాతీతం. ప్రస్తుతం భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికే 44 డిగ్రీల మార్క్ దాటాయి. జనం వడదెబ్బకు గురవుతున్నారు. వాంతులు, విరేచనాలు, జ్వరాల బారిన పడుతున్నారు. ఆస్పత్రికి వెళ్లిన సమయంలో వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో గత్యంతరం లేక ప్రైవేట్కు వెళ్లాల్సిన దుస్థితి. ఖాళీలతో అవస్థలు.. జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు బోథ్, నార్నూర్ సీహెచ్సీలు ఉన్నాయి. పీహెచ్సీల్లో 50 పోస్టులకు గాను 25 మంది పనిచేస్తున్నారు. బజార్హత్నూర్లో నా లుగు పోస్టులకు గాను ఒక్కరు కూడా లేరు. భీంపూర్(టి)లో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గుడిహత్నూర్, ఝరి పీహెచ్సీల్లో ఇదే పరిస్థితి. ఇద్దరు చొప్పున ఉండాల్సి ఉండగా, ఒక్కరు కూడా లేరు. సైద్పూర్, పీపీ యూనిట్, నేరడిగొండ, గాదిగూడ, పిట్టబొంగరంలో ఒక్కరు చొప్పున వైద్యులు ఉండాల్సి ఉండగాా, ప్రస్తుతం ఈ పీహెచ్సీల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బోథ్ సీహెచ్సీలో 6 పోస్టులకు గాను ఇద్దరు మాత్రమే పనిచేస్తుండగా, 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగతా పీహెచ్సీల్లో ఉన్న వైద్యులతో సేవలు అందిస్తున్నారు.ఇదీ పరిస్థితి..పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలికై లాస్నగర్: పెన్షనర్లకు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యసేవలు అందించా లని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సాయిరి శశి కాంత్ డిమాండ్ చేశారు. ఈమేరకు అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రుకు మంగళవారం ఆయన కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఇందులో సంఘం నాయకులు దయానందరెడ్డి, జగన్మోహన్, దేవిదాస్, గంగాధర్, శ్యామ్ రాజుగౌడ్, ఉమాకాంత్ తదితరులున్నారు. -
విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
ఆదిలాబాద్రూరల్: విధి నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మావల పోలీస్స్టేషన్ను మంగళవారం తనిఖీ చేశారు. ఆవరణలో ఉన్న వాహనాలను పరి శీలించారు. పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలు సుకున్నారు. స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకోకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. స్టేషన్కు వచ్చే బాధితుల విషయంలో గౌరవంగా వ్యవహరిస్తూ వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. డయల్ 100 ద్వారా వచ్చే ప్రతీ కాల్కు స్పందించి నిమిషాల వ్యవధిలో ఘట నా స్థలాలకు చేరుకొని బాధితులకు భరోసా కల్పించాలన్నారు. ఆయన వెంట ట్రెయినీ ఐపీఎస్, ఎస్హెచ్వో రాహుల్కాంత్, సీఐ కర్రె స్వామి, ఎస్సై రాజశేఖర్రెడ్డి, సిబ్బంది, తదితరులున్నారు. -
నాణ్యమైన వైద్యసేవలే లక్ష్యం
ఆదిలాబాద్టౌన్: రిమ్స్లో గర్భిణులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను ఎంపీ గోడం నగేశ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూషతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసూతి విభాగంలో గర్భిణులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని సమయానుకూలంగా పరిశీలించి, తగిన చికిత్స అందించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అంతకుముందు రిమ్స్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆస్పత్రిలో ఉన్న సౌకర్యాలు, ఇంకా మెరుగుపరచాల్సిన వసతులపై విస్తృతంగా చర్చించారు. ఆస్పత్రి అభివృద్ధికి సంబంధించిన రూ.6 కోట్ల 33 లక్షల ప్రతి పాదనలకు కమిటీ ఆమోదం తెలిపింది. కార్యక్రమంలో డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ దీపక్ పుష్కర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణ పోషకాహారంతో చిన్నారుల్లో ఎదుగుదల చిన్నపిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పోషకాహారం కీలకమని కలెక్టర్ రాజర్షి షా అ న్నారు. అంబేద్కర్ భవన్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 8వ పోషణ్ పక్వాడ్ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. గర్భి ణులు, బాలింతలు, చిన్నారులు రక్తహీనత బారిన పడకుండా జాగ్రత్త వహించాలన్నారు. అంగన్వాడీ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించా రు. ఇందులో డీడబ్ల్యూవో మిల్కా, సెక్టోరియల్ అధికారి ప్రత్యూష, వివిధ ప్రాజెక్టుల సీడీపీవో లు, అంగన్వాడీ టీచర్లు, అధికారులు పాల్గొన్నారు. గ్రామస్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు నేరడిగొండ: గ్రామస్తుల భద్రతకు ప్రాధాన్యతని స్తూ ప్రత్యేక చర్యలు చేపడతామని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ‘ప్రజాపాలన– ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని కిష్టాపూర్ పంచాయతీ పరిధిలో గల రోల్మామడ టోల్ ప్లాజా వద్ద చేపడుతున్న పనులను పరిశీలించారు. సర్వీస్ రోడ్డు లేకపోవడంతో వాహనదారులు, స్థానికులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ ప్రవేశం వద్ద త్వరలోనే అన్ని వసతులతో కూడిన సర్వీస్ రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్ జితేందర్ సింగ్, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపా రు. ఆయన వెంట తహసీల్దార్ ఎంఏ కలీం, కేఎన్ఆర్సీ మేనేజర్ సూర్యనారాయణ, ఇన్చార్జి రాంమోహన్ రెడ్డి, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
ఆదిలాబాద్టౌన్: రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రిమ్స్ ఆస్పత్రిని మంగళవారం సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. సిబ్బంది ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించినప్పటికీ వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తుందన్నారు. అలాగే కొంతమంది వైద్యులు అందుబాటులో ఉండడం లేదన్నారు. సమస్య పరిష్కరించేందుకు రాష్ట్రస్థాయిలో చర్చించి తగు చర్యలు చేపడతామని అన్నారు. ఆస్పత్రిలో బయో మెడికల్ వేస్టేజ్ మేనేజ్మెంట్ సరిగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ వైద్య సిబ్బంది ఉన్నారు. -
ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి
కైలాస్నగర్: ఉపాధి హామీ పనులకు హాజర య్యే కూలీల సంఖ్య పెంచేలా శ్రద్ధ వహించాల ని అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ అన్నారు. జిల్లాలో 25మందికి లోపు కూలీలు హాజరవుతున్న 68 గ్రామాల ఏపీవోలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లతో మంగళవారం టీటీడీసీ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. కూలీలు పనులకు రాకపోవడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతీ గ్రామంలో కనీసం 50 మంది కూలీలు పనులకు వచ్చేలా చూడాలన్నారు. పాత పనులు పూర్తయినట్లయితే కొత్త పనులు ఎంపిక చేయాలన్నారు. ఇందులో డీఆర్డీవో రాథోడ్ రవీందర్, అదనపు డీఆర్డీవో కుటుంబరావు, గజాణన్రావు, ఏవో గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి జైనథ్: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో రాజేశ్వర్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మండలకేంద్రంలో ని కేజీబీవీలో మంగళవారం సంక్షేమ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఇందులో తహసీల్దార్ నారాయణ, ఎస్వో వీణాకుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
గతంలోనూ ఇలాగే..
సాక్షి,ఆదిలాబాద్: ప్రతీవారం ఏదో రోజు.. ఏదో ఒక సబ్రిజిస్ట్రార్ కార్యాలయంపై అవినీతి శాఖ దాడులు రాష్ట్రంలో జరుగుతుండటం మనం చూస్తున్నాం. ఎస్ఆర్వో కార్యాలయాల్లో కరప్షన్ రోజురోజుకు పెరిగిపోతుండడంతోనే ఈ దాడులు జరుగుతున్నాయనే ప్రచారం సాగుతుంది. ఇంత జరుగుతున్నా వారి దారి వారిదే అన్నట్టు ఎస్ఆర్వో కార్యాలయాల్లో ఎలాంటి జంకు లేకుండా అక్రమ వ్యవహారాలు సాగించేస్తున్నారు. అలాంటిదే ఆదిలాబాద్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఓ అక్రమ వ్యవహారం కోసం ప్రణాళిక చకచకా రూపొందుతుందనే ప్రచారం ప్రస్తుతం జోరుగా సాగుతుంది. అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదంటూ చెబుతున్నప్పటికీ తెర వెనుక మాత్రం వ్యవహారం పకడ్బందీగా చేపట్టేందుకు వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం. ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్గా ఓ అధికారి కొనసాగుతున్నారు. జాయింట్–2 సబ్ రిజిస్ట్రార్గా ఇన్చార్జి హోదాలో ఓ మహిళ అధికారి కొనసాగుతున్నారు. వచ్చే నెల మొదటి వారంలో మహిళ అధికారి వ్యక్తిగత కారణాలతో సెలవులు తీసుకుంటున్నారని, ఆ స్థానంలో ఓ జూనియర్ అసిస్టెంట్ను ఇన్చార్జిగా నియమించి అనధికారిక లేఔట్లలోని వందలాది ప్లాట్లను అక్రమ రిజిస్ట్రేషన్లు చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారనే ప్రచారం జోరుగా సాగుతుంది. డీడబ్ల్యూవోలతో రహస్య ఒప్పందం..? సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట సుమారు 30 మంది వరకు డాక్యుమెంట్ రైటర్లు పనిచేస్తుండటం నిత్యం కనిపిస్తుంది. ఇటీవల ఈ డాక్యుమెంట్ రైటర్లలో కొంత మంది రిజిస్ట్రేషన్ అధికారులతో ఈ అనధికారిక లేఔట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్ల విషయంలో ఓ ఒప్పందం చేసుకున్నారనే ప్రచారం సాగుతుంది. సుమారు 400 నుంచి 500 ప్లాట్ల రిజిస్ట్రేషన్ల కోసం పక్కా ప్రణాళిక రూపొందించారని చెప్పుకుంటున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్గా ఉన్న అధికారిణి సెలవుల్లో వెళ్లేలా.. ఓ జూనియర్ అసిస్టెంట్ను ఆ స్థానంలో ఇన్చార్జిగా నియమించి ఆ ప్లాట్లన్నింటినీ చకచకా రిజిస్ట్రేషన్ చేసేలా వ్యూహం రూపొందించారనే ప్రచారం సాగుతుంది. ఇందులో ప్రతీ ప్లాట్కు వేలాది రూపాయల చొప్పున పెద్ద ఎత్తున అధికారులకు ముట్టజెప్పేలా ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి నిషేధం ఉన్నప్పటికీ గతేడాది అనధికారిక లేఔట్లలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమయ్యాయి. వీటికి సంబంధించి గతేడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో ‘స్కెచ్ రెడీ’ శీర్షికన ‘సాక్షి’లో మొదట కథనం ప్రచురితమైంది. ఆ తర్వాత వరుస కథనాలు రావడంతో ఈ వ్యవహారంలో అప్పుడు ఇన్చార్జి జిల్లా రిజిస్ట్రార్గా ఉన్న ప్రసన్న విచారణ చేపట్టారు. డీఐజీకి రిపోర్టు అందజేశారు. ఇక ఆ సబ్రిజిస్ట్రార్పై చర్యలు తప్పవని అనుకున్నప్పటికీ వారు నామమాత్రంగా ఇక్కడి నుంచి భైంసా సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి అతడిని పంపించి మమా అనిపించారు. ఇలా పై అధికారులు కొంత మంది కిందిస్థాయి అధికారులను అక్రమ రిజిస్ట్రేషన్ల కోసం నియమించి కోట్ల రూపాయల ఒప్పందాలతో అనధికారిక లేఔట్లలో ప్లాట్లను గంపగుత్తగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా దొడ్డిదారిన స్కెచ్లు రూపొందించి అమలు చేయడం పరిపాటిగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెంచాలి
ఆదిలాబాద్టౌన్: పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెంచేలా విధులు నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ప్రజా ఫిర్యాదుల విభాగంలో భాగంగా సోమవారం పోలీసు కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 38 మంది తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో కుటుంబ కలహాలు, భార్య భర్తల సమస్యలు, గొడవలు వంటివి ఉన్నాయి. కార్యక్రమంలో ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, సిబ్బంది పాల్గొన్నారు. రిసెప్షనిస్టుల పాత్ర కీలకం పోలీస్స్టేషన్లలో రిసెప్షనిస్టుల పాత్ర కీలకమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లాలోని రిసెప్షనిస్టులతో సోమవారం సమావేశం నిర్వహించారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. బాధితులకు సత్వర న్యాయం అందేలా కృషి చేయాలన్నారు. ఫిర్యాదులు స్వీకరించిన వెంటనే స్టేషన్ ఇన్చార్జి ద్వారా విలేజ్ పోలీసు ఆఫీసర్కు దర్యాప్తు కోసం అప్పగించాలని సూచించారు. సంఘటన స్థలంలో ఉన్న వాంగ్మూలాన్ని నమోదు చేసి వారి సంతకాలతో కూడిన రిపోర్టును రిసెప్షనిస్టుకు అందజేయాలన్నారు. రాజీ పడితే ఇరువురితో రాజీపత్రం నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో మహిళాస్టేషన్ సీఐ ప్రేమ్కుమార్, డీసీఆర్బీ ఎస్సై ప్రవీణ్, రిసెప్షనిస్టులు పాల్గొన్నారు. -
మహనీయుడు బసవేశ్వరుడు
ఆదిలాబాద్/ఆదిలాబాద్రూరల్: సమాజంలో కుల, వర్ణ వివక్ష రూపుమాపేందుకు వందల ఏళ్ల క్రితమే కృషి చేసిన మహానీయుడు బసవేశ్వరుడని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. బసవేశ్వరుని జయంతి వేడుకలను జిల్లాకేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. బసవేశ్వర చౌక్ వద్ద ఆయన చిత్ర పటానికి, విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, సమ సమాజ స్థాపనకు బసవేశ్వరుడు చేసిన కృషిని కొనియాడారు. కా ర్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, అదనపు కలెక్టర్ చిత్రు, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి సోనియా, మాజీ మంత్రి జోగు రామన్న తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన విద్యనందించాలి
ఉట్నూర్రూరల్: ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలను సోమవారం తనిఖీ చేశారు. బోధనతో పాటు విద్యార్థులకు అందిస్తున్న భోజనంపై ఆరా తీశారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆర్వో ప్లాంట్ను పరిశీలించారు. ఏఎన్ఎంలతో మాట్లాడి ఐటీడీఏ పల్స్ యాప్ పనితీరుపై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతిరోజూ మెనూ ప్రకారం పోషక విలువలు గల ఆహారం అందించాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట వార్డెన్, ప్రిన్సిపాల్ తదితరులున్నారు. -
నీటి వనరుల సంరక్షణ అందరి బాధ్యత
ఆదిలాబాద్: నీటి వనరుల సంరక్షణ అందరి బాధ్యత అని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. పట్టణంలోని చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ కోసం అమృత్ 2.0 పథకం కింద కేటా యించిన రూ.3.14కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకర్తో కలిసి భూమిపూజ నిర్వహించారు. పట్టణంలోని ఖానాపూర్ చెరువు పునరుద్ధరణ పనులను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వాల లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
జేఈఈలో మెరిసిన ‘గిరి’ విద్యాకుసుమాలు
సిరికొండ: జేఈఈ మెయి న్–2026 రెండో సెషన్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఇందులో మండలంలోని రిమ్మ గ్రామానికి చెందిన పెందూర్ గులబ్ దీప్ 95 పర్సంటైల్తో అడ్వాన్స్కు అర్హత సాధించాడు. ఇంటి వద్ద ఉండే పరీక్షకు సన్నద్ధం అయినట్లు తెలిపాడు. గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు. ఎస్టీ కేటగిరీలో యోగిదాస్ 747వ ర్యాంక్ బజార్హత్నూర్: మండలంలోని కాండ్లీ గ్రామానికి చెందిన జాదవ్ యో గిదాస్ నాయక్ జేఈఈ మెయిన్–2026 ఫలి తాల్లో 94.86 పర్సంటైల్ సాధించాడు. ఆలిండియా ఎస్టీ కేటగిరిలో 747 ర్యాంక్తో అడ్వాన్స్కు అర్హత సాధించాడు. యోగిదాస్ను గ్రామస్తులు అభినందించారు. ఓటర్ మ్యాపింగ్ త్వరితగతిన పూర్తి చేయాలికై లాస్నగర్: ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ చిత్రు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన ఓటరు మ్యాపింగ్పై అన్ని జిల్లాల కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన అధికారులతో సమీక్షించారు. ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. బూత్స్థాయి అధికారులు (బీఎల్వోలు) తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. గడువులోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందులో ఆర్డీవో స్రవంతి, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ముందస్తు జాగ్రత్తలు పాటించాలి
ఆదిలాబాద్టౌన్: అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సురేశ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఫైర్స్టేషన్లో అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం అందించాలన్నారు. వారం పాటు అగ్నిమాపక సేవలను ప్రజలకు తెలియజేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ముందుగా జిల్లా కేంద్రంలో అగ్నిమాపక శాకటాలతో ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో ఫైర్ అధికారి జైత్రరాం, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
దళారులను నమ్మి మోసపోవద్దు
బజార్హత్నూర్: రైతులు తాము పండించిన పంటలను మార్క్ఫెడ్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. అనంతరం రైతువేదికలో 31మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్యాంసుందర్, పీఏసీఎస్ ఇన్చార్జి సంతోష్, సీఈవో నారాయణగౌడ్, సర్పంచ్ సాయన్న, నాయబ్ తహసీల్దార్ హీరాలాల్, నూర్సింగ్, గోవర్ధన్ రైతులు పాల్గొన్నారు. -
జిల్లా వాసికి అంతర్జాతీయ గుర్తింపు
ఆదిలాబాద్టౌన్: ఆదిలా బాద్కు చెందిన డాక్టర్ మామిడాల ఇస్తారి అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ష్టాత్మక గుర్తింపు సాధించారు. యునైటెడ్ కింగ్డమ్కు చెందిన ప్రముఖ శాసీ్త్రయ సంస్థ రాయల్ సొసైటీ ఆఫ్ బయాలజీ ఇస్తారిని ఫెల్లో ఆఫ్ రాయల్ సొసైటీ ఆఫ్ బయాలజీకి ఎంపిక చేశారు. ఈయన ప్రస్తుతం కాకతీయ విశ్వవిద్యాలయం జంతు శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు డీఎస్టీ, డీబీటీ, యూజీసీ, ఐసీఏంఆర్, రూసా సంస్థల మద్దతుతో 10 పరిశోధన ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు. 100కు పైగా పరిశోధనా పత్రాలు ప్రచురించడంతో పాటు 22 పుస్తకాలను రచించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు.


