breaking news
Adilabad
-
ఆల్బెండజోల్ మాత్రలు వేయాలి
ఆదిలాబాద్టౌన్: ఈ నెల 11న జాతీయ నులిపురుగు నిర్మూలన దినోత్సవం సందర్భంగా 1నుంచి 19 ఏళ్లవారికి ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ సూచించారు. గురువారం డీఎంహెచ్వో కార్యాలయం నుంచి మెడికల్ ఆఫీసర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. నులిపురుగులతో విద్యార్థుల్లో ఎదుగుదల లోపిస్తుందని, ఇతర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. డీఐవో డాక్టర్ వైసీ శ్రీనివాస్, జిల్లా మలేరియా నివారణాధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. నులిపురుగుల నిర్మూలనే ధ్యేయం నులిపురుగుల నిర్మూలనే ధ్యేయమని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్ సూచించారు. జిల్లా కేంద్రంలోని పుత్లీబౌళి పట్టణ ఆరోగ్యకేంద్రంలో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వైద్యసిబ్బందితో సమావేశమై మాట్లాడారు. ఈ నెల 11న జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో 1నుంచి 19 ఏళ్లవారికి ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
బియ్యం దుర్వినియోగం కానివ్వొద్దు
కైలాస్నగర్: పేదలు పస్తులుండకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం రూ.కోట్ల రాయితీ భరించి పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. గురువారం మావల, ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్ రూరల్ మండలాల లబ్ధిదారులకు ఆహారభద్రత కార్డులు పంపిణీ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని రెవె న్యూ గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, డీసీఎస్వో వాజీద్అలీతో కలిసి లబ్ధిదా రులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలోని అ ట్టడుగువర్గాలకు సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అర్హులకే లబ్ధి చేకూర్చాలని సూచించారు. డబ్బులు డిమాండ్ చేసే దళా రులపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని అధి కారులను ఆదేశించారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. రేషన్ షాపుల్లో పంపిణీ చేసే పోషకాలతో కూడిన సన్నబియ్యాన్ని లబ్ధిదారులు సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. సన్నబియ్యం విక్రయించే లబ్ధిదారుల రేషన్కార్డులు రద్దు చేస్తామని హెచ్చరించారు. కొత్త రేషన్కార్డుల జారీ ప్రక్రియ ని రంతరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కా ర్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, తహసీల్దార్లు శ్రీనివా స్, గోవింద్, వేణుగోపాల్, ఎన్ఫోర్స్మెంట్ డీటీ బాబుసింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
వర్షాభావమే..
సాక్షి, ఆదిలాబాద్: వరుణుడు ముఖం చాటేశాడు. ఈ నెలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా యి. అసలుకే వర్షాలు లేక ఎదుగుతున్న, పూత, కాత కాస్తున్న పంటలను చూసి జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి వసతి ఉన్నవారు ఏదో రకంగా పంటలకు తడులు అందిస్తున్నారు. నీటి వసతిలేని రైతులు బిక్కచూపులు చూస్తున్నారు. సరైన సమయంలో పంటలకు నీటి తడులు అందక దిగుబడులపై దిగులు చెందుతున్నారు. లోటు దిశగా.. జిల్లాలో ఈ వానాకాలం సరైన వర్షాలు కురవలేదు. జూన్ రెండో వారంలోనే మంచి వర్షాలు కురిశాయి. మిగతా మూడు వారాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. జూలై మొదటి, రెండో వారంలో సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిశాయి. అయితే మూ డు, నాలుగో వారాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఆగస్టులోనైతే ఇప్పటికీ తీవ్ర వర్షాభావమే కనిపిస్తోంది. మొత్తంగా ఈ వానాకాలం మొదలైన జూన్ నుంచి ఇప్పటివరకు 36 రోజులు మాత్రమే వర్షాలు కురిశాయి. ఇందులో భారీ వర్షాలు అసలే లేవు. దీంతో ఇప్పటికీ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండలేదు. మండలాల వారీగా పరిస్థితి జిల్లాలో 13 మండలాల్లో సాధారణ వర్షపాతం న మోదు కాగా, ఎనిమిది మండలాల్లో వర్షాభావ పరి స్థితులు నెలకొన్నాయి. భీంపూర్, జైనథ్, బేల, నా ర్నూర్, భోరజ్, తాంసి, తలమడుగు, బజార్హత్నూర్, ఇచ్చోడ, గుడిహత్నూర్, ఆదిలాబాద్రూర ల్, ఆదిలాబాద్అర్బన్, సాత్నాలలో సాధారణ వర్షపాతం నమోదైంది. సొనాల, నేరడిగొండ, బోథ్, గాదిగూడ, ఉట్నూర్, మావల, సిరికొండ, ఇంద్రవెల్లిలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో ముఖం చాటేసిన వర్షాలు పూత, కాత దశలో సోయా పంట స్ప్రింక్లర్లతో నీటిని అందిస్తున్న వైనం ఆందోళనలో నీటి వసతిలేని రైతులు జిల్లాలో వర్షపాతం వివరాలు (జూన్ 1నుంచి ఆగస్టు 7 వరకు) సాధారణం 618.1 మి.మీ.లు కురిసింది 499.7 మి.మీ.లు వ్యత్యాసం 19 శాతం తక్కువ ఈ రైతు పేరు సోమ ప్రవీణ్రెడ్డి. తాంసి శివారులో 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తొమ్మిదెకరాల్లో పత్తి, అంతర పంటగా కంది, మూడెకరాల్లో సోయాబీన్ సాగు చేశాడు. పత్తి పంట ఎదిగే దశలో ఉండగా సోయా పూత, కాత దశకు వచ్చింది. ఈ పరిస్థితుల్లో సోయా పంటకు నీటి తడులు అందించాల్సి ఉండగా వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో బోర్ల ద్వారా స్ప్రింక్లర్లకు పనిచెప్పాడు. ఈ విధానంలో మూడెకరాల్లోని సోయా పంటకు నీటిని అందిస్తున్నాడు. -
హాజరుశాతం పెంచాలి
తాంసి: విద్యార్థుల హాజరుశాతం పెంచాలని డీఐఈవో జాదవ్ గణేశ్కుమార్ సూచించారు. గురువారం మండల కేంద్రంలో ప్రభుత్వ కళా శాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆవరణ, వసతులు పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రవేశాల సంఖ్య తెలుసుకున్నారు. అనంతరం అధ్యాపకులతో సమావేశమై మాట్లాడారు. సిలబస్ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్ర తీ విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలి పారు. వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పని చే యాలని ఆదేశించారు. డీఐఈవో వెంట ప్రిన్సి పాల్ సుదర్శన్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సంతోష్, అధ్యాపకులు తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, రమణ, దేవేందర్, సిబ్బంది ఉన్నారు. -
‘రాఖీ’ సందడి
ఆదిలాబాద్: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ సందడి జిల్లాలో మొదలైంది. ఈ నెల 9వ రాఖీ పండుగ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని మార్కెట్ ప్రాంతం కొనుగోలు దారులతో కిక్కిరిసిపోతోంది. దస్నాపూర్, కలెక్టరేట్ చౌక్, వినాయక చౌక్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, శివాజీ చౌక్, రైతు బజార్ ఏరియా, రద్దీగా ఉండే వి విధ ప్రాంతాల్లోనూ రాఖీ దుకాణాలు వెలిశాయి. వి విధ డిజైన్లలో రూ.10 నుంచి రూ.500 ధర కలిగిన రాఖీలు అందుబాటులో ఉన్నాయి. సంప్రదాయ దూది బొండాలతో పాటు లాకెట్, రుద్రాక్ష, ము త్యాలు, రంగుల రాళ్లు, జరీ రాఖీలు ఎక్కువగా అ మ్ముడుపోతున్నాయి. చిన్నారులు మెచ్చేలా కార్టూన్ పాత్రలతో కూడిన రాఖీలు ప్రత్యేక ఆకర్షణగా ని లుస్తున్నాయి. కాగా, పలువురు వెండి, బంగారు రాఖీల కోసం స్వర్ణకారులకు ఆర్డర్లు ఇస్తున్నారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ
ఆదిలాబాద్: ఆదిలాబాద్ క్రీడా పాఠశాల వి ద్యార్థులు జనగాం వేదికగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి జావెలిన్త్రో పోటీల్లో సత్తా చాటారు. కిడ్స్ విభాగంలో ప్రతిభ కనబరిచిన వీ దీక్షిత బంగారు, ఎం.హన్మంతు రజత పతకాలు సా ధించినట్లు కోచ్ రమేశ్ తెలిపారు. వీరిని డీవైఎస్వో శ్రీనివాస్ అభినందించారు. బజార్హత్నూర్: ఈ నెల 5, 6 తేదీల్లో భైంసా పట్టణంలోని క్రీడా మైదానంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ఖోఖో అండర్–11 విభాగంలో మండల కేంద్రంలోని సరస్వతీ శి శుమందిర్ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతి భ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచారు. క్రీడాకారులను గురువారం ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణ, పాఠశాల ప్రబంధకారిణి స భ్యులు, ఉపాధ్యాయులు అభినందించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలిఆదిలాబాద్టౌన్: సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ సూచించారు. గురువారం డీఎంహెచ్వో కార్యాలయంలో కీటకజనిత వ్యా ధుల నియంత్రణపై అధికారులతో సమీక్షించారు. బ్రీడింగ్ చెక్కర్స్ ఆయా కాలనీల్లో పర్యవేక్షించాలని తెలిపారు. దోమలు వృద్ధి చెందకుండా చూడాలని సూచించారు. నీటి నిల్వతో డెంగీ, మలేరియా ఇతర వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తెలిపారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా మలేరియా నివారణాధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
దేశ సంస్కృతిని చాటిన యోగా
ఆదిలాబాద్రూరల్: యోగా భారతదేశ సంస్కృతి, కీర్తిని ప్రపంచమంతా గొప్పగా చాటిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. మా వల మండలంలోని రత్న గార్డెన్లో గురువారం ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి యోగాసన ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు చేసిన యోగా విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాల ని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో ప్రపంచవ్యాప్తంగా యోగాను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు గోవర్ధన్రెడ్డి, తిరుపతి, లాలాము న్నా, చిట్యాల సుహాసినీరెడ్డి, దయాకర్, వివిధ జిల్లాల యోగా టీచర్లు పాల్గొన్నారు. -
పోక్సో కేసు ఎత్తి వేయాలి
తాంసి: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు గీతేశ్పై పోక్సో కేసు ఎత్తి వేయాలని పాఠశాల విద్యార్థులు గురువారం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గీతేశ్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడనే ఫిర్యాదు మేరకు మంగళవారం అతడిపై పోక్సో కేసు నమోదు చేసిన తాంసి పోలీసులు రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. అయితే.. విద్యార్థులు ‘మా తెలుగు సార్ మాకే కావాలి’ అంటూ నినదిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయుడు గీతేశ్ ఎలాంటి తప్పు చేయలేదని, వెంటనే కేసు ఎత్తి వేయాలని కోరారు. -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
● కలెక్టర్ రాజర్షి షా ● కొత్త రేషన్కార్డుల పంపిణీ తలమడుగు: అర్హులందరికీ సంక్షేమ, అభివృద్ధి ఫ లాలు అందించనున్నట్లు కలెక్టర్ రాజార్షి షా పేర్కొన్నారు. గురువారం మండలంలోని సుంకిడి గ్రామ రైతువేదికలో తాంసి, తలమడుగు మండలాల లబ్ధి దారులకు కొత్త రేషన్కార్డులు పంపిణీ చేశారు. అ నంతరం వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులంతా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్జాదవ్ మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. సుంకిడి జిల్లా పరిషత్ పాఠశాలకు నూతన భవనం నిర్మించాలని, సుంకిడిలో వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ను కోరారు. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గ ఆత్మ చైర్మన్ అశోక్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ధి జరుగుతోందని చెబుతుండగా బీఆర్ఎస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. ఈ అంశంపై ఎమ్మెల్యే, డీసీసీబీ చై ర్మన్ ఆడ్డి బోజారెడ్డి మధ్య కూడా వాగ్వాదం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే అనిల్జాదవ్ జోక్యం చేసుకుని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను సము దాయించగా గొడవ సద్దుమణిగింది. కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, తాంసి, తలమడుగు తహసీల్దా ర్లు లక్ష్మి, రాజ్మోహన్, ఎంపీడీవో శంకర్, ఝరి పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు వెంకటేశ్, శ్రీనివాస్రెడ్డి, కిరణ్కుమార్, కేదారేశ్వర్రెడ్డి, ప్రకాశ్, వామన్ తదితరులు పాల్గొన్నారు. అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి ఆదిలాబాద్టౌన్: నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. ప్ర భుత్వ డైట్ కళాశాలలో గురువారం ఉల్లాస్ నవభా రత్ సాక్షరత జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలవారు, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ వెళ్లి నిరక్షరాస్యుల వివరాలు సేకరించాలని సూచించారు. జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన ఆర్పీలు వలంటీర్లకు శిక్షణ ఇవ్వాలని తెలిపా రు. జిల్లాలో 1,192 మంది వలంటీర్లు చదువు చె ప్పేందుకు యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పే ర్కొన్నారు. వీరు 26,312 మందికి చదువు నేర్పించాల్సి ఉందని తెలిపారు. జిల్లాలో అక్షరాస్యత శా తం 66 ఉందని, వంద శాతానికి చేరుకునేలా కృషి చేయాలని సూచించారు. వయోజనవిద్య డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటులో బుకింగ్ కౌంటర్లు..
పండుగకు సొంత గ్రామాలకు వెళ్లలేని మహిళలు తమ సోదరులకు రాఖీలను బుక్ చేసి పంపించే విధంగా ఆర్టీసీ ప్రత్యేక కౌంటర్లను ఏర్పా టు చేసింది. రీజియన్ పరిధిలో మూడు బస్టాండ్లు, 26 ఏజెంట్ కౌంటర్లలో వీటిని ఇప్పటికే ప్రా రంభించారు. ఇందులో రాఖీలతో పాటు మిఠాయిలు సైతం పంపించుకునే వెసులుబాటు కల్పించారు. బుకింగ్లో సమస్యలు, ఫిర్యాదులు ఉంటే వినియోగదారులు ఆదిలాబాద్, ఉట్నూర్ డిపోల పరిధిలో సెల్ నంబర్ 9154298531, నిర్మల్, భైంసా డిపోల పరిధిలో 9154298547, ఆసిఫాబాద్, మంచిర్యాల డిపోల పరిధిలో 9154298541, రీజినల్ మేనేజర్ కార్యాలయం సెల్ నంబర్ 9154298553 పై సంప్రదించాలని కరీంనగర్జోన్ కార్గో మేనేజర్ వెంకటనారాయణ కోరారు. -
ప్రైవేట్ ఆస్పత్రులపై కొరడా
● డీఎంహెచ్వో ఆధ్వర్యంలో తనిఖీలు ● ఓ ఆస్పత్రి, మరో ఆర్ఎంపీ క్లినిక్ సీజ్ ఆదిలాబాద్టౌన్: నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై వైద్యారోగ్య శాఖ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. బుధవారం పట్టణ సమీపంలోని శేషన్న చెన్నవార్ కంటి ఆస్పత్రిని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్తో పాటు వైద్యశాఖ అధికారులు తనిఖీ చేశారు. అయితే వైద్యుడి వివరాలు డీఎంహెచ్వో కార్యాలయంలో నమోదు లేకపోవడంతో నోటీసు జారీ చేశారు. అలాగే ఫీజు ఎక్కువగా తీసుకుంటున్నారని రోగులు ఫిర్యాదు చేశారు. అనంతరం దస్నాపూర్లోని హరిహరన్ ప్రైవేట్ ఆస్పత్రిని తనిఖీ చేయగా, డాక్టర్ అందుబాటులో లేకపోవడాన్ని గుర్తించారు. అలాగే ఆస్పత్రికి సంబంధించి రిజిస్ట్రేషన్ లేకపోవడంతో సీజ్ చేశారు. అదే ప్రాంతంలో నాలుగు ఆర్ఎంపీ క్లినిక్లను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఓ క్లినిక్ను సీజ్ చేశారు. సీజ్ చేసిన వాటికి రూ.10వేల చొప్పున జరిమానా విధించారు. ఇందులో డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, డీఐవో వైసీ శ్రీనివాస్, మలేరియా నివారణ అధికారి శ్రీధర్ తదితరులున్నారు. -
జయశంకర్కు ఘన నివాళి
కై లాస్నగర్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపెల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలను బుధవారం అధికారికంగా నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్రను కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. ఇందులో ఆర్డీవో స్రవంతి, డీబీసీడబ్ల్యూవో కె.రాజలింగు, డీసీవో మోహన్, విశ్వబ్రాహ్మణ సంఘ బాధ్యులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో నివాళులర్పించిన పీవో ఉట్నూర్రూరల్: ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో పీవో ఖుష్బూ గుప్తా పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఇందులో ఏపీవో మెస్రం మనోహర్, అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి మనోహర్, ఈఈ తానాజీ, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రజట్టుకు అసిస్టెంట్ కోచ్గా జాదవ్ రవీందర్ఆదిలాబాద్: తలమడుగు మండలం బరంపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పీడీగా విధులు నిర్వహిస్తున్న జాదవ్ రవీందర్ రాష్ట్ర జూనియర్ హాకీ జట్టుకు అసిస్టెంట్ కోచ్గా ఎంపికయ్యాడు. ఈనెల 12నుంచి పంజాబ్లోని జలంధర్లో నిర్వహించనున్న జాతీయ జూనియర్ హాకీ పోటీల్లో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించనున్న జట్టుకు అసిస్టెంట్ కోచ్ గా వ్యవహరించనున్నారు. ఈమేరకు జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, పార్థసారథి ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. -
మూడో రోజుకు ‘ఎండీఎం’ సమ్మె
కై లాస్నగర్: పెండింగ్ బిల్లులు, వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మధ్యా హ్న భోజన పథకం కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె బుధవారంతో మూడో రోజుకు చేరింది. కలెక్టరేట్ ఎదుట గల శిబిరంలో కార్మి కులు బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశా రు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకులు కుంటాల రాములు మాట్లాడుతూ, పెండింగ్ వేతనాలు, కోడిగుడ్ల బిల్లులు వెంటనే చెల్లించా లని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మికులు శ్రీదేవి, శశికళ, పుష్కలత, రాంబాయి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
● మంజూరు లేదు.. అగ్రిమెంట్ లేదు ● క్షేత్రస్థాయిలో స్తంభాలైతే పాతేశారు ● విద్యుత్శాఖలో దొడ్డిదారిన పనులు ● అవసరం లేకున్నా అదనపు పోల్స్ ● సొంత లాభానికే కొందరు పెద్దపీట
సాధారణంగా ఒక పని కార్యరూపం దాల్చాలంటే వివిధ ఘట్టాలను దాటాల్సి ఉంటుంది. ముందుగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎస్టిమేట్ (అంచనా వ్యయం) రూపొందించి ఉన్నతాధికారులకు పంపాల్సి ఉంటుంది. వారు పరిశీలన చేసి మంజూరు ఇ స్తారు. తర్వాత టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడం, ఆసక్తిగల కాంట్రాక్టర్లు అందులో పాల్గొనడం జరుగుతుంది. నిబంధనల ప్రకారం పనులు దక్కించుకు న్న కాంట్రాక్టర్తో అగ్రిమెంట్ చేసుకుంటారు. వర్క్ఆర్డర్ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత ఆ పనికి సంబంధించి ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, కండక్టర్, ఇలా ఏవి అవసరం ఉంటాయో ఆ సామగ్రిని స్టోర్ నుంచి డ్రా చేసుకోవాలి. ఎక్కడైతే పని జరుగుతుందో అక్కడికి వాటిని తరలించాలి. ఆ తర్వాత వర్క్ స్టార్ట్ అవుతుంది. మరి హస్నాపూర్లో ఈ పైన పేర్కొన్న తతంగం అంతా జరగకుండానే క్షేత్రస్థాయిలోకి సామగ్రి ఎలా వచ్చిందనేది అధికారులు తెలియదంటే మనం నమ్మాల్సిందే. జిమ్మిక్కులు ఇలా.. అసలు వర్కే మంజూరు లేదు.. మరి సామగ్రి ఎక్క డి నుంచి తీసుకొచ్చి పని చేశారనే సందేహం రావ చ్చు. ఇక్కడ మనకు అధికారులు, వారి బినామీ కాంట్రాక్టర్ల జిత్తులమారి తంతు తెలుస్తోంది. అదేమిటంటే.. వేరే పనికి సంబంధించి నిబంధనల ప్రకా రం మంజూరు లభించడం, సామగ్రి రావడం జరుగుతుంది. ఇక్కడ ఆ పనికి సంబంధించి వివిధ అభ్యంతరాలను సృష్టిస్తారు. దీనిని క్షేత్రస్థాయిలోని వినియోగదారులు నమ్ముతారు. మన పనికి సంబంధించి సామగ్రి రావడంలో ఆలస్యమవుతుందని వారు కూడా అంతగా పట్టించుకోరు. ఇదంతా విద్యుత్ శాఖ అధికారుల జిమ్మిక్కు. ఇక ఆ సామగ్రిని ఇలా ఎలాంటి అనుమతి లేకుండా చేపట్టే వర్కుల్లో వాడేస్తారు. తమ సొంత లాభం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కేందుకు సిద్ధమవుతారు. లూటీ ఇలా.. మంజూరు లేకుండా వర్క్ చేపట్టడం ఒక ఎత్తయితే.. ఆ పనిలో అక్రమాలకు పాల్పడటం ఇక్కడ విద్యుత్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లకు వెన్నెతో పెట్టిన విద్య.అదెలాగంటే.. అవసరం లేకున్నా అద నంగా సామగ్రిని క్రియేట్ చేసి దాని ద్వారా అదనపు లాభం పొందడమే. దీనికి ప్రస్తుతం హస్నాపూర్లో జరుగుతున్న పనే నిదర్శనం. ఇక్కడ ఇదివరకే ఉన్న ఓ ట్రాన్స్ఫార్మర్కు సంబంధించి సపోర్ట్గా ఉన్న పోల్ డ్యామెజ్ అయ్యిందని, దాన్ని వేరే స్థలా నికి మార్చేందుకు అదనంగా స్తంభాలు అవసరమ ని సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా అదనంగా వేసే పోల్స్ ద్వారా వర్క్ అంచనా వ్యయం పెంచి తమ జేబులు నింపుకోవడమే. ఇవన్నీ విద్యు త్ శాఖలో సర్వసాధారణమే అనే విమర్శ లేకపోలేదు. పర్యవేక్షించే అధికారులే ఇలా అడ్డదారులు తొక్కే పరిస్థితి ఉండడంతో సంస్థ ఆదాయానికి గండి పడుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. నా దృష్టికి రాలేదు.. హస్నాపూర్లో వర్క్ జరిగినట్టుగా నా దృష్టికి రాలేదు. దాని గురించి తెలుసుకుంటాను. అయితే రోడ్డు వెంబడి ప్రమాదకర స్థలాల్లో అత్యవసరంగా పనులు చేపట్టాలని సీఎండీ నుంచి ఆదేశాలు ఉన్నాయి. – జాదవ్ సుభాష్, ఉట్నూర్ డీఈ, విద్యుత్ శాఖ -
వర్సిటీ ఏర్పాటు చేసే దాకా పోరు
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సి టీ ఏర్పాటు చేసేంత వరకు పోరాడుతామని యూ నివర్సిటీ సాధన సమితి కన్వీనర్ బద్దం పురుషోత్తం రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో యూనివర్సిటీ ఆవశ్యకతపై విద్యార్థులకు బుధవారం అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ లేకపోవడంతో ఈ ప్రాంత విద్యార్థులు విద్యాపరంగా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. విశ్వవిద్యాలయ సాధన కో సం పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు కలిసి రావాలని కోరారు. త్వరలో భారీ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఇందులో యూనివర్సిటీ సాధన సమితి సభ్యులు చిట్యాల సుహాసినిరెడ్డి, నరేందర్, ఉదారి నారాయణ, సాత్వి క్ రెడ్డి, సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సంగీత, లెక్చరర్లు సంతోష్కుమార్, మంజుల, రాజ్కుమార్, సంజీవ్, స్రవంతి, జ్యోత్స్న, పాల్గొన్నారు. -
రాఖీకి ఆర్టీసీ సిద్ధం
● పండుగల నేపథ్యంలో ప్రత్యేక బస్సులు ● రాఖీల బుకింగ్ కోసం స్పెషల్ కౌంటర్లు ఆదిలాబాద్: రాఖీ పండుగతో పాటు వరలక్ష్మి వ్రతం వరుస సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరగనుంది. ఈ మేరకు ఆర్టీసీ ముందస్తు చర్యలు చేపట్టింది. రీజియన్ పరిధిలో ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. పండుగ సందర్భంగా అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు పుట్టింటికి వెళ్తారు. మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుంచి మహిళలు పెద్ద ఎత్తున ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నారు. అలాగే వరుస సెలవుల దృష్ట్యా ఉద్యోగులు, కుటుంబాలతో ఇతర ప్రదేశాలకు వెళ్తుంటారు. ఈ మేరకు రద్దీ దృష్ట్యా ఆర్టీసీ స్పెషల్ బస్సుల ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల 7నుంచి షురూ.. ఈనెల 8న వరలక్ష్మివ్రతం, 9న రాఖీ పౌర్ణమి, 10న ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 7, 8 తేదీల్లో హైదరాబాద్ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్లోని వివిధ ప్రాంతాలకు 46 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే 10, 11, 12 తేదీల్లో ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భైంసా, మంచిర్యాల, నిర్మల్, ఉట్నూర్ డిపోల నుంచి హైదరా బాద్కు 72 బస్సులను నడపనున్నారు. రద్దీ ఎక్కువగా ఉంటే అదనంగా మరిన్ని సర్వీసులు నడిపేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రిజర్వేషన్ ఇలా.. పండుగల దృష్ట్యా ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవాలనుకునే వారి కోసం రిజర్వేషన్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే www. tgsrtcbus. in వెబ్సైట్ ద్వారా బస్సుల సీట్లను బుక్ చేసుకోవచ్చు. డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వీలైనంత త్వరగా బుకింగ్ చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు. 118 ప్రత్యేక బస్సులు.. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో వరలక్ష్మీవ్రతం, రాఖీ పౌర్ణమి దృష్టిలో ఉంచుకొని 118 ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. అలాగే ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్లోని జేబీఎస్, ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని ప్రధాన బస్స్టేషన్లలో మే ఐ హెల్ప్ యూ సేవా కేంద్రాలను ఏర్పాటు చేశాం. రీజియన్ పరిధిలోని బస్స్టేషన్ల నుంచి పలు గ్రామాలకు ప్రయాణికుల రద్దీ బట్టి బస్సులను ఏర్పాటు చేస్తాం. – ఎస్.భవానీప్రసాద్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్, ఆదిలాబాద్ -
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
బోథ్: మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియో గం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా సొనాల మండలం కోట (కె)గ్రామంలో ఏర్పాటు చేసిన హరహర మహాదేవ్ పౌల్ట్రీ యూనిట్ షెడ్ను కలెక్టర్ బుధవారం ప్రారంభించారు. శకుంతలాబాయిని ఇతర గ్రామాల మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో రాథోడ్ రవీందర్, తహసీల్దార్ ఇమ్రాన్ఖాన్, ఎంపీడీవో రాజేశ్వర్ పాల్గొన్నారు. మొక్కల సంరక్షణ అందరి బాధ్యత బజార్హత్నూర్: మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ అందరి బాధ్యత అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఎకై ్సజ్, అటవీ, డీఆర్డీఏ శాఖల అధ్వర్యంలో మండలంలోని గిర్నూర్ గ్రామపంచాయతీ పరిధి కనకాయి జలపాతం సమీపంలో బుధవారం వనమహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పొలం బాటలో భాగంగా రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ, డీఆర్డీవో రవీందర్, తహసీల్దార్ శ్యాంసుందర్, ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీవో శ్రీనివాస్, ఎంపీవో మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.● కలెక్టర్ రాజర్షి షా -
వేగ నియంత్రణకు పోలీస్ కటౌట్లు
● జాతీయ రహదారిపై రెండు చోట్ల ఏర్పాటు ● ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్టౌన్: జాతీయ రహదారిపై వేగాన్ని ని యంత్రించేందుకు, రోడ్డు ప్రమాదాలు అరికట్టడాని కి పోలీసు శాఖ ఆధ్వర్యంలో కటౌట్లు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. జా తీయ రహదారిపై హాట్స్పాట్ల వద్ద పోలీసు వా హనం, ట్రాఫిక్ కానిస్టేబుల్తో కూడిన కటౌట్లు ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు. గుడిహత్నూర్ మండలంలోని మేకలగండి, నేరడిగొండ మండలం బంధ ం ఎక్స్రోడ్ వద్ద ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వాటిని చూసి వాహనదారులు బ్రేక్లు వేస్తున్నార ని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నారని తెలిపారు. ఆదివాసీ దినోత్సవానికి ఆహ్వానం ఈనెల 9న నిర్వహించే ఆదివాసీ దినోత్సవానికి హాజరు కావాలని ఆదివాసీ సంఘాల నాయకులు ఎస్పీ అఖిల్ మహాజన్ను కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. ఇందులో తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఆదివాసీ సంఘాల నాయకులు గోడం గణే శ్, పుర్క బాపురావు, జయవంత్రావు, పెందూర్ దాదిరావు, గేడం రేణుకబాయి, వెట్టి మనోజ్, ఉయిక ఇంద్రబాయి, మడావి ఆనంద్రావు, సలాం వరుణ్, సిడాం శంభు,తదితరులు పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● కలెక్టర్ రాజర్షి షా ● తాంసి పీహెచ్సీ, పీఏసీఎస్ తనిఖీ తాంసి: విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాల ని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. మండల కేంద్రంలోని పీహెచ్సీ, పీఏసీఎస్ను మంగళవారం తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో రికార్డులు పరిశీలించారు. తరచూ విధులకు గైర్హాజరవుతున్న జూనియర్ అసిస్టెంట్ సాయితేజకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని డీఎంహెచ్వోను ఆదేశించారు. అనంతరం సహకార సంఘం కార్యాలయంలో ఎరువుల నిల్వలు పరిశీలించారు. స్టాక్ రికార్డులు తనిఖీ చేశారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీవో మోహన్రెడ్డి, డీసీవో మోహన్, ఏవో రవీందర్, వైద్యసిబ్బంది నర్మద, సుజాత, సహకార సంఘం సీఈవో కేశవ్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
పర్యాటకం.. అభివృద్ధికి దూరం
ప్రకృతి అందాలకు నెలవైన కడెం ప్రాజెక్టు పర్యాటక ంగా గుర్తింపు పొందింది. అయితే సరైన సౌకర్యాలు లేక సందర్శకులు ఇబ్బంది పడుతున్నారు. బుధవారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 202510లోu విద్యుత్ శాఖలో సబ్డివిజన్ స్థాయి టెండర్లను సూపరింటెండింగ్ ఇంజినీర్ (ఎస్ఈ) మాత్రమే చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఉట్నూర్ సబ్ డివిజన్లో ఓ కాంట్రాక్టర్కు రూ.10లక్షల విలువైన పనులను డివిజనల్ ఇంజినీర్ (డీఈ) స్థాయి అధికారి తన సీరిస్ నంబర్పై ఖరారు చేశారు. ఇతర పనుల్లో డీఈకి రూ.5లక్షల్లోపే పనులను అప్పగించే అధికారం ఉంది. అయితే సదరు డీఈకి నిబంధనలన్నీ బలాదూర్గా మారాయి. తనకు అనువైన ఓ కాంట్రాక్టర్కు తన సీరిస్ నంబర్పై ఎలాంటి అధికారం లేకున్నప్పటికీ పెద్ద మొత్తంలో పనులను అప్పగించడం గమనార్హం. దానికి సంబంధించిన అగ్రిమెంట్ కాపీయే ఈ ఫొటోలో ఉన్నది. ●న్యూస్రీల్ -
● ఎన్ఆర్సీకి బడ్జెట్ సమస్య ● సరుకులు లేక సిబ్బంది అవస్థలు ● చిన్నారులకు అందని న్యూట్రీషియన్ ఫుడ్
ఆదిలాబాద్టౌన్: వివిధ రుగ్మతలతో బరువు పెరగని పిల్లలను జిల్లా కేంద్రంలోని రిమ్స్లో గల న్యూట్రీషియన్ రీహాబిటేషన్ సెంటర్ (ఎన్ఆర్సీ)లో చేర్పిస్తారు. వీరికి వివిధ రకాల పోషకాహారంతో పాటు వైద్య చికిత్స అందజేస్తారు. ఆయా గ్రామాల నుంచి అంగన్వాడీలు, ఏఎన్ఎంలు పిల్లలను ఇక్కడ చేర్పించి వారి ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు. ఎత్తుకు తగ్గ బరువు ఉండని ఐదేళ్లలోపు పిల్లల్ని గుర్తిస్తారు. ఎన్ఆర్సీలో 14 రోజుల పాటు పౌష్టికాహారం అందజేస్తారు. అయితే రెండు నెలలుగా ఆ సెంటర్లో పిల్లలకు పోషకాహారం అందడం లేదు. బడ్జెట్ లేకపోవడంతో సిబ్బంది పిల్లలకు రిమ్స్లో రోగులకు అందించే భోజనం పెడుతున్నారు. పప్పు, అన్నం, పాలు తప్పా మరే పౌష్టికాహారం అందడం లేదని ఎన్ఆర్సీలో పిల్లలను చేర్పించిన తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంటి వద్ద కూడా ఈ భోజనం తీసుకోవచ్చని పేర్కొంటున్నారు. బడ్జెట్ లేక తంటాలు.. ఈ సెంటర్లో ప్రస్తుతం 13 మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు. ఒక మెడికల్ ఆఫీసర్తో పాటు ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఇద్దరు ఆయాలు, ఒక కుక్, ఒక న్యూట్రీషనిస్ట్ పనిచేస్తున్నారు. వీరంతా కాంట్రాక్ట్ పద్ధతిన కొనసాగుతున్నారు. బడ్జెట్ లేక వీరికి నెల వేతనం సైతం అందలేదని చెబుతున్నారు. నెలకు చిన్నారులకు భోజనం పెట్టేందుకు రూ.15వేలు ఖర్చవుతుందని, అయితే నెలరోజులుగా బడ్జెట్ లేకపోవడంతో తమ డబ్బులతోనే సరుకులు తెచ్చి పిల్లలకు పెడుతున్నట్లు సిబ్బంది పేర్కొంటున్నారు. ఎన్ఆర్సీలో చిన్నారులతో తల్లిదండ్రులుఅమలుకు నోచుకోని మెనూ ఎన్ఆర్సీలో నెల వయస్సు చిన్నారుల నుంచి ఐదేళ్ల లోపు పిల్లలను చేర్పి స్తారు. పాలు, గుడ్లు, ఉప్మా, నెయ్యి, పోహా, సేమియా, ముర్కులు, దొడ్డు రవ్వ, హల్వా, కిచిడి, అన్నిరకాల కూరగాయలతో తయారు చేసిన భోజనం అందించాల్సి ఉంటుంది. అలాగే ఆలు రైస్, దాల్రైస్, సాబుదాన, రాగిజావ, టమాట రైస్, బెల్లం రైస్, వెజిటేబుల్రైస్ ఇలా అనేక రకాల పోషకాలు కూడిన భోజనాన్ని పెట్టాల్సింది. అయితే రెండు నెలలుగా సరిపడా సరుకులు లేకపోవడంతో ఉన్నవాటితోనే నెట్టుకొస్తున్నారు. వారం రోజులుగా పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. కనీసం అక్కడ బియ్యం కూడా లేవని సిబ్బంది చెబుతున్నారు. కేవలం పాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రెండు గంటలకోసారి పిల్లలకు వివిధ రకాల ఆహార పదార్థాలు అందించాల్సి ఉంటుంది. అయితే సరుకులు నిండుకుండడంతో రిమ్స్లో రోగులకు పెట్టే పప్పు, అన్నంనే చిన్నారులకు అందించాల్సి వస్తోంది. దీంతో వారిలో బరువు కూడా పెరగడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ రాలేదు.. ఎన్ఆర్సీకి సంబంధించి బడ్జెట్ రాలేదు. దీంతో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న మాట వాస్తవమే. బియ్యంతో పాటు ఇతర స రుకులు లేవు. రిమ్స్లో రోగులకు అందిస్తున్న భోజనంలో నుంచి పిల్లలకు పెడుతున్నాం. మా సొంత ఖర్చుతో సరుకులు తీసుకొచ్చి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. పౌష్టికాహారం అందించేలా చర్యలు చేపడతాం. – శ్రీనివాస్చారి, ఎన్ఆర్సీ మెడికల్ ఆఫీసర్ -
రెండు ఆస్పత్రులకు నోటీసులు
ఆదిలాబాద్టౌన్: నిబంధనలు పాటించని రెండు ప్రైవేట్ ఆస్పత్రులకు వైద్యశాఖ అధికారులునోటీసులు జారీచేశారు. కలెక్టర్ ఆదేశాల మే రకు జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను మంగళవారం తనిఖీ చేశారు. పట్ట ణంలోని వెంకటేశ్వర చిల్డ్రన్ హాస్పిటల్, శివప్రియ నర్సింగ్హోమ్, సుజాత నర్సింగ్ హో మ్ అండ్ సర్జికల్ ఆస్పత్రులను పరిశీలించారు. నిబంధనలుపాటించని సుజాతనర్సింగ్ హోమ్, శివ ప్రియ నర్సింగ్ హోమ్ యాజమాన్యాలకు నో టీసులు అందించినట్లు డీఎంహెచ్వో నరేంద ర్ రాథోడ్ తెలిపారు. వారి వివరణ అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఇందులో డిప్యూటీ డీఎంహెచ్వో సాధ న, డీఐవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ‘సర్వేయర్’ అప్రెంటిస్షిప్
● ఒక్కో సర్వేయర్కు 15 మంది శిక్షణ అభ్యర్థులు అటాచ్డ్ కై లాస్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమల్లో భాగంగా లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఎంపిక చేసిన వారికి 56 రోజుల పాటు జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో శిక్షణ ఇచ్చింది. రాత పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి ఈనెల 4నుంచి అప్రెంటిస్షిప్ అందించాలని తొలుత నిర్ణయించింది. అయితే ఇప్పటివరకు ఫలితాలు వెల్లడించలేదు. అయినా పరీక్షకు హాజరైన అభ్యర్థులందరికీ అప్రెంటిస్షిప్ అందించాలని నిర్ణయించింది. ఆ దిశగా జిల్లా సర్వే ల్యాండ్ రికార్డు అధికారులు చర్యలు చేపట్టారు. గత నెల 26, 27, 28 తేదీల్లో నిర్వహించిన పరీక్షకు హాజరైన 129 మందికి బుధవారం నుంచి అప్రెంటిషిప్ శిక్షణ ఇవ్వనున్నారు. మండల సర్వేయర్ల పరిజ్ఞానం, వారి పనితీరు ఆధారంగా ఒక్కో సర్వేయర్కు 15 నుంచి 21 మంది అభ్యర్థులను కేటాయించారు. ఈమేరకు వారిని మంగళవారం కార్యాలయానికి పిలిపించారు. ఏ మండలంలో అప్రెంటిస్షిప్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారనే వివరాలు సేకరించారు. తదనుగుణంగా వారిని జిల్లాలో పనిచేస్తున్న 10 మంది సర్వేయర్లకు అటాచ్డ్ చేశారు. మంగళవారం రాత్రి వరకు ఈ ప్రక్రియ పూర్తికాగా అభ్యర్థులకు వాట్సాప్ ద్వారా వారి సర్వేయర్ పేరు, మండలం వంటి సమాచారం అందించనున్నారు. పరీక్ష ఫలితాలు ప్రకటించకుండానే అభ్యర్థులందరికీ అప్రెంటిస్షిప్ ఇవ్వనుండటంతో అందరినీ విధుల్లోకి తీసుకుంటారా లేక ఫలితాల అనంతరం ఎవరినైనా రిజెక్ట్ చేస్తారా అనే ఆందోళన వారిలో వ్యక్తమవుతుంది. ఈ విషయమై జిల్లా సర్వేల్యాండ్ రికార్డ్ ఏడీ రాజేందర్ను ‘సాక్షి’ సంప్రదించగా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు పది మంది సర్వేయర్లకు శిక్షణ అభ్యర్థులను అటాచ్డ్ చేశామని తెలిపారు. తదుపరి ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
మెగా జాబ్మేళాకు స్పందన
కైలాస్నగర్:నిరుద్యోగ యువతకు ప్రైవేట్రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో టాస్క్ సౌజన్యంతో మంగళవారం నిర్వహించిన మెగా జా బ్మేళాకు స్పందన లభించింది. జిల్లాయంత్రాంగం ఆధ్వర్యంలో ఎస్టీయూభవన్లో నిర్వహించిన మేళా కు జిల్లా నలుమూలల నుంచి నిరుద్యోగులు భారీ గా తరలివచ్చారు. ఐటీ, నాన్ ఐటీకి సంబంధించిన 34 కంపెనీల ప్రతినిధులు హాజరై పదోతరగతి నుంచి పీజీ వరకు విద్యార్హతల ఆధారంగావారికి ఇంట ర్వ్యూలు నిర్వహించారు. నైపుణ్యం ఆధారంగా ఉ ద్యోగాలకు ఎంపిక చేశారు. కార్యక్రమాన్ని కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించి మాట్లాడారు. ప్రజావాణిలో అందుతున్న వినతుల నేపథ్యంలో జాబ్మేళా ఏర్పాటు చేశామన్నారు. ప్రారంభంలో వేతనం తక్కువ ఉన్నా వృత్తినైపుణ్యం పెంపొందించుకుంటే మంచి ప్యాకేజీ పొందవచ్చన్నారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డీఐఈవో జాదవ్ గణేశ్కుమార్, డీడబ్ల్యూవో మిల్కా,పరిశ్రమలశాఖ జీఎం పద్మభూషణ్ రాజు, మున్సిపల్ కమిషనర్ సీవీ ఎన్.రాజు, డీవైఎస్వో శ్రీనివాస్, డీఎల్పీవోలు ఫణిందర్రావు, ప్రభాకర్రావు, స్టడీ సర్కిల్ డైరెక్టర్లు ప్రవీణ్కుమార్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కార్గో ద్వారా రాఖీల బుకింగ్
ఆదిలాబాద్: రాఖీ పౌర్ణమి నేపథ్యంలో అన్నదమ్ములకు రాఖీలు పంపాలనుకునే సోదరీమణుల కోసం ఆర్టీసీ కార్గో కౌంటర్లను ప్రారంభించినట్లు ఆదిలాబాద్ డిపో మేనేజర్ ప్రతి మారెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రం లోని బస్టాండ్లో కార్గో బుకింగ్కౌంటర్ ప్రారంభించారు. రీజియన్ పరిధిలో 29 కౌంటర్లలో రాఖీలు బుక్ చేసుకునే సౌలభ్యం ఉందని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో బస్టాండ్ కంట్రోలర్ పీఎస్ రెడ్డి, రీజనల్ మార్కెటింగ్ ఎగ్జి క్యూటివ్ సాయన్న,అన్సార్ తదితరులున్నారు. -
● విద్యుత్ శాఖలో అంతా ఇష్టారాజ్యం ● సబ్ డివిజన్ వర్క్స్ దొడ్డిదారిన కేటాయింపు ● తన స్థాయి మించి ఓ డీఈ పనులు అప్పగింత ● అనువైన కాంట్రాక్టర్లకు అందలం ● పాత అగ్రిమెంట్పైనే ఎక్స్టెన్షన్ ద్వారా పనులు
సాక్షి,ఆదిలాబాద్: విద్యుత్ శాఖలో సబ్ డివిజన్స్థాయి టెండర్లలో పెద్ద మొత్తంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి అధికారులే ఆజ్యం పోస్తున్నారనే విమర్శలున్నాయి. తమ పరిధి కాకపోయినప్పటికీ, తమకు ఆ టెండర్లు ఇచ్చే అధికారం లేకపోయినా కొంత మంది అధికారులు ఇవేమి పట్టించుకోవడం లేదు. ఉట్నూర్ పరిధిలోని సబ్డివిజన్ వర్క్స్ కేటాయింపులో చోటు చేసుకున్న అక్రమాలే అధికార దుర్వినియోగానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. గతంలోనూ ఈ డివిజన్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడం, దానిపై సీఎండీ, జేఎండీ స్థాయిలో ఫిర్యాదులు వెళ్లాయి. విచారణ కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. ఇంత జరిగినా అక్కడ మార్పు రావడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బినామీలకు పెద్దపీట.. విద్యుత్ శాఖలో టెండర్లలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతుందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా అధికారులే తమ బంధువులను బినామీలుగా రంగంలోకి దించి దొడ్డిదారిన పనులు అప్పగిస్తున్నారనే విమర్శలు ముందునుంచి ఉన్నాయి. పైస్థాయి నుంచి కిందిస్థాయి అధికారుల వరకు కొందరు ఇలా అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. రేట్లు సరిపోవడం లేదనే సాకు.. విద్యుత్ శాఖ జిల్లా పరిధిలో ఐదు సబ్ డివిజన్లు ఆదిలాబాద్, జైనథ్, ఆదిలాబాద్రూరల్, ఇచ్చోడ, ఉట్నూర్ ఉన్నాయి. ఈ సబ్ డివిజన్ల పరిధిలో 30 మంది గుర్తింపు పొందిన కాంట్రాక్టర్లు ఉన్నారు. గతంలో టెండర్లు జరిగినప్పుడు రూ.20లక్షల విలువైన పనులను ఒక్కొక్కరికి అప్పగించారు. ఇది ఎస్ఈ స్థాయిలోనే కేటాయించారు. ఆ పనులు పూర్తయిన తర్వాత మళ్లీ వారికి వివిధ పనులకు సంబంధించి ఎక్స్టెన్షన్ ఇస్తారు. అదికూడా ఎస్ఈ స్థాయిలోనే జరగాలి. ఆ పరిమితి పూర్తి చేసుకున్న వాటికి సంబంధించి మళ్లీ కొత్తగా టెండర్లు నిర్వహిస్తారు. ఇలా సబ్ డివిజన్ల పరిధిలో కాంట్రాక్టర్ల గుర్తింపునకు సంబంధించి మళ్లీ టెండర్లు నిర్వహించాలి. ఆ టెండర్లలో పాత కాంట్రాక్టర్లు కూడా పాల్గొనవచ్చు. కొత్త కాంట్రాక్టర్లకు అవకాశం లభిస్తుంది. అయితే ఇక్కడ పాత కాంట్రాక్టర్లు కొత్త కాంట్రాక్టర్లకు చెక్ పెట్టేందుకు ఎత్తుగడ అవలంభించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా వర్క్స్కు సంబంధించి రేట్లు తమకు సరిపోవడం లేదని, తాము ఆ పనులను చేపట్టమంటూ టెండర్లకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదంతా విద్యుత్ శాఖ అధికారులకు, పాత కాంట్రాక్టర్లకు అంతర్గతంగా లోపాయికారి ఒప్పందంతోనే జరుగుతుందనే ప్రచారం ఉంది. ఆ ముసుగులో పనులు అప్పగింత.. ఇలా పాత కాంట్రాక్టర్లు తమకు రేట్లు సరిపోవడం లేదని టెండర్లకు దూరంగా ఉండటం, దానికి సంబంధించి పైస్థాయిలో అధికారులకు నివేదికలు పంపడంతో ప్రస్తుతం సబ్ డివిజన్ స్థాయి కొత్త టెండర్లు కొద్ది రోజులుగా నిలిచిపోయాయి. తద్వారా ఆయా వర్క్స్పై దీని ప్రభావం పడింది. కాంట్రాక్టర్లు రేట్లు సరిపోవడం లేదని పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదనే సాకుతో పాత కాంట్రాక్టర్లకు పాత అగ్రిమెంట్ల పైనే మళ్లీ కొత్త పనులను ఎక్స్టెన్షన్ చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ఎస్ఈ కార్యాలయంనా దృష్టికి రాలేదు.. సబ్ డివిజన్ స్థాయి వర్క్స్ టెండర్లు ఎస్ఈ స్థాయిలోనే జరుగుతాయి. ఉట్నూర్ డివిజన్లో ఆ పనులు డీఈ ఇచ్చినట్లు నా దృష్టికి రాలేదు. జిల్లాలో సబ్ డివిజన్ల పరిధిలో కొత్త టెండర్లకు సంబంధించి మూడుసార్లు కాల్ఫర్ చేసినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ప్రధానంగా వారు రేట్లు సరిపోవడం లేదని చెబుతున్నారు. దీంతో పనులు నిలిచిపోయే పరిస్థితి ఉంది. ఇటు ప్రభుత్వం ఆ పనులను చేపట్టాలని చెప్పడంతో కొంత మంది కాంట్రాక్టర్లకు ఎక్స్టెన్షన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. – జేఆర్ చౌహాన్, ఎస్ఈ, ఆదిలాబాద్ -
‘స్పోర్ట్స్’లో కీచకపర్వం
● అమ్మాయిలపై లైంగిక వేధింపులు ● గతంలో ఓ శిక్షకునిపై వేటు ● తాజాగా మరో కోచ్పై పోక్సో కేసు ● క్రీడా పాఠశాలపై కరువైన పర్యవేక్షణ ఆదిలాబాద్: ఓ వైపు కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటుంటే క్షేత్రస్థాయిలో మాత్రం భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రీడా శిక్షణలో తర్ఫీదు ఇచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా మూడు క్రీడా పాఠశాలలను నెలకొల్పారు. ఒకటి హకీంపే ట, రెండోది కరీంనగర్లో ఉండగా, మరొకటి జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 2016లో ఏర్పాటు చేశారు. అయితే మొదటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన స్పోర్ట్స్ స్కూల్ ప్రతిష్ట క్రమంగా మసకబారుతోంది. అధికా రుల పర్యవేక్షణ లోపంతో సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. తరచూ ఏదో వివాదంతో వార్తల్లో నిలుస్తున్న ఈ క్రీడా పాఠశాలలో తాజాగా ఓ విద్యార్థినిపై శిక్షకుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోక్సో కేసు నమోదు కావడం గమనార్హం. క్రీడా శిక్షణ అందించాల్సిన శిక్షకులపై ఇలాంటి ఆరోపణలు రావడం, కేసులు నమోదు అవుతుండడం మిగతా విద్యార్థులపై ప్రభావం చూపే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆది నుంచీ అదే తీరు.. ● 2023 సంవత్సరంలో ఈ పాఠశాలలో అథ్లెటిక్స్లో శిక్షణ అందించే శిక్షకుడు ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తొలుత విషయాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు తర్వాత బయటకు పొక్కడంతో శిక్షకుడిపై వేటు వేశారు. ● గతంలో ఈ పాఠశాలలో ఓ విద్యార్థినిపై ఓ విద్యార్థి వేధింపులకు దిగాడని ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. విషయాన్ని బయటకు రాకుండా అమ్మాయి మానసిక స్థితి సరిగా లేదని నాడు అధికారులు, సిబ్బంది చెప్పుకొచ్చారు. ● తాజాగా బాక్సింగ్ నేర్పించే శిక్షకునిపై లైంగిక ఆరోపణలు చేస్తూ ఓ బాలిక తల్లిదండ్రులు జూలై 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు సదరు శిక్షకునిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. క్రీడాకారులు, తల్లిదండ్రుల్లో భయాందోళనలు.. క్రీడా పాఠశాలల్లో ప్రవేశం కల్పిస్తే తమ పిల్లలు చదువుతోపాటు మంచి క్రీడాకారులుగా ఎదుగుతారనే ఆలోచనతో తల్లిదండ్రులు ఇక్కడ చేర్పించేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో 4వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యాబోధన చేస్తూ జూడో, అథ్లెటిక్స్, రెజ్లింగ్, బాక్సింగ్ వంటి క్రీడల్లో శిక్షణ అందిస్తున్నారు. అయితే కొంతమంది శిక్షకుల అనుచిత ప్రవర్తన కారణంగా విద్యార్థులు పూర్తిస్థాయిలో అటు చదువుపై, ఇటు క్రీడలపై దృష్టి సారించలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనల కారణంగానే పలువురు విద్యార్థులు టీసీలు తీసుకుంటున్నారనేది బహిరంగ రహస్యమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కరువైన పర్యవేక్షణ.. ఇంత జరుగుతున్నా పట్టించుకోని సంబంధిత అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. డీఎస్ఏ పరిధిలో, క్రీడా పాఠశాల ప్రాంగణంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నా సమాచారం బయటకు రాకుండా సిబ్బంది, అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. మెమో జారీ చేశాం.. బాక్సింగ్ శిక్షకునికి మెమో జారీ చేశాం. అ తని వివరణ తీసుకున్నాం. అంతర్గతంగా వి చారణ జరుపుతున్నాం. మా నివేదికతో పా టు సీ్త్ర శిశు సంక్షేమ శాఖ నివేదికను కలెక్టర్కు అందిస్తాం. వారి ఆదేశాల మేరకు ముందుకు వెళ్తాం. – జక్కుల శ్రీనివాస్, డీవైఎస్వో -
ఆమె భద్రతకు భరోసా
● పోకిరీల చేష్టలకు ‘షీటీం’తో చెక్ ● పలువురిపై పోక్సో కేసులు ● విద్యాసంస్థల్లో అవగాహన ● వేధింపులా.. డయల్ 8712659953 ఆదిలాబాద్టౌన్: షీటీమ్.. మహిళలపై దాడులు, వేధింపులు, ఆకతాయిల చేష్టలకు చెక్ పెట్టేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఇది జిల్లాలో పటిష్టంగా పనిచేస్తోంది. గడిచిన ఆరు నెలల్లో నమోదైన కేసులే ఇందుకు నిదర్శనం. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్న పోలీసుశాఖ వారి రక్షణ కోసం షీ టీంలను ఏర్పాటు చేసింది. ఆడవాళ్లపై వేధింపులకు పాల్పడే వారిని ఉపేక్షించకుండా కేసులు నమోదు చేస్తున్నా రు. మైనర్లను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న వారిపై పోక్సో కేసులు పెట్టి కటకటాల పాలు చేస్తున్నారు. మరోవైపు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసేందు కు వెనుకంజ వేస్తున్న వారికి సైతం అండగా నిలు స్తున్నారు. బాధితులకు న్యాయం చేస్తూ వారి వివరాలు గోప్యంగా ఉంటున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన సంఘటనలు.. ● ఆదిలాబాద్లోని ఓ పాఠశాలలో షీటీమ్ సభ్యులు గుడ్టచ్, బ్యాడ్ టచ్పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తుండగా, తనను ఓ వ్యక్తి వేధిస్తున్నాడని బృంద సభ్యులకు సదరు విద్యార్థిని తెలిపింది. దీంతో నిందితుడిని అరెస్టు చేసి వన్టౌన్లో పోక్సో కేసు నమోదు చేశారు. ● ఇంద్రవెల్లి మండలంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడు వేధిస్తున్నాడని విద్యార్థినులు షీటీమ్ను ఆశ్రయించారు. దీంతో సదరు టీచర్పై పోక్సో కేసు నమోదు చేశారు. ● ఓ గ్రామం నుంచి యువతి టైలరింగ్ కోసం జిల్లా కేంద్రానికి వస్తుంది. ఈ క్రమంలో ఆమెను వేధిస్తున్న యువకుడిని షీటీమ్ మారువేషంలో వెళ్లి పట్టుకుని అరెస్టు చేశారు. ● ఓ బస్టాండ్లోని వాష్రూమ్లో ఓ మహిళకు సంబంధించిన ఫోన్ నంబర్ను ఓ వ్యక్తి రాశాడు. దీంతో ముగ్గురు ఆ మహిళకు ఫోన్ చేసి వేధింపులకు పాల్పడ్డారు. సదరు మహిళ షీటీంను ఆశ్రయించింది. ముగ్గురిని అరెస్టు చేయడంతో పా టు అక్కడి నుంచి ఫోన్ నంబర్ తొలగించారు. ● గుడిహత్నూర్లో ఓ బాలిక ఫొటోలు తీసి నిందితుడు వేధింపుకు పాల్పడ్డాడు. స్నేహితులకు వాటిని షేర్ చేశాడు. దీంతో పోలీసులు తొమ్మిది మందిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ● ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఓ వివాహితను ఏడేళ్లుగా ఓ వ్యక్తి వేధింపులకు పాల్పడుతున్నా డు. దీంతో బాధితురాలు షీటీంను సంప్రదించగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. విస్తృత స్థాయిలో అవగాహన.. మహిళలు, యువతులు, విద్యార్థినులపై జరుగుతు న్న అఘాయిత్యాలు, వేధింపులు, గుడ్టచ్, బ్యాడ్ టచ్, సోషల్ మీడియా తదితర విషయాలపై షీటీ మ్ సభ్యులు విస్తృతంగా అవగాహన సదస్సులు ని ర్వహిస్తున్నారు. విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్, దుకాణ సముదాయాలు, గ్రామాలకు వెళ్లి కూలీల కు సైతం అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో ప్రస్తు తం ఒక షీటీమ్ పనిచేస్తుంది. ఇందులో ఏఎస్సై బి.సుశీల,హెడ్కానిస్టేబుల్ వాణిశ్రీతో పాటు ఇద్దరు ఏఆర్ మహిళా పోలీసులున్నారు. వీరికోసం ప్రత్యేక వాహనం కేటాయించారు. వీరు జిల్లాలో ఎక్కడ సంఘటన జరిగినాచేరుకొని బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు. జిల్లాలో కేసుల వివరాలు.. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 18 కౌన్సెలింగ్లు, 51 పెట్టి కేసులు, 16 ఎఫ్ఐఆర్, 84 అవగాహ న సదస్సులు నిర్వహించారు. 254 గ్రామాల్లో షీటీ మ్ సభ్యులు పర్యటించారు. నాలుగు బాల్య వివా హాలను అడ్డుకున్నారు. గడిచిన నాలుగు నెలల్లో నాలుగు పోక్సో కేసులు నమోదు చేశారు. వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు.. మహిళలు, యువతులు, విద్యార్థినులను పోకిరీలు వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. బాధితులు షీటీమ్ సెల్:8712659953 నంబర్పై సంప్రదించాలి. స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. వివరాలు గోప్యంగా ఉంచుతాం. షీటీమ్ ద్వారా జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – అఖిల్ మహాజన్, ఎస్పీ -
వినతుల వెల్లువ
● పింఛన్, ‘ఇందిరమ్మ’ అర్జీలే అధికం ● ప్రజావాణికి 112 దరఖాస్తులు కై లాస్నగర్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కి వినతులు వెల్లువెత్తాయి. జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితులు కలెక్టర్ రాజర్షి షాను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. వారి నుంచి అర్జీలు స్వీకరించిన ఆయన వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 112 అర్జీలు అందాయి. ఇందులో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్ల మంజూరుకు సంబంధించిన వే ఉన్నాయి. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన.. అధికారుల తీరుపై కలెక్టర్ అసంతృప్తి ప్రజావాణికి కలెక్టర్ ఉదయం 10.30 గంటలకే హాజరయ్యారు. అర్జీలకు సంబంధించి ఆయా శాఖ ల అధికారులను పిలువగా అందుబాటులో లేకపోవడంతో వారి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ అధికారులెక్కడ అంటూ అక్కడే ఉన్న జిల్లా అధి కారుల సంఘం అధ్యక్షుడు మనోహర్ను ప్రశ్నించారు. వచ్చేవారం నుంచి సకాలంలో హాజరయ్యేలా చూస్తామని ఆయన సమాధానమిచ్చారు. అనంతరం ఆయా శాఖల అధికారులు హుటాహుటిన హాజరయ్యారు. అయితే చాలామంది 11.30గంట ల సమయంలో గ్రీవెన్స్కు రావడం కనిపించింది. -
‘మధ్యాహ్న’ కార్మికుల సమ్మె
కై లాస్నగర్: పెండింగ్ వేతనాలు,బిల్లులు విడు దల చేయాలనే డిమాండ్తో ఏఐటీయుసీ అ నుబంధ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. సోమవారం విధులు బహిష్కరించి కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటా ల రాములు మాట్లాడుతూ.. ఏడాదిగా మధ్యా హ్న భోజన పథకానికి సంబంధించిన బి ల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. వేతనాలు కూడా ఆరు నెలలుగా అందడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో వంట చేయడం ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఇందులో సంఘ నాయకులు శ్రీదేవి, రాంబాయి, పు ష్పలత, సంతోష్, నాందేవ్, లక్ష్మి పాల్గొన్నారు. -
● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ
మహాగర్జనకు తరలిరండి●ఆదిలాబాద్రూరల్: పింఛన్ పెంపు హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 13న హైదరాబాద్లో నిర్వహించనున్న మహాగర్జన సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. మహాగర్జన సన్నాహక సమావేశాన్ని జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో ‘సాక్షి’లో వృద్ధులు, దివ్యాంగుల గురించి కథనాలు రావడంతో చలించి వారి సమస్యలపై పోరాటాలు చేస్తున్నానని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో దివ్యాంగులకు రూ.6వేలు, వితంతువులు, వృద్ధులకు రూ.4వేల పింఛన్ పెంచి అందిస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడస్తున్నా పింఛన్ పెంపు ఊసే లేదన్నారు. సీఎం రేవంత్రెడ్డికి, మాజీ సీఎం కేసీఆర్కు పేదల బాధలు తెలియవని, ఎందుకంటే వారి ఇంట్లో ఎవరు కూడా పేదలు లేరన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. -
టీచర్ల తీరు మారలే!
● ఫేషియల్ అటెండెన్స్ వచ్చినా అదే పరిస్థితి ● సమయపాలన పాటించని ఉపాధ్యాయులు ఆదిలాబాద్టౌన్: ఉపాధ్యాయుల హాజరుపై ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నా కొంతమంది తీ రు మాత్రం మారడం లేదు. ఇదివరకు బయోమెట్రి క్ ఉండగా కొందరు సమయపాలన పాటించారు. మరికొంత మంది వివిధ సాకులతో తప్పించుకున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఇటీవల ఫేషియల్ అటెండెన్స్ను అమలులోకి తీసుకొచ్చింది. అయినా పలువురు తమ తీరు మార్చుకో వడం లేదని తెలుస్తోంది. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో డీఈవో పరిధిలో 691 పాఠశాలలు ఉండగా, 3,288మంది ఉపాధ్యాయులు, సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఇంకా 230 మంది టీచర్లు యాప్ డౌన్లోడ్ చేసుకోకపోవడం గమనా ర్హం. మొదటి రోజు 63 శాతం మంది యాప్ ద్వారా హాజరు వేసుకున్నారు. సోమవారం ఉపాధ్యాయు ల హాజరును రాష్ట్రవిద్యాశాఖ అధికారులు పరిశీ లించారు. ఇందులో పలువురు సమయపాలన పా టించలేదని తెలిసింది. జిల్లాకేంద్రంతో పాటు మా రుమూల మండలాల్లో ఉపాధ్యాయులు పాఠశాల కు ఉదయం 9.30 తర్వాత వెళ్లగా, మధ్యాహ్నం 3.30 గంటలకే ఇంటి ముఖం పట్టినట్లు తెలుస్తోంది. మరికొంత మంది 10గంటలు, 11 గంటలకు, 12గంటలు,ఒంటి గంటవరకు వెళ్లగా..మధ్యాహ్నం 3 గంటలు, 3.45 గంటలలోపే యాప్లో అటెండెన్స్ నమోదు చేసి ఇంటి ముఖం పట్టారని తెలు స్తోంది. జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆ రిపోర్టు ను పంపించగా అందులో పలువురి సమయపాలన వివరాలు ఇలా నమోదయ్యాయి. తిప్ప పాఠశాలకు చెందిన టీచర్ మధ్యాహ్నం 3.45 గంటలకు, అంకో లి ఉపాధ్యాయుడు ఉదయం 10.12 గంటలకు, రాంపూర్కు చెందిన ఉపాధ్యాయుడు 10గంటలకు, చాందాకు చెందిన ఉపాధ్యాయుడు మధ్యాహ్నం 1.31 గంటలకు, యాపల్గూడకు చెందిన ఉపాధ్యాయుడు 11.06 గంటలకు, కచ్కంటికి చెందిన టీచర్ మధ్యాహ్నం2.53గంటలకు, ఖిల్లాకు చెందిన టీచర్ మధ్యాహ్నం 1.37 గంటలకు, కేజీబీవీ మావలకు చెందిన సీఆర్టీలు ముగ్గురు 11.45, మరొకరు 12 గంటలకు, సరస్వతీనగర్కు చెందిన టీచర్ మధ్యాహ్నం1.05గంటలకు ఫేషియల్ అటెండెన్స్లో న మోదు చేసుకున్నారు. వీరే కాకుండా మరికొందరు సమయపాలన పాటించలేదని తెలుస్తోంది. ప్రస్తు తం ట్రయల్రన్కొనసాగుతుండగా, రెండు మూడు రోజుల తర్వాత ఈ అటెండెన్స్ పకడ్బందీగా అమలు చేయనున్నట్లు రాష్ట్రశాఖ అధికారులు పేర్కొన్నా రు. దీనిపై సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఇక నుంచి సమయపాలన పాటించని వారికి హైదరాబాద్ నుంచే మెమోలు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ అటెండెన్స్ షీట్ విడుదలతో సమయపాలన పాటించని ఉపాధ్యాయుల్లో గుబులు మొదలైంది. -
కలెక్టర్కు సన్మానం
కైలాస్నగర్: సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమారోహ్లో రాష్ట్రస్థాయి పురస్కారం అందుకున్న కలెక్టర్ రాజర్షి షాను జిల్లా అధికారులు సోమవారం ఘనంగా సన్మానించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ, సమష్టి కృషితోనే అవార్డు సాధించగలిగా మని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్.రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరంకై లాస్నగర్: తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరమని, వాటి ప్రాముఖ్యతపై మహిళలు, గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తల్లిపాల వారోత్సవాలు, పోషకాహార దినోత్సవ అవగాహన ప్రచార పో స్టర్లను కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో కలిసి సోమవారం విడుదల చేశారు. ఈనెల 7వరకు తల్లిపాల వారో త్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తల్లి పా లలో శిశువు ఎదుగుదలకు అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయన్నారు. ఇందులో అదన పు కలెక్టర్ శ్యామలాదేవి, జిల్లా సంక్షేమాధికారి మిల్కా,డీఆర్డీవో రాథోడ్రవీందర్పాల్గొన్నారు. -
ఎఫెక్ట్..
ఆ ఉపాధ్యాయుల వివరాలు పంపండి.. ఆదిలాబాద్టౌన్: జిల్లాలో సర్దుబాటు ప్రక్రియలో భాగంగా ఆయా పాఠశాలలకు కేటాయించిన ఉపాధ్యాయులు విధుల్లో చేరడం లేదని సోమవారం ‘‘సర్దుబాటు’ ఆదేశాలు బేఖాతరు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన డీఈవో శ్రీనివాస్రెడ్డి సర్దుబాటు ప్రక్రియలో భాగంగా కేటాయించిన కొత్త పాఠశాలలకు చేరని టీచర్ల వివరాలు వెంటనే పంపించాలని ఎంఈవోలు, సంబంధిత ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. వివరాల ఆధారంగా వారిపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. -
● అవగాహన కల్పిస్తున్న ‘సాధన సమితి’ ● మేము సైతం అంటున్న విద్యార్థులు, యువత ● ఆందోళనలకు సమాయత్తం ● ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెచ్చేలా ప్రణాళిక
ఆదిలాబాద్టౌన్: విశ్వవిద్యాలయం ఏర్పాటే లక్ష్యంగా యూనివర్సిటీ సాధన సమితి వడివడిగా అడుగులేస్తోంది. ఓ వైపు మేధావులు, రాజకీయ పార్టీల నాయకులను కలుస్తూ ప్రణాళికలు సిద్ధం చేస్తూనే.. మరోవైపు నిరుద్యోగులు, విద్యార్థులకు వర్సిటీ ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. ‘మేము మీ వెంట ఉన్నాం.. మీరు మా వెంట రండి.. మీ భవితకు బాటలు వేసుకోండని సూచిస్తున్నారు. సంఘటితంగా పోరాడితే లక్ష్య సాధన సులువేనని అంటున్నారు. వర్సిటీ ఆవశ్యకతను వివరిస్తూ.. యూనివర్సిటీ ఆవశ్యకతపై సాధన సమితి సభ్యులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రంథాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఓయూ, కేయూలు దూరంగా ఉండడంతో ఈ ప్రాంత విద్యార్థులు ఏవిధంగా నష్టపోతున్నారు.. అదే ఇక్కడ వర్సిటీ అందుబాటులోకి వస్తే ఒనగూరే ప్రయోజనాలు ఎలా ఉంటాయో వివరిస్తున్నారు. ఒక ప్రాంతం అభివృద్ధి సాధించాలంటే అందులో విద్యారంగం పాత్ర కీలకమని చెబుతున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో కన్వీనర్ బద్దం పురుషోత్తంరెడ్డి, కోకన్వీనర్ గొడిసెల రమణగౌడ్, సలహాదారులు, చిట్యాల సుహాసిని రెడ్డి, సభ్యులు నరేందర్రెడ్డి, కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ సూరజ్ సింగ్, లెక్చరర్లు, విద్యార్థినులు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో లెక్చరర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ సాధనకు తోడ్పాటునందించాలని కోరారు. ఉద్యమాలకు ప్రణాళిక సిద్ధం.. వర్సిటీ సాధన సమితి ఉద్యమాలకు సిద్ధమవుతోంది. జిల్లాలోని అన్ని కళాశాలల్లో అవగాహన సదస్సుల అనంతరం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ, సభలు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులను కలిసి పోరాటంలో భాగస్వాములు కావాలని, అసెంబ్లీ, పార్లమెంట్లో విషయాన్ని ప్రస్తావించాలని విన్నవిస్తామని, సీఎంతో పాటు ఆయా శాఖల మంత్రులను కలుస్తామని సమితి సభ్యులు చెబుతున్నారు. వర్సిటీ సాధించేవరకు నిరంతరంగా ఉద్యమిస్తామని, శాంతియుత పోరాటాలు చేస్తామని పేర్కొంటున్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
ఆదిలాబాద్టౌన్: సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరించి త్వరితగతిన పరిష్కరించేలా చూడాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నా రు. జిల్లాకేంద్రంలోని పోలీసు ముఖ్య కార్యాల యంలో సోమవారం నిర్వహించిన గ్రీ వెన్స్కు జిల్లా నలుమూలల నుంచి 38 మంది హాజరై దరఖాస్తులు అందజేశారు. వారి సమస్యలను ఓపికగా విన్న ఎస్పీ సంబంధిత పోలీసు అధి కారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, సిబ్బంది వామన్ పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ
ఆదిలాబాద్:ఆదిలాబాద్ క్రీడా పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్పోటీల్లో సత్తాచాటా రు. హన్మకొండ వేదికగా నిర్వహిస్తున్న 11వ తెలంగాణ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో ట్రయత్లాన్–ఏ ఈవెంట్లో ఎస్.చరణ్ స్వర్ణ ప తకం సాధించగా, జావెలిన్ త్రోలో వీ.మహేశ్ కాంస్య పతకం సాధించినట్లు కోచ్ రమేశ్ తెలి పారు. అలాగే జిల్లాకు చెందిన కే.జకేశ్ జావెలి న్ త్రోలో గోల్డ్మెడల్తో మెరువగా,రేస్వాక్లో కార్తీక్, రమ్య కాంస్య పతకాలతో సత్తాచాటిన ట్లు అసోసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి రాజే శ్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడు భోజారెడ్డి క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. -
వంద సీట్లు గెలుస్తాం
నిర్మల్/ఖానాపూర్: సంక్షేమమే ప్రధాన ధ్యే యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజురోజుకూ ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ధీమా పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో 100 సీట్లు గెలుచి మళ్లీ అధికా రంలోకి వస్తామని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని సీట్లూ కైవసం చేసుకుంటా మని ధీమా వ్యక్తంజేశారు. ఏఐసీసీ రాష్ట్ర వ్య వహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క తది తరులతో ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం జనహిత పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్కుమార్గౌడ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించా రు. అధికారంలోకి వచ్చిన స్వల్పకాలంలోనే రాష్ట్రంలో ఆరుగ్యారంటీలు,ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం లాంటి హామీలు అమలు చే స్తున్నామని చెప్పారు. తాముఏసీల్లో కూర్చో కుండా తమనేత రాహుల్గాంధీ చెప్పినట్లు ప్రజల్లో ఉండేందుకే జనహిత పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు. ఆదిలాబాద్ జిల్లాను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదిలా బాద్ ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. ఇన్చార్జి మంత్రి జూపల్లి ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తామన్నారు. ఆదివాసీలతో అనుబంధం ఉంది : మీనాక్షి మళ్లీ తనకు జన్మంటూ ఉంటే ఆదివాసీగానే పుట్టాలని కోరుకున్న దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఆశయాలు, ప్రజలతో ఎప్పుడూ దగ్గరగా ఉంటే వారి సమస్యలు ఎక్కువగా పరిష్కరించవచ్చన్న తమనేత రాహుల్గాంధీ ప్రేరణతో కాంగ్రెస్ప్రభుత్వం పని చేస్తోందని పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. తనకు ఆదివాసీలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్తోనూ అనుబంధం ఉందని పేర్కొన్నారు. గతంలోనూ సర్వోదయ యాత్రలో భాగంగా ఆదిలాబా ద్కు వచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఆదివాసీ సమాజం నుంచి మంచితనాన్ని నేర్చుకున్నట్లు చెప్పారు. జల్, జంగల్, జమీ న్ కోసం పోరాడిన ఆదివాసీలే తమకు స్ఫూర్తి అన్న రాహుల్ ఆశయాలతోనే ముందుకు సాగుతామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీసులు, గిరిజనుల అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉంద ని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్రెడ్డి నెరవేరుస్తున్నారని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రా ష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరో పించారు. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. బనకచర్లపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంద ని, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు.. మన నీళ్లను ఆంధ్రప్రదేశ్కు దోచిపెట్టారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు చిలుకపలుకులు పలుకుతున్నారని,గతంలో మూడు రాష్ట్రాలను ఇచ్చి, తెలంగాణకు మొండిచే యి చూపారని ఆరోపించారు. తెలంగాణలో ఓటు అడిగే హక్కు బీజేపీ, బీఆర్ఎస్కు లేదని, దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ శ్రీ రామ రక్ష అని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా పై ప్రభుత్వం ప్రత్యేకదృష్టి పెట్టిందని, అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామని చె ప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఖానాపూర్ ఎమ్మె ల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎలా దోపిడీ జరిగిందో, ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పని చేస్తోందో ప్రజలకు తెలుపుతూ.. సమస్యలు పరిష్కరించేందుకేజనహిత పాద యాత్ర చేపట్టినట్లు తెలిపారు. బీఆర్ఎస్ దోపిడీకి పాల్పడితే, బీజేపీ ప్రజల్లో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రేషన్కార్డులు ఇస్తూ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామ ని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో ఐక్యంగా ముందుకు సాగి అన్ని స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. పదేళ్ల కేసీఆర్ పా లనలో జీవోలే తప్పా పైసలు ఇవ్వలేదని, అభివృద్ధికి నోచుకోలేదని కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి ఎద్దేవా చేశారు. గత సీఎం కేసీఆర్కు ఎన్నిసార్లు విన్నవించినా సదర్మట్ మినీబ్యారేజీ నుంచి ప్రత్యేక కాలువ ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యే రేఖానా యక్ మండిపడ్డారు. కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమంద్ అలీ, కాంగ్రెస్ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి ఆత్రం సుగుణ, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, నా యకులు అల్లూరి మల్లారెడ్డి, ఆడె గజేందర్, కంది శ్రీనివాస్, బొంత రామ్మోహన్, నారా యణరావుపటేట్, పడిగెల భూషణ్, ఎంఏ మజీద్, దయానంద్, తోట సత్యం, చిన్నం సత్యం, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. రెండోసారి అధికారంలోకి వస్తాం.. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఖానాపూర్లో ‘జనహిత’ పాదయాత్ర భారీగా తరలివచ్చిన నేతలు, శ్రేణులు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి, పలువురు మంత్రులు హాజరు -
‘వర్సిటీ’ ఆవశ్యకతపై అవగాహన
ఆదిలాబాద్టౌన్: జిల్లాలోయూనివర్సిటీ ఏర్పా టు చేయాలని ఆదిలాబాద్ యూనివర్సిటీ సా ధన సమితి జిల్లా కన్వీనర్ బద్దం పురుషోత్తంరెడ్డి అన్నారు. వర్సిటీ సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని లైబ్రెరీలో ఆదివారం అ వగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో యూనివర్సిటీ లేకపోవడంతో విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లి చ దువుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందన్నా రు.ఆర్థికంగా లేనివారు మధ్యలోనే ఆపేస్తున్నా రన్నారు. విద్యార్థినులు ఇతర ప్రాంతాలకు వెళ్లలేక డిగ్రీకే పరిమితమవుతున్నారని పేర్కొన్నా రు. జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం విద్యాపరంగా అభివృద్ధి చెందుతుందన్నారు.విద్యార్థులంతా వర్సిటీ సాధన కోసం ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో కోకన్వీనర్ రమణాగౌడ్, సుహాసినిరెడ్డి, ఉదారి నారాయణ, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. -
గాడితప్పిన పల్లె పాలన
● ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ కరువు ● విధులకు డుమ్మా కొడుతున్న కార్యదర్శులు ● పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా అస్తవ్యస్తం కై లాస్నగర్: పంచాయతీ ప్రత్యేకాధికారులు పల్లెల ముఖం చూడటం లేదు. గ్రామాలను విధిగా సందర్శిస్తూ పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా పర్యవేక్షించాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. పంచాయతీ కార్యదర్శులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ సమస్యలు పరిష్కరించాల్సి ఉండగా తమకేం సంబంధంలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న పలువురు కార్యదర్శులు విధులకు డుమ్మా కొడుతున్నారు. దీంతో పంచాయతీ పాలన పూర్తిగా గాడి తప్పింది. సంతకాల కోసమే అన్నట్లుగా.. పంచాయతీ పాలకవర్గాల గడువు గతేడాది జనవరి 31న ముగిసింది. దీంతో ప్రత్యేకాధికారుల పాలన అనివార్యమైంది. జిల్లాలో 123 మంది వివిధ శా ఖ ల గెజిటెడ్ అధికారులను పంచాయతీ స్పెషలా ఫీసర్లుగా నియమించారు. ఇందులో ఎంపీడీవోలు, ఎంపీవోలు, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, ఆర్ఐలు, ఎంఈవోలు, పీఆర్ఏఈలు, సూపరింటెండెంట్లు, ఏంఏఓలు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, వాటర్గ్రిడ్ ఏఈలు వంటి అధి కారులున్నారు. కొన్ని మేజర్ పంచాయతీలకు జిల్లాస్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. వీరు పంచాయతీల ముఖమే చూడటం లేదు. నెలలో కనీసం ఒకటి, రెండు సార్లు సందర్శించిన దాఖలాలు సైతం కనిపించడం లేదు. జిల్లా కలెక్టర్ పర్యటించిన సమయాల్లో మాత్రమే ఆ గ్రామాలకు వస్తున్నారనే ఆరోపణలున్నాయి. కేవలం సంతకాల కోసం మాత్రమే ఉన్నారన్నట్లుగా వీరు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువై పంచాయతీ పాలన గతితప్పుతోంది. విధులకు కార్యదర్శుల డుమ్మా .. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పలువురు కా ర్యదర్శులు విధులకు గైర్హాజరవుతున్నారు. ఉదయ మే గ్రామానికి చేరుకుని పంచాయతీ మానిటరింగ్ యాప్లో ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ఫొటో అప్ లోడ్ చేసి అటెండెన్స్ నమోదు చేయాలి. కానీ జిల్లాలో చాలామంది విధులకు వెళ్లకుండానే వెళ్లినట్లుగా ఫేక్ అటెండెన్స్ నమోదు చేస్తున్నారు. తమ ము ఖాలకు బదులు పంచాయతీలోని కుర్చీలు, బీరువా లు,టేబుళ్లు,పంచాయతీ పరిసరాలు నమోదు చేస్తూ అధికారులను తప్పుతోవ పట్టిస్తున్నారు. విధులకు రాకుండా ప్రైవేట్ దందాలు నిర్వహిస్తున్నారు. వీరి హాజరును పర్యవేక్షించాల్సిన ఎంపీవోలు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణ లున్నాయి. ఫలితంగా పల్లెల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తప్పడం లేదు. తొమ్మిది మంది ఎంపీవోలు.. 26 మంది కార్యదర్శులపై చర్యలు విధులకు రాకున్నా వచ్చినట్లుగా తప్పుడు హాజరు నమోదు చేసిన కార్యదర్శులపై పంచాయతీరాజ్ క మిషనరేట్ చర్యలు చేపట్టేదాకా జిల్లా అధికారులకు విషయం తెలియదంటే పర్యవేక్షణ ఏ విధంగా ఉందనేది స్పష్టమవుతుంది. జిల్లాలో స్థానిక సంస్థల ప ర్యవేక్షణకు ప్రత్యేకంగా ఓ ఐఏఎస్ అధికారితో పా టు జిల్లా పంచాయతీ అధికారి, ఇద్దరు డివిజనల్ పంచాయతీ అధికారులు ఉన్నారు. ఎంపీవోలు సై తం తమ పరిధిలోని పంచాయతీ కార్యదర్శులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇంత మంది అధికారులు ఉండగా కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్ నమోదు చేస్తుంటే వీరంతా ఏం చేస్తున్నారనే సందేహం క లుగుతోంది. జిల్లాలో 9మంది ఎంపీవోలకు, 21 మంది కార్యదర్శులకు నోటీసులు జారీచేయగా, మ రో నలుగురు కార్యదర్శులకు చార్జీమెమోలు ఇచ్చా రు. అలాగే ఓ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు పడింది. లోతుగా విచారిస్తే మరింత మంది బయటపడే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. జిల్లాలో.. గ్రామ పంచాయతీలు : 473 రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులు : 417 కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్యదర్శులు : 31 కఠినంగా వ్యవహరిస్తాం పంచాయతీలను సందర్శించి సమస్యలను పరి ష్కరించేలా చూడాల్సిన బాధ్యత ప్రత్యేకాధికా రులపై ఉంటుంది. వారు సందర్శించడం లేద నే విషయం నా దృష్టికి రాలేదు. కార్యదర్శుల పనితీరుపై దృష్టి సారిస్తాం. విధులకు గైర్హాజరయ్యే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. – జి.రమేశ్, జిల్లా పంచాయతీ అధికారి -
స్నేహబంధం గొప్పది..
● కలెక్టర్ రాజర్షి షా ఐఐటీ కాన్పూర్లో చదివే రో జుల్లో మేం నలుగురం మంచి స్నేహితులుగా ఉండేవాళ్లం. సివి ల్స్కు సన్నద్ధమైన సమయంలో మా స్నేహం మరింత బలపడింది. ఎలాంటి సందేహాలున్నా ఒకరికొకరం చర్చించుకుని పరిష్కరించుకునేవాళ్లం. మా నలుగురిలో ఇద్దరం ఐఏఎస్గా ఎంపికవ్వగా, మరో ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. విధి నిర్వహణ పరంగా దూరంగా ఉన్నప్పటికీ ఫోన్లో మాట్లాడుకుంటాం. యోగాక్షేమాలు అడిగి తెలుసుకుంటాం. శుభకార్యాల్లో కలుస్తూ ఉంటాం. అలాగే నా భార్య, యాపల్గూడ 2వ బెటాలియన్ కమాండెంట్, ఐపీఎస్ నితిక పంత్ నా బ్యాచ్మెట్. పనిలో, వ్యక్తిగత జీవితంలో నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలున్నా చర్చించుకుని ముందుకు సాగుతున్నాం. స్నేహబంధం ఎంతో గొప్పది. ఒక మంచి స్నేహితుడు, స్నేహితుల బృందం ఓ వరం. ఒత్తిడిలేని జీవితం గడపడానికి, లక్ష్యసాధనకు దోహదపడుతారనేది నా అభిప్రాయం. – కై లాస్నగర్ -
క్యూఆర్.. జేబుకు చిల్లు!
నా పేరు శివప్రసాద్. ఆదిలాబాద్ వాసిని. శుక్రవారం ఉదయం 11.45 గంటలకు మంచిర్యాల నుంచి ఆ డిపోకు చెందిన బస్సులో ఆదిలాబాద్ బయలుదేరా. కండక్టర్ టికెట్ అనడంతో ఫోన్ ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేస్తానని చెప్పా. ఆయన మిషన్లో క్యూఆర్ స్కానర్ను చూయించాడు. అందులో రూ.230 టికెట్ ఖరీదు రాగా ఆన్లైన్ పేమెంట్ చేశా. డబ్బులు నా అకౌంట్ నుంచి డ్రా అయినట్లు ఫోన్కు మెసేజ్ వచ్చింది. అయితే మిషన్లో సాంకేతిక సమస్య కారణంగా టికెట్ రాలేదు. దీంతో కండక్టర్ డబ్బులు చెల్లించి టికెట్ తీసుకోవాలన్నాడు. ఆన్లైన్ పేమెంట్ తిరిగి వస్తాయని చెప్పాడు. చేసేది లేక డబ్బులిచ్చి టికెట్ తీసుకున్నాను. శనివారం వరకు కూడా ఆ డబ్బులు జమ కాలేదు. చాలా మంది అవి రావని చెబుతున్నారు. సాక్షి, ఆదిలాబాద్: ఆర్టీసీ బస్సుల్లో క్యూఆర్ స్కానర్ ద్వారా డబ్బులు చెల్లిస్తున్న ప్రయాణికులకు జేబులకు చిల్లుపడుతుంది. ఆన్లైన్ పేమెంట్ అయినా మిషన్ నుంచి టికెట్ రాకపోవడంతో నష్టపోవాల్సిన పరిస్థితి. ఒక వేళ ఆ సమయంలో చేతిలో డబ్బులు లేకపోతే దిగిపోమ్మంటూ కండక్టర్లు చెప్పేస్తున్నారని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు. ప్రభుత్వమెమో ఆర్టీసీలో నగదు రహిత సౌలభ్యం కల్పిస్తున్నామని గొప్పలు చెబుతున్నా తరచూ ఇలాంటి ఫిర్యాదులు వస్తుండటం గమనార్హం. ఐ–టిమ్ ద్వారా.. ఆర్టీసీలో నగదు రహిత లావాదేవీలు రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇందుకోసం చలో కంపెనీ నుంచి ఐ–టిమ్ మిషన్లు పంపిణీ చేశారు. ఆదిలాబాద్ రీజియన్లో గత ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చింది. ఏసీ బస్సులు మొదలుకుని సూపర్ లగ్జరీ, ఎక్స్ప్రెస్, పల్లె వెలుగుల్లోనూ అమలు పర్చారు. రీజియన్ పరిధిలోని ఆయా డిపోల్లో మొత్తం 520 మిషన్లు ప్రస్తుతం పని చేస్తున్నాయి. అయితే అత్యధిక మిషన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్ ద్వారా డబ్బులు స్కాన్ చేస్తున్న ప్రయాణికులకు చుక్కెదురవుతుంది. డబ్బులు అకౌంట్ నుంచి కట్ అవుతున్నా టికెట్ మాత్రం జనరేట్ కావడం లేదు. దీంతో ప్రయాణికులు కండక్టర్లను ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంలో వివాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. అంతే కాకుండా సిగ్నల్ వీక్ ఉన్నచోట ఇవి పనిచేయడం లేదనే విమర్శలున్నాయి. అయితే ఆర్టీసీ అధికారులు మాత్రం ఆ డబ్బులు తిరిగి వస్తాయని చెబుతున్నారు. పరిశీలన చేస్తాం.. టిమ్ మిషన్లపరంగా ప్రయాణికులు వ్య క్తం చేస్తున్న ఈ సమస్యపై పరిశీలన చే స్తాం. ఒకవేళ అకౌంట్లో నుంచి డబ్బులు డ్రా అయిన పక్షంలో కండక్టర్లను ఓ నంబర్కు స్క్రీన్ షాట్ పెట్టాలని చెప్పాం. తద్వారా 24గంటల్లో ఆ ప్రయాణికులకు డబ్బులు తిరిగి వచ్చేలా చేస్తున్నాం. సాంకేతిక సమస్యలుంటే పరిష్కరిస్తాం. – భవానీప్రసాద్, ఆర్టీసీ ఆర్ఎం -
కలెక్టర్కు మరో అవార్డు
● రాష్ట్రస్థాయి పురస్కారం అందుకున్న రాజర్షి షా కై లాస్నగర్: నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని నార్నూర్ బ్లాక్ను దేశంలోనే ఆదర్శంగా నిలిపిన కలెక్టర్ రాజర్షి షాను ఇప్పటికే జాతీయస్థాయి అవార్డు వరించగా.. తాజాగా రాష్ట్రస్థాయి పురస్కారం అందుకున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)సంపూర్ణతా అభియాన్ సమ్మాన్ సమరోహ్ పేరిట ఈ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని రాజ్భవన్ దర్బార్ హాల్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నా రు. గోల్డ్మెడల్తో పాటు ప్రశంసాపత్రం అందజేసి వారు అభినందనలు తెలిపారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్, ప్రిన్సిపల్ సెక్రటరీలు జ్యోతి బుద్ద ప్రకాశ్, దాన కిశోర్ తదితరులు పాల్గొన్నారు. గుర్తుకొచ్చిన ఆ ముగ్గురు ఐఏఎస్లు.. కాగా ఈ వేదికపై గతంలో ఆదిలాబాద్ కలెక్టర్లుగా పనిచేసిన మరో ముగ్గురు ఐఏఎస్లు ఉండటం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధా న కార్యదర్శిగా ఉన్న కె. రామకృష్ణారావు నాడు ఉమ్మడి ఆదిలాబాద్ కలెక్టర్గా వ్యవహరించారు. అలాగే జ్యోతిబుద్ధప్రకాశ్, దివ్యదేవరాజ న్లు సైతం కొత్త ఆదిలాబాద్కు కలెక్టర్లుగా వ్యవహరించినవారే. ఆ ముగ్గురూ ఇదే వేదికపై ఉండటం జిల్లావాసులకు గత జ్ఞాపకాలను గుర్తు చేసినట్లయింది. అలాగే సమగ్ర గిరిజన అభివృద్ధిసంస్థ పరిధిలో సేవలందించిన ఉ ట్నూర్ ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా గవర్నర్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. -
ఏటా కలుసుకుంటున్నాం..
● అనిల్ జాదవ్, బోథ్ ఎమ్మెల్యే నా టెన్త్ ఇచ్చోడలోని ప్రభుత్వ పాఠశాలలో పూర్తయింది. మాది 1986–87 బ్యాచ్. అప్పుడు విడిపోయిన మేమంతా ఇరవై ఏళ్ల తర్వాత 2006లో కలుసుకున్నాం. ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారంతా మళ్లీ కలుసుకోవడంతో మా స్నేహం తిరిగి చిగురించింది. అప్పటి నుంచి ఏటా వేసవిలో అపూర్వ సమ్మేళనం పేరిట 120 మంది వరకు ఒక్క చోటకు చేరుతున్నాం. కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నాం. హోదాలతో సంబంధం లేకుండా మా ఫ్రెండ్షిప్ను కొనసాగిస్తున్నాం. రీ యూనియన్ రోజు అన్నీ మరిచిపోతాం. ఆ జ్ఞాపకాలను ఆస్వాదిస్తాం. సృష్టిలో స్నేహ బంధం ఎంతో గొప్పది. నిజమైన స్నేహితులను వదులుకోవద్దు. – నేరడిగొండఅవసరాల కోసం స్నేహాలు చేస్తున్న ప్రస్తుత సమాజంలో 50 ఏళ్లుగా ఓ ఇద్దరూ వ్యక్తులు స్నేహానుబంధాన్ని పంచుకుంటూ పలువురికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు. 1970 దశకంలో మొదలైన వారి సోపతి ఇప్పటికీ ఎలాంటి అరమరికలు లేకుండా సాగుతోంది. వారే పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన కొమ్ము రాజన్న, తిర్పెళ్లి కాలనీకి చెందిన సట్ల అశోక్. వీరి తల్లిదండ్రులు కూడా వీరిలాగే కలిసిమెలిసి ఒకే కుటుంబంలా మెలిగేవారు. ఏ నిర్ణయం తీసుకున్నా ఇద్దరూ కలిసి తీసుకుంటామని పేర్కొన్నారు. 30 ఏళ్లుగా ఏటా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ శివాలయాలు సందర్శిస్తామని, తాము కలవనిదే రోజు గడవదని చెబుతున్నారు. రాజన్న ప్రస్తుతం డీఎస్ఏలో వాచ్మెన్ విధులు నిర్వహిస్తుండగా, మల్లేశ్ వ్యవసాయం చేస్తున్నాడు. మేము కలిసి చేసిన కష్టమే ఒకరిపై ఒకరికి గౌరవాన్ని పెంచడంతో పాటు బలమైన బంధానికి పునాదులు వేసిందని చెప్పుకొచ్చారు ఈ చెడ్డీ దోస్తులు. – ఆదిలాబాద్ 50 ఏళ్ల దోస్తానా.. -
● బడికి పరుగులు పెట్టిన ఉపాధ్యాయులు
‘ఎఫ్ఆర్ఎస్’తో సమయపాలన ఆదిలాబాద్టౌన్: బడులకు డుమ్మా కొట్టే, సమయపాలన పాటించని పంతుళ్లకు చెక్ పడింది. శుక్రవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్ఆర్ఎస్ (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం) అటెండెన్స్ అమలులోకి వచ్చింది. దీంతో ఉపాధ్యాయులు సమయపాలన పాటించేందుకు పాఠశాలలకు పరుగు పెట్టారు. నిర్ణీత సమయం కంటే ముందుగానే చేరుకొని ఫేషియల్ అటెండెన్స్ నమోదు వేశారు. ఉదయం 9.05 గంటలకు, సాయంత్రం 4.15 గంటలకు హాజరు వేసుకున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో సర్వర్ డౌన్ కారణంతో ఇబ్బందులకు గురయ్యారు. ఈ ప్రక్రియతో ఇష్టారీతిన బడికి వెళ్లే ఉపాధ్యాయుల ఆగడాలు ఇకపై సాగని పరిస్థితి. జిల్లాలో డీఈవో పరిధిలో 691 పాఠశాలలు ఉండగా, 3,288 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వీరందరికీ ఫేషి యల్ అటెండెన్స్ వర్తింపజేశారు. విద్యార్థులతో పాటు టీచర్లు తమ ముఖ గుర్తింపు ద్వారా హాజరు నమోదు చేసుకున్నారు. జిల్లా కేంద్రం నుంచి ఇతర ప్రాంతాల్లోని పాఠశాలలకు వెళ్లేవారు ఇదివరకు బస్టాండ్, తెలంగాణ చౌక్, ఠా కూర్ హోటల్, తాంసి బస్టాండ్లలో 9 నుంచి 10 గంటల వరకు కనిపించేవారు. శనివారం ఆ ఉపాధ్యాయులు ఉద యం 8 గంటలకే ఇంటి నుంచి బయల్దేరి నిర్ణీత సమయంలోగానే పాఠశాలలకు చేరుకోవడం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయంపై పలు ఉపాధ్యాయ సంఘాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
శిక్షణ నుంచి మంచి స్నేహితులం
● ఎస్పీ అఖిల్ మహాజన్ 2017లో మసూరిలో ట్రెయినింగ్ నుంచి కలెక్టర్ రాజర్షిషా, ఆయన సతీమణి నితిక పంత్ మంచి స్నేహితులం. శిక్షణ అనంతరం ఇతర జిల్లాల్లో పోస్టింగ్ తీసుకున్నప్పటికీ యోగక్షేమాలు తెలుసుకునేవాళ్లం. అప్పుడప్పుడు కలిసేవాళ్లం. ప్రస్తుతం ముగ్గురం ఆదిలాబాద్ జిల్లాలోనే పనిచేస్తున్నాం. ప్రపంచంలో తల్లిదండ్రుల తర్వాత ఏ విషయాన్నైనా పంచుకునేది స్నేహితులతోనే. సంతోష సమయంలోనే కాదు.. కష్టాల్లోనూ తోడుండేవాడే నిజమైన స్నేహితుడు. – ఆదిలాబాద్టౌన్ -
బీసీ రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ కొత్త నాటకం
● ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్: రాష్ట్రంలోని బీసీలంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడుతున్నారని బీసీ రిజర్వేషన్ల పేరిట కొత్త నాటకానికి హస్తం సర్కారు తెరలేపిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీల వ్యతిరేకతను తప్పించుకునేందుకే కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి బీసీ రిజర్వేషన్లను తెరమీదకి తీసుకువచ్చారని ఆరోపించారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ కట్టబెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. ఆ పార్టీకి నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ముస్లింల ప్రస్తావన లేకుండా 42 శాతం బీసీ రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసేంతవరకు ఆ పార్టీని బీజేపీ వెంటాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. -
టీబీ రహిత సమాజానికి కృషి చేయాలి
ఆదిలాబాద్టౌన్: టీబీ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు. రిమ్స్లో శనివారం టీబీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జిల్లాలో టీబీ నివారణ కు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. జ నరల్ మెడిసిన్, పీడియాట్రిక్తో పాటు ఆయా విభాగాల వైద్యులతో మాట్లాడారు. దేశంలో టీబీ నివారణ కోసం ముక్త్ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో జిల్లా టీబీ నియంత్రణ అధికారి సుమలత, వైద్యులు సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
అందరి కృషితోనే ‘ఆస్పిరేషనల్’ సక్సెస్
నార్నూర్: అందరి కృషితోనే నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం విజయవంతంగా కొనసాగుతుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండలంలో శుక్రవారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ఖైర్డట్వా గ్రామంలో మొహువా లడ్డూ తయారీ యూ నిట్ను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి ప్రారంభించారు. అలాగే ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యాబోధనపై ఆరా తీశారు. భీంపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో డిజిటల్ సైన్స్ ల్యాబ్ను ప్రారంభించారు. రాజులగూడలోని సుమన్బాయి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు కొత్త రేషన్కార్డులు పంపిణీ చేశారు. నీతి ఆయోగ్ ప్రోగ్రాంకు సహకరిస్తున్న అధికారులు, సిబ్బందికి జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం కింద ఖైర్డట్వా గ్రామంలో మొహువా లడ్డూ తయారీ యూనిట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడ తయారయ్యే లడ్డూలను కేజీబీవీలతోపాటు ప్రభుత్వ వసతి గృహాలు, మార్కెట్లకు సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. నీతి ఆయోగ్ కింద చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు గాను జాతీయస్థాయిలో అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. అలాగే రేషన్కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రి య అని అన్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడు తూ, అర్హులందరికీ ప్రభుత్వం కొత్త రేషన్కార్డులు, పింఛన్లు మంజూరు చేయాలన్నారు. గాదిగూడలో నిర్వహించిన పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉట్నూర్ సబ్కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సయ్య, జెడ్పీ సీఈవో జితేందర్రెడ్డి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, శిశు సంక్షేమ శాఖ అధికారి మిల్కా, నీతి ఆయోగ్ ప్రోగ్రాం అధికారి రాహుల్, జిల్లా రాయి సెంటర్ సార్మేడి మెస్రం దుర్గు, సీడీపీవో శారద, ఎంపీడీవో గంగాసింగ్, తహసీల్దార్ రాజలింగు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ● కలెక్టర్ రాజర్షి షా -
కాలువల ద్వారా నీళ్లొచ్చే పరిస్థితి లేదు..
ఏమాయికుంట శివారు గురుదేవ్ చెరువు కింద హీరాపూర్లో నాకు నాలుగెకరాల సాగు భూమి ఉంది. యాసంగిలో పంటలు పండించాలంటే తప్పనిసరి ఆ చెరువు నీళ్లే దిక్కు. అయితే ఇప్పటివరకు నిండకపోవడంతో వచ్చే సాగు ఎలా చేపట్టాలో అర్థం కావట్లే. కాల్వల ద్వారా నీళ్లొచ్చే పరిస్థితి కనిపించట్లే. – పఠాన్ అన్వర్, రైతు, హీరాపూర్, ఇంద్రవెల్లి మండలం చాలా చెరువులు నిండలేదు.. జిల్లాలో ఇంకా అనేక చెరువులు పూర్తిస్థాయిలో నిండలేదు. భారీ వర్షాలు కురిస్తే నిండే అవకాశం ఉంది. యాసంగిలో ఆయకట్టు భూములకు నీళ్లందించేలా చూస్తాం. – విఠల్, ఈఈ, నీటిపారుదల శాఖ, ఆదిలాబాద్ -
ఖాళీ ప్లాట్లపై బల్దియా దృష్టి
కై లాస్నగర్: పిచ్చిమొక్కలు, మురుగునీటి నిల్వతో అపరిశుభ్రత నెలకొని సీజనల్ వ్యాధుల ప్రబలతకు కారణమవుతున్న పట్టణంలోని ఓపెన్ప్లాట్లపై బ ల్దియా దృష్టి సారించింది. ఆయా కాలనీల్లో గల ఖా ళీ ప్లాట్లను ఇప్పటికే గుర్తించిన అధికారులు వాటిలో హెచ్చరిక బోర్డుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు. యజమానులు స్పందించకుంటే 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం చర్యలకు సిద్ధమవుతున్నారు. ఇదీ పరిస్థితి... ఆదిలాబాద్ పట్టణంలో మొత్తం 49 వార్డులున్నాయి. వీటి పరిధిలో వందలాది ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. ఏళ్ల తరబడి ఖాళీగా ఉంచడం, నిర్వహణ లేకపోవడంతో అందులో పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి. దీనికి తోడు చుట్టుపక్కల వారు చెత్తాచెదారం వేస్తున్నారు. దీంతో అపరిశుభ్రత నెలకొంటుంది. మరికొన్ని ప్లాట్లలో మురుగునీరు ప్రవహించే అవకాశం లేకపోగా అక్కడే నిల్వ ఉంటుంది. కొన్ని చోట్ల వర్షపునీరు బయటకు వెళ్ల లేక చిన్నపాటి కుంటలుగా మారుతున్నాయి. అందులో దోమలు, ఈగలు వృద్ధి చెంది వ్యాధుల ప్రబలతకు కారణమవుతున్నాయి. వర్షాకాలం కావడంతో డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముంది. ఈ పరిస్థితిని అధిగమించేలా బల్దియా అధికారులు చర్యలు చేపట్టారు. శుభ్రత పాటించని వారికి హెచ్చరిక స్పందించకుంటే చర్యలకు సిద్ధంప్రతీ ప్లాట్లో హెచ్చరిక బోర్డు.. ఖాళీ ప్లాట్లలో పిచ్చిమొక్కలు పెరగకుండా, మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాల్సిన బాధ్యత ప్లాట్ల యజమానులదేనని స్పష్టం చేస్తూ బల్దియా అధికారులు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయించారు. శుభ్రత పాటించని పక్షంలో మున్సిపల్ యాక్ట్–2019 ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు అందులో స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే గుర్తించిన ఖాళీ ప్లాట్లన్నింటిలో వీటిని ఏర్పాటు చేయిస్తున్నారు. బల్దియా అధికారుల ఆలోచన స్వాగతించదగినదే అయినప్పటికీ ఎంత మంది స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే. మూడు రోజుల్లోగా స్పందించాలి అపరిశుభ్రంగా ఉండే ఖాళీ ప్లాట్లతో చుట్టుపక్కల ఉండే వారు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు అవి కారణమవుతున్నాయి. ఖాళీ ప్లాటును శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత యజమానిదే. దాన్ని గుర్తు చేసేలా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయిస్తున్నాం. మూడు రోజుల్లోగా స్పందించాలి. లేనిపక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. – బైరి శంకర్, శానిటరీ ఇన్స్పెక్టర్ -
చెరువులు నిండలే!
తాంసి మండలంలోని సావర్గాం గ్రామ చెరువు ఇది. దీనికింద సుమారు వంద ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 70 శాతం మేర మాత్రమే నిండింది. వానాకాలంలో జలకళ సంతరించుకోవాల్సిన చెరువు ఈసారి ఆగస్టు వచ్చినా ఇంకా పూర్తిగా నిండకపోవడం గమనార్హం. యాసంగి సాగుతో పాటు భూగర్భజలాల వృద్ధిపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన స్థానికుల్లో కనిపిస్తుంది. ఇంద్రవెల్లి మండలం ఏమాయికుంట గ్రామ శివారులోని గురుదేవ్ చెరువు ఇది. ఈ వానాకాలంలో 80 శాతం వరకు నిండింది. అలుగు పారాల్సిన సమయంలో ఇంకా బోసిపోయి కనిపిస్తోంది. దీనికింద సుమారు 200 ఎకరాల ఆయకట్టు ఉంది. యాసంగిలో ఆయా రైతులు ఈ చెరువును నమ్ముకొని పంటలు సాగు చేస్తారు. -
మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారానికి కృషి
ఆదిలాబాద్టౌన్: మధ్యవర్తిత్వంతో అత్యధిక కేసులు పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా జడ్జి కె.ప్రభాకర రావు అన్నారు. జిల్లా కో ర్టులో న్యాయవాదులతో శుక్రవారం ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. ‘మీడియేషన్ ఫర్ నేషన్’ పేరుతో ప్రారంభించిన 90 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఇప్పటికే నలుగురికి శిక్షణ కల్పించినట్లు తెలి పారు. మరో ఐదుగురికి సైతం శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో జడ్జీలు పి.శివరాంప్రసాద్, రాజ్యలక్ష్మి, కుమారి లక్ష్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్, గంగారాం, న్యాయవాదులు పాల్గొన్నారు. -
బాలలు బడిలోనే ఉండాలి
● ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం ● 93 మంది బాలకార్మికులకు విముక్తి.. 28 కేసులు నమోదు ● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: బాలలు బడిలోనే ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఆపరేషన్ ముస్కాన్ వివరాలు వెల్లడించారు. జిల్లాలో 93 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించామని, 28 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 86 మంది బాలురు, ఏడుగురు బాలికలను రక్షించినట్లు తెలిపారు. 70 మంది పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించినట్లు చెప్పారు. అలాగే 23 మంది పిల్లలను వసతిగృహాలకు తరలించి వారి బంధువులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. కార్మిక, విద్యా శాఖలతో పాటు చైల్డ్ ప్రొటక్షన్, ఎన్జీఓల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్ నెలపాటు కాకుండా నిరంతరం సాగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా బాల కార్మికులు ఉన్నట్లు తెలిస్తే డయల్ 100కు సమాచారం అందించాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. సమష్టి కృష్టితోనే బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించవచ్చన్నారు. పోలీసు ఆధీనంలో ఉన్న వాహనాలను తీసుకెళ్లాలి పోలీసు ఆధీనంలో ఉన్న వాహనాలను వాహనదారులు నిజధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఆరు నెలల్లోగా తీసుకెళ్లాలని ఎస్పీ అన్నారు. జిల్లాలోని ఆయా స్టేషన్ల పరిధిలో వివిధ నేరాలకు సంబంధించి, పలుచోట్ల లభ్యమైన వాహనాలు 51 ఉన్నాయని తెలిపారు. 2026 జనవరి వరకు అవకాశం ఉందని, యజమానులు గమనించాలని సూచించారు. గడువు అనంతరం పోలీసు హెడ్క్వార్టర్స్లో మిగిలిన వాటికి బహిరంగ వేలం నిర్వహిస్తామని తెలిపారు. సందేహాలు ఉంటే రిజర్వు ఇన్స్పెక్టర్ మురళిని 8712659962 నంబర్పై సంప్రదించాలని సూచించారు. -
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఇంద్రవెల్లి: పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నా రు. మండలకేంద్రంలోని కాగ్నే ఫంక్షన్ హాల్లో కలెక్టర్ రాజర్షిషా, ఐటీడీఏ పీవో ఖుష్బుగుప్తాతో కలిసి కొత్త రేషన్కార్డులను లబ్ధిదారులకు శుక్రవా రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఎలాంటి పైర వీ లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. బీజేపీ మత రాజకీయాలు మా నుకోవాలని హితవుపలికారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, డీఎస్వో వాజిద్ అలీ, ఆది లాబాద్ ఆర్డీవో స్రవంతి, ఇంద్రవెల్లి మా ర్కెట్ కమి టీ చైర్మన్ ముఖడే ఉత్తం, తహసీల్దార్ ప్ర వీణ్కుమార్, ఎంపీడీవో భాస్కర్, కాంగ్రెస్ నాయకులు ఎండీ మసూద్, ఎండీ జహీర్ తదితరులున్నారు. -
జాతీయ రహదారిగా ఉన్నతీకరించాలి
● ఎంపీ గోడం నగేశ్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని గు డిహత్నూర్ నుంచి మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లా అల్లాపల్లి వరకు ఉన్న రోడ్డును జాతీయ రహదారి గా ఉన్నతీకరించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ గోడం నగేశ్ కోరారు. గురువారం రాత్రి మంత్రిని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించారు. ఈ రహదారిని ఉన్నతీకరిస్తే గడ్చిరౌలిలో ఉన్న జాతీయరహదారి 353సీ తో అనుసంధానం అవుతుందని పేర్కొన్నారు. గుడిహత్నూర్ నుంచి ఇంద్రవెల్లి, ఉట్నూరు, జైనూరు, కెరమెరి, ఆసిఫాబాద్, కాగజ్నగర్, సిర్పూర్, కౌటాల, గూడెం మీదుగా అల్లాపల్లి వరకు గల ఈ మార్గంలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అలాగే పార్లమెంట్ పరిధిలో ఉన్న పలు రహదారు ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. జేఎన్వీ మంజూరు చేయాలి ఆదిలాబాద్: జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయం మంజూరు చేయాలని ఎంపీ గోడం నగేశ్ కోరారు. శుక్రవారం పార్లమెంట్లో రూల్ 377 కింద వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో విద్యారంగం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుందని అన్నారు. విద్యార్థులకు గుణాత్మక విద్య అందించడంలో ఇబ్బందులు తప్పడం లేదని, అలాగే జాతీయ అక్షరాస్యతతో పోల్చితే జిల్లా అక్షరాస్యత రేటు చాలా తక్కువగా ఉందన్నారు. వీటికి పరిష్కార మార్గంగా జవహన్ నవోదయ విద్యాలయం(జేఎన్వీ) ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. -
చాంపియన్లుగా నిలవాలి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకు చెందిన విద్యార్థులు జూడోలో రాష్ట్రస్థాయి వేది కలపై ఓవరాల్ చాంపియన్లుగా నిలవాలని డీౖ వెఎస్వో జక్కుల శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐపీ స్టేడియంలో గల జూడో హాలు లో శుక్రవారం నిర్వహించిన సబ్ జూనియర్, కేడేట్ జిల్లాస్థాయి ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించారు. నిరంతరం సాధన చేస్తేనే గొప్ప క్రీడాకారులుగా ఎదుగుతారన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారినిఈనెల 5నుంచి 7 వరకు వరంగల్ వేదికగా నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జూడో కోచ్ రాజు, డీఎస్ఏ సిబ్బంది సురేశ్, శిక్షకులు కబీర్దాస్, రమేశ్, శ్రీధర్ తదితరులున్నారు. -
జిల్లాలో వనమహోత్సవం వివరాలు
● డీఆర్డీఏ లక్ష్యం 27.87 లక్షలు ● నాటిన మొక్కలు 20.07 లక్షలు ● జిల్లా వ్యాప్తంగా 72.05 శాతం ● 90 శాతంతో తాంసి ప్రథమం కైలాస్నగర్: పచ్చదనాన్ని పెంపొందించాలనే ల క్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చే స్తున్న వనమహోత్సవం జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. మొక్కలు నాటడంలో ఆ శాఖకు కేటాయించిన ల క్ష్యానికి చేరువవుతోంది. ఇళ్లలో నాటేందుకు వీలుగా మొక్కలు అందించడంతో పాటు ఎంపిక చేసిన ప్ర దేశాల్లో ఉపాధిహామీ సిబ్బంది విరివిగా మొక్కలు నా టుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 72.05శాతం మొక్కలు నాటారు. ఈ నెలాఖరులో పు పూర్తిస్థాయి లక్ష్యాన్ని చేరుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే నాటిన మొక్కలను సంరక్షిస్తేనే పచ్చదనం పెరిగి ప్రభుత్వ లక్ష్యం నెరవేరనుందని, ఆ దిశగా శ్రద్ధ చూపాల్సిన అవసరముందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. లక్ష్యానికి అనుగుణంగా ముందుకు.. 2025–26 ఆర్థిక సంవత్సరానికి జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖకు 27.87లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం విధించారు. ఇందులో 8,46,762 మొక్కలు ఇళ్లలో నాటాల్సి ఉండగా ఇప్పటివరకు అంతే మొ త్తంలో మొక్కలు పంపిణీ ప్రక్రియ పూర్తయింది. మరో 19,40,238 మొక్కలను ఎంపిక చేసిన ప్ర భుత్వ, ప్రైవేట్ స్థలాలు, రైతుల పంట చేలల్లో నా టాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 2,129 స్థలాలను ఎంపిక చేశారు. వాటిలో ఇప్పటివరకు 11,53,875 మొక్కలు నాటగా, మొత్తంగా జిల్లాలో 20,07,923 మొక్కలు నాటారు. సంరక్షణే అసలు సవాల్ ఏటా అధికసంఖ్యలో మొక్కలు నాటుతున్నా సంరక్షించే దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా మొక్కలను మూగజీవాలు తినేస్తున్నాయి. దీంతో ప్రజాధనం వృథా అవతుందే గాని పచ్చదనాన్ని పెంచాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. కొందరు అధికారులు, సిబ్బంది ప్రత్యేక చొరవ చూపి మొక్కలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి చోట్ల మాత్రమే మొక్కలు వృక్షాలుగా ఎదుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఆ దిశగా చొరవ చూపి మొ క్కలను సంరక్షిస్తేనే వనమహోత్సవ లక్ష్యం నెరవేరడంతో పాటు ప్రభుత్వం ఆశించిన పచ్చదనం పెంపు సాధ్యమవుతుంది. ఆ దిశగా అధికారులు ప్రతీ మొక్కకు జియో ట్యాగింగ్ చేస్తే మొక్కల సంరక్షణ సాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మండలం లక్ష్యం నాటినవి ఆదిలాబాద్ 2,00,000 1,32,274 గాదిగూడ 1,50,000 99,335 భీంపూర్ 1,50,000 1,00,375 తలమడుగు 1,65,000 1,11,971 నార్నూర్ 1,50,000 1,02,155 నేరడిగొండ 1,70,000 1,16,190 బేల 2,00,000 1,37,129 బోథ్ 2,00,000 1,40,269 గుడిహత్నూర్ 1,60,000 1,13,222 ఇంద్రవెల్లి 2,00,000 1,44,262 ఇచ్చోడ 2,00,000 1,47,505 సిరికొండ 1,10,000 83,758 జైనథ్ 2,10,000 1,59,960 ఉట్నూర్ 2,52,000 1,93,415 బజార్హత్నూర్ 1,70,000 1,35,535 మావల 20,000 17,996 తాంసి 80,000 72,572 అగ్రస్థానంలో తాంసి.. అట్టడుగున ఆదిలాబాద్ రూరల్.. తాంసి మండలం 90.72 శాతం మొక్కలు నాటి అగ్రస్థానంలో నిలిచింది. 26,346 మొక్కలను ఇళ్లలో నాటేందుకు పంపిణీ చేయగా, 46,226 మొక్కలను ఎంపిక చేసిన 70 ప్రాంతాల్లో నా టారు. మొత్తంగా 72,572 మొక్కలు నాటి జి ల్లాలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆదిలాబాద్ రూరల్ మండలం 66.14 శాతంతో అట్టడుగు స్థానానికే పరిమితమైంది. ఈ మండలంలో 1,32,274 మొక్కలు నాటగా, 80,866 మొక్కలను ఎంపిక చేసిన 164 ప్రాంతాల్లో నాటారు. మరో 51,408 మొక్కలను ఇంటి ఆవరణల్లో నాటేందుకు ప్రజలకు పంపిణీ చేశారు. గాది గూడ, భీంపూర్ మండలాల్లో 66శాతం మొక్కలు నాటే ప్రక్రియ పూర్తయింది. తలమడుగులో 67శాతం మొక్కలు నాటారు. మిగతా మండలాలు లక్ష్యానికి చేరువలో ఉన్నాయి. సంరక్షణకు ప్రత్యేక చర్యలు కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో మొక్కలు నాటుతున్నాం. నర్సరీల్లో పెంచిన పూలు, పండ్ల మొక్కలను ఇళ్లలో నాటేందుకు ప్రజలకు పంపిణీ చేస్తున్నాం. ఈ నెలాఖరులోపు వందశా తం మొక్కలు నాటుతాం. నాటిన ప్రతీ మొక్క వృక్షంగా ఎదిగేలా చూడాల్సిన బాధ్యత మండల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిపై ఉంది. ఆ దిశగా వారు శ్రద్ధ చూపాలి. మొక్కలను సంరక్షించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. – రాథోడ్ రవీందర్, డీఆర్డీవో -
ఒక సిమ్తో ఒకేసారి కాల్ !
● ఆ తర్వాత సిమ్ లేకుండా ధ్వంసం ● ‘జన్నారం సైబర్’ కేసులో నిందితుల తీరిదీ.. ● మాస్టర్ మైండ్ జాక్ ఖాతాలో భారీగా నగదు ● ముమ్మరంగా కేసు దర్యాప్తు, నిందితులకు 14రోజుల రిమాండ్ సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఒక ఫోన్కాల్కు ఒకేసారి సిమ్ వాడుతూ ఆ తర్వాత వాటిని ధ్వంసం చేస్తూ నిత్యం వందలాది కాల్స్ చేస్తూ రూ.లక్షల సొమ్ము కాజేసే యత్నం జరిగింది. జన్నారం కేంద్రంగా సాగిన సైబర్ నేరాన్ని రామగుండం సైబర్ క్రైం పోలీసులు తీవ్రంగా పరిగణించి విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే ఏడుగురు ఈ కేసులో ఉన్నట్లు గుర్తించారు. నలుగురిని అరెస్టు చేశారు. గురువారం నిందితులను లక్సెట్టిపేట కోర్టులో హాజరుపర్చగా.. వారికి 14రోజుల రిమాండ్ విధించారు. సైబర్ నేరాలు చేసేందుకు ఆధునిక సాంకేతికతను వాడుతూ అమాయక జనాలను కేవలం ఫోన్లో మాట్లాడి మభ్యపెడుతూ సొమ్మును తస్కరించే పనుల్లో నిమగ్నమయ్యారు. గత నెలన్నరలోనే వేలాది మందికి ఎక్కడి నుంచో ఫోన్ కాల్స్ చేస్తూ ఇక్కడి లొకేషన్ చూపించేలా ఏర్పాట్లు చేశారు. గోల్డెన్ ట్రయాంగిల్ ఏరియాగా పిలిచే కంబోడియా, మయన్మార్ నుంచి ఈ వ్యవస్థను నియంత్రిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రాలో రోడ్లపై విక్రయించే వారి నుంచి సిమ్లు వందలకొద్దీ కొనుగోలు చేసి, యాక్టివ్ చేసి మాట్లాడగానే పని పూర్తయిన వెంటనే ఆ సిమ్ను పాడేసినట్లు గుర్తించారు. ఎప్పటికప్పుడు యాక్టివ్ అయిన సిమ్ వివరాలను ఓ బుక్లో రాసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆ బుక్లోని వివరాల ప్రకారం ఎవరెవరికి కాల్స్ చేశారు..? ఇందులో ఎంతమొత్తం డబ్బు దోచుకున్నారనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. జాక్ ఖాతాల్లో రూ.కోట్లలో డబ్బు ప్రస్తుతం పరారీలో ఉన్న వైజాగ్ చెందిన జాక్ అలియాస్ రాజు జన్నారానికి చెందిన వారితోపాటు ఆంధ్రా వారినీ ఈ నేరంలో భాగస్వామ్యం చేస్తూ పథకం రచించాడు. గత మే నుంచే ఈ తతంగం మొదలు కాగా, గత నెలన్నరగా మోసాలు చేసే ప్రయత్నాలు చేశారు. దర్యాప్తులో భాగంగా జాక్ బ్యాంక్ ఖాతాలో రూ.కోటికిపైగా లావాదేవీలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా అతడు చెప్పినట్లు చేసినందుకు రూ.లక్షల్లో డబ్బు స్థానికులకు పంపాడు. మోసం చేస్తున్నామని తెలిసినా జన్నారం వాసులు ఇందులో ఇరుక్కుపోయారు. ఐఎంఈఐ కనిపించకుండా సైబర్ నేరగాళ్లు కాల్స్ చేస్తే వాళ్లు చేసే ప్రాంతం, చూపించే లొకేషన్ భిన్నంగా ఉండేందుకే జన్నారంను ఎంపిక చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఒక సిమ్ బాక్స్లో ఒకేసారి 256సిమ్లు వాడుతూ, ఐఎంఈఐ కూడా గుర్తించకుండా ఉండేలా జాగ్రత్త పడ్డారు. అంతేకాక లొకేషన్ ట్రేస్ చేస్తే అడవులు, కొండల మధ్య టవర్ సిగ్నల్స్ను ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలుసుకోవడం కష్టంగా మారుతుంది. ఈ క్రమంలో ముందుగా జన్నారం పోలీసులు ఆచూకీ వెతికినా నేరగాళ్లు బయటపడలేదు. ఇదంతా కంబోడియా నుంచే పూర్తిగా ఈ వ్యవహారం నడిచిందా? వీరి వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు. వీరి చేతిలో ఎంతమంది మోసపోయారు? దోచిన డబ్బు ఏ ఖాతాల్లోకి వెళ్లిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే నేరంలో ప్రధానంగా వ్యవహరించిన జాక్ దొరికితేనే ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. అతన్ని పట్టుకోవడం కోసం లుక్అవుట్ నోటీసులు జారీ చేసేందుకు వారు సిద్ధమయ్యారు. -
ఎట్టకేలకు టీచర్ల సర్దుబాటు
● ఉత్తర్వులు జారీ చేసిన డీఈవోఆదిలాబాద్టౌన్: ఎట్టకేలకు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ పూర్తయింది. డీఈవో శ్రీనివాస్రెడ్డి గురువారం ఉ త్తర్వులు జారీ చేశారు. బుధవారం ‘సాక్షి’లో ‘సర్దుబాటు అయ్యేదెప్పుడో’ శీర్షి కన ప్రచురించిన కథనానికి విద్యాశాఖ అధికారులు స్పందించారు. అవసరమైన పాఠశాలలకు 131మంది ఉపాధ్యాయులను కేటాయించా రు. గతనెల 15న సర్దుబాటుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు వివరాలు విడుదల చేశారు. ఈ స ర్దుబాటులో తప్పిదాలు జరిగాయని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలెక్టర్, డీఈవోకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రత్యేక కమిటీ నియమించి సవరణ చేపట్టారు. మైదాన ప్రాంతంలోని పాఠశాలల నుంచి మైదాన ప్రాంతానికి 111 మంది టీచర్లను, ఏజెన్సీ ప్రాంతంలోని పాఠశాలల నుంచి మైదాన ప్రాంతానికి 20 మంది టీచర్లను సర్దుబాటు చేశారు. కేటాయింపు ఇలా ఏజెన్సీ ప్రాంతంలోని ఉపాధ్యాయులను ఆదిలా బాద్ అర్బన్, బజార్హత్నూర్ మండలాలకు ఒ క్కొక్కరు చొప్పున, బేలకు ఇద్దరు, ఇచ్చోడకు ఏ డుగురు, తలమడుగు, గుడిహత్నూర్కు నలుగు రు చొప్పున ఉపాధ్యాయులను సర్దుబాటు చేశా రు. అలాగే మైదాన ప్రాంతంలోని టీచర్లను ఆది లాబాద్రూరల్ మండలానికి 11 మంది, ఆదిలా బాద్అర్బన్కు 25 మంది, బజార్హత్నూర్కు నలు గురు, బేలకు ఆరుగురు, భీంపూర్కు ఐదుగురు, బోథ్కు ఏడుగురు, గుడిహత్నూర్కు ముగ్గురు, ఇచ్చోడకు ఐదుగురు, ఇంద్రవెల్లికి ముగ్గురు, జైనథ్కు ఆరుగురు, నార్నూర్కు 11 మంది, నేరడిగొండకు ఒకరు, తలమడుగుకు ఐదుగురు, తాంసికి 11 మంది, ఉట్నూర్కు 14 మంది టీచర్లను సర్దుబాటు చేసినట్లు డీఈవో తెలిపారు. మైదాన ప్రాంతంలో మొత్తం 111 మందిని, ఏజెన్సీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి 20 మంది, మొత్తం 131 మందిని సర్దుబాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎఫెక్ట్.. -
అలారం వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్ ● బ్యాంక్, ఏటీఎంల భద్రతపై బ్యాంక్, పోలీస్ అధికారులతో సమీక్ష ● రిటైర్డ్ పోలీసులకు సన్మానం ఆదిలాబాద్టౌన్: అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో బ్యాంక్ లాకర్లు, ఏటీఎంలలో సెన్సార్లు, సీసీ టీవీ కెమెరాలు, అలారం వ్యవస్థ ఏర్పాటు చేసుకో వాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. పోలీస్ హెడ్క్వార్టర్స్లోని సమావేశ మందిరంలో భద్రత అంశాలు, ప్రజల ఆర్థిక రక్షణ కోసం గురువారం బ్యాంక్, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఖాతాదారుల నమ్మకాన్ని వ మ్ము చేయకుండా బ్యాంక్ నేరాల నియంత్రణకు కృషి చేద్దామని పేర్కొన్నారు. అధిక మొత్తంలో నగదు తరలించే సమయంలో సరిపడా సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. సైబర్క్రైమ్ పెరిగిపోవడంతో మోసాలకు పాల్పడుతున్న వారి అకౌంట్లను ఫ్రీజ్ చేసేలా చర్యలు చేపట్టాలని, ఇందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేకంగా సైబర్క్రైమ్ బృందాన్ని ఏర్పాటు చేసి పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకులు, ఏటీఎంలను నిరంతరం తనిఖీ చేయాలని ఆదేశించారు. ఏఎస్పీ సురేందర్రావు, డీఎస్పీ జీవన్రెడ్డి, పట్టణ సీఐలు సునీల్కుమార్, కరుణాకర్రావు, ఫణిదర్ తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఎస్సై, కానిస్టేబుల్కు సన్మానం జిల్లా పోలీస్ కార్యాలయంలో రిటైర్డ్ పోలీస్ అధికా రులను ఎస్పీ అఖిల్ మహాజన్ శాలువాలతో సన్మానించి బహుమతులు అందజేశారు. రిటైర్డయిన వా రిలో ఏఆర్ ఎస్సైగా పని చేసిన సంతోష్రెడ్డి, ఇచ్చో డ ఠాణాలో విధులు నిర్వర్తించిన కానిస్టేబుల్ రాథో డ్ గణపతి ఉన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ సురేందర్రావు, ఏఆర్ డీఎస్పీ ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకటి, మురళి, అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, వామన్ తదితరులున్నారు. నేటి నుంచి 30పోలీస్ యాక్ట్ శాంతిభద్రతల పరిరక్షణ, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాలో శుక్రవారం నుంచి ఈ నెలాఖరు వరకు 30పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజ న్ తెలిపారు. స్థానిక పోలీస్ కార్యాలయంలో మా ట్లాడారు. డీఎస్పీ, ఆపైస్థాయి అధికారి నుంచి అనుమతి లేకుండా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు నిర్వహించరాదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ప్రమోషన్ల షెడ్యూల్ విడుదల●
ఆదిలాబాద్టౌన్: టీచర్ల ప్రమోషన్ల షెడ్యూల్ ను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. ఈనెల 2 నుంచి ప్రక్రియ ప్రారంభం కానుండగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 26మంది పీజీహెచ్ఎంలుగా, 118మంది స్కూ ల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందనున్నారు.ఈనెల 2న వెబ్సైట్లో పీజీహెచ్ఎం ఖాళీల ప్రదర్శన, 3న సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, 4, 5 తేదీల్లో అభ్యంతరాల పరిష్కారం అనంతరం తుది జాబితా విడుదల చేయనున్నారు. 6న వెబ్ ఆప్షన్లు, 7న ప్రమోషన్ల జాబితా విడుదల, 8, 9 తేదీల్లో ఎస్జీటీ ఖాళీల జాబితా విడుదల, 10న స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కోసం వెబ్ ఆప్షన్లు, 11న ప్రమోషన్ కల్పించనున్నారు. 144 మంది టీచర్లకు ప్రమోషన్ జిల్లాలో 144 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్ లభించనుంది. ప్రభుత్వ యాజమాన్యంలో నలుగురికి, లోకల్బాడీలో 22 మందికి అవ కాశం దక్కనుంది. జిల్లాలో 27 ఖాళీలున్నప్పటికీ, ఇచ్చోడ మండలం తలమద్రి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య లేక ఆ పోస్టు భర్తీ చేసే అవకాశం కానరావడం లేదు. ప్రభుత్వ యాజమాన్యంలో 40, లోకల్బాడీలో 102 ఎస్ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 70శాతం పో స్టులను భర్తీ చేయనుండగా ప్రభుత్వ యాజ మాన్యంలో 28 ఎస్ఏ పోస్టులు, లోకల్బాడీలో 71 పోస్టులలో ప్రమోషన్లు కల్పించనున్నారు. 26 మంది ఎస్ఏలు ప్రమోషన్లు పొందడంతో ఈ పోస్టులు ఖాళీగా ఉండగా వీటిని ఎస్జీటీల కు ఎస్ఏలుగా ప్రమోషన్ కల్పించనున్నారు. సబ్జెక్టుల వారీగా ఇలా.. ప్రభుత్వ యాజమాన్యంలో పీఎస్ హెచ్ఎంలు –2, స్కూల్ అసిస్టెంట్ గణితం–2, ఫిజికల్ సై న్స్–4, బయోసైన్స్–3, సాంఘిక శాస్త్రం–6, తె లుగు–2, హిందీ–1, ఇంగ్లిష్–2, ఉర్దూ–2, పీడీ–1, మరాఠీ–1, స్పెషల్ ఎడ్యుకేషన్–1, పీ జీహెచ్ఎంలు–4 పోస్టుల్లో ప్రమోషన్లు చేపట్ట నున్నారు. లోకల్బాడీలో పీఎస్ హెచ్ఎం–27, స్కూల్ అసిస్టెంట్ గణితం–4, ఫిజికల్ సైన్స్–4, బయోసైన్స్–9, సాంఘిక శాస్త్రం–19, హిందీ–2, ఇంగ్లిష్–6, ఉర్దూ–1, పీడీ–1, మరాఠీ–1, స్పెషల్ ఎడ్యుకేషన్–9, పీజీహెచ్ఎం–22 పోస్టులు భర్తీ చేయనున్నారు. -
హాస్టల్లో విద్యార్థులను కొట్టిన సీఆర్టీ
● విచారణ చేపట్టిన ఐటీడీఏ పీవో ● సీఆర్టీ లాలుసింగ్పై బదిలీ వేటు ● వాచ్మెన్, కుక్లకు నోటీసులు బోథ్: మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్ విద్యార్థులను సీఆర్టీ లాలుసింగ్ గురువారం చితకబాదారు. దీంతో పలువురు విద్యార్థులకు మోకాళ్లపై గాయాలు కాగా వారు ఆందోళనకు దిగారు. విషయం తె లుసుకున్న ఏఐఎస్ఎఫ్ నాయకులు హాస్టల్కు చేరుకోగా విద్యార్థులు గోడు వెల్లబోసుకున్నారు. లాలు సింగ్ విధుల్లో చేరిన నుంచి తమకు భోజనం సరిగా అందించడం లేదని, తరచూ కొడుతున్నారని, అ న్నంలో పురుగులు వస్తున్నాయని ఆరోపించారు. స మాచారం అందుకున్న ఐటీడీఏ పీవో ఖుష్బూ గు ప్తా హాస్టల్కు చేరుకున్నారు. ఘటనపై విచారణ చే పట్టారు. విద్యార్థుల ద్వారా విషయం తెలుసుకున్నారు. విద్యార్థులను కొట్టడమేమిటని లాలుసింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేసి అతడిపై బదిలీ వేటు వేశా రు. వంట పని చేస్తున్న సుకుమాబాయి, కామాటిగా విధులు నిర్వహిస్తున్న సావిత్రీబాయికి షోకాజ్ నోటీసులిచ్చారు. వంట సామగ్రి, రికార్డులు, స్టాక్ వివరాలు పరిశీలించారు. మరుగుదొడ్లు సరిగా లేకపోవడంతో ఒక్కరోజులోనే బాగు చేయించాలని ఏఈ సునీల్ను ఆదేశించారు. నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. గదుల్లో ఫ్యాన్లు తిరగడం లేదని విద్యార్థులు తెలుపగా.. వెంటనే సమస్యలన్నీ పరిష్కరించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థుల పఠన సామర్థ్యాలను పరిశీలించారు. -
సమష్టి కృషితో గ్రామాలాభివృద్ధి
జైనథ్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి కృషతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే పా యల్ శంకర్ తెలిపారు. మండలంలోని జైనథ్, బెల్గం గ్రామాల్లో గురువారం ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. ఇళ్ల నిర్మాణాల కు భూమిపూజ చేశారు. బెల్గం గ్రామంలో రూ.20 లక్షలతో చేపట్టిన పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇందిరమ్మ పథకాలతో అర్హులందరికీ ఇళ్లు మంజూరవుతాయని తెలిపారు. పొలం బాట కార్యక్రమం ద్వారా పొలాలకు రోడ్ల సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రజాప్రతి నిధులు, నాయకులు అడ్డి భోజారెడ్డి, అల్లూరి అశోక్రెడ్డి, బోయర్ విజయ్, కరుణాకర్రెడ్డి, రాందాస్, అశోక్రెడ్డి, రమేశ్, సూర్య, ప్రతాప్యాదవ్, విశాల్, నరేశ్, సాయి తదితరులు పాల్గొన్నారు. -
రేషన్కార్డుల పంపిణీ
బజార్హత్నూర్: మండల కేంద్రంలోని రైతువేదికలో కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే అనిల్జా దవ్ గురువారం మండలానికి చెందిన 160 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్కార్డులు పంపి ణీ చేశారు. వారు మాట్లాడుతూ.. రేషన్కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, కొత్తగా పెళ్లయినవారు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అనంతరం పీఏసీఎస్ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. యూరియా, కాంప్లెక్స్ ఎరువుల నిల్వలు పరిశీలించారు. అ డిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్స య్య, ఆత్మ చైర్మన్ గొర్ల రాజుయాదవ్, పీఏసీ ఎస్ చైర్మన్ మేకల వెంకన్న, తహసీల్దార్ శ్యాంసుందర్, ఎంపీడీవో శ్రీనివాస్ పాల్గొన్నారు. గుడిహత్నూర్ మండల కేంద్రంలో.. గుడిహత్నూర్: మండల కేంద్రంలోని రైతువేదికలో కలెక్టర్ రాజర్షిషా, ఎమ్మెల్యే అనిల్జాద వ్ లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నర్సయ్య, తహసీల్దార్ కవితారెడ్డి, నాయకులు సంజీవ్కుమార్, ప్రకాశ్ తదితరులున్నారు. -
చీరలు కట్టి.. చెట్లుగా మార్చారు!
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖరా కె గ్రామస్తులు హరితహారం అమల్లో ఆదర్శంగా నిలిచారు. 2021 జూలై 24న కేటీఆర్ జన్మదినం సందర్భంగా గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. వాటిని సంరక్షించేందుకు వినూత్న ఆలోచన చేశారు. గ్రామ సర్పంచ్ గాడ్గే మీనాక్షి సొంతంగా ఖర్చు చేసి చీరలు కొనుగోలు చేశారు. మొక్కలకు ప్లాస్టిక్ కంచెలు వేసి వాటి చుట్టూ చీరలు కట్టారు. నాడు నాటిన మొక్కలు వృక్షాలుగా ఎదిగి హరిత తోరణంలా కనిపిస్తున్నాయి. గ్రామానికి వచ్చేవారికి స్వాగతం పలికేలా పచ్చని పందిరి ఇలా కనువిందు చేస్తోంది. - సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్పచ్చని అంచున పొగమంచు.. సహ్యాద్రి పర్వతాలుగా పిలుచుకునే మహబూబ్ (నిర్మల్) ఘాట్స్ ఈ సీజన్లో బాగా ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్–నాగపూర్ దారిలో పాత ఎన్హెచ్–44 దారిలో నిర్మల్ జిల్లా కేంద్రానికి 10–12 కి.మీటర్ల దూరంలో ఈ సహ్యాద్రి పర్వతాలు స్వాగతం పలుకుతాయి. ఒంపులు, ఘాట్ రోడ్డు చుట్టూ పచ్చని, ఎత్తయిన చెట్లతో వానాకాలంలో ఇక్కడి వాతావరణం ఆకట్టుకుంటుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్బొగత జలపాతం వద్ద సందడివాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బొగత జలపాతం (Bogatha Waterfall) వద్ద బుధవారం పర్యాటకులు సందడి చేశారు. ఈ సందర్భంగా ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేశారు. కాగా, ఇటీవల వర్షాలు విస్తారంగా కురువడంతో జలపాతం ఉధృతంగా ప్రవహించింది. దీంతో అధికారులు జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రవాహం తగ్గడంతో పర్యాటకులను నిబంధనల మేరకు అనుమతిస్తున్నారు. దీంతో జలపాతానికి పర్యాటకులు తరలొచ్చారు. పర్యాటకుల ప్రతీ వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాతే సిబ్బంది లోపలికి పంపిస్తున్నారు.మమతానురాగాల రాఖీ అన్నా చెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ల అనురాగ బంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి. ఈ పర్వదినం సమీపిస్తున్న తరుణంలో మార్కెట్లో విభిన్న రకాల రాఖీలు దర్శనమిస్తున్నాయి. ఇప్పటినుంచే కొనుగోలుదారులతో దుకాణాలు సందడిగా మారాయి. హైదరాబాద్ నగరంలోని బేగంబజార్లో రాఖీల విక్రయాలు జోరందుకున్నాయి.చదవండి: విశాఖ టు జోగిపేట వయా వికారాబాద్! -
ప్రణాళికాబద్ధంగా సమస్యల పరిష్కారం
నిరుద్యోగ అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు గ్రంథాలయాలకు వస్తున్నారు. ముఖ్యంగా వారు కాంపిటేటివ్ పుస్తకాలు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులతో చర్చించి తగు చర్యలు చేపడతా. అలాగే ఉద్యోగుల నియామకం గురించి గ్రంథా లయ సంస్థ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్తా. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉన్న అసంపూర్తి భవనాన్ని త్వరితగతిన అందుబాటులోకి తెచ్చేలా కృషి చేస్తా. ప్రణాళికాబద్ధంగా సమస్యల పరిష్కారానికి పాటుపడతా. –మల్లెపూల నర్సయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ -
ఆకట్టుకున్న స్థానిక ఉత్పత్తుల ప్రదర్శన
కైలాస్నగర్: నీతి ఆయోగ్ ఆకాంక్ష హాట్– వోకల్ ఫర్ లోకల్ పేరిట జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన స్థానిక ఉత్పత్తుల ప్రదర్శన ఆకట్టుకుంటుంది. జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఆదివాసీ కళాకారులు తయారు చేసిన మిల్లెట్ బిస్కెట్లు, జ్యూట్ బ్యాగులు తదితర వస్తువులను ఇందులో ప్రదర్శనకు ఉంచారు. ఆగస్టు 3 వరకు కొనసాగనున్న ప్రదర్శనను కలెక్టర్ రాజర్షి షా బుధవారం ప్రారంభించారు. వివిధ స్టాల్స్ను సందర్శించారు. ఉత్పత్తుల తయారీ విధానం అడిగి తెలుసుకున్నారు. మన గ్రామీణ పారిశ్రామికులను ప్రోత్సహించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో జితేందర్రెడ్డి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, జిల్లా అధికారులు, నీతి ఆయోగ్ ప్రతినిధి రాహుల్, తదితరులు పాల్గొన్నారు. -
రేషన్కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ
● కలెక్టర్ రాజర్షి షా బోథ్: రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బోథ్, సొనాల, నేరడిగొండ మండలాలకు చెందిన 212 మంది లబ్ధిదారులకు రేషన్కార్డు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే అనిల్జాదవ్తో కలిసి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్హులందరికీ కార్డులు అందజేస్తామన్నారు. ఇందులో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఆర్డీవో స్రవంతి, తహసీల్దార్ సుభాష్ చందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు పరచాలి ఇచ్చోడ: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోని రైతు వేదికలో ఇచ్చోడ, సిరికొండ మండలాల లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, రాజకీయలతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అమలుపరచాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఇచ్చోడ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యవతి కోటేశ్, వైస్ చైర్మన్ చౌహాన్ శేషారావు, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆదిలాబాద్ ఆర్డీవో స్రవంతి, ఇచ్చోడ, సిరికొండ తహసీల్దార్లు సత్యనారాయణరావు, తుకారాం తదితరులు పాల్గొన్నారు. -
గాడిన పడేనా!
● సమస్యల్లో విజ్ఞాన భాండాగారాలు ● ఇబ్బందులు తీర్చాలంటున్న పాఠకులు ● గ్రంథాలయ జిల్లా చైర్మన్పై గంపెడాశలుఆదిలాబాద్: జిల్లావ్యాప్తంగా విజ్ఞాన భాండాగా రాలు సమస్యలకు నిలయంగా మారాయి. జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండల కేంద్రాల్లో ఉన్న గ్రంథాలయాల పరిస్థితి అధ్వానంగా మారింది. అరకొర వసతులు, సరిపడా సిబ్బంది లేక అలంకా రప్రాయంగా దర్శనమిస్తున్నాయి. పాఠకులు, నిరుద్యోగ అభ్యర్థులకు అవస్థలు తప్పడం లేదు. ఇటీవల గ్రంథాలయ సంస్థ జిల్లా నూతన చైర్మన్గా మల్లెపూల నర్సయ్య నియామకంతో సమస్యల పరిష్కారంపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇదీ పరిస్థితి.. పట్టణంలోని భుక్తాపూర్ కాలనీలో గల జిల్లా కేంద్ర గ్రంథాలయానికి పాఠకులు, నిరుద్యోగ అభ్యర్థులు వందల సంఖ్యలో వస్తుంటారు. అయితే ఇప్పటికీ దశాబ్దాల క్రితం నిర్మించిన భవనంలోనే పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన దుస్థితి. నూతన భవనం పూర్తి స్థాయిలో నిర్మాణం కాకపోవడంతో ఇరుకై న పాత భవనంలోనే కాలం వెల్లదీయాల్సి వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ నోటిఫికేషన్ల నేపథ్యంలో ప్రిపరేషన్ కోసం నిరుద్యోగ అభ్యర్థులు సమీప గ్రా మాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. అయితే పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో లేకపోవడంతో వేలాది రూపాయలు వెచ్చించి సొంతంగా కొనుక్కోవాల్సి వస్తుంది. విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా తూతూ మంత్రంగా ఒకటి, రెండు పుస్తకాలు తెచ్చి చేతులు దులుపుకుంటున్నారని నిరుద్యోగ అభ్యర్థులు పేర్కొంటున్నారు. మండల కేంద్రాల్లో మరీ దారుణం.. ఇక మండల కేంద్రాల్లోని గ్రంథాలయాల విషయానికి వస్తే సొంతభవనాలు లేకపోవడం గమనార్హం. అద్దె భవనాల్లో చాలీచాలని వసతుల నడుమ నిర్వహిస్తూ మమ అనిపిస్తున్నారు. పుస్తకాల విషయం పక్కన పెడితే కనీసం దినపత్రికలు సైతం అందుబాటులో ఉంచకపోవడంతో పాఠకుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆయా గ్రంథాలయాల్లో లైబ్రేరియన్లకు బదులు ఏళ్లుగా రికార్డు అసిస్టెంట్లతో నెట్టుకు వస్తున్నారు. మరోవైపు గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు లైబ్రరీ సెస్ వసూలు చేస్తున్నప్పటికీ గ్రంథాలయ సంస్థకు బకాయిలు ఉంటుండడంతో ప్రగతి జరగట్లేదని సంబంధిత అధికారులే పేర్కొంటుండడం గమనార్హం. -
కొబ్బరి బోండాల విక్రయదారులపై బల్దియా కొరడా
కై లాస్నగర్: సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో కొబ్బరి బోండాల విక్రయదారులపై బల్దియా అధికారులు కొరడా ఝుళిపించారు. అసిస్టెంట్ కమిషనర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య టౌన్ ప్లానింగ్ అధికారులు బుధవారం పట్టణంలోని రిమ్స్, ప్రభుత్వ డైట్ కళాశాల వద్ద గల కొబ్బరిబొండాల దుకాణాలను పరిశీలించారు. ఖాళీ బోండాలను తొలగించకుండా చెత్తలా నిల్వచేసినందుకు గాను 24 మంది యజమానులకు రూ.500 చొప్పున రూ.12,000 జరిమానా విధించారు. మరోసారి పునరావృతం అయితే బోండాలతోపాటు తోపుడుబండ్లను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఇందులో శానిటరీ ఇన్స్పెక్టర్ భైరీ శంకర్, టీపీఎస్ నవీన్కుమార్, టీపీబీవో సాయికృష్ణ, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ రవికిరణ్, ఏరియా జవాన్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
● 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ ● వర్తింపజేయాలని హైకోర్టు తీర్పు ● ఫలించిన టీచర్ల న్యాయ పోరాటం
ఆదిలాబాద్టౌన్: 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు హైకోర్టు తీర్పు ఊరటనిచ్చింది. పాత పెన్షన్ విధా నం వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ టీచర్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. రెండు దశాబ్దాల తర్వాత సమస్య పరిష్కారానికి నోచుకోవడంతో వారిలో ఆనందం వ్యక్తమవుతుంది. న్యాయస్థాన తీర్పుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 746 మంది ఉపాధ్యాయులకు ప్రయోజనం చే కూరనుంది. ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయులు సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చే యాలని ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2004 సెప్టెంబర్ 1 నుంచి సీపీఎస్ అమలు చేశారు. ఈ నిర్ణయంకు ముందే 2003 డీఎస్సీ ఉపాధ్యాయుల నియామకం జరిగినప్పటికీ పోస్టింగ్ ఇవ్వకపోవడంతో వీరికి సీపీఎస్ అమలు చేశారు. దీంతో 2019, 2020 సంవత్సరాల్లో పలు వురు ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించి పిటిషన్లు దాఖలు చేశారు. ఎట్టకేలకు వారి పోరా టం ఫలించింది. మంగళవారం హైకోర్టుడీఎస్సీ 2003 టీచర్లకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాటి నుంచి నేటి వరకు.. 2003 నవంబర్ 14న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాగా, అభ్యర్థులు పరీక్ష రాశారు. ఎంపికై న వారికి 2005 నవంబర్ 23న నియామకాలు చేపట్టారు. మరోవైపు 2004 సెప్టెంబర్ 1 నుంచి సీపీఎస్ అమలులోకి వచ్చింది. ప్రభుత్వం నియామకాలు చేపట్టినప్పటి నుంచి సీపీఎస్ అమలవుతుందని చెప్పడంతో వీరికి ఇప్పటివరకు అదే అమలు చేశారు. అ యితే 2019లో వీరితో నియామకమైన న్యాయశాఖ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించడంతో వారికి అనుకూలమైన తీర్పు వచ్చింది. ఆ తీర్పు పత్రాలతో కో ర్టులో పిటిషన్ దాఖలు చేయగా తమకు సైతం పా త పెన్షన్ విధానం వర్తింపజేయాలని న్యాయస్థానంతీర్పునిచ్చినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో.. డీఎస్సీ 2003లో ఉమ్మడి జిల్లాలో 746 పోస్టులకు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఏజెన్సీ ప్రాంతంలో 317 పోస్టులకు నియామకాలు చేపట్టగా, మైదాన ప్రాంతంలో 429 పోస్టులను భర్తీ చేసింది. ఇందులో ఎస్జీటీ పోస్టులు 372, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 264, భాషా పండిత పోస్టులు 98, పీఈటీ పోస్టులు 12 ఉన్నాయి. ఈ డీఎస్సీ ద్వారా నియామకమైన ఉపాధ్యాయులు ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధిలో పనిచేస్తున్నారు. కొంత మంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందారు. హైకోర్టు తీర్పు హర్షణీయం కేంద్రం విడుదల చేసిన మెమో 57/4, 57/5 ప్రకారం హైకోర్టు తీర్పు ఇచ్చింది. పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం హర్షణీయం. జీవన భద్రతకు ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలి. జీపీఎఫ్ నంబర్ను 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కేటాయించాలి. – అన్వర్, ఉపాధ్యాయుడు పోరాటాల ఫలితంగా.. మేము 2003 డీఎస్సీ ద్వారా నియామకం అయయ్యాం. నియామక ప్రక్రియ రెండేళ్లు ఆలస్య కావడంతో నష్టపోయాం. కొన్నేళ్లుగా సీపీఎస్ రద్దు చేయాలని పోరాటాలు చేస్తున్నాం. 2019లో కోర్టులో పిటిషన్ వేశాం. హైకోర్టు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోరాట ఫలితంగానే మా హక్కులను సాధించుకున్నాం. – నీల, ఉపాధ్యాయురాలు -
‘వీపీవో’ అమలు పర్చాలి
ఆదిలాబాద్టౌన్: పోలీసు అధి కారులు గ్రామాలను సందర్శి స్తూ వీపీవో విధానం పకడ్బందీ గా అమలు చేయాలని ఎస్పీ అ ఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు హెడ్క్వార్టర్స్లోని సమావేశ మందిరంలో బుధవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలో మరింత గస్తీ చేపట్టాలని, నేరాల అదుపునకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డ్రంకెన్డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ ప్రమాదాలను అరికట్టాలని సూ చించారు. పోలీసులు మీకోసం కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు పోలీసులపై నమ్మకాన్ని పెంపొందించాలన్నారు. స్టేషన్లలో వర్టి కల్ విధానాన్ని పూర్తిగా అమలుపర్చాలన్నారు. ఫిర్యాదుదారులపై మర్యాదగా ప్రవర్తిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రానున్న గణపతి ఉత్సవాలు, పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల కోసం సంసిద్ధులుగా ఉండాలని ఆదేశించారు. జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. జిల్లాలో నమోదైన కేసుల స్థితిగతులపై కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేయాలని తెలిపారు. ఇందులో అదనపు ఎస్పీ బి.సురేందర్ రావు, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, డీఎస్పీలు జీవన్రెడ్డి, పోతారం శ్రీనివాస్, హసీబుల్లా, నాగేందర్, ఇంద్రవర్ధన్, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు. -
‘నాగోబా’కు నీరా‘జనం’
ఇంద్రవెల్లి: నాగుల పంచమి సందర్భంగా ఆదివాసీ ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబా ఆలయం మంగళవారం భక్తజన సంద్రమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీసంఖ్యలో భక్తులు వచ్చి గంటల తరబడి క్యూలైన్లలో నిల్చుని నాగోబాను దర్శించుకున్నారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ, రాజ్గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావ్ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం మెస్రం వంశీయులు అతడిని శాలువాలతో సన్మానించారు. మెస్రం వంశీ యులు భక్తులకు జొన్న గట్కాతో కూడిన ప్రసాదం పంపిణీ చేశారు. ఆలయ ఆవరణలో వెలిసిన దుకా ణాల వద్ద సందడి నెలకొంది. ఆలయ ప్రాంగణంలో శ్రీనాగోబా యూత్ ఆధ్వర్యంలో కబడ్డీ, వాలీబా ల్ పోటీలు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్, మెస్రం వంశీయులు మెస్రం కోసేరావ్, నాగ్నాథ్, మెస్రం శేఖర్బాబు, దేవ్రావ్, వంశ పెద్దలు మెస్రం బాదిరావ్, ఆనంద్రావ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సారెస్పీలోకి 65వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో
మామడ: ఎగువ కురుస్తున్న వర్షాలకు క్రమంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటి నిల్వ పెరిగింది. మంగళవారం 65వేల క్యూసెక్కుల వరద చేరింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నిల్వ 1,091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1,076.60 అడుగులు (36. 464 టీఎంసీలు) నీటి నిల్వ ఉంది. దీంతో సరస్వతీ ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తంజేస్తున్నారు. నవోదయలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగింపుకాగజ్నగర్టౌన్: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యాసంవత్సరానికి ఆరోతరగతిలో ప్రవేశాల కోసం ఈ నెల 29వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తు గడువు ఉండగా ఆగస్టు 13వ తేదీ వరకు పొడగించినట్లు కాగజ్నగర్ జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్ రేపాల కృష్ణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని కోరారు. https:// cbseitms. rcil. gov. in/ nvs/ వెబ్సైట్ ఓపెన్ చేసి క్యాండిడెట్ కార్నర్లో రిజిస్ట్రేషన్ ఫర్ 6వ తరగతి 2026–27ను క్లిక్ చేసి అప్లికేషన్ ఫాం ఫిల్ చేసుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థులకు ల్యాప్ట్యాప్లు ఉట్నూర్రూరల్: మండలంలోని గిరిజన విద్యార్థులకు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా మంగళవారం ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ మె మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులు ఉన్నత వి ద్యలో ప్రతిభ కనబరిచి ఆదర్శంగా నిలవాలని సూ చించారు. పెంబి మండలం పాశపుల గ్రామానికి చెందిన గుగ్లావత్ వామనరావ్కు జేఈఈ మెయిన్స్ పరీక్షల కోసం, ఉట్నూర్ మండలం శంకర్తండా గ్రామానికి చెందిన రాథోడ్ మనోజ్కు ఐఐటీ చదవుల కోసం వారి తల్లిదండ్రుల సమక్షంలో ల్యాప్ టాప్లు అందజేసినట్లు తెలిపారు. పట్టుదలతో ల క్ష్యాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. -
12 టీఎంసీలకు చేరువలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎల్లంపల్లి ప్రా జెక్ట్ 12 టీఎంసీల నీటి మట్టానికి చేరువలో ఉంది. ఐదురోజుల్లోనే ఏకంగా ఐదు టీఎంసీల నీ టిమట్టం పెరిగింది. మంగళవారం మంచిర్యా ల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి గుడిపేట వద్ద గల ఎల్లంపల్లి (శ్రీపాదసాగర్) ప్రాజెక్ట్ నీటి మట్టం వివరాలిలా ఉన్నాయి. 148 మీటర్ల క్రస్ట్ లెవెల్ కాగా, 144 మీటర్లకు చేరింది. 20.175 టీఎంసీలకు 11.500 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 440 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉండగా, అవుట్ ఫ్లో కింద హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్ సుజల స్రవంతి పథకానికి 319 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు తరులుతోంది. -
శాంతిఖని గనిలోకి దిగిన డీఎంఎస్
బెల్లంపల్లి: మందమర్రి ఏరియా శాంతిఖని భూగర్భ గనిని మంగళవారం డైరెక్టర్ ఆఫ్ మై న్స్ సేప్టీ (డీఎంఎస్) ఎన్.నాగేశ్వరరావు సందర్శించారు. గనిలో దిగి పని స్థలాలు, రక్షణ చ ర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. ప్రమాదరహిత సింగరేణి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూ చించారు. బొగ్గు ఉత్పత్తి యాగంలో ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆయన వెంట మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ దేవేందర్, శాంతిఖని గ్రూప్ ఆఫ్ మైన్స్ ఏజెంట్ అబ్దుల్ ఖదీర్, బాలాజీ భగవంత్ ఝా, గని మేనేజర్ సంజయ్కుమార్ సిన్హా, రక్షణ, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
● మైనర్ మ్యారేజీల నియంత్రణకు చర్యలు ● ‘బాల్య వివాహాల ముక్త్ భారత్’తో అడ్డుకట్ట వేస్తున్న కేంద్ర ప్రభుత్వం ● ఆసిఫాబాద్ జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం
ఆసిఫాబాద్: జిల్లాలో తరచూ బాల్యవివాహాలు జ రుగుతున్నాయి. నియంత్రణకు ప్రభుత్వం పలు అ వగాహన కార్యక్రమాలు చేపడుతున్నా ఫలితం కానరావడంలేదు. నిరక్షరాస్యత, ఆర్థిక వెనుకబాటుత నం, ఆడ పిల్లలకు అభద్రత భావం, పేదరికం, సా మాజిక దురాచారాలు, కట్టుబాట్ల కారణంగానే బా ల్య వివాహాలు కొనసాగుతున్నాయి. వీటి నియంత్ర ణకు కేంద్ర ప్రభుత్వం ఓ కార్యాచరణ రూపొందించింది. 2030 నాటికి బాల్యవివాహాల ముక్త్ భారత్ లక్ష్యంతో ముందుకువెళ్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని కుమురంభీం ఆసిఫాబాద్తోపాటు ఖమ్మం, భూపాల్పెల్లి జిల్లాలను ఎంపిక చేసింది. ఏడేళ్లలో 153 వివాహాల అడ్డగింత బాల్యవివాహాల నియంత్రణలో భాగంగా తాజాగా కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పురుషుడి వివాహ వయస్సు 21, స్రీల వివాహ వయ స్సు 18 ఏళ్లు తప్పనిసరి. బాల్య వివాహాలపై తర చూ జిల్లా అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా గ్రామీణ ప్రజల్లో మార్పు రావడంలే దు. ఏటా జిల్లాలో బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ముందస్తు సమాచారం అందుకుంటున్న జిల్లా బాలల సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో అధికారులు పలు వివాహాలు అడ్డుకున్నారు. గత ఏడేళ్లలో జిల్లా వ్యాప్తంగా 153 బాల్య వివాహాలను అడ్డుకుని వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రత్యేక హబ్లుగా.. జిల్లాలో బాల్యవివాహాలు అధికంగా జరుగుతున్న పది గ్రామాలను ఎంపిక చేసి ప్రత్యేక హబ్లుగా తీర్చిదిద్దనున్నారు. బాల్యవివాహాలతో కలిగే అనర్ధాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తద్వారా వీటిని బాల్య వివాహ రహిత గ్రామాలుగా మారుస్తారు. ప్రతీనెల పాఠశాలల్లో డ్రాపౌట్లు, సుదీర్ఘకాలం గైర్హాజరైన బాలికలను గుర్తించి ఆ జాబితాలను అంగన్వాడీ టీచర్ జిల్లా బాలల సంరక్షణ యూనిట్లకు పంపిస్తారు. గైర్హాజరుకు కారణాలపై విచారణ జరిపిస్తారు. జిల్లాలో ఇలా.. జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో బాల్యవివాహా లను జిల్లా బాలల సంరక్షణ అధికారి, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అడ్డుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని దస్నాపూర్, ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్, గుండి, రెబ్బెన మండలం నారాయణపూర్, వంకులం, పర్శనంబాల, వాంకిడి మండలం ఇందాని, పెంచికల్పేట్ మండలం చెడ్వాయి, బారెగూడ, బెజ్జూర్ మండలం నాగుల్వాయి, బాబాసాగర్, కర్జెల్లి, కాగజ్నగర్ మండలం బట్టుపెల్లి, చింతగూడ, దహెగాం, చీలపెల్లి గ్రామాల్లో బాల్యవివాహాలను అడ్డుకున్నారు. అధికారుల మాటను నిర్లక్ష్యం చేసిన ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. జిల్లాలో అధికారులు అడ్డుకున్న బాల్య వివాహాల వివరాలు సంవత్సరం అడ్డుకున్న కేసులు 2019 38 2020 29 2021 24 2022 23 2023 18 2024 15 2025 06 మొత్తం 153 -
జనగణనలో షెడ్యూల్డ్ ట్రైబ్ కాలమ్ పొందుపరచాలి
ఆదిలాబాద్: 2027లో చేపట్టనున్న జనగణనలో ఆ దివాసీలకు సంబంధించి షెడ్యూల్డ్ ట్రైబ్గా గుర్తించే ప్రత్యేక కాలమ్ పొందుపరచాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మను తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) నాయకులు కోరారు. మంగళవా రం హైదరాబాద్లో గవర్నర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధా న కార్యదర్శి పూసం సచిన్ మాట్లాడుతూ.. జనగణ నలో కాలమ్ పొందుపరిచే అంశాన్ని కేంద్రానికి సి ఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. 50శాతానికి మించి జనాభా ఉన్న ఆదివాసీ గ్రామాలను షెడ్యూల్డ్ గ్రామాలుగా గుర్తించాలని కోరారు. ఆదివాసీలకు ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలున్న నేపథ్యంలో షెడ్యూల్ ట్రైబ్ మతంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశా రు. అనేక సమస్యల నుంచి నాన్ షెడ్యూల్డ్ గ్రామాలుగా ఉన్న కారణంగా ఆదివాసీ గ్రామాలకు ఐటీడీఏ పథకాలు అందడంలేదని తెలిపారు. ఏజెన్సీ ప్రాంత హక్కులు ఆ ప్రాంతవాసులు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్ను కలిసినవారిలో మాజీ ఎంపీ మీడియం బాబురావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, నాయకులు రవికుమార్, శ్రీరామ్, ధర్మ తదితరులున్నారు. -
మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య
కుభీర్: మండలంలోని రంజని గ్రామానికి చెందిన జాదవ్ సచిన్ (24) మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై క్రిష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సచిన్ మంగళవారం మద్యం తాగి ఇంటికి రాగా కుటుంబీకులు మందలించారు. దీంతో తాగిన మైకంలో సచిన్ తన వ్యవసాయ చేనులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి చిన్నాన్న శివరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. వాటోలిలో ఉరేసుకుని ఒకరు.. భైంసారూరల్: మండలంలోని వాటోలి గ్రామానికి చెందిన బాదోళ్ల మహేశ్ (31) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై శంకర్, స్థానికులు తెలిపి న వివరాల ప్రకారం.. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే మహేశ్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచా రం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబీకుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కూతురు ఉంది. జంగుగూడలో మరొకరు.. పెంబి: మద్యం తాగవద్దని భార్య మందలించినందుకు మనస్తాపానికి గురైన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై హన్మాండ్లు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని షెట్పల్లి పరిధి జంగుగూడ గ్రామానికి చెందిన మోస్రం కృష్ణ (31) మ ద్యానికి బానిసై ఏ పనీ చేయకుండా తరచూ భార్యతో గొడవపడేవాడు. మద్యం తాగవద్దని భార్య గీత మందలించగా మనస్తాపానికి గురై సోమవారం రా త్రి 11గంటలకు పురుగుల మందు తాగాడు. గుర్తించిన కుటుంబీకులు ఖానాపూర్ ప్రభుత్వాస్పత్రికి త రలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ తెలి పారు. భార్య గీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఉద్యోగం రాలేదని ఉరేసుకున్నాడుకెరమెరి(ఆసిఫా బాద్): ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై మధూకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దేవుడ్పల్లికి చెందిన జాడి నానాజీ– విమలాబాయి దంపతులకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లున్నారు. వీరిలో చిన్నవాడు నవీన్ (24) ఉన్నత చదువులు చదివాడు. ఇటీవల డీఎ స్సీ, ఇతర పోటీ పరీక్షలు రాసినా ఉద్యోగం రాలేదు. దీంతో రోజూ బెంగపడుతుండేవాడు. ఈక్రమంలో సోమవారం ఇంటినుంచి బయటకువెళ్లిన నవీన్ సాయంత్రమైనా తిరిగి రాలేదు. అతడి కోసం కుటుంబీకులు వెతకగా సమీపంలోని ఓ చెట్టు కింద శవమై కనిపించాడు. అయితే అతడు చెట్టుకు ఉరేసుకోగా తాడు తెగి బండరాళ్లపై పడ్డట్లు ఆనవాళ్లున్నాయని మృతుడి తండ్రి నానాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
జాతీయ విద్యాసదస్సులో రంగయ్య
కెరమెరి(ఆసిఫాబాద్): ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన జాతీయ విద్యాసదస్సుల్లో మండలంలోని సావర్ఖెడా పీఎంశ్రీ ప్రాథమిక పాఠశాల ప్రధానో పాధ్యాయుడు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవా ర్డు గ్రహీత కడేర్ల రంగయ్య పాల్గొన్నారు. అఖిల భారతీయ శిక్షా సమాగం (ఏబీబీఎస్) ఐదో వార్షి కోత్సవం సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్వంలో నిర్వహించిన ఈ సదస్సులో ఎన్ఈపీ (నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ) –2020లో ఎలాంటి మార్పులు జరిగాయి, విద్యాభివృద్ధికి తీసుకోవాల్సి న చర్యలు.. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి చర్చించినట్లు రంగయ్య తెలిపారు. సదస్సులో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, వివిధ రాష్ట్రాల మంత్రులు, ప్రొఫెసర్లు, తెలంగాణ రాష్ట్రం నుంచి ఏడుగురు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు, ఐదుగురు ఇన్నోవేటర్ స్టూడెంట్స్ పాల్గొన్నట్లు పేర్కొన్నారు. -
నకిలీ ఆయుర్వేదిక్ అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: నకిలీ ఆయుర్వేదిక్ వైద్యంతో మో సగిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. తొమ్మిది మంది పై కేసు నమోదు చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చే యగా ఒకరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్ర ధాన నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పా టు చేసి గాలిస్తున్నట్లు తెలిపారు. ఆరు ద్విచక్రవాహనాలు, 15 ఫోన్లు, సిమ్ కార్డులు, నకిలీ ఆయుర్వేదిక్ మందులు, రూ.10వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. బ్యాంక్ ఖాతాలో ఉన్న మరో రూ.23వేల నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం జిల్లా కేంద్రంలోని వన్టౌన్ పోలీస్స్టేషన్లో వెల్ల డించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆది లాబాద్ పట్టణంలో సాయి ఆయుర్వేదిక్ మందుల దుకాణం పేరిట కర్ణాటకకు చెందిన ముఠా సభ్యులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, సూపర్ మార్కెట్ల వద్ద అనారోగ్యంతో కని పించిన బాధితుల వివరాలు సేకరిస్తారు. ఇదే సమస్య ఉన్న తమ కుటుంబీకులను ఆయుర్వేద బాబాకు చూపిస్తే నయమైనట్లు నమ్మిస్తారు. వారి సెల్ నంబర్ సేకరించి ప్రధాన నిందితుడు కుమార్ బాబాకు ఇస్తారు. బాబా సాయంత్రం వారికి ఫోన్ చేసి సమస్యకు తన వద్ద పరిష్కారం ఉందని నమ్మిస్తాడు. ముఠాలోని ఓ సభ్యుడిని వారింటికి పంపించి వారిని ఆయుర్వేద దుకాణానికి రప్పిస్తాడు. 5 గ్రాములు, 10 గ్రాముల నకిలీ మూలికలు ఇచ్చి రూ.5వేల నుంచి రూ.10వేల చొప్పున వసూలు చే స్తాడు. జిల్లా పోలీసులు వారి అక్రమాలను బట్టబయలు చేశారు. వీరిపై వన్టౌన్ పోలీస్స్టేషన్లో–6, టూటౌన్లో–1, మావల పోలీస్స్టేషన్లో–2 కేసులు నమోదైనట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల్లో కర్ణాటకు చెందిన కుమార్ పరారీలో ఉండగా, గాజీపూర్ కు చెందిన శేఖర్ రెడ్లైన్, ఉగర్ఖర్ద్కు చెందిన పెంద్రేకుమార్, దరావడ్కు చెందిన గోలార్ సంతోష్, గుల్బర్గాకు చెందిన కొడంగల్ అమ్రేశ్, ఉబ్లికి చెందిన గోలార్ ఆనంద్, గోగక్కు చెందిన యలిగర్ హ జ్రత్, గుల్బర్గాకు చెందిన నగేశ్, అనిల్కుమార్ ఉన్న ట్లు పేర్కొన్నారు. సిద్దిపేటలో ఒకరి నుంచి రూ.7లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిపారు. ప్రజలు గు ర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే వై ద్యం చేసుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ డీఎ స్పీ జీవన్రెడ్డి, వన్టౌన్, టూటౌన్, మావల సీఐలు సునీల్కుమార్, కరుణాకర్రావు, స్వామి ఉన్నారు. ఎనిమిదిమంది నిందితుల అరెస్ట్ ఆరు ద్విచక్రవాహనాలు స్వాధీనం 15 సెల్ఫోన్లు, మందులు కూడా.. వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్ -
‘మధ్యాహ్నం’ ఎప్పుడో!
● అవస్థల్లో ఇంటర్ విద్యార్థులు ● అల్పాహారం చేసి కాలేజీలకు.. ● ఖాళీ కడుపుతో తిరిగి ఇళ్లకు.. ● అర్ధాకలితో అలమటిస్తున్న వైనం చెన్నూర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రభుత్వం మఽధ్యాహ్న భోజన పథకం అమలు చేయడంలేదు. దీంతో గ్రామీణ విద్యార్థులు అర్ధాకలితో చదువులు కొనసాగిస్తున్నారు. జిల్లాలో వేలాదిమంది గ్రామీణ విద్యార్థులు పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యాభ్యాసం చేస్తూ నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ఉదయం అల్పాహారం తీసుకుని ఇంటి నుంచి క ళాశాలలకు వస్తున్న విద్యార్థులు తిరిగి ఇంటికి వెళ్లే సరికి సాయంత్రం 6గంటలవుతోంది. అప్పటివరకు భోజనం లేక నీరసించి పోతున్నారు. ప్రతీ కళాశాలలో 100–200 మందికి పైగా విద్యార్థులుండగా హాజరు శాతం అంతంత మాత్రంగా ఉంటోందని అధ్యాపకులు చెబుతున్నారు. ఇందులో గ్రామీణ విద్యార్థులే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు తెలిపారు. గతంలో దాతల సాయంతో.. మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గంలో 2015 నుంచి 2017 వరకు అప్పటి ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, 2019లో అప్పటి ఎమ్మెల్యే బాల్క సుమన్ మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించి గ్రామీణ ఇంటర్ విద్యార్థుల ఆకలి తీర్చారు. కరోనా వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం నిలిచిపోయింది. గత ఎమ్మెల్యేల మాదిరిగా దాతలు ముందుకువచ్చి జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. జిల్లాల వారీగా ప్రభుత్వ కళాశాలలు, విద్యార్థుల వివరాలు జిల్లా కళాశాలలు ప్రథమ ద్వితీయ మొత్తం మంచిర్యాల 10 2,160 1,850 4,010 ఆదిలాబాద్ 13 3,100 3,506 6,606 నిర్మల్ 15 2,517 2,469 4,977 కు.ఆసిఫాబాద్ 11 1,645 2,535 4,180 -
వైద్యశాఖ డైరెక్టర్కు వినతి
ఆదిలాబాద్టౌన్: రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ నరేందర్ కుమార్ను తెలంగాణ ల్యాబ్ టెక్నికల్ అసోసియేషన్ నాయకుల ఆధ్వర్యంలో ఆ శాఖ జిల్లా ఉద్యోగులు కలిశారు. మంగళవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసి వి నతిపత్రం అందజేశారు. పదోన్నతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను అర్హులైన వారి తో భర్తీ చేయాలని కోరారు. ఈ మేరకు డైరెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. డైరెక్టర్ను కలిసిన వారిలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నిజామొద్దీన్, సంఘ బాధ్యులు రమణాచారి, సమి ఉన్నారు. -
నాగోబాను దర్శించుకున్న ఎస్పీ
ఇంద్రవెల్లి: నాగుల పంచమి సందర్భంగా కేస్లాపూర్లోని నాగోబా ఆలయాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ కాజల్సింగ్తో కలిసి దర్శించుకున్నారు.మెస్రం వంశీయులు వారిని సన్మానించారు. నాగోబా ప్రతిమలు అందజేశారు. మహిళల సమస్యలపై శ్రద్ధ వహించాలి ఆదిలాబాద్టౌన్: మహిళల సమస్యలపై ప్రత్యే క శ్రద్ధ వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అ న్నారు. జిల్లా కేంద్రంలోని మహిళా పోలీసు స్టేషన్తోపాటు టూటౌన్ను మంగళవారం తని ఖీ చేశారు. స్టేషన్కు వచ్చే బాధితులతో గౌరవంగా మెదలాలని సూచించారు. వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. పట్ట ణంలో ఓపెన్డ్రింక్ జరగకుండా గస్తీ నిర్వహించాలన్నారు. మట్కా, గుట్కా, గంజాయి, ఇత ర అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పర్యవేక్షించాలని సూచించారు. ఎస్పీ వెంట ఆదిలా బాద్ డీఎస్పీ జీవన్రెడ్డి, టూటౌన్ సీఐ కరుణా కర్రావు, మహిళా స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్కుమార్ తదితరులు ఉన్నారు. -
కొనసాగిస్తారా.. తొలగిస్తారా
నాగమ్మా.. దీవించు● రిమ్స్లో రెన్యూవల్కు నోచుకోని 54 మంది ● అయోమయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ● ఏజెన్సీల మల్లగుల్లాలు ● రోగుల వైద్యసేవలపై ప్రభావం మొక్కు తీర్చుకుంటున్న మహిళ జిల్లావ్యాప్తంగా నాగుల పంచమిని మహిళలు మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. పుట్టల వద్ద పాలు పోసి నాగదేవతకు పూజలు చేశారు. ఇంటిల్లిపాదిని సల్లంగ దీవించు తల్లీ అని వేడుకున్నారు. ఉదయం నుంచే ఆయా ఆలయ ప్రాంగణాల్లోని పుట్టల వద్ద సందడి వాతావరణం కనిపించింది. – ఆదిలాబాద్ మత్స్యకారులకే డబ్బులు అందజేయాలి ప్రభుత్వం టెండర్ల విధానం వీడి, మత్స్యకారులకే చేప పిల్లల కొనుగోలు కోసం డబ్బులు అందజేయాలి. దీంతో మేలు రకమైన వాటిని కొనుగోలు చేసి చెరువుల్లో వదులుకునే అవకాశం ఉంటుంది. టెండర్ ప్రక్రియ కారణంగా కాంట్రాక్టర్లు సకాలంలో చేప పిల్లలను ఇవ్వడం లేదు. దీంతో గతేడాది నష్టపోవాల్సి వచ్చింది. – మేకల అశోక్, మత్స్య పారిశ్రామిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు.. ఈఏడాది ఇంకా నోటిఫికేషన్ వెలువడలేదు. టెండర్లు పిలవలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం. టెండర్దారులకు సంబంధించి గత రెండేళ్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. – ప్రభాకర్, జిల్లా మత్స్యశాఖ అధికారి రిమ్స్లో ఔట్సోర్సింగ్ పోస్టుల పరిస్థితి.. కేటగిరి మొత్తం రెన్యూవల్ కుదించినవి అయినవి అసోసియేట్ ప్రొఫెసర్ 11 09 02 టెక్నికల్ పోస్టులు 79 46 33 పేషెంట్కేర్ 24 05 19 -
అర్హులందరికీ రేషన్కార్డులు
● కలెక్టర్ రాజర్షి షాజైనథ్: అర్హులైన ప్రతీ ఒక్కరికి రేషన్కార్డు అందేలా చూస్తామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. స్థానిక లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణ మండపంలో మంగళవారం జైనథ్, బోరజ్, సాత్నాల, బేల మండలాలకు సంబంధించిన కొత్త రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ఆయన లబ్ధిదారులకు కార్డులు అందించారు.కలెక్టర్ మాట్లాడుతూ.. రేషన్కార్డుల ప్రక్రియ నిరంతరం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, డీఎస్వో వాజిద్ అలీ, తహసీల్దార్లు ఆత్రం నారాయణ, రాజేశ్వరి, విశ్వనాథ్, రఘునాథ్, ఎంపీడీవో మహేశ్కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రంలోని పశువుల ఆసుపత్రిని కలెక్టర్ తనిఖీ చేశారు. మౌలిక వసతులపై ఆరా తీశారు. సన్న బియ్యం సద్వినియోగం చేసుకోవాలిభీంపూర్:ప్రభుత్వం అందజేసే సన్నబియ్యంను రేష న్ కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. స్థానిక రైతువేదికలో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో మండలంలోని పలు గ్రా మాలకు చెందిన 200 మందికి కొత్త రేషన్ కార్డుల ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో కలిసి అందజేశారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా కేజీబీవీ ఆవరణలో మొక్కలు నాటారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, డీఎస్వో వాజిద్ అలీ, తహసీల్దార్ నలంద ప్రియ, అధికారులు, మండల నాయకులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక అంగన్వాడీ కేంద్రంను కలెక్టర్ సందర్శించారు. చిన్నారుల హాజరు వివరాలు అడి గి తెలుసుకున్నారు. అలాగే పీఏసీఎస్ కేంద్రంలోని యూరియా స్టాక్ వివరాలు పరిశీలించారు. సర్వేయర్ శిక్షణార్థుల ‘ప్రాక్టికల్’ పరిశీలన ఆదిలాబాద్: జిల్లాలో లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణలో భాగంగా ఏరోడ్రాం మైదానంలో నిర్వహిస్తున్న ప్రా క్టికల్ పరీక్షలను కలెక్టర్ రాజర్షి షా మంగళవారం పరిశీలించారు. శిక్షణ వివరాలను సంబంధిత అధి కారులు కలెక్టర్కు వివరించారు. -
‘సీజనల్’పై అప్రమత్తంగా ఉండాలి
● వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ ● రిమ్స్, ఉట్నూర్ ఆస్పత్రుల తనిఖీఆదిలాబాద్టౌన్: సీజనల్ వ్యాధులపై వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిని మంగళవారం తనిఖీ చేశారు. పలు వార్డులను పరిశీలించారు. డెంగీ బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలు సుకున్నారు. వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్యులు సమయపాలన పాటించి రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. అనంతరం క్రోమ్ ఆస్పత్రిలో రికార్డులను పరిశీలించారు. విజిట్కు వచ్చే వైద్యుల వివరాలను డీఎంహెచ్వో కార్యాలయంలో నమోదు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, డీసీహెచ్ఎస్ ఉపేందర్, వైద్య సిబ్బంది ఉన్నారు. రిమ్స్ సేవలపై కమిషనర్కు ఫిర్యాదు రిమ్స్లో రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అంద డం లేదని వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్కు ఏబీవీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. రిమ్స్ తనిఖీకి వచ్చిన కమిషనర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. పీజీ వైద్యులు, సీఎంవో సమయపాలన పాటించడం లేదని, రోగులకు సరిగా సేవలు అందించడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. టి–హబ్ ద్వారా కేవలం పది రకాల పరీక్షలు మాత్రమే జరుగుతున్నాయని తెలిపారు. ఇందులో ఏబీవీపీ నాయకులు కార్తీక్, అజయ్, శశి ఉన్నారు. -
బారులు తీరి.. గోడు విన్నవించి
● ‘ప్రజావాణి’కి 114 దరఖాస్తులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ కై లాస్నగర్: ప్రజల సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి అర్జీదారులు భారీగా తరలివచ్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితులు కలెక్టర్ రాజర్షి షాను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. వారి నుంచి అర్జీలు స్వీకరించిన ఆయన వాటిని పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి 114 అర్జీలు అందాయి. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన.. -
సమగ్ర ప్రణాళికతోనే ‘గిరిజన’ అభివృద్ధి
● బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్నేరడిగొండ: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక అవసరమని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని డీఎస్ఎస్ భవనంలో సోమవారం నిర్వహించిన గిరిజన సలహా మండలి సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు త్వరితగతిన మంజూరు చేయించాలని కోరారు. అలాగే పోడు భూముల విషయమై గిరిజనులతో పాటు గిరిజనేతరులకూ పట్టాలు మంజూరు చేసేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. అలాగే జిల్లాలో గిరిజన యూనివర్సిటీ మంజూరు చేయాలని, బోథ్ నియోజకవర్గంలో ప్రభుత్వ జనరల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. గిరి వికాసం పథకం కింద సాగులో ఉన్న ప్రతీ ఎకరాకు నీరు, కరెంట్ అందించాలన్నారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, గిరిజన శాఖ, ఇతర శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు -
క్రీడల్లో గెలుపోటములు సహజం
ఆదిలాబాద్: క్రీడల్లో గెలుపోటములు సహజమని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నా రు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సో మవారం నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించి మా ట్లాడారు. నిరంతర సాధనతోనే విజయాలు సాధ్యమన్నారు. డీవైఎస్వో శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో వి జేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. జిల్లాస్థా యి అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజేశ్ మాట్లాడుతూ జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను హన్మకొండ వేదికగా నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చే స్తామని వివరించారు. ఇందులో జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు కొమ్ము కృష్ణ, అసోసియేషన్ కోశాధికారి రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుడు లేక మూత‘బడి’!
ఇంద్రవెల్లి: మండలంలోని వడగామ్ టీడబ్ల్యూ పీఎస్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు శ్రీనివాస్ అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. ఈ క్రమంలో వారం రోజులుగా పాఠశాల ఇలా మూతబడి దర్శనమిస్తోంది. ఈ ఏకోపాధ్యాయ పాఠశాలలో డిప్యూటేషన్పై మరొకరిని నియమించాల్సి ఉండగా అధికారులు పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎస్సీఆర్పీ పెందోర్ అర్జున్ను వివరణ కోరగా.. ఉపాధ్యాయుడు శ్రీనివాస్ అనారోగ్యం కారణంగా సెలవులో ఉన్న విషయం వాస్తవమే అని తెలిపారు. వెంటనే డిప్యూటేషన్పై మరొకరిని నియమించి పాఠశాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. -
ఆ ముగ్గురు ఏఈల తీరే వేరు..!
● ఇష్టానుసారంగా విధులు ● విద్యుత్శాఖ ఎంఆర్టీలో చోద్యంఆదిలాబాద్టౌన్: విద్యుత్ శాఖలో కొంత మంది ఉద్యోగులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. వేలల్లో వేతనాలు తీసుకుంటున్నప్పటికీ విధులకు ఎ గనామం పెడుతున్నారు. పర్యవేక్షించాల్సిన అ ధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.ఎంఆర్టీ విభాగంలో పనిచేసే ముగ్గురు ఏఈలు ఇష్టమొచ్చినప్పుడు రావడం, రిజిస్టర్లో సంతకాలు పెట్టి వెళ్లిపోవ డం పరిపాటిగా మారింది. మరో ఉద్యోగయితే ఏకంగా కార్యాలయంలో అడుగు పెట్టకుండానే వేతనాలు తీసుకోవడం గమనార్హం. వివిధ పను ల నిమిత్తం కార్యాలయానికి వచ్చే వారికి అందుబాటులో ఉండకపోవడం, ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి. విద్యుత్మీటర్లు, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు, సబ్స్టేష న్లోని బ్రేకర్లు, హె చ్డీ మీటర్లకు సంబంధించి చూడాల్సి ఉంటుంది. అయితే వీరికి సంబంధిత శాఖ అధికారుల అండదండలు ఉండడంతో ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయమై విద్యుత్శాఖ ఎస్ఈ జేఆర్ చౌహా న్ను వివరణ కోరగా.. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ప్లీజ్.. హెల్ప్ మీ
ఆంగ్లంలో గోడు వెల్లబోసుకున్న వృద్ధుడు పంచె కట్టు.. తలపాగా.. చేతిలో గొడుగు.. కర్ర సాయంతో ప్రజావాణికి వచ్చిన ఓ వృద్ధుడు తన ఆంగ్ల నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. నార్నూర్ మండలం తడిహత్నూర్కు చెందిన కాంబ్లే విశ్వనాథ్ తన సమస్యపై సోమవారం కలెక్టర్ రాజర్షి షాకు దరఖాస్తు అందజేశాడు. అయితే తన గోడు ఆంగ్లంలో ధారాళంగా చెప్పడాన్ని చూసిన అధికారులంతా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. 82 ఏళ్ల వయస్సు కలిగిన తాను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని, తన భార్య అనారోగ్యంతో బాధపడుతుందని తెలిపిన ఆయన ‘ప్లీజ్.. హెల్ప్ మీ’ అంటూ కోరాడు. సమస్యను ఆలకించిన కలెక్టర్ ఎంపీడీవోను కలువాలని సూచించారు. కాగా, తాను 1964లో డిగ్రీ పూర్తి చేసినట్లు వృద్ధుడు తెలిపాడు. – కై లాస్నగర్ -
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి●
సాత్నాల: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. భోరజ్ మండలంలోని కొరటా, గిమ్మ, తర్ణం గ్రామాల్లో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ హాజరయ్యారు. ముందుగా చనాఖా–కొరటా ప్రాజెక్టును సందర్శించారు. పెన్గంగ బ్రిడ్జి వద్ద నదీ ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పా ల్గొని మాట్లాడారు. యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. ఆయా గ్రామాల యువతకు వాలీబాల్ కిట్స్ అందజేశారు. ఇందులో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి, జైనథ్ సీఐ సాయినాథ్, ఎస్సై గౌతమ్, మూడు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. -
‘స్థానిక’.. సన్నద్ధం
● ఆదిలాబాద్ ఎన్నికలకు గుజరాత్ బ్యాలెట్ బాక్స్లు ● అదనంగా 1030 తెప్పించుకోవాలని సర్కారు ఆదేశం ● రిజర్వేషన్ల ఉత్కంఠకు నేడు తెరపడే అవకాశం కై లాస్నగర్: స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.పంచాయతీ, పరిషత్ ఎన్ని కలను ఏకకాలంలో నిర్వహించాలని భావిస్తోంది. సెప్టెంబర్ నెలాఖరులోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలనే రాష్ట్ర హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపడుతోంది. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, సిబ్బందిని పూర్తిస్థాయిలో సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే యంత్రాంగాన్ని ఆదేశించిన ప్రభుత్వం తాజాగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలె ట్ బాక్స్లపై దృష్టి సారించడం అందుకు బలాన్ని చేకూరుస్తోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్స్లు జిల్లాలో ఇప్పటికే అందుబాటులో ఉండగా అదనపు బాక్స్లను ఇతర రాష్ట్రాల నుంచి సమకూర్చుకోవాలని ఆదేశించడంతో ఈ రెండు ఎన్నికలు ఏకకాలంలో ఉంటాయనే సంకేతాలు వినిపిస్తున్నాయి. మరోవైపు రిజర్వేషన్ల పై సోమవారం నిర్వహించనున్న రాష్ట్ర కేబినేట్లో స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది.ఈ భేటీ తర్వాత ఎప్పుడైనా స్థానిక పోరుకు నోటిఫికేషన్ వెలువడవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏకకాలంలో స్థానిక పోరు .. జిల్లాలోని 473 గ్రామపంచాయతీలు, 3,870 వార్డులకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేలా యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. ఇందుకోసం 2,400 బ్యాలెట్ బ్యాక్స్లను సిద్ధం చేశా రు. పంచాయతీ ఎన్నికలకు ఉదయం పోలింగ్, మ ధ్యాహ్నం కౌంటింగ్ ఉండే అవకాశముండటంతో ఈబాక్స్లు ఎన్నికలకు పూర్తిస్థాయిలోసరిపోనున్నా యి. అదే పరిషత్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరిగిన వారం, 15 రోజుల తర్వాత ఫలితాలు వెల్ల డించే అవకాశముంటుంది. అప్పటి వరకు బాక్స్ల ను కౌంటింగ్ కేంద్రాల్లో భద్రపర్చాలి. దీంతో సరి పడా బాక్స్లను సమకూర్చుకోవాలని ప్రభుత్వం జిల్లా పంచాయతీ, జెడ్పీ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రెండు ఎన్నికలను కొన్ని రోజుల వ్యవధిలో నిర్వహించవచ్చనే అభిప్రాయాన్ని ఆయా శాఖల అధికా రులు, ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ బ్యాలెట్ బాక్స్లు .. పంచాయతీ, పరిషత్ ఎన్నికలను రోజుల వ్యవధిలో ఏకకాలంలో నిర్వహిస్తే బ్యాలెట్ బాక్స్ల కొరత ఏర్పడే అవకాశముందని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు పూర్తిస్థాయిలో సమకూర్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో మరో 1030 బాక్స్లను గుజరాత్ నుంచి తెప్పించుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ చర్యలు పరిశీలిస్తే ఈ రెండు ఎన్ని కలను హైకోర్టు ఆదేశాలకనుగుణంగా గడువులోపు పూర్తిచేయాలని భావిస్తున్నట్లుగాతెలుస్తోంది. మరో వైపు జిల్లాలోని సీనియర్ ఎంపీడీవోలు, పంచాయ తీ కార్యదర్శులతో కూడిన ప్రత్యేక బృందాలను ఆ రాష్ట్రానికి పంపించే దిశగా కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్ అనుమతి మేరకు రెండు, మూడు రోజుల్లోనే వారు గుజరాత్లో పర్యటించి అక్కడి నుంచి బాక్స్లను జిల్లాకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణపై నేడు స్పష్టత స్థానిక ఎన్నికలను సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విష యం తెలిసిందే. రెండు నెలల గడువు మాత్ర మే ఉండటంతో ఆలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయా లని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. సోమవారం సీఎం రేవంత్అధ్యక్షతన జరిగే కేబినేట్ మీటింగ్లో దీనిపై స్పష్టత రానుందనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్కు ఇంకా గవర్నర్ ఆమోదం తెలుపలేదు. ఈ నేపథ్యంలో ఏ ప్రతిపాదికన రిజర్వేషన్లు అమలు చేస్తారనే ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి. అయితే నేటి కేబినెట్ భేటి అనంతరం దీనిపై పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అలాగే ఆశావహుల్లోనూ ప్రతిష్టంభన తొలగిపోనుంది. కలెక్టర్కు ఫైలు పంపించాం ఎన్నికల నిర్వహణకు వీలుగా జిల్లాకు అదనంగా బ్యాలెట్ బాక్స్లను తెప్పించుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఇందుకోసం కలెక్టర్కు తగు వివరాలతో కూడిన ఫైల్ను పంపించాం. వారి అనుమతి మేరకు ప్రత్యేక బృందాన్ని గుజరాత్కు పంపించి బ్యాలెట్ బాక్స్లను తెప్పిస్తాం. ప్రభుత్వ, ఈసీ ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించేలా తగు చర్యలు తీసుకుంటాం. – జి.రమేశ్, జిల్లా పంచాయతీ అధికారి -
ప్రశాంతంగా ‘సర్వేయర్’, జీపీవో రాత పరీక్షలు
కైలాస్నగర్: జిల్లాలో లైసెన్స్డ్ సర్వేయర్, గ్రామ పాలనాధికారి పోస్టుల నియామకాల కోసం ఆదివా రం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాత పరీక్షలు ప్ర శాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 29 మంది గైర్హాజరయ్యారు. ప్రభుత్వ ఆర్ట్స్అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో ఉదయం, మధ్యాహ్నం నిర్వహించిన లైసెన్స్డ్ సర్వేయర్ పరీక్షకు 155 మందికి గాను 129 మంది హాజరయ్యారు. 26 మంది గైర్హాజరయ్యా రు. ఉదయం 9.30 నుంచే అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించారు. మధ్యాహ్నం నిర్వహించిన టిప్పన్ ప్లాటింగ్ పరీక్షలో 40మార్కులకు సంబంధించిన ప్రశ్న మరాఠీ మీడియంలో ఉండటంతో తెలుగులో తర్జుమా చేసేందుకు అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. ప్రశ్న ముద్రణ సైతం సరిగా లేక అయోమయానికి గురయ్యారు. అలాగే జీపీవో నియామ క పరీక్షను మావల మండల కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించిన పరీక్షకు 51 మంది హాజరుకావాల్సి ఉండగా 48 మంది హాజరయ్యారు. ముగ్గురు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి సందర్శించారు. నిర్వహణ తీరును పరిశీలించారు. వారి వెంట ఆర్డీవో స్రవంతి, సర్వేల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాజేందర్, పరీక్షల పరిశీలకులు కె.రాజలింగు, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులున్నారు. నేటి నుంచి ప్రాక్టికల్ పరీక్షలు లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణార్థులకు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకుడు రాజేందర్ తెలిపారు. శిక్షణకు హాజరైన 155 మందిని రెండు బృందాలుగా ఏర్పాటు చేసిన ట్లు పేర్కొన్నారు. తొలి రోజున 80 మంది, 29న మి గతా వారికి ఉదయం 9నుంచి సాయంత్రం 5గంట ల వరకు జిల్లా కేంద్రంలోని ఏరోడ్రమ్ మైదానంలో ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని తెలిపారు. అభ్యర్థులు సకాలంలో హాజరుకావాలని సూచించారు. -
ప్రత్యేకాధికారికి వినతి
ఆదిలాబాద్టౌన్: తమ సమస్యలు పరిష్కరించాలని ఎకై ్సజ్ కానిస్టేబుళ్లు, సిబ్బంది ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ను కోరారు. జిల్లా కేంద్రంలోని పెన్గంగ భవన్లో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరారు. అలాగే పదోన్నతి కల్పించాలని, సీనియారిటీ జాబితా రూపొందించాలని పేర్కొన్నారు. ఇతర సమస్యలను విన్నవించగా, ప్రత్యేక అధికారి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఇందులో సంఘం అధ్యక్షుడు పొచ్చన్న, ప్రధాన కార్యదర్శి అరవింద్, కార్యవర్గ సభ్యులు లత, మహేందర్, వెంకటగిరి తదితరులున్నారు. -
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో ప్రతిభ
ఆదిలాబాద్: హైదరాబాద్లోని షేక్పేటలో ని ర్వహించిన నాలుగో సబ్జూనియర్రాష్ట్రస్థాయి బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో ఆదిలాబా ద్ క్రీడా పాఠశాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. 40–43కిలోల విభాగంలో జే.నిత్యారెడ్డి స్వర్ణ పతకం, 35–37కిలోల విభాగంలో నందిని రజతం, 52–55 కిలోల విభాగంలో బీ.నిఖిల్ రజతం, 43–46 కిలోల విభాగంలో సి.వివేక్, 43–46 కిలోల విభాగంలో బత్తుల అశ్వినీ కాంస్య పతకాలతో మెరిశారు. ఇందులో నిత్యారెడ్డి ఆగస్టు 6 నుంచి 13వరకు ఉత్తర్ ప్రదేశ్లోని నోయిడాలో నిర్వహించనున్న జాతీ య సబ్జూనియర్ బాక్సింగ్ పోటీలకు ఎంపికై నట్లు కోచ్ సాయి తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలవడంపై డీవైఎస్వో జక్కు ల శ్రీనివాస్, జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయేందర్, ఎంఏ బేగ్ తదితరులు అభినందించారు. -
నాణ్యమైన వైద్య సేవలందించాలి
● ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి హరికిరణ్ ● బోథ్, గుడిహత్నూర్ మండలాల్లో పర్యటన బోథ్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్ అ న్నారు. జిల్లాలోని బోథ్, గుడిహత్నూర్ మండలా ల్లో కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ఇందులో భాగంగా బోథ్ సీహెచ్సీని సందర్శించారు. వార్డులను పరిశీలించి, రోగులతో మాట్లాడారు. బోథ్ మండలం కన్గుట్ట గ్రామానికి చెందిన మహేశ్ కుమార్తె మూడేళ్ల చిన్నారి సాయి అన్విని చూసి చలించిపోయారు. ఆమె ఆరో గ్య పరిస్థితి తెలుసుకుని, ప్రత్యేక వైద్యం అందించా ల్సిందిగా డీఎంహెచ్వోను ఆదేశించారు. వెంటనే ఆమెను 108లో రిమ్స్కు తరలించారు. వర్షాకాలం నేపథ్యంలో ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన, మందుల నిల్వపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. అంతకముందు బోథ్ ప్రాథమి క వ్యవసాయ సహకార సంఘాల కేంద్రం, గోదాంను పరిశీలించారు. యూరియా స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. యూరియా మహారాష్ట్రకు తరలిపోకుండా ఘన్పూర్ అబ్కారీ చెక్పోస్ట్ వద్ద ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలన్నారు. వారి వెంట ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా,డీసీవో మోహన్, డీఏవో శ్రీధర్స్వామి, వైద్యసిబ్బంది, తదితరులున్నారు. రిమ్స్లో కోలుకున్న చిన్నారి..ఆదిలాబాద్టౌన్: చిన్నారి సాయి అన్వి రిమ్స్లో చేర్పించాక ఆరోగ్యం కొంత మెరుగుపడిందని డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం బ్రెయిన్లో సమస్య ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. కాగా తమ చిన్నారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిన ప్ర త్యేక అధికారి, కలెక్టర్, వైద్యులకు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.రైతుసేవల్లో పారదర్శకత లక్ష్యం.. గుడిహత్నూర్: రైతులకు అందించే సేవల్లో పారదర్శకత లక్ష్యమని హరికిరణ్ అన్నారు. స్థానిక పీఏసీ ఎస్ను సందర్శించి మాట్లాడారు. ఈ పాస్ మిషన్ల ద్వారా అర్హులైన రైతులకు ఎరువులు, ఇతర సంక్షేమ ఫలాలు అందించాలన్నారు. అనంతరం ఎరువుల గోదాంలను పరిశీలించారు. వారి వెంట తహసీల్దార్ కవితారెడ్డి, ఎంఏవో రమేశ్ భగత్, పీఏసీఎస్ చైర్మన్ సంజీవ్, సీఈవో పండరీ ఉన్నారు. -
సర్కారు బడిలో ప్రీప్రైమరీ
● ఎల్కేజీ, యూకేజీ అందుబాటులోకి ● జిల్లాలో 15 పాఠశాలలు ఎంపిక ● పీఎంశ్రీ కింద ఇప్పటికే నాలుగు బడుల్లో అమలు 15 పాఠశాలల్లో అమలు.. జిల్లాలోని 15 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య (ప్రీ ప్రైమరీ) అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లాలోని నాలుగు పాఠశాలల్లో పీఎంశ్రీ పథకం కింద ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభమైంది. విద్యార్థులకు ఆటపాటలతో కూడిన బోధన అందించడం జరుగుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా టీచర్, ఆయాలను తా త్కాలిక పద్ధతిన నియమించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయంతో సర్కారు బడులు మరింత బలోపేతం అవుతాయి. – రఘురమణ, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి ఆదిలాబాద్టౌన్: సర్కారు బడుల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది.. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్లో ఇంగ్లీష్ మీడియం చదివించేందుకు నాలుగేళ్ల కంటే ముందే చేర్పిస్తున్నారు. విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ చదివిన పిల్లలు అక్కడే పైతరగతులు చదవడంతో సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రీప్రైమరీ ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు కొన్నేళ్లుగా విన్నవిస్తున్నారు. జిల్లాలో ఇదివరకే పీఎంశ్రీ పథకం కింద నాలుగు ప్రీప్రైమరీ స్కూళ్లు ప్రస్తుతం కొనసాగుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 15 పాఠశాలలను ఎంపిక చేసింది. త్వరలో తరగతులను ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించి శనివా రం ఉత్తర్వులు జారీ చేసింది. తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతుండగా.. నిరుద్యోగులకు సైతం ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఎంపికై న పాఠశాలలు ఇవే.. ప్రీప్రైమరీ విద్యాబోధన కోసం జిల్లాలో 15 పాఠశాలలను ఎంపిక చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో కేశవపట్నం ప్రాథమిక పాఠశాల, దుబ్బ(కె), కంఠ, దస్నాపూర్గూడ, వైజాపూర్, కేస్లాగూడ, బరంపూర్, రాంపూర్(పి), మల్కాపూర్, చెర్లపల్లి, గుబిడి, యాపల్గూడ, రణదీవెనగర్, పిప్పల్కోటి ఉర్దూ మీడియం, ప్రభుత్వ పాఠశాల భుక్తాపూర్ పాఠశాలలు ఉన్నాయి. ప్రస్తుతం పీఎంశ్రీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో నాలుగు పాఠశాలలను ప్రీప్రైమరీ కోసం ఎంపిక చేసింది. జైనథ్ మండలంలోని దీపాయిగూడ, సిరికొండ మండల కేంద్రం, భీంపూర్ మండలంలోని నిపాని, గాదిగూడలోని చింతగూడ పాఠశాలల్లో వీటిని ప్రారంభించింది. ఆయా పాఠశాలల్లో ఇందుకోసం ప్రత్యేక తరగతి గది ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆటపాటలతో కూడిన చదువు, స్లీపింగ్ ఆవర్, మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు. వీరికి విద్యాబోధన చేసేందుకు ఆయా గ్రామాల్లోనే ఉన్న త చదువు చదివిన వారిని ఎంపిక చేశారు. ఇన్స్ట్రక్టర్కు నెలకు రూ.8వేలు, ఆయాకు రూ.6వేలు చెల్లిస్తున్నారు. మూడేళ్లు పైబడిన పిల్లలను ఎల్కేజీ, నాలుగేళ్లు పైబడిన వారిని యూకేజీలో చేర్చుతున్నారు. వీటి నిర్వహణ నిమిత్తం గ్రీన్బోర్డులు, ఫ్యాన్లు, ఇతర వాటి కోసం రూ.30వేలు, బోధన సామగ్రి, ఆట వస్తువుల కోసం మరో రూ.30వేలు విడుదల చేసింది. సర్కారు బడుల బలోపేతం కోసం.. సర్కారు బడుల బలోపేతం కోసం ప్రభుత్వం ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తుంది. ఇక్కడ ఎల్కేజీ, యూకేజీ చదివిన పిల్లలు వచ్చే విద్యా సంవత్సరంలో 1వ తరగతిలో చేరేందుకు అర్హత ఉంటుంది. తద్వారా ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గడంతో పాటు పిల్లలకు ప్రైవేట్కు ధీటుగా సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్యాబోధన అందుతుంది. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించనున్నారు. అవసరమైన ఫర్నిచర్, ఆట వస్తువులు, బోధన సామగ్రి, భద్రత ప్రమాణాలు, విద్యార్థులను ఆకర్షించేలా గోడలపై రంగు రంగుల బొమ్మలు, పిల్లలు నిద్రపోయే గదిని ఏర్పాటు చేయనున్నారు. పారిశుధ్య పనులను గ్రామపంచాయతీతో చేపట్టనున్నారు. జిల్లాలో డీఈవో పరిధిలో పాఠశాలలు.. ప్రాథమిక : 500 ప్రాథమికోన్నత : 119 ఉన్నత : 120 మొత్తం విద్యార్థులు : 65వేల మంది -
● రిమ్స్లో రెగ్యులర్ ప్రొఫెసర్లను కేటాయించిన ప్రభుత్వం ● కోర్టును ఆశ్రయించిన కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు ● న్యాయస్థానం తీర్పుపై ఉత్కంఠ
ఆదిలాబాద్టౌన్: రిమ్స్ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు కొనసాగేనా.. లేక రెగ్యులర్గా నియామకమైన ప్రొఫెసర్లతో సేవలు అందించేనా అనే సందేహం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా మెడికల్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా రిమ్స్కు తొమ్మిది మంది ప్రొఫె సర్లను నియమించింది. దీంతో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ అవుతున్నాయనే సర్వత్రా హర్షం వ్యక్తమైంది. రెగ్యులర్ ప్రొఫెసర్లు విధుల్లో చేరితే ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న వారిని తొలగించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ప్రస్తుతం ఒప్పంద పద్ధతిన పనిచేస్తున్న వారు హైకోర్టును ఆశ్రయించారు. తాము సెమీ అటానమస్ ఆస్పత్రిలో పనిచేస్తున్నామని, 21 చట్టం ప్రకారం ఆస్పత్రి కమిటీ తమను కొనసాగించాలని పేర్కొంటున్నారు. వైద్యులు లేని సమయంలో ఇక్కడ సేవలు అందించా మని, ఎన్ఎంసీ తనిఖీకి వచ్చిన సమయంలో తామే దిక్కుగా ఉన్నామని, ఇప్పుడు తమను తొలగించడం ఎంతవరకు సబబని అంటున్నారు. అయితే కొంత మంది రెగ్యులర్ వైద్యులు తాము 30 ఏళ్లుగా సేవలు అందిస్తున్నా ఇప్పటివరకు పదోన్నతి లభించలేదని, ప్రస్తుతం ప్రభుత్వం ప్రమోషన్ కల్పిస్తే అడ్డుకోవడం సరికాదని చెబుతున్నారు. కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు కొన్నేళ్లలోనే ఆ స్థాయిని పొందారని పేర్కొంటున్నారు. అయితే కోర్టు తీర్పుతో ఎవరు కొనసాగుతారనేది స్పష్టం కానుంది. కోర్టును ఆశ్రయించిన వైనం.. రిమ్స్లో 21 విభాగాలకు గాను 13 విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వం తొమ్మిది విభాగాల్లో ప్రొఫెసర్లను నియమించింది. అయితే వీటిలో ఎంత మంది విధుల్లో చేరుతారు.. ఎంత మంది చేరరనే దానిపై స్పష్టత లేదు. రెగ్యులర్ ప్రొఫెసర్లను నియమించడంతో కాంట్రాక్ట్ వైద్యులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ప్రస్తుతం స్టే విధించగా, తీర్పు వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పదోన్నతి పొందిన ప్రొఫెసర్లు, కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న వారిలో ఆందోళన వ్యక్తమవుతుంది. రెగ్యులర్ పోస్టుల కేటాయింపు.. రాష్ట్ర వ్యాప్తంగా పలు వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ పోస్టులను పదోన్నతిపై భర్తీ చేసిన ప్రభుత్వం రిమ్స్లో తొమ్మిది రెగ్యులర్ పోస్టులను కేటాయించింది. వీటిలో ఆప్తమాలజీ, ఈఎన్టీ, పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, అనస్తీషియా, గైనిక్, రేడియాలజీ, పాథాలజీ విభాగాల్లో ప్రొఫెసర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందుబాటులో ఉండేనా.. ప్రభుత్వం రిమ్స్కు కేటాయించిన రెగ్యులర్ ప్రొఫెసర్ పోస్టుల్లో ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతిన వైద్యులు పనిచేస్తున్నారు. అయితే రెగ్యులర్ వైద్యులు చేరిన తర్వాత అందుబాటులో ఉండకపోతే రోగుల పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొంత మంది ఇక్కడ ప్రొఫెసర్గా పదోన్నతి పొంది డిప్యూటేషన్, సెలవుల్లో వెళితే రోగులకు వైద్యసేవలు అందకుండాపోతాయని, భవిష్యత్తులో అసోసియేట్ ప్రొఫెసర్లను భర్తీ చేస్తే తమ పోస్టులు కూడా లేకుండా పోతాయని కాంట్రాక్ట్ వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా రిమ్స్లో సేవలు అందిస్తున్నామని, సెమీఅటానమస్గా ఉన్న రిమ్స్లో పోస్టులను భర్తీ చేసే విషయం, లేక ఉన్నవారినే కొనసాగించేది రిమ్స్ కమిటీ చేతిలో ఉంటుందని చెబుతున్నారు. కోర్టు తీర్పు వెలువడేంత వరకు ప్రస్తుతం ఉన్న వైద్యులతోనే సేవలు కొనసాగించనున్నారు. కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు కోర్టుకెళ్లారు.. కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టే విధించింది. ఇప్పటివరకు రెగ్యులర్ ప్రొఫెసర్లు విధుల్లో చేరలేదు. – జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ -
దంచి కొట్టలే..
జిల్లాకు ‘రెడ్.. ఆరంజ్ అలర్ట్’ అంటూ ఇటీవల వాతావరణ శాఖ నుంచి అందుతున్న సమాచారం. అయితే క్షేత్రస్థాయి పరిస్థితి మా త్రం భిన్నంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా గడిచిన ఐదు రోజులుగా నమోదైన వర్షపాత వివరాలే ఇందుకు నిదర్శనం. ఈ నెల 25న 10 మి.మీ.లు నమోదు కాగా 24న 26.8 మి.మీ.లు, 23న 2.0 మి.మీ.లు, 22న 7.4 మి.మీ. లు, 21న 0.0 మి.మీ. సగటు వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. ఈలెక్కలను పరిశీలిస్తే ఓ మోస్తారు వర్షాలే అని చెప్పవచ్చు. సాక్షి, ఆదిలాబాద్: రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అన్నిచోట్ల జలాశయాలు నిండుకుండల్లా తయారయ్యాయి. అయితే జిల్లాలో పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. కొద్ది రోజులుగా జిల్లాకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ అంటూ వాతావరణ శాఖ నుంచి కూడా సూచనలు జారీ అయ్యాయి. దీంతో భారీ వర్షాలు కురుస్తాయని అంతా భావించారు. ఒకవేళ వరదలు వస్తే అందుకు సిద్ధంగా ఉండాలని యంత్రాంగం కూడా సిద్ధమైంది. కంట్రోల్రూమ్ కూడా ఏర్పాటు చేసింది. అయితే జిల్లాలో ఇప్పటివరకు దంచికొట్టిన వానలే లేవు. నాలుగైదు రోజులుగా ఓ మోస్తారు వర్షాలే కురుస్తున్నాయి. అయితే వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఎప్పుడైనా జోరవాన కురిసే అవకాశం ఉందని జనం భావిస్తున్నారు. పూర్తిస్థాయిలో నిండని ప్రాజెక్టులు.. జిల్లాలో రెండు మధ్యతరహా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో సాత్నాల ప్రాజెక్టు నీటి సామర్థ్యానికి ఇంకా పూర్తిస్థాయిలో చేరుకోలేదు. మత్తడివాగు ప్రాజెక్ట్దీ ఇదే పరిస్థితి. ఇక జిల్లాలో 392 చెరువులు ఉన్నాయి. వాటిలో అధిక శాతం 75 శాతానికి పైగా నిండాయి. అయితే ఎక్కడ కూడా అలుగుపారుతున్న చెరువుల దృశ్యాలు ఇప్పటివరకు లేవు. జూన్ 1 నుంచి వర్షాకాలం మొదలు కాగా, ఆ మాసంలో సాధారణ వర్షపాతం నమోదైంది. జూలైలో భారీ వర్షాలు కురుస్తాయని ఆశించినప్పటికీ ఈనెల చివరి వరకు వచ్చినప్పటికీ మోస్తరుగానే నమోదయ్యాయి. జిల్లాలో వర్షాపాతం సాధారణంగా ఉన్నప్పటికీ భారీ వర్షాలు అంతగా లేకపోవడం లోటుగా కనిపిస్తుంది. పంటలకు ఆశాజనకమే.. మోస్తరుగా కురుస్తున్న వర్షాలు జిల్లాలో పంటలకు మాత్రం ఆశాజనకంగా ఉన్నాయన్న అభిప్రాయం రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పత్తి, సోయా, కంది, ఇతరత్రా పంటలు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. అధికంగా వర్షాధారంగానే పండిస్తారు. జూన్లో సాధారణ వర్షపాతం నమోదు కావడం, జూలైలో కూడా ఇదే పరిస్థితి ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మోస్తరు వానలే! ఈ సీజన్లో పరిస్థితి ‘సాధారణ’మే పంటలకు పర్వాలేదంటున్న రైతాంగంవర్షపాతం వివరాలు (జూన్ 1 నుంచి జూలై 25 వరకు)సాధారణం 467 మి.మీ.లు కురిసింది 447.4 మి.మీ.లు వ్యత్యాసం – 4 శాతం స్థితి సాధారణం -
‘ఫేస్’తోనే ఇక పింఛన్
● ముఖ గుర్తింపు అమలుకు ప్రభుత్వం కసరత్తు ● నేడు బీపీఎంలకు శిక్షణ ● ఆగస్టు నుంచి అమల్లోకి.. ● అక్రమాలకు చెక్ పెట్టేలా చర్యలుకైలాస్నగర్: చేయూత పథకం కింద అందిస్తున్న పింఛన్ల పంపిణీలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఫేస్ రికగ్నిషన్(ముఖ గుర్తింపు) అనే ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానం అమలుపై సెర్ప్ పెన్షన్ విభాగం డీపీఎం, ఏపీఎంలకు హైదరాబాద్లో ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. గ్రామాల వారీగా పంపిణీ చేసే పోస్టల్ శాఖకు సంబంధించిన బ్రాంచ్ పోస్ట్మాస్టర్(బీపీఎం)లకు శనివారం జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ విధానం ఆగస్టు నుంచి అమల్లోకి రానుంది. అక్రమాలకు చెక్ మున్సిపాలిటీల్లో పింఛన్ను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. అయితే ఎవరైనా లబ్ధిదారు మరణిస్తే కుటుంబ సభ్యులు సంబంధిత అధికారులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. డెత్ సర్టిఫికెట్ ఇచ్చినట్లైతే సదరు లబ్ధిదారునికి అందించే పింఛన్ నిలిచిపోతుంది. కానీ అలా జరగడం లేదు. పింఛన్దారులు మరణించినా డబ్బులు మాత్రం వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి. వాటిని కొంతమంది ఏటీఎం ద్వారా డ్రా చేసుకుంటున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు పలు చోట్ల చోటు చేసుకున్నాయి. అలాగే పలుచోట్ల పంచాయతీ కార్యదర్శులు మరణించిన లబ్ధిదా రుల పింఛన్ కాజేసిన ఘటనలు సైతం చోటు చేసుకున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం ఫేస్ రికగ్నిషన్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇబ్బందులు దూరం .. ప్రస్తుతం బయోమెట్రిక్ ద్వారా పింఛన్ల పంపిణీ చేపడుతున్నారు. లబ్ధిదారుల్లో అత్యధికులు వృద్ధులు, దివ్యాంగులే. వీరిలో 60 నుంచి 80 ఏళ్లు దాటిన వారి చేతి వేళ్ల కొనలు అరిగిపోయి వేలిముద్రలు పడటం లేదు. దీంతో పింఛన్ల పంపిణీలో సమస్యలు తలెత్తుతున్నాయి. పంచాయతీ కార్యదర్శులు తమ వేలిముద్రల ఆధారంగా పింఛన్లు అందజేస్తున్నప్పటికీ పదేపదే తిరగాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యను దూరం చేసేలా ప్రభుత్వం ఫేస్ రికగ్నిషన్ యాప్ను తీసుకొచ్చింది. ఆధార్కు ఫొటో అనుసంధానమైన లబ్ధిదారులను స్మార్ట్ఫోన్లో ఫొటో తీయగానే వారి వివరాలు ప్రత్యక్షమై పేమేంట్ మోడల్లోకి వెలుతుంది. దీంతో సత్వరం నగదు పొందే అవకాశముంది. ఈ యాప్తో కూడిన అధునాతన స్మార్ట్ఫోన్లను జిల్లాలోని 250 మంది బీపీఎంలకు అందజేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు శనివారం వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇదీ పరిస్థితి .. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులు, బీడీ వర్కర్లతో పాటు హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు (1,012), ఫైలేరియా బాధితులు (645) డయాలిసిస్ రోగులు (78)లు చేయూత పథకం కింద పింఛన్ పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కేటగిరీలు కలిపి 75,564 మంది లబ్ధిదారులున్నారు. వీరికి ప్రతి నెలా రూ.19 కోట్ల 51లక్షల 27వేల 790లను చెల్లిస్తోంది. ఇందులో దివ్యాంగులకు రూ.4,016, ఇతరులకు రూ.2,016లను అందజేస్తోంది. -
ఫలించిన ఎనిమిదేళ్ల న్యాయ పోరాటం
● రిటైర్మెంట్ ప్రయోజనాలపై హైకోర్టును ఆశ్రయించిన సీసీఐ ఉద్యోగులు ● వడ్డీతో సహా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశం కై లాస్నగర్: జిల్లా కేంద్రంలోని సీసీఐ యాజమాన్యం జారీ చేసిన ఉత్తర్వులపై ఆ సంస్థలో పనిచేసిన ఉద్యోగులు చేసిన న్యాయ పోరాటం ఎట్టకేలకు ఫలించింది. సీసీఐని మూసివేస్తూ 2017లో ఉత్తర్వులు జారీ చేసిన మేనేజ్మెంట్ 2008 సంవత్సరం వరకే ఉద్యోగులకు రిటైర్మెంట్, వాలంటరీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేస్తామని స్పష్టం చేసింది. అయి తే తమకు అన్యాయం జరుగుతుందని భావించిన ఉద్యోగులు సంస్థ జారీ చేసిన ఉత్తర్వులపై హై కోర్టును అదే సంవత్సరంలో ఆశ్రయించారు. అప్ప టి నుంచి కోర్టులో కేసు నడుస్తుంది. కాగా ఉద్యోగులకు రిటైర్మెంట్, వాలంటరీ రిటైర్మెంట్ ప్రయోజనాలను 2008 నుంచే వడ్డీతో సహా చెల్లించాలని సూచిస్తూ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు సీసీఐ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కా ర్యదర్శి, ఏఐటీయుసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్ తెలిపారు. ఎనిమిదేళ్ల న్యాయ పోరాటం ఫలించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును స్వాగతిస్తూ శుక్రవారం సీపీఐ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. -
ఒత్తిడిని అధిగమించాలి
ఆదిలాబాద్టౌన్: కోర్టులో విధులు నిర్వహించే జడ్జీలు, న్యాయవాదులు ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకు సాగాలని జిల్లా జడ్జి కె.ప్రభాకరరా వు అన్నారు. ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ న్యాయ శ్రేయ దినో త్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి పాల్గొని కేక్ కట్ చేశారు. అనంత రం మాట్లాడారు. కోర్టులో జడ్జీలు, న్యాయవా దులు ఒత్తిడితో ఉంటారని, పరస్పర సహకా రంతో కక్షిదారులకు ఉన్నతమైన న్యాయం అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు జడ్జి శివరాంప్రసాద్, ఫ్యామిలీ కోర్టు జడ్జి లక్ష్మికుమారి, ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి వివేక్, సీని యర్ సివిల్ జడ్జి రాజ్యలక్ష్మి, జూనియర్ సివిల్ జడ్జి హుస్సేన్ నాయక్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్రాల నగేశ్, డీఎస్పీ శర్మ, న్యాయవాదులు పాల్గొన్నారు. -
‘49’ తెచ్చింది.. అప్పటి ప్రభుత్వాలే!
● కాంగ్రెస్కు సంబంధం లేదు.. ● జీవో రద్దు చేసేంత వరకు ఉద్యమిస్తాం ● మాజీ ఎంపీ సోయం బాపూరావుఆదిలాబాద్రూరల్: జీవో 49కి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, ఆ జీవోను 2016లో రాష్ట్రంలోని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముసాయిదా తీసుకువచ్చిందని మాజీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆసిఫాబాద్ ప్రాంతంలో కారిడర్ పేరిట లక్షలాది ఆదివాసీలను నిర్వాసితులు చేసే కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఆదివాసీలను ఇబ్బందులకు గురి చేసే జీవో 49 రద్దు చేయాలని ఇటీవల సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు సీతక్క, జూపల్లిని కలిసి విన్నవించామన్నారు. స్పందించిన వారు ఆ జీవోను తాత్కాలికంగా నిలిపివేశారన్నారు. అయితే గతంలో ఆ జీవోకు మద్దతు ఇచ్చిన అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, ఎంపీ గోడం నగేశ్ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఆ జీవో రద్దు చేసేంత వరకు ఢిల్లీస్థాయి వరకు ఉద్యమిస్తామన్నారు. తుడుందెబ్బలోని కొంతమంది నాయకులు డబ్బులకు అమ్ముడుపోయారనే విమర్శలు రావడంతో అందులో నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నానని తెలిపారు. ఆదివాసీ సమస్యలపై పోరాటం చేసేందుకు రాజ్గోండ్ సేవా సమితిలో చేరి రాష్ట్ర అధ్యక్షుడిగా నెల 27న ప్రమాణ స్వీకారం చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట సంఘం నాయకులు సిడాం అర్జు, ఆత్రం పరుశురాం, హన్ను పటేల్, శంబు, తానాజీ, ఆనంద్రావ్, శ్యాంరావ్, తదితరులున్నారు. -
కేజీబీవీల్లో సీఆర్టీ పోస్టుల భర్తీ
ఆదిలాబాద్టౌన్: కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న సీఆర్టీ పోస్టులను భర్తీ చేశారు. ఇటీవల సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టిన విద్యాశాఖ అధికారులు శుక్రవారం డీఈవో కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి వారికి నియామక పత్రాలు అందజేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేయాలని సూచించారు. జిల్లాలో ఐదు పోస్టులు ఖాళీగా ఉండగా, నాలుగు భర్తీ చేసినట్లు తెలిపారు. మావల కేజీబీవీలో ఫిజికల్ సైన్స్, ఉట్నూర్లో బయోసైన్స్, ఇచ్చోడలో పీజీ సీఆ ర్టీ నర్సింగ్, బేలలో పీజీ సీఆర్టీ బాటనీ పోస్టులు భర్తీ చేసినట్లు పేర్కొన్నారు. సీఆర్టీ పీఈటీ పోస్టింగ్కు సంబంధించి అభ్యర్థి నాట్ విల్లింగ్ ఇచ్చారని, దీంతో ఆ పోస్టును భర్తీ చేయలేదని వివరించారు. గత నియామకాల్లో ఒకరికి బదులు మరొకరికి పోస్టింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఫిజికల్ సైన్స్కు సంబంధించి 8వ ర్యాంక్ అభ్యర్థిని తొలగించి 7వ ర్యాంక్ అభ్యర్థికి పోస్టింగ్ కల్పించారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నా రు. కార్యక్రమంలో ఆదిలాబాద్ అర్బన్ విద్యాధికారి సోమయ్య, డీఈవో కార్యాలయ సూపరింటెండెంట్ వేణు, కేజీబీవీ సెక్టోరియల్ అధి కారి ఉదయ్శ్రీ, రమేశ్ పాల్గొన్నారు. -
ఆరోగ్యంపై దృష్టి సారించాలి
ఇచ్చోడ: ప్రతీ విద్యార్థి ఆరోగ్యంపై దృష్టి సారించా లని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మండలంలోని ముఖరా(బి) ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడా రు. ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు చెప్పిన అంశాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. తలసేమి యాతో బాధపడుతున్న శివంగి అనే విద్యార్థినికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ చాబ్రా, జెడ్పీసీఈవో జితేందర్రెడ్డి, డీఎంహెచ్వో రాథోడ్నరేందర్, డీఈవో శ్రీనివాస్రెడ్డి, జిల్లా మలేరియా అధికారి శ్రీధర్, తహసీల్దార్ సత్యనారాయణరావు, ఎంపీడీవో సత్యానంద్, ఇచ్చోడ వైద్యాధికారి కిరణ్కుమార్, మాజీ సర్పంచ్ మారుతి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు సు భాష్, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రజలను అప్రమత్తం చేయాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: మూడురోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజల ను అప్రమత్తం చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలోని పోలీస్ అధికారులకు సూచనలు చేశా రు. కొత్తగా శిక్షణ పొందిన డిజాస్టర్ రెస్పాన్స్ బృందం (డీడీఆర్ఎఫ్) అత్యాధునిక సదుపాయాలతో 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తుందని చెప్పారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. నీరు ప్రవహిస్తున్న కల్వర్టులు, బ్రిడ్జిలపై ప్రజలు దాటకుండా, వాగులు, నదులు, రిజ ర్వాయర్లు, జలపాతాల వద్దకు వెళ్లకుండా చూడాలని తెలిపారు. చేపల వేట కోసం వాగులు, చెరువులకు వెళ్లకుండా మత్స్యకారులను అప్రమత్తం చే యాలని పేర్కొన్నారు. రైతులు తడిచిన విద్యుత్ మోటార్లు, స్తంభాలు, వైర్లను ముట్టుకోకుండా, చె ట్లు, శిథిల భవనాల వద్ద ఉండకుండా అవగాహన కల్పించాలని చెప్పారు. జలపాతాలు, చెరువులు, వాగులు, రహదారుల పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షించి రాకపోకలపై నిఘా పెట్టాలని, రహదారులపై నీటి గుంతలున్న చోట హెచ్చరిక బోర్డులు ఏ ర్పాటు చేయాలని ఆదేశించారు. అత్యవసరమైతే ప్రజలు ‘డయల్ 100’కు లేదా స్థానిక పోలీస్స్టేషన్ను సంప్రదించాలని సూచించారు. -
ముందస్తు టెండర్లు?
● ఎకై ్సజ్ కమిషనర్ నుంచి ఆదేశాలు ● ఏజెన్సీ ప్రాంత గ్రామాల్లో గ్రామసభలు ● తీర్మానాలు సేకరిస్తున్న అధికారులు ● నవంబర్ వరకు గత షాపుల గడువు సాక్షి, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వైన్షాపులకు ముందస్తు టెండర్లు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఏజెన్సీ ప్రాంత గ్రామాల్లో వైన్షాపులు ఏర్పాటు చేసేందుకు తప్పనిసరిగా పెసా యాక్ట్ ప్రకారం గ్రా మసభ తీర్మానం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందు కు అనుకూలంగా తాజాగా ఎకై ్సజ్ కమిషనర్ నుంచి ఆ శాఖ జిల్లా అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. దీంతో అధికారులు ఏజెన్సీ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తూ తీర్మానాలు సేకరించే పనిలో పడ్డారు. ఈనెల 27వరకు వాటిని కమిషనర్కు పంపించనున్నారు. దీని ద్వారా ప్రభుత్వం వైన్షాపులకు ముందస్తు టెండర్ల నిర్వహణకు సిద్ధమవుతున్నట్లు లిక్కర్ వ్యాపారుల్లో చర్చ మొదలైంది. తీర్మానాల సేకరణలో అధికారులు రెండేళ్ల కిందట అంటే.. 2023 నవంబర్లో బీఆర్ఎస్ హయాంలో వైన్స్లకు సంబంధించి టెండర్లు నిర్వహించారు. వచ్చే నవంబర్లో వాటి కాలపరిమితి ముగియనుంది. అప్పట్లో బీఆర్ఎస్ సర్కార్ కూడా ఎన్నికలకు ముందే ముందస్తు టెండర్లు నిర్వహించింది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు ముందుండగా, ఈ టెండర్లు నిర్వహించడం ద్వారా ఔత్సాహికుల్లో లిక్కర్ షాప్ దక్కించుకోవాలనే పో టీ కనిపిస్తుందని, తద్వారా అధిక ఆదాయం లభి స్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. కాగా, రాష్ట్ర ఎకై ్సజ్శాఖ కమిషనర్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో డీపీఈవోలు ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాల్లో గ్రామసభల ద్వారా అక్కడ వై న్స్ ఏర్పాటు చేసేందుకు వీలుగా తీర్మానాలు సేకరించే పనిలో పడ్డారు. రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి కమిషనర్ ఆఫీస్కు పంపించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా.. ఉమ్మడి జిల్లాలో ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఆదిలాబాద్లో ఉంది. ఆదిలాబాద్ డివిజన్ కార్యాలయంగా దీన్ని పిలుస్తారు. దీని పరిధిలో మొత్తం 192 వైన్స్లున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 40, నిర్మల్లో 47, మంచిర్యాలలో 73, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 32 చొప్పున ఉన్నాయి. ఏటా సుమారు రూ.1,400 కోట్ల డిమాండ్ మేర మద్యం విక్రయాలు జరుగుతాయి. తీర్మానాలు సేకరిస్తున్నాం పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామసభల ద్వారా వైన్షాపులు ఏర్పాటు చేసేందుకు తీర్మానాలు సేకరిస్తున్నాం. ఎకై ్సజ్ టెండర్లను ముందస్తుగా నిర్వహించే విషయంలో మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. – హిమశ్రీ, డీపీఈవో -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ఉట్నూర్రూరల్: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గురువారం కలెక్టర్ రాజర్షి షా ఉట్నూర్ మండలం నాగపూర్ శివసాగర్ ప్రాజెక్ట్, పులిమడుగు బ్రిడ్జిని పరిశీలించారు. అతి భారీ వర్షాలు కురిస్తే ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులు సూచించారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని పేర్కొన్నారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారి విఠల్, డిప్యూటీ ఇంజినీర్ వినోద్, ఏఈలున్నారు. అంతకుముందు మండల కేంద్రంలోని పీఏసీఎస్ను సందర్శించారు. రైతులకు యూరియా సరఫరా చేస్తున్న తీరు, నిల్వ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు ఇండెంట్ పంపించి యూరియా కొరత రా కుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
క్షయకు ఎవరూ భయపడొద్దు
బేల: క్షయకు ఎవరూ భయపడొద్దని జిల్లా టీబీ అ ధికారి సుమలత సూచించారు. గురువారం మండల కేంద్రంలోని కేజీబీవీలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భా గంగా స్క్రీనింగ్, టీబీ అనుమానిత కేసుల ఎక్స్రేల వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్షయ నివారణకు ప్రభుత్వ ఆస్పత్రి లో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తూ చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. డెంగీ, చికెన్ గున్యా, మలేరియా, అతిసారా బారిన పడకుండా ఉండేందుకు పలు సూచనలు చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య వి ద్యపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పీ హెచ్సీ వైద్యాధికారి వంశీకృష్ణ, ఎస్టీఎస్ రవీందర్, ఎస్వో గేడం నవీన, హెల్త్ సూపర్వైజర్లు కళావ తి, జాదవ్ అనిల్కుమార్, హెల్త్ అసిస్టెంట్ బాసిద్, ఏఎన్ఏంలు లలిత, సుజాత తదితరులున్నారు. -
వృత్తి శిక్షణతో ఉపాధి అవకాశాలు
ఆదిలాబాద్రూరల్: వృత్తి నైపుణ్య శిక్షణ పొందితే ఉ పాధి అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ, షిరిడీ సాయి సేవా సొసైటీ సంయుక్తంగా సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయ ఆవరణలోని భవనంలో ఏర్పాటు చేసిన ఉచిత వృత్తి విద్య, నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ గురువారం ప్రారంభించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, షిరిడీ సాయి సొసైటీ సంయుక్తంగా వృత్తి నైపుణ్య కేంద్రం నిర్వహణకు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత కేంద్రాన్ని సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, దళితాభివృద్ధి శాఖ అధికారి సునీతాకుమారి, షిరిడి సాయి సేవా సొసైటీ అధ్యక్షుడు, సాయిలింగి వృద్ధాశ్రమం నిర్వాహకుడు దెబ్బడి అశోక్, ఉపాధ్యక్షుడు నాలం అని ల్, ప్రధాన కార్యదర్శి శివన్న, కోశాధికారి దశరథ్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధుల బారిన పడొద్దు
సాత్నాల: సీజనల్ వ్యాధుల బారిన పడొద్దని డీఎంహెచ్వో సాధన సూచించారు. భోరజ్ మండలం గిమ్మ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉ న్నత పాఠశాలలో ఆరోగ్య పాఠశాలలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. క్యాన్సర్పై విద్యార్థులు అవగాహన కలి గి ఉండాలని తెలిపారు. వ్యాధి లక్షణాలను వి ద్యార్థులకు వివరించి నివారణపై అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూ చించారు. అనంతరం పీహెచ్సీని సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. ఆమె వెంట మెడికల్ ఆఫీసర్ సుచల, సూపర్వైజర్ చంద్రశేఖర్, అనిత, ఏఎన్ఎంలు అరుణ, రుక్మిణి, ఆశ, హెచ్ఎం పద్మజ తదితరులున్నారు. -
కేంద్ర మంత్రులకు వినతులు
ఆదిలాబాద్: కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, హరదీప్ సింగ్ను ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలి శారు. ఆర్మూర్–నిర్మల్ రైల్వే మార్గానికి సర్వే పూర్తి చేయించి నిధులు విడుదల చేయాలని విన్నవించా రు. జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న రైల్వే వంతెనలకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాలని కోరారు. ఇంటింటికీ సహజవాయువు గ్యాస్ పైపులైన్ ఏర్పా టు చేయాలని, ద్విచక్ర వాహనాలకూ విద్యుత్ చా ర్జింగ్ పాయింట్ స్టేషన్లు నెలకొల్పాలని విజ్ఞప్తి చేశా రు. ఇందుకు కేద్ర మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. వీరి వెంట బీజేపీ రాష్ట్ర నాయకుడు ముస్తాపూర్ అశోక్ ఉన్నారు. -
లబ్ధిదారులకు కొత్త రేషన్కార్డులు
ఉట్నూర్రూరల్: ఉట్నూర్ హెచ్కేజీఎన్ ఫంక్షన్ హా ల్లో గురువారం ఆహార భద్రత, కొత్త రేషన్ కార్డులను కలెక్టర్ రాజర్షిషా, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పంపి ణీ చేశారు. లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముభా రక్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పదేళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రే షన్ కార్డుల కల నెరవేరిందని తెలిపారు. ఉట్నూర్ కు సుమారు 2,081 రేషన్కార్డులు వచ్చినట్లు పేర్కొన్నారు. అర్హులెవరైనా ఉంటే దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం పరిశీలించి మంజూరు చేస్తుందని చెప్పా రు. రేషన్కార్డుల్లో పేర్లు నమోదు కాని వారు నమో దు చేయించుకోవాలని, కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, డీసీ సీబీ డైరెక్టర్ ప్రభాకర్రెడ్డి, తహసీల్దార్ ప్రవీణ్, సివి ల్ సప్లయ్ అధికారి వాజిద్ తదితరులున్నారు. -
‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
జైనథ్: మండలంలోని నిరల గ్రామంలోగల త్రి నేత్ర ఫంక్షన్హాల్లో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో ‘స్థానిక’ ఎన్నికల కార్యశాల నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం హా జరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. నాయకులు పాయల్ శరత్, ఏండ్ల నాగేశ్, మయూర్ చంద్ర, బోయర్ విజయ్, సీతారాం, దత్తాత్రేయ, కరుణాకర్రెడ్డి, రాందాస్, రాకేశ్రెడ్డి, సీడం రాకేశ్, సత్యనారాయణ, రాకేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు విద్యుత్ సమస్యల పరిష్కార వేదికనేరడిగొండ: విద్యుత్ సమస్యలపై శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదికలో నేరడిగొండ, ఇచ్చోడ, బోథ్, బజార్హత్నూర్ మండలా ల విద్యుత్ వినియోగదారుల సమస్యల పరి ష్కారం కోసం పరిష్కార వేదిక నిర్వహించను న్నట్లు విద్యుత్ శాఖ అధికారి నాగేంద్రప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నా రు. కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవా లని తెలిపారు. వినియోగదారులు విద్యుత్ సంబంధిత సమస్యలు తమ దృష్టికి తీసుకు వచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. -
కంప్యూటర్ ఆపరేటర్ల నిరసన
కై లాస్నగర్: పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు గురువారం విధులు బ హిష్కరించి డీపీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. తమ వేతనం రూ.22,750 ఉండగా.. రూ.19,500 మాత్రమే ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోందని ఆరోపించారు. ఇలా వేతనాలు తగ్గించి ఇవ్వ డంతో ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంజేశారు. మూడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంత రం డీపీవో రమేశ్కు వినతిపత్రం ఇచ్చారు. -
నాణ్యమైన వైద్యసేవలందించాలి
● రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ● ఘనంగా నర్సింగ్ గ్రాడ్యుయేషన్ డే ఆదిలాబాద్టౌన్: వృత్తిని దైవంగా భావించి రోగుల కు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని రిమ్స్ డై రెక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు. బుధవారం రిమ్స్ ఆడిటోరియంలో నర్సింగ్ గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. నర్సింగ్ విద్యార్థుల సాంస్కృతి క ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ మాట్లాడుతూ వైద్యసేవల్లో న ర్సుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్లు దీపక్ పు ష్కర్, బండారి నరేందర్, నర్సింగ్ కళాశాల ప్రిన్సి పాల్ అనిత, లెక్చరర్లు విద్యార్థులు పాల్గొన్నారు. -
కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ
ఆదిలాబాద్: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని ఎంపీ గోడం నగేశ్ బుధవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలో విమానాశ్రయ అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా, ఈ నెల 4న రక్షణ, విమానయాన శాఖ అధికారులు అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిగినట్లు మంత్రి ఎంపీకి తెలిపారు. ఈ చర్చలకు కొనసాగింపుగా తమ వద్ద సైతం సమావేశం ఏర్పాటు చేయాలని ఎంపీ విన్నవించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ వివరించారు. -
కళాశాలపై నిఘా
ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వ కళాశాలల అభివృద్ధిపై సర్కారు దృష్టి సారించింది. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్కారు కళాశాలల్లో నిఘా ఏర్పాటు చేసింది. సీసీ కెమెరాలతో పర్యవేక్షణకు శ్రీకారం చుట్టింది. ఆయా కాలేజీల నుంచి నేరుగా ఇంటర్మీడియెట్ బోర్డు కమిషనరేట్కు వీటిని అనుసంధానం చేశారు. తరగతులకు డుమ్మా కొట్టే విద్యార్థులు, సక్రమంగా విధులు నిర్వహించని గురువులకు చెక్ పడనుంది. ఈ ప్రక్రియ ద్వారా విద్యార్థుల హాజరు శాతం పెరగనుండడంతో పాటు నాణ్యమైన విద్యాబోధన అందనుంది. తద్వారా ఉత్తీర్ణత శాతం మెరుగుకానుంది. ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో.. జిల్లాలో ఒక్కో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 14 సీసీ కెమెరాల చొప్పున అమర్చారు. తరగతి గది, కళాశాల ముందు భాగం, ఆవరణలో వీటిని ఏర్పాటు చేశారు. విద్యార్థినులను ఎవరైనా ఇబ్బందులకు గురిచేసినా ఇట్టే తెలిసిపోనుంది. వీటి ఏర్పాటుతో బాలికలకు మరింత భరోసా కలగనుంది. అలాగే లెక్చరర్ల సమయపాలన తీరు తెలుస్తోంది. ఏ తరగతి కూడా లెక్చరర్ లేకుండా ఉండకూడదు. అలాగే ఒకరికి బదులు మరొకరు బోధించే పరిస్థితికి చెక్ పడనుంది. ఇక ప్రతీ విద్యార్థికి 75 హాజరు శాతం ఉంటేనే పరీక్షలకు అనుమతించనున్నారు. దీంతో విద్యార్థుల హాజరు శాతం కూడా మెరుగుపడనుంది. తరగతులు బోధించాల్సిందే.. జిల్లాలోని చాలా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇదివరకు కనీసం ప్రార్థన కూడా నిర్వహించని పరిస్థితి ఉండేది. ఇక ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అలాగే ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు బోధించాల్సిందే. దీనికి సంబంధించి టైంటేబుల్ సైతం సిద్ధం చేశారు. ప్రతీ గదిలో సీసీ కెమెరా ఏర్పాటు కారణంగా లెక్చరర్లు ఇక కాలక్షేపం చేయడానికి అవకాశం లేదు. అలాగే విద్యార్థులు సైతం తప్పనిసరిగా తరగతి గదిలో కూర్చోవాల్సిందే. ఈ సీసీ కెమెరాలను హైదరాబాద్లోని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ కమాండెంట్కు అనుసంధానం చేశారు. ఉమ్మడి జిల్లా కళాశాలల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారిని నియమించారు. ఉమ్మడి ఆదిలాబాద్కు డిప్యూటీ సెక్రెటరీగా ఉన్న ఆర్.వెంకటేశ్వర్రావు పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో దాదాపు 200 మంది జూనియర్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అంతగా అధ్యాపకుల కొరత లేదు. గుడిహత్నూర్, తలమడుగు, నార్నూర్ మండలాల్లో ఇన్చార్జి ప్రిన్సిపాళ్లు ఉన్నారు. ప్రస్తుతం లెక్చరర్లకు బయోమెట్రిక్ హాజరు అమలు చేస్తుండగా, ఆగస్టు 1 నుంచి ఫేషియల్ అటెండెన్స్ అమలు కానుంది. దీంతో ఆయా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మేలు చేకూరనుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సీసీ కెమెరాలు కమిషనరేట్ నుంచే పర్యవేక్షణ అధ్యాపకుల గైర్హాజరుకు ఇక చెక్ విద్యార్థులకు అందనున్న నాణ్యమైన బోధన జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు : 13 ప్రథమ సంవత్సరం విద్యార్థులు : 3,100 ద్వితీయ సంవత్సరం విద్యార్థులు : 3,506 అన్ని కళాశాలల్లో సీసీ నిఘా.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీ నిఘా ఏర్పాటు చేశాం. ఒక్కో కళాశాలలో 14 కెమెరాల చొప్పున అమర్చడం జరిగింది. వీటి ద్వారా లెక్చరర్ల స మయపాలన, కచ్చితంగా బోధన, చదువులో నాణ్యత పెరుగుతుంది. ఏవైనా సంఘటనలు జరిగినా సీసీ కెమెరాల్లో నిక్షిప్తమవుతాయి. వీటిని ఆయా కళాశాలల నుంచి హైదరాబాద్లోని ఇంటర్మీడియెట్ బోర్డు కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేయడం జరిగింది. పర్యవేక్షణ కోసం ఉమ్మడి జిల్లాకు ఒక్కరు చొప్పు న ప్రత్యేక అధికారులను నియమించారు. – జాదవ్ గణేశ్కుమార్, డీఐఈవో -
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
● కలెక్టర్ రాజర్షి షాఆదిలాబాద్: మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో బుధవారం నిర్వహించిన మహాలక్ష్మి సంబురాల్లో పాల్గొని మాట్లాడా రు. మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందన్నారు. ఇందులో భా గంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు 200 కోట్ల మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారన్నారు. ప్రయాణ చార్జీల రూపంలో రూ.6,680 కోట్లు మహిళలకు ఆదా అయ్యాయన్నారు. ఈ మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తోందని వెల్లడించారు. జిల్లాలో 1.75 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని వివరించారు. అనంతరం బస్టాండ్లో తీర్చిదిద్దిన రంగవల్లులను వీక్షించి ప్రయాణికులు, విద్యార్థులు, సిబ్బందిని అభినందించారు. పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. పలువురు మహిళా ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బందిని సన్మానించారు. ఇందులో ట్రెయినీ కలెక్టర్ సలోని, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సోమరాజు భవాని ప్రసాద్, డిపో మేనేజర్ ప్రతిమ, సారథి కళాకారులు ప్రయాణికులు పాల్గొన్నారు. గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఆదిలాబాద్రూరల్: మావల మండల కేంద్రంలోని మహాత్మాజ్యోతి బాపూలే గురుకుల పాఠశాలను కలెక్టర్ రాజర్షిషా బుధవారం రాత్రి తనిఖీ చేశారు. భోజన, వసతిగృహ శుభ్రత, తాగునీరు, విద్యుత్ సరఫరా, ఆరోగ్య సంరక్షణ తదితర అంశాలను పరిశీలించారు. స్టోర్ రూమ్లో నిల్వలను పరిశీలించి అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. భోజనం, విద్యాబోధన తీరుపై ఆరా తీశారు. -
● జీవో నిలుపుదలపై క్రెడిట్ కోసం కాంగ్రెస్ నేతల పాట్లు ● స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎత్తుగడ అంటున్న ఆదివాసీలు ● పూర్తిగా రద్దు చేసేవరకు పోరాటం ఆగదంటున్న ట్రైబల్స్
సాక్షి,ఆదిలాబాద్: కుమురంభీం కన్జర్వేషన్ కారిడార్ పేరిట తీసుకొచ్చిన జీవో నం.49ను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలుపుదల చేయడాన్ని కాంగ్రెస్ నేతలు రాజకీయంగా మైలేజ్ పొందేందుకు యత్నిస్తున్నారు. రాష్ట్రంలోని హస్తం పార్టీ గిరిజన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలంతా కలిసి ఈ జీవో నిలుపుదల విషయంలో తీవ్ర ప్రయత్నాలు చేశామని చెబుతున్నారు. అయితే ఇది స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలుపుదల చేసిందని, దాన్ని పూర్తిగా రద్దు చేసేంత వరకు మా పోరాటం ఆగదని ఆదివాసీలు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు గట్టిగా ప్రయత్నాలు చేయాలని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా బంద్ ప్రభావంతో.. ప్రస్తుతం జీవో నం.49 చుట్టే రాజకీయ చర్చ సాగుతుంది. ప్రధానంగా గత సోమవారం ఈ జీవోను వ్యతిరేకిస్తూ ఆదివాసీ సంఘాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు బంద్ పిలుపునివ్వడం, అది సక్సెస్ కావడంతో ఆ సాయంత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాత్కాలిక నిలిపివేత నిర్ణయం వెలువడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అదే రోజు హైదరాబాద్లో హస్తం పార్టీకి చెందిన గిరిజన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను సన్మానించారు. ఆ తర్వాత ఆదివాసీ సంఘాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. అయితే దీన్ని పూర్తిగా రద్దు చేసేవరకు తమ పోరాటం ఆపమని స్పష్టం చేస్తున్నారు. ఈక్రమంలో ఈనెల 28న కుమురంభీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట మహాధర్నాకు సమాయత్తం అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆదివాసీ సంఘాలు దిగివచ్చాయని అనుకుంటున్న సందర్భంలో మహా ధర్నా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు ఈ జీవోను నిలుపుదల చేశామంటూ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేస్తుండటం గమనార్హం. మొత్తంగా ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాలు రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి.. తాత్కాలికంగా నిలుపుదల చేసిన ఈ జీవో విషయంలో ఆదివాసీలు ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తూనే మరోవైపు పూర్తిస్థాయిలో రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలంటున్నారు. ఈ జీవో విషయంలో ఆదివాసీ సంఘాలు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నాయి. ప్రస్తుతం తాత్కాలికంగా నిలుపుదలతో పోరాటా న్ని విరమించకుండా ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నాయి. అందులో భాగంగానే కుమురంభీం ఆసిఫాబాద్లో త్వరలో మహాధర్నాకు సిద్ధమవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివాసీలకు అండగా ప్రజాప్రభుత్వం ఆదివాసీలకు ప్రజాప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుంది. జీవో నం.49 నిలుపుదల విషయంలో గతంలో ఆదివాసీలకు మాట ఇచ్చాను. దాన్ని నిలబెట్టుకున్నాను. ప్రభుత్వం అన్ని కోణాల్లో చర్చించి నిలుపుదల నిర్ణయం తీసుకోవడం జరిగింది. మంత్రుల విజ్ఞప్తి, ఆదివాసీల ఆందోళన, అధికారుల నివేదికలను పరిశీలించిన సీఎం జీవో నిలుపుదలకు ఆదేశించారు. దానికి అనుగుణంగా అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. – జూపల్లి కృష్ణారావు, జిల్లా ఇన్చార్జి మంత్రిపోరాటం ఆగదు.. ఆదివాసీ ప్రజా ఉద్యమం కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం జీవోను నిలుపుదల చేసింది. అయితే రద్దయ్యే వరకు మా పోరాటం ఆగదు. 28న కుమురంభీం కలెక్టరేట్ ఎదుట మహా ధర్నాకు పిలుపునిచ్చాం. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ఉంది. – గోడం గణేశ్, తుడుందెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు -
● ఉండీ లేనట్టుగా శాఖా వ్యవహారం ● జిల్లా అధికారి సస్పెన్షన్తో లోపాలు బహిర్గతం ● రైతుల దరిచేరని సంక్షేమ పథకాలు ● తగ్గిన కూరగాయలు, పండ్ల తోటల సాగు విస్తీర్ణం ● లక్ష్యాల సాధనలోనూ వెనుకంజ
ఈ శాఖ ఇన్చార్జి జిల్లా అధికారిగా ఉన్న సుధాకర్ ఇటీవల సస్పెన్షన్కు గురయ్యారు. ఈ సంఘటన జరిగిన తర్వాత కార్యాలయానికి ఎవరైనా వెళితే.. జిల్లా అధికారి సస్పెన్షన్ వ్యవహారాన్ని దాచిపెడు తూ బదిలీపై వెళ్లారని ఉద్యోగులు పేర్కొనే పరిస్థితి ఉంది. విషయం తెలిసిన వారు సస్పెన్షన్కు గురైనట్లు తెలుస్తుందంటే.. అప్పుడు వారు ఆ విషయంలో స్పందించే పరిస్థితి. ఇది వరకు జిల్లా అధికారి ఒకరు సస్పెన్షన్కు గురికావడంతో కరీంనగర్లో పట్టు పరిశ్రమ శాఖ డిప్యూటీ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న సుధాకర్ను ఏడాదిన్నర క్రితం ఇక్కడ ఉద్యానవన, పట్టుపరిశ్రమల శాఖ ఇన్చార్జి జిల్లా అధికారిగా నియమించారు. ఎందుకు వేటు పడిందంటే.. ఉద్యానవన శాఖలోనే విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన ఓ ఉద్యోగికి సంబంధించి పెన్షన్ పత్రాలు అందించే విషయంలో ఇబ్బందులకు గురి చేయడంతో ఆయన టీఎన్జీవో నాయకులను ఆశ్రయించాడు. వారు జిల్లా అధికారిని కలిసి పెన్షన్ పత్రాలు అందజేయాలని కోరినప్పటికీ ఆ అధికారి పట్టీపట్టనట్టుగా వ్యవహరించాడు. దీంతో టీఎన్జీవో నాయకులు హైదరాబాద్లో డైరెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. స్పందించిన ఉన్నతాధికారులు జిల్లా ఇన్చార్జి అధికారి సుధాకర్పై సస్పెన్షన్ వేటు వేశారు. జిల్లా శాఖలో అసలు లక్ష్యాలను విస్మరించి ఇలా అధికారులు తమ స్వార్థప్రయోజనాల కో సం అక్రమాలకు పాల్ప డుతున్నారనే విమర్శలు లేకపోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పథకాలు.. ఉద్యానవన శాఖ ద్వారా రైతుల సంక్షేమం కోసం వివిధ అభివృద్ధి పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యంతో అమలు చేస్తున్నాయి. వాటి లక్ష్యాలను జిల్లాల వారీగా నిర్దేశిస్తున్నాయి. ఇందులో కేంద్ర భాగస్వామ్యం 60 శాతం ఉండగా, రాష్ట్ర భాగస్వామ్యం 40 శాతంగా ఉంటుంది. ప్రస్తుతం ఆయిల్పామ్ సాగుపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. అలాగే మైక్రో ఇరిగేషన్, మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ హార్టికల్చర్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద వివిధ పథకాలను అమలు పరుస్తున్నారు. అయితే ఈ పథకాలకు సంబంధించిన లక్ష్యాల సాధన జిల్లాలో అంతంత మాత్రంగానే ఉందని తెలుస్తోంది. రైతుల దరిచేరని సంక్షేమం.. జిల్లాలో కూరగాయల సాగు విస్తీర్ణం ఏటా తగ్గిపోతుంది. ప్రస్తుతం 1600 ఎకరాల్లో మాత్రమే సాగవుతున్నాయి. పండ్ల తోటల సాగు కూడా నామమాత్రంగా 800 ఎకరాల్లోనే ఉంది. ఆయిల్పామ్ 2500 ఎకరాల్లో సాగవుతుంది. అయితే ఒకప్పుడు కూరగాయలు, పండ్ల సాగుపరంగా జిల్లాలో రైతులు ఆసక్తి కనబర్చినా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువవ్వడంతో పలువురు దృష్టి సారించడం లేదనే అభిప్రాయం ఉంది. ఇక డ్రిప్, స్ప్రింక్లర్లను రాయితీపై రైతులకు అందించాల్సి ఉండగా, అనేక దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఈ లక్ష్యం సాధినలోనూ శాఖ వెనుకబడిందన్న విమర్శలున్నాయి.ఆయిల్పామ్ కొనుగోలు కేంద్రాల ప్రణాళికేది..? ఆయిల్పామ్ దిగుబడులు మరో మూడు నెలల్లో చేతికి రానున్నాయి. ఇటీవలే కలెక్టర్ రాజర్షిషా వీటి విషయంలో జిల్లా అధికారిని ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లా అధికారి సస్పెన్షన్కు గురికావడంతో దానిపై కార్యాచరణ లోపించే పరిస్థితి కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఉద్యానవన శాఖ పరంగా జిల్లాలో ఒక జిల్లా అధికారి పోస్టుతో పాటు ప్రస్తుతం ఇద్దరు హెచ్వోలు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి క్లస్టర్కు ఒక హెచ్ఓ ఉండాల్సి ఉండగా, జిల్లాలో నలు గురు ఉండాల్సిన స్థానంలో ఇద్దరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వీరే ప్రస్తుతం జిల్లా అంతటా పరిశీలించాల్సిన పరిస్థితి. జిల్లా అధికారి సస్పెన్షన్తో ప్రస్తుతం వీరిపై మరింత బాధ్యతలు పెరిగాయి. మరో అధికారిని ఇక్కడికి నియమించాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ శాఖలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ‘సాక్షి’ ఓ హెచ్వోను సంప్రదించగా.. పూర్తిస్థాయిలో వివరాలు ఇచ్చేందుకు నిరాకరించారు. అంతేకాకుండా జిల్లా అధికారి సస్పెన్షన్ వ్యవహారంలోనూ గోప్యత పాటించడం గమనార్హం. -
కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ ‘గోడం’
ఆదిలాబాద్: కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను ఎంపీ గోడం నగేశ్ మంగళవారం ఢిల్లీ లో కలిశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధి లోని పలు అభివృద్ధి పనుల విషయంపై వినతిపత్రం అందించారు. జిల్లా కేంద్రంలో రైల్వే ఓవర్బ్రిడ్జి నిర్మాణం, కాజిపేట–హౌరా వయా మంచిర్యాల, కాగజ్నగర్ రైలు, ఆదిలాబాద్లోని ఎల్సీనంబర్ 29, 30 మార్పుపై విన్నవించారు. అలాగే కాగజ్నగర్ రైల్వేస్టేషన్లో వందేభారత్ రైలు ఆపితే ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని కోరారు. ఈ అంశాలపై మంత్రి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు ఇచ్చినట్లు ఎంపీ వివరించారు. -
మళ్లీ ఓటర్ల జాబితా
● కుటుంబం ఓట్లన్నీ ఒకేచోట ఉండేలా.. ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ● కసరత్తు చేస్తున్న కార్యదర్శులు కై లాస్నగర్: పరిషత్, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతున్న ప్రభుత్వం ఆ దిశగా ప్రక్రి య వేగవంతం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో మళ్లీ ఓటర్ల జాబితా రూపకల్పనకు ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికల జాబితా అనుసరించి కుటుంబంలోని సభ్యుల ఓట్లన్నీ ఒకే చోట ఉండేలా చూడాలని సూచించింది. బధవారం నాటికి మెర్జింగ్ స్టేట్మెంట్ సిద్ధం చేయాల్సిందిగా స్పష్టం చేసింది. ఆ దిశగా దృష్టి సారించిన పంచాయతీ కార్యదర్శులు ఓటర్ల జాబితా తయారీలో నిమగ్నమయ్యారు. కుటుంబ సభ్యులంతా ఒకే చోట.. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా అనుసరించి మండల, జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికల నిర్వహణ కు అవసరమైన ఓటర్ల మ్యాపింగ్ చేపట్టనున్నారు. 700 నుంచి 800 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తారు. అంతకు మించి ఉంటే అదనంగా మరో కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.అలాగే ఒక వార్డులోని ఓటర్లంతా అదే వార్డు పరి ధిలో ఉండేలా చూడటంతో పాటు కుటుంబ సభ్యులంతా ఒకే దగ్గర ఉండేలా ఓటర్ల జాబితా రూపకల్పన చేయాలని ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఓటర్ల జాబితాలు పరిశీలిస్తే ఒకే కుటుంబంలోని సభ్యులు వేర్వేరు సీరియల్ నంబర్లను కలిగి ఉంటారు. అలాగే పోలింగ్ స్టేషన్లు సై తం వేర్వేరుగా ఉంటాయి. స్థానిక పోరుకు మాత్రం ఇలాంటి సమస్య తలెత్తకుండా కుటుంబ సభ్యులంతా ఒకే చోట ఓటు హక్కు వినియోగించుకునేలా జాబితాలను సిద్ధం చేయనున్నారు. కసరత్తు చేస్తున్న పంచాయతీ సిబ్బంది జిల్లాలో గ్రామీణ ఓటర్లను పరిశీలిస్తే పురుషులు 2,20,620 మంది, మహిళలు 2,31,070 మంది ఉన్నారు. ఇతరులు మరో 17 మంది ఉన్నారు. వీరికి సంబంఽధించి ఇది వరకే పోలింగ్ కేంద్రాల వారీగా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. అయితే కొత్తగా నమోదైన ఓటర్లకు సైతం స్థానిక పోరులో ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మళ్లీ జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించింది. వార్డుల వారీగా మెర్జింగ్ స్టేట్మెంట్ను బుధవారం వరకు పూర్తి చేయనున్నారు. ఇది వరకు ఎంపీడీవోల లాగిన్లలో ఓటర్ల మ్యాపింగ్ చేపట్టగా తాజాగా పంచాయతీ కార్యదర్శులకు సైతం ప్రత్యేక లాగిన్ ఐడీలు కేటాయించారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాను కుటుంబాల్లోని సభ్యులంతా ఒకే చోట ఉండేలా మ్యాపింగ్ చేస్తున్నారు. ఈ జాబితా ల ఆధారంగానే ప్రభుత్వం స్థానిక సమరానికి వెళ్లనుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నిర్ణయంతో ఇటీవల కొత్తగా ఓటు హక్కు పొందిన వారు దాన్ని వినియోగించుకునే వెసులుబాటు కలుగనుంది. జిల్లాలో.. గ్రామ పంచాయతీలు : 473 వార్డు సభ్యుల స్థానాలు : 3,870 జెడ్పీటీసీ స్థానాలు : 20 ఎంపీపీ స్థానాలు : 20 ఎంపీటీసీ స్థానాలు : 166 పోలింగ్ కేంద్రాలు : 3,888 గ్రామీణ ఓటర్లు : 4,51,707ఆదేశాలు వచ్చాయి పంచాయతీ ఓటర్ల జాబితాలు కొత్తగా తయారీ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. వార్డుల వారీగా సిద్ధం చేయాలని సూచించింది. తదనుగుణంగా చర్యలు చేపట్టాం. పంచాయతీ కార్యదర్శులు అదే పనిలో నిమగ్నమయ్యారు. వార్డులోని ఓటర్లంతా ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండేలా శ్రద్ధ వహిస్తున్నాం. – జి.రమేశ్, జిల్లా పంచాయతీ అధికారి -
‘ఉపాధి’ బీమా.. కూలీలకు ధీమా
● ఏడాదికి రూ.20 ప్రీమియం మాత్రమే.. ● ‘పీఎంఎస్బీవై’ అమలుకు యంత్రాంగం కసరత్తుకైలాస్నగర్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథ కం పనులకు హాజరయ్యే కూలీలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. అవసరమైన చర్యలు చేపట్టాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు డీఆర్డీఏ అధికారులు ఇటీవల ఉపాధిహామీ ఏపీవోలు, టెక్నికల్,ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. బీమా సౌకర్యం క ల్పనకు అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దే శం చేశారు. రూ.20 ప్రీమియం చెల్లింపుతో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై) కింద రూ.2లక్షల బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఉద్దేశమేంటి... గ్రామీణ ప్రాంతాల కూలీలకు స్థానికంగానే వంద రోజుల పాటు పని దినాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే పనులకు వెళ్లే క్రమంలో రోడ్డు ప్రమాదాలతో పాటు పని ప్రదేశాల్లోనూ ప్రమాదాలకు ఆస్కా రం ఉంటుంది. ప్రమాదవశాత్తు కూలీ మృతి చెందితే ఆ కుటుంబానికి తీరని నష్టం వాటిల్లుతుంది. ఇటీవల పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఉపాధి పనులకు వెళ్లే క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మందికి పైగా ఉపాఽధి కూలీలు దుర్మరణం చెందారు. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కూలీ కు టుంబాలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో పీఎంఎస్బీవై పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఆ దిశగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కేంద్రం ఆదేశాలకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఏడాదికి రూ.20 మాత్రమే.. ఉపాధి జాబ్కార్డు కలిగి 18 నుంచి 70 ఏళ్లలోపు కూ లీలు ఈ పథకానికి అర్హులు. ఏదైనా జాతీయ బ్యాంకు లేదాపోస్టాఫీసు ఖాతా (ఆధార్కార్డు అనుసంధా నం) కలిగి ఉండాలి. ఈ పథకం కింద లబ్ధి కోసం కూలీలు కేంద్ర నిర్దేశిత రాతపూర్వక అభ్యర్థనతో పా టు ఏటా తమ ఖాతా నుంచి రూ.20 ప్రీ మియం చెల్లించడానికి అనుమతనిస్తు కన్సంట్ లేఖను ఏంపీడీవో, ఉపాధి హామీ ఏపీవోలకు అందజేయాల్సి ఉంటుంది. ఒక జాబ్ కార్డులో ఎంతమంది కూలీలు ఉంటే అంతమంది లేఖలు అందించాలి. తద్వారా ఏటా ప్రీమియంను అధికారులు ఆటోమెటిక్గా కూ లీల ఖాతా నుంచి డెబిట్ చేసుకుని పథకాన్ని వర్తింపజేయనున్నారు. బ్యాంకులు ఇప్పటికే ఈ పథకా న్ని అమలు చేస్తున్నప్పటికీ జిల్లాలో అనేక మంది కూలీలకు వర్తించడం లేదు. అలాంటి వారికి లబ్ధి చే కూర్చే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. లబ్ది ఇలా.. రూ.20 ప్రీమియం చెల్లించి పీఎంఎస్బీవై కింద నమోదు చేసుకున్న కూలీలు ఏదైనా రోడ్డు ప్రమాదం లేదా పని ప్రదేశాల్లో ప్రమాదవశాత్తు మృతి చెందినట్లైతే ఆ కుటుంబానికి రూ.2లక్షల ఆర్థికసాయం అందించనున్నారు. అలాగే శాశ్వత వైకల్యం కలిగిన కూడా అదే మొత్తాన్ని అందించనున్నారు. పాక్షిక వైకల్యానికి గురైనట్లైతే వారికి రూ.లక్ష సాయం అందించనున్నారు. జిల్లాలో.. ఉపాధి జాబ్ కార్డు కలిగిన కుటుంబాలు : 1.74 లక్షలు యాక్టివ్ జాబ్కార్డులు : 1.01 లక్షలు నమోదు చేసుకున్న కూలీలు : 3.44లక్షలు పనులకు హాజరయ్యే కూలీలు : 2.06 లక్షలురూ.20 ప్రీమియంతోనే బీమా ఉపాఽధి హామీ పనులకు హాజరయ్యే కూలీలకు పీఎంఎస్బీవై పథకాన్ని అమలు చేయాలని ఆదేశిస్తు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ పథకం కింద లబ్ధి కోసం ఏడాదికి రూ.20 ప్రీమియం చెల్లింపునకు గాను కూలీలు అంగీకార లేఖలు అందించాల్సి ఉంటుంది. ఆ దిశగా ఏపీవోలు, పీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లు అవగాహన కల్పించాలి. – రాథోడ్ రవీందర్, డీఆర్డీవో -
బంగారం ధరలకు రెక్కలు
● రూ.లక్ష మార్కు దాటిన 10 గ్రాముల పసిడి ● వెలవెలబోతున్న దుకాణాలు ● శ్రావణమాసంలో మరింత పెరిగే అవకాశం ఆదిలాబాద్టౌన్: బంగారం పేరు వింటేనే గుండె గుబిల్లుమంటోంది. సామాన్యులకు అందనంత దూరంలో ధర పెరుగుతూనే ఉంది. మంగళవారం 10 గ్రాములు రూ.లక్ష మార్కు దాటింది. ఈనెల 25 నుంచి శ్రావణమాసం ప్రారంభం కానుంది. 26 నుంచి నవంబర్ 30 వరకు శుభకార్యాలు, పెళ్లిళ్లు ఉండడంతో పసిడి మరింత ప్రియం కానుందని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికే పెరిగిన ధరలతో వినియోగదారులు లేక దు కాణాలు వెలవెలబోతున్నాయి. అవసరం ఉంటే తప్పా కొనుగోలుకు జనం ముందుకు రావడం లేదు. పెళ్లిలో ఆభరణాలు తప్పనిసరి కావడంతో కొనుగో లు తప్పడం లేదని పలువురు పేర్కొంటున్నారు. పసిడితో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. రూ.లక్ష దాటిన పసిడి ధర.. బంగారం 10గ్రాముల ధర మంగళవారం రూ.లక్ష 2వందలు పలికింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రూ.లక్ష ఉండగా, మధ్యాహ్నం తర్వాత రూ.200 పెరిగింది. ఆన్లైన్లో సా యంత్రం రూ.లక్ష 2వేలకు చేరిందని వ్యాపారులు చెబుతున్నారు. మే నెలలో ఒకసారి రూ.లక్ష 16వేలు ఉండగా, ఆ తర్వాత ధర తగ్గి రూ.96 నుంచి రూ.97వేల మధ్య కొనసాగింది. సోమవారం రూ. 99,400 ఉండగా, ఒకేసారి రూ.800 పెరిగిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇక వెండి ధర మంగళవారం కిలో రూ.లక్ష 17వేల 500 పలికింది. సో మవారం రూ.లక్ష 15వేలు ఉండగా, ఒకేరోజు రూ.2500 పెరిగింది. మూడు నెలల క్రితం వెండి కిలో రూ.90వేలు ఉండడం గమనార్హం. ధరలు భారీగా పెరగడంతో పట్టణంలోని బంగారు దుకాణాలు గిరాకీ లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. -
జీవో 49 నిలిపివేత హర్షణీయం
ఆదిలాబాద్రూరల్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటు కోసం ఇచ్చిన జీవో 49ను రాష్ట్ర ప్రభుత్వం నిలిపి వేయడం హర్షనీయమని పీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. మంగళవారం మావలలోని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్రెడ్డి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి, సీతక్క, సురేఖ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రానున్న రోజుల్లో ఆదివాసీలకు ఇబ్బందులకు కలగకుండా చూసుకుంటామన్నారు. జీవో నిలిపివేతకు కృషి చేసిన మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి, చంద్రశేఖర్, నవీన్ రెడ్డి, చంటి, ప్రఫూల్ రెడ్డి, కరుణకర్, గోవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీసీసీ ఉపాధ్యక్షురాలు సుగుణ -
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ అఖిల్ మహా జన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వన్టౌన్ పోలీసుస్టేషన్ను మంగళవారం తనిఖీ చేశారు. సిబ్బంది విధులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మా ట్లాడుతూ.. పట్టణంలోని ప్రతీ వార్డుకు ఓ పోలీస్ అధికారిని కేటాయించాలని, వీపీవో విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సీఐని ఆదేశించారు. గంజాయి, పేకాట, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. రానున్న స్థా నిక ఎన్నికల దృష్ట్యా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన పాటించాలన్నారు. స్టేష న్లో నమోదైన కేసుల దర్యాప్తు, రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీట్లు, పట్ట ణంలో జరుగుతున్న నేరాలను అరికట్టడానికి ప్రత్యే క కార్యాచరణ రూపొందించాలన్నారు. ఎస్పీ వెంట ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి, సీఐ సునిల్కుమార్, ఎస్సైలు నాగనాథ్, రమ్య తదితరులు ఉన్నారు. -
విద్యుత్ సమస్య పరిష్కరించాలి
నేరడిగొండ: మండలంలోని గుత్పాల గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యకు శాశ్వత పరి ష్కారం చూపాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్హెచ్ఆర్సీ) వైస్చైర్మన్ రాథోడ్ సందీప్ అన్నారు. గ్రామాన్ని మంగళవారం ఆయ న సందర్శించారు. అనంతరం మాట్లాడారు. గ్రామంలో ప్రతీ ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఉన్నప్పటికీ ట్రాన్స్ఫార్మర్ (డీటీఆర్)పై అధిక లోడ్ కారణంగా తరచూ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుతో సమస్యకు శాశ్వత పరి ష్కారం లభిస్తుందన్నారు. అనంతరం గ్రామస్తులతో కలిసి విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఇందులో మండల చైర్మన్ నర్సింగ్ దాస్, కోఆర్డినేటర్ కృష్ణ, లైన్మెన్ రణధీర్, గ్రామస్తులు ఉన్నారు. -
వన మహోత్సవం జయప్రదం చేయాలి
● కలెక్టర్ రాజర్షి షాఅటవీ అధికారులకు ఆయుధాలివ్వాలి ఆదిలాబాద్టౌన్: సిరిచెల్మ రేంజ్ పరిధి ఇచ్చోడ మండలంలోని కేశవ్పట్నంలో పోలీసు, అటవీశాఖ అధికారులపై ముల్తానీల దాడిని తెలంగాణ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు ఖండించారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ను మంగళవారం వేర్వేరుగా కలిసి వినతి పత్రాలు సమర్పించారు. అటవీశాఖ అధికారుల ఆత్మరక్షణ కోసం ఆయుధాలు ఇవ్వాలని కోరారు. ఫారెస్ట్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కలప స్మగ్లర్లు, ముల్తానీ తెగలకు చెందిన వారికి ప్రభుత్వ పథకాలను నిలిపివేయాలని కోరారు. ఇందులో ఆ సంఘం నాయకులు నరేశ్, ప్రశాంత్, అమర్సింగ్, కృష్ణ, సృజన్, శ్యామ్ తదితరులున్నారు.కై లాస్నగర్: వన మహోత్సవ కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టి విజయవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులకు ఆయ న పలు సూచనలు చేశారు. ఆయా శాఖలు లక్ష్యం మేరకు మొక్కలు నాటాలన్నారు. ప్రతీ ఆలయ ఆవరణలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక అందిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు రవాణా చార్జీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇసుక రవాణా విషయంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. భూభారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేలా శ్రద్ధ వహించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యంపై బుధవారం బస్టాండ్లో వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని, సబ్ కలెక్టర్ యువరాజ్, డీఎఫ్వో ప్రశాంత్ బాజీరావ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ అమలుపై సమీక్ష ఆరోగ్యశ్రీ పథకం అమలుపై ప్రభుత్వ, ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల వైద్యులు, వైద్యఆరోగ్యశాఖ అధి కారులతో కలెక్టరేట్లో కలెక్టర్ సమీక్ష నిర్వహించా రు. వైద్యసేవల అమలులో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు. ఈజేహెచ్ఎస్ ద్వారా ఉద్యోగులు, జర్నలిస్టులకు వెల్నెస్–కేర్లో మెరుగైన సేవలను అందించాలన్నారు. ఇందులో డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్, రిమ్స్డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, ఆరోగ్య శ్రీ జిల్లా కోఆర్డినేటర్ రాధిక తదితరులు పాల్గొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా ప్రకటనలో తెలిపారు. లోతట్టు ప్రాంతాల వారు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వర్షాల కారణంగా తలెత్తే సమస్యల పరిష్కారం, సందేహాల నివృత్తి కోసం కలెక్టరేట్లో ఏర్పాటు చేసి న 18004251939 టోల్ఫ్రీ నంబర్ను సంప్రదించా లని సూచించారు. వ్యవసాయ క్షేత్రాల్లో, చెట్ల కింద పిడుగుపడే అవకాశముంటుందని తెలిపారు. ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు బయటకు వెళ్లకపోవడమే ఉత్తమమని పేర్కొన్నారు. -
గ్ర ంథాలయాల అభివృద్ధికి కృషి
● జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య ఆదిలాబాద్: జిల్లాలోని ఆయా గ్రంథాలయాల్లో స మస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య అన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చైర్మన్గా సోమవారం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రంథాలయాల ప్రగతిని పట్టించుకోలేదన్నారు. త్వరలోనే జి ల్లా వ్యాప్తంగా అన్ని గ్రంథాలయాలను సందర్శించి, వాటి అభివృద్ధిపై అధికారులతో చర్చిస్తామన్నా రు. స్థానిక దాతల సహకారంతో పాఠకులకు, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్టడీ మెటీరియల్ అందుబా టులో ఉంచుతామన్నారు. తనకు పదవి రావడానికి సహకరించిన మంత్రులతో పాటు నియోజకవర్గ ఇన్చార్జీలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పలువురు నాయకులు, ఉద్యోగులు ఆయనను సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్, బోథ్వ్యవసాయ మార్కెట్కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, బోథ్, ఇచ్చోడ బ్లాక్ ఆత్మ చైర్మన్లు గొర్ల రాజు, అశోక్, కోటేష్, పసుల చంటి, టీఎన్జీవోఎస్ నాయకులు అశోక్, నవీన్, గ్రంథాలయఅధికారులు శ్రీనివాస్, సతీష్,నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కనిపించని కార్యదర్శి.. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన రోజునే సంస్థ కార్యదర్శి బుగ్గారెడ్డి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. -
సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి●
ఆదిలాబాద్టౌన్: బాధితుల సమస్యలపై బా ధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎస్పీ అఖిల్ మహా జన్ అన్నారు. సోమవారం పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 26 మంది అర్జీదారులు తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. ఓపిగ్గా విన్న ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడా రు. వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ప్ర జలు ఏవైనా సమస్యలు ఉంటే స్థానిక పోలీసుస్టేషన్లో, ఎస్పీ కార్యాలయంలో నేరుగా కలిసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. దూరప్రాంతాల్లో ఉన్నవారు వాట్సాప్ నం.87126 59973పై సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
ఎఫెక్ట్..
‘స్వచ్ఛతలో.. పూర్’పై కలెక్టర్ ఆరా ● మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం ● నివేదిక అందించాలని కమిషనర్కు ఆదేశం ౖకైలాస్నగర్: మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో ఆదిలాబాద్ మున్సిపాలిటీ అట్టడుగుస్థానంలో నిలిచింది. ఇందుకు దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ ‘స్వచ్ఛతలో..పూర్ ’శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ రాజర్షి షా స్పందించారు. ర్యాంకుల్లో వెనుకబడటానికి గల కారణాలపై ఆరా తీశారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ గతి తప్పడంపై మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర నివేదిక అందజేయాలని కమిషనర్ సీవీఎన్. రాజును ఆదేశించారు. -
బంద్ ప్రశాంతం
● డిపోలకే పరిమితమైన బస్సులు ● స్తంభించిన వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ● ఆదివాసీల నిరసనకు అన్నివర్గాలు మద్దతు జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆదివాసీ, గిరిజన సంఘాల నాయకులుకైలాస్నగర్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ పేరిట జారీ చేసిన జీవో 49 రద్దు చేయాలనే డిమాండ్తో ఆదివాసీ గిరిజన సంఘాలు చేపట్టిన బంద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంతో పాటు ఉట్నూర్, బోథ్, ఇంద్రవెల్లి, నార్నూర్, ఇచ్చోడ మండల కేంద్రాల్లో ఆది వాసీ సంఘాల నాయకులు ర్యాలీలు చేపటారు. అక్కడక్కడ తెరిచి ఉంచిన దుకాణాలను పూర్తిగా మూసివేయించారు. మధ్యాహ్నం వరకు జిల్లా వ్యాప్తంగా బస్సులు డిపోల నుంచి బయటకు రాలేదు. వ్యాపార కార్యకలాపాలు స్తంభించాయి. ఆదివాసీల పోరాటాల ఫలితంగా వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో వారిలో హర్షం వ్యక్తమైంది. బస్టాండ్లో ఆందోళన ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులతో పాటు వామపక్ష కార్మిక సంఘాల నాయకులు ఉదయం 4గంటలకే జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వద్దకు చేరుకున్నారు. బస్టాండ్ ప్రధాన ద్వారం ఎదుట బై ఠాయించి బస్సులు బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. మధ్యాహ్నం 2గంటలవరకు బస్సు లు డిపో దాటలేదు. బంద్ విషయం తెలియక బ స్టాండ్కు చేరుకున్న ప్రయాణికులు బస్సుల్లేక ఇ బ్బందులు పడ్డారు. గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. మధ్యాహ్నం తర్వాత బస్సులు యథా విధిగా నడిచాయి. పట్టణంలోని వాణిజ్య, వర్తక సంస్థలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆందోళనకారులు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరి జన హక్కులను హరించేలా చర్యలు తీసుకోవడం సరికాదని తమ వైఖరి మార్చుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. -
లోటు దిశగా..
● జిల్లాలో వర్షపాతం తీరిది ● పది రోజుల క్రితం రాష్ట్రంలోనే ‘అధిక’ం ● తాజాగా ముఖం చాటేసిన వరుణుడు ● నీటి వసతి లేని పంటలకు తిప్పలు సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో వర్షపాతం అధికం నుంచి లోటువైపు పయనిస్తుంది. పది రోజుల క్రితం రాష్ట్రంలోనే అధిక వర్షపాతంతో మొదటి స్థానంలో నిలిచిన జిల్లా ప్రస్తుతం లోటు వైపు వెళ్తుంది. ఈ పరిస్థితుల్లో నీటి వసతి ఉన్న వారు ఎదుగుతున్న పంటకు స్ప్రింక్లర్ల ద్వారా నీటిని అందిస్తుండగా, మిగతా రైతులు వరుణుడే దిక్కు అని ఆకాశం వైపు చూస్తున్నారు. ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం జిల్లాలో స్వల్ప వాన కురిసినప్పటికీ అది పూర్తిస్థాయిలో ఊరట ఇవ్వలేకపోయింది. ఈ వానకాలం సీజన్ రైతులతో దోబూచులాట ఆడుతుంది. సీజన్ ప్రారంభానికి ముందు మస్తుగా వర్షాలు కురువడంతో రైతులు సాగు పనులు ముందే షురూ చేశారు. ఆ తర్వాత జూన్ మొదటి వారం మృగశిరకార్తే ప్రవేశం తర్వాత అధిక సంఖ్యలో రైతులు సాగుకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత వర్షాలు లేకపోవడంతో కొంత మంది రైతులు మళ్లీ రెండోసారి విత్తనాలు విత్తాల్సిన పరిస్థితి. జూన్ చివరి వారంలో మంచి వర్షాలు కురువడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జిల్లాలో సాధారణ నుంచి అధిక వర్షపాతంకు చేరుకుంది. మళ్లీ జూలైలో పరిస్థితులు తారుమారయ్యాయి. పది రోజులుగా చినుకు రాలకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధానంగా పంట ఎదిగే దశలో నీటి తడులు అందించాల్సి ఉండగా వర్షాలు లేకపోవడంతో హైరానా పడుతున్నారు. పరిస్థితి మరికొద్ది రోజులు ఇలాగే కొనసాగితే పంట నష్టం తప్పదన్న ఆవేదన వారిలో కనిపిస్తుంది. ఇక నీటి వసతి ఉన్నవారు పంటలకు స్ప్రింక్లర్ల ద్వారా తడులు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ జిల్లాలోని పలు మండలాల్లో లోటు వర్షపాతం నెలకొంది. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి.. జిల్లాలో మారిన వాతావరణ పరిస్థితులతో జనం ఆందోళన చెందుతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మళ్లీ వేసవి నాటి పరిస్థితులు కనిపించడంతో ఇదేమి కాలంరా బాబోయ్ అంటూ నిట్టూరుస్తున్నారు. మళ్లీ ఏసీలు, కూలర్లకు పనిచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో వర్షపాతం (జూన్ 1 నుంచి జూలై 21 వరకు..) సాధారణం : 419.9 మి.మీ. కురిసింది : 401.0 మి.మీ. వ్యత్యాసం : 5 శాతం తక్కువ స్థితి : సాధారణం -
యూరియా కొరత లేకుండా చర్యలు
కైలాస్నగర్: జిల్లాలో రైతులకు అవసరమైన యూరి యాకు ఎలాంటి కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఇందుకు సంబంధించి సలహాలు, సూచనల కోసం 89777 41771 నంబర్లో సంప్రదించవచ్చన్నారు. సీఎం రేవంత్రెడ్డి సోమవారం హైదరాబాద్లోని సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ఆయా శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వ్యవసాయశాఖ స్టాక్ వివవరాలను ప్రతి రోజు డిస్ప్లే చేయాలన్నారు. అలాగే టోల్ఫ్రీ నంబర్ను స్థానిక రైతువేదికలు, బస్టాండ్, కలెక్టరేట్లో ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. వర్షాల ప్రభావంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపారు. అలాగే 18004251939 టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రేషన్ కార్డులను ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10వరకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని, సబ్ కలెక్టర్ యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. ● కలెక్టర్ రాజర్షి షా -
సమగ్ర భూసర్వేతో సమస్యలు పరిష్కారం
● తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్ ఆదిలాబాద్అర్బన్: టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో భూ సమస్యలు తగ్గకపోగా మరింతగా పెరుగుతున్నాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ అన్నారు. సీఐటీయూ కార్యాలయంలో ‘భూ భారతి చట్టం భూ సమస్యలను పరిష్కరిస్తుందా..’ అంశంపై తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి ‘భూ భారతి’ చట్టా న్ని తీసుకొచ్చిందని, రెవెన్యూ సదస్సుల ద్వారా కోటి 40 వేల దరఖాస్తులు స్వీకరించగా, అందులో 70 శాతం భూ సమస్యలకు సంబంధించినవే ఉన్నట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ‘ధరణి’ పోర్టల్ తీసుకురాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ‘భూ భారతి’ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు. దరఖాస్తు దారులందరికీ పట్టా దార్ పాస్బుక్లు ఇవ్వడం ద్వారా సమస్యలు పరి ష్కారం కావన్నారు. భూ రికార్డుల అస్తవ్యస్తతతో రైతులు అసలు యాజమాన్య హక్కులను నిరూపించుకోలేక పోతున్నారని విమర్శించారు. శాశ్వత పరి ష్కారం కావాలంటే సమగ్ర భూసర్వే అవసరమన్నారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.పద్మ, జిల్లా నాయకులు లంకా రాఘవులు, బండి దత్తాత్రి, ఎన్.స్వామి, డి.స్వామి, గంగారాం, ఆశన్న, పొచ్చన్న, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ తెరపైకి ‘సీసీఐ’
● పునరుద్ధరణపై ప్రభుత్వాల ఫోకస్ ● కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన రాష్ట్ర సర్కారు ● సాధ్యాసాధ్యాలపై కేంద్ర మంత్రి సమీక్ష ● సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం ● జిల్లావాసుల్లో చిగురిస్తున్న ఆశలు చిత్తశుద్ధి నిరుపించుకోవాలిసీసీఐని పునఃప్రారంభించాలనే డిమాండ్తో మూడేళ్లుగా విస్తృత పోరాటం చేస్తున్నాం. కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిని కలిసి విన్నవించాం. కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఫ్యాక్టరీ పునఃప్రారంభంపై సమీక్షించి డీపీఆర్ కోరడం హర్షనీయం. జిల్లాకు చెందిన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా చొరవ చూపాలి. ఎన్నికల హామీ మేరకు తమ చిత్తశుద్ధి నిరుపించుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. – విజ్జగిరి నారాయణ, సీసీఐ సాధన కమిటీ కోకన్వీనర్ కైలాస్నగర్: జిల్లా కేంద్రంలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీ పునరుద్ధరణపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కేంద్రంలో కదలిక వచ్చినట్లుగా తెలుస్తోంది. పాతికేళ్ల క్రితం మూతపడ్డ ఈ ఫ్యాక్టరీలోని యంత్రాలు, సామగ్రిని స్క్రాప్ కింద విక్రయించేందుకు కేంద్రం టెండర్ల ప్రక్రియ సైతం చేపట్టిన విషయం తెలిసిందే. ఇక కనుమరుగేననే భావన వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమరస్వామి ఇటీవల సీసీఐ పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలపై ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఈ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు సైతం సమావేశానికి హాజరు కావడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ నెలాఖరులోగా రాష్ట్రంలో పర్యటిస్తాననే కేంద్ర మంత్రి ప్రకటనతో ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశం మరోసారి తెరపైకి వచ్చినట్లయింది. ఇదీ పరిస్థితి.. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం 1984లో ఈ సిమెంట్ ఫ్యాక్టరీని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ప్రారంభించింది. 14 ఏళ్ల పాటు నడిచిన ఫ్యాక్టరీ ప్రత్యక్షంగా వందలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించింది. పరోక్షంగా వేలాది మంది జీవనోపాధికి తోడ్పడింది. అలాగే ఈ ప్రాంత వ్యాపార, వాణిజ్య అభివృద్ధికి ఎంతో దోహదపడింది. లాభాల బాటలో సాగుతున్న ఫ్యాక్టరీపై పాలకుల ఆశ్రద్ధ కారణంగా నష్టాలు మొదలయ్యాయి. ఈ సాకుతో 1998లో సిమెంట్ ఉత్పత్తిని నిలిపివేశారు. నాడు మూతపడ్డ ఫ్యాక్టరీ తిరిగి తెరచుకోలేదు. పునః ప్రారంభించాలంటూ నాటి నుంచి నేటి వరకు కార్మికులతో పాటు భూ నిర్వాసితులు, రాజకీయ పార్టీల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా వీటిని పట్టించుకోని కేంద్రం ఫ్యాక్టరీలోని యంత్రాలు, సామగ్రిని స్క్రాప్ కింద విక్రయించేందుకు ఈ ఏడాది మే నెలలో టెండర్లు ఆహ్వానించింది. వాటిని ఖరారు చేసే సమయంలో కార్మిక సంఘాలు జాతీయస్థాయిలో ఒత్తిడి తెచ్చేలా ఉద్యమించడంతో ఆ నిర్ణయంపై వెనక్కితగ్గింది. టెండర్ల ప్రక్రియను నిలిపివేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి 27 ఏళ్ల క్రితం మూతపడ్డ సిమెంట్ ఫ్యాక్టరీ ఇక చరిత్రకే పరిమితమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. ఈ క్రమంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి ఫ్యాక్టరీ పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలపై ఈనెల 9న తన శాఖ అధికారులతో ఢిల్లీలో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. గతంలో సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఇందులో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు పాల్గొని ఫ్యాక్టరీ పునరుద్ధరణ అవశ్యకతను కేంద్ర మంత్రి, అధికారులకు వివరించారు. రాష్ట్ర సర్కారు సానుకూలంగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ విషయాన్ని ప్రస్తావించగా.. స్పందించిన కేంద్ర మంత్రి సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్ర పర్యటనకు వచ్చి ప్రభుత్వ రంగ పరిశ్రమల పనితీరు సమీక్షించడంతో పాటు సీసీఐ పునరుద్ధరణ దిశగా చర్యలకు ప్రయత్నిస్తానని ప్రకటించడంపై జిల్లావాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఫ్యాక్టరీ పునరుద్ధరణకు అవసరమైన అన్ని వనరులు జిల్లాలో అందుబాటులో ఉన్నట్లుగా కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. ఉత్పత్తికి అవసరమైన యంత్రాలను సమకూర్చితే సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే చొరవ కీలకం .. సీసీఐ పునరుద్ధరణపై కేంద్ర, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రులు సానుకూలత వ్యక్తం చేసిన నేపథ్యంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే చొరవ కీలకం కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతంంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తరఫునే ఇరువురు ప్రాతినిధ్యం వహిస్తుండటం, పలువురు కేంద్ర మంత్రులు, కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండటం ఫ్యాక్టరీ విషయంలో కలిసోస్తుందనే చర్చ సాగుతుంది. -
విద్యలో నూతన ‘స్వరం’
● సర్కారు బడుల్లో సరిగమ పదనిసలు ● విద్యార్థుల్లో సృజనాత్మకతకు ప్రోత్సాహం ● పీఎంశ్రీ కింద ఎంపికై న బడులకు చేరిన సంగీత పరికరాలుఆదిలాబాద్టౌన్: విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా తమకు ఆసక్తి ఉన్న కళారంగాల్లోనూ రాణించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పాఠశాల స్థాయిలోనే ప్రతిభను గుర్తించి వారిలో కళా నైపుణ్యాలు పెంపొందించాలనే లక్ష్యంతో విద్యాశాఖ ఇప్పటికే ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేలా చర్యలు చేపడుతోంది. పీఎంశ్రీ పథకం కింద సంగీత పాఠాలను కూడా భాగస్వామ్యం చేసేందుకు పలు పాఠశాలలను ఎంపిక చేసింది. ఇప్పటికే ఆయా పాఠశాలలకు తబల, హార్మోనియం, వయోలిన్, డోలక్ వంటి సంగీత పరికరాలు చేరుకున్నాయి. పిల్లల బుద్ధివికాసానికి, భావోద్వేగాల సమతూల్యతకు సంగీతం కీలక భూమిక పోషించనుంది. శిక్షకులను ఎంపిక చేసిన తర్వాత పాఠశాలల్లో విద్యతో పాటు సరగమ పదనిసలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో.. జిల్లాలో డీఈవో పరిధిలో 676 పాఠశాలలు ఉన్నాయి. పీఎంశ్రీ పథకం కింద 24 పాఠశాలలు ఎంపిక కాగా, తొలివిడతగా 11 చోట్ల అమలు చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య, వనరుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ పాఠశాలలను ఎంపిక చేసింది. బడి అభివృద్ధితో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా నిధులతో పాటు సంగీత వాయిద్య, సైన్స్ పరికరాలను సరఫరా చేస్తోంది. ఇప్పటికే విద్యార్థులు చూడదగ్గ ప్రదేశాల కోసం విహార యాత్రలకు తీసుకెళ్లేందుకు గత విద్యా సంవత్సరంలో నిధులను విడుదల చేసింది. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను టూర్కు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమం కింద ఐదేళ్ల వరకు పాఠశాల అభివృద్ధికి నిధులు సమకూరనున్నాయి. రూ.కోటి నుంచి రూ.2 కోట్ల 25లక్షల వరకు విడుదల అవుతాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఎంపికై న పాఠశాలలకు సంగీత టీచర్ల నియామకం కోసం నిధులు విడుదల అ య్యాయి. ఒక్కో పాఠశాలకు రూ.60వేల చొప్పున కేటాయించారు. నెలకు రూ.10వేల చొప్పున ఆరు నెలల పాటు శిక్షణకు వెచ్చించనున్నారు. ఎంపికై న పాఠశాలలు ఇవే.. జిల్లాలో తొలి విడతలో జెడ్పీఎస్ఎస్ ఇంద్రవెల్లి(బి), జెడ్పీఎస్ఎస్ ఇచ్చోడ, మోడల్స్కూల్ గుడిహత్నూర్, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల బోథ్, జెడ్పీఎస్ఎస్ బేల, మోడల్స్కూల్ బజార్హత్నూర్, మోడల్స్కూల్ నార్నూర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల నం.1 విద్యానగర్, లక్కారం బాలికల ఆశ్రమ పాఠశాల, బాలికల ఆశ్రమ పాఠశాల ఉట్నూర్, జెడ్పీఎస్ఎస్ యాపల్గూడ పాఠశాలలు ఎంపికయ్యాయి. సంగీతంతో విద్యార్థుల్లో సృజనాత్మకత.. విద్యలో సంగీతాన్ని ఓ సాధనంగా భావిస్తున్న విద్యాశాఖ, విద్యార్థుల్లో సృజనాత్మకత, ఏకాగ్రత, మానసిక ప్రశాంతత పెంచే అంశంగా దీన్ని తీసుకుంటోంది. బాల్యంలోనే సంగీతం పరిచయమైతే వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులను వెలికితీసేందుకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. వ్యక్తిత్వ వికాసానికి తోడ్పాటు.. ప్రభుత్వ పాఠశాలల్లో వి ద్యతో పాటు సంగీత పా ఠాలు బోధించేందుకు ప్ర భుత్వం చర్యలు చేపడుతుంది. పీఎంశ్రీ పథకం కింద జిల్లాలో 11 పాఠశాలలను ఎంపిక చేసింది. ఆయా స్కూళ్లకు ఇప్పటికే సంగీత పరికరాలు చేరుకున్నాయి. టీచర్లను నియమించాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే చర్యలు చేపడతాం. ఆరు నెలల పాటు శిక్షణ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఉపాధ్యాయులు విద్యార్థులకు నేర్పించనున్నారు. – రఘురమణ, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి -
ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు..
ఎలాంటి లింకు డా క్యుమెంట్ లేకుండా, పట్టాదారు కాకుండా మున్సిపల్ నుంచి అక్రమంగా ఇంటి నంబర్లు తీసుకుని కబ్జా చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశాం. కొందరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాం. ఆక్రమణదారులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలి. అలాగే ప్రజలు ప్లాట్లను కొనుగోలు చేసే ముందు లింకు డాక్యుమెంట్స్, పట్టా తప్పనిసరిగా పరిశీలించాలి. – ఎల్.జీవన్రెడ్డి, డీఎస్పీ, ఆదిలాబాద్ -
మంత్రి సీతక్కను కలిసిన ‘సోయం’
కైలాస్నగర్: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి శాఖ మంత్రి సీతక్కను మాజీ ఎంపీ సోయం బాపూరావు హైదరాబాద్లో ఆదివా రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 27న ఆదిలాబాద్ లోని ఎస్టీయు భవన్లో నిర్వహించనున్న రాజ్గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క సోయంను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఆయన వెంట మాజీ ఎమ్మెలే సక్కు, కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్, అక్కేపల్లి లక్ష్మణ్ తదితరులున్నారు. -
టీపీడీఈఏ నూతన కార్యవర్గం
ఆదిలాబాద్టౌన్: తెలంగాణ పవర్ డిప్లొమో ఇంజినీర్స్ అసోసియేషన్ (టీపీడీఈఏ) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సమావేశంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గోవర్ధన సతీశ్కుమార్, ప్రధాన కార్యదర్శిగా గన్ను జనార్దన్ రెడ్డి, కోశాధికారిగా భూషణవేణి వెంకటేశ్, ఆదిలాబాద్ డివిజన్ కార్యదర్శిగా కొమ్మటి మోహన్ప్రసాద్, కోశాధికారిగా వినయ్కుమార్, ఉట్నూర్ అధ్యక్షుడిగా జాదవ్ రోహిదాస్, కార్యదర్శిగా రాథోడ్ ఫృథ్వీరాజ్, ఆదిలాబాద్ కార్యదర్శిగా షిండే సాయికిరణ్, కోశాధికారిగా సుశాంత్, జిల్లా కార్యాలయ కార్యదర్శిగా కాటం తిరుపతిరెడ్డి, జిల్లా సలహాదారుడిగా దేవుళ్ల శ్రీనివాస్, మహిళా ప్రతినిధిగా గోమాస అలివేణి ఎన్నికై నట్లు తెలిపారు. -
25న జాబ్మేళా
కైలాస్నగర్: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈనెల 25న ఉట్నూర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జీసీసీ చైర్మన్ కొట్నాక్ తిరుపతి, కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రజాసేవా భవన్లో జాబ్మేళా కరపత్రాలను ఆవిష్కరించారు. ఉట్నూర్లోని జేసీఎన్ ఫంక్షన్ హాల్లో ఉదయం 10గంటలకు నిర్వహించనున్న మేళాకు జిల్లాలోని నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో హాజరుకావాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, గిమ్మ సంతోష్, సామ రూపేష్ రెడ్డి, కలాల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
స్వచ్ఛతలో.. పూర్!
కై లాస్నగర్: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, క్షేత్రస్థాయిలో కరువైన పర్యవేక్షణ.. వెరసి ఆదిలాబాద్ మున్సిపాలిటీ స్వచ్ఛతలో అట్టడుగుస్థానానికి పరి మితమైంది. మూడేళ్లుగా పురోగతి సాధించి రాష్ట్ర, జాతీయస్థాయిలో మెరుగైన ర్యాంకులు సాధించిన బల్దియా ఇటీవల కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2024–25 ర్యాంకుల్లో మాత్రం తడబడింది. పట్టణంలో చెత్త సేకరణ మొదలు.. పారిశుద్ధ్య పరమైన అన్ని విభాగాల్లో పనితీరు ఆశించిన మేర లేకపోవడంతో స్వచ్ఛతలో వెనుకబాటుకు గురైంది. రాష్ట్రస్థాయిలో అట్టడుగు స్థానానికి పడిపోగా, జాతీయ స్థాయిలో గతేడాదితో పోల్చితే 124 స్థానాలు పడిపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రస్థాయిలో అట్టడుగుస్థానానికి .. దేశంలోని నగరాలు, పట్టణాల మధ్య స్వచ్ఛతలో పోటీతత్వం పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. జనాభా ఆధారంగా వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తోంది. 2024–25 సంవత్సరానికి గాను ఆదిలాబాద్ బల్దియా 50 వేల నుంచి 3లక్షల లోపు జనాభా కేటగిరీలో పోటీ పడింది. అయితే నిర్దేశించిన పారిశుద్ధ్య అంశాల్లో ప్రగతి కనబర్చడంలో విఫలమైంది. రాష్ట్రస్థాయిలో గతేడాది 11 ము న్సిపాలిటీల్లో 9వ ర్యాంకులో నిలువగా.. ఈ ఏడాది 40వ ర్యాంకుతో అట్టడుగుస్థానానికి పడిపోయింది. అలాగే జాతీయ స్థాయిలో గతేడాది 446 మున్సిపాలిటీలకు గాను 151వ స్థానంలో నిలిచింది. ఈ సారి 824 మున్సిపాలిటీలకుగాను 275వ ర్యాంకు సాధించడం గమనార్హం. గతేడాదితో పోల్చితే 124 స్థానా లు పడిపోయి స్వచ్ఛతపరంగా ఎలాంటి పోటీ ఇవ్వలేకపోయింది. అయితే బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత పట్టణాల్లో ఓడీఎఫ్ డబుల్ ప్లస్ గుర్తింపును సొంతం చేసుకోవడం ఒక్కటే కాస్తా ఊరటనిచ్చే అంశం. మిగతా అన్ని అంశాల్లో వెనుకబడి ఉండడం పరిస్థితికి అద్దం పడుతోంది. అన్నింటా అధ్వాన పరిస్థితులే.. పట్టణాభివృద్ధి, పరిశుభ్రత, మరుగునీటి వ్య వస్థ, చెత్త సేకరణ, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం,వినియోగం, ప్లాస్టిక్ వాడకంపై నిషేధం, స్వచ్ఛతలో ప్రజల భాగస్వామ్యం ఆన్లైన్ సేవలపై అవగాహన వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కేంద్రం స్వచ్ఛత పురస్కారాలకు ర్యాంకులు కేటాయిస్తోంది. ఆయా అంశాలను పరిశీలించేందు కోసం ప్రత్యేక బృందాలను క్షేత్రస్థాయిలోకి పంపిస్తోంది. ఆదిలాబాద్ మున్సి పల్ పరిధిలో సర్వేచేసిన బృందం అన్ని అంశాల్లోనూ అధ్వాన పరిస్థితులున్నట్లుగా గుర్తించింది. 12,500 మార్కులకు గాను ఈ పోటీ నిర్వహించగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ 7680 స్కోరు మాత్రమే సాధించి స్వచ్ఛత ర్యాంకులో వెనుకబడిపోయింది. పట్టణంలోని నీటి వనరుల వద్ద శుభ్రత, ప్రజా మరుగుదొడ్ల వినియోగంలో సున్నా స్కోరుకే పరి మితమైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలా గే ఇంటింటి చెత్త సేకరణలో 31, వ్యర్థాలను వేరు చేయడంలో 39, వ్యర్థాల రీసైక్లింగ్లో 31, నివాస స్థలాల్లో 44 స్కోరు చూస్తే పారిశుద్ధ్య నిర్వహణకు బల్దియా అధికారులు ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో స్పష్టమవుతుంది. ఉన్నతాధికారులు ఇప్పటికై నా దృష్టి సారించాలని లేకుంటే పారిశుద్ధ్య నిర్వహణ మరింత గతితప్పే ప్రమాదం లేకపోలేదని పట్టణ వాసులు అభిప్రాయపడుతున్నారు. జాతీయస్థాయిలో ఆదిలాబాద్కు 275వ ర్యాంకు గతేడాదితో పోల్చితే 124 స్థానాలు డమాల్ బల్దియా అధికారుల పట్టింపులేమే కారణమా?పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం పక్కన మహిళల కోసం నిర్మించిన మరుగుదొడ్లు ఇవి. ప్రారంభానికి పరిమితమయ్యాయే తప్ప ఇప్పటి వరకు తాళాలు తెరుచుకోకపోవడం గమనార్హం. వినియోగంలో లేక కేవలం అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. -
పోడు భూముల రగడ..
ఇచ్చోడ/ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో పోడు గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. పోడు భూము ల్లో అటవీశాఖ మొక్కలు నాటడాన్ని ముల్తానీలు వ్యతిరేకించారు. కేశవపట్నం, సడక్గూడ గ్రామాల మధ్యలో ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. మహిళలు, పురుషులు, పిల్లలు దాదాపు 200 మంది వరకు రాళ్లు కర్రలతో మూకుమ్మడిగా దాడికి దిగారు. ఈ ఘట నలో ఇచ్చోడ ఎస్సై పురుషోత్తంతో పాటు నలుగురు సిబ్బంది గాయపడ్డారు. వారిని స్థానిక పీహెచ్సీకి తరలించారు. నాలుగు రోజులుగా సిరిచెల్మ అటవీ ప్రాంతంలోని చెలుకగూడ వద్ద ముల్తానీలు సాగు చేస్తున్న పోడు భూముల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటుతున్నారు. ఆదివారం కూడా సిబ్బందితో కలిసి బందోబస్తు మధ్య అక్కడికి చేరుకున్నారు. మరికొంతమంది అటవీ సిబ్బంది, పోలీసులు సిరిచెల్మ ఘాట్పై సడక్గూడ వద్ద వేచి ఉన్నారు. ఈక్రమంలో కేశవపట్నం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ భర్త అల్తాఫ్ స్థానిక ఎస్సై పురుషోత్తంకు ఫోన్ చేసి గ్రామస్తులతో మాట్లాడదామని పిలిచారు. దీంతో ఎస్సై ఇద్దరు సిబ్బందితో కలిసి కేశవపట్నం వైçపు వెళ్లారు. అప్పటికే గ్రామస్తులు గాయిద్పల్లి రోడ్డు వద్ద వేచి ఉన్నారు. వాహనంలో నుంచి దిగిన ఎస్సై, సిబ్బందిని ముల్తా నీలు చుట్టుముట్టి దాడికి పాల్పడ్డారు. ఎస్సై చేతికి గాయమవగా.. వీడియో తీస్తున్న కానిస్టేబుల్ సెల్ఫోన్ను లాక్కొని రాయితో తలపై కొట్టారు. పోలీసు వాహనంపై రాళ్లు వేయడంతో అద్దాలు పగిలిపోయాయి. అప్రమత్తమైన ఎస్సై మిగతా సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకునేలోపు ముల్తానీలు పరారయ్యారు. 20 నిమిషాల తర్వాత పొలాల వైపు నుంచి వచి్చన ముల్తానీలు సిబ్బందిపై మరోసారి రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. పోలీసులు ఎదురు దాడికి దిగడంతో ముల్తానీలు పారిపోయారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చెలుకగూడ వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని వాయిదా వేశారు. విషయం తెలుసుకున్న ఎస్పీ అఖిల్ మహాజన్, ఉట్నూర్ డీఎస్పీ కాజాల్సింగ్ ఇచ్చోడ పోలీస్స్టేషన్ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాగా, ముల్తానీల దాడిలో గాయపడిన వారిలో ముగ్గురు కానిస్టేబుళ్లను స్థానిక పీహెచ్సీ నుంచి రిమ్స్కు తరలించారు. చికిత్స అనంతరం సాయంత్రం వారిని డిశ్చార్జ్ చేశారు. -
కేశవపట్నంలో ఉద్రిక్తత.. ఫారెస్ట్ సిబ్బందిపై పోడు రైతుల రాళ్లదాడి..
సాక్షి, ఆదిలాబాద్ జిల్లా: ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీశాఖ సిబ్బంది, పోలీసులపై పోడు రైతులు దాడి చేశారు. తమ గ్రామంలోకి రావొద్దంటూ రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఆందోళనకారుల దాడిలో పోలీస్ వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఫారెస్ట్, పోలీస్, మీడియా సిబ్బందికి గాయాలవ్వగా వారిని ఇచ్చోడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. గాయపడిన వారిలో ఐదుగురికి తీవ్రగాయాలు కావడంతో.. వారిని మెరుగైన చికిత్స నిమిత్తం రిమ్స్కు తరలించారు. -
గిరి గూడేలకు పండుగ శోభ
విజ్జపేన్..! ● ఆదివాసీ సంస్కృతి.. సంప్రదాయాల సౌరభం ● నాలుగు మాసాలు వివిధ పండుగలు ● అకాడితో ప్రారంభమై దీపావళితో ముగింపు ● కుల దేవతలకు ప్రత్యేక పూజలు ● ఆదివాసీ పల్లెల్లో కోలాహలం ‘శీత్ల’ పండుగ శీత్ల భవాని లంబాడీల దేవత. పశువుల ఆరోగ్యం, తండా సౌభాగ్యం కోసం శీత్ల భవానికి పూజలు చేయడం లంబాడీల ఆనవాయితీ. కలరా వంటి వ్యాధుల బారి నుంచి కాపాడుతుందని వారి నమ్మకం. ఆషాఢమాసంలో ఒక మంగళవారం గ్రామ సరిహద్దులోని పొలిమేరలో ఉన్న కూడలి వద్ద శీత్ల భవానీని ప్రతిష్టిస్తారు. మహిళలు, యువతులు నెత్తిన బోనం ఎత్తుకుని వస్తారు. నైవేద్యంగా పాయసం సమర్పిస్తారు. కోళ్లు, మేకలను బలిచ్చి వాటిపైనుంచి పశువులను దాటిస్తారు. పశు సంపద వృద్ధి చెందాలని, పాడిపంటలు బాగా పండాలని, ఎలాంటి దుష్టశక్తులు దరి చేరకుండా ఉండాలని శీత్ల మాతను పూజిస్తారు. ఆకిపేన్.. పెర్సాపేన్, రాజుల్దేవత వద్దకు విత్తనాలను తీసుకెళ్లి పూజలు చేస్తారు. పంటలకు ఎలాంటి హాని కలగకుండా చూడాలని పెర్సాపేన్కు మొక్కుతారు. అంతకు ముందు గ్రామంలో ఉన్న విత్తనాలను ఒక వద్దకు చేర్చి కుల దేవతలకు అందరు కలిసి పూజలు నిర్వహిస్తారు. అనంతరం కటోడా వాటిని అందరికీ అందిస్తారు. ఆ తర్వాతే పొలం పనులు ప్రారంభిస్తారు.అడవిలో ఆకులు చిగురించి పచ్చగా మా రుతున్న క్రమంలో ఆదివాసీలు ఆకిపేన్ కు పూజలు చేస్తారు. ఈ కాలంలో అడవికి వెళ్లిన మూగజీవాలకు రక్షణగా ఉండాలని, ఎలాంటి హాని తలపెట్టవద్దని, పంటలు అధికదిగుబడి సాధించాలని పూజలు చేస్తారు. ఈ సందర్భంగా లక్ష్మణరేఖ లాంటి గీతను గీస్తారు. ప్రత్యేకంగా తయారు చేసిన తుర్రను ఊదడంతో పశువులు అడవిలోకి పరుగెత్తాయి. కోడి, మేకలతో జాతకం చెబుతారు. ప్రతీ పండుగకు ప్రత్యేకత ఆదివాసీలు జరుపుకునే ప్రతీ పండుగకు ప్రత్యేకత ఉంది. అకాడి నుంచి ప్రారంభమైన పండుగలు నాలుగు మాసాలపాటు కొనసాగుతాయి. దీపావళికి గుస్సాడీ దీక్ష స్వీకరించే వారు ఇప్పుడే కుల దేవతలకు మొక్కుకుంటారు. కార్యం నెరవేరాక దీక్ష చేపడతారు. పూజల తర్వాత ఏత్మాసార్ పేన్కు పూజలు చేస్తాం. వన భోజనం ఐకమత్యాన్ని తెలియజేస్తుంది. – కుర్సెంగ దుందేరావు, ఆదివాసీ నాయకుడు, చౌపన్గూడ కెరమెరి(ఆసిఫాబాద్): మారుతున్న ఆధునిక కా లంలోనూ ఆదివాసీలు తమ ఆచారాలు, సంప్రదాయాలు కొనసాగిస్తున్నారు. సమాజంలో ఎ న్నో మార్పులు వస్తున్నప్పటికీ ఆదివాసీలు నేటికీ పుడమితల్లిని పూజిస్తూ కాలం వెల్లదీస్తున్నారు. పండుగలు, పెళ్లిళ్లు, సంస్కృతి, ఆచార వ్యవహారాల్లోనూ.. తమకు మరెవరూ సాటిరారని నిరూపిస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలు. వారి ఇళ్లల్లో జరిగే వివాహాల్లో వైవిధ్యం ఉంటుంది. నూతనత్వం కనిపిస్తుంది. పండుగల్లోనూ కొత్తదనం కనిపిస్తుంది. ఆషాఢమాసంలో వచ్చే అకాడి పండుగతో ప్రారంభమయ్యే ఆదివాసీల పండుగలు, ఉత్సవాలు దీపావళితో ముగుస్తాయి. నాలుగు మాసాల పాటు ఆదివాసీ గూడేల్లో వివిధ రకాల పండుగలు సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీలు అకాడి పండుగలో జరిపే ఇతివృత్తంపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.. అకాడి.. ఆషాఢమాసంలో ప్రథమంగా వచ్చే పండుగ అకాడి. పాడిపంటలకు రక్షణ కల్పించే అడవిదేవతగా భావించే రాజుల్పేన్ను పూజిస్తారు. నెలవంక కనిపించగానే జిల్లాలోని ప్రతీ గ్రామంలో దీనిని నిర్వహిస్తారు. అకాడి పండగను కొందరు పౌర్ణమి వరకు నిర్వహిస్తే మరికొందరు అమావాస్య వరకు నిర్వహిస్తారు. అనాదిగా వస్తున్న ఆచారమని ఆదివాసీ పెద్దలు, కటోడాలు పేర్కొంటున్నారు.