breaking news
Adilabad
-
టెండర్ లేకుండానే..
బ్లీచింగ్ పౌడర్, పటిక కొనుగోళ్లు ● బల్దియాలో నిబంధనలకు తిలోదకాలు ● ఇంజినీరింగ్ విభాగం అధికారుల తీరుపై విమర్శలుకైలాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగంలో అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన పనుల్లో అక్రమాలు మరువకముందే తాజాగా బ్లీచింగ్ పౌడర్, పటిక కొనుగోళ్లలోనూ అదేతీరు ప్రదర్శించ డం అనుమానాలకు తావిస్తోంది.టెండర్లు లేకుండా దొడ్డిదారిన వాటిని కొనుగోలు చేసిన అధికారులు లక్షలాది రూపాయల బిల్లులు స్వాహా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకాధికారి పట్టించుకోకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతోనే వీరి అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదీ పరిస్థితి .. ఆదిలాబాద్ పట్టణానికి మిషన్ భగీరథతో పాటు జిల్లా కేంద్రం శివారులోని లాండసాంగ్వీ, మావల చెరువు నుంచి నీటి సరఫరా ఉంటుంది. ఈ రెండు వనరుల నుంచి నీరు కలెక్టరేట్ పక్కన గల ఫిల్టర్బెడ్కు చేరుతుంది. అక్కడ శుద్ధి చేసి పట్టణంలోని ఆయా వార్డులకు సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో నీటి శుద్ధికోసం బ్లీచింగ్ పౌడర్, పటిక వినియోగిస్తారు. వీటి కొనుగోలుకు మున్సిపల్ అధికారులు ఏటా టెండర్లు ఆహ్వానిస్తారు. తక్కువ ధరకు కోట్ చేసిన వారికి సరఫరా బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇలా ప్రతీ సీజన్కు సుమారు రూ.50లక్షల నుంచి రూ.కోటి వరకు వెచ్చిస్తుంటారు. అయితే ఇక్కడే ఇంజినీరింగ్ విభాగం అధికారులు నిబంధనలకు తూట్లు పొడిచి తమ జేబులు నింపుకునే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏం జరిగిందంటే... నిబంధనల ప్రకారం బ్లీచింగ్ పౌడర్, పటిక కొనుగోలుకు టెండర్లు ఆహ్వానించాలి. పత్రికల ద్వారా నోటిఫికేషన్ ప్రకటించాలి. తక్కువ ధరకు కోట్ చేసిన వారికి సరఫరా బాధ్యతలు అప్పగించాలి. అయితే ఈ సారి ఇవేమి పాటించ లేదు. బల్దియా ఇంజినీరింగ్ విభాగంలోని ఓ కీలక అధికారి టెండర్లకు పాతరేస్తూ ఇష్టారాజ్యంగా దాదాపు రూ.20 లక్షల విలువైన బ్లీచింగ్ పౌడర్, పటికను కొనుగోలు చేశారని తెలుస్తోంది. గుట్టుగా ఈ ప్రక్రియ చేపట్టిన సదరు అధికారి తీరుపై బల్దియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ● ఈ విషయమై మున్సిపల్ ఇంజినీర్ పేరి రాజును పలుమార్లు ఫోన్లో సంప్రదించగా ఆయన కట్ చేయడం గమనార్హం. ● ఇదే విషయమై మున్సిపల్ కమిషనర్ సీవీఎన్.రాజును సంప్రదించగా ప్రభుత్వరంగ సంస్థ అయిన హాకా నుంచి బ్లీచింగ్ పౌడర్, పటిక కొనుగోలు చేశామని తెలిపారు. అయితే ఎంత విలువైన సరుకు కొనుగోలు చేశారు.. ఎక్కడి నుంచి తెప్పించారనే దానిపై అడుగగా ఆ వివరాలేవీ తనకు తెలియవని మున్సిపల్ ఇంజినీర్ను అడగాలని పేర్కొనడం గమనార్హం. విచారించి చర్యలు తీసుకుంటాం మున్సిపల్ పరిధిలో ఎలాంటి టెండర్లు నిర్వహించకుండా బ్లీచింగ్ పౌడర్, పటికను కొనుగోలు చేశారనే విషయం ఇప్పటి వరకు నా దృష్టికి రాలేదు. విచారణ చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – ఖుష్బూగుప్తా, మున్సిపల్ ప్రత్యేకాధికారి -
‘జ్వాల’తో విద్యార్థినుల్లో ఆత్మస్థైర్యం
ఆదిలాబాద్రూరల్: విద్యార్థినిల్లో ఆత్మస్థైర్యం నింపాలనే ఉద్దేశంతో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ జ్వాల’ కార్యక్రమం చేపడుతున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాలలో కా ర్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. బాలికల ఆత్మరక్షణ కోసం జిల్లా వ్యా ప్తంగా ఆయా పాఠశాలల్లో కరాటే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, డీఈవో శ్రీనివాస్రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పాఠశాల, కళాశాలల ప్రధానోపాధ్యాయులు, సీఐలు, కరాటే శిక్షకులు పాల్గొన్నారు. -
‘టీబీ ముక్త్’పై ఫోకస్
● వ్యాధిగ్రస్తులపై నిత్యం ఆరా ● ప్రత్యేకంగా టోల్ఫ్రీ నంబర్ ● మందులు వేసుకోవడంపై పర్యవేక్షణఆదిలాబాద్టౌన్: క్షయ నిర్మూలనపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. టీబీ ముక్త్ భారత్లో భాగంగా వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు మందులు వేసుకుంటున్నారా..లేదా అనే విషయాలపై ఆరా తీస్తోంది. మెడిసిన్ వేసుకున్న తర్వాత టోల్ఫ్రీ నంబర్కు మిస్కాల్ ఇచ్చేలా చర్యలు చేపడుతున్నారు. బాధితుడు 18003137957 నంబర్కు మిస్కాల్ ఇస్తే ఆన్లైన్లో వివరాలు నమోదవుతాయి. ఇక మందులు వేసుకోని వారిని ఫోన్ ద్వారా, నేరుగా సంప్రదించి అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. టీబీ నియంత్రణ అధికారులతో పాటు మండల, జిల్లా రాష్ట్ర, జాతీయస్థాయి వరకు వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షిస్తుండడంతో వ్యాధిగ్రస్తుల చికిత్స వివరాలు తెలియనున్నాయి. జిల్లాలో.. జిల్లాలో వ్యాధిగ్రస్తులు 1,003 మంది ఉన్నారు. వీరి కి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. తీవ్ర త బట్టిమెడిసిన్ వినియోగించాల్సి ఉంటుంది. ఆరు నెలల వరకు చికిత్స పొందితే క్షయ నయమవుతుంది. వ్యాధి ముదిరిన వారు మాత్రం 9 నెలల నుంచి 18 నెలల వరకు మందులు వాడాల్సి ఉంటుంది. వ్యాధిగ్రస్తులు ఒకేసారి ఐదు మాత్రలు వేసుకోవా ల్సి ఉంటుంది. కొంత మంది ఒకేసారి కాకుండా వేర్వేరుగా వేసుకోవడంతో ఫలితం కనిపించదని వైద్యులు చెబుతున్నారు. ఈ మందులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఇదిలా ఉండగా టీబీ సోకితే పది రకాల లక్షణాలు కనిపిస్తాయి. దగ్గు, జ్వరం, ఆయాసం, నీరసం, ఛాతిలో నొప్పి, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, రాత్రిపూట చె మటలు పట్టడం, దగ్గినప్పుడు రక్తం పడటం, మెడ, గజ్జలు, సంకలో గడ్డలు వంటివి కనిపిస్తాయి. ఇలాంటి వారు సమీపంలోని ఆస్పత్రిలో వైద్యులను సంప్రదించాలని అధికారులు చెబుతున్నారు. టీబీ నివారణకు ప్రత్యేక చర్యలు..జిల్లాలో టీబీ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. వ్యాధిగ్రస్తులు మందులు వేసుకున్న తర్వాత టోల్ఫ్రీ నంబర్కు మిస్కాల్ చేస్తే మందులు వేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ వివరాలను కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారులకు తెలుస్తుంది. వైద్యుల సూచన మేరకు మందులు వాడితే వ్యాధి పూర్తిస్థాయిలో నయమవుతుంది. – డాక్టర్ సుమలత, టీబీ నియంత్రణ జిల్లా అధికారి -
పీవీటీజీల సంక్షేమానికి కృషి
● ఎంపీ గోడం నగేశ్ సాత్నాల: పీవీటీజీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ఎంపీ గోడం నగేశ్ అన్నా రు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పీవీటీజీ అవగాహన సదస్సు కార్యక్రమానికి ఆయ న హాజరై మాట్లాడారు. పీవీటీజీల అభివృద్ధి కోసం కేంద్రం ఆరు నెలల క్రితం రూ.313 కోట్లను మంజూరు చేసినా, రాష్ట్ర ప్రభుత్వం వాటిని విడుదల చేయడం లేదన్నారు. జిల్లాలో కొలాం, తోటి వర్గాలకు పక్కాఇళ్లు ఉండాలనే ఉద్దేశంతోకేంద్రం 4,902 ఇళ్లను మంజూరు చేసి నిర్మిస్తుందన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలని, అనంతరం నియోజకవర్గ అభివృద్ధి తమ ధ్యేయమన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా కృషి చేస్తానన్నారు. త్వరలోనే రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అనంతరం ఎంపీ, ఎమ్మె ల్యే దుబ్బగూడ గ్రామంలో జన్మన్ నిధులు రూ.60 లక్షలతో నిర్మించనున్న మల్టీపర్పస్ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఇందులో నాయకులు బోయర్ విజయ్, సుభాష్, సోనీరావ్, రాము, దేవరావు, గోవిందరావు, రమేశ్, రోహిదాస్, స్వామి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
వన మహోత్సవం విజయవంతం చేయాలి
● డీఆర్డీవో రాథోడ్ రవీందర్కై లాస్నగర్: పచ్చదనం పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఆర్డీవో రాథోడ్ రవీందర్ అన్నారు. జిల్లాలోని ఏపీవోలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అ సిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లతో శుక్రవారం స్థా నిక టీటీడీసీ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా నిర్దేశించి న లక్ష్యాల మేరకు మొక్కలు నాటేలా శ్రద్ధ వహించా లన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు హాజరయ్యే కూలీలకు ప్రధానమంత్రి సు రక్ష బీమా యోజన పథకం కింద బీమా సౌకర్యం క ల్పిస్తున్నట్లు తెలిపారు. దీనిపై కూలీలకు అవగాహ న కల్పించాలన్నారు. ఇందులో ఏపీడీలు కుటుంబరావు, కృష్ణారావు, విజిలెన్స్ అధికారి కృష్ణారావు, ఏవో అందె గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
● సీఆర్టీ పోస్టుల భర్తీ విషయంలో.. ● ఐటీడీఏలో ముదిరిన వివాదం ● తొలుత ‘2023’ ప్రకారం ముందుకెళ్లిన ప్రాజెక్ట్ ఆఫీసర్ ● ట్రైబల్స్ ఆందోళనతో వెనక్కి తగ్గి కొత్త నోటిఫికేషన్
సాక్షి,ఆదిలాబాద్: ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, గిరి జనుల మధ్య వివాదం ముదిరింది. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ (సీఆర్టీ) పోస్టుల భర్తీ విషయంలో తారాస్థాయికి చేరింది. పాత నోటిఫికేషన్ ప్రకారం కాకుండా కొత్తది జారీ చేయాలని విన్నవించినా పీవో దిగిరాలేదని వారు ఆరోపిస్తున్నారు. తప్పని పరిస్థితిలో మేడంకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగా ల్సి వచ్చిందని పేర్కొంటున్నారు. గురువారం ఆది లాబాద్ కలెక్టరేట్తో పాటు ఉట్నూర్లో గిరిజనులు పీవోను తొలగించాలంటూ తుడుందెబ్బ, ఆదివాసీ నిరుద్యోగులు, ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగడం సంచలనం కలిగించింది. ఇదిలా ఉంటే మొదట పాత నోటిఫికేషన్ ప్రకా రం ముందుకెళ్లిన ఐటీడీఏ గిరిజనుల ఆందోళన తర్వాత మెట్టు దిగివచ్చింది. రాత్రి రాత్రే కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే అందులోనూ తిరకాస్తు ఉందని గిరిజనులు వాపోతున్నారు. పోస్టుల సంఖ్య పొందుపర్చలేదని పేర్కొంటున్నారు. ఈ విషయమై పీవో ఖుష్బూ గుప్తాను ‘సాక్షి’ వివరణ కోరేందుకు పలుమార్లు ఫోన్లో ప్రయత్నించినా ఆమె అందుబాటులోకి రాలేదు. వివాదం ఇలా.. ఉట్నూర్ ఐటీడీఏపరిధిలో ఖాళీగా ఉన్న గిరిజన ప్రా థమిక పాఠశాలల్లో 17 మంది సీఆర్టీల నియామకం కోసం అధికారులు చర్యలు చేపట్టారు. స్థానిక కుమురంభీం ప్రాంగణం పీఎంఆర్సీ భవనంలో 2023 మెరిట్ జాబితా ఆధారంగా ఈ ప్రక్రియ చేపట్టారు. దీన్ని గిరిజనులు విభేదించారు. అప్పట్లో సీఆర్టీలుగా నియమితులైన పలువురు ఆ తర్వాత రెగ్యులర్ ఉద్యోగాలు రావడంతో పోస్టులు ఖాళీ అ య్యాయని గిరిజనులు పేర్కొంటున్నారు. ఇలా ఖాళీ అయిన వాటిలో ఐటీడీఏలో పాతుకుపోయిన ఉద్యోగులు తమకు అనుకూలమైన వారిని నియమించుకున్నారని, ఇందులో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తున్నారు. ఈనేపథ్యంలోనే కొత్త నోటిఫికేషన్ ద్వారా ప్రస్తుత పోస్టులు భర్తీ చేయాల ని తాము డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఈ విషయమై పీవోకు తెలియజేసినా ఆమె కొత్త నోటిఫికేషన్కు ముందుకు రాకపోవడంతో ఆందోళనకు దిగాల్సివచ్చిందని వారు చెబుతున్నారు. రెగ్యులర్ పోస్టులు సీఆర్టీగా మారిన వైనం.. దశాబ్దంన్నర నుంచి ఏజెన్సీలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ రాలేదు. దీంతో ఉన్నత చదువులు చదివినా పలువురు సర్కా రు కొలువు కోసం అష్టకష్టాలు పడుతున్నారని గిరి జన సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 2013 లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది ఐటీడీఏల పరిధిలో 2,825 ఆశ్రమ పాఠశాలల్లో టీచర్ పోస్టులను మంజూరు చేసింది. దీంట్లో అప్పట్లో కొత్తగా ప్రతిపాదించిన ఆశ్రమ పాఠశాలలకు సంబంధించిన పోస్టులను కలిపి విడుదల చేసింది. ఇందులో గ్రేడ్–2 హెచ్ఎం నుంచి మొదలుకుంటే ఎస్ఏ, పీఈటీ, టీపీ, హెచ్పీ, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, ఎస్జీ టీ వంటి పోస్టులు ఉన్నాయి. వీటిలో ఉట్నూర్ ఐటీడీఏకు సంబంధించి 569 పోస్టులు ఉన్నాయి. అ యితే వివిధ కారణాలతో భర్తీకి నోచుకోలేదు. ఆ త ర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం, పలు ఇతర కారణాలతో ఆ రెగ్యులర్ పోస్టులను సీఆర్టీలుగా మలి చినట్లు గిరిజనులు వివరిస్తున్నారు. అందులో నుంచే ఖాళీలను భర్తీ చేస్తూ వస్తున్నారని పేర్కొన్నారు. 2023లో జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా అప్పట్లో పలు పోస్టులను భర్తీ చేసినప్పటికీ పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఐటీడీఏలో పాతుకుపోయిన ఉద్యోగులు అక్రమాలకు పాల్పడ్డారని, ఇందులో నాన్ట్రైబల్స్ కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ నోటిఫికేషన్పై కాకుండా కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయాలని తాము కోరామని వెల్లడించారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలి
ఆదిలాబాద్: జిల్లా స్విమ్మర్లు రాష్ట్రస్థాయి పోటీల్లో నూ రాణించాలని డీవైఎస్వో శ్రీనివాస్, జిల్లా గిరిజ న క్రీడల అధికారి పార్థసారథి సూచించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గు రువారం నిర్వహించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఎంపిక పోటీలను వారు ప్రారంభించారు. అనంత రం వారు మాట్లాడుతూ.. క్రీడాకారులు గెలుపోట ములను సమానంగా స్వీకరించాలని సూచించారు. రాష్ట్రస్థాయి పోటీలకు గ్రూప్–1 విభాగంలో సీహెచ్ దీక్షిత్, పీ మణిక్రిష్, గాందేవార్ సాయి, బీ విశ్వజ్ఞ, గ్రూప్–2 విభాగంలో చరణ్తేజ్, ఎస్.రితేశ్, ఎం.శ్రవాన్ష, మనీశ్ రాథోడ్, గ్రూప్–3 విభాగంలో సా యి శివాంక్, జే ఆమోగ్ ఎంపికయ్యారు. జిల్లా స్వి మ్మింగ్ ఆక్వాటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహేందర్ జిత్ కుమార్, పూల్ నిర్వాహకుడు రాష్ట్ర పాల్, శిక్షకులు కృష్ణ, చందు తదితరులున్నారు. -
ఐటీడీఏ పీవోను తొలగించాలని ధర్నా
కైలాస్నగర్: గిరిజన నిరుద్యోగులు నష్టపోయేలా ఎ లాంటి గైడ్లైన్స్ లేకుండా సీఆర్టీ నియామకాలు చేపడుతున్న ఐటీడీఏ పీవోను తక్షణమే విధుల నుంచి తొలగించాలని తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేశ్ డిమాండ్ చేశారు. పీవో తీరును వ్యతిరేకిస్తూ గురువారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులతో కలి సి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఆర్టీల నియామకాలపై అనుమానాల ని వృత్తి కోసం విద్యార్థి సంఘాలు, ఆదివాసీ నాయకులు బుధవారం పీవోను కలవగా దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు. మెరిట్ ప్రకారం ని యామకాలు చేపట్టకుండా గిరిజనేతరులకు లబ్ధి చే కూర్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కొత్తగా నోటిషికేషన్ ప్రకటించి నియామకాలు చేపట్టా ల్సి ఉండగా 2023 ప్రకారమే నియామకాలు చేపడతామనడం సరికాదని తెలిపారు. వెంటనే పీవోను బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో వినోద్కుమార్ వారి వద్దకు వచ్చి సమస్య తెలుసుకున్నారు. వారి నుంచి వినతిపత్రం స్వీకరించారు. నాయకులు దాదీరావు, దీపక్, సుమేశ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ సంఘాల రాస్తారోకో ఉట్నూర్రూరల్: ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా సమస్యలపై చర్చించడానికి అవకాశం కల్పించడం లేద ని ఆరోపిస్తూ ఆదివాసీ సంఘాల నాయకులు మండల కేంద్రంలో రాస్తారోకో చేశారు. సీఆర్టీల నియామకానికి నోటిపికేషన్ ప్రకటించలేదని ఆరోపించా రు. బుధవారం జరిపిన సీఆర్టీల డెమో సరిగా లేద ని తెలిపారు. ఈ విషయమై మాట్లాడేందుకు వెళ్లగా పీవో ఆంక్షలు విధించారని, అమర్యాదగా వ్యవహరించారని విమర్శించారు. దీంతో పీవో వైఖరిని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించినట్లు తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ గోడం గణేశ్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పుర్కాపురావు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ ప్రసాద్, ఎస్సై ప్రవీణ్ వారిని సముదాయించి రాస్తారోకో విరమింపజేశారు. గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులు దేవేందర్, మెస్రం శేఖర్ మా ట్లాడుతూ.. పీవో వైఖరిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పీవో తీరు మార్చుకోకుంటే నిరంతరం ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. తు డుం దెబ్బ ఆదివాసీ విద్యార్థి సంఘం, ఏజెన్సీ డీఎ స్సీ సాధన సమితి, ఆదివాసీ గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలి కైలాస్నగర్: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినదించారు. నెలకు రూ.6వేల పెన్షన్ ఇవ్వాలని, వికలాంగుల కార్పొరేషన్ను బలోపేతం చేయాలని, స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశా రు. అనంతరం అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవికి వి నతిపత్రం అందజేశారు. నాయకులు నగేశ్, పొచ్చ న్న, ఆరిఫా, అనసూయ, ప్రియాంక పాల్గొన్నారు. -
భువనేశ్వర్ వర్క్షాప్లో కలెక్టర్
కైలాస్నగర్: దేశంలోని ఆస్ప్రేషనల్ బ్లాక్లో అమలు చేసిన కార్యక్రమాల ప్రగతిపై సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒడిశాలోని భువనేశ్వర్లో గురువారం వర్క్షాప్ నిర్వహించింది. కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షిషా హాజరయ్యా రు. నార్నూర్ బ్లాక్లో బాధ్యతాయుత పాలన కు సంపూర్ణ అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఆరోగ్యం, విద్య, పోషణ, వ్యవసాయం, ఉపాధి, మౌలిక వసతులు తదితర రంగాల్లో ప్రగతి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతకుముందు ఢిల్లీలో రాజ్యసభకు సంబంధించిన సన్సద్ టీవీలో ప్రసారమయ్యే ప్రతిష్టాత్మక అభినవ ప హల్ 3.0 సిరీస్కు సంబంధించిన ఇంటర్వ్యూ లో జిల్లా సంక్షేమాధికారి మిల్కాతో కలిసి పా ల్గొన్నారు. నార్నూర్ బ్లాక్లో అమలు చేసిన కా ర్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. -
వడ్డీలేని రుణం.. అతివలకు వరం
● రూ.1.57 కోట్ల బకాయిల విడుదల ● 4,202 ఎస్హెచ్జీలకు ప్రయోజనం ● బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్న నగదు కై లాస్నగర్: స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను కోటీశ్వరులను చేయాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఇందుకోసం మహిళాశక్తి ద్వారా వివిధ కార్యక్రమాలు అమలు చే స్తోంది. ప్రధానంగా బ్యాంక్ల ద్వారా రుణాలిస్తూ వారు ఆర్థికంగా ముందడుగు వేసేలా ప్రోత్సహిస్తోంది. రుణాలను సకాలంలో చెల్లించిన సంఘాల కు వడ్డీ మాఫీ చేస్తున్న ప్రభుత్వం ఈ నగదును వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి దీన్ని పక్కాగా అమలు చేస్తూ అతివలకు అండగా నిలుస్తోంది. ఇప్పటికే పలుసార్లు రుణాల వడ్డీని విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన వడ్డీ బకాయిలను విడుదల చేసింది. జిల్లాలోని 4,202 సంఘాలకు గాను రూ.1.57 కోట్లు మహిళల ఖాతాల్లో జమ చేస్తోంది. ఆర్థిక చేయూతనిచ్చేందుకే.. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల పరిధిలో 7,532 స్వయం సహాయక సంఘాలున్నాయి. ఇందులో 1,16,492 మంది సభ్యులున్నారు. వీరు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద బ్యాంక్ల ద్వారా స్వయం ఉ పాధి రుణాలు మంజూరు చేస్తోంది. మహిళలు స్వ యం సమృద్ధి సాధించేందుకు తోడ్పడుతోంది. ఈ రుణాలను సకాలంలో వడ్డీతో పాటు బ్యాంక్లకు తి రిగి చెల్లించిన మహిళా సంఘాలకు ప్రభుత్వం వారి వడ్డీని బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ సొమ్ముతో కలిిపి బ్యాంకుల్లో ఉన్న రుణాన్ని తగ్గిస్తారు. తద్వారా మహిళా సంఘాలపై వడ్డీ భారం పడకుండా ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రుణాల వడ్డీని చెల్లించకపోవడంతో ఎస్హెచ్జీ సభ్యులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు నెలల బకాయిలు విడుదల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి వడ్డీలేని రుణాలను సక్రమంగా విడుదల చేస్తోంది. ఏడాదిన్నర పాలనలో ఇప్పటివరకు మూడుసార్లు వడ్డీ విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా మరోసారి రూ.1.57 కోట్లు విడుదల చేసింది. మహిళలను కో టీశ్వరులను చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాటను పక్కాగా అమలు చేస్తున్నా రు. తాజాగా జిల్లాలోని 4,202 సంఘాలకు రూ.1.57 కోట్లు విడుదల చేస్తూ మహిళల ఖాతాల్లో జమ చేయనుంది. ప్రభుత్వ నిర్ణయంపై ఎస్హెచ్జీ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. మంజూరైన వడ్డీలేని రుణం, సంఘాలు మండలం మొత్తం మంజూరైన గ్రూపులు రుణాలు (రూ.లక్షల్లో) ఆదిలాబాద్రూరల్ 261 10.32 బజార్హత్నూర్ 271 10.35 బేల 189 6.84 భీంపూర్ 155 05.35 బోథ్ 541 23.72 గాదిగూడ 121 1.93 గుడిహత్నూర్ 200 07.03 ఇచ్చోడ 265 10.42 ఇంద్రవెల్లి 277 7.65 జైనథ్ 274 10.98 మావల 52 2.10 నార్నూర్ 204 6.82 నేరడిగొండ 296 11.17 సిరికొండ 117 3.80 తలమడుగు 241 9,46 తాంసి 180 7.17 ఉట్నూర్ 558 22.01 -
ఆపద్బాంధవులు పోలీసులు
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: ఆపద సమయంలో పోలీసులు ఆపద్బాంధవులుగా వ్యవహరిస్తారని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో ‘డయల్ 100’లోని పెట్రోకార్, బ్లూకోల్ట్స్ సిబ్బందికి సీపీఆర్, అత్యవసర సమయంలో స్పందించేందుకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యుత్ షాక్, పాముకాటు, అగ్నిప్రమాదం, రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు చే యాల్సిన ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించా రు. అత్యవసర సమయంలో వైద్యులను పిలిచి ప్ర థమ చికిత్స అందేలా చూడాలని ఎస్పీ సూచించా రు. ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్, ఏఆర్ డీఎస్పీ ఇంద్రవర్ధన్, ట్రాఫిక్ సీఐ ప్రణయ్కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ మురళి తదితరులు పాల్గొన్నారు. ఐఐటీ ర్యాంకర్లకు సన్మానం ఐఐటీ అడ్వాన్స్డ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన పోలీసుల పిల్లలు చౌహాన్ కార్తిక్ (787వ ర్యాంక్), రాథోడ్ లావణ్య (803), రాథోడ్ గోవర్ధన్ (1,506వ ర్యాంక్)ను ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ కార్యాలయంలో శాలువాలతో సత్కరించారు. ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున నగదు బహుమతులు అందజేసి అభినందించారు. పోలీస్ కార్యాలయ సూపరింటెండెంట్ సులోచన, పోలీస్ అసోసియేషన్ అ ధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, జైస్వాల్ కవిత, వా మన్, కొండ రాజు తదితరులు పాల్గొన్నారు. సఖీ కేంద్రం పరిశీలన జిల్లా కేంద్రంలోని సఖీ కేంద్రాన్ని ఎస్పీ అఖిల్ మ హాజన్ పరిశీలించారు. కేంద్రం ద్వారా పోలీస్ సేవలు, న్యాయ, వైద్యసహాయం, తాత్కాలిక వసతి, కౌ న్సెలింగ్ అందించనున్నట్లు తెలిపారు. ఎలాంటి ఆ పద సమయంలోనైనా మహిళలు ‘డయల్ 100’, స ఖీ కేంద్రం హెల్ప్లైన్ 181ను సంప్రదించాలని సూ చించారు. ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్, వన్టౌన్ సీఐ సునీల్కుమార్, సఖీ కేంద్రం సిబ్బంది నాగమ ణి, లావణ్య, సంఘమిత్ర, అక్షయ్ ఉన్నారు. -
పరిహారం చెల్లించాకే భూసేకరణ
సాత్నాల: పరిహారం చెల్లించాకే భూసేకరణ చే పట్టాలని కామాయి, యాపల్గూడ రైతులు తహసీల్దార్ విశ్వనాథ్కు గురువారం వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. రేణు క సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి తమ భూములివ్వాలంటే సర్వే నంబర్–82లో ఎకరానికి రూ.30 లక్షల చొప్పున ఇచ్చినా, లేదా.. ఎంత భూమి కోల్పోతున్నామో.. అంత వ్యవసాయ భూమి కొనిచ్చినా అంగీకరిస్తామన్నారు. లేనిపక్షంలో న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. గంగన్న, గోల్కొండ రమేశ్, కస్తూరి ర మేశ్, గండ్రత్ రాజేశ్వర్, రమేశ్ పాల్గొన్నారు. -
‘ఉమ్మడి జిల్లా బంద్కు సహకరించాలి’
ఆదిలాబాద్: జీవో 49 రద్దు చేయాలని కోరుతూ ఈనెల 21న చేపట్టనున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్కు సహకరించాలని తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్ కోరారు. జిల్లా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివాసీల హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్న జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆదివాసీలు, ప్రజాస్వామ్యవాదులు, గ్రామ పటేళ్లు, రాయి సెంటర్ సార్మేడీలు, ఆదివాసీ కుల సంఘాలు, వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు, ప్రజా సంఘాలు బంద్కు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సంఘం డివిజన్ ఉపాధ్యక్షుడు ఆత్రం గణపతి, నాయకులు వెడ్మ బొజ్జు, ముకుందరావు, పీ. నాగోరావు, గెడం ఆనందరావు, దుర్వ జుగాథిరా వు, ఆత్రం మచ్చేందర్, తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణిలో ఆర్టీఐకి అడ్డంకులు
● సమాచార అధికారుల నియామకంలో జాప్యం ● నిలిచిన దరఖాస్తుల స్వీకరణ శ్రీరాంపూర్: సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలో ఆర్టీఐ దరఖాస్తులకు అడ్డంకి ఏర్పడింది. కంపెనీలోనే అతిపెద్ద ఏరియా అయిన శ్రీరాంపూర్లో అధికారులు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ యాక్ట్–2005) దరఖాస్తులు స్వీకరించడం లేదు. మూడు నెలలుగా ఈ ప్రక్రియ నిలిచిపోవడంతో సమాచారం కోరే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏరియా పరిధిలో ఈ చట్టం కింద దరఖాస్తులు స్వీకరించాల్సిన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (పీఐవో), అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అఫీసర్ (ఏపీఐవో) లేకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. పీఐవో గా బాధ్యతలు స్వీకరించిన ఓ డీజీఎం అధికారి ఏ ప్రిల్ 15న అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. ఆయన స్థానంలో ఎవర్నీ నియమించలేదు. ఆతర్వాత ఏపీఐవోగా బాధ్యతలు నిర్వహించిన అధికా రి కూడా గత నెల ఇక్కడి నుంచి ఇతర ఏరియాకు బదిలీ అయ్యాడు. ఆ స్థానాన్ని కూడా భర్తీ చేయలేదు. దీంతో ఈ రెండు సీట్లు ఖాళీగానే ఉంటున్నా యి. పీఐవో బాధ్యతలు నిర్వహించే అధికారి మృతి చెందిన తరువాత మరో పూర్తిస్థాయి అధికారిని నియమించే వరకు ఏపీఐవోకు ఇన్చార్జి పీఐవో బాధ్యతలు అప్పగించడానికి అనుమతి కోరుతూ ఏరియా అధికారులు కార్పొరేట్ అధికారులకు లేఖ రాశారు. వారు ఆలస్యంగా స్పందించడంతో ఆలోపే సదరు ఏపీఐవో అధికారి కూడా ఇక్కడి నుంచి వేరే ఏరియాకు బదిలీ అయ్యారు. దీంతో ఈ రెండు బాధ్యతలను చూసేవారు కరువయ్యారు. వెనుదిరిగి పోతున్న దరఖాస్తుదారులు సమాచారం హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకో వడానికి జీఎం కార్యాలయానికి వచ్చిన కార్మికులు, సమాచార చట్టం కార్యకర్తలు, పౌర సమాజ కార్యకర్తలు అక్కడ అధికారులెవ్వరూ దరఖాస్తులు స్వీకరించకపోవడంతో వెనుదిరిగి పోతున్నారు. ఆ స్థానాల్లో అధికారులు వచ్చేంత వరకు తమకు ఈ దరఖాస్తులు స్వీకరించే అధికారం లేదని ఇతర అధి కారులు వారికి చెప్పి తిప్పి పంపిస్తున్నారు. దీనికి తోడు ఇది వరకే పీఐవోకు దరఖాస్తు చేసుకున్నాక సరైన సమాచారం, స్పందన లేకపోవడంతో అప్పిలేట్ అఽధికారిగా ఉన్న ఏరియా జీఎంకు దరఖాస్తులు చేసుకున్న వారూ ఉన్నారు. ఆ దరఖాస్తులపై కూడా నిర్ణయం తీసుకోవాలంటే కూడా పీఐవో వద్ద సమాచారం తీసుకోవాల్సి ఉంటుంది. పీఐవో లేకపోవడంతో అప్పిలేట్ దరఖాస్తులు కూడా పరిష్కారానికి నోచుకోకుండా మరుగునపడ్డాయి. కార్పొరే ట్ అధికారుల జాప్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలిసింది. చట్టబద్ధత గల ఇలాంటి పోస్టుల భర్తీలో జాప్యం చేయడం సరికాదని, ఇలా చట్టాలను నీరుగార్చుతున్నారని దరఖాస్తు దారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర సమాచార హక్కు చట్టం పరిరక్షణ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేట్కు లేఖ రాశాం.. పీఐవో, ఏపీఐవో పోస్టులు భర్తీ చేయడం కోసం కార్పొరేట్ అధికారులకు లేఖ రాశాం. కార్పొరేట్ అధికారుల ఆదేశాల మేరకే ఈ నియామకాలు జరుగుతాయి. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తాం. – ఎం.శ్రీనివాస్, జీఎం, శ్రీరాంపూర్ -
చెరువులో పడి బాలుడు మృతి
దిలావర్పూర్: ప్రమాదవశా త్తు చెరువులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెంది న కొప్పుల అశ్విత్ (15) బుధవారం సాయంత్రం ఆడుకోవడానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. రాత్రయినా రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం మండల కేంద్రంలోని కుడి చెరువులో మృతదేహం గమనించిన స్థానికులు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాలకృత్యాల కోసం వెళ్లి చెరువులో జారిపడి మృతి చెందినట్లు అశ్విత్ తల్లి కొప్పుల పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టులో పడి ఒకరి మృతిభైంసాటౌన్: పట్టణ శివారులోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులో పడి ఒకరు మృతి చెందినట్లు ఎస్సై నవనీత్రెడ్డి తెలిపారు. మండలంలోని వానల్పాడ్కు చెందిన సిద్దివార్ రమణ (45) పట్టణంలోని కోర్వగల్లిలో నివాసముంటున్నాడు. కుమారుడు రాజుతో కలిసి ఉదయం స్థానిక గడ్డెన్నవాగు ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. నిర్మల్లో కిడ్నాప్ కలకలంనిర్మల్టౌన్: నిర్మల్లో బాలుడి కిడ్నాప్కు యత్నం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు నిర్మల్ మండలం అనంతపేట్కు చెందిన ఐదేళ్ల బాలుడికి తండ్రి కిరాణా కొట్టువద్ద బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చి ఇంటికి వెళ్లమని చెప్పాడు. అదే గ్రామానికి వెంట్రుకలు కొనుగోలు చేయడానికి ఆటోలో వచ్చిన ఆరుగురు మహిళలు బాలున్ని ఆటోలో ఎక్కించుకుని వెళ్లారు. బాలుడు ఇంటికి రాకపోయేసరికి కంగారుపడిన తల్లిదండ్రులు అనుమానంతో బంగల్ పేట్ మహాలక్ష్మి వద్ద ఉన్న తెలిసిన వారికి ఫోన్ చేసి విషయం తెలిపారు. అప్పటికే ఆ మహిళలు మహాలక్ష్మి కాలనీకి కొద్ది దూరంలో బాలుడిని దించి వెళ్తుండగా పట్టుకుని నిలదీశారు. తమకేం తెలియదని బుకాయించడంతో వారిపై దాడి చేశారు. అనంతరం మహిళలను పోలీసులకు అప్పగించారు. పిచ్చికుక్క స్వైరవిహారంవేమనపల్లి: మండలంలోని జక్కెపల్లిలో గురువారం ఉదయం పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. ఏడుగురిపై దాడి చేసి గాయపర్చింది. అల్లాడి అనసూర్య ఎడమచేయి మణికట్టు వద్ద, ఆలం సాంబయ్య కాళ్లకు, చెన్నూరి బక్కు తల వద్ద, శనిగారపు పోశం కాళ్లకు, తలండి శ్రీనివాస్ చేతులను కొరికింది. చెన్నూరి శేఖర్పై పడి కొరికేందుకు ప్రయత్నించగా కర్రతో కొట్టి చంపాడు. జిల్లెడలో కూడా మరో నలుగురిపై దాడి చేసినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆటో సాయంతో వేమనపల్లి పీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స అందించారు. కుక్క దాడిలో ఇరువురికి గాయాలుకాగజ్నగర్టౌన్: పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో కాపువాడకు చెందిన కర్ల కళావతిపై కుక్క దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి కుక్కలను తరి మేయడంతో ప్రాణాపాయం తప్పింది. రైల్వే స్టేషన్కు వెళ్లే మరో ప్రయాణికునిపై కూడా కుక్క దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. బాధితులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే స్టేషన్లో కుక్కల బెడద ఉందని ‘సాక్షి’ బుధవారమే కథనాన్ని ప్రచురించింది. అయినా అధికా రులు స్పందించక పోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి రైల్వే స్టేషన్ పరిసరాల్లో కుక్కల బెడదను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. -
ఇచ్చోడలో దొంగల బీభత్సం
● ఒకేరోజు మూడిళ్లలో చోరీ ● బంగారం, వెండి, నగదు అపహరణఇచ్చోడ: మండల కేంద్రంలో బుధవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన మూడిళ్లలో చోరీకి పాల్పడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రంలోని సాయినగర్ కాలనీకి చెందిన జాదవ్ దేవిదాస్ మూడు రోజుల కిత్రం ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులంతా ఇంటికి తాళం వేసి సొనాల మండలంలోని ఘన్పూర్కు వెళ్లారు. తాళం పగులగొట్టిన దొంగలు ఇంట్లో చొరబడి తులం బంగారం, 20 తులాల వెండి, రూ.10 వేల నగదు దొంగిలించారు. విద్యానగర్ కాలనీలోని రమేశ్ ఇంట్లో చొరబడి 4 గ్రాముల బంగారంతో పాటు నగదు అపహరించారు. అదేకాలనీలో ఉన్న చిక్రం జంగు ఇంట్లో తులం బంగారం, ఐదు తులాల వెండి దొంగిలించారు. సంతోషిమాత ఆలయం వద్ద పార్క్ చేసిన పల్సర్ 220 బైక్ను తీసుకెళ్లి ఆదిలాబాద్ బైపాస్ వద్ద వదిలేసి పరారయ్యారు. అప్రమత్తమైన పోలీసులు క్లూస్ టీం, డాగ్స్క్వాడ్ బృందాలను రప్పించి వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. -
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ షురూ
నిర్మల్టౌన్: నిర్మల్ పట్టణ శివారులోని కొండాపూర్ వద్ద ఉన్న నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీలో గురువారం రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లా స్టార్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా 33జిల్లాల నుంచి 180మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. గురువారం క్వాలిఫై పోటీలు నిర్వహించగా.. శుక్రవారం నుంచి ఈ నెల 20వరకు ప్రధాన పోటీలు కొనసాగుతాయి. అండర్–19 బాలురు, బాలికలు, సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. జిల్లా క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్రెడ్డి, మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముఖేష్గౌడ్, ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ కిషోర్, కో కన్వీనర్, వన్నెల భూమన్న, కోఆర్డినేటర్లు సందీప్, మధుకర్గౌడ్, మహేష్, ప్రణీత్, నందకుమార్ పోటీలను పర్యవేక్షించనున్నారు. శుక్రవారం మెయిన్ డ్రా పోటీలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
నిర్మల్టౌన్: షట్టర్ లిఫ్టింగ్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని ఉమ్రికి చెందిన రాజుసింగ్ మోహన్సింగ్, సేవక్ సింగ్ రఘుబీర్సింగ్, సుర్దిప్ సింగ్ ముగ్గురు బంధువులు. నిర్మల్ జిల్లాలో కూలి పనులు చేసేవారు. జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 12న రాత్రి బైక్పై లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్ చేరుకుని పెట్రోల్ బంక్ సమీపంలోని ఇంటి ముందున్న బైక్ను దొంగలించారు. అనంతరం ఓ గోల్డ్షాప్లో చొరబడి బంగారం, వెండి ఆభరణాలు అపహరించారు. అదే రాత్రి ఉమ్రికి వెళ్తూ మార్గమధ్యలో కుంటాల మండలం కల్లూరు బస్టాండు సమీపంలో రెండు దుకాణాల తాళాలు పగులగొట్టి రూ.2,500ల నగదు అపహరించారు. గురువారం నిర్మల్లో బంగారం విక్రయించడానికి వచ్చారన్న పక్కా సమాచారంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 2.7 కిలోల వెండి, 17 గ్రాముల బంగారం, రూ.2,500 నగదు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు వెండి ఆభరణాలను ‘నిర్మల్ పోలీస్’ అని అందంగా అలంకరించి, తప్పించుకోలేరని ఒక మెసేజ్ ఇచ్చారు. కేసును ఛేదించడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సీఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్సైలు శ్రీనివాస్, అశోక్, పీసీఆర్ ఎస్సై ప్రదీప్ కుమార్, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
108లో సుఖప్రసవం
కోటపల్లి: మండలంలోని పంగిడిసోమారం గ్రామానికి చెందిన గర్భిణి రెడ్డి లవలోకకు పురిటినొప్పులు రావడంతో ఆమె భర్త అర్జన్న 108కి సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది అంబులెన్సులో కోటపల్లి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో పురిటినొప్పులు అధికం కావడంతో పంగిడిసోమారం అటవీప్రాంతంలోనే సుఖప్రసవం చేయడంతో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇరువురిని కోటపల్లి పీహెచ్సీకి తరలించారు. కార్యక్రమంలో ఈఎంటీ షబనాజ్, ఫైలట్ ఫరీద్, తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన విద్యార్థికి ల్యాప్టాప్ అందజేత
ఉట్నూర్రూరల్: కెరమెరి మండలంలోని నిషాని గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి ఆత్రం వంశీకృష్ణ పైచదువుల నిమిత్తం గురువారం ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తన కార్యాలయంలో ల్యాప్టాప్ అందజేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివితే భవిష్యత్లో అపజయాలు ఉండవని, ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. సన్మానం కళామందిర్ ఫౌండేషన్ ద్వారా ఇటీవల సేవారత్న పురస్కారం అందుకున్న కాథ్లే మారుతిని గురువా రం ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా సన్మానించారు. ఆ దిలాబాద్ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన మారుతి ఎంతోమంది గిరిజన విద్యార్థులకు వి లువిద్యలో శిక్షణ ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ఫౌండేషన్ తరపున అతనికి రూ.లక్ష నగదు, జ్ఞాపిక అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో పీవీటీజీ మెస్రం మనోహర్, ఏసీఎంవో జగన్, జిల్లా క్రీడల అధికారి పార్థసారథి పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా అరెస్ట్
జైనథ్ : అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠాను అరె స్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బేల మండలానికి చెందిన సుమిత్, అతని మిత్రుడైన సలీం షకిల్తో కలసి మహారాష్ట్రకు చెందిన కృష్ణతో గ్యాంగ్గా ఏర్పడ్డారన్నారు. ఆదిలాబాద్ వన్ టౌన్, బేల, మహారాష్ట్ర కోర్పణ మండలాల్లో బైక్లను అపహరించి ఇతరులకు విక్రయిస్తుండేవారన్నారు. వారి వద్దనుంచి 12 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో ఎనిమిదిమందిపై కేసు నమోదు చేసి నలుగురిని రిమాండ్కు తరలించామన్నారు. రేషన్ బియ్యం పట్టివేతకోటపల్లి: మంచిర్యాల నుంచి మహారాష్ట్రకు బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 33 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. కోటపల్లి మండలంలోని రాంపూర్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టుబడినట్లు ఆయన పేర్కొన్నారు. డ్రైవర్ సంజయ్ను అదుపులోకి తీసుకుని సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించమన్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. రెండోలీగ్లో ఓడిన ఉమ్మడి జిల్లా జట్టుమంచిర్యాలటౌన్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీఎ స్సార్ క్రికెట్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో రెండో లీగ్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు సాయి సత్య టీంతో 90 ఓవర్ల చాంపియన్షిప్లో ఓడిపోయింది. ఆదిలాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 30.3 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌట్ కాగా అనంతరం బ్యాటింగ్ చేసిన సాయిసత్య టీం 24.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసి విజయం సాధించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టులోని సాయికుమార్ 7 వికెట్లు సాధించడం గమనార్హం. పిచ్ పూర్తిగా బౌలర్లకు అనుకూలంగా ఉండడంతో, ఇరుజట్లు పరుగులను చేసేందుకు ఇబ్బంది పడ్డాయని కోచ్ ప్రదీప్ తెలిపారు. దివ్యాంగులకు రైలులో రాయితీపై ప్రయాణంమంచిర్యాలఅర్బన్: దివ్యాంగులు, ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి రైల్వేశాఖ రాయితీపై ప్ర యాణ సౌకర్యం కల్పిస్తోందని సికింద్రాబాద్ డివిజన్ (ఎస్సీఆర్) అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ ఐఎస్ఆర్ మూర్తి అన్నారు. గురువా రం మంచిర్యాల రైల్వేస్టేషన్లో అవగాహన కల్పించారు. మంచిర్యాల కమర్షియల్ ఇన్స్పెక్టర్ దేవేందర్, తదితరులు పాల్గొన్నారు. -
● జిల్లాలో 3 జెడ్పీటీసీ.. 8 ఎంపీటీసీ స్థానాలు పెంపు ● గ్రామ పంచాయతీ, వార్డులు కూడా.. ● అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం ● ఎన్నికల నిర్వహణపై మొదలైన చర్చ
కై లాస్నగర్: స్థానిక సమరానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీలు, వార్డుల స్థానాలను బుధవారం అధికారికంగా ప్రకటించింది. జిల్లాలో 20 జెడ్పీటీసీలు, 20 ఎంపీపీలు ఉండగా, 166 ఎంపీటీసీ స్థానాలున్నాయి. కొత్తగా మూడు జెడ్పీటీసీలు, మూడు ఎంపీపీతో పాటు 8 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ స్థానాలు పెరిగాయి. నూతనంగా మండలాలు ఏర్పాటు కావడంతో ఎంపీటీసీ స్థానాల పునర్విభజన అనివార్యమైంది. తదనుగుణంగా కసరత్తు చేసిన అధికారులు మండలాల వారీగా ఖరారు చేస్తూ ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. పూర్వ మండలాల నుంచి కొత్తగా ఏర్పడిన మండలాలకు జనాభా సంఖ్యకు అనుగుణంగా ఎంపీటీసీ స్థానాలను కేటా యించిన అధికారులు మరో రెండు మండలాల్లో వాటి సంఖ్య పెంచారు. 2019లో జరిగిన ఎన్నికల్లో 158 ఎంపీటీసీ స్థానాలు ఉండగా పెరిగిన స్థానాలతో ఈ సంఖ్య ప్రస్తుతం 166కు చేరింది. జిల్లాలో ఐదు గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడటంతో వీటి సంఖ్య 473కు చేరింది. అలాగే 3,870 వార్డులు న్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. తక్కువ సభ్యులున్న మండలాల్లో సర్వసభ్య సమావేశాల నిర్వహణకు వీలుగా కనీసం ఐదుగురు సభ్యులండేలా పునర్విభజన చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో ఎన్నికలకు ఎప్పుడైన నోటిఫికేషన్ రావచ్చనే చర్చ ఊపందుకుంది. ఆ దిశగా ఆశావహులు తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఎంపీటీసీ స్థానాల పెంపు ఇలా... 2019లో జరిగిన ఎన్నికల్లో జైనథ్ మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలుండేవి. ఆ మండలాన్ని విభజించి కొత్తగా భోరజ్, సాత్నాల మండలాలను ఏర్పా టు చేశారు. నూతన మండలాల్లోని గ్రామ పంచాయతీల సంఖ్యకనుగుణంగా ఎంపీటీసీ స్థానాల ను ప్రకటించారు. ● ఆదిలాబాద్ రూరల్ మండలంలో గతంలో 11 ఎంపీటీసీ స్థానాలుండగా ప్రస్తుతం ఈ మండలంలోని పలు గ్రామాలు కొత్తగా ఏర్పడిన సాత్నాల మండలంలో చేరాయి. దీంతో ఈ మండలంలో ఒక ఎంపీటీసీ స్థానం తగ్గింది. ● బోథ్ మండలంలో గతంలో 14 ఎంపీటీసీ స్థానా లుండగా ఈ మండలం నుంచి కొత్తగా సొనాల మండలాన్ని ఏర్పాటు చేశారు. రెండు మండలాల్లోని గ్రామ పంచాయతీల సంఖ్యకనుగుణంగా ఎంపీటీసీలను కేటాయించారు. ● మావల మండలంలో గతంలో మూడు గ్రామా ల పరిధిలో ముగ్గురు ఎంపీటీసీలు మాత్రమే ఉండేవారు. ఇందులో ఒకరు ఎంపీపీ, మరొకరు వైస్ ఎంపీపీగా ఎన్నికై తే ఒక సభ్యుడు మాత్రమే ఉండేవారు. మండల సర్వసభ్య సమావేశాలకు ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో జనాభా కు అనుగుణంగా ఈ మండలంలో అదనంగా మరో రెండు స్థానాలను పెంచారు. ● ఇక 2019లో మున్సిపల్ ఆవిర్భావం పేరిట ఎన్నికలకు దూరంగా ఉన్న ఉట్నూర్ గ్రామ పంచాయతీలో గతంలో 14 ఎంపీటీసీ సీట్లు ఉండగా పెరిగిన జనాభాకు అనుగుణంగా అదనంగా మరో 4 స్థానాలు పెంచారు. ● బేల మండలంలో గతంలో 11 ఎంపీటీసీ స్థానా లుండగా ఈ మండలంలోని పలు గ్రామాలను సాత్నాల మండలంలో కలుపడంతో రెండు స్థా నాలను తగ్గించారు. ● సిరికొండ మండలంలోని మల్లాపూర్ గ్రామాన్ని ఇంద్రవెల్లి మండలంలో కలుపడంతో సిరికొండలో ఓ ఎంపీటీసీ స్థానం తగ్గించగా, ఇంద్రవెల్లిలో ఓ ఎంపీటీసీ స్థానం పెరిగింది. ● ఈ మండలాలు మినహా మిగతా మండలాల్లోని ఎంపీటీసీ స్థానాల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఆయా మండలాల్లోని ఎంపీటీసీ స్థానాలు యథాతథంగా ఉన్నట్లుగా జెడ్పీ సీఈవో జి.జితేందర్ రెడ్డి తెలిపారు. జిల్లా పరిషత్ కార్యాలయం పునర్విభజన మండలాల్లో గ్రామపంచాయతీలు, ఎంపీటీసీ స్థానాల వివరాలు.. మండలం గ్రామ ఎంపీటీసీ జనాభా పంచాయతీలు స్థానాలు సొనాల 12 05 13,025 భోరజ్ 17 05 17,909 సాత్నాల 17 05 13,662 ఆదిలాబాద్ రూరల్ 31 10 34,514 బేల 31 09 32,661 బోథ్ 21 10 35,191 జైనథ్ 17 07 23,788 మావల 03 05 6,310 ఉట్నూర్ 38 18 63,465 -
నిరుద్యోగులకు కుచ్చుటోపీ
● ఉద్యోగాల పేరిట ‘డిజిటల్’ మోసం ● అమాయక గిరిజనులే టార్గెట్ ● జిల్లాలో 300 మంది వరకు.. ● ఒక్కొక్కరి నుంచి రూ.20వేలకు పైనే వసూలు ● పోలీసులను ఆశ్రయించిన బాధితులు ఆదిలాబాద్టౌన్: ఉపాధి అవకాశాల పేరిట నిరుద్యోగులను నమ్మించిన ఓ ప్రైవేట్ సంస్థ అందిన కాడికి దండుకొని దుకాణం ఎత్తేసింది. ‘డిజిటల్ మైక్రోఫైనాన్స్’ పేరిట సంస్థను ఏర్పాటు చేసి అమాయక గిరిజనుల నుంచి డబ్బులు వసూలు చేశారు. తర్వాత రేపుమాపు అంటూ బుకాయించారు. బాధితులు ప్రశ్నించడంతో మంగళవారం నుంచి కనిపించకుండా పోయారు. ఈ వ్యవహారం జిల్లా కేంద్రంలోని రాంనగర్లో చోటు చేసుకుంది. బాధితులు బుధవారం ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. జిల్లా పోలీస్ బాస్ ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. ఉద్యోగం వస్తుందని ఆశపడి అప్పుసొప్పు చేసి కొందరు, బంగారు ఆభరణాలు అమ్మి మరి కొందరు వారికి డబ్బులు చెల్లించారు. అసలేం జరిగిందంటే.. రెండు నెలల క్రితం ఇంద్రవెల్లి మండలంలోని శంకర్గుట్టకు చెందిన ఓ వ్యక్తి ఎన్ఆర్ఐ పేరిట సోషల్ మీడియాలో హల్చల్చేశాడు. పేదల కోసమే తాను ఇక్కడికి వచ్చానని నమ్మ బలికాడు. ఆదిలా బాద్ పట్టణంలోని రాంనగర్లోని కేవీకే పక్కనగల ఓ బిల్డింగ్లో కార్యాలయం ప్రారంభించాడు. అలాగే ఉట్నూర్, జైనూర్ ప్రాంతాల్లో బ్రాంచ్లు సైతం ఓపెన్ చేశాడు. రిమ్స్ అభివృద్ధికి రూ.కోటి వరకు ఖర్చు చేస్తానని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అందరి దృష్టిలో పడ్డాడు. ఆసుపత్రి అధికారులను కలిసి అంబులెన్స్, వ్యాన్లు, స్ట్రెచ్చర్లు, ఏసీలు, వీల్చైర్లు, కుర్చీలు తదితర వస్తువులు ఇస్తానని లెటర్ ప్యాడ్ అందజేశాడు. దీంతో అధికారులు ఆయనను నమ్మారు. తర్వాత జిల్లా కేంద్రంలోని సినిమా రోడ్లోని ఓ హోటల్లో 200 మంది నిరుద్యోగులతో సమావేశం ఏర్పాటు చేశాడు. ఉపాధి అవకాశాలు కల్పిస్తానని నమ్మబలకడంతో వారంతా ఆయన వలలో చిక్కారు. వారిని ఉట్నూర్లోని పూలాజీ బాబా ఆలయానికి ఓ కాన్వాయ్ ద్వారా తీసుకెళ్లా డు. అక్కడ నిర్వాహకులకు 2 కిలోమీటర్ల మేర తారు రోడ్డు వేయిస్తానని నమ్మబలికాడు. ఇవన్ని చూసి నిరుద్యోగులు తమకు మేలు చేకూరుతుందని ఆశపడ్డారు. రూ.20వేలకు పైగా.. డిజిటల్ మైక్రోఫైనాన్స్ పేరిట కృష్ణ అనే వ్యక్తి ఈ సంస్థను ఏర్పాటు చేశాడు.జిల్లాలోని ఆయా గ్రామా ల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు. నిరుద్యోగులకు బ్యాంకులో ఉద్యోగాలు, ఎలాంటి విద్యాఅర్హత లేకపోయినా ఏదో ఒకఉద్యోగం కల్పిస్తానని నమ్మిం చాడు. ముఖ్యంగా ఆదివాసీలను టా ర్గెట్ చేశాడు. రెండు జతల యూనిఫాం, షూ కోసమని, ఇతర ఖర్చుల కోసం రూ.20వేల నుంచి రూ. లక్ష వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఎక్కువ శాతం రూ.20వేల చొప్పున చెల్లించారు. బజార్హత్నూర్ మండలానికి చెందిన మెస్రం ప్రహ్లాద్కు డబ్బులు ఇచ్చామని బాధితులు చెబుతున్నారు. కార్యాలయానికి వెళితే రేపుమాపు అంటూ కాలం వెళ్లదీశాడు. వారంతా మంగళవారం ఒత్తిడి చేయగా బుధవారం దుకాణం షట్టర్ మూసివేసి పరారైనట్లు తెలుస్తోంది. దాదాపు రూ.కోటికి పైగా వసూలు చేసినట్లు సమాచారం. ఉద్యోగంలో చేరిన తర్వాత ఎలాంటి షూరిటీ లేకుండా రూ.5లక్షల రుణం, నెలకు రూ.15వేల వేతనం, యూనిఫాం, షూ, ఇతర అలవెన్సులు ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఎస్పీని కలిసిన బాధితులు.. బాధితుల్లో తలమడుగు మండలంలోని ఝరి, బ రంపూర్, దేవాపూర్, గుడిహత్నూర్ మండలంలోని గోండ్ అర్కాపూర్, ఆదిలాబాద్ పట్టణంతో పాటు పొచ్చర, ఉట్నూర్ తదితర గ్రామాల వారు ఉన్నా రు. బాధితులంతా ఎస్పీ కార్యాలయానికి చేరుకొని తమ గోడు వెల్లబోసుకున్నారు. స్పందించిన అఖిల్ మహాజన్ వారికి భరోసా కల్పించారు. బంగారం అమ్మి ఇచ్చాను.. మాది మహారాష్ట్ర. ఉపాధి కోసం ఇక్కడికి వచ్చాం. ఇదివరకు నేను ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేశాను. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించడంతో ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టాను. నా వద్ద ఉన్న బంగారం అమ్మి రూ.20వేలు ఇచ్చాను. విషయం మా ఇంట్లో తెలియడంతో గొడవలు జరుగుతున్నాయి. మాకు న్యాయం చేయాలి. – రత్నమాల, రాంనగర్ నిందితులను పట్టుకుంటాం.. ఉద్యోగం పేరిట ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వొ ద్దు. అలాంటి వారిపై పో లీసులకు సమాచారం అందించాలి. డిజిటల్ మై క్రో ఫైనాన్స్ పేరిట మో సం చేసిన వ్యక్తులపై బాధితుల ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేశాం. ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. ప్రధాన నింది తుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. – అఖిల్ మహాజన్, ఎస్పీ -
శిక్షణ నిధులు హాంఫట్!
● హెచ్సీఏ సమ్మర్ క్యాంపులో గోల్మాల్? ● శిబిరం పేరిట ప్రైవేట్ కోచింగ్ ● జిల్లా స్థాయిలో అక్రమాలపై ఫిర్యాదులు ఆదిలాబాద్: క్రికెట్.. ఈ క్రీడంటే ఇష్టపడని వారు ఉండరు. సెలవులొస్తే చాలు చిన్నారులు బ్యాట్, బాల్ పట్టుకొని మైదానాల్లో వాలిపోతుంటారు. ఇక పెద్దవారు టీవీలు, స్టెడియాల్లో మ్యాచ్లను వీక్షిస్తూ క్రీడాసక్తి చూపుతున్నారు. క్రికెటర్లకు ఉన్న క్రేజీతో ఆ ప్రభావం చిన్నారులపై పడుతోంది. తల్లిదండ్రులు సైతం ప్రోత్సహిస్తుండడంతో మంచి క్రికెటర్లుగా ఎదగాలని వారు ఆశిస్తున్నారు. అయితే దీనిని కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు. శిక్షణ పేరిట అర్హతలు లేని వారికి కోచ్ బాధ్యతలు అప్పగిస్తూ వేలాదిగా డబ్బులు దండుకుంటున్నారు. ఇటీవలే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిని సీఐ డీ అరెస్టు చేయడంతో జిల్లా స్థాయిలో సైతం అవి నీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ మైదానం.. ప్రైవేట్ శిక్షణ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో హెచ్సీఏ ఆధ్వర్యంలో ఏటా సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ ఉచితంగా ఇవ్వాల్సి ఉండగా పిల్లల నుంచి రూ.వేలల్లో ఫీజు వసూలు చేయడం గమనార్హం. అంతేకాకుండా అర్హత లేని ఓ జూనియర్కు కోచింగ్ బాధ్యతలు అప్పగించడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఇంత జరిగినా అధికారులు మామూలుగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. మరుగునపడుతున్న ప్రతిభావంతులు.. జిల్లావ్యాప్తంగా ఎంతోమంది ప్రతిభగల క్రికెటర్లు ఉన్నారు. అయితే సరైన ప్రోత్సాహం లేక, శిక్షణ సౌ కర్యాలు కరువై వారంతా రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించలేని దుస్థితి. రూ.వేలల్లో ఫీజు లు చెల్లిస్తేనే అకాడమీలలో శిక్షణ పొందే వీలు ఉంటుంది. అయితే ఆసక్తి, అభిరుచి, నైపుణ్యం ఉన్నప్పటికీ ఆర్థిక వనరులు లేక పలువురు ఈ క్రీడ నుంచి నిష్క్రమిస్తున్నారు. ఔత్సాహిక క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తే రాష్ట్రస్థాయిలోనే కాకుండా, జాతీయ, అంతర్జాతీయ క్రికెటర్లుగా ఎదిగే అవకా శాలు లేకపోలేదు. హెచ్సీఏ నిర్లక్ష్యం కారణంగా ఎంతోమంది జిల్లాకు చెందిన క్రీడాకారులు హైదరాబాద్ వరకు సైతం వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని సీనియర్ క్రికెట్ శిక్షకులు చెబుతున్నారు. రాజఽ దాని కేంద్రంగా అకాడమీల్లో శిక్షణ పొందుతున్న వారికే అవకాశాలు ఇస్తున్నారనే ఆరోపణలున్నా యి. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాల్లో అర్హులైన శిక్షకులు లేకపోవడం, ఫీజులు చెల్లించిన వారికి, అస్మదీయులకు ఎంపికలో పెద్దపీట వేయడంతో ఈ ప్రాంత క్రీడాకారుల నైపుణ్యం జిల్లాకే పరిమితమవుతుందనే విమర్శలున్నాయి. అధ్యక్షుడి అరెస్టుతో కదులుతున్న డొంక.. హెచ్సీఏ హైదరాబాద్ కేంద్రంగా ఉండే క్రీడాకారులను మాత్రమే దేశవాళి టోర్నీలకు ఎంపిక చేస్తూ జిల్లాల్లోని వారిని నిర్లక్ష్యం చేస్తుందనే అపవాదు మూటగట్టుకుంది. గతేడాది ఏప్రిల్లో రాష్ట్రంలోని ఉమ్మడి ఎనిమిది జిల్లాల్లో హెచ్సీఏ ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు. ఒక్కో ఉమ్మడి జిల్లాలో మూడు శిక్షణ కేంద్రాలకు రూ.15 లక్షల నిధులు కేటాయించారు. ఉమ్మడి ఆదిలాబాద్ విషయానికి వస్తే ఆదిలాబాద్, మంచిర్యాల, సిర్పూర్లో వీటిని ఏర్పాటు చేశారు. అయితే క్రీడాకారులకు సరైన శిక్షణ ఇవ్వకుండా, సదుపాయాలు సైతం కల్పించకుండా హెచ్సీఏ నుంచి వచ్చిన నిధులను దుర్వినియోగం చేశారని చర్చ జోరుగా సాగుతోంది. అంతేకాకుండా శిక్షణకు వచ్చిన క్రీడాకారుల నుంచి సైతం ఫీజులు వసూలు చేయడం గమనా ర్హం. రాష్ట్రస్థాయిలో అక్రమాలు బయటపడడంతో జిల్లా స్థాయిలోనూ స్థానిక హెచ్సీఏ ప్రతినిధులు నిధులను పక్కదారి పట్టించారనే వాదనలకు బలం చేకూరుస్తూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు తాజాగా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో అధికారులు చొరవ తీసుకొని విచారణ జరిపితే అక్రమాలు పూర్తిస్థాయిలో బయటపడే అవకాశం ఉంది. హెచ్సీఏ నిధులు దుర్వినియోగం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అందిస్తున్న నిధులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దుర్వినియోగం అవుతున్నాయి. ఏటా క్రికెట్ క్రీడాభివృద్ధికి రూ.20లక్షలు విడుదలవుతున్నాయి. అలాగే వేసవి శిక్షణ శిబిరం కోసం రూ.15లక్షలు కేటాయిస్తున్నారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి పురోగతి కానరావడం లేదు. ప్రతిభ ఉన్నప్పటికీ ఎంతోమంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు వెళ్లలేకపోతున్నారు. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటపడతాయి. – నరోత్తం రెడ్డి, టీసీఏ ఆదిలాబాద్ ఇన్చార్జివివరాలు సేకరిస్తున్నాం.. స్టేడియంలో హెచ్సీఏ క్రికెట్ శిక్షణ శిబిరానికి సంబంధించి అనుమతుల విషయంలో వివరాలు సేకరిస్తున్నాం. స్టేడియంలో ప్రైవేట్ శిక్షణ అందిస్తే చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో సదరు శిక్షకులు, నిర్వాహకులను విచారించి, నివేదికను కలెక్టర్కు అందిస్తాం. వారి ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్తాం. – జక్కుల శ్రీనివాస్, డీవైఎస్వో ఆదిలాబాద్ -
‘సర్దుబాటు’ సరిదిద్దేందుకు కమిటీ
● ఉపాధ్యాయ సంఘాలతో డీఈవో సమావేశం ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబా టు ఇష్టానుసారం చేపట్టిన తీరు ను ప్రస్తావిస్తూ‘సర్దుబాటు గంద రగోళం’ శీర్షికన ‘సాక్షి’లో బుధవారం కథనం ప్రచురితమైంది. దీనికి డీఈవో శ్రీనివాస్రెడ్డి స్పందించారు. ప్రక్రియ రీవెరిఫికేషన్ కోసం ఐదుగురు ఎంఈవోలతో కమి టీ ఏర్పాటు చేశారు.అలాగే జిల్లాకేంద్రంలోని ప్రభు త్వ డైట్ కళాశాలలో ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రక్రియలో జరిగిన పొరపాట్లను సరిదిద్దాలని డీఈవో దృష్టికి తీసుకెళ్లారు. కేజీబీవీ సెక్టోరియల్ అధికారి పోస్టుల నియామకాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. సదరు అధికారిని తొలగించాల ని పేర్కొన్నారు. డీఈవో కార్యాలయంలో పనిచేసే కొంత మంది ఉద్యోగుల తీరుతో విద్యాశాఖ అభా సుపాలవుతుందన్నారు. డిప్యూటీ ఈవో కార్యాలయాన్ని యథావిధిగా కొనసాగించాలని, పీఎంశ్రీ నిధులకు సంబంధించి సమగ్ర విచారణ చేపట్టాల ని, కేజీబీవీల్లో ఆడిట్ చేయించాలని డీఈవో దృష్టికి తీసుకొచ్చారు. వినతి పత్రం సమర్పించారు. సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు కృష్ణకుమార్, శ్రీకాంత్, జలేందర్, కాంతం, గోపీకృష్ణ, అశోక్, శ్రీనివాస్, నవీన్యాదవ్, రియాజ్, మహేందర్, శ్రీనివాస్, సుదర్శన్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఒక్క విద్యార్థి.. ముగ్గురి పర్యవేక్షణ
ఖానాపూర్: ఉపాధ్యాయుల కొరత, సౌకర్యాల లేమి వంటి కారణాలతో విద్యార్థులను ప్రభుత్వ బడులకు పంపేందుకు తల్లిదండ్రులు అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో గ్రామాల్లో ఉన్న పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. మండలంలోని అడవి సారంగాపూర్ పంచాయతీ పరిధి రాజులమడుగులోని ఐటీడీఏ ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడితో పాటు ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. కొద్దిరోజులుగా ఇద్దరు గైర్హాజరు అవుతుండడంతో ఒకే విద్యార్థి పాఠశాలకు వస్తున్నాడు. బుధవారం నిర్మల్ ఏసీఎంవో శివాజీ ఎస్సీఆర్టీ జంగు పటేల్తో కలిసి పాఠశాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో ఒకే విద్యార్థి భీష్ము అందుబాటులో ఉన్నాడు. ఉపాధ్యాయుడితో పాటు ఇద్దరు అధికారులు కలిసి ఒక్క విద్యార్థిని పర్యవేక్షించాల్సి వచ్చింది. -
వింత వ్యాధితో 17 మేకలు మృతి
భైంసారూరల్ : మండలంలోని ఇలేగాంలో కదం దత్తురాంకు చెందిన 17 మేకలు వింత వ్యాధి సోకి మృతి చెందినట్లు బాధితుడు తెలి పారు. మంగళవారం ఉదయం మేకలను మేతకోసం గ్రామ శివారులోని అడవికి తీసుకెళ్లాడు. మేత మేస్తుండగానే ఒక్కొక్కటిగా సాయంత్రం వరకు అడవిలోనే ఏడు మేకలు మృతి చెందాయి. దీంతో ఏంచేయాలో తెలియక మిగిలిన మేకలను తోలుకుని ఇంటికి వచ్చి పాకలో తోలాడు. బుధవారం ఉదయం చూసేసరికి మరో 10 మేకలు చనిపోయి ఉన్నాయి. పశువైద్యాధికారి విఠల్కు ఫోన్ ద్వారా సమాచారం అందించగా పరిశీలించి సీసీపీపీ(కంటైజెస్ క్యాప్ట్రెన్ ఫ్లూరో నిమోనియా)తో మృతి చెందినట్లు తెలిపారు. సుమారు రూ.2లక్షల వరకు నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. -
‘రేషన్’ మంజూరు పత్రాలొచ్చాయ్●
కై లాస్నగర్: కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి కి సంబంధించిన రేషన్కార్డుల మంజూరు ప త్రాలు బుధవారం జిల్లాకు చేరాయి. జిల్లాలోని 21 మండలాల పరిధిలో కొత్త కార్డులు 4,900 మంజూరయ్యాయి. అలాగే పాత కార్డుల్లో కొత్తగా 5,160 మందిని చేర్చారు. వారికి సంబంధించిన మంజూరుపత్రాలు జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి చేరాయి. వాటిని నియోజకవర్గం, మండలాల వారీగా సిద్ధం చేసిన అధికారులు ఆయా మండలాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. వీటి పంపిణీ ప్రక్రియను ఈ నెల 22లోపు పూర్తి చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం మండలాల వారీగా ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా వాటిని లబ్ధి దారులకు అందజేయనున్నట్లు డీఎస్వో వాజీ ద్ అలీ తెలిపారు. రేషన్కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని, మంజూరుపత్రాలు రానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. -
అర్ధరాత్రి దొంగల బీభత్సం
● చింతలమానెపల్లి, కౌటాల మండలాల్లో చోరీలు ● చేతికి చిక్కినట్టే చిక్కి.. తప్పించుకుని పరారీ ● ద్విచక్ర వాహనం, ఫోన్ స్వాధీనం చింతలమానెపల్లి/కౌటాల: చింతలమానెపల్లి, కౌ టాల మండలాల్లో మంగళవారం రాత్రి దొంగలు బీ భత్సం సృష్టించారు. చోరీకి పాల్పడి పారిపోతుండగా ఓ ఉపాధ్యాయుడు సాహసించి పట్టుకునే ప్రయత్నం చేయగా చేజారాడు. ఎస్సైకి ఎదురుపడగా.. అనుమానంతో పట్టుకునే ప్రయత్నం చేయగా చిక్కినట్టే చిక్కి పారిపోయారు. ప్రత్యక్ష సాక్షులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలమానెపల్లి మండలం డబ్బా గ్రామం అడెపల్లి చౌరస్తాలోని శ్రీసాయి ఫర్టిలైజర్ దుకాణంలో మంగళవారం రా త్రి 10.30గంటలకు దొంగలు చోరీకి పాల్పడ్డారు. దుకాణం వెనుక వైపు తలుపు పగులగొట్టి రూ.70వేలు ఎత్తుకెళ్లడంతోపాటు సీసీ కెమెరాలు, డీవీఆర్ ధ్వంసం చేశారు. ఉదయం గమనించిన యజమాని మహేష్గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌటాలలో చేతికి చిక్కి.. కౌటాల మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎడ్ల తిరుపతి ఇంటికి తాళం వేసి కరీంనగర్కు వెళ్లారు. రాత్రి 11గంటల ప్రాంతంలో తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లో ఇద్దరు దొంగలు ఉండడాన్ని గమనించి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఓ దొంగను పట్టుకోగా ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. అతడి బట్టలు సైతం చిరిగిపోయాయి. సెల్ఫోన్ అక్కడే పడిపోయింది. అయినా గోడ దూకిన దొంగ అక్కడి నుంచి పారిపోయాడు. పెట్రోలింగ్ పోలీసులకు ఎదురుపడి.. ఇదే సమయంలో కౌటాలలో ఎస్సై గుంపుల విజయ్ వాహనాల తనిఖీ, పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. రాత్రి 12గంటల ప్రాంతంలో మోటార్సైకిల్ వేగంగా రావడాన్ని గమనించి అనుమానంతో అనుసరించారు. దీంతో దొంగలు మోటార్సైకిల్ను ధనురేటి గ్రామ సమీపంలో వదిలేసి పారిపోయారు. మోటార్సైకిల్ నంబరు ఆధారంగా మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో రిజిస్ట్రేషన్ అయినట్టుగా పోలీసులు గుర్తించారు. మోటార్సైకిల్తోపాటు మొబైల్ఫోన్ను కౌటాల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, రెండు మండలాల్లో చోరీకి పాల్పడింది ఒకే ముఠా దొంగలని తెలుస్తోంది. డబ్బాలో చోరీకి పాల్పడడానికి సమీపంలోని మెకానిక్ దుకాణం నుంచి గునపాన్ని దొంగిలించి అదే గునపంతో డబ్బా, కౌటాలలో తలుపులను పగులగొట్టినట్లు సీసీ కెమెరాల్లో వీడియోలను బట్టి తెలుస్తోంది. వేర్వేరుగా నమోదైన కేసుల్లో విచారణను వేగవంతం చేశామని, దొంగలను త్వరలో పట్టుకుంటామని కౌటాల ఎస్సై గుంపుల విజయ్, చింతలమానెపల్లి ఎస్సై ఇస్లావత్ నరేష్ తెలిపారు. -
● జ్వరంతో బాలిక మృతి ● ముత్తంపేటలో విషాదం
ఏడేళ్లకే నూరేళ్లు..●కౌటాల: ఆ బాలికకు ఏడేళ్లకే నూరేళ్లు నిండాయి. విషజ్వరం ఆ చిన్నారిని బలి తీసుకుంది. అల్లరు ముద్దుగా చూసుకుంటున్న ఒక్కగానొక్క కుమార్తె మృతితో ఆ కుటుంబంలో తీరని విషాదం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కుమురంభీం జిల్లా కౌటాల మండలం ముత్తంపేటకు చెందిన రైపూర్ నాగేశ్వర్, జయ దంపతులకు కుమార్తె మన్విత (7), కుమారుడు ఉన్నాడు. నాగేశ్వర్ వ్యవసాయ కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మన్విత స్థానిక ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. మంగళవారం పాఠశాలకు వెళ్లిన బాలికకు జ్వరం రావడంతో ఉపాధ్యాయులు ఇంటికి పంపించారు. రాత్రి తల్లి స్థానిక ఆశ వర్కర్ వద్ద పారాసిటమల్ మాత్రలు అడిగి వేశారు. జ్వరం తగ్గకపోవడంతో బుధవారం కౌటాల పీహెచ్సీకి తీసుకెళ్లగా సిబ్బంది మందులు ఇచ్చి ఇంటికి పంపించారు. బుధవారం సాయంత్రం ఇంటి వద్ద బట్టల్లోనే మూత్రం పోసుకుని కిందపడిపోయింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది. -
చికిత్స పొందుతూ యువకుడు మృతి
నెన్నెల: ఈ నెల 10న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన మండలంలోని కోణంపేటకు చెందిన దుర్గం రాజేంద్రప్రసాద్ (26) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్ రెండేళ్ల క్రితం ప్రైవేట్ ఫైనాన్స్లో బొలెరో తీసుకున్నాడు. గిరాకీ లేకపోవడంతో ఈఎంఐలు కట్టలేకపోతున్నానని ఇంట్లో చెప్పుకుని బాధపడుతుండేవాడు. దీంతో మనస్తాపానికి గురై ఇంటివద్ద గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ముందుగా బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యంకోసం వరంగల్లోని ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని తండ్రి సతీశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై వివరించారు. -
తెలంగాణ వర్సిటీకి ప్రత్యేక గుర్తింపు
● వర్సిటీ చాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ● రెండో స్నాతకోత్సవంలో పట్టాల ప్రదానం ● 113 మందికి గోల్డ్మెడల్స్.. 157 మందికి డాక్టరేట్లు అందజేతతెయూ(డిచ్పల్లి): రాష్ట్రం పేరుతో ఏర్పడిన తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని వర్సిటీ చాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. తెయూ రెండో స్నాతకోత్సవాన్ని(కా న్వొకేషన్) బుధవారం డిచ్పల్లి క్యాంపస్లో అట్ట హాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ 2006లో ఆరు కోర్సులతో ప్రారంభమైన తెయూ.. నేడు ఏడు విభాగాలు, 24 ఉప విభా గాలుగా 31 కోర్సులతో కొనసాగుతోందన్నారు. తెయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ టీ యాదగిరిరావు మాట్లాడుతూ వర్సిటీలో ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. బంగారు పతకాలు.. డాక్టరేట్ పట్టాలు 2014 నుంచి 2023 వరకు 15 విభాగాల్లో 130 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపగా, దరఖాస్తు చేసుకున్న 113 మందికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యఅతిథి ప్రొఫెసర్ చంద్రశేఖర్ చేతుల మీదుగా స్నాతకోత్సవంలో బంగారు పతకాలు అందజేశారు. 2017 నుంచి 2025 జూన్ వరకు ఏడు విభాగాల్లో పరిశోధనలు పూర్తి చేసుకున్న 157 మంది పరిశోధకులకు పీహెచ్డీ(డాక్టరేట్) పట్టాలను అందజేశారు. -
షార్ట్సర్క్యూట్తో మంటలు
బెల్లంపల్లి: పట్టణంలోని బజారు ఏరియాలో బుధవారం రాత్రి విద్యుత్ షార్ట్సర్క్యూట్ తీవ్ర కలకలం రేపింది. నో నేమ్ రెడీమేడ్ షాపు ఎదు ట ఉన్న విద్యుత్ తీగలపై ఒక్కసారిగా మంట లు చెలరేగాయి. కాంటా చౌరస్తా వద్ద నుంచి పాత బస్టాండ్ వైపు వెళ్లే విద్యుత్ తీగలకు మంటలు వ్యాపించడంతో పాదచారులు, వాహనదారులు పరుగులు పెట్టారు. విద్యుత్ శాఖ సి బ్బందికి సమాచారం అందించడంతో సరఫరా నిలిపివేసి పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. రెండు తీగలు పరస్పరం తాకడంతో మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. ఈ ఘటన బజారు ఏరియాలో చర్చనీయాంశమైంది. -
వైద్యానికి కావొద్దు వాగు అడ్డంకి
కెరమెరి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కు మండలంలోని టెమ్లగూడ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. బుధవారం నడుములోతులో నీళ్లు ఉన్నప్పటికీ వైద్యసిబ్బంది వాగుదాటి అ వుతల ఉన్న సొమ్లగూడ, తుమ్మగూడ, టెమ్లగూడ గ్రామాల్లో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. సుమారు 43 మందికి వైద్య పరీక్షలు ని ర్వహించి మాత్రలు అందించారు. రక్తపూతలు సేకరించారు. వర్షాకాలంలో సంక్రమించే వ్యా ధులతో అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ మె స్రం సోము, హెచ్ఏలు శంకర్, వసంత్, ఏఎన్ఎంలు సంఘమిత్ర, సుమలత పాల్గొన్నారు. బెదిరింపులకు పాల్పడిన ఒకరి రిమాండ్ఆదిలాబాద్టౌన్: డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడిన విద్యానగర్కు చెందిన మణిశేఖర్పై కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్కు తరలించినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కు మార్ తెలిపారు. పట్టణంలోని బొక్కల్గూడకు చెందిన మహ్మద్ అబ్దుల్ వసీమ్ 2024 డిసెంబర్లో రాంలీలా మైదానంలో ఎగ్జిబిషన్ మేనేజర్గా వ్యవహరించాడు. మణిశేఖర్ వసీమ్ను బెదిరించి రూ.2లక్షలు ఇవ్వాలని, లేదంటే హైకోర్టుకు వెళ్లి ఎగ్జిబిషన్ బంద్ చేయిస్తానని బెదిరించాడు. దీంతో బాధితుడు రూ.20వేలు ఇచ్చాడు. మిగితా డబ్బులు తర్వాత ఇవ్వాలని, లేదంటే చంపుతానని హెచ్చరించాడు. దీంతో బాధితుడు మంగళవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి మణిశేఖర్ను రిమాండ్కు తరలించినట్లు వివరించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికజన్నారం: మండలంలోని కిష్టాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆకుల అనన్య బుధవారం మంచిర్యాలలో నిర్వహించిన జిల్లాస్థాయి వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు రాజన్న తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సేనో బీఫోర్ ఇట్స్ టూ లేట్ అనే కామిక్ వ్యాస రచన, కామిక్ డ్రాయింగ్ పోటీలో పాల్గొని ప్రతిభ కనబర్చినట్లు ఆయన పేర్కొన్నారు. గెలుపొందిన విద్యార్థినిని, గైడ్ టీచర్స్ దాముక కమలాకర్, మణెమ్మను డీఈవో ఎస్.యాదయ్య, ఉపాధ్యాయ బృందం అభినందించారు. -
ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని..
నేరడిగొండ: కుంటాల బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతు న్న ఓ విద్యార్థిని హైదరాబాద్లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మామడ మండలంలోని వాస్తాపూర్కు చెందిన ఆత్రం త్రివేణి (15) ఈనెల 11న శుక్రవారం వాంతులు చేసుకోవడంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది నిర్మల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం శనివారం హైదరాబాద్లోని నిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. సదరు విద్యార్థిని నెలక్రితం గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమానికి వెళ్లిన సమయంలో గాలిదుమారం వీచింది. దీంతో టెంటు కర్ర ఆమె తలపై పడడంతో గాయాలుకాగా స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించారు. అనంతరం పాఠశాల పునఃప్రారంభం తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. -
సింగరేణి ఇన్చార్జిగా కొప్పుల ఈశ్వర్
● టీబీజీకేఎస్ నేతలతో కేటీఆర్ భేటీశ్రీరాంపూర్: సింగరేణిలో టీబీజీకేఎస్ను మరింత బలోపేతం చేసే దిశగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా టీబీజీకేఎస్ నాయకులతో బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమై దిశానిర్ధేశం చేశారు. పార్టీ నుంచి సింగరేణికి ఇన్చార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సింగరేణిలో యూనియన్కు పూర్వవైభవం తీసుకు రావాలని సూచించారు. ఏ ప్రభుత్వం చేయని మేలును బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు చేసిందన్నారు. సింగరేణి, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక హామీలు ఇచ్చి గెలిచాక మోసం చేశారని విమర్శించారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని, వారి వైఫల్యాలను ఎత్తి చూపుతూ కార్మిక క్షేత్రాల్లో పోరాడాలని తెలిపారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణపై బీజేపీ, కాంగ్రెస్ ఒకటే వైఖరి అవలంబిస్తున్నాయని, ఆ పార్టీలు, ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను అడ్డుకోవాలని అన్నారు. పోరాటాలు చేయడంలో ఏ సమస్య వచ్చినా కార్యకర్తలను ఆదుకోవడానికి పార్టీ లీగల్ సెల్ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. త్వరలో సింగరేణిలో పర్యటించి విస్తృతంగా సమావేశాలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పినట్లు నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ, ప్రధాన కార్యదర్శులు మాదాసు రామ్మూర్తి, కేతిరెడ్డి సురేందర్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య, సీనియర్ ఉపాధ్యక్షుడు పారుపల్లి రవి, అధికార ప్రతినిధి వడ్డేపల్లి శంకర్, ఐలి శ్రీనివాస్, శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
వీడిన హిజ్రా హత్యకేసు మిస్టరీ
ఉట్నూర్రూరల్: ఉట్నూర్ పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని ఇంద్రవెల్లిలో ఇటీవల జరిగిన హిజ్రా హత్య కేసు మిస్టరీ వీడింది. బుధవారం రాత్రి ఉట్నూర్ పోలీసు సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ కాజల్సింగ్ వివరాలు వెల్లడించారు. జాదవ్ అర్జున్, ఆయు (అరుణ) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోమని ఆయు వెంటపడుతుండడంతో కాలయాపన చేస్తూ వస్తున్నాడు. ఈనెల 8న పథకం ప్రకారం ఆయును అడవిలోకి తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. మత్తులో ఉన్న ఆయు తలపై కొట్టి చెట్టుకు ఉరివేసి ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించాడు. మృతిపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేయడంతో ఉట్నూర్ సీఐ మడావి ప్రసాద్ ఆధ్వర్యంలో ఇచ్చోడకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ అర్జున్ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నామని ఏఎస్పీ వివరించారు. సమావేశంలో సీఐ మడావి ప్రసాద్, ఎస్సైలు సాయన్న, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు. -
‘రాయిసెంటర్’ పనితీరు అభినందనీయం
● ఆదివాసీ సంస్కృతిని కాపాడుకోవాలి ● ఎస్పీ అఖిల్ మహాజన్ ఇంద్రవెల్లి: ఆదివాసీ గ్రామాల్లోని రాయిసెంటర్ వ్యవస్థ పనితీరు అభినందనీయమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలోని గిన్నెర గ్రామంలో రాయిసెంటర్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సమావేశానికి ఏఎస్పీ కాజల్సింగ్తో కలిసి ఆయన హాజరయ్యారు. ఆదివాసీలతో మాట్లాడి వారి జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. రాయిసెంటర్ వ్యవస్థలో భాగంగా గ్రామాల్లోనే ఆదివాసీ పెద్దలు చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడం అభినందనీయమన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూనే పిల్లల చదువుపై దృష్టి సారించాలన్నారు. గంజాయి సాగుకు దూరంగా ఉండాలన్నారు. అలాగే మద్యం తాగి వాహనాలు నడుపొద్దన్నారు. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్యులను సంప్రదించాలే తప్ప బాబాలను మంత్రగాళ్లను ఆశ్రయించవద్దన్నారు. బాల్య వివాహ వ్యవస్థ రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ముందుగా రాయిసెంటర్ సార్మేడీలు, ఆయా గ్రామ పటేళ్ల ఆధ్వర్యంలో ఎస్పీని సన్మానించారు. కార్యక్రమంలో ఉట్నూర్ సీఐ మడావి ప్రసాద్, ఎస్సై సాయన్న, రాయిసెంటర్ జిల్లా మేడి మెస్రం దుర్గు, ఆదివాసీ పెద్దలు సిడాం భీంరావ్, ఆర్క ఖమ్ము తదితరులు పాల్గొన్నారు. -
వానాకాలం ఆయకట్టు ఖరారు
● యాక్షన్ ప్లాన్ ప్రకటించిన సాగునీటి శాఖ ● ఉమ్మడి జిల్లాలో ఇంకా పూర్తిగా నిండని ప్రాజెక్టులు ● వానలు లేకపోతే ఆయకట్టు ప్రశ్నార్థ్ధకమే సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి జిల్లాలోని ఆయా ప్రాజెక్టుల ఆయకట్టు కింద వానాకాలంలో సాగయ్యే వివరాలను సాగునీటి శాఖ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర స్థాయి ఇంజినీర్ల కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈసారి పలు చోట్ల వర్షాలు తక్కువగా కురవడంతో ప్రాజెక్టుల్లోకి ఇంకా సరిపడా నీరు రాలేదు. దీంతో ప్రాజెక్టుల్లోకి నీరు వచ్చాకే సాగునీటి శాఖ అధికారులు ఆయకట్టు ప్రతిపాదించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని సదర్మాట్, నిర్మల్ పరిధిలోని గడ్డెన్నవాగు, ఎస్సారెస్పీ (సరస్వతి కాలువ), మంచిర్యాల జిల్లాలోని గొల్లవాగు, ర్యాలీ వాగు, నీల్వాయి ప్రాజెక్టులకు, ఆసిఫాబాద్ జిల్లాలోని ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్టులను మరోసారి సమీక్షించి ఆయకట్టును ప్రకటించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఒక్క కుమురంభీం ప్రాజెక్టు నిల్వ ఆశాజనంగా ఉంది. మరోవైపు వర్షాలు కురిస్తేనే ఈ ప్రాజెక్టుల కింద రైతాంగానికి ఊరట కలగనుంది. -
రోడ్డు కబ్జా చేసిన ఇద్దరి రిమాండ్
ఆదిలాబాద్టౌన్: నకిలీ పత్రాలు సృష్టించి రోడ్డును కబ్జా చేసిన ఇద్దరిని రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. బుధవారం వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్కు చెందిన రంగినేని శ్రీనివాస్ శాంతినగర్లోని మున్సిపల్ రోడ్డుకు తన బావ అమూల్ పేరిట డోర్ నంబర్ తీసుకొని ఇంటి పన్నులు చెల్లించాడు. ఆ తర్వాత అమూల్ తన భార్య శ్వేత పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించాడు. దీంతో మున్సిపల్ వారు ఆ స్థలాన్ని రంగినేని శ్వేత పేరిట మ్యూటేషన్ చేశారు. ఆదిలాబాద్అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో రెగ్యులరైజేషన్ కోసం రూ.22,900 చలాన్ చెల్లించినట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు. రెవెన్యూ అధికారులు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేసినట్లు నకిలీ పత్రాలు తయారు చేశాడు. ఆ తర్వాత ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ నుంచి పర్మిషన్ తీసుకోగా అధికారులు అనుమతించారు. ఈ స్థలా న్ని విక్రయించేందుకు సైతం సిద్ధమైనట్లు పేర్కొన్నారు. కాగా ఈ రోడ్డు పక్కన ఉన్న జిన్నింగ్ ఫ్యాక్టరీ గేటును కబ్జా చేసి స్థలాన్ని ఆక్రమించడంతో కౌటివార్ సుశీల్ వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యా దు చేయడంతో కేసు నమోదైంది. పత్రాలను పరి శీలించగా నకిలీవని తేలింది. దీంతో రంగినేని శ్రీని వాస్తో పాటు అతని తండ్రి సూర్యప్రకాశ్రావు, చెల్లెలు శ్వేత, బావ అమూల్పై కేసు నమోదు చేయగా శ్రీనివాస్, అమూల్ను రిమాండ్కు తరలించిన ట్లు పేర్కొన్నారు. సమావేశంలో వన్టౌన్, రూరల్ సీఐలు సునీల్ కుమార్, ఫణిందర్ పాల్గొన్నారు. ఐదుగురి రిమాండ్.. గుడిహత్నూర్కు చెందిన జాదవ్ రమేశ్ కేఆర్కే కాలనీలోని సర్వే నం.68లో ప్లాట్ కొనుగోలు చేయగా అట్టి స్థలాన్ని ఆదిలాబాద్ పట్టణానికి చెందిన 8 మంది ఆక్రమించేందుకు యత్నించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఆ ప్లాట్ను తక్కువ ధరకు విక్రయించాలని, బెదిరింపులకు పాల్పడినట్లు బాధితుడు ఫిర్యాదు చేయడంతో మహ్మద్ ముజాహిద్ అలియాస్ పత్తి ముజ్జు, ఇస్మాయిల్ అలియాస్ తౌఫిక్, షేక్ ఆబిద్, షేక్ ఆదిల్, సర్ల బుచ్చన్నను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని, ఆదినాథ్, అతీఖ్, సయ్యద్ అహ్మద్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. -
ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య
వాంకిడి: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఎనోలి గ్రామానికి చెందిన సోయం మారు (35) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిస కావడంతో నిత్యం భార్యతో గొడవపడేవాడు. మంగళవారం అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చి కుమారుడు గణేశ్ను కొట్టాడు. దీంతో భార్య నీలాబాయి నిలదీయడంతో రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. బుధవారం గ్రామ శివారులోని ఓ చేనులో చెట్టుకు ఉరేసుకున్నాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
కాలువల్లో వ్యర్థాలేయొద్దు
నెల్లూరు(బారకాసు): కాలువల్లో మురుగు ప్రవాహానికి అడ్డంకిగా మారే ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని కమిషనర్ నందన్ ఆదేశించారు. 42వ డివిజన్లోని మన్సూర్నగర్, పరమేశ్వరినగర్లో మంగళవారం ఆయన పర్యటించారు. రామిరెడ్డి కాలువలో వ్యర్థాలేయకుండా సంబంధిత సచివాలయ శానిటేషన్ సెక్రటరీలు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అనంతరం 46వ డివిజన్లోని బృందావనం, శ్రీనివాసాగ్రహారం, రామచంద్రారెడ్డి ఆస్పత్రి రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించి.. కాలువలపై అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను పరిశీలించారు. 42వ డివిజన్లో నగరపాలక సంస్థకు చెందిన వెహికల్ షెడ్డును తనిఖీ చేశారు. Æ శిక్షణ ద్వారా వ్యాపారంలో మెళకువలను నేర్చుకోవాలని కమిషనర్ నందన్ సూచించారు. యాంట్రప్రెనార్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా స్మార్ట్ స్ట్రీట్ వెండార్లకు మెప్మా ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణను నగరపాలక సంస్థ కార్యాలయంలోని అబ్దుల్ కలామ్ సమావేశం మందిరంలో ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. నిరుపేద మహిళలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా నిర్దేశించిన శిక్షణను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణలో భాగంగా చైన్నెలో ఫీల్డ్ వెరిఫికేషన్కు తీసుకెళ్లి స్ట్రీట్ వెండింగ్ విధానాలపై అవగాహన కల్పించనున్నామని వెల్లడించారు. ట్రెయినర్లుగా రాజ్యలక్ష్మి, మధు వ్యవహరించారు. Æ ట్యాక్స్ రివిజన్ సర్వేను అన్ని డివిజన్లలో పూర్తిస్థాయిలో ముగించి సమగ్ర నివేదికను అందజేయాలని కమిషనర్ నందన్ సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో రెవెన్యూ శాఖతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రెవెన్యూ వసూళ్లను 20 శాతం అదనంగా పెంచాలని సూచించారు. డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, రెవెన్యూ అధికారులు సమద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. Æ కార్పొరేషన్ కార్యాలయంలోని పలు విభాగాలను కమిషనర్ నందన్ పరిశీలించారు. ప్రజలకు సంబంధించిన సేవలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని సూచించారు. -
బ్రాహ్మణ మహాసంఘ నూతన కార్యవర్గ ఏర్పాటు
నెల్లూరు(బృందావనం): అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఓ కల్యాణ మండపంలో అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ, ఆంధ్రప్రదేశ్ విభాగ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. మహాసంఘ జిల్లా గౌరవాధ్యక్షుడిగా శేషగిరిరావు, జిల్లా అధ్యక్షుడిగా రేవూరు వెంకటకళాధర్రావు, కార్యదర్శిగా మామిడిపల్లి చంద్రశేఖర్, కోశాధికారిగా భట్టారం రాఘవేంద్ర, జిల్లా ఉపాధ్యక్షుడిగా గావి మాధవాచార్యులు, అర్చక, పురోహిత విభాగ గౌరవ సలహాదారులుగా నాగరాజుతో కార్యవర్గం ఏర్పాటైంది. కేంద్ర కమిటీ అనుమతితో ఏర్పాటైన కార్యవర్గానికి నియామక పత్రాలను అందజేశారు. -
పక్కాగా రక్త పరీక్షలు
నెల్లూరు(అర్బన్): సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు గానూ రక్త పరీక్షలను ల్యాబ్ టెక్నీషియన్లు పక్కాగా నిర్వహించాలని జిల్లా మలేరియా నివారణాధికారి హుస్సేనమ్మ పేర్కొన్నారు. నగరంలోని పీసీ నాయుడి వీధి, జాకీర్హుస్సేన్నగర్లో గల పట్టణ ఆరోగ్య కేంద్రాలను మంగళవారం తనిఖీ చేశారు. ల్యాబ్ రిజిస్టర్లను పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడారు. జ్వరాలు నమోదవుతున్న ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తలు తక్షణమే స్పందించి రక్త నమూనాలను సేకరించి ల్యాబ్ టెక్నీషియన్లకు సకాలంలో చేర్చాలని కోరారు. నూతనంగా రూపొందించిన రిజిస్టర్లను నిర్వహించాలని సూచించారు. ఆరోగ్య సిబ్బంది కరుణమ్మ, గురవయ్య, సంజీవకుమార్, ఆరోగ్య పర్యవేక్షకురాలు గిరిజావతి తదితరులు పాల్గొన్నారు. -
గుండె వ్యాధి నివారణ మాత్రల అందజేత
నెల్లూరు(బృందావనం): పొదలకూరు రోడ్డులోని జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో వాకర్స్కు గుండె వ్యాధి నివారణ మాత్రలను జెడ్పీ వాకర్స్ సంఘం, శుభమస్తు షాపింగ్మాల్ సౌజన్యంతో మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ – 203 ఎలక్ట్ గవర్నర్ నలుబోలు బలరామయ్యనాయుడు, సంగీత విద్వాంసురాలు వేదాంతం హర్షవర్ధినిని సత్కరించారు. జెడ్పీ వాకర్స్ సంఘ గౌరవాధ్యక్షుడు మెట్టు సుధాకర్రెడ్డి, కార్యదర్శి ఖాజామస్తాన్, కోశాధికారి వెంకటరమణయ్య, చెంచయ్య, రాజగోపాల్, ప్రసాద్, ఎస్తేరు రాణి, మేరీ బ్లెస్సింగ్టన్, మెట్టు సృజన, ప్రసాద్, వీరగంధం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
స్కానింగ్ కేంద్రాల్లో తనిఖీలు
నెల్లూరు(అర్బన్): నగరంలోని పలు స్కానింగ్ కేంద్రాలను వైద్య, ఆరోగ్యశాఖాధికారులు ఆకస్మికంగా మంగళవారం తనిఖీ చేశారు. నగరంలోని వెంకటరమణ ఆస్పత్రి, విజయ డయాగ్నొస్టిక్స్, సింహపురి, శ్రీనివాస స్కాన్ సెంటర్లలో రికార్డులను జిల్లా లెప్రసీ, టీబీ నివారణాధికారి ఖాదర్వలీ, వెంకటాచలం సీహెచ్సీ సూపరింటెండెంట్ వేదవల్లి వాణిశ్రీ, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నరసింహరావు పరిశీలించారు. పీసీ, పీఎన్డీటీ యాక్ట్ ప్రకారం వ్యవహరిస్తున్నారాననే అంశాన్ని ఆరాతీశారు. లింగ నిర్ధారణ చేస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. స్కానింగ్ చేసిన వారి వివరాలను ఫారమ్ – 4లో నమోదు చేసి వైద్యశాఖకు పంపాలని కోరారు. టీబీ నివారణ సిబ్బంది విజయకుమార్, హరీష్, తులసీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదిశంకర ధ్యాన మందిరానికి బౌద్ధ గురువులు
నెల్లూరు(బృందావనం): పొగతోటలోని చక్రాల వారి ట్రస్ట్ ఆదిశంకర ధ్యాన మందిరానికి బౌద్ధగురువులు కోవానే పాలితథెరో (శ్రీలంక), షిమాడా యూషి (జపాన్) బోధిహీన్ మంగళవారం విచ్చేశారు. ఆదిశంకర భగవత్పాదులును దర్శించుకున్నారు. అనంతరం వీరిని సత్కరించారు. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ చక్రాల ఆనంద్కుమార్, ఇందుకూరుపేట లలితా భరద్వాజ దత్తాశ్రమ పీఠాధిపతి రామాయణం మహేష్స్వామి, మందిర మేనేజర్ స్వామి సమయానందనాథ, రామాయణం మణిశంకర్, తంగిరాల వెంకటశ్రీకాంత్శర్మ తదితరులు పాల్గొన్నారు. అన్నదానం పొగతోటలోని చక్రాల వారి ట్రస్ట్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పాత మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో గల పట్టణ నిరాశ్రయులు, వృద్ధుల కేంద్రం, పంచవటి ఆశ్రమంలో అన్నదానాన్ని నిర్వహించారు. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ చక్రాల ఆనంద్కుమార్, పంచవటి ఆశ్రమ పీఠాధిపతి ఆత్మానందగిరి, నిరాశ్రయుల కేంద్ర నిర్వాహకుడు దాసరి సుందరం, చక్రాల వారి ట్రస్ట్ నిర్వాహకుడు చక్రాల వెంకట లక్ష్మీనరసింహం, మైపాడు రాజాశర్మ, అన్నవరం సత్యనారాయణమూర్తి, పామర్తి వెంకటలీలామోహన్, ములుమూడి ఉదయ్కుమార్, శ్రీహరిప్రసాద్రావు, మల్లవరపు లక్ష్మీనరసింహరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీటీఎఫ్ సభ్యత్వ నమోదు
నెల్లూరు (టౌన్): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఏపీటీఎఫ్ ముందుంటోందని జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి పేర్కొన్నారు. కార్పొరేషన్ పరిధిలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఏపీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. 12వ పీఆర్సీ కమిటీని నేటికీ నియమించలేదని ఆరోపించారు. మున్సిపల్ పాఠశాలల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేసి గుణాత్మక విద్యనందించేలా చూడాలని కోరారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ మురళీకృష్ణ, పట్టణ శాఖ బాధ్యులు శ్రీనివాసులు, వెంగబాబు, మహేష్, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెద్దాస్పత్రిలో మౌలిక వసతుల కల్పనకు కృషి
నెల్లూరు (అర్బన్): నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి మెరుగైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని సూపరింటెండెంట్ మాధవి చెప్పారు. మదర్ అండ్ చైల్డ్ విభాగంలోని పలు వార్డులను హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులతో కలిసి మంగళవారం ఆమె తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలను ఆరాతీశారు. ఈ సందర్భంగా హెచ్డీఎస్ కో ఆర్డినేటర్ మడపర్తి శ్రీనివాసులు మాట్లాడారు. గదుల్లో దెబ్బతిన్న ఫ్లోర్ టైల్స్ను సరిచేయించాలని, మరుగుదొడ్లలో శుభ్రతతో పాటు బకెట్లు, మగ్గులుండేలా, నీటి సమస్య లేకుండా చూడాలని కోరారు. రాత్రి పూటా ల్యాబ్ పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. లిఫ్ట్లు సక్రమంగా పని చేయకపోవడంతో వృద్ధులు నడవలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. స్కానింగ్ పరీక్ష కేంద్రం వద్ద ఆలస్యాన్ని నివారించాలని కోరారు. అనంతరం మాధవి మాట్లాడారు. డాక్టర్లు, సిబ్బంది ఓపీల్లో సకాలంలో రోగులకు సేవలందించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. సక్రమంగా విధులు నిర్వర్తించని వారిపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. గైనకాలజీ హెచ్ఓడీ గీతాలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ మహేశ్వరరెడ్డి, అడ్మినిస్ట్రేషన్ అధికారి డాక్టర్ కళారాణి, హెచ్డీఎస్ కమిటీ నేతలు శ్రీనివాసులు, మొగరాల సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
శాసీ్త్రయ సమాజానికి కృషి
నెల్లూరు(అర్బన్): మూఢ నమ్మకాల్లేని శాసీ్త్రయ సమాజం.. సైన్స్ ఫలాలు సామాన్యులందరికీ దక్కాలనే లక్ష్యంతో జన విజ్ఞాన వేదిక కృషి చేస్తోందని వేదిక రాష్ట్ర నూతన అధ్యక్షుడు శ్రీనివాసులు పేర్కొన్నారు. నగరంలోని బాలకోటేశ్వరరావు ఆస్పత్రిలో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ అభినందన సమావేశంలో జేవీవీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గౌస్బాషా, డాక్టర్ బాలకోటేశ్వరరావు మాట్లాడారు. ఉపాధ్యాయుడిగా ఉంటూ.. తన ఖాళీ సమాయాన్ని వెచ్చిస్తూ జేవీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైన్స్ ఉద్యమాల్లో శ్రీనివాసులు చురుకై న పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. అనంతరం ఆయనతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జిల్లా నుంచి ఎన్నికై న చక్రపాణి, రాష్ట్ర సలహా మండలి సభ్యుడు శేషారెడ్డి, కార్యదర్శి గీతాంజలిని సన్మానించారు. -
భూసారం ఆధారంగా ఎరువులు వాడాలి
● కలెక్టర్ రాజర్షిషానార్నూర్: రైతులు భూసార పరీక్షలకు అనుగుణంగా ఎరువులు వాడాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులకు మట్టి నమూనా పరీక్ష ఫలితాల పత్రాలు పంపిణీ చేశారు. మోతాదు మేరకే ఎరువులు వాడాలని సూచించారు. లేకుంటే నేల భూసారం కోల్పోయి పంట దిగుబడిపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. అనంతరం తాడిహత్నూర్ శివారులో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ను ప్రారంభించారు. నార్నూర్ను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు ఉద్యానశాఖ కృషి చేస్తుందన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో స్వశోధన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని సందర్శించారు. నిర్వాహకులను అభినందించారు. వన మహోత్సవంలో భాగంగా స్థానిక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలన్నారు. అనంతరం మోడల్ స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించారు. ఆయన వెంట డీఈవో శ్రీనివాస్, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్స్వామి, తహసీల్దార్ జాడి రాజలింగు, ఎంపీడీవో గంగాసింగ్, సీడీపీవో శారద, ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాస్, ఏంఈవో అనిత, ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపాల్ ఆంజనేయులు, ఏవో అకాశ్తో పాటు వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏజెన్సీలో విద్య, వైద్యం మెరుగుపరచాలి ఏజెన్సీ ప్రాంతంలో విద్య, వైద్యం అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు పెందూర్ దాదిరావు కోరారు. మండల పర్యటనకు విచ్చేసిన కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్ రావు, మండల అధ్యక్షుడు శ్రీరామ్ తదితరులున్నారు. -
● రసాయనాలతో కృత్రిమంగా తయారీ ● తాగే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ● నిషేధించాలంటున్న జనం ● నామమాత్ర తనిఖీలకే ‘ఎకై ్సజ్’ పరిమితం
రసాయనాలతో తయారు చేసిన కల్లును స్వాధీన పరుచుకున్న ఎకై ్సజ్ అధికారులుస్వల్పంగా సేకరించిన కల్లులో భారీగా నీటితో పాటు రసాయనాలు అఽ దిక మోతాదులో కలుపుతున్నారు. ముఖ్యంగా క్లోర ల్ హైడ్రేట్, ఆల్పజ్రోలం, డైజోఫామ్, ఓపీఎం ఇతర రసాయనాలను కలిపి కృత్రిమ కల్లు తయారు చేస్తున్నారు. వీటిని తాగిన వారు మత్తులో తూగుతున్నారు. పులుపు కోసం లెమన్ సాల్ట్, తీపి కోసం షాక్రిన్, పులియబెట్టడానికి డైయిస్ట్ పౌడర్, తెలుపు కోసం టైటానియం డయాక్సైజ్, నురుగు కోసం కుంకుడుకాయ ఇతర రసాయనాలు కలుపుతున్నారు. ఇది అచ్చం ఈత, తాటికల్లు లాగానే కనిపిస్తోంది. కానీ ఇందులో ఒక శాతం కూడా వాటి ఆనవాళ్లు ఉండడం లేదని ప లువురు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్టౌన్: జిల్లాలో కొంత మంది కల్తీ కల్లు తయారు చేసి అమాయక ప్రజల జీవి తాలతో చెలగాటం ఆడుతున్నారు. రసాయనాలు, ఇతర పదార్థాలు కలిపి అచ్చం ఈతకల్లులా తయారు చేస్తున్నారు. వీటిని తాగిన జనం అనారోగ్యం బారి న పడుతున్నారు. పట్టించుకోవాల్సిన ఎకై ్సజ్ శాఖ అధికారులు ‘మామూలు’గా వ్యవహరించడంతో ఈ కల్తీ దందా యథేచ్ఛగా సాగుతుందనే ప్రచారం వినిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్లోని కూకట్పల్లిలో కల్తీ కల్లు సేవించి తొమ్మిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇంత జరుగుతున్నా ఆ శాఖ నామమాత్రపు తనిఖీలకే పరిమితమైందనే విమర్శలున్నాయి. కొరడా ఝళిపించకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. జిల్లాలో ఇదీ పరిస్థితి.. ఆదిలాబాద్ స్టేషన్ పరిధిలో వందల్లో ఈత చెట్లు ఉండగా.. ప్రతీరోజు 10వేల లీటర్లకు పైగా కల్తీ కల్లు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇక ఉట్నూర్ స్టేషన్ పరిధిలో 5వేల లీటర్ల వరకు, ఇచ్చోడ స్టేషన్ పరిధిలో 8వేల లీటర్ల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. అయితే చెట్లు తక్కువగా ఉన్నప్పటికీ తయారయ్యే కల్లు అధికం. మొత్తంగా 5 శాతం కల్లు ఉంటే 95 శాతం రసాయనాలతోనే తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు.. కల్తీ కల్లు ప్రాణాలు తీస్తుందని తెలిసినా.. చాలా మంది దానికి అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. తక్కువ ధరకే దొరుకుతుండటంతో తాగి అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు. చెట్ల నుంచి వచ్చే కల్లులో రసాయనాలు, నీళ్లు, ఇతర పదార్థాలు కలిపి భారీ మొత్తంలో తయారు చేసి కాంపౌండ్లలో విక్రయిస్తున్నారు. వీటిని తాగిన వారి శరీర అవయవాలు పనిచేయకుండాపోయి ప్రాణాంతకంగా మారుతోంది. క్లోరల్ హైడ్రేట్, డైజోఫామ్ వంటివి అధిక మోతాదులో కలపడంతో నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. శ్వాస తగ్గిపోవడం, బీపీ తగ్గడం, కోమాలోకి వెళ్లడం, మరణం సంభవిస్తుంది. కాలేయం, కిడ్నీలపైనా వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తయారీ ఇలా.. తనిఖీలు చేపడుతున్నాం.. కల్తీ కల్లు తయారు చేయకుండా తనిఖీలు చేపడుతున్నాం. అనుమతి లేని షాపులపై కేసులు నమోదు చేస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నాం. – విజేందర్, ఎకై ్సజ్ సీఐ, ఆదిలాబాద్ నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం కల్తీ కల్లు తాగే వారి నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. క్లోరోహైడ్రేట్, ఆల్ఫజోలమ్, డైజోఫామ్ తదితర రసాయనాలతో తయారు చేసిన కల్లు తీవ్రమైన మత్తు, బద్దకం, వివిధ అనారోగ్యానికి దారి తీస్తుంది. ఫిట్స్, మూత్రపిండాలు చెడిపోవడం, గుండె, నరాల సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. – ఆడే విఠల్, రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ -
నవోదయలో ఆటలపోటీలు
● 23, 24 తేదీల్లో రాష్ట్రస్థాయి క్రీడలు ● రాష్ట్రంలోని 9 జిల్లాల నుంచి క్రీడాకారులు రాక కాగజ్నగర్టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థులకు చదువుతో ఆటల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం పీఈటీలు విద్యార్థులకు క్రీడలపై ప్రత్యేక శిక్షణ ఇస్తుండడంతో నేషనల్ స్థాయి క్రీడల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలోని నవోదయ విద్యాలయాల క్లస్టర్స్థాయి పోటీలు ఉమ్మడి ఆదిలాబాద్ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ నవోదయ విద్యాలయంలో జరగనున్నాయి. జరుగనున్న ఈవెంట్స్ అండర్ 14, 17, 19 విభాగంలో హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్ పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రంలోని 9 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నారు. ఒక్కో క్రీడలో 6 టీంలుగా 18 జట్లు క్రీడల్లో పాల్గొనున్నాయి. గెలుపొందిన క్రీడాకారులు ఈ నెల 29, 31 తేదీల్లో కేరళలో జరిగే రీజినల్ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఇందులో తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రపదేశ్, కేరళ జట్లు పాల్గొననున్నాయి. చదువుతోపాటు క్రీడల్లో ప్రోత్సాహం విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సాహం అందిస్తున్నాం. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పీఈటీలు క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. మూడు నెలల కిత్రం కరుణాకర్, హరీష్నాయక్, నిశ్విత్ రెడ్డి, ప్రిన్స్ యాదవ్ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. – రేపాల కృష్ణ, ప్రిన్సిపాల్, జవహర్ నవోదయ విద్యాలయం, కాగజ్నగర్ -
సర్దుబాటు గందరగోళం
● ఇష్టారీతిన టీచర్ల కేటాయింపు ● జిల్లాలో 142 మందికి సర్దుబాటు ● ఎంఈవోలు, ఉద్యోగుల తీరుపై విమర్శలు ● మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలు ఆదిలాబాద్టౌన్: ఉపాధ్యాయుల సర్దుబాటు గందరగోళంగా మారింది. సర్కారు బడుల్లో టీచర్ల కొరత అధిగమించేందుకు ఏటా విద్యాశాఖ ఏటా ఈ ప్రక్రియ చేపడుతోంది. గతంలో మాదిరిగా ఈ సారి కూడా తప్పిదాలు పునరావృతం అయినట్లు ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. కొంత మంది ఉపాధ్యాయులు, విద్యాశాఖ ఉద్యోగుల తీరుతో టీచర్లతో పాటు విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని అంటున్నారు. జూనియర్లను సర్దుబాటు చేయాల్సి ఉండగా, సీనియర్లను ఆయా పాఠశాలలకు కేటాయించడం, మండల పరిధిలో కాకుండా ఇతర మండలాలకు కేటాయించడం, ఉర్దూ మీడియం పాఠశాలలకు తెలుగు మీడియం టీచర్లను ఏర్పాటు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయా సంఘాల నాయకులు పలువురు విద్యాశాఖ అధికారులు, ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు. పొరపాట్లు సవరించాలని, లేకుంటే ఆందోళన చేపడతామని పేర్కొన్నారు. జిల్లాలో.. జిల్లాలో డీఈవో పరిధిలో 500 ప్రాథమిక, 119 ప్రా థమికోన్నత, 120 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 65వేల మంది విద్యార్థులు విద్య ను అభ్యసిస్తున్నారు. మొత్తం 3,067 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా, 2,654 మంది పని చేస్తున్నారు. 413 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల్లో జిల్లాలోని ఆయా పాఠశాలల్లో అవసరానికి మించి ఉపాధ్యాయులు ఉన్న స్కూళ్ల నుంచి అవసరమున్న చోటుకు సర్దుబాటు ప్రక్రియ చేపట్టారు. కొంతమంది మండల విద్యాధికారులు నిబంధనలు తుంగలో తొక్కుతూ ఇష్టారీతిన వ్యవహరించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వారితో మచ్చిక ఉన్నవారికి దగ్గరలో గానీ, అదే పాఠశాలలో కొనసాగించడం, తదితరవి చేసినట్లు పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. 142 మంది సర్దుబాటు.. సర్దుబాటు ప్రక్రియలో భాగంగా జిల్లాలో 142 మంది ఉపాధ్యాయులకు సర్దుబాటు చేశారు. ఇందుకు సంబంధించి డీఈవో ఉత్తర్వులుజారీ చేశారు. వీ రి లో 96 మంది ఎస్జీటీలు, 46 మంది స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు. ఈ ప్రక్రియతో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకు ప్రయోజనం చేకూరనుంది. తప్పిదాలు ఇవే.. ● జెడ్పీఎస్ఎస్ లాండసాంగ్విలో ఉపాధ్యాయుడు ఉద్యోగ విరమణ పొందకముందే ఆ పాఠశాలకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల నుంచి అక్కడికి కేటాయించారు. ప్రస్తుతం ఆ పాఠశాలలో ఇద్దరు సైన్స్ ఉపాధ్యాయులు పనిచేయాల్సిన పరిస్థితి. బోథ్లోని ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడు అవసరం ఉండగా అక్కడ పోస్టు కేటాయించలేదు. ● మావల మండలంలోని భట్టిసావర్గాం పాఠశాలలో జూనియర్ ఉపాధ్యాయుడిని అక్కడే కొనసాగించి సీనియర్ను సర్దుబాటు చేశారు. ఆయన వైకల్యం ఉన్నప్పటికీ అక్కడి నుంచి వేరే పాఠశాలకు కేటాయించారు. ● ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లాండసాంగ్వి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయుడిని జైనథ్ మండలంలోని ఆకుర్లకు కేటాయించగా, జూనియర్ను ఆదిలాబాద్లోని రాంపూర్కు కేటాయించారు. ● ఏజెన్సీ ప్రాంతానికి చెందిన 15 మంది ఉపాధ్యాయులను మైదాన ప్రాంతానికి సర్దుబాటు చేశారు. ● ఆదిలాబాద్ రూరల్ మండలంలోని భీంసరిలో పనిచేస్తున్న వైకల్యం గల టీచర్ను జైనథ్ మండలానికి సర్దుబాటు చేశారు. ప్రత్యేక కేటగిరీని కూడా పరిశీలించలేదు. ● బరంపూర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడిని భీంపూర్ మండలంలోని రాజులవాడికి కేటాయించారు. ఇటీవల ఆ ఉపాధ్యాయుడు తన కూతురును అదే పాఠశాలలో చేర్పించారు. ● భీంపూర్ మండలంలోని వడూర్ యూపీఎస్లో పనిచేస్తున్న ఎస్జీటీని మరో పాఠశాలకు సర్దుబాటు చేయాల్సి ఉండగా, స్కూల్ అసిస్టెంట్ సోషల్ బోధించేందుకు అదే పాఠశాలలో సర్దుబాటు చేశారు. ● బేలతో పాటు పలు ఉర్దూ మీడియం పాఠశాలల్లో తెలుగు మీడియం బోధించే ఎస్జీటీలతో సర్దుబాటు చేశారు. ఆ విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం చేకూరే పరిస్థితి లేదు. ● సిరికొండ, గాదిగూడ మండలాల్లో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా, ఈ రెండు మండలాలకు ఒక్క ఉపాధ్యాయుడిని కూడా సర్దుబాటు చేయకపోవడం గమనార్హం. అవసరం ఉన్న పాఠశాలలకు కేటాయించాం జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న పాఠశాలలకు అవసరానికి మించి ఉన్న పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను కేటాయించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపట్టాం. ఏవైనా తప్పిదాలు ఉంటే సవరిస్తాం. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి చర్యలు చేపడతాం. – శ్రీనివాస్రెడ్డి, డీఈవో -
● 8 మందికి గాయాలు
బొలెరోను ఢీకొట్టిన కారు●రెబ్బెన: మండలంలోని కాగజ్నగర్ ఎక్స్రోడ్ సమీపంలో సోమవారం రాత్రి జాతీయ రహదారిపై బొలెరోను వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టడంతో ఇరు వాహనాల్లో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. సిర్పూర్ (టి) రైల్వేస్టేషన్లో పనిచేస్తున్న సాగర్ సోమవారం విధి నిర్వహణలో భాగంగా పెద్దపల్లికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో భార్య అరుణ, కుమారులు విశ్వక్రాజ్, విహాన్ రాజ్లతో కలిసి బొలెరో వాహనంలో బయలుదేరాడు. రెబ్బెన మండల పరిధిలోని కాగజ్నగర్ ఎక్స్రోడ్ సమీపంలో రెడిమిక్స్ ప్లాంట్ వద్దకు చేరుకోగా రెబ్బెన వైపు నుంచి ఆసిఫాబాద్ వైపు వెళ్తున్న షిఫ్ట్కారు అతివేగంగా వచ్చి బొలెరోను ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న సాగర్తో పాటు అతని కుటుంబ సభ్యులు, డ్రైవర్ సంతోష్కు, షిప్ట్ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు సాగర్తో పాటు అతని కుటుంబ సభ్యులను రెబ్బెన పీహెచ్సీ తరలించి ప్రథమ చికిత్స అనంతరం మంచిర్యాలకు తరలించారు. సాగర్ సోదరుడు రజినికాంత్ ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ వినాయక్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం!
మంచిర్యాలక్రైం: ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్నగర్లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు రాంనగర్కు చెందిన సెటిపెల్లి శ్రీనివాస్ వద్ద కలీమ్ ఐదు నెలల క్రితం రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు. చెల్లించడంలో జాప్యం జరగడంతో కాలేజ్రోడ్ ఆటో డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ షఫీ ఇంటికి వచ్చి అసభ్యకరంగా మాట్లాడడమే కాకుండా కుటుంబ సభ్యులను బెదిరించాడు. అంతేకాకుండా సోషనల్ మీడియాలో ప్రచారం చేస్తానని బెదిరించడంతో మనస్తాపానికి గురైన కలీమ్ ఆటోస్టాండ్ వద్ద ఆలౌట్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానిక ఆటో డ్రైవర్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా ఘటనపై ఫిర్యాదు రాలేదన్నారు. ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్యతలమడుగు: ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాధిక తెలిపిన వివరాల మేరకు సుంకిడి గ్రామానికి చెందిన గంగాధర నందిని (19) ఆదిలాబాద్లో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మూడేళ్లుగా మానసిక స్థితి సరిగాలేదు. మంగళవారం ఉదయం స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్లి ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా చున్నీతో ఉరేసుకుని కనిపించింది. జిల్లా కేంద్రంలోని రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. బేలలో యువకుడు..బేల: మండల కేంద్రంలోని కుమురం భీం కాలనీకి చెందిన కుడిమెత రాంచందర్ (30) ఉరేసుకుని ఆ త్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరా ల మేరకు రాంచందర్ కుటుంబంలో కొన్నిరోజులు గా కలహాలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి అతిగా మద్యం సేవించి ఇంట్లో భార్య లక్ష్మితో గొడవపడ్డాడు. చనిపోతానని తాడు తీసుకుని బయట కు వెళ్లాడు. మంగళవారం ఉదయం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఓ చెట్టు కొ మ్మకు ఉరేసుకుని కనిపించాడు. మృతుని భార్య ల క్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై మధుకృష్ణ తెలిపారు. మద్యానికి బానిసై ఒకరు..తానూరు: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై షేక్ జుబేర్ తెలిపిన వివరాల మేరకు బామ్ని గ్రామానికి చెందిన కోతిమీర గౌతం (35) కొంతకాలంగా మద్యానికి బానిసై ఏపని చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్యలు పుష్పలత, అర్చన, కుమార్తె ఉన్నారు. లింబగూడలో ఇంటర్ విద్యార్థి..సిర్పూర్(టి): మండలంలోని లింబగూడలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకున్నట్లు ఎస్సై కమలాకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన సుర్పం శేఖర్ (17) సిర్పూర్లోని ఆశ్రమ పాఠశాలలో పదోతరగతి పూర్తి చేశాడు. ఆసిఫాబాద్లోని గిరిజన ఆశ్రమ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యాడు. ఈ నెల 11న ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లాలని చెప్పగా పోనని ఇంటివద్దే ఉన్నాడు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరేసుకున్నాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుని తండ్రి సుర్పం యాదవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
నిర్మల్టౌన్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెంది న సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థా నికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు జిల్లా పద్మశాలి సంఘం సమన్వయకర్త, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ కమిటీ కోకన్వీనర్ ఆడెపు భూమన్న (61) సోమవారం రాత్రి బస్టాండ్ సమీపంలో కాలినడకతో రోడ్డు డివైడర్ను దాటే క్రమంలో ఎదురుగా వచ్చిన బైక్ ఢీ కొట్టింది. తలకు బలమైన గాయాలు కావడంతో స్థానికులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం
ఇచ్చోడ: మండల కేంద్రానికి చెందిన జాదవ్ దేవి దాస్ (42) సోమవారం మధ్యాహ్నం అదృశ్యం కాగా మంగళవారం మృతదేహం లభ్యమైనట్లు సీఐ బండారి రాజు తెలిపారు. కిరాణ దుకాణానికి వెళ్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లి ఇంటికి రాకపోయేసరికి అతని భార్య వనిత ఇచ్చోడ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మంగళవారం టీటీడబ్ల్యూఆర్జేసీ ప్రహరీ పక్కన మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. పురుగుల మందు తాగినట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఆరోగ్య పరిస్థితి సరిగాలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ వివరించారు. -
బీడీ కార్మికుల పిల్లలకు ‘ఉపకార’ం
● దరఖాస్తులు కోరుతున్న కేంద్రం ● గరిష్టంగా రూ.25 వేలు అందజేత ● ఉమ్మడి జిల్లాలో పలువురు విద్యార్థులకు ప్రయోజనంనిర్మల్చైన్గేట్: బీడీ కార్మికుల పిల్లలు చదువులో రాణించేలా కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ చేయూతనిస్తోంది. ఒకటో తరగతి నుంచి ఎంబీఏ, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల వరకు అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ప్రతీ సంవత్సరం ఉపకార వేతనాలు మంజూరు చేస్తోంది. కనిష్టంగా రూ.వెయ్యి, గరిష్టంగా రూ.25 వేలు అందజేస్తూ వారి ఉన్నత విద్యకు బాటలు వేస్తోంది. 2025–2026 విద్యా సంవత్సరానికి అర్హత కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఉమ్మడి జిల్లాలో పీఎఫ్ కలిగిన బీడీ కార్మికులు 75,200 మంది ఉన్నారు. ఆయా కుటుంబాలకు చెందిన విద్యార్థులు సుమారు లక్షా 20 వేల మంది వివిధ స్థాయిల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వారంతా పథకం కింద దరఖాస్తు చేసుకుంటే లబ్ధి పొందనున్నారు. దరఖాస్తు గడువు.. అర్హులైన విద్యార్థులు http:// scholarship. gov. in వెబ్సైట్లో సంబంధిత వివరాలు నమోదు చేయడంతో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు జతపరచాలి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు ఆగస్టు 31లోగా, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్, తదితర వృత్తి విద్యా కోర్సులు, ఎంబీఏ, ఎంబీబీఎస్, బీఏఎంఎస్, ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులు అక్టోబర్ 31లోగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. పూర్తి వివరాలు, సందేహాల నివృత్తికి నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ చౌరస్తాలో గల బీడీ కార్మికుల ఆస్పత్రిలో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. అవగాహన లేమి.. బీడీ కార్మికుల పిల్లలకు జాతీయస్థాయిలో ఉపకార వేతన స్కీం ఎప్పటి నుంచో అమలులో ఉంది. అ యినా సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఆన్లైన్లో సాంకేతిక సమస్యలు, కొన్ని సందర్భాల్లో వెబ్సైట్ ఓపెన్ కాకపోవడం, దరఖాస్తు అప్లోడ్ కాకపోవడం వంటి సమస్యల వల్ల చాలామంది ఉపకార వేతనం పొందలేకపోతున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు రూ.200 నుంచి రూ.300 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి దరఖాస్తు అప్లోడ్ కాకపోతే తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. అంతేకాకుండా బీడీ కార్మికుల పిల్లల కోసం కేంద్రం ఉపకార వేతనాలు మంజూరు చేస్తుందన్న విషయం చాలా మందికి ఇప్పటికీ తెలియదు. దీనిపై ప్రచారం కల్పించాలని, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.బీడీలు చుడుతున్న మహిళా కార్మికులుఉమ్మడి జిల్లా వివరాలు జిల్లా బీడీ కార్మికులు నిర్మల్ 70,000 ఆదిలాబాద్ 3,000 కుమురంభీం 1,500 మంచిర్యాల 700 మొత్తం 75,200సద్వినియోగపర్చుకోవాలి బీడీ కార్మికుల పిల్లలు చదువుకునేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఏటా ఉపకార వేతనాలు మంజూరు చేస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అర్హత కలిగిన విద్యార్థులు నిర్ణీత గడువులోపు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సందేహాలుంటే హెల్ప్డెస్క్ను సంప్రదించాలి. – డాక్టర్ మహేష్, బీడీ కార్మిక ఆస్పత్రి వైద్యాధికారి, నిర్మల్ అర్హతలు పదోతరగతి, ఇంటర్లో నేరుగా ఉత్తీర్ణులై ఉండాలి. సప్లిమెంటరీ విద్యార్థులు అనర్హులు. దూరవిద్య అభ్యసించిన వారు అనర్హులు. తండ్రి లేదా తల్లికి పీఎఫ్ గుర్తింపు కార్డు తప్పనిసరి. కుటుంబ ఆదాయం నెలకు రూ.10వేల లోపు ఉండాలి. జత చేయాల్సిన పత్రాలు 2025లో తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం. విద్యార్థి పేరిట బ్యాంక్ ఖాతా గత సంవత్సరం చదివిన తరగతి, కోర్సుకు సంబంధించిన మార్కుల మెమో ఉపకార వేతనం (రూ.ల్లో) తరగతి స్కాలర్షిప్ 1 నుంచి 4 1,000 5 నుంచి 8 1,500 9 నుంచి 10 2,000 ఇంటర్ 3,000 డిగ్రీ, పాలిటెక్నిక్, ఇతర వృత్తి విద్యాకోర్సులు 6,000 ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంబీబీఎస్, బీఏఎంఎస్ 25,000 -
ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్
భైంసాటౌన్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. పట్టణ పోలీస్స్టేషన్లో మంగళవారం వివరాలు వెల్లడించారు. పట్టణంలోని ఓవైసీనగర్కు చెందిన షేక్ అహ్మద్, బంగాలగల్లీకి చెందిన సుల్తాన్ ఖాన్ స్థానిక గాంధీగంజ్ వద్ద గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్సై నవనీత్రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా 2.5 కిలోల ఎండు గంజాయి లభించినట్లు వెల్లడించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో మహారాష్ట్ర నుంచి గంజాయి తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. వీరిద్దరిపై గతంలోనూ గంజాయి అక్రమ రవాణా కేసు నమోదైందన్నారు. సమావేశంలో సీఐ జి గోపీనాథ్, ఎస్సై నవనీత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ అవినాష్కుమార్ -
మహిళల ఆర్థికాభివృద్ధికి కేంద్రం చేయూత
బజార్హత్నూర్: మహిళల ఆర్థికాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేయూత అందిస్తుందని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. మండల కేంద్రంలో ఓఎన్జీసీ మంజూరు చేసిన 270 కుట్టుమిషన్లను 18 గ్రామాల మహిళలకు ఆ సంస్థ ప్రతినిధి మృత్యంజయ్తో కలిసి పంపిణీ చేశారు. అలాగే స్థానిక జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదర్శ, గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల, జెడ్పీ పాఠశాల విద్యార్థులకు 50 ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడు తూ.. మహిళలు స్వయం ఉపాధితో రాణించా లన్నారు. అలాగే విద్యార్థులు కష్టపడి చదివి ఉ న్నతంగా ఎదగాలన్నారు. అనంతరం డేడ్ర గ్రా మాన్ని సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడారు. డేడ్ర, గిరిజాయి, మాన్కపూర్, బద్దునా యక్ తండా, ఇంద్రనగర్, ఉమార్డ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తానని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ మండల అధ్యక్షుడు పో రెడ్డి శ్రీనివాస్, జెడ్పీటీసీ మాజీ సభ్యులు తాటిపల్లి రాజు, కొత్త శంకర్, నాయకులు గణేశ్, రమణ, సుఖ్దేవ్, మురళీమోహన్, గజానంద్, రాజేశ్వర్, ఎంఈవో కిషన్గుప్తా, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
చోరీ కేసును ఛేదించిన పోలీసులు
తానూరు: మండలంలోని బోంద్రట్లో ఈ నెల 13న పట్టపగలు గ్రామానికి చెందిన జగ్మే సవిత్రిబాయి, నారాయణ్ దంపతుల ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం పోలీస్స్టేషన్లో భైంసా ఏఎస్పీ అవినాష్కుమార్ వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన సోన్కాంబ్లె రాహుల్ ఇంట్లో ఎవరూలేని సమయంలో చొరబడి రూ.70 నగదు, పదమూడున్నర గ్రాముల బంగారు ఆభరణాలు, 10 గ్రాముల వెండి దొంగిలించాడు. బోంద్రట్ ఎక్స్రోడ్డు సమీపంలోని హైవే పక్కన పొదలో గుంతతవ్వి అందులో దాచి పెట్టాడు. ఎస్సై షేక్ జుబేర్ నిందితుడిని వేలిముద్రల ఆధారంగా పట్టుకున్నాడు. నిందితుని వద్ద నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ముధోల్ సీఐ మల్లేశ్, సిబ్బంది పాల్గొన్నారు. -
గల్ఫ్లో ఆగిన మరో గుండె●
● పొన్కల్ వాసి మృతి మామడ: కుటుంబ పోషణ, ఉపాధి నిమిత్తం గల్ఫ్ కు వెళ్లిన వ్యక్తి అక్కడ గుండెపోటుతో మృతి చెందిన విషాద సంఘటన చోటు చేసుకుంది. మండలంలో ని పొన్కల్ గ్రామానికి చెందిన కోటగిరి శ్రీనివాస్ (46) ఆరునెలల క్రితం గల్ఫ్కు వెళ్లాడు. కంపెనీలో ఉద్యోగం లభించిందని కుటుంబ స భ్యులకు కొన్నిరోజుల క్రితం ఫోన్చేసి చెప్పడంతో సంతోషపడ్డారు. సోమవారం అబుదాబిలో విధులు నిర్వహిస్తుండగా గుండెపోటు రావడంతో తోటి కార్మికులు ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందులు తీరుతా యని అనుకుంటున్న సమయంలోనే మృత్యు వు గుండెపోటు రూపంలో కబలించడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నా రు. అబుదాబిలోని హెల్పింగ్ హాండ్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పిచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఇలా వచ్చారు.. అలా వెళ్లారు!
● ఆటవిడుపుగా ఆదిలాబాద్ డీఏవో పోస్టు ● జిల్లాలో పనిచేసేందుకు అధికారుల అయిష్టత ● బదిలీపై వచ్చిన ఆఫీసర్ నామమాత్రంగా చేరిక ● అదే రోజు నిజామాబాద్కు డిప్యూటేషన్పై.. ● మళ్లీ ఇన్చార్జి పాలనే.. సాక్షి,ఆదిలాబాద్: జిల్లా వ్యవసాయ అధికారిగా బదిలీపై వచ్చిన మేకల గోవింద్ మంగళవారం ఉదయం స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.. తర్వాత కొంత మంది వ్యవసాయ అధికారులు వచ్చి ఆయనను కలిశారు. పిమ్మటే ఆయన ఇక్కడి నుంచి రిలీవ్ అయి నిజామాబాద్కు డిప్యూటేషన్పై వెళ్లారు. ఇప్పటివరకు ఇన్చార్జి జిల్లా వ్యవసాయ అధికారిగా వ్యవహరిస్తున్న శ్రీధర్స్వామి మళ్లీ తన పోస్టులో యథావిధిగా ఒదిగిపోయారు. వ్యవసాయ శాఖలో చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి. ఇదంతా ఒకేరోజులో జరిగిపోయింది. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖలో ప్రస్తుతం బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చోటు చేసుకుంటుంది. ఇదిలా ఉంటే హైదరాబాద్ రైతు కమిషన్లో జేడీఏగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గోవింద్ను ప్రభుత్వం ఆదిలాబాద్కు బదిలీ చేసింది. మంగళవారం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత నిజామాబాద్లో జేడీఏ పోస్టు ఖాళీగా ఉండగా, డిప్యూటేషన్పై అక్కడికి వెళ్లిపోయారు. అయితే ఆదిలాబాద్లో పనిచేసేందుకు అయిష్టత కారణంగా అనువైన జిల్లాకు వెళ్లేందుకు ఆసక్తి కనబర్చారని వ్యవసాయ శాఖలో చర్చించుకుంటున్నారు. అంతా ప్రణాళిక.. రాష్ట్రంలోని పాత పది జిల్లాల్లోనే జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ (జేడీఏ) పోస్టులు ఉన్నాయి. రైతు కమిషన్లో జేడీఏ హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న గోవింద్ బదిలీ తప్ప ని పరిస్థితుల్లో ఆదిలాబాద్కు అదే హోదాలో వచ్చారు. అ యితే ఇక్కడి నుంచి డిప్యూటేషన్పై వెళ్లేందుకు ముందే ఆయన వ్యూహరచన చేసుకున్నారనే ప్రచారం ఉంది. ప్ర భుత్వం నుంచి బదిలీల ప్రక్రి య చోటుచేసుకోగా, అక్కడినుంచి ఆయనను ఆదిలాబాద్కు బదిలీ చేశారు. నిజామాబాద్లో ఏడీఏ వీరస్వామి ఇన్చార్జి డీఏవో గా వ్యవహరిస్తున్నారు. జేడీఏ హోదా ఉన్న స్థానాని కే అధికారి గోవింద్ వెళ్లాల్సి ఉంటుంది. ఇదివరకు నిజామాబాద్ జిల్లాలో బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఈ ఆఫీసర్కు ఉంది. అక్కడ కూడా జేడీఏ హోదా కలిగి ఉండడంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఆయన ఆదిలాబాద్లో ఇలా బాధ్యతలు తీసుకొని.. ఆ వెంటనే అక్కడికి చేరుకున్నారు. అక్కడ కూడా అదే రోజు బాధ్యతలు తీసుకోవడం గమనార్హం. అయితేఈ విషయాలను ఆశాఖ అధికా రులు ఎవరు కూడా బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. ‘సాక్షి’కి ఈ సమాచారం అందడంతో అటు నిజామాబాద్.. ఇటు ఆదిలాబాద్లో వివరా లు సేకరించడంతో ఈ రెండు జిల్లాల్లో మంగళవారం జరిగిన పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడికి వచ్చే అధికారుల తంతే అంతా.. జిల్లాలో జేడీఏ పోస్టు ఓ ఆటవిడుపుగా మారిపోయింది. బదిలీలు, పదోన్నతులు వంటి ప్రక్రియలు చోటుచేసుకున్నప్పుడు తప్పని పరిస్థితిలో ఇక్కడికి వచ్చి ఏదో నామమాత్రంగా బాధ్యతలు స్వీకరించి ఆ తర్వాత డిప్యూటేషన్పై వెళ్లిపోవడం తంతుగా మారిపోయింది. గతంలో ఊషాదయాల్ను ఇక్కడ నియమించగా ఆమె ఇక్కడి నుంచి డిప్యూటేషన్పై రంగారెడ్డి కమిషనర్ కార్యాలయానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏడీఏ స్థాయి అధికారులు ఇన్చార్జిగా వ్యవహరిస్తూనే వస్తున్నారు. తాజాగా అదే పరిస్థితి. ఈ అధికారి కంటే ముందు కూడా మరో ఇద్దరు అధికారులను ఈ పోస్టులో నియమించగా వారు కూడా ఇక్కడ పనిచేసేందుకు అనాసక్తి కనబర్చుతూ డిప్యూటేషన్లపై వెళ్లిపోయారు. రెగ్యులర్ అధికారులు ఇలా వచ్చి.. అలా వెళ్లిపోవడం, ఇక్కడ ఇన్చార్జి అధికారులే బాధ్యతలు నిర్వర్తిస్తుండడం ఓ ఫార్స్గా మారిపోయింది. బదిలీలు, పదోన్నతుల విషయమై ప్రస్తుతం ఇన్చార్జి జిల్లా అధికారిగా ఉన్న శ్రీధర్ స్వామిని ‘సాక్షి’ వివరణ కోరగా.. ఆయన ప్రస్తుతం అన్ని పోస్టులు భర్తీ అయ్యాయని పేర్కొన్నారు. -
పస్తులుంటున్నా పట్టించుకుంటలేరు..
● మోదీ గారు ఇండియాకు రప్పించండి ● కువైట్లో మండల వాసి నరకయాతన ● సోషల్ మీడియాలో వీడియో వైరల్ జన్నారం: ‘ప్రధాని మోదీ సార్ మూడు రోజుల నుంచి తిండి లేదు. పోలీసుస్టేషన్కు వచ్చిన సార్.. పోలీసులు పట్టించుకుంట లేరు. రెండేళ్ల క్రితం కువైట్ పోయిన.. రెండు నెలల నుంచి జీతాలు ఇస్తలేరు.. తిండి లేదు, ఇంటికి పంపడం లేదు.. ఎండలు చాలా కొడుతున్నాయి.. సార్ నన్ను కాపాడండి..’ అంటూ మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన గొర్రె శాంతయ్య ప్రధానిని వేడుకుంటూ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శాంతయ్య ఉపాధి కోసం రెండేళ్ల క్రితం కువైట్ దేశం వెళ్లి కూలీ గా పని చేస్తున్నాడు. రెండు నెలలుగా యజమాని జీతం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడు. జీతం రాకపోవడంతో తిండికి గోసైతందని, ఇండియాకు పంపివ్వమంటే పాస్పోర్టు ఇవ్వడం లేదని తెలిపాడు. ఈ విషయాన్ని అక్కడి పోలీసులకు చెప్పడానికి వెళ్తే మూడు రోజులుగా తిప్పించుకుంటున్నారని, పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అబుసుల్తాన్ అనే వ్యక్తి పాస్పోర్టు ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడని, తన నంబరును బ్లాక్లిస్టులో పెట్టాడని, రెండు నెలలుగా వేరేచోట పని చేయగా.. వారూ వెళ్లగొట్టారని పేర్కొన్నాడు. ప్రధాని మోదీ, తెలంగాణ ప్రభుత్వం ఇండియాకు రప్పించాలంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. శాంతయ్యను రప్పించండి: కుటుంబీకులు శాంతయ్యను ఇండియాకు రప్పించాలని ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తల్లిదండ్రులు గొర్రె శంకరయ్య, లక్ష్మీ, భార్య ప్రమీల, కుమారుడు సాయితేజ, కూతురు వైష్ణవి వేడుకుంటున్నారు. వృద్ధాప్యంలో ఉన్నామని, తమ కొడుకు ఏడుస్తూ వేడుకుంటుంటే తట్టుకోలేక పోతున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రాణాలు కాపాడి.. కుటుంబ సభ్యులకు అప్పగించి
లోకేశ్వరం: ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని బ్లూకోల్ట్ సిబ్బంది కాపాడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని ధర్మోర గ్రామానికి చెందిన పుసవర్ల శ్రీనివాస్ మంగళవారం పంచగుడి వంతెన వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంటున్నానని 100కు డయల్ చేసి సమాచారం అందించాడు. వెంటనే బ్లూ కోల్ట్ సిబ్బంది సబ్ధర్ హుస్సేన్, ధన్రాజ్ అక్కడికి చేరుకుని అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాధితుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఈక్రమంలో మద్యానికి బానిసై ఆత్మహత్యకు యత్నించినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. గంజాయి కేసు నమోదునెన్నెల: గంజాయి సేవిస్తున్న యువకుడిపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. జెండావెంకటాపూర్ గ్రామ శివారు మామిడి తోటలో గంజాయి సేవిస్తున్నాడని తమకు అందిన పక్కా సమాచారం మేరకు ఎస్కూరి శశికుమార్ను దాడి చేసి పట్టుకున్నట్లు చెప్పారు. అతడి వద్ద నుంచి 130 గ్రాముల గంజాయి ప్యాకెట్లు లభించాయన్నారు. స్టేషన్కు తరలించి విచారించగా భీమారం మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన ఆకుదారి రాకేష్ వద్ద కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. సెల్ఫోన్ పేలి యువకుడికి గాయాలుభీంపూర్: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పలకోటి గ్రామానికి చెందిన గంగాధర్ జేబులో ఉన్న సెల్ఫోన్ మంగళవారం అకస్మాత్తుగా పేలడంతో స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. గంగాధర్ మహారాష్ట్రలోని బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో భోరజ్ హైవే వద్ద సెల్ఫోన్ ఒక్కసారిగా పేలింది. దీంతో స్వల్ప గాయాల పాలైన ఆయనను జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. -
అజ్ఞాతం వీడుతున్నారు..!
● జనంలోకి మావోయిస్టులు ● ఉమ్మడి జిల్లా నేతల లొంగుబాటు ● ఆపరేషన్ కగార్తో పంథా మారిన వైనం సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టినప్పటి నుంచి ఉమ్మడి ఆదిలాబా ద్ జిల్లాలో కీలక నేతలు ఎన్కౌంటర్లలో మరణించడమో.. లొంగిపోవడమో జరుగుతోంది. ఇప్పటికీ కొందరు దశాబ్దాలుగా కుటుంబసభ్యులు, సొంతూరు విడిచి అడవుల్లోనే గడుపుతున్నారు. రోజు రోజు కు పోలీసు బలగాలు అడవులు, మావోయిస్టు కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం, మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మరణించడంతో ఉమ్మడి జిల్లా కు చెందిన నేతలు ఒక్కొక్కరుగా ఉద్యమానికి దూ రమవుతున్నారు. ఈ నేపథ్యంలో జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసులు కోరుతున్నారు. తాజా గా మావోయిస్టు దంపతులు అజ్ఞాతంవీడగా.. ఊరి లో గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఉనికిని కోల్పోతున్న పార్టీ నిత్యం పోలీసుబలగాలు, మావోయిస్టుల మధ్య ఘ ర్షణ నుంచి నేడు పార్టీ ఉనికే లేకుండాపోయే రోజు లొచ్చాయి. గడచిన ఏడాదిలోనే పార్టీ వేగంగా క్షీణిస్తోంది. కేంద్ర కమిటీలో పని చేసిన కటకం సుదర్శ న్ ఉరఫ్ ఆనంద్(69) మొదలు దండకారణ్య స్పెష ల్ జోనల్ కమిటీ, గడ్చిరోలీ జిల్లా ఇన్చార్జి కాసర్ల రవి ఉరఫ్ అశోక్, కంతి లింగవ్వతోపాటు అనేక మంది సీనియర్లను పార్టీ కోల్పోయింది. 2020లో కాగజ్నగర్ మండలం కడంబా ఎన్కౌంటర్లో ఛత్తీ స్గఢ్కు చెందిన చుక్కాలు, నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్కు చెందిన బాదీరావు చనిపోయారు. గతనెల 6న రాష్ట్ర కమిటీ సభ్యుడు, కేబీఎం కమిటీ ఇన్చార్జి మైలరాపు అడెలు ఛత్తీస్గఢ్ బీజా పూర్ అడవుల్లో జరిగిన కాల్పుల్లో మరణించారు. ఆయనపై రూ.45లక్షల రివార్డు ఉంది. మిగిలిందెందరు? గతంలో అనేకమంది ఉమ్మడి జిల్లా నుంచి వివిధ రాష్ట్రాల్లో పలు హోదాల్లో పని చేసేవారు. ప్రస్తుతం వారి సంఖ్య పదిలోపే చేరింది. ప్రస్తుతం ఉమ్మడి జి ల్లాకు చెందిన నాయకులు కీలక హోదాల్లో ఉన్నా రు. నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచన్పల్లికి చెందిన ఇర్రి మోహన్రెడ్డి, సెంట్రల్ పోలిట్ బ్యూరో కేంద్ర కమిటీలో సాంకేతిక విభాగంలో ఉన్నారు. మరో ముఖ్యనేత మందమర్రికి చెందిన బండి ప్రకా శ్ ఉరఫ్ దాదా సింగరేణి కోల్బెల్ట్ కమిటీ చూస్తున్నారు. ఈయనను కేంద్ర కమిటీలోకి తీసుకున్నట్లుగా సమాచారం. అలాగే ఈయన సహచరులుగా ఉన్న పుల్లూరి ప్రసాదరావు ఎన్కౌంటర్లో మరణించారు. సలాకుల సరోజ, జాడి వెంకటి, పుష్పలత ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. దళంలోనే ఒక్కటై.. తాజాగా లొంగిపోయిన మావోయిస్టులు లచ్చన్న, అంకుబాయి అప్పట్లో క్రియాశీలకంగా ఉన్న సిర్పూ ర్ దళంలోనే పని చేస్తూ ఒక్కటయ్యారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పార్పల్లికి చెందిన లచ్చన్న 1983లో పీపుల్స్వార్ గ్రూప్ చెన్నూరు దళంలో చేరారు. 2002లో డివిజనల్ కమిటీ సభ్యుడిగా, 2007లో నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ సాంకేతిక విభాగం ఇన్చార్జీగా పని చేశారు. 2023నుంచి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నారు. ఈయనపై పలు పోలీసుస్టేషన్లలో 35కేసులు ఉన్నాయి. అన్న వచ్చిన 37ఏళ్లకు.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం అగర్గూడకు చెందిన చౌదరి అంకుబాయి 1988లో తన అన్న చిన్నన్నను కలిసేందుకు వచ్చి పార్టీలోకి వెళ్లింది. పీపుల్స్వార్ సిర్పూర్ దళ సభ్యురాలిగా చేరి, ఆ సమయంలోనే ఆత్రం లచ్చన్నను పెళ్లి చేసుకుంది. 1995లో లచ్చన్నతో పట్టణ ప్రాంతానికి బదిలీ కాగా, 2002లో ఏరియా కమిటీ స భ్యురాలిగా, తర్వాత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సాంకేతిక విభాగానికి బదిలీ అయ్యారు. ప్రస్తుతం నార్త్ బస్తర్ డివిజనల్ కమిటీ టెక్నికల్ విభాగం సభ్యురాలిగా ఉన్నారు. ఈమైపె 14కేసులు ఉన్నాయి. అయితే అన్న కోసం అడవికి వెళ్లిన అంకుబాయి చిన్నన్న కొన్నేళ్ల క్రితమే లొంగిపోయి సాధారణ జీవితం గడుపుతున్నారు. చెల్లె మాత్రం గత 37ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉండిపోయింది. -
ఆర్కే 5 గనిలో దొంగల బీభత్సం
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 5 గనిలో సోమవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఐదుగురు వ్యక్తులు గని ఆవరణలోని గోడదూకి స్క్రాప్, కాపర్ కేబుల్ ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. గమనించిన సెక్యూరిటీ గార్డు పూర్ణ వెంకటేశ్ విజిల్ వేసి ఇతర సిబ్బందిని అలర్ట్ చేశాడు. సెక్యూరిటీ సిబ్బంది అలికిరి విని దొంగలు చీకట్లో దాక్కుకున్నారు. వెంకటేశ్ వారి వద్దకు వెళ్లడంతో అతనిపై దాడికి పాల్పడ్డారు. మిగతా సెక్యూరిటీ గార్డులు వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా రాళ్లతో దాడి చేశారు. దీంతో మధుకర్, కుమార్కు గాయాలయ్యాయి. ఇంతలో ఏసీటీఎస్ టీం సభ్యులు రావడంతో అందరూ కలిసి చాకచక్యంగా ముగ్గుర్ని పట్టుకోగా ఇద్దరు పరారయ్యారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఏరియా సెక్యూరిటీ అధికారి జక్కారెడ్డికి సమాచారం అందించగా ఆయన శ్రీరాంపూర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు తక్షణమే స్పందించి కొద్ది గంటల్లోనే మిగతా ఇద్దరిని పట్టుకున్నారు. ఈ మేరకు సెక్యూరిటీ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి పాల్పడిన నరేంద్ర, పవన్కుమార్, శివ, మునియప్ప, భూమయ్యపై కేసు నమోదు చేసి మంగళవారం అరెస్టు చేసినట్లు తెలిపారు. సెక్యూరిటీ సిబ్బందిని ఏరియా జీఎం ఎం శ్రీనివాస్, సెక్యూరిటీ అధికారి జక్కారెడ్డి అభినందించారు. -
‘కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలి’
ఇంద్రవెల్లి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా పోస్ట్కార్డు ఉద్యమం చేపట్టినట్లు ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జెరిపోతుల పరశురామ్ అన్నారు. జూన్ 23న చేపట్టిన చైతన్యయాత్ర మంగళవారం ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1921లో ఇంపీరియల్ బ్యాంక్ కుప్పకూలినప్పుడు ‘రూపాయి దాని సమస్య పరిష్కర మార్గం’ అనే అంశంపై పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్, రాయల్ కమిషన్, సైమన్ కమిషన్కు ఇచ్చారని, దాని ఫలితంగానే 1935 ఏప్రిల్ 1న ఆర్బీఐ ఏర్పడిందని గుర్తు చేశారు. అంబేద్కర్ లేకుంటే ఆర్బీఐనే లేదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి లక్ష మందితో పోస్ట్ కార్డులు రాయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు సోన్కాంబ్లే మనోహర్, వాగ్మరే కామ్రాజ్, కాంబ్లే ఉత్తం, బాలాజీ, మస్కే రాజువర్ధన్, పరత్వాగ్ సందీప్, సూర్యవంశీ ఉత్తం, సత్యానంద్, తదితరులు పాల్గొన్నారు. -
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
కై లాస్నగర్: తమ సమస్యల పరిష్కారం కోసం గెస్ట్ లెక్చరర్లు, అంగన్వాడీలు సోమవారం ఆందోళన చే పట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నాలు నిర్వహించారు. బీఎల్వో విధులు మినహాయించాలని అంగన్వాడీలు.. స్థానిక సుందరయ్య భవన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చిన అంగన్వాడీలు ప్రధాన ద్వారం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సంఘం జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ.. చిన్నారులకు పోషకాహా రం అందించడం, కేంద్రం నిర్వహణ, న్యూట్రిషి యన్ హెల్త్ చెకప్లు, సమాచారం అందించడం వంటి ఐసీడీఎస్కు సంబంధించిన అనేక పనులు నిర్వహిస్తున్నారన్నారు. వారిపై మరింత భారం మోపేలా బీఎల్వో విధులు అప్పగించడం సరికాదన్నా రు. ప్రభుత్వం వెంటనే దానిని మినహాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. యూనియన్ నాయకులు వెంకటమ్మ, సునీత, విజయ, లక్ష్మి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. రెన్యూవల్ చేయాలని గెస్ట్ లెక్చరర్లు.. తమను రెన్యూవల్ చేయాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోగాల ప్రవీణ్ మాట్లాడారు. డిగ్రీ కళాశాలలు ప్రారంభమై 40 రోజులైనా గెస్ట్ లెక్చరర్లను ప్రభుత్వం రెన్యూవ ల్ చేయకుండా కాలయాపన చేస్తుండడంతో అధ్యాపకులు, విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందన్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం రూ.50వేల కనీస వేతనాన్ని 12నెలలకు చెల్లించాలని డిమాండ్ చేశా రు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, బి.రాహుల్, ఉపాధ్యక్షులు సుభాష్, కోశాధికారి ఆనంద్, నారాయణ, సంజీవ్, జావిద్ తదితరులు పాల్గొన్నారు. -
గృహ ప్రవేశానికి రండి..
● కలెక్టర్ను ఆహ్వానించిన ఇందిరమ్మ లబ్ధిదారు●కై లాస్నగర్: బజార్హత్నూర్ మండలానికి చెందిన ఇందిరమ్మ లబ్ధిదారు ఉయికే సుభద్రబాయి సోమవారం కలెక్టర్ రాజర్షి షాను గ్రీవెన్స్లో కలిశారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరుకావాలని కోరా రు. కాగా గతేడాది ఆగస్టు 7న బజార్హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దివ్యాంగురాలైన సుభద్రబాయి పరిస్థితి తెలుసుకుని ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేశారు. జిల్లాలోని తొలి లబ్ధిదారు ఆమెనే. రూ.5లక్షలతో చేపట్టిన ఇంటి నిర్మాణం ఇటీవల పూర్తయింది. ఈ క్రమంలో సోమవారం కలెక్టర్ను కలిసి గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆహ్వానించారు. స్పందించిన ఆయన తాను హాజరయ్యే తేదీ సమాచారం త్వరలోనే చెబుతానని తెలిపారు. -
విన్నపాలు వినవలె
సర్వేకు రావడం లేదు నాకు బెల్లూరి శివా రులో 49/3లో 8.18ఎకరాల వ్యవసాయ భూమి పట్టా ఉంది. అయి తే క్షేత్రస్థాయిలో నాలుగెకరాల మాత్రమే ఉంది. మిగతా భూ మి తమదంటూ ఇటీవల రైల్వే అధికారులు బండరాయిని పాతారు. అయితే ఆ భూమి హద్దులు చూపించాలని సర్వే కోసం దరఖా స్తు చేసుకున్నాను. సర్వేయర్ను పలుమార్లు కలిసి విన్నవించినా రావడం లేదు. చొరవచూపి న్యాయం చేయాలని కోరుతున్నా. – చందా పొచ్చుబాయి, భీంసరి కై లాస్నగర్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అర్జీదారులు కలెక్టర్ రాజర్షి షాకు మొర పెట్టుకున్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్కు జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చారు. తమ సమస్యలతో కూడిన దరఖాస్తులను కలెక్టర్కు అందజేశారు. వాటిని స్వీకరించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు అందజేస్తూ పెండింగ్లో ఉంచకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, ఆర్డీవో వినోద్కుమార్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వివిధ సమస్యలకు సంబంధించి ఈ వారం 131 దరఖాస్తులు అందాయి. అందులో కొందరి నివేదన.. ప్రజావాణికి అర్జీల వెల్లువ దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ -
వేతనాలు పెంచాలని వినతి
ఆదిలాబాద్: ఐటీడీఏ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పార్ట్టైం, శానిటేషన్ వర్కర్ల వేతనాలు పెంచాలని ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ను తెలంగాణ ప్రభుత్వ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని ఎంపీ నివాసంలో, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారిని కలిసి వినతిపత్రాలు అందించారు. ఇందులో సంఘం జిల్లా అధ్యక్షుడు షౌకత్ హుస్సేన్, గౌరవ అధ్యక్షుడు కేబీసీ నారాయణ, నాయకులు రామచంద్ర, రాజలింగు, దిలీప్కుమార్ తదితరులున్నారు. -
వైద్యశాఖ అప్రమత్తం..
ఆదిలాబాద్టౌన్: ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. దీంతో నీరు నిల్వ ఉండి దోమలు, ఈగలు వృద్ధి చెంది సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రస్తు తం జిల్లాలో వైరల్ జ్వరాలతో పాటు టైఫాయిడ్, డెంగీ కేసులు నమోదవుతున్నాయి. దగ్గు, జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలతో జనం అనా రోగ్యం బారిన పడుతున్నారు. ప్రస్తుతం రిమ్స్తో పాటు ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. అప్రమతమైన వైద్యశాఖ ర్యాపిడ్ ఫీవర్ సర్వేతో పాటు ఎపడమిక్ టీమ్లను ఏర్పాటు చేసింది. స్టాప్ డయేరియా కార్యక్రమం చేపడుతోంది. డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాధుల కాలం.. ఇటీవల కురిసిన వర్షాలతో ఆయా గ్రామాలు, పట్ట ణ ప్రాంతాలు చాలాచోట్ల అపరిశుభ్రంగా దర్శనమి స్తున్నాయి. గుంతలు, మురుగుకాల్వలతో పాటు నివాస పరిసరాల్లో నీరు నిల్వ ఉంటుంది. దీంతో దోమలు వృద్ధి చెంది వ్యాధులకు కారణమవుతున్నాయి. జిల్లాలో వారం పది రోజులుగా జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. చిన్నాపెద్ద తేడా లేకుండా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటికే 26 కేసులు నమోదు కాగా, ఈ నెలలోనే ఆరు నమోదు కావడం పరి స్థితికి అద్దం పడుతోంది.సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ కూడా అప్రమత్తమైంది. ముందస్తు ప్రణాళి క మేరకు చిన్నారులు డయేరియా బారిన పడకుండా ‘స్టాప్ డయేరియా’ను జూన్ 16 నుంచి షురూ చేసింది. ఈనెల 31 వరకు కొనసాగించేలా నిర్వహిస్తోంది. అలాగే సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఓఆర్ఎస్, జింక్ మాత్రలతో పాటు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో వారానికి రెండుసార్లు ఐదేళ్లలోపు చిన్నారులకు ఐరన్సిరప్ అందజేస్తున్నారు. ప్ర భుత్వ పాఠశాలల్లో 6 నుంచి 16 ఏళ్లలోపు వారికి వారానికోసారి ఐరన్ మాత్రలు అందిస్తున్నారు. ఇక ఆశలు, ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి ర్యాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. జ్వరం అదుపునకు అవసరమైన మందులు అందజేస్తున్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే.. ఫ్రైడే నిర్వహిస్తూ డెంగీ ప్రబలుతున్న కాలనీలు, గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఆదిమ గిరిజనులు నివసించే గ్రామాల్లో జన్మన్ కార్యక్రమంలో భాగంగా 13 ప్రత్యేక వాహనాల ద్వారా వైద్యసేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే రెండు ఎపడమిక్ టీమ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జి ల్లాలో హైరిస్క్ ప్రాంతాలను ఇప్పటికే గుర్తించా మని, ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాలపై ప్రత్యే క దృష్టి సారిస్తున్నట్లు పేర్కొంటున్నారు. డెంగీ నియంత్రణపై ‘అర్బన్ యాక్షన్ ప్లాన్’ కైలాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో డెంగీ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించిన వై ద్యారోగ్యశాఖ, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా అర్బన్ యాక్షన్ ప్లాన్ ఖరారు చేశారు. 49 వార్డుల పరిధిలో డెంగీ జ్వరాలను నియంత్రించేలా చేపట్టాల్సిన చర్యలపై ఆరు ప్రత్యేక టీంల ను ఏర్పాటు చేశారు. ఈమేరకు సోమవారం సా యంత్రం మున్సిపల్ కార్యాలయ కాన్ఫరెన్స్ హా లులో వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్ సిబ్బంది తో డీఎంహెచ్వో నరేందర్రాథోడ్, మెప్మా డీఎంసీ కె.శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. అర్బన్ ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు, వార్డు ప్రత్యేకాధికారులు, ఆర్పీలు, శానిట రీ సిబ్బందికి సూచనలు చేశారు. యాక్షన్ ప్లాన్ను మంగళవారం నుంచి అమలు చేయనున్నట్లుగా తెలిపారు. ప్రతీటీం వారంలో మూడుసార్లు మంగళ, గురు, శుక్రవారాల్లో తమకు కేటాయించిన వార్డుల్లో డ్రైడే, ఆంటీ లార్వా యాక్టివిటీస్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. శుభ్రత పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, జిల్లా మలేరియా నివారణ అధికారి శ్రీధర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. వ్యాధులు ప్రబలకుండా చర్యలు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నాం. గతేడాది జిల్లాలో 366 డెంగీ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 26 నమోదయ్యాయి. ఆశలు, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. అవసరమైన మందులను పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. – నరేందర్ రాథోడ్, డీఎంహెచ్వో -
రోడ్డు ప్రమాదం.. కుటుంబం చిన్నాభిన్నం
కాసిపేట/లక్సెట్టిపేట: రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కుటుంబంలోని తండ్రి, పెద్ద కుమారుడు మృతి చెందగా, తల్లి, చిన్నకుమారుడు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హృదయ విషాదకర ఘటన శనివారం చోటు చేసుకుంది. లక్సెట్టిపేట ఎస్సై గోపతి సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. దండెపల్లి మండలం నెల్కివెంకటాపూర్ గ్రామం వందూర్గూడ తండాకు చెందిన సిడం శంకర్(37) దేవాపూర్లోని ఓరియంట్ సిమెంట్ కంపెనీ న్యూప్లాంట్లో లోడింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. శనివారం తన తండ్రి దామును చూసేందుకు భార్య సుమిత్ర, ఇద్దరు కుమారులు సాగర్(13), సంతోష్లతో కలిసి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా లక్సెట్టిపేట మండలం అంకతిపల్లి స్టేజీ సమీపంలో మంచిర్యాల నుంచి లక్సెట్టిపేట వైపునకు వస్తున్న కారు బైక్ను ఎదురుగా ఢీకొట్టింది. ప్రమాదంలో పెద్ద కుమారుడు సాగర్ అక్కడికక్కడే మృతి చెందగా శంకర్, సుమిత్ర, సంతోష్లకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులకు మంచిర్యాలలో చికిత్స అందించగా పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో శంకర్ మృతిచెందగా భార్య, చిన్న కుమారుడు కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడి తమ్ముడు సిడం జాకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. తండ్రి, పెద్ద కుమారుడు మృతి తల్లి, చిన్న కుమారుడికి తీవ్ర గాయాలు దేవాపూర్లో విషాదచాయలు -
టీ–గేట్ కమిటీ చైర్మన్గా గోవర్ధన్రెడ్డి
కైలాస్నగర్: రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించేందుకు టీ గేట్ (telangana Gateway for Adaptive Training & Employment) పథకాన్ని ప్రవేశపెట్టింది. అమలు కోసం జిల్లాస్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ జిల్లా చైర్మన్గా బి.గోవర్ధన్రెడ్డి, వైస్ చైర్మన్గా ఏ.రాజేశ్వరమ్మ, కన్వీనర్గా పి.శ్రీనివాస్, కో కన్వీనర్గా ఆర్.శ్రీనివాస్, సభ్యులుగా మిల్కా, ముత్యంరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని పారిశ్రామిక అవసరాలను విశ్లేషించడంతో పాటు శిక్షణ–ప్లేస్మెంట్ వ్యూహాలను అమలు చేసేందుకు ఈ కమిటీ పనిచేయనుంది. -
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
తానూరు: మండలంలోని బోంద్రట్ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగినట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలిపారు. ఎస్సై, బాధితులు తెలిపిన వివరాలు.. బోంద్రట్ గ్రామానికి చెందిన జంగ్మే సావిత్రిబాయి –నారాయణ దంపతులు ఆదివారం ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనులకు వెళ్లారు. వ్యవసాయ పనులు ముగించుకుని సాయంత్రం ఆరు గంటలకు తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి ఉన్న తాళం పగులగొట్టి ఉండడం.. బీరువా తెరిచి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై షేక్ జుబేర్ అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. బీరువాలో నగదుతో పాటు బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిసాత్నాల: విద్యుదాఘాతానికి గురై బావునే అశోక్ (56) అనే వ్యక్తి మృతిచెందిన సంఘటన భోరజ్ మండలం పెండల్వాడ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై గౌతమ్ పవర్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి కుటుంబ సభ్యులందరు భోజనం చేసి పడుకున్నారు. అశోక్ ముందురూమ్లో పడుకున్నాడు. అశోక్ కుమారుడు రవి రాత్రి 11 గంటల సమయంలో బాత్రూం వెళ్లేందుకు నిద్ర లేచాడు. అశోక్ రెండు కాళ్లు కూలర్ స్టాండ్కు తగిలి ఉన్నాయి. అనుమానం వచ్చిన రవి కరెంట్ ఆఫ్ చేసి చూడగా అశోక్ కరెంట్ షాక్తో మృతిచెంది ఉన్నాడు. రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గౌతమ్ పవర్ తెలిపారు. -
ఆదివాసీ ఉద్యోగులు జాతి అభివృద్ధికి కృషిచేయాలి
ఇచ్చోడ: ఆదివాసీ ఉద్యోగులు తమ హక్కులకోసం పోరాడుతూనే జాతి అభివృద్ధికోసం కృషి చేయాలని ఆదివాసీ ఉద్యోగుల ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఆ త్రం భాస్కర్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఆదివాసీ భవన్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకూ ఆదివాసీలు అభివృద్ధిలో వె నుకబడి పోతున్నారన్నారు. ఆదివాసీలు అన్నిరంగాల్లో అభివృద్ధి వైపు పరుగులు తీయడానికి ఉ ద్యోగ సంఘాలు తమవంతు పాత్ర పోషించాలన్నా రు. ఆదివాసీల పిల్లలు చదువుపై ప్రత్యేక దృష్టి పె ట్టేలా ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. చదువుతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. మారుమూల ఆదివాసీ గ్రామాల్లో ఇప్పటికి తమ పిల్లలను బడికి పంపించడంలేదన్నారు. సమావేశంలో గౌరవ అధ్యక్షుడు కొడప కోసేరావు, ప్రధాన కార్యదర్శులు కనక దేవేందర్, మెస్రం గంగారాం, బోథ్ డివిజన్ అధ్యక్షుడు తొడసం భూమన్న, ఉమ్మడి జిల్లా ఆదివాసీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
రిమ్స్ డైరెక్టర్కు ఐఎస్బీ సర్టిఫికెట్
ఆదిలాబాద్టౌన్: రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) సర్టిఫికెట్ అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాటు ఐఎస్బీ కోర్సు నిర్వహించింది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు, డైరెక్టర్లకు ఏడాది పాటు శిక్షణ ఇచ్చారు. ఆదిలాబాద్ రిమ్స్ నుంచి రిమ్స్ డైరెక్టర్ కోర్సును పూర్తి చేశారు. శిక్షణలో హెల్త్కేర్ మేనేజ్మెంట్, నాణ్యమైన వైద్యసేవలు అందించడం తదితర అంశాలపై శిక్షణ నిర్వహించారు. ఆదివారం హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఐఎస్బీ ప్రొఫెసర్ సారంగ్దేవ్ సర్టిఫికెట్ను అందజేశారు. -
గిరిజనేతరుల సమస్యలపై సీఎంతో మాట్లాడుతా
● రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి నార్నూర్: ఏజెన్సీ ప్రాంతంలో నివాసం ఉంటున్న గిరిజనేతరుల సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరించడానికి కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడు కాంబ్లె బాలాజీ సోదరుని వివాహానికి మంత్రి హాజరయ్యారు. తొలిసారిగా మండలానికి వచ్చేసిన మంత్రికి కాంగ్రెస్, దళిత సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం అంబేడ్కర్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నార్నూర్లో కొలాంధరి, ఎంపల్లి ప్రాజెక్ట్ మంజూరు కోసం చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల, ఉన్నత విద్యకోసం డిగ్రీ కళాశాల, నార్నూర్లో అంబేడ్కర్ భవన్, సేవాలాల్ భవన్, షాదీఖానా మంజూరు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీరా శ్యాంనాయక్, కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్చార్జి అత్రం సుగుణ, వక్స్బోర్డు మాజీ చైర్మన్ యూనుస్ అక్బానీ, సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బానోత్ గజానంద్నాయక్, పీఏసీఎస్ డైరెక్టర్ దుర్గే కాంతరావు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు లోఖండే దేవురావు, మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు లోఖండే చంద్రశేఖర్, దళితరత్న అవార్డు గ్రహిత నర్శింగ్మోరే, ఫాక్స్ చైర్మన్ అడే సురేశ్, ఏఎంసీ డైరెక్టర్ కై లాస్నాయక్, తదితరులు పాల్గొన్నారు. దేశం గర్వించదగిన మహోన్నతుడు అంబేడ్కర్ తాంసి: ప్రజలందరికి సమాన హక్కులు కల్పించడానికి భారత రాజ్యాంగాన్ని రచించిన మహోన్నతుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్మించిన అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆదిలాబాద్ ఎంపీ నగేష్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, విగ్రహదాతలు కాటిపెల్లి వసంత్రెడ్డి, శ్రీనివాస్రెడ్డితో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీ ఎమ్మెల్యేలను అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండలంలో నెలకొన్న పలు సమస్యలను మండల నాయకులు మంత్రికి విన్నవించారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా బోథ్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఎంపీ నగేశ్ మాట్లాడుతూ తలమడుగు మండలంలో బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి గజేందర్, మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్, మాజీ జెడ్పీటీసీలు గణేశ్రెడ్డి, రాజు, బాబన్న పాల్గొన్నారు. మంత్రిని కలిసిన రూపేష్రెడ్డి కై లాస్నగర్: ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు తగిన ప్రాధాన్యతనిచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాల పండుగ తాంసి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక అని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం తలమడుగు మండలంలోని సుంకిడిలో బోనాల పండుగ కార్యక్రమంలో ఎంపీ గోడం నగేశ్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో కలిసి పాల్గొన్నారు. బోనం ఎత్తుకొని గ్రామస్తులతో కలిసి పొచ్చమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశా రు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్, ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు గోక గణేశ్రెడ్డి, తాటిపెల్లి రాజు, తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో అగ్రగామి..
● నాకు మధిర ఎంతో.. మంచిర్యాల అంతే ● ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ● ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ● పరిశ్రమలకు, పెట్టుబడులకు అవకాశాలు ● ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ● జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం ● నలుగురు మంత్రుల రాకతో పండుగ వాతావరణం దండెపల్లి/ జన్నారం/మంచిర్యాలరూరల్(హాజీపూర్)/లక్సెట్టిపేట: మంచిర్యాల జిల్లా అభివృద్ధిలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. మంచిర్యా ల జిల్లాలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులకు పు ష్కలంగా అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. లక్సెట్టిపేటలో నిర్మించిన 50 పడకల సామాజిక ఆస్పత్రి, కళాశాల భవనాన్ని ఆదివారం ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుతో కలిసి ప్రారంభించారు. దండేపల్లి మండలం రెబ్బెనపల్లిలో ఇందిరా మహిళా శక్తి సౌర విద్యుత్ ప్రాజెక్టు, హాజీపూర్ మండలం వేంపల్లిలో 212 ఎకరాల్లో నిర్మించే దత్తసాయి ఇండస్ట్రీయల్, ఐటీ, ఆటోనగర్ పార్కుల పనులకు శంకుస్థాపన చేశారు. నలుగురు మంత్రుల రాకతో పండుగ వాతావరణం కనిపించింది. మధిరతో సమానం.. మంచిర్యాల జిల్లాను తన సొంత నియోజకవర్గం మధిరతో సమానంగా భావిస్తూ రాష్ట్రంలో రోల్మాడల్గా నిలిపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చా రు. రెబ్బెనపల్లిలో ఇందిరా మహిళాశక్తి సోలార్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పనులను తిరిగి ప్రారంభిస్తామన్నారు. మంచిర్యాలలో 650 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, లక్సెట్టిపేటలో 50 పడకల ఆస్పత్రి, కళాశాల భవన నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు కోరినట్లుగా దండేపల్లి మండలంలో మూడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, 220, 400 మెగావాట్ల సబ్స్టేషన్లు దశల వారీగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి సమక్షంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. అభివృద్ధికి నాంది.. మంచిర్యాలలో 300 ఎకరాల్లో ఐటీ, ఇండస్ట్రీయల్, ఆటోనగర్ పార్కుల ఏర్పాటుతో అభివృద్ధికి నాంది పడిందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. మొదటి దశగా 240 ఎకరాల భూమిని సేకరించి, 212 ఎకరాల్లో ఈ పార్కుల నిర్మాణం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.30 కోట్ల నిధులు కేటాయించామన్నారు. ఈ పార్కుల ఏర్పాటుతో 2 వేల మందికిపైగా ఉపాధి లభిస్తుందన్నారు. మంచిర్యాల జిల్లా హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలతో సమానంగా అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి శ్రీధర్బాబు ప్రశంసించారు. నిధుల సేకరణ, అభివృద్ధి పనుల సరళీకరణలో ఆయన చూపిస్తున్న చొరవ జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలిపే దిశగా సాగుతోందని తెలిపారు. ఆదర్శంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి.. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, మంచిర్యాలలో నిర్మించిన 650 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో హైదరాబాద్తో సమానమైన సౌకర్యాలతో రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పర్యాటకంగా అభివృద్ధి.. అబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. కళాకారులకు చేయూతనిస్తామని హామీ ఇచ్చారు. రూ.2 కోట్లతో కళాభవనం నిర్మాణం చేపడతామన్నారు. హాజీపూర్ మండలం గఢ్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో గాంధారీ ఖిల్లా సఫారీ కోసం రెండు నూతన వాహనాలను మంత్రులు ప్రారంభించారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన మంత్రులకు అటవీ శాఖ అధికారులు జంతువుల ఫొటోలతో కూడిన ఫ్రేమ్లు జ్ఞాపికలుగా అందజేశారు. ప్రజల మద్దతుతో ముందుకు.. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల మద్దతు, నమ్మకంతోనే ముందుకు సాగుతున్నానని, వారి శ్రేయస్సు కోసం జీవితాంతం కృషి చేస్తానన్నారు. ఇంద్రవెల్లి, నస్పూర్లో జరిగిన బహిరంగ సభలకు లక్షలాది మంది హాజరైనందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ కే.శశాంక్, అటవీశాఖ కన్జర్వేటర్, ఫీల్డ్ డైరెక్టర్ శాంతా రాం, అటవీ శాఖ అధికారి శివ్ ఆశిశ్సింగ్, ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా, కలెక్టర్ కుమార్ దీపక్, ఎఫ్డీవో సర్వేశ్వర్, లక్సెట్టిపేట అటవీరేంజ్ అధికారి అత్తె సుభాష్, వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్, డీఎంహెచ్వో హరీశ్రాజ్, సూపరింటెండెంట్ హరీశ్చంద్రారెడ్డి, డీసీహెచ్ఎస్ కోటేశ్వర్ డీసీపీ భాస్కర్, ఏసీసీ ప్రకాశ్, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి, ఐఎన్టీయూసీ నేతలు జనక్ప్రసాద్, ప్రేమ్చంద్, శ్రీనివాస్ పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి భోజనం.. లక్సెట్టిపేట: పట్టణంలో సామాజిక ఆస్పత్రి, ప్రభుత్వ కళాశాల భవనాల ప్రారంభోత్సవం తర్వా త మంత్రులు పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో సహపంక్తి భోజనం చేశారు. పాఠశాలలో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులలోని బెంచీలపై కూర్చుని చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి విద్యార్థి వద్ద పుస్తకాన్ని తీసుకుని చదివారు. విద్యార్థి సంఘం నాయకులు స్కాలర్షిప్ల విడుదల కోసం వినతిపత్రం అందజేశారు. -
● నేటినుంచి పంపిణీ ప్రక్రియ షురూ ● ఏడేళ్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెర ● అర్హులకు చేకూరనున్న సంక్షేమ పథకాల లబ్ధి ● ప్రభుత్వ నిర్ణయంపై పేదప్రజల్లో ఆనందం
కై లాస్నగర్: కొత్త రేషన్కార్డుల జారీకి రంగం సిద్దమైంది. ఈ నెల 14న సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కార్డుల పంపిణీ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జిల్లాలోనూ అర్హులైన పేదలకు రేషన్కార్డులు అందించే దిశగా అధికార యంత్రాంగం కసర త్తు ముమ్మరం చేసింది. మీసేవ, ప్రజాపాలన కేంద్రాల్లో స్వీకరించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో వి చారిస్తున్న అధికారులు అర్హులైన వారి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఆమోదిస్తున్నారు. దీంతో తమకు రేషన్కార్డులు ఎప్పుడెప్పుడు వస్తాయా అనే గంపెడాశతో ఎదురుచూస్తున్న పేదప్రజల నిరీ క్షణకు ఎట్టకేలకు తెరపడనుంది. నూతన కార్డుదా రులకు సన్నబియ్యంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ప థకాల లబ్ధి చేకూరనుండటంతో ప్రభుత్వ నిర్ణయంపై అర్హులైన వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. ఏడేళ్ల నిరీక్షణకు తెర... కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఏడేళ్లుగా నిలిచిపోయింది. దీంతో కార్డుల్లో మార్పులు, చేర్పులకు సై తం అవకాశం లేకుండా పోయింది. అయితే ప్రభుత్వం అందించే పథకాలన్నింటికి రేషన్ కార్డునే ప్రా మాణికంగా తీసుకోవడంతో వేలాది మంది కార్డుల్లేక వాటి లబ్ధికి దూరమయ్యారు. రేషన్ బియ్యం పొందలేకపోయారు. దీంతో కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం ఎప్పుడు జారీ చేస్తుందా? అని గంపెడాశతో ఎదురుచూస్తునే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 26న జిల్లాలోని మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి అక్కడి అర్హులైన పేదలకు కార్డులను జారీ చేసి వారికి రేషన్ బియ్యం అందించింది. తాజాగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో దరఖాస్తు చేసుకున్న అర్హులైన పేదలందరికి కార్డులను అందించే దిశగా చర్యలు చేపట్టింది. మీసేవ, ప్రజాపాలన కేంద్రాల్లో అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారిస్తున్న రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు ఆన్లైన్లో వాటిని ఆమోదిస్తున్నారు. దీంతో త్వరలోనే వారందరికీ కొత్త రేషన్కార్డులు అందనున్నాయి. దీంతో వారి నిరీక్షణకు తెరపడనుంది. అయితే మూడు నెలల రేషన్కోటా బియ్యం ఇప్పటికే ప్రభుత్వం కార్డుదారులకు పంపిణీ చేసిన నేపథ్యంలో కొత్తగా జారీ చేసే కార్డుదారులకు జూలై నుంచి బియ్యం పంపిణీ చేస్తుందా? లేక తర్వాత అందజేస్తుందా? అనేదానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. చేకూరనున్న ‘సంక్షేమ’ లబ్ధి జిల్లాలో ప్రస్తుతం 1,92,752 కుటుంబాలు రేషన్కార్డులను కలిగి ఉండగా వాటి పరిధిలో 6,49,521 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం లబ్ధిపొందుతున్నారు. కొత్త కార్డుల జారీతో ఈ సంఖ్య మరింత పెరగనుండగా మరికొంతమంది పేదప్రజలకు లబ్ధి చేకూరనుంది. తద్వారా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యంతో పాటు మహాలక్ష్మి పథకం కింద అందించే రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాల ప్రయోజలను సైతం అందుకోనున్నారు. వీటితో పాటు ప్రధానంగా ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యసేవలు పొందే అవకాశం ఉంది. దీంతో తమకు కార్డులు ఎప్పుడు వస్తాయా అని ఆశగా ఎదురుచూసున్న వారిలో ప్రభుత్వ ప్రకటన ఆనందాన్ని రెట్టింపు చేసింది. జిల్లాలో కొత్త కార్డుల విచారణ కాస్తా నెమ్మదిగా సాగుతుండటంపై అర్హులైన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ఎక్కడ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోతుందోననే భయంతో దరఖాస్తుదారులు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించుకునేందుకోసం జిల్లాలోని తహసీల్దార్, పౌరసరఫరాలశాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణ చేస్తున్నారు. దీంతో ఆయా కార్యాలయాల్లో దరఖాస్తుదారుల సందడి కనిపిస్తోంది. జిల్లాలో కొత్త రేషన్కార్డుల వివరాలు కొత్తగా సభ్యుల చేర్పుల వివరాలు ఈ చిత్రంలో కనిపిస్తున్న గంజివార్ సునీల్–నాగరాణి దంపతులకు 2020లో వివాహమైంది. వీరిది ఆదిలాబాద్ పట్టణంలోని కోలిపూరకాలనీ. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. విచారణ చేపట్టిన అధికారులు ఇటీవల ఆమోదించారు. దీంతో ఆ కుటుంబానికి రేషన్కార్డు అందనుంది. ఈ కుటుంబం సన్నబియ్యంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందనున్నారు. అందిన దరఖాస్తులు ఆమోదం పొందినవి తిరస్కరించినవి 18,970 6,970 237 అందిన దరఖాస్తులు ఆమోదించినవి తిరస్కరించినవి 32,254 12,754 5,400 ఆదేశాలు రాలేదు కొత్త కార్డుల జారీ ప్రక్రియ ఈ నెల 14న ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే జిల్లాలో ఎప్పటి నుంచి చేపట్టాలనే దానిపై ప్రభుత్వం నుంచి ఇంకా మాకు ఎలాంటి ఆదేశాలు అందలేదు. మీ సేవ కేంద్రాల ద్వారా అందిన దరఖాస్తులపై విచారణ చేస్తూ అర్హులైన వారిని ఆమోదం తెలుపుతున్నాం. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. ప్రభుత్వ తదుపరి ఆదేశాలకు అనుగుణంగా కార్డుల జారీపై తగు చర్యలు తీసుకుంటాం. – వాజీద్ అలీ, డీఎస్వో, ఆదిలాబాద్ -
బీఆర్ఎస్, బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదు
కైలాస్నగర్: రాష్ట్రంలో పదేళ్లు పాలించిన బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. జైనథ్ మండలంలోని నిరాల గ్రామ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఆదిలాబాద్ పట్టణంలోని 13, 34 వార్డుల బీఆర్ఎస్ కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పట్టణంలోని ప్రజాసేవా భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఓటమితో రాజకీయంగా మాజీ మంత్రి జోగు రామన్న పని అయిపోయిందన్నారు. పాయల్ శంకర్ ఎలాంటి వారనేదీ ప్రజలందరికీ తెలుసన్నారు. ఇద్దరూ కుటుంబం గురించి ఆలోచిస్తారే తప్ప నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీలేదన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. -
పెళ్లిపీటలు ఎక్కాలని వచ్చి... పాడెక్కాడు..
ఖానాపూర్:పెళ్లి చేసుకునేందుకు ఎన్నో ఆశలతో అతను ఇటీవలే గల్ఫ్ నుంచి స్వదేశానికి తిరిగొచ్చాడు. ఈనెల 18న పెళ్లి కూడా నిశ్చయమైంది. ఎంతో సంతోషంతో పెళ్లి శుభలేఖలు పంచేందుకు తన బావమరిదితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతిచెందిన ఘటన ఆదివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో చోసుచేసుకుంది. సీఐ సీహెచ్ అజయ్, ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి గ్రామానికి చెందిన చొప్పదండి లక్ష్మణ్(25)కు కడెం మండలం పెద్ద బెల్లాల్ పంచాయతీపరిధి ఎస్సీకాలనీకి చెందిన యువతితో ఇటీవల వివాహం నిశ్చయమైంది. ఈ నెల 18న వివాహం ఉండడంతో ఆదివారం నిర్మల్ జిల్లా లక్ష్మణచాందలో శుభలేఖలు పంచేందుకు జన్నారం మండలం మురిమడుగు గ్రామానికి చెందిన మేన బావమరిది పడిగెల జశ్వంత్(19)తో కలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. ఈక్రమంలో ఖానాపూర్ పట్టణంలోని కుమురంభీం చౌరస్తా సమీపంలో వాహనం అదుపుతప్పి కల్వర్టు వద్ద కాలువలో పడ్డారు. దీంతో ఇద్దరి తలలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఖానాపూర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. జశ్వంత్ తల్లి భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా లక్ష్మణ్ పెళ్లి చేసుకునేందుకు ఇటీవలే గల్ఫ్ నుంచి వచ్చాడు. వివాహం కోసం గల్ఫ్ నుంచి వచ్చిన యువకుడు శుభలేఖలు పంచేందుకు వెళ్తుండగా ప్రమాదం వరుడుతోపాటు బావమరిది దుర్మరణం రెండు కుటుంబాల్లో విషాదం -
నిమ్స్లో గిరిజన బాలికకు మంత్రి పరామర్శ
లక్డీకాపూల్: అనారోగ్యంతో బాధపడుతున్న గిరిజ న విద్యార్థిని ఆత్రం త్రివేణిని హైదరాబాద్లోని నిమ్స్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం పరామర్శించారు. త్రి వేణి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని మంత్రి ఆదేశించారు. ఆయన వెంట గిరిజన సంక్షేమ శా ఖ కార్యదర్శి ఎ.శరత్, అదనపు సంచాలకులు వి.సర్వేశ్వర రెడ్డి, ఉప సంచాలకులు దిలీప్ పాల్గొన్నారు. తలపై కర్ర పడడంతో.. త్రివేణి ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుంటాల గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతుంది. ఆమె తండ్రి తులసీరాం తెలిపిన వివరాల ప్రకారం.. వేసవి సెలవుల్లో త్రివేణి తలపై కర్ర పడటంతో ఆమెకు గాయమవడంతో పాటు వాంతులతో సతమతమైంది. స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా మందులు ఇవ్వడంతో వాంతులు ఆగిపోయాయి. ఈ క్రమంలో గత నెల20 నుంచి పాఠశాల ప్రారంభం కాగా వెళ్లింది. ఈ నెల11న నైట్ స్టడీ సమయంలో ఆమె వాంతులు చేయడంతో పాటు తీవ్రమైన తలనొప్పితో బాధపడింది. దీంతో ఆమెను పాఠశాల సిబ్బంది నేరడిగొండ పీహెచ్సీకి, మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ నెల12న నిర్మల్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా ఆమె మెదడులో రక్తం గడ్డకట్టినట్టు వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్య చికిత్సకు నిమ్స్కు రిఫర్ చేశారు. -
అపూర్వ కలయిక!
బోథ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1981 –82లో పదో తరగతి, 1982 –84లో ఇంటర్ చదివిన పూర్వ విద్యార్థులు ఒక్కచోట చేరిన అపూర్వ ఘటన ఆదివారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. అపూర్వ సమ్మేళనంలో ఆనాటి విద్యార్థులు తమ విద్యాభ్యాసం రోజుల జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఈ సందర్భంగా తమ గురువులు నర్సింగ్రెడ్డి, నర్సారెడ్డి, రమేశ్లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. భూమారెడ్డి, విజయ్, కాశీనాథ్, రమాకాంత్, దేవిదాస్, సదానందం, రమేశ్, విలాస్, సునీల్, అనురాధ, పద్మ, సునీత, ఎస్ఎస్ ఖాన్, మహేంద్ర, శివాజీ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. – బోథ్ 50 ఏళ్ల తర్వాత..బెల్లంపల్లి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం అట్ట హాసంగా జరిగింది. 1974 –75లో విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు 50 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరి భావోద్వేగానికి గురయ్యారు. విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు పూలమాల వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయులు జి.వెంకటయ్య, మాధవి, ఉపాధ్యాయులు శ్రీహరి, కృష్ణారావు, సతీశ్, జగన్నాథరావు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. – బెల్లంపల్లి -
ఘనంగా క్వారీ దుర్గాదేవి జాతర
క్వారీ దుర్గాదేవి 54వ వార్షికోత్సవ జాతరకు భక్తులు వేలసంఖ్యలో హాజరయ్యారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గఢ్పూర్ గ్రామ పంచాయతీ పరిధి ఎంసీసీ క్వారీలో ఏటా జరిగే ఈ జాతర అంగరంగ వైభవంగా సాగింది. ఆదివారం ఉదయం ఆలయ ఆవరణలో వేదమంత్రోచ్ఛారణల మధ్య చండీహామం జరిపారు. భక్తులు దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో వాహనాలకు పూజలు జరుపుకున్న భక్తులు కోళ్లు, మేకలు బలిచ్చి అక్కడే వంటలు చేసుకున్నారు. దుర్గాదేవి దర్శన అనంతరం ఆలయ ఆవరణలోని పోచమ్మ, నాగదేవతలను కూడా దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు –రాజకుమారి దంపతులు, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో ఏసీపీ ప్రకాశ్ పర్యవేక్షణలో మంచిర్యాల సీఐ ప్రమోద్, పలువురు ఎస్సైలు, పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. – మంచిర్యాలరూరల్ (హాజీపూర్) -
ఆలయాల అభివృద్ధికి కృషి
నేరడిగొండ/బోథ్: ఆలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండలంలోని మాదాపూర్ అభయాంజనేయ స్వామి, బోథ్ మండలంలోని కౌట(బి)లోని మల్లికార్జునస్వామి ఆలయాల పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. ఆదివారం మండల కేంద్రంలోని ఆయన నివాసంలో ఆలయాల కమి టీ సభ్యులకు ప్రొసీడింగ్ కాపీ అందజేశారు. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయానికి సీ జీఎఫ్ నిధులతో మొదటి దశలో రూ.25 లక్షలు, మల్లికార్జునస్వామి ఆలయానికి రూ.20 లక్షలు మంజూరు చేయించి ప్రొసీడింగ్లు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు రాథోడ్ సజన్, తుల శ్రీని వాస్, మండల కన్వీనర్లు శివారెడ్డి, నారాయణ రెడ్డి, ప్రతాప్, గులాబ్, గఫ్ఫార్ పాల్గొన్నారు. -
రౌడీలూ.. తీరు మారాలి!
● కొరడా ఝళిపిస్తున్న పోలీసులు ● రంగంలోకి స్పెషల్ బృందాలు ● పద్ధతి మార్చుకోకుంటే నగర బహిష్కరణ ● జిల్లాలో 234 మందికి హెచ్చరిక మంచిర్యాలక్రైం: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో రౌడీషీటర్ల ఆగడాలపై పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా నిఘా పెంచారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 234 మందిపై రౌడీషీట్లు ఉన్నా యి. జిల్లాలో ఇటీవల రౌడీషీటర్ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. అంబర్ కిషోర్ ఝా బాధ్యతలు తీసుకున్న తర్వాత రౌడీ షీటర్లు, గంజాయి విక్రేతలు, పాత నేరస్తుల ఆట కట్టించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రత్యేకంగా స్పెషల్ పార్టీ బృందాలను రంగంలోకి దింపారు. ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలోని నిఘా వర్గాల ద్వారా రౌడీ షీటర్లు చేస్తున్న పనులపై ఆరా తీస్తున్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు.. రౌడీషీటర్ల ఆగడాలు, గంజాయి పాత నేరస్తుల అల్లర్లను అరికట్టేందుకు రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా 30మంది ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేశారు. అక్రమ దందాలు, సెటిల్మెంట్లు, గ్యాంగ్ దాడులు నిర్వహించే రౌడీ షీటర్ల ప్రభావం ఉండే ప్రాంతాల్లో సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. తమకు తాముగా మారితేనే రౌడీషీట్ తొలగిస్తామని, లేకుంటే పీడీయాక్ట్, నగర బహిష్కరణ చేస్తామని ఇప్పటికే పలువురు రౌడీ షీటర్లకు హెచ్చరికలు పంపారు. అమయాక ప్రజలను బెదిరింపులకు గురిచేస్తున్న రౌడీషీటర్ల జాబితా సిద్ధం చేసి ఆయా పోలీస్స్టేషన్లకు అందించారు. వీరి ఇళ్లపై డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేస్తూ వారి కదలికలపై నజర్ పెడుతున్నారు. రాజకీయ రంగు.. రౌడీషీటర్లు మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, తాండూర్, పెద్దపెల్లి జిల్లాల్లోని గోదావరిఖని, మంథని, ఎన్టీపీసీ పరిసర ప్రాంతాల్లో రియల్, వ్యాపార లావాదేవిల్లో, భూ వివాదాల్లో ఇటీవల రౌడీషీటర్ల జోక్యం పెరిగింది. కాగా కొంతమంది రౌడీషీటర్లను రాజకీయ నాయకులే పెంచి పోషిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా పోలీస్ రికార్డుల్లో రౌడీ షీటర్లుగా గుర్తింపు పొందిన వారి ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేందుకు పోలీస్ ఉన్నతాధికారులు తరుచుగా రౌడీ షీటర్లు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఇలా చేస్తే రౌడీషీటే.. ● కుట్రపూరితమైన ఆలోచనతో భూవివాదాల్లో జోక్యం చేసుకోవడం, దాడికి దిగడం. అల్లర్లు చేయడం. ● పంచాయతీల్లో తలదూర్చడం, దాడులు, కొట్లాటలు వంటి సంఘటనల్లో తరుచుగా పాలుపంచుకోవడం. ● సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడం. ● ఆడవాళ్లను తరుచూగా వేధింపులకు గురిచేయడం. ● నిత్యం నేరపూరితమైన సంఘటనలకు పాల్పడడం. మంచిర్యాల జిల్లాలో డివిజన్ల వారీగా రౌడీషీటర్లు.. మంచిర్యాల 82 జైపూర్ 31 బెల్లంపల్లి 121 నిరంతరం నిఘా.. రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు గ్యాంగ్ దాడులకు పాల్పడుతున్న వారిపై, పాత నేరస్తులు, రౌడీషీట్, గంజాయి నిందితులపై నిరంతరం నిఘా ఉంచాం. రౌడీ షీటర్లు వారి పద్ధతి మార్చుకోకపోతే నగర బహిష్కరణ చేస్తాం. – ఎగ్గడి భాస్కర్, డీసీపీ, మంచిర్యాల -
అరచేతిలో ‘నా పంచాయతీ’
అవగాహన కల్పించాలి పంచాయతీల సమగ్ర సమాచారం తెలుసుకునేందుకు మేరీ పంచాయతీ యాప్ ఉందని చాలా మంది ప్రజలకు తెలియదు. అధికారులు ఈ యాప్పై ప్రజలకు అవగాహన కల్పించాలి. – సుమన్, ధర్మారం యాప్తో సమగ్ర సమాచారం మేరీ పంచాయతీ యాప్తో పంచాయతీల సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. పంచాయతీలకు వచ్చే నిధులు, చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలు తెలుసుకోవచ్చు. ఈ యాప్పై పంచాయతీ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తారు. – శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి, నిర్మల్ లక్ష్మణచాంద: గ్రామ పంచాయతీల్లో చేపట్టే అభివృద్ధి పనులను ప్రజలు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మేరీ పంచాయతీ(నా పంచాయతీ)అనే యాప్ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఆదాయ, వ్యయాల్లో పారదర్శకత పాటించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు మంజూరు చేసే నిధులను పాలకవర్గాలు ఎలా ఖర్చు చేస్తున్నాయనే సమాచారం నేరుగా తెలుసుకోవచ్చు. ఈ యాప్ను 2019లో రూపొందించినప్పటికి కొన్ని సాంకేతిక కారణాల వల్ల పూర్తిస్థాయిలో అప్పట్లో అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం సమగ్ర సమాచారంతో అందుబాటులోకి వచ్చింది. వివరాలు తెలుసుకోవచ్చు పంచాయతీల్లో చేపట్టే అభివృద్ధి పనులు, వాటి వివరాలను జీపీ అధికారులు ఎప్పటికప్పుడు యాప్లో పొందుపరుస్తారు. ప్రభుత్వాలు ఏటా ఎన్ని నిధులు మంజూరు చేసింది, ఎంత ఖర్చయింది, తదితర పనులు ఏ దశలో ఉన్నాయో వివరాలు తెలుసుకోవచ్చు. ఈ నిధుల్లో సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చులు యాప్లో నమోదు చేస్తారు. ఇవే కాకుండా వచ్చే ఏడాది అంచనా వ్యయాల నమోదు, గ్రామసభల వివరాలను యాప్లో అందుబాటులో ఉంటాయి. వివరాలు నమోదు చేసే సమయంలోనే జీపీఆర్ఎస్ ద్వారా గుర్తించే అవకాశం ఉంది. కాగా, మేరీ పంచాయతీ యాప్పై విద్యావంతుల్లో కొందరికి తప్ప మిగిలిన వారికి తెలియదని తెలుస్తోంది. పంచాయతీ అధికారులు ఇప్పటికై నా స్పందించి పల్లెల్లో అవగాహన కల్పించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. డౌన్లోడ్ చేసుకోవాలి స్మార్ట్ఫోన్లో ప్లేస్టోర్కు వెళ్లి మేరీ పంచాయతీ యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ కావాలి. ఆ వెంటనే ఫైనాన్షియల్ ఇయర్, స్టేట్, జిల్లా, మండలం, పంచాయతీ వివరాలు నమోదు చేయాలి. వాటిని నమోదు చేయగానే పంచాయతీల వివరాలు కనిపిస్తాయి. గ్రామం పేరు, లేదంటే పిన్ కోడ్తో పంచాయతీల పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు అంటున్నారు. చేసిన పనుల ఫొటోలను యాప్లో పొందుపరుస్తారు. అందుబాటులోకి యాప్ నిధుల ఖర్చులో పారదర్శకతకు ప్రాధాన్యత ఆదాయ వ్యయాలు తెలుసుకునే అవకాశం పొట్టపెల్లి పంచాయతీ భవనం -
ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాతలమడుగు: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. మండలంలోని బరంపూర్ సమీపంలోని కొండపై శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భర్త దీపక్ తివారి కుటుంబ సభ్యులతో కలిసి శనివారం పూజలు నిర్వహించారు. మన మహోత్సవం సందర్భంగా ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో మాట్లాడుతూ విశాలమైన వాతావరణం చుట్టుపచ్చని కొండలు మనసుకి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఆలయ అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందిస్తానన్నారు. అనంతరం అదిలాబాద్ అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి ఆలయంలో పూజలు చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కేదారేశ్వర్ రెడ్డి, పూజారి స్వస్తిక్, స్వామి కమిటీ సభ్యులు బి.మల్లేశ్, రాజు రమాకాంత్ ఉన్నారు. -
బ్లాక్మెయిలింగ్ దందా గుట్టురట్టు
● 11 మందిపై కేసు, నలుగురి అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్టౌన్: భారీ బ్లాక్ మెయిలింగ్ గుట్టు రట్టయింది. నెలనెలా లక్షల్లో వసూళ్లు చేస్తూ, డబ్బులివ్వకుంటే చంపేస్తామంటూ వాహన యజమానులను బెదిరింపులకు పాల్పడుతున్న ముఠాను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాకేంద్రంలోని ఎస్పీ అఖిల్ మహాజన్ తన కార్యాలయంలో శనివారం ఈమేరకు వివరాలు వెల్లడించారు. తెలంగాణ–మహారాష్ట్ర గుండా వెళ్లే 44వ జాతీయ రహదారిపై అక్రమంగా తరలించే పశువుల వాహనాల వద్ద బ్లాక్ మెయిలింగ్ దందాలకు పాల్పడుతున్నారు. 11 మంది ముఠాగా ఏర్పడ్డారు. మహారాష్ట్రకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ సందీప్, జిల్లా కేంద్రానికి చెందిన రౌడీషీటర్ రోహిత్ షిండే కీలకంగా ఉన్నారు. పశువులను అక్రమంగా తరలించే వాహనాలను అక్రమంగా తనిఖీ చే స్తూ యజమానులు, డ్రైవర్లను బెదిరింపులకు పా ల్పడుతూ డబ్బులు వసూళ్లకు పాల్పడేవారు. డబ్బులు ఇవ్వకపోతే దాడి చేసి పోలీసులకు ఫిర్యాదులు చేస్తామంటూ బెదిరింపులకు గురిచేసేవారు. ఈ క్ర మంలో పోలీసులకు సమాచారం అందింది. నేరడిగొండలో నలుగురిని పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు ఎస్పీ తెలిపారు. వీరిలో నేరడిగొండకు చెందిన చేతన్ కుమార్, జంగిలి అన్వేష్, ఇచ్చోడకు చెందిన మసీద్ ఆనంద్, ఆదిలాబాద్కు మహ్మద్ మజార్ ఉన్నారని పేర్కొన్నారు. ఏడుగురు పరారీలో ఉన్నారు. మిగతా వారిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నేరడిగొండ పోలీసుస్టేషన్లో 11 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఇచ్చోడ సీఐ రాజు, నేరేడిగొండ ఎస్సై ఇమ్రాన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
వరద తగ్గింది.. బురద మిగిలింది
ఈ చిత్రంలో ఉన్నది రైతు మడే అక్షంతరావు. పెంచికల్పేట్ మండలం నందిగామ గ్రామశివారులో నాలుగెకరాల్లో పత్తి సాగు చేశాడు. మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ప్రాణహిత నదికి వరద పోటెత్తడంతో నాలుగెకరాల పత్తి నీట మునిగింది. సుమారు రూ.80 వేలు నష్టం వాటిల్లింది. తిరిగి పత్తి విత్తనాలు విత్తుకునే పరిస్థితి లేదని వాపోయాడు.వేలాది ఎకరాల నష్టం.. దహెగాంలో 12 గ్రామాలు, పెంచికల్పేటలో 8 గ్రామాలు, బెజ్జూర్లో 14 గ్రామాలు, చింతలమానెపల్లిలో 10 గ్రామాలు, కౌటాలలో 8 గ్రామాలు, సిర్పూర్లో 9 గ్రామాలు వరదల బారిన పడ్డాయి. ఈ ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోవడంతో పత్తి, వరి, ఇతర పంటలు మునిగిపోయాయి. పెంచికల్పేట మండలంలో మురళీగూడ, జిల్లెడ, నందిగామ, కమ్మర్గాం గ్రామాల్లో సుమారు 400 ఎకరాల పత్తి నీటమునిగింది. గతేడాది చింతలమానెపల్లిలో 1,200 ఎకరాల్లో పంటలు నష్టపోయినా, అధికారులు సర్వే నిర్వహించినప్పటికీ పరిహారం అందలేదు. చింతలమానెపల్లి/పెంచికల్పేట్/వేమనపల్లి: వానాకాలం ప్రారంభంలోనే ప్రాణహిత నది వరదలు కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల రైతుల పంటలను నాశనం చేశాయి. పత్తి మొక్కలు మొలకెత్తుతున్న తరుణంలో వచ్చిన ఈ వరదలు వేలాది ఎకరాల పంటలను తుడిచిపెట్టాయి. గత నాలుగేళ్లుగా ఇలాంటి వరదలతో నష్టపోతున్న రైతులు, అప్పుల భారంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు. ఈ కథనం ద్వారా వరదల ప్రభావం, రైతుల నష్టాలు, పరిహారం కోసం వారి ఆవేదనను వివరిద్దాం. వరదలతో పంట నష్టం.. ప్రాణహిత నది ఉధృతి కారణంగా కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని నదీతీర ప్రాంతాల్లో పత్తి పంటలు నీటమునిగాయి. వేమనపల్లి, కోటపల్లి, దహెగాం, బెజ్జూర్, కౌటాల మండలాల్లో వేలాది ఎకరాల పంటలు మూడు నాలుగు రోజుల పాటు నీటిలో మునిగి కుళ్లిపోయాయి. మొలక దశలోనే ఉన్న పత్తి మొక్కలు వరదలో కొట్టుకుపోయా యి. వరద తగ్గిన తర్వాత చేలల్లో ఒండ్రు మట్టి, బురద, ఇసుక మేటలు పేరుకుని, పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. మళ్లీ పంట వేసినా వరద ముప్పు తప్పదనే ఆందోళన రైతుల్లో నెలకొంది. నాలుగేళ్లుగా నష్టాలే.. గత నాలుగేళ్లుగా ప్రాణహిత నది వరదలు రైతుల పంటలను నాశనం చేస్తున్నాయి. అప్పులు చేసి పంట సాగు చేసిన రైతులు, నష్టాలతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. ఒక్కో ఎకరం పత్తి సాగుకు రూ.16 వేల నుంచి రూ.20 వేల ఖర్చవుతుందని, విత్తనాలు, ఎరువులు, కల్టివేటర్, కై కిలి ఖర్చులు తీర్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం, వేమనపల్లిలో 1,790 ఎకరాలు, కోటపల్లిలో 2,500 ఎకరాలు, బెజ్జూర్లో 1,200 ఎకరాలు, దహెగాంలో 900 ఎకరాలు, కౌటాలలో 1,800 ఎకరాల్లో పత్తి పంట నష్టపోయింది. రైతులు సమగ్ర సర్వే నిర్వహించి నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు. ప్రాణహిత–పెన్గంగ ప్రభావం.. సిర్పూర్(టి) నియోజకవర్గంలో ప్రాణహిత, పెన్గంగ నదులు ప్రవహిస్తాయి. సిర్పూర్(టి), కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, పెంచికల్పేట, దహెగాం మండలాల్లో ఈ నదుల తీర ప్రాంతాలు వరదల ప్రభావానికి గురవుతున్నాయి. మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు, పెన్గంగ, వార్దా తదితర నదులపై ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడం వల్ల ప్రాణహితలో నీటి ప్రవాహం పెరుగుతోంది. గోదావరిలో ఉధృతి పెరిగినప్పుడు ప్రాణహిత నది ప్రవాహం అడ్డుకోబడి, వరద నీరు నిలిచిపోతుంది. దీంతో నదిలో కలిసే వాగులు, కాలువల నీరు పరిసర భూముల్లోకి చేరి పంటలను నాశనం చేస్తోంది. ఈ వరదలు 3 నుంచి 15 రోజుల వరకు కొనసాగుతాయి. పరిహారం, నష్ట నివారణ చర్యల లేక.. ఏటా పంటలు మునిగినప్పటికీ, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందడం లేదు. ముంపు ప్రాంతాల ను గుర్తించి, ప్రత్యామ్నాయ పంటలు, రాయితీపై విత్తనాలు, ఎరువులు అందించడం వంటి చర్యలు చేపట్టడం లేదు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులకు ఈ ప్రాంతాలపై అవగాహన లేకపోవడం, వరద సమయంలో హెచ్చరికలు తప్ప మరో మద్దతు అందకపోవడంపై రైతులు విమర్శిస్తున్నా రు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఒత్తిడి తెచ్చేందుకు విఫలమవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.పంటల బీమా ఉంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంటల బీమా పథకం అమలులో ఉండేది. అయితే, తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు పంటల బీమా పథకాన్ని తిరిగి అమలు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతున్న రైతులకు ఆర్థిక మద్దతు అందక, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ చిత్రంలో ఉన్నది రైతు డగె అంకులు. గతేడాది ఏడు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ఎకరాకు సుమారు రూ.20 వేల పెట్టుబడి పెట్టాడు. గతేడాది వర్షాలతో దిందా గ్రామం సమీపంలోని వాగుకు వరదలొచ్చాయి. ప్రాణహిత నది ముంపు నీటిలో పత్తి మునిగింది. వారం రోజులకు పైగా వరద నీటిలో ఉండడంతో మొక్కలు కుళ్లిపోయాయి. సుమారు రూ.లక్షకుపైగా నష్టం వాటిల్లింది. అధికారులు పంట నష్టం సర్వే నిర్వహించినా పరిహారం అందించలేదు. పంటలను ముంచిన ప్రాణహిత ఆదిలోనే అన్నదాత ఆశలను తుంచిన వరద మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో వేల ఎకరాల్లో పంట నష్టం మళ్లీ విత్తనాలు విత్తుకోవాల్సిందే.. ఏటా నష్టపోతున్నా.. అందని పరిహారం -
‘సాహితీ విపంచి’ ఆవిష్కరణ
మంచిర్యాలఅర్బన్: పట్టణంలోని సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో జిల్లా సాహితీ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో శనివారం సాహితీ విపంచి సంపుటి–6ను కవి అన్వర్ అవిష్కరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 125 మంది కవులు రంచించిన సంపుటి పద్యవిభాగంలో 25 గేయ విభాగంలో 77 కవితలు రాయటం జరిగింది. ఈసందర్భంగా అన్వర్ మాట్లాడుతూ సాహితీ సంస్థ ఏర్పాటు చేసి 17 సంవత్సరాలుగా ప్రతీ మాసంలో రెండు సాహితీ కార్యక్రమాలు నిర్వహించటం గొప్ప విషయమన్నారు. కవులు మలయశ్రీ, ఐవీ సుబ్బాయమ్మ, సంస్థ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు అనంద్రావు, మహిళా కార్యదర్శి శ్రీలక్ష్మీ, శ్రీనాథ్గౌడ్ సాహితీ విపంచి పుస్తక సమీక్షించారు. ఈసందర్భంగా ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన కవులను శాలువాలతో సత్కరించి సాహితీ విపంచి సంపుటిని అందజేశారు. వ్యవస్థాపక అధ్యక్షుడు పట్వర్థన్, అధ్యక్షుడు వామన్రావు, కవులు చంద్రశేఖర్, బ్రహ్మయ్య, సంతోష్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
భైంసారూరల్: మండలంలోని తిమ్మాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందినట్లు ఎస్సై సుప్రియ తెలిపారు. కుంటాల మండలం అందకూర్ గ్రామానికి చెందిన బోండ రవి(23), శ్రీకాంత్లు శుక్రవారం స్నేహితుడి బర్త్డే పార్టీలో పాల్గొనేందుకు బైక్పై భైంసాకు వచ్చారు. పార్టీ ముగించుకుని తిరిగి వెళ్తున్నారు. మార్గమధ్యలో రాత్రి ఈదురుగాలులకు రోడ్డుకు అడ్డంగా చెట్టుకొమ్మ పడింది. బొండ రవి బైక్ డ్రైవింగ్ చేస్తున్న దాన్ని ఢీకొట్టి గాయాలపాలయ్యాడు. వెనుక కూర్చున్న శ్రీకాంత్కు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు వారిని అంబులెన్సులో నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలో బొండ రవి మృతిచెందాడు. మృతుడి తల్లి నీలాబయి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. యువకుడిని కాపాడిన పోలీసులుకడెం: కడెం ప్రాజెక్ట్లో దూకి ఆత్మహత్య చేసుకుందామని వెళ్లిన యువకుడిని పోలీసులు కాపాడారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం బుగ్గారం గ్రామానికి చెందిన రాథోడ్వంశీ మండలంలోని డ్యాంగూడకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. గతకొన్ని రోజుల నుంచి భార్య కాపురానికి రావడం లేదని శనివారం డ్యాంగూడకు వచ్చిన వంశీ మామతో గొడవపడి మనస్తాపం చెందాడు. ఆత్మహత్యకు చేసుకుందామని ప్రాజెక్ట్ వద్దకు వచ్చాడు. విషయం తెలుసుకున్న వంశీ మామ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై పి.సాయికిరణ్ సిబ్బందిని హుటాహుటిన ప్రాజెక్ట్ వద్దకు పంపించారు. కానిస్టేబుళ్లు భీంరావు, షాకీర్ అతన్ని కాపాడారు. పురుగుల మందు తాగినట్లు చెప్పడంతో అంబులెన్స్లో ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అధిక వడ్డీ వసూలు చేస్తున్న ముగ్గురిపై కేసుఆదిలాబాద్టౌన్: అమయాకప్రజల నుంచి అధిక వడ్డీ వసూలు చేస్తున్న ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ సునీల్కుమార్ తెలిపారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో పట్టణంలోని అంబేద్కర్నగర్కు చెందిన బంగారి బాలాజీ –రంజనబాయి దంపతుల ఇంట్లో సోదాలు నిర్వహించారు. అదే కాలనీలో దీపక్ ఇంట్లో సైతం తనిఖీలు చేశారు. వారి వద్ద నుంచి ప్రామిసరీ నోట్లు, సెల్ డీడీలు, బ్యాంకు చెక్లు ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పుస్తక పఠనం అలవర్చుకోవాలి
సాత్నాల: విద్యార్థులు పుస్తకాలు చదవడం అలవర్చుకోవాలని, పుస్తక పఠనమే భవిష్యత్లో అగ్రగణ్యులుగా నిలుపుతుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. భోరజ్ మండలం పిప్పర్వాడలోని అభ్యుదయ పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కవి బి.మురళీధర్ రచించిన ‘మౌనం ఎరుపు’ పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించగా ఇటీవల హిందీలోకి అనువాదమైన మోర్ పంకిపేడ్ పుస్తకాన్ని పాఠశాల యాజమాన్య సభ్యులు రాధాకృష్ణ, వెంకటరమణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు పఠానసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. నేటి ఆధునిక ప్రపంచంలో డిజిటలైజేషన్ ద్వారా ఎన్నో రకాల సాహిత్యం, రచనలు అందుబాటులోకి వచ్చినప్పటికీ భౌతికంగా ఒక పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని చదివేటప్పుడు కలిగే అనుభూతి అనిర్వచనీయమన్నారు. జిల్లా సంస్కృతి, భౌగోళిక విశిష్టతను ప్రతిబింబించే సాహిత్యాన్ని ప్రతి ఒక్కరూ చదవాలన్నారు. పీఎం శ్రీ పాఠశాలల్లో ప్రత్యేక గ్రంథాలయాలు ఏర్పాటు చేసి జిల్లా కవుల రచనలు కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రముఖ నవలా రచయిత వసంత్రా దేశ్పాండే అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పుస్తక రచయిత బి.మురళీధర్, విజయ డెయిరీ జనరల్ మేనేజర్ మధుసూదన్రావు, అభ్యుదయ పాఠశాల యాజమాన్య సభ్యులు సర్సన్ వెంకట్రెడ్డి, రచయితలు రాజవర్ధన్, మన్నె ఏలియా, చిందం ఆశన్న, చరన్దాస్, అశోక్, తదితరులు పాల్గొన్నారు. ● కలెక్టర్ రాజర్షి షా -
పట్టణంలో కేంద్ర బృందం పర్యటన
కై లాస్నగర్: మున్సిపాలిటీల అభివృద్ధితో పాటు ఆదాయ వనరులను పెంపొందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అర్బన్ చాలెంజ్ ఫండ్ స్కీం’ కింద ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎంపికై న విషయం తెలిసిందే. పథకం కింద టీయూఎఫ్ఐడీసీ ద్వారా మున్సిపాలిటీకి రూ.900 కోట్ల నిధులు కేటాయించనున్నారు. ఈ నిధులతో పట్టణంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టవ చ్చు, పట్టణ ఆదాయాన్ని ఏ విధంగా పెంచుకోవచ్చని అధ్యయనం చేసేందుకు అశి పౌల్, ఎన్.వినయ్కాంత్లతో కూడిన ఇద్దరు సభ్యుల బృందం శనివారం ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో పర్యటించింది. కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాలు, వాకింగ్ ట్రాక్ వంటి ఇతరాత్ర వసతులను కల్పించేందుకు వీలుగా పట్టణంలోని పాత జాతీయ రహదారితో పాటు ప్రధాన చౌక్లు, ఖానాపూర్ చెరువు, ఇంటిగ్రేటేడ్ మార్కెట్, గాంధీ పార్కు, నేతాజీచౌక్, ఖుర్షీద్నగర్లోని మున్సిపల్ లీజు స్థలాలను పరి శీలించారు. అంతకు ముందు మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజును కలిసి పట్టణంలోని వార్డులు, జనా భా, ప్రాపర్టీ ట్యాక్స్, ఇతర మార్గాల్లో వచ్చే ఆదా యం వంటి సమగ్ర సమాచారం సేకరించారు. నివేదికను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖకు అందించనున్నా రు. కార్యక్రమంలో ఎంఈ పేరిరాజు, డీఈ కార్తీక్, టౌన్ ప్లానింగ్ అధికారులు సుమలత, నవీన్ కుమార్, సానిటరీ ఇన్స్పెక్టర్ ఎం.నరేందర్ పాల్గొన్నారు. -
ఆలయాన్ని అభివృద్ధి చేసి తీరుతాం
● వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి ● పర్యాటకంగానూ తీర్చిదిద్దుతాం ● మంత్రులు కొండా సురేఖ, వివేక్ ● బాసర ఆలయంలో ప్రత్యేక పూజలు ● ధర్మశాల పునరుద్ధరణ ప్రారంభం ● ట్రిపుల్ఐటీ కళాశాల సందర్శన భైంసా/బాసర: బాసర శ్రీజ్ఞానసరస్వతీ ఆలయాన్ని నభూతో న భవిష్యత్ అన్న రీతిలో అభివృద్ధి చేసి తీరుతామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు. శనివారం కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సురేఖ సరస్వతీ అమ్మవారి ప్రాశస్త్యాన్ని వివరించారు. బాసర అభివృద్ధికి డీపీఆర్ సిద్ధం చేశామని చెప్పారు. త్వరలోనే సీఎం రేవంత్రెడ్డి ఆమోదంతో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఆలయ అభివృద్ధిని విస్మరించిందని ఆరోపించారు. బాసర ఆలయ అభివృద్ధికి అవసరమై కేంద్రం నిధులు రాబట్టేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీల సహకారం తీసుకుంటామని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతోనూ చర్చించి పర్యాటకంగా బాసర క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులిచ్చి అందులో రూ.8 కోట్లే ఖర్చు చేసి మిగతా వాటిని వెనక్కి తీసుకుందని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం వెనక్కి వెళ్లిన నిధులు విడుదల చేయాలని కోరారు. పవర్పాయింట్ ప్రజెంటేషన్ బాసర సరస్వతీ అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులను నాలుగు భాగాలుగా కేటాయించి రూపొందించిన పవర్పాయింట్ ప్రజెంటేషన్ను కలెక్టర్ అభిలా ష అభినవ్, దేవాదాయ శాఖ అధికారులు ప్రదర్శించారు. మొదటిభాగంలో అమ్మవారి ఆలయ విస్తరణ, క్యూకాంప్లెక్స్లు, గర్భగుడి విస్తరణ, చుట్టూ ప్రాకారాల నిర్మాణాలు ప్రదర్శించారు. పక్కనే గుట్ట పై మరో వంద గదుల సత్రం, 300 కార్లు నిలిపేలా పార్కింగ్ స్థలంతో నమూనాను సిద్ధం చేశారు. రెండవ ప్రదర్శనలో బాసర గోదావరినదికి వెళ్లే మార్గంలో అమ్మవారి ఆలయానికి సంబంధించిన ఎని మిది ఎకరాల్లో 50 అడుగుల సరస్వతీ ఆలయం, లేజర్ ప్రదర్శన, భక్తులు సేద తీరేలా డార్మెంటరీ నిర్మాణం చేపట్టేలా, రాత్రి వేళ ప్రదర్శనలు ఇచ్చేలా నమూనాలు రూపొందించారు. ఇక అమ్మవారి ఆలయానికి ఆదాయం వచ్చేలా ఓ కన్వెన్షన్ హాల్ నిర్మించేలా ప్రతిపాదించారు. పలు ప్రైవేట్ కంపెనీల స మావేశాలు, వివాహాలు, శుభకార్యాల నిర్వహణపై వచ్చే ఆదాయం పెరిగేలా నమూనా వేశారు. మూ డో ప్రదర్శనలో బాసర గోదావరినది తీరంలో అమ్మవారి ఆలయానికి సంబంధించి మరో 20 ఎకరాలకుపైగా భూములున్నాయి. ప్రస్తుతం నది ఒడ్డు నే పిండ ప్రదానం, పక్కనే శివాలయం, అటు పక్క నే అల్పహారాల విక్రయ కేంద్రాలు కనిపిస్తుంటా యి. అలా కాకుండా పిండ ప్రదానాలకు వేరే చోట నిర్మాణాలు, శివాలయాన్ని విస్తరించడం, సువిశాలంగా ఉన్న స్థలాన్ని అందంగా తీర్చిదిద్దితే గోదావ రి నది దృశ్యాలు ఆహ్లాదం పంచేలా నిర్మాణాలు చేపట్టే నమూనాను వివరించారు. నాలుగో ప్రదర్శనలో బాసర రైల్వేస్టేషన్ సమీపంలో ఆలయానికి సంబంధించిన భూమిలో సిబ్బంది, ఉద్యోగులకు వసతి సౌకర్యంతోపాటు భక్తులకు విశ్రాంతి భవనం నిర్మించేలా నమూనా రూపొందించారు. ప్రైవేట్ వాహనాలు నిలిపి భక్తులను అమ్మవారి క్షేత్రానికి తరలించేలా.. ఆన్లైన్లో వెహికిల్ బుకింగ్ చేసుకునేలా కౌంటర్లు ఏర్పాటు చేయాలని నమూనాలో వివరించారు. రైలు మార్గం ద్వారా వచ్చే భక్తులు అక్కడే విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు చేయాలని ఇందులో చర్చించారు. ట్రిపుల్ఐటీలో మొక్కలు నాటి.. వనమహోత్సవంలో భాగంగా బాసర ట్రిపుల్ఐటీలో అటవీశాఖ మంత్రి కొండా సురేఖ మొక్కలు నాటారు. అనంతరం కాన్ఫరెన్స్ హాల్లో ఆమె మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ బాసరలో ట్రిపుల్ఐటీ నెలకొల్పడంతోనే ఇప్పుడు వేలాది మంది విద్యార్థులకు విద్య, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయన్నారు. సమస్యలపై కలెక్టర్ నివేదిక పంపితే సీఎంతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ఐటీ అభివృద్ధికి నిధులివ్వాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ అభిలాష అభినవ్, ట్రిపుల్ఐటీ వీసీ గోవర్ధన్, ఎస్పీ జానకీ షర్మిల, మాజీ ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, నారాయణరావుపటేల్, వేణుగోపాలాచారి పాల్గొన్నారు. నిరాహార దీక్షకు దిగుతా.. బాసర అమ్మవారి ఆలయ అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆరోపించారు. మాస్టర్ ప్లాన్ అమలుపై తమకు మళ్లీ నిరాశే మిగిలిందన్నారు. ఆలయ గర్భగుడి, ఇతర అభివృద్ధి పనుల విషయంలోనూ ప్రభుత్వంతోపాటు మంత్రులను పలుసార్లు కలిశాన ని, అసెంబ్లీలోనూ ప్రస్తావించానన్నారు. వచ్చే దసరా, దీపావళి వరకై నా నిధులిచ్చి అభివృద్ధి చేయాలని కోరారు. లేని పక్షంలో తాను అమ్మవారి ఆలయం ఎదుట నిరాహార దీక్షకు దిగుతానని తెలిపారు. ప్రభుత్వం నిధులివ్వకుంటే భిక్షమైత్తెనా ఆలయాన్ని బాగు చేసుకుంటామని చెప్పారు. ఆలయానికి బెంగళూర్కు చెందిన ఓ దాత రూ.4 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే ప్రకటించారు. -
● అధ్యక్షుడి ఎంపికపై ఉత్కంఠ ● ప్రాధాన్యత సంతరించుకున్న ఎమ్మెల్యే బొజ్జు వ్యాఖ్యలు ● సమీకరణాల నేపథ్యంలో ఎవరికి దక్కనుందోననే చర్చ ● హస్తం పార్టీలో ఆసక్తికరంగా పరిణామాలు
జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఇన్చార్జి, ఎంపీ అనిల్ కుమార్ (ఫైల్) జిల్లా అధ్యక్షుడి ఎంపికలో అందరి ఆమోదం తీసుకోవాలి.. ఏకపక్షంగా నిర్ణయం ఉండరాదు.. అందరూ సూచించిన నాయకుడినే ఎంపిక చేయాలి.. జనబలం ఉండాలి.. కొంతమంది వద్ద డబ్బు ఉంటుంది కానీ, కార్యకర్తల అండ ఉండదు.. ఎవరు ఏమీ అనేదీ మాకు తెలుసు.. కొంతమంది వ్యవహారశైలి వల్లే సీతక్క వేరే జిల్లాకు వెళ్లిపోయింది.. ఆమెను అడిగినా జిల్లా నాయకుల వ్యవహారశైలి తెలిసి పోతుంది.. కార్యకర్తలు ప్రతిపాదించే పేరునే ఎంపిక చేయాలి.. లేనిపక్షంలో నేను ఎక్కడికి పోవాలో అక్కడికి వెళ్తాను.. నాకు కూడా మార్గాలు ఉన్నాయి.. ఈ మాటలన్నీ అన్నది ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు.. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ఈ మాటలు అన్నారు.. అదీ కూడా పార్టీ సంస్థాగత జిల్లా ఇన్చార్జీ, రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్ కుమార్యాదవ్ ఎదుట.. ప్రస్తుతం పార్టీలో ఈ వ్యాఖ్యలు చర్చనీయంగా మారాయి. సాక్షి, ఆదిలాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎంపికకు ముహూర్తం దగ్గరపడుతోంది. మరో రెండు, మూడు రోజుల్లో డీసీసీ అధ్యక్షుడు ఎవరు అనేది నిర్ణయం జరుగుతుందని పార్టీలో చెప్పుకుంటున్నారు. తుదిదశకు ఈ ప్రక్రియ రాగా ఎంపిక కోసం పరిశీలనకు వచ్చిన జిల్లా ఇన్చార్జి సమక్షంలోనే ఎమ్మెల్యే బొజ్జు ఈ వ్యాఖ్యలు చేయడం, ఆయన జిల్లా నేతల్లో ఎవరిని విభేదిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారోనని పార్టీలో నలుగురు కలిసిన ప్రతీచోట చర్చించుకుంటున్నారు. ఆత్రం సుగుణ వర్గం గురించేననీ.. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో గతంలో పార్లమెంట్ ఎన్నికలు, ఆతర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలు కావడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత హైదరాబాద్ గాంధీభవన్ స్థాయిలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమక్షంలో ఈ పార్లమెంట్ పరిధిలోని ముఖ్యనేతలతో పలు సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లోనే జిల్లాలో గ్రూపు తగదాల కారణంగా పార్టీ ఓటమిపాలైందని, గ్రూపులకు కొంతమంది నేతల వ్యవహారశైలే కారణమని మీనాక్షి సమక్షంలోనే పలువురు ప్రస్తావించారు. కాగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఉన్న ఆత్రం సుగుణ మధ్య కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకుని వార్ కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీచేసిన ఆత్రం సుగుణ ప్రధానంగా తన ఓటమికి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యమైన నాయకులు సహకరించకపోవడంతోనేనని అప్పట్లో ఆరోపణలు చేశారు. అప్పటి నుంచే ఈ ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య తగదా మొదలైంది. ఇద్దరు ఖానాపూర్ నియోజకవర్గానికే చెందిన ఎస్టీ నేతలే కావడంతో భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకునే ఈ వార్ జరుగుతోందని పార్టీలో చర్చ సాగుతుంది. తాజాగా మళ్లీ జిల్లా అధ్యక్షుడి ఎంపికలో ఈ వివాదం తీవ్రస్థాయిలో జరుగుతోంది. ఆత్రం సుగణ తన వర్గానికి చెందిన నాయకుడికి అధ్యక్ష పదవి ఇప్పించే విషయంలో ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఆ ప్రక్రియను విభేదిస్తూ ఈ వ్యాఖ్యలు చేసారని చెప్పుకుంటున్నారు. తుదిదశకు వచ్చినట్టేనా.. ప్రధానంగా పార్టీ పరంగా పరిశీలకులు పట్టణం, మండలం వారీగా సమావేశాలు నిర్వహించి ఇటు బూత్ స్థాయి నుంచి మొదలుకుంటే గ్రామ, మండల, బ్లాక్ స్థాయి కమిటీల నియామకం కోసం విస్తృతంగా పర్యటించారు. ప్రతీ కమిటీకి సంబంధించి ఐదేసి పేర్లను సేకరించి అధిష్టానానికి పంపించారు. ఇక ఈ కమిటీల నియామకం జరుగుతుందనే దశలో వేరువేరు జిల్లాలతో పాటు మన జిల్లాలోనూ వివాదం నెలకొనడంతో ప్రక్రియ అలాగే నిలిచిపోయింది. దీంతో ఇప్పటి వరకు ఏ ఒక్క కమిటీ కూడా నియామకం కాలేదు. తాజాగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఈ కమిటీల ఏర్పాటు విషయంలో సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోనే ఉమ్మడి జిల్లాలకు ఇద్దరేసి ఇన్చార్జీలను నియమించి ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, జిల్లా కమిటీలను కూడా 15వ తేదీ తర్వాత ఎప్పుడైనా పూర్తి చేసేలా ఇన్చార్జీలు బాధ్యత తీసుకోవాలని ఆమె నిరంతరం వారితో జూమ్ సమావేశంలో మాట్లాడుతూ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్ జిల్లాకు రావడం జరిగింది. ఇక కమిటీలను ప్రకటించడమే తరువాయి అని పార్టీలో చెప్పుకుంటున్నారు. జిల్లా కమిటీ కూడా ప్రకటించడంతో పాటు డీసీసీ ఎవరనేదీ కూడా తేల్చేయనున్నట్లు చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే ఉమ్మడి జిల్లాలో ఈ అధ్యక్షుల ఎంపిక పరంగా సామాజిక సమీకరణలను ప్రధానంగా తీసుకుని ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు సంబంధించి మాత్రం జనరల్ కేటగిరీలో ఎవరినైనా అధ్యక్షుడిగా నియమించవచ్చని అంటున్నారు. ఇలా ప్రక్రియ తుదిదశకు రాగా తాజాగా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
పూలే దంపతుల స్ఫూర్తితో రాణించాలి
ఆదిలాబాద్రూరల్: భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే, సామాజిక ఉద్యమ పితామహుడు మహాత్మ జ్యోతిరావు పూలే దంపతుల స్ఫూర్తితో విద్యార్థులు చదువులో రాణించాలని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో గల పూలే విశ్రాంతి భవనంలో పదోతరగతిలో టాపర్స్గా నిలిచిన మాలీ సామాజిక వర్గానికి చెందిన తాంసి మండలం కప్పర్ల హై స్కూల్ విద్యార్థి దారట్ల కీర్తిలయ, తలమడుగు మండలం కుచాలాపూర్కు చెందిన సెండే సమీక్షను సత్కరించి నగదు పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేష్ గురునులే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న శేండే, రాష్ట్ర కోశాధికారి సతీష్ గురునులే, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అడ్వకేట్ ఉమేష్ రావు డోలే, మాలీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ అంబేకర్, పట్టణ అధ్యక్షుడు శ్రీను ఆచారి, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీఐ పేరిట అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
ఆదిలాబాద్టౌన్: సమాచార హక్కు చట్టాన్ని (ఆర్టీఐ) అడ్డు పెట్టుకుని అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా బ్లాక్ మెయిలింగ్కు పాల్పడిన వారిపై ఇదివరకు రెండు కేసులు నమోదు చేశామన్నారు. ఆదిలాబాద్ పట్టణా నికి చెందిన సోమ రవి, డీవీఆర్ ఆంజనేయులుపై వన్టౌన్లో కేసు నమోదు చేశామన్నా రు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాన్ని బ్లాక్మెయిలింగ్కు పాల్పడిన షేక్ యూసఫ్, ఎండీ ఆర్షద్, షేక్ సమద్పై టూటౌన్లో ఇటీవల కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆర్టీఐ సమాచారం అత్యధికంగా సేకరించిన వారిపై ప్రత్యేక బృందం ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. -
నిబంధనలకు విరుద్ధంగా వైద్యంచేస్తే చర్యలు
బోథ్: నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తే కఠినచర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి నరే ందర్ రాథోడ్ అన్నారు. శనివారం మండలంలోని పొచ్చర సబ్సెంటర్ను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. అనంతరం గ్రామంలో నిబంధనల కు విరుద్ధంగా నడుస్తున్న ఆర్ఎంపీ క్లినిక్ను గుర్తించి సీజ్ చేశారు. అక్కడ నిర్వహిస్తున్న వైద్యం అర్హతకు మించి ఉందని, ప్రజల ప్రాణా లకు ప్రమాదమన్నారు. ఆర్ఎంపీలకు కేవలం ప్రాథమిక చికిత్సకు మాత్రమే అనుమతులు న్నాయని, డాక్టర్ అనిపించుకునే హక్కు లేదన్నారు. ప్రజలు అర్హత గల ఎంబీబీఎస్ వైద్యు ల వద్దే వైద్యం చేయించుకోవాలన్నారు. ఆయ న వెంట మలేరియా అధికారి డాక్టర్ ఎం.శ్రీధర్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నవీన్ రెడ్డి ఉన్నారు. -
ప్రతీ కేసులో సీఐ స్థాయి పర్యవేక్షణ ఉండాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: ప్రతీ కేసులో సీఐ అధికారి పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్క్వార్టర్స్లో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ శనివారం సర్కిల్ అధికారితో కోర్టు డ్యూటీ అధికారులు సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. కోర్టుకు హాజరు కాని నిందితులకు నాన్బెయిల్ వారెంట్ వచ్చేవిధంగా చూడాలన్నారు. కేసుల దర్యాప్తు పురోగతిపై పర్యవేక్షించాలన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన కోర్టు డ్యూటీ అధికారులకు నగదుతో పాటు ప్రశంస పత్రాలు అందజేస్తామన్నారు. నేరస్తులకు శిక్ష పడుతున్న సందర్భంలో సమాజం సన్మార్గం వైపు పయనించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, కోర్టులో శిక్ష పడే విధంగా కృషి చేయాలన్నారు. హెడ్కానిస్టేబుల్, ఏఎస్సైలకు ప్రత్యేక శిక్షణ జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లలో దర్యాప్తు చేస్తున్న హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సైలతో జిల్లా కేంద్రంలోని హెడ్క్వార్టర్స్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వీలైనంత వరకు కేటాయించిన కేసుల్లో సక్రమంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. పార్ట్–1, పార్ట్–2, సీజర్, పంచనామాలు నిర్వహించి దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఇన్స్పెక్టర్లు ప్రేమ్కుమార్, గుణవంత్రావు, అంజమ్మ, కోర్టు లైజన్ అధికారులు, కోర్టు డ్యూటీ అధికారులు, ఏఎస్సైలు, హెడ్కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
ఆదిలాబాద్అర్బన్: ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఔట్ సోర్సింగ్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీను అన్నారు. హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన మహాధర్నాలో పాల్గొనేందుకు శనివారం ఉదయం సంఘం నాయకులు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి ఏటా రూ.వెయ్యి ఇంక్రిమెంట్ ఇవ్వాలని, మహిళలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని, ఉద్యోగి మరణిస్తే రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెళ్లిన వారిలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామగిరి సంతోష్, పుల్లూరి రవి, దాసు జ్ఞానేందర్, తోట రాజు, శైలేందర్, రవికిరణ్ యాదవ్, రాహుల్, విజయ్, ఓంకార్, సాయి కృష్ణ, సాయి, ఆశీష్, వేణు, అక్షయ్, శ్రీనివాస్, పవన్, తదితరులు ఉన్నారు. -
ఆదివాసీలకు ప్రత్యేక కాలం కేటాయించాలి
ఆదిలాబాద్అర్బన్: జనగణనలో ఆదివాసీలకు ప్రత్యేక కాలం కేటాయించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. శనివారం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా నగరంలో ఆదివాసీ అధికార్ రాష్టీయ్ర మంచ్ జాతీయ సమావేశాలకు తెలంగాణ నుంచి హాజరయ్యారు. ఆదివాసీలు ఆస్తిత్వ, సంప్రదాయం, గోండి ధర్మ, ప్రకృతి ఆరాధకులుగా ఉన్న వారికి జనగణనలో పత్యేక మతానికి సంబంధించి కాలం కేటాయించకుండా అన్యా యం చేశారని ఆరోపించారు. కుమురం భీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ఫార్డెస్ పేరిట తీసుకొచ్చిన జీవో 49 రద్దు చేయాలన్నారు. అటవీ సంపద కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. -
నిజంగా ఇది హాస్టలే.. నమ్మండి బాబూ!
ఆదిలాబాద్ జిల్లా మావల మండల కేంద్రంలోని ఈ భవనంలో జైనథ్ మండలానికి చెందిన మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర వసతిగృహాన్ని నిర్వహిస్తున్నారు. పదేళ్లుగా అద్దె భవనంలో కొనసాగుతోంది. ఈ పాఠశాలలో 600 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. భవనం శిథిలమై అసౌకర్యంగా మారడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భవనానికి కిటికీలు సైతం లేకపోవడంతో.. ఇటీవలి వర్షాలకు నీరు లోపలకు రాకుండా గోనె సంచులు, చద్దర్లు, అట్టముక్కలు కడుతున్నారు. వర్షాకాలం కావడంతో పురుగు, పుట్రతో భయంభయంగా కాలం వెళ్లదీస్తున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్మక్క బుట్టలకు మస్తు గిరాకీ నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామం పచ్చి మక్క బుట్టలకు చిరునామాగా నిలిచింది. చేతికి వచ్చిన బుట్టలను డజన్ రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. ఆటో ట్రాలీ మక్క బుట్టల ధర రూ.8 వేల నుంచి రూ.9 వేల వరకు పలుకుతోంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల్, కరీంనగర్, మంచిర్యాల్, మహారాష్ట్ర, చుట్టు పక్కల ప్రాంతాల వ్యాపారులు మక్కబుట్టలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. అంకాపూర్ మార్కెట్ శుక్రవారం పచ్చి మక్క బుట్ట విక్రయాలతో సందడిగా మారింది. సీజన్లో ఉదయం 5 గంటల నుంచి.. ఉదయం 9 గంటల వరకు హోల్సేల్ వ్యాపారం సాగుతోంది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్చదవండి: మేకల కల్యాణి.. నీకు హ్యాట్సాఫ్ -
అంతా.. మా ఇష్టం!
● జిల్లాలో విద్యాశాఖ తీరిది ● కేజీబీవీ సీఆర్టీ పోస్టుల భర్తీలో నిర్లక్ష్యం ● 7వ ర్యాంకర్కు బదులు తదుపరి అభ్యర్థికి పోస్టింగ్ ● ఆరు నెలల తర్వాత వెలుగులోకి..ఆదిలాబాద్టౌన్: ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా జిల్లా విద్యాశాఖ తీరు మాత్రం మారడం లేదు. నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంచి ర్యాంకులు తెచ్చుకున్న వారికి కాకుండా అనర్హులకు పోస్టింగ్ ఇస్తూ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు డీఎస్సీ ప్రక్రియలో పలు తప్పిదాలు చేసిన అధికారులు మళ్లీ పునరావృతం చేశారు. కేజీబీవీలో సీఆర్టీ పోస్టుకు సంబంధించి ఈ తతంగం ఆలస్యంగా బయటకు వచ్చింది. ఆరు నెలల క్రితం కేజీబీవీ ఉద్యోగాల ప్రక్రియలో అర్హులైన అభ్యర్థికి కాకుండా ఆ తర్వాత ర్యాంక్ వచ్చిన వారికి పోస్టింగ్ కల్పించారు. ఇటీవల కేజీబీవీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వెలువడడంతో సదరు అభ్యర్థి విద్యాశాఖ కార్యాలయానికి వెళ్లి వెకెన్సీల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎస్టీ రోస్టర్లో ఇదివరకే పోస్టు భర్తీ అయ్యిందని, ఇప్పుడు ఆ పోస్టు ఖాళీగా లేదనడంతో ఆమె అవాక్కయ్యారు. తనకు దక్కాల్సిన పోస్టు మరో అభ్యర్థికి ఇచ్చారని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, పరిశీలిస్తామంటూ దాటవేశారు. దీంతో ఆమె విద్యాశాఖ కార్యాలయంలోని ఇన్వార్డులో ఫిర్యాదు చేశారు. తర్వాత కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో విషయం బయటకు వచ్చింది. అసలేం జరిగిందంటే.. గత డిసెంబర్లో కేజీబీవీలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. సీనియారిటీ జాబితాలో ఉన్న అభ్యర్థులకు ఫోన్ చేసి సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని సూచించారు. 1:2 ప్రకారం వెరిఫికేషన్ జరిగింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఫిజికల్ సైన్స్లో రోస్టర్ నం.8కి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. 2023 జూన్ 16న రాత పరీక్షలో అర్హత సాధించి మెరిట్, రోస్టర్ ప్రకారం పోస్టు భర్తీ చేయాలి. అయితే ఫిజికల్ సైన్స్లో 7వ ర్యాంక్ అభ్యర్థి జాదవ్ జ్యోతికి బదులు ఆ తర్వాత ర్యాంక్ ఉన్న అభ్యర్థికి పోస్టింగ్ ఇచ్చారు. సదరు అభ్యర్థికి ఈ విషయం తెలియదు. ఇటీవల మళ్లీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో డీఈవో కార్యాలయానికి వెళ్లి పోస్టుల గురించి ఆరా తీయగా ఇదివరకే ఆ పోస్టు భర్తీ అయ్యిందని చెప్పడంతో ఖంగుతిన్నారు. తనకు దక్కాల్సిన పోస్టును మరొకరికి ఇచ్చారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల తీరుపై కలెక్టర్ ఫైర్.. ఒకరికి బదులు మరొకరికి పోస్టింగ్ ఇవ్వడంపై విద్యాశాఖ అధికారులను పిలిచి కలెక్టర్ రాజర్షిషా ఫైర్ అయ్యారు. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు అధికారులు ఏదో ఒకటి చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే 8వ ర్యాంక్ అభ్యర్థిని తొలగించి 7వ ర్యాంక్ అభ్యర్థికి పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో సదరు అభ్యర్థి సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించారు. ఇదిలా ఉండగా ఈ తప్పిదం కావాలనే చేశారా.. లేక పొరపాటు జరిగిందా అనేది తెలియడం లేదు. సెక్షన్ క్లర్క్, సూపరింటెండెంట్, కేజీబీవీ సెక్టోరియల్ అధికారి, విద్యాశాఖ ఏడీ, డీఈవో, ఆ తర్వాత వెరిఫికేషన్ కమిటీ సభ్యులు పరిశీలిస్తారు. ఇంతమందిలో నుంచి ఏఒక్కరు కూడా విషయాన్ని పసిగట్టకపోవడంపై ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పొరపాటు జరిగింది..గత డిసెంబర్లో జరిగిన కేజీబీవీ సీఆర్టీ ప్రక్రియలో పొరపాటుతో వేరే అభ్యర్థికి పోస్టింగ్ కల్పించడం జరిగింది. రోస్టర్ నం.8 ఉండడంతో ర్యాంక్ అదే అనుకొని పోస్టింగ్ ఇచ్చాం. ఇటీవల సదరు అభ్యర్థి మా దృష్టికి తీసుకొచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ తప్పిదాన్ని సవరించి ఏడో ర్యాంక్ అభ్యర్థికి పోస్టింగ్ కల్పిస్తాం. – ఉదయశ్రీ, కేజీబీవీ సెక్టోరియల్ అధికారి -
పనిచేసే వారికే పదవులు
కై లాస్నగర్: కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన వారికే తగిన గుర్తింపు లభిస్తుందని రాజ్యసభ సభ్యుడు, పార్టీ సంస్థాగత ఉమ్మడి జిల్లా ఇన్చార్జి ఎం.అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పట్టణ శివా రులోని రత్నాగార్డెన్లో శుక్రవారం నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రేణులనుద్దేశించి మా ట్లాడారు. గతంలో జిల్లా అధ్యక్ష పదవీ గాంధీభవన్ నుంచి పేరును ఢిల్లీకి సిఫారసు చేసిన వ్యక్తికే వచ్చేదన్నారు. ప్రస్తుతం పార్టీశ్రేణల అభిప్రాయం మేరకే అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందన్నారు. సామాజిక వర్గాల సమతుల్యత ఆధారంగా అన్ని వర్గాలతో కూడిన జిల్లా కాంగ్రెస్ కమిటీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఎన్నికల సమయంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42శా తం రిజర్వేషన్లను కల్పించేలా సీఎం రేవంత్రెడ్డి నే తృత్వంలోని కేబినెట్ తీర్మానం చేసిందని గుర్తుచేశా రు. కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం పనిచేస్తోందన్నారు. రానున్న రోజుల్లో కష్టపడి పని చేస్తే అందరికీ పదవులు దక్కనున్నాయన్నారు. పునర్విభజనతో రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య 153కు పెరుగనుందన్నారు. దీంతో మహిళలకు పెద్దఎత్తున అవకాశాలు రానున్నాయని తెలిపారు. మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి ఆశీర్వాదంతో తాను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలుపొందినట్లుగా గుర్తుచేశారు. పార్టీ పదవులు రానివారికి నామినేటెడ్ పోస్టులు వచ్చేలా కృషి చేస్తామన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు తగు ప్రాధాన్యత క ల్పించేలా కమిటీని నియమిస్తామన్నారు. అంతకు ముందు కేబినెట్తీర్మానాన్ని హర్షిస్తూ రాహుల్ గాంధీ, సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ల ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కాగా అంతకు ముందు జిల్లాకు చేరుకున్న ఆయనకు పార్టీ నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఇందులో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ హందాన్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీఎమ్మెల్యే రాథోడ్ బాపూ రావు, ఏఐసీసీ సభ్యులు నరేశ్జాదవ్, ఆదిలాబాద్, బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, శ్యామ్నాయక్, ఇంద్రకరణ్ రెడ్డి,గోక గణేశ్రెడ్డి, ఆత్రం సుగుణ, బోరంచు శ్రీకాంత్రెడ్డి, చరణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక వర్గాల సమతుల్యతతో జిల్లా కమిటీ కాంగ్రెస్ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకై లాస్నగర్: దేశంలోని రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వ యత్నాలను తిప్పి కొట్టాలని కాంగ్రెస్ పా ర్టీ ఉమ్మడి జిల్లా సంస్థాగత ఇన్చార్జి, అనిల్కుమార్ యాదవ్ అన్నారు. శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
డుమ్మా టీచర్లకు చెక్!
● ఉపాధ్యాయులకూ ‘ఫేషియల్ రికగ్నిషన్’ ● కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ● త్వరలోనే అమలుకు చర్యలు ● గురువుల సమయపాలనపై ఫోకస్జిల్లాలో..ప్రాథమిక పాఠశాలలు 500 ప్రాథమికోన్నత పాఠశాలలు 119 ఉన్నత పాఠశాలలు 120 ఉపాధ్యాయ పోస్టులు 3,067 పనిచేస్తున్న వారు 2,654 ఖాళీలు 413 బయోమెట్రిక్ హాజరు వేసే ఉపాధ్యాయులు, సిబ్బంది 65వేలుఆదిలాబాద్టౌన్: డుమ్మా టీచర్లకు చెక్ పెట్టేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. చాలామంది ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుండా ఇష్టారీతిన విధులకు హాజరవుతున్నారు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందడం లేదు. ప్రాథమిక పాఠశాలల్లో కొంత మంది విధులకు హాజరుకాకపోయినా మరుసటి రోజు వచ్చి రిజిస్టర్లో సంతకాలు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇంకొందరు పాఠశాల పనివేళలకు ముందుగానే ఇంటి ముఖం పట్టడం, రియల్ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహించడం, చిట్టీలు నడపడం, ఇతర వ్యాపకాల్లో నిమగ్నమవుతూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. కోవిడ్కు ముందు సర్కారు పాఠశాలల్లో బయోమెట్రిక్ అమలు చేశారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు విధులకు సక్రమంగా హాజరయ్యారు. ఆ తర్వాత అవి మూలనపడడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఈ క్రమంలో టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. పెద్దపల్లి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేశారు. సత్ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు అమలవుతున్న విషయం తెలిసిందే. టీచర్లకు కూడా అమలు చేస్తే సక్రమంగా విధులకు హాజరయ్యే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మూలనపడ్డ బయోమెట్రిక్.. సర్కారు బడుల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలనే ఉద్దేశంతో 2018లో ప్రభుత్వం బయోమెట్రిక్ యంత్రాలను తీసుకొచ్చింది. చాలా మంది టీచర్లు ‘ట్రిక్స్’ఉపయోగించి అవి అమలుకు నోచుకోకుండా చేశారు. నెట్వర్క్ సమస్య, యంత్రాల మరమ్మతులు, తదితర కారణాలు చూపుతూ హాజరు వేయకుండానే తప్పించుకొని తిరిగారు. ఇది విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం చూపింది. సర్కారు బడుల్లో చదివే సగం మంది విద్యార్థులకు చదవడం, రాయడం, చతుర్విద ప్రక్రియలు చేయడంలో వెనుకబడ్డారనేది తాజాగా ఫరఖ్, ఇతర సర్వేల్లో వెల్లడైంది. పర్యవేక్షించాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతోనే ఈ దుస్థితి నెలకొందని పలువురు పేర్కొంటున్నారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత యంత్రాలను పునఃప్రారంభించాలని అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొన్ని నెలలు మాత్రమే వాటిని ఉపయోగించి మూలన పడేశారు. ఈ యంత్రాలు పనిచేసిన సమయంలో సమయపాలన పాటించేందుకు పరుగులు తీసిన టీచర్లు.. ప్రస్తు తం బయోమెట్రిక్ భయం లేకపోవడంతో ఎప్పుడైనా వెళ్లొచ్చన్న విధంగా వ్యవహరిస్తున్నారు. అధికా రులు పర్యవేక్షణను పూర్తిగా గాలికి వదిలేశారు. సొంత పనుల్లో నిమగ్నం.. ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధించడం కంటే వారి సొంత పనుల్లోనే నిమగ్నమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టమొచ్చినప్పుడు పాఠశాలకు రావడం, సెలవు కాకముందే ఇంటి ముఖం పట్టడం, మధ్యా హ్న సమయం తర్వాత పాఠశాలల్లో ఉండకుండా కొంతమంది తమ వ్యాపారాలు, చిట్టీలు, రియల్ ఎస్టేట్ దందాల్లో మునిగి తేలుతున్నారు. ప్రాథమిక పాఠశాలల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒకరిద్దరు ఉపాధ్యాయులు పనిచేసే చోటా పనులకు వెళ్లినప్పటికీ సెలవు పత్రం సమర్పించకుండా డుమ్మా కొడుతున్నారు. అందరు ఉపాధ్యాయులు ఒకటై వంతుల వారీగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. -
అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్రూరల్: హెచ్సీఎల్ టెక్బీ ఆధ్వర్యంలో సాఫ్ట్వేర్ రంగంలో ఇంటర్మీడియేట్ చదివిన విద్యార్థులకు అందజేస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర సంక్షేమ పాఠశాల ఆవరణలో శుక్రవారం మెగా జాబ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తే రాష్ట్రంలోని హైదరా బాద్తో పాటు ఏపీలోని విజయవాడలో గల హెచ్సీఎల్ శాఖలలో శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. అనంతరం మంచి ప్యాకేజీ ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీఐఈవో జాదవ్గణే శ్, హెచ్సీఎల్ కోఆర్డినేటర్ రాజేశ్, స్టార్ 50 కో ఆర్డినేటర్ మారుతిశర్మ, విద్యార్థులు ఉన్నారు. -
అమర్నాథ్ యాత్రలో జిల్లావాసులు
ఆదిలాబాద్: జమ్మూ కశ్మీర్లోని ప్రముఖ శైవక్షేత్రమైన అమర్నాథ్ మంచు లింగాన్ని దర్శించుకునేందుకు జిల్లాకు చెందిన భక్తులు తరలివెళ్లారు. శ్రీనగర్ సమీపంలోని పహల్గాం నుంచి ప్రారంభమైన పాదయాత్ర శేష్నాగ్ వరకు 16 కిలోమీటర్లు, అక్కడి నుంచి అమర్నాథ్ వరకు 20 కిలోమీటర్ల మేర సాగింది. అనంతరం 800 మెట్లను ఎక్కిన తర్వాత శివలింగం దర్శనం అయినట్లు భక్తులు తెలిపారు. ఇందులో జిల్లాకు చెందిన భక్తులు డాక్టర్ కాలే సతీష్, రామగిరి అశ్విన్, అర్జున్, రాకేశ్రెడ్డి, జైపాల్ తదితరులు ఉన్నారు. -
జనాభా నియంత్రణ అందరి బాధ్యత
ఆదిలాబాద్టౌన్: జనాభా నియంత్రణ అందరి బాధ్యత అని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. ప్రపంచ జనాభా నియంత్రణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయ న మాట్లాడారు. జనాభా పెరుగుదలతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపారు. ఒకరిద్దరు పిల్లల్ని కని వారి భవితకు బాటలు వేయాలని కోరారు. జిల్లాలో ఈ ఏడాదిలో 4వేల కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు 44 శాతం ఆపరేషన్లు చేసినట్లు తెలిపారు. అత్యధిక ఆపరేషన్లు నిర్వహించిన డీఐవో వైసీ శ్రీనివాస్ను సన్మానించి ప్రశంసా పత్రం అందజేశారు. ఇందులో డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, టీబీ నియంత్రణ అధికారి సుమలత, జిల్లా మలేరియా నివా రణ అధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
● పలుశాఖల అధికారుల తీరుపై ఎంపీ, ఎమ్మెల్యేల ఆగ్రహం ● పార్లమెంట్లో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించిన ఎంపీ నగేశ్ ● ‘కేంద్ర’ పథకాల ప్రగతిపై సుదీర్ఘ సమీక్ష
కై లాస్నగర్: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన జిల్లాస్థాయి అభివృద్ధి, సమన్వయ, మానిటరింగ్ కమిటీ (దిశ) సమీక్షా సమావేశం శుక్రవారం వాడీవేడిగా సాగింది. ఎంపీ గోడం నగేశ్ అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో విద్య, వైద్యం, ఐసీడీఎస్, ఇరిగేషన్, గిరిజన సంక్షేమం, మైనింగ్, హర్టికల్చర్, డీఆర్డీఏ, సివిల్ సప్లై, హౌసింగ్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, గిరిజన సంక్షేమం, ఇంజినీరింగ్ విభా గం, విద్యుత్, పరిశ్రమలు, వ్యవసాయం వంటి 40 శాఖలపై ఎంపీ సుదర్ఘీంగా సమీక్షించారు. ఆయా శాఖలకు మంజూరైన నిధులు, చేపట్టిన పనుల ప్రగతిపై ఆరా తీశారు. పలు శాఖల అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని అవసరమైన ప్రతిపాదనలు అందించాలని అధికారులను ఆదేశించారు. సీఎస్సీ డీఎం రాహుల్కు అవార్డు రావడంపై అభినందించిన ఎంపీ అధికారులతో చప్పట్లు కొట్టించారు. సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, డీఎఫ్వో ప్రశాంత్ బాజీరావు పాటిల్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమాచారం ఇవ్వరా.. తమాషా చేస్తున్నారా : ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఇందిరమ్మ ఇళ్లకు కాంగ్రెస్ నాయకులు భూమిపూజ చేయడంపై బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ తమకు ఎందుకు సమాచారం ఇవ్వడం లేదని పీడీ బసవేశ్వర్ను ప్రశ్నించారు. ఇలా భూమిపూజ జరిగిన ఇళ్లను రద్దు చేయించమంటరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క హౌసింగ్లోనే ఇలా జరుగుతుందని మందలిస్తూ దీనిపై కఠినంగా ఆదేశాలివ్వాలని కలెక్టర్కు సూచించారు. నేషనల్ హైవే శాఖపై ఎమ్మెల్యే మాట్లాడుతూ టోల్ ట్యాక్స్ వసూలు చేయడమే తప్ప రోడ్లపై సౌకర్యాలు కల్పించరా అంటూ పీడీని ప్రశ్నించారు. సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో మూగజీవాలు రోడ్లపైకి వచ్చి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. నిర్మల్ జిల్లాలో ఎలాంటి వసతులున్నాయి, ఇక్కడే ఎందు కు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా అంటే అలసత్వమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.పార్లమెంట్లో ఫిర్యాదు చేస్తే ఇబ్బందులు పడుతారు.. : ఎంపీ నగేశ్ ‘అనిల్జాదవ్ నేను ప్రచారంలో తిరిగి గెలిపించుకున్న ఎమ్మెల్యే.. ఇందిరమ్మ భూమి పూజ లో ఎక్కడా కనిపించడం లేదు. అలాగే ఆది లాబాద్లో పాయల్ శంకర్ కూడా కనిపిస్తలే డు. పార్లమెంట్లో మీపై ఫిర్యాదు చేస్తే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఎంపీ నగేశ్ హౌసింగ్ పీడీని హెచ్చరించారు. కలెక్టర్ క ల్పించుకుని రాజకీయ జోక్యంలేకుండా జిల్లా ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకెళుతానని తెలి పారు. పంచాయతీరాజ్ రోడ్లకు సైతం ఇలాగే కొబ్బరికాయలు కొడుతున్నారని పరో క్షంగా అధికారపార్టీ నాయకుల తీరును తప్పుపట్టారు. పొలంబాట రోడ్లపై సమీక్షించిన ఎంపీ జిల్లాలో 610 కిలోమీటర్లు మంజూ రు చేస్తే తనను కేవలం 25 కిలోమీటర్లకే ప్రతి పాదనలు అడిగారని పీఆర్ ఈఈ రాథోడ్ శివరాంను ప్రశ్నించారు. దీనిపై ఈఈ ఇస్తాను సార్.. అని సమాధానమివ్వగా నేను బిచ్చమడుకో వాల్నా అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనను డిగ్రేడ్ చేశారని పార్లమెంట్లో ప్రివి లేజ్ మోషన్ మూవ్ చేస్తే మీమ్మల్నెవరూ కా పాడలేరని ఘాటుగానే మందలించారు. కేజీ బీవీలు, ఆశ్రమపాఠశాలలకు ప్రహరీలు ఇవ్వ రు.. సీసీ రోడ్లు ఇవ్వరు ఇంతేనా అని ప్ర శ్నించగా.. అంతే సార్ అని ఈఈ సమాధానమి వ్వడంతో మరింత ఆగ్రహానికి గురయ్యా రు. కామన్సెన్స్ లేదా మాట్లాడే విధానం తెలియదా అంటూ ఫైర్అయ్యారు. విద్యాశాఖ అధి కారులు సరైన వివరాలతో రాకపోవడంపై వారిని మందలించారు. పెన్గంగ నుంచి ఇ సుక అక్రమంగా తరలిస్తూ రూ.కోట్లు సంపాదిస్తుంటే ఏం చేస్తున్నారని మైనింగ్ ఏడీ రవీందర్ను ప్రశ్నించారు. పెద్ద వాగు నుంచి ఇసుక తీసుకొచ్చి అక్రమంగా విక్రయాలు సా గిస్తుంటే ఎందుకు కట్టడిచేయడం లేదని దానిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. -
రోడ్లపైకి పశువులను వదలొద్దు
ఆదిలాబాద్టౌన్: రోడ్లపైకి పశువులను వదిలితే య జమానులపై కేసులు నమోదు చేస్తామ ని ఆదిలా బాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలోని వన్టౌన్, టూటౌన్, మా వల పోలీస్స్టేషన్ల పరిధిలో రోడ్లపై తిరుగుతున్న 50 పశువులను గోశాలకు తరలించారు. పశువుల ను రోడ్లపైకి వదులుతున్నందున వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోందని పేర్కొన్నారు. పట్ట ణంలో నిత్యం స్పెషల్డ్రైవ్ చేపట్టి పశువులను రోడ్లపైకి వదిలే యజమానులపై చర్యలు తీసుకుంటామ ని హెచ్చరించారు. ఆయన వెంట వన్టౌన్, టూటౌ న్ సీఐలు సునీల్కుమార్, కరుణాకర్రావు ఉన్నారు. -
బాల్యవివాహాలను అరికట్టాలి
ఆదిలాబాద్టౌన్: బాల్య వివాహాలను అరికట్టాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో మహిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. బాలికా సాధికారత అభివృద్ధికి సంస్థ చేస్తున్న కృషి ని అభినందించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జ రిగితే 1098కు సమాచారం ఇవ్వాలని సూచించా రు. సంస్థ డైరెక్టర్ రమేశ్ రాజశేఖర్రెడ్డి, జిల్లా మేనేజర్ శ్రీకాంత్, డీసీపీవో రాజేంద్రప్రసాద్, డైట్ ప్రి న్సిపల్ కిరణ్కుమార్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సతీశ్, సెక్టోరియల్ అధికారులు సుజాత్ ఖాన్, రఘురమణ, శ్యామ్సుందర్, నర్సయ్య, రాజేశ్వర్, శ్రీకాంత్గౌడ్, ప్రవీణ్, సుజాత తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ పోలీసుల ముఠా అరెస్ట్
● అదుపులో నలుగురు, పరారీలో ఒకరు ● కారు, బైక్, ఆటో బంగారు, వెండి స్వాధీనం ఇచ్చోడ: నకిలీ పోలీసుల ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇచ్చోడ సీఐ కార్యాలయంలో గురువారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా నిడమనూర్ గ్రామానికి చెందిన షేక్ ఇర్ఫాన్ (పశువుల వ్యాపారి), చింతల చెరువు ప్రశాంత్(లారీ క్లీనర్), బదనపూరి అజయ్(మోటార్ మెకానిక్) బొప్పరం సుధాకర్(సెల్ పాయింట్), ఒట్కురి నరేష్ (పెట్రోల్ బంక్ ఉద్యోగి) ఐదుగురు ముఠాగా ఏర్పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ఎస్సై పేరు చెప్పి వివిధప్రాంతాల్లో బంగారు వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. గతనెల 27న రంగారెడ్డి జిల్లాకు చెందిన కొండోజు నరసింహచారికి ఫోన్ చేసి ఇచ్చోడ ఎస్సై నర్సిరెడ్డి అని పరిచయం చేసుకున్నాడు. నాలుగేళ్ల క్రితం 11 గ్రాముల బంగారం కొన్నారని కేసు కాకుండా ఉండాలంటే గూగుల్ పే ద్వారా డబ్బులు పంపాలని డిమాండ్ చేశారు. అనుమానం వచ్చిన నరసింహచారి తనకు ఫోన్ చేసిన వ్యక్తి నకిలీ ఎస్సైగా గుర్తించి ఇచ్చోడ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈనెల 4న హైదరాబాద్కు చెందిన రుద్రంగి కిరణ్ కుమార్కు ఫోన్ చేసి ఇచ్చోడ ఎస్సై నర్సిరెడ్డి మాట్లాడుతున్నట్లు చెప్పి, దొంగ బంగారం కొన్నారని బెదిరించి సదరు వ్యక్తి నుంచి రూ1.50 లక్షలు వసూళ్లు చేశారు. అనుమానం వచ్చిన కిరణ్కుమార్ సైతం ఇచ్చోడలో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నకిలీ ఎస్సై అంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యుల్లో నలుగురిని మండల కేంద్రంలో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఒట్కురి నరేశ్ పరారీలో ఉన్నారు. వీరిపై గతంలో నల్గొండ, హుజుర్నగర్ పోలీస్టేషన్లలో కేసులు నమోదై ఉన్నవి. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, చైన్నె నగరాల్లోని ఆభరణాల షాపుల యజమానులకు ఫోన్ చేసి బెదిరించి దాదాపు రూ.18 లక్షలు వసూలు చేసి జల్సాలకు వాడుకున్నట్లు తేలింది. నిందితుల నుంచి కారు, ఆటో, బంగారు, వెండిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్, ఇచ్చోడ సీఐ బండారి రాజు, ఎస్సై పురుషోత్తం పాల్గొన్నారు. -
హోరాహోరీగా బాలికల ఫుట్బాల్ పోటీలు
● సెమీస్కు నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి జట్లు రామకృష్ణాపూర్: పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్రస్థాయి బాలికల జూనియర్స్ ఫుట్బాల్ చాంపియన్షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. వర్షం కారణంగా కొంత ఆటంకం ఏర్పడినప్పటికీ ఉదయం లీగ్ కమ్ నాకౌట్ పోటీలు నిర్వహించారు. మధ్యాహ సమయంలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు ఉత్సాహంగా సాగాయి. మహబూబ్నగర్–నల్గొండ జట్ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో రెండు జట్లు దీటుగా తలపడ్డాయి. నిర్ణీత సమయం ముగిసేసరికి ఏ ఒక్క జట్టు కూడా గోల్ సాధించకపోవడంతో మ్యాచ్ టై గా ముగిసింది. దీంతో పెనాల్టీ షూటౌట్లు నిర్వహించారు. ఇందులో నల్గొండ జట్టు 2–1 తేడాతో మహబూబ్నగర్పై గెలిచి సెమీస్కు చేరింది. మరో క్వార్టర్ ఫైనల్లో వనపర్తి–ఖమ్మం జట్లు తలపడగా 0–1 తేడాతో ఖమ్మం గెలుపొందింది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్లో నిజామాబాద్–గద్వాల్ జట్లు తలపడగా 7–1 గోల్స్తో నిజామాబాద్ గెలుపొందింది. ఇక ఆతిథ్య ఆదిలాబాద్ జట్టుకు క్వార్టర్ ఫైనల్స్లో నిరాశే ఎదురైంది. రంగారెడ్డి–ఆదిలాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 4–0 గోల్స్తో రంగారెడ్డి గెలిచి సెమీస్కు చేరింది. శుక్రవారం ఉదయం మొదటి సెమీఫైనల్ మ్యాచ్ నల్గొండ–నిజామాబాద్ల మధ్య, రెండో సెమీఫైనల్ మ్యాచ్ ఖమ్మం–రంగారెడ్డి జట్ల మధ్య జరుగనుంది. -
ఎరువుల కోసం ఆందోళన వద్దు
తాంసి: వివిధ రసాయన ఎరువులు అందుబా టులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందొ ద్దని డీఏవో శ్రీధర్స్వామి పేర్కొన్నారు. మండలంలోని హస్నాపూర్, జామిడి, తాంసి గ్రామాల్లోగల ప్రాథమిక సహకార సంఘాలను గురువారం సందర్శించారు. గోదాంలలోని ఎరువు ల నిల్వలు పరిశీలించారు. స్టాక్ రిజిష్టర్లు పరిశీ లించి కొనుగోళ్ల వివరాలు తెలుసుకున్నారు. మండలంలో 1,708 బ్యాగుల యూరియా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఆయన వెంట ఏవో రవీందర్, ఏఈవోలు శివ, నిఖిత, ఆయా సొసైటీల సీఈవోలు కేశవ్, దత్తు, రాంరెడ్డి, సిబ్బంది కార్తిక్, అఖిల్ ఉన్నారు. -
పిల్లలు బడికి వెళ్లేలా ప్రోత్సహించాలి
ఆదిలాబాద్టౌన్: పిల్లలు బడికి వెళ్లేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూ చించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కా ర్యాలయంలో ఆపరేషన్ ముస్కాన్ కార్యాచరణపై ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ పరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహించిన 10 రో జుల్లో 37 మంది బాలలను గుర్తించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 10 కేసులు నమోదు చేసినట్లు పే ర్కొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో బాలకా ర్మిక వ్యవస్థను రూపుమాపాలని సూచించారు. హో టళ్లు, ఇటుకబట్టీలు, వ్యాపార సముదాయాల్లో బా లలను పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఏఎస్పీ సురేందర్రావు, డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్లు గుణవంత్రావు, పద్మ, అసిస్టెంట్ లేబర్ అధికారి రాజలింగు, వినోద్కుమార్, డీసీపీవో రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఎలక్ట్రానిక్స్ గోదాంలో చోరీ
నిర్మల్టౌన్: జిల్లాకేంద్రంలోని మోహన్ ఎలక్ట్రానిక్స్ గోదాంలో జరిగిన దొంగతనాన్ని నిర్మల్ పోలీసులు ఛేదించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం రూరల్ సీఐ కృష్ణ వివరాలు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా గోదాంలోని ఎలక్ట్రానిక్ వస్తువులు కనిపించకుండా పోవడాన్ని యజమాని వెంకటరమణ గుర్తించారు. దీంతో ఆడిట్ నిర్వహించారు. అనుమానాస్పదంగా పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నవత్ శ్రీకాంత్, జిందాడే సచిన్, సాబ్లే జగదీశ్వర్, కూసులే నవీన్ను విచారించగా వారు దొంగతనానికి పాల్పడ్డట్లు ఒప్పుకున్నారు. దొంగతనం చేసిన వస్తువులను తరలించేందుకు ఆటో డ్రైవర్ సయ్యద్ ఇమ్రాన్ సహాయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి ఒక ఫ్రిడ్జ్, గీజర్, సామ్సంగ్ టీవీ, ఆరు కూలర్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఇందులో ఎస్సై సంజీవ్ ఉన్నారు. లోన్లు ఇప్పిస్తానని మోసగించిన వ్యక్తి రిమాండ్ఆదిలాబాద్టౌన్: లోన్లు ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకుని మోసగించిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. పోలీసు స్టేషన్లో గురువారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని భుక్తాపూర్ రూరల్ డెవలప్మెంట్ క్రెడిట్ కోపరేటివ్ సొసైటీకి చెందిన రమేశ్ రూ.2 లక్షల రుణం ఇప్పిస్తానని ప్రజల వద్ద రూ.25 వేలు తీసుకుని మోసం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
ఇంద్రవెల్లి: మద్యం మత్తులో యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఇ.సాయన్న తెలిపారు. ఎస్సై ఇ.సాయన్న, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండలంలో దనోరా(బి) పంచాయతీ పరిధి ఇన్కార్గూడకు చెందిన ఎల్నారే అనిల్, ఉమ దంపతులకు ఏకై క కుమారుడు శుభం(23). డిగ్రీ పూర్తి చేసి ఇంట్లో ఉంటున్నాడు. గత కొన్నిరోజులుగా మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 7న మద్యం తాగి ఇంటికొచ్చిన కుమారుడిని రోజు మద్యం ఎందుకు తాగుతున్నానవని తల్లి ఉమ మందలించింది. క్షణికావేశంతో వ్యవసాయ చేనుకు వెళ్లి గుర్తుతెలియని పురుగుల మందు తాగి ఇంటికి వచ్చి చెప్పాడు. గ్రామస్తుల సహాయంతో ఓ ప్రైవేట్ వాహనంలో ఆదిలాబాద్లోని ప్రైవేట్ అస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని ఒకరు.. సోన్: అప్పుల బాధ, భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపం చెందిన ఒకరు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని న్యూవెల్మల్ గ్రామానికి చెందిన పట్టం పోశెట్టి(34) గతంలో దుబాయ్ వెళ్లి అప్పుల పాలయ్యాడు. భార్య పోసవ్వ అలియాస్ అరుణకు కుమారుడు ఉన్నాడు. ఆమె ఇటీవల భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లింది. అటు అప్పుల బాధ, ఇటు భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం చెందిన పోశెట్టి గురువారం ఇంట్లో చీరతో ఉరేసుకున్నాడు. మృతుడి అక్క ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.గోపి తెలిపారు. -
ప్రశాంతంగా సర్టిఫికెట్ల పరిశీలన
ఆదిలాబాద్టౌన్: జిల్లాలోని కేజీబీవీల్లోగల ఖాళీ పో స్టుల భర్తీకి గురువారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలన ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్రూరల్ మండల వి ద్యాధికారి నర్సయ్య, మహేందర్రెడ్డి, సూపరింటెండెంట్ వేణుగోపాల్వర్మ, కేజీబీవీ సెక్టోరియల్ అధికారి ఉదయశ్రీ, రమేశ్ తదితరులు ప్రక్రియ ప ర్యవేక్షించారు. జిల్లాలో సీఆర్టీ గణితం, ఫిజికల్ సై న్స్, బయోసైన్స్, పీఈటీ, పీజీసీఆర్టీ బాటనీ, పీజీ సీఆర్టీ నర్సింగ్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి పే ర్కొన్నారు. రోస్టర్, మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. 1:1 జాబితాను త్వరలో ప్రకటిస్తామని వివరించారు. -
నీట్లో విద్యార్థి ప్రతిభ
లక్సెట్టిపేట: నీట్ పరీక్ష ఫలితాల్లో మండలంలోని బలరావుపేట గ్రామానికి చెందిన కందుల కుషీంద్రవర్మ ప్రతిభ కనబర్చి రాష్టస్థాయి 59 ర్యాంకు సాధించాడు. పదో తరగతి వరకు పట్టణంలోని గుడ్ షెప్పర్డ్ పాఠశాల, చైతన్య కళాశాలలో ఇంటర్ చదివి మంచి మార్కులు సాధించాడు. ఈయన తండ్రి ప్రవీణ్కుమార్ ప్రైవేటు టీచర్, తల్లి సుమలత గృహిణి. కుమారుడు నీట్లో ర్యాంక్ సాధించడంపై పలువురు అభినందించారు. గుడుంబా పట్టివేతజైపూర్: బైక్పై గుడుంబా తరలిస్తుండగా ఒకరు పోలీసులకు పట్టుబడ్డాడు. భీమారం మండల కేంద్రంలో ఆరెపల్లి క్రాస్ రోడ్డు వద్ద గురువారం ఉదయం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. కొత్తూర్ మండలం లంబాడితండాకు చెందిన ధరావత్ శంకర్ బైక్పై 30లీటర్ల గుడుంబా తరలిస్తుండగా పట్టుబడ్డాడు. పోలీసులకు చిక్కకుండా ప్రయత్నించగా జోడువాగు వద్ద శంకర్ను అదుపులో తీసుకుని బైక్, గుడుంబా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్వేత తెలిపారు. ఆయనపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బాసరలో ముగిసిన గురుపౌర్ణమి వేడుకలుబాసర: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో గురుపౌర్ణమి వేడుకలు గురువారంతో ముగిశాయి. వ్యాసమహర్షి, సరస్వతి, వ హాంకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు అర్చకులు పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే రామారావు పటేల్ అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ ఉన్నారు. -
కలిసుంటే కలదు సుఖం..
● ఉమ్మడి కుటుంబాల్లో ఆత్మీయత, ప్రేమానురాగాలు ● ఆత్మస్థైర్యంతోపాటు బలం ● ఆదర్శంగా నిలుస్తున్న పలు ఫ్యామిలీలు కాలం మారుతోంది.. జీవితం బిజీగా మారిపోయింది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. చిన్న కుటుంబాలే చింతలేని కుటుంబాలు అన్న భావన నెలకొంది. దీంతో పెద్ద కుటుంబాలు విడిపోయి, ఒక్కొక్కరూ ఒక్కో చోట జీవనం సాగిస్తున్న రోజులివి. చిన్నచిన్న మనస్పర్థలు, వ్యక్తిగత ఆలోచనలు వీరిని దూరం చేస్తున్నాయి. కానీ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బంధాలను బలోపేతం చేస్తూ, ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. ప్రేమ, అనురాగం, ఆత్మీయ ఆప్యాయతలకు ఇది ఒక గొప్ప వేదికగా నిలుస్తుంది. ఇప్పటికీ ఉమ్మడి కుటుంబాలు కష్టసుఖాలను పంచుకుంటూ, ఒకరికొకరు అండగా నిలుస్తున్నాయి. ఏళ్ల తరబడి ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవనం సాగిస్తూ, ఇవి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఒకరి ఆనందంలో అందరూ భాగస్వాములవుతూ, కష్టాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ, ఈ కుటుంబాలు సామాజిక సమతుల్యతను కాపాడుతున్నాయి. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా, ఉమ్మడి కుటుంబాల విలువను గుర్తుచేసుకోవడం అవసరం. ఇవి కేవలం కుటుంబ సభ్యులను కలిపే సంస్థానం మాత్రమే కాదు..సమాజంలో ప్రేమ, సామరస్యం, సహకార భావనలను పెంపొందించే బలమైన ఆధారాలు. ఇటువంటి కుటుంబాలు మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ, భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. నాలుగు దశాబ్దాలుగా.. ఆదిలాబాద్: జిల్లాకేంద్రంలోని ఆదిత్యనగర్ కాలనీకి చెందిన నానక్ సింగ్ పరివారం ఉమ్మడి కుటుంబం. గత నాలుగు దశాబ్దాలుగా కుటుంబమంతా ఒకేచోట కలిసి ఉంటుండడం విశేషం. నానక్ సింగ్–మంజీత్ కౌర్ దంపతులకు ఆరుగురు సంతానం. అందులో నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. చిన్నపాటి ఇనుప వస్తువులు, పనిముట్లు చేసుకుని జీవనం సాగిస్తున్నా, పరివారమంత ఒకే దగ్గర ఆత్మీయంగా కలిసి ఉంటున్నారు. కుటుంబంలో ఒక అబ్బాయికి తప్పా అందరికీ వివాహాలు జరిగాయి. తమ మధ్య ఉన్న అనుబంధమే మా అందరిని 40 ఏళ్లుగా కలిపి ఉంచిందని నానక్ సింగ్ చెబుతున్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా, తామందరం బాధ్యతలు పంచుకుని ఆ ఇబ్బంది నుంచి బయటపడేందుకు శ్రమిస్తామని పేర్కొంటున్నారు.చిన్ననాటి నుంచి ప్రత్యేక శ్రద్ధ బోథ్: మండలకేంద్రానికి చెందిన రాజశేఖర్ దీప దంపతులు. వారికి పిల్లల సంఖ్య కన్నా, వారిపై పెట్టే శ్రద్ధ ముఖ్యమని నమ్మారు. మేము ఒక్కరే కావాలనుకున్నారు. ఆ ఒకరిలో అన్ని విలువలు, విజ్ఞానం, మంచి భవిష్యత్తును ఇవ్వాలని అనుకురు. సంతానంగా కూతురు రుతిక పుట్టింది. ఆమె అభ్యున్నతికి పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. చిన్ననాటి నుంచి ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. ఇటీవల విడుదలైన లాసెట్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు వచ్చింది. చిన్న కుటుంబం వల్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చామని అనుకుంటున్నాం. -
ఉమ్మడి కుటుంబం..ఆత్మీయం
తాంసి: మండల కేంద్రానికి చెందిన జానకొండ శ్రీకాంత్ ఉమ్మడి కుటుంబంగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నర్సయ్య–లక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కుమార్తె వివాహం అనంతరం కొన్నేళ్లకు తండ్రి నర్సయ్య మృతిచెందాడు. పెద్ద కుమారుడు శ్రీకాంత్ అన్నీతానై కుటుంబ బాధ్యతలను తనపై వేసుకుని ముందుకు నడిపించాడు. కుటుంబం కోసం వ్యాపారం ప్రారంభించి, తమ్ముడు అశోక్ను ఉన్నతంగా చదివించాడు. అన్న కష్టానికి తగ్గట్టుగా పట్టుదలతో చదివి పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ప్రస్తుతం సాత్నాల మండలంలో విధులు నిర్వహిస్తున్నాడు. సివిల్స్కు సన్నద్ధమై ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. ఇటీవల గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయి 250వ ర్యాంక్, గ్రూప్–3లో 417 ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం తల్లితోపాటు వివాహమైనప్పటికి సోదరులు ఇద్దరు ఉమ్మడిగా ఉంటున్నారు. నలుగురు పిల్లలు, ఇద్దరు భార్యాభర్తలు, తల్లి మొత్తం తొమ్మిది మంది ఒకే చోట ఉంటున్నారు. -
డీల్ కుదిరింది!
● అక్రమ రిజిస్ట్రేషన్లకు ఒప్పందం ● లింక్ డాక్యుమెంట్ లేకున్నా ఓకే ● రూ.15వేలు అప్పగిస్తే పని పూర్తి ● ఆదిలాబాద్ ఎస్సార్వోలో దందా! సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కా ర్యాలయం (ఎస్సార్వో) పరిధిలో ఇటీవల ఓ సబ్రి జిస్ట్రార్ డాక్యుమెంట్ రైటర్లతో రహస్యంగా సమావేశమై డీల్ కుదుర్చుకున్నారు. లింక్ డాక్యుమెంట్ లేకున్నా అసెస్మెంట్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేస్తామని, ఇందుకు ఒక్కో డాక్యుమెంట్కు రూ.15వేలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారమే లింక్ డాక్యుమెంట్ లేకున్నా రిజిస్ట్రేషన్లు చేసే పని ఇప్పటికే మొదలైంది. సాధారణంగా ఓ ప్లాట్, ఇల్లు రిజిస్ట్రేషన్ చేయాలంటే లింక్ డాక్యుమెంట్ను పరిగణనలోకి తీసుకుంటారు. దరఖాస్తుదారుకు ఆ ప్లాట్ ఎలా సంక్రమించిందనేది దాని ద్వారానే తెలుస్తుంది. అయితే లింక్ డాక్యుమెంట్లు లేకున్నా మున్సిపాలిటీ నుంచి జారీ చేసే అసెస్ మెంట్ (డోర్ నంబర్) ఆధారంగా అక్రమంగా రి జిస్ట్రేషన్లు చేస్తుండటం పరిపాటిగా మారింది. ఇటీవల ఇలాంటి రిజిస్ట్రేషన్లకు సంబంధించి పోలీస్ శాఖ కేసులు కూడా నమోదు చేసింది. అయినప్పటి కీ ఈ దొడ్డిదారి దందాకు ఫుల్స్టాప్ పడటం లేదు. కాగా, పాత ఆస్తులు, వారసత్వంగా ఒకరి నుంచి మరొకరికి వచ్చే ఆస్తులకు లింక్ డాక్యుమెంట్లు లేకపోవడంతోనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని సంబంధిత అధికారులు తమ తప్పు కప్పి పుచ్చుకుంటున్నారు. కానీ.. ప్రస్తుతం జరుగుతున్న రిజిస్ట్రేషన్లలో చాలా కొత్త ఆస్తులవే కావడం గమనార్హం. అక్రమాలు జరిగేదిలా.. ప్రధానంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం, వాటిలో ఇల్లు కట్టుకుని మున్సిపాలిటీ ద్వారా దొడ్డిదారిన అసెస్మెంట్ చేసుకోవడం లాంటి అక్రమాలు ముందునుంచి జరుగుతున్నవే. ఇలా అసెస్ మెంట్ తీసుకుని.. అలా దాని ఆధారంగా రిజిస్ట్రేష న్కు వెళ్తున్నారు. కొందరైతే ఏకంగా ఓపెన్ ప్లాట్పై నే అసెస్మెంట్ నంబర్ తీసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ప్రధానంగా ఆ స్థలాలను అక్రమ ప ద్ధతిలో స్వాహా చేసేందుకు ఇలాంటి కుయుక్తులకు పాల్పడటం పరిపాటిగా మారింది. ఇలా ప్రభుత్వ స్థలాలను కైంకర్యం చేయడంలో కొందరు అక్ర మార్కులు ఆరితేరారు. అలాంటి వారికి రిజిస్ట్రేషన్ అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీన్ని అరికట్టాల్సిన రిజిస్ట్రేషన్ అధికారులు ‘మామూలుూగా తీసుకోవడంతో వ్యవహారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. -
కరీంనగర్ కోర్టుకు హాజరైన అఘోరి శ్రీనివాస్
కరీంనగర్క్రైం: ఉమ్మడి రాష్ట్రంలో హల్చల్ చేసిన అఘోరి శ్రీనివాస్ గురువారం కరీంనగర్ కోర్టుకు హాజరయ్యాడు. కొత్తపల్లి పోలీసులు పీటీ వారెంటుపై చర్లపల్లి జైలు నుంచి తీసుకొచ్చి కరీంనగర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుషాన్పల్లికు చెందిన శ్రీనివాస్తో జిల్లాకు చెందిన ఓ మహిళకు నవంబర్ 2024లో పరిచయం ఏర్పడింది. శ్రీనివాస్ తనపై లైంగిక దాడి జరిపాడని, జనవరి 2025లో కొండగట్టు తీసుకెళ్లి తాళికట్టాడని, రూ.3 లక్షలు తీసుకున్నాడని సదరు మహిళ కొత్తపల్లి పోలీసులకు 2025 ఏప్రిల్ 28న ఫిర్యాదు చేసింది. పోలీసులు శ్రీనివాస్పై పలుసెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చర్లపల్లి జైల్లో ఉన్న శ్రీనివాస్ను పీటీ వారెంట్ ద్వారా కరీంనగర్ కోర్టులో హాజరు పర్చారు. శ్రీనివాస్కు కోర్టు ఈ నెల 23వరకు రిమాండ్ విధించింది. అనంతరం శ్రీనివాస్ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. -
● ఉమ్మడి కుటుంబాలతోనే మేలు ● చిన్నకుటుంబాలపైనే యువత ఆసక్తి ● నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
4. ఉమ్మడి కుటుంబాల వల్ల ప్రయోజనమా.. చిన్న కుటుంబాల వల్లనా..?1.దేశంలో మరో 25ఏళ్లలో యువజనుల సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఒక్కొక్కరు ముగ్గురు పిల్లల కన్న ఎక్కువ మందిని కనాలన్న సూచనలపై మీరేమంటారు..3. మీది ఉమ్మడి కుటుంబమా..? చిన్న కుటుంబమా..? 2. పెళ్లి తర్వాత పిల్లలపై మీ ప్రణాళిక ఏమిటిపాటించాలిఇద్దరు చాలుఉమ్మడి కుటుంబాలుఇద్దరుముగ్గురుచెప్పలేంచిన్న కుటుంబాలుఉమ్మడిచిన్నదే225347916501128 -
విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు
● డెప్యూటీ డీఎంహెచ్వో సుధాకర్నాయక్ వేమనపల్లి: విధుల్లో నిర్లక్ష్యం చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని డెప్యూటీ డీఎంహెచ్వో సుధాకర్నాయక్ అన్నారు. పీహెచ్సీలో ప్రసవ వేదన శీర్షికన ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఎంసీహెచ్ ప్రోగ్రాం అధికారి కృపబాయితో కలిసి పీహెచ్సీలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ప్రసూతి కోసం కొండగొర్ల సోనియా పీహెచ్సీకి వచ్చినప్పుడు ఎవరు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటివి పునరావృతమైతే క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచాలన్నారు. లోతట్టు గ్రామాల్లోని గర్భిణులను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అత్యవసర వేళ 108 సేవలను వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు పెరిగేలా చూడాలన్నారు. ఆయన వెంట జిల్లా కమ్యూనిటీ అధికారి వెంకటేశ్వర్, బీపీహెచ్ఎన్ ఆర్ఎస్ పద్మ, ఎస్యూఓలు జగదీశ్, వసంత, సూపర్వైజర్ అపరంజి, రాంశెట్టి బాపు ఉన్నారు. ఎఫెక్ట్.. -
కార్మిక సంఘాల ఆందోళన
● సార్వత్రిక సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రంలో ర్యాలీ, ధర్నా కై లాస్నగర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ చేపట్టిన జాతీయ సార్వత్రిక సమ్మెలో భాగంగా కార్మిక సంఘాలు జిల్లా కేంద్రంలో బుధవారం ఆందోళనకు దిగాయి. మున్సిపల్, రిమ్స్, భవన నిర్మాణ, ఎండీఎం కార్మికులతో కలిసి సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ సంఘాల ఆధ్వర్యంలో పట్ట ణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించా రు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ఆరో పించారు. కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం సరికాదన్నారు. అలాగే జిల్లాకేంద్ర సహకార బ్యాంకు ఎదుట ఉద్యోగులు, సిబ్బంది తమ నిరసన తెలి పారు. ఇందులో ఆయా సంఘాల నాయకులు కిరణ్, రాఘవులు, ఆశాలత, దేవేందర్ పాల్గొన్నారు. -
ఇసుక లారీ పట్టివేత
బోథ్: మండల కేంద్రంలో ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. సీఐ వెంకటేశ్వర రావు, ఎస్సై ప్రవీణ్ కుమార్లు తెలిపిన వివరాలు.. నిర్మల్ జిల్లా సోఫీనగర్ నుంచి ఇసుక లారీ అనుమతి లేకుండా, రాయల్టీ చెల్లించకుండా బుధవారం మండల కేంద్రానికి చేరుకుంది. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన మాజీద్ అనే వ్యక్తి మండల కేంద్రానికి చెందిన ఇజాజ్ అనే వ్యక్తికి 40 టన్నుల ఇసుక తరలిస్తున్నట్లు లారీ డ్రైవర్ తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేసినా, విక్రయించినా కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. -
జలదిగ్బంధంలో కామాయి గ్రామం
సాత్నాల: భోరజ్ మండలంలోని కామాయి గ్రామానికి చిరుజల్లులు పడితేనే రాకపోకలు నిలిచిపోతున్నాయి. గ్రామంలో దాదాపు 600 మంది నివసిస్తున్నారు. పెన్ గంగ నది పరీవాహక ప్రాంతంలో ఉండే ఈ గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే రహదారిపై లోలెవల్ వంతెన ఉండటంతో చిన్నవర్షానికే బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రవహిస్తుంది. కుడి వైపున పెన్గంగా, ఎడమవైపు లో లెవల్ వంతెనపై వరదనీరు పొంగిపొర్లడంతో బుధవారం సాయంత్రం వరకు గ్రామస్తులు జలదిగ్బంధంలో కూరుకుపోయారు. సాయంత్రం 7 గంటల తర్వాత బ్రిడ్జిపైన వరద నీటి ప్రవాహం తగ్గడంతో రాకపోకలు పునరుద్ధరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
అట్టహాసంగా రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలు
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి బాలికల జూనియర్స్ ఫుట్బాల్ పోటీలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మరో మూడు రోజులపాటు జరుగనున్న పోటీలకు రాష్ట్రంలోని 12 జిల్లాల క్రీడాకారులు హాజరయ్యారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఫాల్గుణ ముఖ్య అతిథులుగా హాజరై పోటీలు ప్రారంభించారు. ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ యువత చెడు అలవాట్ల వైపు మరలకుండా క్రీడలపై దృష్టి సారించాలన్నారు. సరైన మార్గంలో జీవనం సాగించేందుకు క్రీడలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఫాల్గుణ మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు కోచింగ్ క్యాంప్ రామకృష్ణాపూర్లోనే ఏర్పాటు చేస్తామన్నారు. మందమర్రి సీఐ శశిధర్రెడ్డి, పట్టణ ఎస్సై రాజశేఖర్, ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాథ్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, ఈశ్వరాచారి, బెల్లం శ్రీనివాస్, గణపతి తదితరులు పాల్గొన్నారు. మొదటి రోజు లీగ్ పోటీలు.. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తున్న పోటీల కోసం స్టేడియంలో రెండు గ్రౌండ్లు సిద్ధం చేశారు. మొదటిరోజు గ్రౌండ్ నంబర్ 1లో నిజామాబాద్ –సిద్దిపేట జట్లు తలపడగా నిజామాబాద్, మహబూబ్నగర్, వరంగల్ జట్లు పోటీ పడగా మహబూబ్నగర్, ఆదిలాబాద్, సిద్దిపేట్ మధ్య జరిగిన లీగ్లో ఆదిలాబాద్ గెలుపొందాయి. రెండో గ్రౌండ్లో మెదక్ –గద్వాల్ జట్లు తలపడగా గద్వాల్, కరీంనగర్ –నల్గొండ జట్ల మధ్య జరిగిన లీగ్లో నల్గొండ జట్లు గెలుపొందాయి. -
● ఉద్యమ కార్యాచరణకు అడుగులు ● ‘వర్సిటీ.. కావాల్సిందే’ పై సర్వత్రా చర్చ ● ప్రజల గొంతుకై న ‘సాక్షి’కి అభినందనలు ● ‘కమిటీ’కి అండగా అంటూ జనం నుంచి స్పందన
మంగళవారం చర్చావేదిక అనంతరం అభివాదం చేస్తున్న వక్తలుసాక్షి,ఆదిలాబాద్: ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా జిల్లాలో యూనివర్సిటీ సాధనకు అడుగులు పడుతున్నాయి. రాజకీయాలకతీతంగా ఏకతాటిపైకి వచ్చి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగేందుకు ఉద్యమ కార్యాచరణ సిద్ధమవుతోంది. ఈ ప్రాంతవాసులు చిరకాల డిమాండ్ను ప్రస్తావిస్తూ అడవి బిడ్డల గొంతుకగా ‘సాక్షి’లో బుధవారం ‘వర్సిటీ.. కావాల్సిందే’ శీర్షికన ప్రచురితమైన కథనం సర్వత్రా చర్చనీయాంశమైంది. రెండు దశాబ్దాల డిమాండ్.. విశ్వవిద్యాలయం.. ఈ ప్రాంతంలో రెండు దశాబ్దాలుగా వినిపిస్తున్న డిమాండ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అప్పట్లో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్మల్ ప్రాంతంలో ఓ స్థాయిలో ఉద్యమం చేశారు. అప్పుడే జ్ఞాన సరస్వతీ విశ్వవిద్యాలయం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్ణయం కూడా చేశారు. ఆ తర్వాత ఆయన మరణం, తెలంగాణ ఉద్యమ తీవ్రత, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల విభజన వంటి కారణాలతో అది అటకెక్కింది. ఆ తర్వాత ఇటీవల కేంద్రం నుంచి గిరిజన యూనివర్సిటీ ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తారనే ప్రచారం విస్తృతంగా సాగింది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసులు గంపెడాశతో ఎదురుచూశారు. అయితే ఆ వర్సిటీ కాస్త ములుగులో ఏర్పాటు కావడంతో ఉమ్మడి జిల్లాకు మొండి చెయ్యి ఎదురైంది. అయినప్పటికీ విశ్వవిద్యాలయం సాధించాలనే బలమైన ఆకాంక్ష ఇక్కడి విద్యావంతులు, విద్యార్థి సంఘాలకు నాటుకుపోయింది. ఎలా ముందుకెళ్లాలనే విషయంలో కార్యాచరణ కరువైంది. ఈ పరిస్థితుల్లో ‘సాక్షి’ జిల్లా కేంద్రంగా ‘యూనివర్సిటీ ఆవశ్యకత– సాధన కోసం ఎలా ముందుకెళ్లాలనే విషయంపై చర్చావేదిక’ను మంగళవారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి ఇది కొండంత బలంగాతోచింది. ఇంకేముంది..పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ అభిప్రాయాలను వెల్లడించారు. అనేక విషయాలు వెలుగులోకి.. చర్చావేదికలో పాల్గొన్న వక్తలు తమ ప్రసంగాల్లో అనేక అంశాలను ప్రస్తావించారు. యూనివర్సిటీ ఏ ర్పాటుపై గతంలో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి..తాజా పరిస్థితులను వివరించారు. గతంలో జ్ఞాన సరస్వతీ యూనివర్సిటీ మంజూరు చేశారని, ఆ ఫైల్ను మళ్లీ ముందుకు కదిపేందుకు అందరం ప్రయత్నించాంటూ వరప్రసాద్ పేర్కొన్నారు. యూనివర్సిటీ ఏర్పాటు అంశంలో ఇప్పుడు కొత్త జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్ జిల్లాలో 27 డిగ్రీ కళాశాలలు మాత్రమే ఉన్నాయని, వంద కళాశాలలు ఉంటేనే ఈ అంశాన్ని ప్రభుత్వాలు ప రిశీలనకు తీసుకుంటాయని కె.పున్నారావు వివరించారు. మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలు కూడా కలిసి వస్తేనే ఇది సాధ్యమవుతుందని చెప్ప డం ఆలోచించేలా చేసింది. అయితే ప్రస్తుతం మంచిర్యాలకు కరీంనగర్లోని శాతవాహన, నిర్మల్కు నిజామాబాద్లోని తెలంగాణ వర్సిటీలు దగ్గరగా ఉండడంతో వారు కలిసి వస్తారా.. లేదా.. అనే సందేహం వ్యక్తం చేశారు. ఈ విధంగా ఈ చర్చా వేదిక ద్వారా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.‘సాక్షి’కి ప్రశంసలు ఈ ప్రాంతవాసుల ఆకాంక్షకు అనుగుణంగా బుధవారం ‘సాక్షి’లో చర్చా వేదిక కథనం ప్రచురితం కాగా పాఠకులతో పాటు జిల్లావ్యాప్తంగా ఆయా వర్గాల నుంచి ప్రశంసలు, అభినందనలు వెల్లువెత్తాయి. ‘సాక్షి’ ఇప్పటికే ఎయిర్పోర్టు సాధన కోసం చేసిన కృషిని ప్రశంసిస్తూనే తాజాగా విశ్వవిద్యాలయం అంశాన్ని పాలకుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అభినందనీయమని కొనియాడారు. ఇక ప్రణాళికాబద్ధ్దంగా..వేదిక సందర్భంగా విద్యావంతులు, మేధావులు, నాయకులు ఐక్య పోరాటాల ద్వారానే లక్ష్యం సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీ సాధన కోసం కమిటీ ఏర్పాటు చేయాలని భావించారు. వెంటనే అడ్హక్ కమిటీని ప్రకటించారు. భవిష్యత్తు కార్యాచరణకు అడుగులు వేస్తామని, ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తామని వెల్లడించారు. అలాగే విద్యార్థి సంఘాలు, విద్యార్థులు తాము వెంటే ఉంటామని స్పష్టం చేశారు. -
పార్టీ పటిష్టతకు కృషి చేయాలి
● మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదిలాబాద్టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ పటిష్టతకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి, భూగర్భగనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఉమ్మడి జిల్లా నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఇందులో పార్టీ బలోపేతం, సమీకరణాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. స్థానిక సమస్యలు, కార్యకర్తల అభిప్రాయాలు, రాబోయే ఎన్నికల కార్యాచరణపై సమీక్షించారు. పార్టీని బలంగా తీర్చిదిద్దేందుకు నియోజకవర్గ స్థాయిలో నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, ఎంపీ అనిల్కుమార్యాదవ్, నాయకులు ఆత్రం సుగుణ పాల్గొన్నారు. -
బదిలీల అనంతరం పదోన్నతులు చేపట్టాలి
ఆదిలాబాద్టౌన్: గెజిటెడ్ హెడ్మాస్టర్ల బదిలీ అనంతరం పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోపాల్సింగ్ తి లావత్, జి.శశికళ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో వా రు మాట్లాడారు. నిబంధనల ప్రకారం మొదట బదిలీలు చేపట్టిన తర్వాత అర్హులైన ప్రధానో పాధ్యాయులకుపదోన్నతులు కల్పించాల్సి ఉంటుందన్నారు. అయితే అందుకు విరుద్ధంగా ప దోన్నతులు కల్పించడం సరికాదన్నారు. జిల్లా కు చెందిన ప్రధానోపాధ్యాయులు సుదూర ప్రాంతాల్లో పనిచేస్తున్నారని, రిటైర్మెంట్కు దగ్గ ర ఉన్నవారికి జీరో సర్వీస్, మినిమం ఏడా ది సర్వీసుతో ప్రధానోపాధ్యాయులందరికీ బదిలీ లకు అర్హులుగా అవకాశం కల్పించాలని కోరా రు. ఇందులో సంఘ నాయకులు పాల్గొన్నారు. ‘అభివృద్ధిని చూసి కాంగ్రెస్లోకి..’ బోథ్: రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధి పాలనను చూసి ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్లో చేరుతున్నారని ఏఐ సీసీ విచార్ విభాగ్ తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ తుల అరుణ్ కుమార్ అన్నారు. సొనాల మండల కేంద్రంలో చింతల్బోరి గ్రామానికి చెందిన పలువురు బుధవారం కాంగ్రెస్లో చేరారు. వారికి ఆయన కండువా కప్పి పార్టీలో కి ఆహ్వానించారు. ఇందులో సీనియర్ నాయకులు జ్ఞానేశ్వర్, పోతన్న, రమేష్ , పోశెట్టి, శ్రీధర్, అనిల్, భోజన్న, శ్రీరామ్ గైక్వాడ్, సంతోష్ ధన్వే, దేవిదాస్, గంగారాం, సదానంద్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టులో యువకుడి మృతదేహం లభ్యం
తాంసి: మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టులో చేపలు పట్టడానికి వచ్చి గల్లంతైన యువకుడి మృత దేహం బుధవారం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బొక్కలగూడ కాలనీకి చెందిన అడ్డెల రఘు(24) తన స్నేహితుడితో కలిసి సరదాగా ప్రాజెక్టు వద్దకు మంగళవారం చేపలు పట్టడానికి వచ్చారు. చేపలు పట్టే క్రమంలో ప్రాజెక్టు గేట్ల సమీపంలో రఘు ఒక్కసారిగా అదుపుతప్పి నీటిలో పడిపోయి గల్లంతయ్యాడు. తన స్నేహితుడు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం నీటిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడి సోదరుడు అజయ్ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రణయ్ కుమార్ తెలిపారు. బాధితుడికి నష్టపరిహారం అందజేతకాసిపేట: మండలంలోని వెంకటపూర్ గ్రామానికి చెందిన రైతు బుద్దె రాజలింగుకు చెందిన లేగదూడ పెద్దపులి దాడిలో మృతి చెందగా బాధితుడికి అటవీశాఖ ఆధ్వర్యంలో 24గంటల్లో నష్టపరిహారం అందజేశారు. ముత్యంపల్లి సెక్షన్ పరిధి మల్కేపల్లి బీట్లో మంగళవారం పెద్దపులి దాడిలో లేగదూడ మృతి చెందగా బుధవారం బాధిత రైతుకు బెల్లంపల్లి రేంజ్ కార్యాలయంలో రేంజ్ అధికారి పూర్ణచందర్ రూ. 20వేల నష్టపరిహారం అందజేశారు. డెప్యూటీ రేంజ్ అధికారి ప్రవీణ్నాయక్, ఎఫ్బీవో శ్రీధర్ పాల్గొన్నారు. కోడి పందేల స్థావరంపై దాడిజైపూర్: మండలంలోని దుబ్బపల్లి గ్రామ శివారులో బుధవారం కొంతమంది వ్యక్తులు కోడి పందేలు ఆడుతున్నట్లు వచ్చిన సమాచారంతో ఎస్సై శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు స్థావరంపై దాడి చేశారు. ఎస్సై మాట్లాడుతూ కోడి పందెం ఆడుతున్న సీసీసీ, నస్పూర్కు చెందిన గడ్డం సతీశ్, లక్షెట్టిపేట కుమ్మగూడెంకు చెందిన లశెట్టి సురేశ్, శ్రీరాంపూర్ తీగలపహాడ్కు చెందిన కట్కూరి రాజేశ్లను పట్టుకోగా ఇందారం గ్రామానికి చెందిన కూరగాయల శ్రీకాంత్, యతిరాజు వంశీ, మహేశ్, వైద్య గణేశ్లు, టేకుమట్ల గ్రామానికి చెందిన గోనె శరత్, గోదావరిఖనికి చెందిన పాకి సందీప్, నస్పూర్కు చెందిర రంగు సాయి, అరుణక్కనగర్కు చెందిన ఉదయ్లు పోలీసులను చూసి పారిపోయినట్లుగా తెలిపారు. పట్టుబడిన నిందితుల వద్ద ఒక్క కోడి, 31కోడి కత్తులు, రూ.3840లు, మూడు సెల్ ఫోన్లు, ఏడు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. చెన్నూర్ ఎంఈవోపై విచారణచెన్నూర్: మండల విద్యాధికారి కొమ్మెర రాధాకృష్ణమూర్తిపై డీటీఎఫ్ ఫిర్యాదు మేరకు విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎల్.లలిత బుధవారం విచారణ చేపట్టారు. ఎంఈవో విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని, ఉపాధ్యాయుల సర్వీసు బుక్ రికార్డు పూర్తి చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. విచారణ నివేదిక డీఈవోకు నివేదించనున్నట్లు లలిత తెలిపారు. -
దొరికిన పర్సు పోలీసులకు అప్పగింత
కుభీర్: దొరికిన పర్సును పోలీసులకు అప్పగించి దొంతుల పుష్ప అనే మహిళ నిజాయితీ చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. భైంసా వెళ్లేందుకు దొంతుల పుష్ప అనే మహిళ మండల కేంద్రంలోని బస్టాండ్కు వచ్చారు. అక్కడ ఆమెకు ఒక పర్సు దొరికింది. అందులో రూ.24,416ల నగదు, వెండి కాళ్లగజ్జలు (ఒక జత), ఇద్దరు మహిళలు, ఒక పిల్లడి ఫొటోలు ఉన్నాయి. ఒక ఫొటోపై యువతి పేరు కవిత అని రాసి ఉంది. కాగా దొంతుల పుష్ప దొరికిన పర్సును తన భర్త దత్రాత్రితో పోలీస్స్టేషన్కు పంపించి తన నిజాయితీ చాటుకున్నారు. భర్త పర్సును ఎస్సై కృష్ణారెడ్డికి అప్పగించారు. డబ్బు పోగొట్టుకున్న వారు సరైన ఆధారాలు చూపి డబ్బు తీసుకుపోవచ్చని ఎస్సై తెలిపారు. -
ట్రిపుల్ఐటీలో ముగిసిన కౌన్సెలింగ్
భైంసా: ట్రిపుల్ఐటీ బాసర, మహబూబ్నగర్ సెంటర్లకు 2025 –26 విద్యా సంవత్సరానికి గాను తొలివిడత కౌన్సెలింగ్ బుధవారం ముగిసింది. మూడవ రోజు ట్రిపుల్ఐటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధర్లు కౌన్సెలింగ్ ప్రారంభించారు. రెండు సెంటర్లలో కలిపి 1690 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. మూడు రోజులపాటు నిర్వహించిన కౌన్సెలింగ్లో 1472 మంది విద్యార్థులు హాజరయ్యారు. గైర్హాజరైన విద్యార్థుల స్థానాలను త్వరలోనే వెయిటింగ్ లిస్టు ఆధారంగా భర్తీ చేస్తామని క్యాంపస్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ బాసర క్యాంపస్ పూర్వ వైభవం తీసుకొచ్చేలా కృషి చేస్తామన్నారు. -
పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
దండేపల్లి: కడుపునొప్పి భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన దండేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై తహసీనోద్దిన్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. దండేపల్లి మండలం నెల్కి వెంకటపూర్ గ్రామానికి చెందిన కోవ మహేందర్ (19) కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. మద్యానికి బానిసైన మహేందర్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చూపించగా మద్యం మానేసి, మందులు వాడితే కడుపునొప్పి తగ్గుతుందని వైద్యులు చెప్పారు. కానీ మహేందర్ మద్యం మానేయలేదు. ఈనెల 5న కడుపునొప్పి తీవ్రంగా ఉందని, చనిపోవాలని ఉందంటూ అన్న లక్ష్మణ్కు చెప్పాడు. తాగుడు మానివేసి మందులు వాడితే కడుపునొప్పి తగ్గుతుందని లక్ష్మణ్ సముదాయించాడు. అదేరోజు మధ్యాహ్నం మందుల కోసం ఇంట్లో నుంచి వెళ్లిన మహేందర్, దండెపల్లి వాగులో పురుగుల మందు తాగి స్నేహితుడు మోకాషి శేఖర్కు ఫోన్ చేసి చెప్పాడు. శేఖర్ వెంటనే లక్ష్మణ్కు ఫోన్ చేయగా లక్ష్మణ్ అక్కడకు చేరుకుని బైక్పై మహేందర్ను లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వైకల్యాన్ని జయించి.. డాక్టరేట్ పొంది
● ఆదర్శం.. ప్రభుత్వ లెక్చరర్ గుణశ్వేత ఆదిలాబాద్టౌన్: కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ లెక్చరర్ డాక్టర్ గుణశ్వేత. వైకల్యమనేది శరీరానికే కానీ.. మేధస్సుకు కాదని చాటారు. క్యాన్సర్తో బాధపడి ఓ కాలును కోల్పోయిన ఆమె అదే అంశంలో పట్టు వదలకుండా రీసెర్చ్ చేసి డాక్టరేట్ అందుకున్నారు.ఆదిలాబాద్ లోని న్యూహౌసింగ్బోర్డు కాలనీకి చెందిన సుందరబాబు–త్రివేణి దంపతుల కుమార్తె ఈమె. ఒకటి నుంచి పదో తరగతి వరకు జిల్లా కేంద్రంలోని కాన్వెంట్ పాఠశాలలో చదివారు. పదో తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న సమయంలో తరగతి గదిలో ఇనుప బెంచీ తగిలి మోకాలుకు గాయమైంది. రక్తం గడ్డకట్టి క్యా న్సర్ బారిన పడ్డారు. దీంతో శాశ్వతంగా కాలు కో ల్పోవాల్సి వచ్చింది. అయినా చదువు మధ్యలో ఆపివేయకుండా ఉన్నతస్థాయికి ఎదిగారు. ఆర్టిఫిషల్ కాలుతో ముందుకు సాగి ఆదర్శంగా నిలిచారు. జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత వరంగల్లో ఎంఎస్సీ పూర్తి చేశారు. నిర్మల్లోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా విధులు నిర్వహిస్తున్నారు. 2021లో నీటి ద్వారా క్యాన్సర్ అనే అంశంపై పరిశోధన చేశారు. ఈనెల 7న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందుకున్నారు. అందరి మన్ననలు పొందారు. -
ఆయిల్పామ్ సాగు లాభదాయకం
● జిల్లాలో సాగు విస్తీర్ణం పెంచాలి ● కలెక్టర్ రాజర్షిషా ● వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులతో సమీక్ష కైలాస్నగర్: లాభదాయకమైన ఆయిల్పామ్ సాగుకు జిల్లా రైతులు ముందుకు రావాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయిల్పామ్ సాగు ద్వారా మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకంగా అనేక సబ్సిడీ పథకాలు అందిస్తున్నాయని తెలిపారు. జిల్లా రైతులు ఈ సాగు వైపు దృష్టి సారించాలని సూచించారు. ఆయా మండలాల్లో ఏవోలు సాగు లక్ష్యాలను రూపొందించి రైతులకు అవగాహన కల్పించాన్నారు. ఇందులో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి ఎస్.సుధాకర్, మల్లేశ్వరరావు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు. ‘అమృత్ 2.0’పై సమీక్ష పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి గాను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ 2.0 పథకం పురోగతిపై కలెక్టర్ రాజర్షిషా, స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి బుధవారం సమీక్షించారు. కలెక్టరేట్ చాంబర్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. అమృత్ పథకం ద్వారా పట్టణంలో నీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థ, పచ్చదనం పెంపు, రహదారి నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేలా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో చేపడుతున్న నీటి సరఫరా అభివృద్ధి పనులు, ఎస్టీపీ నిర్మాణ పనుల పురోగతిపై అధికారుల నుంచి నివేదికలు తీసుకున్నారు. ప్రతీ ప్రాజెక్టును నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని, పనులపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని సూచించారు. సమావేశంలో ఆదిలాబాద్ ఆర్డీవో వినోద్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ సలోని, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యం
ఇంద్రవెల్లి: మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా మండలంలోని దస్నాపూర్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ప్లాంట్ కోసం అధికారులు బుధవారం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా అదన పు డీఆర్డీవో గోవింద్రావ్ మాట్లాడుతూ.. రూ.3 కోట్ల నిధులతో చేపట్టనున్న ప్రాజెక్టుకు దస్నాపూర్, పిట్టబొంగరం మహిళా సంఘాలు రూ.26 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని, మిగతా రూ.2.74 కోట్లు రాయితీ కింద కేంద్రం అందిస్తుందన్నారు. గాంధీ జయంతి రోజున నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట డీపీఎం ఫైనాన్స్ న్యాను, ఐకేపీ ఏపీఎం రాథోడ్ రామారావ్ తదితరులున్నారు. -
ఇంకా తడబాటే
● విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు అంతంతే ● గతంతో పోల్చితే కొంత మెరుగు ● ‘ఫరఖ్’ ఫలితాల్లో వెల్లడి ఆదిలాబాద్టౌన్: జిల్లాలో పాఠశాల స్థాయి విద్యార్థుల అభ్యసన సామర్థాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. 2017లో లో పర్ఫార్మెన్స్గా ఉన్న జిల్లా గతంతో పోల్చితే కొంత మెరుగు పడిందని చెప్పుకోవచ్చు. గతేడాది డిసెంబర్లో జాతీయ స్థా యిలో 3,6,9 తరగతుల విద్యార్థులకు పర్ఫామెన్స్ అసెస్మెంట్ రివ్యూ అనాలసిస్ నాలెడ్జ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ (ఫరఖ్) నిర్వహించారు. అయితే జిల్లాలో ఫలితాలు అంతగా చెప్పుకోదగ్గవిగా లేవు. 50 శాతం కంటే తక్కువగానే సామర్థ్యాలు ఉన్నట్లు తేలింది. రెండు విభాగాల్లో విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ముందు వరుసలో ఉండగా, మిగతా వాటిలో అంతంత మాత్రంగానే నిలిచారు. ఈ ఫలితాలను జాతీయ విద్యా మండలి మంగళవారం విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించారు. వీటి ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు విద్యాశాఖ చర్యలు చేపట్టాల్సి ఉంది. విద్యార్థుల సామర్థ్యాలు అంతంతే.. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సామర్థ్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. చా లామంది హైస్కూల్ విద్యార్థులు చదవడం, రా య డం, చతుర్విద ప్రక్రియలు చేయలేకపోతున్నారు. 2017లో నిర్వహించిన న్యాస్ పరీక్షలో జిల్లా విద్యార్థులు అత్యంత సామర్థ్యాలు వెనుకబడిన జిల్లాగా దేశంలో నమోదైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జిల్లాపై దృష్టి సారించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ఈ క్రమంలో కొంత మెరుగు పడింది. గత డిసెంబర్లో జిల్లాలో 79 పాఠశాలల్లో ఫరఖ్ పరీక్ష నిర్వహించారు. 3వ తరగతికి సంబంధించి 32 పాఠశాలల్లో 713 మంది, 6వ తరగతికి సంబంధించి 27 పాఠశాలల్లో 680 మంది విద్యార్థులు, 9వ తరగతికి సంబంధించి 35 పాఠశాలల్లో 717 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. జిల్లా వ్యాప్తంగా 2,3 10 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష నిర్వహణకు 298 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తరగతుల వారీగా.. ఈ పరీక్షను 3,6,9 తరగతులకు సంబంధించి తెలు గు, గణితం కూడికలు, తీసివేతలు, భాగాహారాలు తదితర అంశాలపై నిర్వహించారు. ● 3వ తరగతిలో తెలుగు భాషకు సంబంధించి జిల్లా విద్యార్థులు 55 శాతం మంది నిర్ణీత సామర్థ్యాలు సాధించారు. అంటే దాదాపు సగం మంది వరకు తెలుగు చదవలేక పోతున్నారనేది పరీ క్ష ద్వారా తేటతెల్లమైంది. తెలంగాణ రాష్ట్ర శాతం చూస్తే 58 శాతం నమోదైంది. గణితంలో జిల్లా విద్యార్థులు 51 శాతం మంది అర్హత సాధించగా, రాష్ట్రస్థాయిలో 54 శాతం మంది లెక్కలు చేయగలుగుతున్నారు. ● ఆరో తరగతిలో తెలుగు భాషకు సంబంధించి 49 శాతం మంది విద్యార్థులు సామర్థ్యాలు కలిగి ఉన్నారు. గణితంలో 42 శాతం కూడికలు, తీసివేతలు, గుణాకారాలు, భాగహారం సమస్యలు సాధించడంలో 48 శాతం మంది సామర్థ్యాలు కలిగి ఉండగా, భిన్నాలకు సంబంధించి 27 శాతం మందికి మాత్రమే అవగాహన ఉంది. ● 9వ తరగతిలో తెలుగుకు సంబంధించి 47 శా తం విద్యార్థులు సామర్థ్యాలు కలిగి ఉన్నారు. గణితంలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. 36 శాతం మంది మాత్రమే లెక్కలు చేయగలు గుతున్నారు. వివిధ రకాల గణిత అంశాలపై 33 శాతం మందికి మాత్రమే అవగాహన ఉంది. రాష్ట్రంలోని ఆయా జిల్లాల పరిస్థితి కూడా గణితంలో వెనుకబడే ఉండడం గమనార్హం.సామర్థ్యాల పెంపుపై దృష్టి.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సామర్థ్యాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. గతేడాది 3,6,9 తరగతుల విద్యార్థులకు ఎన్సీఈఆర్టీ ఫరఖ్ పరీక్ష నిర్వహించింది. గతం కంటే విద్యార్థుల సామర్థ్యాలు మెరుగ్గానే ఉన్నాయి. మరింత మెరుగుపర్చేందుకు చర్యలు చేపడతాం. చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. – శ్రీనివాస్రెడ్డి, డీఈవో -
సమస్య గుర్తింపు ఇక ఈజీ
● విద్యుత్ లైన్లపై లైన్ఫాల్ట్ కండక్టర్లు ఏర్పాటు ● సమస్య గుర్తించి వేగంగా పరిష్కరించేందుకు కొత్త విధానం ● అటవీ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు ● త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి.. కడెం: అటవీ ప్రాంతాల్లో తరచూ విద్యుత్ సమస్యలు తలెత్తుతుంటాయి. వానాకాలంలో ఈదురుగాలులు సంభవించినప్పుడు విద్యుత్లైన్పై చెట్ల కొమ్మలు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. విద్యుత్ సమస్య ఏర్పడినపుడు సమస్యను గుర్తించి, విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు విద్యుత్శాఖ సిబ్బంది గంటల తరబడి శ్రమిస్తుంటారు. అంతవరకు విద్యుత్ సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతారు. ఇక నుంచి గంటల తరబడి విద్యుత్ సరఫరాలో అంతరాయానికి చెక్ పడనుంది. విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు విద్యుత్శాఖ అటవీ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా లైన్ఫాల్ట్ కండక్టర్లను ఏర్పాటు చేసింది. త్వరలోనే ఈ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 12 చోట్ల ఏర్పాటు.. విద్యుత్ అంతరాయాన్ని వెంటనే పరిష్కరించేలా ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాలకు విద్యుత్ సరఫరా అందించే విద్యుత్లైన్లపై అటవీ ప్రాంతాల్లో లైన్ఫాల్ట్ కండక్టర్లు ఏర్పాటు చేశారు. కడెం, పెంబి మండలాల్లోని 33 కేవీ లైన్పై ఆరుచోట్ల, కడెం మండలంలోని అల్లంపల్లి, ఉడుంపూర్, ఖానాపూర్ మండలంలోని రాజురా 11 కేవీ విద్యుత్లైన్లపై సైతం వీటిని ఏర్పాటు చేశారు. లైన్ఫాల్ట్ కండక్టర్ల ద్వారా విద్యుత్ సిబ్బంది వెంటనే అప్రమత్తమైవిద్యుత్ సమస్య తలెత్తిన ప్రాంతానికి వెళ్లి విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు అవకాశం ఉంటుంది. పని తీరు ఇలా.. విద్యుత్ సరఫరా నిలిచిపోగానే వైర్లకు ఉన్న మూడు కండక్టర్లు ఎరుపు రంగులో మెరుస్తుంటాయి. లైన్ఫాల్ట్ కండక్టర్ల వద్ద విద్యుత్ స్తంభానికి ఏర్పాటు చేసిన సోలార్ సిస్టం ద్వారా లైన్మెన్, ఏఈఈ, డీఈఈ, ఎస్ఈ వరకు అంతరాయం సమాచారం అందజేస్తుంది. ఇందుకు సోలార్ సిస్టంలో సిమ్ వేసి ఉంచుతారు. అందులో సేవ్ చేసిన నంబర్లకు సమాచారం వెళ్తుంది. దీంతో పాటు విద్యుత్ లైన్కు ఎంత దూరంలో సమస్య ఉందని సమాచారం తెలిపే సిస్టం కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలో పూర్తిస్థాయి సేవలు అటవీ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు పలుచోట్ల విద్యుత్లైన్లకు లైన్ఫాల్ట్ కండక్టర్లు ఏర్పాటు చేశాం. త్వరలోనే వీటి పూర్తిస్థాయి సేవలు అందుబుటులోకి వస్తాయి. – ఎం.రాంసింగ్, ఏఈఈ -
పీహెచ్సీలో ప్రసవ వేదన
వేమనపల్లి: పురిటినొప్పులతో వేమనపల్లి పీహెచ్సీకి వెళ్తే గర్భిణీకి వైద్యం కరువైంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని సిరొంచ తాలూకా నర్సయ్యపల్లికి చెందిన కొండగొర్ల సోనియా కాన్పు కోసం మూడు నెలల క్రితం వేమనపల్లిలోని తల్లిగారింటికి వచ్చింది. పీహెచ్సీ వైద్యంపై నమ్మకం లేక మంచిర్యాల, చెన్నూర్ ప్రైవేట్ వైద్యుల వద్ద వైద్యపరీక్షలు చేయించుకుంటోంది. ఈ నెల 17వ తేదీన ప్రసవానికి సమయం ఇచ్చారు. కాగా బుధవారం ఉదయం పురిటినొప్పులు రావడంతో వేమనపల్లి పీహెచ్సీకి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో ఏ ఒక్క సిబ్బంది అందుబాటులో లేరు. గత్యంతరం లేక పీహెచ్సీలోని బెడ్పై పడుకోబెట్టగా తీవ్రమైన నొప్పులతో విలవిలలాడింది. పీహెచ్సీలోనే గంటసేపు వేచి చూశారు. కొంతసేపటికి గ్రామంలోనే ఉన్న కాంటిజెంట్ వర్కర్ నిర్మల వచ్చారు. వైద్యాధికారి రాజేశ్కు సోనియా అన్నయ్య రజినీకాంత్ ఫోన్ చేసినా స్పందించలేదు. ఇంకా ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం అని 108 అంబులెన్స్లో చెన్నూర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సోనియా వైద్యుల పర్యవేక్షణలో క్షేమంగా ఉన్నట్లు భర్త స్వామి, తల్లి గౌరక్కలు తెలిపారు. -
బాధితుడి నిర్వాకంతో అధికారుల హైరానా
కై లాస్నగర్: కలెక్టర్ను కలిసేందుకు వచ్చిన ఓ వ్యక్తి కలెక్టరేట్లో మూర్చ పేరిట కిందపడిపోయి అధికారులు హైరానా పడేలా చేసిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇచ్చోడ మండలం గెర్జాం గ్రామానికి చెందిన శివాజీ అనే వ్యక్తి తన భూ సమస్యను కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్కు వచ్చాడు. తహసీల్దార్ చాంబర్లోకి వెళ్లి మూర్చపోయినట్లు కిందపడ్డారు. దీంతో తహసీల్దార్ శ్రీనివాస్తో పాటు కార్యాలయ ఉద్యోగులు ఆందోళన చెందారు. ఆర్డీవో వినోద్కుమార్ సైతం అక్కడి చేరుకున్నారు. బాధితుడు పడిపోయి ఉండడంతో వివరాలు ఆరా తీశారు. ఆ సమయంలోనే చేరుకున్న కలెక్టర్ రాజర్షిషా బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. దీంతో కార్యాలయ సిబ్బంది 108 అంబులెన్స్లో రిమ్స్కు తరలించారు. కాగా తన భూమిని కొందరు కబ్జా చేయగా అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని మూర్చపోయినట్లు నాటకాలు ఆడినట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. -
డ్రైవర్ కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన
రెబ్బెన: ఇటీవల ట్రాక్టర్ బోల్తాపడి పులికుంట గ్రామానికి చెందిన దుర్గం మారుతి మృతి చెందగా మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు బుధవారం పులికుంట వద్ద జాతీయ రహదారిపై మృతదేహంతో రాస్తారోకో నిర్వహించారు. ట్రాక్టర్ యజమాని మృతుడి కుటుంబానికి రూ. 5లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ట్రాక్టర్ యజమాని వచ్చి న్యాయం చేస్తానని హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. సుమారు 45 నిమిషాల పాటు రాస్తారోకో చేపట్టడంతో రోడ్డుకు ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు విషయాన్ని ఏఎస్పీ చిత్తరంజన్ దృష్టికి తీసుకెళ్లగా హుటాహుటిన ఆయన సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. గురువారం ట్రాక్టర్ యజమానిని పిలిపించి మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. దాంతో రాస్తారోకో విరమించారు. -
సమస్య పరిష్కరించాలని రైతు ఆత్మహత్యాయత్నం
లక్ష్మణచాంద: తన భూ సమస్య పరిష్కరించడం లేదని ఓ రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మణచాందకు చెందిన రైతు పసుపుల గంగాధర్కు 10 గుంటల భూమి ఉంది. దానికి పట్టాపాస్ బుక్ ఉండడంతో పాటు ఏటా వివిధ ప్రభుత్వ పథకాలు కూడా పొందుతున్నాడు. అయితే ఆ భూమిని అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి తనదిగా చెబుతూ సాగు చేసుకుంటున్నాడు. తన భూమిని తనకు చూపాలంటూ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ఏళ్లుగా తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదు. మనస్తాపం చెందిన గంగాధర్ బుధవారం మధ్యాహ్న సమయంలో తహసీల్ధార్ కార్యాలయం వద్దకు వచ్చి వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా గమనించిన రైతులు, అధికారులు అడ్డుకొని మందు డబ్బా లాక్కున్నారు. అనంతరం తహసీల్దార్ సరిత రైతుతో మాట్లాడారు. దీనిపై సాక్షి తహసీల్దార్ సరితను వివరణ కోరగా రైతు ఫిర్యాదుతో గతంలోనే సర్వేయర్ వెళ్లి పంచనామా నిర్వహించారన్నారు. దానికి రైతు సంతృప్తి చెందలేదని పేర్కొన్నారు. పూర్తి వివరాలతో డీఐకి, ఏడీ నిర్మల్కు చర్యలు తీసుకోవాలని కోరుతూ రైతు ఫిర్యాదు పంపుతున్నట్లు తెలిపారు. -
మొన్న ఎయిర్పోర్టు.. ఇప్పుడు యూనివర్సిటీ
‘సాక్షి’ సామాజిక బాధ్యతగా యూనివర్సిటీ సాధన కోసం ముందడుగు వేయడం అభినందనీయం. ఇటీవల ఎయిర్పోర్టు గురించి డిబెట్ నిర్వహించగా, ప్రభుత్వాలు స్పందించి ముందడుగు వేశాయి. తాజాగా యూనివర్సిటీ ఏర్పాటు కూడా సాధ్యపడుతుందని ఆశిస్తున్నాం. – పురుషోత్తం రెడ్డి, జాతీయ మానవ హక్కుల కమిషన్ జిల్లా చైర్మన్ వివక్షతతోనే వర్సిటీ దూరం.. జిల్లాలో వర్సిటీ ఏర్పాటుకు అవసరమైన అన్ని వనరులు ఉన్నా పాలకుల వివక్ష కారణంగా అన్యాయం జరుగుతుంది. విశ్వవిద్యాలయం సాధన కోసం ‘సాక్షి’ చొరవ తీసుకొని చర్చా వేదిక ఏర్పాటు చేయడం అభినందనీయం. – అల్లూరి భూమన్న, స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్