breaking news
Adilabad
-
పులకించిన పోరుగడ్డ
కెరమెరి(ఆసిఫాబాద్):జల్.. జంగల్.. జమీన్ కోసం పోరుసలిపి అసువులు బాసిన ఆదివాసీ పోరాట యోధుడు కుమురంభీం స్మరణతో పోరుగడ్డ పులకించింది. రణభూమి జోడేఘాట్లో వీరుడి 85వ వ ర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమా ర్ హాజరై భీంవిగ్రహానికి పూలమాలలు వేసి, ఆయ న సమాధిపై పూలు చల్లి నివాళులర్పించారు. ఎన్ని కల కోడ్ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు వేదికపైకి వెళ్లలేదు. దర్బార్ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరికి వారుగా వచ్చి నివాళులర్పించి వెళ్లిపోయారు. సంప్రదాయపూజలు కుమురంభీంకు ఆయన వారసులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సంప్రదాయ పూజలు నిర్వహించారు. భీం సమాధిపై పూలు చల్లి పూజలు చేశారు. ముందుగా ఆచార, వ్యవహారాలతో పాత జెండాలు తీసేసి కొత్త జెండాలు ఆవిష్కరించారు. అంతా వరుసక్రమంలో నిల్చుని జెండాలకు మొక్కారు. ధూప, దీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. కోడి, మేకలతో జాతకం చూశారు. భీం ఆశయాలు నెరవేర్చుతాం: మంత్రులు కుమురం భీం ఆశయాలు నెరవేర్చుతామని మంత్రులు జూపల్లి, అడ్లూరి అన్నారు. ఆదివాసీలను సంఘటితం చేసి వారి హక్కుల సాధనకు పోరాడిన వీరుడు కుమురంభీం అని కొనియాడారు. తెలంగా ణ రాష్ట్ర సాధనలో ఆయన స్ఫూర్తి ఎంతో ఉందని పేర్కొన్నారు. 1935 నుంచి నిజాంకు వ్యతిరేకంగా పోరాడి వారి బలగాలను ఎదురించారని తెలిపారు. ఆదివాసీల అభివృద్ధికి రూ.740 కోట్లతో రోడ్లు, గిరి జన భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిందని చెప్పారు. విద్య, ఆశ్రమ పాఠశాలలను మరింత తీర్చి దిద్దుతామని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా వేదికపై మాట్లాడలేకపోతున్నామని అన్నారు. ‘కుమురం’ స్ఫూర్తితో ముందుకు..: కలెక్టర్ కుమురం భీం స్ఫూర్తితో ముందుకు సాగుదామని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పిలుపునిచ్చా రు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పాటుపడతామని పేర్కొన్నారు. భీం వర్ధంతికి ఉచిత బస్సు సౌకర్యం, భోజనం వసతులు కల్పించామన్నారు. అనంతరం భీం మనుమడు కుమురం సోనేరావు కు టుంబానికి కలెక్టర్ నూతన వస్త్రాలు అందించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు పాటగూడ, జోడేఘాట్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గుస్సాడీ నృత్యాలు కనువిందు చేశాయి. ఐసీడీఎస్, రెవెన్యూ, ఐటీడీఏ, సఖీ, వైద్యారోగ్యశాఖ, కొలాం అభివృద్ధి, ఇప్పుపూలు, విస్తరాకుల తయారీ తదితరస్టాళ్లు ఆకట్టుకున్నాయి. నివాళులర్పించినవారిలో.. ‘స్థానిక’ ఎన్నికల కోడ్ నేపథ్యంలో దర్బార్ రద్దు చేయగా భీం ఆరాధికులు అనుకున్న స్థాయిలో హాజరు కాలేదు. మంత్రులు, కలెక్టర్తోపాటు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎస్పీ కాంతిలాల్పాటిల్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, ఏఎస్పీ చిత్తరంజన్, డీఎఫ్వో నీరజ్కుమార్, ఆర్డీవో లోకేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, డీడీ రమాదేవి, ఎంపీ నగేశ్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు, భీం మనుమడు కుమురం సోనేరావు, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు సుగుణ, నాయకులు విశ్వప్రసాద్, శ్యాంనాయక్ తదితరులు భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించినవారిలో ఉన్నారు. -
అప్రమత్తంగా ఉండాలి
తాంసి: విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఎస్పీ మంగళవారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందితో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మహారాష్ట్ర నుంచి మద్యం, డబ్బు వంటివి అక్రమంగా రవాణా కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ జీవన్రెడ్డి, రూరల్ సీఐ ఫణిందర్, ఎస్సై జీవన్రెడ్డి, సిబ్బంది ఉన్నారు. -
‘స్థానిక’ ఎన్నికలపై ఉత్కంఠ
సాక్షి,ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి గత నెలలో షెడ్యూల్ జారీ అయ్యింది. సాధారణంగా షెడ్యూల్ ప్రకటన తర్వాత క్షేత్రస్థాయిలో రాజకీయాలు వేడెక్కాలి. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ నేపథ్యంలో ఎన్నికలు ఇ ప్పుడు ప్రకటించిన రిజర్వేషన్ల ఆధారంగానే జరుగుతాయా.. లేనిపక్షంలో పరిణామాలు ఎలా ఉంటాయని రాజకీయ పార్టీలతో పాటు ఆశావహులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుధవారం రాష్ట్ర ప్రధాన న్యాయస్థానంలోఈ విచారణ సాగను న్న నేపథ్యంలో అందరి దృష్టి అటువైపే నెలకొంది. గత నెలలో షెడ్యూల్.. సెప్టెంబర్ 29న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ జారీ అయిన విషయం తెలిసిందే. పరిషత్ ఎన్నికలు రెండు విడతల్లో, గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించేలా అందులో ప్రకటించారు. పరిషత్ మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ గురువారం రావాల్సి ఉంది. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో హైకోర్టులో బుధవారం విచారణ సాగనుంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం స్పందనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రిజర్వేషన్లు నిలిచేనా..? ఆదిలాబాద్ జెడ్పీ చైర్పర్సన్ రిజర్వేషన్ జనరల్ (మహిళ)కు కేటాయించిన విషయం తెలిసిందే. అలాగే జిల్లాలో 20 పరిషత్ స్థానాలకు గాను 8 ఎస్టీ, 8 బీసీ, 2 జనరల్, 2 ఎస్సీలకు రిజర్వేషన్ ఖరారయ్యాయి. ఇందులో సగం స్థానాలను మహిళలకు కేటాయించారు. అలాగే ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ల రిజర్వేషన్ల ఖరారు సైతం ఇప్పటికే పూర్తయింది. హైకోర్టు తీర్పు తర్వాత రోజే గురువారం పరిషత్ ఎన్నికలకు సంబంధించి మొదటి నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. అయితే గ్రామాల్లో ఇప్పటివరకు ఈ ఎన్నికలకు సంబంధించి వేడి కనబడటం లేదు. రాజకీయ పార్టీలు కూడా వేచి చూసే ధోరణిలో న్యాయస్థానం తీర్పు ఎలా ఉంటుందోనని ఆసక్తిగా గమనిస్తున్నారు. -
మాతా శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యం
ఆదిలాబాద్టౌన్: మాతా, శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యమని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. పట్టణంలోని శాంతినగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలతో మంగళవారం సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవజాతి శిశు మరణాల రేటును 10లోపు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే గర్భిణుల ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. ఇందులో డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి శ్రీధర్, మెడికల్ ఆఫీసర్ ఇఫత్, వినోద్ కుమార్, సీఓ రాజారెడ్డి, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ
కై లాస్నగర్: జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా అన్నారు. తొలి విడత నామినేషన్ల స్వీకరణ ఈనెల 9 నుంచి ప్రారంభం కానున్న తరుణంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, నామినేషన్ల ప్రక్రియపై జిల్లాలోని ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పోలీస్ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. నామినేషన్ల స్వీకరణ నుంచి అభ్యర్థుల తుది జాబితా ప్రకటన వరకు నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, విత్డ్రా, గుర్తుల కేటాయింపు ప్రక్రియతో పాటు ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేలా చూడాలన్నారు. సమయపాలన పక్కాగా పాటించాలని, ఆర్వో గదిలో వాల్క్లాక్ ఏర్పాటు చేయాలన్నారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులతో పాటు వారి ప్రతిపాదకులు స్థానికులేనా అనే దాన్ని ఓటరు జాబితా ఆధారంగా నిర్ధారించుకోవాలన్నారు. ప్రక్రియ అంతా వీడియోగ్రఫీ చేయించాలన్నారు. రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు ప్రత్యేక ఐడీ కార్డులు జారీ చేయాలని తెలిపారు. పోటీలో నిలిచే అభ్యర్థులు ప్రత్యేక బ్యాంకు అకౌంట్ ఖాతా తెరిచి నామినేషన్ల సమయంలోనే అందించాలన్నారు. ఎన్నికల ఖర్చులు మొత్తం ఈ ఖాతా నుంచే నిర్వహించాలని తెలిపారు. ప్రతీ ఆర్వో కార్యాలయంలో అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేసేలా హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు. నోటిఫికేషన్ జారీకి ముందే మాక్ నామినేషన్ ప్రక్రియ నిర్వహించాలని తద్వారా నిర్వహణలో తప్పిదాలకు అవకాశం లేకుండా ఉంటుందన్నారు. సమస్యత్మాక కేంద్రాలపై తహసీల్దార్, ఎంపీడీవో, ఎస్హెచ్ఓలు సంయుక్తంగా చర్చించి వాటి వివరాలతో కూడిన జాబితాలను గురువారంలోగా అందించాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని, సబ్ కలెక్టర్ యువరాజ్, ఏఎస్పీ కాజల్ సింగ్, జెడ్పీ సీఈవో రాథోడ్ రవీందర్, డీపీవో రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రొసీడింగ్.. జాప్యం
కైలాస్నగర్: అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఎల్ఆర్ఎస్– 2020 స్కీం కింద ఫీజు లో 25శాతం రాయితీ కల్పిస్తూ మే 3వ తేదీ వరకు ఈ పథకాన్ని అమలు చేసింది. అయితే ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో దీనికి ఆశించిన మేర స్పందన లభించలేదు. దరఖాస్తులు పెద్ద సంఖ్యలో అందినప్పటికీ ఫీజు చెల్లింపునకు మాత్రం అంతగా ముందుకు రాలేదు. మరోవైపు ఫీజు చెల్లించిన వారి విషయంలో బల్దియా అధికారులు అలసత్వం ప్రదర్శి స్తున్నారు. క్షేత్రసాయి పరిశీలనలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో ప్రొసీడింగ్ ఆర్డర్ల జారీలో తీవ్ర జాప్యమవుతోంది. దీంతో ఫీజు చెల్లించిన వారికి నిరీక్షణ తప్పడం లేదు. స్పందన నామమాత్రమే.. గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీంకు 2020లో శ్రీకా రం చుట్టింది. నాడు మీసేవ కేంద్రాల్లో రూ.1000 చె ల్లించి దరఖాస్తు చేసుకున్న వారి ప్లాట్లను క్రమబద్ధీ కరించాలని ఇటీవల కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. 25శాతం రాయితీతో కూడిన ఫీజు చెల్లింపున కు రెండు నెలల పాటు అవకాశం కల్పించింది. దీంతో బల్దియాకు భారీగా ఆదాయం సమకూరుతుంద ని భావించారు. అయితే ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు.దరఖాస్తుదారుల్లో సగంలో సగం మంది కూడా ఫీజు చెల్లించలేదు. చెల్లింపులోనూ సాంకేతిక సమస్యలు తలెత్తడం, పలు ప్లాట్లను నిషేధిత భూముల జాబితాలో చూపడం, వాటిని సరిదిద్దాల్సిన సంబంధిత అధికారుల మధ్య సమన్వయం కొరవడటం, చాలామంది ప్లాట్లను విక్రయించడం, కొనుగోలు చేసిన వారు ఎల్ఆర్ఎస్ చేస్తే తమకు ఎలాంటి ఇబ్బంది వస్తుందోనని వెనుకడుగు వేయడం వంటి కారణాలతోనే ఆశించిన స్థాయిలో స్పందన రాలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. వేల సంఖ్యలో దరఖాస్తులు అందినప్పటికీ ఫీజు చెల్లించేందుకు మాత్రం వారు అంతగా ముందుకు రానట్లుగా అధికారులు చెబుతున్నారు. ఫీజు చెల్లించినా.. అందని ప్రొసీడింగ్ ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి నెలల తరబడి ప్రొసీడింగ్ ఆర్డర్లు అందించకపోవడం బల్దియా అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. జిల్లాలో ఇంకా 602 మందికి ప్రొసీడింగ్ కాపీలు అందించాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో పరిశీలించి అందించాల్సిన అధికారుల తీరుపై దరఖాస్తుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రొసీడింగ్ అందకపోవడంతో ఇళ్లను నిర్మించుకోవాలని భావిస్తున్న వారు అనుమతుల కోసం ఇబ్బందులు పడుతున్నా రు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సత్వరం అందేలా చూడాలని కోరుతున్నారు. మున్సిపల్లో అందిన దరఖాస్తులు : 22,489 ఫీజు చెల్లింపునకు అర్హులు : 17,854 ఫీజు చెల్లించిన వారు : 4,498 జారీ చేసిన ప్రొసీడింగ్ పత్రాలు : 3,806 బల్దియాకు చేకూరిన ఆదాయం : రూ.9కోట్లు ప్రక్రియ వేగవంతం చేశాం ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తుదారుల ప్లాట్ల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేశాం. ఇందుకోసం పది మంది వార్డు ఆఫీసర్లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాం. వారికి లాగిన్ ఐడీలు సైతం కేటాయించాం. ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసి ప్రొసీడింగ్ ఆర్డర్లు అందించేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం. – సుమలత, టౌన్ప్లానింగ్ అధికారి -
పోరాటయోధుడు కుమురంభీం
ఆదిలాబాద్రూరల్: జల్, జంగల్, జమీన్తో పాటు ఆదివాసీల హక్కుల సాధన కోసం నిజాం సర్కార్తో కుమురం భీం అనేక పోరాటాలు చేశారని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. హీరా సుకా జాగృతి సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మంగళవారం కుమురంభీం వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి ఆయన హాజరయ్యారు. కుమురంభీం, రాంజీగోండ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ, పోరాటయోధుడు కుమురం భీం జీవి తం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశ య సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నా రు. అనంతరం కొలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న కొడప సొనేరావ్ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్, డీఎస్పీ జీవన్ రెడ్డి, జాగృతి సమితి జిల్లా అధ్యక్షుడు సిడాం రాంకిషన్, ఆదివాసీ సంఘాల నేతలు మడావి రాజు, కుర్సేంగే తానాజీ, కుమ్ర రాజు, గేడం వనిత, గేడం గీత, ఆత్రం అనసూయ, యాదవ్రావ్, బాపూరావ్, లక్ష్మణ్, ఆనంద్రావ్, మనోహర్, శంకర్, సుభాష్ పాల్గొన్నారు. కై లాస్నగర్: భూ భారతి పెండింగ్ దరఖాస్తులు ఈ నెలాఖరులోగా పరిష్కరించి నివేదికలు అందించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని తహసీల్దార్లతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వివిధ మాడ్యూల్స్లో అందిన దరఖాస్తులు, పరిష్కారమైన, పెండింగ్లో ఉన్న, నోటీసులు జారీ చేసిన, క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టిన దరఖా స్తుల వివరాలపై మండలాల వారీగా సమీక్షించారు. దరఖాస్తుల పరిశీలనలో అలసత్వం వహించవద్దన్నారు. ప్రతీ మండలంలో రెండు టీంలను ఏర్పాటు చేసి సర్వే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందులో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రెయినీ కలెక్టర్ సలోని తదితరులు పాల్గొన్నారు. ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి కై లాస్నగర్: వాల్మీకి మహర్షి జయంతిని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా బీసీ అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని వాల్మీకి చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి -
ఇక వారి పింఛన్ డబ్బులు బ్యాంకు ఖాతాలకే..
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో విలీనమై ఆరేళ్లుగా మావలలోనే చేయూత పింఛన్ డబ్బులు పొందుతున్న వారి కష్టాలు ఎట్టకేలకు దూరం కానున్నాయి. ఇక నుంచి నేరుగా వారి బ్యాంకు ఖాతా ల్లోనే జమ కానున్నాయి. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు.మున్సిపల్ పరిధిలోని 13 కాలనీలకు..ప్రస్తుతం ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న దస్నాపూర్, దోబీకాలనీ, దుర్గానగర్, హన్మాన్నగర్, న్యూహౌసింగ్బోర్డు, కై లాస్నగర్, పిట్టలవాడ, రాంనగర్, షాద్నగర్, సుభాష్నగర్, టైలర్స్కాలనీ, టీచర్స్కాలనీ, కేఆర్కే కాలనీలు గతంలో మావల మేజర్ గ్రామ పంచాయతీ పరిదిలో ఉండేవి. 2019లో పునర్విభజనలో భాగంగా వీటిని ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో చేర్చారు. పట్టణ పరిధిలోని పింఛన్దారులకు పింఛన్ను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. గ్రామీ ణ ప్రాంత లబ్ధిదారులకు మాత్రం పోస్టాఫీసుల ద్వారా చెల్లిస్తున్నారు. అయితే ఈ కాలనీలు ము న్సిపల్లో విలీనమై ఆరేళ్లవుతున్నా వీరికి మాత్రం దస్నాపూర్, మావలలోని పోస్టాఫీసుల ద్వారానే పింఛన్ చెల్లిస్తూ వస్తున్నారు. ఈ నగదు తీసుకునేందుకు వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు ఆయా కాలనీల నుంచి ప్రతి నెలా అక్కడికి ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సి వస్తోంది. అలాగే రద్దీ ఉండటంతో గంటల తరబడి నిరీక్షణ తప్పని పరిస్థితి. ఈ క్రమంలో వారి ఇక్కట్లను గుర్తించిన కలెక్టర్ వారికిచ్చే పింఛన్ను మున్సిపల్ ద్వారానే చేపట్టాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వచ్చే నెల నుంచి ఆయా కాలనీల్లోని 1608 మంది లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో పింఛన్ డబ్బులు జమ కానున్నాయి.మరి ఆ రెండు కాలనీల పరిస్థితి..ఇదిలా ఉంటే ఆదిలాబాద్ రూరల్ మండల పరి ధిలో గ్రామ పంచాయతీగా ఉన్న అనుకుంట గ్రా మాన్ని మున్సిపల్ 4వార్డులో అలాగే రాంపూర్ గ్రామాన్ని 17వ వార్డులో విలీనం చేశారు. ప్రస్తుతం రాంపూర్లో 320 మంది, అనుకుంటలో 235 మంది పింఛన్ లబ్ధిదారులున్నారు. నిబంధనల ప్రకా రం వీరికి కూడా బ్యాంకు ఖాతాల ద్వారానే నగదు చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా 13 కాలనీల లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా అందించాలని నిర్ణయించిన అధికారులు ఈ రెండు కాలనీలను మాత్రం ఎందుకు విస్మరించారనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే వారికి స్థానికంగానే పోస్టాఫీసులు అందుబాటులో ఉన్నందున ప్రస్తుతం అక్కడ అమలు చేయడంలేదని డీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. త్వరలోనే వాటిని కూడా పట్టణ పరిధిలోకి తీసుకొస్తామని పేర్కొంటున్నారు.మున్సిపల్ పరిధిలోకి చేరినలబ్ధిదారుల వివరాలు..కాలనీ లబ్ధిదారుల సంఖ్యదస్నాపూర్ 305దోబీకాలనీ 104దుర్గానగర్ 64హన్మాన్నగర్ 58న్యూహౌసింగ్బోర్డు 82కై లాస్నగర్ 50పిట్టలవాడ 187రాంనగర్ 320షాద్నగర్ 27సుభాష్నగర్ 151టైలర్స్కాలనీ 50టీచర్స్కాలనీ 58కేఆర్కే కాలనీ 142ఈకేవైసీ నమోదు చేసుకోవాలిపట్టణ పరిధిలోని 13 కాలనీల పింఛన్దారులకు ఇచ్చే సొమ్మును ఇక నుంచి నేరుగా మున్సిపల్ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నాం. ఇందుకోసం లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాలను యాక్టివేట్ (ఈకేవైసీ) చేయించుకోవాలి. బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డుతో కూడిన వివరాలను ఈ నెల 25లోపు మున్సిపల్ కార్యాలయంలో అందజేయాలి. జాప్యం చేస్తే పింఛన్ జమ చేయడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశముంది.– రాథోడ్ రవీందర్, డీఆర్డీఓ -
జాతీయ మహాసభల్లో జిల్లా టీచర్లు
ఆదిలాబాద్టౌన్/ఇచ్చోడ: రాజస్థాన్లోని జండోలి ఏబీఆర్ఎస్ఎం జాతీయ మహాసభల్లో టీపీయూఎస్ జిల్లా బాధ్యులు సోమవారం పా ల్గొన్నారు. అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షానిక్ మహాసంఘ్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా మహాసభలను చేపడుతున్నారు. ఇందులో జా తీయ నూతన విద్యా విధానం, టెట్ సమస్య పరిష్కారం, పాత పెన్షన్ విధానం అమలు, సర్వీస్ రూల్స్, బడ్జెట్లో విద్యకు అధిక ప్రాధాన్యం, దేశ వ్యాప్తంగా ఒకే పీఆర్సీ, ఎస్జీటీలకు ఎమ్మెల్సీ ఓటు హక్కు తదితర అంశాలపై చ ర్చించారు. ఈ మహాసభల్లో టీయూపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సునిల్ చౌహాన్, గోపీకృష్ణ, కిరణ్, మనోజ్రెడ్డి, జీజాబాయి, సంగీత తదితరులున్నారు. -
స్లాట్ బుకింగ్పై అవగాహన కల్పించాలి
ఆదిలాబాద్టౌన్: కిసాన్ కపాస్ యాప్ స్లాట్ బుకింగ్పై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆడిటోరియంలో ఆదిలాబాద్, నిర్మల్ ఏఈవోలకు సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. యాప్లో స్లాట్ బుకింగ్ చేసిన తర్వాత ఏడు రోజుల వరకు పంట విక్రయించేందుకు అవకాశం ఉంటుందన్నారు. మూడుసార్లు బుకింగ్ చేసిన తర్వాత కూడా మార్కెట్కు పత్తి తీసుకురాకపోతే బ్లాక్లిస్టులో పడుతుందని తెలి పారు. ఆ తర్వాత రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించి విక్రయించుకోవచ్చని సూచించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పత్తి విక్రయించే తేది ప్రకటించిన తర్వాత స్లాట్ బుకింగ్ ప్రారంభమవుతుందని అన్నారు. ఏఈవోలు ఆయా గ్రామాల్లో విద్యావంతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. స్లాట్ బుకింగ్ కోసం ఎవరు కూడా రైతుల నుంచి డబ్బులు తీసుకోవద్దని సూచించారు. ఫిబ్రవరి వరకు పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. హెల్ప్డెస్క్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 8 నుంచి 12 శాతం తేమతో సీసీఐ పత్తి కొనుగోలు చేస్తుందని, ఈ మేరకు రైతులు నాణ్యమైన పత్తిని తీసుకురావాలని కోరారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, మా ర్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ పద్మావతి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్స్వామి, మార్కెటింగ్ శాఖ ఏడీ గజానన్, టెక్నికల్ ఏవో శివకుమార్, వ్యవసాయ శాఖ అధికారులు, ఏఈవోలు తది తరులు పాల్గొన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి కై లాస్నగర్: గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకతతో నిష్పక్షపాతంగా నిర్వహించా లని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై స్టేజ్–2 రిటర్నింగ్ అధికారులు, స్టేజ్–1 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనుసరించాల్సిన విధి విధానాలపై మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో ఆర్వోలదే కీలకపాత్ర అన్నారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూ చించారు. ప్రిసైడింగ్ అధికారులకు మండలాల్లోనే శిక్షణ ఇచ్చినట్లుగా తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీపీవో రమేశ్, డీఎల్పీవో ఫణిందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
భీం త్యాగానికి గౌరవం
కెరమెరి(ఆసిఫాబాద్): నిజాం సర్కారుకు వ్యతిరేకంగా, ఆదివాసీల హక్కు ల కోసం ప్రాణాలర్పించిన భీం త్యాగాలను రాష్ట్రప్ర భుత్వం గుర్తించింది. జల్.. జంగల్.. జమీన్.. నినాదంతో పోరాడి అమరుడైన కు మురంభీం వర్ధంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కెరమెరి మండలం జోడేఘాట్లో మంగళవారం భీం వర్ధంతి అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం నివాళులర్పించనున్నారు. ఉదయం 8గంటలకు జెండాలు ఆవిష్కరించనున్నారు. 9గంట లకు సమాధి వద్ద పూజలు చేసి, 10గంటలకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు. ఇప్పటికే ఆసిఫా బాద్ కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఏర్పాట్లు పరిశీలించి, అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. పదివేల మందికి పైగా హాజరు.. ప్రభుత్వం భీం వర్ధంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంతో అందుకు తగిన విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే భీం విగ్రహానికి మెరుగులు దిద్దారు. ట్రాక్టర్లతో పరిసరాలు, పార్కింగ్ స్థలాలు చదును చేయించి.. ప్రజలు కూర్చునేందుకు వీలుగా టెంట్లు వేస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాత్కాలిక మూత్రశాలలు ఏర్పాటు చేస్తున్నారు. భోజన సదుపాయం కూడా కల్పించనున్నారు. 10వేల మందికి పైగా హాజరవుతారని అంచనా వే స్తుండగా, 12 వేల మందికి భోజనాలు సిద్ధం చేస్తున్నారు. హెలిప్యాడ్ సైతం సిద్ధం చేశారు. మారుమూల ప్రాంతం కావడంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఏఎస్పీ, డీఎస్పీతోపాటు సీఐ, ఆర్ఐలు 8 మంది, ఎస్సైలు 25, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు 51 మంది, ఇతర సిబ్బంది 136, డబ్ల్యూపీసీలు 56, హోంగార్డులు 79 మంది, ఇతర సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. బాంబు, డాగ్స్క్వాడ్తో జోడేఘాట్కు చేరుకునే రహదారుల్లో తని టఖీలు ముమ్మరం చేశారు. అలాగే గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఏటీడబ్ల్యూవోలు ముగ్గు రు, సీఆర్టీలు, రెగ్యులర్ ఉపాధ్యాయులు 100 మంది, వంట మనుషులు 70 మంది, ఆశ్రమ పాఠశాలల వార్డెన్లు ఐదుగురు, ఇతర సిబ్బందిని డిప్యూటేషన్పై నియమించారు. ఐకేపీ సిబ్బంది 35 మంది, ఇంజినీరింగ్ శాఖకు చెందిన సిబ్బంది పది మందిని కేటాయించారు. ఆయా శాఖల సిబ్బంది సోమవారం రాత్రే జోడేఘాట్కు చేరుకున్నారు. ఆసిఫాబాద్ డిపో నుంచి ప్రత్యేక బస్సులను జోడేఘాట్కు నడపనున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే వాహనాల కోసం పార్కింగ్ స్థలాలు సిద్ధం చేశారు. హాజరు కానున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం భీం వర్ధంతిని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరు కానున్నారు. అలాగే ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు నివాళులర్పించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కేవలం భీం విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటించి, పూజలకే పరిమితం కానున్నారు. ఆదివాసీలు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యలు తీసుకెళ్లేందుకు ఏటా నిర్వహించే దర్బారు కోడ్ కారణంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. కుమురంభీం విగ్రహం -
బతుకమ్మ సంబురాలు
జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో సోమవారం బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్, ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. మహిళా అధికారులు, ఉద్యోగులు పాల్గొని తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆడి పాడారు. ఎస్పీ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచూర్యం పొందడం గొప్ప విషయమని అన్నారు. ఇందులో అదనపు ఎస్పీలు కాజల్ సింగ్, సురేందర్రావు, డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, సీఐలు, ఎస్సైలు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు. అలాగే తలమడుగు మండలం బరంపూర్లో సద్దుల వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు ఉయ్యాల పాటలు, చప్పట్లతో బతుకమ్మ ఆడారు. అనంతరం పూల సింగిడిలను డప్పుచప్పుళ్ల నడుమ నిమజ్జనానికి తరలించారు. వెళ్లిరా బతుకమ్మ అంటూ గంగమ్మ ఒడికి చేర్చారు. – ఆదిలాబాద్టౌన్/తలమడుగు -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
● ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి ‘జూపల్లి’ కై లాస్నగర్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖ్య నాయకులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల్లో పార్టీ పరంగా బలమైన అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోవడంతో పాటు జెడ్పీలను సైతం కై వసం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి ఆత్రం సుగుణ, నిర్మల్, ఆసిపాబాద్ జిల్లాల అధ్యక్షులు శ్రీహరిరావు, విశ్వ ప్రసాద్రావు, బైంసా మార్కెట్ చైర్మన్ ఆనంద్రావు పటేల్, మాజీ ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, రాథోడ్ బాపూరావ్, సోయం బాపూరావ్, ఆత్రం సక్కు, ఆదిలాబాద్, బోథ్, ఆసిఫాబాద్ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడే గజేందర్, అజ్మీరా శ్యామ్నాయక్, నాయకులు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, పాల్గొన్నారు. -
‘పరిషత్’కు రెడీ
కై లాస్నగర్: పరిషత్ తొలి విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 9నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. మండల ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లాస్థాయి అధికా రులనే జెడ్పీటీసీ రిటర్నింగ్ అధికారులుగా నియమించింది. ఎంపీటీసీ రిటర్నింగ్ అధికారులుగా గెజిటెడ్ హోదా కలిగిన జూనియర్ లెక్చరర్లు, పీజీ హెడ్మాస్టర్లను ఎంపిక చేసింది. అయితే వీరు పని చేసే మండలం, సొంత మండలం కాకుండా ఇతర మండలాల బాధ్యతలు అప్పగించింది. నామినేషన్ల స్వీకరణ మొదలు పరిశీలన, తొలగింపు, ఫిర్యాదుల స్వీకరణ, బరిలో నిలిచిన అభ్యర్థుల ప్రకటన, ఫలితాల వెల్లడి వరకు ఆర్వోలు కీలకపాత్ర పోషించనున్నారు. వీరికి ఇది వరకే శిక్షణ ఇవ్వగా తాజాగా స్టేజ్–2 ప్రిసైడింగ్ అధికారులకు జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం శిక్షణ అందించారు. దీంతో శిక్షణ ప్రక్రియ పూర్తయింది. ఎంపీడీవో కార్యాలయాల్లో.. నామినేషన్ల దాఖలుకు అవసరమైన పత్రాలన్నింటి నీ ఇది వరకే ఎంపీడీవో కార్యాలయాలకు చేరవేసి సిద్ధంగా ఉంచారు. ఆయా కార్యాలయాల్లోనే నామపత్రాలు స్వీకరించనున్నారు. అయితే మండలా ల్లోని ఎంపీటీసీ స్థానాల సంఖ్య ఆధారంగా 3 నుంచి 4 ఎంపీటీసీ స్థానాలను కలిపి ఓ క్లస్టర్గా విభజించారు. ప్రతీ క్లస్టర్కు గెజిటెడ్ హోదా కలిగిన జూని యర్ లెక్చరర్, పీజీ హెచ్ఎంలను ఆర్వోలుగా నియమించారు. ప్రక్రియ సజావుగా సాగేలా రిజ ర్వు ఆర్వోలను సైతం అందుబాటులో ఉంచారు. అయితే మావల మండలంలో కేవలం ఐదు ఎంపీటీసీ స్థానాలే ఉండటంతో వాటన్నింటినీ ఒకే క్లస్టర్గా ఏర్పాటు చేసి ఆర్వోను నియమించారు. ఎంపీటీసీ స్థానాలకు ఏఆర్వోలుగా స్కూల్ అసిస్టెంట్లను నియమించారు. నామినేషన్ల ప్రక్రియ నిర్వహణపై వీరందరికీ మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ పూర్తి చేశారు. పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. అయితే బ్యాలెట్ పేపర్ల ముద్రణకు అవసరమైన టెండర్ల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ఈమేరకు జిల్లాకు ఉత్తర్వులు రావాల్సి ఉంది. అవి అందిన వెంటనే అవసరమైన చర్యలు చేపడుతామని అధికారులు చెబుతున్నారు. అందరి దృష్టి హైకోర్టు నిర్ణయంపైనే.. ఓ వైపు తొలి విడత స్థానిక సమరానికి అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తుంటే మరోవైపు అందరి దృష్టి హైకోర్టు నిర్ణయంపై కేంద్రీకృతమైంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేస్తుండటంపై దా ఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్ర ధాన న్యాయస్థానంలో ఈ నెల 8న విచారణ ఉంది. అయితే కోర్టు తీర్పు ఆధారంగా ఎన్నికల ప్రక్రియ పై ముందుకెళ్లే అవకాశముంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రకటించి న రిజర్వేషన్లే ఉంటాయా.. లేక మళ్లీ ఏమైనా మారుతుందా అనే దానిపై కూడా సర్వతార చర్చ సాగు తుండడం గమనార్హం.జిల్లాలోని పరిషత్ స్థానాలు, రిటర్నింగ్ అధికారుల వివరాలు : జెడ్పీటీసీ స్థానాలు : 20 రిటర్నింగ్ అధికారులు : 22 ఎంపీటీసీ స్థానాలు : 166 (ఎంపీటీసీ క్లస్టర్లు : 52) రిటర్నింగ్ అధికారులు : 59 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు : 59 -
ప్రజా సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్
గెలుపే లక్ష్యంగా పని చేయాలి ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిలాబా ద్ ఎంపీ గొడం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సోమవారం సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ తరఫున స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఔ త్సాహికులకు సంబంధించిన ప్రాథమిక సమాచా రం ఇప్పటికే సేకరించినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, జిల్లాలో సంస్థాగతంగా పార్టీ ఎంతగానో బలపడిందని తెలిపారు. కష్టపడిన ప్రతీ కార్యకర్తకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్, నాయకులు దినేష్ మటోలియా, మయూర్చంద్ర, రమేశ్, రాజు, విజయ్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.ఆదిలాబాద్టౌన్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగం కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 32 మంది అర్జీదారులు రాగా బాధితుల సమస్యలను ఎస్పీ ఓపికగా విన్నారు. సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. సుదూర ప్రాంతాల వారు నేరుగా 8712659973 నంబర్కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. కార్యక్రమంలో సీసీ కొండ రాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి కవిత, తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలుస్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామ ని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు హెడ్క్వార్టర్స్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని స్టేషన్ల అధికారులు, సీఐలు, డీఎస్పీలతో సో మవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఎన్నికలకు సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లాలో ఇదివరకే చెక్పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. అక్రమంగా డబ్బు, మద్యం, ఎన్నికలను ప్రభావితం చేసే బహుమతులు రవాణా కాకుండా చూడాలన్నారు. సమస్యలను సృష్టించే వారిని, రౌడీలను, సస్పెక్ట్లను బైండోవర్ చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం, వదంతులు వ్యాప్తి చెందకుండా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సభలు, సమావేశాలు నిర్వహించాలంటే ముందస్తుగా అధి కారుల అనుమతులు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్ సింగ్, డీఎస్పీలు ఎల్.జీవన్రెడ్డి, పోతారం శ్రీనివాస్, సీఐలు సునిల్కుమార్, నాగరాజు పాల్గొన్నారు. -
నారీ.. బీమారి పరారీ
ఆదిలాబాద్టౌన్: మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించిన ప్రభుత్వం స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. జిల్లాలో ఈ కార్యక్రమం సత్ఫలితాలనిచ్చింది. గతనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళలకు వైద్య పరీక్షలు చేశారు. రోగాలను గుర్తించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. శస్త్ర చికిత్సల నిమిత్తం పలువురిని రిమ్స్కు రిఫర్ చేశారు. రిమ్స్తో పాటు ఉట్నూర్ జిల్లా ఆస్పత్రిలో ఉన్న వైద్య నిపుణులతో జిల్లాలోని ఆయా పీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో పరీక్షలు నిర్వహించారు. దాదాపు పక్షం రోజుల పాటు 209 క్యాంపులను ఏర్పాటు చేశారు. వేలాది మంది మహిళలకు స్క్రీనింగ్ చేశారు. ఈఎన్టీ, కంటి పరీక్షలు, రక్తపోటు, డయాబెటీస్, దంత పరీక్షలు, నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్, గర్భిణులకు రక్తహీనత పరీక్షలతో పాటు పిల్లలకు పీడియాట్రిక్ సేవలు అందించారు. అలాగే చర్మ వ్యాధులు, పల్మనాలజీ, సైకియాట్రి, క్షయవ్యాధి స్క్రీనింగ్, వయోవృద్ధులకు ఆరోగ్య పరీక్షతో పాటు వివిధ రకాల సేవలు అందించారు. ఆరోగ్య నియమాలు, పోషకాహార ఆవశ్యకతను వివరించారు. శిబిరాల్లో పలు రోగాలు నిర్ధారణ అయిన వారిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.విశేష స్పందన..స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లాలోని 22 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 2 బస్తీ దవాఖానాలు, 67 పల్లె దవాఖానాలు, బోథ్ ఏరియా ఆస్పత్రితో పాటు 5 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఈ శిబిరాలను మహిళల కోసం ఏర్పాటు చేశారు. పిల్లలకు సంబంధించి పీడియాట్రిక్ వైద్యులు 25 క్యాంపులు, గైనిక్కు సంబంధించి 33, జనరల్ మెడిసిన్ 23, జనరల్ సర్జరీ 13, డెంటల్ 18, పల్మనాలజీ 17, ఈఎన్టీ 19, ఆప్తమాలజీ 23, ఆర్థో 15, డర్మటాలజీ 19, సైకియాట్రిస్ట్కు సంబంధించి 4, మొత్తం 209 క్యాంపులు నిర్వహించారు. ఇందులో కాళ్ల నొప్పులకు సంబంధించి 27,167 మహిళలకు, బీపీకి సంబంధించి 17,552, డయాబెటిస్కు సంబంధించి 16,780, క్యాన్సర్కు సంబంధించి 10,771మంది, అలాగే 1,714 మంది గర్భిణులకు వైద్య పరీక్షలు చేశారు. ఎనీమియాకు సంబంధించి 9,938 మందికి, మహిళలతో పాటు 814 మంది ఆడపిల్లలకు వివిధ రకాల టీకాలు వేశారు. 10,552 మందికి ఎనీమియాకు సంబంధించి రక్త పరీక్షలు నిర్వహించారు. యువతులు, మహిళలకు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. 10,742 మందికి టీబీ పరీక్షలు చేపట్టారు. క్షయ వ్యాధిగ్రస్తులకు ఫుడ్ కిట్లు ఇచ్చేందుకు 376 మంది మహిళలు ముందుకొచ్చారు. సికిల్సెల్తో బాధపడుతున్న 665 మందికి వైద్య పరీక్షలు చేశారు. దీంతోపాటు ఇతర రుగ్మతలతో బాధపడుతున్న 325 మందికి చికిత్స అందించారు. ఈ కార్యక్రమం ఆయా గ్రామాలు, మండల కేంద్రాల్లో నిర్వహించడంతో మహిళలు ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.పకడ్బందీగా చేపట్టాం..జిల్లాలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాం. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళలకు ప్రత్యేక వైద్యనిపుణులతో పరీక్షలు నిర్వహించాం. వ్యాధి నిర్ధారణ అయిన వారికి మందులు పంపిణీ చేశాం. 50 మందికి కంటిశుక్లాలు ఉన్నట్లు గుర్తించాం. వారికి ఆపరేషన్కు ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే వివిధ రుగ్మతలతో బాధపడుతున్న మహిళలపై ప్రత్యేక దృష్టి సారించాం.– రాథోడ్ నరేందర్, డీఎంహెచ్వో -
స్థానిక ఎన్నికలు.. నిఘా కట్టుదిట్టం
కైలాస్నగర్: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధానంగా మద్యం, డబ్బు ప్రవాహా నికి అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు చేపట్టింది. నిరంతర నిఘా ఉంచేందుకు వీలుగా జిల్లాలో 14 ఫ్లయింగ్ స్క్వాడ్, మూడు స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలను నియమించింది. రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఇతర శాఖల డివిజన్ స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించింది. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో వాహన తనిఖీలు ముమ్మరం చేశాయి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల వద్ద రౌండ్ది క్లాక్ నిఘా ఏర్పాటు చేశారు. రూ.50వేలకు మించి నగదును ఆధారాలు లేకుండా తరలించినట్ల యితే సీజ్ చేయనున్నారు.చెక్పోస్టుల వద్ద పటిష్ట నిఘా..ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటు అక్రమాలకు ఆస్కారమిచ్చే అనుమానాస్పద ప్రాంతాల్లో స్టాటిక్ సర్వేలెన్స్ టీం (ఎస్ఎస్టీ)లను ఏర్పాటు చేశారు. అంతర్రాష్ట్ర చెక్పోస్టు భోరజ్తో పాటు ఉట్నూర్ ఎక్స్రోడ్, నేరడిగొండ టోల్ ప్లాజా వద్ద నిఘా ఉంచేందుకు వీలుగా మూడు టీంలను ఏర్పాటు చేశారు. ఒక్కో టీంలో ఇద్దరు నాయబ్ తహసీల్దార్లు, ఒక పోలీస్ అధికారిని నియమించారు. ఏఎస్డబ్ల్యూవోకు బాధ్యతలు అప్పగించారు. వీరితో పాటు వీడియోగ్రాఫర్ నిత్యం వెంట ఉండనున్నారు. రౌండ్ ది క్లాక్ తనిఖీలు చేపట్టనున్న ఈ బృందాల్లో ఓ అధికారి ఉదయం 6నుంచి సాయంత్రం 6గంటల వరకు మరో అధికారి సాయంత్రం ఆరు నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు రెండు షిఫ్టుల్లో విధులు నిర్వహించనున్నారు. ఆయా మార్గాల్లో ప్రయాణించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ మద్యం, డబ్బు తరలించకుండా చర్యలు తీసుకోనున్నారు.రంగంలోకి ప్రత్యేక బృందాలు..కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా ఆదేశాల మేరకు ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ ప్రత్యేక బృందాలు ఆదివారం నుంచి రంగంలోకి దిగాయి. ఎఫ్ఎస్టీలు తమకు కేటాయించిన మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు పర్యవేక్షణతో పాటు అభ్యర్థుల ఖర్చులపై నిఘా ఉంచనున్నారు. మద్యం, డబ్బు తరలిస్తూ పట్టుబడితే సీజ్ చేస్తారు. చెక్పోస్టుల వద్ద ఉండే ఎస్ఎస్టీలు వాహన తనిఖీలు ముమ్మరం చేశాయి.రూ.50వేలకు మించి తరలిస్తే సీజ్..మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున ప్రజలు రూ.50వేలకు మించి నగదు తరలించొద్దు. ఒకవేళ తరలిస్తే దానికి సంబంధించిన రశీదులు చూపించాలి. లేకుంటే ఆ నగదును సీజ్ చేస్తారు. ఇక అక్రమంగా మద్యం తరలిస్తే మాత్రం సరుకు సీజ్ చేయడంతో పాటు బాధ్యులపై కేసులు నమోదు చేస్తారు. అలాగే రూ.10వేలకు మించి గిప్ట్లను తరలించినట్లయితే వాటిని కూడా సీజ్ చేయనున్నారు.ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలివిడత ఎన్నికల నామి నేషన్ల గడువు సమీపిస్తోంది. ఈ క్రమంలో బరి లో నిలిచే అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేసేందుకు గాను మద్యం, నగదు, బహుమతులు వంటి ప్రలోభాలకు గురిచేసే ఆస్కారముంటుంది. అయితే వీటికి చెక్ పెట్టేలా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్ర నుంచి అక్రమంగా మద్యం దిగుమతికి అవకాశం ఉండటంతో దాన్ని కట్టడి చేయడంపై దృష్టి సారించింది. అలాగే క్షేత్రస్థాయిలో పకడ్బందీ నిఘా ఉంచేలా 14 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసింది. ఇచ్చోడ – సిరికొండ, బోథ్ – సొనాల, జైనథ్ – భోరజ్, బేల –సాత్నాల, తాంసి – భీంపూర్, నార్నూర్ – గాది గూడ వంటి రెండేసి మండలాలకు ఒక టీంను ఏర్పాటు చేయగా మిగతా మండలాలకు ఒక్కో టీం చొప్పున మొత్తం ఏర్పాటు చేశారు. గిరిజన సంక్షేమ అధికారులు, మిషన్ భగీరథ ఏఈలు, నాయబ్ తహసీల్దార్లు, ఐకేపీ ఏపీఎంలు, మండల వ్యవసాయాధికారులు టీం లీడర్గా వ్యవహరిస్తారు. ప్రతీ బృందంలో ఒక పోలీస్ అధి కారి, ఓ వీడియోగ్రాఫర్ కలిపి ముగ్గు రు ఉండనున్నారు. అలాగే ముగ్గురు అధికారులను రిజర్వ్లో ఉంచారు. ఈ బృందాలు తమకు కేటాయించిన మండలాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టనున్నాయి. -
సాగు నీరందేదెప్పుడో?
తాంసి: మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టు కుడికాలువ నిర్మాణ పనులు పూర్తయి ఏడాది దాటినా ఆయకట్టు రైతులకు సాగునీరందని పరిస్థితి. పనులు పూర్తవడంతో అధికారులు ట్రయల్రన్ సైతం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏడాది క్రితం జిల్లా పర్యటన సందర్భంగా దీనిని ప్రారంభిస్తారని అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే సీఎం పర్యటన వాయిదా పడటంతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. రూ.7.34 కోట్లతో పనులు తాంసి మండలంలోని వడ్డాడి సమీపంలో రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో 20 ఏళ్ల క్రితం మత్తడివాగు ప్రాజెక్టు పనులు చేపట్టారు. 2008లో ప్రాజెక్టును ప్రారంభించారు. ఎడమకాలువ ద్వారా ప్రస్తుతం 8500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. నిర్మాణ సమయంలో కుడికాలువ పనులు చేపట్టలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఈ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నూతన సాంకేతికతో పైపులైన్ ద్వారా భూసేకరణ సమస్య లేకుండా వడ్డాడి, హస్నాపూర్, ఖోడద్, పొన్నారి శివారు రైతులకు నీటిని అందించాలని నిర్ణయించారు. 1200 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా 2017లో రూ.7.34 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు గుత్తేదారు పనులను ఏడాది క్రితం పూర్తి చేశారు. ట్రయల్రన్ సైతం సక్సెస్ కావడంతో పోయిన సంవత్సరం రబీ నుంచి సాగు నీరు అందుతుందని రైతులు ఆశపడ్డారు. అయితే ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోకపోవడం గమనార్హం. పైపులైన్ ద్వారా చేలకు నీరు కుడి కాలువ వద్ద పంప్హౌస్ నిర్మాణం చేపట్టి అందులో మోటార్లను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి భూగర్భ పైపులైన్ ద్వారా చేలకు నీరు అందేలా పనులు పూర్తి చేశారు. మొత్తం 9 కిలోమీటర్ల మేర ప్రధాన పైపులైన్తో పాటు 25 బ్లాక్లను ఏర్పాటు చేశారు. ప్రతీ బ్లాక్కు ఐదు ఆటోమెటిక్ వాల్వ్లను ఐదెకరాలకు ఒకటి చొప్పున బిగించారు. నీటి వృథా అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఏడాదైనా ప్రారంభానికి నోచుకోని పరిస్థితి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. నవంబర్ నుంచి అందించేలా చర్యలు ప్రాజెక్టు కుడికాలువ పైపులైన్ పూర్తి కావడంతో పాటు ట్రయల్ రన్ సైతం నిర్వహించాం. కుడి కాలువను అధికారికంగా ప్రారంభించకపోయినా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైతులకు వచ్చే నవంబర్ నుంచి నీటిని అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. – హరీశ్కుమార్, మత్తడివాగు ప్రాజెక్టు ఏఈవెంటనే సాగు నీరందించాలి ప్రాజెక్టు కుడికాలువ లేక ఏళ్లుగా ఎదురుచూశాం. ఇప్పుడు పనులు పూర్తయినా ప్రారంభానికి నోచుకోక సాగునీరందని పరిస్థితి. దీంతో రబీలో పంటలు వేయలేకపోతున్నాం. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి త్వరగా సాగునీరందించే చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. – బాగిడి కిష్టయ్య రైతు వడ్డాడి గ్రామం -
జాతీయ రహదారిపై కంటైనర్ను ఢీకొన్న లారీ
గుడిహత్నూర్: మండలంలోని సీతాగోంది స మీపంలో గల జాతీయ రహదారిపై ఆదివారం ఓ కంటైనర్ను లారీ ఢీకొన్న ఘటనలో మంట లు లేచి ఆ వాహనాలు దగ్ధమయ్యాయి. స్థాని కులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నిర్మల్ వైపు నుంచి ఆదిలాబాద్ వైపు జాతీయ రహదారిపై వెళ్తున్న కంటైనర్ వెనకాలే మరో లారీ వస్తోంది. అయితే కంటైనర్ను వెనుక వస్తున్న లారీ వేగంగా ఢీకొని ఇరుక్కుపోయింది. ఈ క్రమంలో ఘర్షణ ఏర్పడి మంటలు చెలరేగాయి. కంటైనర్లో ఉన్న దుస్తులు, ఇతర ఆయుర్వేద మందులు పూర్తి గా దగ్ధమయ్యాయి. ఇద్దరు డ్రైవర్లు వాహనాల ను అక్క డే వదిలి పారిపోయారు. స్థానికుల సమాచా రంతో ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే కంటైనర్ పూర్తి స్థాయిలో దగ్ధమవగా.. లారీ పాక్షికంగా కాలి పోయింది. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని స్థానికులు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలిఇంద్రవెల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు కృషి చే యాలని ఎంపీ నగేశ్ అన్నారు. మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏ ర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఇందులో పార్టీ నిర్మ ల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, రాజలింగు, బాలాజీ, తుకారాం, రాజేశ్వర్, హనుమంత్రావ్, మారుతి, దిలీప్ తదితరులున్నారు. -
ఆమెదే ఆధిపత్యం
కై లాస్నగర్: స్థానిక సంస్థల్లో మహిళలకు అగ్రపీఠం దక్కనుంది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తలరాత మార్చగల శక్తితో పాటు ప్రజాప్రతినిధులుగానూ సత్తా చాటేందుకు ఆమెకు అవకాశం కలగనుంది. స్థానిక ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కోటా అమలు చేస్తున్నారు. దీంతో వారికి కేటాయించిన స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ పోటీకి అవకాశం ఉంది. ఫలితంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డుమెంబర్ వంటి పదవుల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగనుంది. తద్వారా అన్ని రంగాల్లో రాణిస్తున్న అతివలు రాజకీయంగానూ ఆధిపత్యం చాటేందుకు తోడ్పడనుంది. మహిళా ఓటర్లే అధికం.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఇటీవల ఓటరు జాబితా ప్రకటించింది. జిల్లావ్యాప్తంగా 20 గ్రామీణ మండలాల పరిధిలో మొత్తం 4,49,981 మంది ఓటర్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఇందులో పురుష ఓటర్లు 2,19,652 మంది, మహిళా ఓటర్లు 2,30,313 మంది, ఇతరులు మరో 16 మంది ఉన్నారు. పురుషులతో పోల్చితే మహిళా ఓటర్లు 10,661మంది అధికంగా ఉన్నారు. ఉట్నూ ర్ మండలంలో అత్యధిక మంది మహిళా ఓటర్లు ఉండగా జిల్లాలోని సగానికి పైగా మండలాల్లోనూ మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. దీంతో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల గెలుపోటములను ప్రభాఠి వితం చేసే శక్తి వారికుంది. ఈక్రమంలో రాజకీయ పార్టీలన్నీ వారి మద్దతు కూడగట్టుకునేందుకు య త్నిస్తున్నాయి. వారి అనుగ్రహం ఉంటే గెలుపుఖాయమనే ధీమాతో ముందుకు సాగుతున్నారు. సీట్లలోనూ వారిదే హవా... ఓట్ల పరంగానే కాకుండా సీట్లలోనూ మహిళలదే ఆధిపత్యం సాగనుంది. 50 శాతం రిజర్వేషన్ల అమలుతో పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో సగం సీట్లు వారికే కేటాయించబడ్డాయి. జెడ్పీటీసీలు పది స్థానాలు మహిళలకు కేటాయించగా మరో పది స్థానాలను జనరల్కు కేటాయించారు. అలాగే ఎంపీపీ స్థానాల్లో 8 మహిళలకు, 12 స్థానాలను జనరల్గా కేటాయించారు. ఇవే కాదు అటు సర్పంచ్, వార్డుమెంబర్ పదవులను సైతం సగం సీట్లను మహిళలకే రిజర్వ్ చేశారు. ఈ స్థానాలతో పాటు జనరల్లోనూ మహిళలు పోటీ చేసేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి. ఇదిలా ఉంటే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయనుండడంతో వారి ప్రాతినిధ్యం పెరగనుంది. జిల్లాలోని ఓటర్ల వివరాలు మండలం పురుషులు మహిళలు ఆదిలాబాద్రూరల్ 13,854 14,674 బజార్హత్నూర్ 11,687 12,141 బేల 13,825 13,762 భీంపూర్ 9,312 10,166 భోరజ్ 7,302 7,656 బోథ్ 13,022 14,236 ఇచ్చోడ 17,131 18,114 గాదిగూడ 7,695 8,104 గుడిహత్నూర్ 12,361 12,929 ఇంద్రవెల్లి 16,033 16,416 జైనథ్ 9,741 10,253 మావల 2,103 2,283 నార్నూర్ 11,606 11,775 నేరడిగొండ 11,517 12,352 సాత్నాల 5,271 5,421 సిరికొండ 6,431 6,714 సొనాల 5,293 5,511 తలమడుగు 13,481 14,376 తాంసి 6,515 7,267 ఉట్నూర్ 25,472 26,163 -
నిరంతర నిఘా
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఎన్నికల నియమావళికి అనుగుణంగా వ్యవహరించాలి. ఓటర్లను ప్రభావితం చేసే చర్యలు చేపట్టొద్దు. జిల్లాలో నిరంతర నిఘా ఉంచేందుకు వీలుగా 14 ఫ్లయింగ్ స్క్వాడ్, మూడు స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలను నియమించాం. ఎక్కడైనా ‘కోడ్’ ఉల్లంఘన జరి గినా, మద్యం, నగదు, బహుమతులు పంపిణీ చేసినట్లు తెలిసినా వెంటనే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం టోల్ఫ్రీ నంబర్ 18004251939 కు సమాచారం అందించాలి. వాటిపై సత్వరమే స్పందించి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – రాజర్షి షా, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి -
నాగోబా ఆలయంలో పూజలు
ఇంద్రవెల్లి: మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయంలో ఐఎఫ్ఎస్,ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ జి.త్రినాథ్కుమార్ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ను మెస్రం వంశీయులు శాలువా కప్పి సన్మానించారు. నాగోబా ప్రతిమ అందించారు. ఆల య నిర్మాణం, చరిత్ర, ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, జాతర నిర్వహణ వివరాల ను అడిగి తెలుసుకున్నారు. ముందుగా ఏమాయికుంట నుంచి సమాక, పాటగూడ రోడ్డును పరిశీలించారు. రోడ్డు నిర్మాణానికి ఇచ్చిన అనుమతుల వివరాలు తెలుసుకున్నారు. అటవీ రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట ఉట్నూర్ ఎఫ్డీవో రేవంత్చంద్ర, డీఆర్వో నరేశ్, ఇంద్రవెల్లి, బేల ఎఫ్ఆర్వోలు సంతోష్, గులాబ్సింగ్, ఎఫ్ఎస్వోలు రాజేందర్ తదితరులు ఉన్నారు. -
సర్కారు బడులు వెలవెల
● శనివారం 15 శాతం విద్యార్థులు మాత్రమే హాజరు ఆదిలాబాద్టౌన్: దసరా సెలవులు ముగిసినప్పటికీ విద్యార్థులు బడిబాట పట్టలేదు. దీంతో జిల్లాలోని సర్కారు బడులు శనివారం వెలవెలబోయాయి. 13 రోజుల తర్వాత పాఠశాలలు తెరుచుకున్నాయి. అయితే కేవలం 15 శాతం మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. బతుకమ్మ పండగ, బంధువుల ఇంటికివెళ్లడం, కొన్ని ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ఉండడంతో బడికి రానట్టుగా తెలుస్తోంది. పాఠశాలల్లో ఉండాల్సిన పిల్లలు ఆరుబయట ఆడుకుంటూ కనిపించారు. కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా కనిపించింది. కాగా, ఉపాధ్యాయుల హాజరు మాత్రం 98 శాతం నమోదైనట్లు విద్యా శాఖాధికారులు తెలిపారు. -
శిశు మరణాలు తగ్గించేందుకు చర్యలు
ఆదిలాబాద్టౌన్: నవజాత శిశు మరణాలు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శనివారం రిమ్స్ ఆస్పత్రిని తనిఖీ చేశారు. పలు వార్డులను పరిశీలించారు. బాలింతలు, రోగులతో మాట్లాడి వైద్యసేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. 28 రోజుల లోపు పసికందుల మరణాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలన్నారు. మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలోని మూడు మెడికల్ షాపులతో పాటు విజయ డెయిరీ పార్లర్ను తనిఖీ చేశారు. రికార్డులు సరిగా లేకపోవడంతో మెడికల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి పునరావృతమైతే షాపులను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆస్పత్రిలో అందుబాటులో లేని మందులను మాత్రమే మెడికల్ షాపుల ద్వారా విక్రయించాలన్నారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, వైద్యులు అనంత్రావు తదితరులు ఉన్నారు. విజయ డెయిరీ పార్లర్కు జరిమానా రిమ్స్ ఆవరణలో కొనసాగుతున్న విజయ డెయిరీ పార్లర్కు మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు జరి మానా విధించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు షాపును ఆయన పరిశీలించారు. డెయిరీలో ఇతర వస్తువులు అమ్మడం, అధిక ధరలకు విక్రయాలు జ రపడం, వస్తువులపై ఉన్న ఎమ్మార్పీ కనిపించకుండా మార్కర్తో దిద్దడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రూ. వెయ్యి జరిమానా విధించారు. మరోసారి పునరా వృతమైతే షాపును సీజ్ చేస్తామని హెచ్చరించారు. భోరజ్ మండలంలో పంట నష్టం పరిశీలన.. సాత్నాల: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో భోరజ్ మండలంలో దెబ్బతిన్న పంటలను కలెక్టర్ రాజర్షి షా శనివారం పరిశీలించారు. పెండల్వాడ, శాంగ్వి గ్రామాలను సందర్శించి బాధిత రైతులతో మాట్లాడారు. పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులందరికీ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి, ఎంపీడీవో మహేశ్కుమార్, ఏవో పూజ, ఏఈవో సుజాత, రైతులు ఉన్నారు. -
వరద.. గో‘దారి’లో
సాక్షి,ఆదిలాబాద్: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 90 టీఎంసీలు.. దీని ద్వారా ఆయా జిల్లాల్లోని 18 లక్ష ల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది.. ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దులో ఆదిలాబాద్ జిల్లాలోని మండలాలను ఆనుకొని ఉండే దిగువ పెన్గంగ నుంచి ఈ వానాకాలంలో దిగువకు వెళ్లిన ప్రవాహం అక్షరాలా 360 టీఎంసీలు.. అంటే ఎస్ఆర్ఎస్పీ నీటి సామర్థ్యం కంటే నాలుగు రేట్లు అధికం. ఇక్కడ కొరటా–చనాఖ సరిహద్దులు గా ఇటు తెలంగాణ నుంచి అటు మహారాష్ట్ర వరకు బ్యారేజ్ నిర్మించిన విషయం తెలిసిందే. దీని గేట్లు తెరిచే ఉంటాయి. అయితే జిల్లా జల వనరుల శాఖ అధికారులు ఇక్కడి నుంచి వెళ్లే వరద ప్రవాహాన్ని లెక్కగట్టడం జరుగుతుంది. ఆ లెక్కలే ఇవి. లోయర్ పెన్గంగ నుంచి కొరటా–చనాఖా.. తెలంగాణ–మహారాష్ట్ర సంయుక్తంగా నిర్మించతలపెట్టిన ప్రాజెక్ట్ లోయర్ పెన్గంగ. ఇది అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్. 1975లో ఈ ప్రాజెక్టు నిర్మించాలని డిమాండ్ తీవ్రంగా ఉండేది. 1996లో సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) ఇరు రాష్ట్రాలకు సంబంధించి నీటి వినియోగ లెక్కలను నిర్ధారించింది. ప్రధానంగా నది ప్రవహించే భూభాగ నిష్పత్తులను పరిగణలోకి తీసుకొని నీటి వినియోగాన్ని అప్పట్లో నిర్ధారించారు. ఆ సమయంలో వంద టీఎంసీల సామర్థ్యంతో లోయర్ పెన్గంగ ప్రాజెక్ట్ నిర్మించాలని తలపెట్టారు. అందులో మహారాష్ట్ర వాటా 88 టీఎంసీలు కాగా, తెలంగాణ వాటా 12 టీఎంసీలుగా నిర్ధారించారు. అదేనిష్పత్తిలో నిధులు కూడా వె చ్చించాల్సి ఉంటుంది. అయితే మహారాష్ట్రలో భూ సేకరణ, వివిధ కారణాలతో ఈ ప్రాజెక్టు అటకెక్కింది. ఆ తర్వాత కాలంలో దీని నీటి సామర్థ్యం తగ్గిపోయింది. ఆ తర్వాత సీడబ్ల్యూసీ తెలంగాణ వాటా 5.12 టీఎంసీలుగా నిర్ధారించింది. అయితే లోయర్ పెన్గంగప్రాజెక్ట్ నిర్మాణానికి ముందడుగు పడకపోవడంతో ప్రత్యేక రాష్ట్రంలో జిల్లాకు సరిహద్దులో నది భూభాగంపై ఇరు రాష్ట్రాలను కలుపుతూ కొరటా–చనాఖా బ్యారేజ్ నిర్మించడం జరిగింది. ఈ బ్యారేజ్ సామర్థ్యం కేవలం 0.830 టీఎంసీలు మాత్రమే. ప్రధానంగా జిల్లా నుంచి దిగువకు వందలాది టీఎంసీల వరద నీరు వృథాగా పోతుండగా, ఇక్కడ వాటిని వినియోగించుకునేందుకు సరైన ప్రాజెక్టులు లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. సాత్నాల, మత్తడి సామర్థ్యానికి మించి వరద.. జిల్లాలోని రెండు మధ్యతరహా ప్రాజెక్టుల్లో ఒకటి సాత్నాల, మరొకటి తాంసి మండలంలోని మత్తడివాగు. సాత్నాల పూర్తిస్థాయి సామర్థ్యం 1.24 టీఎంసీలు కాగా, మత్తడివాగు సామర్థ్యం 0.571 టీఎంసీలు. ఈ వర్షాకాలంలో ఈ ప్రాజెక్టుల నుంచి దిగువకు ఎన్నో రేట్లు అధికంగా వరద నీటిని వదిలారు. సాత్నాల నుంచి 4.172 టీఎంసీలు, మత్తడివాగు నుంచి 4.218 టీఎంసీలు దిగువకు వదలినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా భారీ వరదలు రావడంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి ప్రవాహాన్ని దిగువకు వదలాల్సి వచ్చింది. సాత్నా ల ప్రాజెక్ట్ కింద లక్ష్మిపూర్ రిజర్వాయర్ ఉన్నప్పటి కీ, మత్తడివాగుకు దిగువ భాగంలో ఎలాంటి రిజర్వాయర్లు లేకపోవడంతో వరద ప్రవాహం వృథాగా గోదావరిలో కలవాల్సిందే. అయితే రానున్న రోజుల్లో ఈ రెండు ప్రాజెక్టుల నీటి సామర్థ్యం పెంచడం ద్వారా ఆయకట్టు అభివృద్ధికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ లేకపోలేదు.మత్తడివాగు గేట్ల నుంచి దిగువకు నీటి పరవళ్లు (ఫైల్)ఈ సీజన్లో వరద ప్రవాహం ఇలా.. ప్రాజెక్ట్ వచ్చిన వరద సామర్థ్యం (టీఎంసీలలో) కొరటా–చనాఖా బ్యారేజ్ 360 సాత్నాల 4.172 మత్తడివాగు 4.218 జిల్లాలో వర్షపాతం వివరాలు.. (జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు) సాధారణం : 996.1 మి.మీ.లు కురిసింది: 1,362 మి.మీ.లు వ్యత్యాసం : 35 శాతం అధికం -
మహాత్ముడికి ఘన నివాళి
ఆదిలాబాద్టౌన్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మహాత్ముని చిత్రపటానికి కలెక్టర్ రాజర్షి షా, వివిధ శాఖల అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బాపూజీ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ రావు, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, డీవైఎస్వో శ్రీనివాస్, డీపీవో రమేశ్ తదితరులు పాల్గొన్నారు. గొప్ప ఆదర్శవాది గాంధీజీఆదిలాబాద్: అహింసాయుత స్వాతంత్య్రోద్యమానికి నాయకత్వం వహించి దాస్య శృంఖలాల నుంచి భారతమాతకు విముక్తి కల్పించిన గొప్ప ఆదర్శవాది జాతిపిత మహాత్మగాంధి అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గాంధీ జయంతి పురస్కరించుకుని పట్టణంలోని మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే దేశ రెండో ప్రధాని లాల్బహదూర్ శాసీ్త్ర జయంతి సందర్భంగా ఆయన చిత్రానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అలాగే జిల్లా కేంద్రంలోని డీఎస్ఏ కార్యాలయంలో జక్కుల శ్రీనివాస్ గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. -
గోపాలమిత్రల సమస్యలు పరిష్కరించాలని వినతి
బోథ్: గోపాలమిత్రల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం నేరడిగొండ మండల కేంద్రంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను కలిసి వారు వినతిపత్రం అందించారు. తమను పశుసంవర్ధక శాఖలో ఉద్యోగులుగా గుర్తించి, రూ.24వేల వేతనం అందివ్వాలన్నారు. శాఖలో ఉన్న ఆఫీస్ సబార్టినేట్గా గోపాలమిత్రలను నియమించాలని కోరారు. ప్రమాదబీమా, ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. తమకు ఏప్రిల్ నెల నుంచి జీతాలు రాలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం దృష్టికి గోపాలమిత్రల సమస్యలను తీసుకెళ్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో గోపాలమిత్రలు రాజు, గోకుల్ జాదవ్, ఆశన్న, గంగన్న, జంగు పాల్గొన్నారు. విధుల్లో చేరిన విద్యుత్ శాఖ సబ్ ఇంజినీర్ బజార్హత్నూర్: మండల విద్యుత్ శాఖ సబ్ఇంజినీర్ గుండేటి రవి కుమార్ శుక్రవారం ఇచ్చోడ విద్యుత్ శాఖ ఏడీఈ లక్ష్మణ్కు జాయినింగ్ రిపోర్టు అందజేసి మండల విద్యుత్ శాఖ కార్యాలయంలో విధుల్లో చేరారు. ఆయన గత సంవత్సరం డిప్యూటేషన్పై మంచిర్యాల జిల్లాకు వెళ్లారు. ఇచ్చోడ, బజార్హత్నూర్ విద్యుత్ శాఖ ఏఈలు రాజు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
జోష్గా..
సాక్షి,ఆదిలాబాద్: దసరా వేడుకలను ప్రజలు ధూమ్దామ్గా జరుపుకున్నారు. ఎక్కడా జోరు తగ్గించలేదు. గాంధీ జయంతి ప్రభావంతో మార్కెట్లో బహిరంగంగా ఉల్లంఘనలు జరగకపోయినప్పటికీ లోలోపల మాత్రం యథేచ్ఛగా కొనసాగాయి. మద్యం దుకాణాలు మూసివేసి ఉంచగా, బహిరంగంగా మాంసం విక్రయాలు చేపట్టలేదు. లిక్కర్ను ముందే కొనుగోలు చేసిన మద్యం ప్రియులు పండుగ జోష్లో రాజీపడలేదు. లోలోపల మేకలు, గొర్రెలు, కోళ్ల వధ చోటుచేసుకుని.. మటన్, చికెన్ విక్రయాలు సాగాయి. మార్కెట్పై ప్రభావం అక్టోబర్ 2న గాంధీ జయంతి, దసరా పండగ కలిసి రావడంతో ఆ ప్రభావం బహిరంగ మార్కెట్పై పడింది. ప్రధానంగా దసరా పండగ అంటేనే మద్యం, మాంసం విక్రయాలతో సంబంధం ఉన్న వేడుక. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు మద్యం దుకాణాలన్నీ మూసివేశారు. అలాగే స్లాటర్ హౌస్లలో ఎక్కడ కూడా పశువధ జరగలేదు. అయితే జిల్లాలో వారం రోజులుగా లిక్కర్, బీర్ల అమ్మకాలు మాత్రం జోరుగా సాగాయి. మద్యం ప్రియులు పండుగకు ముందుగానే స్టాక్ తీసుకొని ఇంట్లో నిల్వ చేసుకున్నారు. అలాగే మాంసం విక్రయదారులు తమ ఇళ్లలో, లేనిపక్షంలో ఏదైనా అనువైన స్థలంలో మేకలు, కోళ్లను వధించారు. కిక్కెక్కించిన మద్యం.. జిల్లాలో గడిచిన ఆరు రోజుల్లో రూ.6.84 కోట్ల మ ద్యం విక్రయాలు జరిగాయి. గతేడాదితో పోల్చితే సుమారు 10 శాతం పెరిగినట్లు ఎకై ్సజ్ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా 12,564 కేసుల లిక్కర్, బీర్ల అమ్మకాలు జరిగాయి. అందులో 9,932 కేసుల లిక్కర్, 2,632 కేసుల బీర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే జిల్లాలో దసరా రోజు సుమారు 15 టన్నుల వర కు మాంసం విక్రయాలు జరిగాయి. ఇందులో 5 ట న్నుల వరకు మటన్, 10 టన్నుల వరకు చికెన్ విక్రయాలు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. -
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం..
వ్యవసాయ శాఖ ఏఈవోలకు కిసాన్ కపాస్ యాప్, స్లాట్ బుకింగ్పై ఈనెల 6న అవగాహన కల్పించనున్నాం. అనంతరం అధికారులు మండలాల్లోని రైతులకు తెలియజేస్తారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాతే రైతులు పంట దిగుబడిని మార్కెట్కు తీసుకురావాలి. దీంతో యార్డులో ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. అలాగే యాప్లో డబ్బులు ఎప్పుడు పడనున్నాయి, జమ అయ్యాయా.. లేదా అనే వివరాలు కూడా తెలుస్తాయి. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఈనెల 20 తర్వాత పత్తి కొనుగోళ్లు ప్రారంభించే అవకాశం ఉంది. – గజానన్, మార్కెటింగ్ ఏడీ, ఆదిలాబాద్ -
‘స్లాట్’తోనే పత్తి కొనుగోళ్లు
ఆదిలాబాద్టౌన్: పత్తి కొనుగోళ్లకు సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. రైతులు స్లాట్ బుకింగ్ చేసుకుంటేనే మార్కెట్ యార్డులో విక్రయాలు జరిపేలా చర్యలు చేపట్టింది. దీంతో దళారులు, మధ్యవర్తుల అక్రమాలకు చెక్ పడనుంది. అలాగే రైతులకు గంటల తరబడి నిరీక్షణ తప్పనుంది. ఈ మేరకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు దీనిపై అవగాహన కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈనెల 6న జిల్లాలోని ఏఈవోలకు శిక్షణ కల్పించనున్నారు. వీరు ఆయా గ్రామాల్లో రైతులకు యాప్ డౌన్లోడ్, స్లాట్ బుకింగ్పై వివరించనున్నారు. అయితే స్లాట్ బుకింగ్ ద్వారా పత్తి కొనుగోళ్లు ఏ మేరకు జరుగుతాయనేది చూడాల్సి ఉంది. కిసాన్ కపాస్ యాప్.. కేంద్ర ప్రభుత్వం కిసాన్ కపాస్ యాప్ను గతేడాది ప్రవేశపెట్టింది. అయితే ఇది పూర్తిస్థాయిలోకి అమలులోకి రాలేదు. ఈసారి ఖచ్చితంగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ యాప్లో రైతులు ముందుగా తమ వివరాలు నమోదు చేసుకోవాలి. తద్వారా మండలాలు మ్యాపింగ్, షెడ్యూల్ ప్రకారం కొనుగోళ్లు ఉంటాయి. పత్తి విక్రయించే సమయంలో స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రకారం అధికారులు అంచనా వేసిన దిగుబడి మేరకే కొనుగోలు చేస్తారు. ఒకసారి ఎంత పత్తి వస్తుందో అంతే అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తారు. దీంతో రైతులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు. జిల్లాలో ప్రస్తుతం వ్యవసాయ అధికారులు క్రాప్ బుకింగ్ వివరాలు నమోదు చేస్తున్నారు. మధ్యవర్తుల దోపిడీకి చెక్.. రైతులు పత్తి విక్రయించాలంటే మధ్యవర్తుల దోపిడీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు సీసీఐ ‘కపాస్ కిసాన్’ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా నేరుగా రైతులు స్లాట్ బుకింగ్ చేసుకొని పంట విక్రయించేందుకు అవకాశం కల్పించింది. కొంత మంది వ్యాపారులు, దళారులు ఇతర రైతుల పేరిట సీసీఐకి పత్తి విక్రయించి లబ్ధి పొందుతున్నారు. అలాంటి వాటికి ఇక చెక్ పడనుంది. ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందో.. ఆ మేరకు మాత్రమే కొనుగోలు చేయనున్నారు. గతేడాది జిల్లాలో కొంత మంది దళారులు రైతుల పేరిట ఎక్కువ మొత్తంలో సీసీఐకి పత్తి విక్రయించినట్లు తేలింది. దీంతో వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులపై వేటు పడిన విషయం తెలిసిందే. యాప్లో వివరాల నమోదు ఇలా.. రైతులు పంట అమ్ముకునేందుకు సాగుకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుచి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రైతు పేరు, జెండర్, పుట్టిన తేది, కులం, చిరునామా, ఆధార్, మొబైల్ నంబర్ నమోదు చేసుకోవాలి. అనంతరం పంట వివరాలు తెలియజేయాలి. సొంత భూమి, కౌలుదారా అనేది వివరించాలి. పట్టాదారు పాస్ పుస్తకం నంబర్, సర్వే నంబర్, మొత్తం భూమి, పత్తి సాగు విస్తీర్ణం, పంట రకం లాంటి వివరాలతో పాటు రైతు ఫొటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం 5.83 లక్షల ఎకరాలుపత్తి సాగు విస్తీర్ణం 4.28 లక్షల ఎకరాలుగతేడాది సీసీఐ కొనుగోలు చేసిన పత్తి25 లక్షల క్వింటాళ్లుప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసింది2.50 లక్షల క్వింటాళ్లుఈ ఏడాది పత్తి దిగుబడి అంచనా30 లక్షల క్వింటాళ్లు -
ప్రజలంతా విజయం సాధించాలి
ఆదిలాబాద్టౌన్: విజయదశమి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకొని ప్రజలంతా విజయం సాధించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీస్ హెడ్క్వార్టర్స్లోని ఆయుధ భాండాగారంలో గురువారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయానికి చిహ్నంగా తుపాకీతో ఐదు రౌండ్ల కాల్పులు జరిపి వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి పోలీస్శాఖ అహర్నిశలు శ్రమిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి,వెంకటి, టి.మురళి, ఎన్.చంద్రశేఖర్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ టీం, మోటార్ ట్రాన్స్పోర్టు టీం, తదితరులు పాల్గొన్నారు. వినూత్నంగా ‘హాకీ’ ఆయుధపూజఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో దసరా వేడుకలను వినూత్నంగా నిర్వహించా రు. హాకీ స్టిక్స్, గోల్ పోస్టులకు పూజలు చేశారు. అసోసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి పార్థసార థి మాట్లాడుతూ, జిల్లా క్రీడాకారులు ఈ ఏడాది మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించా రు. ఇందులో బాస్కెట్బాల్ జాతీయ క్రీడాకారుడు రాధాకృష్ణ, సీనియర్ హాకీ క్రీడాకారులు జే రవీందర్, సుధీర్, గోవింద్, అతుల్, విజయ్, శేఖర్, జంగు తదితరులు పాల్గొన్నారు. -
ప్చ్.. దశ మారలే!
సాక్షి,ఆదిలాబాద్: దసరా వచ్చిందయ్యా.. సరదా తెచ్చిందయ్యా.. దశమి వచ్చిందయ్యా.. దశనే మా ర్చిందయ్యా.. ఇది ఓ సినిమాలోని పాట. అయితే ఇప్పుడు జిల్లాలోని రైతులకు ఆ సరదా లేదు.. దశ అంతకంటే లేదు.. ఎందుకంటే ఈ దసరా వచ్చిందంటే ఇటు పత్తి, అటు సోయా దిగుబడులు చేతి కొచ్చేవి. పండుగ వేడుకలు నిర్వహించేందుకు ఆ దిగుబడుల్లో కొంతమేర విక్రయించుకొని సంబరాలు జరుపుకునేవారు. ఇప్పుడు మాత్రం ఆ ప రిస్థితే లేదు. దీనంతటికి వానాకాలంలో కురిసిన భారీ వర్షాలే కారణం. ఏకంగా 35 శాతం అధిక వర్షపాతం నమోదుతో పంటల పరిస్థితి పూర్తిగా ఆగమాగం అయిపోయింది. పత్తి కాయలు విచ్చుకొని తెల్లటి పత్తి బయటకు కనిపించాల్సిన సమయంలో దిగువ భాగంలో ఆ కాయలు పూర్తిగా మురిగిపోయి ఉండటం, పైభాగంలో ఉన్న కాయలు అసలుకే విచ్చుకోలేదు. తేమశాతం అధికంగా ఉండడమే కా రణంగా తెలుస్తోంది. పత్తి పంట కాలం మరో నెల పెరిగింది. దీంతోపాటు రైతు అంతర్కృషి, మందుల కోసం మళ్లీ పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి. దిగుబడులు చేతికొచ్చి ఆనందపడాల్సిన సమయంలో ఇంకా పంట కోసం తిప్పలు పడాల్సిన దుస్థితి లో అన్నదాతలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దశమి ఉత్సాహం రైతు ఇంట్లో కనిపించడం లేదు. చేతిలో కాసులు లేక కర్షకులు దిగాలు చెందుతున్నారు. వెంటాడుతున్న అప్పులు.. సాధారణంగా జిల్లాలో వానకాలం సీజన్లోనే భారీగా పంటలు సాగవుతాయి. పత్తి, సోయా, కందులను పెద్ద మొత్తంలో సాగు చేస్తారు. దీనికోసం రైతులు బ్యాంకులతో పాటు దళారుల వద్ద ప్రైవేట్ అప్పులు తీసుకుంటారు. పంట దిగుబడులు ఏటా దసరా వరకు చేతికొస్తాయి. దీంతో వాటిని విక్రయించి అప్పులు తీర్చి రైతు తన ఖర్చుల కోసం మిగతా మొత్తాన్ని వెచ్చించడం జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు, పిల్లల చదువులు, ఇతరత్రా వాటి కోసం డబ్బులను లెక్కలతో సరిపోల్చుకుంటాడు. అయితే ఇప్పుడు ఇవేమి రైతుకు కనిపించడం లేదు. అప్పులు మాత్రం మీద పడ్డాయి. ప్రైవేట్ అప్పుల పరంగా దళారుల నుంచి రైతులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. వానాకాలంలో పంటల సాగు వివరాలు.. (ఎకరాల్లో) మొత్తం సాగు విస్తీర్ణం: 5.85లక్షలు పత్తి : 4.40లక్షలు సోయా : 62,500 కంది : 55వేలు ఇతర పంటలు : 27,500 -
ఎన్నికల విధుల్లో మినహాయింపు ఇవ్వాలి
ఆదిలాబాద్టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో దివ్యాంగులు, గర్భిణులు, ఫీడింగ్ ఉపాధ్యాయులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మినహాయింపు ఇవ్వాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణకుమార్ అన్నారు. ఈమేరకు కలెక్టర్ రాజర్షిషాను బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల రోజు వివాహ శుభకార్యాలు ఉన్నటువంటి, ఉద్యోగ విరమణ దగ్గర ఉన్న ఉపాధ్యాయులకు విధులు కేటాయించవద్దని కోరారు. 2024లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే రెమ్యూనరేషన్ ఇవ్వలేదని, ఆ డబ్బులను ఇప్పించాలని విన్నవించారు. ఇందులో యూనియన్ నాయకులు రవీందర్రెడ్డి, దేవ్రావు, నతీన్ కుమార్, ప్రభాకర్, శ్రీనివాస్, నాందేవ్ తదితరులు ఉన్నారు. -
ఆదర్శం.. పల్సి(బి) తండా
మహాత్ముడి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటున్న గ్రామమది. మాటకు కట్టుబడి దశాబ్దాలుగా మద్యపానం, జీవహింసకు దూరంగా ఉంటున్న పల్లె. దాదాపు మూడు దశాబ్దాలుగా మద్యం, మాంసం ముట్టకుండా నిత్యం ఆధ్యాత్మిక భావనతో ఆదర్శంగా నిలుస్తోంది తలమడుగు మండలంలోని పల్సి(బి)తండా. ఎలాంటి గొడవలు లేకుండా ఠాణా మెట్లు ఎక్కకుండా ఐక్యతతో ముందుకు సాగుతున్నా రు ఈ గ్రామస్తులు. ఐక్యత రాగంతో అభివృద్ధిలోనూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నేడు గాంధీ జయంతి సందర్భంగా గ్రామంపై ప్రత్యేక కథనం. – తలమడుగుపల్సి(బి) తండా గ్రామ ముఖచిత్రం ఈ గ్రామంలో 1997లో పలువురు మద్యానికి బాని సయ్యారు. నిత్యం గొడవలు పడుతుండేవారు. ఈ క్రమంలో ఇద్దరు, ముగ్గురు చనిపోవడంతో వారి కుటుంబాలు ఛిద్రమయ్యాయి. అప్పుడే గ్రామస్తులంతా ఒక నిర్ణయానికి వచ్చారు. గ్రామంలో ఎవ రూ మద్యం ముట్టవద్దని, విక్రయించవద్దని తీర్మా నం చేశారు. అదే సమయంలో గ్రామానికి నారాయణ బాబా వచ్చారు. ఆయన బోధనలకు ప్రభావి తమై మాంసానికి సైతం దూరమయ్యారు. ఆధ్యాత్మికానికి చేరువయ్యారు. దశాబ్దాలుగా అదే బాట లో కొనసాగుతున్నారు. గ్రామ జనాభా దాదాపు 900 వరకు ఉంటుంది. బాబా మరణాంతరం గ్రా మంలో ఆయన పేరిట సద్గురు నారాయణ ఆల యం నిర్మించుకున్నారు. ఇందులో ప్రతీ గురువా రం ప్రత్యేక పూజలు నిర్వహించడం, అన్నదానం చేయడం, ఏటా దత్త జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గ్రామాభివృద్ధిలోనూ సమష్టిగా భాగస్వాములవుతున్నారు. స్థానిక వృద్ధులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ వృద్ధాశ్రమం సైతం నిర్మించారు. నారాయణ బాబా సంస్థాన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. నూతన పంచాయతీగా.. పల్సి(బి)గ్రామ పంచాయతీ పరిధిలో పల్సి(బి)తండా ఉండేది. 2019లో నూతన జీపీగా ఆవిర్భవించింది. అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో సర్పంచ్, వార్డుమెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూడా ఆయా పదవులను ఏకగ్రీవం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు గ్రామస్తులు. గత పాలకవర్గంలో ప్రతీ వార్డులో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, ఇంటింటికి తాగునీటితో పాటు, సెగ్రిగేషన్ షెడ్లు వంటివి నిర్మించుకున్నారు. అలాగే గొడవలకు దూరంగా ఉంటూ పోలీస్ స్టేషన్ మెట్లు సైతం ఎక్కడం లేదు. ఆధ్యాత్మిక బాటలో ఐక్యంగా ఉంటూ గ్రామాభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారు. -
సర్వం సిద్ధం
ఆదిలాబాద్: దసరా మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. విజయదశమి వేడుకలను గురువారం వై భవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కేంద్రంలోని దసరా మైదానంలో హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రావణ దహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇది దశాబ్దాలుగా ఆనవాయితీగా కొనసాగుతోంది. ముందుగా పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వ రి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం శోభా యాత్రగా సాగి దసరా మైదానంలో జమ్మి పూజ నిర్వహిస్తారు. ధ్వజారోహణం చేపట్టి అతిథులు రావణ దహన కార్యక్రమంలో పాల్గొంటారు. ప్ర జలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ సమితి అధ్యక్షుడు బొంపె ల్లి హనుమాండ్లు వెల్లడించారు. మరోవైపు సనా తన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న వేడుకలకు సంబంధించి సైతం ఏర్పాట్లు పూర్తయినట్లు సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమా ర్ ఖత్రి తెలిపారు.పండుగకు సొంతూరుకే..తాంసి: మా సొంతూరు తాంసి. ఉద్యోగరీత్యా కుటుంబంతో సహా కొన్నేళ్లుగా హైదరాబాద్లో ఉంటున్నాం. రాష్ట్ర సచివాలయంలో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నా. ఎన్ని పనులున్నా పండుగలకు మాత్రం అందరం కలిసి ఇక్కడికే వస్తుంటాం. పుట్టి పెరిగిన గ్రామంలో పండుగలు జరుపుకోవడం ఆనందంగా ఉంటుంది. అలాగే అందరిని కలుసుకునే అవకాశం ఉంటుంది. –రామగిరి స్వామి -
నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు
ఆదిలాబాద్టౌన్: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనంతో పాటు దసరా పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. నిమజ్జనోత్సవం కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పోలీసు సిబ్బందితో బుధవారం సమావేశం నిర్వహించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, డీజేలకు అనుమతి లేదని తెలిపారు. 30 మంది మహిళా సిబ్బందితో బందోబస్తు, షీటీంతో పర్యవేక్షణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆకతాయిల వేధింపులకు గురయితే మహిళలు డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. నిమజ్జనం దృష్ట్యా ఆదిలాబాద్ వన్టౌన్, టూటౌన్, మావల పోలీసు స్టేషన్ల పరిధిలో 200 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 9 సెక్టార్లు, 4 క్లస్టర్లుగా విభజించి సీఐ స్థాయి అధికారి పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇందులో డీఎస్పీలు జీవన్రెడ్డి, శ్రీనివాస్, పట్టణ సీఐలు సునిల్ కుమార్, నాగరాజు, ఫణిందర్, ప్రేమ్కుమార్, స్వామి, అంజమ్మ, పద్మ, ఎస్సైలు పాల్గొన్నారు. -
ఏడుగురే.. ఎంపీడీవోలు!
కై లాస్నగర్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సైతం అమల్లోకి వచ్చింది. త్వరలో నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. నోటిఫికేషన్ నుంచి కౌంటింగ్ వరకు మండలంలో నిర్వహించేఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించాల్సిన గురుతర బాధ్యత ఎంపీడీవోపైనే ఉంటుంది. అయితే జిల్లాలో ఎంపీడీవోల కొరత తీవ్రంగా వేఽధిస్తోంది. పలు మండలాల్లో ఎంపీవోలే ఇన్చార్జి ఎంపీడీవోగానూ వ్యవహరిస్తున్నారు. రెండు పోస్టుల బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది. సగానికిపైగా మండలాల్లో ఇన్చార్జీలే ఉండటంతో ఎన్నికల నిర్వహణపై ప్రభావం చూపే అవకాశముంది. రెగ్యులర్ విధులతోనే బిజీ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రేషన్కార్డులు, ఇందిరమ్మ, గృహజ్యోతి, మహలక్ష్మి వంటి సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందించేలా చూడాల్సిన బాధ్యత ఎంపీడీవోలదే. వీటితో పాటు తమ పరిధిలోని గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ విధులతోనే వారు నిత్యం బీజీగా ఉంటున్నారు. తాజాగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అదనంగా వచ్చాయి. నామినేషన్ల స్వీకరణ మొదలు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, ఉత్తర్వుల జారీ, శిక్షణలు, ఎన్నికల సామగ్రి సరఫరా వంటి పనులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. మెజార్టీ మండలాల్లో ఇన్చార్జీలే.. జిల్లాలో మొత్తం 20 గ్రామీణ మండలాలు ఉండగా, వీటి పరిధిలో 20 జెడ్పీటీసీలు, 166 ఎంపీటీసీ స్థా నాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఎంపీడీవోల కొరత ఉండగా తాజాగా మావల రెగ్యులర్ ఎంపీడీవో ఆకుల భూమయ్య ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ప్రస్తుతం తాంసి, తలమడుగు, భీంపూర్, బజార్హత్నూర్, బోథ్, ఉట్నూర్, గాదిగూడ మండలాల్లో మాత్రమే రెగ్యులర్ ఎంపీడీవోలు ఉన్నారు. కొత్తగా ఏర్పడిన మండలాలకు ప్రభుత్వం పోస్టులను మంజూరు చేయకపోవడంతో ఉన్నవారిని తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. మిగతా పది మండలాల్లో ఎంపీవోలు, సూపరింటెండెంట్లకే ఎంపీడీవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇది వారికి తలకుమించిన భారంగా మా రుతోంది. ఆదిలాబాద్రూరల్ ఎంపీవోగా ఉన్న అ ధికారికి ఇన్చార్జి ఎంపీడీవోతో పాటు మావల ఎంపీవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఒకే అధికారి రెండు మండలాల్లో ఏ విధంగా బాధ్యతలు నిర్వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. కాగా రెగ్యులర్ ఎంపీడీవోగా విధులు నిర్వహించాల్సి ఉండగా, కొంతమంది పైరవీలతో తమకు అనుకూలమైన మండలాలకు డిప్యూటేషన్పై వెళ్లారు. ఫలితంగా పాలన గాడితప్పడంతో పాటు ఎన్నికల నిర్వహణపై కూడాప్రభావం చూపే అవకాశముంది. జిల్లాకు ఆరుగురు కొత్త ఎంపీడీవోలు..? ఇటీవల విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో కొత్తగా కొలువు సాధించిన ఆరుగురిని ఆదిలాబాద్ జిల్లాకు ఎంపీడీవోలుగా నియమించినట్లుగా తెలుస్తోంది. వివిధ జిల్లాలకు చెందిన అభ్యర్థులను జిల్లాకు కేటాయించినట్లుగా సమాచారం. అయితే మంగళవారం వరకు ఏ ఒక్క అధికారి రిపోర్టు చేయలేదు. వీరంతా విధుల్లో చేరితే అధికారుల కొరత దూరమై ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మావల ఎంపీడీవోగా కృష్ణవేణిమావల నూతన ఎంపీడీవోగా కృష్ణవేణి నియామకమయ్యారు. సూపరింటెండెంట్ హోదా కలి గిన ఈమె ప్రస్తుతం హైదరాబాద్లోని పంచా యతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటేషన్పై పనిచేస్తున్నారు. ఇది వరకు మా వల రెగ్యులర్ ఎంపీడీవోగా పనిచేసిన భూమ య్య మంగళవారం పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో కృష్ణవేణిని నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా ఇది వరకు ఆమె జిల్లా మైనార్టీ సంక్షేమాధికారిగానూ బాధ్యతలు నిర్వహించారు. -
పకడ్బందీగా స్థానిక సంస్థల ఎన్నికలు
కై లాస్నగర్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి ఎన్నికల నిర్వహణ పై అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతిని ధులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చినందున ఓటర్లను ప్రభా వితం చేసే ప్రచార అంశాలను వెంటనే తొలగించాలన్నారు. మీడియాలో వచ్చే ప్రకటనలు, సోషల్ మీడియాలో ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు మూడు విడతల్లో ఉంటాయని పేర్కొన్నారు. మద్యం, డబ్బు కట్టడికి ప్రత్యేక చెక్పోస్టుల ఏర్పాటుతో పా టు ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలను నియమిస్తున్నట్లు తెలి పారు. ప్రజలు రూ.50వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లవద్దని, పట్టుబడితే అ నగదు సీజ్ చేస్తామని పేర్కొన్నారు. పోటీచేసే అభ్యర్థులు ప్రచార సభలు, సమావేశాలకు తప్పనిసరిగా అనుమతి తీసుకో వా లన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు ఆర్డీవో, సబ్ కలెక్టర్ నుంచి, సర్పంచ్ అభ్యర్థులు సంబంధిత తహసీల్దార్ ద్వారా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మోడల్ కోడ్ ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్యామలదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా,ఆర్డీవో స్రవంతి పాల్గొన్నారు. దుర్గా మాతా ఆలయంలో కలెక్టర్ పూజలు ఆదిలాబాద్రూరల్: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భా గంగా మావల మండలం దుర్గానగర్లో గల దుర్గా మాతా ఆలయంలో కలెక్టర్ రాజర్షి షా మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. -
ఎట్టకేలకు ఉట్నూర్ పంచాయతీకి ఎన్నికలు
ఉట్నూర్రూరల్: ఆరేళ్లుగా ఉట్నూర్ గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరగలేదు. ఈ సారి మాత్రం నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. గత ప్రభుత్వం ఈ మేజర్ పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసేందుకు సన్నద్ధం కాగా.. గిరిజన చట్టాలను ప్రస్తావిస్తూ ఆదివాసీ, గిరిజనులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు అప్పటి ప్రభుత్వం వెనుకడుగు వేసింది. ఈ క్రమలోనే 2019లో ఉట్నూర్ పంచాయతీకి సర్పంచ్ ఎన్నికలు నిలిచిపోయాయి. అప్పటి నుంచి మేజర్ గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి పాలనలో సాగింది. తాజాగా ఈ సారి నోటిఫికేషన్లో ఉట్నూర్కు సైతం ఎన్నిక ఉంటుందని ప్రభుత్వం వెల్లడించడంతో ఆశావహుల్లో జోష్ పెరిగింది. ఆయా పార్టీల నాయకులు ఇప్పటికే తమ ప్రయత్నాలు ముమ్మరం చేవారు. అయితే సర్పంచ్ స్థానానికి ఎస్టీ మహిళా రిజర్వేషన్ ఖరారు కావడంతో పలువురు నాయకులు తమ సతులను బరిలోకి దించేందుకు సిద్ధం చేస్తున్నారు. -
దసరా మహోత్సవానికి తరలిరండి
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని దసరా మైదా నంలో ఈనెల 2న నిర్వహించనున్న దసరా మహోత్సవానికి హిందూ బంధువులంతా తరలిరావాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరా రు. స్థానిక దస్నాపూర్ కాలనీలోని మైదానంలో హిందూ సమాజ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి స్వామితో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా విజయదశమి ఉత్సవా లను ఏటా నిర్వహించుకుంటున్నట్లు తెలిపా రు. ఆయనవెంట ఉత్సవ సమితి అధ్యక్షుడు హనుమాండ్లు, నాయకులు భరత్, కృష్ణయాద వ్, జ్యోతిరెడ్డి,దాము,రాకేశ్ తదితరులున్నారు. -
● ఉట్నూర్లో సద్దుల సంబురం
బతుకమ్మ ఎత్తుకున్న చిన్నారి ఉట్నూర్లో బతుకమ్మ జోష్లో యువతులుఉట్నూర్తో పాటు మండలవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబ రాలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను కూడళ్లలో ఉంచి మహిళలు, యువతులు చిన్నారులు ఆడిపాడారు. అనంతరం గంగన్నపేట చెరువుకు చేరుకుని బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఉట్నూర్ పాత బస్టాండ్లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బతుకమ్మలకు స్వాగతం పలికారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. – ఉట్నూర్రూరల్ -
రిజర్వేషన్ల ‘పంచాయితీ’
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పంచాయితీ మొదలైంది. పలు గ్రామాల్లో పోటీలో నిలబడేందుకు అభ్యర్థులే లేని పరిస్థితి నెలకొంది. దీంతో తమ గ్రామాల్లో రిజర్వేషన్ల ఖరారుపై పునః పరిశీలన చేయాలని విన్నవిస్తున్నారు. కొన్ని చోట్ల స్థానికులు నిరసన వ్యక్తం చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు సిద్ధమయ్యా రు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులను కలుస్తూ రిజర్వేషన్లు మార్చాలని కోరుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత మార్చే అవకాశం లేకపోవడంతో ఆ గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అనే సందిగ్ధత నెలకొంది. జనాభా లేకున్నా అవకాశాలు ఎందుకీ పరిస్థితి? 2011 నాటి జనాభా లెక్కలతో ఎస్సీ, ఎస్టీ వర్గాలు, రాష్ట్రంలో నిర్వహించిన సామాజిక ఆర్థిక కుల గణన సర్వేను పరిగణనలోకి తీసుకుని బీసీలకు రిజర్వేషన్ల ర్యాంకింగ్ ఇచ్చారు. బీసీ వర్గాల రిజర్వేషన్లకు డెడికేషన్ కమిషన్ సిఫారసులు పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్రంలో 2019 తర్వాత ఇప్పుడు జరుగుతున్న రెండో స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్, ఎంపీటీసీ మండలం యూనిట్గా, జెడ్పీటీసీ జిల్లా యూనిట్గా ర్యాంకింగ్లు ఇచ్చే క్రమంలో ఆయా వర్గాల్లో జనాభా లేనప్పటికీ రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇక మహిళలకు 50శాతం, వందశాతం ఎస్టీలు ఉన్న చోట్ల వారికే నోటిఫై చే యడం వంటి నిబంధనలు పాటించాల్సి ఉంది. ఎస్టీ, ఎస్సీ, బీసీల ర్యాకింగ్ ఇచ్చే క్రమంలో ఒక్క ఓటరు లేని వర్గాలకు కూడా ఆయా చోట్ల రిజర్వేషన్లు ప్రకటించాల్సి వచ్చింది. ఇక గత ఎన్నికల్లో ఏదైనా కారణంతో ఎన్నిక జరగకపోతే ఆయా వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్లు అనుభవించని కారణంగా మరోసారి వారికే అవకాశం కల్పించేలా జీవో జారీ చేశారు. ఇక షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజ నులే పోటీకి అర్హులు. దీంతో ఏ గ్రామంలోనైనా గిరిజనులు ఉన్నా లేకున్నా వారికే అవకాశాలు వస్తున్నాయి. గతంలో జనాభా లెక్కల సమయంలోనూ కొన్ని చోట్ల ఆయా వర్గాల వివరాల నమోదులో తప్పిదాలు జరగడంతోనూ ఇబ్బందులు వస్తున్నా యి. మళ్లీ జనాభా లెక్కలు జరిగి, ఆయా వర్గాల వివరాలు స్పష్టత వచ్చే వరకు ఈ పరిస్థితి మారే అవకాశం లేదు. ఉప సర్పంచ్లకే పగ్గాలు సర్పంచ్ పదవులు ఆయా వర్గాలకు రిజర్వు కావడంతో వార్డు స్థానాలకు ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. దీంతో వార్డు సభ్యులు తమలో ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటున్నారు. దీంతో సర్పంచ్ ఎన్నిక జరగని చోట్ల రిజర్వేషన్ వర్తించని ఉప సర్పంచ్లే సర్పంచ్ హోదాలో పాలన కొనసాగించే అవకాశం ఉంది. -
పర్ధాన్ తెగకు గుర్తింపునివ్వాలి
ఆదిలాబాద్రూరల్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్ని కల్లో ఆదివాసీ పర్ధాన్ తెగకు అన్ని రా జకీయ పార్టీలు గుర్తింపు నివ్వాలని పలువురు పర్ధాన్ సమాజ్ నాయకులు కోరారు. జిల్లా కేంద్రంలో ని అంబేద్కర్ భవనంలో మంగళవారం వారు మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఆదివాసీ పర్ధాన్ సమాజ్కు చెందిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. జిల్లాలోని ప్రతీ మండలంలో పర్ధాన్ సమాజ్ ఓటు బ్యాంకు కలిగి ఉందన్నారు. గిరిజనేతరుల మద్ధతు సైతం తమకు సంపూర్ణంగా ఉందని, ఈమేరకు ఆయా పార్టీ లు గుర్తించాలని కోరారు. ఇందులో నాయకులు యాదవ్రావ్, ఆనంద్ రావ్, శంకర్, దే విదాస్, సురేష్, సుభాష్, దిగంభర్, జనార్దన్, విలాస్, అశోక్, దేవిదాస్ పాల్గొన్నారు. -
మద్యం షాపులకు బోణీ
● ఆదిలాబాద్లో ఒకటి, ఇచ్చోడలో రెండు షాపులకు టెండర్లు ఆదిలాబాద్టౌన్: మద్యం షాపుల టెండర్లకు సోమవారం బోణీ అయ్యింది. ఈనెల 26న ప్రక్రియ ప్రారంభం కాగా ఆదివారం వరకు దరఖాస్తుదారులు మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తూ టెండర్లు వేయలేదు. కాగా సోమవారం జిల్లాలో మూడు దరఖాస్తులు వచ్చాయి. ఆదిలాబాద్ పట్టణంలో ఒకటి, బోథ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధి ఇచ్చోడలో రెండు దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో నాలుగు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తులకు అక్టోబర్ 18 వరకు గడువు ఉంది. 23న జిల్లా కేంద్రంలో లక్కీడ్రా తీయనున్నారు. జిల్లాలో 40 షాపులు ఉండగా, 15 షాపులకు రిజర్వేషన్లు ఉన్నాయి. వీటిలో గౌడ్స్కు ఒక షాపు, ఎస్సీలకు 5, ఎస్టీలకు 9 షాపులు కేటాయించారు. టెండర్లు దక్కించుకున్న వారు డిసెంబర్ నుంచి షాపుల నిర్వహణ చేపట్టేందుకు అవకాశం కల్పించారు. రెండేళ్ల వరకు కాలపరిమితి ఉంటుంది. దరఖాస్తులను స్వీకరించిన వారిలో ఆదిలాబాద్ ఎకై ్సజ్ సీఐ విజేందర్, బోథ్, ఉట్నూర్ ఎకై ్సజ్ సీఐలు రూప్సింగ్, జుల్ఫేఖార్ అహ్మద్తో పాటు ఎకై ్సజ్ ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు. -
అన్నదాతకు అండగా..!
ఆదిలాబాద్టౌన్: అన్నదాతకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2018లో సబ్సిడీపై రైతులకు వ్యవసాయ పరికరాలు అందించిన ప్రభుత్వం ఆ తర్వాత ప్రక్రియను నిలిపివేసింది. 2025 –26 సంవత్సరంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రభుత్వం పునఃప్రారంభించింది. దీంతో రైతులకు మేలు జరగనుంది. రాయితీపై పరికరాలు కావాల్సిన రైతులు ఆయా మండలాల వ్యవసాయ అధికారులకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. మార్చి 31, 2026 వరకు దరఖాస్తులకు గడువు విధించింది. యాంత్రీకరణ సాగు కోసం జిల్లాకు 5,193 యూనిట్లను అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.3 కోట్ల 80లక్షల 22వేల నిధులను కేటాయించింది. చిన్న, సన్నకారు రైతులతో పాటు మహిళ రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈప్రక్రియ పూర్తి చేసేందుకు మండల, జిల్లా పరిధిలో కమిటీలను ఏర్పాటు చేశారు. ఆరేళ్ల తర్వాత.. వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2017 –18 సంవత్సరంలో యంత్రలక్ష్మి పేరుతో రైతులకు సబ్సిడీపై పరికరాలను అందజేసింది. ఆ తర్వాత పథకాన్ని పక్కనబెట్టారు. దీంతో అన్నదాతలు సబ్సిడీ పరికరాల కోసం ఎదురుచూసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభించింది. ఇందుకోసం ప్రభుత్వం నిధులు సైతం కేటాయించింది. చిన్న, సన్నకారు రైతులు వివిధ పరికరాలను కొనుగోలు చేసేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఐదెకరాల్లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులు, మహిళ రైతులకు 50 శాతం సబ్సిడీపై, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీపై పరికరాలను అందించనున్నారు. రైతులకు తగ్గనున్న భారం.. యాంత్రీకరణ సాగుతో రైతులకు సాగు భారం తగ్గనుంది. ప్రస్తుతం వ్యవసాయంలో కూలీల కొరత వేధిస్తోంది. మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి కూలీలను రప్పించి పనులు చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంటుంది. దీంతో రైతులకు అదనపు ఆర్థిక భారం పడుతుంది. అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచేందుకు యాంత్రీకరణ సాగు ఎంతగానో దోహద పడుతుంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఈ పథకం ఉపయుక్తంగా మారనుంది. -
ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించండి
– ఆదివాసీ మహిళలు, చించుఘాట్, ఆదిలాబాద్రూరల్ మేమంతా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చించుఘాట్ గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన మహిళలం. కూలీనాలీ చేసుకుని జీవించే నిరుపేదలం. మాకు ఉండేందుకు పక్కా ఇళ్లు కూడా లేవు. గుడిసెల్లో కాలం వెళ్లదీస్తున్నాం. మాకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి వసతి సౌకర్యం కల్పించేలా చూడాలి. ఇందుకోసం దరఖాస్తు చేసుకోవడంతో పాటు పలుమార్లు అధికారులకు విన్నవించినా ఎలాంటి స్పందన లేదు. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి. -
ప్రతీ ఫిర్యాదుకు పరిష్కారం చూపాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: ప్రజల సమస్యలను పరిష్కరించినప్పుడే పోలీసులపై నమ్మకం మరింతగా పెరుగుతుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎస్పీకు విన్నవించారు. సమస్యలను ఓపికగా విన్న ఎస్పీ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. సు దూర ప్రాంతాల ప్రజలు తమ ఫిర్యాదులను 87126 59973 నంబర్కు వాట్సాప్ ద్వారా కూడా తెలియజేయవచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా 56 మంది అర్జీదారులు భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, భార్యభర్తల విభేదాలు, పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు తదితర సమస్యలపై ఫిర్యాదు చేశా రు. కార్యక్రమంలో సీసీ కొండ రాజు, విభాగ అధికారి జైస్వాల్ కవిత, సిబ్బంది వామన్ తదితరులు పాల్గొన్నారు.‘మత్స్య సంపదతో ఆర్థికాభివృద్ధి’ఉట్నూర్రూరల్: మత్స్య సంపదతో ఆర్థిక లబ్ధి చేకూరుతుందని జిల్లా మత్స్య శాఖ సొసైటీ డైరెక్టర్ సిడాం సోనేరావు అన్నారు. సోమవారం ఆదివాసీ భవనంలో గిరిజన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా మత్స్యకారులు, చేపల పెంపకం దారులు, చేపల విక్రయదారులు, మత్స్య మహిళా సంఘాలకు ద్విచక్ర వాహనాలు, పికప్ వాహనాలు, ఫిష్ఫాంలు, రుణ సదుపాయం వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ లక్ష్మి, కిసాన్ మిత్ర కోఆర్డినేటర్ కుంర వినాయక్, ప్రతినిధి పెందూర్ వినోద్, ఆయా సంఘాల అధ్యక్షులు, సభ్యులు తదితరులు ఉన్నారు. -
రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి
కై లాస్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలు అమలు చేసి, వారి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. పెండింగ్ కమీషన్ డబ్బులను విడుదల చేయాలని సోమవారం రేషన్ డీలర్లు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బతుకమ్మలతో నిరసన వ్యక్తం చేశారు. వారికి ఎమ్మెల్యే మద్దతు తెలిపి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వస్తే సమస్యలు పరిష్కారమవుతాయని ఆశపడ్డ డీలర్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోసం చేసిందన్నారు. పెండింగ్లో ఉన్న రేషన్ డీలర్ల కమీషన్ డబ్బులను వెంటనే విడుదల చేయాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో డీలర్ల సమస్యలను ప్రస్తావించి వారికి న్యాయం జరిగేలా చూస్తానని భరోసానిచ్చారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యేతో పాటు అడిషనల్ కలెక్టర్ శ్యామలదేవికి డీలర్లు అందజేశారు. రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాంపల్లి వేణుగోపాల్ పాల్గొన్నారు. -
ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
కైలాస్నగర్: స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులకు శిక్షణనిచ్చారు. నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్ రోజు వరకు ఆర్వోలు అనుసరించాల్సిన విధానాలపై మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చినందున, పకడ్బందీగా అమలు చేసేలా చూడాల్సిన బాధ్యత ఆర్వోలు, ఎంపీడీవోలపై ఉందన్నారు. కోడ్ ఉల్లంఘనలు జరగకుండా శ్రద్ధ వహించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, జెడ్పీ సీఈవో రాథోడ్ రవీందర్, డీపీవో రమేశ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న కలెక్టర్ రాజర్షి షా -
బాధితులకు భరోసా కల్పించాలి
కైలాస్నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలను సత్వరం పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని అడిషనల్ కలెక్టర్ శ్యామలదేవి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. అర్జీలను సంబంధిత అధికారులకు అందజేస్తూ సమస్యల పరిష్కారానికి శ్రద్ధ వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, కలెక్టరేట్ ఏవో వర్ణ, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్.రాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మహా పోచమ్మకు నీరా‘జనం’
సారంగపూర్/దిలావర్పూర్: జిల్లాలో అత్యంత ప్రా శస్త్యం గల అడెల్లి మహాపోచమ్మ గంగనీళ్ల జాతర మహోత్సవం ఆదివారం ముగిసింది. శనివారం దిలావర్పూర్ మండలం సాంగ్వి గ్రా మంలోగల గో దావరి నదికి అశేష భక్తజన సందోహం మధ్య అమ్మవారి ఆభరణాల శోభా యాత్ర చేరింది. ఆది వారం తెల్లవారుజామున గోదావరి నీటితో భక్తులు ఆభరణాలను శుద్ధి చేశారు. అనంతరం కాలినడకన ఆయా గ్రామాల మీదుగా తిరిగి అమ్మవారి ఆలయానికి ఆభరణాలు చేర్చారు. అమ్మవారికి నగలు అంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో జాత ర ముగిసింది. దారి పొడవునా ‘అమ్మ’ నామస్మరణ అడెల్లి పోచమ్మ తల్లి ఆభరణాల ఊరేగింపు శోభా యాత్ర శనివారం ఉదయం సారంగపూర్ మండలం అడెల్లి దేవస్థానం నుంచి దిలావర్పూర్ మండలంలోని కదిలి, మాడేగాం, దిలావర్పూర్, బన్సపల్లి, కంజర్ గ్రామాల మీదుగా రాత్రి సాంగ్వి పోచ మ్మ ఆలయం వరకు కొనసాగింది. అమ్మవారి ఆభరణాల వెంట వచ్చిన భక్తులు శనివారం రాత్రంతా పోచమ్మ ఆలయ పరిసరాల్లో అమ్మవారి నామస్మరణ చేస్తూ జాగరణలో పాల్గొన్నారు. ‘గంగ నీకు శరణమే.. ఘనమైన పూజలే..’ ‘ఉయ్యాలో ఉయ్యాలో.. ఊరూవాడ జంపాలో..’ ‘పోచమ్మ తల్లి చల్లంగా చూడ మ్మో..’ అంటూ భక్తులు అమ్మవారిని వేడుకుంటూ ఆటాపాటలతో ఆభరణాలను ఆదివారం తెల్లవారుజామున గోదావరి తీరానికి తీసుకువెళ్లారు. ఊరి పెద్దలు, అమ్మవారి ఆలయ పూజారులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానిక నాయకుల ఆధ్వర్యంలో అర్చకులు శాస్త్రోక్తంగా అమ్మవారి నగలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర గోదావరి జలాలను గడ ముంతల్లో తీసుకుని గంగనీళ్ల జాతరకు వచ్చిన భక్తులు అమ్మవారి ఆభరణాల వెంట వెళ్లారు. సాంగ్వి ఆలయం నుంచి ఉదయం ప్రారంభమైన గంగనీళ్ల జాతర అడెల్లి దేవస్థానానికి తిరుగు పయనమైంది. ఈక్రమంలో కంజర్, బన్సపల్లి, దిలావర్పూర్, మాడేగాం, కదిలి గ్రామాల్లో స్థానిక నాయకులు అమ్మవారి ఆభరణాల శోభాయాత్రకు మేళతాళాలు, భాజాభజంత్రీలతో ఘనస్వాగతం పలికారు. జాలుక దండతో ఘనస్వాగతం దిలావర్పూర్ గ్రామానికి ఆభరణాల శోభాయాత్ర చేరుకోగానే గ్రామస్తులు జాలుక దండ (భారీ పూలతోరణం) తో స్వాగతం పలికారు. గ్రామానికి చెందిన పోతరాజులు అమ్మవారికి పూజలు నిర్వహిహించి జాతర ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు యాట పిల్లలను (గొర్రె పొట్టేళ్లు) బహూకరించారు. శివసత్తులు పూనకాలు, నృత్యాల మధ్య ముందుకుసాగారు. దారిపొడవునా అమ్మవారి ఆభరణాలపై పసుపు నీళ్లు చల్లుతూ, కొబ్బరి కాయలు కొడుతూ భక్తులు మొక్కు తీర్చుకున్నారు. యాకర్పెల్లి గ్రామ గంగపుత్రులు సన్నని వలతో గొడుగుపట్టి ఆభరణాలను గ్రామ పొలిమేరల వరకు సాగనంపారు. ఆభరణాల శోభాయాత్ర, జాతరలో పాల్గొన్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏఎస్పీ రాజేశ్ మీనా, నిర్మల్ సీఐ కృష్ణ, దిలావర్పూర్ ఎస్సై రవీందర్తో పాటు పలువురు ఎస్సైల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం గంగనీళ్ల జాతర నేపథ్యంలో అడెల్లి మహాపోచమ్మ ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా నిజామాబా ద్, ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, హైదరాబా ద్, మెదక్, మహారాష్ట్రల నుంచి అధికసంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. భక్తులకు ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ తీర్థప్రసాదాలు అందించారు. జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సహకరించిన పోలీస్ యంత్రాంగం, వైద్య సిబ్బంది, ఆర్టీసీ సిబ్బందికి, ఆయా గ్రామాల ప్రజలకు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ భోజాగౌడ్, ఈవో రమేశ్రావు కృతజ్ఞతలు తెలిపారు. -
సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు
కై లాస్నగర్: గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డుమెంబర్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఏ గ్రామం, వార్డు ఏయే సామాజిక వర్గానికి కేటాయించబడిందనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. శనివారం మధ్యాహ్నం జెడ్పీ సమావేశ మందిరంలో చేపట్టిన రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ఆదివారం వేకువజామున 3గంటల వరకు కొనసాగింది. జిల్లా పంచాయతీ అధికారులు, ఉద్యోగులు, ఎంపీడీవోలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కలెక్టర్ రాజర్షి షా ఆమోదంతో రిజర్వేషన్ల గెజిట్ సైతం ప్రకటించారు. జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల మాదిరిగానే పంచాయతీ రిజర్వేషన్లు సైతం భిన్నంగా రావడంతో పలు గ్రామాల్లో పోటీ చేద్దామనుకునే అశావహులకు నిరాశే ఎదురుకానుంది. కాగా సగం సీట్లు అతివలకే కేటాయించడంతో పంచాయతీల్లో వారి ప్రాతినిధ్యం పెరగనుంది. రిజర్వేషన్లు స్పష్టం కావడంతో పల్లె రాజకీయం వేడెక్కనుంది. మరోవైపు పోటీకి సై అంటున్న వారు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో.. జిల్లాలో 20 గ్రామీణ మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 473 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో 251 జీపీలు ఏజెన్సీ పరిధిలోని షెడ్యూల్డ్ ఏరియాలోనే ఉండగా.. మరో 15 పంచాయతీల్లో వందశాతం ఎస్టీ జనాభానే ఉంది. దీంతో ఆయా పంచాయతీలన్నింటినీ ఎస్టీలకే రిజర్వ్ చేశారు. నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో గల మరో 207 పంచాయతీలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆన్ రిజర్వ్డ్గా కేటాయించారు. ఇందులో ఎస్టీలకు 47, ఎస్సీలకు 31, బీసీలకు 86 కేటాయించగా, మరో 43 పంచాయతీలను ఆన్ రిజర్వ్డ్ (జనరల్)గా ఖరారు చేశారు. మొత్తంగా అన్ని కేటగిరీల్లో కలిపి 234 జీపీలను మహిళలకు రిజర్వ్ చేశారు. జనరల్ స్థానాల్లోనూ వీరు పోటీ చేసే అవకాశం ఉండటంతో పంచాయతీల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగే అవకాశముంది. రిజర్వేషన్లు తేలడంతో ఆశావహులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వీటతో పాటు జిల్లాలోని 3,870 వార్డు స్థానాలకు గాను ఎంపీడీవోల ఆధ్వర్యంలో రిజర్వేషన్లను పూర్తి చేశారు. వీటిల్లోనూ సగం స్థానాలను మహిళలకు కేటాయించారు. సర్పంచ్ రిజర్వేషన్ల కేటాయింపు వివరాలిలా... (షెడ్యూల్డ్ ఏరియాలో..) మహిళలకు : 124 జనరల్ : 127 వందశాతం ఎస్టీ జనాభా కలిగిన పంచాయతీల్లో.. మహిళలు : 07 జనరల్ : 08 నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో ... ఎస్టీలు ఎస్సీలు బీసీలు అన్ రిజర్వ్డ్ మహిళలు 24 17 41 21 జనరల్ 23 14 45 22 -
మొక్కలు తెప్పించారు.. పంపిణీ మరిచారు
● బల్దియా అధికారుల నిర్వాకం కైలాస్నగర్: పచ్చదనం పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వన మహోత్సవ కార్యక్రమంపై బల్దియా అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. మీడియన్ ప్లాంటేషన్, ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో ఇప్పటికే లక్ష్యం మేర మొక్కలు నాటడంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి. తాజాగా పట్టణంలోని ప్రతీ ఇంటి ఆవరణలో నాటేందుకు అవసరమైన జామ, మల్లె, నందివర్ధనం, చక్రంపూలు వంటి వివిధ రకాల పండ్లు, పూల మొక్కలను తెప్పించారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఆంధ్రప్రదేశ్లోని కడియం నర్సరీ నుంచి సుమారు 40వేల వరకు ఆయా రకాల మొక్కలను సరఫరా చేశాడు. ఇటీవల జిల్లాకు తీసుకువచ్చిన ఈ మొక్కలను మున్సిపాలిటీకి సంబంధించిన బంగారుగూడలోని డంపింగ్యార్డులో నిల్వ చేశారు. పట్టణానికి చేరి 20 రోజులవుతున్నా ప్రజలకు అందించే దిశగా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. నిర్వహణ లోపంతో పలు మొక్కలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. వాటిని నాటేందుకు అనువైన పరిస్థితులున్నాయి. కాగా, ఈ విషయమై బల్దియా డీఈఈ కార్తీక్ను సంప్రదించగా.. ప్రజలకు అందించేలా చర్యలు చేపట్టామని పేర్కొనడం గమనార్హం. -
తొమ్మిది ఉద్యోగాలకు ఎంపికై న ఉదయ్
పోటీ పరీక్ష ఏదయినా కొలువు కొట్టడమే ఆనవాయితీగా మా ర్చుకున్నాడు బిట్లింగ్ ఉదయ్.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా తొమ్మిది ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. తాజాగా డిప్యూటీ తహసీల్దార్ కొలువు సాధించాడు. బజార్హత్నూర్కు చెందిన లక్ష్మణ్– సరస్వతి దంపతుల కుమారుడు ఉదయ్ ప్రస్తుతం ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్నగర్లో నివా సం ఉంటున్నాడు. తండ్రి రేషన్ డీలర్ కాగా, తల్లి గృహిణి. 2019లో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, పోస్టల్ అసిస్టెంట్, పంచాయతీరాజ్లో జూనియర్ అసిస్టెంట్, సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్, గ్రూప్–3లో 72వ ర్యాంక్ సాధించాడు. అలాగే ట్రెజరీలో జూనియర్ అసిస్టెంట్ అకౌంటెంట్గా ఎంపికై 2024 నుంచి ఆదిలాబాద్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం గ్రూప్–2లో 51వ ర్యాంక్ సాధించి డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకు ఎంపికయ్యాడు. సివిల్స్కు ఎంపిక కావడమే తన లక్ష్యమని చెబుతున్నాడు ఉదయ్. ఉదయ్ -
‘కొండా’ సేవలు చిరస్మరణీయం
బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలోబతుకమ్మ వేడుకలను జిల్లా కేంద్రంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో శనివారం అధికారికంగా నిర్వహించారు. ఉయ్యాల పాటలు హోరెత్తాయి. ఎస్టీయూ భవన్లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక బతుకమ్మ అని పేర్కొన్నారు. ఎకై ్సజ్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో అసిస్టెంట్ కమిషనర్ వై.హిమశ్రీ, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూగార్డెన్లో నిర్వహించిన వేడుకలకు కలెక్టర్ రాజర్షి షా హాజరై బతుకమ్మలకు పూజలు చేశారు. కోలాటమాడి సందడి చేశారు. ఇందులో డీఎఫ్వో ప్రఽశాంత్ బాజీరావు పాటిల్, రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. – ఆదిలాబాద్/కైలాస్నగర్ఆదిలాబాద్రూరల్: తెలంగాణ ఉద్యమంలో ఆచా ర్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరనీయమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హాజరై కొండా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, బీసీ అభివృద్ధి శాఖ జిల్లా అధికారి రాజలింగు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు, పద్మశాలి సంఘం నాయకురాలు ఆశమ్మ పాల్గొన్నారు. -
వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి
నేరడిగొండ: ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను సద్వి నియోగం చేసుకోవాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు. స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం నిర్వహించిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. పలు రికార్డులను పరిశిలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో బీపీ, షుగర్ వ్యాధితో బాధపడుతున్న రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేయాలని ఏఎన్ఎంలకు సూచించారు. గర్భిణులు, బాలింతలు విధిగా పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి సద్దాం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
‘స్థానిక’ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి
ఆదిలాబాద్టౌన్: ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత సీనియర్ నాయకులు లంకా రాఘవులు జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం నిర్వహించిన సమావేశలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే ఇప్పటివరకు దానిని అమోదించకుండా నిర్లక్ష్యం చేయడం బీసీలను బీజేపీ అవమానించడమేనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం స్వతంత్రంగా పోటీ చేస్తుందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే పార్టీని ప్రజలు ఆదరించి గెలిపించాలన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రవికుమార్, రాష్ట్ర నాయకులు శోభన్, రమేశ్, జిల్లా కార్యదర్శి మల్లేశ్, కార్యదర్శివర్గ సభ్యులు రాఘవులు, సచిన్, కిరణ్, దత్తాత్రి, మంజుల, సురేందర్, ఆశన్న, కిష్టన్న తదితరులు పాల్గొన్నారు. పిప్పల్కోటి నిర్వాసితులను ఆదుకోవాలి భీంపూర్: పిప్పల్ కోటి రిజర్వాయర్ భూ నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకోవాలని జాన్వెస్లీ కోరారు. శనివారం పిప్పల్కోటి నిర్వాసితులను కలిసి ఆయకట్టను పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. రిజర్వాయర్ కోసం దాదాపు 1200 ఎకరాల సాగుభూమిని రైతులు అందిస్తే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పరిహారం అందించలేదన్నారు. తక్షణమే నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రస్తుత ధరకు మూడింతలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి ప్రజా భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇందులో నిర్వాసితుల సంఘం కన్వీనర్ నసిరుద్దీన్, కోకన్వీనర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. -
కిసాన్ యాప్ ద్వారా పత్తి కొనుగోళ్లు
ఆదిలాబాద్టౌన్: కిసాన్ కపస్ యాప్ ద్వారానే పత్తి కొనుగోళ్లు చేపట్టాలని వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మిబాయి, వ్యవసాయశాఖ అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ నుంచి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో శనివారం జూమ్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పత్తి కొనుగోళ్లకు సంబంధించి రైతులు స్లాట్ బుకింగ్ చేసుకునే విధానంపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థ సీసీఐ ఈ యాప్ ద్వారానే కొనుగోళ్లు చేపడుతుందన్నారు. పంట అమ్మకానికి తేదీని ఖరారు చేసుకోవాలని, యాప్లో బుకింగ్ చేసుకున్న రైతులు తప్పనిసరిగా అవే తేదీల్లో విక్రయించాల్సి ఉంటుందన్నారు. రైతు వేదికల్లో ఏఈవోలు స్లాట్ బుకింగ్ చేసుకునే విధంగా చూడాలన్నారు. అనంతరం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్స్వామి, మార్కెటింగ్ ఏడీ గజానంద్ మాట్లాడారు . జిల్లాలో ఈ ఏడాది 4.28లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైందన్నారు. 30లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా వేసినట్లుగా తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా మార్కెట్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అక్టోబర్ 20వ తర్వాత పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నట్లు తెలిపారు. 34 జిన్నింగ్ మిల్లులను ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. గతేడాది జిల్లాలో సీసీఐ ద్వారా 25లక్షల క్వింటాళ్ల పత్తిని, ప్రైవేట్ ద్వారా 2.50 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. అక్టోబర్ 6న కిసాన్ యాప్పై శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో టెక్నికల్ ఏవోలు శివకుమార్, విశ్వనాథ్ తదితరులు ఉన్నారు. -
ఏటీసీలో నైపుణ్యంతో కూడిన శిక్షణ
ఆదిలాబాద్టౌన్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నెలకొల్పిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) లో నైపుణ్యంతో కూడిన శిక్షణ అందించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అందుబాటులోకి తెచ్చిన 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను శనివారం హైదరాబాద్లోని మల్లెపల్లి ఏటీసీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని గ్రంథాలయ చైర్మ న్ మల్లెపూల నర్సయ్య, ఏటీసీ చైర్మన్ గోవర్ధన్రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఆధునిక యంత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా, సరికొత్త సాంకేతికత అంశాలతో యువతలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఏటీసీ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్లేస్మెంట్ ఉంటుందని, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందులో జిల్లా ఉపాధి కల్పన అధికారి మిల్కా, ఏటీసీ పిన్సిపాల్ శ్రీనివాస్, ముత్యం రెడ్డి, ఏటీసీ కేంద్రాల ప్రిన్సిపాళ్లు, ఇన్స్ట్రక్టర్లు పాల్గొన్నారు. ఉట్నూర్రూరల్: ఉట్నూర్లోని కుమురంభీం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏటీసీని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా శనివారం ప్రారంభించి మాట్లాడా రు. రూ.5 కోట్లతో భవన నిర్మాణం పూర్తికాగా పరికరాలు, యంత్రాలు, ఇతర ఏర్పాట్లకు రూ.35 కోట్లు కేటాయించామన్నారు. ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే ఐటీడీఏ తరఫున సమకూరుస్తామన్నారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఏటీసీ ఇన్చార్జి ప్రిన్సిపాల్ రొడ్డ శ్రీనివాస్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
● జల సంరక్షణ సంకల్పం.. జాతీయ అవార్డు సొంతం ● జిల్లాకు దక్కిన ‘జల్ సంచయ్ జన్ భాగీదారి’ పురస్కారం ● రూ.2 కోట్ల నగదు కూడా.. ● రాష్ట్రపతి చేతుల అవార్డు అందుకోనున్న కలెక్టర్
కలెక్టర్కు సన్మానంజిల్లాకు జల్ సంచయ్ జన భాగీదారి జాతీ య పురస్కారం వరించడంపై జిల్లా గ్రామీ ణాభివృద్ధి శాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీవో రాథోడ్ రవీందర్ ఆధ్వర్యంలో ఆ శాఖ అధికారులు, ఉపాధి హామీ ఏపీవోలు, ఇతర సిబ్బంది శుక్రవారం కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపా రు. ఇందులో ఏడీఆర్డీవో కుటంబరావు, ఏపీ డీ కృష్ణారావు, ఏవో అందె గంగాధర్ తదితరులున్నారు. అంతకు ముందు ఈజీఎస్లో పనిచేసే ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు డీఆర్డీవోను సత్కరించి అభినందనలు తెలిపారు.కై లాస్నగర్: జిల్లాకు మరోసారి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. నీటి సంరక్షణ చర్యలకు గాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో నాలుగోస్థానం కై వసం చేసుకుంది. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ‘జల్ సంచయ్ జన్ భాగీ దారి’ పురస్కారం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ నుంచి కలెక్టర్ రాజర్షి షాకు ఉత్తర్వులు అందాయి. త్వరలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కలెక్టర్ ఈ అవార్డు అందుకోనున్నారు. దీని కింద రూ.2కోట్ల నగదు కూడా అందనుంది. జిల్లా ఉన్నతాధికారులతో పాటు గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పురస్కారం వరించిందిలా.. నీటి సంరక్షణ ప్రాధాన్యత చాటి చెప్పడంతో పాటు ఆయా కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేసేలా కేంద్ర ప్రభుత్వం జల్ సంచయ్.. జన భాగీ దారి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అడవుల జిల్లాగా ముద్రపడ్డ ఆదిలాబాద్లో గుట్టలు, రాళ్లు రప్పలతో కూడిన భూములే అధికం. వర్షపునీరంతా భూమిలోకి చేరేలా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యలో పలు సంరక్షణ చర్యలు చేపట్టారు. ఉపాధి హామీ పథకం కింద పంట చేలు, అటవీ ప్రాంతాలు, చెరువులు, బోర్వెల్స్, కాలువల వద్ద ప్రత్యే క నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. జిల్లావ్యాప్తంగా లక్షకుపైగా నీటి సంరక్షణ పనులు చేపట్టి 98వేల ఫొటోలను సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేశా రు. వాటిని పరిశీలించిన కేంద్రం జిల్లాకు ప్రత్యేక బృందాన్ని పంపించింది. ఈ ఏడా ది జూన్లో ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ నీటి కమిషన్ సభ్యులు నెల పాటు ఇక్కడే ఉండి జిల్లాలో చేపట్టిన ఆయా పనులను పరిశీలించారు. వెయ్యి ఫొటోలను సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. వాటిని పరిగణలోకి తీసుకున్న జల్శక్తి మంత్రిత్వ శాఖ జిల్లాకు పురస్కారం ప్రకటించింది. జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలివి.. వర్షపు నీటిని బొట్టుబొట్టుగా ఒడిసి పట్టి సంరక్షించడమే లక్ష్యంగా వాగులు, చెరువుల వద్ద ఉపాధి హామీ నిధులతో పెద్ద ఎత్తున చెక్డ్యాంలను నిర్మించారు. వ్యవసాయ భూములు, అటవీ ప్రాంతాల్లో పంటచేలకు నీటిని ఉపయోగించుకునేలా ఊటకుంటలు, కంటూరు కందకాలు, మ్యాజిక్ సోక్పిట్లు, బోర్వెల్స్ రీచార్జ్ స్ట్రక్చర్స్, ఫిష్ పాండ్స్, ఫార్మర్స్ బౌండ్రీ ట్రెంచెస్ వంటి నిర్మాణాల ను భారీగా చేపట్టారు. వీటితో పాటు గ్రామాల్లోని చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంపొందించేందుకు వీలుగా ఉపాధి కూలీలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేసి పూడిక తీత పనులు చేపట్టారు. ప్రధానంగా వేసవి లో నీటి ఎద్దడి నెలకొనే ఏజెన్సీ పరిధిలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, సిరికొండ, గాదిగూడ వంటి మండలాల్లో ఈ కార్యక్రమాలను ఎక్కువగా నిర్వహించారు. వీటి ద్వారా భూగర్భజలాలు పెంపొంది నీటి ఎద్ద డి నియంత్రణకు దోహదపడింది. తద్వారా జాతీయ అవార్డు వచ్చేందుకు తోడ్పడింది. -
వడ్డీ వ్యాపారులపై కొరడా
● జిల్లాలో ఏకకాలంలో దాడులు ● 43 బృందాలతో.. 13 మండలాల్లో తనిఖీలు ● 18 మందిపై కేసులుఆదిలాబాద్టౌన్: వడ్డీ వ్యాపారులపై ఎస్పీ అఖిల్ మహాజన్ కొరడా ఝులిపిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో 13 మండలా ల్లో 43 బృందాలతో శుక్రవారం దాడులు ని ర్వహించారు. అధిక వడ్డీతో రైతుల నడ్డీ విరుస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. వ్యవసాయ భూములు తాకట్టు పెట్టుకొని, భూములు రాయించుకొని కొంత మంది వ్యాపారులు అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తున్నారని తెలి పారు. ఈ మేరకు తనిఖీలు నిర్వహించి పది పోలీసు స్టేషన్ల పరిధిలో 18 మందిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వడ్డీ వ్యాపారుల నుంచి ప్రామిసరీ నోట్లు, చెక్కులు, బాండ్ పేపర్లు, సేల్డీడ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నార్నూర్లో బంగారం కు దువపెట్టుకొని అధిక వడ్డీకి డబ్బులు ఇస్తున్న వ్యాపారి నుంచి 12 గ్రాముల బంగారం, 235 గ్రాముల వెండీ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. లక్ష్మీప్రసన్న జ్యూయలరీ యజ మాని నిందితుడు ఉట్ల రవిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే ఆదిలాబాద్ వన్టౌన్లో 2 కేసులు, టూటౌన్లో 1, తలమడుగులో 2, బజార్హత్నూర్లో 4, బేలలో 1, ఇచ్చోడలో 3, గుడిహత్నూర్లో 1, నార్నూర్లో 1, ఇంద్రవెల్లిలో 1, ఉట్నూర్లో 2 మొత్తం 18 కేసులు నమోదైనట్లు తెలి పారు. ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలతో వ్యాపారం చేసే వారు ఇకనైనా తీరు మార్చుకోవాలన్నారు. లేకుంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. -
కొత్త కిక్కు
ఆదిలాబాద్టౌన్: మద్యం షాపుల ఎకై ్సజ్ పాలసీ గెజిట్ను ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలో 40 షాపులకు గాను టెండర్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. అక్టోబర్ 18 వరకు కొనసాగనుంది. తొలి రోజు ఒక్క టెండర్ కూడా నమోదు కాలేదు. రెండేళ్ల క్రితం జిల్లాలో 975 టెండర్లు నమోదవగా, వాటి ద్వారా ప్రభుత్వానికి రూ.19.50 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి దాదాపు వెయ్యికి పైగా దాఖలయ్యే అవకాశముందని తెలుస్తోంది. జిల్లాలో .. జిల్లాలో మొత్తం 40 వైన్షాపులు ఉండగా ఇందులో 15 రిజర్వు చేశారు. 25 జనరల్గా కేటాయించారు. ఎస్సీలకు 1, 4, 18, 21, 28 షాపులను రిజర్వు చేశారు. గౌడకులస్తులకు అడెగామ–కే లోని 25వ షాపును కేటాయించారు. ఎస్టీలకు ఉట్నూర్ ఎకై ్సజ్స్టేషన్ పరిధిలోని తొమ్మిది షాపులను రిజర్వు చేశారు. అందులో 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 షాపులున్నాయి. దరఖాస్తు ఇలా.. మద్యం షాపుల టెండర్లకు సంబంధించి జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఆదిలా బాద్ ఎకై ్సజ్స్టేషన్ పరిధికి సంబంధించి రెండు, ఇచ్చోడ, ఉట్నూర్ స్టేషన్లకు ఒక్కోటి చొప్పున కౌంటర్లను ఏర్పాటు చేశారు. దరఖాస్తుదారులు డీడీ లేక, చలాన్లు చెల్లించి కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు ఆధార్ జిరా క్స్, పాన్కార్డు, రిజర్వు షాపుల కోసం దరఖాస్తు చేసుకునేవారు కులధ్రువీకరణ పత్రాలు, ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వారు ఏజెన్సీ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. దీంతోపాటు మూడు పాస్ ఫొటోలు జతచేయాలని ఎౖక్సైజ్ అధికారులు పే ర్కొంటున్నారు. 21ఏళ్లు నిండిన వారు టెండర్లో పాల్గొనవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి మాత్ర మే లక్కీడ్రాలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తా రు. డ్రాలో షాపులు దక్కించుకున్న వారు అదే రోజు రెండు నెలలకు సంబంధించి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం రెండేళ్ల పాటు అవకాశం ఉంటుంది. రెండేళ్లలో 12 సార్లు, రెండు నెలకోసారి ఎకై ్సజ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. షాపులకు సంబంధించి మూడు స్లాబ్లుగా విభజించారు. ఆదిలా బాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాటన్నింటికి రూ.65లక్షలు, రూ.55లక్షలు, రూ.50లక్షల చొప్పు న మూడు స్లాబ్లున్నాయి.ఆయా దుకాణాల స్లాబు కు అనుగుణంగా నిర్దేశిత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది దరఖాస్తు ఫీజు రూ.3లక్షలుగా నిర్ణయించారు. 23న లక్కీడ్రా..నూతన మద్యం టెండర్లకు సంబంధించిన పాలసీ విడుదల చేశాం. అక్టోబర్ 18 వరకు దరఖాస్తు గడువు ఉంది. దరఖాస్తు ఫారాలు సమర్పించేందుకు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశాం. అక్టోబర్ 23న జిల్లా కేంద్రంలోని రత్నా గార్డెన్లో కలెక్టర్ చేతుల మీదుగా లక్కీడ్రా ప్రక్రియ ఉంటుంది. – హేమశ్రీ, డీపీఈవో -
‘బెస్ట్ ఇన్నోవేటివ్ టీచర్’కు ముగ్గురు ఎంపిక
ఆదిలాబాద్టౌన్/సాత్నాల: జటాదార ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఎన్జీవో ప్రతిష్టాత్మకంగా అందజేసే రాష్ట్రస్థాయి బెస్ట్ ఇన్నోవేటివ్ టీచర్ పురస్కారానికి జిల్లాలోని ముగ్గురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఇంద్రవెల్లి ఉన్నత పాఠశా ల పీజీహెచ్ఎం రాంమోహన్, భీంసరి ఉన్నత పాఠఽశాల ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ నీలం వెంకట్, కెనాల్ మేడిగూడ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు చిల్క సతీశ్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. పాఠశాలలో వారు బోధిస్తున్న వినూత్న బోధన తీరు, వారి నిరంతర కృషికి గాను అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈనెల 29న హైదరాబాద్లోని కళాభవన్లో ఈ అవార్డుల ప్రదానం ఉంటుందని వెల్లడించారు.చిలుక సతీశ్నీలం వెంకట్రాంమోహన్ -
చాలా సంతోషంగా ఉంది
జల్ సంచయ్.. జన్ భాగీదారి జాతీయ స్థాయి పురస్కారానికి జిల్లా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. ఇందులో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, క్షేత్రస్థాయి ఉద్యోగుల కృషి అభినందనీయం. వర్షపునీటిని ఒడిసిపట్టి సంరక్షించేలా జిల్లాలో అనేక కార్యక్రమాలను అమలు చేశాం. ప్రధానంగా ఏజెన్సీ పరిధిలో ప్రత్యేక చర్యలు చేపట్టాం. అవార్డు ద్వారా వచ్చే రూ.2కోట్లతో మరిన్ని నీటి సంరక్షణ చర్యలు చేపడుతాం. – రాజర్షి షా, కలెక్టర్ జిల్లాకు గర్వకారణంనీటి సంరక్షణలో జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానం, దేశంలో నాలుగో స్థానంలో నిలిచి జాతీయస్థాయి పురస్కారానికి ఎంపికవడం గర్వకారణంగా ఉంది. కలెక్టర్ రాజర్షి షా మార్గదర్శకంలో వారి సూచనలకు అనుగుణంగా పనులు చేపట్టాం. సమష్టి కృషి ఫలితమే ఈ అవార్డు. ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడం మరింత ఉత్సాహన్ని అందిస్తోంది. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతాం. – రాథోడ్ రవీందర్, డీఆర్డీవో -
వీరనారి చాకలి ఐలమ్మ
ఆదిలాబాద్రూరల్: వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఐలమ్మ జయంతిని బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అధికా రికంగా నిర్వహించారు. రిమ్స్ ఆసుపత్రి ఎదుట గల ఆమె విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివా ళులర్పించారు. అనంతరం మాట్లాడారు. తెలంగా ణ రైతాంగ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాత్రను కొనియాడారు. అంతకుముందు బీసీ సంక్షేమ సంఘం, రజక సంఘం నేతలతో పాటు పలు పార్టీల నేతలు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, మాజీమంత్రి జోగు రామన్న, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజలింగు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, శ్రీనివాస్, మనీషా, సుజాత, పాల్గొన్నారు. తెలంగాణ పౌరుషానికి ప్రతీక ఐలమ్మ ఆదిలాబాద్టౌన్: తెలంగాణ పౌరుషానికి, పోరాటా నికి ప్రతీక వీరనారి చాకలి ఐలమ్మ అని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీ శ్రీనివాస్, సీహెచ్ నాగేందర్, ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, కార్యాలయ ఏవో భక్త ప్రహ్లాద్, సూపరింటెండెంట్లు సులోచన, సంజీవ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
కై లాస్నగర్: పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్మికులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వురు మాట్లాడుతూ, వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. మూడు నెలల బకాయిలతో పాటు దసరా పండుగ సందర్భంగా నిత్యావసర సరుకులు అందించాలని కోరారు. సీఎం ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలను గ్రీన్చానల్ ద్వారా బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలన్నా రు. అనంతరం అతనపు కలెక్టర్ శ్యామలాదేవిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో యూనియన్ నాయకులు ఎస్.రవి, గంగన్న, అశోక్, ప్రమోద్, హనుమాన్లు, మారుతి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
పంట కాలం పెరిగినట్టే..
పత్తి పంట కాలం సుమారు నెల పాటు పెరిగినట్టే. ప్రస్తుతం మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా రైతులు చేలల్లో పనులు చేపట్టలేని పరిస్థితి ఉంది. వర్షాలు తగ్గిన తర్వాతే ఏదైనా చేపట్టాలి. వానలు తగ్గిన తర్వాత పత్తికి అనుకూల వాతావరణం ఏర్పడితే పూత, గూడు, కాయ పోయిన చోట మళ్లీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆ సమయంలోనే అవసరమైన ఎరువులు ఇవ్వాలి. దీంతోపాటు సూక్ష్మధాతువు లోపాల నివారణకు పోషక విలువ కల్పించాలి. అంతేకాకుండా రానున్న రోజుల్లో చలి పెరిగే అవకాశాలు ఉన్నందున రసం పీల్చే పురుగులతో పాటు ఇతర పురుగుల ప్రభావం పెరుగుతుంది. వాటి నివారణకు కూడా మందులు వాడాలి. – శ్రీధర్ చౌహాన్, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం -
తల్లుల సౌకర్యార్థం కియోస్క్
● ఆర్పీఎఫ్ ఐజీ అరోమా సింగ్ ఆదిలాబాద్: పాలిచ్చే తల్లులకు సౌకర్యవంతంగా ఉండేందుకే కియోస్క్ను ఏర్పాటు చేసినట్లు ఆర్పీఎఫ్ ఐజీ ఆరోమ సింగ్ ఠాకూర్ అన్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన కియోస్క్ను కలెక్టర్ రాజర్షిషాతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోషణ్ మహా కార్యక్రమంలో భాగంగా కియోస్క్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైల్వే తరఫున కూడా సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు. నవజాత శిశువులకు పాలు ఇవ్వడానికి తల్లులకు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. అనంతరం రైల్వేస్టేషన్లోని వెయిటింగ్ గదులను పరిశీలించారు. ఇందులో ఆర్పీఎఫ్ నాందేడ్ డివిజన్ సెక్యూరిటీ కమిషనర్ అమిత్ ప్రకాశ్మిశ్రా, డీడబ్ల్యూవో మిల్క, డీసీపీవో రాజేంద్ర ప్రసాద్, యశోద తదితరులు పాల్గొన్నారు. -
‘ఓట్ చోర్ గద్దీ చోడ్’ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కై లాస్నగర్: ఏఐసీసీ చేపట్టిన ఓట్ చోర్ గద్దీ చోడ్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనవాసరెడ్డి అన్నారు. శుక్రవా రం తన క్యాంపు కార్యాలయం నుంచి నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో జూమ్ నిర్వహించారు. నూతన ఓటర్ జాబితా లో ఏవైనా దొంగ ఓట్లు నమోదైతే పార్టీ నాయకుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. రాను న్న స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వృద్ధులకు అండగా ఉంటా.. వద్ధుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ‘కంది’ అన్నారు. పట్టణంలోని వయోవృద్ధుల సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి హాజరై మాట్లాడారు. -
లంబాడీలను తొలగించే వరకు ఉద్యమిస్తాం
తలమడుగు: ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే వరకు ఉద్యమిస్తామని తుడుందెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గోడం గణేశ్ అన్నారు. గురువారం రాయి సెంటర్, 9 ఆదివాసీ తెగలు, తుడుందెబ్బ, ఇతర సంఘాల ఆధ్వర్యంలో వేంకటేశ్వర ఆలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు మహా పాదయాత్ర నిర్వహించారు. కుమురంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకు దెరువు కోసం వలస వచ్చి ఆదివాసీలకు రావాల్సిన అభివృద్ధి ఫలాలను రాకుండా చేస్తున్న లంబాడీలను వెంటనే తొలగించాలన్నారు. అక్రమంగా వలస వచ్చిన వారికి ఎస్టీ కులధ్రువీకరణ పత్రాలు జారీ చేయవద్దన్నారు. అనంతరం తహసీల్దార్ రాజమోహన్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ మండల అధ్యక్షుడు జంగాల పోచన్న, డివిజన్ అధ్యక్షుడు కుముర జ్ఞానేశ్వర్, రాయి సెంటర్ అధ్యక్షుడు రామారావు, ఉపాధ్యక్షుడు భుజంగరావు పాల్గొన్నారు. -
సింగరేణి కార్మికుడు ఆత్మహత్య
మందమర్రిరూరల్(రామకృష్ణాపూర్): రామకృష్ణాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని జవహర్గర్కు చెందిన సింగరేణి కార్మికుడు రెక్కల గోవర్ధన్రెడ్డి (39) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఆర్కేపీ సీహెచ్పీలో జనరల్ అసిస్టెంటుగా పనిచేస్తున్న గోవర్ధన్రెడ్డికి అతని భార్యకు మధ్య బుధవారం రాత్రి గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెంది గదిలో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఓరియంట్ కార్మికులకు బోనస్ పెంపు
కాసిపేట: దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపనీ పర్మినెంట్, లోడింగ్ కార్మికులకు బోనస్ పెంచుతూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. గుర్తింపు సంఘం అధ్యక్షుడు సత్యపాల్రావుతో యాజమాన్యం గురువారం నిర్వహించిన చర్చల్లో రూ.4 వేలు పెంచేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. గతంలో రూ.35,500 ఉండగా ప్రస్తుతం రూ.39,500కు పెంచారు. రాబోయే సంవత్సరానికి రూ.2వేలు పెంచుతూ రూ 41,500లకు అగ్రిమెంట్ చేసుకున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు రూ.16,800 ఇస్తుండగా రూ.వెయ్యి పెంచుతూ రూ.17,800 ఇవ్వనున్నట్లు తెలిపారు. చర్చల్లో కంపనీ హెచ్ఆర్ హెడ్ ఆనంద్ కులకర్ణి, గుర్తింపు సంఘం సెక్రటరీ భీమిని మహేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్లు పాల్గొన్నారు. అగ్రిమెంట్ పత్రాలతో సత్యపాల్రావు -
చికిత్స పొందుతూ మహిళ మృతి
కాగజ్నగర్టౌన్: అనారోగ్యంతో బాధపడుతూ మూడు రోజులుగా పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మండలంలోని సీతానగర్కు చెందిన మౌల్కార్ అమృత (40) గురువారం రాత్రి మృతి చెందింది. కాగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని ఆరోపిస్తూ బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు వైద్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన వైద్యం అందించకపోవడంతోనే ఒక నిండు ప్రాణం బలైందని, దీనికి ఆస్పత్రి యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ముంబై ఎయిర్పోర్టులో ఆదిలాబాద్ వాసి అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: టాంజానియా దేశంలో ఉంటూ మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఆదిలాబాద్ పట్టణానికి చెందిన షేక్ ఇర్ఫాన్ను ముంబై ఎయిర్పోర్టులో అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. గురువారం వన్టౌన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్రూరల్ పోలీసులు రౌడీషీటర్ కై ంచి సలీంను అరెస్ట్ చేసిన ఘటనపై నిందితుడు ఇర్ఫాన్ ‘సిల్సిలా ఆదిలాబాద్’ అనే వాట్సాప్ గ్రూపులో టాంజానియాలో ఉంటూ వివాదాస్పద వాయిస్, టెక్స్ ్ట మెసేజ్లు పోస్ట్ చేశాడు. దీంతో గత ఏప్రిల్ 15న ఆదిలాబాద్ టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితుడు విదేశాల్లో ఉండటంతో ఎస్పీ అఖిల్ మహాజన్ సిఫార్సు మేరకు ఇమిగ్రేషన్ అధికారులు అతనిపై లుక్ అవుట్ సర్క్యూలర్ (ఎల్ఓసీ) జారీ చేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం టాంజానియా నుంచి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన షేక్ ఇర్ఫాన్ను ఇమిగ్రేషన్ అధికారులు డిటైన్ చేసి ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు. అనంతరం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్సై పీర్సింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ముంబైలో అతన్ని పట్టుకొని ఆదిలాబాద్కు తరలించినట్లు చెప్పారు. జడ్జి ఎదుట హాజరుపర్చగా 14 రోజుల జుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు వివరించారు. నిందితుడి వద్ద నుంచి పాస్పోర్ట్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని ఏఎన్రెడ్డి కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. బాధితుల కథనం ప్రకారం సారంగాపూర్ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రమేష్ చందర్గౌడ్ ఈనెల 22న కుటుంబ సభ్యులతో కలిసి మహారాష్ట్రలో ఉంటున్న కూతురు ఇంటికి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున పనిమనిషి ఇంటికి వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉంది. విషయాన్ని రమేష్ చందర్గౌడ్కు ఫోన్ ద్వారా చెప్పడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు ఐదున్నర కేజీల వెండి, తులం నర బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలిపారు. క్లూస్టీం, ఫింగర్ ప్రింట్ టీం వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఉయ్యాలో..
పాటపాడే అక్కాచెల్లెళ్లు బతుకమ్మ అనగానే అందరికీ గుర్తొచ్చేవి.. తీరొక్క పువ్వులు.. బతుకమ్మ పాటలు. ప్రస్తుతం పూలకు ఎంత డిమాండ్ ఉందో.. పాటలకు అంతే ఉంది. ఏటా కొత్త కొత్త పాటల కోసం మహిళలు ఎదురు చూస్తుంటారు. అయితే ఒకప్పుడు బతుకమ్మ ఆట, పాటలు సంప్రదాయబద్ధంగా ఉండేవి. మహిళలు లయబద్ధంగా చప్పట్లు కొడుతూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ బతుకు చిత్రాన్ని ఆవిష్కరించే పాటలు పాడేవారు. క్రమంగా ఆ పాటలు కనుమరుగవుతున్నాయి. అయితే ఇప్పటికీ కొందరు పాత పాటలతో ఆకట్టుకుంటున్నారు. ఇక ప్రస్తుత తరం.. జానపద పాటలు, కోలాటాల నృత్యాలతో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ వేడుకల్లో పాటలు సద్దుల బతుకమ్మ వరకు ఊరూరా.. వాడవాడలా మార్మోగుతున్నాయి. పూల పండుగలో పాడే పాటల్లో సామాజిక అంశాలు, కుటుంబ బాంధవ్యాలు దాగి ఉన్నాయి. బతుకమ్మ పాటలపై నాటి, నేటి మహిళల అభిప్రాయాలు..పల్లెదనాన్ని ప్రతిబింబించేలా... నిర్మల్ఖిల్లా: బతుకమ్మ పాటలు అంటేనే పల్లె జీవనాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటాయి. మన సంస్కృతి, సంప్రదాయం, జీవన విధానం ఉట్టిపడే బతుకమ్మ పాటలు వారసత్వ సంపదగా కాపాడుకుంటూనే భావితరానికి తెలియజెప్పేందుకు ప్రయత్నం చేయాలి. నేటితరం అభిరుచికి అనుగుణంగా పాతకొత్తల మేలు కలయికగా పాటల్ని రూపొందించుకుంటే మంచిది. – ఎల్.నవ్య, సింగర్, నిర్మల్ ప్రోత్సహించాలి నిర్మల్ఖిల్లా: పాటలు పాడే వారిని గుర్తించి ప్రోత్సహిస్తేనే బతుకమ్మ సంప్రదాయం నిలుస్తుంది. ప్రభుత్వంతో పాటు సంఘాలు కూడా బతుకమ్మ పాటల పోటీలు నిర్వహిస్తే కొత్తతరానికి ఆసక్తి పెరుగుతుంది. ఇప్పటి తరానికి బతుకమ్మ పాటల్ని సొంతంగా పాడేవారన్న విషయమే తెలియదు. – పర్కిపండ్ల లక్ష్మి, తాండ్ర, సారంగపూర్ పాటల వెనుక నాటి జ్ఞాపకాలు నిర్మల్ఖిల్లా: మా చిన్నప్పటి నుంచి బతుకమ్మ పాటలు అంటే ప్రాణం. సాయంత్రం వేదికల వద్ద బతుకమ్మల చుట్టూ తిరుగతూ పాటలు పాడటం ఆనందంగా ఉండేది. బీడీ కంపనీలో తోటివారితో కలిసి సామూహికంగా బతుకమ్మ ఆడుతూ స్వయంగా పాటలు పాడుకునే వాళ్లం. కానీ ఇప్పటి తరం మాత్రం మొబైల్, టీవీ, డీజే పాటలతో బతుకమ్మ ఆడుతున్నారు. – సంగెం భూదేవి, అనంతపేట, నిర్మల్ రూరల్ ఏడు దశాబ్దాలకు పైగా.. నాకు 80 సంవత్సరాలు. నా చిన్ననాటి నుంచి ఏడు దశాబ్దాలకు పైగా బతుకమ్మను చూస్తూ వస్తున్నా. ఇప్పటికీ బొడ్డెమ్మ పాటలు కై గట్టి పాడుతా. ఈతరం మహిళలు బతుకమ్మ ప్రాధాన్యతను తెలియజెప్పే విధంగా ఆ పాటలు నేర్చుకోవాలి. వారసత్వ సంపద లాంటి బతుకమ్మ పాటలు కనుమరుగు కాకుండా సంరక్షించుకోవాలి. – కట్కం రుక్మాబాయి, బోరిగాం, సారంగాపూర్ సంస్కృతిని పరిరక్షిస్తూనే... నిర్మల్ఖిల్లా: కాలానుగుణంగా పాటలరూపం మారినా, ఆత్మ మాత్రం అదే. ఈ తరం భాషలో, బీట్లో పాడినా బతుకమ్మ స్ఫూర్తి అందుతుంది. కొత్తగా సృజనాత్మకంగా పాటలను వెలుగులోకి తెస్తున్నారు. నవతరం యువతుల అభిరుచికనుగణంగా పాటలు రూపుదిద్దుకుంటున్నాయి. – శైలజ, జానపద గాయని, నిర్మల్ -
డిగ్రీ చేసిన డిపెండెంట్లకు క్లర్క్ పోస్టులు
శ్రీరాంపూర్: సింగరేణి గని ప్రమాదంలో చనిపోయిన ఉద్యోగుల స్థానంలో డిగ్రీ చదివిన డిపెండెంట్లకు సూటబుల్ జాబ్ కింద గ్రేడ్ 3 క్లర్క్పోస్ట్ ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. 2009లో అప్పుడున్న గుర్తింపు సంఘం ఏఐటీయూసీకి, యజమాన్యానికి మధ్య జరిగిన చర్చల్లో గని ప్రమాదాల్లో ఉద్యోగులు చనిపోతే వారి పిల్లలకు విద్యార్హతను బట్టి సూటబుల్ జాబ్ కల్పించాలని ఒప్పందం జరిగింది. కానీ కేవలం ఐటీఐ, బీటెక్ వంటి టెక్నికల్ చదువులు చదివిన వారికి ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టెక్నికల్ సూపర్వైజర్లుగా సూటబుల్ జాబ్ కల్పిస్తున్నారు. నాన్ టెక్నికల్ చదువులైన డిగ్రీ మరే ఇతర సత్సమాన డిగ్రీ విద్యార్హత ఉన్న డిపెండెంట్లకు మాత్రం అండర్గ్రౌండ్లో జనరల్ అసిస్టెంట్గా ఉద్యోగం కల్పిస్తున్నారు. దీనిపై ప్రస్తుత గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు పలుమార్లు యజమాన్యంతో చర్చించారు. స్ట్రక్షరల్ సమావేశంలో కూడా ఈ డిమాండ్ను పెట్టారు. దీంతో గురువారం ఈ అంశంపై హైదరాబాద్లో డిప్యూటీ సీఎల్సీ సమక్షంలో యజమాన్యానికి, గుర్తింపు సంఘానికి మధ్య ట్రైపార్టీయేట్ సమావేశం జరిగింది. ఇందులో సమస్యలను పరిష్కరిస్తూ రాత పూర్వక ఒప్పందం జరిగింది. ఉద్యోగి గని ప్రమాదంలో మృతి చెందితే డిగ్రీ అర్హత కలిగిన వారి పిల్లలకు గ్రేడ్ 3 క్లర్క్గా ఉద్యోగం కల్పించబోతున్నారని గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ తెలిపారు. ఇదిలా ఉంటే 2009 నుంచి మైన్స్ యాక్సిడెంట్ కేసుల్లో డిపెండెంట్లు డిగ్రీ అర్హత ఉండి జనరల్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేస్తున్న వారికి కూడా గ్రేడ్ 3 క్లర్క్ ఇప్పిస్తామని తెలిపారు. -
బ్రాండెడ్ పేరిట పీడీఎస్ బియ్యం విక్రయం
ఆదిలాబాద్టౌన్: బ్రాండెడ్ బియ్యం పేరిట పీడీఎస్ బియ్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు వన్టౌన్ సీఐ బీ.సునీల్కుమార్ తెలిపారు. గురువా రం వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలోని చిల్కూరి లక్ష్మీనగర్ కాలనీకి చెందిన షేక్ అయూబ్ పట్టణంలోని శివాజీచౌక్లో ఆంధ్రా కిరా ణషాపు నడుపుతున్నాడన్నారు. బ్రాండెడ్ బియ్యం సంచుల్లో పీడీఎస్ బియ్యం నింపి ప్రజలకు విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ఆరు క్వింటాళ్ల రాయితీ బియ్యంతో పాటు ఆటోను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే అతనిపై పలు కేసులు న మోదైనట్లు తెలిపారు. నిందితుడి దుకాణా న్ని జప్తు చేసేందుకు ఆదిలాబాద్ ఆర్డీవోకు సిఫార్సు చేసినట్లుగా వెల్లడించారు. -
గిరి గ్రామాల అభివృద్ధే లక్ష్యం
నేరడిగొండ: గిరిజన గ్రామాల అభివృద్ధే ఆదికర్మ అభియాన్ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ పరిశీలకుడు జితేంద్రసింగ్ అన్నారు. గురువారం మండలంలోని వివిధ గ్రామపంచాయతీల్లో పర్యటించి కార్యక్రమం అమలు తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా లింగట్ల గ్రామ పంచాయతీలోని గోండుగూడలో గుస్సాడీ నృత్యంతో ఆయనకు స్వాగతం పలికారు. లింగట్ల రాజురా, వెంకటపూర్ గ్రామపంచాయతీల్లో కార్యక్రమం అమలు, గ్రామాభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక, గ్రామసభ, గ్రామ సోషల్ మ్యాపింగ్, నిరుద్యోగ యువత గుర్తింపు వంటి అంశాలను పరిశీలించి సంతృప్తి చెందారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి వంటి అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. నేరడిగొండ మండలంలోని 12 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమం అమలవుతుందని ఆయన పేర్కొన్నారు. -
ఎలుగుబంట్ల దాడిలో రైతులకు గాయాలు
నెన్నెల: మండలంలోని మైలారం గ్రామ శివారులో గురువారం మూడు ఎలుగుబంట్లు దాడి చేయడంతో దుబ్బపల్లి గ్రామానికి చెందిన అర్శ మారయ్య, గావిడి మల్లేశ్ అనే గిరిజన రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. సదరు రైతులు మధ్యాహ్నం గ్రామ శివారులోని పత్తి చేన్లకు వెళ్తుండగా మూడు ఎలుగుబంట్లు అకస్మాత్తుగా వచ్చి దాడి చేశాయి. తీవ్రగాయాలు కావడంతో బాధిత కుటుంబ సభ్యులు వెంటనే 108లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యంకోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
కల సాకారమైన వేళ
ఆశయ సాధనకు ఎన్ని ఇబ్బందులొచ్చినా వెన్ను చూపలేదు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టు వీడలేదు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా ఇష్టపడి చదివారు. పగలు, రాత్రి పుస్తకాలతో కుస్తీ పట్టారు. చివరికి అనుకున్న లక్ష్యం సాధించారు. జిల్లాకు చెందిన పలువురు అత్యుత్తమ ర్యాంకులతో గ్రూప్–1 ఉద్యోగాలు సాధించారు. నందినికి ఇది నాలుగో కొలువు ఆదిలాబాద్ టౌన్: జిల్లా కేంద్రంలోని తిర్పెల్లి కాలనీకి చెందిన జనగం సంతోష్–సంగీత దంపతుల ఏకై క సంతానమైన నందిని వైద్యారోగ్యశాఖలో ఏవోగా ఉద్యోగం సాధించింది. పదోతరగతి వరకు జిల్లా కేంద్రంలోని లిటిల్స్టార్, ఇంటర్ నుంచి డిగ్రీ వరకు హైదరాబాద్లోని నారాయణ ఐఏఎస్ అకాడమీలో అభ్యసించింది. ఉస్మానియా కళాశాలలో పీజీ పూర్తి చేసింది. ఇదివరకు మున్సిపల్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఎంపికై ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మూడు నెలల పాటు పనిచేసింది. గ్రూప్–3 ఉద్యోగానికి ఎంపికై నా పోస్టింగ్ ఇవ్వలేదు. ఇటీవల ఆమె జేఎల్ కొలువు సాధించి నిర్మల్ ప్రభుత్వ కళాశాలలో జూనియర్ లెక్చరర్గా పనిచేస్తోంది. ఉద్యోగం చేస్తూనే ఎలాంటి కోచింగ్ లేకుండా పరీక్షకు హాజరైన ఆమె తాజాగా గ్రూప్–1లో ఉద్యోగం సాధించింది. ఫైర్మన్ నుంచి గ్రూప్–1 అధికారిగా.. ఆదిలాబాద్టౌన్: భోరజ్ మండలం పిప్పర్వాడకు చెందిన రాజీ వ్రెడ్డి–లక్ష్మి దంపతుల కుమారుడు శశిధర్రెడ్డి చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం గ్రూప్–1లో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్గా ఉద్యోగం సాధించాడు. శశిధర్రెడ్డి జిల్లా కేంద్రంలోని ఫైర్స్టేషన్లో ఫైర్మన్ (కానిస్టేబుల్)గా విధులు నిర్వహిస్తున్నాడు. 2017 లో ఈ ఉద్యోగం సాధించాడు. ఆ తర్వాత 2018లో ఎకై ్సజ్ కానిస్టేబుల్గా, గ్రూప్–4లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగాలు సాధించినా ఫైర్మన్గానే కొనసాగుతున్నాడు. దీంతో ఆయన నాలుగు ఉద్యోగాలు సాధించాడు. శశిధర్రెడ్డికి భార్య పల్లవి, ఇద్దరు పిల్ల లు మనస్వి, శ్రీహన్ష్ ఉన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీరాంరెడ్డి పాఠశాలలో పదో తరగతి, బోధన్లో ఇంటర్, హైదరాబాద్లో డిగ్రీ పూర్తి చేశాడు.ఉపాధ్యాయుడి కొడుకు ఎంపీడీవోగా.. ఇచ్చోడ: మండల కేంద్రంలోని విద్యానగర్ కాలనీకి చెందిన ఉయికే శ్రీనివాస్ గ్రూప్–1లో సత్తా చాటి ఎంపీడీవో ఉద్యోగం సాధించాడు. శ్రీనివాస్ తండ్రి సంజీవ్ నాగేశ్వర్రావు ఐటీడీఏలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. శ్రీనివాస్ ప్రాథమిక విద్యను మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో, ఇంటర్, డిగ్రీ హైదరాబాద్లో పూర్తి చేశాడు. -
సౌత్ జోన్ పోటీల్లో సత్తా
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇంది రాప్రియదర్శిని స్టే డియంలోగల ఆది లాబాద్ క్రీడా పా ఠశాలకు చెందిన విద్యార్థి ఎస్.చరణ్ సౌత్ జోన్ జాతీ యస్థాయి పోటీల్లో సత్తా చాటాడు. ఈనెల 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో గల ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రా రంభమైన 36వ సౌత్ జోన్ జాతీయ స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో ట్రయాథ్లాన్–ఏ పోటీల్లో గురువారం స్వర్ణంతో మెరిసినట్లు అథ్లెటిక్స్ కోచ్ రమేశ్ తెలిపారు. ఈ సంవత్సరం అథ్లెటిక్స్ పోటీల్లో జాతీయస్థాయిలో విజేతగా నిలిచిన ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకు చెందిన తొలి అథ్లెట్ చరణ్ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చరణ్ను డీవైఎస్వో శ్రీనివాస్ తదితరులు అభినందించారు. -
సజావుగా ఇంటర్వ్యూల ప్రక్రియ
కై లాస్నగర్: ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమి క విద్య (ప్రీ ప్రైమరీ స్కూల్స్)ను అందించేందుకు ప్రభుత్వం 19 ఇన్స్ట్రక్టర్, 19 ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరించింది. జిల్లా వ్యాప్తంగా 38 పో స్టులకు 735మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. వీరి ఎంపిక కోసం గురువారం కలెక్టరేట్ స మావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో ఒక్కో పోస్టుకు ఇద్దరు అభ్యర్థులను పిలిచి ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ప్రక్రియ సజావుగా సా గింది. కాగా, పోటీ తీవ్రంగా ఉండటంతో డీఎడ్ అ భ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించి నట్లు అధికారులు తెలిపారు. ఎంపికై న అభ్యర్థుల జాబితా త్వరలో ప్రకటిస్తామన్నారు. అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. -
మొదటి ప్రయత్నంలోనే డీఎస్పీగా..
ఇంద్రవెల్లి: మండలంలోని వాగాయితండాకు చెందిన సత్యభామ–రాథోడ్ దుదిరాం దంపతుల కుమారుడైన రాథోడ్ ప్రమోద్ గ్రూప్–1లో 458.5 మార్కులతో 420వ ర్యాంక్ సాధించి డీఎస్పీ ఉద్యోగం దక్కించుకున్నాడు. ప్రమోద్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివాడు. 2007–10 విద్యాసంవత్సరంలో ఢిల్లీలోని వెంకటేశ్వర యూనివర్సిటీలో డిగ్రీలో బీఏ పూర్తి చేశాడు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేసి అక్కడే ప్రస్తుతం పీహెచ్డీ మూడో సంవత్సరం చదువుతూ గ్రూప్స్కు సిద్ధమయ్యాడు. మొదటి ప్రయత్నంలోనే సత్తా చాటి డీఎస్పీగా ఉద్యోగం సాధించాడు. కాగా, ప్రమోద్ ఐదుసార్లు యూపీఎస్సీ సివిల్స్ రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్లడం గమనార్హం. -
అసాంఘిక చర్యలకు పాల్పడవద్దు
ఇచ్చోడ: అసాంఘిక చర్యలకు పాల్పడవద్దని ఎస్పీ అఖిల్మహాజన్ సూచించారు. గురువారం ఉద యం 5గంటలకు మండలంలోని కేశవపట్నంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించగా ఎస్పీ భారీ వర్షంలోనూ గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. గత ఐదేళ్లలో గ్రామానికి చెందిన పలువురిపై 90 కేసులు నమోదైనట్లు తెలిపారు. కలప స్మగ్లింగ్, పీడీ యాక్ట్, రౌడీ షీట్లు నమోదైన వారు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో మెదిలితే కేసులు ఎత్తివేసే దిశగా కృషి చేస్తామని తెలిపారు. చదువుకోలేక కొన్నేళ్లుగా ఇక్కడి ముల్తానీలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఐదేళ్లున్న పిల్లలందరినీ పాఠశాలలకు పంపించాలని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని పోలీస్శాఖకు సహకరించాలని కోరారు. పత్రాలు లేని వాహనాలు స్వాధీనం కేశవపట్నం గ్రామంలో నిర్వహించిన కార్డన్ సెర్చ్లో భాగంగా పోలీసులు ఇంటింటా తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలులేని 82 ద్విచక్రవాహనాలు, 18 ఆటోలు, ఒక మ్యాక్స్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఉట్నూర్ అడిషనల్ ఎస్పీ కాజల్సింగ్, ఆదిలాబాద్ డీఎస్సీ జీవన్రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాస్, ఇచ్చోడ, ఉట్నూర్ సీఐలు రాజు, ప్రసాద్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, నేరడిగొండ, సిరికొండ ఎస్సైలు పురుషోత్తం, సాయన్న, శ్రీకాంత్, ఇమ్రాన్, పూజ, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై అన్వర్ ఉల్ హక్, 180మంది పోలీసులు, 20 మంది మహిళా పోలీసులు పాల్గొన్నారు. -
స్వతహాగా సన్నద్ధమై డీఎస్పీగా ఎంపికై ..
ఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రానికి చెందిన సునీల్కుమార్ మకారియా–శ్వేత మకారియా దంపతుల కుమార్తె సాక్షి మకారియా గ్రూప్–1లో డీఎస్పీ ఉద్యోగం సాధించింది. జిల్లా కేంద్రంలోని కాన్వెంట్ పాఠశాలలో పదో తరగతి, హైదరాబాద్ చైతన్యలో ఇంటర్, ఢిల్లీలోని ఎల్ఎస్ఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఢిల్లీలోనే ఉంటూ పీజీ, బీఏ, ఎంఏ చదివింది. సివిల్స్ సాధించేందుకు తీవ్రంగా శ్రమించింది. ఐదుసార్లు యూపీఎస్సీ పరీక్షలు రాసినా విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత హైదరాబాద్లో ఉంటూ పరీక్షల కోసం సన్నద్ధమైంది. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే స్వతహాగా సన్నద్ధమై గ్రూప్–1లో సత్తా చాటింది. 65వ ర్యాంక్ సాధించి డీఎస్పీగా ఎంపికై ంది. -
పంచాయతీ కార్యదర్శి నుంచి ఎంపీడీవోగా..
ఉట్నూర్రూరల్: మండలంలోని కొత్తగూడ చెక్ పోస్టు గ్రామానికి చెందిన తుడుం లవ్కుమార్ గ్రూప్–1లో రాణించి ఎంపీడీవోగా ఉద్యోగం సాధించాడు. ఆదిలాబాద్లోని గిరిజన గురుకుల పాఠశాలలో పదో తరగతి వరకు, డీఆర్డీఏ ద్వారా హైదరాబాద్లోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ చదివాడు. బీటెక్లో 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. 2016లో గ్రూప్–2లో విఫలమై, 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఎంిపికయ్యాడు. ప్రస్తుతం నార్నూర్ మండలం మాన్కాపూర్ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉద్యోగం చేస్తూనే 2022 నుంచి గ్రూప్–1 కోసం ప్రయత్నించాడు. 440 మార్కులతో (తెలుగు మీడియం) స్టేట్ 902, ఎస్సీ కేటగిరీలో 88వ ర్యాంక్ సాధించి ఎంపీడీవో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కాగా, లవకుమార్ పదేళ్ల వయస్సులోనే తల్లిదండ్రులు మరణించారు. భార్య మృణాళిని, మిత్రులు ప్రవీణ్, వెంకటేశ్, రాజు, అన్నయ్య రాజేందర్ ప్రోత్సాహంతో తాను ఈ విజయం సాధించినట్లు లవకుమార్ తెలిపాడు. -
గర్భిణులకు మెరుగైన వైద్యం అందించాలి
ఇంద్రవెల్లి: గర్భిణులకు మెరుగైన వైద్యం అందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని పరిశీలించారు. మంచి పోషకాహారం, అంగన్వాడీ సెంటర్ల ద్వారా అందిస్తున్న గుడ్లు, పాలు తీసుకోవాలని గర్భిణులకు సూచించారు. ఆస్పత్రిలో శుద్ధ జల సమస్య ఉందని సిబ్బంది పీవో దృష్టికి తీసుకెళ్లగా ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ అదనపు వైద్యాధికారి కుడ్మెత మనోహర్, పూజిత, శ్వేత, సిద్ధార్థ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
వారం రోజుల్లో పనులు ప్రారంభించేలా చర్యలు
కై లాస్నగర్: జిల్లా కేంద్రంలోని బీఫ్ మార్కెట్ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ బుధవారం సందర్శించారు. రూ.50లక్షల వ్యయంతో నాలుగేళ్ల క్రితం చేపట్టిన మార్కెట్ నిర్మాణ, అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉ న్నాయని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ ఇటీవల కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ బీఫ్ మార్కెట్ను సందర్శించి అసంపూర్తి పనులను పరిశీలించారు. వ్యాపారుల ఇ బ్బందులను రంజానీ వివరించగా.. స్పందించిన అదనపు కలెక్టర్ వారం రోజుల్లో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలి పారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు, డీఈ సందీప్ ఉన్నారు. -
ప్రభుత్వ కొలువు.. అక్రమాలకు పరుగు
ఆదిలాబాద్టౌన్: సర్కారు నౌకరి.. లక్షల్లో జీతం.. దర్జాగా విధులు నిర్వహిస్తూ పేదలకు సేవ చేయాల్సిన కొంత మంది ప్రభుత్వ అధికారులు కాసులకు కక్కుర్తి పడుతున్నారు. ధనార్జనే ధ్యేయంగా అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అక్రమాలకు ఒడిగడుతున్నారు. అక్రమ దందాలు, సెటిల్మెంట్లలో వీరి పాత్ర ఉండటం విస్మయానికి గురిచేస్తోంది. ఇటీవల పోలీసులు నమోదు చేసిన కేసులను పరిశీలిస్తే.. ప్రభుత్వ అధికారుల పాత్ర తేటతెల్లం కావడంతో పాటు ఆ శాఖలకు మచ్చ తెచ్చేలా కనిపిస్తోంది. జనం నుంచి వీరికి ఛీత్కారాలు తప్పట్లేదు. అక్రమాలకు అడ్డా.. ప్లాట్ల రిజిస్ట్రేషన్ జరగాలంటే మున్సిపల్ నుంచి అసెస్మెంట్ తప్పనిసరి. భవన నిర్మాణాలు ఉంటేనే వాటిని జారీ చేయాలి. కానీ కొంత మంది మున్సి పల్ ఉద్యోగులు, అధికారులు కాసులకు కక్కుర్తిపడి దొడ్డిదారిన అసెస్మెంట్లు జారీ చేస్తున్నారు. వాటి సాయంతో తప్పుడు పత్రాలను సృష్టించి అక్రమార్కులు రిజిస్ట్రేషన్ శాఖలో తమ పని కానిచ్చేస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న కోట్లాది రూపాయల ప్లాట్ల కబ్జాలే ఇందుకు నిదర్శనం. ఇదిలా ఉంటే రిజిస్ట్రేషన్ కోసం సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చే వారి లింక్ డా క్యుమెంట్లు, భూమి అసైన్డ్, పట్టా ల్యాండ్, ప్రభుత్వ భూమినా వంటి వివరాలు పరిశీలించాల్సి ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే రిజిస్ట్రేష న్ చేయాలి. కానీ సంబంధిత అధికారులు కొంత మంది డాక్యుమెంట్ రైటర్ల సాయంతో అక్రమాలకు తెర లేపుతున్నారు. ఇది ఒకెత్తు అయితే.. మరోవైపు ఇదివరకే రిజిస్ట్రేషన్ అయి ఉన్నవాటికి డబుల్ రిజి స్ట్రేషన్ చేస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారు. త ద్వారా అర్హులైన వారికి అన్యాయం జరుగుతోంది. నిబంధనలు తుంగలో తొక్కుతూ.. ప్రభుత్వ ఉద్యోగి ఎలాంటి వ్యాపారం చేయరాదు. ప్లాట్లు, భూములు కొనుగోలు చేస్తే సంబంధిత శాఖ ఉన్నతాధికారికి సమాచారం అందించాలి. సొంత డబ్బుతో కొనుగోలు చేస్తున్నాడా.. బ్యాంక్ నుంచి రుణం పొందుతున్నాడా అనే విషయాలను తెలియజేయాలి. అయితే జిల్లాలో చాలా మంది ఉపాధ్యాయులతో పాటు ఉద్యోగులు రియల్ ఎస్టే ట్ దందాలో ఆరితేరి అక్రమంగా రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు. తన పేరుతో పాటు కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఉద్యోగం చిన్నదేనైనా రూ.కోట్లకు పడగలెత్తుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. భూ దందాతో పాటు చిట్టీలు నడపడం, పత్తి వ్యాపారం, మద్యం దుకాణాల్లో వాటాలు, ఇసుక దందా, సెటిల్మెంట్లు వంటివి చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. -
స్లాట్ బుకింగ్పై అవగాహన కల్పించాలి
కై లాస్నగర్: పత్తి కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన స్లాట్ బుకింగ్ విధానంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఈ సీజన్కు సంబంధించి పత్తి కొనుగోళ్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యా పారులు, సీసీఐ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. వ్యాపారులు, అధికారుల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, కపస్ కిసాన్ యాప్ను రైతులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని స్వతహాగా స్లాట్ బుకింగ్ చేసుకునేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఏవోలు, ఏఈవోలదేనన్నారు. క్రాప్ బుకింగ్ నమోదు ప్రక్రియ మందకొడిగా సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చేనెల 10వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో 4,31,042 ఎకరాల్లో పత్తి సాగవుతుందని, సుమారు 33.47లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశముందన్నారు. ఈ మేరకు 36 జిన్నింగ్ కేంద్రాల్లో 11 సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110తో కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కొనుగోళ్లకు సంబంధించి గ్రామాలు, తేదీల వారీగా ప్రత్యేక షెడ్యూల్ సిద్ధం చేయాలని డీఏవోను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్కెట్ యా ర్డులు, జిన్నింగ్ ఫ్యాక్టరీలలో ఎలక్ట్రానిక్ కాంటాల ను పరిశీలించి సిద్ధం చేయాలని లీగల్ మెట్రాలజీ అధికారులకు సూచించారు. విద్యుత్, అగ్నిమాపక శాఖ అధికారులు తగు ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రెయి నీ కలెక్టర్ సలోని, డీఎస్పీ జీవన్రెడ్డి, మార్కెటింగ్ అధికారి గజానంద్, డీఏవో శ్రీధర్ స్వామి, టెక్నికల్ ఏవో కె.శివకుమార్, ట్రాన్స్ కో ఎస్ఈ జేఆర్ చౌహన్ తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే రో డ్డు ప్రమాదాలను నివారించవచ్చని కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నిషేధం అంశంపై సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేసేవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. విద్యాసంస్థల్లో రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, హెల్మెట్, సీట్ బెల్టు ప్రాధాన్యత వివరించాలని పేర్కొన్నారు. మద్యం సేవించి, అతివేగంతో వాహనాలు నడపొద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. జిల్లా కేంద్రంలోని రహదారులపై పలుచోట్ల స్పీడ్ బ్రేకర్లు, సైన్ బోర్డులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, నియంత్రణ కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
పాత నేరస్తులపై నిఘా పెంచాం..
పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా పెంచాం. మార్కెట్ ప్రాంతాల్లో మహిళల భద్రత కోసం షీ టీమ్ మఫ్టీలో ఉంటూ నిఘా కొనసాగుతోంది. పెట్రోలింగ్ బీట్స్ పెంచాం. క్రైం టీమ్ మఫ్టీలో బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశాం. పట్టణాల్లో 24గంటలూ పోలీసులు గస్తీ తిరుగుతుంటారు. డయల్ 100కు సమాచారం ఇస్తే ఐదు నిమిషాల వ్యవధిలో బ్లూ కోల్ట్స్ పోలీసులు మీ వద్ద ఉంటారు. ఈ నెల 23న రాత్రి చెడ్డి గ్యాంగ్ వ్యూహాన్ని తిప్పికొట్టాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – ఎగ్గడి భాస్కర్, డీసీపీ, -
దేశీదారు పట్టివేత
ఆదిలాబాద్టౌన్: అక్రమంగా మహరాష్ట్ర నుంచి జిల్లాకు దేశీదారు తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ విజేందర్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ ఎకై ్సజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. పెన్గంగా నది ఒడ్డున పెండల్వాడ గ్రామ శివారులో రూ.30వేల విలువైన 404 దేశీదారు బాటిళ్లను పట్టుకున్నారు. పెండల్వాడ గ్రామానికి చెందిన అడిగే రమేష్, టార్పే వినోద్, పద్రె గజానంద్ దేశీదారు తీసుకొస్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. దేశీదారు అక్రమ రవాణా చేసినా, విక్రయాలు జరిపినా కేసు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. -
ఎకరాకు రూ.50 లక్షలిస్తేనే భూములిస్తాం..
కై లాస్నగర్: ఎకరాకు రూ.50లక్షలు చెల్లిస్తేనే తమ భూములు అప్పగిస్తామని రామాయి సిమెంట్ ఫ్యాక్టరీలో భూములు కోల్పోతున్న రైతులు తేల్చిచెప్పారు. ఎకరాకు రూ.8.29లక్షల చొప్పున చెల్లించేలా ధర నిర్ణయిస్తూ ఆర్డీవో ఇటీవల 38 మంది రైతులకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వాసిత రైతులు, ఫ్యాక్టరీ యాజమాన్యంతో ఆర్డీవో స్రవంతి బుధవారం సమావేశం నిర్వహించారు. తొలుత ఫ్యాక్టరీ ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రైతులకు వివరించారు. అనంతరం వారి అభిప్రాయాలు స్వీకరించారు. పనికి రా ని భూములకు చెల్లించే మొత్తాన్నే మూడు పంటలు పండించే భూములకు చెల్లిస్తామనడం సరికాదని రైతులు పేర్కొన్నారు. తామంతా సన్న, చిన్నకారు రైతులమేనని, ఆ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నామన్నారు. వాటిని తక్కువ ధరకు తీసుకుంటే తమకు కనీసం ప్లాటు కూడా రాదని తామెలా జీవించాలని ప్రశ్నించారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెబుతున్నందున తాము సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే భూమికి బదులు భూమి కొనివ్వాలని, లేకుంటే ఎకరాకు రూ.50లక్షల చొప్పున పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. స్పందించిన ఆర్డీవో రైతులకు న్యాయం చేసేలా చూడాలని ఫ్యాక్టరీ యాజమాన్యానికి సూచించారు. ఫ్యాక్టరీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇప్పటికే 630 ఎకరాల భూమిని సేకరించామన్నారు. దసరా తర్వాత పనులు ప్రారంభిస్తామని, రైతులు సహకరించాలని కోరారు. కాగా, అంతకుముందు రైతులు కలెక్టరేట్ సమావేశ మందిరం వద్ద తమ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీజీఎం ఆది నారాయణస్వామి, ఆమరేందర్, జీఎం శ్రీనివాసరావు, ఏజీఎం సైదులు, ఆకుల రాంరెడ్డి, మాజీ ఎంపీపీ గండ్రత్ రమేశ్, బండి దత్తాత్రీ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలపై పెరుగుతున్న వేధింపులు
ఆదిలాబాద్టౌన్: రోజురోజుకు మహిళలపై వేధింపులు పెరిగిపోతున్నాయని అఖిల భార త శ్రామిక మహిళా కార్యదర్శి పద్మశ్రీ అన్నా రు. జిల్లా కేంద్రంలోని మాధవరావు విజ్ఞాన కేంద్రంలో బుధవారం నిర్వహించిన జిల్లా మహిళా సదస్సులో ఆమె మాట్లాడారు. సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా అసమానత, చిన్నచూపు, లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు తెలిపారు. వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. కార్యక్రమంలో సీఐ టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆశన్న, కిరణ్, వెంకటమ్మ, సురేందర్, గంగమ్మ, జంగుబాయి, పద్మ, పార్వతి, సౌజన్య, అరుణ, మనోజ, స్నేహ, పావని పాల్గొన్నారు. -
పూలే దంపతులను ‘భారతరత్న’తో గౌరవించాలి
ఆదిలాబాద్రూరల్: సామాజిక ఉద్యమానికి నాంది పలికి, సీ్త్ర విద్య, మహిళా సాధికారిక, మూఢనమ్మకాల నిర్మూలన కోసం కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారతరత్నతో గౌరవించాలని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే అన్నారు. సత్యశోధక స్థాపన 152వ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఆవరణలో గల పూలే దంపతుల విగ్రహాలకు బుధవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఇందులో సాంబన్న, సతీశ్, విజయ్, అనిల్, రమేశ్, రాంకిషన్, కల్పన పాల్గొన్నారు. -
క్యూలో ‘పట్టా’
ఈ సీజన్లో రైతులకు యూరియా ఇక్కట్లు తప్పడం లేదు. భోరజ్ సహకార సంఘ కార్యాలయం వద్ద బుధవారం వేకువజాము నుంచే బారులు తీరారు. గంటల తరబడి క్యూలో నిలబడ లేక తమవంతుగా పట్టా పాస్బుక్లను ఉంచారు. 444 బ్యాగ్లను పంపిణీ చేసినట్టు ఏవో అష్రఫ్ తెలిపారు. జైనథ్లోని గ్రోమోర్ షాపు ఎదుట రైతులు ఉదయం నుంచే బారులు తీరారు. టోకెన్లు అందించి 400 బస్తాల యూరియా పంపిణీ చేసినట్లు ఏవో పూజ తెలిపారు. కాగా, పలువురి రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు వారిని సముదాయించారు. అలాగే తలమడుగు మండలంలోని బరంపూర్, సుంకిడి గ్రామాల సహకార సంఘ గోదాంల వద్ద రైతులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఒక్కో గ్రామంలో 444 బస్తాల చొప్పున పంపిణీ చేసినట్లు ఏవో ప్రమోద్రెడ్డి తెలిపారు. – సాత్నాల/జైనథ్/తలమడుగు -
కిడ్నాపర్ నుంచి తప్పించుకున్న బాలుడు
ఆదిలాబాద్టౌన్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్లోని చిల్కూరినగర్కు చెందిన భరత్ అనే ఎనిమిదేళ్ల బాలుడు కిడ్నాపర్ చెర నుంచి తప్పించుకుని జిల్లాకు చేరుకున్నట్లు జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. సికింద్రాబాద్లో రైలు ఎక్కి తలమడుగు మండలంలోని కోసాయి స్టేషన్లో బుధవారం దిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఏడుస్తూ కనిపించిన బాలుడి వివరాలు తెలుసుకున్న రైల్వేస్టేషన్ సిబ్బంది తలమడుగు పోలీసులతో పాటు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకుని కోసాయికి వెళ్లి బాలుడిని ఆదిలాబాద్ బాల రక్షక్ భవన్కు తీసుకువచ్చినట్లు తెలిపారు. కాగా అపరిచిత వ్యక్తి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా తప్పించుకుని రైలు ఎక్కానని బాలుడు చెప్పినట్లు పేర్కొన్నారు. చందు, సునీత తన తల్లిదండ్రులుగా చెబుతున్నాడని, కాగా బాలుడి గురించి మల్కాజిగిరి డీసీపీవో సిబ్బందికి సమాచారం అందించామని వివరించారు. ఆయన వెంట ష్యూర్ ఎన్జీవో జిల్లా కోఆర్డినేటర్ కిల్లారే వినోద్, చైల్డ్లైన్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, వినోద్ తదితరులు ఉన్నారు. -
అంతటా ‘స్థానిక’ ముచ్చటే..
కై లాస్నగర్: స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ఇప్పటికే పూర్తి కాగా త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. ప్రస్తుతం ఏ నలుగురు ఓ చోట కలిసినా రిజర్వేషన్ల ముచ్చటే వినిపిస్తోంది. సర్పంచ్, వార్డుమెంబర్ నుంచి ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల వరకు రిజర్వేషన్లు ఏ విధంగా ఖరారై ఉండవచ్చనే దానిపైనే చర్చించుకుంటున్నారు. అధికారికంగా వివరాలు ప్రకటించనప్పటికీ ఎవరికి వారుగా అంచనాలు వేసుకుంటున్నారు. ఇక జెడ్పీపరంగా మెజార్టీ స్థానాలు ఎస్టీలు, బీసీలకు రిజర్వ్ కావడంతో జనరల్ స్థానాల్లో పోటీ చేద్దామని ఆశపడ్డ వారికి నిరాశే ఎదురుకానుంది. ఆన్ రిజర్వుడ్ స్థానాలు రెండే ఉండడంతో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకున్న తాజా మాజీల అంచనాలు తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుండటంతో బీసీల ప్రాతినిధ్యం పెరగనున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల అధికారిక ప్రకటనపై రాజకీయ పార్టీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బీసీలకు పెరగనున్న ప్రాతినిధ్యం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగానే ఖరారు చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించింది. అలాగే జిల్లాలో జెడ్పీ పరంగా 20 మండలాలుండగా 8 ఎస్టీలకు, 8బీసీలకు, రెండు ఎస్సీలకు, రెండు ఆన్ రిజర్వ్డ్గా కేటాయించింది. దీంతో జెడ్పీలో బీసీల ప్రాతినిధ్యం పెరగనుంది. అయితే ఈసారి జెడ్పీటీసీగా ఆన్ రిజర్వ్డ్ స్థానాల్లో బరిలో నిలువాలని అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన పలువురు బడా నాయకులు భావించారు. అయితే రిజర్వేషన్లు తారుమారు కావడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. వారితో పాటు తాజా మాజీలు సైతం ఆయా స్థానాల్లో మరోసారి పోటీ చేయాలని భావించారు. దీంతో వారికి కూడా భంగపాటు తప్పేలా కనిపించడం లేదు. దీంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక జిల్లాలో 473 గ్రామ పంచాయతీలుండగా ఇందులో 251 సర్పంచ్ స్థానాలు నోటిఫైడ్ ఏరియాలోనే ఉండటంతో వాటిని తప్పనిసరిగా ఎస్టీలకు కేటాయించనున్నారు. మరో 15 పంచాయతీల్లో వందశాతం ఎస్టీ జనాభానే ఉండటంతో అక్కడ వారికే ప్రాతినిధ్యం దక్కనుంది. మిగిలిన 207 సర్పంచ్ స్థానాల్లో వివిధ కేటగిరిల వారికి రిజర్వు చేయాల్సి ఉంది. దీంతో ఆయా పంచాయతీల్లో ఏ స్థానం ఎవరికి కేటాయించబడిందనేది తెలియక ఆశావహులు తలలు పట్టుకుంటున్నారు. వాటిని తెలుసుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వివరాలు బయటకు వెల్లడి కాకపోవడంతో టెన్షన్కు గురవుతున్నారు. అధికారికంగా ప్రకటిస్తే తప్ప ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం లేదు. రిజర్వేషన్లు ఎలా ఉంటాయో.. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేయాలని యంత్రాగాన్ని ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాంగం రెండు రోజులుగా కసరత్తు చేపట్టింది. స్థానాల వారీగా జనాభా ప్రాతిపదికన రొటేషన్ విధానం అనుసరిస్తూ రిజర్వేషన్లను ఖరారు చేసింది. అయితే వాటి వివరాలు బయటకు వెల్లడించకపోవడంతో ఏ స్థానం ఎవరికి రిజర్వు అయిందనే విషయం తెలియడం లేదు. పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులతో పాటు ఆయా రాజకీయ పార్టీల నాయకులు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఆయా రచ్చబండల వద్ద తమ సర్పంచ్, వార్డుమెంబర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్ ఏమై ఉంటుందనే దానిపై చర్చించుకుంటున్నారు. ఎవరికి వారుగా అంచనాలు వేసుకుంటున్నారు. -
బతుకమ్మ.. బతుకుదెరువైంది
బతుకమ్మ పండుగ సందర్భంగా పలువురు రైతులు బంతి తదితర పూల సాగు చేపట్టి లాభాలు గడిస్తున్నారు. గురువారం శ్రీ 25 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025IIలోu పనులు వేగవంతం చేయాలిబోథ్: మండల కేంద్రంలో చేపట్టిన కోర్టు భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా జడ్జి ప్రభాకరరావు అన్నారు. ఈమేరకు బుధవారం నిర్మాణ పనులను పరిశీలించారు. ముందుగా జడ్జికి బార్ అసోసియేషన్ సభ్యులు స్వాగతం పలికారు. వారి వెంట అసోసియేషన్ అధ్యక్షుడు వామన్రావ్ దేశ్పాండే, ఏజీపీ శంకర్, న్యాయవాదులు విజయ్కుమార్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
భలే పూల గిరాకీ
నిర్మల్టౌన్: పూలను పూజించే ఏకై క పండుగ బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు మహిళలు బతుకమ్మ ఆడి పాడుతారు. ఈ క్రమంలో పూలకు భారీ డిమాండ్ పెరిగింది. స్థానిక బస్టాండ్, ఓల్డ్ బస్టాండ్, బోయివాడ హనుమాన్ టెంపుల్, మున్సిపల్ కాంప్లెక్స్లో గల పూల సెంటర్లు మహిళలతో సందడిగా మారాయి. బంతిపూలు కిలోకు రూ.60 నుంచి రూ.80, చామంతి పూలు రూ.300 నుంచి రూ.400, గులాబీలు రూ.300, లిల్లీ రూ.400, మల్లెపూలు రూ.800 వరకు ధర పలుకుతున్నాయి. మహారాష్ట్ర, హైదరాబాద్, కర్ణాటక నుంచి నిర్మల్కు పూలు దిగుమతి అవుతున్నాయి. 80 కిలోలు అమ్ముతున్న బతుకమ్మ, నవరాత్రుల సందర్భంగా పూల గిరాకీ ఎక్కువగా ఉంది. రోజుకు 80 కిలోల బంతిపూలు, 50 కిలోల చామంతిపూలు అమ్ముతున్నా. నిర్మల్ చుట్టుపక్కల గ్రామాల వారు సైతం బతుకమ్మలకు బంతి, చామంతులను కొనుగోలు చేయడానికి వస్తున్నారు. – సురేష్, ఫ్లవర్ మర్చంట్, బోయివాడ సీజన్ బాగుంది ఈ బతుకమ్మ పండుగ సీజన్లో పూల గిరాకీ బాగుంది. రోజుకు క్వింటల్ బంతిపూలు, 80 కిలోల చామంతి, 20 కిలోల మల్లెపూలు అమ్ముతున్నా. నిర్మల్ చుట్టుపక్కల గ్రామాల వారు సైతం నా వద్దే పూలు కొనుగోలు చేస్తున్నారు. గతేడాది కంటే ఈసారి 20 శాతం గిరాకీ ఎక్కువే ఉంది. – జీ.నరేశ్, మున్సిపల్ కాంప్లెక్స్ ఫ్లవర్ మర్చంట్ -
ఊరెళ్తున్నారా.. జాగ్రత్త..!
మంచిర్యాలక్రైం: దసరా, బతుకమ్మ పండుగల ఏర్పాట్లలో ప్రజలు పూర్తిగా నిమగ్నమై ఉంటారు. ఇదే అదును భావించిన దొంగలు స్వైరవిహారం చేస్తుంటారు. ఉద్యోగ, వ్యాపార నిమిత్తం పట్టణాల నుంచి పల్లె బాట పడుతున్నారు. కొత్త బట్టలు, వస్తువుల కొనుగోలుకు షాపింగ్ చేస్తున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మార్కెట్లలో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఇదే సమయంలో దొంగలు, చైన్స్నాచర్స్, పిక్పాకెటర్స్ చోరీలకు పాల్పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నెల 23న అర్ధరాత్రి మంచిర్యాల జిల్లా కేంద్రంలో చెడ్డిగ్యాంగ్ సంచారం కలకలం రేపింది. సీసీసీ నస్పూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. గోదావరివాడలో మరో ఇంట్లో చోరీకి యత్నించగా పోలీసులు తిప్పికొట్టారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులను మంచిర్యాల డీసీపీ భాస్కర్ అప్రమత్తం చేశారు. రాత్రి 10గంటలు దాటిందంటే అనుమానాస్పదంగా కనిపించిన వారిపై కొరఢా ఝలిపిస్తున్నారు. పెట్రోలింగ్ నిఘా పెంచారు. వేలిముద్రలు సేకరిస్తూ జైలు నుంచి విడుదలైన పాత నేరస్తులపై నిఘా పటిష్టం చేశారు.ఇవి పాటించండి..నగలు, నగదు బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోండి ● చైన్ స్నాచర్స్పై అప్రమత్తంగా ఉండాలి ● ఊరు వెళ్లే వారు పక్కింటి వాళ్లకు చెప్పాలి. ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఎన్ని రోజులు, ఎక్కడికి వెళ్తున్నారనే సమాచారం ఇస్తే పోలీసులు వీధుల్లో నిఘా వేస్తారు. ● వైఫై బేస్డ్ రోబో కెమెరాను అమర్చుకోవాలి. దీంతో ఇళ్లలో జరిగే విషయాలపై సెల్ఫోన్కు అలర్ట్ రింగ్టోన్ వస్తుంది. అది వారికి వినిపించదు. దొంగతనం చేస్తుండానే పట్టుకునే అవకాశం ఉంటుంది. నాలుగు సెల్ఫోన్లకు వినియోగించుకోవచ్చు. ఒక పోలీస్ అధికారి నంబరు కూడా ఇవ్వొచ్చు. ● సైరన్ మోగే తాళాలు సైతం మార్కెట్లో లభిస్తున్నాయి. స్థోమతను బట్టి కొనుగోలు చేయవచ్చు. తాళం కదిలించే ప్రయత్నం చేస్తే సైరన్ మోగుతుంది. దీంతో పక్క ఇళ్లవారు అప్రమత్తం కావొచ్చు. ● అపార్టుమెంట్లలో వాచ్మెన్ను నియమించుకోవాలి. ● గుర్తు తెలియని వ్యక్తులు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలి. ● ఇళ్లలోని బంగారు ఆభరణాలు, నగదు, విలువైనవి బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి.ప్రయణంలోనూ..ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు, రైళ్లలో ప్రయాణించే వారు విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోవాలి. బస్టాండ్, రైల్వేస్టేషన్లలో జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో కొందరు మాయమాటలు చెప్పి నగదు, నగలు, బ్యాగులు కాజేసే ప్రమాదం ఉంటుంది. కళ్లు మూసి తెరిచేలోపు మాయమైపోతారు. సీసీ పుటేజీ కవరేజి ఉండే ప్రాంతంలో ఉండాలి. ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలి. రాత్రివేళ, మద్యం సేవించి ప్రయాణం చేయడం మంచిదికాదు. ఏదైనా సమస్య, రోడ్డు ప్రమాదం సంభవిస్తే కుటుంబ సభ్యులు, స్నేహితులకు సమాచారం అందేలా ఫోన్నంబర్లు, అడ్రస్ అందుబాటులో ఉంచుకోవాలి. 100 డయల్, 108కు సమాచారం అందించాలి. -
బతుకమ్మ బతుకుదెరువైంది
నిర్మల్ఖిల్లా: బతుకమ్మ పండుగ అంటే కేవలం మహిళల పండుగ మాత్రమే కాదు. ఇది రైతుల నుంచి వ్యాపారుల దాకా అన్ని వర్గాలకూ ఉపాధి కల్పించే పండుగ. పూలు, బట్టలు, అలంకరణ వస్తువులు, మాంసం, డీజే సౌండ్ సిస్టమ్స్ ఇలా ప్రతీ రంగంలోనూ ఈ పండుగ ఆర్థిక ప్రోత్సాహాన్ని తెచ్చిపెడుతోంది. ప్రతీ సంవత్సరం మాదిరి బతుకమ్మ, దేవీ నవరాత్రుల నేపథ్యంలో ఈసారికూడా జిల్లాలో ఉత్సాహం ఊపందుకుంటోంది. పూలవ్యాపారుల నుంచి మొదలుకుని వస్త్ర దుకాణాలు, షాపింగ్మాల్స్, డీజే సౌండ్ సిస్టమ్ల యజమానుల వరకు అన్ని రంగాల వారికి ఉపాధి కల్పించేలా బతుకమ్మ పండగ నిజంగానే బతుకుదెరువుగా మారుతోంది. మామడ మండలం తాండ్ర శివారులో చామంతి పూల సాగు పూలకూ గిరాకీ ఫుల్...మామడ మండలంలోని కొండ ప్రాంతమైన తాండ్ర గ్రామంలో యువ రైతు మనోజ్ తనకున్న నాలుగెకరాల్లో ఒక ఎకరం చామంతి పూలు సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం దుర్గాదేవి శరన్నవరాత్రులు, బతుకమ్మ వేడుకల నేపథ్యంలో చామంతి పూలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. నాలుగు నెలలపాటు కష్టపడితే పంట చేతికి వచ్చిందని చెబుతున్నాడు. వ్యవసాయంతో పాటు చామంతి పూల సాగును చేపట్టిన మనోజ్ పండగ నేపథ్యంలో ప్రయోజనం ఉందని పేర్కొంటున్నాడు.. -
పిడుగుపాటుకు గేదెల కాపరి..
నిర్మల్టౌన్: మండలంలోని తల్వేద గ్రామానికి చెందిన సాకలి పోశెట్టి(52) పిడుగుపాటుకు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పోశెట్టి గేదెలు కాస్తూ జీవనం సాగిస్తుంటాడు. మంగళవారం మంజులాపూర్ పెద్దచెరువు సమీపంలో గేదెలు మోపుతున్నాడు. సాయంత్రం కురిసిన వర్షానికి పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించగా.. బుధవారం నీటిమడుగులో విగత జీవిగా కనిపించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆస్పత్రికి వెళ్లివస్తూ అనంతలోకాలకు..ఉట్నూర్రూరల్: కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగా లేదని ఆస్పత్రికి వెళ్లివస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఉట్నూర్ మండలంలోని శంకర్ నాయక్ తండాకు చెందిన జాదవ్ బలిరాం(73)మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో బైక్పై హస్నాపూర్ తీసుకెళ్లాడు. తిరుగుప్రయాణంలో గ్రామ సమీపంలోకి రాగానే గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు రిమ్స్కు రెఫర్ చేశారు. పరీక్షించిన వైద్యులు హైదరాబాద్కు రెఫర్ చేశారు. తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. గడ్డెన్నవాగు కాలువలోపడి ఒకరు మృతి లోకేశ్వరం: మండలంలోని పుస్పూర్ గ్రామ సమీపంలో ఉన్న గడ్డెన్నవాగు ప్రాజెక్టు కాలువలోపడి ఒకరు మృతి చెందినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. బిహార్లోని ముధపర్నగర్కు చెందిన వినోద్ సహాని (35) ఉపాధి నిమిత్తం జిల్లాకు వచ్చి మండలంలోని రాజేశ్తండా సమీపంలోని రైస్మిల్లులో హమాలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి ముఖఃదం గులాబ్ సహానితో కలిసి పుస్పూర్లో మద్యం సేవించాడు. ఇంటికి వెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు పుస్పూర్ గ్రామ శివారులోని గడ్డెన్న వాగు ప్రాజెక్టు కాలువలో పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని పెదనాన్న కుమారుడైన రాజ్గిర్ సహాని ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
వ్యభిచార ముఠా గుట్టు రట్టు
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలో వ్యభిచార ముఠా గుట్టును పట్టణ పోలీసులు రట్టు చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జానకీ షర్మిల వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన మహిళలు నాఫీస్ బేగం, బిల్కీస్ చంద్ నిర్మల్లోని ఇంద్రానగర్ ప్రాంతంలో ఓఇంటిని కేంద్రంగా చేసుకుని కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారన్నారు. మహిళలకు మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దింపుతున్నారన్నారు. విటులకు చరవాణి ద్వారా సమాచారం ఇచ్చి వ్యాపారం కొనసాగిస్తున్నట్లు తెలిపా రు. పక్కా సమాచారంతో పోలీసులు ఇంటిపై దాడి చేసి మహిళలు, విటుడు ఇర్షద్ను అరెస్టు చేసి రెండు మొబైల్ ఫోన్లు, మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. అక్రమ దందాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ జిల్లాలో అక్రమ దందాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్కు చెందిన షేక్ రౌఫ్ అలియాస్ షేక్ రౌఫ్ రహీం ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం పాలిషింగ్ చేసి విక్రయిస్తున్నాడన్నారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి పీడీఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి మహారాష్ట్రలోని రైస్మిల్లుల్లో సన్నగా పాలిష్ చేసి తిరిగి కొన్ని బ్రాండ్ల పేరుతో నిర్మల్ జిల్లాతోపాటు చుట్టుపక్కల గల జిల్లాలో ఎక్కువ ధరలకు అమ్ముతున్నాడన్నారు. గతంలో రౌఫ్కు సంబంధించిన 12 టైర్ల లారీని భైంసాలో జప్తు చేసినట్లు తెలిపారు. గతంలో నిర్మల్కు చెందిన వ్యక్తి కిడ్నాప్ పట్టణంలోని సోఫీనగర్కు చెందిన షేక్ తహేర్ బియ్యం దందా చేస్తున్నాడని, ఈ క్రమంలో ధర్మాబాద్ (మహారాష్ట్ర)కు చెందిన షేక్ రౌఫ్ భైంసాకు చెందిన అతని భాగస్వామి రహీజ్కు బియ్యం సంబంధిత లావాదేవీలలో రూ.4 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఈ విషయంలో లావాదేవీల పరిష్కారానికి దందాలు చేసే ఇబ్రహీం బిల్డర్ అలియాస్ మహమ్మద్ అబ్దుల్ ఇబ్రహీంతో రూ.1.50 లక్షలకు సుపారీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో మహమ్మద్ అబ్దుల్ ఐదుగురితో కలిసి జూలై 2, 2025న నిర్మల్కు వచ్చి షేక్ తాహేర్ బంధువును కిడ్నాప్ చేశారు. ఈ ఘటనలో నిర్మల్ పోలీసులు ఇబ్రహీం బిల్డర్ను 5 జూలై, 2025న అరెస్టు చేసి జైలుకు తరలించారు. దీంట్లో ప్రధాన నిందితుడైన షేక్ రౌఫ్ను మంగళవారం రాత్రి నాందేడ్లో పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. కాగా షేక్ రౌఫ్పై భైంసా, బాసర, తానూరు పోలీస్స్టేషన్లలో సైతం కేసులు నమోదైనట్లు ఎస్పీ పేర్కొన్నారు. -
గునుగు పూలతో ఉపాధి
సారంగపూర్: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని నాగునూరు గ్రామానికి చెందిన ఆరుగురు మహిళలు ఏటా బతుకమ్మ పండుగకు గునుగుపూలు సేకరిస్తూ ఉపాధి పొందుతున్నారు. 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలానికి వచ్చి గునుగుపూలు సేకరిస్తున్నారు. ప్రత్యేక వాహనంలో వాటిని తమ గ్రామానికి తీసుకెళ్లి బతుకమ్మ పేర్చేందుకు అనువుగా కట్ చేస్తారు. ఆతర్వాత రంగులు అద్దుతారు. వాటితో బతుకమ్మలను తయారు చేసి రూ.500ల నుంచి రూ.600లకు ఒకటి చొప్పున విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. గునుగు పూలను తీసుకెళ్తున్న మహిళలుమూడేళ్ల నుంచి వస్తున్నాం.. మా గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో మహిళలు బతుకమ్మ పండుగ సీజన్లో గునుగు పూలు కొనుగోలు చేసేవారు. అది గమనించిన నాకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఈవిషయాన్ని తోటి మహిళలకు వివరించి వారి సహకారంతో గునుగు లభ్యమయ్యే ప్రాంతాలపై ఆరాతీశాం. అప్పుడే నిర్మల్ జిల్లాలో ఉండే మా బంధువుల ద్వారా సారంగాపూర్లో లభ్యమవుతుందని తెలిసింది. అందుకే మూడేళ్లుగా ఇక్కడికి వచ్చి గునుగుపూలు సేకరిస్తున్నాం. – లక్ష్మి, నాగునూరు, జగిత్యాల ఆదాయమార్గంగా.. బతుకమ్మ సీజన్ రాగానే వ్యవసాయ కూలీ పనులు మానేసి గునుగు పూల సేకరణ ఆదాయమార్గంగా ఎంచుకున్నాం. గునుగు సేకరించి ఇళ్లకు వెళ్లాక అంతా కలిసి ఒకచోట చేరి బతుకమ్మ తయారీకి అనుగువుగా కట్చేస్తాం. రంగులు అద్ది జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో విక్రయిస్తాం. – గంగవ్వ, నాగునూరు, జగిత్యాల డిమాండ్ ఎక్కువే మా ప్రాంతంలో గునుగు లభ్యత చాలా తక్కువ. అందుకే వాటికి డిమాండ్ ఎక్కువ. నిర్మల్ జిల్లాలోని పలు మండలాల్లో గునుగు లభ్యమయ్యే ప్రాంతాలను ఎంచుకుని అక్కడికి వెళ్లి గునుగు పూలు సేకరిస్తున్నాం. బతుకమ్మ మా బతుకులకు ఉపాధి మార్గం చూపడం చాలా సంతోషంగా ఉంది. – జంగిలి రాజవ్వ, నాగునూరు, జగిత్యాల -
రిజర్వేషన్ల కసరత్తు పూర్తి
కై లాస్నగర్: స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి జిల్లా యంత్రాంగం రెండు రోజులు గా చేపట్టిన కసరత్తు పూర్తయింది. సర్పంచ్, వార్డుమెంబర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి కులాల వారీగా రిజర్వేషన్లను కేటాయించింది. జిల్లాలోని డీఎల్పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలంతా జెడ్పీ సమావేశ మందిరంలోనే ఉదయం నుంచి రాత్రి వరకు మకాం వేశారు. స్థానాల వారీ గా కులాల వారీ లెక్కలతో కుస్తీ పట్టారు. జనాభా దామాషా, రొటేషన్ విధానంలో అన్ని స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఈప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది. మండలాల వారీగా రిజర్వేషన్ల వివరాలతో కూడిన నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్ దగ్గరుండి పర్యవేక్షించగా, జెడ్పీ సీఈవోగా పనిచేసిన జితేందర్రెడ్డి, డీపీవో రమేశ్, ఆర్డీవో స్రవంతి ప్రక్రియను నిర్వహించారు. కలెక్టర్ రాజర్షిషా ఈ ప్రక్రియను పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం ఖరారు చేసిన రిజర్వేషన్లకు ప్రభుత్వం జీవో జారీ చేశాక మహిళ/పురుషుల వారీగా కేటాయిస్తూ వివరాలు వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. వీడని ఉత్కంఠ .. స్థానిక రిజర్వేషన్లకు సంబంధించిన ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఆశావహులతో పాటు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు ప్రభుత్వ అధికారిక ప్ర కటనపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎక్కడ చూ సినా తమ మండలం, గ్రామాలకు సంబంధించిన ఆయా స్థానాలు ఎవరికి రిజర్వ్ అవుతాయో అంటూ చర్చించుకోవడం కనిపించింది. పరిచయం ఉన్న అధికారులను సంప్రదిస్తూ ఆరా తీశారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటిని బయటకు చెప్పే అవకాశం లేకపోవడంతో వివరాలేమి వెల్లడికాలేదు. -
సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
ఆదిలాబాద్రూరల్: తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ ల ఆధ్వర్యంలో మంగళవారం అధికారికంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలను కలెక్టర్ ప్రారంభించారు. మహిళా ఉద్యోగులు, వి ద్యార్థినిలతో కలిసి దాండియా ఆడి ఉత్సాహపరి చారు. రాష్ట్రంలో ప్రకృతిని ప్రేమించే సంస్కృతి ఉందన్నారు. అందులో భాగంగానే పూలను పూ జిస్తూ మహిళలు ఏటా బతుకమ్మ సంబరాలను ఘ నంగా నిర్వహించుకుంటారన్నారు. ప్రభుత్వం కూడా ఈ పండుగకు ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సహిస్తుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్, బతుకమ్మ సంబరాల చైర్పర్సన్ శ్యామలాదేవి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఎస్సీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు సునీతకుమారి, రాజలింగు, మనోహర్, కలీం, డీడబ్ల్యూవో మిల్కా, ఏటీడీవో నిహారిక, ఆయా శాఖల మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.బాధితులకు అండగా ఉంటాం ఆదిలాబాద్టౌన్: వరద బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవనంలో లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులతో పాటు పలు సామగ్రి కిట్లను మంగళవారం అందజేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి ఆయన 75 మందికి కిట్లను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇళ్లు కూలిపోయిన బాధితులకు ఇందిరమ్మ పథకం రెండో విడతలో ప్రాధాన్యమిస్తామన్నారు. ఇందులో లయన్స్క్లబ్ గవర్నర్ భద్రేశం, చంద్రప్రకాశ్, వాసుదేవారెడ్డి, వెంకట్, రమాకాంత్, చంద్రమోహన్, సురేశ్బాబు, దేవన్న పాల్గొన్నారు. తోషంలో వైద్యశిబిరం ప్రారంభం గుడిహత్నూర్: మారుమూల పల్లెల్లో ఏటా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న సామాజిక సేవకుడు మదన్ గిత్తే సేవలు అభినందనీయమని కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలోని తోషంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. సుమారు 1200 మందికి పైగా రోగులకు వైద్యులు పరీక్షలు చేసి మందులు ఉచితంగా అందించారు. ఇందులో అదనపు జిల్లా వైద్యాధికారి మనోహర్, తహసీల్దార్ కవితారెడ్డి, మండల వైద్యాధికారి శ్యాంసుందర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఈకేవైసీ పూర్తయితేనే ‘రేషన్’
కై లాస్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా రేషన్కార్డులు జారీ చేసింది. నూతన లబ్ధిదారులు ఈ నె ల బియ్యం కోటా కూడా తీసుకున్నారు. అయితే వా రంతా రెగ్యులర్గా రేషన్ తీసుకోవాలంటే సంబంధిత రేషన్ షాపులో ఈకేవైసీ నమోదు చేసుకోవాలి. లేనిపక్షంలో కార్డు రద్దుతో పాటు బియ్యం పంపిణీ సైతం నిలిచిపోయే అవకాశముంది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు గడువు విధించి ంది. అయితే జిల్లావ్యాప్తంగా ఇంకా 4లక్షల మంది కి పైగా కార్డుదారులు నమోదు చేసుకోవాల్సిఉంది. ఉద్దేశమేంటంటే.. కార్డుదారుల్లో మరణించిన సభ్యుల పేరిట కూడా బియ్యం తీసుకుంటున్నారు. కొంత మంది నెలల తరబడి రేషన్ తీసుకోవడం లేదు. అనర్హుల ఏరివేతతో పాటు బియ్యం పంపిణీలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కార్డుదారులకు ఈకేవైసీ తప్పనిసరి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆ దిశగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెండేళ్లుగా ఈ ప్రక్రియ చేపడుతున్నారు. లబ్ధిదారుల ఆధార్లో పొరపాట్లు దొర్లడం, కార్డులు అప్డేట్ చేసుకోకపోవడం వంటి కారణాలతో నమోదులో తీవ్ర జాప్యం అవుతోంది. కార్డుదారులు వాటిని సరిచేసుకునేందుకు ఆధార్ కేంద్రాల చుట్టూ తిరిగినా సకాలంలో అప్డేట్ కాని పరిస్థితి. ఈ క్రమంలో కేంద్రం పలుమార్లు గడువు పెంచుతూ వచ్చింది. తొలుత ఈ ఏడాది మార్చి 31వరకు ఉండగా దానిని జూన్ నెలాఖరు వరకు పొడిగించినా పూర్తి కాలేదు. దీంతో మరోసారి ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా రేషన్ కార్డులను జారీ చేసింది. దీంతో సభ్యుల సంఖ్య కూడా పెరిగింది. మరో వారం మాత్రమే గడువు ఉండటంతో ప్రక్రియ పూర్తి కావడం ప్రశ్నార్థకమేననే అభిప్రాయం వ్యక్తమవుతుంది. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో కొత్తగా మంజూరు చేసిన వాటితో కలిపి ప్ర స్తుతం రేషన్ కార్డుల సంఖ్య 2,14,429కి చేరింది. ఇందులో సభ్యుల సంఖ్య 7,06,302 మంది ఉన్నా రు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 4,95,386 మంది ఈకేవైసీ నమోదు చేసుకున్నారు. మరో 2,10,916 మంది నమోదు చేసుకోవాల్సి ఉంది. వీ రంతా సంబంధిత రేషన్ డీలర్లను సంప్రదించాలి. ఆధార్, రేషన్కార్డు నంబర్ల ఆధారంగా వారి వద్దనున్న పీవోఎస్ మిషన్లో లబ్ధిదారుల ఫింగర్ఫ్రింట్స్ నమోదు చేస్తారు. ఇలా రేషన్కార్డుకు ఆధార్ను అనుసంధానం చేస్తారు. లేనిపక్షంలో కార్డు రద్దుతో పాటు బియ్యం సరఫరా సైతం నిలిపివేసే అవకాశమున్నట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో.. రేషన్ దుకాణాలు : 356 కొత్తగా జారీ చేసిన కార్డులు : 21,672 మొత్తం రేషన్కార్డులు : 2,14,429 ఈకేవైసీ నమోదు చేసుకున్నవారు : 4,95,386 -
రోగులకు నాణ్యమైన వైద్యసేవలు
ఆదిలాబాద్టౌన్/ఆదిలాబాద్రూరల్: ఆస్పత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నామని వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ రవీందర్ నాయక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన డీఎంహెచ్వో చాంబర్లో అధికారులతో సమావేశమయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. ముందస్తుగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లను నియమించినట్లు పేర్కొన్నారు. అలాగే అన్ని పీహెచ్సీల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో సికిల్సెల్ ఎనీ మియా వైద్యసేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వస్త్ నారీ సశక్త్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 2 వరకు జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక వైద్య నిపుణుల ద్వారా వైద్య శిబి రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. టీబీ వ్యాధిగ్రస్తులకు పోషణ కిట్లు అందజేశారు. క్షయ బాధితులకు సేవలందిస్తున్న ఉద్యోగులకు సర్టిఫి కెట్లు అందజేసి ప్రశంసించారు. అనంతరం జిల్లాలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. ఆదిలాబాద్రూరల్ మండలంలోని అంకోలి పీహెచ్సీని సందర్శించి వైద్యసేవలు అందుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమాల్లో డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, టీబీ నియంత్రణ అధికారి సుమలత, డిప్యూటీ డీఎంహెచ్వో సాధ న, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి వైసీ శ్రీనివాస్, మలేరియా నివారణ అధికారి శ్రీధర్, డీపీఎం వామన్రావు, అంకోలి పీహెచ్సీ వైద్యుడు సర్పరాజ్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
వీధి వ్యాపారులకు మళ్లీ రుణాలు
కై లాస్నగర్: పట్టణ పరిధిలోని వీధి వ్యాపారులకు మళ్లీ రుణాలు అందజేయాలని కేంద్ర ప్ర భుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అధికారులు సెప్టెంబర్ 17నుంచి మున్సిపల్ పరిధిలో లోక కల్యాణ మేళా పేరిట అవగాహ న సదస్సులకు శ్రీకారం చుట్టారు. అక్టోబ ర్ 2 వరకు నిర్వహించి 50 మందికి రుణాలందించేలా చర్యలు చేపడుతున్నారు. కరోనా తర్వాత పీఎం స్వనిధి పథకం కింద వీధి వ్యాపారులకు రూ.10వేలు, రూ.20వేలు, రూ.50వేల వరకు మూడు విడతల్లో అందించారు. అయితే గతేడాది డిసెంబర్ నుంచి ఈ పథకాన్ని కేంద్రం నిలిపివేసింది. దీంతో దరఖాస్తు చేసుకున్న చాలామంది నిరాశకు గురయ్యారు. తాజాగా లోక కల్యాణ మేళా పేరిట తిరిగి వారికి రుణా లు అందించాలని కేంద్రం సంకల్పించింది. ఈ మేరకు మెప్మా సిబ్బంది పట్టణంలోని వీధి వ్యాపారులతో సమావేశాలు నిర్వహిస్తూ పథకంపై అవగాహన కల్పిస్తున్నారు. గతంతో పో ల్చితే రుణ పరిమితి పెంచారు. ఈ సారి రూ. 15వేలు, రూ.25వేలు, రూ.50వేలను అందించనున్నారు. రుణ మంజూరుతో పాటు డిజిట ల్ చెల్లింపులపై శిక్షణ ఇస్తున్నారు. క్యూఆర్ కోడ్ స్కానర్లను అందిస్తున్నారు. -
జీఎస్టీ తగ్గింపుతో సామాన్యులకు మేలు
ఆదిలాబాద్: జీఎస్టీ తగ్గింపుతో సామాన్యులకు ఎంతో మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం జీ ఎస్టీలో సమూల మార్పులు తీసుకొచ్చిందని తెలి పారు. గతంలో ఉన్న నాలుగు స్లాబులను రెండింటికి కుదించడం, అందులోనూ సామాన్యులకు ఉపయోగపడే అనేక వస్తువుల్లో పన్ను తొలగించడం శు భ పరిణామమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే నిర్ణయాలతో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు మే లు జరుగుతుంటే కొన్ని పార్టీలు గగ్గోలు పెడుతున్నాయని విమర్శించారు. ఇంటి నిర్మాణ సామగ్రి ధ రలు తగ్గడం వల్ల పేదలకు, వ్యవసాయ పనిముట్ల ధరలు తగ్గడం వల్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. జీఎస్టీ ప్రయోజనాలను బీజేపీ కార్యకర్తలు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఇందులో నాయకులు దినేశ్ మాటోలియా, క్రాంతికుమార్, ప్రవీణ్, వేదవ్యాస్, రాకేశ్, గంగాధర్, భీమ్సేన్ రెడ్డి, సూర్యకిరణ్ తదితరులున్నారు. -
జీఎస్టీ 2.0 సంబురం
ఆదిలాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి. జిల్లావ్యాప్తంగా కిరాణ దుకాణాలు, మా ల్స్ సందడిగా మారాయి. అలాగే వాహన షోరూంలు వినియోగదారులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా సామాన్యులకు సంబంధించిన నిత్యావసరాల ధరలు 18, 12 శాతం స్లాబ్లో నుంచి ఐదు శాతంలోకి వచ్చాయి. దీంతో పేద, మధ్యతరగతి వారికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ మార్పుతో ఆదాయం మిగులుతుందనే ఆనందం వినియోగదారుల్లో వ్యక్తం అవుతుంది. అయితే వెంటనే ధరలు తగ్గుదల అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని, కొత్త స్టాకుపై ఈ ప్రభావం ఉండవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. -
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి
ఆదిలాబాద్టౌన్/ఆదిలాబాద్రూరల్: ఆర్టికల్ 34 ప్రకారం చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబి తా నుంచి తొలగించాలని ఆదివాసీ సంఘాల నా యకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆందోళన చేపట్టారు. ముందుగా రాయిసెంటర్లు, సార్మేడీలు, పటేళ్ల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ముత్యాలమ్మ గుడి వద్ద పూ జలు చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఆదిలాబాద్ రూరల్, మావల తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. కుమురంభీం చౌక్లో భీంకు నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్కు చేరుకుని బైఠాయించారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఆర్డీవో స్రవంతి అక్కడికి చేరుకుని వారితో మాట్లాడేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. కలెక్టర్ రావాలంటూ పట్టుబట్టారు. వర్షంలోనూ ఆందోళన కొనసాగించారు. ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా రావడంతో ఆమెకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, 40 ఏళ్లుగా లంబాడాలు ఆదివాసీల రిజర్వేషన్లు పొందుతూ ఉద్యోగ, ఉపాధి, వైద్య, విద్యలో ఆదివాసీల అవకాశాలను కొల్లగొడుతున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు లంబాడాలకు ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయవద్దని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గణేశ్, విశ్వంబర్, జంగుపటేల్, సోనేరావు, వెంకటేశ్, తానాజీ తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ గ్రీవెన్స్కు 43 ఫిర్యాదులు
ఆదిలాబాద్టౌన్: పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని పలువురి నుంచి అర్జీలు స్వీకరించారు. వెంటనే సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ వారం 43 ఫిర్యాదుదారులు అందినట్లు వెల్లడించారు. ఇందులో సీసీ కొండ రాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, సిబ్బంది పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో డీజేలకు అనుమతులు లేవు నవరాత్రి ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా దుర్గామాత, శారదాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సుప్రీంకోర్టు నిబంధనలకు లోబడి సౌండ్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. మండపాల వద్ద ప్రత్యేకంగా మహిళా సిబ్బంది, షీటీంతో నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో ప్రత్యేకంగా క్లస్టర్, సెక్టార్ స్థాయిగా విభజించి బందోబస్తు ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పండుగకు సొంత ఊర్లకు వెళ్లేవారు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు. విలువైన సామగ్రి, వస్తువులను ఇంట్లో ఉంచకుండా చూడాలని పేర్కొన్నారు. నిమజ్జన ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్ణీత సమయంలో పూర్తిచేసేలా అందరూ సహకరించాలని కోరారు. -
భద్రత దృష్ట్యా కార్యాలయం మార్పు
ఆదిలాబాద్టౌన్: భారీ వర్షాలతో కలెక్టరేట్లోని పై అంతస్తులో ఓ భాగం కూలిందని, ఉద్యోగులతో పా టు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజల భద్రత ని మిత్తం కార్యాలయాన్ని మార్చినట్లు కలెక్టర్ రాజ ర్షిషా అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ (రెవెన్యూ), స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఏ,బి,సీ,డీ,ఈ,ఎఫ్ సెక్షన్లను పెన్గంగ భవన్లోకి మార్చినట్లు పేర్కొన్నారు. ఇక నుంచి ఈ కార్యాలయంలోనే కార్యకలాపాలు సాగుతాయని తెలిపా రు. కలెక్టరేట్లో తన చాంబర్తో పాటు డీపీఆర్వో, ట్రెజరీ కార్యాలయాలకు ఎలాంటి ముప్పు లేదని నివేదికలు ఇచ్చినట్లు చెప్పారు. అంతకుముందు కార్యాలయాన్ని షిఫ్ట్ చేయగా, కలెక్టర్ పూజలు చేసి ప్రారంభించారు. అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్లు కలెక్టర్ను సత్కరించారు. ఇందులో ఉట్నూర్ సబ్కలెక్టర్ యువరాజ్ మర్మట్, ట్రెయినీ కలెక్టర్ సలోని, ఆర్డీవో స్రవంతి పాల్గొన్నారు. నేటి నుంచి అధికారికంగా బతుకమ్మ సంబరాలు కై లాస్నగర్: బతుకమ్మ సంబరాలను మంగళవారం నుంచి జిల్లాలో అధికారికంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా ప్రకటనలో తెలిపారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి చైర్పర్సన్గా, డీడబ్ల్యూవో, డీఎస్సీడీఓ, డీపీఆర్వో, డీఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, జిల్లా యువజన క్రీడల అధికారితో కూడిన ప్రత్యేక కమిటీని నియమించినట్లు పేర్కొన్నారు. తొలిరోజున జిల్లా కేంద్రంలోని సంక్షేమశాఖల సముదాయ భవన్లో సాయంత్రం 4గంటలకు వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని మున్సిపల్, గ్రామీణ ప్రాంతాల్లో బతుకమ్మ ఆడే, నిమజ్జన ప్రాంతాల్లో తగు వసతులు కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. -
బీమాపై జీఎస్టీ ఎత్తివేత హర్షణీయం
ఈసారి పండుగ సీజన్లో కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఇబ్బంది లేకుండా జీఎస్టీ స్లాబులు సవరించడం శుభ పరిణామం. మరింతగా సవరిస్తే బాగుండేది. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జీఎస్టీ సంస్కరణల ద్వారా దిగి రావాలి. అప్పుడే సామాన్యుడికి లబ్ధి చేకూరుతుంది. ముఖ్యంగా బీమా పాలసీలపై జీఎస్టీ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. బీమా తీసుకోవాలనుకునే మధ్యతరగతి ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరం. – రాఘవేంద్ర దారవేణి, తాంసి, ఆదిలాబాద్ -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
బోథ్: సొనాల మండలం సాకెర గ్రామం వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సోమవారం బోల్తాపడంది. ప్రయాణికులు, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జయలక్ష్మి ట్రావెల్స్కు చెందిన బస్సు ఆదివారం రాత్రి బెంగళూరు నుంచి బయలుదేరి నేపాల్ వెళ్తోంది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బెంగళూర్లో పనిచేసే వారు తమ సొంత ప్రాంతాలైన మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్తో పాటు నేపాల్కు వెళ్తున్నారు. ఇందులో 80 సీట్లు ఉండగా 150మందికి పైగా ప్రయాణిస్తున్నారు. బస్సు సోమవారం రాత్రి 7గంటల ప్రాంతంలో సొనాల మండలం ఘన్పూర్ వద్ద గల సాకెరకు చేరుకుంది. ఇక్కడ ఓ కల్వర్టు వద్ద గుంత ఉండటంతో వాహనం కుదుపునకు గురైంది. వెంటనే పక్కనే ఉన్న చేనులో పడింది. ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అదృష్టవశాత్తు అంతా స్వ ల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ సమయంలో సాకెర గ్రామంలో ఉన్న స్థా నిక ఎమ్మెల్యే అనిల్జాదవ్ అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను తరలించేందుకు అంబులెన్స్లను రప్పించారు. అయితే స్వల్ప గాయాలు కావడంతో వారు ఆసుపత్రికి వెళ్లడానికి నిరాకరించారు. వేరే బస్సులో వారిని గమ్యస్థానాలకు తరలించారు. ఈ ఘటనలో 56 మందికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ పరారైనట్లు ప్రయాణికులు తెలిపారు. ఓవర్లోడ్, అధిక లగేజే కారణం కొన్నేళ్లుగా బెంగళూర్ నుంచి నేపాల్ వరకు ప్రైవేట్ సర్వీసులు నడుస్తున్నాయి. వీటిలో పరిమితికి మంచి ప్రయాణికులను తరలిస్తున్నారు. అలాగే అధికంగా లగేజీ ఉండటంతో ఆర్టీవో చెక్పోస్టుల వద్ద ఇబ్బందులు వస్తాయని భావిస్తున్న డ్రైవర్లు రూటు మార్చుతున్నారు. ఆదిలాబాద్ మీదుగా భోరజ్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్లాల్సి ఉండగా.. బోథ్ ఎక్స్ రోడ్డు నుంచి పొచ్చెర క్రాస్ మీదుగా ఘన్పూర్ వద్ద మహారాష్ట్రలో ప్రవేశిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓవర్లోడ్ కారణంగా వాహనం అదుపుతప్పి బోల్తా పడినట్లు తెలుస్తోంది. -
వ్యవసాయ కళాశాల డీన్గా ప్రవీణ్కుమార్
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ వ్యవసాయ కళా శాల అసోసియేట్ డీన్గా డాక్టర్ వై.ప్రవీణ్కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు కృషివిజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్గా పనిచేస్తున్న ఆయన ఇక్కడికి బదిలీ అయ్యారు. ఇక్కడ డీన్గా పనిచేసిన శ్రీధర్ చౌహాన్ ఆది లాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్తగా స్థానచలనం కల్పించారు. ఈ సందర్భంగా బదిలీపై వచ్చిన, బదిలీపై వెళ్తున్న శాస్త్రవేత్తలను కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది సోమవారం శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. -
సరస్ మేళాకు జిల్లా ప్రతినిధులు
కై లాస్నగర్: రాష్ట్రంలోని గ్రామీణ స్వయం సహా యక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులతో ప్ర భుత్వం ప్రత్యేకంగా సరస్ మేళాను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ శిల్పారామంలో నిర్వహించిన ప్రదర్శనను తిలకించేందు కోసం జిల్లా సమాఖ్య కార్యవర్గంతో పాటు ఒక్కో మండల సమాఖ్య నుంచి ముగ్గురు ప్రతినిధుల చొప్పున ప్రత్యేక వాహనంలో తరలివెళ్లారు. వారి వెంట సెర్ప్ డీపీఎం రమాకాంత్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మి, ఏపీఎం సంతోష్ తదితరులు ఉన్నారు. మేళాకు బయలుదేరుతున్న సమాఖ్య ప్రతినిధులు -
అర్జీలు పెండింగ్లో ఉంచొద్దు
ఆదిలాబాద్టౌన్: ప్రజా సమస్యలపై వచ్చిన అర్జీలు పెండింగ్లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వాటిని ఆయా శాఖల అధికారులకు అందజేస్తూ పరిష్కరించాలని సూచించారు. భూ సమస్యలపై వచ్చిన వినతులను ఆన్లైన్ ద్వారా సంబంధిత తహసీల్దార్లతో మాట్లాడి పరిష్కరించేలా చూడాలన్నారు. ఈ వారం మొత్తం 82 దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
కొలువుదీరిన అమ్మవారు
శోభాయాత్ర ద్వారా అమ్మవారిని తీసుకువస్తున్న భక్తులునేతాజీచౌక్లో..బొజ్జవార్ ఆలయంలో కొలువుదీరిన అమ్మవారు జిల్లా వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తి గీతాలు, డప్పు చప్పుళ్ల నడుమ అమ్మవారి విగ్రహాలను ఉదయం మండపాలకు తరలించారు. ప్రత్యేకంగా అలంకరించిన మండపాల్లో అమ్మవారిని కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. కొందరు భక్తులు భవానీ దీక్ష స్వీకరించారు. – ఆదిలాబాద్ -
నలుగురు ల్యాబ్టెక్నీషియన్లకు బయోకెమిస్ట్గా ప్రమోషన్
ఆదిలాబాద్టౌన్: జిల్లాలోని ఆయా ప్రాథమిక ఆరో గ్యకేంద్రాల్లో ల్యాబ్టెక్నీషియన్లుగా పనిచేస్తున్న న లుగురికి బయోకెమిస్ట్గా ప్రమోషన్ కల్పిస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నరేందర్ కుమార్ శని వారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పది మందికి ప్రమోషన్ కల్పించగా ఇందులో జిల్లా నుంచి నలుగురున్నారు. దీంతో వీరికి ప్రభు త్వ వైద్యకళాశాలలో గెజిటెడ్ హోదా లభించింది. గిమ్మ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో పనిచేస్తున్న బండారి కృష్ణను మెదక్ జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు, తాంసి పీహెచ్సీలో పనిచేస్తున్న ఈ. రమణాచారిని రిమ్స్ వైద్యకళాశాలకు, అంకోలి పీహెచ్సీలో పనిచేస్తున్న ఎంఏ సమీని వరంగల్ జిల్లాలోని నర్సంపేట ప్రభుత్వ వైద్యకళాశాలకు, శ్యామ్పూర్ పీహెచ్సీలో పనిచేస్తున్న భూమయ్యను భూపాలపల్లి వైద్యకళాశాలకు కేటాయించారు. -
రివర్ రాఫ్టింగ్ కేంద్రంగా ‘పొచ్చెర’!
బోథ్: పర్యాటక రంగంలో కొత్త అధ్యయనానికి నాంది పలుకుతూ బోథ్ మండలంలోని సుందరమైన పొచ్చెర జలపాతం ఇప్పుడు రివర్ రాఫ్టింగ్ కేంద్రంగా మారనుంది. తాజాగా ఈ జలపాతం వద్ద ఇటీవల కోయానా అడ్వంచర్ టీమ్ విజయవంతంగా నిర్వహించిన ట్రయల్ దీనికి మరింత బలం చేకూర్చింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే నదుల్లో రివర్ రాఫ్టింగ్ నిర్వహిస్తారు. పర్యాటకులు, సాహస క్రీడల్లో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గాలితో కూడిన పడవల్లో హెల్మెట్లు, ప్రత్యేక జాకెట్లు ధరించి దీనిని చేస్తుంటారు. అయితే మన దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే అనేకచోట్ల రాఫ్టింగ్కు అనుమతులిచ్చారు. దీంతో అక్కడ పర్యాటక రంగాలు అభివృద్ధిలో ఉన్నాయి. పొచ్చెర జలపాతం దిగువ నుంచి పారుతున్న నీటిలో సాహసోపేతంగా మొదటగా ఆరు కిలోమీటర్ల మేర కుప్టి వరకు రాఫ్టింగ్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ విజయవంతమైందని నిర్వాహకులు తెలిపారు. జలపాతం పరిసరాల్లోని ప్రవాహాలు ఇందుకు ఎంతగానో అనుకూలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రెండు వైపులా ఎత్తైన కొండ ప్రాంతం, మధ్యలో వాగు ప్రవాహంతో ఎంతో ఆకట్టుకునేలా ఉందని వారు తెలిపారు. పొచ్చెర జలపాతాన్ని పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేసేందుకు, ప్రత్యేకించి సాహస క్రీడాప్రియులను ఆకర్షించేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. నేడు అధికారుల బృందం రాక జిల్లా పర్యాటక ప్రోత్సాహక మండలి (డీటీపీసీ) చై ర్మన్గా ఉన్న కలెక్టర్ రాజార్షి షాతో పాటు పలువు రు అధికారుల బృందం సోమవారం పొచ్చెర జలపాతాన్ని సందర్శించనున్నారు. పొచ్చెరలో పర్యాటక ప్రాంతాలను పర్యవేక్షించిన అనంతరం జలపాతం కింది భాగం నుంచి కుప్టి వరకు రివర్ రాఫ్టింగ్కు గల అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. రాఫ్టింగ్కు అవసరమైన భద్రత ప్రమాణాలు, వసతులు, ఇతర అంశాలపై ఈ బృందం ఒక నివేదిక తయారు చేయనుంది. అనుమతులొస్తే పర్యాటకానికి ఊతం పొచ్చెర జలపాతం వద్ద రివర్ రాఫ్టింగ్కు డీటీపీసీ నుంచి అనుమతులు లభిస్తే ఈ ప్రాంతం పర్యాట కంగా అభివృద్ధి చెందే ఆస్కారముంది. దీంతో త్వ రలోనే పొచ్చెర జలపాతం అధికారికంగా ఒక రివర్ రాఫ్టింగ్ జోన్గా ప్రకటించబడే అవకాశముంది. అనుమతి లభిస్తే ఈ ప్రాంత పర్యాటకానికి మరింత ఊతమివ్వడమే కాకుండా, స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుందని అధికారులు భావిస్తున్నా రు. పొచ్చెర జలపాతం ఇకపై చూడదగిన ప్రదేశమే కాకుండా, సాహస క్రీడలకు అనువైన ప్రదేశంగానూ ప్రసిద్ధి చెందవచ్చని తెలిపారు. రివర్ రాఫ్టింగ్ వర్షాకాలం చివరలో, చలికాలంలో నిర్వహించే అవకాశమున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. -
డిగ్రీ లెక్చరర్కు డాక్టరేట్
ఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలకు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ తిరుకోవెల మంజులకు డాక్టరేట్ లభించింది. ఆమె శాతవాహన విశ్వవిద్యాలయంలో ‘సింథసిస్ ఆఫ్ పైరన్ అండ్ పైపిరిడిన్ డెరివేటివ్స్ యూసింగ్ నావెల్ మెథలాడజీ’ అనే అంశంపై పరిశోధన చేశారు. శాతవాహన విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ జయంతి పర్యవేక్షణకు గాను డాక్టరేట్ పట్టా అందజేసినట్లు ఆమె వివరించారు. పరిశోధన సమయంలో అంతర్జాతీయ స్థాయిలో పలు పత్రాలు అందజేశారు. తన కుటుంబ సభ్యుల సహకారంతో డాక్టరేట్ లభించిందని మంజుల తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ సంగీత, లెక్చరర్లు, సిబ్బంది ఆమెకు అభినందనలు తెలిపారు. -
నిండుకుండలా ‘మత్తడివాగు’
తాంసి: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వడ్డాడి స మీపంలోని మత్తడివాగు ప్రాజెక్ట్లోకి భారీగా వరదనీరు చేరింది. ప్రాజెక్ట్ అధికారులు ఎప్పటికప్పు డు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. వారంరో జులుగా వర్షాలు తగ్గుముఖం పట్టగా ప్రాజెక్ట్లోకి ఇ న్ఫ్లో తగ్గింది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో నీటి మట్టం ఉండగా ప్రాజెక్ట్ నిండుకుండను తలపిస్తోంది. ప్రా జెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 మీటర్లు కాగా, ప్రస్తుతం 277.40 మీటర్ల వద్ద నీరు నిల్వ ఉంది. నిండుకుండలా మారడంతో పలువురు పర్యాటకులు వచ్చి ప్రాజెక్ట్ అందాలను తిలకిస్తున్నారు. -
కోర్టులో పిటిషన్ వేశాం
టెట్ విషయంలో సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాం. ఏదైన చట్టం అమలైన రోజు నుంచి నిబంధనలు వర్తించాలి. 2010 కంటే ముందు ఉపాధ్యాయులకు టెట్ అర్హత నుంచి మినహాయింపు ఇవ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రీపిటిషన్ వేయాలి. ప్రమోషన్లు పొందే ఉపాధ్యాయులకు మాత్రం టెట్ అర్హత పెట్టడం సరైందే. కోర్టు తీర్పుతో చాలామంది ఉపాధ్యాయులు భయాందోళనలో ఉన్నారు. – వెంకట్, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మినహాయింపు ఇవ్వాలి మానవతాదృక్పథంతో ఆలోచించి టెట్ రాకముందు వృత్తిలో కొనసాగుతున్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి. ఈ విషయంలో గందరగోళం నెలకొని మానసిక వేదనకు గురవుతున్నారు. ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చినట్లుగానే విద్యాహక్కు చట్టం అమలుకంటే ముందు విధుల్లో చేరిన వారికీ మినహాయింపు ఇవ్వాలి. – కొమ్ము కృష్ణకుమార్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు -
వామ్మో పెద్దపులి!
బోథ్: సొనాల మండలంలోని ఘన్పూర్, వజ్జర్ అడవుల్లో పెద్దపులి సంచరిస్తోంది. ఈ నెల 19న దేవుల్నాయక్ తండా గ్రామానికి చెందిన రాథోడ్ గోవింద్ ఎద్దును హతమార్చింది. ప్రస్తుతం ఈ అడవుల్లోనే సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్దపులిని ట్రాప్ చేసేందుకు అటవీశాఖ అధికారులు కెమెరాలు అమర్చారు. ఎద్దును పులి హతమార్చిన ప్రదేశానికి ఎవరూ వెళ్లవద్దని అటవీశాఖ అధికారి ప్రణ య్ సూచించారు. అయితే ఆదివాసీ గ్రామాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా, తిప్పేశ్వర్ అడవుల్లో నుంచి ఘన్పూర్ మీదుగా తెలంగాణకు పెద్దపులి వచ్చి వెళ్తోంది. ఈ ఏడాది జూన్లో బోథ్ మండలంలోని నారాయణపూర్, రఘునాథ్పూర్ ప్రాంతాల్లో సంచరించింది. గతేడాది నవంబర్లో వజ్జర్, చింతగూడ, మర్లపెల్లి, నిగిని ప్రాంతాల్లో తిరిగింది. మొత్తంగా ఏడాదిలో మూడుసార్లు పెద్దపులి బోఽథ్, సొనాల మండలాలకు వచ్చింది. అటవీ విస్తీర్ణం పెరగడంతో పెద్దపులికి ఆవాసానికి అనుకూలంగా ఉండగా తరచూ వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లవద్దని అధికారులు అటవీ సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. -
‘ఐఏటీ’లో గిరిజన విద్యార్థినికి 729వ ర్యాంక్
ఉట్నూర్ రూరల్: మండలంలోని గంగన్నపేట్ గ్రామానికి చెందిన రాథోడ్ సరోజ–కిశోర్ దంపతుల కూతురు కీర్తి జాతీయ స్థాయిలో నిర్వహించిన ఐఏటీ పరీక్షలో ప్రతిభ కనబరిచి 729 ర్యాంక్ సాధించింది. తద్వారా బీఎస్ఎంఎస్ ఐదేళ్ల కోర్సులో ఒడిసా రాష్ట్రంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యూకేషనల్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) బరంపూర్ కళాశాలలో సీటు పొందింది. కీర్తి తల్లి సరోజ ఉపాధ్యాయురాలు కాగా, తండ్రి కిశోర్ నార్నూర్లో వ్యవసాయం చేస్తున్నాడు. కీర్తి ఎస్సెస్సీ వరకు ఉట్నూర్లో, ఇంటర్ హైదరాబాద్లో పూర్తి చేసింది. కీర్తిని స్థానికులు అభినందిస్తున్నారు. -
అనుమతులొస్తే బాగుండు
పొచ్చెర జలపాతం వద్ద కోయినా అడ్వంచర్ టీమ్ సభ్యులు రివర్ రాఫ్టింగ్ నిర్వహించారు. దిగువ జలపాతం నుంచి రాఫ్టింగ్ అనుకూలంగా ఉందని తెలిపారు. అనుమతులు వస్తే జలపాతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. తప్ప కుండా అనుమతులు వస్తాయని ఆశిస్తున్నాం. – ప్రణయ్, ఎఫ్ఆర్వో, బోథ్ రివర్ రాఫ్టింగ్ బాగుంది మొదటిసారిగా అడ్వంచర్ బృందం సభ్యులతో కలిసి రివర్ రాఫ్టింగ్లో పాల్గొన్నాను. పొచ్చెర జలపాతం దిగువ భాగం నుంచి కుప్టి వరకు దాదాపు ఆరు కిలోమీటర్ల దూరం వెళ్లాం. ఆధ్యంతం అడ్వంచర్గా, థ్రిల్గా ఫీలయ్యాం. రివర్ రాఫ్టింగ్కు అనుమతులిస్తే పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. – వెండి పృథ్వి, రివర్ రాఫ్టింగ్లో పాల్గొన్న యువకుడు -
ఆశలు ఆవిరి!
ఇచ్చోడ: పుడమి తల్లిని నమ్ముకున్న రైతులకు కష్టాలు తప్పడంలేదు. ఒడిదుడుకులతో ప్రారంభమైన ఖరీఫ్ సాగు ముందుకు సాగడంలేదు. పెట్టుబడికి చేసిన అప్పులు తలకు మించిన భారంగా మారి అన్నదాతలపై ఆర్థికభారం మరింత పెరగనుంది. జిల్లాలో తీవ్ర అతివృష్టితో పత్తి పంటలో ఎదుగుదల నిలిచిపోయింది. నెలన్నర నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా పూత, కాత ఆశించిన స్థాయిలో రాలేదు. గత జూన్లో విత్తనాలు వేసే ముందు వర్షాలు కొంత ఆశించిన స్థాయిలో ఉన్నా మొక్కలు పెరి గే సమయంలో ఆగస్టు నుంచి వర్షాలు కురవడం ప్రారంభమైంది. ఒక్కరోజూ విరామం లేకుండా 50 రోజులుగా కురుస్తూనే ఉండగా పంట ఎదుగుదల పూర్తిగా నిలిచిపోయింది. గతేడాది ఇప్పటివరకు చెట్టుకు 30 నుంచి 40 వరకు కాయలు కాశాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 10 కాయలు కూడా లేక దిగుబడుపై రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో నమోదైన వర్షపాతం ఈ ఏడాది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లా వ్యాప్తంగా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. జూన్, జూలై వరకు సాధారణానికి పరిమితమై, ఆగస్టు నుంచి సెప్టెంబర్ 12వరకు 1215.3 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 33శాతం అధికం. ఇచ్చోడ, సిరికొండ, బజార్హత్నూర్, తలమడుగు, మావల, ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్ రూరల్, గుడిహత్నూర్, బేల, జైనాథ్, సాత్నాల, నేరడిగొండ మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. 12మండలాల్లో సాధారణం కంటే 47 నుంచి 67 శాతం అధికంగా వర్షం కురిసింది. పెరిగిన పెట్టుబడులు పత్తి విత్తుకున్న నుంచి 180రోజులలోపు పంట గడు వు ముగుస్తుంది. విత్తుకున్న నాటి నుంచి 120 రోజుల వరకు ఎదుగుదల, కాత, పూత దశకు చేరుకుంటుంది. 120 రోజుల పాటు పత్తిని ఏపుగా పెంచడంతో పాటు కాత, పూత కోసం రైతులు ఎరువులు, పురుగుల మందులు పిచికారీ చేస్తుంటారు. దా దాపు నాలుగు నుంచి ఐదుసార్లు ఎరువులు వేస్తా రు. కానీ, ఈ ఏడాది గత 50రోజులుగా నిరంతరంకురుస్తున్న వర్షాలతో ఎరువులు, పురుగు మందుల వాడకం కూడా పెరిగిపోయింది. దీంతో ఏడాది పత్తి పంట సాగుకు పెట్టుబడులు పెరిగిపోగా దిగుబడులు మాత్రం ఘననీయంగా తగ్గిపోయే అవకాశముండగా రైతులు ఆందోళన చెందుతున్నారు. దిగుబడులు తగ్గవచ్చు నెలరోజులుగా జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున పత్తి దిగుబడులపై ప్రభావం పడనుంది. నిత్యం వాన కురుస్తుండడతో పంట ఎదుగుదల నిలిచిపోయింది. ఆశించిన స్థాయిలో కాత, పూత రాలేదు. వర్షాలు తగ్గుముఖం పడితే కొంత కాత, పూత పెరగనుంది. అయినా ఈసారి దిగుబడులు తగ్గే అవకాశముంది. – రాజశేఖర్, ఏరువాక సీనియర్ శాస్త్రవేత్త, ఆదిలాబాద్ -
కలెక్టరేట్లో లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి
ఆదిలాబాద్రూరల్: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూ జీ వర్ధంతిని ఆదివారం కలెక్టరేట్లోని బాపూజీ చౌక్లో ఘనంగా నిర్వహించారు. బాపూజీ విగ్రహానికి కలెక్టర్ రాజర్షి షా పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర గు రించి వివరించారు. బాపూజీ స్ఫూర్తిని కొనసాగి స్తూ ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని సూచించా రు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ.. స్వరాష్ట్రం కోసం బాపూజీ పదవులను కూడా వదులుకున్నారని గుర్తు చేశారు. అలాగే, పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పా ల్గొని లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. పద్మశాలీ సంఘం నాయకులు మంచికట్ల ఆశమ్మ, బేత రమేశ్, జిట్ట రమేశ్, బొ మ్మకంటి రమేశ్, దాసరి రమేశ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు పాల్గొన్నారు. -
వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
కై లాస్నగర్: ఇంటర్మీడియెట్లో వందశాతం ఉత్తీ ర్ణతే లక్ష్యంగా ముందుకు సాగాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, సాంఘి క సంక్షేమ, గురుకుల, మోడల్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వారం వారం స్లిప్ టెస్ట్లు నిర్వహిస్తూ, విద్యార్థుల ప్రతిభకు అనుగుణంగా బోధన చేపట్టాలన్నారు. అలాగే యుడైస్, అపార్ నంబర్లను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నా రు. ఇందులో డీఐఈవో జాదవ్ గణేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. లైంగిక వేధింపుల నివారణకే పోక్సో చట్టం ఆదిలాబాద్టౌన్: బాలికలపై లైంగిక వేధింపుల నివారణకు పోక్సో చట్టం రూపొందించబడిందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో శనివారం ఫోక్సో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు. లైంగిక వేధింపుల నిరోధానికి కమిటీలను ఏ ర్పాటుచేసి తరచూ విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఇందులో జిల్లా అదనపు జడ్జిశివరాం ప్రసాద్, జిల్లా సంక్షేమాధికారి మిల్కా, యూని సెప్ ప్రతినిధి డేవిడ్, ట్రస్మా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పవన్రావు, వి.ఆదినాథ్, దేవేందర్ పటా స్కర్, పురుషోత్తంరెడ్డి, అశోక్, సదాశివ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బరితెగింపు!
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో ఫోర్జరీ కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ఖాళీస్థలాలను హస్తగతం చేసుకోవడం.. ఖాళీగా ఉన్న జాగాలో పాగా వేయ డం.. వ్యవసాయ భూములను కబ్జా చేసేందుకు బరితెగించడం.. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా వేసి నకిలీ పత్రాలు సృష్టించడం వంటివి చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో తండ్రీ కొడుకులు ఏకంగా ప్రభుత్వ కార్యాలయాల స్టాంపులు తయారీతో పాటు నకిలీ డాక్యుమెంట్లను సృష్టిస్తున్నారు. ఏ పత్రాన్నైనా ఫోర్జరీ చేయడంలో సిద్ధహస్తులు. ఇటీవలే వారు పోలీసులకు చిక్కారు. అక్రమార్కులు ఫోర్జరీలకు పాల్పడుతూ కాసుల కో సం ఎంతకై నా తెగిస్తున్నారు. జిల్లాలో ఇటీవల వెలు గుచూసిన ఘటనల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా పెట్టింది. గతంలో ఇవి సివిల్ కేసులుగా ఉండడంతో తమను ఎవరు ఏమి చేయలేరనే ధీమాతో ఉన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ బా ధ్యతలు చేపట్టిన ఆరు నెలల వ్యవధిలో కొరడా ఝళిపించగా.. వారి బండారం బయటపడుతుంది.కేసులు నమోదు చేసి జైలుకు పంపుతుండంతో బాధితులు ముందుకొస్తున్నారు. వారు ఎంతటి వారైనా పోలీసులు మాత్రం వదిలిపెట్టడం లేదు. నకిలీ పత్రాలు సృష్టిస్తూ.. జిల్లాలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రభు త్వ, అసైన్డ్ భూములు, ఖాళీగా ఉన్న ప్లాట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకొని ఆయా శాఖల్లో కొంత మంది అధికారులు, ఉద్యోగుల అండదండలతో ఫోర్జరీతో నకిలీపత్రాలు సృష్టిస్తున్నారు. పంచాయ తీ, మున్సిపాలిటీల్లో అక్రమ మార్గంలో ముటేషన్, అసిస్మెంట్ చేయించుకుంటున్నారు.ఆ తర్వా త ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించి తీరా తమ పేరిట మార్చుకోవడం, అమాయకులకు ఆ భూ ములను విక్రయించడం పరిపాటిగామారింది. ఇటీవల బాధి తుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న పోలీసు అధి కారులు పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నారు. కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నారు. ఆరు నెలల్లో జరిగిన సంఘటనలు.. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలుఎవరైనా ఫోర్జరీ సంతకాలతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినా, తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసినా కఠిన చర్యలు తప్పవు. నిబంధనలకు విరుద్ధంగా చిట్టీల దందా, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేస్తే కేసులు నమోదు చేస్తాం. బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే న్యాయం జరిగేలా చూస్తాం. – ఎల్.జీవన్రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ -
గద్దెలు కట్టి.. వెంపలి పెట్టి
బొడ్డెమ్మ గుంత (ఫైల్ ) జిల్లాలో మహాలయ అమావాస్య రోజు మహిళలు నిర్ణయించుకున్న ఒక స్థలంలో గుంతను తవ్వుతారు. అందులోని మట్టిని తీసి చుట్టూ 16 నుంచి 21 గద్దెలు ఏర్పాటు చేస్తారు. అనంతరం ఆడపడుచులు మంగళ హారతులతో వెళ్లి స్థానికంగా ఉండే వెంపలి చెట్టుకు పూజలు చేసి దానిని తీసుకొని వచ్చి గుంత మధ్యలో ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రతి ఇంటి నుంచి ఓ పళ్లెంలో పూలను బతుకమ్మగా చేసి తీసుకువస్తారు. వాటిని గద్దెల వద్ద ఉంచుతారు. గునుగు, గుమ్మడి, తంగేడు, బంతి తదితర పూలతో తీర్చిదిద్దుతారు. అటుకులు, పేలాలు, పల్లీలు, పుట్నాలు, బెల్లం, చక్కెర వంటి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం బతుకమ్మ పాటలతో లయబద్ధంగా నర్తిస్తూ, తమ కష్ట సుఖాలను తెలుపుకుంటారు. అనంతరం ఆ పూలను ఆ గుంతలోనే వేసి, అర్ధరాత్రి వరకు ఆడి పాడుతారు. -
నాటుసారా స్థావరాలపై దాడులు
బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రొహిబిషన్, ఎకై ్సజ్, మంచిర్యాల ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ అధికారులు శుక్రవారం నాటుసారా స్థావరాలపై ఆకస్మిక దాడులు చేశారు. బెల్లంపల్లి ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని మందమర్రి మండలం పులిమడుగు, కాసిపేట మండలం ధర్మారావుపేట, మామిడి గూడెం గ్రామాల్లోని నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. పులిమడుగు గ్రామానికి చెందిన బానోత్ అంబ్రియా, బూక్యా దేవి, ధర్మారావుపేట గ్రామానికి చెందిన బానోత్ లక్ష్మి, బానోత్ రాజు వద్ద 15 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని 200 లీటర్ల బెల్లం పానకాన్ని పారబోశారు. ఈమేరకు నలుగురు నిందితులపై కేసులు నమోదు చేసినట్లు బెల్లంపల్లి ప్రొహిబిషన్, ఎక్సెజ్ సీఐ ఇంద్రప్రసాద్ తెలిపారు. దాడుల్లో మంచిర్యాల టాస్క్ఫోర్స్ సీఐ ఎస్.సమ్మయ్య, ఎస్సైలు శారద, వెంకటేశ్, సిబ్బంది అశోక్, దినేశ్, గణేశ్, శిరీష, సాగర్, రమేశ్, ప్రశాంత్, కవిత పాల్గొన్నారు. -
తరలింపు ప్రక్రియ షురూ
కై లాస్నగర్: కలెక్టరేట్ తరలింపు ప్రక్రియ మొదలైంది. ఈ నెల 11న కురిసిన భారీ వర్షాలతో కార్యాల య ఏ–సెక్షన్ బాల్కనీ కుప్పకూలిన విషయం విది తమే. పరిశీలించిన ఇంజినీరింగ్ నిపుణుల బృందం కార్యాలయాన్ని తరలించడమే ఉత్తమమని నివేదిక అందజేసింది. ఈనేపథ్యంలో కార్యాలయాన్ని జెడ్పీ ఎదురుగా ఉన్న ఇరిగేషన్శాఖ కార్యాలయమైన పెన్ గంగ భవన్కు తరలిస్తున్నారు. శుక్రవారం ఈ ప్రక్రి య ప్రారంభమైంది. తొలుత ఏ, బి సెక్షన్లకు సంబంధించిన రికార్డులు,దస్త్రాలు, కంప్యూటర్లు, ఫర్ని చర్ వంటి సామగ్రి తరలిస్తున్నారు. ఈ ప్రక్రియ వా రం రోజుల్లో పూర్తికానున్నట్లు అధికారులు చెబు తున్నారు. ఇప్పటికే కలెక్టరేట్లోకి ఉద్యోగులు, సిబ్బంది మినహా ఇతరులేవరినీ అనుమతించడం లేదు. -
‘గిరి’ గ్రామాలకు దారి కష్టాలు
ఇచ్చోడ: ‘గిరి’ గ్రామాల ప్రజలు ఏళ్లకేళ్లుగా దారి కష్టాలు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎటు వెళ్లాలన్నా వీరికి కాలినడకే దిక్కవుతోంది. వానాకాలంలో కాలినడక కూడా కష్టమవుతోంది. రాళ్ల దారి, బురద రోడ్లు, ఉధృతంగా ప్రవహించే వాగుల నుంచి వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. ఆదివాసీలు మండల కేంద్రాలు, పొరుగు గ్రామాలకు వెళ్లాలంటే కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లాల్సిందే. అత్యవసర సమయంలో గ్రామాలకు అంబులెన్స్ కూడా రాని దుస్థితి. సరైన రవాణా వ్యవస్థ లేక అత్యవసర వేళల్లో ఆస్పత్రికి చేరుకోలేక అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వాలు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా ఇప్పటికీ జిల్లాలోని చాలా గ్రామాలకు కనీసం మట్టి రోడ్లు కూడా లేకపోవడం గిరిజన గ్రామాల దుస్థితికి అద్దం పడుతోంది. వాగులపై వంతెనలు లేకపోవడంతో చాలా గ్రామాలకు వానాకాలంలో రెండు నెలలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. అంబులెన్స్ వెళ్లలేని గ్రామాలుజిల్లాలోని మారుమూల గ్రామాలకు సరైన రోడ్లు లేక అత్యవసర సమయాల్లో అంబులెన్స్ కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో ఆపదలో ఉన్నవారిని స మయానికి ఆస్పత్రులకు చేర్చడం వీలు కావడంలే దు. అకస్మాత్తుగా అస్వస్థతకు గురైతే కిలోమీటర్ల దూరం కాలినడకన లేదా ఎడ్ల బండ్లపై తీసుకెళ్లాల్సి న దుస్థితి ఉంది. జిల్లాలో ఇప్పటివరకు రోడ్లు లేని గ్రామాలు చాలానే ఉన్నాయి. ఇచ్చోడ మండలం బావోజీపేట్, గుండి, గుండివాగు, సిరికొండ మండలం బుర్సిగుట్ట, ధర్మన్నపేట్, నేరడిగొండ మండలం అద్దల తిమ్మపూర్, లక్ష్మాపూర్, పీచర, గాజిలి, బజార్హత్నూర్ మండలం ఉమార్ద, ఇంద్రానగర్, రెంగన్వాడీ, గిరిజాయి, డెడ్రా, మాన్కపూర్, కొత్తపల్లి, భీంపూర్ మండలం గుబడి, గుబిడిపల్లి, నార్నూ ర్ మండలం ఉమ్రి, సీతగూడ, బారిక్రావుగూడ, లొద్దిగూడ, కొలాంగూడ గ్రామాలకు రోడ్డు సౌకర్యంలేదు. దీంతో వానాకాలంలో నానా ఇబ్బందుల కు గురవుతున్నారు. వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు. రోడ్డు సౌకర్యం కల్పించాలి గిరి గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదు. అత్యవసర సమయంలో గిరిజనులు వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. ప్రభుత్వాలు గిరిజన ప్రజల ఆవేదనను అర్థం చేసుకుని రోడ్డు సౌకర్యం కల్పించాలి. – టేకం దేవురావు, బావోజీపేట్ మాజీ సర్పంచ్ వానాకాలంలో అవస్థలు గిరిజన గ్రామాలకు రోడ్డు లేదు. రోడ్లున్న చోట వంతెనలు లేవు. వానాకాలంలో అంబులెన్స్ కూడా వెళ్లవు. అత్యవసర సమయంలో గర్భిణులు, బాలింతలను కిలోమీటర్ల దూరం కాలినడకన తీసుకెళ్లాల్సి వస్తోంది. వంతెనలు, రోడ్లు నిర్మించాలి. – కొడప నగేశ్, ‘తుడుం’ రాష్ట్ర కార్యదర్శి ఇటీవలి ఘటనలు కొన్ని..ఈ నెల 16న సిరికొండ మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన కన్నపూర్ తండాకు చెందిన మీనా ఇంద్రవెల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. 18న ఆమెను డిశ్చార్జి చేశారు. 102 వాహనంలో ఆమెను గ్రామానికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో వాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో వాహనం వెళ్లలేని పరిస్థితి ఉండడంతో పైలెట్ పసిబిడ్డతో సహ బాలింతను వాగు దాటించాడు. అక్కడి నుంచి కిలోమీటరు దూరం వరకు బాలింత కాలినడకన గ్రామానికి చేరుకోవాల్సి వచ్చింది. ఈ నెల 17న ఉట్నూర్ మండలంలోని మత్తడి సుంగుగూడ గ్రామానికి చెందిన కుమ్ర పారుబాయి అనారోగ్యంతో మృతి చెందింది. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బంధువులు గ్రామానికి వచ్చే క్రమంలో సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహించింది. ప్రమాదం అని తెలిసినా బంధువులు ఒకరి చేయి ఒకరు పట్టుకుని నడుంలోతు నీటిలో వాగు దాటాల్సి వచ్చింది. -
అసాంఘిక కార్యకలాపాలను రూపుమాపుదాం
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో కల్తీకల్లు, గేమింగ్, ఓ పెన్ డ్రింకింగ్ తదితర అసాంఘిక కార్యకలా పాలను పూ ర్తిగా రూపుమాపుదామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్ సమావేశ మందిరంలో శుక్రవారం నెలవారీ నేర స మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గంజాయిరహిత జిల్లాగా మా ర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అలా గే కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని అన్నా రు. వీడీసీ ఆగడాలు పూర్తిస్థాయిలో అరికట్టాల ని తెలిపారు. వడ్డీ వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. గ్రా మాల్లో సమావేశాలు నిర్వహించి డీజేలు ఏర్పా టు చేయకుండా చూడాలన్నారు. జిల్లాలో ఉత్త మ ప్రతిభ కనబర్చిన 30 మంది పోలీసులకు ప్రశంసాపత్రాలు అందజేసి ప్రోత్సహించనున్నట్లు తెలిపా రు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు సిబ్బంది సంసిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్సింగ్, డీఎస్పీలు జీవన్రెడ్డి, పోతారం శ్రీనివాస్,నాగేందర్, హసీ బుల్లా, ఇంద్రవర్ధన్, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కాజల్సింగ్కు పదోన్నతి చిహ్నం అలంకరణఉట్నూర్ ఏఎస్పీగా ఉన్న కాజల్ సింగ్కు గురువారం అదనపు ఎస్పీగా పదోన్నతి లభించిన విషయం తెలిసిందే. ఈమేరకు నెలవారీ నేర సమీక్ష అనంతరం ఎస్పీ ఆమె భుజ స్కంధా లపై సింహ తలాటం చిహ్నం అలంకరించి అభినందనలు తెలిపారు. -
‘సాదా’.. సీదాకు వేళాయె
కై లాస్నగర్: తెల్లకాగితాలపై రాసుకున్న భూ కొనుగోలు ఒప్పందాల (సాదాబైనామా) క్రమబద్ధీకరణ కు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2020 అక్టోబర్ 12 నుంచి అదే ఏడాది నవంబర్ 10 వరకు అందిన దరఖాస్తులను క్రమబద్ధీకరిస్తామని ప్రకటిస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాటికనుగుణంగా జిల్లాలో అందిన దరఖాస్తులపై రెవెన్యూ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల నిరీక్షణ త్వరలో ఫలించనుంది. వారికి భూ యాజమాన్య హక్కులు లభించనున్నాయి. సర్కారు ప్రయోజనాలు చేరువకానున్నాయి. 12 ఏళ్లుగా ఆధీనంలో ఉన్న వాటికే.. చేతిరాత ఒప్పందాల ద్వారా భూ క్రయ, విక్రయాలు చేసుకున్న రైతులకు పట్టాలు లేకపోవడంతో ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. భూములు సాగు చేస్తున్నప్పటికీ యాజమాన్య హ క్కులు లేక సతమతమవుతున్నారు. అయితే పన్నెండేళ్లకు పైగా భూమి ఆధీనంలో ఉన్న రైతుల దరఖాస్తులను క్రమబద్ధీకరించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. 2014 జూన్ 2వ తేదీకి ముందు సాదాబైనామా కొనుగోళ్లకు అధికారిక హక్కు కల్పించాలని భావిస్తూ 2016లో రైతుల నుంచి తొలిసారి దరఖాస్తులు స్వీకరించింది. అయితే విచా రణలో జాప్యం కావడం, భూముల ధరలు పెరగడం.. అమ్మిన వారు మొండికేయడంతో పట్టాల జారీ నిలిచిపోయింది. మరోసారి 2020 అక్టోబర్లో క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. మీసేవ ద్వారా అప్లికేషన్లు స్వీకరించారు. దీంతో జిల్లాలో 2,008 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ధ రణి రెవెన్యూ చట్టంలో నిబంధనలు పొందుపర్చని కారణంగా కోర్టు ఈ ప్రక్రియను నిలిపివేసింది. కోర్టు ఆదేశాలతో తొలగిన అడ్డంకి.. ఎన్నికలకు ముందు సాదాబైనామాపై ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులను స్వీకరించింది. ఈమేరకు జిల్లాలో 947 అందాయి. అయితే వీటి రెగ్యులరైజేషన్కు ఆర్వోఆర్– 2020 స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్వోఆర్–2025 భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్–6 ద్వారా అవకాశం కల్పించింది. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తూ ఇటీవల తీర్పు వెలువరించింది. దీంతో రైతుల ఏళ్లనాటి నిరీక్షణకు తెరపడింది. సాదా బైనామాల కమబద్ధీకరణ ద్వారా రైతులకు భూ పట్టాలు జారీ కానున్నాయి. యాజమాన్య హక్కులు లభించనున్నాయి. అలాగే ప్రభుత్వం అందించే రైతు భరోసా, రైతు బీమా వంటి ప్రయోజనాలతో పాటు సబ్సిడీ ఎరువులు, బ్యాంకు రుణాలు అందనున్నాయి. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సైతం చేకూరనుంది. ప్రారంభమైన పరిశీలన.. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు సా దాబైనమా దరఖాస్తుల పరిశీలనను ఇటీవల ప్రా రంభించారు. తహసీల్దార్, ఆర్ఐ, సర్వేయర్లు సంయుక్తంగా క్షేత్రస్థాయి విచారణ చేపడుతున్నారు. దరఖాస్తుదారు భూమి 12 ఏళ్లుగా తన ఆధీనంలో నే ఉందా, అందుకు సంబంధించిన రికార్డులు ఏమైనా ఉన్నాయా వంటి వివరాలు సేకరిస్తున్నారు. అవి సక్రమంగా ఉన్నట్లుగా నిర్ధారణ అయితే సదరు రైతు దరఖాస్తును క్రమబద్ధీకరించేలా చర్యలు చేపడుతున్నారు.లేనిపక్షంలోవాటిని తిరస్కరిస్తున్నారు.జిల్లాలో అందిన దరఖాస్తుల వివవరాలు మండలం అందిన దరఖాస్తులు ఆదిలాబాద్ అర్బన్ 15 ఆదిలాబాద్ రూరల్ 254 మావల 31 జైనథ్ 168 బేల 60 భీంపూర్ 83 తాంసి 63 తలమడుగు 335 గుడిహత్నూర్ 163 ఇచ్చోడ 98 సిరికొండ 08 నేరడిగొండ 109 బజార్హత్నూర్ 97 బోథ్ 222 ఇంద్రవెల్లి 27 నార్నూర్ 52 ఉట్నూర్ 223ప్రారంభమైన దరఖాస్తుల పరిశీలన సాదాబైనామా దరఖాస్తుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఆదేశిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు అందాయి. వాటికనుగుణంగా ప్రక్రియ చేపడుతున్నాం. కొన్ని మండలాల్లో దరఖాస్తుల పరిశీలన ఇప్పటికే ప్రారంభం కాగా మిగతా మండలాల్లోనూ చేపట్టేలా ఆదేశాలు జారీ చేశాం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారి భూములను క్రమబద్ధీకరిస్తాం. – బి.స్రవంతి, ఆర్డీవో, ఆదిలాబాద్ -
ఆశల ‘ప్రాణహిత’
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గత పదిహేడేళ్లుగా ఉమ్మడి జిల్లా వాసుల చిరకాల కలగా ఉన్న డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణంపై మళ్లీ ఆశలు రేకెత్తిస్తున్నా యి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత నదిపై బరాజ్ నిర్మాణా నికి సాగునీటి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించ డం ఈ ప్రాంత రైతులకు ఊరటనిస్తోంది. 2008లో ఉమ్మడి రాష్ట్రదివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అటవీ అనుమతులు, కాలువ ల నిర్మాణం, భూ సేకరణ జరిగాయి. 2016లో టీఆర్ఎస్ ప్రభుత్వం రీడిజైనింగ్తో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టింది. బరాజ్ను కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద కాకుండా మేడిగడ్డకు మా ర్చడంతో ఆ ప్రాజెక్టు పూర్తిగా మరుగున పడింది. తర్వాత ఈ ప్రాంత వాసులకు సాగునీటి కోసం డిమాండ్లు రావడంతో ప్రాణహిత, వార్దా, పెన్గంగ నదులపై పలు చోట్ల తక్కువ ఎత్తులో సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాల కోసం ప్రాజెక్టు కడతామని ప్రణాళికలు వేసినా ముందుకు కదల్లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాణ హిత కడతామని ఇచ్చిన హామీపై ఆచరణ దిశగా సాగుతోంది. కాలువలు ధ్వంసం, పైపుల తరలింపు తుమ్మిడిహెట్టి నుంచి చింతలమానేపల్లి, దహెగాం, వేమనపల్లి, నెన్నెల, మందమర్రి, మంచిర్యాల మండలాల మీదుగా నీళ్లు గోదావరిపై ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకోవాలి. మరో ప్యాకేజీలో ఎస్సారె స్పీ నుంచి నిర్మల్ జిల్లా దిలావర్పూర్కు నీటిని తరలించాలి. కాళేశ్వరం రాకతో ఈ నీటి తరలింపు నిలి చిపోయింది. దీంతో 40కి.మీపైన తవ్విన కాలువలన్నీ ధ్వంసమయ్యాయి. చాలా చోట్ల కబ్జాలకు గురయ్యాయి. కొన్ని చోట్ల పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, ఇతర ప్రజాప్రయోజనాలకు వాడుతున్నారు. ఇక కర్జెల్లి, సురగపల్లి, మైలారంలో రిజర్వాయర్ల నిర్మాణం కోసం భూ సేకరణ జరిగింది. వృథాగా ఉన్న పైపులను రెండేళ్ల క్రితమే ఇతర ప్రాంతాలకు తరలించారు. తాజాగా ఆ కాలువలను మళ్లీ వినియోగంలోకి తీసుకురావాల్సి ఉంది. ప్రత్యేక చొరవ చూపితేనే.. చుట్టూ నీరున్నా ఒక్క భారీ నీటి పారుదల ప్రాజక్టు లేక ఈ ప్రాంత రైతులు అల్లాడుతున్నారు. నీరులేక పత్తి, కంది తదితర ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. చాలాచోట్ల వర్షాధారమే దిక్కు. వానాకాలంలో పంట వేస్తే యాసంగిలో భూములు బీడుగా ఉంటాయి. రెండో పంట వేసుకోలేని దుస్థితి. పల్లెల్లో పనులు లేని సమయాల్లో వలస వెళ్తుంటారు. ఈ క్రమంలో సిర్పూర్ వంటి మారుమూల ప్రాంతంతోపాటు ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గాల పరిసర రైతులకు సా గునీరందే అవకాశాలు ఉన్నాయి. ఏళ్లుగా ఈ ప్రాజె క్టు నిర్మాణం పూర్తి కాక సాగునీటికి దూరంగానే ఉంటున్నారు. మహారాష్ట్రతో గతంలోనే 148మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. తాజాగా 150మీటర్ల ఎత్తు కోసం అనుమతికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో నది అవతల గ్రామాల ముంపు, అటవీ అనుమతులు బరాజ్ నిర్మాణానికి ప్రధాన సవాళ్లుగా మారనున్నాయి. ఏటేటా నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం నిధుల ఖర్చులో ప్రత్యేక చొరవ చూపాల్సి ఉంది.చిత్తశుద్ధితో పూర్తి చేయాలిమారుమూల ప్రాంత రైతులకు సాగునీరందించే తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ప్రభుత్వం చేయడం సంతోషకరమే. కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తేనే ప్రాజెక్టు పూర్తవుతుంది. బరాజ్ నిర్మాణంపై సమగ్ర అధ్యయనం చేయాలి. అలాగే మహారాష్ట్రతో ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వ సహకారంతో మా వంతు కృషి తప్పకుండా చేస్తాం. – హరీశ్బాబు, ఎమ్మెల్యే, సిర్పూర్ -
టీబీ రహిత సమాజాన్ని స్థాపించాలి
తాండూర్: టీబీ రహిత సమాజాన్ని స్థాపించాలని డెప్యూటీ డీఎంహెచ్వో సుధాకర్ నాయక్ సూచించారు. తాండూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలో శుక్రవారం జిల్లా వైద్యారోగ్యశాఖ నిర్వహించిన స్వస్త్ నారీ సశక్త్ పరివార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీబీ పేషెంట్లు మందులతో పాటు బలమైన పోషకాహారం తీసుకుంటే చాలా తొందరగా కోలుకోవచ్చని పేర్కొన్నారు. టీబీ రహిత సమాజం కోసం టీబీ న్యూట్రిషియన్ కిట్లు అందించాలని పిలుపునిచ్చారు. దీంతో పాటు స్వస్త్ నారీ సశక్త్ పరివార్లో భాగంగా స్పెషలిస్ట్ డాక్టర్ రఘుమోహన్ ఆధ్వర్యంలో 87మందికి రక్త పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి ఝాన్సీ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జయమేరి, సూపర్వైజర్లు తార, రమాదేవి, స్టాఫ్ నర్సులు షారుణ్, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, టీబీ సూపర్వైజర్ శశికాంత్, ల్యాబ్ టెక్నీషియన్ తదితరులు పాల్గొన్నారు. -
గుండెపోటుతో కాంట్రాక్టు కార్మికుడి మృతి
కాసిపేట: మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సి మెంటు కంపెనీ కాంట్రాక్టు కార్మికుడు రేణికుంట శంకరయ్య(53) శుక్రవారం గుండెపోటుతో మృతిచెందాడు. దేవాపూర్ ఎస్సై గంగారాం తెలిపిన వివరాల ప్రకారం.. కంపెనీ పరిధిలోని క్వార్టర్లలో పనికి వెళ్లిన శంకరయ్య ఉదయం 10.30గంటలకు చాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో తోటి కార్మికులు కంపెనీ డిస్పెన్సరీకి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు ఆందోళనకు సిద్ధమయ్యారు. రూ.20లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతదేహన్ని కంపెనీ గేటు ముందుకు తీసుకువచ్చి ఆందోళన చేయనున్నట్లు తెలుసుకున్న పోలీసులు ముందస్తుగా మంచిర్యాలకు చేరుకుని నివారించారు. మానవత కోణంలో రూ.లక్ష వరకు ఖర్చుల నిమిత్తం సహాయం అందిస్తామని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని కంపెనీ అధికారులు తెలిపినట్లు సమాచారం. మృతదేహం పోస్టుమార్టం అనంతరం శనివారం గ్రామానికి చేరనుండడంతో శుక్రవారం ఆందోళనలు నిర్వహించలేదు. -
పశువులను తరలిస్తున్న వాహనం పట్టివేత
ఇచ్చోడ: మండల కేంద్రంలోని నిర్మల్ బైపాస్ వద్ద ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వైపు పశువులను తీసుకెళ్తున్న బొలెరో వాహనాన్ని పోలీసులు పట్టుకున్నా రు. పది పశువులను స్వాధీనం చేసుకుని స్థానిక జైశ్రీరాం గోశాలకు తరలించారు. ఎస్సై పురుషో త్తం తెలిపిన వివరాల ప్రకారం.. అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనం శుక్రవారం ఉదయం నిర్మల్ బైపాస్ వద్ద వెనుక నుంచి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బొలెరో వాహనంలో పశువులు ఉన్న ట్లు గమనించారు. స్థానికులను చూసిన వాహన డ్రై వర్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు పోలీ సులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాని కి చేరుకుని బొలెరో వాహనాన్ని పోలీస్టేషన్కు తరలించి పశువులను గోశాలకు అప్పగించినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. ఈ ఘటనలో బస్సు కండక్టర్కు స్వల్పగాయాలు కాగా ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్టట్లు పేర్కొన్నారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సును ఢీకొన్న పశువులు తరలిస్తున్న వాహనం -
పత్తిలో చీడపీడలు
చెన్నూర్రూరల్: ఈసారి పత్తి పంట ఆశాజనకంగా ఉంది. కానీ.. అధిక వర్షాలు కురిసిన చోట పంటను చీడ, పీడలు ఆశిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఈ వానాకాలంలో 1.61లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేస్తున్నారు. దుక్కి దున్నడం, విత్తనాలు, క్రిమిసంహారకాలు, ఎరువుల కోసం ఒక్కో ఎకరాకు సుమారు రూ.30వేల నుంచి రూ.45వేల వరకు ఖర్చు చేశారు. మొదట పత్తి విత్తనాలు వేసిన సమయంలో సరిగా వర్షాలు కురవలేదు. మొలకెత్తక పోవడంతో కొందరు రైతులు మళ్లీ విత్తనాలు వేశారు. ఆగస్టు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తుండగా ప్రస్తుతం పంటకు చీడపీడలు సోకుతున్నాయి. క్రిమిసంహారకాలు పిచికారీ చేద్దామంటే రోజూ వర్షం కురుస్తోంది. ఇప్పుడే పత్తి పూత దశలో ఉంది. కొన్ని చోట్ల కాయ దశలో ఉంది. పచ్చ దోమ, తెల్ల దోమ ఆశించి మొక్కల అడుగు భాగం నుంచి పత్రహరితాన్ని పీలుస్తున్నాయి. దీంతో ఆకులు మొదట పచ్చబారి, ఆ తరువాత ఎరుపు రంగులోకి మారుతున్నాయి. ఆకులు కింది వైపునకు ముడుచుకుపోతున్నాయి. చెట్టు కొనలు ముడుచుకుపోయి పెరుగుదల తగ్గి, పూత, కాత తగ్గనుంది. ఈ పురుగులు రసం పీల్చడంతో గూడలు బలహీన పడతాయి. పిందె పరిమాణం తగ్గుతుంది. ఈ కారణంగా దిగుబడి కూడా తగ్గి పోయే అవకాశముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
పోలీసులపై దాడులు చేస్తే కఠిన చర్యలు
భైంసాటౌన్: పోలీసులపై ఎవరైనా దాడులు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని అదనపు ఎస్పీ అవినాష్కుమార్ హెచ్చరించారు. కుభీర్ పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్పై దుండగుడు కత్తితో దాడి చేసిన కేసు వివరాలను శుక్రవారం పట్టణ పోలీస్స్టేషన్లో ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని ధర్మాబాద్కు చెందిన అబ్దుల్ కలీం (51)కు కుభీర్ మండలకేంద్రానికి చెందిన మహిళతో వివాహం కాగా, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు తలెత్తేవి. ఈ క్రమంలో భార్య కుభీర్లోని తన పుట్టింటికి రాగా, మరోసారి ఇద్దరి మధ్య తగాదా తలెత్తింది. దీంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని భార్య భర్తను బెదిరించగా, అదే రోజు రాత్రి మద్యం మత్తులో నిందితుడు అబ్దుల్ కలీం మండలకేంద్రంలోని పోలీస్స్టేషన్కు వచ్చి ఎస్సై గదిలోకి వెళ్లబోయాడు. దీంతో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ నారాయణ అడ్డుకునే యత్నంలో కత్తితో గాయపర్చి పారిపోయాడు. ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలతో గాలించగా శుక్రవారం కుభీర్ శివారులో నిందితుడిని అరెస్ట్ చేశారు. అబ్దుల్ కలీం గతంలో ధర్మాబాద్లోనూ హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్లు విచారణలో వెల్లడైందని అదనపు ఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐలు గోపీనాథ్, నైలు, కుభీర్ ఎస్సై కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
ఆర్జీయూకేటీలో ఏఐపై ప్రత్యేక శిక్షణ
బాసర: బాసరలోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో టీజీఎఫ్ డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్తో కలిసి ప్రత్యేక ఇంటరాక్టివ్ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్రపరిశ్రమలో కృత్రిమ మేధస్సు (ఏఐ) పాత్ర, సృజనాత్మకత, కథనం, నిర్మాణ సామర్థ్యం, కంటెంట్ డెలివరీలో దాని ప్రభావంపై చర్చించారు. అదే సమయంలో, ఐఈఈఈ విద్యార్థి శాఖ, ఈసీఈ విభాగం కార్యాలయం ప్రారంభించారు. దిల్ రాజు మాట్లాడుతూ.. చిత్ర నిర్మాణంలో ఏఐ పాత్రను వివరించారు. ఏఐ పరిశ్రమలో కొత్త అవకాశాలను సృష్టిస్తోందని తెలిపారు. విద్యార్థుల్లోని ప్రతిభను ఉపాధి అవకాశాలతో సమన్వయం చేయడానికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సాంకేతిక ఆవిష్కరణలకు వేదికఈ సదస్సులో ఐఈఈఈ హైదరాబాద్ విభాగం సభ్యులు, ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్తోపాటు దిల్ రాజు ఐఈఈఈ ప్రపంచ ప్రభావం, సాంకేతిక పురోగతిపై చర్చించారు. 39 గ్లోబల్ సొసైటీలు, 20 సెక్షన్ల ద్వారా సాంకేతిక సహకారం, అభ్యాసాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. ఐఈఈఈ విద్యార్థి శాఖ కౌన్సిలర్ డాక్టర్ నామాని రాకేశ్, చైర్పర్సన్ జి.వంశీ శాఖ అభివృద్ధి కోసం తమ ప్రణాళికలను పంచుకున్నారు. కార్యనిర్వాహక కమిటీ సభ్యులను పరిచయం చేస్తూ రాబోయే కార్యక్రమాల గురించి తెలియజేశారు. -
ఎనిమిదో పే కమిషన్ ప్రకటించాలి
బెల్లంపల్లి: రైల్వే కార్మికులకు ఎనిమిదో పే కమిష న్ను వెంటనే అమలు చేయాలని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ చైర్మన్ ఎస్.నాగరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ పిలుపు మేరకు బెల్లంపల్లి రైల్వేస్టేషన్ ఆవరణలోని సీఅండ్డబ్ల్యూ డిపో షెడ్, లోకో పైలట్ క్రూ లాబీ ఎదుట నిరసన ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే కార్మికులపై కేంద్ర ప్ర భుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్మికుల శ్రమను గుర్తించడం లేదని పేర్కొన్నారు. ఈపాటికే ఎనిమిదో వేతన కమిషన్ ను అమలు చేయాల్సి ఉన్నా పట్టించుకోకపోవడంతో రైల్వే కార్మికులు వేతన పెంపుదల లేక తీవ్ర నిరాశకు గురవుతున్నారని పేర్కొన్నారు. వేతన సంఘాన్నీ ప్రకటించి జనవరి 2026 నుంచి భేషరతుగా అమలు చేయకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి సాంబశివుడు, కోశాధికారి షోకిన్ మీనా, నాయకులు నిరాజ్, అగర్వాల్, శంకరయ్య, కార్యకర్తలు, రైల్వే కార్మికులు పాల్గొన్నారు. -
‘ఆరోగ్య పాఠశాల’ పకడ్బందీగా నిర్వహించాలి
కై లాస్నగర్: విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన మార్పుల కోసం చేపట్టిన ఆరోగ్య పాఠశాల, కళాశాల కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కార్యక్రమ అమలు తీ రుపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు, స్టూడెంట్ చాంపియన్లు కార్యక్రమ ప్రయోజనాలను వివరించారు. ఆరోగ్యకరమైన అలవాట్లు, ప్రవర్తనలో వచ్చిన మార్పులను తమ సందేశాలు, డ్రాయింగ్స్ ద్వారా స్టూడెంట్ చాంపియన్లు వివరించారు. పట్టణంలోని బంగారుగూడ మోడల్ పాఠశాల పదో తరగతి విద్యార్థి జి.ప్రనూష్ ఆరోగ్య పాఠశాల ద్వారా చేకూరిన లబ్ధిని ఆంగ్లంలో అనర్గళంగా వివరించిన తీరుతో కలెక్టర్ మంత్ర ముగ్ధులయ్యారు. ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం స్టూడెంట్ చాంపియన్లకు సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిౖకై ెన వారిని శాలువాలతో సన్మానించారు. ఇందులో హెచ్ఎంలు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.24 వరకు ఓటరు జాబితా ప్రత్యేక సవరణకై లాస్నగర్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ఈ నెల 24వరకు చేపట్టనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఇ.సుదర్శన్రెడ్డి శుక్రవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం తహసీల్దార్లకు ఆయన పలు సూచనలు చేశారు. బీఎల్వోలు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ జాబితా పక్కాగా రూపొందించేలా శ్రద్ధ వహించాలన్నారు. ఇందులో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, ఆర్డీవో స్రవంతి తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణి కార్మికుడి ఆత్మహత్య
నస్పూర్: పట్టణ పరి ధిలోని సీసీసీ శ్రీరామ్నగర్కు చెందిన సింగరేణి కార్మికుడు సీర్ల శ్రీనివాస్ (38) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ఎస్సై ఉపేందర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూనాగార్జున కాలనీకి చెందిన శ్రీనివాస్ శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే–7 గనిలో జనరల్ మజ్దూర్గా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం మిడిల్ షిఫ్ట్ విధులు నిిర్వహించి సీసీసీ కార్నర్ వద్ద గల శ్రీరాంనగర్లోని ఆయన సొంత ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత ఇంటి నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికుడు లెంకంటి సురేందర్ వెంటనే శ్రీనివాస్ తండ్రి సీర్ల నర్సయ్యకు సమాచారం ఇచ్చాడు. నర్సయ్య ఇంటికి వెళ్లి చూడగా శ్రీనివాస్ కాలిన గాయాలతో కిందపడి ఉన్నా డు. అతడిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లున్నారు. కాగా, శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.