Adilabad
-
‘రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలి’
ఆదిలాబాద్టౌన్: పంట దిగుబడులను విక్రయించేందుకు రైతులు మార్కెట్ యార్డుల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై ఎంపీ, ఎమ్మెల్యేలు దృష్టి సారించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నారాయణ అన్నారు. సీసీఐ భూముల అంశంపై చూపుతున్న శ్రద్ధను రైతు సమస్యల పరిష్కారంపై ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శనగల కొనుగోళ్ల సమయంలో ఎదురైన సమస్యలు జొన్నల కొనుగోళ్లలో పునరావృతం కాకుండా మాజీ మంత్రి జోగు రామన్న రైతుల పక్షాన నిలబడి జిల్లా ఉన్నతాధికారులతో చర్చించినట్లు పేర్కొన్నారు. అయితే స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు మాత్రం రైతు సమస్యలను పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఇందులో నాయకులు ప్రహ్లాద్, రమేష్, రాజన్న, సతీ్జగదీష్, రాజు, కలీమ్ తదితరులు పాల్గొన్నారు. -
పెట్రో ధరలు తగ్గించాలని ఆందోళన
కై లాస్నగర్: కేంద్రం వరుసగా పెంచుతున్న పెట్రో ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం ఆందో ళన చేపట్టారు. జిల్లా కేంద్రంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎ న్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తుందని ఆరో పించారు. 2029లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు. ఇందులో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బోథ్లో.. బోథ్: పెట్రో ధరల పెంపును నిరసిస్తూ బోథ్లో మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. ఇందులో మండల కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు అనీష్ కుమార్, అంజయ్య, భోజన్న, రాజు రెడ్డి, యూసుఫ్, తదితరులు పాల్గొన్నారు. -
అ‘పూర్వ’ సమ్మేళనం
ఆదిలాబాద్టౌన్: వారంతా దాదాపు మూడు దశాబ్దాల క్రితం కలిసి చదువుకున్నారు. తర్వాత ఉన్నత విద్య, ఉపాధి నిమిత్తం ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. క ట్ చేస్తే.. మళ్లీ ఒకే చోటకు చేరారు. ఇందుకు సరస్వతమ్మ ఒడి వేదికై ంది. జిల్లా కేంద్రంలోని శ్రీసరస్వతి శిశుమందిర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం హౌసింగ్ బోర్డులో ఆదివారం నిర్వహించారు. 1997–98 బ్యాచ్కి చెందిన పదో తరగతి డి సెక్షన్ విద్యార్థులు ఆత్మీయంగా కలుసుకున్నారు. తమకు చదువు చె ప్పిన గురువులను ఘనంగా సన్మానించుకున్నారు. అనంతరం పాఠశాలలో తిరుగుతూ నాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకున్నారు. తర్వాత అంతా కలిసి భోజనం చేశారు. ఆధ్యంతం ఆనందంగా గడిపారు. శిశుమందిర్లో చదవడం గర్వకారణంగా ఉందని, సమాజ సేవతో పాటు ఉత్తమ పౌరులను తయారు చేయడంలో శిశుమందిరాల పాత్ర గొప్పగా ఉంద ని పూర్వ విద్యార్థులు కొనియాడారు. కాగా ఈ స మ్మేళనానికి లండన్, హైదరాబాద్, కరీంనగర్, ని జామాబాద్ నుంచి దాదాపు 50మందిపాల్గొన్నారు. -
కోఆప్షన్.. డేట్ ఫిక్స్
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రత్యేక సమావేశ నిర్వహణపై ఎట్టకేలకు సందిగ్ధం వీడినట్లయింది. ఈ నెల 27న మధ్యాహ్నం 3గంటలకు ప్రత్యేక సమావేశం ఖరారైంది. ఇందుకు సంబంధించి సిద్ధం చేసిన అజెండాకు మున్సిపల్ చైర్పర్సన్ అనూష ఆమోదం తెలిపారు. శనివారం రాత్రే అజెండాపై ఆమె సంతకం చేయగా ఆదివారం వేకువజామునే అన్ని పార్టీల కౌన్సిలర్లకు అజెండా కాపీలను అందజేశారు. అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించనుండగా నలుగురు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. అయితే ఈ పదవులను ఏ పార్టీ కై వసం చేసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 4 పదవులకు 27 మంది పోటీ ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో మొత్తం నాలుగు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. ఇందులో ఇద్దరు మైనార్టీ, మరో ఇద్దరు జనరల్ కోటా కింద ఎన్నిక జరపాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ 17న మున్సిపల్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. వారం గడువు విధిస్తూ అదే నెల 25వరకు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంల నుంచి మొత్తం 28 దరఖాస్తులు అందాయి. వాటిని పరిశీలించిన అధికారులు నిబంధనల ప్రకారం లేకపోవడంతో ఒక దరఖాస్తును తిరస్కరించారు. ప్రస్తుతం నాలుగు పదవుల కోసం 27 మంది పోటీ పడుతున్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతీ అభ్యర్థికి సంబంధించి ఎన్నిక నిర్వహించనున్నారు. ఇందులో అత్యధిక మంది కౌన్సిల్ సభ్యుల మద్దతు ఎవరికి ఉంటుందో వారు ఎన్నికై నట్లుగా ప్రకటిస్తారు. పోటాపోటీ .. కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు గతంలో ఎన్నడూలేని విధంగా పోటీ నెలకొంది. బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి ముగ్గురితో దరఖాస్తు చేయించగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ల నుంచి పదవులను ఆశిస్తూ పలువురు పోటాపోటీగా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్న వార్డుల నుంచి ఎంఐఎం సభ్యులు దరఖాస్తు చేసుకోగా, కాంగ్రెస్ సభ్యులు ఉన్న చోట బీఆర్ఎస్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై ఆయా పార్టీల అఽధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఒకరికి మద్దతునిస్తే మరొకరు అసంతృప్తికి గురయ్యే అవకాశమున్నందున సపోర్ట్పై ఆయా పార్టీల కౌన్సిలర్లు ఆలోచనలో పడ్డారు. పదవులను ఎలాగైనా కై వసం చేసుకోవాలని భావిస్తున్న దరఖాస్తుదారులు, పార్టీలు ప్రలోభాలకు తెరలేపినట్లుగా తెలుస్తోంది. ఆయా పార్టీల తరఫున విప్ జారీ చేయనుండటంతో ఎన్నిక సమయంలో సమావేశానికి గైర్హాజరు కావాలని పలువురు కౌన్సిలర్లను కోరుతున్నారు. మద్దతు కూడగట్టిన కౌన్సిలర్లతో కలిసి వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. సమావేశానికి రాకుంటే రూ.2లక్షల నుంచి రూ.5లక్షల నగదు ముట్టజెపుతామని హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. కౌన్సిల్లో పార్టీల వారీగా బలాబలాలు బీజేపీ : 21 (ఎంపీ, ఎమ్మెల్యేతో కలుపుకుంటే 23) కాంగ్రెస్ : 11 బీఆర్ఎస్: 06 ఎంఐఎం : 06 స్వతంత్రులు: 05 -
రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో సత్తా
ఆదిలాబాద్: రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో జిల్లాకు చెందిన స్విమ్మర్ సత్తా చాటాడు. హైదరాబాద్లోని అంబర్పేట్ జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్ వేదికగా ఆదివారం నిర్వహించిన ‘11వ తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ చాంపియన్షిప్–2026’లో ఆదిలాబాద్ క్రీడాకారుడు వై.అనుదీప్ రాజ్ కాంస్య పతకం కై వసం చేసుకున్నాడు. 200 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ విభాగంలో ప్రతిభ చాటాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటడంపై జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయిని రవికుమార్, కార్యదర్శి కొమ్ము కృష్ణ, ట్రెజరర్ హరిచరణ్, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్, కోచ్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు అభినందించారు. -
ఇందిరమ్మ–2
కై లాస్నగర్: రెండో విడత ఇంది రమ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చే స్తోంది. రాష్ట్ర ఆవి ర్భావ దినోత్సవం పురస్కరించుకుని జూన్ 2న శ్రీకారం చుట్టాలని భావిస్తోంది. సీఎం అధ్యక్షతన శనివారం నిర్వహించిన రాష్ట్ర కేబినెట్లో ఒక్కో నియోజకవర్గానికి 2వేల చొప్పున ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లుగా రాష్ట్ర గృహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈమేరకు జిల్లాకు ఈ విడతలో మరో ఐదు వేల ఇళ్లు మంజూరయ్యే అవకాశముంది. వీటిపై అ ర్హులైన నిరుపేదలు గంపెడాశతో ఎదురుచూస్తున్నా రు. కాగా మొదటి విడతకు సంబంధించిన నిర్మాణాలు నత్తనడకన సాగుతుండడం గమనార్హం. నియోజకవర్గానికి 2వేల చొప్పున .. సీఎం రేవంత్రెడ్డి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు జూన్ 2న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో శ్రీకారం చుట్టనున్నారు. తొలివిడత గృహ ప్రవేశాలతో పాటు రెండో విడత ఇళ్లకు భూమిపూజ చేయనున్నారు. మలి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 2వేల చొప్పున ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలకు కలిపి 4వేల ఇళ్లు మంజూరు కానుండగా ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే గాదిగూడ, నార్నూర్, ఖానాపూర్ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాలకు కలిపి గతంలో ఒక్కో మండలానికి 200 చొప్పున మంజూరు చేసింది. ఈ లెక్కన జిల్లాకు 4800 నుంచి 5వేల వరకు మంజూరయ్యే అవకాశముంది. గతంలో మాదిరి ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తులు చేస్తే మరిన్ని మంజూరయ్యే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఇళ్ల మంజూరుపై మంత్రి పొంగులేటి ప్రకటనతో జిల్లాలోని అర్హులైన పేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అర్హులై తొలి విడతలో వివిధ కారణాలతో ఇళ్లు రాని వారు ఈ విడతలో మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు. లబ్దిదారుల ఎంపికకు క్షేత్రస్థాయి సర్వే.. జిల్లా వ్యాప్తంగా ఇంటిస్థలం కలిగి ఇళ్లు లేనటువంటి వారు 80,233 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ తాజా ప్రకటనతో ఇందులో అర్హులను గుర్తించేందుకు అధికారులు ప్రత్యేక సర్వే చేపట్టారు. ఇందుకోసం వివిధ శాఖల మండల స్థాయి గెజిటెడ్ అధికారులు 111 మందిని నియమించారు. వీరికి ప్రత్యేక లాగిన్ ఐడీలు కేటాయించారు. సదరు అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి విచారణ చేపడుతున్నారు. ఇంటి నిర్మాణం వివరాలు, ప్రభుత్వ ఉద్యోగం, నెలకు వచ్చే ఆదాయం, కారు కలిగి ఉందా లేదా వంటి వివరాలపై ఆరా తీస్తున్నారు. వాటిని యాప్లో నమోదు చేస్తున్నా రు. వీటి ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొదటి విడతలో మంజూరైన ఇళ్ల వివరాలు .. మంజూరైనవి : 16,106 మార్కౌట్స్థాయిలో : 1819 బెస్మెంట్ లెవల్ : 5219 రూఫ్లెవల్ : 2959 స్లాబ్ లెవల్ : 3026 పూర్తయినవి : 1477 ప్రారంభంకానివి : 1606జిల్లాలో తొలివిడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఈ విడతలో 16,106 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు కేవలం 1477 మాత్రమే పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ 1606 ఇండ్లకు సంబంధించి కనీసం పునాదులు సైతం తీయలేదు. ఇందులో అత్యధికంగా ఆదివాసీలు, పీవీటీజీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆర్థికస్థోమత లేకపోవడం, అటవీశాఖ పరిధిలో స్థలాలు ఉండటం, పట్టాలు లేకపోవడం వంటి కారణాలతోనే నిర్మాణానికి ముందుకు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక స్లాబ్, లెంటల్ లెవల్లో సాగుతున్న ఇళ్లలో రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా జూన్లో 1200 నుంచి 1400 గృహ ప్రవేశాలు నిర్వహించేలా హౌసింగ్శాఖ ప్రయత్నిస్తోంది. -
మహిళా వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలి
కైలాస్నగర్: ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈనెల 25 నుంచి 30 వరకు మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్రెడ్డితో కలిసి ఆదివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ‘మహిళా ఉన్నతి–తెలంగాణ ప్రగతి’ నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళా అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొనేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ, జిల్లాల వారీగా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను సమీక్షించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. అవసరమైన చోట స్థానిక హమాలీలను నియమించుకోవాలని, రవాణా సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్లు నిరంతరం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. తాలు, తరుగు పేరిట రైతుల ధాన్యంలో కోతలు విధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలి అనంతరం కలెక్టర్ రాజర్షిషా అధికారులతో సమీక్షిస్తూ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచి నిర్దేశిత గడువులోపు పూర్తి చేసి రోజువారీ లక్ష్యాలను సాధించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహిళా వారోత్సవాలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని, ప్రతిరోజూ కార్యక్రమాలను మహిళలు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు ఆర్ఎస్. చిత్రు, ఎస్.రాజేశ్వర్, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, డీడబ్ల్యూవో మిల్కా, డీఎస్వో నందిని, సివిల్ సప్లై డీఎం సుధారాణి, డీఏవో శ్రీధర్, మార్కెటింగ్ అధికారి గజానన్, రవాణా అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రెడ్డి సంఘం జిల్లా కార్యవర్గం
కై లాస్నగర్: ఆదిలాబాద్ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. పట్టణంలోని సంఘ భవనంలో నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. అధ్యక్షుడిగా ఎల్టీ ఓంప్రకాశ్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా అల్లూరి భూపతిరెడ్డి, ఉపాధ్యక్షులుగా బోరంచు శ్రీకాంత్రెడ్డి, ముడుపు కేదారీశ్వర్రెడ్డి, సింగడి పద్మరెడ్డి, కోశాధికారిగా సర్సన్ విట్టల్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రమేశ్రెడ్డి, ప్రమోద్రెడ్డి, కోప్రెసిడెంట్లుగా గోవర్ధన్ రెడ్డి, మనిలతా రెడ్డి ఎన్నికయ్యారు. కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి నూతన కార్యవర్గాన్ని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. -
షార్ట్ సర్క్యూట్తో పెంకుటిల్లు దగ్ధం
నెన్నెల: మండలంలోని మైలారం గ్రామంలో శుక్రవారం షార్ట్ సర్క్యూట్తో బొమ్మెన మురళీధర్గౌడ్కు చెందిన పెంకుటిల్లు పూర్తిగా దగ్ధమైంది. భూక్య చందు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పంట పొలాల్లో వ్యవసాయ సామగ్రిని భద్రపర్చుకోవడానికి బాధిత రైతు కట్టుకున్న పెంకుటిల్లులో విద్యుత్ వైర్లు ఒకటికొకటి తగిలి షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రామపంచాయతీ సిబ్బంది అప్రమత్తమై అక్కడికి చేరుకుని పంచాయతీ ట్యాంకర్తో నీటిని చల్లి మంటలు ఆర్పివేశారు. అప్పటికే ఇల్లు పూర్తిగా కాలిబూడిదైంది. ఈ ప్రమాదంలో టేకు దుంగలు, వాసాలు, బోర్వెల్, డ్రిప్ పైపులు, స్టాటర్లు, ప్లాస్టిక్ పైపులు కాలి పోయాయి. సుమారు రూ.3లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. బాధితుడికి పరిహారం అందేలా చూస్తామని జీపీవో చందు తెలిపారు. -
453 ఎస్హెచ్జీలు.. రూ.51.20కోట్లు
కై లాస్నగర్: పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహా యక సంఘాల మహిళలకు మెప్మా ద్వారా అందించే బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యాన్ని ప్రభుత్వం ఖరా రు చేసింది. 2026–27ఆర్థిక సంవత్సరానికి గాను ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో రూ.51.20 కోట్లు అందించాలని లక్ష్యంగా నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది లక్ష్యంతో పోల్చితే ఈ ఏడాది రూ.7.04కోట్లు అదనంగా కేటాయించింది. తదనుగుణంగా అర్హులైన సంఘాలకు రుణాలు అందించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అర్హత గల ఒక్కో సంఘానికి రూ.5లక్షల నుంచి రూ.20లక్షల వరకు అందజేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఆర్థిక స్థిరత్వం సాధించేలా.. స్వయం సహాయక సంఘాల్లోని మహిళా సభ్యులు ఆర్థిక స్థిరత్వం సాధించడంతో పాటు వ్యాపారులుగా ఎదగాలనే ఉద్దేశంతో బ్యాంకుల ద్వారా ప్ర భుత్వం రుణాలు అందిస్తోంది. టైలరింగ్, కిరాణ, సెంట్రింగ్, ఆహార ఉత్పత్తుల తయారీ, కుటీర పరిశ్రమల ఏర్పాటు, పాడి ఉత్పత్తి, కోళ్ల పెంపకం వంటి వ్యాపారాలకు ఆర్థికంగా చేయూతనంది స్తోంది. ఒక్కో సంఘంలో 10 మంది సభ్యులు ఉండగా వారి రుణ వాయిదాల చెల్లింపు ఆధారంగా రూ.5లక్షల నుంచి రూ.20లక్షల వరకు రుణాలు అందజేస్తోంది. వీటి ద్వారా ఆయా వ్యాపారాల్లో రాణించడంతో పాటు కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచే అవకాశం ఏర్పడుతుంది. అయితే చాలా మంది సభ్యులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకుండా వెనుకబడిపోతున్నారు. అయితే అలాంటి వారిని కొత్త రుణాలకు అనర్హులుగా ప్రకటిస్తున్నారు. గతేడాది లక్ష్యానికి మించి.. గతేడాది లక్ష్యం కేటాయింపు నుంచే బ్యాంకులు, సంఘాల వారీగా మెప్మా సిబ్బంది పక్కా కార్యాచరణతో ముందుకు సాగారు. వారి కృషి ఫలితంగా లక్ష్యానికి మించి రుణాలు అందించారు. 441 సంఘాలకు గాను రూ.59.93 కోట్లు అందజేశారు. ల క్ష్యానికి మించి 35శాతం అధికంగా పంపిణీ చేసి మ హిళల ఆర్థికాభ్యున్నతికి అండగా నిలిచారు. కాగా ఈ ఏడాది సంఘాల సంఖ్యతో పాటు రూ.7కోట్లు అదనంగా పెంచారు. రుణాల మంజూరుతో పాటు వాటిని తిరిగి చెల్లించేలా మెప్మా సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించినట్లయితే మరింత మందికి కొత్త రుణాలు అందజేసే అవకాశం ఏర్పడుతుంది. సద్వినియోగం చేసుకోవాలి ఈ ఆర్థిక సంవత్సరానికి గాను బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. గతేడాదితో పోల్చితే రూ.7కోట్లు అదనంగా కేటాయించింది. పట్టణానికి కేటాయించిన రుణలక్ష్యంలో ప్రస్తుతం మున్సిపల్ పరిధిలో చేపట్టిన ‘ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా పలు సంఘాలకు రుణాలు అందజేస్తున్నాం. ప్రతీ సంఘానికి రుణం అందించేలా శ్రద్ధ వహిస్తాం. వందశాతం లక్ష్యాన్ని సాధించేలా ముందుకు సాగుతాం. – సీవీఎన్.రాజు, మెప్మా పీడీ సంవత్సరం సంఘాలు కేటాయించిన లక్ష్యం సంఘాలు మంజూరు చేసిన మొత్తం 2024–25 421 రూ.40.22 కోట్లు 382 రూ.72.93 కోట్లు(181శాతం) 2025–26 416 రూ.44.16 కోట్లు 441 రూ.59.93 కోట్లు(135శాతం) 2026–27 453 రూ.51.20 కోట్లు –– –– -
అష్టాచెమ్మా.. ఆడెద్దామా..
వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. పిల్లలు ఆటలాడుకునేందుకు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. అందుకే నీడ పట్టున ఆడే ఆటలవైపే మొగ్గు చూపుతున్నారు. కన్నెపల్లి మండలంలోని జన్కాపూర్లో ఓ ఇంటి ఎదుట చెట్టు నీడన నలుగురు చిన్నారులు ఇలా అష్టాచెమ్మా ఆడుతూ కనిపించారు. – భీమిని వేసవి సెలవుల్లో కన్నెపల్లి మండలంలోని రెబ్బెన గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చిన చిన్నారులు పెద్దలు చెప్పినట్టు బుద్ధిగా ఇంటి బయటకు వెళ్లడంలేదు. ఇంట్లో రోజూ బొమ్మలాట ఆడుతున్నారు. మధ్యాహ్నం వేళ ఉక్కపోత భరించలేక ఇలా నీటితో నింపిన తొట్టిలో జలకాలాడుతూ సేదతీరుతున్నారు. – భీమిని -
‘మత మార్పిడిలను సహించేది లేదు’
ఆదిలాబాద్: మత మార్పిడిలను ఇకపై సహించేది లేదని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న వనవాసీ కల్యాణ పరిషత్ కార్యకర్తలతో శుక్రవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి స మావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే మత మార్పిడిలు జరిగి జాతికి తీవ్ర అన్యాయం జరి గిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వంలో ప్రస్తుతం న్యాయం జరుగుతుందన్నా రు. అనంతరం వారాహి హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్లో మజ్జిగ పంపిణీలో వారు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ఫౌండర్ శిరీష్, సభ్యులు మహేశ్, కిరణ్, ప్రవీణ్, సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణికులకు మెరుగైన సేవలే లక్ష్యం
● ఆర్టీసీ ఆర్ఎం విజయభాను ఆదిలాబాద్: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆర్టీసీ పనిచేస్తోందని ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్ విజయభాను అన్నారు. జిల్లా కేంద్రంలోని డిపో శిక్షణ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ప్రయాణికులతో డ్రైవర్లు, కండక్టర్లు మర్యాదగా వ్యవహరించాలన్నారు. వృత్తిపరమైన ఒత్తిడి అధిగమించేందుకు సిబ్బంది ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించాలని సూచించారు. వ్యాయామం, ధ్యానం వంటివి అలవర్చుకోవాలన్నారు. ఏ చిన్న సమస్య ఎదురైనా వెంటనే డిపో మేనేజర్, డిప్యూటీ ఆర్ఎంలను సంప్రదించాలని సూచించారు. నిబద్ధతతో పనిచేస్తూ సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఇందులో డిప్యూటీ ఆర్ఎం రామయ్య, అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్, ఎంఎఫ్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాను ప్రగతిపథంలో నిలపాలి
కై లాస్నగర్: నిర్దేశిత లక్ష్యాలను గడువులోపు పూర్తి చేసి జిల్లాను రాష్ట్రంలోనే ప్రగతిపథంలో నిలిపేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ రా జర్షి షా అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్లో శుక్రవారం జి ల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో అవసరాలు గు ర్తించి, తదనుగుణంగా నిధులు కేటాయించడమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతీ గ్రామాని కి స్పష్టమైన, ఆచరణాత్మక ప్రణాళిక ఉండాలని, ఇందుకోసం మండల, గ్రామస్థాయి అధికారులు స మన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం మెగా జాబ్మేళా ద్వారా ఎంపికై న అభ్యర్థుల కు నియామక పత్రాలు, పదోతరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు, చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ జీపీలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇందులో ఐటీడీఏ పీవో మంద మకరంద్, అదనపు కలెక్ట ర్ ఎస్.రాజేశ్వర్, మున్సిపల్ చైర్పర్సన్ అనూష, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్రెడ్డి, జి ల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మెప్మా పీడీ సీవీఎన్.రాజు తదితరులు పాల్గొన్నారు. సర్వే గడువులోపు పూర్తి చేయాలి జనగణన సర్వేను నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సెన్సెస్ చార్జ్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్స్తో శుక్రవారం వీడియో కాన్పరెన్స్ నిర్వహించి ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో సేకరించే ప్రతీ అంశం కచ్చితత్వంతో కూడి ఉండాలని, ఎక్కడా తప్పులకు తావుండకూడదని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, గడువులోపు పూర్తి చేయకపోయినా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. వీసీలో డీఆర్వో స్రవంతి, సూపరింటెండెంట్ నలంద ప్రియ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు, ఉత్తమ ఫలితాలు సాధించాలి రానున్న విద్యాసంవత్సరంలో ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో శుక్రవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఇందులో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఆర్వో స్రవంతి, డీఐఈవో గణేశ్జాదవ్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. -
పట్టపగలు ఇంట్లో చోరీ
భైంసారూరల్: పట్టపగలు ఇంట్లోకి చొరబడి నగదు, బంగారం అపహరించిన ఘటనలో నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 6న మండలంలోని దేగాం గ్రామానికి చెందిన దావుల మయూరి ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లింది. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో ఉన్న సుమారు మూడు మాసాల బంగారం, రూ.1,500 నగదు ఎత్తుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఆధారాలు సేకరించి, అదే గ్రామానికి చెందిన పోశెట్టిని అదుపులోకి తీసుకుని విచారించగా అతడు నేరాన్ని అంగీకరించినట్లు సీఐ పేర్కొన్నారు. రూ.4వేల నగదు రికవరీ చేసినట్లు వెల్లడించారు. ఎస్సై సుప్రియ, సిబ్బంది ఉన్నారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యంభైంసాటౌన్: పట్టణంలోని భైంసా–బాసర మార్గంలోని సాత్పూల్ వంతెన కింద శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీయించేందుకు చర్యలు చేపట్టారు. బురదనీటిలో కుళ్లిన స్థితిలో ఉండడంతో గుర్తు పట్టలేని విధంగా ఉంది. మృతదేహాన్ని వెలికి తీయించి ఏరియాస్పత్రిలోని మార్చురీకి తరలిస్తామని సీఐ సాయికుమార్ తెలిపారు. ఏఈవోను దూషించిన వ్యక్తిపై అట్రాసిటీ కేసునేరడిగొండ: ఏఈవోను కులం పేరుతో దూషించి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఇచ్చోడ రూరల్ సీఐ రమేశ్ తెలిపారు. యాసంగి పంట నమోదు ప్రక్రియ చేపడుతున్న క్రమంలో కుమారి గ్రామానికి చెందిన గడ్డం చంద్రశేఖర్రెడ్డి తన భూమి వివరాలు తిరిగి నమోదు చేయాలని ఏఈవోకు తరచూ ఫోన్ చేసి ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొన్నారు. కులం పేరుతో దూషించి బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ల నియామకం కైలాస్నగర్: కాంగ్రెస్ ఎస్సీ విభాగం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చైర్మన్లను నియమిస్తూ ఆ విభాగం రాష్ట్ర చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్ జిల్లా చైర్మన్గా కొలేట్కర్ పరమేశ్వర్, నిర్మల్ జిల్లా చైర్మన్గా కట్టా శ్యాంసుందర్, మంచిర్యాల జిల్లాకు పి.నర్సిములు, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చైర్మన్గా దుర్గం హంసరాజ్ను నియమించారు. -
డ్రాయింగ్ వేస్తూ.. డ్యాన్స్ చేస్తూ..
రింగ్ ఆడుతున్న చిన్నారులు స్కిప్పింగ్ ఆడుతున్న చిన్నారులు డ్యాన్స్ చేస్తున్న విద్యార్థులు భీమారంలో డ్రాయింగ్ వేస్తున్న విద్యార్థులు భీమారం: మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపుకు స్పందన లభిస్తోంది. ఈ శిబిరంలో డ్యాన్స్, చిత్రలేఖనంలో శిక్షణ ఇస్తున్నారు. వస్త్రంపై వివిధ రకాల అల్లికలు కూడా నేర్పిస్తున్నారు. దీంతో విద్యార్థులు వారికి నచ్చిన అంశంలో చికిత్స పొందేందుకు ఉత్సాహంగా శిబిరానికి వస్తున్నారు. బెట్టు చేయం.. చెట్లు వీడం.. దండేపల్లి: వేసవి సెలవుల్లో పిల్లలు చెట్ల నీడన చేరి ఆటలు ఆడుతూ సందడి చేస్తున్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలోని చెట్ల నీడలో చిన్నారులు రోజూ ఇలా రింగ్, స్కిప్పింగ్ ఆడుతూ కనిపిస్తున్నారు. -
కర్రసాములో శిక్షణ పొందుతున్న
మా పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరంలో కర్రసాములో శిక్షణ పొందుతున్నాను. కర్రసాము అంటే నాకు చాలా ఇష్టం. ఈ వేసవి సెలవుల్లో కర్రసాము శిక్షణ పూర్తి చేసుకుంటుండడం సంతోషంగా ఉంది. మాస్టర్ సులభమైన పద్ధతిలో శిక్షణ ఇస్తుండగా నేను చాలా బాగా నేర్చుకుంటున్నాను. – సహర్ష్ కర్రసాముతోపాటు యోగా కూడా.. సమ్మర్ క్యాంప్లో యోగా, కర్రసాము, చిత్రలేఖంలో శిక్షణ ఇస్తున్నారు. నేను యోగా, కర్రసాము శిక్షణ తరగతులకు హాజరవుతున్నాను. రెండు తరగతుల మధ్య కొంత సమయం ఉండగా యోగా, కర్రసాము నేర్చుకుంటున్నాను. తరగతులు చక్కగా నిర్వహిస్తున్నారు. సులభంగా నేర్పిస్తున్నారు. – సీహెచ్ శ్రీనిధి -
డిమాండ్ రకాలు అందుబాటులో ఉంచాలి
రైతులు డిమాండ్ చేసే పత్తి విత్తన కంపెనీల ప్యాకెట్లను మార్కెట్లో అందుబాటులో ఉంచాలి. ఏటా ఆ వైరెటీలు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర కంపెనీల విత్తనాలు మార్కెట్లో పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్నా రైతులు మాత్రం కొన్నిరకాలకు మాత్రమే ఆసక్తి చూపుతారు. – కృష్ణారెడ్డి, భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు అన్ని రకాలు నాణ్యమైనవే.. జిల్లాలో ప్రైవేట్ కంపెనీలు డిమాండ్ మించి పత్తి విత్తనాల ప్యాకెట్లను అందుబాటులోకి తీసుకొ చ్చాయి. అన్నిరకాల సీ డ్స్ నాణ్యమైనవే. ఈ దృష్ట్యా రైతులు ఎలాంటి సంకోచం లేకుండా ఆ యారకాలను కొనుగోలు చేయాలి.– శ్రీధర్స్వామి, జిల్లా వ్యవసాయ అధికారి, ఆదిలాబాద్ -
ఇష్టంగా నేర్చుకుంటున్నాను
నాకు కర్ర తిప్పడమంటే చాలా ఇష్టం. అదృష్టం కొద్ది మా పాఠశాలలో కర్ర సాము నేర్పిస్తున్నారు. చాలా ఇష్టంగా నేర్చుకుంటున్నాను. ప్రతీ సంవత్సరం పాఠశాలలో వేసవి సెలవుల్లో ఇలాంటి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మేమంతా సమ్మర్ క్లాస్లకు సంతోషంగా హాజరవుతున్నాం. – శివప్రియ చిన్పప్పటి నుంచే బొమ్మలు గీస్తా సమ్మర్ క్యాంపులో కర్రసాము, యోగాతోపాటు చిత్రలేఖనంలోనూ శిక్షణ ఇస్తున్నారు. బొమ్మలు గీయడమంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. వేసవి సెలవుల్లో ప్రత్యేకంగా చిత్రలేఖనంలో శిక్షణ ఇస్తుండడం సంతోషంగా ఉంది. ప్రతీరోజు శిక్షణ తరగతులకు హాజరవుతున్నాను. మంచి అవకాశం కల్పించారు. – శ్రీమణి -
● యోగా, చిత్రలేఖనంలోనూ మెరికలు ● నచ్చిన అంశంలో రాణిస్తున్న పిల్లలు ● సమ్మర్ క్యాంపులకు పెరిగిన ఆదరణ
కర్రసాములో శిక్షణ పొందుతున్న విద్యార్థులుచెన్నూర్: వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థులకు సత్ఫాలితాలనిస్తున్నాయి. చెన్నూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలబాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థినులు కర్ర సాములో శిక్షణ పొందుతూ రాటుదేలుతున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సరిత ఆధ్వర్యంలో కరాటే ఇన్స్ట్రక్టర్ ఆర్.స్వామి, యోగా శిక్షకురాలు సరిత, చిత్రలేఖనంలో ఉపాధ్యాయుడు శంకర్ ఆయా అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. శిబిరంలో 7–10 ఏళ్ల విద్యార్థులకు ఉదయం 8నుంచి 10గంటల వరకు కర్రసాము, యోగా, చిత్రలేఖనంలో మెళకువలు నేర్పుతున్నారు. నిత్యం శిబిరానికి విద్యార్థులు ఉత్సాహంగా హాజరవుతున్నారు.యోగాసనాలు వేస్తున్న విద్యార్థులు -
దుబాయిలో యువకుడి మృతి
ఖానాపూర్: మండలంలోని బిర్నంది గ్రామానికి చెందిన శాఖాపురం మల్లేశ్ (42) దుబాయిలో అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేశ్ రెండేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయికి వెళ్లి అక్కడి ఓ పెయింటింగ్ కంపెనీలో ప్యాకింగ్ పనులు చేస్తున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వచ్చేందుకు సిద్ధమవుతున్న క్రమంలో అనారోగ్యానికి గురయ్యాడు. దాదాపు 10రోజులకుపైగా అక్కడే చికిత్స పొందుతూ ఈ నెల 18న మృతి చెందాడు. మృతుడికి భార్య కవిత, కుమారుడు శ్రీనాథ్, కుమార్తె శ్రీనిధి ఉన్నారు. శుక్రవారం మల్లేశ్ మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఇంటికి పెద్దదిక్కు కోల్పోయామని కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అగ్నిప్రమాదంలో 10 గొర్రెలు మృతిఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో శుక్రవారం ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని పది గొర్రెలు ఆహుతి అయ్యాయి. మంచిర్యాల జిల్లా వెంకటాపూర్ గ్రామానికి చెందిన గొర్రెలకాపరులు రెండు నెలల క్రితం ఓదెల మండలం కనగర్తికి మన్నెం వచ్చారు. గ్రామ శివారులో 150 గొర్రెలు, మేకలతో మంద పెట్టారు. అక్కడే గుడారాలు వేసుకుని ఉంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా గాలి వీచడంతో సమీపంలోని కరెంట్ తీగలు రాపిడికి గురయ్యాయి. ఈక్రమంలో నిప్పురవ్వలు ఎగిసిపడి పొలంలోని వరి కొయ్యకాలుకు అంటుకున్నాయి. ఆ వెంటనే పొలం మొత్తం వ్యాపించాయి. గొర్రెలు, మేకలున్నచోటుకు రావడంతో కాపరులు మందను దూరంగా పరుగెత్తించేందుకు యత్నించారు. ఈక్రమంలో అందులోని పది గొర్రెలు అగ్నికి ఆహుతయ్యాయి. మిగతా జీవులు, కాపరులు పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. స్థానికులు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. కళ్లముందే కాలిపోయిన గొర్రెలను చూస్తూ గొర్రెలకాపరులు రోదించారు. -
వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి
జన్నారం: ఉట్నూర్ మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన ఉపాధిహామీ కూలీ వడదెబ్బతో మృతి చెందిన ఘటన జన్నారంలో చోటు చేసుకుంది. ఎస్సై ఉదయ్కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూర్ మండల ఘన్పూర్ గ్రామానికి చెందిన కోవ కిరణ్కుమార్ (27) ఉపాధిహామీ కూలీగా పని చేస్తున్నాడు. ఈ నెల 21న ఉపాధిహామీ పనికి వెళ్లి ఇంటికి వచ్చిన ఆయన సెల్ఫోన్ మరమ్మతు చేయించుకునేందుకు జన్నారం వెళ్తానని ఇంట్లోంచి వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాలేదు. శుక్రవారం ఉదయం జన్నారం బస్టాండ్లో ఓ మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో ఎస్సై అక్కడికి వెళ్లి పరిశీలించారు. కిరణ్కుమార్ మృతదేహంగా అతడి కుటుంబ సభ్యులు గుర్తించారు. అయితే.. వడదెబ్బతో చనిపోయినట్లు మృతుడి అన్న కోవా సుంగు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కుచులాపూర్లో వ్యవసాయ కూలీ.. తాంసి: తలమడుగు మండలంలోని కుచులాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం రాము (44) అనే వ్యవసాయ కూలీ గురువారం చేను పనికి వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. శుక్రవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురికాగా గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్కు సమాచారం అందించారు. అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించే క్రమంలో ఇంటి వద్దే రాము మృతిచెందాడు. -
బడి బస్సు భద్రమేనా?
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో బడి బస్సు భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఫిట్నెస్ గడువు ముగిసినా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. చిరిగిన సీట్లు, అరిగిన టైర్లు, పగిలిన అద్దాలతోనే ఏటా రోడ్లపై తిరుగుతున్నాయని తల్లిదండ్రుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్ గడువు ముగిసినా సంబంధిత అధికారులు మామూలుగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. ఏటా ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు హడావుడి తప్పితే తర్వాత పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలం చెల్లిన బస్సులు.. పిల్లలను పాఠశాలలకు తీసుకెళ్లాల్సిన ఆయా బస్సుల కండీషన్ దారుణంగా ఉంది. ఎప్పటికప్పుడు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన యాజమాన్యాలు ఆ దిశగా దృష్టి సారించడం లేదు. ఈనెల 15తో బస్సుల ఫిట్నెస్ గడువు ముగిసింది. జిల్లాలో ప్రైవేట్ స్కూల్ బస్సులు 233 ఉండగా, ఇప్పటివరకు కేవలం 30కి మాత్రమే ఫిట్నెస్ చేయించుకోవడం గమనార్హం. వాహనాల సామర్థ్యాన్ని పరిశీలించాల్సిన సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కొందరు కాలం చెల్లిన బస్సులను రోడ్లపై తిప్పుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జూన్ 12 నుంచి బడులు పునఃప్రారంభం ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు ఉండడంతో స్కూల్ బస్సులు మూలనపడ్డాయి. చాలా వరకు మరమ్మతుల్లో ఉన్నాయి. బడి పునఃప్రారంభం అ య్యే నాటికి సిద్ధం చేసుకోవాల్సిన యాజమాన్యాలు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని తెలుస్తోంది. సెలవులు ముగియక ముందే బస్సుల్లో సీట్లు, అద్దాలు, టైర్లు, తదితర సామగ్రి అన్ని సక్రమంగా ఉన్నా యా.. లేదా.? చూసుకోవాలని రవాణా శాఖ అ ధికారులు సూచిస్తున్నారు. అలాగే ఈ బస్సులకు సంబంధించి 32 అంశాలతో కూడిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. డ్రైవర్ వయసు 60 ఏళ్లకు మించొద్దు. ఫిట్నెస్, ఇన్సూరెన్స్ తప్పనిసరి. బస్సులో విద్యార్థుల వివరాలతో కూడిన పట్టిక నమోదు చేసి ఉంచాలి. అలాగే వాహనాన్ని 15 సంవత్సరా లు మించి నడపరాదు. అయితే జిల్లాలో ఈ నిబంధనలను చాలా చాలా పాఠశాలలు విస్మరిస్తూ కండీషన్ లేని బస్సుల్లో విద్యార్థులను తరలిస్తున్నాయి. దీంతో చిన్నారులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు నిబంధనలు అతిక్రమించే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం. ఈనెల 15తో బస్సుల ఫిట్నెస్ గడువు ముగిసింది. మరమ్మతులు పూర్తి చేసుకుని ఫిట్నెస్ చేయించుకోవాలి. డ్రైవర్లు, క్లీనర్లు, యాజమాన్యాలకు అవగాహన కల్పిస్తాం. కాలంచెల్లిన వాహనాలను నడపొద్దు. తరచూ తనిఖీలు చేపట్టి పర్యవేక్షిస్తాం. భద్రత విషయంలో రాజీ పడేది లేదు. – సీపెల్లి శ్రీనివాస్, జిల్లా రవాణాశాఖ అధికారి, ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు: 167 అందులో విద్యార్థులు: 45వేలు పైవేట్ స్కూల్ బస్సులు: 233 ఇప్పటి వరకు ఫిట్నెస్ చేయించుకున్నవి : 30 -
దీపపు స్తంభంపై ప్రాచీన శిలాశాసనం
లక్ష్మణచాంద: నిర్మల్ జిల్లా కేంద్రానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని వడ్యాల్ గ్రామంలో అరుదైన ప్రాచీన శిలాశాసనాలను గుర్తించినట్లు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు తుమ్మల దేవరావ్ తెలిపారు. శుక్రవారం ఆయన అబ్బడి రాజేశ్వర్రెడ్డి కలిసి గ్రామాన్ని సందర్శించారు. గ్రామానికి పశ్చిమ దిక్కునున్న ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలోని హనుమాన్ ఆలయ సమీపంలో నాలుగు అడుగుల ఎత్తైన దీపపు స్తంభంపై చెక్కబడిన దాన శాసనం, మరో రెండు లఘు శాసనాలు పరిశీలించినట్లు ఆయన తెలిపారు. శాసనంలోని అక్షరాలను మధ్యయుగపు తెలుగు–కన్నడ లిపికి చెందినవిగా గుర్తించవచ్చని తెలిపారు. శాసనం ప్రారంభంలో ‘స్వస్తి శ్రీ’ అని స్పష్టంగా కనిపిస్తుండగా ఇది దాన శాసనంగా భా విస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై మరింత శాసీ్త్రయ పరిశోధన అవసరమని అభిప్రాయపడ్డారు. దీపపు స్తంభంపై కనిపిస్తున్న శాసనం 11–15 శతాబ్దాల మధ్యకాలానికి చెందినదై ఉండవచ్చని పేర్కొన్నారు. మరో రాయిపైనున్న అస్పష్ట శాసనంలోని అక్షరాలు దేవనాగరి లిపిని పోలి ఉన్నాయని తెలిపారు. గ్రామ దేవతకు సంబంధించిన శిలపై సింధూరం పూయడంతో పూర్తి శాసనాన్ని స్పష్టంగా చదవడం సాధ్యపడలేదని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో మరో లఘు శాసనాన్ని గుర్తించినట్లు చెప్పారు. ఈ మూడు శాసనాలు కళ్యాణి చాళుక్యుల కాలం నుంచి కాకతీయుల మధ్యయుగ కాలానికి చెందినవిగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు నిర్మల్ జిల్లాలో 18 శాసనాలను వెలుగులోకి తీసుకువచ్చి వాటిపై పరిశోధనలు నిర్వహించినట్లు వివరించారు. -
ఫుల్ స్టాక్
సాక్షి,ఆదిలాబాద్: వానాకాలం సాగు సీజన్ వచ్చిందంటే జిల్లాలో మొదట చర్చకు వచ్చేది పత్తి విత్తనాలే. అయితే అనేక రకాల కంపెనీల ప్యాకెట్లు మార్కెట్లో విరివిగా అందుబాటులో ఉన్నాయని, కొరత సమస్య ఉత్పన్నమయ్యే పరిస్థితే ఉండదని ఏటా వ్యవసాయ శాఖ చెబుతోంది. తీరా క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితులు ఎదురవుతాయి. రైతులు అధికంగా నాలుగు కంపెనీల సీడ్ మాత్రమే కావాలని అడుగుతారు. అవి డిమాండ్ మేర ఇచ్చే పరిస్థితులు ఉండవు. దీంతో వాటి కోసం వేకువజామునే దుకాణాల ఎదుట బారులుతీరడం, ఒక్కోసారి పరిస్థితి అదుపు తప్పడం ఏటా జిల్లాలో ఆనవాయితీగా మారింది. ఈ సీజన్లో జిల్లాలో అన్ని పంటలు కలిపి సుమారు 5లక్షల 91వేల ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో 70 శాతానికి పైగా పత్తి సాగు కానుంది. ఈ ప్రాంత రైతులు తెల్లబంగారాన్ని నమ్ముకొని తేటా వానాకాలంలో పత్తిని పెద్ద ఎత్తున సాగు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సీజన్ సమీపిస్తుంది. మృగశిరకార్తె ప్రవేశంతో పాటు వానలు మంచిగా కురిసిన పక్షంలో రైతులు జూన్ రెండో వారంలోనే పెద్ద ఎత్తున విత్తనాలు విత్తేందుకు అవకాశం ఉంది. ఇదీ పరిస్థితి.. జిల్లాలో నాణ్యమైన లాంగ్స్టాపిల్ పత్తి దిగుబడి అవుతుంది. పొడవైన దారాలు కలిగిన పత్తిని లాంగ్స్టాపిల్గా పరిగణిస్తారు. ఇది మృదువైన, మన్నికై న, నాణ్యమైన వస్త్రాలను తయారీకి ఉపయోగపడుతుంది. లాంగ్స్టాపిల్ ధరనే జిల్లాలో రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం రూ.557లు అధికంగా పెంచారు. లాంగ్స్టాపిల్ పత్తి క్వింటాలుకు రూ.8,667 ధర నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పత్తి విస్తీర్ణం మరింత పెరుగుతుందా.. లేనిపక్షంలో పరిస్థితులు ఎలా ఉంటాయనేది చూడాల్సిందే. ఈ వానాకాలం సీజన్లో.. పత్తి సాగు విస్తీర్ణం అంచనా : 4లక్షల 25వేల ఎకరాలు అవసరమయ్యే విత్తన ప్యాకెట్లు : 10లక్షల 66వేలు (450 గ్రాములు) విత్తన కంపెనీల వద్ద లభ్యత : 19లక్షల ప్యాకెట్లు వైరెటీల సంఖ్య : 60 -
వడదెబ్బకు సొమ్మసిల్లిన ఐకేపీ వీవోఏ
నెన్నెల: మండల కేంద్రంలో ఐకేపీ వీవోఏలు చేస్తున్న నిరవధిక సమ్మెలో పాల్గొన్న మెట్పల్లి గ్రామానికి చెందిన వీవోఏ దుగుట సంతోష్ శుక్రవారం దీక్షాశిబిరంలో వడదెబ్బతో సొమ్మసిల్లి పడిపోయాడు. గమనించిన తోటి వీవోఏలు అతడిని స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్లి చికిత్స అందించారు. వీవోఏలు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్పల్లి నుంచి సంతోష్ బైక్పై ఎండలో 15కిలోమీటర్లు ప్రయాణించి దీక్షాశిబిరానికి చేరుకున్నాడు. 15 నిమిషాల త్వరాత దాహం వేస్తుందని, కళ్లు తిరుగుతున్నాయని చెప్పి పడిపోయాడు. చికిత్స అందించిన తర్వాత కోలుకున్నట్లు తోటి వీవోఏలు తెలిపారు. కాగా, ఐదురోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వీవోఏలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. -
మామిడి, టేకు చెట్లు దహనం!
నెన్నెల: ప్రమాదవశాత్తు మామిడి, టేకు చెట్లు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు దహనమైన ఘటన మండల కేంద్రంలోని కొత్త పోశమ్మ సమీపంలో చోటు చేసుకుంది. బాధిత రైతు దూపం చందు తెలిపిన వివరా ల ప్రకారం.. కొత్తపోశమ్మ సమీపంలో చందు ఐదెకరాల్లో తొమ్మిదేళ్లుగా మామిడి, టేకు మొక్కలు పెంచుతున్నాడు. ఇందుకు కావాల్సిన బిందు సేద్యం ప రికరాలు సమకూర్చుకున్నాడు. శుక్రవారం ప్రమాదవశాత్తు చెట్లకు మంటలు అంటుకున్నాయి. మేక ల కాపరి ఇచ్చిన సమాచారం మేరకు చందు తోట కు వెళ్లేసరికి 120 మామిడి, 300 టేకు చెట్లతోపాటు డ్రిప్ గేట్ వాల్స్, పైపులు కాలిపోయాయి. సుమారు రూ.6లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపాడు. గుర్తు తెలియని వ్యక్తి నిప్పు పెట్టినట్లు అనుమానించి స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నాడు. -
సీఎం ప్రజావాణిలో 396 దరఖాస్తులు
సాక్షి,ఆదిలాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన 224వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 396 దరఖాస్తులు అందాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 163, రెవెన్యూ శాఖకు సంబంధించి 47, ఇందిరమ్మ ఇండ్ల కోసం 113, ప్రవాసి ప్రజావాణికి 01 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 72 దరఖాస్తులు అందాయి.సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి దరఖాస్తులు స్వీకరించి ప్రజల సమస్యలు విని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏ.సీ.పీ. ఉమేందర్, ఎన్.ఆర్.ఐ. సమన్వయ మండలి వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మాతాశిశువుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఇచ్చోడ:మాతాశిశువుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. గురువారం ఇచ్చోడ పీహెచ్సీలో బేబీ ఫీడింగ్ రూంను ప్రారంభించి మాట్లాడారు.కేంద్రంలో బీజేపీ ప్ర భుత్వం మాతా శిశు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. వైద్యాధికారి మధురిమ, సీహెచ్వో బ్రహ్మానందరెడ్డి, హెల్త్ అసిస్టెంట్ రాథోడ్ కై లాస్, సిబ్బంది పాల్గొన్నారు. తల్లీబిడ్డల ఆరోగ్యానికి పెద్దపీట నేరడిగొండ: తల్లీ బిడ్డల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. నేరడిగొండ పీహెచ్సీలో బేడీ ఫీడింగ్ సెంటర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లులు తమ చిన్నారులకు ప్రశాంత వాతావరణంలో పాలిచ్చేందుకు ప్రత్యేకంగా సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానందం, మండల అధ్యక్షుడు ఆకుల రాజశేఖర్, జిల్లా కార్యదర్శి గాదె శంకర్, దక్షిణ మధ్య రైల్వే బోర్డ్ మెంబర్ గణేష్ భోసారె, తదితరులు పాల్గొన్నారు. మాతా శిశువుల సంక్షేమానికి గొప్ప వేదిక బోథ్: మండల కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన బేబీ ఫీడింగ్ సెంటర్ మాతా శిశువుల సంక్షేమానికి ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని ఎంపీ గోడం నగేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ రాజనాల రవీంద్ర ప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ కదం ప్రశాంత్, కేంద్రె శివ, కనపర్తి చంద్రకాంత్, జాదవ్ రమేశ్ పాల్గొన్నారు. మహిళల ఆత్మగౌరవం కోసమే..తలమడుగు: మహిళల ఆత్మగౌరవం కోసమే మదర్ ఫీడింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీ గోడం నగేష్ అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీలో కోల్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన ‘మదర్ ఫీడింగ్ రూమ్’ను ప్రారంభించారు. సర్పంచ్ ఏలుగు చంటి, పాల్గొన్నారు. మాతాశిశు సంక్షేమానికి కృషి బజార్హత్నూర్: జిల్లాలో మాతాశిశు సంక్షేమానికి కృషి చేస్తానని ఎంపీ గోడం నగేష్ అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీలో మదర్ బేబీ ఫీడింగ్ క్యాబిన్ను ప్రారంభించారు. పీఏసీఎస్ చైర్మన్ మేక ల వెంకన్న, మండల అధ్యక్షుడు పోరెడ్డి శ్రీనివాస్, శంకర్, రమణ, గణేష్, చంద్రకాంత్ పాల్గొన్నారు. గుడిహత్నూర్ : మండల కేంద్రంలోని బస్టాండ్, పీహెచ్సీలో ఏర్పాటు చేసిన మదర్ ఫీడింగ్ గదులను ఎంపీ నగేష్ ప్రారంభించారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ కేంద్రే, మండలాధ్యక్షుడు శివ కేంద్రే, తదితరులు పాల్గొన్నారు. -
సదరం సర్టిఫికెట్ల కోసం తంటాలు
ఆదిలాబాద్టౌన్: దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారు గురువారం ఉదయం 9 గంటలకు రావాలని చెప్పడంతో జిల్లా నలుమూలల నుంచి దివ్యాంగులు, వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారు ఉదయం 8 గంటల కంటే ముందుగానే రిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఉదయం 10 గంటలకు రావాల్సిన వైద్యులు 11 గంటల వరకు కూడా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తాగునీరు లేకపోవడంతో అవస్థలు పడ్డారు. తీరికగా 11 గంటల తర్వాత వైద్యులు ఒక్కొక్కరు చేరుకున్నారు. ప్రతీసారి వైద్యులు ఈవిధంగానే వ్యవహరిస్తున్నారని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. -
డోలాయమానం
ఈ రైతు పేరు కేమ రామయ్య. తాంసి మండలం వడ్డాడి. 15 రోజుల క్రితం తాంసి మార్కెట్కు జొన్నలు తీసుకొచ్చాడు. మూడు రోజుల క్రితం కాంటా జరిగింది. లారీలు రాకపోవడంతో సంచులను గోదాములకు తరలించలేని పరిస్థితి. జొన్నలను గోదాముకు తరలించే వరకు రక్షించే బాధ్యత రైతుదే. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో అక్కడే ఉండాల్సిన దుస్థితి. వానాకాలం సీజన్కు తన చేనును సిద్ధం చేద్దామంటే అనువైన పరిస్థితులు కనిపించడం లేదు. ఈ రైతు పేరు కుమ్ర విశ్వనాథ్. తాంసి మండలంలోని పాలోజి గ్రామం. ఐదెకరాలు సొంతం ఉండగా, మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని పంటలు సాగు చేస్తున్నాడు. యాసంగిలో పండించిన జొన్న దిగుబడులు 25 క్వింటాళ్లు రాగా వాటిని అమ్ముకునేందుకు తిప్పలు పడాల్సి వస్తోంది. నాలుగు రోజుల క్రితం మార్కెట్కు తెచ్చి నిల్వలు ఉంచాడు. ఇప్పటికీ పాసింగ్ కాలేదు. దానికోసం పడిగాపులు కాస్తున్నాడు. వానాకాలం సీజన్ సమీపిస్తోంది. చేనును దుక్కిదున్ని సిద్ధం చేయాల్సి ఉంది. ఇంకా ఎన్నిరోజులు పడుతుందోనని మదన పడుతున్నాడు. -
ఐటీ రంగానికి ఆద్యుడు రాజీవ్గాంధీ
కై లాస్నగర్: దేశంలో ఐటీ రంగానికి నాంది పలికిన ఘనత రాజీవ్ గాంధీదేనని డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని గురువారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఆదివాసీ కాంగ్రెస్ నేషనల్ కో ఆర్డినేటర్ కుసుమ్ ఆలంతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన వర్ధంతి రోజున దేశవ్యాప్తంగా ‘ఉగ్రవాద వ్యతిరేక దినం’గా పాటిస్తున్న సందర్భంగా ప్రతీ భారతీయుడు హింసకు వ్యతిరేకంగా, శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోరంచు శ్రీకాంత్ రెడ్డి, బండారి అనూష, గండ్రత్ సుజాత, సంజీవరెడ్డి బండి దేవిదాస్ చారి, గౌలి సంజయ్, తదితరులు పాల్గొన్నారు. -
‘అటవీ అధికారుల వేధింపులు ఆపాలి’
కైలాస్నగర్: అటవీ అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అల్లికొరి గ్రామస్తులు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేశ్ మాట్లాడుతూ చిచ్ధరి నుంచి అల్లికొరి వరకు ప్రభుత్వం రూ.30 లక్షలతో బీటీరోడ్డు మంజూరు చేసిందన్నారు. అటవీ అధికారులు ఆ పనులు ప్రారంభం కాకుండా అడ్డుపడుతున్నారన్నారు. వర్షాకాలం ప్రారంభమవుతున్నందువల్ల వెంటనే రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, ఆదివాసీలు పాల్గొన్నారు. -
కు.ని ఆపరేషన్లు చేయిస్తున్నాం
పట్టణంలో గుంపులుగా సంచరించే కుక్కలను ఎనిమల్ బర్త్ కేర్ సెంటర్కు తరలించి పశు వైద్యాధికారులతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తున్నాం. కుక్కలను పట్టేందుకు హైదరాబాద్కు చెందిన ఓ సంస్థకు బాధ్యతలు అప్పగించాం. వీధి కుక్కల కారణంగా పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటాం. – బైరి శంకర్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా.. పిచ్చిపట్టిన కుక్కలకు కారుణ్య మరణం ప్రసాదించా లని, ఇతర వీధి కుక్కలను నియంత్రించాలని సుప్రీంకో ర్టు తీర్పునిచ్చింది. తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వం నుంచి గైడ్లైన్స్ రా వాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి వచ్చే తదుపరి ఆదేశాలకు అనుగుణంగా శునకాలపై తగు చర్యలు తీసుకుంటాం. – జి.రమేశ్, జిల్లా పంచాయతీ అధికారి -
జాబ్కార్డున్న ప్రతీకూలీకి ఉపాధి కల్పించాలి
తలమడుగు: జాబ్కార్డున్న ప్రతీకూలీకి ఉపాధి కల్పించాలని పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ జాన్వెస్లీ అన్నారు. గురువారం మండలంలోని ఝరి, కొత్తూర్, గ్రామాల్లో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ కూలీకి రోజుకు రూ.300 కూలి వచ్చే వి ధంగా పని కల్పించాలన్నారు. పనిస్థలాల్లో కూ లీలకు వసతులు కల్పించాలన్నారు. పథకంలో ఎ లాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా నిత్యం పర్యవేక్షించాలన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఉదయం పూటనే పనులు చేపట్టాలని సూచించారు. కూలీల సంఖ్య పెంచాల ని సూచించారు. అనంతరం ఝరి గ్రామ స మీపంలో జరుగుతున్న వాటర్ షెడ్ చెక్డ్యామ్ పనులను పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ రవీందర్ రాథోడ్, ఎంపీడీవో శంకర్, ఈజీఎస్ ఏపీవో మేఘమాల, ఈసీ ప్రవీణ్రావ్, తదితరులు పాల్గొన్నారు. -
యువ ఇన్ఫ్లుయెన్సర్ల భాగస్వామ్యం అభినందనీయం
కైలాస్నగర్: జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేస్తూ పర్యాటకరంగ అభివృద్ధిలో యువ ఇన్ఫ్లుయెన్సర్ల భాగస్వామ్యం అభినందనీయమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక టీటీడీసీలో డిజిటల్ టూరిజం ఛాలెంజ్–రీల్స్ కాంపిటీషన్ నిర్వహించారు. పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు హాజరై యూట్యూబ్, ఇన్స్టాలో పర్యాటకరంగంపై పెట్టిన పోస్టులను ప్రదర్శించారు. ఆర్.సాయికృష్ణ ప్రథమ బహుమతి, పెందూర్ కిరణ్ ద్వితీయ బహుమతి, రవి, తొడసం కై లాష్ తృతీయ బహుమతి అందుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని చారిత్రక దేవాలయాలు, అటవీ ప్రాంతాలు, ప్రకృతి అందాలు, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, స్థానిక పండుగలను డిజిటల్ మీడియా వేదికగా దేశవ్యాప్తంగా పరిచయం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. అనంతరం అక్రిడిటేషన్ కమిటీ సభ్యులకు నూతన అక్రిడేషన్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, టూరిజం అధికారి రవి కుమార్, డీపీఆర్వో విష్ణువర్ధన్, తదితరులు పాల్గొన్నారు. జనాభా వివరాలు నమోదు కై లాస్నగర్: జాతీయ జనగణన (సెన్సెస్) సర్వేలో భాగంగా కలెక్టర్ రాజర్షిషా డిజిటల్ పద్ధతిలో తన కుటుంబానికి సంబంధించిన వివరాలను నమోదు చేసుకున్నారు. మట్టి సేకరణకు కుమ్మరులకు అనుమతి కైలాస్నగర్: కులవృత్తిపై ఆధారపడ్డ కుమ్మరులకు మట్టి సేకరణకు అనుమతినిచ్చినట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. కలెక్టర్ చాంబర్లో కుమ్మరి సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. చెరువులు, కుంటల నుంచి ఉచితంగా మట్టిని తీసుకునే హక్కు కుమ్మరులకు ఉందని, ఎలాంటి ఆటంకాలు లేకుండా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, బస్టాండ్ ప్రాంతాల్లో మట్టి కుండలు విక్రయించేందుకు స్థల కేటాయింపు అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. జొన్న కొనుగోలు కేంద్రం సందర్శన సాత్నాల: భోరజ్ మండలం పిప్పర్వాడలోని జొన్న కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాథోడ్ రాజేశ్వరి, మండల వ్యవసాయ అధికారి ఆశ్రఫ్, రైతులు పాల్గొన్నారు. క్రీడలు శారీరక దృఢత్వానికి పునాదులు ఆదిలాబాద్: క్రీడలు శారీరక దృఢత్వానికి పునాదులు అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి స్విమ్మింగ్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్, అధికారులు, క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
కుక్కలకు కు.ని ఆపరేషన్లు
గత మూడేళ్లలో నమోదైన కుక్కకాటు వివరాలు .. ఇచ్చోడలో గుంపులుగా సంచరిస్తున్న వీధి కుక్కలు 20252026 ఏప్రిల్ నెల వరకు20242023కైలాస్నగర్: ‘గౌరవంగా జీవించే హక్కు అంటే కుక్కకాటు భయం లేకుండా స్వేచ్ఛగా తిరిగే హక్కు కూడా.. చిన్నారులు, వృద్ధులు ప్రాణభయంతో బతకడాన్ని చూస్తూ ఊరుకోలేం’.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఇది. ప్రజల పాలిట ప్రాణసంకటంగా మారిన వీధి కుక్కల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రమాదకరమైన (పిచ్చిపట్టిన) వీధి కుక్కలకు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలని తీర్పులో స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతోనైనా జిల్లాలో వీధి కుక్కల బెడద తప్పుతుందా? అనే చర్చ మొదలైంది. శునకాల నియంత్రణకు జిల్లా అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టనుందనే అంశంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. గుంపులుగా స్వైర విహారం జిల్లాలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది. పల్లె, పట్టణమనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ గుంపులు, గుంపులుగా స్వైర విహారం చేస్తూ ప్రజ లను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వాటికి ఆహారం దొరక్కపోవడంతో చిన్నారులు, వృద్ధులు, మహిళలపై దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. దీంతో చిన్నారులు బయట తిరుగలేని పరిస్థితి. జిల్లాలో ఇటీవల రికార్డు స్థా యిలో ఉష్ణోగ్రతలు న మోదు కావడంతో ఎండ ల తీవ్ర త భగ్గుమంటో ంది. ఎండ వేడి తాళలేక మతిభ్రమించినట్లుగా పిచ్చిపట్టినట్లుగా వ్యవహరి స్తున్నాయి. వీధుల్లో స్వైరవిహారం చేస్తూ ప్రజలపై దాడులకు పాల్ప డుతున్నాయి. ఏటా కుక్కకా టు బాధితుల సంఖ్య పెరుగుతుండటం జిల్లాలోని పరిస్థితికి అద్దం పడుతోంది. ఇలా ప్రజల పాలిట ప్రాణాంతకంగా మారుతున్న వీధి కుక్కల బెడదను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని, వాటిని ప్రత్యేక సెంటర్లకు తరలించా లని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ప్రమాదకరమైన కుక్కలకు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయంతోనైనా అధికార యంత్రాంగం స్పందించి వీధి కుక్కల బెడదను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతోనైనా పరిస్థితి మారేనా? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. అయితే అఽఽధికార యంత్రాంగం నిర్లీప్తతను విడనాడి శునకాలను కట్టడి చేసేలా షెల్టర్లకు తరలిస్తారా? లేక శస్త్రచికిత్సలు మరింత వేగవంతం చేస్తారా? అనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అంతు చిక్కని రోగాల బారిన పడుతున్న కుక్కల కారణంగా ప్రజలకు వ్యాధులు సోకే అవకాశముందని, కాటేస్తే ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదముందని వైద్యులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలోని వీధి కుక్కల వివరాలు జిల్లాలోని గ్రామ పంచాయతీలు : 473 వీధి కుక్కల సంఖ్య : 16,646 ఆదిలాబాద్ మున్సిపాలిటీలో వార్డులు : 49 వీధి కుక్కల సంఖ్య : 1,850 స్టెరిలైజేషన్ చేసిన కుక్కల సంఖ్య : 818ఆదిలాబాద్ పట్టణంలో వీధి కుక్కలను నియంత్రించాలనే ఉద్దేశంతో బంగారుగూడలోని డంపింగ్యార్డులో ఐదేళ్ల క్రితం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రూ.80లక్షల వ్యయంతో ఎనిమల్ బర్త్ కేర్ సెంటర్ నిర్మించారు. అందులో కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసేందుకు వీలుగా 52 గదులు నిర్మించారు. కుక్కలను పట్టేందుకు హైదరాబాద్కు చెందిన ఏనిమల్ కేర్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక్కో కుక్కకు రూ.1,650 చొప్పున చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 700 శునకాలకు శస్త్రచికిత్సలు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. రెండున్నరేళ్లలో కేవలం 700 కుక్కలకు మాత్రమే ఆపరేషన్లు జరిగాయంటే వాటిపై అఽధికారులు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారనేది స్పష్టమవుతోంది. -
సీసీఐని పునఃప్రారంభించాలి
ఆదిలాబాద్టౌన్: సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదిలాబాద్ పరిశ్రమను వెంటనే పునఃప్రారంభించాలని ప్రజా, ఉద్యోగ, విద్యార్థి, యువజన సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు డిమాండ్ చేశారు. డీటీఎఫ్ నాయకుడు రంగన్న అధ్యక్షతన జిల్లా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా టాస్క్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ కేవలం రూ.2వేల కోట్ల పెట్టుబడితో తిరిగి పునరుద్ధరించే అవకాశం ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా లేఖలతో సరిపెట్టకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి పరిశ్రమ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రం తక్షణమే తుక్కు టెండర్లను రద్దు చేసి పరిశ్రమ పునరుద్ధరణకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో టాస్క్ కోకన్వీనర్ రవీందర్, ప్రైవేట్ కాలేజీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేశ్, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు విలాస్, బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు విజ్జగిరి నారాయణ, న్యూ డెమోక్రసీ నాయకుడు వెంకట్ నారాయణ, మాస్లైన్ నాయకుడు జగన్ సింగ్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి దేవేందర్, సీసీఐ సాధన ఉద్యమ నాయకుడు నవతె శ్రీనివాస్, తుడుందెబ్బ నాయకులు పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణకు చర్యలు
ఆదిలాబాద్టౌన్: నేరాల నియంత్రణలో భాగంగా వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అక్రమ రవాణా అరికట్టేందుకు బుధవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నాకాబందీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. 20 పోలీస్స్టేషన్ల పరిధిలో 25 చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ, నంబర్ ప్లేట్ లేని, సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపే వారిపై చర్యలు చేపట్టారు.ఎస్పీ స్వయంగా ఇచ్చోడ, ఆదిలాబాద్ ప్రాంతాల్లోని చెక్పోస్టులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. విధి నిర్వహనలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందులో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, ఇచ్చోడ సీఐ నరేష్, టూటౌన్ సీఐ కె.నాగరాజు, వన్టౌన్ సీఐ బి.సునీల్కుమార్తో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బజార్హత్నూర్ పోలీస్స్టేషన్ తనిఖీ బజార్హత్నూర్: మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఎస్పీ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో వీపీవో విధానం అమలు చేయాలన్నారు. ఇందులో డీఎస్పీ జీవన్రెడ్డి, బోథ్ సీఐ గురుస్వామి, ఎస్సై రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు ఇచ్చోడ: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. మండలంలోని గుండాలలో బుధవారం ఉదయం 5 నుంచి 8 గంటల వరకు వంద మంది పోలీసులతో కమ్యూనిటీ కాంటాక్ట్ (కార్డెన్సర్చ్) నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలన్నారు. ఇదివరకే కేసులు నమోదైన వారిపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో ధ్రువీకరణ పత్రాలు సరిగాలేని 65 ద్విచక్రవాహనాలు, ఐదు ఆటోలు, ఒక బొలేరా వాహనంతో పాటు రూ.15 వేల విలువ చేసే కలప, కటింగ్ మిషన్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందులో ఉట్నూర్ ఏఎస్పీ రుత్వీక్ సాయి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, సీఐలు సీహెచ్ రమేశ్, నరేశ్, నైలు, పద్మ, రిజర్వ్ సీఐ వెంకటి, ఎస్సైలు, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. -
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
● అదనపు కలెక్టర్ చిత్రు సాత్నాల: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అదనపు కలెక్టర్ చిత్రు అన్నారు. భోరజ్ మండలం పిప్పర్వాడ జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన బుధవారం సందర్శించారు. కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులతో మాట్లాడి కొనుగోళ్లు తీరు, తూకం, గన్నీబ్యాగుల నిల్వ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. లారీల కొరత కారణంగా సరిపడా గన్నీ బ్యాగులు లేక ఇబ్బందులు పడుతున్నట్లుగా వివరించారు. స్పందించిన ఆయన నిల్వలో ఉన్న బ్యాగులను వెంటనే తరలించేలా చూస్తానన్నారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ రాజేశ్వరి, సర్పంచ్ సంతోష్రెడ్డి, రైతులున్నారు. -
గిరి ప్రాంతాల అభివృద్ధికి కృషి
ఉట్నూర్రూరల్: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందని ఐటీడీఏ పీవో మకరందు అన్నారు. కేంద్రం ప్రభుత్వం చేపడుతున్న ‘జన్ భాగీదారి అభియాన్ – స బ్సే దూర్ సబ్సే పహలే’ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన కార్యాలయ ప్రాంగణంలో ఇప్ప మొక్క నాటారు. గిరిజనుల సంక్షేమం, వారి జీవన ప్రమాణాల మెరుగుదల కోసం కేంద్రం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు.కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, సిబ్బంది, గిరిజన సంక్షేమ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. -
బెస్ట్ చదువులు చెప్పలేం!
ఆదిలాబాద్టౌన్/ఆదిలాబాద్రూరల్: బెస్ట్ అవలేబుల్ పథకంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మూడేళ్లుగా ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులకు చదువులు చెప్పలేమని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు చేతులెత్తేశాయి. దీంతో పేద విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. గతేడాది పలుమార్లు బడులు మూసివేయడంతో విద్యార్థుల చదువులు కుంటుపడ్డాయి. ప్రైవేట్ స్కూళ్లను అధికారులు బుజ్జగించి విద్యా సంవత్సరాన్ని పూర్తి చేశారు. నూతన విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభం కానుంది. ఇప్పటికే సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా నోటిఫికేషన్ విడుదలైంది. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి విద్యార్థుల ఎంపిక పూర్తయింది. పెండింగ్ బిల్లులు చెల్లిస్తే గానీ చదువు చెప్పేది లేదని ఆయా పాఠశాలలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా లేఖలు సైతం అందజేశాయి. దీంతో బెస్ట్ అవలేబుల్ పథకం నీరుగారనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చదువులు కొనసాగిస్తున్న విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. ఈ విషయమై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పథకం కొనసాగుతుందా.. లేదా అని తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. మూడేళ్లుగా బిల్లులు పెండింగ్.. ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు ప్రభుత్వం 2004లో బెస్ట్ అవలేబుల్ పథకాన్ని ప్రారంభించింది. మొదట్లో ఈ పథకం సాఫీగా సాగింది. మూడేళ్లుగా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో పాటు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఈ పథకం కింద జిల్లాలో ఆరు పాఠశాలల్లో విద్యాబోధన సాగుతుంది. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా 1 నుంచి పదో తరగతి చదువుతున్న దాదాపు 250 మందికి విద్యాబోధన చేస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 730 మంది విద్యార్థులు 3 నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ డేస్కాలర్ విద్యార్థులకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.28వేలు, రెసిడెన్షియల్ విద్యార్థులకు రూ.42వేలు చెల్లిస్తోంది. గిరిజన సంక్షేమ శాఖ రూ.42వేలు విద్యార్థి చదువుకు కేటాయిస్తుంది. అయితే సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఆరు పాఠశాలలకు కలిపి దాదాపు రూ.15 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు చెబుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రూ.5 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో విద్యార్థులకు భోజనం, చదువు కొనసాగించలేమని ప్రైవేట్ యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. చేతులెత్తేసిన యాజమాన్యాలు ఈ స్కీమ్ను తాము నడపలేమని ఆరు ప్రైవేట్ స్కూళ్లు చేతులెత్తేశాయి. మూడేళ్లుగా నిధులు విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు. ఇటీవల లేఖ ఇ వ్వడంతో అధికారులు 25 శాతం విడుదల చేశారని పేర్కొంటున్నారు. పెండింగ్ బిల్లుల విడుదలతో పాటు విద్యార్థుల ఫీజు సైతం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పలుమార్లు ఇంటికి పంపారు.. మా బాబును బెస్ట్ అవలేబుల్ పథకం కింద మావలలోని పాఠశాలలో చేర్పించాం. ప్రభుత్వం బిల్లులిస్తలేదని గతేడాది పలుమార్లు అబ్బాయిని ఇంటికి పంపించారు. ఈ సారి బిల్లులొస్తేనే చదువు చెబుతామని అంటున్నారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ప్రభుత్వం స్పందించాలి. – సంతోష్, మావల -
ఆర్టీసీలో ఇంధన పొదుపు కీలకం
ఆదిలాబాద్: బస్సుల నిర్వహణలో ఇంధన పొదుపు అత్యంత కీలకమని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ డి.విజయ్భాను అన్నారు. ఆదిలాబాద్ డిపోలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ పనితీరు కనబరిచిన డ్రైవర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మిగిలిన వారు కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. డిపో పరిధిలో అత్యుత్తమ కేఎంపీఎల్ సాధించిన డ్రైవర్లు జావిద్, డి.రవీందర్, ఎం.ఆర్.జి రావు, హలీమ్ ను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ జి. ప్రతిమారెడ్డి, ఏఈ శ్రీకర్, ఆర్ఎం కార్యాలయ ఏఎం రాజశేఖర్, డిపో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ప్రోత్సాహం.. ఉత్సాహం
మంచిర్యాలఅర్బన్: వేసవిలో పీఎంశ్రీ పాఠశాలల్లో విద్యార్థుల సందడి నెలకొంది. సమ్మర్ క్యాంపులో భాగంగా ఇస్తున్న నైపుణ్య శిక్షణలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. ఉపాధ్యాయుల మార్గదర్శకంలో వివిధ నైపుణ్యాలను అభ్యసిస్తూ ప్రతిభను మెరుగుపర్చుకుంటున్నారు. ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతుల విద్యార్థులకు విద్యతో పాటు సృజనాత్మకత, కళలు, క్రీడలు, జీవన నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. సెలవుల్లో సెల్ఫోన్కు అతుక్కుపోకుండా సమ్మర్క్యాంపు వైపు వెళ్లేలా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలోని 16 పాఠశాలల్లో నిర్వహిస్తున్న ససమ్మర్ క్యాంపులో 100 మంది చొప్పున అవకాశం కల్పించారు. ఈ నెల 11న ప్రారంభమైన శిక్షణ 25న ముగియనుంది. స్టిచ్చింగ్, సంగీతం, నృత్యం, డ్రాయింగ్, యోగా, కథలు చెప్పటం, వ్యక్తిత్వ వికాసం, కంప్యూటర్ తరగతులు, ఆంగ్ల, గణిత భాషపై పట్టుసాధించడం, చెస్, ఇండోర్ గేమ్స్, సైన్స్ ప్రయోగాలు, క్రీడలు, క్విజ్, మాక్పార్లమెంట్, తదితర అంశాలపై తర్ఫీదు ఇస్తున్నారు. రాజీవ్నగర్ మోడల్స్కూల్లో 15 రోజుల పాటు నిర్వహించే సమ్మర్ క్యాంపులో విభిన్న అంశాలపై శిక్షణ పొందుతున్న విద్యార్థులు తమ అభిప్రాయాలను ఇలా ‘సాక్షి’తో పంచుకున్నారు. -
ఆర్జీయూకేటీలో ధ్రువపత్రాల పరిశీలన
బాసర: బాసర ఆర్జీయూకేటీలో 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం ప్రత్యేక కేటగిరీలకు చెందిన విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలించారు. అడ్మిషన్ల ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటిస్తూ, ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన ప్రతిభావంతులకే సీట్లు కేటాయిస్తామని యూనివర్సిటీ వర్గాలు స్పష్టం చేశాయి. ఎంపికై న విద్యార్థుల వివరాలను యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. తాజా సమాచారం కోసం www.rgukt.ac.in వెబ్సైట్ను క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడ్మిషన్ల విభాగం కన్వీనర్, కోకన్వీనర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొని వెరిఫికేషన్ ప్రక్రియ పర్యవేక్షించారు. -
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు కోరారు. ఈ మేరకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ను జిల్లా కేంద్రంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. యూనియన్ జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి చూపడం లేదన్నారు. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇందులో యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె. సునీత, సీఐటీయూ సహాయ కార్యదర్శి సురేందర్, నాయకులు విమల, సుజాత, లక్ష్మి పాల్గొన్నారు. -
● మళ్లీ కలప అక్రమ దందా షురూ ● అటవీ ప్రాంతాల్లో జోరుగా టేకు చెట్ల నరికివేత ● సైజులు, ఫర్నిచర్గా మార్చి తరలింపు ● అటవీశాఖ దాడులతో పట్టుబడుతున్న వైనం
ఇచ్చోడ: జిల్లాలోని ఇచ్చోడ, సిరికొండ, బోథ్, తలమడుగు, తాంసి, ఇంద్రవెల్లి మండలాల్లోని దట్టమైన అటవీ ప్రాంతాలను స్మగ్లర్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. రాత్రివేళల్లో మిషన్లతో భారీ టేకు చెట్లను సైజులుగా మార్చుతున్నారు. అక్కడి నుంచి ఎడ్లబండ్లు, ద్విచక్రవాహనాల ద్వారా పొద్దు పొడిచే వరకు మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో విక్రయిస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. ఇచ్చోడ, సిరిచెల్మ అటవీప్రాంతం నిర్మల్ జిల్లాలోని పెంబి మండలానికి సరిహద్దులో ఉంది. అలాగే తలమడుగు, భీంపూర్, బజార్హత్నూర్ మండలాల్లోని అటవీప్రాంతం మహారాష్ట్ర సరిహద్దులో, సిరికొండ అటవీప్రాంతం కవ్వాల్ సరిహద్దులో ఉండటంతో ఆయా ప్రాంతాలపై జిల్లా అటవీ అధికారులు ఎక్కువగా ఫోకస్ చేయడం లేదని తెలుస్తోంది. ఫలితంగా స్మగ్లర్లు తమ పని సులువుగా కానిచ్చేస్తున్నట్లు సమాచారం. ఆరేళ్లుగా అజ్ఞాతంలో స్మగ్లర్లు.. గత ప్రభుత్వ హయాంలో కలప స్మగ్లింగ్పై అధి కారులు ఉక్కుపాదం మోపారు. అటవీశాఖ సి బ్బందితో కలిసి సాయుధ పోలీసులు అ టవీప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేశారు. స్మగ్లర్లపై పీడీ యాక్టు నమోదు చేశారు. దీంతో చాలామంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.అక్రమదందాకు ఫుల్స్టాప్ పడింది. అయితే ఇటీవల గస్తీ నిర్వహించే పోలీసులను తొలగించడంతోదందామళ్లీమొదలైనట్లుగా తెలుస్తోంది. కలప అక్రమ రవాణా కట్టడికి చర్యలు కలప అక్రమ రవాణా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల సిబ్బందితో పలుచోట్ల తనిఖీలు, అనుమానిత ఇళ్లలో సోదాలు ముమ్మరం చేశాం. అక్రమ దందా అరికట్టేందుకు ప్రజల సహకారం కూడా అవసరం. సమాచారం తెలిస్తే అటవీశాఖకు అందించాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం. – అరవింద్, టైగర్జోన్ ఎఫ్డీవో, ఉట్నూర్ -
వడదెబ్బతో ఒకరు మృతి
తలమడుగు: వడదెబ్బతో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బబాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం దేవాపూర్ గ్రామానికి చెందిన నాయని పోచన్న (30) వ్యవసాయ కూలీ. బుధవారం ఉదయం కూలీపనులకు వెళ్లాడు. చేనులో పనులు చేస్తుండగా కళ్లుతిరిగి కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ఇంటికి తీసుకెళ్లారు. ఇంటివద్ద వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రాత్రి మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
విద్యుదాఘాతంతో మూగజీవాలు మృతి
జైనథ్: మండలంలోని బెల్లూరి గ్రామ శివారులో మంగళవారం రాత్రి కురిసిన గాలివానకు పంటచేలకు వెళ్లే ఎల్టీ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. బుధవారం మేతకు వెళ్లిన గ్రామానికి చెందిన కొంగల రాకేశ్, దోడ సురేష్, వాగాడే బాలాజీకి చెందిన మూడు ఆవులు, గంగం పెద్దరాములుకు చెందిన ఎద్దు విద్యుత్ తీగలకు తాకడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. వాటి విలువ రూ.2 లక్ష ల వరకు ఉంటుందని బాధిత రైతులు తెలిపారు. సంఘటన స్థలాన్ని పశుసంవర్ధక శాఖ అధికారి వినోద్ దేశ్పాండే, తహసీల్దార్ ఆత్రం నారాయణ, విద్యుత్ శాఖ ఏడీ శ్రీనివాస్ పరిశీలించారు. -
జొన్న రైతుల ఆందోళన
బజార్హత్నూర్: ప్రభుత్వం జొన్నల కొనుగోలులో నిబంధనలు తొలగించి, ఎకరాకు 20 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం నాయబ్ తహసీల్దార్ హీరాలాల్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, ఈ ఏడాది జొన్నల దిగుబడి ఎకరాకు 20 క్వింటాళ్ల వరకు పెరిగిందన్నారు. ప్రభుత్వం మాత్రం ఎకరాకు 10 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని నిబంధనలు విదించడం సరికాదన్నారు. అలాగే కాంటా పూర్తయి వారం దాటినా లారీలు రాకపోవడంతో యార్డులో ఎక్కడి కుప్పలు అక్కడే దర్శనమిస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు అకాల వర్షాలకు నిల్వచేసిన జొన్నలు తడుస్తున్నాయని, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సరిపడా లారీలను అందుబాటులోకి తెచ్చి ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో రైతులు డుబ్బుల చంద్రశేఖర్, రాములు, రాజన్న, ధనుంజయ్, శంకర్, శ్రీనివాస్, వినాయక్, నందకుమార్, అరుణ్, ఫరీద్ఖాన్, చిన్నయ్య, శ్రీనివాస్, పండరి తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల్లో పర్యటించి.. వివరాలు సేకరించి
ఇంద్రవెల్లి: మండలంలోని ముత్నూర్, కేస్లాపూర్, ఇంద్రవెల్లి గ్రామాల్లో పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ వెస్లీ, ఆయా జిల్లాల్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీపీవోలు బుధవారం సాయంత్రం పర్యటించారు. ముందుగా ముత్నూర్ గ్రామాన్ని సందర్శించి నర్సరీ నిర్వహణతో పాటు గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అక్కడి నుంచి కేస్లాపూర్ చేరుకుని నాగోబా ఆలయంలో పూజలు చేపట్టారు. మెస్రం వంశీయులతో మాట్లాడి ఆలయ చరిత్ర, అభివృద్ధి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని సందర్శించి స్మృతి వనంను పరిశీలించారు. అక్కడి నుంచి ఇంద్రవెల్లి మేజర్ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. అధికారులు, సిబ్బందితో మాట్లాడి గ్రామాభివృద్ధి, స్వచ్ఛత, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో చేపట్టిన కార్యక్రమాలు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట వనపర్తి డీపీవో తరుణ్ చక్రవర్తి, భద్రాద్రి డీపీవో బి అనూష, జగిత్యాల డీపీవో రేవంత్, సిద్దిపేట డీపీవో వినోద్కుమార్, ఆదిలాబాద్ డీపీవో ఫణిందర్రావ్, పంచాయతీ సిబ్బంది తదితరులున్నారు. -
జొన్న, మొక్కజొన్న పంటలు దగ్ధం
కుంటాల: మండలంలోని అంబకంటి, ఓల గ్రామాల శివారులో బుధవారం ప్రమాదవశాత్తు జొన్న, మొక్కజొన్న పంటలు దగ్ధ మయ్యాయి. కుంటాలకు చెందిన పారెడ గంగారావు తనకున్న రెండున్నర ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. ఇటీవలే పంటను కోసి చేనులోనే కుప్పగా వేశాడు. బుధవారం ఉదయం సేవాలాల్ తండాలో రైతులు వ్యర్థాలను తగులబెట్టగా మంటలు విస్తరించి గంగారావు మొక్కజొన్న పంటకు అంటుకోవడంతో దగ్ధమైంది. ఘటనలో రూ.లక్షా 25వేల నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. మరికొందరి రైతులకు చెందిన స్టార్టర్లు, వ్యవసాయ పరికరాలు దగ్ధమయ్యాయి. భైంసా అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు మంటలను అదుపు చేశారు. ఘటనా స్థలాన్ని తహసీల్దార్ కమల్ సింగ్, ఆర్ఐ రాజేశ్వర్, జీపీవోలు భోజన్న, నాగేంద్ర పరిశీలించి పంచనామా నిర్వహించారు. ఓలలో.. ఓలా శివారులో కుంటాలకు చెందిన ఎడ్ల నారాయణ ఎకరంన్నరలో జొన్న పంట సాగు చేశాడు. బుధవారం ప్రమాదవశాత్తు పంటకు నిప్పంటుకోవడంతో పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.లక్షా 75వేల నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. పక్కనే ఉన్న రైతు న్యాలకంటి గంగాధర్, సోమ మోహన్, నూతికాడి రమేశ్కు చెందిన రూ.60 వేల విలువైన విద్యుత్ పరికరాలు కాలిపోయాయి. ఘటన స్థలాన్ని జీపీవో రాజలింగు పరిశీలించారు. -
సరదాగా.. సరికొత్తగా..
లక్ష్మణచాంద: వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా తెలంగాణ ప్రభుత్వం సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తోంది. విద్యార్థులు సరికొత్త విషయాలు నేర్చుకునే అవకాశం కల్పిస్తోంది. మండల కేంద్రంలోని పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలో ఈ నెల 11 నుంచి సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈనెల 25 వరకు విద్యార్థులకు వివిధ క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. కబడ్డీ, ఖోఖో, చెస్, క్యారమ్, వాలీబాల్ తదితర క్రీడల్లో శివకుమార్, రాజు సంగీతం, నృత్యం సాత్విక నేర్పిస్తున్నారు. మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన 80 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. శిక్షణకు హాజరయ్యే విద్యార్థులకు ఉదయం స్నాక్స్ కూడా అందజేస్తున్నారు. క్యారం ఆడుతున్న విద్యార్థినులుకూచిపూడిపై ఆసక్తితో.. వేసవి శిక్షణ శిబిరంలో ఉచితంగా కూచిపూడి నృత్యం నేర్చుకుంటున్నా. శిక్షకులు చాలా బాగా నేర్పిస్తున్నారు. సమయం వృథా చేయకుండా ఆసక్తితో నేర్చుకుంటున్నా. – రమణి, లక్ష్మణచాంద నృత్యాన్ని ఇష్టంగా.. వేసవి సెలవుల్లో ఇంటివద్ద ఉండి సమయం వృథా చేయడం లేదు. మండల కేంద్రంలోని సమ్మర్ క్యాంపులో సాత్విక టీచర్ నృత్యం నేర్పిస్తున్నారు. ప్రతీరోజు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్నా. – మాలతి, లక్ష్మణచాంద క్యారమ్ ఆడుతున్నా మండల కేంద్రంలోని సమ్మర్ క్యాంపులో క్యారమ్ నేర్చుకుంటున్నా. మా రాజు సార్ క్యారమ్, చెస్ ఆడడంలో మెలకువలు నేర్పిస్తున్నారు. ఆసక్తితో నేర్చుకుంటున్నా. – మనోహర్, లక్ష్మణచాందకబడ్డీ ఆడుతున్న విద్యార్థులు వాలీబాల్ నేర్చుకుంటున్న విద్యార్థులు కబడ్డీ నేర్చుకుంటున్నా.. ఏటా వేసవిలో ఎండలో తిరిగే వాడిని. ఈసారి సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ప్రతీరోజు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు కబడ్డీ నేర్చుకుంటున్నా. మా శివకుమార్ సార్ ఆటలు మంచిగా ఆడిస్తున్నాడు. – పవన్ కుమార్, లక్ష్మణచాంద -
యోగాతో ఆరోగ్యం
కోటపల్లి:నేటి ఆధునిక యుగంలో అనా రోగ్య సమస్యలకు చెక్ పెట్టాలంటే యో గాతోనే సాధ్యమని, ప్రతిఒక్కరూ యో గా చేసేలా వైద్యులు, ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని మోడల్ స్కూ ల్లో సమ్మర్ క్యాంపులో భాగంగా చిన్నారులకు యోగాపై శిక్షణ ఇస్తున్నారు. రోజుకు గంటపాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 1న ప్రారంభమైన శిక్షణ ఈ నెల 31 వరకు కొనసాగనుంది. శిక్షణతో విద్యార్థినుల్లో మానసిక ప్రశాంతత, ఆరోగ్యవంతమైన జీవనశైలి అలవడుతుందని, ఒత్తిడి దూరం చేస్తుందని శిక్షకుడు రాజారం పేర్కొంటున్నారు. చదువుపై ఏకాగ్రత.. యోగా నేర్చుకోవడం వల్ల చదువుపై ఏకాగ్రత పెరుగుతోంది. మానసిక ప్రశాంతత లభిస్తోంది. అంతేకాక మనసు ఉల్లాసంగా ఉంటోంది. యోగా పోటీల్లో పాల్గొనేందుకు దోహదం చేస్తుంది. సమ్మర్లో యోగా నేర్చుకోవడం చాలా అనందంగా ఉంది. – భవ్యశ్రీ, కోటపల్లి ఆసక్తిగా పాల్గొంటున్నారు యోగా శిక్షణ తరగతులకు విద్యార్థులు ఆసక్తిగా హాజరవుతున్నారు. ఈ శిక్షణతో ఒత్తిడి తగ్గడమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది. ఇక్కడ నేర్చుకున్న విద్యార్థులు మండల రాష్ట్ర, స్థాయి పోటీల్లో పాల్గొనేలా శిక్షణ ఇస్తున్నా. – రాజారాం, ఇన్స్ట్రక్టర్ఆనందంగా ఉంది.. సమ్మర్ క్యాంపులో భాగంగా మోడల్ స్కూల్లో యోగాపై ఉచితంగా శిక్షణ ఇవ్వడం ఆనందంగా ఉంది. చిన్ననాటి నుంచే యోగా నేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారని తెలుసుకున్నా. ఇక్కడ నేర్చుకున్న యోగాను నా ఫ్రెండ్స్కు కూడా నేర్పిస్తున్నా. – కె.సాగరిక, కోటపల్లి -
ప్రమాదవశాత్తు బైక్ దగ్ధం
వేమనపల్లి: నీల్వాయి అటవీ ప్రాంతంలో బుధవారం ప్రమాదవశాత్తు బైకు దగ్ధమైంది. ముల్కలపేటకు చెందిన ఎల్కరి సంజీవ్, మరో మహిళ, ఇద్దరు పిల్లలతో కలిసి బైకుపై చెన్నూర్ బయలుదేరాడు. నీల్వాయి అటవీప్రాంతంలో అకస్మాత్తుగా బైకులోంచి మంటలు చెలరేగడంతో వాహనం అక్కడే వదిలేసి దూరంగా పరుగులు తీశారు. క్షణాల్లో మంటలు ఎక్కువై బైకు దగ్ధమైంది. బస్సు టైర్లోంచి పొగలు కెరమెరి: మండల కేంద్రంలో బుధవారం ఆగి ఉన్న ఆర్టీసీ బస్సు టైరులో నుంచి పొగలు వచ్చాయి. ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్కు బయలుదేరిన ఆర్టీసీ బస్సు కెరమెరి స్టాప్ వద్ద ఆగింది. ప్రయాణికులు దిగతున్న నేపథ్యంలో ముందు టైరులో నుంచి పొగలు వచ్చాయి. గమనించిన డ్రైవర్ నీళ్లు పోయడంతో ప్రమాదం తప్పింది. బ్రెయిన్ స్ట్రోక్తో గర్భిణి మృతిఖానాపూర్: పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన మదిరె యోగిత (20) బ్రెయిన్ స్ట్రోక్కు గురై చికిత్స పొందుతూ మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన యోగిత (ఐదునెలల గర్భిణి)కు మంగళవారం ఉదయం అకస్మాత్తుగా మెదడులో రక్తనాళం దెబ్బతినడంతో కోమాలోకి వెళ్లింది. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. -
యోగాపై మక్కువ
యోగా నేర్చుకోవడం చాలా ఇష్టం. ధ్యానం, ప్రాణాయామం, సూర్యనమస్కారం, తదితర ఆసనాలు ఎంతో చక్కగా నేర్పిస్తున్నారు. వేసవి సెలవుల్లో సమయం వృథా చేయకుండా పలు అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. భవిష్యత్లో ఎంతగానో ఉపయోగపడనున్నాయి. – సాయిదీక్షిత, తొమ్మిదో తరగతి క్రీడలపై తర్ఫీదు.. వేసవి శిబిరంలో క్రీడలపై తర్ఫీదు ఇస్తున్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు మెలకువలు నేర్పిస్తుండటంతో ప్రతీరోజు ప్రాక్టీస్ చేసి నైపుణ్యం పెంపొందించుకుంటున్నా. ఆర్ట్క్రాఫ్ట్ ద్వారా గులాబీలు, గ్లోబ్, గొడుగు వంటివి స్వయంగా తయారు చేయడం ఎంతో మధురానుభూతి కలిగించింది. – శాన్వి, ఏడో తరగతి -
వ్యవసాయ మోటార్ల చోరీ నిందితుడి అరెస్ట్
కడెం: మండలంలోని వివిధ గ్రామాల్లో వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ మోటార్లను ఎత్తుకెళ్తున్న నిందితుడిని అరెస్టు చేసినట్లు ఖానాపూర్ సీఐ సీహెచ్.అజయ్ తెలిపారు. బుధవారం కడెం పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. పెద్ద బెల్లాల్కు చెందిన మైస రాజ్కుమార్, పాత మద్దిపడగకు చెందిన విజిగిరి పుష్ప మోటార్లు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారు. విచారణలో కొత్త మద్దిపడగకు చెందిన ఎలుకలపాట గంగారంను నిందితుడిగా గుర్తించి విచారించగా నేరం ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి నాలుగు మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో కడెం, ఖానాపూర్ ఎస్సైలు పి.సాయికిరణ్, రాహుల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కంప్యూటర్ బోధన సూపర్..
సమ్మర్ క్యాంపులో స్పె షల్గా సిస్టమ్ను ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నా. శిక్షకులు కంప్యూటర్ ప్రాథమి కాలు, ప్రయోజనాలపై సులభంగా బోధిస్తున్నారు. నృత్యంలో శిక్షణ తీసుకుంటున్నా. క్రమశిక్షణతో నేర్పించడంపై ప్రత్యేక ధన్యవాదాలు. – మణిత్ర, ఏడో తరగతి గ్రామర్పై పట్టు.. వేసవి సెలవుల్లో ఆడుతూ పాడుతూ గడపటం చాలా సంతోషంగా ఉంది. ఇంగ్లిష్పై భయం పొగొట్టేలా, గ్రామర్పై పట్టు సాధించేలా తర్ఫీదు ఇస్తున్నారు. డ్రాయింగ్, కంప్యూటర్ పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తున్నారు. అన్ని అంశాల్లో మంచి నైపుణ్యాన్ని సాధించే విధంగా టీచర్లు శిక్షణ ఇస్తున్నారు. – అయిషా సిద్దిఖా, ఎనిమిదో తరగతి -
చైనీస్ చక్కర్..
చెన్నూర్రూరల్: వేసవి సెలవుల్లో విద్యార్థులు ఇంటిపట్టున ఉండి ఆటలు ఆడుకుంటూ సరదాగా గడుపుతున్నారు. మండలంలోని ఆస్నాదలో చిన్నారులు చైనీస్ చక్కర్ ఆట ఆడుతూ కనిపించారు. సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోకుండా ఇలాంటి ఆటలు ఆడుకుంటే ఎంతో మంచిదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.నృత్యం నేర్చుకుంటున్న విద్యార్థులుదండేపల్లి: దండేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల (పీఎంశ్రీ)లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. విద్యార్థులకు క్యారం, చెస్ వంటి ఆటలతో పాటుగా, ప్లవర్ బోకేల తయారీ, యోగా, నృత్యంపై శిక్షణ ఇస్తున్నారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూదొందే..
నాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వందల కో ట్ల విలువైన ప్రభుత్వ భూ ములను పార్టీ కార్యాలయాల కోసం అక్రమంగా వినియోగించుకున్నారు. పేదల అవసరాల కో సం ఉపయోగించాల్సిన భూములను ఆక్రమించుకున్న బీఆర్ఎస్ పార్టీ విధానమే ఇప్పు డు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా కొనసాగిస్తోంది. – పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే 140 ఏళ్ల చరిత్ర గల పార్టీ.. 140 ఏళ్ల చరిత్ర గల పార్టీకి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం లేదు. అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మిస్తుండగా, ఆదిలాబాద్లోనూ స్థలం అన్వేషించాం. విజయ డెయిరీలో ఖాళీగా ఉన్న ఎకరం భూమిని ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాం. దీనికి కేబినెట్ ఆమోదం లభించింది. ఎంత ధర కట్టే విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్తాం. – నరేశ్ జాదవ్, డీసీసీ అధ్యక్షుడు -
జిల్లాలో ఎరువుల స్టాక్ వివరాలు..
కొద్ది రోజుల్లో వానాకాలం సాగు సీజన్ మొదలవుతుంది. మార్క్ఫెడ్ వద్ద యూరియాతో పాటు ఇతర ఎరువులు అందుబాటులో ఉన్నార ుు. ముందస్తుగానే వాటిని పీఏసీఎస్లు, ప్రైవేట్ డీలర్లకు పంపిణీ చేయాలి. అ యితే వ్యవసాయ శాఖ ఇప్పటివరకు సరైన కార్యాచరణ రూపొందించలేదనే విమర్శలున్నాయి. దీంతో ఇటు సొసైటీల్లో నోస్టాక్ దర్శనమిస్తుండగా, అటు ప్రైవేట్ వద్ద నామమాత్రంగా ఉన్నట్లుగా వ్యవసాయ శాఖ నివేదికలే స్పష్టం చేస్తుండడం గమనార్హం. కార్యాచరణ ఏది.. ముందుగానే సొసైటీలు, ప్రైవేట్ డీలర్లకు యూరియాను పంపిణీ చేసిన పక్షంలో రైతులకు సౌకర్యంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఎక్కడా సరైన స్టాక్ లేదు. సీజన్ మొదలైన తర్వాత యూరియా కావాలని రైతులంతా ఒకేసారి వచ్చే పరిస్థితి ఉంటుంది. అదే జరిగితే మళ్లీ దుకాణాల ఎదుట బారులు తప్పకపోవచ్చు. గతేడాది జిల్లాలో అనేకచోట్ల ఈ సమస్య తలెత్తింది. ఈక్రమంలో యంత్రాంగం అప్రమత్తమై పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలి. కానీ ఆ కార్యాచరణ ఇప్పటివరకు అమలు చేయడం లేదనే విమర్శలున్నాయి. మరోవైపు యూరియా స్టాక్ మార్క్ఫెడ్ వద్ద ఉన్నట్లుగా వ్యవసాయ శాఖ చెబుతున్నా పంపిణీకి సంబంధించి ఎలాంటి ప్రణాళిక రూపొందించకపోవడం గమనార్హం. యాప్ అమలు తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 20 నుంచి ఫ ర్టిలైజర్ యాప్ను అమలులోకి తీసుకొచ్చింది. త ద్వారా రైతులు ముందుగా బుక్ చేసుకొని నిర్ధారిత సమయానికి, ఎంపిక చేసుకున్న కేంద్రాల్లో వాటిని తీసుకునే అవకాశం కల్పించింది. అయితే యాప్ అమలులోకి వచ్చాక రైతులు ముందుగా బుక్ చేసుకొని కావాల్సిన ఎరువు మాత్రమే తీసుకుంటున్నారు. అంతకుముందు యూరియా కోసం వచ్చే రైతులకు వాటితో పాటు డీఏపీ, కాంప్లెక్స్, ఎంఓపీ, ఎస్ఎస్పీ ఇలా ఇతర ఎరువులను కూడా ప్రైవేట్ డీలర్లు, వ్యాపారులు అంటగట్టి వ్యాపార పరంగా ప్రయోజనం పొందేవారు. యాప్ రాకతో పరిస్థితి మారింది. డీలర్లు ప్రస్తుతం రైతు బుక్ చేసుకున్న ఎరువు మాత్రమే ఇవ్వాలి. ఈ క్రమంలో ప్రైవేట్ వ్యాపారులకు యూరియా విక్రయాలపై పెద్దగా మార్జిన్ లేకపోవడం, ఇతర ఎరువులను విక్రయించే పరిస్థితి లేకపోవడంతో వారు వీటి విక్రయాలపై ఆసక్తి చూపడం లేదనే ప్రచారం సాగుతుంది. దీంతోనే ప్రస్తుతం ప్రైవేట్లో నామమాత్రంగా స్టాక్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ వానాకాలంలోనూ ఇదే పరిస్థితి ఎదురైతే రైతులు ప్రభుత్వ కేంద్రాల వద్ద మళ్లీ బారులు తీరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదీ పరిస్థితి.. వానాకాలం సాగు సీజన్ సమీపిస్తోంది. విత్తనాలు నాటిన తర్వాత రైతులకు యూరియా అవసరమవుతోంది. ఆ సమయంలో అంతా ఒకేసారి వస్తుండడంతో బారులు తీరాల్సిన దుస్థితి. జిల్లాలో గతేడాది ఈ సమస్య తలెత్తింది. అయినా వ్యవసాయ శాఖ, మార్క్ఫెడ్ పాఠం నేర్వనట్టుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ప్రణాళిక రూపొందించకపోవడం, పకడ్బందీ కార్యాచరణ లేకపోవడంతో ఈ సారి కూడా అగచాట్లు తప్పవా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి,ఆదిలాబాద్ జిల్లాలో ఏటా ప్రభుత్వ కేంద్రాలైన సొసైటీలు, డీసీఎంఎస్లు, అగ్రో సేవ కేంద్రాలతో పాటు ప్రైవేట్ షాపుల్లో కలిపి లక్ష మెట్రిక్ టన్నులకు పైగా ఎరువుల విక్రయాలు జరుగుతాయి. ఇందులో ప్రభుత్వ కేంద్రాల్లో 60 శాతం, ప్రైవేట్లో 40 శాతం వరకు విక్రయిస్తారు. ఒక్కోసారి ప్రభుత్వ కేంద్రాల్లో అందుబాటులో లేకపోతే రైతులు ప్రైవేట్లో కొనుగోలు చేస్తారు. అక్కడా లేకపోతే రైతుల కష్టాలు వర్ణనాతీతమే.మార్క్ఫెడ్ వద్ద : 14,631 మెట్రిక్ టన్నులు ప్రైవేట్ డీలర్ల వద్ద: 1,158 మెట్రిక్ టన్నులు కంపెనీల వద్ద : 1,266 మెట్రిక్ టన్నులుపంపిణీకి సిద్ధం చేశాం.. జిల్లాలో వానాకాలం సీజన్కు సంబంధించి యూరియాతో పాటు ఇత ర ఎరువులు పంపిణీకి స రిపడా స్టాక్ ఉంది. దీన్ని సొసైటీలు, ప్రైవేట్ డీలర్లకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నాం. – శ్రీధర్ స్వామి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
షార్ట్సర్క్యూట్తో మొక్కజొన్న దగ్ధం
కుభీర్: విద్యుత్ షార్ట్సర్క్యూట్తో మొక్కజొన్న పంట దగ్ధమైన ఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని దార్కుభీర్కు చెందిన కురుణబాయి అనే మహిళా రైతుకు తనకున్న 15 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసింది. ఇటీవల పంటను కోసి చేనులోనే కుప్పగా వేసింది. కుమారుడికి వివాహం నిశ్చయం కావడంతో పంటనూర్పిడి చేయలేదు. మంగళవారం చేనుపై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు ఒకదానికి ఒకటి తాకడంతో నిప్పురవ్వలు ఎగిసిపడి పంట దగ్ధమైంది. పక్కనే ఉన్న చేనులో రైతులు శేషరావ్, తోకల సుదర్శన్ వానాకాలంలో సాగు చేసేందుకు పసుపు విత్తనాలు కొనుగోలు చేసి కుప్పగా వేశారు. ఘటనలో పసుపు విత్తనాలు కూడా దగ్ధమయ్యాయి. సంఘటన స్థలాన్ని రెవెన్యూ అధికారులు పరిశీలించారు. సుమారు 18 లక్షల వరకు నష్టం జరిగినట్లు అంచనా వేశారు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. -
ఎండలతో జర పదిలం
ఆదిలాబాద్టౌన్: ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా హీట్వేవ్ కారణంగా జనాలు అతలాకుతలం అవుతున్నారు. 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా ఎండ తీవ్రత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా క్రీడాకారులు ఎండ నుంచి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆటలు, వ్యాయామం చేయాలని చెబుతున్నారు. ముఖ్యంగా పాఠశాలలు, క్రీడా మైదానాల్లో శారీరక శ్రమ ఎక్కువగా చేసే పిల్లలు ఎండ ప్రభావానికి గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించకుంటే వడదెబ్బకు గురయ్యే ప్రమా దం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు జ్వ రం, వాంతులు, విరోచనాల బారిన పడే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు. జాగ్రత్తలు పాటించాలి.. ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య, సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే ఆటలు ఆడటం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తీవ్రమైన ఎండలో ఎక్కువసేపు శారీరక శ్రమ చేయడం ద్వారా డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్, అలసట, తలనొప్పి వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. వి ద్యార్థులు ఆటల సమయంలో త రచూ నీరు తాగాలని, ఓఆర్ఎస్, కొబ్బరి నీరు, పండ్ల రసాలు తీసుకోవడం మంచి దని చెబుతున్నారు. కాటన్ దుస్తులు, టోపీ ధరించడంతో శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుందని పేర్కొంటున్నారు. ఎండలో ఎక్కువసేపు ఉండడంతో తల తిరగ డం, వాంతులు, అధిక చెమటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నీడ ప్రదేశానికి వెళ్లి వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఆరో గ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఖాళీ కడుపుతో ఆటలకు పంపించవద్దని, శిక్షకులు విద్యార్థులకు తగిన విరామం ఇవ్వడంతో పాటు తాగునీటి సదుపాయం కల్పించాలని పేర్కొంటున్నారు. కబడ్డీ ఆడుతున్న క్రీడాకారులు ఆస్నాదలో క్రికెట్ ఆడుతున్న చిన్నారులుపెరట్లో చిన్నారుల క్రికెట్చెన్నూర్రూరల్: వేసవి సెలవుల్లో గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులంతా ఒకేచోట చేరి ఆడుతున్న ఆటలు చూడ ముచ్చటగా ఉంటాయి. అందులోనూ క్రికెట్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎంతగానో ఇష్టపడతారు. మండలంలోని ఆస్నాద గ్రామంలో మంగళవారం సాయంత్రం చిన్నారులు తమ ఇంటివద్ద ఉన్న పెరట్లో ఇలా క్రికెట్ ఆడుతూ ‘సాక్షి’ కెమెరాకు చిక్కారు. ఆటలకు ముందు క్రీడాకారులు వామప్ చేసి జాగింగ్ చేయడం మంచిది. రన్నింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా వామప్ చేయాలని క్రీడా నిపుణులు చెబుతున్నారు. లేదంటే నీరసించిపోయి సామర్థ్యం తగ్గుతుందంటున్నారు. ఆయా క్రీడల్లో పాల్గొనే ముందు తప్పనిసరిగా స్టిల్స్ ప్రాక్టిస్ చేసి గేమ్లోకి దిగితే ఎక్కువ సమయం ఆడే అవకాశం ఉంటుందన్నారు. -
డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు
ఆదిలాబాద్టౌన్: డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నా రు. ఇందులో భాగంగా పట్టణంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, మార్కెట్ పరిసర ప్రాంతాల్లో నార్కోటిక్ జాగిలం రోమాతో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రజలకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
రోడ్డెక్కిన రైతులు
బోథ్: జొన్నల కొనుగోలులో నిబంధనలు మార్చాలని డిమాండ్ చేస్తూ రైతులు మంగళవారం రోడ్డెక్కారు. మండల కేంద్రంలోని కోరమండల్ వద్ద రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దిగుబడి పెరిగిన నేపథ్యంలో ఎకరానికి 10 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలనే నిబంధనను తక్షణమే రద్దు చేయాలన్నారు. ఎకరాకు 20 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనతో రహదారికి ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని పోలీసులు నచ్చజెప్పడంతో వారు శాంతించారు. ఆందోళన విరమించారు. -
‘హస్తం’కు నీడపై రగడ
సాక్షి,ఆదిలాబాద్: హస్తం పార్టీ కార్యాలయం కోసం జిల్లా కేంద్రంలోని విజయ డెయిరీలో ఎకరం స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. దీనిపై బీజేపీ విమర్శలు గుప్పిస్తుండగా, బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ నిర్ణయానికి మద్దతు తెలపడంపై రామన్న ప్రజలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే శంకర్ డిమాండ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాలకు సొంత జాగా లేనిచోట స్థలం కేటాయిస్తూ ఇటీవల కేబినెట్ తీర్మానం చేసింది. ఆదిలాబాద్లో కలెక్టర్, ఎస్పీ క్యాంప్ కార్యాలయాలతో పాటు ఇతర ఉన్నతాధికారులు నివాసం ఉండే ప్రాంతంలోనే ఈ స్థలం ఉంది. దీనికోసం ప్రత్యేకంగా ఇటీవల మున్సిపల్ సమావేశం నిర్వహించారు. అందులో బీజేపీ కౌన్సిలర్లు కాంగ్రెస్ కార్యాలయం కోసం కేటాయించిన స్థలంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. అయితే బీఆర్ఎస్, ఎంఐఎంలు హస్తం పార్టీ నిర్ణయాన్ని సమర్థించాయి. దీనిపై ప్రస్తుతం రాజకీయ దుమారం చోటుచేసుకుంది. రైతులకు సంబంధించిన భూమి.. జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కు వెనకాల విజయ డెయిరీకి విలువైన భూమి ఉంది. ఇందులో పాల శీతలీకరణ కేంద్రంతో పాటు ఉద్యోగులు, సిబ్బందికి సంబంధించి క్వార్టర్స్ కూడా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల కోసం స్థలం కేటాయించాలంటూ ప్రభుత్వానికి కాంగ్రెస్ దరఖాస్తు చేసుకుంది. దీనిపై క్షేత్రస్థాయిలో ఆయా పార్టీల నాయకులు స్థల అన్వేషణ చేశారు. ఆఫీసర్స్ క్లబ్కు ఎదురుగా ఉన్న ఎస్సీ హాస్టల్, డీఎస్పీ కార్యాలయం సమీపంలోని ఖాళీ స్థలంతో పాటు విజయ డెయిరీ స్థలాన్ని పరిశీలించారు. అందులో ఎస్సీ హాస్టల్ స్థలాన్ని ఎంపిక చేసినప్పటికీ దీనిపై వివాదం చోటుచేసుకోవడంతో యంత్రాంగం దానికి ఒప్పుకోలేదు. దీంతో విజయ డెయిరీలోని ఖాళీ స్థలాన్ని ఎంపిక చేయగా, దానికి ఇటీవల కేబినెట్ ఆమోదం లభించింది. బీఆర్ఎస్పై విమర్శలు.. రాష్ట్రస్థాయిలో బీఆర్ఎస్ తమను ప్రతిపక్షంగా చె ప్పుకుంటున్నప్పటికీ, ఆదిలాబాద్లో మాత్రం బీ ఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తూ రైతుల ప్రయోజ నాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నాయని బీజే పీ ఆరోపిస్తోంది. రైతులకు సంబంధించిన విజయ డెయిరీ స్థలంలో విలువైన భూమిని పార్టీ కార్యాలయాల కోసం కేటాయించడాన్ని విమర్శిస్తోంది. దీనిపై కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకొని రైతుల భూమిని కాపాడాలని ఎమ్మెల్యే శంకర్ కోరారు. -
యువతలో నైపుణ్యాభివృద్ధిపై దృష్టి
కై లాస్నగర్: యువతలో నైపుణ్యాలు పెంపొందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన–ప్రగతిప్రణా ళిక 99రోజుల కార్యాచరణలో భాగంగా జెడ్పీ సమా వేశ మందిరంలో యువతకు కెరీర్ గైడెన్స్, స్కిల్ డె వలప్మెంట్పై మంగళవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా ప్రైవేట్ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ స్టడీసర్కిల్కు సొంత భవనం మంజూ రైందని వెల్లడించారు.ఇందులో డీవైఎస్వో శ్రీనివా స్,ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, జిల్లా ట్రై బల్ స్పోర్ట్స్ ఆఫీసర్ పార్థసారథి, ఉట్నూరు, బీసీ, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్లు ప్రవీణ్,రమేశ్ పాల్గొన్నారు. ఆదిలాబాద్ పర్యాటక వైభవాన్ని చాటుదాం ఆదిలాబాద్రూరల్: ఆదిలాబాద్ పర్యాటక వైభవా న్ని ప్రపంచానికి చాటుదామని కలెక్టర్ రాజర్షి షా అ న్నారు. మావల పార్క్లో మంగళవారం నిర్వహించిన ప్రెస్ టూర్ కార్యక్రమానికి ఆయన హాజరై మా ట్లాడారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక పర్యాటక వారోత్సవాల్లో భాగంగా ‘ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ కాంపిటీషన్’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడి యా ఇన్ఫ్లుయెన్సర్లు, హ్యాండ్లర్స్ కంటెంట్ క్రియేటర్లు, మీడియా ప్రతినిధులు ఇందులో పాల్గొనవచ్చని తెలిపారు. ఆసక్తి కలవారు జిల్లాలోని పర్యాట క ప్రాంతాలు, ప్రకృతి అందాలు, జలపాతాలు, చా రిత్రక వైభవం, స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేలా రీల్స్, వీడియోలు రూపొందించాలని సూచించారు. వాటిని ఈనెల 21 ఉదయం 11గంటలలోపు పెన్డ్రైవ్ ద్వారా జిల్లా కేంద్రంలోని విద్యుత్ తరంగిణి ఫంక్షన్ హాల్లో నేరుగా అందజేయాలని సూ చించారు. వివరాలకు 9440816087, 915417 0902 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే ధ్యేయం ఉట్నూర్రూరల్: గిరిజన ప్రాంతాల్లోని మత్స్యకారు ల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంద ని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఉట్నూర్లోని కేబీ కాంప్లెక్స్ పీఎంఆర్సీ భవనంలో గిరిజన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులకు మంగళవారం నిర్వహించిన ప్రత్యే క అవగాహన సదస్సుకు ఐటీడీఏ పీవో మకరందు తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ, గిరిజన మత్స్యకారులు ఆధునిక చేపల పెంపక విధానాలను అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి లాయక్ మొహమ్మద్దీన్, ఆర్డీవో గంగాధర్, మత్స్య శాఖ అధికారులు, గిరిజన మత్స్య పారిశ్రామిక స హకార సంఘాల అధ్యక్షులు సభ్యులుపాల్గొన్నారు. -
‘కోఆప్షన్’పై వీడని సందిగ్ధం
కైలాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి ప్రత్యేక సమావేశ నిర్వహణపై సందిగ్ధం వీడటం లేదు. కౌన్సిల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ సమావేశ నిర్వహణకు పట్టుబడుతుంది. సోమవారం నిర్వహించిన మున్సిపల్ ప్రత్యేక సమావేశంలోనూ ఆ పార్టీ కౌన్సిలర్లు ఇదే అంశంపై కమిషనర్ను ప్రశ్నించారు. చైర్పర్సన్ త్వరలోనే తేదీ ఖరారు చేస్తారంటూ కమిషనర్ చెప్పడంతో వెనక్కితగ్గారు. అయితే చైర్పర్సన్ ఎటూ తేల్చకపోవడంతో స్పష్టత రాని పరిస్థితి. రెండు, మూడు రోజుల్లోగా దీనిపై తేల్చని పక్షంలో కోర్టును ఆశ్రయించాలని కమలం పార్టీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదేశాలకనుగుణంగా ముందుకు సాగాలని అధికార పార్టీ భావిస్తోంది. ఇరు పార్టీల భిన్న నిర్ణయాలతో మున్సిపల్ అధికారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేక సమావేశానికి బీజేపీ డిమాండ్ .. నాలుగు కోఆప్షన్ పదవులకు గాను బీజేపీ ముగ్గురిని బరిలో నిలిపింది. మరో స్థానం కోసం దరఖాస్తు చేసుకున్న మైనార్టీ వర్గానికి చెందిన మాజీ కౌన్సిలర్కు మద్దతు ఇస్తున్నట్లుగా ప్రచారం సాగుతుంది. చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికలో విఫలమైన ఆ పార్టీ ఎలాగైన ఈ సారి నాలుగింటికి కై వసం చేసుకుని మున్సిపల్లో పట్టు నిలుపుకో వా లని భావిస్తోంది. ఆ దిశగా వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ కౌన్సిలర్లు మంగళవారం మరో సారి మున్సిపల్ కమిషనర్ను సంప్రదించారు. ప్రత్యేక సమావేశం తేదీ ఖరారుపై చర్చించారు. రెండు, మూడు రోజుల్లోగా తేల్చకపోతే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఆ దిశగా కార్యాచరణ సైతం సిద్ధం చేస్తున్నారు. ఆచితూచి వ్యవహరిస్తున్న చైర్పర్సన్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించిన ప్రత్యేక సమావేశం నిర్వహణపై నిర్ణయం తీసుకోవాల్సిన అధికారం చైర్పర్సన్పై ఉంటుంది. ఆమె నిర్ణయించే తేదీకనుగుణంగా బల్దియా అఽధికారులు తగు చర్యలు తీసుకుంటారు. అయితే ఈ విషయంలో చైర్పర్సన్ అనూష ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లితో పాటు డీసీసీ అధ్యక్షుడు నరేశ్జాదవ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస రెడ్డి ఆదేశాలకనుగుణంగానే ముందుకు సాగాలని ఆమె నిర్ణయించినట్లుగా ప్రచారం సాగుతుంది. వారిచ్చే ఆదేశాలకనుగుణంగా ముందుకు సాగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో సమావేశం జరిగే అవకాశమున్నట్లుగా అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
ముఖ్యమంత్రి పర్యటనలో మార్పు
కైలాస్నగర్/ఆసిఫాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డి పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ ది నోత్సవం పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లాకు వస్తారని మొదట ప్రచారం జరిగింది. కానీ జూన్ 2న సీఎం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు రానున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు బుధవారం కుమురంభీం జిల్లాలో సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని మంత్రి ప్రత్యేక కార్యదర్శి కాసుల నానిల్ కుమార్ తెలిపా రు. మంత్రులు మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్లోని బేగంపేట నుంచి హెలి కాప్టర్ ద్వారా ఆసిఫాబాద్ కలెక్టరేట్కు చేరుకోనున్నారు. అనంతరం సీఎం బహిరంగ సభ నిర్వహించే ప్రాంతాన్ని పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2.15 గంటల నుంచి సా యంత్రం 4.45 గంటల వరకు కలెక్టరేట్లో అధి కా రులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంత రం హైదరాబాద్కు తిరిగి వెళ్లనున్నారు. రాష్ట్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో మంగళవారం కుము రంభీం కలెక్టర్ కె.హరిత, ఎస్పీ నితిక పంత్, ఎమ్మెల్సీ దండె విఠల్ కాగజ్నగర్ ఎక్స్రోడ్, వంజిరీ దాదానగర్ ప్రాంతాలను పరిశీలించారు. సీఎం ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం, అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సమాచారం. -
ఆగని పెట్రో బాదుడు
కైలాస్నగర్: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఈనెల 15న రూ.3ల చొప్పున పెంచిన ఆయిల్ కంపెనీలు తాజాగా మంగళవారం మరోసారి పెంపు నిర్ణయం తీసుకుని అమల్లోకి తెచ్చాయి. నాలుగు రోజుల వ్యవధిలో రెండో సారి పెంచడంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. తాజాగా దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ పై రూ.0.86 పైసలు, డీజిల్పై రూ.0.83 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే జిల్లాకు వచ్చేసరికి అవి రూపాయి వరకు పెరిగాయి. ఇప్పటికే పెరిగిన పెట్రో ధరలు వాహనదారులకు భారంగా మారాయి. రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పెంచిన ధరలు తగ్గించాలని ఓ వైపు ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తుండగా.. ఆయిల్ కంపెనీలు మరోసారి పెంచడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. ఈ పెంపుతో జిల్లాలో పెట్రోల్పై రోజుకు రూ.70వేలు, డీజిల్పై రూ.లక్షన్నర వరకు అదనపు భారం పడనుంది. ఈ లెక్కన నెలకు డీజిల్పై రూ.45లక్షలు, పెట్రోల్పై రూ.21లక్షలు కలిపి మొత్తంగా రూ.66లక్షల వరకు భారం పడనున్నట్లుగా తెలుస్తోంది. జిల్లాలో పెట్రోల్ బంక్లు : 70 రోజువారీగా.. డీజిల్ వినియోగం : 150–170 కిలోలీటర్లు పెట్రోల్ వినియోగం : 70– 80 కిలోలీటర్లు పాత ధర కొత్త ధర పెట్రోల్ రూ.112.25 రూ.113.25 డీజిల్ రూ.100.39 రూ.101.39 -
మరణంలోనూ వీడని మూడుముళ్ల బంధం
ఆదిలాబాద్టౌన్/గుడిహత్నూర్:ఏడడుగులు నడిచి.. జీవితాంతం కలిసి ఉండాలని ఒక్కటైన మూడుముళ్ల బంధం మరణంలోనూ వీడలేదు.. ఈ జంటను మృత్యువు రోడ్డు ప్రమాదంలో కబళించింది.. అన్న కుమారుడి వివాహ వేడుకలకు వెళ్తుండగా బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది.. మరికొంత దూరంలోనే గమ్యం చేరుకోవాల్సిన వారు కానరాని లోకాలకు వెళ్లిపోయారు.. దీంతో పెండ్లి బాజాలు మోగాల్సిన కుటుంబంలో చావు డప్పులు మోగే పరిస్థితి. అసలేం జరిగిందంటే.. గుడిహత్నూర్ మండలం తోషం గ్రామ పంచాయతీ పరిధి తోయగూడకు చెందిన పెందూర్ లక్ష్మణ్ (50), పెందూర్ శకుంతల (45) దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె పూర్ణబాయికి వివాహమైంది. కుమారుడు అరవింద్ ఉన్నాడు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మృతుని సోదరుడు జైనూర్ మండలం పాట్నాపూర్లో నివాసం ఉంటున్న భీంరావు ఐదారేళ్ల క్రితం మృతి చెందాడు. గురువారం భీంరావు కుమారుడి వివాహం జరగాల్సి ఉంది. ఆ కుటుంబానికి వీరే పెద్ద దిక్కు. సంప్రదాయం ప్రకారం వీరు పెళ్లి కుమారుడికి హల్దీ కార్యక్రమం మంగళవారం చేపట్టాల్సి ఉంది. దీంతో ఈ దంపతులు ద్విచక్ర వాహనంపై ఉదయం 11:30 గంటల ప్రాంతంలో గుడిహత్నూర్ నుంచి బయల్దేరి వెళ్లారు. ఉట్నూర్ సమీపంలోని యేంద వద్ద కారును ఓవర్టేక్ చేసే సమయంలో బైక్ కారుకు తగలడంతో అదుపుతప్పి ఎదురుగా ఉట్నూర్ వైపు నుంచి ఆదిలాబాద్ వైపు వస్తున్న ఆసిఫాబాద్ డిపోకు చెందిన బస్సుకింద పడ్డారు. పెందూర్ లక్ష్మణ్ తల, శరీర భాగాల పైనుంచి బస్సు టైర్లు వెళ్లడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రగాయాలపాలైన శకుంతల కొన ఊపిరితో కొట్టుకుంటుండగా స్థానికులు ఉట్నూర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచింది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలకు ఉట్నూర్ ఆస్పత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. పెళ్లింట విషాదం.. ఎంతో సంబరంగా పెళ్లి జరగాల్సిన ఆ ఇంట్లో చావు డప్పులు మోగడంతో వారు జీర్ణించుకోలేక పోతున్నారు. పెళ్లికి హాజరు కావాల్సిన బంధువులు అంతిమ యాత్రకు రావడంతో గ్రామాల్లో విషాదం నెలకొంది. -
నీళ్లల్లో హాయ్ హాయ్..
నిర్మల్: వేసవి సెలవులను ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేందుకు జిల్లావాసులు ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా వాటర్ పార్కులు, రిసార్టులు జిల్లాలో అందుబాటులోకి రావడంతో కుటుంబాలతో కలిసి ఆనందంగా గడుపుతున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలోనే సారంగపూర్ మండలం రాణాపూర్ వద్ద పచ్చని ప్రకృతి ఒడిలో వండర్ల్యాండ్ పేరిట వాటర్పార్క్ ఏర్పాటు చేశారు. కృత్రిమ జలపాతం, రెయిన్డ్యాన్స్లతో పాటు అరుదైన జిప్ సైకిల్, జిప్లైన్, రాకెట్ ఎజెక్షన్, 360 డిగ్రీల సైకిలింగ్, నాలుగుసీట్ల గైరో, క్రేజీ రోలర్, బుల్రైడ్, బౌన్సీ, పిల్లలకు నెట్ ట్రాంపోలిన్ ఇలా ఎన్నో అడ్వెంచర్లు ఉన్నాయి. వేసవి తాపాన్ని మరిచిపోయేలా వాటర్పార్కులు, స్విమ్మింగ్పూల్స్తో కూడిన రిసార్టుల్లో జిల్లావాసులతో సందడి చేస్తున్నారు. కాస్త ఆసక్తి ఉన్నవాళ్లు కశ్మీర్, లద్దాఖ్, సిమ్లా, సిక్కిం తదితర ప్రాంతాలకు వెళ్తున్నారు. అంతదూరం వద్దనుకున్నవాళ్లు ఊటీ, కొడైకెనాల్ వంటి చల్లని ప్రదేశాలకు కుటుంబంతో కలిసి వెళ్లి కూల్గా గడిపేస్తున్నారు. మార్గమధ్యలో ప్రసిద్ధ ఆలయాలు, పేరొందిన టూరిస్ట్ ప్రాంతాలనూ దర్శిస్తున్నారు.మిత్రులతో కలిసి.. కుటుంబసభ్యులంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేందుకు ఇతర నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. మాకూ ఇలాంటివి తప్పలేదు. దూరప్రాంతాలకు వెళ్లే పరిస్థితులు లేనివాళ్ల కోసం ఇక్కడే ఏదైనా చేయాలన్న లక్ష్యంతో మిత్రులం కలిసి ‘వండర్ల్యాండ్’ను ఏర్పాటు చేశాం. ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిరోజూ మంచి స్పందన ఉంటోంది. – నూకల గురుప్రసాద్, వండర్ల్యాండ్ వాటర్పార్క్ కశ్మీర్ భూతలస్వర్గమే.. వేసవిలో ఎటైనా వెళ్లాలనుకునే వారికి మంచి టూర్ కశ్మీర్. హిమాలయ అందాలతో భూతలస్వర్గాన్ని తలపిస్తుంది. జీవితంలో ఒక్కసారైనా కశ్మీర్ అందాలను తిలకించాల్సిందే. ఈ సీజన్లో కుటుంబంతో ‘కూల్’గా వాటన్నింటినీ ఆస్వాదించడం ఎప్పటికీ మర్చిపోలేం. – నగేశ్, టీచర్, నిర్మల్ ఈ చిత్రంలో ఉన్న వీరంతా నిజామాబాద్, బాన్సువాడకు చెందిన కుటుంబసభ్యులు. వాటర్పార్క్లో ఓ రోజంతా పిల్లలతో ఎంజాయ్ చేయడానికి వచ్చారు. అంతదూరం నుంచి వచ్చిన వారంతా ఉదయం నుంచి సాయంత్రం దాకా వాటర్పార్క్లో, రెయిన్డ్యాన్స్లో చల్లగా సేదదీరారు. పిల్లలతో పాటు పెద్దలూ ఇక్కడి వాటర్గేమ్స్ను ఎంజాయ్ చేశారు. -
వాహనాలు భద్రం
బెల్లంపల్లి: వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మండుతున్న ఎండలతో వాహనాలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు పొంచి ఉన్నాయి. ఎండలో పార్కింగ్ చేసిన వాహనాలు వేసవి తీవ్రతకు పెట్రోల్ ట్యాంక్ హీటెక్కి మంటలు చెలరేగే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే అక్కడక్కడ బైక్లు, కార్లు మంటల్లో కాలిపోయిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 19న ఇచ్చోడ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఇంజిన్లోంచి మంటలు చెలరేగి కారు దగ్ధమైన ఘటన చోటు చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో బైక్లు, కార్లను నీడపట్టున పార్కింగ్ చేయాలని బెల్లంపల్లికి చెందిన ఓ సీనియర్ మెకానిక్ గౌరు మహేష్ సూచిస్తున్నారు. ఎండలో వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. -
కో‘నీటి’లో మునిగి యువకుడు మృతి
దిలావర్పూర్: ప్రమాదవశాత్తు కోనేరులో మునిగి యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల మేరకు సారంగాపూర్ మండలంలోని తాండ్ర గ్రామానికి చెందిన పచ్చిమట్ల శ్రీనివాస్గౌడ్ మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి దిలావర్పూర్లోని ఎల్లమ్మ ఆలయంలో మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్లారు. అతని చిన్న కుమారుడైన రోహిత్గౌడ్ (24) కోనేరులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వడదెబ్బతో వృద్ధురాలు..భైంసాటౌన్: పట్టణంలోని గణేశ్నగర్కు చెందిన రావుల లక్ష్మీబాయి (68) వడదెబ్బతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతురాలి భర్త, కుమారుడు గతంలోనే చనిపోగా, ఆమె కూరగాయలు విక్రయిస్తూ ఒంటరిగా ఉంటోంది. సోమవారం ఎప్పటిలాగే వారసంతలో కూరగాయలు విక్రయించేందుకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకుంది. వాంతులు చేసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మంగళవారం ఉదయం స్థానికులు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలుమంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల బస్టాండ్ సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొట్టిన ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం పాతమంచిర్యాలకు చెందిన పూదారి సూరయ్య బైక్పై మంచిర్యాల నుంచి ఇంటికి వెళ్తుండగా పాతమంచిర్యాల బస్టాండ్ సమీపంలో మంచిర్యాల నుంచి ఉట్నూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్ క్రాస్ చేస్తున్న సూరయ్య బైక్ను ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో స్థానికులు 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులను వివరణ కోరగా బాధితుల నుంచి ఫిర్యాదు రాలేదన్నారు. -
సాయ్ ఆర్చరీ అకాడమీకి ఎంపిక
ఆదిలాబాద్రూరల్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆర్చరీ అకాడమీకి ఆదిలాబాద్ రూరల్ మండలం చించుఘాట్ ఆశ్రమోన్నత పాఠశాలకు చెందిన పెందూర్ రూప ఎంపికై ంది. హైదరాబాద్ గచ్చిబౌలి అకాడమిలో అత్యున్నత ప్రమాణాలతో శిక్షణ ఇవ్వనున్నారు. గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి కె.పార్థసారధి మంగళవారం సదరు విద్యార్థిని స్వగ్రామం ఆదిలాబాద్ రూరల్ మండలం టేకిడిగూడకు వెళ్లి రూపతో పాటు ఆమె తల్లిదండ్రులను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాదవ్ ప్రేమ్దాస్, సర్పంచ్ మేస్రం అనసూయ షాకు, పటేళ్లు కుమ్ర రాజు, పెందూర్ సుంగు, ఆర్చరీ కోచ్ మారుతి పాల్గొన్నారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
నెన్నెల: వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో పిల్లలు బయట ఆడుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులు చెట్ల నీడన చేరి క్రికెట్, తదితర క్రీడలు ఆడుతూ ఉత్సాహంగా వేసవి సెలవులు గడిపేస్తున్నారు. ఎండకు ఆడే ఆటలను పక్కన బెట్టి చెట్టు నీడన ఆడే ఆటలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వేసవి సెలవులకు అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి వచ్చిన పిల్లలను ఎండ తీవ్రత దృష్ట్యా బయటకు వెళ్లకుండా పెద్దలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంగళవారం వేప చెట్టు నీడన చిన్నారులు క్రికెట్ ఆడుతుండగా ‘సాక్షి’ కెమెరాలో బంధించింది. -
పోలీసుల ప్రతిష్ట పెంచాలి
ఆదిలాబాద్టౌన్: పోలీసుల ప్రతిష్ట పెరిగేలా ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మ హాజన్ అన్నారు. మంగళవారం సాయుధ సి బ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఎలాంటి సమస్యలున్నా నిర్భయంగా ఉన్నతాధికారులను సంప్రదించి సామరస్యంగా, చట్టపరంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఇతరులకు షురిటీలు ఇచ్చే విషయంలో జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. పలువురు సిబ్బంది తమ వ్యక్తిగత, శాఖాపరమైన సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకురాగా, పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇందులో ఆదిలాబాద్ ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, ఆర్ఐలు డి.వెంకటి, టి.మురళి, ఎన్.చంద్రశేఖర్, ఆర్ఎస్సైలు దేవేందర్, వినోద్, మహేశ్, గబ్బర్ సింగ్, ఆశన్న, ఏఆర్ ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి
ఆదిలాబాద్టౌన్: విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని సీజీఆర్ఎఫ్ చైర్మ న్ సలంద్ర రామకృష్ణ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్)ను ఏర్పాటు చే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సీజీఆర్ఎఫ్ ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. బిల్లుల్లో హెచ్చుతగ్గులు, మీటర్ల సమస్యలు, వేలాడే తీగలు, ట్రాన్స్పార్మర్ల సమస్యలు తదితర వాటిపై వినియోగదారులు దరఖాస్తులు అందజేశారు. సమస్యల పరిష్కారానికి చ ర్యలు చేపడతామని ఆయన వివరించారు. ఇందులో విద్యుత్ శాఖ సీఈ జేఆర్ చౌహాన్, సీజీ ఆర్ఎఫ్ ఫైనాన్స్ మెంబర్ సత్యనారాయణ, డీఈ నాగరాజు, అధికారులు జనార్దన్రెడ్డి, శ్రీనివాస్, రాజన్న, సతీశ్కుమార్ పాల్గొన్నారు. -
సుందరయ్యకు ఘన నివాళి
ఆదిలాబాద్టౌన్: సమసమాజం, సోషలిజం స్థాపనే సీపీఎం వ్యవస్థాపక నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్యకు నిజమైన నివాళి అని పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్ అన్నా రు. సుందరయ్య వర్ధంతిని పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. సుందరయ్య భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలను పెంచిపోషించే దుర్మార్గపు వ్యవస్థను మార్చేందుకు యు వత, కార్మిక వర్గం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ఇందులో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కిరణ్, సీనియర్ నాయకులు దత్తాత్రి, జిల్లా కమిటీ సభ్యులు మంజుల, విష్ణు, గంగన్న తదితరులు పాల్గొన్నారు. -
రాత్రి ఇక్కడే ఉండాల్సి వస్తుంది..
నేను మూడెకరాల్లో జొన్న సాగు చేసిన. చేతికొచ్చిన దాదాపు 70 క్వింటాళ్ల దిగుబడిని మార్కెట్కు తీసుకొచ్చాను. రెండు రోజుల నుంచి యార్డులో కుప్పలు పోసి ఉంచాను. మరో రెండు మూడు రోజుల వరకు కూడా కొనే పరిస్థితి కనిపించడం లేదు. పారీలు తెచ్చుకొని కప్పి ఉంచాను. రాత్రి ఇక్కడే పడుకుంటున్నాను. – రాంరెడ్డి, రైతు, ఖోడద్ వచ్చి వారం రోజులైతంది..ఈనెల 12న ఆదిలాబాద్ మార్కెట్కు 45 క్వింటాళ్ల జొన్నలు తీసుకొచ్చాను. కాంటా చేసినప్పటికీ లోడింగ్ కాకపోవడంతో ఇక్కడే ఉంటున్నా. యార్డులో కొందరు జొన్న పంట దొంగతనానికి పాల్పడుతున్నారు. పట్టీ ఇచ్చేవరకు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. – కృష్ణ, రైతు, రాంపూర్ రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలుకొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నాం. గన్నీ బ్యాగుల కొరత లేదు. ఇప్పటివరకు 70వేల క్వింటాళ్ల వరకు జొన్న పంట కొనుగోలు చేశాం. మరో 50వేల క్వింటాళ్ల వరకు యార్డుల్లో ఉంది. కొంత లేబర్ కొరత ఉంది. షెడ్యూల్ ప్రకారం రైతులు పంటను మార్కెట్కు తీసుకురావాలి. – మహేశ్కుమార్, మార్కెటింగ్ డీఎం -
భానుడు ‘మండే’
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం 9 దాటిందంటే మండే ఎండతో ప్రతాపం చూపుతున్నాడు. రాత్రి 7 దాటినా వడగా లుల సెగ తగ్గడం లేదు. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వారం రోజుల పాటు గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రమంతా హీట్వేవ్ అలర్ట్ ప్రకటించింది. ఉమ్మడి జిల్లా పరి ధిలోని ఆదిలాబాద్లో సోమవారం గరిష్ణ ఉష్ణోగ్రత 45.4 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. మంచిర్యాల, నిర్మల్లో 45.2 డిగ్రీలుగా నమోదైంది. అప్రమత్తంగా ఉండాలి.. హీట్వేవ్ కారణంగా చిన్నారులు, వృద్ధులు, గర్భి ణులు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వడ గాలులుతో జనం బెంబేలెత్తుతున్నారు. ఉపాధికూలీలు పని ప్రదేశాల్లో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే భవన నిర్మాణ కార్మి కులు, వీధి వ్యాపారులు ఎండలోనే పనులు చేస్తూ బేజారవుతున్నారు. ఇప్పటికే పలువురు వడదెబ్బకు గురయ్యారు. కాగా పొచ్చెరలో సోమవారం 45.4 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, జైనథ్లో44.6, భోరజ్లో 44.3, సిరికొండలో 44.2, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, ఆదిలాబాద్ పట్టణంలో 44 డిగ్రీలు గా నమోదయ్యాయి. మరోవైపు ఎండ తీవ్రత కారణంగా పట్టణంలో ఇటీవల ఐదు ద్విచక్ర వాహనా లు ఆహూతైన విషయం తెలిసిందే. -
విద్యుత్ సౌకర్యం కల్పించాలి
మేమంతా నిరుపేద దళితులం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబస్తీ కింద 19 మందికి అందించిన వ్యవసాయ భూములను సాగు చేసుకుంటున్నం. యాసంగిలోనూ సాగు చేసేలా బోరుబావితో పాటు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఆ దిశగా చర్యలు చేపట్టినప్పటికీ విద్యుత్ స్తంభాలు సగం వరకే వచ్చాయి. త్వరగా కరెంట్ సౌకర్యం కల్పించాలని అధికారులకు విన్నవించాం. – దళితబస్తీ లబ్ధిదారులు, పొచ్చెర, బోథ్ బిల్లులు రావడం లేదు మేమంతా పీవీటీజీ తెగకు చెందిన ఆదివాసీ గిరి జనులం. కేంద్ర ప్రభుత్వ పీఎం జన్మాన్ పథ కం కింద రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. పనులు ప్రారంభించి బెస్మెంట్, స్లాబ్ లెవల్ వరకు పూర్తి చేశాం. బిల్లులు రాకపోవడంతో పనులు చేయలేని పరి స్థితి. త్వరలో వర్షాకాలం ప్రారంభం కానున్నందున గుడిసెల్లో ఉంటున్న మాకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. త్వరగా బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. – తోటి కులస్తులు, వాగాపూర్, మావల -
భద్రతా చర్యలు పాటించాలి
ఆదిలాబాద్టౌన్: బంగారు దుకాణాల్లో భద్రతా చర్యలు తప్పనిసరి పాటించాలని ఎస్పీ అఖిల్ మ హాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో సోమవారం బంగారు ఆభరణాల దుకా ణ నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. దొంగతనాలను నివారించేందుకు దుకాణాల్లో సీసీ కెమెరాలు, మోషన్ సె న్సార్ అలర్ట్ సిస్టమ్, సైరన్ అలారం, సెన్సార్ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పెద్ద దుకా ణా ల్లో ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోవడంతో పాటు రాత్రి వేళల్లో నిఘా ఏర్పాటు చేసుకో వాలని సూచించారు. తెలిసిన వ్యక్తుల వద్ద మాత్ర మే బంగారం కొనుగోలు చేయాలని, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు. ప్ర తిరోజూ డయల్ 100, పెట్రోలింగ్ సిబ్బంది ద్వారా గస్తీ నిర్వహిస్తున్నామని, అనుమానాస్పద వ్యక్తులు, దొంగల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు.ఇందులో డీఎస్పీ ఎల్. జీవన్రెడ్డి, వన్టౌన్ సీఐ బి.సునీల్కుమార్, వ్యాపారుల సంఘం అధ్యక్షుడు దేవిదాస్, ప్రతినిధులు రాజు, భాస్కరాచారి, బి.శ్రీనివాస్ పాల్గొన్నారు. పోలీస్ అక్క సేవలు భేష్జిల్లాలో బాల్య వివాహాలు అరికట్టేందుకు పోలీస్ అక్క, షీటీంల సేవలు అభినందనీయమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బందితో సోమవారం సమావేశం నిర్వహించారు. 2026 సంవత్సరంలో ఇప్పటివరకు 26 బాల్య వివాహాలను నిలిపివేయగా, పోలీస్ అక్క బృందం 23, షీటీం 3 కేసుల్లో స్పందించి బాలికల భవిష్యత్తును కాపాడినట్లు తెలిపారు. పాఠశాలలు, గ్రామాలు, కళాశాలల్లో నిరంతరం అవగాహన కా ర్యక్రమాలు నిర్వహిస్తూ తల్లిదండ్రులకు చట్టాల పై అవగాహన కల్పిస్తున్నట్లుగా పేర్కొన్నారు. బాల్య వివాహాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గతనెలలో పోలీస్ అక్క సి బ్బంది 225 గ్రామాలను సందర్శించి 207 అవగా హన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే 15 ఈవ్టీజింగ్ కేసులు నమోదు చేసినట్లు వివరించారు. బాల్య వివాహాలపై సమాచారం తెలి సిన వెంటనే డయల్ 100, స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశా రు. ఇందులో సీఐలు ప్రేమ్ కుమార్, కె.ఫణిదర్, షీటీం సిబ్బంది సుశీల, వాణిశ్రీ పాల్గొన్నారు. -
మండుటెండ.. వేదనే నిండా
కై లాస్నగర్: ఇందిరమ్మ బిల్లులు రావడం లేదని కొందరు.. పంట చేలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని మరికొందరు.. రహదారి సౌకర్యం కల్పించాలని మరికొందరు తమ సమస్యలను అధికారుల ఎదుట విన్నవించుకున్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్కు మండుటెండను సైతం లెక్కచేయకుండా భారీగా తరలివచ్చారు. అదనపు కలెక్టర్లు ఎస్.రాజేశ్వర్, ఆర్ఎస్.చిత్రులకు తమ సమస్యలను నివేదించారు. అర్జీలు స్వీకరించిన ఉన్నతాధికారులు వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో డీఆర్వో స్రవంతి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వారం బాధితుల్లో కొందరి నివేదన.. -
ప్రజా ఫిర్యాదులు పరిష్కరించాలి
ఆదిలాబాద్టౌన్: ప్రజా ఫిర్యాదులను తక్షణ మే పరిష్కరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీ సు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 41 మంది ఎస్పీని కలిసి సమస్యలను విన్నవించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో ఎస్పీ ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. వివిధ కేసుల పురోగతిపై ఆరా తీశారు. కార్యక్రమంలో ప్రజా ఫిర్యాదుల విభా గం అధికారి కవిత, సిబ్బంది పాల్గొన్నారు. -
రసాభాసగా మున్సిపల్ ప్రత్యేక సమావేశం
కైలాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యే క సమావేశం సోమవారం రసాభాసగా మారింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ స్థలం కేటాయింపునకు సంబంధించిన ఎన్వోసీ, అర్బన్ చాలెంజ్ ఫండ్ రూ.20 కోట్లతో ఖానాపూర్ చెరువులో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు, లాంగసాంగ్వీ పంప్హౌస్ వద్ద అధునాతన వసతులతో కూడిన మరో పంపు నిర్మాణం వంటి అజెండాతో ఈ సమావేశం నిర్వహించారు. చైర్పర్సన్ అనూష అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బీజేపీ సభ్యుల ఆందోళన నడు మ అజెండాను ఆమోదించారు. కాంగ్రెస్ కార్యాలయానికి స్థలం కేటాయించవద్దంటూ ప్లకార్డులతో బీజేపీ కౌన్సిలర్లు నిరసన తెలిపారు. పోడియం ఎదుట నినాదాలు చేశారు. రాజకీయ పార్టీలకు ప ట్టణంలోని విలువైన స్థలాలను ఎలా కేటాయిస్తారని చైర్పర్సన్ను ప్రశ్నించారు. ఇందుకు ఆమె స్పందిస్తూ స్థలం తాము కేటాయించడం లేదని, రెవె న్యూ అధికారులు కేటా యించినట్లుగా తెలిపారు. దానికి ఎన్వోసీ ఇవ్వాల నే కలెక్టర్ ఆదేశాల మేరకు సమావేశం నిర్వహిస్తున్నట్లుగా స్పష్టం చేశారు. ఓ వైపు బీజేపీ కౌన్సిలర్లు ఆందోళన చేస్తుండగానే బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ కౌన్సిలర్లు అజెండా పాస్ అంటూ బయటకు వెళ్లిపోయారు. దీంతో బీజేపీ సభ్యులు కమిషనర్తో వాగ్వాదానికి దిగారు. అజెండా పత్రాలు చింపివేశారు. వన్టౌన్ సీఐ బలగాలతో అక్కడికి చేరుకున్నారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ,24మంది అంగీకారంతో అజెండాకు ఆమోదం లభించినట్లుగా తెలిపారు. కాగా, ఎన్వోసీ ఇవ్వవద్దంటూ బీజేపీ కౌన్సిలర్లు సంతకాలు చేసి కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. -
యువత ఆరోగ్యంపై దృష్టి సారించాలి
ఆదిలాబాద్: యువత ఆరోగ్యంపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ చైర్పర్సన్ అనూష అన్నారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద 5కే మారథాన్ రన్ను సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. యువత, ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం యోగా, ధ్యానం అలవర్చుకోవాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని, కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్రెడ్డి, డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, డీపీవో రమేశ్, సంక్షేమ అధికారి మిల్కా, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, వివిధ క్రీడల కోచ్లు, అధికారులు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాల్గొన్నారు. -
వంతెన నిర్మించాలి
మేమంతా సాత్నాల మండలంలోని బొరేగాం గ్రామస్తులం. గ్రామ ప్రవేశ ద్వారం వద్ద వంతెన నిర్మాణం లేక వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందవుతుంది. గర్భిణులు, రోగులను అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు సైతం తరలించలేని దుస్థితి. త్వరగా వంతెన నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.ఆ నోటిఫికేషన్ రద్దు చేయాలి ఆదిలాబాద్ పట్టణంలోని పాత ఎస్సీ హాస్టల్ కు సంబంధించిన సర్వే నంబర్ 348లో గల 30 గుంటల స్థలాన్ని కాంగ్రెస్ పార్టీకి కేటాయిస్తూ ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ నోటిఫికేషన్ జారీ చేశారు. గతంలోనూ న్యూ అంబేడ్క ర్ భవనానికి సంబంధించిన స్థలంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలోని సీనియర్ సిటిజన్ భవనా న్ని కేటాయించారు. ఈ క్రమంలో తహసీ ల్దార్ నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేసి ఆ స్థలాన్ని దళితుల అవసరాల కోసం పరిరక్షించాలి. – దళితసంఘాల నాయకులు, ఆదిలాబాద్ -
గిరిజన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం
కై లాస్నగర్: జిల్లాలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పలు ప్రాజెక్టులను చేపట్టినట్లు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. నీతి ఆయోగ్ సీఈవో సంబంధిత అదనపు కార్యదర్శులతో కలిసి 49వ ఈసీ ఆన్లైన్ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. కలెక్టరేట్ హాల్ కలెక్టర్ పాల్గొని జిల్లా పరిపాలన విభాగం సమర్పించిన రూ.5.79 కోట్ల విలువైన ప్రాజెక్టుల సమగ్ర నివేదికను వివరించారు. నార్నూర్ బ్లాక్లో శాసీ్త్రయ పద్ధతులు, మార్కెట్ లింకేజీల ద్వారా లక్క సాగు ప్రోత్సహించేందుకు రూ.40 లక్షల వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే 12 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని, మరో ఎనిమిది గ్రామాలకు విస్తరించి అమలు చేయనున్నట్లుగా తెలిపారు. తద్వారా సుమారు 370 గిరిజన కుటుంబాలకు లబ్ధి చేకూరనుందన్నారు. జిల్లాలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి రూ.3.8 కోట్ల వ్యయంతో ‘వాడీ సాగు, సమగ్ర వ్యవసాయ ప్రాజెక్టు’ కింద బోర్వెల్స్ రీచార్జి నిర్మాణాలు, ఫార్మ్ పాండ్స్, తోటల పెంపకం వంటి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ వీసీలో డీఆర్డీవో రవీందర్ రాథోడ్, నీతి ఆయోగ్ ప్రోగ్రాం అధికారి రాహుల్ తదితరులు పాల్గొన్నారు. విస్తృతంగా రెడ్క్రాస్ సభ్యత్వ నమోదు కై లాస్నగర్: జిల్లాలో రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసేలా సభ్యత్వ నమోదులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. అదనపు కలెక్టర్ చాంబర్లో రెడ్క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది చొరవ చూపి సభ్యత్వం స్వీకరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రు, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ గంగేశ్వర్, స్టేట్ ఎంసీ మెంబర్ విజయ్బాబు తదితరులు పాల్గొన్నారు. -
భార్యను ఆస్పత్రికి పంపి మృత్యు ఒడికి..
మామడ: అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను ఆస్పత్రికి వెళ్లి చూపించుకోవాలని చెప్పాడు. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి వెళ్లేందుకు తన ద్విచక్రవాహనంపై బస్టాండ్ వద్ద దింపాడు. తిరిగి ఇంటికి వెళ్తుండగా కారు రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన మామడ మండలంలో సోమవారం జరిగింది. ఎస్సై హన్మాండ్లు కథనం ప్రకారం.. పొన్కల్ గ్రామానికి చెందిన బాయ గంగాధర్(60) తాపీ మేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని భార్య లింగవ్వ తనకు ఒంట్లో నలతగా ఉందని చెప్పడంతో ఆస్పత్రికి వెళ్లి చూపించుకోవాలని సూచించాడు. ఉదయం తన ద్విచక్రవాహనంపైనే మామడకు తీసుకువచ్చాడు. బస్టాప్లో భార్యను వదిలి తిరిగి పొన్కల్కు బయల్దేరారు. ఈ క్రమంలో నిర్మల్ నుంచి కోరుట్ల వెళ్తున్న కారువేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో గంగాధర్ తలకు బలమైన గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గంగాధర్కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నా రు. ప్రమాద స్థలాన్ని ఎస్సై హన్మాండ్లు సందర్శించారు. మృతదేహాన్ని నిర్మల్ ఆస్పత్రికి తరలించా రు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
స్నానానికి వెళ్లి.. నీటిలో మునిగి..
పెంబి: స్నానం చేద్దామని చెరువుకు వెళ్లిన ఓ యువకుడు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన సోమవా రం పెంబి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మందపల్లి గ్రామానికి చెందిన చెరుపూరి సంధ్య–నారాయణ దంపతుల ఎకై క కూమారుడు చెరుపూరి మనోజ్(21) గ్రామంలోని పాత చెరువులో సోమవారం ఉదయం 10 గంటల సమయంలో స్నానానికి వెళ్లాడు. లోతు తెలియకపోవడం, ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందాడు. కొడుకు ఎంతకీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు చెరువు వద్దు వెళ్లాడు. అక్కడ బట్టలు కనిపించడంతో ఈతగాళ్లతో గాలించారు. మృతదేహం దొరికింది. ఒక్కగానొక్క కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
లఘు చిత్రాలకు.. లక్షణంగా ఆహ్వానం
ఆదిలాబాద్: ప్రస్తుత సమాజంపై సోషల్ మీడియా ఎంతగానో ప్రభావం చూపుతోంది. సామాజిక పరిస్థితులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా తమదైన ముద్ర వేస్తోంది. ఈ నేపథ్యంలో మానవ హక్కులపై మరింతగా అవగాహన కల్పించాలనే ధ్యేయంతో జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) షార్ట్ ఫిల్మ్స్ పోటీలకు శ్రీకారం చుట్టింది. సందేశాత్మకంగా లఘు చిత్రాల రూపకల్పనకు అవకాశం ఇచ్చింది. ఈ అంశాలపై.. దేశవ్యాప్తంగా పౌర హక్కులపై అవగాహన పెంపొందించే ఉద్దేశంతో సృజనాత్మక లఘు చిత్రాల పోటీలకు ఎన్హెచ్ఆర్సీ శ్రీకారం చుట్టింది. సమాజంలోని వివిధ మానవ హక్కుల ఉల్లంఘనలను దృశ్యరూపంలో ఆవిష్కరించేందుకు ఈ వేదిక ద్వారా అవకాశం కల్పిస్తోంది. పోటీల్లో భాగంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలతో పాటు ప్రాథమిక హక్కులపై లఘు చిత్రాలను రూపొందించాలి. డాక్యుమెంటరీ, యానిమేషన్ లేదా కల్పిత కథల రూపంలో జీవించే హక్కు, సమానత్వం, గౌరవం వంటి అంశాలను ప్రతిబింబించాలి. ముఖ్యంగా బాల కార్మిక వ్యవస్థ, వెట్టిచాకిరీ, మహిళలు, చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగుల హక్కులతో పాటు మానవ అక్రమ రవాణా, గృహ హింస, పోలీసు అకృత్యాలు, జైలు సంస్కరణల వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. వీటితో పాటు విద్యా హక్కు, ఉపాధి, ఆరోగ్య సంరక్షణ, స్వచ్ఛమైన పర్యావరణం, ఆహార భద్రత, ట్రాన్స్ జెండర్ల హక్కులపై కూడా దృష్టి సారించవచ్చు. భారతీయ వైవిధ్యంలోని మానవ విలువలు, అభివృద్ధి కార్యక్రమాలను దృశ్యరూపంలో ఆవిష్కరించవచ్చు. నిబంధనలివే..ఈ పోటీల్లో వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా పాల్గొనవచ్చు. మానవ హక్కుల అంశాలపై 3 నుంచి 10 నిమిషాల నిడివి గల చిత్రాలను పంపేందుకు అవకాశం ఉంది. అభ్యర్థులు ఎన్ని ఎంట్రీలనైనా పంపే అవకాశం ఉన్నప్పటికీ, గతంలో కమిషన్కు పంపినవి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వాటిని పరిగణలోనికి తీసుకోరు. వీటిని ఎంపీ4 ఫార్మాట్లో ఫుల్ హెచ్డీ నాణ్యతతో, వీలైతే 2 జీబీలోపు సైజులో ఉండేలా చూసుకోవాలి. ఏ భారతీయ భాషలో తీసినప్పటికీ, తప్పనిసరిగా ఇంగ్లిష్ సబ్టైటిల్స్ జత చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు చిత్రం ఇతివృత్తం, ప్రభుత్వం జారీ చేసిన ఐడెంటిటీ ప్రూఫ్ (ఆధార్, ఓటర్ ఐడీ, పాన్కార్డ్ వంటివి) జతచేయాలని కమిషన్ సూచించింది. భారీగా నజరానా మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం వంటి ఇతివృత్తాలతో రూపొందించిన ఉత్తమ లఘు చిత్రాలకు కమిషన్ భారీ నగదు బహుమతులను ప్రకటించింది. ప్రథమ విజేతకు రూ.2 లక్షలు, ద్వితీయ విజేతకు రూ.1.50 లక్షలు, తృతీయ విజేతకు రూ.లక్ష చొప్పున నగదు పురస్కారాలు లభించనున్నాయి. కేవలం నగదు మాత్రమే కాకుండా, ఎంపికై న చిత్రాలను జాతీయస్థాయి వేదికలపై ప్రదర్శించే అవకాశం కూడా ఉంటుంది. ఔత్సాహికులు సమాజానికి మేలు చేసే సందేశాత్మక చిత్రాలతో భాగస్వాములు కావాలని కమిషన్ కోరుతోంది. ఇలా పంపాలి.. ఆసక్తి ఉన్న వారు తమ లఘు చిత్రంను, దరఖాస్తును, కథాంశాన్ని గూగుల్ డ్రైవ్లో అప్ లోడ్ చేసి ఆ ఫోల్డర్కు Short Film Awa rd-2026, తమ పేరు నమోదు చేయాలి. ఆతర్వాత ఆ డ్రైవ్ లింక్ను nhrcshort fil m@gmail. com ఈమెయిల్కు పంపాలి. ఇందులో పోటీదారుని పూర్తి చిరునామా, ఫోన్ నంబర్ పొందుపరచాలి. ఆన్లైన్ ద్వారా పంపిన వాటినే కమిషన్ ఆమోదిస్తుంది. డీవీడీలు, పెన్ డ్రైవ్లు పంపకూడదు. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 30. -
బానిసెల్ కావొద్దని..
చెన్నూర్రూరల్: ఒకప్పుడు సెలవులు వచ్చాయనంటే.. ఊళ్లకు వెళ్లడం, సెలవుల్లో అమ్మానాన్నలక సహాయం చేయడం, కొత్త పనులు నేర్చుకోవడం, ఈత నేర్చుకోవడం నీడపట్టున శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదపడే ఆట లు ఆడేవారు. కానీ ఇప్పుడు 5జీ కాలం.. సెలవులు కాదు.. ఖాళీ టైం దొరికితే చాలు పిల్లలు సెల్కు అతుక్కుపోతున్నారు. రీల్స్ చూస్తూ, గే మ్స్ ఆడు తూ కాలక్షేపం చేస్తున్నారు. దీంతో కళ్లు దెబ్బతింటున్నా యి. శారీరక శ్రమ లేకపోవడంతో లేజీగా తయారవుతున్నారు. సెల్ లేకపోతే టీవీల కు అతుక్కుపోతున్నారు. ఈ నేపథ్యంలో చె న్నూర్ మండలం చాకెపల్లి సర్పంచ్ బల్ల సమ్మయ్య వినూత్న ఆలోచన చేశాడు. పిల్లల సెల్ఫోన్లు, టీవీలు చూస్తూ సమయం వృథా చేయకుండా, సమ్మర్ క్లాస్లు నిర్వహించే ఏ ర్పాటు చేశారు. సర్పంచ్ ఆలోచనకు తల్లి దండ్రులు సహకారం అందించారు. దీంతో సొంత డబ్బులతో ఒక ఉపాధ్యాయురాలిని నియమించి పాఠశాల ఆవరణలోనే చదువు చెప్పిస్తున్నాడు. చల్లని వాతావరణంలో..పిల్లల్లో క్రమశిక్షణ పెండంతోపాటు, పాఠాలపై పట్టు సాధించేలా ఉదయం వేళలోనే రెండు గంటలపాటు తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాల ఆవరణలోని చెట్ల నీడలో పాఠాలు బోధించే ఏర్పాటు చేశారు. ఈ నెల 11వ తేదీన ఈ తరగతులు ప్రారంభించారు. జూన్ 11 వరకు కొనసాగుతాయి. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. పిల్ల లు తాగేందుకు మినరల్ వాటర్ను కూడా తెప్పిస్తున్నారు. మొదటి రోజు 30 మంది విద్యార్థుల వరకు వచ్చారని సర్పంచ్ తెలిపారు. ఇప్పుడు రోజు 20 నుంచి 25మంది వరకు వస్తున్నారన్నారు. ఎర్రగుంటపల్లిలో... గతేడాది ఎర్రగుంటపల్లి సర్పంచ్ డెబ్బ సుగుణ, రామన్న అధికారంలోకి రాక ముందు కూడా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 16వ తేదీ నుంచి ప్రత్యేక తరగతులను ప్రారంభించారు. ఇక్కడ కూడా వేసవి సెలవులు ముగిసే వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుందని సర్పంచ్ తెలిపారు. బాగా చెబుతున్నారు నేను ఇప్పుడు 2వ తరగతి చదువుతున్నాను. సెలవుల్లో పాఠాలు వినేందుకు వెళ్తున్నాం. టీచర్ మాకు పాఠాలు బోధిస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ తరువాత ఇంటికి వెళ్లి ఆడుకుంటున్నాం. – సుహాసిని, చాకెపల్లిరోజూ వెళ్తున్నా.. నేను మూడో తరగతి చదువుకుంటున్నాను. సెలవుల్లో కూడా మాకు చదువు నేర్పిస్తున్నారు. ఉదయం రోజూవెళ్లి చదువుకుంటున్నాను. మాకు ఏమైనా సందేహాలు వస్తే టీచర్ చెబుతున్నారు. – వర్షిణి, చాకెపల్లినీడ పట్టున పాఠాలు సెలవుల్లో పిల్లలు సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కు పోతున్నారు. పుస్తకాలు పట్టడం లేదు. ఇందు కోసం నేను పిల్లలకు పాఠాలు బోదించేందుకు ఏర్పాటు చేశారు. నీడ పట్టున ఉదయం 8 నుంచి 10గంటల వరకు పాఠాలు బోదించేందుకు ఉపాధ్యాయురాలిని నియమించాను. – బల్ల సమ్మయ్య, సర్పంచ్, చాకెపల్లిసమయం వృథా కాకుండా.. పిల్లలు వేసవి సెలవుల్లో ఆటలకే పరిమితం కాకుండా, సమయం వృథా కాకుండా ఉండేందుకు సర్పంచ్ ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేశారు. ఉదయం పూట నీడ పట్టున పిల్లలకు పాఠాలు బోధిస్తున్నా. – దుర్గం అంజలి, ఉపాధ్యాయురాలు, చాకెపల్లి -
నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్
ఆదిలాబాద్టౌన్: నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహిస్తున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీలో ఉదయం 5 నుంచి 8 గంటల వరకు వంద మంది సిబ్బందితో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 67 ద్విచక్ర వాహనాలు, 16 ఆటోలు, రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపా రు. అలాగే 98 దేశీదారు, 12 లిక్కర్ బాటిళ్లను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ముగ్గురుపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలన్నారు. అలాగే యువత గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని అన్నారు. ఇదివరకే కేసులు నమోదైన వారిపై సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేస్తామని, అయినా మారకుంటే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. నంబర్ ప్లేట్, లైసెన్సు లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు ఎల్.జీవన్రెడ్డి, ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, పట్టణ సీఐలు సునీల్ కుమార్, నాగరాజు, ప్రణయ్ కుమార్, ఫణిధర్, స్వామి, బిడి ప్రేమ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకటి, టి.మురళి, ఎన్.చంద్రశేఖర్, ఎస్సైలు రాధిక, విష్ణువర్ధన్, ఎస్సైలు దేవేందర్, విష్ణుప్రకాష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వడదెబ్బతో మేకల కాపరి మృతి
ఖానాపూర్:మండలంలోని గోసంపల్లె గ్రామానికి చెందిన మేకల కాపరి భూక్యా బాలయ్యనాయక్(54) వడదెబ్బతో మృతి చెందాడు. కుటుంబ స భ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలయ్య నా యక్ ఎప్పటిలాగే తన సొంత మేకలను గ్రామ శివారులోని సదర్మాట్ కాలువ వైపు మేతకు తీసుకెళ్లాడు. తీవ్ర ఎండల కారణంగా అక్కడే అస్వస్థతకు గురై కిందపడిపోయాడు. అటువైపు వెళ్లిన స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబీకులు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. వడదెబ్బ కారణంగానే ఆయన మృతి చెందినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. మృతుడికి భార్య జమున, ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మత్తడిగూడలో మరొకరు..ఉట్నూర్రూరల్: మండలంలోని మత్తడిగూడ గ్రా మానికి చెందిన కనక లచ్చు(52) సోమవారం వడదెబ్బతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలి పిన వివరాలప్రకారం..లచ్చు ఉదయం ఉపాధి పని కి వెళ్లి వచ్చాడు. సాయంత్రం విరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. సిబ్బంది చేరుకుని పరీక్షించగా అప్పటికే మృతి చెందాడు. మృతుడికి భార్య చందుబాయి, ఇద్ద రు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
చింతలమానెపల్లి: మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్, బాలాజీఅనుకోడ రైతువేదిక మధ్య రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. కానిస్టేబుల్ శ్రీకాంత్ విధి నిర్వహణలో భాగంగా బైక్పై అనుకోడ గ్రామానికి వెళ్తుండగా, బాలాజీఅనుకోడ నుంచి వస్తున్న దుర్గం రాము బైక్తో ఎదురెదురుగా ఢీకొన్నారు. ఇద్దరి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై కమలాకర్ ఘటనా స్థలానికి చేరుకుని 108 వాహనానికి సమాచారం అందించారు. క్షతగాత్రులను చికిత్స కోసం కాగజ్నగర్కు తరలించారు. -
చెట్టు ముడితే.. పట్టేస్తది
జన్నారం: కుక్క విశ్వాసవంతమైన జంతువు. మనతో కలిసి జీవించే శునకాలు కొన్ని విషయాల్లో మనకన్నా తెలివైనవి. యజమానులకు హాని తలపెట్టేవారి తాట తీస్తాయి. ఇక పోలీసులు, ఆర్మీకి దొంగలు, ఉగ్రవాదులను పట్టుకోవడంలో సహాయపడతాయి. తాజాగా అటవీశాఖలోనూ కలప స్మగ్లర్ల భరతం పడుతున్నాయి. కలప తరలించుకుపోయే, వన్యప్రాణులను వేటాడేవారిని ఇట్టే పట్టేస్తున్నాయి. జన్నారం అటవీ డివిజన్కు కేటాయించిన డాగ్ స్క్వాడ్ గడిచిన 9 నెలల్లో 14 కేసులను ఛేదించింది. ఏడు నెలల శిక్షణ..ఈ డాగ్ల సంరక్షణ, నిర్వహణ కోసం బీట్ అధికారి అనిల్కుమార్కు ఏడు నెలల ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. హర్యానాలోని ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఈ శిక్షణను పూర్తి చేసి, డాగ్ స్క్వాడ్తో కలిసి జన్నారం డివిజన్కు చేరుకున్నారు. ఈ డాగ్ స్క్వాడ్కు ‘హంటర్’ అని పేరు పెట్టారు. 2025 ఆగస్టులో హంటర్ను జన్నారం డివిజన్కు తీసుకొచ్చారు. డివిజన్ కేంద్రంలో బీట్ అధికారి అనిల్కుమార్తోపాటు బేస్ క్యాంపు సిబ్బంది హంటర్ ఆరోగ్యం, ఆహారం, డైట్ ప్లాన్, వ్యాయామం, నియమిత వైద్య పరీక్షలు చేయిస్తూ సక్రమంగా చూసుకుంటున్నారు. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు..కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని గ్రామాల్లో అటవీశాఖ అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రేంజ్ సిబ్బందితోపాటు హంటర్ డాగ్ స్క్వాడ్ను గ్రామాలకు తీసుకెళ్లి ప్రత్యక్ష ప్రదర్శనలు ఇస్తున్నారు. ‘మనుషులు అబద్ధం చెప్పవచ్చు, కానీ డాగ్ అబద్ధం చెప్పదు’ అని స్పష్టంగా తెలియజేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ వచ్చిన తర్వాత జన్నారం డివిజన్లో అటవీ నేరాలు గణనీయంగా తగ్గినట్లు అధికారులు తెలిపారు. -
విద్యార్థుల హాజరుశాతం పెరగాలి
కైలాస్నగర్: విద్యార్థుల హాజరుశాతం పెరిగినప్పుడే మెరుగైన ఫలితాలు వచ్చేందుకు ఆస్కారముంటుందని ఆ దిశగా ఉపాధ్యాయులు దృష్టి సారించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన– ప్రగతిప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11నుంచి నిర్వహించిన విద్యా వారోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘విద్యా విజయోత్సవం’ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో రాజేశ్వర్తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రతీ విద్యాసంస్థలో పేరెంట్స్, టీచర్స్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. బడిబాట కార్యక్రమంతో విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నప్పటికీ హాజరుశాతం తగ్గుతోందని, తద్వారా డ్రాపౌట్స్ చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఈ మేరకు ఉపాధ్యాయులు దృష్టి సారించాలన్నారు. ఫలితాలు మెరుగుపడాలంటే 75శాతం హాజరు నమోదయ్యేలా చూడాలన్నారు. రానున్న నూతన విద్యాసంవత్సరంలో పాఠశాలల్లో సీఎం బ్రేక్పాస్ట్, జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయనున్నట్లుగా తెలిపారు. కార్యక్రమంలో డీఐఈవో జాదవ్ గణేశ్ కుమార్, ఏఎంవోలు లక్ష్మణ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. టాపర్స్, అధ్యాపకులు, టీచర్స్కు సన్మానం విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేస్తున్న పలువురు అధ్యాపకులు, ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు. వీరితో పాటు పది, ఇంటర్మీడియెట్లో టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. అనంతరం ఆదిలాబాద్ బాల కేంద్రం పుస్తక నిధి ప్రచార పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. -
మౌలిక వసతుల కల్పనకు కృషి
ఇచ్చోడ: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ప్రత్యేక కృషి చేస్తుందని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. మండలంలోని అడేగామ(బి)లో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిని ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్రామాల్లో సీసీ రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, సర్పంచ్ విశాల్, పార్టీ నాయకులు రాజు, మాదవ్ అమ్టె, జీవీ రమణ, కిషన్ తదితరులు పాల్గొన్నారు. ముఖరా(బి)లో పంచాయతీ భవనం ప్రారంభం ఇచ్చోడ: గ్రామాల అభివృద్ధి కోసం పాలనాపరమై న ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే అనిల్జాదవ్ అన్నారు. మండలంలోని ముఖరా(బి)లో నిర్మించిన నూతన పంచాయతీ భవనాన్ని ఆదివారం వారు ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, గాడ్గే సుభాష్, మారుతి తదితరులు పాల్గొన్నారు. -
కార్యదర్శులకు ‘ఉపాధి’ బాధ్యతలు
కైలాస్నగర్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథ కం పర్యవేక్షణ పూర్తి బాధ్యతలను ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. కూలీల సంఖ్య పెంచడంతో పాటు పనులు కల్పించడం, ఎన్ఎంఎంఎస్ యాప్లో ఫేస్ అథెంటికేషన్ హాజ రు వంటి ఏడు రకాల రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ దివ్యదేవరాజ న్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిర్ణయంతో గ్రామాల్లో ఉపాధిపనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెరగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరిస్థితి ఇలా.. గతంలో పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించాక ఉపాధి పనులను పంచాయతీ కార్యదర్శులే పర్యవేక్షించేవారు. టెక్నికల్ అసిస్టెంట్లతో కలిసి అన్ని పనులు వారే నిర్వహించేవారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంది. ఈక్రమంలో పలువురు కార్యదర్శులు తమ రెగ్యులర్ పనులకు ప్రాధాన్యతనిస్తూ ఉపాధి పర్యవేక్షణను విస్మరించినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఉపాధి పర్యవేక్షణ బాధ్యతలు కూడా నిర్వహించాలంటూ కార్యదర్శులను ఆదేశించింది. కార్యదర్శులు ఏం చేయాలంటే.. ఉపాధి సిబ్బంది సాయంతో గ్రామాల్లో వంద రోజుల పనులు, వనమహోత్సవ కార్యక్రమాలు చేపట్టి పర్యవేక్షించాలి. మేట్లను నియమించాలి. వారితో కలిసి కూలీల నుంచి పని డిమాండ్ వివరాలు తీసుకోవాలి. కూలీల మస్టర్లు నమోదు చేసుకునేలా చూడటంతో పాటు వారం చివరలో వాటిపై కౌంటర్ సైన్ చేసి టెక్నికల్ అసిస్టెంట్లకు అప్పగించాలి. ఎన్ఎంఎంఎస్ యాప్లో కూలీల ఫేస్ అథెంటికేషన్ ద్వారా హాజరును అప్లోడ్ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వీటితో పాటు జాబ్కార్డుల అప్డేషన్, వారినికోసారి సమావేశాల నిర్వహణ, పని ప్రదేశాల్లోని బోర్డును తనిఖీ చేయడం, కూలీలకు అవసరమైన తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచడం, గ్రీన్ నెట్షెడ్లను ఏర్పాటు చేయడం వంటి పనులను పర్యవేక్షించాలి. ముఖ్యంగా సర్పంచ్లతో సమావేశమై కూలీల సంఖ్య పెంచేలా శ్రద్ధ వహించాలి. వీటితో పాటు ఏడు రికార్డులను తప్పనిసరిగా నిర్వహింలని ప్రభుత్వం ఆదేశించింది. సర్కారు తాజా నిర్ణయంతో కూలీల సంఖ్య పెరగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.ఉత్తర్వులు అందాయి ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అందాయి. వాటిపై ఇటీవల సెక్రెటరీలతో సమావేశాలు నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ప్రతీ కార్యదర్శి తప్పనిసరిగా ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెంచడంతో పాటు పనులు పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షించాలి. – రాథోడ్ రవీందర్, డీఆర్డీవో -
జిల్లాకు ‘రాజీవ్ జ్యోతి’ యాత్ర
కై లాస్నగర్: దివంగత ప్రధానమంత్రి రాజీవ్గాంధీని స్మరించుకుంటూ తమిళనాడులోని శ్రీపెరంబదూర్ నుంచి ఢిల్లీలోని వీర్భూమి వరకు శామ్యూల్ ద్రవ్యం ఆధ్వర్యంలో చేపట్టిన రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర ఆదివారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. విద్యానగర్లోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. కార్యాలయం వరకు జ్యోతిని తీసుకువచ్చారు. ఇందులో పార్టీ పట్టణ అధ్యక్షుడు కిజర్ పాషా, నాయకులు సతీశ్, అనిల్, సంజయ్, పరమేశ్వర్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పసుపు తాడుతో పసిమొగ్గల బంధీ
తల్లిదండ్రుల నిరక్షరాస్యత, పేదరికం, బాలికల భద్రతపై భయం, సామాజిక ఒత్తిళ్లు, మూఢనమ్మకాలు వంటి కారణాలు బాల్య వివాహాలకు దారి తీస్తున్నాయి. ‘ఆడపిల్ల భారం’ అనే పాతబడ్డ భావజాలం ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతుండడం పరిస్థితిని విషమంగా మారుస్తోంది. కుటుంబీకులు ఆరోగ్య సమస్యలతో సతమతం అవ్వడం, పిల్లల పెళ్లి కళ్లారా చూడాలనే కోరిక.. తదితర సెంటిమెట్లు కూడా కారణమవుతున్నాయి. తల్లీబిడ్డలకు ప్రాణాపాయం.. చిన్న వయసులో గర్భం దాల్చడం ద్వారా తల్లీబిడ్డలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. తక్కువ బరువుతో శిశువులు పుట్టడం, పోషకాహార లోపం, రక్తహీనత, నెలలు నిండకముందే ప్రసవాలు, అధిక రక్తస్రావం వంటి సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. సాధారణ ప్రసవాలు తగ్గిపోవడంతో పాటు శస్త్ర చికిత్సలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. అలాగే చిన్న వయసులో గర్భం దాల్చిన మహిళల్లో గర్భస్రావాలు, కాన్పు సమయంలో మరణాల శాతం సాధారణ మహిళలతో పోల్చితే రెండింతలు అధికంగా ఉన్నట్లుగా పేర్కొంటున్నారు. అలాగే ప్రసవం తర్వాత కోలుకోవడానికి కూడా ఎక్కువ సమయం పడుతోందని చెబుతున్నారు. పెరుగుతున్న శిశు మరణాలు.. బాల్య వివాహాలు జరిగిన తర్వాత వారి పిల్ల లు ఎక్కువ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రసవ సమయంలో శిశు మరణాలు సైతం అధికంగా ఉంటున్నట్లుగా చెబు తున్నాయి. చిన్న వయసులో గర్భం దాల్చిన వారి లో ఏజెన్సీ, మారుమూల మండలాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. బాల్య వివా హాల నిర్మూలనకు చట్టాల అమలుతో పాటు సమాజంలో అవగాహన పెంపు, బాలికల విద్యకు ప్రాధాన్యత, తల్లిదండ్రుల్లో చైతన్యం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.పసిమొగ్గలనే పసుపు తాడుతో బంధిస్తున్నారు. బాల్య వివాహాలతో బాలికల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు సమీపిస్తున్నా ఇంకా చిన్నారి పెళ్లికూతుళ్లు దర్శనమి స్తూనే ఉన్నారు. అధికారులు అవగాహన కల్పిస్తున్నా జిల్లాలో ఘటనలు చోటు చేసుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. – ఆదిలాబాద్టౌన్ -
‘ఎల్ఆర్ఎస్’లో సాంకేతిక సమస్య
కై లాస్నగర్: జిల్లాలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ మందకొడిగా సాగుతుంది. సాంకేతిక సమస్యలతో రెండు రోజులుగా సర్వర్ పనిచేయడం లేదు. దీంతో ఫీజు చెల్లించేందుకు వచ్చే దరఖాస్తుదారులకు నిరాశ ఎదురవుతుంది. జిల్లాలోని ఏకై క ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ఇప్పటికే ఈ ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగడం లేదనే విమర్శలున్నాయి. తాజా గా సాంకేతిక సమస్యలు తోడవడం గమనార్హం. ఇదీ పరిస్థితి.. 2020లో ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం విడతల వారీగా ఎల్ఆర్ఎస్కు అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో ఈ ప్రక్రియను నిర్వహించింది. మరోసారి మార్కెట్ ఫీజులో 25శాతం రాయితీ వర్తింపజేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 1నుంచి 31వరకు గడువు విధించింది. అయితే దీనిపై అధికారులు సరైన ప్రచారం చేపట్టకపోవడం, దరఖాస్తుదారుల అవగాహన రాహిత్యంతో స్పందన అంతంతే ఉన్నట్లుగా తెలుస్తోంది. సాంకేతిక సమస్యలతో జాప్యం .. మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా మారింది మున్సిపల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ. మొత్తం 17,865 మంది ఫీజు చెల్లింపునకు అర్హులు కాగా అందులో కేవలం 4,564 మంది మాత్రమే చెల్లించారు. అందులోనూ 1,716 మందికి ఇంకా ప్రొసీడింగ్ జారీ చేయాల్సి ఉంది. తాజాగా ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించడంతో దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో పురోగతి కనిపిస్తుందని భావించారు. అయితే సర్కారు ఆశించిన స్పందన లేదు. ఇప్పుడిప్పుడే దరఖాస్తుదారులు మున్సిపల్ కార్యాలయానికి వస్తుండగా తాజాగా రెండు రోజులుగా సర్వర్ పనిచేయడం లేదు. 25శాతం ఫీజు రాయితీకి సంబంధించిన సాఫ్ట్వేర్ను ప్రభుత్వం మారుస్తున్నందున ఈ సమస్య తలెత్తుతున్నట్లుగా మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం తాజాగా వ్యవసాయ భూములు, ప్లాట్ల మార్కెట్ విలువ పెంచాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కసరత్తుకు ఆదేశించింది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు భూముల విలువలతో కూడిన వివరాలు నమోదు చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో కచ్చా లేఅవుట్లోని పది శాతం ప్లాట్లను విక్రయించుకుని మిగతా ప్లాట్లను రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ (ఐజీఆర్ఎస్) చేసుకోవాలనుకునే వారు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుకు ముందుకు వస్తుండగా సాంకేతిక సమస్యలు అడ్డంకిగా మారుతున్నాయి. కాగా, భూములు, ప్లాట్ల మార్కెట్ విలువ పెంచుతున్న నేపథ్యంలో సర్వర్ సమస్య ఏర్పడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సోమవారం దీనిపై స్పష్టత వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. -
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
నేరడిగొండ/బోథ్: కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతుధర లభిస్తుందని, వాటిని సద్విని యో గం చేసుకోవాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో నేరడిగొండ మండలంలో ని కుమారి, బోథ్ మండలంలోని మర్లపెల్లిలో ఏ ర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాలను ఆది వారం ఆయన ప్రారంభించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా రైతు చంద్రశేఖర్రెడ్డి ఆయన ను శాలువాతో సన్మానించారు. ఇందులో పీఏసీఎస్ చైర్మన్ రమేశ్, సర్పంచ్ గోదావరి, ఉపసర్పంచ్ రవి, తర్నం సర్పంచ్ నీరజ, నాయకులు, పీఏసీఎస్ పాలకవర్గసభ్యులు, రైతులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాలు జరిపిస్తే కేసులు
బాల్య వివాహం చట్టరీత్యా నేరం. అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు ఉంటేనే వివాహం జరిపించాలి. ఇటీవల ఆదిలాబాద్ పట్టణంలోని చిల్కూరినగర్లో జరిగిన ఓ బాల్య వివాహానికి సంబంధించి పూజారితో పాటు ఫంక్షన్హాల్ యజమాని, పెళ్లికి హాజరైన వారిపై కేసులు నమోదం చేయడం జరిగింది. పూజారులకు అవగాహన కల్పిస్తున్నాం. అలాగే తల్లిదండ్రులు బాల్య వివాహం జరిపించి పిల్లల భవిష్యత్తును నాశనం చేయవద్దు. – మిల్కా, జిల్లా సంక్షేమ అధికారి ఆరోగ్య సమస్యలు వస్తాయి..బాల్య వివాహం ద్వారా బాలికలు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. చిన్న వయస్సులోనే గర్భం దాల్చడంతో కాన్పు సమయంలో నెలలు నిండక ముందే ప్రసవాలు జరుగుతాయి. తల్లితో పాటు పుట్టబోయే బిడ్డకు సైతం ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. తక్కువ బరువు గల పిల్లలు పుడతారు. సిజేరియన్ కాన్పులు ఎక్కువగా అవుతాయి. బీపీ, రక్తహీనత సమస్యలతో బాధపడతారు. – డాక్టర్ రమ, గైనకాలజిస్ట్ -
రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలి
ఆదిలాబాద్రూరల్: జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలని స్విమ్మింగ్ అసో సియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవికుమార్, కొమ్ము కృష్ణ అన్నారు. మండలంలోని చాందా (టి)పంచాయతీ పరి ధిలో గల ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆదివారం జిల్లాస్థాయి స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని ఈ నెల 24న హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న వారిలో అనుదీప్రాజ్, లోహిత్ సాయి, చరణ్ తేజ్, మణికృత్ ఉన్నట్లు వివరించారు. విజేతలకు మెడల్స్, ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో కోచ్లు వంశీ, శ్రీనివాస్గౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
జీవో నం.3 పునరుద్ధరించాలి
ఆదిలాబాద్టౌన్: షెడ్యూల్ ప్రాంతాల్లో ఆది వాసీ యువతకు వంద శాతం రిజర్వేషన్ కల్పించే జీవో నం.3ను పునరుద్ధరించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. ఆదివారం న్యూ ఢిల్లీలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరంను కలిసి ఆదివాసీ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 5వ షెడ్యూల్ ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగాలను ఆదివాసీ అభ్యర్థులతోనే భర్తీ చేయాలంటే జీవో నం.3 పునరుద్ధరణ అవసరమన్నారు. పీఎం జన్మన్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అటవీ శాఖ అడ్డంకులు తొలగించాలని కోరా రు. ఈమేరకు మంత్రి సానుకూలంగా స్పందించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు సచిన్ తెలిపారు. ఆయన వెంట మాజీ రాజ్యసభ సభ్యురాలు బృందా కారత్, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి వెంకట్ పాల్గొన్నారు. పెంచిన పెట్రో ధరలు తగ్గించాలిఆదిలాబాద్టౌన్: పెంచిన పెట్రో ధరలు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చే స్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం ఆందో ళన చేపట్టారు. బస్టాండ్ ఎదుట రాస్తారో కో నిర్వహించారు. జిల్లా కార్యదర్శి మల్లేశ్ మా ట్లాడుతూ, కేంద్రం గ్యాస్, పెట్రో ధరలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. తక్షణమే ధరల పెంపును ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో నా యకులు లంకా రాఘవులు, బండి దత్తాత్రి, సురేందర్, మంజుల, ఆరిఫాబేగం, రాములు, ఆశన్న, గంగారాం పాల్గొన్నారు. -
పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం పెంపొందించాలి
ఆదిలాబాద్: పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం పెంపొందినప్పుడే వారిలో దాగి ఉన్న ప్రతిభ బయటకు వస్తుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక, విద్యా వారోత్సవాల్లో భాగంగా బాలకేంద్రంలో శనివారం కళలు, హస్తకళల ప్రదర్శనలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు. బాలకేంద్రంలో మరిన్ని వసతులు కల్పించేలా కృషి చేస్తామన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించేలా కార్యక్రమాలు చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం విద్యార్థులు తబలా, హా ర్మోనియం వాయించడంతో పాటు ఆయా పాటల పై నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలు అందించారు. ఇందులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో రాజేశ్వర్, విద్యాశాఖ అధికారులు అజయ్, లక్ష్మణ్, బాలకేంద్రం నిర్వహకులు మిట్టు రవి, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
ధర్మవరం–నాందేడ్ వీక్లీ ఎక్స్ప్రెస్
కాగజ్నగర్టౌన్: భక్తుల చిరకాల కోరిక నెరవేరింది. నిర్మల్ జిల్లా బాసర రైల్వేస్టేషన్ మీదుగా నడిచే 07189/90 నాందేడ్–ధర్మవరం–నాందేడ్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును క్రమబద్ధీకరిస్తూ దక్షిణ మధ్య రైల్వే నాందేడ్ డివిజన్ అధికారులు ఈ నెల 15న ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 17న ధర్మవరం జంక్షన్లో ప్రారంభం కానుంది. 22న నాందేడ్ నుంచి రెగ్యులర్గా నడవనుంది. ఈ రైలులో 8 స్లీపర్, 6 థర్డ్ ఏసీ, 2 సెకండ్ ఏసీ, 4 జనరల్ బోగీలు ఉంటాయి. ఇందులో దివ్యాంగులకు రాయితీ సౌకర్యం కల్పించారు.క్రమబద్ధీకరణ తర్వాత ఈ రైలుకు కొత్త నంబర్లు కేటాయించారు. 17635 నాందేడ్–ధర్మవరం వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రతీ శుక్రవారం నాందేడ్లో బయలుదేరి 6:30 గంటలకు బాసర రైల్వేస్టేషన్కు చేరుకుంటుంది. ఇక్కడ రెండు నిమిషాల హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. 17636 ధర్మవరం–నాందేడ్ వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రతీ ఆదివారం ఉదయం 5:25కు బయలుదేరి 10:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. 10:40కి బయలుదేరి సోమవారం తెల్లవారు జాము న 4:45 గంటలకు బాసరకు చేరుకుంటుంది. 4:47 గంటలకు నాందేడ్ బయలుదేరుతుంది. ఈ రైలు నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం, విజయవాడ, నెల్లూరు, గూడురు, తిరుప తి, పాకాల మార్గం గుండా నడుస్తుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోని భక్తులకు ఎంతగానో ఉపయోగకరంగా మారనుంది. పెద్దపల్లి జంక్షన్తో కనెక్టివిటి17636 ధర్మవరం–నాందేడ్ ఎక్స్ప్రెస్ ద్వారా తిరుపతి నుంచి వచ్చే భక్తులకు పెద్దపల్లి జంక్షన్లో ప్రతీ ఆదివారం రాత్రి 11:55కు పెద్దపల్లిలో దిగిన భక్తుల కు 10 నిమిషాల వ్యవధిలో రాత్రి 12:05 గంటలకు వచ్చే 17035 కాజీపేట్–బల్లార్షా ఎక్స్ప్రెస్ ఎక్కి రామగుండం, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, కాగజ్నగర్కు వెళ్ళవచ్చు. ఈ కొత్త రైలుతో పెద్దపల్లి జంక్షన్ నుంచి తిరుపతికి రైలు సౌకర్యం మరింత మెరుగుపడింది. ప్రతీ గురు, శుక్ర, శని, ఆదివా రాల్లో వరుసగా నాలుగు రోజులు వరంగల్–విజ యవాడ మీదుగా తిరుపతికి రైళ్లు అందుబాటులో ఉన్నాయి. గురు, ఆదివారాల్లో రాత్రి 8గంటలకు 12762 కరీంనగర్–తిరుపతి బై వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, శుక్రవారం రాత్రి 10 గంటలకు 17635 నాందేడ్–ధర్మవరం వీక్లీ ఎక్స్ప్రెస్, శనివారం రాత్రి 10 గంటలకు 17633 నాందేడ్ తిరుచానూరు వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. -
రౌడీయిజాన్ని కనుమరుగు చేస్తాం
● ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్టౌన్: జిల్లాలో రౌడీయిజం, గుండాయిజం పూర్తిగా కనుమరుగు చేసి ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించడమే పోలీస్ శాఖ లక్ష్యమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నా రు. స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో జిల్లాలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లతో శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. పద్ధతి మార్చుకోని వారిపై పీడీ యాక్ట్ నమోదుకు సైతం వెనకాడబోమని హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటికే ఆరుగురిపై నమోదు చేశామని స్పష్టం చేశారు. గతంలో జిల్లాలో 1,300కు పైగా రౌడీ, సస్పెక్ట్ షీట్లు ఉండగా, ప్రవర్తన మారిన 500 మంది షీట్లను తొలగించామని, నూతనంగా 300 మందిని చేర్చి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఎవరైనా తిరిగి గంజాయి దందా, మట్కా, హత్యలు, భూ ఆక్రమణలు, ల్యాండ్ మాఫియా, నకిలీ పత్రాల సృష్టించడం వంటి నేరాలకు పాల్పడినా, సోషల్ మీడియాలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా పోస్టులు పెట్టినా సహించేది లేదన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, ఏఆర్ డీఎస్పీ ఇంద్రవర్ధన్, సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
ఉట్నూర్రూరల్: గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. శనివారం స్థానిక కుమురంభీం కాంప్లెక్స్లోని ఎమ్మార్సీ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాల ఆదివాసీ సర్మేడిలు, వివిధ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధి, గిరిజనుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రధానమంత్రి జుగా పథకంలో భాగంగా ఉట్నూర్కు కేంద్ర గ్రంథాలయం మంజూరైందన్నారు. విద్యార్థులు, యువత పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి అవసరమైన పుస్తకాలు, ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయన్నారు. గిరిజనుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వాట్సాప్ ద్వారా కూడా ప్రజలు తమ సమస్యలు తెలపవచ్చన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతీ ఫిర్యాదును అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ రుత్విస్ సాయి కొట్టే, ఐటీడీఏ అధికారులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, ఆదివాసీ నాయకులు, సర్మేడిలు, తదితరులు పాల్గొన్నారు. -
‘భగీరథ’ నచ్చట్లే.. చల్లని చెలిమె నీటికే జై
ఆ గూడెంలో ఐదు కుటుంబాలు.. 25 మంది జనాభా ఉన్నారు. మిషన్ భగీరథ పైపులైన్ ఉన్నా వేసవి ఎండలకు అందులోని నీరు ప్లాస్టిక్ వాసనతో పాటు వేడిగా వస్తోంది. దీంతో గూడెంవాసులు ఆ నీటిని తాగలేక సమీపంలోని వాగులో ఓ చెలిమె ఏర్పాటు చేసుకున్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా అక్కడి వెళ్లి ఆ నీటితోనే దాహార్తి తీర్చుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం దొంగచింత పంచాయతీ పరిధిలోని రాజుగూడ వాసుల నీటిగోసను ప్రతిబింబించే దృశ్యాలను ‘సాక్షి’ క్లిక్ మనిపించింది. కాగా, తమకు చల్లని రక్షిత నీటి సౌకర్యం కల్పించాలని స్థానికులు కన్నీబాయి, తదితరులు కోరుతున్నారు. – ఉట్నూర్రూరల్ -
జొన్న పంట దగ్ధం
బోథ్: మండలంలోని కరత్వాడ శివారులో శనివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గ్రామానికి చెందిన రైతు అనిల్కుమార్ నాలుగెకరాల జొన్నపంట పూర్తిగా దగ్ధమైంది. పంట చేను పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద షార్ట్సర్క్యూట్ జరిగి నిప్పురవ్వలు ఎగిసి పడడంతో జొన్నపంటకు నిప్పంటుకుని క్షణాల వ్యవధిలోనే మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానిక రైతులు, కూలీలు అప్రమత్తమై మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఇచ్చోడలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా ఫైరింజన్ అందుబాటులో లేదని, వేరే ప్రాంతంలో ప్రమాదం జరగడంతో అక్కడికి వెళ్లిందని సిబ్బంది సమాధానం ఇచ్చారు. దీంతో రైతులంతా సుమారు రెండు గంటల పాటు శ్రమించి మంటలు ఆర్పివేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు. -
తొలుత రభస.. తర్వాత సాఫీగా
కైలాస్నగర్: ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాల నీ, సర్వేనంబర్ 170లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు కోసం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం లక్కీడ్రా నిర్వహించారు. అయి తే ఈ ప్రక్రియ కౌన్సిలర్ల అభ్యంతరాలు, ఆందోళనలు, విజ్ఞప్తుల నడుమ ముగిసింది. కలెక్టర్ రాజర్షిషా ఈ ప్రక్రియను అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూషతో కలిసి చేపట్టారు. ముందుగా కలెక్టర్ మాట్లాడుతూ, 337 ఇళ్లకు గాను జిల్లా ఇన్చార్జి మంత్రి నుంచి 1032 దరఖాస్తులు అందినట్లుగా తెలిపారు. గతంలో పట్టణంలోని 36వార్డులకు సంబంధించి 618 ఇళ్లకు లక్కీ డ్రా నిర్వహించగా అందులో 488 మంది అర్హులుగా తేలరన్నారు. మరో 16 వార్డులకు 109 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. 48 ఇళ్లను రిజర్వ్లో ఉంచి 337 ఇళ్లకు ప్రస్తుతం లక్కీడ్రా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియను 49 వార్డుల నుంచి అందిన దరఖాస్తుల సంఖ్యకనుగుణంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఇందులో హౌసింగ్ పీడీ రెడ్డి శంకర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, ఆర్ఐ అజయ్ తదితరులు పాల్గొన్నారు. కౌన్సిలర్ల అభ్యంతరం.. అయితే దరఖాస్తుల ఆధారంగా ఇళ్ల కేటాయింపు సరికాదంటూ అధికార కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ కౌన్సిలర్లు మాత్రం అలాగే డ్రా నిర్వహించాలని పట్టుబట్టారు. ఇలా పరస్పర డిమాండ్లతో ఆందోళనకర పరిస్థితి తలెత్తింది. దీంతో అదనపు కలెక్టర్ జోక్యం చేసుకుని ఏ విధానంలో డ్రా నిర్వహించాలనే దానిపై కౌన్సిలర్ల అభిప్రాయం కోరుతూ సంతకాలు సేకరించారు. 22 మంది అన్ని వార్డులకు సమానంగా డ్రా తీయలని కోరగా మిగతా వారు మాత్రం దరఖాస్తుల సంఖ్యకనుగుణంగానే చేయాలంటూ పట్టుబట్టారు. దీంతో మళ్లీ రభస మొదలైంది. పలువురు కౌన్సిలర్లు అదనపు కలెక్టర్ను చుట్టుముట్టి అన్ని వార్డులకు సమానంగా ఇళ్లను కేటాయించాలంటూ పట్టుబట్టారు. ఎంతకీ తగ్గకపోవడంతో అదనపు కలెక్టర్.. కలెక్టర్తో వేరుగా చర్చించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే ఇళ్ల పంపిణీ ఆలస్యమైందన్నారు. జూన్ 2న లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేద్దామని, సహకరిస్తే పేదలకు న్యాయం జరుగుతుందని అర్థం చేసుకోవాలంటూ కౌన్సిలర్లను కోరారు. రెండు విధానాలు కాకుండా 1,032 మందితో నేరుగా లక్కీ డ్రా తీద్దామని వచ్చినవారు ‘డ్యాన్స్ చేస్తారని, రానివారు ఏడుస్తారంటూ’ పేర్కొన్నారు. దీంతో చల్లబడ్డ కౌన్సిలర్లు అన్ని వార్డులకు సమానంగా వచ్చేలా డ్రా నిర్వహించేందుకు అంగీకరించారు. దీంతో ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. నాలుగు గంటలకు సమావేశం మొదలు కాగా రాత్రి 7.30గంటలకు ముగియడం పరిస్థితికి అద్దం పడుతుంది. ర్యాండమైజేషన్ ద్వారా..అనంతరం 46 వార్డులకు ఏడు చొప్పున మూడు ఇళ్లకు తక్కువ దరఖాస్తులు రావడంతో వచ్చిన దరఖాస్తుల సంఖ్యకనుగుణంగా లక్కీ డ్రా నిర్వహించారు. ఆన్లైన్లో ర్యాండమైజేషన్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఎంపికై న వారి జాబితాను మున్సిపల్, కలెక్టర్ కార్యాలయాల నోటీసుబోర్డుపై ఉంచనున్నట్లుగా తెలిపారు. ఏమైనా అభ్యంతరాలుంటే మూడు రోజుల్లోగా తెలియజేయవచ్చని కలెక్టర్ సూచించారు. గతంలో ఎంపికై న లబ్ధిదారులతో పాటు 337మందిని కలిపి అందరికి జూన్ 2లోగా ఇళ్లను కేటాయిస్తామని స్పష్టం చేశారు. -
ఉద్యోగ సోపానం..సావర్ఖెడా గ్రంథాలయం
కెరమెరి: మండలంలోని సావర్ఖెడాలో ఏర్పాటు చేసిన గ్రంథాలయం విద్యార్థులు, నిరుద్యోగుల కు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఆగస్టు త ర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కానున్న నేపథ్యంలో గ్రామానికి చెందిన సుమారు 20 మందికి పైగా నిరుద్యోగులు వేసవిలో పోటీ పరీ క్షలకు సన్నద్ధమవుతున్నారు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న తపనతో ఉదయం నుంచి రాత్రి వరకు పుస్తక పఠనం చేస్తున్నారు. పీఎంశ్రీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కడేర్ల రంగయ్య బడి బాగుకు చేసిన సేవలు తెలుసుకున్న ‘సర్’ సినిమా డైరెక్టర్ నాగవంశీ గ్రంథాలయ ఏర్పాటుకు రూ.3 లక్షలు విరాళంగా ఇచ్చారు. గ్రామస్తులు, దాతల సహకారంతో.. గ్రామస్తులతో పాటు కెరమెరి ఎంఆర్సీలో విధులు నిర్వహస్తున్న ఎంఐఎస్ కోఆర్డినేటర్ అశ్విని, తదితరులు పుస్తకాల కొనుగోలుకు ఆర్థికసాయం అందించారు. వాటితో డైట్సెట్, బీఎడ్, పోలీస్ కానిస్టేబుల్, నీట్, ఆర్జేసీ, ఎస్ఎస్సీ, గ్రూప్స్, ఇతర కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు కొనుగోలు చేశారు. -
ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మోదీ కృషి
ఆదిలాబాద్: దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ప్రధాని ఇందన పొదుపు పిలుపు మేరకు శనివారం ఆయన కారు పక్కనపెట్టారు. పట్టణంలోని కుమ్మరివాడ తదితర వార్డుల్లో సైకిల్పై పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు ఇంధనం ఆదా చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బ్రహ్మానంద్, ధోని జ్యోతి, జోగు రవి, దత్తు, సతీష్, అశోక్ రెడ్డి, ప్రశాంత్, రవి, అజయ్ తదితరులున్నారు. -
గిరి గ్రామాల్లో ‘బుడు బమ్ కుకు’
ఆదివాసీ గిరిజనులు తమ సంస్కృతి సంప్రదాయాలను నేటికీ కొనసాగిస్తున్నారు. శనివారం వైశాఖ మాసం (బడ్బావై) అమావాస్యను పురస్కరించుకుని మండలంలోని గిరి గ్రామాల్లో చిన్నారులు కాళ్ళకు గజ్జెలు కట్టుకుని రోకలిబండకు కప్పను కట్టి భుజాన వేసుకుని కప్పతల్లికి స్నానం చేయిస్తూ బుడు బమ్ కుకు ఆట ఆడారు. అనంతరం గ్రామ పొలిమేరలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కప్పను వదిలిపెట్టారు. ఆ కప్ప ఏదిక్కు వెళ్తుందో ఆ దిక్కు నుంచి వర్షాలు వస్తాయని గిరిజనుల నమ్మకం. – సిరికొండ -
● లింకు డాక్యుమెంట్ లేకుండానే రిజిస్ట్రేషన్లు ● ఇటీవలే విజిలెన్స్ దాడులు.. అయినా మారని ధోరణి ● ఆదిలాబాద్ ఎస్ఆర్వోల తీరిది
ఈ కార్యాలయంలో ఇటీవల వందలాది ప్లాట్లకు సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఓ సబ్ రిజిస్ట్రార్ ఇందులో కీలక భాగస్వామ్యం వహించినట్లుగా ప్రచారం నడుస్తోంది. పట్టణంలోని భాగ్యనగర్, భీంసరి, సీసీఐ ఏరియాలోని వందలాది ప్లాట్ల కు సంబంధించి ఇది వరకు లింకు డాక్యుమెంట్లు లేకున్నప్పటికీ రిజిస్ట్రేషన్లు చేశారు. కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు కీలకంగా వ్యవహరించి సబ్ రిజిస్ట్రార్ను మచ్చిక చేసుకుని వ్యవహరం సాగించారని చెప్పుకుంటున్నారు. ఒక్కో ప్లాట్ రిజిస్ట్రేషన్కు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు అధికా రులకు ముట్టజెప్పినట్లుగా ప్రచారం ఉంది. ఆగని తంతు.. ప్రభుత్వం నుంచి నిషేధం ఉన్నప్పటికీ గతేడాది అనధికారిక లేఅవుట్లలో ఇక్కడ అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్ని అప్పట్లో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఆ సమయంలో డీఆర్గా ఉన్న ప్రస న్న దీనిపై డీఐజీకి రిపోర్టు అందజేశారు. ఇక ఆ సబ్ రిజిస్ట్రార్పై చర్యలు తప్పవని అంతా భావించినప్పటికీ కేవలం మరో చోటకు బదిలీకే పరిమితమ య్యారు. ఆ తర్వాత కూడా పలు ప్లాట్లను ఇలాగే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు స్కెచ్ రెడీ చేయగా ‘సాక్షి’లో కథనం రావడంతో బ్రేక్ పడింది. తర్వాత విజిలెన్స్ దాడులు కలకలం రేపాయి. కొద్ది రోజుల పాటు అక్రమాలకు దూరంగా ఉన్నా ఇటీవల మళ్లీ అక్రమ రిజిస్ట్రేషన్లకు తెరలేపారు. మొత్తంగా ఆదిలాబాద్ ఎస్ఆర్వోలో అడపా, దడపా వందలాది ప్లాట్లను అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తూ దళారులు తమ దందా సాగిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్లు మామూళ్లకు ఆశపడి పెద్ద మొత్తంలో డీల్ కుదుర్చుకుని వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు ఈ విషయంలో పట్టిపట్టనట్లుగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. నా దృష్టికి రాలేదు..లింక్ డాక్యుమెంట్ లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఆధారాలు ఉంటే డీఆర్ కార్యాలయంలో అందజేయాలి. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. ఆదిలాబాద్ ఎస్ఆర్వో కార్యాలయంలో ఇలాంటి రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నా దృష్టికి రాలేదు. ఆధారాలు అందజేస్తే విచారణ చేసి నిబంధనలకు విరుద్ధంగా జరిగి ఉంటే డీఐజీకి రిపోర్టు అందజేస్తాం. శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – ఎం.రవీందర్రావు, జిల్లా రిజిస్ట్రార్ -
ఆర్జీయూకేటీలో గ్రంథాలయ దినోత్సవం
బాసర: బాసర ఆర్జీయూకేటీలో విద్యా వారోత్సవా ల్లో భాగంగా శనివా రం గ్రంథాలయ ది నోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రవేశ పరీక్షలకు, ఇంజినీరింగ్, సైన్స్, సా హిత్య విషయాలకు సంబంధించి నూతన పుస్తకాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారత ప్రభుత్వ ఐఐటీ స్థాయిల పరిశోధనా పత్రాలు విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. డిజిటల్ గ్రంథాలయం ద్వారా 10 కోట్లకు పైగా పుస్తకాలు, ఆడియో–వీడియో వనరులు ఒక్క క్లిక్లో పొందేమని ఆయన వివరించారు. విద్యార్థులు, అధ్యాపకులు ఈ వనరులను సద్వినియోగం చేసుకోవాలంటూ సలహా అందించారు. ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ. మురళీ దర్శన్ మాట్లాడుతూ డిజిటల్ వనరులను ఎలా ఉపయోగించుకోవాలో సాధనాత్మక సూచనలు ఇచ్చారు. పుస్తక ప్రదర్శనలో ఇంజనీరింగ్, శాస్త్ర, సాహిత్య, పోటీ పరీక్షల సంభంధిత తాజా నోట్లు, పుస్తకాలు ప్రదర్శనకు ఉంచారు. గ్రంథాలయాధికారి డాక్టర్ కే.అరుణ జ్యోతి స్వాగత ప్రసంగంలో పుస్తకదానానికి ప్రోత్సాహం ఇచ్చి ‘పుస్తకదానం చేయండి.. అక్షరజ్ఞానం పంచండి‘ అంటూ పాఠకులకు ఆహ్వానం పలుకారు. కార్యక్రమంలో డీన్ అకడమిక్స్ ప్లానింగ్ శేఖర్ శీలం, అసోసియేట్ డీన్ డాక్టర్ ఎస్.విఠల్, దేవరాజ్, గ్రంథాలయ సిబ్బంది అర్చన, సునీత, అన్ని విభాగాల అధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రయోగాత్మకంగా సాగు చేశాం
తాంసి: కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతు సాయినాథ్కు చెందిన ఎకరం విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ సహకారంతో మండలంలోని పొన్నారి శివారులో జనవరిలో డ్రోన్ ద్వారా విత్తనాలు చల్లి నువ్వు సాగు చేపట్టారు. జగిత్యాల అగ్రికల్చర్ కళాశాలకు చెందిన జేసీఎస్ 1020 రకానికి చెందిన విత్తనాలను డ్రోన్ ద్వారా విత్తారు. సాళ్ల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 5 నుంచి 8 సెంటీమీటర్ల ఉండేలా 10 నిమిషాల్లోనే విత్తన ప్రక్రియ పూర్తి చేశారు. కలుపు, పురుగు మందులను సైతం కూలీల అవసరం లేకుండా డ్రోన్ ద్వారా పిచికారీ చేశారు. ప్రస్తుతం పంట ఏపుగా పెరగడంతో పాటు దిగుబడి సైతం ఆశించిన విధంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విధానంలో ఎకరం సాగుకు కేవలం రూ.800 మాత్రమే ఖర్చవుతుండగా విత్తనం వేసే సమయం కూడా ఆదా అవుతుంది. అదే సంప్రదాయ పద్ధతిలో సాగు చేస్తే రూ.1400కు పైగా పెట్టుబడి వ్యయంతో పాటు విత్తనం వేయడం ఒక రోజు పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సాధారణ పద్ధతిలో దిగుబడి 3నుంచి 4 క్వింటాళ్లు వస్తుండగా, ఈ విధానంలో 4 నుంచి 5క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. పెట్టుబడి తక్కువ.. సమయం ఆదాకృషి విజ్ఞాన కేంద్రం సహకారంతో ఎకరంలో సాగు చేస్తున్న. డ్రోన్తో పది నిమిషాల్ల్లోనే విత్తనాలు విత్తడం పూర్తయింది. అదే కూలీలతో అయితే ఒక రోజు పట్టేది. గడ్డిమందు, పురుగుమందు కూడా డ్రోన్తోనే రెండు సార్లు పిచికారీ చేసినం. ప్రస్తుతం పంట కోత దశలో ఉంది. మామూలు విధానంతో పోల్చితే పెట్టుబడి తక్కువ. అలాగే దిగుబడి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నన్ను గైడ్ చేస్తున్నారు. – కేమ సాయినాథ్, రైతు రైతులకు సాగులో డ్రోన్ టెక్నాలజీ అందించాలనే ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా ఈ విధానం చేపట్టాం. దేశంలోనే తొలిసారిగా డ్రోన్ ద్వారా నువ్వు విత్తనాలు వేసి సాగు చేస్తున్నాం. సాధారణ సాగుకు ఈ విధానానికి తేడా కనిపిస్తుంది. ఎకరానికి మామూలుగా రూ.1400 పెట్టుబడి అవుతుండగా.. ఈవిధానంలో రూ.800 దాటదు. విత్తనం వేసే సమయం కూడా తక్కువే. దిగుబడి సాధారణ సాగుతో పోల్చితే 25శాతం వరకు అధికంగా ఉంటుంది. ఈ విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. – రాంగోపాల్వర్మ, కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ -
కలెక్టర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
● కుండి శేకుగూడ జీపీ సందర్శన ● క్షేత్రస్థాయిలో సమస్యల పరిశీలన నార్నూర్: గాదిగూడ మండలం కుండి శేకుగూడ జీపీ పరిధిలోని ఆయా గ్రామాల్లో అధికారులు శుక్రవారం పర్యటించారు. ఇటీవల గ్రామస్తులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, స్పందించిన ఆయన సంబంధిత శాఖల అధికారులను పరిశీలనకు ఆదేశించారు. ఈమేరకు డీఎల్పీవో ప్రభాకర్ ఆధ్వర్యంలో విద్యుత్, పంచాయతీరాజ్, నీటిపారుదల, హౌసింగ్ తదితర శాఖల అధికారులు శుక్రవారం ఆయా గ్రామాలను సందర్శించారు. గ్రామస్తులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామపంచాయతీ పరిధిలోని కుండి, కుండి శేకుగూడ, చిన్నకుండి, కుండి మరోతిగూడ గ్రామాలు ఏర్పడి దాదాపు ఏడు దశాబ్దాలవుతున్నా ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేవని తెలిపారు. గ్రామాల్లో ఎక్కువగా పెంకుటిళ్లు, రేకుల ఇళ్లు ఉండటంతో వర్షాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. విద్యుత్ స్తంభాలు లేక రాత్రి వేళల్లో అంధకారంలో మగ్గాల్సి వస్తోందని పేర్కొన్నారు. తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉందని, గ్రామంలో బోరు ఉన్నప్పటికీ కరెంటు స్తంభా లు, ట్రాన్స్ఫార్మర్ లేక వినియోగంలోకి రా వడం లేదన్నారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరా రు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీ సుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఇందులో ఎంపీడీవో శ్రీనివాస్, విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్, మీషన్ భగీరథ ఏఈ శివ, హౌసింగ్ డీఈ భుజంగ్రావు, ఏఈ రాకేశ్ తదితరులున్నారు. -
ఇం‘ధన’ భారం!
కై లాస్నగర్: ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి. ఇప్పటికే గ్యాస్ ధర మండగా తాజాగా పెట్రోల్, డీజిల్ వంతయింది. ఆయిల్ కంపెనీలు లీటర్పై ఏకంగా రూ.3చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. శుక్రవారం ఉదయం నుంచే అమల్లోకి రావడంతో బంకులకు వెళ్లిన వాహనదారులు షాక్కు గురయ్యారు. ఈ పెంపుతో జిల్లాపై రోజుకు రూ.7.26లక్షల భారం పడనుంది. అలాగే ఈ ప్రభావం నిత్యావసరాల ధరలపై కూడా చూపే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. రోజుకు రూ.7.26లక్షల భారం జిల్లా వ్యాప్తంగా వివిధ ఆయిల్ కంపెనీలకు సంబంధించి 70 బంక్లు నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా రోజుకు 70వేల నుంచి 80వేల లీటర్ల పెట్రోల్ వినియోగమవుతుంది. లీటర్ పెట్రోల్పై రూ.3 పెంచినప్పటికీ జిల్లాకు వచ్చేసరికి మరో 39 పైసలు అదనంగా పెరిగాయి. ఈ లెక్కన వాహనదారులపై పెట్రోల్ అదనపు భారం రోజుకు రూ.2.37లక్షల వరకు పడుతుంది. నెలవారీగా పరిశీలిస్తే రూ.71లక్షలుపైనే. ఇక డీజిల్ రేటు జిల్లాలో లీటర్కు రూ.3.26 పైసలు పెరగగా.. రోజుకు 1.50 లక్షల నుంచి 1.70 లక్షల లీటర్లు వినియోగమవుతుంది. ఈ లెక్కన వాహనదారులపై రూ.4.89 లక్షల భారం పడుతుంది. నెలవారీగా పరిశీలిస్తే అదనపు భారం రూ.1.46కోట్లకు పైనే ఉండనుంది. ఇది రవాణారంగంతో పాటు నిత్యావసరాల ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. పేదలపై పెను భారం ఇంధన ధరల పెంపుతో వాహనదారులపైనే కాకుండా పాలు, కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలపై ప్రభావం పడే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. రవాణా చార్జీలు సైతం పెరగనున్నాయి. ఫలితంగా పేద, మధ్య తరగతి ప్రజలకు పెను భారంగా మారనుంది. జిల్లాలోని పెట్రోల్ బంక్లు : 70 పెరిగిన ఇంధన ధరలు పాత ధర ప్రస్తుతం పెట్రోల్ రూ.108.86 రూ.112.25 డీజిల్ రూ.97.13 రూ.100.39 -
‘డబుల్’ అదృష్టవంతులెవరో?
కై లాస్నగర్: జిల్లా కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియకు ఎట్టకేలకు మోక్షం లభించింది. లబ్ధిదారుల ఎంపిక చేపట్టేందుకు గాను యంత్రాంగం సిద్ధమైంది. శనివారం సాయంత్రం 4గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించనున్నారు. అయితే మ్యానువల్గా కాకుండా ఆన్లైన్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లుగా తెలిసింది. ఇదీ పరిస్థితి .. నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పట్టణంలోని కేఆర్కే కాలనీలో రెండు బ్లాక్లుగా 760 ఇళ్లను నిర్మించగా, మావలలోని సర్వేనంబర్ 170లో 222 ఇళ్ల చొప్పున మొత్తం 982 ఇళ్లను నిర్మించారు. ఇందులో 720 ఇళ్ల కేటాయింపున కోసం మూడేళ్ల క్రితం అప్పటి కలెక్టర్ రాహుల్రాజ్ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్యార్డులో లక్కీడ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే క్షేత్రస్థాయిలో నాటి లబ్ధిదారుల స్థితిగతులపై విచారణ చేపట్టిన మున్సిపల్ అధికారులు అందులో 527 మంది మాత్రమే అర్హులుగా ఉన్నట్లుగా తేల్చారు. నేడు లక్కీడ్రా.. సర్వేనంబర్ 170లో ఉన్న 222 ఇళ్లకు గాను 48 ఇళ్లను భవిష్యత్ అవసరాల కోసం రిజర్వ్లో ఉంచనున్నారు. మిగిలిన 174 ఇళ్లు, అలాగే కేఆర్కే కాలనీలోని గతంలో లక్కీడ్రాలో మిగిలినవి కలిపి మొత్తం 337 ఇళ్లకు కలెక్టర్ ఆధ్వర్యంలో కౌన్సిలర్ల సమక్షంలో నేడు లక్కీడ్రా నిర్వహించనున్నారు. అయితే గతంలో దరఖాస్తుదారుల సమక్షంలో డ్రా నిర్వహించగా ప్రస్తుతం మాత్రం మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారుల సమక్షంలోనే ఈ ప్రక్రియ చేపడుతున్నారు. ఇది కూడా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల అన్ని పార్టీల కౌన్సిలర్లు తమ వార్డుల పరిఽఽధిలో నుంచి కొంతమంది పేర్లతో కూడిన జాబితా సిద్ధం చేసి అధికారులకు అందజేశారు. బీజేపీ కౌన్సిలర్లు ఒక్కొక్కరు పది నుంచి 15 మంది పేర్లు ఇవ్వగా, కాంగ్రెస్ కౌన్సిలర్లు 6నుంచి 8 మంది, ఎంఐఎం, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ముగ్గురేసి పేర్లతో కూడిన జాబితాలను అందజేశారు. వారిచ్చిన జాబితా ప్రకారమే లక్కీ డ్రా నిర్వహిస్తారా లేక దరఖాస్తుదారులందరి వివరాలతో కూడిన జాబితా ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపడుతారా అనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్లోనే ఎంపిక ప్రక్రియలక్కీ డ్రా ప్రక్రియ ఈ సారి మ్యానువల్గా కాకుండా ఆన్లైన్లో ఉంటుంది. కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా హౌసింగ్, రెవెన్యూ అధికారులు ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు. దరఖాస్తులను పలుమార్లు ర్యాండమైజ్గా చేసి కౌన్సిలర్లు అంగీకరించిన తర్వాతే లబ్ధిదారుల ఎంపిక చేపట్టడం జరుగుతుంది. – ఏ.జగదీశ్వర్గౌడ్, మున్సిపల్ కమిషనర్ డబుల్ బెడ్రూం ఇళ్ల సమాచారం.. కేటాయించనున్న ఇళ్లు : 337 దరఖాస్తుదారులు : 1100 మంది -
అట్రాసిటీ కేసులు సత్వరం పరిష్కరించాలి
కై లాస్నగర్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ వేగవంతం చేయడంతో పాటు బాధితులకు సత్వ రం పరిహారం అందేలా చూడాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి కేసుల పురోగతిపై సమీక్షించారు. పోలీస్ స్టేషన్ల వారీగా నమోదైన కేసులు, విచారణ, పరి హారం అందజేత తదితర అంశాలపై పోలీస్, రెవె న్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్సీల రక్షణకు సంబంధించిన చట్టాలను జిల్లాలో పకడ్బందీగా అ మలు చేస్తున్నట్లుగా తెలిపారు. విజిలెన్స్ కమిటీ త రచూ సమావేశమై కేసుల పురోగతిని సమీక్షించా లని సూచించారు. ఎస్సీలపై వేధింపులు జరగకుండా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఏఎస్పీ రుత్విక్ సాయి, డీఎస్సీడీవో సునీతా కుమారి, ఆర్డీవో జగదీశ్వర్ రావ్, వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు తదితరులు పాలొన్నారు. పశువుల రక్షణకు ప్రత్యేక చర్యలు ఆదిలాబాద్టౌన్: పశువుల సంరక్షణకు ప్రత్యేక చ ర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి అన్నారు. పట్ట ణంలోని పశువైద్యశాల వెనుక భాగంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కంపౌండ్ వాల్ను శుక్రవారం పరిశీలించారు. జిల్లాలోని వివిధ చెక్పోస్టుల వద్ద స్వాధీనం చేసుకున్న పశువుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా షెడ్ నిర్మించాలని ఆదేశించారు. పట్టుబడిన పశువులను నేరుగా గోశాలకు తరలించడం ద్వారా స్థల సమస్య, నిర్వహణ ఇబ్బందులు ఎదురవుతున్నాయని పే ర్కొన్నారు. పశువులకు అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్స అందించాలని సూచించారు. ఇందులో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రామారావు రాథోడ్, అసిస్టెంట్ డైరెక్టర్ గోపీకృష్ణ పాల్గొన్నారు. -
విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
నేరేడిగొండ: విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్ను శుక్రవారం సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. నూతన వంటగదితో పాటు ప్రహరీని ప్రారంభించారు. అనంతరం సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రతీ పోలీస్ తమకు కేటాయించిన గ్రామాల్లో పర్యటిస్తూ సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని సూచించారు. గంజాయి, గుడుంబా, మట్కా వంటి అక్రమ కార్యకలాపాలపై నిఘా పెంచాలన్నారు. ఫిర్యాదుదారులపై గౌరవంగా వ్యవహరిస్తూ, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం రోల్ మామడ వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ను ఎస్పీ తనిఖీ చేశారు. అనుమతి పత్రాలు లేకుండా పశువులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్వీక్ సాయి కొట్టే, ఇచ్చోడ రూరల్ సీఐ రమేశ్, నేరేడిగొండ ఎస్సై ఇమ్రాన్, ఆర్ఎస్సై ఆశన్న, వెటర్నరీ అధికారి పావని తదితరులు పాల్గొన్నారు. -
పుస్తక పఠనంతో విజ్ఞానం
ఆదిలాబాద్టౌన్: పుస్తక పఠనంతో జ్ఞానం పెంపొందుతుందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య అన్నారు. విద్యా వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాలలో శుక్రవారం గ్రంథాలయ దినోత్సవం ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడా రు. విద్యార్థులు సెల్ఫోన్కు దూరంగా ఉంటూ దినపత్రికలు, పుస్తకాలు చదవాలని సూచించారు. ప్రిన్సిపాల్ అతీఖ్ బేగం, లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు. బజార్హత్నూర్లో.. బజార్హత్నూర్: శాఖ గ్రంథాలయాలకు పక్కా భవనాలతో పాటు వసతుల కల్పనకు కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య అన్నారు. మండల కేంద్రంలో ని గ్రంథాలయంలో శుక్రవారం గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో లైబ్రేరియన్ రాజన్న, సర్పంచ్ సా యన్న, తదితరులు పాల్గొన్నారు. పుస్తక పఠనంతో ఉజ్వల భవిష్యత్తు ఆదిలాబాద్: పుస్తక పఠనంతో ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ప్రజా పాలన– ప్రగతి ప్ర ణాళిక’ విద్యా వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై మట్లాడారు. విద్యార్థులు, యువత మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి గ్రంథాలయాలను సందర్శించే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు. నిరంతరం గ్రంథాలయాన్ని సందర్శించే ఉత్తమ పాఠకులను అభినందించి, వారికి బహుమతులు అందజేశారు. అనంతరం గ్రంథాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను సందర్శించారు. ఇందులో అదన పు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చై ర్మన్ మల్లెపూల నర్సయ్య, లైబ్రేరియన్ శ్రీనివాస్, సిబ్బంది సతీశ్, విద్యార్థులు, పాఠకులు తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రం ప్రారంభం
సాత్నాల: మండలంలోని కాన్ఫా మెడిగూడ రైతువేదిక వద్ద ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన జొన్న పంటను నూటికి నూరుశాతం ప్రభుత్వం కొనుగోలు చేసేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. పంట కొనుగోలు కోటాను పెంచాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని గుర్తు చేశారు. జైనథ్ ఏఎంసీ చైర్మన్ అల్లూరి అశోక్రెడ్డి, తహసీల్దార్ జాదవ్ రామారావు, రైతులు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి భూమిపూజ ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని క్రాంతినగర్ కాలనీలో చేపట్టిన విట్టల రుకుంబాయి ఆలయ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని పురాతన ఆలయాల పునరుద్ధరణ, అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కౌన్సిలర్లు నరేశ్, జీవన్, కృష్ణ, రాకేశ్, అశోక్రెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా
ఆదిలాబాద్టౌన్: నకిలీ విత్తనాలు, గడ్డి మందులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్క్వార్టర్స్లో నెలవారీ నేర సమీక్ష నిర్వహించి మాట్లాడారు. బక్రీద్ సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. గంజాయి, మాదకద్రవ్యా ల నిర్మూలనకు కృషి చేయాలని తెలిపారు. వర్టికల్ విధానం అమలు చేయాలని, రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లపై నిఘా కొనసాగించాలని ఆదేశించారు. ఈ కేసుల దర్యాప్తు, పురోగతి, విచారణ, శిక్షలపై సమీక్షించి ప్రతీ ఒక్కరికి సమాన విధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని, రాత్రి వేళ గస్తీని మరింత పటిష్టం చేసి అసాంఘిక కార్యకలాపాలు, గ్యాంబ్లింగ్ వంటి చర్యలను అరికట్టాలని పేర్కొన్నారు. నేరస్తుల ఫింగర్ప్రింట్లను సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాలని, గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదనపు ఎస్పీ సురేందర్రావు, ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్సాయి కొట్టె, శిక్షణ ఐపీఎస్ అధికారి రాహుల్కాంత్, డీఎస్పీలు శ్రీనివాస్, జీవన్రెడ్డి, ఇంద్రవర్ధన్, సీఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కాంగ్రెస్ మండలాధ్యక్షుల నియామకం
కైలాస్నగర్: కాంగ్రెస్ మండ ల, పట్టణ అధ్యక్షులను పార్టీ అ ధిష్టానం ఎట్టకేలకు ఖరారు చే సింది. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపే తం చేయడమే లక్ష్యంగా పార్టీకి విధేయులుగా ఉన్న వారికి పదవులు కట్టబెట్టింది. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేశ్జాదవ్ పంపించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్గౌడ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అయి తే, ఇదివరకు ఆదిలాబాద్ పట్టణానికి అధ్యక్షుడు ఉండగా కొత్తగా ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండల కేంద్రాలకూ వేరుగా అధ్యక్షులను నియమించడం ప్రా ధాన్యత సంతరించుకుంది. గత కొంతకాలంగా ఊ రిస్తూ వస్తున్న పదవులను ఎట్టకేలకు భర్తీ చేయడంతో నిరాశలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. త్వరలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించనున్న నేపఽథ్యంలో పార్టీ మండలాధ్యక్షులను నియమించడం కాంగ్రెస్కు కలిసిరానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, కొత్త అధ్యక్షులు మండలంలోని నా యకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు పిలుపునిచ్చారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీని పటిష్టం చేయాలని కోరారు. నూతన అధ్యక్షులు వీరే.. మండలం అధ్యక్షుడి పేరు ఆదిలాబాద్రూరల్ వెంకటేశ్యాదవ్ జైనథ్ జి.జగదీశ్రెడ్డి బేల రూప్రావు మావల కుదురుపాక సురేశ్ భోరజ్ బత్తుల శ్రీనివాస్ సాత్నాల కనక బాపురావు ఆదిలాబాద్ ఖిజర్ పాషా ఇంద్రవెల్లి ఎండీ జహీర్ ఇంద్రవెల్లిటౌన్ సోన్కాంబ్లేజితేందర్ ఉట్నూర్ దాసండ్ల ప్రభాకర్ ఉట్నూర్టౌన్ సయ్యద్ నిసార్ భీంపూర్ దండే సుదర్శన్ తలమడుగు కసుల ప్రతాప్ తాంసి కౌడాల సంతోష్ సిరికొండ షేక్ ఇమామ్ బజార్హత్నూర్ కళ్లెం విఠల్ ఇచ్చోడ ఆసిఫ్ ఉల్లాఖాన్ నేరడిగొండ ఏలేటి రాజశేఖర్రెడ్డి బోథ్ నల్ల శ్రీకాంత్రెడ్డి గుడిహత్నూర్ తొడసం దౌలత్రావ్ సొనాల గాజుల పోతన్న నార్నూర్ చౌహాన్ గోవింద్రావు గాదిగూడ గెడం పరశురాం -
మారుమూల గ్రామాల సందర్శన
ఆదిలాబాద్రూరల్: మండలంలోని మారుమూల గ్రామాలైన వాన్వాట్ పంచాయతీ పరిధి మంగ్లీ, అసోదా పంచాయతీ పరిధి బుర్కి గ్రామాలను ఐటీడీఏ పీవో మంద మకరందు గురువారం సందర్శించారు. మంగ్లీకి రోడ్డు సౌకర్యం సరిగా లేక సుమారు నాలుగు కిలోమీటర్లు బైక్పై వెళ్లారు. బైక్ కూడా వెళ్లడానికి వీలు లేని ప్రాంతం నుంచి కాలినడకన గ్రా మానికి చేరుకున్నారు. గ్రామస్తుల సమస్యలు తెలు సుకుని దశలవారీగా పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వా రా లబ్ధి చేకూరేలా చూస్తామని తెలిపారు. పీవీటీజీ ఏపీవో భాస్కర్, తహసీల్దార్ గోవింద్, ఐటీడీఏ ఈ ఏ సతీశ్, ఆర్ఐ శకుంతల, వాన్వాట్, అసోదా బు ర్కి సర్పంచులు మెస్రం భుజంగ్రావ్, మెస్రం నా గోరావ్, ఏఈలు ఆదిత్య, గణేశ్ తదితరులున్నారు. ఆత్మీయ సమ్మేళనం ఉట్నూర్ రూరల్: ఉట్నూర్ పరిధిలోని కుమరం భీమ్ కాంప్లెక్స్లో తోటి, కోలాం సర్పంచులు, వార్డ్ సభ్యులు, మేధావులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈటీడబ్ల్యూ తానాజీ, మండల అధికారి గంగాధర్, ఏపీవో జనరల్ వసంతరావు, ఏపీవో పీవీటీజీ భాస్కర్, డీడీ అంబాజి, వైద్యారోగ్యశాఖ అధికారి మనోహర్తో కలిసి ఐటీడీఏ పీవో మకరందు హాజరయ్యారు. పీవీటీజీ, కోలాం, తోటి, ఆది వాసీ గిరిజనులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. వివిధ సమస్యలపై కార్యాలయానికి వచ్చే దరఖాస్తుదారులకు సమయం కేటాయిస్తానని తెలిపారు. విద్య, వైద్యం కోసం ప్రజల నుంచి ఒక నాయకుడిని ఎంపిక చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
పకడ్బందీగా జొన్నల కొనుగోళ్లు
కై లాస్నగర్(బేల): రైతులకు ఇబ్బందులు కలగకుండా జొన్న పంటను కొనుగోలు చేస్తామని మండల ప్రత్యేకాధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్రావు పేర్కొన్నారు. బేల మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డ్లో చేపట్టిన జొన్న కొనుగోళ్లను గురువారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 30శాతం పంట కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. కొనుగోలు చేసిన పంటను ఇక్కడే ఉన్న గోదాంలో నిల్వ చేస్తున్నామని పేర్కొన్నారు. గన్నీ సంచుల కొరతతో కొనుగోళ్లలో కొంత జ్యాపం జరుగుతోందని, రైతులు సొంతంగా గన్నీ బ్యాగ్లు సమకూర్చుకుంటే ఒక్కో సంచికి రూ.22 చెల్లించనున్నట్లు వివరించారు. -
అభివృద్ధి పనులకు భూమిపూజ
సిరికొండ: విద్యావారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని కేజీబీవీలో రూ.కోటి 72లక్షలతో చేపట్టిన అదనపు తరగతుల నిర్మాణానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గురువారం భూమిపూజ చేశారు. ఎస్సెస్సీ టాపర్గా నిలిచిన విద్యార్థినితో ఆర్వోఆర్ ప్లాంట్ను ప్రారంభించారు. విద్యార్థినులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. పదోతరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులను శాలువాలతో సన్మానించారు. మండలంలోని రాయిగూడ ఆశ్రమ పాఠశాలలో రూ.13 లక్షలతో నిర్మించిన సైన్స్ ల్యాబ్ను ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో ప్రమాదకర విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను గుర్తించిన ఎమ్మెల్యే చుట్టూ రక్షణ గోడ నిర్మించాలని అక్కడే ఉన్న ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సతీశ్ను ఆదేశించారు. ఇన్చార్జి ఎంపీడీవో సంతోష్కుమార్, సర్పంచులు బొడ్డు దత్తాత్రి, పెందుర్ లక్ష్మణ్, రాజు, ఎంఈవో సునీల్కుమార్, ఎస్వో సంధ్యారాణి, ఆత్రం భాస్కర్, నాయకులు రంజాన్, పెంటన్న, ఎక్బాల్, చందు, తదితరులు పాల్గొన్నారు. ఇచ్చోడ: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో రూ.13.50లక్షలతో నిర్మించిన అదనపు గదులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, సర్పంచ్ కొడప జలైజాకు, బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు రమణారెడ్డి తదితరులున్నారు. నేరడిగొండ: మండల కేంద్రంలోని కేజీబీవీలో రూ.68 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమిపూజ చేశారు. విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించేందుకు నూతన గదుల నిర్మాణం, పాఠశాల భవనానికి మరమ్మతు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
రోగులకు అందుబాటులో ఉండాలి
గుడిహత్నూర్: రోగులకు అందుబాటులో ఉండాలని జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్ సూచించారు. గురువారం స్థానిక పీహెచ్సీని ఆయన తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎండల దృష్ట్యా పీహెచ్సీలో మందులు అందుబాటులో ఉంచాలని, అవసరమైన మందుల కోసం ముందస్తుగా ఇండెంట్ పెట్టాలని పేర్కొన్నారు. గర్భిణులు, బాలింతలకు నిరంతర సేవలు అందేలా ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, పీహెచ్సీలోనే ప్రసూతి అయ్యేలా చూడాలని సూచించారు. జిల్లా అదనపు వైద్యాధికారి మనోహర్, మండల వైద్యాధికారి నీలోఫర్ ఉన్నారు. -
ఆదివాసీలతో సమావేశమైన అహేరి ఎమ్మెల్యే
ఆదిలాబాద్రూరల్: మావల మండలంలోని బట్టిసావర్గాం శివారు ప్రాంతంలోగల కుమురంభీం కాలనీకి చెందిన ఆదివాసీలతో ఎన్సీపీ నేత, అహే రి ఎమ్మెల్యే, తెలంగాణ ఇన్చార్జి ఆత్రం బాబా గు రువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆ దివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్ మాట్లాడు తూ.. ఇంటి స్థలాలకు పట్టాలు, నీరు, విద్యుత్ వి ద్య, వైద్యం, రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్య వహరిస్తున్నారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమస్యలను రాష్ట్రపతి, ప్రధానమంత్రి, తెలంగాణ గవర్నర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పా రు. సామాజిక కార్యకర్తలు అజయ్కుమార్, చంద్ర న్న, తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోజ్, ఆదివాసీ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు రేణు క, ఉపాధ్యక్షురాలు ఇందిరా, ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు విష్ణు, తుడుం దెబ్బ ఆదిలాబాద్ డివిజన్ అధ్యక్షుడు గణపతి, నాయకులు ముకుందరావు, ప్రకాశ్, తులసీరాం తదితరులున్నారు. -
సర్కారు బడుల్లో విద్యాప్రమాణాలు పెంచాలి
ఇంద్రవెల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణా లు పెంచాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మండలకేంద్రంలోని పీఎంశ్రీ జెడ్పీ స్కూల్లో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి షా హాజరయ్యారు. పాఠశాల నిర్వహణ, విద్యార్థు ల సంఖ్య పెంపు, వసతుల కల్పన తదితర అంశాలపై ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. పదోతరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులతోపాటు వా రి తల్లి దండ్రులను శాలువాలతో సన్మానించి బహుమతులు అందజేశారు. అనంతరం మండలకేంద్రంలో చేపట్టిన జనగణన సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, ఎంపీడీవో జీవన్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం, సర్పంచ్ రాథోడ్ మోహన్సింగ్, ఉప సర్పంచ్ తిట్టే సుమిత్, హెచ్ఎం రవీందర్రెడ్డి, ఉపాధ్యాయులున్నారు. -
పాఠశాలల బలోపేతంలో భాగమవ్వాలి
ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ రాజర్షిషా పి లుపునిచ్చారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక వి ద్యావారోత్సవాల్లో భాగంగా బుధవారం రిమ్స్ ఆడిటోరియంలో ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలోని సర్పంచులు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లకు నిర్వహించిన విద్యా అవగాహన సదస్సుకు హాజరై మా ట్లాడారు. ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అంగన్వాడీ పి ల్లలను ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలని ప్రజా ప్రతినిధులను కోరారు. విద్యార్థులు మధ్యలో చదు వు మానేయకుండా పర్యవేక్షించాలని సూచించారు. ప్రతీ పాఠశాలకు నిర్దేశించిన ఎన్రోల్మెంట్ లక్ష్యాలను చేరుకునేందుకు గ్రామాలు, వార్డుల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో రాజేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్మన్ రోహిత్, డీఎల్పీవో ఫణీందర్, కోఆర్డినేటర్ అజయ్, అధికారులు పాల్గొన్నారు. జనగణనను పకడ్బందీగా చేపట్టాలి కైలాస్నగర్: జనగణన పకడ్బందీగా చేపట్టాలని క లెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్, బొక్కలగూడ కాలనీల్లో నిర్వహిస్తున్న జనగణన హౌస్ లిస్టింగ్ సర్వేను ఆకస్మికంగా పరిశీ లించారు. ప్రక్రియ క్రమపద్ధతిలో సాగుతుండటంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 14నుంచి హౌ స్ లిస్టింగ్ ఆపరేషన్ (హెచ్ఎల్వో) యాప్ ద్వారా డేటా నమోదు ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో సాంకేతిక అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్టర్ ట్రైనర్ శ్రీహరిబాబు, ఫీల్డ్ ట్రైనర్ సుజాత్ఖాన్, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు నవీన్కుమార్, సాయికృష్ణ ఉన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ కఠినంగా అమలు కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ఘన వ్యర్థాల నిర్వహణ–2026ను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన జాతీయ స్థాయి సెన్సిటైజేషన్ వెబినార్లో కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్షించిన కలెక్టర్ పలు సూచనలు చేశారు. మే 5, 2026న జారీ చేసిన తాజా ఉత్తర్వులను జిల్లాలో అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహించే అధికారులను ఉపేంక్షించబోమని హెచ్చరించారు. బల్క్ వేస్ట్ జనరేటర్లను గుర్తించి నిబంధనల ప్రకా రం వారి ప్రాంగణాల్లోనే వ్యర్థాల ప్రాసెసింగ్ జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఆర్డీవో రవీందర్ రాథో డ్, డీఎల్పీవో ఫణిందర్రావు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రం తనిఖీ తాంసి: మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రైతులు పండించిన జొన్న పంటను పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఆందోళన చెందవద్దని తెలిపారు. అదనపు కలెక్టర్ చిత్రు, మార్క్ఫెడ్ డీఎం మ హేశ్, డీఏవో శ్రీధర్స్వామి, ఏడీఏ శ్రీనివాస్, ఎంబీఐ శ్రీనివాస్, కొనుగోలు కేంద్రం ఇన్చా ర్జి శ్రీనివాస్, ఎంపీడీవో మోహన్రెడ్డి, తహసీ ల్దార్ లక్ష్మి, ఏవో రవీందర్ తదితరులున్నారు. -
ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ఆదిలాబాద్టౌన్: ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ పే ర్కొన్నారు. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రిమ్స్లోని ఏఆర్టీ సెంటర్లో హెచ్ఐవీతో జీవిస్తున్న 18 మంది పేదలకు బుధవారం పౌష్టికాహారం పంపిణీ చేయగా నరేందర్ రాథోడ్ హాజరై మాట్లాడారు. ప్ర భుత్వ ఏఆర్టీ సెంటర్ ద్వారా అందించే మందులతో పాటు పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చని భరోసా ఇచ్చారు. నా కో, తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి నిర్దేశించిన 95:95:99 లక్ష్యాలను అధిగమించి జిల్లా ను ఆదర్శంగా నిలపాలని తెలిపారు. హెచ్ఐవీతో జీవిస్తున్న చిన్నారులకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. చిన్నారుల ఉన్నత విద్య, పెద్దలకు ఆసరా పెన్షన్ల కోసం సంబంధిత అధికారులకు నివేదిక పంపిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ.. హెచ్ఐవీతో జీవిస్తున్న వారు క్రమం తప్పకుండా ఏఆర్ టీ సెంటర్లో మందులు తీసుకోవాలని, తద్వారా వ్యాధిని నియంత్రణలో ఉంచవచ్చని పేర్కొన్నారు. హెచ్ఐవీ బాధితులపై వివక్ష చూపకుండా సహకా రం అందించాలని సూచించారు. ఏఆర్టీ సెంటర్ డాక్టర్ పద్మిని ప్రియదర్శిని, సీపీఎం నాగరాజు, ఎన్జీ వో ప్రతినిధులు సాయినాథ్, భాగ్యలక్ష్మి ఉన్నారు. -
‘దళారులకు ధాన్యం అమ్ముకోవద్దు’
బోథ్: ధాన్యం దళారులకు అమ్ముకోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందా లని ఎమ్మెల్యే అనిల్జాదవ్ సూచించారు. సొనాల మండల కేంద్రంలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో బోథ్ పీఏసీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన జొన్నల కొనుగో లు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించి రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, సర్పంచ్ బిందుజ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కదం ప్రశాంత్, స్థానిక నాయకుడు తుల శ్రీనివాస్ తదితరులున్నారు. కాగా, సొనాల మండలంలో పలు శుభకార్యాలకు హాజరైన ఎమ్మెల్యే తిరుగు ప్రయాణంలో స్థానికంగా గల చిన్నపాటి హోటల్ వద్ద ఆగారు. టీ తాగు తూ స్థానికులతో సరదాగా ముచ్చటించారు. రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన నేరడిగొండ: మండలంలోని వడూర్ గ్రామం నుంచి దంస్యతండా వరకు రూ.15లక్షలతో చేపట్టిన గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే అనిల్జాదవ్ శంకుస్థాపన చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రహదారి పనులు ప్రారంభం కావడంతో గ్రా మస్తులు హర్షం వ్యక్తం చేశారు. మండలంలోని సు ర్దాపూర్ గ్రామంలోని హన్మాన్ ఆలయంలో నిర్వహించిన హన్మాన్ విగ్రహ ప్రతిష్ఠాపనకు ఎమ్మెల్యే హాజరై హోమం, ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. స్వా మివారిని దర్శించుకుని పూజలు చేశారు. స్థానిక ప్ర జాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
క్రీడాకారులకు సన్మానం
ఆదిలాబాద్: హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో నిర్వహించిన ‘3వ తెలంగాణ త్రోస్, జంప్స్, 400 మీటర్ల అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్–2026’లో విజేతలైన జిల్లా క్రీడాకారులను బుధవారం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సన్మానించారు. అసోసియేషన్ అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి మాట్లాడారు. ‘రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు 10 పతకాలు సాధించారని, క్రీడాకారుల క్రమశిక్షణ, కోచ్ రాకేశ్ శిక్షణతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. హ్యామర్ త్రోలో అరుణ, విక్రమ్ సింగ్, షాట్పుట్లో చరణ్ బంగారు, జ్యోతీశ్వరన్, సౌమ్య, జ్యోతి, సంజన, ఖుషి రజత, వంశీ, సౌమ్య కాంస్య పతకాలు సాధించగా అసోసియేషన్ సెక్రటరీ రాజేశ్, పెటా ప్రెసిడెంట్ పార్థసారథి, పీడీ కృష్ణతో కలిసి అభినందించారు. -
భగీరథ్ను అరెస్ట్ చేయాలి
ఆదిలాబాద్టౌన్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ను అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. లైంగిక దాడికి గురైన మైనర్ బాలిక పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అనేందుకు ఇదే నిదర్శనమని ఆరోపించారు. గత ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు స్థానిక ఎమ్మెల్యేకు కనిపించకపోవడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు కొప్పుల దేవన్న, కారం కార్తిక్, గెడం నగేశ్, కలగట్టు అనిల్, ఆది నారాయణ, కుమ్ర నగేశ్ తదితరులు బీఆర్ఎస్లో చేరగా రామన్న వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. నాయకులు మెట్టు ప్రహ్లాద్, రాఘవేంద్ర, లింగారెడ్డి, వెంకట్రెడ్డి, గణేశ్, లస్మన్న, సత్యనారాయణ, అడెల్లు తదితరులున్నారు. -
జిల్లావాసికి డాక్టరేట్
ఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రానికి చెందిన చౌహాన్ రాణా ఆశిష్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జ ర్నలిజం, మాస్ కమ్యూని కేషన్ విభాగంలో పీహెచ్ డీ పట్టా పొందారు. ‘పొలిటికల్ ఇన్ఫ్లూయెన్స్ ఆఫ్ సోషల్ మీడియా ఏ కేస్ స్టడీ ఆన్ ట్రైబ్స్ ఆఫ్ ఆదిలాబాద్’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారు. 2023లో గిరిజన ప్రాంతాల్లో సో షల్ మీడియా, రాజకీయ ప్రభావంపై పరిశోధ న చేసి భూ హక్కులు, విద్య, ఆరోగ్యం లాంటి స్థానిక సమస్యలు, సంప్రదాయ ప్రచార పద్ధతుల కంటే డిజిటల్ ప్ర చార ప్రభావం పెరుగుతోందని వివరించారు. ఇతని తండ్రి చౌహాన్ జైవంత్ రావు విద్యుత్ శా ఖలో సీఈగా, తల్లి స్వరూప చవాన్ ఆది లాబాద్లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నా రు. ఆశిష్కు డాక్టరేట్ రావడంపై పలువురు అభినందించారు. -
ఇక బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు
సాక్షి, ఆదిలాబాద్: సభ్యత్వ నమోదుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. డిజిటల్ పద్ధతిలో నమోదు చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. ఎన్నిక ల కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన ‘సర్’ ప్రక్రియతో పాటు ఓటరు జాబితా సవరణ తదితర కార్యాచరణ అంతా డిజిటల్ పద్ధతిలోనే జరుపుతున్న నేపథ్యంలో పార్టీ ఇలా నిర్ణయించింది. నియోజకవర్గాల్లోని మండలాలు, మున్సిపాలిటీల్లో అన్నిచోట్ల స మన్వయ కమిటీల నియామకానికి నేతలు కసరత్తు చేస్తున్నారు. జిల్లా ఇన్చార్జిగా రావుల శ్రావణ్కుమార్రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. ప్రాదేశిక ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ అన్నిచోట్ల క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కా ర్యాచరణ సిద్ధం చేస్తోంది. సభ్యత్వాల నమోదుకు ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఇద్దరు కార్యకర్తలను ఎంపిక చేసి వారికి జిల్లా కేంద్రాల్లో సాంకేతిక నిపుణులతో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. మండలా లు, బల్దియాల్లో ఐదుగురు నేతలతో సమన్వయ క మిటీలను నియమించే దిశగా చర్యలు చేపట్టారు. సంస్థాగత నిర్మాణంపై దృష్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి చాలామంది ముఖ్య నేతలు పార్టీని వీడారు. దీంతో పలు నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు చేపట్టడంలో కొంత వెనుకబడింది. ఈ నేపథ్యంలో పార్టీని సంస్థాగత నిర్మాణం చేసి పటిష్టపర్చాలని అ ధినేత కేసీఆర్ సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టా రు. జిల్లాలోని బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆదిలాబాద్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను ఇదివరకు జిల్లా అ ధ్యక్షుడిగా వ్యవహరించిన మాజీ మంత్రి జోగు రా మన్న పర్యవేక్షిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో పా ర్టీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రతీ పోలింగ్ బూత్కు ఇద్దరు కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి వారిని సభ్యత్వ నమోదులో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. -
● రెండోవిడతకు ప్రభుత్వం సమాయత్తం ● జూన్ 2న జిల్లాకేంద్రంలో ప్రారంభం ● 30 వేలకుపైగా ఇళ్లు వచ్చే అవకాశం ● నత్తనడకన తొలివిడత ఇళ్ల నిర్మాణం
కైలాస్నగర్: రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను జిల్లా నుంచే ప్రా రంభిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించడంతో జిల్లాలోని గూ డులేని పేదప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న మలివిడత ఇళ్ల ని ర్మాణాలకు శ్రీకారం చుడతా మని, దీనిపై ఈ నెల 21న జరి గే రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. దీంతో సొంతిళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్న పేదలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలివిడత కంటే మ లి విడతలో రెట్టింపు స్థాయిలో మంజూరు చేస్తామ నే ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాకు సుమారు 30వేల కు పైగా ఇళ్లు వచ్చే అవకాశముంది. అయితే, వీటిని అనర్హులకు కాకుండా అర్హులను గుర్తించి ఇస్తే పేద ల సొంతింటి కలతోపాటు ప్రభుత్వ లక్ష్యం నెరవేరనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 81వేల మందికి పైగా అర్హులు దారిద్య్ర రేఖకు దిగవనున్న నిరుపేదల సొంతింటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని అమలు చేస్తోంది. ఒక్కో ని ర్మాణానికి రూ.5లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేస్తోంది. ఇళ్ల కోసం ప్రజాపాలన, ప్రజావాణి కార్యక్రమాలతోపాటు ఎంపీడీవో కార్యాలయాల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా వ్యా ప్తంగా అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరి శీలించిన అధికారులు 81,901 మందిని (ఉ ట్నూర్, ఇంద్రవెల్లి మండలాలు మినహా) అర్హులుగా గుర్తించారు. ఇంటి స్థలం ఉండి ఇళ్లు లేనివారిని ఎల్–1 జాబితా లో చేర్చారు. ఇళ్లకు అర్హత ఉండి స్థలం లేనివారు 26,158 మంది ఉన్నట్లు నిర్ధారించారు. వీరిని ఎల్–2 జాబితా లో చేర్చారు. గతంలో ఇందిరమ్మ ఇళ్లు పొంది ఉండటం, ఆర్సీసీ పక్కాభవనం ఉండటం, నాలుగు చక్రాల వాహనం, ఆదాయపు పన్ను చెల్లించినవారిని అనర్హులుగా ఎల్–3జాబితాలో చేర్చారు. ఇందులో 53,959 మంది ఉన్నట్లు గుర్తించారు. అర్హులకు కేటాయిస్తేనే ప్రయోజనం తొలివిడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున జిల్లాకు 7,800 ఇళ్లు మంజూరయ్యాయి. ఆదిలాబా ద్, బోథ్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి చేసి న విజ్ఞప్తి మేరకు మరో 8వేలకు పైగా ఇళ్లు మంజూ రయ్యాయి. కాగా, ఇందులో చాలామంది అనర్హుల కు మంజూరయ్యాయనే ఆరోపణలు వ్యక్తమయ్యా యి. దీనిపై ప్రజాప్రతినిధులు, అధికారులకు అధికసంఖ్యలో ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఈ విడతలో నైనా అర్హులను గుర్తించి ఇళ్లు మంజూరు చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తద్వారా వారి సొంతింటి కల సాకారమవుతుంది. ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరనుంది. కానీ, ఇందిరమ్మ కమిటీలపైనే ఆధారపడి వారిచ్చే సిఫారసుల మేరకు ఇళ్లు మంజూరు చేస్తే మళ్లీ అనర్హులకే ప్రయోజనం కలిగే అవకాశముంది. అధికారులు ప్రత్యేక పరిశీలన చేపట్టి అర్హులనే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. తొలి విడత.. నత్తనడక.. మంజూరైన ఇళ్లు 16,106 మార్కౌట్స్థాయిలో 1,819 బేస్మెంట్ లెవల్లో 5,219 రూఫ్లెవల్లో 2,959 స్లాబ్ లెవల్లో 3,026 పూర్తయిన ఇళ్లు 1,477 ప్రారంభంకాని ఇళ్లు 1,606మొదటి విడతలో మంజూరైన ఇళ్ల వివరాలు జిల్లాలో తొలివిడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. 16,106 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 1,477 మాత్రమే పూర్తి కావడం పరిస్థితికి అద్దం పడుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ 1,606 ఇళ్లు ప్రారంభానికే నోచుకోలేదు. 1,819 నిర్మాణాలు పునాది దశలోనే ఉన్నాయి. ఈ విడతలోనైనా నిర్మాణాల్లో వేగం పెంచి త్వరగా పూర్తయ్యేలా చూడాలని ప్రభుత్వం సూచిస్తోంది. -
వివరాలు తీసుకుని గదులివ్వాలి
ఆదిలాబాద్టౌన్: ఆధార్, ఫోన్ నంబర్లు తప్పనిసరిగా నమోదు చేసిన తర్వాతే గదులివ్వాల ని డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి సూచించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు పట్టణంలోని లాడ్జిల యజమానులు, నిర్వాహకులతో బుధవారం వన్టౌన్ పోలీస్స్టేషన్లో సమావేశం ని ర్వహించి మాట్లాడారు. గంజాయి విక్రయాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, పాత మొబైల్ ఫోన్లు సేకరించే నేరస్తులకు గదులు ఇవ్వవద్దని తెలిపారు. లాడ్జిల్లో బ స చేసిన వారి పూర్తి వివరాలను ప్రతీ వారం ఆ యా ఠాణాల్లో ఇవ్వాలని ఆదేశించారు. ఫొటో గుర్తింపు పత్రాలను భద్రపర్చుకోవాలని తెలి పారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచించా రు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పట్టణ సీఐలు సునీల్కుమార్, నాగరాజు, ఫణిధర్, ఎస్సైలు సంజయ్, రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
ఐక్యతతో ముందుకు సాగాలి
తాంసి: ఆలయాల నిర్మాణాలు గ్రామస్తుల ఐ క్యతకు నిదర్శనమని, ఐక్యతతో ముందుకు సా గితేనే గ్రామాలాభివృద్ధి సాధ్యమని ఆదిలాబా ద్ ఎంపీ గోడం నగేశ్ పేర్కొన్నారు. బుధవా రం భీంపూర్ మండలంలోని అంతర్గాం గ్రా మంలో నూతనంగా నిర్మించిన శివాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవానికి హాజరయ్యారు. హోమం, ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఆలయ ప్రాంగణంలో షెడ్ నిర్మాణానికి త్వరలోనే రూ.5లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. డీసీసీ బీ మాజీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, తహసీల్దార్ ర మేశ్, ఎంపీడీవో గోపాలకృష్ణారెడ్డి, ఎస్సై పీర్సింగ్నాయక్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజు, సర్పంచ్ రాకేశ్యాదవ్ తదితరులున్నారు. -
పశువుల అక్రమ రవాణాను అడ్డుకోవాలి
తలమడుగు: బక్రీద్ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ పశువుల అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. బుధవారం రాత్రి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశువల అక్రమ రవాణాను అడ్డుకోవాలని సూచించారు. పశువులను తరలిస్తున్న వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించాలని తెలిపారు. అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పేర్కొన్నారు. సిబ్బంది 24 గంటలు షిఫ్ట్ విధానంలో విధులు నిర్వహించాలని సూచించారు. నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తనిఖీ సమయంలో అనుమానాస్పదంగా పారిపోయే వాహనాల సమాచారాన్ని వెంటనే ఉన్నతాధికారులకు చేరవేయాలని సూచించారు. రూరల్ సీఐ ఫణిదర్, తలమడుగు ఎస్సై రాధిక, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
వైద్య సేవల్లో నర్సుల పాత్ర కీలకం
ఆదిలాబాద్టౌన్: వైద్యసేవల్లో నర్సుల పాత్ర కీలకమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా రిమ్స్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉత్తమ సేవలు అందించిన పలువురు స్టాఫ్ నర్సులు, అధికారులను సన్మానించారు. రోగుల విషయంలో నర్సుల చూపే కరుణ, సేవాభావం అమూల్యమైందని అన్నారు. అందుకే వారిని గౌరవప్రదంగా సిస్టర్స్ అని పిలుస్తారని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇందులో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డిప్యూటీ సూపరింటెండెంట్ నరేందర్, నర్సింగ్ సూపరింటెండెంట్లు కల్పన, రమాదేవి, ఉమ పాల్గొన్నారు. ఓటమి విజయానికి తొలిమెట్టుఓటమి అనేది విజయానికి తొలి మెట్టులా మారుతుందని కలెక్టర్ రాజర్షిషా అన్నా రు. జిల్లా కేంద్రంలోని గెజిటెడ్ నం.1 పాఠశాలలో పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల సందర్భంగా పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం జిల్లాలో మూడు కేంద్రాలను ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి వంద శాతం ఉత్తీర్ణులు కావాలని సూచించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ అర్బన్ ఎంఈవో సోమయ్య, డీసీఈబీ సెక్రెటరి గజేందర్, ప్రధానోపాధ్యాయురాలు నీలా దేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణకు చర్యలు
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా నా కాబందీ నిర్వహించారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, ప్రధాన రహదారులు, పట్టణాల్లో 25 ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ, నంబర్ ప్లేట్, సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపే వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ స్వయంగా చెక్పోస్టులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఇందులో ఆది లాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి తలమడుగు: విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నా రు. స్థానిక పోలీస్ స్టేషన్ను ఎస్పీ మంగళవారం త నిఖీ చేశారు. రికార్డులు పరిశీలించిన అనంతరం మాట్లాడారు.నకిలీ విత్తనాలు, గంజాయి అక్రమ ర వాణాను అరికట్టాలన్నారు. ఆయన వెంట రూరల్ సీఐ ఫణిదర్, ఎస్సై రాధిక, సిబ్బంది పాల్గొన్నారు. రెండో విడత డ్రైవింగ్ లైసెన్స్ మేళా ఆదిలాబాద్టౌన్: రెండో విడత మెగా డ్రైవింగ్ లైసె న్స్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మాట్లాడారు. ఈ నెల 16వరకు సంబంధిత పోలీసు స్టేషన్లలో ఉట్నూ ర్, ఇంద్రవెల్లి, బజార్హత్నూర్ మండలాల యువకులు టూవీలర్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆధార్, పదో తరగతి మెమో, అడ్రస్ప్రూఫ్ జిరాక్స్లను పోలీసు స్టేషన్లో అందజేయాలని సూచించారు. మొదటి విడతలో 205 మంది ఆదివాసీలకు డీజీపీ చేతుల మీదుగా లైసెన్సులు అందించినట్లు చెప్పారు. లర్నింగ్ లైసెన్స్ కోసం మీసేవలో నమోదు చేసుకోవాలని, ఇందుకోసం రూ.600 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలి
ఆదిలాబాద్టౌన్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ను తక్షణమే అరెస్ట్ చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి మంజూల డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కుమురంభీం చౌక్లో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీ నామా చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలిపైనే కేసు పెట్టడం దారుణమని అన్నారు. ఇందులో విజయ, మీన, నర్మద, రాధ, ఆరీఫా బేగం, గంగాసాగర్ తదితరులు పాల్గొన్నారు. బండి సంజయ్ రాజీనామా చేయాలి కై లాస్నగర్: తన తనయుడు భగీరథ్ కేసు నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే కేంద్ర మంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్ర తినిధి బాలురి గోవర్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తీవ్రమైన ఆరోపణలపై విచారణ జరుగుతున్నప్పుడు కేంద్ర మంత్రి హోదాలో కొనసాగడం విచారణ ప్రక్రియను ప్రభావితం చేస్తుందన్నారు. ఇందులో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు సంజయ్కుమార్, దేవిదాస్చారి తదితరులు పాల్గొన్నారు. -
‘నీట్’ లీకేజీపై విచారణ జరిపించాలి
ఆదిలాబాద్టౌన్: దేశ వ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ పేపర్ లీకేజీ ఘటన దారుణమని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మెస్రం భాస్కర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కా ర్యాలయంలో మంగళవారం ముఖ్య నాయకుల స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడంలో విఫలమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. లీకేజీపై సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందులో జిల్లా నాయకులు సచిన్, వెంకటేశ్, ఇర్ఫాన్, వేణు, రవి, దిగంబార్ తదితరులు పాల్గొన్నారు.


