Adilabad
-
ఎక్స్లెన్స్ అవార్డు గ్రహీతలకు కలెక్టర్ అభినందన
కై లాస్నగర్: రోడ్డు భద్రతపై జిల్లా యంత్రాంగం, రవాణాశాఖ చేపట్టిన వినూత్న ప్రచారానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రవాణా రంగంలో చేసిన కృషికి గాను జిల్లాకు 2వ జాతీయ రోడ్డు భద్రతా ఎక్స్లెన్స్ అవార్డు–2026 దక్కింది. ఇటీవల బెంగళూరులో జరిగిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో జిల్లా రవాణ శాఖ అధికారులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వారు కలెక్టర్ రాజర్షిషా ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం అరైవ్ అలైవ్ పేరిట ఏప్రిల్ 13 నుండి 18 వరకు నిర్వహించే వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలు, స్టిక్కర్లు, బ్యానర్లను ఆవిష్కరించారు. ఇందులో రవాణా శాఖ అధికారి రవీందర్ కుమార్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీనివాస్, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కె. హరీంద్ర కుమార్, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు, ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం,డీఎం తదితరులున్నారు. -
సమస్యలు పరిష్కరించాలని సీపీఐ ఆందోళన
కై లాస్నగర్: పట్టణంలోని నిషాన్ఘాట్, 170 సర్వేనంబర్లలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు ఇంటిపట్టాల జారీతో పాటు విద్యుత్, రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ రాజేశ్వర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు మేస్రం భాస్కర్, పట్టణ కార్యదర్శి చంద్రమౌళి, కృష్ణస్వామి, కేశవ్, సంగీత, భాను, నిస్సర్, భూ మన్న, షబానాఖాన్, సుజాత, సునీత, అమీర్ తదితరులు పాల్గొన్నారు. -
జెడ్పీ సీఈవోగా రవి బాధ్యతలు
కైలాస్నగర్: జెడ్పీ సీఈవోగా బి.రవి సో మవారం జిల్లా పరి షత్ కార్యాలయ చాంబర్లో బాధ్యతలు స్వీకరించా రు. హన్మకొండ జెడ్పీ డిప్యూటీ సీఈవోగా పనిచేస్తున్న ఈయనకు పదోన్నతి కల్పించిన ప్రభుత్వం జిల్లాకు బదిలీ చేసింది. ఈ మేరకు బాధ్యతలు చేపట్టిన ఈయనకు కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. రెగ్యులర్ అధికారి రాకతో ఏడు నెలలుగా కొనసాగిన ఇన్చార్జి పాలనకు తెరపడింది. అనంతరం కలెక్టర్ రాజర్షి షాను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
లక్ష్యంగా జిల్లాలో డీజీపీ సుడిగాలి పర్యటన
ఆదిలాబాద్టౌన్/ఆదిలాబాద్/ఉట్నూర్రూరల్: రహదారి భద్రతకు ప్రాధాన్యం కల్పించడం..యువ త భవితకు చేయూత అందించడం.. ఆదివాసీలు, మాజీ మావోలకు భరోసా కల్పించడం లక్ష్యంగా డీజీపీ శివధర్రెడ్డి పర్యటన సోమవారం ఆదిలాబా ద్ జిల్లాలో సాగింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. పోలీసుల గౌర వ వందనం స్వీకరించారు. ముందుగా జిల్లా కేంద్రంలోని డీపీవో కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పార్క్ను ప్రారంభించారు. పోలీసు హెడ్క్వార్టర్స్లో మైనర్ డ్రైవింగ్చేస్తూ పట్టుబడ్డ పిల్లల తల్లిదండ్రుల కు కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రయాణికుల భద్ర త దృష్ట్యా ఆర్టీసీబస్సుల్లో, పోలీసు కంట్రోల్ రూమ్లో సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఆదిలాబాద్రూరల్ మండలంలోని చించుఘాట్లో లైబ్రరీని ప్రారంభించి ఆదివాసీలతో సమావేశం నిర్వహించారు. వారితో కలిసి సామూహిక భోజనం చేశారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు.. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని డీజీ పీ సూచించారు. పోలీసు హెడ్క్వార్టర్స్లో తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్లో పలు విషయాలను వివరించారు. జిల్లాలో డ్రైవింగ్ చేస్తూ ప ట్టుబడ్డ 400 మంది మైనర్ పిల్లల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. మైనర్లు డ్రైవింగ్ చే యడం ద్వారా ప్రమాదాలు చోటుచేసుకుంటాయని తెలిపారు. ట్రాఫిక్ పార్క్ ప్రారంభం.. విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నియమాలు అలవర్చుకునే విధంగా జిల్లా కేంద్రంలోని డీపీవో కార్యాల యం ఎదుట ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పార్క్ను డీజీ పీ ప్రారంభించారు. పాఠ్య పుస్తకాల్లో ఉన్న పాఠ్యాంశాలను నేరుగా అర్థమయ్యే విధంగా దీన్ని రూపొందించారు. రోడ్డుపై ప్రయాణించే సమయంలో పాటించాల్సిన నిబంధనలు, సూచిక బోర్డులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించేలా పార్క్ను ఏర్పాటు చేశారు. ‘అభయ మై టాక్సీ ఈజ్ సేఫ్ 2.0’.. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వేదికగా, ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా రూపొందించిన ‘అభయ మై టాక్సీ ఈజ్ సేఫ్ 2.0‘ కార్యక్రమాన్ని డీజీపీ ప్రారంభించారు. జిల్లాలో ఇప్పటికే 5వేలకు పైగా ఆటోలు నమోదు చేసుకోగా 500 మందికి గుర్తింపు పత్రాలను అందజేశారు. ఆదివాసీలతో సామూహిక భోజనం.. చించుఘాట్లో నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఏర్పాటు చేసిన అధునాతన లైబ్ర రీని ప్రారంభించారు. గుస్సాడీ వేషధారణలో డీజీపీ ఆదివాసీ ల కులదైవానికి ప్రత్యేక పూజలు చేశారు. మావలలో ఇంటెలిజెన్స్కు సంబంధించి నిర్మించిన క్వార్టర్లను ప్రారంభించారు. సర్పంచులతో తీర్మానాలు.. గుడిహత్నూర్లోని ఎస్కన్వెన్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 500 మంది రోడ్ సేఫ్టీక్లబ్ సభ్యులు పాల్గొన్నారు. రహదారి భద్రత ని యమాలు పాటిస్తూ సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని డీజీపీ సూచించారు. ఇందులో భాగంగా 36 గ్రామాల సర్పంచులు హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు తీర్మానాలు చేశారు. నర్సాపూర్లో ఆర్వో ప్లాంట్ ప్రారంభం ఆదివాసీల కోసం ఉట్నూర్ మండలం నర్సాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ను డీజీపీ ప్రారంభించారు. మారుమూల ఆదివాసీ గ్రామాల అభివృద్ధి, ప్రజల ఆరోగ్య పరిరక్షణపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. శుద్ధమైన తాగునీరు అందుబాటులోకి రావడంతో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వెయ్యి మంది ఆదివాసీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉట్నూర్ పోలీసు స్టేషన్లో 205 మంది యువతకు డ్రైవింగ్ మేళా ద్వారా లైసెన్సులను అందజేశారు. కార్యక్రమంలో ఐజీ గజరావ్ భూపాల్, కలెక్టర్ రాజర్షిషా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు ఎస్పీలు బి.సురేందర్ రావు, పి.మౌనిక, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన బస్సును ప్రారంభిస్తున్న డీజీపీ శివధర్రెడ్డి ఇంటి స్థలం పట్టాలను అందజేస్తూ..గతంలో పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ మావోయిస్టు సభ్యులకు డీజీపీ ఇంటి స్థలం పట్టాలను పంపిణీ చేశారు. పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బోథ్ దళానికి చెందిన కుమురం సుశీల, కొమురం సక్కుబాయిలకు పిట్టలవాడలో ఇంటి స్థలాలు, అలాగే అల్లంపల్లి ఫైరింగ్ ఘటనలో అమరుడైన పోలీసు కానిస్టేబుల్ జె.ముకుంద్రావు కుటుంబానికి ఇంటి స్థలం పట్టా అందజేశారు. -
అర్జీలు పెండింగ్లో ఉంచొద్దు
కై లాస్నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలు పెండింగ్లో ఉంచకుండా సత్వరం పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేస్తూ పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు. ఇందులో ఆర్డీవో స్రవంతి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, మెప్మా పీడీ రాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 85 అర్జీలు అందాయి. అందులో కొందరి నివేదన..అయ్యా నా భర్త పేరి ట గ్రామ శివారులో 2.30 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఎనిమిది నెలల క్రి తం ఆయన చనిపోయాడు. కొడుకు ఉన్నా తిండి పెట్టడం లేదు. భూమిని నా పేరిట పట్టా చేసి ఇవ్వాలని తహసీల్దార్కు దరఖాస్తు చేసిన. డిపెండెంట్ సర్టిఫికెట్తో పాటు మీసేవలో స్లాట్ బుక్ చేసిన. అ యినా తహసీల్దార్ పట్టా చేయడం లేదు. నాకు పట్టా చేసి న్యాయం చేయాలని కోరుతున్నా. – జక్కుల గంగమ్మ, సుంకిడి, తలమడుగు మా గ్రామంలో సామాజికపరమైన కార్యక్రమాలు, సమావేశాల నిర్వహణకు అనువైన భవనం లేక ఇబ్బందులు పడుతున్నాం.కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవసరమైన స్థలం అందుబాటులో ఉంది. స్పందించి మంజూరు చేయాలని కోరుతున్నాం. – దాబా–బి గ్రామస్తులు, గాదిగూడ పదేళ్లుగా మా గ్రామంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి విధులకు సక్రమంగా హాజరుకావడం లేదు. సమస్యలు పరిష్కరించమని కోరితే పట్టించుకోవడం లేదు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కార్యదర్శిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి. – కంఠ గ్రామస్తులు, జైనథ్ మండలం మా గ్రామ పంచాయతీ పరిధిలో మూడు ఆవాస ప్రాంతాలున్నాయి. సుమారు 5వేల జనాభా ఉంది. మిషన్ భగీరథ నీరు సరఫరా కాక ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే స్పందించి ప్రత్యేక పైపులైన్ల తో పాటు వాటర్ట్యాంక్ నిర్మించి సమస్యను పరిష్కరించాలని విన్నవించాం. – టేకం కవిత, సర్పంచ్, ఉమ్రి, ఉట్నూర్మేమంతా ఇందిరమ్మ లబ్ధిదారులం. ఇళ్లు మంజూరుతోఉన్న గుడిసెలు తొలగించి నిర్మాణ పనులు ప్రారంభించాం. ప్రస్తుతం రూఫ్ లెవల్ వరకు పూర్తయ్యాయి. అయినా ఇప్పటివరకు పైసా బిల్లు రాలేదు. మూడు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. స్పందించి మాకు న్యాయం చేయాలి. – ధనోరా –బి గ్రామస్తులు, ఇంద్రవెల్లి -
నాణ్యమైన బోధన అందించాలి
ఆదిలాబాద్టౌన్: ఉపాధ్యాయులు నాణ్యమైన బోధనతో విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో రాజేశ్వర్ అన్నారు. జిల్లాస్థాయి టీఎల్ఎం మేళాలో ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకు సోమవారం సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. కృత్యాధార బోధనతో విద్యార్థులు పూర్తి స్థాయిలో పాఠ్యాంశాలను అర్థం చేసుకుంటారని తెలిపారు, సర్టిఫికెట్లు పొందిన వారిలో సిరికొండ మండలం రాంపూర్గూడ చెందిన ఉపాధ్యాయుడు చౌహన్ నరేష్, రాంపూర్–బి కి చెందిన పైడి సునీత, కప్పర్లకు చెందిన సామన్పెల్లి గంభీర్, తేజాపూర్కు చెందిన కోడూర్ సంతోష్కుమార్, మావల–2కు చెందిన కవిత, గోండ్గూడకు చెందిన శ్రీనివాస్, మాంగూర్లకు చెందిన కె. రాజన్న, యాపల్గూడకు చెందిన అకాష్, ఆదిలాబాద్ పట్టణంలోని ఖిల్లా పాఠశాలలకు చెందిన ఇర్ఫాన్బేగం ఉ న్నారు. ఇందులో ఏఎంవో లక్ష్మణ్, అసిస్టెంట్ ఏఎంవో అజయ్కుమార్, తదితరులున్నారు. -
‘మన ఇసుక–వాహనం’పై అవగాహన కల్పించాలి
కై లాస్నగర్: మన ఇసుక వాహనం పోర్టల్లో లబ్ధి దారులు ఆన్లైన్లో బుకింగ్ చేసుకునేలా అవగా హన కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఇసుక బుకింగ్, రవాణా ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలన్నారు. బుకింగ్ సమయంలో అవసరమైన పత్రాలు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో వార్డు ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదించాలని ఆదేశించారు. ఇందిరమ్మ లబ్ధిదా రులకు ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇంటికి 8 ట్రిప్పుల వరకు ఇసుక పొందే అవకాశం ఉందని, అవసరమైతే దీనిని 10 నుంచి 12 ట్రిప్పులకు పెంచే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. పోర్టల్లో వచ్చే దరఖాస్తులను తహసీల్దార్లు, వార్డు ఆఫీసర్ల స్థాయిలో ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, జా ప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లను 7569538588, 9491053611 అందుబాటులోకి తెచ్చామని, ఇబ్బందులుంటే సంప్రదించాలని సూచించారు. అంతకు ముందు రిజిస్ట్రేషన్, బుకింగ్ విధానంపై హైదరాబాద్ నుంచి సీజీజీ కోఆర్డినేటర్ నరేష్ వర్చువల్ విధానం ద్వారా అవగాహన కల్పించి, సందేహాలను నివృత్తి చేశారు. సమావేశంలో ఆర్డీవో స్రవంతి, డీపీవో రమేశ్, మున్సిపల్ కమిషనర్ రాజు, జిల్లా మైనింగ్ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ రమేశ్, సతీష్, తహసీల్దార్ రాజేశ్వరి, పంచాయితీ కార్యదర్శులు, వార్డు అధికారులు, ట్రాక్టర్ వాహన యజమానులు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీలోనూ ‘ఎఫ్ఆర్ఎస్’
ఆదిలాబాద్టౌన్: పాఠశాల, ఇంటర్ విద్యలో ఇప్పటికే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) అటెండెన్స్ను ప్రభుత్వం అమలు చేస్తోంది. రానున్న విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలోనూ అమలుకు యోచిస్తోంది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే ప్రవేశాల సంఖ్య పెంచేందుకు చర్యలు చేపట్టగా తాజాగా విద్యార్థులు, లెక్చరర్లకు హాజరుపై దృష్టి సారించింది. ప్రభుత్వ కళాశాలలతో పాటు ప్రైవేట్లోనూ ఈ విధానం అమలు చేయనున్నారు. దీంతో సక్రమంగా విధులకు హాజరుకాని లెక్చరర్లు, డుమ్మా విద్యార్థులకు చెక్ పడనుంది. 75ఽశాతం అటెండెన్స్ ఉంటేనే పరీక్షలకు అనుమతించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ విధానంతో డిగ్రీ విద్య మరింత బలోపేతమై మెరుగైన ఫలితాలు సాధించేందుకు అస్కారం ఏర్పడనుంది. ఉత్తర్వులు విడుదల.. డిగ్రీ విద్యను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్ యోగితా రాణా ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా విద్యార్థులు, లెక్చరర్లకు ఎఫ్ఆర్ఎస్ హాజరు అమలు చేయాలని నిర్ణయించారు. శనివారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేశారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమలు కానుంది. జిల్లాలో.. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలల్లో తరగతులు సక్రమంగా నడుస్తుండగా మండల కేంద్రాల్లోని కాలేజీలు మాత్రం మొక్కుబడిగా సాగుతున్నాయి. ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థులు హాజరుకాకపోయినా అటెండెన్స్ వేస్తున్నారు. లెక్చరర్లు పూర్తిస్థాయిలో లేకున్నా.. ఉన్నట్లుగా రికార్డులు నిర్వహిస్తున్నారు. దీంతో పేద విద్యార్థులకు నష్టం వాటిల్లుతుంది. ప్రవేశాల సమయంలోనే తరగతులకు హాజరుకాకపోయినా పర్వాలేదంటూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ కోసమే కాలేజీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పరీక్షల సమయంలో ఫలితాల కోసం ఆయా ప్రైవేట్ కళాశాలలు పరస్పరం సహకరించుకుంటూ అడ్డదారులు తొక్కుతున్నాయనే విమర్శలున్నాయి. అయితే డిగ్రీ పాసైన వారిలో అత్యధికులు పోటీ పరీక్షల్లో వెనుకబడిపోతుండడం గమనార్హం. ఇలాంటి పరిస్థితులకు పూర్తిగా చెక్పెట్టాలనే ఉద్దేశంతో ఎఫ్ఆర్ఎస్ అమల్లోకి తెచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు 36 ఇందులో చదివే విద్యార్థులు 15వేల మంది75 శాతం హాజరు ఉండాల్సిందే.. విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫేషియల్ అటెండెన్స్ అమలులో ఉంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల లెక్చరర్లకు గతనెల 25 నుంచే ఎఫ్ఆర్ఎస్ అమలు చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ కళాశాలల లెక్చరర్లు, విద్యార్థులకు అమలు కానుంది. చాలా మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకొని తరగతులకు హాజరు కావడం లేదు. దీంతో స్కిల్స్ నేర్చుకోవడం లేదు. ప్రభుత్వం డిగ్రీ విద్యపై ఫోకస్ పెట్టింది. ఇంటెన్షిప్ ఇవ్వడానికి సిద్ధమైంది. – శ్రీనివాస్, ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ -
‘గులాబీ’ జోష్
మంచిర్యాలలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నస్పూర్/రామకృష్ణాపూర్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారాకరామారావు జిల్లా పర్యటన ఆ పార్టీ క్యాడర్లో జోష్ నింపింది. నస్పూర్లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జిల్లా కార్యకర్తల సమావేశానికి హాజరై కాంగ్రెస్ పాలనపై ఘాటైన విమర్శలు చేశారు. పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతి, మారుపేర్ల సమస్య, మెడికల్ బోర్డు నిర్వహణ కోసం తాము ఆందోళనలు నిర్వహిస్తామని, సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కేటీఆర్ ప్రసంగిస్తుండగా పలువురు నిరుద్యోగులు సేవ్ సింగరేణి.. మెడికల్ బోర్డు నిర్వహించాలి.. మారు పేర్ల సమస్య పరిష్కరించాలి.. అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. కత్తి మరొకరికిచ్చి యుద్ధం తమను చేయమనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మీరు గెలిపించిన ఎమ్మెల్యేలను ప్రశ్నించాలని సూచించారు. సింగరేణిలో సమస్యల పరిష్కారానికి టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి.. నస్పూర్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డికి మూసిపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన క్యాతన్పల్లి కౌన్సిలర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా చివరివరకు పోరాడి చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులు దక్కించుకోవడం అభినందనీయమని కొనియాడారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు మాట్లాడుతూ.. గోదావరినదిపై నిర్మించ తలపెట్టిన మంచిర్యాల–అంతర్గాం బ్రిడ్జి నిర్మాణాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే తన స్వార్థంతో రద్దు చేయించారని ఆరోపించారు. క్యాతనపల్లిలో పర్యటన.. సమావేశం తర్వాత.. క్యాతనపల్లిలోనూ కేటీఆర్ పర్యటించారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కేటీఆర్ పర్యటన రద్దయిన నేపథ్యంలో ఆయన రాకతో శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. మున్సిపల్ ఎన్నికల్లో క్యాతనపల్లి పీఠాన్ని దక్కించుకున్న నేపథ్యంలో మిత్రపక్షమైన సీపీఐ, బీఆర్ఎస్ నాయకులను వెన్నుతట్టాలని ఆయన రావటంపై కార్యకర్తల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ నివాసానికి వచ్చిన కేటీఆర్ సీపీఐ ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ధైర్యంగా నిలబడి మున్సిపాలిటీని దక్కించుకోవటం అభినందనీయమని పేర్కొన్నారు. సింగరేణిలో కార్మికుల హక్కులు, వారసత్వ ఉద్యోగాల కోసం సంయుక్తంగా పోరాటం చేస్తే బాగుంటుందని సీపీఐ నేతలకు సూచించినట్లు సమాచారం. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లకు సన్మానం ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలు పొందిన క్యాతనపల్లి, ఆసిఫాబాద్ మున్సిప ల్ చైర్పర్సన్, వైస్ చైర్ పర్సన్లను కేటీఆర్ శాలువాలతో సన్మానించి అభినందించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్జాదవ్, మంచిర్యాల, సిర్పూర్, రామగుండం మాజీ ఎ మ్మెల్యేలు దివాకర్రావు, కోనేరు కోనప్ప, కో రుకంటి చందర్, రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్ర ధాన కార్యదర్శులు మిర్యాల రాజిరెడ్డి, కేతిరె డ్డి సురేందర్రెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, నాయకులు అక్కూరి సుబ్బ య్య, వంగ తిరుపతి తదితరులున్నారు. -
‘స్పోర్ట్స్’.. అప్గ్రేడ్ కావాలె!
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 2016 సంవత్సరంలో క్రీడా పాఠశాలను ప్రారంభించారు. ఇందులో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు ఆసక్తి ఉన్న క్రీడాంశాల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. అయితే ఇంటర్ అందుబాటులో లేకపోవడంతో ప్రతిభావంతులైన క్రీడాకారుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పది పూర్తికాగానే విద్యార్థులు పాఠశాలను వదిలి వెళ్లాల్సి వస్తోంది. ఆటపై పట్టు సాధించే క్రమంలో శిక్షణ నిలిచిపోవడంతో వారి క్రీడా భవిష్యత్తు సందిగ్ధంలో పడుతోంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని క్రీడా పాఠశాలను ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేయాలని క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. పతకాల పంట.. ఇందులో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఆయా క్రీడాంశాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నా రు. జిల్లా, రాష్ట్ర స్థాయికే పరిమితం కాకుండా, జా తీయ స్థాయిలోనూ ప్రాతినిధ్యం వహిస్తూ గుర్తింపు పొందుతున్నారు. ఇటీవల నిర్వహించిన ‘సీఎం కప్ రెండో ఎడిషన్’ పోటీల్లో విద్యార్థులు అత్యధిక పతకాలు సాధించడం వారి ప్రతిభకు నిదర్శనం. ‘ఓవరాల్ చాంపియన్’ సైతం కై వసం చేసుకున్నారు. కీలక సమయంలో బయటికి.. ఇక్కడ పాఠశాల స్థాయిలో రాణిస్తున్న విద్యార్థులు ఇంటర్మీడియెట్ అందుబాటలో లేకపోవడంతో వేరే చోట చదవాల్సి వస్తోంది. ఈ క్ర మంలో చదువుపై ఒత్తిడి పెరిగి విద్యార్థులు క్రీడల కు దూరమవుతున్నారు. ఆడాలనే ఆసక్తి ఉన్నప్పటి కీ, సమయం, సదుపాయాలు, శిక్షకులు లేక వారి ప్రతిభ మరుగున పడిపోతోంది. కొంతమంది స్థానికంగా ఉంటూ ఇంటర్ కళాశాలల్లో చేరి, ప్రతిరోజూ తమ పాత శిక్షకుల వద్ద శిక్షణ తీసుకుంటున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు వారిని వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ఆటకు శాశ్వతంగా దూరమవుతున్నారు. అప్గ్రేడ్ చేస్తే.. ప్రస్తుతం ఉన్న క్రీడా పాఠశాలను ఇంటర్మీడియెట్ లేదా డిగ్రీ వరకు అప్గ్రేడ్ చేస్తే విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు పడతాయి. దీనివల్ల వారి క్రీడా శిక్షణ నిరంతరాయంగా కొనసాగుతుంది. ఫలితంగా జిల్లా, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయి వేదికలపై కూడా సత్తా చాటే అవకాశం ఉంటుంది. ఈ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని క్రీడాకారులు కోరుతున్నారు. పదో తరగతి వరకూ... ఈ క్రీడా పాఠశాలలో నాలుగో తరగతిలో ప్రవేశాలు ప్రారంభమై పదో తరగతి వరకు బోధన కొనసాగుతోంది. విద్యార్థులకు జూడో, అథ్లెటిక్స్, బాక్సింగ్, రెజ్లింగ్, స్విమ్మింగ్ వంటి క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. అలాగే నాణ్యమైన విద్యాబోధనతో పాటు ఉచితవసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 195 మంది విద్యాభ్యాసంతో పాటు క్రీడల్లో మెలకువలు నేర్చుకుంటున్నారు. -
బాబ్బాబు.. మా కాలేజీలో చేరండి
ఆదిలాబాద్టౌన్: కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలు ప్రవేశాల కోసం ప్రచారం నిర్వహించడం పరిపాటి. కానీ ఇందుకు భిన్నంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ప్రవేశాల కోసం విస్తృతంగా ప్రచారం చేస్తుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల ఇంటర్మీడియెట్ పరీక్షలు జరిగిన సమయంలో ఆయా కేంద్రాల వద్దకు వెళ్లి తమ కళాశాలల్లో చేరాలంటూ విద్యార్థులకు బ్రోచర్లు అందజేస్తూ కళాఽశాల ప్రత్యేకతను వివరించారు. ప్రభుత్వ కళాఽశాలకు కేటాయించిన సీట్లను పూర్తిస్థాయిలో భర్తీ చేయాలని కళాశాల విద్యాశాఖ కమిషనర్ యోగితా రాణా ఆదేశాలు జారీ చేశారు. నెల రోజులుగా ఈ ప్రక్రియ జరుగుతుండగా ప్రస్తుతం ప్రచారం ముమ్మరం చేశారు. అధ్యాపకులు విద్యార్థుల ఇళ్ల బాట పడుతున్నారు. తల్లిదండ్రులకు సర్కారు కళాశాలల ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ తమ పిల్లలను చేర్పించాలని కోరుతున్నారు. వీరితో పాటు గ్రామాల్లోని సర్పంచ్లు, పట్టణాల్లోని కౌన్సిలర్లను కలుస్తూ సహకరించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. వందశాతం సీట్ల భర్తీయే లక్ష్యం.. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు 36 ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ డిగ్రీ కళాఽశాలలు ఆదిలాబాద్లో రెండు, ఉట్నూర్లో ఒకటి, ఇచ్చోడలో ఒకటి ఉండగా గిరిజన, సోషల్ వెల్ఫేర్ సంక్షేమ డిగ్రీ కళాశాలలు రెండు ఉన్నాయి. గతంలో కేవలం ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఐదారు మాత్రమే ఉండగా, ప్రస్తుతం మండలానికి ఒకటి అన్నట్లుగా 28 వరకు చేరాయి. గతేడాది ప్రైవేట్ కళాశాలల్లో సీట్లు నిండక అధ్యాపకులు ఆందోళన చెందారు. ఆదిలాబాద్ పట్టణంలోని కళాశాలల పరిస్థితి అలాగే ఉండింది. దోస్త్ ద్వారా మూడు విడతల్లో సీట్ల భర్తీ చేయగా వందలోపే ప్రవేశాలు పొందారు. విద్యార్థులంతా తమ మండలాల్లోని ప్రైవేట్ కళాశాలల్లో చేరడంతో ప్రభుత్వ కళాశాలలు సైతం వెలవెలబోయాయి. చివరి విడతలో ప్రవేశాల సంఖ్య పెరిగింది. ఆదిలాబాద్ పట్టణంలోని సైన్స్ డిగ్రీ కళాశాలలో 660 సీట్లకు గాను 491 మంది చేరారు. ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో, ఇచ్చోడ డిగ్రీ కళాశాలలో 241 సీట్లకు గాను 163 మంది చేరారు. ఉట్నూర్ డిగ్రీ కళాశాలలో మాత్రం సీట్లు పూర్తి స్థాయిలో భర్తీ అయ్యాయి. ఇలా మొత్తం ఆయా కళాశాలల్లో 840 మంది చేరారు. ఈ ఏడాది కొత్తగా రెండు కోర్సులను అందుబాటులోకి తీసుకురాగా 120 సీట్లు అదనంగా పెంచారు. వీటి భర్తీ కోసం ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు పూర్తిస్థాయిలో శ్రమిస్తున్నారు. విద్యార్థుల ఇళ్లకు లెక్చరర్లు.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు ప్రవేశాల కోసం విస్తృతంగా శ్రమిస్తున్నారు. ప్రతిరోజు ఒకటి, రెండు గ్రామాలకు వెళ్తూ ప్రచా రం నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులను కలుస్తూ అడ్మిషన్లు పెంచేలా చూడాలని కోరుతున్నారు. అలాగే ప్రభుత్వ కళాశాలల్లో ప్ర స్తుతం ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులను అంబాసిడర్లుగా నియమించా రు. ఆ గ్రామంలో ఇంటర్ చదివిన విద్యార్థుల వివరాలను సేకరించారు. ఇది వరకే ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సెల్నంబర్లు, చిరునామాలు సేకరించి వాటి ఆధారంగా ఇళ్ల వద్దకు వెళుతూ వారిని కలుస్తున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల ప్రచారానికి మోసపోవద్దని, అర్హత కలిగిన లెక్చరర్లు తమ కళాశాలల్లో ఉన్నారని, అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెబుతూ అడ్మిషన్ తీసుకోవాలని కోరుతున్నారు.పూర్తిస్థాయిలో సీట్లను భర్తీ చేయడమే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. సర్కారు కళాశాలల్లోనే నాణ్యమైన విద్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుంది. ఉన్నత విద్యతో పాటు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో బోధన జరుగుతుంది. ప్రైవేట్ కళాశాలల ఆర్బాట ప్రచారం చూసి మోసపోవద్దు. ప్రభుత్వ కళాశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఈ ప్రవేశాల కోసం విద్యార్థులను అంబాసిడర్లుగా నియమించాం. – జే. సంగీత, ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, ఆదిలాబాద్ -
పడిపోయిన ఇంటర్ ఫలితాలు
ఆదిలాబాద్టౌన్: అక్షర క్రమంలో ముందున్న ఆ దిలాబాద్ జిల్లా ఇంటర్మీడియెట్ ఫలితాల్లో వెనుకబడిపోయింది. రాష్ట్రస్థాయిలో అట్టడుగున నిలిచింది. ఈ ఏడాది పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏ ర్పాటుతో మాస్ కాపీయింగ్కు అవకాశం లే కుండా పోయింది. ఈ ప్రభావం ఫలితాలపై పడినట్లుగా తెలుస్తోంది. పదో తరగతిలో 95 శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించిన ఈ విద్యార్థులే ఇంటర్లో వెనుకబడడం గమనార్హం. ఆదివారం వెల్లడైన ఫ లితాల్లో జిల్లా ప్రథమ సంవత్సరం ఏకంగా 32వ స్థానంలో నిలువగా, ద్వితీయ సంవత్సరం 33వ స్థానానికి పడిపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. సెకండియర్లో మరింత దారుణం.. గతేడాదితో పోల్చితే సెకండియర్ ఫలి తాలు తీవ్ర నిరాశ కలిగించాయి. ఏకంగా 21 స్థానాలకు పడిపోవడం విద్యార్థుల సామర్థ్యాలను ప్రశ్నిస్తోంది. రాష్ట్ర స్థాయిలో జిల్లా 33వ స్థా నంలో నిలిచింది. జనరల్ కోర్సులో 7518 మంది హాజరు కాగా, 4,699 మంది ఉత్తీర్ణులయ్యారు. 62. 50 శాతం నమోదైంది. ఇందులో బాలురు 3,647 మందికి గాను 1847 మంది (50.64 శాతం)పాసయ్యారు. బాలికలు 3,871 మందికి గాను 2852 మంది పాస్ అయ్యారు. 73.68 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది 69.57 శాతం నమోదు కాగా ఈ సారి 7.07 శాతం తగ్గింది. ఒకేషనల్లో 905 మంది పరీక్షలు రాయగా 669 మంది పాసయ్యా రు. ఉత్తీర్ణత శాతం 73.92గా నమోదైంది. ఇందులో బాలురు 63.03 శాతం, బాలికలు 81.02 శాతంగా ఉంది. గతేడాది రాష్ట్ర స్థాయిలో ఐదో స్థానంలో నిల వగా, ఈసారి 18కి పడిపోయింది. ద్వితీయ సంవ త్సరంలో ప్రైవేటు విద్యార్థులు (గతంలో ఫెయిల్ అయిన వారు) జనరల్ కోర్సులో 452 మంది రాయగా, 162 మంది ఉత్తీర్ణులయ్యారు. 35.85 శాతం నమోదైంది. ఒకేషనల్ కోర్సులో ప్రైవేట్ విద్యార్థులు 53 మంది పరీక్షకు హాజరు కాగా 15 మంది పాస్ అయ్యారు. 28.30 శాతం నమోదైంది. మే 13 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు.. ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు డీఐ ఈవో జాదవ్ గణేశ్కుమార్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వి తీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు ఈనెల 13 నుంచి 20 వరకు చెల్లించేందుకు గడువు ఉందన్నారు. రీకౌంటింగ్ కోసం ప్రతీ పేపర్కు రూ.100, రీవెరిఫికేషన్, స్కానింగ్ కాపీ కోసం రూ.800 ఆన్లైన్లో చెల్లించాలని సూచించారు. అలాగే అడ్వాన్స్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు మే 22 నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫె యిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందవద్దని, అఘాయిత్యాలకు పాల్పడవద్దని సూచించారు. సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావచ్చని తెలిపారు. సర్కార్ కళాశాలల ఫలితాలు.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివిన విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. ద్వితీయ సంవత్సరంలో బజార్హత్నూర్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. 86 శాతం ఉత్తీర్ణతతో జిల్లాలో టాప్లో నిలిచారు. అలాగే బేలలో 85.51 శాతం, నేరడిగొండ 78.79 శాతం, తాంసిలో 77.6 శాతం ఉత్తీర్ణులయ్యారు. తక్కువ శాతం ఉత్తీర్ణత అయిన కళాశాలల్లో ఉట్నూర్ 26.25 శాతం, ఆదిలాబాద్ బాలుర కళాశాలలో 35.69 శాతం, నార్నూర్ 41 శాతం, గుడిహత్నూర్లో 44 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఫస్టియర్ ఐదు స్థానాలు డౌన్.. ప్రథమ సంవత్సరం ఫలితాలు గతేడాదితో పోల్చితే మరో ఐదు స్థానాలు దిగజారింది. జనరల్ కోర్సులో 7,701 మంది పరీక్షకు హాజరు కాగా, 3,910 మంది ఉత్తీర్ణులయ్యారు. 50.77 ఉత్తీర్ణత శాతం నమోదైంది. గతేడాదితో పోల్చితే ఈసారి 2.3 శాతం తగ్గింది. బాలుర ఉత్తీర్ణత 36.87 శాతం కాగా.. బాలికలది 64.13 శాతంగా నమోదైంది. ఒకేషనల్ కోర్సులో 935 మందికి గాను 620 మంది ఉత్తీర్ణత (66.31 శాతం)సాధించారు. ఇందులో బాలురది 53.37 శాతం ఉత్తీర్ణత కాగా.. బాలికలది 75.41 శాతంగా నమోదైంది. రాష్ట్ర స్థాయిలో ఒకేషనల్ కోర్సులో 9వ స్థానం నిలిచింది. గతంతో పోల్చితే ఆరు స్థానాలు పడిపోయాయి. -
ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేయాలి
ప్రస్తుతం క్రీడా పాఠశాలలో పదోతరగతి వరకు మాత్రమే చదివే అవకాశం ఉంది. తర్వాత వేరే కళాశాలలో చదవాల్సి ఉంటుంది. చదువు విషయంలో ఇబ్బంది లేకపోయినా క్రీడా శిక్షణ విషయంలో మాత్రం ఇబ్బందులు వస్తాయి. ఇక్కడే ఇంటర్ వరకు అప్ గ్రేడ్ చేస్తే బాగుంటుంది. – పి.కావ్య, పదోతరగతి, స్పోర్ట్స్ స్కూల్ సీఎం దృష్టికి తీసుకెళ్లాం.. క్రీడా పాఠశాలను ఇంటర్మీడియెట్ వరకు ఉన్నతీకరించేందుకు గత జూన్లోనే ప్రతిపాదనలు పంపించాం. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థకే కాకుండా, సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్లినం. ఈ విషయంలో కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. అప్గ్రేడ్ అ యితే విద్యార్థులకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. – జక్కుల శ్రీనివాస్, డీవైఎస్వో -
కీచక ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయుడు అశ్వాక్ అహ్మద్పై సస్పెన్షన్ వేటు వేస్తూ అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో రాజేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఓ విద్యార్థినికి వాట్సాప్ ద్వారా అసభ్యకర మెసేజ్లు పెడుతూ ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో ఆ విద్యార్థిని కు టుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై కేసు నమోదైంది. అలాగే ‘సాక్షి’లోనూ కీ(టీ)చకులు శీర్షకన ప్రత్యేక కథనం ప్ర చురితమైంది. ఈ క్రమంలో ఆ ఉపాధ్యాయుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. -
నేర నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర
● ఎస్పీ అఖిల్ మహాజన్ ఇచ్చోడ: నేరాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఇచ్చోడ హెడ్క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన 40 సీసీ కెమెరాలను ఆదివారం ప్రారంభించారు. ఆయా కాలనీలతో పాటు వ్యాపార సంస్థలు తమ పరిధిలో సీసీ కెమెరాలను స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి పాటించాలన్నారు. కార్యక్రమంలో ఇచ్చోడ సీఐ బండారి రాజు, సర్పంచ్లు కోడప జలైజాకు, ఆసిఫ్ ఖాన్, ఇచ్చోడ పంచాయతీ ఈవో సురేశ్, సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
13 ఏళ్ల భూ సమస్యకు పరిష్కారం
కై లాస్నగర్: జిల్లాలోని తలమడుగు మండలం పల్సి–బి తండాకు చెందిన గిరిజన రైతులకు సంబంధించి గత 13 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భూసమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం, సర్వే నంబర్లలోని సాంకేతిక సమస్యల కారణంగా తొమ్మిది మంది గిరిజన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భూములను సాగు చేస్తున్నప్పటికీ వాటిపై హక్కులేకపోవడంతో దశాబ్దకాలానికి పైగా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందలేకపోయారు. ఈమేరకు ప్రజావాణిలో వారి సమస్యలను ఆలకించిన కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపారు. సీసీఎల్ఏతో సమన్వయం చేసి పరిష్కరించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో కదిలిన రెవెన్యూ అధికారులు సమస్యను పరిష్కరించారు. మొత్తం 30 ఎకరాల భూమిని అర్హులైన రైతులకు కేటాయించారు. తొమ్మిది మందికి సాగు విస్తీర్ణం ఆధారంగా 2 నుంచి 3 ఎకరాల వరకు పట్టాలను సిద్ధం చేశారు. కలెక్టర్ శనివారం స్వయంగా లబ్ధిదారులకు వాటిని అందజేశారు. ఏళ్ల నాటి సమస్య పరిష్కారం కావడంతో హర్షం వ్యక్తం చేసిన ఆదివాసీ రైతులు కలెక్టర్ను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. ఇందులో ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులున్నారు. -
విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యత
కాసిపేట(బెల్లంపల్లి): రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. శనివారం బెల్లంపల్లి కేజీబీవీలో నిర్మించిన ఆధునిక సదుపాయాలతో కూడిన ల్యాబ్, తరగతి గదులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.2.30కోట్లతో ల్యాబ్, తరగతి గదుల్లో మెరుగైన విద్య వాతావరణాన్ని కల్పించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం పట్టణ స్థాయి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో యాదయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రాంచందర్, సర్పంచ్లు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
గుబ్బలో జింకల సంచారం
ఇచ్చోడ: మండలంలోని గుబ్బ అటవీప్రాంతంలో జింకలు సంచరిస్తుంది. మండల కేంద్రానికి అతి సమీపంలో ఉన్న టింబర్ డిపో ప్రహరీ వెనుకభాగం నుంచి శనివారం జింకల గుంపు కనిపించింది. వన్యప్రాణుల దాహార్తి తీర్చడానికి టింబర్ డిపో సమీప ప్రాంతంలో నీటి తొట్టిని ఏర్పాటు చేశారు. గుబ్బ, డిగ్నూర్, జున్ని అటవీ ప్రాంతాల్లో సంచరించే జింకలు నీరు తాగేందుకు నీటితొట్టి వద్దకు వస్తాయని ఇచ్చోడ ఎఫ్ఆర్వో పుండలిక్ తెలిపారు. వేసవిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చడానికి నీటి తొట్టీల్లో ప్రతీరోజు ట్యాంకర్ల ద్వారా నీటిని పోస్తూ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
విద్యుత్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలి
ఆదిలాబాద్టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి రాగానే ఆర్టిజన్లను క్రమబద్ధీకరిస్తామ ని ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలని వి ద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఉమ్మడి జిల్లా కన్వీనర్ మోహసిన్ఖాన్ డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని ఆర్టిజన్ ఎంప్లాయీస్ జా యింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరింది. శనివారం వి ద్యుత్ శాఖ కార్యాలయ ఆవరణలోని సమ్మె శిబిరం వద్ద వంటావార్పుతో నిరసన తెలిపా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆర్టిజన్, ఆన్మెన్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం, యజమాన్యం పట్టించుకోపోవడంతోనే సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నారు. సమస్య పరి ష్కరం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇందులో జేఏసీ జిల్లా చైర్మన్ సంజు నాయక్, కన్వీనర్ శ్రీను, దేవిదాస్, పాండు తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ బాస్ వస్తున్నారు
సాక్షి, ఆదిలాబాద్: మావోయిస్టు రహిత తెలంగాణ ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకప్పుడు నక్సల్బరికి అడ్డాగా ఉన్న ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ఆయన రానుండ డం ఆసక్తికరంగా మారింది. యువత చూపు తిరిగి అజ్ఞాతం వైపు మరలకుండా ఏజెన్సీ గ్రామాల్లో ప్ర త్యేక చర్యలు, అలాగే శాఖాపరంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న పథకాలను మరింత విస్తృతం చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఏర్పాట్లలో పోలీస్శాఖ నిమగ్నం.. డీజీపీ శివధర్రెడ్డి జిల్లా పర్యటనకు సంబంధించి శాఖాపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివా రం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనుండగా అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జోడేఘాట్లో కూడా పర్యటించనున్నారు. ఆ రాత్రి ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుని ఇక్కడే బస చేయనున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. చించుఘాట్లో లైబ్రరీ ప్రారంభం.. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఏజెన్సీ ప్రాంతమైన చించుఘాట్లో పోలీస్శాఖ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన లైబ్రరీని డీజీపీ ప్రారంభించనున్నా రు. ప్రధానంగా మావోరహిత తెలంగాణ సాధించామని రాష్ట్ర పోలీస్ బాస్ చెబుతుండగా, సమీప భవిష్యత్తులో మళ్లీ ఏజెన్సీ యువత చూపు అజ్ఞాతం వైపు వెళ్లకుండా శాఖాపరంగా వివిధ చర్యలు చేపడుతున్నారు. ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ఆలోచన మేరకు ఈ గ్రామంలో లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా యువత విద్యవైపు దృష్టి సారించేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. సార్మేడీలతో సమావేశం .. చించుఘాట్లోని ఆదివాసీ రాయి సెంటర్లకు చెందిన సార్మేడీలతో డీజీపీ సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఉట్నూర్ మండలం మారుమూల గ్రా మం నర్సాపూర్–జిలో శాఖాపరంగా ఏర్పాటు చేసి న వాటర్ ప్లాంట్ను ప్రారంభించనున్నారు. ఇక్కడే వైద్యశిబిరం ఏర్పాటు చేసి గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇలా డీజీపీ తన పర్యటనలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలను కలుస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. పథకాలు మరింత విస్తృతం..డీజీపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న ‘అరైవ్.. అలైవ్’ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసే దిశగా ఈ పర్యటనలో చర్యలు చేపడుతున్నారు. కుమురంభీం జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌక్లో భారీ హెల్మెట్ రూపొందించారు. దాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అలాగే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థి దశ నుంచే పిల్లలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేలా ఈ పార్కును తీర్చిదిద్దుతున్నారు. జిల్లాలో అభయ మై ట్యాక్సీ సేఫ్ కార్యక్రమంలో భాగంగా 5600 ఆటోలను రిజిస్టర్ చేయగా క్యూ ఆర్ కోడ్ గుర్తింపు ఆధారంగా నేరాల అదుపునకు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో మరో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా వాటిని ప్రారంభిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. దీన్ని కూడా డీజీపీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. -
జీవితమే శాశ్వతం
పరీక్ష తప్పితే జీవితం లేదనుకోవడం పొరపాటు. తమ పిల్లల పరీక్ష ఫలితాలు ఎలా ఉన్నా తల్లిదండ్రులు ఓపికగా ఉండాలి. మందలింపులు చేపడితే సున్నితమైన మనస్తత్వం ఉన్న వారు ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోలేదు. చాలామంది ప్రసిద్ధ వ్యక్తులు మొదట్లో చదువులు, పరీక్షల్లో విఫలమైనా జీవితంలో గొప్ప స్థాయికి చేరుకున్న వారి జీవిత గాథలను గుర్తు చేసేందుకు ప్రయత్నించాలి. ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైతే టెలి మానస్ 14416 నంబర్లో సంప్రదించాలి. –డాక్టర్ సునిల్, మానసిక వైద్యనిపుణులు (డీఎంహెచ్పీ) -
‘లవ్ జిహాద్ నిరోధించడంలో పోలీసులు విఫలం’
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో లవ్ జిహాద్ను నిరోధించడంలో పోలీస్ యంత్రాంగం పూ ర్తిగా విఫలమైందని వీహెచ్పి జాతీయ అధికా ర ప్రతినిధి రావినూతల శశిధర్ అన్నారు. పట్టణంలోని ప్రెస్క్లబ్లో శనివారం ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలో లవ్ జిహాద్ పెరిగిపోతోందని పేర్కొన్నారు. హిందూ అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ ధోరణిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కారకులపై చర్యలు తీసుకోకుండా, దానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వీహెచ్పి, బజరంగ్ దళ్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. రాష్ట్రంలోనే లవ్ జిహాద్ ఉదంతాల్లో జిల్లా అగ్రభాగాన ఉండటం ఆందోళనకరమన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం వైఫ ల్యాలను రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకెళ్తానని వివరించారు. ఇందులో పరిషత్ జిల్లా అధ్యక్షుడు రాజ్కుమార్, శ్రీరామ్ శర్మ, దర్మ ప్రసార ప్రముఖ్ రాజుల్వార్ దత్తు, సత్సంగ్ ప్రముఖ్ సంతోష్ తదితరులున్నారు. -
శభాష్ నరేశ్
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి దర్శనానికి వరంగల్ జిల్లా నుంచి శనివారం ఇద్దరు యు వకులు వచ్చారు. గోదావరిలో పుణ్యస్నానం చేసేందుకు వెళ్లారు. నదిలో దిగి స్నానం చేస్తుండగా, లో తు తెలియకుండా లోపలికి వెళ్లారు. దీంతో ఇద్దరు నీటమునుగుతూ కాపాడాలని కేకలు వేశారు. అ క్కడే ఉన్న జాలరి డప్పు నరేశ్ వెంటనే నదిలో దూ కాడు. ఈదుకుంటూ వెళ్లి వారిని ఒడ్డుకు తీసుకొ చ్చాడు. వరంగల్ జిల్లాకు చెందిన యశ్వంత్, సా త్విక్ స్నేహితులు. బాసరకు వచ్చిన వీరు గోదావరిలో స్నానం చేసేందుకు దిగారు. లోతు తెలియకపోవడంతో నది లోపలికి వెళ్లారు. ఈక్రమంలో మొ దట ఒకరు కొట్టుకుపోగా, అతడిని కాపాడేందుకు మరొకరు లోపలికి వెళ్లాడు. దీంతో ఇద్దరు కొట్టుకుపోతూ కేకలు వేశారు. జాలరి గమనించి వెంటనే నదిలో దూకి ఇద్దరిని ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఇద్దరికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయినట్లు భక్తులు తెలిపారు. నిండు ప్రాణాలు కాపాడినందుకు నరేశ్ను అభినందించారు. ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు..బాసర వద్ద గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరిని పోలీసులు కాపాడారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలానికి చెందిన వెంకటేశ్, మహారాష్ట్రలోని ధర్మబాద్కు చెందిన శివ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకునేందుకు శనివారం బాసర గోదావరి వద్దకు వచ్చారు. వారిని గమనించిన స్థానికులు వెంట నే డయల్ 100కు సమాచారం అందించారు. స్పందించిన పోలీస్ బృందం సంఘటన స్థ లానికి చేరుకుని, అప్రమత్తంగా వ్యవహరించి ఆ ఇద్దరిని కాపాడింది. స్టేషన్కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ చేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు అ ప్పగించారు. ఇద్దరిని కాపాడిన బాసర పోలీసులను ఎస్పీ జానకీషర్మిల అభినందించారు. -
పర్ధాన్ సమాజాభివృద్ధికి పాటుపడాలి
ఆదిలాబాద్రూరల్: ఆదివాసీ పర్ధాన్ సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని పర్ధాన్ పురోహిత్ సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు మెస్రం మనోహర్, పర్ధాన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గేడం తులసీరాం అన్నారు. జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల తులసీరాం నివాసంలో శనివారం అత్యవసర సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పర్ధాన్ కులస్తుల అభివృద్ధి, సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై త్వరలో సమావేశం నిర్వహించాలన్నారు. ఆ దిశగా ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో ఉమ్మడి జిల్లా పర్ధాన్ సమాజ్కు చెందిన నేతలు భాగస్వాములయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర సలహాదారులు పూసం ఆనంద్రావ్, ఉయికే విఠల్, జిల్లా అధ్యక్షుడు మడావి శంకర్, ప్రధాన కార్యదర్శి ఆడ నగేశ్, ఉపాధ్యక్షుడు మెస్రం నగేశ్, ఆర్క నగేశ్, గేడం బలిరాం, పర్ధాన్ సంఘం నాయకులు మెస్రం శంకర్, గేడం మాధవ్, తదితరులు ఉన్నారు. -
ఒక్కరే.. సారు
బాసరలో గోహారతికడెం: మండలంలోని అల్లంపల్లి పంచాయ తీ పరిధి పాలరేగడి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మొత్తం ఐదుగురు విద్యార్థులే ఉన్నారు. శనివారం వారు గైర్హాజరయ్యారు. విద్యార్థులు లేకున్నా తరగతి గదిలో ఉపాధ్యాయుడు రమేశ్ ఒక్కరే ఉండడం కనిపించారు. బాసర: బాసరలో వేదభారతి పీఠం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం గోహారతి పూజ నిర్వహించారు. గోవులకు హారతులిచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆధ్యాత్మికత పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రతీ శనివారం నిర్వహిస్తున్నట్లు వేద విద్యానంద నాద స్వామిజీ తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. -
ఎస్టీపీపీలో జ్యోతిబాపూలే జయంతి
జైపూర్: ఎస్టీపీపీలో మహాత్మా జ్యోతిబాపూలే జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఎస్టీపీపీ ఓపెన్ ఆడిటోరియంలో ఈడీ చిరంజీవి, జీఎంలు నర్సింహారావు, మదన్మోహన్తో కలిసి జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఎస్టీపీపీలో నిర్వహించిన క్విజ్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ పిట్ సెక్రెటరీ సత్యనారాయణ, సీఎంవోఏఐ బ్రాంచి ప్రెసిడెంట్ పంతులా, పీఎంపీఎల్ హెడ్ అఖిల్కపూర్, డీజీఎం పర్సనల్ కిరణ్బాబు, బీసీ లైసన్ ఆఫీసర్ వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. జ్యోతిబాపూలే సేవలు చిరస్మరణీయం మంచిర్యాలటౌన్: మహాత్మా జ్యోతిబా పూలే సేవలు చిరస్మరణీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అన్నారు. శనివారం స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో జ్యోతిబాపూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, మహిళా సాధికారత, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకుడని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుర్గం అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎనగందుల కృష్ణమూర్తి, వంగపల్లి వెంకటేశ్వర్రావు, మాజీ ఎంపీపీ మంత్రి రామన్న, బీజేపీ కార్యాలయ కార్యదర్శి మల్లికార్జున్, గర్మిళ్ల జోన్ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజ్కుమార్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో బీజేపీ కార్పొరేటర్లు గాజుల ముఖేష్గౌడ్, కస్తూరి నాగరాజు, మాజీ కౌన్సిలర్ బొట్ల సత్యనారాయణ జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాల వే శారు. షార్ట్ సర్క్యూట్తో మొక్కజొన్న దగ్ధం బోథ్: ఆరుగాలం శ్రమించి పంట చేతికందే సమయంలో షార్ట్ సర్క్యూట్తో ఐదెకరాల మొక్కజొన్న పంట దగ్ధమైంది. మండలంలోని నిగిని గ్రామంలో శనివారం ఈఘటన చోటు చేసుకుంది. జాదవ్ అంకుష్ తన చేనులో ఐదెకరాల్లో మొక్కజొన్న వేశాడు. ప్రస్తుతం పంట కోతలు ప్రారంభించాల్సి ఉంది. అయితే విధి పగబట్టడంతో చేతికి రావల్సిన పంట ఆగ్నికి అహుతైంది. చేనులో విద్యుత్ వైర్లు ఒకదానికొకటి తగలడంతో మంటలు చెలరేగి పంటకు అంటుకున్నాయి. దాదాపు మూడున్నర ఎకరాల్లో పంట మొత్తం కాలిబూడిదైంది. దాదాపు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాఽధిత రైతు కోరాడు. పెన్గంగలో పడి వ్యక్తి మృతి సాత్నాల: పెన్గంగ నదిలో పడి వ్యక్తి మృతిచెందాడు. మృతుడు భువనగిరి పరమేశ్వర్ (45) భోరజ్ మండలం బాలాపూర్ గ్రామ వాసిగా మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. మృతుడు గత కొన్నేళ్లుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మివాడలో నివసిస్తున్నారు. శనివారం పెన్గంగ సరిహద్దు ప్రాంతంలో మృతి చెందడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రమాదవశాత్తు నదిలో పడిపోయడా, ఆత్మహత్య చేసుకున్నాడనేది తెలియాల్సి ఉంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
మేకలు, గొర్రెల చోరీపై వీడని మిస్టరీ
దిలావర్పూర్: మండలంలోని మాడేగాం గ్రామంలో మేకలు, గొర్రెలు చోరీపై మిస్టరీ వీడలేదు. రైతు పులిండ్డ శ్రీనివాస్ గురువారం మధ్యాహ్నం 80 మేకలు 30 గొర్రెలకు నీరు తాగించి గ్రామానికి ఆనుకుని ఉన్న వ్యవసాయ క్షేత్రం సమీపంలో చుట్టూ జాలి వేసి ఉంచాడు. గ్రామంలోని శుభకార్యంలో పాల్గొనేందుకు వచ్చాడు. సాయంత్రం మేకల మంద వద్దకు వెళ్లి చూడగా కనిపించలేదు. చుట్టూ ఉన్న అటవీప్రాంతంలోకి వెళ్లి ఉండవచ్చునని అక్కడికి వెళ్లి వెతికినా కనిపించలేదు. శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై రవీందర్ ఆధ్వర్యంలో శనివారం మేకల మంద ప్రాంతాన్ని పరిశీలించారు. అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న సారంగాపూర్ మండలంలోని ప్యారమూర్, నర్సాపూర్(జి) మండలంలోని కుస్లి అంజనీతండా తదితర గ్రామాల ప్రజలను విచారించారు. త్వరలో మేకలు, గొర్రెల మంద చోరీ మిస్టరీని ఛేదిస్తామని తెలిపారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులో తీసుకుని విచారించేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. -
1600 కేజీల బెల్లం పట్టివేత
నెన్నెల: మండలంలోని జెండావెంకటాపూర్ పంచాయతీ పరిధి శ్రావణ్పల్లి అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీ కోసం రహస్యంగా దాచి ఉంచిన 1600 కేజీల బెల్లం, 15 కేజీల పటికను పక్కా సమాచారం మేరకు ఎకై ్సజ్ పోలీసులు దాడి చేసి శనివారం స్వాధీనం చేసుకున్నట్లు చెన్నూర్ ఎకై ్సజ్ సీఐ ఎం.హరి తెలిపారు. 5 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని 200 లీటర్ల బెల్లంపానకాన్ని, ఒక గుడుంబా బట్టిని ధ్వంసం చేశారు. పరారీలో ఉన్న నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బెల్లాన్ని అక్రమంగా నిల్వ చేసిన వ్యక్తిని త్వరలో పట్టుకుంటామన్నారు. పట్టుకున్న బెల్లం విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎకై ్సజ్ సీఐ మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా బెల్లం రవాణా, నాటుసారా తయారు విక్రయించినా పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ దాడుల్లో చెన్నూర్ ఎకై ్సజ్ ఎస్సై బి.వెంకటరమణ, ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. -
● పరీక్షలే జీవితం కాదు..! ● ఒక్క ఫలితమే నిర్ణయించలేదు ● నేడు ఇంటర్మీడియెట్ ఫలితాలు ● ఒత్తిడికి గురైతే టెలిమానస్ నంబరు 14416లో సంప్రదించవచ్చు
పరీక్ష ఫలితాల్లో ఫెయిలైతే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. చదువు కొనసాగించడం.. మార్కులు పెంచుకునేందుకు బోర్డు పలు అవకాశాలు కల్పిస్తోంది. ఫెయిలైన సబ్జెక్టులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇదే సంవత్సరం ఉన్నత చదువులకు వెళ్లేందుకు వీలుంటుంది. తమకు వచ్చిన మార్కుల(మార్కులు తక్కువొచ్చినా, ఫెయిలైనా)పై నమ్మకం లేని విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. పాసైనా మార్కులు తక్కువొచ్చాయని భావిస్తే విద్యార్థులు బెటర్మెంట్ పరీక్షలు రాసి మెరుగుపర్చుకోవచ్చు. ఇరుగు పొరుగు పిల్లలతో పోల్చి పలుచన చేయకుండా తల్లిదండ్రులు సన్నిహితంగా ఉంటూ ధైర్యం కల్పించాలి.ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18వరకు పరీక్షలు జరిగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 53,307 మంది పరీక్షలు రాశారు. ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానుండడంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నిరుత్సాహం దరిచేరనీయొద్దుపరీక్ష ఫలితాల్లో తగిన మార్కులు రాలేదని ఫెయిల్ అయ్యామని చాలామంది నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. భావోద్వేగాలను సమన్వయపర్చుకుంటూ ఒత్తిడికి గురి కాకుండా జీవితంలో ముందుకు ఎలా వెళ్లాలో తల్లిదండ్రులు మార్గదర్శనం చేయాలి. ఆత్మవిశ్వాసం పెంపొందించే గాథలు, అనుభవాలను వారితో పంచుకోవాలి. పరీక్షలే జీవితానికి పరమావధి కాదని వారికి తెలియజెప్పాలి. జీవితంలో ఎదిగేందుకు అనేక మార్గాలు ఉంటాయని అవగాహన కల్పించాలి. – మోత్కూరి రామచందర్, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ఈ చిత్రంలో మధ్యలో కనిపిస్తున్న యువకుడు నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామానికి చెందిన పంతిక ప్రవీణ్. ఎంసీఏ పూర్తి చేశాడు. ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. నచ్చిన ఉద్యోగం రాకపోవడంతో స్వయంశక్తితో ఎదగాలని నిర్ణయించుకున్నాడు. వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్ని నమ్ముకున్నాడు. పౌల్ట్రీ రంగంలో మెలకువలు నేర్చుకుని ప్రభుత్వ రుణ సదుపాయంతో పౌల్ట్రీఫామ్ నెలకొల్పాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం మంచి ఆదాయం ఆర్జిస్తున్నాడు. శిక్షణ ఐఏఎస్లు, ఉన్నతాధికారులు వ్యవసాయం, పౌల్ట్రీఫాంను సందర్శించి అతడిని అభినందించారు. ఉద్యోగంలో ప్రవేశిస్తే ఎక్కడో ఒకచోట మాత్రమే పరిమితమైన సేవలందించే వాడినని, ప్రస్తుతం మరో పదిమందికి ఉపాధి కల్పించడం గొప్ప అనుభూతిని ఇస్తుందని ప్రవీణ్ చెబుతున్నాడు.‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన’.. అంటే నీ కర్తవ్యాన్ని నిష్కామంగా చేయడం మాత్రమే నీ చేతుల్లో ఉంది. ఫలితంపై నీకు హక్కు లేదు. ఏది జరిగినా అది భగవంతుని సంకల్పంగా భావించి సమత్వంతో స్వీకరించడమే నిజమైన జ్ఞానం. – భగవద్గీతమంచిర్యాలఅర్బన్/నిర్మల్ఖిల్లా: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. పదో తరగతి రిజల్ట్స్ త్వరలో వెలువడుతాయి. ఏడాదంతా కష్టపడ్డాం.. ఫలితం ఎలా ఉంటుందోననే ఒత్తిడి.. ఆశలు ఉండడం విద్యార్థులకు సహజమే. కానీ.. ఫలితాలు ఒక్కటే జీవితాన్ని పూర్తిగా నిర్ణయించలేవు. పరీక్ష తప్పితే మరోసారి రాసుకోవచ్చు. ఆశించిన ర్యాంకు.. మార్కులు రాలేదని తట్టుకోలేకపోతుంటారు. తల్లిదండ్రులు కాస్త భరోసా కల్పించాలి. క్షణికావేశంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని కన్నవారికి తీరని శోకం మిగుల్చుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చదువు జీవితంలో భాగమే కానీ అదే జీవితం కాదని ఉపాధ్యాయులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆత్మస్థైర్యాన్ని నింపాలని విద్యావేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణులు సూచిస్తున్నారు.నిరాశ వద్దు..పౌల్ట్రీరంగంలో ఎదిగి..53వేల మంది..ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులుమంచిర్యాల 12,317ఆదిలాబాద్ 17,564నిర్మల్ 13,125ఆసిఫాబాద్ 10,301 -
ఘనంగా ‘వారసత్వ సంబురాలు’
నిర్మల్చైన్గేట్: పట్టణంలోని సిటీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో శనివారం ‘వారసత్వ సంబురాలు’కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రిటైర్డ్ ఐఏఎస్, మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా చరిత్ర, వైద్యవృత్తి, సంస్కృతి, సంప్రదాయాలపై జిల్లా రచయితలు రచించిన పలు పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం రిటైర్డ్ పార్థసారథి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. జిల్లాలో రచయితలు సాహిత్య అభివృద్ధికి, భాషా పరిరక్షణకు కృషి చేస్తున్నారని, ముఖ్యంగా మహిళా రచయితలు ముందుకు రావడం గర్వకారణమన్నారు. అనంతరం వైద్యులను శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా వైద్యులు, నిర్వాహకులు పాల్గొన్నారు. -
వైద్యుల సూచన మేరకే మందులు విక్రయించాలి
మంచిర్యాలటౌన్: మెడికల్ దుకాణాల నిర్వాహకులు వైద్యుల సూచన మేరకే మందులు విక్రయించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ చందన ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ నిష్ణాతులైన వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నారని, ప్రజలు వైద్య సేవలు పొందాలని అన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏడు పడకలతో ఏర్పాటు చేసిన డ్రగ్స్ డీ అడిక్షన్ సెంటర్ను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనిత, ఆసుపత్రి సూపరింటెండెంట్ వేదవ్యాస్, ఆర్ఎంవో భీష్మతో కలిసి ప్రారంభించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు సెంటర్ను ప్రారంభించి, వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయంపై హెల్ప్లైన్ నంబర్లు 14416, 1908లో సమాచారం ఇవ్వాలని అన్నారు. అనంతరం వైద్య విద్యార్థులతో జీవితంలో ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోబోమని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కెమిస్టు, డ్రగ్గిస్టు అసోసియేషన్ సభ్యులు చంద్రశేఖర్, సుధాకర్, వైద్యులు సునిల్కుమార్, కిరణ్కుమార్, నర్సింగ్ అధికారులు, డెమో బుక్క వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
పూరిగుడిసె దగ్ధం
తాంసి: మండల కేంద్రంలోని శుక్రవారం రా త్రి పూరి గుడిసె దగ్ధమైంది. గొద్దెల చిన్నక్క నిద్రిస్తుండగా రాత్రి 11 గంటల ప్రాంతంలో దేవుని చిత్రపటం వద్ద దీపం మంటలు అంటుకుని చెలరేగాయి. చిన్నక్క కేకలు వేయడంతో చుట్టూపక్కల వారు అక్కడికి చేరుకుని నీటితో మంటలార్పివేశారు. అప్పటికే బి య్యం, బట్టలు, తదితర వస్తువులు కాలిపోయాయి. సుమారు రూ.20వేల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితురాలు తెలిపింది. సర్పంచ్ సంతోశ్రెడ్డి శనివారం బాధితురాలి ఇంటి ని పరిశీలించారు. ప్రభుత్వం తరపున పరిహా రం అందేలా చూస్తానని భరోసానిచ్చారు. -
చదువుతోనే సమాజంలో మార్పు
ఆదిలాబాద్రూరల్: చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మహాత్మాజ్యోతి బాపూలే జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణలోని సావిత్రిబాయి, జ్యోతి బాపూలే విగ్రహాలకు, అలాగే బీసీ స్టడీ సర్కిల్ సెంటర్ ఆవరణలోని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళలర్పించారు. అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాజంలోని అసమానతలు గుర్తించి, వాటి నిర్మూలనకు కృషి చేసిన గొప్ప సంస్కర్త జ్యోతిబా పూలే అని కొనియాడారు. ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ, విద్యతోనే సమాజ వికాసం జరుగుతుందని నమ్మిన గొప్ప ఆదర్శమూర్తి పూలే అని అన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ మహనీయుల జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు, యువత ముందుకు సాగాలన్నారు. పూలే జీవిత చరిత్రపై మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే రూపొందించిన ఆడియో సీడీని కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం వ్యాసరచన పోటీల విజేతలకు మెమెంటో, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఇందులో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, బీసీ అభివృద్ధి శాఖ అధికారి సోనియా, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి సునీత కుమారి, ఈడి మనోహర్, కౌన్సిలర్లు శ్రీనివాస్, స్వాతి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు, నాయకులు మల్లేశ్, గణేశ్, తదితరులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణ అందరి బాధ్యతఆదిలాబాద్/ఆదిలాబాద్టౌన్: మాదక ద్రవ్యాల నియంత్రణ అందరి బాధ్యత అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో ఔషధ నియంత్రణ, హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ వినియోగంపై శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం రిమ్స్లో ఏర్పాటు చేసిన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. సమాజంలో డ్రగ్స్ నియంత్రణ అత్యంత కీలకమన్నారు. వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మత్తుకు బానిసైన వారికి డీఅడిక్షన్ సెంటర్ల ద్వారా కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించారు. అనంతరం ఔషధ నియంత్రణపై ప్రతిజ్ఞ చేయించి, పోస్టర్ ఆవిష్కరించారు. ఇందులో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య సమాజ నిర్మాణమే లక్ష్యం
ఆదిలాబాద్: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శుక్రవారం ప్రపంచ హోమియోపతి దినోత్సవం, ఆయుష్ డే సందర్భంగా ‘హెల్త్ వీక్’ యోగా శిబి రం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాల్గొ ని ప్రజలు,విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశా రు. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగా అత్యుత్తమ సాధనమన్నారు.ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో ప్రజారోగ్యానికి పెద్దపీ ట వేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదన పు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ చైర్మన్ బండారి అనూష, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్టేడియంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ను కలెక్టర్ పరిశీలించారు. పూల్లోని నీటి శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ వైద్యం ప్రజలకు వరం ఆదిలాబాద్టౌన్: ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న మెరుగైన వైద్యసేవలను సద్విని యోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. హమాలీవాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ హోమియోపతి దినో త్సవం నిర్వహించా రు. ఆయుష్ వైద్య విధానాల ద్వారా దీర్ఘకాలిక వ్యాధులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఇందులో మున్సిపల్ చైర్మన్ బండారి అనూష, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, ఇతర వైద్య అధికారులు పాల్గొన్నారు. ఈవీఎంల గోదాం తనిఖీ కై లాస్నగర్: జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో గల ఈవీఎంల గోడౌన్ను కలెక్టర్ రాజర్షి షా శు క్రవారం తనిఖీ చేశారు. భద్రత ఏర్పాట్లను పరి శీలించారు. నిరంతరం పహారా ఉండాలని, అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. వర్షం కా రణంగా తేమ చేరకుండా జాగ్రత్తలు తీసుకో వాలని, లోపల ఉన్న యంత్రాల రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని స్ప ష్టం చేశారు. ఆయన వెంట రెవెన్యూ అధికారులు, ఎన్నికల విభాగం సిబ్బంది, తదితరులు ఉన్నారు. -
ఆదిలాబాద్ ఆర్టీవో అధికారులకు జాతీయ అవార్డు
ఆదిలాబాద్టౌన్: రోడ్డు భద్రతపై వినూత్న కార్యక్రమాలు చేపట్టినందుకు గాను ఆదిలాబాద్ జిల్లా ఆర్టీవో అధికారులకు జాతీయ స్థాయిలో ‘రోడ్డు భద్రత ఎక్స్లెన్స్ అవార్డు’ లభించింది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. జిల్లాలో 800 మంది విద్యార్థులతో నిర్వహించిన మానవ గొలుసు, ‘అమ్మా.. నాన్న.. నెమ్మదిగా డ్రైవ్ చేయండి’ వంటి సందేశాలతో చేపట్టిన అవగాహన కార్యక్రమాలు జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందాయి. ఇండివిజువల్ విభాగంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పి.రవీందర్ కుమార్, ఎంవీఐ ఎస్.శ్రీనివాస్, ఏఎంవీఐ కె.హరేంద్ర కుమార్లు బెస్ట్ పర్ఫార్మర్ అవార్డులు అందుకున్నారు. -
టీ(కీ)చకులు
ఆదిలాబాద్టౌన్: విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువులే తప్పటడుగులు వేస్తున్నారు. వెకిలి చేష్టలతో కీచకులుగా మారుతున్నారు. కూతురు వయస్సు ఉన్న పిల్లలతో నీచంగా ప్రవర్తిస్తూ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెస్తున్నారు. జిల్లాలో ఇటీవల వరుస ఘటనలతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పక్షం రోజుల క్రితం గుడిహత్నూర్ మండంలోని ఓ జెడ్పీఎస్ఎస్లో ఓ కీచక గురువు విద్యార్థినులను వేధించగా, శుక్రవారం జిల్లాలో మరో ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. గురువుల లైంగిక వేధింపులను కొందరు విద్యార్థినులు తల్లిదండ్రుల వద్ద వెల్లబోసుకోగా, కొంత మంది ఎవరికి చెప్పుకోలేక మనోవేదనకు గురవుతున్నారు. మరోవైపు కలెక్టర్, పోలీసు శాఖ పోక్సో చట్టం, విద్యార్థులపై ప్రవర్తించాల్సిన విషయాలపై ఉపాధ్యాయులకు శిక్షణ కల్పించినప్పటికీ తీరు మారకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. గడిచిన రెండేళ్లలో 10 మందికి పైగా ఉపాధ్యాయులపై పోక్సో కేసులు నమోదవడం పరిస్థితికి అద్దం పడుతోంది. మార్పు ఏదీ..? జిల్లాలోని పలు ప్రభుత్వ, పైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న కొంత మంది కీచక గురువుల్లో మార్పు కానరావడం లేదు. కొంత కాలంగా పలువురు ఉపాధ్యాయులు విద్యార్థినులను మానసిక, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. వారి తీరుపై విసుగుచెంది కొందరు పోలీసులు, షీ టీమ్ను ఆశ్రయిస్తే తప్పా ఘటనలు బయటపడటం లేదు. కొన్ని పాఠశాలల్లో ఇలాంటివి చోటు చేసుకున్నా బయటకు రాకుండా ఉపాధ్యాయులు కప్పిపుచ్చుతున్నారు. దీంతో సదరు ఉపాధ్యాయులపై చర్యలు లేకపోవడంతోనే వారి తీరులో మార్పు రావడం లేదని తెలుస్తోంది. జిల్లాలో ఇటీవల సంఘటనలు.. అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు విద్యార్థినులపై ఉపాధ్యాయులు అసభ్యకరంగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తాం. కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా వేధింపులకు గురయితే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. షీటీమ్, డయల్ 100కు నిర్భయంగా సమాచారం అందించాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం.– జీవన్రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ -
‘ఎంపీ, ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలి’
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ పేరుతో మోసపూరిత మాస్టర్ ప్లాన్ విడుదల చేసి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్పై తక్షణమే కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. శుక్రవారం డీపీవో కార్యాలయంలో ఏఎస్పీ మౌనికను కలి సి ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ, ఇటీవల ఎలాంటి నిజా ధారాలు లేని డూప్లికేట్ మాస్టర్ ప్లాన్ను ఎంపీ, ఎమ్మెల్యేలు విడుదల చేయడం ప్రజలను వంచించడమేనని మండిపడ్డారు. ఆదిలాబాద్ ఎ యిర్పోర్ట్ విషయంలో ఇంకా ఎలాంటి మాస్ట ర్ ప్లాన్ రూపొందించలేదని కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్వ యంగా పత్రికాముఖంగా ప్రకటించారని తెలి పారు. ఈనెల 17న కేంద్రబృందాలు సర్వే చే యబోతున్నాయని తెలపడంతో వీరి మోసం బయటపడిందని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దని, తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చ ర్యలు తీసుకోవాలని కోరారు. ఇందులో పట్టణ అధ్యక్షుడు అజయ్, ప్రకాశ్, వెంకటేశ్, వసంత్, అశోక్ స్వామి, భూమన్న, తదితరులున్నారు. -
ఇండోర్.. పూర్తయ్యేదెప్పుడో?
ఆదిలాబాద్: క్రీడారంగంలో రాష్ట్రాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో ప్రతిభ ఉన్నా ఎంతోమంది నిరుపేద క్రీడాకారులు మరుగున పడుతున్నారు. కలెక్టరేట్ సమీపంలో చేపట్టిన అధునాతన ఇండోర్ స్టేడియం పనులు నిధుల విడుదలలో జాప్యంతో పిల్లర్ల దశలోనే నిలిచిపోయాయి. వసతుల లేమితో అవస్థలు.. కై లాస్నగర్లో ఏళ్ల క్రితం ఇండోర్ స్టేడియం నిర్మించారు. ఆ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ఇందులోనూ కేవలం బ్యాడ్మింటన్ ఆడేందుకు మాత్రమే వీలుండటంతో, ఇతర ఇండోర్ క్రీడలకు అవకాశం లేకుండా పోయింది. దీనికి తోడు స్టేడియంలో ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉండటంతో నిరుపేద క్రీడాకారులు అక్కడికి వెళ్లలేకపోతున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని పాత స్టేడి యం ప్రాంగణంలోనే అధునాతన ఇండోర్ స్టేడి యం నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ ప్రగతి నిధులతో.. క్రీడాకారులకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హ యాంలో పట్టణ ప్రగతి నిధులతో నిర్మాణ పనులు ప్రారంభించారు. రూ. కోటి 95 లక్షల అంచనా వ్య యంతో 2022లో మొదలైన ఈ పనులు పిల్లర్ల దశ వరకు వచ్చాయి. అయితే కాంట్రాక్టర్కు బిల్లులు విడుదల కాకపోవడంతో పనులు మధ్యలోనే నిలిచి పోయాయి. అప్పటి నుంచి అసంపూర్తిగానే ఉంది. అందుబాటులోకి వస్తే.. ఈ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం అందుబాటులోకి వస్తే ఎన్నో రకాల క్రీడలను ప్రోత్సహించే అవకాశం ఉంటుందని కోచ్లు చెబుతున్నారు. జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయి వేదికలపై సత్తా చాటి మరిన్ని పతకాలు సాధించే అవకాశం ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పోటీలను సైతం ఇక్కడ నిర్వహించుకోవచ్చు. దీనివల్ల క్రీడారంగం అభివృద్ధి చెందుతుందని, ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి వస్తారని క్రీడా సంఘాలు అభిప్రాయ పడుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులు విడుదల చేయాలని క్రీడాకారులు కోరుతున్నారు. ప్రతిపాదనలు పంపాం.. ఇండోర్ స్టేడియం నిర్మాణం పట్టణ ప్రగతి నిధులతో ప్రారంభమైంది. పలు కారణాలతో పనులు నిలిచినట్లు తెలుస్తోంది. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి పిప్రి సభకు వచ్చినప్పుడు క్రీడాభివృద్ధి కోసం రూ.6 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. అవి విడుదలయితే పనులు వేగవంతం అవుతాయి. – జక్కుల శ్రీనివాస్, డీవైఎస్వో పనులు వేగవంతం చేయాలి స్టేడియం నిర్మాణం త్వరగా పూర్తయి అందుబాటులోకి వస్తే ఎంతోమంది క్రీడాకారులకు లబ్ధి చేకూరుతుంది. అలాగే ప్రతిభావంతులైన నిరుపేద క్రీడాకారులు సైతం వెలుగులోనికి వస్తారు. ఈ మేరకు ప్రభుత్వం దృష్టి సారించాలి. – నవీన్కుమార్, శాంతినగర్, ఆదిలాబాద్ -
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలి
కైలాస్నగర్(బేల): ప్రభుత్వ పథకాలను ప్రజ లకు చేరవేయాలని ఎంపీ నగేశ్ అన్నారు. బీజే పీ చేపట్టిన పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్లో భాగంగా శుక్రవారం బేల, జైనథ్, భోరజ్, సాత్నాల మండలాలకు చెందిన పార్టీ కార్యకర్తలకు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంత్యోదయ సిద్ధాంతం ద్వారా సమాజంలో చివరి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు చేరేలా చేయడం పార్టీ లక్ష్యమని తెలిపారు. ఇందులో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం, మోహన్ అగర్వాల్, క్రాంతి కుమార్, రాకేశ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అంబులెన్స్ల తనిఖీ
ఉట్నూర్రూరల్: ఉట్నూర్ మండలంలోని 108, 102 అంబులెన్స్లను ప్రోగ్రామ్ మేనేజర్ సామ్రాట్, జిల్లా ఇన్చార్జి శేఖర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేసవి ఎండల నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లోని సిబ్బంది అంబులెన్స్లతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున వడదెబ్బకు గురైన బాధితుల నుంచి కాల్ రాగానే తక్షణమే స్పందించాలని సూచించారు. బాధితుల్లో శరీర ఉష్ణోగ్రత తగ్గించేందుకు అంబులెన్స్లలో ఐస్ ప్యాక్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. వడదెబ్బ తగిలిన వారికి వెంటనే ప్రథ మ చికిత్స అందించి, ఆలస్యం చేయకుండా సమీప ఆస్పత్రికి తరలించాలని సూచించారు. అనంతరం 108 సిబ్బందితో సమావేశమై అంబులెన్స్లోని వైద్యపరికరాలు, రికార్డులు పరిశీలించారు. 108 ఈఎంటీలు శంకర్, దత్తాత్రేయ, పైలెట్లు ప్రవీణ్కుమార్, రవీందర్, 102 సిబ్బంది వెంకటేశ్ తదితరులున్నారు. -
కొనుగోలు చేసిన ‘కంది’ నాణ్యత లేమితో వెనక్కి..
జైనథ్: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల నుంచి మార్చి 28న పీఏసీఎస్, మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన 257 క్వింటాళ్ల కందులను జిల్లా కేంద్రంలోని సీడబ్ల్యూసీ గోదాం అధికారులు తిరిగి వెనక్కి పంపించారు. నాణ్యత లేమి కారణంతో తిరిగి లారీలో మార్కెట్యార్డుకు పంపించగా ఐదు రోజులైనా తీసుకునేందుకు అధి కారులు ముందుకురాలేదు. దీంతో విధిలేక పీ ఏసీఎస్ అధికారులు గురువారం వాటిని రైతులకు అప్పగించారు. వాటి రవాణా ఖర్చులూ భరించాలని చెబుతుండగా రైతులు లబోదిబో మంటున్నారు. నాసిరకంగా ఉంటే ముందుగా ఎందుకు కొనుగోలు చేశారని వారు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కందులను కొనుగోలు చేయాలని కోరుతున్నారు. -
ఇళ్ల నిర్మాణంలో జాప్యం వద్దు
నార్నూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని హౌసింగ్ డీఈ భగవంతరావు సూచించారు. గురువారం గాదిగూడ మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి పనులపై సమీక్షించారు. పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్లకు సూచించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల మూడో వారం నుంచి నాలుగో వారం లోపు అన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సామూహిక గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నందున, అందుకు అనుగుణంగా పనులు పూర్తి కావాలని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, ఎక్కడైనా నిర్లక్ష్యం తలెత్తితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, పనులు వేగవంతంగా కొనసాగించేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమమని, ప్రతీ ఇల్లు నాణ్యమైనదిగా ఉండేలా అధికారులు, కాంట్రాక్టర్లు సమష్టిగా పనిచేయాలని పేర్కొన్నారు. హౌసింగ్ ఏఈ రాకేశ్, ఇందిరమ్మ గ్రామ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. -
ఎయిడ్స్ రహిత సమాజానికి కృషి చేయాలి
ఆదిలాబాద్టౌన్: ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణా నికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్యారో గ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్ సూచించారు. ప్ర జాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువా రం రిమ్స్ నుంచి తెలంగాణచౌక్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా జైలులో ఖైదీలకు హెచ్ఐవీ, ఇతర ఆరోగ్య పరీక్షలు చేశారు. లారీ డ్రైవర్లకు హెచ్ఐవీ, కంటి, కిడ్నీ, కాలేయ సంబంధిత పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. రక్షణ లేని లైంగిక సంబంధాలు పెట్టుకోవ డం ద్వారా హెచ్ఐవీ బారినపడే ప్రమాదముందని హెచ్చరించారు. బాధితులపై వివక్ష చూపించకుండా ఆదరించాలని కోరారు. ఎయిడ్స్కు మందుల్లేవని తెలిపారు. నివారణ ఒక్కటే మార్గమని సూచించారు. తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవీ రాకుండా ఇంజక్షన్ల ద్వారా జాగ్రత్తలు తీసుకోవచ్చని తెలిపారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, ఎయిడ్స్ అండ్ లెప్రసీ నివారణ అధికారి ఈశ్వర్రాజ్, టీబీ నివారణ అధికారి సుమలత తదితరులు పాల్గొన్నారు. -
మహోన్నత పోరాట యోధుడు రాంజీ
ఆదిలాబాద్రూరల్: జల్, జంగల్, జమీన్ హక్కుల కోసం బ్రిటీష్ సైన్యాన్ని గడగడలాడించిన మహోన్నత పోరాట యోధుడు మర్సుకోల రాంజీగోండ్ అని మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు కొనియాడారు. గు రువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గల హీరా సుకా దేవస్థానం ఆవరణలో రాంజీ గోండ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. రాంజీ గోండ్, కుమురంభీం విగ్రహాలకు పూలమాలలు నివా ళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ప్రభుత్వాలు ఆదివాసీ మహనీయుల చరిత్ర ను ప్రజలకు తెలియనీయడంలేదని ఆరోపించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రా మన్న కూడా రాంజీ విగ్రహానికి పూలమాల వేసి ని వాళులర్పించారు. కార్యక్రమాల్లో ఆదిలాబాద్ ము న్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, కాంగ్రెస్ నా యకురాలు గండ్రత్ సుజాత, వివిధ సంఘాల నా యకులు మడావి రాజు, కుర్సేంగే తానాజీ, సిడాం రాంకిషన్, మెస్రం శంకర్, గేడం మాధవ్, పూసం ఆనంద్రావ్, గేడం మనోహర్, కుర్సేంగే యాదవ్రావ్, మోహన్, గేడం భగవాన్, కుమ్ర జంగు, గే డం వనిత, మెస్రం సంగీత, ఆత్రం అనసూయ, ఆ త్రం వెంకటేశ్, అజయ్, మెట్టు ప్రహ్లాద్, రాజు, దు ర్వ నగేశ్, గోడం గంగారాం, దేవన్న పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాకు ‘రాంజీ’ పేరు పెట్టాలి ఆదిలాబాద్ టౌన్: నిర్మల్ జిల్లాకు రాంజీ గోండ్ పేరు పెట్టాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో రాంజీ గోండ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రిటీష్ సామ్రాజ్యవాదా నికి వ్యతిరేకంగా ఆదివాసీలకు అడవిపై, భూమిపై హక్కుల కోసం జరిగిన వీరోచిత పోరాటంలో రాంజీతో సహా వెయ్యిమంది అమరులైన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లంకా రాఘవులు, జిల్లా అధ్యక్షుడు స్వామి, రైతు సంఘం అధ్యక్షుడు బండి దత్తాత్రి, ఐద్వా జిల్లా కార్యదర్శి మంజుల, నాయకులు పోచక్క, రామన్న, గంగారాం తదితరులు పాల్గొన్నారు. -
‘ముందస్తు’పై ఆసక్తి!
కైలాస్నగర్: మున్సిపాలిటీల పరిఽధిలో ఆస్తిపన్ను బకాయిలు పేరుకుపోకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎర్లీబర్డ్ స్కీంను అమలు చేస్తోంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను ముందస్తుగా పన్ను చెల్లించేవారికి ఐదు శాతం రాయితీ కల్పిస్తోంది. నివాస, నివాసేతర భవనాలకు సంబంధించి ఎలాంటి పాత బకాయిలు లేనివారినే ఇందుకు అర్హులుగా ప్రకటించింది. ఈ నెల 30వరకు పన్ను చెల్లింపునకు గడువు విధించింది. పలువురు యజమానులు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ప్రత్యేక కౌంటర్లలో పన్నులు చెల్లిస్తున్నారు. ఎర్లీబర్డ్పై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పిస్తే మరింత ఎక్కువగా పన్నులు వసూలయ్యే అవకాశముంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆరు ప్రత్యేక బృందాల ద్వారా.. ఆదిలాబాద్ పట్టణంలో 49వార్డులున్నాయి. ఎర్లీబర్డ్ పథకం అమలులో భాగంగా నిర్దేశించిన పన్ను వసూళ్ల కోసం బల్దియా అధికారులు ఆరు ప్రత్యేక బృందాలను నియమించారు. ఒక్కో బృందంలో బిల్ కలెక్టర్, అసిస్టెంట్ బిల్ కలెక్టర్ లాంటి ఇద్దరు ఉద్యోగులను నియమించారు. బకాయిలు లేని యజమానుల వివరాలతో కూడిన జాబితాతో పాటు పీవోఎస్ మిషన్లను వారికి అందజేశారు. దీంతో వారు, ఉదయం సాయంత్రం వేళల్లో తమకు కేటాయించిన వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ పన్నుల వసూళ్లకు ప్రయత్నిస్తున్నారు. ఏటా ఆస్తి పన్ను వసూళ్లలో ప్రభుత్వం వడ్డీ మాఫీ అమలు చేస్తూ వస్తోంది. పాత బకాయిలున్న వారికి వడ్డీపై 95శాతం రాయితీ కల్పిస్తోంది. అయితే గత 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంఽధించిన వన్టైం సెటిల్మెంట్ స్కీం బకాయిలపై వడ్డీ మాఫీ పథకాన్ని కేవలం జీహెచ్ఎంసీకే పరిమితం చేసింది. దీంతో పన్నుల వసూళ్లు గతేడాది కంటే కొంతమేర తగ్గాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎర్లీబర్డ్ స్కీంను అమలు చేస్తుందో లేదోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, దాన్ని ఈ సారి కూడా కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1నుంచి 30వ తేదీ వరకు మున్సిపాలిటీలో ఈ స్కీం అమలుకు అవకాశం కల్పించింది. గత మూడేళ్లలో ఇలా.. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో గత మూడేళ్ల ఎర్లీబర్డ్ ఆదాయాన్ని పరిశీలిస్తే రూ.2 కోట్ల వరకు వసూలవుతోంది. 2023–24లో ఈ స్కీం కింద రూ.1.83 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేశారు. 2024–25లో రూ.2.13 కోట్లు రాబట్టారు. గత ఆర్థిక సంవత్సరం 2025–26కు గాను రూ.1.98 కోట్లు వసూలు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను పన్నుల వసూళ్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకోసం మున్సిపల్ కార్యాలయంలో రెండు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. బిల్ కలెక్టర్లను పీవోఎస్ యంత్రాలతో అందుబాటులో ఉంచారు. ఎర్లీబర్డ్ స్కీం కింద పన్నుల వసూళ్ల ప్రక్రియ ప్రారంభం కాగా, ఇప్పటివరకు రూ.12లక్షల మేర వసూలైనట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ఇందుకు మరో 20 రోజులు గడువు ఉన్నందున ఈ విషయాన్ని తెలియజేసేలా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరముంది. ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, చెత్త బండ్ల ద్వారా అనౌన్స్మెంట్ చేయించడం లాంటి కార్యక్రమాలు చేపడితే మరింత ఎక్కువగా పన్నులు వసూలయ్యే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ దిశగా అధికారులు చర్యలు చేపపడితే బల్దియాకు ప్రయోజనం చేకూరనుంది. -
‘ఉపాధిహామీ’ నిర్వీర్యానికి కుట్ర
కైలాస్నగర్: ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు లంక రాఘవులు ఆరోపించారు. 2005 ఉపాధిహామీ చట్టాన్నే కొనసాగించాలనే డిమాండ్తో గురువారం సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ‘కొత్త చట్టం వద్దు.. పాత చట్టమే కావాలి’ అంటూ నినదించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. వీబీ జీ రామ్ చట్టం అమలు ద్వారా కూలీలకు కల్పించిన వేసవి అలవెన్స్, పే స్లిప్, తాగునీరు, పార, గుల్లలు, గడ్డపారలు లాంటి సౌకర్యాలు దూరం కానున్నాయని పేర్కొన్నారు. పైగా కొత్త చట్టంలో ఉదయం, మధ్యాహ్నం ఫొటోలు తీయటం, మేట్స్ను తొలగించడం, గ్రూపులను రద్దు చేయడం, నిధుల్లో కోత విధించడం లాంటి చర్యలతో చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. కేంద్రం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, అడిషనల్ డీఆర్డీవో గజానన్రావుకు వినతిపత్రం ఇచ్చారు. నాయకులు స్వామి, గంగారాం, రామన్న, పోచ్చక్క తదితరులున్నారు. -
చూసీ చూడనట్లుగా..
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో వైట్ప్లేట్ వాహనదారులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. నిబంధనలకు విరుద్దంగా వాహనాలను నడుపుతున్నారు. ట్యాక్సీ వాహనాల మాదిరిగా ప్రజలను తరలిస్తున్నారు. దీంతో వేలల్లో ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్న వారు నష్టపోతున్నారు. స్వయం ఉపాధి కోసం వాహనాలను కొనుగోలు చేసి, నెలవారీ ఈఎంఐలను చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్రమంగా ప్రయాణికులను తరలిస్తున్న వైట్ ప్లేట్ యజమానులపై రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో పాటు పలు ప్రభుత్వ శాఖల్లో అధికారులు అద్దె ప్రతిపాదికన సైతం వైట్ ప్లేట్ వాహనాలను ఏర్పాటు చేసుకుని లబ్ధి పొందుతున్నారు. నిబంధనలు గాలికి.. వైట్ప్లేట్ వాహనదారులు నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. ఏడాదికోసారి ఇన్సూరెన్స్ తప్ప ఇతర పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. సొంత వినియోగం కోసం కొనుగోలు చేసిన వాహనా లను అద్దెకు పంపుతూ జేబులు నింపుకుంటున్నా రు. ఎల్లోప్లేట్ వాహనదారులు మూడు నెలలకో సారి ట్యాక్స్ రూపంలో రూ.8,850 చెల్లించాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్గా ఏడాదికి మరో రూ.40వే లకు పైగా చెల్లించాలి. గ్రీన్ ట్యాక్స్ పేరిట ఏడాదికి రెండు సార్లు రూ.6వేలు చెల్లించాల్సి ఉంటుంది. టో ల్చార్జీలు సైతం అదనం. ఇతర రాష్ట్రాలకు ప్రయాణికులను తరలిస్తే టెంపరరీ పర్మిట్ కోసం ఏడు రోజుల కోసం రూ.3500 చెల్లించాల్సి వస్తోంది. దీనికి తోడు అదనంగా రూట్ పర్మిట్ చెల్లించాల్సి ఉంటుంది. అదే వైట్ ప్లేట్ వాహనదారులు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఇతర రాష్ట్రాలకు సైతం ప్రయాణికులను తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. జిల్లా కేంద్రంలో దాదాపు 200కు పైగా వైట్ ప్లేట్ వాహనాలు ఉంటే కేవలం 30 వరకు మాత్రమే ఎల్లోప్లేట్వి ఉండడం గమనార్హం. జిల్లా కేంద్రంలోని అడ్డాపై నిలిపి ఉంచిన వైట్ప్లేట్ వాహనాలు జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో వైట్ప్లేట్ వాహనదారుల అక్రమ దందా సాగుతుంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు సొంత వినియోగం కోసం వాహనాలను కొనుగోలు చేస్తూ వాటిని అద్దెకు వినియోగిస్తున్నారు. ఖరీదైన వాహనాలను కొనుగోలు చేస్తూ తక్కువ ధరకు అద్దెకు తిప్పుతూ నిరుద్యోగ యువత ఉపాధికి గండికొడుతున్నారు. ఈ విషయం రవాణా శాఖ అధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికై నా స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే మరి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు వైట్ ప్లేట్ వాహనాలు అద్దె ప్రతిపాదికన నడుపుతున్నారనే సమాచారం ఇప్పటి వరకు నా దృష్టికి రాలేదు. అలాంటివి ఉంటే సమాచారం అందించాలి. విస్తృతంగా తనిఖీలు చేపడుతాం. నిబంధనలు అతిక్రమించిన వాహనదారుల వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం. వైట్ప్లేట్ వాహనాలు ట్యాక్సీలుగా వినియోగించొద్దు. ఎల్లోప్లేట్ వాహనాలను మాత్రమే ప్రజలను తరలించేందుకు వినియోగించాలి. – రవీందర్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ -
పోషకాహారంతోనే ఆరోగ్యం
కై లాస్నగర్: పోషకాహారం తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉంటారని అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ అన్నారు. ప్రజాపాలన–ప్రగ తి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా బుధవారం ఆహార భద్రత శాఖ ఆధ్వర్యంలో వాకథాన్ నిర్వహించారు. రిమ్స్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. జెడ్పీ కార్యాలయం వరకు కొనసాగింది. అ నంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మా ట్లాడారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించా లన్నారు. పలువురికి ఫుడ్ లైసెన్స్ అందజేశారు. వివిధ ఆహార ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన మేళా ను తిలకించి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో జిల్లా ఆహార భద్రత అధికారి ప్ర త్యూష, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథో డ్, ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ నాయక్ పాల్గొన్నారు. -
మార్షల్ ఆర్ట్స్లో దూసుకుపోతున్న ‘నాగిని’
ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న డి. నాగిని ప్రియ జూడోలో అద్భుత ప్రతిభ కనబరుస్తూ పతకాలతో దూసుకుపోతోంది. 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఎస్జీఎఫ్ అండర్–17 అంతర్ జిల్లాల స్థాయి పోటీల్లో, సబ్ జూనియర్ కేడెట్ అంతర్ జిల్లాల పోటీల్లో రెండు స్వర్ణ పతకాలను సాధించి సత్తా చాటింది. అలాగే ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన సీఎం కప్ జూడో చాంపియన్షిప్లో బంగారు పతకం కై వసం చేసుకుంది. వీటితో పాటు చైన్నెలో నిర్వహించిన సౌత్ జోన్ పోటీల్లో, వరంగల్లో జరిగిన జూనియర్ మీట్లో రజత పతకంతో మెరిసింది. 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ (గుజరాత్), కేరళలోని త్రిస్సూర్లో నిర్వహించిన ఆల్ ఇండియా స్థాయి పోటీల్లోనూ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించింది. మార్షల్ ఆర్ట్స్లో తనదైన ఆటతీరుతో మెరుస్తోంది. -
అటవీ అనుమతుల పేరిట అభివృద్ధిని అడ్డుకోవద్దు
బోథ్/కై లాస్నగర్: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో గిరిజనుల అటవీ సమస్యలపై బుధవారం హైదరాబాద్లోని సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇందులో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. నియోజకవర్గంలోని అటవీ భూములకు సంబంధించిన పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఫారెస్ట్ అనుమతుల సాకుతో అనేక గూడేలకు నేటికీ రహదారి, విద్యుత్ సౌకర్యం వంటివి కరువయ్యాయన్నారు. ఆయా గ్రామాలకు బీటీ రోడ్లతో పాటు విద్యుత్ సౌకర్యం కల్పించేదుకు అటవీశాఖ తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని కోరారు. అలాగే గిరి వికాసం పథకం కింద మంజూరైన బోర్ల విషయంలోనూ ఆ శాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరికాదన్నారు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని మంత్రి తో పాటు ఉన్నతాధికారులను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు సమీక్షలో డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేశ్జాదవ్ పాల్గొన్నారు. జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎదురవుతున్న ఇబ్బందులను, పోడు భూముల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అటవీ అధికారులు మానవతా ధృక్పథంతో సహకరించాలన్నారు. -
మన క్రీడా రత్నాలు
జూడోలో అబ్బురపరుస్తున్న.. సహస్ర ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న జి. సహస్ర జూడోలో అసాధారణ ప్రతిభతో అబ్బురపరుస్తోంది. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటుతున్న ఈ క్రీడా కెరటం 2024 నుంచి 2026 వరకు జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ టోర్నీల్లో వరుసగా స్వర్ణ పతకాలను కై వసం చేసుకుని విజయ పరంపర కొనసాగించింది. అలాగే 2023–24లో కేరళలోని కొచ్చి వేదికగా నిర్వహించిన ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ పోటీల్లో కాంస్యం, 2024–25లో స్వర్ణ పతకంతో మెరిసింది. 2024–25లో మహారాష్ట్రలోని పుణేలో నిర్వహించిన యూత్ నేషనల్స్, 2025–26లో మణిపూర్ రాజధాని ఇంఫాల్లో నిర్వహించిన సీనియర్ నేషనల్ మీట్లో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి వేదికగా ఈ ఏడాది ఫిబ్రవరి 17నుంచి 19వరకు నిర్వహించిన సీఎం కప్ రెండో ఎడిషన్ పోటీల్లో స్వర్ణం సాధించింది. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన సీనియర్ స్టేట్ జూడో చాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన సహస్ర, జుడోలో రాష్ట్రానికే ఆశాకిరణంగా నిలుస్తోంది.జిల్లా కేంద్రంలోని తెలంగాణ క్రీడా పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభతో ఆకట్టుకుంటున్నారు. వేదికలేవైనా సత్తా చాటుతూ పతకాలు కై వసం చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన సీఎం కప్ రెండో ఎడిషన్ పోటీల్లోనూ సత్తా చాటి ఔరా అనిపించారు. జిల్లా కీర్తిని రాష్ట్రస్థాయిలో ఇనుమడింపజేశారు. ఓవరాల్ చాంపియన్షిప్గా నిలిచారు. ఇటీవల బజార్హత్నూర్ మండలం పిప్రి వేదికగా నిర్వహించిన బహిరంగ సభలో ఈ క్రీడాకారులను సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా క్రీడా రత్నాలుగా నిలుస్తున్న వారిపై ఫోకస్. – ఆదిలాబాద్ -
మాతాశిశు మరణాలు అరికట్టాలి
ఆదిలాబాద్టౌన్: మాతాశిశు మరణాలను అరి కట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్వో రాఽథోడ్ నరేందర్ అన్నారు. ప్ర జాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న హెల్త్ వీక్ కార్యక్రమంలో భాగంగా బుధవారం రిమ్స్ సమావేశ మందిరంలో సేఫ్ మదర్హుడ్ డే కార్యక్రమం నిర్వహించారు. మాతా, శిశు మరణాలు అరికట్టేందుకు పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. గర్భిణులను ప్రారంభ దశలోనే గుర్తించడం, సమయానికి రిజిస్ట్రేషన్ చేయించడం, కనీసం నాలుగు ఏఎన్సీ చెకప్లు నిర్వహించడం, హై రిస్క్ ప్రెగ్నెన్సీలను గుర్తించి తక్షణ చికిత్స అందించడం ద్వారా మాతా మరణాలను తగ్గించవచ్చన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచడం ద్వారా తల్లి–శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చన్నారు. ఇందులో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డిప్యూటీ సూపరింటెండెంట్ నరేందర్, గైనకాలజీవిభాగాధిపతి పద్మిని, ప్రో గ్రాం ఆఫీసర్ సాధన, దీపక్ పుష్కర్ తదితరు లు పాల్గొన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యతఆదిలాబాద్టౌన్: మహిళలు, విద్యార్థినిలకు రక్షణగా ఆదిలాబాద్ షీ టీం 24 గంటల పాటు అందుబాటులో ఉండి సేవలందిస్తుందని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రకటనలో తెలిపారు. మహిళలు అత్యవసర సమయంలో షీటీం సభ్యులను సంప్రదించాలని పేర్కొన్నారు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో వికృత చేష్టలపై నిర్భయంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఏప్రిల్లో విడుదలైన రాష్ట్ర వ్యాప్త షీటీం నివేదికలో జిల్లా బృందం రెండో స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. ఈమేరకు టీం సభ్యులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. మహిళలు ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా డయల్ 100 లేదా ఆదిలాబాద్ షీ టీం 8712659953 నంబర్లో సంప్రదించి సాయం పొందవచ్చని పేర్కొన్నారు. -
పతకాల రేసులో ‘శివాని’
క్రీడా పాఠశాల విద్యార్థి ఎం.శివాని వరుస విజయాలతో దూసుకుపోతోంది. 2025లో హన్మకొండ వేదికగా నిర్వహించిన సౌత్ జోన్ పోటీల్లో 600 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించిన ఈ క్రీడాకారిణి, అదే ఏడాది హైదరాబాద్ జింఖానా మైదానంలో నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్–17 పోటీల్లో 3వేల మీటర్ల రేస్ వాక్లో రజత పతకాన్ని కై వసం చేసుకుంది. అలాగే ఈ ఏడాది జనవరి 17న ఆదిలాబాద్లో నిర్వహించిన సబ్ జూనియర్ మీట్లో 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ ప్రతిభ చాటుతోంది. 2025 డిసెంబర్ 11న ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్–17 నేషనల్స్ పోటీల్లో 3వేల మీటర్ల రేస్ వాక్ విభాగంలో పాల్గొని సత్తా చాటింది. -
పాతాళంలోకి..
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో భూగర్భ జలాలు గణనీ యంగా పడిపోతున్నాయి. వేసవి ఎండలు మండిపోతుండడంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చుతుంది.ఇచ్చోడలో 17మీటర్లు, గుడిహత్నూర్లో 15.30, భోరజ్లో 13.30, ఇంద్రవెల్లి మండలం ముత్నూర్లో 10.34, నేరడిగొండలో 9.50 మీటర్ల లోతులోకి జలాలు పడిపోయాయి. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చి నీటి సమస్య ఏర్పడే పరిస్థితి ఉంది. ఫీజో మీటర్ల ద్వారా అంచనా.. జిల్లాలో భూగర్భ జలశాఖ ఆధ్వర్యంలో 26 చోట్ల ఫీజో మీటర్ల ద్వారా భూగర్భ జలాలను నిర్ధారిస్తున్నారు. ప్రతినెలా చివరిలో వీటిని కొలిచి రిపోర్టు అందజేస్తారు. మార్చి చివరిలో కొలువగా, దానికి సంబంధించిన రిపోర్టును తాజాగా వెల్లడించారు. భూ ఉపరితలం నుంచి ఎంత లోతులో జలాల లభ్యత ఉందని ఇందులో స్పష్టం చేశారు. జిల్లాలో సగటున ఫిబ్రవరి నుంచి మార్చి వరకు మరింత లోతులోకి భూగర్భలాలు పడిపోయాయి. అప్పటివరకు ఉన్నదాని కంటే 1.76 మీటర్ల లోతులోకి జలాలు వెళ్లిపోయాయి. కొన్ని మండలాల్లో పరిస్థితి తీవ్ర రూపం దాల్చుతుంది. ఇది నార్నూర్లోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఉన్న బావి. ఇటీవల వరకు నీళ్లు పైకి ఉండడంతో ఆస్పత్రిలోని వాట ర్ ప్లాంట్కు నీటి సమస్య ఏర్పడలేదు. ప్రస్తుతం బావి అడుగంటడంతో ప్లాంట్కు నీళ్లందని పరిస్థితి. దీంతో ఆసుపత్రి నిర్వహణకు ఇబ్బందుల తప్పట్లేదు. రీచార్జ్ పద్ధతులు అవలంబించాలి జిల్లా ప్రజలు రీచార్జ్ పద్ధతులను అవలంభించి నీటి కొరత ఏర్పడకుండా చూసుకోవాలి. ప్రధానంగా ఇళ్ల సముదాయాల వద్ద ఇంకుడు గుంతలు, పంట పొలాల వద్ద చెక్డ్యాంలు, పాంపాడ్లు నిర్మించుకోవాలి. ఏప్రిల్, మే నెలల్లో సహజంగానే వేసవి తీవ్రత కారణంగా భూగర్భ జలాలు పడిపోతాయి. – శ్రీవల్లి, జిల్లా భూగర్భజల శాఖ అధికారిజిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి.. నెల : లోతులో.. ఫిబ్రవరి : 5.29 మీటర్లు మార్చి : 7.05 మీటర్లు -
జెడ్పీ సీఈవోగా బి.రవి
కై లాస్నగర్: ఆదిలాబాద్ జెడ్పీ నూతన సీఈవోగా బి.రవి నియామకమయ్యారు. హన్మకొండ జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవోగా పనిచేస్తున్న ఈయనకు పదోన్నతి కల్పించిన ప్రభుత్వం జిల్లాకు బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా జిల్లాలో రెగ్యులర్ సీఈవోగా పనిచేసిన జి.జితేందర్ రెడ్డిని ఆయిల్ ఫెడ్ ఎండీగా ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్లో బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో రెగ్యులర్ సీఈవోను నియమించకపోవడంతో డీఆర్డీవో రాథోడ్ రవీందర్కు ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఏడు నెలల తర్వాత ఎట్టకేలకు జెడ్పీకి రెగ్యులర్ సీఈవో రానున్నారు. -
అథ్లెటిక్స్లో మెరుస్తున్న ‘స్వాతి’
అథ్లెట్ పి.స్వాతి ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. మహబూబ్నగర్ వేదికగా 2025 సెప్టెంబర్ 30న జరిగిన జూనియర్ స్టేట్ మీట్లో 80 మీటర్ల హర్డిల్స్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. అలాగే 2026 జనవరి 19న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సబ్ జూనియర్ మీట్లో 100 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం తన ఖాతాలో వేసుకుంది. ఇలా పతకాల జోరును కొనసాగిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 20న హన్మకొండలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ’సీఎం కప్’ పోటీల్లో 80 మీటర్ల హర్డిల్స్లో కాంస్య పతకం కై వసం చేసుకుని అథ్లెటిక్స్ లో మెరుస్తోంది. ‘నిత్య’ పంచ్ విసిరితే.. పతకమే ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న జే.నిత్య బాక్సింగ్ రింగ్లో సత్తా చాటుతోంది. పతకాల వేట కొనసాగిస్తోంది. దూకుడైన ఆటతీరుతో ప్రత్యర్థులపై పంచ్లు విసురుతూ భవిష్యత్తు ఆశాకిరణంగా మారుతోంది. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో జరిగిన 4వ సబ్ జూనియర్ జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్తో పాటు, పుదుచ్చేరి వేదికగా జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ రాష్ట్ర తరపున ప్రాతినిధ్యం వహించింది. ముఖ్యంగా హైదరాబాద్లోని షేక్పేట వేదికగా జరిగిన 4వ అండర్–15 సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ, అలాగే సౌత్ జోన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లోనూ వరుసగా స్వర్ణ పతకాలను కై వసం చేసుకుని సత్తా చాటింది. -
పార్టీ మారేందుకే ‘జోగు’ తప్పుడు విమర్శలు
● కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి గోవర్ధన్రెడ్డి కై లాస్నగర్: బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పార్టీ మారాలనుకున్నప్పుడు తాను చేరే పార్టీపై విమర్శలు చేయడం పరిపాటిగా మారిందని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరే సమయంలో కేసీఆర్పై లేనిపోని ఆరోపణలు చేశారన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్లో చేరేందుకే సీఎం రేవంత్రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఓర్వలేకనే తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను చేసిన ఆరోపణలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితులో లేరని, రామన్న ఆయన కుటుంబ సభ్యులు తొమ్మిదేళ్లపాటు చేసిన వ్యవహారాలతో ఆయనకు రాజకీయ సమాధి తప్పదని స్పష్టం చేశారు. ఇందులో పార్టీ నాయకులు సుధాకర్ గౌడ్, సంజయ్, బీడీ చారి తదితరులున్నారు. -
అకా‘డమ్మీ’లు!
వీటిలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు : 600 (సుమారు) ఆదిలాబాద్: నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పలువురు శిక్షణ పేరిట వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. తమ అకాడమీ, కోచింగ్ సెంటర్లో చేరితే జాబ్ గ్యారెంటీ అంటూ నమ్మిస్తూ వేలాది రూపాయలు నిలువు దోపిడీకి గురి చేస్తున్నారు. సరైన అనుమతులు లేకుండా కొనసాగుతున్న ఈ కేంద్రాలపై అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అనుమతులు లేకుండానే.. అకాడమీ, కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలంటే మున్సిపాలిటీ, విద్యాశాఖ, కార్మిక శాఖ, అగ్నిమాపక శాఖల అనుమతులు తప్పనిసరి. అలాగే కోచింగ్ సెంటర్ వార్షిక ఆదాయం రూ.20 లక్షలు దాటితే జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అయితే ఇవేవి లేకుండానే క్షేత్రస్థాయిలో పలువురు కోచింగ్ సెంటర్లు నడుపుతున్నారు. వీటిపై చర్యలు చేపట్టాల్సిన అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. నిరుద్యోగులకు బురిడీ.. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారు. ఇటీవల పోలీస్శాఖ నిర్వహించిన జాబ్ మేళాకు భారీగా హాజరు కావడమే ఇందుకు నిదర్శనం. దీనిని ఆసరాగా చేసుకుంటున్న అకాడమీల నిర్వాహకులు నిరుద్యోగులను బురిడీ కొట్టిస్తున్నాయి. రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ అరకొర వసతులతో కాలవ వెల్లదీస్తున్నారు. మరికొందరు నిరుద్యోగ అభ్యర్థుల సిర్టిఫికెట్లను తమవద్దే ఉంచుకొని, ఉద్యోగం వస్తే డబ్బులు చెల్లించాక ఇస్తామంటూ ఒప్పందాలు చేసుకుంటున్నారు. జాబ్ రాకున్నా కొందరు సర్టిఫికెట్లను అడ్డు పెట్టుకుని వసూళ్లకు పాల్పడుతుండడం సమాచారం. ప్రభుత్వ ఉద్యోగి నిర్వాకం..? ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ వ్యాపారాలు చేయడం నిబంధనలకు విరుద్ధం. అయితే జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ప్రైవేట్ కోచింగ్సెంటర్ను పరోక్షంగా నడుపుతుండడం చర్చనీయాంశంగా మారింది. గతంలో కొంతమందికి కోచింగ్ ఇచ్చిన ఆయన ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. అనంతరం నిబంధనలకు విరుద్ధంగా పట్టణ నడిబొడ్డున కోచింగ్ సెంటర్ నడుపుతుండడం విమర్శలకు తావిస్తోంది. పలు సందర్భాల్లో ఆ అకాడమీని ప్రమోట్ చేయడం, అడ్మిషన్లు తీసుకోవాలంటూ ప్రచారం చేయడం ఈ విషయాలకు మరింత బలం చేకూరుస్తోంది. సదరు ఉద్యోగి కోచింగ్ సెంటర్ పేరిట రూ. లక్షల్లో సంపాదించడం ఉద్యోగ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. జిల్లాలోని కోచింగ్ సెంటర్లు: 07అమలుకు నోచుకోని మార్గదర్శకాలు కోచింగ్ సెంటర్లు, వసతిగృహాలను కట్టడి చేసేందుకు సరైన నిబంధనలు లేకపోవడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా మారింది. కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీచేసినప్పటికీ ఇవి ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోచింగ్ సెంటర్లను నియంత్రించేందుకు చట్టం తీసుకువచ్చింది. ఆ విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక చట్టం చేస్తే సెంటర్ల ఆగడాలను అరికట్టడంతో పాటు నిరుద్యోగులు మోసపోకుండా అడ్డుకోవచ్చు. -
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
ఉట్నూర్రూరల్: ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు సంతోష్ అన్నారు. మంగళవారం ఐటీడీఏ కా ర్యాలయంలో పీవో యువరాజ్ మర్మాట్తో కలిసి వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ), ఇంజినీరింగ్, విద్య, గురుకులాలు, మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఉద్యానవనం, వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా, భూ వివాదాలు, అటవీ హక్కుల చట్టం తదితర అంశాలపై ఆయా విభాగాల అధికారులతో సమీక్షించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం ఆయనకు ఆదివాసీ నాయకులు, ఉద్యోగులు, కొలం, గోండు తెగకు చెందిన నాయకులు తమ సమస్యలు పరిష్కరించాలని వినతులు సమర్పించారు. -
ఆరోగ్య ఆదిలాబాద్గా తీర్చిదిద్దాలి
ఆదిలాబాద్టౌన్: ప్రజారోగ్యమే లక్ష్యంగా పనిచేస్తూ జిల్లాను ఆరోగ్య ఆదిలాబాద్గా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని మంగళవారం రిమ్స్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా సేఫ్ మ దర్ హుడ్, ఎయిడ్స్ నివారణ, ఆయుష్ వంటి అంశాలపై వారం పాటు అవగాహన కార్యక్రమాలు ని ర్వహించనున్నట్లు తెలిపారు. రిమ్స్ జిల్లాకే కాకుండా పొరుగు రాష్ట్రాల ప్రజలకు కూడా మెరుగైన వై ద్య సేవలు అందిస్తుందన్నారు. ముఖ్యంగా సర్జికల్ ఆంకాలజీ విభాగంలో శస్త్రచికిత్సలు, శిశు మరణాల రేటు తగ్గించేందుకు చేపట్టిన ’సంకల్ప’ ప్రోగ్రాం ద్వారా రిమ్స్కు జాతీయస్థాయి గుర్తింపు, టీబీ నివారణలో జిల్లా యంత్రాంగం సాధించిన పురోగతికి గాను అవార్డులు రావడం అభినందనీయమన్నారు. గర్భిణుల్లో రక్తహీనత (అనిమియా) సమ స్య తీవ్రంగా ఉందని, అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే పౌష్టికాహారం, ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు సక్రమంగా వాడేలా చూడాలన్నారు. అనంతరం ఉత్తమ వైద్య సేవలు అందించిన పలువురు వైద్యులు, సి బ్బందికి, నిక్షయ మిత్రాలకు కలెక్టర్, ఎంపీ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. అ నంత రం నూతన టీబీ ఎక్స్రే యంత్రాన్ని ఆవిష్కరించి, వ్యాధిగ్రస్తులకు పోషన్కిట్లు పంపిణీ చేశా రు. కా ర్యక్రమంలో డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, లీగల్ అడ్వైజర్ గంగారం, వైద్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పదిపరీక్ష కేంద్రం కలెక్టర్ తనిఖీ ఆదిలాబాద్టౌన్: పదో తరగతి వార్షిక పరీక్షలను విద్యార్థులకు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను మంగళవారం తనిఖీ చేశారు. స్థానిక వినాయక్ చౌక్లోని బాలక్ మందిర్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించి వసతుల ఏర్పాటుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వేసవి దృష్ట్యా విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అర్బన్ తహసీల్దార్శ్రీనివాస్, ఫ్లయింగ్ స్క్వాడ్ ఉదయ్రావు, ఆర్ఐయజువేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదవశాత్తు చెరువులోపడి బాలుడు మృతి
బెల్లంపల్లి: ప్రమాదవశాత్తు చెరువులోపడి బాలుడు మృతి చెందిన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై బి. రామకృష్ణ తెలిపిన వివరాల ప్ర కారం బెల్లంపల్లి మున్సిపాలిటీ షంషీర్నగర్ బస్తీకి చెందిన కొల్లూరి రాజేశ్ (15) మంగళవారం తన స్నేహితులైన సాయిచరణ్, దేవ య్య, రాంచరణ్తో కలిసి లంబాడితండా శివారులోని చెరువు వద్దకు ఆడుకునేందుకు వెళ్లాడు. స్నానం చేసేందుకు చెరువులోకి దిగడంతో రాజేశ్కు ఈతరాక నీట మునిగి మృతి చెందాడు. బాలుడు బెల్లంపల్లి బజార్ ఏరియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుని తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. రైలు ఢీకొని ఒకరు..మంచిర్యాలక్రైం: ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఒకరు మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తెలిపారు. స్థానిక చింతపండువాడకు చెందిన గదర్ల బాలరాజు కుమారుడు చంద్రశేఖర్ (54) ప్రైవేటు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రేషన్ బి య్యం తెచ్చేందుకు హమాలివాడ పాత రైల్వే గేటు సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా అతివేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మాజీ జవాన్ దుర్మరణం నేరడిగొండ: బోథ్కు చెందిన బీఎస్ఎఫ్ మాజీ జవాన్ జక్కులవార్ మురళి (39) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం ఇంటినుంచి బయటకు వెళ్లిన మురళి తిరిగిరాలేదు. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో నేరడిగొండ వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ సమీపంలో రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గతంలో బీఎస్ఎఫ్ జవాన్గా దేశానికి సేవలందించారు. -
సీఎం సభ విజయవంతం
కై లాస్నగర్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా బజార్హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో సోమవారం నిర్వహించిన సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బహిరంగసభ విజయవంతమైందని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేశ్జాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. సభను విజయవంతం చేసేందుకు సహకరించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్రెడ్డితో పాటు జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భారీగా తరలివచ్చిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సభ వేదికగా సీఎం ఆదిలాబాద్ అభివృద్ధికి అనేక హామీలు ఇచ్చారన్నారు. జిల్లాకు యూనివర్సిటీ, ఇంజినీరింగ్ కళాశాలను త్వరలోనే మంజూరు చేసి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని ఇది విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుందన్నారు. బోథ్ నియోజకవర్గ వరప్రదాయని కుప్టి ప్రాజెక్ట్ పనులు, అలాగే ప్రాణహిత ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని సీఎం ఇచ్చిన మాట జిల్లా రైతాంగానికి కొండంత అండనిస్తుందని తెలిపారు. జూన్ 2 లోపు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభించేలా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వే లైన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, స్థానిక బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. సహజ వనరులు పుష్కలంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని, పర్యాటక రంగంలో జిల్లాను రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలుపుతామని సీఎం హామీ ఇచ్చారని వివరించారు. ఇందులో పార్టీ నాయకులు గండ్రత్ సుజాత, సాజిద్ఖాన్, అల్లూరి సంజీవరెడ్డి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, బాలురి గోవర్దన్రెడ్డి, బండారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.30 కోట్లు.. 38 పనులు
కైలాస్నగర్: గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆదిలాబాద్ మున్సిపాలిటీకి మంజూరైన రూ.46.70 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధుల్లో రూ.30కోట్లతో కూడిన అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. రూ.10.50 కోట్ల పనులను ఇది వరకు రెండు విడతల్లో ప్రారంభించగా మూడో విడతకు రెండేళ్ల తర్వాత గ్రీన్సిగ్నల్ వచ్చింది. ఈ నిధులతో విలీన కాలనీల్లో 38 పనులు చేపట్టేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర టీయూఎఫ్ఐడీసీ వైస్చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ టి.కే శ్రీదేవి గత నెల 30న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇక విలీన కాలనీల్లో మౌలిక వసతులు మెరుగుపడనున్నాయి. ఏం జరిగిందంటే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీకి టీయూఎఫ్ఐడీసీ కింద రూ.46.70 కోట్ల నిధులు మంజూరు చేసింది. వీటితో పట్టణంలోని వివిధ కాలనీల్లో 49 పనులు చేపట్టాలని అధికారులు ప్రతిపాదించారు. పనులు చేపట్టడమే తరువాయి అనుకున్న సమయంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియ వాయిదా పడింది. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడంతో పాటు ఎమ్మెల్యేగా ఎన్నికై న పాయల్ శంకర్ ఈ పనులను సమీక్షించి మళ్లీ ప్రతిపాదనలు పంపించాలని అధి కారులను ఆదేశించారు. తదనుగుణంగా అధికారులు మరోసారి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. రెండో సారి ప్రతిపాదనల మేరకు తొలి విడతలో రూ.5.40 కోట్ల విలువైన ఆరు పనులకు, రెండో విడతలో రూ.5.10 కోట్ల విలువైన 13 పనులకు గతంలోనే టీయూఎఫ్ఐడీసీ నుంచి ఆమోదం లభించింది. దీంతో ఆయా పనులను ప్రారంభించారు. అందులో కొన్ని ఇప్పటికే పూర్తవగా మరికొన్ని కొనసాగుతున్నాయి. తాజాగా మంజూరైన రూ.30 కోట్లతో ఆయా పనులు చేపట్టేందుకు టీయూఎఫ్ఐడీసీ నుంచి ఆమోదం లభించింది. కాగా, ప్రతిపాదిత నిధుల్లో మరో రూ.6.20కో ట్లు మంజూరు కావాల్సి ఉంది. మెరుగుపడనున్న వసతులు.. పట్టణంలో మావల, బట్టిసావర్గాం, అనుకుంట, రాంపూర్ గ్రామ పంచాయతీల్లోని పలు కాలనీలు విలీనమై ఏడేళ్లు గడిచినా ఇప్పటికి కనీస వసతులకు నోచుకోవడం లేదు. తాజాగా ఆమోదించిన నిధులతో బంగారుగూడ, బెల్లూరి, కేఆర్కే కాలనీ, బాలాజీనగర్, కుమ్మరికుంట, దుర్గానగర్, కో జాకాలనీ, శంకర్గుట్ట, మణిపూర్, రాంనగర్, న్యూ హౌసింగ్ బోర్డు, 170 సర్వేనంబర్, అగ్రజాటౌన్షిప్, టైలర్స్కాలనీ, సుభాష్నగర్, టీచర్స్కాలనీ, దస్నాపూర్, దోబీకాలనీ, పోలీస్కాలనీ, రాంపూర్, కై లాస్నగర్, హనుమాన్ నగర్ కాలనీల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, కల్వర్టులు, డ్రెయినేజీలను నిర్మించనున్నారు. రూ.30 కోట్లలో రూ.27కోట్లను ఈ కాలనీల్లోనే వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీంతో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని విలీన కాలనీల్లో మౌలిక వసతులు మెరుగుపడనున్నాయి. ఇది ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ఏడేళ్ల క్రితం విలీనమైన టీచర్స్ కాలనీలోని డ్రెయినేజీ పరిస్థితి. కాలువల నిర్మాణం లేకపోవడంతో మురుగునీరంతా ఇలా రోడ్డుపై ప్రవహిస్తూ దుర్గంధం వెదజల్లుతోంది. అయితే ఇలాంటి కాలనీల్లో మౌలిక వసతులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో త్వరలోనే ఈ పరిస్థితి దూరం కానుంది. పట్టణ అభివృద్ధికి దోహదం రెండేళ్ల క్రితం పంపిన ప్రతిపాదనలకు సంబంధించి రూ.30 కోట్లతో పనులు చేపట్టేందుకు ఆమోదిస్తూ టీయూఎఫ్ఐడీసీ ఉన్నతాధికారుల నుంచి ఇటీవల ఉత్తర్వులు వచ్చాయి. త్వరలోనే ఈ నిధులతో విలీన కాలనీల్లో అభివృద్ధి పనులు చేపడతాం. మరో రూ.6కోట్ల వరకు రావాల్సి ఉన్నాయి. అవి కూడా విడుదలైతే పట్టణంలో మరింత అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. – బండారి అనూష, మున్సిపల్ చైర్పర్సన్ -
అంత్యక్రియలకు వెళ్లి వస్తూ అనంత లోకాలకు
సారంగపూర్: అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు మహారాష్ట్రలోని శివుని గ్రామానికి చెందిన ఆస్తపోలు సాయన్న(85) సోమవారం మండలంలోని కౌట్ల(బి)లోని తమ బంధువు అంత్యక్రియలకు హాజరయ్యాడు. రాత్రి ఆటోలో మహారాష్ట్రకు వెళ్తుండగా రాంసింగ్ తండా వద్దకు చేరుకోగానే ఎదురుగా ద్విచక్ర వాహనంపై నిర్మల్ వైపు వెళ్తున్న ముగ్గురు యువకులు ఆటోకు ఎదురుగా వచ్చారు. గమనించిన డ్రైవర్ బైక్ను తప్పించే క్రమంలో అదుపుతప్పి ఆటో బోల్తాపడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న సాయన్న అక్కడికక్కడే మృతి చెందగా అందులో ఉన్న తిరుపతి, లక్ష్మితో పాటు బైక్ నడుపుతున్న ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్కు చెందిన సంజీవ్కు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ట్రిపుల్రైడింగ్ చేస్తూ ప్రమాదానికి కారకుడైన సంజీవ్పై కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
108 సిబ్బందికి ఉత్తమ పురస్కారం
జన్నారం: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జన్నారం 108 అంబులెన్స్ ఈఎంటీ, పైలట్లు ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతీలో ఈఎంటీ కిషన్, పైలట్ రఫీక్ మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఫ్యామిలి వెల్ఫేర్ కమిషనర్ క్రిస్టియానో, హెల్త్ కమిషనర్ సంగీత చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వారిని జిల్లా ప్రోగ్రాం అధికారి సమ్రాట్, జిల్లా ఈఎంఈ కొండల్రావు అభినందించారు. ప్రథమ చికిత్స ప్రదర్శన పోటీలుకాసిపేట: రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా మంగళవారం మందమర్రి ఏరియా కాసిపేట గనిపై ప్రథమ చికిత్స(ఫస్ట్ఎయిడ్) ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ సూపరింటెండెంట్ లోక్నాథ్రెడ్డి, డెప్యూటీ జనరల్మేనేజర్ విజయ్కుమార్, మేనేజర్ సతీష్, ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేశ్, రక్షణాధికారి నిఖిల్, డెప్యూటీ మేనేజర్ వెంకటేష్, సంక్షేమాధికారి మీర్జాగౌస్, పిట్ సెక్రెటరీ లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
సీవోఈ పిలుస్తోంది!
బెల్లంపల్లి:ప్రభుత్వ సాంఘిక సంక్షేమ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ (సీవోఈ) గురుకులాలు, రెగ్యులర్ జూనియర్ కళాశాలలు, వృత్తి విద్య సైనిక కళాశాలల్లో 2026–2027 విద్యాసంవత్సరంలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. గతేడాది పదో తరగతి మార్కుల ప్రాతిపదికన ప్రవేశం కల్పించగా ఈసారి మాత్రం పూర్వ పద్ధతిని అనుసరించనున్నారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ప్రతి భావంతులైన విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నా రు. ప్రవేశ పరీక్షకు సంబంధించి టీజీఎస్ డబ్ల్యూఆర్– ఆర్జేసీసెట్–2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 25 తుది గడువు సంక్షేమ గురుకుల సీవోఈలు, రెగ్యులర్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించనున్న పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు ఈనెల 25లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హులు వీరే.. 2025–26 విద్యాసంవత్సరంలో రెగ్యులర్ ప్రాతిపదికన ఐసీఎస్ఈ/సీబీఎస్ఈ ద్వారా పదోతరగతి లేదా 2026 మార్చిలో ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మరిన్ని వివరాల కోసం సమీపంలోని టీజీఎస్డబ్ల్యూఆర్ జూనియర్ కళాశాలల్లో సంప్రదించాలని సూచించారు. మే 13న ప్రవేశ పరీక్ష దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మే 13న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు నిర్దేశించిన కేంద్రాల్లో హాజరుకావాల్సి ఉంటుంది. ఏ పరీక్ష కేంద్రం కేటాయిస్తారో పరీక్షకు ముందస్తుగా వెల్లడిస్తారు. తొమ్మిది ప్రీమియర్ సీవోఈలు సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 9 ప్రీమియర్ సీవోఈ కళాశాలలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని గౌలిదొడ్డి బాలురు, బాలికల కళాశాలలు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ బాలురు, రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలురు, ఇబ్రహీంపట్నంలో బాలురు, కరీంనగర్ జిల్లా అల్గునూరులో బాలికలు, హైదరాబాద్ జిల్లా మహేంద్ర హిల్స్లో బాలికలు, రంగారెడ్డి జిల్లా సరూర్నగర్లో బాలికల ప్రీమియర్ సీవోఈ కళాశాలలు ఉన్నాయి. వీటిలో సీటు సాధించిన విద్యార్థులకు ఐఐటీ, నీట్ అంశాల్లో విద్యాబోధన ఉంటుంది. ఇతర నాన్ ప్రీమియర్ సీవోఈలు, రెగ్యులర్ జూనియర్, వృత్తి విద్య, సైనిక కళాశాలల్లో అత్యుత్తమ విద్యాబోధన చేసివిద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతారు. ఉమ్మడి జిల్లాలో.... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాంఘిక సంక్షేమ నాన్ ప్రీమియర్ సీవోఈ జూనియర్ కళాశాలలు రెండు ఉన్నాయి. బెల్లంపల్లిలో బాలురు, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బాలికల సీవోఈ కళాశాలలు పని చేస్తున్నాయి. అదే తీరుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. -
స్టాక్ మార్కెట్ పేరుతో అమాయకులకు టోకరా
ఉట్నూర్రూరల్: ఆన్లైన్ స్టాక్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయంటూ అమాయకులను మోసం చేసి రూ.కోటి 19 లక్షలు వసూలు చేసిన ఇద్దరు ఘరానా మోసగాళ్లను ఉట్నూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. ఉట్నూర్ మండలం నవోదయనగర్కు చెందిన సయ్యద్ జావీద్, ఘన్పూర్కు చెందిన కొత్తపెల్లి గంగాధర్ ఆన్లైన్ స్టాక్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి ఉట్నూర్, పరిసర గ్రామాలకు చెందిన 25 మంది అమాయకులను పెట్టుబడులు పెట్టేలా ప్రలోభపెట్టారు. మొత్తం రూ.కోటి 19లక్షల 4వేల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఈ డబ్బులతో జల్సాలకు పాల్పడుతూ, ఇళ్లు, ఓపెన్ ప్లాట్స్ కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. శ్యాంపూర్కు చెందిన ఆనంద్వార్ మనోజ్ కుమార్ ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి మూడు మొబైల్ ఫోన్లు, బ్యాంక్ పాస్ బుక్కులు, ఓపెన్ ప్లాట్, ఇళ్లకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సోమవారం ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, అధిక లాభాల పేరుతో మోసాలకు గురి కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. -
‘పీఎంశ్రీ’కి ప్రచార నిధులు
మంచిర్యాలఅర్బన్/లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోంది. అయినా ఏటా ప్రవేశాలు తగ్గుతున్నాయి. ప్రవేశాలు పెంచేందుకు ఉపాధ్యాయులు కూడా తమ వంతు చర్యలు చేపడుతున్నారు. బడిబాట కార్యక్రమం చేపట్టి ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు జరిగేలా చూస్తున్నారు. పీఎంశ్రీ పాఠశాలల్లో... ప్రధాన మంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ )పాఠశాలల్లో ప్రవేశాల పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించింది. పాఠశాలల్లో అడ్మిషన్లు తగ్గుతుండడంతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జూన్లో నిర్వహించే బడిబాట కార్యక్రమాన్ని ఏప్రిల్లోనే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. 2026–27 విద్యా సంవత్సరం బడుల్లో విద్యార్థుల నమోదును పెంచేందుకు కమ్యూనిటీ మొబిలైజేషన్ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇంటింటా ప్రచారం, అవగాహన సదస్సులు, కరపత్రాల పంపిణీ, ఫ్లెక్స్బ్యానర్ల ప్రదర్శన నిర్వహించేందుకు ఒక్కో పాఠశశాలకు రూ.4,691 చొప్పున నిధులు మంజూరయ్యాయి. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, ఎస్ఎంసీ సభ్యుల సహకారంతో అడ్మిషన్ల డ్రైవ్ నిర్వహించనున్నారు. ముందస్తు ప్రవేశాలతో.. పీఎంశ్రీ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు ముందస్తు అడ్మిషన్లకు శ్రీకారం చుట్టారు. పాఠశాలలో చేరితే కలిగే ప్రయోజనాలు, విద్య ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. పీఎంశ్రీ పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు, ఆధునిక బోధనా పద్ధతులు, స్మార్ట్ తరగతి గదులు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయాలు, క్రీడా సౌకర్యాలు, సురక్షిత పారిశుద్ధ్యంపై విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. ‘మాబడిలో చేరండి’ అంటూ టీచర్లు ఇంటింటా ప్రచారం చేపట్టారు.ఉమ్మడి జిల్లాలో పీఎంశ్రీ పాఠశాలలు, మంజూరైన నిధులు జిల్లా పాఠశాలలు నిధులు (రూ.ల్లో) నిర్మల్ 12 56,292 కుమురంభీం 13 60,983 ఆదిలాబాద్ 15 70,365 మంచిర్యాల 16 75,056 -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
మామడ: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చే సుకుంది. మండలంలోని దిమ్మదుర్తికి చెందిన దండుగుల సా యిరాం(26) సోమవారం రాత్రి మామడ నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలంను పోలీసులు సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామస్తుల ఆందోళన యువకుడి మృతికి కారకులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ మంగళవారం గ్రామస్తులు నిర్మల్–ఖానాపూర్ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. సీఐ గోవర్ధన్రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కారకులను శిక్షిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. మృతికి కారకులపై కేసు యువకుడి మృతికి కారకులను మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ సాయికిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. అజాగ్రత్తగా ట్రాక్టర్ నడిపి ప్రమాదానికి కారకులైన మైనర్ బాలుడు, వాహన యాజమాని అలకుంట రాములుపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
వందశాతం ప్రవేశాలు కల్పించాలి
● రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ అదనపు డైరెక్టర్ శ్రీధర్ కైలాస్నగర్: జిల్లాలోని షెడ్యూల్డు కులాల ప్రభుత్వ వసతి గృహాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను వంద శాతం ప్రవేశాలు కల్పించాలని రాష్ట్ర షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ అదనపు డైరెక్టర్ సి. శ్రీధర్ ఆదేశించారు. జిల్లాలో పర్యటించిన ఆ యన ఇచ్చోడ, బజార్హత్నూర్ ఎస్సీ బాలుర, బా లికల వసతి గృహాలతో పాటు ఆదిలాబాద్లోని కళాశాల బాలికల వసతి గృహాన్ని మంగళవారం సందర్శించారు. రికార్డులు, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సౌకర్యాలపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన లోపాలను తక్షణమే సవరించాలని అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వసతి గృహ సంక్షేమ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వసతి గృహాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి విద్యార్థులకు డిజిటల్ తరగతులు నిర్వహించాలన్నారు. ప్రతి నె లా వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి రెండు నెలలకోసారి సమావేశం నిర్వహించి నాణ్య మైన ఆహారం అందేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల సమీక్ష, ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, మ్యానువల్ స్కావెంజర్స్ కమిటీ సమావేశాలను ప్రతి మూడు నెలలకు ఒకసారి విధిగా నిర్వహించా లని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారి సునీతా కుమారి, సహాయ అభివృద్ధి అధికారులు నారాయణరెడ్డి, నర్సింగ్ పాల్గొన్నారు. 10న ఆన్లైన్ మూల్యాంకనంపై సమావేశంఆదిలాబాద్టౌన్: ఈ విద్యా సంవత్సరం నుంచి కాకతీయ యూనివర్సిటీ పరిధిలో చదువుతున్న విద్యార్థుల జవాబు పత్రాలను ఆన్లైన్ విధానంలో మూల్యాంకనం చేయాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు. దీనిపై అవగాహన కల్పించేందుకోసం ఈ నెల 10న జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో సమావేశం నిర్వహించనున్నారు. కాగా ఈ విఽ దానాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నట్లు టీపీడీఎంఏ రాష్ట్ర సభ్యులు, బేల కీర్తన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వరప్రసాద్ రావు తెలిపారు. ఆన్లైన్ విధానంలో మూల్యాకంన చేయడం ద్వా రా ఫలితాలు త్వరగా రావడంతో పాటు అక్రమాలు జరగకుండా ఉంటాయని 15 ఏళ్ల క్రిత మే విషయాన్ని యూనివర్సిటీ అధికారుల దృష్టి కి తీసుకువెళ్లినట్లుగా ఆయన గుర్తు చేశారు. -
సోమగూడంలో భూ వివాదంపై ఉద్రిక్తత
కాసిపేట: బెల్లంపల్లి మండలంలోని సోమగూడం భరత్కాలనీ, ఆకెనపల్లి శివారులో సర్వే నంబర్ 3లో 2.30 ఎకరాల భూమి స్వాఽధీనానికి కోర్టు ఆదేశాలతో మంగళవారం జేసీబీతో వచ్చిన అధికారులను భూ బాధితులు, స్థానిక నాయకులు అడ్డుకొని రోడ్డుపై బైఠాయించారు. దీంతో సోమగూడంలో ఉద్రిక్తత నెలకొంది. రాంకిష్టయ్య కుటుంబ సభ్యులు 2.30 ఎకరాల భూమి తమదని కోర్టును ఆశ్రయించారు. సాక్ష్యాలు పరిశీలించిన కోర్టు రాంకిష్టయ్యకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇప్పటికే ఆ భూమిలో పలువురు అనధికారికంగా ప్లాట్లు చేసి నిర్మాణాలు చేపట్టారు. 13 ఇళ్ల నిర్మాణాలు ఉండగా మిగతా సగం ప్లాట్లుగా మారాయి. కోర్టు తీర్పు ప్రకారం 13 ఇళ్లను సైతం కూల్చివేసి మొత్తం భూమిని స్వాధీనపర్చుకోవాల్సిందిగా పేర్కొంది. గతంలో తీర్పుకు అనుకూలంగా కోర్టును ఆశ్రయించిన యజమానులకు పరిహారం ఇస్తామని బాధితులు తెలపడంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇప్పటి వరకు పరిహారం ఇవ్వకపోవడంతో యజమానులు మరోసారి కోర్టును ఆశ్రయించగా కూల్చివేసేందుకు పోలీసు సిబ్బందితో యజమానులు జేసీబీతో అక్కడికి చేరుకున్నారు. బాధితులకు మద్దతుగా స్థానికులు తరలివచ్చి ఉదయం నుంచి రాత్రి వరకు రోడ్డు పైనే బైఠాయించారు. సాయంత్రం ఇరువర్గాల మధ్య కోర్టు సమీపంలో చర్చలు జరిపి కోటి రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మౌనిక, కనకరాజు, ఉపసర్పంచ్ విజయ–భూమయ్య పాల్గొన్నారు. -
మూల్యాంకన బకాయిలు చెల్లించాలి
ఆదిలాబాద్టౌన్: గతేడాది పదో తరగతి మూల్యాంకన బకాయిలు వెంటనే చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టెన్త్ స్పాట్ కేంద్రం వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణకుమార్ మాట్లాడుతూ, గతేడాది మూల్యాంకన బకాయిలను ఇప్పటి వరకు చెల్లించకపోవడం విచారకరమన్నారు. వెంటనే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు కె. కిష్టన్న, వృకోధర్, నాగేందర్, గోపాల్ సింగ్, శశికళ , సతీష్, చంద్రశేఖర్, రవీందర్, స్వామి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
బెటాలియన్లో అభివృద్ధి పనులు ప్రారంభం
ఆదిలాబాద్రూరల్: బెటాలియన్ అభివృద్ధి పనులు సిబ్బంది సంక్షేమానికి, శిక్షణా ప్రమాణాల మెరుగుదలకు ఎంతో దోహదపడతాయని తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంజయ్కుమార్ జైన్ అన్నారు. మండలంలోని యాపల్గూడ శివారులోని 2వ పోలీస్ బెటాలియన్ను మంగళవారం ఆయన సందర్శించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, సి బ్బంది శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించేందుకు క్రీడా సదుపాయాలు ముఖ్య పాత్ర పోషి స్తాయన్నారు. ఆధునిక సదుపాయాలతో బెటా లియన్ మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించగలదన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, కుమురం ఆసిఫాబాద్ ఎస్పీ నితికాపంత్, 2వ బెటాలియన్ కమాండెంట్ బి.వెంకటేశ్వర రెడ్డి, ఏఎస్పీ మౌనిక, సురేందర్, తదితరులు ఉన్నారు. -
యువతి ఆత్మహత్య కేసులో నిందితుడు అరెస్టు
● నిందితునికి 15 రోజుల రిమాండ్ పామూరు: కోరిక తీర్చమని బలవంతం చేయడంతో మనస్తాపానికి గురై యువతి ఆత్మహత్య చేసుకుందని సీఐ మాకినేని శ్రీనివాసరావు, ఎస్సై కట్టా అనూక్ తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని అయ్యవారిపల్లె గ్రామానికి చెందిన బోడ మాధవి పామూరులోని సెయింట్మార్స్క్ ప్రైౖవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తోంది. మండలంలోని మోపాడు కొండారెడ్డిపల్లె గ్రామానికి చెదిన షేక్.నాగూర్బాషా తన పిల్లలను అదేపాఠశాలలో చదివిస్తుండగా వారికోసం వెళ్లి వస్తూండేవాడు. ఈ క్రమంలో నాగూర్బాషా టీచర్ బోడా మాధవి ఫోన్నంబర్ తీసుకుని ఆమెతో క్రమంగా స్నేహం ఏర్పరచుకుని ఆమెతో ఫోన్ ఛాటింగ్, వీడియో కాల్స్ చేసేవాడు. అయితే మాధవికి తెలియకుండా నూడ్ వీడియోస్ స్క్రీన్ రికార్డు చేసి వాటితో ఆమెతో బెదిరించేవాడు. తన కోరిక తీర్చకుంటే వీడియోలు సోషల్ మీడియాలో ఉంచుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పరువు పోతుందని భయపడిన మాధవి ఈ నెల 4వ తేదీ సాయంత్రం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. విచారణలో మాధవి బలవాన్మరణానికి కారకుడైన నాగూర్బాషాను పామూరులోని కందుకూరు రోడ్డులో అరెస్ట్చేసినట్లు వెల్లడించారు. నిందితున్ని కనిగిరి ఏజేఎఫ్సీఎం కోర్టులో హాజరుపరచగా 15 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. -
ముదిరిన టోల్ప్లాజా వివాదం
పెద్దదోర్నాల: మండల పరిధిలోని హసానాభాద, జమ్మిదోర్నాల గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన టోల్ ప్లాజా ఆయా గ్రామాల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఈ వివాదం రెండు గ్రామాల ప్రజలు ఎదురు పడటంతో తోపులాటకు దారి తీసింది. రెండు గ్రామాల నడుమ నిర్మించిన టోల్ప్లాజాకు తమ ఊరి పేరు పెట్టాలంటే, కాదు తమ ఊరి పేరే పెట్టాలంటూ హసానాబాద, జమ్మిదోర్నాలకు చెందిన గ్రామస్తులు ఏకంగా సోమవారం రోడ్లపైకి చేరి ఆందోళన చేయటంతో ఏకంగా రెండు గంటల పాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో టోల్ప్లాజాకు ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో మండుతున్న ఎండలకు పలు వాహనాల్లోని ప్రయాణికులతో పాటు చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. వివరాల్లోకి వెళితే..ఆయా రెండు గ్రామాల నడుమ ఏర్పాటు చేసిన టోల్ప్లాజాకు జమ్మిదోర్నాల పేరు పెట్టాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. అయితే టోల్ ప్లాజా ఏర్పాటుకు తమ గ్రామంలోని రైతులకు చెందిన స్థలాలనే వినియోగించారని, కోట్ల రూపాయల విలువ చేసే స్థలాలను టోల్ ప్లాజా నిర్మాణాలకు తాము కారు చౌకగా ప్రభుత్వానికి ఇచ్చామని కాబట్టి టోల్ప్లాజాకు తమ ఊరి పేరే పెట్టాలని హసానాబాదకు చెందిన పలువురు రైతులు వాదిస్తున్నారు. అయితే టోల్ప్లాజాకు తమ ఊరి పేరు పెట్టాలంటూ ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేసిందని, అందువల్ల తమ ఊరి పేరే పెట్టాలని జమ్మిదోర్నాలకు చెందిన పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం టోల్ ప్లాజాకు నేమ్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారన్న సమాచారంలో రెండు గ్రామాల ప్రజలు ఒక్క సారిగా రోడ్లపైకి చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కొందరు ఆకతాయిలు ఒకరిపై ఒకరు వాటర్ బాటిళ్లను విసురుకోవడంతో గందరగోళం వాతావరణం నెలకొంది. దీంతో పాటు ఆయా గ్రామాలకు చెందిన మహిళలు, పురుగు మందు డబ్బాలతో హల్చల్ చేశారు. సంఘటనా స్థలిలో కొద్ది మంది మాత్రమే పోలీసులు ఉన్నా, అక్కడ భారీగా గుమిగూడిన గ్రామస్తులను అదుపులోకి తీసుకురావడం అసాధ్యమైంది. దీంతో సమాచారమందుకున్న యర్రగొండపాలెం సీఐ అజయ్కుమార్ సంఘటనా స్థలికి చేరుకుని ఇరువర్గాలను నచ్చజెప్పటంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం సీఐ అజయ్కుమార్, నేషనల్ హైవే కాంట్రాక్టర్ రవీంద్రారెడ్డితో ప్రత్యేకంగా చర్చించారు. టోల్ప్లాజాకు సంబంధించిన వివాదాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. రెండు గ్రామాలకు చెందిన వారి మధ్య తోపులాట టోల్ప్లాజాకు తమ ఊరి పేరే పెట్టాలని ఇరు గ్రామాలు పట్టు గ్రామస్తులు రోడ్లపై భైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జాం రెండు గంటల పాటు ఎండ తీవ్రతకు అల్లాడిన చిన్నారులు, వృద్ధులు -
పిడుగులు, ఈదురుగాలుల బీభత్సం
సాక్షి నెట్వర్క్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సోమవారం పిడుగులు, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపించగా..సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆ తరువాత ఉరుములు మెరుపులతో పిడుగులు పెద్ద సంఖ్యలో పడ్డాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందారు. ముఖ్యంగా పొలం పనులు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో పిడుగులు పడటంతో రైతులు, కూలీలు ఇబ్బందులు పడ్డారు. త్రిపురాంతకం: పిడుగులు, ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి కళ్లాల్లో ఆరబెట్టిన మిరపకాయలు పూర్తిస్థాయిలో దెబ్బతినగా, పిడుగుపాటుకు ఓ ఎద్దు మృతి చెందింది. ఈ సంఘటన త్రిపురాంతకం మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో లింగాల కోటేశ్వరరావుకు చెందిన 1.50 లక్షల విలువ చేసే ఎద్దు మృతి చెందగా, అదే సమీపంలో మరో ఎద్దు తప్పించుకుని పరిగెడుతూ ఓ మహిళలను ఢీకొట్టడంతో ఆమె గాయపడింది. గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షానికి రైతులు బెంబేలెత్తారు. ఒక్క సారిగా వాతావరణంలో మార్పులు చేసుకుని భారీ వర్షం కురవటంతో కళ్లాల్లోని మిరిప కాయలు పూర్తిగా తడిచిపోయాయని రైతులు వాపోయారు. వాటికి పట్టాలు కప్పే పరిస్థితి కూడా లేకపోవటంతో భారీగా పంట నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. దీంతో పాటు అరటి, బొప్పాయి, మెక్కజొన్న పంటలకు సైతం నష్టం వాటిల్లిందని వారు వాపోతున్నారు. పొన్నలూరు: పొన్నలూరులో పిడుగు పడి వ్యక్తికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని బాప్టిస్ట్ నగర్కు చెందిన చుండి సామ్యేలు గ్రామానికి సమీపంలో ఉన్న పొలం దగ్గరకు వెళ్లాడు. ఇంటికి వచ్చే క్రమంలో ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం పడటంతో మార్గ మధ్యలో చెట్టు కిందకు వెళ్లాడు. ఆ సమయంలో ఉరుములతో చెట్టుకు సమీపంలో పిడుగు పడటంతో వీపు భాగం, కాళ్లకు స్వల్ప గాయాలతో సృహతప్పి పడిపోయాడు. దీంతో అటుగా వస్తున్న వారు గమనించి బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి చికిత్స నిమిత్తం స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలు తరలించారు. పొదిలి రూరల్: మండలంలోని ఓబులక్కపల్లిలో సోమవారం పిడుగుపడి మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన తిరుమలశెట్టి భాగ్యలక్ష్మి పొలంలో పనులు చేస్తుండగా సాయంత్రం సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఆ సమయంలో పొలంలో పిడుగుపడిన సమీపంలో ఉన్న భాగ్యలక్ష్మి శరీరంలోని వెనుక వైపు, చేయి తీవ్రగాయాలతో ఆపస్మారక స్థితిలో జారుకుంది. స్థానికులు గ్రామస్తులు తెలపడంతో వెంటనే పొదిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. పొదిలి: పొదిలి పట్టణంలో ఉరుములు మెరుపులతో సోమవారం భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో స్థానిక శ్రావణి ఎస్టేట్లోని చెరుకూరి నాగవర్థనమ్మ భవనంపై పిడుగు పడింది. ఈ పిడుగుపాటుకు భవనం ఎలివేషన్ పాక్షికంగా దెబ్బతినటంతో పాటు, అద్దాలు పగిలిపోయాయి. అదృష్టవశాత్తూ ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. నందిపాలెం గ్రామంలోని పొలాల్లో విపరీతంగా వీచిన గాలికి కరెంటు స్తంభం దెబ్బతింది. విరిగిపోయిన పోల్ కొంత భాగం తీగలకు వేలాడుతుంది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మర్రిపూడి: మండలంలోని వేమవరం, కూచిపూడి, మర్రిపూడి, గుండ్లసముద్రం, అంకేపల్లి గ్రామాల్లో సోమవారం ఉరుములు, మెరుపులతో వడగండ్ల వాన కురిసింది. అకాల వర్షానికి వేమవరంలో పొగాకు, టమోటా పంటలు దెబ్బతిన్నాయి. గుండ్లసముద్రం దళితవాడలో ఇళ్లల్లోకి వర్షం నీరు చేరింది. వల్లాయపాలెం, మర్రిపూడి, గంగపాలెం గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వడగండ్లతో కూడిన వర్షం కురవడంతో రేకులు ఇళ్లు దెబ్బతిన్నాయి. వడగండ్ల వర్షానికి పంట నష్టం సంభవించింది. పంట పొలాల్లో వర్షం నీరు నిలిచాయి. పొదిలి మండలం ఓబులక్కపల్లిలో పిడుగుపాటుకు గాయపడిన భాగ్యలక్ష్మి త్రిపురాంతకం కల్లాల్లో తడిసిన మిరపకాయలు -
తౌషిక్ మృతిపై విచారణ
ఒంగోలు టౌన్: జిల్లాలో సంచలనం సృష్టించిన సింగరాయకొండ చైతన్య నవోదయ స్కూలు విద్యార్థి సయ్యద్ తౌషిక్ అనుమానాస్పద మృతిపై నెల్లూరు అడిషనల్ ఎస్పీ సీహెచ్ సౌజన్య విచారణ నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలతో నెల్లూరు ఏఎస్పీ సౌజన్యకు విచారణ బాధ్యతలు అప్పగించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం కనిగిరి డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆమె తౌషిక్ తల్లిదండ్రులు సయ్యద్ అలీ, మౌలాబీలతో సుదీర్ఘంగా మాట్లాడారు. తల్లిదండ్రుల అనుమానాలను ఒక్కొక్కటిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. స్కూలు యజమాని కుమారుడు ఒక ఉపాధ్యాయునితో సన్నిహితంగా ఉండటం చూసినందుకు వల్లే తౌషిక్ను హత్య చేసినట్లు తలిదండ్రులు ఏఎస్పీ దృష్టికి తీసుకొని వచ్చినట్లు సమాచారం. విచారణ అనంతరం బయటకు వచ్చిన తౌషిక్ తల్లిదండ్రులు మాట్లాడుతూ తమకు న్యాయం చేయాలని కోరారు. -
బైక్లు ఢీకొని ఇద్దరికి గాయాలు
మార్కాపురం రూరల్: ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీకొని ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని వేములకోట జగనన్న కాలనీ వద్ద ఎదురెదురుగా వస్తున్న బైక్లు ఢీకొని ఇద్దరు వాహనదారులకు గాయాలయ్యాయి. మార్కాపురం నుంచి నికరంపల్లి, చింతగుంట్ల నుంచి మార్కాపురం వస్తున్న బైక్లు ఢీకొన్నాయి. ప్రమాదంలో ఆనెకాళ్ల పిచ్చిరామిరెడ్డి తలకు, చేతులకు గాయాలు కాగా మద్దుపల్లి సాయి కల్యాణ్ ప్రసాద్కు మోకాలికి తీవ్ర గాయమైంది. మేడం ఆంజనేయులకు ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో ఒంగోలు తరలించారు. రూరల్ ఎస్సై వేమన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కూలి బతుకులపై పిడుగు
యర్రగొండపాలెం/పుల్లలచెరువు/కనిగిరి రూరల్/ముండ్లమూరు/దర్శి: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం మండుటెండలో ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. వడగండ్ల వానకు తోడు భీకర శబ్దాలతో పిడుగులు పడ్డాయి. బతుకు దెరువు కోసం పంట పొలాల్లో పనులు చేసుకునే కూలీలు, పశువులు మేపుకునే కాపరుల పాలిట ఆ పిడుగులు మృత్యుపాశాలయ్యాయి. పిడుగుల ధాటికి ఆరుగురు మృత్యువాత పడగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ● పుల్లలచెరువులోని మొక్కజొన్న ఫ్యాక్టరీ వద్ద పిడుగు పడటంతో బీహార్ రాష్ట్రం అరారియా జిల్లా అచర గ్రామానికి చెందిన కన్నయ్య(18) మృతి చెందాడు. ఆయనతో పాటు ఉన్న అచర గ్రామానికి చెందిన అజాద్ కుమార్, రజనీష్ కుమార్, నితీష్ కుమార్, రాజు కుమార్కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ మండలంలోని యండ్రపల్లి గ్రామానికి సమీపంలో మొక్కజొన్న తోటలో కంకులు కోస్తున్న సమయంలో పిడుగు పడటంతో రైతు కూలి బొందలపాటి నాగయ్య (60) మృతి చెందాడు. మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో పుల్లలచెరువులోని మొక్కజొన్న ఫ్యాక్టరీలో పంట అన్లోడ్కు వచ్చిన లారీలో ఉన్న కంకులు తడుస్తాయని బీహార్ రాష్ట్రం నుంచి వచ్చిన కూలీలు ఆ లారీపై పట్టలు కప్పుతున్నారు. ఈ సమయంలో పెద్ద శబ్దంతో అక్కడికి సమీపంలో పిడుగుపడింది. పిడుగు ధాటికి కూలీలు కింద పడిపోయారు. వారిలో కన్నయ్య మృతి చెందాడు. మిగిలిన కూలీలకు గాయాలయ్యాయి. గాయాలైన వారు యర్రగొండపాలెంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. సంఘటన తెలిసిన వెంటనే సీఐ అజయ్కుమార్, ఎస్సై సాంబశివరావు హుటాహుటిన వైద్యశాలకు వచ్చి క్షతగాత్రులను విచారించారు. ఈ కేసులను నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ● అదే విధంగా పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని మిట్టమీదపల్లి గ్రామానికి చెందిన మడతల శ్రీనివాసరెడ్డి(37) పశువుల వ్యాపారం చేసుకుంటూ పుల్లలచెరువు మండలంలోకి రాగా వర్షంతో పాటు మెరుపులు, ఉరుములు రావడంతో సమీపంలోని చెట్టు వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో పిడుగు పడడంతో శ్రీనివాసరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. చెట్టు తోర్రలో పిడుగు పడడంతో చెట్టు కూడా కాలిపోయిందని గ్రామస్తులు తెలిపారు. ● ముండ్లమూరు మండలంలోని వేములబండ పొలాల్లో సోమవారం సాయంత్రం పిడుగుపడి పసుపుగల్లు గ్రామానికి చెందిన రావులపల్లి శివకృష్ణ (19) మృతిచెందాడు. శివకృష్ణ తన బంధువులైన రావులపల్లి శ్రీను, మల్లయ్య, మరికొందరితో కలిసి వేములబండ రైతుల పొలాలకు గొర్రెలను కౌలుకు తీసుకుని మేత మేపుకుంటున్నారు. సోమవారం సాయంత్రం శివకృష్ణ సెల్ఫోన్ మాట్లాడుతుండగా అతడు ఉన్న ప్రదేశంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో పిడుగుపడి అక్కడికక్కడే మృతిచెందాడు. తోటి కాపరులు శివకృష్ణ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో అతని తల్లిదండ్రులు కుమార్, భవానీలు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని తహశీల్ధార్ ఆర్ శ్రీకాంత్, ఆర్ఐ మూర్తి, ఏఎస్ఐ బి పవన్ కుమార్ పరిశీలించారు. ● దర్శి మండలం శామంతపూడిలో ఆవుల మల్లికార్జునరావు (26) సోమవారం మేత కోసం పొలానికి వెళ్లాడు. ఆ సమయంలో అతనిపై పిడుగుపడింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. భార్య ప్రస్తుతం గర్భిణిగా ఉంది. మృతి వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు విలపించారు. ● కనిగిరిలో పిడుగుపాటుకు రైల్వే పనుల కోసం వచ్చిన కార్మికుడు దుర్గేష్ కుమార్ (24) మృతి చెందాడు. బీహార్కు చెందిన దుర్గేష్ కుమార్ వారం రోజుల క్రితం కనిగిరి సమీపంలోని పోలవరం, కలగట్ల వద్ద జరుగుతున్న రైల్వే లైన్ పనుల కోసం వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడ్డాయి. రైల్వే లైన్ సమీపంలో పిడుగు పడటంతో అక్కడే పనులు చేస్తున్న కార్మికుడు దుర్గేష్ మృతి చెందాడు. -
సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలి
మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లాలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రజల సమస్యలకు అధికారులు సానుకూలంగా చర్యలు తీసుకొని పరిష్కార మార్గం చూపాలని కలెక్టర్ విజయ సునీత ఆదేశించారు. మార్కాపురం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్జీదారులు తీసుకొచ్చే సమస్యలకు రాతపూర్వకంగా ఎండార్స్మెంట్ ఇవ్వాలని సూచించారు. అలాగే వారి సమస్యలను పరిష్కరించి అర్జీదారులతో కలిసి దిగిన ఫొటోను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. అర్జీదారులకు సరైన సమాచారం ఇవ్వకపోవడం వలనే పదే పదే పరిష్కారవేదిక కార్యక్రమానికి వస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. ఇకనుంచైనా అధికారులు పద్ధతి మార్చుకుని ప్రవర్తించాలని తెలిపారు. మొత్తం 167 అర్జీలు ప్రజలు అందించగా వాటిలో రెవెన్యూ 81, ఇతర సమస్యలకు సంబంధించి 86 అర్జీలు అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పీ శ్రీనివాసులు, మార్కాపురం, కనిగిరి ఆర్డీఓలు ప్రభాకర్, శివరామిరెడ్డి, మైక్రో ఇరిగేషన్ పీడీ జెన్నెమ్మ, మైనింగ్ ఏడీ రవివర్మ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాలాజీ నాయక్తోపాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. మార్కాపురంలో భిక్షాటన చేస్తున్న బాలబాలికలు, మహిళలకు జీవనోపాధి కల్పించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి సీహెచ్ బాబు వినతిపత్రం కలెక్టరుకు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం భిక్షాటన నిషేధిస్తూ జీవో విడుదల చేశారని, నిరుపేదలకు జీవనోపాధి, పునరావాసం కల్పించి బిక్షాటన పూర్తిగా నిర్మూలించాలని కోరారు. పింఛను కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నాం ● కనిగిరి మండలం మందలవారిపాలేనికి చెందిన మండ్ల కొండమ్మ భర్త చనిపోయి పదేళ్లు అయింది. 15 నెలల నుంచి వితంతు పింఛను అందడం లేదని కలెక్టర్కు వినతిపత్రం అందజేసింది. తనకు వస్తున్న పింఛను ఎందుకు ఆగిందని అధికారులను అడిగినా ఎటువంటి సమాధానం చెప్పడం లేదని, పింఛన్ రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని కలెక్టర్కు విన్నవించింది. ● అర్థవీడుకు చెందిన సయ్యద్ భానూబీ బేగం దివ్యాంగురాలు. ఆమె గర్భిణి అయి మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకోవడం కుదరలేదు. దీంతో అధికారులు పింఛన్ తొలగించారు. విషయం తెలుసుకుని వెళ్లి అడుగ్గా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని, మేం చేసేదేమీలేదని అధికారులు తెలిపారని, పింఛన్ మంజూరయ్యేలా చూడాలని కలెక్టరుకు వినతిపత్రం అందించింది. -
మంగళవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
ధాన్యం దిగుబడి ఆశాజనకంగా ఉంది. ధరలు మాత్రం రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. ధాన్యం అమ్ముకోవడం పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వం ప్రకటనకు, క్షేత్ర స్థాయి పరిస్థితులకు అస్సలు పొంతన లేకుండా ఉంది. మొక్కుబడిగా కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. అయితే అవి ఏరకంగానూ అన్నదాతకు మేలు చేయడంలేదు. దిక్కుతోచని స్థితిలో వచ్చిన రేటుకు తెగనమ్ముకోవాల్సి వస్తోంది. ఇదే అదునుగా దళారులు ధరలో కోత పెడుతున్నారు. రైతులను నిలువునా ముంచుతున్న కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రైతులను నిలువునా ముంచుతోంది. నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు పంపిణీలో విఫలమైన ప్రభుత్వం చివరకు రైతులకు మద్దతు ధర కల్పించడంలోనూ వైఫల్యం చెందింది. ప్రభుత్వం ఇప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు బయట మార్కెట్లల్లో ధాన్యం అమ్ముకుంటున్నారు. మాజీ సీఎం జగనన్న ప్రభుత్వంలో అన్ని రకాల రైతులకు మద్దతు ధర కల్పించారు. – రాయిండ్ల వెంకట నారాయణ, టంగుటూరు మండలం. కందుకూరు: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 41,467 మంది వరిసాగు చేస్తున్నారు. ఖరీఫ్లో 16,704 హెక్టార్లలో, రబీలో 24,647 హెక్టార్లలో వరిసాగు చేశారు. అత్యధికంగా దర్శి నియోజకవర్గం పరిధిలోని దర్శి, ముండ్లమూరు, కురిచేడు, తాళ్లూరు, కొండపి నియోజకవర్గంలో సింగరాయకొండ, టంగుటూరు, అలాగే త్రిపురాంతకం, పామూరు, నాగులుప్పలపాడు, చీమకుర్తి, ఒంగోలు తదితర మండలాల్లో పెద్ద మొత్తంలో వరి సాగు చేశారు. మొక్కుబడిగా కొనుగోలు కేంద్రాలు సాధారణంగా పంట చేతికొచ్చే సమయంలో మద్దతు ధరలు కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ప్రభుత్వం విధి. జిల్లాలో మొక్కుబడిగా అరకొరగా, ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. వివిధ సాకులు చూపుతూ పలుచోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు తక్కువ రేట్లకు దళారులకు తెగనమ్ముకున్నారు. రెచ్చిపోతున్న దళారులు.. ధాన్యం సేకరణలో దళారుల ఇష్టారాజ్యంగా మారింది. ఒకపక్క మద్దతు ధరలకు కొనుగోలు చేయకపోగా తేమ శాతం పేరుతో మరో దోపిడీకి పాల్పడుతున్నారు. గ్రేడ్–ఏ రకం ధాన్యానికి క్వింటాకు రూ.2389ల మద్దతు ధర ప్రకటించింది. దీని ప్రకారం 75 కేజీల బస్తాకు రూ.1800ల వరకు ధర చెల్లించాల్సి ఉంది. కానీ దళారులు ప్రస్తుతం రూ.1500 కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఇక మిగిలిన కామన్ గ్రేడ్ రకాల ధాన్యానికి క్వింటాకు రూ.2369 మద్దతు ధర ఉండగా 75 కేజీల బస్తాకు రూ.1780ల వరకు ధర ఇవ్వాలి. కానీ దళారులు మాత్రం రూ.1200 నుంచి రూ.1400లకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. పైగా తేమ శాతం పేరుతో బస్తాకు 4 కేజీల వరకు తరుగు తీసేస్తున్నారు. దీంతో రైతులు అటు ధరలు లేక, ఇటు తేమ శాతం పేరుతో రెండు విధాలా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా నేటికీ ఒక్క ధాన్యం సేకరణ కేంద్రాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం దారుణం. తీరా రైతులు ధాన్యం మొత్తం అమ్ముకున్న తరువాత ధాన్యం సేకరణ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రకటనలు ఇస్తుండడం విడ్డూరంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పెట్టుబడి ఖర్చులు వరి సాగులో పెట్టుబడి ఖర్చులు అంతకంతకు పెరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలు, సేద్యపు ఖర్చులు, ఎరువులు, కూలీలు, కోతలు ఇలా అన్ని రకాల ఖర్చు పెరగడంతో ఎకరాకు రూ.40 వేల వరకు పెట్టుబడి కింద ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. పెట్టుబడి పెరిగినా దిగుబడి బాగా వచ్చిందని సంబరపడుతున్న తరుణంలో ధరలు లేకపోవడంతో విచారం వ్యక్తం చేస్తున్నారు. వరి కోతలకు ముందుతో పోల్చితే ప్రస్తుతం బస్తాకు రూ.500ల వరకు ధర తగ్గిందని రైతులు అంటున్నారు. ఈ విధమైన ధరలతో చేసిన శ్రమకు, పెట్టిన పెట్టుబడులకు ఏమాత్రం ఫలితం లేకుండా పోతుందంటున్నారు. ప్రభుత్వం ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో దళారులకు విక్రయిస్తున్నామని చెప్తున్నారు. కందుకూరు నియోజకవర్గంలోని లింగసముద్రం, గుడ్లూరు, కందుకూరు మండలాల్లో రబీ సీజన్లో ప్రధానంగా వరి పంట సాగు చేస్తుంటారు. కందుకూరు మండలంలో అత్తాకోడళ్ల చెరువుల కింద మాచవరం, మోపాడు, కొండముడుసుపాలెం, పాలూరు–దొండపాడు వంటి ప్రాంతాల్లో, రాళ్లపాడు ప్రాజెక్టు కింద లింగసముద్రం, గుడ్లూరు మండలాల్లోని గ్రామాల్లో పంటను సాగు చేస్తారు. అయితే వరిసాగు ఆశాజనకంగా ఉండడం లేదనే కారణంతో ఈ ఏడాది కొంత మేర మాత్రమే రైతులు వరిని సాగు చేశారు. ప్రధానంగా రాళ్లపాడు ప్రాజెక్టు కింద ఆయకట్టులో కొన్ని గ్రామాల్లో వరి సాగైంది. సాగైన ప్రాంతాల్లో ఈ ఏడాది రైతులు ఊహించిన దానికంటే దిగుబడులు అధికంగా వచ్చాయి. సాధారణంగా సన్నం రకాల ధాన్యం ఎకరాకు 40 నుంచి 45 బస్తాల దిగుబడి వస్తే రైతులు సంతోషంగా ఉంటారు. అలాంటి ఈ ఏడాది ఎకరాకి 50 బస్తాల నుంచి 60 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. అన్ని ప్రాంతాల్లోను ఒకటీ రెండు బస్తాలు అటూఇటుగా దిగుబడి వచ్చింది. ప్రస్తుతం గత 20 రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా వరికోతలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. దిగుబడులు చూసి ఆశ్చర్యంతో పాటు, సంతోషంతో సంబరపడుతున్న రైతులకు ధరలు మాత్రం షాక్ ఇస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు ఇచ్చి కొనుగోలు చేసే నాథుడు కరువయ్యాడు. మిల్లర్లు దళారులను అడ్డుపెట్టుకుని ధరలు తగ్గించి నిలువు దోపిడీ చేస్తున్నారు. -
ఘనంగా బూచేపల్లి జన్మదిన వేడుకలు
ఒంగోలు సిటీ: దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ అభిమాన నాయకుడికి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ కట్ చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి, ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడు కనపర్తి శేషారెడ్డిల ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జున, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు తదితరులు ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన నాయకులు, అభిమానులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జ్ చింతలపూడి అశోక్కుమార్, మాజీ పీడీసీసీ బ్యాంకు చైర్మన్ మాదాసి వెంకయ్య, పార్టీ కార్యాదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, కె.ఆదెన్న, బి.రామారావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, వైఎస్సార్ సీపీ నాయకులు దుంపా చెంచిరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, మాజీ కార్పొరేటర్ వెన్నపూస కుమారి, గౌడ విభాగం జిల్లా అధ్యక్షుడు తాతా నరసింహా గౌడ్, సోషల్ మీడియా ప్రెసిడెంట్ శివకృష్ణారెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పోసం మధుసూదన్రెడ్డి, త్రిపురాంతకం ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి, చీమకుర్తి ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, దర్శి మాజీ ఏఎంసీ చైర్మన్ వెన్నపూస వెంకటరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు నెమలిదిన్నె చెన్నారెడ్డి, కిస్టిపాటి శేఖరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు స్పందనకు 80 ఫిర్యాదులు
ఒంగోలు టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసంకు 80 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులు నేరుగా ఎస్పీ హర్షవర్థన్ రాజును కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడిన ఎస్పీ వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. వెంటనే సంబంధిత పోలీసుస్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఆయన చట్టపరంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. నిర్ణీత గడువు లోగా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వృద్ధులు, నడవలేని వారి సమస్యలను విని వారికి సత్వర న్యాయం చేయాలని చెప్పారు. కార్యక్రమంలో మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ రమణకుమార్, చీమకుర్తి సీఐ ప్రసాద్, అద్దంకి సీఐ సుబ్బరాజు, ప్యానెల్ అడ్వకేట్ బాలాజీ సింగ్, మీ కోసం ఎస్సై జనార్దన్రావు పాల్గొన్నారు.ముండ్లమూరు: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డికి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని టీడీపీ దుండగులు చింపేశారు. ఈ ఘటన మండలంలోని నూజెల్లపల్లిలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన హనుమంతరావు అనే కార్యకర్త తన ఇంటి వద్ద ఎవరికీ ఇబ్బంది తలెత్తకుండా బూచేపల్లికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆదివారం రాత్రి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అది ఓర్చుకోలేని టీడీపీ వర్గీయులు ఫ్లెక్సీని చించివేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్త అయిన హనుమంతరావుపై వారం రోజుల క్రితం దాడి చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి సమాచారం ఇస్తే కేసు తీసుకోకుండా కాళ్లరిగేలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ చింత శ్రీనివాస్రెడ్డి అక్కడకి చేరుకొని టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడిచేసి, ఫ్లెక్సీలు చింపి వేయడంపై మండిపడ్డారు. ఫ్లెక్సీ చించివేతపై గ్రామస్తులతో పాటు జెడ్పీటీసీ తాతపూడి రత్నరాజు, మండల నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. కురిచేడు: మండలంలోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు జీబీబీ రఘువీరను జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక సస్పెండ్ చేశారు. పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఎంఈఓ సీహెచ్ కోటయ్య విచారించారు. విచారణలో సదరు ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించినట్లు ధ్రువీకరించడంతో అతన్ని సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
సమస్యల పరిష్కారం దిశగా పనిచేయాలి
మార్కాపురం: ప్రజల నుంచి అందిన సమస్యలతో కూడిన అర్జీలకు పరిష్కారం దిశగా పోలీసులు పనిచేయాలని డీఎస్పీ యూ నాగరాజు ఆదేశించారు. మార్కాపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిట్రెస్సల్ కార్యక్రమాన్ని డీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను పోలీసు అధికారులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. అందిన ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ జరిపి సత్వర పరిష్కారం కల్పిస్తామనే భరోసా ప్రజల్లో కల్పించాలన్నారు. ఎస్పీ కార్యాలయంలో అందిన ఫిర్యాదులను సంబంధిత పోలీసు స్టేషన్లకు తెలియచేసి త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. మీకోసంలో 35 అర్జీలు అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐలు రాజేష్కుమార్, కే అజయ్కుమార్, రామకోటయ్య, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. సీఎస్పురం (పామూరు): మండలంలోని మిట్టపాలెం నారాయణస్వామి ఆలయానికి ఆదివారం రూ.2,06,369 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ ఎస్జీఆర్ నరసింహబాబు, ధర్మకర్త కొమ్మినేని చిన్న ఆదినారాయణ సోమవారం తెలిపారు. స్వామివారి దర్శనం టికెట్ల అమ్మకం ద్వారా రూ.53,990, లడ్డు ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.22,640, ఆలయం వద్ద నిర్వహిస్తున్న శాశ్వత అన్నదానం పథకం నిర్వహణకు విరాళాలుగా రూ.37,127, ఇతర విరాళాల కింద రూ.92,612 విరాళంగా ఇచ్చినట్లు ఈఓ, ధర్మకర్త తెలిపారు. -
వ్యాళి వాహనంపై వామనుడిగా చెన్నకేశవుడు
మార్కాపురం టౌన్: చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారు వామన అలంకారంలో వ్యాళి వాహనంపై సోమవారం రాత్రి భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తులకు అర్చన, నివేదన, మంగళ హారతులను ఆలయ అర్చకులు అప్పనాచార్యులు, అర్చక బృందం నిర్వహించారు. నగరోత్సవాన్ని నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ ఈవో జీ.శ్రీనివాసరెడ్డి, ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. రేపు పొన్న వాహన సేవ: లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చెన్నకేశవస్వామి వారు మురళీకృష్ణ అలంకారంలో పొన్నవాహనంపై బుధవారం ఉదయం (పగలు ఉత్సవం) భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఉత్సవంలో భాగంగా నగరోత్సవం ముందు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించాలని కోరారు. -
గ్రామాల అభ్యున్నతికి సర్పంచ్ల కృషి భేష్
మార్కాపురం: మండలంలోని గ్రామాల అభ్యున్నతికి సర్పంచ్లు తమ శక్తివంచన లేకుండా మెరుగైన కృషి చేశారని మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు కొనియాడారు. సర్పంచ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా సోమవారం మార్కాపురం పట్టణంలోని విహారీ గ్రాండ్ ఇన్లో తర్లుపాడు మండల సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు మాట్లాడుతూ గడచిన ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందులను తట్టుకుని గ్రామాల అభివృద్ధికి పాటుపడిన సర్పంచ్లకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తిరిగి వైఎస్సార్ సీపీ అభివృద్ధికి ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా వ్యవహరించి పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీపీ భూలక్ష్మి రామసుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ గాయం శ్రీనివాసరెడ్డి, మండలపార్టీ కన్వీనరు మురారి వెంకటేశ్వర్లు, వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. -
కాలుష్యం నియంత్రించాలని ఫిర్యాదు
జైపూర్: సింగరేణి థర్మల్ పవర్ప్లాంట్ పరిసర ప్రాంతాలలో ఏర్పడుతున్న కాలుష్య సమస్యను పరిష్కరించాలని నిజామాబాద్లోని పొల్యుషన్ కంట్రోల్ బోర్డుకు సోమవారం పెగడపల్లి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ప్లాంట్ నిర్వహణతో గాలి, నీటి కాలుష్యం తీవ్రంగా పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. యాష్ కారణంగా పంటలు దెబ్బతినడంతో పాటు తాగునీటి వనరులు కలుషితమవుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై సమగ్ర పరిశీలన జరిపి, కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇందులో దుస్స భాస్కర్, రాజా గౌడ్, రాజేందర్ రెడ్డి, ప్రభాకర్చారి తదితరులు ఉన్నారు. -
జొన్నపంట దగ్ధం
ఇచ్చోడ: మండలంలోని కామగిరిలో జాదవ్ హరి బా అనే రైతు ఐదెకరాల్లో సాగు చేసిన జొ న్న పంట దగ్ధమైంది. బాధిత రైతు తెలిపిన వివరాల మేరకు సోమవారం సాయంత్రం వి ద్యుత్ మోటార్కు ఉన్న విద్యుత్ తీగల వద్ద షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి పంటకు అంటుకున్నాయి. పెద్దఎత్తున మంటలు ఎగిసి పడటంతో గమనించిన స్థానికులు ఫైరింజన్కు సమాచారం అందించారు. వాహ నం సీఎం బందోబస్తులో ఉండటంతో అరగంట వ్యవధిలోనే జొన్న పంట కాలిబూడిదయింది. ఘటనలో దాదాపు రూ.2లక్షల వరకు ఆస్తినష్టం జరిగిందని రైతు వాపోయాడు. బిలోలిలో... లోకేశ్వరం: మండలంలోని బిలోలిలో రైతు ఏరోల్ల రమణారావుకు చెందిన మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. బాధిత రైతు తెలిపిన వివరాల మేరకు సదరు రైతు నాలుగెకరాల్లో సాగు చేసిన మొక్కజొన్నను వారం రోజుల క్రితం కోసి పంటను చేలోనే ఆరబెట్టాడు. సోమవారం పంట చేనులో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తీగలు ఒకదానికి ఒకటి తాకడంతో మంటలు చెలరేగి పంట పూర్తిగా దగ్ధమైంది. పంట విలువ రూ.2లక్షల వరకు ఉంటుందని రైతు వాపోయాడు. విద్యుత్ తీగల విషయమై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని రైతు ఆరోపిస్తున్నాడు. కుభీర్: మండలంలోని సిర్పెల్లి(హెచ్)లో సోమవారం ఉదయం 3గంటల ప్రాంతంలో జాదవ్ దత్తారాంకు చెందిన మొక్కజొన్న పంట దగ్ధమైంది. వివరాల్లోకి వెళ్తే.. ఎకరంన్నర భూమిలో సాగు చేసిన మొక్కజొన్న పంటను కోసి కుప్పలు వేశారు. మంటలు వ్యాపించి పంట దగ్ధమైంది. దీంతో సుమారు రూ.లక్ష 50వేల నష్టం జరిగినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం మాలేగాం గ్రామంలో గౌతం, భోజరాంలకు చెందిన మొక్కజొన్న కుప్పలు సైతం కాలిపోయాయి. సుమారు రూ.5లక్షల నష్టం జరిగినట్లు ఆర్ఐ నరేశ్ తెలిపారు. ఆయా గ్రామాల సర్పంచులు సతీశ్, లక్ష్మి ఉన్నారు. -
ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యతనివ్వాలి
నా జీవితంలో ఎంతో మంది సీఎంలను చూశాను. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసింది రేవంత్రెడ్డి ఒక్కరే. గోదావరి ఒడ్డున, గుట్టపై ఉన్న గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాభివృద్ధికి రూ.75 కోట్లను కేటాయించాలి. ఆదివాసీలు కలిగిన ఉమ్మడి ఆదిలాబాద్కు ఎంత చేసినా తక్కువే. అభివృద్ధి పరంగా మరింత ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. తూర్పు ప్రాంతంలోని ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి పునః ప్రారంభించాలి. – కొక్కిరాల ప్రేంసాగర్రావు, ఎమ్మెల్యే, మంచిర్యాల -
ఈ ప్రాంత అభివృద్ధికి పెద్దపీట
నాడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి, సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క జిల్లా నుంచి చేపట్టిన పాదయాత్రలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎంతో దోహదం చేశాయి. అభివృద్ధి, సంక్షేమం కోసం కమిట్మెంట్తో పని చేసే పార్టీ కాంగ్రెస్. రెండేళ్లలోనే ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, రేషన్కార్డులు, ఉచిత విద్యుత్ వంటి హామీలన్నింటినీ నెరవేర్చాం. ఉమ్మడి ఆదిలాబాద్ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలో వందకు పైగా సీట్లను కై వసం చేసుకుంటాం. – బొమ్మ మహేశ్కుమార్గౌడ్, ఎమ్మెల్సీ, టీపీసీసీ చీఫ్ -
అప్పులున్నా ప్రజా సంక్షేమాన్ని ఆపలేదు
ఉమ్మడి రాష్ట్రంలో 64 ఏళ్లలో 22 మంది సీఎంలు రాష్ట్రాన్ని పాలించి రూ.64 వేల కోట్లు అప్పు చేస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.8లక్షల కోట్ల అప్పు చేశారు. ఇన్ని అప్పులున్నా అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని మా త్రం ఆపలేదు. జిల్లాలో రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడమే ఇందుకు నిదర్శనం. త్వరలోనే ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభిస్తాం. పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధితో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం. భట్టి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడం సంతోషంగా ఉంది. – జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి -
26 ఏళ్ల తర్వాత సీఎం రావడం సంతోషంగా ఉంది
1983లో ఎన్టీఆర్ సీఎం హోదాలో తొలిసారి మా మండలానికి వచ్చారు. మళ్లీ 26 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి సీఎంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు రావడం ఆనందంగా ఉంది. బోథ్లో మినీ స్టేడియం మంజూరు చేయాలి. రూ.18 కోట్లతో చేపట్టిన భీంపూర్– కరంజీ అంతర్రాష్ట్ర రోడ్డ్డును త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలి. నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను పిప్రిలోనే ఏర్పాటు చేయాలి. జిల్లాను ప్రత్యేకంగా పరిగణిస్తూ ఆర్అండ్ బీ, పంచాయతీరాజ్, ఐటీడీఏ పరిధిలోని పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలి. – గోడం నగేశ్, ఎంపీ, ఆదిలాబాద్ -
మహిళా సంఘాలకు చెక్కు.. ఐదు గ్రామాలకు ‘ఐఎస్వో’
కై లాస్నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 30,149 స్వయం స్వహాయక సంఘాలకు మంజూరైన రూ.53.50 కోట్ల వడ్డీలేని రుణాల చెక్కును సీఎం రేవంత్రెడ్డి మహిళలకు అందజేశారు. అలాగే జిల్లాలోని నార్నూర్, ముఖరా, ముత్నూర్, పిప్రి, వన్వాట్ గ్రామ పంచాయతీలకు ఐఎస్వో సర్టిఫికెట్లను ఆయా సర్పంచ్లకు అందజేసి అభినందించారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఐదుగురు ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇంటి మంజూరు ప్రొసీడింగ్ ఉత్తర్వులు అందించారు. ఇటీవల నిర్వహించిన సీఎం కప్ రెండోవిడత పోటీల్లో ఒవరాల్ చాంపియన్గా నిలిచిన క్రీడాకారులకు ట్రోఫీ అందజేసి అభినందనలు తెలిపారు. సీఎంకు ఘన స్వాగతం ముందుగా ప్రత్యేక హెలికాప్టర్లో పిప్రికి చేరుకున్న సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఎంపీ నగేష్, ఎమ్మెల్యేలు శంకర్, బొజ్జు, అనిల్ జాదవ్, కలెక్టర్ రాజర్షి షా, ఐజీ చంద్రశేఖర్రెడ్డి, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, డీఎఫ్వో ప్రశాంత్ బాజీరావు పాటిల్ తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. -
నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలి
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, రెండు లిప్ట్ ఇరిగేషన్ స్కీంలు, మూడు సబ్స్టేషన్లు, ఏటీసీ మంజూరు చేసి శంకుస్థాపనలు చేయడం సంతోషంగా ఉంది. సీఎం అంటేనే రాష్ట్రానికి తండ్రిలాంటి వారు. మా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలి. బోథ్ను రెవెన్యూ డివిజన్గా చేయాలి. అలాగే రూ.345 కోట్లతో చెరువుల అభివృద్ధికి నిధులు కేటాయించాలి. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు రూ.40 కోట్లు ప్రకటించాలి. జందాపూర్–కరంజీ రోడ్డు పనులు పూర్తి చేయాలి. బోథ్లో డిగ్రీ కళాశాల, మినీస్టేడియం, సుంకిడిలో వ్యవసాయ మార్కెట్ యార్డు మంజూరు చేయాలి. సిరిచెల్మ, భరంపూర్ ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలి. – అనిల్ జాదవ్, ఎమ్మెల్యే, బోథ్ -
అక్షరాభ్యాసం.. భూమిపూజ
నిర్మల్/భైంసా/బాసర: దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఓ మహాత్తర ఘట్టానికి అంకురార్పణ జరిగింది. దేశంలోనే ఏకైక సరస్వతీక్షేత్రంగా విరాజిల్లుతున్న నిర్మల్ జిల్లాలోని బాసరను భవ్యమందిరంగా, విశాలమైన కోవెలగా తీర్చిదిద్దేందుకు ముందడుగు పడింది. సీఎం రేవంత్రెడ్డి రూ.225 కోట్లు మంజూరు చేయడమే కా కుండా సోమవారం స్వయంగా వచ్చి ఈ పనుల కు భూమిపూజ చేశారు. రూ.200 కోట్లతో ముధోల్లో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులకూ ఇక్కడే శంకుస్థాపన చేశారు. కేవలం ఆలయం వరకే ముఖ్యమంత్రి పర్యటన పరిమితమైంది. లంచ్టైమ్లో జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో పర్యాట క, పలు అభివృద్ధి పనులపై చర్చించారు. మనుమడితో అక్షరాభ్యాసం.. సీఎం రేవంత్రెడ్డి సోమవారం ఉదయం 11.42 గంటలకు హైదరాబాద్ నుంచి మంత్రులతో కలిసి హెలికాప్టర్లో బాసర చేరుకున్నారు. భార్య గీతారెడ్డి, బిడ్డ నైమిషారెడ్డి, అల్లుడు సత్యరెడ్డి, మనుమడు రియాన్ష్ మరో హెలికాప్టర్లో 11.46 గంటలకు చేరుకున్నారు. ముఖ్యమంత్రితోపాటు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఎకై ్సజ్, ప్రొహిబిషన్, పర్యాటకశాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలకు హెలీపాడ్ వద్ద కలెక్టర్ అభిలాషఅభినవ్, ఎస్పీ జానకీషర్మిల, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ తదితరులు స్వాగతం పలి కా రు. అనంతరం జ్ఞానసరస్వతీ అమ్మవారి ఆలయంలో అర్చకులు వేదమంత్రాలు, పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తుల్లో కుటుంబసభ్యులు, మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి ఆలయంలో ప్రదక్షిణ చేశారు. అమ్మవారి ఎదుట అక్షరాభ్యాస పీఠం వద్ద రేవంత్రెడ్డి దంపతులు తమ మనుమడు రియాన్ష్తో అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం గర్భాలయంలో సరస్వతీ, మహాలక్ష్మీ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి పైనున్న మహంకాళీ అమ్మవారి వద్దకు వెళ్లి దర్శించుకున్నారు. వేదఆశ్వీరచన మండపంలో సీఎం కుటుంబాన్ని అర్చకులు ఆశీర్వదించారు. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, ఆలయ ఇన్చార్జి ఈవో విజయరామారావు తదితరులు జ్ఞాపికలు, కండువాలతో సన్మానించారు. లంచ్టైమ్లో మాటామంతి.. బాసర పర్యటనలో స్థానిక ఓ ప్రైవేటు రిసార్ట్లో లంచ్టైమ్లోనే సీఎం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడారు. ఈసందర్భంగా జిల్లా చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతి బింబించేలా రూపొందించిన ‘కాఫీ టేబుల్ బుక్’ను కలెక్టర్ అందించగా, ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఇందులోని అంశాలను కలెక్టర్ వివరించారు. జిల్లాలో పర్యాటక అభివృద్ధి అవశ్యకతను బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి, కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి త్వరలో ఆర్కియాలజీ, టూరిజం అధికారులతో మాట్లాడుతామన్నారు. కొయ్యబొమ్మలు, పెయింటింగ్స్తోపాటు మహిళ సంఘాలసభ్యులు తయారు చేసిన వరికుచ్చులను సీఎంకు జ్ఞాపికలుగా అందజేశారు. ఇందులో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి బాసర పర్యటనను విజయవంతం చేసినందుకు స్థానిక గ్రామస్తులు, సహకరించిన భక్తులకు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీషర్మిల ధన్యవాదాలు తెలిపారు. ఘనంగా భూమిపూజ.. బాసర ఆలయంలోని తూర్పు ద్వారం పక్కన పునరాభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి భూమిపూజ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే రామారావుపటేల్తోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, బీజేఎల్పీనేత మహేశ్వర్రెడ్డి, ఎంపీలు నగేశ్, వేంనరేందర్రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారులు సుదర్శన్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, డీసీసీ చీఫ్, ఎమ్మెల్యే వెడ్మబొజ్జుపటేల్, ఎమ్మెల్సీలు దండె విఠల్, చిన్నమైల్ అంజిరెడ్డి, నిర్మల్, భైంసా మున్సిపల్ చైర్మన్లు అప్పాల కావ్యగణేశ్చక్రవర్తి, తూమోల్ల దత్తాద్రి, బాసర సర్పంచ్ వెంకటేశ్గౌడ్, దేవాదాయశాఖ ఉన్నతాధికారులు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, నారాయణరావుపటేల్, రేఖానాయక్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు తదితరులతో కలిసి భూమిపూజను అట్టహాసంగా నిర్వహించారు. ఇక్కడే ముధోల్లో నిర్మించే యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.ట్రిపుల్ఐటీ, యూనివర్సిటీ ఊసే లేదు.. సీఎం రేవంత్రెడ్డి బాసర పర్యటనలో అందరూ ఊహించిన ట్రిపుల్ఐటీ విద్యార్థుల సమస్యలు, యూనివర్సిటీ ఏర్పాటు గురించి ఎక్కడా చర్చ రాకపోవడం గమనార్హం. ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో సతమతమవుతున్న ఆర్జీయూకేటీ గురించి మాట్లాడుతారని, జనవరి 16న నిర్మల్సభలో ప్రకటించిన జ్ఞానసరస్వతీ యూనివర్సిటీ ఏర్పాటుపై చర్చిస్తారని అంతా అనుకున్నారు. కానీ.. ఆలయ అభివృద్ధి మినహా ఈ రెండు ప్రముఖ అంశాలకు సీఎం పర్యటనలో ప్రాధాన్యత దక్కకపోవడం జిల్లావాసులను నిరాశపర్చింది. -
బోథ్ ఏరియా ఆస్పత్రి పరిశీలన
బోథ్: బోథ్ ఏరియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణ పనులను తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, ఫైనాన్స్ సెక్రెటరీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ సోమవారం పరిశీలించారు. పిప్రిలో సీఎం సభ అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజనాల రవీంద్ర ప్రసాద్ విన్నపం మేరకు ఆస్పత్రిని పరిశీలించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, వైద్య పరికరాలు, ఫర్నిచర్, ఇతర మౌలిక వసతుల కోసం టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. దీనిపై డాక్టర్ గౌరవ్ ఉప్పల్ సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా అన్ని వసతులతో ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. -
దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యం
ఆదిలాబాద్: దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. దేశ ప్రయోజనాలే పరమావధిగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పార్టీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ బలమైన శక్తిగా ఎదుగుతోందని తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ కేవలం ఐదుగురు సభ్యులతో ప్రారంభమైన బీజేపీ, నేడు కోట్లాది మంది కార్యకర్తలతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించడం గర్వకారణమని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు విజయ్, వేద వ్యాస్, జోగు రవి, రాజు, రాకేష్, సాయి, జీవన్, శ్రీకాంత్, నగేష్, సతీష్ పాల్గొన్నారు. -
ఆశ్రమ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించాలి
ఆదిలాబాద్రూరల్: ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సంతోష్ ఐటీడీఏ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన భుక్తాపూర్ కాలనీలో గల గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు ఆడిగి సమాధానం రాబట్టారు. కంప్యూటర్ ల్యాబ్, వంట గదిని పరిశీలించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. స్టోర్ రూమ్ను తనిఖీ చేసి సరుకులను పరిశీలించారు. మెనూ అమలు తీరును అడగగా ఐటీడీఏ యాప్ ఏర్పాటు చేసి పకడ్బందీగా మెనూ అమలు చేస్తున్నామని సిబ్బంది వివరించారు. అనంతరం డార్మెట్రీ నిర్మాణ పనులను పరిశీలించి అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. జుగా కింద మరో రూ.2 కోట్లు మంజురయ్యాయని, పనులు వెంటనే ప్రారంభించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ డీడీ జాదవ్ అంబాజీ, సీఈ బాలు నాయక్, ఎస్ఈ ఫణికుమారి, ఈఈ తానాజీ, ఏటీడీవో నిహారిక, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు. -
వడదెబ్బతో వ్యక్తి మృతి
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని మారుతినగర్కు చెందిన కారుకూరి సత్తయ్య(63) వడదెబ్బతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి సత్తయ్య సోమవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి సాయంత్రం స్థానిక ఓ లిక్కర్ మార్ట్లో మద్యం సేవించి అక్కడే కుప్పకూలిపోయాడు. సిబ్బంది డయల్ 100కు సమాచారం అందించారు. పోలీసులు ప్రైవేటు అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే సత్తయ్య మృతిచెందినట్లు తెలిపారు. ఆయనకు భార్య సత్యలీల, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మధుసూధన్రావు తెలిపారు. -
మట్టుబెడుతున్నారు..!
జిల్లాలో ఇటీవల హత్యలు పెరిగిపోయాయి. ఇందులో కొన్ని వివాహేతర సంబంధాలు కారణం కాగా.. మరికొన్ని మద్యం మత్తులో చోటు చేసుకుంటున్నా యి. మూడు ముళ్ల బంధాన్ని లెక్కచేయక పక్కదారి పడుతున్న క్రమంలో దంపతుల మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కట్టుకు న్న వారే తోడును కడతేర్చుతున్నారు. ఫలితంగా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగామారుతోంది. మరోవైపు మద్యం మత్తులో తలెత్తుతున్న గొడవలు హత్యలకు దారి తీస్తున్నాయి. అప్పటివరకు స్నేహితులుగా ఉన్నవారు సైతం చిన్నపాటి గొడవలతో దాడులకు పాల్పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంటుంది. వివాహేతర సంబంధాలతోనే.. జిల్లాలో చాలా వరకు వివాహేతర సంబంధాలతోనే హత్యలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నివారించేందుకు అవకాశం ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. క్షణికావేశంతో గొడవలకు దిగి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు. పెద్దల సమక్షంలో కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించే అవకాశం లేకపోలేదని పేర్కొంటున్నారు. హత్యకు పాల్పడితే సమస్య పరిష్కారం కాదు. దీంతో ఇరు కుటుంబాలు రోడ్డున పడతాయి. వారి పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. దారి తప్పినప్పుడు వినకపోతే విడాకులు తీసుకోవచ్చని సూచిస్తున్నారు. క్షణికావేశ నిర్ణయాలు సరికాదు.. క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయాలతో జీవితాలు నాశనం అవుతాయి. దంపతుల మధ్య మనస్పర్దలు ఏర్పడితే పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలి తప్ప అఘాయిత్యాలకు పాల్పడకూడదు. వివాహేతర సంబంధాలు, పాత కక్షలే దారుణలకు కారణమవుతున్నాయి. హతమార్చడం అనేది సమస్య పరిష్కారం కాదనే విషయాన్ని గ్రహించాలి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కౌన్సెలింగ్ ద్వారా పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. – ఎల్.జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ -
ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఐటీడీఏ ఏవో దామోదర స్వామి అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గొర్రెల కొనుగోలుకు రుణం మంజూరు చేయాలని భీంపూర్ మండలం తాంసి కె గ్రామస్తులు, రికార్డు అసిస్టెంటు ఉద్యోగం ఇప్పించాలని ఉట్నూర్కు చెందిన మెస్రం కార్తీక్, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆదిలాబాద్కు చెందిన కుడిమెత శ్రీనివాస్ కోరారు. వివిధ ప్రాంతాల నుంచి పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖకు సంబంధించిన పలు దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 06కేఎన్పీ27: అర్జీలు స్వీకరిస్తున్న ఐటీడీఏ ఏవో దామోదర స్వామి అర్జీలు స్వీకరిస్తున్న ఐటీడీఏ ఏవో దామోదర స్వామి -
గురుకులాలపై నిర్లక్ష్యం
చెన్నూర్: జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. గతంలో చురుగ్గా పనిచేసిన పేరెంట్స్ కమిటీలు నామమాత్రంగా పని చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ప్రతీనెల రెండో శనివారం తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించేవారు. ఇలా చేయడం ద్వారా ఇటు విద్యార్థులతో పాటు అటు ఉపాధ్యాయులు, సిబ్బంది పనితీరు మెరుగ్గా ఉండేది. విద్యార్థులు తప్పు చేస్తే ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు పేరెంట్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్లడంతో కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో మార్పు తీసుకువచ్చే అవకాశం ఉండేది. కానీ గతేడాది నుంచి చెన్నూర్ ప్రాంత గురుకుల పాఠశాలలో పేరెంట్స్ కమిటీ సమావేశాలు నిర్వహించక పోవడంతో విద్యావ్యవస్థ గాడితప్పుతోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చెన్నూర్ పట్టణంలోని బాలికల గురుకుల పాఠశాలలో పది రోజుల వ్యవధిలో వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఏడు నెలల క్రితం బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రహరీ దూకి ఇద్దరు యువకులు లోపలికి వచ్చిన ఘటనపై విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. చెన్నూర్ పట్టణంలో గల గురుకుల పాఠశాలలో గతంలో పలు సంఘటనలు జరిగినా నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రిన్సిపాళ్లు స్థానికంగా ఉండక పోవడమేనా? గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు స్థానికంగా ఉండక పోవడంతో రాత్రివేళల్లో పర్యవేక్షణ కరువైందనే ఆరోపణలు ఉన్నాయి. కిందిస్థాయి సిబ్బంది రాత్రి వేళ విధులు నిర్వహించినప్పటికి పైఅధికారులు అందుబాటులో లేకపోవడంతో ‘మాకేందుకులే’ అనే ధోరణి అవలంభిస్తున్నారని తెలిసింది. దీంతో కొంతమంది విద్యార్థులు ఇష్ట్యారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు గురుకులాలకు అందుబాటులో ఉండి విద్యార్థులు గాడి తప్పకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇలా చేస్తే మార్పు రావచ్చు ఏడాదిగా సమావేశాల్లేవ్ గతంలో గురుకుల పాఠశాలలో ప్రతీనెల రెండో శనివారం పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసేవారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం కమిటీపై అధికారుల నిర్లక్ష్యం పెరిగింది. పాఠశాలలో పర్యవేక్షణ కరువైంది. విద్యార్థులు గాడి తప్పుతున్నారు. కమిటీలను పటిష్టం చేయాలి. సమావేశాలు ఏర్పాటు చేయాలి. – ఎన్.సారయ్య, పేరెంట్స్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి విద్యార్థుల మానసికస్థితిలో మార్పులు విద్యార్థుల మానసిక స్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా మానసిక నిపుణుల చేత కౌన్సెలింగ్ ఇస్తున్నాం. చెన్నూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థిని మృతి బాధాకరం. మరో విద్యార్థిని చిన్న విషయానికి పెద్ద నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆమె సెఫ్గా ఉంది. చెన్నూర్ గురుకుల పాఠశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. – రామకళ్యాణి, డీసీవో, మంచిర్యాల -
2034 వరకు మా సర్కారే: సీఎం రేవంత్
సాక్షి, ఆదిలాబాద్: ‘మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే.. 2034 వరకు ప్రజా ప్రభుత్వమే కొనసాగుతుంది.. మీ బాగోతం ప్రజలు చూశారు.. మళ్లీ గడీల పాలన కావాలని ఎవరూ కోరుకోరు. పదేళ్లలో మీరు చేయ లేని ఎన్నో గొప్ప పనులు మా ప్రభుత్వం చేసింది.. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి..’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ‘అడ్డు పడడానికి ఊరూరా తిరగడం కాదు.. ఎంతసేపూ లొల్లి పెట్టాలి.. యాగీ చేయాలనే దృక్పథంతోనే వెళ్తున్నారు..’ అంటూ విపక్ష బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పదేళ్లలో ఇలాంటి సంప్రదాయం చూశారా? ‘పీసీసీ అధ్యక్షుడిగా అప్పట్లో నిర్మల్లో నిరసన తెలిపినా, ఇంద్రవెల్లిలో దండోరా పెట్టినా.. భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిర్వహించినా.. ప్రజా సమస్యలను పరిష్కరించాలనే ఉక్కు సంకల్పంతోనే పోరాటం కొనసాగించాం. ఎన్ని కేసులు పెట్టినా కొట్లాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. అభివృద్ధి విషయంలో అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం. అందుకే పార్టీలకు అతీతంగా ఈ సభలకు ఆహ్వానించాం. గత పదేళ్లలో తెలంగాణలో ఇలాంటి సాంప్రదాయం ఎప్పుడైనా చూశారా?. ఇక్కడ కాంగ్రెస్ శాసనసభ్యులు లేకపోయినా బోథ్లో, నిర్మల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను మంజూరు చేశాం. మా ఎమ్మెల్యేలు లేకపోయినా ప్రజలు నష్టపోకూడదని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాం. పార్టీలు చూడకుండా, ప్రజల కష్టాలు చూసి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. జూన్ 2 నాటికి ఎయిర్పోర్టుకు శంకుస్థాపన బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు మంజూరు చేశాం. అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేస్తాం. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం. త్వరలోనే వీలైతే జూన్ 2 నాటికి ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణానికి శిలాఫలకం వేసేలా చూస్తాం. ఆదిలాబాద్ ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ఆదిలాబాద్లో యూనివర్సిటీకి సంబంధించి భూసేకరణ చేపట్టాం. త్వరలోనే శంకుస్థాపన చేస్తాం. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు అభ్యర్థన మేరకు గూడెం సత్యనారాయణస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. డిసెంబర్లో ఇందిరమ్మ చీరలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఏమేం కావాలో అంచనాలు సిద్ధం చేస్తున్నాం. తెలంగాణ ఆడపడుచులకు వచ్చే డిసెంబర్లో ఇందిరమ్మ చీరలు అందజేస్తాం.. చిలుకపచ్చ రంగు చీరలు అందిస్తాం. పేదల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే మా ప్రయత్నం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సన్న బియ్యం పంపిణీ ‘రాష్ట్రంలో రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. ఇప్పటివరకు దాదాపు రూ.5,400 కోట్లు ఆ ఇళ్లు కట్టుకునే పేదల ఖాతాల్లో వేశాం. ఎన్నడైనా గత ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేసిందా?. సన్న బియ్యంతో పేదల కడుపు నింపాలనే ఆలోచన ఎప్పుడైనా చేసిందా?. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మా ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తోంది. మా ఆడబిడ్డల ఉచిత బస్సు ప్రయాణానికి రూ.10 వేల కోట్లు ఖర్చు చేశాం. మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్జీలు) తయారు చేసిన ఉత్పత్తుల మార్కెటింగ్కు హైటెక్ సిటీలో షాపులు కేటాయించాం..’ అని సీఎం తెలిపారు. పిప్రిలో సభ సీఎం ఆలోచనే: డిప్యూటీ సీఎం ‘పిప్రిలో బహిరంగ సభ నిర్వహించాలన్నది సీఎం రేవంత్రెడ్డి ఆలోచనే.. నా ఆలోచన కాదు..’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలకు సంబంధించి చర్చిస్తున్న క్రమంలో.. ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహిద్దామని సీఎం అన్నారని చెప్పారు. పిప్రి నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేపట్టి ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు వాటిని మంజూరు చేసి అమలు చేయాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారని వెల్లడించారు. ఆనాడు మండుటెండలో తనతో నడిచి పాదయాత్రను విజయవంతం చేశారని, ఈరోజు కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారని అన్నారు. ఇది రాజకీయ సభ కాదని ఆనాడు ప్రజలతో ఏర్పర్చుకున్న అనుబంధానికి నిదర్శనం ఈ సభ అని భట్టి చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో మంత్రులందరం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని, అంతరాలు లేని సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని చెప్పారు. ఆనాడు టీపీసీసీ అధ్యక్షుడిగా సీఎం రేవంత్రెడ్డి, సీఎల్పీ నేతగా మల్లుభట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలు, బహిరంగ సభలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి దోహద పడ్డాయని ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అన్నారు. అప్పట్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ తెలంగాణను మేటి రాష్ట్రంగా నిలుపుతున్నారని అభినందించారు. వచ్చే ఎన్నికల్లో వందకు పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. భట్టి పాదయాత్రకు మూడేళ్లు పూర్తి ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క, సీఎల్పీ నేతగా రాష్ట్రంలో చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.. ఆనాడు భట్టి పాదయాత్ర ప్రారంభించిన పిప్రిలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక బహిరంగ సభను ప్రభుత్వం నిర్వహించింది. కాగా అప్పట్లో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి రూ.614 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఎస్హెచ్జీల మహిళలకు వడ్డీలేని రుణాలు పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ ఎంపీ వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్రావు, వెడ్మ బొజ్జు, మాలోత్ రాందాస్, ఎమ్మెల్సీ దండే విఠల్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, విజయరమణారావు, బీజేపీ ఎంపీ గొడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, కేంద్ర మాజీమంత్రి వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు. -
బాసరలో రేవంత్ ప్రత్యేక పూజలు.. మనవడికి అక్షరాభ్యాసం
సాక్షి, నిర్మల్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబంతో కలిసి బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు తమ మనవడు రియాన్ష్కు అక్షరాభ్యాసం చేయించారు.ఇక, దర్శనం అనంతరం బాసర ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి భూమి పూజ చేయనున్నారు. బాసర పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.225 కోట్లతో పునర్ నిర్మాణ పనులకు నేడు శ్రీకారం చుట్టనుంది. ప్రాచీన ఆలయం కావడం, ఏటేటా పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగినట్లు అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బాసర ఆలయ అభివృద్ధి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు మాస్టర్ ప్లాన్ రూపొందించారు.బాసర పర్యటన ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పిప్రి చేరుకోనున్నారు. భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పిప్రిలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. -
‘పీపుల్స్ మార్చ్’కు మూడేళ్లు ..
ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో నాడు ప్రతిపక్ష నేత హోదాలో మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్మార్చ్ పేరిట పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. దీనికి బజార్హత్నూర్ మండలం పిప్రి గ్రామం నుంచి 2023 మార్చి 16న శ్రీకారం చుట్టారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించి వివిధ వర్గాల వారిని కలిశారు. వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మాణిక్రావ్ ఠాక్రేతో పాటు ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న పలు వురు కాంగ్రెస్ నేతలు ఆయనతో కలిసి అడుగు కలిపారు. తాజాగా భట్టి నాటి పాదయాత్రను గుర్తు చేసుకున్నారు. ‘అణ గారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పాదయాత్ర చేపట్టానని.. ఇది రాష్ట్ర ప్రజలతో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరిచిందని.. ఆదిలాబా ద్ అడవుల నుంచి ఖమ్మం గడ్డ వరకు 1,364 కిలోమీటర్ల ప్రయా ణం నా జీవితంలో మర్చిపోలేని ఒక మహాయజ్ఞమని’ పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ పాదయాత్రను ప్రజా ఉద్యమంగా మార్చిన ప్రతీ కార్యకర్తకు, నాయకుడికి, అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు. -
సీఎం సభ విజయవంతం చేయాలి
కైలాస్నగర్: బజార్హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో సోమవారం నిర్వహించనున్న సీఎం బహిరంగసభను విజయవంతం చేయాలని ప్రభుత్వవిప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు కోరారు. పట్టణంలోని పట్టణంలోని ప్రజాసేవభవన్లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆదివారం సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, ఆత్మ చైర్మన్ సంతోష్రావు, కౌన్సిలర్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు. విప్ ‘ఆది’ని కలిసిన ‘కంది’ పిప్రిలో సీఎం పర్యటన ఏర్పాట్లను సమీక్షించేందుకు వచ్చిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను కంది శ్రీనివాసరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించారు. అనంతరం సభ ఏర్పాట్లపై చర్చించారు. -
జగ్జీవన్రామ్ ఆశయ సాధనకు కృషి చేయాలి
ఆదిలాబాద్రూరల్: మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్లో ఆదివారం జగ్జీవన్రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్తో పాటు ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అతిథులుగా పాల్గొని జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఉప ప్రధానిగా జగ్జీవన్రామ్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. మహనీయుల జీవిత చరిత్రలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అంతకముందు ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణలో జగ్జీవన్ రామ్ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా దళిత అభివృద్ధి శాఖ అధికారి సునీత కుమారి, కార్పొరేషన్ ఈడీ మనోహర్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీవైఎస్వో శ్రీనివాస్, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
విధులు నిర్వర్తిస్తూనే మృత్యు ఒడిలోకి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండల పరిషత్ కార్యాలయంలో నైట్ వాచ్మెన్గా విధులు నిర్వర్తిస్తున్న కొత్తకొండ తిరుపతి(53) ఆదివారం ఉదయం విధులు నిర్వహిస్తూనే ఆకస్మికంగా మృతి చెందాడు. స్థానికులు, హాజీపూర్ ఎస్సై కిరణ్కుమార్ కథనం మేరకు.. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తాళ్లపల్లికి చెందిన కొత్తకొండ తిరుపతి హా జీపూర్ ఎంపీపీ కార్యాలయంలో గత రెండేళ్లుగా నైట్ వాచ్మెన్గా పని చేస్తున్నాడు. ఆది వారం విధి నిర్వహణలో ఉన్న తిరుపతి కార్యాలయ ఆవరణలో కుప్పకూలి పడిపోయాడు. వెంటనే స్థానికులు గమనించి మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య సత్తమ్మ, కుమారుడు సాయికుమార్, కుమార్తె శైలజ ఉన్నారు. మృతుడి కుమారుడు సాయికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బుద్ధ జయంతి అధికారికంగా నిర్వహించాలి
కై లాస్నగర్: బుద్ధ పౌర్ణమిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భారతీయ బౌద్ధ మహాసభ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షాను ఆదివారం ఆయన చాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రపంచానికే శాంతి సందేశాన్ని ఇచ్చిన గౌతమ బుద్ధుని జయంతిని సెలవుదినంగా ప్రకటించాలన్నారు. రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది బౌద్ధులు ఉన్నారని వారి ఆకాంక్షలను గౌరవించేలా పిప్రికి రానున్న సీఎం రేవంత్రెడ్డి దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నజాడే ప్రజ్ఞాకుమార్, విట్టల్, దయానంద్, దయానంద్ కాంబ్లే, రాహుల్ పాల్గొన్నారు. -
రిమ్స్లో ‘సూపర్’ సేవలు
ఆదిలాబాద్టౌన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన రిమ్స్లో ప్రస్తుతం రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయి. ఆస్పత్రిలో 21 విభాగాల్లో, సూపర్ స్పె షాలిటీలో మరో ఏడు విభాగాల్లో ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో నిత్యం 2వేల వరకు ఓపీ, 900 వరకు ఇన్పేషెంట్లుగా చికి త్స పొందుతున్నట్లుగా వైద్యాధికారులు చెబుతున్నారు. అన్నిరకాల శస్త్ర చికిత్సలతో పాటు అత్యవసర సేవలకు సంబంధించి ఇటీవల క్రిటికల్ కేర్ కూడా అందుబాటులోకి వచ్చింది. సూపర్ స్పెషా లిటీలో కార్డియాలజిస్టు రాకతో గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు ఇక్కడే చికిత్స పొందుతున్నారు. అందుతున్న సేవలు..ఎంఆర్ఐ, సిటిస్కాన్, ఆల్ట్రాస్కాన్, టిఫ్పా స్కాన్, డయాలసిస్, టీ–హబ్, ఎక్స్రే, బ్లడ్బ్యాంక్, సాధారణ ప్రసవాలు, సిజేరియన్, వెల్నెస్ సెంటర్, వృద్ధుల కోసం జరియాట్రిక్ కేర్, కీమోథెరపీ, క్రిటికల్ కేర్, డయాలసిస్, ల్యాప్రోస్కోపి, హెర్నియా, కంటి, ఆర్థో, ఈఎన్టీ, యూరాలజీ, క్యాన్సర్ సేవలు అందుతున్నాయి. అత్యవసరానికి సంబంధించి ఎంఐసీ యూ, ఎస్ఐసీయూ, పీఐసీయూ, ఆర్ఐసీయూ, ఎస్ఎన్సీయూ, టీబీనాట్ ద్వారా టీబీ టెస్టులు, ప్యాథాలజీ సేవలను రోగులు పొందుతున్నారు. తీరుతున్న వైద్యుల కొరత రిమ్స్లో గతంలో వైద్యుల కొరతతో రోగులు ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం 140 మంది వైద్యులు పనిచేస్తుండగా, 120 మంది హౌస్సర్జన్లు, 190 మంది పీజీ వైద్యులు, 220 మంది నర్సింగ్ విద్యార్థులు, 600 మంది యూజీ విద్యార్థులు సేవలు అందిస్తున్నారు. సూపర్ స్పెషాలిటీలో యూ రాలజీ, క్యాన్సర్ సర్జన్, నెఫ్రాలజీ, కార్డియాలజీ, ప్లాస్టిక్ సర్జన్, పీడియాట్రిక్ సర్జన్, న్యూరో సర్జన్ సేవలు అందుతున్నాయి. మెరుగైన సేవలందిస్తున్నాం.. రిమ్స్లో రోగులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నాం. ప్రహరీ, ఇంటర్నల్ సీసీ రోడ్లు, రిమ్స్ నుంచి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి వెళ్లేందుకు ఫుట్ ఓవర్బ్రిడ్జి, డాక్టర్ క్వార్టర్స్, ఎంసీహెచ్ బిల్డింగ్ కోసం ప్రభుత్వానికి నివేదించాం. రిమ్స్తో పాటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అందుతున్న సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలి. – జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్, ఆదిలాబాద్ -
జోగు రామన్న హౌస్ అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్నను ఆదివారం రెండో రోజు కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశా రు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎన్నికల పరిశీలకులుగా ఉన్న రామన్న అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఉదయం పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు. బయటకు వెళ్లకుండా రోజంతా ఇంటి వద్ద పహారా నిర్వహించారు. పార్టీ నాయకులు ఆయనకు మద్దతుగా అక్కడికి చేరుకొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పోలీసులను అడ్డు పెట్టుకొని అడ్డదారులు తొక్కుతుందని విమర్శించారు. ఖానాపూర్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా అడ్డదారిలో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు అక్రమ అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. -
బీఆర్ఎస్వీ నాయకులపై కేసు నమోదు
చెన్నూర్: పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట ముందస్తు సమాచారం, అనుమతులు లేకుండా గుంపుగా చేరి ప్రజారవాణాకు ఆటంకం కలిగించడం, దిష్టిబొమ్మ దగ్ధం చేయడంతో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్వీ నాయకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు.బీఆర్ఎస్వీ నాయకులు బడికెల శ్రావణ్, నాయబ్, శ్రీనివాస్, నవీన్, సంపత్, శివ, మహేందర్లపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా చట్టవ్యతిరేక, ప్రజాశాంతికి భంగం కల్గించే విధంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. -
‘స్టడీ అవర్స్’కు అంతర్జాతీయ గుర్తింపు
బాసర: ఆర్జీయూకేటీలో పీయూసీ మొదటి, రెండో సంవత్సరాల విద్యార్థుల అకాడమిక్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రారంభించిన ‘స్టడీ అ వర్స్’ కార్యక్రమానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ కార్యక్రమం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు, అవార్డులను సొంతం చేసుకుంది. నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ బుక్ ఆఫ్ వర ల్డ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ ఎక్సలెన్స్, డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ నేషనల్ ఎడ్యుకేషని స్ట్ అవార్డులు వరించాయి. అంతర్జాతీయ పత్రిక ‘యూకే మిర్రర్’ మొదటి పేజీలో ఆర్జీయూకేటీ ముఖచిత్రం ప్రచురించడంతో పాటు స్టడీ అవర్స్పై ప్రత్యేక కథనం ఇచ్చింది. వైస్ చాన్స్లర్ గోవర్ధన్ మాట్లాడుతూ విద్యార్థుల కృషి, క్రమశిక్షణతో పాటు ఉద్యోగుల పర్యవేక్షణ, శ్రమ కారణమన్నారు. -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
మందమర్రిరూరల్: మందమర్రి రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలు నుంచి ఓ వ్యక్తి కింద పడగా తలకు తీవ్ర గాయలై మృతి చెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ జస్పాల్సింగ్ ఆదివారం తెలిపారు. మృతుని వద్ద హైదరాబాద్ నుంచి పందుర్ణ (మధ్యప్రదేశ్) ప్రయాణపు టికెట్ ఉందని, మిలిటరీ కలర్ షర్ట్, సిమెంట్ కలర్ లోయర్ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. చేతిపై జైశ్రీరామ్ రబ్బర్ బ్యాండు, కుడి చేతిపై మై లవ్ ఎం అని టాటూ ఉందని పేర్కొన్నారు. వివరాలు తెలిసిన వారు ఎస్సై (జీఆర్పీ) 8712658596, జస్పాల్సింగ్ హెడ్ కానిస్టేబుల్ 98490 58691నంబర్లలో సంప్రదించాలని సూచించారు. చికిత్స పొందుతూ మృతి లింగాపూర్: మండలంలోని ఏల్లాపటార్ గ్రామ పంచాయతీలోని రాముగూడ కాలనీకి చెందిన ఆత్రం అక్బర్షా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఎస్సై గంగన్న తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఉపాధిహామీ పనికి వెళ్లాడు. ఇంటికి వచ్చాక వాంతులు, విరేచనాలు కావడంతో జైనూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరుసటి రోజు ఇంటికి తిరిగి వచ్చాడు. ఆదివారం వాంతులు, వీరేచనాలు ఎక్కువై మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. అనారోగ్యం బారిన కుటుంబం.. ఆత్రం అక్బర్షా భార్య, కుమారులు, కుమార్తె కూ డా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈక్రమంలో ఆదివారం గ్రామంలో డిప్యూటీ డీఎంహెచ్వో నాగేంద్ర ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఆత్రం అక్బర్షా మృతికి కలుషిత ఆహారమే కారణమని నిర్ధారించారు. అతని కుటుంబ సభ్యులను జైనూర్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. వారు ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారు. వైద్య శిబిరంలో డాక్టర్ మురళీకృష్ణ, సూపర్వైజర్ దత్తారాం ఉన్నారు. పిడుగుపాటుతో ఒకరికి గాయాలుకౌటాల: బెజ్జూర్ మండలంలో ఆదివారం వేకువజామున ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పోతేపల్లి గ్రామానికి చెందిన డోకి సంజీవ్ తన ఇటుకల బట్టీపై కవర్ కప్పడానికి వెళ్లగా పిడుగు పడడంతో గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు గమనించి బెజ్జూర్ పీహెచ్సీకి, మెరుగైన వైద్యం కోసం కాగజ్నగర్ ఆసుపత్రికి తరలించారు. ఈదురు గాలులతో అందుగులగూడ గ్రామంలోని ఐదు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. బెజ్జూర్ –కౌటాల ప్రధాన రహదారిపై పలు చోట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కోడి పందేల స్థావరంపై దాడులుదహెగాం: మండలంలోని ఐ నం గ్రామ శివారులో కోడి పందేలు ఆడుతున్నారన్న స మాచారం మేరకు ఆదివారం సాయంత్రం దాడులు చేసినట్లు ఎస్సై సీహెచ్ రమేశ్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం సిబ్బందితో కలిసి స్థావరంపై దాడి చేసి నలుగురు నిందితులతో పాటు నాలుగు కోడి పుంజులు, రెండు కత్తులు, రూ.7,600 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వెల్ములే దిలీప్, తక్కల్ల సంజీవ్, రాములు, కోట పోశంలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేతదహెగాం: మండల కేంద్రం సమీపంలోని పెద్దవాగు నుంచి అక్రమంగా అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను ఆదివారం పట్టుకున్నట్లు ఎస్సై ీసీహెచ్ రమేశ్ తెలిపా రు. మండల కేంద్రానికి చెందిన పణ్యాల శ్రీనివాస్కు చెందిన ట్రాక్టర్లో డ్రైవర్ చప్పిడి దామోదర్ ఇసుక తరలిస్తున్నందున పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను సీజ్ చేసి డ్రైవర్ దామోదర్, ఓనర్ శ్రీనివాస్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
లక్ష్యానికి దూరంగా..!
శ్రీరాంపూర్ ఏరియా ముఖ ద్వారంశ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియా గనులు వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో వెనుకబడ్డాయి. బుధవారంతో ఆర్థిక సంవత్సరం ముగియగా కంపెనీ గణంకాల ప్రకారం ఈసారి ఉత్పత్తి తక్కువ జరిగింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో శ్రీరాంపూర్ గ నులు నిర్ధేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. ఓసీపీల్లో ఓబీ కాంట్రాక్ట్ సమస్యలు, కాలం చెల్లిన భూగర్భ గనుల్లో కొత్త సీమ్లు లేకపోవడం వెరసి ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోలేనట్లు అధి కారులు పేర్కొంటున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో శ్రీరాంపూర్ ఏరియా లక్ష్యం 65,16,000 టన్నులకు గానూ 57,86,282 టన్నులు సాధించి 88.8 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని నమోదు చేసుకుంది. 2025–26 ఆర్థిక సంవత్సరం 65,16,000 టన్నులకు గానూ 44,06,291 టన్నులు సాధించి 68 శాతం లక్ష్యాన్ని నమోదు చేసుకుంది. ఇంత తక్కువలో నమోదు కావడంతో పదేళ్లలో ఇదే తొలిసారి. లక్ష్యానికి ఈ సారి ఇంకా 32 శాతం లోటు ఉంది. ఓబీ కాంట్రాక్టర్లే నిండా ముంచారు...శ్రీరాంపూర్లో మూతపడిన ఆర్కే 6 మినహా 6 భూ గర్భ గనులు, రెండు ఓసీపీలు నడుస్తున్నాయి. ఎ స్సార్పీ ఓసీపీ, ఇందారం ఓసీపీల్లో గడిచిన సంవత్సరం ఓబీ వెలికితీతలో తీవ్ర జాప్యం జరిగింది. కాంట్రాక్టర్లు ఓబీ మట్టి తీయకపోవడంతో దీని ప్ర భావం బొగ్గు ఉత్పత్తిపై పడింది. ఈ రెండు ఓసీపీల్లో కాంట్రాక్టర్లు పనులు చేయమని చేతులెత్తడంతో ఓబీ నిలిచిపోయి దాని ప్రభావం ఉత్పత్తిపై పడింది. ఏరియాలోని రెండు ఓసీపీల్లో ఓబీ తీయాల్సిన లక్ష్యంలో కేవలం 38 శాతమే నమోదైంది. దీంతో బొగ్గు తీయలేకపోయారు. అనంతరం కొత్త టెండ ర్లు పిలిచి వాటికి పనులు అప్పగించి మొదలు పెట్ట డం జాప్యం మూలంగా మరింత నష్టం జరిగింది. భూగర్భ గనుల్లో నామమాత్రమే..భూగర్భ గనుల్లో నిర్ధేశించిన లక్ష్యంలో 90 శాతమే సాధించారు. ఆరు గనుల్లో కేవలం ఆర్కే న్యూటెక్ గని, ఎస్సార్పీ 1 గనులు మాత్రమే నూరుశాతం ఉత్పత్తిని సాధించాయి. మిగిలిన అన్ని గనుల్లో నూరు శాతం లోపే ఉత్పత్తి జరిగింది. ఆర్కే 5 గని 96 శాతం, ఆర్కే 7 గని 95 శాతం, ఆర్కే న్యూటెక్ గని 113 శాతం, ఎస్సార్పీ 1 గని 103 శాతం, ఎస్సార్పీ 3, 3 ఏ గని 74 శాతం, ఐకే 1ఏ గని 81 శాతం, ఎస్సార్పీ ఓసీపీ 59 శాతం, ఐకే ఓసీపీ 66 శాతం ఉత్పత్తిని నమోదు చేసుకున్నాయి. ఎస్సార్పీ 1, ఆర్కే న్యూటెక్ గనుల్లో పని స్థలాలు లేవు. ఇటీవలే అధికారులు వాటి జీవితకాలం పెంచడానికి కొత్త సీమ్లను ప్రారంభించడంతోనే ఉత్పత్తి జరిగింది. -
భూసార పరీక్ష.. రైతుకు రక్ష
బోథ్: వ్యవసాయ క్షేత్రాలు ఏ రకమైన పంటలకు అ నుకూలంగా ఉంటాయి.. నేలలో పోషకాల స్థాయి ఎలా ఉంది.. ఎలాంటి ఎరువులు ఏ సందర్భాల్లో ఉ పయోగించాలనే విషయాలపై రైతులకు అవగా హ న కలగాలంటే భూసార పరీక్షలు తప్పనిసరి.సరైన సమయంలో వర్షాలు పడకపోవడం అలాగే ప్రకృతి వైపరీత్యాలతో రైతులు ఏటా నష్టపోతున్నారు. ఈ క్రమంలో భూసార పరీక్షలు నిర్వహించి తదనుగు ణంగా పంటలు సాగుచేస్తే ఆశించిన దిగుబడులు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. జిల్లాలో.. జిల్లాలో 101 క్లస్టర్లుఉన్నాయి. వాటి పరిధిలో దాదా పు 5 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. ఏటా వర్షాకాలం, యాసంగిలో పత్తి, సొయా, పెసర, మినుము, జొన్న, మొక్క జొన్న, శనగ, కంది తదితర పంటలు సాగు చేస్తున్నారు. అయితే ఎరువులు ఎంత మోతాదులో వాడాలి.. భూమి ఏ పంటలకు అనుకూలంగా ఉందో తెలియక సరైన దిగుబడి రాక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. అవగాహన లేమితో వెనుకంజ రైతులు ఇష్టానుసారం రసాయన ఎరువుల వాడకంతో సాగు వ్యయం పెరగడంతో పాటు భూమిలో పోషక విలువలు తగ్గుతున్నాయి. నేల స్వభావం తెలియక అవసరానికి మించి క్రిమి సంహారక మందులు వినియోగిస్తున్నారు. భూసార పరీక్షల ప్రాధాన్యంపై సదస్సులు, సమావేశాల్లో వ్యవసాయాధికారులు, సిబ్బంది పదేపదే చెబుతున్నా రైతులు ఆ దిశగా అడుగులు వేయడం లేదని తెలుస్తోంది. ఫలితాల ఆధారంగా.. భూసార పరీక్ష ఫలితాలు అనుసరించి సాగు చేస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచిస్తున్నారు. ఈ పరీక్ష ల ద్వారా నేలలోని ఉదజని, లవణ సూచి క పోషకాలు, నత్రజని, భాస్వరం, పొటాష్ లభ్యత ను తెలుసుకోవచ్చు. తద్వారా అవసరమైన మోతా దులో ఎరువుల వినియోగానికి అవకాశం ఉంటుంది. గ్రామానికి పది మట్టి నమూనాల సేకరణ.. ప్రజాపాలన–ప్రగతి ప్రఽణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలో రెవెన్యూ గ్రామాల వారీగా కనీసం పది మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నమూనాలను భూసార పరీక్ష కేంద్రాలకు పంపించి మే 10 లోపు ఫలితాలను అందించాలని ప్రభుత్వం పేర్కొంది. కాగా జిల్లాలోని వ్యవసాయ విస్తరణ అధికారులు మట్టి నమూనాలు సేకరించే పనుల్లో ఉన్నారు. సద్వినియోగం చేసుకోవాలి రైతులు భూసార పరీక్షలు ఏటా చేయించుకోవాలి. తద్వారా నేలకు కావాల్సిన పోషకాలను ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది. ఆయా క్లస్టర్లలో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారులను లేదా నేరుగా వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలి. ఈ పరీక్షలు పూర్తిగా ఉచితం. వారం రోజుల్లో రిపోర్టులు వస్తాయి. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – శ్రీధర్స్వామి, జిల్లా వ్యవసాయాధికారి -
నేడు బాసరలో ఆర్జిత సేవలు రద్దు
బాసర: బాసర సరస్వతీ ఆలయంలో ఆర్జిత సే వలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం బాసర సరస్వతీ ఆలయంలో రూ.225 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్షరభ్యాసాలు, కుంకుమార్చనలు, సత్యనారాయణ వ్రతాలు వంటి ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు సహకరించాలని కోరారు. 107 మక్కల బస్తాలు చోరీ కుంటాల: మండలంలోని కల్లూరు –కుంటాల అంతర్రాష్ట్ర రహదారిపై కొత్త వెంకూర్ సమీపంలో తూకం వేసి ఉంచిన 107 మక్కల బస్తాలు శనివారం రాత్రి చోరీకి గురయ్యాయి. మండలంలోని కొత్త వెంకూర్ గ్రామానికి చెందిన మగ్గిడి చిన్న నారాయణ తనకున్న రెండెకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. వారం క్రితం పంట కోసి ఆరబెట్టాడు. శనివారం రా త్రి పాత వెంకూర్ గ్రామానికి చెందిన ప్రైవేటు వ్యాపారి దత్తు పటేల్కు మక్కలు విక్రయించాడు. బస్తా 55 కేజీల చొప్పున తూకం వేసిన 107 బస్తాలను దొంగలు ఎత్తుకెళ్లి పోయారని రైతు వాపోయాడు. బస్తాలు చోరీ జరగడంతో రూ.1 లక్ష 42 వేల నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆదివారం ఎస్సై అశోక్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. -
నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం పర్యటన
భైంసా/బాసర/కైలాస్నగర్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మొదట ఆయన బాసర శ్రీజ్ఞాన సరస్వతి ఆలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం పర్యటనను విజయవంతం చేయడానికి అన్నిశాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్లు నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బాసర మాస్టర్ ప్లాన్లో భాగంగా రూ.225 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. తర్వాత మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో బహిరంగసభలో పాల్గొంటారు. సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా.. ⇒ ఉదయం 10:20 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బాసరకు బయల్దేరతారు. ⇒ ఉదయం 11 గంటలకు బాసర హెలీప్యాడ్కు చేరుకుని అక్కడ నుంచి రాజన్న గెస్ట్హౌస్కు వెళతారు. ⇒11:10 నుంచి 12:10 వరకు బాసర శ్రీజ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ⇒మధ్యాహ్నం 12:15 నుంచి 12:30 వరకు ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేస్తారు.⇒ మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు రిజర్వ్ టైమ్ ⇒ మధ్యాహ్నం 1:45 గంటలకు బాసర నుంచి ఆదిలాబాద్ జిల్లాకు వెళ్తారు. ⇒ మధ్యాహ్నం 2.15 గంటలకు పిప్పిరికి చేరుకుంటారు. ⇒ 2.20 నుంచి 2.30 వరకు వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ⇒ 2.30 నుంచి సాయంత్రం 4.10 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.⇒ సభ అనంతరం ఐఎస్వో సరి్టఫికెట్లు, వడ్డీలేని రుణాల చెక్కులను లబి్ధదారులకు అందజేస్తారు. అలాగే సీఎం కప్ విజేతలకు ట్రోఫీని బహూకరిస్తారు. ⇒ 4.20 గంటలకు హైదరాబాద్కు తిరిగి పయనమవుతారు. -
ప్రత్యేక ప్యాకేజీతో జిల్లా అభివృద్ధి
కై లాస్నగర్: ప్రత్యేక ప్యాకేజీతో ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. పార్టీ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శుక్రవారం హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో నూతన కార్యవర్గానికి నియామకపత్రాలు అందజేసి, వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మాట్లాడారు. బీజేపీవి దేవుడి పేరిట రాజకీయాలు బీజేపీని గద్దెనెక్కిస్తే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్షాలు దేశాన్ని కార్పొరేట్శక్తులు, ట్రంప్నకు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీకి దేవుడి పేరిట రాజకీయాలు చేపడమే తప్ప ప్రజల సంక్షేమం పట్టదన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చేలా సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే పదేళ్లపాలనలో ఏ సీఎం చేయనంతంగా అ ప్పులు చేసిన కేసీఆర్ పలాయనం చిత్తగించి ప్రస్తు తం ఫాంహౌస్కు పరిమితమైండని మండిపడ్డారు. జిల్లాకేంద్రంలో త్వరలో ఎయిర్పోర్టు పనులు ప్రారంభం జిల్లా కేంద్రంలో త్వరలోనే ఎయిర్పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. జిల్లా రైతాంగానికి లబ్ధి చేకూర్చేలా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు. విద్య, వైద్యం, పారిశ్రామికంగా జిల్లాను అభివృద్ధి పరుస్తామని భరోసానిచ్చారు. పార్టీ జిల్లా కమిటీలో ఎస్సీ, ఎస్టీలకు 74శాతం పోస్టులు కేటాయించామన్నారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు సైతం భర్తీ చేస్తామని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపునిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికి సంక్షేమం, అభివృద్ధిలో రాజీపడకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పేదలకు సన్నబియ్యం, రేషన్కార్డులను జారీ చేశామన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వందకు పైగా సీట్లను పార్టీ కై వసం చేసుకోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ సునామీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ కొట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. పదికి పది అసెంబ్లీ సీట్లను పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కార్యవర్గ సభ్యులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలన్నారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యవర్గ సభ్యులు ఆయనను పూలమాల, శాలువాతో సత్కరించారు. అంతకు ముందు మావల బైపాస్ వద్ద పార్టీ ఽశ్రేణులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, కేంద్ర మాజీ మంత్రి ఎస్.వేణుగోపాలాచారి, మాజీ ఎంపీ సోయం బాపూరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేశ్జాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, నాయకులు గండ్రత్ సుజాత, సాజీద్ఖాన్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మాటిచ్చారు.. నిలబెట్టుకున్నారు
బజార్హత్నూర్: కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తే వడమే లక్ష్యంగా ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూ ర్ మండలంలోని పిప్రి గ్రామంలో నాడు పీసీసీ హో దాలో మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రకు శ్రీకా రం చుట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గ్రామానికి ఆయన పలు హామీలు కూడా ఇచ్చారు. 2023 మార్చి 16న మొదలైన ఈ యాత్ర 16 జిల్లాలు, 37 అసెంబ్లీ నియోజకవర్గాలు, 700కు పైగా గ్రామాల్లో 1,365 కిలోమీటర్ల మేర సాగింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావ డం డిప్యూటీ సీఎంగా భట్టి కొలువుదీరిన విషయం తెలిసిందే. మాట నిలబెట్టుకున్న ‘భట్టి’ పాదయాత్ర సందర్భంగా నాడు ఇచ్చిన హామీ మేర కు 2024 ఆగస్టు 7న భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం హోదాలో గ్రామానికి విచ్చేశారు. గ్రామాన్ని దత్తత తీసుకుని రూ.20.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎస్సీ కార్పొరేషన్, ట్రైకా ర్, ఐటీడీఏ బ్యాంకు లింకేజీ ద్వారా మంజూరైన చె క్కులను పంపిణీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 72మంది దళిత రైతులకు పంటచేలకు బోర్లు వే యించారు. విద్యుత్ కనెక్షన్ అందించాల్సి ఉంది. అలాగే రూ.2.90 కోట్ల నిధులతో ప్రతీవార్డులో సీసీ రోడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం అన్ని చోట్ల పూర్తయ్యాయి. గ్రామ సమీపంలో బోథ్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు అనుబంధంగా సబ్మార్కెట్కు ఐదెకరాల ప్రభుత్వ భూమి కేటా యించారు. భవనం మంజూరు కావాల్సి ఉంది. అలాగే 17మందికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారు. ఈ నిర్మాణాలు పూర్తయ్యాయి. రేపు గ్రామంలో నిర్వహించనున్న బహిరంగ సభకు సీఎం రానున్నా రు. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.దండిగా నిధులు..ఈ గ్రామ అభివృద్ధికి గాను 2026 ఫిబ్రవరి 5న కలెక్టర్ రాజర్షిషా రూ.10 కోట్ల నిధుల కోసం ఆర్థిక శాఖకు నివేదించగా మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు. ఈ నిధుల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం రూ.15 లక్షల చొప్పున నాలుగింటికి రూ.60 లక్షలు, అంగన్వాడీ –1, 2 భవనాల నిర్మాణానికి రూ.14.80 లక్షల చొప్పున రూ.29.60 లక్షల నిధులు మంజూరయ్యాయి. గ్రామం నుంచి ఇచ్చోడ, బజార్హత్నూర్ బీటీ రోడ్డు విస్తరణ కోసం రూ.2.18 కోట్ల నిధులు మంజూరయ్యాయి. మరో 7 అభివృద్ధి పనులకు రూ.2.87 కోట్లు మంజూరైనట్లు అధికారులు వెల్లడించారు. -
తీరని వంటగ్యాస్ కష్టాలు
● ఏజెన్సీ నిర్వాకంపై డీఎస్వో ఆగ్రహం కై లాస్నగర్: జిల్లాలో గ్యాస్ కష్టాలు తొలగడం లేదు. స్థానిక రిషి శంకర్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు రెండు రోజులుగా డోర్ డెలివరీ నిలిపివేశారు. దీంతో బుకింగ్ చేసుకున్న వినియోగదారులు సిలిండర్లతో ఏజెన్సీ వద్దకు చేరుకున్నారు. మండుటెండలో బారులు తీరి గంటల తరబడి నిరీక్షించారు. ఓటీపీ రావడం లేదనే కారణంతో నిర్వాహకులు రశీదులు ఇవ్వడంలో జాప్యం చేశారు. దీంతో వినియోగదారులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న డీఎస్వో నందిని అక్కడికి చేరుకున్నారు. సిబ్బందిని ప్రశ్నించగా ఓటీపీ రాకపోవడంతోనే సిలిండర్లు ఇవ్వడం లేదంటూ దురుసుగా సమాధానమిచ్చారు. వారి తీరుపై తీవ్ర ఆగహం వ్యక్తం చేసిన డీఎస్వో ఇండియన్ ఆయిల్ కంపెనీ సెల్స్ అధికారి, ఏజెన్సీ యజమానితో ఫోన్లో మాట్లాడారు. అనంతరం ఆమె స్వ యంగా వినియోగదారుల సర్వీస్ నంబర్ల ఆ ధారంగా ఓటీపీ నంబర్లను చీటీలపై రాసి ఇచ్చి గోడౌన్ వద్దకు పంపించారు. విషయాన్ని కలెక్ట ర్ దృష్టికి తీసుకెళ్తానని డీఎస్వో పేర్కొన్నారు. -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
కై లాస్నగర్: ఈ నెల 6న సీఎం రేవంత్రెడ్డి జిల్లా పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రారంభోత్సవాలు, శిలాఫలకాల ఆవిష్కరణ వద్ద ప్రొటోకాల్ విధిగా పాటించాలని, కేటాయించిన విభాగం వద్దనే ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉండాలని స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ, ఇతర సర్టిఫికెట్ల అందజేత వంటి కార్యక్రమాలను నిర్ణీత సమయంలోగా, క్రమశిక్షణతో పూర్తి చేయాలని సూచించారు. వేదిక వద్ద తాగునీరు, సీటింగ్, పార్కింగ్, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. హెలీప్యాడ్ వద్ద, వీఐపీ గ్యాలరీలో భద్రతా ప్రమాణాలు పాటించాలని, అనుమతి ఉన్న వారిని మాత్రమే అనుమతించాలని రెవెన్యూ, పోలీస్ అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, వివిధ శాఖల ఈఈలు, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండాలిబజార్హత్నూర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మండలంలోని పిప్రి గ్రామంలో సీఎం సభ ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. అనంతరం దిగ్నూర్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. రికార్డులతో పాటు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి మెనూ ప్రకారం భోజనం అందుతుందా.. అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే గంగాపూర్, బోస్రా, దేగామ గ్రామాల్లో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్లు మురళీధర్, సుభాష్, దేవుబాయి, కృష్ణకాంత్రెడ్డి, ఎస్ఈ శ్రావణ్కుమార్, ఈఈ చంద్రమోహన్, డీఈఈ రమణ, ఏఈఈలు దివాకర్, వెంకటేశ్ గ్రామస్తులున్నారు. ‘మన ఇసుక వాహనం’ప్రారంభంసాత్నాల: ప్రజలకు ఇసుక రవాణా సేవలను మరింత సులభతరం చేయడం, పారదర్శకత పెంపొందించడం లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన ఇసుక వాహనం‘ వెబ్, మొబైల్ అప్లికేషన్ను కలెక్టర్ రాజర్షి షా శనివారం ప్రారంభించారు. భోరజ్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆన్లైన్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ హెల్ప్ డెస్క్ ను సందర్శించి ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, మైనింగ్ ఏడీ రవీందర్, తహసీల్దార్ రాజేశ్వరి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘సెల్’ వెలుతురులో మూల్యాంకనం
ఆదిలాబాద్టౌన్: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నారు. గడిచిన నాలుగు రోజుల్లో ఉపాధ్యాయులు 48వేల జవాబుపత్రాలను మూల్యాంకనం చేశా రు. ఇంత వరకు బాగానే ఉంది. శనివారం సాయంత్రం మూల్యాంకనం చేస్తున్న సమయంలో కురిసిన అకాల వర్షంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 45 నిమిషాల పాటు ఉపాధ్యాయులు సెల్ఫోన్ వెలుతురులో మూల్యాంకనం చే శారు. దీనికి తోడు ఉక్కపోతతో తీవ్ర అవస్థలు పడ్డారు. చీకటిలో పేపర్లు దిద్దడం ద్వారా పారపాట్లు జరిగితే విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. అధికారులు పట్టింపులేమిపై ఉపాధ్యాయ సంఘాలు ఆసహనం వ్యక్తం చేశాయి. ఈ విషయ మై పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ వేణుగో పాల్రెడ్డిని వివరణ కోరగా విద్యుత్ కోతలు లేకుండా చూడాలని ఆ శాఖ అధికారులకు లేటర్ ఇచ్చామన్నారు. ఇదివరకు జనరేటర్ను ఏర్పాటు చేశా మని ఈ సారి స్పాట్ ఎక్కువ రోజులు ఉండటంతోనే ఏర్పాటు చేయలేకపోయామని పేర్కొన్నారు. -
దొడ్డి కొమురయ్యకు ఘన నివాళి
కై లాస్నగర్: తెలంగాణ సాయుధ పోరాట యో ధుడు దొడ్డి కొమురయ్య బహుజన ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచారని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కొమురయ్య జయంతి వేడుకలను కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం అధికారికంగా నిర్వహించారు. ఎమ్మెల్యే శంకర్, బీసీ సంఘాల ప్రతి నిధులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొమురయ్య త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం బీసీ సంఘాల నాయకులు కొమురయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్, ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఇందులో అదనపు కలెక్టర్ ఎస్. రాజేశ్వర్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సోనియా, తహసీల్దార్ శ్రీనివాస్, కౌన్సిలర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రెండు విడతల్లో జనగణన
కై లాస్నగర్: ప్రణాళికల రూపకల్పన, సంక్షేమ పథకాల అమలులో కీలకమైన జనగణన నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. రెండు విడతల్లో ఈ ప్రక్రియ చేపట్టేలా ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతుంది. తొలిసారిగా డిజిటల్ విధానంలో చేపడుతున్న సర్వేకు కసరత్తు ముమ్మరం చేసింది. తొలి విడతలో భాగంగా మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల గుర్తింపు జాబితా సిద్ధం చేయనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెండో దశలో జనగణన చేపట్టనున్నారు. సర్వే ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బందికి దశలవారీగా శిక్షణ ఇస్తున్నారు. చార్జీ అధికారులైన తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, మ్యాపుల తయారీకి సంబంధించిన టెక్నికల్ అసిస్టెంట్లకు ఇప్పటికే శిక్షణ పూర్తికాగా, ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 800 ఇళ్లకు ఒక ఎన్యూమరేటర్.. జిల్లాలో ఏకై క ఆదిలాబాద్ మున్సిపాలిటీతో పాటు 473 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలోని ఇళ్లను గుర్తించేందు కోసం ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు విధులు నిర్వహించనున్నారు. 800 ఇళ్లకు ఒకరు చొప్పున 1,242 మంది ఎన్యూమరేట్లరను, అలాగే ఆరుగురికి ఒక సూపర్వైజర్ చొప్పున 217 మందిని నియమించారు. అదనపు సిబ్బందితో కలిపి 1608 మందిని అందుబాటులో ఉంటారు. వీరికి ఈ నెల 18 నుంచి మే 5వరకు మండలాల వారీగా ఫీల్డ్ ట్రైనర్లు శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం వీరంతా క్షేత్రస్థాయిలో ఇళ్ల జాబితాను, కుటుంబాల సమాచారాన్ని సేకరించి ప్రత్యేక యాప్ హెచ్ఎల్వోలో నమోదు చేయనున్నారు. కాగా ఈ ప్రక్రియలో కీలకపాత్ర పోషించనున్న చార్జీ ఆఫీసర్లైన తహసీల్దార్లకు గత నెల 12, 13, 14 తేదీల్లో మూడు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మ్యాపుల తయారీకి సంబంధించి టెక్నికల్ ఆసిస్టెంట్లకు గత నెల 20 నుంచి మూడు రోజుల పాటు శిక్షణ అందించారు. 28, 29, 30 తేదీల్లో ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ పూర్తి చేశారు. మే 11 నుంచి తొలిదశ.. జనగణన తొలిదశలో భాగంగా వచ్చే మే 11నుంచి జూన్ 9వరకు ఎన్యూమరేటర్లు గ్రామాలు, వార్డుల్లో క్షేత్రస్థాయికి వెళ్లనున్నారు. వాటి పరిధిలో ఎన్ని గృహాలు ఉన్నాయో గుర్తించి, ప్రాంతాల వారీగా పటాలను రూపొందించనున్నారు. స్వరాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించనున్న జనగణనకు శాటిలైట్ అనుసంధానంతో రూపొందించిన సాంకేతికత వినియోగిస్తున్నారు. స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న హెచ్ఎల్వో యాప్లో సమాచారం నిక్షిప్తంచేయనున్నారు. ప్రజలు ఈ యాప్ ద్వారా లాగిన్అయి కేంద్రం నిర్దేశించిన 33 అంశాలతో తమ స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ఈ అంశాలను ఎన్యూమరేటర్లు తిరిగి పరిశీలిస్తారు. 2027 ఫిబ్రవరి నుంచి రెండో దశలో జనగణన సర్వే చేపట్టనున్నారు. జిల్లాలో మండలాలు : 21 జనాభా : 7,08,972 గృహాలు : 1,56,683 ఎన్యూమరేటర్లు : 1,242 సూపర్వైజర్లు : 217 బల్దియాలో మాక్ సర్వే వచ్చే మే నెలలో ప్రారంభం కానున్న జనగణన–2027కు సంబంధించి మాక్ సర్వేను మున్సిపల్ అధికారులు పట్టణంలో శుక్రవారం నిర్వహించారు. స్థానిక కేఆర్కే కాలనీలో కమిషనర్ జి.రాజు హాజరై స్వయంగా ప్రజల నుంచి వివరాలు సేకరించి ఎన్యూమరేటర్లకు ప్రత్యక్ష అవగాహన కల్పించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా హౌస్ లిస్టింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ మేనేజర్ స్వామి, వార్డు ఆఫీసర్ నరేష్ తదిరులున్నారు. -
సీఎం సభకు పకడ్బందీ ఏర్పాట్లు
ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రులు జూపల్లి, వివేక్ వెంకటస్వామి బజార్హత్నూర్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6న మండలంలోని పిప్రి గ్రామానికి సీఎం రేవంత్రె డ్డి విచ్చేయనున్నారు. ఈ మేరకు నిర్వహించనున్న సభ ఏర్పాట్లను మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం ఉమ్మడి జిల్లా పర్యటనలో చేపట్టనున్న అభివృద్ధి పనుల వివరాలను జూపల్లి వెల్లడించారు. బోథ్ నియోజకవర్గంలో రూ.1200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన, రూ.300 కోట్ల నిధులతో బాసర ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, 2027లో గోదావరి పుష్కరాల కోసం రూ.500 కోట్లతో కుంభమేళా తరహా ఏర్పాట్లు, జిల్లా వ్యాప్తంగా రూ.600 కోట్ల నిధులతో ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పనులు ప్రారంభిస్తారని తెలిపారు. మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఈ సభ మైలురాయిగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి సహకారం తీసుకుంటున్నామని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, ఈ నెల 6న మధ్యాహ్నం 2గంటలకు పిప్రిలో ఏర్పాట చేసిన హెలిప్యాడ్ వద్దకు సీఎం చేరుకుంటారని అన్నారు. అనంతరం సభా ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులకు శిలాఫలకాలు ఆవిష్కరిస్తారని తెలిపారు. వారి వెంట మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్రావ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడే గజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
13న చించుఘాట్కు డీజీపీ రాక
ఆదిలాబాద్రూరల్: పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఆదివాసీ, గిరిజన యువత కోసం పో లీస్శాఖ తన వంతు పాత్ర పోషిస్తోంది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చించుఘాట్లో గ్రంథాలయం ఏర్పాటు చేస్తున్నారు. గ్రామస్తులు ఓ గదిని సమకూర్చగా మిగతా ఏర్పాట్లను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 13న డీజీపీ శివధర్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందు కు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎస్పీ అఖిల్ మ హాజన్ గ్రా మాన్ని సందర్శించి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు, సలహాలు చేశారు. అదే రోజున జిల్లాలోని సార్మేడిలు, గ్రామపటేళ్లు, మహా జన్లతో డీజీపీ సమావేశం కానున్నట్లు పలు వురు ఆదివాసీ నేతలు తెలిపారు. -
బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా ప్రకాశ్
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ మున్సిపల్ బీఆర్ఎస్ ఫ్లోర్లీడర్గా 49వ వార్డు కౌన్సిలర్ వేనగంటి ప్రకాశ్ నియామకం అయ్యారు. ఈమేరకు మాజీ మంత్రి జోగు రామన్న శుక్రవారం ఆయనకు నియామక పత్రం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణాభివృద్ధికి విశేష కృషి చేసిందని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో ప్రస్తుత కౌన్సిల్లోనూ పార్టీ కౌన్సిలర్లు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ జోగు ప్రేమేందర్, వసంత్, వెంకటేశ్, డాక్టర్ గౌస్, సలీమ్, అనిల్, పర్వీన్ పాల్గొన్నారు. -
కుళ్లిన చికెన్.. వేడివేడిగా సర్వ్!
ఆదిలాబాద్టౌన్: రోజుల తరబడి ఫ్రిజ్లో ఉంచిన చికెన్ను అప్పటికప్పుడు వేడి చేస్తున్నారు.. వాటికి మసాలాలు, నిషేధిత రంగులను జత చేసి ఘుమఘుమలాడేలా ప్లేట్లో సర్వ్ చేస్తున్నారు. లొట్టలేసి తిన్నారనుకో అంతే మరి. ఆస్పత్రి పాలవడం ఖాయం. జిల్లాలోని పలు హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు కుళ్లిన పదార్థాలను విక్రయిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. రోజుల తరబడి మాంసపు నిల్వలను ఫ్రిజ్లో నిల్వ ఉంచడం, నిషేధిత రంగు గల రసాయనాలు వాడటం, వాడిన నూనెనే మళ్లీ వినియోగించడంతో ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోంది. జిగేల్మనే విద్యుత్ కాంతులు, అద్దాలు, గార్డెన్ను చూసి హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్తున్నారా.. అయితే అక్కడ కిచెన్లను చూస్తే మాత్రం విస్తుపోవాల్సిందే. పలుమార్లు తనిఖీలు చేసినప్పుడు బయటపడుతున్న డొల్లతనాన్ని వారు సరిచేసుకోలేక పోతున్నారు. నామ్కే వాస్తే జరిమానాతో వారు మరింతగా రెచ్చిపోతున్నారు. కుళ్లిన పదార్థాలతో.. జిల్లాలోని చాలా హోటళ్లలో బిర్యానీ చేసిన తర్వాత మిగిలిపోతే అందులోని ముక్కలను తీసి మరుసటి రోజు వినియోగిస్తున్నారు. వాసన రాకుండా, సువాసన వెదజల్లేలా అందులో టెస్టింగ్ పౌడర్ వేస్తున్నారు. ఇలాంటి భోజనం తినేవారు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం లేకపోలేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీంతోపాటు స్వీట్లలో కూడా రసాయనాలు వాడుతున్నారు. మిఠాయిలతో సంతోషాలను పంచుకోవడాన్ని పక్కనబెడితే తినే వారి ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం లేకపోలేదనే వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆహార పదార్థాలకు వినియోగించే సరుకులు సైతం నాణ్యతగా లేకపోవడం గమనార్హం. గడువు తీరినవి, ఫ్రిజ్లో స్టోరేజ్ చేసి తర్వాత వాడుతుండడంతో ప్రజలు అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. నిరంతరం తనిఖీలు చేస్తాం.. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడే హోటాళ్ల యజమానులపై కఠిన చర్యలు చేపడతాం. హోటాళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, స్వీట్ షాపులతో పాటు సూపర్ మార్కెట్లలో తరచూ తనిఖీలు నిర్వహిస్తాం. నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేస్తాం. ప్రజలు ఆహారం తినే ముందు నాసిరకంగా ఉందా, అందులో ఏవైన రసాయనాలు కలిపారా అనేది నిర్ధారించాలని సూచించారు. ఎక్కడైన కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తే సెల్: 7981764779కు సమాచారం అందించాలి. ఈయేడాది ఇప్పటివరకు నాలుగు కేసులు నమోదు చేయడం జరిగింది. – ప్రత్యూష, ఫుడ్ ఇన్స్పెక్టర్ -
ఆత్మీయ సమ్మేళనానికి సీఎండీకి ఆహ్వానం
శ్రీరాంపూర్: పట్టణంలోని ప్రగతి మైదానంలో ఈ నెల 19న నిర్వహించనున్న ఉద్యోగ, అధికారులు, క్రీడాకారులు, కళాకారుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నిర్వాహకులు సీఎండీని కోరారు. గురువారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సంస్థ సీఎండీ బుద్దప్రకాశ్ జ్యోతి చేతుల మీదుగా కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ మైదానంలో ఆడిన ఎంతోమంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారన్నారు. కళాకారులకు కూడా గొప్ప వేదికై ందన్నారు. కార్మికులు, అధికారులు ప్రతీరోజు వ్యాయామం చేయడానికి ఈ మైదానానికే వస్తారన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వై.యాదిరెడ్డి, శ్యాంసుందర్, పీ.సంపత్కుమార్, ప్రేంకుమార్, లింగయ్య, తదితరులు పాల్గొన్నారు. -
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
రెబ్బెన: మండలంలోని మాద్వాయిగూడ సమీపంలో గల జగన్నాథ్పూర్ ప్రాజెక్టులో గల్లంతైన యువకుడి మృతదేహం గురువారం లభ్యమైనట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. కాగజ్నగర్కు చెందిన అర్ఫజ్ బేగ్ (21) బుధవారం తన స్నేహితులైన గౌస్, కిరణ్, సాయి, జిబిల్తో కలిసి ఈత కొట్టేందుకు జగన్నాథ్పూర్ ప్రాజెక్టు వద్దకు వెళ్లాడు. అందరూ కలిసి నీటిలో దిగగా అర్ఫజ్ నీటమునిగాడు. ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో ప్రాజెక్టులో గాలించారు. రాత్రయినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో గురువారం తెల్లవారు జామున తిరిగి గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. మృతుని మేనమామ మహ్మద్ నౌషద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పీఎం ఇంటర్న్షిప్కు దరఖాస్తు చేసుకోవాలిపాతమంచిర్యాల: ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కోసం అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాస రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 25 సంవతర్సాల వయస్సు కలిగి ఎస్సెస్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లోమా, డిగ్రీ/ పీజీ చదువుతున్న విద్యార్థుఽలు అర్హులన్నారు. ఎంపికై న వారికి 6–9 నెలల పాటు ఇంటర్న్షిప్ పొందే అవకాశం ఉంటుందని నెలకు రూ.9వేల స్టైఫండ్, రూ.6 వేల గ్రాంట్ అందిస్తారన్నారు. ఆసక్తి కలవారు http/pminternship.mca. gov.in. వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం 1800 116 090 నంబరులో లేదా కలెక్టరేట్లోని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు. స్థలం ఆక్రమించిన నలుగురిపై కేసుఆదిలాబాద్రూరల్: తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమంగా స్థలాన్ని ఆక్రమించిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు మావల ఎస్హెచ్ఓ రాహుల్ కాంత్ (ఐపీఎస్) తెలిపారు. మావల పోలీస్స్టేషన్ పరిధిలోని దస్నాపూర్ సర్వే నం.1లో ప్లాట్ నం.20లో మంద జయనారాయణ రెడ్డికి చెందిన స్థలాన్ని మైసర్ల లక్ష్మి, సిరిపురం రమాదేవి, ప్రసన్న, రాణి ఆక్రమించారు. బాధితుడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మైసర్ల లక్ష్మిని అరెస్టు చేయగా, మిగితా ముగ్గురు పరారీలో ఉన్నారు. -
మెరుగైన వైద్యసేవలందించాలి
సాత్నాల: రోగులకు మెరుగైన సేవలందించాలని డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ జాదవ్ దేవిదాస్ సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా భోరజ్ మండలం గిమ్మ ప్రాథమిక ఆస్పత్రిని గురువారం తనిఖీ చేశారు. ఎన్సీడీ స్కానింగ్, సదుపాయాల పరిశీలన, రికార్డులు, నివేదికలు, పరికరా లు, మందుల వివరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమయానుకూల వై ద్యసేవలు అందించేందుకు కృషి చేయాలని, ఆస్పత్రికి వచ్చే ప్రతీ రోగితో మర్యాదపూర్వకంగా వ్యవహరించడంతోపాటు సరైన చికిత్స అందించాలని సూచించారు. మందుల కొరత లేకుండా చూసుకో వాలని, అత్యవసర సేవలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచాలని ఆదేశించారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, రో గులకు తాగునీరు, అవసరమైన వసతులు కల్పించడం లాంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అమర్నాథ్, ఎన్సీడీ కోఆర్డినేటర్ రమణ, సుచల, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ఉత్పత్తి లక్ష్య సాధనకు కృషి చేయాలి
నస్పూర్: 2026–27 ఆర్థిక సంవత్సరం నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనకు కృషి చేయాలని శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్ అన్నారు. గురువారం జీఎం కార్యాలయంలో అన్ని గనుల అధికారులతో ఉత్పత్తి ఉత్పాదకతపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ 2026–2027 ఆర్థిక సంవత్సరానికి యాజమాన్యం 64 లక్షల 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించిందన్నారు. శ్రీరాంపూర్ ఓసీలో కొత్త కాంట్రాక్ట్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, ఐకే ఓసీలో త్వరలోనే టెండర్ల నిర్వహణ ద్వారా మరో రెండు నెలల్లో ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. ఉపరి తల గనులలో వీలైనంత త్వరగా ఉత్పత్తి మొదలు పెట్టి లక్ష్య సాధనకు సమష్టిగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్.సత్యనారాయణ, ఏరియా ఇంజినీర్ రమణారావు, ఎస్ఆర్పీ ఓసీ ప్రాజెక్టు ఆఫీసర్ చిప్ప వెంకటేశ్వర్లు, ఐకే ఓసీ ప్రాజెక్టు ఆఫీసర్ ఏవి రెడ్డి, ఆర్కే 5 గ్రూప్ ఏజెంట్ ఎన్.శ్రీధర్, ఎస్ఆర్పీ గ్రూప్ ఏజెంట్ రవికుమార్, క్వాలిటీ మేనేజర్ వెంకటేశ్వర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఆశ వర్కర్ ఆత్మహత్యాయత్నంపై విచారణ జరపాలి
ఖానాపూర్: మండలంలోని ఎర్వచింతల్ ఆశ వర్కర్ ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ డిమాండ్ చేశారు. ఎర్వచింతల్ గ్రామాన్ని సందర్శించి బాధిత ఆశవర్కర్ పద్మతోపాటు బాలింత రమణబాయిని గురువారం పరామర్శించారు. గర్భిణికి సంబంధిత అధికారులు, సిబ్బంది వైద్యం నిలిపివేయడం అమానుషమన్నారు. వైద్య శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతోపాటు సంబంధిత అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఘటన చోటు చేసుకుందన్నారు. ఘటనపై ఆయా శాఖల అధికారులు సమగ్ర విచారణ చేసి బాధితురాలికి రక్షణ కల్పించడంతోపాటు బాధ్యులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సుజాత, సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు గంగమణి, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్కేపీ ఓసీపీని పరిశీలించిన కేంద్ర బృందం
రామకృష్ణాపూర్: మందమర్రి ఏరియాలో అమలు చేస్తున్న పర్యావరణ పరిరక్షణ చర్యలను కేంద్ర పర్యావరణ శాఖ ఉన్నతాధికారుల బృందం గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన సలహాదారు తరుణ్ కత్తుల నేతృత్వంలోని బృందం సింగరేణి కార్పొరేట్ జీఎం (ఎన్విరాన్మెంట్) సైదులు, ఏరియా జీఎం రాధాకృష్ణతో కలిసి రామకృష్ణాపూర్ ఓపెన్కాస్ట్ గని పరిసర ప్రాంతాలను సందర్శించింది. ఓసీ పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న కాలుష్య నియంత్రణ చర్యలు, ట్రావెలింగ్ రోడ్ల వెంట నిర్వహిస్తున్న ఎవెన్యూ ప్లాంటేషన్, గని పరిసరాల్లో పెంచుతున్న మొక్కలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్వోటు జీఎం జీఎల్ ప్రసాద్, ఓసీ మేనేజర్ పంకజ్, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా పథకాల అమలు
ఉట్నూర్ రూరల్: అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభు త్వ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి నివేదికలో భాగంగా మండల కేంద్రంలోని రైతువేదికలో గురువారం స్థానిక సర్పంచ్ అనిత–శ్రీనివాస్ జాదవ్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్తో కలిసి హాజరయ్యారు. ముందుగా రాష్ట్ర గీతం ఆలపించారు. అ నంతరం సీఎం రేవంత్రెడ్డి సందేశాన్ని ఎంపీడీవో రామ్ప్రసాద్, గ్రామపంచాయతీ నివేదికను పంచా యతీ కార్యదర్శి శంకర్ గ్రామసభలో చదివి వినిపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఖా నాపూర్ నియోజకవర్గానికి కొత్తగా రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైందని తెలిపారు. ఉట్నూర్లోని ఐ టీఐలో టాటా సంస్థ సహకారంతో అడ్వాన్స్డ్ టె క్నాలజీ సెంటర్ ప్రారంభమైందని తెలిపారు. దీని ద్వారా 200మంది యువతకు రోబోటిక్స్, ఇంటర్నె ట్ ఆఫ్ థింగ్స్ లాంటి ఆధునిక అంశాల్లో శిక్షణ ఇ చ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. గ్రా మాల్లోని తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ లాంటి సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. అనంతరం వెదురు తయారీదారుల ఇ ళ్లకు వెళ్లి వారి జీవనోపాధి గురించి తెలుసుకున్నా రు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. గ్రామాల్లోని సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే గ్రా మసభల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. అధికా రుల సమన్వయంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ సభలో శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, అదనపు వైద్యాధికారి మనోహర్ తదితరులు పాల్గొన్నారు. కోర్టు భవనం ప్రారంభం ఉట్నూర్ ఆర్డీవో కార్యాలయంలో ఏజెన్సీ కోర్టు భవనాన్ని కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. మండల కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏజెన్సీ కోర్టు సముదాయాన్ని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మట్తో కలిసి సందర్శించారు. సబ్ కలెక్టర్ కా ర్యాలయంలోనీ రికార్డు గది, కంప్యూటర్ గది, వివి ధ విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, న్యాయవాదులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.‘గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం’బజార్హత్నూర్: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేపూల నర్సయ్య పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. మండల కేంద్రంతో పాటు 30 గ్రామపంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచులు పరచ సాయన్న, కృష్ణకాంత్రెడ్డి, ప్రియాంక, అనిత, సాయినాథ్, మాధవ్, దేవుబాయి, రజక్, విజయ, నాందేవ్, అనిల్, ప్రవీణ్, కై లాస్ పాల్గొన్నారు. సృజనాత్మకతను వెలికితీయాలిఆదిలాబాద్టౌన్: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని ప్ర భుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అతీఖ్ బేగం సూచించా రు. నేషనల్ గ్రీన్ కార్ప్, ఈకో క్లబ్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని కళాశాలలో విద్యార్థులు మట్టితో వివిధ రకాల ఆకృతులను తయారు చేశారు. హైడల్ మేకింగ్, సీడ్బాల్స్ అండ్ మేకింగ్, అనేక రకాల విత్తనాలతో కలిపి మ ట్టిలో గుండ్రంగా చుట్టారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వారిని అభినందించా రు. వానాకాలంలో అడవులు, ఖాళీ ప్రదేశాల్లో వేస్తే అవి మొలకెత్తుతాయని ప్రి న్సిపల్ తెలిపారు. కార్యక్రమంలో కునాల్, అశ్విని, స్వప్న, నరేశ్ పాల్గొన్నారు. -
కన్నోళ్లకు ఊరట
నిర్మల్చైన్గేట్: కనీ పెంచి ప్ర యోజకులను చేసిన తల్లిదండ్రులను కొందరు పట్టించుకోవడం లేదు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను భారంగా భావిస్తున్నారు. తమను సరిగా చూసుకోవడం లేదని ఎందరో వృద్ధ తల్లిదండ్రులు వయోవృద్ధుల ట్రిబ్యునళ్లను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి వారికి భరోసా కల్పించేందుకు తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంట బిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరంటల్ సపోర్ట్ యాక్ట్–2026 (టీఈఏఎంపీఎస్) పేరుతో ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. ఇది పిల్లల నిర్లక్ష్యానికి గురయ్యే తల్లిదండ్రులకు అండగా నిలవనుంది. తల్లిదండ్రుల ఆత్మగౌరవం కాపాడేందుకు.. పేద కుటుంబాల్లోని వృద్ధులు, వితంతువులకు ప్రభుత్వం అందించే పెన్షన్లు ఆసరాగా నిలుస్తున్నాయి. అయితే ఉద్యోగం చేసే సంతానం ఉన్న వారికి పెన్షన్ రాకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్ర భుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘తల్లిదండ్రుల మద్దతు బిల్లు’ను కేబినెట్ ఆమోదించింది. దీని ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారితో పాటు ప్రజాప్రతి నిధులు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే.. వారి జీతం నుంచి 15 శాతం లేదా రూ.10 వేల చొప్పున కోత విధించి తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తారు. ఈ చట్టాన్ని పక్కాగా అమలు చేస్తే నిరాదరణకు గురవుతున్న ఎంతోమంది తల్లిదండ్రులకు మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విశ్రాంత ఉద్యోగులకూ తప్పని కష్టాలు ఉద్యోగం చేసి రిటైరైన పెన్షనర్లలో చాలామంది తమ సంతానం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల నెలా వచ్చే పింఛన్ డబ్బుల కోసం వేధించే వారు ఎందరో ఉన్నారు. కొందరైతే తల్లి లేదా తండ్రి బ్యాంకు పాస్ పుస్తకం, ఏటీఎం కార్డులను తమవద్దే ఉంచుకుని, వారి పెన్షన్ ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తున్నారు.ఫిర్యాదు చేయండిలా.. బాధిత తల్లిదండ్రులు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో జిల్లా కలెక్టరేట్లలో ఫిర్యాదు చేయవచ్చు. కేవలం 45 రోజుల్లోనే సమస్యను పరిష్కరించేలా గడువు విధించడం ఈ చట్టంలోని మరో ముఖ్యమైన అంశం. ఒకవేళ కలెక్టర్ తీర్పుతో సంతృప్తి చెందకపోతే, రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ప్రత్యేక కమిషన్ను ఆశ్రయించే వెసులుబాటు కూడా కల్పించారు. -
సీఎం సభ సక్సెస్ చేయాలి
కైలాస్నగర్: ఈ నెల 6న బజార్హత్నూర్ మండలంలోని పిప్రి గ్రామంలో నిర్వహించనున్న సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభను విజయవంతం చే యాలని డీసీసీ అధ్యక్షుడు నరేశ్జాదవ్ కోరారు. గు రువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఎన్నికలకు ముందు పిప్రి గ్రామం నుంచి చేపట్టిన ‘పీపుల్ మార్చ్ పాదయాత్ర’ మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామంలో పర్యటించనున్నట్లు తెలిపారు. సీఎం సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు శుక్రవారం జిల్లా ఇన్చార్జి మంత్రి జూ పల్లి కృష్ణారావు, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మ హేశ్కుమార్గౌడ్ ఈనెల 4న పిప్రి గ్రామంలో పర్యటించనున్నట్లు వెల్లడించారు. తొలుత ఆదిలాబాద్లో పార్టీ శ్రేణులతో సమావేశమవుతారని తెలిపా రు. ఆయన వెంట మాజీ ఎంపీ సోయం బాపూరా వు, నాయకులు సాజీద్ఖాన్, బొరంచు శ్రీకాంత్రెడ్డి, గండ్రత్ సుజాత తదితరులున్నారు. -
ఆర్టీసీ ఆర్ఎంగా విజయభాను
ఆదిలాబాద్: ఆర్టీసీ ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్గా డి.విజయభాను గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఆర్ఎంగా బాధ్యతలు నిర్వర్తించిన ఎస్.భవానీప్రసాద్ వరంగల్కు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించి న విజయభానుకు ఇప్పటివరకు ఆర్ఎంగా విఽ దులు నిర్వర్తించిన భవానీప్రసాద్, డిప్యూటీ ఆ ర్ఎంలు రామయ్య, శ్రీహర్ష పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం విజ యభాను కలెక్టర్ రాజర్షిషాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. డిపో మేనేజర్ జి.ప్రతిమారెడ్డి పాల్గొన్నారు. -
హస్తంలో ‘సంస్థాగత’ సందడి!
సాక్షి, ఆదిలాబాద్: కాంగ్రెస్ను సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో కమిటీలన్నింటి నీ పటిష్టపర్చడం ద్వారా కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్రంలో ప్రతిపక్షాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నే తలు, కార్యకర్తలు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రణాళిక రూపొందించేందుకు ఆ పార్టీ నాయకత్వం ముందుకుపోతోంది. ఇందులో భాగంగా శనివారం జిల్లా కేంద్రానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ రా నున్నారు. జిల్లా పొలిటికల్ ఎఫైర్ కమిటీ సభ్యులతో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో భవి ష్యత్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలా ముందుకు కదలాలో దిశానిర్దేశం చేయనున్నారు. అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటరు జాబి తా సవరణ స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (సర్) నేపథ్యంలో పార్టీ క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్ఏ)లు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఓటరు జాబితాలను నవీకరించడానికి, వాటిలో కచ్చితత్వాన్ని నిర్ధారించడానికి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఈ కార్యక్రమం చేపడుతున్న విషయం తెలిసిందే. కొత్త ఓటర్లను చేర్చడం, అనర్హులైన, పునరావృతమైన పేర్లను తొలగించడం, కచ్చితత్వమైన ఓటరు జాబితాలు రూపొందించడం అంశాలుగా ‘సర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా రు. అయితే, ఇందులో ఎ లాంటి లోపాలు ఎదురైనా బీ ఎల్ఏలు ఎలా ముందుకెళ్లా లి.. అనే విషయంలో హస్తం పార్టీ నాయకత్వం దిశానిర్దేశం చేయనుంది. కొత్త చట్టాల నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ సెషన్లోనే డీ లిమిటేషన్ బిల్లు తీసుకువచ్చే అవకాశాలున్నాయనే చర్చ జోరుగా సాగుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులపై కూడా అధిష్టానం దృష్టి సారించింది. లోక్సభతో పాటు శాసనసభ నియోజకవర్గ స్థానాల పెంపునకు ఆమో దం లభించే అవకాశమున్న దృష్ట్యా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులను మెరుగుపరిచేందు కు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకే రాష్ట్ర నాయకత్వం పర్యటిస్తుందని పార్టీలో చెప్పుకొంటున్నారు. మహిళా రిజర్వేషన్, ఇతర అంశాల్లోనూ పార్టీ అనుసరించాల్సిన పద్ధతులు, నూతనంగా వస్తున్న చట్టా లు, ఇలా అన్ని అంశాల్లో కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు పార్టీ అధిష్టానం ముందుకెళ్తోంది. -
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
కై లాస్నగర్: సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ సూ చించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని 49 వార్డుల్లో వార్డు సభలు నిర్వహించారు. 45వ వార్డులో నిర్వహించిన సభకు ఆయన హాజరయ్యారు. మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూషతో కలిసి రాష్ట్ర గీతాన్ని ఆలపించి సభ ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని ప్ర జలకు వివరించారు. అనంతరం చైర్పర్సన్ వార్డులో చేపట్టిన పనులతో పాటు ప్రభుత్వ పథకాల గు రించి వివరించారు. ప్రజల నుంచి వివిధ సమస్యలు, పథకాలపై దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదిలాబాద్ నియోజకవర్గంలో సుమారు ఆరువేల ఇందిరమ్మ ఇళ్లకు గాను 1,600 ఇళ్లు పట్టణంలో నిర్మించనున్న ట్లు తెలిపారు. మిగతా వార్డుల్లో కౌన్సిలర్లు, వార్డు ఆఫీసర్ల ఆధ్వర్యంలో సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మున్సిపల్ కమిషనర్ రాజు, ట్రాన్స్కో ఎస్ఈ జాదవ్ శేషరావు, మెప్మా పీడీ సీవీఎన్ రాజు, డీఎంసీ శ్రీనివాస్, వార్డు ఆఫీసర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
బ్యాగు అప్పగింత
లక్సెట్టిపేట: గొల్లపల్లి మండలం ధనురుకు చెందిన కొల్లూరి భాగ్యలక్ష్మి గురువారం పని నిమిత్తం ఉట్నూర్కు వెళ్ళింది. తిరుగుప్రయాణంలో మంచిర్యాల వెళ్లే బస్సు ఎక్కి లక్సెట్టిపేటలో దిగింది. తన బ్యాగ్ బస్సులోనే మరిచిపోవడంతో వెంటనే లక్సెట్టిపేట పోలీసులకు సమాచారం అందించింది. బ్లూ కోర్టు విధులు నిర్వహిస్తున్న ఎంబడి సత్యనారాయణ, రాజేందర్ వెంటనే మంచిర్యాల బస్టాండ్కు వెళ్లి డిపో మేనేజర్తో మాట్లాడి బ్యాగును తెప్పించి బాధితురాలికి అప్పగించారు. బ్యాగులో బంగారంతో పాటు నగదు కూడా ఉన్నట్లు బాధిత మహిళ పేర్కొంది. -
పకడ్బందీగా అమలు చేయాలి
కన్నవారిని చూసుకోవాల్సిన బాధ్యతను విస్మరించే వారిపై కఠిన చర్యలుండాలి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే. అయితే కచ్చితంగా అమలు జరిగేలా చూడాలి. గతంలో ఒక జిల్లాస్థాయి అధికారి తన తల్లిని సరిగా చూసుకోవడం లేదని ఆర్డీవోకు ఫిర్యాదు చేస్తే పరిశీలించిన అధికారి ప్రతీనెల తల్లికి రూ.పదివేల చొప్పున ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసినా నేటికీ అమలుకాలేదు. ఇలా తూతూమంత్రంగా కాకుండా పథకం పకడ్బందీగా అమలు చేయాలి. – ఎంసీ లింగన్న, ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు -
హనుమాన్ జయంతిలో కుస్తీ పోటీలు
ముధోల్: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలో గురువారం వీడీసీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. ముధోల్తో పాటు పక్క మండలాలు, మహారాష్ట్ర నుండి వచ్చిన మల్లయోధులు పోటీల్లో తలబడ్డారు. మొదటి విజేతకు రూ.5వేలు, రెండో విజేతకు రూ. 2,500 బహుమతిగా అందజేశారు. గూడెంలో పౌర్ణమి జాతరదండేపల్లి: మంచిర్యాల జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన దండేపల్లి మండలం గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో గురువారం చైత్రపౌర్ణమి జాతర ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సత్యదేవున్ని దర్శించుకున్నారు. 178 జంటలు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నోముకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణాలు భక్తులతో రద్దీగా కనిపించాయి. జాతరకు వచ్చిన భక్తులకు ఆలయం తరుపున ఉచిత అన్నదానం చేశారు. -
చెక్కు అందజేత
ఆదిలాబాద్టౌన్: ఇంద్రవెల్లి పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహించే రాథోడ్ విలాస్ జనవరి 5న గుండెపోటుతో మృతి చెందగా పోలీస్శాఖ కార్పస్ ఫండ్ నుంచి మంజూరైన రూ.లక్ష చెక్కును ఎస్పీ అఖిల్ మహాజ న్ గురువారం జిల్లా పోలీస్ ముఖ్య కార్యాలయంలో అతడి భార్య జ్యోతికి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి పోలీస్శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సూ పరింటెండెంట్ సులోచన, సీసీ కొండరాజు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
నిర్వాసిత గ్రామాలుగా ప్రకటించాలి
కాసిపేట: మండలంలోని సోమగూడెం(కె) గ్రామ పంచాయతీలోని ట్యాంకుబస్తీ, ఎన్టీఆర్ కాలనీలను ముంపు గ్రామాలుగా ప్రకటించాలని గురువారం నిర్వహించిన గ్రామసభలో గ్రామస్తులు, సర్పంచ్, వార్డుసభ్యులు తీర్మానం చేశారు. ఓసీ ప్రాజెక్టు పేలుళ్లకు ఇళ్లు పగుళ్లు తేలుతున్నాయని, దుబ్బగూడం మాదిరి పునరావాసం కల్పించి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందించాలని కోరారు. ఎమ్మెల్యే, ఎంపీ స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చైతన్య ప్రవీణ్ నాయక్, ఉపసర్పంచ్ మల్యాల స్రవంతి, పంచాయతీ కార్యదర్శి కీర్తి, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు సంకె రవి, కనుకుల రాకేష్, శ్రీనివాస్, తోడేటి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
సర్దార్ సర్వాయి పాపన్నకు నివాళి
ఆదిలాబాద్రూరల్: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతిని గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బ స్టాండ్ ఎదుట గల పాపన్నగౌడ్ విగ్రహం వద్ద నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్ ముఖ్య అతి థిగా హాజరై పాపన్నగౌడ్ విగ్రహం, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పా పన్నగౌడ్ ఆశయాలకు అనుగుణంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికా రికంగా నిర్వహిస్తూ యువతకు ఆయన చరిత్రను ప రిచయం చేస్తోందని వివరించారు. మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, జిల్లా బీసీ అభివృద్ధి అధి కారి దరావత్ సోనియా, డీసీసీ అధ్యక్షుడు నరేశ్జా దవ్, నాయకులు శ్రీకాంత్రెడ్డి, గండ్రత్ సుజాత, సా జిద్ఖాన్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చి క్కాల దత్తు, వివిధ సంఘాల నాయకులున్నారు. -
తాత అంత్యక్రియలకు వెళ్తూ.. మనుమడు అనంతలోకాలకు
జన్నారం: తాత అంత్యక్రియలకు వెళ్తూ గుండెపోటుకు గురై మనుమడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం జన్నారం మండలంలోని పొనకల్ గాంధీనగర్కు చెందిన సంకపాగ దేవన్న (35) గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పర్లలో వరుసకు తాత అయిన చిన్నరాజన్న అంత్యక్రియలకు బస్సులో బయలుదేరాడు. కడెం మండలం ఉడుంపూర్ సమీపంలోకి వెళ్లే సరికి చాతిలో నొప్పి రావడంతో జన్నారం ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యుని సూచన మేరకు కరీంనగర్ తరలిస్తుండగా మృతి చెందాడు. పానీపూరి బండి వద్ద గొడవలో ఒకరిపై దాడి భైంసాటౌన్: పానీపూరి బండి వద్ద జరిగిన స్వల్ప తగాదా ఒకరిపై దాడికి దారితీసిన ఘటన పట్టణంలోని మున్సిపల్ చౌక్ వద్ద గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దెగ్లూర్కు చెందిన రాహుల్ భైంసాలో కొద్దిరోజులుగా పానిపూరి బండి నిర్వహిస్తున్నాడు. ఓవైసీనగర్కు చెందిన షేక్ మస్తాన్ గురువారం బండి వద్దకు వచ్చి పానీపూరి అడిగితే నిర్వాహకుడు లేదని బదులిచ్చాడు. అయినా వినకుండా దుర్భాషలాడడంతో ఆగ్రహించిన రాహుల్ రాడ్తో మస్తాన్ను గాయపర్చాడు. దీంతో తలకు తీవ్రగాయం కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఏరియాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సాయికుమార్ తెలిపారు. విద్వేషాలు వ్యాప్తి చేస్తే చర్యలు చిన్నపాటి గొడవలు, తగాదాలతో జరిగే ఘటనలకు విద్వేషాలు రెచ్చగొట్టేలా పుకార్లు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి ఏఎస్పీ సాయికిరణ్ అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. నకిలీ భూదస్త్రాలతో మోసగించిన ఇద్దరు అరెస్టుబెల్లంపల్లి: నకిలీ భూ దస్త్రాలు సృష్టించి కొనుగోలు దారుడిని మోసగించిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు బెల్లంపల్లి రూరల్ సీఐ సీ.హెచ్.హనోక్ తెలిపారు. బెల్లంపల్లి మండలం బుధాకలాన్లో రాంపల్లి గణేశ్కు చెందిన వ్యవసాయ భూమిని మంచిర్యాలకు చెందిన సంగం సాగర్కు లాశెట్టి సతీష్ (బుధాకుర్దు), రామటెంకి హరికృష్ణ, రామటెంకి శివకుమార్ (బట్వాన్పల్లి), కామెర రాజు (మంచిర్యాల), కట్టా పవన్ కుమార్ (బెల్లంపల్లి బస్తీ) ముఠాగా ఏర్పడి నకిలీ పట్టేదారు పాసు పుస్తకం, ఆధార్కార్డు సృష్టించి అమ్మకానికి ఒప్పందం చేసుకున్నారు. సాగర్ వద్ద నుంచి ముఠా సభ్యులు పలు దఫాలుగా రూ.31,80,000 నగదు తీసుకున్నారు. విషయం తెలుసుకున్న సాగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం లాశెట్టి సతీష్, కట్టా పవన్ కుమార్ను అదుపులోకి తీసుకోగా హరికృష్ణ, శివకుమార్, రాజు పరారీలో ఉన్నట్లు సీఐ వెల్లడించారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సమావేశంలో తాళ్లగురిజాల ఎస్సై బి.రామకృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ముఖరా(కే)ను సందర్శించిన ఐఎస్వో ఆడిటర్
ఇచ్చోడ: మండలంలోని ముఖరా(కె)ను ఐఎస్ వో ఆడిటర్ శివయ్య బుధవారం సందర్శించా రు. గ్రామంలో ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించారు. అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాల, గ్రామపంచాయతీ కార్యాలయాల ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఇంకుడుగుంతలు, పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. ఈనెల 6నబజార్హత్నూ ర్ మండలంలోని పిప్రి గ్రామానికి సీఎం వస్తు న్న సందర్భంగా ఐఎస్వో సర్టిఫికెట్ జారీకి సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఎంపీవో అతుల్ కుమార్, సర్పంచ్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
బోథ్: ప్రతిపక్షంలో ఉన్నా నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నానని ఎ మ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నియోజకవర్గానికి ఇటీవల మూడు కొత్త సబ్స్టేషన్లు మంజూ రైనట్లు తెలిపారు. బోథ్ మండలంలోని ధ న్నూర్ (బి), నేరడిగొండ మండలంలోని కు ప్టి, తలమడుగు మండలంలోని కుచులపూర్ గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈమేరకు ధన్నూర్ (బి)లో బుధవారం ఆయన స్థల పరిశీలన చేశారు. సబ్స్టేషన్ల నిర్మాణానికి సంబంధించి ఈ నెల 6న బ జార్హత్నూర్ మండలంలోని పిప్రిలో భూ మిపూజ ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.


