breaking news
Adilabad
-
గడువు పెంచినా నామమాత్రమే..
ఆదిలాబాద్టౌన్: మద్యం షాపుల దరఖాస్తు ప్ర క్రియ గురువారం ముగిసింది. ప్రభుత్వం గడువు పెంచినా దరఖాస్తుదారులు అంతగా ఆసక్తి చూపలేదు. జిల్లాలోని మద్యం షాపులకు 37 దరఖాస్తులు రాగా, హైదరాబాద్లోని కమిషనరేట్ కార్యాలయంలో 19 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా జి ల్లాలోని 40షాపులకు గాను 767 దరఖాస్తులు వచ్చి నట్లు ఎకై ్సజ్శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 27 న లక్కీడ్రా ద్వారా షాపులు కేటాయించనుండగా అంతా ఆసక్తిగా చూస్తున్నారు. డిసెంబర్ 1నుంచి 2025–27 మద్యం పాలసీ ప్రారంభం కానుంది. దరఖాస్తు ఫీజు పెంచడంతోనే.. మద్యం షాపుల దరఖాస్తు ఫీజు రూ.3లక్షలకు పెంచడంతోనే ఈసారి తక్కువ దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. గతనెల 26నుంచి ఈనెల 18వరకు 711 దరఖాస్తులు రాగా, ప్రభుత్వం ఈనెల 23వరకు గడువు పెంచింది. గడువు పెంచిన తర్వాత 56 దరఖాస్తులు వచ్చాయి. 2023లో దరఖాస్తుల ద్వా రా ప్రభుత్వానికి రూ.20కోట్ల వరకు రాగా, ఈసారి రూ.23 కోట్ల వరకు వచ్చింది. గతం కంటే ఈ సారి 280 దరఖాస్తులు తక్కువగా వచ్చినా ఆదాయం మరో రూ.3కోట్లు అదనంగా రావడం గమనార్హం. పది కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన షాపులకు మళ్లీ రీటెండర్ వేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా, గడువు పెంచిన తర్వాత ఆదిలాబాద్ స్టేషన్ పరిధిలో 24 దరఖాస్తులు, ఇచ్చోడ స్టేషన్ పరిధిలో 10, ఉట్నూర్ స్టేషన్ పరిధిలో మూడు దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్ కమిషనరేట్లో మద్యం షాపులకు సంబంధించి 19 దరఖాస్తులు రాగా, వీటిలో ఆదిలాబాద్కు ఆరు, ఇచ్చోడకు ఎనిమిది, ఉట్నూర్కు ఐదు దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ శాఖ జిల్లా అధికారి హిమశ్రీ, ఆదిలాబాద్ ఎకై ్సజ్ సీఐ విజేందర్ తెలిపారు. మొత్తంగా ఆదిలాబాద్ స్టేషన్ పరిధిలో 420 దరఖాస్తులు, ఇచ్చోడ స్టేషన్ పరిధిలో 201, ఉట్నూర్ స్టేషన్ పరిధిలో 127 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. -
ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొనాలి
ఆదిలాబాద్టౌన్: విద్యార్థులు ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో విద్యార్థులకు ఓపెన్హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 23పాఠశాలలకు చెందిన 600మంది విద్యార్థులు హాజరు కాగా, పో లీస్ స్టేషన్ నిర్వహణ, పోలీసుల విధులు, పనితీరు గురించి వివరించారు. ఆయుధాలు, బాంబులు, దొంగలను పట్టుకునే ఫింగర్ప్రింట్స్ యంత్రాలు, పేలుడు పదార్థాలను కనుగొనే పరికరాలు, జాగిలా ల పనితీరు గురించి అవగాహన కల్పించారు. కార్య క్రమంలో అదనపు ఎస్పీ సురేందర్రావు, డీఎస్పీలు జీవన్రెడ్డి, శ్రీనివాస్, ఇంద్రవర్ధన్, పట్టణ సీఐలు సునీల్కుమార్, రాగరాజు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మురళి, చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయిలో సత్తా చాటాలి
ఆదిలాబాద్: జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో సత్తా చాటలని డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టే డియంలో గురువారం జోనల్ లెవెల్ ఎస్జీఎఫ్ జూ డో ఎంపిక పోటీలను డీటీఎస్వో పార్థసారథితో కలి సి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ.. జిల్లా క్రీడాకారులు అందుబాటులోని సదుపాయాలను వినియోగించుకుని కోచ్ రాజు పర్యవేక్షణలో పతకాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఆడే రామేశ్వర్, మాట్లాడు తూ.. జిల్లాస్థాయి యోగా ఎంపిక పోటీలను నవంబర్ మొదటి వారంలో నిర్వహిస్తామని తెలిపారు. కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్రపాల్, జూడో కోచ్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
అమరుల త్యాగాలను స్మరించుకోవాలి
‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలిఆదిలాబాద్టౌన్: పోలీసు అమరవీరుల త్యాగాల ను ప్రతిఒక్కరూ స్మరించుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎస్పీతోపాటు పోలీస్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఆర్అండ్బీ విశ్రాంతి భవనం నుంచి ర్యాలీ పట్టణంలోని పలు వీధులగుండా కొనసాగింది. అ దనపు ఎస్పీ సురేందర్రావు, డీఎస్పీలు జీవన్రెడ్డి, శ్రీనివాస్, ఇంద్రవర్ధన్, సీఐలు, ఎస్సైలున్నారు. కై లాస్నగర్: పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. గురువారం జిల్లా పరి షత్ సమావేశ మందిరంలో పదో తరగతి ఫలితాల పెంపు, విద్యార్థుల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించా రు. విద్యార్థుల హాజరు, ఫలితాల మెరుగుదల, బో ధన నాణ్యత, ఉత్తీర్ణత శాతం పెంపునకు చేపడుతు న్న చర్యలపై సమీక్షించారు. ఆయన మాట్లాడు తూ.. వందశాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో సమ గ్ర ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. గతేడాది ఫలితాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి మరింత శాతం పెంచే దిశగా ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఉత్సాహం నింపేలా ప్రతీ పాఠశాలలో మోటివేషన్ సెషన్లు, కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపా రు. ఈ వారంలో ప్రతీ పాఠశాలలో తప్పనిసరిగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలని, చదువులో వె నుకబడిన విద్యార్థులకు నవంబర్ 1నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభించి జనవరి 10నాటికి సిలబస్ పూర్తి చేయాలని సూచించారు. అనంతరం గ్రాండ్ టెస్ట్–1, గ్రాండ్ టెస్ట్–2 నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయాలని, ప్రతీ పాఠశాలలో విద్యార్థుల హాజరు వందశాతం నమోదయ్యేలా ఉపాధ్యాయులు, ఎంఈవోలు పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో హెచ్ఎంలకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు. ఇన్చార్జి డీఈవో కుష్బూ గుప్తా, విద్యాశాఖ అధికారులు సుజాత్ఖాన్, జగన్, ఎంఈవోలు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు పాల్గొన్నారు. తల్లిదండ్రులూ ఆరోగ్యంగా ఉండాలి ఇచ్చోడ: పిల్లలతోపాటు తల్లిదండ్రులూ ఆరోగ్యంగా ఉండాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. మండలంలోని బోరిగామ జెడ్పీ స్కూల్లో ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని పరిశీలించి మాట్లాడారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలిపారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పరిశీలించి పనుల్లో వేగం పెంచాలని లబ్ధిదారులకు సూచించారు. సీనియర్ సిటిజన్ కాన్ఫిడేషన్, హెల్త్ ఇండియా సౌ జన్యంతో నిర్వహించిన తల్లిదండ్రుల సంక్షేమం–సంరక్షణ అవగాహన కార్యక్రమంలో పాల్గొని వి ద్యార్థులు, తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు, తాత, ముత్తాతలకు పాదపూజ చేసి ఆశీస్సులు తీసుకున్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగంలో తీసుకోవాల్సి న జాగత్రలపై హెల్త్ ఇండియా స్టేట్ కోఆర్డినేటర్ శ్యామ్ అవగాహన కల్పించారు. 80 ఏళ్లు దాటిన వ యోవృద్ధులను వయోవృద్ధుల సమాఖ్య ఆధ్వర్యంలో సన్మానించారు. జిల్లా సంక్షేమాధికారి మిల్కా, సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు దేవిదాస్ దేశ్పాండే, తహసీల్దార్ జాదవ్ రమేశ్, ఎంపీడీవో ఆ నంద్, ప్రధానోపాధ్యాయుడు రమాకాంత్ ఉన్నారు. -
మరింత ఊరట
కై లాస్నగర్: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు నాలుగు విడతల్లో రూ.5 లక్షల ఆర్థికసాయం అందజేస్తోంది. లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా చేయడం, మేసీ్త్రలు, నిర్మాణ కూలీల కొరత లేకుండా శ్రద్ధ వహిస్తోంది. తాజాగా వారికి మరింత ప్రయోజనం చేకూర్చేలా వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్బీఎం) ద్వారా రూ.12వేల ఆర్థి క సాయాన్ని అందించేలా ఉత్తర్వులు జారీ చేసింది. స్లాబ్ లెవెల్, స్లాబ్ నిర్మాణం పూర్తి చేసిన ఉపాధిహా మీ జాబ్ కార్డు కలిగిన లబ్ధిదారులకే ఈ సాయం అందించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంపీడీవోలు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులు అర్హు ల ఎంపికపై దృష్టి సారించారు. ఇప్పటివరకు 600 మంది లబ్ధిదారుల వివరాలను ఎస్బీఎం అధికారులకు అందజేశారు. ఆ వివరాలను పరిశీలిస్తున్న సదరు అధికారులు మరుగుదొడ్ల నిర్మాణాల అంచనాలను సిద్ధం చేసి నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు చేపడుతున్నారు. ఈ నిర్ణయంతో జిల్లాలోని 1,338 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు తొలివిడతగా ప్రయోజనం చేకూరనుంది. పట్టణ పేదలకు మరింత లబ్ధి పట్టణాల్లో 400 చదరపు అడుగులలోపు స్థలం కలిగిన పేదలూ జీ ప్లస్ వన్ విధానంలో నిర్మించుకునేలా ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయిస్తూ ప్ర భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత 500 నుంచి 600 చదరపు అడుగుల సొంత స్థలాన్ని కలి గిన పేదలకు మాత్రమే ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. ఇప్పటివరకు ఆ దిశగానే అమలు చేసింది. ఈ విధానంలో రెండు గదులతో పాటు వంటగది మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించుకో వాలని స్పష్టం చేసింది. ఇంటి నిర్మాణ డిజైన్కు హౌసింగ్ శాఖ ఇంజినీరింగ్ అధికారులు అనుమతి తప్పనిసరి చేసింది. అయితే గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణా నికి రూ.లక్ష, రూఫ్ లెవెల్కు రూ.లక్ష, ఫస్ట్ ఫ్లోర్ ని ర్మాణానికి రూ.రెండు లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మరో రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణశాఖ సంచాలకుడు గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా లబ్ధిదా రుల ఎంపికపై మున్సిపల్, హౌసింగ్ శాఖల అధికా రులు దృష్టి సారించారు. త్వరలోనే అర్హులను ఎంపిక చేసి ఇళ్లు మంజూరు చేయనున్నారు. జిల్లాలో ఇళ్ల నిర్మాణాల సమాచారం మంజూరైన ఇళ్లు 15,486 పునాది దశలో.. 7,763 బేస్మెంట్ దశలో.. 4,547 రూఫ్ లెవెల్లో.. 1,092 రూఫ్ పూర్తయినవి 236 పూర్తయిన ఇళ్లు 2 నిర్మాణాలు ప్రారంభించనవి 5,877 ఎస్టిమేషన్లు సిద్ధం చేస్తున్నాం ఇందిరమ్మ లబ్ధిదారులకు వ్యక్తిగత మరుగుదొడ్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఇప్పటివరకు 600 మంది లబ్ధిదారుల వివరాలను హౌసింగ్ శాఖ అధికారులు మాకు పంపించారు. జాబ్ కార్డు కలిగిన ఇందిరమ్మ లబ్ధిదారుల మరుగుదొడ్డికి సంబంధించి ఎస్టిమేషన్లు సిద్ధం చేస్తున్నాం. ప్రక్రియ పూర్తయ్యాక వారి ఖాతాల్లో రూ.12వేలు జమ చేస్తాం. – ఫర్హాత్, ఎస్బీఎం జిల్లా మేనేజర్ -
ఆస్పత్రి ప్రసవాలను ప్రోత్సహించాలి
బజార్హత్నూర్: మారుమూల గ్రామీణ ప్రాంతాల గర్భిణులకు ఆస్పత్రి డెలివరీలపై అవగా హన కల్పించి ప్రోత్సహించాలని అడిషనల్ డీ ఎంహెచ్వో మనోహర్ సూచించారు. గురువా రం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మీకంగా తనిఖీ చేశారు. రికార్డులు, ప్రసూతి గది, గర్భిణుల వెయిటింగ్ హాల్, ఫార్మా గదిని పరిశీలించారు. ఏఎన్సీ, పీఎన్సీ, ఎన్సీడీ స్క్రీనింగ్ వివరాలు, గర్భిణులు, బా లింతలకు అందిస్తున్న 102 అంబులెన్స్ సేవల గురించి తెలుసుకున్నారు. మెడికల్ ఆఫీసర్ శిల్ప, హెచ్ఈవో సూర్యప్రకాశ్, రవీందర్, సూపర్వైజర్ సుశీల, సిబ్బంది పాల్గొన్నారు. -
సోయా కొనుగోళ్లు ప్రారంభించాలి
బేల: సోయా కొనుగోళ్లు ప్రారంభించాలని గురువా రం మండల కేంద్రంలోని మార్కెట్ సబ్యార్డులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఠాక్రే గంభీర్ మాట్లాడుతూ.. 15రోజుల క్రితమే సోయా కోతలు ప్రారంభమైనా ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభి స్తారో ప్రకటిస్తేనే ఆందోళన విరమిస్తామని డిమాండ్ చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న డిప్యూటీ తహసీల్దార్ వామన్రావు ఫోన్లో మార్క్ఫెడ్ డీఎం ప్రవీణ్తో మాట్లాడించారు. వచ్చే సోమవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తామని ఆయన హామీ ఇవ్వగా ఆందోళన విరమించారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు ప్రమోద్రెడ్డి, నాయకులు సతీశ్పవార్, తేజ్రావు, గుండవార్ ఆకాశ్, జితేందర్, బత్తుల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా వాసికి డాక్టరేట్
ఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలోని సంజయ్నగర్కు చెందిన ఉదారి జ్ఞానేశ్వర్చారి విజయవాడలోని కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం నుంచి గురువారం డాక్టరేట్ పట్టా అందుకున్నారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్లోగల బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈయన ఈసీఈ అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. ‘డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సీఎంవోఎస్ ఎనలాగ్ ఫ్రొంటెడ్ డిజైన్ ఫర్ లీడ్’ అంశంపై పరిశోధన చేశారు. తక్కువ విద్యుత్ వినియోగంతోగల వైద్య పరికరాలను రూపొందించినందుకు ఈయనకు డాక్టరేట్ పట్టా దక్కింది. -
గోండి భాషలో రామాయణం
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం గౌరాపూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు తొడసం కైలాశ్ రామాయణాన్ని గోండి భాషలోకి అనువదించారు. సుందరకాండ 5వ భాగాన్ని ఆయన పుస్తక రూపంలో పొందుపర్చారు. దీనిని ఈనెల 26న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. తొడసం కైలాశ్ స్వగ్రామం మావల మండలం వాగాపూర్. గతంలో ఆయన మహాభారతాన్ని గోండి భాషలోకి అనువదించారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గోండి భాషలో వార్తలు చదవడం, కథలు చెప్పడం, పాటలు పాడించడం చేశారు. దీంతో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మన్కీ బాత్ ప్రసారంలో కైలాశ్ను అభినందించారు. గిరిజనులకు రామాయణం, మహాభారతం గురించి తెలియాలనే ఉద్దేశంతో వాటిని గోండి భాషలోకి అనువదించినట్లు కైలాశ్ తెలిపారు. -
మంత్రి ‘తుమ్మల’ను కలిసిన ఎమ్మెల్యే శంకర్
ఆదిలాబాద్: రైతుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ వి న్నవించారు. హైదరాబాద్లో బుధవారం కలి సి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సోయా పంటను ప్రభుత్వమే కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు బెంగాల్గ్రామ్ విత్తనాలు సబ్సిడీపై ఇవ్వా లని విజ్ఞప్తి చేశారు. అలాగే పత్తి అమ్మకాలకు వచ్చే రైతుల కోసం యార్డులో ఆహార పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు. వరద ప్రభావిత మండలాల్లో బాధిత రైతులకు పంట నష్టపరిహారం వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
ఆదిలాబాద్టౌన్: అమర పోలీసుల త్యాగాల ఫలి తమే జిల్లా ప్రశాంత వాతావరణానికి కారణమని, వారి త్యాగాలు చిరస్మరణీయమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్క్వార్టర్స్లో బుధవారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి స్పందన లభించింది. 817 మంది పోలీసులు, ప్రజలు, ఔత్సాహికులు రక్తదానం చేశారు. రిమ్స్ బ్లడ్ బ్యాంక్ వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ స్వయంగా రక్తదానం చేసి సిబ్బందికి స్ఫూర్తిగా నిలిచారు. రక్తదానం మహోన్నతమైనదని అన్నారు. రక్తదానం చేసిన ప్రతీ ఒక్కరికి ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్రావు, రిమ్స్ డైరెక్టర్ జయ్సింగ్ రాథోడ్, డీఎస్పీలు ఎల్. జీవన్రెడ్డి, పోతారం శ్రీనివాస్, కమతం ఇంద్రవర్ధన్, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది తది తరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
కైలాస్నగర్: విద్యార్థులు చదువుతోపాటు ఆరోగ్యం పై దృష్టి సారించాలని కలెక్టర్ రాజర్షి షా అ న్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆరోగ్య పాఠశాల పై బుధవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ఆయా మండలాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్టూడెంట్ చాంపియన్లతో సమావేశం అయ్యారు. తొలుత వారి అభిప్రాయాలు స్వీకరించారు. భీంసరి పాఠశాల ఉపాధ్యాయుడు వెంకట్ ఇంగ్లీష్లో ఆరోగ్య పాఠశాల, కలెక్టర్ పనితీరు వివరిస్తూ పద్యం రాయగా విద్యార్థులు నేహ, ప్రణవి చదివి వినిపించారు. ఉట్నూర్ జెడ్పీఎస్ఎస్ విద్యార్థిని ఆరోగ్య పాఠశాల వలన కలిగే ప్రయోజనాలు, మాదక ద్రవ్యాలతో కలిగే నష్టాలను తెలియజేస్తూ పాట పాడింది. ఈ పాటను ప్రతి పాఠశాలలో ప్లే చే యాలని కలెక్టర్ సూచించారు. ఆరోగ్యపాఠశాలకు సంబంధించిన ప్రాజెక్టులు రూపకల్పన చేసిన ఆది లాబాద్లోని రణదీవెనగర్ జెడ్పీ ఉన్నత పాఠశాలకు రూ.75వేల నగదు పురస్కారం అందజేశారు. అలాగే ఇచ్చోడ మండలం బోరిగాం జెడ్పీ హైస్కూ ల్, జైనథ్, గుడిహత్నూర్ మోడల్ స్కూళ్లకు రూ. 50వేల చొప్పున, అలాగే పిప్పర్వాడ ఉన్నత పాఠశాలకు రూ.25వేల నగదు పురస్కారం అందజేశా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతీ నెల పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని సూచించా రు. జిల్లావ్యాప్తంగా 23 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని, నిర్మాణాలకు గాను ఈజీఎస్ నిధులు మంజూరు చేశామన్నారు. పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్ఎంలు, కేజీబీవీల ఎస్ వోలు, విద్యార్థులు పాల్గొన్నారు. ‘పర్యాటక’ విజేతలకు బహుమతి ప్రదానం ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలి చిన విద్యార్థులకు కలెక్టర్ రాజర్షి షా బహుమతులు అందజేశారు. పర్యాటకంపై ఆసక్తిని పెంపొందించేలా గత నెల 19న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కు వ్యాసరచన, ఉపన్యాస, డ్రాయింగ్ పోటీలు ని ర్వహించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం సర్టిఫి కెట్లు, బహుమతులు అందజేశారు. జిల్లాలోని జలపాతాలు, గిరిజన సంస్కృతి, చారిత్రక ప్రదేశాలు ప ర్యాటక ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు. ఇందులో జిల్లా పర్యాటక శాఖ అధికారి రవి కుమార్,గైడ్ లింగన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రైతులు అధైర్యపడొద్దు
ఎఫెక్ట్..సిరికొండ: రైతులు అధైర్యపడొద్దని, ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి మక్కలు తడిసి రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈ తీరును వివరిస్తూ ‘సాక్షి’లో ‘కురిసిన వర్షం.. తడిసిన పంటలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అదనపు కలెక్టర్ స్పందించారు. తడిసిన మక్కలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అధైర్యపడొద్దని, ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రతీ గింజను కోనుగోలు చేస్తుందని ధైర్యం చెప్పారు. ఆమె వెంట తహసీల్దార్ తుకారాం, రెవెన్యూ అధికారులు ఉన్నారు. -
వైద్యసేవలు మెరుగుపర్చాలి
గుడిహత్నూర్: వైద్యసేవలు మెరుగుపర్చడంతో పాటు ఆసుపత్రుల్లో ఉన్న వైద్య ఉపకరణా లు వినియోగంలో ఉండేలా చూడాలని డిప్యూ టీ డీఎంహెచ్వో సాధన సూచించారు. స్థానిక పీహెచ్సీని బుధవారం సందర్శించారు. ప్రసూ తిగది, ల్యాబ్లో ఉన్న పరికరాలతో పాటు అందుబాటులో ఉన్న మందులు, ఎన్సీడీ, ఏఎన్సీ, టీబీ, వ్యాక్సినేషన్ రికార్డులు పరిశీలించి సి బ్బందికి పలు సూచనలు చేశారు. ఈ నెల 29 న వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు స్థానిక పీహెచ్సీని సందర్శించనున్నారని ఈ మేరకు అన్ని రికార్డులతో పాటు ఉపకరణాలు సక్రమంగా ని ర్వహించాలని సూచించారు. అందిస్తున్న సేవలను స్థానిక వైద్యాధికారి శ్యాంసుందర్ను అడి గి తెలుసుకున్నారు. ఆమె వెంట జిల్లా ప్రోగ్రాం అధికారి జాదవ్ దేవిదాస్ నాయక్, క్వాలిటీ మేనేజర్ అమర్, డీడీఎం రమణ ఉన్నారు. -
ఆర్టీఏ అవినీతికి చెక్..!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రవాణా శాఖలో అక్రమాలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. రాష్ట్రంలో ఆ శాఖ పరిధిలోని చెక్పోస్టులను పూర్తిగా ఎత్తివేస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. వెంటనే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉన్న తనిఖీ కేంద్రాలను సాయంత్రమే తొలగించారు. జాతీయ రహదారులు–44, 61, 363పై జైనథ్ మండలం భోరజ్, తానూర్మండలం బెల్తరోడ, వాంకిడిలోని చెక్పోస్టులు తొలగిస్తున్నట్లు ఫ్లెక్సీలు సైతంఏర్పాటు చేశారు. మూడు నెలల క్రితమే రవాణా శాఖలో తనిఖీ కేంద్రాలను ఎత్తివేసి పూర్తిగా ఆన్లైన్ ఆధారిత వాహన పన్నుల వసూళ్లు, జరిమానాలు చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. అయితే క్షేత్రస్థాయిలో ఇంకా చెక్పోస్టులు అనధికారికంగానే కొనసాగుతూ వస్తున్నాయి. ఇటీవల ఉమ్మడి జిల్లాలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశా రు.ఈ తనిఖీల్లో లెక్కకు మించి ఉన్న రూ.1.26లక్షల నగదు భోరజ్ వద్ద, రూ.5,100 వాంకిడి చెక్పోస్టు వద్ద, బెల్తరోడ చెక్పోస్టు వద్ద రూ.3వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు ఇవే చెక్పోస్టుల్లో దాడులు జరుగగా.. అనధికారికంగా వసూలు చేసిన సొమ్మును స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. తరచూ దాడులు, తనిఖీలు జరిగినా ఈ కేంద్రాల్లో సాగిన అవినీతి ని నిలువరించలేకపోయారు. మరోవైపు ప్రభుత్వానికి పన్నుల లక్ష్యాలు పూర్తి స్థాయిలో చేరడం లేదు. తాజాగా కేంద్రాలను ఎత్తివేయడంతో వా హన యజమానులు, డ్రైవర్ల నుంచి అనధికార వసూళ్లు పూర్తిగా తగ్గనుంది. కార్యాలయాల్లో ఏజెంట్ల హవా ఉమ్మడి జిల్లా పరిధిలో ఆదిలాబాద్, మంచిర్యా ల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లా రవాణాశాఖ కార్యాలయాల్లోనూ ఏజెంట్లు, మధ్యవర్తల హవా కొనసాగుతోందనే ఆరోపణలున్నాయి. ఏజెంట్ల పేరుతో వాస్తవ చార్జీల కంటే అధికంగా వసూళ్లు చేస్తున్నారు. ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు, సి బ్బంది అంతా తెలిసి కూడా ఈ అనధికార వసూళ్లను ప్రోత్సహిస్తున్నారు. కార్యాలయాలకు వచ్చే వాహనదారులు, వినియోగదారులు లైసెన్స్, రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు ఇవ్వడంలో ప్రభుత్వం విధించిన రుసుం, పన్నుల కంటే అధికంగా చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతోంది. చాలా మందికి రవాణా శాఖ నిబంధనలపై అవగాహన లేమితో విద్యావంతులు సైతం మధ్యవర్తులతోనే కార్యాలయాలకు వెళ్తున్నారు. చాలా సేవలు ఆన్లైన్లో చేసుకోవచ్చు. సులువుగా పని పూర్తవుతుందనే కారణంతో ఏజెంట్లను ఆశ్రయిస్తున్న పౌ రులపై అదనపు భారం పడుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం వాహన రిజిస్ట్రేషన్లు షోరూంల్లోనే చేసుకునే వెలుసుబాటు ఇవ్వాలి. నిరక్షరాస్యులు సైతం కార్యాలయాల్లో సేవలు పొందేలా ఏర్పా ట్లు, కార్యాలయాల్లో మధ్యవర్తులను కట్టడి చేస్తే అవినీతి తగ్గే అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత ఆధునిక సేవలను వినియోగించి దళారుల వ్యవస్థను తగ్గిస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ పే ర్కొన్న నేపథ్యంలో ఆ దిశగా ఉమ్మడి జిల్లా కా ర్యాలయాల్లో పకడ్బందీగా అమలు చేస్తే అక్రమ వసూళ్లు నిలిచే అవకాశం ఉంటుంది. బెల్తరోడాలో.. తానూరు: బెల్తరోడా చెక్పోస్టులోని ఫర్నిచర్ను నిర్మల్లోని ఆర్టీఏ కార్యాలయానికి తరలించాల ని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో అధికా రులు, సిబ్బంది ఫర్నిచర్తోపాటు కంప్యూటర్లు, ఫైళ్లు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. చెక్పోస్ట్ ఎత్తివేసినట్లు బ్యానర్ ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో సేవలు.. వాంకిడి: చెక్పోస్టుల ద్వారా అందించిన సేవల ను ఇకపై www. transport. telangana. gov. in వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. ఆన్లైన్ సర్వీ సెస్ అనే ఆప్షన్ ద్వారా టెంపరరీ పర్మిట్, వాలంటరీ టాక్స్, స్పెషల్ పర్మిట్ వంటి సేవలు లభ్యమవుతాయి. సేవలపై చెక్పోస్ట్ సిబ్బంది కొన్ని నెలలుగా వాహనదారులకు అవగాహన కల్పించడంతోపాటు చెక్పోస్టు వద్ద ప్రత్యేకంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఫైళ్లు తరలింపు.. ఆదిలాబాద్టౌన్: జిల్లా అధికారులు ఆఘమేఘాలపై భోరజ్ చెక్పోస్టు వద్ద కార్యకలాపాలు నిలిపి వేశారు. బోర్డులు, బారి కేడ్లు తొలగించారు. కంప్యూటర్లు, రశీదులు, ఆర్థిక పరిపరమైన రికార్డులను డిప్యూ టీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయాని(డీటీసీ)కి తరలించారు. నలుగురు ఎంవీఐలు, ఆరుగురు ఏఎంవీఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు, నలుగురు హోంగార్డులు, ముగ్గురు కార్యాలయ సిబ్బంది పని చేస్తున్నారు. వీరు మూడు షిప్టుల్లో విధులు నిర్వహించే వారు. వీరిని డీటీసీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఇక నుంచి వీరికి ఇతర బాధ్యతలు అప్పగించనున్నారు. -
రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు
ఆదిలాబాద్టౌన్: రైతులకు ఇబ్బంది కలుగకుండా మార్కెట్యార్డులో అన్ని సౌకర్యాలు కల్పించనున్న ట్లు వ్యవసాయ మార్కెటింగ్ గ్రేడ్–2 కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి అన్నారు. పట్టణంలోని పలు జిన్నింగ్ మిల్లులను లోకల్ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిన్నింగ్ మిల్లుల్లో రైతుల కోసం తాగునీరు, కూర్చోవడానికి వసతి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని వ్యాపారులను ఆదేశించారు. రైతులకు యార్డులో ఎవరైనా ఇబ్బందులు కలుగజేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈనెల 27 నుంచి ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. పత్తి తూకం కోసం 11 కాంటాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో మానిటరింగ్ కమిటీ సభ్యులు గోవింద్, విష్ణువర్ధన్, నగేశ్రెడ్డి, గోవర్ధన్ యాదవ్, లక్ష్మణ్, విట్టల్ తదితరులు ఉన్నారు. -
చిన్నారుల ఆలనా.. పాలన
ఆదిలాబాద్టౌన్: చిన్నారుల ఆలన పాలన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రభు త్వ, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు కూలీనాలి చేసే త ల్లుల పిల్లల పాలన కోసం ‘పల్నా’ పథకాన్ని ప్రవేశపెట్టింది. త్వరలో జిల్లాలో అమలు చేయనుంది. ఈ పథకం ద్వారా తల్లిదండ్రులు వివిధ పనులకు వెళి తే వారి పిల్లల సంరక్షణకు చర్యలు చేపట్టనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కేంద్రాల్లో పోషకాహారంతో పాటు విద్యాబుద్ధులు నేర్పించనున్నారు. పల్లెలు, పట్టణాల్లో ఈ కేంద్రాలను అంగన్వాడీ సెంటర్లలో ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని నియోజకవర్గానికి ఐదు చొప్పున ఏర్పాటు చేసే అవకాశం ఉందని మహిళా, శిశు సంక్షేమ శా ఖాధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. పిల్లల సంరక్షణ కోసం.. ఆదిలాబాద్తో పాటు ఆయా మండలకేంద్రాలు, గ్రామాల్లో చాలా మంది మహిళలు వివిధ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషిస్తున్నారు. అయి తే కొంతమంది వారి పిల్లలను చూసుకునేవారు లేకపోవడంతో పనులకు తీసుకెళ్తున్నారు. దీంతో అక్క డ పూర్తిస్థాయిలో పనులు చేయకుండా ఇబ్బందులు పడుతున్నారు. మరి కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు సైతం పిల్లల సంరక్షణ కోసం ఏం చేయాలో తెలియక ఎవరో ఒకరు ఇంటివద్దే ఉండాల్సిన పరి స్థితి ఉంది. అయితే కేంద్రం తీసుకువస్తున్న పల్నా కేంద్రాలతో ఇబ్బందులు కొంత తొలగనున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో 6 కేంద్రాలను, నార్నూర్లో 1, ఇచ్చోడలో 2, ఉట్నూర్లో 1 కేంద్రాలను ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. చదువుతో పాటు ఆటపాటలు.. ఈ పల్నా కేంద్రాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. ఏడు నెలల నుంచి మూడేళ్ల పిల్లల వరకు ఇందులో వదిలివెళ్లొచ్చు. అయితే తప్పనిసరిగా తల్లులు ఏదో ఒక ఉద్యోగం, కూలీ పనులు చేసేవారై ఉండాలి. అలాంటి తల్లుల పిల్లల కోసమే ఇక్కడ సౌకర్యం కల్పిస్తారు. ఈ కేంద్రంలో ఒక టీచర్తో పాటు ఒక ఆయాను నియమిస్తారు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలు ఉన్నప్పటికీ 3 నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు మాత్రమే ఆటపాటలతో చదువు నేర్పిస్తారు. అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చుకోరు. అయితే ఈ కేంద్రాల అనుబంధంగానే ఇవి కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 1,287 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ఆరేళ్లలోపు 22వేల మంది చిన్నారులకు చదువుతో పాటు పోషకాహారం అందిస్తున్నారు. 1,110 మంది అంగన్వాడీ కార్యకర్తలు పనిచేస్తుండగా, 177 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పల్నా కేంద్రాలకు సంబంధించిన సరుకులు, ఇతర వస్తువులు, ఉద్యోగుల వేతనాలు, మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 శాతం నిధులను అందజేయనున్నాయి. పగటిపూట చిన్నారులను పడుకోబెట్టడం, ఆటలాడించడం, విద్యాబోధనతో పాటు పోషకాహారం అందించనున్నారు. పల్నా కేంద్రాల ఏర్పాటుకు చర్యలు.. జిల్లాలో పల్నా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. నియోజకవర్గానికి ఐదు చొప్పున ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ కేంద్రాల్లో వర్కింగ్ ఉమెన్ పిల్లలకు చదువుతో పాటు ఆటపాటలు, పోషకాహారం అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఉత్తర్వులు ఇంకా రావాల్సి ఉన్నాయి. – మిల్కా, జిల్లా సంక్షేమ అధికారి, ఆదిలాబాద్ -
కార్తీకం..పవిత్రం
కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉంది. అటు హరికి, ఇటు హరుడికి, వారిద్దరి తనుయుడైన అయ్యప్పకు కూడా ప్రీతిపాత్రమైన మాసమిది. నేటి నుంచి ప్రారంభం కానుంది. వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమశాతం పెరగనుంది. బుధవారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2025బజార్హత్నూర్ : జాతర్లలో పాల్గొన్న ఎంపీ నగేశ్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ తదితరులునేరడి గొండ: గుస్సాడి టోపితో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ లక్ష్మీపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ ‘రైజింగ్’ సర్వేలో అందరూ పాల్గొనాలికైలాస్నగర్: తెలంగాణ రైజింగ్–2047 సిటిజన్ సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కలెక్టర్ రాజర్షి షా ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర భవిష్య త్ రూపకల్పనలో ప్రతీపౌరుడి భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే సందర్భంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్ర జల అభిప్రాయాలను తెలుసుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సిటిజన్ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 25వరకు చేపట్టనున్న సర్వేలో జిల్లా ప్రజలు www. telangana. gov. in/ telanganarising వెబ్సైట్ ద్వారా తమ అమూల్యమైన సలహాలు, సూచనలు నమోదు చేయాలని సూచించారు. శక్తివంతమైన, అభివృద్ధి చెందిన తెలంగాణ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అత్యవసరమని స్పష్టం చేశారు. అంబరాన్నంటిన సంబురంజిల్లావ్యాప్తంగా సోమవారం దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. ప్రజలు తమ ఇళ్లతో పాటు వ్యాపార, వాణిజ్య దుకాణాల్లో లక్ష్మీదేవి పూజలు నిర్వహించారు. అష్టైశ్వర్యాలు అనుగ్రహించాలని అమ్మవారిని వేడుకున్నారు. చీకటి పడగానే చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ హుషారుగా బాణాసంచా కాల్చారు. మరోవైపు గిరి గ్రామాల్లో దండారీ సందడి కనిపించింది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్, నేరడిగొండ మండలంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. – ఆదిలాబాద్/నేరడిగొండ/ఇంద్రవెల్లిసంస్కృతిని భావితరాలకు అందించాలిసిరికొండ: గిరిజన సంస్కృతిని భావితరాలకు అందించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండలంలోని రాయిగూడలో అశోక చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మంగళవారం దండారీ ఉత్సవాలు నిర్వహించారు.ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి ఆయన హాజరయ్యారు. ఇందులో ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యురాలు నీలాదేవి, ట్రస్టు చైర్మన్ అశోక్ పాల్గొన్నారు. బజార్హత్నూర్: మండలంలోని జాతర్ల గ్రామంలో నిర్వహించిన దండారీ ఉత్సవాలకు ఎంపీ గోడం నగేశ్, కలెక్టర్, ఎస్పీ హాజరయ్యారు. ఎంపీ మాట్లాడుతూ ఆదివాసీలు దండారీ సంస్కృతిని తరతరాలుగా కాపాడుకోవడం గొప్ప విషయమన్నారు. ఇందులో డీఎస్పీ జీవన్రెడ్డి, పాయల్ శరత్ తదతరులు పాల్గొన్నారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
ఆదిలాబాద్టౌన్: విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఫ్లాగ్ డే సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ ఏఆర్ హెడ్క్వార్టర్స్ ప్రాంగణంలోని అమరవీరుల స్తూపం వద్ద మంగళవారం పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రజల రక్షణ కోసం పోలీసులు తమ ప్రాణాలు సైతం లెక్కచేయరన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, జిల్లాలో గతంలో నక్సలైట్ వ్యతిరేక పోరాటంలో 50 మంది పోలీసు సిబ్బంది తమ ప్రాణా లను కోల్పోయారని అన్నారు. వారి త్యాగాలు మరువలేనివని కొనియాడారు. బాధిత కుటుంబాలకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని అన్నారు. జిల్లా జడ్జి కె.ప్రభాకరరావు, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తదితరులు హాజరయ్యారు. స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలతో నివా ళులర్పించారు. అనంతరం సాయుధ పోలీసులు అమరవీరులకు గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి.సురేందర్రావు, డీఎస్పీలు ఎల్.జీవన్రెడ్డి, పోతారం శ్రీనివాస్, హసీబుల్లా, కమతం ఇంద్రవర్ధన్, డీఎంహెచ్వో నరేంద్ర రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, ఆర్టీసీ ఆర్ఎం, రెండో బెటాలియన్ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి
ఆదిలాబాద్టౌన్: మహిళల ఆర్థిక స్వావలంబ నకు కృషి చేస్తున్నట్లు పల్నా పథకం రాష్ట్ర లీడ్ రాజారాం ప్రసాద్ అన్నారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్న పల్నా పథకంపై జిల్లా కేంద్రంలోని బాలరక్షక్ భవన్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ పథకంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో క్రె చెస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపా రు. పనులకు వెళ్లే తల్లులు తమ చిన్నారులను ఈ కేంద్రాల్లో వదిలి వెళ్లవచ్చని పేర్కొన్నారు. నియోజకవర్గానికి 5 చొప్పున ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని రిక్షా కాలనీ, సంజయ్నగర్, మహాలక్ష్మివాడలో గుర్తించిన కేంద్రాలను సందర్శించారు. ముందుగా కలెక్టర్ రాజర్షిషాను రాష్ట్ర లీడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి మిల్కా, సీడీపీవోలు సౌందర్య, శారద, ఉమాదేవి, నర్సమ్మ, వినూత్న పాల్గొన్నారు. -
కనిపించని డబ్బా వసూళ్లు
ఆదిలాబాద్టౌన్: నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే భోరజ్ చెక్పోస్టు మంగళవారం నిర్మానుష్యంగా మారింది. చెక్పోస్టు వద్ద సిబ్బంది వాహనాలు ఆపిన దాఖలాలు కనిపించ లేదు. ఇటీవల ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా రవా ణాశాఖ చెక్పోస్టుల్లో దాడులు జరిపిన విషయం విదితమే. ఇందులో భాగంగా భోరజ్ చెక్పోస్టు వద్ద లెక్కకు మించి రూ.లక్ష 26వేలు లభించా యి. అయితే ఈ చెక్పోస్టు వద్ద ఏర్పా టు చేసిన డబ్బాలో లారీడ్రైవర్లు, క్లీనర్లు డబ్బులు వేసి వెళ్తుండగా గమనించారు. కొన్నేళ్లుగా జరుగుతు న్న ఈ తంతు బహిరంగ రహస్యమే. అయితే ఏసీబీ దాడులతో ఒక్కసారిగా చెక్పోస్టు ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. ఇది వరకు ప్రతి రోజు వేలాది వాహనాలు చెక్పోస్టు వద్ద ఆగు తూ వెళ్లేవి. ముద్ర వేసుకొని డబ్బాలో డబ్బులు వేసేవారు. మంగళవారం ఆ సందడి కనిపించలేదు. చెక్పోస్టు వద్ద డబ్బా సైతం తొలగించిన ట్లు తెలుస్తోంది. ‘సాక్షి’ ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరిశీలించగా.. చెక్పోస్టు వద్ద ఒక ఆపరేటర్ విధులు నిర్వహిస్తూ కనిపించాడు. ఇదివరకు పలువురు రవా ణాశాఖాధికారులు, హోంగార్డులు, ప్రైవేట్ వ్యక్తులు ఉండేవారు. అయితే ఈ అక్రమ వసూళ్లు ఇంతటితో నిలిచిపోతాయా.. మళ్లీ కొనసాగుతాయా అనే విషయాలపై పలువురు చర్చించుకుంటున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. -
వెలుగుల పండుగొచ్చే..
టపాసులు కొనుగోలు చేస్తున్న జనంఆదిలాబాద్టౌన్: భోరజ్ చెక్ పోస్టు.. అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిందనే విమర్శలున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లా మీదుగా వెళ్లే వాహనా లను తనిఖీ పేరిట అధికారులు, సిబ్బంది అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలే దు. తరచూ ఏసీబీ దాడులు జరిగినప్పుడు లెక్క కు మించి నగదు పట్టుబడుతుండడం గమనార్హం. ఈ అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఇటీవల అంతర్రాష్ట్ర చెక్పోస్టులు ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే వాహనదారులకు ఆన్లైన్ విధానంపై అవగాహన కల్పిస్తామని చెబుతూ ఇక్కడి అధికారులు అందినకాడికి దండుకుంటున్న ట్లు తెలుస్తోంది. కేవలం గంటల వ్యవధిలోనే డబ్బాలో రూ.లక్ష జమ అయితే.. రోజుకు ఎంత జమ అవుతుందోనని సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఈ అక్రమ వసూళ్లలో కింది నుంచి పైస్థాయి అధికారు ల వరకు వాటాలు ఉంటాయనేది బహిరంగ రహస్యమే. ఇక్కడ డ్యూటీ అంటే కాసుల పంట అనే ప్ర చారం ఉంది. గతంలో ఇక్కడ విధుల కోసం అధి కారుల గొడవలు రాష్ట్రస్థాయి వరకు వెళ్లిన విషయం విదితమే. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికీ మార్పు కానరావడం లేదు. డబ్బులు పట్టుబడినప్పుడు నామ్కే వాస్తే వివరణ తప్పా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో వారి ఆగడాలు మితిమీరుతున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ అధికారుల ముందే లారీ డ్రైవర్లు, క్లీనర్లు డబ్బాలో నగదు వేయడాన్ని చూసి ఆశ్చర్యపోయా రు. ఎందుకు డబ్బులు వేస్తున్నారంటే మరికొంత ఎక్కువ వేస్తామని చెప్పడం అవినీతి ఏ మేరకు పేరుకుపోయిందో తెలిసిపోతోంది. లెక్కకు మించిన డబ్బులెక్కడివి.. ఈ చెక్పోస్టు జాతీయ రహదారి 44కు ఆనుకొని ఉంటుంది. ఈ మార్గం గుండా వెళ్లే భారీ వాహనా లకు సంబంధించి పర్మిట్, ఓవర్లోడ్, లైసెన్సులు, ట్యాక్స్లు, ఇతరత్రా పత్రాలు సరిగా ఉన్నాయా.. లేదా అనేది చెక్ చేసి పంపించాల్సి ఉంటుంది. 24 గంటల పాటు అక్కడికి వచ్చిపోయే వాహనాల తని ఖీతో చెక్పోస్టు ప్రాంతం సందడిగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ రవాణాశాఖ అధికారులతో పా టు ప్రైవేట్ సిబ్బంది వాటికి సంబంధించిన ప్రక్రి య చేపట్టి లోటుపాట్లు గుర్తించి అక్రమంగా డబ్బులు వసూలు చేయడమే విధిగా సాగుతుంటుందనేది బహిరంగ రహస్యమే. ఏటా ఏసీబీ అధికారులు తనిఖీల్లో భాగంగా సోదాలు నిర్వహిస్తారు. అయితే ప్రతీసారి లెక్కకు మించి నగదు లభిస్తుండడం గమనార్హం. గతేడాది డిసెంబర్ 4న ఏసీబీ దాడి చేయగా, లెక్కకు మించి రూ.62,500 నగదు పట్టుబడిన విషయం తెలిసిందే. అంతకుముందు జరిపిన దాడుల్లోనూ లెక్కకుమించి డబ్బులు లభించడం పరిస్థితికి అద్దం పడుతోంది. షరామామూలే.. ఈ చెక్పోస్టు వద్ద డబ్బుల వసూలు కొన్నేళ్లుగా షరా మామూలుగానే జరుగుతోంది. ఉత్తరభారతం వైపు నుంచి జిల్లా మీదుగా దాదాపు రోజుకు 3వేల నుంచి 4వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటా యి. రవాణాశాఖ అధికారులు వాహనాలను తనిఖీ చేసినప్పుడు ఓవర్లోడ్ ఉందా.. సరుకులు వేసిన సమయంలో ప్రస్తుతం వాటికి సరితూగిందా లేదా, జీరో లోడ్ తీసుకెళ్తున్నారా.. పర్మిట్లో ఉన్న రోడ్డు మార్గం గుండానే వెళ్తున్నారా అనే విషయాలను పరిశీలిస్తారు. ఒకవేళ ఇందులో లోటుపాట్లు ఉంటే జరిమానాతో పాటు వేలాది రూపాయలు అక్రమంగా తీసుకుంటారనేది బహిరంగ చర్చ సాగుతోంది. ఈ విషయమై రవాణా శాఖ అధికారులను వివరణ కోరగా, స్పందించేందుకు వారు నిరాకరించారు. మరికొంత మంది అధికారులు ఫోన్ స్విచ్ఆఫ్ చేసుకోగా, ఇంకొందరు అందుబాటులోకి రాలేదు. భోరజ్ చెక్పోస్టుచెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి. వెలుగుల పండుగను నేడు వైభవంగా నిర్వహించుకు నేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు. లక్ష్మీపూజలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. సాయంత్రం టపాసుల మోతకు చిన్నా పెద్దా రెడీ అవుతున్నారు. భోరజ్ మండలకేంద్రంలోని అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద ఏసీబీ అధికారులు శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము 5 గంటల వరకు తనిఖీ చేపట్టారు. నిబంధనల ప్రకారం వచ్చిన డబ్బులు పక్కనబెడితే, రూ.లక్ష 26వేలు అదనంగా ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు రవాణా శాఖ చెక్పోస్టుల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఆ సమయంలో ఇక్కడ ఇద్దరు ఆర్టీఏ అధికారులతో పాటు ఒక హోంగార్డు, ఒక సెక్యూరిటీ, నలుగురు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు. అదనంగా ఉన్న డబ్బుల గురించి ఏసీబీ అధికారులు ప్రశ్నించగా.. ఆ డబ్బులతో తమకు సంబంధం లేదని చెప్పడం గమనార్హం. కార్యాలయ ఆవరణలో ఓ డబ్బా ఏర్పాటు చేయగా, వాహన డ్రైవర్లు, క్లీనర్లు అందులో నగదు వేసి పత్రాలపై ముద్ర వేసుకొని వెళ్లడాన్ని గమనించారు. ఒక్కో వాహనానికి రూ.300 నుంచి రూ.500, ఆపై డబ్బులు వేసినట్లు ఏసీబీ అధికారులు గమనించారు. గంటల వ్యవధిలోనే రూ.లక్షకు పైగా జమ కావడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ లెక్కన రోజు రూ.లక్షల్లో వసూలవుతున్నట్లు తెలుస్తోంది. అదనపు డబ్బులను ఏసీబీ అధికారులు సీజ్ చేసి ప్రభుత్వ ఖజానాలో జమ చేశారు. ఇక్కడ జరిగిన తంతుపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. -
‘స్వయం’.. విస్తృతం
కైలాస్నగర్:జిల్లాలోని గ్రామీణప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలు మరింతగా పెరగనున్నాయి. 15 ఏళ్ల కిశోర బాలికల నుంచి 60 ఏళ్లు పైబడిన వృద్ధ మహిళల వరకు ఎస్హెచ్జీల్లో సభ్యులుగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి మిషన్–2025 కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాకు ప్ర త్యేక లక్ష్యాన్ని నిర్దేశించింది. వీరితో పాటు దివ్యాంగులతో కూడిన సంఘాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఈమేరకు లక్ష్యాన్ని చేరుకునే దిశగా సెర్ప్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెలాఖరులో గా సాధించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. కిశోర బాలికలపై ప్రత్యేక దృష్టి.. ప్రస్తుతం ఎస్హెచ్జీల్లో 18 నుంచి 60 ఏళ్లలోపు మహిళలు మాత్రమే ఉన్నారు. వారికి పొదుపుపై అవగాహన కల్పించడంతో పాటు బ్యాంకుల ద్వారా రుణాలు అందజేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వారితో పాటు కేరళ రాష్ట్రంలో అమలవుతున్న కుటుంబ శ్రీ పథకం స్ఫూర్తిగా 15 నుంచి 18 ఏళ్ల లోపు కిశోర బాలికలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. వారిని కూడా సంఘాల్లో సభ్యులుగా చేర్చాలని ఆదేశించింది. వారికి పొదుపుతో పాటు బ్యాంకింగ్ లావాదేవీలపై అవగాహన కల్పించనున్నారు. దీంతో పాటు హ్యూమన్ ట్రాఫికింగ్, లైంగిక వేధింపులు సోషల్ మీడియా ద్వారా కలిగే అనర్థాలు, ఆరోగ్యం, పోషకాహారంపై అవగాహన కల్పిస్తారు. ముఖ్యంగా విద్య, ఉద్యోగ అవకాశాలను వివరించి సద్విని యోగం చేసుకునేలా చైతన్య పర్చనున్నారు. 60 ఏళ్లు పైబడిన వారిని కూడా... సంఘాల్లో సభ్యులుగా ఉండి 60 ఏళ్లు పైబడిన మహిళలను సాధారణంగా సంఘాల్లో నుంచి తొలగిస్తున్నారు. అయితే ఆ వయస్సు కలిగిన మహిళలతోనూ సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పొదుపు చేసేలా చూడటంతో పాటు ఎలాంటి అండలేనటువంటి వారికి ఆర్థిక చేయూత ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి తోడు వారు ఏమైన చిన్నపాటి వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే బ్యాంకుల ద్వారా రుణాలు అందజేసి ప్రోత్సహించనున్నట్లుగా తెలుస్తోంది. దివ్యాంగులకు సైతం... దివ్యాంగులతోనూ ఎస్హెచ్జీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 18 ఏళ్లు నిండిన దివ్యాంగ మహిళలు, పురుషులను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి సంయుక్తంగా సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. వీరికి కూడా అవసరమైన ఆర్థిక చేయూత అందించ ను న్నారు. ఇందులో భాగంగా వ్యాపారాల ని ర్వహణకు గాను బ్యాంకుల ద్వారా రుణా లు అందించేలా చొరవ చూపనున్నారు. సంఘాల ఏర్పాటు ఇలా.. ప్రతీ వీవో పరిధిలో కొత్తగా నాలుగు స్వయం సహా యక సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆ దేశించింది. ఇందులో ఒకటి జనరల్ కాగా, దివ్యాంగులు, వృద్ధ మహిళలు, కిశోర బాలిక ల కేటగిరీల వారీగా ఒక్కో సంఘాన్ని ఏర్పాటు చేయనున్నారు. జనరల్ సంఘాల్లో పది మంది సభ్యులు ఉండగా, దివ్యాంగులు, వృద్ధ మహిళలు, కిశోర బాలికలతో కూడిన సంఘాల్లో ఐదు నుంచి పది మంది వరకు ఉండనున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో కసరత్తు ప్రారంభించిన సెర్ప్ డీపీఎం, ఏపీఎంలు, సీసీలు, వీవోఏలు,వీవో ఓబీలు ఆయా వర్గాల వారి ని గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా కిశోర బాలికలు 4,133, వృద్ధ మహిళలు 3,570, దివ్యాంగులు 1,516, జనరల్ మహిళలు 6,412 మందిని గుర్తించారు. వీరిలో బ్యాంకు ఖాతాలు కలిగిన వారి వివరాలు సేకరిస్తుండగా, అవి లేనటువంటి వారికి కొత్తగా ఖాతాలు తెరిపిస్తున్నారు. లక్ష్యసాధన దిశగా .. కిశోర బాలికలు, వృద్ధ మహిళలు, దివ్యాంగులు, జనరల్ మహిళా సభ్యులతో కూడిన స్వయం సంఘాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆయా వర్గాల వారిని గుర్తిస్తూ సభ్యులుగా చేర్పిస్తున్నాం. ఈ నెలాఖరులోగా లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నాం. – రమాకాంత, డీపీఎం ఐబీ జిల్లాలో..ప్రస్తుతం ఉన్న ఎస్హెచ్జీలు 1103 ఆయా సంఘాల్లోని సభ్యులు 121514 కొత్త ఎస్హెచ్జీల లక్ష్యం, ఇతర వివరాలుమొత్తం వీవోలు 554 ఏర్పాటు చేయాల్సిన ఎస్హెచ్జీలు 2,216 ఆయా సంఘాల్లో చేర్చాల్సిన సభ్యులు 19,390 ఇప్పటి వరకు గుర్తించిన సభ్యులు 12,246 -
రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో సత్తా
ఆదిలాబాద్: రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన కొమ్ము కృష్ణ సత్తా చాటాడు. హైదరాబాద్లోని అంబర్పేటలో ఆదివారం నిర్వహించిన పదవ తెలంగాణ మాస్టర్ ఇంటర్ డిస్టిక్ర్ట్ స్విమ్మింగ్ చాంపియన్షిప్ పోటీల్లో 100 మీటర్స్ బ్రెస్ట్ స్ట్రోక్ ఈవెంట్లో గోల్డ్ మెడల్తో మెరిశాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో వి జేతగా నిలవడంపై డీవైఎస్ఓ జక్కుల శ్రీని వాస్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలూరి గోవర్ధన్రెడ్డి, పార్థసారథి తదితరులు అభినందించారు. -
చెదరని నెత్తుటి జ్ఞాపకాలు
ఖానాపూర్: ఉమ్మడి రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు నేటికి చెదరని నెత్తుటి చేదు జ్ఞాపకాలు.. అప్పటి పరిస్థితులు తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఎటుచూసినా అన్నల అలజడి.. తుపాకీ మోత చప్పుళ్లు వినబడుతుండేవి. ప్రతీరోజు ఎక్కడో ఒకచోట నక్సలైట్ల విధ్వంసాలు, తరచూ ఎన్కౌంటర్లు జరుగుతుండేవి. వారి కవ్వింపు చర్యలను తిప్పికొట్టే ప్రయత్నాల్లో పలువురు పోలీసులు అమరులయ్యారు. వారి సేవలు మరువలేనివి. ఈక్రమంలోనే ఎన్నో సంఘటనలు జరిగాయి. 1983 నుంచి అప్పటి ఆదిలాబాద్లో ఉన్న నిర్మల్ జిల్లా పరిధిలో నక్సలైట్ల ప్రభావం పెరుగుతూ వచ్చింది. ఖానాపూర్ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండడంతో స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచే కార్యకలాపాలు నడిపేవారు. జిల్లాలో మొదటిసారిగా ఇక్కడి నుంచే విద్రోహచర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఖానాపూర్ సర్కిల్ పోలీస్స్టేషన్ పరిధిలో విధి నిర్వహణలో ఉన్న 19 మంది పోలీసులు నక్సలైట్ల తూటాలకు బలయ్యారు. వారి కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. ఈనెల 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా సాక్షి కథనం. ఉమ్మడి రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు నేటికి చెదరని నెత్తుటి చేదు జ్ఞాపకాలు.. అప్పటి పరిస్థితులు తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఎటుచూసినా అన్నల అలజడి.. తుపాకీ మోత చప్పుళ్లు వినబడుతుండేవి. ప్రతీరోజు ఎక్కడో ఒకచోట నక్సలైట్ల విధ్వంసాలు, తరచూ ఎన్కౌంటర్లు జరుగుతుండేవి. వారి కవ్వింపు చర్యలను తిప్పికొట్టే ప్రయత్నాల్లో పలువురు పోలీసులు అమరులయ్యారు. వారి సేవలు మరువలేనివి. ఈక్రమంలోనే ఎన్నో సంఘటనలు జరిగాయి. 1983 నుంచి అప్పటి ఆదిలాబాద్లో ఉన్న నిర్మల్ జిల్లా పరిధిలో మెల్లమెల్లగా నక్సలైట్ల ప్రభావం పెరుగుతూ వచ్చింది. ఖానాపూర్ సర్కిల్ పోలీస్స్టేషన్ పరిధిలో విధి నిర్వహణలో నక్సలైట్ల తూటాలకు 19 మంది పోలీసులు బలయ్యారు. ఖానాపూర్ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండడంతో నక్సలైట్లు స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచే కార్యకలాపాలు నడిపేవారు. జిల్లాలో మొదటిసారిగా ఇక్కడి నుంచే నక్సలైట్లు విద్రోహచర్యలకు శ్రీకారం చుట్టారు. ఖానాపూర్లో అమరుల స్తూపంఖానాపూర్ పోలీస్ష్టేషన్లో పోలీసు అమవీ రుల స్మారకార్థం స్తూపం లేదు. పోలీస్స్టేష న్ ఆవరణలో వేపచెట్టు కింద కొన్నేళ్లుగా శిలాఫలకంపై పేర్లు రాసి ఉంచారు. 2008 లో అప్పటి సీఐ, ఎస్సైలు స్మారక స్తూప నిర్మాణానికి కృషిచేశారు. ప్రస్తుత సీఐ అజయ్తోపాటు ఎస్సై రాహుల్ గైక్వాడ్ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. -
ప్రీప్రైమరీ ప్రారంభమెప్పుడో!
ఆదిలాబాద్టౌన్: దేవుడు వరమిచ్చినా.. పూజారి కనికరించలేదన్న చందంగా మారింది విద్యాశాఖ తీరు. జూలై 16న పాఠశాల విద్యాశాఖాధికారులు జిల్లాకు ప్రీప్రైమరీ పాఠశాలలను ఎంపిక చేశారు. గత నెల 27న ఇన్స్ట్రక్టర్ల నియామకాలు చేపట్టా రు. ప్రాథమిక పాఠశాలల్లో తరగతులు ప్రారంభించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ సౌకర్యాలు, మరమ్మతుల పేరిట జాప్యం అవుతున్నట్లు అధికా రులు చెబుతున్నారు. మరోవైపు నియామకమైన ఇన్స్ట్రక్టర్లు ఎప్పుడు విధుల్లో చేరుతామోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇవే పాఠశాలలు.. ప్రీప్రైమరీ విద్యాబోధన ప్రారంభించేందుకు జిల్లాలో ఈ ఏడాది 15 పాఠశాలలను ఎంపిక చేయగా, గత విద్యాసంవత్సరంలో నాలుగు పాఠశాలలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇందులో కేశవపట్నం ప్రాథమిక పాఠశాల, దుబ్బ(కె), కంఠ, తాండబాబాపూర్, వైజాపూర్, ముత్నూర్, బరంపూర్, రాంపూర్(పి), మల్కాపూర్, చెర్లపల్లి, గుబి డి, యాపల్గూడ, కేఆర్కే కాలనీ, పిప్పల్కోటి తెలుగు మీడియం, బాలక్మందిర్ పాఠశాలలు ఉ న్నాయి. అయితే గతేడాది జైనథ్ మండలంలోని దీపాయిగూడ, సిరికొండ, భీంపూర్ మండలంలో ని నిపాని, గాదిగూడలోని చింతగూడ పాఠశాలల్లో ప్రారంభించింది. ప్రారంభమయ్యేదెప్పుడో.. ప్రీప్రైమరీ పాఠశాలల నిర్వహణ కోసంప్రభుత్వం ఒక్కోపాఠశాలకు రూ.లక్ష 70వేలు కేటా యించింది. ఇందులో ఫర్నిచర్ కోసం రూ.50వేలు, టీఎల్ఎంకోసం రూ.50వేలు, పెయింటింగ్ కోసం రూ. 50వేలు, 20మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. వెయ్యి చొప్పున ఖర్చు చేయనున్నారు. విద్యార్థులకు షూ, యూనిఫాం అందించాల్సి ఉంది. ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ కోసం ఒక గదిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులను ఆకర్షించేలా పెయింటింగ్ వేయించాల్సి ఉండగా, ఆ దిశగా పనులు సాగడం లేదు. ఈ నెలలో కూడా తరగతులు ప్రారంభమవుతాయో.. లేదోననే అనుమానం వ్యక్తమవుతుంది. నాలుగేళ్లు పైబడిన చిన్నారులకు ఎల్కేజీలో ప్రవేశం కల్పిస్తారు. ఉద యం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆట పాటలతో విద్యాబోధన చేయాల్సి ఉంటుంది. అయితే 19 పాఠశాలలకు సంబంధించి 18 మంది ఇన్స్ట్రక్టర్లను, 17 మంది ఆయాలను ఎంపిక చేశా రు. ఇన్స్ట్రక్టర్లకు రూ.8వేలు, ఆయాలకు రూ.6వేలు గౌరవ వేతనం చెల్లిస్తారు. పది నెలల పాటు వీరు పనిచేయాల్సి ఉంటుంది. గతేడాది నిపాని పాఠశాల ఎంపికై నప్పటికీ గదులు లేవని సిబ్బంది ని నియమించలేదు. తరగతులు కూడాప్రారంభం కాలేదు. సిరికొండలో ఆయాకు క్వాలిఫికేషన్ లేకపోవడంతో నియామకం జరగలేదు. కంఠలో ఆ యా పోస్టు భర్తీకాలేదు. దీపాయిగూడలో గతేడా ది పనిచేసిన వారిని కొనసాగించాలా.. లేదా అనే విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది చింతగూడలో ప్రారంభమైనా ఆమె సక్రమంగా విధులు నిర్వహించడం లేదని తొలగించారు. త్వరలో ప్రారంభిస్తాం.. ప్రీప్రైమరీ పాఠశాలలకు సంబంధించి ఇన్స్ట్రక్టర్లు, ఆయాలను నియమించడం జరిగింది. జిల్లాలో గతేడాది నాలుగు పాఠశాలలను ప్రారంభించగా, ఈ ఏడాది మరో 15 ఎంపికయ్యాయి. ఆయా పాఠశాలల్లో పనులు ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలో ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభిస్తాం. – అజయ్, సెక్టోరల్ అధికారి -
ఆదివాసీ సంస్కృతికి ప్రతీక దండారీ
నార్నూర్: ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం దండారీ ఉత్సవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలోని జామ్డా గ్రామంలో ఆదివారం నిర్వహించిన దండారీ ఉత్సవాలకు ఆయన అతిథిగా హాజరయ్యారు. జిల్లా సా ర్మేడి దుర్గు పటేల్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఎస్పీ వారితో కలిసి గుస్సాడి నృత్యం చేశారు. అనంతరం 50 మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయలను భావితరాలకు అందించాలన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో ఉట్నూర్ సీఐ ప్రసాద్, నార్నూర్ సీఐ పద్మ, తహసీల్దార్ జాడి రాజలింగు, ఎంపీడీవో గంగాసింగ్, ఆదివాసీ పెద్దలు చెంచు రామకృష్ణ, ఎస్సైలు సాయన్న, అఖిల్ తదితరులున్నారు. కేస్లాపూర్లో..ఇంద్రవెల్లి: మండలంలోని కేస్లాపూర్లో నిర్వహించిన దండారీ ఉత్సవాలకు ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యేత్మసూర్ దేవతలకు పూజలు నిర్వహించారు. దండారీలతో కలిసి నృత్యం చేశారు. ఆదివాసీలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో ఉట్నూర్ సీఐ ప్రసాద్, స్థానిక ఎస్సై సాయన్న, గ్రామ పటేల్ వెంకట్రావ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
కలంపై జులుం సరికాదు
పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్నారు ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛ ను కాలరాసేలా వ్యవహరిస్తోంది. మీడియాలో ప్రసారం చేసిన కథనాలపై, దినపత్రికల్లో ప్రచురితమైన వార్తలపై ఏమైనా అభ్యంతరాలుంటే వివరణ ఇవ్వడమో లేక ఖండిచడమో చేయాలి. కానీ పోలీసులతో నోటీసులు పంపించి ‘సాక్షి’ ఎడిటర్, జర్నలిస్టులపై బెదిరింపులకు దిగడం అప్రజాస్వామికం. ఈ చర్యలను మానుకోవాలి. – సిర్రా దేవేందర్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కై లాస్నగర్: నిజాలను నిర్భయంగా రాస్తున్న జర్నలిస్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని వివిధ వర్గాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయ్రెడ్డిపై పోలీసులతో అక్రమ కేసులు నమోదు చేయించి జులం ప్రదర్శించడాన్ని వారు తప్పుపట్టారు. మీడియాను అణచివేయాలనే విధానాలు మానుకోవాలని స్పష్టం చేశారు. -
లైసెన్స్డ్ సర్వేయర్లు వచ్చేస్తున్నారు
కై లాస్నగర్: జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖలో కొత్తగా లైసెన్స్డ్ సర్వేయర్లు వచ్చేస్తున్నారు. జిల్లాలో నిర్వహించిన వృత్తిపరమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న 44 మంది ఆ శాఖ అధికారులతో కలిసి ఆదివారం వేకువజామున ప్రత్యేక బస్సులో హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు. శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి చేతుల మీదుగా వారు లైసెన్స్ పత్రాలు అందుకున్నారు. గుడిహత్నూర్ మండలం తోషం తండాకు చెందిన జాదవ్ కీర్తి స్వయంగా సీఎం చేతుల నుంచి లైసెన్స్ పత్రం అందుకోగా మిగతా వారికి అక్కడి అధికారులు ప్రత్యేక కౌంటర్ ద్వారా అందజేశారు. దీపావళి తర్వాత వీరంతా జిల్లాలో విధుల్లో చేరనున్నారు. కార్యక్రమంలో జిల్లా సర్వేల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకుడు రాజేందర్, ఉద్యోగులు గోవింద్, తిరుమల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చూసొద్దాం..
జన్నారం అందాలు జన్నారం: జన్నారం అటవీ డివిజన్లో అందాలు ఆస్వాదిస్తూ.. వన్యప్రాణులు, రకరకాల పక్షులు, జంగిల్ సఫారీ ప్రయాణం ద్వారా పర్యాటకులు వీక్షించేందుకు అటవీశాఖ అనుమతి ఇచ్చింది. వర్షాలు తగ్గుముఖం పట్టడడంతో సఫారీ ప్రయాణానికి గ్రీన్సిగ్నల్ లభించింది. మూడు నెలల విరామం తర్వాత అక్టోబర్ 1 నుంచి జంగిల్ సఫారీ మొదలైంది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడకు వచ్చి అడవులు చూసి మురిసిపోతున్నారు. పచ్చదనం, స్వచ్ఛమైన వాతావరణం మధ్య గడుపుతున్నారు. వీకెండ్ రోజుల్లో గదులు ఫుల్గా ఉంటున్నాయని పర్యాటక అధికారులు పేర్కొంటున్నారు. 15 రోజుల్లో 600 పైగా మంది జంగిల్ సఫారీ మొదలైన 15 రోజుల్లో తెలంగా ణ, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 600 పైగా మంది పర్యాటకులు ఇక్కడకు వచ్చార ని అధికారులు తెలిపారు. నిజామాబాద్, హైదరా బాద్ నుంచి బస్సుల్లో వచ్చి ఇక్కడ సందడి చేస్తున్నారు. రాత్రి హరిత రిసార్ట్లో బస చేసి ఉదయం జంగిల్ సఫారీ ద్వారా వన్యప్రాణుల పరుగులు, పచ్చని అడవులను అస్వాదిస్తున్నారు. అటవీశాఖ ఏర్పాటు చేసిన బేస్క్యాంపు, అధ్యయన కేంద్రాలను పరిశీలిస్తున్నారు. అడవుల్లో నిర్మించిన కుంటల్లో పక్షుల కిలకిలలు చూసి మురిసిపోతున్నారు. తెల్లవారు జామున, సూర్యకిరణాలు, చెట్ల మధ్యన పడటం ఆహ్లాదం పంచుతుంది. చెడిపోయిన దారులు.. గేట్ నంబర్ 1 నుంచి సుమారు 15 కి.మీ దూరం సఫారీ ప్రయాణం ఉంటుంది. గొండుగూడ బేస్క్యాంపు, బైసన్కుంట ప్రాంతాల్లో చుక్కల దుప్పులు, నీలుగాయిలు, అడవి దున్నలు, రకరకాల పక్షులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో సఫారీ దారి చెడిపోయినట్లు పర్యాటకులు పేర్కొంటున్నారు. అటవీశాఖ దృష్టిసారించి సఫారీ దారిని బాగు చేయిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలు సైతం కల్పించాలని కోరుతున్నారు. పర్యాటకుల సంఖ్య పెరిగింది సఫారీ మొదలై 15 రోజు ల్లోనే పర్యాటకుల సంఖ్య పెరిగింది. వీకెండ్లో గదులు నిండిపోతున్నాయి. ఆన్లైన్లోనే బుకింగ్ చేసుకుంటున్నారు. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ నుంచి చాలామంది వస్తున్నారు. – వీరేందర్, హరిత మేనేజర్ -
‘పీవీటీజీల అభివృద్ధిపై నిర్లక్ష్యం’
బేల: గిరిజన గ్రామాల పీవీటీజీల అభివృద్ధి, సంక్షేమంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సొనేరావ్ ఆరోపించారు. మండలంలోని సదల్పూర్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన కుంరం సూరు, కుమురం భీం వర్ధంతికి ఆయన హాజరయ్యారు. పోరాటయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ గతేడాది దేశంలోని పీవీటీజీల అభివృద్ధి, సంక్షేమం కోసం రూ. 24వేల కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. అందులో భాగంగా తెలంగాణలో రూ. 24 కోట్లు, ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఐటీడీఏకు నిధులు కేటాయించారని తెలిపారు. పీవీటీజీలకు రూ. 60 లక్షలతో మల్టీహాల్ నిర్మించాల్సి ఉండగా కేవలం రూ.45 లక్షలతో నిర్మాణాలు చేపడుతున్నారని విమర్శించారు. అంచనా వ్యయం తగ్గించడంలో అంతరాయం ఏముందని ప్రశ్నించారు. అనంతరం ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై నా కొడప సొనేరావ్ను గ్రామస్తులు సన్మానించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమ్ర రాజు, జిల్లా అధ్యక్షుడు మడావి గోవింద్రావ్, డివిజన్ అధ్యక్షుడు టేకం గణేష్, ఆదిలాబాద్ రూరల్ మండల అధ్యక్షుడు కుమ్ర జలపత్రావ్, బేల మండల అధ్యక్షుడు కొడప జైవంత్, గ్రామ మాజీ సర్పంచ్ రాందాస్, ఆదివాసీ సీనియర్ నాయకుడు మడావి జంగు తదితరులు పాల్గొన్నారు. -
వార్డెన్ ఆత్మహత్యాయత్నం
లక్సెట్టిపేట: మండలంలోని ఎస్సీ బాలుర వసతి గృహం వార్డెన్, నిర్మల్ జిల్లా ఖానాపూర్కు చెందిన రాజగోపాల్ ఈనెల 18న సాయంత్రం తన ఇంటి వద్ద యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 17న ఇంటికి వెళ్లిన రాజగోపాల్... 18వ తేదీ సాయంత్రం బాత్రూంలోకి వెల్లి యాసిడ్ తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హాస్టల్లో విద్యార్థుల సంఖ్యను 100 నుంచి 252కి పెంచేలా రాజగోపాల్ కృషి చేశాడు. అయితే ఆమేరకు బిల్లులు రాకపోవడంతో రూ.7 లక్షల వరకు సొంతంగా ఖర్చు చేశాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా తెలిపారు. అయినా బిల్లులు రాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది. దీనిపై సంక్షేమ శాఖ ఉప సంచాలకులు చాతరాజు దుర్గాప్రసాద్ను వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం నిర్మల్కు వెళ్లి పూర్తి వివరాలు సేకరిస్తామని తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలుసుకుంటామని పేర్కొన్నారు. ఏఎస్డబ్ల్యూవో సురేశ్ను వివరణ కోరగా ఈనెల 17న తన తల్లి ఆరోగ్యం బాగాలేదని రాజగోపాల్ ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. -
అన్వేషిక ప్రయోగదర్శిని రూపకల్పనలో టీచర్
జైనథ్: ఎస్సీఈఆర్టీ వారు రూపొందించిన అన్వేషిక ప్రయోగదర్శిని రూపకల్పనలో జిల్లా ఉపాధ్యాయుడికి చోటు లభించింది. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు గోసుల సత్యనారాయణ 6వ తరగతి పాఠ్యాంశంలోని ప్రయోగ కృత్యాలను పుస్తకంలో పొందుపర్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది సబ్జెక్ట్ ఉపాధ్యాయులు పాల్గొనగా, ఆదిలాబాద్ జిల్లా నుంచి ఈయన పాల్గొన్నారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ జ్ఞానం, విలువలు పెంపొందించడంతోపాటు ప్రయోగకృత్యాలను పుస్తకంలో పొందుపర్చినట్లు తెలిపారు. ఈ అంశాలు ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన వివరించారు. -
సాత్నాల ప్రాజెక్టులో దూకి ఒకరి ఆత్మహత్య
సాత్నాల: మండలంలోని సాత్నాల ప్రాజెక్టులో ఆది వారం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎస్సై గౌతమ్పవార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రవెల్లి గ్రామానికి చెందిన, పవార్ బాలాజీ(37) ఆరు నెలల క్రితం, ఉపాధి కో సం సాత్నాల మండలం రామయికి వలస వచ్చాడు. సీస కమ్మరిగా, చికెన్ సెంటర్లో పనిచేస్తూ జీవనం కొ నసాగిస్తున్నారు. మద్యానికి బానిసైన బాలాజీ శని వారం రాత్రి భార్య, అత్తతో గొడవ పడ్డాడు. బామ్మర్దులు వారించారు. ఆదివారం ఉదయం పనికి వెళుతున్నానని చెప్పి, సాత్నాల ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బాలాజీ తమ్ముడు సంజయ్ ఇచ్చి న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై గౌతమ్పవార్ తెలిపారు. పురుగుల మందు తాగి వ్యక్తి.. లక్ష్మణచాంద: అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పీచర గ్రామానికి చెందిన నైనం శేఖర్ (28) గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెందాడు. శనివారం ఉదయం గ్రామసమీపంలో గుర్తుతెలియని పురుగుల మందు తాగాడు. గమనించిన గ్రామస్తులు అందించిన సమాచారంతో కుటుంబ సభ్యులు అతన్ని నిర్మల్కు తరలించారు. చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి భార్య నాగలక్ష్మి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
కన్నతండ్రినే కడతేర్చాడు..
జన్నారం: మద్యానికి బాని సైన కుమారుడు తన కన్నతండ్రినే కర్రతో కొట్టిచంపిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం గ్రామ పంచాయతీలోని సేవదాస్నగర్కు చెందిన జాదవ్ శంకర్నాయక్ (60)కు ముగ్గురు కూతుర్లు, కుమారుడు సంతానం. నలుగురికి పెళ్లిళ్లు చేశాడు. శంకర్నాయక్ భార్య రేణుకాబాయి రెండేళ్ల క్యాన్సర్తో మృతి చెందింది. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న కుమారుడు నూర్సింగ్ నాయక్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యను కొడుతుండడంతో ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి తండ్రితో కలిసి ఉంటున్నాడు. తాగేందుకు డబ్బులు ఇవ్వాలని వేధించేవాడు. పలుమార్లు గొడ్డలితో చంపుతానని వెంటపడగా శంకర్నాయక్ తప్పించుకున్నాడు. ఈనెల 17న కూడా గొడ్డలితో చంపుతానని వెంటపడగా స్థానికులు 100కు డయల్ చేయడంతో పోలీసులు వచ్చి నూర్సింగ్ను బెదిరించి వెళ్లిపోయారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో మద్యం సేవించి ఇంటికి వచ్చి రొట్టెలు చేస్తున్న తండ్రిని కర్రతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. కాలనీవాసులు నిలదీయడంతో పరారయ్యాడు. స్థానికు ల సమాచారం మేరకు లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై గొల్లపెల్లి అనూష సంఘటన స్థలానికి చే రుకుని వివరాలు సేకరించారు. డాగ్స్క్వాడ్, క్లూస్ టీంతో పరిశీలించారు. మృతుని చిన్న కూతురు జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. -
ఆవులు తరలిస్తున్న లారీ పట్టివేత
సాత్నాల: భోరజ్ మండలంలోని చెక్పోస్ట్ వద్ద ఆవులు తరలిస్తున్న కంటైనర్ లారీని పట్టుకున్నట్లు ఎస్సై గౌతమ్ పవర్ తెలిపారు. శనివారం నాగ్పూర్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న కంటైనర్ను తనిఖీ చేయడంతో 25 ఆవులు ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. ఎస్సైకి సమాచారం సమాచారం అందించడంతో ఆవులను ఇచ్చోడలోని గోశాలకు తరలించారు. డ్రైవర్ గురురవాల్సింగ్పై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, మోహన్గౌడ్, పైమా సుల్తానా, జాదవ్ గోవింద్, తదితరులు పాల్గొన్నారు. -
ఆలయంలో చోరీకి పాల్పడిన ఇద్దరి అరెస్టు
భీమారం: మండల కేంద్రంలోని లక్ష్మీదేవర ఆలయంలో ఈనెల 15న చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. సీసీ కెమెరాల పుటేజీ ఽఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సిరికొండ లక్ష్మణ్, మహా రాష్ట్రలోని రాజూరా తాలూకా చున్నాల గ్రామానికి చెందిన కాకట్ల కేశవరెడ్డిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కిలో 900 గ్రాముల వెండి, 10 గ్రాముల బంగారం, రూ.3,600 నగదు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడిన ఈఇద్దరు నిందితులపై ఇప్పటికే పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి జుడీషియల్ కస్టడీకి తరలించినట్లు తెలిపారు. ఒక్క రోజులో కేసును ఛేదించిన భీమారం ఎస్సై శ్వేత, శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్, సిబ్బంది మల్లయ్య, కిరణ్ను సీఐ అభినందించారు. -
దరఖాస్తు గడువు పొడిగింపు
కాగజ్నగర్ టౌన్: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యాసంవత్సరానికిగానూ 9, 11 తరగతుల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తు గడువు అక్టోబర్ 23 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. తాళం వేసిన ఇంట్లో చోరీ నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన కొరిపెల్లి రేణుకాదేవి శుక్రవారం తమ బంధువుల ఇంట్లో పుట్టినరోజు వేడుకలకు స్థానిక శాస్త్రినగర్ కాలనీకి వెళ్లింది. చీకటి పడడంతో రాత్రి అక్కడే ఉండిపోయింది. గమనించిన దొంగలు ఇంటి తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న 26 తులాల బంగారం, అరకిలో వెండి, రూ.5 వేల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. అడవిలో అరుదైన ‘హైగ్రోసైబ్ పెల్లిసిడా’ జన్నారం: హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ నార్త్ తెలంగాణ కోఆర్డినేటర్ డాక్టర్ ఎనగందుల వెంకటేశ్ శనివారం కవ్వాల్ టైగర్జోన్లో శిలీంద్ర జాతికి చెందిన అరుదైన హైగ్రోసైబ్ పెల్లిసిడాను కనుగొన్నారు. 2024లో కేరళ రాష్ట్రంలోని హైగ్రోఫోరేసి కుటుంబంలో ఒక కొత్త జాతిగా మొదటిసారి కనుగొన్నారు. చిన్న, సున్నితమైన అగారిక్ ఫంగస్ అని తెలిపారు. ఇవి సాధారణంగా గడ్డి మైదానాలు, చిత్తడి ప్రాంతాల్లో కనిపిస్తాయని, దీనిని వాక్స్కప్ అని పిలుస్తారన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కవ్వాల్ టైగర్జోన్లో మొదటిసారి నిర్ధారించినట్లు ఆయన పేర్కొన్నారు. -
కాలయాపన
కరెంటు సమస్యలపై మంచిర్యాలఅగ్రికల్చర్: సాంకేతిక లోపమో.. మరేదైనా కారణమో తెలియదు గానీ కొందరి ఇళ్లలో కరెంటు మీటరు గిర్రున తిరుగుతోంది. రూ.వేలల్లో వస్తున్న బిల్లులతో వినియోగదారులు తల పట్టుకోవాల్సి వస్తోంది. మరోవైపు కరెంటు సమస్యలపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే నెలలు గడిచినా పరిష్కారానికి నోచుకోవడం లేదు. విద్యుత్ సరఫరాలో అంతరాయం, హై ఓల్టేజ్, ప్రమాదకరంగా ఉన్నత స్తంభాలు, బిల్లుల్లో హెచ్చుతగ్గులు తదితర సమస్యలపై ప్రతీ సోమవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో విద్యుత్ బిల్లులతోపాటు ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, తీగలతో పశువులు, మూగజీవాలు, మనుషులకు ప్రమాదం పొంచి ఉందని ఫిర్యాదు చేస్తున్నారు. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో దండేపల్లి మండలం విద్యుత్ స్తంభానికి షాక్ వస్తుందని పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అదే స్తంభానికి తగిలి పశువు, లేగదూడ చనిపోవడంతో తేరుకుని సవరించారు. వినియోగదారులు నేరుగా, ఆన్లైన్, మొబైల్ ద్వారా ఏ ఫిర్యాదు అందించినా వెంటనే పరిష్కరించాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సూచిస్తున్నారు. అయినా కొన్ని సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. రెండు నెలలు గడిచింది.. ఆర్ఆర్నగర్లోని తన ఇంటికి గత కొన్ని నెలల నుంచి రూ.వేలల్లో విద్యుత్ బిల్లు వస్తోందని విద్యుత్ అధికారులకు, ఆగస్టు 4న ప్రజావాణిలో ఎస్ఈకి ఫిర్యాదు చేశాను. రూ.150 చెల్లిస్తే సిబ్బంది మీటర్ను పరిశీలిస్తారని చెప్పారు. ఎన్పీడీసీఎల్ డీఈ ఆపరేషన్ పేరిట నగదు చెల్లించి రెండు నెలలైంది. వందల్లో రావాల్సిన బిల్లు వేలల్లో వస్తోంది. ఈ నెల రూ.3,882 బిల్లు చెల్లించాలని, లేదంటే కరెంటు కట్ చేస్తామని ఇబ్బంది పెడుతున్నారు. – జోగుల విజయ, మంచిర్యాల -
బాసరలో శృంగేరీ పీఠాధిపతి పూజలు
బాసర: నిర్మల్ జిల్లా బాసర శ్రీజ్ఞాన సరస్వతి దేవస్థానంలో శనివారం ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. విజయయాత్రలో భాగంగా దక్షిణామ్నాయ శృంగేరీ శారదా పీఠాధిపతి జగద్గురువు విధుశేఖర భారతీ మహాస్వామివారు ఆలయంలో ప్రత్యేక పూ జలు నిర్వహించారు. ఈవో అంజనాదేవి ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారు శ్రీసరస్వతి, మహాకాళి, మహాలక్ష్మీ అమ్మవార్ల గర్భాలయాలలో వేదమంత్రోచ్ఛరణల మధ్య అభిషేక, హారతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణపై దిశానిర్దేశం పూజల అనంతరం స్వామిజీ భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ ప్రతీ హిందువు కర్తవ్యమని, ధార్మిక విలువలతో జీవించడం సమాజ ఉన్నతికి దోహదం చేస్తుందన్నారు. అనంతరం భక్తులకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం..బాసరలో నూతనంగా నిర్మించిన లలితా చంద్రమౌళీశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం నిర్వహించారు. వేలేటి రాజేందర్ శర్మ ఆధ్వర్యంలో గణపతిపూజ, పుణ్యాహవచనం, మహాసంకల్పం వంటి కార్యక్రమాలు జరిగాయి. ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, అంజనాదేవి, బాసర గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులను ఆశీర్వదిస్తూ ప్రసాదాలు అందజేస్తున్న శృంగేరీ పీఠాధిపతి మహాకాళి అమ్మవారి ఆలయంలో హారతి ఇస్తున్న విధుశేఖర భారతీస్వామి -
అధికారి చెప్పినా ఆగని దందా
దీపావళికి స్వీట్లకు మంచి డిమాండ్ ఉంటుంది. దీనిని ఆసరా చేసుకున్న కొందరు స్వీట్ల తయారీలో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవనంలో అనుమతి లేకుండా స్వీట్లు తయారు చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు రావడంతో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రత్యూష ఈ నెల 14న తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకపోవడం, అపరిశుభ్ర వాతావరణంలో స్వీట్లు తయారు చేస్తుండడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తయారీ కేంద్రాన్ని సీజ్ చేశామని చెప్పారు. ఆ తర్వాత వదిలేయడంతో నిర్వాహకులు మళ్లీ స్వీట్ దందా మొదలుపెట్టారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ -
పేకాడుతున్న ఏడుగురు అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని ఎరోడ్రమ్ సమీపంలో గల ఆమన్ స్విమ్మింగ్పూల్ గెస్ట్హౌస్లో శనివారం పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.23,400 నగదు, 8 సెల్ఫోన్లు, ఏడు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదుపుతప్పి కారు బోల్తా నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలో అదుపుతప్పి కారు బోల్తా పడింది. స్థానికులు, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల మేరకు వరంగల్కు చెందిన ఐదుగురు స్నేహితులు కారులో షిరిడికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వరంగల్ వెళ్లే క్రమంలో స్థానిక కంచరోని చెరువు కట్ట రహదారిపై అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో కారు బోల్తా పడింది. బెలూన్లు తెరుచుకోవడంతో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా, ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బైక్ అదుపుతప్పి వైద్యుడు మృతి తరిగొప్పుల: బైక్ అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ఒప్పిచెర్ల గ్రామానికి చెందిన మాచర్ల రవికిషోర్ (31) మృతి చెందాడు. మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న రవికిషోర్ గురువారం తన స్వగ్రామం ఒప్పిచెర్లకు వెళ్లి కారంపూడిలో కొత్త బైక్ కొన్నాడు. శుక్రవారం అదే బైక్పై తిరిగి మంచిర్యాలకు వస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి క్రాస్రోడ్ సమీపంలో మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొన్నాడు. దీంతో అతడి తల, ఛాతి భాగంలో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. భార్య హిమబిందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై కాసర్ల రాజయ్య తెలిపారు. గుర్తు తెలియని వృద్ధుడు.. మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల ము న్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్లలో నాలు గు రోజుల క్రితం అనారోగ్యంతో పడి ఉన్న గుర్తు తెలియని వృద్ధుడిని గమనించిన స్థానికులు అందించిన సమాచారం మేరకు 108 ద్వారా మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. తెలిసిన వారు 8712656541, 8712658667 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. మద్యానికి బానిసై ఆత్మహత్య జైనథ్: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గౌతమ్ పవర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని లక్ష్యంపూర్ గ్రామానికి చెందిన కార్ల శంకర్ (35) భార్య లక్ష్మి నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. దీంతో మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. శనివారం ఉదయం తండ్రి విట్టల్ తలుపు తీసి చూడగా ఉరేసుకుని కనిపించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. నాలుగు నెలల వ్యవధిలో తల్లిదండ్రులు మృతి చెందడంతో చిన్నారులు అనాధలయ్యారు. -
సౌత్జోన్ పోటీలకు ఎంపిక
మంచిర్యాలఅర్బన్: కాకతీయ యూనివర్సిటీలో ఈ నెల 15, 16, 17 తేదీల్లో నిర్వహించిన అంతర్జిల్లా బ్యాడ్మింటన్ పోటీల్లో మంచిర్యాలలోని మిమ్స్లో బీకాం తృతీయ సంవత్స రం చదువుతున్న విద్యార్థిని అశ్విత పాల్గొని ప్రతిభ కనబర్చింది. నవంబర్ 21 నుంచి 23 వరకు బెంగళూర్లో జరిగే సౌత్జోన్ టోర్నమెంట్లో యూనివర్సిటీ జట్టుకు కెప్టెన్గా వ్య వహరించనుంది. శనివారం కళా శాలలో ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో కరస్పాండెంట్ శ్రీనివాసరాజు, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఉపేందర్రెడ్డి, శ్రీధర్రావు అభినందించారు. -
స్వర్ణ వాగులో పడి ఒకరు మృతి
సారంగపూర్: ప్రమాదవశాత్తు స్వర్ణ వాగులోపడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని ప్యారమూర్ గ్రామానికి చెందిన పగడపు భోజన్న (59) కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయాడు. బోరిగాంలో ఉంటున్న అతని అక్క పోశవ్వ మూడు రోజుల క్రితం తన ఇంటికి తీసుకువచ్చింది. శుక్రవారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన భోజన్న తిరిగిరాలేదు. శనివారం స్వర్ణ వాగులో మృతదేహం కనిపించడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహా న్ని బయటకు తీయించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
జాతీయస్థాయిలో గుర్తింపు హర్షణీయం
ఉట్నూర్రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆది కర్మయోగి, ధర్త్తి ఆబా జన భాగీదారి పథకాలను ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలలో సమర్ధవంతంగా అమలు చేసి జాతీయస్థాయిలో గుర్తింపు పొందడం హర్షణీయమని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివాసీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ నెల 17న నిర్వహించిన జాతీయ సదస్సులో ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్తో పాటు జిల్లా మాస్టర్ ట్రైనర్లు అర్క వసంత్, బ్లాక్ మాస్టర్ ట్రైనర్లు రాజేశ్బాబు, నందకిషోర్ పాల్గొన్నట్లు తెలిపారు. పథకాల అమలులో వారు చేసిన కృషికి పురస్కారాలు అందుకోవడం అభినందనీయమన్నారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మంచిర్యాలకు చెందిన తల్లీకూతుళ్ల మృతి
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన తల్లీకూతుళ్లు శనివారం ఉదయం మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం మంచిర్యాలకు రెడ్డి కాలనీకి చెందిన విఘ్నేష్-రమాదేవి దంపతుల కూమార్తెలు స్రవంతి, తేజస్విలు.. వీరికి వివాహాలు జరగ్గా.. భర్త, పిల్లలతో అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఇటీవల విఘ్నేష్ తన భార్య రమాదేవితో కలిసి అమెరికాలో ఉంటున్న ఇద్దరూ కూతుళ్ల వద్దకు వెళ్లారు.విఘ్నేష్ చిన్న కూతురు తేజస్వి రెండు రోజుల క్రితం నూతన గృహ ప్రవేశం చేశారు. స్రవంతి కూతురు పుట్టిన రోజు ఉండటంతో శనివారం విఘ్నేష్, రమాదేవి, తేజస్వి, ఆమె భర్త కిరణ్ కుమార్, ఇద్దరూ పిల్లలు కారులో స్రవంతి ఇంటికి బయలుదేరారు. చికాగో సమీపంలో వీరి కారును ట్రక్కు ఢీ కొనడంతో రమాదేవి(52), తేజస్వి (32) మరణించారు. కారులో ఉన్న విఘ్నేష్, అల్లుడు కిరణ్ కుమార్, పిల్లలు గాయపడ్డారు. -
● నత్తనడకన కొరటా– చనాఖ బ్యారేజ్ ● ఇంకా పూర్తి కాని డిస్ట్రిబ్యూటరీలు ● తొమ్మిదేళ్లుగా సా..గుతున్న పనులు ● పాలకుల తీరుపై సర్వత్రా విమర్శలు
సాత్నాల: ఆదిలాబాద్ జిల్లాలో దిగువ పెన్గంగపై నిర్మిస్తున్న కొరటా– చనాఖ బ్యారేజ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరంభించిన ఈ ప్రాజెక్టు మూడేళ్లలోనే పూర్తి కావాల్సి ఉంది. తొమ్మిదేళ్లవుతున్నా ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. బ్యారేజ్ పూర్తయినా ఇంకా కాలువల పనులు మాత్రం పూర్తి కాలేదు. పెన్గంగ పరీవాహక ప్రాంతాల్లో వృథా అవుతున్న వరద నీటిని నిల్వ చేసి రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు రాజకీయ హామీలకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాలకుల నిర్లక్ష్యం, సాంకేతిక లోపాలు, అసంపూర్తి కాలువల కారణంగా జాప్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదీ పరిస్థితి.. పెన్గంగ పరీవాహక ప్రాంతాల్లో వరద ప్రవాహంతో వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2016లో ఈ బ్యారేజ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు రూ.1200 కోట్లు ఖర్చయినట్లు అధికారులు చెబుతున్నారు. మరో రూ.800 కోట్లు అవసరం ఉందని పేర్కొంటున్నారు. ఇందులో భూసేకరణ, డిస్ట్రిబ్యూటరీలు, పంప్హౌస్ నిర్మాణాలకు నిధులు అవసరం ఉంటాయని అంటున్నారు. ప్రధాన కాలువల నిర్మాణం పూర్తయినప్పటికీ డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. పిప్పల్కోటి నుంచి భీంపూర్ వరకు 14 గ్రామాల్లో, హత్తిఘాట్ నుంచి బేల వరకు కాలువల నిర్మాణానికి సైతం భూ సేకరణ చేపట్టాల్సి ఉంది. ఇందుకు గాను రైతులకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. కాగా కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో పనులు నిలిచిపోయినట్లు పేర్కొంటున్నా రు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పనులు త్వరి తగతిన పూర్తిచేసి బ్యారేజ్ను అందుబాటులోకి తీ సుకురావాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. -
సంస్కృతిని భావితరాలకు అందించాలి
ఇంద్రవెల్లి: ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని ఎస్పీ అఖిల్ మహా జన్ అన్నారు. మండలంలోని గౌరాపూర్లో శుక్రవారం ఘనంగా దండారీ ఉత్సవాలు నిర్వహించారు. ఏఎస్పీ కాజల్సింగ్తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామస్తులు సంప్రదాయ వాయిద్యాలు, గుస్సాడి నృత్యాలతో వారికి స్వా గతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దీపావళి పండుగ సందర్భంగా ఆదివాసీలు దండారీ ఉత్సవాలు నిర్వహించుకో వడం ఆనవా యితీ అని అన్నారు. పండుగను ప్రతి ఒక్కరూ ప్ర శాంత వాతావరణంలో నిర్వహించుకో వాలన్నారు. ఉట్నూర్ సీఐ మడావి ప్రసాద్, ఎస్సై సాయన్న, గ్రామ పెద్దలు మడావి మారుతి పటేల్, భూమేశ్, బొజ్జు, సోము, అంకూస్, తదితరులున్నారు. మన్కాపూర్లో..గుడిహత్నూర్: మండలంలోని మన్కాపూర్ గ్రా మంలో శుక్రవారం నిర్వహించిన దండారీ ఉత్సవా ల్లో ఎస్పీ హాజరై మాట్లాడారు. గ్రామ పటేళ్ల ఆధ్వర్యంలో పండుగ నిర్వహించడం, ఒక గ్రామానికి మరో గ్రామం ఆతిథ్యం ఇవ్వడం అనేది ఒకరికి ఒక రు ప్రేమను పంచుకోవడమే అన్నారు. ఇందులో ఏఎస్పీ కాజల్సింగ్, సీఐ బండారి రాజు, ఎస్సై శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
‘సాక్షి’పై కేసులు అప్రజాస్వామికం
అక్షర సత్యాలను ప్రజల ముందు ఉంచుతున్న ‘సాక్షి’పై కక్ష గట్టి కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికమని పలు వర్గాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. జిల్లాలోని పలువురు జర్నలిస్టులు, విద్యార్థి సంఘ నాయకులు, న్యాయవాదులు తమ అభిప్రాయాలను వెల్లడించారు ఇలా.. – ఆదిలాబాద్టౌన్/కై లాస్నగర్ఏపీ ప్రభుత్వ తీరును ఖండిస్తున్నాం..ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసేలా అ క్కడి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సాక్షి ఎడిటర్ ధనంజయ్ను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. ఈ చర్యను ఖండిస్తున్నాం. అలాగే సాక్షి జర్నలిస్టులపై కేసులు అప్రజాస్వామికం. అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి. – సూది నరేష్, బోథ్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు కేసుల నమోదు సరికాదురాజకీయ నాయకులు మాట్లాడిన మాటలను ప్రజల్లో తీసుకెళ్తే జర్నలి స్టులపై కేసులు పెట్ట డం సరికాదు. సాక్షి ఎడిటర్పై ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఖండించాలి. అవసరమైతే న్యాయపరంగా ముందుకెళ్లాలి. కానీ దాడులకు పాల్పడడం అప్రజాస్వామికం. అక్రమ కేసులు పెట్టడం సమంజసం కాదు. – షేక్ మోయిజ్, టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే..పత్రికలు ప్రజాస్వామ్యానికి మూలస్తంభం లాంటివి. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారనే కక్షతో సాక్షి దినపత్రికపై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడం సరికాదు. అక్రమ కేసులతో జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేయడం అప్రజాస్వామికం. ఇది భావప్రకటన స్వేచ్ఛను హరించడమే. – గెడం కేశవ్, ఏఐఎస్ఎఫ్, జిల్లా కార్యదర్శి ప్రజాస్వామికవాదులు స్పందించాలిప్రశ్నించే గొంతుకలపై ముఖ్యంగా ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయ్రెడ్డిపై ఏపీ పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయ డం దుర్మార్గం. ఇది మీడి యా స్వేచ్ఛను హరించడమే. ఇది ఒక ‘సాక్షి’ పత్రిక సమస్య కాదు. పాత్రికేయులు, ప్రజాస్వామికవాదులంతా స్పందించాల్సిన అవసరం ఉంది. – బొల్లారం సుధీర్, న్యాయవాది పత్రికల గొంతు నొక్కడం సరికాదు..సాక్షి ఎడిటర్ ధనంజయ్ రెడ్డిపై ఏపీ పోలీ సులు దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేయడం సరి కాదు. సమాజంలో జరుగుతున్న అంశాలను బయటకు తీసే స్వేచ్ఛ పత్రికలకు ఉంటుంది. దాన్ని తప్పుబడుతూ ఏపీ ప్రభుత్వం పోలీసులతో సాక్షి కార్యాలయాలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య. పత్రికల గొంతు నొక్కే తీరును మార్చుకోవాలి. – సామ రూపేశ్రెడ్డి, కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు మీడియాపై దాడి సరికాదుప్రభుత్వం అవలంభిస్తు న్న అసంబద్ధ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే స్వేచ్ఛ పత్రికలకు ఉంటుంది. తమకు వ్యతి రేకంగా వార్తలు వస్తున్నాయనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం కక్ష కట్టి సాక్షిపై పోలీసులతో దాడులు చేయించడం విచారకరం. మీడియాపై దాడులు ప్రజాస్వామ్యంలో సరికాదు. ఏపీ ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలి. – బాలశంకర్ కృష్ణ, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు -
మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు
ఆదిలాబాద్టౌన్: మద్యం షాపుల దరఖాస్తు ప్రక్రి య కొనసాగుతుంది. ఇందులో భాగంగా శుక్రవారం 221 టెండర్లు దాఖలయ్యాయి. ఇందులో ఆదిలాబాద్ స్టేషన్ పరిధిలో 122, ఇచ్చోడ స్టేషన్ పరిధిలో 60, ఉట్నూర్ స్టేషన్ పరిధిలో 39 వచ్చి నట్లు జిల్లా ఎకై ్సజ్ అధికారి హిమశ్రీ, ఆది లాబాద్ ఎకై ్సజ్ సీఐ విజేందర్ తెలిపారు. ఇప్పటివరకు ఆదిలాబాద్ స్టేషన్ పరిధిలో 216, ఇచ్చోడ స్టేషన్ పరిధిలో 99, ఉట్నూర్ స్టేషన్ పరిధిలో 75 కలిపి మొత్తం 391 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. కాగా శనివారంతో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఈనెల 23న లక్కీడ్రా ద్వారా ఎంపిక ప్రక్రి య నిర్వహించనున్నానరు. షాపులు దక్కించుకున్న వారు డిసెంబర్ 1 నుంచి కొత్త వైన్స్షాపులను ప్రారంభించనున్నారు. -
చదువు సాగేదెలా..!
ఆదిలాబాద్టౌన్: సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు సరఫరా చేయాల్సిన పార్ట్–2 పాఠ్య పుస్తకాలు ఇంకా గోదాముల్లోనే నిల్వ ఉన్నాయి. పార్ట్–1 పుస్తకాల సిలబస్ సెప్టెంబర్లో పూర్తయింది. అక్టోబర్ నుంచి పార్ట్–2 సిలబస్ బోధించాల్సి ఉంటుంది. సెప్టెంబర్కు ముందే సంబంధిత పాఠశాలలకు ఆయా పాఠ్య పుస్తకాలను సరఫరా చేయాల్సి ఉండగా, జాప్యం జరిగింది. ట్రాన్స్పోర్ట్ చార్జీలు లేకపోవడంతో పాఠ్య పుస్తకాలు జిల్లా కేంద్రంలోని గోదాములకే పరిమితం అయ్యాయి. ఈనెల 24 నుంచి సమ్మెటీవ్ అసిస్మెంట్ (ఎస్ఏ–1)పరీక్షలు జరగనున్నాయి. ఇందులో పార్ట్–2కు సంబంధించిన సిలబస్ ఉంటుంది. కాగా, పాఠ్యపుస్తకాల సరఫరాలో జాప్యం కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు తప్పేటట్లు కనిపించడం లేదు. గోదాముల్లోనే నిల్వ.. జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలను సరఫరా చేస్తోంది. ఇదివరకు ఒకేసారి పాఠ్య పుస్తకాలను బడులకు సరఫరా చేసేది. అయితే బైలింగ్వల్ (తెలుగు, ఆంగ్ల భాష)లో పుస్తకాలను ప్రచురిస్తున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేయడంతో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ప్రచురిస్తున్న విషయం తెలిసిందే. జూన్లో పార్ట్–1కు సంబంధించి 4లక్షల 83వేల 110 పాఠ్య పుస్తకాలను బడులకు సరఫరా చేశారు. పార్ట్–2కు సంబంధించి తెలుగు, ఉర్దూ మీడియం విద్యార్థులకు 1లక్ష 36వేల 610 పాఠ్య పుస్తకాలను సరఫరా చేయాల్సి ఉంది. గత జూలై నుంచి ఈనెల 15వరకు జిల్లా కేంద్రంలోని పాఠ్య పుస్తకాల గోదాంకు పుస్తకాలు చేరుకున్నాయి. వీటిని సంబంధిత పాఠశాలలకు పంపించాల్సి ఉంది. 2 నుంచి 5వ తరగతి విద్యార్థులకు గణితం, ఈవీఎస్, 6,7 తరగతి విద్యార్థులకు గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రం, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గణితం, భౌతిక, జీవ, సాంఘిక శాస్త్రాల పుస్తకాలు పంపిణీ జరగాల్సి ఉంది. నిధుల లేమితో ఇబ్బందులు.. పాఠ్య పుస్తకాలను సంబంధిత మండలాలకు సరఫరా చేసేందుకు ట్రాన్స్పోర్ట్ చార్జీలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సమగ్ర శిక్ష నుంచి రూ.3లక్షలు మంజూరు చేశారు. అయితే ఇవి కాగితాలకే పరిమితం అయ్యాయి. మొదటి విడతలో కలెక్టర్ ఆదేశాల మేరకు డీసీఈబీ ద్వారా రూ.లక్ష 50వేలు విడుదల చేయించారు. మరో రూ.1లక్ష 20వేలు పాఠ్య పుస్తకాల మేనేజర్ తన సొంత ఖర్చుతో సరఫరా చేశారు. ప్రస్తుతం రెండో విడత సరఫరాకు నిధులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆదిలాబాద్ అర్బన్, రూరల్, మావల మండలాలకు సంబంధించిన ఉపాధ్యాయులు గోదాంకు వచ్చి పాఠ్య పుస్తకాలను తీసుకెళ్తున్నారు. దూర మండలాలకు సంబంధించి ఇబ్బందులు తప్పడం లేదు. ఈ విషయమై జిల్లా విద్యాశాఖ ఏడీ వేణుగోపాల్ గౌడ్ను వివరణ కోరగా.. రూ.3లక్షల నిధులు మంజూరైనప్పటికీ విడుదల కాలేదు. సంబంధిత మండలాల ఎంఈవోలు పాఠ్య పుస్తకాలను గోదాముల నుంచి తీసుకెళ్లాలని సూచించాం. నిధులు వచ్చిన తర్వాత వారికి చెల్లిస్తాం. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతాం.జిల్లాలో.. డీఈవో పరిధిలోని పాఠశాలలు 739 విద్యార్థుల సంఖ్య 65,000 పంపిణీ చేసిన పార్ట్–1 పుస్తకాలు 4,83,110 జిల్లాకు చేరుకున్న పార్ట్–2 పుస్తకాలు 1,36,610 -
డీసీసీ అధ్యక్ష ఎంపికకు అభిప్రాయ సేకరణ
కైలాస్నగర్: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి (డీసీసీ) ఎంపికపై మరోసారి అభిప్రాయ సేకరణ జరి గింది. ఏఐసీసీ పరిశీలకుడు, కర్ణాటక రాష్ట్ర జేవర్గి ఎమ్మెల్యే అజయ్ సింగ్ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రెండోసారి విచ్చేశారు. పట్టణంలో ని గాయత్రి గార్డెన్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. డీసీసీ నియామకంపై తొలుత నాయకులందరితో మాట్లాడారు. అనంత రం దరఖాస్తు చేసుకున్న ఆశావహులతో పాటు పార్టీ శ్రేణులతో విడివిడిగా సమావేశమై అభిప్రాయాలు స్వీకరించారు. పార్టీ పరంగా, రాజకీయంగా పదవులు కలిగిన బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ ముఖ్య నాయకులతోపాటు మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్ల నుంచి సామాజిక వర్గాల వారీగా అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందని దానిపై విడివిడిగా అభిప్రాయాలు స్వీకరించారు. జనరల్ అయితే ఎవరు.. ఎస్టీ అయితే ఎవరు.. బీసీ అయితే ఎవరు.. అనే దానిపై పార్టీ శ్రేణులు ఇచ్చిన అభిప్రాయాల ఆధారంగా నివేదిక సిద్ధం చేసి అధిష్టానానికి పంపనట్లు సమాచారం. అయితే ఈ ప్రక్రియ రహస్యంగా నిర్వహించారు. మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గోప్యత పాటించారు. కాగా ఈ సమావేశంలో డీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లుగా సమాచారం. ఇది గమనించిన పరిశీలకులు బయటకు వచ్చి ఇరువురికి సర్దిచెప్పడంతో వివాదం సద్దుమనిగింది. -
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
నార్నూర్: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆర్థిక స్వావలంబన సాధించాలని కలెక్టర్ రాజ ర్షిషా అన్నారు. మండలంలోని అంబేద్కర్ భ వన్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన వెదురుబొంగుల కటింగ్ యంత్రాల ను శుక్రవారం ఆయన పరిశీలించారు. వెదురు వస్తువులను మార్కెటింగ్ చేసే విధానం అడిగి తెలుసుకున్నారు. మహిళలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. అనంతరం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. తాగునీటి పైపులైన్ పగిలిపోయి ఉండడంపై హెచ్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారికి పలు అంశాలను బోధించారు. అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. టెలీమెడిసన్ కేంద్రాన్ని పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఇంగ్లీష్ ఫౌండేషన్ లర్నింగ్ ప్రోగ్రాంపై సమీక్ష నిర్వహించారు. ఇందులో డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్, జెడ్పీ సీఈవోరాథోడ్ రవీందర్, ఏంఈవో పవార్ అనిత, ఎంపీడీవో గంగాసింగ్, తహసీల్దార్ రాజలింగు, ఎంపీవో సాయిప్రసాద్, పీఆర్ డీఈ లింగన్న, ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ శ్రీనివాస్ తదితరులున్నారు. నార్నూర్ పంచాయతీని దత్తత తీసుకోవాలని వినతి నార్నూర్ గ్రామ పంచాయతీని దత్తత తీసుకు ని అభివృద్ధి చేయాలని మండల పర్యటనకు వ చ్చిన కలెక్టర్కు గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు. ఇందులో మాజీ సర్పంచ్ గజానంద్నాయక్, పీఏసీఎస్ చైర్మన్ సురేశ్, మహేందర్, బీజేపీ, కాంగ్రెస్ మండలాధ్యక్షులు భిక్షపతి, దేవురావు, తదితరులున్నారు. -
అసెంబ్లీలో నాలుగుసార్లు ప్రస్తావించా..
కొరటా–చనాఖ బ్యారే జీ అంశాన్ని గతంలో నాలుగు సార్లు అసెంబ్లీలో ప్రస్తావించాను. స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి నిధులు కేటాయించాలని కోరాను. ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేసినా కలెక్టర్ ఖాతాలో నుంచి ల్యాప్స్ అవుతున్నా యి. రైతులకు త్వరితగతిన సాగునీరు అందేలా తగు చర్యలు చేపట్టాలి. – పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఏళ్లు గడుస్తున్నాయి..బ్యారేజ్ పనులు ప్రా రంభించి ఏళ్లు గడుస్తు న్నా పనులు మాత్రం ఇంకా పూర్తి కావడం లేదు. ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఇ ప్పటికై నా ప్రభుత్వం వెంటనే స్పందించి బ్యా రేజ్ నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించాలి. – గంధం సురేశ్, రైతు, మాండగడ నిధులు కేటాయించాలి..బ్యారేజ్ నిర్మాణం పూ ర్తయ్యేలా నిధులు కేటా యించాలి. పెన్గంగ పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా మా పంటలు ముంపునకు గురవుతున్నాయి. పనులు పూర్తయితే ముంపు ప్రభావం తగ్గుతుంది. అలాగే యా సంగికి సాగునీరు అంది మేలు జరుగుతుంది. – సంతోష్, రైతు, డొలార ఇటీవల రూ.40 కోట్లు విడుదలబ్యారేజీ కెనాల్, డిస్ట్రిబ్యూటరీ పనులు నిధుల లేమి కారణంగా ప్రస్తుతం నిలిచిపోయాయి. ఇటీవల ప్రభుత్వం రూ.40 కోట్ల నిధులను విడుదల చేసింది. వీటితో త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. – ప్రభు,ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
కై లాస్నగర్: జిల్లా కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి సారించాల ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి ఎస్.రాజేశ్వర్ ఆదేశించారు. ము న్సిపల్ కార్యాలయంలోని తన చాంబర్లో మున్సి పల్ అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించా రు. పట్టణంలోని కేఆర్కే కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీపై ఆరా తీశారు. లబ్ధి దారులను ఎంపిక చేసి జాబితాను రెవెన్యూ శాఖకు అందజేశామని కమిషనర్ తెలిపారు. అయితే మౌలిక సౌకర్యాలు లేనందున వాటి పంపిణీ నిలిచిపోయిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల కోసం అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలన్నారు. ఇంటి నిర్మాణ అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నా రు. ఆక్రమణలపై వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సీవీ ఎన్. రాజు, మున్సిపల్ ఇంజినీర్ పేరిరాజు, డీఈ ఎం.కార్తీక్, శానిటరీ ఇన్స్పెక్టర్ బైరి శంకర్, టీపీవో సుమలత , పర్యావరణ ఇంజినీర్ చౌహాన్ అవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు చోట్ల ఇద్దరికి పాము కాటు
బేల: మండలంలోని సిర్సన్న, జూనోని రెవెన్యూ గ్రామ శివారుల్లోని పొలాల్లో గురువారం ఇద్దరు రైతులు పాముకాటుకు గురయ్యారు. సిర్సన్న గ్రా మ శివారులోని పొలంలో పనిచేస్తున్న బబన్కు, జూనోని గ్రామ శివారులోని పొలంలో పనిచేస్తున్న వైశాలిని వేర్వేరుగా పాములు కాటేశాయి. గమినించిన స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో ఈఎంటీ అనిల్, పైలెట్ అర్షద్ఖాన్ బాధితులకు ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలో ని రిమ్స్కు తరలించారు. వైశాలికి చికిత్స చేస్తున్న ఈఎంటీ అనిల్ -
పశువైద్య శిబిరం పరిశీలన
ఇచ్చోడ: మండలంలోని గుబ్బ గ్రామంలో గు రువారం నిర్వహించిన పశువైద్య శిబిరాన్ని జి ల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రామారావు పరి శీలించారు. ఉచిత గాలికుంటు నివారణ టీకా ల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాల ని సూచించారు. పశువైద్య శిబిరాల్లో పశువులన్నింటికీ తప్పనిసరిగా గాలికుంటు నివారణ టీ కాలు వేయించాలని, ఆధార్ చెవి పోగు కూడా వేయించాలని పేర్కొన్నారు. రైతులు పశుపోషణపైనా దృష్టి సారించాలని సూచించారు. అనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న దండారీ వేడుకల్లో పాల్గొన్నారు. మండల పశువైద్యాధికారి గోవింద్నాయక్, సంధ్య ఉన్నారు. -
విద్యుత్ షాక్తో గుర్తు తెలియని వ్యక్తి ..
నేరడిగొండ: మండలంలోని బుద్దికొండ గ్రామ స మీపంలో స్థానిక రైతు నవీన్ రెడ్డికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి (45) విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు ఎస్సై ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. గ్రామస్తులు సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించినట్లు తెలిపారు. మృతుడు తెల్లటి చొక్కా, జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలి పాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. వివరాలు తెలిసిన వారు 8712659947 నంబర్కు సమాచారం అందించాలని కోరారు. -
ఉద్యోగ వేట ఇక సులభతరం
బోథ్: డిజిటల్ యుగంలో నిరుద్యోగులకు ఉ ద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతికతతో కూడిన ‘డీట్’ (డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎకేస్ఛ్ంజ్ ఆఫ్ తెలంగాణ) యాప్ను అందుబాటులోకి తెచ్చింది. నిరుద్యోగులు, ప్రైవేటు రంగ సంస్థల మధ్య ప్రత్యక్ష వారధిగా ఈ యాప్ పనిచేయనుంది. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పర్యవేక్షణ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ను రూపొందించారు. విద్యా సంస్థలు, ప్ర భుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థల సమన్వయంతో ఇది పర్యవేక్షించబడుతుంది. తద్వారా, అ భ్యర్థులు తమ అర్హతలకు తగిన ప్రైవేటు రంగ ఉద్యోగ అవకాశాలను సులభంగా పొందేందు కు మార్గం సుగమం అవుతుంది. పరిశ్రమలు, నిరుద్యోగులు ఈ యాప్లో నమోదు చేసుకుంటే కంపెనీలు తమకు అవసరమైన, స్కిల్ ఉన్న వారికి సందేశాన్ని పంపిస్తారు. వందల కంపె నీలన్నీ ఒకే చోట ఉండటంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉటుంది. అర్హతలు, నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగాలు డీట్ యాప్ ద్వారా పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, ఆపై చదివిన అభ్యర్థులు ప్రయోజనం పొందవచ్చు. వారి విద్యార్హత, నైపుణ్యాలు, అనుభవం ఆధారంగా కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. డిగ్రీ చదువుతున్న అభ్యర్థులకు కూడా నమోదు చేసుకునే అవకాశం కల్పించడం అదనపు విశేషం. ఫార్మా, ఇండస్ట్రియల్, బీపీవో, కస్టమర్ ఎగ్జిక్యూటివ్ సపోర్ట్, బిజినెస్ డెవలప్మెంట్, సేల్స్ ఎగ్జిక్యూటివ్తో పాటు అనేక ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ● నిరుద్యోగులు, ఉద్యోగాలు కల్పించే ఔత్సాహిక కంపెనీలు ఈ యాప్లో నమోదు చేసుకోవచ్చు. ● కంపెనీ నిర్వాహకులు, యాప్లో నమోదైన అభ్యర్థుల విద్య, నైపుణ్య వివరాలను పరిశీలించి, నేరుగా వారిని సంప్రదిస్తారు. ● కంపెనీల నియమావళిని బట్టి రాత లేదా మౌఖిక పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు. ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయానికి ఇందులో అవకాశం ఉండదు. నమోదు విధానం ● నిరుద్యోగులు తమ పూర్తి వివరాలను డీట్ యాప్లో లేదా అధికారిక వెబ్సైట్ www. deet.telangana.gov.in లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ● ఫోన్ నంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా యాప్ను తెరవాలి. ● విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యాలు, అనుభవం, ఇంటర్న్షిప్ల వివరాలు నమోదు చేయాలి. ● పార్ట్టైమ్, ఫుల్టైమ్, అప్రెంటిస్షిప్లలో దేని కోసం అన్వేషిస్తున్నారో, ఏ రంగంలో ఉద్యోగం కావాలో స్పష్టం చేయాలి. ● విద్యార్హత పత్రాలను యాప్లో అప్లోడ్ చేయడంతో నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. -
గుండాల అటవీప్రాంతంలో దాడులు
ఇచ్చోడ: ‘అడవి తల్లి కన్నీరు’ శీర్షికన ఈ నెల 14న ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అటవీ అధికారులు స్పందించారు. ఇన్చార్జి డీఎఫ్వో రేవంత్చంద్ర ఆదేశాల మేరకు టాస్స్ఫోర్స్, స్థానిక అటవీశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో గురువారం మండలంలోని గుండాల అటవీప్రాంతలో సోదాలు నిర్వహించా రు. దట్టమైన అటవీప్రాంతంలో టేకు చెట్లను నరి కిన కొందరు స్మగ్లరు వాటిని సైజులుగా మార్చి విక్రయించేందుకు సిద్ధం చేయగా గుర్తించి స్వాఽధీనం చేసుకున్నారు. పట్టుకున్న కలప విలువ రూ.90వేల వరకు ఉంటుంది. కాగా, అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకునే లోపే స్మగ్లర్లు పరారయ్యారు. పట్టుకున్న కలపను ఇచ్చోడ టింబర్ డిపో కు తరలించారు. దాడుల్లో టాస్క్ఫోర్స్ ఎఫ్ఆర్వో శ్రీనివాస్రెడ్డి, డీఆర్వోలు అమర్సింగ్, కవిత, ఎఫ్ బీవోలు సజన్లాల్, భీంజీనాయక్, రాకేశ్, స్వాతి, బేస్క్యాంప్ సిబ్బంది, పోలీసులు ఉన్నారు. -
కడెం ప్రాజెక్ట్ గేటు ఎత్తివేత
కడెం: కడెం ప్రాజెక్ట్కు గురువారం రాత్రి 1000 క్యూసెక్కుల స్వల్ప ఇన్ఫ్లో రావడంతో ఇరిగేషన్ అధికారులు ఒక వరద గేటు ఎత్తి 4,178 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ఫ్లో పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తనున్నట్లు అధికారులు వెల్లడించారు. నిజాయతీ చాటుకున్న సాయితేజలోకేశ్వరం: మండలంలోని పుస్పూర్ గ్రామానికి చెందిన గొడిసెల సాయితేజగౌడ్ దొరికిన బ్యాగును లోకేశ్వరం పోలీసులకు అప్పగించి నిజాయతీ చాటుకున్నాడు. బుధవారం నిజా మాబాద్ నుంచి పుస్పూర్కు బైక్పై వస్తున్న సాయితేజకు నందిపేట్ మండలం పలుగుగుట్ట సమీపంలో ఓ హ్యాండ్బ్యాగు దొరికింది. అందులో సెల్ఫోన్, రెండు గ్రాముల బంగా రం, ఆధార్ కార్డు ఉంది. ఆధార్ ఆధారంగా నందిపేట్ మండల కేంద్రానికి చెందిన ప్రవళికగా గుర్తించి లోకేశ్వరం పోలీసులకు బ్యాగ్ను అప్పగించాడు. సుమారు రూ.40 వేల విలువైన వస్తువులను అప్పగించిన యువకుడిని పోలీసులు అభినందించారు. గురువారం పోలీసులు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించి బ్యాగును అప్పగించారు. డబ్బులు దండుకున్న మధ్యవర్తిపై కేసుఆదిలాబాద్టౌన్: మధ్యవర్తిగా వ్యవహరిస్తూ కోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చేలా చూస్తానని, పెద్దల సమక్షంలో సెటిల్మెంట్ చేస్తానని డబ్బులు వసూలు చేసిన నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కె.నాగరాజు తెలిపారు. హైకోర్టులో జడ్జీలు, న్యాయవాదులు పరిచయం ఉన్నారని నమ్మబలికి బాధితుల నుంచి రూ.3 లక్షల 50వేలు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఖుర్షీద్నగర్కు చెందిన ఫిర్యాదుదారు కుమారుడు, కోడలు మధ్య గొడవలు ఉన్నాయి. మధ్యవర్తిగా పరిచయం ఉన్న జైనూర్ మండలంలోని బూసిమెట్టకు చెందిన జాడే రవీందర్ బాధితులను నమ్మబలికి అందినకాడికి దండుకున్నా డు. తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడు. మొదట రూ.3లక్షలు ఇవ్వగా ఆ త ర్వాత కేసు నమోదు చేయిస్తానని బెదిరించి మ రో రూ.50 వేలు తీసుకున్నాడు. డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడడంతో బాధితురా లు గురువారం ఫిర్యాదు చేయగా కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. 42 కిలోల గంజాయి దహనంఆదిలాబాద్టౌన్: జిల్లాలో నమోదైన 18 కేసుల్లో పట్టుబడిన 42 కిలోల గంజాయిని గంజాయి డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలోని శ్రీ మెడికేర్ సర్వీసెస్ సెంటర్లో గురువారం గంజాయి డిస్పోజల్ చేశారు. ఇందులో 22 కిలోల గంజాయి మొక్కలు, 20 కిలోల ఎండు గంజాయిని దహనం చేశారు. అడిషనల్ ఎస్పీ సు రేందర్ రావు, డీసీఆర్బీ సీఐ హకీమ్ ఈ ప్రక్రియను పరిశీలించారు. -
క్రాప్ బుకింగ్ పూర్తయ్యాకే కొనుగోళ్లు
కైలాస్నగర్: జిల్లాలో డిజిటల్ క్రాప్ బుకింగ్ 85 శా తం పూర్తయిందని, వందశాతం పూర్తయ్యాక రైతు ల సమాచారమంతా కపాస్ కిసాన్ యాప్లోకి వె ళ్లాకే పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తామని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ఈ నెలాఖరుకు పూ ర్తికానుందని తెలిపారు. పత్తి కొనుగోళ్లపై గురువా రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రైతులు, రైతు సంఘాల ప్రతినిఽధులు, వ్యాపారులు, వ్యవసాయ, మార్కెటింగ్, పోలీస్, ఫైర్, లీగల్ మెట్రాలజీ శాఖ ల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తొలుత ఆయా వర్గాల నుంచి అభిప్రాయలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పత్తి కొనుగోళ్లు సజావుగా సాగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. నెట్వర్క్ సమస్య కలిగిన ఆవాస ప్రాంతాలను పెన్షన్ పంపిణీలో తలెత్తిన ఇబ్బందు ల ఆధారంగా గుర్తించి వాటి వివరాలు సేకరించా మని, ఈ ప్రాంతాల్లో ఏఈవోల ద్వారా స్లాట్బుకింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నెట్వర్క్ కలిగిన ప్రాంతాల్లో రైతులకు సహకరిస్తూ స్లాట్ బుకింగ్ చేసేందుకు ఆసక్తి గల యువతను గుర్తించి వారి సెల్ నంబర్లనూ తీసుకున్నామని పేర్కొన్నారు. అక్కడ నెట్వర్క్ ఉంటుందా? లేదా? అనే వివరాలు కూడా సేకరించామని తెలిపారు. యువత, ఏఈవోలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కౌలు రైతులు మాత్రం రిజిస్ట్రేషన్తో పాటు స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. తేమశాతంపై ఇబ్బందులు తలెత్తకుండా కాటన్ పర్చేజింగ్ ఆఫీసర్లు (సీపీవోలు), ఐకేపీ సి బ్బందిని నియమించుకోవాలని సూచించారు. ఆది లాబాద్ వ్యవసాయ మార్కెట్యార్డులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కంట్రోల్ రూంలు ఏర్పా టు చేస్తామని కలెక్టర్ చెప్పారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా షామియానాలు, కుర్చీలు, తాగునీ టి వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. సమస్యలు తలెత్తకుండా తహసీల్దార్, ఎస్హెచ్వో, ఇద్దరు రైతులతో కూడిన ప్రత్యేక పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వారు జిన్నింగ్లు, కొనుగోలు కేంద్రాలను సందర్శించి వసతులు పరిశీలించాలని ఆదేశించారు. అనంతరం కిసాన్ యాప్ ప్ర చార పోస్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రైనీ కలెక్టర్ సలోని, అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జిల్లా గ్రంఽథాలయ సంస్ధ చైర్మన్ నర్సయ్య, మార్కెటింగ్ ఏడీ గజానంద్, ఆర్డీవో స్రవంతి, వ్యవసాయ శాఖ టెక్నికల్ అధికారి కే శివకుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సెక్రటరీలు పాల్గొన్నారు. పోలీస్ పికెటింగ్ ఏర్పాటు ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. మార్కెట్యార్డులో ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక పోలీస్ పికె టింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతీ జిన్నింగ్ మిల్లులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల ని, తహసీల్దార్, సెక్రటరీ, ఎస్హెచ్వో, రైతులతో కూడిన మానిటరింగ్ కమిటీలకు పత్తి కొనుగోళ్లపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. రైతులకు ఎ లాంటి ఇబ్బంది కలిగించవద్దని, కొనుగోళ్లలో ఎ లాంటి అవకతవకలు జరిగినా వెంటనే ఫిర్యాదు చే స్తే తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
హోరాహోరీగా బ్మాడ్మింటన్ పోటీలు
మంచిర్యాలఅర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల క్లబ్లో గురువారం నిర్వహించిన అండర్–14, 17, 19 బాలబాలికల జోనల్స్థాయి ఎంపిక పోటీలు హోరాహోరీగా సాగాయి. బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముఖేష్గౌడ్ పోటీలను ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 120 మంది క్రీడాకారులు పాల్గొనగా ఒక్కో గ్రూపు నుంచి ఐదుగురు చొప్పున 30 మంది ఎంపికయ్యారు. అండర్–14 హైదరాబాద్, అండర్–17 మేడ్చల్, అండర్–19 మహబూబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి యాకూబ్ తెలిపారు. కార్యక్రమంలో అండర్–19 ఎస్జీఎఫ్ కార్యదర్శి బాబురావు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి పులూరి సుధాకర్, జెడ్పీబాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బండి రమేశ్, ఫిజికల్ డైరెక్టర్ రేణి రాజయ్య, కుమురంభీం జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు. -
సర్వేయర్లు వస్తున్నారు
కైలాస్నగర్: లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకాలకు రంగం సిద్ధమవుతోంది. తొలి విడత శిక్షణ పూర్తి చేసుకుని అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కసరత్తు పూర్తి చేయాలని జిల్లా సర్వేల్యాండ్ రికార్డ్స్ అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు జిల్లాకు సంబంధించిన 45మంది లైసె న్స్డ్ సర్వేయర్ల నియామక ప్రక్రియ ప్రారంభించా రు. గురువారం అభ్యర్థుల పాస్పోర్టు సైజ్ ఫొటోలు, ఆధార్కార్డు, ఎస్సెస్సీ మెమోలు స్వీకరించారు. వాటి ఆధారంగా లైసెన్స్ పత్రాలు సిద్ధం చేశారు. ఈ నెల 19న హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా అందించనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 45మంది అర్హులు జిల్లాలో మొదటి విడత శిక్షణ కోసం 155 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి గత మే 26నుంచి జూలై 26వ తేదీ వరకు శిక్షణ ఇచ్చారు. జేఎన్టీయూ ఆధ్వర్యంలో రాత, ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించా రు. తొలి విడత పరీక్షలో నలుగురే ఉత్తీర్ణత సాధించగా, సప్లిమెంటరీ పరీక్షల్లో మరో 41మంది పాసయ్యారు. వీరికి 40రోజుల పాటు మండల సర్వేయ ర్ల కింద అప్రెంటిస్షిప్ ఇచ్చారు. ఈ శిక్షణ పూర్తి కా గా గత నెల 27న వీరికి అసెస్మెంట్ పరీక్ష నిర్వహించారు. ఇందులోనూ ఉత్తీర్ణత సాధించిన వారికి సర్వేయర్ లైసెన్స్లు అందించాలని నిర్ణయించారు. జీపీవోల తరహాలో వీరిని కూడా రెవెన్యూ క్లస్టర్ల వారీగా నియమించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో సీఎం చేతుల మీదుగా..ఆ శాఖ రాష్ట్ర కమిషనర్ నుంచి వచ్చిన ప్రొఫార్మా ప్రకారం అభ్యర్థుల వివరాలతో కూడిన లైసెన్స్లు రూపొందించారు. అభ్యర్థులను హైదరాబాద్కు తీసుకెళ్లి సీఎం చేతుల మీదుగా పత్రాలు అందించనున్నట్లు జిల్లా సర్వేల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాజేందర్ తెలిపారు. వీరి నియామకం ద్వారా జిల్లాలో సర్వేయర్ల కొరత తగ్గి భూముల కొలతల ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశముంటుందని పేర్కొన్నారు. -
వివాహిత ఆత్మహత్య
బాసర: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. సీఐ సాయికుమార్ తెలిపిన వివరాల మేరకు మహారాష్ట్రలోని హజిని గ్రామానికి చెందిన మాధవి (23)కి బాసర మండలంలోని దౌడాపూర్ గ్రామానికి చెందిన కర్మానే మనోజ్తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం వారికి ఇద్దరు పిల్లలు సంతానం. కొంతకాలంగా మనోజ్ మద్యం సేవించి ఇంటికి వచ్చి అదనపు కట్నం తేవాలని మా ధవిని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేసేవా డు. దీంతో మనస్తాపానికి గు రైన మహిళ బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులతో నే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురా లి తండ్రి రాంచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. -
లక్ష్మీదేవర ఆలయంలో చోరీ
భీమారం: మండల కేంద్రంలోని లక్ష్మీదేవర ఆలయంలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. ముది రాజ్ సంఘం పెద్దలు తెలిపిన వివరాలు ఇలా ఉ న్నాయి.. సమీపంలోని పత్తి చేను మీదుగావచ్చిన దుండగులు మొదట ఆలయం తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. హుండీలో ఉన్న 4 కిలో ల 500గ్రాములు వెండి, రూ. 36 వేల నగదు, అ మ్మవారిపై ఉన్న రెండు తులాల బంగారు అభరణా లను ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నారు. ఆలయంలో ఇంత పెద్దఎ త్తున వెండి ఉందన్న సమాచారం దొంగలకు ఎలా చేరిందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మందు పార్టీ చేసుకుని దోపిడీ చోరీకి పాల్పడిన దొంగలు మొదట సమీపంలోని పత్తి చేనులో మందు పార్టీ చేసుకున్నట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పథకం ప్రకారం మొదట ఆలయ పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆలయం ఎదుటే నివాస గృహాలు ఉన్నప్పటికీ దుండగులు దోచుకుని యథేచ్ఛగా వెళ్లి పోవడం వెనుక స్థానికులు ఎవరైనా వారికి సహకరించారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 500 మీటర్ల దూరంలోనే పోలీస్స్టేషన్ పోలీస్స్టేషన్కు కేవలం 500 మీటర్ల దూరంలోనే చోరీ, జాతీయ రహదారికి సమీపంలోనే చోరీ జరగడం మండలంలో సంచలనంగా మారింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ సంఘటన స్థలాన్ని శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ గురువారం సందర్శించి స్థానికులను అడిగి వివరా లు తెలుసుకున్నారు. డాగ్స్వ్వాడ్తో పరిసరాలు గా లించగా అది పత్తిచేనులోకి వెళ్లి ఆగిపోయింది. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. -
భార్యను కడతేర్చిన భర్త
గుడిహత్నూర్: మద్యం తాగొద్దని మందలించిన భార్యను గొడ్డలితో నరికి చంపిన సంఘటన మండలంలో సంచలనం సృష్టించింది. పోలీసులు తెలి పిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సీతాగోంది గ్రామానికి చెందిన సిడాం సంతోష్, లక్ష్మీబాయి (35) దంపతులు కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. సంతోష్ మద్యానికి బానిసై తరచూ ఇంట్లో భార్యతో గొడవపడేవా డు. గురువారం ఉదయం సైతం మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. తాగి మోటార్ సైకిల్ నడుపొద్దని లక్ష్మీబాయి మందలించింది. మద్యం మత్తులో ఉన్న సంతోష్ కోపంతో ఇంట్లో ఉన్న గొడ్డలితో ఆమె చెంప భాగంలో బలంగా కొట్టడంతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. నేరుగా పోలీస్స్టేషన్కు వెళ్లి తన భార్యను హత్య చేశానని పోలీసులకు లొంగిపోయాడు. సీఐ బండారి రాజు, ఎస్సై శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించనున్నట్లు తెలిపారు. -
పశువులను తరలిస్తున్న లారీ పట్టివేత
బోథ్: మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి హైదరాబాద్కు పశువులను తరలిస్తున్న లారీని గురువారం సోనాల మండలంలోని ఘన్పూర్ చెక్పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు పోలీసులు ఘన్పూర్ చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పదంగా ఉన్న లారీని ఆపి పరిశీలించగా అందులో పశువులు కనిపించాయి. లారీలో 26 పశువులు ఉండగా రెండు మృతి చెంది ఉన్నాయి. వాహనాన్ని స్థానిక పోలీస్స్టేషన్కు తరలించి డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పట్టుకున్న పశువులను బజార్హత్నూర్లోని గోశాలకు తరలించినట్లు ఎస్సై శ్రీసాయి పేర్కొన్నారు. లారీ ఓనర్తో పాటు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
గెలిచిన సంఘాలు విఫలం
శ్రీరాంపూర్: కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో గెలిచిన సంఘాలు విఫలమయ్యాయని సీఐటీయూ కేంద్ర కమిటీ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. గురువారం ఆర్కే 7 గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్లో మాట్లాడారు. సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించడం లేదని, ఇన్వాలిడేషన్ అయిన వారి స్థానంలో డిపెండెంట్లకు కారుణ్య ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. కార్మికుల సమస్యలపై కొట్లాడటానికి వేదికలైన స్ట్రక్చర్ సమావేశాలు బహిష్కరించి ఇక్కడ గనులపై మెమోరాండాలు ఇస్తూ కార్మికులను ఆయోమయానికి గురి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆ యూని యన్ బ్రాంచి అధ్యక్షుడు గుల్ల బాలాజీ, రాష్ట్ర కమిటీ సభ్యుడు కస్తూరి చంద్రశేఖర్, నాయకులు వెంగళ కుమారస్వామి, వెంకట్రెడ్డి, సమ్మయ్య, ప్రవీణ్, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు. -
పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
లక్ష్మణచాంద: పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఒడ్డెపెల్లి గ్రామానికి చెందిన పల్లపు బుచ్చన్న (52) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురై ఈ నెల 13న గుర్తుతెలియని పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఆదివాసీలు అన్ని రంగాల్లో రాణించాలి
భీంపూర్: ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలోని భగవాన్పూర్ గ్రామంలో బుధవారం దండారీ ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీకి గ్రామస్తులు సంప్రదాయ డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గుస్సాడీ వేషధారణతో ఎస్పీ నృత్యం చేస్తూ సందడి చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆదివాసీలు తమ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలన్నారు. అలాగే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి, జైనథ్ సీఐ శ్రావణ్, ఎస్సై విక్రమ్, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. -
సీపీఆర్తో ప్రాణాలు కాపాడవచ్చు
ఆదిలాబాద్టౌన్: సరైన సమయంలో సీపీఆర్ చేసినట్లైతే హార్ట్ఎటాక్ వచ్చిన వారి ప్రాణాలను కాపాడవచ్చని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్, ప్రభుత్వ డైట్ కళాశాల, రిమ్స్ ఆసుపత్రిలో సీపీఆర్పై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గుండెపోటు వచ్చిన పది మందిలో ఒకరు మాత్రమే ఆసుపత్రికి వెళ్తున్న క్రమంలో బతుకుతున్నారన్నారు. వారికి సరైన సమయంలో సీపీఆర్ అందించినట్లయితే సగం మందిని కాపాడవచ్చన్నారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంవో శ్రీధర్, రిమ్స్ వైద్యులు నరేందర్ , డైట్ కళాశాల ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ అనిత తదితరులు పాల్గొన్నారు. -
బీఏఎస్ విద్యార్థులను అనుమతించండి
కైలాస్నగర్: బెస్ట్ అవేలబుల్ స్కూల్ (బీఏఎస్) విద్యార్థులను తక్షణమే పాఠశాలల్లోకి అనుమతించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీఏఎస్కు సంబంధించిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఏడు పాఠశాలల్లో 1,123 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఈ పథకం కింద చదువుతున్నారని అన్నారు. సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, విద్యార్ధులను, తల్లిదండ్రులను మాత్రం ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. కాగా, తమకు మూడేళ్లుగా బకాయిలు రావడం లేదని, దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ప్రైవేట్ యజమానులు పేర్కొన్నారు. ప్రభుత్వం త్వరలోనే 40 శాతం బకాయిలు విడుదల చేయనుందని, మిగతాది మార్చిలోగా అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందుకు యాజమాన్యాలు అంగీకరించి విద్యార్థులను పాఠశాలలకు అనుమతిస్తామని పేర్కొన్నారు. ఇందులో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ట్రెయినీ కలెక్టర్ సలోని, డీఎస్సీడీవో సునీతాకుమారి, గిరిజన సంక్షేమాధికారి అంబాజీ, ఎంఈవోలు తదితరులు పాల్గొన్నారు. కేంద్రీయ విద్యాలయం సందర్శన.. ఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయంలో బుధవారం నిర్వహించిన విద్యాలయ మేనేజ్మెంట్ కమిటీ సమావేశానికి కలెక్టర్ రాజర్షి షా అతిథిగా హాజరయ్యారు. విద్యాలయ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కమిటీ సభ్యులతో చర్చించారు. ప్రిన్సిపాల్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి సన్నద్ధత, సమస్యలపై ఆరా తీశారు. ఉన్నతంగా రాణించేలా శ్రద్ధ వహించాలని సూచనలు చేశారు. సమావేశంలో కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బార్బర్ ఇంటికి వెళ్లిన జిల్లా పాలనాధికారి.. పట్టణంలోని భుక్తాపూర్కు చెందిన లింగంపల్లి నర్సిములు–శ్రావణిల దంపతుల కుమారుడి నామకరణ కార్యక్రమం వాటి ఇంట్లో బుధవారం జరిగింది. ఆ కుటుంబీకుల ఆహ్వానం మేరకు కలెక్టర్ రాజ ర్షి షా వారి ఇంటికి వెళ్లి అతిథ్యాన్ని స్వీకరించారు. చిన్నారిని ఆశీర్వదించారు. కాగా నర్సిములు కలెక్టర్కు క్షవరం చేస్తుంటారు. కలెక్టర్ తమ ఇంటికి రావడంతో కుటుంబీకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వరిధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్ కైలాస్నగర్: వరిధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు బుధవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చే యాలని, ఏ–గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు రూ. 2,389, సాధారణ రకానికి రూ. 2,369 చొ ప్పున కనీస మద్దతు ధర చెల్లించనున్నట్లుగా తెలిపారు. అలాగే సన్న రకానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.500 చొప్పున బోనస్ అందించనుందని పేర్కొన్నారు. సమావేశంలో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని, డీఏవో శ్రీధర్స్వామి, సివిల్ సప్లె ౖడీఎం సుధారాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. వారికి పలు సూచనలు చేశారు. ప్రతీ కేంద్రంలో మౌలిక సౌకర్యాలు కల్పించేలా చూడాలని ఆదేశించారు. -
మక్కల కొనుగోలుకు వేళాయె
ఇచ్చోడ: ఈ ఏడాది వానాకాలంలో సాగైన మొక్కజొన్న కొనుగోళ్లపై సందిగ్ధం తొలగిపోయింది. ఈ సీజన్కు సంబంధించి మక్కల విక్రయాలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో కొన్నేళ్లుగా యాసంగిలో మాత్రమే మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా యాసంగి పంటనే మద్దతు ధరతో కొనుగోలు చేస్తూ వస్తోంది. అయితే ఈ ఏడాది పత్తి, సోయాకు ప్రత్యామ్నాయంగా వానాకాలంలోనూ జిల్లా వ్యాప్తంగా చాలా మంది రైతులు మొక్కజొన్న సాగు చేశారు. ప్రస్తుతం పంట చేతికి రావడంతో విక్రయాలపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే కొంతమంది చేతికొచ్చిన పంట దిగుబడిని యార్డులకు తరలించారు. ఎట్టకేలకు ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొక్కజొన్న సాగు.. జిల్లాలో ఈ సీజన్లో ఇచ్చోడ, బోథ్, బజార్హత్నూర్, సిరికొండ, ఇంద్రవెల్లి, నార్నూర్, నేరడిగొండ, తాంసి, తలమడుగు, గాదిగూడ, సొనాల తదితర మండలాల్లో దాదాపు 50వేల ఎకరాల్లో ఈ పంట సాగు చేశారు. ఎరువుల వాడకం, పెట్టుబడి వ్య యం కూడా తక్కువగా ఉండడంతో మొగ్గు చూపా రు. అయితే పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అధిక వర్షాలు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో రైతులు ఆశించిన దిగుబడులు చేతికందాయి. ఐదు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జిల్లాలో మార్క్ఫెడ్ ద్వారా ఐదు కేంద్రాలను ఏర్పాటు చేసి మొక్కజొన్న కొనుగోలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఆదిలాబాద్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, బోథ్, నార్నూర్ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు రోజుల్లో ప్రారంభిస్తాం జిల్లా వ్యాప్తంగా ఐదు కేంద్రాల్లో మొక్కజొన్న కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. రెండు రోజుల్లో ఆయా కేంద్రాల్లో విక్రయాలు ప్రారంభిస్తాం. – ప్రవీణ్రెడ్డి, మార్క్ఫెడ్ డీఎం, ఆదిలాబాద్ ఇక్కడ కనిపిస్తున్న రైతు రాకేశ్రెడ్డి. ఇచ్చోడ మండలంలోని ముఖరా(బి) గ్రామం. ఈ వానాకాలం సీజన్లో ఐదెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. ఎకరానికి 20 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది. అయితే పంట విక్రయంపై సందిగ్ధం నెలకొంది. తాజాగా ప్రభుత్వం ఈ సీజన్లోనూ మద్దతు ధరతో మక్కల కొనుగోలు చేపడుతున్నట్లు ప్రకటించింది. సర్కారు నిర్ణయంపై ఇతడు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. జిల్లాలో ఈ సీజన్లో మొక్కజొన్న సాగు : 50వేల ఎకరాలు మద్దతు ధర (క్వింటాలుకు) : రూ 2,400 -
పుంజుకున్న ఎక్సైజ్ దరఖాస్తులు
ఆదిలాబాద్టౌన్: మద్యం షాపుల టెండర్లు పుంజుకున్నాయి. గత నెల 26న నోటిఫికేషన్ విడుదల కాగా ఈ నెల 14 వరకు కేవలం 50 వరకు దరఖా స్తులు అందాయి. అయితే బుధవారం ఒక్క రోజే 52 దాఖలు కావడం గమనార్హం. ఈ ఏడాది దరఖా స్తు ఫీజు రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచడంతో అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉంది. 2023లో 40 వైన్స్షాపులకు 1,047 దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు కేవలం 110 మాత్రమే వ చ్చాయి. అయితే ఈ ఏడాది ఆ స్థాయిలో అందుతా యా లేదా అనే దానిపై చర్చ సాగుతుంది. బుధవా రం ఆదిలాబాద్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 21, ఇచ్చో డ స్టేషన్ పరిధిలో 12, ఉట్నూర్ స్టేషన్ పరిధిలో 19 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఆదిలాబాద్ స్టేషన్ పరిధిలో 61, ఇచ్చోడ పరిధిలో 20, ఉట్నూర్ పరిధిలో 29 దరఖాస్తులు అందినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ తెలిపారు. ఇప్పటి వరకు ఆయా దుకాణాలకు నిల్.. ఆదిలాబాద్ పట్టణంలోని 2, 4, 7, 10, 12, 14, 16, 17, 18 షాపులకు ఒక్క దరఖాస్తు కూడా అందలేదు. అలాగే ఇచ్చోడ పరిధిలో 24, 25, 26, 27, 28, 30, 31 షాపులకు, ఉట్నూర్ పరిధిలో 34, 35, 36, 40 షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా ఆదిలాబాద్ పట్టణంలో షాపులవారీగా కేటాయించిన స్థలంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాల్సి ఉండేది. అయితే ఈ సారి జిల్లాకేంద్రంలో షాపులు దక్కించుకున్న వారు తమకు ఇష్టమైన ప్రాంతంలో ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయినప్పటికీ వ్యాపారులు అంతగా ఆసక్తి చూపకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. దరఖాస్తుల ద్వారానే గతేడాది ప్రభుత్వానికి రూ.20 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. -
మనస్తాపంతో ఒకరు..
దండేపల్లి: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తహసీనొద్దీన్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని గుడిరేవు గ్రామానికి చెందిన పూసాల రాజు (36) ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. తరచూ భార్య రాజేశ్వరితో గొడవపడటంతో రెండు రోజుల క్రితం ఇద్దరు పిల్లలతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన రాజు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం చిట్టీడబ్బులకోసం వెళ్లిన వ్యక్తి చూడగా ఉరేసుకుని కనిపించాడు. మృతుని తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
పాఠశాల ఆవరణలో నాగుపాము కలకలం
నిర్మల్ఖిల్లా: జిల్లా కేంద్రంలోని వెంకటపూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం నాగుపాము కనిపించడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం ఇంటర్వెల్ సమయంలో మూత్రశాలల సమీపంలో నాగుపామును గమనించిన విద్యార్థులు వెంటనే ఉపాధ్యాయులతో చెప్పా రు. ప్రధానోపాధ్యాయురాలు సుహాసిని శాంతినగర్ కాలనీకి చెందిన స్నేక్క్యాచర్ గిరిగంటి అనిల్కు సమాచారం అందించడంతో చాకచక్యంగా పామును బంధించి అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు. ఈ సందర్భంగా స్నేక్క్యాచర్ అనిల్ను అభినందించారు. -
33వ రోజుకు కార్మికుల సమ్మె
ఉట్నూర్రూరల్: తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఐటీడీఏ కార్యాలయం ఎదుట కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీవేజ్, ఔట్సోర్సింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె 33వ రోజుకు చేరుకుంది. మంగళవారం గిరిజన సంఘాలు, వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు మాట్లాడుతూ సమ్మె చేపట్టి 33 రోజులు కావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మద్దతు తెలిపిన వారిలో కొలాం సేవా సంఘం రాష్ట్ర అఽ ద్యక్షుడు కొడప సోనేరావు, కుంర రాజు, భీంరావు, సంజయ్, విజయ్, బీఆర్ఎస్ నాయకులు కొమ్ము విజయ్, కాటం రమేశ్, ధరణి రా జేశ్, బాజీరావు, దావుల రమేశ్ ఉన్నారు. -
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
తిర్యాణి: కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామానికి చెందిన కల్పన (28)కు తిర్మాణి మండలంలోని గంభీరావుపేటకు చెందిన సైదం శేఖర్తో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్లుగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో కల్పన పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించడంతో ఇటీవల మళ్లీ అత్తారింటికి వచ్చింది. సోమవారం మళ్లీ గొడవ జరగడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. తన కుమార్తె మృతికి అల్లుడే కారణమని మృతురాలి తల్లి దేవక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఆత్మీయం.. ఆదివాసీ వైభవం
దండేపల్లి మండలం గుడిరేవులోని ఏత్మాసార్ పేన్ పద్మల్పురి కాకో ఆలయంగుస్సాడీలు అశ్వయుజ పౌర్ణమి మరుసటి రోజు భోగితో మాలధారణ చేసి పది రోజుల పాటు కఠినదీక్ష చేపడతారు. దీక్ష పూర్తయ్యే వరకు స్నానం ఆచరించరు. ఒంటిపై చుక్క నీరుకూడా పడకుండా.. కాళ్లకు చెప్పులు ధరించకుండా.. ఒంటిపై ఎలాంటి వస్త్రాన్ని కప్పుకోకుండా అర్ధనగ్నంగానే గడుపుతారు. నేలపైనే కూర్చోవడం, నేలపైనే పడుకోవడం వారి ఆచారం. గుస్సాడీల్లో పోరీలది మరింత ప్రాముఖ్యత. సీ్త్ర వేషధారణలో ఉండే యువకులను ఆదివాసీలు పోరీలు అని పిలుస్తారు. వారు ఏ ఊరికి వెళ్లినా.. ఏ ఇంటిని సందర్శించినా మహిళలు మంగళహారతులు ఇచ్చి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు. ఆరాధ్యదైవం ఏత్మాసార్ పద్మల్పురి కాకో ఆదివాసీలకు పెద్ద పండుగ దీపావళి.. ఇందులో భాగంగానే గోండులకు ఆరాధ్యదైవమైన ఏత్మాసార్ పద్మల్పురి కాకో ఆలయానికి భక్తజన దండు కదులుతుంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గుడిరేవు గోదావరి తీరంలో కొలువై ఉన్న పద్మల్ పురి కాకో ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రాంతాల నుంచి ఆదివాసీలు అధికసంఖ్యలో తరలివస్తారు. గోదావరినదిలో పుణ్యస్నానం ఆచరిస్తారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కలు తీర్చుకుంటారు. గుస్సాడి టోపీ ప్రత్యేకం గుస్సాడీ టోపీలను నిపుణులైన గోండులు, కొలాంలు తయారు చేస్తారు. నెమలి ఈకలను సేకరించి వాటి తెల్లని కాడలను అల్లికగా మెలివేసి తలకు పట్టే ఒక చిన్న వెదురు బుట్ట అంచు చుట్టూ గట్టిగా కుట్టేసి, నెమలి పింఛాలు పై వైపు అందంగా బయటకు గుండ్రని బుట్టలాగా విస్తరిస్తూ, కదిలినప్పుడు విలాసంగా ఊగేలా ఏర్పాటు చేస్తారు. టోపీకి చుట్టూ ముఖ్యంగా ముందు వైపు, పలు వరుసల్లో, పెద్ద అద్దాలతో, రంగురంగుల జరీ దారాలు, చక్కటి డిజైన్లు ఉన్న గుడ్డపట్టీలతో, పలు ఆకారాల రంగురంగుల చెమ్కీ బిళ్లలు, చిన్ని గంటల మాలలతో, కొన్నిసార్లు రెండు వైపులా జింక కొమ్ములతోనూ అలంకరిస్తారు. ఆదివాసీల మధ్య ఆత్మీయ బంధం దండారీ అంటేనే ఐకమత్యానికి నిదర్శనం. ఈ పండుగ వేళ ఆదివాసీ గ్రామాల గిరిజనం ఒక ఊరి నుంచి మరో ఊరికి విడిది వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. రాత్రంతా నృత్యం చేస్తూ రేలారె రేలా పాటలతో పాటు గోండి హాస్యపు నాటికలు ప్రదర్శించి వినోదాన్ని అందిస్తారు. తెల్లవారుజామునే కాలకృత్యాలు తీర్చుకుని మాన్కోలాతో నృత్య ప్రదర్శనలు చేసి సాయంత్రం సార్కోలాతో ముగిస్తారు. ఈ సందర్భంగా ఆదివాసీలు అతిథులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేసి వీడ్కోలు పలుకుతారు. అలా చేయడం ద్వారా రెండు గ్రామాల మధ్య సత్సంబంధాలు, బాంధవ్యాలు పెరుగుతాయని ఆదివాసీ పటేళ్లు పేర్కొంటున్నారు. నాలుగు సగల పేరిట ఉత్సవాలు దండారీ పండుగలో ఏత్మాసార్ పేన్ పేరిట గిరిజనులు నాలుగు సగ(గోత్రం)లలో ఉత్సవాలు జరుపుకుంటారు. నాలుగు సగల అంటే గుమ్మేల, ఐదు సగల వారు అంటే ఫర్ర, ఆరు సగల వారు అంటే కోడల్, ఏడు సగల వారు అంటే తపల్ పేరిట ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. వేడుకల్లో భేటికోలా, మాన్కోలా, సదర్కోలా, కోడల్కోలా, సార్కోలా, కలివల్కోలా నృత్యాలు చేయడం ఆదివాసీలకే సొంతం. పేర్లు ఎంత వైవిధ్యంగా ఉన్నాయో వారి ఆటపాటలు కూడా అంతే వైవిద్యంగా సాగుతాయి. చచోయ్ ఇట్ కోలారా.. దేనే దేనారా.. రేలా.. రేలా.. లాంటి ఆట పాటల నడుమ ఉత్సవాలు అట్టహాసంగా కొనసాగుతాయి. కొలబొడితో ముగింపు దీపావళి రెండు రోజుల తరువాత గురువారం కొలబొడితో ఈ దండారీ వేడుకలు ముగుస్తాయి. ఈ సందర్భంగా దండారీ బృందం ఇంటింటికీ వెళ్లగా గృహిణి ఓ పల్లెంలో ధాన్యాలు, తోచినంత నగదు ఉంచిన హారతిని వారికి అందిస్తుంది. దానిని వారు సంతోషంగా స్వీకరించి ఇంట్లో అందరూ బాగుండాలని, పాడిపంటలు సమృద్ధిగా పెంపొందాలని ఆశీ ర్వదిస్తారు. అనంతరం పాటలు పాడుతూ హారతి పూజ ఇస్తారు. అనంతరం గ్రామ పొలిమేరలో ఉన్న ఇప్పచెట్టు వద్ద తమ ఇలవేల్పు అయిన భీందేవుని సన్నిధికి చేరుకుంటారు. తలకు ధరించిన నెమలి టోపీలను తొలగిస్తారు. గుస్సాడీ వేషధారణ, అలంకరణ వస్తువులను భీందేవుని సన్నిధిలో పెట్టి కోళ్ళు, మేకలను బలి ఇస్తారు. భీం దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం విందు భోజనాలతో కొలబొడి నిర్వహించి కార్యక్రమాన్ని ముగిస్తారు. ఆదివాసీ గూడేల్లో అంగరంగ వైభవంగా సాగే దండారీ సంబరం మొదలైంది. డప్పుల దరువులు, గజ్జెల మోతలు, గుస్సాడీ నృత్యాలతో అడవితల్లి మురిసి పోనుంది. ఆదివాసీల ఆరాధ్య దేవత ‘ఏత్మాసార్ పేన్’ పేరిట చేసే ప్రత్యేక పూజలతో దండారీ పండుగ ప్రారంభమైంది. దీపావళికి ముందు అశ్వయుజ పౌర్ణమి మరుసటి రోజు భోగితో ప్రారంభమై కొలబొడితో ముగియనుంది. పక్షం రోజుల పాటు కొనసాగే ఉత్సవాలకు గూడేలన్నీ సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం దండారీని ప్రత్యేక పండుగగా గుర్తించింది. – బజార్హత్నూర్ పవిత్రమైన పండుగ మా ఆదివాసీ గోండు గిరిజనులకు దీపావళి పవిత్రమైన పండుగ. ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకుంటాం. గిరిజన దేవతలను, వన దేవతలను పూజిస్తాం. బంధువుల ఇళ్లకు వెళ్తాం. గుస్సాడీల థింసా నృత్యం, ఆడపడుచుల రేలారేరేలా నృత్యం ఆకట్టుకుంటాయి. – కొడప భీంరావ్ పటేల్, చింతలసాంగ్వీఘనంగా జరుపుకుంటాం దీపావళికి పక్షం రోజుల ముందే అన్నీ సిద్ధం చేసుకుంటాం. ఎంత పేద గిరిజనుడైనా ఈ పండుగకు ఇంటిని శుభ్రపరచడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, పిండివంటలకు సామగ్రి సమకూర్చుకుంటారు. నెమలి ఈకలతో టోపీలు తయారు చేసుకుంటాం. దండారీ ఘనంగా జరుపుకుంటాం. – కనక లంకు మహాజన్, తుమ్ముగూడ, ఇంద్రవెల్లి ప్రోత్సాహం అందించాలి ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గత సంవత్సరం రూ.15 వేలు అందించింది. ఈ సంవత్సరం కూడా ప్రోత్సాహకం అందించాలని జిల్లా సార్మేడీలు, కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాను కలిసి విన్నవించాం. – మేస్రం దుర్గు, జిల్లా సార్మేడి, ఉట్నూర్ -
ఐటీఐ గేటుకు తాళం వేసి నిరసన
మంచిర్యాలఅర్బన్: 2022–24 విద్యాసంవత్సరానికి సంబంధించిన కోర్సు ఫీజు చెల్లించినప్పటికీ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో మంగళవారం డింపి ఐటీఐ గేటుకు తాళం వేసి విద్యార్థులు నిరసన తెలిపారు. కళాశాల చైర్మన్ వచ్చారన్న సమాచారంతో వెళ్లి సర్టిఫికెట్లు అడిగితే దాటవేత సమాధానం ఇవ్వడంతో గేటు ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. పీడీఎస్యూ, ఏఐఎస్బీ, జేవీఎస్ విద్యార్థి సంఘాల నేతలు శ్రీకాంత్, వంశీ వారికి మద్దతు తెలిపారు. ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కళాశాల యజమానులను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లగా విద్యార్థులు, విద్యార్థిసంఘాల నేతలు కూడా అక్కడికి వెళ్లారు. కళాశాల చైర్మన్, ప్రిన్సిపాల్ మధ్య డబ్బుల వివాదంతో సర్టిఫికెట్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాత్రి వరకు సర్టిఫికెట్ల సమస్య పరిష్కారంపై కొలిక్కిరాలేదు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుని సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
రైతు నేస్తం.. వాట్సాప్ చానల్
లక్ష్మణచాంద: పంటల సాగులో తరచూ ఎదురయ్యే తెగుళ్లు, వాటి నివారణకు సరైన మందుల ఎంపికలో అవగాహన లోపం కారణంగా రైతులు దిగుబ డులు కోల్పోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సాంకేతికత ఆధారంగా రైతుల ముంగిట ముఖ్య సమాచా రాన్ని అందించేందుకుఈ ఏడాది ఆగస్టు 8న ప్ర త్యేక అధికారిక వాట్సాప్చానల్నుప్రారంభించింది. చానల్ ద్వారా లభించే ప్రయోజనాలు నిపుణుల సలహాలు రైతు సాగు చేసే పంటకు మొలక దశ నుంచి కోత దశ వరకు ఏ తెగులు వచ్చినా, దాని ఫొటోను చానల్లో పోస్టు చేస్తే వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆ తెగుళ్లను వెంటనే గుర్తిస్తారు. తెగులు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ మందులు, ఏ మోతాదులో ఉపయోగించాలో వివరిస్తారు. చానల్లో చేరడం ఇలా.. గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాలు -
దాడి కేసులో నలుగురి రిమాండ్
జైపూర్: మండలంలోని వేలాలలో జరిగిన దాడి కేసులో నలుగురిని రిమాండ్కు తరలించినట్లు శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ తెలిపారు. గ్రామంలో ప్యాగ రాజ సమ్మయ్య, అతని సోదరులకు 33 గుంటల భూమి ఉంది. ఆ భూమి విషయంలో అన్న మైసయ్య, అతని కుమారులు సమ్మయ్య, నగేష్, మల్లేశ్తో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. అందులో ఇటీవల మైసయ్య ఇల్లు నిర్మాణం చేపట్టగా రాజ సమ్మయ్య కుమారులు శ్రీనివాస్, సంతోష్, భార్య మల్లక్క భూమి వద్దకు వెళ్లి భూమిని పంచుకున్న తర్వాత ఇల్లు కట్టుకొమ్మన్నారు. ఈ విషయంలో సమ్మయ్య, నగేష్, మల్లేశ్, లక్ష్మి వారిపై దాడికి పాల్పడ్డారు. బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. -
అద్దె కారు తిరిగివ్వని ఇద్దరు..
ఆదిలాబాద్టౌన్: కారు అద్దెకు తీసుకొని తిరిగి ఇవ్వని ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. మంగళవారం వన్టౌన్ పోలీసు స్టేషన్లో వివరాలు వెల్లడించారు. 2025 మార్చి 28న సునార్ గల్లికి చెందిన అన్నదమ్ములు ముమ్మడివార్ రాకేష్, ముమ్మడివార్ కృష్ణ హైదరాబాద్కు వెళ్తామని చెప్పి రవీంద్రనగర్కు చెందిన బొడ్గం రాజేశ్ వద్ద కారు అద్దెకు తీసుకున్నారు. ఇప్పటి వరకూ తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులను అరె స్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వివరించారు. -
బాసర ఆలయ హుండీ లెక్కింపు
బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ హుండీని మంగళవారం లెక్కించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనాదేవి తెలిపారు. 83 రోజులకు రూ.81,69,099 నగదు, 91 గ్రాముల 500 మిల్లీగ్రాముల మిశ్రమ బంగారం, మూడు కిలోల 500 గ్రాముల మిశ్రమ వెండి, 79 విదేశీ కరెన్సీ నోట్లు సమకూరినట్లు ఈవో తెలిపారు. కార్యక్రమంలో వ్యవస్థాపక ధర్మకర్త శరత్ పాఠక్, ఏఈవో సుదర్శన్ పర్యవేక్షకులు శివరాజ్, తదితరులు పాల్గొన్నారు. 108 ఈఎంటీకి ఉత్తమ సేవా పురస్కారంఉట్నూర్రూరల్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న 108 సిబ్బందికి రాష్ట్ర ఎంఆర్ఐ సంస్థ అందించే ఉత్తమ సేవా పురస్కారానికి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ 108లో మెడికల్ టెక్నీషియన్గా పనిచేస్తున్న గణేశ్ ఎంపికయ్యారు. మంగళవారం ఐటీడీఏ కార్యాలయంలో పీవో ఖుష్బూ గుప్తా చేతుల మీదుగా పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ సామ్రాట్, జిల్లా ఇన్చార్జి రాజశేఖర్, పైలట్ సుందర్ సింగ్, తదితరులు పాల్గొన్నారు. -
మాలలను అణచివేసేందుకు కుట్ర
ఆదిలాబాద్టౌన్: తెలంగాణలోని రాజకీయ పార్టీ లు మాలలను అణచివేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రింట్ మీడియా ప్రెస్క్లబ్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాలల సామాజిక వర్గాన్ని కొందరు టార్గెట్ చేసినప్పటికీ మాల నాయకులు, ప్రజాప్రతినిధులు నోరు మెదపడం లేదన్నారు. తెలంగాణలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వర్గీకరణ విషయంలో మాట్లాడలేదని, అధికారంలో వచ్చిన తర్వాత రేవంత్రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేపట్టారని అన్నారు. హస్తం పార్టీ ఎస్సీ వర్గీకరణకు బీజం వేస్తే, ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా వర్గీకరణ చేపట్టారని తెలిపారు. అయితే తాము మాదిగ సోదరులకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం మాలల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉందన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు చెప్పిన విధంగా సీఎం రేవంత్రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేపట్టారని తెలిపారు. వర్గీకరణతో వందలో నలుగురికి ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. దేశ వ్యాప్తంగా ఎస్సీ జాబితాలో 1108 కులాలు ఉన్నాయని, వారందరికీ ఏవిధంగా ఫలాలు పంచుతారని ప్రశ్నించారు. ఆయన వెంట మాల మహానాడు నాయకులు బల్లెం లక్ష్మణ్, ప్రభాకర్రావు, బాలచౌరి, తదితరులున్నారు. -
బాధితులకు సత్వర న్యాయం అందాలి
కై లాస్నగర్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లోని బాధితులకు సత్వర న్యాయం అందించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. జిల్లా అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మాని టరింగ్ సమావేశాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. ఎస్పీ అఖి ల్ మహాజన్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి జిల్లాలో అట్రాసిటీ కేసుల నమోదు, వాటి పురోగతి, బాధితులకు నష్ట పరిహారం చెల్లింపు, పెండింగ్ కేసులు వంటి అంశాలపై పోలీస్స్టేషన్లు, మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పుర్వాపరాలు పరిశీలించి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలన్నారు. అలాగే బాధితులకు పరిహారం జమచేసేందుకు అవసరమైన బ్యాంకు ఖాతాలు సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, సబ్కలెక్టర్ యువరాజ్, అదనపు ఎస్పీ కాజల్సింగ్, ట్రెయినీ కలెక్టర్ సలోని, డీఎస్సీడీవో సునీత కుమారి, ఆర్డీవో స్రవంతి, కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్కు సన్మానం.. నీతి ఆయోగ్ యూజ్ కేసు ఛాలెంజ్లో నాలుగు జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్న కలెక్టర్ రాజర్షి షాను జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. సమావేశం అనంతరం ఆయనను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఇందులో సభ్యులు ఆరెల్లి మల్లేశ్, మేస్రం జంగుబాపు, బాల శంకర్కృష్ణ, పంద్రం శ్యామల, తోట విజయ్, ఉషారాణి, లక్ష్మికాంత్ తదితరులున్నారు. -
అనైక్యతతోనే పార్టీ ఓటమి
కై లాస్నగర్: కాంగ్రెస్కు ప్రజల్లో ఎప్పుడూ ఆదరణ ఉంటుందని, అయితే నాయకుల్లో అనైక్యతే పార్టీ ఓటమికి కారణమవుతుందని ఏఐసీసీ పరిశీలకులు అజయ్ సింగ్ అన్నారు. పట్టణ శివారులోని గాయత్రి గార్డెన్లో జిల్లా అధ్యక్షుడి నియామక ప్రక్రియపై మంగళవారం అభిప్రాయ సేకరణ నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లాలోని ముఖ్య నేతలతో పాటు నియోజకవర్గ, మండల నాయకులు హాజరయ్యా రు. వారందరి నుంచి వ్యక్తిగతంగా, లిఖితపూర్వకంగా అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదలకు చేరువైందన్నారు. వారి మద్దతుతో రానున్న స్థానిక సంస్థల్లో పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరి నుంచి అభిప్రాయాలు సేకరించి అందరి ఆమోదం మేరకే జిల్లా అధ్యక్షుడిని నియమిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, సంఘటన్ శ్రుజన్ అభియాన్ సమన్వయ కర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సీహెచ్ రాంభూపాల్, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ఏఐసీసీ మెంబర్ నరేశ్జాదవ్, ఆదిలాబాద్, బోథ్ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జీలు కంది శ్రీనివాస రెడ్డి, ఆడె గజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యుత్ అందించాలి
కైలాస్నగర్: వినియోగదారులకు నిరంతర నాణ్య మైన విద్యుత్ అందించాలని ఎన్పీడీసీఎల్ అపరేషన్ డైరెక్టర్ టి.మధుసూదన్ అన్నారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో విద్యుత్శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో విద్యుత్ డిమాండ్, సరఫరా, ఇబ్బందులపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ, 33కేవీ 11కేవీ లైన్స్లో పెట్రోలింగ్ నిర్వహించి సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చూడాలన్నారు. అన్ని సర్వీసులను ట్రాన్స్ఫార్మర్ల మీద మ్యాపింగ్ చేయాలన్నారు. ప్రమాదకరంగా ఉన్న, వంగిపోయిన విద్యుత్ స్తంభాలు, వదులుగా ఉన్న లైన్స్ను గుర్తించి వెంటనే సరి చేయాలన్నారు. రోజువారీగా ఆ డేటాను యాప్లో నమోదు చేయాలన్నారు. ప్రతీ సెక్షన్ ఆఫీసర్ వారానికి ఒక గ్రామంలో పొలం బాట కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. అలాగే పెండింగ్లో ఉన్న అగ్రికల్చర్ సర్వీసులను వెంటనే రిలీజ్ చేయాలన్నా రు. సమావేశంలో ఆపరేషన్ సీఈ అశోక్, సీఈ కన్స్ట్రక్షన్ జే.ఆర్.చౌహాన్, సర్కిల్ పరిధిలోని డివిజనల్ ఇంజినీర్స్, అకౌంట్స్ ఆఫీసర్స్, అసిస్టెంట్ డివి జనల్ ఇంజినీర్స్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఇంజినీర్స్, సబ్ ఇంజినీర్స్ తదితరులు పాల్గొన్నారు. -
కదులుతున్న డొంక
కైలాస్నగర్: జిల్లా కేంద్రంలో వెలుగుచూసిన భూ కబ్జా వ్యవహరంలో రియల్టర్లతో అంటకాగిన అవి నీతి అధికారుల బండారం బట్టబయలవుతోంది. బ్యాంకు తనఖాలో ఉన్న రూ.కోట్ల విలువైన భూమి ని కాజేసిన బడా రియల్టర్లతో ఇప్పటికే ఊచలు లెక్కపెట్టిస్తున్న పోలీసులు వారికి సహకరించిన అధికారులపైనా చర్యలకు సిద్ధమవుతున్నారు. ప్ర స్తుతం పొరుగు జిల్లాలో పనిచేస్తున్న మండల సర్వేయర్ శివాజీపైన కేసు నమోదు చేసిన పోలీసులు, భూమాఫియాతో చేతులు కలిపిన రెవెన్యూ, సర్వేల్యాండ్స్ రికార్డ్స్ అధికారుల పాత్రపైనా లోతైన విచారణ జరుపుతున్నారు. వారిపైన కేసుల నమోదుకు సిద్ధమవుతున్నారు. దీంతో అక్రమార్కుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అక్రమంగా సప్లిమెంటరీ సేత్వార్.. ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ శివారు రణ దీవేనగర్లో గల సర్వేనంబర్ 65/బిలో 1.05 ఎకరాలు, 64/4లో గల 1.04 ఎకరాలు కలిపి 2.09 ఎకరాల భూమి ఆర్థిక నేరాల కేసులో ఈడీ ఆధీనంలో ఉంది. రూ.కోట్ల విలువైన భూమి కావడంతో బ డా రియల్టర్లు దానిపై కన్నేశారు. రెవెన్యూ అధి కారుల అండతో తప్పుడు పత్రాలు సృష్టించారు. దొడ్డిదారిన ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో 2023 ఆగస్టు 17న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సర్వేల్యాండ్ రికార్డ్స్లోనూ ఈ భూమి తమ పేరిటనే ఉందని తెలిపేలా పన్నాగం పన్నారు. 2024 నవంబర్లో అక్రమంగా సప్లిమెంటరీ సేత్వార్ను చేసుకున్నారు. దీనికి సర్వేల్యాండ్ రికార్డ్స్ ఏడీ కూడా ఆమోదం తెలిపినట్లుగా పోలీసులు గుర్తించా రు. ఈ వ్యవహారంలో నాటి ఆదిలాబాద్ అర్బన్ మండల సర్వేయర్గా పనిచేసిన శివాజీ కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆయనపై కేసు నమోదు చేశారు. విషయాన్ని ముందుగానే పసిగట్టిన సదరు అవినీతి అధికారి ప్రస్తుతం పరా రీలో ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. అయితే అక్రమంగా చేసిన సేత్వార్, రిజిస్ట్రేషన్పై కలెక్టర్ రాజర్షి షాకు ఫిర్యాదు అందడంతో ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారుల పాత్రపై విచారణ.. ఈ మొత్తం వ్యవహారంలో పరారీలో ఉన్న మండల సర్వేయర్ ప్రధాన పాత్ర పోషించినట్లుగా స్పష్టమవుతుంది. ఇదే కాకుండా సర్వేయర్గా పనిచేసిన స మయంలో మావలలో ప్రతీ వెంచర్లోనూ ప్రభు త్వ, అసైన్డ్ ల్యాండ్స్ను రియల్టర్లు ఆక్రమించేలా స దరు అధికారి తనవంతు సహకారం అందించినట్లుగా తెలుస్తోంది. ఆయనతో పాటు అప్పటి రెవెన్యూ అధికారులు సైతం భూకబ్జాలు వారికి తెలిసినా చూసీచూడనట్లుగా వ్యవహరించారని సమాచారం. ఇందుకు వారికి పెద్ద మొత్తంలోనే లబ్ధి చేకూరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ అధికారుల బాగోతంపైనా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో భాగస్వాములైన రెవెన్యూ, సర్వే ల్యాండ్ రికార్డు అధికారులేవరనే దానిపైనా కలెక్టర్ రాజర్షి షా సైతం ఆరా తీస్తున్నారు. దీంతో బాధ్యులపై శాఖాపరంగానూ వేటు పడే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. బాధ్యులపై చర్యలు తప్పవు ఈడీ ఆధీనంలోని భూమిని కబ్జా చేసిన రియల్ వ్యాపారులను ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు పంపించాం. ఈ అక్రమదందాలో వ్యాపారులకు సహకరించిన మండల సర్వేయర్ శివాజీపై కేసు నమోదు చేశాం. ఆయనతో పాటు రియల్టర్లకు సహకరించి తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసిన అధికారుల పాత్రపైనా విచారణ జరుపుతున్నాం. బాధ్యులైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. అక్రమార్కులందరిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తాం. – ఎల్.జీవన్రెడ్డి, డీఎస్పీ, ఆదిలాబాద్ -
విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
ఉట్నూర్రూరల్: విధి నిర్వహణలో ప్రతి ఒక్క రూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మ హాజన్ అన్నారు. ఈ నెల 21న ఫ్లాగ్డే వారో త్సవాల్లో భాగంగా ఉట్నూర్లో పోలీస్ అమరవీరుడు ఆర్.శంకర్ స్మారక భవనంను అదనపు ఎస్పీ కాజల్సింగ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం సబ్ డివిజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా అవగాహన కా ర్యక్రమాలు నిర్వహించాలన్నారు. అలాగే పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలన్నా రు. కార్యక్రమంలో ఉట్నూర్ సీఐ ప్రసాద్, నార్నూర్ సీఐ ప్రభాకర్, అమరవీరుడు శంకర్ భార్య దూరిబాయ్, ఎస్సైలు సాయన్న, ప్రవీ ణ్, అఖిల్, సిబ్బంది పాల్గొన్నారు. -
పల్లెల్లో వసతులపై సర్వే
నేరడిగొండ: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ఫోకస్ పెంచింది. ప్రతీ పంచాయతీలో మౌలిక వసతులు, ప్రభుత్వ ఆస్తుల స్థితిగతులు గుర్తించేందుకు గాను గత నెల 18 నుంచి సర్వేకు శ్రీకారం చుట్టింది. ప్రత్యేకంగా జీపీ మానిటరింగ్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు కార్యదర్శులు ఆయా జీపీల్లో మౌలిక వసతుల వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. జిల్లాలో మొ త్తం 473 గ్రామ పంచాయతీలు ఉండగా, అన్ని చో ట్ల సర్వే చేపడుతున్నారు. కొద్ది నెలలుగా పంచా యతీ పాలకవర్గాలు లేకపోవడం, అలాగే నిధుల కొరతతో పలు గ్రామాల్లో సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సర్వే ద్వారా గ్రామాల్లో ఉన్న వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం అంచనా వేయనుంది. తద్వారా పల్లె అభివృద్ధికి దోహదపడనుంది. సమగ్ర సమాచారం సేకరణ.. ఈ సర్వే ద్వారా గ్రామాల్లో మొత్తం 21 అంశాలపై వివరాలు సేకరించనున్నారు. జీపీ మానిటరింగ్ యాప్ ద్వారా ప్రతీ కార్యదర్శి క్షేత్ర స్థాయిలో డేటా నమోదు చేయాలి. పంచాయతీ భవనం, అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాల, ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, సెగ్రిగేషన్ షెడ్, నర్సరీ, వైకుంఠదామం, తాగునీరు, వీధిదీపాలు వంటి ప్రాథమిక వసతులు ఉన్నాయా లేదా పరిశీలించి వివరాలు నమోదు చేయాలి. దీంతో వసతుల స్థాయి, ప్రజా అవసరాల స్థితి, భవిష్యత్ ప్రాధాన్యతలు స్పష్టంగా తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు. అభివృద్ధికి పునాది.. గ్రామాల్లోని ప్రభుత్వ ఆస్తుల వాస్తవ స్థితి, అభివృద్ధి అవకాశాలు, ప్రజా వసతుల లోపాలపై ఈ సర్వే ద్వారా సమగ్ర అవగాహన లభిస్తుంది. తద్వారా రాబోయే అభివృద్ధి ప్రణాళికల్లో దీనికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. 21 అంశాలపై పరిశీలన.. గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ ఆస్తులు, మౌలిక వసతులపై సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలోని ఆయా పంచాయతీల కార్యదర్శులకు సర్వే తీరుతెన్నులను వివరించాం. 21 అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వివరాలను జీపీ మానిటరింగ్ యాప్లో పారదర్శకంగా నమోదు చేయాలని ఆదేశించాం. – రమేశ్, జిల్లా పంచాయతీ అధికారి -
బారులు తీరి.. బాధలు చెప్పి
కై లాస్నగర్: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్తో తా త్కాలికంగా నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని నోటిఫికేషన్ రద్దుతో సోమవారం పునఃప్రారంభించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులు బా రులు తీరి సమస్యలపై ఏకరువు పెట్టారు. కలెక్టర్ రాజర్షి షా వారి నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్.రాజు, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 121 అర్జీలు అందినట్లు అధికారులు వెల్లడించారు. అందులో కొందరి నివేదన వారి మాటల్లోనే... -
మందకొడిగా..
16 నుంచి దండారీ ఉత్సవాలు దీపావళి పండుగ సందర్భంగా ఆదివాసీ గిరి జన గ్రామాల్లో నిర్వహించే దండారీ ఉత్సవా లు ఈనెల 16 నుంచి ప్రారంభమవుతాయని గ్రామ పటేళ్లు ప్రకటించారు. సాక్షి,ఆదిలాబాద్: ‘మీ పరిధిలోని ప్రతీ దుకాణానికి దరఖాస్తు ఫైల్ అయ్యే విధంగా చూడాలి.. ఈ సారి టెండర్ల సంఖ్యలో 10 శాతం వృద్ధి సాధించాలి.. ఏవిధంగా నైనా కొత్త దరఖాస్తుదారుని కనెక్ట్ చేసే పనిని వ్యక్తిగతంగా చేపట్టాలి.. ఆ వివరాలు ఈ సాయంత్రంలోగా పంపండి.. మిగిలిన రోజుల్లో లక్ష్యం సాధించే దిశగా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలి..’ ఇది రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ నుంచి సంబంధిత జిల్లా అధికారులకు సోమవారం అంతర్గతంగా వచ్చిన ఆదేశాలివి. వైన్స్ షాప్ టెండర్లకు సంబంధించి దరఖాస్తులు పెంచేందుకు ఎకై ్సజ్ అధికారులు అపసోపాలు ప డుతున్నారు. ప్రధానంగా ఈ ప్రక్రియ ప్రారంభమై 18 రోజులు గడిచినప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు మూడంకెల్లోనే దరఖాస్తులు రావడం గమనార్హం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడంతో ఆ శాఖ ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వం కూడా ఆలోచనలో పడింది. ఈనెల 18 వరకు దరఖాస్తుకు అవకాశం ఉండటం, మిగిలిన ఐదు రోజుల్లో అన్ని జిల్లాల్లో దరఖాస్తుల సంఖ్య పెంచడంపై ఫోకస్ చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రధానంగా ఉమ్మడి జిల్లా డిప్యూటీ కమిషనర్ (డీసీ)తో పాటు జిల్లాల అధికారులైన డీపీఈవోలు టాస్క్గా తీసుకొని లక్ష్యం పూర్తి చేయాలని స్పష్టం చేసింది. దీంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కార్యాలయాల్లోనే తిష్టవేసి దరఖాస్తుదారులను రప్పించేలా శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ చివరి రోజుల్లోనే దరఖాస్తులు అధికంగా వస్తాయని, గతంలో కూడా ఇదే విధంగా ప్రక్రియ కొనసాగిందని ఎకై ్సజ్ అధికారులు చెబుతున్నప్పటికీ లోలోపల మాత్రం సంశయనం చెందుతున్నారు. పడరాని పాట్లు.. దరఖాస్తుల పెంపుపై ఎకై ్సజ్ అధికారులు అపసోపాలు పడుతున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను బయటకు తీసి ఈసారి చేసుకునేలా వారికి ఫోన్లు చేస్తున్నారు. అలాగే 2023–25లో ఆయా వైన్స్ల వారీగా ఎకై ్సజ్ ట్యాక్స్ కంటే ఎంత శాతం అధికంగా ఆయా షాపులు విక్రయాలు చేశాయనే లెక్కలతో వాట్సాప్ గ్రూప్లలో సర్క్యులేట్ చేస్తున్నారు. తద్వారా డిమాండ్ షాపులకు అధిక దరఖాస్తులు వచ్చేలా అధికారులు ఫోకస్ పెంచారు. అంతేకాకుండా ఇతర దుకాణాలకు కూడా తప్పనిసరి దరఖాస్తులు వచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పెంచిన ఫీజుతోనేనా.. గతంలో దరఖాస్తు ఫీజు రూ.2లక్షలు ఉండగా, కొత్త ఎకై ్సజ్ పాలసీలో దీనిని రూ.3లక్షలకు పెంచారు. ఈ ప్రభావమే దరఖాస్తులపై పడిందనే చర్చ సాగుతుంది. గతంలో కొత్త దరఖాస్తుదారులు ప్రధానంగా యువత కొంతమంది గ్రూప్గా కలిసి వైన్స్షాప్ పొందేందుకు దరఖాస్తులు అమితంగా చేసుకునేవారు. అయితే ఈసారి ఫీజు పెరగడంతో ఇలాంటి కొత్త దరఖాస్తుదారులు ఆలోచనలో పడ్డారని చెప్పుకుంటున్నారు. అయితే చివరి రోజుల్లో దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో వస్తాయని ఎకై ్సజ్ అధికారులు పేర్కొంటున్నారు. మంచి రోజు, ఇతరత్రా చూసుకొని పలువురు దరఖాస్తు ప్రక్రియను పెండింగ్లో ఉంచారని, అలాంటి వారంతా ఈ మిగిలిన రోజుల్లో ముందుకొస్తారని అంటున్నారు. ఆదిలాబాద్లో దరఖాస్తులు స్వీకరించే కౌంటర్ వద్ద ఎకై ్సజ్ సిబ్బంది ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమశాతం పెరగనుంది.గత, ప్రస్తుత పాలసీలో వచ్చిన దరఖాస్తుల సంఖ్య (ఉమ్మడి జిల్లాలో) జిల్లా వైన్స్ షాపుల 2023లో 2025లో సంఖ్య వచ్చినవి ఇప్పటివరకు ఆసిఫాబాద్ 32 1020 99 మంచిర్యాల 73 2242 43 నిర్మల్ 47 1067 30 మొత్తం 192 5376 215చివరి రోజుల్లో అధికంగా.. గడువుకు సమీపిస్తున్న తరుణంలో ఈ మిగిలిన రోజుల్లోనే దరఖాస్తుదారులు ఎక్కువ సంఖ్యలో ముందుకు వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ముహూర్తాలు చూసుకొని పలువురు దరఖాస్తు చేస్తున్నారు. – రఘురాం, డిప్యూటీ కమిషనర్, ఎకై ్సజ్ శాఖ, ఆదిలాబాద్ డివిజన్ -
బుక్స్ కూడా ఇవ్వలేదు
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదని మా కు రెండేళ్ల నుంచి యూని ఫాంతో పాటు కనీసం బుక్స్ కూడా ఇవ్వడం లేదు. వాటిని అడిగితే సార్లు మమ్మల్ని టార్గెట్ చేసి కొడుతున్నారు. అంతేకాకుండా సార్ చేనుకు తీసుకెళ్లి అక్కడ పని చేయిస్తున్నారు. దసరా తర్వాత పాఠశాలకు రానివ్వడం లేదు. – అనుదీప్, 7వ తరగతి, బీఏఎస్ విద్యార్థి స్కూల్కు రానివ్వట్లే.. టీసీ ఇవ్వట్లే నా కూతురు బెస్ట్ అవలేబు ల్ స్కూల్లో ఐదో తరగతి చదువుతుంది. ప్రభుత్వం ఆ బడికి ఫీజురీయింబర్స్ మెంట్ అందించడం లేదంటూ పిల్లలకు యూనిఫాం, బుక్స్ కూడా ఇవ్వడం లేదు. ఇటు పాఠశాలకు రాన్విడం లేదు. వేరే స్కూల్లో చేర్పిద్దామంటే కనీసం టీసీ కూడా ఇవ్వడం లేదు. ఇలా చేస్తే పిల్లల భవిష్యత్ ఏం కావాలి. – కే అరుణ, పేరెంట్ -
నిర్వాసితులను ఆదుకోవాలి
భీంపూర్:పిప్పల్కోటి భూనిర్వాసితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్ అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ లేఖ రాసినట్లు వెల్లడించారు. గ్రామ రైతులతో సోమవారం ఆయన సమావేశమై మాట్లాడారు. రిజర్వాయర్ కోసం దాదాపు 1200 ఎకరాల సాగు భూమిని రైతులు అందిస్తే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పరిహారం అందించలేదన్నారు. భూసేకరణ చట్టం–2013 ప్రకారం ఎకరాకు రూ.18లక్షలు, కుటుంబంలో ఒకరికి ప్ర భుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరినట్లు తెలిపా రు. పార్టీ జిల్లా కార్యదర్శి కిరణ్, ఆశ న్న, రైతులు నసీరుద్దీన్ స్వామి పాల్గొన్నారు. -
డీఎస్వో వాజిద్ అలీ సరెండర్
కైలాస్నగర్: జిల్లా ఇన్చార్జి పౌరసరఫరాల అధికారిగా పనిచేస్తున్న వాజిద్ అలీపై సరెండర్ వేటు పడింది. ఆయనను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్కు సరెండర్ చేస్తూ కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, శాఖకు సంబంధించి నివేదికలు సకాలంలో అందించకపోవడంపై కలెక్టర్ సీరియస్ అయినట్లుగా తెలిసింది. అయితే వారం రోజులుగా సెలవుపై ఉన్న డీఎస్వో జిల్లా ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, వారి అనుమతి తీసుకోకుండానే వెళ్లడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించా రు. క్రమశిక్షణరాహిత్యంగా వ్యవహరిస్తున్న ఆయనను సరెండర్ చేశారు. కాగా రేషన్కార్డుల జారీ సమయంలో డీఎస్వో కార్యాలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూ డబ్బులు వసూలు చేసిన విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లింది. దీంతో అప్పట్లోనే ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ తీవ్రంగా మందలించారు. ఈ నేపథ్యంలో ఆయనను సరెండర్ చేయడంపై సివిల్ సప్లైతో పాటు అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా ఇన్చార్జి డీఎస్వోగా ఏఎస్వో నందినికి బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆమె సోమవారం కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బాధ్యతలు చేపట్టారు. -
బెస్ట్ కాదు.. వరస్ట్!
కైలాస్నగర్/ఆదిలాబాద్రూరల్/ఉట్నూర్రూరల్: తమ పిల్లలను చదువుకు దూరం చేయవద్దని కోరు తూ జిల్లాలో బెస్ట్ అవలేబుల్ స్కూల్ (బీఏఎస్) వి ద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్, ఐటీడీఏ కార్యాలయం ఎదుట వే ర్వేరుగా ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కుమురంభీంచౌక్ చౌక్ నుంచి తమ పిల్లలతో కలిసి కలెక్టరేట్ వరకు ర్యాలీగా చేరుకున్నారు. అక్కడి ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేశారు. అనంతరం సమావేశ మందిరం వద్దకు చేరుకుని గంట పాటు నిరసనకు దిగారు. ప్రజావాణి అనంతరం వారి వద్దకు వచ్చిన కలెక్టర్కు తమ గోడును నివేదించారు. ప్రభుత్వం మూడేళ్లుగా బీఏఎస్ విద్యార్థుల ఫీజులు విడుదల చేయడం లేదన్నారు. దీంతో దసరా సెలవులకు ఇంటికి వచ్చిన పిల్లలను ఆయా యాజమాన్యాలు బడిలోకి రానివ్వ డం లేదన్నారు. విద్యార్థులను ఆయా పాఠశాలలకు పంపించి చదువుకునే అవకాశం కల్పించాలని లే దంటే గురుకులాలు, మోడల్ స్కూల్స్లో అడ్మిషన్లు ఇవ్వాలని విన్నవించారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా స్పందిస్తూ సంబంధిత యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసి పిల్లలను బడుల్లో కొనసాగించేలా చూస్తామన్నారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి సైతం తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. అలాగే ఉట్నూర్లోని ఐటీడీఏ పీ వో కార్యాలయం ఎదుట గిరిజన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. అక్కడికి చేరుకున్న పీవో ఖుష్బూ గుప్తా తల్లిదండ్రులతో మాట్లాడి సముదాయించారు. తగు చర్యలు తీసుకుంటామని పేర్కొనడంతో వారు ఆందోళన విరమించారు. -
4 కి.మీ కాలినడకన వెళ్లి.. వైద్యం అందించి
ఆదిలాబాద్రూరల్: మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన మంగ్లీ వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేదు. మండల వైద్యాధికారి సర్ఫరాజ్, సిబ్బంది 4 కి.మీ కాలినడకన వెళ్లి శనివారం గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్యపరీక్షలు చేసి మాత్రలు అందజేశారు. పిల్లలకు ఇమ్యూనైజేషన్ టీకాలు వేశారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి సర్ఫరాజ్ మాట్లాడుతూ గ్రామంలో 11 ఇళ్లు ఉండగా, 64 మంది జనాభా ఉన్నారని పేర్కొన్నారు. అనారోగ్యం బారినపడితే వెంటనే పీహెచ్సీకి, రిమ్స్కు వెళ్లి చికిత్స చేసుకోవాలన్నారు. అంకోలి పీహెచ్సీ హెల్త్ సూపర్ వైజర్ బొమ్మేత సుభాష్, హెల్త్ అసిస్టెంట్స్ వేణుతాయి, పవర్ ప్రేమ్సింగ్, రాథోడ్ నారాయణ, ఆశకార్యకర్తలు సుమిత్ర, రుక్మిణి, దుర్పత బాయి, గ్రామస్తులు ఉన్నారు. -
గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురి అరెస్ట్
మందమర్రిరూరల్: గంజాయి రవాణా చేస్తున్న ము గ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం మందమర్రి పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సై రాజశేఖర్ వివరాలు వెల్లడించారు. కాగజ్నగర్ నుంచి గంజాయి తీసుకువస్తున్నారనే సమాచారంతో జాతీయ రహదారి టోల్గోట్ వద్ద తనిఖీ చేపట్టారు. స్కూటీపై వచ్చిన ముగ్గురిని తనిఖీ చేయగా 100 గ్రాముల గంజాయి లభించింది. గంజాయిని స్వాధీనం చేసుకుని స్కూటీతోపాటు వేల్పుల వర్శిత్ (పొన్నారం), వేల్పుల రాహుల్ (ఆదిల్పేట్), మణిదీప్ (నస్పూర్)ను అదుపులో తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
గురుకులాలపై ఫోకస్
ఆదిలాబాద్టౌన్: సాంఘిక సంక్షేమ గురుకులాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతుంది. గురుకులాల సొసైటీ కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆ దిశగా ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి పది జి ల్లాలకు పది మంది ప్రత్యేకాధికారులను నియమించారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ కు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ సెక్రెటరీ పీఎస్ఆర్.శర్మ నియమితులయ్యారు. రెండు రోజు ల క్రితం జిల్లాకు వచ్చిన ఆయన ఉమ్మడి జిల్లా పరి ధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల ప్రి న్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆదేశించారు. ఫుడ్ పాయిజన్, విద్యార్థుల రక్షణపరంగా చర్యలతో పాటు మెనూ ప్రకారం భోజనం అందించడం, పెండింగ్ అద్దెబిల్లులు వంటి సమస్యల పరిష్కారం కోసం అనుసరించాల్సిన కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. జిల్లాలో.. జిల్లాలో నాలుగు సాంఘిక సంక్షేమ గురుకుల వి ద్యాసంస్థలున్నాయి. పట్టణంలో బాలికల పాఠశా ల, జూనియర్ కళాశాల అలాగే బాలికల డిగ్రీ కళా శాల, ఇచ్చోడలో బాలుర కళాశాల, బోథ్లో బాలిక ల డిగ్రీ కళాశాల ఉంది. ఒక్కో పాఠశాల/కళాశాలలో 640 మంది విద్యార్థులు చదువుతున్నారు. డిగ్రీ కళాశాలలో 480 మంది చదువుతున్నారు. జిల్లాలో మొత్తం 2,400 మంది విద్యార్థులున్నారు. సమస్యల పరిష్కారంపై దృష్టి ఇటీవల గురుకుల సొసైటీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు స్వీకరించిన కృష్ణ ఆదిత్య సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన బో ర్డులో పలు సంస్కరణలు తీసుకువచ్చారు. తాజా గా గురుకులాలపై ఫోకస్ పెట్టారు. ఈ ఏడాది మే నుంచి అద్దె భవనాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో యజమానులు భవనాలను ఖాళీ చేయాలని ప్రిన్సిపాళ్లపై ఒత్తిడి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. దీనిపై దృష్టి సారించిన ఆయన కళాశాలల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో 50మంది వరకు పార్ట్ టైం టీచర్లు, లెక్చరర్స్గా పనిచేస్తున్నారు. అలాగే 30 మంది సిబ్బంది ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన విధులు నిర్వహిస్తున్నారు. మూడు నెలలుగా వీరికి వేతనాలు రావడం లేదు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని సదరు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం.. గురుకుల కళాశాలల్లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి నుంచే ప్రత్యేక తరగతుల నిర్వహణపై ఫోకస్ పెట్టా రు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కొత్త మెనూ ప్ర కారం విద్యార్థులకు పౌష్టికాహరంతో కూడిన నాణ్య మైన భోజనం అందించే దిశగానూ దృష్టి సారిస్తున్నారు. ఈ విషయమై గురుకులాల జోనల్ అధికారి అరుణ కుమారిని సంప్రదించగా.. ఇటీవల మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో ఉమ్మడి జిల్లా ప్రిన్సి పాళ్లతో ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి సమావేశం నిర్వహించారని తెలిపారు. పలు అంశాలపై వివరాలు సేకరించినట్లు పేర్కొన్నారు. అలాగే సమస్యలపై ఆరా తీసినట్లుగా వివరించారు. -
‘ఉపాధి’ గ్రామ సభలకు వేళాయె
కై లాస్నగర్: గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు వంద రోజులు పని కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను చేపట్టాల్సిన పనులు గుర్తించేందుకు గ్రామసభల నిర్వహణకు సన్నద్ధమైంది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు నిర్వహించనున్నారు. ప్రజాభిష్టం మేరకే పనుల ఎంపిక.. ఉపాధి పనుల్లో ప్రజలు, రైతులను భాగస్వాముల ను చేయనున్నారు. వారు కోరిన పనులు కల్పించేలా ప్రభుత్వం ఏటా గ్రామసభలు నిర్వహిస్తోంది. ఈనెల 2నుంచి నిర్వహించాల్సి ఉండగా స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా చేపట్టలేదు. తాజాగా కోడ్ ఎత్తివేయడంతో జిల్లాలో రేపటి నుంచి షురూ కానున్నాయి. ఎంపీడీవోలు, ఏపీవోలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు హాజరై రానున్న ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి పనులు కల్పించాలనే దానిపై గ్రా మస్తులతో చర్చిస్తారు. గుర్తించిన పనులను కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు చదివి వినిపిస్తారు. తర్వాత ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు వాటికి సంబంధించిన అంచనాలు తయారు చేస్తారు. జాబ్కార్డుల ఆధారంగా పనులను నిర్ణయిస్తారు. పంచాయతీల వారీగా నివేదికలను మండల, జిల్లా పరిషత్లకు పంపించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం వాటికి పాలకవర్గాలు లేనందున కలెక్టర్కు నివేదిస్తారు. కలెక్టర్ వాటిని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి ప్రతిపాదిస్తారు. అక్కడి నుంచి అనుమతి వచ్చాక జిల్లాలో ఆయా పనులు చేపట్టి కూలీలకు ఉపాధి కల్పిస్తారు. భూగర్భజలాల పెంపు, పండ్ల తోటల పనులకు ప్రాధాన్యం వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టే ఉపాధి హామీ పనుల్లో ప్రధానంగా భూగర్భజలాలు పెంపొందించడంతో పాటు వ్యవసాయపరంగా రైతాంగానికి మేలు చేకూర్చే పనులకు ప్రాధాన్యతనివ్వాలని అధి కారులు నిర్ణయించారు. నీటి సంరక్షణకు సంబంధించి కుంటలు, చిన్నపాటి చెరువులు, స్టోన్ బండింగ్, గులకరాళ్ల ఏరివేత, పశువులు, మేకలు, గొర్రెల షెడ్ల నిర్మాణం, పండ్ల తోటల పెంపకం, రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకం, నర్సరీల ఏర్పాటు రైతులు పొలాల్లోకి వెళ్లేందుకు వీలుగా మట్టి రోడ్ల నిర్మాణం వంటి పనులను చేపట్టనున్నారు. వీటితో పాటు రైతులకు అదనపు ఆదాయం చేకూర్చేలా పండ్లతోటలు, ఈత వనాలను పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. మార్కెట్లో డిమాండ్ కలిగిన మామిడి, కొబ్బరి, సీతాఫల్, జామా వంటి పండ్లతోటల పెంపకంతో పాటు నీలగిరి చెట్ల పెంపకానికి సంబంధించి అంచనాలను రూపొందించనున్నారు. వీటితో పాటు గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు వీలుగా వెదురు మొక్కల పెంపకం, అలాగే పాడి ఉత్పత్తి పెంచేలా పశువుల పాకల నిర్మాణాలకు సైతం ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వంద రోజులు పని కల్పించడమే లక్ష్యం వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2026–27)గాను ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో ఎలాంటి పనులు చేపట్టాలనే దానిపై చర్చించి ప్రణాళికను సిద్ధం చేయాల్సి ఉంది. సోమవారం నుంచి జిల్లావ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించనున్నాం. ప్రజలకు అవగాహన కల్పించి ఎలాటి పనులు చేపట్టాలనే దానిపై వారి అభిప్రాయాలు తీసుకుంటాం. వాటి ఆధారంగా ప్రతీ కూలీకి వంద రోజుల పాటు పని కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తాం. – కుటుంబరావు, అదనపు డీఆర్డీవో -
రైతుల స్వయం సమృద్ధికి కేంద్రం కృషి
బతుకమ్మ సంబురంబతుకమ్మతో చిన్నారి జిల్లాలో బతుకమ్మ సంబరాలు కొనసాగుతున్నాయి. తాంసి, తలమడుగు మండలాల్లో శనివారం పూల వేడుకలు అంబరా న్నంటాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను గద్దెల వద్ద ఉంచి ఉయ్యాల పాటల నడుమ ఆడబిడ్డలు చప్పట్లతో సందడి చేశారు. అనంతరం డప్పుచప్పుళ్ల నడుమ ఊరేగింపుగా బయలుదేరి పోయిరా బతుకమ్మ అంటూ గంగమ్మ ఒడికి చేర్చారు. పూల సింగిడిని సమీపంలోని చెరువులు, వాగుల్లో నిమజ్జనం చేశారు. తాంసి, హస్నాపూర్, పొన్నారి గ్రామాల్లో వీడీసీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. తాంసిలోని హనుమాన్ ఆలయం వద్ద మహిళలు సామూహికంగా ఆడి అలరించారు. తలమడుగు మండలంలోని కజ్జర్ల, దేవాపూర్లో నిర్వహించిన వేడుకల్లో ఆడబిడ్డలు భారీగా పాల్గొన్నారు. – తాంసి/తలమడుగు సాక్షి,ఆదిలాబాద్: కాంగ్రెస్లో మళ్లీ డీసీసీ అధ్యక్షుడి నియామక వేడి మొదలైంది. ఏఐసీసీ నుంచి పరిశీలకుడు రానున్నారు. నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటించి అభిప్రాయ సేకరణ చేయనున్నారు. పీసీసీ ముఖ్య నేతలు ఆయనతో సమన్వయం చేయనున్నారు. నేడో, రేపో వారు జిల్లాకు రానున్నట్లు చెబుతున్నారు. గతంలో కూడా అనేక సార్లు డీసీసీ అధ్యక్షుడి నియామకం విషయంలో పార్టీలో ప్రక్రియ జరిగినప్పటికీ ముందడుగు పడకపోవడం గమనార్హం. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ నుంచి పరిశీలకుడి రాక ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి జిల్లాలో.. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం ఏఐసీసీ నుంచి 22 మందితో పరిశీలకులను నియమించారు. వారు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో సర్వేకోసం ఇప్పటికే పరిశీలకులు వచ్చేశారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో సర్వే కోసం ఏఐసీసీ నుంచి మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే అజయ్సింగ్ను నియమించారు. ఆయనతో పాటు పీసీసీ నుంచి రాజ్యసభ ఎంపీ అనిల్కుమార్ యాదవ్, పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, ప్రధాన కార్యదర్శులు గడ్డం చంద్రశేఖర్రెడ్డి, సీహెచ్.రాంభూపాల్ కోఆర్డినేషన్ చేయనున్నారు. కాగా ఈ రెండు జిల్లాల్లో వారు బ్లాక్స్థాయిలో కార్యకర్తలతో సమావేశమై అభిప్రాయ సేకరణ చేయనున్నారు. అంతే కాకుండా ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఐదు రోజుల పాటు ఇక్కడే ఉండి ఈ రెండు జిల్లాల్లో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో డీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో ప్రస్తుతం ప్రక్రియ గట్టిగానే సాగుతుందనే చర్చ వినిపిస్తోంది. ఆసక్తికరం.. కాంగ్రెస్లో ఏఐసీసీ నుంచి నేరుగా పరిశీలకులు రావడం, డీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో క్షేత్రస్థాయిలో పర్యటించనుండటంతో పార్టీలో ఇది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా బ్లాక్ కాంగ్రెస్ కార్యకర్తలను కలిసి వారి అభిప్రాయం సేకరించనుండటంతో ఇప్పుడు ఆశావహుల్లో టెన్షన్ కనిపిస్తోంది. కేవలం కార్యకర్తల నుంచే కాకుండా వ్యాపారులు, వివిధ కుల, ప్రజా సంఘాల నాయకులను కూడా కలిసి అభిప్రాయ సేకరణ చేయనున్నారని పార్టీలో ప్రచారం సాగుతోంది. దీంతో ఆశావహులు ఎవరినైనా మేనేజ్ చేసి తమ పేరును పరిశీలకుడి ముందు గట్టిగా చెప్పించాలనుకునే ప్రయత్నాలకు ఎక్కడ కూడా అవకాశాలు ఉండకపోవచ్చని చెప్పుకుంటున్నారు. ప్రధానంగా ఈ కమిటీలకు పార్టీలో ముందుగానే శిక్షణ ఇచ్చి అభిప్రాయ సేకరణ ఏ విధంగా చేపట్టాలని పార్టీ దిశానిర్దేశం చేసిందని పేర్కొంటున్నారు. దీంతోనే ఈ ప్రక్రియపై ఇప్పుడు పార్టీలో అందరి దృష్టి నెలకొంది. జిల్లా పరిశీలకుడిగా రానున్న అజయ్ సింగ్ ఆదిలాబాద్టౌన్: రైతులు స్వయం సమృద్ధి సాధించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని ఎంపీ గోడం నగేశ్ అన్నా రు. రూ.42 వేల కోట్లతో దేశ వ్యాప్తంగా చేపట్టిన ధన్ధాన్య పథకాన్ని ప్రధాని శనివారం వర్చువల్గా ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే శంకర్తో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. ప్రధానమంత్రి ప్రసంగాన్ని ఆలకించిన అనంతరం ప్రదర్శనలో ఉంచిన వివిధ రకాల విత్తనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. దేశంలోని రైతులు స్వయం సమృద్ధి సాధించేలా కేంద్ర ప్రభుత్వం ధన్ ధాన్య పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. సాంకేతికత ఉపయోగిస్తూ రైతులు తమ పంట దిగుబడులను ఎగుమతి చేసేలా తయారు చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కేవీకే ప్రొగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్.రాంగోపాల్వర్మ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్స్వామి, మార్కెటింగ్ అధికారి గజానంద్, ఉద్యాన అధికారి నర్సయ్య, కేవీకే శాస్త్రవేత్తలు రఘువీర్, సురేష్,శివచరణ్ తదితరులు పాల్గొన్నారు.దరఖాస్తుకు సిద్ధమవుతున్న ఆశావహులు.. ప్రధానంగా ఇది వరకే పీసీసీ దృష్టిలో ఉన్న జా బితాలోని పేర్ల ఆధారంగా ఏఐసీసీ పరిశీలకులు క్షేత్రస్థాయిలో సర్వే చేయనున్నారని చెబు తున్నారు. పదవీ ఆశిస్తున్న నేతలు కూడా పరి శీలకులకు దరఖాస్తులను అందించేందుకు సిద్ధ మవుతున్నారు.ప్రధానంగా ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్ష పదవిని ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గోక గణేశ్ రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు నరేష్ జాదవ్, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడె గజేందర్ ఆశిస్తున్నట్లుగా పార్టీలో ప్రచారం సాగుతుంది. తనకు అవకాశం ఇవ్వాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొ జ్జు కూడా దరఖాస్తు అందించేందుకు సిద్ధమవుతున్నారు. మాజీ ఎంపీ సోయం బాపూరావు కూడా డీసీసీ అధ్యక్ష పదవీని ఆశిస్తున్నారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష పీఠం కోసం కార్యకర్తలు ఎవరి పేరును సూచిస్తారనేది అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. -
ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు
బీసీ రిజర్వేషన్లపై కోర్టుల్లో కేసులు వేసి బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. సుధీర్ఘ పోరాటం తరువాత ప్రభుత్వం 42 శాతం రిజ ర్వేషన్లు కల్పిస్తే అడ్డుకో వడం సరికాదు. బీసీలకు పదవులు వస్తుంటే ఓ ర్వలేకపోతున్నారు. రాజకీయంగా అణిచివేసేందుకే ఇదంతా చేస్తున్నారు. మాకు రావాల్సిన వాటా దక్కే వరకు ఉద్యమిస్తాం. – కరిపే శ్రీనివాస్, వంజరి సంఘం అధ్యక్షుడు, బోథ్బీసీలు నష్టపోతున్నారు 23 శాతం రిజర్వేషన్తో బీసీలు రాజకీయంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవల ప్రభుత్వం 42 శాతం పెంచితే ఆనందపడ్డాం. జనాభాకు తగ్గట్టు ఫలాలు అందుతాయని ఆశపడ్డాం. కానీ కొందరు కోర్టులో కేసు వేసి మా నోటికాడ ముద్ద లాక్కున్నారు. జనాభా ప్రాతిపదికన మా వాటా మాకు దక్కాల్సిందే. – కలాల శ్రీనివాస్, బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి -
ఇంట్లో చోరీ
జైనథ్: మండలంలోని దీపాయిగూ డ గ్రా మంలో దు ర్ల రాజలింగు ఇంట్లో గుర్తుతెలి యని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. సమీప బంధువులు చనిపోవడతో రాజలింగు కుటుంబంతో కలిసి మూడురో జుల క్రితం ఊరికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన గుర్తుతెలియని వ ్యక్తులు ఇంటికి ఉన్న కిటికీలోంచి లోపలికి చొరబడ్డారు. బీరువా తలుపులు పగులగొట్టి మూ డు తులాల బంగారం, 25 వేల నగదును ఎత్తుకెళ్లారు. శనివారం స్థానికులు గమనించారు. వెంటనే అందించిన సమాచారంతో ఎస్సై గౌతమ్ పవర్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. డాగ్స్క్వాడ్ బృందంతో తనిఖీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బహుదూరపు బాటసారులు
లోకేశ్వరం: మండలంలోని రాజూర, వట్టోలి, ధర్మోర, కన్కపూర్ గ్రామాల గొర్రెల కాపరులు బహుదూరపు బాటసారులు. ఏడాదిలో మూడు నెలలు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో గొర్రెల మందతోపాటు మేత కోసం తిరుగుతూనే ఉంటారు. నిర్మల్ జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాన్ని అనుకుని ఉండటంతో ఇక్కడి గొర్రెలు, మేకల పెంపకందారుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఎస్సారెస్పీ నిండనంత వరకు వెనుకభాగం పశుగ్రాసం లభిస్తుండటంతో రోజూ ఉదయం, సాయంత్రం వరకు జీవా లను మేపుతుంటారు. ఏటా జూలై, ఆగస్టులో ఎస్సారెస్పీ నిండుకుండలా మారుతుంది. వెనుకభాగం నీటితో నిండి ఉంటుంది. దీంతో జీవా లకు గ్రాసం దొరకక వలస వెళ్లాల్సిన పరిస్థితి. వీరంతా మళ్లీ వరి నూర్పిడి పూర్తయ్యే వరకు దాదాపు మూడునెలలు ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లాలోని గుట్టలపై, నిజామాబాద్ జిల్లాలోని బా డ్సీ ప్రాంతాలకు వెళ్తారు. మండలాలకు చెందిన గొర్రెల కాపరులు బృందాలుగా ఏర్పడి మందలతో బయల్దేరుతారు. అడవిలో ఉంటూ వాటిని మేపుతూ అక్కడే వంట, భోజనాలు చేస్తారు. రాత్రి మందల వద్దే నిద్రిస్తారు. వంట సామగ్రి కోసం అక్కడి నుంచి కొందరు రావడమో, లేదంటే ఇక్కడి నుంచి వెళ్లేవారు వెంట తీసుకెళ్తారు. తరచూ ప్రమాదాలు సుదూర ప్రయాణం రోడ్డు మార్గంలో సాగడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాహనాలు ఢీకొని జీవాలు చనిపోతున్నాయి. ఇన్సూరెన్సు లేకపోవడంతో కాపరులు నష్టపోతున్నారు. ఇప్పటికై న పశుసంవర్థక శాఖ అధికారులు పట్టించుకుని జీవాలకు ఇన్సురెన్సు చేసేలా చర్యలు తీసుకోవాలి.పొలాల్లో గ్రాసం పెంచుకోవాలి జీవాలు, పశువుల యజమానులు వారి పంట పొలాల్లో గ్రాసం పెంచుకోవాలి. జీవాలు, పశువులకు ఇన్సురెన్సును చేయించుకోవాలి. గ్రామాల్లో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేయిస్తున్నాం. పశువైద్యుల సూచనలు పాటించాలి. – రాజేశ్వర్, నిర్మల్ పశుసంవర్థక శాఖ డెప్యూటీౖ డెరెక్టర్ఇదే వృత్తిని నమ్ముకున్నాం ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నాం. ఏడాదిలో మూడు నెలలు బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్నాం. ఒక్కో మందకు నలుగురు కాపలాగా ఉంటారు. గుట్ట ప్రాంతంలో జీవాలను మేపుతూ తిరుగుతాం. గొర్రెల కాపరులను ప్రభుత్వం పట్టించుకోవాలి. – బరిడే పోతన్న, రాజూర మేత దొరకక దూరప్రాంతాలకు ఎస్సారెస్పీ నిండితే జీవాలకు మేత దొరకడం కష్టమవుతుంది. మేత కోసం దూరప్రాంతాలకు జీవాలతో వెళ్తుంటాం. వంట సామగ్రి తీసుకెళ్తాం. అటవీప్రాంతాల్లో జీవాలను మేపుతున్నాం. – గీజాగంగాధర్, ధర్మోరపొలాల్లోనే నిద్రమండలంలోని రాజూర గ్రామానికి చెందిన 20 మంది కాపరులు, వట్టోలిలోని 10 కురుమ యాదవ, కుటుంబాల వారు మూడు నెలలు ఇంటికి దూరంగా ఉంటున్నారు. వందలాది కిలోమీటర్లు తిరుగుతూ ఎక్కడ చీకటిపడితే అక్కడే పొలాల్లో నిద్రిస్తున్నారు. సరైన భోజనం, నీటి వసతి లేక ఇబ్బంది పడుతున్నారు. ఒక్కోసారి జీవాలకు సైతం తాగునీరు లభించని పరిస్థితి. వాగులు, వంకలు అందుబాటులో ఉంటేనే నీరు తాగిస్తున్నారు. తమ గ్రామాల్లో మేత దొరకగానే తిరుగుపయనమతారు.జీవాలు సంఖ్య గొర్రెలు 3.50 లక్షలు మేకలు 1.25 లక్షలు నిర్మల్ జిల్లాలో.. వారంతా తమ కులవృత్తి అయిన గొర్రెల పెంపకాన్ని నమ్ముకొని జీవనం సాగించే యాదవులు. ఉన్న ఊరిలో జీవాలకు గ్రాసం దొరకకపోవడంతో పెంపకందారులు బృందంగా ఏర్పడి ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఏడాదిలో మూడు నెలలు అడవిలో ఉంటూ వండుకొని తింటారు. తమ జీవనోపాధితోపాటు జీవాల మేత కోసం వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్న బాటసారులపై ప్రత్యేక కథనం. -
క్రీడలతో ఒత్తిడి దూరం
నిర్మల్టౌన్: అటవీ ఉద్యోగుల్లో ఒత్తిడిని దూరం చేసేందుకు క్రీడలు నిర్వహిస్తున్నామని రాష్ట్రఅటవీశాఖ చీఫ్ కమిషనర్ జి.చంద్రశేఖర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో అటవీశాఖ ఆధ్వర్యంలో శనివారం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహించారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్, వాకింగ్, చెస్, లాంగ్ జంప్, షాట్ఫుట్, క్యారమ్, జాలిన్ త్రో, తదితర క్రీడాపోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీశాఖ ఉద్యోగులకు మానసికోల్లాసం, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం కోసం పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలకు సంబంధించిన సుమారు 350 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఆదివారం వరకు పోటీలు కొనసాగనున్నాయి. కార్యక్రమంలో బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ శర్వానన్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ డీఎఫ్ఓలు వికాస్ మీనా, రేవంత్ చంద్ర, నాగిని భాను, అధికారులు కుమారి చిన్న, సుధాకర్, శివకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
క్రీడా సంబురం
రెబ్బెన: క్రీడా సంబురం మొదలైంది. రెండు రోజు ల పాటు జరిగే 11వ రాష్ట్రస్థాయి జూనియర్స్, సబ్ జూనియర్స్ సెపక్తక్రా పోటీలకు మండలంలోని గోలేటి టౌన్షిప్లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానం వేదికై ంది. రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లా ల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు, కోచ్లు, క్రీడాఽభిమానులతో మైదానం కోలాహలంగా మారింది. శనివారం ముఖ్య అతిథిగా హాజరైన బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్రెడ్డి క్రీడా పతకాలను ఆవిష్కరించి క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆపై క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. సుమారు 200 మంది క్రీడాకారులు, 50 మంది కోచ్లు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలకు గోలేటి ప్రాంతం పుట్టినిల్లులాంటిదని అన్నారు. ఈ ప్రాంతానికి చెందిన ఎంతో మంది అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పోటీల్లో రాణిస్తూ మంచి గుర్తింపు పొందారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలను గోలేటిలో నిర్వహించడం అభినందనీయమన్నారు. సెపక్తక్రా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాల్గొన్నారు. ఫస్ట్ప్లేస్ సాధిస్తాం సొంత జిల్లాలో జరుగుతున్న ఈ పోటీల్లో ఫస్ట్ప్లేస్ సాధిస్తామనే నమ్మకం ఉంది. దానికి తగినట్లుగా ఆటతీరును ప్రదర్శిస్తాం. ఇప్పటి వరకు మూడు సార్లు స్టేట్ మీట్ను ఆడాను. త్వరలో గోవాలో జరగబోయే నేషనల్స్ పోటీల్లో పాల్గొనబోతున్నా. – అభినయ రమ్యశ్రీ, ఆదిలాబాద్ సెపక్తక్రా అంటే ఇష్టం నాకు సెపక్తక్రా అంటే ఎంతో ఇష్టం. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నా. 8వ తరగతి నుంచి ఆడటం నేర్చుకున్నా. ఆటపై ఉన్న ఇష్టంతో పోటీల్లో రాణిస్తున్నా. రాష్ట్రస్థాయి పోటీల్లో నాలుగు బంగారు, ఒకసారి వెండి పతకం సాధించాను. – పి.అభినవ్ రాణా, రంగారెడ్డి ఆత్మవిశ్వాసంతో ఆడుతాం జిల్లా జట్టు క్రీడాకారులు ఆత్మ విశ్వాసంతో పోటీల్లో దిగుతున్నాం. ఇప్పటి వరకు ఒకసారి నేషనల్స్, మూడుసార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ఒకసారి మూడోస్థానంలో సాధించాను. ఈసారి బంగారు పతకం సాధిస్తాను. – కె.రాంచరణ్, ఆదిలాబాద్ -
మద్యం షాపుల్లో చోరీ కేసు ఛేదింపు
భైంసాటౌన్:ముధోల్, తానూరులోని మద్యం షాపుల్లో మందు బాటిళ్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. పట్టణంలోని పోలీస్స్టేషన్లో శనివారం అదనపు ఎస్పీ అవినాష్కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తాడ్బిలోలికి చెందిన యాపరి వినోద్ గ్రామంలో బెల్టుషాపు నిర్వహిస్తున్నాడు. తన బెల్టుదుకాణంలో మ ద్యం విక్రయం కోసం వైన్స్ షాపుల్లో దొంగతనాలను ఎంచుకున్నాడు. ఇందుకు తన సొంత జిల్లాలో చోరీ చేస్తే దొరికిపోతానని, నిర్మల్ జిల్లాపై ఫోకస్ చేశాడు. తన బెల్టుదుకాణం వద్ద మద్యం తాగేందుకు రెగ్యులర్గా వచ్చే బేగరి రోహిత్, నీరడి శ్రావణ్కుమార్, ఖదులూరి సాయి, ఆదిత్యగౌడ్, సట్ల నవీన్, దిలీప్తో జట్టు కట్టాడు. గత మే నెలలో ముధోల్లోని రాజరాజేశ్వర వైన్స్ షాపు వెనుక రేకులు తొలగించి మందు బాటిళ్లు చోరీకి పాల్పడ్డాడు. తానూరులోని శ్రీ లక్ష్మి వైన్స్షాపులోనూ అదే తరహాలో చోరీ చేశాడు. ఇలా చోరీ చేసిన మందు బాటిళ్లను తన బెల్టుదుకాణంలో విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. ఇటీవల మరోమారు అదే తరహాలో చోరీ కోసం ముధోల్కు రాగా, అనుమానించిన పోలీసులు వారిని అదుపులో తీసుకున్నారు. ముధోల్లో రూ.2.50 లక్షలు, తానూరులోని వైన్స్ షాప్ల్లో రూ.80 వేల మద్యం బాటిళ్లను చోరీ చేసినట్లు విచారణలో గుర్తించామన్నారు. నిందితుడి బ్యాంక్ అకౌంట్ను ఫ్రీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. సమావేశంలో ముధోల్ సీఐ మల్లేశ్, ఎస్సైలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు బలవన్మరణం చెందారు. బావిలో దూకి ఒకరు ఆత్మహత్య చేసుకోగా, మద్యానికి బానిసైన యువకుడు, వెన్నునొప్పితో బాధ పడుతున్న వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకున్నారు. బావిలో దూకి ఒకరు.. లక్సెట్టిపేట: బావిలో దూకి ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. దండేపల్లి మండలం కొర్విచెల్మ గ్రామానికి చెందిన సౌటేపల్లి మౌళి (32), సంజన దంపతులు. వీరికి పది నెలల కుమారుడు ఉన్నాడు. మౌళి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం ఉదయం వాకింగ్కు వెళ్తున్నానని భార్యతో చెప్పి వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు వెతకుతుండగా లక్సెట్టిపేట మండలం దౌడపల్లి శివారులోని వ్యవసాయ బావి ఒడ్డున చెప్పులు, సెల్ఫోన్ కనిపించాయి. బావిలో గాలించగా మృతదేహం లభించింది. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని రెండో ఎస్సై రామయ్య పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడవచ్చని తండ్రి లచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. ఆయన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని యువకుడు.. ఆదిలాబాద్టౌన్: మద్యానికి బానిసైన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్ సీఐ కె.నాగరాజు కథనం ప్రకారం..పట్టణంలోని తాటిగూడకు చెందిన కుమ్ర రుషికేష్ (24) మద్యానికి బానిసయ్యాడు. కుటుంబీకులు మందలించడంతో మనస్తాపం చెంది శుక్రవారం రాత్రి ఇంటి ఎదుట ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. తండ్రి ప్రభు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. జీవితంపై విరక్తితో వ్యక్తి..నర్సాపూర్(జి): వెన్నునొప్పితో బాధపడుతున్న వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకుని ఆత్మహ త్య చేసుకున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. ఆయన కథనం ప్ర కారం.. మండల కేంద్రానికి చెందిన బొల్లి నర్సయ్య (45), లక్ష్మి దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నర్సయ్య రెండేళ్లుగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఆస్పత్రుల్లో చికిత్స పొందిన నయంకాలేదు. ఈక్రమంలో జీవి తంపై విరక్తితో శనివారం ఇంట్లో ఉరేసుకున్నాడు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ ఆట భిన్నమైనది
సెపక్తక్రా ఆట భిన్నమైనది. కేవలం కాళ్ల సహాయంతోనే ఆడాల్సి ఉంటుంది. నాలుగేళ్ల నుంచి ఆడుతున్నా. ఒకసారి నేషనల్స్కు సెలెక్ట్ అయ్యాను. ఇప్పటి వరకు మూడుసార్లు స్టేట్మీట్లో ఆడితే ఒకసారి గోల్డ్మెడల్ సాధించాను. – నిఖిల్, వరంగల్ బంగారు పతకం సాధిస్తా మూడేళ్లుగా సెపక్తక్రా ఆడుతున్నా. ఒకసారి నేషనల్స్లో, రెండు సార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. రాష్ట్ర స్థాయి పోటీల్లో రెండు సిల్వర్ మెడల్స్ సాధించాను. ఈసారి బంగారు పతకం సాధిస్తాను. – ఆర్.విష్ణువర్థన్, మహబూబ్నగర్ గతేడాది నుంచే ఆడుతున్నా గతేడాది నుంచే సెపక్తక్రా మొదలుపెట్టాను. కోచ్, క్రీడాకారుల ప్రో త్సాహం ఇస్తున్నారు. గ తంలో నేషనల్ పోటీల్లో పాల్గొన్నా ప్లేస్ రా లేదు. రాష్ట్ర స్థాయి పోటీల్లో మూడోస్థానం సాధించాను. ఈసారి ఫస్ట్ ప్లేస్ కోసం ప్రయత్నిస్తున్నా. – సింగసాని అశ్విత, కరీంనగర్ -
జిల్లాకు చేరిన భారత్ అన్యుశుద్ధి యాత్ర
కై లాస్నగర్: దేశంలోని ప్రతి వ్యక్తికి శుద్ధమైన ఆహారం అందాలనే ఉద్దేశంతో గౌరవ్ త్యాగి అనే యువకుడు చేపట్టిన భారత్ అన్యుశుద్ధి యాత్ర శనివారం జిల్లా కేంద్రానికి చేరింది. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని హపూర్ జిల్లా హైదర్పూర్కు చెందిన త్యాగి జూన్ 26న శ్రీనగర్లోని లాలౌచౌక్ నుంచి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టారు. బాల్య స్నేహితులు రాజత్ భారతి, రియాజ్తో కలిసి ప్రతీరోజుకు 25 నుంచి 30 కి.మీ పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటివరకు 12 రాష్ట్రాల్లో పాదయాత్ర పూర్తి చేసిన ఆయన మహారాష్ట్ర మీదుగా జిల్లాకు చేరుకున్నారు. పాఠశాల విద్యార్థులు, గృహిణిలు, రైతులను కలుస్తూ ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు శనివారం అవగాహన కల్పించారు. ఇప్పటివరకు 50 వేల మంది చిన్నారులను కలిసి జంక్ఫుడ్ తినొద్దని ప్రతిజ్ఞచేయించినట్లు తెలిపారు. పోకిరీలకు కౌన్సెలింగ్మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని బస్టాండ్, రైల్వేస్టేషన్, రద్దీ ప్రాంతాలు, విద్యాసంస్థల వద్ద షీటీమ్ పోలీసులు మఫ్టీలో ఉండి డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద, మినీ బస్టాండ్ వద్ద శనివారం నలుగురు పోకిరీ యువకులను అ దుపులో తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. షీ టీమ్ ఎస్సై ఉషారాణి, పోలీసులు శ్రావణ్కుమార్, శ్రీలత, సిబ్బంది పాల్గొన్నారు. -
లక్ష్మీనారాయణుడిపై సూర్యకిరణాలు
జైనథ్: మండల కేంద్రంలోని ప్ర సిద్ధి చెందిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఆదివా రం నుంచి స్వా మివారి మూలవిరాట్టుపై సూ ర్యకిరణాలు ప డుతున్నాయి. స్వామివారి పా దాల నుంచి వి గ్రహం మొత్తం తాకుతూ వెళ్తుంటాయి. సూర్య కిరణాలు తాకుతున్న సమయంలో స్వామివారు సువర్ణ ఆకృతితో భక్తులకు దర్శనమిస్తారు. ఈ సమయంలో స్వామి వారిని దర్శించుకుంటే సకల దోషాలతో పాటు చర్మవ్యాధులు తొలగుతాయని భక్తుల నమ్మ కం. కుటుంబ సభ్యుల్లో సుఖఃశాంతులు కలు గుతాయని విశ్వాసం. కాగా, అక్టోబర్, ఫిబ్రవరి నెలల్లో ఏటా రెండుసార్లు విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకుతూ ఉంటాయి. -
ప్లానింగ్ పక్కాగా..
కై లాస్నగర్: ఉపాఽధిహామీ పథకం అమలులో అక్రమాలను కట్టడి చేసేందుకు కేంద్రం అనేక సంస్కరణలు తీసుకువస్తోంది. తాజాగా ఒకేచోట పనులు చేపట్టడానికి ఆస్కారం లేకుండా పనుల ప్లానింగ్ను పక్కాగా అంచనా వేసేందుకు యుక్తధార జియో స్పెషియల్ ప్లానింగ్ పోర్టల్ను అందుబాటులోకి తె చ్చింది. భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) భువన్ పోర్టల్ ఆధారంగా అధికారులు పనులను ఆన్లైన్లో గుర్తించనున్నారు. అంచనాల తయారీ నుంచి పనుల మంజూరు, బిల్లుల చెల్లింపు లాంటి పనులన్నీ ఇక నుంచి ఈ పోర్టల్ ద్వారానే జరగనున్నాయి. దీంతో అక్రమాలకు పూర్తిగా చెక్పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అక్రమాలకు తావు లేకుండా.. ఉపాధిహామీలో కొన్నిచోట్ల పనులు చేయకున్నా చే సినట్లు రికార్డులు నమోదు చేసి క్షేత్రస్థాయిలో కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారు. సో షల్ ఆడిట్లోనూ ఇలాంటివి బయటపడుతున్నా యి. ఇందుకు తావులేకుండా యుక్తధార పోర్టల్ తో డ్పడనుంది. గ్రామాల్లో పనులు చేపట్టే ప్రాంతాల ను ఈ యాప్లో ఆన్లైన్ ద్వారా లైవ్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇస్రో భువన్ పోర్టల్ ద్వారా చేపట్టనుండగా ఇదివరకు ఆ ప్రాంతంలో పనులు చే పట్టారా.. పనులు చేసేందుకు ఆ ప్రాంతం అనుకూలంగా ఉందా.. లేదా? అనే వివరాలు చెప్పడంతో పాటు ఆ ప్రాంతం ఫొటోలనూ ప్రత్యక్షంగా చూపిస్తుంది. దీంతో పనులు చేపట్టే ప్రాంతాలనే ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాంతాలను గుర్తించే ప నిలో టెక్నికల్ అసిస్టెంట్లు నిమగ్నమయ్యారు. ఏ వి ధంగా పనుల అంచనాలు గుర్తించాలనేదానిపై ఇది వరకే అధికారులు వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప నులు మంజూరయ్యాక నిర్దేశిత ప్రాంతంలోనే పనులు చేయాల్సి ఉంటుంది. పనులు చేయకముందు ఒకసారి, 60శాతం పనులు పూర్తయ్యాక, 90 నుంచి వంద శాతం పనులు పూర్తయ్యాక ఇలా మూడుసార్లు ఆ ప్రాంతం ఫొటోలు తీసుకుంటారు. దాన్ని నిర్ధారించాకే కూలీలకు బిల్లులు మంజూరవుతాయి. గ్రామానికో లాగిన్ ఐడీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో టెక్నికల్ అసిస్టెంట్లు జిల్లాలో ఎలాంటి పనులు చేపట్టాలో గుర్తించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతీ గ్రామానికో లాగిన్ ఐడీని క్రియేట్ చేశారు. వాటి ఆధారంగా యుక్తధార పోర్టల్లో పనులు చేపట్టే ప్రాంతాలను వారు నమో దు చేయనున్నారు. ఈ ప్రక్రియ సోమవారం నుంచి మొదలయ్యే అవకాశమున్నట్లు అధికారులు చెబు తున్నారు. గ్రామానికి సంబంధించి ఉపాధి పనులకు హాజరైన కూలీల మూడేళ్ల వివరాలు తీసుకుంటారు. అందులో సంవత్సరం వారీగా ఎంతమంది పనులకు వచ్చారనే వివరాలను యావరేజ్గా తీసుకుని చేపట్టాల్సిన పనులు, మెటీరియల్ కాంపొనెంట్ను కలిపి లేబర్ బడ్జెట్ ప్రణాళికను సిద్ధం చేస్తా రు. ఈ వివరాల ఆధారంగా పనులు మంజూరు చే యడంతో పాటు బడ్జెట్ కేటాయింపులు, కూలీలకు బిల్లుల చెల్లింపులు తదితర పనులన్నీ ఇక నుంచి ఈ పోర్టల్ ద్వారానే చేపట్టనున్నారు. నేరుగా కేంద్ర మే వీటిని పర్యవేక్షించనుంది. ఫలితంగా రాష్ట్ర ప్రమేయం తగ్గి అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. 17 గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్ట్గా.. యుక్తధార పోర్టల్ను అమలు చేసేందుకు పైలెట్ ప్రాజెక్ట్ కింద గతేడాది మండలానికో గ్రామం చొ ప్పున జిల్లాలోని 17 గ్రామాలను ఎంపిక చేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలో అంకాపూర్, బేల మండల కేంద్రం, జైనథ్లో నిరాల, తలమడుగులో కుచులాపూర్, తాంసిలో జామిడి, నార్నూర్లో గుంజాల, ఇంద్రవెల్లిలో దేవాపూర్, గుడిహత్నూర్లో శంభుగూడ, ఇచ్చోడలో బోరిగామ, బజార్హత్నూర్లో దహెగాం, బోథ్లో కౌట, ఉట్నూర్లో ధన్పూర్, నేరడిగొండలో కుంటాల–కే, భీంపూర్లో మర్కగూడ, గాదిగూడలో పర్సువాడ (కే), మావలలో వాగాపూర్, సిరికొండలో రిమ్మ గ్రామాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఆయాచోట్ల ఈ విధానం విజయవంతం కావడంతో ప్రస్తుతం ప్రతీ గ్రామంలో దీనిని అమలు చేయనున్నారు. పారదర్శకత పెంచేందుకే.. ఉపాఽధిహామీ పనుల్లో పారదర్శకత పెంచాలనే ఉద్దేశంతోనే కేంద్రం యుక్తధార పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. గ్రామ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా పనులు చేపట్టేందుకు అవకాశం ఉందా.. అనేదాన్ని శాటిలైట్ ద్వారా గుర్తించి ప్రాంతాలను ఎంపిక చేయనున్నాం. గతంలో కొండ ప్రాంతాల్లో ఇంకుడుగుంతలు, ఫాంపాండ్స్ లాంటి నిర్మాణాలు చేపట్టారు. అలాంటి అవకాశం లేకుండా ఎత్తు, పల్లాలను గుర్తించి పనులు చేసేందుకు వాస్తవంగా అవకాశం ఉందా.. అనే దాన్ని గుర్తించేందుకు ఈ విధానం తోడ్పడుతుంది. – కుటుంబరావు, అడిషనల్ డీఆర్డీవో -
‘కేంద్ర పథకాలతో ప్రయోజనం శూన్యం’
ఆదిలాబాద్టౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ పథకాలతో రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న విమర్శించారు. ఆదివా రం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రైతు వ్యతిరేక విధానాలతో విఫలమైన మోదీ ప్రభుత్వం ఇప్పుడు పథకాల పే ర్లు మార్చి మళ్లీ రైతులను మోసం చేస్తోందని ఆరో పించారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు లబ్ధిదా రుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో మాత్రం రైతుల సంఖ్య 59లక్షల నుంచి 33లక్షలకు పడిపోయిందని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి ధన్, ధాన్య కృషి యోజనలో జిల్లాను చేర్చకపోవడం స్థానిక బీజేపీ ప్రజాప్రతినిధుల వైఫల్యమని విమర్శించారు. వరదలతో పంట నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు పరిహారం ఇవ్వకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ఎరువులు, విత్తనాలు, మందులపై సబ్సిడీ తగ్గించి, ధరలు పెంచు తూ రైతుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, నాయకులు కుమ్రా రాజు, గంగయ్య, ధమ్మపాల్, కనక రమణ, శుక్లల్, అశోక్, భూమన్న తదితరులున్నారు. -
పెద్దగా ఒరిగేదేం ఉండదు
జిల్లాకు ముగ్గుర్ని ఎంపిక చేసి విదేశాలకు పంపడం వల్ల ఇక్కడి విద్యావిధానంలో పెద్దగా ప్రయోజనాలేం ఉండకపోవచ్చు. మన దేశంలోనే వివిధ రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న విద్యాబోధన ప్రక్రియలు అధ్యయనం చేయడం మేలు. ఆయా దేశాల్లో సామాజిక ఆర్థిక కోణాలు మన దేశానికి భిన్నంగా ఉంటాయి. కాబట్టి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడి పొరుగు రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేయడం సమంజసంగా ఉంటుంది. – దాసరి శంకర్, టీఎస్యూటీఎఫ్ అధ్యక్షుడు, నిర్మల్ విప్లవాత్మక మార్పులకు అవకాశం ఎంపికై న ఉపాధ్యాయులు విదేశాల్లోని విద్యావిధానాలు, బోధన పద్ధతులను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా నూతన విషయాలు తెలుసుకుంటారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా గ్రహించిన అంశాలను అమలుపరచడం ద్వారా ప్రభుత్వ బడుల్లో చదివే పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విప్లవాత్మక మార్పులకు అవకాశం ఉంటుంది. – తోట నరేంద్రబాబు, పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు, నిర్మల్ -
దండారీ ఉత్సవాలకు సన్నద్ధం
దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ నెల 14నుంచి ప్రారంభమ య్యే దండారీ ఉత్సవాల నిర్వహణకు ఆదివాసీలు సిద్ధమవుతున్నారు. గు స్సాడీ వేషధారణ కోసం నెమలి ఈకల టోపీలు, సంప్రదాయ వాయిద్యాలపై పర, వెట్టే, గుమ్మేల, డప్పుల తయారీలో నిమగ్నమయ్యారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్కు చెందిన మెస్రం జంగు, పెందోర్ దేవ్రావ్, దుర్వగూడకు చెందిన పుసం యేశ్వంత్రావ్, దుర్వ గంగారాం గుస్సాడీ టీపీలు, డప్పులు తయారు చేయడంతో ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి ఆదివాసీలు వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. కాగా, వీటి తయారీతో తమకు ఉపాధి దొరుకుతుందని వారు తెలిపారు. – ఇంద్రవెల్లి ఉపాధ్యాయుల లెర్నింగ్ టూర్!నిర్మల్ఖిల్లా: రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు డాక్టర్ ఈ.నవీన్ నికోలస్ ఉపాధ్యాయుల విదేశీ టూర్కు సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు రెండురోజుల క్రితం జారీ చేశా రు. నవంబర్లో ఒక్కో బృందానికి 40మంది చొ ప్పున నాలుగు బృందాల్లో 160 మంది ఐదు రోజు లపాటు సింగపూర్, వియత్నాం, జపాన్, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. అక్కడి పాఠశాలల బోధన విధానం, విద్యార్థి–ఉపాధ్యాయ సంబంధాలు, సాంకేతిక వినియోగం వంటి అంశాలను అధ్యయనం చేసి తిరిగి వచ్చాక రాష్ట్రంలో అమలు చేసేలా మార్గదర్శకాలు రూపొందించనున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి 12 మంది.. ఉమ్మడి జిల్లాలో నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీంఆసిఫాబాద్, మంచిర్యాల నుంచి ముగ్గురి చొప్పున మొత్తం 12మంది విదేశీ పర్యటనలో భాగం కానున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 2,855 ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలలు ఉండగా దాదాపు 12వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఎంపికై న ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి బృందంలో ఆయా దేశాల్లో పర్యటించి అక్కడి బోధన విధానాలను అధ్యయనం చేయనున్నారు. ఎంపిక ప్రక్రియ ఇలా.. బోధన రంగంలో కనీసం పదేళ్ల అనుభవం, 55 ఏళ్ల లోపు వయస్సు, పాస్పోర్టు కలిగి ఉన్నవారు ఈ పర్యటనకు అర్హులు. కలెక్టర్ చైర్మన్గా అదనపు కలెక్టర్, డీఈవో, జిల్లాస్థాయి సీనియర్ అధికారులు సభ్యులుగా ఉన్న కమిటీ జిల్లాకు ముగ్గురు చొప్పున ఉత్తమ టీచర్ల పేర్లను ఎంపిక చేయనుంది. ఇందుకుగానూ మూడేళ్లలో వారి పనితీరు పరిశీలిస్తారు. ‘పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచడంలో తీసుకున్న చొరవ, విద్యార్థుల సంఖ్య పెంచడం, వృత్తిపరంగా అభివృద్ధి, పాఠశాల అభివృద్ధికి తీసుకున్న చర్యలు, వినూత్న బోధన పద్ధతులు, సాధించిన పురస్కారాలు, ఆంగ్లంలో సంభాషించే సామర్థ్యం’ అనే ఏడు కొలమానాల ఆధారంగా జిల్లా కమిటీ టూర్కు వెళ్లే ఉపాధ్యాయులను ఎంపిక చేస్తుంది. ఈ ఎంపిక ప్రక్రియ ఈనెల 23 లోపు పూర్తి చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను ప్రవేశపెట్టేందుకు మరో అడుగు వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన నాణ్యతను పెంపొందించేలా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులను విదేశాలకు పంపించాలని నిర్ణయించింది. ‘గ్లోబల్ లెర్నింగ్ టూర్’ పేరిట సుమారు 160 మందిని సింగపూర్, ఫిన్లాండ్, వియత్నాం, జపాన్ వంటి దేశాలకు పంపనుంది. వీరు ఆయా దేశాల్లో విద్యా విధానాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయనున్నారు. దీంతో విద్యావ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతుందని విద్యావేత్తలు భావిస్తున్నారు. -
● యూజ్ కేస్ చాలెంజ్లో నార్నూర్ ఆస్పిరేషనల్ బ్లాక్కు అవార్డులు ● జిల్లాకు దక్కిన అరుదైన గుర్తింపు ● కలెక్టర్ పాలన దక్షతకు నిదర్శనం
కై లాస్నగర్: జిల్లాకు మరోసారి జాతీయస్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆస్పిరేషనల్ బ్లాక్లలో భాగంగా నీతి ఆయోగ్ చేపట్టిన ‘యూజ్ కేస్ చాలెంజ్’లో జిల్లా ఏకంగా నాలుగు అంశాల్లో పురస్కారాలు సా ధించింది. నార్నూర్ ఆస్పిరేషనల్ బ్లాక్లో విద్య, సామాజికాభివృద్ధి, ఆరోగ్యం, పోషణ విభాగాల్లో సాధించిన ప్రగతికి గాను అవార్డులతో పాటు నగ దు పురస్కారాన్ని అందుకోవడం కలెక్టర్ రాజర్షి షా సమర్ధతకు నిదర్శనం. ఇదివరకే ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అవార్డు అందుకుని జాతీ యస్థాయిలో జిల్లా ఖ్యాతిని చాటిచెప్పారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేలా.. నార్నూర్ మండలంలోని 34 ప్రభుత్వ పాఠశాలల్లో ని 202మంది పేద విద్యార్థుల ఇంగ్లిష్ నైపుణ్యాన్ని పెంచేలా ‘ఇంప్రూవింగ్ సాఫ్ట్ స్కిల్స్ అ మాంగ్ ద స్టూడెంట్స్’ థీమ్ అమలు చేశారు. విద్యార్థుల్లో క మ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచడం, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం తదితర స్కిల్స్ పెంచేదిశగా ప్రత్యేక శ్రద్ధ వహించారు. ముఖ్యంగా నార్నూ ర్ బ్లాక్ పరిఽధిలో ఇంగ్లిష్ ఫౌండేషన్ లెర్నింగ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపర్చేలా బేస్లైన్ టెస్ట్ నిర్వహించారు. టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రత్యేక మాడ్యుల్స్ను అందజేసి పక్కాగా అమలుపరిచారు. ఇదీ విజయవంతమై విద్యార్థుల భాషా నై పుణ్యం మెరుగుపడేలా చేసింది. ఇందుకు రూ.2లక్షల నగదు బహుమతి సాఽధించింది. విద్యా విభాగంలో.. సర్కారు బడుల్లో చదివే పేద విద్యార్థుల్లోని చెడు అ లవాట్లను దూరం చేసి చదువులో రాణించేలా కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేకంగా ఆరోగ్య పాఠశాలను అ మలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 81 పాఠశాలల్లో దీ న్ని అమలు చేస్తుండగా 39వేల మంది విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు నిత్యం రోజుకో అంశంలో తర్ఫీదునిస్తున్నారు. గుట్కా, పాన్, తంబాకు లాంటి వాటిని వాడకుండా చూడటంతో పాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు అనుసరించాల్సిన అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్ర త ప్రాధాన్యతను చాటి చెబుతున్నారు. వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పిస్తున్నారు. దీన్ని నా ర్నూర్ బ్లాక్లోనూ పటిష్టంగా అమలుచేశారు. ప్రతీ వారం విద్యార్థులు, టీచర్లతో కలెక్టర్ ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తూ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం ఆరోగ్యపరంగా గణనీయమైన మార్పులను తీసుకువచ్చింది. విద్యార్థులతో పాటు వారి కుటుంబీకులు చెడు అలవాట్లు మానుకునేలా తోడ్పడింది. ఈ కార్యక్రమానికీ రూ.లక్ష పురస్కారం అందుకుంది. సామాజికాభివృద్ధి విభాగంలో.. నార్నూర్ ఆస్పిరేషనల్ బ్లాక్కు ప్రత్యేక వెబ్సైట్ రూపొందించారు. ఈ బ్లాక్ పరిధిలో విద్య, వైద్యం ఆరోగ్యం, పోషకాహారంతో పాటు వ్యవసాయం, ఆర్థిక చేయూత, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు లాంటి వివరాలన్నింటినీ అందులో ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. ఆయా వివరాలు రా ష్ట్ర, జాతీయ స్థాయిలో ఏ విధంగా అమలవుతున్నా యి.. జిల్లా స్థాయిలో వాటి అమలు ఎలా ఉందనే దానిపై పూర్తి గణాంకాలతో ఎప్పటికప్పుడు నమో దు చేస్తున్నారు. నీతి ఆయోగ్ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా కార్యక్రమాలను అమలు చేస్తూ వివరాలు పొందుపరుస్తున్నారు. ఆయా ప్యారామీటర్ల ను గణాంకాలతో నిర్దేశించుకుని జిల్లాకు అవార్డు, రూ.లక్ష నగదు పురస్కారం ప్రకటించారు. నార్నూర్ ఆస్పిరేషనల్ బ్లాక్ వివరాలు గ్రామాలు 24 కుగ్రామాలు 34 జనాభా 29,152 పీహెచ్సీలు 1 అంగన్వాడీ కేంద్రాలు 77 ఆరోగ్య ప్రమాణాలను పెంచడంతో పాటు చిన్నారులు, విద్యార్థులకు పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం అందించేలా పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేశారు. జిల్లాలోని 17 కేజీబీవీల్లో చదివే విద్యార్థినులకు శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ చేసి వ్యక్తిగత పరిశు భ్రత ప్రాధాన్యతను తెలియజేశారు. 10వేల మంది విద్యార్థినులకు ప్రయోజనం చేకూర్చేలా 40 పాఠశాలల్లో శానిటరీ న్యాప్కిన్ వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నారు. నార్నూర్ బ్లాక్లో మూడు హ్యాబిటేషన్లలో టెలి మెడిసిన్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. తాగునీటి వసతి కలిగిన అంగన్వాడీ కేంద్రాలు రాష్ట్రస్థాయిలో 47.6శాతం ఉండగా నార్నూర్లో వందశాతం, మరుగుదొడ్డి ఉపయోగించే కేంద్రాలు రాష్ట్రంలో 36.8శాతం ఉంటే నార్నూర్లో 32.46 శాతంగా ఉన్నాయి. ఐదేళ్లలోపు చిన్నారుల్లో పోషకాహారలోపం రాష్ట్రస్థాయిలో 3.3 శాతంగా ఉంటే నార్నూర్ బ్లాక్లో 2.70శాతానికి తగ్గించారు. ఐదేళ్లకు పైబడిన చి న్నారుల్లో తీవ్రమైన పోషకాహారలోపం రాష్ట్రస్థాయిలో 1.1శాతంగా ఉండగా నార్నూర్ బ్లాక్లో 0.5 శాతానికి తగ్గించారు. 2,500 గ్రాముల కంటే తక్కువ బరువుతో జన్మించిన శిశువుల శాతం రాష్ట్రంలో 7.8శాతం ఉండగా ఈ బ్లాక్లో జీరోకు తగ్గించారు. అలాగే ఆస్పత్రి ప్రసవాలు రాష్ట్రంలో 87.8శాతం ఉండగా జిల్లాలో వందశాతం జరిగేలా శ్రద్ధ వహిస్తున్నారు. ఏఎన్సీ రిజిస్ట్రేషన్లు 87.8శాతం ఉండగా జిల్లాలో వందశాతానికి తీసుకువచ్చారు. పోషణ్ అభియాన్, నేషనల్ హెల్త్ మిషన్, ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేసి రూ.లక్ష నగదు పురస్కారాన్ని సాధించారు. -
రియల్ ఎస్టేట్ ముఠా భారీ కుంభకోణం
ఆదిలాబాద్టౌన్: ఈడీ, బ్యాంక్ అధీనంలోని రూ.కోట్ల విలువైన భూములను నకిలీ పత్రాలతో కబ్జా చేసిన రియల్ ఎస్టేట్ ముఠా బండారం బయటపడింది. ఇందులో ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్ చేసి 14రోజుల పాటు రిమాండ్కు తరలించారు. ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి ఆదివారం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కోర్టు ద్వారా నియమించబడిన అధికారి దుమ్మటి సూర్య రామకృష్ణ సాయిబాబా భూముల కబ్జాకు సంబంధించి ఈనెల 10న ఆది లాబాద్ రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ప్రకారం.. మనోజ్ కుమార్ అగర్వాల్ అనే వ్యక్తి సర్వే నంబర్ 65/బీ, 65/4లోని 2.09 ఎకరాలను జీఎస్ ఆయిల్మిల్స్ పేరుతో ఎస్ బీఐలో మార్టిగేజ్ చేసి రుణం తీసుకున్నారు. 2012 లో అదే వ్యక్తి 65/4/1 సర్వే నంబర్లోని భూమిని నలుగురికి విక్రయించగా, ఆ తర్వాత 2013లో అదే భూమిని డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు. జీపీఏ ఆధారంగా పూనమ్ వ్యాస్కు, తర్వాత ఆమె అనుపమ వ్యా స్కు అమ్మినట్లు తేలింది. అలాగే 2023లో రమేశ్శర్మ, అతని కుమారుడు రాకేశ్శర్మ, ఇబ్రహీం మ హ్మద్ అలియాస్ మామ్లా సేట్ తదితరులు నకిలీ ప త్రాలు సృష్టించి తహసీల్దార్ కార్యాలయంలో రిజి స్ట్రేషన్ చేయించుకున్నారు. సర్వే అధికారుల సహకారంతో సప్లిమెంటరీ సేత్వార్ పొందారు. 2024 నవంబర్ 18న నిందితులు జేసీబీలు, టిప్పర్లతో మొరం పోసి చదును చేసి ఆక్రమించారు. అప్పటికే ఆ స్థలం ఈడీ అధీనంలో ఉంది. అక్కడ రిటైర్డ్ ఎస్సై రాములు భద్రత సిబ్బందిగా ఉన్నారు. రాములు అడ్డుకునేందుకు ప్రయత్నించగా నిందితులు అతడిని చంపేస్తామని బెదిరించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు రూరల్ సీఐ కె.ఫణీదర్ చర్యలు చేపట్టారు. నిందితులు వీరే.. ఈ కేసులో హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు రమేశ్శర్మ, భుక్తాపూర్కు చెందిన ఇబ్రహీం మహ్మద్ అలియాస్ మామ్లా సేట్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరితో పాటు నిందితులు యతేంద్రనాథ్, హితేంద్రనాథ్, రాకేశ్శర్మ, మనోజ్కుమార్ అగర్వాల్, పూనమ్ వ్యాస్, అనుపమ వ్యాస్, సర్వేయర్ శివాజీపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. నకిలీ పత్రాలతో భూ ఆక్రమణ రమేశ్శర్మ సర్వే నంబర్ 65/ఋ/1 పేరుతో నకిలీ సేత్వార్ సృష్టించి ఈడీ అధీనంలోని భూమి స్వాధీ నం చేసుకున్నాడు. కలెక్టర్ విచారణలో ఈ కుంభకో ణం వెలుగులోకి రాగా రిజిస్ట్రేషన్లు, సేత్వార్లు ర ద్దు చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ ఆధారాలతో రూ రల్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రధాన నిందితులు రమేశ్శర్మ, ఇబ్రహీం మహ్మద్ను ఆదివారం అరె స్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో సర్వే అధికారుల సహకారం, సేత్వార్ జారీ ప్ర క్రియపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు డీఎస్పీ వివరించారు. -
మెరుగైన వైద్య సేవలందించాలి
ఉట్నూర్రూరల్: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. మాతా శిశు మరణాలు, ఇతర అంశాలపై వైద్యాధికారులు, సూపర్వైజర్లతో జిల్లా అదనపు వైద్యాధికారి కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాతా శిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గర్భిణుల వివరాలు నమోదు చేసి సమయానుసారం వారికి పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు అందించాలన్నారు. అనంతరం మండలంలోని శ్యాంపూర్, దంతన్పల్లి పీహెచ్సీలను సందర్శించారు. వారి వెంట అదనపు డీఎంహెచ్వో మనోహర్, డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, క్షయ నివారణ అధికారి సుమలత, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. తోషం సబ్సెంటర్ తనిఖీ గుడిహత్నూర్: మండలంలోని తోషం సబ్సెంటర్ను డీఎంహెచ్వో శుక్రవారం తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. గర్భిణులకు అవసరమైన సలహాలు అందిస్తూ పీహెచ్సీలో ప్రసవం అయ్యేలా చూడాలన్నారు. వారి వెంట హెల్త్ అసిస్టంట్ ఎజాజ్, ఏఎన్ఎంలు సునీత, తుర్పాబాయి, ఆశవర్కర్ రేణుక ఉన్నారు. -
విద్యాశాఖ అప్రతిష్టపాలు
ఆదిలాబాద్టౌన్: జిల్లా విద్యాశాఖ ఇటీవల అప్రతిష్ట మూటగట్టుకుంటుంది. ఆ శాఖలో సస్పెన్షన్లు, సరెండర్లు, టర్మినేట్, మెమోల జారీ.. ఇలా వరుస ఘటనలు కారణమని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పర్యవేక్షణ లోపమనే చర్చ సాగుతోంది. కొన్నేళ్లుగా జిల్లాకు రెగ్యులర్ విద్యాశాఖాధికారి కరువయ్యారు. దీంతో పలువురు ఉద్యోగులు, కొంత మంది ప్రధానోపాధ్యాయులు అక్రమాలకు తెర లేపుతున్నారు. పాఠశాలలో విద్యార్థులపై కొందరు గురువులు అసభ్యంగా ప్రవర్తిస్తూ కటకటాల పాలవుతున్నారు. పౌష్టికాహారం మాట పక్కనబెడితే.. కనీసం నా ణ్యమైన విద్యాబోధన సైతం అందకుండా పోతుందనే విమర్శలున్నాయి. అక్రమాల జోరు.. విద్యాశాఖలో ప్రతీ పనికి ఎంతో కొంత ముట్టజెబితే కానీ కొంత మంది ఉద్యోగులు ఫైళ్లు కదలనివ్వడం లేదని పలువురు చెబుతున్నారు. రెగ్యులర్ డీఈవో లేకపోవడం, ఇన్చార్జి అధికారి స్థానికంగా ఉండకపోవడంతో వారి ఆగడాలు మితిమీరుతున్నట్లు తెలుస్తోంది. కొంత మంది ప్రధానోపాధ్యాయులు సైతం పాఠశాల నిధులను దుర్వినియోగం చేస్తున్నా రు. విద్యాభివృద్ధి కోసం కేటాయించాల్సిన వాటిని సొంతగా వినియోగించుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గాడితప్పిన పాలన.. జిల్లాకు ఐదారేళ్లుగా రెగ్యులర్ విద్యాధికారి కరువయ్యారు. ఇటీవల ఇన్చార్జి అధికారి ఉద్యోగ విరమణతో వయోజన విద్యాశాఖ అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన పనితీరు సరిగా లేకపోవడంతో ఆయనను తప్పించారు. ఐటీడీఏ పీవోకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే సదరు అధికారికి కీలకమైన ఐటీడీఏ శాఖ ఉండడంతో పూర్తిస్థాయిలో జిల్లా విద్యాశాఖపై దృష్టి సారించడం లేదని తెలుస్తోంది. దీంతో పాలన గడితప్పినట్లు తెలుస్తోంది. ఫేషియల్ అటెండెన్స్ ఉన్నప్పటికీ కొంత మంది సమయపాలన పాటించడం లే దు. కొందరు మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాఠశాలలను ప ర్యవేక్షించాల్సి ఉండగా, కార్యాలయానికే పరిమితమవుతున్నారని తెలుస్తోంది. ఈ ప్రభావం విద్యార్థుల చదువుపై పడుతుంది. పదో తరగతికి సంబంధించి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యా శాఖాధికారులు గత మంగళవారం ఆ దేశాలు జారీ చేస్తే కొన్ని పాఠశాలల్లో మాత్రమే ఈ తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే కేజీబీవీల్లో వి ద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. మెనూలో కోత విధిస్తూ కొంత మంది ఎస్వోలు అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. ఇటీవల నాణ్యమైన భోజనం అందక విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మె నూ ప్రకారం అందడం లేదు. సర్కారు బడుల బా గు కోసం ప్రభుత్వం చర్యలు చేపడితే కొంత మంది ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయుల తీరుతో విద్యాశాఖకు చెడ్డపేరు వస్తోంది. ఈ విషయమై విద్యా శాఖ ఏడీ వేణుగోపాల్ గౌడ్ను వివరణ కోరగా, ఇటీవల నార్నూర్ మండలంలోని కేజీబీవీలో జరిగిన సంఘటనపై సెక్టోరియల్ అధి కారి ఉదయశ్రీని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని తెలిపారు. అలాగే ఇంద్రవెల్లి ప్రధానోపాధ్యాయుడిని ఆర్జేడీకి కలెక్టర్ సరెండ్ చేసినట్లు వివరించారు. -
ఇంద్రవెల్లి పీజీహెచ్ఎం సరెండర్
● నిధుల దుర్వినియోగంపై కలెక్టర్ కొరడాఆదిలాబాద్టౌన్: ఇంద్రవెల్లి పీజీ హెచ్ఎం రాంమోహన్పై కలెక్టర్ కొరడా ఝుళిపించారు. పాఠశాలలోని పీఎంశ్రీ నిధులకు సంబంధించి దుర్వినియోగంపై చర్యలు చేపట్టారు. ఇటీవల పాఠశాల ఉపాధ్యాయులతో పాటు ఉపాధ్యా య సంఘాల నాయకులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సదరు ప్రధానోపాధ్యాయుడు పీఎంశ్రీ నిధులను దుర్వినియోగం చేశాడని, అలాగే పాఠశాలలో వాతావరణానికి భంగం కలిగిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు విచారణకు ఆదేశించిన కలెక్టర్ ఆయనను వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డికి సరెండర్ చేశారు. ఇదిలా ఉండగా ఇంద్రవెల్లి పాఠశాలలో పోక్సో కేసులో ఇటీవల సస్పెండ్ అయిన నాందేవ్ అనే ఉపాధ్యాయుడిని తిరిగి విధుల్లోకి తీసుకుంటూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఈయనకు బోథ్లోని ప్రభుత్వ పాఠశాలలో విధులు కేటాయించారు. -
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
● ఎస్పీ అఖిల్ మహాజన్ఇంద్రవెల్లి: శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో ఉట్నూర్ సబ్డివిజన్ పోలీసు అధికారులతో శుక్రవారం రాత్రి సమావేశమయ్యారు. పలు అంశాలపై వారికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో రౌడీలు, సస్పెక్ట్ రౌడీల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ప్రతీ గ్రామంలో విలేజ్ పోలీస్ అధికారి కీలకంగా వ్యవహరించాలన్నారు. అలాగే జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, సీఐలు మడావి ప్రసాద్, ఎస్సై సాయన్న, కానిస్టేబు ళ్లు ఉన్నారు.ఒత్తిడికి గురికావద్దుఆదిలాబాద్టౌన్: ఒత్తిడికి గురైతే మానసిక ఆరో గ్యంతో బాధపడతారని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథో డ్ అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని రిమ్స్ డైరెక్టర్ చాంబర్లో తెలంగాణ జూనియర్ డాక్టర్లు మానసిక ఆరోగ్య హెల్ప్డెస్క్, ఫీర్ సపోర్ట్ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మానసిక వైద్యనిపుణులు ఓంప్రకాశ్, జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. -
పొగాకుతో ఆరోగ్యంపై ప్రభావం
ఆదిలాబాద్టౌన్: పొగాకు సేవించడంతో ఆరో గ్యంపై ప్రభావం చూపుతుందని జిల్లా పొగాకు నియంత్రణ అధికారి శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని బాలక్మందిర్, ప్రభుత్వ నం.2 పాఠశాలల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పొగాకు, మత్తుపదార్థాలతో క్యాన్సర్, ఇతర రోగాల బారిన పడతా రని తెలిపారు. కోట్పా చట్టం ప్రకారం మైనర్లు పొగాకు ఉత్పత్తులు విక్రయించడం, కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నం.2 పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్, పొగాకు నియంత్రణ విభాగం సోషల్ వర్కర్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
అడ్డుపడితే గుణపాఠం చెబుతాం
ఆదిలాబాద్రూరల్: బీసీలకు 42శాతం రిజర్వేషన్కు ఎవరు అడ్డుపడుతున్నారో తమకు తెలుసని, రాబో యే రోజుల్లో వారికి తగిన గుణపాఠం చెబుతామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు అన్నారు. బీసీ రిజర్వేషన్కు వ్యతిరేకిస్తూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషనర్ల దిష్టిబొమ్మతో శుక్రవారం జిల్లా కేంద్రంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తెలంగాణ చౌక్ వద్ద దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరువురి మధ్య తొపులాట చోటుచేసుకుంది. అనంతరం రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ మేరకు అసెంబ్లీలో జీవో చేసి గవర్నర్ వద్దకు పంపితే అక్కడ పెండింగ్లో ఉందన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్తో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే జీర్ణించుకోలేక కొందరు హైకోర్టులో కేసు వేశారని ఆందోళన వ్యక్తం చేశారు. దీని వెనుక ఎవరున్నారో బీసీలకు తెలుసని, తగిన సమయంలో వారికి గుణపాఠం తప్పదన్నారు. రిజర్వేషన్ అమలయ్యే దాకా పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కలాల శ్రీనివాస్, నాయకులు అంజయ్ కుమార్, శ్రీనివాస్, అశోక్, రాము, చందు, సామల ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు. -
● జీవో 9పై స్టే విధించిన హైకోర్టు ● ‘సుప్రీం’కు వెళ్తామన్న ప్రభుత్వం ● సర్కారుపై విపక్షాల విమర్శలు ● ఆదరిస్తేనే మద్దతు: బీసీ నేతలు
సాక్షి, ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు తా త్కాలిక బ్రేక్ పడింది. బీసీ రిజర్వేషన్ల జీవో 9, ‘పరిషత్’ ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే విధించింది. గురువారం ఉదయం 10.30 గంటలకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొదటివిడత ఎన్నికలు జరిగే మండలాల్లో ఆయా రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. అయినప్పటికీ హైకోర్టులో విచారణ ఉండడంతో ఎన్నికలు జరుగుతాయా.. లేదా? అనే సందేహం ఓ వైపు ఉంటే, నామినేషన్ వేయాలా.. వద్దా? అనే సంశయం ఆశావహుల్లో నెలకొంది. ఈ సందిగ్ధంలోనూ బజార్హత్నూర్ మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేశారు. జిల్లా వ్యాప్తంగా ఇదొక్కటే నామినేషన్ దాఖలు కావడం గమనార్హం. మధ్యాహ్నం నుంచి విచారణ ప్రారంభం కావడం, ఆ తర్వాత హైకోర్టు స్టే ఇవ్వడంతో ఈ ఎన్నికలు నిలిచిపోతున్నాయని తెలియడంతో ఆశావహుల్లో నిరుత్సాహం వ్యక్తమైంది. సర్కారు ఎలా ముందుకెళ్తుందో! జిల్లాలో మొదటి విడతలో 10 జెడ్పీటీసీ, 80 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, ప్రభుత్వం ఇందుకు సంబంధించి గురువారం ఉద యం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత హై కోర్టు స్టే నేపథ్యంలో ఎన్నికలు నిలిచిపోయాయి. జీవో నంబర్ 9కి సంబంధించి స్టే ఇవ్వగా ఎన్నికల నోటిఫికేషన్ నిలిచిపోయినట్టేనని స్పష్టమైంది. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ కూడా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని తెలిపింది. ఎన్నికలు నిలిపివేస్తామని, ‘కోడ్’ తొలగిస్తామని ప్ర కటించడంతో ప్రస్తుతం జారీ చేసిన రిజర్వేషన్లకు అ నుగుణంగా ఈ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనని స్పష్టమైంది. దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుంది.. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుందా.. లేనిపక్షంలో పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు మళ్లీ షెడ్యూల్ జారీ చేస్తుందా.. ఇలా వివిధ సందేహాల మధ్య ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషనైతే నిలిచిపోయింది. ఆరోపణలు.. ప్రత్యారోపణలు బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కల్పనలో అధికార కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్, బీజేపీ ఆరో పించాయి. ఎన్నికలపై స్టే విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువడ్డాక సాయంత్రం ఆయా పార్టీల నాయకులు ప్రెస్మీట్లు పెట్టి మరీ విమర్శలు గుప్పించారు. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్కు పూర్తి చిత్తశుద్ధి ఉందని, దీనిపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. కాగా, బీసీ కులాలకు మద్దతు ఇచ్చే ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలనే ఆదరిస్తామని జిల్లాకు చెందిన బీసీ సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. -
‘ఇందిరమ్మ’కు ఉపాధిహామీ
కై లాస్నగర్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఆ శించిన స్థాయిలో ముందుగుసాగడం లేదు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం లబ్ధిదారులకు ఆర్థికభారం త గ్గించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ స్కీంకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చే సింది. తాజా నిర్ణయంతో జాబ్కార్డు కలిగిన కూ లీలకు అదనపు ప్రయోజనం కలిగి ఆర్థిక సాంత్వన చేకూరనుంది. సర్కారు నిర్ణయంపై ఇందిరమ్మ లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. నిర్మాణాలు వేగవంతం చేసేలా.. ఇందిరమ్మ పథకం కింద ఒక్కో నియోజకవర్గానికి ప్రభుత్వం 3,500 చొప్పున ఇళ్లు మంజూరు చేసింది. ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారులకు రూ.5లక్షల చొప్పున చెల్లిస్తోంది. ఇళ్ల నిర్మాణ దశలను అనుసరించి బిల్లులు చెల్లించనుంది. బేస్మెంట్ దశలో రూ.లక్ష, గోడల నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష, స్లాబ్ లెవల్ వరకు పూర్తయితే రూ.2లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తిస్థాయిలో జరిగాక రూ.లక్ష చొప్పున నాలుగు విడతల్లో అందజేస్తోంది. లబ్ధిదారులు ఆర్థి కంగా ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో స్వయం సహాయక సంఘాల ద్వారా రూ.లక్ష చొ ప్పున తక్షణమే ఆర్థికసాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానించాలని నిర్ణయం తీసుకుంది. తద్వారా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు వేగవంతం చేయాలని భావిస్తోంది. అదనపు లబ్ధి చేకూర్చేందుకే.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానం చేసింది. ఉపాధి కూలీలకు 90రోజుల పనిదినాలు కల్పించాలని నిర్ణయించింది. రోజుకు రూ.307 చొప్పున 90రోజుల పనిదినాలకు గాను రూ.27,630 వారికి అదనంగా లబ్ధి చేకూర్చాలని భావిస్తోంది. అయితే బేస్మెంట్ స్థాయి వరకు 40 రోజులు, లెంటల్ స్థాయి వరకు 30 రోజులు, ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మరో 20రోజుల పాటు పని కల్పించనుంది. ఒకవేళ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే బేస్మెంట్ వరకు నిర్ణీత 90రోజుల పనిదినాలు పూర్తయితే మిగతా పనిదినాలను వచ్చే ఆర్థికసంవత్సరంలో ఇచ్చే వెసులుబాటు కల్పించింది. కూలీల వేతనాల చెల్లింపు కోసం నిర్మాణ పనుల్లోని మూడు దశల్లో లబ్ధిదారుడి ఫొటోలు తీసుకుని వాటిని ఆన్లైన్లో హౌసింగ్శాఖ అధికారులు ఆప్లోడ్ చేయనున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత పంచాయ తీ సెక్రటరీ దాన్ని ధ్రువీకరించినట్లయితే దాని ఆధారంగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో బిల్లులు జమకానున్నాయి. తద్వారా లబ్ధిదారు ఇంటి నిర్మాణాన్ని వేగవంతం చేసుకోవడంతో పాటు కూలీలకు చెల్లించే ఆర్థికభారాన్ని తగ్గించుకోన్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ప్రగతి వివరాలు మంజూరైన ఇళ్లు 15,486 మార్కౌట్ ఇచ్చినవి 7,763 బేస్మెంట్ దశలో.. 4,547 రూప్ లెవల్లో.. 1,092 ఆర్సీ లెవెల్లో.. 236 పూర్తయిన ఇళ్లు 02 -
సైన్స్పై ఆసక్తి పెంచడమే లక్ష్యం
ఆదిలాబాద్టౌన్: విద్యార్థుల్లో సైన్స్పై ఆసక్తి పెంచడమే లక్ష్యమని జిల్లా సైన్స్ అధికారి ఆరే భాస్కర్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల ఆవరణలో ‘మానవజాతి ప్రయోజనం కో సం శాస్త్ర సాంకేతికత’ అంశంపై జిల్లా స్థాయి సైన్స్ పోటీలు నిర్వహించారు. జిల్లాలోని పలు పాఠశాల ల విద్యార్థులు ప్రదర్శించిన నాటికలు శాస్త్ర స్ఫూర్తి ని ప్రతిబింబించాయి. బంగారిగూడ మోడల్ స్కూ ల్ ప్రథమ, బరంపూర్ జెడ్పీహెచ్ఎస్ ద్వితీయ, ఇంద్రవెల్లి జెడ్పీహెచ్ఎస్ తృతీయ స్థానాల్లో నిలువగా విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ప్ర థమ స్థానంలో నిలిచిన బంగారిగూడ విద్యార్థులు ఈనెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సైన్స్ పోటీల్లో పాల్గొంటారని జిల్లా సైన్స్ అధికారి తెలిపారు. హెచ్ఎంలు లచ్చిరాం, డైట్ కళాశాల ప ర్యవేక్షకులు మమత, శ్రీచైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్గౌడ్, హెచ్ఎం లక్ష్మణ్, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్రెడ్డి తదితరులున్నారు. -
ఆందోళనలో అన్నదాతలు
సాత్నాల: ఆరుగాలం కష్టపడి పంటలు పండించే అన్నదాతల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా తయారైంది. భారీ వర్షాలు, వరదలతో వివిధ పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు కుమిలిపోతున్నా రు. జిల్లాలోని పెన్గంగా పరీవాహక ప్రాంతాలైన భీంపూర్, భోరజ్, జైనథ్, బేల, సాత్నాల మండలా ల్లో వేల ఎకరాల్లో పంట ముంపునకు గురైంది. భీంపూర్ మండలంలో 1,016 ఎకరాల్లో పత్తి, 53 ఎకరాల్లో సోయాబీన్, 16 ఎకరాల్లో కంది పంట లకు నష్టం జరిగింది. బేల మండలంలో పత్తి 1,400, సో యాబీన్ 550, కంది 50, భోరజ్ మండలంలో పత్తి 1,880, సోయాబీన్ 353, కంది 68, సాత్నాల మండలంలో పత్తి 285, సోయాబీన్ 80, కంది 40, జైన థ్ మండలంలో పత్తి 1,200, సోయాబీన్ 1,200, కంది 160ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మానసిక ఒత్తిడికి లోనవుతూ.. పెన్గంగా పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. పత్తి, సోయాబీన్, కంది పంటలు నాశనమై రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. ఆర్థికంగా ఇప్పటికే నష్టాల్లో ఉన్న రైతులు ఇప్పుడు పూర్తిగా విసిగిపోయారు. దిగుబడి రాదని ఆవేదనతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. భోరజ్ మండలంలో ఇప్పటికే ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రైతులు ఇప్పటికే ఎకరాకు రూ.15వేల వరకు పెట్టుబడి పెట్టారు. వేల ఎకరాల్లో పంట నష్టపోయిన నేపథ్యంలో ప్ర భుత్వం ఎకరాకు రూ.10వేల పరిహారం ఇస్తామని చెప్పడంతో ఎదురుచూస్తున్నారు. పంట నష్టంపై స ర్వే చేసిన అధికారులు కలెక్టర్కు నివేదిక అందించారు. అయినా ఇప్పటివరకు రైతులకు పరిహారం అందలేదు. ప్రభుత్వం నుంచి పరిహారం అందకుంటే ఎలా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి భారీ వర్షాలతో ఇప్పటికే పంటలు కోల్పోయాం. రైతులకు ఆర్థికభారం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. రబీ సాగు కోసం రైతులకు విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై అందించాలి. నష్టాల్లో ఉన్న రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలి. – పట్టెపు విలాస్, పెండల్వాడ పరిహారం అందించాలి భారీ వర్షాలు, వరదల కారణంగా ఎరువులు, విత్తనాల ఖర్చులు వృథా అయ్యాయి. ఇప్పటికే ఎకరానికి రూ.15వేల ఖర్చయింది, ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం అందించాలి. రబీ సాగుకు ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై అందించి ఆదుకోవాలి. – సంతోష్రెడ్డి, పిప్పర్వాడ -
ఘనంగా పోస్టల్ దినోత్సవం
ఆదిలాబాద్: తెలంగాణ స్టేట్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ పోస్టల్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని యూనియన్ కా ర్యాలయంలో పోస్ట్మాస్టర్లను సన్మానించారు. యూనియన్ అధ్యక్షుడు జనగం సంతోష్ మాట్లాడుతూ.. 70ఏళ్లుగా పోస్టల్శాఖ సేవలందిస్తోందని, ప్రస్తుత మొబైల్ ఫోన్ల యుగంలోనూ అధునాతన సేవలు అందిస్తుండడం శుభపరిణామమని పేర్కొన్నారు. యూనియన్ ప్రతినిధులు దుర్గం రాజేశ్వర్, రాఘవేంద్రనాథ్ యాదవ్, రాంకిషన్, అమర్, జార్జ్, జగదీశ్, అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఏటీసీల్లో యువతకు శిక్షణ
ఉట్నూర్రూరల్: ప్రభుత్వం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ) ఏర్పాటు చేసి యువతకు ఆధునిక సాంకేతిక వృత్తి విద్య కోర్సుల్లో శిక్షణ ఇస్తోందని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తెలిపారు. గురువారం కేబీ ప్రాంగణంలోని అ డ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను సందర్శించి ని ర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచానికి అనుగుణంగా యువతకు సాంకేతిక శిక్షణ ఇ చ్చేందుకు ప్రభుత్వం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి వృత్తి విద్య కోర్సులు అందిస్తోందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పనులు త్వరగా పూర్తి చేయించాలని ప్రిన్సిపల్ శ్రీనివాస్ను ఆదేశించారు. -
పనుల్లో నాణ్యత పాటించాలి
ఇంద్రవెల్లి: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చే పట్టిన అమ్మ ఆదర్శ కళాశాల పనుల్లో నాణ్యత పాటించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధి కారి జాదవ్ గణేశ్ సూచించారు. గురువారం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ను సందర్శించి అభివృద్ధి పనులు పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడానికే అమ్మ ఆదర్శ కళాశాల కింద నిధులు మంజూ రు చేసి పనులు చేపట్టినట్లు తెలిపారు. అనంత రం కళాశాలలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ మారుతి, అ ధ్యాపకులు మధుకర్, ప్రమీల, సరితారాణి, వెంకటేశ్, పూర్ణచందర్, రవి ఉన్నారు. -
‘బీసీ రిజర్వేషన్లపై సీఎంకు చిత్తశుద్ధి ఏది’
ఆదిలాబాద్: బీసీ రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ డ్రామా చేస్తోందని, సీఎం రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి లేదని బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత పాయల్ శంకర్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. 42శాతం బీసీ రిజర్వేషన్లపై తాను అసెంబ్లీలో చర్చించానని, రిజర్వేషన్ అమలులో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించానని గుర్తు చేశారు. ఇలాంటి సమస్యలే మహారాష్ట్ర, కర్ణాటకలో వచ్చినట్లు తాను ఉదహరించానని వివరించారు. 42శాతం రిజర్వేషన్ పేరిట కాంగ్రెస్ బీసీలను ఆశల పల్లకిలో ఊరేగించిందని, ఏమీ కాకముందే కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకాలు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్లో ఉండగా జీవో తీసి రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేసేందుకే కుట్ర పన్నిందని మండిపడ్డారు. రిజర్వేషన్ల పేరిట బీసీలను మోసం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూసిందని ఆరోపించా రు. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని, అ ప్పటివరకు బీసీల పక్షాన పోరాడుతామని వెల్లడించారు. ఆయన వెంట నాయకులు లాలా మున్నా, సంతోష్, మయూర్ చంద్ర, దయాకర్, విజయ్, దినేశ్ మాటోలియా, భీమ్సేన్రెడ్డి, రాందాస్, అశోక్, సన్నీ, విశాల్, రమేశ్ తదితరులున్నారు. -
చిత్తగూడను సందర్శించిన అధికారులు
నార్నూర్: గ్రామానికి రోడ్డు సౌకర్యంతో పాటు మౌలిక వసతులు కల్పించకుంటే ఎన్నికలు బహిష్కరిస్తామని మండలంలోని మాలేపూర్ పంచాయతీ పరిధి చిత్తగూడ గ్రామస్తులు వారం క్రితం ఉమ్రీ వాగు వద్ద నిరసన వ్యక్తం చేసిన విషయం విధితమే. ఈ మేరకు గ్రామాన్ని స్థానిక తహసీల్దార్ జాడి రాజలింగు, ఎంపీడీవో గంగాసింగ్, ఎస్సై అఖిల్ బుధవారం సందర్శించారు. సమస్యలపై ఆరా తీశారు. గ్రామానికి కనీసం రోడ్డు సౌకర్యం లేదని, రవాణా కష్టాలు తప్పడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రస్తుతం ఎలాంటి అభివృద్ధి పనులు చేసేందుకు అవకాశం లేదని అధికారులు పేర్కొన్నారు. రోడ్డుకు మరమ్మతులు, కల్వర్టు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
ఆర్టీసీకి పండుగ
ఆదిలాబాద్: బతుకమ్మ, దసరా సీజన్ ఆర్టీసీకి కలి సొచ్చింది. పండుగ సెలవుల నేపథ్యంలో సెప్టెంబ ర్ 20 నుంచి ఈనెల 6వరకు యాజమాన్యం ప్రత్యేక బస్సులను నడపింది. 17 రోజుల పాటు స్పెషల్ స ర్వీసులతో సంస్థకు భారీగా ఆదాయం సమకూరింది. బతుకమ్మ పండుగకు ఆడపడుచులు పట్టణాల నుంచి ఊర్లకు చేరుకోవడం, దసరాకు విద్యార్థులు, ఉద్యోగులు హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి దూర ప్రాంతాల నుంచి సొంతూర్లకు రావడంతో బస్సులు కిటకిట లాడాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ ఈ సారి రెగ్యులర్ బస్సులతో పాటు రీజియ న్ వ్యాప్తంగా 599 ప్రత్యేక సర్వీసులను నడిపింది. గతేడాది పండుగ సందర్భగా రూ.19.42 కోట్ల ఆదాయం రా గా.. ఈసారి రూ.24.11కోట్ల ఆదా యం సమకూరింది. గతేడాదితో పోలిస్తే రూ.4.59 కోట్ల అదనపు ఆమ్దాని సమకూరడం విశేషం. పకడ్బందీ ప్రణాళికతో.. పండుగ రద్దీకి అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రణాళికాబద్ధంగా బస్సులను నడిపి ప్రయాణికులకు సురక్షితంగా గమ్యస్థానాలకు చే ర్చారు. గతేడాది 412 ప్రత్యేక బస్సులు నడపగా, ఈసారి 414 స్పెషల్ సర్వీసులు నడపాలని తొలుత నిర్ణయించారు. రద్దీ పెరగడంతో మరో 185 బస్సులను అదనంగా ఏర్పాటు చేశారు. దీంతో మొత్తంగా 599 బస్సులను గతనెల 20 నుంచి ఈనెల 6 వరకు నడపడం గమనార్హం. అగ్రస్థానంలో నిర్మల్ డిపో.. ఆదాయం విషయంలో నిర్మల్ డిపో ఈ సారి కూడా అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది ఈ డిపో పరిధిలో రూ.4.96 కోట్ల ఆదాయం సమకూరగా, ఈసారి రూ.6.53 కోట్ల ఆదాయంతో దూసుకెళ్లింది. రూ.1.57కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. రీజియన్ వ్యాప్తంగా పరిశీలిస్తే మొత్తం బస్సులు 44 లక్షల కిలోమీటర్ల మేర తిరిగాయి. 83శాతం ఆక్యుపెన్సీ రేషియోతో రూ. 24.11 కోట్ల ఆదాయం సమకూరింది. అదనపు బస్సులతో.. రూ.1.85 కోట్లు రీజియన్ వ్యాప్తంగా మొత్తంగా 599 అదనపు బస్సులను నడిపారు. ఈ సర్వీసులు మొత్తం 3.04 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాయి. 82,921 మంది ప్ర యాణికులు రాకపోకలు సాగించగా, 92 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో రూ.1.85 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వివరించారు. కలిసొచ్చిన అదనపు చార్జీ.. పండుగ సమయంలో ఈసారి ప్రయాణికులపై ఆర్టీసీ అదనపు చార్జీలను వసూలు చేసింది. ప్రత్యేక బస్సుల్లో ఏకంగా 50శాతం అధికంగా వసూలు చేయడం గమనార్హం. గతంలో సూపర్ లగ్జరీ, లహరి, రాజధాని వంటి ఉన్నతశ్రేణి సర్వీసుల్లోనే అదనపు చార్జీలు ఉండగా ఈసారి స్పెషల్ బస్సులన్నింటిలోనూ అదనపు వడ్డన చేయడంతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడ్డాయి. ‘మహాలక్ష్మి’లే అధికం.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో ఆర్టీసీలో మొత్తం 49,31,476 మంది ప్రయాణించారు. వీరి లో మహాలక్ష్మి లబ్ధిదారులే అధికంగా ఉన్నారు. మ హాలక్ష్ములు 32,60,025 మంది ఉండగా, టికెట్ డ బ్బులు చెల్లించి ప్రయాణించిన వారు 16,71,451 మంది ఉన్నారు. అత్యధికంగా నిర్మల్ డిపో పరిధి లో 13,73,205 మంది ప్రయాణించగా, ఇందులో 9,99,123 మంది మహాలక్ష్ములు ఉన్నారు. రీజియన్ పరిధిలో డిపోల వారీగా సమకూరిన ఆదాయం డిపో ఆదాయం (రూ. లక్షల్లో) ఆదిలాబాద్ 550.84 భైంసా 234.97 నిర్మల్ 653.81 ఉట్నూర్ 141.07 ఆసిఫాబాద్ 277.90 మంచిర్యాల 552.41సమష్టి కృషితోనే సాధ్యం పండుగ సీజన్ దృష్టిలో ఉంచుకొని రీజియన్ పరిధిలోని అన్ని డిపోల నుంచి హైదరాబాద్కు రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాం. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ముందుకు సాగాం. సమష్టి కృషితోనే ఈ ఏడాది అధిక ఆదాయం సమకూరింది. రాబోయే రోజుల్లో సైతం ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలు అందిస్తాం. – ఎస్. భవానీ ప్రసాద్, రీజినల్ మేనేజర్ -
‘కూచిపూడి’లో ప్రతిభ
ఆదిలాబాద్: శాసీ్త్ర య కళకు ఆదరణ తగ్గిపోతున్న ప్ర స్తుత తరుణంలో జై నథ్ మండల కేంద్రానికి చెందిన చిన్నారి సామ మ హతి కూచిపూడి నృత్యం కోర్సులో ఉత్తీర్ణత సాధించింది. జిల్లా కేంద్రంలోని బాలకేంద్రంలో మిట్టు రవి పర్యవేక్షణలో నాలుగేళ్లుగా నృత్యంలో శిక్షణ తీసుకుంటుంది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్ కోర్సు చేస్తూ ప్రాక్టికల్, థియరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినట్లు రవి తెలిపారు. ఈ సందర్భంగా బాల కేంద్రం తల్లిదండ్రుల సంఘం ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు. -
‘స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం’
నేరడిగొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాలను కై వసం చేసుకుంటుందని ఎంపీ గోడం నగేశ్ ధీమా వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ బలపరిచిన సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూ చించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గడప గడపకు తీసుకెళ్లాలన్నారు. అలాగే కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఆకుల రాజశేఖర్, నాయకులు రాజు, భీంరెడ్డి, శంకర్, మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన వైద్యసేవలందించాలి
ఆదిలాబాద్టౌన్: రోగులకు మరింత నాణ్యమైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు, సిబ్బందితో తన చాంబర్లో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతాశిశు మరణాలు తగ్గించేందుకు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. నవజాత శిశువుల మరణాల రేటు 10 లోపు తగ్గించేందుకు వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలని పేర్కొన్నారు. గర్భిణుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని, హైరిస్క్ ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. టీబీ లక్షణాలు ఉన్నవారికి స్క్రీనింగ్ చేసి వ్యాధిగ్రస్తులకు మందులు పంపిణీ చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా టీబీ నియంత్రణ అధికారి సుమలత, డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి శ్రీధర్, డీపీఓ దేవిదాస్, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దేవపూర్ పీహెచ్సీ తనిఖీ తలమడుగు: మండలంలోని దేవపూర్ పీహెచ్సీని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. సమయపాలన పాటించాలని సిబ్బందికి సూచించారు. -
ఆర్టీసీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్: ఆర్టీసీ సేవలను ప్రయాణికులు సద్వి నియోగం చేసుకోవాలని రీజినల్ మేనేజర్ ఎస్.భవానీ ప్రసాద్ అన్నారు. దసరా పండుగ పురస్కరించుకొని ఆర్టీసీ ఆధ్వర్యంలో లక్కీ డ్రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు బుధవారం స్థానిక బస్టాండ్ ఆవరణలో లక్కీ డ్రా నిర్వహించి విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 27నుంచి అక్టోబర్ 6వరకు ఆర్టీసీలో ప్రయాణించిన వారిలో రీజియన్ వ్యాప్తంగా ముగ్గురిని డ్రా ద్వారా ఎంపిక చేసినట్లు తెలిపారు. పండుగ సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సేవలు అందించామన్నారు. అనంతరం విజేతలను ప్రకటించారు. వైభవ్ (ప్రథమ, రూ.25వేలు), గణేశ్(ద్వితీయ, రూ.15వేలు) మహేశ్ (తృతీయ, రూ.10వేలు) బహుమతులకు ఎంపికై నట్లు వెల్లడించారు. వీరికి త్వరలో హైదరాబాద్ వేదికగా నగదు బహుమతి ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంవీఐలు శ్రీనివాస్, రవీందర్, డిప్యూటీఆర్ఎం శ్రీహర్ష, రామయ్య, సీఐ రాజశేఖర్, ఎంఎఫ్ శ్రీకర్, ఎస్ఎం పోశెట్టి, రిజర్వేషన్ ఇన్చార్జి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
పులకించిన పోరుగడ్డ
కెరమెరి(ఆసిఫాబాద్):జల్.. జంగల్.. జమీన్ కోసం పోరుసలిపి అసువులు బాసిన ఆదివాసీ పోరాట యోధుడు కుమురంభీం స్మరణతో పోరుగడ్డ పులకించింది. రణభూమి జోడేఘాట్లో వీరుడి 85వ వ ర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమా ర్ హాజరై భీంవిగ్రహానికి పూలమాలలు వేసి, ఆయ న సమాధిపై పూలు చల్లి నివాళులర్పించారు. ఎన్ని కల కోడ్ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు వేదికపైకి వెళ్లలేదు. దర్బార్ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరికి వారుగా వచ్చి నివాళులర్పించి వెళ్లిపోయారు. సంప్రదాయపూజలు కుమురంభీంకు ఆయన వారసులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సంప్రదాయ పూజలు నిర్వహించారు. భీం సమాధిపై పూలు చల్లి పూజలు చేశారు. ముందుగా ఆచార, వ్యవహారాలతో పాత జెండాలు తీసేసి కొత్త జెండాలు ఆవిష్కరించారు. అంతా వరుసక్రమంలో నిల్చుని జెండాలకు మొక్కారు. ధూప, దీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. కోడి, మేకలతో జాతకం చూశారు. భీం ఆశయాలు నెరవేర్చుతాం: మంత్రులు కుమురం భీం ఆశయాలు నెరవేర్చుతామని మంత్రులు జూపల్లి, అడ్లూరి అన్నారు. ఆదివాసీలను సంఘటితం చేసి వారి హక్కుల సాధనకు పోరాడిన వీరుడు కుమురంభీం అని కొనియాడారు. తెలంగా ణ రాష్ట్ర సాధనలో ఆయన స్ఫూర్తి ఎంతో ఉందని పేర్కొన్నారు. 1935 నుంచి నిజాంకు వ్యతిరేకంగా పోరాడి వారి బలగాలను ఎదురించారని తెలిపారు. ఆదివాసీల అభివృద్ధికి రూ.740 కోట్లతో రోడ్లు, గిరి జన భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిందని చెప్పారు. విద్య, ఆశ్రమ పాఠశాలలను మరింత తీర్చి దిద్దుతామని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా వేదికపై మాట్లాడలేకపోతున్నామని అన్నారు. ‘కుమురం’ స్ఫూర్తితో ముందుకు..: కలెక్టర్ కుమురం భీం స్ఫూర్తితో ముందుకు సాగుదామని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పిలుపునిచ్చా రు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పాటుపడతామని పేర్కొన్నారు. భీం వర్ధంతికి ఉచిత బస్సు సౌకర్యం, భోజనం వసతులు కల్పించామన్నారు. అనంతరం భీం మనుమడు కుమురం సోనేరావు కు టుంబానికి కలెక్టర్ నూతన వస్త్రాలు అందించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు పాటగూడ, జోడేఘాట్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గుస్సాడీ నృత్యాలు కనువిందు చేశాయి. ఐసీడీఎస్, రెవెన్యూ, ఐటీడీఏ, సఖీ, వైద్యారోగ్యశాఖ, కొలాం అభివృద్ధి, ఇప్పుపూలు, విస్తరాకుల తయారీ తదితరస్టాళ్లు ఆకట్టుకున్నాయి. నివాళులర్పించినవారిలో.. ‘స్థానిక’ ఎన్నికల కోడ్ నేపథ్యంలో దర్బార్ రద్దు చేయగా భీం ఆరాధికులు అనుకున్న స్థాయిలో హాజరు కాలేదు. మంత్రులు, కలెక్టర్తోపాటు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎస్పీ కాంతిలాల్పాటిల్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, ఏఎస్పీ చిత్తరంజన్, డీఎఫ్వో నీరజ్కుమార్, ఆర్డీవో లోకేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, డీడీ రమాదేవి, ఎంపీ నగేశ్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు, భీం మనుమడు కుమురం సోనేరావు, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు సుగుణ, నాయకులు విశ్వప్రసాద్, శ్యాంనాయక్ తదితరులు భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించినవారిలో ఉన్నారు. -
అప్రమత్తంగా ఉండాలి
తాంసి: విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఎస్పీ మంగళవారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందితో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మహారాష్ట్ర నుంచి మద్యం, డబ్బు వంటివి అక్రమంగా రవాణా కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ జీవన్రెడ్డి, రూరల్ సీఐ ఫణిందర్, ఎస్సై జీవన్రెడ్డి, సిబ్బంది ఉన్నారు. -
‘స్థానిక’ ఎన్నికలపై ఉత్కంఠ
సాక్షి,ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి గత నెలలో షెడ్యూల్ జారీ అయ్యింది. సాధారణంగా షెడ్యూల్ ప్రకటన తర్వాత క్షేత్రస్థాయిలో రాజకీయాలు వేడెక్కాలి. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ నేపథ్యంలో ఎన్నికలు ఇ ప్పుడు ప్రకటించిన రిజర్వేషన్ల ఆధారంగానే జరుగుతాయా.. లేనిపక్షంలో పరిణామాలు ఎలా ఉంటాయని రాజకీయ పార్టీలతో పాటు ఆశావహులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుధవారం రాష్ట్ర ప్రధాన న్యాయస్థానంలోఈ విచారణ సాగను న్న నేపథ్యంలో అందరి దృష్టి అటువైపే నెలకొంది. గత నెలలో షెడ్యూల్.. సెప్టెంబర్ 29న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ జారీ అయిన విషయం తెలిసిందే. పరిషత్ ఎన్నికలు రెండు విడతల్లో, గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించేలా అందులో ప్రకటించారు. పరిషత్ మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ గురువారం రావాల్సి ఉంది. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో హైకోర్టులో బుధవారం విచారణ సాగనుంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం స్పందనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రిజర్వేషన్లు నిలిచేనా..? ఆదిలాబాద్ జెడ్పీ చైర్పర్సన్ రిజర్వేషన్ జనరల్ (మహిళ)కు కేటాయించిన విషయం తెలిసిందే. అలాగే జిల్లాలో 20 పరిషత్ స్థానాలకు గాను 8 ఎస్టీ, 8 బీసీ, 2 జనరల్, 2 ఎస్సీలకు రిజర్వేషన్ ఖరారయ్యాయి. ఇందులో సగం స్థానాలను మహిళలకు కేటాయించారు. అలాగే ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ల రిజర్వేషన్ల ఖరారు సైతం ఇప్పటికే పూర్తయింది. హైకోర్టు తీర్పు తర్వాత రోజే గురువారం పరిషత్ ఎన్నికలకు సంబంధించి మొదటి నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. అయితే గ్రామాల్లో ఇప్పటివరకు ఈ ఎన్నికలకు సంబంధించి వేడి కనబడటం లేదు. రాజకీయ పార్టీలు కూడా వేచి చూసే ధోరణిలో న్యాయస్థానం తీర్పు ఎలా ఉంటుందోనని ఆసక్తిగా గమనిస్తున్నారు. -
మాతా శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యం
ఆదిలాబాద్టౌన్: మాతా, శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యమని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. పట్టణంలోని శాంతినగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలతో మంగళవారం సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవజాతి శిశు మరణాల రేటును 10లోపు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే గర్భిణుల ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. ఇందులో డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి శ్రీధర్, మెడికల్ ఆఫీసర్ ఇఫత్, వినోద్ కుమార్, సీఓ రాజారెడ్డి, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ
కై లాస్నగర్: జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా అన్నారు. తొలి విడత నామినేషన్ల స్వీకరణ ఈనెల 9 నుంచి ప్రారంభం కానున్న తరుణంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, నామినేషన్ల ప్రక్రియపై జిల్లాలోని ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పోలీస్ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. నామినేషన్ల స్వీకరణ నుంచి అభ్యర్థుల తుది జాబితా ప్రకటన వరకు నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, విత్డ్రా, గుర్తుల కేటాయింపు ప్రక్రియతో పాటు ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేలా చూడాలన్నారు. సమయపాలన పక్కాగా పాటించాలని, ఆర్వో గదిలో వాల్క్లాక్ ఏర్పాటు చేయాలన్నారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులతో పాటు వారి ప్రతిపాదకులు స్థానికులేనా అనే దాన్ని ఓటరు జాబితా ఆధారంగా నిర్ధారించుకోవాలన్నారు. ప్రక్రియ అంతా వీడియోగ్రఫీ చేయించాలన్నారు. రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు ప్రత్యేక ఐడీ కార్డులు జారీ చేయాలని తెలిపారు. పోటీలో నిలిచే అభ్యర్థులు ప్రత్యేక బ్యాంకు అకౌంట్ ఖాతా తెరిచి నామినేషన్ల సమయంలోనే అందించాలన్నారు. ఎన్నికల ఖర్చులు మొత్తం ఈ ఖాతా నుంచే నిర్వహించాలని తెలిపారు. ప్రతీ ఆర్వో కార్యాలయంలో అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేసేలా హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు. నోటిఫికేషన్ జారీకి ముందే మాక్ నామినేషన్ ప్రక్రియ నిర్వహించాలని తద్వారా నిర్వహణలో తప్పిదాలకు అవకాశం లేకుండా ఉంటుందన్నారు. సమస్యత్మాక కేంద్రాలపై తహసీల్దార్, ఎంపీడీవో, ఎస్హెచ్ఓలు సంయుక్తంగా చర్చించి వాటి వివరాలతో కూడిన జాబితాలను గురువారంలోగా అందించాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని, సబ్ కలెక్టర్ యువరాజ్, ఏఎస్పీ కాజల్ సింగ్, జెడ్పీ సీఈవో రాథోడ్ రవీందర్, డీపీవో రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రొసీడింగ్.. జాప్యం
కైలాస్నగర్: అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఎల్ఆర్ఎస్– 2020 స్కీం కింద ఫీజు లో 25శాతం రాయితీ కల్పిస్తూ మే 3వ తేదీ వరకు ఈ పథకాన్ని అమలు చేసింది. అయితే ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో దీనికి ఆశించిన మేర స్పందన లభించలేదు. దరఖాస్తులు పెద్ద సంఖ్యలో అందినప్పటికీ ఫీజు చెల్లింపునకు మాత్రం అంతగా ముందుకు రాలేదు. మరోవైపు ఫీజు చెల్లించిన వారి విషయంలో బల్దియా అధికారులు అలసత్వం ప్రదర్శి స్తున్నారు. క్షేత్రసాయి పరిశీలనలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో ప్రొసీడింగ్ ఆర్డర్ల జారీలో తీవ్ర జాప్యమవుతోంది. దీంతో ఫీజు చెల్లించిన వారికి నిరీక్షణ తప్పడం లేదు. స్పందన నామమాత్రమే.. గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీంకు 2020లో శ్రీకా రం చుట్టింది. నాడు మీసేవ కేంద్రాల్లో రూ.1000 చె ల్లించి దరఖాస్తు చేసుకున్న వారి ప్లాట్లను క్రమబద్ధీ కరించాలని ఇటీవల కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. 25శాతం రాయితీతో కూడిన ఫీజు చెల్లింపున కు రెండు నెలల పాటు అవకాశం కల్పించింది. దీంతో బల్దియాకు భారీగా ఆదాయం సమకూరుతుంద ని భావించారు. అయితే ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు.దరఖాస్తుదారుల్లో సగంలో సగం మంది కూడా ఫీజు చెల్లించలేదు. చెల్లింపులోనూ సాంకేతిక సమస్యలు తలెత్తడం, పలు ప్లాట్లను నిషేధిత భూముల జాబితాలో చూపడం, వాటిని సరిదిద్దాల్సిన సంబంధిత అధికారుల మధ్య సమన్వయం కొరవడటం, చాలామంది ప్లాట్లను విక్రయించడం, కొనుగోలు చేసిన వారు ఎల్ఆర్ఎస్ చేస్తే తమకు ఎలాంటి ఇబ్బంది వస్తుందోనని వెనుకడుగు వేయడం వంటి కారణాలతోనే ఆశించిన స్థాయిలో స్పందన రాలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. వేల సంఖ్యలో దరఖాస్తులు అందినప్పటికీ ఫీజు చెల్లించేందుకు మాత్రం వారు అంతగా ముందుకు రానట్లుగా అధికారులు చెబుతున్నారు. ఫీజు చెల్లించినా.. అందని ప్రొసీడింగ్ ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి నెలల తరబడి ప్రొసీడింగ్ ఆర్డర్లు అందించకపోవడం బల్దియా అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. జిల్లాలో ఇంకా 602 మందికి ప్రొసీడింగ్ కాపీలు అందించాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో పరిశీలించి అందించాల్సిన అధికారుల తీరుపై దరఖాస్తుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రొసీడింగ్ అందకపోవడంతో ఇళ్లను నిర్మించుకోవాలని భావిస్తున్న వారు అనుమతుల కోసం ఇబ్బందులు పడుతున్నా రు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సత్వరం అందేలా చూడాలని కోరుతున్నారు. మున్సిపల్లో అందిన దరఖాస్తులు : 22,489 ఫీజు చెల్లింపునకు అర్హులు : 17,854 ఫీజు చెల్లించిన వారు : 4,498 జారీ చేసిన ప్రొసీడింగ్ పత్రాలు : 3,806 బల్దియాకు చేకూరిన ఆదాయం : రూ.9కోట్లు ప్రక్రియ వేగవంతం చేశాం ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తుదారుల ప్లాట్ల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేశాం. ఇందుకోసం పది మంది వార్డు ఆఫీసర్లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాం. వారికి లాగిన్ ఐడీలు సైతం కేటాయించాం. ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసి ప్రొసీడింగ్ ఆర్డర్లు అందించేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం. – సుమలత, టౌన్ప్లానింగ్ అధికారి -
పోరాటయోధుడు కుమురంభీం
ఆదిలాబాద్రూరల్: జల్, జంగల్, జమీన్తో పాటు ఆదివాసీల హక్కుల సాధన కోసం నిజాం సర్కార్తో కుమురం భీం అనేక పోరాటాలు చేశారని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. హీరా సుకా జాగృతి సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మంగళవారం కుమురంభీం వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి ఆయన హాజరయ్యారు. కుమురంభీం, రాంజీగోండ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ, పోరాటయోధుడు కుమురం భీం జీవి తం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశ య సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నా రు. అనంతరం కొలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న కొడప సొనేరావ్ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్, డీఎస్పీ జీవన్ రెడ్డి, జాగృతి సమితి జిల్లా అధ్యక్షుడు సిడాం రాంకిషన్, ఆదివాసీ సంఘాల నేతలు మడావి రాజు, కుర్సేంగే తానాజీ, కుమ్ర రాజు, గేడం వనిత, గేడం గీత, ఆత్రం అనసూయ, యాదవ్రావ్, బాపూరావ్, లక్ష్మణ్, ఆనంద్రావ్, మనోహర్, శంకర్, సుభాష్ పాల్గొన్నారు. కై లాస్నగర్: భూ భారతి పెండింగ్ దరఖాస్తులు ఈ నెలాఖరులోగా పరిష్కరించి నివేదికలు అందించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని తహసీల్దార్లతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వివిధ మాడ్యూల్స్లో అందిన దరఖాస్తులు, పరిష్కారమైన, పెండింగ్లో ఉన్న, నోటీసులు జారీ చేసిన, క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టిన దరఖా స్తుల వివరాలపై మండలాల వారీగా సమీక్షించారు. దరఖాస్తుల పరిశీలనలో అలసత్వం వహించవద్దన్నారు. ప్రతీ మండలంలో రెండు టీంలను ఏర్పాటు చేసి సర్వే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందులో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రెయినీ కలెక్టర్ సలోని తదితరులు పాల్గొన్నారు. ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి కై లాస్నగర్: వాల్మీకి మహర్షి జయంతిని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా బీసీ అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని వాల్మీకి చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి -
ఇక వారి పింఛన్ డబ్బులు బ్యాంకు ఖాతాలకే..
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో విలీనమై ఆరేళ్లుగా మావలలోనే చేయూత పింఛన్ డబ్బులు పొందుతున్న వారి కష్టాలు ఎట్టకేలకు దూరం కానున్నాయి. ఇక నుంచి నేరుగా వారి బ్యాంకు ఖాతా ల్లోనే జమ కానున్నాయి. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు.మున్సిపల్ పరిధిలోని 13 కాలనీలకు..ప్రస్తుతం ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న దస్నాపూర్, దోబీకాలనీ, దుర్గానగర్, హన్మాన్నగర్, న్యూహౌసింగ్బోర్డు, కై లాస్నగర్, పిట్టలవాడ, రాంనగర్, షాద్నగర్, సుభాష్నగర్, టైలర్స్కాలనీ, టీచర్స్కాలనీ, కేఆర్కే కాలనీలు గతంలో మావల మేజర్ గ్రామ పంచాయతీ పరిదిలో ఉండేవి. 2019లో పునర్విభజనలో భాగంగా వీటిని ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో చేర్చారు. పట్టణ పరిధిలోని పింఛన్దారులకు పింఛన్ను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. గ్రామీ ణ ప్రాంత లబ్ధిదారులకు మాత్రం పోస్టాఫీసుల ద్వారా చెల్లిస్తున్నారు. అయితే ఈ కాలనీలు ము న్సిపల్లో విలీనమై ఆరేళ్లవుతున్నా వీరికి మాత్రం దస్నాపూర్, మావలలోని పోస్టాఫీసుల ద్వారానే పింఛన్ చెల్లిస్తూ వస్తున్నారు. ఈ నగదు తీసుకునేందుకు వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు ఆయా కాలనీల నుంచి ప్రతి నెలా అక్కడికి ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సి వస్తోంది. అలాగే రద్దీ ఉండటంతో గంటల తరబడి నిరీక్షణ తప్పని పరిస్థితి. ఈ క్రమంలో వారి ఇక్కట్లను గుర్తించిన కలెక్టర్ వారికిచ్చే పింఛన్ను మున్సిపల్ ద్వారానే చేపట్టాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వచ్చే నెల నుంచి ఆయా కాలనీల్లోని 1608 మంది లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో పింఛన్ డబ్బులు జమ కానున్నాయి.మరి ఆ రెండు కాలనీల పరిస్థితి..ఇదిలా ఉంటే ఆదిలాబాద్ రూరల్ మండల పరి ధిలో గ్రామ పంచాయతీగా ఉన్న అనుకుంట గ్రా మాన్ని మున్సిపల్ 4వార్డులో అలాగే రాంపూర్ గ్రామాన్ని 17వ వార్డులో విలీనం చేశారు. ప్రస్తుతం రాంపూర్లో 320 మంది, అనుకుంటలో 235 మంది పింఛన్ లబ్ధిదారులున్నారు. నిబంధనల ప్రకా రం వీరికి కూడా బ్యాంకు ఖాతాల ద్వారానే నగదు చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా 13 కాలనీల లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా అందించాలని నిర్ణయించిన అధికారులు ఈ రెండు కాలనీలను మాత్రం ఎందుకు విస్మరించారనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే వారికి స్థానికంగానే పోస్టాఫీసులు అందుబాటులో ఉన్నందున ప్రస్తుతం అక్కడ అమలు చేయడంలేదని డీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. త్వరలోనే వాటిని కూడా పట్టణ పరిధిలోకి తీసుకొస్తామని పేర్కొంటున్నారు.మున్సిపల్ పరిధిలోకి చేరినలబ్ధిదారుల వివరాలు..కాలనీ లబ్ధిదారుల సంఖ్యదస్నాపూర్ 305దోబీకాలనీ 104దుర్గానగర్ 64హన్మాన్నగర్ 58న్యూహౌసింగ్బోర్డు 82కై లాస్నగర్ 50పిట్టలవాడ 187రాంనగర్ 320షాద్నగర్ 27సుభాష్నగర్ 151టైలర్స్కాలనీ 50టీచర్స్కాలనీ 58కేఆర్కే కాలనీ 142ఈకేవైసీ నమోదు చేసుకోవాలిపట్టణ పరిధిలోని 13 కాలనీల పింఛన్దారులకు ఇచ్చే సొమ్మును ఇక నుంచి నేరుగా మున్సిపల్ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నాం. ఇందుకోసం లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాలను యాక్టివేట్ (ఈకేవైసీ) చేయించుకోవాలి. బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డుతో కూడిన వివరాలను ఈ నెల 25లోపు మున్సిపల్ కార్యాలయంలో అందజేయాలి. జాప్యం చేస్తే పింఛన్ జమ చేయడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశముంది.– రాథోడ్ రవీందర్, డీఆర్డీఓ -
జాతీయ మహాసభల్లో జిల్లా టీచర్లు
ఆదిలాబాద్టౌన్/ఇచ్చోడ: రాజస్థాన్లోని జండోలి ఏబీఆర్ఎస్ఎం జాతీయ మహాసభల్లో టీపీయూఎస్ జిల్లా బాధ్యులు సోమవారం పా ల్గొన్నారు. అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షానిక్ మహాసంఘ్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా మహాసభలను చేపడుతున్నారు. ఇందులో జా తీయ నూతన విద్యా విధానం, టెట్ సమస్య పరిష్కారం, పాత పెన్షన్ విధానం అమలు, సర్వీస్ రూల్స్, బడ్జెట్లో విద్యకు అధిక ప్రాధాన్యం, దేశ వ్యాప్తంగా ఒకే పీఆర్సీ, ఎస్జీటీలకు ఎమ్మెల్సీ ఓటు హక్కు తదితర అంశాలపై చ ర్చించారు. ఈ మహాసభల్లో టీయూపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సునిల్ చౌహాన్, గోపీకృష్ణ, కిరణ్, మనోజ్రెడ్డి, జీజాబాయి, సంగీత తదితరులున్నారు. -
భీం త్యాగానికి గౌరవం
కెరమెరి(ఆసిఫాబాద్): నిజాం సర్కారుకు వ్యతిరేకంగా, ఆదివాసీల హక్కు ల కోసం ప్రాణాలర్పించిన భీం త్యాగాలను రాష్ట్రప్ర భుత్వం గుర్తించింది. జల్.. జంగల్.. జమీన్.. నినాదంతో పోరాడి అమరుడైన కు మురంభీం వర్ధంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కెరమెరి మండలం జోడేఘాట్లో మంగళవారం భీం వర్ధంతి అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం నివాళులర్పించనున్నారు. ఉదయం 8గంటలకు జెండాలు ఆవిష్కరించనున్నారు. 9గంట లకు సమాధి వద్ద పూజలు చేసి, 10గంటలకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు. ఇప్పటికే ఆసిఫా బాద్ కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఏర్పాట్లు పరిశీలించి, అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. పదివేల మందికి పైగా హాజరు.. ప్రభుత్వం భీం వర్ధంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంతో అందుకు తగిన విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే భీం విగ్రహానికి మెరుగులు దిద్దారు. ట్రాక్టర్లతో పరిసరాలు, పార్కింగ్ స్థలాలు చదును చేయించి.. ప్రజలు కూర్చునేందుకు వీలుగా టెంట్లు వేస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాత్కాలిక మూత్రశాలలు ఏర్పాటు చేస్తున్నారు. భోజన సదుపాయం కూడా కల్పించనున్నారు. 10వేల మందికి పైగా హాజరవుతారని అంచనా వే స్తుండగా, 12 వేల మందికి భోజనాలు సిద్ధం చేస్తున్నారు. హెలిప్యాడ్ సైతం సిద్ధం చేశారు. మారుమూల ప్రాంతం కావడంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఏఎస్పీ, డీఎస్పీతోపాటు సీఐ, ఆర్ఐలు 8 మంది, ఎస్సైలు 25, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు 51 మంది, ఇతర సిబ్బంది 136, డబ్ల్యూపీసీలు 56, హోంగార్డులు 79 మంది, ఇతర సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. బాంబు, డాగ్స్క్వాడ్తో జోడేఘాట్కు చేరుకునే రహదారుల్లో తని టఖీలు ముమ్మరం చేశారు. అలాగే గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఏటీడబ్ల్యూవోలు ముగ్గు రు, సీఆర్టీలు, రెగ్యులర్ ఉపాధ్యాయులు 100 మంది, వంట మనుషులు 70 మంది, ఆశ్రమ పాఠశాలల వార్డెన్లు ఐదుగురు, ఇతర సిబ్బందిని డిప్యూటేషన్పై నియమించారు. ఐకేపీ సిబ్బంది 35 మంది, ఇంజినీరింగ్ శాఖకు చెందిన సిబ్బంది పది మందిని కేటాయించారు. ఆయా శాఖల సిబ్బంది సోమవారం రాత్రే జోడేఘాట్కు చేరుకున్నారు. ఆసిఫాబాద్ డిపో నుంచి ప్రత్యేక బస్సులను జోడేఘాట్కు నడపనున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే వాహనాల కోసం పార్కింగ్ స్థలాలు సిద్ధం చేశారు. హాజరు కానున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం భీం వర్ధంతిని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరు కానున్నారు. అలాగే ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు నివాళులర్పించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కేవలం భీం విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటించి, పూజలకే పరిమితం కానున్నారు. ఆదివాసీలు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యలు తీసుకెళ్లేందుకు ఏటా నిర్వహించే దర్బారు కోడ్ కారణంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. కుమురంభీం విగ్రహం -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
● ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి ‘జూపల్లి’ కై లాస్నగర్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖ్య నాయకులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల్లో పార్టీ పరంగా బలమైన అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోవడంతో పాటు జెడ్పీలను సైతం కై వసం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి ఆత్రం సుగుణ, నిర్మల్, ఆసిపాబాద్ జిల్లాల అధ్యక్షులు శ్రీహరిరావు, విశ్వ ప్రసాద్రావు, బైంసా మార్కెట్ చైర్మన్ ఆనంద్రావు పటేల్, మాజీ ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, రాథోడ్ బాపూరావ్, సోయం బాపూరావ్, ఆత్రం సక్కు, ఆదిలాబాద్, బోథ్, ఆసిఫాబాద్ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడే గజేందర్, అజ్మీరా శ్యామ్నాయక్, నాయకులు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, పాల్గొన్నారు.


