breaking news
Adilabad
-
● డీఏపీ నోస్టాక్.. యూరియా పంపిణీలో వైఫల్యం ● వెరసీ కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల బారులు ● పంట ఎదుగుదలకు కీలకమైన సమయంలో.. ● అధికారుల ప్రణాళిక లోపమనే విమర్శలు
సాక్షి,ఆదిలాబాద్: ఈ వానాకాలం సీజన్లో రైతులు ఉత్సాహంగా పంటల సాగు చేపట్టారు. ప్రస్తుతం మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో ఇప్పటికే విత్తనాలు మొలకెత్తాయి. వాటి ఎదుగుదలకు యూరి యా, డీఏపీ ఇవ్వాల్సిన ఆవశ్యకత. ఈ క్రమంలో త మకు అవసరం మేర ఎరువులు ఇవ్వాలని రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వెళ్తున్నారు. అక్కడ డీఏపీ అసలుకే లభించడం లేదు. యూరియా లభిస్తున్నప్పటికీ రైతులు కోరినంత అందించని పరిస్థితి. వాస్తవానికి డీఏపీ కొరత ఉండగా, యూరి యా అందుబాటులో ఉన్నా రైతులకు పూర్తిస్థాయిలో లభించకపోవడం గమనార్హం. అధికారుల ప్ర ణాళిక లోపమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడా వైఫల్యం.. జిల్లాకు జూన్ వరకు ఎంతమేర యూరియా అవసరమో ఇప్పటివరకు అంతకుమించి ప్రభుత్వం పంపింది. క్షేత్రస్థాయి పంపిణీలో వైఫల్యం కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా పీఏసీఎస్ నుంచి తమకు ఇంత ఎరువు కావాలని వ్యవసాయ శాఖ జిల్లా అధికారికి స్థానిక ఏవో రికమండేషన్తో ఇండెంట్ పంపుతారు. తదనుగుణంగా డీఏవో మా ర్క్ఫెడ్కు ప్రొసీడింగ్ జారీ చేయాలి. ఆ ఇండెంట్ ఆధారంగా సొసైటీలకు స్టాక్ చేరుతుంది. అయితే ఈ ప్రక్రియ ఆన్లైన్లో చేపడతారు. ప్రధానంగా ప్రతీ ఘట్టంలో సమయం తీసుకోవడంతో పంపిణీ పరంగా జాప్యం అవుతున్నట్లు తెలుస్తోంది. అడిగిన మేర ఎందుకివ్వడం లేదు.. జిల్లాకు యూరియా కోటా మించి ఇప్పటి వరకు చే రుకుంది. అయినప్పటికీ పలుచోట్ల రైతుల డిమాండ్ మేరకు బస్తాలను పీఏసీఎస్లు ఇవ్వడం లేదు. మరి ఈ వైఫల్యం ఎవరిదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొసైటీలు ఏమేర తమకు స్టాక్ కావా లని ఇండెంట్ పంపుతున్నారో ఆ మేర అక్కడికి యూరియా చేరడం లేదు. దానికి బజార్హత్నూర్ స్టాక్ ఇండెంటే నిదర్శనం. అరకొర పంపుతుండడంతో క్షేత్రస్థాయిలో రైతులకు తమ విస్తీర్ణానికి అనుగుణంగా యూరియా దొరకని పరిస్థితి ఉంది. డీఏపీకి ప్రత్యమ్నాయంగా.. జిల్లాకు డీఏపీ ఇప్పటివరకు కోటాలో సగం మా త్రమే అందింది. ప్రస్తుతం కేంద్రాల్లో ఎక్కడ కూడా అందుబాటులో లేని పరిస్థితి. దీంతో రైతులు ప్ర త్యామ్నాయంగా కాంప్లెక్స్ ఎరువులు వాడాల్సిన దుస్థితి. ప్రధానంగా డీఏపీలో నత్రజని, భాస్వరం శాతం అధికంగా ఉంటుంది. ఇది మొక్కల ఎదుగుదలకు దోహదపడుతుంది. అయితే ప్రస్తుతం ఇది దొరకని పరిస్థితి ఉండడంతో రైతులు గత్యంతరం లేక తక్కువ నత్రజని, భాస్వరం ఉండే కాంప్లెక్స్ ఎరువుల వైపు మరలుతున్నారు. ప్రత్యామ్నాయంగా వాడే ఈ ఎరువుల్లో ఒకట్రెండు డీఏపీ ధరకే లభిస్తాయి. మరికొన్ని మాత్రం అధిక ధర ఉండడంతో రైతులపై ఆర్థిక భారం పడుతోంది. ఎరువుల వివరాలు.. (మెట్రిక్ టన్నుల్లో) ఎరువు మొత్తం కోటా జూన్ వరకు అవసరం వచ్చింది విక్రయించింది ఉన్న స్టాక్ యూరియా 35,000 17,000 25,503 10,222 15,281 డీఏపీ 13,000 13,500 8,444 8,140 304 కాంప్లెక్స్ 36,000 15,900 27,314 13,213 14,101ఒకేసారి తీసుకెళ్తుండడంతో.. ఎదిగే పంటలకు యూరియా దఫదఫాలుగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అన్ని దఫాలది కలిపి రైతులు ఒకేసారి కావాలని వస్తుండడంతోనే సమస్య ఎదురవుతుంది. అంతే తప్పితే యూరియా కొరత లేదు. డీఏపీ స్టాక్ రావాల్సి ఉంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రత్యామ్నాయంగా కాంప్లెక్స్ ఎరువులు కూడా వాడుకోవచ్చు. – శ్రీధర్స్వామి, జిల్లా వ్యవసాయ అధికారి -
రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలి
ఆదిలాబాద్: జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో రా ణించిన క్రీడాకారులంతా రాష్ట్రస్థాయి పోటీల్లో నూ సత్తాచాటాలని జిల్లా గిరిజన క్రీడల అధి కారి కోరెడ్డి పార్థసారథి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి అండర్– 10, 12, 14 అథ్లెటిక్స్ ఎంపిక పోటీలను ఆయ న ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ.. జిల్లాఅథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తర చూ పోటీలు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. నిరంతర సాధనతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించవచ్చని క్రీడాకారులకు సూ చించారు. అసోసియేషన్ సెక్రెటరీ పిట్ల రాజేశ్ మాట్లాడుతూ, జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరి చిన క్రీడాకారులు ఈనెల 6 నుంచి హన్మకొండ వేదికగా నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. ఇందులో అసోసియేషన్ ట్రెజరర్ రాకేష్, వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రెటరీ జ్యోతి స్వరన్ తదితరులు పాల్గొన్నారు. -
బడి తాళం తీసేదెప్పుడో?
● 20 రోజులవుతున్నా ప్రారంభం కాని తరగతులుటీచర్ రాకపోవడంతో ఆవరణలో చదువుకుంటున్న విద్యార్థులు బడి ఉంది.. విద్యార్థులూ ఉన్నారు.. కానీ బోధించేవారే కరువయ్యారు. విద్యా సంవత్సరం ప్రారంభమై 20 రోజులు గుడస్తున్నా ఆ చిన్నారులకు మాత్రం ఇంకా పాఠాలు అందని పరిస్థితి. సొనాల మండలం మహదుగూడ గ్రామ ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు చదువు కు దూరమవుతున్నారు. ఇందులో 20 మంది విద్యార్థులు ఉండగా.. ఉన్న ఒక్క ఉపాధ్యాయురాలు మెటర్నిటీ సెలవుపై వెళ్లారు. జూన్ 12న నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైనా ఇంకా తరగతులు షురూ కాకపోవడం గమనార్హం. ప్రతిరోజూ విద్యార్థులు పాఠశాలకు వచ్చి ఆవరణలో కాసేపు చదువుకొని వెళ్లిపోతున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ విషయమై స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీని వాస్ను వివరణ కోరగా.. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు మెటర్నిటీ సెలవులో ఉన్నట్లు తెలిపారు. విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించగా డిప్యూటేషన్పై తాజాగా ఒకరిని కేటాయించారని, బుధవారం నుంచి ఉపాధ్యాయుడు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. – బోథ్ -
పకడ్బందీగా ‘ఆరోగ్య పాఠశాల’
● ఈనెల 3 నుంచి డిసెంబర్ 31 వరకు ● కలెక్టర్ రాజర్షిషా ఆదిలాబాద్టౌన్: జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, కళాశాలల్లో ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్లో జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, వైద్యశాఖ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 250 పాఠశాలలు, 13 కళాశాలల్లో ఈ నెల 3నుంచి డిసెంబర్ 31 వరకు కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లుగా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 35వేల మంది విద్యార్థులకు ప్రతిరోజు ప్రార్థన సమయంలో ఉదయం 9.15 నుంచి 9.35 గంటల వరకు (20 నిమిషాల పాటు) రోజుకో కార్యక్రమంపై అవగాహన కల్పించాలన్నారు. మొదటి విడత కార్యక్రమం విజయవంతమైనందున మలి విడత మరింత పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ప్రతి నెలా సమీక్ష ఉంటుందని తెలిపారు. అలాగే విద్యార్థులకు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన వారికి రూ.2లక్షల వరకు నగదు పురస్కారం అందించనున్నట్లుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, డీఈవో శ్రీనివాస్రెడ్డి, జెడ్పీసీఈవో జితేందర్ రెడ్డి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్, డీడబ్ల్యూవో మిల్కా, డీఐఈవో జాదవ్ గణేష్ కుమార్, డైట్ ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్, ఆయుష్ విభాగాధికారి ప్రీతల్ రాథోడ్, ఆరోగ్య పాఠశాల కో ఆర్డినేటర్ అజయ్ పాల్గొన్నారు. -
నాణ్యమైన సేవలందించాలి
ఆదిలాబాద్టౌన్: వైద్యులు రోగులకు మరింత నాణ్యమైన సేవలు అందించాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా రిమ్స్ ఆస్పత్రిలో మంగళవారం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ను వైద్యులు, సిబ్బంది శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. బెస్ట్ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్స్డే నిర్వహించారు. వైద్యులను శాలువాతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఇందులో వైద్యులు శిరీష్, కళ్యాణ్రెడ్డి, భానుప్రకాశ్, నర్సింగ్ సూపరింటెండెంట్ రమాదేవి, దీపక్ పుష్కర్, అశ్విన్రాథోడ్, విజయలక్ష్మి, సింధూ జ, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు. టీబీ కార్యాలయంలో.. జిల్లా టీబీ కార్యాలయంలో డాక్టర్స్డే ఘనంగా నిర్వహించారు. వైద్యాధికారి సాయిప్రియను ఉద్యోగులు శాలువాతో సన్మానించారు. ఇందులో వైద్య ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బండారి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలతో సత్సంబంధాలు కీలకం
● అసాంఘిక కార్యకలాపాలకు తావివ్వొద్దు ● జిల్లాలో నెల రోజుల పాటు 30 పోలీస్యాక్ట్ ● ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్టౌన్: ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపర్చుకుంటూ పోలీసులు విధులు నిర్వర్తించాల ని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో అధికారులతో మంగళవారం నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బంది గ్రామాల్లో సందర్శిస్తూ ‘పోలీసులు మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామస్థాయిలో సమాచార వ్యవస్థ పటిష్టం చేసుకోవాలని సూచించారు. ప్రతీ గ్రామానికి విలేజ్ పోలీసు ఆఫీసర్ను కేటాయించి వారి పేర్లు గోడలపై రాయించాలన్నారు. సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు స్టేషన్ హౌస్ అధికారి ఘట నా స్థలాన్ని పరిశీలించి సరైన దర్యాప్తు చేపట్టాలన్నారు. అప్పుడే పోలీసులపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందన్నారు. మంగళవారం నుంచి ఆపరేషన్ ముస్కాన్ ప్రారంభమవుతుందని, జిల్లాలో ఇద్దరు సీఐలు పద్మ, అంజమ్మ ఆధ్వర్యంలో రెండు బృందాలు పనిచేస్తాయన్నారు.ఆదిలాబాద్, ఉట్నూ ర్ డివిజన్లలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలా గే జిల్లాలో నెలరోజులపాటు 30 పోలీస్యాక్ట్ అమలులో ఉంటుందని, అనుమతులు లేకుండా ఎలాంటి సభలు, ర్యాలీలు చేపట్టరాదని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణకు పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. అలాగే రహదారి ప్రమాదాల నివారణకు రాత్రి వేళల్లో డ్రంకెన్ డ్రైవ్ చేపట్టాలన్నారు. జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు రూపుమాపే దిశగా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. నేరస్తులపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అనంతరం గత నెలలో జరిగిన నేరాలు, నమోదైన కేసులు, వాటి దర్యాప్తు, పెండింగ్ కేసుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సమావేశంలో అదనపు ఎస్పీ బి.సురేందర్ రావు, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్.జీవన్రెడ్డి, సీహెచ్ నాగేందర్, హసిబుల్లా, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, రిజర్వు ఇన్స్పెక్టర్లు, సబ్ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, డీసీఆర్బీ, ఎన్ఐబి, ఐటీ కోర్, ఫింగర్ ప్రింట్స్, పోలీసు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాఉట్నూర్రూరల్: గిరిజనుల సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయ ఛాంబర్లో నిర్వహించిన ప్రజావాణిలో వి విధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలనుంచి అర్జీలు స్వీకరించారు. ఇంద్రవెల్లి మండలం సమ్మక్క గ్రామానికి చెందిన భీంరావ్ కిరాణ దుకాణం, నా ర్నూర్ మండలం గుండాలకు చెందిన ప్రవీణ్ ల్యాబ్, రెబ్బెన మండలం ఖావీగూడకు చెందిన చంద్రశేఖర్ టెంట్హౌస్ మంజూరు చేయాలని కోరా రు. ఇంకా పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన దరఖాస్తులు స మర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో (పీవీ టీజీ) మెస్రం మనోహర్, డీడీ అంబాజీరావు, పీహెచ్వో సందీప్ కుమార్, ఏడీఎంహెచ్వో కుడిమేత మనోహర్, ఏవో దామోదరస్వామి, మనోహర్, మేనేజర్ శ్యామల, డీపీవో ప్రవీణ్, జేడీఎం నాగభూషణం, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆదివాసీలను అడవుల నుంచి దూరం చేయొద్దు
● కేంద్ర మంత్రికి విన్నవించిన ‘సోయం’కై లాస్నగర్: ఆదివాసీలను అడవుల నుంచి దూరం చేసేలా జారీ చేసిన జీవో 49 రద్దు చేయాలని మాజీ ఎంపీ సోయం బాపూరావు కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి జుయల్ ఓరామ్ను కోరారు. సోమవారం న్యూఢిల్లీలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో ఆదివాసీల సమస్యలు, పోడు భూములకు పట్టాలు, జీవో 49 అంశాలపై మంత్రితో చర్చించి వినతిపత్రం అందజేశారు హరితహారం పేరిట పోడు భూముల్లో మొక్కలు నాటడం మానుకోవాలని కోరారు. టైగర్ కన్జర్వేషన్ పేరిట ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదివాసీలను అడవుల నుంచి దూరం చేసేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారన్నారు. గిరిజనులు, గిరినేతలు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు అందించేలా చూడాలని విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే తెలంగాణలో పర్యటించి గిరిజనుల స్థితిగతులను పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. -
చోరీకి పాల్పడిన ముగ్గురు అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: మత్తు పదార్థాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. సోమవారం టూటౌన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం తెల్లవారుజామున పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గుర్ని విచారించగా చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. శనివారం రాత్రి రిమ్స్ ఆస్పత్రి పక్కన గల సాయిసేవ ఆస్పత్రిలోని మెడికల్ షాపులో చోరీకి పాల్పడ్డారని, ఒక సెల్ఫోన్తో పాటు రూ.200 నగదు, టర్మైన్ ఇంజక్షన్లు, మెడజాలమ్ ఇంజెక్షన్లను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. మత్తుపదార్థాలకు అలవాటుపడిన వారు మత్తులో ఉండటానికి ఇలాంటి ఇంజక్షన్ల చోరీకి పాల్పడినట్లు వివరించారు. ఈనెల 22న మోయిజ్ మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో, 23న దస్నాపూర్లోని దుర్గామాత మందిరంలో, 28న సాయిఫాస్ట్ఫుడ్ సెంటర్ పక్కన గల కిరాణ దుకాణంలో చోరీకి పాల్పడినట్లు తెలిపారు. అరెస్టు చేసిన వారిలో న్యూహౌజింగ్బోర్డుకు చెందిన మహ్మద్ మోయిజ్, చిల్కూరి లక్ష్మీనగర్కు చెందిన షేక్ సమీర్, షేక్ అబ్దుల్ ఉన్నట్లు పేర్కొన్నారు. -
ఆర్జీయూకేటీలో అకడమిక్ రివ్యూ మీటింగ్
బాసర: బాసర ఆర్జీయూకేటీలో 2025–26 విద్యాసంవత్సరాన్ని పురస్కరించుకుని సోమవారం అకడమిక్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్, ఓఎస్డి ప్రొఫెసర్ ఈ. మురళీదర్శన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ గోవర్ధన్ మాట్లాడుతూ విద్యార్థుల హాజరు, రిజిస్టర్ల నిర్వహణ, డేటా భద్రతపై దృష్టి పెట్టాలన్నారు. ఎన్ఏఏసీ ఫైల్ తయారీపై అన్ని శాఖల అధ్యాపకులు శ్రద్ధ వహించాలని సూచించారు. త్వరలో (ఎంటెక్)పీహెచ్డీ ప్రవేశ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. బాసర, మహబూబ్ నగర్ సెంటర్లకు సంబంధించిన ప్రవేశ ఫలితాలు విడుదల జూలై 4న, జూలై 7, 8, 9 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఫలితాలను మొదటిగా విడుదల చేసిన విశ్వవిద్యాలయంగా బాసర ఆర్జీయూకేటీ నిలిచిందన్నారు. ఇందులో భాగమైన టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో డీన్లు డాక్టర్ మహేష్, డాక్టర్ విట్టల్, డాక్టర్ నాగరాజు, అన్ని విభాగాల హెచ్ఓడీలు, పీఆర్వో విజయ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుత్షాక్తో మహిళ మృతి
తలమడుగు: విద్యుత్షాక్తో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చే సుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మే రకు తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామానికి చెందిన జువ్వాక లక్ష్మి (48) ఆదివారం రాత్రి ఇంట్లోకి సరఫరా అయ్యే విద్యుత్ తీగపై ఆరేసిన బ ట్టలు తీస్తుండగా షాక్కు గురికావడంతో కిందపడిపోయింది. గమనించిన కుటుంబ స భ్యులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రి మ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాధిక తెలిపారు. -
జీవో 49 రద్దు చేయాలి
ఉట్నూర్రూరల్: టైగర్ రిజర్వ్ పేరుతో ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 49 వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆత్రం తనుష్, జిల్లా అధ్యక్షుడు ఉయిక విష్ణు, నార్నూర్ మండల అధ్యక్షుడు మల్కు డిమాండ్ చేశారు. సోమవారం ఐటీడీఏ క్యాంపు కార్యాలయం ఎదుట టీఏజీఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగోరావు, మహేష్, గణేశ్, వికాస్, నాందేవ్, తదితరులు పాల్గొన్నారు. బైక్ల దొంగ అరెస్ట్ఆదిలాబాద్టౌన్: ద్విచక్ర వాహనం దొంగలించిన ఆదిలా బాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీకి చెందిన షేక్ నదీమ్ను అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్రావు తెలిపారు. పట్టణంలోని సుభాష్నగర్కు చెందిన మహ్మద్ షాబాద్ఖాన్ ఏప్రిల్ 11న బస్టాండ్లో పల్సర్ బైక్ పార్కింగ్ చేసి నిర్మల్కు వెళ్లాడు. రాత్రి 9 గంటలకు తిరిగి వచ్చిన ఆయన బైక్ కనిపించకపోవడంతో 15న టూటౌన్లో ఫిర్యా దు చేశాడు. సోమవారం ఇందిరానగర్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పట్టుకుని విచారించగా రెండు బైక్లు చోరీ చేసినట్లు తెలిపాడు. నిందితుడిపై ఇదివరకే రూరల్ పోలీసుస్టేషన్లో 2, టూటౌన్లో 2 చోరీ కేసులు ఉన్నట్లు చెప్పారు. -
యూరియా, డీఏపీ కోసం రైతుల పడిగాపులు
బజార్హత్నూర్/తాంసి: బజార్హత్నూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి 60 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని తెలియడంతో ఉదయం 5 గంటల నుంచి రైతులు బారులు తీరారు. మండలానికి 2వేల మెట్రక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటి వరకు 500 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందని, మంగళవారం మరో 60 మెట్రిక్ టన్నులు వస్తుందని ఏవో ఎండీ సౌద్ తెలిపారు. తాంసి మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం సొసైటీలో సోమవారం డీఏపీ పంపిణీ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఉదయమే సొసైటీ కేంద్రానికి చేరుకున్నారు. సుమారు 200 మందికి పైగా రైతులు డీఏపీ కోసం క్యూలో వేచి ఉన్నారు. సొసైటీ కేంద్రంలో మాత్రం కేవలం 200 బ్యాగులు మాత్రమే ఉండడంతో ముందు వరుసలో ఉన్నవారికే బస్తాలు దొరికాయి. దీంతో ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగారు. వెంటనే జిల్లా అధికారులు స్పందించి సరిపడా ఎరువులు అందించాలని తాంసి, బజార్ హత్నూర్ మండలాల రైతులు కోరుతున్నారు. -
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. పేషెంట్లు పూర్తయ్యే వరకూ..జిల్లా కేంద్రంలోని రిమ్స్లో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న జైనథ్ మండలం దీపాయిగూడ గ్రా మానికి చెందిన నూతుల కళ్యాణ్రెడ్డి రేడియాలజిస్ట్గా సేవలందిస్తున్నారు. ఎలాంటి ప్రైవేట్ ప్రాక్టీస్ చేయరు. ఉదయం 9 గంటలకు విధులకు హాజరవుతారు. సమయంతో సంబంధం లేకుండా పేషెంట్లు పూర్తయ్యేంత వరకు సేవలందిస్తారు. స్కానింగ్, సేవల కోసం నిత్యం 300 నుంచి 400 మంది ఇక్కడికి వస్తుంటారు. ఏరోజుకు ఆరోజు నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు రిపోర్టులు సైతం అందిస్తూ రోగులు ఇబ్బందులు పడకుండా చూస్తున్నారు. సేవలకు గుర్తింపుగా పలు అవార్డులు సైతం అందుకున్నారు. ఉట్నూర్ మండలం పులి మడుగు గ్రామానికి చెంది న పార్వతి–శ్రీరాముల దంపతుల కుమారుడు డాక్టర్ ఆడె విఠల్ జనరల్ రిమ్స్లో నాలుగేళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్నాడు. ఈయన వరంగల్లోని కేఎంసీలో వైద్యవిద్య అభ్యసించగా, ఢిల్లీలో పీజీ పూర్తి చేశాడు. అక్కడే అంబేద్కర్ ఆస్పత్రిలో వైద్యుడిగా సేవలు అందించా డు. జిల్లా ప్రజలకు వైద్యసేవలందించాలని తండ్రి కోరిక మేరకు రిమ్స్లో వైద్యుడిగా చేరి ఈ ప్రాంతంపై మమకారం చాటుతున్నాడు. ఢిల్లీ వదిలి.. రిమ్స్కు వచ్చి -
గ్రామాన్ని దత్తత తీసుకున్నారు..
జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ అశోక్ రిమ్స్లో సూపరింటెండెంట్గా సేవలు అందిస్తున్నారు. ఈయన సతీమణి డాక్టర్ రమ గైనకాలజిస్ట్. జిల్లా కేంద్రంలో వీరు సీనియర్ వైద్యులు. వృత్తిపరంగా కాకుండా సామాజిక సేవలోనూ వీరు ముందు నిలుస్తున్నారు. రెండేళ్లుగా ఆదిలాబాద్రూరల్ మండలంలోని అంకాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ పల్లెవాసులకు స్థానికంగా నాణ్యమైన వైద్యసేవలను ఉచితంగా అందిస్తున్నారు. రక్త పరీక్షలు, స్కానింగ్, ఓపీ తదితర సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాగే టీబీ పేషెంట్లను ఐదుగురిని దత్తత తీసుకొని ఆరు నెలల పాటు వారికి పోషకాహారం ఉచితంగా అందిస్తున్నారు. రిమ్స్ మార్చురీ ఎదుట షెడ్తో పాటు కుర్చీలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని సాధన మానసిక వైకల్యం గల కేంద్రంలో ప్రతినెలా పిల్లలకు భోజనం అందిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్లో గల సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రంలో రోగుల బంధువులకు నెలకోసారి భోజనం అందజేస్తూ దాతృత్వం చాటుతున్నారు. -
బాధలు విని.. భరోసా కల్పించి
కళాశాలలో ప్రవేశం కల్పించండి.. అయ్యా.. మేము ఉట్నూర్ మండలంలోని రాముగూడకు చెందిన కోలాం తెగ గిరిజనులం. మా బిడ్డలు ఇటీవల పదో తరగతి పాసయ్యారు. నైతం సోనిబాయికి 412 మార్కులు, కుమ్రం సీతాబాయికి 417 మార్కులు వచ్చాయి. గిరిజన సంక్షేమ ఆశ్రమ గురుకుల కళాశాలల్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేశాం. ఇటీవల జరిగిన కౌన్సెలింగ్లో సీటు దొరకలేదు. ప్రైవేట్లో వేలాది రూపాయలు పెట్టి చదివించే స్థోమత మాకు లేదు. మాపై దయచూపి గిరిజన ఆశ్రమ కశాశాలల్లో సీటు ఇప్పించాలి. – నైతం భీంరావు, కుమ్ర లక్ష్మణ్, ఉట్నూర్ కై లాస్నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలు పెండింగ్లో ఉంచకుండా సత్వరం పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అ న్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. తమ గోడు విన్నవించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వారి నుంచి అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోనిచాబ్రాతో కలిసి ఆయన అర్జీ లు స్వీకరించారు. అనంతరం వాటిని సంబంధిత అధికారులకు అందజేస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 98 అర్జీలు అందాయి. అందులో కొందరి నివేదన.. అర్జీలు స్వీకరించిన కలెక్టర్ ప్రజావాణికి 98 దరఖాస్తులు -
వానాకాలం జర భద్రం
అసలే వర్షాకాలం. విద్యుత్ ప్రమాదాలు పొంచి ఉంటాయి. లూజ్వైర్లు, నేలకొరిగే విద్యుత్ స్తంభాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎరువుల కోసం పడిగాపులు సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో యూరియా, డీఏపీ కోసం రైతులకు పడిగాపులు తప్పడం లేదు. 9లోu 8లోu రిమ్స్ సూపర్ స్పెషాలిటీలో యూరాలజిస్ట్గా సేవలిందిస్తున్న డాక్టర్ కార్తీక్ విధుల్లో చేరిన 18నెలల్లోనే 1600 శస్త్ర చికిత్సలు చేశారు.ప్రైవేట్లో రూ.లక్షల ఖర్చుతో కూడిన క్రిటికల్ ఆపరేషన్లు సైతం విజయవంతంగా పూర్తి చేసి అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఈయనది బోథ్ మండలంలోని కన్గుట్ట గ్రామం. తండ్రి పోశెట్టి రిటైర్డ్ ఎంఈవో, తల్లి పుష్పలత గృహిణి. ఇదివరకు హైదరాబాద్లోని యశోదలో నాలుగేళ్ల పాటు పనిచేశారు. జిల్లావాసులకు వైద్యసేవలు అందించాలనే తన తండ్రి కోరిక మేరకు రిమ్స్లో విధులు నిర్వర్తిస్తున్నట్లు చెబుతున్నాడు ఈయన. డబ్బే ముఖ్యం కాదని.. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఈ వృత్తిని ఎంచుకున్నానని, అదే స్ఫూర్తిగా ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నాడు. ఇప్పటివరకు కిడ్నీ స్టోన్స్, మూత్రాశయ క్యాన్సర్, ప్రొటెస్టెడ్ సమస్యలు, ఆర్ఐఆర్ఎస్ వంటి తదితర అరుదైన శస్త్ర చికిత్సలు చేశారు. ఈయన భార్య రోషిని నిర్మల్ మెడికల్ కళా శాలలో ఈఎన్టీగా సేవలందిస్తున్నారు. 18 నెలల్లోనే 1600 శస్త్రచికిత్సలు -
జీవో 49 రద్దు చేయాలి
కైలాస్నగర్: ఆదివాసీలను అడవికి దూరం చేసేలా తెచ్చిన జీవో 49ను తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదు ట సోమవారం ధర్నా నిర్వహించారు. పెసా వంటి గిరిజన చట్టాలు అమలు చేయకుండా ఎలాంటి గ్రా మసభలు నిర్వహించకుండా తీసుకొచ్చిన జీవో 49 ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో ఆదివాసీలు పాల్గొన్నారు. ఎండీఎం కార్మికుల ధర్నా.. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలనే డిమాండ్తో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో అప్పలు తెచ్చి వంట చేయాల్సి వస్తుందన్నారు. ఎన్నికల హామీ మేరకు రూ.10వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇందులో సంఘం నాయకులు, కార్మికులు తదిత రులు పాల్గొన్నారు. -
బాధితుల సమస్యలు పరిష్కరించాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: బాధితుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 73 మంది అర్జీదారులు ఎస్పీని కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఆయా స్టేషన్ల అధికారులతో ఎస్పీ ఫోన్ ద్వారా మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యలు విన్నవించేందుకు నేరుగా రాలేని వారు వాట్సాప్నంబర్8712659973పై సంప్రదించవ్చని సూచించారు. ఇందులో సీసీ కొండ రాజు, ఫిర్యాదు ల విభాగం అధికారి కవిత, వామన్ పాల్గొన్నారు. -
పీడీపీఎస్.. అమలయ్యేనా?
● పత్తి కొనుగోళ్లపై కేంద్రం నూతన విధానం ● ఆదిలాబాద్లో ఈ సీజన్ నుంచే పైలట్ ప్రాజెక్టుగా.. ● ఇక వ్యాపారులే కొంటారు.. ● ఎంఎస్పీ కంటే తక్కువ ఉంటే ఆ వ్యత్యాసాన్ని సీసీఐ ద్వారా రైతులకు చెల్లింపు ● ప్రస్తుత విధానమే మేలంటున్న కాటన్ అసోసియేషన్ప్రస్తుత విధానమే మేలు.. న్యూ ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ కాటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రధానంగా ప్రస్తుత కొనుగోలు విధానమే రైతులకు మేలని స్పష్టం చేయడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచి తప్పనిసరిగా ఈ స్కీమ్ అమలు చేయాలనే లక్ష్యంతో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటికీ కేంద్రానికి హామీ ఇవ్వలేదని మా దృష్టిలో ఉంది. ప్రధానంగా వ్యాపారుల వద్ద డ బ్బులు ఉన్నంతవరకు పత్తిని కొనుగోలు చేయగలుగుతారు. ఆ తర్వాత వ్యాపారులు కొనుగోలు చేయకపోతే రైతుల పరిస్థితి ఏంది. ఈ నేపథ్యంలోనే సీసీఐ కూడా కొనుగోలు చేస్తేనే రైతులకు మేలు జరుగుతుంది. – మనీష్ మాల్పాని,జిన్నింగ్ మిల్లు యజమాని ఆ మండలాల రైతులే అమ్మాలి.. పీడీపీఎస్ అమలైన పక్షంలో ఆదిలాబాద్ ఏఎంసీ నోటిఫైడ్ మండలాలైన తలమడుగు, తాంసి, భీంపూర్, ఆదిలాబాద్అర్బన్, ఆదిలాబాద్రూరల్, మావల రైతులు మాత్రమే మార్కెట్ యార్డులో పత్తిని విక్రయించాల్సి ఉంటుంది. ఇతర మండలాల రైతులు విక్రయించడానికి వీలుండదు. ఆదిలాబాద్ మార్కెట్లో ఉన్న వసతుల దృష్ట్యా ప్రస్తుత విధానంలో అటు వ్యాపారులు కొనుగోలు చేసినా, ఇటు సీసీఐ కొనుగోలు చేసినా ప్రతిరోజు రూ.20కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. ప్రధానంగా జిల్లాలోని అన్ని మండలాల నుంచే కాకుండా, పక్క జిల్లాలోని కొన్ని మండలాల నుంచి రైతులు ఆదిలాబాద్ మార్కెట్కు వచ్చి పత్తిని విక్రయిస్తారు. – గోవర్ధన్ యాదవ్, రైతు సంఘం నాయకుడు సాక్షి,ఆదిలాబాద్: ధర వ్యత్యాస చెల్లింపు పథకం (పీడీపీఎస్)ను పత్తి కొనుగోళ్ల పరంగా దేశంలో అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమవుతుంది. రా ష్ట్రంలో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ఆదిలాబా ద్ మార్కెట్లో ఈ సీజన్ నుంచే అమలు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై చర్చ మొదలైంది. పీడీపీఎస్ అమలైతే.. భారత పత్తి సంస్థ (సీసీఐ) పత్తిని కొనుగోలు చేయ దు. మార్కెట్లో వ్యాపారులు మాత్రమే రైతుల నుంచి విక్రయిస్తారు. అలాంటప్పుడు ఇక సీసీఐ ఉంటుందా.. కనుమరుగవుతుందా అనే సందేహాలు రావచ్చు. అయితే కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే రైతులకు మార్కెట్లో తక్కువ ధర లభించిన పక్షంలో ఆ వ్యత్యాసాన్ని కేంద్రం భరిస్తుంది. సీసీఐ ద్వారా ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేస్తోంది. అదే ఈ స్కీమ్ ఉద్దేశం. మార్కెట్లో ఎంఎస్పీ కంటే తక్కువ ధర ఉన్నప్పుడు రైతులకు ఆ వ్యత్యాసాన్ని చెల్లించడం ద్వారా వారికి నష్టం కలగకుండా చూడాలన్నదే ప్రభుత్వ భావన. ఇటీవల నీతి ఆయోగ్ సమావేశంలో చర్చ.. జూన్ 19న న్యూఢిల్లీలోని నీతి ఆయోగ్ భవన్లో చైర్మన్ ప్రొఫెసర్ రమేశ్చంద్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో పీడీపీఎస్ అమలుతో ఎదుర య్యే ఇబ్బందులు, సవాళ్లపై చర్చించారు. నీతి ఆ యోగ్, సీసీఐ ఉన్నతాధికారులు, వివిధ రాష్ట్రాల వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు, కాటన్ అసోసియేషన్ సభ్యులు, ఎంపిక చేసిన రైతులు పా ల్గొన్నారు. జిల్లా నుంచి జిన్నింగ్ మిల్లు వ్యాపారి మనీష్ మాల్పాని, రైతు సంఘం నుంచి గోవర్ధన్ యాదవ్ పాల్గొన్నారు. ఈ స్కీమ్ అమలుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై నీతి ఆయోగ్ అందరి నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. ఇందులో పాల్గొన్న తెలంగాణ కాటన్ అసోసియేషన్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు వరంగల్కు చెందిన బొమ్మినేని రవీందర్ రడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం సీసీఐ ద్వారా చేపడుతున్న కొనుగోలు విధానమే రై తులకు బాగుందని, ఇకముందు కూడా కొనసాగి స్తేనే మేలు చేకూరుతుందని స్పష్టం చేశారు. మ రోపక్క రైతు సంఘం నాయకులు కూడా సందేహా లు వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యత్యాస ధర రైతులకు ఎ న్ని రోజుల్లో ప్రభుత్వం చెల్లిస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి ఉత్తర్వులు అందలేదు.. పీడీపీఎస్ అమలు విషయంలో ఇప్పటివరకు మాకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. విధివిధానాలు ఖరారు కాలేదు. ఈ కొనుగోలు సీజన్ నుంచి ఈ విధానం అమలవుతుందా అని ఇప్పుడే చెప్పలేం. ప్రభుత్వాల నిర్ణయాల మేరకు ముందుకెళ్తాం. – గజానంద్, జిల్లా మార్కెటింగ్ అధికారి సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి ఆదిలాబాద్ వంటి పెద్ద మార్కెట్లో పైలట్ ప్రాజెక్ట్గా ఈ సిస్టమ్ను అమలు చేయాలనుకోవడం సరికాదు. మొదట ఓ చిన్న మార్కెట్లో అమలు చేసి దాన్ని సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. అలాంటప్పుడే లోపాలు తెలుస్తాయి. – రాజు చింతవార్, వ్యాపారి -
జీపీ కార్మికుల ఆందోళన
కై లాస్నగర్: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్మికులు సోమవారం ఆందోళన చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కా ర్యదర్శి కిరణ్ మాట్లాడారు. మూడు నెలలుగా వేతనాలు అందక కార్మికులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనంతరం డీపీవో రమేశ్కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఇందులో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న, గ్రామ పంచాయతీ కా ర్మికుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సోపన్రా వు, వెంకట్రావు, అశోక్, లస్మన్న పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట లంబాడాల ధర్నా లంబాడాలకు 1977 ఓటరు జాబితా ఆధారంగా కుల ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఇందులో లంబాడా హక్కుల పోరాట సమితి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చౌహన్, నాయకులు జాదవ్ కృష్ణ, రాథోడ్ రోహిదాస్, జాదవ్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు. 5వ తేదీలోగా రిపోర్టు చేయాలిఆదిలాబాద్టౌన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీటు పొందిన వారు ఈనెల 3లోగా సెల్ఫ్ రిపో ర్టు చేసుకోవాలని, కళాశాలలో 5వ తేదీలోగా రిపోర్టు చేయాలని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామ ర్స్ డిగ్రీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ రఘు గణపతి తెలిపారు. ఒకటి, రెండు, మూడో విడతల్లో సీటు పొంది కూడా అడ్మిషన్ పొందని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన సూచించారు. దరఖాస్తుల ఆహ్వానంఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అగ్రికల్చర్ కళాశాలలో యూజీ కోర్సుల్లో కంబైన్డ్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల డీన్ శ్రీధర్ చౌహాన్ ప్రకటనలో తెలిపారు. ఈనెల 18 వరకు గడువు ఉందని పే ర్కొన్నారు. అగ్రికల్చర్ బీఎస్సీ హోమ్ సైన్స్, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్, బీటెక్ ఫుడ్ టెక్నాల జీ, బ్యాచ్లర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ (బీవీఎస్సీ) బ్యాచ్లర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ (బీఎఫ్ఎస్సీ), బీఎస్సీ హార్టికల్చర్ తదితర కోర్సులు ఉన్నట్లు తెలిపారు. వివరాల కోసం కళాశాలలో సంప్రదించాలని సూచించారు. -
● ‘గ్రీవెన్స్’ సమస్య పరిష్కారంపై హర్షం
కలెక్టర్ను సన్మానించి .. కృతజ్ఞతలు తెలిపి కై లాస్నగర్: ప్రజావాణిలో నివేదించిన సమస్య పరిష్కరించడంపై భీంపూర్ మండలం డబ్బకుచ్చి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు గ్రీవెన్స్కు వచ్చి కలెక్టర్ రాజర్షి షాను సత్కరించారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల 15ఏళ్ల క్రితం మూతపడింది. దీంతో విద్యార్థులు మూడు కిలోమీటర్ల దూరంలోని వడ్గాంవ్కు వెళ్లి చదువుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో పలువురు చదువుకు దూరమవుతున్నారని, ఈ తీరుపై గ్రామస్తులు జూన్ 23న ప్రజావాణిలో కలెక్టర్ను కలిసి విన్నవించారు. మూతపడ్డ బడిని తెరపించాలని కోరారు. స్పందించిన కలెక్టర్ ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డీఈవోను ఆదేశించారు. మరుసటి రోజే గ్రామాన్ని సందర్శించిన విద్యాశాఖ అధికారులు పాఠఽశాలను పునఃప్రారంభించారు. కలెక్టర్ చొరవపై హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు సోమవారం ఆయన్ను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. తమ గ్రామాన్ని సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. కాగా పాఠశాలలో చదివే 30 మంది విద్యార్థులకు అవసరమైన 300 నోట్ బుక్స్ను పట్టణానికి చెందిన న్యాయవాది కె.విశ్వనాథ్ తన సమనుజ్ఞ ట్రస్ట్ ద్వారా కలెక్టర్ చేతుల మీదుగా వారికి అందజేశారు. ఇందులో డీఈవో శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
గుడిహత్నూర్: మండల కేంద్రంలోని జాతీయ రహదారి 44పై ఆదివారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రాటవెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 28 మందికి స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అమరావతికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్షసాక్షులు, పోలీసులు తెలి పిన వివరాలు.. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో మొత్తం 32 మంది ఉన్నారు. శనివారం రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి ట్రావెల్స్ బస్సు బయల్దేరింది. ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో మండల కేంద్రానికి చేరుకుంది. కాగా, మండల కేంద్రంలో సర్వీసు రోడ్డు పనులు నేపథ్యంలో నిర్మాణ సంస్థ ప్రమాద హెచ్చరికల బోర్డు ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుకాల మరో బస్సు వేగంగా వస్తోంది. ట్రావెల్స్ డ్రైవ ర్ ఆ బస్సు వెళ్లడానికి దారి ఇచ్చేక్రమంలో హెచ్చరిక బోర్డు దాటగా సర్వీసు రోడ్డుపై మెల్లగా బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగా యాలు కాగా, అందులో జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీకి చెందిన గాడిగు నరేంద్ర, అమరావతికి చెందిన ఇర్ఫాన్ మన్స్రీ, యవత్మాల్ జిల్లా ఘటానాకు చెందిన ఎండీ హర్భాజ్, అమరావతి పరత్వాడకు చెందిన ఆనంద్ అగ్రవాల్ ఉన్నారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను రిమ్స్కు తరలించి చికిత్స అందజేశారు. రిమ్స్లో క్షతగాత్రులను డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ పరామర్శించారు. అయితే బస్సు వేగం తగ్గించడంతో మెల్లగా మట్టి రోడ్డుపై పడడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై.మధుకృష్ణ తెలిపారు. జాతీయ రహదారి 44పై గుడిహత్నూర్ వద్ద ఘటన నలుగురికి తీవ్ర, 28 మందికి స్వల్ప గాయాలు క్షతగాత్రుల రిమ్స్కు తరలింపు తప్పిన పెను ప్రమాదం -
ఘనంగా అకాడి పూజలు
ఆషాడమాసం ప్రారంభంతో ఆదివాసీ గ్రామాల్లో అకాడి పూజలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇచ్చోడ మండలం బాదిగూడతోపాటు ఇంద్రవెల్లి మండలం సమాక, కేస్లాపూర్, పాటగూడ, ముత్నూర్ గ్రామాల ఆదివాసీలు పొలిమేరకు వెళ్లి వనదేవతలకు పూజలు చేశారు. సంప్రదాయ వంటలు తయారు చేసి నైవేద్యాలు సమర్పించారు. ప్రజలతోపాటు పంటలు, పశుపక్ష్యాదులు బాగుండాలని మొక్కినట్లు గ్రామాల ఆదివాసీ పెద్దలు తెలిపారు. గ్రామాల పెద్దలు కొరెంగా యేశ్వంత్రావ్ మహారాజ్, పెందోర్ భగ్వంత్రావ్, జంగు, లక్ష్మణ్, సోయం భీంరావ్, గ్రామపటేల్ సిడాం లక్ష్మికాంత్, దేవారి పెందుర్ బండు, గ్రామస్తులు తులిసిరాం, చిక్రం దేవ్రావు, పంద్రం రాజు, మెస్రం అమృత్రావు, సిడాం మధుకర్ తదితరులు పాల్గొన్నారు. – ఇంద్రవెల్లి/ఇచ్చోడ -
బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలి
పాతమంచిర్యాల: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని తెలంగాణ బీసీ మేధావుల ఫోరం చైర్మన్, వి శ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు అన్నారు. మంచిర్యాలలోని చార్వాక భవన్లో జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన బీసీ చైతన్య సదస్సులో ఆ యన మాట్లాడారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన 30 రోజు ల వ్యవధిలో 42 శాతం రిజర్వేషన్ బిల్లు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అఖిలపక్షాన్ని ఒప్పించి బీసీ రిజర్వేషన్ బిల్లును భారత రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్పించే బాధ్యత కేంద్రానితే అని తెలిపారు. అగ్రవర్ణాల కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లును అఘమేఘాల మీద చక్కబెట్టిన కేంద్రం అదే రీతిన బీసీ రిజర్వేషన్ బిల్లుకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. జాతీయస్థాయిలో కుల గణన సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. బీసీ మేధావుల ఫోరం అధ్వర్యంలో చేపట్టే పోరాటాలను ఉమ్మడి జిల్లా బీసీలు విజయివంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ బడి నిర్వాహకులు పిడికిలి రాజు, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం కోర్ కమిటీ సభ్యులు ప్రొఫెసర్ వీరస్వామి, అవ్వారు వేణుకుమార్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ నీలకంఠేశ్వర్రావు, బీసీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు కనుకుంట్ల మల్లయ్య, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, బీసీ రాజ్యాధికార సమితి జిల్లా కార్యదర్శి వేముల అశోక్, విశ్రాంత ఎంఈవో కొండయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్గౌడ్, బీసీ నాయకులు పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజీకి మృతదేహం అప్పగింత
● ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి నేత్రాలు దానంమందమర్రిరూరల్: మంచిర్యాల మెడికల్ కళాశాలకు వృద్ధురాలి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు అప్పగించారు. ఆమె నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి దా నం చేశారు. వివరాలు ఇలా.. మండలంలోని మామిడిగట్టు గ్రామానికి చెందిన మందల అమృతమ్మ(90) శనివారం రాత్రి మృతిచెందింది. తల్లి మృతి చెందినప్పటికి పది మందికి ఉపయోగపడాలని కుమారుడు శ్యాంసుందర్రెడ్డి ఆలోచన చేశాడు. తల్లి నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల(ఐ బ్యాంక్)కు అప్పగించారు. మృతదేహాన్ని మంచిర్యాల మెడికల్ కళాశాల వారికి సదాశయ ఫౌండేషన్ ద్వారా అప్పగించారు. సదాశయ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి సమ్మయ్య ఆదివారం వైకుంఠరథంలో మృతదేహాన్ని తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీటితో తుది వీడ్కోలు పలికారు. మృతురాలికి భర్త రాజిరెడ్డి ఉన్నారు. -
సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలి
● కార్మిక సంఘాల జేఏసీ పిలుపుశ్రీరాంపూర్: కేంద్రం కొత్తగా తెచ్చిన 4 లేబర్ కోడ్లకు నిరసనగా జూలై 9న జరిగే దేశ వ్యాప్త సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. నస్పూర్ ప్రెస్క్లబ్లో ఆదివారం ఏఐటీయూసీ అధ్యక్షుడు వి.సీతారామయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి ఏనుగు రవీందర్రెడ్డి, ఐఎఫ్టీయూ అధ్యక్షుడు విశ్వనాథ్ మాట్లాడారు. కేంద్రం 44 కార్మిక చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. ఈ కోడ్లు జూలై నుంచి అమలు చేయడానికి కేంద్రం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఇవి అమలైతే కార్మికవర్గం తమ హక్కులను కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం, సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసే హక్కును కూడా కోల్పోతారన్నారు. కార్మిక సంఘాల ఉనికిని ప్రశ్నార్థకం అవుతుందని తెలిపారు. దీనిని కార్మికవర్గం ముక్తకంఠంతో వ్యతిరేకించాలన్నారు. ఈ సమ్మె విజయవంతంతో కేంద్రం దిగివస్తుందన్నారు. అవసరమైతే నిరవధిక సమ్మెకు కూడా సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్య, బ్రాంచి కార్యదర్శి షేక్ బాజీసైదా, నాయకులు కొమురయ్య, కిషన్రావు, ఐఎన్టీయూసీ కేంద్ర ఉపాధ్యక్షులు గరిగే స్వామి, ల్యాగల శ్రీనివాస్, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్రెడ్డి, బ్రాంచి ఉపాధ్యక్షుడు బండి రమేశ్, సీఐటీయూ బ్రాంచి అధ్యక్షుడు గుల్ల బాలాజీ, కస్తూరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ ధ్రువపత్రాల కేసులో ముగ్గురు అరెస్ట్
ఇచ్చోడ: మండలంలోని ఇస్లాంనగర్ కేంద్రంగా నకిలీ నివాస ధ్రువపత్రాలు సృష్టించిన కేసులో కేశవపట్నానికి చెందిన షేక్ కలీం, ఇస్లాంనగర్కు చెందిన షేక్ ఫరీద్, జాదవ్ గజానంద్ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్ తెలిపారు. ఇచ్చోడ సీఐ కా ర్యాలయంలో ఆదివారం ఈమేరకు వివరాలు వెల్లడించారు. గత రెండునెలల క్రితం ఇస్లాంనగర్లో నివాసముంటున్నట్లు ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు యువకులు నకిలీ ధ్రువపత్రాలు పొంది ఆర్మీ, బీఎస్ఎఫ్లో ఉద్యోగాలు పొందారు. నిందితులు ముగ్గురు ఇతర రాష్ట్రాలకు చెందిన యువత నివాస ధ్రువపత్రాలు పొందే విషయంలో ఫేక్ ఇంటి నంబర్, ఆధార్కార్డులు ఇచ్చి సహకరించారు. ఇందుకు గాను వారి వద్ద నుంచి రూ.9 లక్షలు తీసుకున్నారు. నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నకిలీ ధ్రువపత్రాలు పొంది ఉద్యోగాలు చేస్తున్న 9 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ విషయమై ఆర్మీ, బీఎస్ఎప్ ఉన్నతాధికారులతో చర్చిస్తున్నామన్నారు. మండల కేంద్రంలో కొందరు మీ సేవ కేంద్రాల పేరుతో బోర్డులు పెట్టి ఆధార్ కార్డులు మార్ఫింగ్ చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఇచ్చోడ సీఐ బండారి రాజు, ఎస్సై పురుషోత్తం పాల్గొన్నారు. -
విద్యార్థిని నృత్య ప్రదర్శన
బోథ్: మండల కేంద్రానికి చెందిన నాంపల్లి సాయిసాగర్–అనిత దంపతుల కుమార్తె వైష్ణవి తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద నిర్వహించే భక్తి నృత్య ప్రదర్శనలో పాల్గొంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న ఆమె నృత్యంపై మక్కువతో శిక్షణ తీసుకుంది. కాగా, టీటీడీ వద్ద నృత్యం చేయడానికి అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా వైష్ణవి చేసిన నృత్యం అందరినీ అలరించింది. తన కూతురికి అక్కడ నృత్యం చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. -
● జూలై 1న 14 గేట్లు ఎత్తనున్న త్రిసభ్య కమిటీ సభ్యులు ● ఎస్సారెస్పీలోకి గోదావరి ప్రవాహం
భైంసా:మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై ని ర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లు జూలై 1 నుంచి తెరుచుకోనున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు, ప్రతి ఏటా జూలై 1 నుంచి అక్టోబర్ 28 వర కు 14 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు. ఈ నీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లోకి చే రనుంది, దీనివల్ల నిజామాబాద్, నిర్మల్ జిల్లాల రై తులకు తాగు,సాగునీటి అవసరాలు తీరనున్నాయి. త్రిసభ్య కమిటీ పర్యవేక్షణలో బాబ్లీ ప్రాజెక్టుపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో పో రాటాలు, కోర్టు వివాదాలు జరిగాయి. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం, వర్షాకాలంలో గోదావరి నది ప్రవాహానికి అడ్డంకులు లేకుండా గేట్లు తెరిచి ఉంచాలని నిర్దేశించింది. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యుల సమక్షంలో మహారాష్ట్ర, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు జూలై 1న గేట్లను ఎత్తనున్నారు. ఎస్సారెస్పీలో ప్రస్తుతం.. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 1064.60 అడుగుల వద్ద 15.567 టీఎంసీల నీటి నిల్వ ఉంది. బాబ్లీ గేట్ల నుంచి విడుదలయ్యే వరద నీరు ఈ ప్రాజెక్టులోకి చేరనుంది. ఎస్కేప్ గేట్ల ద్వారా 100 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీటిని ఎస్సారెస్పీ నుంచి విడుదల చేస్తున్నారు. బాబ్లీ నుంచి వచ్చే నీరు నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి, బాసర మీదుగా ఎస్సారెస్పీకి చేరుతుంది. తెలంగాణ సరిహద్దుకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాబ్లీ నుంచి ఎస్సారెస్పీ వరకు సుమారు 70 కిలోమీటర్ల దూరం ఉండగా, నీరు చేరడానికి కొంత సమయం పడుతుంది. రైతులకు ఉపయోగం.. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో, బాబ్లీ గేట్ల విడుదలతో గోదావరి నది నిండుగా ప్రవహించనుంది. దీనివల్ల నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లోని ఎత్తిపోతల పథకాల కింద లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులకు పుష్కలంగా నీరు అందనుంది. రైతులు ఇప్పటికే వరి నారుపోసి, మరో వారంలో నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో బాబ్లీ నీటి విడుదల రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఏర్పాట్లు చేసిన నీటిపారుదల శాఖ.. బాబ్లీ గేట్ల విడుదల కోసం మహారాష్ట్ర, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాలు జోరందుకునే ముందే గేట్లను తెరిచి, సహజ నీటి ప్రవాహాన్ని ఎస్సారెస్పీకి చేరేలా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రక్రియ వర్షాకాలంలో గోదావరి నది పరివాహక ప్రాంతంలోని సాగు, తాగునీటి అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది.బాబ్లీ ప్రాజెక్టు(ఫైల్)ప్రాజెక్టు పేరు : బాబ్లీ నిర్మాణ స్థలం : గోదావరి నదిపై మహారాష్ట్రలోని ధర్మాబాద్ తాలుకా బాబ్లీ గ్రామం వద్ద గేట్లు : 14 నీటి నిల్వ సామర్థ్యం : 2.74 టీఎంసీ గేట్లను పైకి ఎత్తే తేదీ : ప్రతియేట జూలై 1 నుంచి తిరిగి గేట్లను దించేతేదీ : ప్రతియేట అక్టోబర్ 28 దూరం : తెలంగాణ రాష్ట్ర సరిహద్దుకు 7 కిలోమీటర్లు, బాసరకు 18 కిలోమీటర్లు -
శెభాష్.. సింగరేణి
● వెలుగుల రికార్డులకు అవార్డులు ● జాతీయస్థాయిలో ఎస్టీపీపీకి గుర్తింపు ● పక్కాగా విద్యుత్ ఉత్పత్తి, నిర్వహణ ● ఎస్టీపీపీలో సీఎండీ బలరాం మార్క్ ● సింగరేణికి తలమానికంగా ప్లాంట్ జైపూర్: సింగరేణి సంస్థ ప్రత్యక్షంగా విద్యుత్ రంగంలోకి అడుగుపెట్టి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పిన అనతికాలంలో ఉత్పత్తి, నిర్వహణలో దేశస్థాయిలో రికార్డులు బద్దలు కొట్టింది. అత్యధిక పీఎల్ఎఫ్(ప్లాంటు లోడ్ ఫ్యాక్టరీ)తోపాటు నిర్వహణలో జీరో వాటర్ యూటిలైజేషన్, యాష్ వినియోగం, కర్బన ఉద్గారాలు తగ్గిస్తూ పర్యావణహిత చర్యలు చేపడుతూ శెభాష్ సింగరేణి అనిపించుకుంటోంది. ఒకపక్కన థర్మల్ పవర్ ప్లాంటు, మరో పక్కన భూమిపై సోలార్, నీటిపై తేలియాడే ఫ్లోటింగ్ సోలార్ ఏర్పాటు చేస్తూ జాతీయస్థాయిలో పురస్కారాలు అందుకుంటోంది. ఇప్పటికే 54 అవార్డులు.. ఎన్టీపీపీ, జెన్కో థర్మల్ పవర్ ప్లాంట్ను తలదన్నేలా ఎస్టీపీపీ అత్యధిక పీఎల్ఎఫ్ సాధనలో దేశస్థాయిలో వరుసగా మొదటి వరుసలో నిలువడంతోపాటు అన్నివిభాగాల్లో అవార్డులు కై వసం చేసుకుంటోంది. ఎస్టీపీపీకి ఇప్పటికే 54 అవార్డులు వరించాయి. ఈ అవార్డులు అందుకోవడం పట్ల అధికారులు, ఉద్యోగులపై సంస్థ సీఎండీ ఎన్.బలరాం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎస్టీపీపీలో ఆయన మార్క్ చూపుతూ వారిని ప్రోత్సహిస్తున్నారు. పర్యావరణ హిత చర్యల్లో మేటి.. పర్యావరణహిత చర్యల్లో భాగంగా కర్బన ఉద్గారాలు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. సల్ఫర్ను ఎఫ్జీడీ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్(ఎఫ్జీడీ) పద్ధతిలో జిప్సంగా మార్చే పనులు పూర్తయ్యాయి. ఇందుకు రూ.700 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టింది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి జరిగే సమయంలో గాల్లోకి సల్ఫర్ ఆకై ్సడ్ శాతం ఘనపు మీటర్కు 2 వేల మిల్లీగ్రాములు ఉంటోంది. దీంతో వాతావరణంలో తీవ్ర సమస్యలు ఏర్పడుతున్నాయి. 2,200 మిల్లీ గ్రాములకు తగ్గించడానికి దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎఫ్జీడీ నిర్మాణంతో బొగ్గు బూడిదను వందశాతం గాలిలో కలవకుండా నిలువరిస్తుంది. బొగ్గును మండిస్తే వెలువడే వేడి, నీటిని ఆవిరి రూపంలో మార్చే శక్తితో టర్బైన్లు తిప్పుతూ విద్యుత్ ఉత్పత్తిప్రక్రియ చేపడుతారు. అయితే చివరకు వెలువడే బూడిద, విషవాయువులను శుద్ధి చేస్తున్నారు. ఎలక్ట్రో స్టాటిక్ ప్రెసిపిటేటర్స్తో బూడిదను గాలిలో కలువకుండా చేస్తున్నారు. ఇలా వేరు చేసిన యాష్ను సిమెంట్, ఇటుకల నిర్మాణ రంగపరిశ్రమలకు విక్రయిస్తున్నారు. ఇలా వందశాతం యాష్ వినియోగం చేస్తూ జాతీయస్థాయిలో బెస్ట్ఫ్లైయాష్ యుటిలైజేషన్, ఉత్తమ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్, ఎనర్జీ ఎఫీషియంట్ ప్లాంటు, ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియంట్, పొల్యూషన్ కంట్రో అండ్ ఎక్విప్మెంట్, గోల్డెన్ అవార్డు ఇన్ ఎన్విరాన్మెంట్ ఎక్సలెన్సీ, జీరో వాటర్ యుటిలైజేషన్లో ఇలా 54 అవార్డులు అందుకుంది. అవార్డులు రావడం గర్వకారణం సీఎండీ బలరాం దిశానిర్దేశఽంతో అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషి ఫలితంగా పవర్ ప్లాంటు అన్నిరంగాల్లో ముందంజలో నిలుస్తోంది. కర్బన ఉద్గరాలు తగ్గించడానికి ఇప్పటికే ఎఫ్జీడీ నిర్మాణం పూర్తయింది. త్వరలో ప్రారంభిస్తాం. అన్నివిభాగాల్లో జాతీయస్థాయిలో అవార్డులు రావడం అందరికీ గర్వకారణం. ఇదే ఉత్సాహంతో పనిచేస్తూ ఎస్టీపీపీని జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలుపుతాం. – సీహెచ్ చిరంజీవి, ఎస్టీపీపీ ఈడీ -
‘యూహెచ్సీ’ పనుల పరిశీలన
● అసంతృప్తి వ్యక్తం చేసిన ఎంఈ ● తిరిగి చేపట్టాలని కాంట్రాక్టర్కు ఆదేశం కై లాస్నగర్: మున్సిపల్ పరిధిలోని మహాలక్ష్మివాడ కాలనీలో రూ.1.43 కోట్ల వ్యయంతో చేపట్టిన అర్బన్ హెల్త్సెంటర్ భవన నిర్మాణ పనులను మున్సిపల్ ఇంజినీర్ పేరిరాజు, బల్దియా డీఈ కార్తీక్ ఆదివారం పరిశీలించారు. పిల్లర్ల దశ దాటిన పనులను ప్రత్యక్షంగా పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ ప్రభుత్వ ఆమోదిత డిజైన్ ప్రకారం కాకుండా ఇష్టానుసారం చేపడుతున్నట్లుగా గుర్తించారు. ఇప్పటి వరకు జరిగిన నిర్మాణాన్ని పూర్తిగా తొలగించి, తిరిగి నిబంధనల ప్రకారం చేపట్టాలని ఆదేశించారు. కాగా, అధికారుల ఆదేశాలను కాంట్రాక్టర్ అమలు చేస్తాడా లేక రాజకీయ అండతో యథావిధిగా చేపడుతారా అనేది వేచి చూడాల్సిందే. -
ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా బీఆర్ఎస్..
● డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి కై లాస్నగర్: బీఆర్ఎస్ పార్టీ అనేది పైవేట్ లిమిటెడ్ కంపెనీ అని, అందులోని నాయకులు ఆ కంపెనీ ఓనర్ దొర చెప్పినట్టుగా నడుచుకోవడమే తప్ప ప్రత్యేకంగా చేసేదేమి ఉండదని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి విమర్శించారు. స్థానిక ప్రజాసేవ భవన్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల సమస్యలు, అధికార యంత్రాంగం పనితీరు సమీక్షించేందుకు వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రి పర్యటన తీవ్ర నిరాశ మిగిల్చిందని మాజీ మంత్రి రామన్న విమర్శించడం హస్యాస్పస్పదంగా ఉందన్నారు. మంత్రిగా పనిచేసిన ఆయన జిల్లాకు గతంలో ఏం ఒరగబెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. పదేళ్లు అధికారమిస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. సొంత అభివృద్ధి గురించి ఆలోచించారే తప్ప ప్రజల క్షేమాన్ని ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం 15నెలల్లో చేసి చూపిందన్నారు. హైదరాబాద్లో మహాన్యూస్ కార్యాలయంపై బీఆర్ఎస్ నాయకులు గుండాల్లా దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లుగా తెలిపారు. ఇందులో నాయకులు సంతోష్, నర్సింగ్, రఫీక్ తదితరులు పాల్గొన్నారు. -
మహలనోబిస్కు ఘన నివాళి
కై లాస్నగర్: జాతీయాదాయం అంచనా వేయడంలో, ప్రభుత్వ విధానాలు రూపొందించడంలో గణాంకాలు కీలకపాత్ర పోషిస్తాయని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రశాంత చంద్ర మహలనోబిస్ జయంతి పురస్కరించుకుని జాతీయ గణాంక దినోత్సవాన్ని కలెక్టరేట్లో ఆదివారం నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో ప్రణాళికశాఖ అధికారులు, ఉద్యోగులతో కలిసి ప్రశాంత చంద్ర మహలనోబిస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. గణాంక కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు మహలనోబిస్ వివిధ సంస్థలు, పద్ధతులను ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి బి.వెంకటరమణ, డివిజనల్, మండల గణాంక అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
అంగన్వాడీల్లో ‘ఎఫ్ఆర్ఎస్’
ఆదిలాబాద్టౌన్: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఇచ్చే పౌష్టికాహారం, లబ్ధిదారులకు ఇచ్చే సరకులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జూలై 1నుంచి ఆయా కేంద్రాల్లో ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా వీటిని అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే గ ర్భిణులు, బాలింతలు, చిన్నారుల ముఖచిత్రంతో కూడిన వివరాలను అంగన్వాడీ టీచర్లు మొ బైల్లో ట్రాకర్ యాప్లో నమోదు చేశారు. ప్ర స్తుతం ఆధార్ అనుసంధానం చేస్తున్నారు. ఈ ప్ర కియ పూర్తయిన వెంటనే ఎఫ్ఆర్ఎస్ అమలు కా నుందని ఐసీడీఎస్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కేంద్రం ఆదేశాలు.. లబ్ధిదారులందరికీ ఎఫ్ఆర్ఎస్ అమలు చేసేందుకు కేంద్ర మహిళాశిశు సంక్షేమ శాఖ నుంచి ఆదేశాలు రావడంతో జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ నుంచి కొనసాగుతుండగా కొందరికి ఫోన్లో ట్రాకర్ పనిచేయకపోవడంతో జాప్యం అవుతోంది. అక్రమాలకు చెక్ పెట్టేందుకు.. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పక్కదారి పడుతుందనే ఆరోపణలున్నాయి. లబ్ధిదారులకు సరుకులు సక్రమంగా పంపిణీ చేయకపోవడం, కొందరు కేంద్రానికి రాకపోయినా వచ్చినట్లు హాజరు నమోదు చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉన్నతాధికారుల తనిఖీల్లోనూ ఈ విషయాలు పలుమార్లు బయటపడిన సందర్భాలున్నాయి. ఇక నుంచి ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని ప్రభుత్వం యోచించింది. ఈ విధానం ద్వారా పిల్లలకు ఇచ్చే బాలామృతం, గుడ్లు, పాలు, మురుకులతో పాటు మెనూ ప్రకారం భోజనం అందనుంది. అలాగే కేంద్రానికి వస్తేనే ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు నమోదు కానుంది. నెలలో ఎంత మంది లబ్ధిదారులు వచ్చారు.. ఎంత మందికి సరుకులు పంపిణీ చేశారు.. తదితర వివరాలు ఇక ఇట్టే తెలుస్తాయి. కేంద్రాల్లో సరుకుల నిల్వ కూడా సులువుగా తెలిసిపోతుంది. అక్రమాలకు ఇక చెక్ కేంద్రాల్లో ఫేషియల్ రికగ్నైజేషన్ లబ్ధిదారుల ముఖచిత్రం తప్పనిసరి సరుకులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం చర్యలు రేపటి నుంచి అమలు జిల్లాలో.. అంగన్వాడీ కేంద్రాలు 1,283టీచర్లు 1,192గర్భిణులు 4,483బాలింతలు 6,000 చిన్నారులు 51,686సిగ్నల్ సమస్యతో జాప్యం ఫోన్లలో సిగ్నల్ సరిగా లేక లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం ఇబ్బందిగా మారుతోంది. యాప్లు సక్రమంగా పనిచేయడం లేదు. రోజువారీ హాజరు నమోదు కష్టంగా మారుతోంది. కొత్తగా ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్లో భాగంగా ముఖ చిత్రాలను నమోదు చేయడం ఇబ్బందిగా ఉంది. అన్ని పూర్తి చేసిన తర్వాతే ఈ విధానం అమలు చేయాలి.– వెంకటమ్మ, అంగన్వాడీల సంఘం జిల్లా అధ్యక్షురాలుపకడ్బందీగా అమలు చేస్తాం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్ఆర్ఎస్ను జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తాం. ఇప్పటికే లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశాం. ప్రస్తుతం ఆధార్తో అనుసంధానం చేస్తున్నాం. ఈ ప్రక్రియ ద్వారా సరుకులు పక్కదారి పట్టకుండా నిరోధించేందుకు ఆస్కారం ఉంటుంది. అధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడుతాం. – మిల్కా, జిల్లా సంక్షేమ అధికారి -
సమస్యలుంటే సంప్రదించండి
● ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్రెడ్డి ఆదిలాబాద్టౌన్: ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే స్థానికంగా అందుబాటులో ఉన్న పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్రెడ్డి అన్నారు. పట్టణంలోని భుక్తాపూర్ కాలనీలో పోలీసులు మీకోసం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీలో ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్తు పదార్థాలు సేవించి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. గంజాయి, మట్కా, పేకాట తదితర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. డయల్ 100, షీ టీం, మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఇందులో టూటౌన్ సీఐ కరుణాకర్రావు, పోలీస్ సిబ్బంది కాలనీవాసులు పాల్గొన్నారు. -
ఆర్టీసీలో ‘టోల్’ బాదుడు
● ప్రయాణికులపై అదనపు వడ్డన ● టికెట్పై రూ.10 నుంచి రూ.30వరకు ● పునరాలోచించాలంటున్న ప్యాసింజర్స్ ఆదిలాబాద్: మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది ఆర్టీసీ ప్రయాణికుల పరిస్థితి. ఇప్పటికే చార్జీల భారంతో, మహాలక్ష్మి పథకం అమలుతో ఇబ్బందుల మధ్య ప్రయాణిస్తున్న వారిపై సంస్థ తాజాగా అదనపు చార్జీలను వడ్డిస్తోంది. టోల్ చార్జీలను కేంద్రం పెంచేయడంతో వాటిని సాకుగా చూపుతూ ప్రతీ టోల్ పరిధిలో రూ.10 అదనంగా వసూలు చేస్తోంది. ఆయా టోల్గేట్ల సంఖ్యను బట్టి టికెట్పై రూ.10 నుంచి 30 వరకు అదనపు భారం పడుతోంది. టోల్ బాదుడు.. ఓ వైపు నెలవారీ బస్పాస్ చార్జీల పెంపుతోపాటు టికెట్లపై టోల్ ప్లాజా యూజర్ చార్జీలు వసూలు చేస్తుండడంతో ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. టోల్ప్లాజా క్రాస్ చేస్తే టికెట్పై అదనంగా రూ.10 చెల్లించాల్సి వస్తుంది. ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ మార్గంలో రెండు టోల్ ప్లాజాలు ఉంటాయి. ఈ లెక్కన రూ.20 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఇక నిర్మల్ నుంచి ఆదిలాబాద్కు చూస్తే ఒక టోల్ప్లాజ్ ఉంటుంది. ఈ మార్గంలో గతంలో ఎక్స్ప్రెస్ చార్జీ రూ.120 ఉండగా, ప్రస్తుతం రూ.130కి చేరింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకంతో కిక్కిరిసి వెళుతున్న బస్సుల్లో సీట్లు సైతం దొరకడం లేదని పురుష ప్రయాణికులు వాపోతున్నారు. మరోవైపు చార్జీల పేరిట భారం మోపడం ఎంతవరకు సబబు అనే ప్రశ్నలు వారి నుంచి వ్యక్తం అవుతున్నాయి. డబ్బులు చెల్లించే వారిపైనే భారం.. మహాలక్ష్మి పథకం అమలుతో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణ సేవలు పొందుతున్నారు. దీంతో బస్సులు నిండుగా ప్రయాణిస్తున్నాయి. చాలా సందర్భాల్లో సీట్లు ఖాళీగా ఉండడం లేదు. అరకొరగా ఉన్న బస్సుల్లో నిలబడి వెళ్తున్న వారిపై కొత్తగా టోల్ పేరిట చార్జీల భారం మోపడం సరికాదని పురుష ప్రయాణికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈవిషయంలో సంస్థ పునరాలోచించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. పునరాలోచించాలి ఇప్పటికే మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో సీట్లు దొరకడం లేదు. చాలా సార్లు నిలబడే ప్రయాణించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఆర్టీసీ టోల్ పేరిట చార్జీలు పెంచడం సరికాదు. పబ్లిక్ వాహనాల కన్నా ప్రైవేట్ వాహనాలపై ప్రయాణిస్తే చార్జీలు కలిసి వస్తున్నాయి. ఇలాగే టికెట్ ధరలు పెంచుకుంటూ పోతే ఆర్టీసీకి ప్రయాణికులు దూరం అవుతారు. తగ్గింపుపై సంస్థ పునరాలోచించాలి. – అమీర్, కేఆర్కే కాలనీ, ఆదిలాబాద్ -
‘మంత్రి జూపల్లి చెప్పినవన్నీ అబద్దాలే’
ఆదిలాబాద్టౌన్: తెలంగాణ రాష్ట్ర అప్పులపై జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పి న మాటలన్నీ అబద్దాలేనని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు రోజుల ఆయన పర్యటనతో జిల్లాకు ఎలాంటి ప్రయోజనం చే కూరలేదని విమర్శించారు. నూతన అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ పనులను ప్రస్తావించకుండా ఈ ప్రాంతవాసులకు నిరాశ మిగిల్చారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8లక్షల కోట్లు అప్పు చేసిందని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో రూ.5 వేల కోట్లతో అభివృద్ధి జరిగిన మాట వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇందులో పార్టీ నాయకులు నారాయణ, అజయ్, నర్సింగరావు, ప్రహ్లాద్ తదితరులున్నారు. -
నాతోపాటే ఇద్దరు పిల్లలు
● ప్రభుత్వ పాఠశాలలకే తమ పిల్లలు ● సర్కారు బడుల బలోపేతానికి చొరవ ● తల్లిదండ్రులకు నమ్మకం కలిగించే యత్నం ● ఆదర్శం.. ఈ ఉపాధ్యాయులునేను తాంసి మండలంలోని కప్పర్ల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నా కూతురు ప్రజ్ఞశ్రీ 4వ తరగతి, బాబు కృష్ణ రెండో తరగతి చదువుతున్నారు. ఇద్దరిని నేను బోధన చేసే పాఠశాలలోనే చది విస్తున్నాను. గతంలో కుచులాపూర్లో పనిచేసిన సమయంలో అక్కడ చదివించాను. ప్రభుత్వ పాఠశాలలపై నాకు నమ్మకం ఉంది. నాతో పాటు బోధించే ఉపాధ్యాయులు అనుభవంతో పాటు ప్రావీణ్యంగలవారు. మా పాఠశాలలో అన్ని వసతులు ఉన్నాయి. నన్ను చూసి చాలా మంది తమ పిల్లలను చేర్పిస్తున్నారు. – సామనపెల్లి గంభీర్, ఉపాధ్యాయుడు -
మనం ఆదర్శంగా ఉంటేనే..
మాది తాంసి మండలంలోని జామిడి. నేను ఇచ్చోడలో ఉంటాను. ప్రస్తుతం బజార్హత్నూర్ ఉన్నత పా ఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యూకేషన్) గా పనిచేస్తున్నాను. నా కూ తురు మేఘ నేను బోధించే పాఠశాలలోనే 8వ తరగతి చదువుతుంది. నాతో పాటు ప్రతిరోజు తీ సుకెళ్తాను. గతంలో బజార్హత్నూర్ మండలంలో ని కాండ్లీ పాఠశాలలో పనిచేశాను. 1 నుంచి 5వ త రగతి వరకు అక్కడే చదివించాను. ఉపాధ్యాయులను చూసే మిగతా వారు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపుతారనేది నా నమ్మకం. దీంతో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుంది. – సర్పే చందన్బాబు, స్కూల్ అసిస్టెంట్ -
మనపై మనకు నమ్మకం ఉండాలి
మాది ఉట్నూర్. మా పాప ప్రియాన్షి ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతోంది. రెండేళ్లుగా ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నాను. గతంలో నార్నూర్ మండలంలోని చిత్తగూడ ఉమ్రి పాఠశాలలో పనిచేసే సమయంలో అక్కడే చేర్పించాను. ఇటీవల బదిలీల్లో భాగంగా ఉట్నూర్ ప్రాథమిక పాఠశాలకు వచ్చాను. మనపై మనకు నమ్మకం ఉండాలి. మన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తేనే తల్లిదండ్రుల వద్దకు వెళ్లి అడగవచ్చు. వారిని మోటీవేట్ చేయవచ్చు. లేకుంటే వారు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు కంప్యూటర్ విద్యతో పాటు ఏఐ బోధన సైతం అందుతుంది. – చిరివెల్ల రవికుమార్, ఉపాధ్యాయుడు -
వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమశాతం పెరగనుంది.
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ఆదిలాబాద్టౌన్: వాహన డ్రైవర్లు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ అ న్నారు. స్థానిక పీఆర్టీయూ భవన్లో ది రాష్ట్రీయ చాలక్ ఏక్తా మంచ్ డ్రైవర్ల మహాసభ ముగింపు కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరయ్యారు. సామాజిక వేత్త ముడుపు మౌనిష్రెడ్డి ఏర్పాటు చేసిన వైద్యశిబిరంతో పాటు రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. డ్రైవర్లు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. అనంతరం పట్టణంలో డ్రైవర్లు ర్యాలీ చేపట్టారు. ఇందులో ఏక్తామంచ్ ఆలిండియా వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ హబీబ్, రాష్ట్ర అధ్యక్షుడు సంజు, నాయకులు సోఫి, ఇర్ఫాన్, బాలాజీ, అభిమన్యు, మహబూబ్, మొయిన్ తదితరులున్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. శనివారం జూమ్ ద్వారా జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లు, వైద్యసిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు ప్రారంభమైనందున పారిశుద్ధ్య నిర్వహణ లోపించి వ్యాధులు ప్రబలే అవకాశముందని పేర్కొన్నారు. అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ ప్రజల కు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సిబ్బంది తమ పరిధిలోని అన్ని గ్రామాల్లో జూలై 30 వరకు ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించాలన్నారు. అవసరమైన వారికి ఓఆర్ఎస్, జింక్ టాబ్లెట్లు అందించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందులో డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, జిల్లా టీబీ నియంత్రణ అధికారి సుమలత, వైద్యాధికారులు పాల్గొన్నారు. అక్రిడిటేషన్ గడువు పొడిగింపుకైలాస్నగర్: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడు వు మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు డీపీఆర్వో తిరుమల ప్రకటనలో తెలిపారు. జూన్ 30తో గడువు ముగియనున్నందున సెప్టెంబర్ 31 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అక్రిడిటేషన్ కార్డుదారులు ఈ నెల 30న డీపీఆర్వో కార్యాలయంలో సంప్రదించి కార్డుపై స్టిక్కర్ వేయించుకోవాలని ఆమె సూచించారు. -
‘వన’లక్ష్యం నెరవేరేనా!
● ‘మున్సిపల్’లో వన మహోత్సవం జాడేది ● ఈ ఏడాది ఏర్పాటు చేయని నర్సరీలు ● మొక్కల కొనుగోళ్లపైనే బల్దియా దృష్టి ● ఇంకా ఖరారు కాని టెండర్ల ప్రక్రియ రేపటి వరకు టెండర్లు ఖరారు వనమహోత్సవంలో భాగంగా పట్టణ పరిధిలో నాటనున్న మొక్కల సరఫరాకు సంబంధించి ఆసక్తి గల వారి నుంచి టెండర్లు స్వీకరించాం. ఏడుగురు కొటేషన్లు అందజేశారు. వాటిని పరిశీలిస్తున్నాం. తక్కువకు కోట్ చేసి మొక్కలు సరఫరా చేసే సామర్థ్యం కలిగిన వారికే అప్పగిస్తాం. నిర్దేశిత లక్ష్యాలు సాధించేలా మొక్కలు నాటి సంరక్షించడంపై దృష్టి సారిస్తాం. – కార్తీక్, మున్సిపల్ డీఈ కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో వన మహోత్సవ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది బల్దియా ఆధ్వర్యంలో నర్సరీలను ఏర్పాటు చేయలేదు. పట్టణ పరిధిలో నాటేందుకు అవసరమై న మొక్కలను ప్రైవేట్ నుంచి కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం రూ.25లక్షల నిధులు కేటాయించారు. ఆసక్తి గల వారి నుంచి టెండర్లు స్వీకరిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో జాప్యం అవుతుండడంతో నిర్ణీత సమయంలో మొ క్కల సరఫరా సాధ్యమవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హరిత లక్ష్యం నెరవేరుతుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. 5 లక్షల మొక్కలు నాటేలా కార్యాచరణ.. పచ్చదనం పెంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా వర్షాకాలంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తోంది. గ్రేడ్–1 స్థాయి కలిగిన ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ఈ ఏడాది 7.50లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే మొక్కల సంరక్షణ కష్టతరమవుతుందనే ఉద్దేశంతో ఐదు లక్షలు నాటాలని మున్సిపల్ అధికారులు కా ర్యాచరణ సిద్ధం చేశారు. ఇందులో హోం ప్లాంటేష న్ కింద ఇళ్లలో నాటేందుకు 2లక్షల పూలు, పండ్ల మొక్కలు అందించాలని నిర్ణయించారు. ఇంటికి ఐదు మొక్కలు పంపిణీ చేయాలని భావించారు. అవెన్యూ ట్రీ ప్లాంటేషన్ కింద 2.50లక్షలు, మీడియన్ ప్లాంటేషన్ కింద మరో 50వేల చొప్పున నా టేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో నీడనిచ్చేవాటితోపాటు భారీవృక్షాలుగా ఎదిగే స్పటోడియా, గుల్మొహర్, మహగని, టేబుషియా రోషియా, న ల్లమద్ది,కానుగ,రావి,మర్రివంటివి ఉండనున్నాయి. మొక్కల కొనుగోలుకు టెండర్లు .. పట్టణ పరిధిలో నాటేందుకు అవసరమైన మొక్కలను ప్రైవేట్ నర్సరీల నుంచి కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం రూ.25లక్షలు కేటాయించారు. పట్టణానికి చెందిన ఏడుగు రు వ్యక్తులు అధికారులు సూచించిన ఆయా రకాల మొక్కలను వివిధ ధరలకు సరఫరా చేస్తామని పే ర్కొంటూ ఆయా నర్సరీల పేరిట కొటేషన్లు సమర్పించారు. బల్దియా అధికారులు వాటిని పరిశీలిస్తున్నారు. ఇందులో తక్కువ ధరకు కోట్ చేసిన వారికి మొక్కల సరఫరా బాధ్యతలు అప్పగించేలా కసర త్తు చేస్తున్నారు. అయితే ఈప్రక్రియలో జాప్యం అ వుతోంది. ఇప్పటికే వర్షాలు కురుస్తున్నందున పలు శాఖల ఆధ్వర్యంలో వనమహోత్సవం ప్రారంభించారు. త్వరితగతిన ఈప్రక్రియ పూర్తి చేసినట్లయితే సకాలంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే చిన్నపాటి నర్సరీలు కలిగిన వారికి సరఫరా బాధ్యతలు అప్పగిస్తే వారు సకాలంలో ఎలా సరఫరా చేస్తారనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. అధికారులు కొటేషన్లు చూసి కాకుండా క్షేత్రస్థాయిలో నర్సరీలను పరిశీలించి చర్యలు చేపడితే ప్రయోజనకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. -
వారికి అనుమతివ్వొద్దు..
కైలాస్నగర్: పట్టణంలో తొలగించిన వీధి వ్యా పారులను మళ్లీ అంబేద్కర్చౌక్, గాంధీచౌక్, శివాజీ చౌక్ల్లో వ్యాపారం కొనసాగించేలా అవకాశం ఇవ్వొద్దని చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతి నిధులు కోరారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ రాజర్షి షాను కలెక్టరేట్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా అధ్యక్షుడు దినేశ్ మటోలియా మాట్లాడుతూ.. అంబేద్కర్చౌక్, గాంధీచౌక్, శివాజీ చౌక్ల్లో మళ్లీ తోపుడుబండ్ల ను ఏర్పాటు చేయడానికి సిద్ధపడినట్లుగా తెలు స్తుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించిబండ్లు పెట్టి వ్యాపారం చేయించాలని చూస్తే తాము కూడా దు కాణాలు మూసి వేసి రోడ్లపైకి వచ్చి వ్యాపారం చేస్తామన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో సంఘ నాయకులు తదితరులున్నారు. -
అందరూ చదివించాలి
నేను ఆదిలాబాద్లోని రాంనగర్లో ఉంటాను. నా కుమారుడు జాన్ సుచిత్ ఆరో తరగతి చ దువుతున్నాడు. స్థాని కంగా ఉన్న ప్రభుత్వ పా ఠశాల గెజిటెడ్ నం.1లో చేర్పించాను. నేను ఒక టీచర్ సంఘంలో పనిచేస్తున్నాను. కేవలం ఉపాధ్యాయుల పిల్లలే కా దు.. అన్ని శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, రాజకీయ నాయకుల పిల్లలను చదివిస్తేనే సర్కారు బడులు బాగుపడతాయి. ప్రస్తుతం సర్కారు బడులు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వీటిని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది. – నాందేవ్, అవాల్పూర్, ఉపాధ్యాయుడు -
జయహో జగన్నాథా..
రథాన్ని లాగడానికి పోటీపడుతున్న భక్తులు జయహో జగన్నాథా.. అంటూ భక్తులు పులకించిపోయారు. పూరి జగన్నాథుని నామస్మరణతో పట్టణ వీధులు మారుమోగాయి. ఇస్కాన్ ఆదిలాబాద్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మథుర జిన్నింగ్ నుంచి శనివారం చేపట్టిన పూరి జగన్నాథుని రథయాత్ర వైభవంగా సాగింది. సోదరుడు బలభద్ర, సోదరి సు భద్రతో కొలువుదీరిన ఆ స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తజనం పోటీపడ్డారు. ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే శంకర్ బంగారుపిడి కలిగిన చీపుళ్లతో ఊడ్చి యాత్ర ను ప్రారంభించారు. ఆధ్యంతం శ్రీ ప్రణవానంద ప్రభూజీ బోధనలు, భక్తి గీతాలతో రథయాత్ర శోభా యమానంగా సాగింది. అనంతరం భక్తులకు ఇస్కా న్ ప్రతినిధులు ప్రసాద వితరణ చేపట్టారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. – ఆదిలాబాద్ -
కవ్వాల్కు కొత్త పులులు!
● మహారాష్ట్ర నుంచి తరలించే యత్నం ● అంగీకరించిన తడోబా అధికారులు ● ఎన్టీసీఏ ఓకే చెబితేనే టైగర్ల రాకసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కవ్వాల్కు కొత్త పులులు రానున్నాయి. మహారాష్ట్ర పులులను ఇక్కడికి తరలించేందుకు ప్ర యత్నం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో విస్తరించిన కవ్వా ల్ కోర్ ప్రాంతంలో నేటికీ ఒక్క పులి కూడా శాశ్వతంగా ని వాసం ఏర్పరుచుకోలేదు. మరోవైపు పొరుగునే ఉన్న మహా రాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్నుంచి పదుల సంఖ్యలో పులులు వలసవస్తూ.. పోతున్నాయి. ఇక్కడి వాతావరణం అనుకూలించిన మేరకు సంచరిస్తూ వెళ్లిపోతున్నాయి. తోడు, ఆవాసం, మానవ సంచారం కారణంగా పులులు వచ్చి తిరిగి వెళ్లి పోతున్నాయి. ఆడ, మగ కలిపి ఐదు దాకా.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ డివిజన్లో కొన్ని పులులు శాశ్వత నివాసమేర్పరుచుకోగా, ఆదిలాబాద్, ఖానాపూర్, ఇచ్చోడ, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల డివి జన్ల వరకు వాటి సంచారం ఉంది. అయితే చాలా పులులు ఇక్కడ సంచరించి కొద్ది రోజులకే తిరిగి వెళ్లిపోతున్నాయి. ఈ క్రమంలో ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్లను టైగర్ కన్జర్వేషన్గా గుర్తిస్తూ అటవీశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో అక్కడి పులుల రక్షణకు వీలు కలగనుంది. మరో అడుగు ముందుకేసి మహారాష్ట్రలోని తడోబా పులులనే ఇక్కడికి తరలించేందుకు ప్రతిపాదనలు పంపగా, అక్కడి అధికారులు అంగీకరించడంతో కవ్వాల్కు కొత్తపులులు వచ్చే అవకాశాలున్నాయి. ఆడ, మగ కలిపి ఐదు వరకు తరలించేలా ఏర్పా ట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఎన్టీసీఏ (జాతీయ పులుల సంరక్షణ సంస్థ) ఈ మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయనుంది. చివరికి తరలింపునకే మొగ్గు మహారాష్ట్ర పులులు భవిష్యత్లో ఉమ్మడి జిల్లాకు వస్తాయనే దూరదృష్టితో 13ఏళ్ల క్రితం కవ్వాల్ కేంద్రంగా 2వేల చ.కి. మీటర్లకు పైగా అటవీ భూభాగాన్ని పులుల అభయారణ్యంగా నోటిఫై చేశారు. అయితే అప్పటినుంచి ఇప్పటిదాకా కోర్ ఏరియాలోనే పులులు నివాసమేర్పరుచుకోలేదు. ఏళ్లుగా అనేక ప్రయత్నాలు చేస్తూ రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. మానవ కార్యక్రమాలను తగ్గించేందుకు కోర్ పరిధిలో ఉండి, పులుల రాకపోకల మార్గంలో ఉన్న గ్రామాలను గుర్తించి తరలించడం ప్రారంభించారు. అయినా, పలు కారణాలతో పులులు రాలేదు. చివరకు మహారాష్ట్రలోని తడోబాలో అధికసంఖ్యలో ఉంటూ ఇరుకు ఆవాసాలు, సంరక్షణ కష్టమవుతున్న నేపథ్యంలో కవ్వాల్కు పులులను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే పులుల సంచారంతో తమకు ఇబ్బంది కలుగుతుందని స్థానిక గిరిజన రైతులు, అటవీ ప్రాంత సమీప గ్రామాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశముంది. సంరక్షణ సవాలే..! కవ్వాల్లో విశాల భూభాగం పులుల జీవనానికి అనుకూలంగా ఉంది. కొంతకాలంగా ఇక్కడ గడ్డి క్షేత్రాల పెంపు, శాకాహార జీవుల పెరుగుదలతో పాటు కోర్ గ్రామాలైన కడెం మండలం రాంపూర్, మైసంపేటను తరలించారు. అయితే వలస పులులు సంచరిస్తున్న సమయంలో ఇదివరకు అనేక చోట్ల వేట ముప్పు ఎదుర్కొన్నాయి. విద్యుత్ కంచెలు, వేటకారణంగా అభయారణ్యంలో మృత్యువాత పడ్డా యి. రూ.కోట్లు ఖర్చు పెట్టి సంరక్షణ చర్యలు చేపట్టినా ఇక్క డి పరిస్థితులకు సరిపోక అనేక పులులు తిరిగి వెళ్లిపోయా యి. తాజాగా అధికారులు ఇక్కడికి తరలించే పులుల సంరక్షణ స్థానిక అధికారులకు సవాల్గా మారనుంది. సిబ్బంది కొరతతో పాటు స్థానిక పరిస్థితులు, అడవిలో మానవ అలజడి కొత్త పులుల జీవనంపై ప్రభావం చూపనుంది. మరో వైపు పునరావాస గ్రామాల వాసులకు పూర్తిస్థాయిలో హామీ లు అమలు చేయలేదని పేర్కొంటూ పాత గ్రామాల్లోకి వెళ్లేందకు సిద్ధపడి నిరసనలు చేపట్టారు. కవ్వాల్ కోర్ ప్రాంతా ల్లో ఇప్పటికే మానవ కార్యకలాపాలు, పంట చేన్లు ఉన్నా యి. ఈ క్రమంలో జాతీయ జంతువు రక్షణకు ఇక్కడి అధికా రులు మరింత శ్రమించాల్సి ఉంది. -
‘మధ్యాహ్న’ కార్మికుల సమ్మె నోటీసు
ఆదిలాబాద్టౌన్: తమ సమస్యల పరిష్కారంలో భాగంగా వచ్చే నెల 9న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొంటామని మధ్యాహ్న భోజన కార్మికులు పేర్కొన్నారు. ఈ మేరకు డీఈవో శ్రీనివాస్రెడ్డికి శుక్రవారం సమ్మె నోటీసు అందజేశారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాములు మాట్లాడు తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా పది కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు సమ్మెలో పాల్గొననున్నట్లు తెలిపారు. మధ్యా హ్న భోజన కార్మికులకు పని భద్రత కల్పించా లని, కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని, గ్రాట్యూటీ, పెన్షన్, ఈఎస్ఐ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శశికళ, పుష్ప, శ్రీదేవి, రాంబాయి తది తరులు పాల్గొన్నారు. -
జొన్న రైతుల నిరీక్షణ
● ఇంకా తొమ్మిది వేల మందికి అందని పంట విక్రయ డబ్బులు ● వానాకాలం పెట్టుబడికి తప్పని తిప్పలు ● క్రమంగా విడుదల అవుతున్నాయంటున్న అధికారులుసాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో 20వేల మంది రైతులు యాసంగి సీజన్లో మద్దతు ధరకు జొన్నలు విక్రయించారు. ఈ డబ్బులు సాధారణంగా 48 నుంచి 72 గంటల్లోగా వారి ఖాతాల్లో చేరాలి. నెల దాటినా ఇప్పటి వరకు కేవలం 11వేల మందికి సంబంధించిన డబ్బులు మాత్రమే మార్క్ఫెడ్ ద్వారా వారి ఖాతాల్లో జమ అయ్యాయి. ఇంకా 9వేల మంది ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వానాకాలం సీజన్ మొదలైంది. పెట్టుబడికి ఆసరా అవుతాయనుకొని డబ్బుల కోసం వారంతా ఎదురుచూస్తున్నారు. త్వరగా అందేలా చూడాలని కోరుతున్నారు. కొనుగోళ్లు ముగిసి దాదాపు నెల.. జిల్లాలో యాసంగి సీజన్లో జొన్న పంటను రైతులు పెద్ద ఎత్తున సాగు చేశారు. దిగుబడి కూడా పెద్దమొత్తంలో వచ్చింది. ఇదిలా ఉంటే గత ఏప్రిల్ 22న మార్క్ఫెడ్ ద్వారా పీఏసీఎస్ల్లో మొత్తం 16 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి జొన్నల విక్రయాలు చేపట్టారు. మే 31తో మూడు సెంటర్లు మినహా జిల్లాలోని అన్ని కేంద్రాలు మూతపడ్డాయి. ఆదిలాబాద్, జైనథ్, నార్నూర్లో జూన్ 6వరకు కొనుగోలు చేశారు. డబ్బుల కోసం ఎదురుచూపులు.. రూ.వందల కోట్ల విలువైన జొన్నలను విక్రయించిన జిల్లా రైతులు ఆ డబ్బులను మాత్రం నిర్దేశిత సమయంలో అందుకోలేక పోయారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇటు రైతు భరోసా విడుదల చేయడంతో పాటు జొన్న పంట విక్రయించిన రైతులకు రావాల్సిన డబ్బులను కూడా విడుదల చేస్తూ వచ్చింది. విడతల వారీగా ప్రక్రియ కొనసాగుతుండడంతో మిగిలిన రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. మార్క్ఫెడ్ కొన్నది కొంతే.. జిల్లాలో యాసంగి సీజన్లో లక్ష 70వేల మెట్రిక్ టన్నుల జొన్నల దిగుబడి వచ్చింది. ప్రభుత్వం అందజేసిన మద్దతు ధర క్వింటాలుకు రూ.3,371. అయితే ప్రైవేట్లో రైతులకు రూ.3వేల లోపే ధర దక్కింది. ఇదిలా ఉంటే మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాల ద్వారా కేవలం 56వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. ఈ లెక్కన మద్దతు ధర దక్కింది కొంత మంది రైతులకే. మిగతా జొన్నలను పలువురు రైతులు ప్రైవేట్లో తక్కువ ధరకే విక్రయించారు. పలువురు దళారులు జొన్నలను రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేసి మద్దతు ధరకు ప్రభుత్వరంగ సంస్థకు విక్రయించారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇక్కడ కనిపిస్తున్న రైతు బారె నిఖిల్. బోథ్ మండలకేంద్రం. మే 19న స్థానిక మార్కెట్ యార్డులో పీఏసీఎస్ సిబ్బందికి 60 క్వింటాళ్ల జొన్నలు విక్రయించాడు. రూ. 2లక్షలకు పైగా డబ్బులు రావాల్సి ఉంది. ప్రభుత్వం ఇటీవల బకాయిలు విడుదల షురూ చేయడంతో తనకు కూడా వస్తాయని ఆశించాడు. ఇంకా రాకపోవడంతో నిరాశ చెందుతున్నాడు. ఇతనొక్కడే కాదు.. జిల్లాలో ఇలాంటి వారు వేలాది మంది ఉన్నారు. జిల్లాలో జొన్న పంట వివరాలు యాసంగిలో సాగైన విస్తీర్ణం : 1.10లక్షల ఎకరాలు దిగుబడి అంచనా : లక్ష 70వేల మెట్రిక్ టన్నులు మార్క్ఫెడ్ కొనుగోలు చేసింది: 56వేల మెట్రిక్ టన్నులు కనీస మద్దతు ధర : రూ.3,371 రైతులకు రావాల్సిన డబ్బులు (20వేల మందికి) : రూ.188 కోట్లు ఇప్పటి వరకు వచ్చినవి (11వేల మందికి): రూ.113 కోట్లు క్రమంగా డబ్బులు విడుదల.. జొన్నలు విక్రయించిన రైతులకు క్రమంగా ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుంది. మిగతా రైతులకు కూడా త్వరలో జమ అవుతాయి. ఆందోళన అవసరం లేదు. – ప్రవీణ్, మార్క్ఫెడ్ డీఎం, ఆదిలాబాద్ -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
ఆదిలాబాద్: జీవితం ఎంతో విలువైనదని, ఈ మేరకు యువత, విద్యార్థులు డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రన్ ఫర్ హోప్ ఆంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో 5కే రన్ నిర్వహించారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దన్నారు. చదువుతో పాటు వ్యాయామం, క్రీడలకు ప్రాధాన్యమిచ్చి తల్లిదండ్రులు, పుట్టిన ఊరు గర్వపడేలా ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. మత్తు పదార్థాలను పండించడం, రవాణా చేయడం, సేవించడం వంటి వాటికి పాల్పడితే ప్రభుత్వ పథకాలను నిలిపివేస్తామన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. యువత, విద్యార్థులు సోషల్ మీడియాలో చూసి డ్రగ్స్కు ఆకర్షితులు కావొద్దన్నారు. మత్తు పదార్థాల విషయంలో పోలీస్శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ఆదిలాబాద్ శంకర్ మాట్లాడుతూ.. సమా జంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని మత్తు పదార్థాలతో కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు మా ట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి నివారణకు ప్రజాప్రతినిధులుగా తమవంతు సహకారం అందిస్తామన్నారు. అనంతరం రన్లో విజేతలుగా నిలిచిన తొలి 15 మందికి బహుమతిగా సైకిళ్లను అందించారు. పురుషుల విభాగంలో మొదటిస్థానంలో సురేందర్, మహిళల భాగంలో శిల్ప నిలి చారు. కార్యక్రమంలో భాగంగా అంకోలి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నాటిక అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో డీఎఫ్వో ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, ట్రెయినీ అసిస్టెంట్ కలెక్టర్ సలోని, ఏఎస్పీ కాజల్, డీఎస్పీ జీవన్ రెడ్డి, డీవైఎస్వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాకేంద్రంలో ఉత్సాహంగా 5కే రన్ ఎకో టూరిజం అభివృద్ధికి కృషి.. ఆదిలాబాద్రూరల్: ఆదిలాబాద్ను ఎకో టూరిజంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మావలలోని హరితవనం పార్కును శుక్రవారం సందర్శించారు. ముందుగా ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. అర్బన్ డెవలప్మెంట్లో భాగంగా కాటేజెస్, వివిధ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మొక్క నాటా రు. అనంతరం సఫారీలో పర్యటించారు. ఆయన వెంట ఎంపీ గోడం నగేశ్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, సీసీఎఫ్ శర్వానంద్, డీఎఫ్వో ప్రశాంత్ పాటిల్, ఎఫ్డీవో రేవంత్ చంద్ర, ఎఫ్ఆర్వో శ్రీనివాస్రెడ్డి, బీట్ ఆఫీసర్లు ప్రశాంత్, కృష్ణ, తదితరులున్నారు. -
సర్టిఫికెట్ల పరిశీలన షురూ
ఆదిలాబాద్టౌన్: పాలిటెక్నిక్లో ప్రవేశాల కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్ల పరి శీలన ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు కొనసాగనుంది. తొలి రోజు 105 మంది విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకోగా, 103 మంది హాజరయ్యారు. వారి సర్టిఫి కెట్లను అధికారులు పరిశీలించారు. ప్రక్రియను కోఆర్డినేటర్, కళాశాల ప్రిన్సిపాల్ రాంబాబు పర్యవేక్షించారు. ఇందులో సాయన్న, ఫాతి మా, సంజయ్ సింగ్, నర్సయ్య, శ్రీకాంత్, శ్రుతి సిబ్బంది ఉన్నారు. -
● ఏ పనికై నా చేయి తడపాల్సిందే ● జలగల్లా పీడిస్తున్న సిబ్బంది, అధికారులు ● కరువైన ఉన్నతాధికారుల పర్యవేక్షణ ● పట్టణవాసులకు తప్పని తిప్పలు
కైలాస్నగర్: ఆదిలాబాద్ బల్దియా కార్యాలయం అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారింది. చేయి తడపనిదే ఏ పని జరగడం లేదనే విమర్శలున్నాయి. ఆయా పనులనిమిత్తం కార్యాలయానికి వచ్చే వారు సిబ్బంది, అధికారులు అడిగినంత ముట్టజెప్పాల్సిందే. లేదంటే నెలల తరబడి తిరిగినా అంతే సంగతులు. ఇది ఏఒక్క విభాగానికో పరిమితం కా లేదు. బల్దియాలోని దాదాపు అన్ని విభాగాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రత్యేకాధికారి పట్టించుకోకపోవడం, ఉన్నతాధికారులు సైతం ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందనే విమర్శలున్నాయి. పేరులోనే ‘రెవెన్యూ’ ఇక రెవెన్యూ విభాగం గురించి ఎంత చెప్పినా తక్కు వే అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మున్సిపాలిటీకి సంబంధించిన రూ.కోట్ల విలువైన లీజు భూములను కాసులకు కక్కుర్తిపడి ఆ విభాగం అధి కారులు అక్రమంగా అసెస్మెంట్లు జారీ చేశారు. వాటి ఆధారంగా అక్రమార్కులు రిజిస్ట్రేషన్ చేసుకుని సొంతం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. ఇందుకు బాధ్యులపై పోలీసు కేసు నమోదు కావడమే నిదర్శనం. ఇక ఇందిరమ్మ కాలనీ, 170 సర్వేనంబర్, కేఆర్కే కాలనీల్లో వందలాది ఖాళీ ప్లాట్లకు అక్రమంగా అసెస్మెంట్ చేసి ఇంటి నంబర్లు జారీ చేశారు. ఇందులో ప్రభుత్వ, అసైన్డ్ భూములకు సంబంధించిన ప్లాట్లు కూడా ఉండటం అవినీతికి అద్దం పడుతోంది. ఈ వ్యవహారంలో పలువురు ఈ విభాగం అధికారులు అక్రమార్కులతో కుమ్మకై ్క భారీగా అర్జించినట్లుగా తెలుస్తోంది. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఇద్దరు ఆర్ఐలపై సస్పెన్షన్ వేటు వేశారు. మరో ఇద్దరు ఆర్ఐలను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. కీలకపాత్ర పోషించిన అధికారి సరెండర్తో పాటు సస్పెన్షన్కు గురి కావడం బల్దియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంజినీరింగ్, పారిశుద్ధ్యంలోనూ ఇదే పరిస్థితి.. ఇంజినీరింగ్, పారిశుద్ధ్య విభాగాల్లోనూ అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే శంకర్ బల్దియాస్థాయి సమీక్షలో ఈ విభాగాల్లో చోటు చేసుకున్న అక్రమాలను ప్రస్తావిస్తూ అధికారులను మందలించడం తెలిసిందే. పట్టణంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనుల అంచనాలు రూపొందించడంలో రూ.వేలల్లో అయ్యే పనులకు రూ.లక్షల్లో కేటాయించడంతో నిధులు దుర్వినియోగమైనట్లుగా ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదులు సైతం అందాయి. ఇక పారిశుద్ధ్య నిర్వహణ విభాగంలోనూ అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లుగా బల్దియా ఉద్యోగులే చర్చించుకోవడం గమనార్హం. కార్మికులు విధులకు రాకున్నా వచ్చినట్లుగా హాజరు నమోదు, సామగ్రి కొనుగోలు, చెత్త తరలింపు వాహనాల నిర్వహణలో పలు అక్రమాలు జరిగాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల పట్టింపులేమి కారణంగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సిన అకౌంట్ వి భాగంలోనూ లంచాలు డిమాండ్ చేసే పరిస్థితి ఏర్ప డిందని కొంతమంది ఉద్యోగులు, మాజీ కౌన్సిలర్లు చర్చించుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయం అందిన కాడికి దండుకునుడే.. బల్దియాలో కీలకమైన విభాగాలు టౌన్ప్లానింగ్, రెవెన్యూ. అక్రమ లేఅవుట్లు, అనుమతి లేని భవన నిర్మాణాల కట్టడితో పాటు ఆక్రమణలు చోటు చేసుకోకుండా చూడాల్సిన గురుతర బాధ్యత టౌన్ ప్లానింగ్దే. అయితే ఇందులో ఒకరిద్దరు అధికారులతో పాటు పలువురు సి బ్బంది ఆయా పనులకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అడిగినంత ముట్టజెప్పకుంటే కొర్రీలు విధించి భవన నిర్మాణ అనుమతులు జాప్యం చేస్తారనే విమర్శలున్నాయి. ఇక అక్రమ నిర్మాణాలు చూసీచూడనట్లు ఉండేందుకు రూ.లక్షలు దండుకున్నారనే ఆరోపణలున్నాయి. పట్టణంలో అనుమతి లేకుండా చేపట్టిన ఓ భవన నిర్మాణాన్ని కూల్చివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసి ఎనిమిది రోజులవుతున్నా పట్టించుకోకపోవడం ఇందుకు నిదర్శనం. అలాగే అక్రమంగా చేపట్టిన మరో రెండు భవనాలు కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించినా వాటి జోలికి వెళ్లకపోవడం గమనార్హం. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజల నుంచి కొంతమంది డబ్బులు తీసుకుంటున్నట్లుగా ఇటీవల నా దృష్టికి కూడా వచ్చింది. త్వరలోనే బల్దియాలోని అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తాం. ఎవరైనా లంచం డిమాండ్ చేసినా, తీసుకున్నా వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. – సీవీఎన్. రాజు, మున్సిపల్ కమిషనర్ -
ఆయిల్పాం సాగు లాభదాయకం
తాంసి: లాభదాయకమైన ఆయిల్పాం సాగు కు రైతులు ముందుకు రావాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి సుధాకర్ అన్నారు. మండలంలోని హస్నాపూర్ శివారు పంటచేనులో శుక్రవారం మెగా ఆయిల్పాం ప్లాంటేషన్ నిర్వహించారు. స్థానిక రైతులతో కలిసి మొక్కలు నాటా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు దీర్ఘకాలిక పంటలు సాగుచేస్తే మంచి లాభాలు పొందవచ్చన్నారు. ఆయిల్ పాం సా గుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీని సద్వి నియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల ఇన్చార్జి ఉద్యాన అధికారి క్రాంతి, ఏరియా మెనేజర్ రమేశ్, రైతులు పాల్గొన్నారు. -
జైళ్లశాఖ ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ పంపిణీ
ఆదిలాబాద్టౌన్: జిల్లా జైలు ఖైదీలు తయారు చేసిన సీడ్ బాల్స్ పంపిణీని శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ అశోక్ మాట్లాడుతూ.. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఆదేశాల మేరకు అటవీ విస్తీర్ణం పెంచాలనే ఉద్దేశంతో 10వేల సీడ్స్ బాల్స్ను తయారు చేసినట్లు తెలిపారు. ఇందులో సీతాఫలం, జామ, చింత, రావి, సండ్ర, మేడి తదితర సీడ్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. జైలు బంక్కు వచ్చే వినియోగదారులతో పాటు ప్రజలకు 3వేల సీడ్బాల్స్ పంపిణీ చేశామన్నారు. అలాగే ఆసిఫాబాద్ స్పెషల్ సబ్జైలుకు 3,500, లక్సెట్టిపేట సబ్ జైలుకు వెయ్యి వరకు సీడ్ బాల్స్ సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో డిప్యూటీ జైలర్రాథోడ్ ప్రకాశ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ చిక్చిన అకౌంట్ ఆఫీసర్
లంచం తీసుకుంటూ ఇద్దరు మున్సిపల్ అధికారులు ఏసీబీకి చిక్కారు. బిల్లు చెల్లించేందుకు కాంట్రాక్టర్ వద్ద రూ.15వేలు తీసుకుని రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. శుక్రవారం శ్రీ 27 శ్రీ జూన్ శ్రీ 2025చిత్తశుద్ధితో పథకాలు అమలు చేస్తున్నాంసీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో ఎన్ని అడ్డంకులొచ్చినా చిత్తశుద్ధితో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. 18 నెలలుగా గత ప్రభుత్వం చేసిన అప్పు కింద ప్రతీనెల రూ.6,500 కోట్లు చెల్లిస్తున్నాం. అయినా రూ.21వేల కోట్ల రుణమాఫీ చేశాం. రైతుభరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తున్నాం. రుణమాఫీకి నోచుకోని రైతులకు సింగిల్ విండో కౌంటర్ ఏర్పాటు చేసి పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నాం. భూభారతి చట్టం ద్వారా వివిధ దశల్లో తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్లకు అధికారం ఇవ్వడం ద్వారా భూ సమస్యలు పరిష్కారమవుతున్నాయి. చట్టాలు చేసేది మేమే అయినప్పటికీ వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే. సంక్షేమ పథకాల లబ్ధి కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక వాట్సాప్ నంబర్ క్రియేట్ చేయాలి. బాధితులు సమస్యలు లిఖితపూర్వకంగా సదరు నంబర్కు వాట్సాప్ చేస్తే పరిష్కరించేలా కలెక్టర్లు మానిటరింగ్ చేయాలి. సమస్యలు నిర్ణీత సమయంలో పరిష్కారం కాకుంటే తొలుత మౌఖికంగా, ఆ తర్వాత లిఖితపూర్వకంగా సంబంధిత అధికారులను వివరణ కోరాలి. అప్పటికీ పరిష్కారం కాకుంటే బాధ్యులపై చర్య తీసుకోవాలి. నకిలీ విత్తనాలు సరఫరా చేసేవారిపై అధికారులు కఠినంగా వ్యవహరించాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పని చేస్తూ అభివృద్ధిలో మెరుగైన ఫలితాలు సాధించాలి. – జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సమ్మె సక్సెస్ చేయాలిఆదిలాబాద్టౌన్: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ కోరారు. గురువారం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్ గోపికి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా వారి డిమాండ్లు వివరించారు. ఆశ కార్యకర్తల యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం.సుజాత, పార్వతి, లత పాల్గొన్నారు. న్యూస్రీల్ -
ప్రజాప్రభుత్వంలోనే ప్రగతి
సాక్షి, ఆదిలాబాద్/కైలాస్నగర్: ప్రజాప్రభుత్వంలోనే రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకెళ్తోందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి జిల్లాకు చెందిన రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, మైనింగ్ శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందించే బాధ్యత అధికారులేదనని చెప్పారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన తర్వాత తొలిసారి జూపల్లి కృష్ణారావు, మరో మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి గురువారం ఆదిలాబాద్లో ని జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉమ్మ డి జిల్లా స్థాయి సమీక్షా సమావేశానికి హాజరయ్యా రు. ఈ సందర్భంగా మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును స్పష్టం చేస్తూ అధికారులు ఎలా ముందుకెళ్లాలో దిశానిర్దేశం చేశారు. మొదట వ్యవసాయ శాఖపై సుదీర్ఘంగా సమీక్షించారు. రైతులకు విత్తనా లు, ఎరువుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు విక్రయించేవారికి జైలు శిక్ష పడేలా కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. ఇక నుంచి జిల్లాల వారీగానే స మీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం మృతి చెందిన స్వయం సహాయక సంఘాల కుటుంబీ కులకు మంజూరైన రూ.10లక్షల ఆర్థికసాయం చె క్కులు పంపిణీ చేశారు. పాఠశాల విద్యార్థులకు ట్యాబ్లు అందజేశారు. ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, జాద వ్ అనిల్కుమార్, వెడ్మ బొజ్జు, వినోద్, కోవ లక్ష్మి, హరీశ్బాబు, మహేశ్వర్రెడ్డి, రామారావుపటేల్, క లెక్టర్లు రాజర్షి షా, కుమార్ దీపక్, అభిలాష అభిన వ్, వెంకటేశ్ దోత్రే, ఐటీడీఏ పీవో ఖు ష్బు గుప్తా, ఎ స్పీలు అఖిల్ మహాజన్, జానకీ షర్మిల, కాంతిలా ల్, అడిషనల్ కలెక్టర్లు, ట్రైనీ కలెక్టర్లు, ఇతర అధికా రులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.మంత్రులకు ఘన సన్మానంఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన జూపల్లి కృష్ణారావుతోపాటు ఇటీవలే మంత్రిగా బా ధ్యతలు స్వీకరించిన ఉమ్మడి జిల్లాకు చెందిన వివేక్ తొలిసారి జిల్లాకు రాగా, వీరిని ఎమ్మెల్యేలు పాయ ల్ శంకర్, అనిల్జాదవ్, కోవ లక్ష్మి, కలెక్టర్ రాజర్షి షా శాలువాలతో సత్కరించారు. జ్ఞాపికలు అందజేసి అభినందనలు తెలిపారు. అంతకుముందు జిల్లాకు చేరుకున్న మంత్రులకు కలెక్టర్లు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనస్వాగతం పలికారు.మంచిర్యాల ఎమ్మెల్యే గైర్హాజరుఆదిలాబాద్ జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్షా సమావేశానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యే గైర్హాజరుపై పలువురు చర్చించుకోవడం కనిపించింది.ఎమ్మెల్యే కోవ లక్ష్మి అలకసమావేశం ప్రారంభమయ్యాక కాసేపటికి వేదికపై కి వచ్చిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కుర్చీ లేకపోవడంతో కొద్దిసేపు నిల్చునే ఉన్నారు. జెడ్పీ సి బ్బంది కుర్చీ తీసుకువచ్చి వేయగా ఆసీనులయ్యా రు. ఈ తర్వాత ఏమనుకున్నారో తెలియదు గాని ఎ మ్మెల్సీ దండే విఠల్తో కలిసి వేదిక దిగి అధికారుల కుర్చీల్లో కూర్చున్నారు. మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో దీన్ని గమనించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోవ లక్ష్మి వద్దకు వచ్చి తన సీట్లో కూర్చోవాలని కోరారు. మంత్రి కూడా ఆహ్వానించడంతో తిరిగి వేదికపైకి వచ్చి అనిల్ జాదవ్ సీట్లో కూర్చున్నారు.సీఆర్ఆర్ ఇంటికి వెళ్లిన ‘జూపల్లి’తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పట్టణంలోని శాంతినగర్లోగల మాజీ మంత్రి, దివంగత చిల్కూరి రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్కు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. రామచంద్రారెడ్డి మరణం కాంగ్రెస్కు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన మేనల్లుడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవరెడ్డిని పరామర్శించారు.కేంద్రం నిధులు పెండింగ్లో పెట్టొద్దుకోలాం, తోటి వంటి పీవీటీజీల ఇళ్ల నిర్మాణాలకు ఈజీఎస్ కింద కేంద్రం నిధులు విడుదల చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖలకు చెల్లించకుండా పెండింగ్లో పెడుతోంది. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న రూ.742 కోట్లు వెంటనే విడుదల చేయాలి. 9,10వ తరగతుల విద్యార్థులకు ఎండీఎం నిధులు ఎందుకు విడుదల చేయడం లేదు? అర్హులైన గిరిజనులందరికీ ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు వెంటనే జారీ చేయాలి. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన రోడ్లను ప్రభుత్వం నిర్మిస్తుందా? లేదా? అనేది స్పష్టం చేయాలి.– గోడం నగేశ్, ఆదిలాబాద్ ఎంపీ‘కొరాటా– చనాకా’ పూర్తి చేయాలికొరాటా–చనాకా ప్రాజెక్ట్కు రూ.900కోట్లు ఖర్చు చేశారు. భూ సేకరణకు మరో రూ.100 కోట్లు విడుదల చేస్తే ప్రాజెక్ట్ పూర్తయి 50వేల ఎకరాలకు సాగునీరందే అవకాశముంది. సీఎం అసెంబ్లీలో మాటిచ్చినా ఒక్క రూపాయి కూడా రాలేదు. వర్షాలు కురుస్తున్నందున కనీసం మరమ్మతులైనా చేపట్టాలి. కేంద్రం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజనలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యమై రైతులకు లబ్ధి చేకూర్చాలి. ఎయిర్పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ప్రణాళికలు పూర్తి చేయాలి.– పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే‘కుప్టి’కి నిధులు మంజూరు చేయాలికుప్టి ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులు విడుదల చేసి టెండర్లు ఆహ్వానించాలి. బోథ్ నియోజకవర్గంలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుగ్గారం, పొచ్చెర, పిప్రికి లిఫ్ట్ ఇరిగేషన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే నిధులు విడుదల చేయాలి. భూభారతి చట్టం కాస్తు కాలంలో గిరిజనేతర పేర్లు చేర్చాలి. ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక సరఫరా చేయాలి. బోథ్ ఆస్పత్రి వైద్యుడి డిప్యూటేషన్ను యథావిధిగా కొనసాగించాలి. వైద్యుల బదిలీ, డిప్యూటేషన్ల అధికారం కలెక్టర్లకు అప్పగించాలి.– జాదవ్ అనిల్కుమార్, బోథ్ ఎమ్మెల్యేఅధికారుల తీరు సరికాదుజిల్లాలో పోడు, రెవె న్యూ భూముల సమ స్య ప్రత్యేక సర్వే నిర్వహిస్తేనే పరిష్కారమవుతుంది. కడెం, దస్తురాబాద్ మండలాల్లో అటవీ అధికారులతో తీవ్ర ఇబ్బందులున్నాయి. వీరితో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. పీపీ ల్యాండ్స్ సాగు చేస్తున్న గిరిజనేతరులకు గతంలో పహాణీల ద్వారా రుణాలందేవి. 30–40 ఏళ్లుగా సాగు చేస్తున్న గిరిజనేతరులకు ప్రత్యామ్నాయం చూపాలి. ప్రజలను ఇబ్బంది పెట్టే అధికారులను ఇతర జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేయలి.– వెడ్మ బొజ్జుపటేల్, ఖానాపూర్ ఎమ్మెల్యే -
పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలి
ఆదిలాబాద్టౌన్: చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం అందించాలని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అధికారి నవీన్కుమార్ సూచించారు. గురువారం పట్టణంలోని జిల్లా పరిశ్రమల శాఖ, ఇతర శాఖల జిల్లా అధికారులు, ఎస్బీ ఐ, టీజీబీ ఆర్ఎంలతో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ) స్కీమ్ గురించి వివరించారు. 2025–26 సంవత్సరానికి ఇచ్చిన 70 యూనిట్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. బ్యాంకర్లు లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేయవద్దని సూచించారు. జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పద్మభూషణ్ రాజు మాట్లాడుతూ.. ప్రభు త్వ నిబంధల మేరకు ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు ముందుకువస్తున్న యువకులు, మహిళలకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పరిశ్రమల శాఖ సూపరింటెండెంట్ సత్యనారాయణ, జిల్లా ఫుడ్ ప్రాసెసింగ్ రిసోర్స్ పర్సన్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
బోనాల పండుగకు వేళాయె
● నేటి నుంచి ఆషాఢమాసం ప్రారంభం ● ఊరుకట్టడితో ప్రత్యేక పూజలు ● డప్పుచప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు ● వనభోజనాలు, గోరింటాకు సంబురాలు మంచిర్యాలఅర్బన్: జిల్లాలో బోనాల సందడి షురూ కానుంది. ఈనెల 26 నుంచి నెలరోజుల పాటు డప్పు చప్పుళ్లు పోతరాజుల విన్యాసాలు శివసత్తుల సిగాలు, కళాకారుల ఆటపాటలు, డీజే హోరుతో వాడవాడలు మార్మోగనున్నాయి. బోనాల జాతర సంస్కృతి సంప్రదాయలను కొనసాగించడమే కాదు... ఆర్థిక కోణంలోనూ అనేక మందికి ఉపాధి కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఊరు కట్టడి ఆనవాయితీ. మహిళలు మెహందీ (గోరింటాకు)తో మురిసిపోతుంటారు. గురువారం ప్రారంభమయ్యే ఆషాఢమాసంపై ప్రత్యేక కథనం.. ఊరుకట్టడి ఇలా.. గ్రామీణ ప్రాంతాల్లో పాడి పంటలు, పిల్లాపాపలు, పశుసంపద సల్లంగా ఉండాలని కోరుతూ గ్రామస్తులంతా ఏకమై ఊరు కట్టడి చేస్తారు. పూజలు పూర్తయ్యేంత వరకు గ్రామస్తులెవరూ బయటకు వెళ్లరు. బయటి వ్యక్తులను గ్రామంలోకి రానీయరు. గ్రామ దేవతలైన పోచమ్మ, భూలక్ష్మి దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మేకలను బలిఇస్తారు. పోతరాజు గావుపట్టి ఊరు చుట్టూ తిరుగుతూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. బోనాలతో ఊరేగింపుగా వెళ్లి.. ఆషాఢమాసంలో డప్పుచప్పుళ్లతో ఊరేగింపుగా వెళ్లి పోచమ్మతల్లికి బోనాలు సమర్పిస్తారు. జిల్లా కేంద్రమైన మంచిర్యాలలో ముదిరాజ్ల ఆరాధ్యదైవం పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేస్తారు. ముదిరాజ్ కులస్తులంతా కలిసి బోనాలతో బయలుదేరి అమ్మవారిని దర్శించుకుంటారు. హమాలీవాడ పోచమ్మ చెరువు సమీపంలోని మండేలయ్యకు రజకులు, గౌడ కులస్థులు ఎల్లమ్మతల్లికి బోనాలు సమర్పించడం ఆనవాయితీ. తాటి, ఈత వనంలో తమకు మంచి జరగాలని గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఎల్లమ్మతల్లికి బోనాలు సమర్పిస్తారు. మహిళలకు గోరింటాకు పండుగ.. ఆషాఢమాసం వచ్చిందంటే గోరింటాకు గుర్తుకు వస్తుంది. మహిళలు, యువతులు, పిల్లల చేతులు గోరింటాకుతో కళకళలాడుతుంటాయి. రుతువు మారినవేళ గోరింటాకు పెట్టుకుంటే కాళ్లు, చేతులు గోళ్లు శుభ్రపడుతాయని రోగనిరోథకంగా అంటూ వ్యాధులను దూరం చేస్తుందని నమ్మకం. ఒకప్పుడు గోరింటాకు ముద్దలుగా చేసి ఇంటిల్లిపాది చేతులు, కాళ్లకు పెట్టుకునే వారు. పట్టణ ప్రాంతాల్లో మెహందీగా వివిధ ఆకృతుల్లో తీర్చిదిద్దటానికి కొంతమందికి ఉపాధి మార్గంగా మారింది. విద్యాసంస్థల్లో గోరింటాకు విశిష్టతను తెలిపేలా విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. బాలికలు, మహిళలు, వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో గోరింటాకు సంబురాలు నిర్వహిస్తారు. పండుగతో ఉపాధి.. బోనాల పండుగ ఉపాధికి ఊతమివ్వనుంది. ప్రత్యేకంగా పోతరాజుల విన్యాసాలకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. ఇతర ప్రాంతాలకు చెందిన కళాకారులు మంచిర్యాల ప్రాంతాలకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తారు. బోనం సమర్పించేందుకు కుండలు ఎంతో అవసరం. నైవేద్యం సమర్పించే కుండతో పాటు దానిపై ఉండే చిన్న చిన్న బుడ్డిదీపం పెట్టే ముంత కలిపి ఒక సెట్లాగా ఉంటుంది. ఈ సమయంలో కుమ్మరులు బిజీగా ఉంటారు. డప్పులు వాయించేవారి నుంచి డీజేల వరకు ఉపాధి పొందనున్నారు. బోనం అలంకరణకు అవసరమైన పూల వ్యాపారం ఊపందుకుంటుంది. హైదరాబాద్, తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు పూలను సిద్ధం చేస్తారు. మేకలు, కోళ్లకు భలే డిమాండ్ ఉంటుంది. -
ఇద్దరి ప్రాణాలు తీసిన అతివేగం
● పొక్లెయిన్ను ఢీకొన్న కారు ● ఇద్దరు యువకులు దుర్మరణంగుడిహత్నూర్: అతి వేగం రెండు ప్రాణాలు బలిగొంది. రెండు కుటుంబాల్లో విషాధం నింపింది. అతివేగంగా వచ్చిన కారు పొక్లెయిన్ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు జైనూర్ మండల కేంద్రానికి చెందిన ఆర్యన్ ముండే (19), ఉట్నూర్ మండలంలోని ఉమ్రి గ్రామానికి చెందిన గాయక్వాడ్ అనిల్ (21) ఇద్దరు స్నేహితులు. మంగళవారం రాత్రి కారులో వెళ్తుండగా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై వైజాపూర్ యూటర్న్ వద్ద పొక్లెయిన్ను అతివేగంగా ఢీకొట్టారు. గాయక్వాడ్ అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు కొనఊపిరితో ఉన్న ఆర్యన్ముండేను ఆదిలాబాద్లోని రిమ్స్కు తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఎవరికీ తెలియకుండా పయనం.. ఆర్యన్ ముండే, గాయక్వాడ్ అనిల్ మంచి మిత్రులు. ఆర్యన్ ముండే స్వస్థలం మహారాష్ట్రలోని బోధిడి. తన అమ్మమ్మ ఊరైన జైనూర్లో ఉంటూ తాత వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఎవరికీ తెలియకుండా ఇంటి బయట ఉన్న కారు తీసుకుని ఉట్నూర్ ఎక్స్రోడ్డుకు వచ్చి తన మిత్రుడు గాయక్వాడ్ అనిల్కు ఫోన్ చేశాడు. దీంతో అనిల్ తన ఇంటి నుంచి స్కూటీపై ఏందా ఎక్స్రోడ్డు వద్దకు వచ్చాడు. స్కూటీని వదిలి ఆర్యన్తో కారులో ఆదిలాబాద్ వైపు బయలు దేరారు. మృతదేహాలకు బుధవారం రిమ్స్లో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వై.మధుకృష్ణ తెలిపారు. -
‘ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం’
ఆదిలాబాద్: భారత దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయమని ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం సంవిధాన్ హత్య దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందన్నారు. ఇందులో పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్, నాయకులు వేణుగోపాల్, గంగారెడ్డి, చంద్ర, విజయ్, సంతోష్రెడ్డి, మాధవరావు, జ్యోతి రెడ్డి, ఆకుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
రెండోరోజూ బాధితుల ఆందోళన
పెంచికల్పేట్: అగర్గూడ గ్రామానికి చెందిన తుమ్మిడే రాజశేఖర్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఎల్కపల్లిలోని రాచకొండ కృష్ణ ఇంటి ఎదుట గ్రామస్తులు చేపట్టిన ఆందోళన బుధవారం రెండో రోజుకు చేరుకుంది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, బీజేపీ నాయకుడు పాల్వాయి సుధాకర్ రావు, సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కోనప్ప మాట్లాడుతూ మృతుని కుటుంబానికి తనవంతుగా రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తానని హామి ఇచ్చారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుడు చేసిన మానసిక వేధింపులతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. ఎరువుల దుకాణాల్లో విజిలెన్సు తనిఖీలు నిర్వహించి అక్రమాలకు పాల్పడిన వారిపైన చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ జెడ్పీటీసీ పాల్వాయి సుధాకర్రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం మాట్లాడుతూ లైసెన్సు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేశ్ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్స్టేషన్లో ఽఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అద్యక్షుడు కోట సతీశ్, ఆరె సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జైరాం కోరారు. మృతికి సంతాపంగా మండల కేంద్రంలోని వ్యాపార సముదాయాలు బంద్ పాటించారు. కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం ఆధ్వర్యంలో కాగజ్నగర్ రూరల్, కౌటాల సీఐ శ్రీనివాసరావు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుడి అరెస్టు.. అగర్గూడ గ్రామానికి చెందిన రాజశేఖర్ ఆత్మహత్యకు కారణమైన ఎల్కపల్లి గ్రామానికి చెందిన రాచకొండ కృష్ణను హైదరాబాద్లో అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పెంచికల్పేట్ ఎస్సై కొమురయ్య తెలిపారు. విషాదంలో అగర్గూడ.. గ్రామంలో అందిరితో కలిసి మెలిసి ఉండే రాజశేఖర్ ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుని తండ్రి శ్రీనివాస్ మూడేళ్ల క్రితం చనిపోయాడు. చేతికి అందివచ్చిన కొడుకు ఆత్మహత్యకు పాల్పడంతో తల్లి లక్ష్మీ రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. -
వేడెక్కిన.. పల్లె
● ఆశావహుల్లో ఉత్సాహం నింపిన హైకోర్టు తీర్పు ● ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం ● పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధంకై లాస్నగర్: గ్రామపంచాయతీ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆశావహుల్లో రా ష్ట్ర హైకోర్టు తీర్పు నూతన ఉత్సాహం నింపింది. మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంపై పోటీకి సై అంటున్న వారిలో జోష్ మొదలైంది. మరోవైపు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయడం, కోర్టు కూడా ఆ దిశగా ఆదేశాలివ్వడంతో ఏ క్షణమైన నోటిషికేషన్ వెలువడే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో ఆశావహులు ఓటర్లను ఆకట్టకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అలాగే ప్రధాన రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో నిమగ్నం అవుతున్నారు. ఇలా పల్లె రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇదీ పరిస్థితి.. పంచాయతీ పాలకవర్గాల గడువు గతేడాది జనవరి 31తో ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతుంది. జీపీలకు ఎన్నికలు నిర్వహించాలని అప్పట్లోనే ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. అయితే ఎన్నికల హామీ మేరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి రావడంతో ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ నియమించడంతో పాటు వారి స్థితిగతులపై అధ్యయనం చేసింది. ఈ కారణంగా పంచాయతీల ఎన్నికల ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. అయితే గత 18 నెలలుగా పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల కూడా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో జీపీలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. చిన్నపాటి సమస్యలు సైతం పరిష్కరించలేని దుస్థితి. ఈ క్రమంలో రాజకీయ పార్టీలన్నీ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై డిమాండ్ వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. కోర్టు తీర్పుతో .. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తు మాజీ సర్పంచ్లు రాష్ట్ర హైకో ర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యా యస్థానం రానున్న మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో ఎన్నికలకు సై అంటున్న వారిలో ఉత్సాహం మొదలైంది. ప్రభుత్వం కూడా ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉండటం, జిల్లా స్థాయిలో యంత్రాంగం అవసరమైన కసరత్తు ఇప్పటికే పూర్తి చేయడంతో ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ రావచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో పల్లెపోరుకు ఆసక్తి చూపుతున్న వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే రిజర్వేషన్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. అయితే రిజర్వేషన్ కలిసివస్తే పోటీలో ఉండాలని భా విస్తున్న వారంతా ఓటర్లను మచ్చిక చేసుకునే ప నిలో పడ్డారు. పంచాయతీ పోరు పార్టీలకతీతంగా జరగనున్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టుకుంటే గెలుపు సునాయాసం కానుందని భావిస్తున్నారు. ఇందుకోసం ఆయా పార్టీల మద్దతు కూడగట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా పార్టీల ముఖ్యనేతల కనుసన్నల్లో పడేందుకు యత్నిస్తున్నారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి ఆశీస్సులు పొందేలా వ్యవహరిస్తున్నారు. మంచి, చెడులకు అందుబాటులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ సందడి మొదలైంది.జిల్లాలో.. మండలాలు : 20 గ్రామ పంచాయతీలు : 473 మొత్తం వార్డులు : 3,870 పోలింగ్ కేంద్రాలు : 3,888 ఓటర్లు : 4,51,707 -
పలువురు డీపీఎంల బదిలీ
కై లాస్నగర్: జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖలో బదిలీల ప్రక్రియ ఎట్టకేలకు మొదలైంది. ఇందులో భాగంగా పలువురు డీపీఎంలకు స్థానచలనం కలిగింది. హైదరాబాద్లోని ప్రజాభవన్లో బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ ప్రక్రియ రాత్రి 10.30గంటల వరకు కొనసాగింది. ఇందులో ఆర్.శోభారాణి, సుగంధ జిల్లాలోనే యథావిధిగా కొనసాగనున్నారు. హేమలత, గంగన్న నిర్మల్ జిల్లాకు బదిలీ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం నుంచి రమాకాంత్, నిర్మల్ నుంచి కే జ్ఞాను, జగిత్యాల నుంచి జాడి మల్లేశ్, కామారెడ్డి నుంచి ఎస్.వకుల, నిర్మల్ నుంచి వెంకటసాయిప్రసాద్ ఆదిలాబా ద్ జిల్లాకు రానున్నారు. కాగా, కౌన్సెలింగ్ హాజరైన వారిలో ఏ శోభారాణి, జాదవ్ శేషురావు, నరేందర్ను రిజర్వ్లో ఉంచారు. వీరికి ఆసిఫాబాద్ లేదా ఆదిలాబాద్లో పోస్టింగ్ ఇవ్వనున్నట్లుగా అధికారులు చెబుతున్నారు గురువారం శ్రీ 26 శ్రీ జూన్ శ్రీ 2025ముగ్గురికి ఎస్సైగా పదోన్నతి ఆదిలాబాద్టౌన్: జిల్లాలో ముగ్గురు ఏఎస్సైలకు ఎస్సైలుగా పదోన్నతి లభించింది. ఈమేరకు ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం వారి భుజాలపై స్టార్ చిహ్నాలు అలంకరించి అభినందించారు. పదోన్నతితో బాధ్యతలు మరింతగా పెరుగుతాయన్నారు. పదోన్నతి పొందిన వారిలో ఆదిలాబాద్ టూటౌన్ ఏఎస్సై ముకుంద్రావు, మావల ఏఎస్సైగా ఎండీ యూసుఫ్, రూరల్ స్టేషన్ ఏఎస్సై ఎండీ ఆరుఫ్ అలీఖాన్ ఉన్నారు. కానిస్టేబుల్గా అడుగు పెట్టినప్పటి నుంచి ఈ ముగ్గురు స్నేహితులు అంచెలంచెలుగా ఎదుగుతునానరు. 1985లో కానిస్టేబుల్గా, 2011లో హెడ్కానిస్టేబుల్గా, 2016లో ఏఎస్సై, ప్రస్తుతం ఎస్సైగా పదోన్నతులు పొందారు. ఒకే రోజు విధుల్లో చేరినప్పటి నుంచి పదోన్నతులు పొందడం విశేషం. ఇందులో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, డీసీఆర్బీ సీఐ గుణవంత్రావు, సీసీ రాజు తదితరులు పాల్గొన్నారు.న్యూస్రీల్టీబీ రహిత సమాజానికి కృషి చేయాలి బేల: ప్రతి ఒక్కరూ టీబీ రహిత సమాజం కో సం కృషి చేయాలని డీఎంహెచ్వో రాథోడ్ న రేందర్ అన్నారు. మండలకేంద్రంలోని అశోక్నగర్ ప్రభుత్వ పాథమిక పాఠశాలలో వారం కంటే ఎక్కువ దగ్గు ఉన్న వారికి బుధవారం ని ర్వహించిన ఎక్స్రే పరీక్షల శిబిరాన్ని పరిశీలించారు. అలాగే నూతన పీహెచ్సీ భవన ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. ఆయనవెంట వైద్యాధికారి వంశీకృష్ణ, టీబీ నివారణ వైద్య బృందం సభ్యులు ఉన్నారు.విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలిఆదిలాబాద్టౌన్: ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను బుధవారం పరి శీలించారు. పట్టణంలోని భుక్తాపూర్ ఉర్దూ మీడియం, గెజిటెడ్ నం.1 పాఠశాలలకు వెళ్లి విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆయన వెంట బీఆర్ఎస్వీ నాయకులు ప్రశాంత్, కలీమ్, రఘు, మోసిన్ తదితరులున్నారు. -
యువకుడు ఆత్మహత్య
సాత్నాల: మానసిక స్థితి సరిగాలేక పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గౌతమ్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని జామ్ని గ్రామానికి చెందిన సోయం సతీశ్(23) జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాలలో వార్డెన్గా పనిచేస్తున్నాడు. మంగళవారం బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు వెతుకుతుండగా రాత్రి జామ్ని, మేడిగూడ మధ్యలో పంట పొలాల్లో పురుగుల మందు తాగి విగత జీవుడై కనిపించాడు. మృతుని తండ్రి సోయం తులసీరామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
కార్మికులపై వేధింపులు మానుకోవాలి
● హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ శ్రీరాంపూర్: తమమాట వినలేదన్న కారణంతో అధికారులు కార్మికులను వేధించడం మానుకోవాలని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అన్నారు. బుధవారం శ్రీరాంపూర్ లోని ఎస్సార్పీ 3, 3ఏ గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్లో మాట్లాడారు. అధికారుల తప్పిదాలను ప్రశ్నిస్తే షిఫ్టులు మార్చి వేధింపులకు గురి చేస్తున్నారని, ఇలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. పని స్థలాల వద్ద కార్మికులకు తాగునీటి సదుపాయం లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కార్మికులతో కోల్ ఫిల్లింగ్ పనులు చేయిస్తూ వేతనం మాత్రం ఒకటో కేటగిరీ వేతనాలు చెల్లిస్తున్నారన్నారు. జన్మభూమి పేరుతో కార్మికులపై అదనపు పని భారం మోపుతున్నారన్నారు. సమయానికి మ్యాన్రైడింగ్ నడుపకపోవడంతో కార్మికులు కాలినడకతోనే గనిలోకి దిగాల్సి వస్తుందన్నారు. కొంతమంది అధికారులు కార్మికుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, వారిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్మికులు శశిధర్, గంగపెల్లి కమలాకర్, నర్సింగరావు, తదితరులు యూనియన్లో చేరగా వారికి కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు అనిల్రెడ్డి, కేంద్ర కమిటీ నాయకులు జక్కుల నారాయణ, తిప్పారపు సారయ్య, గొల్ల సత్యనారాయణ, బ్రాంచ్ కార్యదర్శి పొనగంటి అశోక్, నాయకులు దుర్గం లక్ష్మణ్, రేగుంట సందీప్, తుల అనిల్ కుమార్, చెవుల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఓపెన్ స్కూల్ ఓ వరం..
● చదువు మానేసిన వారికి మంచి అవకాశం ● పదోతరగతి, ఇంటర్లో ప్రవేశాలు ప్రారంభం ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 84 కేంద్రాలు లక్ష్మణచాంద(నిర్మల్): ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితుల వల్ల పాఠశాల స్థాయిలోనే పలువురు విద్యార్థులు చదువు మధ్యలోనే మానేస్తున్నారు. మరి కొందరు పదోతరగతి పూర్తయిన తరువాత ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో ఇంటర్ చదువు కొనసాగించలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) మళ్లీ చదువుకునే అవకాశం కల్పిస్తోంది. చదువు మధ్యలో మానేసిన విద్యార్థులు మళ్లీ చదువు కొనసాగించేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న ఓపెన్ స్కూల్, ఓపెన్ ఇంటర్ ఓ సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓపెన్ పదోతరగతి, ఓపెన్ ఇంటర్ అధ్యయన కేంద్రాలు 84 ఉన్నాయి. వాటిలో 7,078 మందికి ప్రవేశాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఓపెన్ తరగతుల్లో ప్రవేశాల కోసం ఎలాంటి విద్యార్హత లేదు. కనీస వయస్సు 15 ఏళ్లు నిండి ఉండాలి. ఆపై వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్లో ప్రవేశాల కోసం తప్పనిసరిగా పదో తరగతి పాపై ఉండాలి. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా జూన్ 12 నుంచి జూలై 11 వరకు ప్రవేశం పొందవచ్చు. టీజీ ఆన్లైన్లో మీసేవ కేంద్రంలో ఫీజు చెల్లించి సమీపంలోని ఓపెన్ స్కూల్లో దరఖాస్తులు సమర్పించి అడ్మిషన్ తీసుకోవాలి. ఓపెన్ స్కూల్లో ఈ నెల 25 బుధవారం వరకు మొత్తం 71 దరఖాస్తులు వచ్చినట్లు ఓపెన్ స్కూల్ ఉమ్మడి ఆదిలాబాద్ కోఆర్డినేటర్ అశోక్ తెలిపారు. ఇందులో ఓపెన్ పదో తరగతికి ఉమ్మడి జిల్లాలో 47 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 34 మంది అడ్మిషన్ ఫీజు చెల్లించారని పేర్కొన్నారు. ఓపెన్లో ఇంటర్లో సైన్స్ విభాగంలో 20 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థులు అడ్మిషన్ ఫీజు చెల్లించారని, ఆర్ట్స్ విభాగంలో ఇప్పటి వరకు 41 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 31 మంది అడ్మిషన్ ఫీజు చెల్లించారని తెలిపారు. సెలవుల్లో తరగతులు... ఓపెన్ పదో తరగతి, ఇంటర్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది. వీరికి సెలవుల రోజుల్లో తరగతులు నిర్వహిస్తారు. రెండో శనివారం, ఆదివారం, ఇతర సెలవులు ఉన్న రోజుల్లో తరగతులు నిర్వహిస్తారు. విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు అధ్యయన కేంద్రాల్లోనే అందజేస్తారు.ఉమ్మడి జిల్లా సమాచారం... జిల్లా అధ్యయన చేర్పించాల్సిన కేంద్రాలు లక్ష్యం నిర్మల్ 25 2,506 ఆదిలాబాద్ 22 1,696 మంచిర్యాల 17 1,974 కుమురంభీం 20 902 మొత్తం 84 7,078 -
‘సమస్యలుంటే నా దృష్టికి తీసుకురండి’
గుడిహత్నూర్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకు రావాలని ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా అన్నారు. ఇటీవల స్థానిక పీహెచ్సీలో పసికందుపై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడ్డ ఘటన నేపథ్యంలో బుధవారం పీహెచ్సీని సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. వైద్యాధికారి శ్యాంసుందర్ను అడిగి ఆస్పత్రిలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో లక్షల విలువైన వైద్యోపకరణాలు చిన్నచిన్న సమస్యలతో మూలనపడి ఉన్నాయని, వాటికి మరమ్మతులు చేస్తే రోగులకు ఇక్కడే మెరుగైన వైద్యం అందిస్తామని వైద్యాధికారి వివరించాడు. ఆస్పత్రిలో తాగినీటి సమస్య, ఆర్వో ప్లాంట్ లేక పడుతున్న ఇబ్బందులు చెప్పడంతో పీవో సానుకూలంగా స్పందించారు. నిధులు సమకూరుస్తానని హామీ ఇచ్చారు. సైబర్ వలలో మరో బాధితుడుఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్కు చెందిన జోషి వినాయక్ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. ఈ నెల 3న సైబర్ నేరస్తుడు ఆయనకు వీడియో కాల్ చేసి ఫోన్పే ద్వారా రూ.52,800 పంపించానని, ఆ డబ్బులు తిరిగి తనకు పంపించాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. లేనిపక్షంలో కేసు నమోదు చేస్తానని హెచ్చరించాడు. మొదట డబ్బులు వచ్చినట్లు ఆయన ఫోన్కు మెసేజ్ వచ్చింది. దీంతో బాధితుడు భయపడి రూ.32వేలు ఎస్బీఐ అకౌంట్ ద్వారా పంపించాడు. ఆ తర్వాత తన అకౌంట్ చూసుకోగా ఎలాంటి డబ్బులు జమ కాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించాడు. బుధవారం వన్టౌన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. -
జిల్లా విపత్తు నిర్వహణ బృందం సిద్ధం
● 20 మంది సిబ్బందితో అందుబాటులోకి.. ● ‘డీడీఆర్ఎఫ్’ను ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్ సాత్నాల: జిల్లాలో విపత్తులు ఎదురైన క్రమంలో ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా అత్యవసరంగా స్పందించేందుకు డీడీఆర్ఎఫ్ అందుబాటులో ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. వర్షాకాలం దృష్ట్యా వరదలు, ఇతర విపత్తులకు సంబంధించి ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా విపత్తు నిర్వహణ బృందం (డిస్టిక్ర్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్)ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం సాత్నాల ప్రాజెక్టు వద్ద బృందం సేవలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎస్సై ఆధ్వర్యంలో 20 మందితో కూడిన ఈ బృందం ఇప్పటికే ప్రత్యేక శిక్షణను పూర్తి చేసుకుందన్నారు. ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. జిల్లాలో వరదలు, అగ్ని ప్రమాదాలు వంటివి సంభవించినప్పుడు, రోడ్లపై చెట్లు విరిగిపడ్డ సమయంలో వీరి సేవలు సత్వరం అందుబాటులోకి వస్తాయన్నారు. రెస్క్యూ బోట్, మోటార్ మిషన్, మెడికల్ స్టక్చ్రర్, లైఫ్ జాకెట్స్, వుడ్ కట్టర్స్మిషన్ వంటి అత్యాధునిక పరికరాలను వీరి వద్ద అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇందులో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్రెడ్డి, ఎస్సైలు డి.సాయినాథ్, కె ఫణిదర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి. వెంకటి, టి మురళి, ఎన్. చంద్రశేఖర్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. -
టెండర్ రీకాల్కు కలెక్టర్ ఆదేశం
కైలాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో రూ.600 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, వాటర్ ట్యాంకుల నిర్మాణాల డీపీఆర్ రూపకల్పనకు మున్సిపల్ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. అయితే కేవలం ఒకే ఒక టెండర్ దాఖలవడం గమనార్హం. బల్దియా అధికారులు దానినే ఖరారు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ‘కుమ్మక్కయ్యారా.. ఆసక్తి లేకనా’ శీర్షికన ఈ నెల 23న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ మేరకు కలెక్టర్ రాజర్షిషా స్పందించారు. మరోసారి టెండర్లు ఆహ్వానించాలని అధికారులను ఆదేశించారు. గతంలో ఆఫ్లైన్లో టెండర్లు పిలవగా, ఈసారి ఆన్లైన్లో ఆహ్వానించాలని, ఇందుకు సంబంధించి జాతీయస్థాయి పత్రికల్లో నోటిఫికేషన్ ప్రకటించాలని సూచించారు. కలెక్టర్ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. -
మూత‘బడి’కి.. మళ్లీ కళ
● పుష్కర కాలం తర్వాత ఓపెన్ ● కలెక్టర్ చొరవతో ఐదు పాఠశాలల్లో మోగినగంట ● ‘సర్కారు’పై ఆసక్తి చూపుతున్న తల్లిదండ్రులు ఆదిలాబాద్టౌన్: మూతబడిన సర్కారు బడులు పుష్కర కాలం తర్వాత ఈ ఏడాది తెరుచుకున్నా యి. అధికారుల నిర్లక్ష్యమో.. ఉపాధ్యాయుల అలసత్వమో ఏమోగాని ఎట్టకేలకు ఆ బడుల్లో గంట మోగింది. మౌలిక వసతులు లేకపోవడం, ఉపాధ్యాయుల కొరత, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్కు పంపడంతో ఆ ప్రభుత్వ పాఠశాలలు ఏళ్లుగా తాళం పడి వెలవెలబోయాయి. ఇటీవల కలెక్టర్ రాజర్షిషా ప్రత్యేక చొరవ చూపి మూతబడులన్నీ తెరిపించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లాలో పదేళ్లకు పైగా మూసి ఉన్న 14 బడుల్లో ఐదు ఈ విద్యా సంవత్సరం పునఃప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. ఇన్ని రోజులు బోసిపోయిన బడులు ప్రస్తుతం విద్యార్థులతో కళకళ లాడుతున్నాయి. మూత‘బడి’కి కారణాలెన్నో.. సర్కారు బడులు మూతపడడానికి అనేక కారణా లున్నాయి. కొంతమంది ఉపాధ్యాయులు సమ యపాలన పాటించకపోవడం, నాణ్యమైన బోధ న అందించకపోవడం, మౌలిక వసతులు లేకపోవడం తదితర కారణాలతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులున్నా ప్రైవేట్కే మొగ్గు చూపుతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. తాము పడ్డ కష్టాలు తమపిల్లలు పడొద్దనుకోవడమే. అయితే కొంత మంది ఉపాధ్యాయులు విధులకు సక్రమంగా హా జరుకాకపోవడం, పిల్లలకు సరైన రీతిలో బోధన చేయకపోవడంతో సర్కారు బడులకు చెడ్డ పేరు వస్తుందనే ప్రచారం ఉంది. చాలా మంది పిల్లలు చదవడం, రాయడంలో వెనుకబడిఉండటం, అధి కారుల పర్యవేక్షణ లేకపోవడంతో బడులు మూతబడ్డాయని పలు వురు అభిప్రాయ పడుతున్నారు. కలెక్టర్ చొరవతో.. కలెక్టర్ రాజర్షి షా చొరవతో ఏళ్లుగా మూతబడిన సర్కారు బడులు ఈ ఏడాది తెరుచుకున్నాయి. విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలను పునఃప్రారంభించాలని ఆదేశించారు. దీంతో ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఆయా కాలనీలు, గ్రామాలకు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని, నాణ్యమైన విద్యాబోధన అందుతుందని వివరించారు. దీంతో తల్లిదండ్రులు ఆసక్తి కనబర్చి తమ పిల్లలను చేర్పించేందుకు ముందుకు వచ్చారు. జిల్లాలో 14 మూతబడులు.. జిల్లాలో మూతబడిన పాఠశాలలు 14 ఉన్నాయి. ఇందులో ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ ప్రాథమిక పాఠశాల, స్టేషన్ రోడ్, వెంకట్రావుపేట్, కేఆర్కే కాలనీ, బజార్హత్నూర్ మండలంలోని ఇందిరానగర్, భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి, డబ్బకుచ్చి, గాదిగూడ మండలంలోని చిన్నకుండి, కునకాస, ఇచ్చోడ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ తలమద్రి, నార్నూర్ మండలంలోని భీంపూర్ ఎస్సీ కాలనీ, కొత్తపల్లి పాఠశాల, నేరడిగొండ మండలంలోని దాబా, సవర్గాం పాఠశాలలు పదేళ్లకు పైగా మూతబడ్డాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదిలాబాద్లోని వెంకట్రావుపేట కాలనీ, భీంపూర్ మండలంలోని డబ్బకుచ్చి, నేరడిగొండ మండలంలోని సవర్గాం, నార్నూర్ మండలంలోని కొత్తపల్లి, భీంపూర్ ఎస్సీ కాలనీ పాఠశాలలు ఇటీవల పునఃప్రారంభం అయ్యాయి. తెరుచుకున్న ఒక్కో బడిలో ప్రస్తుతం 15 నుంచి 20 మంది విద్యార్థులు చేరారు. వీరికి పాఠ్య పుస్తకాలతో పాటు యూనిఫాం పంపిణీ చేశారు. ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఐదు పాఠశాలలను తెరిచాం.. కొన్నేళ్లుగా జిల్లాలో 14 పాఠశాలలు జీరో ఎన్రోల్మెంట్ ఉన్నాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు ఐదు పాఠశాలలను పునఃప్రారంభించాం. సమీప పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను సర్దుబాటు చేశాం. ‘బడిబాట’లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించే సౌ కర్యాలు, విద్యాబోధన విషయాలను తల్లి దండ్రులకు తెలియజేశాం. దీంతో వారు తమ పిల్లలను ప్రభుత్వ బడికి పంపించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దాదాపు 500 మంది ఈ ఏడాది ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. – సుజాత్ ఖాన్, సెక్టోరియల్ అధికారి -
లక్ష్యాలకు అనుగుణంగా రుణాలందించాలి
● బ్యాంకర్లకు కలెక్టర్ రాజర్షి షా ఆదేశం కై లాస్నగర్: బ్యాంకర్లు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు మంజూరు చేసి రైతులు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు అండగా నిలువాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బ్యాంకర్లతో కూడిన డిస్ట్రిక్ట్ కన్సల్టెటీవ్ కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పంట రుణాలతో పాటు పీఎం ఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ, పీఎం విశ్వకర్మ, నాబార్డు పథకాల లక్ష్యాలను సాధించే దిశగా బ్యాంకర్లు సహకరించాలన్నారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ఆర్థిక చేయూత అందించాలని సూచించారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకంపై అవగాహన కల్పించారు. అనంతరం 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక యాక్షన్ ప్లాన్ను విడుదల చేశారు. సమావేశంలో ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎల్డీఎం ఉత్పల్కుమార్, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ రావు, డీఏవో శ్రీధర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. -
యువత మత్తుకు బానిస కావొద్దు
● కలెక్టర్ రాజర్షి షా ‘రైతు భరోసా’ సద్వినియోగం చేసుకోవాలి గుడిహత్నూర్: రైతు భరోసాను రైతులు సద్వి నియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అ న్నారు. మండలంలోని సీతాగోంది రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన రైతు భరోసా సంబరాల్లో పాల్గొని మాట్లాడారు. రైతులు సా గులో అధికారుల సూచనలు పాటించి మంచి దిగుబడులు సాధించాలన్నారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్స్వామి,ఎన్పీడీసీఎల్ ఎస్ఈ గుణవంత్ చౌహా న్, తహసీల్దార్ కవితా రెడ్డి, మండల ప్రత్యేక అధికారి సునీత, ఏవో రమేశ్ పాల్గొన్నారు. కై లాస్నగర్: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. అలాగే జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా పూర్తిగా అరికట్టాలన్నారు. మిషన్ పరివర్తన్– నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఫ్రీడమ్ పార్కులో అధికా రులతో కలిసి మంగళవారం వివిధ రకాల మొక్కలు నాటారు. అయామ్ ఆన్ యాంటీ డ్రగ్ సోల్జర్ సెల్ఫీ స్టాండ్ వద్ద ఫొటో దిగారు. అనంతరం ఆయ న మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు బాని సై విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలను నియమించాలన్నారు. గంజాయిసాగు, మత్తు పదార్థాల అక్రమ రవాణా జరుగుతున్నట్లు దృష్టికి వస్తే టోల్ఫ్రీ14446, 1908 నంబర్లతో పాటు డయ ల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్కలెక్టర్ యువరాజ్, ట్రెయినీ కలెక్టర్ సలోని, డీఎఫ్వో ప్రఽశాంత్, జిల్లా సంక్షేమాధికారి మిల్కా, జెడ్పీ సీఈవో జితేందర్రెడ్డి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు పాల్గొన్నారు. మత్తు పదార్థ రహిత సమాజ నిర్మాణానికి బహుముఖ వ్యూహం మత్తు పదార్థ రహిత సమాజ నిర్మాణం కోసం బహుముఖ వ్యూహంతో ముందుకెళుతున్నట్లు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. అంతర్జాతీయ మాదక ద్ర వ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆకాశవాణితో ముచ్చటించారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందకు చేపడుతున్న కార్యక్రమలనువివరించారు. అవగాహనతోనే వీటిని రూపు మాపగలుగుతామన్నారు. ఇందులో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, ఆకాశవాణి రిటైర్డ్ డైరెక్టర్ సుమనస్పతిరెడ్డి, ముఖ్య కార్యక్రమాధికారి కె. రామేశ్వర్ పాల్గొన్నారు.‘ఇందిరమ్మ’లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు.. కై లాస్నగర్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో సంబంధిత కమిటీలు, అధికారులు, సి బ్బంది అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరె న్స్ అనంతరం ఆయన జిల్లా అధికారులతో స మీక్షించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పా రదర్శకంగా ఉండాలన్నారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, సబ్కలెక్టర్ యువరాజ్, తదితరులు పాల్గొన్నారు. -
15 ఏళ్ల తర్వాత మోగిన బడి గంట
● కలెక్టర్ ఆదేశాలతో తెరుచుకున్న డబ్బకుచ్చి పాఠశాలఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 15 ఏళ్ల తర్వాత ఆ పాఠశాలలో మళ్లీ బడిగంట మోగింది. కలెక్టర్ చొరవతో మండలంలోని డబ్బకుచ్చి ప్రభుత్వ పాఠశాల ఎట్టకేలకు పునఃప్రారంభమైంది. దశాబ్దంనరగా పాఠశాల మూతబడి ఉండడాన్ని యూఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు, గ్రామస్తులతో కలిసి ఈనెల 23న ప్రజావాణిలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు జిల్లా బాస్ రాజర్షి షా ఆదేశాలతో విద్యాశాఖ అధికారులు మంగళవారం పాఠశాలకు చేరుకున్నారు. గ్రా మస్తులతో కలిసి బడిని పునఃప్రారంభించారు. ఇందులో జిల్లా విద్యాశాఖ అధి కారులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. – భీంపూర్ -
కొమ్మలు కాదు.. చెట్లే నరికేశారు..!
● విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్నాయని.. ● ఫిర్యాదుపై పట్టించుకోని అధికారులు ● ప్రజావాణిలో మూడుసార్లు ఫిర్యాదు మంచిర్యాలఅగ్రికల్చర్: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు విద్యుత్ శాఖ సిబ్బంది కొట్టేస్తుంటారు. జిల్లాలోని నెన్నెల మండల విద్యుత్ శాఖ అధికారులు ఏకంగా 80 చింతచెట్లు కొట్టేయించారు. దిగుబడి వచ్చే చెట్లను కొట్టేయడంపై బాధితుడు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. నెన్నెల మండలం వెల్లంపల్లికి చెందిన ముడపల్లి మహేష్కు భీమారం మండలం కాజిపల్లి శివారు సర్వేనంబరు 94/1లో 4.12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. చుట్టూ 2015లో 90 చింతచెట్టు మొక్కలు నాటి పెంచుతున్నాడు. రెండేళ్లుగా చింతపండు దిగుబడి వస్తోంది. గత ఏడాది రూ.70వేలు ఆదాయం వచ్చింది. భవిష్యత్లో మంచి లాభాలు వస్తాయని ఆశిస్తే విద్యుత్శాఖ అధికారులు అడియాసలు చేశారు. నెన్నెల మండల విద్యుత్ శాఖ అధికారులు 2025 మే 5న వెంకటపూర్, కొత్తూర్కు కొత్త విద్యుత్ లైన్ ఏర్పాటుకు అడ్డుగా ఉన్నాయని 80 చెట్లు నరికేశారు. కొమ్మలు అడ్డుగా ఉంటే నరికేస్తారు. కానీ ఇక్కడ చెట్లే నరికేయడం గమనార్హం. అనుమతి లేకుండా చెట్లు నరికేశారని విద్యుత్శాఖ, తహసీల్దార్, అటవీశాఖ, పోలీసుస్టేషన్, ఉద్యానవన అధికారులకు, కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో మూడు సార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని బాధితుడు మహేష్ వాపోతున్నాడు. అటవీశాఖ అధికారులు పరిశీలించి చెట్ల విలువను టింబర్ రేట్ ప్రకారం రూ.17వేలుగా నిర్ణయించారని, అక్రమంగా నరికినందుకు తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారని తెలిపాడు. విద్యుత్ శాఖ అధికారులు తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి స్థానిక ప్రజాప్రతినిధులతో ఒత్తిడి తీసుకొస్తున్నారని పేర్కొన్నాడు. నరికిన చెట్లు పొలంలోనే ఉండడంతో వరిసాగు చేసుకోవడం కష్టంగా మారిందని తెలిపాడు. ఏడాదికి రూ.లక్షలు ఆదాయం, వందేళ్ల దిగుబడి వచ్చే చెట్లను అన్యాయంగా నరికేశారని, న్యాయస్థానాన్ని ఆశ్రయించక తప్పేలా లేదని పేర్కొన్నాడు. కొమ్మలు నరికేశారు.. విద్యుత్ లైన్కు అడ్డుగా వస్తున్నాయి.. కొమ్మలు నరుకాలని ఏఈ సంబంధిత కాంట్రాక్టర్కు సూచించడంతో కొమ్మలు మాత్రమే నరికేశారు. చెట్లు నరకాలని చెప్పలేదు. చెట్లు ఎవరు నరికి వేశారో తెలియదు. బాధితుడు నా వద్దకు వచ్చి ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ కొనసాగుతోంది. – గంగాధర్, జిల్లా విద్యుత్ శాఖ అధికారి -
పైచదువులు ఇష్టంలేక విద్యార్థి ఆత్మహత్య
దండేపల్లి(మంచిర్యాల): పై చదువులు ఇష్టంలేక ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దండేపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై తహసీనొద్దీన్ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన పొన్నం చంద్రగౌడ్, మాధవి దంపతుల కుమారుడు పొన్నం తరుణ్గౌడ్ (18) ఇంటర్ పూర్తి చేశాడు. బీటెక్ చదవాలని తండ్రి సూచించడంతో నాకు పైచదువులు ఇష్టం లేదని, ఏదైనా వ్యాపారం చేసుకుంటానని చెప్పాడు. అయితే బీటెక్ అయ్యాక వ్యాపారం చేసుకొమ్మని తండ్రి నచ్చజెప్పాడు. ఇటీవల హైదరాబాద్కు వెళ్లి కొన్ని బీటెక్ కాలేజీలు కూడా చూసివచ్చారు. అప్పటి నుంచి దిగాలుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి గదిలో ఉన్న తరుణ్ను భోజనానికి పిలిస్తే రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లిచూడగా ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించాడు. మృతుని తండ్రి చంద్రగౌడ్ ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ఇంటర్ ఇష్టంలేక ఒకరు..లోకేశ్వరం(ముధోల్): మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని బిలోలిలో చోటు చేసుకుంది. ఏఎస్సై దిగంబర్ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన ఓల్కర్ బీరన్న–రాంబాయి దంపతుల కుమారుడు గంగాధర్ (17)నిర్మల్ పట్టణంలోని బీసీ వెల్ఫేర్ పాఠశాలలో ఇటీవల పదోతరగతి పూర్తి చేశాడు. ఇంటర్ చదివేందుకు నిజామాబాద్లోని ఓ ప్రైవేటు కళాశాలలో అప్లై చేసుకున్నాడు. అయితే హోటల్ మేనేజ్మెంట్ చేస్తానని, ఇంటర్ చదవనని చెప్పడంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం తమ పంటచేనులో మద్యం సీసాలో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో ఒకరు..సిరికొండ: ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఏస్సై శ్రీసాయి, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రనికి చెందిన దోండే రవీంద్రనాథ్ (48) కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఆదివారం మధ్యాహ్నం గ్రామ సమీపంలో పురుగుల మందు తాగి కుటుంబ సభ్యులకు సమాచా రం అందించాడు. రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మద్యానికి బానిసై యువకుడు..కడెం: మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణసాగర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు మండలంలోని పెద్దూర్తండాకు చెందిన హపవత్ సురేశ్ (22) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం మద్యం మత్తులో పెద్దూర్ సమీపంలోని ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతుని తల్లి అనూష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదుతానూరు: ఆటో డ్రైవర్పై దాడి చేసిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ట్రెయినీ ఎస్సై నవనీత్రెడ్డి తెలిపారు. హిప్నెల్లితండాకు చెందిన రాథోడ్ అశ్విన్ తన ఆటోలో ప్రయాణికులను ఎక్కంచుకుని వెళ్తుండగా అందులో ప్రయాణిస్తున్న రాథోడ్ గురుజీ, సునీల్ గొడవపడ్డారు. వారిని ఆటోలోంచి దిగిపొమ్మనడంతో ఇనుపరాడ్డుతో దాడికి పాల్పడ్డారు. గాయాలు కావడంతో అశ్విన్ను స్థానిక ఆస్పత్రికి తరిలించారు. బాధితుని తల్లి అంజనాబాయి ఫిర్యాదు మేరకు ఇరువురిపై కేసు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా వెడ్మ బొజ్జు
ఉట్నూర్రూరల్: టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ను నియామకమయ్యారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో మంగళవారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్రెడ్డి, డిప్యూ టీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సీఎం చేతుల మీదుగా నియామకం పత్రం అందుకున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలో పేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా సుగుణ టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి ఆత్రం సుగుణ నియామకమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా నియామకపత్రం అందుకున్నారు. పార్టీలో తనకు గౌరవమైన హోదాను కల్పించినందుకు జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. -
సమయపాలన పాటించాలి
నార్నూర్: ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని డీఈవో శ్రీనివాస్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల తెలుగు, ఉర్దూమీడియం పాఠశాలలు, విజయ్నగర్లోని ఎంపీపీఎస్తో పాటు దివ్యాంగుల కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టికలను పరిశీలించారు. ఈ విద్యాసంవత్సరం ప్రవేశాలపై ఆరా తీశారు. ఎంపీపీఎస్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ తక్కువగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఏంఈవో పవార్ అనిత, సీసీ రాజేశ్వర్ తదితరులు ఉన్నారు. -
ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
దస్తురాబాద్: మండలంలోని గోడిసీర్యాల గ్రామ పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ ఆదిలాబాద్ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. గోడిసీర్యాల గ్రామానికి చెందిన గోసుకుల రాజేశ్ తన గ్రామంలో నూతన వాటర్ ప్లాంట్కు నిర్వహణ అనుమతుల కోసం శివకృష్ణను సంప్రదించాడు. రూ.15 వేలు డిమాండ్ చేయగా.. చర్చల అనంతరం రూ.12 వేలకు ఒప్పందం కుదిరింది. మంగళవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో అనుమతి పత్రాలను శివకృష్ణ రాజేశ్కు ఇచ్చాడు. అనంతరం గ్రామ సమీపంలోని ఓనర్సరీలో రూ.12 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికా రులు రెండ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నగదుతోపాటు శివకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఆదిలాబాద్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ మధు తెలిపారు. -
బ్రాండెడ్ పేరిట రాయితీ బియ్యం విక్రయం
● ముగ్గురు వ్యాపారులపై కేసు ● పరారీలో ఒకరు ఆదిలాబాద్టౌన్: బ్రాండెడ్ రైస్ పేరుతో ప్రభుత్వ రాయితీ బియ్యం విక్రయిస్తున్న ఘరానా ముఠాను మంగళవారం అరెస్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఎస్పీకి అందిన సమాచారం మేరకు జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్లో దుకాణాలను తనిఖీ చేయగా ఇద్దరు వ్యాపారుల వద్ద 80 క్వింటాళ్ల రాయితీ బియ్యం బ్రాండెడ్ బ్యాగుల్లో వేసి ప్రజలకు విక్రయిస్తున్నట్లు గుర్తించి ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. శివాజీ చౌక్లోని రజిత కిరాణంకు చెందిన గాగుల్వార్ రాజేశ్వర్, ఆంధ్ర కిరాణంకు చెందిన షేక్ అయ్యుబ్లను అరెస్టు చేశారు. చిల్కూరి లక్ష్మీనగర్కు చెందిన షేక్ అస్లమ్ పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. మార్కెట్లో మంచి బ్రాండ్గా ఉన్న జై శ్రీరామ్, గోల్డెన్, సైకిల్బ్రాండ్, సూర్యతేజ, మధురం, దీపం, గీతాంజలి, వైట్ప్లాటినం, శ్రీదత్త అనే పేర్లతో ఉన్న ఖాళీ సంచుల్లో పీడీఎస్ రైస్ నింపి మిషన్తో సీల్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, వన్టౌన్ సీఐ సునీల్ కుమార్, ఎస్సై అశోక్, సిబ్బంది పాల్గొన్నారు. -
వేధింపులతో యువకుడు ఆత్మహత్య
● వ్యాపారి ఇంటి ఎదుట బాధిత కుటుంబ సభ్యుల ఆందోళనపెంచికల్పేట్: వ్యాపారి వేధింపులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని అగర్గూడలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన తుమ్మిడే రాజశేఖర్ (22) కొంతకాలంగా ఎల్కపల్లి గ్రామానికి చెందిన వ్యాపారి కృష్ణ ఎరువుల దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. తన సోదరి డెలివరీకి ఉండగా నాలుగురోజుల పాటు దుకాణానికి వెళ్లలేదు. సోమవారం విధులకు హాజరుకావడంతో కోపోద్రికుడైన వ్యాపారి తీవ్ర పదజాలంతో ధూషించడంతో పాటు డబ్బులు దొంగిలించాడని హేళనగా మాట్లాడాడు. బాకీ ఉన్న రూ.10వేలు ఇవ్వాలనగా ఫోన్పే ద్వారా చెల్లించాడు. అంతేకాకుండా కేసు పెడతానని ఫోన్లో కుటుంబ సభ్యులను బెదిరించడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అగర్గూడ సమీపంలోని పంట చేనులో గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ముందుగా కాగజ్నగర్, మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లి లక్ష్మి కన్నీరుమున్నీరవుతోంది. ఘటనకు కారకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వ్యాపారి ఇంటి ఎదుట ఆందోళన చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాగజ్నగర్ రూరల్ సీఐ శ్రీనివాస్రావు, ఎస్సై కొమురయ్య బందోబస్తు ఏర్పాటు చేశారు. -
బ్యాంకులో తుపాకీ మిస్ఫైర్
● తప్పిన పెను ప్రమాదం ● ఆదిలాబాద్లో ఘటనఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని శివాజీ చౌక్ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో తుపాకీ మిస్ఫైర్ అయ్యింది. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. పెను ప్రమాదం తప్పడంతో బ్యాంకుకు వచ్చిన వారు ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం ఉదయం 10.15 గంటలకు బ్యాంకు నుంచి డబ్బులు బయటకు తీసుకెళ్లే సమయంలో గార్డ్ రాములు తుపాకీలో బుల్లెట్లు లోడ్ చేశాడు. పొరపాటున స్ట్రింగర్పై వేలు పడడంతో ఒక్కసారిగా తూటా బ్యాంక్ పైకప్పుకు తగిలింది. దీంతో అధికారులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందోనని ఆందోళనకు గురయ్యారు. ఆ సమయంలో కొందరు ఖాతాదారులు మాత్రమే బ్యాంకులో ఉన్నారు. వన్టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని సంఘటనపై ఆరా తీశారు. బుల్లెట్ -
మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలి
ఆదిలాబాద్టౌన్: మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్పీ అఖి ల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్ ఆవరణలో సిబ్బందితో కలిసి మంగళవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు నిరంతరం కృషి చేయాలన్నారు. ప్రజలు గంజాయి, డ్రగ్స్పై ఎలాంటి సమాచారమైనా డయల్ 100, పోలీసు సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు. ఇందులో అదనపు ఎస్పీ బి.సురేందర్ రావు, డీఎస్పీలు శ్రీనివాస్, ఎల్.జీవన్రెడ్డి, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి యుద్ధం.. డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి యుద్ధం చేస్తామని ఎస్పీ అన్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో విద్యార్థులకు మాదకద్రవ్యాల పై అవగాహన కల్పించారు. ఎక్కడైనా డ్రగ్స్ విక్రయించినట్లు, సేవించినట్లు దృష్టికి వస్త్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అనంతరం ‘ఐ ఆమ్ ఆన్ యాంటీడ్రగ్ సోల్జర్’ అంటూ.. విద్యార్థులతో కలిసి ఫొటోలు దిగారు. అంతకముందు విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఇందులో డీఎస్పీ జీవన్రెడ్డి, వన్టౌన్, టూ టౌన్, ట్రాఫిక్ సీఐలు సునిల్ కుమార్, కరుణాకర్ రావు, ప్రణయ్కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.● ఎస్పీ అఖిల్ మహాజన్ -
‘జూపల్లి’ వస్తున్నారు..
● ఇన్చార్జి మంత్రిగా నియామకం తర్వాత జిల్లాకు తొలిసారిగా.. ● మంత్రి వివేక్తో కలిసి రేపు ఆదిలాబాద్ పర్యటన ● రెండు రోజులపాటు జిల్లాలోనే.. ● ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష ● శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో బిజీ షెడ్యూల్ సాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన తర్వాత తొలిసారిగా రాష్ట్ర ఎకై ్సజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్కు వస్తున్నారు. గురు, శుక్రవారాల్లో ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కూడా ఆయనతో కలిసి ఈ పర్యటనకు విచ్చేయనున్నారు. జిల్లా కేంద్రంలో గురువారం ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రుల పర్యటన అధికారికంగా ఖరారైంది. ఇందులో భాగంగా ఉట్నూర్, తలమడుగు, బేల, నిర్మల్లోనూ పర్యటించనున్నారు. పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేపట్టనున్నారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటనున్నారు. సర్వత్రా ఆసక్తి.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా సీతక్కను నియమించారు. ఇటీవల ముగ్గురు ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా కేబినెట్ విస్తరించడం, ఆ తర్వాత ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను మార్పు చేసిన విష యం తెలిసిందే. సీతక్కను నిజామాబాద్ జిల్లా కు, ఆ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా ఉన్న జూపల్లిని ఆదిలాబాద్కు మార్చిన విషయం విదితమే. అంతే కాకుండా ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్కు చోటు దక్కింది. ఈ క్రమంలో ఇద్దరు మంత్రులు తొలిసారిగా మంత్రి హోదాలో ఆదిలాబాద్కు విచ్చేసి ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పర్యటన ఇలా.. ● గురువారం వేకువజామున హైదరాబాద్ నుంచి ఇన్చార్జి మంత్రి జూపల్లి రోడ్డు మార్గాన ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 11 గంటలకు చేరుకోనున్నారు. స్థానికంగా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో నేరుగా పాల్గొననున్నారు. ● గురువారం ఆదిలాబాద్లో రూ.1.40 కోట్లతో నిర్మించిన కామన్ సర్వీస్ సెంటర్, తలమడుగులో రూ.1.56 కోట్లతో నిర్మించిన పీహెచ్సీ భవనాన్ని ప్రారంభించనున్నారు. అలాగే బేల మండలం చప్రాలలో రూ.2.30 కోట్లతో నిర్మిస్తున్న జెడ్పీహెచ్ఎస్ బాలుర హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. రాత్రి జిల్లా కేంద్రంలోని పెన్గంగ విశ్రాంతి భవనంలో బస చేయనున్నారు. ● శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటనున్నారు. మావల అర్బన్ పార్కులో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అక్కడినుంచి ఉట్నూర్కు బయల్దేరి వెళ్లనున్నారు. ఉట్నూర్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉన్నతీకరణలో భాగంగా రూ.13.70 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాప న చేయనున్నారు. అనంతరం పీఎంఆర్సీ భ వనంలో ఆదివాసీ కమ్యూనిటీ పెద్దలతో స మావేశం కానున్నారు. అక్కడి నుంచి నిర్మల్ కు బయల్దేరి వెళ్లనున్నారు. నిర్మల్లో ఇందిర మ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయనున్నారు. స్వ యం సహాయక సంఘాలకు చెక్కులు ఇవ్వనున్నారు. ఆ సాయంత్రం నిర్మల్ నుంచి బయల్దే రి హైదరాబాద్కు వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే మంత్రుల పర్యటనకు సంబంధించి ఉన్నతాఽ దికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా జిల్లా ల ఎస్పీలు బందోబస్తు సమీక్షించనున్నారు. -
మెడికల్ బోర్డు పిలుపు ఎప్పుడో..?
● 3 నెలలుగా నిర్వహించని సమావేశం ● సింగరేణి వ్యాప్తంగా 700 మంది నిరీక్షణ ● ఆందోళనలో హయ్యర్ సెంటర్ రిఫరల్ కేసు బాధితులుశ్రీరాంపూర్:సింగరేణి కార్పొరేట్ మెడికల్ బోర్డు సమావేశం నిలిచిపోయింది. మూడు నెలలుగా బోర్డు సమావేశం ఏర్పాటు చేయకపోవడంతో జబ్బుపడిన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలకోసారి మెడికల్ బోర్డు సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. కానీ 2025, మార్చి 21న నిర్వహించిన మెడికల్ బోర్డు మళ్లీ ఇప్పటి వరకు నిర్వహించలేదు. దీంతో మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులు నిరీక్షిసున్నారు. కంపెనీ నిబంధనల ప్రకారం ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులు ఇక తాము డ్యూటీలు చేయలేమని భావిస్తే మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకుంటారు. ఉద్యోగ విరమణ తేదీకి కనీసం రెండేళ్ల ముందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కీళ్ల నొప్పులు, నడుం నొప్పులు, కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల భారిన పడిన వారంతా కూడా బోర్డుకు దరఖాస్తు చేసుకుంటారు. దీంతో పాటు గనులు, బయట ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి ఏరియా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని కూడా ఏరియా వైద్యాధికారులు కార్పొరేట్ మెడికల్ బోర్డుకు రెఫర్ చేస్తారు. హయ్యర్ సెంటర్ రిఫరల్ కేసులు.. హయ్యర్ సెంటర్ రిఫరల్ బాధిత కార్మికులను హైదరాబాద్లోని నిమ్స్, ఇతర ప్రముఖ ఆస్పత్రులకు కంపెనీ రెఫర్ చేస్తుంది. ఇలా రిఫరల్ అయిన కార్మికులు అక్కడ చేయించుకున్న వైద్య పరీక్షల రిపోర్టును కంపెనీకి సమర్పిస్తారు. వారిని మెడికల్ బోర్డుకు పిలిచి వైద్యపరీక్షలు నిర్వహించి నిర్ధారణ చేస్తారు. అయితే ఈ ఏడాది మార్చిలో జరిగిన మెడికల్ బోర్డుకు ముందు మూడు నెలల నుంచి ఇలాంటి కేసులను బోర్డుకు పిలువలేదు. ఇలా ఆరు నెలలుగా హయ్యర్ సెంటర్ రిఫరల్ కేసులు పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో తాము వేతనాలు కోల్పోవాల్సి వస్తోందని కార్మికులు వాపోతున్నారు. 700 మంది నిరీక్షణ.. సింగరేణి వ్యాప్తంగా సుమారు 700 మంది కార్మికులు మెడికల్ బోర్డు పిలుపుకోసం ఎదురుచూస్తున్నారు. మెడికల్ బోర్డుకు వెళ్లిన కేసులను అక్కడి వైద్యబృందం, అధికారులు పరీక్షిస్తారు. వారికి ఉన్న జబ్బుల తీవ్రతను బట్టి అండర్ గ్రౌండ్లో పనిచేయలేని వారిని అన్ఫిట్ చేసి సర్ఫేస్లో డ్యూటీ ఇస్తారు. పూర్తిగా పని చేయలేరని భావించిన వారిని ఇన్వాలిడేషన్ చేస్తారు. దీని కింద కార్మికుని డిపెండెంట్లకు కారుణ్య ఉద్యోగం వస్తుంది. సమావేశం నిర్వహించాలి సింగరేణి యాజమాన్యం ఇకనైనా ఆలస్యం చేయకుండా వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించాలి. నెలకోసారి నిర్వహించాల్సిన బోర్డును ఇప్పటికీ మూడు నెలలుగా నిర్వహించకపోవడంతో వ్యాధుల భారిన పడిన కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. – కే.వీరభద్రయ్య, ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి -
ఏటీఎంలో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు
బెల్లంపల్లి: బెల్లంపల్లిలో సంచలనం సృష్టించిన ఏటీఎంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీసీపీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు. మంగళవారం బెల్లంపల్లి రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ రవికుమార్తో కలిసి వివరాలు వెల్లడించారు. హర్యానా రాష్ట్రానికి చెందిన జేసీబీ ఆపరేటర్లు మహ్మద్ ముస్తాఫా, షాహీద్, వారి సహచరులైన ఆలీంఖాన్, సాజిద్, అప్తాబ్తో కలిసి ఏటీఎంలోకి వెళ్లి మిషన్ క్యాషెట్ను గ్యాస్కట్టర్తో కట్ చేశారు. అంతలోనే పోలీస్ సైరన్ వినిపించడంతో క్యాషెట్ను (రూ.30వేల)ను పట్టుకెళ్లారు. ఏటీఎం నిర్వహాకులు సీఎంఎస్ కంపెనీకి చెందిన అసిస్టెంట్ మేనేజర్ శివకుమార్ ఫిర్యాదుతో బెల్లంపల్లి టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రామగుండం సీపీ ఆదేశాల మేరకు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం బెల్లంపల్లి కెమికల్ ప్రాంతంలో మహ్మాద్ ముస్తాఫా, షాహిద్ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు బైక్లు, గ్యాస్ కట్టర్, గ్యాస్ సిలిండర్తో పాటు ఏటీఎంలోని క్యాషెట్ను స్వాధీనం చేసుకున్నారు. ఆలీంఖాన్, సాజిద్, అప్తాబ్ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. నిందితులు మహారాష్ట్రలోని అహేరిలో పల్సర్ బైక్, మంచిర్యాలలో షైన్ బైక్ను దొంగలించారు. కాగజ్నగర్లో గ్యాస్ కట్టర్, కౌటాలలో గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేశారు. కేసును ఛేదించిన బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్, టూటౌన్ ఎస్సై కే.మహేందర్, నెన్నెల ఎస్సై ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ రవీందర్, కానిస్టేబుల్ సాయికృష్ణ, హోంగార్డు సంపత్ను డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు. -
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది.పలుచోట్ల ఓ మోస్తరు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమశాతం పెరగనుంది.8లోu మంగళవారం శ్రీ 24 శ్రీ జూన్ శ్రీ 2025క్రీడల అభివృద్ధికి కృషిఆదిలాబాద్టౌన్: జిల్లాలో క్రీడల అభివృద్ధికి త న వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఒలింపిక్ డే రన్ కార్యక్రమాన్ని ట్రెయినీ కలెక్టర్ సలోనితోకలిసి సోమవారం ప్రారంభించారు. క్రీడా జ్యోతి వెలిగించి అనంతరం క్రీడాకారులతో కలిసి రన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడారంగానికి ఖేలో ఇండియా ద్వారా మరిన్ని నిధులు తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. ఇందులో డీవైఎస్వో శ్రీనివాస్, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి,ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి,రాష్ట్రపాల్పాల్గొన్నారు.● మొదలైన ‘స్థానిక’ సందడి ● సన్నద్ధమవుతున్న ప్రధాన పార్టీలు ● శ్రేణులను అప్రమత్తం చేస్తున్న అధిష్టానాలు ● పావులు కదుపుతున్న బీజేపీ, బీఆర్ఎస్ ● అధికార కాంగ్రెస్కు జిల్లాలో సవాలే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. జిల్లాలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. పూర్తి స్థాయి నియోజకవర్గాలైన ఆదిలాబాద్లో బీజేపీ, బోథ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక జిల్లాలో పాక్షికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఖానాపూర్ పరంగా కాంగ్రెస్, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్కు ప్రత్యర్థుల నియోజకవర్గాలో స్థానిక పోరులో విజయం సాధించాలంటే ఆషామాషీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆయా నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకు సంబంధించి క్యాడర్ బలంగా ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార కాంగ్రెస్ను పరిశీలిస్తే ఇటీవల రైతు భరోసా విడుదల చేయడం, మరో పక్క ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, భూభారతి అమలు ద్వారా హస్తం పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతుందనే సంకేతాలు ఇస్తుంది. బీఆర్ఎస్ విషయానికి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే ఎన్నికలు చేపట్టాలని డిమాండ్ చేస్తూనే తాము ఎన్నికలకు మాత్రం సిద్ధమేనని పేర్కొంటుంది. కమలం పార్టీ సైతం ఎన్నికలకు సమాయత్తమవుతుంది. తలమడుగు మండలం సుంకిడిలో ఆదివారం బోథ్ నియోజకవర్గ పార్టీ శ్రే ణులతో ఎంపీ గోడం నగేశ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమావేశం అయ్యారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని శ్రేణులకు సూచించారు. బలాబలాలు.. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమ ప్రభావం చూపాలని పార్టీ శ్రేణులు ఉత్సాహంగా కదులుతున్నారు. పార్టీకి సంబంధించి ఈనెలలో గ్రామ, మండల, బ్లాక్ కమిటీలు నియమించనున్నారు. డీసీసీ అధ్యక్షుడిని కూడా ఇదే నెల చివరిలో నియమించేందుకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ పరంగా పరిశీ లిస్తే.. బోథ్,ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, క్యాడర్ను బలోపేతం చేస్తున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆ పార్టీకి మాజీ మంత్రి జోగు రామన్న ఉండటం, జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండడంతో పాటు గతం నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్న ద్వితీయశ్రేణి గణాన్ని కోల్పోలేదు. ఈ నేపథ్యంలో ఈ మూడు నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్కే బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే పరిస్థితి ఉంది. ఇక బీజేపీ పరంగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్లో ఆ పార్టీకి ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రాతినిధ్యం వహిస్తుండడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందాలని గట్టి ప్రయత్నంలో ఉన్నారు. బోథ్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న పతంగే బ్రహ్మానంద్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీ పోరు ఆసక్తికరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే కమలం పార్టీకి సంబంధించి శుక్రవారం హైదరాబాద్లో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునిల్ బన్సాల్, రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు సమావేశం అయ్యారు. ఇందులో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించినట్లు తెలిసింది. ‘కాళేశ్వరం’పై సీబీఐ విచారణ చేపట్టాలి ఆదిలాబాద్టౌన్: కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన వి లేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం అవినీతిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజ య్ కుమార్తో పాటు బీజేపీ కేంద్ర, రాష్ట్ర నా యకత్వాలు ఒకే స్టాండ్పై ఉన్నాయని పేర్కొన్నారు. విషయాన్ని వక్రీకరించి మాజీ మంత్రి హరీశ్రావుతో పాటు ఇతర నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కాళేశ్వరంపై అవినీతి జరి గిందని సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రులు ప్రకటిస్తున్నా లోతైన విచారణ మాత్రం జరగ డం లేదన్నారు. ఇందులో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్టౌన్: జిల్లాలో అక్రమార్కులపై పోలీస్ బాస్ కొరడా ఝళిపిస్తున్నారు. ఎస్పీ అఖిల్ మహా జన్ చేపట్టిన వినూత్న కార్యక్రమాలు వారి గుండెల్లో గుబులు రేపుతోంది. నిరంతరం నిఘాతో రౌడీలు, బ్లాక్మెయిలర్లు, దళారులు, వడ్డీ వ్యాపారులు, భూకబ్జాదారులువణికిపోతున్నారు. వీడీసీలు, ఇసు కాసురుల ఆగడాలకు ఇప్పటికే చెక్ పడింది. దాబా ల్లో మద్యం విక్రయాలు నిలిచిపోయాయి. వాహనా లకు మోడిఫైడ్ సైలెన్సర్లు కనిపించకుండా పోయా యి. ఆన్లైన్ బెట్టింగ్, సోషల్ మీడియాలో రెచ్చగొ ట్టేలా పోస్టులు పెట్టేవారిపై నిఘా పెంచడంతో అవి తగ్గుముఖం పట్టాయి. రోడ్లపై ఫ్లెక్సీలు, బ్యానర్లు క నిపించకుండా పోయాయి. బెల్టుషాపులను స్వచ్ఛందంగా తొలగిస్తున్నారు. షీటీమ్ ద్వారా పోకిరీలకు అడ్డుకట్ట వేస్తున్నారు. మట్కా, గంజాయి, మాదకద్రవ్యాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో కేసులు తగ్గుముఖం పట్టాయి.పోలీసుల ప్రవర్తనపైనా ఫోక స్ పెట్టారు. విధులు విస్మరించిన పలువురిపై సస్పెన్షన్ వేటు కూడావేశారు.ఎస్పీ విధుల్లోచేరిన మూడు నెలల్లోనే నేరాల అదుపునకు చర్యలు చేపట్టారు. ఎస్పీ ప్రత్యేక చొరవ ఇలా.. ● జిల్లా కేంద్రంలోని అంబేద్కర్చౌక్, గాంధీచౌక్, శివాజీచౌక్ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ● ప్రతీ సోమవారం గ్రీవెన్స్ నిర్వహించి బాధితుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. ● భూకబ్జాదారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేశారు. ● ఇప్పటివరకు 20 మంది భూకబ్జాదారులను అరె స్టు చేశారు. డాక్యుమెంట్ రైటర్లతో పాటు సహకరించిన అధికారులపై సైతం కేసులు పెట్టారు. ● ఆపరేషన్ చబుత్రాలో భాగంగా రాత్రి 11 గంటలు దాటిందంటే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. అర్ధరాత్రి అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిని స్టేషన్కు తరలించి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే రౌడీమేళా నిర్వహించి వార్నింగ్ ఇచ్చారు. డీజే చప్పుళ్లు, మైక్ల హోరు తగ్గింది. రోడ్లపై, జంక్షన్లలో బర్త్డే కేక్ కటింగ్లు, ఫ్లెక్సీలు కనిపించకుండా పోయాయి. ● జిల్లా కేంద్రంలోని ముఖ్య కూడళ్లలో పోలీస్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. బ్యాంకుల వద్ద పోలీసుల నిఘా పెంచారు. ● అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యశిబిరా లు, వేసవిలో క్రీడా శిబిరాలను ఏర్పాటు చేశారు. ● ప్రయాణికుల భద్రతే పరమావధిగా అభయ–మై టాక్సీ ఈస్ సేఫ్ కార్యక్రమానికి తాజాగా శ్రీకారం చుట్టారు. ● ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే దృష్టికి తీసుకువచ్చేలా మెసేజ్ యువర్ ఎస్పీ కా ర్యక్రమాన్ని చేపట్టారు. నేరుగా ఎస్పీకి వాట్సాప్ నంబర్ 8712659973 ద్వారా తెలియజేసేందు కు వీలు కల్పించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకైలాస్నగర్: కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలనే డిమాండ్లతో వచ్చే నెల 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్లు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ను సోమవారం కలిసి సమ్మె నోటీసుఅందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్మిక సంఘం యూనియన్ నాయకులు కిరణ్, శంకర్ శ్రీని వాస్, గంగారాం,తదితరులు పాల్గొన్నారు .విలేజ్ పోలీస్ కార్యక్రమంలో భాగంగా నార్నూర్లో గిరిజనులతో కలిసి భోజనం చేస్తున్న ఎస్పీ (ఫైల్) మోడిఫైడ్ సైలెన్సర్లను రోడ్రోలర్తో తొక్కిస్తున్న ఎస్పీ అఖిల్ మహాజన్ (ఫైల్) 27న 5కే రన్ఆదిలాబాద్టౌన్: మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలో ఈనెల 27న 5కే రన్ నిర్వహించనున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ ప్ర కటనలో తెలిపారు. స్థానిక ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ నుంచి ఉదయం 6 గంటలకు 5కే రన్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. యువత, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఆసక్తి గలవారు https:// forms. gle/ UR2 iPE6 PYP9 AkdoA7 లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. న్యూస్రీల్ ఇద్దరు ఆర్ఐలపై సస్పెన్షన్ వేటు జాతీయ శిక్షణకు ఎన్సీడీ అధికారిఆదిలాబాద్టౌన్: భారత ఆహార భద్రత ప్రమాణా ల సంస్థ, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి త్వశాఖ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆధ్వర్యంలో కేరళలోని కొచ్చిలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో జిల్లా ఆహార భద్రత, ఎన్సీడీ అధికారి డాక్టర్ శ్రీధర్ మెట్పెల్లివార్ సోమవారం పాల్గొన్నారు. తెలంగాణ, ఉత్తర్ప్రదేశ్, కేరళ, తమిళనాడు, లక్షద్వీప్, మేఘాలయ రాష్ట్రాల నుంచి ఆహార భద్రత అధికారులు హాజరవగా.. సాంకేతిక పరిజ్ఞానం అమలు నైపుణ్యాలు, నియంత్రణ సామర్థ్యాలు అంశంపై శిక్షణ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 27 వరకు కార్యక్రమం కొనసాగనున్నట్లు తెలిపారు. ప్రజలతో మేమకం అవుతూ.. అక్రమార్కులపై కొరడా ఝళిపిస్తూ అసాంఘిక కార్యకలాపాలపై పోలీస్బాస్ ఉక్కుపాదం జిల్లాలో వినూత్న కార్యక్రమాలకు ఎస్పీ శ్రీకారం మూడు నెలల్లో నేరాల అదుపునకు చర్యలుస్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు శ్రేణులను అప్రమత్తం చేస్తున్నాయి. ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ముందు కు సాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఇప్పటికే ‘పరిషత్’ సందడి మొదలైంది. ఈ ఎన్నికలు అధికార పార్టీకి సవాలుగా మా రుతుండగా.. బీజేపీ, బీఆర్ఎస్ సైతం తమదైన శైలిలో పావులు కదుపుతున్నాయి. – సాక్షి,ఆదిలాబాద్ఎస్పీ చేపట్టిన వినూత్న కార్యక్రమాలు.. మెస్సేజ్ యువర్ ఎస్పీ ఆపరేషన్ చబుత్రా పోలీసులు మీకోసం హోమ్గార్డు సిబ్బందికి ఆరోగ్య భద్రత పిల్లలకు సమ్మర్ క్యాంప్ యాంటీ డ్రగ్ కమిటీ అభయ– మై టాక్సీ ఈస్ సేఫ్ పటిష్టంగా కమ్యూనిటీ పోలీసింగ్ జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను పూర్తి గా రూపుమాపుతున్నాం. కమ్యూనిటీ పోలీ సింగ్ విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నాం. గంజాయి, మట్కా, ఆన్లైన్ బెట్టింగ్కు అడ్డుకట్ట వేస్తున్నాం. అధిక వడ్డీ వసూలు చేస్తున్న వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నాం. బ్యాంకుల వద్ద దళారీలపై ఇటీవల కేసులు నమోదు చేశాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కేసులు నమోదుతో పాటు శిక్ష పడేలా చూస్తున్నాం. మెసేజ్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి మంచి స్పందన ఉంది. – అఖిల్ మహాజన్, ఎస్పీ -
సమస్యల నివేదన
ప్రొసీడింగ్లిచ్చారు.. ముగ్గు పోయట్లేదు అయ్యా.. మేము కూలీనాలి చేసుకునే నిరుపేదలం. సొంతింటి స్థలం ఉండడంతో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నాం. సర్వే చేసిన కార్యదర్శి మేము అర్హులమని నిర్ధారించారు. మాకు ప్రొసీడింగ్ లెటర్లు కూడా ఇచ్చారు. ముగ్గు పోయాలని కార్యదర్శిని కోరగా మాకు స్థలం లేదంటూ నిరాకరిస్తున్నారు. విచారణ జరిపించి న్యాయం చేయాలని విన్నవించుకుంటున్నాం. – రాగి లలిత, గొడ్డెల అరవినా, సాయిలింగి, తలమడుగు ఉపాధ్యాయులను నియమించాలి మా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులు లేరనే కారణంతో ఉపాధ్యాయులను నియమించలేదు. పాఠశాలను సైతం అంగన్వాడీ కేంద్రంగా మార్చారు. ప్రస్తుతం ఊరిలో బడీడు పిల్లలు 30 మంది వరకు ఉన్నారు. గ్రామంలో బడి లేకపోవడంతో మూడు కిలోమీటర్ల దూరంలో గల వడ్గాం పాఠశాలకు వెళుతున్నారు. గతేడాది ఓ విద్యార్థిని బడికి వెళ్లే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందింది. ఈ మేరకు స్పందించి తగుచర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. – డబ్బాకూచి గ్రామస్తులు, భీంపూర్ ఆ ఏజెన్సీని బ్లాక్లిస్టులో పెట్టాలి రిమ్స్లో 800 పోస్టులు దక్కించుకున్న మహాలక్ష్మి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ కార్మి కులకు రెండేళ్లుగా పీఎఫ్, జీఎస్టీ, ఈఎస్ఐ చెల్లించట్లేదు. సంబంధించిన వివరాలివ్వాలని జిల్లా ఉపాధి కల్పనా ధికారికి స.హ. చట్టం కింద దరఖాస్తు చేశాను. రెండేళ్లుగా తిరుగుతున్నా సమాచారం ఇవ్వకుండా దాట వేస్తున్నారు. సంబంధిత ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెట్టడంతో పాటు సదరు అధికారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. – నోముల రాజేందర్గౌడ్, మందమర్రి, మంచిర్యాల జిల్లా విచారణ జరిపి న్యాయం చేయండి.. సార్.. మేమంతా ఆదిలాబాద్లోని బెల్లూరి శివారు సర్వేనంబర్ 47/1/2, 47/1/3లో మదస్తు రమేశ్, మదస్తు ఆనంద్రావు, మదస్తు సత్యనారాయణల నుంచి ప్లాట్లను న్యాయబద్ధంగా కొనుగోలు చేశాం. వాటిలో ఇళ్లను నిర్మించుకుని జీవిస్తున్నాం. అయితే ఇటీవల రైల్వే అధికారులు ఆ స్థలమంతా తమదంటూ ఇటీవల మార్కింగ్ చేశారు. విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరుతున్నాం. – బాఽధితులు, ఆదిలాబాద్ ‘ప్రజావాణి’కి వినతుల వెల్లువ అర్జీలు స్వీకరించిన కలెక్టర్ కై లాస్నగర్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి అర్జీలు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వారు ఉన్నతాధికారులకు తమ సమస్యలను నివేదించారు. కలెక్టర్ రాజర్షి షా వారి నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని సంబంధిత అధికారులకు అందజేస్తూ సత్వరం పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ వారం వివిధ శాఖలకు సంబంధించి 115 అర్జీలు అందాయి. అందులో కొందరి నివేదన వారి మాటల్లోనే... -
పోలీస్ గ్రీవెన్స్కు స్పందన
● 72 అర్జీలు స్వీకరించిన ఎస్పీఆదిలాబాద్టౌన్: పోలీసు ప్రజాఫిర్యాదుల విభాగా నికి స్పందన లభిస్తుంది. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్కు జిల్లా నలుమూలల నుంచి 72 మంది త రలివచ్చి ఎస్పీకి తమ సమస్యలను విన్నవించారు. వాటిని ఓపికగా విన్న ఎస్పీ సత్వరం పరిష్కరించేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో సీసీరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి కవిత, వామన్ పాల్గొన్నారు. నైపుణ్యాభివృద్దికి డ్యూటీ మీట్ నైపుణ్యాభివృద్ధికి డ్యూటీ మీట్లు దోహద పడతా యని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీస్ హెడ్క్వార్టర్స్లో జిల్లాస్థాయి డ్యూటీ మీట్ సోమవారం ప్రారంభించి మాట్లాడారు. అధికారులు, సిబ్బంది పనితీరు మెరుగుపర్చేందుకు ఎంతగానో దోహద పడుతుందని తెలిపారు. వీటిని సద్వినియోగం చే సుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో ఉత్త మ ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రస్థాయిలో రివార్డులు అందించనున్నట్లు వివరించారు. ఇందులో డీఎస్పీలు శ్రీనివాస్, జీవన్ రెడ్డి, సీహెచ్ నాగేందర్, ఇన్స్పెక్టర్లు ప్రణయ్ కుమార్, మొగిలి, వెంకటేశ్వర్రావు, వెంకటి, చంద్రశేఖర్, మురళి పాల్గొన్నారు. -
బాలికపై వేధింపులు.. ఎనిమిది మందిపై పోక్సో కేసు
గుడిహత్నూర్: సోషల్ మీడియాలో స్నేహం పేరుతో ఓ బాలికను వేధింపులకు గురిచేసిన కేసులో ఎనిమిది మందిని శనివారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికతో మండల కేంద్రానికి చెందిన ఓ బాలుడు పరిచయం పెంచుకున్నాడు. అప్పటి నుంచి ఫోన్లో చాటింగ్ చేస్తున్నాడు. ఒకరోజు తనకు న్యూడ్ వీడియో కాల్ చేయాలని, లేదంటే చాటింగ్ అందరికీ తెలిసేలా చేస్తానని బెదిరించాడు. ఆ బాలిక ఒకరోజు న్యూడ్ కాల్చేసి మాట్లాడుతుండగా వీడియోను స్క్రీన్ రికార్డు చేసి తన ఏడుగురు స్నేహితులకు పంపించాడు. వారు వీడియోను అడ్డం పెట్టుకుని బాలికను మానసికంగా వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. ఓ యువకుడు ఏకంగా ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో బాలిక తన కుటుంబ సభ్యులకు విషయం తెలిపింది. బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో షీటీం పోలీసులు ఎనిమిది మందిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారని తెలిపారు. ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ వివరించారు. -
‘కొత్త స్కూళ్లు కాదు..ఉన్నవి బాగుచేయండి’
ఆదిలాబాద్టౌన్: రాష్ట్రంలో పబ్లిక్ స్కూళ్లు సమీకృత గురుకులాల పేరుతో కొత్త స్కూళ్లను నెలకొల్పడం కాదని, ఉన్న స్కూళ్లనే బాగు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో యూటీఎఫ్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో విద్యారంగం వివక్షకు గురైందన్నారు. గతేడాది 16 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో లక్షా 20 వేల మంది చేరితే, 11వేల ప్రైవేట్ పాఠశాలల్లో 5 లక్షల మంది చేరారన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ, కేజీ తరగతులు కూడా ఉండటం ఇందుకు కారణమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభిస్తామని ఆర్భాటంగా చెప్పి కేవలం 250 పాఠశాలల్లో మాత్రమే అనుమతించారన్నారు. కొత్త పాఠశాలలతో నష్టమే తప్పా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఉపాధ్యాయుల పదోన్నతులు వెంటనే చేపట్టాలని, హెల్త్ కార్డులు అందించాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని, మధ్యాహ్న భోజన ధరలను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కిష్టన్న, అశోక్, సంఘ బాధ్యులు సూర్యకుమార్, శ్రీనివాస్, స్వామి, ఇస్తారి, గౌస్ మొయినొద్దీన్, శివన్న, గణేశ్, శంకర్, తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
● ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ తలమడుగు: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతీ కార్యకర్త సిద్ధంగా ఉండి సైనికుల్లా పని చేయాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం తలమడుగు మండలం ఉండం గ్రామంలోని ఆయూష గార్డెన్లో వికసిత్ భారత్ కార్యక్రమం నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి వికసి త్ భారత్ నిర్మాణానికి అందరూ కట్టుబడి ఉండాల ని ప్రతిజ్ఞ చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో మృతులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలే గ్రామీణ ఎన్నికలకు బలమని, అందరూ కలిసికట్టుగా పనిచేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానందం, ఉపాధ్యక్షులు సామా సంతోష్రెడ్డి, పార్లమెంటు కోకన్వీనర్ మయూర్ చంద్ర, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి బాబారావు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రాజు, మండల కన్వీనర్ నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
కానిస్టేబుల్ను కోల్పోవడం బాధాకరం
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: పోలీసు కానిస్టేబుల్ను కోల్పోవడం బాధాకరమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. టూటౌన్ పోలీసు స్టేషన్లో కోర్టు విధులు నిర్వహిస్తున్న పద్మవార్ ప్రకాష్ ఉట్నూర్ నుంచి ఆదిలాబాద్ టూటౌన్కు కోర్టు విధులకు వస్తున్న క్రమంలో ఆదివారం బస్సులో గుండెపోటుకు గురయ్యాడు. రిమ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఉట్నూర్లోని ఆయన నివాసానికి చేరుకున్న పార్థివదేహానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. తక్షణ ఆర్థిక సహాయం కింద బాధిత కుటుంబ సభ్యులకు రూ.30 వేలు అందించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అంత్యక్రియల్లో టూటౌన్ సీఐ కరుణాకర్రావు, ఎస్సై మొగిలి, సిబ్బంది పాల్గొన్నారు. -
‘నేటి ధర్నా విజయవంతం చేయాలి’
ఇచ్చోడ: ఏఐటీయూసీ అనుబంధ, భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్ట నున్న ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చే యాలని యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి కల్లెపెల్లి గంగయ్య కోరారు. ఆదివారం ఇ చ్చోడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ న మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల స మస్యల పరిష్కారం కోసం నిర్వహించనున్న ధర్నాకు జిల్లాలోని ప్రతీ మండలం నుంచి తాపీమేసీ్త్రలు, పెయింటర్లు, ప్లంబర్లు, లేబర్ కార్మికులు అధికసంఖ్యలో హాజరుకావాలని సూచించారు. సమావేశంలో నాయకులు బోఽ దస్ రవి, బొజ్జ రాజ్కుమార్, గొలుసుల విజ య్, రాయుడు, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
ట్రిపుల్ఐటీకి 20,258 దరఖాస్తులు
● జూలై 4న సెలక్షన్ లిస్ట్ విడుదల ● 7 నుంచి ధ్రువపత్రాల పరిశీలన భైంసా: 2025–26 విద్యాసంవత్సరానికి బాసర ట్రిపుల్ఐటీలో ప్రవేశాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 20,258 దరఖాస్తులు వచ్చాయి. ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశానికి పదో తరగతిలో ఉత్తీర్ణులైనవారి నుంచి ఈ నెల 21వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. 1,500 సీట్లుండగా ఒ క్కో సీటుకు 14 మందికిపైగా పోటీపడుతున్నారు. క్రమంగా తగ్గుతున్న పోటీ ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి క్రమంగా విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య తగ్గుతోంది. 2020–21 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం 32వేల మంది, 2021–22లో 20,178, 2022–23లో 31,432, 2023–24లో 32,635, 2024–25లో 15వేలు, 2025–26 విద్యాసంవత్సరంలో 20,258 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు పరిశీలించి జూలై 4న సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తామని ట్రిపుల్ఐటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. జూలై 7నుంచి సర్టిఫికెట్లు పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. విద్యా విధానం ఇలా.. ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సులో భాగంగా తొలి రెండేళ్లు ఇంటర్ తత్సమాన పీయూసీ బోధిస్తారు. ఇందులో మెరిట్ ఆధారంగా నాలుగేళ్ల బీటెక్ కోర్సుకు వివిధ బ్రాంచ్లలో సీట్లు కేటాయిస్తారు. బీటెక్లో సివిల్, కెమికల్, కంప్యూటర్, ఎలక్టాన్రిక్స్, ఐటీ, ఈసీఈ, ఎంఎంఈ కోర్సులు బోధిస్తారు. క్యాంపస్లో వసతులు ప్రవేశాలకు ఎంపికై న విద్యార్థులకు ల్యాప్టాప్లు, యూనిఫాంలు, షూస్, స్పోర్ట్స్ డ్రెస్ ఇస్తారు. హా స్టల్, భోజన వసతి యూనివర్సిటీలోనే ఉంటుంది. ఆటలు, వ్యాయామం, సాంస్కృతిక రంగాల్లో రా ణించేందుకు తరగతులు నిర్వహిస్తారు. క్యాంపస్ లోనే ప్రత్యేక వైద్యశాల, అధునాతనమైన ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీలు అందుబాటులో ఉన్నాయి. -
దీనావస్థలో యూఆర్ఎస్లు
● అద్దె భవనాలు.. అరకొర వసతులు ● సరిపడా లేని బోధకులు, సిబ్బంది ● అధ్వానంగా అర్బన్ రెసిడెన్షియల్స్ ● ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ఆదిలాబాద్టౌన్: బడిబయటి బాలురను బడిబాట పట్టించి బంగారు భవితకు బాట వేయడానికి 2017లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం వీటిని నేతాజీ సుభాష్ చంద్రబో స్ ఆవాసీయ విద్యాలయాలుగా పిలుస్తున్నారు. వి ధి వంచితులు, అనాధలు, వలస బాల కార్మికులు, నిరుపేద కుటుంబాలకు చెందిన బాలుర కోసం వీటిని నెలకొల్పారు. బాలికలకు కేజీబీవీల మాదిరి బాలుర కోసం వీటిని ఏర్పాటు చేశారు. రెసిడెన్షి యల్ స్థాయిలో యూఆర్ఎస్లను ప్రారంభించా రు. ఈ స్కూళ్లలో కేజీబీవీ ఉపాధ్యాయులతో సమానంగా విద్యార్హతలు, జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చిన వారిని ఉపాధ్యాయులుగా నియమించారు. ‘అన్నీఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లు స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో బోధన చేయగలిగే ఉపాధ్యాయులు యూఆర్ఎస్లో ఉన్నప్పటికీ ఒక్క తరగతి కూడా అప్గ్రేడ్ చేయలేదు. వీటితో ప్రారంభమైన కేజీబీవీలు ఇంటర్ కళాశాలలుగా ఉన్నతీకరణ చెందాయి. వీటిలో కేవలం మూడోతరగతి నుంచి ఎని మిదో తరగతి వరకు మాత్రమే విద్యాబోధన సాగుతోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేయగా ఒక్కో పాఠశాలలో వంద చొప్పున విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు. ఎనిమిదేళ్ళు గడుస్తున్నా కనీసం భవన నిర్మాణానికి స్థల సేకరణ జరగకపోవడం శోచనీయం. తిండికీ తిప్పలే.. అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రతీ విద్యార్థికి కేవలం నెలకు రూ.1,049 కేటాయిస్తుండగా, ప్రతీ రోజు రూ.35 మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ మెస్ చార్జీలతో పిల్లలకు నాణ్యమైన భోజనం అందించలేకపోతున్నారు. 2022–23 విద్యాసంవత్సరం వరకు కేజీబీవీ విద్యార్థినులతో సమానంగా మెస్ చార్జీలు చెల్లించేవారు. కానీ 2023–24, 2024–25 విద్యా సంవత్సరంలో మాత్రం కేజీబీవీ విద్యార్థినులకు రూ.1,225 ఇస్తుండగా, అర్బన్ రెసిడెన్షియల్ స్కూ ల్ విద్యార్థులకు మాత్రం కేవలం రూ.1,049తోనే సరిపెడుతున్నారు. ఈ విద్యాసంవత్సరం యూఆర్ఎస్ విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచినట్లు తెలుస్తో ంది. అవి ఏమేరకు అమలులోకి వస్తాయో చూ డాలి. పాఠశాలలో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, డార్మెంటరీలు, టాయిలెట్లు, వంటగదులు, భోజనశాలలు లేవు. విద్యార్థులకు ట్రంక్పెట్టెలు, ఇవ్వడం లేదు. తాగునీటికోసం ఆర్వో ప్లాంట్లుగానీ చలికాలంలో వేడినీళ్లతో స్నానానికి హీటర్లుగానీ ఇవ్వడం లేదు. కనీసం విద్యార్థులు కూర్చోవడానికి బెంచీలు కూడా సమకూర్చడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఓవైపు డిజిటల్ బోర్డులు ఇస్తుండగా వీరికి నల్లబల్లాలు కూడా సరిగ్గా లేవు. అన్నింటా పక్షపాతమే.. రాష్ట్ర వ్యాప్తంగా 29 అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో డ్రాపౌట్ పిల్లలు, విధి వంచిత బాలురు, ఆర్ఫాన్, సెమి ఆర్ఫాన్ పిల్లలు, నిరుపేద కుటుంబాలకు చెందిన బాలురు, వలసకు వెళ్లే కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకుంటున్నారు. వీరికి విద్యాబుద్ధులు నేర్పి మెయిన్ స్ట్రీమ్ చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ పాఠశాలలు పనిచేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న ప్రభుత్వ విద్యార్థులకు తరగతికి సంబంధించిన కనీస ప్రమాణాలు కొరవడుతున్నాయని నేషనల్ అచీవ్మెంట్ సర్వే తేల్చి చెప్పింది. అనేక విద్యాసంబంధిత సర్వేలు కూడా ప్రభుత్వ విద్యార్థుల ప్రమాణాలు ఆశాజనకంగా లేవని తమ నివేదికల్లో పేర్కొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు కార్యశాలలుగా కీలకంగా మారాయి. ఏటా యూఆర్ఎస్లో చదువుకున్న అనేక మంది విద్యార్థులు గురుకులంలో సీట్లు సాధిస్తున్నారు. అన్ని విధాలుగా కేజీబీవీలతో సమానంగా ఎదగాల్సిన యూఆర్ఎస్లో కనీసం ఒక్క కంప్యూటర్ కూడా లేదు. విద్యార్థుల హాజరు నమోదుకు ఇతర ప్రభుత్వ పాఠశాలలకు ఇచ్చినట్లుగా ట్యాబులు కూడా ఇవ్వడం లేదు. పోస్టుల మంజూరేది.. పూర్తిస్థాయి వసతి గృహ సౌకర్యంతో పాఠశాలలు నడుస్తున్నప్పటికీ అత్యంత కీలకమైన ఏఎన్ఎం పోస్టులు ఈ పాఠశాలకు మంజూరు చేయడం లేదు. వసతి గృహాల్లో అపరిశుభ్ర వాతావరణంలో అనారోగ్యం బారిన పడుతున్న పిల్లల గురించి వార్తల్లో ఎక్కుతున్నా ఈ పాఠశాలలకు కనీసం ఏఎన్ఎమ్లను కూడా నియమించడం లేదు. పిల్లల మానసిక, శారీరక వికాసానికి ముఖ్యమైన పీఈటీ పోస్టును, హిందీ టీచర్ పోస్టులను గెస్ట్ పద్ధతిలో నియమించుకోవాలని ఆదేశాలున్నప్పటికీ అతితక్కువ వేతనం (నెలకు రూ.5వేలు)తో పనిచేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. భౌతిక రసాయన శాస్త్రం ఉపాధ్యాయుల పోస్టును మంజూరు చేయడం లేదు. పిల్లలకు మార్గనిర్దేశం చేయడానికి పాఠశాలకు కౌన్సిలర్ను నియమించుకునే అవకాశం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ఇబ్బందులు కలగకుండా చర్యలు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతాం. అవసరమైన సౌకర్యాలు కల్పిస్తాం. పీఈటీ, ఏఎన్ఎం పోస్టుల గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – శ్రీనివాస్రెడ్డి, డీఈవో, ఆదిలాబాద్ -
● డీపీఆర్ రూపకల్పనకు టెండర్ల ఆహ్వానం ● రూ.కోటి విలువైన పనికి ఒకే టెండర్ దాఖలు ● కాంట్రాక్టర్ల తీరుపై సందేహాలు ● నేడు ఖరారు చేయనున్న అధికారులు
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో తాగునీటి సరఫరా, పారిశుధ్యం, వరద కాల్వల సమస్య కు శాశ్వత పరిష్కారానికి సంబంధించిన సమస్యల పై బల్దియా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. గ్రేడ్–1 స్థాయికి ఎదిగిన ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఈ సమస్యను దూరం చేసేలా చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ పథకమైన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (యూఐడీఎఫ్) కింద రూ.600 కోట్ల వ్యయంతో పనులు చేపట్టాలని అంచనా వేసింది. క్షేత్రస్థాయిలో ఆయా పనులను చేపట్టేందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)ను తయారు చేసేందుకు టెండర్లు ఆహ్వానించింది. ఆసక్తి గల ఏజెన్సీల నుంచి టెండర్లను స్వీకరించింది. అయితే ఇందుకు ఒకే ఒక టెండర్ దా ఖలు కావడం పలు అనుమానాలకు తా విస్తోంది. ఈ వ్యవహారంలో కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారా.. లేక అవగాహన రాహిత్యంతో ముందుకు రాలేదా.. అనే దానిపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డీపీఆర్కు సంబంధించిన టెండర్లను సోమవారం ఖరారు చేయనున్నారు. భవిష్యత్లో సమస్యలు తలెత్తకుండా.. గ్రేడ్–1 స్థాయికి ఎదిగిన ఆదిలా బాద్ మున్సిపాలిటీ పరిధి రోజురో జుకూ విస్తరిస్తోంది. కొత్తగా పలు కాలనీలు వెలుస్తున్నాయి. దీంతో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణంలో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, తాగునీటి సరఫరా ప్రాజెక్టులను, వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా వరద కాల్వలను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంకల్పించారు. ఆ దిశగా బల్దియా యంత్రాంగాన్ని ఆదేశించారు. దీంతో ఆదిలాబాద్ పట్ట ణంలో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం, తాగునీటి రిజర్వాయర్ల నిర్మాణాలకు రూ.600 కోట్లు అవసరం అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రానికి ఎమ్మెల్యే ప్రతిపాదనలు పంపారు. డీపీఆర్ సిద్ధమైతేనే నిధులు విడుదల.. ఆదిలాబాద్ పట్టణంలో చేపట్టాల్సిన రూ.600 కోట్ల పనులకు సంబంధించిన సిద్ధం చేసిన డీపీఆర్ను జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. అక్కడి నుంచి కేంద్రానికి నివేదించనున్నారు. కేంద్రం అందుకు ఆమోదం తెలిపితే ఆ నిధులు విడుదల కానున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన డీపీఆర్ను సిద్ధం చేసేందుకు ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ జరుగుతుంది. అర్హులైన ఏజెన్సీల నుంచి దరఖాస్తులను స్వీకరించగా, ఒకే ఒక టెండర్ దాఖలైంది. దీన్ని ఈనెల 23న మధ్యాహ్నం 3 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో తెరవనున్నారు. ఒకే టెండర్ దాఖలు కావడంతో అదే ఏజెన్సీకి టెండర్ కట్టబెట్టే అవకాశం ఉంది. ఆ ఏజెన్సీ ఎవరనేది సీల్డ్ కవర్లో రావడంతో స్పష్టత లేదు. ఆ ఏజెన్సీ ఏదనేది సోమవారం తేలనుంది. సంబంధిత ఏజెన్సీ అందించే డీపీఆర్కు ఆమోదం లభిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు బల్దియా భాగస్వామ్యంతో కూడిన అండర్గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ కోసం రూ.350 కోట్లు, వరద కాల్వలకు రూ.110 కోట్లు మంజూరు కానున్నాయి. ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయండీపీఆర్ తయారీకి ఆదేశాలు..ఎమ్మెల్యే ప్రతిపాదనలు పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు అవసరమైన డీపీఆర్ను పంపించాల్సిందిగా మున్సిపల్ అధికారులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టిన బల్దియా అధికారులు ఇందుకు అర్హులైన ఆసక్తిగల ఏజెన్సీల నుంచి టెండర్లను ఆహ్వానిస్తూ ఈనెల 11న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 19 వరకు అర్హులైన ఏజెన్సీలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డీపీఆర్ తయారీకి అవసరమైన రూ.కోటి వ్యయాన్ని బల్దియా జనరల్ ఫండ్ నుంచి సంబంధిత ఏజెన్సీకి చెల్లించాలని నిర్ణయించారు. అయితే కోటి రూపాయల విలువైన డీపీఆర్ తయారీకి సంబంధించి ఒకే ఒక టెండర్ దాఖలు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. పారదర్శకంగా టెండర్లు ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో రూ.600 కో ట్లతో చేపట్టే అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, తాగునీటి రిజర్వాయర్లు, వరద కాల్వల నిర్మాణా నికి సంబంధించిన డీపీఆర్ తయారీ కోసం టెండర్లు ఆహ్వానించాం. ఇందుకు ఈనెల 19 గడువు విధించగా ఒకేఒక టెండర్ దాఖలైంది. దానిని ఈనెల 23న ఖరారు చేస్తాం. ఈ వ్యవహారంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తాం. – పేరి రాజు, బల్దియా ఇంజనీర్ -
మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలి
ఆదిలాబాద్టౌన్: మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని టూటౌన్ సీఐ కరుణాకర్రావు అన్నారు. ఆదివారం టూటౌన్ పోలీసుస్టేషన్ ఎదుట యాంటీ నా ర్కొటిక్ వారోత్సవాల సందర్భంగా సెల్ఫీ పా యింట్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవించడంతో ఆరోగ్యం దె బ్బతింటుందన్నారు. ఎక్కడైనా మత్తు పదా ర్థాలు విక్రయించినా, సేవించినా పోలీసులకు లేదా టోల్ఫ్రీ నంబర్ 1908కు సమాచారం అందించాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచాలని సూచించారు. -
ఎస్హెచ్జీలకు మరింత ధీమా
● సభ్యులు ప్రమాదవశాత్తు మృతి చెందితే బీమా ● బాధిత కుటుంబాలకు రూ.10లక్షల ఆర్థికసాయం ● ఇటీవల రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం ● జిల్లాలో 10 కుటుంబాలకు ప్రయోజనంకై లాస్నగర్: స్వయం సహాయక సంఘాల్లోని మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి ద్వారా వడ్డీలేని రుణాలు అందజేస్తూ వారికి ఆర్థికంగా అండగా నిలుస్తోంది. చిరు వ్యాపారాల ద్వారా స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహిస్తోంది. దీంతో పాటు దురదృష్టవశాత్తు ప్రమాదంలో, అనారోగ్యంతో మృతి చెందిన సభ్యుల కుటుంబాలకు రుణ బకాయిల సర్దుబాటుతో పాటు రూ.10లక్షల ఆర్థికసాయం అందించాలని నిర్ణయించింది. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. గతేడాదికి సంబంధించిన మృతులకు సైతం ఆర్థికసాయం వర్తింపజేయాలని యోచిస్తోంది. జిల్లాలో 10 మందికి లబ్ధి బ్యాంకు లింకేజీ కింద రుణం పొందిన సభ్యులు అనారోగ్య కారణాలతో మృతి చెందినట్లయితే లోన్ బీమా కింద రూ.2లక్షల వరకు వారు చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వమే సర్దుబాటు చేయనుంది. సీ్త్రనిధి, బ్యాంకు లింకేజీ రుణాలు పొందిన సభ్యులు ప్రమాదవశాత్తు మరణించినట్లయితే వారి కుటుంబాలకు రూ.10లక్షల ఆర్థికసాయం అందజేయనుంది. ఈ ఆర్థిక చేయూత పథకాన్ని గతేడాది మార్చి 14 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. జిల్లాలో పది కుటుంబాలకు ఈ సాయం అందనుంది. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో రెండు, గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. ఆర్థికసాయం, సర్దుబాటుతో పాటు సీ్త్రనిధి రుణాలను నిర్దిష్ట గడువులోపు చెల్లించినట్లయితే ఏడాదికి 0.5శాతం ప్రోత్సాహకాలను సైతం అందజేయనుంది. కాగా, ప్రభుత్వం తాజాగా అమలు చేస్తున్న బీమా పథకంతో సభ్యులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఇలా.. రూ.10లక్షల ఆర్థికసాయం కోసం సీసీల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. మృతి చెందిన సభ్యురాలి ఆధార్, పాన్కార్డు, బ్యాంక్ అకౌంట్, ఫొటోతో పాటు ఎస్హెచ్జీ, వీవోల తీర్మానాలు తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. ఈ వివరాలపై అసిస్టెంట్ మేనేజర్ విచారణ చేపట్టి ఆమోదించాల్సి ఉంటుంది. దాన్ని సీ్త్ర నిధి రీజినల్ మేనేజర్ పరిశీలించి రాష్ట్రస్థాయికి పంపిస్తారు. అక్కడ ఆమోదం లభిస్తే డీఆర్డీవో లాగిన్కు తుది ఉత్తర్వులు అందుతాయి. వాటి ఆధారంగా ఆర్థికసాయం చెల్లించనున్నారు. -
భీం విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే ఆర్థికసాయం
ఇంద్రవెల్లి: మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఎదుట ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేయనున్న కుమురంభీం విగ్రహ ఏర్పాటుకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ఆదివాసీ రాయిసెంటర్ సార్మెడీలకు లక్ష రూపాయల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయిసెంటర్ సార్మెడీలు మెస్రం వెంకట్రావ్, దుర్గు, దేవ్షావ్, ఆదివాసీ సంఘాల నాయకులు దేవ్రావ్, కొట్నాక్ బారిక్రావ్, మెస్రం ఆనంద్రావ్, కోసేరావ్, తదితరులు పాల్గొన్నారు. -
వైద్యులే లేరంటే.. బదిలీలా?
బోథ్: పేరుకే పెద్దాసుపత్రి.. ఇప్పటికే సరిపడా వైద్యులు లేరు. ఉన్న ముగ్గురిలో డిప్యూటేషన్పై ఉన్న సూపరింటెండెంట్ను ఇటీవల బదిలీ చేశారు. ఆయన స్థానంలో వచ్చిన సూపరింటెండెంట్ వెంటనే సెలవులో వెళ్లగా పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందని పరిస్థితి. బోథ్ సీహెచ్సీ సూపరింటెండెంట్గా డిప్యూటేషన్పై విధులు నిర్వహిస్తున్న రవీంద్రప్రసాద్ను ఉట్నూర్లోని ఏరియా ఆసుపత్రిలో స్పెషలిస్ట్ వైద్యుడిగా, అక్కడ స్పెషలిస్ట్ వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్న కె.రవిని బోథ్ సూపరింటెండెంట్గా వైద్యారోగ్య శాఖ అధికారులు ఇటీవల బదిలీ చేశారు. కాగా, రవీంద్రప్రసాద్ ఉట్నూర్ ఏరియా ఆసుపత్రి నుంచి బోథ్ సీహెచ్సీలో సూపరింటెండెంట్గా డిప్యుటేషన్పై విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన డిప్యూటేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలపై ఇద్దరు వైద్యులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇరువురు ఈనెల 16న విధుల్లో చేరిన రోజునే దీర్ఘకాలిక సెలవు పెట్టినట్లు సమాచారం. మరోవైపు ఈ బదిలీలు రెండు నియోజకవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుతం బోథ్ ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు వర్షాకాలం షురూ కావడంతో వ్యాధుల సీజన్ మొదలైంది. ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరగనుంది. ఈ క్రమంలో ఉన్న ఇద్దరితో వైద్యసేవలు అందించడం కష్టంగా మారే అవకాశం ఉంది. ఈ విషయమై బోథ్ సూపరింటెండెంట్గా నియమితులైన కె.రవిని ఫోన్లో సంప్రదించేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. మరోవైపు రవీంద్రప్రసాద్ను ఇదే విషయమై సంప్రదించగా తనను రాజకీయ కోణంలో బదిలీ చేశారని పేర్కొన్నారు. రాజీనామా యోచనలో రవీంద్రప్రసాద్..? రవీంద్రప్రసాద్ డిప్యూటేషన్ రద్దుపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. నియోజకవర్గానికి చెందిన ఓ పార్టీ నాయకుడు తనను బదిలీ చేయించినట్లు సన్నిహితుల వద్ద ఆయన వాపోయినట్లు తెలుస్తోంది. బోథ్, ఉట్నూర్ ఆసుపత్రి వైద్యుల స్థానచలనంపై అసంతృప్తి విధుల్లో చేరిన రోజే ఇద్దరూ సెలవు పెట్టిన వైనం ఆలస్యంగా వెలుగులోకి.. బోథ్ సీహెచ్సీలో ప్రస్తుతం విధుల్లో ఇద్దరే డాక్టర్లు..! -
● జిల్లాలో కానరాని భారీ వర్షాలు ● అంచనాకు చేరువైన పత్తి, కంది, సోయా సాగు విస్తీర్ణం ● పలుచోట్ల మొలకలు రాక రైతుల్లో హైరానా ● ఆకాశం వైపు అన్నదాత చూపు
సాక్షి, ఆదిలాబాద్: ఈ వానాకాలంలో ముందుస్తుగా ఊరించి ప్రస్తుతం వర్షాలు ఉసురుమనిపిస్తున్నాయి. మృగశిరకార్తె ప్రవేశం తర్వాత తొలకరితో రైతులు జోరుగా సాగు పనులు ప్రారంభించారు. జిల్లాలో అన్ని రకాల పంటలు కలిపి 5లక్షల 85వేల 350 ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇప్పటి వరకు 4లక్షల 42వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. పెద్ద మొత్తంలో పత్తి, ఆ తర్వాత కంది, సోయా సాగు చేస్తున్నారు. పత్తి సాగు విస్తీర్ణం ఇప్పటికే వ్యవసాయశాఖ అంచనాకు చేరువైంది. కంది, సోయా కూడా రైతులు వేశారు. అయితే వానాకాలం మొదలైన జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు అంటే ఈ నెల 21వరకు కేవలం ఏడు రోజులు మాత్రమే వర్షాలు కురిశాయి. అందులో ఈ నెల 10న 3.2 సెం.మీ, 11న 1.4 సెం.మీ. మేర మాత్రమే చెప్పుకోదగినదిగా నమోదైంది. మిగతా రోజుల్లో తేలికపాటిగా కురిశాయి. దీంతో విత్తనాలు విత్తిన రైతులు ప్రస్తుతం హైరానా చెందుతున్నారు. కొన్ని మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉండటంతో మొలకెత్తనేలేదు. మరికొన్ని చోట్ల సాధారణ వర్షాలు పడటంతో మొలకెత్తినప్పటికీ ప్రస్తుతం ఎదుగుదలకు అవసరమైన నీరందని పరిస్థితి ఉంది. దీంతో రైతు ఆకాశం వైపు చూస్తున్నాడు. మండలాల్లో పరిస్థితి జిల్లాలో 21 మండలాలు ఉండగా కేవలం తొమ్మిది మండలాల్లోనే సాధారణ వర్షం కురిసింది. 12 మండలాల్లో లోటు నమోదైంది. గాదిగూడ, నేరడిగొండ, సిరికొండ మండలాల్లో 50శాతం లోటుగా ఉంది. బోథ్, సాత్నాల, తలమడుగులో 40శాతం, బేల, ఇంద్రవెల్లి, తాంసి, బజార్హత్నూర్, ఉట్నూర్, సొనాలలో 30శాతం లోటు వర్షపాతం కనిపిస్తుంది. మొత్తంగా జిల్లా అంతటా లోటు వర్షపాతం రైతును ఆందోళనకు గురి చేస్తుంది. విత్తన దశలోనే పంట నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి. లోటు వర్షపాతమున్న మండలాల్లో రైతులు మళ్లీ వర్షాలుపడితే విత్తనాలు కొని నాటుతామని చెబుతున్నారు. పక్కపక్క మండలాల్లోనే పరిస్థితులు వేరు.. నార్నూర్, గాదిగూడ మండలాలు పక్కపక్కనే ఉంటాయి. నార్నూర్లో ఇప్పటి వరకు అధిక వర్షపాతం నమోదు కాగా, గాదిగూడలో లోటు కనిపిస్తుంది. జైనథ్, బేల మండలాలు పక్కపక్కనే ఉంటాయి. జైనథ్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, బేలలో లోటు వర్షపాతం ఉంది. సిరికొండ, ఇచ్చోడ మండలాలు పక్కపక్కనే ఉంటాయి. సిరికొండలో లోటు వర్షపాతం ఉండగా, ఇచ్చోడలో సాధారణ వర్షపాతం నమోదైంది. చించోలి గ్రామంలో రైతు శ్రీనివాస్ చేనులో మొలకెత్తని సోయా విత్తనాలుసిర్సన్న గ్రామంలో రైతు రామన్న చేనులో మొలకెత్తని పత్తి గింజజిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు (జూన్ 1నుంచి 21వరకు ) సాధారణం: 128.6 మి.మీ కురిసింది: 81.1 మి.మీ లోటు : 37శాతం జిల్లాలో సాగైన పంటల వివరాలు.. (ఎకరాల్లో) పంట అంచనా సాగైంది పత్తి 4,30,000 3,80,000 సోయా 50,000 21,000 కంది 60,000 29,000 మొక్కజొన్న 25,000 12,000పత్తి విత్తనాల విక్రయాలు .. అందుబాటులో ఉన్న ప్యాకెట్లు : 20,66,036 ఇప్పటి వరకు విక్రయించనవి : 10,48,061మోస్తరు వానలు ఉన్నాయి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అయితే జిల్లా అంతటా కాకుండా చెదురుమదురుగా నమోదయ్యే పరిస్థితి ఉంది. నీటి వసతి ఉన్న రైతులు విత్తనం మొలకెత్తెందుకు, మొలకెత్తిన వాటి ఎదుగుదలకు నీళ్లు అందించాలి. – మోహన్దాస్, వ్యవసాయ శాస్త్రవేత్త -
యోగాను విశ్వవ్యాప్తం చేసిన ఘనత మోదీదే
● యోగాసానాలు వేసిన ఎంపీ, ఎమ్మెల్యే ● జిల్లా కేంద్రంలో ఘనంగా యోగా దినోత్సవం ఆదిలాబాద్టౌన్/కై లాస్నగర్: యోగాను ప్రపంచా నికి పరిచయం చేసిన ఘనత ప్రధాని నరేంద్రమోదీదేనని ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్లో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అధికారులు, ఉద్యోగులు, ప్రజలతో కలిసి యోగాసానాలు ఆచరించారు. అనంతరం మాట్లాడారు. యోగాను విశ్వవ్యాప్తం చేసిన ఘనత ప్రధానమంత్రి మోదీకే దక్కుతుందన్నారు. ప్రతిరోజు గంట పాటు యోగాసనా లు చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్, డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ చంద్రశేఖర్, డీవైఎస్వో శ్రీనివాస్, డీఈవో శ్రీనివాసరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్ పాల్గొన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో... యోగాతో ఆరోగ్యంగా జీవించవచ్చని జిల్లా జడ్జి కె.ప్రభాకరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో యోగా గురువు సంధ్య యోగాసానాలను వివరించారు. ఇందులో జిల్లా మొదటి అదనపు జడ్జి డాక్టర్ పి.శివరాంప్రసాద్, ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి కుమార్ వివేక్, ఫ్యామిలీ కోర్టు జడ్జి కుమారి లక్ష్మి, డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జిల్లా జైలులో ... జైలు పర్యవేక్షణాధికారి అశోక్, ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో యోగా శిక్షకులు ఖైదీలకు యోగాసానాలను నేర్పించారు. అనంతరం యోగా శిక్షకులు కె. సంతోష్ను జైలు సూపరింటెండెంట్ సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో జైలర్ సూర్య ప్రకాష్ , డిప్యూటీ జైలర్ రాథోడ్ ప్రకాశ్ సిబ్బంది పాల్గొన్నారు. ● ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ నగేశ్తో కలిసి ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ శ్రేణులతో యోగాసానాలు వేశా రు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు బ్రహ్మానంద్, మున్నా, జోగు రవి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ● లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ పార్కులో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని యోగా చేశారు. యోగాతో మానసిక, శారీరక ప్రశాంతత ఆదిలాబాద్టౌన్: యోగా ద్వారా మానసిక, శారీరక ప్రశాంతత లభిస్తుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు హెడ్ క్వార్టర్స్లో నిర్వహించిన కార్యక్రమంలో సిబ్బందితో కలిసి ఎస్పీ యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ.. యువత చెడు మార్గాల వైపు పయనించకుండా యోగా, క్రీడల్లో రాణించాలని సూచించారు. జి ల్లాలో శనివారం నుంచి మాదకద్రవ్యాల నిరోధక వారోత్సవాలు ప్రారంభమైనట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, జీవన్రెడ్డి, సీహెచ్.నాగేందర్, ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ సిబ్బంది, యోగా గురువులు రమేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
‘బీఏఎస్’ ఎంపిక ప్రక్రియ పూర్తి
ఉట్నూర్రూరల్: ఈ విద్యాసంవత్సరానికి గా ను జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల(బీవైఎస్)లో ప్రవేశాలకు సంబంధించి గిరిజన విద్యార్థుల ఎంపిక కోసం శనివారం లక్కీ డ్రా నిర్వహించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో పీవో ఖుష్బూ గుప్తా ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మూడో తరగతిలో 24 సీట్లకు గాను 244 దరఖాస్తులు, ఐదో తరగతిలో 12 సీట్లకు గాను 270, అలాగే 8వ తరగతిలో 12 సీట్లకు గాను 88 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. డ్రా ద్వారా ఎంపిక చేసిన విద్యార్థుల వివరాలను పీవో ప్రకటించారు. ఇందులో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ, ఏపీవో పీవీటీజీ మెస్రం మనోహర్, ఏటీడీవో క్రాంతి, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, జీసీడీవో చాయ, ఏవో వేణుమాధవ్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. -
మొలకలు బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటున్నారు..
కొన్నేళ్లుగా నేను ఇక్కడ మొలకెత్తిన గింజలు అమ్ముతున్నాను. గింజల మిశ్రమాన్ని చట్నీతో అందిస్తున్నా. ఉదయం వాకింగ్కు వచ్చే వారు బ్రేక్ఫాస్ట్లాగా తీసుకుంటున్నారు. రెగ్యులర్ గిరాకీ బాగుంది. రోజూ 10 కిలోల వరకు అమ్ముతున్నా. – అర్చన, ఖుర్షీద్నగర్ రోజూ 200 రొట్టెలు అమ్ముతున్న.. స్టేడియం పక్కన గుడిసె వేసుకుని ఏడాది నుంచి జొన్న రొట్టెలు తయారు చేసి అమ్ముతున్నా. కట్టెల పొయ్యిపై కాల్చుతూ వేడి వేడిగా అందిస్తుండడంతో తినేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. నాతో పాటు ఇద్దరు మహిళలకు సైతం ఉపాధి లభిస్తుంది. రూ.10 చొప్పున రోజుకు 200 వరకు రొట్టెలు అమ్ముతున్న. – దుర్గం సబిత, శాంతినగర్ జీవనశైలిలో మార్పుతోనే .. ప్రజల జీవనశైలిలో మా ర్పులే ఆరోగ్యంపై ప్రతి కూల ప్రభావం చూపుతున్నాయి. క్రమం తప్పకుండా వ్యాయా మం చేయాలి. కనీసం 5వేల అడుగులు నడవాలి. అయితే చాలా మంది ఇవి పాటించడం లేదు. దీంతో యుక్తవయసులోనే బీపీ, షుగర్, తదితర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. నిద్రలేమితో పాటు జంక్ఫుడ్తో అనారో గ్యం కొనితెచ్చుకుంటున్నారు. నిత్యం వ్యా యామంతో పాటు మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యంగా ఉండవచ్చు. – డాక్టర్ విఠల్, రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ -
గిరాకీ బాగుంది
మాది నిర్మల్ జిల్లాలోని కడెం. ఆరు నెలల క్రితం ఇక్కడికి వచ్చాం. రెవెన్యూ గెస్ట్హౌస్ పక్కన ఈ జ్యూస్ సెంటర్ ఏర్పాటు చేశాను. ఉదయం వాకింగ్కు వెళ్లేవారితో పాటు చాలా మంది జ్యూస్ తాగుతున్నారు. ముఖ్యంగా బీపీ, షుగర్, కొలస్ట్రాల్ ఉన్నవారు ఎక్కువగా తీసుకుంటున్నారు. గోధుమ గడ్డి, గుమ్మడి, సోరకాయ, బీట్రూట్, క్యారెట్, ఆపిల్, కాకర జ్యూస్లు లభిస్తాయి. ఉదయం 5.30 నుంచి 10.30 గంటల వరకు గిరాకీ ఉంటుంది. – రవికిరణ్, జ్యూస్ల తయారీదారుడు ఉల్లాసంగా ఉంటుంది.. నేను మూడు నెలల నుంచి క్రమం తప్పకుండా ఈ జ్యూస్లే తాగుతున్నా. ఉదయం షటిల్ ఆడిన తర్వాత స్నేహితులందరితో కలిసి ఇక్కడికి చేరుకుంటాం. కాసేపు సేదతీరి జ్యూస్ తాగుతాం. రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. ఆరోగ్యం కోసం ఆహార నియమాలు కూడా పాటిస్తున్నాను. – లోక ప్రవీణ్రెడ్డి, ఆదిలాబాద్ -
సమయపాలన పాటించాలి
తలమడుగు: ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని డీఈవో శ్రీనివాస్రెడ్డి అన్నారు. మండలంలోని సుంకిడి, రుయ్యా డి, తలమడుగులోని ప్రాథమిక, జెడ్పీ పాఠశాలలను శనివారం తనిఖీ చేశారు. హాజరు పట్టికలతో పాటు ఆయా తరగతి గదులు, కి చెన్, స్టోర్ రూమ్లను పరిశీలించారు. విద్యార్థుల హాజరుశాతం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ, కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగా లని సూచించారు. కార్యక్రమంలో ప్రధానో పాధ్యాయులు వెంకట్రమణ, సుకుమార్, వి నోద్రెడ్డి, మురళి, సుజాత తదితరులున్నారు. ఇక్కడ కనిపిస్తున్న రైతు సూర్యవంశీ రాజేందర్. సిరికొండ మండల కేంద్రంలో అయిదెకరాల్లో పత్తి సాగు చేపట్టాడు. ఈ వానాకాలంలో ఆరు బ్యాగుల విత్తనాలు వేశాడు. తొమ్మిది రోజులు దాటినా వర్షాలు లేక ఇంకా మొలకలు రాలేదు. వాన పడితే మళ్లీ గింజలు కొని వేయాల్సి ఉంటుందని రైతు వాపోతున్నాడు. -
చదువుతోనే సమాజంలో గుర్తింపు
ఆదిలాబాద్రూరల్: చదువుతోనే సమాజంలో గుర్తింపు ఉంటుందని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్క ర్ భవన్లో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా బెస్ట్ అవైలబుల్ స్కీంలో 1, 5వ తరగతుల్లో ప్రవేశాల కోసం శుక్రవారం లక్కీడ్రా ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆమె హాజరై మాట్లాడారు. 1వ తరగతిలో 45 మంది, 5వ తరగతిలో 47 మంది విద్యార్థులను ఎంపిక చే సినట్లు తెలిపారు. జిల్లాలో ఎంపిక చేసిన ఏడు ప్రైవేట్ పాఠశాలల్లో వీరికి ప్రవేశం కల్పించి పదో తరగతి వరకు ఉచితంగా విద్య అందించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకొని ఉన్నతస్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. ఇందులో డీఎస్సీడీవో సునీత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, డీసీవో లలిత, నారాయణ రెడ్డి, నర్సింగ్, పూర్ణచందర్, ఎస్సీ కుల సంఘాల నాయకులు కొప్పుల రమేశ్, నక్క రాందాస్, మల్యాల మనోజ్ తది తరులు పాల్గొన్నారు. -
ఉన్నతస్థాయికి ఎదగాలి
ఆదిలాబాద్టౌన్: పోలీసుల పిల్లలు బాగా చది వి అత్యున్నత స్థాయికి ఎదగాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు ముఖ్య కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు క నక పూనరాం కూతురు వైష్ణవికి ఐఐటీ ముంబైలో సీటు లభించింది. ఈమేరకు జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఆమెను శుక్రవా రం శాలువాతో సత్కరించారు. ఇందులో అదనపు ఎస్పీ సురేందర్ రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకటి, చంద్రశేఖర్, పోలీసు సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం బాధిత కుటుంబానికి అండగా ఉంటూ సహా య సహకారాలు అందిస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఈ ఏడాది మార్చిలో అనారోగ్యంతో మృతిచెందిన హెడ్కానిస్టేబుల్ ఆర్.దిగంబర్ కుటుంబానికి శుక్రవారం రూ.8లక్షల భద్రత చెక్కును అందజేశారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి ఇంద్రవెల్లి: విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. స్థానిక పోలీస్స్టేషన్ను శుక్రవారం సాయంత్రం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. సిబ్బందిని పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జ్షీటు దాఖలు చేయాలని సూచించారు. ఆయన వెంట ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్, సీఐ మొగిలి, ఎస్సై సాయన్న, సిబ్బంది ఉన్నారు. -
‘పీఎం జన్మన్’ సద్వినియోగం చేసుకోవాలి
ఉట్నూర్రూరల్: పీఎం జన్మన్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభారి అధికా రి, డిప్యూటి సెక్రెటరీ గణేశ్ నిరంజన్ అన్నారు. ఉట్నూర్ ఐటీడీఏలో దర్థి అబ జనభాగిదారి అభియాన్ అవగాహన శిబిరానికి శుక్రవారం ఆయన హాజరయ్యారు. ముందుగా ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఆయనకు మొక్క అందించి స్వాగతం పలికా రు. అనంతరం మండలంలోని దంతన్పల్లి, కొలాంగూడ కమ్యూనిటి హాళ్లలో దాల్మిల్ శిక్షణ పొందుతున్న వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. జ న్మన్ పథకం ప్రజలకు చేరువయ్యేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. వైద్యాధికారులు ఏర్పాటు చేసిన సికిల్సెల్ శిబిరాన్ని పరిశీలించారు. ఎంత మంది బాధితులు ఉన్నారని డీఎంహెచ్వో నరేందర్రాథోడ్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో సబ్కలెక్టర్ యువరాజ్ మార్మట్, డీటీడబ్ల్యూవో తిరుపతి, మాజీ సర్పంచ్ తిరుపతి, ఎఫ్డీవో రేవంత్, జిల్లా సార్మేడీ దుర్గు పటేల్ తదితరులు పాల్గొన్నారు. సమాక గ్రామంలో.. ఇంద్రవెల్లి: మండలంలోని సమాక గ్రామ పంచా యతీ పరిధిలోని మారుతిగూడ పీవీటీజీ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న మల్టీపర్పస్ సెంటర్ భవనాన్ని గణేశ్ నిరంజన్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. కొలాం గిరిజనులతో మాట్లాడారు. వారి స్థితిగతులు, జీవన విధానం తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. -
‘ఉపాధి’ పనుల్లో నాణ్యత పాటించాలి
ఇంద్రవెల్లి: ఉపాధి హామీ పథకంలో రైతులకు అవసరమైన పనులు చేపట్టాలని, అలాగే పనుల్లో నాణ్యత పాటించాలని మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అధికారి కిరణ్చరణ్ పదే అన్నారు. మండలకేంద్రంలోని ఎస్టీ కాలనీ, ప్రబుద్ధనగర్, మిలింద్నగర్లో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను కేంద్ర బృందం సభ్యులు శుక్రవారం పరిశీలించారు. అలాగే ఇంద్రవెల్లి పరిధిలోని వ్యవసాయ భూములను సందర్శించి చేపట్టిన ఉపాధి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయ భూముల్లో చేపట్టే పనులు రైతులకు మేలు చేకూరేలా ఉండాలన్నారు. ఇందులో కేంద్ర బృంద సభ్యులు రఘుకుమార్, మురళీధర్, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, ఏపీవో జాదవ్ శ్రీనివాస్, ఏఈ ప్రభుకిరణ్, టెక్నికల్ అసిస్టెంట్లు సంతోష్ జైస్వాల్, మహేందర్, ధమ్మనంద్, విఠల్, ప్రకాశ్ తదితరులున్నారు. రైతుల ఖాతాల్లో రూ.212.74 కోట్లు జమకైలాస్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద వ్యవసాయ ఆధారిత రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం నిధులు జమ అవుతున్నాయని కలెక్టర్ రాజర్షి షా ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది వానాకాలం సీజన్కు సంబంధించి జిల్లాలోని 1,68,238 రైతులకు గాను ప్రభుత్వం రూ.342.3 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. భూ విస్తీర్ణం ఆధారంగా శుక్రవారం వరకు 1,33,808 మంది రైతుల ఖాతాల్లో రూ.212.74 కోట్లను జమ చేసినట్లుగా వివరించారు. -
● మండల, గ్రామీణ డిగ్రీ కళాశాలల్లో చేరేందుకే విద్యార్థుల ఆసక్తి ● పాస్ గ్యారంటీ అని నమ్మిస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు ● ప్రభుత్వ కళాశాలల్లో పడిపోయిన ప్రవేశాలు ● జిల్లా కేంద్రంలోని కాలేజీల్లో పరిస్థితి మరింత దారుణం
ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెగ్యులర్ ప్రిన్సిపాల్తో పాటు 10 మంది లెక్చరర్లు ఉన్నారు. వీరంతా కళాశాలలు ప్రారంభం కాకముందే మండలంలోని చుట్టుపక్కల గ్రా మాల్లో ప్రచారం చేపట్టారు. తమ కళాశాలలో వసతులు, విద్యాబోధన తీరుపై అవగాహన కల్పించారు. ఈ కళాశాలలో మొత్తం 540 సీట్లు అందుబాటులో ఉండగా ఈ విద్యాసంవత్సరం ఇప్పటి వరకు కేవలం 30 మంది మాత్రమే ప్రవేశాలు పొందడం గమనార్హం.ప్రైవేట్ ప్రలోభాలకు తలొగ్గొద్దుప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాణ్యమైన వి ద్యాబోధనతో పాటు అన్ని మౌలిక వసతులు ఉన్నాయి. అర్హత గల లెక్చరర్లతో వి ద్యాబోధన ఉంటుంది. కొన్ని ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులను ప్రలోభాలకు గురిచేసి అడ్మిషన్లు చేయించుకుంటున్నారు. ఆయా కళాశాలల్లో తరగతులు పూర్తిస్థాయిలో జరగడం లేదు. ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు ఈ ఏడాది తక్కువగా నమోదయ్యాయి. – ఎ.శ్రీనివాస్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇచ్చోడ ఆదిలాబాద్టౌన్: విద్యార్థుల ట్రెండ్ మారింది. సబ్జెక్టుపై పట్టు సాధించడం కాకుండా సులువుగా డిగ్రీ పట్టా పొందాలని ఆరాటపడుతున్నారు. గతంలో డిగ్రీ చదవాలంటే పల్లెల నుంచి పట్నానికి రావాల్సి వచ్చేది. సీటు దొరకడం కూడా గగనంగానే ఉండే ది. విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పట్టి మరీ పరీక్షల్లో సత్తా చాటేవారు. ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీతత్వం పెరుగుతుండగా, దాన్ని అందిపుచ్చుకోవాల్సి న విద్యార్థులు అడ్డదారిలో డిగ్రీ సర్టిఫికెట్ పొందేందుకు యత్నిస్తున్నారు. వారి అమాయకత్వాన్ని ప లు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఆసరాగా చేసుకుని సొ మ్ము చేసుకుంటున్నాయి. కళాశాలకు రాకపోయినా, పరీక్ష ఫీజు చెల్లించకపోయినా, ప్రాక్టికల్ పరీక్షలు చూసి రాయిస్తామని వారిని ఆకర్షిస్తున్నాయి. సెల్ఫ్ సెంటర్తో పాస్ గ్యారెంటీ అనే అభయం ఇస్తుండడంతో పేద విద్యార్థులతో పాటు జిల్లా కేంద్రంలోని విద్యార్థులు సైతం ఆయా మండలాలు, గ్రామాల్లోని కళాశాలల్లో చేరి పోతున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైనప్పటికీ విషయ పరిజ్ఞానం లేకపోవడంతో పోటీ పరీక్షల్లో వెనుకడుగు వేయాల్సి వస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలతో పాటు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ కళాశాలలు సైతం విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఎత్తివేసే ఆలోచనల్లో పడ్డాయి. పాస్ గ్యారంటీ హామీ.. జిల్లాలో 25 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీ టితో పాటు ఆదిలాబాద్లో సైన్స్, ఆర్ట్స్ అండ్ కామ ర్స్ డిగ్రీ కళాశాలలు, ఇచ్చోడ, ఉట్నూర్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అలాగే జిల్లా కేంద్రంలో మూడు రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు కొనసాగుతున్నాయి. ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులు ఇంటర్ పాసైన వెంటనే వారి ఇళ్లకు వెళ్లి సర్టిఫికెట్లను తీసుకుంటున్నారు. వారే ఆన్లైన్ ద్వారా అప్లై చేసి తమ కళాశాలల్లో చేర్పించుకుంటున్నారు. వి ద్యార్థుల ఫోన్ నంబర్లకు బదులు కళాశాల యాజ మాన్యం ఓటీపీలు ఇచ్చుకోవడంతో విద్యార్థులు ఏమి చేయలేని పరిస్థితి. అయితే ఇదివరకు ఉ ట్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ, బేల, తాంసి, తలమడు గు, బోథ్ తదితర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రాని కి వచ్చి విద్యార్థులు ఇంటర్, డిగ్రీ చదివేవారు. ప్ర స్తుతం సీన్ రివర్స్ అయింది. జిల్లా కేంద్రంలోని కళాశాలలు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. తమ కళాశాలలో చేరితే పాస్ గ్యారంటీ.. కాలేజ్కు రానవసరం లేదు.. సెల్ఫ్ సెంటర్ అంటూ ప్రలో భాలకు గురిచేస్తున్నారు. ఒక్కో విద్యార్థికి మూడేళ్లు చదివితే కళాశాల యాజమాన్యానికి ఫీజు రీయింబర్స్మెంట్ రూ.45వేల నుంచి రూ.50వేల వరకు వస్తున్నాయి. చాలా ప్రైవేట్ కళాశాలల్లో తరగతులు నిర్వహించడం లేదు. ఒకరిద్దరు లెక్చరర్లతోనే నెట్టుకొస్తున్నారు. వారికి సైతం జీతాలు ఇచ్చే అవసరం లేకపోవడంతో విద్యార్థుల ఫీజురీయింబర్స్మెంట్తో లబ్ధి పొందుతున్నారు. మాస్ కాపీయింగ్పైనే.. చాలా మంది ప్రైవేట్ కళాశాలల్లో చదివే విద్యార్థులు మాస్ కాపీయింగ్పైనే ఆధారపడి ఉంటున్నారు. ఎలాగైనా పాస్ అవ్వాలనే ఆలోచనలో ఉండడంతో జిల్లాలోని ఆయా మండలాల్లోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, బజార్హత్నూర్, నేరడిగొండ, ఉండం, బేల కళాశాలలతో పాటు పలు కళాశాలల్లో చేరుతున్నట్లు సమాచారం. పరీక్షల సమయంలో ఆయా యాజమాన్యాలకు ఒక్కో పరీక్షకు రూ.200 నుంచి రూ.500 వరకు ఇస్తూ హాజరవుతున్నట్లు సమాచారం. -
డీలర్ల మాయాజాలం!
● హోల్సెల్ వ్యాపారుల్లో పలువురు రిటైల్ కూడా.. ● బిల్లుల ఎంట్రీలో జిమ్మిక్కులు ● నిఘా పెంచకపోతే యూరియా పక్కదారికి ఆస్కారం ● భీంపూర్ ఘటనే నిదర్శనంజిల్లాలో ఎరువుల డీలర్ల వివరాలు.. హోల్సెల్ డీలర్లు 24 రిటైల్ లైసెన్స్ కలిగి ఉన్న హోల్సెల్ డీలర్లు 21 రిటైల్ డీలర్లు 306సాక్షి,ఆదిలాబాద్: భీంపూర్ మండలం అందర్బంద్లో మంగళవారం యూరియా లోడ్తో వెళ్తున్న లారీని టాస్క్ఫోర్స్ బృందం పట్టుకున్న విషయం తెలిసిందే. దీనిపై విచారణ కొనసాగుతోంది. రైతుమిత్ర అనే హోల్సెల్ ట్రేడర్స్ నుంచి ఈ సరుకు లోడైనట్లు గుర్తించారు. భీంపూర్ వ్యవసాయ అధికారి విచారణ చేపట్టారు. 18 మంది రైతులకు సరఫరా చేసేందుకే ఇది వెళ్తున్నట్లు నిర్ధారించారు. అయితే ట్రేడర్ మొదట మ్యానువల్గా బిల్లులు రూపొందించారు. సరుకును రవాణా చేసిన తర్వాత ఈపాస్లో నమోదు చేశారు. రైతుల ఆధార్ నంబర్, వేలిముద్రల పరిశీలన అనంతరం లోడ్ పక్కదారి పట్టలేదని స్పష్టం చేస్తున్నారు. కొసమెరుపు ఏమిటంటే.. రైతుమిత్ర ట్రేడర్స్కు ఇటు హోల్సెల్తో పాటు రిటైల్లోనూ లైసెన్స్ ఉంది. జిల్లాలో ఇలా హోల్సెల్తో పాటు రిటైల్లో లైసెన్స్ కలిగిన వారు అనేకం ఉన్నారు. ట్రేడర్స్ లైసెన్స్ సస్పెన్షన్.. భీంపూర్ మండలంలో లారీ లోడ్తో పట్టుబడ్డ యూరియా విషయంలో ట్రేడర్ రైతుల పేరుపైనే దీన్ని సరఫరా చేసినప్పటికీ మొదట మ్యానువల్గా నమోదు చేయడం, ఆ తర్వాత ఆన్లైన్ ఎంట్రీ చేయడం వంటిది తప్పుగానే వ్యవసాయ శాఖ పేర్కొంటుంది. అయితే దీన్ని సరిదిద్దుకునే తప్పుగా ఆ శాఖ పేర్కొంటుంది. సాధారణంగా రెండు రకాల పొరపాట్లు ఉంటాయని.. అందులో సరిదిద్దుకునే తప్పు ఒకటిగా.. సరిదిద్దుకోలేని తప్పు మరొకటిగా శాఖాపరంగా పేర్కొంటామని వివరిస్తున్నారు. లైసెన్స్ లేకుండా ఎరువులు విక్రయించడం సరిదిద్దుకోలేని తప్పుగా పేర్కొంటామని అంటున్నారు. అయినప్పటికీ రైతుమిత్ర ట్రేడర్స్ లైసెన్స్ను సస్పెన్షన్ చేశారు. తద్వారా ఇతర ట్రేడర్స్ కూడా యంత్రాంగం నుంచి హెచ్చరిక జారీ చేశారు. హోల్సెల్, రిటైల్ వారే.. జిల్లాలో హోల్సెల్ ట్రేడర్స్ కలిగిఉన్న వారిలో పలువురికి రిటైల్ షాపులు కూడా ఉండటం గమనార్హం. ఇలాంటి దగ్గరే అధికంగా అక్రమాలకు ఆస్కారం ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలా లైసెన్స్ ఉన్నవారు సాధారణంగానైతే హోల్సెల్ నుంచి రిటైల్కు సరుకు వచ్చిన తర్వాతే రైతుల పేరిట ఈపాస్ ద్వారా విక్రయాలు జరపాలి. అయితే హోల్సెల్ గోదాం నుంచి నేరుగా సరుకును పక్కదారి పట్టించి అక్రమంగా విక్రయించేందుకు అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ అధికారులు నిరంతరం దృష్టి సారిస్తేనే అక్రమాలు అరికట్టేందుకు ఆస్కారం ఉంటుంది. లేనిపక్షంలో వ్యాపారులు ఆడిందే ఆట అన్నట్టుగా వ్యవహారం సాగేందుకు అవకాశం ఉంటుంది. ఈపాస్లో ఎంట్రీ చేయాలి..ఎరువుల విక్రయాలకు సంబంధించి ఈపాస్ మిషన్లో ఎంట్రీ చేసిన తర్వాతే విక్రయాలు చేయాలి. రైతుమిత్ర ట్రేడర్స్కు సంబంధించి లైసెన్స్ను సస్పెన్షన్ చేశాం. ఇతర ట్రేడర్లు కూడా నిబంధనల ప్రకారం వ్యవహరించాలి. లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవు. – శ్రీధర్స్వామి, జిల్లా వ్యవసాయ అధికారి -
ఆస్తుల లెక్క.. ఇక పక్కా
● ప్రారంభమైన ‘భువన్’ సర్వే ● బల్దియాలో పకడ్బందీగా కొనసాగుతున్న ప్రక్రియకై లాస్నగర్: పట్టణంలోని ఆస్తుల (అసెస్మెంట్) లెక్క ఇక పక్కాగా తేలనుంది. భువన్ యాప్ ద్వారా బల్దియా అధికారులు ప్రత్యేక సర్వేకు శ్రీకారం చుట్టారు. ఈనెల 17నుంచి క్షేత్రస్థాయి కి వెళ్లి వాస్తవ విస్తీర్ణం ఆధారంగా వివరాలను యాప్లో నమోదు చేస్తున్నారు. నివాస గృహాలతో పాటు వాణిజ్యపరమైన భవనాలను సైతం పరిశీలిస్తున్నారు. వాటి ఆధారంగానే ఇక పన్ను మదింపు ఉంటుంది. పక్కాగా పన్ను మదింపు.. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో 48,448 అసెస్ మెంట్లు ఉండగా వాటికి గాను ఏడాదికి రూ. 13.96 కోట్ల ఆస్తి పన్ను డిమాండ్ ఉంది. ఇందులో ఏటా సుమారు రూ.8 కోట్ల వరకు వసూలవుతున్నాయి. అయితే పన్ను విధింపులో అనేక అక్రమాలు జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలు ప్రాంతాల్లో బల్దియా సి బ్బంది యజమానులతో కుమ్మకై ్క చేతివాటం ప్రదర్శిస్తూ ఆస్తి విలువను తక్కువగా నమోదు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొంతమంది వాణిజ్యపరమైన ఆస్తులను సైతం నివాసగృహంగా చూపించి తక్కువగా పన్ను చెల్లిస్తున్నా రు. ఇలాంటి వాటికి చెక్ పట్టేలానే ఉద్దేశంతోనే ప్రభుత్వం భువన్ యాప్ సర్వేకు ఆదేశించింది. ఇందులో భాగంగా బల్దియా సిబ్బంది ఇంటింటికి వెళ్లి జీపీఎస్ ట్రాకింగ్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. దీంతో ఆస్తి పన్ను మదింపు పక్కగా ఉండటంతో పాటు వసూళ్లు సైతం పెరగనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సర్వే సాగుతుందిలా... ఈ యాప్ ద్వారా పట్టణంలోని ఆస్తుల లెక్క తేల్చేందుకు 15 మంది బల్దియా బిల్ కలెక్టర్లను ఎంపిక చేశారు. వారికి ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్వర్డులతో కూడిన లాగిన్లను కేటాయించారు. వీరంతా తమకు కేటాయించిన వార్డులకు వెళ్లి క్షేత్రస్థాయిలో ఆస్తుల వివరాలను సేకరించనున్నారు. నివాస, వాణిజ్యపరమైన భవనాలను వెనుక, ముందు భాగాల్లో రెండు ఫొటోలు తీసుకుంటారు. వాటి విస్తీర్ణం ఎంత అనే కొలతలను లెక్కిస్తారు. భవన యాజమాని ఆధార్ నంబర్ నమోదు చేయగానే వారి వివరాలు కనిపించే అవకాశమున్నందున వీటి వివరాలను భువన్యాప్లో జీపీఎస్ విధానంలో నమోదు చేస్తారు. గతంలో చేపట్టిన సర్వేలో మిగిలిపోయి న 8,478 ఆస్తులతో పాటు ఇటీవల కొత్తగా న మోదైన 10వేల ఆస్తులను సైతం ఇందులో నమోదు చేయనున్నారు. వాటి ఆధారంగా ఆ ఆస్తులకు పన్ను విధిస్తారు. అలాగే ప్రతీ ఆస్తికి 10 అంకెలతో కూడిన ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ (పిటిన్)ను కేటాయిస్తారు. ఇలా వివరాలు పక్కాగా సేకరించడం ద్వారా బల్ది యాకు పన్నుల రూపంలో మరింత ఆదాయం సమకూరే అవకాశముంది. సర్వే పర్యవేక్షణ కోసం బల్దియాలో ఐదుగురు రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. నాలుగు రోజుల క్రితం సర్వే ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. పకడ్బందీగా సర్వే..పట్టణంలోని ఆస్తులను పక్కాగా తె ల్చేందు కోసమే ప్రభుత్వం భువన్ యాప్ ద్వారా సర్వే కు ఆదేశించింది. అందుకనుగుణంగా ఆస్తుల సర్వే చేపట్టాం. పకడ్బందీగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 628 ఇళ్ల వివరాలను సేకరించి యాప్లో నమోదు చేశాం. – కళ్యాణ్, బల్దియా రెవెన్యూ అధికారి పట్టణంలో..వార్డులు 49 ఓల్డ్ అసెస్మెంట్లు 8,478 న్యూ అసెస్మెంట్లు 10,980 సర్వేకు ఎంపిక చేసిన సిబ్బంది 15 -
పంచాయతీ ఎన్నికల సామగ్రి తరలింపు
కైలాస్నగర్: స్థానిక సంస్థల సమరానికి ఎన్నికల సంఘం ఎప్పుడైనా నోటిఫికేషన్ విడుదల చేయవచ్చనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జిల్లా అధి కార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా జి ల్లా పంచాయతీ అఽధికారులు తాజాగా ఎన్నికల సా మగ్రి తరలింపుపై దృష్టి సారించారు. రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారుల కరదీపికలు, బ్యాలెట్ పేప ర్లు, పోలింగ్కు ముందు, తర్వాత పీవో చేసే ప్రకట నలు ఉంచే కవరు, మార్క్డ్ ఓటర్ల జాబితా లాంటి సామగ్రి నెల కిందటే జిల్లాకు చేరింది. ఈ సామగ్రి ని జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలోని పంచా యతీ వనరుల కేంద్రంలో భద్రపర్చారు. ఎన్నికలు నిర్వహించనున్నట్లు వస్తున్న సంకేతాల నేపథ్యంలో సామగ్రిని మండలాల వారీగా వాహనాల్లో తరలి స్తున్నారు. ఇప్పటివరకు బజార్హత్నూర్, సొనాల, నేరడిగొండ తదితర తొమ్మిది మండలాలకు సామ గ్రి పంపిణీ పూర్తి చేశారు. మరో 11 మండలాలు మిగిలి ఉండగా రెండు, మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో అందజేస్తామని డివిజనల్ పంచాయతీ అధి కారి ఫణీందర్రావు తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక పోలింగ్కు ఒక్కరోజు ముందుగా ఈ సామగ్రిని మండల కేంద్రంలోని రిసెప్షన్ కేంద్రంలో ఎన్నికల సిబ్బందికి అందజేస్తామన్నారు. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా ఎన్నికలు నిర్వహించేలా పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. -
ఉట్నూర్లో ‘మై టాక్సీ ఈజ్ సేఫ్’
ఉట్నూర్రూరల్: ఉట్నూర్ సబ్ డివిజన్ కార్యాల యం ఎదుట, ఉట్నూర్ పోలీస్స్టేషన్లో ఎస్పీ అ ఖిల్ మహాజన్, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్తో క లిసి ‘అభయ మై టాక్సీ ఈజ్ సేఫ్’ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎ స్పీ మాట్లాడుతూ.. విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో యువతులు, మహిళా ప్రయాణికుల భద్రత చర్యల్లో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 3,232 ఆటోల్లో ‘అభయ మై టాక్సీ ఈజ్ సేఫ్’ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నట్లు చెప్పారు. ఇందులో ఉట్నూర్ సబ్ డివిజన్లో 850 ఆటోల రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు తెలిపారు. ఆటోల్లో ముందు, వెనుక భాగంలో క్యూఆర్ కోడ్, జిల్లా ప్రత్యేక నంబర్ కలిగి న పోస్టర్ అతికించి, లోపలి భాగంలో ఆటో డ్రైవర్ వివరాలు, క్యూఆర్ కోడ్, ఆటో రిజిస్ట్రేషన్ నంబర్ కనబడేలా పోస్టర్లను శాశ్వతంగా అతికిస్తున్నట్లు పే ర్కొన్నారు. ప్రయాణికులు ఎక్కిన వెంటనే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత ఒక వెబ్ అప్లికేషన్ వస్తుందని తెలిపారు. అందులో మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత వారికి మూడు భద్రత ఆప్షన్లు ‘ట్రాక్ మై లొకేషన్, ఎమర్జెన్సీ కాల్, కంప్లయింట్’ కనబడతాయని పేర్కొన్నారు. మహిళలు అత్యసర సమయంలో దీనిని ఉపయోగించుకోవాలని సూచించా రు. ఉత్తమ రేటింగ్ కలిగిన ఆటో డ్రైవర్లు, యజమానులకు అవార్డులు అందించి ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. నేరాల నియంత్రణ, నేరాల అదుపునకు ప్రతి ఒక్కరూ ‘అభయ మై టాక్సీ ఈజ్ సేఫ్’ కార్యక్రమంలో పాల్గొనాలని ఎస్పీ పిలుపునిచ్చారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. స్వయంగా ఆటోల వద్దకు వెళ్లి పోస్టర్ అతికించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఐ మొగిలి, ఎస్సై మనోహర్ తదితరులున్నారు. -
విమానాశ్రయ పనులు ప్రారంభించాలి
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో వీలైనంత త్వరగా ఎయిర్ఫోర్స్, విమానాశ్రయ పనులు ప్రారంభించాలని ఐఏఎఫ్ అధికారి జేఎస్ మహంతిని ఆదిలా బాద్ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరా రు. గురువారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో విమానా శ్రయం ఏర్పాటుకు సంబంధించి అనువైన స్థలం ఉందని తెలిపారు. ఈ మేరకు ఐఏఎఫ్ అధికారి సా నుకూలంగా స్పందిస్తూ వీలైనంత త్వరలో జాయింట్ ఐఏఎఫ్, ఏఏఐ సమావేశం నిర్వహించనున్నట్లు హామీ ఇచ్చినట్లు ఎంపీ, ఎమ్మెల్యే తెలిపారు. -
పెన్షన్ల పంపిణీలో అక్రమాలకు తావివ్వొద్దు
● కలెక్టర్ రాజర్షి షా ● ‘చేయూత’ అమలుపై వర్క్షాప్ కై లాస్నగర్: పెన్షన్ల పంపిణీలో అక్రమాలకు తావులేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. చేయూత పథకం (సామాజిక భద్రత పెన్షన్లు) అమలుపై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ–సెర్ప్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ బిల్ కలెక్టర్లకు పట్టణంలోని ఎస్టీయూ భవన్లో గురువారం వర్క్షాపు నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ హాజరై దిశానిర్దేశం చేశారు. అనర్హులను ఏరివేయడంతో పాటు మరణించిన వారి పేర్లు జా బితాల నుంచి తొలగించాలని ఆదేశించారు. లబ్ధి దారులకు సకాలంలో పెన్షన్లు అందించేలా శ్రద్ధ వ హించాలని పేర్కొన్నారు. పెన్షన్కు అర్హులై సదరం సర్టిఫికెట్ లేనివారు యూడీఐడీ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పంచాయతీ అ డ్వాన్స్మెంట్ ఇండెక్స్ సమాచారాన్ని సమగ్రంగా నమోదు చేయాలని తెలిపారు. స్వచ్ఛ్ సర్వేక్షణ్లో అవార్డులు పొందే దిశగా కార్యదర్శులు, ఎంపీడీవో లు కృషి చేయాలని సూచించారు. పెన్షన్ల పంపిణీలో మార్పులు, దరఖాస్తుల స్వీకరణ, పెన్షన్ల పంపిణీకి చేపట్టాల్సిన చర్యలపై సెర్ప్ డైరెక్టర్ గోపాల్రా వు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా శిక్షణ ఇ చ్చారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. పెన్షన్ల పంపిణీలో జరుగుతున్న అక్రమాలను పూర్తిగా ని యంత్రించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కేంద్రంలోనే పెన్షన్లను అందించాలని సూచించారు. జెడ్పీ సీఈవో జితేందర్రెడ్డి, డీపీవో రమేశ్, ఏపీవో జాదవ్ శేష్రావు, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, డీఎల్పీవోలు పాల్గొన్నారు. -
ఖాళీ బిందెలతో ఆందోళన
నార్నూర్: తాగునీటి కోసం మండల కేంద్రంలోని వడ్డెర, మైనార్టీ కాలనీల వాసులు గురువారం ఆందోళనకు దిగారు. స్థానిక మసీద్ వద్ద ప్రధాన రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. దీంతో రెండు గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్సై అఖిల్ అక్కడికి చేరుకుని సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. నెలరోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదని తెలిపారు. గ్రామపంచాయతీ ద్వారా సరఫరా అయ్యే నీ టిని కొందరు అక్రమ నల్లాలు బిగించి వాడుకుంటున్నారని ఆరోపించారు. గ్రామపంచా యతీ కార్యదర్శి, ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని తెలిపారు. అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆరోపించారు. రాతపూర్వకంగా సమస్యలు రాసిస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని ఎస్సై హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
ఉచిత వృత్తివిద్య శిక్షణ
ఇచ్చోడ: కేంద్ర ప్రభుత్వం ద్వారా నిరుద్యోగ యువతీయువకులకు వృత్తివిద్య శిక్షణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా ఆదిలాబాద్ జనశిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ శాఖ డైరెక్టర్ శ్యామల తెలిపారు. గురువారం ఇచ్చోడలో విలేకరులతో మాట్లాడారు. ఇచ్చోడ, బజార్హత్నూర్, సిరికొండ మండలాల్లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. డ్రెస్మేకర్ (టైలరింగ్), బ్యూటీషియన్ కోర్సు, కంప్యూటర్ ఆపరేటర్, మగ్గం వర్క్, డ్రైవింగ్, హెల్త్కేర్, తేనెటీగల పరిశ్రమపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపా రు. ఆసక్తిగలవారు ఆధార్కార్డు, పాస్పోర్టు సైజ్ ఫొటోలతో ఇచ్చోడ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 9963098573, 9110732460 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2025న్యూస్రీల్హాజరు శాతం పెంచాలిబజార్హత్నూర్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచి తరగతులను పకడ్బందీగా నిర్వహించాలని డీఈ వో శ్రీనివాస్రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. గురువారం మండలంలోని కాండ్లీ, గి ర్నూర్, పిప్రి, బజార్హత్నూర్ మండల పరి షత్ ప్రాథమిక పాఠశాలలు, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలు, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలను ఆకస్మీకంగా తనిఖీ చేశారు. రికార్డులు, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. పిప్రి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఎల్ఈడీ టీవీ, కంప్యూటర్, టీషర్టులు అందించిన దాతలు విశాల్, భోజారెడ్డి, ప్రమోద్రెడ్డిని అభినందించారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో స్థానికులు ప్రభుత్వ పాఠశాలల ను ప్రోత్సహించాలని కోరారు. పాఠశాలల్లో ఉత్తమమైన విద్యను అందిస్తామని తెలిపా రు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాల ని సూచించారు. ఎంఈవో కిషన్గుప్తా, సీసీ రాజేశ్వర్, ప్రధానోపాధ్యాయులు కౌసల్య, భూమన్న, సురేందర్రెడ్డి, లక్ష్మి, ప్రేంకుమార్, సదానందం, ఉపాధ్యాయులున్నారు. విజిట్లో వెల్లడైన అంశాలు జిల్లా కేంద్రంలోని కేఆర్కే ఉర్దూ మీడియం పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకు బో ధిస్తున్నారు. 430 మంది విద్యార్థులకు తొమ్మి ది మంది ఉపాధ్యాయులుండగా, ఇద్దరిని డి ప్యూటేషన్పై పంపించారు. ప్రస్తుతం ఏడుగు రు పనిచేస్తున్నారు. ఇందులో ఇద్దరు స్కూల్ అ సిస్టెంట్లు, ఐదుగురు ఎస్జీటీలున్నారు. 1, 2 తరగతుల విద్యార్థులను ఒకచోట, 3, 4 తరగతులు మరొక చోట, 6,7 తరగతుల విద్యార్థులను ఇంకో చోట కూర్చోబెట్టి బోధిస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్, సోషల్, ఉర్దూ బోధించేవారు లేరు. మావల మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలకు మన ఊరు–మనబడి కింద భవనం మంజూరైంది. నిధులు కూడా రావడంతో స్లాబ్ వేసి వదిలిపెట్టారు. దీంతో ఏడో తరగతి విద్యార్థులు ఆరుబయటే కూర్చోవాల్సిన పరిస్థితి. ఆరో తరగతి గది వర్షానికి ఉరుస్తోంది. దీంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. తరగతి గదిలో బోర్డు లేక పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బేల మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో తొమ్మిది తరగతులు నిర్వహిస్తున్నారు. 119 మంది విద్యార్థులుండగా ఒ కే ఉపాధ్యాయుడున్నారు. ఉర్దూ మీడియానికి బదులు తెలుగు, మరాఠీ మీడియం ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడంతో పాఠాలు అ ర్థం కావడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలోగల ఉ న్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 310మంది విద్యార్థులుండగా ఇదివరకు ఉన్నవాటిని బాలికలు ఉపయోగిస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కొమురంభీం కాలనీలోగల ప్రాథమిక పాఠశాలలో 81మంది వి ద్యార్థులున్నారు. ఒక రెగ్యులర్ ఉపాధ్యాయు డు ఉండగా, ఇద్దరినీ డిప్యూటేషన్పై పంపించా రు. బడి అద్దె భవనంలో కొనసాగుతోంది. వ రండా, మరో గదిలో తరగతులు బోధిస్తుండగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. బజార్హత్నూర్ మండలం బలాన్పూర్లో గ్రా మంలో గల ప్రాథమిక పాఠశాల భవనం శిథి లావస్థలో ఉంది. వర్షం పడితే స్లాబ్ ఉరుస్తోంది. మరుగుదొడ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉ న్నాయి. పాఠశాలలో ఎనిమిది మంది విద్యార్థులుండగా, ఒక ఉపాధ్యాయుడున్నారు. జైనథ్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో మన ఊరు–మనబడి కింద రూ.80 లక్షలతో చేపట్టిన భవన నిర్మాణం పూర్తి కాలేదు. బిల్లులు రాకపోవడంతో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో తరగతి గదులు సరిపడా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సిరికొండ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలోగల ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా కనిపించాయి. దీంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఈ పాఠశాలలో 16 మంది విద్యార్థులు చదువుతున్నారు. -
యూరియా బ్లాక్ చేయకుండా చర్యలు
ఆదిలాబాద్టౌన్: యూరియా ను బ్లాక్ మార్కెట్కు తరలించకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్స్వామి తెలి పారు. ‘బ్లాక్లో యూరియా.. దొడ్డిదారిన బడాబాబుల చెంతకు’ శీర్షికన గు రువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆ యన స్పందించారు. తాంసి ప్రాథమిక సహకా ర సంఘంలో 40 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వానాకా లం పంటకు జూన్ వరకు 18,786 మెట్రిక్ ట న్నుల యూరియా అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. రైతులకు ఇతర ఎరువులు బలవంతంగా ఇవ్వరాదని సూచించారు. డీలర్లతో సమావేశమై నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెండింగ్ కేసులు పర్యవేక్షించాలిఆదిలాబాద్టౌన్: కోర్టుల్లో పెండింగ్ కేసులను పర్యవేక్షించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూ చించారు. గురువారం ఏఆర్ హెడ్క్వార్టర్ స మావేశ మందిరంలో పోలీస్ సిబ్బందితో స మావేశమై మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా రో డ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చే పట్టాలని ఆదేశించారు. కేసుల దర్యాప్తులో నా ణ్యత ప్రమాణాలు పాటించాలని, న్యాయస్థానాల్లో నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సా యంత్రం వేళ డ్రంకెన్ డ్రైవ్, హైవేల్లో స్పీడ్ లే జర్ గన్లు, సైన్బోర్డులు, రంబుల్స్టిక్లు ఏ ర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామాల నుంచి హైవేలకు వచ్చే దారుల్లో స్పీడ్ బ్రేకర్లు ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. నేరస్తులు క్రమంతప్పకుండా కోర్టుకు హాజరయ్యేలా పర్యవేక్షించాలని పేర్కొన్నారు. హాజరుకాని ప క్షంలో వారెంట్లు తీసుకుని నిందితులకు అందజేయాలని సూచించారు. హైవేపై బ్లాక్స్పాట్, హాట్స్పాట్లను గుర్తించి ఎలాంటి సమస్యలు న్నా పరిష్కరించాలని వివరించారు. ఎస్పీ వెంట ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్, డీఎస్పీలు ఎల్.జీవన్రెడ్డి, నాగేందర్ తదితరులున్నారు. -
వాతావరణం
అధ్వాన రోడ్లతో అవస్థలు గతంలో కురిసిన వర్షాలకు గ్రామీణ రహదారులు, వంతెనలు కోతకు గురయ్యాయి. తాత్కాలిక వంతెనలు, రహదారులు నిర్మించగా ఇటీవలి వర్షాలకు కొట్టుకుపోయాయి. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో అక్కడక్కడా వర్షం కురుస్తుంది. సెలవులు ముగిసినా బడి తెరువలే..పోడు.. తీరని గోడు! అటవీ భూముల సాగుపై వివాదం ఆగడం లేదు. ఏటా వానాకాలం విత్తనాలు వేసే వేళ అటవీ అధికారులు, ఆక్రమణదారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. సుంకిడిలో శిథిల‘బడి’ ఆదిలాబాద్టౌన్: సర్కారు బడుల్లో విద్యార్థులు స మస్యలతో సతమతమవుతున్నారు. జిల్లాలోని ప లు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులున్న చోట సరి పడా ఉపాధ్యాయులు లేరు. ఉపాధ్యాయులున్నచో ట విద్యార్థులు బడికి రారు. సరిపడా తరగతి గదులు లేక పలు పాఠశాలల్లో రెండు, మూడు తరగతు ల విద్యార్థులను ఒకేచోట కూర్చోబెట్టి బోధిస్తున్నా రు. జిల్లాలో 25 పాఠశాల భవనాలు శిథిలావస్థలో ఉండగా, 54 పాఠశాలల్లో విద్యార్థులకు బోధించే ఉ పాధ్యాయులు లేరు. విద్యార్థులు లేక ఇప్పటికే 11 పాఠశాలలు మూతబడ్డాయి. గురువారం ‘సాక్షి’ జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలలను విజిట్ చేయగా, వివిధ సమస్యలు వెలుగుచూశాయి. పెండింగ్లోనే పనులు జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో చేపట్టిన పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. మన ఊరు–మనబడి ద్వారా 2021–22లో 237 పాఠశాలల్లో పనులు చేపట్టారు. వీటికోసం రూ.51కోట్లు అంచనా వేశారు. ఈ నిధులతో అదనపు తరగతి గదులు, మేజర్, మైనర్ మరమ్మతులు, విద్యుత్, తాగునీటి వసతి తదితర పనులు చేపట్టేందుకు నిర్ణయించారు. ఈజీఎస్ కంపోనెంట్ కింద రూ.43.62 కోట్ల పనులకు అంచనా వేశారు. ఈ నిధుల ద్వారా మరుగుదొడ్లు, కిచెన్ షెడ్లు, ప్రహరీలు నిర్మించేందుకు ప్రణాళికలు తయారు చేశారు. జిల్లాలో 141 ప్రాథమిక పాఠశాలలు, 36 యూపీఎస్, 60 ఉన్నత పాఠశాలల్లో పనులకు అంచనాలు వేశారు. అయితే 200 పాఠశాలల్లో రూ.30 లక్షల్లోపు పనులు, 37 పాఠశాలల్లో రూ.30లక్షలకు పైగా ప నులకు అంచనా వేశారు. రూ.30లక్షల లోపు వాటి ని ఎస్ఎంసీ కమిటీలు, రూ.30లక్షలు పైబడిన ప నులను కాంట్రాక్టర్లు చేపట్టారు. 2023 జూన్ 23 వరకు చేపట్టిన పనులకు రూ.23.58 కోట్ల బిల్లులు వచ్చాయి. మిగతా వాటికి బిల్లులు పెండింగ్లో ఉండగా పనులు నిలిచిపోయాయి. దాదాపు కాంట్రాక్టర్లకు రూ.7.61 కోట్లు రావాల్సి ఉంది. దీంతో తరగతి గదులు, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. గత విద్యాసంవత్సరంలో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా 649 పాఠశాలల్లో ప నులు చేపట్టారు. మైనర్ రిపేర్లు, తాగునీరు, మరుగుదొడ్ల మరమ్మతులు, విద్యుద్ధీకరణ, బాలికల మరుగుదొడ్ల పనులు చేపట్టారు. వీటికోసం రూ.30 కోట్ల అంచనా వేశారు. అమ్మ ఆదర్శ కమిటీల ద్వా రా చేపట్టిన పనులు దాదాపు పూర్తయ్యాయి. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణా లు, ఇతర పనులు పెండింగ్లో ఉన్నాయి. మావల జెడ్పీఎస్ఎస్లో అసంపూర్తి భవనంలో పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడుజల్దా బడి.. సమస్యల ఒడి సమస్యల్లో సర్కారు స్కూళ్లు పిల్లలున్నచోట టీచర్లు లేరు సార్లుంటే విద్యార్థులు రారు చాలాచోట్ల వసతులు కరువు సమస్యల మధ్యే చదువులుఇంద్రవెల్లి: మండలంలోని తుమ్మగూడ, గోపాల్సింగ్తండా, కేస్లాగూడ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి నల్లాలు నిరుపయోగమయ్యాయి. విద్యార్థులు ఇళ్ల నుంచే బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుంటున్నారు. మరుగుదొడ్లు మరమ్మతుకు నోచుకోవడం లేదు. వడగామ్ పంచాయతీ పరిధి లింగపూర్ టీడబ్ల్యూపీఎస్లో 18 మంది విద్యార్థులుండగా ఉపాధ్యాయుడు లేక సెలవుల తర్వాత పాఠశాల ఇంకా తెరుచుకోలేదు. విద్యార్థులు ఆడుతూ కనిపించారు. ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయుడు బదిలీ కావడంతో మరో ఉపాధ్యాయుడిని నియమించలేదు. తలమడుగు: మండలంలోని సుంకిడి జెడ్పీహెచ్ఎస్ పురాతన భవనం శిథిలావస్థకు చేరింది. విద్యార్థులు భయాందోళనకు గురవుతుండగా అధికారులు 8, 9, 10 తరగతులను ప్రాథమిక పాఠశాల ఆవరణలోని తరగతి గదిలోకి మార్చారు. శిథిల భవనాన్ని తొలగించి నూతన భవనం నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులు: 3,067 పనిచేస్తున్నవారు : 2,667 ఖాళీలు : 400 డీఈవో పరిధి పాఠశాలలు : 739 విద్యార్థుల సంఖ్య : 65వేలుఇచ్చోడ: మండలంలోని జల్దా ప్రాథమిక పాఠశాలను సందర్శించగా సమస్యలు వెలుగుచూశాయి. పాఠశాల ప్రధాన ద్వారం తలుపులు పగిలిపోయాయి. మరుగుదొడ్డి, మూత్రశాలలు నిరుపయోగమయ్యాయి. ప్రహరీ లేక ఆవరణలోకి పశువులు సంచరిస్తున్నాయి. 28 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులుండగా గురువారం 15మంది విద్యార్థులే హాజరు కావడం గమనార్హం. -
ఇద్దరు వ్యక్తుల బైండోవర్
లక్సెట్టిపేట: మండలంలోని కొమ్ముగూడెం గ్రామానికి చెందిన ధనిశెట్టి సతీశ్, కారుకూరి మల్లేశ్ అనే ఇద్దరు వ్యక్తులను స్థానిక తహసీల్దార్ దిలీప్ కుమార్ ముందు బైండోవర్ చేసినట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ధనిశెట్టి సతీశ్, కారుకూరి మల్లేశ్ అనే వ్యక్తులు గత కొద్ది రోజుల నుంచి కారణం లేకుండానే 100 నంబర్కు డయల్ చేస్తున్నారు. పలుమార్లు ఈవిధంగా డయల్ చేస్తూ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారని, ఎలాంటి సమస్యలు లేకున్నా ఫోన్ చేస్తున్నందున బైండోవర్ చేసినట్లు తెలిపారు. -
కేజీబీవీల్లో నూతన మెనూ
● పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ● విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు ● పెరిగిన మెస్చార్జీలతో విద్యార్థినుల హర్షంలక్ష్మణచాంద: నిరుపేద బాలికలు మధ్యలో చదువు ఆపేయకుండా, వారిని అక్కున చేర్చుకుని కేజీబీవీలు వసతితో కూడిన నాణ్యమైన విద్య అందిస్తున్నాయి. కేజీబీవీల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. కేజీబీవీ విద్యార్థినులు పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నట్లు ఇటీవల చేపట్టిన సర్వేలో తేలింది. దీంతో కేజీబీవీ బాలికల పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న బాలికలకు పౌష్టికాహారం అందించి వారిని అనారోగ్య సమస్యల నుంచి దూరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గతంలో ఉన్న మెనూలో పలు మార్పులు చేసింది. దీంతో 2025 –26 విద్యా సంవత్సరంలో నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించనున్నారు. పెరిగిన మెస్ చార్జీలు గతంలో 6 –10, ఇంటర్ విద్యార్ధులందరికీ ఒకే విధంగా నెలకు రూ.1225లు ప్రభుత్వం అందించేది. కానీ నేడు నూతన మెనూ ప్రకారం 6 నుంచి 7వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.1330లు, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.1540లు, ఇంటర్ విద్యార్థులకు నెలకు రూ.2100లు అందించనున్నారు. నూతన మెనూ ఇదే.. ఉదయం..టమాట కిచిడి, సాంబారు, బూస్టు, పూరి, రాగి జావ, ఉప్మా, పులిహోర, వడ, బోండా, చపాతి, జీరా రైస్తో పాటు రోజుకు ఒక్కో రకమైన పండ్లు అందించాలి. ఇందులో అరటి పండు, జామ, వాటర్ మిలన్, బొప్పాయి, సపోట వంటి పండ్లు అందించాలి. మధ్యాహ్నం..టమాట పప్పుతో కూడిన అన్నం, నెయ్యి, రసం, పెరుగు, ఉడక బెట్టిన గుడ్డు, చికెన్ అందించాలి. సాయంత్రం..ఉడకబెట్టిన శనగలు, కోడిగుడ్డు బజ్జీ, బెల్లం పల్లీలు, అల్లం చాయ్, మిల్లెట్ బిస్కెట్లు, పకోడి ఇవ్వాలి. రాత్రి వేళ..వివిధ రకాల కూరలతో తయారు చేసిన అన్నం, సాంబారు, మజ్జిగ అందించాలి. నెలలో రెండు సార్లు మటన్, అయిదుసార్లు గుడ్లు, ప్రతీరోజు నెయ్యి అందించాలి. ఉమ్మడి జిల్లా కేజీబీవీల సమాచారం.. జిల్లా పాఠశాలలు విద్యార్థుల సంఖ్య ఇంటర్ కాలేజీలు విద్యార్థుల సంఖ్య మొత్తం నిర్మల్ 18 3600 14 2240 5840 మంచిర్యాల 18 3786 15 1080 4866 ఆదిలాబాద్ 18 4800 13 680 5480 కుమురంభీం 15 3027 13 1069 4096 -
లారీ ఢీకొని ఒకరు..
భైంసాటౌన్: పట్టణంలోని సాత్పూల్ వంతెన సమీపంలో లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తానూర్ మండలం బెలతరోడకు చెందిన చెంచుల సాయినాథ్(37) బుధవారం బెల్తరోడ వెళ్లి బైక్పై భైంసా తిరిగి వస్తున్నాడు. సాత్పూల్ వంతెన వద్దకు చేరుకోగా, నిర్మల్ వైపు నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న సాయినాథ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఎండీ గౌసుద్దీన్ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గోపినాథ్ తెలిపారు. సాయినాథ్కు భార్యతో పాటు కుమారుడు, కూతురు ఉన్నారు. -
భూ వివాదంలో ఇరువర్గాల దాడి
బెల్లంపల్లిరూరల్: బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామ శివారులో జరిగిన భూ వివాదంలో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. తాళ్లగురిజాల ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పాతబెల్లంపల్లి గ్రామానికి చెందిన పనాస గణేశ్ ఆకెనపల్లి శివారు సర్వే నంబర్ 64లో ఉన్న భూమిని మంగళవారం సాయంత్రం దున్నే క్రమంలో పాతబెల్లంపల్లి గ్రామానికి చెందిన సింగతి హైమావతి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగి రాళ్లతో పరస్పర దాడులకు దిగారు. దాడిలో పలువురికి గాయాలయ్యాయి. బాధితులను బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు ఇరు వర్గాలకు చెందిన పది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
తల్లి మెడలో గొలుసు అపహరించిన కుమారుడు
మందమర్రిరూరల్: తల్లి మెడలోని రెండు తులాల బంగారు గొలుసు దొంగిలించిన కుమారుడిని మందమర్రి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బుధవారం మందమర్రి సర్కిల్ పోలీస్స్టేషన్లో సీఐ శశిధర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ హాజరై వివరాలు వెల్లడించారు. పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డు వైపు నివాసం ఉండే విజయపురి పుల్లమ్మ అనే వృద్ధురాలు గత నెల 24న అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టింది. ఈక్రమంలో గుర్తు తెలియని వ్యక్తి పుల్లమ్మ మెడలో గొలుసు దొంగిలించినట్లు మనుమడు శివ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉన్నతాధికారుల సూచనలు, సాంకేతికత ఆధారంగా ఇంటి వారే దొంగతనం చేసి ఉంటారనే కోణంలో పుల్లమ్మ కుమారుడు శంకరయ్యపై నిఘా ఉంచారు. ఆయన అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో విచారించగా ఆర్థిక ఇబ్బందుల వల్ల తానే దొంగిలించినట్లు నేరం అంగీకరించాడు. ఈ మేరకు శంకరయ్య వద్ద నుంచి రెండు తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్న ఎస్సై రాజశేఖర్, క్రైంటీం కానిస్టేబుళ్లు మహేశ్, రాకేశ్లను ప్రత్యేకంగా అభినందించారు. -
కూల్చివేతకు సిద్ధంగా కళాశాల భవనం
ఖానాపూర్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శిథిలావస్థలో గల పురాతన భవనం కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం ప్రిన్సిపాల్ శ్రీదేవి ఆధ్వర్యంలో చర్యలకు ఉపక్రమించారు. భవనం శిథిలావస్థకు చేరిందని కూలితే విద్యార్థులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఇంజినీర్ అఖిలేష్తో కలిసి బుధవారం కూల్చివేత అనుమతుల కోసం కొలతలు తీసుకున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. వేలాది మంది విద్యార్థులు చదువుకున్న భవనం కూల్చివేస్తున్న విషయం తెలియగా పలువురు కలత చెందుతున్నారు. ఈ భవనాన్ని 1969లో నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఖానాపూర్ పోలీస్స్టేషన్కు కొణతం దిలీప్ఖానాపూర్: గతంలో సోషల్మీడియాలో కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీఆర్ఎస్ సోషల్మీడియా రాష్ట్ర ఇన్చార్జి కొణతం దిలీప్పై నమోదైన కేసులో భాగంగా బుధవారం ఆయన ఖానాపూర్ పోలీస్స్టేషన్లో హాజరయ్యారు. ఫిబ్రవరిలో నమోదైన కేసులో ఇది వరకే బెయిల్ మంజూరైనప్పటికీ ప్రతీ బుధవారం పోలీస్స్టేషన్కు హాజరు కావాల్సి ఉంది. ఈక్రమంలో పోలీసులు గంటల తరబడి ఆయన పోలీస్స్టేషన్లో నిరీక్షించేలా చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీస్స్టేషన్కు చేరుకుని పోలీస్స్టేషన్ బయట పెద్దఎత్తున గుమిగూడారు. బెల్గాం అడవుల్లో ఎలుగుబంటి సంచారంకుభీర్: మండలంలోని బెల్గాం అడవుల్లో ఎలుగుబంటి సంచారంతో సమీప ప్రాంతాల వాసులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల క్రితం బెల్గాం గ్రామ శివారులోని చేనులో పని చేసే వారికి ఎలుగుబంటి కన్పించడంతో వారు భయంతో కేకలు వేయగా సమీప అడవిలోకి పారిపోయింది. మండలంలోని బ్రహేశ్వర్, మార్లగొండ అడవుల్లో ఎలుగుబంట్లు ఉన్నట్లు సమాచారం ఉంది. ఎలుగుబంటి కనిపించిందన్న వార్త వ్యాపించడంతో అడవుల సమీపంలోని గ్రామాల ప్రజలు అడవివైపు వెళ్లడానికి జంకుతున్నారు. ఈ విషయమై అటవీ అధికారి లక్ష్మణ్ను బుధవారం వివరణ కోరగా ఐదు నుంచి ఆరు ఎలుగుబంట్లు ఉన్నాయని, అవి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. -
బౌలర్లదే జోరు
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఉమ్మడి జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో అండర్ 19 క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహిస్తుండగా బుధవారం జరిగిన పోటీల్లో బౌలర్లదే హవా కొనసాగింది. రెడ్, బ్లూ జట్ల మధ్య 50 ఓవర్ల మ్యాచ్ జరగ్గా, బ్లూ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 39.5 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రెడ్ జట్టు బౌలర్లు అద్బుతంగా రాణించగా, డి.లక్ష్మణ్ 4 కీలక వికెట్లు సాధించాడు. అనంతరం లక్ష్య చేధనలో రెడ్జట్టు 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. శ్రీరామ్ 53 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడని కోచ్ ప్రదీప్ తెలిపారు. ఎస్టీపీపీలో అధికారులను బదిలీ చేయాలి జైపూర్: జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటులో గత పదేళ్లుగా పాతుకుపోయిన సింగరేణి అధికారులను వెంటనే బదిలీ చేయాలని హెచ్ఎంఎస్ యూనిట్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణం నుంచి ఇప్పటి వరకు ఇంజినీర్గా వచ్చి డీజీఎం స్థాయి దాక ఎదిగినా ప్లాంట్లోనే కొందరు అధికారులు ఉన్నారని ఆరోపించారు. ప్రతీ ఏరియాలో బదిలీలు ఉంటాయని కానీ ఇక్కడ మాత్రం బదిలీ చేయకపోవడానికి ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. పీఎఫ్ సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలినస్పూర్: ఉద్యోగులు పదవీ విరమణ పొందిన తర్వాత ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ నిధి సకాలంలో అందేలా తగిన చర్యలు తీసుకోవాలని ఏరియా జీఎం ఎం. శ్రీనివాస్ సూచించారు. బుధవారం జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలకు చెందిన సీఎంపీఎఫ్ జాయింట్ వర్క్షాప్ నిర్వహించారు. సమావేశంలో ఉద్యోగుల పీఎఫ్, పెన్షన్ సంబంధిత సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఎస్ఓటూ జీఎం ఎన్. సత్యనారాయణ, ఏజీఎం ఫైనాన్స్ బీభత్స, డీవైజీఎం పర్సనల్ అనిల్కుమార్, మందమర్రి డీవైపీఎం అసిఫ్, బెల్లంపల్లి సీనియర్ పీవో ప్రశాంత్, అధికారులు దేవేందర్రెడ్డి, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
బస్సు ఢీకొని ఒకరి మృతి
భైంసారూరల్: మండలంలోని వాలేగాం గ్రామానికి చెందిన బొడిగంవార్ చంద్రశేఖర్ (49) అనే వ్యక్తి దేగాం గ్రామంలో బస్సు ఢీకొట్టిన సంఘటనలో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వాలేగాం గ్రామానికి చెందిన బొడిగంవార్ చంద్రశేఖర్ –సుశీల దంపతులు బుధవారం బాసరకు వెళ్తున్నారు. దేగాం బస్టాండ్ వద్ద బస్సు కోసం వేచిచూస్తున్న క్రమంలో చంద్రశేఖర్ను భైంసా నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు దేగాం చేరుకుని న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు. -
పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
● యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్రెడ్డి కైలాస్నగర్: త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో బుధవారం నిర్వహించిన యూత్ కాంగ్రెస్ జిల్లా కమిటీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతి థిగా హాజరయ్యారు. యూత్కాంగ్రెస్ బలోపేతం, ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి అవగాహన కల్పించాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్య త ఉంటుందన్నారు. సమావేశంలో రాష్ట్ర ఇన్చార్జి ఖలీద్ అహ్మద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మాజిద్ఖాన్, ఎర్రమళ్ల రామచంద్రారెడ్డి, జిల్లా ఇన్చార్జి అల్మాస్ఖాన్, జిల్లా అధ్యక్షుడు సాయి చరణ్గౌడ్, అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్రెడ్డి, నాయకులు శాంతన్రావు, అర్ఫాత్ఖాన్, నాహిద్, పోతారెడ్డి, అనీష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణికుల భద్రతకు ‘అభయ’
● ‘మై టాక్సీ ఈస్ సేఫ్’ ప్రారంభం ● 3,232 ఆటోలకు క్యూఆర్ కోడ్ ● వినూత్న కార్యక్రమానికి ఎస్పీ శ్రీకారం బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం..బజార్హత్నూర్: బాధిత కుటుంబానికి జి ల్లా పోలీసు యంత్రాంగం ఎల్లవేళలా అండగా ఉంటూ సహాయ సహకారాలు అంది స్తుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఇచ్చోడ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎం.నాగేశ్వరరావు బుధవారం ఉదయం అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. స్వగ్రామమైన జాతర్లలో నిర్వహించిన అంత్యక్రియల్లో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్తో కలిసి ఎస్పీ పాల్గొన్నారు. పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తక్షణ సాయం కింద కుటుంబ సభ్యులకు రూ.30వేల ఆర్థిక సాయం అందజేశారు. పోలీస్స్టేషన్ తనిఖీ అనంతరం మండలకేంద్రంలోని పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. విధి నిర్వహణలో అప్రత్తమంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఎస్పీ వెంట బోథ్ సీఐ వెంకటేశ్వరరావు, ఇచ్చోడ సీఐ బండారి రాజు, బజార్హత్నూర్ ఎస్సై సంజయ్కుమార్, సిబ్బంది ఉన్నారు.ఆదిలాబాద్: ప్రయాణికుల భద్రతే పరమావధిగా ‘అభయ – మై టాక్సీ ఈస్ సేఫ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బుధవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరాల నే ఉద్దేశంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు, యువతులు, మహిళలు నిర్భయంగా ఆటోల్లో ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉన్న ప్రతీ ఆటో ముందు, వెనుక భాగంలో ప్రత్యేక క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అత్యవసర సమయాల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందుతుందన్నారు. వెబ్ అప్లికేషన్ ద్వారా మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ట్రాక్ మై లొకేషన్, ఎమర్జెన్సీ కాల్, కంప్లైంట్ వంటి సేవలను పొందవచ్చన్నారు. అంతేకాకుండా సురక్షితంగా ప్రయాణించే ఆటోలకు రేటింగ్ సైతం ఇచ్చే వెసులుబాటు ఉందన్నా రు. ఉత్తమ రేటింగ్ కలిగిన డ్రైవర్లు, యజమానులకు అవార్డులు అందించి ప్రోత్సహిస్తామన్నారు. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆటో డ్రైవర్లు, యజమానులకు ఏడాది పాటు లక్ష ప్రమాద బీమా వర్తిస్తుందని వివరించారు. అనంతరం పలు ఆటోలకు క్యూఆర్ కోడ్ స్కానర్ పోస్టర్ అతికించారు. వేదికపై పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్, డీఎస్పీ ఎల్ జీవన్రెడ్డి, ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ప్రణయ్కుమార్, పట్టణ ఇన్స్పెక్టర్లు సునీల్ కుమార్, సీహెచ్ కరుణాకర్రావు, ఎస్సైలు ముజాహిద్, అశోక్, మహేందర్, దేవేందర్, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు. క్రీడా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి ఆదిలాబాద్: క్రికెటర్లు క్రీడా నైపుణ్యాలను పెంచుకుంటే భవిష్యత్తులో గొప్పగా రాణించవచ్చని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆదిలాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ ఎంపిక పోటీలను బుధవారం ప్రారంభించారు. ఆరెంజ్ – ఎల్లో జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకున్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం సాధన చేసి మంచి క్రికెటర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం జరిగిన మ్యాచ్లో ఆ రెంజ్ జట్టుపై ఎల్లో జట్టు విజయం సాధించింది. -
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాటం
ఆదిలాబాద్టౌన్: ఉద్యోగుల సమస్యల పరి ష్కారానికి టీఎన్జీవో పక్షాన పోరాడుతామని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సంద అశోక్ అ న్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, వసతిగృహ, సంక్షేమ అధి కారుల సమావేశం బుధవారం నిర్వహించా రు. నూతనంగా నియామకమైన వసతిగృహ సంక్షేమ అధికారుల నుంచి స భ్యత్వం తీసుకున్నారు. ఇందులో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నవీన్ కుమార్, సెంట్రల్ ఫోరం బాధ్యులు తిరమల్రెడ్డి, వసతిగృహ సంక్షేమ అధికా రుల సంఘం అధ్యక్షుడు నర్సింలు, సుజాత, ఓంప్రసాద్, పర్వేజ్, చిన్నయ్య, జావిద్, రవి, సంధ్య పాల్గొన్నారు. -
చిత్తు కాదు.. పుస్తకాలండోయ్!
ఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాల వసతిగృహంలో కొనసాగుతున్న భీంపూర్ కేజీబీవీలోని ఓ గదిలో పాఠ్యపుస్తకాలు ఇలా చిందరవందరగా దర్శనమిస్తున్నాయి. గత విద్యా సంవత్సరంలో మిగిలిపోయిన పాఠ్యపుస్తకాలు, విద్యార్థుల నుంచి తిరిగి తీసుకున్న వాటిని ఇష్టారీతిన పడేశారు. పుస్తకాలు లేక చాలా మంది విద్యార్థులు ఓవైపు అవస్థలు పడుతుండగా, ఉన్న పుస్తకాలను క్రమపద్ధతిలో కాకుండా చెల్లాచెదురుగా పడేసి ఉంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్కడికి వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు ఈ దృశ్యాన్ని చూసి విస్తూపోతున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చిందరవందరగా పడేసిన పుస్తకాలు -
కొలిక్కి వచ్చేనా..!?
● ఔట్సోర్సింగ్ ఎంప్యానల్మెంట్ టెండర్లలో తీవ్ర జాప్యం ● ఓపెన్ చేసి నెల దాటినా పూర్తికాని పరిశీలన ● గుర్తింపు కోసం డిఫాల్ట్ ఏజెన్సీల పైరవీలు ● అక్రమాలపై సర్వత్రా విమర్శలు సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో అత్యధిక ఔట్సోర్సింగ్ పోస్టులు నిర్వహిస్తున్న ఓ ఏజెన్సీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా ఎంప్యానల్మెంట్లో గుర్తింపు కలి గి ఉంది. పక్క జిల్లా కుమురంభీంలోనే ఆ ఏజెన్సీ వందలాది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఈపీఎఫ్, ఈఎస్ఐ చెల్లించలేదు. ప్రస్తుతం జిల్లాలో కొత్త ఎంప్యానల్మెంట్ కోసం టెండర్లలో తిరిగి ఆ ఏజెన్సీ కూడా దరఖాస్తు చేసుకుంది. అయితే రా ష్ట్రంలో ఎక్కడైనా ఉద్యోగులకు సంబంధించి ఈపీఎఫ్, ఈఎస్ఐ చెల్లించనటువంటి ఇలాంటి ఏజెన్సీ లను డిఫాల్ట్గా పరిగణించాలి. ఆన్లైన్లో దీన్ని పరి శీలించి ప్రక్రియ చేపట్టాలి. అయితే ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతున్న ఎంప్యానల్మెంట్ గుర్తింపులో ఆ ఏజెన్సీఅడ్డదారులు తొక్కుతుందనే ప్రచారం సా గుతుంది. పరిశీలనప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నా యి. ఈ ఏజెన్సీ డిఫాల్ట్లో ఉన్నప్పటికి దాన్ని ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పుకుంటున్నారు. కొనసా..గుతున్న పరిశీలన కొత్త ఎంప్యానల్మెంట్ ఏర్పాటులో అక్రమాలు చో టు చేసుకుంటున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా టెండర్లు తెరిచి నెల దాటినా పరిశీలన ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండగా, దీన్ని డిఫాల్ట్ ఏజెన్సీలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నట్లు తెలుస్తోంది. నేతలు, ఉన్నతాధికారు ల ద్వారా ఒత్తిడి తెచ్చి ఎంప్యానల్మెంట్లో చోటు కోసం అడ్డదారులు తొక్కుతున్నారనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో అన్ని సజావుగా ఉన్న ఏజెన్సీలు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నాయి. తమకు అన్యా యం జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. నెల రోజుల కు పైబడి .. జిల్లాలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపునకు సంబంధించి కొత్త ఎంప్యానల్మెంట్ ఏర్పాటుకు గత నెలలో జిల్లా యంత్రాంగం టెండర్లు పిలిచింది. మే 2 నుంచి 13వరకు జిల్లా ఉపాధి కల్పన శాఖ కా ర్యాలయంలో ఏజెన్సీల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. 29 ఏజెన్సీలు దరఖాస్తు చేసుకున్నాయి. అదే నెల 14న అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ఆధ్వర్యంలో జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి, కార్మికశాఖ, ట్రెజరీ అధికారుల సమక్షంలో ఈ టెండర్లను తెరి చారు. అప్పటి నుంచి పరిశీలన ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఆన్లైన్ ప్రక్రియ వేగవంతంగా ము గించాల్సి ఉండగా జాప్యం అవుతుండటంపై విమ ర్శలు వ్యక్తమవుతున్నాయి. మరో పక్క అవకాశం లేదని తెలుసుకుంటున్న ఏజెన్సీలు పైరవీలకు పా ల్పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. త్వరలోనే పూర్తి చేస్తాం త్వరలోనే ప్రక్రియ పూర్తి చేస్తాం. ఎంప్యానల్మెంట్లో ఏజెన్సీల గుర్తింపునకు సంబంధించి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నాం. జాబితా విడుదల చేసిన తర్వాత ఎవరైనా ఏదైనా ఏజెన్సీ గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేస్తే దానికనుగుణంగా కూడా చర్యలు తీసుకుంటాం. –కె.మిల్కా, జిల్లా ఉపాధి కల్పనాధికారి -
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
● డీఈవో శ్రీనివాసరెడ్డి ● ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం ఆదిలాబాద్టౌన్: ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని డీఈవో శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ‘చదువు కొనాల్సిందే’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. జిల్లా కేంద్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలతో ఆదిలా బాద్ అర్బన్ ఎంఈవో కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలల్లో నోట్బుక్లు, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం వంటివి విక్రయించరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. ఇందులో ఆదిలాబాద్ అర్బన్ మండల విద్యాధికారి డి.సోమయ్య, సెక్టోరియల్ అధికారులు రఘురమణ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
● దొడ్డిదారిన బడాబాబుల చెంతకు.. ● హోల్సెల్ గోదాం నుంచి నేరుగా వారి వద్దకే.. ● మరోవైపు క్షేత్రస్థాయిలో నో స్టాక్ ● నిల్వలు ఉన్నాయంటున్న వ్యవసాయ శాఖ ● అయోమయంలో రైతులు
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో వానాకాలం సాగు మొదలైంది. తొలకరి వర్షాలతో రైతులు పత్తి, సోయా, కంది విత్తనాలు నాటారు. మొలకలు వచ్చిన తర్వాత పంట ఎదుగుదలకు డీఏపీ, యూరియా చల్లాల్సి ఉంటుంది. యూరియా పంటకు ఇచ్చేందుకు మరికొంత సమయం అవసరం. అయితే రైతులు ముందు జాగ్రత్తగా దాన్ని తీసుకొని నిల్వ చేసుకుంటారు. కొంత మంది మొలకలు రాగానే వేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో రైతులు దాని కోసం సొసైటీలు, అగ్రో సెంటర్ల బాట పడుతున్నారు. అక్కడ స్టాక్ అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్లో కొనుగోలు కోసం మార్కెట్కు వెళ్తున్నారు. అక్కడ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న ప్రచారం సాగుతుంది. యూరియాను 60 శాతం మార్క్ఫెడ్ ద్వారా.. అంటే పీఏసీఎస్లు, అగ్రో సెంటర్లు, ఇతరత్రా వాటి ద్వారా విక్రయిస్తారు. మిగతా 40 శాతం ప్రైవేట్ వ్యాపారుల ద్వారా విక్రయిస్తుంటారు. అయితే పీఏసీఎస్లలో యూరియా అందుబాటులో లేకపోవడం, మరో పక్క లారీల్లో నేరుగా కొంతమంది బడా బాబులకు గోదాముల నుంచి చేరుతున్న పరిణామాలు జిల్లాలో యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిందనేదానికి నిదర్శనంగా నిలుస్తోంది. క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులు.. అధికారులు చెబుతున్నదానికి, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు యూరియా స్టాక్ ఉందని, అన్ని సొసైటీలు, అగ్రోసెంటర్లు, డీసీఎంఎస్ల వద్ద లభిస్తున్నాయని చెబుతున్నారు. అయితే వారు చెబుతున్న దానికి, వాస్తవ పరిస్థితికి పొంతన కుదరడం లేదు. బుధవారం ‘సాక్షి’ తాంసి పీఏసీఎస్లో యూరియా లభ్యతపై పరిశీలన చేయగా.. ఆ సీఈవో వారం క్రితం స్టాక్ కోసం డబ్బులు కట్టామని, ఇప్పటివరకు రాలేదని పేర్కొన్నారు. నాలుగు రోజులుగా తమ వద్ద స్టాకే లేదని స్పష్టం చేయడం గమనార్హం. ఇక జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రైవేట్ ట్రేడర్స్ వద్దకు రైతులు యూరియా కోసం వెళ్తే.. వారు యూరియాతో పాటు కార్బన్ అనే ధాతువు కొన్ని బ్యాగులను అంటగడుతున్నారనే ప్రచారం ఉంది. ఈ కార్బన్ వినియోగం విషయంలో రైతులకు ఆసక్తి లేకపోయినా యూరియా కోసం తప్పని పరిస్థితిలో కొనాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. జిల్లాలో వానాకాలం సాగుకు యూరియా ఆవశ్యకత వివరాలు యూరియా : 35వేల మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు వచ్చింది : 20వేల మెట్రిక్ టన్నులుఇది భీంపూర్ మండలానికి సమీపంలోనే ఉండే తాంసిలోని పీఏసీఎస్ భవనం. ఇప్పుడు ఈ భవనం గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. నాలుగైదు రోజులుగా రైతులు యూరియా కోసం ఇక్కడికి వస్తున్నారు. అయితే స్టాక్ లేదని చెబుతుండడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఆరు రోజుల క్రితం రూ.లక్ష 12వేల విలువైన 20 టన్నుల యూరియాను సమకూర్చాలని ఈ పీఏసీఎస్ సీఈవో అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఆ లోడ్ రాకపోవడంతో రైతులకు యూరియా ఇవ్వని పరిస్థితి. జిల్లాలోని అనేక పీఏసీఎస్ల్లోనూ ఇదే పరిస్థితి ఉందనే విమర్శలున్నాయి. విచారణ చేస్తున్నాం.. భీంపూర్ మండలం అందర్బంద్లో యూరియా లోడ్తో పట్టుబడిన లారీ విషయంలో విచారణ చేస్తున్నాం. దీనికి సంబంధించి రైతుమిత్ర అనే డీలర్కు షోకాజు నోటీసులు ఇచ్చాం. దీనిపై వ్యవసాయశాఖ ఏడీ, ఏవోలతో విచారణ చేయిస్తున్నాం. 18 మంది రైతులు ఈ యూరియాను తెప్పించుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ విషయంలో అన్ని అంశాలను పరిశీలిస్తున్నాం. – శ్రీధర్స్వామి, జిల్లా వ్యవసాయ అధికారి, ఆదిలాబాద్ -
మహిళలు ఆర్థికాభివృద్ధ్ది సాధించాలి
● కలెక్టర్ రాజర్షి షాకైలాస్నగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్థిక చేయూతను సద్వినియోగం చేసుకుని ఎస్హెచ్జీ సభ్యులు ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో రూ.8లక్షల వ్యయంతో మున్సిపల్ కార్యాలయ పాత భవనంలో ఏర్పాటు చేసిన శానిటరీ నాప్కిన్ ప్యాడ్స్ మే కింగ్ యూనిట్, పట్టణంలోని గాంధీనగర్లో ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీం ద్వారా రూ. 60లక్షల వ్యయంతో నెలకొల్పిన 22 రకాల మిల్లెట్ బిస్కెట్స్ తయా రీ యూనిట్ను బుధవారం ఆయన ప్రారంభించారు. పలువురు పాఠశాల విద్యార్థులకు శానిటరీ ప్యాడ్స్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యక్తిగత ఆరోగ్యంపై విద్యార్థినులకు అవగాహన కల్పించాలన్నారు. బాలికలు రక్తహీనత బారిన పడకుండా ఐరన్, పోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అందించాలని సూచించారు. ఇందులో మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్, డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, డీఈవో శ్రీనివాస్ రెడ్డి, ఎల్డీఎం ఉత్పల్కుమార్, మెప్మా డీఎంసీ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
చదువుతోపాటు ఆటలూ ముఖ్యమే
● ఎస్పీ అఖిల్ మహాజన్ గుడిహత్నూర్: పిల్లలకు చదువుతోపాటు ఆటలూ ముఖ్యమేనని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలకేంద్రంలోని పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసి న చిల్డ్రన్ పార్క్ను ఉట్నూర్ ఏఎస్పీ కాజల్తో కలిసి మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పిల్లల శారీరక సామర్థ్యాలు పెంచుకోవడం కోసం ప్రతీ పోలీసుస్టేషన్లో చిల్డ్రన్పార్క్ ఏర్పాటు చేశామని, వాటిని చిన్నారులు సద్వినియో గం చేసుకోవాలన్నారు. అనంతరం స్టేషన్ పరిసరాలతో పాటు రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. విధి ని ర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. ఇందులో ఇచ్చోడ సీఐ రాజు, పీఎస్సై మధుకృష్ణ, సిబ్బంది ఉన్నారు. -
కొత్త భవనం.. ప్చ్!
ఇది జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయం నూతన భవనం. నిర్మాణం పూర్తయి రెండున్నర ఏళ్లు దాటింది. సుమారు రూ.40లక్షల వ్యయంతో నిర్మించారు. పాత కార్యాలయం నుంచి ఈ నూతన భవనంలోకి మారేందుకు అధికారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ భవన ఆవరణ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. లక్షల వ్యయంతో నిర్మించిన భవనం ఇలా అలంకారప్రాయంగా మారింది.కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లే దారిలో ఉన్న ఎకై ్సజ్ సీఐ కార్యాలయం ఇది. ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంది. అలాంటప్పుడు అధికారులు ఈ ఆఫీసును కొత్త భవనంలోకి మార్చేందుకు అన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అయితే పెచ్చులూడి పడిపోయే భవనాన్ని సొంత నిధులతో రిపేర్ చేయిస్తున్నారు తప్పితే కొత్త భవనంలోకి మారేందుకు యత్నించకపోవడం గమనార్హం. -
‘భూభారతి’తో సమస్యలు పరిష్కారం
● కలెక్టర్ రాజర్షిషా ● దస్నాపూర్లో రెవెన్యూ సదస్సుఇంద్రవెల్లి: భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలు పరిష్కరించుకోవచ్చని కలెక్టర్ రాజ ర్షిషా అన్నారు. మండలంలోని దస్నాపూర్లో ఏర్పా టు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సును ఉట్నూర్ సబ్కలెక్టర్ యువరాజ్ మర్మాట్తో కలిసి మంగళవారం సందర్శించారు. రైతులు సమర్పించిన దరఖాస్తులు, రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. స్వీ కరించిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను సత్వరం పరిష్కరించాలన్నారు. కాగా, గ్రామంలో తరచూ విద్యుత్ సరఫరా లో ఆటంకం ఏర్పడుతుందని, మిషన్ భగీరథ నీరు సైతం సరిగా రావడం లేదని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరి ష్కరించాలని ఆదేశించారు. అనంతరం మండలంలోని పిట్టబొంగరం గ్రామాన్ని సందర్శించారు. అ మరవీరుల కుటుంబాలతో పాటు ఇతర లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం,డిప్యూటీతహసీల్దార్ రమేశ్, వైద్యు డుప్రతాప్నాయక్, అధికారులు తదితరులున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపర్చాలి●కై లాస్నగర్: గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపర్చాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్–2025 కార్యక్రమంలో భా గంగా కలెక్టర్ సమావేశ మందిరంలో అధికారులకు మంగళవారం దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పారి శుధ్య నిర్వహణ స్థితిని అంచనా వేయడంతో పాటు మరింత మెరుగుపర్చడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. గ్రామీణా భివృద్ధి లక్ష్యాలు సాధించడంలో పంచాయతీల పురోగతిపై సమీక్షించారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్కుమార్, సంబంధిత జిల్లా, మండలాల అధికారులు పాల్గొన్నారు. -
● ఎకై ్సజ్ సర్కిల్ నూతన భవనంలోకి మార్పునకు వెనుకంజ ● నిత్యం బాస్ దృష్టిలో ఉంటామనే కారణమా..? ● శిథిలావస్థలో ప్రస్తుత కార్యాలయం ● లక్షలు వెచ్చించినా అలంకారప్రాయంగానే..
సాక్షి,ఆదిలాబాద్: సాధారణంగా శిథిలావస్థలో కొనసాగుతున్న కార్యాలయానికి నూతన భవ నం నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చిందంటే ఎగిరి గంతేసి అందులోకి మారుతారు. అయితే జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయం ఇందుకు విరుద్ధంగా ఉంది. వారు అస్సలు శిథిలావస్థలో ఉన్న భవనాన్ని విడిచి కొత్త భవనంలోకి వెళ్లాలనే ఆలోచననే చేయట్లేదు. అదేమని ఎవరైనా అడిగితే.. అందులో వాస్తు లే దని దాటవేస్తున్నారు. అలాంటప్పుడు ముందుగా అన్ని చూసి నిర్మాణం చేయలేదా.. అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాకుండా కాంట్రాక్టర్ ఆ భవనాన్ని హ్యాండోవర్ చేయలేదని అధికారులు చెబుతుండగా, కాంట్రాక్టర్ మాత్రం అధికారులే చేసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అసలు లోగుట్టు ఇది.. దీని లోగుట్టు మరోలా ఉంది. ఎకై ్సజ్ జిల్లా అధికారి కార్యాలయం పక్కనే సీఐ కార్యాలయం భవనం ఉండడంతో నిరంతరం జిల్లా అధికారి కంట్లో ఉంటామనే భావనతోనే ఈ కార్యాలయాన్ని అందులోకి మార్చడం లేదనే ప్రచారం ఉంది. కలెక్టర్, జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలకు వెళ్లే దారిలో జిల్లా ఎకై ్సజ్ అధికారి కార్యాలయం రోడ్డు పక్కనే ఉంటుంది. దాని పక్కనే ఎకై ్సజ్ సర్కిల్ ఆఫీస్ కోసం నాలుగేళ్ల క్రితం మంజూరు లభించింది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయాలకు నిధులు మంజూరు చేస్తూ సొంత స్థలంలో కొత్త భవనాల నిర్మాణానికి ఆ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంచిర్యాల, లక్సెట్టిపేట, ఆదిలాబాద్లలో ఒకేసారి భవన నిర్మాణాలు ప్రారంభమయ్యా యి. ఆ రెండుచోట్ల సర్కిల్ కార్యాలయాలను కొత్త భవనాల్లోకి షిఫ్ట్ కూడా అయ్యాయి. ఆదిలా బాద్లో మాత్రం కొత్త భవనంలోకి వెళ్లేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. మరో వైపు నూతన భవనం సాయంత్రం అయిందంటే చా లు అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డాగా మా రిందనే విమర్శలున్నాయి. హ్యాండోవర్ చేయలేదు భవన నిర్మాణం పూర్తయినప్పటికీ ఇప్పటివరకు కాంట్రాక్టర్ మాకు హ్యాండోవర్ చేయలేదు. అందులో కరెంటు, వాటర్ సదుపాయాలు కూడా లే వు. అన్ని పనులు పూర్తి చేసి భవనాన్ని మార్పు చేస్తాం. – హిమశ్రీ, జిల్లా ఎకై ్సజ్ అధికారి -
పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ పూర్తి
● 500 మంది ఓటర్లకు ఒక కేంద్రం ● వార్డు పరిధిలోని ఓటర్లంతా ఒకే చోట ఓటు వేసేలా చర్యలు ● ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్న యంత్రాంగం కై లాస్నగర్: జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో యంత్రాంగం అందుకు అవసరమైన కసరత్తు చేపట్టింది. పోలింగ్కేంద్రాలు, సిబ్బందిని ఇప్పటికే గుర్తించిన అధికారులు, తాజాగా ఓటర్ల సంఖ్యకనుగుణంగా ఆయా కేంద్రాల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తిచేశారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకునేలా 500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రాల వారీగా రూట్లను ఎంపిక చేయడంలో నిమగ్నమయ్యారు. ఎన్నికల సంఘం ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసినా ఒకే విడతలో పూర్తిచేసేలా సంసిద్ధమవుతున్నారు. వందశాతం పోలింగ్ సాగేలా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. ఒక్క ఓటు అభ్యర్థుల తలరాతలను మార్చనుంది. దీంతో ప్రతీ ఓటరు ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్కేంద్రాల మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టారు. 2023 డిసెంబర్లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా అనుసరించి గ్రామం, వార్డులు, ఎంపీటీసీ స్థానం వారీగా కేంద్రాలను సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 4,51,744 మంది పరిషత్ ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 2,31,068 మంది, పురుష ఓటర్లు 2,20,619 మంది, ఇతరులు 17మంది ఉన్నారు. ఇందులో 500మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఒక వార్డు పరిధిలోని ఓటర్లంతా అదే వార్డులో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఓటు వేసేలా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో 875 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు వాటి పరిధిలోని ఓటర్లందరినీ ఎంపీటీసీ స్థానాలకనుగుణంగా మ్యాపింగ్ చేశారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీల వారీగా కూడా ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తి కావడంతో ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ సిబ్బందిని మ్యాపింగ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. మల్లాపూర్ ఇంద్రవెల్లిలోనే.. మండలాల పునర్విభజనలో భాగంగా సిరికొండ మండలంలో చేర్చిన మల్లాపూర్ గ్రామాన్ని ప్రభుత్వం తిరిగి ఇంద్రవెల్లి మండలంలోనే విలీనం చేసింది. అయితే ఆ మండలంలో కొనసాగేందుకు అక్కడి ప్రజలు విముఖత వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్తో పాటు ఇన్చార్జి మంత్రిగా ఉన్న సీతక్కకు పలుమార్లు కలిసి వారు విన్నవించారు. ఈ మేరకు స్పందించిన ప్రభుత్వం మల్లాపూర్ను యథావిధిగా ఇంద్రవెల్లి మండలంలో విలీనం చేయాలని ఆదేశించింది. దీంతో మల్లాపూర్ పంచాయతీతో పాటు దాని పరిధిలోని నిజాంగూడ, ధర్మసాగర్ హ్యాబిటేషన్లను సైతం ఇంద్రవెల్లిలోనే చేర్చారు. ప్రస్తుతం ఆయా మండలాల్లోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీల సంఖ్యకనుగుణంగా పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ ప్రక్రియను అధికారులు చేపట్టారు. సిరికొండ, ఇంద్రవెల్లి ఎంపీడీవోల నుంచి అందుకు సంబంధించిన వివరాలు సేకరించారు. ఈ ప్రక్రియ తుది దశకు చేరినట్లుగా సమాచారం. పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ ప్రక్రియతో సిరకొండ మండలంలో ఓ ఎంపీటీసీ స్థానం తగ్గనుండగా, ఇంద్రవెల్లిలో మరో స్థానం పెరుగనుంది. జిల్లాలో.. గ్రామీణ మండలాలు : 20 ఎంపీటీసీ స్థానాలు : 166 జెడ్పీటీసీ స్థానాలు : 20 పోలింగ్ కేంద్రాలు : 875 ఓటర్లు : 4,51,704 -
దివ్యాంగ పిల్లల్లో రెండింతల మేధస్సు
ఆదిలాబాద్టౌన్: దివ్యాంగ పిల్లల్లో మేధ స్సు రెండింతలు ఉంటుందని డీఈవో శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాలికా విద్యా, విలీన విద్యా ది నోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని భవిత రిసోర్స్ సెంటర్లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు. వైకల్యం గల పిల్లలను చిన్నచూపు చూడొద్దన్నారు. వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చి విద్యాబుద్ధులు నేర్పించాలని సూచించారు. అనంతరం వారికి అక్షరభ్యాసం చేయించారు. కా ర్యక్రమంలో ఆదిలాబాద్అర్బన్ ఎంఈవో సో మయ్య, డైట్కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ కిరణ్కుమార్, సెక్టోరియల్ అధికా రులు సుజాత్ఖాన్, తిరుపతి, శ్రీకాంత్,కాంప్లెక్స్ ప్రధానో పాధ్యాయుడు లచ్చిరాం, ఎన్జీవో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతు నేస్తం.. సాగుకు హస్తం
● ప్రతీ మంగళవారం కార్యక్రమం ● సమస్యలను దృష్టికి తేనున్న రైతులు ● సలహాలు, సూచనలు ఇవ్వనున్న అధికారులు ఆదిలాబాద్అర్బన్: సాగులో అన్నదాతల సమస్యలు ఇట్టే పరిష్కారం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమం దోహదపడనుంది. రైతులు తమ సమస్యలు, సందేహాలను ప్రతీ వారం అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చు. ఇప్పటికే ఈ సేవలు అందుబాటులో ఉండగా మరింత విస్తరించేలా చర్యలు చేపట్టింది. జిల్లాలో మరో 32 చోట్ల రైతు నేస్తం యూనిట్లను సోమవారం ప్రారంభించింది. గతంలో ఉన్న వాటితో కలుపుకొని ప్రస్తుతం 49 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతీ వారం రైతునేస్తం.. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయా రైతు వేదికల్లో ప్రతీ మంగళవారం ఉదయం 10నుంచిమధ్యాహ్నం 12 వరకు వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది. ఆ సీజన్లో రైతులకు తలెత్తిన సమస్యలను నేరుగా తెలుసుకొని వాటిని పరిష్కరించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో రైతులతో పాటు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, టెక్నికల్, వ్య వసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొంటారు. సాగులో ఏ చిన్న సమస్య ఎదురైనా రైతులు ఇందులో దృష్టికి తీసుకువస్తే సత్వర పరిష్కారం లభించనుంది. 49 చోట్ల అందుబాటులోకి.. జిల్లాలో రైతు నేస్తం కార్యక్రమాలు 2024 ఫిబ్రవరి నుంచి మొదలయ్యాయి. మొదట నాలుగు షురూ కాగా, ప్రస్తుతం 49 చోట్ల అందుబాటులోకి వచ్చా యి. తొలి విడతలో నియోజకవర్గంలో మండలానికి ఒకటి చొప్పున సదుపాయం కల్పించారు. రెండో విడతలో మండలానికి రెండు చొప్పున ఆయా రైతు వేదికల్లో సదుపాయాలు ఉండాలని వీసీ యూనిట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మండలానికి మూడు చొప్పున ఉండాలని కొత్తగా 32 యూనిట్లు ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్క ఊరికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒక రైతు వేదికలో 120 మంది రైతులు కూర్చునేందుకు సదుపాయం ఉండగా, అంతకన్నా ఎక్కువ మంది వస్తే ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అయితే రైతునేస్తం సదుపాయం ఉన్న ఊరి రైతులే కాకుండా పక్క ఊళ్ల రైతులు కూడా రావడంతో అందులోనే సర్దుకుపోయిన సందర్భాలు లేకపోలేదు. జిల్లాలో.. రైతు వేదికలు : 101 రైతునేస్తం కొనసాగుతున్నవి: 17 కొత్తగా ప్రారంభించినవి : 32 సదుపాయం లేనివి : 52 సాగు సమస్యలు పరిష్కారం రైతు నేస్తంతో సాగులో తలెత్తే సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించుకోవచ్చు. అధికారులే కాకుండా అనుభవజ్ఞులు, సీనియర్లు పాల్గొంటారు. రైతునేస్తం సమస్యల పరిష్కారానికి మంచి వేదిక. రైతులు సైతం తమ అనుభవాలు పంచుకోవచ్చు. – శ్రీధర్ స్వామి, జిల్లా వ్యవసాయాధికారి -
● మితిమీరుతున్న ‘ప్రైవేట్’ ఆగడాలు ● బడిలోనే నోట్బుక్లు, యూనిఫాం విక్రయాలు ● ఇష్టారీతిన ధరలు ● లబోదిబోమంటున్న తల్లిదండ్రులు ● చర్యలకు వెనుకాడుతున్న విద్యాశాఖ
ఆదిలాబాద్టౌన్: ప్రస్తుతం విద్య వ్యాపారంగా మా రింది. రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవే ట్ యాజమాన్యాలు అవి చాలవన్నట్టుగా బడులను ఏకంగా సూపర్ మార్కెట్లను తలపించేలా చేస్తున్నా యి. అక్కడే నోట్బుక్లు, పాఠ్యపుస్తకాలు, బెల్టు, టై, షూ, వంటివి అధిక ధరలకు విక్రయిస్తూ అంది నకాడికి దండుకుంటున్నారు. కొన్ని యాజమాన్యాలు వారు చెప్పిన చోటనే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులకు హు కుం జారీ చేస్తున్నారు. చీటీలు రాసిచ్చి ఫలానా బుక్సెంటర్, బట్టల షాపు, షూ దుకాణాల్లో నే కొనుగోలు చేయాలని చెబుతున్నారు. కమీషన్ల కోసం తల్లి దండ్రుల జేబులకు చిల్లు పెడుతున్నారు. నిబంధన ల ప్రకారం విద్యా సంస్థల్లో చదువు తప్పితే ఎలాంటి వస్తువులు విక్రయించరాదు. విద్యాశాఖ అధికా రుల పర్యవేక్షణ లోపం, అలసత్వాన్ని ఆసరాగా చేసుకొని కొన్ని యాజమాన్యాలు తమవ్యాపారాన్ని సాఫీగా కానిచ్చేస్తున్నాయి. మితిమీరుతున్న ప్రైవేట్ ఆగడాలు.. జిల్లాలో 162 ప్రైవేట్, రెండు ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 48,931 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో కొన్నింటి ఆగడాలు మి తిమీరుతున్నాయి. తల్లిదండ్రుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని అందినకాడికి దండుకుంటున్నాయి. ఇష్టానుసారంగా ఫీజుల వసూలుతో పాటు నిబంధనలకు విరుద్ధంగా బడిలోనే అన్ని విక్రయిస్తున్నారు. నియంత్రించాల్సిన విద్యాశాఖ ‘మామూలు’గా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. సూపర్ మార్కెట్ను తలపించేలా.. పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. జిల్లాలోని చాలా ప్రైవేట్ పాఠశాలలు సూపర్ మార్కెట్లను తలపిస్తున్నాయి. ఇటీవల ఓ ప్రైవేట్ పాఠశాలలో నిల్వ ఉంచిన నోట్బుక్లను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. ఫిర్యాదు చేస్తే తప్పా తనిఖీలు చేపట్టడం లేదు. దాదాపు అన్ని పాఠశాలల్లో ఈ దందా సాగుతున్నా అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నామ్కే వాస్తేగా సీజ్ చేయడం, తర్వాత వారితో మిలాఖతై జేబులు నింపుకుంటున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా స్పందించి జిల్లా వ్యాప్తంగా ఆయా పాఠశాలల్లో తనిఖీలు చేపట్టడంతో పాటు ఫీజులు సైతం నియంత్రించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలల్లో విక్రయాలు చేపట్టొద్దుప్రైవేట్ పాఠశాలల్లో నోట్ బుక్లు, పాఠ్య పుస్తకాలు, టై, బెల్టు, షూ వంటి వస్తువులు విక్రయించరాదు. నిబంధనలను విరుద్ధంగా వ్యవహరించే వాటిపై చర్యలు తీసుకుంటాం. ఎవరైనా వస్తువులు విక్రయిస్తున్నట్లు తెలిస్తే సమాచారం అందించాలి. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు నిల్వ ఉంచిన గోదాంను సోమవారం సీజ్ చేశాం. – శ్రీనివాస్రెడ్డి, డీఈవో -
ఉన్నత చదువా.. పట్నమే దారి!
● ఇప్పటికే చేజారిన గిరిజన వర్సిటీ ● ఉత్తర్వులకే పరిమితమైన ‘ఇంజినీరింగ్’ ● జిల్లాలో కానరాని పీజీ, ఫార్మా కళాశాలలు ● ఇబ్బందుల్లో విద్యార్థులు.. పట్టించుకోని పాలకులుఆదిలాబాద్టౌన్: ప్రతీ విద్యార్థి జీవితంలో రాణించాలంటే ఉన్నత చదువు ఎంతో అవసరం. ప్ర స్తుత పోటీ ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానంసై తం అందిపుచ్చుకోవాలి. అయితే అక్షర క్రమంలో ముందున్న ఆదిలాబాద్ జిల్లాలో అందుకు అవసరమైన అవకాశాలు కానరాని పరిస్థితి. వనరులు న్నాసంబంధిత విద్యాసంస్థలు నెలకొల్పడం లేదు. పీజీ, ఇంజినీరింగ్, ఫార్మా, ఎంబీఏ,ఎంసీఏ వంటి కోర్సుల్లో విద్యను అభ్యసించాలంటే హైదరాబా ద్, వరంగల్ తదితర నగరాలకు వెళ్లాల్సిన దుస్థితి. ఈ క్రమంలో చాలామంది పేద విద్యార్థులు డిగ్రీకే పరిమితమవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్రం జిల్లాకు గిరిజన యూనివర్సిటీని మంజూ రు చేసింది. అయితే జిల్లా పాలకుల పట్టింపులేమి, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వెరసీ ఆ వర్సిటీ ఉమ్మడి వరంగల్కు తరలిపోయింది. ఇలా ఈప్రాంతానికి విద్యాపరంగా తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉంది. గళమెత్తాల్సిన పాలకులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఉన్నత చదువులకు దూరం.. రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో యూనివర్సిటీలు ఉండగా ఆదిలాబాద్లో మాత్రం కానరాని పరి స్థితి. జిల్లాలో కేవలం రిమ్స్, అగ్రికల్చర్ బీఎస్సీ కళాశాలలు మాత్రమే ఉన్నాయి. గతంలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల ఉండగా అది హైదరాబాద్ కు తరలిపోయింది.జిల్లాకేంద్రంలో ప్రభుత్వడీఎడ్ కళాశాల ఉన్నా అందులో కేవలం ఇద్దరు రెగ్యులర్ లెక్చరర్లు మాత్రమే ఉన్నారు. వారికి కూడా ఇతర జిల్లాల్లో డీఈవోలుగా అదనపు బాధ్యతలు ఉండ డం గమనార్హం. బీఎడ్ విషయానికి వస్తే రెండు ప్రైవేట్ కళాశాలలు మాత్రమే ఉన్నాయి. ఇంటర్ పూర్తి చేసినవారికి ఇంజినీరింగ్ చదవాలంటే ఇతర జిల్లాలకు వెళ్లాల్సిందే. ఈ క్రమంలో మంచి ర్యాంకులు వచ్చిన వారు సైతం ఆర్థిక పరిస్థితులు సరి గా లేని కారణంగా చదువుకోలేకపోతున్నారు. ఇంజినీరింగ్ కళాశాల ఊసేది.. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చిన సందర్భంలో ఈ ప్రాంతంలో ఇంజినీరింగ్ కళాశాల మంజూరుచేస్తూ ఉత్తర్వులు జా రీచేశారు. ఆదిలాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఉన్నతీకరిస్తూ ఇక్కడే తరగతులు నిర్వహిస్తారని ప్రకటించారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వం మారింది. ప్రస్తుతం ఆ అంశం అటకెక్కింది. పీజీ కూడా లేదాయే.. డిగ్రీ పూర్తయిన తర్వాత జిల్లా విద్యార్థులు పోస్టు గ్రాడ్యూయేట్ చేయలేని దుస్థితి. ఏటా వేలాది మంది డిగ్రీ కోర్సు పూర్తి చేసిన తర్వాత పీజీ ఎంట్రెన్స్ రాస్తున్నారు. అయితే జిల్లాలో పీజీ కళాశాల లేకపోవడంతో హైదరాబాద్, వరంగల్కు వెళ్లి ఉన్నత చదువులు చదవాల్సిన పరిస్థితి. ఆదిలా బాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో బాటనీ, జువాలజి, ఆర్ట్స్ డిగ్రీ కళాశాలో ఎకనామిక్స్ పీజీ కోర్సులు మాత్రమే ఉన్నాయి. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ద్వారా కేవలం ఆర్ట్స్కు సంబంధించిన పీజీ కోర్సులు ఉండడంతో చాలా మంది సైన్స్ విద్యార్థులు డిగ్రీకే పరిమితం అవుతున్నారు. యూనివర్సిటీ మంజూరు చేయాలి జిల్లాలో యూనివర్సిటీ మంజూరు చేస్తేనే విద్యాపరంగా అభివృద్ధి సాధ్యపడుతుంది. ప్రస్తుతం చాలామంది విద్యార్థులు డిగ్రీ తర్వాత ఉన్నత చదువులు కొనసాగించలేకపోతున్నారు. అలాగే బ్యాంకింగ్, ఆర్ఆర్బీ, ఇన్సూరెన్స్ తదితర కొలువుల కోసం ప్రత్యేకంగా శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలి. – సంతోష్కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రభుత్వ సైన్స్ కళాశాల గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలి జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. గతంలో జిల్లాకు కేటాయించినా వరంగల్కు తరలిపోయింది. పాలకుల నిర్లక్ష్యంతో విద్యార్థులకు నష్టం వాటిల్లుతుంది. గత ప్రభుత్వం ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేసినా ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో గిరిజన యువత ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. – గణేశ్, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి -
● మారనున్న జెడ్పీ స్వరూపం ● ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి ● జిల్లాలో పెరగనున్న జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ● రిజర్వేషన్లపై వీడని ఉత్కంఠ ● ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం
కై లాస్నగర్: స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం తొలుత పరిషత్ ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెలాఖరులోపు షెడ్యూల్ విడుదల కానున్నట్లుగా రాష్ట్రమంత్రులు ప్రకటించడంతోఆశావహుల్లో జోష్ మొదలైంది. ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో పల్లెల్లో ఎన్నికల వాతా వరణం నెలకొంది. అయితే ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికలను పాత రిజర్వేషన్ల ప్రకారం నిర్వహిస్తుందా లేక కొత్తగా ప్రకటిస్తుందా అనేదానిపై ఉత్కంఠ మాత్రం వీడటం లేదు. మరోవైపు పరిషత్ ఎన్నికల నిర్వహణతో జెడ్పీ స్వరూపం మారనుంది. మండలాల పునర్విభజనతో కొత్తగా పలు ఎంపీటీసీ స్థానాలు ఏర్పడగా, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు అదనంగా పెరిగాయి. ఈ క్రమంలో ఆయా స్థానాల రిజర్వేషన్లు అనివార్యం కానున్నాయనే అభిప్రాయం వ్యక్తమతుంది. దీంతో ఏ మండలానికి ఏ రిజర్వేషన్ వస్తుందోననే ఆందోళన ఆశావహుల్లో వ్యక్తమవుతుంది. పెరిగిన స్థానాలు ... జిల్లాలో గ్రామీణ మండలాలు గతంలో 17 ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో మూడు కొత్తగా ఏర్పాటు చేసింది. బోథ్మండలాన్ని పునర్విభజన చేసి సొనా ల మండలంను, జైనథ్ను విభజించి సాత్నాల, భో రజ్ మండలాలను ఏర్పాటు చేశారు. బేల, ఆదిలా బాద్ రూరల్ మండలాల్లోని పలు గ్రామాలను ఆ యా మండలాల పరిధిలోకిచేర్చారు. దీంతో ఆయా మండలాలకు జెడ్పీటీసీ, ఎంపీపీలు ఎన్నికయ్యే అవకాశముంది. కాగా ఆయా మండల్లాలోని గ్రామ పంచాయతీల సంఖ్యకు అనుగుణంగా ఎంపీటీసీ స్థానాలను సైతం పునర్విభజన చేశారు. జిల్లాలో గతంలో 158 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, పునర్విభజనతో 11 మండల ప్రాదేశిక నియోజకవర్గ స్థానాల ను అదనంగా పెంచారు. దీంతో ఈ సంఖ్య ప్రస్తు తం 169కి చేరింది. మావల మండలంలో రెండు, ఉట్నూర్ గ్రామ పంచాయతీలో నాలుగు స్థానాలను పెంచగా పునర్విభజన జరిగిన మండలాల్లో సొనాల, భోరజ్, సాత్నాల మండలాల్లో మరో ఐదు స్థానాలు పెంచారు. తద్వారా మండల సర్వసభ్య సమావేఽశాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. గ్రామాల్లో ఎలక్షన్ ఫీవర్ స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ నెలాఖరులోగా ఎప్పుడైనా షెడ్యూల్ రావచ్చంటూ మంత్రులు సీతక్క, పొంగులేని చేసిన ప్రకటనలు ఆశావహుల్లో జోష్ నింపింది. పోటీకి సై అంటున్న వారు గ్రామాల్లోని ఓటర్ల ను మచ్చిక చేసుకునేపనిలో నిమగ్నమయ్యారు. ప్రతి ఒక్కరిని అప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలపై ఆరా తీస్తున్నారు. ఎలాంటి శుభకార్యాలైనా అక్కడ వాలిపోతున్నారు. ఇక గ్రామంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు ముగిసే వరకు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరోసారి వారింటికెళ్లి పరామర్శిస్తున్నారు. మరికొంత మంది ఆశావహులు గ్రామ సమస్యలపై స్థానికులతో వెళ్లి కలెక్టర్, అధికారులను కలుస్తున్నారు. పరిష్కరించాలని కోరుతున్నారు. దీంతో పల్లెల్లో ప్రస్తుతం ఎటు చూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది.జెడ్పీ స్వరూపం ఇలా.. జిల్లాలో.. మండలాలు : 20 ఎంపీటీసీ స్థానాలు : 169 (కొత్తవి 11 ) జెడ్పీటీసీ స్థానాలు : 20 (కొత్తవి 3 ) గతంలో 17 మండలాలుండగా 17 మంది చొప్పు న జెడ్పీటీసీలు, ఎంపీపీలు సభ్యులుగా ఉండేవా రు. ఇందులో నుంచే ఒకరిని చైర్మన్, మరొకరిని వైస్ చైర్మన్గా ఎన్నుకున్నారు. త్వరలో నిర్వహించనున్న పరిషత్ ఎన్నికల్లో ఈ సంఖ్య 20కి చేరనుంది. కొత్తగా మరో ముగ్గురు జెడ్పీటీసీలు, ముగ్గురు ఎంపీపీలు జిల్లా పరిషత్లోకి అడుగుపె ట్టనున్నారు. మండలాల సంఖ్య పెరగడం, గ్రా మ పంచాయతీలు, అక్కడి జనాభాకనుగుణంగా ఎంపీటీసీల పునర్విభజన జరగడంతో ఆయా సా ్థనాల రిజర్వేషన్లు మారనున్నాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. అయితే ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఎ న్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించింది. అదే జరిగితే బీసీలకు కలిసోచ్చే అవకాశం ఏర్పడి సభలో వారి సంఖ్య పెరిగే అవకాశముంటుంది. అయితే ఇప్పటికప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యం కాకపోవచ్చని పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరిగే అవకాశముందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ప్ర భుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. -
‘ఆదివాసీలపై దాడులు సరికాదు’
ఆదిలాబాద్రూరల్: ఆదివాసీలపై అటవీశాఖ అధికారుల దాడులను ఖండిస్తున్నామని తుడుందెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గోడం గణేశ్ అన్నారు. మావల మండలం బట్టిసావర్గాం శివారులోని కుమురంభీం గూడలో సోమవారం ఆయన మాట్లాడారు. ఆదివాసీలు సాగు చేస్తున్న వ్యవసాయ భూముల్లో అటవీ అధికారులు మొక్కలు నాటడం, కందకాలు తవ్వడం వంటి చర్యలు సరికాదన్నారు. ఏటూరునాగారం మండలంలోని అటవీశాఖ పరిధిలో ఆదివాసీలు నివసిస్తున్న గుడిసెలను తొలగించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోనూ అటవీ అధికారుల దాడులు పెరిగాయన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించాలని, లేకుంటే తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోజ్, విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వరుణ్, డివిజన్ అధ్యక్షులు గణపతి, తదితరులున్నారు. -
రైతుకు భరోసా..
● బ్యాంకు ఖాతాల్లో నిధుల జమ ● ఈసారి ఎకరాలతో సంబంధం లేకుండా లబ్ధి ● అన్నదాతల్లో ఆనందం రైతుల వివరాలు.. మండలం గ్రామాలు పట్టా రైతులు ఆదిలాబాద్రూరల్ 44 11,467ఆదిలాబాద్అర్బన్ 03 502 బజార్హత్నూర్ 41 10,692 బేల 53 11,530 భీంపూర్ 23 8,741 భోరజ్ 28 6,992 బోథ్ 42 11,294గాదిగూడ 61 7,737 గుడిహత్నూర్ 29 7,865 ఇచ్చోడ 44 10,985 ఇంద్రవెల్లి 47 9,359 జైనథ్ 26 9,853 మావల 06 1,019 నార్నూర్ 40 7,060 నేరడిగొండ 58 11,377 సాత్నాల 12 3,206 సిరికొండ 26 5,943 సొనాల 10 3,707 తలమడుగు 33 11,503 తాంసి 12 6,023 ఉట్నూర్ 58 11,383 మొత్తం 696 1,68,238ఆదిలాబాద్టౌన్: వానాకాలం పెట్టుబడి సాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను సోమవారం విడుదల చేసింది. అయితే ఈసారి ఎకరాలతో సంబంధం లేకుండా రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తోంది. దీంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతుంది. మొదటి విడతగా రెండెకరాల్లోపు రైతులకు అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయి. మిగతా రైతులకు వారంలోగా జమ అయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 1,68,238 మంది రైతులు ఉన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.342 కోట్ల 30లక్షల 71వేల 305 విడుదల చేసింది. ఆయా మండలాల ఏఈవోలు 1,61,775 అకౌంట్లను అప్గ్రేడ్ చేశారు. కాగా 1,61,552 అకౌంట్లను మండల వ్యవసాయ అధికారులు పరిశీలించారు. 1,10,647 మంది రైతులకు సంబంధించిన అకౌంట్లను ట్రెజరీ అధికారులకు పంపించారు. ఇందుకు గాను రూ.148కోట్ల 41లక్షల 307 రైతుల అకౌంట్లో జమకానున్నాయి. తొలివిడతగా సోమవారం సాయంత్రం రెండెకరాల లోపు రైతుల అకౌంట్లలో జమ అయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఎకరానికి రూ.6వేల చొప్పున పెట్టుబడి సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు పెట్టుబడి సాయం మూడోసారి విడుదల చేసింది. గత యాసంగిలో జిల్లాలో 96,682 మంది రైతులకు రూ.124.50 కోట్ల నిధులను రైతుల అకౌంట్లలో జమ చేసింది. అయితే గతంలో పూర్తిస్థాయిలో రైతులకు రైతు భరోసా జమ కాలేదు. నాలుగు ఎకరాల్లోపు మాత్రమే నిధులు జమైనట్లుగా చెబుతున్నారు. ఈసారి ఎకరాలతో సంబంధం లేకుండా రైతులందరికీ ఈ పథకాన్ని అమలు చేస్తుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాగు సమయంలో నిధులు ఖాతాల్లోకి చేరడంతో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఉపయోగపడుతుండటంపై రైతుల్లో సంతోషం వ్యక్తమవుతుంది. కాగా, కొత్త రైతులకు సంబంధించి ఈనెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో రైతులు : 1,68,238 రైతు భరోసా నిధులు :రూ.342.30 కోట్లు -
సమస్యల పరిష్కారానికి చర్యలు
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ అఖిల్ మ హాజన్ అన్నారు. స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు విని వెంటనే సంబంధిత పోలీ సు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వారం 54 అర్జీలు అందినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికా రిని జైస్వాల్ కవిత, సిబ్బంది వామన్ తదితరులు పాల్గొన్నారు.