Adilabad
-
నేషనల్ టాలెంట్ హంట్ పోస్టర్ విడుదల
కై లాస్నగర్: కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందని డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ అన్నారు. టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్స్ టీమ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న నేషనల్ టాలెంట్ హంట్ కార్యక్రమ ప్రచార పోస్టర్లను జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతలో ఉన్న ప్రతిభను వెలికితీసి, కాంగ్రెస్ పార్టీ మీడియా, కమ్యూనికేషన్స్ విభాగంలో సేవలందించేందుకు ఈ నేషనల్ టాలెంట్ హంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మీడియా ప్రతినిధులు, పబ్లిసిటీ కోఆర్డినేటర్లు, రీసెర్చ్ టీమ్ సభ్యులుగా పనిచేయాలనే ఆసక్తి ఉన్న యువత @tpccmc. in వెబ్సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. -
దరఖాస్తులు 80 వేలు.. ఇళ్లు 3,700
కై లాస్నగర్: జిల్లాలో ఇందిరమ్మ రెండోవిడత ఇళ్లకు తీవ్ర పోటీ నెలకొంది. మంజూరైన ఇళ్ల సంఖ్య గొరంత కాగా.. అర్హులైన వారి సంఖ్య కొండంతగా ఉంది. దీంతో ఇల్లు ఎవరికి దక్కుతుందనే దానిపై దరఖాస్తుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు లబ్ధిదారుల ఎంపిక అధికారులకు సవాలుగా మారనుంది. గుడిసెలో నివసిస్తున్న వారికి మాత్రమే మంజూరు చేయాలనే ప్రభుత్వ నిర్ణయంతో అర్హుల గుర్తింపుపై అధికారులు ఫోకస్ పెంచారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఈ నెలాఖరులోపు ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు పేర్కొంటున్నారు. నియోజకవర్గానికి 1500 చొప్పున.. రెండో విడతలో ఒక్కో నియోజకవర్గానికి 1500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. ఈ లెక్కన ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలకు కలిపి 3వేల ఇళ్లు మంజూరయ్యాయి. పాక్షికంగా ఉన్న ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాలకు మరో 786 ఇండ్లను మంజూరు చేసింది. వీటిని ఆయా మండలాల్లో అందిన ఎల్–1 దరఖాస్తుల సంఖ్యకనుగుణంగా కేటాయించారు. అదే ప్రతిపాదికన గ్రామాల వారీగా కూడా కేటాయింపులు పూర్తి చేసిన హౌసింగ్ అధికారులు కలెక్టర్ రాజర్షి షా ఆమోదం కోసం పంపించారు. అయితే ఈ కేటాయింపుల్లో ఒక్కో గ్రామానికి 5నుంచి 15, జిల్లా కేంద్రంలోని ఒక్కో వార్డుకు 12 నుంచి 13 ఇళ్లు ఎల్1 దరఖాస్తుల సంఖ్యకనుగుణంగా వచ్చే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. లబ్ధిదారుల ఎంపిక సవాలే.. తొలి విడతలో జిల్లావ్యాప్తంగా 16వేల ఇళ్లు మంజూరయ్యాయి. ప్రజల నుంచి అంతగా పోటీ లేకపోవడంతో ఈ విడతలో అర్హులైనవారితో పాటు రాజకీయంగా పలుకుబడి కలిగిన వారికి ఇళ్లు మంజూరయాయి. వాటి నిర్మాణాలు ముమ్మరంగా సాగుతుండటం, బిల్లులు సైతం వెంటవెంటనే వస్తుండటంతో ఈ విడతలో డిమాండ్ ఏర్పడింది. అలాగే ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్లోనూ వందలాది మంది దరఖాస్తులు అందజేయడం తీవ్రతకు అద్దం పడుతుంది. రెండో విడతలో కేవలం 3,786 ఇళ్లు మాత్రమే జిల్లాకు మంజూరయ్యాయి. అయితే జిల్లా వ్యాప్తంగా ఇంటి స్థలం కలిగి ఉండి ఇళ్లు లేనటువంటి వారి సంఖ్య (ఎల్–1 జాబితాలో) 80,123 మంది ఉన్నారు. వారంతా సొంతింటి కోసం గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో లబ్ధిదారుల ఎంపిక అధికారులు, ప్రజాప్రతినిధులకు సవాలుగా మారనుంది. తొలి విడతలో ఈ బాధ్యతను పూర్తిగా ఇందిరమ్మ కమిటీలకే అప్పగించారు. దీంతో అనర్హలకు సైతం పెద్ద ఎత్తున ఇళ్లు వచ్చాయనే విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ సారి కమిటీలు అర్హులైన పేర్లను సిఫారసు చేసినప్పటికీ ఎంపిక మాత్రం అధికారులకే అప్పగించారు. గుడిసెల్లో ఉన్న వారికే ప్రాధాన్యత .. ఈ విడతలో గుడిసెల్లో నివసించే వారినే ఎంపిక చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ గ్రామాల్లో అలాంటి వారు లేకపోవడంతో ఇంటి పైకప్పుగా తాడిపత్రి వేసుకుని, రేకుల షెడ్డులో నివసించే వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేసి వారికి తప్పనిసరిగా ఇళ్లను కేటాయించాలి. ఇ లాంటి వారి గుర్తింపు కోసం ఎంపిక చేసిన మండల స్థాయి గెజిటెడ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడుతున్నారు. వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నారు. అయితే లబ్ధిదారుల ఎంపిక గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో చేయనుండగా, మున్సిపల్లో కమిషనర్, వార్డు ఆఫీసర్లు చేపట్టనున్నారు. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక రెండో విడతలో జిల్లాకు 3786 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వాటిని మండలాలు, గ్రామాల వారీగా అందిన ఎల్–1 దరఖాస్తుల సంఖ్యకనుగుణంగా కేటాయించాం. ఈ విడతలో గుడిసెల్లో ఉన్న వారికే ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాంటి వారి గుర్తింపునకు సర్వే జరుగుతుంది. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తాం. కలెక్టర్ ద్వారా వారికి ప్రొసీడింగ్ పత్రాలు అందజేస్తాం. – రెడ్డి శంకర్, హౌసింగ్ పీడీ -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమశాతం పెరగనుంది. చదువుతో పాటు ఆటలు.. నాన్న హర్జి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. నేను కూడా హసన్పర్తి లోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి వరకు చదివాను. ఫాతి మా స్కూల్లో టెన్త్ పూర్తయింది. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుంది. మా గురువులు మాపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. చదువుతో పాటు ఆటపాటలు నేర్పించేవారు. అప్పుడు సెల్ఫోన్లు లేవు. జంక్ ఫుడ్ దొరికేది కాదు. బడి ముందర పండ్లు అమ్మేవారు. ఇప్పటికీ మా గురువులు కళ్లలో మెదులుతూనే ఉంటారు. వారంటే ఎనలేని అభిమానం. – డాక్టర్ సాధన, డీఎంహెచ్వో -
టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
ఆదిలాబాద్టౌన్: ప్రమోషన్లు పొందాలనుకునే సీని యర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించి, షరతులతో కూడిన పదోన్నతులు ఇ వ్వాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూక్యా రాజేశ్నాయక్ డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో ఆదివారం ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తీసుకువచ్చి సీని యర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. విద్యా హక్కు చట్టం అమలుకు ముందే అనేక మంది ఉపాధ్యాయులు అప్పటి నిబంధనల ప్రకారం ఉద్యోగాల్లో చేరారని, వారికి ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు వర్తింపజేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వేలాది మంది సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాం వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం కార్యవర్గ సభ్యులు, జిల్లా నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
బడి స్మృతులు..
సోమవారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2026హుషారుగా వెళ్లేవాడిని.. చిన్నతనంలో బడికి హుషారుగా వెళ్లేవాడిని. ఏ రోజు మారం చేయలేదు. అమ్మ అమిత్షా చిన్నతనంలోనే చదువు ప్రాధాన్యత, క్రమశిక్షణ నేర్పించారు. ఆ స్ఫూర్తితో ఉదయమే నిద్రలేచి ఉత్సాహంగా రెడీ అయ్యేవాడిని. పాఠశాలకు ఎప్పుడూ గైర్హాజరు కాలేదు. చిన్నతనం నుంచి సివిల్స్ వరకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినేవాడిని. హోంవర్క్ పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేసేవాడిని. బీహార్లోని శిశు మందిరంలో ఒకటి నుంచి రెండో తరగతి, మిథిల పబ్లిక్ స్కూల్లో మూడో నుంచి ఐదో తరగతి వరకు చదివాను. తర్వాత మా కుటుంబం రాజస్థాన్లోని జైపూర్కు రావడంతో అక్కడి మహేశ్వరీ పబ్లిక్ స్కూల్లో 6 నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదివాను. కాన్పూర్ ఐఐటీలో సివిల్ ఇంజినీరింగ్ బీటెక్ పూర్తి చేశాను. – రాజర్షిషా, కలెక్టర్ సర్కారు బడిలోనే చదివా.. నేను మొదటిరోజు బడికి సంతోషంగానే వెళ్లాను. మా ఇంటి దగ్గరే బడి ఉండేది. 1,2 తరగతులు బ్రాహ్మణవాడ ప్రా థమిక పాఠశాలలో చదివాను. ఆ తర్వాత 5,6 తరగతులు స్టేషన్ రోడ్లో, 7 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ బాలికల పాఠశాలలో పూర్తి చేశాను. ఇంటర్, డిగ్రీ ప్రభుత్వ కళాశాలల్లోనే పూర్తి చేశాను. గురువులు మాపై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. రోజూ క్రమం తప్పకుండా బడికి వెళ్లేదానిని. ఆటాపాటలతో విద్యాబోధన చేసేవారు. టీఎల్ఎం ఉపయోగించేవారు. – డి.మాధవి, డీఈవో బాల్యం తిరిగి రాదు.. పాఠశాలలు పునఃప్రారంభమైన మొదటిరోజే బ డికి వెళ్లేవాడిని. నేను జ మ్ముకశ్మీర్లోని లిటిల్ఫ్లవర్ పాఠశాలలో చ దివా ను. వేసవి సెలవుల్లో ఇంటివద్ద ఉండడంతో స్నేహితులతో కలిసే అవకాశం ఉండేది కాదు. పాఠశాలకు వెళితేనే ఫ్రెండ్స్తో సరదాగా ఉండేది. మా గురువులు మా పై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. నా ణ్యమైన బోధన చేసేవారు. వారంటే ఎనలేని అభిమానం. అలాగే బాల్యం తిరిగి రాదు. అదో మధుర జ్ఞాపకం. – అఖిల్ మహాజన్, ఎస్పీ కష్టపడి చదివారు.. ఉన్నతస్థాయికి ఎది గారు.. ప్రస్తుతం జిల్లా ఉన్నతాధికారులుగా కొనసాగుతున్నారు.. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో తమ బాల్యంలో బడి స్మృతులను ‘సాక్షి’తో మరోసారి గుర్తుకు చేసుకున్నారు. వారి మాటల్లోనే.. – ఆదిలాబాద్టౌన్ -
ఇసుక తోడేళ్లు మస్తూ..!
బేల మండలంలోని సాంగిడి వద్ద గల పెన్గంగ ఇది. నదిలో నీరు ఉన్నా ప్రతిరోజు ఇసుకను ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. గతంలో ఇక్కడ వేలం నిర్వహించిన వీడీసీ సభ్యులపై కేసులు సైతం నమోదయ్యాయి. అయినప్పటికీ అక్రమ దందా మాత్రం ఆగడంలేదు.ఆదిలాబాద్: పెన్గంగలో ఇసుకాసురులు మకాం వేశారు. నదిని నిత్యం జేసీబీలతో తోడేస్తున్నారు. సహజ సంపదను యథేచ్ఛగా తరలిస్తున్నారు. అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తుండడంతో వీరి అక్రమ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయిందనే విమర్శలున్నాయి. పరీవాహక ప్రాంతాల్లో.. జిల్లాలో పెన్గంగ పరీవాహక ప్రాంతాలైనా భీంపూర్ మండలంలోని వడూర్, అంతర్గాం, అర్లి టీ, గుబిడి, తాంసి కె, భోరజ్ మండలంలోని పెండల్వాడ, జైనథ్ మండలంలోని సాంగ్వి, ఆనందపూర్, బేల మండలంలోని కామ్గార్పూర్, సాంగిడి సమీపంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. నదిలో నీరు ఉన్నప్పటికీ జేసీబీలతో తవ్వుతూ ప్రతీ పది నిమిషాలకో టిప్పర్ నింపుతుండడం గమనార్హం. వీటిని సమీప ప్రాంతాలకు తరలిస్తూ డంపింగ్ చేస్తున్నారు. తర్వాత ఇతర ప్రాంతాలకు చేరవేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. టిప్పర్ ఇసుక ధర ప్రస్తుతం రూ.15వేల నుంచి రూ.20వేల వరకు పలుకుతోంది. ఇలా రోజుకు లక్షల్లో ఆదాయం సమకూరుతుండడంతో అక్రమార్కులు దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అనుమతుల పేరుతో అక్రమంగా.. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతి విధానాలను తీసుకువచ్చింది. ఆన్లైన్లో చలానా చెల్లిస్తే ట్రాక్టర్లో ఒక ట్రిప్పు తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. ఇక్కడే తతంగమంతా మారిపోతుంది. ట్రిప్పు కోసం అనుమతి తీసుకుంటున్న కొంతమంది స్థానిక అధికారులను మచ్చిక చేసుకొని అదనంగా ట్రిప్పులు కొడుతున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఇసుకను చౌకగా అందిస్తుండగా, దానిని సాకుగా చూపి మరికొందరు అక్రమ దందాకు తెరలేపుతున్నారు. మినహాయింపులతో ఇసుక తరలింపు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పెన్గంగ నుంచి ఇసుక తరలింపులో కొన్ని మినహాయింపులున్నాయి. ఇంద్రవెల్లి, గాదిగూడ మండలాలకు తరలింపు ఇబ్బందవుతుందని కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. టిప్పర్లలో కూడా తరలిస్తున్నారు. విషయం నా దృష్టిలో ఉంది. – రవీందర్, మైనింగ్, ఏడీ ఇది బేల మండలం కాంగార్పూర్ సమీపంలోని పెన్గంగ నది. ఇక్కడ నిత్యం జేసీబీలతో ఇసుకను తోడుతూ టిప్పర్లు, ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. సమీపంలోని తీర ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. -
రక్తదానానికి ముందుకు రావాలి
ఆదిలాబాద్టౌన్: స్వచ్ఛంద రక్తదానం కోసం యువత ముందుకు రావాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్వో సాధన అన్నా రు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రిమ్స్లో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ, రిమ్స్ బ్లడ్ బ్యాంక్లో రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయని, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరా రు.కార్యక్రమంలో పీవో డీటీటీ నరేందర్ రాథో డ్, అదనపు డీఎంహెచ్వో మనోహర్, యువజన సంఘాల నాయకులు బాలశంకర్ కృష్ణ, సిరాజ్, సతీష్రెడ్డి, శ్రీకాంత్, ప్రమోద్, గణేష్, ఠాకూర్ రాణాప్రతాప్ సింగ్, శశికాంత్, అజీజ్, శశికళ, అనిల్, రాజు, పరమేశ్వర్ పాల్గొన్నారు. -
ఇందిరమ్మ తుది బిల్లుకు ‘ఆవాస్’
కై లాస్నగర్: ఇందిరమ్మ ఇళ్ల తుది బిల్లు మంజూరుకు మార్గం సుగమం అవుతున్నట్లుగా తెలు స్తోంది. గృహ ప్రవేశాలు సైతం పూర్తయిన గ్రామీణ ప్రాంతానికి చెందిన పలువురు లబ్ధిదారులకు తుది బిల్లు చేతికందడం లేదు. దీంతో వారంతా ఎంపీడీవో, హౌసింగ్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇలాంటి వారి బిల్లుల చెల్లింపుల కోసం కేంద్రం కొత్తగా ఆవాస్సాఫ్ట్ పేరిట కొత్త యాప్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఇందిరమ్మ ఇంటి తుది బిల్లు జమ చేయనున్నట్లుగా హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ఈ యాప్ ద్వారా నగదు చెల్లింపులు షురు కానున్నట్లుగా పేర్కొంటున్నారు. తద్వారా లబ్ధిదారుల నిరీక్షణకు తెరపడే అవకాశముంది. చెల్లింపులు ఇలా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ పథకం కింద నిరుపేదలకు పెద్ద ఎత్తున ఇళ్లను మంజూరు చేస్తోంది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల చొప్పున నాలుగు విడతల్లో అందిస్తోంది. బెస్మెంట్ స్థాయిలో రూ.లక్ష, గోడలు నిర్మించాక రూ.లక్ష, రూఫ్ స్లాబ్ వేసిన తర్వాత రూ.2లక్షలు, ఇంటి ప్లాస్టరింగ్, కలరింగ్, విద్యుత్ వంటి వాటితో పూర్తయ్యాక మరో రూ.లక్ష చొప్పున విడుదల చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు రూ.5లక్షలు అందుతుండగా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి మాత్రం ఫైనల్ బిల్లు రావడం లేదు. కొందరికి రూ.1.60 లక్షలు రావాల్సి ఉండగా, మరికొందరికి రూ.2లక్షలు అందాల్సి ఉంది. ఇందులో రూ.12వేలు మరుగుదొడ్డి నిర్మాణానికి ఉపాధి హామీ నిధుల నుంచి అందిస్తున్నారు. అలాగే మరో రూ.27వేలను వంద రోజుల ఉపాధి పనుల కల్పన కింద పనులు జరిగినట్లుగా వారికి లెక్కకట్టి రూ.3వేల చొప్పున లబ్ధి దారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. మిగతా నిధులను పీఎంఏవైజీ కింద కేంద్రం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు చేయడం లేదు. త్వరలోనే చెల్లింపులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ఫైనల్ బిల్లు పెండింగ్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వాటిని పెండింగ్లో ఉంచింది. ప్రత్యేక యాప్ ద్వారా త్వరలోనే కేంద్రం నుంచి చెల్లింపులు ప్రారంభమయే అవకాశముంది. లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమకానున్నాయి. – రెడ్డి శంకర్, హౌసింగ్ పీడీ ప్రత్యేక యాప్తో అందనున్న బిల్లుఇందిరమ్మ లబ్ధిదారులకు ఫైనల్ బిల్లు అందించేందుకోసం కేంద్ర ప్రభుత్వం అవాస్ సాఫ్ట్ పేరిట ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. తద్వారా చెల్లింపులు చేసేలా కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. ఈ యాప్ వారం నుంచి పది రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశముందని దీంతో ఇళ్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులందరికీ చెల్లింపులు జరిగే అవకాశమున్నట్లుగా హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. ఇందిరమ్మ మొదటి విడత కింద జిల్లా వ్యాప్తంగా 16,094 ఇళ్లు మంజూరు కాగా అందులో 2,445 ఇళ్లు పూర్తయ్యాయి. గృహ ప్రవేశాలు కూడా జరిగాయి. ఈ యాప్ అందుబాటులోకి వస్తే వీరిందరికి చివరి బిల్లు చేతికందే అవకాశముంది. -
టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
ఆదిలాబాద్టౌన్: ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సునీల్ చౌహన్, వలబోజు గోపీకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో శనివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని పేర్కొందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తెలంగాణలో 30వేల మంది ఉపాధ్యాయులు టెట్ పాస్ కావాల్సిన అవసరముందని 2028 ఆగస్టు 31 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపుకోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని పేర్కొన్నారు. ఇందులో సంఘ నాయకులు కేశవ్, విలాస్, అనిల్, నాందేవ్ , గంభీర్, తదితరులు పాల్గొన్నారు. -
‘సర్’తో ప్రమాదంలో విపక్షాల ఓట్లు
కై లాస్నగర్: సర్ (ఎస్ఐఆర్) పేరిట కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంతో విపక్ష పార్టీల ఓట్లు ప్రమాదంలో పడ్డాయని, భారీగా ఓట్ల చోరీ జరుగుతోందని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ ఆరోపించారు. స్థానిక కంది క్యాంపు కార్యాలయంలో ఆదిలాబాద్ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన బీఎల్ఏ–2ల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ఈసీని అడ్డుపెట్టుకుని పథకం ప్రకారం బీజేపీ వ్యతిరేక ఓట్లు తొలగిస్తుందని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును కోల్పోకుండా మ్యాపింగ్ చేసుకోవాలన్నారు. ఈవిషయంలో బీఎల్ఏ–2ల పాత్ర కీలకమన్నారు. అనంతరం పీసీసీ ట్రైనర్ నరేశ్రాథోడ్, కోఆర్డినేటర్లు రాఘవేంద్రరెడ్డి, మోహన్ కుమార్ ఎస్ఐఆర్పై అవగాహన కల్పించారు. ఇందులో సర్ కోఆర్డినేటర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్, మార్కెట్ కమిటీ చైర్మన్లు బండారి అనూష, బోరంచు శ్రీకాంత్రెడ్డి , ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్, నాయకులు సాయి మౌనారెడ్డి, సంజీవ్రెడ్డి, సాజిద్ ఖాన్, పరమేశ్వర్, పట్టణ కౌన్సిలర్లు, డీసీసీ కార్యదర్ళులు, మండల అధ్యక్ష,కార్యదర్శులు పాల్గొన్నారు. -
మౌలిక వసతుల కల్పనకు కృషి
తలమడుగు: నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని ఖోడద్ గ్రామంలో అంతర్రాష్ట్ర రహదారిపై రూ.34 లక్షలతో నిర్మించిన బ్రిడ్జిని ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేశామన్నారు. ఇందులో సర్పంచ్ లస్మారెడ్డి, నాయకులు కేదారేశ్వర్రెడ్డి, కిరణ్, వెంకటేశ్, ఆనంద్, చందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరంజి(టి) రహదారి నిర్మాణానికి కృషి తాంసి: భీంపూర్ మండలంలోని కరంజి(టి) అంతర్రాష్ట్ర రోడ్డు నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నిపాని నుంచి సావర్గాం మధ్య అంతర్రాష్ట్ర రహదారి ప్రారంభమైన నేపథ్యంలో తాత్కాలిక రోడ్డు మర్మమతు పనులను ఎమ్మెల్యే శనివారం పరిశీలించారు. ఆయన వెంట స్థానిక నాయకులు వినోద్రెడ్డి, మహేందర్, అశోక్, సుధాకర్, శ్రీకాంత్ తదితరులున్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
సిరికొండ: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూ రు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మండలంలోని రిమ్మ గ్రామంలో శనివా రం ఏర్పాటు చేసిన సాముహిక ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. లబ్ధిదారులైన దంపతులకు సారె, దుస్తులు అందజేసి సన్మానించారు. గిరిజన సంప్రదాయాలు గొప్పవని అన్నారు. మాజీ సర్పంచ్ అనిల్కుమార్ గ్రా మానికి గ్రంథాలయం కావాలని అడగడంతో మంత్రి వెంటనే స్పందించారు. రూ.10లక్షలు మంజూ రు చేశారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ, నియోజకరవ్గంలోని మారుముల గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని అన్నా రు. కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, స్థానిక సర్పంచ్ జంగుబాయి, జిల్లా పంచాయతీ అధికారి రమేశ్, వివిధ శాఖల అధికారులు,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయం ఆదిలాబాద్రూరల్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మండలంలోని బెల్లూరి శివారు గాయత్రి గార్డెన్స్లో శనివారం నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.సంక్షేమ పథకాల పారదర్శక అమలుతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అనంతరం జాబ్ మేళా లో ఉద్యోగాలు పొందిన యువతకు సన్మానం, టా స్క్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అలాగే ఎంపికై న లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదా రులకు చెక్కులు, మైనార్టీ లబ్ధిదారులకు కుట్టు మిష న్లు, అగ్నిమాపక శాఖకు సంబంధించిన ఎస్డీఆర్ఎఫ్ ఉపకరణాలను పంపిణీ చేశారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో ఎంపీ నగేష్, కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆదిలాబాద్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు, మున్సిపల్ చైర్పర్సన్ అనూష, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. పీహెచ్సీ భవనం ప్రారంభం మావల మండలం బట్టిసావర్గాంలో రూ.1.43 కోట్లతో నూతనంగా నిర్మించిన పీహెచ్సీ భవనా న్ని మంత్రి జూపల్లి శనివారం ప్రారంభించారు. -
ఆ ఊర్లు ప్రభుత్వ పాఠశాలలకే జై కొడుతున్నాయి. తమ పిల్లలను సర్కారు బడికి పంపేందుకే మొగ్గు చూపుతున్నాయి. ఉపాధ్యాయులు అత్యుత్తమ బోధనతో ఆకర్షిస్తుండగా.. తల్లిదండ్రులు ప్రైవేట్ బాట వీడుతున్నారు. ఏకగ్రీవ తీర్మానాలతో సర్కారు బడి వైపు అడుగులేస్తున్నారు. అందరికీ ఆద
ఉట్నూర్రూరల్: మండలంలోని వడోని ఎంపీపీఎస్లో రెండేళ్ల క్రితం వరకు విద్యార్థుల సంఖ్య కేవలం 10 మంది మాత్రమే. పాఠశాల మూతపడే పరి స్థితి. ఈ క్రమంలో ఉపాధ్యాయు ల బోధన తల్లిదండ్రులను ఆలో చనలో పడేసింది. తమ పిల్ల లను ప్రైవేట్ నుంచి సర్కారు బడి బాట పట్టించింది. గతేడాది విద్యార్థుల సంఖ్య 70కి పెరగగా.. ఈ ఏడాది మరో 20 కొత్త ప్రవేశాలు నమోదయ్యాయి. 15మంది ఆరో తరగతికి వెళ్లగా ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 75కు చేరువైంది. ఈ సారి నలుగురు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు జాయిన్ కావడం గమనార్హం. తల్లిదండ్రుల్లో పెరిగిన నమ్మకం ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు నాణ్యమైన బోధ న అందిస్తున్నారు. ఫలితంగా విద్యార్థులు ఏటా ఏకలవ్య, గురుకుల, మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి సీట్లు సాధిస్తున్నారు. తద్వారా తల్లిదండ్రుల్లో నమ్మకం పెరిగి ఇక్కడ చదివించేందుకు మొగ్గు చూపుతున్నారు. పాఠశాలలో ప్రస్తు తం ముగ్గురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఉపాధ్యాయుల సహకారం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఏటా విద్యార్థుల సంఖ్య పెంపు సాధ్యపడుతుందని ప్రధానోపాధ్యాయుడు రాథోడ్ గజేందర్ పేర్కొంటున్నాడు. -
మోదీ పాలన ఆదర్శం
ఆదిలాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మనదేశం 12ఏళ్లుగా అభివృద్ధి, పేదల సంక్షేమ పథకాల అమలులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని ఎంపీ నగేశ్ అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివా రం నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. మోదీ సారథ్యంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లాలో అనేక సంక్షేమ, ప్రగతి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయని వివరించా రు. ఇందులో ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్, రాష్ట్ర అధికార ప్రతినిధి అశోక్ ముస్తపురేతో పాటు పలువురు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
కై లాస్నగర్: పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్య రక్షణను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఘన వ్యర్థాల నిర్వహణకు నూతన నియమాలను అమలు చేస్తోందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో ‘స్వచ్ఛ తెలంగాణ’ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించేలా ముద్రించిన పోస్టర్ను ఆవిష్కరించారు. వర్మి కంపోస్టు బెడ్స్ (వానపాముల ఎరువు తయారీ షెడ్డు)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. ప్రతి గ్రామం, పట్ట ణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ, పారిశుధ్య నిర్వహణ అనేది అందరి బాధ్యత అని అన్నారు. ఇళ్ల నుంచి సేకరించిన తడి చెత్తను గ్రామాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వర్మి కంపోస్టు బెడ్స్కు తరలించి సేంద్రియ ఎరువు తయారు చేయనున్నట్లు తెలిపారు. వ్యాపార సంస్థలు, హోటళ్లు, మార్కెట్లు, బస్టాండ్ల నిర్వాహకులు తమ పరిసరాల్లో తప్పనిసరిగా డస్ట్బిన్లు ఏర్పాటు చేసి పరిశుభ్రతకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో రవీందర్ రాథోడ్, సీసీలు కార్తీక్, యాసిన్, స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతినిధులు, క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రశాంతంగా ‘ప్రీ ప్రైమరీ’ ఎంపిక రప్రక్రియ జిల్లాలో ఈ విద్యాసంవత్సరం నుంచి నూతనంగా ప్రారంభిస్తున్న ప్రీ–ప్రైమరీ స్కూళ్లలో ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల నియామకాలకు సంబంధించి ఎంపిక ప్రక్రియ శుక్రవారం ప్రశాంతంగా ము గిసింది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో ఈ ప్రక్రి య చేపట్టారు. 74 ఇన్స్ట్రక్టర్, 74 ఆయా పోస్టులకు వేలల్లో దరఖాస్తులు అందగా మెరిట్ ప్రతిపాదికన ఒక్కో పోస్టుకు ఇద్దరి చొప్పున పిలిచారు. ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన వారికి ఎంపిక చేశారు. వీరికి సోమవారం నియామక పత్రాలను అందజేయనున్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, శిశు సంక్షేమ శాఖ అధికారి మిల్కా, జిల్లా విద్యాశాఖ అధికారులు లక్ష్మణ్, రఘురమణ తదితరులు పాల్గొన్నారు. -
ఆవుకు అరుదైన శస్త్రచికిత్స
ఆదిలాబాద్(బేల): మండలంలోని పొన్నాల గ్రా మంలో ఆవుకు సోకిన హార్న్ క్యాన్సర్ (కొమ్ము క్యా న్సర్)ను పశువైద్యులు శుక్రవారం విజయవంతంగా శస్త్రచికిత్స చేసి తొలగించారు. రైతు అశోక్ పుల్మ రేకు చెందిన ఆవు కొమ్ము భాగంలో క్యాన్సర్ గడ్డలతో తీవ్ర ఇబ్బంది పడుతుండగా, పశువైద్యులు స కాలంలో స్పందించి ప్రాణదానం చేశారు. పశువైద్యాధికారి వినోద్ దేశ్పాండే.. శస్త్రచికిత్స చేశారు. కొమ్ము భాగాన్ని శాసీ్త్రయ పద్ధతిలో తొలగించారు. రక్తస్రావం కాకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు. శస్త్రచికిత్స అనంతరం ఆవు ఆ రోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్ తెలిపారు. గాయం మానడానికి అవసరమైన చికి త్స అందిస్తున్నామని, కొన్నిరోజుల అనంతరం ఆ వు పూర్తిగా కోలుకుంటుందని పేర్కొన్నారు. పశువైద్యుల బృందాన్ని స్థానిక రైతులు అభినందించారు. -
‘ఎన్నికల హామీలు విస్మరించిన బీజేపీ’
కై లాస్నగర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ ఆరోపించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామనే హామీ ఇచ్చినట్లుగా గుర్తు చేశారు. శుక్రవారం ఆ పార్టీ నాయకులతో కలిసి ఫ్యాక్టరీలో చేపట్టిన కూల్చివేత పనులను ఆయన పరిశీలించారు. ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సిమెంట్ కర్మాగారాన్ని ఏర్పాటు చేసిందన్నారు. అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దాన్ని పునరుద్ధరించకుండా శాశ్వతంగా తుక్కుగా మార్చేస్తోందని మండిపడ్డారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, నాయకులు సాజీద్ఖాన్, రూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పంట రుణం ఇక ఈజీ
లక్ష్మణచాంద: ఇప్పటివరకు సాగు సమయం వచ్చిందంటే చాలు రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు అవసరమైన పంట రుణాల కోసం రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. బ్యాంకు అధికారులు ‘రేపు రండి..మాపు రండి’అంటూ తిప్పించుకునేవారు. ఇక నుంచి పంట రుణాలు కావాలనుకునేవారు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేవలం మొబైల్ యాప్ ద్వారా నేరుగా పంట రుణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కృషిక అనే నూతన యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ యాప్ ఆంగ్లంలో ఉండగా, త్వరలోనే అన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదిస్తామని అధికారులు తెలిపారు. కృషిక యాప్ పని తీరు ఇలా.. ప్రయోజనాలు ఇవే.. భవిష్యత్తు లక్ష్యాలు.. -
రాష్ట్రస్థాయిలో మెరిసిన జిల్లా అథ్లెట్స్
ఆదిలాబాద్: జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో మెరిశారు. ఈనెల 11,12 తేదీల్లో ఓయూ వేదికగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్రస్థాయి మెన్, ఉమెన్, జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా అథ్లెట్లు నాలుగు పతకాలతో సత్తా చాటారు. హ్యామర్త్రోలో దివిటి అరుణ (స్వర్ణ), డిస్కస్త్రోలో కాంస్య పతకాలతో మెరిసింది. ట్రిపుల్ జంప్లో సీహెచ్ వసంత స్వర్ణంతో సత్తా చాటగా, హ్యామర్త్రోలో రాధారాణి రజత పతకం సాధించింది. అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అడ్డి భోజారెడ్డి, రాజేష్, కోచ్ వీజీఎస్ రాకేశ్ క్రీడాకారులను అభినందించారు. -
విద్యుత్షాక్తో ఒకరు..
ముధోల్: విద్యుత్ షాక్తో ఒకరు మృతిచెందిన ట్లు ఎస్సై బిట్లా పెర్సిస్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని కోలిగల్లీకి చెందిన ముడుగుల సాయినాథ్ (40), సాయినాథ్ భూమేష్ ఎలక్రీషియన్తో కలిసి మాధవ్నగర్ కాలనీలో శుక్రవారం విద్యుత్ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో సాయినాథ్ ప్రమాదవశాత్తు కరెంటు షాక్కు గురయ్యాడు. స్థానికులు అంబులెన్సుకు సమాచారం అందించి ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అధ్యక్షా.. మేముసైతం
నిర్మల్ఖిల్లా: హైదరాబాద్ సచివాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్నేహ మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా చిన్నారులు ప్రతిభ కనబర్చారు. కడెం మండలం కల్లెడ గ్రామానికి చెందిన స్నేహ సంఘం సభ్యురాలు దీటి శ్రీనిజ (8వ తరగతి) డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించి పేదరికంపై అద్భుతంగా ప్రసంగించి అందరి ప్రశంసలు పొందింది. సారంగాపూర్ మండలకేంద్రానికి చెందిన హాసిని ఎంపీగా వ్యవహరించి తన ప్రతిభ చాటుకుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్, అధికారుల సమక్షంలో మాక్ పార్లమెంట్ గురువారం సాయంత్రం నిర్వహించగా ఇందులో పాల్గొన్నారు. వీరిని అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. చిన్నారులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గతనెల 30న నిర్మల్లో నిర్వహించిన జిల్లాస్థాయి మాక్ పార్లమెంట్లో ఈ చిన్నారులు ప్రతిభ కనబర్చగా కలెక్టర్ భవేశ్మిశ్రా అభినందించారు. -
సర్కారు బడికి కొత్త అ‘డ్రెస్’
నిర్మల్ఖిల్లా/నిర్మల్రూరల్/మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ, స్థానిక సంస్థల్లోని 1వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థుల అందరి యూనిఫాం మారింది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే కొత్త యూనిఫాం అమలు చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఈ.నవీన్ నికోలస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న యూనిఫాం రంగుల్లో మార్పులు చేస్తూ కొత్త డిజైన్లను ఖరారు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ యూనిఫాం విధానం అమలులోకి రానుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, పంచాయతీరాజ్, గురుకుల, కేజీబీవీలు తదితర స్కూళ్లు విద్యార్థుల నూతన రంగుల దుస్తులతో శోభను సంతరించుకోనున్నాయి. పాఠశాలల వారీగా విద్యార్థుల కొలతలు, అవసరమైన గుడ్డ సరఫరా, కుట్టింపు ప్రక్రియలను త్వరలో ప్రారంభించనున్నట్లు సమాచారం. సమగ్ర శిక్ష, సెర్ప్, మెప్మా సంస్థల సమన్వయంతో యూనిఫాంల తయారీ, పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. ఇంకా చేరని ముడివస్త్రం పాఠశాలలు ఈ నెల 15న పునః ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ విద్యార్థులకు రెండేసి యూనిఫామ్ జతలు అందిస్తారు. ఇప్పటివరకు జిల్లాలకు యూనిఫామ్ వస్త్రం చేరలేదు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ముడివస్త్రం చేరి అక్కడి నుంచి పాఠశాలలకు చేరాలంటే కనీసం నెలరోజులైన పట్టవచ్చు. దీంతో కొన్ని రోజుల వరకు గత సంవత్సరం యూనిఫాంతోనే విద్యార్థులు బడులకు రావాల్సి ఉంటుంది. నిర్మల్ జిల్లాలో గత సంవత్సరం 47,969 మంది విద్యార్థులకు యూనిఫామ్ను స్వయం సహాయక సంఘాల ద్వారా కుట్టించి అందజేశారు. ఈసారి బడిబాటలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నందున సుమారు 53,100 మందికి అందించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మంచిర్యాల జిల్లాలో గత ఏడాది 761 పాఠశాలల్లో 42,711మంది విద్యార్థులకు మొదట 1,86,723 మీటర్ల ముడి వస్త్రం సరఫరా చేశారు. రెండో దఫా 58,059 మీటర్ల వస్త్రం సరఫరా అయింది. గత ఏడాది వేసవి సెలవులకు ముందే యూనిఫామ్కు అవసరమైన వస్త్రం సరఫరా చేసి సకాలంలో విద్యార్థులకు యూనిఫామ్లు పంపిణీ చేశారు. ఈ ఏడాది వేసవి సెలవులు ముగిసిపోతున్నా ముడివస్త్రం సరఫరాకు నోచుకోలేదు. కొత్తగా పాఠశాలల్లో అడ్మిషన్లు పొందే విద్యార్థులకు మరింత ఆలస్యమయ్యే అవకాశం లేకపోలేదు. ప్రత్యేకతలివే.. విద్యాశాఖ విడుదల చేసిన నమూనాల ప్రకారం బాలురకు లైట్ బ్లూ రంగు షర్ట్, నేవీ బ్లూ రంగు ప్యాంట్/నిక్కర్ ఉండనుంది. బాలికలకు లైట్ బ్లూ టాప్తోపాటు నేవీ బ్లూ స్కర్ట్ లేదా దుస్తులు అమలు చేయనున్నారు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బాలికల యూనిఫాంలో ప్రత్యేక నేవీ బ్లూ వేస్ట్కోట్ను కూడా ప్రవేశపెట్టారు. తరగతుల వారీగా డిజైన్లలో స్వల్ప మార్పులు ఉండనున్నాయి. -
నాగోబా స్కూల్ ప్రారంభం
ఇంద్రవెల్లి: కేస్లాపూర్ నాగోబా ఆలయంలో మెస్రం వంశ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ నాగోబా ఎక్సలెన్స్ స్కూల్ను శుక్రవారం ప్రారంభించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతి దేవి చిత్రపటానికి పూజలు చేశారు. ఈప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికే శ్రీ నాగోబా ఎక్సలెన్స్ స్కూల్ను ప్రారంభించినట్లు మెస్రం వంశీయులు తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ, పేద పిల్లలను నాగోబా స్కూల్లో చేర్పించి ఉచిత విద్యను అందిస్తామన్నారు. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్, కేస్లాపూర్ సర్పంచ్ తుకారం, మెస్రం వంశం ఉద్యోగులు దేవ్రావ్, శేఖర్బాబా, మోనోహర్, సోనేరావ్, వంశపెద్దలు కోసేరావ్, హనుమంత్రావ్, నాగ్నాథ్, భీంరావ్ తదితరులున్నారు. -
వైద్యసిబ్బంది నిర్లక్ష్యమే ప్రాణం తీసింది!
ఖానాపూర్: వైద్యసిబ్బంది నిర్లక్ష్యమే ఒకరు మృతిచెందారని ఆరోపిస్తూ ఖానాపూర్ ప్రభుత్వ ఆ సుపత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులు శుక్రవారం ఆందోళనకు దిగా రు. రోగిని పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంధువులు, గ్రామస్తులతో కలిసి అధికారులు, వైద్యసిబ్బందిని నిలదీశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని సుర్జాపూర్ గ్రామానికి చెందిన షేక్ షారుఖ్ తన తండ్రి షేక్ హుస్సేన్ (54)కు గురువారం అర్ధరాత్రి తీవ్రనొప్పులు, అధిక చెమటలు వచ్చాయి. ఆర్ఎంపీ సూచన మేరకు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. విధుల్లో ఉన్న సిబ్బంది కేవలం ఒక ఇంజక్షన్, మూడు మాత్రలు ఇచ్చారని, కనీసం బీపీ పరీక్ష నిర్వహించలేదు. వైద్యుడు ప్రత్యక్షంగా వచ్చి చూడలేదు. ఆసుపత్రిలో అడ్మిట్ కావాలని చెప్పకపోవడంతో దా దాపు 40 నిమిషాల పాటు అక్కడే ఉండి తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం హు స్సేన్ ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విధుల్లో నర్సు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, రాత్రివేళ వైద్యుడు అందుబాటులో లేరని కుటుంబీకులు ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబం చేసిన ఆరోపణలను ఆసుపత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ స్వర్ణరెడ్డి ఖండించారు. రోగికి వైద్యచికిత్స అందించామని, డ్యూటీ వైద్యుడు అందుబాటులో ఉన్నారని, సిబ్బంది రోగి పరిస్థితి వైద్యుడి దృష్టికి తీసుకెళ్లలేదని తెలిపారు. సిబ్బంది అనుమతి లేకుండానే రోగిని ఇంటికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. సుర్జాపూర్ సర్పంచ్ బక్కశెట్టి వెంకట్రాములు, నాయకులు భూసి నరేందర్, బొమ్మెన రాకేశ్, ముషారఫ్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి పోటీల్లో సత్తా
ఆదిలాబాద్: చండీగఢ్లో ఈనెల 10 నుంచి 13 వరకు జరుగుతున్న ‘నేషనల్ క్యాడెట్ జూడో చాంపియన్షిప్ 2026’లో ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ పూర్వవిద్యార్థులు ప్రతిభ కనబర్చారు. జిల్లాకేంద్రంలోని ఆదిత్య జూనియర్ కళాశాలలో చదువుతున్న మోథం హర్షవర్ధన్ మైనస్ 60 కేజీల విభాగంలో స్వర్ణ పతకం, రమావత్ తరుణ్ మైనస్ 55 కేజీల విభాగంలో కాంస్యం కై వసం చేసుకుని రాష్ట్రకీర్తిని జాతీయ స్థాయిలో చాటారు. త్వరలో జరగనున్న ఏషియన్ క్యాడెట్, వరల్డ్ క్యాడెట్ జూడో చాంపియన్షిప్లో వీరు పాల్గొనే అవకాశం ఉందని కోచ్ రాజు పేర్కొన్నారు. వీరిద్దరి విజయం జిల్లా క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిస్తోందని డీవైఎస్ఓ జక్కుల శ్రీనివాస్ తెలిపారు. లక్ష్మణ్కు ఉత్తమ రైతు పురస్కారంతాంసి: మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన రైతు కేమ లక్ష్మణ్ ఉత్తమ రైతు పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో శుక్రవారం నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ 62వ ఆవిర్భావ వేడుకల్లో రాష్ట్రవ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, అధికారులు రైతును సన్మానించి పురస్కారం అందజేశారు. వ్యవసాయరంగంలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. గ్రామస్తులు ఆయన్ను అభినందించారు. తనకు సహకరించిన ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రానికి కేమ లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు. -
సర్కారు కళాశాలల బలోపేతమే లక్ష్యం
ఆదిలాబాద్టౌన్: ‘ప్రభుత్వ కళాశాలలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నాం.. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పాఠ్య పుస్తకాలు అందిస్తున్నాం.. త్వరలో మధ్యాహ్న భోజన పథకం, యూనిఫాం, నోట్బుక్స్ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.. తల్లిదండ్రులు కూడా అన్ని విషయాలు ఆలోచించి పిల్లల్ని ప్రభుత్వ కళాశాలల్లోనే చేర్పించాలి.. ’అని డీఐఈవో జాదవ్ గణేశ్కుమార్ అన్నారు. శుక్రవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. సాక్షి: ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాల పెంపుకోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? డీఐఈవో: ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్ల పెంపు కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. అన్ని కళాశాలల లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు తమ పరిధిలోని గ్రామాలకు వెళ్లి అడ్మిషన్లు చేపడుతున్నారు. ఈనెల 30 వరకు గడువు ఉంది. 13 కళాశాలల్లో 1139 మంది విద్యార్థులు చేరారు. సాక్షి: అన్ని కళాశాలల్లో మౌలిక వసతులు ఉన్నాయా.. వాటి ఏర్పాటు కోసం ఎలా ముందుకెళ్తున్నారు? డీఐఈవో: ప్రతీ కళాశాలలో తాగునీరు, టాయిలెట్స్, ల్యాబ్, గ్రంథాలయం వంటి వసతులు ఉ న్నాయి. ఆరు కళాశాలకు మాత్రమే ప్రహారీలు లే దు. గతేడాది మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.50వేల నిధులు మంజూరు చేసింది. గోడల కు పెయింటింగ్ కూడా వేయించడం జరిగింది. సాక్షి: లెక్చరర్ల కొరతను ఏవిధంగా అధిగమిస్తారు..? డీఐఈవో: కళాశాలల్లో లెక్చరర్ల కొరత లేదు. 33 మంది గెస్ట్ లెక్చరర్లను కొనసాగిస్తున్నాం. అలాగే 8 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు, 168 మంది రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నారు. నార్నూర్, తలమడుగు, బోథ్, తాంసి కళాశాలల్లో ఇన్చార్జి ప్రిన్సిపాళ్లు ఉండగా, మిగతా కళాశాలల్లో రెగ్యులర్ ప్రిన్సిపాళ్లు ఉన్నారు. సాక్షి: వార్షిక ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఫలితాలపై ఎలా దృష్టి సారిస్తారు..? డీఐఈవో: వార్షిక పరీక్షల ఫలితాలు తగ్గిన విషయం వాస్తవమే. సప్లిమెంటరీ ఫలితాలు ఫస్టియర్లో నాలుగో స్థానం, సెకండియర్లో ఐదో స్థానంలో నిలిచాం. కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపారు. రెమీడియల్ తరగతులు నిర్వహించాం. ఈ ఏడాది ప్రారంభం నుంచే ప్రత్యేక దృష్టి సారిస్తాం. సాక్షి: ప్రభుత్వ కళాశాలల్లో తరగతులు సక్రమంగా జరగవనే ఆరోపణలున్నాయి.. మీరేమంటారు? డీఐఈవో: అలాంటిదేమి లేదు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు జరుగుతాయి. లెక్చరర్లు, విద్యార్థులకు ఫేషి యల్ అటెండెన్స్ ఉంది. విద్యార్థులు గైర్హాజరైతే తల్లిదండ్రులకు సమాచారం అందిస్తున్నాం. కళాశాలకు రాకపోతే ఇంటికి వెళ్లి విద్యార్థులను తీసుకొచ్చేలా చూస్తాం. తరగతి గదులతో పాటు కళాశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. సాక్షి: నాణ్యమైన విద్యాబోధన కోసం ఎలాంటి చర్యలు చేపడతారు..? డీఐఈవో: ప్రతీ కళాశాలకు ప్రభుత్వం ఈ ఏడాది డిజిటల్ బోర్డులను అందించింది. లెక్చరర్లకు 22 రోజుల పాటు ఓరియంటేషన్ నిర్వహిస్తాం. అన్ని వసతులతో పాటు నాణ్యమైన బోధన అందుబాటులో ఉన్న ప్రభుత్వ కళాశాలల్లోనే విద్యార్థులు చేరాలి. -
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం
ఆదిలాబాద్టౌన్: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని ఎస్పీ అఖిల్ మహా జన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ క మాండ్ కంట్రోల్ సెంటర్లో ఆదిలాబాద్ పట్ట ణ కౌన్సిలర్లు, ఆదిలాబాద్రూరల్, జైనథ్, భీం పూర్, బేల, తాంసి, తలమడుగు మండలా ల సర్పంచ్లకు సీసీ కెమెరాల ప్రాధాన్యతపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లాలో గతంలో సీసీ ఫుటేజీ ఆధారంగా ఛేదించిన పలు కేసులకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి వాటి ప్రాముఖ్యతను వివరించారు.సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్అనూష, వైస్చైర్మన్ మహమ్మద్ రోహిత్, ఆది లాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, సీఐలు బి.సునీల్ కుమార్, కె.నాగరాజు, ప్రేమ్ కుమార్, శ్రావ ణ్, రహీంపాషా తదితరులు పాల్గొన్నారు. -
రైతు అయోమయం
సాక్షి,ఆదిలాబాద్: జూన్ 1నుంచి వానాకాలం సీజన్ మొదలైంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివర కు వర్షాభావ పరిస్థితులున్నాయి. ఏడు మండలాలు మినహాయిస్తే మిగతాచోట్ల చినుకు జాడ కరువైంది. ఈనెల 8న తొలకరి పలకరింపుతో పలు మండలాల్లో కొందరు రైతులు పత్తి విత్తనాలు విత్తారు. మూడు రోజులుగా వాన లేకపోవడంతో వారంతా ఆందోళనలో ఉన్నారు. మరో రెండు రోజులు ఇలాగే ఉంటే ఆశలు వ దులుకోవాల్సిందే. జిల్లాలో 20 శాతానికి పైగా రైతులు ఇప్పటికే పత్తి విత్తనాలు వేశారు. మరో వైపు పగటి ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో మిగతా రైతులు వెనకడుగు వేస్తున్నారు. రెండు, మూడు వర్షాలు పడే వరకు వేచి చూడడమే మంచిదని భావిస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సైతం అదే సూచిస్తున్నారు. తేలికపాటి వర్షాలున్నాయి.. ఈనెల 14 వరకు తేలికపాటి వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే జిల్లాలో ఎక్కడెక్కడ కురుస్తాయనేది స్పష్టత లేదు. పొడి దుక్కుల్లో విత్తనాలు వేయడం రిస్క్తో కూడుకున్నది. మంచి వర్షాలు కురిసిన తర్వాతే విత్తుకోవడం మంచిది. – శ్రీధర్ చౌహాన్, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం, ఆదిలాబాద్ భీంపూర్ మండలం నిపాని గ్రామానికి చెందిన ముకుంద్ సంతోష్ తొలకరికి ముందే ఈనెల 5న తనకున్న 19 ఎకరాల్లో పత్తి విత్తనాలు విత్తాడు. మృగశిరకార్తే రోజు తొలకరితో సంబురపడ్డాడు. అయితే నాలుగు రోజులైనా వాన జాడ లేకపోవడంతో ఆందోళన మొదలైంది. ఒక సంతోష్ మాత్రమే కాదు.. జిల్లాలో విత్తనాలు వేసిన రైతులందరిదీ ఇదే పరిస్థితి. జిల్లాలోని 21 మండలాల్లో వర్షపాతం వివరాలు.. అధిక : తలమడుగు, సిరికొండ, సొనాల సాధారణ : భీంపూర్, జైనథ్, మావల, తాంసి వర్షాభావం : బేల, గుడిహత్నూర్, ఆదిలాబాద్అర్బన్, బోథ్, ఉట్నూర్, సాత్నాల, భోరజ్ తీవ్ర వర్షాభావం : గాదిగూడ, నార్నూర్, ఆదిలాబాద్రూరల్, నేరడిగొండ, ఇచ్చోడ అసలే వర్షం కురవని ప్రాంతాలు : ఇంద్రవెల్లి, బజార్హత్నూర్ -
ఆర్జేసీలను కొనసాగించాలి
నార్నూర్: ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్ బాలుర, ఉట్నూర్ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలను (ఆర్జేసీ) కొనసాగించాలని ఆదివాసీ వి ద్యార్థి సంఘం (ఏఎస్యూ) జిల్లా అధ్యక్షుడు పెందోర్ సంతోష్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ఆర్జేసీ కళాశాలలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఈవో)గా మార్చి కొనసాగిస్తామని ప్రభుత్వం భావిస్తే విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్జేసీలను య థావిధిగా కొనసాగించాలని కోరారు. అవసరమైతే ప్రత్యేకంగా కొత్త సీఈవో కళాశాలలను మంజూరు చేసి భవనాలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా సలహాదారుడు పెందోర్ దీపక్, డీఏసీ సాధన కమిటీ ప్రధాన కార్యదర్శి జాదవ్ సుమేష్, రాజ్గొండ విద్యార్థి సంఘ జిల్లా అధ్యక్షుడు కుంరం చతుర్షావ్, మండల అధ్యక్షుడు ఆత్రం ప్రమేశ్వర్, నాయకులు మారప గంగారం, కొట్నాక్ శ్యాంరావు, కొట్నాక్ శ్రీరామ్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. -
మంచి నిర్ణయం
రైతులు పంట రుణాల కోసం నేరుగా తమ మొబైల్ ఫోన్ల నుంచి దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కృషిక యాప్ తీసకురావడం మంచి నిర్ణయం. రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగే పని తప్పింది. ఈ యాప్ వల్ల వారికి మేలు చేకూరుతుంది. – నర్సారెడ్డి, రైతు, లక్ష్మణచాంద సద్వినియోగం చేసుకోవాలి కృషిక యాప్ ద్వారా రైతులు తమ పంటల సాగుకు అసవరమైన రుణాలను తమ మొబైల్ ఫోన్ల నుంచే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకులకు వెళ్లకుండా రుణాలు పొందవచ్చు. జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి. –రాంగోపాల్, ఎల్డీఎం, నిర్మల్ -
ఎస్బీ ఎస్సై గంగన్న మృతి
జన్నారం: అనారోగ్యంతో ఎస్బీ ఎస్సై జాడి గంగన్న మృతిచెందారు. మండలంలోని మురిమడుగు గ్రామానికి చెందిన ఈయన 1989లో కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరారు. 2012లో హెడ్ కానిస్టేబుల్గా, 2018లో ఏఎస్సైగా, 2024 సెప్టెంబర్ 26న ఎస్సైగా ప్రమోషన్ పొంది, ప్రస్తుతం రామగుండం ఎస్బీ ఎస్సైగా పనిచేస్తున్నారు. రెండునెలల క్రితం బ్రెయిన్స్ట్రోక్తో హై దరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవల ఇంటికి వచ్చారు. ఆ తర్వాత అనా రోగ్యం బారినపడగా కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. కాగా, గంగన్న మరో 14 నెలల్లో ఉద్యోగ విరమణ పొందాల్సి ఉంది. ఆయనకు భార్య అన్నపూర్ణ, ముగ్గురు కుమారులు ఉన్నారు. -
గిరిజన గ్రామాలాభివృద్ధికి కృషి
బోథ్: గిరిజన గ్రామాలాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. మండలంలో ని కంటేగావ్ గ్రామంలో రూ.15లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడ తూ.. గ్రామస్తుల సహకారంతో పెండింగ్ సమస్యలన్నీ దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చా రు. గ్రామానికి చెందిన రాథోడ్ ఇందల్ మాతృమూర్తి ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అగ్ని ప్రమాదానికి గురై ఇళ్లు కో ల్పోయిన జాదవ్ దేవిదాస్, హీరాలాల్ కుటుంబా లను కలిసి ఓదార్చారు. అండగా ఉంటామని భరో సా ఇచ్చారు. మండలంలోని మర్లపల్లి గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయించి నందుకు గ్రామస్తులు సర్పంచ్ శీలాబాయి అంబాజీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బోథ్లో పర్యటించిన ఎమ్మెల్యే పట్టణంలోని ప్రధాన రహదారిపై మురుగునీరు ఉండడంతో వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులున్నారు. -
‘డబుల్’ పనులు త్వరగా పూర్తి చేయాలి
కైలాస్నగర్: జిల్లా కేంద్రంలోని కేఆర్కే కాలనీ, మావల మండల కేంద్రం సర్వే నంబర్ 170లో లబ్ధిదారులకు కేటాయింపునకు సిద్ధమైన డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. గురువారం మున్సిపల్, ఆర్అండ్బీ అధికారులతో క్షేత్రస్థాయిలో ఇళ్లను పరిశీలించారు. వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్, తాగునీరు, శానిటేషన్ పనులు పరిశీలించారు. అనంతరం పట్టణంలోని గాంధీ పార్క్ను సందర్శించారు. పార్క్లో చేపట్టిన ఏడు ఫామ్ పాండ్స్, ఐదు బోర్ వెల్ రీచార్జ్ స్టక్చ్రర్స్ నిర్మాణ పనులు పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, మెప్మా పీడీ సీవీఎన్ రాజు, హౌసింగ్ పీడీ శంకర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్అండ్బీ డీఈ ప్రవీణ్కుమార్ తదితరులున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వద్దు పథకాల అమలు, భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తే కఠినచర్యలు తప్పవని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించి మా ట్లాడారు. పెండింగ్ ఫైళ్లను గడువులోపు క్లియర్ చే యాలని ఆదేశించారు. ‘భూ భారతి’, సాదాబైనా మాల క్రమబద్ధీకరణ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. రెవె న్యూ, అటవీ శాఖల భూ సరిహద్దు వివాదాలను సమన్వయంతో పరిష్కరించుకోవాలని తెలిపారు. వివాదాస్పద భూముల్లో జాయింట్ సర్వే నిర్వహించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని పే ర్కొన్నారు. కమ్యూనిటీ సర్టిఫికెట్ల జారీలో జాప్యం చేయవద్దని సూచించారు. అదనపు కలెక్టర్ (రెవె న్యూ) ఆర్ఎస్ చిత్రు, డీఆర్వో స్రవంతి, ఆర్డీవో జగదీశ్వర్రావు, ఉట్నూర్ ఆర్డీవో మోహన్ సింగ్, కలెక్టరేట్ ఏవో వర్ణ, సూపరింటెండెంట్లు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
ఎల్నినో ప్రభావం.. పిడుగులకు ఆస్కారం!
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో తొలకరి వర్షాలు కురవడంతో రైతులు దుక్కిలో విత్తనాలు వేసే పనుల్లో ఉన్నారు. వానాకాలం మొదలైన నుంచి ఇప్పటివరకు భారీ వర్షాలు కురవలేదు. వాతావరణంలో తే మ తగ్గలేదు. ఉష్ణోగ్రతలు వేసవి స్థాయిలోనే ఉన్నా యి. ఈసారి ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులుంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిడుగు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి కారుమబ్బులు కమ్ముకుని భారీ శబ్దాలతో కూడిన ఉరుములు.. కళ్లు మిరుమిట్లు గొలిపే మెరుపులు వస్తున్నాయంటే పిడుగులు పడతాయని గుర్తించి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ హృదయ విదారక ఘటన గతేడాది జూన్ 12న చోటుచేసుకుంది. గాదిగూడ మండలం పిప్పిరి గ్రామంలో దుక్కిలో విత్తనాలు వేస్తుండగా పిడుగు పడడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో పది మంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మృత్యువాత పడ్డ నలుగురిలో ఇద్దరు తండ్రి కూతురు కాగా, మిగతా ఇద్దరు వారి సంబంధీకులే. అదేరోజు బేల మండలం సాంగిడి, సోన్కాస్ గ్రామాల్లో పిడుగుపాటుకు గురై మరో ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఆ సమయంలోనే ఉట్నూర్ మండలం కుమ్మరితండాలో పిడుగు పడడంతో ముగ్గురు గాయపడ్డారు. -
ప్రీప్రైమరీ స్కూళ్లను రద్దు చేయాలి
ఆదిలాబాద్టౌన్: ప్రీప్రైమరీ స్కూళ్లను వెంటనే ర ద్దు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వా డీ టీచర్లు జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం ఎదుట గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత మాట్లాడా రు. ప్రభుత్వం ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. పీఎంశ్రీ ప్రీప్రైమరీ స్కూళ్లను రద్దు చేసి వీటికి కేటాయించే నిధులను అంగన్వాడీ కేంద్రాలకు ఇవ్వాలని కోరారు. కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సంఘం నాయకురాళ్లు సునీత, పార్వతి, కళావతి, రాధ, శోభ, విజయ, రత్నలక్ష్మి, నజీమ, కళ్యాణి తదితరులున్నారు. -
పారిశుద్ధ్యం లోపించొద్దు
ఇంద్రవెల్లి: వానాకాలంలో గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని డీపీవో రమేశ్ సూచించారు. గురువా రం మండలంలోని దనోరా(బి) గ్రామపంచా యతీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. గ్రామంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, డంపింగ్ యార్డు, విద్యుత్, తాగునీటి సరఫరా తది తర వివరాలు తెలుసుకున్నారు. రికార్డులు పరి శీలించారు. ప్లాస్టిక్ను నిషేధించాలని సూచించారు. సర్పంచ్ జాదవ్ జమునానాయక్, ఉప సర్పంచ్ షేక్ కరీంలాలా, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్కుమార్ తదితరులున్నారు. -
ముగిసిన ఏఐ, లైఫ్ స్కిల్ శిక్షణ
ఆదిలాబాద్రూరల్: నాలుగు రోజులుగా జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ సెంటర్లో జిల్లాలోని విద్యార్థులకు ఉచితంగా ఇస్తున్న ఏఐ, లై ఫ్ స్కిల్ శిక్షణ గురువారం ముగిసింది. విద్యార్థులకు పీపీటీ తయారు చేసి ప్రజెంటేషన్ చేశారు. అగ్రికల్చర్లో అభివృద్ధి, పోటీ పరీక్షలపై అవగాహన తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం వారికి సర్టిఫికెట్లు అందజేశారు. డీబీసీడీవో సోనియా, బీసీ స్టడీ సర్కిల్ సెంటర్ డైరెక్టర్ ప్రవీణ్కుమార్, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఫ్యాకల్టీ మహేందర్రావు, శశాంక్రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. -
యోగాతో ఖైదీల్లో సానుకూల మార్పు
ఆదిలాబాద్టౌన్: ఖైదీల్లో సానుకూల మార్పునకు యోగా దోహద పడుతుందని జిల్లా జైలు సూపరింటెండెంట్ పి.గోపిరెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకు ని జిల్లా జైలులో బుధవారం నుంచి యోగా శిక్షణ తరగతులు ప్రారంభించారు. 200 మంది ఖైదీలు, 45 మంది సిబ్బంది ఇందులో పాల్గొంటున్నట్లు తెలిపారు. యోగా ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకా గ్రత పెంపొందుతుందని అన్నారు. ఈ శిక్షణ ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు కొనసాగుతుందని తెలిపారు. ఇందులో జైలర్ ఎన్.చంద్రశేఖర్, సిబ్బంది, తతోవంశి యోగా గురువు విజయ్ కుమార్ పాల్గొన్నారు. -
20న జాతీయ లోక్ అదాలత్
బోథ్: ఈనెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాలని బోథ్ కోర్టు న్యాయమూర్తి కె. సందీప్ తెలిపారు. న్యా యస్థాన ప్రాంగణంలో న్యాయవాదులతో ఆ యన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సుదీ ర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులను ఎక్కువ మొత్తంలో పరిష్కరించేలా న్యాయవాదులు చొరవ చూపాలన్నారు. ఈమేరకు కక్షిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా సమ యం, డబ్బు ఆదా అవుతాయని, ఇరువర్గాల కు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏజీపీ పంద్రం శంకర్, బార్ అసోసియేషన్ సెక్రెటరీ రూపేందర్ సింగ్, న్యాయవాదులు ఆడెపు హరీశ్, మహేశ్, గంగసాగర్, సందేశ్ పాల్గొన్నారు. -
మోదీ పుష్కర పాలనపై ఎమ్మెల్యే పూజలు
ఆదిలాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్వాడి ధర్మశాల శ్రీవేంకటేశ్వర ఆలయంలో బీజే పీ నాయకులతో కలిసి పూజలో పాల్గొన్నారు. దేశ రాజకీయ చరిత్రలో ప్రధాని మోదీ సరికొత్త రికార్డు సృష్టించారని తెలిపారు. సుదీర్ఘకాలం పనిచేసిన ప్ర ధానులలో ఒకరిగా నిలిచి దేశానికి గర్వకారణంగా మారారని కొనియాడారు. పుష్కరకాలంలో పేదలు, రైతులు, మహిళల సంక్షేమం కోసం జనధన్, ఆయుష్మాన్ భారత్, ఆవాస్ యోజన వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
దేశ చరిత్రలో ప్రధాని మోదీ రికార్డు
తలమడుగు: ప్రధాని నరేంద్రమోదీ దేశ చరిత్రలో అత్యధికంగా 4,399 రోజుల పాలన సాగిస్తూ రికార్డు సృష్టించారని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. మండలంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకు దేశాన్ని అత్యధిక రోజులు పాలించిన ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సత్యనారాయణ గౌడ్, నాయకులు తాటిపల్లి గంగాధర్ రాజు, చంద్రకాంత్, ప్రభాకర్, వామన్ పటేల్, జీవీరమణ, వెంకటస్వామి, కిరణ్, నారాయణ, ప్రేమేందర్ రెడ్డి, స్వామి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
యువతకు హితబోధ..
గుడిహత్నూర్: తోషంలో నిర్వహించిన గ్రామసభలో డీజీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ, గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. యు వత గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగానే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా హైల్మెట్, సీట్ బెల్టు ధరించడంతో పాటు మద్యం సేవించకుండా వాహనాలు నడపాలన్నారు. అనంతరం 30 మంది ఆటో డ్రైవర్లకు ప్రమాద సమయంలో ఉపయోగపడే ఫస్టయిడ్ కిట్లు పంపిణీ చేశారు. యువతకు ఐదు వాలీబాల్ కిట్లు, 200 మందికి హెల్మెట్లు అందజేశారు. అరైవ్.. అలైవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబర్చిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. 75 మంది యువతకు లర్నింగ్ లైసెన్స్ అందజేశారు. గతంలో లొంగిపోయిన ముగ్గురు మావోయిస్టులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషాతో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
రుణాల మంజూరు వేగవంతం చేయాలి
కై లాస్నగర్: ప్రభుత్వ సంక్షేమ, అభివవృద్ధి పథకాల అమలులో బ్యాంకుల పాత్ర కీలకమని, లక్ష్యం మేరకు రుణాల మంజూరు వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన డీఎల్ఆర్సీ డీసీసీ సమావేశాల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాన్ని బ్యాంకు అధికారులతో కలిసి ఆవిష్కరించారు. పీఎంఎఫ్ఎంఈ, పీఎంఈజీపీ, ఎన్ఎల్ఎం, పీఎం విశ్వకర్మ వంటి ప్రతిష్టాత్మక పథకాల పురోగతిపై సుదీర్ఘంగా సమీక్షించారు. వివిధ పథకాల కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులు సత్వరమే పరిష్కరించి రుణాల మంజూరు వేగవంతం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా మహిళా స్వయం సహాయక సంఘాలు కేవలం సంప్రదాయ వ్యాపారాలకే పరిమితం కాకుండా, సరికొత్త ఇన్నోవేటివ్ ఐడియాలతో ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని సూచించారు. మహిళలను స్వయం ఉపాధి దిశగా నడిపించేందుకు బ్యాంకర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రుణాల కోసం వచ్చే రైతులను ఇబ్బంది పెట్టకుండా నిబంధనల ప్రకారం మంజూరు చేయాలన్నారు. ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా డ్రోన్ల వినియోగం, రూఫ్ టాప్ సోలార్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన కోసం కొత్త తరహా రుణాలు అందించాలని పిలుపునిచ్చారు. అలాగే అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు పొందిన రైతులకు కూడా లోన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకు ముందు లీడ్ డిస్టిక్ర్ట్ మేనేజర్ ఉత్పల్ కుమార్ ధామ్ జిల్లా ఆర్థిక ప్రగతిని వివరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్బీఐ ఏజీఎం రాములు, నాబార్డ్ డీడీఎం అబ్దుల్ రావూఫ్, ఆర్సేటీ డైరెక్టర్ మహ్మద్ గౌస్, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
ఆదిలాబాద్టౌన్: ‘ఏజెన్సీ పరిధిలో మాతా శిశు మ రణాల నివారణకు చర్యలు చేపడతాం.. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక దృష్టి సారిస్తాం.. ప్రజలు కూడా వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి..’ అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సాధన అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆమె బుధవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. సాక్షి: సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు..? డీఎంహెచ్వో: వానాకాలందృష్ట్యా అ ప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వైద్య సిబ్బందికి సూచించాం. జి ల్లాలోని ఆయా ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చే స్తాం. జూలైలో ఏజెన్సీ ప్రాంతంలో ఇంటింటి సర్వే చేపడతాం. డీఎంహెచ్వో కార్యాలయంలో కాల్సెంటర్ ఏ ర్పాటు చేసి 24గంటల పా టు సేవలు అందుబాటులో ఉండేలా చూస్తాం. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా, డెంగీ, డయేరియా వంటివి ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తాం. సాక్షి: కొంత మంది సిబ్బంది సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలున్నాయి.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? డీఎంహెచ్వో: వైద్యులు, సిబ్బందికి ఫేషియల్ అటెండెన్స్ ఉంది. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా చర్యలు చేపడతాం. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి. నిర్లక్ష్యం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవు. పీహెచ్సీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు అందుబాటులో ఉండాలి. సాక్షి: డెంగీ, మలేరియా వ్యాధులపై ఎలాంటి ముందస్తు చర్యలు చేపడతారు..? డీఎంహెచ్వో: వానాకాలంలో దోమ కాటుతో డెంగీ, ఇతర వ్యాధులు ప్రబలుతాయి. గతేడాది జిల్లాలో నమోదైన కేసులను దృష్టిలో ఉంచుకొని అవసరమైన చర్యలు చేపడతాం. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించేలా అవగాహన కల్పి స్తున్నాం. వర్షపు నీరు నిల్వ ఉండడంతో అందులో దోమలు వృద్ధ చెంది వ్యాధులకు కారణమవుతాయి. దీనిపై అవగాహన కార్యక్రమాలు చేపడతాం. సాక్షి: జిల్లాలో ఏమైనా మందుల కొరత ఉందా..? డీఎంహెచ్వో: ప్రస్తుతానికి లేదు. వ్యాధుల సీజన్ కావడంతో డ్రగ్ స్టోరేజీలో అవసరమైన మందులను అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతాం. పీహెచ్సీలు, సీహెచ్సీలు, అర్బన్హెల్త్ సెంటర్లు, ఆశ కార్యకర్తలు, వైద్యసిబ్బంది వద్ద అవసరమైన మందులను అందుబాటులో ఉంచేలా చూస్తాం. సాక్షి: కటాఫ్ విలేజ్లపై ఎలాంటి దృష్టి సారిస్తారు..? డీఎంహెచ్వో: జిల్లాలో 192 కటాఫ్ విలేజ్లు ఉ న్నాయి. ప్రతీ పీహెచ్సీలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీ మ్లను ఏర్పాటు చేశాం. ఆయా గ్రామాల్లో ఉండే గర్భిణులను వారం రోజుల ముందుగానే బర్త్ వెయిటింగ్ రూమ్లకు తరలించడం జరుగుతుంది. హైరిస్క్ గర్భిణులను ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లు ఇంటికి వెళ్లిఅవసరమైనచర్యలు చేపడతాయి. సాక్షి: వైద్యుల కొరత తీవ్రంగా ఉంది.. ఎలా అధిగమిస్తారు? డీఎంహెచ్వో: పీజీ విద్యకోసం 18 మంది వైద్యులు వెళ్లడంతో పోస్టులు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం ఆర్బీఎస్కే, జన్మన్ వైద్యుల ద్వారా సేవలు అందిస్తున్నాం. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేలా చూస్తాం. సాక్షి: మాతా శిశు మరణాల నివారణకు ఎలాంటి చర్యలు చేపడతారు..? డీఎంహెచ్వో: జిల్లాలో మాతా శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం. ఇదివరకు ఎనీమియాతో గర్భిణులు మృత్యువాత పడేవారు. ఇటీవల బీపీ కారణంగా చనిపోతున్నారు. హైరిస్క్ ఉన్న గర్భిణులను ఏఎన్ఎం, ఆశ, సూపర్వైజర్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేయిస్తాం. అవసరమైన వారిని వెంటనే రిమ్స్కు తరలించేలా చర్యలు చేపడతున్నాం. -
పెట్రో ధరలు తగ్గించాలి
కై లాస్నగర్: పెంచిన పెట్రో, వంటగ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బుధవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచుతూ సా మాన్యుడి నడ్డి విరుస్తోందని ఆరోపించారు. ఫలితంగా పెరిగిన నిత్యావరాల ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పెంచిన ధరలు తక్షణమే తగ్గించాలని, లేనిపక్షంలో రానున్న రోజుల్లో బీజేపీకి ప్రజలు తగి న గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటాల రాములు, అర్ధాంగి రమేశ్, అమీనా బేగం, మహబూబ్ ఖాన్, సలీం,షేక్ పాషా, కట్గోజి స్వామి, ఎస్.అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో పర్యటించిన శిక్షణ ఐఏఎస్లు
ఇంద్రవెల్లి: 2025 బ్యాచ్కు చెందిన శిక్షణ ఐఏఎస్లు బుధవారం జిల్లాలో పర్యటించారు. తెలంగాణ దర్శన్లో భాగంగా ట్రైయినీ ఐఏఎస్లు హరిప్రసా ద్, సాయి సురేశ్, సాయి శివాని, శ్రీకాంత్రెడ్డి, సచి న్ భజవరగుట్టు, పసర్కుమార్ ముందుగా కేస్లాపూర్ చేరుకున్నారు. నాగోబా ఆలయంలో పూజలు చేపట్టారు. అనంతరం ఇంద్రవెల్లి అమరవీరుల స్తూ పాన్ని సందర్శించి అమరులకు నివాళులర్పించారు. ఇందులో ఐటీడీఏ ఏపీవో వసంత్రావ్, డిప్యూటి ఈవో చందన్, ఏపీవో పీవీటీసీ భాస్కర్, డీఈ తా నాజీ, ఎస్వో రాజ్కుమార్, జేడీఎం నాగభూషణ, నాగ్నాథ్ తదితరులున్నారు. ‘ఐటీడీఏ’లో అధికారులతో సమీక్ష ఉట్నూర్రూరల్: మండలంలోని కామాయిపేట గ్రా మాన్ని సందర్శించారు. గ్రామస్తులతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయంలోని పీవో చాంబర్లో వివిధ శాఖ ల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై సమగ్రంగా చర్చించారు. కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
గ్రేహౌండ్స్ సిబ్బంది ఇతర విభాగాల్లోకి..
సాక్షి, ఆదిలాబాద్: ‘పోలీసు డిపార్ట్మెంట్ ప్రయా ణం కొత్త దిశలో ఉంది. క్రైమ్ స్వరూపం మారిపో యిన దృష్ట్యా శాఖలో కూడా అందుకు తగ్గట్టుగా మార్పులు చేస్తున్నాం. మావోయిస్టు సమస్య పోయింది. దానికోసమే ఏర్పడ్డ గ్రేహౌండ్స్, ఎస్ఐ బీ విభాగాల్లోని సిబ్బందిని ఇతర విభాగాల్లోకి తీసుకుంటాం. ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో, టీజీ టెక్నికల్ టీమ్ (టీస్పార్క్), విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఫుడ్ అండ్ డ్రగ్ కల్తీ నిరోధక విభాగాల ఏర్పాటుతో డ్రగ్స్, సైబర్ సెక్యూ రిటీ, సైబర్ క్రైమ్, ట్రాఫిక్, హైవే యాక్సి డెంట్స్ నిరోధానికి చర్యలు చేపడతాం. ఇందుకు తక్షణం ఆయా విభాగాల్లోని 800 మందిని తీసుకుని వారి సేవలను వినియోగించుకుంటాం’ అని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. మంగళవారం రాత్రి ఆదిలా బాద్ చేరుకున్న ఆయన బుధవారం జిల్లాలో వివిధ కార్యక్ర మాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘ముప్పై, నలభై ఏళ్లుగా మన రాష్ట్రం ఒకే ఆలోచనతో పనిచేసింది. నక్సలైట్లు, మావోయిజం ఎదుర్కోవడానికి పోలీసు శాఖ వివిధ విభాగాల ను అప్పట్లో ఏర్పాటు చేసింది. ఈ దళాల పోరాటం, కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలతో మావోయిజం పూర్తిగా పోయిందని భావించవచ్చు.మన రాష్ట్రంలో లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డులు ఇచ్చాం. వారు జనజీవన స్రవంతిలో కలిసేందుకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించాం’ అని ఆనంద్ చెప్పారు. సమావేశంలో ఉమెన్ సేఫ్టీ, సీఐడీ, ఏసీబీ డీజీ చారు సిన్హా, నార్కోటిక్స్ ఇన్చార్జి సందీప్ శాండిల్య, మల్టీజోన్–1 ఐజీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు.గ్రామసభల్లో పాల్గొన్న డీజీపీరాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలోని గుడి హత్నూర్ మండలం తోషం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో డీజీపీ ఆనంద్ పాల్గొన్నారు. పోలీసు శాఖ నిర్వహిస్తున్న అరైవ్.. అలైవ్ కార్యక్రమాన్ని వివరించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం గ్రామ పెద్దలు డీజీపీకి ఘన స్వాగతం పలికారు. డీజీపీతోపాటు ఇతర అధికారులకు తలపాగా ధరింపజేశారు. కాగా, నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ఆధ్వర్యంలో వినూత్నంగా అమలు చేస్తున్న ‘పోలీస్ అక్క’ కార్యక్రమాన్ని డీజీపీ సీవీ.ఆనంద్ అభినందించారు. -
సందడే సందడి
ఉట్నూర్ పోలీస్స్టేషన్లో ప్రస్తుతం చిన్నారుల నవ్వులు, ఆటపాటలతో వారు చేసే సందడి కనిపిస్తోంది. ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్క్లో చిన్నారులు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు. పార్కులోని జారుడు బల్లలు, ఊయలలు, సీసాలపై ఊగుతూ చిందులు వేస్తున్నారు. ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ నవ్వులు చిందిస్తూ ఆటపాటల్లో మునిగితేలుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల వారు కూడా తమ పిల్లలను పార్క్కు తీసుకువస్తున్నారు. కాగా, చిన్నారులకు పోలీస్ సిబ్బంది స్టేషన్లో వారి విధుల గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఈ చిల్డ్రన్స్ పార్క్ వేసవిలో పిల్లలకు మంచి వినోదాన్నిస్తోంది. తమ పిల్లలు ఎలాంటి భయం లేకుండా సురక్షితమైన వాతావరణంలో ఆడుకోవడం చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. – ఉట్నూర్రూరల్ -
20న జాతీయ లోక్అదాలత్
ఆదిలాబాద్టౌన్: దీర్ఘకాలంగా పెండింగ్లో ఉ న్న కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకునేందుకు ఈనెల 20న జాతీయ లోక్ అ దాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి ప్రభాకరరా వు అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని తన చాంబర్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ క్రిమినల్ కేసులు, సివిల్, రోడ్డు ప్రమాదాలు, ఇతరత్రా కేసులను రాజీమార్గం ద్వారా శాశ్వతంగా పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ మంచి అవకాశమని తెలిపారు. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందులో డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాజ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. -
జాడలేని యూనిఫాం
ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే యూనిఫాం జాడ లేదు. మరో ఐదు రోజుల్లో బడులు పునఃప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు వస్త్రం చేరుకోలేదు. అయితే కుట్టిన యూనిఫాం అందజేస్తారా.. లేక వస్త్రం పంపిస్తారా అనే విషయం విద్యాశాఖ అధికారులకు సైతం తెలియడం లేదు. ప్రతిసారి మార్చి, ఏప్రిల్లోనే వస్త్రం వచ్చేది. అయినా బడి రీఓపెన్ అయ్యే సమయానికి ఒక జత కూడా పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేని పరిస్థితి. ఈసారి వస్త్రమే రాలేదు. ఇక కుట్టడం ఎప్పుడని ఉపాధ్యాయుల్లో సందేహం వ్యక్తమవుతుంది. కాగా, పాఠశాల విద్యా శాఖాధికారులు మాత్రం మొదటి రోజు యూనిఫాం పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. చిరిగిన దుస్తులతోనే.. ఈ విద్యా సంవత్సరం జూన్ 15న బడులు పునఃప్రారంభం కానున్నాయి. ఏటా కనీసం 50 శాతం మంది విద్యార్థులకై నా మొదటి రోజు పాఠ్య పుస్తకాలతో పాటు ఒక జత యూనిఫాం అందజేసేవారు. అయితే ఈసారి ఆ పరిస్థితి కానరావడం లేదు. చిరిగిన దుస్తులతోనే బడికి వచ్చే పరిస్థితి నెలకొందని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. రెడీమేడ్ దుస్తులు పంపిణీ చేస్తే విద్యార్థులకు వదులుగా, చిన్నవి, పెద్దవిగా సైజులు సరిపోక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా యూనిఫాం కుట్టిస్తుండడంతో సమస్య ఎదురయ్యేది కాదు. రెండేళ్లుగా స్వయం సహాయక సంఘాల ద్వారా కుట్టించి విద్యార్థులకు పంపిణీ చేసేవారు. సకాలంలో కూలీ అందకపోయినా యూనిఫాంలను మాత్రం కుట్టి పాఠశాలలకు అందజేసేవారు. మరి ఈసారి పరిస్థితి ఏమిటనేది తెలియరావడం లేదు. 73,884 మంది విద్యార్థులకు.. జిల్లాలో 1180 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వీటిలో 73,884 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరందరికీ రెండు జతల యూనిఫాం అందించాల్సి ఉంది. రెండేళ్లుగా స్వయం సహాయక సంఘాల ద్వారా యూనిఫాం కుట్టించి విద్యార్థులకు పంపిణీ చేసేవారు. ఈ కుట్టుకు సంబంధించిన బాధ్యతలను డీఆర్డీఏకు అప్పగించేవారు. యూనిఫాంలు త్వరగా కుట్టించేలా ప్రభుత్వం మండల, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసేవారు. ఈసారి ఆ కమిటీలు కూడా వేయలేదని తెలుస్తోంది. అయితే గతనెల 27న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నికోలస్ యూనిఫాంకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. డేస్కాలర్ విద్యార్థులకు రెండు జతల యూనిఫాం, బ్లాక్ షూ, రెండు సాక్సులు, బెల్టు అందిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే రెసిడెన్షియల్, కేజీబీవీ, మోడల్ స్కూల్, హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు నైట్ డ్రెస్, పీటీ డ్రెస్, ట్రాక్సూట్, వైట్ షూ, రెండు సాక్సులు, టవల్, ప్లేట్, గ్లాస్, కటోరా, కప్పులు, స్పూన్స్ ఇవ్వాలని పేర్కొన్నారు. వీటన్నింటిని బడులు తెరిచిన మొదటిరోజు అందించేలా చర్యలు చేపట్టాలని తెలిపినప్పటికీ ఇంకా బడులకు చేరుకోలేదు. యాజమాన్యం పాఠశాలలు విద్యార్థుల డీఈవో పరిధిలో 974 52,485 ట్రైబల్ వెల్ఫేర్ 171 14,054 బీసీ గురుకులాలు 06 331 ఎస్సీ గురుకులాలు 16 1975 గిరిజన గురుకులాలు 06 1755 జ్యోతిబాపూలే పాఠశాలలు 07 3284 యూనిఫాం అందించేలా చర్యలు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫాం అందించేలా చర్యలు చేపడుతున్నాం. బడులు తెరిచిన మొదటి రోజు అందించాలని విద్యాశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు వస్త్రం రాలేదు. – ఉష్కం తిరుపతి, సెక్టోరియల్ అధికారి -
రైల్వే పనుల పురోగతిపై దృష్టి సారించాలి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రైల్వే పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీ గోడం నగేష్ దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవకు విన్నవించారు. సికింద్రాబాద్లోని ఆయన కార్యాలయంలో మంగళవారం కలిసి పలు పెండింగ్ అంశాలపై చర్చించారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన ‘ఆదిలాబాద్–ఆర్మూర్’ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి డీపీఆర్ వేగవంతం చేయాలని కోరారు. కరంజి రోడ్–జందాపూర్ (ఎల్సీ నంబర్ 33), బాసర రైల్వే స్టేషన్ (ఎల్సీ నంబర్ 182), రెబ్బెన (ఎల్సీ నంబర్ 71) వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణానికి తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని విన్నవించారు. -
పోరాట వీరుడు బిర్సాముండా
ఆదిలాబాద్రూరల్: బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమంలో పోరాడిన తొలి ఆదివాసీ పోరాటయోధుడు బిర్సాముండా అని కొలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సోనేరావ్ అన్నారు. బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ ఎదుట గల ఆయన విగ్రహానికి మంగళవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బిర్సాముండా స్ఫూర్తితో ఆదివాసీలకు దక్కాల్సిన హక్కులు, చట్టాల సాధనకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాజ్గోండ్ సేవా సమితి రాష్ట్ర నాయకుడు కుర్సెంగే తానాజీ, మెస్రం శంకర్, ఆదివాసీ పర్దాన్ సమాజ్ జాతీయ నాయకుడు కుర్సెంగే యాదవ్ రావ్, గేడం మాధవ్, గేడం మనోహర్, మేస్రం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
● ఆదిలాబాద్కు విచ్చేసిన డీజీపీ సీవీ ఆనంద్ ● నేడు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
సాక్షి,ఆదిలాబాద్/ఆదిలాబాద్టౌన్: జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పోలీస్బాస్ మంగళవారం రాత్రి ఆదిలాబాద్కు విచ్చేశారు. డీజీపీ సీవీ ఆనంద్కు కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. వారివెంట ఉమె న్ సేఫ్టీ, సీఐడీ డీజీ చారుసిన్హా తదితరులున్నారు. వీరు బుధవారం జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. బెల్లంపల్లిలో ఏడాదిపాటు అదనపు ఎస్పీగా.. డీజీపీ సీవీ ఆనంద్ తన కెరీర్ ప్రారంభంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లిలో ఆపరేషన్స్ అ దనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (అడిషనల్ ఎస్పీ)గా ఏడాది పాటు పనిచేశారు. నక్సలైట్లపై కూంబింగ్ ఆపరేషన్లకు స్వయంగా నాయకత్వం వహించారు. డీజీపీగా మే 1న బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలిసారిగా జిల్లాకు విచ్చేశారు. నేటి పర్యటన ఇలా.. డీజీపీ ఉదయం జిల్లా పోలీసు అధికారులతో క్రైమ్ రివ్యూలో పాల్గొననున్నారు. పట్టణంలోని కలెక్టరేట్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ వ్య వస్థను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చేరుకుంటా రు. వీటితో పాటు పలు ఇతర కార్యక్రమాల్లోనూ డీజీపీ పాల్గొననున్నారు. -
పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థినికి ఉత్తమ ప్యాకేజీ
శ్రీరాంపూర్: సీసీసీలోని సింగరేణి పాలిటెక్నిక్ కాలేజీ పూర్వ విద్యార్థిని మంచాల అక్షయ ఉత్తమ ప్యాకేజీతో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించింది. 2020–23లో ఇక్కడ సివిల్ డిప్లొమా కోర్సు చదివిన ఆమె అనంతరం కంప్యూటర్ ఇంజినీరింగ్ చేసింది. ఇటీవల హెచ్ఎస్బీలో రూ.16.43 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించింది. ఈ సందర్భంగా మంగళవారం కాలేజీలో అక్షయను ప్రిన్సిపల్ కుర్మ రాజేందర్, డీజీఎం (పర్సనల్) అనిల్కుమార్ అభినందించారు. సింగరేణి పాలిటెక్నిక్ కాలజీ మంచి విద్యాప్రమాణాలతో కొనసాగుతుందనడానికి ఇది నిదర్శనమని వారు తెలిపారు. పారిశుధ్య కార్మికుడి మృతిభైంసాటౌన్: పట్టణంలోని మున్సిపాలిటీ పారి శుధ్య విభాగంలో పని చేస్తున్న జంగ్మే మారుతి (45) గడ్డెన్నవాగు ప్రాజెక్టులో పడి మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మారుతి కొన్నేళ్లుగా మున్సిపాలిటీలో పారిశుధ్య విభాగంలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రెండురోజులుగా విధులకు హాజరుకావడం లేదు. మంగళవారం సాయంత్రం గడ్డెన్నవాగు ప్రాజెక్టులో అతడి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీయించారు. పోస్టుమార్టం నిమిత్తం ఏరియాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య సుకేశ్న బాయి, ఇద్దరు కొడుకులున్నారు. వడదెబ్బతో ఒకరు మృతిఆసిఫాబాద్రూరల్: వడదెబ్బతో ఒకరు మృతి చెందిన ఘటన మండలంలోని రాజురా గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాజురా గ్రామానికి చెందిన పిప్రే మోహన్ (40) ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లాడు. పనులు ముగించుకుని ఇంటికి వచ్చి ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. -
ప్రాణాలు తీస్తున్న నిర్లక్ష్యం!
భైంసా: బాసర గోదావరి నదిలో మరో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం హైదరాబాద్కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు అన్నదమ్ములు పుణ్యస్నానానికి వెళ్లి నీటమునిగి మృత్యువాత పడిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనతో బాసర గోదావరిలో భద్రతా లోపాలపై మరోసారి చర్చ మొదలైంది. ప్రతీ ఏడాది ప్రమాదాలు జరుగుతున్నా ఘటన జరిగినప్పుడు మాత్రమే అధికారులు స్పందించడం, అనంతరం పరిస్థితి మళ్లీ ఎప్పటిలాగే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతేడాది ఐదుగురు.. గతేడాది జూన్ 15న గోదావరి నదిలో స్నానానికి దిగిన ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తు నీటి మునిగి ప్రాణాలు కోల్పోయారు. వీరు రాజస్థాన్కు చెందినవారు కాగా, ఈ కుటుంబం హైదరాబాద్లో స్థిర పడింది. ఆ సమయంలో హైదరాబాద్కు చెందిన 30 మంది బృందం ఇంటర్సిటీ రైతులో బాసరకు చేరుకుంది. ఇసుక దిబ్బ నుంచి నీటిలో స్నానాలు చేస్తూ ప్రమాదవశాత్తు రాథోడ్ రాకేశ్, భరత్, మదన్, వినోద్, రుతిక్ మృతిచెందారు. ఈ ఘటన మరువకముందే ఇప్పుడు మరో ముగ్గురు మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. ఏటా బాసరకు లక్షలాది మంది భక్తులు వస్తున్నప్పటికీ నదీ తీరంలో శాశ్వత భద్రతా ఏర్పాట్లు మాత్రం లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు నది పరిస్థితులపై అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు మరింత పెరుగుతున్నాయి. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు తక్కువగా ఉండటంతో పాటు నిత్యం విధుల్లో ఉండే లైఫ్గార్డుల సంఖ్య కూడా సరిపడా లేదని తెలుస్తోంది. పండుగలు, సెలవు దినాలు, వారాంతాల్లో భారీగా భక్తులు వచ్చే సమయంలో ప్రత్యేక నిఘా అవసరమని భక్తులు భావిస్తున్నారు. భక్తుల ప్రధాన డిమాండ్లు -
బోథ్, సొనాల మండలాల్లో భారీ వర్షం
బోథ్: బోథ్, సొనాల మండలాల వ్యాప్తంగా సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం బీభత్సం సష్టించింది. ఏకధాటిగా దాదాపు మూడు గంటల పాటు కురియడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సొనాల మండలంలోని పెద్దగూడ గ్రామ సరిహద్దులో ప్రవహిస్తున్న వాగు ఉధృతికి వంతెన సమీపంలో రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోథ్ మండల కేంద్రంలోనూ వర్షం కురిసే సమయంలో పిడుగు పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పిడుగు తీవ్రతకు పట్టణంలోని పలువురి ఇళ్లలో టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. మరోవైపు ఈ ఏడాది తొలకరి పలకరించడంతో రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వాన పడటంతో అదును చూసుకుని పలు గ్రామాల్లో రైతులు ఆనందంగా విత్తనాలు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. -
మేల్కోకుంటే.. ముప్పే!
కై లాస్నగర్: వర్షాకాలం మొదలైంది. పట్టణంలోని చాలా డ్రెయినేజీలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయాయి. పూడిక పేరుకుపోవడంతో చిన్నపాటి వర్షానికే అవి పొంగి ప్రవహించే అవకాశముంది. ముందస్తు చర్యల్లో భాగంగా వేసవిలోనే పూడికతీత పనులు చేపట్టాల్సిన బల్దియా యంత్రాంగం ఇప్పటి వరకు ఆ దిశగా దృష్టి సారించలేదు. గతేడాది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పలు కాలనీల్లో ఇళ్లలోకి వరదనీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయినా పాఠం నేర్వని అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూడిక తొలగింపుపై అలసత్వం.. మున్సిపల్ పరిధిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా డ్రెయినేజీలు నిర్మిస్తున్నారు. ప్రధానంగా పట్టణంలోని విద్యానగర్, రాంనగర్, సుభాష్నగర్, రిక్షాకాలనీ, రిమ్స్, పంజాబ్చౌక్, శాంతినగర్, మహలక్ష్మివాడ, హౌసింగ్బోర్డు, ఖానాపూర్, తాటిగూడ, దస్నాపూర్ వంటి పలు కాలనీల్లో సుమారు 20కి పైగా భారీ డ్రెయినేజీలు ఉన్నాయి. వీటిలో కొ న్నింటిని పారిశుద్ధ్య కార్మికులతో ఎప్పటికప్పుడు శు భ్రం చేయిస్తున్నారు. కొన్నింటిని జేసీబీలతో మా త్రమే శుభ్రం చేయాల్సి ఉంటుంది. అయితే ఆ ప్ర క్రియ సాగకపోవడంతో ఆయా డ్రెయినేజీల్లో చెత్తాచెదారంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు భారీగా పేరుకుపోయాయి. ఈ క్రమంలో భారీ వర్షాలు కురిస్తే వరదంతా రోడ్లపై ప్రవహించే అవకాశముంది. గతేడాది ఇదే పరిస్థితి తలెత్తింది. వర్షాకాలం రాకముందే పూడికతీత పనులపై దృష్టి సారించాల్సిన బల్దియా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాది కూడా మళ్లీ వరద ముంపు సమస్య తప్పకపోవవచ్చని ఆయా కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకపాత్రలో బల్దియా ... గతేడాది ఆలస్యంగా పనులు చేపట్టడంతో పంజాబ్ చౌక్లోని భారీ డ్రెయినేజీ ఉప్పొంగి మురుగునీరంతా రోడ్లపైకి చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాటిగూడ, మహాలక్ష్మివాడ కాలనీల్లోని ప లు ఇళ్లలోకి మురుగునీరు చేరింది. ఎగువ నుంచి వ చ్చిన వరదతో జీఎస్ఎస్టేట్ పూర్తిగా జలమయమైంది. దాని ఎదుట గల ప్రధాన పాత జాతీయ రహదారిపై ఐదారు గంటలు రాకపోకలు స్తంభించాయి. స్వయంగా కలెక్టర్ రాజర్షి షా అక్కడికి చేరుకుని పు నరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఈ సారి ఇప్పటి వర కు కనీసం వరద ప్రాంతాలను గుర్తించకపోవడం, టెండర్ల ప్రక్రియ చేపట్టకపోవడంతో మళ్లీ ముప్పు తప్పవకపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతుంది. త్వరలోనే పూడికతీత పనులు పట్టణ పరిధిలో ఎన్ని వరద డ్రెయినేజీలు ఉన్నాయి.. గతేడాది ఏయే చోట్ల సమస్యలు తలెత్తాయనేదానిపై ఆరా తీస్తున్నాం. స్వయంగా కాలనీలకు వెళ్లి పరిశీలిస్తున్నాం. త్వరలోనే గుర్తించి పూడికతీత పనులు చేపట్టేలా టెండర్ల ప్రక్రియ చేపడతాం. ఒకవేళ ఆలస్యమైతే అడ్వాన్స్గానైనా పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. – ఏ.జగదీశ్వర్గౌడ్, మున్సిపల్ కమిషనర్ ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో.. వార్డులు : 49 కుటుంబాలు 48,393 జనాభా : 1,50,383 ప్రధాన డ్రెయినేజీలు : 20 -
చెన్నూర్లో ప్రజామరుగుదొడ్లు కరువు
చెన్నూర్: చెన్నూర్ బల్దియాలో ప్రజామరుగుదొడ్లుకరువయ్యాయి. కోటపల్లి, వేమనపల్లితో పాటు చెన్నూర్ మండలాలకు చెన్నూర్ మున్సిపాలిటీ వ్యాపార కేంద్రంగా మారింది. దీంతో నిత్యం వేలాదిమంది ప్రజలు వివిధ అవసరాల కోసం ఇక్కడికి వస్తుంటారు. బల్దియా పరిధిలో 18 వార్డులుండగా సుమారు 30 వేలకు పైగా జనాభా ఉంది. గతంలో చెన్నూర్లో ఆర్టీసీ బస్టాండ్తో పాటు ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంతాల్లో రెండు సులభ్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేయగా అందరూ వినియోగించుకున్నారు. నూతన ఆస్పత్రి భవన నిర్మాణంలో భాగంగా సులభ్ కాంప్లెక్స్ను తొలగించడంతో అందరికీ బస్టాండ్లోని సులభ్ కాంప్లెక్స్ మాత్రమే దిక్కయింది. దీంతో ప్రధానంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితులుంటే ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ప్రధాన వ్యాపార సంస్థలు, బ్యాంక్లు, ఆస్పత్రి గాంధీచౌక్ ఏరియాల్లోనే ఉండడంతో ఇక్కడికి జనం ఎక్కువగా వస్తుంటారు. అధికారులు స్పందించి గాంధీచౌక్, పాత బస్టాండ్ ఏరియాల్లో ప్రజామరుగుదొడ్లు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. సమస్య పరిష్కరిస్తాం మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన వ్యాపార కేంద్రాల ప్రాంతాల్లో ప్రజామరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రభుత్వ స్థలం లేదు. ప్రజల ఇబ్బందులను గుర్తించి పాత బస్టాండ్ ప్రాంతం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సమీపంలో ప్రజామరుగుదొడ్లు నిర్మించాలని ప్రతిపాదించాం. సమస్యను మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకువెళ్లి పాత బస్టాండ్ ప్రాంతంలో సులభ్ కాంప్లెక్ నిర్మించేందుకు కృషి చేస్తాం. – మురళీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ -
పిడుగుల దడ!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/కౌటాల: తొలకరి వానలతో ఉ మ్మడి జిల్లా ప్రజలకు పిడుగుల దడ మొదలైంది. ఉరుములు, మె రుపులు, శబ్దాలతో భయం వెంటాడుతోంది. ఏటా ఉమ్మడి జిల్లాలో వానాకా లం ఆరంభం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పిడుగుల వానలు కురుస్తున్నాయి. సీజన్ ముగిసే వరకు పదుల సంఖ్యలో పిడుగుపాటు మరణాలు సంభవిస్తున్నాయి. మూగజీవా లు, ఆస్తులకు నష్టం వాటిల్లుతోంది. చనిపోతున్న వారిలో గిరిజనులు, పేద, మధ్య తరగతికి చెందిన వారే అధికంగా ఉంటున్నారు. ఒక్కోసారి ఒకే కు టుంబం నుంచి ఇద్దరు, ముగ్గురు ప్రమాదం బారిన పడుతున్నారు. స్థానిక రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ అధికారి ధ్రువీకరణతో జిల్లా కలెక్టర్ ద్వారా బాధిత కుటుంబాలు రూ.6లక్షలు పొందవచ్చు. రైతుబీమా ఉంటే మరో రూ.5లక్షల సాయం అందుతుంది. అయితే బాధిత కుటుంబాలకు పరిహారం అందడంలో జాప్యం జరుగుతోంది. వానాకాలంలో తీవ్రత ఎక్కువ ప్రధానంగా వానాకాలం సీజన్ ప్రారంభంలో పిడుగుల తీవ్రత ఎక్కువ ఉంటుంది. సాధారణంగా మే ఘాలు రెండు ఒకదానిని మరొకటి తాకినప్పుడు విద్యుత్ శక్తి వెలువడుతుంది. ఇది భూమి వైపు ప్ర యాణించే సమయంలో లోహాలు, చెట్లు, ఎత్తయిన కట్టడాలు ఆకర్షిస్తాయి. తొలకరి వర్షాల సమయంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండే రైతులు, కూలీలు ఎక్కువగా పిడుగుపాటుకు గురవుతున్నా రు. ప్రాణహానితోపాటు తీవ్ర గాయాలపాలవుతున్నారు. మూగజీవాలు సైతం ఊపిరి విడుస్తున్నా యి. మరికొన్ని సమయాల్లో సెల్టవర్లు, విద్యుత్ ఉపకరణాలు దెబ్బతింటున్నాయి. ‘దామిని’తో తప్పును ముప్పు ఐఎండీ(భారత వాతావరణ శాఖ) 88శాతం కచ్చితత్వంతో జిల్లాల వారీగా ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తోంది. అధికశాతం నిరక్షరాస్యులే కావడంతో గుర్తించలేకపోతున్నారు. దామిని యాప్ సమాచారాన్ని లోకల్ వాట్సాప్ గ్రూపుల ద్వారా రైతులు, కూలీలకు చేరవేయాల్సి ఉంది. యాప్ వాడే వ్యక్తికి 20నుంచి 40 కిలోమీటర్ల దూరంలోనూ అప్రమత్తం చేస్తుంది. స్మార్ట్ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘దామిని’ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 7, 14, 21 నిమిషాల ముందు హెచ్చరికలు జారీ చేస్తుంది. రిజిష్టర్ చేసుకుంటే చదువురాని వారు సైతం సు లువుగా అప్రమత్తం అయ్యేలా ఆలారం మోగుతుంది. తెలంగాణ విపత్తు నిర్వహణ శాఖ ముందు రో జు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలోనూ అప్రమత్తం చేస్తుంది. ప్రజల మొబైళ్లకు సందేశాలు పంపుతుంది. జిల్లా వ్యవసాయ, ప్రణాళిక శాఖ, కృషి విజ్ఞాన కేంద్రాలు, దినపత్రికల్లో వచ్చే వాతావరణ సూచనలు పాటిస్తే ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. గాల్లో కలుస్తున్న ప్రాణాలు జాగ్రత్తలే రక్ష -
ఓటర్ల మ్యాపింగ్ విజయవంతం చేయండి
కై లాస్నగర్: ఓటర్ల మ్యాపింగ్ను విజయవంతం చే యాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో తన ఓటును ఎస్ఐఆర్– 2002 జాబితాకు బీఎల్వో, తహసీల్దార్ సమక్షంలో మంగళవారం మ్యాపింగ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మ్యాపింగ్ ప్రక్రియకు జూన్ 24 వరకు గడువు ఉందన్నారు. 25వ తేదీ నుంచి బీ ఎల్వోలు ఇంటింటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫార మ్స్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభిస్తారని తెలిపారు. పట్టణ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ యజ్వేందర్ రెడ్డి, బీఎల్వో నివేదిత తదితరులున్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రగతిపై సమీక్ష జిల్లా కేంద్ర సహకార బ్యాంకును లాభాలబాటలో తీసుకెళ్లెలా పనిచేయాలని కలెక్టర్, బ్యాంకు పర్సన్ ఇన్చార్జి రాజర్షి షా ఆదేశించారు. మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు సంబంధించిన డీఎల్ఎంఆర్సీ, డీఎల్ఈసీ సమావేశాలు నిర్వహించారు. బ్యాంకు ప్ర స్తుత ఆర్థిక స్థితిగతులు, ప్రగతిని సమీక్షించారు. ఖా తాదారులకు మెరుగైన సేవలు అందించేలా తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. సమావేశంలో సీఈవో సీహెచ్.రవి, నాబార్డ్ డీడీఎం అబ్దుల్ రవూఫ్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల సహకార అధికారి ఎం.సత్యనారాయణ, మంచిర్యాల అసిస్టెంట్ రిజి స్ట్రార్ రవీందర్, డీజీఎంలు టి. వెంకటేశ్వరస్వామి, జి.భీమేందర్, తదితరులు పాల్గొన్నారు. పీఆర్ కార్యాలయం తనిఖీజెడ్పీ కార్యాలయంలో గల పంచాయతీరాజ్ ఈఈ కార్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశా రు. అన్ని విభాగాల గదులు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. విలేజ్ ఆర్గనైజేషన్ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, జీపీ భవనాలతో పాటు పాఠశాలల్లో చేపట్టిన కిచెన్ షెడ్లు, మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణ పనులను గడువులోపు నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని సందర్శించారు. పనుల నాణ్యత పర్యవేక్షణ తీరును అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఈఈ శివరాం, డీఈఈ రమేశ్పవార్, క్వాలిటీ కంట్రోల్ డీఈఈ సలావుద్దీ న్, సూపరింటెండెంట్ శ్రీరామ్ తదితరులున్నారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి చర్యలు ఆదిలాబాద్టౌన్:విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నా రు. జెడ్పీ సమావేశ మందిరంలో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ, గతేడాదితో పోల్చితే ఈసారి 30 శాతం విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంచాలని ఆదేశించారు. లేకుంటే ఉపాధ్యాయులపై చర్యలుంటా యని హెచ్చరించారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం, చతుర్విద ప్రక్రియలు రావాలని సూచించారు. యూని ఫాంకు సంబంధించిన వస్త్రం వస్తుందని, మెప్మా అధికారులు చొరవ చూపి త్వరగా కుట్టించేలా చూ డాలన్నారు. ఇప్పటినుంచే పదో తరగతి విద్యార్థుల పై ప్రత్యేక దృష్టిసారించాలని పేర్కొన్నారు. ప్రతీ పాఠశాలలో కిచెన్ గార్డెన్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. డిజిటల్ విద్య పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జిల్లాలో ఉన్న 12 జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలను పునఃప్రారంభించేలా చర్యలు చేపట్టాలని విద్యా శాఖాధికారులను ఆదేశించారు. 22 అంశాల ను తప్పనిసరిగాఅమలు చేయాలన్నారు. సమావేశంలో డీఈవో మాధవి, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ కందుల గజేందర్, తిరుపతి, లక్ష్మణ్, రఘురమణ, అజయ్, ఎంఈవో సోమయ్య, మెప్మా పీడీ సీవీఎన్ రాజు పాల్గొన్నారు. -
ఓసీ పేలుళ్లపై ఆందోళన
కాసిపేట: మందమర్రి ఏరియా కేకే ఓపెన్కాస్ట్ వద్ద మంగళవారం సోమగూడం, చొప్పరిపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. అధిక పేలుళ్లతో ఇంట్లో ఉండలేకపోతున్నామని, ఇళ్లు పగుళ్లు తేలాయని, దుమ్ము, విషవాయువులతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పేలుళ్ల తీవ్రత అధికంగా ఉండటంతో తిప్పలు తప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అడ్డుకున్న క్రమంలో రెండు రోజులు తీవ్ర తగ్గించి తిరిగి యథావిధిగా పేలుళ్లు జరుపుతున్నట్లు ఆరోపించారు. రోజూ సాయంత్రం పేలుళ్ల దాటికి ఇళ్ల గోడలు, రేకులు పగిలి పోతున్నాయని, వర్షాకాలంలో ఇళ్లల్లో ఉండే పరిస్థితి లేదని మండిపడ్డారు. పేలుళ్ల తీవ్రతను తగ్గిస్తామని స్పష్టమైన హామీ ఇస్తూ విస్మరిస్తున్నారని, ఇలా జరిగితే ఆందోళనలు ఉధృతం చేసి ఓపెన్కాస్ట్ను పూర్తిగా అడ్డుకోనున్నట్లు హెచ్చరించారు. ఓసీలో పేలుళ్లను తగ్గిస్తామని, గ్రామంలో సర్వే చేయించి పగుళ్లు తేలిన గోడలకు మరమ్మతులు చేయిస్తామని, సమస్యలు పరిష్కరిస్తామని సింగరేణి అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. స్థానిక నాయకులు రాంచందర్, గురుమూర్తి, తిరుపతి, లక్ష్మణ్, స్వరూప, గ్రామస్తులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ మృతి
రెబ్బెన: మండలంలోని నేర్పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రేగళ్ల వెంకటేశ్వర్లు (45) చికిత్స పొందుతూ మృతి చెందారు. గత నెల 11 నుంచి వెంకటేశ్వర్లు నేర్పల్లిలో జనగణన విధులు నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల క్రితం డీహైడ్రేషన్తో అస్వస్థతకు గురయ్యారు. కుటుంబీకులు చికిత్స చేయించినా కోలుకోలేదు. సోమవారం పరిస్థితి విషమించడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ కార్డియక్ అరెస్ట్కు గురై సోమవారం రాత్రి మృతి చెందారు. మృతుడికి భార్య శ్రీలత ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ దుర్మరణం
నేరడిగొండ: రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి చెందగా ఆర్ఎంపీకి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లఖంపూర్ గ్రామానికి చెందిన మాడవి షేక్రావ్ (45) ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం తన ఆటోలో ఇచ్చోడ వైపు వెళ్తుండగా మార్గమధ్యలో గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాడవి షేక్రావ్కు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కుమారి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ దేవిదాస్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు దేవిదాస్ను చికిత్స కోసం ఆదిలాబాద్లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. షేక్రావ్కు భార్య సంధ్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. ఇంటి పెద్దదిక్కు మరణించడంతో అతడి భార్య, పిల్లల రోదనలు స్థానికులను కలచివేశాయి. ఎస్సై ఇమ్రాన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
డీఎంహెచ్వోగా సాధన
ఆదిలాబాద్టౌన్: జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్వో)గా డాక్టర్ సాధన మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఉట్నూర్లో అడిషనల్ డీఎంహెచ్వోగా కొనసాగారు. ఇక్కడ డీఎంహెచ్వోగా పనిచేస్తూ డిప్యూటేషన్పై ఉన్న కృష్ణ బదిలీపై నాగర్కర్నూల్కు వెళ్లారు. కేవలం రెండు నెలల పాటు మాత్రమే ఆయన ఇక్కడ విధులు నిర్వహించారు. మహబూబ్నగర్లో డిప్యూటేషన్పై పనిచేశారు. కాగా ఇదివరకు ఇన్చార్జి డీఎంహెచ్వోగా పనిచేసిన నరేందర్ 2020 జూన్ నుంచి ఇప్పటివరకు విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఈయన పీఓడీటీటీగా కొనసాగనున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం డీఎంహెచ్వోను ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్, డిప్యూటీ సివిల్ సర్జన్ మనోహర్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, కార్యాలయ ఏఓ నందిని, డీపీఓ దేవిదాస్, తెలంగాణ వైద్యారోగ్య శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బ్రహ్మానంద రెడ్డి, రమణాచారి, తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. -
మహిళా సంఘాలకు 18 కొత్త బస్సులు
కై లాస్నగర్: మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం కొత్తగా బస్సులను అందజేసింది. ఎస్హెచ్జీ సభ్యులను కోటిశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని 18 సంఘాలకు ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఒక్కో సంఘానికి ఒకటి చొప్పున 18 బస్సులను కేటాయించింది. సికింద్రాబాద్లోని పరేడ్గ్రౌండ్లో మంగళవారం నిర్వహించిన మహిళా శక్తి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎస్హెచ్జీలకు వాటిని అందజేశారు. కార్యక్రమానికి జిల్లా నుంచి డీఆర్డీవో రాథోడ్ రవీందర్, ఏపీడీ జాదవ్ గోవింద్రావు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పి.లక్ష్మి, కోశాధికారి మంజూషా, సెర్ప్ హెచ్ఆర్ మేనేజర్ శ్రీనివాస్తో పాటు అన్ని మండలాల ఏపీఎంలు, ఒక్కో మండలం నుంచి 50 మంది మహిళా సంఘాల సభ్యులు ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్కు తరలివెళ్లారు. ఈ బస్సులను మండల సమాఖ్యలు ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్నారు. ఒక్కో బస్సుకు నెలకు రూ.69వేల చొప్పున ఆర్టీసీ అద్దె చెల్లించనుంది. ఎస్హెచ్జీల ఆర్థిక స్వావలంబనకు ఈ పథకం తోడ్పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. -
మృత్యువులోనూ వీడని అన్నబంధం!
మృతదేహాలను ఒడ్డుకు చేర్చుతున్న గంగపుత్రులు, పోలీసులు బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని కాచిగూడ చెప్పల్ బజార్ ప్రాంతంలో నివాసముండే నీలి నాగభూషణ్కు ముగ్గురు కుమారులు చంద్రశేఖర్ (38), రాంచందర్ (36), మల్లేశ్కుమార్ (31) ఉన్నారు. వీరంతా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఫుట్పాత్పై చిరువ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. నాగభూషణ్ భార్య చంద్రకళ రెండేళ్ల క్రితమే మృతి చెందగా ముగ్గురు కుమారులైన చంద్రశేఖర్ (38), రాంచందర్ (36), మల్లేశ్కుమార్ (31)తో ఉంటున్నాడు. రాంచందర్–అశ్విని దంపతులకు ఇద్దరు కుమారులు వసంత్, విజయ్ ఉన్నారు. వీరి అక్షరాభ్యాసం కోసం ఈ కుటుంబమంతా మంగళవారం బాసరకు వచ్చింది. ముందుగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయానికి వెళ్లి అక్షరాభ్యాసాలు చేయించాలని నిర్ణయించుకున్నారు. స్నానాల కోసం ఇంటెక్వెల్ వద్ద నదిలోకి దిగిన చంద్రశేఖర్, రాంచందర్, మల్లేశ్కుమార్ బురదనీటిలో కూరుకుపోయారు. ఒకరిని కాపాడే ప్రయత్నంలో మరొకరు ముగ్గురూ నీటిమునిగి మృత్యువాత పడ్డారు. తన కళ్లెదుటే ముగ్గురు కొడుకులు ప్రాణాలు కోల్పోవడం చూసి నాగభూషణ్ గుండెలు బాదుకున్నాడు. వీరి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రెండు గంటలు గాలింపు గోదావరి నదిలో స్నానాలకు దిగిన ప్రాంతంలో ఇంటెక్ వెల్ ఉంది. నది నీటిని తాగునీటి కోసం మళ్లించేందుకు ఇక్కడ ఫిల్టర్ బెడ్ నిర్మించారు. ఈ ప్రాంతంలో బురద కూడా ఎక్కువగానే ఉంది. ముందుగా స్నానానికి వెళ్లిన చంద్రశేఖర్ అందులో కూరుకుపోతుంటే తమ్ముడు మల్లేశ్కుమార్ కాపాడే ప్రయత్నం చేశాడు. ఇద్దరు మునిగిపోతుండగా రాంచందర్ వారిని కాపాడే ప్రయత్నం చేశాడు. క్షణాల్లోనే ముగ్గురు గల్లంతైపోయారు. కళ్లెదుటే జరిగిన ఈ ఘటనను చూసి కుటుంబీకులంతా తల్లడిల్లిపోయింది. తండ్రి నాగభూషణ్తోపాటు మిగతా కుటుంబీకులంతా కన్నీరు మున్నీరుగా విలపించారు. వీరి రోదన అక్కడివారిని కంటతడి పెట్టించింది. సీఐ దీపక్ ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. రెస్క్యూ టీం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. చివరకు స్థానిక గంగపుత్రులు వెళ్లి మృతదేహాలను బయటకు తీశారు. భైంసా ఏరియాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారు ముగ్గురూ తోడబుట్టిన అన్నదమ్ములు. మూడు దశాబ్దాలకు పైగా అనుబంధం. ఒకరి చేయి పట్టుకుని ఒకరు పెరిగారు. మృత్యువు ఎదురొచ్చినా ఏ ఒక్కరూ చేయి విడువ లేదు. నీట మునిగిపోతున్న ఒకరిని కాపాడబోయి ఒకరు ఇలా ముగ్గురూ గోదావరి నదిలో మృత్యు ఒడికి చేరారు. పిల్లల అక్షరాభ్యాసం కోసం ఆనందంగా మంగళవారం నిర్మల్ జిల్లా బాసరకు వచ్చిన ఆ కుటుంబం పర్యటన విషాదాంతంగా ముగిసింది. ఒక్కసారిగా ముగ్గురు అన్నదమ్ముల మృతితో ఆ కుటుంబాన్ని విషాదం ముంచేసింది. – భైంసా/బాసరబాసర యువకుల మానవత్వంఈ విషాద ఘటన సమయంలో మానవత్వం చూపిన బాసర యువకులు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే స్వచ్ఛందంగా ముందుకువచ్చి బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. సొంత బంధువుల్లా బాధిత కుటుంబాన్ని ఓదారుస్తూ వారి వెంట ఉండి ధైర్యం చెప్పడం అక్కడున్న ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేసింది. ఒకవైపు ముగ్గురు కుమారులను కోల్పోయిన తండ్రి ఆవేదన, మరోవైపు భర్తను కోల్పోయిన మహిళల రోదనలు అక్కడి వారిని కన్నీళ్లు పెట్టించాయి. చిన్నారులు తమ తండ్రుల కోసం ఎదురుచూస్తుండగానే వారి మరణవార్త వినాల్సి రావడం అందరి హృదయాలను కలిచివేసింది. అంతటితో ఆగకుండా ఆ యువకులంతా విరాళాలు సేకరించి అంబులెన్స్, కారులో మృతదేహాలు, కుటుంబీకులను హైదరాబాద్కు తరలించారు. -
వెళ్లింది 12 మంది.. వచ్చింది ఇద్దరు
ఆదిలాబాద్టౌన్: మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా మారింది రిమ్స్ పరిస్థితి. ప్రతీసారి బదిలీల్లో రిమ్స్ ఆస్పత్రిపై నిర్లక్ష్యం జరుగుతోంది. అసలే వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు అధిక పో స్టులు కేటాయించాల్సిన అధికారులు ఉన్న వారిని బదిలీ చేసి వారి స్థానంలో కొత్త వారిని కేటాయించకపోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో రోగుల వైద్య సేవలపై ప్రభావం చూపుతోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న రిమ్స్లో ఇప్పుడిప్పుడే ఖాళీలు భర్తీ అవుతుండగా, ఈ బదిలీల్లో ఉన్న పోస్టులు ఖాళీ అయ్యాయి. 12మంది వైద్యులకు బదిలీలు జరగగా, నలుగురిని మాత్రమే కేటా యించారు. వీరిలో ఇద్దరు రిపోర్టు చేశారు. దీంతో పాటు 2021 బ్యాచ్కు చెందిన స్టాఫ్ నర్సులు దా దాపు అందరూ బదిలీ అయ్యారు. 60 మందికి స్థానచలనం జరగగా, మంగళవారం 10లోపు మా త్రమే రిపోర్టు చేశారు. బదిలీ అయిన వారి స్థానాల్లో పూర్తిస్థాయిలో చేరే అవకాశాలు కానరావడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపితే గా ని పరిస్థితి మారే అవకాశం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే రిమ్స్లో వైద్యు ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పలుసార్లు నోటిఫికేషన్ జారీ చేసినా భర్తీకి నోచుకోవడం లేదు. ఉన్నవారిని బదిలీ చేయడంతో మరిన్ని ఖాళీలు ఏర్పడుతున్నాయి. 12మంది వైద్యులకు బదిలీలు సాధారణ బదిలీల్లో భాగంగా రిమ్స్ ఆస్పత్రిలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు బదిలీ అయ్యారు. రిమ్స్లో పనిచేస్తున్న నలుగురు ప్రొఫెసర్లు తానాజీ జాడే, కరుణాకర్, రత్నకుమారి, సరోజ బదిలీ కాగా, రిమ్స్కు ప్యాథాలజీకి సంబంధించి నీలవేణికు ప్రొఫెసర్ పోస్టు కేటాయించారు. అయితే, ఈమె ఇంకా విధుల్లో చేరలేదు. అ సోసియేట్ ప్రొఫెసర్లను జనరల్ మెడిసిన్ సందీప్ పవార్, గైనిక్ విభాగానికి సంబంధించి పి.క్రాంతి, పీడియాట్రిక్ వైద్యులు హేమలత, కన్నయ్య, జనరల్ సర్జన్ జి.సృజన, ఆర్థోపెడిక్ అవినాష్రెడ్డితో పాటు మరో అసోసియేట్ ప్రొఫెసర్కు ట్రాన్స్ఫర్ అయింది. ఈ విభాగంలో బి.గవస్కర్ మాత్రమే నిజామాబాద్ నుంచి వచ్చారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగంలో జనరల్ మెడిసిన్లో కమలాకర్ బదిలీ అయ్యారు. సైకియాట్రిక్ విభాగంలో నిజా మాబాద్కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజశేఖర్ బదిలీపై వచ్చారు. మంచిర్యాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నీలవేణి విధుల్లో చేరాల్సి ఉంది. నలుగురు ప్రొఫెసర్ల బదిలీలు జరగగా, ఒకరు వస్తున్నారు. అసోసియేట్లో ఐదుగురికి బదిలీ కాగా, ఒకరిని కేటాయించారు. అసిస్టెంట్ ప్రొఫెర్లలో ముగ్గురికి బదిలీ కాగా, ఇద్దరిని కేటాయించారు. స్టాఫ్ నర్సుల పరిస్థితి కూడా.. 2021 బ్యాచ్కు సంబంధించిన స్టాఫ్ నర్సులకు బదిలీలు జరిగాయి. రిమ్స్ నుంచి అత్యధికంగా నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు బదిలీ చేశారు. 60 మంది వరకు బదిలీలు జరగగా, జిల్లాలో పది మంది వరకు రిపోర్టు చేశారు. స్టాఫ్ నర్సుల పోస్టులు పూర్తి స్థాయిలో భర్తీ అవుతాయా.. లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యులు చికిత్స చేస్తే, స్టాఫ్ నర్సులు వారికి వైద్యసేవలు అందిస్తారు. ఈ పోస్టులు ఖాళీగా ఉంటే రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం గగనమే. -
హమ్మయ్య.. జొన్నలమ్మినం
కై లాస్నగర్: జిల్లాలో యాసంగి సీజన్ జొన్నల కొనుగోళ్లు సోమవారంతో ముగిశాయి. ఈ సారి కేంద్రాల్లో అసౌకర్యాలు వెంటాడగా.. రైతుల ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 26 పీఏసీఎస్ల ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేపట్టారు. వానాకాలం సీజన్ ప్రారంభమయ్యే నాటికి ప్రక్రియ పూర్తి చేసినా విక్రయించిన రైతుల ఖాతాల్లో మాత్రం నగదు జమ చేయలేదు. దీంతో ఖరీఫ్ పెట్టుబడి కోసం వారికి తిప్పలు తప్పని పరిస్థితి. పెరిగిన దిగుబడి జిల్లాలో రైతులు ఈ సారి పెద్ద మొత్తంలోనే జొన్న సాగు చేశారు. దిగుబడి సైతం పెరిగింది. ఎకరాకు 25నుంచి 30 క్వింటాళ్ల వరకు వచ్చింది. అయితే పంట విక్రయించుకునేందుకు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దిగుబడి చేతికొచ్చినా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు ఆందోళనలు చేపట్టాల్సి వచ్చింది. స్పందించిన ప్రభుత్వం కేంద్రాలను ఆలస్యంగా షురూ చేసింది. హమాలీలను పూర్తి స్థాయిలో నియమించలేదు. లారీల కొరత తోడవడంతో కాంటా పూర్తయినా గోదాంలకు సకాలంలో తరలించలేని పరిస్థితి. ఫలితంగా రైతులు రోజుల తరబడి కేంద్రాల వద్ద నిరీక్షించాల్సి వచ్చింది. నిల్వలు పేరుకుపోయాయనే కారణంతో పలు చోట్ల రెండు రోజులు కొంటే మరో రెండు రోజులు కొనుగోళ్లకు బ్రేక్ వేశారు. గన్నీసంచుల కొరత సైతం రైతులకు శాపంగా మారింది. ఈ సారి కేంద్రాలను పెంచినా.. కొనుగోళ్లు వేగవంతం చేయాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం ఈసారి కేంద్రాలను పెంచింది. ఈ ఏడాది కజ్జర్ల, భీంపూర్, పిప్పర్వాడ, బేల, మేడిగూడ, ఝరి, మర్లపల్లి, తడిహత్నూర్, శ్యాంపూర్ గ్రామాల్లో అదనంగా ఏర్పాటు చేసింది. అయితే రైతుల సంఖ్యకనుగుణంగా వసతులు కల్పించలేదు. కాంటాలు పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడం, సరిపడా హమాలీలు అందుబాటులో లేక కొనుగోళ్లు ఆలస్యం కావడమే కాకుండా తరలింపులోనూ జాప్యం ఏర్పడింది. పంట కొన్న తర్వాత వారం వరకు తక్పట్టీలు ఇవ్వకపోవడంతో రైతులు కేంద్రాల్లోనే రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. పెట్టుబడి సాయానికి పడిగాపులే.. జిల్లా వ్యాప్తంగా రూ.257 కోట్ల 16లక్షల 83వేల 512 విలువైన 6,95,237 క్వింటాళ్ల జొన్నలను పీఏసీఎస్ల ద్వారా మార్క్ఫెడ్ కొనుగోలు చేసింది. ఇందులో 5,35,895 క్వింటాళ్లను గోడౌన్లకు తరలించింది. ఈ తరలింపులో జాప్యం కారణంగా పలు యార్డులు జొన్న రాశులతో నిండిపోయాయి. ఆదిలాబాద్, బోథ్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, ఉట్నూర్, తలమడుగు, నేరడిగొండ మార్కెట్యార్డుల్లో వేలాది జొన్నల బ్యాగులు కుప్పలుగా పడి ఉన్నాయి. ఇంకా 1,59,342 క్వింటాళ్ల నిల్వలను గోడౌన్లకు తరలించాల్సి ఉంది. సోమవారం ఉదయం నుంచి పలు చోట్ల వర్షం కురుస్తుండటంతో జొన్నలు తడిసిపోయే అవకాశముంది. కాగా పంట విక్రయించిన రైతుల ఖాతాల్లో నగదు మాత్రం జమకాలేదు. దీంతో వానాకాలం పెట్టుబడి కోసం దళారుల వద్ద అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.జిల్లాలో జొన్నల కొనుగోళ్ల వివరాలు..మొత్తం కొనుగోలు కేంద్రాలు 26 ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 69,523 మెట్రిక్ టన్నులు విక్రయించిన రైతులు 24,068 యార్డుల్లో నిల్వ ఉన్న జొన్నలు 15,934 క్వింటాళ్లు -
చేపల వేటకెళ్లి జాలరి మృతి
లోకేశ్వరం: చేపల వేటకెళ్లిన జా లరి ప్రమాదవశాత్తు తెప్ప పై నుంచి జారిపడి నీటిలో మునిగి మృతిచెందాడు. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మ ండలకేంద్రానికి చెందిన చౌటోల్ల నడ్పి పోశెట్టి(49), పోచమ్మ చెరువులో చేపలు పడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శని వారం మధ్యాహ్నం చేపలు పట్టేందుకు పోచమ్మ చెరువులోకి వెళ్లాడు. రాత్రివరకు ఇంటి రాకపోవడంతో కుటుంబీకులు గ్రామస్తుల సహకారంతో చె రువులో గాలింపు చేపట్టిన ఫలితం లేకపోయింది. ఆ దివారం ఉదయం శవమై కనిపించాడు. తెప్ప సహా యంతో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు తెప్పపైనుంచి జారిపడి నీటిలో మునిగి మృతిచెంది ఉంటాడని ఎస్సై తెలిపారు. పోశెట్టికి భార్య రసుల, కుమారుడు శ్రీకాంత్ ఉన్నారు. కుమారుడి ఫిర్యాదుతో ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘వీబీజీ రాంజీ’ రద్దు చేయాలి
ఆదిలాబాద్టౌన్: వీబీజీ రాంజీ పథకాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకటరాములు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సీఐ టీ యూ కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్రామీణ పేదలను ఆర్థికంగా బలోపేతం చేసే ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. నిత్యావసరాల ధరలు పెంచుతూ పేదల నడ్డీ విరుస్తున్నారని విమర్శించారు. ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధరించాలని జూలై 1న దేశ వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు తెలిపా రు. అలాగే ఈనెల 20 నుంచి 22 వరకు మహబూబ్నగర్ జిల్లాలో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు స్వామి, లంకా రాఘవులు, ఆశన్న, చింటు, రాజక్క తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన జొన్న రైతులు
ఆదిలాబాద్టౌన్: జొన్నలను కొనుగోలు చేసినప్పటికీ తరలింపులో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు రోడ్డెక్కారు. స్థానిక కొమురంభీంచౌక్లో వాహనాలతో ఆదివారం రాస్తారోకో చేపట్టారు. ఆ దిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో జొన్నలను విక్రయించిన రైతులు వాటిని మహేశ్వరి గోదాంకు తరలించగా అక్కడ స్థలం లేదని నిర్వాహకులు చెప్పడంతో రైతులు ఆగ్రహించారు. జొన్నలతో ఉన్న వా హనాలను తీసుకువచ్చి నిరసనకు దిగారు. విష యం తెలుసుకున్న పోలీసులు వారిని సముదా యించి అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, ప్రభుత్వం జొన్నలను కొనుగోలు చేస్తున్నప్పటికీ వాటిని నిల్వ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండిస్తున్న జొన్నలకు స్థలం లేక వాటిని తరలించడం లేదన్నా రు. రోజుల తరబడి వాహనాల్లోనే ఉంచడంతో వా టికి కిరాయి పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశా రు. అధికారులు తగు చర్యలు చేపట్టి పంట నిల్వ కు అవసరమైన గోదాములను అందుబాటులో ఉంచాలని కోరారు. -
ఎస్సార్పీ 3లో కార్మికుడికి గాయాలు
శ్రీరాంపూర్:సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ 3 గనిలో శనివారం నైట్షిఫ్ట్ విధులకు వచ్చిన కార్మికుడు దండు శ్రీకాంత్ గాయపడ్డాడు. ట్రామర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ ఆదివారం తెల్లవారు జామున 5 సీమ్, జీరో లెవల్ 7 రేస్ వద్ద ట్రబ్బు ట్రా క్పై నుంచి జారడంతో బల్ల వేసి దానిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్క సారిగా జంప్ కావడంతో పాయకు, రేస్కు మద్య ఇరుకున్నాడు. దీంతో తుంటి భాగంలో తీవ్ర గాయమైంది. వెంటనే అక్కడున్న కార్మికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం, తుంటి భాగంలో రెండు ఫాక్షర్లు ఉన్నట్లు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈత చెట్టుపై నుంచి పడి గీతకార్మికుడు.. జన్నారం: మండలంలోని ఇందనపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు గాజుల నారాయణ గౌడ్ ఈత చెట్టు పైనుంచి పడి గాయాలపాలయ్యాడు. శనివారం సాయంత్రం ఈత చెట్టెక్కి కల్లు గీస్తుండగా మోకు జారడంతో కిందపడి రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి కార్మికులు అందించిన సమాచారంతో కుటుంబ సభ్యులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. పేద గీత కార్మికుడిని ప్రభుత్వం ఆదుకోవాలని గౌడ సంఘం మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు మూల భాస్కర్గౌడ్, నారాయణగౌడ్ కోరారు. -
అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు
మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలో డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆధ్వర్యంలో శనివారం అర్ధరాత్రి నాకబందీ, ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలీ సులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో లాడ్జీలు, బస్టాండ్, రైల్వేస్టేషన్, ప్రధాన చౌ రస్తాల వద్ద విస్తృత తనిఖీ జరిపారు. అర్ధరాత్రి బైక్లపై తిరుగుతున్న వారికి డ్రంకెన్ డ్రైవ్పరీక్షలు చేశారు. అదుపులో తీసుకుని విచారించి వివరాలు సేకరించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ర్యాష్ డ్రైవింగ్, బైక్లపై స్టంట్ల చేస్తున్నవారిపై లాఠీ ఝులిపించారు. లాడ్జీ గదులను డీసీపీ తనిఖీ చేశారు. అద్దెకు ఉన్నవారిలో అనుమానితులను విచారించారు. సీసీ కెమెరాలు, రికార్డు సక్రమంగా ఉండాలని, రాష్ట్రాల నుంచి వచ్చేవారి వివరాలు సేకరించాలని నిర్వాహకులకు సూచించారు. నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ ప్రమోద్రావు, ఎస్సైలు మధుసూదన్, తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు. -
హాజీపూర్లో దారుణ హత్య
● పెద్దనాన్నను కత్తితో పొడిచిన కుమారుడు ● భూతగాదాలే కారణం మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్లో దారుణ హ త్య కలకలం సృష్టించింది. పో లీసుల కథనం ప్రకారం.. హా జీపూర్కు చెందిన పెద్దనాన్న పూదరి భాస్కర్(65), కుమారుడు పూదరి వినయ్ మధ్య ఇటీవల భూతగాదాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో ఆదివా రం రాత్రి వినయ్ కత్తితో వచ్చి అందరూ చూస్తుండగానే భాస్కర్పై రెండుసార్లు దాడిచేశాడు. తీవ్ర గా యాలైన ఆయన్ను అంబులెన్స్లో మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు స త్యనారాయణ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కా గా, ఈ దాడిలో భాస్కర్ కుమారుడు సత్యనారాయణకు గాయాలయ్యాయి. హాజీపూర్ ఎస్సై కిరణ్కుమార్ ఘటనస్థలాన్ని పరిశీలించారు. దాడి చేసిన వినయ్ను అదుపులో తీసుకున్నట్లు తెలుస్తోంది. కాలుజారి బావిలో పడి వ్యక్తి మృతిజన్నారం: బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై ఉదయ్కిరణ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు..మండలంలోని చింతగూడకు చెందిన గజ్జల భూపతి (31) ఆ దివారం తాను కౌలుకు చేస్తున్న భూమిలో పంటవ్యర్థాలు తొలగించడానికి వెళ్లాడు. అక్కడే బహిర్భూమికని వెళ్లాడు. పక్కనే ఉన్న బావివద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతిచెందాడు. మృతుడి భార్య శ్వేత ప్రస్తుతం నిండుగర్భిణి. కుమారుడి మృతితో తల్లిదండ్రులు సత్తవ్వ–మల్లేశ్తోపాటు భార్య రోదించారు. తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. రైలు కిందపడి ఆర్మీజవాన్ ఆత్మహత్యకాగజ్నగర్రూరల్: రైలు కిందపడి ఆర్మీజవాన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే హెడ్కానిస్టేబుల్ సురేష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని బురదగూడకు చెందిన కొట్రంగి సురేష్(32) అస్సాంలో ఆర్మీ జవాన్గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం సెలవులపై స్వగ్రామానికి వచ్చాడు. ఈక్రమంలో మద్యం తాగుతుండడంతో మానేస్తేనే నీతో అస్సాంకు వస్తానని భార్య తిరుమల చెప్పింది. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లి మద్యం తాగాడు. మత్తులో క్షణికావేశంలో కాగజ్నగర్, రెబ్బెన రైల్వేస్టేషన్ల మధ్య గల పెద్దవాగు బ్రిడ్జి సమీపంలో ఆదివారం గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన స్థలంలో మద్యం బాటిళ్లు లభించాయి. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్కానిస్టేబుల్ తెలిపారు. -
టీజీ–20 ఖమ్మం ఏసేస్ జట్టులో హిమతేజ
● వేలంలో రూ.8 లక్షలు పలికిన యువ క్రికెటర్ ఆదిలాబాద్: జిల్లాకేంద్రానికి చెందిన యువ క్రికెటర్ కొడిమెల హి మతేజ హెచ్సీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీజీ–20 వేలంలో సత్తాచాటాడు. హైదరాబాద్ వేదికగా ఆదివారం నిర్వహించిన టీజీ–20 క్రికెట్ లీగ్ వేలంలో ఖమ్మం ఏసేస్ జట్టు రూ.8 లక్షలకు దక్కించుకుంది. దేశవాళీ క్రికెట్లో సత్తాచాటుతున్న యువ కెరటం తాజాగా టీజీ–20 లీగ్లో అత్యధిక ధర పలకడం విశేషం. లీగ్లో ఎంపిక కావడం పట్ల కోచ్ జయేంద్ర పటాస్కర్ అభినందనలు తెలిపారు. మందమర్రిలో ఆర్టీసీ బస్సు బోల్తామందమర్రిరూరల్:మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని జాతీయ రహదారిపై కేకే ఓసీపీ సమీపంలో కొత్తగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్లగ్జరీబస్సు(టీఎస్28జెడ్ 0109) ఆదివారం తెల్లవారుజామున బోల్తాపడింది. కొత్తగూడెం నుంచి బెల్లంపల్లికి వస్తుండగా ఓసీపీ సమీపంలో అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి బోల్తాపడింది. తెల్లవారుజామున ప్రమా దం జరగడంతో ఆ సమయంలో రోడ్డుపై రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్ సీతారాం, తాళ్లగురిజాలకు చెందిన ప్రయాణికుడు ప్రవీణ్కుమార్ మాత్రమే ఉన్నారు. వీరికి స్వల్పగాయాలు కాగా స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలుగకుండా పట్టణ ఎస్సై నరేశ్ ఆధ్వర్యంలో బస్సును రోడ్డుపై నుంచి తొలగించారు. బస్సు డ్రైవర్ సీతారాం బీపీ పడిపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. -
కేఆర్కేలో 754.. మావలలో 178 మందికి
కై లాస్నగర్: జిల్లాకేంద్రంలోని రెండు ప్రాంతాల్లో ని ర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లకు ఎంపిక చేసిన లబ్ధిదారుల తుది జాబితాను బల్దియా అధికారులు ప్రకటించారు. ఆదివారం మున్సిపల్ కార్యాలయ నోటీసు బోర్డుపై వారి వివరాలు ప్రదర్శించారు. మొత్తం 932 ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయగా కేఆర్కే కాలనీలో 754మందిని, సర్వేనంబర్ 170 లో 178 మందిని ఎంపిక చేశారు. కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో ఆన్లైన్లో ర్యాండమైజేషన్ ద్వారా ఈ ప్రక్రియ చేపట్టారు. ఇందులో ఏ బ్లాక్లోని ఏ ప్లాట్ను ఎవరికి కేటాయించాలనే దానిపై త్వరలోనే మున్సిపల్ అధికారులు కసరత్తు చేసి చర్యలు చేపట్టనున్నారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తికావడంతో ఏళ్లుగా ఇళ్లకోసం ఎదురుచూస్తున్న నిరుపేదల సొంతింటి కల ఎట్టకేలకు సాకారమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎంపికై న వారికి ఫ్లాట్లు కేటాయించాక బల్దియా అధికారులు అధికారికంగా ఇంటి నంబర్లను కేటాయించనున్నారు. ఇందులో ఎవరైనా అనర్హులైనట్లు తేలితే వారి ఇళ్లను రద్దు చేస్తామని అధికారులు ప్రకటించారు. బల్దియా నోటీస్బోర్డుపై ఉంచిన లబ్ధిదారుల జాబితా -
మండిన ‘గ్యాస్’
కై లాస్నగర్: వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.వెయ్యి మార్కు దాటింది. ఇప్పటికే పెట్రో ధరలను పెంచిన ఆయిల్ కంపెనీలు తాజాగా గృహావసర సిలిండర్ ధర పెంచుతున్నట్లు ప్రకటించాయి. 14.2 కిలోల సిలిండర్పై రూ.29 పెంపుదలను ఆదివారం నుంచే అమల్లోకి తెచ్చాయి. దీంతో జిల్లాలో ఈ సిలిండర్ ధర రూ.1,021 చేరింది. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందాల్సిన సబ్సిడీలు సైతం నిలిచిపోవడంతో గృహ వినియోగదారులు లబోదిబోమంటున్నారు. గుదిబండగా గ్యాస్బండ.. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వంటింటిని తాకుతుంది. ఈ ఏడాది మార్చిలో ఒక్కో సిలిండర్పై రూ.60 బాదిన ఆయిల్ కంపెనీలు తాజాగా మరో రూ.29 పెంచడంతో సిలిండర్ ధర ప్రస్తుతం రూ.వెయ్యి మార్కు దాటిపోయింది. ఇప్పటికే పెరిగిన పెట్రో ధరల కారణంగా నిత్యాసరాల ధరలు ఆకాశన్నంటాయి. తాజాగా గ్యాస్ ధరపెంపుతో పేద, మధ్యతరగతిపై తీవ్ర ప్రభావం చూపనుంది. జిల్లావ్యాప్తంగా మొత్తం 2,05,250 వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సగటున నెలకు ఒక సిలిండర్ చొప్పున వినియోగించినా జిల్లా వినియోగదారులపై ప్రతీనెల దాదాపు రూ.60 లక్షల వరకు అదనపు భారం పడనుంది. ఉజ్వల, దీపం లబ్ధిదారులకు సైతం వర్తింపు.. ఇది వరకు వంట గ్యాస్ సిలిండర్ల ధర పెంపును కేంద్ర ప్రభుత్వం కేవలం సాధారణ గ్యాస్ కనెక్షన్ దారులకు మాత్రమే పరిమితం చేసేది. తాజాగా పెంచిన ధరను ఉజ్వల, దీపం గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులకు సైతం వర్తింపజేస్తోంది. కేంద్రం ఈ కనెక్షన్లన్నీ నిరుపేదలకే మంజూరు చేసింది. వాటికి రూ.300 సబ్సిడీని ఇచ్చేది. తాజాగా అలాంటి వారిపైన కూడా భారం మోపింది. నామమాత్రంగా అందించే రూ.47 సబ్సిడీని సైతం నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.500కే సిలిండర్ సరఫరా చేస్తామని ప్రకటించినప్పటికీ మిగతా సొమ్ము నెలల తరబడి లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావడం లేదు. ఈ క్రమంలో ఆయిల్ కంపెనీల తీరుపై వినియోగదారులు, ముఖ్యంగా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో వంట గ్యాస్ ఏజెన్సీలు : 17 మొత్తం గ్యాస్ కనెక్షన్లు : 2,05,250 దీపం : 46,136 ఉజ్వల : 36,960 జనరల్ : 83,096 గృహావసర సిలిండర్ పాత ధర : రూ.992 పెరిగిన తర్వాత కొత్త ధర : రూ.1,021 -
పూర్తికాని నిర్మాణాలు..
● కూలేందుకు సిద్ధంగా 135 ప్రభుత్వ పాఠశాలల భవనాలు ● విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన ● త్వరలోనే పునఃప్రారంభం కానున్న పాఠశాలలు ● వర్షాకాలం కావడంతో అప్రమత్తమైన విద్యాశాఖఆదిలాబాద్టౌన్: సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. చాలా చోట్ల భవనాలు శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. అమ్మ ఆదర్శ, మన ఊరు–మనబడి ద్వారా మంజూరైన పలు పాఠశాల భవనాల నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. దీంతో సరిపడా గదులు లేక విద్యార్థులను చెట్ల కింద, పాఠశాల ఆవరణలో కూర్చోబెట్టి విద్యాబోధన సాగిస్తున్నారు. మరికొన్ని పాఠశాలల్లో రెండు మూడు తరగతులను ఒకే గదిలో నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులకు పాఠాలు అర్థంకాని పరిస్థితి. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ ప్రారంభం కానుంది. జూన్ 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బడులు ప్రారంభం కాకముందే మరమ్మతులు చేపట్టడం, కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాలను తొలగిస్తే ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. భయం గుప్పిట్లో.. జిల్లాలో డీఈవో పరిధిలో 739 పాఠశాలలున్నాయి. ఇందులో 500 ప్రాథమిక, 119 ప్రాథమికోన్నత, 120 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ బడుల్లో 57,896 మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 135 బడుల్లో గదులు శిథిలావస్థకు చేరుకున్నాయని అధికారుల రికార్డులు చెబుతున్నాయి. అనధికారికంగా 150 వరకు ఉండవచ్చు. ఏటా శిథిల భవనాల్లోనే విద్యార్థులకు చదువులు చెబుతుండడంతో వారు భయం గుప్పిట గడుపుతున్నారు. ఏ క్షణం ఏమవుతుందోనని తల్లిదండ్రుల్లోనూ ఆందోళన నెలకొంది. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కానుండడంతో వానలకు గోడలు తడిసి, పైకప్పు కూలే అవకాశాలు లేకపోలేదు. శిథిలావస్థలో 135 భవనాలు.. జిల్లాలో 135 పాఠశాలల్లో శిథిలావస్థకు చేరిన గదులు ఉన్నాయి. వీటిలో భీంపూర్ మండలంలో 4, భోరజ్లో 10, జైనథ్లో 9, సాత్నాలలో 4, బేలలో 6, గాదిగూడలో 3, నార్నూర్లో 6, ఇంద్రవెల్లిలో 15, గుడిహత్నూర్లో 9, ఆదిలాబాద్రూరల్లో 1, ఆదిలాబాద్అర్బన్లో 8, తాంసిలో 3, తలమడుగులో 10, బజార్హత్నూర్లో 3, సొనాలలో 1, బోథ్లో 6, నేరడిగొండలో 9, ఇచ్చోడలో 10, ఉట్నూర్లో 18 గదులు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి.గుర్తించాం.. ఆదేశాలు జారీ చేశాం జిల్లాలోని ఆయా పాఠశాలల్లో శిథిలావస్థకు చేరిన తరగతి గదులను ఇప్పటికే గుర్తించాం. వాటిని తొలగించాలని సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశాం. మరమ్మతుల కోసం ప్రత్యేక చర్యలు చేపడతాం. ఇప్పటికే నిర్మాణాల్లో ఉన్న వాటిని బడులు తెరిచే నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశాం. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతాం. – డి.మాధవి, డీఈవో జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో భవనా లు శిథిలావస్థకు చేరడంతో కొంత మంది గు రువులు విద్యార్థులకు చెట్ల కింద, ఆరుబయటనే తరగతులు బోధిస్తున్నారు. వర్షాలు ప డిన సమయంలో విద్యార్థులందరినీ ఒకేచోట కూర్చోబెట్టడంతో వారి చదువులకు ఆటంకం ఎదురవుతుంది. అమ్మ ఆదర్శ, మన ఊరు–మనబడి ద్వారా పలు పాఠశాలల్లో చేపట్టిన పనులు ఇంకా పూర్తి కాలేదు. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే నిలిపివేశారు. దీంతో ఈ ఏడాది కూడా విద్యార్థులకు అవస్థలు తప్పకపోవచ్చు. -
ఆరోగ్యానికి వ్యాయామం అవసరం
ఆదిలాబాద్: ఆరోగ్యకరమైన జీవనానికి వ్యాయా మం అవసరమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అ టవీశాఖ ఆధ్వర్యంలో ఆదివారం 5కే రన్ నిర్వహించారు. డీఎఫ్వో ప్రశాంత్ బాజీరావు పాటిల్తో కలి సి ఆయన ర్యాలీని ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ, వ్యాయామం, క్రీడలు మానసికోల్లాసానికి దోహదం చేస్తాయన్నారు. డీఎఫ్వో మాట్లాడుతూ, సైకిల్ దినోత్సవం పురస్కరించుకొని ఈ ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. ఇందులో ఏఎంసీ చైర్మన్ శ్రీ కాంత్రెడ్డి, డీవైఎస్వో శ్రీనివాస్, డీఎస్పీ జీవన్రెడ్డి, ఎఫ్డీవో అరవింద్కుమార్, ఎఫ్డీవో చిన్న భూషరె డ్డి, ఎఫ్ఆర్వోలు అవినాష్, షీలానంద, అరుణ, కవి త, సవిత, ఎఫ్ఎస్వోలు, డీఆర్వోలు పాల్గొన్నారు. -
స్టేడియంలో వారిదే ఆధిపత్యం!
ఆదిలాబాద్: ప్రభుత్వ స్థలంలో ప్రైవేట్ వ్యక్తుల అజమాయిషీ సాగుతోంది. క్రీడా, వ్యాయామ సాధనకు గమ్యంలా నిలవాల్సిన ప్రభుత్వ మైదానం ప్రై వేట్ కోచింగ్ సెంటర్లకు అడ్డాగా మారింది. శిక్షణ పేరిట నిరుద్యోగుల నుంచి రూ.వేలాదిగా ఫీజులు వసూలు చేస్తున్న పోలీస్, డిఫెన్స్ అకాడమీల నిర్వాహకులు ఇందిరా ప్రియదర్శిని స్టేడియాన్ని తమ వ్యాపార కేంద్రంగా మార్చుకున్నారు. అకాడమీల పేరిట సరైన అనుమతులు లేకుండా కొనసాగుతున్న కోచింగ్ సెంటర్లపై అధికారులు నోరు మెదపకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఎటు చూసినా వారే.. స్టేడియానికి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయామసాధకులు, క్రీడాకారులు వందల సంఖ్యలో వస్తుంటారు. మరోవైపు క్రీడా పాఠశాల విద్యార్థులు సాధన చేస్తుంటారు. అదే సమయంలో ప్రైవేటు కోచింగ్, అకాడమీలకు చెందిన విద్యార్థులు సైతం భారీగా చేరుకుంటున్నారు. మైదానంలోని 800 మీటర్ల రన్నింగ్ ట్రాక్ను ఆక్రమించి వ్యాయామ సాధకులు, క్రీడా పాఠశాల విద్యార్థుల సాధనకు ఆటంకం కలిగిస్తున్నారు. ఏ మూలన చూసినా అకాడమీల విద్యార్థుల గుంపులే కనిపిస్తుండడం గమనార్హం. లాంగ్ జంప్, రన్నింగ్ చేయాలనుకునే క్రీడాకారులకు ఇది తీవ్ర ఆటంకంగా మారుతుంది. ‘మామూలు’గా వ్యవహరిస్తున్న డీఎస్ఏ.. వీరిని కట్టడి చేయాల్సిన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ పట్టించుకోకపోవడంతో వారు ఆడిందే ఆట అన్న చందంగా వ్యవహారం సాగుతోంది. కొన్నేళ్లుగా స్టేడియం వనరులను ఉచితంగా వాడుకుంటున్న శిక్షణ కేంద్రాల నిర్వహకులు పలువురు అధికారులను మచ్చిక చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో క్రీడా శాఖ బాధ్యతలు చూసిన ఓ అధికారికి రూ.వేలల్లో ముట్టజెప్పినట్లుగా కొంతమంది నిర్వాహకులు బహిరంగంగా చెప్పడం గమనార్హం. తాజాగా ప్రస్తుత డీఎస్ఏ అధికారులు సైతం పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. చర్యలు తీసుకుంటాం.. స్టేడియంలో ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల పేరిట శిక్షణ ఇవ్వడం సరికాదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం. క్రీడా పాఠశాల విద్యార్థులు, వ్యాయామ సాధకులకు ఇబ్బందులు కలిగించడం సరికాదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు నోటీసులు అందిస్తాం. – జక్కుల శ్రీనివాస్, డీవైఎస్వో -
ప్రాణం తీసిన ఈత సరదా
మంచిర్యాలరూరల్(హాజీపూర్):మరో వారం రోజుల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. పదో తరగతికి వచ్చిన తమ పెద్ద కొడుకును సన్నద్ధం చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. పదో తరగతి పూర్తిచేసి ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడని ఆశపడ్డారు. కానీ, కొడుకు ఈత సరదా తల్లిదండ్రులకు తీరని శోఖం మిగిల్చింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట దుబ్బపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి బోగిరి సందీప్(15) ఈతకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. శనివారం మధ్యాహ్నం సందీప్ తన స్నేహితులైన అభినయ్, అక్షయ్, అశ్విత్, రాంచరణ్తో కలిసి ముల్కల్ల శివారులోని ర్యాలీ ప్రాజెక్టులో ఈతకు వెళ్లాడు. సాయంత్రం వరకు సందీప్ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. స్నేహితులు ఇంటికి వచ్చినా సందీప్ రాకపోవడంతో బంధువులు, స్నేహితులు వివిధ చోట్ల వెతికారు. చివరకు సందీప్ తండ్రి రాజు హాజీపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆదివారం ఉదయం సందీప్తో ఈతకు వెళ్లిన స్నేహితులను విచారించారు. సందీప్ ర్యాలీ ప్రాజెక్ట్లోని లోతైన నీటిలో ఈత రాకపోవడంతో మునిగిపోయినట్లు తెలిపారు. భయంతో తాము ఇంటికి వచ్చేశామని వెల్లడించారు. గజ ఈతగాళ్లతో గాలింపు దీంతో పోలీసులు ర్యాలీ ప్రాజెక్టుకు చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో వెతికించగా సందీప్ మృతదేహం లభించింది. సందీప్ ముల్కల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి పూర్తి చేసి 10వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలు తెరుచుకోవడానికి వారం ముందు జరిగిన ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. -
అ‘పూర్వ’ సమ్మేళనం
జిల్లాకేంద్రంలోని ఎస్బీహెచ్ నం.2 పాఠశాలలో 1985–86 బ్యాచ్కు చెందిన పదో తరగతి విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. 40 ఏళ్ల తర్వాత వీరి అపూర్వ సమ్మేళనానికి జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ హాల్ వేదికై ంది. ఎక్కడెక్కడో స్థిరపడినవారు మిత్రులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. మిత్రులు ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం అనంతరం యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులు లింబగిరి స్వామి, కుటుంబరావు, చక్రపాణి, టి.రాములు తదితరులను సన్మానించి జ్ఞాపికలు బహుకరించారు. –ఆదిలాబాద్టౌన్హైదరాబాద్ నుంచి వచ్చా మూడు సెక్షన్లు కలిపి దాదాపు 70 మంది ఉంటాం. సమ్మేళనం ఉందని సమాచారంతో హైదరాబాద్ నుంచి వచ్చాను. గురువులు విలువలతో కూడిన విద్య అందించారు. నేను ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యాను. అప్పుడప్పుడు చిన్ననాటి మిత్రులతో ఫోన్లో మాట్లాడతాను. – కుంట గంగయ్య, రిటైర్డ్ ఆర్మీ సంతోషంగా ఉంది చిన్ననాటి మిత్రులను కుటుంబ సమేతంగా కలుసుకోవడం సంతోషంగా ఉంది. మిత్రుడి కుమారుడి పెళ్లికి వెళ్లిన సమయంలో స్నేహితులందరూ ఒకేచోట కలవాలని నిర్ణయించాం. రెండు నెలల నుంచి ఫోన్ నంబర్లు, వివరాలు సేకరించి గ్రూప్ తయారు చేశాం. సమ్మేళనం ఉందని చెప్పడంతో అందరూ వచ్చారు. – దొగ్గలి గంగయ్య, పూర్వ విద్యార్థి మరుపురాని అనుభూతి 40 ఏళ్ల క్రితం కలిసిన స్నేహితులందరినీ ఒకే వేదికపై కలవడం ఆనందంగా ఉంది. అనాటి మధురస్మృతులను గుర్తుచేసుకున్నాం. ఆరోగ్య క్షేమాలు, ఇతర విషయాల గురించి పలకరింపులు మరవలేను. కష్టసుఖాల్లో అందరు పాలుపంచుంటాం. – భీమన్న, పూర్వ విద్యార్థి -
కూలీ రేట్ల్ల పెంపుపై ప్రభుత్వం నిర్లక్ష్యం
బెల్లంపల్లి:పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాద్ అన్నారు. బెల్లంపల్లి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో వ్యవసాయ కా ర్మిక సంఘం జిల్లా మూడో మహాసభలు ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ప్రసాద్ హాజరై మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చినప్పటి నుంచి కూలీ రేట్లను పెంచలేదన్నారు. కూలీలపై వివక్ష ప్రదర్శిసస్తోందని విమర్శించారు. కమ్యూనిస్టులు పోరాడి సాధించుకున్న ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేసి కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ఎరువుల ధరలు పెంచి రైతులపై భారం మోపుతోందన్నారు. కూలీ రేట్లు పెంచుతామని హామీ ఇచ్చి రా ష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఊసెత్తడం లేదన్నారు. ప్రధాన మంత్రి మోదీ అనుసరిస్తున్న విధానాలతో వ్యవసాయ కూలీలు బానిసలుగా మారుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ వృత్తిదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైళ్ల ఆశయ్య మాట్లాడుతూ.. గ్రామాల్లో వ్యవసాయ యంత్రాలు వచ్చిన తర్వాత కూలీలకు పనులు దొరకడం లేదని తెలిపారు. వలసలు పెరుగుతున్నాయన్నారు. వ్యవసాయ కార్మికులు, కూలీలకు ఇందిరమ్మ ఇళ్లు, ఫించన్లు, జాబ్కార్డు, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నూతన కమిటీ ఎన్నిక మహాసభలో మంచిర్యాల జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా గుమాస అశోక్, ఉపాధ్యక్షులుగా కృష్ణమాచారి , గోమాసబాపు, ఎం.జయ, కార్యదర్శిగా కనికరపు అశోక్, సహాయ కార్యదర్శులుగా వేల్పుల శంకర్, రాజమణి , నరేందర్, సరిత, కోశాధికారిగా ముడిమడుగుల బ్రహ్మయ్యను ఉన్నుకున్నారు. మరో 10 మందిని సభ్యులుగా ఎంపిక చేశారు. ఈ మహాసభలో వ్యవసాయ కార్మిక సంఘం, వృత్తిదారుల సంఘం, ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. -
సురక్షిత ఆహారం అందించాలి
ఆదిలాబాద్టౌన్: ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించాలని అదనపు కలెక్టర్ ఆర్ఎస్.చిత్రు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాలు పురస్కరించుకుని డీఎంహెచ్వో కార్యాలయ సమావేశ మందిరంలో మిఠాయి దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహకులతో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడారు. సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహారం తయారు చేయడం, నిల్వ చేయడంపై ఫుడ్సెప్టీ అధికారులు అందించే సూచనలు తప్పని సరిగా పాటించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ టి.నాయక్ సురక్షితమైన ఆహారం తయారీ, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు -
● బెల్లంపల్లిలో పెరిగిన పాముల సంచారం ● ఇళ్లలోకి వస్తున్న తేళ్లు ● వారం రోజుల్లో 30 పాములు పట్టివేత ● ఆందోళన చెందుతున్న ప్రజలు
బెల్లంపల్లి: పురాతన బొగ్గుగనుల ప్రాంతం బెల్లంపల్లి సర్పాలమయంగా మారింది. నిత్యకృత్యంగా విషసర్పాలు విచ్చలవిడిగా సంచారం చేస్తున్నాయి. జననివాసాలు, ఇళ్ల పరిసరాలు, వీధులు, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ స్వైరవిహారం చేస్తున్నాయి. రక్తపింజరలు, నాగుపాములు ఇళ్లలో వచ్చి తిష్ట వేస్తుండగా, తేళ్లు సైతం దూరుతున్నాయి. ప్రాణాంతకమైన సర్పాలు, తేళ్ల బెడద పురప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వీటి సంచారంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల అకాల వర్షాలు కురుస్తుండటంతో పుట్టల్లోంచి పాములు, తేళ్లు బయటకు వస్తున్నాయి. ఏ బస్తీలో చూసినా.. మున్సిపాలిటీలో 34 వార్డులు ఉండగా వీటిలో సగానికి పైగా వార్డుల్లో పాముల ప్రభావం ఉంది. ముఖ్యంగా అటవీ, శివారుబస్తీలు, మూసివేతకు గురైన కార్మికవాడలు, తుమ్మ, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి చిత్తడిగా ఉన్న ప్రతీ ప్రాంతం కూడా పాములు, తేళ్లకు నిలయాలుగా మారాయి. శాంతిఖని, 65 డీప్, సుభాష్నగర్, నెంబర్–2 ఇంక్లైన్, రైల్వే రడగంబాల బస్తీ, అంబేడ్కర్ రడగంబాల బస్తీ, పెద్దనపల్లి, సుబ్బారావుపల్లి, కాల్టెక్స్ ఏరి యా, గంగారాం నగర్, గాంధీనగర్, కన్నాల బస్తీ, మధునన్ననగర్, టేకుల బస్తీ, 24 డీప్ ఏరియా, కొత్తబస్టాండ్ ఏరియా ఇందిరమ్మ కాలనీ, కాంట్రాక్టర్ బస్తీ, షంషీర్నగర్, రవీందర్నగర్, అంబేద్కర్నగర్, బెల్లంపల్లి బస్తీ, హన్మాన్ బస్తీ, అశోక్నగర్, బూడిదగడ్డ, బాబుక్యాంపు బస్తీ, గోల్బంగ్లాబ స్తీ తదితర కార్మిక, కార్మికేతర బస్తీల్లో పాములు, తే ళ్ల సమస్య స్థానికులను తీవ్ర వేదనకు గురిచేస్తోంది. వారం రోజుల్లో.. పాముల్లో రక్త పింజర, తాచుపాములు ప్రమాదకరమైనవి. వీటి కాటుకు గురైతే ప్రాణాలు కోల్పోయే ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. అవి జన నివాసాల్లో సంచరిస్తుండడం గమనార్హం. కాల్టెక్స్, 65 డీప్ ఏరియా, శాంతిఖని, సుబ్బారావుపల్లి, గంగారాంనగర్, గోల్ బంగ్లాబస్తీ, నెంబర్–2 ఇంక్లైన్, సుభాష్నగర్ తదతర ప్రాంతాల్లో రక్త పింజరల ప్రభావం అఽధికంగా ఉండగా ఇతర బస్తీల్లో నాగుపాములు సంచరిస్తున్నాయి. ఇళ్ల పరిసరాలు, గల్లీలు, వీధుల్లో పిచ్చిమొక్కలతో చిత్తడి వాతావరణం ఉండగా , కొన్ని బస్తీలను ఆనుకుని అటవీ ప్రాంతం ఉండటం, మూసివేతకు గురైన బొగ్గు గనులు పాములకు స్థావరాలుగా మారడంతో పాముల సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో ఏకంగా 30కిపైగా స్నేక్ క్యాచర్లు పట్టుకున్నట్లు సమాచారం. వీటిలో 15 వరకు రక్తపింజరలు ఉండగా మిగతా తాచుపాములు ఉన్నాయి. తేళ్లు కూడా లెక్కలేనన్నీ ఇళ్లలోకి వస్తున్నట్లు పురప్రజలు చెబుతున్నారు. పట్టుకున్న పాములను స్నేక్ క్యాచర్లు ప్లాస్టిక్ బాటిళ్లు, సంచుల్లో వేసి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలి పెడుతున్నారు. జననివాసాలకు చేరువలో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి, సర్పాల సమస్యను పరిష్కరించాలని పురప్రజలు కోరుతున్నారు. తేళ్లు వస్తున్నాయి ఇళ్ల పరిసరాల్లో పాములు, తేళ్లు భయపెట్టిస్తున్నాయి. ఒకసారి పాము కనిపిస్తే మరోసారి ఐదారు తేళ్లు వస్తున్నాయి. ఏమాత్రం జాగ్రత్తగా లేకపోతే వాటి కాటుకు గురయ్యేవాళ్లం. పిల్లలు వణికిపోతున్నారు. పాములు, తేళ్లు రాకుండా మున్సిపల్ అధికారులు కట్టడి చర్యలు తీసుకోవాలి. – మేకల భాగ్యలక్ష్మి, టేకులబస్తీ భయంగా ఉంది ఇళ్ల చుట్టూ రెండు, మూడు పాములు తిరుగుతున్నయ్. చీకటి పడటంతోనే చేరుతున్నయ్. రెండు రోజుల క్రితం పాము వచ్చింది. కొద్ది దూరం నుంచి చూసి కేకలు వేసి బయటకు పరుగుతీశాను. ఓ యువకుడు చాకచక్యంగా పామును పట్టుకుని ప్లాస్టిక్ డబ్బాలో వేసి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. ఇట్ల పాములతో భయం భయంగా గడుపుతున్నం. – వేల్పుల శాంత, టేకులబస్తీ పట్టుకుని వదిలేస్తున్నా మున్సిపాలిటీలో సర్పాలు స్వైరవిహారం చేస్తున్నాయి. వీటిలో ప్రాణాంతక రక్తపింజరలు, తా చుపాముల సంఖ్య అధికంగా ఉంది. గతంలో రక్త పింజరలు, నాగుపాములు అడపాదడపా కనిపించగా ప్రస్తుతం ప్రతి బస్తీలోనూ దర్శనమిస్తున్నాయి. వీటి సంతతి వృద్ధి చెందినట్లు కనిపిస్తుంది. వారం నుంచి రోజుకు రెండు, మూడు పాములను ప ట్టుకునిసురక్షితంగాఅటవీప్రాంతంలోవదిలేస్తున్నాను. – దుర్గా రాజేష్, సీనియర్ స్నేక్క్యాచర్, బెల్లంపల్లి -
బుస కొడుతున్న సర్పాలు
ఈ చిత్రంలో ఉన్న రక్తపింజర పాము సుభాష్నగర్బస్తీలోని ఓ ఇంట్లో రెండు రోజుల క్రితం వచ్చిదూరింది. బస్తీని ఆనుకుని అటవీప్రాంతం ఉండటంతో రక్త పింజర వచ్చినట్లు తెలుస్తుండగా దాని పొడవు 6 ఫీట్లు, బరువు 40 కిలోల వరకు ఉంది. ఈ పాము కాటేస్తే మనిషి బతికే అవకాశాలు ఉండవు. అంతటి ప్రాణాంతకమైన సర్పాన్ని స్నేక్ క్యాచర్ దుర్గా రాజేష్ పట్టుకుని అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు. ఈ చిత్రంలో పడగవిప్పి బుస కొడుతున్న నాగుపాము బెల్లంపల్లి బస్తీలో ఉన్న ఓ వాటర్ ప్లాంట్లో గురువారం వచ్చింది. 6 ఫీట్లకు పైగా పొడువు ఉన్న పామును పట్టుకోబోయిన సీనియర్ స్నేక్ క్యాచర్ దుర్గా రాజేష్ను అరగంటకు పైగా ముప్పు తిప్పలు పెట్టింది. ఆఖరుకు అతికష్టంగా పట్టుకున్నాడు. -
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైనది
ఆదిలాబాద్: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సర్ శిక్షణ శిబిరం, సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ఓటరు నమోదు ప్రక్రియలో కార్యకర్తలు చొరవ చూపాలని సూచించారు. కొత్త ఓటర్లను నమోదు చేయించడం, జాబితాలో సవరణలు ఉంటే పూర్తి చేయడం వంటి అంశాలపై శ్రేణులు సమర్థవంతంగా పనిచేయాలన్నారు పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానందం మాట్లాడుతూ ప్రతి శక్తి కేంద్రం, బూత్ స్థాయిలో నాయకులు సమన్వయంతో పనిచేసి ఓటర్లకు అవసరమైన అవగాహన కల్పించాలని కోరారు. రాష్ట్ర పార్టీ సర్ ఇన్చార్జ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఓటర్లకు సరైన సమాచారం అందించడంలో కార్యకర్తల పాత్ర కీలకమన్నారు. ఇందులో పార్టీ రాష్ట్ర, జిల్లా పదాధికారులు, కౌన్సిలర్లు, శక్తి కేంద్ర అధ్యక్షులు, బూత్ స్థాయి నాయకులు, ఏజెంట్లు, తదితరులు పాల్గొన్నారు. -
బాలల హక్కులు కాపాడాలి
తాంసి: బాలల హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలోని కప్పర్ల గ్రామంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఆధ్వర్యంలో శనివారం బాల పంచాయత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా వంటి సామాజిక సమస్యలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని సూచించారు. బాలికలపై వివక్ష చూపకూడదన్నారు. గ్రామాల్లో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలను ఏర్పాటు చేసి బాలల సంక్షేమం, భద్రతపై నిరంతర సమీక్ష నిర్వహించాలన్నారు. ఇళ్లలో, పాఠశాలల్లో చైల్డ్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేయాలని, సమస్యలను నిర్భయంగా వివరించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, అదనపు ఎస్పీ పి.మౌనిక, డీఈవో మాధవి, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్రెడ్డి, డీసీపీవో రాజేంద్ర ప్రసాద్, ష్యూర్ ఎన్జీవో కోఆర్డినేటర్ వినోద్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సీసీఎస్ సీఐ చంద్రశేఖర్, కప్పర్ల సర్పంచ్ అరుణ్కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ నారాయణ, హెచ్ఎం ఆనంద్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
పల్లి(బి) అభివృద్ధికి కృషి
తలమడుగు: పల్లి(బి) గ్రామాన్ని జిల్లాలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రజాపాలన–ప్రగతిప్రణాళికలో భాగంగా నిర్వహించిన గ్రామసభకు కలెక్టర్ హాజరయ్యారు. గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సత్వరం పరి ష్కరించేలా చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీటి సంరక్షణ, వ్యవసాయ ప్రణాళికలపై ఫోకస్ పెంచాలన్నారు. బీఎల్వోలు జూన్ 24లోగా వంద శాతం ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అలాగే మిషన్ భగీరథ పైప్లైన్ విస్తరణ, సీసీ రోడ్లు, వైకుంఠ ధామాలు, అంగన్వా డీ భవనాల నిర్మాణానికి సంబంధించిన అంచనా లు పరిశీలించి త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్మోహన్, ఎంపీడీవో శంకర్, సర్పంచ్ సంజీవ్, పంచాయతీ కార్యదర్శి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
కోట.. మెరిసేలా..
తెలంగాణలో గోండుల పాలనకు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్లో సిర్పూర్ కేంద్రంగా దాదాపు తొమ్మిది శతాబ్దాల పాటు వీరి ఏలుబడి సాగింది. చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలతో పాటు తెలంగాణలోని ఆదిలాబాద్ వరకు వీరి రాజ్యం విస్తరించింది. నాడు ఆ రాజులు నిర్మించిన కోటలు ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఇందులో ఉట్నూర్ కోట ప్రస్తుతం పర్యాటకంగా రూపుదిద్దుకుంటుంది. – ఇచ్చోడఉమ్మడి ఆదిలాబాద్లో నాడు గోండు రాజులు నిర్మించిన కోటలు వారి పాలన, సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి. ఇందులో శిథిలావస్థకు చేరిన ఉట్నూర్ కోటను గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టింది. మొత్తం రూ.3.90 కోట్లు కేటాయించగా.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.2.30 కోట్లు, ఐటీడీఏ మరో రూ.1.60కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది. ప్రస్తుతం పనులు 60 శాతం వరకు పూర్తయినట్లు పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే సిర్పూర్ పట్టణ కేంద్రంగా సుమారు పదెకరాల విస్తీర్ణంలో నిర్మించిన మరో కోట కూడా ప్రత్యేకత సంతరించుకుంది. వీటితో పాటు మంచిర్యాల జిల్లాలోని తాండూర్, గాంధారి, కవ్వాల్, కుమురంభీం జిల్లాలో మోహ్వాడ్, నిర్మల్ జిల్లాలో బాదన్కుర్తి, ఎలగడప, సుర్జాపూర్, ఆదిలాబాద్ జిల్లాలోని కనకాయి వద్ద కూడా వారు నిర్మించిన కోటలు దర్శనమిస్తున్నాయి. ఉట్నూర్లోని కోటలో గల కోనేరుఉట్నూర్లోని కేబీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న గోండు రాజుల కోట ప్రస్తుతం టూరిజం స్పాట్గా రూపుదిద్దుకుంటుంది. గోపురాలు, గోడలు, కోనేరు తదితర నిర్మాణాలకు మెరుగులు దిద్దే పనులు కొనసాగుతున్నాయి. అయితే నిధుల లేమితో కొంత నెమ్మదిగా సాగుతున్నట్లుగా సంబంధిత అధికారులు వెల్లడిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ను గోండురాజులు క్రీ.శ. 870–1751 వరకు పాలించారు. సిర్నూర్ కేంద్రంగా 19 మంది ఏకంగా 881 ఏళ్ల పాటు పాలన సాగించారు. గోండ్వానా రాజ్యాన్ని భీం బలాల్సింగ్ 870వ సంవత్సరంలో స్థాపించి 25 ఏళ్లపాటు పాలించాడు. తర్వాత మరో 18 మంది రాజులు 1751వ సంవత్సరం వరకు పాలన సాగించారు. ఉమ్మడి జిల్లాలో సిర్పూర్ ప్రధాన కేంద్రంగా ఉండగా.. ఉట్నూర్ కూడా ప్రత్యేకత సంతరించుకుంది. అలాగే తాండురు, గాంధారి, కవ్వాల్తో పాటు కనకాయి, బాదన్కుర్తి, ఎలగడప, సుర్జాపూర్, మోహ్వాడ్ ప్రాంతాల్లో నిర్మించిన కోటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చారిత్రక నేపథ్యం.. ఉట్నూర్ కోటకు మరమ్మతులు.. -
అన్ని కోటలను పర్యాటకంగా తీర్చిదిద్దాలి
ఒక్క ఉట్నూర్ కోటనే కాదు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శిథిలావస్థలో ఉన్న గోండురాజుల కోటలన్నింటినీ మరమ్మతు చేసి పర్యాటకంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలి. భావితరాలకు గోండు రాజుల చరిత్ర తేలిసేలా చొరవ చూపాలి. – ఆత్రం జ్ఞానసుధ, నేరడిగొండ, గోండు రాజుల వంశీయురాలు 60 శాతం పనులు పూర్తయ్యాయిఉట్నూర్లో ఉన్న గో ండు రాజుల కోటను పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, ఐటీడీఏ కలిపి రూ. 3.90కోట్లను మంజూరు చేసింది. పునర్నిర్మాణ పనులు దాదాపు 60శాతం వరకు పూర్తయ్యాయి. నిధుల విడుదలలో జాప్యం కారణంగా కొంత నెమ్మదిగా సాగుతున్నాయి. – రవికుమార్, పర్యాటక శాఖ జిల్లా అధికారి -
స్పందనకు అండగా కదిలారు..
శ్రీరాంపూర్: ‘అయ్యో బిడ్డా.. వచ్చేదెట్లా’ శీర్షిక న ఈ నెల 4న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాని కి పలువురు మానవతావాదులు స్పందించా రు. నస్పూర్ షిర్కే కాలనీకి చెందిన వ్యాన్ డ్రైవ ర్ లగిశెట్టి శ్రీనివాస్, సునిత దంపతుల కూ తురు స్పందన అమెరికాలోని చికాగోలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతుండడం, గత నెల 31న కాలేజీకి వెళ్లి వస్తూ మెట్రోస్టేషన్లో మెట్లపై నుంచి పడి గాయపడడం తెలిసిందే. అపస్మారక స్థితిలో అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అక్కడ కూతురు ఎలా ఉందో, ఎలాంటి వైద్యం అందుతుందోనని తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అ క్కడికి వెళ్లడానికి ఆర్థిక పరిస్థితి అంతంత మా త్రమే కావడం, పాస్పోర్టు, వీసా కూడా లేకపోవడం ‘సాక్షి’ కథనంలో ప్రస్తావించింది. ఈ కథనాన్ని పలువురు వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేశా రు. ఇక్క డి నుంచి వెళ్లి అమెరికాలో ఉద్యోగా లు చేస్తున్న వారు, చదువుతున్న వారు ‘సాక్షి’ కథనం ద్వారా కుటుంబ వివరాలు, ఫోన్నంబ ర్లు, ఆస్పత్రి వివరాలు తెలుసుకున్నారు. ఒక బృందంగా ఏర్పడి ఫండ్ సేకరణ మొదలు పె ట్టారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్సకు సుమారు రూ.3కోట్లు ఖర్చవుతాయని తెలిపినట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కొంత డబ్బు సమకూరగా.. మరికొంత మంది దాతలు ముందుకు వస్తే స్పందన పూర్తి వైద్యానికి భరోసా ఉంటుందని ఎదురుచూస్తున్నారు. అమెరికా పంపడానికి ఏర్పాట్లు..స్పందన తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోగా శుక్రవారం పాస్పోర్టు వచ్చింది. శనివారం స్పందన తండ్రి శ్రీనివాస్ హైదరాబాద్లో మంచిర్యాల ఎమ్మెల్యే కే.ప్రేంసాగర్రావును కలిసి తన సమస్యను విన్నవించారు. దీంతో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో వారికి వీసా ఇప్పించి అమెరికా పంపించే ఏర్పాట్లు చేస్తానని ఎమ్మెల్యే హామీనిచ్చారు. మాయలేడీలపై కేసు నమోదుమంచిర్యాలటౌన్: ‘మంచిర్యాలలో మాయలేడీలు’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మంచిర్యాల పోలీసులు స్పందించా రు. రుణాల పేరిట పలువురి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన ఇద్దరు మహిళలపై శనివా రం కేసు నమోదు చేశా రు. మంచిర్యాల పట్టణ సీఐ ప్రమోద్రావు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలలోని ఇక్బాల్ అహ్మద్నగర్కు చెంది న బద్రూన్నిసా, గోపాల్వాడకు చెందిన అరవ సుబ్బలక్ష్మి కలిసి ఈ ఏడాది జనవరి నుంచి కొందరు మహిళలకు రూ.5 లక్షలు లోన్ ఇప్పిస్తామని నమ్మించారు. అందుకోసం కొంత డబ్బు ఖర్చవుతుందని సుమారు పది మంది మహిళల నుంచి దాదాపు రూ.3లక్షలు వసూలు చేశారు. రుణం ఇప్పించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. బాధితులు డ బ్బుల విషయమై ప్రశ్నించగా బెదిరించారు. దీంతో షేక్ రిజ్వానా, బాధితులు ఇచ్చిన ఫిర్యా దు మేరకు ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఎఫెక్ట్ -
నో పైరవీ.. నో రెక్వెస్ట్
సాక్షి, ఆదిలాబాద్: ఆదాయం అధికంగా ఉండే శాఖల్లో ఉన్నతాధికారుల బదిలీల ప్రక్రియ చోటు చేసుకుంటుందంటే అందులో పైరవీలు, రెక్వెస్టూ లు సాధారణం. జిల్లాకు వచ్చేందుకు ఆ అధికారి జోరుగా పైరవీ చేస్తున్నారట.. రాష్ట్ర మంత్రిని కలిశారట.. మరో ఆఫీసర్ రిక్వెస్ట్ పెట్టుకున్నాడట.. అందుకోసం రూ.లక్షలు కూడా సమర్పించుకునేందుకు వెనకాడటం లేదట.. అనే చర్చ సాగుతోంది. అయి తే ఎకై ్సజ్ శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరి స్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఆ శాఖలో రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లా బాస్ డిప్యూటీ కమిషనర్(డీసీ), నాలుగు జిల్లాలకు డీపీఈవోలుగా కొత్త అధికారులు త్వరలో రావడం ఖాయమని తేలింది. అయితే ఎవరు వస్తారో తెలియని పరిస్థితి ఉందని ఆ శాఖలో చెప్పుకుంటున్నారు. ఏ ఒక్క అధికారి కూడా ఉమ్మడి ఆదిలాబాద్లో పోస్ట్ కావాలని పైరవీ చేసుకోలేదని, రెక్వెస్ట్ మాటే లేదనే చర్చ సాగుతోంది. పనిష్మెంటు పైనే కొత్త అధికారులను పైనుంచి పంపుతారని చెప్పుకోవడం గమనార్హం. రెండు నెలల క్రితం ఎకై ్సజ్ శాఖలో రాష్ట్రవ్యాప్తంగా పదోన్నతుల ప్రక్రియ చోటుచేసుకుంది. సీఐలు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, ఈఎస్లు, ఏసీలకు ప్రమోషన్ లభించింది. డిప్యూటీ కమిషనర్ వరకు పదోన్నతులు అందాయి. తాజాగా వారికి పోస్టింగ్ కేటాయింపు ప్రక్రియ చోటు చేసుకుంటుంది. పక్కనున్న పలు ఉమ్మడి జిల్లాలకు ఆఫీసర్లుగా వచ్చేందుకు పలువురు పైరవీలు, రెక్వెస్ట్లు చేసుకుంటుండగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు మాత్రం ఆ పరిస్థితి లేదని చెప్పుకుంటున్నారు. ఆ జిల్లాలో ‘పచ్చగడ్డి బాగుంటుందని, ఆ జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడ ఎండుగడ్డి మాత్రమేనని’ అందుకే ఇక్కడికి వచ్చేందుకు ఎవరు సుముఖంగా ఉండరని, ఆ శాఖలోని ఓ ఉద్యోగి పేర్కొనడం పరిస్థితికి అద్దం పడుతుంది. అలాగని ఉమ్మడి జిల్లాలో ఆదాయం ఉండదనే ది కాదని, ఇతర జిల్లాలతో పోల్చుకుంటే ఆ స్థాయిలో ఉండకపోవడంతోనే ఈ పరిస్థితి అని బాహాటంగానే చెప్పుకోవడం గమనించదగ్గ విషయం. ఇది పరిస్థితి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డిప్యూటీ కమిషనర్ (డీసీ)గా రఘురాం ఇన్చార్జి ఆఫీసర్గా కొద్ది నెలలుగా కొనసాగుతున్నారు. హైదరాబాద్ డీసీ కార్యాలయంలో అధికారిగా కొనసాగుతున్న ఆయన ఉమ్మ డి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు ఇన్చార్జి డీసీగా కొనసాగుతున్నారు. పలువురు డీసీలుగా పదోన్నతులు పొందడంతో తాజా ప్రక్రియలో ఉమ్మడి జిల్లాలకు బాస్ లను నియమించనున్నారని, రఘురాంను ఇక్కడి బాధ్యతల నుంచి తప్పించి వేరే అధికారికి పోస్టింగ్ ఇవ్వడం ఖాయమని శాఖలో చర్చ సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు డీపీఈవో (ఎకై ్సజ్ సూపరింటెండెంట్) లుగా హిమశ్రీ, నందా గోపాల్, జ్యోతి కిరణ్, రజాక్ కొనసాగుతున్నారు. సుదీర్ఘకాలంగా ఆ జిల్లాల్లో పనిచేస్తుండడంతో వారి బదిలీ లు ఖాయం. వారి స్థానంలో కొత్త ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు రానున్నారు. ఈ పోస్టులకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బాధ్యతలు నిర్వర్తించేందుకు ఏ ఆఫీసర్ కూడా పైరవీ, రెక్వెస్టులు లేవని, అక్కడి నుంచి పంపే వారే ఇక్కడికి వస్తారని చెప్పుకుంటున్నారు.కొరవడిన పర్యవేక్షణ.. ఉమ్మడి జిల్లా బాస్ డీసీ ఇన్చార్జిగా కొనసాగుతుండడంతో ఆయన అడపాదడపా వస్తుండడంతో పర్యవేక్షణ కొరవడింది. ఈ కార్యాలయంలోనే అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ కూడా ఇన్చార్జితోనే నడిపిస్తున్నారు. రెండు కీలకమైన పోస్టుల్లో ఇన్చార్జీలు ఉండడంతో పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉందనే విమర్శలు లేకపోలేదు. ఇక ఏసీ ఎన్ఫోర్స్మెంట్, జిల్లా టాస్క్ ఫోర్సుల్లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. ఇటీవల జిల్లాలో గంజాయి సాగు కేసులు అధికంగా నమోదవుతున్నాయి. గుడుంబా కేసులు కూడా పోలీసులు దాడి చేసి పట్టుకునే పరిస్థితి ఉంది. పర్యవేక్షించే శాఖలో పోస్టులు ఖాళీగా ఉండడంతో నియంత్రణ కొరవడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఆహార భద్రత.. అందరి బాధ్యత
నిర్మల్ఖిల్లా: ఆహారం ఆరోగ్యానికి మూలాధారం. కానీ ప్రస్తుతం మార్కెట్లో పాల నుంచి భోజనం, ఆహార పదార్థాలు, తినుబండారాల వరకు కల్తీ బారిన పడుతున్నాయి. ఆకర్షణీయంగా కృత్రిమ రంగులు, రసాయనాలు, నాణ్యతలేని పదార్థాలను ఉపయోగించడం వల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా ప్రమాదంలో పడుతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా ఇష్టపడే చిప్స్లు, స్వీట్లు, ఐస్క్రీములు, బేకరీ ఉత్పత్తులు, శీతల పానీయాల్లో ఈ కల్తీ ఎక్కువగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. జూన్ 7న నిర్వహించే ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా ‘సురక్షిత ఆహారం ప్రతీ ఒక్కరి హక్కు’అనే సందేశాన్ని ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం. గత ఘటనలు కలకలంతనిఖీలు ముమ్మరం చేస్తేనే.. జిల్లాలో ఆహార భద్రత అధికారుల తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. హోటళ్లు, బేకరీలు, స్వీట్ షాపులు, వీధి వ్యాపారుల వద్ద విక్రయించే ఆహార పదార్థాల నమూనాలు సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించాలని సూచిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. -
సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి
ఆదిలాబాద్రూరల్: ఆదివాసీ పర్ధాన్ సమాజ్ సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాలని మహా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఓఎస్డీ, ఆదివాసీ పర్ధాన్ సమాజ్ నేత హామ్రాజ్ ఉయికే, సుప్రీంకోర్టు న్యాయవాది విశాల్ జొగ్దండా అన్నారు. జిల్లా కేంద్రంలో ఈనెల 28న నిర్వహించే ఆదివాసీ పర్ధాన్ సమాజ్ సభ నిర్వహణపై శనివారం ఓ హోటల్ నిర్వహించిన సన్నాహాక సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. పర్ధాన్ సమాజ్ తెగకు ప్రభుత్వాలు పథకాలు అందించాలని పేర్కొన్నారు. రాజకీయంగా, ఉద్యోగ, ఉపాధి, వైద్య, విద్యరంగాల్లో అవకాశాలు కల్పించాలన్నారు. మహారాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అశోక్ ఉయికే రాష్ట్రాలవారీగా సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీలు, సంఘాలకతీతంగా నిర్వహించే సభకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రాల్లో సభలు ముగిశాక ఢిల్లీలో బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో ఆదివాసీ పర్ధాన్ సమాజ్ నాయకులు పాల్గొన్నారు. -
బొమ్మను గీస్తే..
నిర్మల్టౌన్: పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులు వేసవి సెలవులను సద్వి నియోగం చేసుకుంటున్నారు. పేప ర్, కాన్వాస్పై బొమ్మలు గీయడం, రంగులు అద్దడం, భావాలు, ఆలో చింపజేసే చిత్రకళపై ఆ సక్తి పెంచుకుంటున్నారు. ఇందుకోసం పెయింటింగ్స్ శిక్షణలో చేరి కళాప్రతిభకు పదును పెడుతున్నా రు. చిత్రలేఖనం, స్కెచ్చింగ్, వాటర్ కలర్, అక్రిలిక్ పెయింటింగ్ వంటి విభాగాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. పెన్సిళ్లు, సిరా, వాటర్ కలర్స్, ఇతర వాటితో జాతీయ నాయకులు, ప్రకృతి అందాలు, జంతువులు, పక్షులు, సామాజిక అంశాలపై చిత్రాలు గీస్తూ ఆకట్టుకుంటున్నారు. తల్లిదండ్రులు పిల్లల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాలు గుర్తించి ప్రోత్సహిస్తున్నా రు. దీంతో శిక్షణా కేంద్రాలకు ఆదరణ పెరుగుతోంది. ఏకాగ్రత ఉండాలిచిత్రలేఖనం అంటే రంగులతో పూర్తయ్యే పని కాదు. బొమ్మ గీయాలంటే ఎంతో ఏకాగ్రత ఉండాలి. మనసులోని భావాలను కాగితంపై బొమ్మగా మార్చేందుకు ఆలోచించాలి. నిదానం పాటించాలి. అప్పుడే బొమ్మ అందంగా వస్తుంది. అప్పుడే ఊహాశక్తిని అభివృద్ధి చేసుకోవడం సాధ్యమవుతుంది. ఆకారాలు, రంగులు, దశ్యాలను గుర్తుంచుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. -
ప్రాణాలు పోతున్నా.. పట్టింపేది?
ఆదిలాబాద్టౌన్: పొట్టకూటి కోసం పనులు చేస్తున్న కార్మికుల ప్రాణాలకు భరోసా లేకుండా పోతుంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. గతంలో విద్యుత్ మరమ్మతులు చేస్తూ పలువురు కార్మికులు మృత్యువాత పడిన ఘటనలు చోటు చేసుకున్నా, ఆ శాఖ అధికారులు, కాంట్రాక్టర్ల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. తమ పనులు జరిగితే చాలు అన్న రీతిలో వ్యవహరిస్తున్నరనే ఆరోపణలున్నాయి. గతంలో జిల్లాకేంద్రంలోని నేతాజీచౌక్తో పాటు, పలు కాలనీల్లో మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో కార్మికులు షాక్కు గురై ప్రాణాలు పోగుట్టుకున్నారు. ఇంటి పెద్దదిక్కు కోల్పోవడంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మరోవైపు అధికారులు, కాంట్రాక్టర్లు నామామత్రంగా పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా జిల్లా కేంద్రంలో మరో కార్మికుడు విద్యుదాఘాతానికి గురై శనివారం మృతిచెందాడు. ఉపాధి నిమిత్తం ఝార్ఖండ్ రాష్ట్రం నుంచి వచ్చి విధి నిర్వహణలో ఇక్కడ ప్రాణాలు వదలడం గమనార్హం. కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. అసలేం జరిగిందంటే..ఆదిలాబాద్ పట్టణంలోని రాణిసతీజి కాలనీలో డ్యామేజ్ స్తంభాల తొలగింపు, ఇతర మరమ్మతు పనులు చేపడుతున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కార్మికుడు సురేశ్కుమార్(24) స్తంభంపైకి ఎక్కి పనులు చేపడుతున్న క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ తీగలకు కరెంట్ సరఫరా కావడంతో షాక్కు గురై విలవిల్లాడాడు. కింద ఉన్న కార్మికులకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. విద్యుత్ నిలిపివేసినా షాక్కు గురికావడంతో అక్కడ ఉన్న కార్మికుల్లో భయాందోళన నెలకొంది. క్షణాల్లోనే విద్యుత్ స్తంభంపై కార్మికుడు ప్రాణాలు వదిలాడు. కింద ఉన్న ఇద్దరు కార్మికులు స్తంభం పైకి ఎక్కి షాక్కు గురైన కార్మికుడికి కిందకు దించారు. రిమ్స్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతిడికి ఇద్దరు పిల్లల(ఐదేళ్లు, మూడేళ్ల వయస్సు)తో పాటు భార్య ఉంది. ఇంటి పెద్దదిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి నెలకొంది.పర్యవేక్షణ లోపమే కారణమా..? ఇటీవల విద్యుత్ శాఖలో పనిచేసే పలువురు ఉద్యోగులతో పాటు, కార్మికులు కరెంట్ షాక్ గురై ప్రాణాలు పోతు న్నా సంబంధిత అధికారుల తీరులో మార్పుకానరావడం లేదనే ఆరోపణలున్నాయి. మరమ్మతు పనులు చేపట్టే సమయంలో ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసి పనులు చేస్తున్నప్పటికీ సంఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. ఇంట్లో అమర్చుకుంటున్న ఇన్వర్టర్ నుంచి విద్యుత్ వెనక్కి సరఫరా కావడంతో ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పనులు జరిగే సమయంలో అధికారులతో పాటు కాంట్రాక్టర్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సి ఉండగా, పట్టించుకోని కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ విషయమై విద్యుత్ శాఖ ఎస్ఈ శేషారావును వివరణ కోరగా, విద్యుత్ మరమ్మతు పనులు చేపడుతున్న సమయంలో ఇంట్లో నుంచి ఇన్వర్టర్ ద్వారా కరెంట్ సరఫరా కావడంతో షాక్ గురై మృతి చెందాడని తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. -
ఏపీఐ రాష్ట్ర చైర్మన్గా రాములు
నిర్మల్ఖిల్లా: అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియ న్స్ ఆఫ్ ఇండియా (ఏ పీఐ) రాష్ట్ర చైర్మన్గా నిర్మల్కు చెందిన ప్ర ముఖ వైద్యుడు డాక్టర్ దామెర రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈమేర కు ప్రకటించినట్లు ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ నవల్చంద్ర తెలిపారు. నాలుగు దశాబ్దాలకుపైగా వైద్యవృత్తిలో సేవలందిస్తున్న ఆయన ఉమ్మడి జిల్లా నుంచి తొలి ఏపీఐ రాష్ట్ర చైర్మన్గా ఎంపికయ్యారు. అసోసియేష న్ ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతానని దామెర రాములు తెలిపారు. ఈయన వైద్యవృత్తితోపాటు సాహితీరంగంలో తనదైన శైలిలో ప్రజలను జాగృతం చేస్తుండటం విశేషం. -
చిరుతదాడిలో లేగదూడ మృతి
తానూరు: మండలంలోని మోగ్లి అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచా రంతో స్థానికులు బెంబేలెత్తుతున్నా రు. మోగ్లి గ్రామానికి చెందిన రైతు పోతన్న శుక్రవా రం ఆవులను మేపి పొలంలో కట్టేసి రాత్రికి ఇంటికి వెళ్లాడు. శనివారం రైతు పొలానికి వెళ్లగా లేగదూడ కనిపించలేదు. సమీపంలో వెతకగా మృతిచెంది ఉంది. అక్కడ చిరుత పాదముద్రలు కనిపించడంతో వెంటనే అటవీ అధి కారులకు సమాచారం అందించారు. సెక్షన్ అధికారి రవికమార్, సిబ్బంది శివ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిరుత దాడిలో లేగదూడ మృతిచెందినట్లు నిర్ధారించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేన్లకు గుంపులుగా వెళ్లాలని సూచించారు. -
ఆదిలాబాద్లో యుద్ధవిమానాల గర్జన!
ఆదిలాబాద్లో యుద్ధ విమానాలు గర్జించబోతున్నాయి. పట్టణానికి ఆనుకొని కొత్తగా నిర్మించబోయే పౌర విమానాశ్రయానికి అనుబంధంగా భారీస్థాయిలో భారత వైమానిక శిక్షణ కేంద్రం ఏర్పాటు కాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిన పౌర విమానాశ్రయానికి ఇండియన్ ఎయిర్ఫోర్స్ రన్వే కూడా ఉండనున్నందున ఇది ‘జాయింట్ ఎయిర్ ఫీల్డ్‘గా రూపొందనుందని తెలిసిందే. కానీ, శిక్షణ కేంద్రాన్ని సాధారణస్థాయిలో కాకుండా దేశంలోనే కీలక స్థావరంగా మార్చాలని తాజాగా భారత వైమానిక దళం నిర్ణయింది. యుద్ధ విమానాల శిక్షణలో దీన్ని వ్యూహాత్మక కేంద్రంగా మార్చుకోవాలని ప్రణాళిక రూపొందించింది.ఇది భారీ స్థాయిలో ఉండనున్నందున, ఇక్కడ ఎయిర్ఫోర్స్ సిబ్బంది సంఖ్య కూడా ఎక్కువగా ఉండబోతోంది. దీంతో వారి కుటుంబాల కోసం వందల సంఖ్యలో గృహాలను నిర్మించనున్నారు. శిక్షణ, యుద్ధ విమానాలకు రన్వేలు, వాటిని నిలిపేందుకు భారీ హ్యాంగర్లు, మూమెంట్ కోసం ఏప్రాన్లు, టాక్సీవేలు, శిక్షణ కేంద్రానికి సంబంధించిన భారీ భవనాలు, పరిపాలన కార్యాలయ భవనాలు, రక్షణ సామగ్రి నిల్వ కేంద్రాలు... వెరసి దేశంలో ప్రధాన ఎయిర్ఫోర్స్ శిక్షణ కేంద్రంగా మారబోతోంది. – సాక్షి, హైదరాబాద్చిన్న స్ట్రిప్ నుంచి... ఆదిలాబాద్ పట్టణానికి ఆనుకునే గతంలో వాయుసేన ఎయిర్ర్స్టిప్ ఉండేది. ఆ తర్వాత దాని కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయాయి. కానీ, నిజాం కాలం నాటి ఆ ఎయిర్స్ట్రిప్ పరిధిలో దాదాపు 369 ఎకరాల భూమి ఇప్పటికీ ఎయిర్ఫోర్స్ అ«దీనంలోనే ఉంది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో విమానాశ్రయాలను అభివృద్ధి చేసే క్రమంలో పాత ఎయిర్్రస్టిప్ స్థానంలో పౌర విమానాశ్రయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.దీనికి అంగీకరించిన ఎయిర్ఫోర్స్, రాష్ట్ర ప్రభుత్వం మరో 400 ఎకరాలు ఇస్తే ఉమ్మడి విమానాశ్రయం (పౌర విమానాశ్రయం, ఎయిర్ఫోర్స్ శిక్షణ కేంద్రం)గా రూపొందించేందుకు సిద్ధమైంది. వెరసి 700 ఎకరాల్లో ఎయిర్బస్ 380 స్థాయి పెద్ద విమానాలు దిగే 9 వేల అడుగుల పొడవైన రన్వేను ప్రతిపాదించారు. కానీ, తాజాగా రక్షణశాఖ ఇక్కడ భా రీ వైమానిక శిక్షణ కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అదనంగా మరో వేయి ఎకరాలు సేకరించి ఇవ్వాలని ప్రతిపాదించింది.వ్యూహాత్మక ప్రాంతం ఆదిలాబాద్ దేశానికి రక్షణపరంగా వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. ఇది ఉత్తర–దక్షిణ భారత దేశాల జంక్షన్గా ఉంటుంది తీర ప్రాంతాలకు దూరంగా అటవీ ప్రాంతాల మధ్యన ఉన్నందున దీన్ని రక్షిత ప్రాంతంగా భారత వాయుసేన భావిస్తోంది. దీంతో ఇక్కడ పూర్తిస్థాయి ఎయిర్ఫోర్స్ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం దుండిగల్, హకీంపేటల్లోని శిక్షణ కేంద్రాల కంటే ఇది భిన్నంగా ఉండనుందని సమాచారం. నిర్మాణాలు ఈ శిక్షణ కేంద్రంలో భాగంగా యుద్ధ విమానాలు దిగడానికి భారీ రన్వే, విమాన రక్షణ కేంద్రం, పైలట్లకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు, కంట్రోల్ రూమ్లతోపాటు రక్షణ సిబ్బంది నివాసానికి ఒక పెద్ద టౌన్షిప్ నిర్మించనున్నారు.ట్రైనింగ్ అకాడమీ–హ్యాంగర్లుఫైటర్ జెట్స్, హెలికాప్టర్ల నిర్వహణకు భారీ హ్యాంగర్లు, అత్యాధునిక రక్షణ సామగ్రి నిల్వ కేంద్రాలు నిర్మిస్తారు. రన్వేకు చేరువలో ఒకేసారి ఎక్కువ సంఖ్యలో వాయుసేన విమానాలు నిలిపేందుకు ఏప్రాన్, రన్వేకు అనుసంధానమయ్యే టాక్సీవేలను నిర్మిస్తారు. ఇవి సాధారణ విమానాశ్రయం తరహాలో ఎక్కువ సంఖ్యలో ఉంటాయని సమాచారం. భూమి కావాలంటే పరిహారం ఖర్చు చెల్లించాల్సిందే... ప్రస్తుతం రక్షణశాఖ అ«దీనంలో 369.45 ఎకరాలు ఉండగా, మరో నాలుగొందల ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. తాజా ప్రతిపాదన ప్రకారం మరో వేయి ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందుకు భారీగా పరిహారం చెల్లించాల్సి ఉన్నందున, దాన్ని కేంద్రమే భరించాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీనిపై త్వరలో స్పష్టత రానుంది. ఆదిలాబాద్లో డీఫంక్ట్ అయిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధీనంలోని భూములను దీనికి వినియోగించాలని భావిస్తున్నారు.ఫలితంగా పరిహా ర ఖర్చు తగ్గుతుందని పేర్కొంటున్నారు. దీంతోపాటు నిషానీ ఘాట్, సమీపంలోని రెండు గ్రామాల భూములను సేకరించే అంశాన్ని ప్రత్యామ్నాయంగా చూస్తున్నా రు. ఇప్పటికే రక్షణశాఖ ఈ విమానాశ్రయ పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్ను ఆమోదించాల్సి ఉంది. మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందిన తర్వాత నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రస్తుత ప్రణాళిక. శంకుస్థాపన జరిగిన మూడేళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నది ఆలోచన. -
అమల్లోకి సవరించిన ధరలు
కై లాస్నగర్: రాష్ట్ర ప్రభుత్వం సవరించిన భూముల ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్స్ ధరలను ప్రాంతాల వారీగా డిమాండ్కు అనుగుణంగా సవరించారు. ప్లాట్ల ధరలు 15 శాతం నుంచి 25 శాతం పెంచగా, వ్యవసాయ భూములను 20 శాతం నుంచి 100శాతం పెంపుదల చేశారు. నూతన ధరలను పరిశీలిస్తే.. ఆదిలాబాద్ అర్బన్లో అత్యఽధికంగా భూముల ధరలు పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో 20శాతం పెంచగా, మండల కేంద్రాలు, డిమాండ్ ఎక్కువగా ఉన్న మేజర్ గ్రామ పంచాయతీల్లో 50శాతం నుంచి 75శాతం ధరలు పెరిగాయి. దీంతో ప్లాట్ల కొనుగోలు దారులపై స్వల్పంగా భారం పడగా, వ్యవసాయ భూముల ధరలకు మాత్రం రెక్కలు వచ్చాయి. వాటి కొనుగోలు కొంత భారంగా మారనుంది. వీటి రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరే అవకాశముంది. ఆదిలాబాద్ పట్టణంలో ఇలా.. ఆదిలాబాద్ పట్టణంలో ప్లాట్ల ధరలు స్వల్పంగా పెరిగాయి. గంజ్రోడ్, అంబేడ్కర్చౌక్, శివాజీచౌక్, రైల్వే స్టేషన్ రోడ్, బస్టాండ్డౌనల్ వంటి ప్రాంతాల్లో గతంలో స్వ్కేర్యార్డ్కు రూ.26,400 అత్యధికంగా ఉండగా ప్రస్తుతం దాన్ని రూ.30,400కు పెంచారు. పట్టణంలో ఏరియా, అక్కడి డిమాండ్కనుగుణంగా ధరలు పెంచారు. పంజేషాకాలనీలో చదరపు అడుగుకు రూ.13,200 ఉండగా దాన్ని రూ.15వేలకు పెంచారు. అత్యల్పంగా ఖానాపూర్, ధన్గర్గల్లి, మసూద్చౌక్, స్వీపర్స్కాలనీ, బొక్కల్గూడ కాలనీల్లో గతంలో రూ.2400 ఉండగా ప్రస్తుతం రూ.2800కు చేరింది. అశోక్రోడ్, కోలిపూర, బ్రహ్మణ్వాడల్లో రూ.5800 నుంచి రూ.6700కు పెంచారు. ప్రస్తుతం ప్లాట్ల క్రయవిక్రయాలు ఎక్కువగా జరగడంతో పాటు భారీ ధర పలుకుతున్న దస్నాపూర్, రాంనగర్, మణిపూర్ వంటి ప్రాంతాల్లో మార్కెట్ వ్యాల్యూను మురికివాడలైన గాంధీనగర్, రణదీవేనగర్ కాలనీలకంటే తక్కువగా నిర్ణయించడంపై విమర్శలు విన్పిస్తున్నాయి. కాగా గ్రామీణ ప్రాంతాల్లో స్క్వేర్యార్డ్కు రూ.600లు ఉన్న ధర రూ. 700లు కాగా, రూ.900లు ఉన్న ధర రూ.1100లకు పెంచారు. ఆయా ప్రాంతాల్లో ప్లాట్ల కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ చార్జీలు భారంగా మారనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారీగా పెరిగిన వ్యవసాయ భూముల ధరలు.. ఓపెన్ ప్లాట్ల కంటే వ్యవసాయ భూముల ధరలు జిల్లాలో భారీగా పెరిగాయి. 20శాతం నుంచి 100శాతం పెంచడంతో మార్కెట్ వ్యాల్యూ అధికమైంది. ఆదిలాబాద్ పట్టణంలోని సర్వే నంబర్ 400లో మొన్నటి వరకు రూ.11కోట్ల విలువ కలిగిన ఎకరం వ్యవసాయ భూమి రూ.13 కోట్లకు చేరింది. అదనంగా రూ.2 కోట్లు పెరిగాయి. ఖానాపూర్, భూక్తాపూర్ శివారులోని పలు సర్వే నంబర్లలో గల వ్యవసాయ భూములు ఎకరాకు రూ.25 లక్షల నుంచి రూ.31 లక్షలకు పెరిగాయి. రియల్ ఎస్టేట్లో దూసుకుపోతున్న మావల మండల కేంద్రంలోని పలు వ్యవసాయ భూముల విలువను రూ.1.95 కోట్లకు పెంచారు. నేరడిగొండ మండలం నేరడిగొండ –జి గ్రామ పంచాయతీ పరిధిలో ఎకరం వ్యవసాయ భూమి ధర రూ.2.50లక్షలు ఉండగా రూ.6లక్షలకు పెరిగింది. సిరికొండ మండలం పొన్న గ్రామంలో రూ.3,37,500 ఉండగా రూ.8లక్షలకు చేరింది. సుంకిడి గ్రామంలో రూ.3,37,500లు ఉండగా రూ.15లక్షలకు పెరిగింది. మిగతా మండలాల్లోని గ్రామాలు, మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో భూముల డిమాండ్, రోడ్డు సౌకర్యం, నివాసాలు వంటి వాటి ఆధారంగా 20 నుంచి 100శాతం పెంచినట్లుగా రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. -
పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత
కై లాస్నగర్: పర్యావరణ పరిరక్షణ సామాజిక బా ధ్యతగా భావించి మొక్కలు నాటడంతో పాటు సంరక్షించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రజాపాలన –ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం జి ల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా అటవీశాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ అడవులు, జల వనరుల సంరక్షణే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తుందన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో నాటిన మొక్కలపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్ర తీ దుకాణదారుడు తమ షాపుల ఎదుట మొక్కలు నాటాలని సూచించారు. పిల్లల్లో చిన్నతనం నుంచే పర్యావరణ ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. కాగా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకా రులు, విద్యార్థులు నిర్వహించిన నృత్యప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీ సీఈవో రవి, డీఆర్డీవో రవీందర్, డీపీఆర్వో విష్ణువర్ధన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, పశు సంవర్ధక శాఖ అధికారి రామారావు, ఎఫ్డీవో అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్రూరల్: మారుతున్న వాతావరణ పరిస్థితులు, గ్లోబల్ వార్మింగ్ సవాళ్లను ఎదుర్కోవడానికి అడవులను రక్షించుకోవడం ఒక్కటే మార్గమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్రూరల్ మండలం యాపల్గూడ బీట్లో హైడెన్సిటీ మిక్స్డ్ ప్లాంటేషన్ విధానంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్తో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, సర్పంచ్ నిరోష, డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, ఎఫ్డీవో అరవింద్ సిబ్బంది పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి కై లాస్నగర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్లు, పంచాయతీరాజ్ భవనాలు, తాగునీటి సరఫరా, గ్రామీణ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జెడ్పీ సీఈవో రవి, డీఆర్డీవో రవీందర్, డీపీవో రమేశ్, హౌసింగ్ పీడీ శంకర్, ఏడీ గ్రౌండ్ వాటర్ సతీశ్ యాదవ్ పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో మొహతుక్ పూజలు
నార్నూర్: మండలంలో ఏంపల్లి గ్రామ పంచాయతీ పరిధి గోండుగూడలో శుక్రవారం ఆదివాసీలు సంప్రదాయ బద్ధంగా విజంగ్ మొహతుక్ పూజా కార్యక్రమం నిర్వహించారు. వర్షాలు సంవృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గ్రామస్తులు సంప్రదాయ నృత్యాలు చేస్తూ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పూ జల అనంతరం వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టి, త్వరలో విత్తనాలు విత్తనున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. గ్రామస్తులు పెందోర్ అమృత్రావు పటేల్, కోట్నాక్ శ్రీరామ్, పెందోర్ జ్యో తిరాం, పూసం జాంబిరావు, మాడవి జల్పత్, కోట్నాక్ భీంరావు, పూసం లచ్చు, యందొ రావు, కలాబాయి, లచ్చుబాయి, ద్రౌపదిబాయి, పుల్లమ్మ, పారుబాయి పాల్గొన్నారు. -
ఆడిటోరియం అటకెక్కినట్టేనా..!
ఆదిలాబాద్: ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు నెలవైన జిల్లాలో కళాకారులకు కొదవ లేదు. గుస్సాడీ మొదలుకొని బంజారా, జానపదం, వెస్ట్రన్, సంప్రదాయ నృత్యరీతుల్లోనూ ఎంతోమంది ప్రతిభ చాటుతున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన కళాకారులెందరో ఉన్నా రు. అయితే తమ కళను ప్రదర్శించడానికి జిల్లాలో ఎటువంటి వేదిక లేకపోవడం కళాకారులకు శాపంగా మారింది. గతంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆడిటోరియం నిర్మించాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ అది సైతం అటకెక్కినట్లే కనిపిస్తోంది. కళాభివృద్ధికి వేదికగా.. ఆడిటోరియం నిర్మాణం జరిగితే ఎంతోమంది కళాకారులు తమ కళను ప్రదర్శించే అవకాశం కలుగుతుంది. తక్కువ ఖర్చుతో కళా ప్రదర్శనలు ఇవ్వొచ్చు. ఆడిటోరియం అందుబాటులో ఉండి ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేస్తే కళాకారులు ఆదాయం కూడా పొందవచ్చు. అదే సమయంలో జిల్లా ప్రజలకు ఈ కళా ప్రదర్శనలు చూసే అవకాశం కలుగుతుంది. ఆడిటోరియం వేదికపై ప్రదర్శన ఇవ్వడం వల్ల కళాకారులకు సమాజంలో మంచి గుర్తింపు రావడమే కాకుండా, రాష్ట్ర, జాతీయ స్థాయి వేదికలపై సత్తా చాటే అవకాశం ఉంటుంది. ప్రాక్టీస్ గదులు ఏర్పాటు ద్వారా కళాకారులు ప్రదర్శనలను మ రింతగా మెరుగుపరుచుకోవచ్చు. ఆడిటోరియంలో అధికారిక కార్యక్రమాలు సైతం నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. స్థానిక నృత్యరీతులైన గుస్సాడీ, బంజారా నృత్యాల ప్రదర్శనతో వాటిని మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావచ్చు. యువజనోత్సవాలకు మంగళం.. యువత ప్రతిభను వెలికి తీసేందుకు ఏటా యువజనోత్సవాలను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే సరైన వేదిక లేకపోవడంతో వాటి నిర్వహణలో సైతం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తూతూ మంత్రంగా నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఎంతోమంది ప్రతిభగల యువ కళాకారులు నిరుత్సాహానికి గురవుతున్నారు. గతంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్స్ ప్రాంగణంలో ఆడిటోరియం నిర్మించాలని భావించారు. అయితే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని తమకే ఆ స్థలం కావాలని కళాశాల యాజమాన్యం నిరాకరించడంతో స్థలం కరువైంది. ఇప్పటికై నా అధికారులు దృష్టి సారించి ఆడిటోరియం నిర్మాణమయ్యేలా కృషి చేయాలని కళాకారులు కోరుతున్నారు.డిగ్రీ కళాశాలలో.. కళలకు నెలవైనా.. జిల్లాలో గిరిజనుల ప్రాభల్యం అధికంగా ఉంటుంది. వారి సంస్కృతి, సంప్రదాయాలు ఎంత భిన్నంగా ఉంటాయో వారి కళలు కూడా వైవిధ్యంతో నిండి ఉంటాయి. ఆదివాసీల గుస్సాడీ నృత్యం ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ గుస్సాడీ కళాకారుడు పద్మశ్రీ కనకరాజు గుస్సాడీ ఖ్యాతిని ఢిల్లీ వరకు చేర్చారు. మరోవైపు బంజారాల నృత్యాలు వాటికవే ప్రత్యేకంగా ఉన్నాయి. ఎన్నో భిన్నమైన నృత్యరీతులకు జిల్లా నెలవైనప్పటికీ వాటిని ప్రదర్శించేందుకు వేదికలు కరువయ్యాయి. -
హెచ్ఎంల మధ్య అంతర్గత పోరు
ఆదిలాబాద్టౌన్: ఇద్దరు ప్రధానోపాధ్యాయుల వివాదం ఏడాదిగా విద్యాశాఖ అధికారులకు తలనొప్పిగా మారింది. త్వరలో పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా, ఈ విషయాన్ని ఎటూ తేల్చలేకపోతున్నారు. కొత్త మండలాలు ఏర్పడినప్పుడు మావలను మండలంగా ఏర్పాటు చేశారు. గతంలో ఆదిలాబాద్అర్బన్ ఎంఈవో ఈ మండలాన్ని పర్యవేక్షించారు. రెండేళ్ల క్రితం మావలకు ప్రత్యేక ఎంఈవో పోస్టు ఇన్చార్జీతో భర్తీ చేశారు. గతంలో ఎంఎన్వోలుగా పనిచేసిన వారికే ఎంఈవోలుగా బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉంటే మావల మండలానికి స్కూల్ కాంప్లెక్స్ లేదు. ఇదివరకు సరస్వతినగర్ పాఠశాల పరిధిలోకి ఈ పాఠశాలలు వచ్చేవి. గతేడాది సమగ్ర శిక్షా ఎస్పీడీ చించుఘాట్ స్కూల్ కాంప్లెక్స్ను మావలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిప్రకారం మావల పరిధిలోకి వచ్చే ఏడు స్కూళ్లను సరస్వతినగర్ నుంచి తొలగించాల్సి ఉంటుంది. కానీ ఓ హెచ్ఎం ఆ పాఠశాలలు తమ పరిధిలోకే వస్తాయని రికార్డులు అప్పగించడం లేదని సమాచారం. మావల మండలంలోనే సరస్వతినగర్ పాఠశాల ఉందని, తానే సీనియర్ కావడంతో ఎంఈవోగా నియమించాలని అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ వివాదం కలెక్టర్తోపాటు ఆర్జేడీ, డీఈవో వరకు వెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. స్కూళ్లు మావంటే.. మావే.. సరస్వతినగర్ స్కూల్ కాంప్లెక్స్ ఆదిలాబాద్ అర్బన్ మండల పరిధిలోకి వస్తుంది. అయితే రెవెన్యూ పరంగా చూస్తే మావల మండలంలో ఉంది. ప్రస్తుతం ఈ పాఠశాల పర్యవేక్షణ ఆదిలాబాద్అర్బన్ ఎంఈవో చూస్తున్నారు. సరస్వతినగర్ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో 15 పాఠశాలలు ఉండగా, మావల మండల పరిధిలో ఏడు పాఠశాలలు ఉన్నాయి. వాటిని సరస్వతినగర్ కాంప్లెక్స్లోనే కొనసాగించాలని ఓ హెచ్ఎం అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మావల మండల పరిధిలో ఏడు పాఠశాలలు ఉండగా, ఈ పాఠశాలలు తమ పరిధిలోకే వస్తాయని మావల ప్రస్తుత ఎంఈవో పేర్కొంటున్నారు. కాగా సమగ్రశిక్షా నుంచి చించుఘాట్ స్కూల్ కాంప్లెక్స్ను మావలకు కేటాయిస్తూ గతేడాది ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో విద్యాశాఖ అధికారులు కంప్యూటర్, ప్రింటర్, నిధులను మావలకు కేటాయించాలని చించుఘాట్ హెచ్ఎంకు ఆదేశాలు జారీ చేసినా సదరు హెచ్ఎం పట్టించుకోవడం లేదని విద్యాశాఖ ఉద్యోగులు చెబుతున్నారు. అదేవిధంగా సరస్వతి స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని ఏడు పాఠశాలల రికార్డులను మావలకు అప్పగించాల్సి ఉంది. కానీ ఆ రికార్డులను మాత్రం సదరు హెచ్ఎం అప్పగించడం లేదు. విద్యార్థులకు నష్టం.. కొత్తగా ఏర్పడ్డ మావల మండలంలో మూడు గ్రామాలు ఉన్నాయి. ఇతర మండల స్థాయి అధికారులను కేటాయించిన ప్రభుత్వం ఎంఈవోను సైతం నియమించింది. ప్రస్తుతం ఆదిలాబాద్అర్బన్ పరిధిలో ఉన్న సరస్వతినగర్ను మావలలో కలపడంతో మండల పరిధిలోని విద్యార్థులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. మౌలిక వసతులు, ఇతర వనరులు, పాఠశాలకు కేటాయించే నిధులు నష్టపోవాల్సి వస్తుందని మండల పరిధిలోని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మావల మండలానికి ప్రత్యేక స్కూల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని పేర్కొంటున్నారు. ఈ విషయమై జిల్లా విద్యా శాఖాధికారి డి.మాధవిని విరణ కోరగా, ఈ విషయాన్ని ఆర్జేడీ దృష్టికి తీసుకెళ్లామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. -
భూముల మార్కెట్ విలువ సవరణ
సాక్షి, ఆదిలాబాద్: రాష్ట్రంలో భూముల విలువలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్ల కొత్త మార్కెట్ విలువలను ఖరారు చేసింది. జిల్లాలో 15నుంచి 50 శాతం వరకు భూముల మార్కెట్ విలువ సవరణ చోటు చేసుకుంది. శుక్రవారం నుంచి కొత్త ధరలు వర్తింపజేస్తున్నారు. ఇదివరకు స్టాంప్ డ్యూటీ ఉండనుండగా, సవరించిన విలువల ఆధారంగా వినియోగదారులపై భారం పడనుంది. పలుచోట్ల 50నుంచి 100శాతం వరకు పెంచనున్నట్లు ప్రభుత్వం పేర్కొనగా, జిల్లాలో మాత్రం 15 నుంచి 50 శాతం వరకు భూముల విలువలను సవరించి పెంచినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఆదిలాబాద్ అర్బన్ మండలం మినహాయిస్తే 20 మండలాలున్నాయి. ఆదిలాబాద్ పట్టణ పరిధిలో పలుచోట్ల ప్లాట్ల విలువలు 50శాతం వరకు పెంచారు. స్లమ్ ఏరియాల్లోని ప్లాట్లకు మాత్రం 15–25 శాతం వరకు సవరించారు. ధరలు పెరగనుండగా, గురువారం ప్లాట్ల రిజిస్ట్రేషన్ల తాకిడి పెరిగింది. ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సాధారణంగా రోజుకు 30 ప్లాట్ల వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా చివరిరోజు సుమారు 50 ప్లాట్ల వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. మండలాల పరిధిలో.. మండలాల పరిధిలో వ్యవసాయ భూముల ధరలు కూడా 15 నుంచి 50 శాతం వరకు పెంచారు. అధికారికంగా శుక్రవారం నుంచి వీటిని అమలు చేస్తున్నారు. రహదారి సౌకర్యం, నివాస ప్రాంతాలకు సమీపంలోని వ్యవసాయ భూములకు ధరలు పెంచారు. జిల్లాలో ఇదివరకు ఎకరానికి రూ.2.50 లక్షల వరకు ఉండగా రూ.3లక్షల నుంచి రూ.3.75 లక్షల వరకు పెంచారు. కొన్నిచోట్ల రూ.5లక్షల వరకూ పెంచేశారు. నేరడిగొండ మండలంలో రహదారికి సమీపంలోని వ్యవసాయ భూముల ధరలు ఇదివరకు బయట మార్కెట్ విలువలకు దరిదాపున ఉండగా, వాటిని సవరించి తగ్గించినట్లు తెలుస్తోంది. ముగిసిన కసరత్తు భూముల విలువల సవరణకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో మార్కెట్ విలువలను అంచనా వేస్తూ అక్కడి పరిస్థితులను అధ్యయనం చేస్తూ తాజాగా సవరణ చేశారు. రిజిస్ట్రేషన్ల సంఖ్య నామమాత్రంగా ఉన్నచోట పాత ధరలనే ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ఆదిలాబాద్టౌన్: సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ సూచించారు. గురువారం డీఎంహెచ్వో చాంబర్ నుంచి మెడికల్ ఆఫీసర్లు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. వర్షాకాలంలో జిల్లాలోని 201 గ్రామాల్లో రా కపోకలు నిలిచిపోతాయని, వాటిని హైరిస్క్ గ్రా మాలుగా గుర్తించి వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జూలైలో ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో అన్ని పీహెచ్సీల పరిధిలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డీఎంహెచ్వో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. సీజ నల్ వ్యాధుల దృష్ట్యా ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. స్టాప్ డయేరి యా కార్యక్రమాన్ని చేపట్టాలని, బాధితులకు 14 రోజులకు సరిపడా జింక్ మాత్రలు అందించాలని ఆదేశించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు రెండు చొప్పున ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేయాలని తెలిపారు. టీబీ నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చే యాలని, హైరిస్క్ గ్రామాల్లో ఎక్స్రే క్యాంపులు ఏ ర్పాటు చేయాలని పేర్కొన్నారు. టీబీ వ్యాధిగ్రస్తులు మందులు సక్రమంగా వాడుతున్నారా? లేదా? అనే విషయాన్ని వైద్య సిబ్బంది పరిశీలించాలని సూచించారు. విధులను నిర్లక్ష్యం చేయొద్దని తెలిపా రు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్, టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ సుమలత, ప్రోగ్రాం ఆఫీసర్ దేవిదాస్ తదితరులున్నారు. -
● ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ ముమ్మరం ● జిల్లాలో ఇప్పటికే 72 శాతం పూర్తి ● 15నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ● ఓటరు జాబితా ప్రక్షాళనకు శ్రీకారం
కై లాస్నగర్: బోగస్ ఓటర్లకు చెక్ పెట్టడంతో పాటు ఒకరికి ఒకేచోట ఓటు ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళనకు శ్రీకా రం చుట్టింది. అనర్హులను తొలగించి అర్హులతో కూ డిన కొత్త జాబితా రూపొందించేలా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)కు సిద్ధమైంది. 2002లో జరిగిన సమగ్ర సర్వే ఓటరు జాబి తాను ప్రామాణికంగా తీసుకుని ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టనుంది. జిల్లాలో బీఎల్వోలు ఇప్పటికే ఇంటింటికీ వెళ్లి పాత జాబితా ప్రకారం ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారు. 72శాతం మ్యాపింగ్ పూర్తి జిల్లాలో ఇప్పటివరకు 72శాతం మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయింది. కాగా, ఈ నెలాఖరులోగా వందశాతం పూర్తిచేసే దిశగా బీ ఎల్వోలు ప్రక్రియ ను ముమ్మరం చేశారు. జిల్లాలో 4,67,695 మంది ఓట ర్లుండగా ఇప్పటివరకు 3,43,334 మంది ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 2,52,455 మంది ఓటర్లకు గాను ఇప్పటివరకు 1,57,616 మంది మ్యాపింగ్ పూర్తి కాగా ప్రక్రియ 62శాతం నమోదైంది. బోథ్ నియోజకవర్గంలో 2,26,340మంది ఓటర్లుండగా ఇందులో 1,85,718 మంది ఓటర్లను మ్యాపింగ్ చేశా రు. ఇక్కడ అత్యధికంగా 85శాతం ప్రక్షాళన పూర్తయింది. బీఎల్వోలు తమ పరిధిలోని గ్రామాలు, వార్డుల్లోని ఇంటింటికీ వెళ్లి 1.01. 2002న జరిగిన సమగ్ర సర్వే ఓటరు జాబితా (ఎస్ఐఆర్)లో ఉన్న ఓటర్లను ప్రస్తుత జాబితా లో సరిపోల్చుతున్నారు. త్వరలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజిన్ (సర్) ప్రక్రియలో భాగంగా మృతుల కుటుంబాలకు, వలస వెళ్లిన వారికి, డబుల్ ఓటర్లకు నోటీసులు జారీ చేస్తారు. అనంతరం ఓటరు జాబితా నుంచి వారి పేర్లు శాశ్వతంగా తొలగించనున్నారు. జిల్లాలోని ఓటర్ల సమాచారంజిల్లాలోని ఓటర్లు 4,67,695 ఇప్పటివరకు మ్యాపింగ్ 3,43,334 ఆదిలాబాద్ నియోజకవర్గ ఓటర్లు 2,52,455 ఇప్పటివరకు మ్యాపింగ్ 1,57,616 బోథ్ నియోజకవర్గ ఓటర్లు 2,26,340 ఇప్పటివరకు మ్యాపింగ్ 1,85,718 పారదర్శకంగా నిర్వహిస్తాం ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియను జిల్లాలో పారదర్శకంగా నిర్వహిస్తాం. 2002నాటి ఓటరు జాబితా ప్రామాణికంగా జాబితా ప్రక్షాళన జరుగుతుంది. ఒకవేళ 2002నాటి ఓటర్ల జాబితా అందుబాటులో లేకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఓటర్ల సౌకర్యార్థం ఆ పాత జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం, సీఈవో తెలంగాణ అధికారిక వెబ్సైట్లలో తమ వివరాలు సులభంగా వెతుక్కునే సదుపాయం కల్పిస్తున్నారు. పారదర్శక జాబితా తయారీకి రాజకీయ పార్టీలు, అధికారులు సహకరించాలి. – రాజర్షి షా, కలెక్టర్ 15 నుంచి ప్రక్రియ షురూ సర్ ప్రక్రియ ఈ నెల 15నుంచి ప్రారంభం కానుంది. తొలి విడతలో భాగంగా ఈ నెల 15నుంచి 24వరకు వరకు ఓటర్ల జాబితా తయారీ, సిబ్బందికి శిక్షణ, జాబితా ముద్రణ లాంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. జూన్ 25నుంచి జూలై 24వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ప్రత్యేక సర్వే చేపట్టనున్నారు. ఇదే సమయంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపడతారు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. దీనిపై జూలై 31నుంచి ఆగస్టు 30వరకు అభ్యంతరాలు, క్లెయింలు స్వీకరించనున్నారు. ఇలా అందిన దరఖాస్తులను సెప్టెంబర్ 28లోపు పరిష్కరించి, అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ నిర్వహణపై కలెక్టర్ రాజర్షి షా బుధవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. పార్టీల తరఫున బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు. -
మహాసభలు సక్సెస్ చేయాలి
ఆదిలాబాద్టౌన్: ఈనెల 7న జిల్లా కేంద్రంలో ని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించను న్న వ్యవసాయ కార్మిక సంఘం నాలుగో జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి లంకా రాఘవులు పి లు పునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కా రం, సమగ్ర వ్యవసాయ కార్మిక చట్టం కోసం సంఘం పోరాటాలు చేస్తోందని తెలిపారు. కేంద్రం తెచ్చిన వీబీ రాంజీ పథకాన్ని రద్దు చేసి పాత ఉపాధిహామీ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాసభల్లో కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ కార్మిక వ్యతిరేక వి ధానాలపై చర్చించి, వ్యవసాయ కార్మికుల స మస్యల పరిష్కారానికి తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. నూతన కమిటీని ఎన్నుకుంటామని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు స్వా మి, ఉపాధ్యక్షులు ఆశన్న, గంగారాం ఉన్నారు. -
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతోనే సమగ్రాభివృద్ధి
కై లాస్నగర్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతో పట్ట ణాల్లోని ప్రతీ వార్డు సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం పట్టణంలోని 45వ వార్డు భుక్తాపూర్ కాలనీలో నిర్వహించిన వార్డు సభకు మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూషతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. వార్డులో నెలకొన్న డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు, అంతర్గత రహదారులు, పారిశుద్ధ్య సమస్యలు త్వరగా గుర్తించి పరిష్కారానికి తగిన ప్రణాళికలతో నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మున్సిల్ చైర్ పర్సన్ అనూష మాట్లాడు తూ.. అభివృద్ధి పనుల్లో స్థానికులు భాగస్వాములైతేనే వార్డులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం సా ధ్యమవుతుందని పేర్కొన్నారు. అనంతరం వేసవి శిక్షణ శిబిరం స్విమ్మింగ్ పోటీల్లో రెండో బహుమతి పొందిన మున్సిపల్ చైర్ పర్సన్ దంపతుల కుమార్తె బండారి అమితకు కలెక్టర్ ప్రశంసాపత్రం అందజేసి అభినందించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, డీఈవో మాధవి, వార్డు ప్రత్యేకాధికారి నిహారిక, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. నాణ్యమైన బోధన అందించాలి జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులందరికీ నాణ్యమైన, గుణాత్మకమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎఫ్ఎల్ఎన్ ఇన్స్పెక్షన్ టీమ్ సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధిస్తున్న విధానం, తరగతి గదుల్లో బోధన, అభ్యసన సామగ్రి (టీఎల్ఎం) వినియోగం, విద్యార్థుల అభ్యసన స్థాయిలపై ఆరా తీశారు. విద్యార్థుల అభ్యసన ఫలితాలు, రాత నైపుణ్యాలను పరిశీలించి, వారి విద్యా పురోగతి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం అమలవుతున్న ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం, టీఎల్ఎం విధానం తదితర అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. విద్యార్థుల్లో పఠనం, రచన, గణిత నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చేందుకు పలు కీలక సూచనలు చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రాథోడ్ రవీందర్, డీపీవో రమేశ్, డీఈవో మాధవి, అకాడమిక్ మానిటరింగ్ అధికారులు లక్ష్మణ్, అజయ్, సీఎంవో తిరుపతి, విద్యా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎయిర్ ఫీల్డ్ నిర్మాణానికి సానుకూలత
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో ఎయిర్ ఫీల్డ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఎ మ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో రక్షణ శాఖ జాయింట్ సెక్రటరీ మహంతిని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ భూసేకరణకు సంబంధించిన అంగీకార పత్రాలను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇది జిల్లా రూపురేఖలను మార్చే అ తిపెద్ద ప్రాజెక్ట్ జాయింట్ ఎయిర్ఫీల్డ్ అని తెలి పారు. దీని నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు తా ము చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నట్లు పే ర్కొన్నారు. ప్రాజెక్ట్కు అవసరమైన 1,580 ఎకరాలు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ ఎయిర్ఫీల్డ్ రాకతో భారత వా యుసేన శిక్షణ కార్యకలాపాలతో పాటు పౌర విమానయాన సేవలు కూడా మన జిల్లాకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. శంషాబాద్ స్థాయిలోనే ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణం కానుందని, దీనికి అ నుబంధంగా ప్రభుత్వం 2వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం శుభపరిణామమని పేర్కొన్నారు. దీంతో పరిశ్రమలు వచ్చి, స్థానిక యువతకు భారీగా ఉద్యోగావకా శాలు లభిస్తాయని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాల సమన్వయంతో ఆదిలాబాద్ను పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని వెల్లడించారు. ప్రాజెక్ట్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్కుమార్, సీఎం రేవంత్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. -
అంగన్వాడీ కేంద్రాల్లో బ్రేక్ఫాస్ట్
ఆదిలాబాద్టౌన్: అంగన్వాడీ కేంద్రాల్లో బ్రేక్ఫాస్ట్ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వేసవి సెలవుల తర్వాత కేంద్రాలు పునఃప్రారంభించిన రోజే అమలు చేసేలా ఐసీడీఎస్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ పథకం అమలు ద్వారా చిన్నారుల్లో పోషకాహార లోపం తలెత్తదు. కేంద్రాల్లో చిన్నారుల హాజరు పెరిగే అవకాశముంది. మూడు రోజుల పాటు ఉప్మా, మరో మూడు రోజుల పాటు కిచిడీ అందిస్తారు. ఇందులో గోధుమ రవ్వ, మినుములు, శనగలు, పల్లీలు, టమాటా, క్యారెట్ వినియోగిస్తారు. ఇందులో 100 గ్రాముల న్యూట్రిషియన్, 15.5 గ్రాముల ప్రొటీన్, 465 ఎనర్జీ క్యాలరీలు అందేలా చూస్తారు. దీంతో చిన్నారుల్లో పోషక విలువలు పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. పోషకాహార లోపానికి చెక్ అంగన్వాడీ కేంద్రాల్లో మూడేళ్లలోపు చిన్నారులకు బాలామృతం, ఇంటికే కోడిగుడ్లు అందజేస్తారు. కేంద్రాల్లో చదువుకునే ఆరేళ్ల లోపు పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. కేంద్రాలకు వచ్చే చిన్నారుల్లో పేదింటి పిల్లలే ఎక్కువ ఉండడంతో ఉదయం ఇంటి వద్ద ఏమీ తినకుండానే వస్తారు. మధ్యాహ్న భోజనం పెట్టే వరకు నీరసించి పోతున్నారు. దీన్ని నివారించేందుకే ప్రభుత్వం ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయించింది. జిల్లాలో పోషకాహార లోపంతో బాధపడేవారిలో ఏడాది నుంచి ఆరేళ్ల లోపువారు అధికంగా ఉన్నారు. ఇందులో ఏజెన్సీ ప్రాంతం వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అంగన్వాడీ టీచర్లు పోషకాహార లోపం ఉన్నవారిని జిల్లా కేంద్రంలోని రిమ్స్లోగల న్యూట్రిషియన్ (ఎన్ఆర్సీ) సెంటర్లో చేర్చుతున్నారు. అయితే, చాలామంది తల్లిదండ్రులు పిల్లలను న్యూట్రిషియన్ సెంటర్లో చేర్పించేందుకు ఆసక్తి చూపడంలేదు. జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్ట్లు 5 అంగన్వాడీ కేంద్రాలు 1,288 కేంద్రాలకు వచ్చే చిన్నారులు 48,368 -
సెల్ఫోన్ పోతే వెంటనే ఫిర్యాదు చేయాలి
ఆదిలాబాద్టౌన్: సెల్ఫోన్ పోయినా, చోరీకి గురైన వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. రూ.66లక్షల విలువైన 330 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి గురువారం స్థానిక పోలీస్ హెడ్క్వార్టర్స్ సమావేశ మందిరంలో పోగొట్టుకున్న బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో మొబైల్ ఫోన్ల రికవరీకి ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు తెలిపారు. ఏడాదిలో 1,500 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు చెప్పారు. ఇది జిల్లా చరిత్రలోనే అత్యధిక రికవరీగా నిలిచిందని పేర్కొన్నారు. రైతుబజార్, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రిమ్స్ ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో మొబైల్ చోరీలు అధికంగా జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, ప్రత్యేక రికవరీ బృందం సభ్యులు ఆర్ఎస్సై పి.గోపీకృష్ణ, రియాస్, మజీద్, త్రిశూల్, అన్వేశ్, నవనీత్ తదితరులున్నారు. రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు రుణాలు, సబ్సిడీలు, వ్యవసాయ పరికరాలు, పంటల కొనుగోలు పేరుతో రైతులను మోసగించేవారిపై కఠినచర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో రైతుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు గతేడాది రైతులను మోసం చేసిన వ్యక్తులపై 25 కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాదిలో నెల వ్యవధిలోనే 20 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. రైతులు అప్రమత్తమై మోసాలకు గురి కాకుండా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు, మోసాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్స్టేషన్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అక్రమ మద్యం తయారీపై ఉక్కుపాదం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక గుడుంబా నిర్మూలన డ్రైవ్ చేపట్టామని, అక్రమ మద్యం తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. జిల్లాలోని 11 పోలీస్స్టేషన్ల పరిధిలో 35 ప్రత్యేక బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 32.5 లీటర్ల గుడుంబా, 35 లీటర్ల బెల్లం వాష్తో పాటు రెండు క్యాన్లు, 705 లీటర్ల కల్లు, తయారీ సామగ్రి స్వాధీనం చేసుకుని 26 మందిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఉట్నూర్లో మూడు కేసులు నమోదు చేసి ఆరు లీటర్ల గుడుంబా, 15 లీటర్ల బెల్లం వాష్, నార్నూర్లో ఏడుగురిపై కేసులు నమోదు చేసి 13 లీటర్ల గుడుంబా, రెండు క్యాన్ల బెల్లం వాష్, ఆదిలాబాద్రూరల్లో ఆరుగురిపై కేసులు నమోదు చేసి నాలుగు లీటర్ల గుడుంబా, 10 ప్యాకెట్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నుట్ల తెలిపారు. తలమడుగులో రెండు కేసులు నమోదు చేసి కల్తీ కల్లు నమూనాలు సేకరించినట్లు పేర్కొన్నారు. బేలలో ఇద్దరిపై కేసులు నమోదు చేసి రెండు లీటర్ల గుడుంబా, గుడిహత్నూర్లో ఒక కేసు నమోదు చేసి ఐదు లీటర్ల కల్తీ కల్లు పట్టుకున్నట్లు చెప్పారు. ఇచ్చోడ పోలీస్స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేసి నలుగురిని బైండోవర్ చేయడంతో పాటు 2.5 లీటర్ల గుడుంబా, 500 లీటర్ల కల్లు, కల్లు తయారీ సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నేరడిగొండలో ఐదుగురిపై కేసులు నమోదు చేసి ఐదు లీటర్ల గుడుంబా, 20 లీటర్ల బెల్లం వాష్, 200 లీటర్ల కల్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. -
మధుర జ్ఞాపకాలు..
నిర్మల్ఖిల్లా: తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం 2011 నుంచి 2014 వరకు సాగిన ఉద్యమం పరాకాష్టకు చేరిన రోజులు ఇప్పటికీ మధుర జ్ఞాపకాలుగా నిలిచాయని నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఉద్యమకారుడు సాధు రాంరెడ్డి పేర్కొన్నారు. అన్ని పార్టీలకు చెందిన ఉద్యమ సహచరులతో కలిసి ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవాలు జీవితాంతం మరువలేనివని చెప్పారు. బాసరలో చేపట్టిన రైల్రోకో నిర్వహించడంతో పోలీసులు అరెస్టు చేసి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఆ ఘటనలు, ఉద్యమంలో ఎదుర్కొన్న సవాళ్లు, సహచరులతో కలిసి సాగించిన పోరాటం తన జీవితంలో మైలురాళ్లుగా నిలిచాయన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు శ్రమించిన ఉద్యమకారులను ఇప్పటికై నా గుర్తించి వారికి తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
‘ప్రత్యేక తెలంగాణలో నష్టపోయింది బీసీలే’
ఆదిలాబాద్రూరల్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో నష్టపోయింది బీసీ వర్గాలేనని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే ప్రత్యేక రాష్ట్రం వచ్చాక 18 శాతానికి తగ్గిందన్నారు. బుధవారం బీసీ సంఘ భవనం వద్ద జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకుల త్యాగాలతో ప్రత్యేక రాష్ట్రం రాలేదని, 1,200 మంది యువకుల బలిదానాలతో సాకారమైందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో బీసీలకు ఒరిగిందేమీ లేదన్నారు. రేవంత్ రెడ్డి 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని, అటు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ ముఖ్యమంత్రి అంటూ ప్రకటించుకుంటూ పోతే బీసీలకు రాజ్యాధికారం దక్కేదెపుడని ప్రశ్నించారు. బీసీలంతా ఐక్యంగా ఉండి అస్తిత్వం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు నర్సాగౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమ జ్ఞాపకాలు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించి 12 ఏళ్లు అవుతోంది. 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరింది. అయితే ఇందుకోసం దశాబ్దానికిపైగా మలిదశ పోరాటం జరిగింది. ఈ ఉద్యమంలో సబ్బండవర్గాలు భాగస్వాములయ్యాయి. పడుచు పోరగాండ్ల నుంచి పండు ముసలి వరకూ అందరూ జైతెలంగాణ అంటూ పోరాటంలో పాల్గొన్నారు. పలువురిపై కేసులు నమోదయ్యాయి. జైలుశిక్షలు సైతం అనుభవించారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ఉద్యమ జ్ఞాపకాలు కొన్ని.. తెలంగాణ తల్లిపార్టీలకు అతీతంగా.. నిర్మల్: తెలంగాణ ఉద్యమంలో ప్రతిఒక్కరూ కలిసి వచ్చారు. నిర్మల్ ప్రాంతంలో పార్టీలకు అతీతంగా జేఏసీ కార్యాచరణకు అనుగుణంగా ఉద్యమంలో భాగమై స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. – కూచాడి శ్రీహరిరావు, డీసీసీ మాజీ అధ్యక్షుడుస్వరాష్ట్రమొచ్చేదాకా.. నిర్మల్: ఎంతోమంది అమరుల ప్రాణత్యాగాల స్ఫూర్తితో ఉద్యమాన్ని ముందుకు నడిపించాం. స్వరాష్ట్రం వచ్చేదాకా ఆపేది లేదంటూ ముందుకు సాగినం. నిర్మల్ ప్రాంతమంతా ఉద్యమంలో భాగమైంది. – కొట్టె శేఖర్, రాజకీయ జేఏసీ కన్వీనర్ఒకే వాదం..ఒకే నినాదం.. నిర్మల్: ఉద్యమ సమయంలో అందరిదీ ఒకటే వాదం, ఒకే నినాదం. డాక్టర్ దామెర రాములు, మేమందరం కలిసి తెలంగాణ రచయితల వేదిక (తెరవే) ఆరో రాష్ట్ర మహాసభలు నిర్మల్లో పెట్టినం. – డాక్టర్ అప్పాల చక్రధారిపలుమార్లు జైలుకెళ్లా.. ఆదిలాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. ఎన్నోసార్లు జైలుకు వెళ్లా. ఉద్యమకారుల పోరాటంతోనే తెలంగాణ సిద్ధించింది. నీళ్లు, నిధులు, నియామకాలు సమపాలలో అందరికీ అందినప్పుడే ప్రత్యేక తెలంగాణకు సార్ధకత వస్తుంది. – చందు, ఉద్యమకారుడుకేసులకూ భయపడలేదు.. నిర్మల్: ఉద్యమంలో విద్యార్థి నాయకులుగా ముందుండి నడిచాం. ముధోల్ మండలం కిర్గుల్(బి)లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సభలో జై తెలంగాణ నినాదా లు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. – కూస వనిత, భైంసా నిరవధికంగా దీక్షలు చేశాం.. ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో 2010 జనవరి 4న జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు ప్రారంభించాం. 2014 మార్చి 6 వరకు 1,523 రోజుల పాటు దీక్షలు కొనసాగాయి. తెలంగాణ రాష్ట్రంలోనే ఆదిలాబాద్ వేదికగా ఎక్కువ రోజులు నిరవధిక దీక్షలు నిర్వహించిన చరిత్ర ఉంది. – కారింగుల దామోదర్ -
అరుదైన, ఖరీదైన.. మియజాకీ
కడెం: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు నిర్మల్ జిల్లా కడెం మండలంలో సాగవుతున్నాయి. జపాన్ దేశపు మియజాకీ మామిడి సాధారణంగా శీతల వాతావరణంలో సాగవుతుంది. అయితే ఇంతటి ఖరీదైన, అరుదైన మామిడి రకం కడెం మండలం నవాబ్పేట్ గ్రామంలోని సత్యం ట్రెడిషనల్ యోగాశ్రమంలో సాగవుతోంది. ఆశ్రమ వ్యవస్థాపకుడు రాపెల్లి సత్యం 2024 జూలైలో కలకత్తా నుంచి ఒక్కో మొక్కకు రూ.10 వేలు వెచ్చించి పది మొక్కలు తెప్పించి ఆశ్రమంలో నాటాడు. వర్మికంపోస్ట్, గోమూత్రం, కషాయాలు, వంటి సేంద్రియ ఎరువులు వేసి మొక్కలను సంరక్షించాడు. రెండేళ్ల తర్వాత మొదటి కాత వచ్చింది. ఒక్కో చెట్టుకు 10 నుంచి 20 కాయాలు కాసాయి. అంతర్జాతీయ మార్కెట్లో మియజాకీ పండ్లు కిలోకు రూ.2 నుంచి 2.5 లక్షల వరకు ధర పలుకుతాయి. గతేడాది మరో పది చెట్లను తెప్పించి నాటినట్లు పేర్కొన్నాడు. మియజాకీ పండ్లకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉండడానికి కారణం అందులో ఉండే ఔషధ గుణాలేనని ఆయన వెల్లడించారు. శరీరానికి రక్షణనిచ్చే రోగ నిరోధకశక్తి అత్యధికంగా ఉంటుందని, శరీరంలోని వ్యర్థాలను (యాంటి ఆక్సిడెంట్స్) తొలగించే ఔషధ గుణాలు ఇందులో పుష్కలంగా ఉంటాయన్నారు. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుందన్నారు. సాధారణ మామిడి పండ్లకు భిన్నంగా ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుందన్నారు. ఏ, బీ, సీ వంటి పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయన్నారు. -
నత్తనడకన.. ‘లైవ్’
కై లాస్నగర్: బోగస్ పెన్షన్దారులకు చెక్పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పింఛన్దారుల లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ జిల్లా కేంద్రంలో నత్తనడకన సాగుతోంది. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారి ఫొటోలను క్యాప్చర్ చేయాల్సిన వా ర్డు అధికారులు, మెప్మా ఆర్పీలు పట్టించుకోవడం లేదు. ప్రత్యేక యూజర్ ఐడీలు కేటాయించి పక్షం రోజులు గడిచినా సదరు అధికారులు ఒకరి ద్దరి ఫొటోలను మాత్రమే క్యాప్చర్ చేస్తున్నారనే వి మర్శలున్నాయి. గడువులోపు ప్రక్రియ పూర్తి చేయకుంటే బోగస్గా పరిగణించి పింఛన్లు రద్దు చేసే అవకాశమున్నట్లుగా సెర్ప్ అధికారులు చెబుతున్నారు. రోజుకు ఒకరిద్దరినే విచారణ అనర్హుల ఏరివేతపై దృష్టి సారించిన ప్రభుత్వం ఇందుకోసం క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టాలని ఆదేశించింది. పింఛన్దారులు బతికే ఉన్నారనే దాన్ని నిర్ధారించేందు కోసం లైవ్ అథెంటికేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో 18 రోజుల క్రితం మున్సిపల్ పరిధిలోని వార్డు ఆఫీసర్లు, మెప్మా రిసోర్సు పర్సన్లకు కలిపి 131మందికి ప్రత్యేక లాగిన్లు క్రియేట్ చేసి యూజర్ ఐడీలు కేటాయించారు. వీరు లబ్ధి దారుల ఇళ్లకు వెళ్లి వారి ముఖ గుర్తింపు(ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం) ద్వారా వివరాలు ప్రత్యేక యాప్లో న మోదు చేయాల్సి ఉంటుంది. ఇందులో కేవలం 26 మంది మాత్రమే 100–232 మంది పింఛన్దారుల అథెంటికేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. మరో 25 మంది 10 నుంచి 50 మంది వివరాలు మాత్రమే నమోదు చేశారు.32 మంది కేవలం ఒకే ఒక్క అథెంటికేషన్ చేయగా ఆరుగురు ఇద్దరిని, ఐదుగురు ముగ్గురిని, ఇద్దరు నలుగురిని, నలుగురు ఆరుగురిని, పది మంది ఏడుగురిని, మరో ముగ్గురు తొ మ్మిది మందిని విచారించారు. శంకర్, రవనీత అనే ఇద్దరు ఆర్పీలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా చేపట్టకపోవడం గమనార్హం. సగం మాత్రమే విచారణ.. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో 14,115 మంది చేయూత కింద వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారు. ఇందులో ఇప్పటి వరకు 8,409 మంది అథెంటికేషన్ మాత్రమే పూర్తిచేశారు. ఇంకా 5,706 మందివి చేయాల్సి ఉంది. ఒక్కోదానికి కేవలం రూ.5 చొప్పున ఇస్తుండటంతో తమకు లాభసాటిగా లేదనే ఉద్దేశంతో ఆర్పీలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. వార్డు ఆఫీసర్లలో కొంతమంది బాధ్యతతో ప్రక్రియ చేపడుతుండగా మరికొంతమంది పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ప్రక్రియ నత్తనకడన సాగుతున్నట్లుగా తెలుస్తోంది. రేపటిలోగా పూర్తి చేయాలి చేయూత లబ్ధిదారులకు సంబంధించిన లైవ్ అథెంటికేషన్ ప్రక్రియను ఈ నెల 5లోపు పూర్తి చేయాల్సి ఉంది. త్వరితగతిన చేపట్టాలనే ఉద్దేశంతో వార్డు ఆఫీసర్లు, ఆర్పీలకు ప్రత్యేక లాగిన్ ఐడీలను క్రియేట్ చేశాం. కానీ వారిలో చాలా మంది పట్టించుకోవడం లేదు. గడువులోపు అథెంటికేషన్ చేయించుకోకుంటే పింఛన్ రద్దయ్యే అవకాశముంటుంది. – జాదవ్ శేష్రావు, డీపీఎం -
రవాణాశాఖలో ప్రక్షాళన
సాక్షి,ఆదిలాబాద్: తెలంగాణ ప్రభుత్వం అవినీతిని అరికట్టడం, పారదర్శకత పెంచే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా గల రవాణాశాఖ చెక్పోస్టులను ఎత్తివేస్తూ గతేడాది అక్టోబర్లో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వాహనాల రాకపోకలకు భౌతిక తనిఖీలు అవసరం లేదన్న కేంద్రం సూచనల మేరకు అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆ శాఖలో పునర్ వ్యవస్థీకరణ చేపట్టారు. జిల్లాలో భోరజ్ అంతర్రాష్ట్ర చెక్పోస్టును కూడా అప్పట్లోనే ఎత్తివేశారు. ఎంవీఐ, ఏఎంవీఐ పోస్టులు ఇక్కడ పదుల సంఖ్యలో ఉండేవి. రద్దు చేసిన తర్వాత ఆ పోస్టులు ప్రాధాన్యత కోల్పోయాయి. వారికి ఎన్ఫోర్స్మెంట్ విధులు కేటాయిస్తూ ఇంతకాలం కొనసాగిస్తూ వచ్చారు. తాజాగా చేపట్టిన బదిలీల్లో వారిని రాష్ట్రంలోని రవాణాశాఖ కార్యాలయాలు, ఎన్ఫోర్స్మెంట్కు మళ్లించారు. ఇటీవల బదిలీలు ఇలా.. రెండు రోజుల క్రితం రవాణా శాఖలో ఇన్స్పెక్టర్లతో పాటు ఆఫీస్ సిబ్బంది బదిలీలు చోటుచేసుకున్నాయి. జిల్లాలో పనిచేస్తున్న ఐదుగురు ఎంవీఐలకు ఇతర జిల్లాలకు స్థానచలనం కల్పించారు. ఒకరిని మాత్రం జిల్లాకు కేటాయించారు. ఏడుగురు ఏఎంవీఐలను ఇతర జిల్లాలకు బదిలీ చేయగా, ఇక్కడికి మాత్రం ఎవరిని కేటాయించలేదు. భోరజ్ చెక్పోస్టు ఎత్తివేసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఆ పోస్టులు ప్రాధాన్యత కోల్పోయాయి. పదుల సంఖ్యలో వారి సేవలు అవసరం లేకుండా ఉండడంతో ఆ పోస్టులను ఇతర చోటకు మళ్లించారు. అందులో భాగంగానే జిల్లా నుంచి పలువురు ఇన్స్పెక్టర్లు బదిలీపై వెళ్లినప్పటికీ కేవలం ఒక్కరు మాత్రమే ఇక్కడికి రానుండటం గమనార్హం. డీటీవోగా కిశోర్బాబు.. రవాణాశాఖ ఆదిలాబాద్ కార్యాలయం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా రవీందర్ కుమార్ కొనసాగుతున్నారు. కాగా, సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లాలో ఎంవీఐలుగా విధులు నిర్వహిస్తున్న సీపెల్లి శ్రీనివాస్, అల్లి శ్రీనివాస్, అశ్వంత్ కుమార్, ప్రదీప్ కుమార్, కోల రవిందర్లు జిల్లా నుంచి బదిలీ అయ్యారు. సీనియర్ ఎంవీఐ సీపెల్లి శ్రీనివాస్ ఇన్చార్జి డీటీవోగా కొనసాగారు. హన్మకొండలో ఎంవీఐగా పనిచేస్తున్న కిశోర్ బాబును జిల్లాకు కేటాయించారు. సీనియర్ ఎంవీఐగా ఆయన ఇన్చార్జి డీటీవోగా బాధ్యతలు తీసుకోనున్నారు. ఇదివరకు జిల్లాలో భోరజ్ చెక్పోస్టుతో పాటు జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయం ఇన్స్పెక్టర్, ఉద్యోగులు, సిబ్బంది పోస్టులతో రవాణాశాఖలో సందడి కనిపించేది. పునర్ వ్యవస్థీకరణలో భాగంగా చెక్పోస్టును ఎత్తివేయడం, పలువురు ఇన్స్పెక్టర్ పోస్టులను ఇక్కడి నుంచి మళ్లించడంతో ఇదివరకు ఉన్న సందడి తగ్గిపోయింది. కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన డీటీవో కై లాస్నగర్: జిల్లా రవాణా అధికారి(డీటీవో)గా బాధ్యతలు స్వీకరించిన బి.కిశోర్బాబు బుధవారం కలెక్టర్ రాజర్షిషాను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలకు రవాణా శాఖ పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ సూచించారు. -
బ్యాటింగ్కు పదును..
నిర్మల్టౌన్: వేసవి సెలవులను చిన్నారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపుల్లో చేరి వివిధ క్రీడల్లో నైపుణ్యం మెరుగుపర్చుకుంటున్నారు. ఏ గల్లీలో చూసిన అంతా ఒకచోట చేరిపోయి బ్యాట్, బంతి పట్టుకొని క్రికెట్ ఆడుతూ కనిపిస్తున్నారు. ఇటీవల ఐపీఏలో అద్భుత ప్రతిభ కనబర్చి అందర్నీ ఆకర్షించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని స్ఫూర్తిగా తీసుకుని శిక్షణలో ముందుకెళ్తున్నారు. చిన్ననాటి నుంచి ఇష్టం నేను పదోతరగతి చదువుతున్నా. చిన్ననాటి నుంచి క్రికెట్ అంటే నాకు ఇష్టం. వేసవిలో క్రికెట్లో శిక్షణ పొందుతున్నా. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో నైపుణ్యం మెరుగుపర్చుకుంటున్నా. క్రమశిక్షణతో సాధన చేస్తున్నా. రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడల్లో ఆడి నా ప్రతిభను నిరూపించుకోవాలన్నదే నా లక్ష్యం. – సోఫియాన్, నిర్మల్ క్రికెట్ శిక్షణ పొందుతున్నా నేను నాలుగోతరగతి చదువుతున్నా. వేసవి సెలవుల్లో నిర్మల్ పట్టణంలో టీసీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులో క్రికెట్ శిక్షణ పొందుతున్నా. ప్రతీరోజు సాధన చేయడం వల్ల నా ఆటతీరు మెరుగుపడుతోంది. భవిష్యత్లో మంచి క్రికెటర్గా ఎదిగి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆడాలని నా లక్ష్యం. – గణేశ్, నిర్మల్ సూర్యవంశీ స్ఫూర్తితో.. చిన్న వయసులోనే సూర్యవంశీ పెద్ద వేదికపై రాణించడం మాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. అందుకే వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ.. క్రికెట్ కోచింగ్లో చేరా. క్రమశిక్షణతో సాధన చేస్తే విజయం సాధించగలమనే నమ్మకం ఉంది. ఎప్పటికై నా జాతీయస్థాయిలో ఆడాలన్నదే నా కోరిక. – రోహన్, నిర్మల్ జాతీయ స్థాయిలో ఆడాలని.. క్రికెట్ అంటే నాకు, మానాన్నకు ఎంతో ఇష్టం. క్రికెట్పై మక్కువతో ఎన్నోసార్లు టోర్నమెంట్లో పాల్గొన్నాడు. తాను అనుకున్న గోల్ క్రికెట్లో రీచ్ కాలేకపోయాడు. మా ఇద్దరి కోరిక ఒకటే కావడంతో ఎలాగైనా క్రికెట్లో జాతీయస్థాయిలో రాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. రోజు ఉదయం, సాయంత్రం ప్రాక్టీస్ చేస్తున్నా. – యువన్ మోడీ, నిర్మల్ భారత జట్టులో చేరాలని.. ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ క్రికెట్పై మరింత ఆసక్తి పెంచుకున్నా. ప్రస్తుతం బ్యాటింగ్, బౌలింగ్లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నా. ఏదో ఒకరోజు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కలలు కంటున్నా. – ఉదయ్కిరణ్, నిర్మల్ అమ్మ కోరిక మేరకు.. నేను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నా. చదువుతోపాటు ఆటల్లో రాణించాలని అమ్మ కోరిక మేరకు క్రికెట్ శిక్షణ శిబిరంలో చేర్పించింది. నెల రోజుల్లో ఆటలో ఎన్నో మెలకువలు నేర్చుకున్నా. క్రీడల్లో రాణించి, జాతీయస్థాయిలో స్థానం సంపాదించడానికి ప్రయత్నిస్తా. – ఆర్.విష్ణుప్రియ, నిర్మల్ యువతలో ఆసక్తి పెరిగింది ప్రస్తుతం యువతలో క్రికెట్ పట్ల ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఐపీఎల్లో యువ ఆటగాళ్లు రాణించడం వల్ల చిన్నారులు, యువకులు పెద్ద సంఖ్యలో శిబిరాలకు వస్తున్నారు. క్రికెట్లో విజయం సాధించాలంటే ప్రతిభతో పాటు క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర సాధన చాలా ముఖ్యం. తన లక్ష్యంపై దృష్టి పెట్టి శ్రమిస్తే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించే అవకాశం ఉంటుంది. – సుదర్శన్, క్రికెట్ కోచ్క్రమశిక్షణతో సాధన చేయాలి క్రికెట్ అనేది ఆట మాత్రమే కాదు, క్రమశిక్షణ, ఏకాగ్రత, జట్టు భావనను పెంపొందించే క్రీడ. క్రమశిక్షణతోనే సాధన చేస్తే క్రికెట్లో ఉన్నత శిఖరాలకు చేరుతాం. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్తో పాటు ఫిట్నెస్పై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. చిన్న వయసులోనే సరైన శిక్షణ తీసుకుంటే భవిష్యత్లో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించే అవకాశాలు ఉంటాయి. – రామరాజు, క్రికెట్ కోచ్ -
విద్యుత్షాక్తో వ్యక్తి మృతి
సాత్నాల: విద్యుత్షాక్తో వ్యక్తి మృతి చెందిన సంఘటన భోరజ్ మండలం కామాయిలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మే రకు గ్రామానికి చెందిన కోల దేవన్న (53) బుధవారం తెల ్లవారుజామున రేకుల పైన ఉన్న చీపురు తీసేందుకు చేతులు పెట్టడంతో షాక్కు గురయ్యాడు. గమనించిన భార్య గంగుబాయి, కుమారుడు చిన్నయ్య అతన్ని కాపాడే ప్రయత్నంలో ఇద్దరికీ షాక్ తగిలి కిందపడ్డారు. గమనించిన స్థానికుడు నర్సింగ్ విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. అప్పటికే స్పృహ కోల్పోయిన దేవన్నను అంబులెన్స్లో రిమ్స్కు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పవర్ గౌతమ్ తెలిపారు. కాగా పుట్టెడు దుఃఖంలోనూ ఆ కుటుంబ సభ్యులు బాధను దిగమింగుతూ మరొకరికి చూపు ప్రసాదించాలనే ఉద్దేశంతో దేవన్న నేత్రాలను హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు. -
లక్కీడ్రా ద్వారా లబ్ధిదారుల ఎంపిక
కై లాస్నగర్: మైనార్టీ కార్పొరేషన్ ద్వారా అందించే ఈ బైక్ లబ్ధిదారుల ఎంపికకు గాను మున్సిపల్ కార్యాలయంలో బుధవారం లక్కీడ్రా నిర్వహించారు. వీటి కోసం పట్టణంలోని ఆయా వార్డులకు చెందిన 747 మంది మైనార్టీలు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 65 రిజెక్ట్ అయ్యాయి. 682 దరఖాస్తుల నుంచి 27 మందిని ఎంపిక చేసేందుకు చైర్పర్సన్ అనూష ఆధ్వర్యంలో లక్కీడ్రా చేపట్టారు. ఎంపికై న వారి వివరాలను కార్యాలయ నోటీసుబోర్డుపై ప్రదర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్, మెప్మా పీడీ సీవీఎన్. రాజు, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కలీం అహ్మద్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
గ్రామసభలు విజయవంతం చేయాలి
కై లాస్నగర్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నేటి నుంచి ఈనెల 12 వరకు నిర్వహించే గ్రామ, వార్డుసభలను అధికారులు సమన్వయంతో సాగుతూ విజయవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఈమేరకు జిల్లా, మండలస్థాయి అధి కారులతో కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి బుధవారం గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. జనగణన, భూభారతి పనులు వేగవంతం చేయాలన్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా వర్షాలు, వరదల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, విరిగిన స్తంభాలను, వేలాడుతున్న తీగలను వెంటనే సరిచేయాలని ఆదేశించారు. పాఠశాలల పునఃప్రారంభోత్సవం సందర్భంగా బడిబాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రవేశాల నమోదు పెంచాలన్నారు.ఇందులో ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు చిత్రు, రాజేశ్వర్, జెడ్పీ సీఈవో రవి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, ఆర్డీవో జగదీశ్వర్ రావు, డీపీవో రమేశ్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, విద్యుత్ శాఖ ఎస్ఈ శేషారావు, డీఈవో మాధవి తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
ఆదిలాబాద్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా అటవీశాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బుధవారం అటవీశాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్తో కలిసి డీఎఫ్వో ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుత ఇంధన సంక్షోభం నేపథ్యంలో సైకిల్ వాడకం అత్యుత్తమమైనదని తెలిపారు. అలాగే జూన్ 7న స్టేడియంలో నిర్వహించనున్న 5కే రన్లో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, సైక్లింగ్తో ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. అంతకుముందు స్టేడియంలో మానవ హారంగా ఏర్పడ్డారు. ఇందులో డీవైఎస్వో శ్రీనివాస్, ఎఫ్డీవో అరవింద్ కుమార్, చిన్న భూష రెడ్డి, ఎఫ్ఆర్వోలు అవినాష్, షీలానంద, అరుణ, కవిత, సవిత, ఎఫ్ఎస్వోలు, డీఆర్ఓలు పాల్గొన్నారు. -
ఉద్యమంలో ‘అల్లూరి’
నిర్మల్: ప్రత్యేక తెలంగాణ కోసం 1998లో మాజీమంత్రి పి.ఇంద్రారెడ్డి ‘జై తెలంగాణ పార్టీ’ని స్థాపించారు. అప్పట్లోనే ఆ పార్టీ బహిరంగసభ నిర్వహించడంలో జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ న్యాయవాది, ఉద్యమకారుడు అల్లూరి మల్లారెడ్డి కీలకపాత్ర పోషించారు. 2003 డిసెంబర్ 21న తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కె.జయశంకర్, ప్రము ఖ జర్నలిస్ట్ పాశం యాదగిరి, తదితరులతో కలిసి స్థానిక స్టార్ ఫంక్షన్ హాల్లో అవగా హన సదస్సు నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. 2007లో వెయ్యిఉరుల మర్రి స్మారకస్థూపం ఏర్పాటులో చురుకుగా పాల్గొన్నారు. గద్దర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్న భారీ బహిరంగసభను విజయవంతం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కరకాలమైన సందర్భంగా పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. -
చెరువు మట్టి చేనుకు
సాక్షి,ఆదిలాబాద్: రైతులు తమ చేలల్లో సారవంతం పెంచేందుకు ప్రాజెక్టు, చెరువుల మట్టిని పూడిక తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. వాటికి స్పందించిన అధికారులు నిబంధనల మేరకు తవ్వుకునేందుకు అనుమతులిస్తూ, ఎక్కడ ఆ పూడికతీత చేపట్టాలో సూచిస్తున్నారు. దీంతో చెరువుల వద్ద సందడి కనిపిస్తోంది. రైతుకు లాభం.. పెరగనున్న నీటి నిల్వ ప్రభుత్వం ఆధ్వర్యంలో పూడికతీత చేపట్టాలంటే ఖర్చుతో కూడుకున్నది. జిల్లా కేంద్రానికి శివారులో ఉండే మావల చెరువులో పూడికతీత చేపట్టాలని గతేడాది యంత్రాంగం ప్రణాళిక రూపొందించినప్పటికీ దాన్ని అంచనా వ్యయం భారీగా ఉండడంతో పనులు ముందడుగు పడలేదు.ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టులు, చెరువుల్లో పేరుకపోయిన పూడికను తీయలేని పరిస్థితి. ప్రస్తుతం పలు గ్రామాల్లో రైతులు చెరువు మట్టి కోసం విజ్ఞప్తులు చేస్తున్నారు. తమ పంట పొలాల్లో వేసుకుంటామని అధికారులను కోరుతున్నారు. వాటిని పరిగణలోకి ఉన్నతాధికారులు నిబంధనల మేరకు అనుమతిస్తున్నారు. ఇది రైతుకు లాభం చేస్తుండగా, మరోవిధంగా ప్రాజెక్ట్, చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. బజార్హత్నూర్లో చెరువు మట్టిని తవ్వుకునేందుకు అనుమతి ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులకు రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా కొద్ది రోజులుగా పూడిక తీత పనులు ఊపందుకున్నాయి. ఈ మట్టి ద్వారా చేను సారవంతం కానుండగా, పూడిక తీసిన చెరువులో నీటి నిల్వ సామర్థ్యం పెరగనుంది. -
అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి
● ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్రూరల్: ప్రజలు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. బుధవారం రాత్రి ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ (కార్డన్ అండ్ సెర్చ్) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన ధ్రువపత్రాలు లేని 37 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, అక్రమంగా విక్రయిస్తున్న మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎక్కువ మంది ప్రజలు వాహన నియమ నిబంధనలు పాటించకుండా రోడ్లపై తిరుగుతున్నట్లు గుర్తించామన్నారు. యువత గంజాయి బారిన పడవద్దని సూచించారు. సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్రెడ్డి, సీఐలు కె.నాగరాజు, రహీంపాషా, కె ఫణిధర్, ఎస్సైలు విష్ణువర్ధన్, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు. నలుగురు ఎఫ్ఆర్వోల బదిలీ ఆదిలాబాద్టౌన్: అటవీశాఖలో పనిచేస్తున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్వో)లకు స్థానచలనం జరిగింది. ఆదిలాబాద్లో పనిచేస్తున్న గులాబ్సింగ్ కామారెడ్డిలోని మాచరెడ్డికి బదిలీకాగా అతని స్థానంలో నిర్మల్ జిల్లా మామడ నుంచి అవినాష్ రాథోడ్ బదిలీపై వచ్చారు. ఇంద్రవెల్లి ఎఫ్ఆర్వో సంతోష్ మంచి ర్యాల జిల్లాలోని దేవాపూర్కు బదిలీ కాగా, అతని స్థానంలో ఎవరిని కేటాయించలేదు. సిరిచెల్మ పోస్టు ఖాళీగా ఉండగా మంచి ర్యాలలో టాస్క్ఫోర్స్లో విధులు నిర్వహిస్తు న్న కారెం శ్రీనివాస్ బదిలీపై వచ్చారు. ఇచ్చోడలో పనిచేస్తున్న పుండలిక్ నిజామాబాద్ జిల్లా వర్ణికి బదిలీ కాగా, అతని స్థానంలో బాన్సువాడలో పనిచేస్తున్న సంతోష్ బదిలీపై వచ్చారు. నేరడిగొండలో పనిచేస్తున్న బి.గణేశ్ మెదక్కు బదిలీ కాగా, అతని స్థానంలో రాజన్న సిరిసిల్లలో ఫ్లయింగ్ స్క్వాడ్గా పనిచేస్తున్న వై.గంగాధర్ బదిలీపై వచ్చారు. -
అర్హులందరికీ ‘ఇందిరమ్మ’ ఇళ్లు
నేరడిగొండ: అర్హులైన ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ పథకం ద్వారా గృహ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని వాంకిడి గ్రామానికి చెందిన ఆడిగెం లక్ష్మీ–ప్రభాకర్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమానికి మంగళవారం ఆయన హాజరై ప్రారంభించారు. ‘మీ ఇంటికి వచ్చి ఇల్లు ఇస్తా.. మీరు ఎక్కడికి తిరగొద్దు’ అని అర్హులైన వారికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ, హౌసింగ్ శాఖ అధికారులు, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, స్థానిక సర్పంచ్ జ్యోతి, సీనియర్ నాయకులు అనిల్ యాదవ్, మాజీ సర్పంచ్ రాజు, నజీర్, రవీందర్ రెడ్డి, భారత్, శ్రీను, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ బడులపై ఫోకస్
ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వ పాఠశాలలను బలో పేతం చేయడంపై ఫోకస్ పెంచుతాం.. ప్రతీ బడిలో మౌలిక వ సతుల కల్పనకు కృషి చేస్తాం.. అలాగే ఉపాధ్యాయులు సమయపాలన పా టించేలా, నా ణ్యమైన విద్యాబోధన చేసేలా చర్యలు చేపడతామని నూతన డీఈ వో డి.మాధవి అన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. సాక్షి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. ఎలాంటి చర్యలు చేపడతారు..? డీఈవో: బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల సంఖ్య పెంచేలా ప్రత్యేక దృష్టి సారిస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో పా టు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాం ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. మధ్యాహ్న భోజన పథకం, కంప్యూటర్ విద్యతో పాటు మౌలిక వసతులు అందుబాటులో ఉన్నా యి. ఈమేరకు తల్లిదండ్రులు గమనించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి. సాక్షి: కొంత మంది ఉపాధ్యాయులు రెగ్యులర్గా విధులకు ఎగనామం పెడుతున్నారు.. అలాంటి వారిపై ఎలాంటి చర్యలు చేపడతారు..? డీఈవో: స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎంఈవోలు పాఠశాలలను తనిఖీ చేయాలి. ఫేషియల్ అటెండెన్స్ ద్వారా సమయపాలన పాటించని వారిని గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. నెట్వర్క్ లేదని సాకులు చెప్పొద్దు. డొంగల్ ఏర్పాటు చేసుకోనైనా అటెండెన్స్ వేసుకోవాలి. సాక్షి: విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాం మొదటి రోజే పంపిణీ జరుగుతుందా..? డీఈవో: పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ ఇప్పటికే మండల పాయింట్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం పాఠశాలలకు సరఫరా అవుతున్నాయి. మొదటి రోజే విద్యార్థులకు పంపిణీ చేసేలా చర్యలు చేపడుతున్నాం. యూనిఫాం టెండర్లు జరుగుతున్నాయి. బడులు తెరిచే వరకు వచ్చే అవకాశం ఉంది. సాక్షి: ఉపాధ్యాయుల కొరతను ఏవిధంగా అధిగమిస్తారు..? డీఈవో: ఉపాధ్యాయుల కొరత ఉన్న విషయం వాస్తవమే. అయినప్పటికీ విద్యార్థుల చదువులకు ఇబ్బందులు తలెత్తకుండా దృష్టి సారిస్తాం. 464 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవసరం ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తాం. స్కూళ్లలో స్కావెంజర్ల సేవలను కొనసాగించేందుకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈమేరకు చర్యలు చేపడతాం. సాక్షి: శిథిలావస్థ బడులపై ఎలాంటి దృష్టి సారిస్తున్నారు..? డీఈవో: జిల్లాలో ఎన్ని శిథిల బడులు ఉన్నాయో గుర్తించేలా ప్రణాళిక సిద్ధం చేశాం. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నవాటిని తొలగించాలని సంబంధిత ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలిచ్చాం. వాటి స్థానంలో కొత్త భవనాల నిర్మాణాలకు చర్యలు చేపడతాం. సాక్షి: పాఠశాలల్లో మధ్యాహ్న భోజన మెనూ సక్రమంగా అమలు కావడం లేదనే ఆరోపణలు న్నాయి. ఎలాంటి చర్యలు చేపడతారు..? డీఈవో: ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలతో పాటు కేజీబీవీల్లో మెనూ సక్రమంగా అమలు చేసేలా చూస్తాం. ఏ రోజు ఎవరు విధుల్లో ఉన్నారనే విషయాన్ని వారి పేర్లతో సహా నోటీసు బోర్డుపై ప్రదర్శించాలి. ఇష్టానుసారం వ్యవహిరించే వారిపై చర్యలు తప్పవు. సాక్షి: ఇటీవల కొంత మంది టీచర్లు విద్యార్థినులపై వేధింపులకు పాల్పడుతున్నారు. వాటిని అధిగమించేలా ఎలాంటి చర్యలు చేపడతారు..? డీఈవో: ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తాం. గురువు స్థానంలో ఉన్నవారు బాధ్యతలు విస్మరించవద్దు. చట్టాలు కఠినంగా ఉన్నాయి. ఎవరైనా బాధ్యతారహితంగా వ్యవహరిస్తే శాఖాపరంగా, చట్టపరమైన చర్యలు తప్పవు. -
రైతు డిస్కం..
సాక్షి,ఆదిలాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం రైతు డిస్కం ఏర్పాటుపై రాజకీయంగా దుమారం నెలకొన్న విషయం తెలిసిందే. తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ కంపెనీ లిమిటెడ్ (టీజీఆర్పీడీసీఎల్)ను మూడో విద్యుత్ పంపిణీ సంస్థగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రత్యేకంగా వ్యవసాయ, నీటి సరఫరా కనెక్షన్ల కోసం నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామని సర్కారు చెబుతోంది. రాష్ట్రంలో టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్ కంపెనీలు ఉండగా, ప్రభుత్వం ఈ రైతు డిస్కంను తీసుకొస్తుంది. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ ఎత్తివేసేందుకే దీన్ని తీసుకొస్తుందని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం మాత్రం దీన్ని ఖండిస్తుంది. నిర్వహణపై తర్జనభర్జన ఈ మూడో డిస్కం ఏర్పాటుకు ప్రతిపక్ష పార్టీలతో పాటు ఉద్యోగ సంఘాల నుంచి కూడా వ్యతిరేకత, నిరసనలు ఎదురవుతున్నాయి. ఉచిత వ్యవసాయ విద్యుత్ భవిష్యత్తు, ప్రైవేటీకరణపై ఆందోళన వ్యక్తం చేస్తూ వారు వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉంటే కొత్తగా ఏర్పడే డిస్కం పరిధిలోకి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహణ కోసం వెయ్యి మంది సిబ్బందిని తీసుకుంటున్నారనే చర్చ సాగుతుంది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి 11కేవీ ట్రాన్స్ఫార్మర్లు వేలాదిగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సిబ్బందే సమస్యలు ఏర్పడినప్పుడు నివారించలేని పరిస్థితి ఉంది. ప్రధానంగా ఖాళీ పోస్టులతోనే ఈ సమస్య ఎదురవుతుందని శాఖాపరమైన చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో కొత్త డిస్కం ఏర్పాటు చేసి సిబ్బందిని అటు ఇటుగా విభజించిన పక్షంలో పాత, కొత్త డిస్కంల పరిధిలో విద్యుత్ కనెక్షన్ల నిర్వహణ ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదని పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త డిస్కం ఏర్పాటు జరుగుతుందా.. లేనిపక్షంలో ఎలాంటి నిర్ణయం ఉంటుందోనని వేచి చూడాల్సిందే. ఈ విషయమై ఆదిలాబాద్ ఎస్ఈ శేష్రావును వివరణ కోరగా, సంస్థ నుంచి ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదని, ఈ దృష్ట్యా ఎలాంటి వివరాలు చెప్పలేమని స్పష్టం చేశారు.జిల్లాలో.. జిల్లాలో.. గృహ, వ్యాపార, వాణిజ్య విద్యుత్ కనెక్షన్లు 2లక్షల 65వేలు వ్యవసాయ, నీటిపారుదల కనెక్షన్లు 35వేలు 11కేవీ వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు 5,700 -
‘ఉద్యమకారుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా..’
ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల పోరాటం, త్యాగాలు అసాధారణ మని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఉద్యమకారులను శా లువా, పూలమాలతో సన్మానించారు. ఎమ్మె ల్యే శంకర్ మాట్లాడుతూ, ఉద్యమకారుల సంక్షేమాన్ని గత, ప్రస్తుత ప్రభుత్వాలు గుర్తించకపోవడం దురదృష్టకరమన్నారు. ఉద్యమకారుల కు పెన్షన్తో పాటు ఇళ్ల స్థలాలు, ఇతర సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తవిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉద్యమకారులు కారింగుల దామోదర్, మేకల మల్లన్న, రామోజీ ఆంజనేయులు, కళాకారుడు రమేశ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా పర్యావరణ వారోత్సవాలు
కై లాస్నగర్: పర్యావరణ వారోత్సవాలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక పర్యావరణ వారోత్సవాల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం జిల్లా కలెక్టర్లు, అధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీసీ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. రానున్న వానాకాలం దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈనెల 4 నుంచి 10 వరకు గ్రామ, వార్డు సభలను ఏర్పాటు చేసి వివిధ అంశాలపై రైతులతో పాటు ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. పెండింగ్లో ఉన్న భూభారతి, సాదాబైనామా దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో మంద మకరందు, అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, చిత్రు, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, జెడ్పీ సీఈవో రవి, డీపీవో రమేశ్ తదితరులు పాల్గొన్నారు. పోస్టర్ ఆవిష్కరణ ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ముద్రించిన అవగాహన పోస్టర్లను కలెక్టర్ రాజర్షి షా మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ ఆఫీసర్ రాబిన్సన్, ఎండీ జావిద్ అన్వర్ సబీమ్, తదితరులు పాల్గొన్నారు. -
13 మందికి ‘సేవా’.. 35 మందికి ప్రశంస
ఆదిలాబాద్టౌన్: జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. క్యాంప్ కార్యాలయంతో పాటు పోలీసు ముఖ్య కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాకం ఆవిష్కరించి జిల్లా ప్రజలు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన 13 మంది పోలీస్ సిబ్బందికి సేవా పతకాలు అందజేసి అభినందించారు. అలాగే నేరాల నియంత్రణ, నేరస్తుల పట్టివేతలో విశేష కృషి చేసిన 35 మంది సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇందులో అదనపు ఎస్పీలు పి.మౌనిక, బి.సురేందర్ రావు, ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, డీఎస్పీలు ఎల్.జీవన్ రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్, ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ అధికారులు, పోలీసు ముఖ్య కార్యాలయ సిబ్బంది, రిజర్వ్ సిబ్బంది పాల్గొన్నారు. -
జేఈఈ అడ్వాన్స్డ్లో సత్తా చాటిన సరస్వతి
ఒంగోలు సిటీ: జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాల్లో శ్రీ సరస్వతి విద్యార్థులు సత్తా చాటారు. సోమవారం ఒంగోలులోని ముంగమూరు రోడ్డులోని వీఆర్ భవన్లో విద్యాసంస్థల చైర్మన్ ఏవీ రమణారెడ్డి విలేకరులతో సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. జేఈఈ అడ్వాన్స్డ్ 2026లో ఆల్ఇండియా స్థాయిలో మా విద్యార్థులు 13 మంది ఐఐటీలో సీట్లు, బిట్స్ పిలానీలో ఆలిండియా స్థాయిలో ఆరుగురు అత్యధిక మార్కులు సాధించినట్లు తెలిపారు. పి.హనీ 1891 ర్యాంకు, వీ రోహిత 3030 ర్యాంకు, వై.రిషిత్ కుమార్రెడ్డి 3390, పి.వాసు 3732, జి. కృషితా ఏంజెల్ 4142, షేక్ అక్రమ్ 4392, కె.అవినాష్రెడ్డి 5120, కె.అషిష్ నిహాల్ 5,671, బీ వైష్ణవి 5,679, ఎంఏవీ సాయిదుర్గా ప్రసాద్ 5817, వై.మహిమా తేజస్విని 7214, వై.శాన్సీ 9982, ఎస్.సహస్ర శంకర్ 15935 ర్యాంకులు సాధించారు. బిట్స్ పిలానీ 2026లో ఆల్ ఇండియా స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన ఎం. అఖిల్ 227 మార్కులు, కె.అవినాష్రెడ్డి 219 మార్కులు, వై.రిషిత్ కుమార్రెడ్డి 215, ఎస్.సహస్ర శంకర్ 198, వై.శాన్సీ 180, సిహెచ్. వెంకట్కళ్యాణ్ 179 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఆలిండియా స్థాయిలో గర్తింపు తీసుకురావడానికి సహకరించిన విద్యార్ధులకు, వారి తల్లిదండ్రులకు, ఫలితాలు సాధించడానికి కృషి చేసిన డైరెక్టర్ ఎ.గణేష్రెడ్డి, ఎ.గంగా శంకరరెడ్డి, డీన్స్, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు యాజమాన్యం ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
పోలీసులపై విశ్వాసం పెరిగేలా స్పందించాలి
● ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఒంగోలు టౌన్: పోలీసు శాఖపై ప్రజలకు మరింతగా విశ్వాసం పెరిగేలా పోలీసు అధికారులు స్పందించాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ కోసం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి రాతపూర్వకంగా ఫిర్యాదులు స్వీకరించారు. సమస్య పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, మీ కోసంలో వచ్చిన ప్రతి ఫిర్యాదును కూలంకషంగా పరిశీలించి చట్టపరిధిలో విచారించి తగిన పరిష్కారం చేయాలని సూచించారు. పిర్యాదుల పరిష్కారం విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే సహించేదిలేదని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ హజరత్తయ్య, కందుకూరు సీఐ షేక్ అన్వర్ బాషా, అద్దంకి సీఐ సుబ్బరాజు, ప్యానెల్ అడ్వకేట్ బీ బాలాజీ సింగ్, వేదిక ఎస్సై జనార్దన్రావు పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించండి
చీమకుర్తి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలని ఎంఈఓలు–1,2 డీవీఎల్ నరశింహారావు, కే.శివాజీ తెలిపారు. సోమవారం చీమకుర్తిలోని గిరిజన బాలుర పాఠశాలలో మండల స్థాయి ప్రభుత్వ పాఠశాలల వంట చేసే నిర్వాహకులు, హెల్పర్లకు శిక్షణ నిర్వహించారు. టాటా కంపెనీ ఏజెన్సీ సహకారంతో మధ్యాహ్న భోజనంలో పాటించాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు, శుభ్రత, నాణ్యత వంటి అంశాలపై వంట ఏజన్సీల వారు పాటించాల్సిన విధానాలపై అవగాహన కల్పించారు. ఈనెల 12న పాఠశాలలను ప్రారంభించే నాటికి ప్రతి ఒక్కరూ నాణ్యతా ప్రమాణాలను పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓలతో పాటు సీఆర్పీలు, వంట ఏజెన్సీ నిర్వాహకులు పాల్గొన్నారు. ఒంగోలు వన్టౌన్: టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని.. ఎస్సీ ఎస్టీ, బీసీలకు కార్పొరేషన్ల సబ్సిడీ రుణాల బడ్జెట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఒంగోలులోని సమితి కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు క్రింద ఉమ్మడి ప్రకాశం జిల్లాకు రూ.9200 కోట్లు తెప్పించినట్లే, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లకు సబ్సిడీ రుణాల నిధులు విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా కార్యదర్శి కాకుమాను రవి, బొమ్మలు వంశీ, మేడికొండ మురళి, యానాది పరిరక్షణ సమితి ప్రతినిధులు నాగమణి, అంకం కిరణ్ తదితరులు ఉన్నారు. -
చలో గుంటూరుకు తరలివెళ్లిన రైతులు
సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): పొగాకు రైతులు గిట్టుబాటు ధరల కోసం సోమవారం తలపెట్టిన గుంటూరులో పొగాకు బోర్డు అధికారులతో రైతుల రాయబారం కార్యక్రమానికి సంతనూతలపాడు మండలంలోని పలు గ్రామాల నుంచి సుమారు 125 మంది రైతులు తరలివెళ్లారు. మైనంపాడు, చలప్పాలెం, రుద్రవరం, ఎనికపాడు, మంగమూరు, వేములపాడు, ఎండ్లూరు, మద్దులూరు తదితర గ్రామాల నుంచి రైతులు కార్యక్రమానికి తరలివెళ్లారు. రైతులు కార్యక్రమం ముగించుకుని తిరిగి వచ్చే సందర్భంలో బొల్లాపల్లి టోల్ గేట్ వద్ద సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావుని రైతులు కలిశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అబ్బూరి వెంకటేశ్వర్లు, సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు కరిచేటి హనుమంతరావు, ఎన్ వీ నరసింహం, నాయకులు కిలారి పెద్దబ్బాయి, బంకా సుబ్బారావు, నెరుసుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఆదమరిస్తే అంతే..
చీమకుర్తి రూరల్: మండలంలోని తొర్రగుడిపాడు నుంచి నేకునంబాదు వెళ్లే మార్గం మధ్యలో చెక్డ్యాం సమీపాన ఉన్న బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. నవంబర్లో మోంథా తుఫాన్ ప్రభావంతో ఈ బ్రిడ్జిని ఆనుకుని ఉన్న తారురోడ్డు నీటి ప్రవాహానికి కోతకు గురై పెద్ద గొయ్యిలా తయారైంది. ఈ రహదారిపై చీమకుర్తి నుంచి నేకునంబాదు, చండ్రపాడు, లక్ష్మీపురం, మల్లవరం, గుండ్లాపల్లి ఇతర గ్రామాల ప్రజలు ప్రయాణిస్తూనే ఉంటారు. రాత్రి వేళల్లో వాహనదారులు ఈ బ్రిడ్జి దగ్గర ఆదమరిస్తే అంతే సంగతులు. నవంబర్లో మోంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ఈ బ్రిడ్జి ఈనాటికీ అలానే ఉంది. కూటమి ప్రభుత్వం తట్టెడు మట్టి అయినా వేయలేదు. ఈ గోతులైన పూడ్చండని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పీటీసీ సీఐ శ్రీనివాసరెడ్డికి డీఎస్పీగా పదోన్నతి
ఒంగోలు టౌన్: ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కళాశాల (పీటీసీ)లో సీఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీగా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు సోమవారం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 21 మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పించారు. గుంటూరు రేంజ్ నుంచి శ్రీనివాసులు రెడ్డికి పదోన్నతి లభించింది. మంగళగిరి హెడ్ క్వార్టర్స్లో వెంటనే రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ● కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: దోమలు పుట్టకుండా, కుట్టకుండా తగిన జాగ్రతలు తీసుకోవడం ద్వారా మలేరియాను నిర్మూలించవచ్చని కలెక్టర్ పీ రాజాబాబు పేర్కొన్నారు. సోమవారం ప్రజా దర్బార్ హాలులో ఈనెల 30వ తేదీ వరకు జరిగే మలేరియా వ్యతిరేక మాసోత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దోమకాటు వలన మలేరియా, డెంగీ, చికున్ గున్యా వంటి వ్యాధులు ప్రబలుతాయని వివరించారు. దోమలు వ్యాపించకుండా పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చూడాలని చెప్పారు. నీటి ట్యాంకులు, డ్రమ్లు, బకెట్లను కప్పిపెట్టాలని, కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, పగిలిన పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ టి.వెంకటేశ్వర్లు, జిల్లా మలేరియా అధికారి ఎన్.మధుసూదన్ రావు, సబ్ యూనిట్ ఆఫిసర్లు పాతూరి శ్రీనివాసులు, సాగర్, అర్జునరావు, హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. గుడ్లూరు: భూములిచ్చిన రైతులకు, స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇతర ప్రాంతాల వారికి ఉద్యోగాలు ఇస్తున్నారని గ్రామస్తులు ఇండోసోల్ కంపెనీ ఎదుట సోమవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రావూరు, చేవూరు, ఏలూరుపాడు, సాలిపేట గ్రామ స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు భూములన్నీ స్వాధీనం చేసుకున్న తరువాత రాజమండ్రి, ఇతర పరిసరాల ప్రాంతాల వారికి ఉద్యోగాలు ఇస్తున్నారని మండిపడ్డారు. విషయం తెలుసుక్నున కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొంత సేపు కంపెనీ నిర్వాహకులు, స్థానిక రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ జాతీయ రహదారి నుంచి చేవూరు గ్రామానికి వచ్చే రోడ్డు దుమ్ము లేని ఇబ్బందులు పడుతున్నామని, తారురోడ్డు వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని డీఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. డీఎస్పీ మాట్లడుతూ స్థానికులకు ఉద్యోగాలు, రోడ్డు సమస్య విషయాలను కంపెనీ వారితో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. కార్యక్రమంలో తహసీల్దార్ బాలకిషోర్, గుడ్లూరు సీఐ నరేష్కుమార్, ఎస్సై వెంకట్రావు ఉన్నారు. కందుకూరు: అనుమతి లేకుండా వాడుకుంటున్న అక్రమ నీటి కుళాయిలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ కె.అనూష సోమవారం తెలిపారు. అక్రమ కుళాయిలను గుర్తించేందుకు సోమవారం కల్లూరి ప్రశాంతినగర్లో ఇంటింటి తనిఖీలు నిర్వహించడం జరిగిందని, ఈ తనిఖీల్లో ఒక అక్రమ కుళాయిని గుర్తించి వెంటనే తొలగించామన్నారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కావున పట్టణంలో ఎవరైనా అక్రమంగా నీటి కుళాయిలు బిగించి ఉంటే వెంటనే వార్డు అమినిటీష్ సెక్రటరీ సంప్రదించి రెగ్యులర్ చేసుకోవాలని సూచించారు. లేదంటూ తనిఖీల్లో గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
బదిలీలు పారదర్శకంగా జరగాలి
ఒంగోలు సిటీ: కేజీబీవీ విద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులపై అడిషనల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ దాసరి అనిల్ కుమార్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని కేజీబీవీ ఎస్టీయూ ఏపీ ప్రెసిడెంట్ రత్నమాలిని దేవి ఆరోపించారు. సోమవారం కేజీబీవీ సిబ్బంది సమస్యలపై జిల్లా కలెక్టర్ రాజాబాబుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మల్లయ్య లింగం భవనంలో వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్నామని, కేవలం రూ.4 వేల నుంచి రూ.25 వేల వరకు కట్టు బానిసల్లా ఉద్యోగాల్లో నెట్టుకొస్తున్నామని చెప్పారు. ఇటీవల ట్రాన్స్ఫర్ల పేరుతో సిబ్బందిని వేధిస్తున్నారని, బదిలీలకు సంబంధించిన విధి విధానాలను ఏమాత్రం పట్టించుకోకుండా వాట్సాప్ సందేశాల ద్వారా బదిలీలు చేయడం ఏంటని వారు ప్రశ్నించారు. తనకు నచ్చిన వారికి నచ్చిన కేజీబీవీలో బదిలీ చేస్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్నారు. ప్రస్తుతం నాలుగు ప్లేసుల్లో స్టేటస్ కో ఉన్న ఆ ఆర్డర్ను బాహాటంగానే ధిక్కరిస్తూ లిఖిత పూర్వకంగా జాయినింగ్ ఆర్డర్లు ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి పూనుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో బాల సరస్వతి షిండే మాలతి, రత్నకుమారి, మాధురి, ఇందిర తదితరులు పాల్గొన్నారు. -
జల్సాలకు అలవాటుపడి చోరీలు
సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): జల్సాలకు అలవాటు పడి ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న ముగ్గురు యువకులను అదుపులోనికి తీసుకున్నట్లు సీఐ శేషగిరిరావు తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బాపట్ల జిల్లా మార్టూరు పరిసరాల్లో ద్విచక్రవాహనాలను దొంగిలించి సంతనూతలపాడు మండలం గుమ్మళంపాడుకు తరలించి ఇక్కడ వాటిని విక్రయిస్తున్నారు. చోరీల ముఠా సభ్యుడైన షేక్ మస్తాన్ మార్టూరులో ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. మిగిలిన సభ్యులతో దొంగిలించిన వాహనాలను గుమ్మళంపాడులోని షేక్ బాజీ దగ్గరికి చేర్చి కొన్ని రోజుల తరువాత వాహనాలను విక్రయించి వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పలు ఫిర్యాదులు రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా మార్టూరు పరిసర ప్రాంతాల్లో చోరీ చేసిన ద్విచక్రవాహనాన్ని సంతనూతలపాడు మండలం గుమ్మళంపాడుకు చెందిన షేక్ బాజీకి ఇచ్చేందుకు వస్తున్నారని సమాచారం అందింది. దీంతో సీసీ కెమెరాల సాయంతో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రూరల్ సీఐ శేషగిరిరావు, సంతనూతలపాడు ఎస్సై అజయ్బాబులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు సీసీ కెమెరాల ఫుటేజీని క్షుణ్యంగా పరిశీలించి నిందితుల కదలికలను గుర్తించి పక్కా సమాచారంతో ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 8 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.5.50 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. ఈ చోరీకి సంబంధించి ముగ్గురు నిందితుల్లో ఒకరు మైనర్ బాలుడు. పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు షేక్ మస్తాన్పై గతంలో మార్టూరులో పలు కేసులు ఉన్నాయని. పాత నేరస్తుడు కావడంతో దొంగతనాలు చాకచక్యంగా చేసేవాడు. చోరీ ముఠాను పట్టుకున్న సీఐ శేషగిరిరావు, ఎస్సై అజయ్బాబు, ఏఎస్సై మాలకొండయ్య హెడ్ కానిస్టేబుల్ ఉదయ్కుమార్, కానిస్టేబుళ్లు పవన్, జాన్వెస్లీ, నారాయణరెడ్డి, ఇతర సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. మార్టూరు పరిసరాల్లో దొంగిలించి గుమ్మళంపాడులో విక్రయాలు నిందితుల నుంచి 8 ద్విచక్రవాహనాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన సీఐ శేషగిరిరావు -
కలెక్టర్ మీ కోసంలో 256 అర్జీలు
ఒంగోలు సబర్బన్: స్థానిక ప్రకాశం భవన్లో సోమవారం కలెక్టర్ పి.రాజాబాబు నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 256 అర్జీదారులు వచ్చి తమ అర్జీలు సమర్పించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ ప్రజల సంతృప్తే లక్ష్యంగా నిర్ణీత గడువులోపు నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఫిర్యాదు పరిష్కారం సాధ్యం కాకపోతే, దానికి గల కారణాలను అర్జీదారునికి అర్థమయ్యేలా ఎండార్స్మెంట్ ఇవ్వాలని సూచించారు. ప్రజా సమస్యలు పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం చూపకూడదన్నారు. అధికారి తీసుకున్న చర్యలతో అర్జీదారుడు సంతృప్తి చెందాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిర్యాదులు మళ్లీ రీ ఓపెన్ కాకూడదని, ఒకవేళ ఏదైనా అర్జీ రీ ఓపెన్ అయితే సంబంధిత అధికారి తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పీజీఆర్ఎస్ వినతులను ఆన్లైన్ ద్వారా వెబ్సైట్లో చెక్ చేసుకొని అధికారులు వినతులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా రెవెన్యు అధికారి శ్రీధర్ రెడ్డి, ఎస్డీసీ మాధురి, డీపీఓ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
అంత్యక్రియల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ
కొత్తపట్నం: అంత్యక్రియల విషయంలో సోమవారం ఇరువర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. అందిన వివరాల మేరకు.. మండలంలోని ఈతముక్కల గ్రామంలో ఒక సామాజిక వర్గానికి చెందిన కిల్లేటి జాలయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో ఆదివారం రాత్రి మృతి చెందాడు. సోమవారం కుటుంబ సభ్యులు మృతి చెందిన వ్యక్తిని అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలో మరో సామాజిక వర్గం వారు మీకు ఇక్కడ శ్మశాన స్థలం లేదు.. కావున ఇక్కడ అంత్యక్రియలు చేయడానికి వీలులేదని తేల్చిచెప్పారు. దీంతో ఇరువర్గాల మధ్య స్వల్పంగా ఘర్షణ చెలరేగింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ డీ రామానాయుడు, ఎస్సై వేముల సుధాకర్బాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి వారితో మాట్లాడి ఒప్పించారు. చివరికి ఒక సామాజిక వర్గం వారు శ్మశాన స్థలాన్ని కేటాయించడంతో సమస్య పరిష్కారమైంది. దీంతో పలువురు నాయుకులు, గ్రామస్తులు వారిని అభినందించారు. అనంతరం మృతి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించారు. -
మన డబ్బులు మన లెక్కలపై అవగాహన
సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): మన డబ్బులు మన లెక్కలు.. అనే కార్యక్రమంపై సంతనూతలపాడు మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం వెలుగు శాఖ ఆధ్వర్యంలో డ్వాక్రా గ్రూప్ సభ్యులకు అవగాహన కార్యక్రమం, అనంతరం ర్యాలీ నిర్వహించారు. మైనంపాడు, గంగవరం, చిలకపాడు, సంతనూతలపాడు కేంద్రాల్లో డ్వాక్రా గ్రూపు సభ్యులకు శిక్షణ ఇచ్చారు. ఈనెల ఆరో తేదీ వరకు ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించాలని వెలుగు ఏపీఎం బాబురావు పేర్కొన్నారు. కార్యక్రమాల్లో వెలుగు సీసీలు చెంచులక్ష్మి, శ్రీనివాసులు, రామాంజనేయులు, శ్రీనివాసరావు, వీవోఏలు, ఈనారిలు, డాక్రా గ్రూపు సభ్యులు పాల్గొన్నారు. సీఎస్పురం(పామూరు): మండలంలోని మిట్టపాలెం నారాయణస్వామివారి ఆలయానికి ఆదివారం రూ.2.41 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఎస్జిఆర్. నరసింహబాబు, ధర్మకర్త కొమ్మినేని చిన్న ఆదినారాయణ సోమవారం తెలిపారు. స్వామివారి దర్శనం టిక్కెట్ల అమ్మకం ద్వారా రూ.97,220, లడ్డు ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.37,680, శాశ్వత అన్నదానం పథకం నిర్వహణకు విరాళాలుగా రూ.25,281, మహాప్రాకార నిర్మాణానికి రూ.40,116 పంచామృతాభిషేకానికి విరాళంగా రూ.38,612, ఇతర విరాళాలుగా రూ.2,500 వేలు, అదేవిధంగా దాతలు వెండి శంఖు, వస్తువులు విరాళాలుగా వచ్చినట్లు ఈవో, ధర్మకర్త తెలిపారు. -
పుష్కరంలో వృద్ధి పథం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: స్వరాష్ట్రం సిద్ధించి పన్నెండేళ్లు అవుతోంది. వెనక్కి తిరిగి చూస్తే అప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు జరిగింది. ఉమ్మడి జిల్లాలో కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీ లు ఏర్పాటయ్యాయి. ప్రజల ఆర్థిక, సామాజిక రంగాల్లో వృద్ధి మొదలైంది. ప్రభుత్వ పాలన చేరువైంది. జిల్లా స్థూల జాతీయోత్పత్తి, జిల్లా పౌరుల తలసరి ఆదాయాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్థికంగా మరింత మెరుగు కనిపిస్తోంది. నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. -
జీడీడీపీ(2024–25) స్థిర ప్రస్తుత ధరల్లో
జీడీడీపీలో మార్పులు ఒక జిల్లాలో ఒక ఏడాది కాలంలో జరిగిన అంతిమ వస్తుసేవల ఉత్పతిని జీడీడీపీ(స్థూల జిల్లా జాతీయోత్పత్తి)గా పరిగణిస్తారు. గత పన్నెండేళ్లలో జీడీడీపీ క్రమంగా పెరుగుతోంది. స్థిరప్రస్తుత13,470 26,37511,857 24,07811,565 23,0518,247 16,465ఆసిఫాబాద్మంచిర్యాలనిర్మల్ -
49 వార్డులకు ఒకే ఒక్కడు!
కై లాస్నగర్: గ్రేడ్–1 స్థాయికి ఎదిగిన ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. పట్టణంలోని 49 వార్డులకు ఒకే ఒక్క శానిటరీ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్నాడు. అలాగే ప లువురు జవాన్లు రెగ్యులర్ విధులు విస్మరించి ఇతర విభాగాల్లో పనిచేస్తున్నారు. దీంతో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. ఫలితంగా ఆయా వా ర్డుల్లో చెత్త డంప్లు దర్శనమిస్తుండగా డ్రెయినేజీల్లో పూడిక పేరుకుపోయి మురుగునీరంతా రోడ్ల పై ప్రవహిస్తూ దుర్గంధం వెదజల్లుతోంది. ఐదు పోస్టులకు ఒక్కరే .. మున్సిపల్లో కీలకమైన పారిశుద్ధ్య నిర్వహణ విభా గంంలో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. మూడు శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టులు మంజూరు ఉండగా కేవలం ఒ క్కరే పనిచేస్తున్నారు. అలాగే సూపర్వైజర్గా ఇక్క డ పోస్టింగ్పొందిన ఓ అధికారిడిప్యూటేషన్పై నిజా మాబాద్లో విధులు నిర్వహిస్తుండడం గమనార్హం. హెల్త్ అసిస్టెంట్గా పనిచేస్తున్న అధికారి మూడు నెలల క్రితం శానిటరీ ఇన్స్పెక్టర్గా పదోన్నతిపై వెళ్లడంతో ఈ పోస్టు ఖాళీగా మారింది. ఈ విభాగంలో ఐదు పోస్టులకు గాను కేవలం ఒక్కరే ఉండటంతో పారిశుద్ధ్య నిర్వహణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేని పరిస్థితి. పట్టణంలోని పలువార్డుల్లో ఎక్కడికక్కడ చెత్త కుప్పులు పేరుకుపోతున్నాయి. విధులపైనే ఆసక్తి .. బల్దియాలో 13 జవాన్ పోస్టులు మంజూరు ఉన్నా యి. ప్రస్తుతం నలుగురే విధులు నిర్వహిస్తున్నారు. మరో ఐదుగురు నిబంధనలకు విరుద్దంగా రెవె న్యూ విభాగంలో కొనసాగుతుండడం గ మనార్హం. వీరు బిల్ కలెక్టర్లుగా, ఆర్ఐలకు అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. దీంతో వారి స్థానా ల్లో పబ్లిక్ హెల్త్ వర్కర్స్, ఔట్సోర్సింగ్ కార్మికులను జవాన్లుగా ని యమించారు. వీరు వార్డులకు వచ్చామా..వెళ్లామా అనే తరహాలో మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారు. కార్మికులపై అజాయియిషీ కొరవడివారు సక్రమంగా విధులు నిర్వహించని పరిస్థితి. రానున్న ది వర్షాకాలం కావడంతో ఇదే పరి స్థితి కొనసాగితే జనం వ్యాధుల బారిన పడే అవకాశం లేకపోలేదు. పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. శానిటరీ సూపర్వైజర్ డిప్యూటేషన్ రద్దు చేయించి తిరిగి మున్సిపాలిటీకి రప్పించేలా చర్యలు తీసుకుంటాం. జవాన్లు ఇతర విభాగాల్లో పనిచేస్తున్నట్లుగా దృష్టికి రాలేదు. వార్డు ఆఫీసర్లు క్షేత్రస్థాయికి వెళ్లి పారిశుద్ధ్య నిర్వహణ పర్యవేక్షించేలా ఆదేశిస్తాం. – ఏ.జగదీశ్వర్గౌడ్, మున్సిపల్ కమిషనర్ -
పోరుగడ్డకు సీఎం
రెబ్బెన: పోరుగడ్డ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు తొలిసారి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్నారు. గతనెలలో తుమ్మిడిహెట్టి పర్యటన దాదాపు ఖరారైనా చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కెరమెరి మండలం కొత్తగూడలో నూతనంగా నిర్మించిన 25 ఇందిరమ్మ గృహాల ప్రారంభోత్సవంతోపాటు కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరును ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. పర్యటన ఇలా.. సీఎం రేవంత్రెడ్డి సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఆయన నివాసం నుంచి డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ వద్ద ఉన్న హెలిప్యాడ్ ప్రాంతానికి బయలుదేరుతారు. 4.40 గంటలకు హెలిక్యాప్టర్ ద్వారా 5.45 గంటలకు కెరమెరి మండలం కొఠారి పంచా యతీకి చేరుకుంటారు. 5.50 నుంచి 6.30 వరకు కొ త్తగూడలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించి ల బ్ధిదారులతో మాట్లాడుతారు. 6.55 గంటలకు రో డ్డు మార్గం ద్వారా కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద ఏర్పా టు చేసిన బహిరంగ సభ వద్దకు చేరుకుంటారు. రాత్రి 7 గంటల వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 8.30 గంటల వరకు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 8.30 గంటలకు రోడ్డు మా ర్గం ద్వారా కాగజ్నగర్కు చేరుకుంటారు. విశ్రాంతి తీసుకుని 9.15 గంటలకు రోడ్డు మార్గం ద్వారా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ నివా సానికి వెళ్తారు. రాత్రి 10 గంటలకు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్కు బయలుదేరి వెళ్తారు. భారీగా జనసమీకరణ.. సీఎం రేవంత్రెడ్డి తొలిసారి జిల్లాకు రానుండటంతో కాంగ్రెస్ శ్రేణులు భారీగా జనసమీకరణకు సిద్ధమవుతున్నారు. మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబా ద్ జిల్లాల నుంచి ప్రజలను తరలించనున్నారు. దాదాపు లక్ష మంది హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు. సీఎం సభ కన్వీనర్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు, ఎమ్మెల్సీ దండె విఠల్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ జనాన్ని సమీకరించేందుకు సన్నాహాలు చేశారు. ఏర్పాట్లు పరిశీలన ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం కెరమెరి మండలం కొఠారి పంచాయతీలోని కొత్తగూడతోపాటు కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద నిర్వహించే బహిరంగ సభ వద్ద ఏర్పాట్లను ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ హరిత, ఎస్పీ నితిక పంత్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణతో కలిసి పరిశీలించారు. అలాగే బందోబస్తు ఏర్పాట్లను మల్టీజోన్ వన్ ఐజీ చంద్రశేఖర్ పరిశీలించారు. హెలిప్యాడ్ ప్రాంతం, ఇళ్ల శంకుస్థాపన ప్రాంతాలను పరిశీలించి కలెక్టర్ హరిత, ఎస్పీలు నితిక పంత్, అఖిల్ మహాజన్కు సూచనలు చేశారు. ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు సైతం ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. -
‘జనగణన’ లోపాలు సవరించాలి
కై లాస్నగర్: జనగణన హెచ్ఎల్వో డేటాలోని లో పాల సవరణతో పాటు, ఇందిరమ్మ ఇళ్ల సామూహి క గృహప్రవేశాల పనులు ప్రాధాన్యతతో పూర్తి చే యాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత జిల్లా, మండల, మున్సిపల్ అధికారులతో గూగుల్ మీట్ ద్వారా ఆదివారం సమీక్షించారు. జన గణన హెచ్ఎల్వో డేటాలో ఉన్న అన్ని రకాల లోపాలను క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా సరిచేయాలన్నారు. మాస్ట ర్ ట్రైనర్లు, సూపర్వైజర్లు, చార్జ్, వార్డు అధికారులు సమన్వయంతో వ్యవహరించి తప్పుల్లేని డేటా సి ద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేసి, మహా గృహప్రవేశ కార్యక్రమాన్ని విజ యవంతం చేయాలన్నారు.విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందులో అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, జిల్లా రెవెన్యూ అధికారి స్రవంతి, జెడ్పీ సీఈఓ రవి, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, హౌసింగ్ పీడీ శంకర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అన్ని మతాలకు గౌరవం ఇస్తున్న ప్రభుత్వం
ఇంద్రవెల్లి: ప్రజా ప్రభుత్వం అన్ని మతాలకు గౌరవం ఇస్తుందని రాష్ట్ర కార్మిక, పరిశ్రమల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మండల కేంద్రంలోని హోలీట్రినిటి చర్చిలో ఆదివారం నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కుల మత భేదాలు పక్కన పెట్టి మనమంతా భారతీయులం అనే భావనతో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో చర్చి ఫాదర్ పీఎస్ జోసెప్, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేష్జాదవ్, ఇంద్రవెల్లి ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం, క్రైస్తవ పెద్దలు చందు, విజయ్కుమార్, మల్యాల సుందర్, బొర్రన్న పాల్గొన్నారు. మాట్లాడుతున్న మంత్రి వివేక్ వెంకటస్వామి


