Adilabad
-
భూభారతిపై అవగాహన అవసరం
ఇచ్చోడ: భూభారతి చట్టంపై ప్రతీ ఒక్కరికి అవగా హన కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాజర్షిషా అన్నా రు. మండల కేంద్రంలోని షార్ప్గార్డెన్లో ఆదివా రం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. భూభారతి చట్టంతో భూసమ స్యలకు సత్వర పరిష్కారం లభించనుందని అన్నా రు. అనంతరం పలువురు రైతులు తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించగా పరిష్కార దిశగా ఆయన సూచనలు చేశారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదే వి, ఆర్డీవో వినోద్కుమార్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, మార్కెట్ చైర్పర్సన్ సత్యవతి తదితరులు పాల్గొన్నారు. సిరికొండలో.. సిరికొండ: మండల కేంద్రంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి భూ సమస్య ఉన్న భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చని అన్నారు. -
బొట్టు బొట్టు ఒడిసి పట్టేలా..
8లోu కైలాస్నగర్: మండుతున్న ఎండల తీవ్రతతో భూగర్భజలాలు ప్రమాదఘంటికలను మోగిస్తున్నాయి. జిల్లాలోని పలు మండలాల్లో 18 నుంచి 20 మీటర్ల లోతు వరకు నీటిమట్టం పడిపోయింది. ప్రస్తుతం 150 నుంచి 300 అడుగుల లోతు వరకు బోర్లు వేస్తే కానీ నీరు పడని పరిస్థితి. మరి కొన్నిచోట్ల అంతకు మించి వేయాల్సిన దుస్థితి. ఇదే కొనసాగితే భవిష్యత్తులో నీటి ఎద్దడి మరింత తీవ్రరూపం దాల్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో భూగర్భజలాల సంరక్షణపై జిల్లా గ్రామీ ణాభివృద్ధి శాఖ దృష్టి సారించింది. వర్షపునీటిని ఒడిసిపట్టి సంరక్షించే చర్యలకు శ్రీకారం చుట్టింది. ఉపాధి హామీ నిధులతో బోర్వెల్ రీచార్జి స్ట్ర క్చర్స్ (భూగర్భ జల పెంపు నిర్మాణాలు), రూప్ టాప్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్(పైకప్పు నీటి సంరక్షణ నిర్మాణాలు), ఫాం పాండ్స్(నీటికుంటలు), కమ్యూనిటీ ఫోక్ఫిట్స్ (సామాజిక ఇంకుడుగుంతలు) నిర్మించేందుకు సంకల్పించింది. 2025– 26 సంవత్సరానికి గాను ఆయా నిర్మాణాలకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. వీటిని సద్వినియోగం చేసుకుని లక్ష్యం మేరకు నిర్మాణాలు చేపట్టినట్లేతే భూగర్భజలాలను సంరక్షించిన వారమవుతామనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. బోర్వెల్ రీచార్జి స్ట్రక్చర్స్.. వర్షపునీటితో పాటు ఇతర భూమిపై ఉన్న నీటిని సంరక్షించేలా ఇప్పటికే ఉన్న బోర్వెల్స్ వద్ద నీటి ని లోనికి మళ్లించడం ద్వారా భూగర్భజలాల ను తిరిగి నింపేందుకు ఇవి తోడ్పడుతాయి. ఈ ఏడా ది జిల్లా వ్యాప్తంగా 240 స్ట్రక్చర్స్ నిర్మించాలని నిర్ణయించగా ఇప్పటివరకు 85 మంజూరు చేశా రు. ఒక్కో స్ట్రక్చర్స్ను రూ.25వేలతో నిర్మించుకునే అవకాశముంది. ఇప్పటి వరకు ఆరు నిర్మాణాలను గ్రౌండింగ్ చేశారు. ఫాంపాండ్స్ పంటచేలల్లో నీటిని నిల్వ చేసేందుకు చిన్నపాటి కుంటలను నిర్మిస్తారు. వీటినే ఫాంపాండ్స్ అని పిలుస్తారు. వర్షాకాలంలో వచ్చే నీటిని నిల్వ చే సుకోవడం ద్వారా వేసవిలో పంటలకు నీరందించేందుకు తోడ్పడుతుంది. జిల్లావ్యాప్తంగా 392 నిర్మించాలని నిర్ణయించిన అధికారులు 332 మంజూరు చేశారు. అందులో 94 నిర్మాణాలు పూర్తయ్యాయి. ఒక్కోదానికి రూ.2.50లక్షల ఉపాధి నిధులు వెచ్చిస్తారు. కమ్యూనిటీ సోక్పీట్స్.. గ్రామీణ, పట్టణప్రాంతాల్లోని చేతిపంపుల వద్ద వీటిని నిర్మించనున్నారు. జిల్లాలో కమ్యూనిటీ సోక్పిట్స్ నిర్మాణలక్ష్యం 183 కాగా 45 మంజూరు చేశారు. ఒక్కో దాన్ని రూ.12వేల వ్యయంతో నిర్మించనున్నారు. ఇందులో ఇప్పటి వరకు ఏడు గ్రౌండింగ్ చేశారు. మిగతా వాటిని ఈ ఆర్థికసంవత్సరంలో పూర్తిచేసేలా ముందుకు సాగుతున్నారు. వీటి నిర్మించడం ద్వారా వర్షపునీటితో పాటు చేతిపంపుల నుంచి వచ్చే వృథానీటిని తిరిగి భూమిలోకి ఇంకేలా చేస్తాయి. రూప్టాప్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ వర్షాకాలంలో భవనాలపై పడే నీటిని నిల్వచేసేందుకు ఈ స్ట్రక్చర్స్ తోడ్పడనున్నాయి. గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, ఇతరత్రా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న 31చోట్ల నిర్మించాలని నిర్ణయించగా ఇందులో 8 మంజూరు చేశారు. ఒక్కోదాన్ని రూ.25వేలతో నిర్మిస్తారు. ఇప్పటి వరకు ఒకటి పూర్తి చేశారు. ఆయా కార్యాలయాలపైపడిన వర్షపునీరు వృథాగా పోకుండా భూ మిలోకి ఇంకించేలా ఈ స్ట్రక్చర్ నిర్మించనున్నారు. భూగర్భజలాల పెంపుపై ఫోకస్ నీటి కుంటలు, ఇంకుడుగుంతలు మంజూరు ఉపాధి హామీ నిధులతో నిర్మాణాలు సద్వినియోగం చేసుకుంటే జల సంరక్షణకు దోహదం భూగర్భ్బజలాల పెంపునకు చర్యలు జిల్లాలో భూగర్భజలాలు అడుగంటి పలుచోట్ల బోరుబావులు, చేదబావులు ఎండిపోయాయి. నీటిని సంరక్షించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేలా భూగర్భజలాలను పెంపొందించేలా ఉపాధి నిధులతో ప్రత్యేక నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈమేరకు లక్ష్యాలను నిర్ణయించాం. వందశాతం సాధించేలా చర్యలు చేపడుతున్నాం. ప్రజలు, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – రాథోడ్ రవీందర్, డీఆర్డీవో -
అధిక వడ్డీ వసూలు చేస్తే కఠిన చర్యలు
● డీఎస్పీ జీవన్రెడ్డి ● జైనథ్లో వడ్డీ వ్యాపారిపై కేసు ఆదిలాబాద్టౌన్(జైనథ్): అధిక వడ్డీ వసూలు చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి హెచ్చరించారు. అమాయక ప్రజ లు, రైతుల వద్ద అధిక వడ్డీ వసూలు చేస్తూ వారి భూములను వడ్డీ పేరుతో రాయించుకుంటున్న ఓ వడ్డీ వ్యాపారిపై జైనథ్ పోలీస్స్టేషన్లో రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జైనథ్ స్టేషన్లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జైనథ్ మండలం కేదార్పూర్ గ్రామానికి చెందిన బోయర్ రమేశ్ 2011లో 25 శాతం వడ్డీతో రూ.3 లక్షలు ఇచ్చి తన 1.36 ఎకరాల భూమిని తన తమ్ముడు గజాణన్ పేరిట రా యించుకున్నాడని జైనథ్ రైతు గోస్కుల నర్సయ్య ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. 2013లో బాధితుడు రూ.2 లక్షలు, 2017 సంవత్సరంలో రూ.2 లక్షలు చెల్లించాడు. తిరిగి తన భూమిని తనకు ఇచ్చేయాలని చెప్పినా నిరాకరించడంతో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వ్యాపారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అలాగే అతడి ఇంటి వద్ద తనిఖీ చేయగా సంతకం చేసిన రెండు ఖాళీ బ్యాంకు చెక్కులు, 32 సేల్ డీడ్లు, రెండు ధరణి సేల్డీడ్లు, 31 ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వాటి విలువ దాదాపు రూ.కోటి 55 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. మనీ లెండర్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో జైనథ్ సీఐ డి.సాయినాథ్, ఎస్సై పురుషోత్తం పాల్గొన్నారు. -
ఆదివాసీలపై దమనకాండను ఆపాలి
ఆదిలాబాద్రూరల్: అమాయక ఆదివాసీలపై ప్రభుత్వాలు చేపడుతున్న దమనకాండను వెంటనే నిలిపివేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ విశ్రాంతి భవనం నుంచి కుమురంభీంచౌక్ వరకు ఆదివారం కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివాసీ అమాయకులపై జరుగుతున్న ఎన్కౌంటర్లను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి శాంతి చర్చలు జరిపించాలన్నారు. ఇందులో వివిధ సంఘాల నాయకులు గోడం గణేశ్, సాజిద్ఖాన్, మల్లేశ్, శంకర్, సచిన్, తదితరులు పాల్గొన్నారు. -
● విద్యార్థుల ప్రవేశాల కోసం ప్రచారం షురూ ● ఉపాధ్యాయులకు టార్గెట్లు ● ఇంటింటికీ తిరుగుతున్న టీచర్లు ● తల్లిదండ్రులను మభ్యపెడుతూ అడ్మిషన్లు
ఆదిలాబాద్టౌన్: ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు అడ్మిషన్ల వేట ప్రారంభించాయి. తల్లిదండ్రులను మభ్యపెడుతూ తమ బడిలో చేర్పించేందుకు ప్రయత్నాలు షురూచేశాయి. ఈనెల 24నుంచి వేసవి సెలవులు మొదలయ్యాయి. అప్పటినుంచే ప్రైవేట్ యా జమాన్యాలు ఎన్నికల ప్రచారం తలపించేలా తమ ఉపాధ్యాయులను ఇంటింటికి తిప్పుతున్నారు. కరపత్రాలు పంచుతూ ఇప్పుడు అడ్మిషన్ చేయిస్తే రా యితీ ఇస్తామని చెబుతున్నారు. కొన్ని యాజమాన్యాలు ఫ్రీ అడ్మిషన్ అంటూ బుట్టలో వేసుకుంటున్నారు. ఈ మేరకు టీచర్లకు టార్గెట్లు ఇచ్చారు. ప్రతీ ఉపాధ్యాయుడు కనీసం 10 నుంచి 20 మందిని చేర్పించాలని ఆదేశించారు. లేకుంటే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించడంతో వారు నానాతంటాలు పడుతున్నారు. ఉదయం 7గంటలకే విద్యార్థుల ఇళ్ల ముందు వాలుతున్నారు. తమ పాఠశాలలో బోధన బాగుంటుంది.. మంచి ఫలితాలు సాధి స్తున్నామంటూ తల్లిదండ్రులకు ఎర వేస్తున్నారు. అయితే ప్రభుత్వం బడిబాట నిర్వహించే సరికే పిల్ల లు ప్రైవేట్లో చేరే అవకాశాలు ఉన్నాయని పలు వురు చర్చించుకుంటున్నారు. వ్యాపారంగా మలుచుకొని.. జిల్లాలో ఒకప్పుడు ప్రైవేట్ పాఠశాలలు మండలాని కి ఒకటో.. రెండో ఉండేవి. ప్రస్తుతం ఎక్కడబడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. విద్యను వ్యాపారంగా మలిచారు. కనీస సౌకర్యాలు లేకపోయినా అధిక ఫీ జులతో తల్లిదండ్రులను పీల్చిపిప్పిచేస్తున్నారు. ఎల్కేజీ మొదలు.. పదోతరగతి వరకు డొనేషన్లు, ఫీజు లు, పుస్తకాలు, నోట్బుక్స్, ప్రాజెక్టులు, బస్సు ఫీజు లు వంటి తదితర ఖర్చులతో మోతమోగిస్తున్నారు. విద్యార్థులను ర్యాంకుల పేరుతో బట్టీ పట్టించి..తరగతికో రేటు కట్టి చదువును అమ్మకపు సరుకుగా చే స్తున్న విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు సైతం దృష్టి సారించడం లేదు. డీఈవో పరిధిలో 700 వరకు ప్రభుత్వ యా జమాన్య పాఠశాలలు ఉండగా, దాదాపు 200 వరకు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. మరోవైపు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజు ల నియంత్రణ తమ పరిధిలో లేదంటూ విద్యాశాఖ అధికారులు చెబుతుండడం గమనార్హం. నిబంధనలకు తూట్లు.. ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ పర్యవేక్షణ కొరవడింది. ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.1 అమలు కావడం లేదు. తల్లిదండ్రులతో కూడిన గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేయాలి. నిబంధనల ప్రకారం పాఠశాలలో 700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో క్రీడా మైదానం ఉండాలి. అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. చాలా పాఠశాలలకు ఫైర్ సేఫ్టీ సౌకర్యాలు లేవు. ఇరుకు గదుల్లో, చుట్టూ వాహనం తిరిగే స్థలం లేని భవనాల్లో స్కూళ్లను ఇష్టానుసారంగా నడిపిస్తున్నారు. బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన వారిచే విద్యాబోధన చేయించాల్సి ఉండగా, విద్యార్హత లేనివారితో చదువులు కొనసాగిస్తున్నారు. ఫీజుల వివరాలు బోర్డుపై ప్రదర్శించాల్సి ఉండగా, ఏ పాఠశాలలో కూడా అలా జరగడం లేదు. చాలా ప్రైవేట్ పాఠశాలలు ఇలా నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సర్కారు బడుల్లో చేర్పించాలి సర్కారు బడుల్లోనే నాణ్యమైన బోధన అందుతుంది. అర్హత గల ఉపాధ్యాయులతో పా టు వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాయి. మధ్యాహ్నభోజనం, ఉచిత యూనిఫాం, పాఠ్యపుస్తకాలు తదితర సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి. ప్రైవేట్ విద్యాసంస్థలు తప్పని సరిగా నిబంధనలు పాటించాలి. లేకుంటే కఠిన చర్యలు తప్పవు. – శ్రీనివాస్ రెడ్డి, డీఈవో ప్రచారం షురూ.. జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాల ప్రచారం ఊపందుకుంది. ఎండలు దంచికొడుతున్నా ఇంటింటికి తిరుగుతూ విద్యార్థుల వివరాలను సేకరిస్తున్నారు. తమ పాఠశాలలో చేర్పిస్తే ఫీజులో రాయితీ కల్పిస్తాం.. బస్సు సౌకర్యం వంటి తదితర మాయమాటలు చెప్పి తల్లిదండ్రులను ఒప్పిస్తున్నారు. అందులో చేరాక ఫీజులు పూర్తిస్థాయిలో ముక్కుపిండి వసూలు చేస్తుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ప్రభుత్వ పాఠశాలల్లో నుంచి 5వేల మంది విద్యార్థులు ప్రైవేట్లో చేరారు. -
● గతేడాది లక్ష్యంతో పోల్చితే ఈ సారి 28లక్షలు తగ్గింపు ● కూలీలకు తీవ్ర నష్టం ● కొత్త జాబ్ కార్డులకు పెరిగిన డిమాండ్
కై లాస్నగర్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ఆధారపడ్డ కూలీలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. 2025–26 సంవత్సరానికి గాను చేపట్టా ల్సిన పనిదినాల్లో భారీగా కోత విధించింది. గతేడాది లక్ష్యానికి మించి పనులు జరగడంతో కూ లీలకు వేసవిలో ఉపాధి లభించింది. జిల్లావ్యాప్తంగా 5,378 కుటుంబాలు వంద రోజుల పాటు పని చేశాయి. అయితే ఈ ఏడాది రాష్టవ్యాప్తంగా ఉపాధి పనిదినాలను తగ్గించగా జిల్లాకు కేటాయించిన లక్ష్యంలోనూ భారీగా గండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో చేసిన పనుల ఆధారంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అ మలు చేస్తుండటంతో జాబ్కార్డుల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పనిదినాలు తగ్గడంతో కూలీల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. గతేడాది లక్ష్యానికి మించి.. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాకు 52.35 లక్షల పనిదినాలను కేంద్ర ప్రభుత్వం కేటా యించింది. గ్రామీణ ప్రాంత కూలీలు ఈ అవకా శాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నారు. కూలీల సంఖ్య పెరుగడంతో జిల్లావ్యాప్తంగా 54.84లక్షల పనిదినాలు జరిగాయి. దీంతో 104.75శాతం నమోదైంది. లక్ష్యానికి మించి పనులు జరగడంతో కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ప్రత్యేక బృందాలను పంపించి పనుల ప్రగతిపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. క్షేత్రస్థాయిలో పనులకు కూలీలు వాస్తవంగా హాజరవుతున్నారా లేక బోగస్ హాజరు నమోదు చేస్తున్నారా అనే దాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. కొన్ని పనులు కేంద్ర నిబంధనల ప్రకారం జరగకపోవడంతో పనిదినా లను భారీగా తగ్గించినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ ఏడాదికి కేవలం 23.81లక్షల పని దినాలు మాత్రమే నిర్దేశించింది. గతేడాదితో పో ల్చితే 28లక్షల పనిదినాలను తగ్గించింది. దీంతో ఉపాధి హామీ పనులపై ఆధారపడ్డ కూలీలు కేంద్ర నిర్ణయంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రశ్నార్థకంగా ‘ఉపాధి’ ఈ ఏడాదికి 23.81 లక్షల పనిదినాలను లక్ష్యంగా కేటాయించగా అందులో ఇప్పటికే 11.21 లక్షల పనిదినాలు పూర్తయ్యాయి. వ్యవసాయ పనులు జరగకపోవడంతో మే నెలంతా ఉపాధి పనులు ముమ్మరంగా సాగనున్నాయి. రుతుపవనాల ఆగమనంతో వర్షాలు కురిసే జూన్ వరకు కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యే అవకాశముంది. వ్యవసాయ పనులు ప్రారంభమైతేనే కూలీల సంఖ్య తగ్గే అవకాశముంటుంది. అయితే ఈ రెండు నెలల్లోనే జిల్లాకు కేటాయించిన పనుల లక్ష్యం పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో లక్ష్యం పూర్తయితే మిగతా సమయాల్లో ఉపాధి పనులను చేపట్టి కూలీలకు పనులు కల్పిస్తారా లేక నిలిపివేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి జాబ్ కార్డుల ఆధారంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద కూలీలకు రూ.12వేల ఆర్థికసాయం అందజేయాలని నిర్ణయించింది. దీంతో కొత్తగా జాబ్కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అలాగే జాబ్ కార్డు కలిగి ఉండి పనులకు హాజరుకానుటువంటి వారు కూడా పనులకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పనిదినాల లక్ష్యం పెంచాల్సిన అవసరముందనే అభిప్రాయం కూలీల నుంచి వ్యక్తమవుతోంది. ఉపాధి పనుల్లో నిమగ్నమైన కూలీలు జిల్లాలోని ఉపాధి పనుల వివరాలు.. గ్రామీణ మండలాలు : 20 పంచాయతీలు : 473 జాబ్కార్డుల సంఖ్య : 1.74లక్షలు నమోదు చేసుకున్న కూలీలు: 3.47లక్షలు యాక్టివ్ జాబ్కార్డులు : 1.09 లక్షలు పనులకు హాజరయ్యే కూలీలు : 2.04 లక్షలు లక్ష్యం మేరకు పనులు కల్పిస్తాం గతేడాదితో పోల్చితే కేంద్ర ప్రభుత్వం ఈ సారి పనిదినాలను తగ్గించింది. రాష్ట్రవ్యాప్తంగా పనిదినాలను తగ్గించగా జిల్లాకు కేటాయించిన లక్ష్యంలో కోత పడింది. అయితే దరఖాస్తు చేసుకున్న ప్రతీ కూలీకి ప్రస్తుతం పనులు కల్పించేలా శ్రద్ధ వహిస్తున్నాం. నిర్దేశిత లక్ష్యం మేరకు పనులు కల్పిస్తాం. అప్పటికీ కూలీల నుంచి పనుల కోసం డిమాండ్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటాం. – రాథోడ్ రవీందర్, డీఆర్డీవో -
వాతావరణం
మధ్యాహ్నం ఎండతీవ్రత పెరగనుంది. వడగాలులు వీస్తాయి. ఉక్కపోత ప్రభావం కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నది నార్నూర్ మండలంలోని పొలాల్లో గల బోర్వెల్ వద్ద ఉపాధి హామీ నిధులతో చేపట్టిన బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్. వర్షపునీటిని సంరక్షించి బోర్వెల్లో నీటిమట్టం పెరిగేందుకు దోహదపడేలా నిర్మిస్తున్నారిలా. -
బ్లడ్ బ్యాంక్ సద్వినియోగం చేసుకోవాలి
నార్నూర్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ను సద్విని యోగం చేసుకోవాలని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ అన్నారు. ఆస్పత్రిని ఆదివారం ఆయ న సందర్శించారు. గాదిగూడ మండలం ఝరి పీహెచ్సీ పరిధిలోని మాలేపూర్ సబ్సెంటర్కు చెందిన అంజలికి రక్తం అవసరం కాగా ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్ నుంచి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏజెన్సీలో గిరిజనులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు నార్నూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో బ్లడ్బ్యాంక్ ఏర్పాటు చేశామన్నారు. గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. ఆయన వెంట ఆస్పత్రి వైద్యాధికారి రాంబాబు తదితరులున్నారు. -
నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యం
ఆదిలాబాద్రూరల్:వినియోగదారులకు నాణ్య మైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కన్స్స్ట్రక్షన్ సీఈ, జిల్లా ఇన్చార్జి ఎస్ఈ జేఆర్ చౌహాన్ అన్నారు. మావల మండలంలో ఏర్పాటు చేసిన వాక్యూం కరెంట్ బ్రేకర్ (వీసీబీ)ను శనివారం ప్రారంభించి మాట్లాడారు. మండలంలోని 33/11 కేవీ సబ్స్టేషన్ పరిధిలోని వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో భాగంగా వీసీబీ ఏర్పాటు చేశామన్నా రు. కార్యక్రమంలో డీఈలు హరికృష్ణ, ప్రభాకర్, ఈదన్న, ఏడీఈ లక్ష్మణ్, ఏఈ జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేఆర్కే కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్
ఆదిలాబాద్రూరల్: మావల పోలీస్స్టేషన్ పరిధి లోని కేఆర్కే కాలనీలో శనివారం రాత్రి కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పాల్గొని మాట్లాడారు. యువ త గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో భాగంగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 107 ద్విచక్ర వాహనాలు, ఆరు ఆటోలు, ఒక మినీ ట్రాలీని స్వాధీన పర్చుకున్నట్లు తెలిపారు. అలాగే నాలుగు బెల్టు షాపులు గుర్తించడంతో పాటు 146 మద్యం క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్, మోడిఫైడ్ సైలెన్సర్లను బిగించిన 20 వాహనాలను స్వాధీ నం చేసుకుని స్టేషన్కు తరలించామన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి, సీఐలు ఫణిదర్, సునీల్కుమార్, సీహెచ్ కరుణాకర్, సాయినాథ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్, వెంకటి, ఎస్సైలు, ఏఎస్సైలు, స్పెషల్ పార్టీ, రిజర్వ్, సిబ్బంది సుమారు 250 మంది తదితరులు పాల్గొన్నారు. -
‘ఎర్లీబర్డ్’కు స్పందన అంతంతే!
● ముందుకు రాని పట్టణవాసులు ● మిగిలింది మూడు రోజులే ● ముందస్తుగా చెల్లిస్తే 5శాతం రాయితీ కైలాస్నగర్: మున్సిపాలిటీలో ఆస్తిపన్ను బకా యిలు పేరుకుపోకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎర్లీబర్డ్ స్కీం అమలు చేస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ముందస్తుగా పన్ను చెల్లించే వారికి ఐదు శాతం రాయితీ కల్పిస్తోంది. నివాస, నివాసేతర భవనాలకు సంబంధించి పాత బకాయిలు లేనటువంటి వారిని అర్హులుగా ప్రకటించింది. ఈ నెల 30 వరకు పన్ను చెల్లింపునకు అవకాశం కల్పించింది. మరో మూడు రోజుల్లో గడువు ముగియనుంది. అయితే పట్టణ వాసుల నుంచి స్పందన కరువైంది. ఇప్పటి వరకు కేవలం నాలుగు శాతం మాత్రమే పన్ను వసూలు కావడం గమనార్హం. అరకొర స్పందనే ... ఆదిలాబాద్ పట్టణంలో 49 వార్డులున్నాయి. ఎర్లీబర్డ్ పథకం అమల్లో భాగంగా నిర్దేశించిన పన్ను వసూళ్ల కోసం బల్దియా అధికారులు 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ముగ్గురు ఉద్యోగులను నియమించారు. బకాయిలు లేని వారి వివరాలతో కూడిన జాబితాతో పాటు పీవోఎస్ యంత్రాలను వారికి అందజేశారు. దీంతో వారు ఉదయం, సాయంత్రం వేళల్లో కేటాయించిన వార్డుల్లో విస్తృతంగా తిరుగుతూ పన్నులు వసూలు చేస్తున్నారు. ఏటా ఆస్తి పన్నులో ప్రభుత్వం వడ్డీ మాఫీ అమలు చేస్తూ వస్తోంది. పాత బకాయిలు కలిగిన వారికి వడ్డీపై 95శాతం రాయితీ కల్పించింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో బల్దియాకు అవసరమైన నిధులు సేకరించాలనే ఉద్దేశంతో ఎర్లీబర్డ్ స్కీం అమలు చేసి ఈ నెల 30 వరకు పన్ను చెల్లించేందుకు అవకాశం కల్పించారు. 2023–24లో ఇదే స్కీంలో రూ.1.83 కోట్లు వసూలు చేశారు. అలాగే 2024–25లో రూ.2.13 కోట్లను వసూలు చేశారు. తాజాగా గడిచిన 26 రోజుల వ్యవధిలో 3,993 మంది రూ.1.40 కోట్ల పన్నులను చెల్లించారు. మరో మూడు రోజులే గడువు ఉండటంతో గతేడాది లక్ష్యాన్ని అధిగమిస్తారా లేక వెనుకబడుతారా అనేది చూడాల్సిందే. ప్రచారం కొరవడడంతోనే ముందస్తుగా పన్ను చెల్లింపునకు పట్టణ ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేదు. అయితే ఐదు శాతం రాయితీ సద్వినియోగం చేసుకునేలా పట్టణ ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బల్దియా యంత్రాంగం ఆ దిశగా క్షేత్రస్థాయిలో ప్రచారం కల్పించకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వ్యాపారులు పన్ను చెల్లింపునకు ముందుకొచ్చేలా గతేడాది పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లతో ప్రత్యేక ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. అలాగే వార్డుల్లోని ప్రజలకు విషయం తెలియజేసేలా మైక్తో కూడిన ఆటో ద్వారా ప్రచారం కల్పించారు. ఈ యేడాది కేవలం ఒకటి రెండు చోట్ల మాత్రమే హోర్డింగ్లు ఏర్పాటు చేసి మమ అనిపించారు. దీంతో ప్రజలకు అవగాహన కొరవడింది. ప్రత్యేక బృందాలు వెళితే తప్ప విష యం తెలియని పరిస్థితి. ఈ క్రమంలో బల్దియా ప్రత్యేక చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో.. అసెస్మెంట్లు : 49,503వాటి ఆస్తి పన్ను డిమాండ్ : రూ.33.46 కోట్లు ఆస్తి పన్ను చెల్లించిన అసెస్మెంట్లు : 3,993 ఇప్పటి వరకు వసూలైంది : రూ.1.40 కోట్లు సద్వినియోగం చేసుకోవాలి పన్నులు ముందస్తుగా వసూలు చేసేందుకు ప్రభుత్వం ఎర్లీబర్డ్ స్కీం అమలు చేస్తోంది. ఈ నెల 30వరకు పన్ను చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ కల్పిస్తున్నాం. పట్టణంలోని వ్యాపారులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – స్వామి, బల్దియా రెవెన్యూ అధికారి -
సాయిచైతన్యకు సన్మానం
కై లాస్నగర్: ఇటీవల ప్రకటించిన యూపీఎస్సీ ఫలితాల్లో ఐఏఎస్కు ఎంపికై న ఉట్నూర్కు చెందిన సాయి చైతన్య జాదవ్ను కలెక్టర్ రాజర్షి షా శనివారం సన్మానించారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ను ఆయ న మర్యాద పూర్వకంగా కలిశారు. జ్ఞాపిక అందజేసి అభినందనలు తెలిపారు.జిల్లా కీర్తిని చాటిన సాయిచైతన్య ఆదిలాబాద్టౌన్: సాయిచైతన్య జిల్లా కీర్తిని జా తీయ స్థాయిలో చాటారని ఎస్పీ అఖిల్ మహా జన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కా ర్యాలయంలో ఆయనను శనివారం శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. యువ త సాయిచైతన్యను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. -
‘భూ భారతి’పై విస్తృత చర్చ అవసరం
● కలెక్టర్ రాజర్షి షా కై లాస్నగర్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టంపై విస్తృత చర్చ జరగాలని, తద్వారా చట్టంపై అవగాహన కలిగి సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని రెవెన్యూగార్డెన్లో శని వారం నిర్వహించిన ఆదిలాబాద్ అర్బన్ మండల భూభారతి అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే శంకర్తో కలిసి సదస్సును ప్రారంభించారు. చట్టం విధి విధానాల పై అధికారులు రైతులకు పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధరణి చట్టంలో లేని అనే క నిబంధనలను 1971 రెవెన్యూ చట్టంలోని మంచి అంశాలను తీసుకుని రైతులకు లబ్ధి చేకూర్చేలా భూబారతి చట్టాన్ని రూపొందించారన్నారు. ఎమ్మె ల్యే శంకర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం తె చ్చిన ధరణితో అనేక అవస్థలు పడ్డ రైతులకు భూ భారతితో మేలు చేకూరనుందని వెల్లడించారు. అనంతరం రైతుల నుంచి ఫిర్యాదులను స్వీకరించా రు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అడిషనల్ కలెక్టర్ శ్యామలదేవి, ఆర్డీవో వినోద్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, డీటీ విజయ్కాంత్, ఆర్ఐ యజువేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేరడిగొండ: ప్రభుత్వం నూతనంగా రూపొందించిన భూభారతి చట్టంతో భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభించనుందని కలెక్టర్ రాజర్షిషా అ న్నారు. మండల కేంద్రంలోని సూర్య గార్డెన్లో శని వారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సు ని ర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యా మలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, తహసీల్దార్ ఎంఏ కలీం, డీటీ మ హేశ్, ఆర్ఐ నాగోరావ్, ఎంపీడీఓ రాజ్వీర్, కుమా రి పీఏసీఎస్ చైర్మన్ రమేశ్ రైతులు పాల్గొన్నారు. మావలలో.. ఆదిలాబాద్రూరల్: మావల మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి ఆర్వోఆర్ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో శంకర్, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. కలెక్టర్కు సన్మానం కై లాస్నగర్: ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఇటీవల జాతీయ అవార్డు అందుకున్న కలెక్టర్ రాజర్షి షాను జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకరరావు, అదనపు జిల్లా సెషన్స్ జడ్జి పి.శివరాం ప్రసాద్ సన్మానించారు. శనివారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో శాలువాతో సత్కరించారు. ఇంటర్ ప్రతిభావంతులకు సన్మానంకైలాస్నగర్: ఇటీవల విడుదలైన ఇంటర్మీడియె ట్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులను కలెక్టర్ రాజర్షి షా శనివారం సన్మానించారు. తంతోలి గ్రామానికి చెందిన ఏ.అంజలి బైపీసీ సెకండియర్లో 955 మార్కులు సాధించగా, పట్టణంలోని బాలాజీనగర్కు చెందిన డి.స్నేహ ఎంపీపీ ఫస్టియర్లో 467 మార్కులతో టాపర్గా నిలిచింది. కలెక్టర్ వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో సత్కరించారు. జేఈఈ, ఎంసెట్ కోచింగ్కు అవసరమైన ఆర్థికచేయూత అందిస్తామని భరో సా ఇచ్చారు. ఇందులో డీఐఈవో జాదవ్ గణేశ్కుమార్, కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ సూరజ్ తదితరులున్నారు. -
ఇదే నా ఇల్లు.. నాకు లేదా ఇందిరమ్మ ఇల్లు?
మంచిర్యాల జిల్లా: ఇందిరమ్మ ఇల్లు మంజూరవుతుందని ఆ మహిళ ఎంతో ఆశపెట్టుకుంది. శిథిలావస్థకు చేరిన ఇంటిని తొలగించి ప్రస్తుతం నాలుగు వైపులా కర్రలు పాతి ప్లాస్టిక్ కవర్లతో గూడు ఏర్పాటు చేసుకుని ఉంటోంది. తీరా ఇల్లు మంజూరు కాకపోవడంతో ఆందోళన చెందుతోంది. మంచిర్యాల జిల్లా భీమారం మండలం మద్దికల్ గ్రామంలో బండారు లక్ష్మి ఒంటరిగా నివసిస్తోంది. ఇందిరమ్మ ఇంటికోసం దరఖాస్తు చేసుకుంది. శిథిలమైన ఇంటిని తొలగించి 4 నెలల క్రితం తాత్కాలిక ఆవాసం ఏర్పాటు చేసుకుంది. గ్రామంలో మొత్తం 104 మందికి ఇళ్లు మంజూరైనట్లు ప్రజాపాలన సభలో ప్రకటించారు. ఇందులో నుంచి 34 మందికి నిర్మాణాలకు అనుమతి ఇస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ జాబితాలో లక్ష్మి పేరు లేకపోవడంతో ఆమె తీవ్రంగా ఆందోళన చెందుతోంది. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలే గానీ ఆర్థికంగా ఉన్న వాళ్లకి ఎందుకు మంజూరు చేస్తున్నారని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. -
ప్రతీ కూలీకి ఉపాధి కల్పించాలి
తలమడుగు: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జాబ్కార్డు కలిగిన ప్రతీ కూలీకి ఉపాధి పనులు కల్పించాలని డీఆర్డీఏ ఏపీడీ రవీందర్ రాథోడ్ అన్నారు. మండలంలోని కప్పరిదేవి, ఝరి, డోర్లీ, గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి హామీ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. వేసవి నేపథ్యంలో పని ప్రదేశాల్లో కూలీలకు ఇబ్బంది లేకుండా నీడ, తాగునీరు వంటి కనీస వసతులు కల్పించాలన్నారు. అనంతరం ఝరి గ్రామ సమీపంలో చేపడుతున్న చెక్ డ్యాం పనులను పరిశీలించారు. ఆయన వెంట ఈజీ ఎస్ ఏపీవో మేఘమాల, ఈసీ ప్రవీణ్రావ్, టెక్నికల్ అధికారి మల్లేశ్, ఉపాధి సిబ్బంది స్వామి తదితరులు ఉన్నారు. -
అర్హులా... కాదా
● ‘యువ వికాసం’ దరఖాస్తుల పరిశీలన షురూ ● క్షేత్రస్థాయిలోకి కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లు ● మే 2 వరకు గడువు కై లాస్నగర్: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఈబీసీలకు రూ.4లక్షల వరకు ఆర్థికసాయం అందించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఆన్లైన్తో పాటు ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లోని ప్రజాపాలన కేంద్రాల ద్వారా ఆఫ్లైన్లోనూ దరఖాస్తులు స్వీకరించింది. ఈ నెల 14వ తేదీతో గడువు ముగిసింది. జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. మొత్తం 34,109 అప్లికేషన్లు అందాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఎంపిక చేసిన లబ్ధిదారులకు జూన్ 2న సబ్సిడీ రుణాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం ఆ దిశగా దృష్టి సారించింది. మండలాల వారీగా రుణ మంజూరు యూనిట్ల టార్గెట్లను ఖరారు చేయడంతో పాటు అర్హుల గుర్తింపునకు క్షేత్రస్థాయిలో సర్వేకు ఆదేశించింది. క్షేత్రస్థాయిలోకి కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లు కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో వార్డు అధికారులు రంగంలోకి దిగారు. తమకు అందిన దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేపడుతున్నారు. దరఖాస్తుదారులు ప్రభుత్వమందించే సాయానికి అర్హులా.. కాదా, వారు గ్రామంలోనే ఉంటున్నారా, దరఖాస్తు చేసుకున్న యూనిట్ మంజూరుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, వనరులు వారి వద్ద ఉన్నాయా అనే వివరాలపై ఆరా తీస్తున్నారు. అర్హులని నిర్ధారించుకున్న వారి వివరాలను ఆయా శాఖల అధికారులతో పాటు సంబంధిత బ్యాంకు మేనేజర్లకు ఎప్పటికప్పుడు నివేదిక అందజేస్తున్నారు. అర్హుల గుర్తింపునకు సంబంధించి మే 2వరకు గడువుగా నిర్ణయించారు. ఈ క్రమంలో పరిశీలన ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కాగా రెండు, మూడు రోజుల్లో వేగవంతమయ్యే అవకాశముంది. దరఖాస్తుల వెల్లువ.. స్వరాష్ట్రం ఏర్పడ్డ పదేళ్ల తర్వాత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి రుణాలు అందించేందుకు రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుకు రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకు యూనిట్ల ఆధారంగా సబ్సిడీ సాయం అందించాలని భావిస్తోంది. అ యితే జిల్లా వ్యాప్తంగా 34వేలకు పైగా దరఖాస్తులు అందాయి. అత్యధికంగా బీసీలు 18,009 మంది దరఖాస్తు చేసుకోగా ఈబీసీలు 610, ఎస్సీలు 9,643 , మైనార్టీల్లో ముస్లింలు 5,791, క్రిస్టియన్లు 56 చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. ఇలా మండలాల వారీగా అందిన దరఖాస్తుల ఆధారంగా రుణ టార్గెట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై నార్టీ సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఆ లక్ష్యాల వివరాలతో పాటు లబ్ధిదారుల ఎంపికకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను మండలాల వారీ గా ఎంపీడీవోలకు అందజేశారు. వారు తమ పరి ధిలోని యూనిట్లకు లబ్ధిదారులను ఎంపిక చేసి ఆయా శాఖలకు అందించాల్సి ఉంటుందని అధి కారులు తెలిపారు. ఈ ప్రక్రియ మే నెలాఖరు నా టికి పూర్తికానుందని వెల్లడించారు. అర్హుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం రాజీవ్ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హుల గుర్తింపు కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీల్లో కార్యదర్శులు, మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో అర్హుల గుర్తింపు సర్వే ప్రారంభించారు. మండలాల వారీగా రుణ యూనిట్ల లక్ష్యాలను కూడా కలెక్టర్ ఆదేశాల మేరకు ఖరారు చేశాం. మండల స్థాయి అధికారులు లబ్ధిదారుల ఎంపిక చేసి జిల్లా కమిటీకి పంపించాల్సి ఉంటుంది. జిల్లా కమిటీ పరిశీలన అనంతరం లబ్ధిదారుల తుది ఎంపిక ఉంటుంది. – కే రాజలింగు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి -
పిల్లల కథల పుస్తకం ఆవిష్కరణ
కై లాస్నగర్: పిల్లలతో కథలు రాయించడంతో పాటు స్వయంగా కథల పుస్తకం రాయడం అ భినందనీయమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోరెడ్డి అశోక్ రాసిన ‘స్ఫూర్తి పిల్లల కథలు’ అనే పుస్తకాన్ని శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ఆవిష్కరించారు. ఇందులోని కథలు పిల్ల ల్లో నైతిక పరివర్తనకు, వ్యక్తిగత మార్పునకు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో డీఈవో ఏ.శ్రీనివాస్ రెడ్డి, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, సంక్షేమ అధికారి మిల్కా, సెక్టోరియల్ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
‘భారత్సమ్మిట్’లో ఎమ్మెల్యే బొజ్జు
ఉట్నూర్రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్తో తెలంగాణకు మేలు చేకూరుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. హైదరాబాద్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మె ల్యే పాల్గొని మాట్లాడారు. అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి కాంగ్రెస్ పార్టీ మూల సూత్రాలపై నెహ్రూ అలీనోద్యమానికి స్ఫూర్తిగా తీసుకొని ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరామర్శ మండలంలోని దంతన్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు సనావుల్లాఖాన్ హైదరా బాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆయనను పరామర్శించారు. -
న్యాయవాదుల నిరసన ర్యాలీ
కై లాస్నగర్: ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ను ప్రపంచ చిత్రపటంలో లేకుండా చేయాలని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్ డిమాండ్ చేశారు. కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడిని ఖండిస్తూ న్యాయవాదులు శుక్రవారం జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసేలా కేంద్రం కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇందులో ప్రధాన కార్యదర్శి డీఎస్పీ శర్మ, ఉపాధ్యక్షుడు చందూసింగ్, ముజాయిద్ హుస్సేన్, అఖిలేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి
● డీఎస్పీకి సీపీఐ నాయకుల వినతికై లాస్నగర్: ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన చౌక్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా కాపాడాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సిర్ర దేవేందర్ కోరారు. శుక్రవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ నర్సయ్య, ఎస్ఈ కార్యాలయ డీఈ లను కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ చౌక్, ఆర్టీసీ బస్టాండ్ ఎదుట, వినాయక చౌక్, నేతాజీ చౌక్, పంజాబీ చౌక్, తిరుమల పెట్రోల్ పంపు వద్ద గల బీటీ రోడ్లను విస్తరించి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు ప్రమాదాలకు గురై ప్రాణా లు కోల్పోకుండా చర్యలు చేపట్టాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో కాంగ్రెస్ నాయకుడు అబ్దుల్ మొయిజ్, ఏఐటీయూసీ నాయకులు కాంతారావు, ఆనంద్, రాజేశ్వర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
‘భూభారతి’తో సమస్యలకు పరిష్కారం
నార్నూర్: ప్రభుత్వం నూతనంగా రూపొందించిన భూభారతి చట్టంతో భూ సమస్యలకు సత్వర పరి ష్కారం లభించనుందని కలెక్టర్ రాజర్షి షా అన్నా రు. గాదిగూడ మండలంలోని రైతు వేదిక భవనంలో, నార్నూర్లోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో శుక్రవారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. భూభారతి చట్టంతో సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. ఆధార్లాగే ప్రతీ భూ కమతానికి భూధార్ కార్డు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. నార్నూర్ మండలవాసుల సహకారంతోనే నీతి ఆయోగ్ బ్లాక్లో భాగంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగిందన్నారు. అనంతరం మండలంలోని బలాన్పూర్ చెరువులో చేపడుతున్న పూడికతీత పనులను కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్కు సన్మానం నార్నూర్ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు మండల పేరును జాతీయ స్థాయిలో నిలిపిన కలెక్టర్ను మాజీ సర్పంచ్ బానోత్ గజానంద్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉట్నూ ర్ సబ్కలెక్టర్ యువరాజ్ మర్మాట్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, మండల ప్రత్యేకాధికారి గంగారాం, తహసీల్దార్ జాడి రాజలింగు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సన్నబియ్యం లబ్ధ్దిదారుడి ఇంట్లో కలెక్టర్ భోజనంఅనంతరం కలెక్టర్ నార్నూర్ మండలకేంద్రంలోని విజయ్నగర్ కాలనీకి చెందిన రేషన్ లబ్ధిదారు జిల్లెపల్లి సుకుమార్ ఇంట్లో సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. కలెక్టర్ రాజర్షి షా నార్నూర్, గాదిగూడలో నూతన చట్టంపై అవగాహన సదస్సులు -
● జిల్లాకు ఈ సారి భారీగా పత్తి విత్తనాలు ● సరిపడా సరఫరాకు కంపెనీలు సిద్ధం ● కొరత ఉండదంటున్న వ్యవసాయశాఖ ● డిమాండ్ వైరెటీల ధర కూడా తగ్గే అవకాశం
పత్తి విత్తనాలు కొనుగోలు చేస్తున్న రైతులు (ఫైల్) గతేడాది వానాకాలం సాగుకు ముందు పత్తి విత్తనాల కొనుగోలు పరంగా జిల్లాలో ఎదురైన పరిస్థితులు విదితమే. డిమాండ్ రకం సీడ్స్ కోసం రైతులు విత్తన దుకాణాల ఎదుట బారులు తీరడం మనం చూశాం. డిమాండ్ రకాలు ఒకటి రెండు మాత్రమే ఇచ్చి మిగతావి మామూలు రకాలు అంటగట్టారని అప్పుడు రైతుల నుంచివిమర్శలు వ్యక్తమయ్యాయి. అంతే కాకుండా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ రాజర్షి షా, అప్పటి ఎస్పీ గౌస్ ఆలం స్వయంగా రంగంలోకి దిగి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ సారి ఆ పరిస్థితి ఉండదని వ్యవసాయ శాఖ చెబుతోంది. జిల్లాకు సరిపడాకు మించి విత్తనాలు రానున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. – సాక్షి, ఆదిలాబాద్ అడిగిన దానికంటే ఎక్కువ.. సాధారణంగానే వానాకాలం సీజన్కు ముందు పత్తి విత్తనాల కంపెనీలకు సంబంధించి ఇక్కడి ప్రతినిధులతో జిల్లా అధికారులు సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లతోనూ సమావేశమవుతారు. మండలం వారీగా డీలర్లతో చర్చిస్తారు. ఈ విధంగా ముందుగానే సీడ్స్ సరఫరాకు సంబంధించిన యాక్షన్ప్లాన్ సిద్ధం చేసుకుంటారు. క్షేత్రస్థాయిలో పత్తి ఎంత సాగవుతుంది.. మార్కెట్లో విత్తన ప్యాకెట్లు అందుకు తగ్గట్లుగా కంపెనీలు సరఫరా చేయగలుగుతాయా లేదా అనే విషయంలోనే ఈ ముందస్తు ప్రణాళిక. జిల్లాలో ఈ సమావేశాలన్నీ వ్యవసాయశాఖ ఇటీవల పూర్తి చేసింది. అందులో విత్తన కంపెనీల ప్రతినిధులు తమ సప్లై ప్లాన్ను అధికారులకు తెలియజేశారు. కమిట్మెంట్ కూడా ఇచ్చేశారు. ఈ సారి అడిగినదానికంటే ఎక్కువ కూడా సరఫరా చేసేందుకు సిద్ధమని వారు తెలియజేశారు. దీంతో వ్యవసాయశాఖలో ఈ సారి సీడ్ వర్రీ కనిపించడం లేదు. ఎందుకంటే .. ఈ సారి పత్తి విత్తనాల ఉత్పత్తి పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. పలు రాష్ట్రాల నుంచి విత్తనాల ప్యాకెట్లు జిల్లాకు వస్తాయి. ఎక్కడైతే సీడ్ ఉత్పత్తి జరుగుతుందో అక్కడ గడిచిన సీజన్లో అకాల వర్షాలు లేకపోవడంతో విత్తన ఉత్పత్తి అధికంగా వచ్చిందని చెబుతున్నారు. అంతే కాకుండా నాణ్య మైన విత్తనం కూడా అందుబాటులో ఉందని పే ర్కొంటున్నారు. దీంతోనే డిమాండ్ రకాలు కూడా పుష్కలంగా అందుబాటులో ఉంటాయని అధికారులు భరోసా ఇస్తున్నారు. పత్తి పండించే రైతులు విత్తనాల విషయంలో ఆందోళన పడవద్దని, నకిలీ విత్తనాల వైపు వెళ్లవద్దని సూచిస్తున్నారు. ధర పెరిగినా.. పత్తి విత్తనాలకు సంబంధించి ప్రైవేట్ మార్కెట్లోనే ప్యాకెట్లను విక్రయిస్తుంటారు. దీంతోనే ఏటా సీజన్ వచ్చిందంటే కంపెనీల ప్రతినిధులతో అధికారులు సమావేశమవుతారు. సరఫరాలో లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటారు. కాగా పత్తి విత్తన ప్యాకెట్ 450 గ్రాములు ఉంటుంది. ఎకరానికి రెండు ప్యాకెట్లు అవసరం పడుతాయి. అయితే మెజార్టీ రైతులు డిమాండ్ వైరెటీ రకాలకే మొగ్గు చూపుతారు. ఆ కంపెనీ ప్యాకెట్లు పూర్తిస్థాయిలో లేకపోవడంతో వ్యాపారులు అవి తక్కువగా ఇచ్చి ఇతర వైరెటీలను వారికి అంటగడతారు. ఈ విషయంలోనే ఏటా రాద్దంతం అవుతోంది. అయితే ఈ ఏడాది పత్తి విత్తన ప్యాకెట్ ధరను కేంద్రం పెంచింది. ఒక్కో ప్యాకెట్పై రూ.37 పెరిగింది. అయితే ఈ సారి సీడ్ ప్రొడక్షన్ అధికంగా ఉండటంతో విత్తన కంపెనీల మధ్య పోటీ పెరగనుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్యార్పీ కన్నా తక్కువకే అమ్మినా ఆశ్చర్య పొనక్కర్లేదని పేర్కొంటున్నారు. జిల్లాలో పత్తి సాగు, విత్తనాల వివరాలు.. సాగు విస్తీర్ణం అంచనా : 4.50 లక్షల ఎకరాలు గతేడాది సాగైన విస్తీర్ణం : 4.37 లక్షల ఎకరాలు విత్తన ప్యాకెట్ల డిమాండ్ : 11 లక్షలు గతేడాది సప్లై చేసింది : 15 లక్షలు (మొదట్లో సీడ్ నష్టంతో రైతులు మళ్లీ కొనుగోలు చేశారు) ఈ సారి ఆయా కంపెనీలు సరఫరా చేస్తామని చెప్పిన విత్తన ప్యాకెట్లు : 20 లక్షల వరకు.. విత్తన సరఫరా ప్రణాళిక సిద్ధం.. పత్తి విత్తనాలకు సంబంధించి ఈ సారి కంపెనీలు డిమాండ్ కంటే అధికంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే వారితో సమావేశాలు పూర్తి చేశాం. ఈ ఏడాది అడిగినదానికంటే ఎక్కువే సప్లై చేస్తామని వారు చెప్పారు. ఈ సారి పత్తి విత్తనాల కొరత ఉండదు. రైతులు బ్లాక్లో కొనుగోలు చేయనవసరం లేదు. అధికారిక విత్తన దుకాణాల్లోనే సరిపడా అందుబాటులో ఉంటాయి. – శ్రీధర్ స్వామి, జిల్లా వ్యవసాయాధికారి -
‘ఉపాధి’ సమస్యలు పరిష్కరించాలి
కై లాస్నగర్: ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లంకా రాఘవులు డిమాండ్ చేశారు. పనిప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాల ని, ప్రభుత్వం నిర్ణయించిన కూలీ రూ.307లో కోత పెట్టకుండా పూర్తిగా చెల్లించాలనే డిమాండ్తో కలెక్టరేట్ ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెండింగ్ వేతనాలు చెల్లించాలని, పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ వంటి వసతులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్.స్వామి, కె.ఆశన్న, గంగారాం తదితరులు పాల్గొన్నారు. -
పరిశుభ్రతతోనే దోమల నియంత్రణ
ఆదిలాబాద్: పరిసరాల పరిశుభ్రతతోనే దోమ ల నియంత్రణ సాధ్యమవుతుందని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకొని డీఎంహెచ్వో కార్యాలయంలో వైద్య సిబ్బందికి శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కీటక జనిత వ్యాధుల నివారణపై ముద్రించిన కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఈ ఏడాది ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాలేదన్నారు. దీనికి వైద్య సిబ్బంది ఎంతగానో కృషి చేశారన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పీహెచ్సీలు, సబ్ సెంటర్లు, పల్లె దవఖానాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి శ్రీధర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
రైతు కుటుంబాలను ఆదుకోవాలి
● బీసీ, ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ విశారదన్ కై లాస్నగర్: రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని, బాధిత కుటుంబాలకు రూ.15లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యస్థాపన కోసం చేపట్టిన లక్ష కిలోమీటర్ల రథయాత్రలో భాగంగా శుక్రవారం సాత్నాల మండలంలోని పార్డి–బి గ్రామంలో పర్యటించారు. విద్యుత్ షాక్తో మరణించిన రైతులు ఉగ్గే హనుమంతు, బొనిగల రాజు కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, రూ.15లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట డీఎస్పీ జిల్లా అధ్యక్షుడు అగ్గిమల్ల గణేశ్, ఉపాధ్యక్షురాలు సుష్మ, కార్యదర్శి గంగన్న, నాయకులు నవీన్, సాయి, రాంచందర్, శ్రీవాణి, దివ్యవాణి, సంతోష్ తదితరులున్నారు. -
ఇద్దరు వధువులు.. ఒక వరుడు
ఆదిలాబాద్ జిల్లా: వివాహం చేసుకునేందుకు అమ్మాయిలు దొరక్క చాలా మంది యువకులు ‘పెళ్లి కాని ప్రసాద్లు’గా మిగిలిపోతున్నారు. కొందరు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. ఒక వైపు పరిస్థితులు ఇలా ఉంటే.. మరో వైపు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ గిరిజన యువకుడు ఇద్దరు యువతులతో ప్రేమాయణం నడిపి, ఇద్దరినీ ఒకే మండపంలో వివాహం చేసుకున్నాడు. జైనూర్ మండలం అడ్డెసరాకు చెందిన ఆత్రం రంభబాయి, భాద్రుషావ్ దంపతుల కుమారుడు ఆత్రం చత్రుషావ్.. అదే గ్రామానికి చెందిన సెడ్మకి సోమిత్రబాయి, భీంరావ్ల కుమార్తె జంగుబాయి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం సాంగ్వి గ్రామానికి చెందిన గోడం రంభబాయి, యాదోరావ్ కుమార్తె సోన్దేవితో చత్రుషావ్కు పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య ఏడాదిగా ప్రేమాయణం సాగుతోంది. విషయం తెలుసుకున్న జంగుబాయి రాయిసెంటర్ను ఆశ్రయించింది. రాయిసెంటర్ పెద్దలు 15 రోజుల క్రితం మూడు కుటుంబాలతో చర్చించారు. యువతులిద్దరూ చత్రుషావ్తో కలిసి ఉండేందుకు ఒప్పుకున్నారు. దీంతో గురువారం బంధువుల సమక్షంలో వరుడి స్వగృహంలో వీరికి వివాహం జరిపించారు. కాగా, ఇటీవల ఇదే జిల్లాలో సిర్పూర్(యూ) మండలం గుంనూర్ (కె)కు చెందిన ఓ యువకుడు కూడా ఇద్దరు యువతులను పెళ్లి చేసుకోవడం తెలిసిందే. -
డేంజర్ బెల్స్
● ఉమ్మడి జిల్లాలో నిప్పుల కుంపటి ● రికార్డుస్థాయిలో 45.2 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు జిల్లా కేంద్రంలో తలపై చున్నీలు వేసుకుని కాలినడకన వెళ్తున్న యువతులుజాగ్రత్తలు పాటించాలి ఎండ నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలి. ఎండలో పనిచేసే వారు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలి. అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లవద్దు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలి. కొబ్బరి బోండాలు, పండ్లరసాలతో పాటు అధిక మొత్తంలో నీళ్లు తాగాలి. వడదెబ్బకు గురైతే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందాలి. – నరేందర్ రాథోడ్, డీఎంహెచ్వో, ఆదిలాబాద్ ఆదిలాబాద్టౌన్: ఉమ్మడి జిల్లాలో భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. రోజురోజుకు పగటి ఉ ష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.. ఉదయం 9 గంటలు దాటిందంటే చాలు ఇంటినుంచి బయటకు వెళ్లేందుకు జనాలు జంకుతున్నారు. రికార్డు స్థాయిలో ఈ ఏడాది ఏప్రిల్లోనే నిప్పుల కుంపటి తలపిస్తున్నాయి. గురువారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని చప్రాల, తాంసి, నిర్మల్ జిల్లా ముధోల్లో 45.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా భీమిని, ఆదిలాబాద్ జిల్లా మావలలో 45.1 డిగ్రీలు, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరిలో 45 డిగ్రీలు నమోదయ్యాయి. రెండుమూడు రోజులుగా ఉమ్మడి జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. ఎండ తీవ్రతకు జనాలు తల్లడిల్లిపోతున్నారు. పంట పొలాలకు వెళ్లి పనులు చేసుకునే కూలీలు, రైతులు, ఉపాధిహామీ కూలీలు, చిరు వ్యాపారులు ఎండ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి 8 గంటలు దాటినా ఎండ వేడిమితో సతమతం అవుతున్నారు. జనాలు ఇంటినుంచి బయటకు వెళ్లకుండా కూలర్లు, ఏసీలకు అతుక్కుపోతున్నారు. మూగజీవులకు నీళ్లు దొరకక అల్లాడుతున్నాయి. ఏప్రిల్లోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక రానున్న మే నెలలో దీని తీవ్రత మరింతగా పెరిగే అవకాశాలు లేకపోలేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత పెరిగిపోవడంతో జిల్లా కేంద్రంలోని ముఖ్య కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. -
సేంద్రియ మామిడి పండ్లతో ఆరోగ్యం
ఉట్నూర్రూరల్: ఎలాంటి రసాయన ఎరువులు వా డకుండా సహజంగా పండించిన మామిడి పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. గురువారం ఉట్నూర్ రైతు ఉత్పత్తిదారుల సంఘం సభ్యులు ఏర్పాటు చేసిన ఆదివాసీ ఆర్గానిక్ మామిడిపండ్ల స్టోర్ను ప్రారంభించారు. పీవో మాట్లాడుతూ పండ్లను మాగపెట్టడానికి రసాయనిక మందులు వాడితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సేంద్రియ మామిడిపండ్లు తాజాగా, రుచిగా ఉంటాయన్నారు. వీటిని తన సొంతఖర్చులతో కొనుగోలు చేసి మంత్రులు, తోటి శాసన సభ్యులకు పంపించి వాటి ప్రాముఖ్యతను వారందరికీ తెలియస్తానన్నారు. -
‘భూభారతి’తో భూసమస్యల పరిష్కారం
● కలెక్టర్ రాజర్షిషాబజార్హత్నూర్: భూభారతి చట్టంతో భూసమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతుల భూముల విషయంలో ఉన్న అభద్రతా భావానికి తావు లేకుండా జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ ధరణి చట్టం ప్రారంభించినప్పుడు ఆన్లైన్లో నా పట్టాభూమి మాయమైందని, మళ్లీ ఆన్లైన్లోకి తీసుకురావడానికి నెలల సమయం పట్టిందన్నారు. ఇలాంటి పొరపాట్లు జరిగినప్పుడు సామస్యులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి వస్తోందన్నారు. భూభారతిలో అలా జరగకుండా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పెండింగ్లో ఉన్న భూసమస్యల పరిష్కారానికి ధరణి చట్టం తీసుకువచ్చిందన్నారు. ప్రభుత్వాలు కొత్త చట్టాలను తీసుకువస్తే వాటిని పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. ధరణి స్థానంలో భూభారతి పేరు మాత్రమే మార్చారని, వాటి విధి విధానాలు మాత్రం రైతులకు మేలు చేయడానికేనన్నారు. ఈ సందర్భంగా రూ.2 లక్షల రుణమాఫీ అయ్యేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, బజార్హత్నూర్ మండలానికి సబ్ మార్కెట్యార్డు మంజూరు చేయాలని రైతులు కలెక్టర్కు మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, తహసీల్దార్ శ్యాంసుందర్, ఎంపీడీవో శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ మేకల వెంకన్న యాదవ్, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. రైతు సమస్యల పరిష్కారానికే ‘భూభారతి’ గుడిహత్నూర్: రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మన్నూరు ఎస్ కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ సునీత, తహసీల్దార్ కవితా రెడ్డి, మన్నూరు సహకార సంఘ చైర్మన్ ప్రకాశ్కరాడ్, డీటీ భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
వాంకిడి: బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ఒక మహిళ మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై ప్రశాంత్, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. బంబార గ్రామానికి చెందిన నాగుల విలాస్, నాగుల ఉమా (48) దంపతులు బుధవారం కాగజ్నగర్ మండలం నవేగాంలోని బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో సాయంత్రం జాతీయ రహదారిపై బంబార గ్రామ సమీపంలోని యూటర్న్ వద్ద వెనుక నుంచి వచ్చిన ఓ ద్విచక్రవాహనం వీరి వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. దీంతో వెనకాల కూర్చుని ఉన్న ఉమా రోడ్డు డివైడర్పై పడగా తలకు, చేతికి బలమైన గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం అంబులెన్స్లో మహా రాష్ట్రలోని చంద్రపూర్కు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆమె మృతి చెందింది. ఈ ప్రమాదంలో నాగుల విలాస్కు గాయాలయ్యాయి. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
● అమాయకుల అవసరాలు సొమ్ము చేసుకుంటున్నవైనం.. ● అధిక వడ్డీకి రుణాలు.. చెల్లించకుంటే ఆస్తుల వశం.. ● కొరడా ఝుళిపించిన ఎస్పీ ● జిల్లాలో ఏకకాలంలో ఆకస్మిక దాడులు ● 31 కేసులు నమోదు ● ప్రామిసరీ నోట్లు, బాండ్లు, బ్యాంక్ చెక్కులు, స్టాంప్ పేపర్స్ స్వాధీనం
సాక్షి,ఆదిలాబాద్:జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు శృతిమించిపోయాయి. అవసరానికి రుణాలు తీ సుకునే వారి నుంచి అధిక మొత్తంలో మిత్తి వసూలు చేస్తూ అమాయక ప్రజల నడ్డి విరుస్తున్నారు. డ బ్బులు చెల్లించని వారి నుంచి ఇల్లు, పొలాలు, వి లువైన ఆస్తులు బలవంతంగా హస్తగతం చేసుకుంటున్నారని బాధితుల నుంచి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఇలాంటి సమస్య పలు చోట్ల వెలుగులోకి రావడంతో గతం నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించడం జరుగుతోంది. జిల్లాలోనూ ఈ ఆగడాల నేపథ్యంలో తొలిసారి ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు బుధవారం ఏకకాలంలో పోలీసులు పలుచోట్ల ఆకస్మిక దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసు శాఖ నుంచి గురువారం ప్రకటన విడుదల చేశారు. కోట్ల రూపాయల వరకు.. అవసరానికి రుణాలు తీసుకునే వారి నుంచి వడ్డీ వ్యాపారులు అధిక మొత్తంలో వడ్డీ వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు అప్పులు ఇస్తున్న వడ్డీ వ్యాపారులు అంతకుమించి విలువైన ఇల్లు, పొలాలకు సంబంధించిన పత్రాలను తమ దగ్గర ఉంచుకుని జనా లకు రుణాలు ఇస్తున్నారనే ప్రచారం ముందు నుంచీ ఉంది. ప్రాపర్టీ సేల్ డీడ్, ప్రామిసరీ నోట్లు, బ్లాంక్చెక్కుల ద్వారా రుణం ఇచ్చే సమయంలోనే వడ్డీ వ్యాపారి తనకు అనువైన రీతిలో మలుచుకోవడం ద్వారా రుణగ్రహీత అవకాశాన్ని అనువుగా మార్చుకుంటున్నారన్న విమర్శలు కోకొల్లాలు. ఆ తర్వాత ఆ వ్యక్తి డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉంటే ఆ ఆస్తులను పూర్తిగా తమవశం చేసుకోవడం వంటివి ఇప్పటికే ఎన్నో జరిగాయనే అపవాదు ఉంది. జిల్లాలో ఇలా వడ్డీ వ్యాపారం చేసేవారికి హద్దేలేని సంపాదన వచ్చిపడుతుందని పలువురు చెప్పుకుంటున్నారు. వడ్డీకి రుణం తీసుకున్న వ్యక్తులు దాన్ని కట్టలేని పరిస్థితుల్లో సర్వం కోల్పోతున్న నేపథ్యాలు కూడా లేకపోలేదు. కాగా కొంతమంది పేరుకు ఇత ర బిజినెస్లు నిర్వహిస్తున్నట్లు మార్కెట్లో చెలామ ణి అవుతున్నప్పటికీ ప్రధానంగా వడ్డీ వ్యాపారమే వృత్తిగా కొనసాగుతుందనే విమర్శలు లేకపోలేదు. 31 కేసులు నమోదు.. జిల్లా వ్యాప్తంగా బుధవారం 30 బృందాలతో పోలీ సులు వడ్డీ వ్యాపారుల నివాస స్థలాలపై ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణం, మావల, ఇచ్చోడ, బోథ్, ఉట్నూర్, గుడిహత్నూర్, బేల, నార్నూర్ మండలాల్లో దాడులు ని ర్వహించి 31 కేసులు నమోదు చేశారు. ప్రామిసరి నోట్లు, స్టాంప్ పేపర్స్, చెక్కులు, స్థలాల డాక్యుమె ంట్లు స్వాధీనం చేసుకున్నారు. సెక్షన్ 3(5)(బి)తెలంగాణ ఏరియా మనిరెండర్స్ యాక్ట్ 1349 కింద కేసు నమోదు చేశారు. మొత్తంగా ఈ సంఘటన జిల్లాలో సంచలనం కలిగిస్తోంది. అదేవిధంగా వడ్డీ వ్యాపారుల ఆగడాలు తెలియజేస్తుంది. చర్యలు తప్పవు అవసరాలకు రుణాలు తీసుకున్న అమాయక ప్రజలను మోసం చేస్తూ అధిక వడ్డీలు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు. ఇచ్చోడలో 10, బోథ్లో 6, మావలలో 3, ఆదిలాబాద్ పట్టణంలో 6, ఉట్నూర్లో 2, ఆదిలాబాద్రూరల్, బేల, నార్నూర్, గుడిహత్నూర్లలో ఒక్కో కేసు నమోదు చేశాం. – అఖిల్ మహాజన్, ఎస్పీ, ఆదిలాబాద్ -
ఘనంగా సామూహిక వివాహ వేడుకలు
● ఏకమైన నాలుగు జంటలుఇంద్రవెల్లి: మండలంలోని అంజీ గ్రామపంచాయతీ పరిధి మామిడిగూడలో గురువారం ఆంద్ సమాజ్ ఆధ్వర్యంలో పరమాహంస సద్గురు పూలాజీబాబా సంస్థాన్ వద్ద సామూహిక వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకల్లో అదే గ్రామానికి చెందిన నాలుగు జంటలు ఏకమయ్యాయి. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి, పట్నాపూర్ శ్రీ సద్గురు పరమాహంస పూలాజీబాబా ధ్యాన్ మందిర్ వ్యవస్థాపకుడు కేశవ్ ఇంగ్లేతో పాటు ఆయా గ్రామాల ప్రజలు, బంధువులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఐటీడీఏ పీవీటీసీ ఏపీవో మెస్రం మనోహర్, ఆదివాసీ పెద్దలు డాకురే రాందాస్, కరాడే మారుతి, మెస్రం శేఖర్బాబు తదితరులు ఉన్నారు. -
రౌడీలు ప్రవర్తన మార్చుకోకపోతే పీడీయాక్ట్
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: రౌడీలు ప్రవర్తన మార్చుకోకపోతే పీడీయాక్ట్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. గురువారం ఆదిలాబాద్ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఆదిలాబాద్ సబ్ డివిజనల్ పరిధిలో రౌడీషీట్లు నమోదైన వారితో రౌడీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌడీయిజం చేస్తే చట్టపరమైన కేసులు నమోదు చేస్తూ అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేస్తామన్నారు. సత్ప్రవర్తన కలిగిన వారిపై రౌడీషీట్లు తొలగిస్తామన్నారు. ప్రజలను బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం లాంటివి మానుకోవాలని సూచించారు. నేరాలు లేని సమాజాన్ని తయారు చేయడానికి జిల్లా పోలీసు యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, సీఐలు బి.సునీల్ కుమార్, సీహెచ్ కరుణాకర్రావు, డి.సాయినాథ్, కె.ఫణింధర్, తదితరులు పాల్గొన్నారు. పదోన్నతితో మరింత బాధ్యత ఆదిలాబాద్టౌన్: పదోన్నతితో బాధ్యతలు మరింత పెరుగుతాయని ఎస్పీ అఖిల్ మ హాజన్ అన్నారు. హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన పది మంది కానిస్టేబుళ్లకు గురువారం పోలీసు కార్యాలయంలో చి హ్నాలను అలంకరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మొ త్తం 28 మందికి పదోన్నతి లభించడం, అందులో ఆదిలాబాద్ జిల్లా నుంచి పది మంది ఉండటం సంతోషంగా ఉందన్నారు. పదోన్నతి పొందిన వారిలో నిర్మల్ జిల్లాకు జి.సుభాష్, ఇ.సుదర్శన్, ఏ.ప్రకాశ్రెడ్డి, ఎం.వీరప్రకాశ్రెడ్డి, బి.గంగారెడ్డి, జగిత్యాల జిల్లాకు శివాజీ, రమణ, వెంకటి, లక్ష్మణ్రావు, వెంకటరమణను కేటాయించినట్లు తెలిపారు. -
‘అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలి’
కై లాస్నగర్: ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీ కేంద్రాలకు మే నెలంతా సెలవులు ప్రకటించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి సీతక్క ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆ సంఘం ఆధ్వర్యంలో అంగన్వాడీలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలుగా నమోదవుతున్నాయని, చిన్నారులు, గర్భిణుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మేలో సెలవులు ప్రకటిస్తామన్న మంత్రి సీతక్క హామీని నిలబెట్టుకోవాలన్నారు. తక్షణమే సర్క్యూలర్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీ యూ జిల్లా ఉపాధ్యక్షుడు చిన్నన్న, సహాయ కార్యదర్శి నవీన్ కుమార్, అంగన్వాడీ యూనియన్ నాయకులు రత్నమాల, ముక్త, ప్రమీల, సుభద్ర, అనసూయ, నజీమా, లక్ష్మి, భాగ్యశ్రీ పాల్గొన్నారు. -
ఆత్మహత్యకు యత్నించిన యువతి..
ఖానాపూర్: ప్రేమించిన యువకుడితో పెళ్లికి తల్లి దండ్రులు అంగీకరించకపోవడంతో యువతి ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందింది. ప్రోబేషనరీ ఎస్సై శ్రావణి తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్ మండలం కొలాంగూడ గ్రామానికి చెందిన ఆత్రం స్వప్న(18) గ్రామానికి చెందిన ఒక యువకుడిని ప్రేమించింది. దీనికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకుండా కొన్ని రోజులు వేచి ఉండాలని తెలిపారు. మనస్తాపానికి గురైన స్వప్న గుర్తు తెలియని పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుంచి నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతిచెందిందని ఎస్సై తెలిపారు. మృతురాలి తండ్రి దేవురావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు. -
లింగాపూర్లో దొంగతనం
కడెం: మండలంలోని లింగాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి దొంగతనం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుగిల్ల బుచ్చన్న కొడుకు దుబాయ్ వెళ్లగా కోడలు సరిత అత్తమామలతో కలి సి ఉంటుంది. బుధవారం సరిత తల్లిగారింటికి వెళ్లగా బుచ్చన్న గదికి తాళం వేసి పక్క గదిలో నిద్రించాడు. తె ల ్లవారుజాము చూసేసరికి గది తాళం, బీరువా తలుపులు పగులగొట్టి ఉన్నాయి. పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ అజయ్, ఎస్సై కృష్ణసాగర్రెడ్డి, క్లూస్టీం, డాగ్స్క్వాడ్తో గదిని పరిశీలించారు. తులం బంగారం, 11 తులాల వెండి ఎత్తుకెళ్లినట్లు, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ, ఎస్సైలు సూచించారు. -
నిర్మల్లోనే నాణ్యమైన విద్య
● ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డినిర్మల్టౌన్: హైదరాబాద్ విద్యాసంస్థలకు దీటుగా నిర్మల్లోనే ఆల్ఫోర్స్ విద్యాసంస్థ నాణ్యమైన విద్య అందిస్తుందని విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. ఇంటర్మీడియట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు గురువారం జిల్లా కేంద్రంలోని ఆల్ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాలలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆల్ఫోర్స్లో విద్యతో పాటు విలువలను అందిస్తామన్నారు. టాపర్స్ వీరే.. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ బాలికల విభాగంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాపర్స్గా నర్వాడే కృష్ణవేణి 468/470, జోషి ప్రసూన శ్రీ 468/470, పడిగెల కీర్తిశ్రీ కి 468/470, బాలుర విభాగంలో బోనాల శ్రీ చరణ్ 467/470, వడకపూర్ అఖిల్ 467/470, కార్తికేయన్ 467/470 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో సామ ఫిర్దోస్ 438/440, జోహా మహావీష్ 438/440, నబిలా తహరీమ్ 438/440 మార్కులు సాధించారు. సెకండ్ ఇయర్లో ఎంపీసీ, బైపీసీ విభాగాలలో కవల్ ప్రీత్కౌర్ 995/100, సుమయ కణం 994/100, జాదవ్ నవ్యశ్రీ 993/1000 మార్కులు సాధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాపర్లుగా నిలిచారు. కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
పెళ్లి నుంచి వస్తూ తిరిగిరాని లోకాలకు..
జన్నారం: బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న ఫిజియో థెరఫిస్టును రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది. ఎస్సై రాజవర్దన్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం గుడిహత్నూర్కు చెందిన ఉరిమెత జంగుబాబు (30) జన్నారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఫిజియో థెరఫిస్టుగా పని చేస్తున్నాడు. గురువారం బంధువుల పెళ్లికి కలమడుగుకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి వస్తున్న క్రమంలో కొమ్ముగూడెం వద్ద ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టి ఎగిరిపడ్డాడు. జంగుబాబు అక్కడికక్కడే మృతి చెందగా స్కూటిపై ఉన్న ఇందన్పల్లి గ్రామానికి చెందిన వంశీ తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై అక్కడకు చేరుకు ని వంశీని జన్నారం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్షేట్టిపేటకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
ఎల్సీకి సాంకేతికత!
● విద్యుత్ ప్రమాదాల నివారణకు యాప్ ● ఇక ఆన్లైన్లో విద్యుత్ లైన్ క్లియరెన్స్ ● అందుబాటులోకి తీసుకొచ్చిన ఎన్పీడీసీఎల్ ● యాప్పై అధికారులు, ఉద్యోగులకు శిక్షణ పూర్తిమంచిర్యాలరూరల్(హాజీపూర్): విద్యుత్ విని యోగదారులకు మరింతగా మెరుగైన, నాణ్య మైన సేవలు అందించేందుకు తెలంగాణ ఎన్పీడీసీఎల్ ఆధునిక సాంకేతిక పద్ధతులు అవలంభిస్తోంది. ఇందులో భాగంగా విద్యుల్ లైన్ క్లియరెన్స్ (ఎల్సీ) సులభంగా ఉండేలా చర్యలు చేపట్టింది. ఫోన్కాల్ ద్వారా ఎల్సీ తీసుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో విద్యుత్ ప్రమాదాలతో పాటు అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు ఎల్సీ (విద్యుత్ సరఫరా నిలిపివేత, పునరుద్ధరణ)తీసుకోవడానికి ఎన్పీడీసీఎల్ ప్రత్యేక యాప్ రూపొందించింది. ఇప్పటి వరకు ఎల్సీ తీసుకుంటే తీసుకున్న ఉద్యోగికి, సబ్స్టేషన్ ఆపరేటర్కు మాత్రమే తెలి సేది. కానీ యాప్ ద్వారా ఏఈ, ఏడీఈ, డీఈలు కూడా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. దీంతో ఎల్సీపై అందరి పర్యవేక్షణ కొనసాగుతుంది. అమలు ఇలా.. ఎల్సీ తీసుకోవాలనుకునే లైన్మెన్ యాప్ ఓపెన్ చేసి అందులో సంబంధిత ఏఈకి విన్నవించుకుంటే ఏఈ పరిశీలించి ఫీడర్లో ఎల్సీ ఇవ్వడానికి వీలు ఉందా లేదా అని పరిశీలించి అనుమతి ఇస్తారు. ఏఈ అనుమతి మేరకు లైన్మెన్, సబ్స్టేషన్ ఆపరేటర్కు యాప్ ద్వారా సమాచారం అందుతుంది. దీని ఆధారంగా యాప్లో నిర్దిష్టంగా పేర్కొన్న ఫీడర్లో ఎల్సీ ఇస్తారు. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేత, పునరుద్ధరణ పనులు బాధ్యతగా జరుగుతాయి. ఎలాంటి పొరపాట్లు జరగకుండా యాప్ తగు సూచనలు ఇస్తుంది. హెల్మెట్ ధరించాలని, హ్యాండ్ గ్లౌజ్లు పెట్టుకోవాలని, ఎర్త్ రాడ్ వాడాలని, ఏబీ స్విచ్ ఓపెన్ చేశారా లేదా వంటి జాగ్రత్తలు యాప్ గుర్తు చేస్తుంది. ఎక్కడైనా డబుల్ ఫీడరింగ్ ఉందా..? ఈ ఫీడర్కు వేరే ఫీడర్తో అనుసంధానం ఉందా..? వంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తుంది. డబుల్ ఫీడరింగ్ ఉంటే రెండు ఫీడర్లలో ఎల్సీ తీసుకోవడమా..? లేదా ఇతరత్రా జాగ్రత్తలు తీసుకోవచ్చా..? అని సంయమనం చేసుకుని సిబ్బంది పనులు పూర్తి చేస్తారు. ఎల్సీ తీసుకున్న ఫీడర్లో పని కాగానే సంబంధిత లైన్మెన్ యాప్లో ఆ సమాచారాన్ని పొందుపరచి విద్యు త్ సరఫరా పునరుద్ధరించవచ్చనే సంకేతాన్ని, సమాచారాన్ని యాప్ ద్వారా చేరవేస్తారు. దీన్ని సంబంధిత సెక్షన్ ఏఈ పరిశీలించి సబ్స్టేషన్ ఆపరేటర్కు చేరవేస్తారు. దీంతో ఎల్సీ తీసుకున్న ఫీడర్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తారు.అనవసర ఎల్సీలకు చెక్ విద్యుత్ వినియోగదారులకు మరింత ఉత్తమ సేవలు అందించడంతో పాటు భద్రతా ప్రమాణాలు పెంచడానికి ఎన్పీడీసీఎల్ ఎల్సీ యాప్ను ప్రత్యేకంగా రూపొందించింది. యాప్తో ఉద్యోగుల మధ్య సమన్వయం ఉంటుంది. ఏ లైన్పై పనులు జరుగుతున్నాయో కూడా సులభంగా తెలుస్తోంది. మొత్తంగా అనవసర ఎల్సీలు తగ్గుతాయి. యాప్ ద్వారా విద్యుత్ అంతరాయాలు, మానవ తప్పిదాలు, విద్యుత్ ప్రమాదాల నివారించవచ్చు. – గంగాధర్, ఎస్ఈ, మంచిర్యాల -
వడదెబ్బతో యువకుడు మృతి
నిర్మల్టౌన్: వడదెబ్బతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన గురువారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బ్రహ్మపూరి కాలనీకి చెందిన మహ్మద్ బేగ్ కుమారుడు సోఫిబేగ్ (25) గత రెండు రోజుల క్రితం వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురయ్యాడు. ఈక్రమంలో గురువారం ఇంట్లో మృతి చెందాడు. కాగా సోఫిబేగ్ మూడు నెలల క్రితం దుబాయ్ నుంచి నిర్మల్కు వచ్చాడు. మేకల కాపరి..ముధోల్: మండలంలోని మచ్కల్ గ్రామానికి చెందిన షెల్కే లింగురాం(58) అనే మేకల కాపరి వడదెబ్బతో మృతి చెందాడు. కు టుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగురాం మేకలు కాస్తూ జీవనం సాగించేవాడు. రోజు మాదిరిగానే బుధవారం గ్రామ సమీపంలో ఉన్న చెరువు వద్ద పెద్ద కుమారుడు గంగాధర్తో కలిసి మేకలను మేపుతున్నాడు. ఈక్రమంలో మిట్ట మ ధ్యాహ్నం ఒక్కసారిగా లింగురాం కుప్పకూలి పోయాడు. గంగాధర్ చెట్టు నీడకు తీసుకెళ్లేందు కు ప్రయత్నించగా లింగురాం స్పందించలేదు. వెంటనే గ్రామంలోకి వెళ్లి కుటుంబసభ్యుల కు, గ్రామస్తులకు సమాచారం అందించారు. వారు వచ్చే సరికి లింగురాం మృతి చెంది ఉన్నాడు. లింగురాంకు భార్య లక్ష్మి, కుమారులు గంగాధర్, శ్రావణ్, కుమార్తె పూజ ఉన్నారు. బెల్లం, పటిక పట్టివేతతాండూర్: జాతీయ రహదారి మీదుగా అక్రమంగా నాటుసారా తయారీకి వినియోగించే బెల్లం, పటికను తరలిస్తుండగా గురువారం ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గోలేటికి చెందిన దుర్గం రాజ్కుమార్, దాగం సంజు, అజ్మీరా చందు అనే వ్యక్తులు బెల్లం, పటిక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఐబీ తాండూర్ ప్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఎకై ్సజ్ అధికారులు కారును తనిఖీ చేసి పట్టుకున్నారు. -
ఫోన్కాల్ రచ్చ ప్రాణం తీసింది..!
● భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య ● సోదరుడికి ఫోన్ చేయడమే శాపమైందా..? ● విద్యార్థి సంఘాలు, కుటుంబ సభ్యుల ఆందోళన ● అదనపు కలెక్టర్, పోలీసుల జోక్యంతో విరమణమంచిర్యాలక్రైం: ఫోన్ కాల్ విషయమై జరిగిన రచ్చ ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకునేలా చేసింది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమిని మండలం జగ్గయ్యపేటకు చెందిన జంగంపల్లి గోపాల్, నాగమ్మ దంపతుల రెండో కూతురు లక్ష్మిప్రసన్న మంచిర్యాలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. గురువారం ఉదయం హాస్టల్ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకింది. కళాశాల విద్యార్థులు, సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మధ్యాహ్నం చనిపోయింది. మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు కళాశాల సిబ్బంది, నైట్వాచ్మెన్ మహేశ్ వేధింపులే కారణమంటూ ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. అదనపు కలెక్టర్ మోతీలాల్ ఆస్పత్రికి చేరుకోగా.. విద్యార్థిని తండ్రి గోపాల్ ఆయన కాళ్లపై పడి న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు. లక్ష్మిప్రసన్న మృతికి కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. రూ. 20లక్షలు పరి హా రం, కుటుంబంలో ఒకరికి ప్ర భుత్వ ఉద్యోగం ఇవ్వాలని అ న్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్, నా యకులు పాల్గొన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులతో మా ట్లాడిన అదనపు కలెక్టర్.. న్యాయం చేస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ వెల్లడించారు. అసలేం జరిగింది.. ఈ నెల 23న రాత్రి 9.30గంటలకు లక్ష్మిప్రసన్న తన చిన్నమ్మ కొడుకు వెంకటేష్కు వాచ్మెన్ మహేశ్ సెల్ఫోన్ నుంచి ఫోన్ చేసింది. తర్వాత 9.45గంటలకు వెంకటేష్ వాచ్మెన్కు ఫోన్ చేసి ఇంత రాత్రి ఫోన్ ఎందుకు ఇచ్చావంటూ బెదిరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త ఔట్సోర్సింగ్ ఏజెన్సీ మేనేజర్ మల్లేష్కు ఫోన్ ద్వారా వెంకటేష్ ఫిర్యాదు చేయడం, మహేశ్పై మల్లేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉద్యోగంలో నుంచి తొలగిస్తానని బెదిరించడం, ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ అనూష దృష్టికి తీసుకెళ్లడం వరకు వెళ్లాయి. అయితే ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం, వాచ్మెన్ మహేశ్ లక్ష్మిప్రసన్నపై ఒత్తిడి చేసి వేధించారని, భరించలేకనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, విద్యార్థిని చిన్నమ్మ కొడుకు వెంకటేష్ ఆరోపించారు. -
ఊపిరాడక 20 మేకలు మృతి
ఆదిలాబాద్టౌన్(జైనథ్): భోరజ్ మండలం సిర్సన్న గ్రామంలో గురువారం 20 మేకలు ఊపిరాడక మృతిచెందాయి. గ్రామంలోని ఆత్రం యాదవ్, గెడాం వికాస్లు తమ మేకలను మేపడానికి గ్రామంలోని వైకుంఠధా మం ప్రాంతానికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం తిరిగి ఇంటికి తీసుకెళ్లాల్సి ఉండగా, వాటిని వైకుంఠధామంలోని స్నానాల గదిలో ఉంచి తలుపులు వేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో వెళ్లి చూసేసరికి ఊపిరాడక 20 మేకలు మృతిచెందాయి. రేకులు ఉండటం, తలుపులు వేసి ఉండడంతో ఎండ తీవ్ర త తట్టుకోలేక, ఊపిరాడక మృతిచెందాయని తె లుస్తోంది. వీటి విలువ దాదాపు రూ.2లక్ష ల వరకు ఉంటుందని, ప్రభుత్వం నష్టపరి హా రం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. జొన్న పంట దగ్ధంఆదిలాబాద్టౌన్(జైనథ్): సాత్నాల మండలంలోని మేడిగూడకు చెందిన కళ్లెం రాంరెడ్డి అనే రైతుకు చెందిన రెండెకరాల జొన్న పంట దగ్ధమైంది. గురువారం చేనుకు ఆనుకొని ఉన్న పక్క చేను రైతు గట్లపై ఉన్న చెత్తను తొలగించేందుకు నిప్పు పెట్టడంతో ప్రమాదవశాత్తు జొన్న పంటకు నిప్పంటుకుంది. దీంతో పంట పూర్తిగా కాలిబూడిదైంది. పంట చేనులో ఉన్న 50 పైపులు కూడా మంటలో కాలిపోయినట్లు రైతు వాపోయాడు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.ఉన్నాయి. పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ అజయ్, ఎస్సై కృష్ణసాగర్రెడ్డి, క్లూస్టీం, డాగ్స్క్వాడ్తో గదిని పరిశీ లించారు. తులం బంగారం, 11 తులాల వెండి ఎ త్తుకెళ్లినట్లు, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నా రు. కాగా ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ, ఎస్సైలు సూచించారు. విద్యుత్షాక్కు గురైన వ్యక్తి మృతినర్సాపూర్(జి): డొంగుర్గాం గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై చికిత్స పొందుతున్న వ్యక్తి గురువారం మృతిచెందాడు. ఎస్సై సాయికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ధనే విజయ్(51) ఈనెల 11న జంగిపల్లి చిన్నయ్య వ్యవసాయ క్షేత్రంలోని ట్రాన్స్ఫార్మర్ దగ్గర మోటార్ పైపులను చెక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్కు తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నిర్మల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బుధవారం డిశ్చార్జి చేయగా డొంగుర్గాం గ్రామానికి తీసుకురాగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. విజయ్ తమ్ముడు వినయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఏసుక్రీస్తు పునరుత్థాన జాతర
● సీఎస్ఐ చర్చి ఆవరణలో మహోత్సవం ● పెద్ద ఎత్తున తరలిరానున్న క్రైస్తవులు ● ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తిలక్సెట్టిపేట: ఏసుక్రీస్తు పునరుత్థాన మహోత్సవ ప్రాంతీయ జాతరను సీఎస్ఐ చర్చి ఆవరణలో ఈ నెల 25, 26న నిర్వహించనున్నారు. ఈ జాతరకు సుదూర ప్రాంతాల నుంచి క్రైస్తవులు పెద్దఎత్తున తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్రార్థనలకు అన్ని ఏర్పాట్లు చేశారు. 1920లో నిర్మాణం.. ఏటా ఏప్రిల్ 25, 26వ తేదీల్లో సీఎస్ఐ చర్చిలో ఈ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రంలో మెదక్ తర్వాత రెండో పెద్దచర్చిగా పేరొందిన లక్సెట్టిపేట సీఎస్ఐ చర్చి జిల్లాలోని చారిత్రక కట్టడాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. లక్సెట్టిపేట పట్టణ సమీపంలో సుమారు 100 ఎకరాలకు పైగా పచ్చటి పొలాలు, టేకు చెట్ల వనంలో మిషన్ కాంపౌండ్ ప్రాంతంలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో సీఎస్ఐ చర్చిని ఆంగ్లేయులు నిర్మించారు. 1920లో ఇక్కడికి వచ్చిన ఇంగ్లాండ్ దేశస్తుడు రెవ సీజీ అర్లి దొర నిర్మాణం ప్రారంభించాడు. ఇంగ్లాండ్ నుంచి రంగురంగుల అద్దాలు, దగ్గరలోని గూడెం గుట్ట, గువ్వల గుట్ట, చిన్నయ్య గుట్టల నుంచి రాళ్లు తెప్పించాడు. సమీప బొట్లకుంటలోని నీటిని నిర్మాణానికి ఉపయోగించారు. మహారాష్ట్ర శిల్పకళాకారులు ఆకర్షణీయంగా నిర్మాణాన్ని తీర్చిదిద్దారు. నిర్మాణం పనులు సాగుతుండగా వేసవి కాలంలో వడదెబ్బ తగిలి అనారోగ్యానికి గురై అర్లి దొర తిరిగి ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత 1935లో రివ హెచ్ బర్డ్ చర్చి నిర్మాణాన్ని పరిశీలించి పూర్తి చేయించాడు. అనంతరం ఇక్కడకు మిషనరీగా వచ్చిన రెవ ఫాస్పూట్ చర్చిని సీఎస్ఐ చర్చిగా నామకరణం చేసి ప్రారంభించాడు. ఘనంగా ఏర్పాట్లు.. జాతర ఏర్పాట్లను సీఎస్ఐ చర్చి కమిటీ సభ్యులు ఫాధర్ డేవిడ్పాల్ పర్యవేక్షిస్తున్నారు. 25న ఉదయం గ్రామాల్లో పర్యటిస్తూ సాయంత్రం ఊత్కూరు చౌరస్తా నుంచి భాజాభజంత్రీలతో పెద్ద ఎత్తున క్రైస్తవులు ర్యాలీగా చర్చి వద్దకు చేరుకుంటారు. 7 గంటలకు సిలువ వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేసి కీర్తనలు పాడుతారు. 26న ఉదయం నుంచి చర్చిలో ప్రత్యేక కీర్తనలు పాడుతూ పలు సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం సిలువ గుట్టపైకి వెళ్లి కొవ్వొత్తులు వెలిగిస్తారు. -
ఆదివాసీ వంటలకు డిమాండ్
● ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ● ఉట్నూర్లో ఇప్పపువ్వు పండుగ కార్యక్రమంఉట్నూర్రూరల్: ఆదివాసీ సాంప్రదాయ వంటలకు ఎంతో డిమాండ్ ఉందని, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. గురువారం ఉట్నూర్ కేబీ ప్రాంగణంలోని పీఎంఆర్సీ సమావేశ మందిరంలో 8వ ఇప్పపువ్వు పండుగ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్లు పాల్గొన్నారు. మహిళలు ఇప్పపువ్వులతో తయారు చేసిన వంటకాలు ప్రదర్శించారు. ఆదివాసీ మహిళలు ఆదివాసీ పద్దతులు, సాంప్రదాయ వంటకాలపై అధికారులకు వివరించి తినిపించారు. అధికారులు మాట్లాడుతూ ఇప్పపువ్వు లడ్డులో ఎన్నో పోషకాలు ఉన్నాయన్నారు. ఈ లడ్డూలు ఉట్నూర్ ఎక్స్రోడ్డులో అందుబాటులో ఉంటాయని తెలిపారు. 12 మంది గిరిజన మహిళా సంఘం సభ్యులు ఇప్పపువ్వుల లడ్డూలు తయారుచేస్తూ ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి, దుర్గు పటేల్, సహకార మిత్ర సంస్థ మేనేజర్ విఠల్, పేసా కోఆర్డినేటర్ వసంత్రావు, రాయి సెంటర్ల్ల, సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
‘తార’ సేవలు భేష్
● ఎస్పీ అఖిల్ మహాజన్ ● ఘనంగా పోలీసు జాగిలం అంత్యక్రియలుఆదిలాబాద్టౌన్: పోలీసు శాఖకు జాగిలం తార అందించిన సేవలు మరువలేనివని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. 2013 బ్యాచ్లో పోలీసు వ్యవస్థలోకి వచ్చిన తార జిల్లాలో పేలుడు పదార్థాలను కనుగొనడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. పోలీసు జాగిలం తార మృతిచెందడంతో గురువారం పోలీసు కార్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ పాల్గొని తారకు శాలువా, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వీఐపీలు జిల్లాపర్యటనకు వచ్చిన సందర్భంగా భద్రత విషయంలో తనిఖీలు నిర్వహించడంలో తార సేవలు ఎంతగానో దోహద పడ్డాయని గుర్తు చేశారు. పోలీసు జాగిలాలకు సకల సదుపాయాలు కల్పించాలని, ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతీ జాగిలానికి కూలర్ ఏర్పాటు చేయాలని సూచించారు. రిజర్వు ఇన్స్పెక్టర్ వెంకటి, మురళి, డాగ్స్క్వాడ్ సిబ్బంది రమేశ్, తిరుమలేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఫోన్కాల్ రచ్చ ప్రాణం తీసింది..!
మంచిర్యాలక్రైం: ఫోన్ కాల్ విషయమై జరిగిన రచ్చ ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకునేలా చేసింది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమిని మండలం జగ్గయ్యపేటకు చెందిన జంగంపల్లి గోపాల్, నాగమ్మ దంపతుల రెండో కూతురు లక్ష్మీప్రసన్న మంచిర్యాలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. గురువారం ఉదయం హాస్టల్ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకింది. కళాశాల విద్యార్థులు, సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మధ్యాహ్నం చనిపోయింది. మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు కళాశాల సిబ్బంది, నైట్వాచ్మెన్ మహేశ్ వేధింపులే కారణమంటూ ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. అదనపు కలెక్టర్ మోతీలాల్ ఆస్పత్రికి చేరుకోగా.. విద్యార్థిని తండ్రి గోపాల్ ఆయన కాళ్లపై పడి న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు. లక్ష్మీప్రసన్నమృతికి కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. రూ. 20లక్షలు పరి హా రం, కుటుంబంలో ఒకరికి ప్ర భుత్వ ఉద్యోగం ఇవ్వాలని అ న్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్, నా యకులు పాల్గొన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులతో మా ట్లాడిన అదనపు కలెక్టర్.. న్యాయం చేస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ వెల్లడించారు. అసలేం జరిగింది..ఈ నెల 23న రాత్రి 9.30గంటలకు లక్ష్మీప్రసన్న తన చిన్నమ్మ కొడుకు వెంకటేష్కు వాచ్మెన్ మహేశ్ సెల్ఫోన్ నుంచి ఫోన్ చేసింది. తర్వాత 9.45గంటలకు వెంకటేష్ వాచ్మెన్కు ఫోన్ చేసి ఇంత రాత్రి ఫోన్ ఎందుకు ఇచ్చావంటూ బెదిరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ మేనేజర్ మల్లేష్కు ఫోన్ ద్వారా వెంకటేష్ ఫిర్యాదు చేయడం, మహేశ్పై మల్లేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉద్యోగంలో నుంచి తొలగిస్తానని బెదిరించడం, ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ అనూష దృష్టికి తీసుకెళ్లడం వరకు వెళ్లాయి. అయితే ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం, వాచ్మెన్ మహేశ్ లక్ష్మీప్రసన్నపై ఒత్తిడి చేసి వేధించారని, భరించలేకనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, విద్యార్థిని చిన్నమ్మ కొడుకు వెంకటేష్ ఆరోపించారు. -
కట్టుకున్న భార్యలను కడతేర్చారు..
కలకాలం కాపురం చేస్తామని చేసిన బాసలు మరిచిన ఆ ఇద్దరు భర్తలూ భార్యల పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. తన వివాహేతర సంబంధాన్ని నిలదీసిందని కోపం పెంచుకున్న ఓ భర్త అదనుచూసి సహచరిని అంతం చేయగా, ఆడపిల్లలను కనిందన్న కోపంతో భార్యను హత్య చేశాడు మరో భర్త. నమ్మించి మెడ కోశాడు..గుడిహత్నూర్: కలహాల కాపురంతో విసిగిపోయిన భార్య పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది. సహించలేకపోయిన భర్త ఆమెను అంతమొందించాలని పథకం వేశాడు. నాలుగు రోజులు అత్తింటి వారితో మర్యాదగా వ్యవహరిస్తూ నమ్మించాడు. గురువారం కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిహత్నూర్కు చెందిన లట్పటే మారుతికి ఇదే గ్రామానికి చెందిన కీర్తి (28)తో 2012లో వివాహం జరిగింది. మారుతి ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై కీర్తి పలుమార్లు భర్తను నిలదీసింది. అయినా తీరు మార్చుకోకపోవడంతో ఇటీవల కీర్తి తన ముగ్గురు పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కక్ష పెంచకున్న మారుతి తన భార్యను అంతమొందించాలని పథకం వేశాడు. ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా అత్తగారింటికి వచ్చి వారితో మర్యాదగా ప్రవర్తించాడు. గురువారం ఉదయం కీర్తి తాగునీటి కోసం ఇంటి సమీపంలోని నల్లా వద్దకు వెళ్లగా, మారుతి వెంట తెచ్చుకున్న కత్తితో కీర్తి మెడపై దాడి చేసి పారిపోయాడు. రిమ్స్కు తరలించేలోపే ఆమె మృతిచెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భీమేష్, ఎస్సై మహేందర్ తెలిపారు.ఆడపిల్లలు పుట్టారని హతమార్చాడు..కాగజ్నగర్ రూరల్: మొదటి భార్యకు మగ సంతానం జన్మించలేదని రెండో పెళ్లి చేసుకున్నాడు ఓ భర్త. ఆమెకూ ఇద్దరు ఆడపిల్లలు జన్మించడంతో ఆగ్రహం పెంచుకున్నాడు. రెండో భార్యతో గొడవ పడి తలపై దాడి చేసి చంపాడు. ఈ సంఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం వంజిరి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వంజిరి గ్రామానికి చెందిన డోకే జయరాంకు ఆసిఫాబాద్కు చెందిన భీంబాయితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది.వీరికి ఓ కూతురు పుట్టగా, మగసంతానం లేదని జయరాం కాగజ్నగర్ మండలం జగన్నాథ్పూర్కు చెందిన పోషక్కను (40) 2010లో రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమెకు కూడా ఇద్దరూ కూతుళ్లే రవళి (12), గౌతమి (6) పుట్టారు. దీంతో మగపిల్లలు లేరని జయరాం తరచూ ఇద్దరు భార్యలతో గొడవ పడేవాడు. బుధవారం రాత్రి కూడా రెండో భార్య పోషక్కతో గొడవ జరిగింది. ఆవేశానికి గురైన జయరాం పలుగుతో ఆమె తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో పోషక్క అక్కడికక్కడే మృతిచెందింది. ఘటనస్థలాన్ని కాగజ్నగర్ ఇన్చార్జి సీఐ రాజేంద్రప్రసాద్, ఎస్సై సందీప్ పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. -
● ఎస్హెచ్జీల ద్వారా అందించేందుకు కసరత్తు ● ఇళ్ల నిర్మాణాల వేగవంతంపై అధికారుల దృష్టి
కై లాస్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసే దిశగా యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలన్నీ ప్రారంభించే దిశగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పలువురు మొదలు పెట్టగా.. చాలామంది ఆర్థిక ఇబ్బందులతో షురూ చేయలేదు. అలాంటి వారిని గుర్తించి త్వరగా ప్రారంభించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా రూ.లక్ష వరకు ఆర్థికసాయం అందించేలా యోచిస్తున్నారు. ఈ మేరకు హౌసింగ్, డీఆర్డీఏ అధి కారులు, ఎంపీడీవోలతో మంగళవారం గూ గుల్ మీట్ ద్వారా సమీక్షించిన కలెక్టర్ ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తదనుగుణంగా ఆయా శాఖల అధికారులు కసరత్తు ప్రారంభించారు. భారీగా మెటీరియల్ ధరలు.. పేదల సొంతింటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. పైలట్ ప్రాజెక్ట్ కింద మండలానికి ఒకటి చొప్పున 17 గ్రామాలను ఎంపికచేసి అర్హులైన వారి కి మంజూరు చేసింది. ఇందులో కొంత మంది ని ర్మాణాలు ప్రారంభించారు. హౌసింగ్ శాఖ ఇచ్చిన మార్కవుట్ ప్రకారం పనులు చేపడుతున్నారు. కొంతమంది బెస్మెంట్ సైతం పూర్తి చేశారు. చాలా వరకు మాత్రం నిర్మాణాలకు ముందుకు రావడం లేదు. ఇసుక, సిమెంట్, స్టీల్ ధరలు భారీగా ఉండటంతో పాటు ఆర్థిక స్థోమత లేకపోవడంతో పనులు చేపట్టేందుకు వెనుకాడుతున్నారు. పాత ఇళ్లను తొలగించి పునాదులు తీసుకుంటే ప్రభుత్వమిచ్చే డబ్బులు ఆలస్యమైతే తమ పరిస్థితి ఏంటనే ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వారిని గుర్తించి స్వయం సహాయక సంఘాల ద్వారా రూ.లక్ష వరకు వడ్డీలేని రుణాలు అందించాలని అధికారులు నిర్ణయించారు. ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈ సాయం మంజూరు చేసినట్లైతే పనులు ముమ్మరమై నిర్మాణాలు త్వరగా పూర్తయ్యే అవకాశముంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వం జమ చేసిన డబ్బులను తిరిగి ఎస్హెచ్జీలకు అందించేలా చర్యలు చేపడుతున్నారు. ఈ నిర్ణయంపై ఇప్పటి వరకు ఇంటి నిర్మాణాలు చేపట్టని వారిలో హర్షం వ్యక్తమవుతోంది. నాలుగు విడతల్లో ఆర్థిక సాయం ఇందిరమ్మ లబ్ధిదారులకు నాలుగు విడతల్లో ఇంటి నిర్మాణానికి అవసరమైన రూ.5లక్షల ఆర్థికసాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మొదట పునాదులు పూర్తయితే రూ.లక్ష, పిల్లర్లు వేసిన తర్వాత 1.25లక్షలు, స్లాబ్ తర్వాత రూ.1.75లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో రూ.లక్ష చొప్పున జమ చేయనున్నారు. ఆర్థిక స్థోమత లేని లబ్ధిదారులకు ఐకేపీ ద్వారా మరో రూ. లక్ష రుణం అందించనున్నారు. అయితే లబ్ధిదారు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులై ఉండటంతో పాటు వారు ఉన్న సంఘం రుణానికి అర్హత కలిగి ఉన్నట్లేతేనే అందజేయనున్నారు.తాంసి మండలం హస్నాపూర్లో పూర్తయిన బేస్మెంట్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం వివరాలు: పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన గ్రామాలు: 17 మంజూరు చేసిన ఇళ్ల సంఖ్య : 2,148 మార్కవుట్ ఇచ్చినవి: 1,022 బేస్మెంట్ వరకు పూర్తయినవి : 118 ఇంకా ప్రారంభించనివి : 1,126వివరాలు సేకరిస్తున్నాం ఇందిరమ్మ ఇళ్లు మంజూరై ఆర్థికస్థోమత లేని లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. కలెక్టర్ సైతం సూచనలు చేశా రు. తదనుగుణంగా వారి వివరాలుఅందించాలని జెడ్పీ సీఈవోకు సూచించాం. వారిచ్చే వివరాల ప్రకారం లబ్ధిదారులు ఎస్హెచ్జీల్లో ఉన్నారా.. ఆ సంఘానికి రుణం పొందే అర్హత ఉందా.. అనే వివరాలు పరిశీలించి రుణసాయం అందించేలా చర్యలు చేపడుతాం. – రాథోడ్ రవీందర్, డీఆర్డీవో -
‘బెల్టు’ తీయరేమి?
● జిల్లాలో జోరుగా బెల్టుషాపుల నిర్వహణ ● ‘మహా’ సరిహద్దులో యథేచ్ఛగా దేశీదారు విక్రయాలు ● ‘మామూలు’గా వ్యవహరిస్తున్న ఎకై ్సజ్ శాఖ ఆదిలాబాద్టౌన్: బెల్టు షాపులతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుపుతుండడంతో కూలీనాలి చేసేవారు వాటికి అలవాటుపడి విలు వైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ము ఖ్యంగా యువత మద్యం మత్తులో తూగుతున్నా రు. దీంతో గొడవలకు దారి తీస్తున్నాయి. ఇటీవల పలువురు హత్యలు, దాడులకు పాల్పడిన ఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. తెల్లవారుజామునే బెల్టుషాపులు తెరుచుకుంటున్నాయి. అర్ధరాత్రి వరకు కొనసాగుతుండడంతో మద్యం బాబులు నిత్యం కిక్కులోనే ఉంటున్నారు. కొంద రు కిరాణ షాపులు, హోటళ్లు, పాన్షాపులు, ఇళ్లలో వీటిని నిర్వహిస్తున్నారు. ఎకై ్సజ్ అధికారులు నామమాత్ర తనిఖీలకే పరిమితమవుతుండడంతో వీరి వ్యాపారం మూడు బాటిళ్లు.. ఆరు బీర్లు అన్న చందంగా సాగుతుందనేవిమర్శలున్నాయి. పుట్టపుగొడుగుల్లా బెల్టుషాపులు.. జిల్లాలో బెల్టుషాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. గల్లీకొకటి చొప్పున దర్శనమిస్తున్నాయి. పల్లెల్లో వీడీసీల ద్వారా వేలం నిర్వహించి అనధికారికంగా విక్రయాలు చేపడుతున్నారు. బాటిల్కు రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఏరులైపారుతున్న దేశీదారు.. మహారాష్ట్ర సరిహద్దున గల గ్రామాల్లో వెలిసిన బె ల్టుషాపుల్లో దేశీదారు ఏరులై పారుతోంది. ఇటీవ ల ఎకై ్సజ్, పోలీసు అధికారులు వీటిపై దాడులు చేసి వందల సంఖ్యలో బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. జైనథ్, బేల,భీంపూర్ తదితర మండలాల్లో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మహారాష్ట్రలో దేశీదారు బాటిల్ ధర రూ.80 ఉండగా, ఇక్కడ రూ.120 నుంచి రూ.140 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ద్విచక్ర వాహనాలు, కాలినడకన వీటిని రవాణా చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం.. నిబంధనల ప్రకారం లైసెన్స్ ఉన్న వారు మాత్రమే మద్యం విక్రయించాలి. అయితే జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా చాలాచోట్ల బెల్టుషాపులు ఏర్పాటు చేసుకొని విచ్చలవిడిగా విక్రయాలు సాగిస్తున్నారు. తక్కువ ధరకు లభించే మద్యంతో పాటు కల్తీ మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు తెలుస్తోంది. వీరికి ఆయా రాజకీయ పార్టీల నాయకుల అండదండలు ఉండడంతో సంబంధిత శాఖ అధికారులు సైతం ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు నిబంధనలు అతిక్రమించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. రాత్రి 10 తర్వాత ఎవరైనా మద్యం విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఇటీవల దాబా హోటళ్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించాం. అలాగే డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. – అఖిల్ మహాజన్, ఎస్పీ -
వాతావరణం
మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరగనుంది. వడగాలులు వీస్తాయి. ఉక్కపోత ప్రభావం అధికంగా ఉంటుంది. 11లోu తాంసి మండలం లింగుగూడలో గల ఓ బెల్టు షాపులో ఈనెల 16న మహారాష్ట్ర నుంచి దేశీదారు తీసుకొచ్చి విక్రయిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. 280 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.ఆదిలాబాద్రూరల్ మండలం భీంసరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల 500 దేశీదారు బాటిళ్లు తీసుకొస్తుండగా పక్కా సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ● ఆదిలాబాద్ పట్టణంలోని వన్టౌన్ పరిధిలో బెల్టుషాపు నిర్వహిస్తున్న ఇద్దరిపై స్థానిక పోలీసులు ఇటీవల కేసులు నమోదు చేశారు. అలాగే టూటౌన్ పరిధిలో వడ్డెర కాలనీ తదితర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న బెల్టుషాపులపై దాడులు జరిపి పలువురిపై కేసులు నమోదు చేశారు. -
నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు
ఆదిలాబాద్టౌన్: నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన సబ్ కంట్రోల్ రూంను బుధవారం ప్రారంభించారు. ఏ ఎస్సై ముకుందరావుకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బస్టాండ్, పరిసర ప్రాంతాల్లో చిన్నపాటి దొంగతనాలు, ఈవ్టీజింగ్, రోడ్డు ప్రమాదాలు వంటి ఘటనలు చోటు చేసుకుంటే తక్షణ సాయంగా పోలీసులు అందుబా టులో ఉంటారన్నారు. క్షణాల వ్యవధిలో స్పందించేలా ఉదయం నుంచి రాత్రి వరకు ఏఎస్సైతో పాటు హెడ్కానిస్టేబుల్, కానిస్టేబుల్ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆదిలా బాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, వన్టౌన్, టూటౌన్, ట్రాఫిక్ సీఐలు సునిల్ కుమార్, కరుణాకర్రావు, ప్రణయ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. వయోవృద్ధులకు పూర్తి సహకారం జిల్లా పోలీసు యంత్రాంగం వయోవృద్ధులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. తెలంగాణరాష్ట్ర వయోవృద్ధుల సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం వన్టౌన్ ఎదుట ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో ఆర్డీవో వినోద్ కుమార్, సంఘం సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ బస్టాండ్ వద్ద సబ్ కంట్రోల్ రూం ప్రారంభం -
రాయితీ సద్వినియోగం చేసుకోండి
కై లాస్నగర్: ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించేవారికి 5శాతం రాయితీ కల్పించినట్లు ము న్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు తెలిపారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఎర్లీబర్డ్ పథకం అమలు తీరుపై రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేటాయించిన వార్డుల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ వీలైనంత మేర పన్ను వసూలు చేసేలా శ్రద్ధ వహించాలన్నారు. ఈ నెల 30 వరకు గడువు ఉందని, పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో ఆర్వో స్వామి, ఆర్ఐలు వెంకటేశ్, హన్మంతు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
● విజయం సాధించే దాకా ఆపలే.. ● నిష్కామకర్మను ఫాలో అయ్యా.. ● ఆరో ప్రయత్నంలో లక్ష్యం సాధించా ● ట్రైబల్, రూరల్ డెవలప్మెంట్కు కృషి ● ‘సివిల్స్’ 68వ ర్యాంకర్ సాయిచైతన్య జాదవ్ మనోగతం
సాక్షి,ఆదిలాబాద్: ‘ఈ ఆనంద క్షణాలను మరువలే ను.. పట్టుదల వీడకుండా చేసిన ప్రయత్నమే నన్ను విజయతీరాలకు చేర్చింది.. యూపీఎస్సీ అంటేనే తీవ్రమైన పోటీ. ఆరేళ్లుగా సాగిన నా ప్రి పరేషన్ మొత్తం ఈ సారి అత్యుత్తమ ర్యాంక్ రావడానికి దోహదపడింది..’ అని అన్నారు ఆది లాబాద్ జిల్లా ఉట్నూర్కు చెందిన సాయిచైతన్య జాదవ్. మంగళవారం విడుదలైన సివిల్ సర్వీస్ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 68వ ర్యాంకు సాధించి జిల్లా కీర్తిని ఇనుమడింపజేశారు. ఈ నే పథ్యంలో హైదరాబాద్లో ఉన్న ఆయనను ‘సాక్షి’ బుధవారం ఫోన్ ద్వారా ‘ఇంటర్వ్యూ’ చేసింది. ఈ సందర్భంగా ఆయన తన సక్సెస్కు దారితీసిన అంశాలను ఇలా వివరించారు. సాక్షి: మీ కుటుంబ నేపథ్యం.. సాయిచైతన్య: మాది తలమడుగు మండలం పల్సి (బి) గ్రామం. మహారాష్ట్రకు సరిహద్దుగా ఉంది. నాన్న గోవింద్రావ్ హెడ్కానిస్టేబుల్. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో పనిచేస్తున్నారు. అమ్మ కవిత ఉట్నూర్ ఎంపీపీఎస్లో ఉపాధ్యాయురా లు. సోదరి శృతికి వివాహమైంది. హైదరాబాద్లో డాక్టర్. 20ఏళ్ల క్రితం మా కుటుంబం పల్సి( బి) నుంచి వచ్చి ఉట్నూర్లో స్థిరపడ్డాం. సాక్షి: మీ విద్య ఎక్కడెక్కడ సాగింది.. జాదవ్: ఉట్నూర్లోనే ప్రాథమిక విద్య పూర్తయింది. ఆ తర్వాత కాగజ్నగర్ నవోదయ పాఠశాలలో పదో తరగతి వరకు చదివా. ఇంటర్ హైదరాబాద్లోని ప్రైవేట్ కళాశాలలో పూర్తి చేశా. ఆ తర్వాత తమిళనాడులోని తిరుచ్చి ఐఐటీలో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశా. సాక్షి: ఐఏఎస్ లక్ష్యం ఎప్పుడు పెట్టుకున్నారు.. జాదవ్: అమ్మ నాన్నకు ముందు నుంచి మమ్మల్ని మంచి హోదాలో చూడాలనే కోరిక ఉండేది. దాన్ని నేను పైకి తీసుకెళ్లాను. పెద్ద పోస్టు సాధించాలని ముందు నుంచి అనుకున్నాను. ఆ లక్ష్యంలో మా ఫాదర్, మదర్ సపోర్టు ఉంది. సాక్షి: ర్యాంక్ వచ్చేందుకు దోహదపడిన అంశాలు.. జాదవ్: బీటెక్ పూర్తయిన వెంటనే 2019లో మొదటిసారి తమిళనాడులోనే సివిల్ సర్వీసెస్ రాశాను. అప్పుడు ప్రిలిమ్స్లోనే తప్పాను. తర్వాత 2020 లో రెండోసారి రాయగా, మెయిన్స్లో పోయింది. మూడు, నాలుగోప్రయత్నంలో 2021, 2022 ఇంటర్వ్యూలో చేజారింది. 2023లో 131వ ర్యాంక్ సాధించాను. ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యాను. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు కేటాయించారు. ఆ శిక్షణ తీసుకున్నాను. ఆ తర్వాత సెలవు పెట్టి మళ్లీ ప్రి పేర్ అయ్యాను. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఈ ర్యాంక్ సాధించాను. సాక్షి: మీ శిక్షణ అనుభవాలను చెప్పండి జాదవ్: ఆరో సారికి నేను 68వ ర్యాంక్ సాధించా ను. గత ఐదుసార్లు రాసింది నాకెంతో ఉపయోగపడింది. నా ప్రిపేరేషన్ క్రమంలో ఎంతో మంది మిత్రులు దొరికారు. ఐదుగురం మిత్రులం కలిసి హైదరాబాద్ అశోక్నగర్లో నివాసం ఉంటూ ప్రి పరేషన్ కొనసాగించాను. ఐదేళ్లుగా వివిధ అకా డమిల్లోనూ శిక్షణ తీసుకున్నాం. ఈ ఫలితాల్లో నాతోపాటు మరో ఇద్దరు ఆంధ్రప్రదేశ్కు చెందిన మిత్రులు మంచి ర్యాంక్ సాధించారు. సాక్షి: ఐఏఎస్గా మీ లక్ష్యాలు ఎలా ఉండబోతున్నాయి..? జాదవ్: నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు చూశాను.. ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నాయి.. అలాంటి వాతావరణంలోనే నేను పెరిగాను.. చుట్టుపక్కలా ఎవరినైనా చూస్తే పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వారే ఉండేవారు. గవర్నమెంట్ వైపు ఏదైనా పథకం కోసం చూసేవారు. అయితే ఆ స్కీమ్ వారి వరకు రీచ్ అవుతుందా.. లేదో.. ఆ స్కీమ్ను అలాంటి వారికే అందించేందుకు బ్యూరోకసి తోడ్పడుతుందని నా భావన. ఐఏఎస్గా ప్రభుత్వ పథకాలను పేదల దరికి చేర్చడం, ట్రైబల్, రూరల్ డెవలప్మెంట్ నా ముఖ్య ఉద్దేశాలుగా ఉండబోతున్నాయి.సాక్షి: సివిల్ సర్వీస్కు ప్రిపేర్ అయ్యేవారికి, ర్యాంక్ రానివారికి మీరిచ్చే సూచన జాదవ్: సివిల్ సర్వీస్కు ప్రిపేర్ అయ్యేవారు, ర్యాంక్ రానివారు తమ ప్రయత్నాన్ని కొనసాగించాలి. ఐదేళ్లుగా నా పరిస్థితిని ఊహించుకోవచ్చు. ప్రస్తుతం ర్యాంక్ రానివారిలో నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఇంతకుముందు నా ఫ్రెండ్స్ ఎవరైతే ర్యాంక్ సాధించారో.. వాళ్లను చూసి నేను మదిలో అనుకునేవా డిని.. నేను ఎప్పుడు లక్ష్యం చేరుకుంటానని.. అందుకే నేను చెప్పేదేమిటంటే అటెంప్ట్ ఉంటే ప్రయత్నం కొనసాగించాలి.. నిన్నటి వరకు నేను ర్యాంక్ సాధిస్తానని కూడా అనుకోలేదు. మంగళవారం రిజల్ట్ వచ్చేవరకు వస్తదో.. రాదో అనే బెంగ వెంటాడింది. చివరికి ఆన్లైన్లో నా నంబర్ సెర్చ్ చేసేంత ధైర్యం కూడా నాకు తొలుత కలగలేదు. ఎలాగోలా సెర్చ్ చేస్తూ పైనుంచి చూస్తూ వచ్చాను. సెకండ్ పేజీలో కనిపించింది. అయితే సివిల్ సర్వీస్కు ప్రిపరేషన్లో నాది ఒకటే ఫిలాసఫి సాగింది.. నిష్కామకర్మను ఫాలో అయ్యాను. దాని అర్థం ఏమిటంటే.. ప్రయత్నిస్తూనే ఉండాలి. అటెంప్ట్స్ అయిపోయిన వారికి కూడా మన దేశంలో అనేక అవకాశాలు ఉన్నాయి. ఫారెన్ సర్వీసెస్పై దృష్టి సారించాలి. గ్రూప్–1 కూడా ఎంపిక చేసుకోవచ్చు. -
భూభారతితో రైతుల సమస్యలు పరిష్కారం
● కలెక్టర్ రాజర్షిషా ఇంద్రవెల్లి: రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ రాజ ర్షిషా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అ న్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నూతన చట్టంపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు హాజరై మాట్లాడారు. ఆధార్కార్డు మాదిరిగా రైతులకు భూధార్ కార్డు పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. జూన్ 2 నుంచి పోర్టల్ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుందన్నారు. అనంతరం కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ముందుగా డిప్యూటీ తహశీల్దార్ రమేశ్ ఆధ్వర్యంలో భూ భారతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఉట్నూర్ సబ్కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఆర్డీవో రాథోడ్ రవీందర్, ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం, ఏపీసీఎస్ చైర్మన్ మారుతి డొంగ్రె, తహసీల్దార్ ప్రవీణ్కుమార్,ఎంపీడీవో జీవన్రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలుగట్టెపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గ్రామంలో అడుగంటిన బావి, చేతిపంపుతో పాటు ఇటీవల తవ్విన బావిని పరిశీలించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. అలాగే మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్న పంట కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఉట్నూర్రూరల్: ఉట్నూర్ కేబీ ప్రాంగణంలోని పీఎంఆర్సీ సమావేశ మందిరంలో భూభారతిపై అ వగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా,ఎమ్మెల్యే బొజ్జు హాజరయ్యారు. పలువురు రైతు లు తమ సమస్యలను కలెక్టర్కు వివరించారు. ఇందులో తహసీల్దార్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్కు సన్మానంకై లాస్నగర్: నార్నూర్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఇటీవల జాతీయ పురస్కారం అందుకున్న కలెక్టర్ రాజర్షి షాను సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వేద పండితుల ఆశీర్వచనాల నడుమ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రీ కలెక్టర్ను సత్కరించారు. పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఇందులో సమితి ప్రతినిధులు మాధవ్, సూర్యకాంత్, రవీందర్, నర్సింలు, వేణు, సంజీవ్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
సీజీఆర్ఎఫ్తో విద్యుత్ సమస్యల పరిష్కారం
తాంసి: విద్యుత్ వినియోగదారుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకే సీజీ ఆర్ఎఫ్ (విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక) అని చైర్మన్ ఎరుకల నారాయణ అన్నారు. తాంసి, తలమడుగు, భీంపూర్ మండలాల వినియోగదారులతో భీంపూర్ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి చైర్మ న్తో పాటు సభ్యులు హాజరయ్యారు. ఎని మిది ఫిర్యాదులు రాగా వాటిపై సంబంధిత ఏఈలను వివరణ కోరారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, వేదికకు జిల్లా అధి కారులు గైర్హాజరు కావడంపై అసహనం వ్య క్తం చేశారు. కార్యక్రమంలో సభ్యులు రామకృష్ణ, కిషన్, రాజా గౌడ్, డీఈ హరికృష్ణ, ఏ డీఏ శ్రావణ్కుమార్, ఏఈలు తిరుపతిరెడ్డి, మనోజ్, శ్రీనివాస్తదితరులు పాల్గొన్నారు. -
● ఇంటర్ ఫలితాల్లో జిల్లాలో పరిస్థితి ● ప్రథమ సంవత్సరంలో రాష్ట్రస్థాయిలో 27వ స్థానం ● ద్వితీయ సంవత్సరంలో 12వ స్థానం ● సత్తా చాటిన ‘ప్రభుత్వ’ విద్యార్థులు
ఆదిలాబాద్టౌన్: ఇంటర్మీడియెట్ ఫలితాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంగళవారం విడుదల చేశారు. జిల్లాలో ఈ ఏడాది ప్రథమ సంవత్సరం ఫలితాలు పడిపోగా, ద్వితీయ సంవత్సరం కొంత మెరుగైంది. ఫస్టియర్లో జిల్లా రాష్ట్రస్థాయిలో 27వ స్థానంలో నిలువగా, సెకండియర్లో 12వ స్థానం దక్కింది. మొత్తంగా ఈ సారి బాలుర కంటే బాలికలే పైచేయిగా నిలిచారు. ఫస్టియర్.. 9నుంచి 27వ స్థానానికి డౌన్ ఈ ఏడాది ప్రథమ సంవత్సరం ఫలితాలు గతంతో పోల్చితే దారుణంగా పడిపోయాయి. గతేడాది రా ష్ట్రస్థాయిలో 9వ స్థానంలో నిలవగా,ఈసారి ఏకంగా 27వ స్థానానికి దిగజారింది. ● జనరల్ కోర్సులో 8,093 మంది పరీక్షకు హాజరు కాగా, 4,295మంది హాజరయ్యారు. 53.07 ఉత్తీ ర్ణత శాతం నమోదైంది. గతేడాదితో పోల్చితే ఈసారి 8.43 శాతం ఉత్తీర్ణత తగ్గింది. ఇందులో బాలురు 4,033 మంది పరీక్షకు హాజరు కాగా, 1,658 ఉత్తీర్ణత సాధించారు. 41.11 ఉత్తీర్ణత శా తం నమోదైంది. బాలికలు 4,060 మంది పరీక్ష కు హాజరు కాగా, 2637 మంది పాస్ అయ్యారు. 64.95 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ● ఒకేషనల్ కోర్సులో 1013 మంది పరీక్షకు హాజ రుకాగా, 672 మంది ఉత్తీర్ణత సాధించారు. 66.34 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బా లురు 421 మంది పరీక్షకు హాజరు కాగా, 252 మంది పాసయ్యారు. 59.86 శాతం ఉత్తీర్ణత న మోదైంది. బాలికలు 592 మంది పరీక్షకు హాజ రు కాగా, 420 మంది ఉత్తీర్ణులయ్యారు. 70.95 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రస్థాయిలో ఒకేషనల్ కోర్సులో జిల్లాకు 3వ స్థానం దక్కింది. ప్రభుత్వ కళాశాలల్లో ఫలితాలు ఇలా.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గతంతో పోల్చితే ఈ సారి మెరుగైన ఫలితాలు సాధించారు. ● ద్వితీయ సంవత్సరంలో తలమడుగు జూనియ ర్ కళాశాల విద్యార్థులు 87.88 శాతం ఉత్తీర్ణులై ప్రథమ స్థానంలో నిలిచారు. బేలలో 85 శాతం, తాంసిలో 80 శాతం, గుడిహత్నూర్లో 75.17 శాతం, ఇంద్రవెల్లి 71.68 శాతం, బజార్హత్నూర్లో 70.65, ఇచ్చోడలో 69.16, బోథ్లో 67.09 శాతం, నేరడిగొండ 64.93, ఆదిలాబాద్ ప్రభు త్వ బాలికల జూనియర్ కళాశాల 61.64 శాతం, నార్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 61.33, ఉట్నూర్ జూనియర్ కళాశాలలో 56.56 శాతం ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల 44.96 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలో చివరి స్థానంలో నిలిచింది. ● ప్రథమ సంవత్సరం ఫలితాల పరంగా చూస్తే తలమడుగు 81.08 శాతం, తాంసి78.32శాతం, గుడిహత్నూర్ 75.61శాతం, చివరి వరుసలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల 30.65 శాతం, ఉట్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 22.52, అత్యల్పంగా ఇంద్రవెల్లి జూనియర్ కళా శాల విద్యార్థులు 18.97శాతం ఉత్తీర్ణులయ్యారు. మే 22 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ.. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి నిర్వహించనున్నట్లు డీఐఈవో జాదవ్ గణేశ్ కుమా ర్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు ఈనెల 23 నుంచి 30 వరకు చెల్లించవచ్చని తెలిపారు. రీవెరిఫికేషన్ కోసం ప్రతీ పేపర్కు రూ.600 ఆన్లైన్లో చెల్లించాలని పేర్కొన్నారు. రీకౌంటింగ్కోసం పేపర్కు రూ.100 చొప్పు న చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 3 నుంచి 6 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇచ్చోడ/తలమడుగు/ఇంద్రవెల్లి:ఇచ్చోడ ప్రభు త్వ గిరిజన గురుకుల బాలికల కళాశాల విద్యార్థిని కావేరి బైపీసీలో 964 మార్కులు సాధించగా, స్నేహ ఎంపీసీలో 961 మార్కులు సాధించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని గుల్లె సాక్షి బైపీసీలో 960 మార్కులు సాధించగా, కేజీబీవీ విద్యార్థిని ప్రియాంక ఎంపీహెచ్ డబ్ల్యూ సెకండియర్లో 928 మార్కులతో ప్రతి భ కనబ రిచింది. గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ ఫస్టియర్లో 90 శాతం, సెకండియర్లో వందశా తం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ గోవర్ధన్ తెలిపారు. సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో సెకండియర్లో వందశాతం ఉత్తీర్ణ త సాధించినట్లు ప్రిన్సిపాల్ నారాయణ పేర్కొన్నారు. తలమడుగు మండలంలోని సాయిలింగి కేజీబీ వీలో సెకండియర్లో వందశాతం ఉత్తీ ర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ అర్చన తెలిపారు. ఇంద్రవెల్లి గురుకుల కళాశాలలో బైపీసీలో కే రంభ 977 మార్కులు, జే పాయల్ 962, రాజ్యలక్ష్మి 960, ఎంపీసీలో అన్నపూర్ణ 963 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ సంగీత తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం విద్యార్థి స్నేహ 467/470 మార్కులు సాధించింది. అలాగే పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఉర్దూ మీడి యం చదువుతున్న జోహ సదఫ్ బైపీసీలో 988 మార్కులు సాధించింది. ఇంగ్లీష్ మీడి యం బైపీసీ విద్యార్థి మసీర అస్రమ్ 977 మార్కులు, ఉర్దూ మీడియం ఎంపీసీలో మది హ మస్రత్ 934 మార్కులు, హెచ్ఈసీ ఉర్దూ మీడియంలో మహెక్ 933 మార్కులు సాధించారు. వీరిని డీఐఈవో జాదవ్ గణేశ్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ సూర్యకుమార్లు విద్యార్థులను అభినందించారు. సెకండియర్లో పెరిగిన ఉత్తీర్ణత ఈ ఏడాది ఇంటర్ సెకండియర్లో మెరుగైన ఫలి తాలు సాధించాం. గతంతో పోల్చి తే 13 శాతం ఉత్తీర్ణత పెరిగింది. కలెక్టర్ రాజర్షిషా ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. కరదీపికలు తయారు చేయించి అందించారు. ఈ మేరకు మంచి ఫలితాలను సాధించగలిగాం. వచ్చే విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తాం. – జాదవ్ గణేశ్కుమార్, డీఐఈవోసెకండియర్లో ఒక స్థానం మెరుగు.. ద్వితీయ సంవత్సరంలో గతేడాదితో పోల్చితే ఈసారి ఒక స్థానం మెరుగుపడింది. రాష్ట్రస్థాయిలో జిల్లా విద్యార్థులు 12వ స్థానంలో నిలిచారు. జనరల్ కోర్సులో మొత్తం 7,978 మంది పరీ క్షకు హాజరు కాగా 5,550 మంది ఉత్తీర్ణులయ్యారు. 69.57 శాతం నమోదైంది. ఇందులో బాలురు 3,880 మంది పరీక్షకు హాజరు కాగా, 2376 మంది పాసయ్యారు. 61.24 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 4098 మంది పరీక్షలు రాయగా, 3174 మంది పాస్ అయ్యారు.77.45శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది 13.15 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ఒకేషనల్ కోర్సులో 912 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 741 మంది పాస్ అయ్యారు. ఉత్తీర్ణత శాతం 81.25 నమోదైంది. బాలురు 360 మందికి గాను 273 మంది పాస్ అయ్యారు. 75.83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 552 మందికి గాను 468 మంది పాస్ అయ్యారు. 84.78 ఉత్తీర్ణత శా తం నమోదైంది. గతేడాది రాష్ట్రస్థాయిలో 11వ స్థానంలో నిలవగా, ఈసారి 6 స్థానాలను మెరుగుపర్చుకొని ఐదో స్థానానికి ఎగబాకింది. -
భూ భారతితో రైతులకు మేలు
● కలెక్టర్ రాజర్షి షాబోథ్: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టంతో రైతులకు మేలు చేకూరుతుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండలంలోని ధన్నూర్ బి గ్రామంలో భూ భారతి చట్టంపై మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రైతులకు సంబంధించి అనేక సమస్యలకు భూభారతి చట్టం పరిష్కారం చూపుతుందన్నారు. అనంతరం ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎంపిక చేసిన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బోథ్ తహసీల్దార్ సుభాష్ చందర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నూ తన చట్టంపై అవగాహన కల్పించారు. కా ర్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఆర్డీవో వినోద్కుమార్, బోథ్ మండల స్పె షల్ ఆఫీసర్ వాజీద్ పాల్గొన్నారు. సొనాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో పలువురు రైతులు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదులు పక్కాగా నమోదు చేయాలికై లాస్నగర్: భూభారతి గ్రీవెన్స్లో వచ్చే ఫిర్యాదులను పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ రాజ ర్షి షా అన్నారు. భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, తాగునీటి సరఫరాపై సంబంధిత అధికా రులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించా రు. ఆయా మండలాల్లో నిర్వహిస్తున్న భూ భారతి అవగాహన సదస్సుల్లో రైతులు, రైతు అసోసియేష న్, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు. అంతకు ముందు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లతో భూ భారతి, హౌసింగ్శాఖ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీ వో వినోద్కుమార్, జెడ్పీ సీఈవో జితేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్ర తి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో బి సేఫ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులు బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూ చించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్రెడ్డి, వన్టౌన్, ట్రాఫిక్ సీఐలు సునిల్ కుమార్, ప్రణయ్ కుమార్, మహిపాల్ రెడ్డి, అమూల్ ఓజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కుమురంభీం చౌక్లో సంస్థ ద్వారా హెల్మెట్ ప్రాముఖ్యతపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఎస్పీ చేతుల మీదు గా 30 మందికి ఉచితంగా హెల్మెట్లు అందజేశారు. అనంతరం సంతకాల సేకరణ చేపట్టారు. వాహనాల నిర్వహణ తప్పనిసరి వాహనాల నిర్వహణ క్రమం తప్పకుండా చేపట్టా లని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు హెడ్క్వార్టర్లోని సమావేశ మందిరంలో పోలీసు వాహ న అధికారులు, డ్రైవర్లకు మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్టేషన్లలో డ్రైవర్లు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా చూడాలన్నారు. సమావేశంలో రిజర్వు ఇన్స్పెక్టర్ వెంకటి, ఎంటీఓ మురళి తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
ఆదిలాబాద్టౌన్(జైనథ్): రైతులు పండించి న పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. జైనథ్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే శంకర్తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంట దిగుబడిని విక్రయించాలని సూచించారు. ఇందులో మార్కె ట్ కమిటీ చైర్మన్ అశోక్రెడ్డి, పీఏసీఎస్ చై ర్మన్ గోవర్ధన్రెడ్డి,తదితరులు పాల్గొన్నారు. బేల:మండలకేంద్రంలోనిసబ్మార్కెట్యా ర్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోళ్లను ఎంపీనగేశ్, ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు. ఇందులో మార్క్ఫెడ్ డీఎం ప్రవీ ణ్ రెడ్డి, జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్రెడ్డి, వైస్ చైర్మన్ విలాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు. -
సివిల్స్లో సందీప్ సత్తా
● రెండో ప్రయత్నంలో మెరుగైన ర్యాంక్ ఆదిలాబాద్టౌన్: గమ్యం చేరే వరకు లక్ష్యాన్ని వీడ డం లేదు.. సివిల్స్లో తొలి ప్రయత్నంలో సాధించిన ర్యాంక్తో సంతోషపడకుండా మరో ప్రయత్నం చేశాడు.. తాజాగా మరింత మెరుగైన ర్యాంక్ సాధించాడు.. అయినా విశ్రమించేది లేదని మరో ప్రయత్నానికి సిద్ధమవుతాన ని చెబుతున్నాడు జిల్లా కేంద్రానికి చెందిన సందీప్. ఆదిలాబాద్రూరల్ మండలంలోని అంకోలి గ్రామానికి చెందిన ఆద వెంకటేశ్– వాణి దంపతులు పట్ట ణంలోని రవీంద్రనగర్లో నివాసం ఉంటున్నారు. వెంకటేశ్ ఇంటెలిజెన్స్ విభాగంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. వీరి కుమారుడు సందీప్ మంగళవారం విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో ఆల్ఇండియా స్థాయిలో 667వ ర్యాంక్ సాధించాడు. ఐఆర్ఎస్కు ఎంపికయ్యాడు. అయితే మొదటి ప్రయత్నంలో 830 వ ర్యాంక్ సాధించగా, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (ఐఆర్ఎస్)లో ఉద్యోగంలో చేరా డు. సెలవులో ఉండి పుస్తకాలతో కుస్తీ పట్టాడు. ఈసారి గతం కంటే మెరుగైన ర్యాంక్ సాధించాడు. అయితే ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని చెబుతున్నాడు ఇతడు. సందీప్ 5వ త రగతి వరకు ఆదిలాబాద్ పట్ట ణంలోని లిటిల్ఫ్లవర్లో అ భ్యసించగా, 6నుంచి 10వతరగతి వరకు కాగజ్నగర్ నవోదయాలో చదివాడు. హైదరాబాద్లో ఇంటర్ పూర్తిచేశాడు. జేఈఈ మెయిన్స్లో 550వ ర్యాంక్ సాధించాడు. బిహార్లోని ధన్బా ద్ ఐఐటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. సందీప్ సివిల్స్లో ర్యాంక్ సాధించడంపై కుటుంబీకులు, బంధువులు అభినందనలు తెలిపారు. -
కాంట్రాక్ట్ లెక్చరర్ల నిరవధిక సమ్మె
బాసర: యుటాక్ స్టేట్ అసోసియేషన్ పిలుపుమేరకు నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు సోమవారం నిరవధిక సమ్మె ప్రారంభించారు. 17 ఏళ్లుగా పని చేస్తున్న తమ ను రెగ్యులరైజ్ చేయాలని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీశైలం మా ట్లాడారు. బాసర ఆర్జీయూకేటీ కాంట్రాక్ట్ అధ్యాపకులతో ప్రారంభమైందని, విశ్వవిద్యాలయ పు రోగతికి తమవంతు కృషి చేస్తున్నామని తెలిపా రు. కాంట్రాక్ట్ వ్యవస్థకు ముగింపు పలికి విశ్వవి ద్యాలయాల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్, డాక్టర్ విజ య్కుమార్, మందా సతీశ్కుమార్, డాక్టర్ రాములు, శ్రీధర్, తిలక్రెడ్డి, భానుప్రియ, రమాదేవి, ప్రశాంతి, రజితారెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు. 13వ రోజుకు అసిస్టెంట్ ప్రొఫెసర్ల దీక్ష ఆర్జీయూకేటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు చే పట్టిన నిరవధిక నిరసన దీక్ష సోమవారం 13వ రోజుకు చేరింది. తమకు అదనపు బాధ్యతలు వ ద్దని, రెగ్యులర్ చేయాలని, తమ సేవలు గుర్తించాలని ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎర్రటి ఎండలో గొడుగులు పట్టుకుని విశ్వవిద్యాలయం ఆ వరణలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఉ పేంద్ర, కృష్ణప్రసాద్, ఖలీల్, డాక్టర్ కుమార్ రా గుల, డాక్టర్ విఠల్, ప్రకాశ్, డాక్టర్ రోషన్, డాక్టర్ సాయికృష్ణ, డాక్టర్ పావని, డాక్టర్ శ్వేత, డాక్టర్ స్వాతి తదితరులు పాల్గొన్నారు. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చి..
లక్ష్మణచాంద: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి అంతలోనే బాలింత ప్రాణాలు కో ల్పోయిన విషాదకర ఘటన మండలంలోని మల్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, చుట్టుపక్కల వారు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బాపట్ల ఆశన్న–లలిత దంపతుల చిన్న కుమారుడు అరుణ్కు మూడేళ్ల క్రితం ఖానాపూర్కు చెందిన హేమశ్రీతో వివాహమైంది. ఏడాదిన్నర క్రితం హేమశ్రీ మొదటి సంతానంగా మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆదివారం నిర్మల్లోని ఓ ఆస్పత్రిలో రెండో సంతానంగా మరో మగబిడ్డను ప్రసవించింది. అంతలోనే హేమశ్రీకి గుండెపోటు వచ్చి ఆరోగ్యం విషమించిందని వైద్యులు కుటుంబీకులకు పిడుగులాంటి వార్త చెప్పారు. దీంతో హేమశ్రీ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి హేమశ్రీ మృతి చెందినట్లు తెలిపారు. దీంతో మల్లాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పుట్టిన బిడ్డను కూడా చూడకుండానే ఆ తల్లి కన్నుమూయగా ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు రోధించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. -
నేరం చేయాలంటే దడ పుట్టాల్సిందే..
● ప్రత్యేక కార్యాచరణ చేపట్టిన సీపీ ● నిందితులకు శిక్ష పడటమే లక్ష్యం ● పకడ్బందీగా సాక్ష్యాధారాల సేకరణ ● ఏడాదిలో 135 మందికి జైలు శిక్ష ● ఈ ఏడాది శిక్షలు పెంచేలా చర్యలు మంచిర్యాలక్రైం: ఒక్కసారి నేరం చేసినవారు మరో సారి నేరాలకు పాల్పడకుండా వారికి సరైన శిక్ష పడేలా రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝూ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. ఎఫ్ఐఆర్ న మోదు నుంచి నిందితుడికి శిక్ష పడేదాకా అన్ని జా గ్రత్తలు తీసుకుంటున్నారు. పక్కాగా సాక్ష్యాలు సేకరించి శిక్షల శాతాన్ని పెంచుతున్నారు. ఇప్పటికే ప లుసార్లు కమిషనరేట్ పోలీస్ అధికారులు, కోర్టు డ్యూటీ నిర్వహిస్తున్న కానిస్టేబుల్, లైసన్ ఆఫీసర్లతో సీపీ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. 2024లో రామగుండం కమిషనరేట్ పరిధిలో 80 కే సుల్లో 135 మంది నిందితులకు శిక్ష పడేలా చేశారు. పెద్దపల్లి జిల్లాలో రెండు కేసుల్లో ముగ్గురికి యావజ్జీవ కారాగారం, మరో రెండు కేసుల్లో ఆరుగురికి పదేళ్ల జైలు, మంచిర్యాల జిల్లాలో మూడు కేసుల్లో ముగ్గురికి ఐదేళ్లు శిక్ష పడేందుకు కృషి చేశారు. శిక్షలు పడిన ఘటనలు కొన్ని.. ● 2016 సెప్టెంబర్ 17న మంచిర్యాల ఠాణా పరిధిలోని ఘడ్పూర్ పంచాయతీ పరిధి బాబానగర్కు చెందిన సండ్ర లక్ష్మణ్, అనిల్, అశోక్ను అదే గ్రామానికి చెందిన మనుబోతుల శ్రీనివాస్ గొడ్డలి, కత్తితో దాడి చేసి గాయపరిచాడు. అప్పటి ఎస్సై వేణుగోపాల్రావు శ్రీనివాస్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అప్పటి న్యాయమూర్తి అర్పిత మారంరెడ్డి ఎదుట పీపీ మదన్మోహన్రావు కోర్టులో సాక్ష్యాలు ప్రవేశపెట్టగా నేరం రుజువైంది. దీంతో శ్రీనివాస్కు ఐదేళ్ల జైలు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ 2024 మే 8న తీర్పునిచ్చారు. ● 2022లో మంచిర్యాల జిల్లా కన్నెపెల్లి ఠాణా పరిధి సుర్జాపూర్కు చెందిన దాసరి శ్రీనివాస్, రాజన్న బైక్పై వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన పూదరి చంద్రశేఖర్ తన ట్రాక్టర్తో బైక్ ఎక్కించి గొడ్డలితో నరికి చంపుతానని బెదిరించాడు. ఫిర్యాదు అందుకున్న అప్పటి ఎస్సై గంగారాం కేసు నమోదు చేశారు. కోర్టులో నేరం రుజువు కాగా అప్పటి న్యాయమూర్తి అర్పిత మారంరెడ్డి చంద్రశేఖర్కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ● 2017 అక్టోబర్ 21న జిల్లాలోని లక్సెట్టిపేట ఠాణా పరిధి ఇందిరానగర్లో ఇంటి ప్రహరీ విషయంలో మామిడి మల్లయ్య, దుంపల బంగారమ్మకు గొడవ జరిగింది. బంగారమ్మ, ఆమె కుమారులు సురేశ్, నరేశ్ మల్లయ్య కుమారులు చంద్రమౌళి, రాజగోపాల్, కృష్ణంరాజుపై తల్వార్లతో దాడి చేయగా చంద్రమౌళి మృతి చెందాడు. రాజగోపాల్, కృష్ణంరాజును గాయపరిచారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టగా నేరం రుజువైంది. బంగారమ్మ, నరేశ్, సురేశ్కు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ అప్పటి న్యాయమూర్తి డీ వెంకటేశ్ 2022 జనవరి 8న తీర్పునిచ్చారు. నేరస్తులు తప్పించుకోలేరు నేరం చేసిన వారు చట్టం చేతి నుంచి తప్పించుకోలేరు. సీసీ ఫుటేజీ, వేలిముద్రలు, సెల్ఫోన్ కాల్డేటా, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం. పంచనామా సమయంలో సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాన్ని వీడియో రికార్డ్ చేసి కోర్టుకు అందజేస్తున్నాం. నేర దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన అధికారులకు రివార్డులిస్తూ ప్రోత్సహిస్తున్నాం. – ఎగ్గడి భాస్కర్, డీసీపీ, మంచిర్యాల -
మత్స్య సంపద యోజనను వినియోగించుకోవాలి
ఖానాపూర్: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజ న పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాబార్డు డీడీఎం వీరభద్రుడు సూచించారు. సోమవారం మండలంలోని మస్కాపూర్ పంచాయతీ పరిధిలోగల గంగాయిపే ట్ గ్రామంలో మత్స్య గాంధీ మల్టీస్టేట్ ఫిషర్ మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెజ్ అండ్ నాన్వెజ్ పచ్చళ్ల తయారీ కేంద్రం ప్రారంభోత్సవానికి హాజరై మాట్లాడారు. కేంద్రప్రభుత్వం మత్స్య సంపద యోజన పథకం ద్వారా సబ్సిడీ రు ణాలు ఇస్తోందని తెలిపారు. మత్స్య రంగాన్ని సంఘటితం చేయడంతో పాటు సూక్ష్మ, చిన్న తరహా ప రిశ్రమలకు సహాయపడేలా ఆర్థికసాయం అందించేందుకు ఈ పథకం అందుబాటులో ఉందని తెలి పారు. అనంతరం సొసైటీ ఆధ్వర్యంలో మహిళలు చేసిన పచ్చళ్లను పరిశీలించారు. ఇక్కడ తయారు చే సిన చేపల పచ్చళ్లను ఒప్పందం ఉన్న దేశవ్యాప్త కంపెనీలకు సరఫరా చేయడమే తమ లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇండియా మార్టు, సహకార సంఘాలతో పాటు పలు కంపెనీలతో ఒప్పందా లున్నాయని తెలిపారు. రోజుకు 50కేజీల చేపలతో రూ.30వేల విలువైన పచ్చళ్లు తయారు చేసి విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. డీసీవో పాపయ్య, సొసైటీ గౌరవాధ్యక్షుడు దామెర రాజయ్య, చైర్మన్ పుల్లబోయిన భీమన్న, నిర్మల్ జిల్లా ఇన్చార్జి విజ య, నిర్వాహకులు రాములు, నరేశ్, నర్సయ్య, లా వణ్య, లలిత, పూజ, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అంకం మహేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆకుల శ్రీనివాస్, మండలాధ్యక్షుడు ఉపేందర్, నాయకులు గిరి, భూమన్న, స్వామి తదితరులున్నారు. -
గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: గిరిజనుల సమస్యలు త్వరగా ప రిష్కరించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అధి కారులను ఆదేశించారు. సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పీవోకు అ ర్జీలు అందించారు. సమస్యలు పరిష్కరించాలని కో రారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. ప్రజా వాణికి పింఛన్, డబుల్ బెడ్రూం, స్వయం ఉపాధి పథకాల కోసం, వ్యవసాయం, రెవెన్యూ శాఖలకు సంబంధించిన 65 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. వీ టిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికా రులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ మృతి
బోథ్: మండలంలోని నక్కలవాడ గ్రామానికి చెంది న నైతం భూమన్న (35) ఈ నెల 17న పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎ స్సై ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. భూమన్న ఓ రైతు వద్ద పాలేరుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 17న మద్యం తాగి ఇంట్లో భార్య లక్ష్మితో గొ డవ పడ్డాడు. దీంతో లక్ష్మి మందలించగా క్షణికావేశంలో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. వెంటనే కుటుంబీకులు బోథ్లోని సీహెచ్సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్లోని రి మ్స్కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, మూడేళ్ల కుమారుడున్నారు. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. లక్సెట్టిపేట: మండలంలోని వెంకట్రావ్పేట గ్రామానికి చెందిన మునుగంటి చంద్రశేఖర్ (51) చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రశేఖర్ ఈ నెల 20న పురోహితం ముగించుకుని ఎల్లారం గ్రామ స్టేజీ మీదుగా బైక్పై ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్కు బలమైన గాయాలు కాగా స్థానికులు లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించగా హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తుండగా సోమవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కూతురు జాహ్నవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రక్తహీనతతో చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి గుడిహత్నూర్: మండలంలోని తోషం గ్రామానికి చెందిన విద్యార్థిని బోరేకర్ సౌజన్య (15) రిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌజన్య నేరడిగొండ మండలంలోని కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కొద్ది నెలలుగా రక్త హీనతతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆమె ఆరోగ్యం క్షీణించింది. వాంతులు, విరోచనాలు కావడంతో ప్రిన్సిపాల్ రజిత ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు రాకపోవడంతో రాత్రి 10.30 గంటలకు సిబ్బంది సౌజన్యను రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందింది. పాఠశాల సిబ్బంది మృతదేహాన్ని కుటుంబ సభ్యులు అప్పగించారు. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతోనే.. పాఠశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతోనే సౌజన్య మృతి చెందిందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి, యు వజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్ ఆ రోపించారు. సౌజన్య కుటుంబీకులను ఆయన పరా మర్శించారు. సౌజన్యను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడంతోనే మృతి చెందిందని పేర్కొన్నారు. సౌజన్య తండ్రి గతంలోనే మరణించగా తల్లి అనిత కూలీ పనులకు వెళ్లి ముగ్గురు పిల్లలను పోషిస్తోందని తెలిపారు. బాధిత కుటుంబానికి రూ.5లక్షల ఆర్థికసాయం అందించాలని, కేజీబీవీ సిబ్బందిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. -
‘అంబేడ్కర్ విధానాలను కాలరాసిన కాంగ్రెస్’
ఆదిలాబాద్: అంబేడ్కర్ విధానాలను అధికారంలో ఉన్న 60 ఏళ్లపాటు కాంగ్రెస్ కాలరాసిందని ఎంపీ గోడం నగేశ్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్ ఆరోపించారు. అంబేడ్కర్ జయంత్యుత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం జిల్లా సదస్సు నిర్వహించా రు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాలకూ అంబేడ్కర్ చే సిన సేవలను ప్రజలకు వివరించాలని పిలుపుని చ్చారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి పెద్దపీట వేసింది బీజేపీ మాత్రమేనని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్, నాయకులు అస్తక్ సుభాష్, పాయల్ శరత్ తదితరులున్నారు. నివాళులర్పిస్తున్న ఎంపీ నగేశ్, మహేందర్ -
‘పేదల ఆరోగ్యంపై వివక్ష ఎందుకు’
ఆదిలాబాద్టౌన్(జైనథ్): పేదల ఆరోగ్యంపై ఈ ప్ర భుత్వాలకు వివక్ష ఎందుకని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ ప్రశ్నించారు. లక్ష కిలో మీటర్ల మా భూమి రథయాత్రలో భాగంగా ఎనిమిదో రో జు సోమవారం జైనథ్ మండల కేంద్రంలోని ప్రభు త్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనమని చెబుతూనే దొడ్డు బియ్యం భోజనం పెడుతున్నారని ఆరోపించారు. కోడి గుడ్లు కూడా ఇవ్వడం లేదని తెలిపారు. ఇదేనా విద్యార్థులకు అందించే నాణ్యమైన భోజనమని ప్ర శ్నించారు. మరుగుదొడ్ల నిర్మాణం నాణ్యతగా లేద ని పేర్కొన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించారు. మందులు ఉన్నాయా.. లేవా.. అనే విషయాలను రోగుల ద్వారా తెలుసుకున్నారు. మా భూమి రథయాత్ర ద్వారా విద్య, వై ద్యం, ఉపాధి రంగాలన్నింటినీ పరిశీలించి వాటి మెరుగుదల కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. పేదల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలతో పోరాడుతామని వివరించారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర నాయకుడు లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు అగ్గిమల్ల గణేశ్, ఇతర నాయకులున్నారు. -
నస్పూర్లోని ఓ ఇంట్లో చోరీ
నస్పూర్: పట్టణ పరిధిలోని ఓ ఇంటిలో చోరీ జరి గినట్లు మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్ తెలి పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కాకతీయ హిల్స్లో నివాసముండే భూపెల్లి లావణ్య ఈ నెల 18వ తేదీన ఇంటికి తాళం వేసి కుటుంబ స భ్యులతో కలిసి గోదావరిఖనికి పెళ్లికి వెళ్లింది. ఈనె ల 21న తిరిగి రాగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోనికి వెళ్లి చూసి 14 తులాల బంగారు ఆభరణాలు, రూ.5వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనాస్థలికి చేరుకుని ఇల్లు, పరిసరాలు పరిశీలించి వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మూడు ప్రత్యేక బృందా లతో గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. -
● ఎస్పీ అఖిల్ మహాజన్
నిజాయతీగా విధులు నిర్వర్తించాలి ఆదిలాబాద్టౌన్: పోలీసులు క్రమశిక్షణతో పా టు నిజాయతీగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు సాయుధ కార్యాలయాన్ని సోమవారం పరిశీలించారు. సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలాంటి సమస్యలున్నా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. సమయపాలన పాటిస్తూ విధులు సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం హెడ్క్వార్టర్లో ఉన్న మోటర్ వెహికిల్ అధికారి, హోంగార్డు కార్యాలయాలను పరిశీలించారు. వారికి కేటాయిస్తున్న విధులను అడిగి తెలుసుకున్నారు. ఇందులో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకటి, మురళి, చంద్రశేఖర్, శ్రీపాల్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. బాధితుల సమస్యలకు సత్వర పరిష్కారం బాధితుల సమస్యలు సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని ఎస్పీ అన్నారు. పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా నలుమూలల నుంచి 12 మంది ఫిర్యాదుదారులు రాగా, వారి సమస్యలను ఓ పిగ్గా విని పరిష్కార దిశగా చర్యలు చేపట్టారు. కొనసాగుతున్న ‘ఓపెన్’ పరీక్షలుఆదిలాబాద్టౌన్: ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియెట్, పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం నిర్వహించిన ఇంగ్లీష్ పరీక్షకు ఉదయం పదో తరగతిలో 518 మందికి గాను 476 మంది హాజరు కాగా, 42 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్ పరీక్షకు 395 మందికి గాను 347 మంది హాజరు కాగా, 48 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ పరీక్షకు పదో తరగతిలో 217 మందికి గాను 197 మంది హాజరు కాగా, 20 మంది గైర్హాజరైనట్లు ఓపెన్స్కూల్ కోఆర్డినేటర్ అశోక్, డీఈవో శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
ఎండింది.. మళ్లీ నిండింది!
● ఫలించిన భగీరథ యత్నం ● పూడికతీతకు బల్దియా శ్రీకారం ● ఉబికి వస్తున్న ‘లాండసాంగ్వి’ ● ‘ఇంటెక్’లో పెరిగిన సామర్థ్యం ● పట్టణానికి తప్పిన నీటి ఎద్దడి ముప్పు కై లాస్నగర్: ఆదిలాబాద్ పట్టణానికి నీటిని సరఫరా చేసే లాండసాంగ్వి పంప్హౌస్ వద్ద బల్దియా అధికారులు చేపట్టిన భగీరథ యత్నం ఫలించింది. అక్కడ నీటి నిల్వ పెంచేందుకు మూడు రోజులుగా చేపట్టిన చర్యలు సఫలీకృతమయ్యాయి. పూడిక తొలగించడం, కాల్వలను తవ్వడంతో పట్టణానికి నీటి సరఫరా చేసే ఇంటెక్వెల్స్ వద్ద భూగర్భజలం ఉబికి వస్తోంది. దీంతో ఈ వేసవిలో పట్టణానికి నీటి ఎద్దడి ముప్పు తప్పింది. ఈనెల 30నుంచి పంప్హౌస్ ద్వారా పట్టణంలోని పలు వార్డులకు యథావిధిగా నీటి సరఫరా చేపట్టనున్నారు. 19 వార్డులకు ఇక్కడి నుంచే.. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని 19 వార్డులకు ఆదిలాబాద్రూరల్ మండలంలోని లాండసాంగ్వి వాగు వద్ద గల పంప్హౌస్ నుంచే నీటి సరఫరా జరుగుతోంది. నాలుగు దశాబ్దాల నుంచి ప్రజల కు ఇక్కడి నుంచే నీటిని అందిస్తున్నారు. అయితే గతంలో ఎన్నడులేని విధంగా లాండసాంగ్వి వా గు పూర్తిగా ఎండిపోయింది. దీంతో పట్టణానికి నీ టి సరఫరా నిలిచిపోయింది. మిషన్ భగీరథ నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మే మొదటి వారం వరకు ‘భగీరథ’ నీరు సైతం వచ్చే పరిస్థితి లేకపోవడంతో పట్టణంలో ఈ వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి తప్పదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ పరిస్థితిని దూరం చేయాలనే ఉద్దేశంతో బల్దియా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కలెక్టర్ రాజర్షిషా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదేశాల మేరకు పట్టణానికి నీటిని అందించే దిశగా చర్యలకు ఉపక్రమించారు. పంప్హౌస్ వద్ద గల రెండు పురాతన ఇంటెక్వెల్స్లో భారీగా పూడిక పేరుకుపోయింది. ఏళ్ల తరబడి వాటిని శుభ్రం చేయకపోవడంతో పైపులకు నీరు వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీన్ని గుర్తించిన బల్దియా అధికారులు వాటిలో పూడికతీతకు నిర్ణయించారు. ఆంధ్ర ప్రదేశ్లోని కడపకు చెందిన పలువురు నిపుణులను రప్పించి వారం పాటు ఇంటెక్వెల్స్ను పూర్తిగా తెరిచి అందులోని పూడిక, ఇసుక మేటలను తొలగింపజేశారు. యంత్రాంగం ప్రత్యేక దృష్టి పట్టణానికి నీటిని అందించే కీలక వనరు కావడంతో దీనిపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. వేసవి నీటి ఎద్దడి కార్యాచరణలో భాగంగా రూ.40లక్షలను కలెక్టర్ మంజూరు చేశారు. ఈ నిధుల ద్వారా లాండసాంగ్వి వాగులోని ఇంటెక్వెల్స్ వద్ద బల్దియా అధికారులు భూగర్భజలాలు పెంపొందించే చర్యలు చేపట్టారు. రెండు బావులకు ఇరువైపులా 15 అడుగుల లోతు, 132 మీటర్ల వెడల్పుతో భారీ కెనాల్స్ తవ్వారు. ఈ ప్రయత్నం ఫలించింది. భూగర్భ జలాలు ఉబికివచ్చి వర్షాకాలంలో ఎలాగైతే వాగులో నీరు నిల్వ ఉంటుందో అదే స్థాయిలోకి చేరాయి. నాలుగు రోజులుగా ఈ తవ్వకాలు చేపడుతున్నారు. ఈనెల 29 వరకు ఈ పనులను చేపట్టనున్నారు. పెరిగిన నీటి సామర్థ్యం ఆధారంగా లాండసాంగ్వి పంప్హౌస్లోని రెండు మోటార్లు 24గంటల పాటు పనిచేసినా నీరు అడుగంటదని బల్దియా ఇంజినీర్ పేరి రాజు తెలిపారు. దీంతో పట్టణంలోని 19 వార్డులకు పంప్హౌస్ ద్వారా యథావిధిగా నీటి సరఫరాను ఈనెల 30 నుంచి ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం పెరిగిన భూగర్భ జలాల ప్రకారం జూలై వరకు పట్టణానికి తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన పేర్కొన్నారు. బల్దియా అధికారులు చేపట్టిన చర్యలతో పట్టణంలోని సగం వార్డులకు నీటి సమస్య దూరమైంది. దీంతో ఆయా కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఆరోగ్యవంత సమాజానికి కృషి●
● ఎంపీ గోడం నగేశ్ ● సూపర్ స్పెషాలిటీలో గ్యాస్ట్రోలజీ సేవలు ప్రారంభం ఆదిలాబాద్టౌన్: ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో గ్యాస్ట్రోలజీ సేవలను ఎమ్మెల్యే శంకర్తో కలిసి సోమవారం ప్రా రంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, పేదల ఆరోగ్యంపై ప్రధానమంత్రి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో సూపర్స్పెషాలిటీ ఆస్ప త్రి నిర్మించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే ట్రామా కేర్ సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు. అలా గే ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకోసం సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇందులో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, సూపరింటెండెంట్ అశోక్, సత్యనారాయణ,ఆర్ఎంఓ చంపత్రావు పాల్గొన్నారు. -
మళ్లీ పుంజుకున్న వైనం..
తెలంగాణ బాపు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసమే ఉద్యమించిన ప్రాంతీయ పార్టీ బీ(టీ)ఆర్ఎస్. సమైక్య రాష్ట్రంలో ప్రజలు ఎన్నో అవమానాలు, అవాంతరాలను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో గులాబీ పార్టీని అప్పట్లో జనం ఉద్యమ పార్టీగా ఆదరించారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. అనే పరిస్థితిలో రెండు జాతీయ పార్టీలు తలొగ్గి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. దీంతోనే తెలంగాణ బాపుగా కేసీఆర్ను ప్రజలు కీర్తిస్తున్నారు. – జోగు రామన్న, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రజతోత్సవం తర్వాత భారీ మార్పులు.. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సభ తర్వాత రాష్ట్రంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ను రిజెక్ట్ చేస్తున్నారు. బీజేపీకి రాష్ట్రంలో ఆదరణ లేదు. త్వరలో పార్టీలో పునర్ నిర్మాణ ప్రక్రియ చోటుచేసుకోనుంది. కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో రజతోత్సవ కార్యక్రమానికి తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గం నుంచి కనీసంగా 7వేల మంది వరకు మేము అంచనా వేస్తుండగా, స్వచ్ఛందంగా పలువురు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. – అనిల్ జాదవ్, బోథ్ ఎమ్మెల్యే సాక్షి, ఆదిలాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రజతోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 27న వరంగల్లో భారీ మహాసభకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పార్టీ కేడర్ సన్నద్ధమవుతోంది. 25 ఏళ్ల ఆ పార్టీ ప్రస్థానంలో రాష్ట్రంలో మాదిరే జిల్లాలోనూ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గులాబీ పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోనూ పటిష్టంగా రూపొందింది. అయితే గత ఎన్నికల్లో ఓటమితో కొంత నైరాశ్యం చోటు చేసుకుంది. పలువురు నేతలు పార్టీని వీడినా పునాది లాంటి కార్యకర్తలు వెన్నంటే ఉన్నారన్న అభిప్రాయం నాయకత్వంలో ధీమా నింపుతోంది. పార్టీ రజతోత్సవం తర్వాత మరింత ఉత్సాహం చోటు చేసుకోనుందని, రానున్న రోజుల్లో కేసీఆర్ పాలననే ప్రజలు కోరుకుంటున్నారని ఆ పార్టీ శ్రేణులు నర్మగర్భంతో పేర్కొంటున్నారు. మొదటి ఎన్నికలతోనే ప్రభంజనం.. బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) పార్టీ 2001 ఏప్రిల్ 27న ఏర్పడింది. 2004 సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారి రాష్ట్రంలో పోటీ చేసింది. తెలంగాణలో 26 సీట్లలో గెలుపొందింది. ఉమ్మడి జిల్లాలో ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ముథోల్ నుంచి నారాయణరావు పటేల్, బోథ్ నుంచి సోయం బాపూరావు, ఖానాపూర్ నుంచి అజ్మీరా గోవింద్ నాయక్ గెలుపొందారు. పార్లమెంట్ ఎన్నికల్లో నాడు ఆదిలాబాద్ ఎంపీ జనరల్ స్థానంగా ఉండగా, అప్పట్లో గులాబీ పార్టీ నుంచి టి.మధుసూదన్రెడ్డి గెలుపొందారు. ఈ విధంగా ఆ పార్టీ ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్ పార్లమెంట్తోపాటు మూడు అసెంబ్లీ స్థానాలను కై వసం చేసుకుంది. అప్పట్లోనే అసమ్మతి వర్గం.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధినేత కేసీఆర్ నాడు పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులందరినీ రాజీనామా చేయాలని కోరారు. అయితే అప్పట్లో ఎంపీ మధుసూదన్రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే గోవింద్నాయక్ కేసీఆర్కు మద్దతుగా రాజీనామా చేయగా, బోథ్ నుంచి గెలుపొందిన సోయం బాపూరావు, ముథోల్ నుంచి గెలుపొందిన నారాయణరావు పటేల్ అసమ్మతి వర్గంగా నిలిచారు. దీంతో మొదటి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో, ఇటు జిల్లాలోనూ అసమ్మతి వర్గం కారణంగా పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఉప ఎన్నికల్లో మళ్లీ ఎంపీగా పోటీ చేసిన మధుసూదన్రెడ్డి, ఖానాపూర్లో తిరిగి పోటీ చేసిన గోవింద్ నాయక్ ఇద్దరూ ఓటమి చెందారు. దీంతో జిల్లాలో పార్టీ పరిస్థితి కొంత డీలా పడింది. ఇక వెనుదిరిగి చూడని వైనం.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం, బీఆర్ఎస్కు ప్రజల్లో ఆ దరణ పెరగడంతో ఇతర పార్టీల్లోని ముఖ్య నేతలంతా బీఆర్ఎస్లోకి వలస వచ్చారు. దీంతో పార్టీ బ లంగా తయారైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ దూసుకుపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జెడ్పీని సైతం కై వసం చేసుకుంది. మున్సిపాలిటీల్లోనూ పాగా వేసింది. 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఏకంగా ఏడు స్థానాల్లో గె లుపొందింది. నిర్మల్, సిర్పూర్లో ఐకేరెడ్డి, కోనప్పలు బీఎస్పీ నుంచి గెలుపొంది ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఆ ఎన్నికల్లో ముథోల్ నుంచి ఏకై క స్థా నం గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూ డా ఆ తర్వాత కాలంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నా రు. ఈ విధంగా పూర్తిగా ఉమ్మడి జిల్లా గులాబీమయంగా తయారైంది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉ మ్మడి జిల్లాలో ఏకంగా తొమ్మిది స్థానాల్లో గెలుపొందగా, ఆసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన ఆత్రం సక్కు గెలుపొందారు. ఆ తర్వాత ఆయన కూడా గులాబీ పార్టీలో చేరడంతో పదికి పది స్థానాలు బీఆర్ఎస్ హస్తగతం అయ్యాయి. ఈ విధంగా ఉద్యమకాలంలో ఉమ్మడి జిల్లాలో గులాబీ పార్టీ మొదట్లో ఆటుపోట్లు ఎదుర్కొన్నా, ప్రత్యేక రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా అవతరించింది. కలిసిరాని కాలం.. అయితే 2023 ఎన్నికలు బీఆర్ఎస్కు కలిసి రాలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు అధికారంలో ఉన్న గులాబీ పార్టీకి ఒక విధంగా ఎదురుదెబ్బ తగిలింది. ఉమ్మడి ఆదిలాబాద్లో కేవలం బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లోనే ఆ పార్టీ అభ్యర్థులు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి గెలుపొందారు. ఇదిలా ఉంటే మొదటి నుంచి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. ఆదిలాబాద్ పరంగా 2004లో మధుసూదన్ రెడ్డి, 2014లో గోడం నగేష్ గులాబీ పార్టీ నుంచి ఎంపీలుగా గెలిచారు. ఇక పెద్దపల్లి నుంచి 2014లో బాల్క సుమన్, 2019లో వెంకటేశ్ నేత ఎంపీలుగా మారారు. ఉమ్మడి జిల్లాలో జెడ్పీ చైర్మన్గా వల్లకొండ శోభారాణి సత్యనారాయణ గౌడ్, ఆ తర్వాత రాథోడ్ జనార్దన్ వ్యవహరించారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత నాలుగు జెడ్పీలు ఏర్పడగా, ఈ నాలుగింటిలోనూ బీఆర్ఎస్ పాగా వేసింది. అయితే గత ఎన్నికల్లో చేదు ఫలితాలు ఎదురుకావడం, ఈ క్రమంలో పార్టీని పలువురు నేతలు వీడినా కార్యకర్తలు మాత్రం వెన్నంటి ఉన్నారనే ధీమా గులాబీ ముఖ్యనేతల్లో వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో వికసిస్తూ.. ముళ్లను సైతం ముద్దాడుతూ తొలి ఎన్నికల నుంచే సత్తా చాటిన ఉద్యమ పార్టీ ‘తెలంగాణ’ ఏర్పాటు తర్వాత రెండుసార్లు ప్రభంజనం మొన్నటి ఎన్నికల్లో మాత్రం ప్రతికూలం కేడర్పైనే కీలక నేతల ధీమా రజతోత్సవ వేళ శ్రేణుల్లో మళ్లీ ఉత్సాహం బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానం ఆసక్తికరం 2009 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్కు చెన్నూర్ నుంచి నల్లాల ఓదెలు, మంచిర్యాల నుంచి గడ్డం అరవింద్రెడ్డి, సిర్పూర్ నుంచి కావేటి సమ్మయ్య గెలుపొందారు. దీంతో పార్టీ మళ్లీ పుంజుకుంది. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం తీవ్రరూపం దాల్చడం, సబ్బండ వర్గాలు కలిసి రావడంతో బీఆర్ఎస్కు కలిసి వచ్చింది. అప్పట్లో కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా, తిరిగి ఉప ఎన్నికల్లో ఆ మూడు స్థానాల నుంచి గెలుపొందింది. ఈ విధంగా పార్టీ తన స్థానాన్ని పదిలపర్చుకుంది. రాజకీయ సుస్థిరత సాధించింది. 2009 ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన జోగు రామన్న మధ్యలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో ప్రజల అభీష్టం మేరకు ఆ పార్టీకి రాజీనామా చేసి 2012లో బీఆర్ఎస్లో చేరారు. గులాబీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు పెరగగా ఉమ్మడి జిల్లాలో పార్టీ బలంగా మారింది. -
● కలెక్టరేట్ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన
‘బీఏఎస్’ బిల్లులు చెల్లించండి●కై లాస్నగర్: తమ పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని కోరుతూ ఆ తల్లిదండ్రులంతా సోమవారం కలెక్టరేట్కు తరలివచ్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ప్రజావాణి సమావేశ మందిరం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గ్రీవెన్స్లో అదనపు కలెక్టర్కు సమస్యను విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వం ఎస్సీల కోసం అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ (బీఏఎస్) పథకం ద్వారా తమ పిల్లలు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారన్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు పూర్తి ఉచితంగా ప్రభుత్వమే ఆ పాఠశాల ద్వారా విద్యనందజేస్తోందన్నారు. అయితే రెండేళ్లుగా ప్రభుత్వం ఆ పాఠశాలకు బిల్లులు విడుదల చేయడం లేదన్నారు. ఫలితంగా యాజమాన్యం డబ్బుల కోసం తమను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బిల్లులు విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. -
విద్యార్థులు ఆందోళనకు గురికావద్దు
ఆదిలాబాద్టౌన్: విద్యార్థులు మానసిక ఆందోళనకు గురికావద్దని డీఈవో శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం పరీక్ష పర్వ్ కార్యక్రమం నిర్వహించారు. పరీక్షలు పూర్తయిన అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదుర్కొనే ఆందోళన, ఒత్తిడి, మానసిక సమస్యలపై రిమ్స్ మానసిక వైద్య నిపుణులు ఓంప్రకాశ్, శ్రీకాంత్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మార్కులు తక్కువ వచ్చాయని, ఫెయిల్ అయ్యారని విద్యార్థులపై తల్లిదండ్రులు ఒత్తిడి పెంచవద్దని సూచించారు. ఎంతో మంది మేధావులు పరీక్షల్లో తప్పి ఆ తర్వాత పాసై ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. ఇందులో ప్రేరణాత్మక వక్త పురుషోత్తంరెడ్డి, బాలల సంరక్షణ కమిటీ సభ్యుడు, సమీరుల్లా ఖాన్, ఎంఈవో సోమయ్య, సెక్టోరియల్ అధికారి సుజాత్ఖాన్, జిల్లా సైన్స్ అధికారి రఘురమణ, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఓపెన్’ పరీక్షలు ప్రారంభం
ఆదిలాబాద్టౌన్: పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఓపెన్ స్కూల్ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉట్నూర్లో టెన్త్, ఇంటర్ కేంద్రాలు ఒక్కోటి చొప్పున, అలాగే జిల్లా కేంద్రంలో టెన్త్ రెండు, ఇంటర్ ఒక కేంద్రం ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు కొనసాగాయి. ఉదయం నిర్వహించిన పదో తరగతి పరీక్షకు 355 మందికి గాను 328 మంది హాజరు కాగా, 27 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఇంటర్ పరీక్షలకు 380 మందికి గాను 52 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పదో తరగతి పరీక్షకు 13 మందికి గాను నలుగురు హాజరు కాగా, తొమ్మిది మంది గైర్హాజరయ్యారు. ఇంటర్ పరీక్షలకు ఇద్దరికి గాను ఇద్దరు హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషన్ వేణుగోపాల్రెడ్డి, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అశోక్, ఫ్లయింగ్ స్క్వాడ్లు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. -
మాట నిలుపుకున్న సీఎం..
గతంలో అమరవీరులకు నివాళులర్పించాలంటే ఎన్నో ఆంక్షలు ఉండేవి. కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలోనైనా పరిస్థితి మారుతుందేమోనని ఆశించాం. కానీ పదేళ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు. పీసీసీ హోదాలో ఇంద్రవెల్లిలో పర్యటించిన రేవంత్రెడ్డి సీఎం కాగానే ఇంద్రవెల్లి స్మృతి వనానికి ఇచ్చిన మాట ప్రకారం రూ.కోటి కేటాయించారు. 15 మంది అమరవీరుల కుటుంబీకులను గుర్తించి వారిలో కొంత మందికి సాయం అందించాం. ఇంకా ఉన్నారని తెలుస్తోంది. వారిని సైతం అధికారికంగా గుర్తించి సాయం అందించేలా చూస్తాం. – వెడ్మ బొజ్జు, ఖానాపూర్ ఎమ్మెల్యే -
క్రీడా శిక్షణకు వేళాయే
జిల్లావ్యాప్తంగా క్రీడా శిబిరాల వివరాలు.. ఆదిలాబాద్: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఏటా వేసవిలో ప్ర త్యేక శిక్షణ శిబిరాలను నిర్వహిస్తోంది. విద్యార్థులు ఆయా క్రీడాంశల్లో ఆసక్తి పెంపొందించడంతో పాటు వారు రాణించేలా నెల రోజుల పాటు ప్రత్యే క శిక్షణ అందజేస్తోంది. అర్హత కలిగిన శిక్షకుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించి ఎంపిక చేసింది. జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో శిక్షణ అందించేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే కలెక్టర్ రాజర్షి షా సంబంధిత శిక్షకులకు సామగ్రి సైతం అందజేశారు. 34 శిక్షణ కేంద్రాల్లో.. ఈ ఏడాది జిల్లాలోని 34 కేంద్రాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 25మంది , పట్టణ ప్రాంతాల్లో 9మంది శిక్షకులు విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వనున్నారు. మే1నుంచి 31వరకు బాక్సింగ్, బ్యాడ్మింటన్ వంటి ఇండోర్ క్రీడలతో పాటు హాకీ, క్రికెట్, వాలీబాల్, అథ్లెటిక్స్ వంటి అవుట్ డోర్ క్రీడల్లో సైతం శిక్షణ కల్పించనున్నారు. ఇప్పటికే శిక్షకులకు క్రీడా సామగ్రి సైతం అందించారు. ఉదయం 6 నుంచి 8.30 గంటల వరకు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు శిక్షణ ఉంటుందది. సుమారు 1000 మంది వరకు బాలలకు లబ్ధి చేకూరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అర్హులు ఎవరంటే.. శిబిరాల్లో 14 ఏళ్లలోపు బాల, బాలికలకు మాత్రమే శిక్షణ అందజేస్తారు. ఈ మేరకు అర్హులు ఈనెల 27వరకు https:// forms. gle/ xAtXkCvSJgzdpidS7 ఆన్లైన్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి ఎంపిక చేసుకున్న క్రీడాంశంలో నెల రోజుల పాటు ఉచిత శిక్షణ అందిస్తారు. విధి, విధానాలు ఇలా.. జిల్లా వ్యాప్తంగా 10 శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కొంతమంది స్వచ్ఛందంగా శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. శిక్షకుడికి రూ.4వేల గౌరవ వేతనంతోపాటు క్రీడా సామగ్రి కొనుగోలు నిమిత్తం మొత్తం రూ.50వేలు మంజూరు చేసింది. మే 1నుంచి వేసవి శిబిరాలు పలు క్రీడాంశాల్లో ఉచిత శిక్షణ శిక్షకులకు ఇప్పటికే సామగ్రి పంపిణీ జిల్లా వ్యాప్తంగా 34 కేంద్రాలు ఈనెల 27వరకు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్గ్రామీణ ప్రాంతాల్లో.. క్రీడాంశం శిబిరం ఇన్చార్జి క్యాంప్ స్థలం సెల్ నంబర్ అథ్లెటిక్స్ రాకేశ్ బెల్లూరి 97049 44283 అథ్లెటిక్స్ జి.సునంద్ ఉట్నూర్ 99894 03069 అథ్లెటిక్స్ పి.రాజేశ్ చాందా(టి) 94921 36510 ఆర్చరీ మారుతి/రవీందర్ చించుఘాట్ 94914 68654 హాకీ శేఖర్ ఉట్నూర్ 80089 71963 హాకీ జె.రవీందర్ భరంపూర్ 96669 07755 హాకీ షేక్ షబ్బీర్ మర్లపల్లి 81211 75659 వాలీబాల్ దయాకర్ కేస్లాపూర్ 93811 59116 వాలీబాల్ పిసారాం నందిగావ్ 81215 35200 వాలీబాల్ మహేందర్ నార్నూర్ 91829 45202 వాలీబాల్ జైతు గుంజాల –– వాలీబాల్ శ్రీనివాస్ మాన్కపూర్ 72076 91916 వాలీబాల్ అఖిలేష్ చాందా(టి) 96660 01285 వాలీబాల్ రామిరెడ్డి ఖాప్రి 79816 71724 వాలీబాల్ సందీప్ దుర్గానగర్ 97015 87819 వాలీబాల్ ఎన్.స్వామి భీంసరి 98487 36476 వాలీబాల్ కాంతారావు పొచ్చర 94935 34163 ఖోఖో పొచ్చన్న ఖోడద్ 97019 65056 ఖోఖో శివకృష్ణ ఉట్నూర్ 89788 10993 క్రికెట్ ఎ.మహేందర్ నార్నూర్ 91829 45202 సాఫ్ట్బాల్ జి.గంగాధర్ నేరడిగొండ 90005 65142 బేస్బాల్ పవన్ అంకోలి –– హ్యాండ్బాల్ వివేక్ గుడిహత్నూర్ 93984 34886 బ్యాడ్మింటన్ కె.మహేశ్ దుర్గానగర్ –– కబడ్డీ ఎం.విఠల్ రెడ్డి మావల 70131 70041 పట్టణ ప్రాంతాల్లో.. బాక్సింగ్ సాయికుమార్ డీఎస్ఏ, ఆదిలాబాద్ 81065 56176 జూడో ఎన్.రాజు డీఎస్ఏ, ఆదిలాబాద్ 77803 69672 అథ్లెటిక్స్ రమేశ్ డీఎస్ఏ, ఆదిలాబాద్ 91774 78427 హ్యాండ్బాల్ సింధు మహాలక్ష్మివాడ 63008 07110 హ్యాండ్బాల్ హరిచరణ్ తిర్పెల్లి 63008 07110 హాకీ శ్రీనివాస్ కేఐసీ, స్టేడియం 94941 48474 తైక్వాండో వీరేష్ డీఎస్ఏ, ఆదిలాబాద్ 70122 81284 బ్యాడ్మింటన్ కబీర్దాస్ ఆదిలాబాద్ 94907 40567 రెజ్లింగ్ శ్రీధర్ డీఎస్ఏ, ఆదిలాబాద్ 86864 26300నెలపాటు ఉచిత శిక్షణ.. 14 ఏళ్ల లోపు బాల, బాలికలకు నెల రోజులపాటు వివిధ క్రీడాంశాల్లో ఉచిత శిక్షణ అందించనున్నాం. ఈ మేరకు శిక్షకులను ఎంపిక చేసి క్రీడా సామగ్రిని సైతం అందజేశాం. శిక్షకుల వేతనం, క్రీడా సామగ్రి కొనుగోలుకు సంబంధించి మొత్తం రూ. 50వేల చొప్పున మంజూరు చేస్తూ ఉత్తర్వులు అందాయి. ఈ శిక్షణను బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలి. – వెంకటేశ్వర్లు, డీవైఎస్వో -
అప్రమత్తతతోనే అగ్ని ప్రమాదాల నివారణ
ఆదిలాబాద్టౌన్: అప్రమత్తతతోనే ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సురేశ్ కుమార్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఆ శాఖ కార్యాలయంలో రిటైర్డ్ ఉద్యోగులను ఆదివారం సన్మానించారు. శాలువాతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రమాదాల నివారణపై వారం పాటు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ రాజేశ్వర్, ఫైర్స్టేషన్ ఆఫీసర్ జగత్రామ్ తదితరులు పాల్గొన్నారు. -
పాలనలో రాజర్షి మార్క్
కై లాస్నగర్: ఆదిలాబాద్ కలెక్టర్గా రాజర్షి షా తన మార్కు చూపుతున్నారు. అడవులు, ఆది వాసీ జిల్లాగా ముద్రపడ్డ ఆదిలాబాద్ అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల ను క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా కృషి చేస్తున్నారు. వాటి అమలు తీరుపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనలతో పరిస్థితులను అవగతం చేసుకుంటూ లోటు పాట్లను సరిదిద్దేలా చర్యలు చేపడుతున్నారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించే వారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు అక్రమార్కులకు తనదైన శైలిలో చెక్ పెడుతున్నారు. బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన నేపథ్యంలోనే రెండు జాతీయ స్థాయి అవార్డులు, ఒక రాష్ట్రస్థాయి పురస్కారం వరించడం తన మార్క్ పాలనకు అద్దం పడుతోంది. సోమవారం ఢిల్లీ వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా నీతి ఆయోగ్ అవార్డు అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో రాజర్షి షా పాలనాదక్షతపై ప్రత్యేక కథనం. ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడంపై రాష్ట్రస్థాయి పురస్కారం.. ● పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సీఈసీ చేపట్టిన బదిలీల్లో భాగంగా జిల్లాకు వచ్చిన రాజ ర్షి షా గతేడాది మార్చి 6న ఆదిలాబాద్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. స్వల్ప వ్యవధిలోనే జిల్లా పరిస్థితులను అవగతం చేసుకున్నారు. అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ఎంపీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకమైన ఓటరు జాబితా సిద్ధం చేసినందుకు గాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రశంసలు అందుకున్నారు. అలాగే రాష్ట్రస్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు. గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ‘ఆరోగ్య పాఠశాల– కళాశాల’ అమలుతో వరించిన ‘స్కోచ్’ ● సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పరిశీలనలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన ద్వారా ప్రభు త్వ బడులను తనిఖీ చేశారు. ఈ సమయంలో ఆయా పాఠశాలల్లోని స్థితిగతులు, విద్యార్థుల అలవాట్లను గమనించిన కలెక్టర్ వాటిని మా ర్చాలని సంకల్పించారు. బాలల దినోత్సవం పురస్కరించుకుని గతేడాది నవంబర్ 14న ‘ఆరోగ్య పాఠశాల– కళాశాల ’కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించడంతో పాటు ఆరోగ్య సంరక్షణ, చదువులో రాణించేందుకు అనుసరించాల్సిన కార్యక్రమాలపై వారంలో ఏడు రోజుల పాటు రోజుకో కార్యక్రమాన్ని నిర్దేశించారు. ప్రతీ పా ఠశాలకు గైడ్ టీచర్తో పాటు స్టూడెంట్ చాంపియన్లను ఎంపిక చేశారు. కార్యక్రమ అమలుపై ప్రతీ వారం సమీక్ష నిర్వహించారు. ప్రగతిపై ఆరా తీస్తూ లోటుపాట్లను సవరించారు. స్వల్ప వ్యవధిలోనే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో మార్పు వచ్చేందుకు కృషి చేశారు. ఈ కార్యక్రమం సఫలీకృతం చేసి స్కోచ్ దృష్టిని ఆకర్షించారు. ఇటీవల జాతీయ స్థాయి అవార్డును అందుకున్నారు. నీతి ఆయోగ్ పురస్కారానికి ఎంపిక ● నీతి ఆయోగ్ అమలు చేస్తున్న బ్లాక్ ఆస్పిరేషనల్ ప్రోగ్రాం– 2024కు గాను ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారాని కి కలెక్టర్ ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 426 ఆస్పిరేషనల్ బ్లాకుల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుండగా జిల్లాలోని నార్నూర్ టాప్– 5లో నిలువడం కలెక్టర్ పాలనాదక్షతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఏప్రిల్ 2022 నుంచి డిసెంబర్ 2024 వరకు ఆ బ్లాక్లో ఆరోగ్యం, పోషణ, విద్య, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై నీతి ఆయోగ్ దృష్టి సారించింది. ఆ సంస్థ మార్గదర్శకాలను పక్కాగా పాటిస్తూ నార్నూర్ మండలం పలు రంగాల్లో ప్రగతిని సాధించింది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరైన పోషకాహారం అందించి గర్భిణులు, చిన్నారులు, బాలింతల ఆరో గ్యం మెరుగుపరడంతో పాటు ప్రాథమిక శిశు సంరక్షణ, విద్యా ఫలితాలు, డిజిటల్ పరిజ్ఞా నం, ఆర్థిక చేకూర్పు, గిరిజన విద్యార్థుల సంక్షేమం, సహజ వ్యవసాయం, చెక్ డ్యాంల ని ర్మాణం, స్వయంసహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందించడం, మోడల్ సీఎస్సీ సెంటర్ ద్వారా ప్రజల జీవనోపాధిలో పురోగతి సాధించింది. వాటిపై పలు విడతల్లో మదింపు చేసిన నీతి ఆయోగ్ అధికారులు ఐదు ప్రధాన అంశాల్లో సాధించిన సమగ్ర అభివృద్ధికి గాను జిల్లా అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమంలో భాగంగా ఈ అవార్డుకు ఎంపిక చేశారు. సివిల్ సర్వీసెస్ డే పురస్కరించుకుని సోమవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా కలెక్టర్ ఈ అవార్డు అందుకోనున్నారు. ఏడాదిలోనే రెండు జాతీయ అవార్డులు గవర్నర్ చేతుల మీదుగా మరో పురస్కారం రాష్ట్ర, జాతీయ స్థాయిలో జిల్లాకు గుర్తింపు నేడు ప్రధాని చేతుల మీదుగా నీతి ఆయోగ్ అవార్డు అందరి సహకారంతోనే.. కేంద్రం నిర్దేశించిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను నార్నూర్ బ్లాక్లో పకడ్బందీగా అమలు చేశాం. అడ్మినిస్ట్రేషన్ విభాగంలో నీతి ఆయోగ్ అవార్డు రావడం జిల్లాకు జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపునిస్తోంది. మంత్రి సీతక్కతో పాటు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలందరి సహకారంతోనే ఈ అవార్డు లభించింది. సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ అవార్డు జిల్లా అభివృద్ధికి మరింత తోడ్పడనుంది. – రాజర్షి షా, కలెక్టర్ -
ఎస్ఆర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ
ఆదిలాబాద్రూరల్: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ మెయిన్స్లో మావల మండలంలోని ఎస్ఆర్ ప్రైమ్ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. రాథోడ్ సచిన్ 3,333 ర్యాంకు, బి.శివసాయి 4,721, వాసు 6,876, ఎల్.శ్రీలేఖ 7,505, ఆక్షాద్ 8,071, జాదవ్ సాయిరామ్ 9,067, రాథోడ్ సంధ్య 9,156, రాథోడ్ పావని 11,113, రాథోడ్ హరీష్ 13,731 ర్యాంకుతో పాటు మరో 32 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు కళాశాల జోనల్ ఇన్చార్జి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. శనివారం కళాశాల చైర్మన్తో పాటు డైరెక్టర్లు సదరు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాళ్లు జయపాల్రెడ్డి, అరవింద్, లలిత పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
● ఇద్దరికి తీవ్రగాయాలు తానూరు/భైంసాటౌన్: తానూరు మండలంలోని భోసి వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని నాంద గ్రామానికి చెందిన చందు (50), హన్మంతు, బాబన్న(సుదర్శన్) భైంసా వైపు నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా భోసి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. చందు తలపై నుంచి వాహనం వెళ్లడంతో తలభాగం నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు. హన్మంతు, బాబన్నకు తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు అంబులెన్స్లో భైంసాలోని ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. హన్మంతు పరిస్థితి విషమంగా ఉండడంతో నాందేడ్కు తరలించగా, బాబన్న భైంసా ఏరియాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతు లక్ష్మణచాంద: ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు వడ్యాల్ గ్రామానికి చెందిన మద్దెల గంగన్న–లక్ష్మి దంపతుల కుమారుడు రామ్చరణ్ (14) శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఒంటిగంట సమయంలో కాలనీ పిల్లలతో కలిసి గ్రామ సమీపంలోని చెక్ డ్యాంకు స్నానానికి వెళ్లారు. సాయంత్రమైనా తమ కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆరా తీయగా ఈతకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో చెక్డ్యామ్ వద్దకు వెళ్లి చూడగా రామ్చరణ్ బట్టలు, పాదరక్షలు కనిపించాయి. చీకటి కావడంతో తిరిగి ఇంటికి వచ్చినట్లు కాలనీవాసులు తెలిపారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్కు సైకిల్యాత్ర నేరడిగొండ: బెంగళూరుకు చెందిన కొట్రెస్ సోలార్ ద్వారా నడిచే సైకిల్పై కన్యాకుమారి నుంచి కశ్మీర్కు యాత్ర చేపట్టాడు. శనివారం నేరడిగొండ మండలంలోని రోల్మామడ టోల్ప్లాజ్ వద్ద అతను హైవే పెట్రోలింగ్ పోలీసులకు కనిపించగా పలు సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 100కు కాల్ చేయాలని, వెంట ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచుకోవాలని సూచించారు. -
కూచిపూడి నృత్యంలో గిన్నిస్ రికార్డు
● 54 మందికి అందిన గిన్నిస్ వరల్డ్ రికార్డు పత్రాలు నిర్మల్ఖిల్లా: జిల్లాకు చెందిన 54 మంది చిన్నారులు కూచిపూడి నృత్యంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. స్వరూపిణి నృత్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో శిక్షకురాలు నవ్య వినయ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన చిన్నారులు 2023 డిసెంబర్ 24న జీఎంసీ బాలయోగి స్టేడియంలో భారత్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి నృత్యంలో ప్రతిభ కనబరిచారు. పరిశీలకుల బృందం ఎంపిక చేసిన మీదట 18 నెలల అనంతరం ధ్రువీకరణ పత్రాలు, మెడల్స్ పంపించినట్లు శిక్షకురాలు నవ్య తెలిపారు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎస్పీ ఉపేందర్ రెడ్డి, కార్మిక శాఖ సహాయ కమిషనర్ ముత్యంరెడ్డి చిన్నారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మానసిక వైద్య నిపుణులు అల్లాడి సురేష్, మహిళా హక్కుల కమిషన్ చైర్పర్సన్ అనిషా, చెనిగారపు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక డంప్ స్వాధీనం
ఆదిలాబాద్టౌన్(జైనథ్): జిల్లా అధికారుల ఆదేశాలతో జైనథ్ మండలంలోని పెన్గంగా పరీవాహక గ్రామాలపై మండల స్థాయి అధికారులు అప్రమత్తమై ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే తమకు అందిన సమాచారం మేరకు శనివారం ఎస్సై పురుషోత్తం, తహసీల్దార్ నారాయణ, ఆర్ఐ ఉల్లాస్ సాంగ్వి, కౌట గ్రామాల మధ్య ఉన్న ఇసుక డంప్ను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ సుమారు 10 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇసుక విలువ రూ.20వేల వరకు ఉంటుందన్నారు. ఈ విషయాన్ని ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. -
21 నుంచి సమ్మెలోకి ఆర్జీయూకేటీ అధ్యాపకులు
బాసర: రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించిన తర్వాతే నోటిపికేషన్ వేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ఆర్జీయూకేటీ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీశైలం తెలిపారు. శనివారం సమ్మె నోటీస్ను ఏవో రణధీర్కు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్జీయూకేటీ స్థాపించినప్పటి నుంచి దాదాపుగా 17 ఏళ్లుగా ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 21 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు డాక్టర్ ఎన్. విజయ్ కుమార్, మంద సతీశ్ కుమార్, శ్రీధర్, తిలక్రెడ్డి, డాక్టర్ బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
జేఈఈలో మెరిసిన మనోళ్లు
బెల్లంపల్లి సీవోఈ విద్యార్థుల ప్రతిభదేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. శుక్రవారం రాత్రి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జేఈఈ మెయిన్ ఫలితాలను ప్రకటించింది.బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ (సీవోఈ) కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మ్రోగించారు. కళాశాల నుండి మొత్తం 39 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 15 మంది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వీరే... ఎస్.కే. సుభాన్ 88.88 పర్సంటైల్ సాధించి కళాశాల టాపర్గా నిలవగా కె.రంజిత్ 86.57, సీహెచ్.సాయికుమార్ 85.15, కె.శ్రీనివాస్ 80.17, ఎం.సాయిరాం 78.99, ఆర్.అంజి 78.53, కె.శారూన్ 76.84, డి.రాజేందర్ 75.69, ఎస్.ఆదర్శ్ 75.04, ఎన్.రాజేశ్, 75.35, ఎస్.వెంకటేశ్వర్ 72.66, బి.ప్రవీణ్కుమార్ 73.67, బి.అంజిబాబు 72.30, జీ.చరణ్ 63.87, కె.రామ్ చరణ్తేజ 62.39 పర్సంటైల్ సాధించారు. సదరు విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ ఆకిడి విజయ్సాగర్, వైస్ ప్రిన్సిపాల్ దుర్గం రమాదేవి, లెక్చరర్లు అభినందించారు. సమష్టి కృషితో ఉత్తమ ఫలితాలు బెల్లంపల్లి సీవోఈ కళాశాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఏటా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ఈ సారి కూడా జేఈఈ మెయిన్స్లో 15 మంది విద్యార్థులు మెరుగైన పర్సంటైల్ సాధించారు. సమష్టి కృషితోనే విజయం సాధ్యమైంది. నిరుపేద విద్యార్థులైనా చదువులో తామేమీ తక్కువ కాదని నిరూపించారు. – ఆకిడి విజయ్సాగర్, సీవోఈ ప్రిన్సిపాల్, బెల్లంపల్లి షేక్ అమన్ -
ప్రజా ప్రభుత్వంలో పర్యాటక క్షేత్రాల అభివృద్ధి
● జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కనేరడిగొండ: ప్రజా ప్రభుత్వంలో పర్యాటక క్షేత్రాలను అభివృద్ధి పర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. శనివారం ఎమ్మెల్సీ దండే విఠల్, పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్రెడ్డితో కలిసి కుంటాల జలపాతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జలపాతం అభివృద్ధికి కృషి చేస్తానని, త్వరలోనే రోప్వే నిర్మిస్తామన్నారు. పర్యాటకుల సౌకర్యార్థం రిసార్ట్ పనులను ప్రారంభించామని, జూన్ నాటికి రిసార్టు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణం దెబ్బతినకుండా కుంటాల జలపాతాన్ని అభివృద్ధి చేసి స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించేలా చూస్తామన్నారు. నిజాం కాలంలోనే కుంటాల జలపాతం వద్ద అప్పటి అధికారులు ఇక్కడ సేద తీరినట్లు ఆనవాళ్లు ఉన్నాయన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుంటాల జలపాతానికి, పర్యాటక రంగానికి చేసిందేమి లేదన్నారు. మంత్రి వెంట కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశ్, కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్, నాయకులు తుల అరుణ్ కుమార్, ఆత్రం సుగుణ, తలమడుగు మాజీ జెడ్పీటీసీ గోక గణేశ్రెడ్డి, బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఉపాధ్యక్షుడు ఆడే వసంత్రావు, తిత్రే నారాయణసింగ్, జాదవ్ కపిల్, ఆడే సతీశ్, బద్దం పోతారెడ్డి, నాయిడి రవి, తదితరులు ఉన్నారు. -
శోక సంద్రంలో సోన్
సోన్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో అష్టపు ప్రేమ్సాగర్ మృతదేహం శనివారం స్వగ్రామం చేరుకుంది. వారం రోజుల క్రితం దుబాయిలోని ఓ ప్రముఖ బేకరీలో పనిచేస్తున్న ప్రేమ్సాగర్ను పాకిస్తాన్కు చెందిన యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. అంతిమయాత్రలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణిరెడ్డి, బీజేపీ నాయకులు సత్యనారాయణగౌడ్, అయ్యన్న గారి భూమ య్య, ముత్కపల్లి నరేష్, తదితరులు పాల్గొన్నారు. -
నిర్మల్ విద్యార్థుల ప్రతిభ
నిర్మల్రూరల్: జిల్లా కేంద్రంలోని విజయనగర్ కాలనీకి చెందిన ఉపాధ్యాయులు పోతుల్వార్ సురేష్–స్వప్న దంపతుల కుమారుడు సృజన్ కుమార్ జేఈఈ మెయిన్లో 99.96 శాతం పర్సంటైల్తో ఆలిండియాలో 683 కామన్ ర్యాంక్, ఓబీసీ విభాగంలో 105 ర్యాంక్ సాధించాడు. జిల్లా కేంద్రానికి చెందిన అటోలి సంజీవ్ కుమార్, చింతప్రభ దంపతుల కుమారుడైన రుతిక్ కుమార్ 99.89 శాతం పర్సంటైల్ సాధించి ఓబీసీ కోటాలో 301 ర్యాంకును కై వసం చేసుకున్నాడు. స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నహిద్ పాష కుమారుడు సయ్యద్ రియాజ్ 99.88 శాతం పర్సంటైల్ సాధించాడు. -
శ్రీచైతన్య విద్యాసంస్థల విజయకేతనం
కరీంనగర్: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు జాతీయస్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించారు. ఎం.రోహిత్ 17, టి.కుందన్ 814, పి.ఈశ్వర్ ముఖేశ్ 1,275, ఎం.అంజలి 2,575, బి.అక్షర 2,992, ఎం.తరుణ్ 5,949, నందిని7,464 ర్యాంకు, 20 వేల లోపు 15 మంది ర్యాంకులు సాధించారు. పరీక్షకు హాజరైన వారిలో 40 శాతం మంది విద్యార్థులు అడ్వాన్స్డ్కు క్వాలిపై అయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ రమేశ్రెడ్డి మాట్లాడుతూ, సంస్థ స్థాపించిన నాటి నుంచి అన్ని పోటీ పరీక్షల్లో శ్రీచైతన్య విద్యార్థులు రాణిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు. కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్రెడ్డి, డీన్ జగన్మోహన్రెడ్డి, ప్రిన్సిపాల్స్ మల్లారెడ్డి, రాధాకృష్ట, మోహన్రావు, ఏజీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ట్రినిటీ సత్తా
కరీంనగర్: జేఈఈ మెయిన్ ఫలితాల్లో ట్రినిటీ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. ఎ.రఘుపతి జాతీయస్థాయిలో 138వ ర్యాంకు, ఎ.హేమంత్ 162, డి.సాయిచరణ్కుమార్ 313, ఎస్.పరమేశ్వరరెడ్డి 344, ఎ.ఫనీందర్ 409, ఆర్.సాయికిశోర్ 587, వి.అదీప్ 751, డి.మహేశ్ 974, ఆర్.మనోజ్ 1,262, బి.సిద్ధిక 1,551 ర్యాంకు సాధించారు. కేవలం కరీంనగర్ బ్రాంచ్ నుంచి 1,000 లోపు 8 ర్యాంకులతో పాటు పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 83 శాతం మంది ఉత్తమ ర్యాంకులతో జేఈఈ–అడ్వాన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో కళాశాల చైర్మన్ దాసరి మనోహర్రెడ్డి మాట్లాడారు. నిర్దిష్ట ప్రణాళిక, ఉన్నతమైన బోధన, నిష్ణాతులైన అధ్యాపకుల పర్యవేక్షణలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. రాబోయే అడ్వాన్డ్స్ పరీక్షల్లో మరిన్ని ఉత్తమ ర్యాంకులు సాధించి పేరొందిన ఐఐటీ సంస్థల్లో తమ విద్యార్థులు సీట్లు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ బ్రాంచ్ల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. -
డీఎస్పీ జిల్లా కార్యవర్గం ఎన్నిక
ఆదిలాబాద్రూరల్: ధర్మ సమాజ్ పార్టీ(డీఎస్పీ) జిల్లా కార్యవర్గాన్ని ఆ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అగ్గిమల్ల గణేశ్, ఉపాధ్యక్షులుగా సీటీ వెంకటేశ్, సుష్మా, ప్రధాన కార్యదర్శిగా చిట్యాల శ్రీనివాస్, కోశాధికారిగా మంజూషా, కార్యదర్శిగా గంగన్న, సోషల్ మీడియా ఇన్చార్జీగా ముదాం పవన్, కార్యవర్గ సభ్యులుగా గణేశ్, రాజేశ్వర్, నవీన్, శ్రీకాంత్, శేఖర్, అరవింద్, నరేశ్, గంగన్న, రాజన్న, సంతోష్, అనిల్, రవి, తిరుపతి, ప్రతాప్ ఎన్నికయ్యారు.ఈవీఎంల గోదాం తనిఖీకై లాస్నగర్: జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో గల ఈవీఎంలను భద్రపర్చిన గోడౌన్ను కలెక్టర్ రాజర్షి షా శనివారం పరిశీలించారు. ప్రతీ నెల తనిఖీలో భాగంగా గోడౌన్ను సందర్శించి స్ట్రాంగ్రూం భద్రతను పర్యవేక్షించారు. అనంతరం అక్కడి రిజిస్టర్లో సంతకం చేశారు. ఆ యన వెంట కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ పంచపూల తదితరులున్నారు.దరఖాస్తుల ఆహ్వానంఆదిలాబాద్రూరల్: 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఎంపికై న విద్యార్థులకు ఇంటర్, ఎప్సెట్ కార్పొరేట్ విద్య అందించేందుకు గాను జిల్లాలోని ఆయా ప్రైవేట్ జూనియర్ కళా శాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా దళితాభివృద్ధిశాఖ అధికారి సునీత కుమా రి ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి గల ప్రి న్సిపాళ్లు ఈ నెల 30లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం సంబంధిత పత్రాలను కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. కళాశాల అనుమతి ధ్రు వీకరణ పత్రం, వసతులు, బిల్డింగ్ ప్లాన్, అగ్ని మాపక భద్రత, గడిచిన ఐదేళ్లలో సాధించిన ఉత్తీర్ణత శాతం, కోర్సుల వివరాల సమాచారం కూడా అందజేయాలని పేర్కొన్నారు. -
అభివృద్ధి పనుల్లో అలసత్వం ఉపేక్షించం
నిర్మల్చైన్గేట్: ‘అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యానికి తావులేదు.. అలసత్వం వహించే వారిని ఉపేక్షించేది లేదు.. పని చేయకుంటే వారిని పక్కన పెట్టుడే.. అ అలాగే గడువులోపు నాణ్యతతో పూర్తి చేయించా లి..’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణనీటి సరఫరా, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. నిర్మల్ కలెక్టరేట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి పనులపై శనివారం ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. టెండర్ దశ నుంచే పనులు వేగవంతం చేసి, వర్షాకాలానికి ముందు పూర్తిచేయాలన్నారు. ఆలస్యం చేస్తున్న గుత్తేదారులకు నోటీసులు జారీ చేసి, త్వరగా పూర్తి చేయించాలని సూచించారు. పనుల నాణ్యతపై రాజీలేకుండా చూ డాలని, కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. సాగు, తాగునీటి సమస్యల పరి ష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు స్ప ష్టం చేశారు. అధికారులు ప్రజాప్రతినిధులకు వాస్తవాలు చెప్పాలని ఫీల్డ్ విజిట్చేసి ఎప్పటికప్పుడు ఏఈలు భగీరథ పనులు సమీక్షించుకోవాలన్నారు. అంగన్వాడీల బలోపేతం, సౌకర్యాల విస్తరణ త్వరలో అంగన్వాడీల్లో టీచర్లు, ఆయాల ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. సొంత భవనాలు లేని కేంద్రాలకు రూ.12 లక్షలతో పక్కా భవనాలు నిర్మిస్తామని పేర్కొన్నారు. గతంలో మండలానికి ఒక భవనం నిర్మిస్తే, ఇప్పుడు రెండు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలకు సొంత భవనాలు, విద్యుత్, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పి స్తామన్నారు. మినీ అంగన్వాడీలను అప్ గ్రేడ్ చేస్తామని, సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్లు, ట్రాన్స్జెండర్ క్లినిక్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మహిళా సంఘాలకు చెక్కులు.. మంత్రి సీతక్క, కలెక్టరేట్కు చేరుకోగానే పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. మహిళా పోలీసులు ఏర్పాటు చేసిన ‘శివంగి’ బృందాన్ని లాంఛనంగా ప్రారంభించి, రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుంద ని కొనియాడారు. తర్వాత మహిళా సంఘాలకు, మెప్మాలకు మంజూరైన చెక్కులను కలెక్టర్ అభిలాష అభినవ్, ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ చేశా రు. బ్యాంకు లింకేజీ, రుణాల మంజూరు, వసూలు లో నిర్మల్ జిల్లా ప్రగతిని మంత్రి ప్రశంసించారు. సమావేశంలో ఎంపీ గోడం నగేశ్, నిర్మల్, ఆదిలా బాద్, ముధోల్, ఖానాపూర్, సిర్పూర్, అసిఫాబా ద్, బోథ్ ఎమ్మెల్యేలు మహేశ్వర్రెడ్డి, పాయ ల్ శంకర్, పవార్ రామారావు పటేల్, వెడ్మ బొజ్జు పటేల్, పాల్వాయి హరీశ్బాబు, కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఐసీడీఎస్ సెక్రటరీ అనితా రామచంద్రన్, మంచిర్యాల, నిర్మల్ కలెక్టర్లు కుమా ర్ దీపక్,అభిలాష అభినవ్, ఐటీడీఏ పీవోఖుష్బూ గుప్తా, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిర్లక్ష్యానికి తావులేదు అలాంటి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి త్వరలో అంగన్వాడీల్లో ఖాళీల భర్తీ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఉమ్మడి జిల్లా పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, సీ్త్ర శిశు సంక్షేమ శాఖలపై సమీక్ష అభివృద్ధి పనుల తీరుపై ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల అసంతృప్తి -
వడదెబ్బ.. అప్రమత్తతే అండ
● ఈ ఏడాది మండుతున్న ఎండలు ● ప్రభుత్వం ముందస్తు చర్యలు ● అందుబాటులో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ● వైద్యులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ● రిమ్స్లో ప్రత్యేక విభాగంకై లాస్నగర్: ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వడగాలులు, వడదెబ్బను ప్రత్యేక విపత్తుగా పరిగణించింది. వాటి కారణంగా మృతి చెందే వారి కుటుంబాలకు అందించే ఎక్స్గ్రేషియాను భారీగా పెంచింది. అయితే ప్రజలు వాటి బారిన ప డకుండా ఉండేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చే యాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎండల తీవ్రత పెరుగుతున్న క్రమంలో చల్లని తాగునీరు అందుబాటులో ఉంచేలా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విరి విగా చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ఏఎన్ఎంలు, ఆరోగ్య, ఆశ కార్యకర్తల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. ప్రజలు కూడా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. యంత్రాంగం సంసిద్ధం.. ప్రభుత్వం వడదెబ్బను విపత్తుగా ప్రకటించడంతో దాన్ని అధిగమించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా జిల్లాలోని తహసీ ల్దార్లు, ఎంపీడీవోలు, మెడికల్ ఆఫీసర్లతో ఇటీవల సమీక్ష నిర్వహించారు. దీంతో జిల్లా కేంద్రంతో పా టు ఆయా మండల కేంద్రాల్లోని ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. వడదెబ్బతో వచ్చే బాధితులకు తక్షణ వైద్య సాయమందించేలా ఐదు పడకలతో రిమ్స్లో ప్రత్యేక విభాగాన్ని సిద్ధం చేస్తున్నారు. మంగళవారం నాటికి ఇది అందుబా టులోకి రానుందని రిమ్స్ వైద్యాధికారులు చెబుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్లకు, పారామెడికల్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఎండల తీవ్రతతో కలిగే అనర్థాలు, వడదెబ్బ లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు సత్వర వైద్యసేవలు అందించేలా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. పీహెచ్సీలతో పాటు ఆరోగ్య, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. వీరిపైనే అఽధిక ప్రభావం .. జిల్లాలో గతంలో ఎన్నడులేని విధంగా ఈ ఏడాది మే నెలకు ముందే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఏప్రిల్లోనే ఎండలు భగ్గుమంటున్నాయి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. ప్రధానంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు, రైతులు, కార్మికులు ప్రత్యేకించి భవన నిర్మాణ రంగంలో పనిచేసే వారిపై భానుడి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముంది. ఈ మేరకు వారంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు ఎండలో వెళ్లకపోవడమే మంచి దని పేర్కొంటున్నారు. అత్యవసరమై బయటకు వెళితే గొడుగు, టోపీ, రుమాలు వంటివి ధరించా లని, సాధ్యమైనంత ఎక్కువ నీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు. అప్రమత్తతే శ్రేయస్కరం వడగాలులు, వడదెబ్బ విపత్తను ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బందికి శిక్షణనిచ్చాం. క్షేత్రస్థాయిలోనూ ఎండ నుంచి రక్షణ పొందేలా ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాకు ఇటీవలే రెండు లక్షల ఓఆర్ఎస్ ప్యాకేట్లు వచ్చాయి. వాటిని పీహెచ్సీలతో పాటు ఆశ, ఆరోగ్య కార్యకర్తల వద్ద అందుబాటులో ఉంచుతున్నాం. ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించినట్లైతే దీని బారిన పడకుండా ఉండవచ్చు. – నరేందర్ రాథోడ్, డీఎంహెచ్వోఎక్స్గ్రేషియా రూ.4లక్షలకు పెంపు.. వడదెబ్బతో మృతి చెందే బాధిత కుటుంబాలకు గతంలో ఆపద్బాంధు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.50వేల సాయం అందించేది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పరిహారాన్ని రూ.4 లక్షలకు పెంచింది. అయితే 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన సందర్భాల్లోనే వడదెబ్బ మరణాలుగా పరిగణించనున్నారు. వడదెబ్బ, వేడిగాలులతో మరణం సంభవిస్తే సంబంధిత మెడికల్ ఆఫీసర్, తహసీల్దార్, పోలీస్ అధికారి(ఎస్సై ర్యాంకు కు తగ్గకుండా ఉండే)తో కూడిన బృందం క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించాల్సి ఉంటుంది. వడదెబ్బ మరణమే అని వారు నిర్ధారిస్తే మృతుడి కుటుంబీకుల్లో ఎవరికి ఆర్థికసాయం అందించా లో వివరాలు సేకరిస్తారు. అనంతరం వివరాలతో పాటు మృతుడి డెత్ సర్టిఫికెట్ను సంబంధిత అధికారులకు నామినీ సమర్పించాల్సి ఉంటుంది. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి, కలెక్టర్ ధ్రువీకరించిన తర్వాత బాధిత కుటుంబానికి పరిహారం మంజూరు చేస్తారు. అయితే మృతులు రైతుబీమాలో నమోదై ఉండి వడదెబ్బతో మరణిస్తే ఏ పథకం కింద ఎక్కువ ఆర్థికసాయం అందుతుందో దానినే అమలు చేయనున్నట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. -
దివ్యాంగుల సంక్షేమానికి కృషి
● మంత్రి సీతక్కఆదిలాబాద్: దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని పంచాయతీ రాజ్, గ్రామీణఅభివృద్ధి, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని స్టేడియంలో దివ్యాంగులకు శనివారం సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దివ్యాంగులు స్వశక్తితో ఎదిగేలా ప్ర భుత్వం పలు కార్యక్రమాలను చేపడుతుందన్నారు. అలింకో సంస్థ సహకారంతో సహాయ ఉపకరణా లను పంపిణీ చేసినట్లు వివరించారు. ఇందులో ఎంపీ నగేశ్, ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, డైరెక్టర్ శైలజ, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య, జిల్లా సంక్షేమ శాఖ అధికారి మిల్కా తదితరులు పాల్గొన్నారు. ఇచ్చోడలో.. ఇచ్చోడ: మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాల ఆవరణలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపి ణీ నిర్వహించారు. మంత్రి సీతక్క హాజరై దివ్యాంగులకు వాటిని అందజేశారు. ఎంపీ నగేశ్ మాట్లాడు తూ, దివ్యాంగుల సహాయ ఉపకరణాల కోసం కేంద్రం నిధులిస్తున్నా పంపిణీ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఫొటో లేకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్జాదవ్ మాట్లాడుతూ, దివ్యాంగులకు బ్యాటరీతో కూడిన స్కూటీలు ఇవ్వాలని మంత్రిని కోరారు. మంత్రి రాకతో మార్కెట్ బంద్ చేయించిన పోలీసులుసాక్షి, ఆదిలాబాద్: జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ప ర్యటన నేపథ్యంలో ఇచ్చోడలో పోలీసులు మార్కెట్ బంద్ చేయించడం చర్చనీయాంశంగా మారింది. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి సీతక్క హజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు శనివారం ఉదయం 8 గంటల నుంచే మార్కెట్ను మూసి వేయించారు. విషయం తెలియక వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు అయోమయానికి గురయ్యారు. దీనిపై సొంత పార్టీ నాయకులు సైతం చర్చించుకోవడం కనిపించింది. ప్రతిపక్ష పార్టీల నాయకులు బంద్ వ్యవహారంపై విస్మయం వ్యక్తం చేశారు. -
● నేడు ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం ● తొలిసారిగా అధికారికంగా నిర్వహణ ● ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ● మంత్రి సీతక్క, ప్రజాప్రతినిధుల రాక
ఆ ఘటనలో నా భర్త చనిపోయిండు..ఇంద్రవెల్లి ఘటనలో నా భర్త కొద్దు చనిపోయిండు. ఆ తరువాత నేను కూలినాలి చేసి నా కొడుకును పెంచి పెద్ద చేసిన. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నా భర్త మరణాన్ని గుర్తించిండ్రు. ఇంటి స్థలం ఇచ్చిండ్రు. ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేసిండ్రు. ఐటీడీఏ ద్వారా రుణం ఇస్తే నా కొడుకుకు ఉపాధి దొరుకుతది. – సెడ్మాకి లచ్చుబాయి, తాటిగూడ నా కుటుంబాన్ని కూడా ఆదుకోవాలినాడు ఇంద్రవెల్లిలో సంతకు నా భర్త శంభుతో కలిసి వెళ్లిన. అక్కడి నుంచే ఇద్ద రం మీటింగ్కు వెళ్లి నం. ఆ సందర్భంగా పోలీసుల కాల్పుల్లో నా కుడి చేయికి గాయమైంది. నా భర్తకు కూడా తుపాకీ బుల్లెట్ల గాయంతో ఇంటికొచ్చి కొద్ది రోజుల తరువాత చనిపోయిండు. చేతికి గాయం కారణంగా ఇప్పటికీ నేను ఏ పని చేయలేకపోతున్న. ఉన్న ఒక్క కొడుకు కూడా అనారో గ్యంతో చనిపోయిండు. కోడలు వద్ద ఉంటూ కాలం వెల్లదీస్తున్న. ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ కూడా రావట్లేదు. చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వం గుర్తించి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్న. – మడావి జంగుబాయి, కన్నాపూర్ గ్రామస్తురాలు సాక్షి, ఆదిలాబాద్/ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లి మురిసిపోతుంది. నేడు అమరవీరుల సంస్మరణ దినోత్సవా నికి సిద్ధమైంది. ఏటా మాదిరిగానే కాకుండా ఈ సారి ఓ ప్రత్యేకత ఉంది. 43 ఏళ్లుగా నిర్బంధాలు, ఆంక్షల మధ్య అమరవీరులకు నివాళులు అర్పించగా, ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా సంస్మరణ వేడుకలను నిర్వహిస్తోంది. కొద్దిరోజులుగా జిల్లా అధికారులే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఫలితంగా ఈ సారి స్వేచ్ఛగా నివాళులు అర్పించవచ్చన్న మురిపెం ఆదివాసీల్లో కనిపిస్తోంది. స్మృతివనంలో కళకళలాడుతున్న స్తూపం .. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం.. ఆదిలాబాద్ నుంచి ఉట్నూర్ వెళ్లే మార్గ మధ్యలో ఇంద్రవెల్లి గ్రామ శివారులో నిలువెత్తుగా దర్శనమిస్తోంది. అయితే ఇన్నాళ్లుగా ఆ స్తూపం ఆవరణలో అభివృద్ధి మచ్చుకు కనిపించేది కాదు. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్రెడ్డి ఇంద్రవెల్లి ప్రాంతం, ఆదివాసీల అభ్యున్నతిపై దృష్టి సారించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తొలుత ఇక్కడికే విచ్చేశారు. ఆ సమయంలోనే స్తూపం వద్ద అభివృద్ధి పనుల కోసం దాదాపు రూ.కోటి కేటాయించారు. ఆ నిధులతో అక్కడ ఎకరం స్థలంలో అమరవీరుల స్మృతివనం అభివృద్ధి చేశారు. అందులో భాగంగా చుట్టూ ప్రహరీ నిర్మించారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా పూర్తి చేశారు. ఈ సారి సంస్మరణ దినోత్సవంను అధికారికంగా ఘనంగా నిర్వహించేందుకు కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా కొద్ది రోజులుగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం నిర్వహించనున్న కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఉమ్మడి జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. భూమి, భుక్తి, విముక్తి కోసం... ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్ 20న జరిగిన సంఘటనకు నేటితో 44 ఏళ్లవుతుంది. భూమి, భుక్తి, విముక్తితో పాటు స్వయం పరిపాలన కోసం ఆదివాసీలు పోరాటం చేశారు. అటవీ అధికారులు, షావుకార్ల దౌర్జన్యం నశించాలనే డిమాండ్తో గిరిజన రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నాడు ఇంద్రవెల్లిలో సభ ఏర్పాటు చేశారు. దీనికి పీపుల్స్వార్ మద్దతునిచ్చింది. అప్పట్లో ప్రభుత్వం సభ నిర్వహణకు అనుమతినిచ్చినట్టే ఇచ్చి ఆ తర్వాత రద్దు చేసింది. విషయం తెలియక ఆదివాసీగూడేల నుంచి పెద్ద ఎత్తున సభకు తరలివచ్చారు. అయితే సభాస్థలాన్ని ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ఆదివాసీలు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇలా ఘర్షణ వాతావరణంలో పోలీసులు కాల్పులు జరపడంతో పలువురు ఉద్యమకారులు (15 మంది అధికారికంగా) మృతి చెందారు. కాల్పుల ఘటనలో అమరులైన ఆదివాసీల స్మారకార్థం రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి వద్ద 80 అడుగుల స్తూపం నిర్మించారు. ఆ తర్వాత ప్రభుత్వాలు స్తూపం వద్ద సంస్మరణ దినోత్సవం నిర్వహణపై నిషేధాజ్ఞలు విధించాయి. దీంతో ఏళ్ల పాటు ఏప్రిల్ 20 వచ్చిందంటే అక్కడ భారీ ఎత్తున పోలీసుల బందోబస్తు కనిపించేది. స్తూపాన్ని 1986 మార్చిలో గుర్తు తెలియని వ్యక్తులు డైనమెట్లతో పేల్చారు. గిరిజనులు ఆందోళనతో 1987లో ప్రభుత్వం ఐటీడీఏ నిధులతో రెండోసారి నిర్మించింది. 2015 నుంచి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇవ్వకపోయినా ఆంక్షలు సడలించింది. అయితే పోలీసు బందోబస్తు మాత్రం అదే రీతిలో ఉండేది. ఈ ఏడాది మాత్రం అలాంటివేమి లేకుండా ఆదివాసీలు స్వేచ్ఛగా నివాళులు అర్పించేందుకు సిద్ధమయ్యారు. చివరి దశకు స్మృతి వనం పనులు నాటి అమరుల కుటుంబీకులతో పాటు గాయాలైన వారిని ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలేదు. నాలుగేళ్ల క్రితం అప్పటి ఎంపీ సోయం బాపూరావ్ అమరుల కుటుంబీకులకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్రెడ్డి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెంచారు. స్తూపం వద్ద స్మృతి వనం ఏర్పాటుకు రూ.97లక్షల నిధులు కేటాయించారు. చుట్టూ ప్రహరీతో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మాణం, స్తూపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసి సుందరంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డుల ప్రకారం 15 మంది అమరవీరుల కుటుంబీకులకు మండలంలోని ముత్నూర్ సమీపంలో గతేడాది ఇళ్ల స్థలాలు కేటాయించి హక్కు పత్రాలు అందించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. ఇటీవల ఆ పనులను ప్రారంభించారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం నేడు అధికారికంగా నివాళులు నేడు ఉదయం 11 గంటలకు అధికారికంగా నిర్వహించనున్న సంస్మరణ సభకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీలు తరలివచ్చి నివాళులర్పించనున్నారు. మంత్రి చేతుల మీదుగా అమరుల కుటుంబీకులకు ట్రైకా ర్ ద్వారా రూ.10 లక్షల చొప్పున రుణ సౌకర్యం కల్పించనున్నారు. కాగా, నాటి ఘటనలో గాయపడిన వారిని కూడా ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. 1981 ఏప్రిల్ 20 జల్..జంగల్...జమీన్ కోసం ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ ఎక్కుపెట్టింది. తూటాల వర్షం కురిపించింది. హక్కుల సాధనలో 15 మంది గిరిజనులు అమరులయ్యారు. వారి రక్తపుటేరులతో తడిసిన వనసీమ ఎర్రబారింది. అడవిబిడ్డల అమరత్వం నింగికెగిసింది. అగ్ని శిఖలా ఇంద్రవెల్లిలో అమరుల స్తూపమై నిలి చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి ప్రభుత్వాల పాలనలో స్వేచ్ఛగా నివాళులర్పించలేని దుస్థితి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం కొంతమేర సడలింపు ఇచ్చింది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరవీరుల స్తూపం వద్ద స్మృతి వనం ఏర్పాటుకు నిర్ణయించింది. అలాగే సంస్మరణ దినోత్సవాన్ని ఈ ఏడాది అధికారికంగా నిర్వహించేందుకు సన్నద్ధమైంది. -
కారు బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు
కడెం: మితిమీరిన వేగం.. నిర్లక్ష్యపు డ్రైవింగ్తో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిన్నబెల్లాల్కు చెందిన బక్కతట్ల వెంకటేశ్ తన కారులో నేతుల వెంకటేశ్తో కలిసి గురువారం రాత్రి పాండ్వపూర్ వైపు నుంచి బెల్లాల్ వెళ్తుండగా పాండ్వపూర్ హనుమాన్ ఆలయ సమీపంలోని మూలమలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ప్రమాద సూచికను, విద్యుత్ స్తంభాన్ని, ఆలయం ఇనుప కంచెను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకుని ఇద్దరిని నిర్మల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
స్తంభంపై నుంచి పడి తీవ్ర గాయాలు
నెన్నెల: కరెంట్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా పట్టుతప్పి కింద పడడంతో కాంట్రాక్టు ఉద్యోగి రెండు కాళ్లు విరిగిన ఘటన నెన్నెల మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన సోదారి చంద్రయ్య విద్యుత్శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పదేళ్లుగా పని చేస్తున్నాడు. ఈక్రమంలో శుక్రవారం గంగారాం శివారులోని మైసమ్మ ఆలయం వద్ద కరెంట్ స్తంభంపైన మరమ్మతుల కోసం స్తంభం ఎక్కాడు. కరెంట్ వైర్ సరి చేస్తుండగా పట్టు తప్పి కింద పడిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను సహచర సిబ్బంది మంచిర్యాల ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు చంద్రయ్యకు రెండు కాళ్లు విరిగినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
బాసర ఆలయంలో భక్తుల కిటకిట
బాసర: చదువుల తల్లి సరస్వతి అమ్మవారు కొలువైన బాసర పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లో వేచి ఉన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. శ్రీ సరస్వతి, మహాలక్ష్మి, మహంకాళి అమ్మవార్లకు అభిషేకం, అర్చన పూజలను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. గోదావరి నదీ తీరం భక్తుల పుణ్యస్నానాలతో రద్దీగా మారింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి 2గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. -
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ మండలం అందవెల్లి, బోడపల్లి గ్రామాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలను శుక్రవారం టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నట్లు టాస్క్ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అందవెల్లి, బోడపల్లి గ్రామాలను అడ్డాలుగా చేసుకొని నకిలీ బీటీ –3 పత్తి విత్తనాలు కాగజ్నగర్ మీదుగా సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాయనే పక్కా సమాచారంతో గ్రామంలో దాడులు చేసినట్లు తెలిపారు. దాడుల్లో అందవెల్లి గ్రామానికి చెందిన ఎన్.మహేందర్ ఇంట్లో వంద కిలోల నకిలీ విత్తనాలు పట్టుకున్నామన్నారు. అతనిపై కేసు నమోదు చేసి విచారించినట్లు తెలిపారు. మహేందర్ మంచిర్యాల జిల్లాలోని పెద్దపేట్ గ్రామానికి చెందిన ఎస్కే సల్మాన్ వద్ద నుంచి నకిలీ పత్తి విత్తనాలు తీసుకొని అందవెల్లి, బోడపల్లి, ఇట్యాల, రెబ్బెన మండలంలోని పలు గ్రామాల్లో విక్రయించేందుకు తీసుకొచ్చినట్లు తెలిపారు. మహేందర్ వద్ద నుంచి రూ. 3.50 లక్షల విలువైన క్వింటాల్ నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అమాయక రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సై వెంకటేశ్, కానిస్టేబుల్స్ మధు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ విధులకు ఆటంకం.. ముగ్గురు అరెస్ట్
మంచిర్యాలక్రైం: బ్లూకోట్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. ఈనెల 13న రాత్రి 12.30 గంటలకు జిల్లాకేంద్రంలోని హరికృష్ణ లాడ్జి ఎదుట ముగ్గురు వ్యక్తులు ఇతరులకు ఇబ్బంది కలుగజేస్తున్నారని డయల్ 100కు కాల్ రాగా బ్లూకోట్ విధుల్లో ఉన్న హోంగార్డ్లు సత్యనారాయణ, రవిలు అక్కడికి వెళ్లారు. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా అక్కడి నుంచి వెళ్లిపోవాలని సదరు వ్యక్తులకు సూచించారు. విధుల్లో ఉన్న పోలీసులను సైతం లెక్క చేయకుండా వారితో దురుసుగా ప్రవర్తించడంతో పాటు నానా దుర్భాషలాడుతూ విధులకు ఆటంకం కలిగించారు. దీంతో శ్రీరాంపూర్ ఆరునక్కనగర్కు చెందిన ఓ మైనర్ బాలుడితో పాటు బానోత్ సాయివికాస్, సీలారపు వినయ్లపై సత్యానారాయణ ఫిర్యాదు చేశారు. దీంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. ‘చరిత్ర ఆనవాళ్లు లభ్యం’బోథ్: మండలంలోని దన్నూరు(బి) గ్రామ స మీపంలోని తూర్పు దిక్కున గల కొంకన్న గుట్ట ప్రాంతంలో లక్షల సంవత్సరాలు క్రితం ఆది మానవులు ఉపయోగించిన రాళ్లు లభ్యమైనట్లు బోథ్ ఎఫ్ఆర్వో ప్రణయ్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ తన బృందంతో కలిసి అడవిని పరిశీలించే క్రమంలో చరిత్రకు సంబంధించిన పలు ఆనవాళ్లు ల భ్యమైనట్లుగా పేర్కొన్నారు. కొంకన్నగుట్ట మ ధ్యలో సూక్ష్మరాతి మొనదేలిన అత్యంత చురుకై న చాకు లాంటి రాళ్లు అనేకం ఉన్నాయన్నారు. పొచ్చర జలపాతం చుట్టుపక్కల సైతం లక్షల ఏళ్ల నాటి ఆదిమ సమాజం ఆనవాళ్లు నేటికీ భద్రంగా కనిపిస్తున్నాయని తెలిపారు. ‘కన్నయ్య కుటుంబానికి న్యాయం చేస్తాం’ వేమనపల్లి: మంగెనపల్లిలో ఆత్మహత్యకు పాల్పడిన నాయిని కన్నయ్య కుటుంబానికి చెందిన భూ సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. నీల్వాయి పోలీస్స్టేషన్లో కన్నయ్య కుటుంబ సభ్యులు, తెలంగాణ ఆదివాసీ గిరి జన సంఘం, సీపీఎం నాయకులతో శుక్రవా రం సమావేశమయ్యారు. వేమనపల్లి శివారు 464 సర్వే నంబర్లో కన్నయ్య తల్లి ఎల్లక్క పేరు మీద ఉన్న భూమి ఎనగంటి చిన్నన్న కొడుకు హరీశ్ పేరు మీదకు ఎలా పట్టా మార్చారన్న విషయమై విచారణ జరిపారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి రికార్డు పరంగా వివరాలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఏసీపీ వెంట చెన్నూర్ రూరల్సీఐ సుధాకర్, ఎస్సై శ్యాంపటేల్, సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు రాజన్న, మల్లేశ్వరి ఉన్నారు. -
వీడిన మల్లక్క హత్య కేసు మిస్టరీ
● నిందితుడి అరెస్ట్, రిమాండ్ ● వివరాలు వెల్లడించిన పోలీసులు కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఆదివారంపేటలో ఈనెల 13న జరిగిన వృద్ధురాలి హత్య కేసు మిస్టరీ వీడింది. కాటారం పోలీసుస్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నాగార్జునరావు వివరాలు వెల్లడించారు. ఆదివారంపేటకు చెందిన ఒడేటి మల్లక్క (67) భర్త రామయ్య, కుమారుడు రమేశ్ కొన్నేళ్ల క్రితం మృతిచెందారు. గ్రామంలో కిరాణం నడుపుకుంటూ ఆమె ఒంటరిగా జీవిస్తోంది. మల్లక్క కుమారుడు చనిపోగా కోడలు శ్రీలతకు నిందితుడు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బారెగూడకు చెందిన మోరలే శివ అలియాస్ శివాజీతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు మూడేళ్లపాటు కాగజ్నగర్లో సహజీవనం చేశారు. శివ వేధింపులు తట్టుకోలేక శ్రీలత అతడిని వదిలిపెట్టి ఆదివారంపేటకు వచ్చి ఉంటోంది. నిందితుడు శివ పలుమార్లు శ్రీలత వద్దకు వచ్చి కలుద్దామని అడగ్గా ఆమె నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్న శివ ఆమె అత్తను అంతమొందిస్తే ఆస్తి కోసం శ్రీలత హత్య చేసిందని కేసు ఆమె పైకి వెళ్తుందని ప్రణాళిక రచించాడు. పథకం ప్రకారం ఈనెల 12న అర్ధరాత్రి మల్లక్క ఇంటికి వెళ్లిన శివ.. నిద్రిస్తున్న మల్లక్క తలపై గొడ్డలితో బాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన మల్లక్క మంచంలోనే మృతిచెందగా నిందితుడు గొడ్డలి అక్కడే పడేసి పరారయ్యాడు. మరుసటి రోజు డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, మహదేవపూర్ సీఐ రాంచంద్రరావు, ఎస్సై –2 శ్రీనివాస్ ఘటనా స్థలిని పరిశీలించారు. మృతురాలి కూతురు శ్రీదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పలు ఆధారాల సాయంతో శివను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సైలు మ్యాక అభినవ్, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
‘పచ్చడి’ మెతుకులు కరువేనా!
● నిరాశజనకంగా మామిడి పంట ● పెరుగనున్న ధరలు ● మంచిర్యాల జిల్లాలో 15,680 ఎకరాల్లో తోటలు చెన్నూర్: మంచిర్యాల జిల్లాలో మామిడి కాయల కాపు నిరాశజనకంగా ఉంది. వాతావరణ మార్పుల కారణంగా పూతకు తెగుళ్లు సోకడంతో పూత రాలిపోయి కాత నిలువలేదు. దీంతో దిగుబడి అమాంతం తగ్గింది. లక్షలాది రూపాయలతో తోటలను కౌలుకు తీసుకున్న రైతులు పెట్టిన పెట్టుబడి వచ్చేదెలా అని తలలు పట్టుకుంటున్నారు. మామిడి దిగుబడి తగ్గడంతో ధరలు రెండింతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాల వారు ‘పచ్చడి’ మెతుకులకు సైతం దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయి. 15,680 ఎకరాల విస్తీర్ణంలో.. మంచిర్యాల జిల్లా మామిడి సాగుకు పెట్టింది పేరు. జిల్లా మామిడికి హైదరాబాద్తో పాటు వివిధ రాష్ట్రాలలో మంచి డిమాండ్ ఉంది. జిల్లాలో 6554 మంది రైతులు ఉండగా 15,680 ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. జిల్లాలోని బెల్లంపల్లి, నెన్నల, భీమారం, చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి, జైపూర్, లక్షెట్టిపేట, తాండూర్, దండెపల్లి మండలాలలో మామిడి తోటలు ఉన్నాయి. పది మండలాలలో మామిడి తోటలు ఉన్నప్పటికీ అత్యధికంగా తోటల విస్తీర్ణం బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నల, తాండూర్, చెన్నూర్ నియోజవర్గంలోని భీమారం, జైపూర్, చెన్నూర్ మండలాలలో ఉన్నాయి. జిల్లాకు చెందిన రైతులు దసరి, బంగెనపల్లి, పెద్ద రసాలు, హిమన్పసందు వంటి మేలైన మామిడి రకాలను మహారాష్ట్రలోని నాగాపూర్, కర్నాటక, ఒరిస్సా రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దిగుబడి అంతంత మాత్రంగా ఉండడంతో పక్క రాష్ట్రాలకు ఎగుమతి అయ్యే అవకాశాలు లేవని మామిడి వ్యాపారులు పేర్కొంటున్నారు. ధరలు పెరిగే అవకాశం..! జిల్లా వ్యాప్తంగా మామిడి కాయల దిగుబడులు తగ్గాయి. ఇందులో తినే మామిడి 20శాతం దిగుబడి మాత్రమే వచ్చే అవకాశం ఉండగా, పచ్చడి మామిడి 10శాతం దిగుబడి కూడా లేదు. దీంతో పచ్చడి మామిడి కాయలు కరువయ్యే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పచ్చడి మామిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయని కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది పచ్చడి మామిడి వంద కాయలకు రూ.150 నుంచి రూ.200 పలికింది. ఈ ఏడాది వంద పచ్చడి మామిడి కాయలకు రూ. 250 నుంచి రూ.300 పలుకుతుందని పచ్చడి ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదలకు కష్టమే.. మామిడి ధరలు పెరిగితే పేదలు మామిడి పండ్లు తినలన్నా, పచ్చడి పెట్టాలన్నా కష్టమే. ఈ ఏడాది మామిడి తక్కువ కాచింది. ఇప్పుడే ధరలు మండుతున్నాయి. రానున్న రోజులలో మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. – బొగె సారయ్య, చెన్నూర్దిగుబడి తగ్గింది.. ఈ ఏడాది మామిడి కాయ నిలువలేదు. చెట్టుకు రెండు నుంచి మూడు క్వింటాళ్ల కాయ దిగుబడి వచ్చేది. ఈ ఏడాది చెట్టుకు 10 నుంచి 20 కిలోల దిగుబడి కూడా వచ్చే అవకాశం లేదు. కాయ దిగుబడి తక్కువగా ఉండడంతో మామిడి కాయల ధరలు పెరిగే అవకాశం ఉంది. – నాయిని తిరుపతి, వ్యాపారి -
గంజాయి రవాణా.. ముగ్గురు అరెస్ట్
జైపూర్: జల్సాలకు అలవాటుపడ్డ ముగ్గురు యువకులు ఆసిఫాబాద్ నుంచి వేలాలకు గంజాయి రవాణా చేస్తూ పట్టుబడినట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపారు. జైపూర్ అసిస్టెంట్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్, ఎస్సై శ్రీధర్తో కలిసి ఏసీపీ వెంకటేశ్వర్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. వేలాల గ్రామానికి చెందిన దుర్గం సాయి కార్తీక్, సుందిళ్ల సంపత్, ప్యాగా శేఖర్లు బైక్పై ఆసిఫాబాద్కు వెళ్లి అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల వద్ద సుమారు 500గ్రాముల గంజాయిని రూ.5వేలకు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లుగా తయారు చేస్తున్నారు. అనంతరం ఒక్కో ప్యాకెట్ను రూ.500ల చొప్పున విక్రయిస్తున్నారు. ఈక్రమంలో శుక్రవారం గంజాయి విక్రయించేందుకు వెళ్తుండగా వేలాల ఇసుక క్వారీ వద్ద ముగ్గురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 290గ్రాముల గంజాయి, రెండు బైక్లు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని, పీడీయాక్టులు సైతం నమోదు చేస్తామని ఏసీపీ హెచ్చరించారు. సమావేశంలో జైపూర్ రెండో ఎస్సై రామలక్ష్మి ఉన్నారు. -
జొన్న చేనులో పుస్తకావిష్కరణ
తాంసి: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత డా.ఉదారి నారాయణ రచించిన ‘యాప చెట్టు కాడ ఊరుమీద ముచట్లు’ పుస్తకాన్ని శుక్రవారం జొన్న చేనులో రైతు చేతుల మీదుగా ఆవిష్కరించారు. మండలంలోని సావర్గాం గ్రామానికి చెందిన ఆదర్శ రైతు సట్వాజీ తన జొన్నపంట చేనులో పనులు చేస్తుండగా పుస్తక రచయిత ఉదారి నారాయణ మిత్రులతో కలిసి వెళ్లి చేనులోనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో దక్కన్ గ్రామీణ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ సామల వీరన్న, తెలుగు భాష ఉపాధ్యాయులు గంగన్న, గ్రామ పెద్దలు జీవన్, రాములు, గంగయ్య తదితరులు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
దండేపల్లి: మండలంలోని ముత్యంపేట సమీపంలో గురువారం రాత్రి బొలెరో –ఆటో ఢీకొన్న ఘటనలో కొర్విచెల్మ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కొట్టె చంద్రయ్య(49) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై తహసీనొద్దీన్ కథనం ప్రకారం.. చంద్రయ్య తన ఆటోతో లక్సెట్టిపేట నుంచి ప్రయాణికుడిని ఎక్కించుకుని కొర్విచెల్మకు వస్తుండగా, మార్గమధ్యలో ముత్యంపేట సమీపంలో జన్నారంవైపు నుంచి లక్సెట్టిపేట వైపు ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ చంద్రయ్యకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న రాజుకు కాలు విరిగింది. అజాగ్రత్తగా అతివేగంతో బొలెరోను నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని చంద్రయ్య తల్లి కొట్టె బుచ్చవ్వ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. బిల్డింగ్పై నుంచి పడి మహిళ మృతిపెంచికల్పేట్: మండలంలోని ఎల్కపల్లి గ్రామానికి చెందిన సముద్రాల రుక్మిణీ (75) ప్రమాదవశాత్తు బిల్డింగ్పై నుంచి పడి మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం బానేశ్ అనే యువకుడి సహాయంతో ఇంటిపైన ఉన్న పిల్లర్కు జెండా కడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు జారి పడింది. తలకు తీవ్ర గాయం కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే కాగజ్నగర్ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలోనే మృతి చెందింది. కాగా మృతురాలి కుటుంబసభ్యులు మాజీ జెడ్పీటీసీ సముద్రాల సరిత రాజన్నను పలువురు పరామర్శించి మృతదేహానికి నివాళులర్పించారు. మంచంపై నుంచి పడి వ్యక్తి..లక్సెట్టిపేట: మున్సిపల్ పరిధి అంగడిబజార్కు చెందిన నౌసర్ అలీ (42) అనే వ్యక్తి మంచంపై నుంచి కింద పడి మృతి చెందినట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నౌసర్ అలీ గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి పడుకున్నాడు. శుక్రవారం ఉదయం లేచి చూసే సరికి మంచంపై నుంచి కింద పడి ఉన్నాడు. నుదిటిపై రక్తపు గాయాలు ఉండగా కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. నుదిటికి బలమైన గాయం కావడంతోనే నౌసర్ అలీ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన భార్య నూర్జన్ బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రమాదవశాత్తు మొక్కజొన్న దగ్ధం
సారంగపూర్: మండలంలోని ధని గ్రామంలో ప్రమాదవశాత్తు ఆరబెట్టిన మొక్కజొన్న పంట దగ్ధమైంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన శనిగారపు చిన్నరాజేశ్వర్ ఎకరంలో మొక్కజొన్న సాగు చేశాడు. పంట కోతకోసి ఆరేందుకు పంటపొలంలో ఉంచాడు. శుక్రవారం రైతు పంటను పరిశీలించి ఇంటికి వెళ్లిన తర్వాత ప్రమాదవశాత్తు పంటకు నిప్పంటుకుంది. ఇతర రైతులు గమనించి రాజేశ్వర్కు సమాచారం అందించారు. బోరుబావుల మోటార్లు ఆన్ చేసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే 90శాతం పంట అగ్నికి ఆహుతైంది. సుమారు రూ.80వేల పంట నష్టం జరిగిందని రైతు వాపోయాడు. ఎంఆర్ఐ నర్సయ్యకు ఫోన్లో సమాచారం అందించగా ఆయన సంఘటన స్థలానికి చేరుకుని పంటనష్టం అంచనా వేశారు. -
యువతిని వేధించిన యువకుడి అరెస్ట్
బోథ్: మండల కేంద్రానికి చెందిన ఓ యువతిని సోషల్ మీడియాలో వేధించిన నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలంలోని కందుకుర్తి గ్రామానికి చెందిన అలీమ్ బేగ్ అనే యువకుడిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు బోథ్ ఎస్సై ఎల్. ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. బోథ్ మండల కేంద్రానికి చెందిన ఓ యువతిని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అలీమ్బేగ్ వేధిస్తున్నాడు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి అలీమ్బేగ్ను అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు. కాగా అలీమ్బేగ్పై రౌడీషీట్ ఉన్నట్లు వారు పేర్కొన్నారు. రెంజల్ పోలీస్స్టేషన్లో నాలుగు కేసులు, డిచ్పెల్లి పోలీస్స్టేషన్లో 2023లో అలీమ్బేగ్ వద్ద నుంచి 17 బైక్లు రికవరీ చేసినట్లు తెలిపారు. -
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
తానూరు: మండలంలోని ఉమ్రి(కే) గ్రామానికి చెందిన కదం బాలాజీ (45) అనే రైతు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్సై భానుప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రైతు బాలాజీ కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఈసారి తనకున్న రెండెకరాల్లో వ్యయప్రయాసలకోర్చి పత్తి పంట సాగు చేశాడు. పత్తి పంట దిగుబడి సరిగా రాకపోవడంతో తీవ్రంగా మనస్తాపం చెందాడు. ఈక్రమంలో గురువారం సాయంత్రం గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు గమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ట్రెయినీ ఎస్సై నవనీత్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. శుక్రవారం బాలాజీ భార్య మోనాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వెల్లడించారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా గత ఆరు నెలల క్రితం కూడా బాలాజీ ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. -
బ్యాంక్ అధికారుల తప్పిదంతో రుణమాఫీ కాలే..
మహారాష్ట్ర బ్యాంక్ అధికారుల తప్పిదంతో 80 శాతం మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. దీంతో వారంతా నష్టపోయారు. అలాంటి వారికి మేలు చేయాలి. ఎట్టకేలకు ధరణి పీడ విరగడయ్యింది. చట్టాలు ఎవరు తయారు చేసినా అందరికీ ఉపయోగపడేలా ఉండాలి. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనేతరులకు రైతు బంధు రావడం లేదు. ఇంటి స్థలాలు ఉన్నవారికే ఇందిరమ్మ పథకం కింద ఎంపిక చేస్తున్నారు. ప్రభుత్వం ఇంటి స్థలాలు మంజూరు చేయాలి. అలాగే జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి. ఫసల్ బీమాను రాష్ట్రంలో అమలు చేయాలి. – పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే -
ఇందిరమ్మ నమూనా గృహాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క
ఆదిలాబాద్రూరల్: మావల గ్రామపంచాయతీ ఆవరణలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ నమూనా గృహాన్ని, పిట్టలవాడలో నిర్మించిన వృద్ధాశ్రమ భవనాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క శుక్రవారం ప్రారంభించారు. అలాగే బాలసదనం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఉమ్మడి కుటుంబంలో ఉన్న సంతోషం ఎందులో ఉండదన్నారు. కొంత మంది పిల్లలు వారి తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలేస్తున్నారని తెలిపారు. అలాంటి వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి వయోవృద్ధ ఆశ్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. కార్యక్రమంలో ఆదిలా బాద్ ఎంపీ నగేశ్, ఎమ్మెల్సీ విఠల్, ఎమ్మెల్యేలు శంకర్, బొజ్జు, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, కలెక్టర్ రాజర్షిషా, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, జెడ్పీ సీఈవో జితేందర్ రెడ్డి, ఆర్డీవో వినోద్ కుమార్, ఎంపీడీవో శంకర్, కాంగ్రెస్ నాయకులు ఆత్రం సుగుణ, శ్రీకాంత్రెడ్డి, నవీన్రెడ్డి, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ నమూనా గృహాన్ని ప్రారంభిస్తున్న మంత్రి సీతక్క, పక్కన ఎంపీ తదితరులు -
ఉచిత ఇసుక సాధ్యమేనా..!?
కై లాస్నగర్: ప్రభుత్వ నిర్మాణాలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక ఉచితంగా సరఫరా చేసేందుకు జిల్లా యంత్రాంగం యోచిస్తోంది. ఈమేరకు పెన్గంగలో ఇసుక లభ్యతపై సంబంధిత శాఖల అధికారులు ఇటీవల సంయుక్తంగా అధ్యయనం చేశారు. మహారాష్ట్ర సరిహద్దులో ఇసుక తవ్వకాలు చేపడుతున్న గ్రామాలను పరిశీలించారు. అందులో సరిపడా లభ్యత లేనట్లుగా గుర్తించారు. అక్రమ తవ్వకాలు ఆపకుంటే భవిష్యత్తులో ఆయా గ్రామాల్లో భూగర్భజలాలకు ముప్పువాటిల్లే ప్రమాదమున్నట్లుగా అంచనా వేశారు. ఈ పరిస్థితుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఉచిత ఇసుక సరఫరా సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతుంది. 12 గ్రామాల్లో పరిశీలన .. పెన్గంగ నది పరీవాహక ప్రాంతంలో ఇసుక అర కమ తవ్వకాలు చేపడుతున్న12 గ్రామాల్లో మైనింగ్, భూగర్భజలనవనరులు, రెవెన్యూ శాఖల అధి కారులు ఇటీవల క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. భీంపూర్ మండలంలో వడూర్, అంతర్గా, తాంసి–కే, బేల మండలంలో సాంగిడి, కామ్గర్పూర్, భోరజ్లో డోలరా, కామాయి, కొరటా, జైనథ్లో పెండల్వాడ, ఆనంద్పూర్, సాంగ్వీ, కౌట గ్రా మాల్లో సంయుక్త పరిశీలన చేపట్టారు. వాల్టా చట్టం నిబంధనల ప్రకారం నదిలో ఇసుక లభ్యత లేనట్లుగా గుర్తించారు. ప్రస్తుతం ఉన్న నిల్వలు సైతం ప్ర భుత్వ పనులకు ఉపయోగకరంగా ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కలెక్టర్ రాజర్షి షాకు నివేదిక సైతం అందజేసినట్లుగాసమాచారం. ఆపకుంటే ముప్పే.. నదిలో కొంతమంది యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. సమీప గ్రామాల్లో ఏర్పాటైన వీడీసీలు జోరుగా ఇసుక వేలం నిర్వహిస్తున్నాయి. దీంతో వాటిని దక్కించుకున్న అక్రమార్కులు పొక్లెయిన్లతో ఏళ్లుగా టిప్పర్లు, లారీల ద్వారా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదే ప్రస్తుతం భూగర్భ జలాలకు పెనుముప్పుగా పరిణమించింది. ఈ క్రమంలో ఇటీవల ఆయా గ్రామాల్లో పర్యటించిన అధికారులు ఈ అంశాన్ని నిర్ధారించారు. యథేచ్ఛగా చేపట్టిన తవ్వకాలతోనే నదిలో నీటి నిల్వలు సైతం లేకుండా పోయాయనే అంచనాకు వచ్చారు. అక్రమ తవ్వకాలు తక్షణం ఆపకుంటే భవిష్యత్తులో సమీప గ్రామాల్లో భూగర్భజలమట్టం ప్రమాదకరస్థాయికి పడిపోయే ముప్పు ఉన్నట్లుగా పేర్కొన్నారు. సరఫరా సాధ్యపడేనా... వాల్టాచట్టం ప్రకారం నదిలో ఇసుక నిల్వలు అంతగా లేవని, తవ్వకాలకు ఆస్కారం లేదనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. మరోవైపు వీడీసీలకు కళ్లెం వేసేలా జిల్లా అధికారులు ఇటీవల చర్యలు చేపట్టారు. రెవెన్యూ, పోలీసు అధికారులు సంయుక్త తనిఖీలు చేస్తూ ఇసుక నిల్వలను సీజ్ చేయడంతో పాటు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అయినా అక్రమ దందా మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలో అధికారుల నివేదిక ఆధారంగా ప్రభుత్వ పనులకు, ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక సరఫరా సాధ్యమేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. పెన్గంగలో లభ్యతపై అధికారుల అధ్యయనం సరిపడా నిల్వలు లేనట్లుగా గుర్తింపు మరోవైపు ఆగని అక్రమ రవాణా ఇందిరమ్మ ఇళ్లకు సరఫరాపై మల్లగుల్లాలు కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. ప్రభుత్వ అవసరాలకు ఉచితంగా అందించాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ, మైనింగ్, భూగర్భజలవనరుల శాఖల అధికారులు పెన్గంగలో ఇటీవల సంయుక్త పరిశీలన చేపట్టారు. కలెక్టర్కు నివేదిక అందించాల్సి ఉంది. వారి ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటాం. – బి.వినోద్కుమార్, ఆర్డీవో, ఆదిలాబాద్ -
గుడ్ ఫ్రైడే
భక్తిశ్రద్ధలతో జిల్లాకేంద్రంలో ర్యాలీలో పాల్గొన్న క్రైస్తవులు నేరడిగొండలో వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే అనిల్ జాదవ్క్రీస్తు శిలువ వృత్తాంతాన్ని ప్రదర్శిస్తూ.. గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు శుక్రవారం జిల్లావ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. జిల్లా కేంద్రంలోని హోలీ ఫ్యామిలీ కేథడ్రల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. అనంతరం క్రీస్తు శిలువ వృత్తాంతాన్ని ప్రదర్శిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. నేరడిగొండలోని చర్చిలో నిర్వహించిన కార్య క్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్జాదవ్ హాజరై ప్రార్థనల్లో పాల్గొన్నారు. – ఆదిలాబాద్/నేరడిగొండ -
● రాష్ట్ర మంత్రులు పొంగులేటి, సీతక్క ● భోరజ్ మండలం పూసాయిలో అవగాహన సదస్సు ● పాల్గొన్న ఎంపీ నగేశ్, ఎమ్మెల్సీ విఠల్, ఎమ్మెల్యేలు బొజ్జు, శంకర్
ఆదిలాబాద్టౌన్: భూ భారతితో రైతుల కష్టాలన్నీ తీరుతాయని, భూ సమస్యలన్నీ పరిష్కృతమవుతా యని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాస్రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అ న్నారు. భోరజ్ మండలం పూసాయి గ్రామంలో శు క్రవారం నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులో ఇద్దరు మంత్రులతో పాటు ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు, ఆర్థిక శాఖ ముఖ్య కా ర్యదర్శి కె.రామకృష్ణారావు హాజరై మాట్లాడారు. హౌసింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి బుద్ధప్రకాశ్, డీసీ సీబీ చైర్మన్ భోజారెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పాల్గొన్నారు. సందేహాలను నివృత్తి చేసిన మంత్రి పొంగులేటి మంత్రులు పొంగులేటి, సీతక్క హెలిక్యాప్టర్ ద్వా రా జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్లో దిగారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా భోరజ్ మండలం పూసాయికి 3.30 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. ఆ తర్వాత అవగాహన సదస్సు ప్రా రంభమైంది. మొదట పలువురు రైతులు తాము ధరణితో ఎదుర్కొన్న సమస్యలను సదస్సులో వివరించారు. అనంతరం ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరు గా మాట్లాడారు. ఎంపీ మాట్లాడుతూ భూ భారతిలోని కొన్ని అంశాలపై సందేహాలు అడిగినప్పుడు స్వయంగా మంత్రి పొంగులేటి సమాధానం ఇచ్చా రు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ, తాను జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన కాలంలో అనుభవాలను పంచుకున్నారు. గతంతో పోల్చితే ఆదిలాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. భూభారతి ద్వారా రైతులు ఎదుర్కొంటున్నసమస్య ల పరిష్కారానికి చర్యలు చేపడతామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య రగడ కాంగ్రెస్ నాయకులు కొందరు స్టేజీపైన కూర్చోవడంతో అక్కడికి వచ్చిన బీజేపీ నాయకులు వారిని కిందికి దించాలని ఆందోళనకు దిగారు. దీంతో పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాట జరగడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. పోలీసులు ఇరు పార్టీల నాయకులకు నచ్చజెప్పినా వినకపోవడంతో బలవంతంగా అక్కడినుంచి పంపించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ కాంగ్రెస్ నాయకులను సముదాయించారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆందోళన చేపట్టవద్దని మంత్రి సీతక్క సూచించారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆ తర్వాత కార్యక్రమం యథావిధిగా కొనసాగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలా బాద్, బోథ్ నియోజకవర్గాల ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడే గజేందర్, ఆత్రం సుగుణ, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్రెడ్డి, ఆర్డీఓ వినోద్ కుమార్, తహశీల్దార్లు రాజేశ్వరి రాథోడ్, నలందప్రియ, తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి
ఆదిలాబాద్టౌన్: తమ సమస్యలు పరిష్కరించాలంటూ కోరుతూ తెలంగాణ ఔట్సో ర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. శుక్రవారం భోరజ్ మండలంలోని పూసాయికి చేరుకున్న మంత్రిని కలిశారు. ఔట్సోర్సింగ్ విధానం రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. వేతనాలు ఏజెన్సీ ద్వారా కాకుండా కార్పొరేషన్ ద్వారా అందించాలని విన్నవించారు. ఇందులో జేఏసీ నాయకులు బండ శ్రీను, స్వామి, రవి, సంతోష్, నరేష్, ఇమ్రాన్, గోపాల్, సారయ్య తదితరులున్నారు. ‘కంది’ క్యాంపు కార్యాలయాన్ని సందర్శించిన మంత్రులు కై లాస్నగర్: జిల్లాకు విచ్చేసిన మంత్రి పొంగులేటి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క శుక్రవారం పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. పార్టీశ్రేణులతో కలిసి ఆయన వారికి స్వాగ తం పలికారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శా లువాతో సత్కరించారు. నియోజకవర్గంలో ని పార్టీ పరిస్థితులు, చేపడుతున్న కార్యక్రమాలను వారికి వివరించారు. -
అవగాహన కల్పిస్తున్నాం..
ఈనెల 14న ప్రభుత్వం భూ భారతి పోర్టల్ను ప్రారంభించింది. 17 నుంచి 30వరకు ఆ యా మండలాల్లో అవగాహన సదస్సులు కొనసాగనున్నాయి. భూ భారతి ద్వారా భూ సమస్యలు పరిష్కారమవుతాయి. సాదాబైనామా భూములను క్రమబద్ధీకరించుకో వచ్చు. ఇదివరకు ధరణిలో ఈ అవకాశం లేదు. గ్రామ పాలన ఆఫీసర్ను నియమించి సమస్యలను పరిష్కరించడానికి చర్యలు చేపడుతున్నాం.– రాజర్షిషా, కలెక్టర్, ఆదిలాబాద్ ధరణి చట్టం శాపంగా మారింది.. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి చట్టం రాష్ట్రంలోని అనేక మంది రైతులకు శాపంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చట్టాన్ని బంగాళాఖాతంలో కలిపేసింది. వాటి స్థానంలో భూ భారతి పోర్టల్ను తీసుకొచ్చింది. ధరణి చట్టం ద్వారా దొరల చేతికి మళ్లీ భూములు వెళ్లాయి. పేదలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. భూ భారతితో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో భూమి లేకపోయినా గతంలో విచ్చలవిడిగా పట్టాలు జారీ చేశారు. రైతుబంధు కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించింది. ఏజెన్సీ ప్రాంతంలోని రైతులకు బ్యాంకు రుణాలు ఇచ్చేవిధంగా మంత్రులు చొరవ తీసుకోవాలి. – వెడ్మ బొజ్జు, ఖానాపూర్ ఎమ్మెల్యే 20 ఏళ్లుగా ఇబ్బందులు.. 20 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూమికి పట్టా లేకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నాం. ధరణి పోర్టల్లో పట్టా కాలేదు. సర్వే నం.12లో మా భూమి ఉండగా, అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయాం. భూ భారతిలో మా సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం. – టాప్రే దత్తు, తరోడా, రైతు, తరోడా -
33వ రోజుకు సీపీఐ దీక్షలు
కైలాస్నగర్: ఆదిలాబాద్ నియోజకవర్గపరిధిలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేదలకు అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించాలనే డిమాండ్తో సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారంతో 33వ రోజుకు చే రాయి. ఈ సందర్భంగా ఆయా కాలనీవా సులు శిబిరంలో కూర్చొని సర్కారు తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి కుంటాల రాములు మాట్లాడుతూ, ఉన్నతాధికారులు స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు దీక్షలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. -
ఎకరాకు 15 క్వింటాళ్లు కొనుగోలు చేయాలి
● బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ● తాంసిలో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభంతాంసి: రైతులు యాసంగి సీజన్లో పండించిన జొ న్నలను ఎకరానికి 15 క్వింటాళ్ల చొప్పున కొనుగో లు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నా రు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. కేంద్రం ప్రారంభానికి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క వస్తున్నారని అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో ఆమె పర్యటన రద్దయింది. రాత్రి 8గంటల తర్వాత ఎమ్మెల్యే కొనుగోళ్లను ప్రారంభించి మాట్లాడారు. జొన్న దిగుబడి పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఎకరానికి కేవలం 8.65క్వింటాళ్లు మాత్ర మే కోనుగోలు చేస్తామడం సరికాదన్నారు. ఇప్పటి కే రుణమాఫీ కాక రైతు భరోసా అందక అన్నదాత ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. ఎకరానికి 15 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలన్నా రు. లేనిపక్షంలో రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామన్నారు. ఇందులో పీఏసీఎస్ వైస్చైర్మన్ ధ నుంజయ్, సీఈవో కేశవ్, ఏవో రవీందర్, మండల నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
దేశీదారు విక్రయిస్తున్న ఇద్దరు..
తాంసి: అక్రమంగా మహారాష్ట్ర నుంచి దేశీదారు తీసుకువచ్చి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ రేండ్ల విజేందర్ తెలిపారు. మండలంలోని లీంగూడ గ్రామానికి చెందిన ఆత్రం దేవ్రావు, టేకం బర్కత్రావులు మహా రాష్ట్ర నుంచి దేశీదారు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. పక్కాసమాచారం మేరకు సిబ్బందితో కలిసి బుధవారం రాత్రి దాడి చేశారు. మద్యం విక్రయిస్తుండగా ఇద్దరిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.10వేల విలువ గల 90 ఎమ్ఎల్ కలిగిన 280 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా దేశీదారు, నాటుసారా విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ సిబ్బంది శ్రీధర్, హనుమంత్ పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం
తాంసి: మండలంలోని జామిడికి చెందిన పర్ధాన్ దేవుబాయి ఇల్లు అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. ఒంటరిగా ఉంటున్న ఆమె గురువారం ఉదయం ఇంట్లో దేవుని చిత్రపటం వద్ద దీపం పెట్టి ఉపాధి పనికి కూలీలతో వెళ్లింది. వెలిగించిన దీపం వస్తువులకు అంటుకొని మంటలు వ్యాపించింది. గమనించిన గ్రామస్తులు వెంటనే మోటార్ల ద్వారా నీటిని చల్లి మంటలార్పివేశారు. అప్పటికే ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు, దుస్తులు, రూ.20వేల నగదు కాలిపోయాయి. ఇంటి పైకప్పు దెబ్బతింది. దాదాపు రూ.లక్షకు పైగా ఆస్తినష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్రెడ్డి ఘటనస్థలానికి చేరుకుని బాధిత మహిళను పరామర్శించారు. నెలకు సరిపడా సరుకులతోపాటు నగదు అందజేశారు. యూత్ కాంగ్రెస్ నాయకుడు అశోక్ ఆర్థికసాయం అందజేశాడు. -
ప్రమాదవశాత్తు బావిలో పడి రైతు మృతి
దండేపల్లి: మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన రైతు గాండ్ల అశోక్ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. ఎస్సై తహాసీనొద్దీన్ కథనం ప్రకారం.. అశోక్ (45) గురువారం ఉదయం పొలం వద్దకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. చాలాసేపటి వరకు రాకపోవడంతో ఫోన్ చేస్తే ఇంట్లో ఉంది. దీంతో బంధువు అయిన కార్తీక్ను పొలం వద్దకు పంపించారు. పొలం ఒడ్డున ఒక చెప్పు, బావిలో మరో చెప్పు కనిపించింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని ఈతగాళ్లతో బావిలో వెతకగా మృతదేహం లభించింది. ప్రమాదవశాత్తు బావిలో జారిపడటంతో ఈత రాక అందులో మునిగి చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య శైలజ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. బ్లేడ్తో గొంతుకోసి హత్యాయత్నంఆదిలాబాద్రూరల్: బ్లేడ్తో ఒకరి గొంతు కోసి హత్యాయత్నం చేసిన ఘటన మండలంలోని బంగారుగూడలో చోటుచేసుకుంది. ఎస్సై ముజాహిద్ కథనం ప్రకారం..బంగారుగూడకు చెందిన ముద్దంగుల విఠల్, అదేకాలనీలో జాబిర్షా ఉంటున్నాడు. గురువారం విఠల్ ఫోన్లో ఓ నంబర్ డయల్ చేయాలని జాబిర్ షా అడిగాడు. ఇందుకు విఠల్ ని రాకరించడంతో బ్లేడ్తో ఆయన గొంతుకోసి హత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలైన విఠల్ను రిమ్స్ కు తరలించారు. బాధితుడి భార్య పోచవ్వ ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. ఆరుగురి బైండోవర్మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆరుగురు పాత నేరస్తులను గురువారం తహసీల్దార్ శ్రీనివాసరావుదేశ్పాండే ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై స్వరూప్రాజ్ తెలిపారు. వేంపల్లిలో దోపిడీ కేసులో నిందితులైన రమేశ్, అవినాశ్, చందు, సంతోశ్, అశోక్, కృష్ణలను ఏడాదిపాటు షరతులతో కూడిన బైండోవర్ చేశారు. -
రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
నెన్నెల: మండలంలోని మైలారం మత్తడి వాగు నుంచి అనుమతి లేకుండా బెల్లంపల్లికి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను జోగాపూర్ వద్ద పట్టుకున్నామని ఎస్సై ప్రసాద్ తెలిపారు. బుధవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేశామన్నారు. యజమానులు గడ్డం సాయికుమార్, కొమ్ము రాజన్న, డ్రైవర్లు పసుల రవీందర్, అత్తి సాయిలపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఆర్థిక ఇబ్బందులతో వివాహిత..
నెన్నెల: ఆర్థిక ఇబ్బందులతో వివాహిత బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గడ్డం లావణ్య (47), భర్త శంకర్గౌడ్తో కలిసి తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఎదుట హోటల్ నిర్వహిస్తోంది. హోం లోన్ తీసుకుని ఇల్లు నిర్మించుకున్నారు. హోటల్ పెట్టుబడి కోసం మరికొంత అప్పు చేశారు. వ్యాపారం సరిగ్గా సాగకపోవడంతో అప్పు తీర్చడం కష్టమైంది. కిస్తీలు చెల్లించకపోవడంతో వడ్డీ పెరిగిపోయింది. అప్పులు ఎలా తీర్చాలో అని ప్రతిరోజు బాధపడేదని కుటుంబీకులు చెప్పారు. ఈక్రమంలో గురువారం తెల్లవారుజామున లావణ్య ఇంట్లో కనిపించలేదు. ఆమె ఆచూకీ కోసం కుటుంబసభ్యులు చుటూపక్కల వెతకగా భీరన్నమర్రి సమీపంలోని వ్యవసాయ బావి వద్ద ఆమె చెప్పులు లోట కనిపించాయి. అనుమానంతో బావిలో నీటిని మోటార్ల ద్వారా తోడగా అందులో శవమై కనిపించింది. కుమారుడు వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. -
● చింతలమానెపల్లి మండలం దిందా గ్రామంలో చిత్రీకరణ ● దర్శకుడు, నటులూ స్థానికులు.. ● నేడు విడుదల
సినిమా చిత్రీకరణలో నటీనటులుగర్వంగా భావిస్తున్నాం దిందా గ్రామం పేరు వెండితెరపై వినిపించడం పట్ల మేము గర్వంగా భావిస్తున్నాం. స్థానికంగా చిత్రీకరణ జరగడంతో కొంతమందికి ఉపాధి లభించింది. అటవీ ప్రాంతంలో ఉండే మా గ్రామం అభివృద్ధిలో వెనుకబడి ఉంది. సినిమాతో గ్రామానికి ప్రచారం లభించడం మేము సంతోషంగా ఉన్నాం. – డోకె రామన్న, దిందా సహకారం అందించాం సినిమా చిత్రీకరణకు అనువైన ప్రదేశాల కోసం సోదరుడు అయిన డైరెక్టర్ నన్ను సంప్రదించారు. ఎన్నో ప్రాంతాలను పరిశీలించి దిందా గ్రామాన్ని ఎంపిక చేసుకున్నాం. సినిమా చిత్రీకరణ పూర్తయ్యే వరకు సినిమా బృందానికి నాతో కలిసి గ్రామస్తులు, స్థానిక ప్రజలు సహకారాలు అందించాం. సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. – దేవాడి రాజన్న, గంగాపూర్ బాలనటుడిగా మరిచిపోలేనిది సినిమాలో నటించే అవకాశం రావడం ఒక వరం లాంటిది. నేను 8వ తరగతి చదువుకునే సమయంలో దగ్గరి బంధువు అయిన సినిమా దర్శకుడు అవకాశం కల్పించారు. నటనలో అనుభవం లేకున్నా దర్శకుడు, నటుల సహకారంతో బాలనటుడిగా నటించాను. ఈ అనుభవం మరిచిపోలేనిది. – దంద్రె మణికంఠ(బబ్లూ), గంగాపూర్ చింతలమానెపల్లి: మండలంలోని దిందా.. ఒక మారుమూల గ్రామం.. త్వరలో రంగస్థలానికి పరిచయమవుతోంది. దట్టమైన అటవీ ప్రాంతంలో రవాణా సౌకర్యాలకు, గ్రామం అభివృద్ధికి నోచుకోకుండా ఉంది. జగమెరిగిన సత్యం టైటిల్తో విడుదల అవుతున్న చిత్రం 80 శాతం గ్రామంలోనే చిత్రీకరించారు. గ్రామ సమీపంలోని వాగు, చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్ వారసంత, గూడెం ప్రాణహిత నది వంతెన, పెంచికల్పేట్ పెద్దవాగు, కౌటాల మండల కేంద్రం, పక్కనే మహారాష్ట్రలోని అహేరి వద్ద కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. కౌటాల ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో మొదటి సన్నివేశం చిత్రీకరణతో సినిమా ప్రారంభించారు. 1994లో గ్రామీణ పరిస్థితుల నేపథ్యం.. 1994లోని గ్రామీణ నేపథ్యం, అప్పటి మనుషుల కట్టుబాట్లు, దర్శకుడి చిన్నతనంలోని అనుభవాలను ఆధారంగా చిత్రం రూపొందింది. ప్రేమ సన్నివేశాలు, భావోద్వేగాలు, సంస్కృతి, సంగీతం ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు పాలె తిరుపతి తెలిపారు. ఇందులో పలు సన్నివేశాల్లో దిందా గ్రామస్తులను బ్యాక్గ్రౌండ్లో నటించేందుకు అవకాశం కల్పించారు. సినిమాలో ఐదు పాటలు ఉండగా బతుకమ్మ పాటను గాయకురాలు మంగ్లీ ఆలపించారు. రాణా దగ్గుబాటి, సాయిపల్లవి నటించిన విరాట పర్వం చిత్రానికి పనిచేసిన సురేష్ బొబ్బిలి ఈచిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. హీరో రవితేజ మేనల్లుడు అవినాష్వర్మ, ఆద్యారెడ్డిలను హీరో, హీరోయిన్లుగా తొలిపరిచయం చేశామని, మరో హీరోయిన్గా నీలిమ పతకంశెట్టి నటించినట్లు దర్శకుడు తెలిపారు. జిల్లాలో ఆలస్యంగా విడుదల జగమెరిగిన సత్యం సినిమా కుమురం భీం జిల్లాలో కాస్త ఆలస్యంగా విడుదల కానుంది. ఈనెల 18 (శుక్రవారం)న మంచిర్యాలలో, తెలంగాణలో 33 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. కాగజ్నగర్లో ఇతర సినిమాలకు ముందుగానే షెడ్యూల్ ఖరారు అయి ఉండడంతో కొన్నిరోజుల అనంతరం విడుదల అవుతుందని సినిమా బృందం తెలిపింది. దర్శకుడు స్థానికుడే..సినిమా అంటే ఒక క్రేజ్.. రంగులతో కనిపించే సినిమా చాలామందికి కల.. ఇలాంటి ఓ సినిమా మన ప్రాంతంలో రూపుదిద్దుకుంటే ఆ ఆనందం వేరు. ఎలాంటి ప్రాచుర్యానికి నోచుకోని ఆ గ్రామంలోని వెనుకబడిన పరిస్థితులు, గ్రామస్తుల సహజ అమాయకత్వం ఈనేపథ్యంలో చింతలమానెపల్లి మండలంలోని దిందా గ్రామ కేంద్రంగా రూపుదిద్దుకున్న చిత్రం.. జగమెరిగిన సత్యం..ఈనెల 18న సినిమా విడుదల కానుంది. దర్శకుడు పాలె తిరుపతి స్వగ్రామం పెంచికల్పేట్ మండలం చెడ్వాయి. ఆయనకు చింతలమానెపల్లి మండలంలో బంధువులు ఉండగా వారి ఇంటికి వచ్చేక్రమంలో స్థానిక గ్రామాలపై పరిచయం ఉండగా సినిమా చిత్రీకరణకు కారణమైంది. గ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన ఆయన మంచిర్యాలలో డిగ్రీ పూర్తిచేశారు. సినిమాలపై ఆసక్తితో చిత్రరంగానికి వెళ్లి దర్శకత్వ శాఖలో 8 ఏళ్లు పనిచేశారు. ఈక్రమంలో ‘కొరియన్ శీర్షిక అహేరి’పేరుతో లఘుచిత్రం రూపొందించారు. అది సాధించిన విజయం ఇచ్చిన స్ఫూర్తితో మరో నాలుగు లఘు చిత్రాలను రూపొందించగా, ఈ అనుభవంతో జగమెరిగిన సత్యం చిత్రాన్ని తెరకెక్కించారు. కథానాయకుడికి చిన్నతనంలో సోదరుడిగా చింతలమానెపల్లి మండలం గంగాపూర్కు చెందిన దంద్రె మణికంఠ(బబ్లూ) బాలనటుడిగా నటించాడు. -
ఓపెన్ ‘పది’, ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు
మంచిర్యాలఅర్బన్: ఈ నెల 20నుంచి ప్రారంభమయ్యే ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో యాదయ్య తెలిపారు. ఉదయం 9నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మంచిర్యాలలో పదో తరగతికి రెండు పరీక్ష కేంద్రాలు, ఇంటర్ పరీక్షలకు మూడు, బెల్లంపల్లిలో పదో తరగతికి ఒకటి, ఇంటర్కు రెండు కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పదో తరగతి విద్యార్థులు 666, ఇంటర్ విద్యార్థులు 1192 మంది పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. విద్యార్థులకు హాల్టికెట్లు స్టడీ సెంటర్ల ద్వారా పంపిణీ చేస్తామని, విద్యార్థులతోపాటు సిబ్బంది పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి పరికరాలు, సెల్ఫోన్లు తీసుకు రావద్దని సూచించారు. న్యాయవాదిపై దాడి దుర్మార్గపు చర్యమంచిర్యాలక్రైం: న్యాయవాదులపై దాడులు దుర్మార్గపు చర్య అని మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు అన్నారు. ఈ నెల 16న సూర్యపేట జిల్లా న్యాయవాది మాంతపురం కిషోర్పై దాడిని ఖండిస్తూ గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా బార్ ఆసోసియేషన్ ఉపాధ్యక్షుడు భుజంగ్రావు, న్యాయవాదులు మాట్లాడుతూ దాడులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తుల అంజనేయులు, ధత్తు, గోపతిరవి, శ్రీరాములు, జాడీ తిరుపతి, శ్రీకాంత్ తదిరులు పాల్గొన్నారు. విధుల బహిష్కరణ లక్సెట్టిపేట: న్యాయవాది కిషోర్పై దాడిని నిరసిస్తూ గురువారం మండల కేంద్రంలోని మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయవాదులు విధులు బహిస్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమిరెడ్డి సత్తన్న, ప్రధాన కార్యదర్శి ప్రదీప్కుమార్, ఉపాధ్యక్షులు నళినికాంత్, కోషాధికారి సుమన్ చక్రవర్తి, న్యాయవాదులు భూమరెడ్డి, సురేందర్, అక్కల శ్రీధర్, కిరణ్కుమార్, పద్మ, తదితరులు పాల్గొన్నారు. -
చోరీ కేసులో నిందితుడి అరెస్టు
బెల్లంపల్లి: చోరీ కేసులో కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. టూటౌన్ ఎస్సై కె.మహేందర్ కథనం ప్రకారం.. 2022లో టూటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో దొంగతనం జరిగింది. చోరీ కేసులో నిందితుడిగా ఉన్న పంజాబ్ రాష్ట్రానికి చెందిన హరదీప్సింగ్ కొంతకాలం నుంచి కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. నిందితుడి ఆచూకీని కనుగొని పోలీసులు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చాకచక్యంగా పట్టుకుని గురువారం బెల్లంపల్లి జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. అనంతరం ఆసిఫాబాద్ జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
ఒంటరితనం భరించలేక వృద్ధుడి ఆత్మహత్య
సారంగపూర్: ఒంటరితనం భరించలేక వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కుటుంబీకులు, ఎస్సై తెలిపిన వివరాలు.. మండలంలోని వంజర్ గ్రామానికి చెందిన తోకల పోశెట్టి(65)కి ఇద్దరు భార్యలు ఉన్నారు. పెద్ద భార్యకు ఇద్దరు కుమార్తెలు, చిన్న భార్యకు ఒక కుమార్తె ఉన్నారు. అయితే గత 20 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. స్థానిక హనుమాన్ ఆలయంలో వంట, బస చేస్తూ కాలం వెళ్లదీశాడు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురికావడంతో తిరిగి ఇంటికి వెళ్లాడు. కుటుంబ సభ్యులకు ముఖం చూపించలేక, ఒంటరిగా బతకలేక తనలో తానే కుమిలిపోయాడు. ఈక్రమంలో రెండు రోజులుగా పోశెట్టి కనిపించడం లేదని గ్రామస్తులు అనుకుంటున్నారు. గ్రామశివారు ప్రాంతంలోని దడే గుట్ట వద్ద ఒర్రె వైపు పశువులు మేపేందుకు వెళ్లిన వారికి గురువారం పోశెట్టి ఉరేసుకుని కనిపించాడు. ఈ విషయాన్ని గ్రామస్తులు, ఆయన కుటుంబీకులకు చేరవేశారు. గ్రామస్తులు అందించిన సమాచారంతో ఎస్సై ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ఏరియాస్పత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
ఇళ్లపట్టాలు ఇప్పించాలి
బెల్లంపల్లి: బెల్లంపల్లి నివాసం ఉంటున్న పుర ప్రజలకు జీవో నెంబర్ 76 ప్రకారం ఇళ్ల పట్టాలు ఇప్పించాలని సీపీఐ నాయకులు కోరారు. గురువారం ఏఎంసీ ఏరియాలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్రసమితి సభ్యులు ఎ. వెంకటస్వామి, బి.పూర్ణిమ, సీపీఐ పట్టణ, మండల కార్యదర్శులు ఆడేపు రాజమౌళి, బి.లక్ష్మీనారాయణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల రాజేశం, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఈదురు గాలుల బీభత్సం
● పలు ఇళ్లపై ఎగిరిపోయిన పైకప్పులు ● నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, వృక్షాలు ఆదిలాబాద్టౌన్(జైనథ్): అకాల వర్షం అతలాకుతలం చేసింది. జైనథ్ మండలంలో బుధవారం రాత్రి ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. ఈదురు గాలులకు జైనథ్ మండలంలోని సిర్సన్న గ్రామంలో దాదాపు పది ఇళ్ల పైకప్పులు లేచి ఎగిరిపడ్డాయి. పూరి గుడిసెలు, రేకుల షెడ్లు, పెంకుటిళ్లు దెబ్బతిన్నాయి. మండలంలోని భోరజ్, సిర్సన్న, గూడ గ్రామాల్లో జొన్న పంట నేలకొరిగింది. మామిడి కాయలు రాలిపోయాయి. చేతికొచ్చిన పంట నేలకొరగడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. సిర్సన్నలోని కుర్మ తిరుపతి, లసుందేవి, పెద్ద ఆశన్న, ఆశన్న, అశోక్, తదితరుల ఇళ్ల పైకప్పులు గాలికి ఎగిరిపడ్డాయి. పలు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. -
బాల్య వివాహం చట్టరీత్యా నేరం
బేల: బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని డీసీపీయూ సంరక్షణ అధికారి ఎన్. స్వామి అన్నారు. గురువారం మండల కేంద్రంలో బాల్య వివాహం జరుగుతున్నట్లు 1098కు వచ్చిన సమాచారం మేరకు చైల్డ్ వెల్ఫేర్, డీసీ పీయూ, చైల్డ్లైన్, షూర్ ఎన్జీవో, పోలీసులతో కలిసి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యవివాహ నిషేధ చట్టం 2006 ప్రకారం బాల్య వివాహాలు చేయడం తప్పన్నారు. ఈ చట్టం ప్రకారం రూ.2లక్షల జరిమానా, ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు. అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలని సూచించారు. ఇక్కడ అమ్మాయికి 16, అబ్బాయికి 18 ఏళ్లు మాత్రమే ఉన్నాయని, ఇద్దరూ మైనర్లేనన్నారు. ఇలా పెళ్లి చేయడంతో వారి ఉజ్వల భవిష్యత్ దెబ్బతింటుందన్నారు. బాల్య వివాహం చేయమని ఇరువురి తల్లితండ్రులచే ఒప్పందపత్రం రాయించి తీసుకున్నా రు. కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్లైన్ కౌన్సిలర్ పద్మజారాణి, కేస్ వర్కర్ శ్రీకాంత్, షూర్ ఎన్జీవో కోఆర్డినేటర్ వినోద్, ఏఎస్సై లింగన్న, తదితరులు పాల్గొన్నారు. -
‘భూభారతి’తో భూసమస్యలకు పరిష్కారం
తాంసి: భూభారతి చట్టంతో రైతుల భూసమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు భూహక్కులు భద్రంగా ఉంటాయని కలెక్టర్ రాజర్షి షా అన్నా రు. గురువారం మండల కేంద్రంలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయ జయహే తెలంగాణ పాటను ఆలపించిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మా ట్లాడుతూ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై అందరికీ అవగాహన ఉండాలని సదస్సులు నిర్వహిస్తున్నామని, వాటిని సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. ధరణి స్థానంలో భూమి హక్కుల కోసం భూ భారతి ప్ర భుత్వం తీసుకొచ్చినట్లు తెలిపారు. చట్టం విధి విఽ దానాలను రైతులకు వివరించారు. భీంపూర్ మండలంలోని గుంజాల, కరంజి(టి) గ్రామాల్లో అసైన్డ్ భూములను సాగుచేస్తున్న రైతులు పట్టాలు లేవని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా భూభారతి చట్టం ద్వా రా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, తహసీల్దార్ నలందప్రియ, మండల ప్రత్యేకాధికారి కిషన్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ స్వామి, ఎంపీడీవో గోపాలకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అంతర్రాష్ట్ర రోడ్డు పరిశీలన భీంపూర్ మండలంలోని ధనోర నుంచి వడూర్ గ్రామాల మధ్య గుంతలుగా మారిన అంతర్రాష్ట్ర రోడ్డును కలెక్టర్ పరిశీలించారు. గుత్తేదారుతో ఫోన్లో మాట్లాడి నిర్మాణ పనులను చేపట్టాలని ఆదేశించారు. అనంతరం జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయనున్న నవోదయ పాఠశాల ఏర్పాటుకు భీంపూర్ శివారులో స్థలాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో వినోద్ కుమార్.సర్వేయర్ మనోజ్, తదితరులు ఉన్నారు. కలెక్టర్ రాజర్షి షా -
జిల్లాకు యూనివర్సిటీ తీసుకొచ్చేందుకు కృషి
● ఎమ్మెల్యే పాయల్ శంకర్ఆదిలాబాద్టౌన్: రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల పరిధిలో తొమ్మిది జిల్లాలకు యూనివర్సిటీలు ఉండగా ఆదిలాబాద్కు మాత్రమే లేదని, జిల్లాకు యూనివర్సిటీ తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ హామీ ఇచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని సైన్స్ డిగ్రీ కళాశాల వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చదువుకునే సమయంలో డిగ్రీ కళాశాలలో ఎన్నికలను చూసిన తర్వాతే నాయకుడిని కావాలన్న ఆలోచన వచ్చిందన్నారు. విద్యార్థులు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని సూచించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సంగీత, వైస్ ప్రిన్సిపాల్ జగ్రాం, అకాడమిక్ కోఆర్డినేటర్ సంతోష్ కుమార్, లెక్చరర్లు శ్రావణి, జ్యోత్స్న, రమాకాంత్ గౌడ్, చక్రవర్తి, మంజూల, అష్రఫ్ అలీ, రాజ్కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఈ ఫొటోలో కనిపిస్తోంది మావల మండలం వాగాపూర్లోని ఇందిరమ్మ ఇలు. ఇప్పటికీ బేస్మెంట్ దశ దాటలేదు. ఈ గ్రామానికి 152 ఇళ్లు మంజూరు చేశారు. ఇందులో 57 ఇళ్ల నిర్మాణాలను మాత్రమే ప్రారంభించగా అందులో 7 మాత్రమే బెస్మెంట్ వరకు పూర్తి చేశారు. ఇంకా 95 ఇళ్లకు పునాదులే తీ
శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025టీసీ, రికార్డు షీట్ల కోసం చలాన్ చెల్లించాలిఆదిలాబాద్టౌన్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు టీసీ బుక్లు, రికార్డు షీట్ల కోసం బ్యాంక్లో చలాన్ చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, జెడ్పీఎస్ఎస్, కేజీబీవీ, మోడల్, ప్రైమరి స్కూళ్లలో రికార్డు షీట్ కోసం రూ.400, టీసీ బుక్ కోసం రూ.500 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో రికార్డు షీట్ల కోసం రూ.వెయ్యి, టీసీ బుక్ కోసం రూ.1200 చెల్లించాలన్నారు. పాత రికార్డు షీట్, టీసీకి సంబంధించిన మొదటి, చివరి పేజీలను జిరాక్స్ చేసి ఎంఈవో, సంబంధిత ప్రధానోపాధ్యాయుల సంతకంతో డీఈవో కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుందని, ఈ విషయాన్ని సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు గమనించాలని సూచించారు. ‘విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలి’ఆదిలాబాద్టౌన్: తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో ఆ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించాలని, తరగతికి ఓ ఉపాధ్యాయుడిని నియమించాలని, విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కిష్టన్న, అశోక్, సంఘ బాధ్యులు లక్ష్మణ్రావు, సురేఖ, సూర్యకుమార్, శ్రీనివాస్, స్వామి, విలాస్, ఇస్తారి, శివన్న, గణేశ్, శ్రీలత, శంకర్, తదితరులు పాల్గొన్నారు. వెనుకడుగు ఎందుకంటే .. తొలిప్రాధాన్యతగా పూరి గుడిసెలు, మట్టిగోడలు ఉన్నటువంటి వారికి మాత్రమే ఇళ్లు మంజూరు చేశారు. దీంతో ఇందిరమ్మ లబ్ధిదారులంతా నిరుపేదలే కావడం, ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించేంత ఆర్థిక స్థోమత లేకపోవడంతోనే చాలా మంది వెనుకడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. బహిరంగ మార్కెట్లో ఇటుక, ఇసుక, సిమెంట్ ధరలు అఽధికంగా ఉండటం కూడా ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతోపాటు అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకుంటే ప్రభుత్వమిచ్చే నిధులు సకాలంలో అందుతాయో.. లేదోననే అనుమానంతోనూ లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలకు ముందుకు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి నిర్మాణం తమకు అదనపు భారంగా మారుతుందనే ఉద్దేశంతో పనులు ప్రారంభించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఫలితంగానే పలు మండలాల్లో ఒక్క ఇంటి నిర్మాణం కూడా ప్రారంభం కానట్లుగా తెలుస్తోంది. కై లాస్నగర్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ప్రగతికి సంబంధించి ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇంకా పలు మండలాల్లో పూర్తిస్థాయిలో మార్కౌట్లను కూడా ఇవ్వలేదు. ఇళ్ల మంజూరుపై గంపెడాశలు పెట్టుకున్న లబ్ధిదారులు తీరా మంజూరుపత్రాలు చేతికందగా నిర్మాణాలపై మాత్రం అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో నిర్మాణాలు పునాదులు సైతం దాటని దుస్థితి నెలకొంది. లబ్ధిదారులంతా నిరుపేదలే కావడం, ఆర్థిక స్థోమత అంతగా లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శుక్రవారం జిల్లాకు రానున్న రాష్ట్ర రెవెన్యూ, గృహానిర్మాణ శాఖ అమాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభయహస్తం కోసం లబ్ధిదారులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. తమ గూడుగోడును తీర్చుకునేందుకు చేయూతనందించేలా ఎదైనా హామీ ఇవ్వకపోతారా అని ఆశపడుతున్నారు. ఇదీ పరిస్థితి.. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. ఇంటిస్థలం కలిగిన వారికి ఫైలట్ ప్రాజెక్ట్ కింద మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి ఇళ్లను మంజూరు చేసింది. జిల్లాలోని 17 మండలాలకు గానూ 2010 ఇళ్లు మంజూరు చేస్తూ ఈ ఏడాది జనవరి 26న లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేసింది. ఇంటిని నిర్మించుకున్నవారికి నాలుగు విడతల్లో రూ.5లక్షల ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించింది. ఇంత వరకు బాగానే ఉన్నా ఇళ్ల నిర్మాణాలు మాత్రం ముందుకు సాగడం లేదు. మూడు నెలలవుతున్నా ఇప్పటి వరకు పలు గ్రామాల్లో పునాదులు సైతం తీయని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు కేవలం 76 ఇళ్లు మాత్రమే బెస్మెంట్స్థాయి వరకు వచ్చాయంటే ఎంత నత్తనడకనసాగుతున్నాయో స్పష్టమవుతోంది. గృహానిర్మాణశాఖ, మండలాధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ నిర్మాణాల్లో మాత్రం పురోగతి కన్పించడం లేదు. కాగా బెస్మెంట్ వరకు ఇళ్లు నిర్మించుకున్న వారిలో గురువారం 51 మంది లబ్ధిదారులకు తొలి విడత ఆర్థికసాయం రూ.లక్ష వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్లుగా హౌజింగ్ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ చేయూతపై ఆశలు రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత జిల్లా అయిన ఖమ్మం, నాగర్కర్నూల్లోని ఇందిరమ్మ లబ్ధిదారులకు జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా స్వయం సహాయక సంఘాలకు అందించే రుణాలను అందించి ఇంటి నిర్మాణాలను వేగవంతం చేసేలా చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగానూ ఈ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. అయితే అధికారులకు ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు అందకపోవడంతో జిల్లాలో ఈ విధానం అమలు కావడం లేదు. వెనుకబడిన, నిరుపేదలు ఉన్నటువంటి ఈ జిల్లాకు ప్రాధాన్యతనిచ్చేలా ప్రభుత్వపరంగా చేయూతనందించేలా మంత్రి ఏదైనా హామీ ఇస్తారానే ఆశ వారిలో వ్యక్తమవుతోంది. మన చిత్రం..‘జగమెరిగిన సత్యం’ కుమురంభీం జిల్లాకు చెందిన తిరుపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జగమెరిగిన సత్యం 18న విడుదల కానుంది. IIలోu న్యూస్రీల్వేగవంతంపై ప్రత్యేక దృష్టి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నెమ్మదిగా సాగుతున్న మాట వాస్తవమే. వాటిని వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి సారించాం. పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టిన గ్రామాల్లో మంజూరైన ఇళ్లకు మార్కవుట్ ఇవ్వడంతో పాటు నిర్మాణ పనులు జరిగేలా అవగాహన కల్పిస్తున్నాం. డీఆర్డీఏ ద్వారా ఆర్థికసాయంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు రాలేదు. – బసవేశ్వర్, హౌజింగ్ పీడీ -
గవర్నర్ను కలిసిన ఎంపీ గోడం నగేశ్
ఆదిలాబాద్: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మను ఎంపీ గోడం నగేశ్ గురువారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏజెన్సీ ప్రాంతంలోని సివిల్ కేసుల అధికారం ఐటీడీఎ పీవోలకే ఉంచేలా చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర గిరిజన సలహా మండలి సమావేశం నిర్వహించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఐటీడీఏ గవర్నింగ్ బాడీ సమావేశాలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తగు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీతో పాటు సార్మెడి మెస్రం దుర్గు, పెందూర్ గోపి, పెందూర్ ప్రభాకర్, కొమురం విఠల్ రావు, అర్క వసంతరావు, గిరి, జమీర్, తదితరులు పాల్గొన్నారు. -
వైద్యసేవల కోసం ఆధార్ తప్పనిసరి
ఆదిలాబాద్టౌన్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం కోసం వచ్చే సమయంలో రోగులు తప్పనిసరిగా ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్ ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాధిగ్రస్తుల సమాచారం ఆన్లైన్లో పొందుపర్చడం జరుగుతుందని, భవిష్యత్లో రోగికి సంబంధించిన సేవలను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. రిమ్స్, సామాజిక ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆధార్ తప్పనిసరి అని పేర్కొన్నారు. సమయపాలన పాటించాలితలమడుగు: వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పీహెచ్సీని తని ఖీ చేశారు. సిబ్బంది హాజరు, స్టాక్ రిజిస్టర్ పరి శీలించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు సకా లంలో వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. విధులు సక్రమంగా నిర్వర్తించాలి తాంసి: వైద్యసిబ్బంది విధులు సక్రమంగా నిర్వర్తించాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. రికార్డులతో పాటు ఫార్మసీ గదిలో నిల్వ ఉన్న మందులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట సిబ్బంది దీప, నర్మద ఉన్నారు. -
యూడైస్లో పొరపాట్లు సవరించుకోవాలి
ఆదిలాబాద్టౌన్(జైనథ్): యూడైస్లో పొరపాట్లు ఉంటే సవరించుకోవాలని డీఈవో శ్రీనివాస్రెడ్డి అన్నారు. జైనథ్ మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ ను బుధవారం తనిఖీ చేశారు. జిల్లాలోని ఆయా పాఠశాలలను 59 మంది డైట్ ఛాత్రోపాధ్యాయులతో యూడైస్ను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఈ సమాచారంలో ఏవైనా పొరపాట్లు ఉంటే మార్పులు చేసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం డీఈవోను సన్మానించారు. ఆయన వెంట ఎంఈవో శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు లస్మన్న తదితరులున్నారు. సర్వే పకడ్బందీగా చేపట్టాలి బేల: యూడైస్లో నమోదైన వివరాల ప్రకారం వి ద్యార్థుల సంఖ్య, పాఠశాల భౌతిక వసతులపై డైట్ ఛాత్రోపాధ్యాయులు చేస్తున్న సర్వే పకడ్బందీగా చేపట్టాలని డీఈవో శ్రీనివాస్రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని అశోక్నగర్ ప్రాథమిక పాఠశాలలో ఛాత్రోపాధ్యాయురాలు వెంకమ్మ చేస్తున్న సర్వే తీరును బుధవారం పరిశీలించారు. ఆయన వెంట ప్లానింగ్ కోఆర్డినేటర్ నారాయణ, ఎంఈవో నర్సింలు, సీఆర్పీ వెంకన్న తదితరులున్నారు. -
స్పౌజ్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్
● ఉమ్మడి జిల్లాలో ఆరుగురికి అవకాశం ● ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్కు నలుగురు, మంచిర్యాలకు ఇద్దరు రాక ● ఈనెల 23న విధుల్లో చేరనున్న ఉపాధ్యాయులు ఆదిలాబాద్టౌన్: స్పౌజ్ బదిలీలకు ప్రభుత్వం మ రోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల 38 మంది స్పౌజ్ ఉపాధ్యాయులు (భార్య, భర్త) ఇతర జిల్లాల నుంచి జిల్లాకు వచ్చిన విషయం తె లిసిందే. తాజా గా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ స్పౌజ్ బదిలీలకు సంబంధించి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆరుగురు సొంత జి ల్లాలకు బదిలీపై వెళ్లనున్నారు.కుమురంభీం ఆసిఫా బాద్ నుంచి ఆదిలాబాద్కు నలుగురు స్కూల్ అసిస్టెంట్లు (తెలుగు) బదిలీపై రానుండగా, ఆసిఫాబా ద్ నుంచి మంచి ర్యాలకు ఇద్దరు సాంఘిక శాస్త్రం ఎస్ఏలు బదిలీపై వెళ్లనున్నారు. 317ద్వారా నష్టపో యిన టీచర్లకు ప్రభుత్వం ఊరట కల్పించింది. 23న రిలీవ్.. సంబంధిత జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఈనెల 22న రిలీవ్ అయి వారికి కేటాయించి న జిల్లాలో 23న విధుల్లో చేరాలని విద్యాశాఖ డై రెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే ఇటీవల మ్యూచువల్ బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. ఆదిలాబాద్ జి ల్లాకు 24 మంది మ్యూచువల్ బదిలీపై రానుండగా, అదే సంఖ్యలో ఇతర జిల్లాలకు ఇక్కడి నుంచి వెళ్లనున్నారు. మంచిర్యాల నుంచి ఓ సీనియర్ అసిస్టెంట్ డీఈవో కార్యాలయానికి రానుండగా, ఇక్కడినుంచిఒకరు మంచిర్యాలకు వెళ్లనున్నారు. బదిలీలు హర్షణీయం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్పౌజ్ బదిలీలు చేపట్టడం హర్షణీయమని టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్, జలందర్రెడ్డి ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 165 మందికి స్పౌజ్ బదిలీలు జరిగాయని పేర్కొన్నారు. అప్పట్లో 38 మంది ఉపాధ్యాయులకు బదిలీలు జరగగా, సాంకేతిక కారణాలతో మిగిలిపోయిన వారికి ప్రస్తుతం బదిలీలు చేపట్టినట్లు తెలిపారు. -
‘తులం బంగారం ఎప్పుడిస్తరు..?’
బజార్హత్నూర్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి చెక్కుతో పాటు తు లం బంగారం ఎప్పుడిస్తుందో రాష్ట్ర మహిళలకు చె ప్పాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండల కేంద్రంలో 42మంది కల్యాణలక్ష్మి లబ్ధి దా రులకు బుధవారం ఆయన చెక్కులు పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డ పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదని నాడు కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం తీసుకువచ్చారన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని విస్మరించిందన్నారు. పార్టీ యువజన సంఘం మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ అధ్వర్యంలో ‘తులం బంగారం ఎక్కడ’ అనే ప్లకార్డులు ప్రదర్శించారు. ఇందులో తహసీ ల్దార్ శ్యాంసుందర్, ఎంపీడీవో శ్రీనివాస్, డీటీ హీరాలాల్, ఆర్ఐ నూర్సింగ్, తదితరులున్నారు. -
పింఛన్ అక్రమాలపై దృష్టి
జిల్లాలో ఇదీ పరిస్థితి .. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులు, బీడీ వర్కర్లతో పాటు హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు, ఫైలేరియా బాధితులు, డయాలిసిస్ రోగులకు ప్రభుత్వం ప్రతి నెలా చేయూత పథకం కింద పింఛన్ అందజేస్తోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని కేటగిరీలు కలిపి 73,596 మంది లబ్ధిదారులున్నారు. వీరికి గాను ప్రతి నెల రూ.17కోట్ల 25లక్షల 27వేల 520లను చెల్లిస్తోంది. ఇందులో దివ్యాంగులకు రూ.4,016, ఇతరులకు రూ.2,016 అందజేస్తోంది. మున్సిపాలిటీల్లో పింఛన్ నగదును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, పోస్ట్ మాస్టర్ల ద్వారా లబ్ధిదారుల వేలి ముద్రల ఆధారంగా పంపిణీ చేస్తున్నారు. -
ముందస్తు ప్రణాళిక.. పంటకు మేలు
భూసార పరీక్షలు.. పంటకు ముందస్తుగా భూసార పరీక్షలు చేయించాలి. భూసార పరీక్షకు మట్టి నమూనాలు సరైన పద్దతిలో తీసుకోవాలి. ఈ పరీక్షలతో భూమిలో ఎంత సారం ఉంది.. ఎలాంటి విత్తనాలు, ఎంత మోతాదులో ఎరువులు వేయాలి వంటి విషయాలు తెలుస్తాయి. ఇష్టారీతిగా ఎరువులు వినియోగించి నష్టపోవడం కంటే భూసార పరీక్షలతో పంటల సాగుతీరు మార్చుకోవాలి. భూసార పరీక్షలతో సూక్ష్మ, స్థూల పోషకాల లోపాలు, మోతాదు పద్ధతిలో ఎరువుల వాడకం, అదనపు ఖర్చులు తగ్గించుకునే వీలుంది. నూతన ఆధునిక యంత్రాల వినియోగం, సాంకేతిక పరిజ్ఞానం పాటించడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చు. నేలలో కలియదున్నితే మేలు.. జిల్లాలో ఏటా పత్తి పంట దిగుబడి అనంతరం పత్తి చెట్ల మొదళ్లను కోసి కుప్పగా చేసి కాల్చివేస్తుంటారు. కొంత వంట చెరుకుగా వినియోగిస్తున్నారు. అలా కాకుండా పత్తి మొదళ్లను వృథా పోకుండా రో టవేటర్ సహాయంతో భూమిలో తేమ ఉన్నప్పుడు భూమిలో కలియదున్నాలి. రోటవేటర్ తర్వాత మల్డ్చెల్డ్ నాగలితో దున్నాలి. తర్వాత మరోసారి రోటవేటర్తో కలియదున్నాలి. ఈ విధంగా చేయడం వలన భూమి సారవంతమై పత్తి పంటకు బయట నుంచి అందాల్సిన ఎరువులు తగ్గుతాయి. వేసవి దుక్కులు కీలకం.. ఖరీఫ్ సాగుకు ముందు నుంచే చేలు చదును చేసుకుని నెల రోజుల ముందే వేసవి దుక్కులు దున్నుకోవాలి. తొలకరికి ముందే పంట విత్తుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. పంటల కోతల తర్వాత భూమిని వదిలివేయకుండా వేసవిలో దుక్కి దున్నుకుంటే చీడపీడలను కొంత వరకు నివారించవచ్చు. నేలను లోతుగా దున్నడంతో కొంత తేమలో ఉన్న కీటకాలు నశిస్తాయి. అడపాదడపా కురుస్తున్న వర్షాలను సద్వినియోగం చేసుకోవడానికి భూమిని దున్నుకోవాలి. ఈ వర్షాలతో లోతుగా దున్నడం వల్ల వరుసకు వరుస మధ్యలో వర్షపు నీరు నిలుస్తుంది. మొదటిసారి దుక్కులు దున్నిన తర్వాత రెండోసారి దున్నే ముందు పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, శాస్త్రవేత్తలు సూచించిన చెరువు మట్టిని పొలంలో వేసుకుంటే పంట దిగుబడి సామర్థ్యం పెరుగుతుంది. సేంద్రియ ఎరువులు అందించడం ద్వారా సూక్ష్మ పోషక లోపాలు నివారించవచ్చు. లోతు తక్కువ ఎర్రచల్క నేలల్లోనూ అడుగున గట్టిగా ఉన్న నేలల్లోనూ లోతుగా దుక్కి చేయడం చాలా ఉపయోగంకరంగా ఉంటుంది. నేలను 35 సెం.మీ నుంచి 40 సెం.మీ వరకు లోతుగా దున్నుకుంటే భూమిలో గట్టిపొర పగిలి నేల బాగా గుల్ల బారుతుంది. వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది. లోతు దుక్కి ప్రభావం 2 నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. వేసవి దుక్కులు ఉపయోగకరం భూసార పరీక్షలు కీలకం వ్యవసాయ పరిశోధన కేంద్ర శాస్త్రవేత్త శ్రీధర్ చౌహాన్వేసవికాలం ప్రారంభమైంది. రైతులు ఎండాకాలంలోనే దుక్కి దున్నడం, చేలు చదును చేయడం, గతేడాది పంట మొదళ్లు, ఇతర అవశేషాలు, చెత్త ఏరికాల్చడం వంటి పనులు చేస్తుంటారు. జూన్ నెలలో తొలకరి వర్షాలు కురవగానే విత్తనాలు సమకూర్చుకుంటారు. రైతులు ఇప్పటినుంచే ప్రణాళికా బద్ధంగా సాగుకు సిద్ధమైతే అధిక దిగుబడులు పొందవచ్చని వ్యవసాయ పరిశోధన కేంద్ర శాస్త్రవేత్త శ్రీధర్ చౌహాన్ వివరిస్తున్నారు. వేసవిలో రైతులు చేపట్టాల్సిన పనులపై సలహాలు, సూచనలు ఆయన మాటల్లోనే.. – మంచిర్యాలఅగ్రికల్చర్ -
‘రెవెన్యూ’పై అనాసక్తి!
● ‘జీపీవో’కు ముగిసిన ఆప్షన్ గడువు ● పూర్వ వీఆర్వో, వీఆర్ఏల వెనుకడుగు ● 292 మందికి 86 మంది మాత్రమే సానుకూలం కైలాస్నగర్: గ్రామాల్లో రెవెన్యూ అధికారుల పా లనను మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలి సిందే. గతంలో కొనసాగిన వీఆర్వో, వీఆర్ఏ పోస్టులకు బదులు గ్రామ పాలన అధికారి (జీపీవో) పేరిట ప్రతి రెవెన్యూ గ్రామానికో పోస్టు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ లెక్కన జిల్లాలో 508 పోస్టులు భర్తీకి అవకాశముంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన పూర్వ వీఆర్వో, వీఆర్ఏలకు తిరిగి మాతృశాఖకు వచ్చే అవకాశాన్ని ప్రస్తుత ప్రభుత్వం కల్పించింది. ఆసక్తి కలిగిన వారు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని ఇప్పటికే ఓ మారు పేర్కొంది. తాజాగా మరోసారి ఇచ్చిన గడువు బుధవారంతో ముగిసింది. అయితే జిల్లాలో వెబ్ ఆప్షన్ ఇచ్చిన వారి సంఖ్యను పరిశీలిస్తే రెవెన్యూశాఖకు వచ్చేందుకు మెజార్టీ పూర్వ వీఆర్వో, వీఆర్ఏలు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ● గతంలో 105 మంది వీఆర్వోలు ఇతర శాఖ ల్లో సర్దుబాటు కాగా వారిలో 88 మంది రెవెన్యూకు వచ్చేలా తొలుత ఆప్షన్ ఇచ్చారు. రెండోసారి మాత్రం ఇందులో కేవలం 41 మంది మాత్రమే సానుకూలత వ్యక్తం చేశారు. ● వీఆర్ఏలు 187మంది ఇతర శాఖల్లో సర్దుబా టు కాగా అందులో గతంలో 120 మంది ఆప్ష న్ ఇచ్చారు. ప్రస్తుతం 45 మంది మాత్రమే రెవెన్యూకు వచ్చేందుకు ఆసక్తి చూపారు. అయితే జీపీవోగా చేరే వీఆర్వో, వీఆర్ఏలకు పాత సర్వీస్ను పరిగణలోకి తీసుకోకపోవడమే వారు వెనుకడుగుకు ప్రధాన కారణంగా తెలు స్తోంది. చాలామంది ఏళ్లుగా పనిచేస్తున్న వారు కొత్త పోస్టులోకి వెళితే సర్వీస్ కోల్పోయి పదోన్నతుల పరంగా నష్టపోయే అవకాశముందనే భావనతో వారు రెవెన్యూకు తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. -
పురుగుల మందు తాగి ఆత్మహత్య
బోథ్: సొనాల మండలం సంపత్నాయక్ తండా గ్రామానికి చెందిన జాదవ్ దేవిదాస్(45) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ఎల్.ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జాదవ్ దేవిదాస్ మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 15న మద్యం సేవించి ఇంటికి వెళ్లగా భార్య సుమన్ బాయి మందలించింది. దీంతో దేవిదాస్ తన వ్యవసాయ భూమిలో పురుగుల మందు తాగి రాత్రి 9 గంటలకు భార్యకు విషయం తెలిపాడు. వెంటనే మండల కేంద్రంలోని సీహెచ్సీకి, మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దేవిదాస్ మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బైక్ దొంగ అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని కేఆర్కే కాలనీకి చెందిన బైక్ దొంగ షేక్ నదీమ్ను టూటౌన్ పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇటీవల బస్టాండ్లో పార్కింగ్ చేసిన మూడు ద్విచక్ర వాహనాలను పదిరో జుల కాల వ్యవధిలో దొంగిలించాడు. ఇందిరా నగర్ సమీపంలో వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానం వచ్చి విచారించగా, మూడు వాహనాలు చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. జైనథ్లో.. ఆదిలాబాద్టౌన్: జైనథ్ మండలంలోని మాకో డకు చెందిన బైక్ దొంగ రామెల్లి కిరణ్ను వన్టౌన్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మావలకు చెందిన రగ్దివార్ ప్రశాంత్ ముథూట్ ఫైనాన్స్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈనెల 9న కార్యాలయం ఎదుట బైక్ పార్కింగ్ చేయగా, సాయంత్రం వచ్చి చూసే సరికి వాహనం కనిపించలేదు. దీంతో ఆయన వన్టౌన్లో ఫి ర్యాదు చేశాడు. శివాజీచౌక్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానం వచ్చి నిందితుడిని విచారించగా బైక్ చోరీకి పాల్పడినట్లు ఒ ప్పుకున్నాడు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వివరించారు. మట్కా నిర్వాహకుడికి రూ.లక్ష జరిమానాఆదిలాబాద్టౌన్: మట్కా నిర్వాహకుడికి రూ.లక్ష జరిమానా విధించినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్యనగర్కు చెందిన మట్కా నిర్వాహకుడు లతీఫ్, రెహాన్ తండ్రి, కొడుకులు ఆన్లైన్లో మట్కా ఆడుతున్నారు. ఇదివరకు బైండోవర్ చేయగా బుధవారం ఆన్లైన్లో మట్కా నిర్వహిస్తుండగా పట్టుబడ్డారు. తహసీల్దార్ ఎదుట వారిని హాజరుపర్చగా పది రోజుల్లో రూ.లక్ష జరిమానా చెల్లించాలని ఆదేశించారు. నిందితుల నుంచి రూ.500, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలుఇంద్రవెల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన బుధవారం రాత్రి మండలంలోని వడగామ్ సమీపంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూర్ మండలంలోని లక్కుగూడ గ్రామానికి చెందిన కొరెంగా రాము, కొరెంగా హేమంత్ కు మార్, ఇంద్రవెల్లి మండలంలోని పొల్లుగూడ గ్రామానికి చెందిన బాలుడు జుగ్నాక గౌతంలు ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్న స మయంలో మోడిగూడ సమీపంలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోయింది. దీంతో కొరెంగా రాము, కొరెంగా హే మంత్లకు తీవ్ర గాయాలయ్యాయి. జుగ్నాక్ గౌ తంకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో క్షతగాత్రులను రిమ్స్కు తరలించారు. రాము, హే మంత్కుమార్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
గుండెపోటుతో పూజారి మృతి
లక్ష్మణచాంద: గుండెపోటుతో పూజారి ప్రాణాలు కోల్పోయిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రానికి చెందిన పూజారి పెరుమాండ్ల రమేశ్(75) గత 30 సంవత్సరాలుగా శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో పురోహితుడిగా సేవలు అందిస్తున్నారు. గత ఏ డాది నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం తన వద్దకు వచ్చిన ఒకరికి పంచాంగం చూశారు. ఆయన వెళ్లిపోయిన కొద్దిసేపటికే గుండెపోటుతో కుప్పకూలిపోయి మృతిచెందారు. పూజారి మృతితో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంతాపం.. పూజారి పెరుమాండ్ల రమేశ్ అకాల మృతి విషయం తెలుసుకున్న నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. -
భార్యపై గొడ్డలితో దాడి
కోటపల్లి: వివాహేతర సంబంధంపై ప్రశ్నించిన భార్యపై భర్త గొడ్డలితో దాడి చేసిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. బొప్పారం గ్రామానికి చెందిన బానోత్ పున్నం అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అతడి భార్య లక్ష్మికి విషయం తెలియడంతో ఇంట్లో తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో బుధవారం సదరు మహిళతో పున్నం సన్నిహితంగా ఉన్నాడని తెలుసుకున్న లక్ష్మి భర్తను తీవ్రంగా మందలించింది. దీంతో కోపోద్రిక్తుడైన పున్నం పక్కనే ఉన్న గొడ్డలితో లక్ష్మిపై దాడి చేయడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుమారుడు రాజేశ్ అక్కడికి చేరుకుని 108లో చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. -
అధికారికంగా అమరుల సంస్మరణ దినోత్సవం
ఇంద్రవెల్లి: అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని మొదటిసారిగా అధికారికంగా నిర్వహిస్తున్నామని, ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని ఆదిలా బాద్ కలెక్టర్ రాజర్షిషా, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. బుధవారం ఉట్నూర్ సబ్కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఏఎస్పీ కాజల్సింగ్లతో కలిసి మండలంలోని అమరవీరుల స్తూపాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. సంస్మరణ దినోత్సవం నిర్వహణపై రాయిసెంటర్ సార్మెడీలు, అమరుల ఆశయ సాధన కమిటీ, ఆది వాసీ పెద్దలతో సమావేశమయ్యారు. వారు మా ట్లాడుతూ అమరవీరుల స్తూపాన్ని వివిధ రకాల పూలతో అలంకరించాలని తెలిపారు. 1981లో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించిన ఫొటోలతో పాటు ఆదివాసీ సంస్కృతికి చెందిన ఫొటోలను సేకరించి మ్యూజియం ఏర్పాటు చేయాలన్నారు. ఏప్రిల్ 20 సంస్మరణ దినోత్సవం రోజు రాష్ట్ర మంత్రి సీతక్క అమరుల కుటుంబాలకు ట్రైకర్ ద్వారా మంజూరైన వాహనాలు, యూనిట్లను పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. వానాకా లంలో స్మృతివనంలో మొక్కలు నాటి వందశాతం పనులు పూర్తయిన తరువాత స్మృతివనా న్ని ప్రారంభిస్తామని తెలిపారు. అమరవీరుల ఆశయ సాధన కమిటీ చైర్మన్ తోడసం నాగో బారావ్ అమరవీరుల స్తూపం ప్రాంగణంలో వీధిదీపాలు ఏర్పాటు చేయాలని, తాగునీటి కోసం బోరు మంజూరు చేయాలని, ప్లాస్టిక్ కుర్చీ లు, గ్రీన్మ్యాట్ మంజూరు చేయడంతో పాటు వాచ్మెన్ను నియమించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. ఐటీడీఏ ఏపీవో జనరల్ వ సంత్రావ్, డీడీ అంబాజీ, ఈఈ తానాజీ, సార్మెడిలు మెస్రం దుర్గు, మెస్రం చిన్ను, ఏఎంసీ చై ర్మన్ ముఖడే ఉత్తం, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, ఎంపీడీవో జీవన్రెడ్డి, ఆదివాసీ సంఘాల నాయకులు గోడం గణేశ్, మెస్రం నాగ్నాథ్, పుర్క చిత్రు, ఆనంద్రావ్, నాగోరావ్ ఉన్నారు. ● ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా, ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా -
గంజాయి కేసులో ఇద్దరి రిమాండ్
నేరడిగొండ: గంజాయి కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఇచ్చోడ సీఐ భీమేశ్, ఎస్సై శ్రీకాంత్లు తెలిపారు. వారి కథనం ప్రకారం.. మంగళవారం సాయంత్రం పక్కా సమాచారం మేరకు కుంటాల ఎక్స్రోడ్లో నేరడిగొండకు చెందిన బత్తుల కిరణ్ అనే వ్యక్తిని తనిఖీ చేయగా 160 గ్రాముల గంజాయి లభించినట్లు పేర్కొన్నారు. ఆయనను విచారించగా దంసతండా గ్రామానికి చెందిన పెందూర్ లచ్చు అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయి తీసుకొచ్చినట్లు తెలిపాడు. కాగా లచ్చును విచారించగా తన వ్యవసాయ భూమిలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నట్లు తెలిపాడు. అతని వద్ద నుంచి 290 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. స్వాధీనం చేసుకున్న మొత్తం 450 గ్రాముల గంజాయి విలువ రూ.11,250 ఉంటుందన్నారు. మావల పరిధిలో.. ఆదిలాబాద్రూరల్: గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు మావల ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీకి చెందిన అంబదాస్, గాదిగూడ మండలానికి చెందిన రాజు అనే ఇద్దరు వ్యక్తులు గంజాయిని తరలిస్తుండగా బుధవారం మావల పోలీసుస్టేషన్ పరిధిలో పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి 12 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
పాఠశాలలో విషప్రయోగం కలకలం
● తప్పిన పెను ప్రమాదం ● పోలీస్స్టేషన్లో ఫిర్యాదు, నిందితుడు అరెస్ట్ ఇచ్చోడ: మండలంలోని ధర్మంపూరి ప్రాథమిక పాఠశాలలో ఓ వ్యక్తి విషప్రయోగం చేసిన ఘటన కలకలం సృష్టించింది. ప్రధానోపాధ్యాయురాలు ప్రతిభ, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన సిబ్బంది పాఠశాల తాళం పగిలిపోయి ఉండటాన్ని గమనించారు. పాఠశాల గదిలో ఉన్న వంటపాత్రలో తె ల్లనినీరు నింపి ఉండటం, వాసన రావడంతో అప్రమత్తమైన ప్రధానోపాధ్యాయురాలు గ్రామస్తులకు సమాచారం అందించారు. వెంటనే పాఠశాలకు చేరుకున్న గ్రామస్తులు వంటపాత్రలు, వాటర్ట్యాంక్లో విషం కలిపినట్లు గుర్తించారు. పాఠశాల ఆవరణలో ఉన్న పురుగుల మందు డబ్బాను గుర్తించి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి ఘటన జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. పాఠశాల సిబ్బంది ముందుగా గుర్తించడంతో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్ బుధవారం పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. నిందితుడు అరెస్ట్ పాఠశాలలో వంటపాత్రలలో విషం కలిపిన దర్మంపూరి గోండుగూడకు చెందిన సోయం కిష్టును బుధవారం అరెస్ట్ చేశారు. కొంత కాలంగా కుటుంబ కలహాల కారణంగా మతిస్థిమితం కోల్పోయిన సోయం కిష్టు ఘటనకు పాల్పడినట్లు ఏఎస్పీ కాజల్సింగ్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలను సందర్శించిన డీఈవో ధర్మంపూరి ప్రాథమిక పాఠశాలను బుధవారం డీఈవో శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. పాఠశాలలో విష ప్రయోగం జరగడంతో పాఠశాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంఈవో బిక్కు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రతిభ ఉన్నారు. -
అన్నయ్య సారీ రా...
ఆదిలాబాద్(బెల్లంపల్లి): కొంతకాలంగా అనారో గ్యంతో బాధపడుతున్న ఓ యువకుడు చికిత్స చేయించుకున్నా మెరుగు పడకపోవడంతో మనస్తాపం చెందాడు. అనారోగ్యం బాధను భరించలేకపోయాడు. ఇక చావే శరణ్యమనుకున్నాడు. ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జెండా వెంకటాపూర్లో జరిగింది. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశాడు. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చెల్మాటికారి సత్తయ్య, అమృత దంపతుల కుమారుడు అనిల్ (24) పీజీ పూర్తిచేసి ఇంటివద్దే ఉంటున్నాడు. కొంతకాలంగా పచ్చకామెర్లు, దవడ బిల్లలు, వైరల్ ఫీవర్తో బాధపడుతున్నాడు. చికిత్స చేయించినా నయం కాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం ఇంట్లోనే దూలానికి చీరతో ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. ఉరేసుకునే ముందు బెడ్రూమ్లో అతని మంచంపై సుసైడ్ నోట్ రాసిపెట్టాడు. ‘అమ్మా.. నన్ను క్షమించండి.. నాకు ఆరోగ్యం బాగుండడంలేదు. బాధ భరించలేక చనిపోతున్నా. నా చావుకు ఎవరూ కారణం కాదు. నా సొంత నిర్ణయంతో చనిపోతున్నా. అన్నయ్య సారీ రా... నీవు ఈ లెటర్ చదివే సమయానికి నేను నీతో ఉండను.. అమ్మా నాన్నను కష్టపెట్టకు.. నన్ను మీరంతా క్షమిస్తారని ఆశిస్తూ.. సెలవు తీసుకుంటున్నా.. అని నోట్ రాసి ఉంచాడు. మృతుని తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.నేత్రదానంఅనిల్ కళ్లు దానం చేయడానికి తల్లిదండ్రులు ముందుకు వచ్చి సోపతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు భీం పుత్ర శ్రీనివాస్, బ్లడ్ డోనర్ అసోసియేషన్ అధ్యక్షుడు రహీమ్కు సమాచారం అందించారు. దీంతో వారు హైదరాబాద్లోని ఎల్వీప్రసాద్ ఐ బ్యాంకు టెక్నీషియన్ ప్రదీప్కుమార్కు తెలియజేయడంతో గ్రామానికి వచ్చి నేత్రాలు సేకరించారు. -
జీవాల పెంపకానికి చేయూత
● ఎన్ఎల్ఎం ద్వారా రుణాలు ● యూనిట్కు 50 శాతం సబ్సిడీ ● గరిష్టంగా రూ.50 లక్షల వరకు మంజూరు యూనిట్ సబ్సిడీ లక్ష్మణచాంద(నిర్మల్): దేశంలో పెరుగుతున్న జనా భాకు అనుగుణంగా మాంసం ఉత్పత్తులు పెంచా లని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. మాంసానికి ఉ న్న డిమాండ్ దృష్ట్యా జీవాల పెంపకాన్ని ప్రోత్సహి ంచాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా గొర్రెలు, మేకల పెంపకానికి నేషనల్ లైవ్స్టాక్ మిష న్ స్కీం(ఎన్ఎల్ఎం) ద్వారా ఔత్సాహికులకు సబ్సి డీ రుణాలు అందిస్తోంది. 2021–22లో ప్రారంభించిన ఈ పథకాన్ని రాష్ట్ర పశుసంవర్థక శాఖ అమలు చేస్తోంది. ఈ పథకం కింద పెంపకందారులకు ఒక్కో యూనిట్కు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు జిల్లా పశు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. యూనిట్ మంజూరైనప్పటి నుంచి పూర్తిస్థాయిలో సబ్సిడీ నిధులు విడుదలయ్యే వరకు రాష్ట్ర పశుసంవర్థక శాఖ పర్యవేక్షిస్తుందని అధికారులు తెలిపారు. గరిష్టంగా యూనిట్కు రూ.50 లక్షల వరకు రుణం అందించనున్నారు. ఈ రుణం డబ్బులను రెండు విడతలుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. దరఖాస్తు ఇలా.. గొర్రెలు,మేకల యూనిట్ల పెంపకం రుణం మంజూరు కోసం www. nim. udyamimitra. in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. ఈ రుణాలు పొందడానికి దరఖాస్తు చేయడానికి ఎలాంటి ఫీజులు చెల్లించనవసరం లేదని అధికారులు అంటున్నారు. రుణం మంజూరుకు దరఖాస్తు చేస్తున్న ఉత్సాహవంతులు తమ పాన్, ఆధార్ కార్డు, అడ్రస్ ఫ్రూఫ్, పాస్ఫొటో, రుణం తీసుకునే బ్యాంకు స్టేట్మెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అర్హతలు 1. కనీసం ఐదెకరాల వ్యవసాయ భూమిని కలిగి ఉండాలి. ఇతరులదైనా లీజుకు తీసుకోవాలి. 2. పశు పోషణలో తగిన అనుభవం ఉండాలి. 3. యూనిట్ మంజూరు కోసం బ్యాంక్ కాన్సెంట్ తీసుకోవాలి.(గొర్రెలు,పొట్టేళ్లు) (రూ.లక్షల్లో) 500–25 50 400–40 40 300–15 30 200–10 20 100–05 10 పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి నేషనల్ లైవ్స్టాక్ మిషన్ పథకాన్ని గొర్రెలు, మేకల పెంపకంపై ఆసక్తి ఉన్న యువత సద్వినియోగం చేసుకోవాలి. ఈ దరఖాస్తు చేసుకుని యూనిట్ పొంది ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని పేర్కొన్నారు. వివరాల కోసం జిల్లా కార్యాలయంలో సంప్రదించాలి. – ఎండీ బాలిగ్ అహ్మద్, జిల్లా పశువైద్యాధికారి, నిర్మల్