Rangareddy
-
శాంతి వర్దిల్లినప్పుడే అభివృద్ధి
మోమిన్పేట: ప్రపంచంలో శాంతి నెలకొన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఏజేఆర్ ఫంక్షన్ హాల్లో అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జిల్లా ద్వితీయ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి సంస్థలు శాంతిని కాపాడటంలో కీలకంగా మారాయన్నారు. నేడు కొన్ని దేశాలు యుద్ధం చేస్తూ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి వర్ధిల్లినప్పుడే దేశాల అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని ప్రభావం అన్ని దేశాలపై పడుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, అఖిల భారత శాంతి సంఘీభావ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమరేందర్రెడ్డి, శుభప్రద్పటేల్ నాయకులు నరోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ -
వృద్ధురాలి మెడలోనుంచి బంగారు గొలుసు చోరీ
ఇబ్రహీంపట్నం రూరల్: వృద్ధురాలి మెడలో నుంచి పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన ఘటన ఆదిబట్ల పీఎస్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. గోదాసు జంగయ్య, యశోద అనే వృద్ధ దంపతులు కొంగరకలాన్ డివిజన్లోని ఎస్బీఐ పక్కన నివాసం ఉంటున్నారు. రోజూ మాదిరిగానే శుక్రవారం రాత్రి భోజనం చేసి, నిద్రకు ఉపక్రమించారు. వీరు ఉంటున్న గదికి కిటికీ తలుపు, గ్రిల్స్ లేకపోవడంతో అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత గుర్తు తెలియని దుండగలు ఇంట్లోకి దూరారు. నిద్రపోతున్న యశోద (70) మెడలోని బంగారు లాక్కుని పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఘటనా స్థలంలో వేలిముద్రలను సేకరించారు. చోరీ అనంతరం పక్కనే ఉన్న పొలాల నుంచి పారిపోయినట్లు గుర్తించారు. -
ప్రభుత్వ ప్రోత్సాహంతో పెరిగిన సాగు
ఆమనగల్లు: రైతు సంక్షేమానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని నాగర్కర్నూల్ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మల్లురవి అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆయన చెప్పారు. శనివారం ఆయన పట్టణంలోని వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ను, మండల పరిధిలోని శంకరకొండతాండాలో నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ప్రారంభించారు. శంకరకొండతాండాలో ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి సర్పంచ్ మండ్లి రాములు ఆధ్వర్యంలో గిరిజనుల సంప్రదాయంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయా చోట్ల జరిగిన సభలలో ఎంపీ మల్లురవి మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల పంట రుణాలు మాఫీ చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో సాగు గణనీయంగా పెరిగిందని రైతులు సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ప్రజాప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలవాలని ఆయన కోరారు. కల్వకుర్తి అభివృద్ధే ధ్యేయం కల్వకుర్తి అసెంబ్లీ నియోజక వర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని చెప్పారు. ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తుందని ఆయన వివరించారు. నియోజక వర్గంలో దాదాపు రూ.600 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు అయిల శ్రీనివాస్గౌడ్, పీసీబీ సభ్యులు బాలాజీసింగ్, మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్, వైస్ చైర్మన్ భాస్కర్రెడ్డి, మాజి వైస్ చైర్మన్ గుర్రం కేశవులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, హౌసింగ్ డీఏ శైలజ, ఎంపీడీఓ మాధురి, ఏఈ శాలిని, మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు వెంకటయ్య, మహేశ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు జగన్, మానయ్య, ప్రభాకర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శ్రీకాంత్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు. కడ్తాల్: నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం వారు మండల కేంద్రంతో పాటు మక్తమాదారం గ్రామంలో పర్యటించారు. ఇందిరమ్మ మోడల్ హౌస్, పలువురు లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ నందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా మక్తమాధారం గ్రామంలో పోస్టాఫీస్, బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ఎంపీ, ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భిక్షపతి, ఉప సర్పంచ్ యాదగిరిరెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్రెడ్డి,, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీచ్యానాయక్ నాయకులు బాలరాజు, చందోజీ, రాఘవేందర్, రవి, షాబుద్దీన్, రాజేశ్, శ్రీకాంత్, అశోక్, కృష్ణ, అధికారులు తదితరులు ఉన్నారు. నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి -
మే 10 వరకు స్వీయ గణనకు అవకాశం
కలెక్టర్ నారాయణరెడ్డి సాక్షి, రంగారెడ్డిజిల్లా: స్వీయ గణన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ప్రారంభమైన ఈ కార్యక్రమం మే 10 వరకు కొనసాగుతుందని, ప్రతి ఒక్కరూ విధిగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో పని చేస్తున్న రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ కార్యాలయం(ఓఆర్జీఐ)హెచ్ఎల్ఓ జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా స్వీయగణ నకు అవకాశం ఇచ్చిందన్నారు. స్వీయగణన చేసుకోవచ్చు ఇలా ముందుగా జనగణన అధికారిక (https:// se. census. gov. in) వెబ్సైట్కి వెళ్లాలి. కొత్త యూజర్గా రిజిస్టర్ అవ్వాలి. మీ మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ ఇవ్వాలి. ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక, మీ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత కుటుంబ వివరాలు నమోదు చేయాలి. ఇంటి చిరునామా సహా కుటుంబ సభ్యుల సంఖ్య, ఇంటి రకం, సౌకర్యాలు (నీరు, విద్యుత్ మొదలైనవి). వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. ఇందులో పేరు, వయస్సు, లింగం, విద్య, ఉద్యోగం, వివాహ స్థితి, భాష, మతం వంటి అంశాలను నమోదు చేయాలి. ఆ తర్వాత నమోదు చేసిన వివరాలు మళ్లీ చెక్ చేసి సబ్మిట్ చేయాలి. ఎంటర్ చేసిన సమాచారాన్ని ఒకసారి చెక్ చేసి, ఫైనల్గా సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఒక అకనాలెడ్జ్మెంట్/రిఫరెన్స్ ఐడీ వస్తుంది. దీన్ని జాగ్రత్తపరుచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు సమాచారం ఇవ్వకూడదు. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మార్పులు చేర్పులు చేయడం కుదరదు. ● వెంచర్లు, ఇళ్ల నిర్మాణాలకు నియమాలు తప్పనిసరి ● ఫ్యూచర్సిటీ డెవలప్మెంట్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ స్నేహ యాచారం: ఫ్యూచర్సిటీ కింద గుర్తించిన ప్రాంతంలో నింబంధనల ప్రకారమే వెంచర్లు, ఇంటి నిర్మాణాలను చేపట్టాలని, ఆ విధంగా ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించాలని ఫ్యూచర్సిటీ డెవలప్మెంట్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ స్నేహ అన్నారు. శనివారం యాచారం మండల పరిషత్ కార్యాలయంలో నింబంధనల అమలుపై వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫ్యూచర్సిటీతో ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని, ఆ విధంగానే అనుమతులు పొందాల్సి ఉంటుందని చెప్పారు. ఫ్యూచర్సిటీ విలీన గ్రామాల్లో నింబంధనల ప్రకారం అనుమతులు ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకొవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే బాధ్యులపై చట్టపరమైన చర్యలుంటాయన్నారు. అథారిటీ పరిధిలో నింబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఫ్యూచర్సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏపీఓ లక్ష్మీనారాయణ, మండల పంచాయతీ అధికారి శ్రీలత తదితరులు పాల్గొన్నారు. సాక్షి, సిటీబ్యూరో: డీజీపీ హోదాకు పదోన్నతి పొందిన సందర్భంగా నగర పోలీసు కమిషనర్ సజ్జనర్ శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. -
సవరణకు సై
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ వాల్యూకు.. బహిరంగ మార్కెట్లోని భూముల విలువకు భారీ వ్యత్యాసం ఉంది. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు ప్రభుత్వం భూముల మార్కెట్ విలువను సవరించాలని నిర్ణయించింది. ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా ఇప్పటికే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల విభాగం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రాంతం, భూ స్వరూపం, అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు, బహిరంగ మార్కెట్లో ఆయా భూములు, ఇళ్లకు ఉన్న డిమాండ్ ఆధారంగా వ్యాల్యూను సవరించనున్నారు. ఐటీ హబ్గా గుర్తింపు పొందిన నార్సింగి, కోకాపేట్, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల్లో వంద శాతానికిపైగా పెరిగే అవకాశం లేకపోలేదు. రూరల్ ఏరియాల్లో ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ 40 నుంచి 50 శాతం పెరిగే అవకాశం లేకపోలేదు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ కదలిక.. ఔటర్ రింగ్రోడ్డు లోపల 39 సబ్రిజిస్ట్రార్ ఆఫీసులున్నాయి. వీటిలో నెలకు సగటున 21వేల నుంచి 22 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. ప్రభుత్వానికి ప్రతి నెలా రూ.350 నుంచి రూ.360 కోట్ల ఆదాయం వస్తోంది. ప్రభుత్వానికి వస్తున్న ఇన్కమ్లో అపార్ట్మెంట్ల నుంచి 35శాతం, ఓపెన్ ప్లాట్ల నుంచి 23శాతం, ఇళ్ల నుంచి 20శాతం సమకూరుతోంది. అయితే ఒక్కో ఎస్ఆర్ఓ పరిధిలో భూముల ధరలు ఒక్కో విధంగా ఉన్నాయి. బహిరంగ మార్కెట్ ధరలతో పోలిస్తే.. ప్రభుత్వ మార్కెట్ విలువ చాలా తక్కువగా ఉంది. ఈ హెచ్చుతగ్గులను సరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2021లో భూముల మార్కెట్ విలువను 20శాతం పెంచుతూ అప్పటి ప్రభుత్వం తొలిసారిగా నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత 2022లో 33 శాతం పెంచింది. తాజాగా మరోసారి భూ విలువను సవరించేందుకు సిద్ధమైంది. మార్కెట్ వాల్యూ శాసీ్త్రయంగా ఉండాలని ఓ ప్రైవేటు ఏజెన్సీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అమలుకు ఏర్పాట్లు చేస్తోంది. భూముల మార్కెట్ విలువ పెంపునకు కసరత్తు జిల్లాలో 40 నుంచి 50 శాతం పెరిగే అవకాశం మే నుంచి అమల్లోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం మరింత గడువు కావాలంటున్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ గచ్చిబౌలిలో అపార్ట్మెంట్కు సంబంధించి చదరపు అడుగు ధర ప్రస్తుతం రూ.3,000 ఉంది. దీన్ని కనీసం 60 శాతం (రూ.4,800) పెంచాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. నార్సింగి, మణికొండ, రాయదుర్గం, నానక్ రాంగూడ, కోకాపేట్, తదితర ప్రాంతాల్లోని వ్యాణిజ్య భూములు బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.వంద కోట్లకు పైనే పలుకుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్లోని భూ విలువ ఆధారంగా ప్రధాన రోడ్ల వెంట గజం ధరను రూ.లక్ష వరకు పెరిగే అవకాశం లేకపోలేదు. ఇక మహేశ్వరంలో పుస్తక విలువ రూ.2,100 మాత్రమే ఉంది. అదే వాణిజ్య స్థలం విలువ రూ.10,200 ఉంది. ఇలాంటి చోట్ల రూ.2,100 ఉన్న విలువను కనీసం రూ.3,800 నుంచి రూ. 4,500 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. సవరించిన ఈ ధరలు మే మొదటి వారం నుంచే అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుండగా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల విభాగం మాత్రం మరికొంత గడువు కావాలని కోరుతోంది. -
అండర్పాస్ ఏర్పాటుకు వినతి
చేవెళ్ల: హైదరాబాద్–బీజాపూర్ రహదారి విస్తరణలో ఖానాపూర్ గేట్ వద్ద అండర్పాస్ నిర్మించాలని నాంచేరి సర్పంచ్ అశోక్, నాయకులు, గ్రామస్తులు కోరారు. ఈ మేరకు శనివారం వారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైవే విస్తరణలో రోడ్డు ఎక్కువ ఎత్తులో నిర్మిస్తుండడంతో గ్రామాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పాడుతాయన్నారు. ఖానాపూర్ గేట్ వద్ద అండర్పాస్ ఏర్పాటు చేస్తే ఖానాపూర్, నాంచేరి, దేవరంపల్లి, రేగడిఘనాపూర్, ఇంద్రారెడ్డి నగర్ గ్రామాలకు వెళ్లే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. కేంద్రం ప్రభుత్వం, నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి అండర్పాస్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు ఆయన సానుకులంగా స్పందించి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్.రత్నం, నాయకులు జైశంకర్గౌడ్, సాయిరాంగౌడ్, రాజలింగంగౌడ్, శ్రావణ్గౌడ్, వర్షవర్ధన్గౌడ్, గ్రామస్తులు, మండల నాయకులు ఉన్నారు. -
ట్రాఫికర్
మొయినాబాద్: స్థానికంగా ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంలో ట్రాఫిక్, పార్కింగ్ సమస్య తీవ్రమైంది. రహదారికి ఇరు పక్కల వాణిజ్య సముదాయాలు(షాపులు) ఉన్నాయి. కానీ ఆ షాపుల ముందు మాత్రం సరైన పార్కింగ్ స్థలాలు లేవు. ఉన్న కొద్దిపాటి స్థలాన్ని సైతం యజమానులు చిన్న చిన్న బండి కొట్లు పెట్టడానికి అద్దెకు ఇస్తున్నారు. దీంతో షాపులకు, బండి కొట్ల వద్దకు వచ్చినవారు తమ వాహనాలను రోడ్లపైనే నిలిపి వెళ్తున్నారు. దీంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. అదే విధంగా హిమాయత్నగర్ చౌరస్తా నుంచి అజీజ్నగర్ చౌరస్తా వరకు హోటళ్లు, గ్రానైట్, టైల్స్ షాపులు అధికంగా ఉన్నాయి. ప్రధానంగా హోటళ్ల వద్ద వాహనాలకు సరిపడా పార్కింగ్ స్థలం లేకపోవడంతో రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం వ్యాపార సముదాయాలు, షాపులు, హోటళ్లకు మున్సిపల్ కార్యాలయం నుంచి నిర్వాహకులు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అధికారులు ట్రేడ్ లైసెన్స్లపై దృష్టి పెట్టకుండా మామూళ్లకు ఆశపడి ఇష్టానుసారంగా వదిలేస్తున్నారు. దీంతో రహదారికి ఇరుపక్కల ఉన్న షాపులు, వ్యాపార సముదాయాల ముందు ఖాళీ స్థలం ఎంత ఉంది. పార్కింగ్ స్థలం ఉందా అనే విషయాలను మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో షాపుల ముందు ఉన్న స్థలాన్ని కబ్జాచేసి వాటిలో బండికొట్లు ఏర్పాటు చేయిస్తున్నారు. వారి వద్ద రోజు లెక్క అద్దెలు వసూలు చేస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారు. షాపుల ముందు అక్రమంగా రేకుల షెడ్లు ఏర్పాటు చేసినా యంత్రాంగం పట్టించుకోవడంలేదు. గత పదకొండు నెలలుగా మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీఐపీ రూట్ అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో హైదరాబాద్–బీజాపూర్ రహదారిని వీఐపీ మూమెంట్ రూట్గా ప్రకటించారు. సీఎం కొడంగల్ వెళ్లాలంటే ఇదే రూట్లో వెళ్లాల్సి ఉంటుంది. అదే విధంగా శాస న సభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తన నియోజకవర్గం వికారాబాద్కు వెళ్లాలన్నా ఇదే రూట్లో వెళ్లాలి. వారంలో రెండు మూడు సార్లు ఆయన వికా రాబాద్ వెళ్లి వస్తూ ఉంటారు. అందుకే పోలీసులు వీఐపీ మూమెంట్ రూట్గా ప్రకటించారు. కానీ అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకోవడం లేదు. చలాన్లు వేయడమే విధి ట్రాఫిక్ పోలీసులు మొయినాబాద్ మాత్రం ఫొటోలు తీయడం, చలాన్లు వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. నిత్యం ట్రాఫిక్ జాం అవుతున్నా ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేయకుండా రోడ్డు పక్కన నిలిపిన వాహనాల ఫొటోలు తీసి చలాన్లు వేస్తున్నారు. షాపుల ముందు పార్కింగ్ స్థలం లేక రోడ్డు పక్కన వాహనాలు నిలిపితే ఫొటోలు తీసి వేలకు వేలు చలాన్లు వేస్తున్నారని స్థానికులు, వాహనదారులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ నిత్యం ట్రాఫిక్ జాం షాపులు, హోటళ్ల ముందు లేని పార్కింగ్ రోడ్లపైనే నిలుపుతున్న వాహనాలు పట్టించుకోని అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నాం మొయినాబాద్లో షాపుల ముందు సామాన్లు పెట్టినా, బండికొట్లు పెట్టినా వాటిని తొలగించేందుకు నోటీసులు ఇవ్వాలని మున్సిపల్ అధికారులకు తెలియజేశాం. మరోసారి తాఖీదులు ఇచ్చి స్పెషల్ డ్రైవ్ పెడతాం. వాహనాల రాకపోకలు పెరగడంతోనే ట్రాఫిక్ సమస్య వస్తుంది. ట్రాఫిక్ జాం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. – సతీష్, ట్రాఫిక్ సీఐ, చేవెళ్ల -
కార్యదర్శుల సమస్యలు పరిష్కరించండి
అబ్దుల్లాపూర్మెట్: పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈ.శ్రీనివాస్ కోరారు. శనివారం ఆయన సంఘం నాయకులతో కలిసి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించాలన్నారు. ఓపీఎస్లను జేపీఎస్లుగా మార్చాలని, జేపీఎస్లను నాలుగు సంవత్సరాల సర్వీస్ను నోషనల్ సీనియారిటీ కలిపించడంతో పాటు ఈ నెల 5వ తేదీన నిర్వహించిన కార్యదర్శుల సంఘం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో చర్చించిన కార్యదర్శుల సమస్యలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మధుసుధన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సతీశ్కుమార్, మహిళా ఉపాధ్యక్షులు వాణి, కవిత, కోశాధికారి పండరినాథ్, నాయకులు హరి నాయక్, మిట్టపల్లి లక్ష్మీనారాయణ, సురేశ్, ప్రవీణ్, రాజేశ్గౌడ్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్కు నాయకుల వినతి -
రాజకీయ కక్షతో సర్పంచ్పై దాడి
కొందుర్గు: సర్పంచ్పై దాడి జరిగిన సంఘటన జిల్లేడ్ చౌదరిగూడు మండలం పద్మారంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మారం శివారులో ఈదమ్మ జాతరలో ఊరేగింపు నిర్వహిస్తుండగా ఓ ఎద్దుల బండి బోల్తా పడింది. దీంతో ఎల్కగూడ సర్పంచ్ బందయ్య బండ్లను మెల్లగా తోలండి, దెబ్బలు తగులుతాయని సూచించారు. ఇదే అదునుగా కొందరు యువకులు బందయ్యతో వాదించి దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గమనించిన స్థానికులు సర్పంచ్ను చికిత్స నిమిత్తం షాద్నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. అటునుంచి మెరుగైన చికిత్సకు శంషాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా తమ వర్గానికి చెందిన వ్యక్తి సర్పంచ్గా ఓడిపోయాడని అక్కసుతో గ్రామానికి చెందిన రాంరెడ్డి వర్గీయులు తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు తెలిపారు. ఈ విషయమై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పారు. ఎమ్మెల్యే పరామర్శ జాతరలో పాల్గొనేందుకు గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్థానికులతో విషయం తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి బందయ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. గొడవకు గల కారణాలు తెలుసుకొని, బందయ్యపై దాడి చేసిన నిందితులను గుర్తించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి మృతి
మొయినాబాద్: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో తీవ్ర గాయాలైన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం ప్రాంతానికి చెందిన మోలా హృదయ రాజు(58) పెద్దమంగళారంలో ఉంటూ కోఠిలోని సీపీడబ్ల్యూడీ(సెంటర్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్)లో ఉద్యోగం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం విధులు ముగించుకుని స్కూటీపై ఇంటికి వస్తుండగా రాత్రి 7:30 గంటలకు మొయినాబాద్లోని జేబీఐటీ కళాశాల వద్దకు చేరుకోగానే గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అతని తలకు తీవ్ర గాయాలు కాగా, కుడిచేయి విరిగింది. వెంటనే చికిత్సకోసం స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ అర్ధరాత్రి దాటిన తర్వాత మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వేడి నీటి సంపులో పడి వలస కార్మికుడి మృతి షాద్నగర్: వేడి నీటి సంపులో పడి ఓ వలస కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం నందిగామ మండలం వీర్లపల్లి శివారులోని జాగృతి స్టీల్ పరిశ్రమలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రం మాండ్లా జిల్లా గౌరాచావర్ తాలుకా ముర్లిటోల గ్రామానికి చెందిన ఉమేశ్(27) కొంత కాలం క్రితం నందిగామకు వలస వచ్చి జాగృతి స్టీల్ పరిశ్రమలో పని చేస్తున్నాడు. పరిశ్రమల్లో తయారైన ఇనుప చువ్వలను చల్లార్చడానికి వాడిన నీటిని సంప్లోకి వదులుతున్నారు. ఆ సంపులో నీరు వేడిగా ఉంటాయి. శనివారం ఉదయం విధుల్లోకి వెళ్లిన ఉమేశ్ సంప్ వద్దకు వెళ్లిన క్రమంలో ప్రమాదశాత్తు అందులో పడి అక్కడిక్కడే మృతి చెందాడు. పరిశ్రమ యాజమాన్యం మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారని, సంపు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడంతోనే కార్మికుడు మృతి చెందినట్లు కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. -
సమ్మె సఫలం.. కదిలిన ప్రగతి చక్రం
ఇబ్రహీంపట్నం: ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు ఫలప్రదం కావడంతో శనివారం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో వద్ద సంబురాలు జరుపుకొన్నారు. డిపో మేనేజర్ సుజాత, ఆర్టీసీ జేఏసీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. ఈ సందర్బంగా కార్మికులు గేట్ మీటింగ్ పెట్టుకుని సమ్మెలో పాల్గొన్న వారికి, మద్దతునిచ్చిన వారందరికి, సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్న ప్రభుత్వానికి ఽకృతజ్ఞత తెలిపారు. ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో వద్ద కార్మికుల సంబురాలుసీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న డీఎం సుజాతముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రపటానికి కార్మికుల క్షీరాభిషేకం -
కొత్త కమిషనర్లొచ్చారు
తొందరపాటు నిర్ణయాలొద్దు ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని డీసీపీ నారాయణరెడ్డి కోరారు.మల్కాజిగిరి పోలీసు బాస్గా సుమతి ‘ఫ్యూచర్’ సీపీగా తరుణ్జోషి సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో తొలిసారిగా పోలీసు విభాగంలో ఓ మహిళ పోలీసు బాస్గా నియమితులయ్యారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) చీఫ్గా ఉన్న 2006 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారిణి బడుగుల సుమతి మల్కాజిగిరి పోలీసు కమిషనర్గా నియమితులయ్యారు. ఇక్కడి సీపీ అవినాష్ మహంతి బదిలీ అయ్యారు. ఆయనను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్కు వెళ్లారు. రాష్ట్రానికి చెందిన మావోయిస్టు కీలక నేతలు లొంగుబాటు వ్యవహారంలో ఐజీ సుమతి కీలకంగా వ్యవహరించి ప్రత్యేక గుర్తింపును పొందారు. అగ్ర కమాండర్ తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవుజీ సహా 591 మందికి పైగా మావోయిస్టు నాయకులు లొంగిపోయిన ప్రక్రియలో సుమతి కీలక పాత్ర పోషించారు. 2001లో సంయుక్త ఆంధ్రప్రదేశ్లో తొలి మహిళా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా వృత్తిని ప్రారంభించిన సుమతి.. వరంగల్లో తొలి పోస్టింగ్.. ఆ తర్వాత 2006లో కన్ఫర్డ్ ఐపీఎస్ అధికారిణిగా పదోన్నతి పొందారు. హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా, సీఐడీ మహిళా రక్షణ సెల్ డీఐజీగానూ సమర్థంగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) హోదాలో ఉన్నారు. సుమతి స్వగ్రామం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కలుగోట్ల. సాక్షి, సిటీబ్యూరో: ఫ్యూచర్సిటీ పోలీసు కమిషనర్గా డాక్టర్ తరుణ్జోషి నియమితులయ్యారు. 2004 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం అవినీతి నిరోధకశాఖ డైరెక్టర్గా పని చేస్తున్నారు. ఇక్కడ కమిషనర్గా పని చేసిన జి.సుధీర్బాబు ఈ నెలాఖరుతో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో తరుణ్ జోషిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పంజాబ్కు చెందిన తరుణ్ జోషి పటియాలలోని ప్రభుత్వ డెంటల్ కాలేజీ అండ్ హాస్పిటల్ నుంచి బీడీఎస్ పూర్తి చేశారు. 2004లో సివిల్ సర్వీసెస్ ఉత్తీర్ణులై ఉమ్మడి ఏపీ కేడర్లో ఐపీఎస్ అధికారిగా నియమితులయ్యారు. 2014–2016 వరకు ఆదిలాబాద్ ఎస్పీగా పని చేశారు. హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా, హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ సీపీగా పని చేశారు. ఆ తర్వాత ఏసీబీ డైరెక్టర్ గా, రాచకొండ సీపీగా పని చేశారు. విధులు నిర్వర్తిస్తూనే ఉన్నత విద్యను కూడా అభ్యసిస్తున్నారు. ఇప్పటికే ఓయూ నుంచి పోలీసు మేనేజ్మెంట్ విభాగంలో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆపై ఎల్ఎల్బీలో చేరిన ఆయన ఓయూలోనే టాప్ ర్యాంకర్గా నిలిచారు. పర్వతారోహణాన్ని హాబీగా మార్చుకున్నారు. 2017లో హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ తీసుకున్నారు. అదే ఏడాది అక్టోబర్లో తొలిసారిగా హిమాలయాల్లోనే ఉన్న మౌంట్ రీనాక్ను అధిరోహించారు. ఇలా ఇప్పటి వరకు ఆయన పలు ప్రముఖ పర్వతాలను అధిరోహించారు. -
పిలుస్తోంది దోస్త్
షాద్నగర్: విద్యార్థి దశలో డిగ్రీ విద్య కీలకం.. ఏటా కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నిర్వహిస్తున్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇటీవల ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల చేసింది. మూడు విడతల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తొలి విడతకు సంబంధించి ఈనెల 15న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమయింది. పాలమూరు వర్సిటీకి అనుబంధంగా.. షాద్నగర్ పట్టణంలో పాలమూరు వర్సిటీకి అనుబంధంగా అధునాత వసతులతో విశాలమైన స్థలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను నిర్మించారు. స్మార్ట్ తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, తాగునీటి ప్లాంట్, సోలార్ ప్లాంట్, ఇంటర్నెట్ సదుపాయం, మరుగుదొడ్ల నిర్వహణ, బొటానికల్ గార్డెన్, కంపోస్టు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు. కళాశాలను సందర్శించిన న్యాక్ (నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్) బృందం కళాశాలకు బీ ప్లస్ గ్రేడ్ను కేటాయించారు. కోర్సులు ● బీఏ ఇంగ్లిష్, తెలుగు మీడియం ● సీడీసీఎస్ విధానం ప్రకారం బీఏ గ్రూపులో ఆర్ట్స్ సబ్జెక్టులతో పాటుగా కంప్యూటర్ సైన్స్, మాథ్యమెటిక్స్ బోధిస్తున్నారు. ● బీఎస్సీ లైఫ్ సైన్సెస్లో బొటనీ, జువాలజీ, సబ్జెక్టులతో పాటుగా కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, సెరీకల్చర్ ● బీఎస్సీ ఫిజికల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటుగా కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్ ● ఈ విద్యా సంవత్సరం నుంచి ఉద్యోగ భద్రత కల్పించేందుకు గాను ఇంటర్న్షిప్ సౌకర్యంతో కూడిన కోర్సులను ప్రవేశపెట్టారు. ● బీకాం రిటైల్ ఆపరేషన్, బీఎస్సీ హెల్త్ మేనేజ్మెంట్ కోర్సులు ఉన్నాయి. ఇంటర్న్షిప్ కాలంలో స్టైఫండ్ ఇవ్వనున్నారు. సులభంగా రిజిస్ట్రేషన్ ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీ మొదటి ఏడాదిలో ప్రవేశాలకు తమ హాల్ టికెట్ నంబర్తో దోస్త్ వెబ్ సైట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంటర్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. సెల్ఫోన్కు వచ్చి పిన్ దోస్త్ ఐడీ ఆధారంగా సంబంధిత పోర్టల్లో లాగిన్ కావాలి. ఆసక్తి ఉన్న కోర్సును, కళాశాలను ఎంపిక చేసి ఐచ్చికాన్ని నమోదు చేయాలి. సీట్ల కేటాయింపు తర్వాత ఆన్లైన్లోనే రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. అనంతరం నిర్ణీత తేదీల్లో కళాశాలల్లో సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. కావాల్సిన పత్రాలు ప్రవేశాలు పొందే విద్యార్థులు ముందుగానే అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలి. ఇంటర్ మార్కుల మెమోతో పాటుగా 1 నుంచి 10వ తరగతి వరకు బోన్ఫైడ్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, రెండు పాస్పోర్టు సైజ్ కలర్ ఫొటోలు, అదనపు విద్యార్హతలుంటే సంబంధిత పత్రాలను జత చేయాల్సి ఉంటుంది.డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తొలివిడత వెబ్ ఆప్షన్స్ 30 నుంచి.. సీట్ల కేటాయింపు మే 14న ఈ ఏడాది నుంచి ఇంటర్న్షిప్తో కూడిన కోర్సులు రిజిస్ట్రేషన్ తేదీ రుసుము వెబ్ఆప్షన్స్ సీట్ల కేటాయింపు ఫేజ్–1 ఏప్రిల్ 15 – మే 7 రూ.200 ఏప్రిల్ 30– మే 8 మే 14 ఫేజ్–2 మే 15 – మే 25 రూ.400 మే 15 – మే 26 మే 30 ఫేజ్–3 మే 31 – జూన్ 15 రూ.400 మే 31 – జూన్ 16 జూన్ 20 -
అధునాతన బస్ షెల్టర్కు శ్రీకారం
● నక్కలపల్లిలో రీసైకిల్ ప్లాస్టిక్ బస్ షెల్టర్ ● భూమిపూజ చేసిన లయన్స్ క్లబ్ నేతలు మొయినాబాద్ రూరల్: ప్రజలకు ఉపయోగపడేలా పర్యావరణ హితమైన రీసైకిల్ ప్లాస్టిక్ బస్ షెల్టర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని జూబ్లీహిల్స్ లయన్స్ క్లబ్ హైదరాబాద్ అధ్యక్షురాలు రామసుందరి, అరిస్టాటిల్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ ఎల్.శ్రీనివాస్రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి గౌరీసతీష్ అన్నారు. నక్కలపల్లి పంచాయతీ అభ్యర్థన మేరకు కేజీరెడ్డి ఇంజనీరింగ్ ఆఫ్ టెక్నాలజీ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ సోషల్ ట్రాన్స్ఫార్మేషన్తో ఇందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. బస్ స్టాప్ నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యర్థాల సేకరణ డ్రైవ్లో భాగంగా సేకరించిన ప్లాస్టిక్ను రీసైకిల్ చేసి బస్ షెల్టర్ నిర్మాణానికి వినియోగిస్తున్నామని స్పష్టంచేశారు. ఇది 500 సంవత్సరాల వరకు మన్నేలా, 240 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతను తట్టుకునేలా తయారు చేస్తున్నామని వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా కేవలం చర్లపల్లి జైలులో మాత్రమే ఇలాంటి బస్ షెల్టర్ ఉందన్నారు. దీని నిర్మాణానికి సుమారు రూ.2.5 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మావతి, కె.నాగేశ్వరి, కె.కరుణ, సాయిసత్య నారాయణరెడ్డి, విజ్ఞాన్ కళాశాల చైర్మన్ సతీష్, డాక్టర్ పి.సంయుక్త, బి.లింగం, గ్రామ సర్పంచ్ మంగళారం యాదయ్య, ఉప సర్పంచ్ గౌండ్ల నిరంజన్గౌడ్, వార్డు సభ్యులు మల్లేశ్, జీవన్, రవీందర్, పంచాయతీ కార్యదర్శి యాదగిరి, గ్రామ కమిటీ అధ్యక్షుడు గౌరీ రవి, శ్రీకాంత్, భానుకుమార్, నవీన్, రమేష్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి శంకర్పల్లి: బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడిగా శంకర్పల్లి మండలం గోపులారం గ్రామానికి చెందిన తొండ రవిని నియమించినట్లు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు క్రాంతికిరణ్ శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. పార్టీ అధిష్టానం తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేసేలా పనిచేస్తానన్నారు. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. బీసీ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ షాద్నగర్రూరల్: పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం బీసీ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు రాజమౌళి మహేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, బీసీ ఉద్యోగుల సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పద్మనళిని హాజరయ్యారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్లు, సంక్షేమం కోసం సంఘంపని చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రాఘవేందర్గౌడ్, గోపాల్, అనిత, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
తొందరపాటు నిర్ణయాలొద్దు
ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని డీసీపీ నారాయణరెడ్డి కోరారు. సమ్మె కారణంగా పలు చోట్ల కార్మికులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన ఇబ్రహీంపట్నం డిపోలో కార్మికులు, నాయకులకు పలు సూచనలు చేశారు. శాంతియుతంగా సమ్మెలో పాల్గొనాలని, ఎట్టి పరిస్థితిలోనూ క్షణికావేశానికి లోను కావొద్దని సూచించారు. ఆవేశానికి లోనయ్యే కార్మికులు సమ్మెలో పాల్గొనకుండా చూడాలని జేఏసీ నేతలకు సూచించారు. అతనితోపాటు ఏసీపీ కేపీవీ రాజు, సీఐలు మహేందర్, మధు, డీవీఎం శంకర్నాయక్, డీఎం సుజాత, ఎస్ఐ చందర్సింగ్ ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు డీసీపీ సూచన -
ఎండలకు జాగ్రత్తలు తప్పనిసరి
● మూడు రోజుల్లో పెండింగ్ బకాయిలు ● డీఆర్డీఓ శ్రీలత యాచారం: కూలీలు ఎండలకు జాగ్రత్త.. పనులు చేసే చోట నీడ, పనులకు వెళ్లేటప్పుడు సరిపడా తాగునీరు తీసుకెళ్లాలని డీఆర్డీఓ శ్రీలత ఉపాధి కూలీలకు సూచించారు. శుక్రవారం ఆమె గ్రామంలో కూలీలు పనిచేసే ప్రదేశాన్ని పరిశీలించారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఎండలకు పనులు చేయడం కష్టంగా ఉందని, పనులు చేసినా సకాలంలో బకాయిలు రాక పస్తులుంటున్నామని చెప్పారు. ఇందుకు స్పందించిన డీఆర్డీఓ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా పెండింగ్ బకాయిలు రెండు, మూడు రోజుల్లో కూలీల ఖాతాల్లో జమ అవుతాయన్నారు. ఎండల తీవ్రత పెరగుతున్నందున కూలీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కూలీలకు నీడ సౌకర్యం కల్పించాలని, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని, వడదెబ్బ తగిలితే వెంటనే ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రతి కూలీ వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచాలని, ఉదయం, సాయంత్రం పనులు చేయిస్తే కూలీలకు ఇబ్బంది ఉండదని వివరించారు. కూలీలకు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని ఈజీఎస్ నర్సరీని సందర్శించి మొక్కలు ఎండిపోకుండా సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాధారాణి, యాచారం సర్పంచ్ మస్కు అనితశరణం, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
సమ్మెకు విపక్షాల మద్దతు
ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్నివర్గాలు, పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. ఇబ్రహీంపట్నం బస్ డిపోలోని సుమారు 50 అద్దె బస్సులు శుక్రవారం నడిచాయి. కండక్టర్లు లేకుండానే సగానికిపైగా బస్సులు రోడ్డెక్కాయి. సమ్మె కారణంగా డిపో ఆదాయం గణనీయంగా పడిపోయింది. శంకర్గౌడ్కు నివాళి సమ్మెతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికుడు శంకర్గౌడ్కు కార్మికులు నివాళి అర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ర్యాలీని నిర్వహించారు. శంకర్గౌడ్ కుటుంబానికి తక్షణమే ఆర్థికసాయం అందించాలని జేఏసీ నేతలు యాదగిరి, శ్రీశైలం, అంజయ్య, టీఎస్రెడ్డి, కృష్ణ, జంగయ్య తదితరులు డిమాండ్ చేశారు. హామీల అమలులో విఫలం: మాజీ ఎంపీ సమ్మెలో ఉన్న కార్మికులకు సంఘీభావంగా మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర నాయకుడు బూర నర్సయ్యగౌడ్ డిపో వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో కాంగ్రెస్ విఫలం కావడంతోనే కార్మికులు మనస్తాపం చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తవారిని రిక్రూట్ చేసి బస్సులను నడపాలనుకుంటే.. కొత్త సీఎంను రిక్రూట్ చేయాల్సివస్తోందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భాస్కర్, సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్యామల, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎం.మహేందర్, రాఘవేంద్రస్వామి, విజయ్, నారాయణయాదవ్, టి.రాంరెడ్డి తదితరుల పాల్గొన్నారు. కార్మికులకు సంపూర్ణ మద్దతు: సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య సమస్యలు పరిష్కరం అయ్యేంత వరకు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య అన్నారు. సమ్మెతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించి ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదన్నారు. కాంగ్రెస్ నియంతృత్వధోరణిని విడనాడి కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సామెల్, నర్సింహ, కిషన్, జగన్, బుగ్గరాములు, పి.కృష్ణ, శారద, సత్తన్న తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలి ఆర్టీసీ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భవాని శేఖర్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులసై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ జేఏసీ నాయకులు ప్రదీప్, భాస్కర్, యాదగిరి, శ్రవణ్, భరత్, వినోద్, సురేందర్, శ్రీకాంత్ పాల్గొన్నారు. కండక్టర్లు లేకుండానే నడుస్తున్న అద్దె బస్సులు -
అధునాతన వసతులు
షాద్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అధునాతన వసతులు కల్పించాం. విశాలమైన మైదానం ఉన్న కళాశాలలో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. – శ్రీనివాసులు, వైస్ ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, షాద్నగర్ డిగ్రీలో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కళాశాలలో అనుభవజ్ఞులైన, అర్హత కలిగిన అధ్యాపకులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్న్షిప్తో కూడిన కోర్సులు ప్రవేశపెట్టారు. – డాక్టర్ కమల, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, షాద్నగర్ -
భరోసగమే!
వికారాబాద్: రైతుల ఎదురు చూపులు ఫలించి ఎట్టకేలకు సాగు సాయం డబ్బులు ఖాతాల్లో జమ కాగా, ఆ సంతోషం సగం వద్దే ఆగిపోయింది. గడి చిన యాసంగి సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం డబ్బులు ఖాతాల్లో జమవడం ప్రారంభమై నెల గడుస్తున్నా ప్రక్రియ పూర్తికాలేదు. ఇప్పటి వరకు కేవలం అరవై శాతం భూమికే సాగు సాయం అందింది. మరో నలభై శాతం భూమికి సంబంధించిన రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. తొలి విడతగా ప్రతీ రైతుకు ఎకరానికి డబ్బులు జమ చేసిన ప్రభుత్వం, మూడు రోజుల క్రితం రెండెకరాలలోపు వారందరికీ నగదు వేసింది. రెండు విడతల్లో కలిపి రెండెకరాల వరకు 2,82,509 మంది రైతులకు రూ.231.82 కోట్ల నిధులు జమయ్యాయి. మిగిలిన వారికి ఎప్పుడో.. జిల్లాలో మొత్తం రైతు భరోసాకు అర్హులైన రైతులు 3,27,561 మంది ఉండగా, వీరు 6,45,145 ఎకరాల వ్యవసాయ భూమి కలిగి ఉన్నారు. ఇందులో ఒక్కో రైతుకు రెండెకరాల వరకు డబ్బులు అందాయి. మరో 2.8 లక్షల మందికి రూ.155.25 కో ట్లు జమ కావాల్సి ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో మూడు నెలలైనా ప్రక్రియ పూర్తయ్యే అవకాశం లేదు. అప్పటికీ ఖరీఫ్ పంటల సాగు కూ డా పూర్తవుతుందని కర్షకులు ఆవేదన వ్యక్తంచేస్తు న్నారు. ఇదిలా ఉండగా అర్హులైన వారందరికీ చెల్లించాల్సిన మొత్తంపై బిల్లులు పూర్తి చేసిన వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే ట్రెజరీకి పంపించారు. ముంచుకొస్తున్న ఖరీఫ్.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఈ పథకాన్ని అమలు చేయగా ప్రస్తుత గవర్నమెంట్ దీన్ని రైతు భరోసాగా మార్చింది. సర్కారు ఏదైనా పంటలు సాగు చేసే సమయంలో రైతులకు సాయం అందడం లేదు. ఖరీఫ్ సమీపిస్తున్నా రబీ డబ్బులే రాలేదు.. ఖరీఫ్ సాయం అందే సరికి ఇంకెంత కాలం పడుతుందోనని విమర్శిస్తున్నారు. నత్తనడకన సాగు సాయం రెండు విడతల్లో.. అందింది రెండెకరాలకే ఆశగా ఎదురు చూస్తున్న అన్నదాతలు -
గిన్నిస్ రికార్డ్ కరాటే ప్రదర్శనకు విద్యార్థుల ఎంపిక
మీర్పేట: నగరంలో ఈనెల 26న నిర్వహించనున్న గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కరాటే ప్రదర్శనకు జిల్లెలగూడ కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు ద టెంపుల్ ఆఫ్ డ్రాగన్ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్, డైరెక్టర్ దాసరి జితేందర్కుమార్ తెలిపారు. ఎంపికై న విద్యార్థులను శుక్రవారం ఉదయం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్కూల్ ప్రెసిడెంట్ జైపాల్రెడ్డి, డైరెక్టర్ సురేష్రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రసూన తదితరులు అభినందించారు. సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్ సీఐ చొరవతో సద్దుమణిగిన వివాదం యాచారం: మండల పరిధిలోని కొత్తపల్లిలో శుక్రవారం ఓ వ్యక్తి సెల్టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన కొండాపురం బాబయ్య ఓ భూ వివాదంలో తన కుటుంబ సభ్యుల నుంచి రావాల్సిన డబ్బులు అందడం లేదని, వెంటనే ఇప్పించాలని గ్రామంలోని సెల్టవర్ ఎక్కాడు. తనవారి నుంచి డబ్బులు ఇప్పిస్తేనే కిందికి దిగుతానని, లేదంటే దూకుతానని హెచ్చరికలు చేశాడు. సమాచారం అందుకున్న యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి అతనితో మాట్లాడారు. సీఐ హామీతో బాబయ్య సెల్టవర్ దిగివచ్చాడు. అతన్ని పీఎస్కు తీసుకెళ్లిన సీఐ బాబయ్య కుటుంబ సభ్యులను పిలిపించి డబ్బులు ఇప్పించడంతో సమస్య సద్దుమణిగింది. సెల్ టవర్ ఎక్కి హంగామా సృష్టించడం నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని బాబయ్యను మందలించి, ఇంటికి పంపించారు. చెట్టును ఢీకొట్టిన స్కూటీ యువకుడి దుర్మరణం షాద్నగర్రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని ఎలికట్ట శివారులో గురువారం అర్థరాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ రాంచందర్ తెలిపిన ప్రకారం.. పట్టణంలోని అంబేడ్కర్కాలనీకి చెందిన సవాళ్ల స్వామి(23) పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్మెన్గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి సమయంలో ఫోన్ రావడంతో మళ్లీ వస్తాననిచెప్పి స్కూటీపై బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి తిరుగు ప్రయాణంలో ఎలికట్ట శివారులోని భారత్ పెట్రోల్పంపు సమీపంలో స్కూటీ అదుపు తప్పడి చెట్టును ఢీకొట్టింది. దీంతో స్వామి రోడ్డు పక్కన గుంతలో పడిపోయాడు. తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. శుక్రవారం ఉదయం విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఎస్ఐ రాంచందర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రౌడీషీటర్కు రిమాండ్ ఆమనగల్లు: ఓ వ్యక్తిని బెదిరించి బైక్ను ఎత్తుకెళ్లిన రౌడీషీటర్ను పోలీసులు శుక్రవారం రిమాండ్కు తరలించారు. ఆమనగల్లు ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం.. పట్టణానికి చెందిన రౌడీషీటర్ నేనావత్ పవన్కల్యాణ్ స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో ఓ వ్యక్తిని బెదిరించి అతని బైక్ను ఎత్తుకెళ్లాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మున్సిపల్ పరిధిలోని విఠాయిపల్లి వద్ద పోలీసులను చూసిన నేనావత్ పవన్కల్యాణ్ బైక్తో పారిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి అనంతరం చంచల్గూడ జైలుకు రిమాండ్కు తరలించామన్నారు. నిందితుడిపై ఆమనగల్లు, మాడ్గుల, అఫ్జల్గంజ్ పోలీసు స్టేషన్లలో పదికి పైగా కేసు ఉన్నాయని తెలిపారు. చికిత్స పొందుతూ మహిళ మృతి కొడంగల్ రూరల్: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని మహిళ శుక్రవారం రాత్రి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ నెల 18న మండల పరిధిలోని ప్యాలమద్ది గేటు సమీపంలో అనారోగ్య కారణంగా ఓ మహిళ కింద పడిందనే సమాచారాన్ని పోలీసులు అందుకొని 108 వాహనంలో కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. మహిళను ఎవరైనా గుర్తిస్తే కొడంగల్ పోలీస్స్టేషన్లో వివరాలు తెలియజేయాలని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. ఫోన్ నెంబర్ 87126 70046లో సంప్రదించాలని తెలిపారు. -
బ్రిడ్జి గుంతలో పడిన మహిళ
తాండూరు రూరల్: ప్రమాదవశాత్తు ఓ మహిళ బ్రిడ్జి గుంతలో పడింది. ఈ ఘటన తాండూరు పట్టణం పాత తాండూరు రైల్వే బ్రిడ్జి వద్ద గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మాణిక్ నగర్కు చెందిన ఆసియా బేగం కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి తాండూరులో మార్కెట్కు బయలుదేరింది. ఈ క్రమంలో బ్రిడ్జి పిల్లర్ల కోసం తవ్విన గుంతలో పడింది. స్థానికులు నిచ్చెన సాయంతో ఆసియాబేగంను బయటకు తీశారు. ఆమెను తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెన్నెముక వద్ద బలమైన గాయం కావడంతో హైదరాబాద్కు తరలించి వైద్యం చేయిస్తున్నట్లు తెలిసింది. గుంత వద్ద కాంట్రాక్టర్ సూచిక బోర్డు పెట్టకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రభుత్వ లాంఛనాలతో లక్ష్మీనృసింహుడి కల్యాణం
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం సమీపంలో స్వయంభువుగా వెలిసిన శ్రీలక్ష్మీనృసింహస్వామి కళ్యాణోత్సవాన్ని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు ఆకుల ఆనంద్కుమార్, కౌన్సిలర్లతో కలిసి ఆలయ భక్త బృందం శుక్రవారం ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రిక అందజేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 30న నిర్వహించే స్వామివారి కల్యాణానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఓ ప్రవీణ్కుమార్, తాళ్లపల్లి కృష్ణ, తమ్మల కృష్ణ, సొప్పరి లక్ష్మణ్, సూరమోని బాబు, శ్రీనివాసచారి, అశోక్రెడ్డి, అర్కే కృష్ణ, శంకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
దోపిడీ కేసులో ఒకరి అరెస్టు
కందుకూరు: బ్యాంకు నుంచి నగదు తీసుకెళ్తున్న వ్యక్తి నుంచి చాకచక్యంగా దొంగలు దోచుకెళ్లిన ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ.8 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. మండల పరిధిలోని అన్నోజిగూడకు చెందిన ఢిల్లీ నారాయణ ఈ నెల 16న మధ్యాహ్నం కందుకూరు ఎస్బీఐకు వచ్చి రూ.10 లక్షల నగదు తీసుకుని బైక్ డిక్కీలో పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు. విషయాన్ని గమనించిన నలుగురు దొంగలు అతన్ని బైక్లపై అనుసరించారు. కందుకూరు గ్రామం దాటిన తర్వాత నారాయణను ఆపి అడ్రస్ అడుగుతున్నట్లుగా నటించారు. వెనుక మరో బైక్పై వచ్చిన మరో ఇద్దరు చాకచక్యంగా డిక్కీ తెరిచి నగదు తస్కరించారు. ఇంటికి వెళ్లి చూసుకున్న బాధితుడు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ టీవీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామంసంజీవయ్యనగర్కు చెందిన మేకల నాని, నితిన్, అనిల్, సాయిలుగా గుర్తించారు. అంతా గ్రూప్గా ఏర్పడి తరచూ దొంగతనాలకు పాల్పడుతుంటారు. వీరిలో నితిన్ హైదరాబాద్ అల్మాస్గూడ, రాజీవ్ గృహకల్పలో గది అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. అంతా ఆ గదిలోనే ఉండి చోరీలు చేసి మళ్లీ వారి స్వగ్రామానికి వెళ్లేవారు. గురువారం పోలీసులు నితిన్ గదికి వెళ్లగా మేకల నాని దొరికాడు. అతని నుంచి రూ.8 లక్షల నగదు, బైక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అతన్ని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. మిగతా వారిని త్వరలో పట్టుకుంటామని సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కందుకూరు: రోడ్డు ప్ర మాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈసంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు.. రాచులూరుకు చెందిన గుంటి ప్రశాంత్(25) వృత్తిరీత్యా మత్స్యకారుడు. బుధవారం ఉదయం చేపల వేటకు బైక్పై ధన్నారం వెళ్లాడు. రాత్రి తిరిగి వస్తున్నాడు. ఈ సమయంలో బైరాగిగూడ గేట్ సమీపంలో ట్రాలీతో పాటు కాంక్రీట్ మిషన్, దానికి అనుసంధానంగా ఉన్న ఆయిల్ ఇంజన్తో ఉన్న ట్రాక్టర్ రాచులూరు గేట్ వైపు మరలుతోంది. దీనికి ఎలాంటి రేడియం స్టిక్కర్లు లేకపోవడంతో వెనక ఉన్న ఆయిల్ ఇంజన్ను అంచనా వేయలేక బైక్తో ఢీకొట్టాడు. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్ వాహనంలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. ఈ మేరకు ఎస్ఐ పరమేశ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దారి దోపిడీ ముఠా అరెస్టు బంజారాహిల్స్: ఆవారాగా తిరుగుతూ జల్సాలు, గంజాయి కోసం దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాలు.. ఇటీవల జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–5లో మెట్రోస్టేషన్ వద్ద అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ర్యాపిడో డ్రైవర్ శుభాంకర్ కుమార్ను రహమత్నగర్, బోరబండ ప్రాంతాలకు చెందిన బర్ల పవన్కళ్యాణ్ అలియాస్ డీజే పవన్, సాయిరాజ్ కుమార్ అలియాస్ చిట్టి, రేసు ప్రణీత్రెడ్డి, జశ్వంత్, అఖిల్, చందు, గోవు ఈశ్వర్ అటకాయించారు. దాడి చేసి బలవంతంగా మొబైల్ ఫోన్ లాక్కొని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలంలోని సీసీ ఫుటేజీని పరిశీలించి పవన్కళ్యాణ్, రేసు ప్రవీణ్రెడ్డి, గోవు ఈశ్వర్గౌడ్లను గుర్తించి గురువారం అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. -
కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి
ఖర్గే వ్యాఖ్యలు దేశద్రోహమే ప్రధాని మోదీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్నా చేపట్టారు.మీర్పేట: కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అని మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కూలిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. మీర్పేటలోని క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనకున్న అనుభవంతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, ఒక రైతుగా ఆలోచించి రైతుకు కష్టం రాకూడదని నిరంతరం సాగునీరు అందించాలన్న దృఢ సంకల్పంతో కేంద్రం నిధులివ్వకున్నా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని గుర్తుచేశారు. మూసీలో గోదావరి పారిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెబుతున్న రిజర్వాయర్ కూడా కాళేశ్వరంలో భాగమేనని పేర్కొన్నారు. కేసీఆర్పై నిందలు వేస్తూ రైతులకు నష్టం చేసేలా ప్రభుత్వం వ్యవహరించడం సరైంది కాదని హితవు పలికారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు అర్కల భూపాల్రెడ్డి, పెద్దబావి ఆనంద్రెడ్డి, దీప్లాల్ చౌహాన్, అనిల్యాదవ్, సునితబాలరాజు, రామిడి రాంరెడ్డి, అర్కల కామేశ్రెడ్డి, దోమలపల్లి రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. సాక్షి, రంగారెడ్డిజిల్లా: బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాశారు. నిధుల దుర్వినియోగం, అవినీతి, అక్రమాలకు బాధ్యులను చేస్తూ పదిమంది అధికారులను సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఇక్కడ సాగిన వ్యవస్థీకృత అవినీతిని కూకటివేళ్లతో సహా పెకిలించాలంటే లోతైన విచారణ జరిపించాలన్నారు. కేవలం కిందిస్థాయి అధికారులపైనే కాకుండా వారి వెనుక ఉండి అక్రమాలను ప్రోత్సహించిన అదృశ్య శక్తులపై కూడా కేసులు నమోదు చేయించాలి అంటూ లేఖలో పేర్కొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి -
సుక్క.. ఎంచక్కా!
గాలివాన.. హైరానా ఈదురుగాలులతో కూడిన వర్షం తీవ్ర నష్టం కలిగించింది. చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి. విచ్చలవిడిగా పర్మిట్ రూములు ● ఊరూరా జోరుగా బెల్ట్షాపులు ● పగలు రాత్రి తేడాలేకుండా మద్యం విక్రయాలు ● ఒక్కో బాటిల్కు అదనంగా వసూలు ● చోద్యం చూస్తున్న ఎకై ్సజ్ అధికారులు చేవెళ్ల: మండలంలోని 24 పంచాయతీలు, మున్సిపాలిటీలోని 11 వార్డుల్లో బెల్టుషాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ఆదాయం కోసం వైన్షాపుల యజమానులు గ్రామాలను పంచుకొని మద్యం సరఫరా చేస్తున్నారు. ఎకై ్సజ్శాఖ అధికారులు ఒక్కచోట కూడా తనిఖీ చేసి పట్టుకున్న దాఖలాలు లేవు. తమ బతుకులు బలైపోతున్నా బెల్టుషాపులు నిషేధించరా అంటూ బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కౌకుంట్లలో ఇటీవలే బెల్టుషాపుల నిషేధానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో బెల్టుషాపుల్లో మద్యం అమ్మితే రూ.లక్ష, కొన్నవారికి రూ.50 వేల జరిమానా విధించటంతోపాటు పట్టించిన వారికి రూ.10వేల బహుమతి ప్రకటిస్తూ తీర్మానం చేశారు. మంచినీరు దొరకని ఊరంటూ ఉంటుందేమో కాని.. మద్యం దొరకని ఊరు లేదు. పట్టణ కేంద్రాల్లోనే కాదు జిల్లాలోని ఏ మారుమూల పల్లెలోకి తొంగిచూసినా మద్యం వాసన గుప్పుమంటోంది. వీధికో బెల్ట్షాపు దర్శనమిస్తోంది. ఉదయం, సాయంత్రం తేడా లేకుండా మద్యం వ్యాపారం మూడు క్వార్టర్లు.. ఆరు ఫుల్ బాటిళ్ల చందంగా జోరుగా సాగుతోంది. – సాక్షి, రంగారెడ్డిజిల్లా పల్లెల్లో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన బెల్టు దుకాణాలు మద్యం ప్రియులకు అడ్డాలుగా మారు తున్నాయి. వైన్షాపు నిర్వాహకులతో కుమ్మకై ్క అమ్మకాలు జరుపుతున్నారు. క్వార్టర్కు రూ.10 అదనం, బీర్కు రూ.20, అదే ఫుల్బాటిల్కు రూ.40 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక వైన్షాపుల ముందు ఉదయం 11 నుంచి రాత్రి 12 గంటల వరకు రద్దీ కొనసాగుతూనే ఉంది. సరదాగా మొదలై.. తర్వాత అలవాటుగా మారుతోంది. మద్యం కోసం కొంతమంది అప్పులు చేస్తుండగా, మరికొంత మంది ఆస్తులు అమ్ముతున్నారు. తాగుడుకు డబ్బులు ఇవ్వడం లేదనే కారణంతో చివరకు తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యలను, పిల్లలను హత్య చేస్తున్న దాఖలాలు ఇటీవల తరచూ వెలుగు చూస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా.. ప్రతి దుకాణానికి 100 చదరపు మీటర్లలోపు పర్మిట్ రూం ఉండాలి. ప్యాకేజ్డ్ ఫుడ్డు మాత్రమే విక్రయించాలి. పర్మిట్ రూం వెలుపల మద్యం తాగడానికి వీల్లేదు. ఇందుకు విరుద్ధంగా కొన్ని దుకాణాలు వ్యవహరిస్తున్నాయి. చేపలు, చికెన్ ఫ్రై, బోటి, తలకాయ సూపు వంటి వాటిని కూడా ఇక్కడే వండివార్చుతున్నారు. సరైన పార్కింగ్ లేకపోవడంతో రోడ్లపైనే వాహనాలను నిలిపి ఉంచి, ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమవుతున్నారు. చీకటి పడిన తర్వాత రోడ్లపైనే మద్యం తాగుతూ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న వాహనదారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. -
టాటా.. బాయ్ బాయ్
దుద్యాల్: విద్యా సంవత్సరం ముగిసింది. నేటి నుంచి ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించిడంతో విద్యార్థులు వారివారి సొంతూర్లకు వెళ్లారు. ఈ విద్య సంవత్సరానికి సంబంధించి చిన్నారులు రాసిన పరీక్షల మూల్యాంకనం అనంతరం.. అందిన ప్రగతి నివేదిక ఆధారంగా.. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రొగ్రెస్ రిపోర్టు కార్డులను వారి తల్లిదండ్రులకు అందజేసి, ప్రగతిని వివరించారు. కాగా.. మండల పరిధి చెట్టుపల్లితండా కస్తూర్బాగాంధీ బాలిక పాఠశాలలో బాలికలు తల్లిదండ్రులతో కలసి ఇంటికి వెళ్లారు. ఉపాధ్యాయులకు, తోటివారికి టాటా చెబుతూ.. మళ్లీ కలుద్దామంటూ ఇంటి బాట పట్టారు. ధారూరులో.. ధారూరు: మండల పరిధి పాఠశాలల్లో పరీక్ష రాసిన విద్యార్థుల ఫలితాలను ప్రకటించి, ఉపాధ్యాయులు వారికి గురువారం ప్రొగ్రెస్ రిపోర్టులను అందజేశారు. గురుదొట్ల పాఠశాలలో 7వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. సెలవుల నేపథ్యంలో చిన్నారులు తోటివారికి బైబై చెబుతూ.. సొంతూళ్ల బాట పట్టారు. -
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
షాద్నగర్: ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్పర్సన్ సీతాదయాకర్రెడ్డి అన్నారు. షాద్నగర్ పరిధిలోని బూర్గుల గ్రామంలో గురువారం ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రగతి పోషణ మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి సీతా దయాకర్రెడ్డితోపాటు జిల్లా మహిళాభివృద్ధి అధికారి శ్రీలత హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని 35 మంది గర్భిణులకు సీమంతాలు, 50 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సీతా దయాకర్రెడ్డి మాట్లాడుతూ.. రసాయనిక ఎరువుల వినియోగంతో పండించిన పంటలతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలు పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బాలల హక్కుల కమిషన్ సభ్యులు ప్రేమలత అగర్వాల్, బండి అపర్ణ, వచన్కుమార్, సీడీపీఓ ఉదయ, సర్పంచ్ రాజాగోపాల్రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు స్వప్న, వీరభద్రప్ప, జంగయ్య, ఏపీఓ అరుణ, ప్రగతి వెల్ఫేర్సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ అలోక్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
ప్లాట్లు మరింత లేట్!
యాచారం: ఫార్మా ప్లాట్ల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల పంపిణీ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిహారం చెల్లింపు విషయమై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మధ్య చోటుచేసుకున్న సవాల్, ప్రతిసవాళ్లతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఫార్మాసిటీ భూసేకరణ పరిహారం చెల్లింపు విషయంలో గతంలో జరిగిన అక్రమాలను పూర్తిగా తవ్వి తీయాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. అసలైన రైతులకు పరిహారంతో పాటు ప్లాట్లు ఇస్తే పర్వాలేదు కానీ రూ.కోట్లలో అక్రమంగా పరిహారం పొందినవారే తిరిగి ప్రభుత్వంపై నిందలు వేయడంపై అధికార పార్టీ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఫార్మాసిటీకి 19,333 ఎకరాల అసైన్డ్, పట్టా భూములను సేకరించారు. ఇందులో సింహభాగం మండలంలోని నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్దలోనే పది వేల ఎకరాల వరకు తీసుకున్నారు. పైనాలుగు గ్రామాల్లో దాదాపు 3,500 మందికిపైగా రైతులు పరిహారం పొందినట్లు తెలుస్తోంది. ఛాలెంజ్గా తీసుకున్న సర్కార్ సుమారు 500 ఎకరాలకు సంబంధించిన కోట్లాది రూపాయల పరిహారం పక్కదారి పట్టిందని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. కొద్ది రోజుల క్రితం ఆయా గ్రామాల్లోని రాజకీయ పక్షాల నాయకులు అనర్హుల వివరాలతో కూడిన జాబితాను ఉన్నతాధికారులకు అందజేసినట్లు తెలిసింది. దీంతో సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం పూర్తి అక్రమాలను వెలుగులోకి తేవాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. నక్కర్తమేడిపల్లిలో 250 ఎకరాలు, నానక్నగర్లో 150 ఎకరాలు, తాడిపర్తిలో 80 ఎకరాలు, కుర్మిద్దలో 150 ఎకరాలకుపైగా పరిహారాన్ని అనర్హులు తీసుకున్నారని ఆయా గ్రామాల నాయకులు కాంగ్రెస్ నేతలు, అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ జాబితాలో తాజా, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారనే ఆరోపణలున్నాయి. మళ్లీ జాబితాలు ప్రభుత్వం నుంచి గతంలోనే పరిహారం పొంది, ప్రస్తుతం ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయించుకున్న రైతులతో కూడిన జాబితాను మళ్లీ ప్రకటించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తాజాగా నక్కర్తమేడిపల్లి జీపీ వద్ద రైతుల జాబితాను ప్రకటించారు. దీనిపై అభ్యంతరాలుంటే ఫిర్యాదు సూచించారు. ఫార్మాసిటీకి భూములిచ్చిన వారిలో నక్కర్తమేడిపల్లి నుంచి 1,281 మంది, కుర్మిద్దలో 574, తాడిపర్తిలో 380, నానక్నగర్లో 201 మంది రైతులు ప్లాట్లు పొందారు. వీరికి రిజిస్ట్రేషన్లు కూడా పూర్తయ్యాయి. అయితే, పరిహారం అందజేతలో నకిలీలకు సహకరించిన యంత్రాంగం.. రిజిస్ట్రేషన్ల విషయంలోనూ అలాగే వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. వీరిపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈనేపథ్యంలో పారదర్శకమైన జాబితా తయారీకి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నందున డాక్యుమెంట్ల పంపిణీ ఇప్పట్లో కష్టమేననే చర్చ సాగుతోంది. డాక్యుమెంట్ల పంపిణీకి ఆలస్యమయ్యే అవకాశం జాబితాలో అనర్హులున్నారని అధికారులకు ఫిర్యాదులు నకిలీల ఏరివేతను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నక్కర్తమేడిపల్లిలో రై తుల జాబితాను ప్రకటించాం. ఇందులో నకిలీ పేర్లు ఉంటే ఫిర్యాదు చేయాలని గ్రామస్తులకు సూచించాం. వీటిని ఉన్నతాధికారులకు చేరవేస్తున్నాం. కొంత ఆ లస్యమైనా అసలైన లబ్ధిదారులకు ప్లాట్ల డాక్యుమెంట్లు అందజేస్తాం. నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో కూడా త్వరలోనే జాబితా ప్రకటిస్తాం. – అయ్యప్ప, తహసీల్దార్, యాచారం -
షాద్నగర్ నియోజకవర్గంలో..
షాద్నగర్: నియోజకవర్గంలోని ఫరూఖ్నగర్లో రెండు మూడు గ్రామాల్లో తప్ప అన్ని గ్రామాల్లో బెల్టు షాపులున్నాయి. సుమారు రెండు వందలకు పైగా దుకాణాలు వెలిశాయి. కేశంపేటలో 28 గ్రామాలు ఉంటే అందులో ఒక్కో గ్రామంలో సుమారు ఆరు నుంచి ఏడు బెల్టు షాపులు ఉన్నాయి. దుకాణాదారులు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. కొత్తూరు.. ‘బెల్టు’ జోరు మండలంలోని ఇన్ముల్నర్వ, సిద్ధాపూర్, గూడూరు, తీగాపూర్తో పాటు పలు గ్రామాల్లో బెల్టు దుకాణాలు జోరుగా సాగుతున్నాయి. బయట మాత్రం కూల్డ్రింక్స్ సీసాలను పెట్టి లోపల మద్యం బాటిళ్లను ఉంచుతున్నారు. చీప్ లిక్కర్ మొదలుకొని బ్రాండెడ్ మద్యం వరకు లభిస్తోంది. కొందరు నిర్వాహకులు ఫోన్ చేస్తే చాలు ఎక్కడికై నా మద్యం, తిను బండారాలు సరఫరా చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో యువకులు మద్యానికి బానిసలుగా మారుతున్నారు. ఇటీవల టెండర్లలో మద్యం దుకాణాలను దక్కించుకున్న కొందరు వ్యాపారులు అమ్మకాలను పెంచుకోవడానికి బెల్టు దుకాణాలను ప్రోత్సహిస్తున్నారు. నిత్యం పట్టణంలోని పలు దుకాణాల నుంచి బెల్టు షాపులకు ఆటోలు, ద్విచక్ర వాహనాలపై మద్యం తరులుతోంది. కొందుర్గులో .. కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండలాల్లో బెల్ట్షాపుల వ్యాపారం జోరుగా సాగుతోంది. కొందుర్గు మండలంలోని 22 పంచాయతీలకు గాను కొందుర్గు, బైరంపల్లి, అయోధ్యాపూర్తండా, చిన్నఎల్కిచర్ల, పర్వతాపూర్, చెర్కుపల్లి, విశ్వనాథ్పూర్ గ్రామాల్లో, జిల్లేడ్ చౌదరిగూడ మండలం తుమ్మలపల్లిలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. మిగతా గ్రామాల్లో సమయం సందర్భం లేకుండా ఎనీ టైం మద్యం లభిస్తోంది. కిరాణా దుకాణంలో మద్యం సీసాలు -
బయోమాస్ పెల్లెట్ స్టవ్లపై అవగాహన
చేవెళ్ల: బయోమాస్ పెల్లెట్స్ వినియోగంతో పర్యావరణానికి మేలుతోపాటు ఎల్పీజీ కోసం ఖర్చు చేసే లక్షకోట్ల సంపద దేశానికి మిగులుతుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. చేవెళ్లలో జేకేఎంఆర్ పౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం వివిధ రకాల బయోమాస్ పెల్లెట్ గ్యాసిఫైర్ స్టవ్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పెల్లెట్స్ జొన్నసొప్ప, వరిపొట్టు, మక్కబుట్టలు, ఇతర వ్యవసాయ ఆధారిత మిగిలిపోయన వ్యర్థాల నుంచి తయారు చేయబడతాయన్నారు. చిరువ్యాపారులు, హోటల్స్ నిర్వాహకులకు ఈ స్టవ్లు ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఇళ్లలో సైతం వీటిని ఉపయోగించుకోవాలని సూచించారు. కావాల్సిన వారికి జేకేఎంఆర్ ఫౌండేషన్ ద్వారా స్టవ్లను అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్రెడ్డి, శంకర్పల్లి అధ్యక్షుడు దయాకర్రెడ్డి, చేవెళ్ల మున్సిపల్ కౌన్సిలర్ పెద్దోళ్ల దయాకర్, నాయకులు మాణిక్యరెడ్డి, సత్యనారాయణ, శర్వలింగం, ప్రభాకర్రెడ్డి, వెంకట్రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, వెంకట్రాంరెడ్డి, నందు, శ్రీకాంత్రెడ్డి, గణేశ్, విఠల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గాలివాన.. హైరానా
విరిగిపడిన చెట్ల కొమ్మలు ● విద్యుత్ సరఫరాకు అంతరాయం ● చల్లబడిన వాతావరణం మొయినాబాద్, మొయినాబాద్ రూరల్: ఈదురుగాలులతో కూడిన వర్షం తీవ్ర నష్టం కలిగించింది. మొయినాబాద్ మున్సిపాలిలోని అజీజ్నగర్, ఎనికేపల్లి, హిమాయత్నగర్, చిలుకూరు, పెద్దమంగళారం, మొయినాబాద్, సురంగల్, ముర్తూజగూడ, అప్పోజీగూడ ప్రాంతాల్లో గురువారం సాయంత్రం సుమారు అరగంటకు పైగా భారీ వర్షం పడింది. బలమైన ఈదురు గాలులకు అజీజ్నగర్, మొయినాబాద్ ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చెట్ల కొమ్మలను తొలగించిన అనంతరం సరఫరాను పునరుద్ధరించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆకాశం మబ్బులుపడి దాదాపు గంటన్నర సేపు వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పంట పొలాల్లో వరద నీరు చేరింది. మండుతున్న ఎండలకు ఇబ్బంది పడుతున్న జనం చల్లని వానతో ఉపశమనం పొందారు. -
లోడు ఓవర్.. ఒత్తిడిలో ఫీడర్!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: విద్యుత్ డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. వృద్ధిరేటు సాధారణంగా ఏటా 10 నుంచి 12 శాతం నమోదవుతుండగా ఈసారి ఏకంగా 30 శాతం మించిపోయింది. తొమ్మిది సర్కిళ్ల పరిధిలోని 80 శాతం 132 కేవీ సబ్స్టేషన్లు ఓవర్ లోడుతో హీటెక్కిపోతున్నాయి. భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు డీటీఆర్ల సామర్థ్యాన్ని పెంచకపోవడం, లోడ్ బ్యాలెన్స్ చేయకపోవడం, ఆయిల్ లీకేజీలను అరికట్టకపోవడం, ఎప్పటికప్పుడు టంగ్టెస్టర్తో లోడును పరిశీలించకపోవడం, వినియోగం అనూహ్యంగా పెరుగుతుండటంతో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయి. సైబర్సిటీ, రాజేంద్రనగర్ సర్కిళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కేవలం 22 రోజుల్లో 800కుపైగా డీటీఆర్లు కాలిపోయాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫీడర్లు ట్రిప్పవుతుండటంతో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. విధిలేని పరిస్థితుల్లో ఇంజనీర్లు అనధికారిక ఎల్ఆర్ (లోడ్ రిలీఫ్)లను అమలు చేస్తున్నారు. సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య ఈ సమస్య ఎక్కువగా ఉంది. 100 కేవీ డీటీఆర్పై 130 యాంప్స్ లోడు గ్రేటర్లో 65 లక్షలకుపైగా విద్యుత్ కనెక్ష ఉండగా, వీటిలో 55 లక్షల గృహ, 8 లక్షల వాణిజ్య, 50 వేలకుపైగా పారిశ్రామిక కనెక్షన్లు ఉన్నాయి. సమ్మర్ యాక్షన్ప్లాన్లో భాగంగా ఫిబ్రవరికి ముందే మెజార్టీ పవర్ ట్రాన్స్ఫార్మర్లను, డీటీఆర్లను మార్చారు. అయినా అంచనాలకు మించి విద్యుత్ వినియోగం అవుతోంది. 2024 మే 29న అత్యధికంగా 91.69 మిలియన్ యూనిట్ల డిమాండ్ నమోదైంది. తర్వాత డిస్కం చరిత్రలోనే తొలిసారిగా 2026 ఏప్రిల్ 17న 100.56 మిలియన్ యూనిట్లు దాటింది. సైబరాబాద్, రాజేంద్రనగర్ సర్కిళ్లలోని పలు 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లపై 130 యాంప్స్కు మించి లోడు పడుతోంది. ఇప్పటికే 20 నుంచి 25 సబ్స్టేషన్లు డేంజర్జోన్లో ఉన్నట్లు తెలిసింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎల్ఆర్లు తప్పవనే హెచ్చరికలు లేకపోలేదు. భవిష్యత్తు డిమాండ్కు తగ్గట్లుగా కొత్త సబ్స్టేషన్లు ఏర్పాటు చేయాలని డిస్కం నిర్ణయించింది. అయితే మెజార్టీ సబ్స్టేషన్లు టెండర్ దశ దాటలేదు. చినుకు చిటపట.. ఇన్సులేటర్లు టపటపా పగటి ఉష్ణోగ్రతలకు ఫీడర్లు, డీటీఆర్లు, విద్యుత్ స్తంభాలపై ఉన్న ఇన్సులేటర్లు హీటెక్కిపోతున్నాయి. పగుళ్ల మధ్య వర్షపు చినుకులు పడితే.. టప్మంటూ భారీ శబ్దంతో పేలిపోతున్నాయి. ఇంటిముందు కరెంట్ స్తంభంపై భారీ శబ్దాలు వస్తుండటం, షార్ట్సర్క్యూట్లు వెలుగు చూస్తుండటం, అగ్నికీలలు ఎగిరి ఆయిల్ లీకేజీలున్న డీటీఆర్లపై పడుతుండటం, వాటి నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇలా ప్రతి రోజూ 50 నుంచి 60 డీటీఆర్లు కాలిపోతున్నట్లు డిస్కం లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. పాడైన డీటీఆర్ను గుర్తించి, దాని స్థానంలో కొత్తది అమర్చేందుకు ఆరేడు గంటల సమయం పడుతోంది. రాత్రిపూట ఉక్కపోతకు తోడు ఇంట్లో కరెంట్ కూడా లేకపోవడంతో దోమలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్లు చేసినా క్షేత్రస్థాయి సిబ్బంది స్పందించడం లేదు. 1912 కాల్ సెంటర్ సైతం బిజీగా ఉంటోంది. విధి లేని పరిస్థితుల్లో ఎక్స్ వేదికగా ఫిర్యా దులను షేర్ చేయాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. తేదీ పేలిన డీటీఆర్లు 22 52 21 72 20 72 19 62 18 54 గణనీయంగా విద్యుత్ డిమాండ్ హీటెక్కిపోతున్న సబ్స్టేషన్లు పేలిపోతున్న డీటీఆర్లు చేతులెత్తేసిన ట్రాన్స్కో అనధికారిక లోడ్ రిలీఫ్లు షురూ -
1 నుంచి ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు
హుడాకాంప్లెక్స్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మే 1 నుంచి 31వ తేదీ వరకు ఉచిత వేసవి శిక్షణ శిబారాలు నిర్వహించనున్నట్టు జిల్లా యువజన, క్రీడల అధికారి స్వర్ణలత గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 14 సంవత్సరాల లోపు బాలబాలికలు వీటిని వినియోగించుకోవాలని కోరారు. శిబిరాలను నిర్వహించేందుకు అనుభవజ్ఞులైన సీనియర్ క్రీడాకారులు, జాతీయ స్థాయి క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఫిజికల్ డైరెక్టర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు తాము నిర్వహించదలిచిన క్రీడా విభాగం, క్రీడా ప్రాంగణం వివరాలతో ఈనెల 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆమనగల్లు: పట్టణానికి ఐదు పడకల డయాలసిస్ సెంటర్ మంజూరైనట్లు జిల్లా వైద్యాధికారి డా.లలితా దేవి తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి ఆవరణలో నూతనంగా రూ.17.5 కోట్లతో నిర్మిస్తున్న భవనాన్ని గురువారం మహేశ్వరం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.నాగేందర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డయాలసిస్ సమస్యలతో బాధపడేవారికి అనుకూలంగా నూతన భవనంలో ఐదు పడకల సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఆమనగల్లు సీహెచ్సీ సూపరింటెండెంట్ నాగరాజు, వైద్యాధికారి డా.మైమునాబేగం, హెచ్ఈఓ తిరుపతిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి యాదయ్య తెలిపారు. ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో వద్దకు గురువారం వచ్చిన ఆయన కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తక్షణమే కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకుడు కాటం రాజుగౌడ్, ఆర్టీసీ జేఏసీ నాయకులు యాదగిరి, శ్రీహరి, నర్సింహ, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆమనగల్లు: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రత్యేక సమావేశం కోరం లేకపోవడంతో వాయిదా పడింది. మున్సిపాలిటీలో నాలుగు కో ఆప్షన్ పదవుల కోసం నిర్వహించిన సమావేశానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు పాపిశెట్టి రాము, ఆంజనేయులుయాదవ్, నాగిళ్ల జగన్, రమేశ్, అనూష, భాగ్యలక్ష్మి, యశోదమ్మ హాజరయ్యారు. చైర్మన్ పత్యానాయక్, వైస్ చైర్మన్ తల్లోజు గీత, బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. సమావేశం నిర్వహణకు కనీసం 8 మంది సభ్యులు హాజరు కావాల్సి ఉండగా బీఆర్ఎస్కు చెందిన ఏడుగురు మాత్రమే హాజరు కావడంతో కోరం లేని కారణంగా వాయిదా వేస్తున్నట్లు కమిషనర్ శంకర్ నాయక్ ప్రకటించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాత్రం ఎన్నిక నిర్వహించాలని వాగ్వాదానికి దిగారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్నా చేశారు. ఈనెల 27న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు. -
ఖర్గే వ్యాఖ్యలు దేశద్రోహమే
● ప్రధాని మోదీపై విమర్శలు సిగ్గుచేటు ● బీజేపీ జిల్లా నేత నర్సింహగౌడ్ కొత్తూరు: రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు తావులేకుండా, అభివృద్ధిపై మాత్రమే చర్చలు, విమర్శలు జరగాలని బీజేపీ జిల్లా కోశాధికారి అమడపురం నర్సింహ గౌడ్ అన్నారు. దేశ ప్రధాని మోదీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం మున్సిపాలిటీలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై ఆరోపణలు చేసేటప్పుడు కనీస ఆలోచన ఉండాలన్నారు. కానీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఉన్న ఖర్గే ఇవేవీ పట్టించుకోకుండా మోదీని ఉగ్రవాది అనడం దారుణమన్నారు. ప్రధానమంత్రిని ఉగ్రవాదితో పోల్చడం దేశద్రోహంతో సమానమని మండిపడ్డారు. రాజకీయాలకు అతీతంగా దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తున్న నేతను కించపరిచేలా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మోదీ పాలనను ప్రపంచ దేశాలన్నీ ప్రశంసిస్తున్నాయనే విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు. కేవలం తమ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికే ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఎద్దేవా చేశారు. వెంటనే ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, ప్రధానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే దేశవ్యాప్త ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రణధీర్గౌడ్, నాగరాజుచారి, మహేందర్రెడ్డి, విజయభాస్కర్రెడ్డి, రాఘవులు, హరికృష్ణ, శివకుమార్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రికార్డుల నమోదులో నిర్లక్ష్యం వద్దు
యాచారం: పంచాయతీల్లో రికార్డుల నమోదులో నిర్లక్ష్యం వద్దని, ఖర్చు చేసే ప్రతి పైసాకు లెక్కలుండాల్సిందేనని జిల్లా పంచాయతీ అధికారి సురేష్మోహన్ పేర్కొన్నారు. మండల పరిధిలోని తమ్మలోనిగూడ పంచాయతీని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పొరపాట్లను సరిచేసుకోవాలని పంచాయతీ కార్యదర్శి అశోక్కు సూచించారు. సర్పంచులు అధికారులతో సమన్వయం చేసుకుంటే గ్రామాలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతాయన్నారు. అనంతరం ఈజీఎస్ నర్సరీని పరిశీలించి మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉపాధి కూలీలకు నీడ, తాగునీరు, ఓఆర్ఎస్ ఫ్యాకెట్లు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీలత, గ్రామ సర్పంచ్ దెంది రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పంచాయతీ అధికారి సురేష్మోహన్ -
ధర్మ పరిరక్షణకే హిందూ సమ్మేళనం
మహేశ్వరం: భారతదేశంలోపి సనాతన హిందూ ధర్మం గొప్పదనం విశ్వవాప్తం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిత్య పరాశ్రీ స్వామిజీ అన్నారు. బుధవారం మండల పరిధిలోని అమీర్పేట్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందువులందరినీ ఏకం చేయడం, సమాజంలో ప్రేరణాశక్తిని రగిలించడం, నిరంతరం ధర్మ పరిరక్షణ కోసం సమ్మేళనాలు నిర్వహిస్తున్నామన్నారు. హిందూ సమాజ ఐక్యత, సంస్కృతి పరిరక్షణకు ఇలాంటి సమ్మేనాలు అవసరమన్నారు. సమాజ శ్రేయస్సుకు హిందువులు ఏకతాటిపై నడవాలన్నారు. పురాణాలు, ఇతిహాసాలు, సంప్రదాయాల ప్రభావంతో సనాతన ధర్మం ప్రారంభమైందని ఇందుకు ప్రతి రూపమే హిందూ సమ్మేళనం అన్నారు. అనంతరం స్వామిజీని హిందూ సమ్మేళన నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. హిందూ సమ్మేళనానికి సహకరించిన వారిని నిర్వాహకులు ఘనంగా అభినందించి సన్మానించారు. సమ్మేళనంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, అలరించాయి. ఈ కార్యక్రమంలో విద్యాభారతి ప్రచార విభాగం దక్షిణ క్షేత్ర సంఘటన మంత్రి లింగం సుధాకర్రెడ్డి, రాష్ట్ర సేవిక సమితి నాయకులు గంజాం పద్మజ భగవత్, పలు గ్రామాల ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ నాయకులు, హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆదిత్య పరాశ్రీ స్వామిజీ -
నై చలేంగే..
ఆర్టీసీ సమ్మె హారన్ ఇబ్రహీంపట్నం: డిపోనకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు ● ఆర్టీసీ జేఏసీ నాయకుడు శంకర్ నాయక్ మహేశ్వరం: మహేశ్వరం ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు బుధవారం సమ్మెలో పాల్గొని నిరసన తెలిపారు. తెల్లవారుజాము నుంచి డిపోలో పని చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, టెక్నీషియన్లు, మెకానిక్లు, ఇతర కార్మికులు డిపో వద్దకు భారీగా చేరుకొని గేటు ఎదుట బైఠాయించారు. డిపోలో 75 ఆర్టీసీ బస్సులు( 63 ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు, 12 ప్రైవేట్ బస్సులు)లో 12 ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు మాత్రమే ప్రైవేట్ డ్రైవర్లతో నడిపించారు. ప్రభుత్వ ఆర్టీసీ బస్సులను కార్మికులు అడ్డుకోవడంతో డిపోకే పరిమితమయ్యాయి. ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా మహేశ్వరం సీఐ రాఘవేందర్రెడ్డి, ఎస్ఐలతో బందోబస్తు నిర్వహించారు. మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని గ్రామాలకు కొన్ని ట్రిప్పులు నడిపారు. సమ్మె కారణంగా ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆటోలు, ట్యాక్సీ కార్లలో అధిక చార్జీలు చెల్లించి ప్రయాణించారు. ఈ సందర్బంగా ఆర్టీసీ జేఏసీ నాయకుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటికై న ఆర్టీసీ సమ్మైపె జోక్యం చేసుకోవాలని కోరారు. ఎలక్ట్రికల్ బస్సులతో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన చేస్తోందన్నారు. ఆర్టీసీని హైదరాబాద్లో లేకుండా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఆర్టీసీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని చూస్తోందన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించేంతవరకు సమ్మెను విరమించమని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని సమ్మెకు చేపట్టారు. దీంతో జిల్లా వ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. రెండేళ్లయినా ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోవడంతోనే సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. హామీలు అమలు చేసే వరకు పోరాటం ఆపమని హెచ్చరించారు. డిపోలకే పరిమితమైన బస్సులు ఇబ్బంది పడిన ప్రయాణికులు జోరుగా ప్రైవేటు వాహనదారుల దోపిడీ -
ప్రగతి చక్రాలకు బ్రేకులు
షాద్నగర్: డిమాండ్ల సాధన దిశగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మె చేపట్టారు. దీంతో బస్సులు బస్టాండ్కే పరిమితమయ్యాయి. హైదరాబాద్, మహబూబ్నగర్కు వెళ్లేందుకు ప్రతి రోజు షాద్నగర్ ప్రాంతం నుంచి విద్యార్థులు, యువకులు, రైతులు, మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. షాద్నగర్ డిపోలో నిర్విరామంగా పరుగులు తీస్తున్న బస్సులు సమ్మెతో నిలిచిపోయాయి. ఏడేళ్ల క్రితం ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులు ఎదుర్కొన్న కష్టాలు మళ్లీ ప్రారంభం అయ్యాయి. బస్సులను అడ్డుకున్న కార్మికులు సమ్మె కారణంగా కార్మికులు విధులు నిర్వహించలేదు. దీంతో ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ సీతారాం, తహసీల్దార్ నాగయ్య, ఎంవీఐ వాసు తదితరులు బస్టాండ్కు వెళ్లారు. ప్రవేటు డ్రైవర్లతో బస్సులను డిపో నుంచి బయటికి తీసేందుకు ప్రయత్నించగా ఆర్టీసీ కార్మికులు డిపో గేటు ఎదుట భైఠాయించి అడ్డుకున్నారు. రోజుకు రూ.18లక్షల నష్టం డిపోలో మొత్తం 88 బస్సులున్నాయి. ఆర్టీసీ బస్సులు 53, అద్దె బస్సులు 35. డిపోలో 340 మంది సిబ్బంది పని చేస్తున్నారు. అయితే బుధవారం కేవలం ఐదు ప్రైవేటు బస్సులను మాత్రమే నడిచాయి. ప్రతి రోజుకు ఆర్టీసీకి రూ.18లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. సమ్మె కారణంగా ఆర్టీసీ సంస్థ ఆదాయాన్ని కోల్పోతుంది. ప్రైవేటు వాహనదారుల దోపిడీ సమ్మె కారణంగా ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. సమ్మెను ఆసరాగా తీసుకొని ప్రైవేట్ వాహనదారులు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. ఒక్కో ప్రయాణికుడి నుంచి దూరాన్ని బట్టి రూ.పది–రూ.50 వరకు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు నడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గ్రామానికి వెళ్లేందుకు అవస్థలు పడుతున్నాం. ప్రైవేటు వాహనాలను అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. బస్సులు నడిచేలా అధికారులు చర్యలు తీసుకోవాలి – వేమారెడ్డి, గుర్రంపల్లి ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికై నా ఉచితంగా ప్రయాణించే వాళ్ళం. సమ్మె కారణంగా ఆటోలు, జీపుల్లో వెళ్లాల్సి వస్తుంది. ప్రైవేట్ వాహనదారులు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. – అండాలు, లింగారెడ్డిగూడ, షాద్నగర్ -
రహదారి భద్రత కరువు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లాలోని పలు జాతీయ రహదారులే కాదు అంతర్గత రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. ఔటర్ రింగ్రోడ్డు సహా హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారి(ఎన్హెచ్ 44), నాగార్జున సాగర్ రోడ్డు, విజయవాడ జాతీయ రహదారి, బీజాపూర్ జాతీయ రహదారి, శ్రీశైలం జాతీయ రహదారిపై నిత్యం ఏదో ఒక ప్రమాదం వెలుగు చూస్తూనే ఉంది. అనేక మంది మృత్యువాతపడుతూనే ఉన్నారు. అయినా అధికారుల్లో చలనం కలగడం లేదు. గుంతలు తేలిన రోడ్లను పూడ్చాలనే సోయి ఉండడం లేదు. కానీ ప్రతి మూడు నెలలకోసారి ఎలాంటి యాక్షన్ ప్లాన్ లేకుండానే జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశమవుతుండటం హాస్యాస్పదంగా మారింది. ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలుపై కనీస చర్చకూడా ఉండడం లేదు. తూతూ మంత్రంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారే కానీ.. రహదారి భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు లేకపోలేదు. బుధవారం అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అధ్యక్షతన కలెక్టరేట్లో జిల్లా రహదారి భద్రత కమిటీ(డీఆర్ఎస్సీ) సమావేశం నిర్వహించింది. ఆర్ అండ్బీ కార్యనిర్వాహక ఇంజనీర్లు, ట్రాఫిక్ పోలీసులు, రెవెన్యూ అధికారులు ఈ సమావేశానికి హజరయ్యారు. అయితే రక్షణ చర్యలపై కనీస చర్చ లేకుండానే సమావేశం ముగించారు. యాక్షన్ ప్లాన్ లేదు.. నియంత్రణ చర్యలు లేవు తూతూ మంత్రంగా జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం -
సోషల్ మీడియా వేదికగా వేధింపులు
యువకుడికి రిమాండ్ కడ్తాల్: సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తానంటూ యువతిని వేధింపులకు గురిచేస్తున్న యువకుడిని కడ్తాల్ పోలీసులు రిమాండ్కు తరలించారు. సీఐ గంగాధర్ తెలిపిన ప్రకారం.. కేశంపేట మండలం చౌలపల్లి పంచాయతీ పరిధిలోని మీనమోనిపల్లికి చెందిన అనపూలస గోవర్ధన్ కడ్తాల్ మండలానికి చెందిన ఓ యువతితో ఇన్స్ట్రాగామ్లో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెబుతూ ఆమెతో కలిసి ఫొటోలు దిగాడు. అనంతరం సదరు యువతిని ఒంటరిగా కలవాలని లేదంటే ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గోవర్ధన్ను కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ తరలించాలని ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి
● తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మానాయక్ ● రూ.25లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి ● సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రాజు షాద్నగర్రూరల్: విద్యుత్ వైర్లకింద పెరిగిన చెట్లను నరికి వేస్తున్న కూలీ ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మానాయక్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన గాయపడిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులతో కలిసి గిరిజనసంఘం, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని అసిస్టెంట్ డివిజన్ ఇంజినీర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్ నందనవనం కాలనీలో నివాసం ఉంటున్న రాత్లావత్ లక్ష్మణ్ రోజు కూలీ నిమిత్తం షాద్నగర్కు వచ్చాడని. మండల పరిధిలోని వెలిజర్ల గ్రామంలో ట్రాన్స్ కో అధికారులు ఈ నెల 8న చేపట్టిన చెట్లు నరికే పనికి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రాత్లావత్లక్ష్మణ్ చెట్టుపైనుంచి కింద పడి పోవడంతో తలకు తీవ్ర గాయాలై చికిత్స పొందుతున్నాడన్నారు. బాధితుడు మతిస్థిమితం కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రాజు మాట్లాడుతూ... చెట్లు నరికివేసే సమయంలో విద్యుత్ అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. సేఫ్టీ పరికరాలు ఇవ్వకుండా పని చేయించిన కాంట్రాక్టర్ బాబుల్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్పై కేసు నమోదుచేసి కాంట్రాక్ట్ను వెంటనే రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి తక్షణమే రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని లేదంటే సీఎండీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనునాయక్, బాధిత కుటుంబ సభ్యులు రూప్సింగ్, మంగుతా నాయక్, హన్మంత్, బాలరాజు, లక్ష్మణ్, లోకేశ్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ సమ్మెకు మద్దతు
సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య ఇబ్రహీంపట్నం: అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నేరవేర్చాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.యాదయ్య డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీపీఎం మద్దతు ఇస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత ఎన్నికలకు ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ పాలకులు తుంగలో తొక్కారన్నారు. ఆర్టీసీ కార్మికుల 32 సమస్యల డిమాండ్ల పరిష్కారానికి వేసిన ఐఏఎస్ అధికారుల కమిటీ నాలుగు వారాల గడువు కోరడం సమ్మెను నీరుగార్చడమేనన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య షాబాద్: నాలుగు లేబర్ కోడులను రద్దు చేసే వరకు పోరాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో మేడే వాల్ పోస్టర్లును విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడులను రద్దు చేసే వరకు పోరాడాలని పిలుపుతో అంతర్జాయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని సూచించారు. జిల్లాలో లక్షలాది మంది కార్మికుల తరపున ఏఐటీయూసీ పోరాడాలన్నారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రామస్వామి మాట్లాడుతూ.. అన్ని రంగాల కార్మికులకు రూ.26 వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్లర్లు కార్మికులపై పెత్తనం చేస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి పాలమాకుల శ్రీశైలం, వర్కింగ్ ప్రెసిడెంట్ మంజుల, బీసీ హక్కుల సాధన సమితి మండల కన్వీనర్ పామాలకు ఆనందం, ఏఐటీయూసీ మండల కన్వీనర్ నారాయణ, సహాయ కార్యదర్శి నర్సింలు, డీహెచ్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జంగయ్య, రఘురాం, మధూకర్, తదితరులున్నారు. -
పరమాత్మ సాధనలో నిమగ్నమే సన్యాసం
ఆమనగల్లు: భౌతిక జీవితం నుంచి దూరంగా ఉండి ఆధ్యాత్మిక మార్గంలో నడిచే పవిత్రమైన జీవన విధానమే సన్యాసమని వ్యాసాశ్రమం పీఠాధిపతి పరిపూర్ణానందగిరిస్వామి అన్నారు. పట్టణంలోని శ్రీ రామదూత ఆశ్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు శివానందస్వామి నేతృత్వంలో వివిధ ఆశ్రమ పీఠాధిపతుల సమక్షంలో బుధవారం పలువురు సన్యాసం స్వీకరించారు. సన్యాసం స్వీకరించిన వారికి పీఠాధిపతులు కాషాయ దుస్తులు అందించడంతో పాటు మంత్రోపదేశం చేశారు. వేదమంత్రాలు, యజ్ఞాలు నిర్వహించగా పలువురు పీఠాధిపతుల సమక్షంలో కుటుంబ సభ్యుల భావోద్వేగాల మద్య పలువురు సన్యాసం స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఆశ్రమ పీఠాధిపతులు మాట్లాడుతూ.. లోకబందనాలను విడిచిపెట్టి పరమాత్మ సాధనలో నిమగ్నం కావడమే సన్యాసమని అన్నారు. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్తం తరువాత సన్యాసం చివరిదశ అని వివరించారు. సన్యాసం స్వీకరించే వారు అహంభావాన్ని విడిచి పరమసత్యాన్ని అన్వేషించే దిశగా అడుగులు వేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా రామదూత ఆశ్రమం వ్యవస్థాపకులు శివానందస్వామిని భక్తులు తులాభారం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ఆశ్రమాల పీఠాధిపతులు పరిశుద్దానందస్వామి, శంకరానందగిరిస్వామి, పరవిద్యానందగిరిమాతాజీ, రామకృష్ణానందగిరిస్వామి, ఆత్మానంద గిరి మాతాజీ, మల్లికార్జుజనానందగిరిస్వామి, కృష్ణనందగిరిస్వామి, భక్తులు వీరబొమ్మ రామ్మోహన్, నర్సింహ, యాదయ్య, శ్రీహరి, రమేశ్, యాదయ్య, లక్ష్మయ్య, కృష్ణయ్య, మల్లయ్య, చంద్రశేఖర్, సత్యం, వెంకటాచారి, యుగందరరెడ్డి, భరతయ్య తదితరులు ఉన్నారు. వ్యాసాశ్రమం పీఠాధిపతికి సత్కారం పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయాన్ని వ్యాసాశ్రమం పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పరిపూర్ణానందగిరి స్వామిని ఆలయ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వీరబొమ్మ రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి బికుమాండ్ల నర్సింహ, సభ్యులు నటరాజ్ యాదయ్య, అర్థం లక్ష్మయ్య, శ్రీ రామదూత ఆశ్రమం వ్యవస్థాపకులు శివానందస్వామి తదితరులు పాల్గొన్నారు. వ్యాసాశ్రమం పీఠాధిపతి పరిపూర్ణానందగిరిస్వామి -
ఇంద్రారెడ్డి ఆశయాలను సాధిద్దాం
● మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ● కౌకుంట్లలో ఇంద్రారెడ్డి వర్ధంతికి హాజరైన నాయకులు చేవెళ్ల: ఇంద్రారెడ్డి కుటుంబానికి రాజకీయ జీవితాన్ని ఇచ్చింది చేవెళ్ల ప్రజలేనని.. నియోజకవర్గ ప్రజలకు ఇంద్రారెడ్డి కుటుంబ ఎప్పటికీ రుణపడి ఉంటుందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. బుధవారం దివంగత హోంమంత్రి ఇంద్రారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆమె చేవెళ్ల, ఖానాపురంగేట్, అంతారంగేట్ వద్ద ఆయన విగ్రహాలకు ఘన నివాళి అర్పించారు. అనంతరం మండల పరిధిలోని కౌకుంట్లలో ఆయన సమాధికి తనయులు కార్తీక్రెడ్డి, కౌశిక్రెడ్డి, కల్యాణ్రెడ్డి, కుటుంబ సభ్యులు, పలువురు నాయకులతో కలిసి పూలమాలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేవెళ్ల గడ్డ అంటే స్వర్గీయ ఇంద్రారెడ్డి పేరు గుర్తుండి పోయేలా పాలన సాగించారన్నారు. ఆయన అనుచరులు పార్టీలకు అతీతంగా జిల్లాలో ఎంతో మంది ఉన్నారని గుర్తు చేశారు. ఆయన ఆయన సాధనకు నిరంతరం కృషి చేద్దామన్నారు. ఆయన కలలు కన్న తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పి.కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అంజనేయులు, ప్రభాకర్, పి.హన్మంత్రెడ్డి, కరుణాకర్రెడ్డి, మల్లారెడ్డి, మల్లేశ్, శ్రీధర్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, బాల్రాజ్, యాదయ్య, నర్సింలు, రవీందర్, మాధవ్గౌడ్, రామగౌడ్, రాజు, సురేందర్, వెంకటేశ్వర్రెడ్డి, గోపాలకృష్ణ, రాజు, చంద్రశేఖర్, ప్రభాకర్రెడ్డి, మాధవ్రెడ్డి, పలువురు నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటాం మొయినాబాద్: ఇంద్రారెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా నిలబెట్టిన చేవెళ్ల ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. బుధవారం దివంగత హోంమంత్రి ఇంద్రారెడ్డి వర్ధంతి సందర్భంగా మున్సిపల్ కేంద్రంలో ఇంద్రారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంద్రారెడ్డి ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఇంద్రారెడ్డి కుటుంబం ఎంతో కృషి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె తనయుడు కౌశిక్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, కొత్త నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్రెడ్డి, ఉపాధ్యక్షుడు జయవంత్, సీనియర్ నేతలు షేక్ మహబూబ్, కృష్ణారెడ్డి, గడ్డం వెంకట్రెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్లు డప్పు రాజు, రవూఫ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ జీఎన్ రాజు, మాజీ సర్పంచ్లు కోట్ల నరోత్తంరెడ్డి, శ్రీహరియాదవ్, సుధాకర్యాదవ్, ఎంపీటీసీ మాజీ సభ్యులు మాణిక్రెడ్డి, శ్రీనివాస్, నాయకులు రాంచందర్, సురేందర్గౌడ్, సూరియాదవ్, తిరుపతిరెడ్డి, నవీన్, అరవింద్, ప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిలుకూరు ఇంద్రారెడ్డి నగర్ కాలనీలోని ఆయన విగ్రహానికి మాజీ సర్పంచ్ పురాణం వీరభద్రస్వామి ఆధ్వర్యంలో పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టు రట్టు
● ఆరు తులాల బంగారు ఆభరణాలు, 61 సెల్ఫోన్లు, కారు, రెండు బైక్లు స్వాధీనం ● పరారీలో మరో నలుగురు నిందితులు ● వివరాలు వెల్లడించిన చేవెళ్ల ఏసీపీ కిషన్ చేవెళ్ల: రద్దీ ప్రదేశాల్లో చోరీలకు పాల్పడుతున్న పలువురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు రిమాండ్కు తరలించారు. చేవెళ్ల ఏసీపీ బి.కిషన్ బుధవారం విలేరులతో మాట్లాడుతూ.. ఈ నెల 17న షాద్నగర్ మండలం దూస్కల్ గ్రామానికి చెందిన జి.వెంకటయ్య శంకర్పల్లిలోని తన కూతురు వద్ద నుంచి ఆరు తులాల బంగారు ఆభరణాలు తీసుకుని స్వగ్రామానికి బయలుదేరాడు. చేవెళ్ల బస్టాండ్లో బస్సు ఎక్కే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆభరణాలు తస్కరించారు. ఆయన వెంటనే చేవెళ్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుఽధీర్బాబు, చేవెళ్ల జోన్ డీసీపీ యోగేష్గౌతమ్, ఏసీపీ కిషన్ల పర్యవేక్షణలో ప్రత్యేక క్రైం టీం పోలీసులు గాలింపు చేపట్టింది. ఈ నెల 18న రాత్రి చేవెళ్ల క్రైం టీం పోలీసుల కల్లుగప్పి పారిపోతున్న దొంగలను దాదాపు ఏడు కిలో మీటర్లు వెంబడించి మేడ్చల్–మల్కాజిగిరి పరిధిలోని ప్రతాపసింగారం వద్ద గ్రామస్తుల సహకారంతో పట్టుకున్నారు. ఈ ముఠాలో బేతంపల్లి మేరీ, దేవరకొండ రేణుక, పాలేరు సుష్మిత, ఆకుల గంగయ్య, ఇద్దరు మైనర్లును అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులు బేతంపల్లి రాజశేఖర్, దేవరకొండ నాగేంద్ర, చందు, ఆకుల చరణ్కుమార్ తప్పించుకు పారిపోయారు. పట్టుబడిన ఈ ముఠా నుంచి ఆరు తులాల బంగారు ఆభరణాలతోపాటు 61 మొబైల్ ఫోన్లు, ఒక ట్యాబ్, ఒక కారు, టీవీఎస్ జ్యూపిటర్ స్కూటీ, బుల్లెట్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ కర్ణాటకలోని చిత్రదుర్గ పోలీస్స్టేషన్, బెంగళూరు, ఆర్పీఎస్ సికింద్రాబాద్ పరిధిలోనూ నేరాలు చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. పట్టుబడిన మైనర్లను, నిందితులను ఈనెల 19న చేవెళ్ల కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించామని చెప్పారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీం దర్యాప్తు చేస్తుందన్నారు. కేసును ఛేదించేందుకు పనిచేసిన చేవెళ్ల క్రైం టీమ్ సీఐ భూపాల్శ్రీధర్, కానిస్టేబుల్స్ శివ, రమేశ్, ఇతర కానిస్టేబులను ప్రత్యేకంగా అభినందించారు. -
నడిచిన అద్దెబస్సులు
ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ కార్మికులు బుధవారం నుంచి సమ్మెకు దిగడంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ అద్దె బస్సులు నడిచాయి. ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో 137 బస్సులకు గాను 61 అద్దె బస్సులను అధికారులు నడిపించారు. డిపోలో సుమారు 800 మంది సిబ్బందికిగాను సుమారు 580 మంది సమ్మెలో పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఉదయం డిపో ఎదుట ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు. కార్మికులకు మద్ధతుగా సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆ సంఘం నాయకులు ఎల్లేశ్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు పనిబారం తగ్గించాలని, పేస్కేల్ అములు చేయాలని, ఆర్టీసీ ఆస్తులను కాపాడి, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ జగన్, యాదగిరి, డిపో జేఏసీ చైర్మన్ సీహెచ్ యాదగిరి, అబ్దుల్ రజాక్, జంగయ్య, నర్సింహ, లలిత, కల్పన, కార్మికులు పాల్గొన్నారు. బస్సు సౌకర్యం లేక పలువురు ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. వారు భారీగా చార్జీలు పెంచారు. ఆర్టీసీ సమ్మెతో సకాలంలో బస్సులు రాక ఇబ్బందులు పడ్డాం. గంటల తరబడి బస్సుల కోసం నిరీక్షించాం. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సమ్మె విరమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – దీపిక, ప్రయాణికురాలు -
నేడు మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక
ఆమనగల్లు: ఆమనగల్లు మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు ఈనెల 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆమనగల్లు మున్సిపల్ కమిషనర్ శంకర్ నాయక్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీలో నాలుగు కోఆప్షన్ పదవులకు 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో నలుగురు సభ్యుల ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికలు నిర్వహించనున్నారు. సమావేశానికి 15 మంది కౌన్సిలర్లతో పాటు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా హాజరు కానున్నారు. ఇబ్రహీంపట్నం తహసీల్దార్ సునీతారెడ్డి, వ్యవసాయాధికారిణి విద్యాధరి ఇబ్రహీంపట్నం: రైతులందరూ జూన్ 2వ తేదీలోపు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పకుండా చేయించుకోవాలని తహసీల్దార్ సునీతారెడ్డి, మండల వ్యవసాయాధికారిణి విద్యాధరి కోరారు. ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం గ్రామ పాలనాధికారులు, పంచాయతీ కార్యదర్శులకు, మీ సేవ కేంద్రాల సిబ్బందికి ఫార్మర్ రిజిస్ట్రేషన్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల లబ్ధి పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. సమీప మీ సేవ కేంద్రాలకు భూమి పాస్ బుక్ వివరాలు, ఆధార్, ఓటీపీ వచ్చే ఫోన్తో వెళ్లి ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. రైతులందరికీ తగు సలహాలు సూచనలు పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్గౌడ్, ఏఈఓలు శ్రవణ్, సృజన పాల్గొన్నారు. చెరువు శిఖంలోని బ్లూషీట్ల తొలగింపు సాక్షి, రంగారెడ్డిజిల్లా: శిఖం భూముల్లో వెలుస్తున్న రియల్ వెంచర్లపై అధికారులు చర్యలు చేపట్టారు. ఆదిభట్ల ఔటర్ రింగ్రోడ్డు సర్వీసు రోడు వెంట వెలుస్తున్న అక్రమ వెంచర్లపై బుధవారం ‘సాక్షి’జిల్లా ఎడిషన్లో ‘చెర’వులు శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఇందుకు స్పందించిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు హుటాహుటిన క్షేత్రస్థాయికి చేరుకున్నారు. జిలాన్ఖాన్ చెరువులో వెలసిన బ్లూషీట్లను తొలగించారు. పులిందర్వాగు సహా చెరువు కట్టను ధ్వంసం చేసిన మాట వాస్తవమేనని ఇరిగేషన్ అధికారులు అంగీకరించారు. వెంచర్ యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు ప్రకటించారు. సర్వే నంబర్ 123, 124, 125, 434, 439, 440, 441, 442, 443లో 24.32 ఎకరాల విస్తీర్ణంలో ఈ జిలాన్ ఖాన్ చెరువు విస్తరించి ఉందని, ఇందులో వెంచర్ ఏర్పాటుకు రెవెన్యూశాఖ ఎలాంటి అనుమతులు జారీ చేయలేదని, అదే విధంగా ఔటర్ సర్వీసు రోడ్డు నుంచి వెంచర్లోకి బీటీ రోడ్డుకు కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, ఇది పూర్తిగా అక్రమమని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి స్పష్టం చేశారు. నీటి వనరులను ధ్వంసం చేస్తున్న వెంచర్ నిర్వహకులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే సంబంధిత తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. -
ఉపాధ్యాయులే మార్గదర్శకులు
శంకర్పల్లి: పాఠశాల దశ నుంచి విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఓ ప్రైవేట్ గార్డెన్స్లో శంకర్పల్లి ఎంఈఓ సయ్యద్ అక్బర్ పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ ప్రసాద్కుమార్, ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా విద్యాధికారి సుశీందర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్బర్ దంపతులను వారు ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. 11 ఏళ్లుగా మండల విద్యాధికారిగా అక్బర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఉద్యోగ విరమణ అనేది కేవలం ఉద్యోగానికి మాత్రమేనని.. వృత్తికి కాదన్నారు. అక్బర్ తన ఉపాధ్యాయ అనుభవాన్ని భవిష్యత్లోనూ విద్యార్థులకు సాయం చేసేందుకు తోడ్పాటునందించాలన్నారు. కార్యక్రమంలో పలు మండలాల ఎంఈఓలు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. బహిష్కరించిన ఉపాధ్యాయ సంఘాలు బుధవారం శంకర్పల్లిలో నిర్వహించిన మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్ పదవీ విరమణ కార్యక్రమాన్ని మండలంలోని పలు ఉపాధ్యాయ సంఘాలు బహిష్కరించాయి. 11 ఏళ్లుగా ఎంఈఓగా పని చేసిన ఆయన ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేశారని, అందుకు నిరసనగా కార్యక్రమానికి తాము, తమ సంఘంలోని ఉపాధ్యాయులు వెళ్లవద్దంటూ మంగళవారం పీఆర్టీయూటీఎస్, ఎస్టీయూ, టీపీయూఎస్, టీయూటీఎఫ్, ఎస్జీటీయూ, టీఎస్యూటీఎఫ్ సంఘాలు తీర్మానించుకున్నాయి. శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్ -
వేసవిలో మరమ్మతులు పూర్తి చేయండి
● రిపేర్లకు సంబంధించి నివేదిక సిద్ధం చేయండి ● కలెక్టర్ నారాయణరెడ్డి మహేశ్వరం: ప్రభుత్వ హస్టళ్లలలో మరమ్మతులుంటే విద్యార్థులకు, విద్యా కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా వేసవి సెలవుల్లోనే పూర్తి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. బుధవారం ఆయన మండల పరిధిలోని మహేశ్వరం గేటు సమీపంలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాలను అదనపు కలెక్టర్ కె.శ్రీనివాస్తో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలతో పాటు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న వసతి గృహాలకలో రిపేర్లను గుర్తించి నివేదికను సిద్ధం చేయాలన్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే సత్వరమే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. అనంతరం హస్టల్లోని వంటశాల, మెస్, పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఎంసెట్ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు అందిస్తున్న కోచింగ్ వివరాలను తెలుసుకున్నారు. విద్యా వ్యవస్థలలో అనేక మార్పులు వచ్చాయని.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుఽలకు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి కేషురామ్, తహసీల్దార్ చిన్న అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
రోజురోజుకూ తగ్గుతున్న కూలీలు
చేవెళ్ల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉపాఽధిహామీ పథకం నిబంధనల కొర్రీతో వేసవి ఎండల్లో కూలీలు పనులు చేసేందుకు ఆసక్తి చూపించటం లేదు. మండలంలో ప్రస్తుతం రెండు వేలకుపైగా జాబ్కార్డులు ఉంటే 220 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే పనులు చేసేందుకు సైతం ముందుకు రావటంలేదు. వేసవి ఎండలు మండుతున్న నేపథ్యంలో కూలీలకు పనిచేసే చోట తాగునీటి వసతి, టెంట్లు, పనిముట్లు అందించాలనే నిబంధనలు ఉన్నా కొన్నేళ్లుగా పట్టించుకోవటం లేదని కూలీలు వాపోతున్నారు. ఉపాధి పనుల నిర్వహణ ప్రస్తుతం పంచాయతీలకు అదనపు భారంగా మారుతుంది. కూలీలకు మూడు నెలల నుంచి డబ్బులు సైతం రావటం లేదని వాపోతున్నారు. -
ఐదు నెలలుగా డబ్బులు వస్తలేవు
షాబాద్: ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు తాగునీరు, నీడ కోసం టెంట్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం మండల పరిధిలోని బొబ్బిలిగామ గ్రామంలో పనులు చేస్తున్న కూలీలను సాక్షి విజిట్ చేసింది. ఐదు నెలలుగా పని చేస్తున్న తమకు కూలీ డబ్బులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల వస్తాయి.. రేపు అంటూ కాలయాపన చేస్తున్నారు. ఉపాధి హామీ ఫీల్ట్ అసిస్టెంట్లుకు మూడు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడిమిని తట్టుకోలేక చెట్ల నీడకు వెళ్తున్నట్లు చెప్పారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమకు కూలీ డబ్బులు అందేలా చూడాలని కోరారు. -
కష్టానికి దక్కని ప్రతిఫలం
ఇబ్రహీంపట్నం: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ఇబ్రహీంపట్నం మండలంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మండుటెండల్లో కూలీలు కష్టపడుతున్న ఫలితం దక్కడంలేదు. చేసిన ఉపాధి పనికి వెంటనే కూలీ డబ్బులు పడకపోవడంతో శ్రమజీవులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో 5,460 జాబ్ కార్డులుండగా ప్రతి నిత్యం 850 నుంచి 950 మంది కూలీలు పనులకు వెళుతున్నారు. ఊట చెరువులు, ఫీడర్ చానల్ కాలువ తవ్వకాలు, చిన్న నీటి కుంటలు, ఫాంపాండ్స్, నర్సరీల నిర్వహణ, మొక్కల సంరక్షణ తదితర పనులు కూలీలు చేస్తున్నారు. పది వారాలుగా కూలీలకు డబ్బుల చెల్లింపులు కాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. చేసిన కష్టానికి వెంటనే డబ్బులు రాక వారాల తరబడి ఎదురు చూపులే దిక్కాయ్యాయి. అంతేగాక పని ప్రదేశంలో ఫేస్ రికగ్నైజెషన్ యాప్ ద్వారా హాజరు నమోదు చేస్తుండటంతో నెట్ వర్క్ సమస్యలు తలెత్తున్నాయి. -
కూలీలకు చాలీచాలని టెంట్లు!
మంచాల: వేసవి ఎండలతో ఉపాధి కూలీలకు తిప్పలు తప్పడం లేదు. నాలుగైదేళ్లుగా ప్రభుత్వం కూలీలకు టెంట్లు, పనిముట్లు సైతం అందించ లేదు. నేడు గ్రామ పంచాయతీల ద్వారా కూలీలకు పని చేసే చోట టెంట్లు, తాగునీరు అందించాలని ఆదేశాలు ఇచ్చారు. అవి కూడా సక్రమంగా అమలు జరగడం లేదు. మండలంలోని 23 గ్రామ పంచాయతీల్లో 5,100 మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం 1,100 మంది కూలీలు హామీ పథకం కింద పనులు చేస్తున్నారు. పని చేసే చోట చాలీచాలని టెంట్లు ఏర్పాటు చేయడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. కనీస సౌకర్యాలు లేక ఎండలోనే పనులు చేస్తున్నామని పేర్కొంటున్నారు. పనిముట్లు ఇవ్వాలి గ్రామాల్లో ఉపాధిహామీ పథకం కింద పని చేసే కూలీలకు గడ్డపారలు, గంపలు, ఎండలకు నీడ కోసం టెంట్లు కొత్తవి సరఫరా చేయాలి. పాతవి, చాలీచాలని టెంట్ల కింద ఇబ్బందులు పడుతున్నాం. తక్షణమే కొత్తవి ఇవ్వాలి. – పర్వతాలు, ఉపాధికూలీ, రంగాపూర్ జీపీలకు అప్పగించాం గ్రామాల్లో ఉపాధిహామీ పథకం కింద పని చేసే కూలీలకు టెంట్లు, తాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీలకు ఆదేశాలు ఇచ్చాం. అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నాం, మెడికల్ కిట్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నాం. – వీరాంజనేయులు, ఏపీఓ, మంచాల -
అర్ధరాత్రి అడవిలో మంటలు
ఆమనగల్లు: తలకొండపల్లి మండలం పడకల్ గ్రామ సరిహద్దులో ఉన్న అటవీ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గుర్తించిన సమీప గ్రామాల ప్రజలు వెంటనే తలకొండపల్లి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన సీఐ జానకిరాంరెడ్డి, ఎస్ఐ శేఖర్లు సంఘటనా స్థలం వద్దకు పోలీసులను పంపించారు. అనంతరం ఫైర్ స్టేషన్లకు సమాచారం అందించడంతో షాద్నగర్ నుంచి వచ్చిన ఫైర్ సిబ్బంది అటవీప్రాంతంలో మంటలను ఆర్పివేశారు. అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలలో విలువైన కానుగు, నీలగిరి, మోదుగు తదితర చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ముదిరాజ్లకు న్యాయం చేయాలిచేవెళ్ల: ముదిరాజ్లను బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి మార్చాలని కోరుతూ ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకురాలు కోట్ల పుష్పలత కొడంగల్ నుంచి హైదరాబాద్లోని అమరవీరుల స్థూపం వరకు చేపట్టిన పాదయాత్ర మంగళవారం చేవెళ్లకు చేరింది. ఈ సందర్భంగా ఆమె పండుగల సాయన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. బీసీ–డీలో ఉన్న ముదిరాజ్లకు సరైన న్యాయం జరగడం లేదని అన్నారు. అన్ని రంగాల్లో అవకాశాలు దక్కాలంటే బీసీ–ఏలోకి మార్చాలని ఎన్నో రోజులుగా డిమాండ్ ఉందని, దీనిని ప్రభుత్వం పరిశీలించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముదిరాజ్సంఘం మండల నాయకులు పాల్గొన్నారు. -
మండుటెండలో పనులు
కొందుర్గు: ఉపాధిహామీ కూలీలు మండుటెండలో కూలిపనులు చేస్తున్నారు. మండలంలోని 22 గ్రామపంచాయతీలకు గాను 625 మంది కూలీలు పనులకు వస్తున్నారని ఏపీఓ నర్సింగ్రావు తెలిపారు. అయితే రేగడిచిల్కమర్రి, బైరంపల్లి, ఆగిర్యాల గ్రామాల్లో టెంట్లు లేవు. జిల్లేడ్ చౌదరిగూడ మండలంలోని 24 గ్రామపంచాయతీల్లో 623 మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. చాలా గ్రామాల్లో కూలీలు సేదతీర్చుకోవడానికి టెంట్లు లేవు. ఇక తాగడానికి నీటివసతి, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో లేవు. దీంతో కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. -
వ్యక్తుల అదృశ్యంపై కేసు నమోదు
శంకర్పల్లి: ఓ వ్యక్తి ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిన పోయిన సంఘటన మంగళవారం మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మహారాజ్పేట్ గ్రామానికి చెందిన మోతే పరమేశ్(32) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకి భార్య, ఇద్దరూ కూతుళ్లు ఉన్నారు. సోమవారం సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిన పరమేశ్ రాత్రి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. రేషన్ తీసుకొస్తానని.. పహాడీషరీఫ్: గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ లక్ష్మయ్య మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి సబితా ఇంద్రారెడ్డి కాలనీకి చెందిన మిర్యాల విజయలక్ష్మి(26), రాజు దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. ఈ నెల 20వ తేదీన రేషన్ కార్డు కోసం రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయానికి వెళుతానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ సైతం స్విచ్ఛాప్ ఉంది. కుమార్, బోయ నిఖిల్ అనే ఇద్దరిపై అనుమానం ఉందంటూ భర్త రాజు మంగళవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భారతదేశం ఆధ్యాత్మికతకు నిలయంషాద్నగర్: హిందూ ధర్మరక్షణ కోసం అందరూ కృషి చేయాలని విశ్వహిందూ పరిషత్ క్షేత్ర సంఘటన మంత్రి సత్యం జీ అన్నారు. పట్టణంలోని కేఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో మంగళవారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశం ఆధ్యాత్మికతకు నిలయమని, హిందూ సంస్కృతి ప్రపంచానికి మార్గదర్శకమని అన్నారు. సమాజంలో ఐక్యత, సంస్కృతి పరిరక్షణ కోసం ఆర్ఎస్ఎస్ నిరంతరం పని చేస్తుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి, అందెబాబయ్య, శ్రీవర్ధన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బస్వం, నాయకులు నాగిళ్ల ప్రభాకర్, అశోక్గౌడ్, ప్యాట అశోక్, శ్రీనివాసచారి, చెట్ల వెంకటేశ్, మంగ విజయ్, సుధాకర్, బాల్రెడ్డి, వెంకట్రెడ్డి, భాగ్యవతి, రుషికేష్, కొత్త సతీష్ తదితరులు పాల్గొన్నారు. హిందువులు సంఘటితంగా మెలగాలి కందుకూరు: ప్రపంచానికి శాంతి, సహనం నేర్పిన గొప్ప సంస్కృతి హిందూ ధర్మానిదే అని నిత్య అగ్నిహోత్రి, వేద పాఠశాల ఫౌండర్ చైర్మన్ శశిభూషణ సోమయాజీ అన్నారు. హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు బొక్క సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి మండల కేంద్రంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. సనాత ధర్మాన్ని పాటిస్తూ హిందువులందరూ సంఘటితంగా మెలగాలన్నారు. గురుకులాలను నిలబెట్టుకుని మన పిల్లల్ని భావి పౌరులుగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. వీహెచ్పీ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్, స్వదేశీ జాగరణ మంచ్ ప్రాంత మహిళా ప్రముఖ్ డాక్టర్ కళ్లెం స్వప్న మాట్లాడుతూ.. అందరూ ఏకతాటిపైకి రావాలని, హిందూ ధర్మంతో పాటు కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలన్నారు. చిన్నతనం నుంచే మన సంస్కృతి, సంప్రదాయల గురించి పిల్లలకు నేర్పించాలన్నారు. అంతకుముందు చిన్నారులు హిందూ సంస్కృతి సంప్రదాయాలు తెలిపేలా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. -
నీడ లేదు.. నీళ్లు లేవు
కొడంగల్ రూరల్: మండుటెండలో చెమటోడ్చుతున్న ఉపాధికూలీలకు పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. జాతీయ ఉపాధి హామీ కూలీలకు నిబంధనల ప్రకారం ఆయా ప్రాంతాలలో టెంట్లు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలి. ఇవేమీ లేక పోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని ఉడిమేశ్వరం శివారులో కొనసాగుతున్న ఉపాధి పనుల్లో ఎండ వేడిమి తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో వైద్య సిబ్బంది అందించిన ఓఆర్ఎస్ ప్యాకెట్లను సర్పంచ్ కె.శ్రీనివాస్ ఉపాధికూలీలకు అందిస్తూ జాగ్రత్తలను చెబుతున్నారు. మండల పరిధిలోని అప్పాయిపల్లి శివారులో కొనసాగుతున్న ఉపాధిహామీ పనుల్లో చెరువు పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. ఎండలు మండుతున్న క్రమంలో ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటయ్య, కూలీలు కలిసి కానుగ పొరకతో పని ప్రదేశంలో పందిరి మాదిరి ఏర్పాటు చేసుకుని సేదతీరుతున్నామన్నారు. ఇటీవల సర్పంచ్ బొడ్రాయి వెంకటయ్య, వైద్య సిబ్బంది అందించిన ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఉపాధికూలీలకు అందించారు. ●ఫొటో క్యాప్చర్తో ఇబ్బంది ఉపాధి పనుల్లో ఇటీవల ఉదయం, సాయంత్రం పని ప్రదేశంలో ఫొటో క్యాప్చర్ విధానం అమలు చేస్తున్నారు. దీంతో ఫొటో అప్లోడ్ సమయంలో నెట్వర్క్ పనిచేయకున్నా, సర్వర్ బిజీగా ఉన్నా ఉపాధికూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సరైన ఫోన్లను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – జనార్దన్, ఎఫ్ఏ, ఉడిమేశ్వరం -
అధిక లాభాల ప్రకటనలు నమ్మొద్దు
పహాడీషరీఫ్: రోజు రోజుకూ కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ బి.లక్ష్మీనారాయణ రెడ్డి సూచించారు. జల్పల్లి శ్రీరామ కాలనీలోని సింఘానియా ఫుడ్స్ ఇంటర్నేషనల్ కంపెనీలో కార్మికులకు మంగళవారం సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్లు ముఠాలుగా ఏర్పడి సామాన్యుల పట్ల విరుచుకుపడుతున్నారన్నారు. అమాయకుల పేర్లతో సృష్టిస్తున్న మ్యూల్ అకౌంట్లు ప్రస్తుతం సైబర్ మోసాలకు కేంద్ర బిందువుగా మారాయన్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో వచ్చే అధిక లాభాల ప్రకటనలను నమ్మరాదని సూచించారు. ఏ దర్యాప్తు సంస్థ వీడియో కాల్ ద్వారా విచారణ చేయదని, డబ్బులు అడగడదని, ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో వచ్చే బెదిరింపులకు జంకరాదన్నారు. ఏపీకే ఫైల్స్ లాంటి వాటిని తెరవకూడదని సూచించారు. సెక్స్టార్షన్కు దారితీసే వీడియో కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ మోసానికి గురైతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ
యాచారం: ఎండల తీవ్రత, పనులు చేసే సమయంలో చెమట తీస్తున్న కూలీలకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో వారు పస్తులుండాల్సిన దుస్థితి వస్తుంది. యాచారం మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం నిత్యం 1,500 మంది నుంచి రెండు వేల మంది వరకు కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నారు. కూలీల ఉపశమనం, వడదెబ్బకు గురి కాకుండా ఈజీఎస్ అధికారులు మండల ప్రభుత్వాసుపత్రి నుంచి ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా 500 మంది కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేయడంతో పాటు పనులు చేసే ప్రాంతాల్లో టెంట్లు వేస్తున్నారు. ఎండల తీవ్రతలో ఉపాధి పనులు చేయరాదని ఎంపీడీఓ రాధారాణి నిత్యం ఏదో ఒక గ్రామంలోకి వెళ్లి కూలీల్లో చైతన్యం కల్పిస్తున్నారు. -
న్యాయం జరగక చనిపోయింది
కేశంపేట: తమ భూమికి పొజీషన్ ఇప్పించాలని అధికారుల చుట్టూ 15 ఏళ్లుగా తిరిగిన న్యాయం జరగకపోవడంతో మనస్తాపంతో వెంకటమ్మ మృతి చెందిందని కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షురాలు గన్నారపు సరోజన అన్నారు. మండల పరిధిలోని కాకునూర్ గ్రామానికి చెందిన ఎర్ర వెంకటమ్మ దశదిన కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన సంస్కరణ సభలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ... వెంకటమ్మకు గ్రామ శివారులోని 361/ఇలో 20 గుంటల వ్యవసాయ పొలం ఉందన్నారు. ఆ భూమి ఇతరులు కబ్జాలో ఉందని, విడిపించి న్యాయం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ప్రయోజనం జరగలేదని అన్నారు. దీంతో అనారోగ్యానికి గురైన వెంకటమ్మ మృతి చెందిందని పేర్కొన్నారు. వెంకటమ్మ పేరు పైన ఉన్న పట్టాభూమికి పొజీషన్ చూపించాలని ఎన్ని ఫిర్యాదులు చేసిన ఎవరూ స్పందించలేదని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికై న స్పందించి వెంకటమ్మ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి జాతీయ కన్వీనర్ బండారి లక్ష్మయ్య, రాష్ట్ర కోశాధికారి చక్రవర్తి, రాష్ట్ర కమిటీ సభ్యులు లక్ష్మయ్య, మధు, విలాస్ పాల్గొన్నారు. కేఎన్పీఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు సరోజన -
బుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
కందుకూరు: మండలంలోని ముచ్చర్ల పరిధిలో మంగళవారం ఉపాధిహామీ కూలీలు వాగులో పూడికతీత పనులు చేపట్టారు. మొత్తం 109 మంది కూలీలు పనులకు హాజరయ్యారు. పని చేసే ప్రదేశంలో తాగునీరు, నీడ సౌకర్యం ఏర్పాటు చేయాల్సి ఉన్నా అలాంటివి ఏమీ ఏర్పాటు చేయలేదు. కూలీలే ఇళ్ల వద్ద నుంచి తాగునీరు సీసాల్లో తెచ్చుకున్నారు. మండుటెండలోనే పనులు చేస్తున్నారు. సమీపంలోని చెట్ల నీడనే సేదతీరాల్సిన పరిస్థితి. మరోవైపు పిబ్రవరి 3 నుంచి ఇప్పటి వరకు చేసిన పనులకు సంబంధించిన డబ్బులు బకాయిలు ఉన్నాయని కూలీలు తెలిపారు. సకాలంలో కూలీ డబ్బు రాక ఇబ్బంది పడాల్సి వస్తోందని వాపోయారు. పని ప్రదేశంలో కరువైన సౌకర్యాలు తాగునీరు, నీడ ఏర్పాట్లు నిల్ నిబంధనలు పట్టని అధికారులు ఇబ్బందులు పడుతున్న కూలీలు భానుడు భగభగ మండిపోతున్నాడు.. ఎండలు దంచి కొడుతున్నాయి.. తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది.. బయటికి వెళ్లాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది.. ఉపాధి కూలీలు మాత్రం ఎండలోనే చెమటోడుస్తున్నారు.. పనిచేసే చోట కనీస సౌకర్యాలు కరువయ్యాయి.. పొట్టకూటి కోసం అవస్థలు పడుతున్నారు.. ఎండలోనే పనులు చేయాలి. కనీసం టెంట్ లేదు, నీళ్లు కూడా లేవు. ఇంటి నుంచే నీళ్లు తెచ్చుకుంటున్నాం. రెండుసార్లు హాజరు కోసం ఫొటోలు తీస్తున్నారు. ఒక్కోసారి రావడంలేదు, ఇబ్బందిగా ఉంది. వాటిని తొలగించాలి. మూడు నెలల నుంచి కూలీ డబ్బు ఇవ్వడం లేదు. వారం వారం అందేలా చూడాలి. – తేరటి పార్వతమ్మ, ఉపాధి కూలీ, ముచ్చర్ల -
పంచాయతీల్లో డీపీఓ ఆకస్మిక తనిఖీ
షాద్నగర్రూరల్: మహిళాసంఘం భవన నిర్మాణానికి గ్రామంలో కేటాయించిన స్థలాన్ని పరిశీలన చేయాలని డీపీఓ సురేష్మెహన్ ఎంపీఓ జయంత్రెడ్డిని ఆదేశించారు. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని హజిపల్లి, ఎలికట్ట పంచాయతీలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయం, డంపింగ్యార్డు, శ్మశానవాటికలను పరిశీలించారు. ఎలికట్టలో మహిళాసంఘం భవనానికి అధికారులు స్థలాన్ని కేటాయించారని, కొందరు గ్రామస్తులు భవనం కట్టకుండా అడ్డుకుంటున్నారని మహిళాసంఘం సభ్యులు ఈ నెల 16న నిర్వహించిన మండలస్థాయి సమావేశానికి హాజరైన పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ దివ్యదేవరాజన్ దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన ఆమె సమస్యను పరిష్కరించాలని అక్కడే ఉన్న డీపీఓ, ఎంపీడీఓ బన్సీలాల్ను ఆదేశించారు. ఈ క్రమంలో ఎలికట్టను సందర్శించిన డీపీఓ సురేష్మోహన్ మహిళాసంఘం భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించి త్వరలోనే నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీఓకు సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు తేజస్విని, అనూష, కారోబార్ శివ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు తీర్చాలి
షాద్నగర్రూరూల్: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర నాయకుడు స్వాములయ్య డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట మంగళవారం గేట్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ చేపట్టాలని, చట్ట వ్యతిరేక డ్యూటీలను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కారుణ్య నియామకాల్లో వచ్చిన కండక్టర్లను ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులరైజ్ చేయాలని, కార్మిక యూనియన్లను పునరుద్ధరించాలని కోరారు. 2017కు సంబంధించిన ఎరియర్స్ను వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిపో జేఏసీ నాయకులు నర్సింలు, అర్జున్కుమార్, తిరుపతయ్య, రాజు, సత్తయ్య, కేడీఎస్ కుమారి, లక్ష్మి, మహేశ్, రవికుమార్, ఎండీ హైమత్, వైఎల్ఎస్ రావు, నర్సింలు, శ్రీనివాసులు, చెన్నయ్య, రఫీక్, శ్రీను, యాదయ్య, గోపాల్, శంకర్, రాజశేఖర్, నరేష్, శ్రీనివాసులు, బాలీశ్వర్, శ్రీరాములు, వెంకటేశ్ పాల్గొన్నారు. ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర నాయకుడు స్వాములయ్య -
చెరవులు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: కొంతమంది రియల్టర్ల ధనదాహానికి జిల్లాలోని చెరువులు, కుంటలు, వరద కాల్వలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. నిండుకుండలను తలపించాల్సినవి అక్రమార్కుల చేతుల్లో చిక్కి వట్టిపోతున్నాయి. పశు పక్షాదులు, జలచరాలతో కళకళలాడాల్సినవి బుల్డోజర్లు, జేసీబీలతో ధ్వంసం అవుతున్నాయి. నీటి వనరుల ఆనవాళ్లు కన్పించకుండా మట్టితో పూడ్చేస్తున్నారు. హైడ్రా చెరువు హద్దులు ఫిక్స్ చేసినా.. ఆక్రమణలు మాత్రం ఆగడం లేదు. శిఖం భూముల్లో ప్లాట్లు, భారీ విల్లాలు వెలుస్తూనే ఉన్నాయి. ఆదిబట్ల సర్వీసు రోడ్డులో భూములు కోల్పోయిన రైతులు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కూడా తీసుకున్నారు. తర్వాత చెరువు భూమిని పట్టా భూమిగా చూపించి రియల్టర్లకు అంటగట్టారు. వారు అధికారులకు ముడుపులు ముట్టజెప్పి శిఖం భూముల్లో వెంచర్ల ఏర్పాటుకు యత్నిస్తున్నారు. కంచే చేనుమేసినట్లు.. కలెక్టర్, అదనపు కలెక్టర్లు మొదలు రెవెన్యూ, ఇరిగేషన్, ఇతర శాఖల ఉన్నతాధికారులంతా నిత్యం ఔటర్ నుంచే రాకపోకలు సాగిస్తుంటా రు. ఆదిబట్ల ఔటర్రింగ్రోడ్డుకు ఆనుకుని ఉన్న చెరువులు, కుంటల్లో ఎత్తయిన బ్లూషీట్స్.. వెంచర్లు వెలుస్తున్నా, కళ్లముందే కబ్జా అవుతున్నా.. కట్టలు, కాల్వలు ధ్వంసం అవుతున్నా.. సర్వీసు రోడ్డు నుంచి వెంచర్లోకి అక్రమంగా బీటీ రోడ్డు వేసినా పట్టించుకోలేదు. కంచే చేను మేసినట్లు జిల్లా అధికార యంత్రాంగమే.. అక్రమార్కులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మచ్చుకు కొన్ని ఆక్రమణలు ● మాడ్గుల మండలం గిరికొత్తపల్లి, అప్పారెడ్డి గ్రామాల్లోని చెరువుల్లో ఆక్రమణలు ఆగడంలేదు. కొంతమంది రియల్టర్లు శిఖం భూములు కొనుగోలు చేసి తూములను ధ్వంసం చేశారు. చెరువులను కాపాడాలని కోరుతూ గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అయినా ఆక్రమణల విధ్వంసం మాత్రం ఆగలేదు. ● ఇబ్రహీంపట్నం మండలం రాందాస్పల్లి రెవెన్యూ మర్రిగూడంకుంట కట్టపై కొంతమంది రియల్టర్లు కన్నేశారు. రాత్రి పగలు తేడా లేకుండా జేసీబీలు పెట్టి చదును చేశారు. కట్ట ఆనవాళ్లు లేకుండా చేశారు. ● కొంగరతండా సమీపంలోని దాతూర్కుంట కట్టను ధ్వంసం చేశారు. కట్ట ఉన్న 4.20 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. కళ్లముందే విధ్వంసం జరుగుతున్నా పట్టించుకున్న నాథుడు లేడు. ● రావిర్యాల నుంచి కొంగర వెళ్లే మార్గంలో ఓ కన్వెన్షన్ నిర్వాహకులు ఏకంగా పులిందర్వాగును కబ్జా చేశారు. వాగుకు అడ్డుగా మట్టిపోసి చిన్న పైపులు వేశారు. ఆగని ఆక్రమణల పర్వం శిఖం భూముల్లో వెంచర్లు కట్టలు, అలుగులు ధ్వంసం ఆనవాళ్లు కోల్పోతున్న తటాకాలు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు ఇది ఆదిబట్ల ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుకు ఆనుకుని ఉన్న జిలాల్ఖాన్ చెరువు. సర్వే నంబర్ 123,124,125,434,439,44,441,442,444లలో 24.32 ఎకరాల విస్తీర్ణంలో ఫుల్ట్యాంక్ లెవల్ విస్తరించి ఉంది. కొంత మంది రియల్టర్లు ఇక్కడ భారీ వెంచర్కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే సర్వీసు రోడ్డు నుంచి వెంచర్లోకి బీటీ రోడ్డు, చుట్టూ బ్లూషీట్స్ వేశారు. టిప్పర్ల కొద్ది మట్టిని తెచ్చి చెరువు శిఖాన్ని చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు. మహేశ్వరం నుంచి తుమ్మలూరు వెళ్లే మార్గంలో ఊరచెరువు ఉంది. అలుగు కింది భాగంలోని తరిపొలంలో ఓ రియల్టర్ వెంచర్ చేస్తున్నారు. నిత్యం వరదలు ముంచెత్తే లోతట్టు ప్రాంతాల్లో వెంచర్ ఏర్పాటుకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసీలు ఎలా జారీ చేశారో మరి. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. అక్రమ వెంచర్లకు తప్పుడు ఎన్ఓసీలు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. – ఎల్మ మోహన్రెడ్డి, మహేశ్వరం -
డిప్లమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
ఇబ్రహీంపట్నం రూరల్: సీ్త్ర, శిశు దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాలల్లో పలు డిప్లమా కోర్సులను అందివ్వనున్నట్లు జిల్లా సంక్షేమాధికారి శ్రీలత మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సివిల్ ఇంజినీరింగ్ (డీసీఈ), ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (డీఈఈఈ), కంప్యూటర్ ఇంజినీరింగ్ (డీసీఎంఈ), ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (డీఈసీఈ)లో డిప్లమా కోర్సులు చేయడానికి 60 సీట్లు ఉంటాయని తెలిపారు. ఇందులో అనాథలు, పాక్షిక అనాథలు, పేదవారు, ట్రాఫికింగ్కు గురైన అమ్మాయిలు, బాలికా సంరక్షణ కేంద్రంలోని అమ్మాయిల కోసం 70 శాతం సీట్లు (ఒక్కో కోర్సులో 42 సీట్లు) కేటాయించినట్టు చెప్పారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం 3 శాతం దివ్యాంగులకు కేటాయించబడతాయన్నారు. తెలంగాణ పాలిసెట్ పరీక్ష రాయకపోయినా పదో తరగతి ఉత్తీర్ణులైనవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వచ్చేనెల 25వ తేదీ లోపు కుల, ఆదాయ, బర్త్ సర్టిఫికెట్, బోనఫైడ్, టీసీ, స్టడీ సర్టిఫికెట్స్, పదో తరగతి మెమో అప్లికేషన్ ఫామ్తో జత చేసి జిల్లాలోని బాలరక్ష భవన్ సమర్పించాలని సూచించారు. ఆమనగల్లు: తలకొండపల్లి మండలం వెల్జాలలో వెలసిన శ్రీ వేదాద్రి లక్ష్మీ నర్సింహాస్వామి ఆలయాన్ని మంగళవారం టూరిజం శాఖ ఇంజనీరింగ్ అధికారులు సందర్శించారు. ఆలయాభివృద్ధి కోసం టూరిజం శాఖ నుంచి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రూ.మూడు కోట్లు మంజూరు చేయించారు. దీంతో చేపట్టాల్సిన పనుల గుర్తింపు కోసం టూరిజం శాఖ డీఈ హనుమంతరెడ్డి, ఏఈ నితీశ్, ఆర్కిటెక్చర్ గణేశ్ తదితరులు ఆలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శ్రీనివాసమూర్తితో చర్చించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకట్రెడ్డి, సింగిల్విండో మాజీ చైర్మన్ అంజయ్యగౌడ్, నాయకులు నర్సింలు, అజీజ్, విష్ణువర్ధన్యాదవ్, ఆరీఫ్, అశోక్బాబు, శ్రీనివాస్గౌడ్, వడ్డె రాజు తదతరులు పాల్గొన్నారు. షాబాద్: తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర ప్లీనరీని విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె వినయ్కుమార్, జిల్లా అధ్యక్షుడు ధార సత్యం పిలుపునిచ్చారు. మండల పరిధిలోని నాగర్గూడలో మంగళవారం పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి నాగని రామకృష్ణ (ఆర్కే) ఆధ్వర్యంలో నాగర్గూడ కూడలిలో వాల్పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వాన్ని గుర్తు చేశారు. మే 12న హైదరాబాద్ జలవిహార్లో నిర్వహించే రాష్ట్ర ప్లీనరీకి తెలంగాణ ఉద్యమ కారులంతా కలిసి రావాలని కోరారు. ప్లీనరీలో రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై చర్చించి, భవిష్కత్ కార్యాచరణ రూపొందించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త రవి, కో–ఆర్డినేటర్ శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మొయినాబాద్: 108 అంబులెన్స్ను ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంచాలని జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జాన్ షాహిద్ అన్నారు. మొయినాబాద్లోని 108 అంబులెన్స్ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. వాహనంలో ఉండాల్సిన అన్ని మెడిసిన్, ఇతర వస్తువుల స్టాక్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అత్యవసర సమయంలో 108 సిబ్బంది, అంబులెన్స్తో సహా అందుబాటులో ఉండాలన్నారు. సమాచారం అందిన వెంటనే స్పందించాలని 108 సిబ్బంది ఈఎంటీ శ్యామప్ప, పైలెట్ రాజేష్కు సూచించారు. -
పౌష్టికాహారంపై అవగాహన
షాద్నగర్: ప్రతి ఒక్కరూ పౌష్టిక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు సూచించారు. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల పరిధిలోని చించోడ్ పీహెచ్సీలో పౌష్టికాహారం, వడదెబ్బ నుంచి రక్షణపై మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు వ్యాధుల బారిన పడకుండా ముందస్తుగా పరీక్షలు నిర్వహించి తగిన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. మహిళలకు ఉచిత వైద్య సేవలు, మందులు అందజేస్తున్నట్లు చెప్పారు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే సమీపంలోని వైద్యశాలను సంప్రదించాలన్నారు. రోజురోజుకూ ఎండలు పెరిగిపోతున్న నేపథ్యంలో వడదెబ్బ తగిలే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
దైవ దర్శనానికి వెళ్తూ.. మృత్యు ఒడికి
● బైక్ను ఢీకొట్టిన డీసీఎం ● తండ్రీకొడుకుల దుర్మరణం ● తల్లీకూతురుకు తీవ్ర గాయాలు ● వండర్లా వద్ద ప్రమాదం ఇబ్రహీంపట్నం రూరల్: మొక్కు తీర్చుకునేందుకు ఆలయానికి వెళ్తున్న ఓ కుటుంబంపై మృత్యువు పంజా విసిరింది. ఈ ఘటనలో తండ్రీకొడుకులు చనిపోగా, తల్లీకూతురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదిబట్ల సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. సాహెబ్గూడ ప్రాంతంలో నివాసం ఉండే కొమ్మగోని ప్రశాంత్గౌడ్ విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం ఉదయం భార్య వాణి, కుమారుడు శ్రీతన్, కూతురు శశికళతో కలిసి మొక్కు తీర్చుకునేందుకు బైక్పై రావిర్యాల సమీపంలోని సూర్యగిరి ఎల్లమ్మ ఆలయానికి వెళ్తున్నారు. వండర్లా వద్దకు రాగానే వెనక నుంచి వచ్చిన ఓ డీసీఎం వీరిని ఢీకొట్టింది. బైక్పై ముందు కూర్చున్న శ్రీతన్ ఎగిరి కొద్ది దూరంలో పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. రోడ్డు పక్కన పడిపోయిన ప్రశాంత్గౌడ్ (41) రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే ప్రాణం వదిలాడు. వాణి (38)కి కాలు విరిగిపోగా, శశికళ (10) సైతం గాయాలపాలైంది. కొన ఊపిరితో ఉన్న శ్రీతన్ (11) అస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. తల్లీకూతుళ్లను మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. తండ్రీకుమారుడి మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. -
నిబంధనలకు తిలోదకాలు
షాద్నగర్: నిబంధనల ప్రకారం పని ప్రదేశాల్లో కనీస వసతులు కల్పించాలి. కూలీలకు నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయడంతో పాటు మెడికల్ కిట్లు, తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి. కొన్ని గ్రామాల్లో మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచుతున్నా.. చాలా గ్రామాల్లో అవి కనిపించడం లేదు. నీడ సౌకర్యం లేకపోవడంతో కూలీలు చెట్ల కిందనే సేద తీరుతున్నారు. గతంలో వేసవిలో చాలా మంది కూలీలు వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటనలు ఉన్నాయి. పని ప్రదేశాల్లో తాగునీరు సరిపడా లేకపోవడంతో నీరసం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఎండలతో చర్మ సమస్యలు, అలసట, తలనొప్పి వంటివి ఎదురవుతున్నాయి. ఎండ రోజురోజుకూ మండిపోతోంది. పని ప్రదేశాల్లో నీడ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి టెంటు ఏర్పాటు చేయాలి. తాగునీరు అందించాలి. – భిక్షపతి, కూలీ, పాపిరెడ్డిగూడ, కేశంపేట మండలం -
విద్యుదాఘాతంతో రైతు మృతి
చేవెళ్ల: విద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన ఘటన మంగళవారం కౌకుంట్లలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎండీ ఫయాజ్ (32) తనకున్న ఎకరం పొలంతోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని అన్నదమ్ములతో కలిసి ఉమ్మడి వ్యసాయం చేస్తూ జీవిస్తున్నారు. ఈక్రమంలో వారం రోజులుగా చేతికి వచ్చిన క్యారెట్ పంటను తీస్తున్నారు. రోజూ మాదిరిగానే పొలంలో నుంచి తీసిన క్యారెట్ను మిషన్లో వేసి కడుగుతుండగా ఫయాజ్ విద్యుత్ షాక్కు గురై పడిపోయాడు. అక్కడే ఉన్న సోదరులు కరెంటు సరఫరా ఆపేసి వెంటనే చేవెళ్ల ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య నస్రీన్బేగం, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ మల్లారెడ్డి, గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు. -
నిర్లక్ష్యపు నిప్పు
గచ్చిబౌలి టీఎన్జీవోస్ జేవీ ప్లాజాలో అగ్నిప్రమాదం ● ప్యానల్ బోర్డులో షార్ట్సర్క్యూట్ ● 24 ఫ్లాట్లు.. ఫైర్ సేఫ్టీ శూన్యం ● సాఫ్ట్వేర్ ఇంజనీర్కు 90% గాయాలు ● పది మందికి తీవ్ర అస్వస్థత, బైక్లు దగ్ధంగచ్చిబౌలి: సెట్ బ్యాక్స్ లేవు.. ఫైర్ సేఫ్టీ శూన్యం..! ఫలితం.. ఓ నిండు ప్రాణం ప్రమాదంలో పడింది. మరో 10 మందికి తీవ్ర అస్వస్థత! 10 బైక్లు బూడిదయ్యాయి. ఇదీ.. గచ్చిబౌలి టీఎన్జీవోస్ కాలనీలోని జేవీ ప్లాజా అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం పర్యవసానం. డీఐ పి.నరేష్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... సోమవారం ఉదయం జేవీ ప్లాజా సెల్లార్లోని ప్యానల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్తో సోఫాకు మంటలు అంటుకున్నాయి. వాచ్మేన్ నజీర్ అపార్ట్మెంట్ లోనివారిని అప్రమత్తం చేశాడు. ఈలోగా బైక్లకు మంటలు అంటుకున్నాయి. మొదటి అంతస్తుకు వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్మేసింది. మాదాపూర్, వట్టినాగులపల్లి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా, అగ్ని ప్రమాదంలో ఏపీలోని కృష్ణా జిల్లా గుడ్లవల్లూరు మండలం చిన్న గొన్నూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాజుల రాజశేఖర్బాబు (25) శరీరం 90 శాతం కాలిపోయింది. ఇతడు జేవీ ప్లాజా ఫ్లాట్ నంబర్ 202లో ఉంటూ ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాడు. రాజశేఖర్కు కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు తెలిసింది. తీవ్ర అస్వస్థతకు గురైన డాక్టర్ అమూల్య (34), ప్రణీత్ (22), హర్షిల, పంకజ్ జిందాల్ (37), సోనమ్జాడోన్ (35), శిల్పా పాండే (24), ఆది పవన్ కుమార్ (25), అరివ్ కే తన్ (7 నెలలు), రాజేష్ (24), వెంకట్ (25) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సైబరాబాద్ కమిషనర్ డాక్టర్ రమేష్ పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. గదులలో ఉన్న 16 మందిని కాపాడారు. రీజనల్ ఫైర్ ఆఫీసర్ హరినాథ్రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. నో ఫైర్ సేఫ్టీ సుమిత్రెడ్డికి చెందిన జేవీ ప్లాజాలో 24 ఫ్లాట్స్ ఉన్నాయి. 8 డబుల్, 8 సింగిల్ బెడ్రూమ్స్ కాగా, 8 సింగిల్ రూమ్స్ అద్దెకిచ్చారు. రాజేందర్రెడ్డి ఈ అపార్ట్మెంట్ను లీజుకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నెలకు రూ.5 లక్షలకు పైగానే అద్దె వసూలు చేస్తున్నా ఫైర్ సేఫ్టీ పాటించడం లేదు. -
ఇన్చార్జిల చేతిలోకీ
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ముఖ్యమైన శాఖలకు జిల్లాలో రెగ్యులర్ ఉన్నతాధికారులు కరువయ్యారు. ఒక్కో అధి కారికి రెండు మూడు శాఖల బాధ్యతలు అప్పగిస్తుండడంతో పరిపాలన కుంటుపడుతోంది. సంక్షే మ పథకాల అమల్లోనూ అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న అధికారి ఏరోజు ఏ ఆఫీసుకు వెళ్తున్నారో.. ఏ సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహిస్తున్నారో తెలియని పరిస్థితి. ఏదైనా సమస్య పరిష్కారం కోసం సగటు వ్యక్తి సంబంధిత ఆఫీసుకు వెళ్లి ఆరా తీస్తే.. అక్కడి అటెండర్ల నుంచి సార్/ మేడం ఫీల్డ్ విజిట్లో ఉన్నారన్న సమాధానం వస్తోంది. రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా సంబంధిత అధికారులు కన్పించకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. పరి పాలనలో పారదర్శకత, సత్వర సేవలు అందాల్సిన చోట ఆరోపణలు మూటగట్టుకోవాల్సి వస్తోంది. సమస్యల వెల్లువ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పోస్టు ఏడాదికిపైగా ఇన్చార్జి గుప్పిట్లోనే మగ్గుతోంది. ఇప్పటి వరకు ఇక్కడ అదనపు కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రతిమాసింగ్ కొంతకాలం మెటర్నిటీ లీవ్లో వెళ్లారు. ఆ పోస్టులో యూఎల్సీ ఎస్డీసీ శ్రీనివాస్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. మెటర్నిటీ లీవ్ ముగియడంతో సుదీర్ఘకాలం తర్వాత ఫిబ్రవరి 20న తిరిగి విధుల్లో చేరిన ఆమె వెంటనే కలెక్టర్గా పదోన్నతిపై వెళ్లిపోయారు. ఈ పోస్టు మళ్లీ ఖాళీ అయింది. అప్పటి వరకు ఇన్చార్జిగా వ్యవహరించిన శ్రీనివాస్కే మళ్లీ బాధ్యతలు అప్పగించారు. పంచాయతీలు, మున్సిపాలిటీలు, ప్రభుత్వ సంక్షే మ పథకాల అమలు తీరు తెన్నులతో పాటు విద్య, వైద్యం, సంక్షేమ హాస్టళ్ల పని తీరును పర్యవేక్షించే కీలక విభాగానికి రెగ్యులర్ అధికారి లేక ఇబ్బందిగా మారింది. సంక్షేమ హాస్టళ్లలో తలెత్తుతున్న సమస్యలు, మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలు, టౌన్ప్లానింగ్లో అక్రమార్కులపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. సీ్త్ర, శిశు వికాసం ఏదీ ? సీ్త్ర, శిశు వికాస, దివ్యాంగుల సంక్షేమశాఖ అధికారి పోస్టు ఏడాదిగా ఖాళీగా ఉంది. డీఆర్డీఏ పీడీ శ్రీలతకు ఈ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. 1,602 అంగన్వాడీ కేంద్రాలు సహా వీటి ద్వారా 20,030 మంది గర్భిణులు, బాలింతలు, 79,817 మంది ఆరేళ్లలోపు పిల్లలకు సంపూర్ణ పోషకాహారం, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాలు ఈ శాఖ పర్యవేక్షణలోనే కొనసాగుతుంటాయి. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటివేస్తున్న కేసులు కూడా ఈ విభాగమే చూస్తోంది. దివ్యాంగుల సంక్షేమం సైతం పర్యవేక్షించాల్సి ఉంది. ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రాల పనితీరును కూడా ఈ విభాగం పర్యవేక్షిస్తుంది. ఇలాంటి కీలక విభాగం ప్రాజెక్ట్ డైరెక్టర్ పోస్టు ఇన్చార్జి గుప్పిట్లో మగ్గుతోంది. కీలక అధికారి లేకపోవడంతో క్షేత్రస్థాయి సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా తయారైంది. కొరవడిన ‘ప్రజా సంబంధాలు’ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత జిల్లా ప్రజా సంబంధాల విభాగంపై ఉంది. ఇక్కడ డీపీఆర్ఓగా పని చేసిన వెంకటేశం నాలుగు నెలల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. అప్పటి నుంచి ఈ బాధ్యతలను అడిషినల్ పీఆర్ఓకు అప్పగించారు. కలెక్టర్ వివిధశాఖలతో నిర్వహించే సమీక్ష సమావేశాలు, ప్రకటనల జారీ కీలకంగా వ్యవహరించాల్సిన ఈ విభాగం ఇన్చార్జిల పాలనలో కొనసాగు తోంది. ఇక్కడ పని చేస్తున్న వారికి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై సరైన అవగాహన లేదు. దీనికి తోడు ఇతర శాఖల ఉన్నతాధికారులతో సమన్వయ లేమి కారణంగా ఆశించిన లక్ష్యం నెరవేరకుండా పోతోంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టాల్సిన ప్రజా సంబంధాల విభాగం అటు జిల్లా ఉన్నతాధికారులకు, ఇటు మీడియా ప్రతినిధులకు దూరమవుతోందనే విమర్శ సైతం లేక పోలేదు. డీఆర్ లేక డీలా జిల్లాలో 22 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉన్నాయి. ఒక్కో ఎస్ఆర్ఓ పరిధిలో రోజుకు సగటున 50 నుంచి 60 ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చి పెట్టే రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ విభాగానికి రెగ్యులర్ అధికారి లేకపోవడం ఇబ్బందిగా మారింది. పర్యవేక్షణ లోపం కారణంగా ఇప్పటి వరకు జిల్లా రిజిస్ట్రార్గా పని చేసిన సంతోష్పై ప్రభుత్వం బదిలీవేటు వేసింది. ఆయన స్థానంలో డీఐజీ స్థాయి అధికారికి అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. కీలకమైన ఈ విభాగానికి రెగ్యులర్ అధికారి లేకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కిందిస్థాయిలోని ఎస్ఆర్ఓ కార్యాలయాల్లో పని చేస్తున్న సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన శాఖలన్నింటికీ అదనపు అధికారులే గతి -
సమ్మర్ కోచింగ్కు ఆహ్వానం
హుడాకాంప్లెక్స్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, జిల్లా యువజన, క్రీడల అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి సమ్మర్ కోచింగ్ నిర్వహించనున్నట్టు జిల్లా యువజన క్రీడల అధికారి ఎస్. స్వర్ణలత సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో శిక్షణ ఉంటుందని తెలిపారు. బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్స్, క్రికెట్, స్విమ్మింగ్, స్కేటింగ్, బాస్కెట్బాల్, లాన్టెన్నిస్, అథ్లెటిక్స్, వాలీబాల్, బాక్సింగ్, కబడ్డీ, కరాటే, టేబుల్టెన్నిస్ క్రీడా విభాగాల్లో శిక్షణ ఉంటుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు, అనుభవజ్ఞులైన కోచ్లతో క్రీడల్లో నైపుణ్యాలు నేర్పించనున్నట్టు చెప్పారు. వివరాలకు స్టేడియంలో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటలకు సంప్రదించాలని సూచించారు. అడ్మిషన్ కోసం రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు, ఆధార్కార్డు, బర్త్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తిగలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జనగణన పక్కాగా నిర్వహించాలి చేవెళ్ల: జాతీయ జనగణనను పక్కగా, పారదర్శకంగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని వివేకానంద కళాశాలలో జనగణన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు జరుగుతున్న శిక్షణ తరగతులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో అత్యంత కీలక ప్రక్రియ అయిన జనగణనను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ మండలాలు, మున్సిపాలిటీల వారీగా సర్వేలో పా ల్గొనే ఉద్యోగులకు శిక్షణ కొనసాగుతున్నట్టు పే ర్కొన్నారు. సర్వే సమయంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలా ఎదుర్కోవాలి.. ఎలా పరిష్కరించాలనే విషయాలను తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఆయన వెంట చేవెళ్ల మున్సి పల్ క మిషనర్ వెంకటేశం, మాస్టర్ ట్రైనర్లు శివరాం, విజయ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఆ కళాశాలపై చర్యలు తీసుకోండి ఇబ్రహీంపట్నం: విద్యార్థి మరణానికి కారణమైన శేరిగూడలోని శ్రీ ఇందు కళాశాల గుర్తింపు రద్దు చేసి, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఫీజు చెల్లించాలని వేధింపులకు గురిచేయడంతో బీటెక్ థర్డ్ ఇయర్ విద్యార్థి ప్రణిత్ తీవ్ర మనస్తాపానికి గురై ఆదివారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సోమవారం కళాశాల ఎదుట ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్ నేతలు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి వదలిపెట్టారు. సింగూర్, మంజీరా నీటి సరఫరాకు అంతరాయం సాక్షి,సిటీబ్యూరో: నగరవాసుల గొంతు తడుపుతున్న సింగూర్, మంజీరా జలాశయాల నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పంప్హౌస్లు ఉన్న ప్రాంతాల్లో గాలి, దుమారానికి చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడుతుండటంతో పంపింగ్ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని జలమండలి ఒక ప్రకటనలో తెల్పింది. కనీసం 15 నుంచి 30 నిమిషాలపాటు కొనసాగే స్వల్పకాలిక విద్యుత్ అంతరాయాలు కూడా మంజీరా పంపింగ్ స్టేషన్ల కార్యకలాపాలను గణనీయంగా దెబ్బతీస్తున్నాయని పేర్కొంది. ఆదివారం జరిగిన విద్యుత్ అంతరాయం కారణంగా సుమారు 7 గంటలపాటు పంపింగ్ నిలిచిపోయినట్లు తెలిపింది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రభావిత ప్రాంతాలకు నీటి సరఫరాను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు జలమండలి స్పష్టం చేసింది. -
రూపురేఖలు మారుస్తాం
అనంతగిరి: అనంతగిరిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని, ఎకో టూరిజంతో రూపురేఖలు మారబోతున్నాయని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. సోమవారం అనంతగిరి గుట్టలో అర్బన్ పార్క్, వాచ్ టవర్, అనంతగిరి పర్యావరణ పట్టణ ఉద్యాన వనం పనులను.. అటవీ అతిథి గృహంలో డెక్కన్ వుడ్స్ అండ్ ట్రైల్స్ దీ బ్రీజ్ను అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ డాక్టర్ సి.సువర్ణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనంతగిరులను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. దీంతో యువతకు ఉపాధి అవకా శాలు లభిస్తాయని పేర్కొన్నారు. అనంతగిరి కొండల్లో వివిధ ఔషధ గుణాలున్న చెట్లు ఉన్నందున పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం మూసీ నది జన్మస్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ సునీత భగవత్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (చార్మినార్ సర్కిల్) ప్రియాంక వర్గీస్, టూరిజం వింగ్ డైరెక్టర్ రంజిత్ నాయక్, కలెక్టర్ దీపక్ తివారి, వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య, డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్, డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
బీజేపీ ద్వంద్వ వైఖరి వీడాలి
వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ తాండూరు: మహిళా బిల్లు ఆమోదం కాకుండా బీజేపీ కుట్ర చేసి నెపం కాంగ్రెస్ పార్టీపై మోపుతోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్ ధ్వజమెత్తారు. సోమవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మహిళా బిల్లులో డీ లిమిటేషన్ బిల్లును కలిపి పెట్టడంతో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు 2023లోనే పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఆమోదం తెలిపిందన్నారు. 2026 –27లో జరిగే జనగణన తర్వాత మహిళా బిల్లు అమలు చేస్తామన్నారు. 2011 జనగణన ప్రకారం డీ లిమిటేషన్ చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్రం తీరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కారణంగానే బిల్లును వ్యతిరేకించినట్లు వివరించారు. బీజేపీ నాయకులు మాత్రం మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లు పెడితే కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా ఆమోదం తెలుపుతుందన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింహులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు శోభారాణి, కావలి సంతోష్, అధికార ప్రతినిధి కలాల్ చంద్రశేకర్, పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు గాజుల మాధవి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్కు ఆ స్థాయి లేదు ధారూరు: ప్రజలు బీఆర్ఎస్ను నమ్మి రెండు సార్లు అధికారం కట్టబెడితే కుంభకోణాలతో కోట్లు దోచుకున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్ ఆరోపించారు. ఇలాంటి పార్టీకి కాంగ్రెస్ను విమర్శించే స్థాయి లేదని హితవు పలికారు. సోమవారం మండలంలోని ఎబ్బనూర్, అల్లిపూర్, హరిదాస్పల్లి, చింతకుంట, స్టేషన్ధారూరులో పార్టీ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నాయకులు భూ కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. భూముల వివరాల్లో కాస్తు కాలం తొలగించి ఏళ్ల తరబడి అనుభవిస్తున్న పేదల పొలాలను కొల్లగొట్టారని విమర్శించారు. ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని ఆరోపించారు. రోడ్లు ధ్వంసమైనా పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రజలకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ వచ్చాక అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. అది చూసి ఓర్వలేక అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు మాన్సింగ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, పార్టీ జిల్లా కమిటీ కార్యదర్శి మహ్మద్ బాబాఖాన్, సోషల్ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి చామల రఘుపతిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాములు, నాయకులు హరిచంద్, బుజ్జయ్యగౌడ్, తిరుపతయ్య, హన్మయ్య, రాజేందర్రెడ్డి పాల్గొన్నారు. -
జనగణన శిక్షణ కేంద్రం పరిశీలన
హుడాకాంప్లెక్స్: సరూర్నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న జనగణన శిక్షణ కేంద్రాన్ని సోమవారం జనగణన కార్యకలాపాల డైరెక్టరేట్ డైరెక్టర్ భారతి హోళికేరి సందర్శించారు. ఆమెకు సరూర్నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాస్ స్వాగతం పలికారు. అనంతరం ఆమె అక్కడ ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు జరుగుతున్న శిక్షణ తరగతులను పర్యవేక్షించారు. ట్రైనింగ్పై వారిని అడిగి తెలుసుకున్నారు. 90 ఎకరాల్లో మామిడి పంటకు నష్టం ఇబ్రహీంపట్నం రూరల్: అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వానికి నివేదికలు పంపుతామని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఉద్యానవన శాఖ అధికారి నవీన తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలంలోని తులేకలాన్లో నష్టపోయిన మామిడి తోటలను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 90ఎకరాల్లో రైతు లు పంట నష్టపోయాయని, కాత పూర్తిగా రాలిపోయిందని చెప్పారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్చైర్మన్ రవీందర్రెడ్డి పాల్గొన్నారు. -
ఆటోను ఢీ కొట్టిన కారు
మూడేళ్ల బాలుడు దుర్మరణం శంకర్పల్లి: ఓ కారు డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త కారణంగా మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ హృదయ విదారక ఘటన సోమవారం శంకర్పల్లి ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ముదస్సర్ అలీ తెలిపిన ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కొల్లూరు ఇంద్రారెడ్డి నగర్కి చెందిన మల్లేశ్(38), తన కుమారుడు ప్రదీప్(3), బావమరిది రాజుతో కలిసి వ్యక్తిగత పనుల నిమిత్తం టాటా గూడ్సు ఆటోలో శంకర్పల్లికి ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో ఆటో శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని బుల్కాపూర్ రాఘవేంద్రస్వామి ఆలయం సమీపంలో ఉండగా.. మండల పరిధిలోని కొండకల్ గ్రామానికి చెందిన గట్టు ప్రభాకర్ అతివేగం, అజాగ్రత్తగా కారుతో ఆటోని ఓవర్టెక్ చేయబోయి బలంగా ఢీ కొట్టాడు. దీంతో ఆటోలోని వారంతా కింద పడ్డారు. ఈ ప్రమాదంలో మూడేళ్ల ప్రదీప్ అక్కడికక్కడే మృతి చెందగా.. మల్లేశ్, రాజు, కారు డ్రైవర్ ప్రభాకర్ గాయపడ్డారు. క్షతగాత్రులను నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బీఆర్ఎస్ నేతలు విషప్రచారం మానుకోవాలి
● శ్రీనివాస్గౌడ్కు పచ్చని పంటలు కనిపించలేదా ● విమర్శలు మానుకోకపోతే బుద్ధి చెప్తాం ● పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్గౌడ్ ఆమనగల్లు: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు విషప్రచారాలు సాగిస్తున్నారని పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. సోమవారం ఆయన పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏఎంసీ చైర్పర్సన్ యాట గీత, మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహతో కలిసి విలేకరులతో మాట్లాడారు.. ప్రభుత్వ తోడ్పాటుతో ప్రజలు సంతోషంగా ఉండడాన్ని చూసి బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్కు పచ్చని పంటలు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు విమర్శలు మానుకోకపోతే ప్రజలే బుద్ది చెప్తారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, సన్న వడ్లకు రూ.500 బోనస్, సకాలంలో ఎరువులు, విత్తనాలు సరఫరా, వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా కరెంట్ అందిస్తున్నామని ఆయన వివరించారు. తలకొండపల్లి మండలం వెల్జాల గ్రామానికి వచ్చిన మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ రోడ్డు పక్కన ఓ రైతు వ్యక్తిగత కారణాలతో పంటలకు నీరు పెట్టక ఎండిపోతే అది విద్యుత్ సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించడం సరికాదన్నారు. వెల్జాలలో అన్ని పంటలు కలకలలాడుతున్నాయని అవి కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి నియోజక వర్గంలో రూ.వంద కోట్లతో కొత్త విద్యుత్ లైన్ల ఏర్పాటు, కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, విద్యుత్ సబ్స్టేషన్ల స్థాయిని పెంచడం జరిగిందని వివరించారు. వెయ్యి కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి వ్యవసాయ రంగానికి నిరంతరంగా విద్యుత్ అందించడం జరుగుతోందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ వివిధ మండలాల అధ్యక్షులు జగన్, బిచ్చానాయక్, ప్రభాకర్రెడ్డి, నాయకులు శ్రీశైలం, రంగయ్య, శ్రీనివాస్రెడ్డి, మల్లయ్య, ఖాదర్, సత్యం, ఫరీద్, కుమార్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలల వద్ద పొగాకు దందా
సాక్షి, సిటీబ్యూరో: విద్యా సంస్థలకు సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయానికి చెక్ చెప్పడానికి నగర పోలీసులు ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ పేరుతో తనిఖీలు చేశారు. శనివారం నగర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని పాన్డబ్బాలు, కిరాణా దుకాణాల్లో సోదాలు చేసిన అధికారులు 567 కేసులు నమోదు చేసి, రూ.1.1 కోటి విలువైన పొగాకు ఉత్పత్తులు సీజ్ చేసినట్లు కొత్వాల్ వీసీ సజ్జనర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, యువతను డ్రగ్స్ ఊబిలోకి దిగడానికి విద్యా సంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న దుకాణాలూ కారణమని అధికారులు గుర్తించారు. అనేక కేసుల దర్యాప్తులో భాగంగా గంజాయి, డ్రగ్స్ బానిసలు తాము సిగరెట్లతో మొదలుపెట్టే ఈ విషవలయంలో చిక్కుకున్నట్లు బయటపెట్టారు. దీంతో విద్యాసంస్థల పరిసరాలను మాదకద్రవ్యాల రహితంగా మార్చే లక్ష్యంతోనే ఈ ఆపరేషన్ చేపట్టారు. పాఠశాలలు, కళాశాలల సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న దుకాణాలపై కేసులు నమోదు చేసి, నిషేధిత గుట్కా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను సీజ్ చేశారు. అత్యధికంగా చార్మినార్ జోన్ పరిధిలో 119 కేసులు నమోదు కాగా, రాజేంద్రనగర్ పరిధిలో 102, గోల్కొండ పరిధిలో 98, ఖైరతాబాద్లో 78, సికింద్రాబాద్లో 64, జూబ్లీహిల్స్ లో 54, శంషాబాద్లో 52 కేసులు నమోదయ్యాయి. దాదాపు ఐదు వేల మందికి పైగా సిబ్బంది, అధికారులు ఏకకాలంలో ఈ సోదాలు చేశారు. లా అండ్ ఆర్డర్, టాస్క్ఫోర్స్, నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, రిజర్వ్ పోలీసులతో కూడిన బృందాలు తనిఖీలు చేశాయి. విద్యాసంస్థల సమీపంలోని దుకాణ యజమానులు అందరూ కోప్టా చట్టంలోని నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. పాఠశాలలు, కళాశాలలు లేదా ఇతర విద్యాసంస్థల సమీపంలో ఎవరైనా సిగరెట్లు, గుట్కా, ఈ–సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు గమనిస్తే వెంటనే 100కు లేదా 8712661601కు సమాచారం అందించాలని సూచించారు. ఆపరేషన్ సేఫ్ స్కూల్ నిర్వహించిన పోలీసులు 567 కేసులు నమోదు, రూ.1.1 కోట్ల సరుకు సీజ్ విక్రేతలపై సమాచారం ఇవ్వండి: కొత్వాల్ సజ్జనర్ -
హత్యాయత్నం కేసులో నిందితుడికి రిమాండ్
అత్తాపూర్: హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని అత్తాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్కు చెందిన మహమూద్ అహ్మద్ సుమారు 15 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి సులేమాన్నగర్ ప్రాంతంలోని మెట్రో ఫర్నిచర్ షాప్లో పని చేస్తున్నాడు. మహమూద్ పనిలో నిర్లక్ష్యం చేస్తున్నాడని తొలగించి అజీజ్ అనే మరో కార్మికుడిని నియమించారు. అప్పటి నుంచి మహమూద్ పలుమార్లు షాపు వద్దకు వచ్చి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన వస్తోందని బెదిరిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం షాపులో ఎవరూ లేని సమయంలో అజీజ్పై దాడి చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఐటీ ఉద్యోగి ఖాతా ఖాళీ ఉప్పల్: ఐటీ ఉద్యోగికి ఏపీకే ఫైల్ పంపిన సైబర్ నేరగాళ్లు రూ.2.60 లక్షలు అతని బ్యాంక్ అకౌంట్నుంచి స్వాహా చేశారు. ఉప్పల్ పోలీసులు తెలిపిన మేరకు.. సెవన్ హిల్స్ కాలనికి చెందిన సాయి కిరణ్కు ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి పంజాబ్ నేషనల్ బ్యాంకు క్రెడిట్ కార్డు విభాగం నుంచి మాట్లాడుతున్నామని చెప్పాడు. కొత్త క్రెడిట్ కార్డు కోసం వివరాలను ఇవ్వాలని కోరాడు. ఏపీకే ఫైల్ పంపి యాప్ ద్వారా వివరాలు పూర్తి చేయాల్సిందిగా కోరాడు. యాప్ను ఓపెన్ చేయగానే అనుమానం వచ్చి కాల్ కట్ చేసినా కూడా బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.2,60,000 ఫిర్యాదు దారునికి తెలియకుండానే ఓటీపీలు చెప్పకుండానే ఖాతా ఖాళీ చేశాడు. దీంతో బాధితుడు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసాడు. ట్రేడింగ్ పేరిట రూ.12 లక్షలకు టోకరా కీసర: సైబర్ నేరగాళ్లు ట్రేడింగ్ పేరిట ఓ వ్యక్తి నుంచి రూ.12.94 లక్షలు దోచేశారు. కీసర పోలీసులు తెలిపిన మేరకు.. కీసర నాగారం సత్యనారాయణ కాలనీకి చెందిన మహేశ్వర్గౌడ్ ఫోన్నెంబరును సైబర నేరగాళ్లు రెండు వాట్సాప్ గ్రూప్స్లో చేర్చారు. నిరాలి సంఘీ, సుబ్రతా ముఖర్జీ పేరిట మాట్లాడారు. లాభాలు తెప్పిస్తామని..ట్రేడింగ్లో పెట్టుబడి పెట్టాలని నమ్మించారు.వారి మాటలు నమ్మిన బాధితుడు మొబైల్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకున్నాడు.ఆ తరువాత రూ.40 వేలు జమ చేశాడు. అనంతరం రూ.15 వేలు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. అది నమ్మిన మహేశ్వర్ గౌడ్ రూ.12.94 లక్షలు జమచేశాడు. ఆ తరువాత డ్రా చేసుకునేందుకు యత్నించగా మరింత డబ్బు జమచేయాలని చెప్పారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాటు తుపాకీ విక్రయించేందుకు యత్నం ఇద్దరి అరెస్ట్ కుత్బుల్లాపూర్: నాటు తుపాకీ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరిని శేరిలింగంపల్లి ఎస్ఓటీ, పేట్బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సవవవేశంలో కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. నాటు తుపాకీ విక్రయిస్తుననారని పోలీసులకు సమాచారం అందింది. దూలపల్లిలోని వికాస్ గ్యాస్ గోదాము వద్ద నిఘా పెట్టగా అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఇద్దరిని ఆదుపులోకి తీసుకొని విచారించగా తుపాకీ విక్రయం వ్యవహారం బయట పడింది. నిందితులు బీహార్కు చెందిన వికాస్కుమార్(22), వంశరాజ్(31) గా గుర్తించారు. వీరు స్థానికంగా కూలీలుగా పనిచేచేస్తున్నారు. బిహార్లో తుపాకీ కొనుగోలు చేసి సిటీలో విక్రయించాలని ప్లాన్ వేయగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.7.65 ఎంఎం నాటు తుపాకీతోపాటు 8 బుల్లెట్లు, రెండు ఖాళీ మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. గతంలో ఎవరెవరికి ఆయుధాలను విక్రయించారనేది దర్యాప్తులో తేలుతుందన్నారు. -
2న హైబిజ్ టీవీ మీడియా అవార్డులు
సాక్షి, సిటీబ్యూరో: మీడియా రంగంలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే ప్రతిష్టాత్మక హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్ 2026 (6వ ఎడిషన్)ను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమం మే 2న హైదరాబాద్లోని సైబర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్నామన్నారు.ప్రింట్, ఎలక్ట్రానిక్, రేడియో, డిజిటల్ మీడియా విభాగాల్లో జర్నలిజం, అడ్వర్టైజ్మెంట్, సర్క్యులేషన్ వంటి కేటగిరీల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. 50కి పైగా విభాగాల్లో పురస్కారాలు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది నలుగురు ప్రముఖ జర్నలిస్టులకు లెజెండరీ పురస్కారాలు అందజేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు తమ పూర్తి వివరాలను ఏప్రిల్ 26లోపు 8096974747 వాట్సాప్ నంబర్కు పంపించాలన్నారు. అలాగే జర్నలిస్టుల పిల్లలకు రూ.2.5లక్షల విలువైన స్కాలర్షిప్స్ అందజేస్తామన్నారు. జలమండలికి అవార్డులు సాక్షి,సిటీబ్యూరో: జలమండలి దక్కించుకున్న మూడు పీఆర్ఎస్ఐ అవార్డులను సోమవారం ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్ వాటర్ బోర్డు ఎండీ అశోక్రెడ్డికి అందించారు. రాష్ట్రీయ స్థాయిలో బెస్ట్ బ్రోచర్, కార్పొరేట్ డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణం, బెస్ట్ లేఅవుట్, డిజైన్ కేటగిరీలో పోస్టర్ కేటగిరీల్లో జలమండలి బహుమతులను గెలుచుకుంది. పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) ద్వారా అందుకున్న అవార్డులను ఎండీకి అందజేశారు. కార్యక్రమంలో సీజీఎంలు కిరణ్ కుమార్, రాజ శేఖర్, పీఆర్వో సుభాష్, గ్రౌండ్ వాటర్ ఎక్స్ పర్ట్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనసూయపై అసభ్య పోస్టులు.. వ్యక్తి అరెస్ట్ సాక్షి, సిటీబ్యూరో: సోషల్మీడియాలో నటి అనసూయ భరద్వాజ్ను ఉద్దేశించి అసభ్యకర పోస్టులు పెట్టిన నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు నల్లగొండ జిల్లా అల్వాల గ్రామానికి చెందిన దోరేపల్లి చంటిగా గుర్తించామని డీసీపీ టి.సాయి మనోహర్ సోమవారం ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్ 23 నుంచి పలువురు వ్యక్తులు సోషల్మీడియా పేజీల్లో నటి అనసూయ భరద్వాజ్పై అనుచిత, అసభ్యకర పోస్టు చేస్తున్నారు. దీనిపై అనసూయ ఫిర్యాదుతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన అధికారులు చంటిని అరెస్టు చేశారు. ఇతడు తన ఇన్స్టా ఖాతాలో అసభ్యకర వ్యాఖ్యలు పోస్టు చేసినట్లు గుర్తించారు. మద్యం మత్తులో నగ్నంగా తిరుగుతూ.. రాజేంద్రనగర్ వ్యక్తి అరెస్ట్ మలక్పేట: అపార్ట్మెంట్లో అర్ధరాత్రి నగ్నంగా తిరిగిన వ్యక్తిని మలక్పేట పోలీసులు సోమవారం రిమాండ్కు తరలించారు. మలక్పేట ఇన్స్పెక్టర్ కుంభం నర్సింహ తెలిపిన మేరకు.. రాజేంద్రనగర్కు చెందిన సయ్యద్ మహ్మద్ షాద్ నక్వి(45) సెకెండ్ హ్యాండ్ కార్ బిజినెస్ చేస్తున్నాడు. అప్పులు ఎక్కువ కావడంతో మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఈనెల 13న రాత్రి అధిక మోతాదులో మద్యంతాగి తెల్లవారుజామున కారులో నగ్నంగా మూసారంబాగ్ డివిజన్ గంగాధర అపార్ట్మెంట్లో చొరబడి తలుపుల్లో చూస్తున్నాడు. దీంతో స్థానికులు పట్టుకోవడానికి ప్రయత్నించగా కారులో వెళ్లిపోయాడు. దీంతో అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై రాజశేఖర్రెడ్డి కేసున మోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ల ఆధారంగా అతనిని అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. గురుకుల పాఠశాల తనిఖీ యాలాల: మండల పరిధి కోకట్ శివారు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయాన్ని పంచాయతీరాజ్ తాండూరు డీఈఈ నాగభూ షణం సోమవారం తనిఖీ చేశారు. సామగ్రి, సరుకుల వివరాలు, కూరగాయల నాణ్యత, ఆర్ఓ ప్లాంట్ పనితీరును పరిశీలించారు. మరుగుదొడ్ల పరిశుభ్రత, నిర్వహణ, ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు.. ఆహారం విషయంలో రాజీ పడొద్దని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సిపాల్ సరస్వతి ఉన్నారు. -
ప్రొహిబిషన్ ఎత్తివేయొద్దని వినతి
శంషాబాద్: కోర్టు కేసులో ఉన్న భూమిపై కొందరు అధికారులు ప్రొహిబిషన్ ఎత్తివేయడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ ఎంపీపీ ఎల్లయ్య సమక్షంలో శంషాబాద్కు చెందిన యుగంధర్రెడ్డి సోమవారం తహసీల్దార్ రవీందర్ దత్కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కొత్వాల్గూడ సర్వే నం.130, 131లోని ఏడెకరాల భూమని 2005లో వెంకటయ్య సోదరుల నుంచి యుగంధర్రెడ్డి, అరుంధతి కొనుగోలు చేసి భూమిపై పొజిషన్లో ఉన్నామన్నారు. దీనిపై దాని పూర్వ యజమానులు పులిమామిడి నర్సింహాగౌడ్లు కోర్టులో కేసు దాఖలు చేశారని తెలిపారు. దీనిపై ఇరువర్గాలు కోర్టుకు చేరడంతో సంబంధిత భూమిని ప్రొహిబిషన్లో ఉంచారని పేర్కొన్నారు. ఇటీవల ఈ భూమికి సంబంధించిన ప్రొహిబిషన్ ఎత్తివేతకు అధికారులు పూర్వ యజమానుల నుంచి ఫిర్యాదు స్వీకరించారని తెలిపారు. కొందరు ప్రజాప్రతినిధుల ప్రోద్బలంతో ఇప్పటికే కొంత భూమిని ప్రొహిబిషన్ ఎత్తివేతకు పావులు కదుపుతున్నారని బాధితులు ఆరోపించారు. సంబంధిత ‘భూమి’ప్రొహిబిషన్ ఎత్తివేతకు తాము తిరస్కరణ ప్రతిపాదనలోనే ఉంచామని తహసీల్దార్ వారికి తెలిపారు. పూర్తి విషయాన్ని సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు. -
వేసవి వేళ జాగ్రత్త
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘ప్రస్తుతం ఎండలు భగ్గున మండుతున్నాయి. ఎండ తీవ్రత దృష్ట్యా మధ్యా హ్నం 12 నుంచి 3 గంటల వరకు బయటికి వెళ్లక పోవడమే ఉత్తమం. అనివార్యమైతే వెంట గొడుగు, తాగునీరు, తలకు టోపీ, కళ్లకు సన్గ్లాసెస్ ధరించాలి’ అని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. సోమ వారం ప్రజావాణిలో బాధితుల నుంచి 48 అర్జీలను స్వీకరించారు. ఆయా అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం హీట్వేవ్స్ నేపథ్యంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలు తరచూ నీరు, మజ్జిగ, పండ్ల రసాలు వంటి ద్రవపదార్థాలు తీసుకోవాలని అన్నారు. పిల్ల లు, వృద్ధులు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్త లు పాటించాలని తెలిపారు. హీట్వేవ్ ప్రభావంతో అలసట, తలనొప్పి, వాంతులు, చెమటలు ఎక్కువగా పట్టటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప వైద్యశాలకు వెళ్లాలని సూచించారు. కూలీలు, కార్మికులు ఉదయం.. సాయంత్రం సమయాల్లోనే పనులు నిర్వహించుకోవాలన్నారు. అన్ని గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో హెల్ప్లైన్లు ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వడదెబ్బ బారి న పడకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్ఓ సంగీత, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ధాన్యం కేంద్రాలు ప్రారంభించాలి ఇబ్రహీంపట్నం రూరల్: వరి ధాన్యం కొనుగో లు కేంద్రాలను ప్రారంభించాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. ఆయా కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖల జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
హక్కుల కోసం పోరాడుదాం
చేవెళ్ల: బీసీలకు అన్ని రంగాల్లో సముచిత న్యాయం జరిగేలా ప్రభుత్వాలు కృషి చేయాలని బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు వరప్రసాద్ అన్నారు. మండలంలోని కమ్మెర సమీపంలోని ఓ ఫంక్షన్హాల్లో సోమవారం చేవెళ్ల నియోజకవర్గం బీసీ సేన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీ సంఘం అనేది వెనుకబడిన వర్గాల హక్కులు, అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం పోరాడే శక్తిగా అభివర్ణించారు. బీసీలంతా ఐక్యంగా ఉండి హక్కుల సాధనకోసం పోరాడాలన్నారు. భవిష్యత్తు తరాలకు మంచి అవకాశాలు కల్పించేందుకు అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. చేవెళ్ల నియోజకవర్గం బీసీ సేన అధ్యక్షుడిగా శ్రీనివాస్గౌడ్ను నియమించినట్లు ప్రకటించారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, బీసీ సంఘం నాయకులు ప్యాట జయ శ్రీకాంత్, గిరిబాబు, నర్సింలు, మనీష్గౌడ్, రవీందర్, సత్యనారాయణ, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచ్ను దూషించిన వ్యక్తులపై కేసు
కొందుర్గు: జిల్లేడ్ చౌదరిగూడ మండలం వనంపల్లి సర్పంచ్ను అసభ్యపదజాలతో దూషించిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్ తెలిపారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. వనంపల్లిలో ఆదివారం సర్కస్ నిర్వహించారు. ఈ సందర్బంగా సర్కస్ నిర్వహకులు సర్పంచ్ అరుణను స్టేజ్పైకి ఆహ్వానించారు. అక్కడే ఉన్న గ్రామస్తులు సమ్మయ్య, నవీన్ సర్పంచ్ను అసభ్యపదజాలతో దూషించారు. సర్పంచ్ దంపతులు అక్కడ నుంచి వెళ్తుండగా సదరు వ్యక్తులు యాదయ్యపై దాడిచేశారు. సోమవారం సర్పంచ్ భర్త యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రేషన్ బియ్యం స్వాధీనం దుద్యాల్: అక్రమంగా విక్రయిస్తున్న రేషన్ బియాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మండలంలోని పోలేపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. సివిల్ సప్ల య్ డీటీ గణపతి రెడ్డి సమాచారంతో దు ద్యాల్ పోలీసులు ఓ వ్యక్తి ఇంట్లో తనిఖీ చేసి నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తి యూసుఫ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చోరీకి గురైన సెల్ఫోన్ల అప్పగింత ధారూరు: చోరీకి గురైన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని సోమవారం ధారూరు ఎస్ఐ రాఘవేందర్ బాధితులకు అప్పగించారు. సీఈఐఆర్ పోర్టర్ ద్వారా చోరీకి గురైన సెల్ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చింతకుంట గ్రామానికి చెందిన పి.రాజేందర్రెడ్డికు, మోమిన్ఖుర్దుకు చెందిన చిన్న, ధారూరుకు చెందిన వెంకటేశ్కు సెల్ఫోన్లు ఇచ్చామని ఎస్ఐ వివరించారు. -
కలుషిత నీటి సరఫరా
● నీటి నుంచి దుర్వాసన ● పట్టించుకోని అధికారులు మణికొండ: పది రోజులుగా కలుషితంగా సరఫరా అవుతోందని మణికొండ డివిజన్ కేంద్రంలోని పాత గ్రామం ప్రజలు పేర్కొంటున్నారు. నీరు దుర్వాసనతో పాటు నురుగుగా వస్తోందని చెబుతున్నారు. ఈ విషయాన్ని జలమండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. సిబ్బందిని పంపించి నీటి నాణ్యతను పరీక్ష చేయిస్తున్నారే తప్ప పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటితో స్నానాలు చేస్తే దురద, దద్దుర్లు వస్తున్నాయని తెలిపారు. జలమండలి అధికారులు వెంటనే స్పందించి కలుషిత నీటి సరఫరాను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. -
బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో..
● బొలేరో, బైక్ ఎదురెదురుగా ఢీ ● తీవ్రంగా గాయపడిన ద్విచక్రవాహనదారులు కుల్కచర్ల: బస్సు ఓవర్టెక్ చేసే క్రమంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని పీరంపల్లి సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ పరమేశ్, స్థానికులు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని పటేల్ చెరువు తండాకు చెందిన గోపాల్ నాయక్, మోహన్ నాయక్ ద్విచక్రవాహనంపై కుల్కచర్ల నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. మహ్మదాబాద్ నుంచి పరిగికి వెళ్తున్న బొలేరో వాహనం ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్టెక్ చేసే క్రమంలో బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని వారిని పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఇప్పటి వరకు కేసు నమోదు కాలేదని వాహనాలను ఠాణాకు తరలిస్తున్నామని చెప్పారు. 440 మంది ‘నిషా’చరులకు చెక్ సాక్షి, సిటీబ్యూరో: మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై నగర ట్రాఫిక్ విభాగం అధికారులు వీకెండ్స్తో ప్రత్యేక డ్రైవ్లు కొనసాగిస్తున్నారు. గత వారాంతమైన శుక్ర, శనివారాల్లో నగర వ్యాప్తంగా చేపట్టగా... 440 మంది డ్రంక్ డ్రైవింగ్ చేస్తూ అధికారులకు పట్టుబడ్డారని ట్రాఫిక్ చీఫ్ డి.జోయల్ డెవిస్ ఆదివారం వెల్లడించారు. సమయం, ప్రాంతం, సందర్భాలతో సంబంధం లేకుండా ఆకస్మికంగా డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు చేశారు. పట్టుబడిన 440 మందిలో 376 మంది ద్విచక్ర, 21 మంది త్రిచక్ర, 43 మంది తేలికపాటి వాహనాల చోదకుల అని ట్రాఫిక్ చీఫ్ పేర్కొన్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం 100 మిల్లీలీటర్ల రక్తంలో 30 మిల్లీ గ్రాముల ఆల్కహాల్ ఉండే అది ఉల్లంఘన. దీన్ని సాంకేతికంగా బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఏసీ) అంటారు. శుక్ర, శనివారాల్లో చిక్కిన వారిలో 91 మందికి 30–50 మధ్య, 200 మందికి 51–100 మధ్య, 79 మందికి 101–150 మధ్య, 31 మందికి 151–200 మధ్య, 18 మందికి 201–250 మధ్య, 12 251–300 మధ్య, తొమ్మిది 300 పైగా వచ్చినట్లు జోయల్ డెవిస్ చెప్పారు. నగర వ్యాప్తంగా ఈ స్పెషల్ డ్రైవ్లు కొనసాగిస్తామన్నారు. వీటిలో చిక్కిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. ‘మహిళా రిజర్వేషన్’ వెనుక కేంద్రం కుట్ర బన్సీలాల్పేట్: మహిళా రిజర్వేషన్ల అంశంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దీపక్ జాన్ ఆరోపించారు. పద్మారావునగర్లో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్(నియోజకవర్గాల పునర్వీభజన) ప్రక్రియతో ముడిపెట్టడాన్ని ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోందని వివరించారు. 543 పార్లమెంట్ స్ధానాల్లోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అలా చేస్తే తమ కూటమి పూర్తి స్ధాయిలో మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. పార్లమెంట్ స్ధానాల సంఖ్యను పెంచిన తర్వాతే రిజర్వేషన్లు అమలు చేస్తామనడం మహిళలను మోసం చేయడమేనన్నారు. సమావేశంలో సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు వీఎస్ నారాయణ, శ్రీనివాస్లతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
వ్యక్తి అరెస్ట్, సిలిండర్ల స్వాధీనం
అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ పహాడీషరీఫ్: అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పహాడీషరీఫ్ పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి డొమెస్టిక్ సిలిండర్, 3 చిన్న సిలిండర్లు, త్రాసు, గ్యాస్ ఫిల్లింగ్ పైపును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జల్పల్లి శ్రీరాంకాలనీ వినాయక కిరాణా దుకాణంలో అపురి రాజశేఖర్(55) గుట్టు చప్పుడు కాకుండా ఎలాంటి లైసెన్స్ లేకుండా అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్కు పాల్పడుతున్నాడు. దీనిపై విశ్వసనీయమైన సమాచారం అందుకున్న పహడీషరీఫ్ పోలీసులు ఆదివారం దుకాణంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రాజశేఖర్ను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి డొమెస్టిక్ సిలిండర్, 3 చిన్న సిలిండర్లు, త్రాసు, గ్యాస్ ఫిల్లింగ్ పైపును స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గ్యాస్ రిఫిల్లింగ్కు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. -
అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పహాడీషరీఫ్ పోలీసులు అరెస్ట్ చేసి సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు.
షాద్నగర్రూరల్: విద్యార్థులు చదువులో రాణించాలని నేషనల్ పోలీస్ అకాడమీ విశ్రాంత డైరెక్టర్ అరుణ బహుగుణ అన్నారు. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని బూర్గుల గ్రామంలో ఉన్న ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం బూర్గుల నర్సింగ్రావు మనుమడు రాజారావు జ్ఞాపకార్థం కాశిరెడ్డిగూడ, కడియాలకుంట, బూర్గుగడ్డ తండా విద్యార్థులకు స్కూలు బ్యాగులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అరుణ బహుగుణ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థుల్లో ఎంతో ప్రతిభ ఉంటుందని అన్నారు. ప్రతి విద్యార్థి చిన్న నాటి నుంచే లక్ష్యాన్ని ఎంచుకోవాలని.. లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ సీతారాం, ప్రగతి వెల్ఫేర్ అధ్యక్షుడు డాక్టర్ అలోక్ అగర్వాల్, మాళవిక, ప్రవీణ్, అరుణ్, ప్రణయ్, విశ్రాంత హెచ్ఎంలు సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
హాల్ టికెట్ ఇవ్వలేదని..
● బీటెక్ విద్యార్థి ఆత్మహత్య ● ఫీజు కోసం వేధించిన కళాశాల సిబ్బంది ● అదనంగా డబ్బు డిమాండ్ హయత్నగర్: ప్రైవేటు కళాశాల ఫీజు దాహానికి ఓ బీటెక్ విద్యార్థి బలయ్యాడు. హాల్ టికెట్ ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా గొల్లపల్లికి చెందిన రమేష్ ఆర్టీసీ బస్ డ్రైవర్గా పనిచేస్తూ హయత్నగర్లోని రాఘవేంద్రనగర్ కాలనీలో నివాసముంటున్నాడు. ఆయన ఒక్కగానొక్క కుమారుడు ప్రణీత్ (21) ఇబ్రహీపట్నం మండలం శేరిగూడలోని శ్రీ ఇందూ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షలు ఉండడంతో ఈ నెల 17న హాల్ టికెట్ కోసం కళాశాలకు వెళ్లి ఏఓ కృష్ణమూర్తిని కలిశాడు. ఇంకా ఫీజు చెల్లించలేదు.. అంతేకాక అటెండెన్స్ తక్కువగా ఉంది.. ఫీజుతోపాటు మరో రూ.5 వేలు ఇస్తేగానీ హాల్ టికెట్ ఇవ్వనని తోటి విద్యార్థుల ముందే చెప్పాడు. ప్రమాదం కారణంగా కళాశాలకు రాలేకపోయానని.. తన పరిస్థితిని అర్థం చేసుకోవాలంటూ ఆధారాలు చూపినా హాల్ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించాడు. ప్రణీత్ తండ్రి కూడా తాను సిటీలో లేనని. సోమవారం వచ్చి కలుస్తానని చెప్పాడు. అయినా హాల్ టికెట్ ఇవ్వకపోడంతో మనస్తాపానికి గురైన ప్రణీత్ శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ప్రణీత్ తండ్రి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహంతో కళాశాల ఎదుట ఆందోళన ఇబ్రహీంపట్నం: ఫీజు చెల్లించాలని వేధించడంతో బలవన్మరణానికి పాల్పడ్డ ప్రణిత్ మృతదేహంతో శేరిగూడ సమీపంలోని శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాల ఎదుట విద్యార్థి సంఘల నేతలు ఆదివారం సాయంత్రం ఆందోళనకు దిగారు. యాజమాన్యం వేధింపుల కారణంగా మనస్తాపంతో ప్రణీత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఈ సందర్భంగా కళాశాల గేట్ను ధ్వంసం చేసి లోనికి వెళ్లేందుకు యత్నించారు. కళాశాల చైర్మన్ రావాలని డిమాండ్ చేశారు. ఏసీపీ కేవీపీ రాజు, సీఐ మహేందర్రెడ్డి ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినకపోవడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. పలువురిని అరెస్టు చేశారు. అనంతరం మృతదేహన్ని బంధువులకు అప్పగించారు. ఆందోళనలో ఎస్ఎఫ్ఐ, జాగృతి, మాల మహానాడు నేతలు పాల్గొన్నారు. -
ఈత సరదా.. కావొద్దు కడుపుకోత
వేసవి కాలం ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం కొందరు.. సరదాగా మరికొందరు యువకులు, విద్యార్థులు చెరువులు, వ్యవసాయ బావుల్లో ఈత కోసం వెళ్తున్నారు. యాచారం మండలం తాడిపర్తి, కుర్మిద్ద, నక్కర్తమేడిపల్లి, మంతన్గౌరెల్లి, కొత్తపల్లి, మల్కీజ్గూడం, నందివనపర్తి, నస్దిక్సింగారం గ్రామాల్లోని వ్యవసాయ బావుల్లో ఈత నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. పురాతన బావులు కావడంతో అడుగు భాగంలో చెట్ల కర్రలు, రాళ్లు, కంపచెట్లు, లోతు తెలియక ప్రమాదం పొంచి ఉంది. గతంలో తాడిపర్తి కుంటలో ఈతకు వెళ్లి లోతు తెలియక నీట మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. చర్యలు తీసుకోవాలి యాచారం పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో గతంలో స్టోన్ తీసేందుకు వ్యాపారులు పెద్ద గోతిని తీశారు. పూర్తిగా మూసివేయకపోవడంతో నీళ్లు చేరి అలానే ఉంది. ప్రస్తుతం ఆ క్వారీ గుంతల్లోకి ఈతకు ఎవరూ వెళ్లడం లేదు. ఒకవేళ వెళ్తే మాత్రం ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే అవుతుంది. అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
దేవాలయ భూములను పరిరక్షించాలి
కందుకూరు: మండలంలోని పులిమామిడి పరిధిలోని చీకటి వేంకటేశ్వరస్వామి దేవాలయానికి సంబంధించిన భూములను పరిరక్షించాలని మైదాన ప్రాంత సేవాలాల్ సేన అధ్యక్షుడు రఘురాం రాథోడ్ డిమాండ్ చేశారు. దేవాలయాన్ని ఆదివారం గిరిజన నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు. వేంకటేశ్వరస్వామి పరమ భక్తుడు, బంజారాల ఆరాధ్య గురువు హాతిరామ్ బావాజీ ఆలయ నిర్మాణం కోసం దేవాలయ భూముల నుంచి 20 ఎకరాలు కేటాయించేలా కృషి చేయాలని ఆలయ చైర్మన్ రాజశేఖర్శర్మకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రఘురాంరాథోడ్ మాట్లాడుతూ.. 240 ఎకరాల ఆలయ భూమిని లీజు పేరుతో కొందరు వ్యక్తులు కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. దేవాలయ భూములను కాపాడుకుందామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు నరేష్నాయక్, యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్నాయక్, సార్లరావులపల్లి, అన్నోజిగూడ, మురళీనగర్ సర్పంచులు శ్రీనునాయక్, రమావత్ సురేష్నాయక్, నేహభాస్కర్నాయక్, మాజీ సర్పంచ్ ఇ.రాంచంద్రారెడ్డి, నాయకులు రుక్మానాయక్, నరసింహానాయక్, లక్ష్మణ్నాయక్, శ్రీనివాస్నాయక్, రవినాయక్, శ్రీనునాయక్ పాల్గొన్నారు. -
యువతి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
మూసాపేట: చెరువులో ఆత్మహత్య చేసుకునేందుకు వెళుతున్న యువతిని పోలీసులు కాపాడారు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. కల్వకుర్తికి చెందిన ఓ యువతి (20) పటాన్చెరువులో ఉద్యోగం చేస్తూ కేపీహెచ్బీ కాలనీలోని షణ్ముఖ హాస్టల్లో ఉంటోంది. వ్యక్తిగత సమస్యల కారణంగా మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలకుంది. దీంతో ఆదివారం కూకట్పల్లి ఐడియల్ చెరువులోకి దిగింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే చెరువు వద్దకు చేరుకున్నారు. ఎస్ఐ చంద్రశేఖర్, దీక్షిత, వెంకటప్పలు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చెరువులోకి దూకి వెళ్లి యువతిని కాపాడి బయటకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఎస్ఐ కాలికి గాయాలయ్యాయి. అనంతరం యువతిని పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇప్పించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే యువతి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను వెల్లడించడానికి ఇష్టపడటం లేదని పోలీసులు తెలిపారు. -
జలమండలికి పురస్కారాల పరంపర
● మూడు ‘పీఆర్ఎస్ఐ’ అవార్డులు సాక్షి, సిటీబ్యూరో: జలమండలికి అవార్డుల పరంపర కొనసాగుతోంది. ఈ ఏడాది ఇప్పటికే పలు అవార్డులు గెలుచుకున్న జలమండలి.. తాజాగా మరో మూడింటిని తన ఖాతాలో వేసుకుంది. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) బహుమతులు మూడు లభించాయి. ఆదివారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో జరిగిన పీఆర్ఎస్ఐ తెలంగాణ పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్లో విశ్రాంత ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, ప్రొఫెసర్ నాగేశ్వర్ కలిసి జలమండలి టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్, పీఆర్వో సుభాష్, భూగర్భ జల నిపుణుడు సత్యనారాయణకు అవార్డులను బహూకరించారు. ఓఆర్ఆర్ పరిధిలో భూగర్భ జలాల పెంపునకు అవగాహన కోసం బ్రోచర్ రూపొందించిన జలమండలి.. వివిధ మాధ్యమాల్లో ప్రజలకు అవగాహన కల్పించింనందుకు ప్రథమ, ఇంకుడు గుంతల నిర్మాణమే లక్ష్యంగా చేపట్టిన 90 రోజుల స్పెషల్ డ్రైవ్పై రూపొందించిన డాక్యుమెంటరీకి ద్వితీయ, ఇంకుడు గుంతల నిర్మాణంపై రూపొందించిన పోస్టర్కు తృతీయ బహుమతులు లభించాయి. ఈ సందర్భంగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సిబ్బందిని అభినందించారు. -
డేటా డైవర్షన్
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్డీ) సంస్థనే బెదిరించిన ట్రాన్సాక్షన్ ఎనలిస్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (టీఏ) సంస్థ వ్యవహారాన్ని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. టీ–వాలెట్ యాప్ నిర్వహణ గడువు ముగిసినా డేటా, ప్రజాధనం అప్పగించకపోవడం, వీటిని మరో ప్రైవేట్ యాప్లోకి మళ్లించే ప్రయత్నాలు చేయడం, ఈఎస్డీని బెదిరించడం తదితర ఆరోపణలపై గత వారం సీసీఎస్లో కేసు నమోదైంది. దీన్ని సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్న అధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వ సేవలను క్యాష్లెస్గా అందించడానికి ప్రభుత్వం 2017లో టీ–వాలెట్ ప్లాట్ఫాంను రూపొందించింది. ప్రస్తుతం ఈ ప్లాట్ఫాంకు 16 లక్షల మందికి పైగా వినియోగదారులు ఉన్నారు. వీరి కేవైసీ వివరాలు, లావాదేవీల హిస్టరీతో పాటు రూ.14 కోట్లు ప్రజా నిధులతో పాటు సున్నిత సమాచారం కూడా ఇందులో ఉంది. ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం ప్రభుత్వం 2018 నవంబర్ 1న ట్రాన్సాక్షన్ ఎనలిస్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (టీఏ) సంస్థను ఎంపిక చేసి, ఒప్పందం చేసుకుంది. అప్పట్లో దీనికోసం ప్రభుత్వం దాదాపు రూ.70 లక్షలు చెల్లించింది. ఒప్పందం ప్రకారం నిర్వహణ గడువు ముగిసిన తర్వాత టీఏ సంస్థ మొత్తం డేటా, సోర్స్ కోడ్తో పాటు డిజిటల్ ప్రాపర్టీలను ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. ఈ ఒప్పందాన్ని ప్రభుత్వం 2018 నుంచి 2025 వరకు పలు దశల్లో పొడిగించింది. తాజాగా కాంట్రాక్ట్ గడువు ముగియబోతుండగా ప్రభుత్వం టెండర్ ప్రక్రియ ద్వారా పర్వ్యూ ఇండియా కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ ఎల్ఎల్పీ సంస్థను ఎంపిక చేసింది. ఆపై సమాచారంతో పాటు సాకేంతిక పరిజ్ఞానం తదితరాలు అప్పగించాల్సిందిగా కోరుతూ టీఏ సంస్థకు ప్రభుత్వం పలుమార్లు ఆదేశించినా ఆ సంస్థ పట్టించుకోలేదు. తొలుత టీఏ సంస్థ డేటా అందిస్తామని చెప్పినప్పటికీ ఆపై పంథా మార్చి ప్రభుత్వ విభాగానికే సవాల్ విసిరింది. దీంతో ఈఎస్డీ శాఖ గత ఏడాది నవంబర్ 12న టీఏ సంస్థకు ఫైనల్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీంతో ఆ సంస్థ టీ–వాలెట్పై తమకే పూర్తి హక్కు ఉందనే కొత్త వాదన తెరపైకి తెచ్చింది. అంతటితో ఆగకుండా టీ–వాలెట్ వినియోగదారుల డేటా, కేవైసీ వివరాలు, లావాదేవీల సమాచారంతో పాటు రూ.14 కోట్ల ప్రజా నిధులను ‘టీఏ వన్ యాప్’ అనే ప్రైవేట్ యాప్కు మళ్లించేందుకు అదే నెల 28న ప్రయత్నించారు. దీన్ని ఈఎస్డీ అడ్డుకోవడంతో ఆ డేటాను ఎట్టిపరిస్థితుల్లోనూ తమ యాప్కు మార్చేస్తామని టీఏ సంస్థ బెదిరింపులకు దిగింది. ఫలితంగా ప్రభుత్వ కార్యకలాపాలు దెబ్బతినడంతో పాటు ప్రజా డేటా భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ఈఎస్డీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు టీఏ సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీసీఎస్లో ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా టీఏ సంస్థపై కేసు నమోదు చేశారు. తక్షణం టీఏపై చర్యలు తీసుకోకుంటే రూ.14 కోట్ల ప్రజా నిధులు దుర్వనియోగం కావడంతో పాటు సున్నితమైన డేటా లీక్, ఐడెంటిటీ థెఫ్ట్ వంటి ప్రమాదాలు ఉండటంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థ నుంచి సర్వర్లు, డేటాబేస్, డిజిటల్ ఆధారాల స్వాధీనానికి సీసీఎస్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కస్టమర్ల డేటా, ప్రజాధనం పరిరక్షణకు సీసీఎస్ చర్యలు ‘టీ–వాలెట్ డేటా’ కేసు దర్యాప్తు ముమ్మరం సాంకేతికంగా ముందుకు వెళుతున్న పోలీసు అధికారులు -
మండేకాలం.. జరపైలం
● అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ● ముందస్తు జాగ్రత్తలతో ఉపశమనం షాబాద్: ప్రస్తుత వేసవిలో ఎండలు మండుతుండడంతో జనం హడలెత్తిపోతున్నారు. మున్ముందు పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందోనని బెంబేలెత్తుతున్నారు. ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత పెరుగుతోంది. జిల్లాలో నిత్యం 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదువుతుండడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. మండల కేంద్రంలో మధ్యాహ్నం సమయంలో రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మే నెలలో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. నిర్లక్ష్యంగా ఉంటే ప్రజలు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంది. ఎల్లో అలర్ట్ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాతావరణ శాఖ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వడదెబ్బ బారినపడే ప్రమాదం ఉందని, చిన్నారులు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. వడదెబ్బ లక్షణాలు వడదెబ్బ తగిలిన వారిలో కాళ్ల వాపులు, కళ్లు తిరగడం, శరీర కండరాలు పట్టుకోల్పోవడం, తీవ్ర జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అధిక చెమట పట్టడం, తల తిరిగి పడిపోవడం వంటివి జరిగితే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి సత్వర వైద్యం అందించాలి. ప్రాథమిక చికిత్స ● వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడకు తీసుకెళ్లాలి. చల్లని నీరు, ఐస్తో ఒళ్లంతా తుడవాలి. ● ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరిబొండం లేదా చిటికెడు ఉప్పు, చక్కర కలిపిన నిమ్మరసం. గ్లూ కోజు ద్రావణం లేదా ఓరల్ రీ హైడ్రేషన్ ద్రావణం(ఓఆర్ఎస్) తాగించవచ్చు. ● వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్తే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించాలి. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు ● వేసవిలో డీహైడ్రేషన్ అధికంగా ఉంటుంది. రోజుకు కనీసం 15 గ్లాసుల నీళ్లు తాగాలి. భోజనం మితంగా తినాలి. ● ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నీడన, చల్లని ప్రదేశంలో ఉండేందుకు ప్రయత్నించాలి. ● ఆల్కాహాల్, సిగరేట్, కార్బొనేటెడ్ వంటి ద్రావణాలకు దూరంగా ఉండాలి. ● ఎండలో వెళ్లేటప్పుడు కళ్లకు సన్ గ్లాసెస్, తలకు టోపీ వంటివి ధరించాలి. ● వేసవిలో ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే బయటికి వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి. ● వేడి వాతావరణంలో శారీరక శ్రమ కార్యక్రమాలు చేయడం మంచిది కాదు. ఒకవేళ చేస్తే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి విరామం తీసుకోవాలి. ● ఆహారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ● ప్రయాణాల్లో సోడియం, ఎలక్ట్రోలైట్ వంటి ద్రావణాలను తాగడం మంచిది. చేయకూడని పనులు ● మండు వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రత ఉన్న సమయంలో ఎక్కువగా తిరగరాదు. ● రోడ్లపై అమ్మే కలుషిత ఆహారం తినవద్దు. ఇంట్లో వండుకున్నవి మాత్రమే తినాలి. ● మాంసాహారం తగ్గించి, తాజా కూరగాయల్ని ఎక్కువగా తీసుకోవాలి. ● పుచ్చ కాయలు, కీరదోస, కర్బూజ, తాటి ముంజలు, బీరకాయలు, పొట్లకాయలు వంటి వాటిలో నీటి శాతం పుష్కలంగా ఉంటాయి. వీటి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ● శీతల పానీయాలు, అధికంగా షుగర్ వేసిన జ్యూస్లు, మామిడి, సపోటా వంటివి తీసుకుంటే బరువు తగ్గకపోగా, కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. ● వేసవిలో ఆకలి తక్కువగా దాహం ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియలోనూ తేడాలు వస్తుంటాయి. డైట్ పాటిస్తూ కాలానికి అనుగుణంగా ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండి బరువును నియంత్రించవచ్చు. నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకోవాలి. బయటకు వెళ్లొద్దు పిల్లలు, వృద్ధులతో పాటు ప్రజలు ఎండతీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. అత్యవసరమైతే తలకు టోపి ధరించి వెళ్లాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐవీ ప్లూయిడ్స్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచాం. ఇంట్లోనే ఉండే పిల్లలకు వేడి తలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ ప్రణీత్, చందనవెళ్లి పీహెచ్సీ -
క్వారీ.. ప్రమాదానికి దారి
షాద్నగర్/యాచారం: ప్రయోజనం పొందింది ఒకరు.. నష్టపోతుంది మరొకరు.. ఎవరో వ్యాపారులు క్వారీలు తవ్వుకొని లబ్ధి పొందితే సామాన్యులు అందులో పడి బలవుతున్నారు. అయినా ఎవరూ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. నిబంధనలకు అనుగుణంగా వాటిని పూడ్చకుండా వదిలేయడంతోనే ఏటా పదుల సంఖ్యలో వాటిలో పడి మృత్యువాతపడుతున్నారు. 20 ఏళ్ల క్రితం తవ్వకాలు షాద్నగర్ పరిధిలోని లింగారెడ్డిగూడ శివారులో ఉన్న క్వారీ ప్రమాదకంగా మారింది. 20 ఏళ్ల క్రితం ఓ వ్యాపారి రైతుల వద్ద భూమిని అద్దెకు తీసుకొని క్వారీ పరిశ్రమ నిర్వహించారు. బండరాళ్ల కోసం లోతుగా తవ్వకాలు చేపట్టారు. సుమారు ఏడేళ్ల క్రితం వరకు క్వారీ పరిశ్రమను నిర్వహించడంతో లోతైన గుంతలు ఏర్పడ్డాయి. ఈ క్వారీ గుంతల్లో ఈతకు వెళ్లి ఇప్పటికే ఎంతోమంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం క్వారీ నీటితో నిండింది. చుట్టు పక్కల ముళ్ల చెట్లు మొలిచాయి. చెట్ల మధ్యలో ఉన్న చిన్నదారుల గుండా వేసవిలో విద్యార్థులు, చిన్నారులు క్వారీలోకి ఈత కొట్టేందుకు వెళ్తున్నారు. ప్రమాదమని తెలిసినా దీన్ని పూడ్చడం లేదు. నిబంధనలకు పాతర ఇక్కడ కొన్నేళ్లుగా తవ్వకం పనులు నిలిచిపోయాయి. వ్యాపారులు పూడ్చకుండా వదిలేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. నిబంధనల ప్రకారం వ్యాపారులు తమ లీజు పూర్తయిన తర్వాత క్వారీ గుంతలను పూడ్చాల్సి ఉంటుంది. అందులో చెట్లు నాటి పర్యావరణ కోసం పాటుపడాలి. ఎక్కడా నిబంధనలు అమలు కావడం లేదు. ప్రాణాలు తీస్తున్నక్వారీ గుంతలు ఏటా పదుల సంఖ్యలో మృత్యువాత నిబంధనలు పట్టని వ్యాపారులు చూసీచూడనట్టు వదిలేస్తున్న అధికారులు క్వారీ గుంతలు ప్రమాదకరంగా మారాయి.. లోతు తెలియక చిన్నారులు సరదాగా ఈత కొడుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.. కన్నవారికి గుండెకోత మిగులుస్తున్నారు.. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు.. -
కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు
ఆమనగల్లు: కాంగ్రెస్ పాలనలో రైతన్నలకు కష్టాలు ప్రారంభమయ్యాయని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎండిపోయిన మొక్కజొన్న, వరి పంటలను ఆదివారం కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతుల కష్టాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన స్వర్ణయుగం లాంటిదని పేర్కొన్నారు. ఎండిన పంటలకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. న్యాయం చేయకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దశరథ్నాయక్, మాజీ ఎంపీపీలు శ్రీనివాస్యాదవ్, నిర్మల శ్రీశైలంగౌడ్, తలకొండపల్లి సర్పంచ్ శేఖర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
ఆమనగల్లు: దాదాపు 47 ఏళ్ల క్రితం కలిసి చదువుకున్న వారంతా మళ్లీ ఓ చోటుకి చేరి సందడి చేశా రు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని సాధకబాధకలు పంచుకున్నారు. అయితే అందులో ని ఓ పూర్వ విద్యార్థి ప్రస్తుత కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కావడం విశేషం. ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1978–79 బ్యాచ్ పదో తరగతి చదివిన విద్యార్థులు హైదరాబాద్లో ఆదివారం ఓ కన్వెన్షన్ హాల్లో సమ్మేళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థి అయిన ఎమ్మెల్యే నారాయణరెడ్డి సమ్మేళనానికి హాజరు కావడంతో తోటి స్నేహితులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు నర్సింహ, రామకృష్ణ, శ్రీనివాస్, దేవేందర్రెడ్డి, యాదగిరి, రఘుపతి, బుచ్చయ్య, సుధాకర్రెడ్డి, నారాయణరెడ్డి, ప్రకాశ్, యాదమ్మ, లక్ష్మి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళానికి హాజరైన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి -
పాపన్నగౌడ్ పోరాటం స్ఫూరిదాయకం
ఆమనగల్లు: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పోరాటస్ఫూర్తి అందరికీ ఆదర్శమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తలకొండపల్లి మండలం వెల్జాలలో గౌడసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో గొప్ప విప్లవ వీరుడు పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఎన్నో సవాళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాడారని గుర్తు చేశారు. కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, బీజేపీ రాష్ట్ర నాయకుడు తూళ్ల వీరేందర్గౌడ్, పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్గౌడ్, కల్వకుర్తి గౌడ సంఘం అధ్యక్షుడు చుక్క అల్లాజీగౌడ్, వెల్జాల గౌడ సంఘం అధ్యక్షుడు రాఘవేందర్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ యాట గీత తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం
మొయినాబాద్రూరల్: తెలంగాణ సాంఘిక సంక్షేమ వికారాబాద్ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 2026–27 సంవత్సరానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయకోట ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీఎస్సీ ఫిజికల్ సైన్స్, ఎంఎస్సీ, లైఫ్ సైన్స్, పీజెడ్సీ, ఎంజెడ్సీ, బీకాం, బీఏ, సీఏ కోర్సుల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. అర్హులైన విద్యార్థులు నేరుగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. 2025–26లో ఇంటర్ పాసైన విద్యార్థులు ఒర్జినల్ సర్టిఫికెట్లతో రావాలని సూచించారు. మండలంలోని తోల్కట్ట సమీపంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ కళాశాల కొనసాగుతోందన్నారు. కడ్తాల్: మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మానాయక్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలో ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ రాజేంద్రపాల్ గౌతమ్ను కలిశారు. తెలంగాణ గిరిజనుల రాజకీయ స్థితిగతులను సమగ్రంగా వివరించారు. గిరిజన జనాభాలో 70 శాతం మంది మైదాన ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని, వారికి రాబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో తగినన్ని ఎంపీ, ఎమ్మెల్సీ సీట్లు కేటాయించాలని కోరారు. 2027 జనగణన పూర్తయిన తర్వాత జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో మైదాన ప్రాంతాల్లో అత్యధిక గిరిజన జనాభా ఉన్న ప్రాంతాలను గుర్తించి, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. షాద్నగర్: హిందువులంతా ఐక్యత చాటాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీగిరి పీఠం శంకర స్వామీజీ అన్నారు. పట్టణంలోని శివమారుతీ దేవాలయం వద్ద ఆదివారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఐక్యతే మన బలమని, ఆ బలమే జీవితమని పేర్కొన్నారు. హిందూ ధర్మం యొక్క విలువలు, సంప్రదాయాలు, గొప్పతనాన్ని రాబోయే తరానికి నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రపంచానికి శాంతి, సహనాన్ని నేర్పిన గొప్ప సంస్కృతి మనదన్నారు. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకు రామాయణం, భాగవతం గాథలను, ధర్మ సూత్రాలను నేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బస్వం, బీజేపీ నేతలు అందెబాబయ్య, శ్రీవర్ధన్రెడ్డి, సమ్మేళనం కమిటీ అధ్యక్షుడు బెజుగం రమేష్, బండారి రమేష్, నాగిళ్ల ప్రభాకర్, పెంటయ్య, రాజు నాయక్, రఘు నాథ్యాదవ్, అశోక్, యాదగిరి, రామ్మోహన్, హరీష్, ఆంజనేయులు, సోమ శ్రీనివాస్, ప్రభుకుమార్ తదితరులు పాల్గొన్నారు. ● హజ్ కమిటీ చైర్మన్ అఫ్జల్ బియబానీ సాక్షి సిటీబ్యూరో: వచ్చే నెల 2 నుంచి ప్రారంభమయ్యే హజ్ యాత్రకు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి దాదాపు 12 వేల మంది యాత్రికులు వెళ్లనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లను ముమ్మరం చేసిందని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మౌలానా సయ్యద్ అఫ్జల్ బియబానీ ఖుస్రో పాషా వ్యాంప్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో హజ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు. యాత్రికులు తమ లగేజీని గుర్తించడానికి ప్రత్యేక బ్యాగులకు ప్రత్యే స్టిక్కర్లను అతికిస్తామన్నారు. ఈ నెల 20వ తేదీ అనంతరం అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నత అధికారులతో క్యాంప్ నిర్వహణ కోసం సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మే 4 నుంచి 21 తేదీ వరకు 23 విమానాల్లో తెలంగాణ రాష్ట్ర యాత్రికులు వెళ్తారని పేర్కొన్నారు. -
అకాల వర్షం.. ఆగమాగం
● నేలరాలిన మామిడికాయలు ● విరిగిన విద్యుత్ స్తంభాలు ● సరఫరాకు అంతరాయం యాచారం: ఈదురు గాలులు, వడగళ్ల వానతో ఆదివారం ఆయా మండలాల్లో తీవ్ర నష్టం జరిగింది. యాచారం మండల పరిధిలోని ధర్మన్నగూడెం, చౌదర్పల్లి, చింతుల్ల తదితర గ్రామాల్లో పలు ఈదురుగాలులతో మామిడికాయలు నేలరాలాయి. ధర్మన్నగూడెం గ్రామానికి చెందిన దోమ జీవన్మయరెడ్డికి చెందిన పది ఎకరాల్లోని తోటలో చెట్లకున్న మామిడికాయలు పూర్తిగా నేలరాలాయి. రూ. లక్షలాది నష్టం రావడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. తులేకలాన్లో భారీ వర్షం ఇబ్రహీంపట్నం రూరల్: అకాల వర్షం ఆగమాగం చేసింది. ఇబ్రహీంపట్నం మండలంలోని తులేకలాన్లో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి గ్రామంలో రెండు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మామిడికాయలు నేలరాలి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. -
ఆలయంలో చొరబడి.. హుండీల అపహరణ
హయత్నగర్: నగర శివారులోని ఓ ఆలయంలో చొరబడిన దుండగులు రెండు హుండీలను అపహరించుకుపోయిన సంఘటన ఆదివారం హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తొర్రూర్–బ్రాహ్మణపల్లి రహదారిలోని ప్రసిద్ధ రంగనాథ స్వామి ఆలయం గ్రిల్స్ తాళాలు శనివారం అర్ధరాత్రి దాటాక దుండగులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడున్న రెండు హుండీలను అపహరించుకుని పోయారు. మరుసటి రోజు ఉదయం ఆలయ పూజారి వచ్చి చూడగా గ్రిల్స్ పగలగొట్టి ఉన్నాయని గమనించారు. దీంతో ఆయన ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డీఐ సంతోష్కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ వచ్చి వివరాలు సేకరించగా.. ఆలయ నిర్మాణం జరుగుతుండడంతో సీసీ కెమెరాలు పని చేయడం లేదని పోలీసులు తెలిపారు. -
పరిశ్రమల్లో నిబంధనలు పాటించాలి
మహేశ్వరం: పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని జిల్లా అగ్నిమాపక అధికారి జి.మురళీ మనోహర్రెడ్డి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని శనివారం మండల పరిధిలోని కేసీ తండా సమీపంలో ఉన్న ఎలక్ట్రానిక్ పార్కులో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాలు జరిగిన సందర్భంలో ఆందో ళన చెందకుండా వెంటనే 101 నంబర్కు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. అంతకు ముందు అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకో వాల్సిన జాగ్రత్తలపై కంపెనీ యజమానులు, కార్మికులు, సెక్యూరిటీ గార్డులకు అవగాహన కల్పించారు. -
యువకుడి అదృశ్యం
మొయినాబాద్: టిఫిన్ చేయడానికి వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని హిమాయత్నగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్నగర్కు చెందిన కూచిమంచి దుర్గాప్రసాద్ యువకుడు కూలీ పనిచేసేవాడు. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో టిఫిన్ చేయడానికంటూ ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో శనివారం మొయినాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
బసవేశ్వరుడి జయంతిని నిర్వహించండి
మంచాల: మహాత్మా బసవేశ్వరుడి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వీర శైవ లింగాయత్ బలిజ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం మండల కార్యాలయంలో సూపరింటెండెంట్ అజీమ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు కొత్తూరు శేఖరప్ప మాట్లాడుతూ.. ఈనెల 20న రాష్ట్ర ప్రభుత్వం రవీంద్రభారతిలో మహాత్మా బసవేశ్వరుడి జయంతి కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. అదే విధంగా అన్ని మండలాలు, గ్రామాల్లో సైతం కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించాలని కోరారు. సమాజంలో మార్పు కోసం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి బసవేశ్వరుడని చెప్పారు. కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్షుడు జక్క హరీశ్, ప్రధాన కార్యదర్శి రాజు, సలహాదారులు రాజప్ప, పెంటప్ప, కోటప్ప తదితరులు పాల్గొన్నారు. -
పాన్ షాపులపై పోలీసుల దాడులు
ఇబ్రహీంపట్నం రూరల్: మైనర్లకు గుట్కా, మసాల లాంటి మత్తు పదార్థాలు విక్రయిస్తే చర్యలు తప్పవని ఆదిబట్ల పోలీసులు హెచ్చరించారు. సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు శనివారం ఉదయం 11 గంటలకు ఏక కాలంలో ఏడు చోట్ల పోలీసులు పాన్ షాపులపై దాడులు చేపట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి షాపుల్లో తనిఖీలు చేశారు. అనుమతులు లేకుండా విక్రయించే మత్తు పదార్థాలను, గుట్కా, పాన్ మసాలను స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాలు విద్యార్థులకు అలవాటుగా మారే అవకాశం ఉందన్నారు. అందుకే వారికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. సిటీ పోలీస్ కమిషనరేట్ పరిఽధిలో కఠినమైన నిబంధనలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఎస్ఐలు సత్యనారాయణ, వెంకటేశ్, నోయల్రాజు, వెంకటేశ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’తో సోదాలు పహాడీషరీఫ్: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్ ఆదేశాల మేరకు బాలాపూర్ పోలీసులు విద్యా సంస్థల పరిసరాలలోని కిరాణ దుకాణాలు, పాన్ షాప్లలో శనివారం సోదాలు నిర్వహించారు. పాఠశాలల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలతో విద్యార్థుల మత్తు పదార్థాలకు బానిసలవుతున్న దృష్ట్యా పోలీసులు ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా షాహిన్నగర్, ఎర్రకుంట, కొత్తపేట, బా లాపూర్, మల్లాపూర్, సుల్తాన్పూర్ తదితర ప్రాంతాల లోని పాఠశాలల సమీపంలోని షాప్లలో తనిఖీలు చే పట్టారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సుధాకర్ మాట్లాడు తూ.. పాఠశాలల పక్కనే ఉన్న పాన్ షాప్లలో విక్రయిస్తున్న పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడుతున్న విద్యార్థులు క్రమేణా సిగరేట్, గంజాయి లాంటి వాటికి బానిసలవుతూ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నామన్నారు. విద్యార్థులకు విక్రయించిన నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆదిబట్ల పీఎస్ పరిధిలో ఏడు చోట్ల తనిఖీలు -
పచ్చిరొట్ట.. దిగుబడి దిట్ట
కందుకూరు: పంటలకు అవసరమయ్యే పోషకాలు, సేంద్రియ రూపంలో సమర్థవంతంగా అందించాలంటే పచ్చిరొట్టను బాగా అందించే పంటలను అదే పొలంలో ముందుగా వేసుకుంటే లబ్ధి పొందవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం క్రిడా నిపుణుడు జి.శ్రీకృష్ణ సూచించారు. మే చివరి వారం తొలకరి వానలు పడిన వెంటనే పచ్చిరొట్ట సాగు చేసుకోవాలన్నారు. పచ్చిరొట్ట సాగుపై రైతులకు పలు సలహాలు, సూచనలు అందజేశారు. రెండు నెలల ముందే.. తక్కువ వనరులతో బాగా పెరిగే పచ్చిరొట్ట పంటలను ప్రధాన పంటల సాగుకు సూమారు రెండు నెలల ముందే మడిలో విత్తుకోవాలి. నేలకు తగినంత సేంద్రియ పదార్ధాన్ని అందించడానికి పచ్చిరొట్ట ఎరువుల వాడకం సులువైన, చౌకై న పద్ధతి. పప్పుజాతి(లెగ్యూమ్)పైర్లు పచ్చిరొట్టకు బాగా పనికొస్తాయి. వీటిలో మినుము, అలసంద, జీలుగ, పెసర, ఉలవ, పిల్లి పెసర, జనుము, వెంపలి పైర్లు ముఖ్యమైనవి. ఈపంటలు పూత దశకు వచ్చిన సమయంలో నేలలో కలియదున్ని, ఎరువుగా ఉపయోగించుకోవడాన్ని పచ్చిరొట్ట ఎరువు అంటారు. ఈ పైరు పెరగడానికి తగినంత తేమ, నేలలో కలియదున్నిన తర్వాత మురగడానికి తగినంత నీటి వసతి ఉండాలి. వీటి వేర్ల బుడిపెలలో సూక్ష్మజీవుల ద్వారా నత్రజని స్థాపక చర్య జరుగుతుంది. నేలలో మిగిలిపోయిన మొక్కల భాగాల నుంచి అందే నత్రజని తర్వాత పైర్లకు ఉపయోగపడుతుంది. వీటిని నేలలో కలియదున్ని, బాగా నీరు పెట్టి 2నుంచి 3 వారాల పాటు మురగనివ్వాలి. ఈ సమయంలో కొన్ని హానికరమైన సేంద్రియ ఆమ్లాలు తయారవుతాయి. కనుక మురుగు నీటిని తీసేసి కొత్త నీరు అందించి, ప్రధాన పంటలను నాటుకోవాలి. పచ్చిరొట్ట ఎరువుల నుంచి విడుదలయ్యే పోషకాలు ఎంతగానో ఉపయోగపడుతాయి. ప్రధాన పంటలకు పోషకాలు అందించే పైర్లు మినుము, అలసంద, జీలుగ, పెసర, ఉలవ, పిల్లి పెసర, జనుము, వెంపలి క్రిడా నిపుణుడు శ్రీకృష్ణ సలహాలు -
జనగణనపై సిబ్బందికి శిక్షణ
శంకర్పల్లి: ప్రభుత్వం అప్పగించిన పనిని సిబ్బంది నిబద్ధతతో పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవని శంకర్పల్లి డిప్యూటీ తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి హెచ్చరించారు. మండల పరిఽషత్ కార్యాలయంలో శనివారం జనగణనకు సంబంధించి ఉపాధ్యాయులకు మొదటి విడత శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణ ఉంటుందని తెలిపారు. ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్లు తమకు అప్పగించిన పనిని సకాలంలో పూర్తి చేయాలని, గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సేవకుల సాయం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్స్ కరుణాకర్ రెడ్డి, మహేశ్, శివ తదితరులు పాల్గొన్నారు. -
వివాహిత ఆత్మహత్య
బడంగ్పేట్: వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం మీర్పేట్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన నిండుకుండ అనురాధ(33) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. భర్త శ్రీనుతో కలిసి ఆర్ఎన్రెడ్డి నగర్ ద్వారకామయికాలనీలో మూడేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఉదయం రూమ్ నుంచి వాసన రావడంతో ఇంటి ఓనర్ అనుమానంతో కిచెన్ కిటికి నుంచి చూడగా చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించడంతో పోలీసులకు ఇంటి ఓనర్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధం తప్పిన ప్రాణనష్టం.. ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు ఆల్విన్కాలనీ: కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ కూతవేటు దూరంలో మెట్రో పిల్లర్ నెంబర్ 734 వద్ద శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో దుర్గా మల్లేశ్వరి ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తం చేయడంతో బస్సులోని 18 మంది ప్రయాణికులు వెంటనే ఎమర్జెన్సీ డోర్ నుంచి కిందికి దూకారు. ఏపీలోని పాలకొల్లు వెళ్లాల్సిన ఈ బస్సు కొండాపూర్ నుంచి మియాపూర్ మీదుగా కేపీహెచ్బీ చేరుకుంది. బస్సు ఆగి ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాణనష్టం తప్పడంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని అధికారులు భావిస్తున్నారు. అయితే తనిఖీ చేసిన రిపోర్టు ఉంటేనే బస్సులను అనుమతించాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు. పెళ్లిపేరిట సహచర కానిస్టేబుల్ మోసం బంజారాహిల్స్: సహచర కానిస్టేబుల్ ప్రేమించినట్లు నటించి పెళ్లి చేసుకుంటానని మోసగించడంతో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు యత్నించింది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. పంజగుట్ట పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ విభేదాల కారణంగా భర్తతో వేరుగా ఉంటోంది. కోర్టులో విడాకుల ప్రక్రియ కొనసాగుతుంది. ఆమెకు నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. పంజగుట్ట పోలీస్స్టేషన్లోనే సహచర కానిస్టేబుల్ కప్షా స్వప్నిల్(27)తో 2024లో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సన్నిహితంగా మెలిగాడు. ఆమెకు రెండుసార్లు గర్భస్రావం చేయించాడు. కొద్దిరోజులుగా ఆమెను మతపరంగా అవమానించడం, దుర్భాషలాడటమే కాకుండా మరో యువతితో సంబంధం కొనసాగిస్తున్నాడు. విష యం తెలిసిన బాధితురాలు ఈ నెల 14న శ్రీకృష్ణానగర్లోని తన గదిలో స్వప్నిల్తో గొడవ పడింది. పెళ్లి చేసుకునేది లేదని నిందితుడు తెగేసి చెప్పడమేకాకుండా నిద్రమాత్ర లు వేసుకోవాలని ఒత్తిడి చేశాడు. దీంతో పెద్దమొత్తంలో నిద్రమాత్రలు మింగి అపస్మారకస్థితికి వెళ్లింది. ఈ నెల 16న ఆస్పత్రిలో చేర్చగా సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుని స్వప్నిల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాత్రూంలో బంధించి.. నగలు చోరీ
షాద్నగర్రూరల్: మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని మాయమాటలు చెప్పి లాడ్జ్కు తీసుకెళ్లి ఓ ఐటీ ఉద్యోగి వద్ద బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తి లూటీ చేసిన ఘటన షాద్నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఫరూఖ్నగర్ మండలం బూర్గుల గ్రామానికి చెందిన లింగారం నరేష్గౌడ్ హైదరాబాద్లో ఐటీ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఆయన శనివారం సాయంత్రం స్వగ్రామానికి వెళ్లేందుకు షాద్నగర్ బస్టాండ్ బస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలోనే ఓ గుర్తు తెలియని వ్యక్తి నరేష్గౌడ్ వద్దకు వెళ్లి డిస్ట్రిబ్యూటర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, మాయమాటలు చెప్పి బస్టాండ్ సమీపంలో ఉన్న సంగమేశ్వర లాడ్జ్కు తీసుకెళ్లాడు. అక్కడ నరేష్గౌడ్ మెడలో ఉన్న బంగారు చైన్తో పాటుగా మూడు ఉంగరాలను అపహరించి, బాత్రూంలో బంధించి పరారయ్యాడు. నరేష్గౌడ్ కేకలు వేయడంతో లాడ్జ్ సిబ్బంది వచ్చి తలుపులు తీశారు. ఈ విషయమై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. చెరువులో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం కుల్కచర్ల: ఈతకు వెళ్లిన యువకుడు గల్లంతైన ఘటనలో విషాదమే మిగిలింది. పరిగి మండలం హీరాపూర్కు చెందిన వీరపురం రామస్వామి(22) శుక్రవారం కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్ అక్కమ్మ చెరువులో గల్లంతైన విషయం తెలిసిందే. రాత్రి వరకూ వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయాన్నే చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టగా మధ్యాహ్నం వేళ రామస్వామి మృతదేహం లభించింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రమేశ్ తెలిపారు. సామాజిక మార్పునకు న్యాయవిద్య దోహదం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద బంజారాహిల్స్: న్యాయవిద్య సామాజిక మార్పునకు దోహదం చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద అన్నారు. బంజారాహిల్స్లోని సుల్తాన్ ఉల్ ఉలూం లా కాలేజీలో అంజద్ అలీఖాన్ స్మారక మూట్ కోర్ట్ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం శనివారం కాలేజీ ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జస్టిస్ సూరేపల్లి నంద, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌస్ మీరా మోహియుద్దీన్తో కలిసి హాజరయ్యారు. జస్టిస్ నంద మాట్లాడుతూ న్యాయశాస్త్ర విద్యార్థులు మంచి న్యాయవాదులుగానే కాకుండా మంచి మనుషులుగా కూడా ఎదగాలన్నారు. మూట్ కోర్ట్ పోటీలు విద్యార్థుల్లో న్యాయ పరిశోధన, వాదనా నైపుణ్యం, విమర్శనాత్మక ఆలోచనలకు దోహదపడుతాయని పేర్కొన్నారు. మూడు రోజులపాటు జరిగిన ఈ మూట్ కోర్ట్ పోటీల్లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ లా కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ లా విభాగం డీన్ వెంకటేశ్వర్లు, నేషనల్ కంపెనీ లా అప్పిలెంట్ ట్రిబ్యునల్ మాజీ మెంబర్ శిరీష మేర్ల, సుల్తాన్ ఉల్ ఉలూం ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ మహ్మద్ వలియుల్లా, గౌరవ కార్యదర్శి జాఫర్ జావెద్, లా కాలేజీ ప్రిన్సిపాల్ గీతారావు, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు కలెక్టర్ అభినందన సాక్షి,సిటీబ్యూరో: ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి శనివారం తన చాంబర్లో అభినందించారు. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఒడ్డెన్న, కళాశాలల ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు. -
ఫిన్లాండ్లో విద్యావిధానం అధ్యయనం
పోచారం: ప్రపంచంలోనే అత్యున్నత విద్యావిధానం గల ఫిన్లాండ్ దేశంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ బృందం ఈనెల 18 నుంచి పర్యటించనున్నది. ఈ బృందంలో మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరిగూడలోని ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన సెకండ్ గ్రేడ్ టీచర్ విశ్వశాంతికి స్థానం లభించింది. 18 ఏళ్ల బోధనానుభవం గల విశ్వశాంతి (vishwashanti) జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లోనూ రీసోర్స్ పర్సన్గా వ్యవహరిస్తున్నారు. ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన పలు మాడ్యూళ్ల రూపకల్పన, పూర్వ ప్రాథమిక, ప్రాథమిక విద్యకు చెందిన వర్క్ బుక్స్, హ్యాండ్ బుక్స్ రచనల్లోనూ ఆమె సేవలు అందించారు.సీఎం రేవంత్రెడ్డి 4 బృందాలను ఏర్పాటు చేసి ఫిన్లాండ్, జపాన్, సింగపూర్, వియత్నాం దేశాలకు ఒక్కో బృందాన్ని పంపించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి 40 మంది నిపుణుల బృందం ఈనెల 18న ఫిన్లాండ్ దేశ పర్యటనకు వెళ్లనున్నది. 20 నుంచి 24 వరకు అక్కడి పాఠశాలలు, టీచర్ ట్రైనింగ్ సెంటర్లను సందర్శించి, పాఠ్యాంశాలు, వారు అవలంభించే బోధనా పద్ధతులు, విద్యార్థుల స్థాయిలను పరిశీలిస్తారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందిస్తుంది. విశ్వశాంతి ఎంపికవ్వడంపై జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి, స్కూల్ హెచ్ఎం సాంబమూర్తి, టీచర్లు ప్రశంసించారు.చదవండి: మే 6 నుంచి వేసవి సంధ్యావందన శిక్షణ శిబిరం -
మొండిగౌరెల్లిలో సర్వే షురూ
యాచారం: మొండిగౌరెల్లి అసైన్డ్ భూముల సర్వే శుక్రవారం ప్రారంభమైంది. సర్వే నంబరు 127లో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డి, యాచారం తహసీల్దార్ అయ్యప్ప సర్వేతీరును పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఓ ఆర్ఐతో పాటు ముగ్గురు సర్వేయర్లు, మరో ఇద్దరు రెవెన్యూ సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారు. సర్వేనంబరు 127లో మొత్తం 122.02 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఇందులో 108.30 ఎకరాలను రైతులకు పంపిణీ చేశారు. 127లోని అసైన్డ్ భూమికి హద్దులు గుర్తించి, ఆవెంటనే ఫెన్సింగ్ వేయనున్నట్లు ఆర్డీఓ తెలిపారు. రెవెన్యూ సిబ్బంది భూముల వద్దకు వచ్చినప్పుడు రైతులు ఫొటోలు దిగాలని, ఈసమయంలో పక్క రైతుల అభిప్రాయం కూడా సేకరించి, వివరాలు నమోదు చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. నెల రోజుల్లో పరిహారం మొండిగౌరెల్లి అసైన్డ్ భూముల సర్వే పూర్తి చేసిన వెంటనే జనరల్ అవార్డు పాస్ చేసి, అర్హులైన వారికి నెల రోజుల్లో పరిహారం చెక్కులు అందజేస్తామని ఆర్డీఓ తెలిపారు. ఇందుకోసం టీజీఐఐసీ నుంచి రూ.వంద కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు. యాచారం మండలానికి కూత వేటు దూరంలో ఉన్న మొండిగౌరెల్లి అసైన్డ్ భూములను లాజిస్టిక్ పార్క్ల కోసం తీసుకునే అవకాశం ఉందని స్పష్టంచేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని సమీక్ష నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కోలన్ రమాదేవి, పాలకవర్గ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 19, 68, 127 సర్వేనంబర్లలో నకిలీలపై ఆరా తీశారు. ఆయా నంబర్లలో 1972 నుంచి నింబంధనల ప్రకారం ఎంతమంది రైతులకు భూములు అసైన్ చేశారనే వివరాలపై ఆరా తీశారు. ఇందులో ఎంతమంది నకిలీ రైతులు ఉన్నారు..? ఏ సంవత్సరంలో వీరికి హక్కులు దక్కాయి..? అప్పుడు ఉన్న అధికారులు, పాలకులు ఎవరు..? అనే విషయాలపై వివరాలు వెలికితీయాలని తహసీల్దార్ను ఆదేశించారు. భూసేకరణ జాబితాలో నకిలీల పేర్లు వచ్చినప్పటికీ మరోసారి రికార్డులు పరిశీలించి, తొలగిస్తామన్నారు. రైతులందరూ సర్వేకు సహకరించాలని కోరారు. అసైన్డ్ భూముల హద్దులు గుర్తిస్తున్న రెవెన్యూ అధికారులు ఆ వెంటనే 127, 68, 19 సర్వేనంబర్ల చుట్టూ ఫెన్సింగ్ సిబ్బందికి సూచనలు అందించిన ఆర్డీఓ అనంతరెడ్డి అసైన్డ్ భూముల్లో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయొచ్చని వెల్లడి -
డీలిమిటేషన్తో అన్యాయం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఇబ్రహీంపట్నం: 2026 జనాభా లెక్కల అనంతరం నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ఇబ్రహీంపట్నంలోని పాషనరహరి స్మారక కేంద్రంలో శుక్రవారం పార్టీ జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్తో రాష్ట్రాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లకు సీపీఎం సానుకూలంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని పాకిస్తాన్, ఇండియా చీల్చిన చందంగా పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, నాయకులు సామెల్, జగదీశ్, జగన్, నర్సింహ, బుగ్గరాములు, ప్రకాశ్కారత్ పాల్గొన్నారు. -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ఉద్యోగులకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ జేఏసీ జిల్లా కన్వీనర్ డాక్టర్ కె.రామారావు డిమాండ్ చేశారు. ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ.. 2వ పీఆర్సీ కమిటీ వేసి 30 నెలలు గడుస్తున్నా నివేదిక రాకపోవడం సిగ్గు చేటన్నారు. నివేదికను తెప్పించి 51 శాతం ఫిట్మెంట్తో జూన్ 2వ తేదీలోపు పీఆర్సీని అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.13 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలన్నారు. కొత్త ఈహెచ్ఎస్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని, ఉద్యోగులు, పెన్షనర్ల, ఆరోగ్య భద్రత కోసం నగదు రహిత చికిత్సను అందుబాటులోకి తేవాలన్నారు. ప్రస్తుతం ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. లేదంటే తదుపరి కార్యాచరణ అమలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనేష్ కుమార్ నోరీ, మహేందర్రెడ్డి, ప్రవీణ్, గోపాల్ నాయక్, పూర్ణచందర్, శాంతిశ్రీ, సైదమ్మ, రాకేష్, యశ్వంత్, అనిత తదితరులు పాల్గొన్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనఅబ్దుల్లాపూర్మెట్: ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు ఈర్లపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఉద్యోగుల పీఆర్సీ, ఓపీఎస్ను తక్షణమే అమలు చేయడంతో పాటు సీపీఎస్ను రద్దు చేస్తూ పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీజీఈ జేఎసీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం హయత్నగర్లోని అబ్దుల్లాపూర్మెట్ మండల పరిషత్ కార్యాలయంలో నిరసన తెలిపారు. ఎంపీడీఓ శ్రీవాణి, ఎంపీఓ తుల్జాప్రసాద్రావు, పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగులతో కలిసి భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సూరిబాబు, రజినీకాంత్ రెడ్డి, రాజశేఖరరెడ్డి, శివప్రసాద్, బబిత, మండలపరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటం
షాద్నగర్రూరల్: ఇందిరమ్మ గృహపథకంలో భాగంగా నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణంలో తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలను పాటించాలని హౌసింగ్ డీఈ సురేష్ సూచించారు. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని మొగిలిగిద్ద, రంగంపల్లి, ఎలికట్టలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్హులందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని తెలిపారు. బిల్లుల విషయంలో లబ్ధిదారులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, నేరుగా ఖాతాలోనే జమ అవుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ అన్వేష్, పంచాయతీ కార్యదర్శులు తేజస్విని, జైపాల్రెడ్డి, కారోబార్ శివ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి
చెరువులు, చేపల పెంపకం వృత్తిని జీవనాధారంగా చేసుకుని బతుకుతున్న వాళ్లకు దక్కాల్సిన ప్రభుత్వ పథకాలు బోగస్ లబ్ధిదారుల జేబుల్లోకి వెళ్తున్నాయి. ఆయా పథకాల్లో చోటు చేసుకున్న అక్రమాలపై మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశాం. తనిఖీలు చేసిన అధికారులు ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టినట్లు తేల్చారు. కానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఏసీబీకి కూడా ఫిర్యాదు చేశాం. మత్స్య సొసైటీలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలి. చెరువులను పూర్తిగా వృత్తిదారులకే అప్పగించాలి. – జి.సురేష్, ఫిషర్మెన్ కో ఆపరేటివ్ సొసైటీ, గూడూరు -
ఈతరాని చేపలు!
అవినీటి చెరువులో..సాక్షి, రంగారెడ్డిజిల్లా: మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు.. మాంసం ప్రియులకు మేలిమి రకం చేపల రుచి చూపించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలు పక్కదారి పట్టాయి. పక్కాగా అమలు చేయాల్సిన జిల్లా మత్స్యశాఖ అధికారులు బోగస్ లబ్ధిదారులతో కుమ్మకై ్క నిధులు స్వాహా చేశారు. ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన (పీఎంఎంఎస్వై), బ్లూ రెవల్యూషన్ స్కీం(బీఆర్ఎస్), రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన (ఆర్కేవీవై) పథకాల కింద రూ.ఐదు కోట్లు కొల్లగొట్టినట్లు తేలింది. చేపల పెంపకంతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు తమకున్న రాజకీయ పలుకుబడితో నిధులను కొల్లగొట్టినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. నిధులు పక్కదారి ఆయా పథకాల కింద 2018 నుంచి 2025 మధ్య కాలంలో జిల్లాకు పలు యూనిట్లను కేటాయించారు. ప్రభుత్వ నిధులను కొల్లగొట్టడంలో ఆరితేరిన బోగస్ వ్యక్తులకు అప్పటి అధికారుల అండదండలు పుష్కలంగా అందాయి. చేపల పెంపకం వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న పేదలకు దక్కాల్సిన సబ్సిడీ నిధులు పక్కదారి పట్టాయి. ఈ అంశపై రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదులు అందాయి. అధికారులు సైతం తమ తనిఖీల్లో నిధులు పక్కదారి పట్టిన అంశాన్ని గుర్తించారు. వాటిని తిరిగి వెనక్కి తీసుకురావడంలో.. ఇందుకు సహకరించిన జిల్లా అధికారులపై చర్యలు తీసుకోవడంలో మాత్రం వెనుకాడుతుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మచ్చుకు కొన్ని బోగస్ చెరువులు ● మొయినాబాద్ మండలం పెద్దమంగాళారం రెవెన్యూ సర్వే నంబర్ 99లో ఎకరం విస్తీర్ణంలో ఆర్ఏఎస్ రౌండ్ ట్యాంక్ ఉన్నట్లు చూపించారు. రూ.30 లక్షలు సబ్సిడీ పొందారు. తీరా తనిఖీ అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలిస్తే ట్యాంకు లేదు. అందులో చేపలు కన్పించలేదు. ● అబ్దుల్లాపూర్మెట్ మండలం మునగనూరు సర్వేనంబర్ 60,70,76లో రూ.50 లక్షల అంచనా వ్యయంతో 365 చదరపు గజాల విస్తీర్ణంలో ఆర్ఏఎస్ రౌండ్ ట్యాంక్ నిర్మించి, అందులో చేపలు పెంచుతున్నట్లు చూపించారు. అప్పటికే రూ.25 లక్షల సబ్సిడీ పొందారు. తనిఖీ అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించగా ట్యాంకు లేదు, చేపలు లేవు. లబ్ధిదారులు సమర్పించిన డాక్యుమెంట్ కూడా నకిలీగా నిర్ధారణ అయింది. ● ఇబ్రహీంపట్నం రాందాస్పల్లి రెవెన్యూ సర్వే నంబర్లు 213/1, 214/1లో 1.05 ఎకరాల విస్తీర్ణంలో ఆర్ఏఎస్ రౌండ్ ట్యాంక్ ఏర్పాటు చేసినట్లు చూపించారు. ఆర్కేవీవై పథకం కింద రూ.25 లక్షల సబ్సిడీ పొందారు. తీరా అధికారులకు అనుమానం వచ్చి తనిఖీ చేయగా, అక్కడ ట్యాంకు లేదు. చేపలు లేవు. ● గండిపేట మండలం వట్టినాగులపల్లి సర్వే నంబర్ 62/2/1లో 1.03 ఎకరాల విస్తీర్ణంలో ఆర్ఏఎస్ ట్యాంక్ నిర్మించి, అందులో చేపపిల్లలు పెంచినట్లు చూపించారు. అప్పటికే రూ.20 లక్షల సబ్సిడీ పొందారు. అధికారులు వెళ్లి పరిశీలిస్తే ట్యాంకు లేదు.. చేపలు లేవు. ● ఇబ్రహీంపట్నం మండలం రాయపోలు రెవెన్యూలోని సర్వే నంబర్ 470లో 375 గజాల విస్తీర్ణంలో ఆర్ఏఎస్ రౌండ్ ట్యాంక్ నిర్మించి, అందులో చేపలు పెంచుతున్నట్లు చూపించి ఆర్కేవీవై పథకం కింద రూ.25 లక్షల సబ్సిడీ పొందారు. ఫిర్యాదులు రావడంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, తనిఖీ చేయగా ట్యాంకు లేదు.. అందులో చేపలు లేవు. బోగస్ లబ్ధిదారులు, అధికారులు కుమ్మక్కు క్షేత్రస్థాయిలో కన్పించని చెరువులు.. చేపలు పథకాల పేరుతో నిధుల స్వాహాపర్వం చర్యలు తీసుకోవడంలో ‘మీన’మేషాలు ఇది ఇబ్రహీంపట్నంలోని షేరిగూడ ప్రాంతం. సర్వే నంబర్ 46/ఈ/1లోని 1.3 హెక్టార్ల విస్తీర్ణంలో చెరువు ఉన్నట్లు, అందులో చేపలు పెంచుతున్నట్లు కొంతమంది రూ.3.75 లక్షల రాయితీ పొందారు. తీరా అధికారులు అక్కడికి వెళ్లి చూస్తే చెరువే మాయమైంది. చేపలు ఎటు వెళ్లాయో తెలియని పరిస్థితి. ఒక్క షేరిగూడలోనే కాదు జిల్లాలోని పెద్దమంగళారం, రాందాసుపల్లి, వట్టినాగులపల్లి, మునగనూరు రెవెన్యూ కేంద్రంగా బోగస్ లబ్ధిదారులు బయటపడ్డారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు చూపించి పథకాలు పొందిన వారిపైనే కాదు.. లేని చెరువులు, చేపలను ఉన్నట్లు చూపించి, వారికి సహకరించిన జిల్లా మత్స్యశాఖ అధికారులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. -
‘పట్నం’లో పోలీసుల మోహరింపు
ఇబ్రహీంపట్నం: మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి నక్కర్తమేడిపల్లికి వెళ్లకుండా ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ కార్యాయలంలోనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏసీపీ కేపీవీ రాజు, సీఐ మహేందర్రెడ్డి వారికి నచ్చజెప్పారు. అనంతరం కిషన్రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఫార్మాసిటి భూములపై తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపించాలని బహిరంగచర్చకు రావాలని సవాల్ విసిరితే ఎందుకు ఎమ్మెల్యే తప్పించుకున్నారని ప్రశ్నించారు. భూముల కబ్జాలు, ఆక్రమణలపై ఆయన స్వగ్రామైన తోర్రూర్లోనే బహిరంగ చర్చ పెడతానన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆలయంలో అంబలి
దుద్యాల్: వేసవి రాగానే హస్నాబాద్ వీరభద్రేశ్వరస్వామి ఆలయంలో నిత్యం అంబలి పంపిణీ చేస్తున్న దాతలు ఆదర్శంగా నిలుస్తున్నారు. 36 ఏళ్లకు పైగా ఈక్రతువును కొనసాగిస్తూ ఔరా అనిపిస్తున్నారు. దాతలు, రైతులు అందించే జొన్నలు, రాగులతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంబలి తయారు చేస్తారు. కులమతాలకు అతీతంగా గ్రామస్తులకు పంచుతున్నారు. ప్రతిరోజూ సుమారు 50 కిలోల పాత్ర నిండా జొన్నలు, రాగుల అంబలి వండి, అందులో శనగలు కలిపి జనాలకు అందిస్తున్నారు. శ్రీరామ నవమితో ప్రారంభం.. పూర్వం గ్రామంలోని వీరభద్రేశ్వరస్వామి ఆలయానికి శ్రీగురు గోవిందానంద సరస్వతి స్వామివారు వచ్చి భక్తులకు ప్రవచనాలు చెప్పేవారు. పూజలు ముగిసిన అనంతరం ఆలయంలో అంబలి పంపిణీ చేయాలని స్వామివారు సూచించడంతో అప్పటి నుంచి ఈరోజు వరకూ వేసవిలో ఈకార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఏటా శ్రీరామ నవమి రోజున ప్రారంభించి, ఎండల తీవ్రత తగ్గేవరకూ అంబలి పంపిణీ కొనసాగుతుంది. తమకు తోచిన సాయం చేస్తూ భక్తులు సైతం దీనికి సహకరిస్తున్నారు. దాతలు, రైతులు అందించే జొన్నలను గ్రామానికి చెందిన మజ్జిబాబా తన గిర్నీలో ఉచితంగా పిండి పట్టించి, సాయం చేస్తున్నారు. అంబలి తాగడం ద్వారా వేసవి తాపం నుంచి ఉపశమనం కలుగుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొంటున్నారు. హస్నాబాద్లో 36 ఏళ్లుగా పంపిణీ దాతల సహకారంతో ఏటా కొనసాగుతున్న కేంద్రం హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు -
నక్కర్తమేడిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత
యాచారం: మండలంలోని నక్కర్తమేడిపల్లిలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫార్మాసిటీ భూ పరిహారంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి వసూళ్లకు పాల్పడ్డారని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. దీంతో తాను పైసా ఎవరి వద్దనైనా తీసుకుంటే రాజకీయాలే వదిలేస్తానని.. నక్కర్తమేడిపల్లికి వస్తాను.. రైతుల వద్దే తేల్చుకుందామని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సవాల్ చేసి చర్చకు రావాలని డిమాండ్ చేసింది తెలిసిందే. ఈ క్రమంలో గ్రామ బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. గ్రామ చౌరాస్తాలో వేసిన టెంట్లను బీఆర్ఎస్ శ్రేణులు తొలగించారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టి గ్రామంలో 144 సెక్షన్ విధించారు. తోపులాట, బీఆర్ఎస్ నేతలకు గాయాలు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తనయుడు, మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నక్కర్తమేడిపల్లికి వచ్చారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు చేసిన వ్యక్తి చర్చకు రాకుంటే ఎలా అని మండిపడ్డారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులను కందుకూరు, మహేశ్వరం పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసులు అరెస్టు చేసే సమయంలో జరిగిన తోపులాటలో మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డితోపాటు పలువురు నాయకులు గాయపడ్డారు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందో అని గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరాస్తా వద్ద బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. పోటీగా నక్కర్తమేడిపల్లి గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. వారిని కూడా పోలీసులు అరెస్టు చేసి మాడ్గుల్ పోలీస్స్టేషన్ తరలించారు. నిరాధారమైన ఆరోపణలు మహేశ్వరం: ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తమపై నిరాధారమైన, పసలేని ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి అన్నారు. నక్కర్తమేడిపల్లిలో పోలీసులు ఆయనను అరెస్టు చేసి మహేశ్వరం పోలీస్స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మల్రెడ్డి రంగారెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకొని నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నెలరోజుల్లో తాము చేసిన అవినీతిని నిరుపించాలని, లేదంటే ఇబ్రహీంపట్నం అంబేడ్కర్ విగ్రహం వద్ద ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. ఫార్మాసిటీ పరిహారం వసూళ్లపై ఎమ్మెల్యే మల్రెడ్డి ఆరోపణలు చర్చకు రావాలని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సవాల్ మంచిరెడ్డి రాక కోసం ఏర్పాట్లు చేసిన బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ నాయకులు వేసిన టెంట్లను పీకేసిన కాంగ్రెస్ శ్రేణులు ఇరు వర్గాలను అరెస్టు చేసిన పోలీసులు -
ఆస్పత్రిలో జారిపడి వ్యక్తి మృతి
చేవెళ్ల: అనారోగ్యంతో ఆసస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తి బాత్రూమ్లో కాలుజారి పడిపోయి మృతి చెందాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలోని పట్నం మహేందర్రెడ్డి జనరల్ ఆస్పత్రిలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ భూపాల్శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామానికి చెందిన వి.మల్లేశ్(32) మేసీ్త్ర పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆరోగ్యం బాగాలేదని ఈనెల 13వ తేదీన చేవెళ్లలోని పట్నం మహేందర్రెడ్డి ఆస్పత్రిలో చేరాడు. అక్కడ కిడ్నీకి సంబంధించి ఆపరేషన్ చేశారు. శుక్రవారం అతడు ఆస్పత్రిలో బాత్రూమ్కని వెళ్లి కాలుజారి పడిపోవటంతో తలకు బలమైన గాయమైంది. వెంటనే వైద్యులు పరిశీలించగా తలకు తగిలిన బలమైన గాయంతో మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య లత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పైసాబారీష్ కేసులో మరో నిందితుడి రిమాండ్ షాద్నగర్రూరల్: పైసా బారీష్ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పట్టణ సీఐ సీతారాం కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల మధు అలియాస్ రవికి బ్రహ్మయ్య అలియాస్ అన్నారెడ్డితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి మోసపూరితంగా డబ్బులు సంపాదించాలని తక్కువ ధరకే బంగారం ఇస్తామని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో రవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా కంచికర్లకు చెందిన మక్బూల్బాషా, రామ్మోహన్కు ఫోన్చేసి రూ.10 లక్షలు ఇస్తే బారీష్ పూజలు చేసి రూ.30లక్షలు ఇస్తామని నమ్మించారు. వారిని డబ్బులు తీసుకొని షాద్నగర్కు రావాలని చెప్పారు. దీంతో ఎలాగైనా వారి నుంచి డబ్బులు తీసుకోవాలనే ఉద్దేశంతో మధు అలియాస్ రవి తన గ్రామానికి చెందిన స్నేహితులు బింగి వెంకటేష్, మహిపాల్, తన బంధువు చంద్రశేఖర్తో కలిసి షాద్నగర్లోని సీఎస్కే విల్లాలోకి వచ్చాడు. అక్కడికి వచ్చిన మక్బూల్బాషా, రామ్మోహన్లను బెదిరించి వారినుంచి రూ.9లక్షల నగదును లాక్కొని పరారయ్యారు. కేసు దర్యాప్తులో భాగంగా పైసాబారీష్ కేసులో పరారీలో ఉన్న నిందితుడు పిచ్చకుంట్ల మధు అలియాస్ రవిని పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. నేరాన్ని ఒప్పుకోవడంతో రిమాండ్కు తరలించారు. పోక్సో నిందితుడికి పదేళ్ల జైలు పహాడీషరీఫ్: బాలాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి ఎల్బీనగర్ న్యాయస్థానం శుక్రవారం పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. 2019లో మహ్మద్ షఫీ ఖాన్(22)అల్జాబ్రీ కాలనీలో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితుడికి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. వడదెబ్బతో రైతు మృతి మొయినాబాద్ రూరల్: వడదెబ్బతో రైతు మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అమ్డాపూర్లో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పట్నం నర్సింహారెడ్డి శుక్రవారం వ్యవసాయ పొలంలో పని చేస్తుండగా ఎండ వేడిమిని భరించలేక సొమ్మసిల్లి పడిపోయాడు. గమనించిన పక్క పొలాల రైతులు, కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ మద్యపాగ కృష్ణ కోరారు. యాలాల: మండలంలోని బండమీదిపల్లి గ్రామానికి చెందిన రేగొండి నర్సింలు(50)శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. సమాచారం అందుకున్న తాండూరుకు చెందిన వైద్యుడు డాక్టర్ సంపత్కుమార్, బండమీదిపల్లి సర్పంచ్ నరేష్కుమార్ అంత్యక్రియల నిమిత్తం మృతుడి భార్య దేవమ్మకు ఆర్థిక సాయం అందించారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సతీష్రెడ్డి పూడూరు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల సతీష్రెడ్డి ఆరోపించారు. కేంద్ర తీరుకు నిరసనగా ఈ నెల ఽ18న నగరంలోని ఇందిరా పార్ వద్ద నిర్వహించే మహాగర్జన కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ధరలు పెరగడం, నిరుద్యోగం, రైతు సమస్యలు సామాస్య ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు. ప్రజల పక్షాన కాంగ్రెస్ పోరాటం చేస్తోందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కులను కాపాడేందుకు తలపట్టిన మహాగర్జనను విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
తమిళనాడు దొంగల పనేనా?
● పాల రైతుపై మత్తుమందు చల్లి రూ.10 లక్షలు దోపిడీ ● బ్యాంకు వద్ద లావాదేవీలను గమనించి, బైక్లపై అనుసరించిన దుండగులు ● కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టిన పోలీసులు కందుకూరు: కుమారుడి పెళ్లి నిశ్చితార్థం కోసం బ్యాంకు నుంచి ఇంటికి నగదు తీసుకెళ్తున్న ఓ వ్యక్తిపై మత్తు మందు చల్లి రూ.10 లక్షలు దోచుకెళ్లిన దొంగలు తమిళనాడుకు చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని అన్నోజిగూడకు చెందిన ఢిల్లీ నారాయణ వ్యవసాయంతో పాటు పాల వ్యాపారం చేస్తాడు. ఈ నెల 19న తన కుమారుడి నిశ్చితార్థ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. డబ్బు అవసరం కావడంతో గురువారం మధ్యాహ్నం పాల వ్యాపారం ముగించుకుని, నగదు డ్రా చేసేందుకు కందుకూరు చౌరస్తాలోని ఎస్బీఐకి వచ్చాడు. ఒకేసారి అంత క్యాష్ ఇచ్చేందుకు సిబ్బంది నిరాకరించడంతో బ్యాంకులో నగదు డిపాజిట్ చేయడానికి వచ్చిన వారి వద్ద రూ.10 లక్షలు తీసుకుని, తన ఖాతా నుంచి వారి అకౌంట్కు చెక్కు ద్వారా చెల్లించాడు. మధ్యాహ్నం 1:20 గంటల సమయంలో నగదు తీసుకుని సమీపంలో పార్కు చేసిన తన బైక్ వద్దకు వచ్చి సైడ్ బాక్స్లో పెట్టుకుని, ఇంటికి బయలుదేరాడు. ఇదంతా గమనించిన నలుగురు దుండగులు బైక్లపై నారాయణను అనుసరించారు. కందుకూరు దాటిన తర్వాత అతనిపై మత్తు మందు చల్లి డబ్బు తీసుకుని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ పుటేజీల పరిశీలన కేసు విచారణ చేపట్టిన పోలీసులు బ్యాంకుతో పాటు రహదారి వెంబడి షాపుల ముందు ఉన్న సీసీటీవీ కెమెరా పుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. బ్యాంకులో జరిగిన లావాదేవీలు చూసిన నలుగురు వ్యక్తులు బైక్లపై నారాయణను అనుసరిస్తూ వెళ్లడాన్ని గుర్తించారు. వారి నడవడిక, దోపిడీ తీరు ఆధారంగా తమిళనాడుకు చెందిన వారని ప్రాథమికంగా నిర్ధారించారు. దుండగులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. -
అండర్పాస్ల నిర్మాణానికి వినతి
చేవెళ్ల: హైదరాబాద్– బీజాపూర్ రహదారి విస్తరణలో పలు గ్రామాలకు వెళ్లే మార్గాల వద్ద అండర్ పాస్లకు అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డిని కోరారు. ఈమేరకు చేవెళ్ల నాయకులతో కలిసి వెళ్లి ఢిల్లీలో కొండాను కలిశారు. రోడ్డు విస్తరణలో పలు చోట్ల ఎదురవుతున్న ఇబ్బందులను ఎంపీకి వివరించారు. ఆయా గ్రామాలకు వెళ్లేలా అండర్పాస్లు, సర్వీస్ రోడ్లు నిర్మించేలా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. ఎంపీని కలిసిన వారిలో నాయకులు రాంరెడ్డి, జనార్దన్రెడ్డి, సురేందర్రెడ్డి, దర్శన్, వెంకట్రెడ్డి, పెంటయ్యగౌడ్, ఆగిరెడ్డి, గోపాల్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ప్రభాకర్, గోనె ప్రతాప్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, రాములు, మధుసుదన్గుప్తా, రవీందర్రెడ్డి, తదితరులు ఉన్నారు. -
బొక్కల కంపెనీని తరలించండి
● దుర్వాసన భరించలేకపోతున్నాం ● హస్తేపూర్వాసుల ఆందోళన ● ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం చేవెళ్ల: గ్రామ సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీ నుంచి వెలువడుతున్న దుర్వాసనను భరించలేకపోతున్నామని, సదరు ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తరలించాలని హస్తేపూర్వాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక సర్పంచ్ జ్యోతిభూపాల్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. మైరాన్ కంపెనీ ద్వారా గ్రామంలోకి వస్తున్న దుర్వాసనతో ప్రజలు శ్వాసకోష వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. కంపెనీ వద్దకు వెళ్లి పరిశీలించగా జంతువుల ఎముకలు, కోళ్ల వ్యర్థాలు, రక్తంతో నిండిన ఎముకలను ఉడికిస్తున్నారని మండిపడ్డారు. ఈ కంపెనీతో హస్తేపూర్, అంతారం వాసులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయాన్ని గతంలోనే ఎమ్మెల్యే కాలె యాదయ్య దృష్టికి తీసుకెళ్లగా కంపెనీని మూసేయాలని ఆదేశించారన్నారు. కానీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఎం.జంగయ్య, బి.యాదయ్య, పి.మహేందర్, వై.క్రిష్ణ, జి.భూపాల్గౌడ్, శ్రీకాంత్, గోవర్ధన్గౌడ్, పెంటయ్య, నర్సింలు, రాజు, ఈశ్వర్, రాజేందర్, నర్సింహ, వెంకటేశ్, క్రిష్ణయ్య ఉన్నారు. -
ప్లాట్లు.. నిబంధనలకు తూట్లు
కందుకూరు: వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్లు విక్రయాలు చేపట్టి ఏళ్లు గడుస్తున్నా ఇంత వరకు గ్రామ పంచాయతీలకు రిజిస్ట్రేషన్లు చేయాల్సిన రోడ్లు, ఓపెన్ ఏరియా, సోషల్ ఇన్ఫ్రా తదితరాలు చేయకుండా రియల్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ మండలంలో ప్రస్తుతం పలు గ్రామాల్లో నెలకొన్న సమస్య. ఇబ్బడిముబ్బడిగా వెంచర్లు రియల్ ఎస్టేట్ భూమ్ ప్రారంభమైన 2006 సంవత్సరం నుంచి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో డీటీసీపీ లేఅవుట్లతో పాటు అనధికార లేఅవుట్లు ఇబ్బడి ముబ్బడిగా వెలిశాయి. వాటిల్లో ప్లాట్లు విక్రయాలు పూర్తయి చాలా ఏళ్లు గడుస్తుంది. కాగా వెంచర్లు ఏర్పాటు చేసిన తర్వాత గ్రామ పంచాయతీలకు పార్కు, కమ్యూనిటీ స్థలాలు, రోడ్లు రిజిస్ట్రేషన్లు తప్పనిసరిగా చేయాలి. దీంతో అందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. కానీ చాలా గ్రామాల్లో వేసిన వెంచర్లలో రియల్ వ్యాపారులు ప్లాట్లు విక్రయించి చేతులు దులుపుకొన్నారు తప్పా అందులోని ఖాళీ స్థలాలు, ప్రజా ప్రయోజనాల కోసం వదిలిన స్థలాలు, రోడ్లు రిజిస్ట్రేషన్లు చేయకుండా మిన్నుకుండిపోయారు. 35 గ్రామ పంచాయతీల్లో దాదాపు సగానికి పైగానే పంచాయతీల పరిధిలో పదుల సంఖ్యలోనే అలాంటి వెంచర్లు ఉన్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీలు అలాంటి వాటిని గుర్తించి ఖాళీ స్థలాలతో పాటు రోడ్లు పంచాయతీల పేరుతో రిజిస్ట్రేషన్లు చేయించేలా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పథకాలతో లబ్ధి వెంచర్లలో ప్రజా ప్రయోజనాల కోసం వదిలిన ఖాళీ స్థలాలు, రోడ్లు రిజిస్ట్రేషన్లు చేయించకపోవడంతో చాలా మందికి అది అవకాశంగా మారింది. ప్రస్తుతం రికార్డుల్లో వారికి ఆ స్థలం అంతా భూమిగా నమోదు కావడంతో ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్నారు. రైతుభరోసా వంటి పథకాలతో లబ్ధి పొందుతున్నారు. మరోపక్క శ్రీశైలం రహదారి నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ఇంత వరకు ఆ రహదారి వెళ్లే భూమిని ప్రభుత్వం పేరుతో నమోదు చేయలేదు. దీంతో పట్టాదారు పాస్పుస్తకాల్లో సైతం రహదారి విస్తీర్ణం కూడా భూమి కింద నమోదయింది. పలుచోట్ల అలాంటి పాస్పుస్తకాలతో విక్రయించడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. గూడూరు సమీపంలో రోడ్లు, పార్కు స్థలాలు పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయని వెంచర్ పంచాయతీలపై రిజిస్ట్రేషన్లు కాని వెంచర్ రోడ్లు, పార్కు స్థలాలు ప్లాట్లు విక్రయించి కాసులు దండుకున్న రియల్ వ్యాపారులు పట్టించుకోని పంచాయతీ అధికారులు చర్యలు తీసుకుంటాం గతంలో అధికారిక, అనధికారికంగా ఏర్పాటు చేసిన లేఅవుట్లను గుర్తిస్తాం. అందులోని రోడ్లు, పార్కు స్థలాలు వంటి వాటిని గ్రామ పంచాయతీలకు రిజిస్ట్రేషన్ చేయకపోతే నోటీసులు ఇస్తాం. క్షేత్రస్థాయి సిబ్బందితో రిజిస్ట్రేషన్ చేయించేలా చర్యలు తీసుకుంటాం. – గీత, ఎంపీఓ, కందుకూరు -
వీఎం హోంలో మంత్రి అడ్లూరి
హుడాకాంప్లెక్స్: షెడ్యూల్ కులాల అభివద్ధి శాఖమంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ గురువారం సరూర్నగర్లోని వీఎం హోం రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు. ఎన్సీసీ విద్యార్థులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన పాఠశాలలోని క్రీడాప్రాంగణంలో క్రికెట్కోర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకమైన ఈ పాఠశాలలో ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది అంకితభావంతో పని చేస్తుండడం అభినందనీయమని అన్నారు. ఇక్కడి విద్యార్థులు అటు చదువులోనూ.. ఇటు క్రీడల్లోనూ ఉత్తమ ఫలితాలు సాధిస్తూ రాష్ట్రస్థాయిలో రాణించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. విద్యాపరమైన విషయాలు, ఉపాధ్యాయుల పనితీరు, అందుతున్న వసతులు తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో పాఠశాల గౌరవ కార్యదర్శి జె.రామారావు, ప్రిన్సిపాల్ సి.నర్సింహారెడ్డి, సూపరింటెండెంట్ లక్ష్మీపార్వతి, వైస్ ప్రిన్సిపాల్ వై.వి. శివప్రసాద్, కాంగ్రెస్ నాయకుడు చిక్కుల్ల శివప్రసాద్ తదితరులు ల్గొన్నారు. -
దళితరత్న అవార్డు గ్రహీత భిక్షపతికి సన్మానం
చేవెళ్ల: సామాజిక ఉద్య మ స్ఫూర్తిదారుడు దళిత రత్న అవార్డు గ్రహీత ఇటిక్యాల భిక్షపతి మహానీయుల ఆశయ సాధనలో గత 40 ఏళ్లుగా పనిచేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. ఈ సందర్భంగా చేవెళ్లలోని అంబేడ్కర్ భవన్లో గురువారం ఇటిక్యాల భిక్షపతిని విద్యార్థి సంఘం నాయకుల ఆధ్వర్యంలో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మండలంలోని అంతారం గ్రామానికి చెందిన ఇటిక్యాల భిక్షపతి గత కొన్నేళ్లుగా సామాజిక కార్యక్రమాలు చేపడుతూ మహానీయుల ఆశయ సాధనలో పనిచేస్తున్నారని కొనియాడారు. సమాజంలో మార్పు కోసం తనవంతు ప్రయత్నంగా ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా దళితరత్న అవార్డు రావటం సంతోషకరమన్నారు. ఇలాంటి అవార్డులు మరెన్నో అందుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు రాజేశ్, జైపాల్, శ్రీనివాస్, దయాకర్, సూర్యప్రకాశ్ తదితరులు ఉన్నారు. -
కిడ్నాప్ కేసులో ‘మంచిరెడ్డి’ సరెండర్
ఇబ్రహీంపట్నం: బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి కిడ్నాప్ కేసు వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి, అతని కుమారుడు ప్రశాంత్కుమార్రెడ్డి హైకోర్టు ఆదేశం మేరకు గురువారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యారు. ఈ కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో న్యాయస్థానం వీరికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కిషన్రెడ్డి, ప్రశాంత్కుమార్రెడ్డి జామీన్ పత్రాలపై సంతకాలు చేసి పోలీస్ అధికారులకు సమర్పించారు. అనంతరం కిషన్రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులను అడ్డం పెట్టుకుని అధికార పార్టీ తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా న్యాయం కోసం తమ పోరాటం ఆగదని స్పష్టంచేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలను కై వసం చేసుకుందని, దొడ్డిదారిన చైర్మన్ పీఠం ఎక్కేందుకు అధికార పార్టీ భయభ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు. -
ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలి
కందుకూరు: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీనివాస్ సూచించారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మండల కేంద్రంలోని నవారు బాల్రెడ్డి ఫంక్షన్హాల్లో మండల సభ నిర్వహించారు. అధికారులు శాఖల వారీగా ప్రగతి నివేదిక చదివి వినిపించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పంచాయతీల్లో పారిశుద్ధ్యం, పచ్చదనానికి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులను అవసరమైన పనులకు ఖర్చు చేయాలన్నారు. అరైవ్–అలైవ్ లో భాగంగా ప్రతి పాఠశాలలో క్షేమంగా ఇంటికి చేరుకోండి అనే పాఠ్యాంశాన్ని పిల్లలకు చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.కృష్ణనాయక్, మండల ప్రత్యేకాధికారి సుధారాణి, ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్, ఎంపీడీఓ సరిత, తహసీల్దార్ గోపాల్, సీఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
మహిళా శక్తి ఎంతో గొప్పది
షాద్నగర్రూరల్: సమాజంలో మహిళాశక్తి ఎంతో గొప్పదని పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ దివ్యదేవరాజన్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీడీఓ బన్సీలాల్ ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సమాజంలో సర్పంచ్ల పాత్ర కీలకమైనదని, ప్రభుత్వం అందిస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించాలని అన్నారు. అర్హులైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వీర్లపల్లిశంకర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి పారదర్శక పాలన అందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీఆర్డీఓ శ్రీలత, డీపీఓ సురేష్మోహన్, డీసీపీ శిరీష, ఆర్డీఓ సరిత, తహసీల్దార్ నాగయ్య, మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బస్వం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్అలీఖాన్, సీడీపీఓ ఉదయ, ఎంఈఓ మనోహర్, ఎంపీఓ జయంత్రెడ్డి, ఏఓ నిషాంత్కుమార్, ఏపీఓ అరుణ, ఏపీఎం జంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
జలం.. పాతాళం
వికారాబాద్: జిల్లాలో భూగర్భజలాలు రోజురోజుకూ అడుగంటుతున్నాయి. ఎండల తీవ్రతతో చెరువులు, కుంటలు, బోరుబావుల్లో నీరు భారీగా పడిపోయింది. దీంతో పంటలపై తీవ్ర ప్రభావం పడింది. ఎండుతున్న పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇళ్లలోని బోర్లలో సైతం నీరు రావడం లేదు. మూగజీవుల దాహార్తిని తీర్చడం కష్టంగా మారింది. ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చి నెలాఖరుకు మీటరు లోతుకు జలాలు పడిపోయాయి. ఏప్రిల్, మే చివరి నాటికి పరిస్థితి మరింత దారుణంగా ఉండనుంది. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన అధికారులు కంటి తుడుపు చర్యలతో సరిపెడుతున్నారు. ఇంకుడు గుంతలు మచ్చుకై నా కనిపించడంలేదు. జిల్లాలో వేలకు వేలు ఇంకుడు గుంతలు తవ్వామని చెబుతున్న అధికారులు వాటి నిర్వహణను గాలికొదిలేస్తున్నారు. చెక్ డ్యామ్లు, ఫాం ఫండ్స్, చెరువులు, కుంటల్లో పూడిక తీయకపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. దీంతో భూగర్భ జలాలు సాధారణ స్థాయి కంటే ఎక్కవగా అడుగంటి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. మరో పక్క నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా బోరు బావులు తవ్వడం కూడా ప్రధాన సమస్యగా మారింది. గత ఫిబ్రవరితో పోలిస్తే.. గత ఫిబ్రవరితో పోలిస్తే భూగర్భ జలాలు మీటరు లోతుకు చేరాయి. మార్చి నెలాఖరు నాటికి మరింత లోతుకు పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి మాసంలో జిల్లాలో సగటున 12.87 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోగా మార్చి నెలాఖరు నాటికి 13.89 మీటర్ల లోతుకు చేరాయి. సాధారణంగా చూస్తే గతేడాది ఈ మార్చి నెలాఖరు నాటికి అత్యధికంగా 27.17 మీటర్ల లోతుకు అడుగంటాయి. మర్పల్లి మండలంలో అత్యధికంగా 27.17 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. గత ఫిబ్రవరితో పోలిస్తే ఈ నెల రెండు నెలల్లో మీటర్ల లోతుకు చేరాయి. చౌడాపూర్ మండలంలో అత్యల్పంగా 6.40 మీటర్ల లోతులో నీళ్లు ఉన్నాయి. దోమ, వికారాబాద్ మండలాల్లోనూ 20 మీటర్ల లోతుకు చేరాయి. లక్నాపూర్, కోట్పల్లి, జుంటుపల్లి, శివసాగర్ ప్రాజెక్టులు సగానికిపైగా అడుగంటాయి. చిన్న చిన్న చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. ఇష్టారాజ్యంగా బోరుబావులు వాతావారణ పరిస్థితులు, నీటి లభ్యత లాంటి విషయాలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా బోరుబావులు బోరుబావులు తవ్వుతున్నారు. ఈ ప్రభావం భూగర్భ జలాలపై పడుతోంది. కొందరు రైతులు ఆటోమెటిక్ స్టార్టర్లు వినియోగించి బోరుబావుల ద్వారా పొలాలకు నీరు పారిస్తున్నారు. వీరు రాత్రి సమయంలో కరెంటు ఉన్నంత సేపు బోరుబావులు నడిచేలా సెట్ చేసి ఉండటంతో అవసరానికి మించి నీరు పారుతోంది. చాలా చోట్ల వృథాగా పోతున్నాయి. ఇది కూడా భూగర్భజలాలు అడుగంటడానికి కారణమవుతోంది. ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. భూగర్భజలాలు ఉన్నాయా లేవో అని చూసుకోకుండా బోర్లు వేసి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. జియాలజిస్టులు చూపుతున్న పాయింట్లు సైతం సగానికిపైగా ఫెయిల్ అవుతున్నాయి. అడుగంటుతున్న భూగర్భ జలాలు గతేడాదితో పోలిస్తే ఈసారి మరింత లోతుకు.. నెల రోజుల్లోనే రెండు మీటర్లు పడిపోయిన వైనం పలు మండలాల్లో 20 మీటర్లు పైగానే.. మర్పల్లిలో అత్యధికంగా 27.17 మీటర్ల లోతుకు.. ఎండుతున్న చెరువులు, కుంటలు పంటలపై తీవ్ర ప్రభావం జిల్లాలో లక్ష పైచిలుకు వ్యవసాయ బోరుబావులు ఉండగా మరో 35 వేలకు పైగా ఇంటి బోరు బావులు ఉన్నాయి. 12 వేల వరకు అనధికార బోరుబావులు ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. అనుమతులు లేకుండా బోరు బావులు తవ్వే వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఎక్కడా అమలు కావడం లేదు. కనీసం ఒక బోరుకు మరో బోరుకు మధ్య 80 మీటర్ల దూరం ఉండాలి. అదే ప్రజావసరాలకు వినియోగించే బోరుబావికి 250 మీటర్ల దూరం పాటించాలి. కానీ ఈ నిబంధనలు ఎక్కడా పాటించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో వెయ్యి అడుగుల వరకు బోర్లు వేస్తున్నారు. బోరు వేయాలనుకుంటే భూగర్భ జలవనరుల శాఖ నుంచి తప్పని సరిగా అనుమతి తీసుకోవాలి. జిల్లాలో సగటున ప్రతి నెలా 300 పైగా బోరుబావులు తవ్వుతున్నట్టు సమాచారం. ఈ లెక్కన ఏడాదికి 2వేల నుంచి 3వేల వరకు తవ్వుతున్నారు. వీటిలో ఒక్క శాతం వాటికి కూడా అనుమతులు తీసుకోవడం లేదు. భూగర్భ జల వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఇంకుడు గుంతలు తవ్వటంతో పాటు నిర్వహణ సక్రమంగా ఉండాలి. కుంటలు, చెరువులు, చెక్ డ్యామ్లలో పూడిక తీసి నీరు ఇంకేలా చూడాలి. నీటిని పొదుపుగా వాడటం సామాజిక బాధ్యత. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే బోరు తవ్వుకోవాలి. – రవిశంకర్, జిల్లా భూగర్భ జల అధికారి -
ఎన్ఎస్యూఐ ఆందోళన
● ప్రైవేటు కాలేజీలు నిబంధనలు పాటించడం లేదని మండిపాటు ● అగస్త్య సిబ్బందితో వాగ్వాదం, పరస్పర దాడులు ఇబ్రహీంపట్నం రూరల్: నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న ప్రైయివేటు జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యూఐ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షుడు నందకుమార్ డిమాండ్ చేశారు. ఆదిబట్లలో అనుమతులు లేకుండా కళాశాలల నడిపిస్తున్నారని, వేసవి సెలవుల్లో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి నిర్బంధ విద్యను బోధిస్తున్నారని ధర్నా చేపట్టారు. కళాశాలలో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఈ సమయంలో సిబ్బంది, ఎన్ఎస్యూఐ నాయకులు పరస్పరం దాడి చేసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఆందోళన సద్దుమనిగింది. అనంతరం నందకుమార్ మాట్లాడుతూ.. ఆదిబట్లలో కొనసాగుతున్న అగస్త్య కళాశాల ఒకే అనుమతితో మరో రెండు బ్రాంచులు నడిపిస్తోందని, వేసవి సెలవులు ఇవ్వకుండా ఇంటర్ తరగతులు నిర్వహిస్తోందని ఆరోపించారు. డీఐఓ వెంక్యానాయక్ కళాశాలల యాజమాన్యాలతో కుమ్మకై ్క ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా ఫెయిల్ అయిన విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు తరగతులు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ తెలిపారు. -
హామీలు అమలు చేయాలి
పహాడీషరీఫ్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా రెడ్డి డిమాండ్ చేశారు. జల్పల్లి సర్కిల్లో మంజూరైన 360 షాదీ ముబారక్ చెక్లను గురువారం ఆమె పహాడీషరీఫ్ ప్రీమియర్ పంక్షన్హాల్లో అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రూ.లక్ష చెక్తో పాటు తులం బంగారు ఇస్తామన్నారని, ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.2,500, స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని విమర్శించారు. ప్రస్తుతం ఈ చెక్ తీసుకుంటున్న ప్రతి మహిళకు రేవంత్ సర్కార్ తులం బంగారం బాకీ ఉందని గుర్తుంచుకోవాలన్నారు. రెండేళ్ల నుంచి 13 లక్షల మంది విద్యార్థులకు రావాల్సిన రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను పెండింగ్లో పెట్టారన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని బాధ్యత గల కేసీఆర్ ప్రభుత్వం కొనసాగించిందన్నారు. చదువు విలువ తెలిసినట్లయితే బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపులో రాజకీయాలకు తావులేకుండా నిజమైన అర్హులకు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో బాలాపూర్ తహసీల్దార్ ఇందిరా దేవి, జల్పల్లి డిప్యూటీ కమిషనర్ బి.వెంకట్రామ్, నాయకులు కృష్ణారెడ్డి, పల్లపు శంకర్, షేక్ అఫ్జల్, కై సర్ బామ్, యంజాల జనార్దన్, గుండు నర్సింగ్, యంజాల అర్జున్, బర్కత్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
చరిత్రాత్మక నిర్ణయం
చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లకు తుదిరూపం ఇచ్చేందుకు.. 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి అమలులోకి తేవడానికి వీలుగా కేంద్రం తీసుకొస్తున్న మూడు బిల్లులను గురువారం లోక్సభలో ప్రవేశపెట్టారు. దీనిపై పలువురు నారీమణులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఇది చరిత్రాత్మక నిర్ణయమని హర్షం వ్యక్తం చేశారు. – సాక్షి, నెట్వర్క్చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు సమానత్వాన్ని పెంపొందిస్తాయి. దేశాభివృద్ధిలో తీసుకునే నిర్ణయాత్మక అంశాల్లో సీ్త్రల పాత్రకు ప్రాధాన్యత లభిస్తుంది. నారీశక్తి వందన్ అదినియమ్ బిల్లు చారిత్రాత్మక నిర్ణయం. రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం దక్కతుంది. మహిళలపై జరుగుతున్న వివిధ రకాల దౌర్జన్యాలపై చట్ట సభల్లో ప్రశ్నించేందుకు అవకాశం కలుగుతుంది. – అనితకుమారి, ప్రిన్సిపాల్, శ్రీ విద్యాంజలి జూనియర్ కళాశాల, ఇబ్రహీంపట్నం చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లతో మహిళలకు ప్రాతినిధ్యం పెరుగుతుంది. సమానత్వాన్ని సాధించే దిశలో ఇదొక మంచి పరిణామం. మహిళల సమస్యలపై పోరాడేందుకు అవకాశం దక్కుతుంది. మహిళాల ప్రాతినిధ్యం పెరిగితే సామాజిక అభివృద్ధి, పాలనాపరమైన నిర్ణయాల్లో కొత్త ఆలోచనలు, విభిన్న అభిప్రాయాలకు అవకాశం ఉంటుంది. – దండె వాణి, న్యాయవాది, ఇబ్రహీంపట్నం న్యాయస్థానంచట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం హర్షణీయం. మహిళల రాజ కీయ భాగస్వామ్యం పెరుగుతుంది. మహిళల సాధికారతకు తీసుకొచ్చిన ఈ బిల్లుతో సముచిత స్థానంతోపాటు గౌరవం లభిస్తుంది. మహిళల అభ్యున్నతికి ఇది మరింత దోహదపడుతుంది. దేశ అభివృద్ధికి ముందడుగు. – బాణాల శ్రీలావణ్య, సరూర్నగర్ మిహిళా సాధికారతతోనే దేశం అభివృద్ధి సాధ్యం. చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ల కల్పనతో సమాజంలో ప్రాధాన్యత పెరుగుతుంది. సమాభివృద్ధిలో మహిళల పాత్ర మరింత పెరుగుతుంది. మహిళా బిల్లుకు చట్టణ సవరణ చేయడం హర్షణీయం. ఇది చరిత్రాత్మక మార్పునకు నాంది. – సుశీల, ఎస్ఐ, షాద్నగర్ భాగస్వామ్యం పెరుగుతుంది మహిళా రిజర్వేషన్ చట్ట సవరణతో రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం నారీ శక్తి వందన్ అదినియమ్ బిల్లు తేవడం హర్షణీయం. 2029 సార్వత్రిక ఎన్నికల నుంచే ఈ చట్టం అమల్లోకి రావడం మరింత ఆనందంగా ఉంది. అప్పటి నుంచి చట్టసభల్లో మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. – పడమటి మమతారెడ్డి, కౌన్సిలర్, పెద్దమంగళారం, మొయినాబాద్ మున్సిపాలిటీ ప్రాధాన్యత లభిస్తుంది మహిళా రిజర్వేషన్లతో రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం హర్షణీయం. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. రిజర్వేషన్లు కల్పించడంతో మహిళలకు సముచిత ప్రాధాన్యత లభిస్తుంది. మహిళా సాధికారతతోనే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. – యాట గీత, మార్కెట్ కమిటీ చైర్పర్సన్, ఆమనగల్లు మహిళలకు సముచిత స్థానం పోరాడే అవకాశం అభ్యున్నతికి దోహదం -
రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరి
శంకర్పల్లి: ప్రమాదాల నివారణకు ప్రతీ వామనదారుడు రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని మోకిల ఎస్ఐ కోటేశ్వర్రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమంలో భాగంగా గురువారం పీఎస్ పరిధిలో ప్రయాణించే వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డుపై ప్రయాణించే సమయంలో కారులో సీటు బెల్టు, బైక్పై హెల్మెట్ తప్పనిసరి అని సూచించారు. అదేవిధంగా ఎట్టిపరిస్థితుల్లోనూ మద్యం తాగి వాహనాలు నడపొద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వొదన్నారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ మేరకు ప్రభుత్వ నిబంధనలకు సంబంధించిన కరపత్రాలను వాహనదారులకు అందించారు. కార్యక్రమంలో ఎస్ఐ చెన్నారెడ్డి, సిబ్బంది రఘుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐ కోటేశ్వర్రావు -
రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో హైటెన్షన్
సాక్షి, రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో హైటెన్షన్ నెలకొంది. మూడేళ్ల ముందే ఇబ్రహీంపట్నంలో ఎన్నికల వేడి ముదిరింది. తాజా, మాజీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్ల పర్వం తీవ్రస్థాయికిచేరాయి. ఇవాళ చర్చకు రావాలని మల్రెడ్డి రంగారెడ్డికి మంచిరెడ్డి కిషన్రెడ్డి సవాల్ విసిరారు. మేడిపల్లిలో చర్చ కోసం బీఆర్ఎస్ శ్రేణులు టెంట్లు ఏర్పాటు చేసింది. సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించడంతో పోలీసులతో బీఆర్ఎస్ నేతలు.. వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ శ్రేణులు గ్రామంలో భారీగా తరలిరావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఫార్మా భూముల విషయంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య వివాదం సాగుతోంది. ‘‘అన్నీ నా హయాంలో జరిగిన పనులే.. కొత్తగా తెచ్చింది ఏముంది?" అంటూ మల్రెడ్డి లెక్కలను మంచిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు మేడిపల్లి భూముల వద్దకు చర్చకు రావాలని మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అక్రమ కబ్జాలు తేలాలంటే ఇబ్రహీంపట్నం బస్ డిపో వెనుక ఉన్న 45 ఎకరాల దగ్గరకు రావాలని మల్రెడ్డి డిమాండ్ చేశారు.ఫార్మా భూముల్లో భారీ స్కామ్ జరిగిందన్న ఎమ్మెల్యే ఆరోపణలతో ఇరుపార్టీల నేతలు.. వ్యక్తిగత దూషణలకు దిగారు. ఇద్దరు నేతలు వేర్వేరు ప్రాంతాల్లో సవాళ్లు విసురుకోవడంతో నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది. పొలీసులు భారీగా మోహరించారు. సవాళ్ల పర్వం ఉద్రిక్తతకు దారితీసింది. -
ధాన్యం సేకరణకు సహకరించండి
● అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ● మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం ఇబ్రహీంపట్నం రూరల్: వేసవిలో వరిధాన్యం సేకరణకు మిల్లర్స్ సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి కోరారు. బుధవారం ఆయన సివిల్ సప్లయ్ అధికారి, డీసీఎంఎస్, మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులందరితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాసంగి 2025–26 వరిధాన్యం నిల్వలకు స్థలం కల్పించేందుకు, సీఎంఆర్ డెలివరీ వేగవంతం చేయాలన్నారు. వీసీ ఎండీ ఇచ్చిన ఒప్పందం ప్రకారం రబీ 2025–26 వరి ధాన్యం కస్టమ్ మిల్లింగ్ కార్యకలాపాల కోసం డిస్ట్రిక్ట్ మేనేజర్తో ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. గత సీజన్లలో తిరిగి ఇవ్వాల్సిన ఉపయోగపడే పాత గోనే సంచులను గరిష్ఠ సంఖ్యలో డీఎంసీఎస్సీకి ఎలాంటి ఆలస్యం లేకుండా తిరిగి ఇవ్వాలని సూచించారు. వరి సేకరణ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు , సివిల్ సప్లైస్ కమిషనర్ జారీ చేసిన సూచనలను పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయి జిల్లా అధికారి వనజాత, మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు . -
పవర్ఫుల్ డిమాండ్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: గ్రేటర్లో విద్యుత్ వినియోగం గత రికార్డును బ్రేక్ చేసింది. సాధారణంగా మేలో నమోదు కావాల్సిన రికార్డు.. ప్రస్తుతం ఏప్రిల్ రెండోవారంలోనే నమోదు కావడం విశేషం. డిస్కం చరిత్రలో అత్యధికంగా 2024 మే 29న 91.68 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. 2025లో ఇదే సమయంలో 3,800 మెగావాట్లు మించలేదు.. కానీ ఈ ఏడాది గత మూడు రోజులుగా విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. బుధవారం ఏకంగా 4,452 మెగావాట్లు(95.29 ఎంయూ) నమోదైంది. మధ్యాహ్నంతో పోలిస్తే.. సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల మధ్య అత్యధిక డిమాండ్ నమోదువుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మే చివరి నాటికి వంద మిలియన్ యూనిట్లు దాటే అవకాశం లేకపోలేదని ఇంజనీరింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒత్తిడిలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఒకప్పుడు ధనవంతుల ఇళ్లలో మాత్రమే కన్పించిన ఏసీలు.. ప్రస్తుతం సాధారణ, మధ్య తరగతి నివాసాల్లో సర్వ సాధారణమయ్యాయి. ఎండలు భగ్గున మండుతుండటానికి తోడు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు రోజంతా ఆన్లో ఉండడంతో వినియోగం రెట్టింపైంది. ఒక్కసారిగా పెరిగిన విద్యుత్ వినియోగంతో సబ్స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్లు హీటెక్కుతున్నాయి. ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. తరచూ ఫీడర్లు ట్రిప్పవుతుండడంతో సరఫరాలో అంతరాయం తలెత్తుత్తోంది. ఫ్యూజులు కొట్టేస్తుండడంతో ఆ సమయంలో చెలరేగిన మంటలు వాటికింద పేరుకుపోయిన చెత్తలో పడి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. 8వ రోజుకు చేరిన ఆర్టిజన్ల సమ్మె తమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుతూ ఆర్టిజన్, పీస్రేట్ వర్కర్లు, అన్ మ్యాన్డ్ వర్కర్లు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 8వ రోజుకు చేరుకుంది. జెన్కోలో 3,608 మంది, ట్రాన్స్కోలో 3,774 మంది, ఎస్పీడీసీఎల్లో 8,595 మంది, ఎన్పీడీసీఎల్లో 3,470 మంది ఉన్నారు. వీరిలో మెజార్టీ కార్మికులు ఎనిమిది రోజులుగా విధులకు దూరంగా ఉంటున్నారు. ప్రతి రోజూ ఏదో ఒక చోట ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తూనే ఉంది. చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడుతున్నాయి. పలు చోట్ల లైన్లు తెగిపడుతున్నాయి. ఈ సమయంలో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. సబ్స్టేషన్లు, ఆపరేషన్స్ వంటి కీలక విభాగాల్లో పని చేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది సమ్మెలోకి వెళ్లడంతో సరఫరా పునరుద్ధరణలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. శివారు సర్కిళ్లలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. అర్ధరాత్రి ఇంట్లో కరెంట్ లేకపోవడంతో దోమలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని గ్రేటర్ జిల్లాల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ జిల్లాల్లో వారం రోజుల్లో నమోదైన విద్యుత్ డిమాండ్ ఇలా తేదీ మెగావాట్లు మిలియన్ యూనిట్లు 07 3,933 84.09 08 3,989 85.56 09 4,106 87.72 10 4,119 89.25 11 4,049 88.92 12 3,960 84.30 13 4,387 92.89 14 4,452 95.29 గ్రేటర్ విద్యుత్ స్వరూపం 33 కేవీ సబ్స్టేషన్లు 498 పీటీఆర్లు 1022 డీటీఆర్లు 1,50,992 విద్యుత్ స్తంభాలు 5,08,271 మొత్తం విద్యుత్ కనెక్షన్లు 63 లక్షలు 33 కేవీ ఓవర్హెడ్లైన్లు 3725 కిలోమీటర్లు 11 కేవీ ఓవర్హెడ్లైన్లు 21,634 కిలోమీటర్లు 11 కేవీ యూజీ కేబుళ్లు 957 కిలోమీటర్లు గ్రేటర్లో అనూహ్యంగా పెరిగిన విద్యుత్ వినియోగం 2024 మే 29న రికార్డు స్థాయిలో 91.68 ఎంయూలు 2026 ఏప్రిల్ 14న ఏకంగా 95.29 మెగావాట్లు నమోదు హీటెక్కుతున్న సబ్స్టేషన్లు.. ట్రిప్పవుతున్న ఫీడర్లు తరచూ తప్పని అంతరాయాలు.. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి -
దీక్ష విరమించండి.. న్యాయం చేస్తాం
● చర్చలకు రైతులు ససేమిరా ● వెనుదిరిగిన ఆర్డీఓ, ఏసీసీ యాచారం: న్యాయం చేస్తాం.. దీక్షలు విరమించండని కుర్మిద్ద గిరిజన రైతులను ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డి, ఏసీపీ కేపీవీ రాజు కోరారు. బుధవారం వారు గ్రామంలోని వ్యవసాయ భూముల వద్ద గిరిజన రైతులు చేపట్టిన దీక్షా శిబిరం వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మీకు న్యాయం చేసేందుకే మేమున్నది.. ఆందోళన చెందొద్దు.. దీక్షలు విరమించి గ్రీన్ ఫీల్డ్ రహరదారి నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఇందుకు స్పందించిన రైతులు టీజీఐఐసీ పేరిట మార్చిన 200 ఎకరాల పట్టా భూమిని తమ పేరిట చేస్తేనే దీక్షలు విరమిస్తామని భీష్మించుకున్నారు. భూరికార్డులు మార్చితే రహదారి నిర్మాణానికి భూములిచ్చే ఆలోచన చేస్తామని తేల్చిచెప్పారు. భూ రికార్డుల మార్పు అంశం ప్రభుత్వ పరిధిలోని ఉందని.. విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఆదేశాలు వస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రహదారి నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తి లేదని.. పరిహారం విషయం చర్చించుకుందామని ఆహ్వానించారు. ఇందుకు రైతులు ససేమిరా అనడంతో అధికారులు వెనుదిరిగారు. వారి వెంట యాచారం తహసీల్దార్ అయ్యప్ప, గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ తదితరులు ఉన్నారు. -
గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన
కొందుర్గు: తమకు సకాలంలో గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేయడం లేదని బుధవారం మండల కేంద్రంలో గ్యాస్ వినియోగదారులు ఆందోళన చేపట్టారు. షాద్నగర్–పరిగి రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులు మాట్లాడుతూ.. గ్యాస్ బుకింగ్ చేయడానికి నెలల తరబడి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో ఎన్నిసార్లు బుక్చేసినా గ్యాస్ బుక్ కావడం లేదని వాపోయారు. గ్యాస్ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని వినియోగదారులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. -
పేదలకు సేవ చేయడమే అంబేడ్కర్కు నివాళి
షాద్నగర్రూరల్: నిరుపేదలకు సేవ చేయడమే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్కు నిజమైన నివాళి అని విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) ఆంధ్ర, తెలంగాణ క్షేత్రప్రముఖ్ బండారి రమేశ్ అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా బుధవారం పట్టణంలోని అంబేడ్కర్ కాలనీలో వీహెచ్పీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షలు చేపట్టి అవసరమైన వారికి మందులు అందజేశారు. అనంతరం బండారి రమేశ్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ జయంతి సందర్భంగా వీహెచ్పీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ ఒక్కరు తమ ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. చిన్నపాటి అనారోగ్యానికి గురైన వైద్యులను సంప్రదించాలని సూచించారు. తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలని చెప్పారు. వైద్యశిభిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు శివానంద్, కార్తికేయ, మల్లిక, బుచ్చయ్య, వెంకటేశ్, తిరుపతి, ఆంజనేయులు, పద్మనాభం, వీహెచ్పీ నాయకులు మఠం రాచయ్య, భాగ్యవతి, నాగేశ్వర్ పాల్గొన్నారు. వీహెచ్పీ ఆంధ్ర, తెలంగాణ క్షేత్ర ప్రముఖ్ రమేశ్ -
బలవంతపు భూ సేకరణ ఆపాలి
అనంతగిరి: పరిగి మండలం కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బుధవారం బాధిత రైతులు బీసీ, ఎస్టీ, ఎస్టీ జేఏసీల ఆధ్వర్యంలో వికారాబాద్లో ఆర్డీఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టారు. కవిత, డాక్టర్ విశారదన్ మహరాజ్ రైతులతో కలిసి ఆర్డీఓ కార్యాలయం ప్రధాన గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎండను లెక్క చేయకుండా రోడ్డుపైనే కూర్చున్నారు. అక్కడి నుంచి నేరుగా ఎన్టీఆర్ చౌరస్తాకు చేరుకొని బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆపమని తేల్చి చెప్పారు. కలెక్టర్ రావాలంటూ నినాదాలు చేశారు. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలను దారి మళ్లించారు. దాదాపు 4 గంటల పాటు ధర్నా కొనసాగింది. కాళ్లాపూర్కు చెందిన మహిళా రైతు నర్సమ్మ, సర్పంచ్ పులిందర్ ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు. రైతులను పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించగా ప్రతిఘటించారు. వాహనానికి అడ్డుపడ్డారు. దీంతో వాగ్వివాదం చోటు చేసుకుంది. సాయంత్రం కవిత తోపాటు విశారదన్ మహరాజ్ను బంట్వారం పోలీస్ స్టేషన్కు తరలించారు. పలువురు వాహనం వెంట కొద్ది దూరం పరుగులు తీయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి పరిశ్రమల పేరుతో రైతుల భూములు లాక్కుంటున్నారని కవిత మండిపడ్డారు. రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా పోరాటం చేస్తామన్నారు. బలవంతపు భూ సేకరణ ఆపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి పెనం మీద ఉంటే.. ఇప్పుడు పొయ్యిలో పడినట్టు అయ్యిందన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు సంతోషంగా లేరన్నారు. నిజామాబాద్లో కూడా పసుపు రైతులు ధర్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. మరో పది రోజుల్లో ఈ గడ్డపై మరో ప్రాంతీయ పార్టీ రాబోతుందన్నారు. 25న ఆ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. మనమంతా ఐక్యంగా ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం ఽరైతు ఽసమస్యలపై ఆమె కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. ఆ తర్వాత డాక్టర్ విశారదన్ మహరాజ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలోని ఈ ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కుల పేరిట వేల ఎకరాలను లాక్కునే కుట్రలు చేస్తోందని ఆరోపించారు. 1,200 ఎకరాల పేద, మధ్య తరగతి రైతుల భూముల సేకరించేందుకు యత్నిస్తోందన్నారు. వారి తరఫున పోరాటం చేస్తామని తెలిపారు.బంట్వారం: ఠాణాలో కల్వకుంట్ల కవిత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వికారాబాద్లో భారీ ధర్నా అదుపులోకి తీసుకున్న పోలీసులు రైతులు – పోలీసుల మధ్య వాగ్వివాదం -
అరవింద్ కుటుంబానికి అండగా ఉంటాం
ఇబ్రహీంపట్నం: బీఆర్ఎస్ నాయకుడు, ఉద్యమకారుడైన కర్నె అరవింద్ కుటుంబానికి అండగా ఉంటామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సోదరుని కుమారుడైన కర్నె అరవింద్ గుండెపోటుతో ఆదివారం మృతిచెందిన విషయం తెలిసిందే. బుధవారం ఇబ్రహీంపట్నంలోని అరవింద్ నివాసానికి వేర్వేరుగా వచ్చిన ఇరువురు నేతలు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. వీరి వెంట మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, బీఆర్ఎస్ నేతలు క్యామ మల్లేశ్, మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సుదర్శన్రెడ్డి, పార్టీ నాయకులు వెంకటరమణారెడ్డి, పల్లె గోపాల్గౌడ్, కిరణప్ప, మంద సురేష్, రమేష్గౌడ్, జెర్కొని రాజు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు -
పొంచి ఉన్న వడదెబ్బ ముప్పు
● మధ్యాహ్నం 12 తర్వాత బయటికి వెళ్లొద్దు ● డీఎంహెచ్ఓ లలితాదేవి సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘ప్రస్తుతం ఎండలు భగ్గుమంటున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటింది. ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిపై పడుతున్నాయి. వీటి ధాటికి డీ హైడ్రేషన్కు లోనయ్యే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం 12 నుంచి 4 గంటలలోపు బయట తిరగక పోవడమే ఉత్తమం. అనివార్యమైతే వెంట గొడుగు, వాటర్ బాటిల్ తీసుకెళ్లాలి. లేదంటే వడదెబ్బకు గురై.. అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యే ప్రమాదం ఉంది’అని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.లలితాదేవి స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా ప్రజలకు పలు సూచనలు చేశారు. సలహాలతో రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఎక్కువ ముప్పు వీరికే గంటల తరబడి బైక్లపై ప్రయాణించే మార్కెటింగ్ ఏజెంట్లు, ఉపాధి హామీ కూలీలు, యాచకులు, వీధి వ్యాపారులు, ఎండలో ఆడే చిన్నారులు, వృద్ధులు ఎక్కువగా వడదెబ్బబారిన పడుతుంటారు. ఎండలో ఎక్కువ సేపు తిరగడం వల్ల డీహైడ్రేషన్కు లోనవుతుంటారు. లక్షణాలు అధిక జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యల బారిన పడుతుంటారు. తీవ్రమైన అలసటతో పాటు శరీరం ఎర్రబారటం, పొడిగా మారుతుంది. గందర గోళం, స్పృహ కోల్పోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కన్పిస్తుంటాయి. జాగ్రత్తలు ● సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం బయటికి వెళ్లొద్దు. అనివార్యమైతే వెంట గొడుగు, వాటర్ బాటిల్, తలకు క్యాప్, కళ్లకు సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. ● ఉక్కపోత నుంచి ఉపశనమనం కోసం వదులైన లేత రంగు కాటన్ దుస్తులను ధరించాలి. కఠినమైన శారీరక శ్రమ చేయకూడదు. ● మద్యం, మాంసాహారాలకు దూరంగా ఉండాలి. మసాల వంటలకు బదులుగా తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ● కూల్డ్రింక్స్కు బదులుగా మజ్జిగ, చెరుకు రసం, కొబ్బరినీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. వాటర్మిలాన్, కర్బూజా, మోసంబి, నిమ్మ పండ్ల రసాలు తీసుకోవాలి. ● స్పృహతప్పిన బాధితులను వెంటనే చల్లని ప్రదేశానికి తరలించి, చన్నీటితో శరీరాన్ని శుభ్రం చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో 108లో సమీపంలోని ఆస్పత్రికి తరలించాలి. -
కేంద్రం దివ్యాంగులకు చేయూతనిస్తోంది
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి హుడాకాంప్లెక్స్: కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు చేయూతనిస్తోందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జిల్లా డిసెబులిటి సెంటర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎల్ఐఎంసీఓ) ద్వారా దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ దూరదృష్టి, సంకల్పబలం వల్ల దివ్యాంగులకు సహాయ పరికరాల పంపిణీ, వారికి గౌరవప్రదమైన జీవనోపాధి అవకాశాలు కల్పించబడుతున్నాయని చెప్పారు. వివిధ ఇండస్ట్రీస్, కంపెనీలలో దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రధాని చొరవతోనే సాధ్యమైందన్నారు. దివ్యాంగులు స్వయం సమర్థులుగా, ఆత్మవిశ్వాసంతో జీవించాలనే లక్ష్యంతో ఉన్నారని, సమాజంలో సానుకూల మార్పు తీసుకువస్తోందని ఇలాంటి గొప్ప సంకల్పంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, సరూర్నగర్ తహసీల్దార్ వేణుగోపాల్, జిల్లా ఉప వైద్యాధికారి గీత తదితరులు పాల్గొన్నారు. -
‘పాలమూరు’ను తక్షణమే పూర్తి చేయాలి
షాద్నగర్: పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని పెండింగ్ ప్రాజెక్టుల ఉద్యమ వేదిక చైర్మన్ రాజేందర్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. ఎన్నికల సమయంలో పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చి రెండేళ్లయినా పనులు ముందుకు సాగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పది శాతం పనులే పెండింగ్లో ఉన్నాయని చెప్పింది.. కానీ నేటికీ పది శాతం పనులు కూడా పూర్తి కాలేదని విమర్శించారు. రెండు రోజులుగా ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నింటినీ కలియ తిరుగుతున్నామని చెప్పారు. షాద్నగర్ పరిధిలోని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ పనులు ప్రారంభించలేదన్నారు ఈ రిజర్వాయర్ పూర్తి చేస్తేనే షాద్నగర్ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణ పనులు వేగిరం చేసేలా ప్రభుత్వం పై ఒత్తిడి తేవడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు పాలమూరు ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేసేలా చూడాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవులు, నాయకులు టీజీ శ్రీనివాస్, రామారావు, సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పూర్తిచేస్తేనే షాద్నగర్ సస్యశ్యామలం హామీలు నెరవేర్చకుంటేఉద్యమం ఉధృతం చేస్తాం పెండింగ్ ప్రాజెక్టుల ఉద్యమ వేదిక చైర్మన్ రాజేందర్రెడ్డి -
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
ఆమనగల్లు: రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర అందించేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోందన్నారు. మంగళవారం ఆయన సర్పంచ్ డోకూరు సునీతతో కలిసి తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో వరి, మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోందన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్గౌడ్, ఏఎంసీ చైర్పర్సన్ యాట గీత, వైస్ చైర్మన్ భాస్కర్రెడ్డి, డైరెక్టర్లు అంజయ్యగుప్తా, అజీం, వెంకట్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు డోకురు ప్రభాకర్రెడ్డి, సింగిల్విండో మాజీ చైర్మన్ కేశవరెడ్డి, లింగరావ్పల్లి సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, శ్రీశైలం, శ్రీనివాస్రెడ్డి, డేవిడ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేను కలిసిన హైటెన్షన్ లైన్ బాధితులు కడ్తాల్: వ్యవసాయ పొలాల మీదుగా పవర్గ్రిడ్ కార్పొరేషన్ వారు ఏర్పాటు చేస్తున్న బీదర్–మహేశ్వరం 765 కేవీ హైటెన్షన్ విద్యుత్లైన్ అలైన్మెంట్ మార్చి తమకు న్యాయం చేయాలని పలువురు రైతులు మంగళవారం ఎమ్మెల్యేకు విన్నవించారు. రైతుల సమస్యను తెలుసుకున్న ఎమ్మెల్యే, కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. రెండు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారికి న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ భాస్కర్రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీచ్యానాయక్, నాయకులు పెంటారెడ్డి, రామకృష్ణ, రాజేందర్యాదవ్, శేఖర్రెడ్డి, జంగయ్యయాదవ్, కృష్ణ, పర్వత్కుమార్, తదితరులు ఉన్నారు.కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి -
ఫిట్స్తో రిమాండ్ ఖైదీ మృతి
ఆమనగల్లు: సీతారాంనగర్ తండా గ్రామ పరిధిలోని పులుగోనిపల్లి తండాలో భార్య, కొడుకును హత్యచేసి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి ఫిట్స్తో మృతిచెందాడు. సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. పులుగోనిపల్లి తండాకు చెందిన బానావత్ రాందాస్ కుటుంబు కలహాలు, మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి గత నెల 31న ఉదయం 5 గంటల సమయంలో భార్య కవిత, కుమారుడు హర్షరోహిత్పై దాడిచేయడంతో వారు మృతిచెందారు. రెండు రోజుల తరువాత రాందాస్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అతనికి సోమవారం రాత్రి ఫిట్స్ రావడంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం ధారూరు: మండల కేంద్రంలో ని ధారూరు – తాండూరు రై ల్వే ట్రాక్ పక్క న మంగళవా రం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. తాండూరు రైల్వే హెడ్ కానిస్టేబుల్ వీరేశం తెలిపిన వివరాల ప్రకారం.. రై ల్వే ట్రాక్ పక్కన వ్యక్తి మృతదేహం ఉన్న ట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలించామన్నారు. దాదాపు 35 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి ఒంటిపై బూడిద రంగు ప్యాంట్, గులాబీ రంగు షర్ట్ ఉందని తెలిపారు. మృతదేహాన్ని తాండూ రు రైల్వే ఆస్పత్రికి తరలించి, పోస్టు మార్టం అనంతరం మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. మృతుడికి సంబంధించిన వారు వికారాబాద్ రైల్వే పోలీసులను సంప్రదించాలని సూచించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.


