Rangareddy
-
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం రూరల్(హైదరాబాద్): కడుపునొప్పి, చెవి నొప్పి భరించలేక ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రాఘవేందర్రెడ్డి కథనం ప్రకారం.. ఆదిబట్ల మున్సిపాలిటీ ఎంపీపటేల్గూడకు చెందిన గడుసు మైత్రి (20) ఇబ్రహీంపట్నంలోని గురునా నక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇటీవల తీవ్రమైన కడుపునొప్పి, చెవినొప్పితో బాధపడుతోంది. సరైన చికిత్స అందడం లేదని మనస్తాపానికి గురై బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
అనుమానాస్పద స్థితిలో బాలుడి మృతి
బషీరాబాద్: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ బాలుడు తెల్లారేసరికి రైలు పట్టాలపై శవమై కనిపించాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం సేడం రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం వెలుగు చూసింది. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, కర్ణాటక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బషీరాబాద్ మండలం మైల్వార్కు చెందిన అంజిలమ్మ, మున్నెప్ప దంపతుల కొడుకు శాంతుకుమార్ మంగళవారం రాత్రి తన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలో పాల్గొనేందుకు కంసాన్పల్లి వెళ్లాడు. తిరిగి 10.30 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. అంతలోనే ఓ నంబర్ నుంచి అతని సెల్ఫోన్కు కాల్ వచ్చినట్లు కుటుంబీకులు గుర్తించారు. దీంతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బైక్ తీసుకుని తన అమ్మమ్మ గ్రామమైన కర్ణాటక రాష్ట్రం ముదిన కు బయలుదేరాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఉదయాన్నే సేడం రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై విగతజీవిగా పడి ఉన్నాడు. పోలీసుల సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున రోదించారు. ప్రేమ వ్యవహారమే ప్రాణం తీసిందా..? శాంతుకుమార్ ఇటీవలే పదో తరగతి పూర్తి చేశాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇతనికి అమ్మమ్మ గ్రామమైన ముదినకు చెందిన ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉందని తెలుస్తోంది. ఆమె ఫోన్ చేయడంతోనే మంగళవారం రాత్రి బైక్ తీసుకుని బయటకు వెళ్లినట్లు బాలుడి సన్నిహితులు తెలిపారు. అయితే ఆతర్వాత బాలుడు ఎక్కడికి వెళ్లాడు.. ఎవరితో మాట్లాడాడు..? అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది. ఇదిలా ఉండగా తమ కొడుకును రైలు ఢీకొని ఉంటే తీవ్రమైన గాయాలు కావాలని, స్వల్పగాయాలతో ఎలా మరణిస్తాడని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరో హత్య చేసి పట్టాలమీద పడేశారని, బైక్ కూడా ఎత్తుకెళ్లారని సేడం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుల్బర్గా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలుడి మృతితో మైల్వార్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సేడం సమీపంలో రైలు పట్టాలపై మృతదేహం బషీరాబాద్ మండలం మైల్వార్లో విషాద ఛాయలు -
దైవ దర్శనానికి వెళ్తూ మృత్యు ఒడికి
బొంరాస్పేట: ఎదురుగా వచ్చిన డీసీఎం కారును ఢీకొట్టిన సంఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మండల పరిధిలోని జాతీయ రహదారి 163పై మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ రవూఫ్ వివరాల మేరకు.. హైదరాబాద్లో వ్యాపారం చేస్తున్న బీజాపూర్ వాసి కంచి వెంకటేశ్వర్రావు(48), భార్య కళ్యాణితో కలిసి కారులో తన కారులో కర్ణాటకలోని గానుగాపూర్ దత్తత్రేస్వామి దర్శనానికి వెళ్తున్నారు. ఈక్రమంలో బీజాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న డీసీఎం భోజన్నగడ్డతండా గేటు వద్ద వీరి కారును ఢీకొంది. దీంతో కారు నడుపుతున్న వెంకటేశ్వర్రావు అక్కడికక్కడే మృతి చెందగా కళ్యాణికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను మొదట పరిగి ఆస్పత్రికి ఆతర్వాత హైదరాబాద్ తరలించారు. డీసీఎం డ్రైవర్ జానప్పపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. కారును ఢీకొట్టిన డీసీఎం వ్యక్తి మృతి, మహిళకు గాయాలు -
బంజారాహిల్స్లో వ్యభిచారం గృహంపై దాడి
బంజారాహిల్స్: బంజారాహిల్స్ పోలీసులతో కలిసి వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ బృందం వ్యభిచారం గృహంపై దాడి చేసి నిర్వాహకుడితో పాటు ఇద్దరు హౌస్ కీపింగ్ సిబ్బంది, ముగ్గురు కస్టమర్లను అరెస్టు చేశారు. మరో నలుగురు మహిళలను రిహాబిలిటేషన్ సెంటర్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలప్రకారం... బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–12లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్ పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వ్యభిచార గృహం నిర్వాహకుడు అనంతపురం జిల్లా కేశవరాయనిపేటకు చెందిన కుమ్మెత నరేందర్రెడ్డి, హౌస్ కీపింగ్ విధులు నిర్వర్తించే బీహార్లోని ముజఫర్పూర్ ప్రాంతానికి చెందిన ఆనంద్కుమార్, రాహుల్కుమార్లతో పాటు ముగ్గురు కస్టమర్లను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే నలుగురు మహిళలను రిహాబిలిటేషన్ సెంటర్కు తరలించారు. వీరి నుంచి రూ.26,500 నగదు, ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బీసీ హక్కుల కోసం నిరంతర పోరాటం
షాబాద్: బీసీల హక్కుల కోసం నిరంతర పోరాటం చేస్తామని బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో బుధవారం బీసీసేన మండల సమావేశం నిర్వహించారు. అనంతరం మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీసీసేన మండల అధ్యక్షుడిగా దామర్లపల్లి గ్రామానికి చెందిన కమ్మరి దయాకర్చారిని నియమించారు. ఉపాధ్యక్షుడిగా గోపాల్, యూత్ అధ్యక్షుడిగా బండ అజయ్కుమార్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణాయాదవ్ మాట్లాడుతూ.. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలంతా పోటీకి సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో బీసీసేన జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, షాద్నగర్ నియోజకవర్గం అధ్యక్షుడు కత్తి శేఖరప్ప, మహిళా అధ్యక్షురాలు బాస వరలక్ష్మి, ఫరూఖ్నగర్ మండల అధ్యక్షుడు మేకల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణాయాదవ్ -
పరువు పోతుందనే హత్యకు పథకం
పరిగి: మండల పరిధిలోని రాపోల్లో మంగళవారం రాత్రి జరిగిన వృద్ధురాలి హత్య, ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై హత్యాయత్నం ఘటనకు సంబంధించిన వివరాలను పరిగి డీఎస్పీ శ్రీనివాస్ బుధవారం మీడియాకు వెల్లడించారు. గ్రామానికి చెందిన పొట్టి రాంచరణ్ ఇంటర్ ఫెయిలై జులాయిగా తిరుగుతున్నాడు. ఈక్రమంలో ఖర్చుల కోసం వరసకు బావ అయ్యే రాజేందర్ ఇంట్లో తరచూ డబ్బులు దొంగిలించేవాడు. గత మంగళవారం రాత్రి సైతం రాజేందర్(ప్రభుత్వ ఉపాధ్యాయుడు) ఇంట్లో చోరీకి వెళ్లాడు. ఇది గమనించిన అతను అరవడంతో రాంచరణ్ పారిపోయాడు. ఈ విషయాన్ని తన స్నేహితులైన చంద్రశేఖర్(బన్ని)తో పాటు మరో యువకుడికి చెప్పాడు. తాను చోరీకి వెళ్లిన విషయాన్ని ఉదయాన్నే గ్రామంలో అందరికీ చెప్పి, తన పరువు తీస్తాడని భావించి, అతన్ని చంపేద్దామన్నాడు. ఇందుకు స్నేహితులు సైతం వంతపాడారు. ఆవెంటనే రాంచరణ్ తన ఇంటికి వెళ్లి కత్తి తీసుకుని, రాజేందర్ ఇంటికి చేరుకున్నారు. అతను నిద్రలో ఉండగా కత్తి, ఇనుప రాడ్డుతో రాంచరణ్ దాడి చేశాడు. మేల్కొన్న రాజేందర్ పెద్దగా అరవడంతో పక్క గదిలో పడుకున్న అతని తల్లి నర్సమ్మ వచ్చి, అడ్డుకుంది. దీంతో ఆమెను సైతం కత్తితో పొడిచి, బండరాయితో దాడి చేయగా అక్కడికక్కడే మృతిచెందింది. ఈ అలికిడికి చుట్టు పక్కల వాళ్లు లేవడంతో పారిపోయారు. దాడికి ఉపయోగించిన కత్తి, రాయి, ఇనుప రాడ్లను బావిలో పడేసేందుకు ప్రయత్నించగా.. కత్తి ఒడ్డుపైనే పడింది. రాంచరణ్, చంద్రశేఖర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సంతోష్కుమార్ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మృత్యువుతో పోరాటం.. దాదాపుగా 30కి పైగా కత్తి పోట్లతో తీవ్రంగా గాయపడిన రాజేందర్ గాంధీ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. కత్తితో దాడి చేసిన సమయంలో కొంత భాగం తలలో విరిగిపోయింది. ఆపరేషన్ ద్వారా కత్తి ముక్కను తొలగించినట్లు తెలిసింది. దాడిలో మృతిచెంది రాజేందర్ తల్లి నర్మమ్మ అంత్యక్రియలను బుధవారం పూర్తి చేశారు. కొడుకు లేకపోవడంతో భర్త చెన్నయ్య అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వరుసకు బావ అయ్యే వ్యక్తిపై యువకుడి హత్యాయత్నం కత్తి, ఇనుప రాడ్లతో విచక్షణా రహితంగా దాడి రాపోల్ ఘటన వివరాలను వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్ -
బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి
షాబాద్: బీజేపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ముదిరాజ్ భవన్లో మండల పార్టీ అధ్యక్షుడు మద్దూరు మాణెయ్య ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాలు ముగిసిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కమల వికాసమే లక్ష్యంగా పని చేద్దామన్నారు. ఈ నెల 21న యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందామన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు పీసరి సతీశ్రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు కిరణ్, రవీందర్రెడ్డి, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి కూతురు మహేందర్, ప్రధాన కార్యదర్శి హరీశ్, బీజేవైఎం మండల అధ్యక్షుడు మహేశ్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మహేందర్, నాయకులు తదితరులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం -
మరియా ఫీడ్ కంపెనీకి సీల్
ధారూరు: మండల పరిధిలోని దోర్నాల్ గ్రామ సమీప 113 సర్వేనంబర్లో ఉన్న మరియా ఫీడ్ కంపెనీకి తహసీల్దార్ సాజిదాబేగం బుధవారం తాళం, సీల్ వేశారు. కంపెనీ నుంచి దుర్వాసన వస్తోందని, ఇళ్లల్లో ఉండలేకపోతున్నామని మంగళవారం రాత్రి గ్రామస్తులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆర్డీఓ వాసుచంద్ర, డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి ఆందోళనకారులను శాంతింపజేశారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారుల నివేదిక వచ్చే వరకు కంపెనీని మూసేస్తున్నామని తహసీల్దార్ తెలిపారు. అప్పటి వరకు ఫ్యాక్టరీలోకి వాహనాలు రాకుండా రోడ్డుకు అడ్డంగా ట్రెంచ్ తవ్వించామన్నారు. ఆమె వెంట డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్, ఏఎస్ఐ సంగమేశ్వర్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. యువకుడి ప్రాణం తీసిన ట్రక్కు షాబాద్: ట్రక్కు దూసుకెళ్లడంతో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన షాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సతీశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చందనవెళ్లి కుందానా కంపెనీలో వలస కార్మికుడిగా పనిచేస్తున్న ప్రమోద్కుమార్ (35) బుధవారం వాష్రూమ్కు వెళ్తున్నాడు. అదే సమయంలో అక్కడే కంటైనర్లను లిఫ్ట్ చేసే ట్రక్కు డ్రైవర్ అజాగ్రత్తగా వాహనం నడపడంతో అదుపుతప్పి ప్రమోద్కుమార్పై నుంచి వెళ్లింది. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం అతడిని శంషాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. టీటీడీ ఆలయం హుండీలో చోరీ.. పోలీసులకు ఫిర్యాదు ఫిలింనగర్: జూబ్లీహిల్స్లోని టీటీడీ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం హుండీలో నగదు దొంగలిస్తుండగా భక్తులు వారిని రెడ్హ్యాండెడ్గా పట్టుకొని ఆలయ వర్గాలకు అప్పగించారు. అయితే మైనర్ బాలుర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలయ వర్గాలు వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి చోరీ చేసిన నగదును తిరిగి హుండీలో వేయించి పంపించారు. అయితే కొద్ది రోజుల తర్వాత అందులో ఓ బాలుడు మళ్లీ ఆలయానికి వచ్చి అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఆలయ ఏఈఓ రమేష్ ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల 28న ఓ బాలుడు సన్నిధిలో ఉన్న హుండీలో నుంచి డబ్బులు తీస్తుండగా భక్తులు గమనించి తమకు అప్పగించారని, ఆ కొద్ది దూరంలోనే తమ విజిలెన్స్ సిబ్బంది మరో బాలుడిని పట్టుకోవడం జరిగిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. -
అక్కసుతోనే దాడులు
పరిగి: ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు, జర్నలిస్టులు, పత్రిక కార్యాలయాలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎల్హెచ్పీఎస్, భారత్ ముక్తి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింగ్నాయక్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. సీనియర్ జర్నిలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్రావుపై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపడం అప్రజాస్వామికమని తెలిపారు. ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న గొంతులను నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. గత ఏడాది కాలంగా ఏపీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను బయటపెడుతోందనే అక్కసుతో సాక్షి కార్యాలయాలపై దాడులు చేస్తున్నారన్నారు. ప్రత్రిక స్వేచ్ఛను హరించే కుట్ర చేస్తున్న వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. -
రోటావేటర్లో ఇరుక్కుని బాలిక మృతి
చేవెళ్ల: రోటావేటర్ ఓ బాలిక ప్రాణం తీసింది. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చేవెళ్ల మండలం తంగడపల్లి సమీపంలోని ఫామ్హౌస్లో కర్ణాటకకు చెందిన సుశీల్కుమార్, పద్మ దంపతులు పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. పద్మ చెల్లెలు కళావతి, సంజీవ్కుమార్ కుటుంబం వికారాబాద్జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్లో ఉంటోంది. అక్కను చూసేందుకు కళావతి భర్త, పిల్లలతో కలిసి మంగళవారం తంగడపల్లిలోని తోటకు వచ్చారు. బుధవారం మధ్యాహ్నం మామిడి తోటలో సుశీల్కుమార్ ట్రాక్టర్ రోటావేటర్తో దున్నతున్నాడు. అదే సమయంలో కళావతి కూతురు అక్షిత (11) ఆడుకుంటూ వచ్చింది. ప్రమాదవశాత్తు రోటావేటర్లో ఇరుక్కొని తీవ్రంగా గాయపడింది. వెంటనే కుటుంబసభ్యులు గమనించి చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సంజీవ్కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కేసారం ఓటర్లను చేవెళ్ల వార్డులోకే కలపాలి
చేవెళ్ల: మున్సిపాలిటీ పరిధిలో వార్డుల విభజనలో కేసారం వార్డులోని ఓటర్లను చేవెళ్ల వార్డు ఓటర్లతోనే కలపాలని ఎమ్మెల్యే కాలె యాదయ్యకు ఆ వార్డు ప్రజలు వినతి ప్రతం అందజేశారు. బుధవారం మాజీ సర్పంచ్ రమేశ్గౌడ్ ఆధ్వర్యంలో ప్రజలు, నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము ఎన్నో ఏళ్లుగా చేవెళ్ల పంచాయతీలో అనుబంధ గ్రామంగా కొనసాగామని, ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా చేవెళ్ల వార్డులోనే తమ ఓట్లు ఉండాలని కోరారు. కేసారంలో 889 ఓట్లు ఉండగా మరో 600ల ఓట్లు మల్కాపూర్ నుంచి కలిపి కేసారం వార్డుగా ప్రకటించారన్నారు. తక్కువగా ఉన్న ఓట్లను మల్కాపూర్తో కాకుండా చేవెళ్లలోని ఓట్లతో కలిపి చేవెళ్ల వార్డులోనే కలిసి ఉండేలా చూడాలని కోరారు. చేవెళ్లతో 70 ఏళ్లుగా అనుబంధం ఉందని కేసారం గ్రామ పంచాయతీగా ఉన్నప్పటికీ ఆ గ్రామ ప్రజలందరూ చేవెళ్లలోనే నివాసం ఉంటున్నారన్నారు. ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా చేవెళ్లతోనే తమ వార్డును కొనసాగించాలని కోరారు. కొత్త వార్డులో కలిసే ఓట్లతో ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. దీనిపై ఎమ్మెల్యే సానుకులంగా స్పందించారన్నారు. కార్యక్రమంలో కేసారంకు చెందిన ప్రజలు, నాయకులు, తదితరులు ఉన్నారు. -
అన్యాయంగా భూములు లాక్కోవద్దు
తుక్కుగూడ: అన్యాయంగా తమ భూములు లాక్కోవద్దని మున్సిపల్ పరిధిలోని రావిర్యాలకు చెందిన పలువురు దళితులు వాపోయారు. మున్సిపల్ పరిధిలోని రావిర్యాలకు చెందిన దళితులు కొంగర ఖుర్దు ఏ సర్వే నంబర్ 73లోని 42 ఎకరాల 36 గంటల అసైన్డ్ భూమిని సాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ భూమిపై సుమారు 100 కుటంబాలు ఆధారపడ్డాయి. సదరు భూమిని ప్రభుత్వం తమకి కేటాయించిందని తెలంగాణ హౌసింగ్ బోర్డ్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకోవడానికి పోలీస్ బందోబస్తుతో వచ్చారు. జేసీబీలతో చదును చేయించి చుట్టూ కంచె వేసేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న రైతులు కుటుంబ సభ్యులతో కలిసి భూమి వద్దకు చేరుకున్నారు. అక్కడే కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో హౌసింగ్ బోర్డ్ అధికారులు, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమకి ప్రభుత్వం ఎలాంటి నోటీసులు గానీ, సమాచారంగానీ లేకుండా భూమిని తీసుకోవడం అన్యాయమని రైతులు పేర్కొన్నారు. 1952 నుంచి సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నామని తెలిపారు. ఇప్పటికే ఈ భూమి నుంచి గ్రీన్ఫిల్డ్ రోడ్డు ఏర్పాటుకు మార్కింగ్ చేశారన్నారు. తమ భూములను తీసుకొని అన్యాయం చేయొద్దని ఆందోళన చేశారు. దళిత భూముల జోలికి రావద్దు సమాచారం అందుకున్న మాజీ మంత్రి, మహేశ్వ రం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అక్కడికి చేరుకున్నారు. రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హౌ సింగ్ బోర్డ్ అధికారులు, పోలీసులతో మాట్లాడా రు. దళిత రైతులకు సమాచారం ఇవ్వకుండా వారి భూములను స్వాధీనం చేసుకోవడం తగదని అన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు దళిత భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు. -
బడి బడ్జెట్
బ్యాలెన్స్ తప్పిన జూన్లో అమాంతం పెరిగిన ఖర్చు ● సర్దుబాటు చేయలేక తల్లిదండ్రుల పాట్లు ● అప్పు చేసి మరీ ఫీజుల చెల్లింపు, స్టేషనరీ కొనుగోలు ● ముగిసిన వేసవి సెలవులు ● నేటి నుంచి పాఠశాలలపునఃప్రారంభం సాక్షి, రంగారెడ్డిజిల్లా: విజ్ఞానాన్ని పంచాల్సిన విద్యా సంస్థలు ఫక్తూ వ్యాపార కేంద్రాలుగా మారాయి. తమ పిల్లలను మంచి స్కూల్లో చేర్పించి, మంచి విద్యను అందించి, వారిని తమకంటే ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే తల్లిదండ్రుల్లో ఉన్న బలహీనతను ‘క్యాష్’ చేసుకుంటున్నాయి. నిర్వహణ ఖర్చు, ఉపాధ్యాయుల వేతనాల పేరుతో ఏటా ట్యూషన్ ఫీజు పది నుంచి 25 శాతం పెంచేసి, ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నాయి. ఎవరికి వారు ప్రత్యేకవర్క్షీట్స్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, డ్రెస్సులు, డైరీలు, టైలు, బెల్ట్స్ తయారు చేసి పాఠశాలకు సమీపంలోనే ప్రత్యేక కౌంటర్లు తెరిచి మరీ విక్రయిస్తున్నాయి. ట్యూషన్ ఫీజు, స్టేషనరీ ధరలపై నియంత్రణ లేకపోవడంతో ఇష్టారీతిన వసూలు చేస్తున్నాయి. ఎవరైనా తల్లిదండ్రులు ఇదేమిటని ప్రశ్నిస్తే అదంతే అని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నాయి. ఆర్థిక స్థోమత లేకపోయినా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అప్పు చేసైనా కట్టాల్సి వస్తోంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 3,203 వరకు ఉన్నాయి. వీటిలో 9,50,079 మంది విద్యార్థులు చదువుతున్నట్లు అంచనా. ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లలను చదిస్తున్న తల్లిదండ్రులు ఖర్చుల విషయంలో బడ్జెట్ పద్మనాభంలా ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది. -
సాగర్ రోడ్డుపై ఘోర ప్రమాదం
కారును ఢీకొన్న ట్రావెల్స్ బస్సు ● అక్కడికక్కడే ముగ్గురు యువకుల మృతి ● మరో నలుగురికి తీవ్ర గాయాలు ● బర్త్ డే వేడుకలు చేసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం ● మృతులు, క్షతగాత్రులంతా సమీప బంధువులే యాచారం: నాగార్జునసాగర్– హైదరాబాద్ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంటకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న కియా కారును ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం, గుడిబండ గ్రామానికి చెందిన వాస సాయితేజ(24), వాస రాఘవేంద్ర(22), వాస పవన్కుమార్(26), వాస శివకుమార్, వాస సాయికుమార్(ఇద్దరు అన్నదమ్ములు), ఇదే జిల్లా మూసాపేట మండల కేంద్రానికి చెందిన మేకల సందీప్ సమీప బంధువులు. వీరంతా హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మంగళవారం వాస శివకుమార్ పుట్టిన రోజు కావడంతో బీఎన్రెడ్డి నగర్కు చెందిన స్నేహితుడు శివకుమార్ గౌడ్తో కలిసి..ఉదయం నల్గొండ జిల్లా దేవరకొండ సమీపంలోని వైజాగ్ కాలనీకి వెళ్లారు. అక్కడ సంబ రాలు ముగించుకుని మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో తిరిగి హైదరాబాద్ బయల్దేరారు. మాల్ సమీపంలోకి రాగానే నగరం నుంచి దేవరకొండ వైపు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు వీరి కారును ఢీకొట్టింది. ఈ సంఘటనలో సాయితేజ, రాఘవేంద్ర, పవన్కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. శివకుమార్, సాయికుమార్, శివకుమార్ గౌడ్, సందీప్కు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను మాల్, మన్నె గూడలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. పార్టీకి వెళ్లిన వారిలో పవన్కుమార్ ఒక్కడికే వివాహం జరిగింది. ఇతనికి భార్య వరలక్ష్మి, ఒక కూతురు ఉన్నారు. ప్రస్తుతం వరలక్ష్మి నాలుగు నెలల గర్భిణి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు. సాగర్ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ సాగర్ రోడ్డుపై జరిగిన ప్రమాదంతో గంటపాటు ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న యాచారం పోలీసులు అక్కడికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీశారు. ట్రావెల్స్ బస్సు, కారును ఢీకొన్న సమయంలో భారీ శబ్దం వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. అతివేగం కారణంగానే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు. -
నాలా ఆక్రమణల తొలగింపు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నాలా విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. బుధవారం చింతలబస్తీలో నాలా ఆక్రమణలను హైడ్రా తొలగించింది. బంజారాహిల్స్ రోడ్ నెం.12 వద్ద ఉన్న కల్వర్టుకు చింతలబస్తీ వైపు ఆక్రమణలు జరిగాయి. ఈ కల్వర్టుకు ఓవైపు 15 మీటర్ల వెడల్పుతో నాలా ఉండగా... చింతలబస్తీ వైపు 7 మీటర్ల మేర కబ్జా జరిగినట్టు నిర్ధారించిన అధికారులు ఆ ఆక్రమణలను తొలగించారు. ఇసుక, చిన్న సిమెంట్ దుకాణంతో పాటు కల్లు కాంపౌండ్ రేకుల షెడ్డు కూల్చేశారు. పింఛన్ ఆఫీసు వద్ద ఉన్న కల్వర్టును పూర్తి స్థాయిలో విస్తరించనున్నారు. శంకర్పల్లిలోని బుల్కాపూర్ చెరువు నుంచి మొదలైన ఈ నాలా నాగులపల్లి, పుప్పాలగూడ, మణికొండ, దర్గా, మెహిదీపట్నం, బంజారాహిల్స్ రోడ్ నెం.12, చింతలబస్తీ, తుమ్మలబస్తీ, హుస్సేన్సాగర్ మీదుగా వెళ్లే ఈ నాలా ద్వారా నీరు సాఫీగా సాగేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటోంది. -
రాజకీయ చైతన్యంతోనే అభివృద్ధి
షాద్నగర్రూరల్: దళితులు రాజకీయంగా చైతన్యవంతులు అయినప్పుడే అభివృద్ధి సాధ్యమని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాగల్ల ఉపేందర్ అన్నారు. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని కిషన్నగర్లో బుధవారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు నాగభూషణం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ.. దళిత రిజర్వేషన్కోసం 31 సంవత్సరాలుగా ఎమ్మార్పీఎస్ అలుపెరగని ఉద్యమం చేసిందని చెప్పారు. దశాబ్దాల ఉద్యమం తరువాత వర్గీకరణ సాధించుకోవడం జరిగిందన్నారు. భవిష్యత్లో దళితులంతా ఐకమత్యంతో ఏకతాటిపైకివచ్చి రిజర్వేషన్ వర్గీకరణ ఫలాలను అందుకోవాలన్నారు. జూలై 7న నిర్వహించనున్న జెండావిష్కరణ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రఘువరన్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ, నాయకులు పాండు, కృష్ణ, లింగం, ప్రవీణ్, శ్రీశైలం, బాలు తదితరులు పాల్గొన్నారు. -
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం రూరల్: కడుపునొప్పి, చెవి నొప్పి భరించలేక ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రాఘవేందర్రెడ్డి కథనం ప్రకారం.. ఆదిబట్ల మున్సిపాలిటీ ఎంపీపటేల్గూడకు చెందిన గడుసు మైత్రి (20) ఇబ్రహీంపట్నంలోని గురునా నక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇటీవల తీవ్రమైన కడుపునొప్పి, చెవినొప్పితో బాధపడుతోంది. సరైన చికిత్స అందడం లేదని మనస్తాపానికి గురై బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
బస్ చార్జీలను తగ్గించండి
తుర్కయంజాల్: పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలను వెంటనే తగ్గించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొంతం మాధవరెడ్డి డిమాండ్ చేశారు. తుర్కయంజాల్లో బుధవారం ఆయన మాట్లాడుతూ.. పెంచిన చార్జీలతో పేద ప్రజలు, విద్యార్థులకు ఆర్థిక భారం కానుందన్నారు. చార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఎస్.జగన్ మోహన్ రెడ్డి, టి.బాలయ్య, బీరప్ప, గంధం బాలరాజ్, నరేందర్, కాటమయ్య, రేఖ, అండాలు, సావిత్రి పాల్గొన్నారు. ప్రభుత్వ భూమిలో ఫెన్సింగ్ తొలగింపు కేశంపేట: మండల పరిధిలోని చింతకుంటపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని గ్రామస్తులు నాయబ్ తహసీల్దార్ గీతకు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని సర్వేనంబర్ 98లో మూడు ఎకరాల ప్రభుత్వ భూమికి కొందరు ఫెన్సింగ్ వేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్ఐ చెన్నకేశవులు ఫెన్సింగ్ వేసి భూమిని పరిశీలించారు. ప్రభుత్వ భూమిలో పాతిన కడీలను తొలగించారు. నేడు డయల్ యువర్ డీఎం షాద్నగర్: ఆర్టీసీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు గురువారం డయల్ యువర్ డీఎం నిర్వహించనున్న ట్టు షాద్నగర్ డిపో మేనేజర్ ఉష బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్య క్రమం ఉంటుందని తెలిపారు. ప్రయాణికులు తమ సమస్యలు, సూచనలు, సలహాలు తెలియజేయాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 99592 26 287 నంబర్లో సంప్రదించాలని సూచించారు. సంక్షేమ నిధి ఏర్పాటు హర్షణీయం మొయినాబాద్: దేవాలయాల్లో పనిచేసే అర్చకులు, ఇతర ఉద్యోగులకు లబ్ధి చేకూరేవిధంగా ప్రభుత్వం ప్రత్యేకంగా సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడంపై దేవాలయాల పరిరక్షణ ఉద్యమం కన్వీనర్, చిలుకూరు బాలాజీ దేవాలయం వంశపారంపర్య అర్చకుడు రంగారజన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 17 ఏళ్లకుపైగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించినందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 1997లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అవిభక్త ఆంధ్రప్రదేశ్లోనే ఈ నిధి ఏర్పడినా పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి పూర్తిస్థాయి సంక్షేమ నిధి ఏర్పాటు అంశం పెండింగ్లోనే ఉందన్నారు. సంక్షేమ నిధి ఏర్పాటుపై సోమవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటన చేశారని.. దానికి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారన్నారు. ఈ నిధి ఏర్పటుతో చిన్నస్థాయి నుంచి అసిస్టెంట్ కమిషనర్ స్థాయి వరకు 13,700 మంది అర్చకులు, ఇతర సిబ్బందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. -
శాంతిభద్రతల రక్షణకు చర్యలు
షాద్నగర్రూరల్: శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ఏసీపీ లక్ష్మీనారాయణ అన్నారు. పట్టణంతో పాటు ఫరూఖ్నగర్లో మంగళవారం రాత్రి వాహనాల తనిఖీ చేట్టారు. కిరాణా దుకాణాలు, బెల్టుషాపులు, దాబాలు, లాడ్జీలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. నిషేధిత గుట్కాలు, అనుమతులు లేకుండా మద్యం విక్రయాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాత్రి సమయాల్లో అపరిచితులకు దూరంగా ఉండాలని, అలాంటి వారు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తనిఖీల్లో పట్టణ సీఐ విజయ్కుమార్, డీఐ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ నర్సయ్య, కేశంపేట సీఐ నరహరి, ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐలు, ఎస్ఓటీ పోలీసులు, పాల్గొన్నారు. ఏసీపీ లక్ష్మీనారాయణ -
ప్రభుత్వ భూముల పరిశీలన
కొందుర్గు: మండల కేంద్రంలో అధిక విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను మంగళవారం అధికారులు పరిశీలించారు. కొందుర్గు పడమర శివారు సర్వే నంబర్ 150, 161లలో గల ప్రభుత్వ భూమిని జీహెచ్ఎంసీ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామునాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అత్యధిక విస్తీర్ణం గల ప్రాంతాలను గుర్తించి స్థలాలను పరిశీలిస్తున్నామని ఆయన వివరించారు. ఈ సర్వే నంబర్లలో మొత్తం ప్రభుత్వ భూమి 230 ఎకరాలు ఉందని, ఇందులో పేదలకు అసైన్డ్ చేయడంతో పాటు మైనింగ్ కోసం లీజుకు ఇచ్చింది పోను ఇంకా 150 ఎకరాల వరకు అందుబాటులో ఉందని తహసీల్దార్ రమేశ్కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఎంఆర్ఐ శివకుమార్, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. -
ఇంట్లో బోర్ కొడుతోంది.. ఉండలేకపోతున్నా..!
ఫిలింనగర్: తల్లిదండ్రులిద్దరూ పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లో ఒక్కదానికే బోర్ కొడుతోంది.. ఉండలేకపోతున్నా అని తరచూ స్నేహితురాలికి చెబుతూ బాధపడుతున్న ఓ యువతి అదృశ్యమైంది.ఈ ఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఫిలింనగర్లోని మహాత్మాగాంధీనగర్ బస్తీలో నివసించే చంద్రయ్య, రేఖ దంపతులకు వసంత (19) అనే కూతురు ఉంది. ఏడో తరగతి చదువుకున్న వసంత తల్లిదండ్రులిద్దరూ పనులకు వెళ్తుండడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఇంట్లో బోర్ కొడుతుందంటూ ఎప్పుడూ స్నేహితురాలితో బాధపడేది. ఈ నేపథ్యంలోనే తాను బయటకు పని మీద వెళ్తున్నానని చెబుతూ తన చిన్నమ్మకు చెప్పి వెళ్లిపోయింది. ఇంటికి వచ్చి చూసిన తల్లిదండ్రులకు కూతురు కనిపించకపోయేసరికి అన్ని ప్రాంతాలు గాలించారు. ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా చంద్రయ్య అన్న కొడుకు విజయ్తో తమకు కొంతకాలంగా గొడవలు ఉన్నాయని, తమ కూతురు అదృశ్యం వెనుక విజయ్ హస్తం ఉండి ఉంటుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిలింనగర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు 8712569163 నెంబర్లో సంప్రదించాలిన పోలీసులు కోరారు. ఫిలింనగర్లో యువతి అదృశ్యం -
స్కూళ్లు ప్రారంభమయ్యేలోగా యూనిఫాంల పంపిణీ
కడ్తాల్: పాఠశాలలు ప్రారంభమయ్యేలోగా విద్యార్థులకు పూర్తి స్థాయిలో యూనిఫాం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీఆర్డీఏ ఏపీడీ సూర్యారావు అన్నారు. మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మండల పరిధిలోని పది పాఠశాలలకు సంబంధించి స్కూల్ యూనిఫాం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీఆర్డీఏ ద్వారా మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులచే యూనిఫాంలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 12న పాఠశాలలు ప్రారంభించేలోగా, ఆయా పాఠశాలలకు మొదటి జత అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీపీఎం బాలరాజు, ఎంఈఓ సత్యనారాయణ, ఏపీఎం రాజేశ్వరి, సీసీలు జరీనా, వసంత, నర్సింహ ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కొనసాగుతున్న లోక్ అదాలత్ చేవెళ్ల: ట్రాఫిక్ కేసులకు సంబంధించి చేవెళ్ల కోర్టు ఆవరణలో జరుగుతున్న లోక్ అదాలత్లో మంగళవారం రెండోరోజు కొనసాగింది. రిటైర్డు జడ్జి కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 169 కేసులు పరిష్కరించారు. రూ.3.78 లక్షల జరిమానా విధించారు. ఇందులో డ్రంకెన్ డ్రైవ్ కేసులు 93 కాగా, ఇతర కేసులు 76 ఉన్నాయి. ఈనెల 14వ తేదీ వరకు లోక్ అదాలత్ కొనసాగుతుందని ట్రాఫిక్ సీఐ వెంకటేశం తెలిపారు. చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్ మండలాల పరిధిలో కేసులు నమోదైన వారు పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ చందర్నాయక్, సిబ్బంది పాల్గొన్నారు. -
భూదాన్ బోర్డు భూ సమస్యలపై అర్జీలు
ఇబ్రహీంపట్నం: భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్గౌడ్ కోరా రు. ఇబ్రహీంపట్నం భాగాయత్, ఇస్మాయిల్ పంపు, తట్టిఖానా, అల్లిమియాకుంట రెవెన్యూ భూ సమస్యలపై మంగళవారం స్థానిక ఓసీ కమ్యూనిటీ హాల్లో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. సర్వే నంబర్ 58, సైదాబాద్ కంచె, భాగాయత్, తట్టిఖాన రెవెన్యూ పరిధి భూదాన భూములకు సంబంధించి అధికంగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఆ భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని పలువురు విన్నవించినట్లు పేర్కొన్నారు. భాగాయత్ పరిధి 120, తట్టి ఖానా పరిధి 10, అల్లిమియా కుంట పరిధి నుంచి ఒక్క దరఖాస్తు అందిందని వివరించారు. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య ఇబ్రహీంపట్నం: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, మీ పిల్లలను వాటిల్లో చేర్పించాలని ఇబ్రహీంపట్నం బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కోరారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఇంటింటికి వెళ్లారు. బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని, మధ్యలో బడి మానేసిన విద్యార్థులను తిరిగి చేర్చాలని సూచించారు. ఉచిత ప్రవేశం, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో విద్యాబోధన జరుగుతుందని వివరించారు. డీసీఎం బోల్తా, వ్యక్తికి గాయాలు కడ్తాల్: కోళ్లను తరలిస్తున్న డీసీఎం వాహనం బోల్తాపడింది. ఈ సంఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోళ్లను సరఫరా చేసే డీసీఎం వాహనం మంగళవారం ఉదయం తలకొండపల్లి నుంచి కడ్తాల్కు బయలుదేరగా, మార్గ మధ్యలో మక్తమాధారం గేట్ సమీపంలో డ్రైవర్ అజాగ్రత్తతో కరెంట్ పోల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలోని కార్మికుడు రోషన్ కాళ్లకు గాయాలయ్యాయి. వాహన యాజమాని చెదురుపల్లి నర్సింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వరప్రసాద్ తెలిపారు. కిరాణా దుకాణాల్లో రేషన్ బియ్యం పట్టివేత శంకర్పల్లి: కిరాణా దుకాణాల్లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని పలు కిరాణ దుకాణాల్లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచి అమ్ముతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో మంగవారం పలు దుకాణాల్లో దాడులు నిర్వహించారు. కోటికే ధనుంజయ్ దుకాణంలో నాలుగు క్వింటాళ్లు, అలంపల్లి శ్రీధర్ దుకాణంలో 3.5 క్వింటాళ్ల రేషన్ బియ్యం దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకొని దుకాణ యాజమానులపై కేసులు నమోదు చేశారు. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. రైలు కింద పడి వ్యక్తి మృతి అనంతగిరి: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ రైల్వే పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం సాయంత్రం వికారాబాద్ – గోధుమగూడ రైల్వేస్టేషన్ల మధ్య ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే అధికారులు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 సంవత్సరాలు ఉంటుందని, చామనచాయ, బక్క పలుచని శరీరం కలిగి ఉన్నాడు. మృతుని ఒంటిపై తెలుపు నలుపు బూడిద రంగు డబ్బాల ఫుల్ షర్ట్, తెలుపు రంగు ప్యాంట్, నలుపు, ఎరుపు రంగు మొలతాడు ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురిలో భద్రపరిచనట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ హరిప్రసాద్ తెలిపారు. ఎవరైన ఆచూకీ తెలిసిన వారు ఉంటే వెంటనే సంప్రదించాలన్నారు. -
పది టిప్పర్లు, జేసీబీ సీజ్
షాబాద్: ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని షాబాద్ తహసీల్దార్ ఎండీ అన్వర్ హెచ్చరించారు. మంగళవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు అలవాటు పడిన కొందరు ప్రభుత్వ భూముల్లోని మట్టిని అక్రమంగా తవ్వి, ప్రైవేట్ కంపెనీలకు తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారని తెలిపారు. సోలీపేట్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 350లో ఉన్న 120 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని సమాచారం రావడంతో సోమవారం రాత్రి దాడులు నిర్వహించామన్నారు. పది టిప్పర్లు, ఒక జేసీబీని అదుపులోకి తీసుకున్నామని స్పష్టంచేశారు. వీటికి సంబంధించిన యజమానులు, డ్రైవర్లపై కేసులు నమోదు చేశామన్నారు. మరోమారు ఇలాంటి అక్రమాలకు పాల్పడితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని, ఈసీ వాగు నుంచి ఇసుక తరలిస్తున్న వారిపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. యజమానులు,డ్రైవర్లపై కేసులు నమోదు మరోసారి పట్టుబడితేనాన్ బెయిలబుల్ కేసులు షాబాద్ తహసీల్దార్ ఎండీ అన్వర్ -
వరుణుడే ఆలస్యం
దుక్కులు సిద్ధం యాచారం: ఈ ఏడు ముందస్తు రుతుపవనాలు వస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటనతో తొలుత రైతులు ఆనందం వ్యక్తంచేశారు. సాగుకు కావాల్సిన సరంజామా సిద్ధంగా ఉంచుకున్నారు. అయినప్పటికీ.. ఆకాశంలో మబ్బులే తప్ప.. వాన జాడ లేదు. దీంతో ఈ ఏడాది అదునులో పంటలు సాగవుతాయా, లేదా అని భయాందోళన చెందు తున్నారు. వర్షాలు పడకపోవడంతో పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ఇక మెట్ట పంటల సాగు కష్టమేనని భావిస్తున్నారు. రోహిణిలో వర్షాలు పడకపోగా.. మృగశిర కార్తె ప్రారంభమై నాలుగు రోజులు గడుస్తున్నా వరుణుడు కరుణించకపోవడంతో దిక్కులు చూస్తున్నారు. మెట్ట పంటలకు పది రోజులే గడువు సమృద్ధిగా వర్షాలు కురిస్తే మెట్ట పంటలు పత్తి, కంది, ఆముదం, జొన్న, సజ్జ తదితర పంటల సాగు కు వారం, పది రోజులే అనువైన గడువని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. జూన్ 15 లోపు వరకు, ఆ తర్వాత మరో వారం విత్తనాలు విత్తుకోవడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తున్నా రు. రోహిణి కార్తెలో కురిసిన వర్షాలకు జిల్లాలోని ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్, షాద్నగర్, మహేశ్వరం, కందుకూరు, కొత్తూర్ తదితర మండలాల్లో కొంత మంది రైతులు పత్తి, జొన్నను సా గు చేశారు. ఆ తర్వాత వాన పడకపోవడంతో విత్తి న విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేక.. పెట్టుబడులు కోల్పోయామంటూ ఆందోళన చెందుతున్నారు. అవగాహన సదస్సులు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వ విద్యాల యం, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ‘రైతు ముగింట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంతో అధికా రులు, శాస్త్రవేత్తలు 20 రోజులుగా గ్రామాల్లో విసృత్తంగా సదస్సులు నిర్వహిస్తున్నారు. సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తొలకరితో జిల్లాలో 25 వేల ఎకరాలకుపై గా పత్తి, జొన్న, కంది తదితర మెట్ట పంటలను రైతులు సాగు చేసినట్లు అధికారులు గుర్తించారు. వరి విషయానికి వస్తే రోహిణి కార్తెలో నారు పోస్తే ఆశించిన దిగుబడి వస్తుందని రైతుల్లో ఆశ. కానీ వరుణుడు నిరాశపర్చడం, ఎండలు మండుతుండటంతో చెరువులు, కుంటలు ఎండిపోయాయి. బోరుబావులు అడుగంటాయి. ఈ కష్టాలన్నీ గట్టెక్కాలంటే భారీ వర్షాలు కురవాల్సిందేనని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. నార్లు పోసుకోవడానికి నీరున్న రైతులు.. కొద్ది పొలంలోనే పోసుకుని, సంరక్షించుకోవాలని సూచిస్తున్నారు. జిల్లాలో వానాకాలం సాగు అంచనా వివరాలు పంట పేరు అంచనా సాగు(ఎకరాల్లో) వరి 1,40,238 జొన్న 5,562 సజ్జ 21 మొక్కజొన్న 52,207 రాగులు 30 కందులు 14,308 మినుములు 4 పెసర్లు 13 ఉలవలు 42 ఆముదాలు 37 వేరు శనగ 96 పొద్దు తిరుగుడు 1 నువ్వులు 10 సోయాబీన్ 50 పతి 1,41,088 ఇతర పంటలు 4,382 కానరాని వానజాడ.. కర్షకుల ఆందోళన సాగుకు పొలాలు సిద్ధం విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు పూర్తి మెట్ట పంటలు కష్టమేనంటున్న రైతులు జిల్లాలో 3,58,089 ఎకరాల్లో సాగు అంచనా వర్షం పడితేనే విత్తనాలుతగిన వర్షాలు పడితేనే విత్తనాలు విత్తుకోవాలని, తడిపొడి భూమిలో విత్తితే మొలకెత్తకపోవడంతో పాటు.. పెట్టుబడి కోల్పోవాల్సి వస్తుందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా.. జిల్లాలో ఈ ఏడాది వానాకాలం సీజన్లో 3,58,089 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. అత్యధికంగా పత్తి 1,41,088 ఎకరాల్లో, వరి 1,40,238, మొక్కజొన్న 52,207 ఎకరాల్లో సాగ వుతుందని పేర్కొంటున్నారు. సాగుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను వ్యవసాయ శాఖ సిద్ధం చేసి ఉంచిందని తెలిపారు. అదును దాటుతోంది. వర్షాల జాడ కానరావడం లేదు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పక్షం రోజుల క్రితం పలకరించిన తొలకరితో.. రైతులు వ్యవసాయ పొలాలను సిద్ధం చేసుకున్నారు. వర్షాలు కురిసిన వెంటనే విత్తనాలు విత్తుకోవడానికి రూ.లక్షలు వెచ్చించి ఎరువులు, విత్తనాలు కొనుగోళ్లు చేశారు. వరుణుడు ముఖం చాటేయడంతో కలవరానికి గురవుతున్నారు. ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు. -
అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
● మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవి చేవెళ్ల: మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా మంగళవారం మున్సిపాలిటీలోని మెప్మా సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకోసం ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశా రు. ఈ వైద్య శిబిరాన్ని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొత్త మున్సిపాలిటీని అంతా కలిసి ఆదర్శంగా మార్చుకోవాలని సూచించారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా ఒక్కోరోజు ఒక్కో కార్యక్రమంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. మున్సిపాలిటీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. అనంతరం మున్సిపాలిటీ ఆవరణలో మొక్కలు నాటారు. మెప్మా సభ్యులకు రూ.3.20 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ప్రత్యేకాధికారి శ్రీధర్, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణరెడ్డి, టీపీసీసీ నాయకుడు జనార్దన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్, పీఏసీఎస్ చైర్మన్ డి.వెంకట్రెడ్డి పాల్గొన్నారు. ప్రణాళికను సమర్థవంతంగా నిర్వహించాలి మొయినాబాద్: మున్సిపాలిటీల్లో చేపడుతున్న వంద రోజుల ప్రణాళికను సమర్థవంతంగా నిర్వహించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. మున్సిపల్ పరిధిలోని చిలుకూరులో నిర్మించిన పొడి చెత్త వేరు చేసే డీఆర్సీసీ కేంద్రాన్ని మంగళవారం ఆమె ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, రోగాలు రాకుండా వంద రోజుల ప్రణాళికలో చర్యలు తీసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, తడిచెత్త, పొడి చెత్త వేరు చేయడం, సురక్షిత మంచినీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జేడీ ఫల్గున్, డీడీ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్, మేనేజర్ జమీర్ హైమద్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల ఏలు‘బడి’!
రేపటి నుంచి తెరుచుకోనున్న విద్యా సంస్థలు ఇది షాబాద్ మండలం తాళ్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల. ఇక్కడ 120మంది విద్యార్థులు విద్యాభ్యాసం సాగిస్తున్నారు. భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. మన ఊరు–మనబడి పథకం కింద ఎంపిక కావడంతో కాంట్రాక్టర్ మరమ్మతు పనులు మొదలుపెట్టారు. బిల్లులు రాకపోవడంతో మధ్యలోనే వదిలేశారు. చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. వంటగది లేక వరండాలోనే వండాల్సి వస్తోంది. వర్షం వస్తే ఏ క్షణంలో ఏమవుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, రంగారెడ్డిజిల్లా: బడి గంటలు గురువారం నుంచి మోగనున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయి. ఎప్పటిలాగే ఈ విద్యా సంవత్సరం కూడా విద్యార్థులకు సమస్యలే స్వాగతం పలకనున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు–మనబడి’ పథకం కింద చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణం, మరుగుదొడ్లు, డైనింగ్హాల్స్ నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో వారు మధ్యలోనే నిలిపివేశారు. పైసా ఖర్చులేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో నిపుణులైన ఉపా ధ్యాయులతో మంచి విద్యాబోధన పొందొచ్చని భావించిన నిరుపేద విద్యార్థులకు మళ్లీ నిరాశే మిగుల్చుతోంది. ఇంగ్లిష్ మీడియంలో బోధన, ఉచిత పుస్తకాలు, యూనిఫాం, పౌష్టికాహారం అందిస్తున్నప్పటికీ మౌలిక సదుపాయాల లేమి వేధిస్తోంది. వెరసి ఆశించిన స్థాయిలో కొత్త అడ్మిషన్లు రాకపోగా, ఉన్నవి కూడా కోల్పోవాల్సి వస్తోంది. వేసవి సెలవుల కారణంగా తరగతి గదుల నిండా దుమ్ము ధూళి పేరుకుపోయాయి. మరుగుదొడ్లు, మూత్రశాలలను శుభ్రం చేసేందుకు స్కావేంజర్లు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. నిధులు లేక నిలిచిన పనులు ● కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దాలని అప్పటి ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ‘మన ఊరు– మనబడి’పథకాన్ని తీసుకొచ్చింది. పైలెట్ ప్రాజెక్ట్ కింద జిల్లెలగూడ ప్రాథమిక, ఉన్నత పాఠశాలతోపాటు శివరాంపల్లి ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసింది. రూ.2 కోట్లతో వీటిని తీర్చిదిద్దింది. తర్వాత మొదటి విడతలో 464 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసింది. వీటిలో 448 పాఠశాలలకు రూ.99.45 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టింది. రూ.30 లక్షలకు లోబడి ఉన్న 345 పాఠశాలల్లో ఇంజనీరింగ్ విభాగం ద్వారా పనులు చేపట్టింది. రూ.30 లక్షలకుపైగా అంచనా వ్యయంతో చేపట్టే పనులను టెండర్ ద్వారా చేపట్టారు. అదనపు తరగతి గదులు, ప్రహరీలు, భవనాలకు రంగులతో పాటు ఫర్నిచర్, విద్యుత్, తాగునీరు, డైనింగ్ హాల్, కిచెన్షెడ్డు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని నిర్ణయించారు. ఆ మేరకు 30 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు 70 శాతం పనులు పెండింగ్లో ఉన్నాయి. అసంపూర్తి నిర్మాణలు, అరకొర తరగతి గదుల మధ్య ఎలా చదువుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తడిసి మోపైడెన అప్పులు ● యాచారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన చంద్రారెడ్డి అదే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రూ.25 లక్షలు ఖర్చు చేసి తరగతి గదులకు మరమ్మతులు చేయించాడు. పనులు పూర్తయి 18 నెలలైంది. అధికారులు ఎంబీ (మెజర్మెంట్ బుక్) కూడా రికార్డు చేశారు. ఆయనకు ఇప్పటి వరకు డబ్బులు రాలేదు. ● ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన శ్రీనివాసరెడ్డి రూ.30 లక్షలు ఖర్చు చేసి శేరిగూడ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి గదుల మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణం పనులు చేపట్టారు. చేసిన అప్పులు రెట్టింపయ్యాయి కానీ పనులుకు మాత్రం బిల్లు రాలేదు. ● నాదర్గుల్కు చెందిన శివకుమార్ రూ.32 లక్షలు ఖర్చు చేసి ఆదిబట్ల జెడ్పీ స్కూల్ చుట్టూ ప్రహరీ నిర్మాణం, తరగతి గదుల మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేపట్టారు.బిల్లులు మాత్రం రాలేదు. ఈ పథకం కింద పనులు చేపట్టిన అనేక మంది ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. 30 శాతం కూడా పూర్తి కాని అభివృద్ధి, మరమ్మతు పనులు చేసిన వాటికి బిల్లులు రాక నిలిపివేత ఎప్పటిలాగే ఈ ఏడాదీ తప్పని తిప్పలు అపరిశుభ్రంగా పాఠశాల ప్రాంగణాలు స్కావేంజర్లు లేక.. ఊడ్చేవాళ్లు రాక ఇబ్బంది అభివృద్ధి పనుల అంచనా ఇలా.. అంశం కేటాయించిన బడ్జెట్ అదనపు తరగతి గదుల నిర్మాణం రూ.29,91,50,058 తాగునీటి సరఫరా పనులు రూ.5,97,34,702 ప్రహరీల నిర్మాణం రూ.4,88,70,392 విద్యుద్దీకరణ పనులు రూ.8,17,26,500 డైనింగ్ హాల్స్ రూ.20,11,31,113 టాయ్లెట్స్ విత్ రన్నింగ్ వాటర్ రూ.6,64,40,861 వంటగదుల నిర్మాణం రూ.2,39,50,261 మేజర్ అండ్ మైనర్ వర్క్స్ రూ.24,35,55,927 నిధులు లేక.. మన ఊరు–మన బడి పథకం కింద సివిల్వర్క్స్, వాటర్, శానిటేషన్, మైనర్ అండ్ మేజర్ రిపేరు, విద్యుద్దీకరణ పనులు చేపట్టారు. 80 శాతం పనులు పూర్తయినా 10 శాతం నిధులు మాత్రమే మంజూరయ్యాయి. నిధులు లేకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేసి మిగతా పనులు పూర్తి చేయాలి. – జంగయ్య, హెచ్ఎం, కడ్తాల్ బాలుర ఉన్నత పాఠశాల -
తోరణాలు కట్టి స్వాగతం పలకాలి
● పాఠశాలల ప్రారంభోత్సవం పండుగలా నిర్వహించాలి ● కలెక్టర్ నారాయణరెడ్డి సాక్షి, రంగారెడ్డిజిల్లా: పాఠశాలల పునఃప్రారంభోత్సవం ఓ పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. ఈ మేరకు మంగళవారం బడిబాట, వనమహోత్సవం, ఇందిరా మహిళాశక్తి అంశాలపై సంబంధిత అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. తొలి రోజు వేడుకల్లో భాగంగా పాఠశాలలకు తోరణాలు కట్టి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కు స్వాగతం పలకాలని అన్నారు. బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించి, వారికి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధ్యాపకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాల ప్రాంగణం సహా కిచెన్, స్టోర్ రూమ్స్, తరగతి గదులన్నీ శుభ్రం చేయించాలన్నారు. పాఠశాల పునఃప్రారంభం రోజే పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, ఒక జత యూనిఫాం అందజేయాలన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న 160 పాఠశాలల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి పని చేయాలని, స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. వన మహోత్సవంలో భాగంగా పండ్ల మొక్కలు నాటించాలని, ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో చేర్పించాలని సూచించారు. సమావేశంలో డీఈఓ సుశీందర్రావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పీసీసీ అధ్యక్షుడికి కృతజ్ఞతలు
కందుకూరు: పీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడైన మండల పరిధిలోని దెబ్బడగూడకు చెందిన ఏనుగు జంగారెడ్డి మంగళవారం పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛంఅందించి కృతజ్ఞతలు తెలిపా రు. పార్టీ బలోపేతానికి తన శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ఉన్నారు. హైటెన్షన్ లైన్ రూట్ మార్చాలని వినతి కేశంపేట: ఇళ్లకు సమీపం నుంచి 765 కేవీ హైటెన్షన్ వైర్లు వెళ్తున్నాయని, వాటిని రూట్ మార్చాలంటూ కేంద్ర విద్యుత్శాఖ సహాయమంత్రి శ్రీపాద్యశో నాయక్కు పోమాల్పల్లి గ్రామస్తులు విన్నవించారు. ఈ మేరకు గోవాలోని మంత్రి నివాసంలో మంగళవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. స్పందించిన ఆయన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు గ్రామస్తులు తెలిపారు. కేంద్ర సహాయమంత్రిని కలిసిన వారిలో బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు నర్సింహయాదవ్, కుమ్మరి మహేశ్, భూపాల్రెడ్డి తదితరులు ఉన్నారు. 13న ఇంటర్ ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్ మహేశ్వరం: స్థానిక గిరిజన బాలుర సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం సీఈసీ, హెచ్ఈసీ గ్రూపుల్లో ఖాళీలు ఉన్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ నళిని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మిగిలిన సీట్లకు ఈనెల 13న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. సున్నిత ప్రాంతాల్లో రాచకొండ సీపీ తనిఖీలు పహాడీషరీఫ్: సున్నితమైన బాలాపూర్, పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ల పరిధిలో రాచకొండ పోలీ స్ కమిషనర్ జి.సుధీర్ బాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. రెండు ఠాణాల పరిధిలో విజిబుల్ పోలీసింగ్తో పాటు స్థానిక పోలీసులు వాహనాల తనిఖీ ఏ తరహా చేపడు తున్నారనే విషయమై మహేశ్వరం జోన్ డీసీపీ డి.సునీతా రెడ్డితో కలిసి పర్యవేక్షించారు. విజి బుల్ పోలీసింగ్ ద్వారా ప్రజలకు భద్రత విష యంలో భరోసా కల్పించాలని బాలాపూర్, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్లు ఎం.సుధాకర్, పి.గురువారెడ్డికి సూచించారు. నగర శివారు ప్రాంతం కావడంతో ఎప్పటికప్పుడు వాహనాల తనిఖీ చేపట్టాలన్నారు. తనిఖీల సమయంలో పరిశీలించాల్సిన అంశాలపై సూచనలు చేశా రు. తనిఖీల్లో మహేశ్వరం అదనపు డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ జానకీ రెడ్డి పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
కందుకూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కడ్తాల్ గ్రామానికి చెందిన కడారి శివరాజ్(66), గత నెల 27న యాక్టివ వాహనంపై మండల పరిధి కొత్తూరులోని బంధువుల ఇంటికి వచ్చాడు. తిరిగి వెళ్లే క్రమంలో శ్రీశైలం రహదారి కొత్తూరు గేట్ వద్ద కందుకూరు వైపు నుంచి వేగంగా వచ్చిన పల్సర్ వాహనం అతడిని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తిని.. చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాశ విడిచాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణంజీడిమెట్ల: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిరన సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సుభాష్నగర్ పాండుబస్తీకి చెందిన రంగంపేట వినయ్(18)కి చిన్నతనంలోనే తండ్రి మృతిచెందాడు. అప్పటి నుంచి అతడి తల్లి మణి వినయ్తో పాటు అతని చెల్లిని పోషిస్తోంది. ఇటీవలే ఇంటర్ వినయ్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన అతను తన చదుల ఖర్చు కోసం టీజీఐఐసి కాలనీలోని జేవీసీ పరిశ్రమలో పని చేస్తున్నాడు. అదివారం సాయంత్రం పరిశ్రమలో పరిచయమైన విష్ణు అనే వ్యక్తితో కలిసి ట్యాంక్ బండ్కు వెళ్లేందుకు సాయిబాబానగర్ నుండి స్కూటీపై బయలుదేరాడు. వినయ్ స్కూటీ నడుపుతుండగా విష్ణు వెనకాల కూర్చున్నాడు. వీరి బైక్ లక్సాయ్ పరిశ్రమ వద్దకు చేరుకోగానే అదే సమయంలో సూరారం వైపు వెళ్లేందుకు యూటర్న్ ఓ లారీ యూటర్న్ తీసుకుంటుంది. అదే రోడ్డులో వస్తున్న వినయ్ అదుపు తప్పి లారీ వెనక టైరును ఢీకొట్టడంతో అతను వెనకటైరు కింద పడిపోగా వెనక కూర్చున్న విష్ణు పక్కకు పడిపోయాడు. ఈ ఘటనలో వినయ్ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికిఅక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి మణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల అరెస్టుఅంబర్పేట: గుట్టు చప్పుడు కాకుండా విద్యుత్ కేబుల్ వైర్లను చోరీ చేసి విక్రయిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు కోనుగోలు చేసిన స్క్రాప్ దుకాణ యాజమానిని ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఆదివారం అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాగ్అంబర్పేటకు చెందిన నరేందర్, వీరు విద్యుత్ శాఖలో కాంట్రాక్ట హెల్పర్లుగా పని చేస్తున్నారు. వీరు శనివారం రాత్రి బతుకమ్మకుంటలోని ఓ స్క్రాప్ దుకాణంలో విద్యుత్ అల్యూమినియం వైర్లు విక్రయించేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు వారిని అదుపుపులోకి తీసుకుని ప్రశ్నించారు. స్క్రాప్ దుకాణం నిర్వాహకుడు చంద్రశేఖర్కు వైర్లను విక్రయించేందుకు వచ్చినట్లు చెప్పారు. వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం అంబర్పేట పోలీసులకు అప్పగించారు. వారి నుంచి రూ.1.50 లక్షలు విలువైన విద్యుత్ వైర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మంత్రి వర్గంలో బీసీలకు పెద్దపీటసుందరయ్య విజ్ఞాన కేంద్రం: కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వర్గంలో బీసీలకు పెద్ద పీట వేసిందని తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజ్గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ యెలికట్టే విజయకుమార్గౌడ్ అన్నారు. 2వ విడత మంత్రి వర్గ విస్తరణలో బీసీ వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి స్థానం కల్పించడం అభినందనీయమన్నారు. ఆదివారం శ్రీహరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పించినందుకు పార్టీ అధినేత రాహుల్ గాంధీ, జాతీయ అధ్యక్షుడు మలికార్జున్ ఖర్గే, సీఎం రేవంత్రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్ కొత్వాల్ పాల్గొన్నారు. -
యువతి అదృశ్యం
పహాడీషరీఫ్: యువతి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ గురువారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి శ్రీరామ కాలనీకి చెందిన యాదగిరి కుమార్తె రాధిక(24) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఈ నెల 6న ఉదయం 8 గంటలకు పాఠశాలకు వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ స్విచ్చాఫ్ ఉండడంతో పాటు, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకి లభ్యం కాలేదు. దీంతో ఆమె తల్లి సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వివరాలు తెలిసిన వారు పోలీస్స్టేషన్లో లేదా 87126 62367 నంబర్కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. వివాహిత.. మణికొండ: వివాహిత అదృశ్యమైన సంఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. పోలీసుల సమాచారం మేర కు... సికింద్రాబాద్లోని సీతాఫల్మండీకి చెందిన శ్రీరామ్ యోగిబాబు, తన భార్య సుచరిత(21)తో కలిసి శనివారం మధ్యాహ్న ం ఫైనాన్షియల్ జిల్లాలో ఉన్న ప్రిస్టేజ్ స్కైటెక్లోని ఆమె కార్యాలయానికి వచ్చారు. అందులో ఆమె ఫ్లోర్ మేనేజర్గా పనిచేస్తుంది. తనకు లోపల పని ఉందంటూ భర్తను బయ ట ఉంచి లోనికి వెళ్లింది. ఎంత సేపు వేచి చూసినా ఆమె రాకపోవటంతో లోనికి వెళ్లి చూడగా ఆమె అక్కడ కనిపించలేదు. పరిసర ప్రాంతాలతో పాటు బంధుమిత్రుల ఇళ్లలో విచారించినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో భర్త నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశా డు. ఆమె మెరూన్ రంగు దుస్తులు ధరించిందని, చేతికి స్మార్ట్ వాచ్ ఉందని, ఆమె ఆచూకీ తెలిస్తే నార్సింగి పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. కేసు దర్యాప్తులో ఉంది. జంట హత్యల కేసు దర్యాప్తునకు బృందం మొత్తం ఏడు టీంల ఏర్పాటు రాజేంద్రనగర్: జంట హత్యల కేసు ఛేదించేందుకు రాజేంద్రనగర్ పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. నిందితుల ఆనవాళ్లు లభించకపోవడంతో దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. హత్య కేసును ఛేదించేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు ఆది వారం మరో బృందాన్ని ఏర్పాటు చేశారు. వృద్ధ దంపతుల కుటుంబ సభ్యులను ఆదివారం మరోసారి ప్రశ్నించి వివరాలను సేకరించారు. ఆస్తి వివాదాలు, డబ్బు, నగలు తదితర వాటి పై కుటుంబ సభ్యుల నుంచి పలు ప్రశ్నలు అడిగి సమాచారం సేకరించారు. సీసీ టీవీ ఫుటేజీల్లో లభించిన ఆధారంగా నిందితుల చిత్రాలను కుటుంబ సభ్యులతో పాటు బంధువు, మిత్రులకు చూపించినా ఎలాంటి క్లూ లభించలేదు. దీంతో నిందితుల చిత్రాలను అన్ని పోలీస్స్టేషన్లకు పంపించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులు వాడిన రెండు ద్విచక్ర వాహనాలు నంబర్ ప్లేట్లు మార్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఒక వాహనం లభించినా ఎలాంటి క్లూ లభించలేదని సమాచారం. పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లూ లభించలేదంటూనే... త్వరలో నిందితులను పట్టుకుంటామని వెల్లడిస్తున్నారు. -
మొక్కజొన్న సాగుకు అనువైన సమయమిదే
నవాబుపేట: మొక్కజొన్న సాగుకు అనువైన సమయమిదేనని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. చాలా మంది రైతులు ప్రస్తుతం ఈ పంట సాగులో బిజీగా ఉన్నారు. సరైన యాజమాన్య పద్ధతులు అవలంబిస్తే మంచి లాభాలు పొందవచ్చని మండల వ్యవసాయాధికారి జ్యోతి సూచిస్తున్నారు. నవాబుపేట మండలంలో ఈ ఖరీప్లో 27,234 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, కంది, కూరగాయలు తదితర పంటలు సాగుకానున్నాయి. అందులో మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరగనుందని అధికారులు తెలుపుతున్నారు. గతేడాది మండలంలో 744 ఎకరాల్లో సాగయింది. ఈసారి మాత్రం 2317 ఎకరాలకు పెరగనుందని అంచనా. మొక్కజొన్న సాగులో పాటించాల్సిన పద్ధతులు, జాగ్రత్తలపై అధికారులు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. నేలలు సారవంతమైన నీరు ఇంకే నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, ఒండ్రు కలిగిన ఇసుక నేలలు మొక్కజొన్న సాగుకు అనుకూలమైనవి. చౌడు భూములు, నీరు నిల్వ ఉండేవి ఈ పంటకు అనుకూలించవు. విత్తుటకు ముందు మూడు–నాలుగు సార్లు నాగలితో దుక్కి దున్నాలి. ఎకరాకు దాదాపు 10 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. విత్తేకాలం సాధారణ పరిస్థితుల్లో వర్షాదారపు పంటను జూన్ 15 నుంచి జులై 15 వరకు విత్తుకోవచ్చు. రబీలో అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 లోగా విత్తితే ఎక్కువ దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది. మొదలు నాగలితో బోదెలు చేసుకోవాలి. తర్వాత విత్తనాన్ని బోదెకు పైనుంచి 1/3 వంతు ఎత్తులో విత్తితే నీటి పారుదల సులభంగా ఉండడమే కాకుండా వర్షాపాతం ఎక్కువైనప్పుడు నీరు బయటకు పోవడానికి వీలుంటుంది. కలుపు యాజమాన్యం పంట విత్తిన తర్వాత రెండు, మూడు రోజులలోపు అట్రజిస్ అనే కలుపు మందును తేలిక నేలల్లో ఎకరాకు 800 గ్రాములు పిచికారీ చేయాలి. బరువు నేలలో అయితే ఎకరాకు 1200 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయడం వల్ల కొన్ని గడ్డిజాతి కలుపు మొక్కలను ఒక నెల వరకు అదుపు చేయవచ్చు. విత్తిన నెల రోజులకు వెడల్పాటి కలుపు మొక్కలు గమనిస్తే 2, 4–డి సోడియం సాల్ట్ ఎకరాకు 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇలా చేస్తే పంట దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉంది. నీటి తడులు మొక్కజొన్న పూతకు ముందు, పూత దశలో, గింజ పాలు పోసుకునే దశలో బాగా నీరు పెట్టడం అవసరం. 30–40 రోజులలోపు ఉన్న లేత పైరుకు అధిక నీరు హానికరం. విత్తిన తర్వాత చేనులో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు. సాధారణంగా పంట కాలంలో 6–8 నీటి తడులు అవసరం. విత్తనాలు వేసినప్పుడు, విత్తిన 15 రోజులకు, తదితర దశల్లో నీటి తడులను తప్పకుండా ఇచ్చేలా జాగ్రత్త పడాలి. దీర్ఘకాలిక వంగడాలను 1–2 తడులు అధికంగా అవసరమవుతాయి. కాండం తొలుచు పురుగులు ఇవి రెండు రకాలు. మచ్చల, చారల కాండం తొలిచే పురుగు ఎక్కువగా ఖరీప్ పైరును ఆశిస్తుంది. గులాబీ రంగు కాండం తొలుచు పురుగు ఎక్కువగా రబీలో ప్రభావం చూపుతుంది. ఇవి పైరు మొలకెత్తిన 10–20 రోజులకు సోకుతాయి. పిల్ల పురుగులు మొదట ఆకులపైన పత్ర హరితాన్ని గోకి తింటాయి. తర్వాత గుండు సూది మాదిరి రంధ్రాలు, పొడవాటి చిల్లులు వరుస క్రమంలో కలిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వల్ల పువ్వు చనిపోయి ఎండిపోతుంది. దీనినే డెడ్హార్ట్ అంటారు. కాండం లోపల గుండ్రని లేదా ఎస్ ఆకారంలో సొరంగాలను ఏర్పరుస్తుంది. ఇవి పూతను, కంకిణి ఆశించడంతో దిగుబడి తగ్గతుంది. రసం పీల్చు పురుగులు 30 రోజులు పైబడిన పైరును పేనుబంక, చిగురు నల్లి ఆశించవచ్చు. పొడి వాతావరణంలో వీటి ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది. లేత కాండం నుంచి రసాన్ని పీల్చడంతో ఆకులు పసుపు రంగుకు మారిపోతాయి. మొక్క గిడసబారిపోతుంది. ఇవి విసర్జించే జిగునరు పదార్థానికి చీమలు చేరడమే కాకుండా శిలీంధ్రాలు ఏర్పడి మసి తెగులు ఆశించడం వల్ల కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం ఏర్పడి దిగుబడి తగ్గుతుంది. నివారణ సహజంగా అక్షింతల పురుగులు, సిర్పిడ్స్ వంటి పరాన్నజీవులు ఈ పురుగులను అదుపులో ఉంచుతాయి. రసం పీల్చు పురుగుల ఉద్ధృతి ఎక్కువగా ఉంటే మొనోక్రోటోపాస్ ఎకరాకు 320 మి.లీ లేదా డైమిథోయేట్ కలిపి పిచికారీ చేయాలి. టర్సికమ్ ఆకు తెగులు ఆకులపై పొదవైన, కోలాకారపు బూడిద రంగుతో ఆకుపచ్చ, గోధుమ వర్ణపు మచ్చలు కన్పిస్తాయి. ఈ మచ్చలు 2.5 నుంచి 25 సెం.మీ. పొడవు, 4 సెం.మీ. వెడల్పు ఉంటాయి. ఈ మచ్చలు మొదట మొక్క కింద ఆకులపై కనిపించి, క్రమంగా పెద్దవై వ్యాపిస్తాయి. అధిక తేమతో కూడిన వాతావరణంలో ఆకు అంతా ఎండి మొక్కలు చలిపోయినట్లుగా కనిపిస్తాయి. ఆకుల అడుగు బాగాన వలయాలుగా ఉంచాయి. ఈ మచ్చలు కాండంపైనా వ్యాపిస్తాయి.తుప్పు తెగులు నల్ల రేగడి, ఎర్ర నేలలు అనుకూలం యాజమాన్య పద్ధతులు పాటిస్తే మేలు నవాబుపేట ఏఓ జ్యోతి ఆకులపై రెండు వైపులా గుండ్రని లేక పొడవాటి గోధుమ వర్ణపు పొక్కుల మాదిరిగా తెగులు లక్షణాలు కనిపిస్తాయి. పంట పెరిగిన కొద్ది ఆకులపైన పొక్కులు గోధుమ వర్ణం నుంచి నలుపు వర్ణానికి మారుతాయి. ఉద్ధృతి, వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. పై రెండు రకాల తెగుళ్ల నివారణకు మాంకోజెట్ ఎకరానికి 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి తెగులు తీవ్రతను బట్టి ఒకటి లేక రెండుసార్లు పిచికారీ చేయాలి. -
10న హిందీ ప్రచార సభ 90 వసంతాల వేడుక
హిమాయత్నగర్: తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో హిందీ భాషాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న హిందీ ప్రచార సభ హైదరాబాద్ సంస్థ 90 వార్షికోత్సవ వేడుకలను ఈనెల 10న జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్నట్లు హిందీ ప్రచార సభ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి గైబువల్లి తెలిపారు. ఆదివారం అధ్యక్షుడు ప్రొఫెసర్ చంద్రదేవ్ కావడేతో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. నాంపల్లి స్టేషన్ రోడ్డులోని హిందీ ప్రచార సభ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో ఈ వేడుకలు జరుగుతాయన్నారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, సెంట్రల్ హిందీ డైరెక్టర్ ప్రొఫెసర్ సునీల్ బాబురావు కులకర్ణి తదితరులు హాజరవుతున్నారన్నారు. ఈ సందర్భంగా హిందీ భాషాభివృద్ధికి విశేషంగా కృషి చేసిన వారికి హిందీ సేవా ప్రతిభా పురస్కారాలు, పాఠశాల, కళాశాల స్థాయిలో నిర్వహించిన పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం చేయనున్నట్లు తెలినారు. హిందీ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, హిందీ భాషాభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ సురేష్ పురి, కోశాధికారి గిరిధర్ రావు, స్పెషల్ ఆఫీసర్ శృతికాంత్ భారతి, డాక్టర్ సుష్మా దేవి, రామచందర్, కార్యదర్శి ఏకే రాజు, విభా వెంకటేశ్వర్లు, నామ్దేవ్ వాగ్మాడే, శివలింగం గౌడ్, మాయ పాండే తదితరులు పాల్గొన్నారు. -
హైరిస్క్ గర్భధారణపై జాతీయ సదస్సు
మాదాపూర్: యశోద హాస్పిటల్స్–హైటెక్సిటీ ప్రసూతి, గైనకాలజీ విభాగం ఆధ్వర్యంలో హైరిస్క్ గర్భధారణపై ఆదివారం జాతీయ స్థాయి సదస్సు, లైవ్వర్క్షాప్ నిర్వహించారు. 500మందికి పైగా గైనకాలజిస్టులు, సర్జన్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా యశోధ గ్రూప్ ఆప్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ ఈ సదస్సులో విభిన్న వైద్య విభాగాల నుంచి అనుభవజ్ఞులైన ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొన్నారన్నారు. హైరిస్క్ ప్రెగ్నెన్సీ నిర్వహణలో ఇబ్బందులను అధిగమిస్తూ నూతన మార్గదర్శకాలు, ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను మరింత సులభంగా,కచ్చితత్వంతో ఎలా నిర్వహించాలో అవగాహన కల్పించారనానరు. యశోధ హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ ప్రసూతి సమయంలో అత్యంత క్లిష్టమైన గర్భధారణలో విజయవంతంగా తల్లీబిడ్డలను క్షేమంగా కాపాడడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమన్నారు. గర్భధారణలో రుమటలాజికల్, ఎండోక్రైన్ రుగ్మతలు, ప్రసూతి సమయంలో అత్యవసరపరిస్థితులు, గుండె సమస్యలు తదితర అంశాలపై తల్లీబిడ్డలను సురక్షితంగా ఎలా కాపాడాలో సెషన్లను నిర్వహించినట్లు తెలిపారు. -
నూతన కార్యవర్గం ఎన్నిక
తుర్కయంజాల్: పురపాలక సంఘం పరిధి ఇంజాపూర్లోని స్నేహపురి కాలనీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం జరిగిన కాలనీ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 125 ఓట్లకు.. గంగిడి రాంరెడ్డికి 73, కట్టా అచ్యుత రెడ్డికి 52 ఓట్లు వచ్చాయి. దీంతో 21 ఓట్ల మెజార్టీతో గంగిరెడ్డి గెలిచి, అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. ప్రధాన కార్యదర్శిగా తంగెల్ల సతీష్ చారి, గౌరవ సలహాదారుగా వడ్ల భాస్కర్ చారి, ఛీప్ కో– ఆర్డినేటర్ ఆలేటి మల్లేశం, ఉపాధ్యక్షులుగా ఎడ్ల గౌరి శంకర్, పి.శ్రీపాల్, పి.తిరుపతయ్య, కార్యదర్శులుగా శ్రీనివాస చారి, యాదగిరి, మురళీ మోహన్, కోశాధికారిగా శ్రావణ్ కుమార్, సహ కోశాధికారిగా మహిపాల్ రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా రాజు గౌడ్, శ్రీనివాస్, ఐలయ్య, శాంత కుమారి, కార్యనిర్వాహక సభ్యులుగా చంద్రశేఖర్ రెడ్డి, సురేంద్ర, రామకృష్ణా రెడ్డి, శ్రీనివాస్, మురళీ, శ్రీనివాస్ రెడ్డి, అహ్మద్ బాష, కల్పన, అన్నపూర్ణ, సుచరితను ఎన్నుకున్నారు. అనంతరం నూతన సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. -
పొదుపుతోనే ఆర్థిక స్వావలంబన
పహాడీషరీఫ్: చిన్న, మొత్తాల పొదుపు ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందని శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి పొదుపు సంఘం అధ్యక్షుడు మస్న రవికుమార్ అన్నారు. సంఘం 20వ వార్షిక మహాసభను జల్పల్లి మున్సిపాలిటీలోని శ్రీరామ కాలనీలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్త మార్కండేయ స్వామికి పూజలు చేశారు. 20 ఏళ్లల్లో సంఘం సాధించిన పురోగతిపై సభ్యులు చర్చించారు. ప్రస్తుతం 720 మందితో కొనసాగుతున్న సంఘంలో పొదుపు సంబంధించి పూర్తి పారదర్శకతను పాటిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడితో పాటు ఉపాధ్యక్షుడిగా ఒగ్గు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా భీమనపల్లి వెంకటేశ్, కోశాధికారిగా కెంచె శ్రీకాంత్, సహాయ కార్యదర్శిగా పున్న విష్ణు, సభ్యులుగా భిక్షపతి, శ్రీనివాస్, రమ్య, గుర్రం నరేశ్ను ఎన్నుకున్నారు. సమావేశంలో సంఘం వ్యవస్థాపకుడు గుర్రం శ్రీనివాస్, వినాయక పొదుపు సంఘం అధ్యక్షుడు కెంచె లక్ష్మీనారాయణ సంఘం సభ్యులకు సలహాలు, సూచనలు చేశారు. పొదుపు సంఘం అధ్యక్షుడు రవికుమార్ -
బాబోయ్.. భౌభౌలు
ఆమనగల్లు: పురపాలక సంఘంలో కుక్కల బెడద పెరిగిపోయింది. గుంపులుగా సంచరిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. బాటసారులపై అకారణంగా దాడులకు పాల్పడుతున్నాయి. ద్విచక్రవాహన దారులను వెంబడిస్తూ ప్రమాదాల బారిన పడేస్తున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధి ఉదయనగర్, ఆదర్శనగర్ కాలనీలలో గ్రామ సింహాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎవరు కంట పడినా గుర్రుమంటూ ఓరగా చూస్తున్నాయి. హడలిస్తే దాడులకు పాల్పడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటినుంచి బయటకు రాలేకపోతున్నామని వాపోతున్నారు. ఇటీవల ఆదర్శనగర్ కాలనీకి చెందిన చిన్నారి రియాజ్ఖాన్పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయని కాలనీ వాసులు తెలిపారు. వాటి భయంతో పిల్లలు ఆరు బయట ఆడుకోలేకపోతున్నారని, ఇంట్లోనే ఉండాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. కొంత కాలం క్రితం శునకాల నియంత్రణకు మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు చర్యలు తీసుకున్నారని, అయినా పదుల సంఖ్యలో కాలనీలలో తిరుగుతున్నాయని చెప్పారు. అంతే కాకుండా పందులు కూడా పెరిగిపోయాయన్నారు. ఇప్పటికై నా మున్సిపాలిటీ అధికారులు స్పందించి, కుక్కలు, పందుల బెడద నుంచి కాపాడాలని పుర ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయమై కమిషనర్ శంకర్నాయక్ను వివరణ కోరగా.. వీధి కుక్కల బెడద గురించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని పేర్కొన్నారు. అనంతరం వారి ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తామన్నారు. గుంపులుగా గ్రామసింహాల సంచారం భయాందోళనలో ప్రజలు -
మీనం ‘బంగారం’
మృగశిర కార్తె సందర్భంగా చేపలకు భారీ డిమాండ్ ఏర్పడింది. కార్తె ప్రారంభం రోజున చేపలను ఆరగించడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఆదివారం ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో విక్రయాలు జోరుగా సాగాయి. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు ధరలు అమాంతం పెంచేశారు. బంగారు తీగలు, రవ్వలు కిలో రూ.200,బొచ్చలు కిలో రూ.300లు, కొరమీను(కొర్రమట్ట) రూ.1500లకు పైగా ధర పలికింది. సాధారణ రోజుల్లో కంటే రెట్టింపు రేటుపలికినా.. కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. చికెన్, మటన్ దుకాణాల్లోనూ సందడి నెలకొంది. –సాక్షి, నెట్వర్క్ -
‘మాగంటి’ లేనిలోటు తీరనిది
కడ్తాల్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతికి బీఆర్ఎస్ నాయకులు సంతాపం తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పార్టీ అభివృద్ధికి మాగంటి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన లేని లోటు తీరనిదన్నారు. సింగిల్విండో చైర్మ న్ వెంకటేశ్గుప్తా, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దశరథ్నాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పరమేశ్, నాయకులు లచ్చిరామ్నాయక్, లాయక్అలీ, పాండు, చంద్రయ్య ఉన్నారు. సెల్ఫోన్ అప్పగింత ఆమనగల్లు: సెల్ఫోన్ పోగొట్టుకున్న బాధితుడికి పోలీసులు ఫోన్ అప్పగించారు. ఆమనగల్లు మండలం శంకరకొండతండా పరిధి దయ్యాలబోడుతండాకు చెందిన తరుణ్.. ఇటీవల పట్టణంలో సెల్ఫోన్ పోగొట్టుకున్నాడు. దీంతో సదరు వ్యక్తి, ఆమనగల్లు ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కానిస్టేబుల్ రఘునాయక్.. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ ఆచూకీ కనుగొన్నారు. అనంతరం ఆదివారం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వెంకటేశ్.. బాధితుడికి మొబైల్ను అప్పగించారు. మృతుడి కుటుంబానికి పరామర్శ ఆమనగల్లు: ఆమనగల్లు మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ యాదయ్య తండ్రి, వార్డు మాజీ సభ్యుడు గోరటి జంగయ్య అనారోగ్యంతో శనివారం మృతిచెందాడు. ఈ మేరకు మృతుడి కుటుంబాన్ని, ఆదివారం జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కండె హరిప్రసాద్, బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు విక్రంరెడ్డి తదితరులు పరామర్శించారు. మంత్రి ‘వాకిటి’కి శుభాకాంక్షలు కడ్తాల్: మంత్రి వర్గంలో చోటు దక్కించుకుని, ఆదివారం రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేసిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి కాంగ్రెస్ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. యూత్ కాంగ్రెస్ కల్వకుర్తి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు షాబుద్దీన్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పి.రాహుల్లు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఘనంగా పోచమ్మ విగ్రహ పునఃప్రతిష్ఠాపన కందుకూరు: మండల పరిధిలోని లేమూరులో పోచమ్మతల్లి విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య విగ్రహ ప్రతిష్ఠ పూజల అనంతరం హోమం, అమ్మవారి కల్యాణం నిర్వహించారు. గ్రామస్తులు పాల్గొని అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్, పీసీసీ సభ్యుడు దేప భాస్కర్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.కృష్ణనాయక్, కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాణాప్రతాప్రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొని పూజలు చేశారు. వీరికి ఆలయ నిర్వాహకులు మెమొంటోలు అందించి సన్మానించారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి కొందుర్గు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ సోషల్ మీడియా కన్వీనర్ సొల్కమ్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం చౌదరిగూడ ఆర్య సమాజంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని మరింత పటిష్టం చేయాలని సూచించారు. కార్యకర్తలందరూ సైనికుల్లా పనిచేసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జెండా ఎగురవేయాలన్నారు. అనంతరం మొక్కలు నాటారు. -
ఆత్మరక్షణకు కరాటే దోహదం
చేవెళ్ల: కరాటే ఆత్మరక్షణతో పాటు శారీర దృఢత్వానికి దోహదపడుతుందని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి పామెన భీంభరత్ అన్నారు. మండల కేంద్రంలోని స్పోర్ట్స్ స్డేడియంలో ఆదివారం జపాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో కరాటే మాస్టర్ కె.కృష్ణ నిర్వహించిన కరాటే శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా కరాటే బెల్టుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన వారికి బెల్టులు ప్రదానం చేశారు. అనంతరం శిక్షణ అందించిన మాస్టర్ కృష్ణను అభినందించారు. కార్యక్రమంలో కరాటే బెల్ట్ల చీఫ్ ఎగ్జామినర్, 8వ బాక్ల్ బెల్టు డాన్ ఎండీ ఖాజాపాషా, అర్గనైజర్లు బ్లాక్ బెల్టు డాన్లు జంగయ్య, రాములు, యూత్ కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు. -
గడువిచ్చినా.. ఫలితం అంతంతే!
ఇబ్రహీంపట్నం: అక్రమ లే అవుట్ ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్)కు 25 శాతం రాయితీతో కూడిన ఫీజు చెల్లింపునకు ప్రభుత్వం మూడు నెలలు గడువు ఇచ్చింది. అయినా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. తొలుత మార్చి ఫస్టు నుంచి మే 31 వరకు గడువును మూడుసార్లు(ఈ మధ్యకాలంలో) పొడిగిస్తూ రుసుం చెల్లించేందుకు దరఖాస్తుదారులకు ప్రభుత్వం వెసులుబాటును కల్పించింది. అయినప్పటికీ.. ప్లాట్ల యజమానులనుంచి స్పందన అంతంత మాత్రమే వచ్చింది. 14,100 దరఖాస్తులు 2020 నాటికి దరఖాస్తు చేసుకున్న వారి ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా పురపాలక సంఘం పరిధి నుంచి 14,100 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. రద్దీ అధికంగా ఉంటుందని భావించిన అధికారులు.. మున్సిపల్ కార్యాలయంలో నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేశారు. కానీ.. కేవలం 4,124 ప్లాట్ల యజమానులు మాత్రమే ఫీజు చెల్లించి, క్రమబద్ధీకరించుకున్నారు. ఆశించింది రూ.60 కోట్లు ఎల్ఆర్ఎస్ ఫీజు రూపేణా మున్సిపాలిటీకి రూ.55 నుంచి 60 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అధికార యంత్రాంగం ఆశించింది. ప్లాట్ల దారుల నుంచి సరైన స్పందన లేని కారణంగా వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కేవలం 29.25 శాతం ప్లాట్ల యజమానుల చెల్లింపుతో రూ.10.69 కోట్లు మాత్రమే వచ్చాయి. మరో 70 శాతం మంది ముందుకు రాకపోవడం గమనార్హం. మరోసారి.. మొదట్లో సాంకేతిక, అవగాహన లోపంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో కొంత జాప్యం జరిగింది. వీటన్నంటిని దృష్టిలో పెట్టుకొని మరో మూడు సార్లు ప్రభుత్వం గడువు పెంచింది. మే నెల 31తో ముగిసింది. ఆశించినట్లుగా అర్జీ దారులు ముందుకు రాకపోవడంతో మరోసారి అవకాశం కల్పించేందుకు మరోదఫా గడువును పెంచాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. రెండుమూడు రోజుల్లో ఈ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. మరో అవకాశం ఇస్తారా లేదా వేచి చూడాల్సిందే! పొడిగించే అవకాశం ఎల్ఆర్ఎస్ గడువును పొడిగించే అవకాశం ఉంది. మున్సిపాలిటీలో 30 శాతం ప్లాట్ల దరఖాస్తుదారులు మాత్రమే ఫీజు చెల్లించారు. సుమారు రూ.10.69 కోట్ల ఆదాయం వచ్చింది. పలు కారణాలతో 70శాతం మంది ముందుకు రాలేదు. మళ్లీ అవకాశం ఇస్తే ఆదాయం పెరగవచ్చు. – రవీంద్రసాగర్, మున్సిపల్ కమిషనర్, ఇబ్రహీంపట్నం తరువాత చూద్దాంలే.. ఫీజు అధికంగా ఉందని కొందరు, ఆర్థిక పరిస్థితుల కారణంతో ఇంకొందరు, లేదా ఫీజు ఇప్పుడేందుకు, తరువాత చూద్దాంలే అని మరికొందరు అర్జీ దారులు ముందుకు రాకపోవడంతో ఆదాయం తగ్గడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అప్పుడైతే దరఖాస్తు చేసుకున్నాం. నిర్మాణ సమయంలో ఫీజు చెల్లిద్దామని, ప్రభుత్వం ఇచ్చే 25 శాతం రాయితీకి ఆశ పడకపోవడం కూడా మరో కారణం కావచ్చు. నాడు దరఖాస్తు చేసుకున్నవారిలో పలువురు ఈ మధ్యకాలంలో ప్లాట్లను విక్రయించుకోవడంతోఆశించిన మేర ఫలితం రాలేదని చెప్పవచ్చు.మొత్తం 14,100 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు 4,124 అర్జీలు క్లియర్ ఆదాయం రూ.10.69 కోట్లు స్పందించని 70 శాతం మంది ప్లాట్ల యజమానులు -
బహుమతుల ప్రదానం
మలక్పేట: రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విక్రాంత్ బ్యాడ్మింటన్ అకాడమీలో నాలుగు రోజుల పాటు జరిగిన జిల్లా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్–2025 పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంతర్జాతీయ మాజీ క్రీడాకారిణి, గోపిచంద్ అకాడమీ కోచ్ దీప్తిరెడ్డి, అంతర్జాతీయ మాజీ క్రీడాకారుడు, అంతర్జాతీయ కోచ్ గురుసాయిదత్త ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. పోటీలలో1000 మంది క్రీడాకారులు పాల్గొన్నారని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కరెడ్ల శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యాక్షుడు పి. ఆనంద్బాబు, సంయుక్త కార్యదర్శి సాయిరెడ్డి, మాజీ కార్పొరేటర్ సామా ప్రభాకర్రెడ్డి, బీఏటీ సంయుక్త కార్యదర్శి యూబీఎన్బాబు, రవణారెడ్డి పాల్గొన్నారు. -
ఉన్నత విద్యనందించడం అభినందనీయం
నాగోలు: విద్యార్థులకు ఉత్తమ శిక్షణ, విద్యనందిస్తూ వారిని ఉన్నత స్థానాల్లో నిలుపుతున్న రేయాన్ సైనిక్ స్కూల్స్ యాజమాన్యం నిబద్ధతను అభినందించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్జీ అన్నారు. ఆలిండియా సైనిక్ స్కూల్–2025 ఫలితాలలో 6, 9వ తరగతి ప్రవేశ పరీక్షల్లో మొదటి ర్యాంక్, 4వ ర్యాంక్లతో పాటు అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల సక్సెస్ మీట్ను ఆదివారం నాగోలులోని రేయాన్ సైనిక్ స్కూల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయి పరీక్షలలో విజయం సాధించిన హనీశ్రెడ్డి, అమృత్యాదవ్, శ్రీతేజ, సాకేత్, దీక్షత్రాజ్రెడ్డి, అక్షిత్రెడ్డి, అకున్ బాలాజీ, భానుప్రసాద్తో పాటు 260పైగా మార్కులు సాధించిన 45 మందిని సన్మానించారు. అదేవిధంగా 9వ తరగతి ప్రవేశ పరీక్షా ఫలితాల్లో ప్రతిభ చూపిన అశ్వర్థా, ఎన్డీఏకు ఎంపికై న జాన్సన్, రూపేశ్, జయంత్, అభిరామ్, రఘునందన్, ప్రణవ్లను బీజేపీ జాతీయ నాయకులు శేఖర్జీ, స్కూల్ చైర్మన్ జనార్ధన్రెడ్డి, డైరెక్టర్ ఉమాదేవి అభినందించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా జనార్ధన్రెడ్డి మాట్లాడుతూ.. రేయాన్లో శిక్షణ పొందిన విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకున్నారన్నారు. గత 25 సంవత్సరాలుగా ఎందరో విద్యార్థులు వివిధ రంగాల్లో స్థిరపడ్డారని, సివిల్ సర్వెంట్స్గా, ఇంజనీరింగ్, మెడికల్ విభాగాలు, ఎన్డీఏలో అవకాశాలు లభించాయన్నారు. రేయాన్ డైరెక్టర్ ఉమారెడ్డి మాట్లాడుతూ.. చిన్నారులకు విద్యతో పాటు సామాజిక అవగాహన, ఉన్నతమైన విలువలు నేర్పుతున్నామని స్పష్టం చేశారు. -
జాతీయ స్ఫూర్తి.. దేశీయ కీర్తి!
సాక్షి, సిటీబ్యూరో/కాచిగూడ: అందమైన శ్వేతసౌధమైన నిజాం కాలం నాటి చారిత్రక కాచిగూడ రైల్వేస్టేషన్ మరింత కళాత్మకతను సంతరించుకోనుంది. స్టేషన్ ముఖద్వారం రకరకాల థీమ్ లైటింగ్తో వెలుగొందనుంది. దేశభక్తిని, జాతీయతా స్ఫూర్తిని కలిగించే అద్భుతమైన థీమ్లను విద్యుత్ కాంతులతో ప్రదర్శిస్తారు. ఆపరేషన్ సిందూర్ విజయోత్సవాన్ని ప్రతిబింబించే త్రివర్ణకాంతులు, మహిళా దినోత్సవానికి పింక్ లైటింగ్ వంటి థీమ్లను ఆయా ప్రత్యేక సందర్భాల్లో ఆవిష్కరించేలా అధునాతన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సోమవారం కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఈ లైటింగ్ వ్యవస్థను ప్రారంభించనున్నారు. అబ్బురపరిచే నిర్మాణశైలి 1916లో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాచిగూడ రైల్వేస్టేషన్ను నిర్మించారు. నగరంలోని నిజాం నవాబులు, ప్రముఖుల కుటుంబాల రాకపోకలకు ఈ రైల్వే స్టేషన్ను వినియోగించేవారు. హైదరాబాద్ నుంచి ముంబై, ఔరంగాబాద్, వాడీ తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి రైళ్లు నడిచేవి. ఇండో–సార్సెనిక్, ఇండో –గోథిక్ నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ భవనం గొప్ప వారసత్వ కట్టడంగా గుర్తింపును పొందింది. ప్రస్తుతం సుమారు 50 వేల మంది కాచిగూడ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ప్రతిరోజు 103 రైళ్లు వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్తాయి. థీమ్లైటింగ్ ప్రారంభోత్సవంలో పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, సీనియర్ అధికారులు పాల్గొననున్నారు. రూ.2.23 కోట్లతో.. పర్యాటకులను ఆకట్టుకొనేవిధంగా కూడా ఈ థీమ్లైటింగ్ను రూపొందించారు. ఇందుకోసం రూ.2.23 కోట్ల అంచనా వ్యయంతో విద్యుత్ దీపాలంకరణ పూర్తిచేశారు. ఈ భవనం నిర్మాణ కౌశలాన్ని, వారసత్వాన్ని చాటేలా సరైన విద్యుత్ దీపకాంతులు వెలుగులు విరజిమ్ముతాయి. ప్రయాణికులకు, నగర వాసులకు, పర్యాటకులకు రాత్రివేళల్లో గొప్ప అనుభూతినివ్వనున్నాయి. అత్యాధునిక సాంకేతికత ఈ అలంకరణలో విద్యుత్ పరికరాలు అవుట్డోర్ టైప్ ఆర్జీబీ, ఎల్ఈడీ, ఐపీ 66 వంటి ఆధునిక పరికరాలతో రూపొందించారు. దీంతో ఇవి వివిధ రకాల లైటింగ్ థీమ్లకు అనుగుణంగా ఉంటాయి. లైటింగ్ పర్యావరణ హితంగా, సురక్షితంగా ఉంటుందని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ లైట్ల నుంచి వెలువడే కాంతి పూర్తిగా కాలుష్య రహితమైనదని పేర్కొన్నారు. భవనం నిర్మాణ వైభవాన్ని సమున్నతంగా ఆవిష్కరించడమే ఈ లైటింగ్ లక్ష్యమని పేర్కొన్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్కు నయా థీమ్ లైటింగ్ ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేక దీపాలంకరణ త్రివర్ణ కాంతుల్లో శ్వేత సౌధం ధగధగ రేపు కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం -
అన్నోజిగూడలో విషాదం
కందుకూరు: కుమార్తెను లండన్ పంపించేందుకు ఏర్పాట్లు చేసుకున్న ఓ తండ్రి ఊహించని ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని అన్నోజిగూడకు చెందిన మాజీ ఉప సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెంకల యాదయ్య(54) శుక్రవారం ఉదయం బైక్పై హైదరాబాద్ వెళ్తుండగా పహాడీషరీఫ్ పీఎస్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. యశోద ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. కాగా మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది. ఈనెల 9న కూతురును ఉన్నత చదువుల కోసం లండన్లో పంపించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం సన్నిహితులు, బంధువులకు విందు ఏర్పాటు చేశాడు. కానీ ఊహించని ప్రమాదంలో గాయపడి మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, పీసీసీ సభ్యుడు దేప భాస్కర్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు బొక్క జంగారెడ్డి, ఏనుగు జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.కృష్ణనాయక్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఎస్.మల్లేశ్, వివిధ పార్టీల నాయకులు, ముదిరాజ్ సంఘం నాయకులు హాజరై నివాళులర్పించారు. రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడికి గాయాలు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి అంత్యక్రియల్లో పాల్గొన్న జిల్లా రాజకీయ ప్రముఖులు -
అంబులెన్స్ దగ్ధం
గచ్చిబౌలి: అంబులెన్స్లో ఆక్సిజన్ సిలిండర్ మార్చుతుండగా మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు తెల్పిన వివరాల మేరకు..గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఉన్న ఓ రోగి ఆక్సిజన్తో తెనాలికి వెళ్లాల్సి ఉండగా సీఎంఎస్ అంబులెన్స్ను బుక్ చేశారు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో హాస్పిటల్ ఎమర్జెన్సీ ద్వారం వద్ద డ్రైవర్ అంబులెన్స్లో ఆక్సిజన్ సిలిండర్ మార్చుతుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. నిమిషాల వ్యవధిలోనే ఎగసిపడటంతో ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అంబులెన్స్ పూర్తిగా దగ్ధ్ధమైంది. పరికరాలు, సీట్లు కాలిబూడిదయ్యాయి. హాస్పిటల్ సీలింగ్కు మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా మంటలు ఆర్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రాయదుర్గం పోలీసులు తెలిపారు.నెల రోజుల తర్వాత కుటుంబం చెంతకు యాచారం: మండల పరిధిలోని కుర్మిద్ద గ్రామంలో నెల రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి శనివారం కుటుంబ సభ్యుల చెంతకు చేరాడు. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మల్కాపురం నర్సింహ మే 7న ఇంటి నుంచి పని కోసమని వెళ్లి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు చుట్టు పక్కల గ్రామాల్లో, బంధువుల ఇళ్ల వద్ద వెతికిన జాడలేకపోవడంతో గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నల్లగొండ, నాగర్కర్నూల్, హైదరాబాద్ జిల్లాల్లోని పలు చోట్ల వెతికి శనివారం నగరంలోని ఎల్బీనగర్ ప్రాంతంలో నర్సింహ సంచరిస్తుండగా గుర్తించి తీసుకొచ్చారు. కుర్మిద్దలోని కుటుంబ సభ్యులకు అప్పగించారు.దైవ దర్శనానికి వెళ్లి..దుద్యాల్: దైవ దర్శనాల కోసం బైక్పై బయల్దేరిన ఇద్దరు స్నేహితులు ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఒకరు మృతిచెందగా మరొకరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండల పరిధిలోని గౌరారం గ్రామానికి చెందిన కమ్మరి జగన్నాథచారి, సరిత దంపతుల కుమారుడు చందుచారి హైదరాబాద్లోని వేద పాఠశాలలో చదువుతున్నాడు. నల్లగొండ జిల్లాకు చెందిన శివకుమార్ అనే స్నేహితుడితో కలిసి ఇటీవల విహార యాత్రగా బైక్పై తిరుపతి, అరుణాచలం బయల్దేరారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో చందు (19) అక్కడిక్కడే మృతి చెందగా, తీవ్రగాయాలైన శివకుమార్ రేణిగుంట ప్రభుత్వ ఆసస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరి వద్ద ఉన్న గుర్తింపు కార్డుల ఆధారంగా అక్కడి పోలీసులు శుక్రవారం సాయంత్రం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. -
పూరి గుడిసె దగ్ధం
కేశంపేట: ప్రమాదవశాత్తు పూరి గుడిసె దగ్ధమైన సంఘటన మండల పరిధిలోని కాకునూర్లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కర్రల రమేశ్ కూలీ పనులు చేస్తూ కుటుంబంతో జీవిస్తున్నాడు. భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆమెను తీసుకువచ్చేందుకు శుక్రవారం అత్తగారి ఊరికి వెళ్లాడు. శనివారం ఉదయాన్నే తన గుడిసె కాలిపోయిందని స్థానికులు ఫోన్ చేయడంతో వెంటనే ఇంటికి చేరుకున్నాడు. బాధితుడిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. దగ్ధమైన పూరి గుడిసె -
అదుపు తప్పి రేకులషెడ్డును ఢీకొట్టి
● రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి దుర్మరణం ● మరో విద్యార్థికి తీవ్ర గాయాలు ఇబ్రహీంపట్నం: అదుపు తప్పిన బైక్ రేకుల షెడ్ను ఢీకొట్టడంతో బీటెక్ విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ జగదీశ్ కథనం ప్రకారం.. మంచిర్యాలకు చెందిన రుతికేష్(20) ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. కళాశాలలో శుక్రవారం ఫేర్వెల్ పార్టీ అనంతరం స్నేహితుడు సంజయ్ ఉంటున్న మంగల్పల్లి హాస్టల్కు మరో స్నేహితుడు శంకర్తో కలిసి బైక్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి దాటిన తర్వాత శేరిగూడ గాంధీ విగ్రహం వద్దకు రాగానే వేగంగా వస్తున్న బైక్ అదుపుతప్పి మెడికల్ షాపు ముందున్న రేకుల షెడ్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో రుతికేష్ అక్కడికక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలైన శంకర్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గిరగిరా!
మూడు చక్రాలు● 20 వేల ఎల్పీజీ, సీఎన్జీ వాహనాలకు అనుమతి ● ఇప్పటికే సిటీ రోడ్లపై 1.25 లక్షల ఆటోలు గ్రేటర్లో కొత్తగా 65 వేల ఆటో పర్మిట్లు సాక్షి, సిటీబ్యూరో: వాహన కాలుష్య నియంత్రణ పేరిట ప్రభుత్వం ఆటో పర్మిట్ల జాతరకు తెర తీసింది. ఎలక్ట్రిక్ ఆటోలు, సీఎన్జీ, ఎల్పీజీ, రిట్రోఫిట్మెంట్ విభాగాల్లో మొత్తం 65 వేల ఆటోలు కొత్తగా రోడ్డెక్కనున్నాయి. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో సుమారు 1.25 లక్షల ఆటోలు తిరుగుతున్నాయి. వివిధ జిల్లాలకు చెందిన మరో 30 వేలకుపైగా ఆటోలు ఇక్కడ నడుస్తున్నాయి. విస్తరిస్తున్న నగర అవసరాల దృష్ట్యా, పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ లేని 65 వేల ఆటోలకు అనుమతి లభించింది. రోడ్డెక్కనున్న 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలు.. ప్రస్తుతం తిరుగుతున్న డీజిల్, పెట్రోల్ వాహనాలతో తీవ్రమైన కాలుష్య కారకాలు వెలువడుతున్నాయి. ఎల్పీజీ, సీఎన్జీతో నడిచే వాహనాల్లోనూ కల్తీ ఇంజినాయిల్ వినియోగిస్తున్నారు. దీంతో ఆటో కాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం కొత్తగా అనుమతినిస్తున్న వాటిలో 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలు ఉన్నాయి. మరో 10 వేల ఎల్పీజీ ఆటోలు, 10 వేల సీఎన్జీ ఆటోలకు కూడా ప్రభుత్వం కొత్తగా అనుమతులను ఇవ్వనుంది. ఇవి కాకుండా డీజిల్, పెట్రోల్తో నడిచే 25 వేల ఆటోలను సీఎన్జీ, ఎల్పీజీకి మార్చుకొనేందుకు రిట్రోఫిట్మెంట్ అనుమతులను కూడా ఇచ్చారు. దీంతో 65 వేల ఆటో రిక్షాలు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆటోలను ఔటర్ వరకు అనుమతిస్తారు. భూరేలాల్ సిఫార్సులకు బురిడీ.. గ్రేటర్లో వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై అప్పటి ప్రభుత్వం భూరేలాల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆటో రిక్షాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు కొత్తగా ఎలాంటి పర్మిట్లను ఇవ్వరాదని ఈ కమిటీ 2002లోనే సిఫార్సు చేసింది. అప్పటి నుంచి కొంతకాలం నిలిపివేశారు. ఆ తర్వాత క్రమంగా నిషేధాన్ని సడలిస్తూ తెలంగాణ ఏర్పాటుకు ముందే 25 వేలకు పైగా పర్మిట్లు ఇచ్చారు. కాలం చెల్లిన వాహనాల పర్మిట్లపై కొత్తవి కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించారు. ఇదంతా నగరంలోని బడా ఫైనాన్షియర్లు, ఆటోమొబైల్ డీలర్లు, దళారుల అక్రమార్జనకు ఊతమిచ్చింది. ఫైనాన్షియర్లకు అక్రమాలకు ఊతం.. అప్పట్లో సుమారు రూ.100 కోట్లకు పైగా అక్రమ వ్యాపారం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం సుమారు లక్ష పర్మిట్లు ఫైనాన్షియర్ల గుప్పెట్లోనే ఉన్నాయి. ప్రభుత్వం కొత్తగా పర్మిట్లు ఇచ్చిన ప్రతిసారి ఆటోరిక్షా ధరలను పెంచేస్తారు. పేద ఆటోడ్రైవర్ల నుంచి ఇష్టారాజ్యంగా అక్రమ వడ్డీలు, చక్రవడ్డీలు వసూలు చేస్తారు. దీంతో అప్పులు చెల్లించలేని నిస్సహాయ స్థితిలో ఆటోకార్మికులు తమ వాహనాలను తిరిగి ఫైనాన్షియర్లకే అప్పగిస్తున్నారు. హైదరాబాద్లో ఆటోపర్మిట్లు మొదటి నుంచి ఫైనాన్షియర్ల అక్రమార్జనకు అవకాశంగా మారాయి. ప్రభుత్వం మరోసారి సామాన్య, పేద డ్రైవర్లపై ఫైనాన్షియర్లు నిలువుదోపిడీకి పాల్పడే పర్మిట్ల బేరానికి తెరతీసింది. -
ఎనికేపల్లిని మరో లగచర్ల చేయొద్దు
మొయినాబాద్: ఎనికేపల్లి భూముల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే మరో లగచర్లను చూస్తారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి హెచ్చరించారు. మున్సిపల్ పరిధిలోని ఎనికేపల్లిలో ప్రభుత్వం గోశాలకు కేటాయించిన భూములను శనివారం ఆమె సందర్శించారు. రైతులు సాగుచేసిన పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారికి మద్దతుగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 18 నెలలుగా రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని వర్గాల వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. కొన్ని రోజులు మూసీ పరిసరాల్లో పేదలను గుంజేశారని అన్నారు. లగచర్లలో గిరిజనుల భూములు గుంజుకునే ప్రయత్నం చేశారని.. ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం మండలాల్లో కొత్త రోడ్డుకోసం 3వేల ఎకరాలు పేదల భూములు తీసుకుంటున్నారని విమర్శించారు. సంగారెడ్డి, గద్వాలలో పేదల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తాజాగా ఎనికేపల్లిలో గోశాల ఏర్పాటుకోసం అంటూ వంద ఎకరాలను రైతుల నుంచి లాక్కుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో రకంగా పేదలు, చిన్న, సన్నకారు రైతుల భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. ఎనికేపల్లి విషయం తెలిసి కేసీఆర్ తనను ఇక్కడి పంపారన్నారు. రైతుల భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని.. వారికి మద్దతుగా పోరాడతామని స్పష్టం చేశారు. 1954 నుంచి రైతులే సాగు చేస్తున్నారు ఎనికేపల్లిలో 1954లోనే హరిజనులు సాగుచేసుకుంటున్నట్లు రికార్డులో ఉందని.. 1998 వరకు రైతులు శిస్తు కట్టిన రసీదులు ఉన్నాయన్నారు. ఎలాంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం భూములను ఎలా తీసుకుంటుందని నిలదీశారు. వాళ్ల భూములు వారికే పట్టా చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలపై చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళతో ఫోన్లో మాట్లాడారు. జిల్లా ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కోకాపేట భూములను అమ్ముకోవడానికే.. కోకాపేటలో గోశాలకు 200 ఎకరాల భూమి ఉందని.. అందులో 100 ఎకరాలు ప్రభుత్వం తీసుకుని దానికి బదులు ఎనికేపల్లిలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. గోశాలకు ఇవ్వాలంటే మొయినాబాద్ మండలంలోనే ప్రభుత్వం పీఓటీ చట్టం కింద స్వాధీనం చేసుకున్న వెయ్యి ఎకరాల భూమి ఉందని గుర్తు చేశారు. ప్రతి ఫాంహౌస్, ప్రతి కాలేజీలో ప్రభుత్వ భూమి ఉందని.. వాటిని బయటకు తీయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, కొత్త నర్సింహారెడ్డి, దేశమొల్ల ఆంజనేయులు, పార్టీ మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్రెడ్డి, మాజీ సర్పంచ్లు కోట్ల నరోత్తంరెడ్డి, శ్రీహరియాదవ్, సుధాకర్యాదవ్, రాఘవరెడ్డి, మహేందర్రెడ్డి, మాజీ ఎంపీటీసీలు కొత్త మాణిక్రెడ్డి, మోర శ్రీనివాస్, రవీందర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, మాజీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోం అన్నదాతలకు అన్యాయం జరగనివ్వం మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి -
నిందితులపై చర్యలు తీసుకోవాలి
కొందుర్గు: జిల్లేడ్ చౌదరిగూడ మండలం గుర్రంపల్లిలో దళితులపై దాడిచేసిన నిందితులపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేశారు. మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో శనివారం గుర్రంపల్లి గ్రామాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా శంకర్తోపాటు మానవ హక్కుల వేదిక జంగయ్య, పాండు మాట్లాడుతూ.. బొడ్రాయి ఉత్సవాల్లో కొందరు యువకులు డ్యాన్స్ చేస్తూ ఆడ పిల్లలపై పడబోతుంటే అడ్డుకున్న దళిత యువకుడు ప్రవీణ్పై దాడిచేయడం బాధాకరమన్నారు. అంతటితో ఆగకుండా మరుసటి రోజు ప్రవీణ్ సోదరుడు శ్రీనివాస్ పంచాయతీ కార్యాలయం వద్ద ఫోన్ మాట్లాడుతుండగా దాడి చేసి చేయి విరగ్గొట్టారన్నారు. ఈ విషయమై బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేసినా నిందితులపై కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే వారిపై కేసు నమోదుచేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల నాయకులు యాదయ్య, రామచంద్రయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
బాలారిష్టాల్లో ఫ్యూచర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ భవిష్యత్ మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్నట్లు మారింది. 330 అడుగుల గ్రీన్ఫీల్డ్ రోడ్డు, మెట్రోరైలు, ఏఐ సిటీ, జపాన్, తైవాన్ కంపెనీలు అంటూ రోజుకో ప్రకటనతో సర్కారు ఊదరగొడుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటివరకు కేవలం స్కిల్ యూనివర్సిటీ మినహా మరే ప్రాజెక్టుకు ప్రతిపాదిత నాలుగో నగరిలో పునాది రాయి కూడా పడకపోవడం.. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ రెండు నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ సిబ్బందిని కూడా సమకూర్చుకోకపోవడం చూస్తే.. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కడ్తాల్, కందుకూరు, యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం మండలాల్లోని 56 గ్రామాలను ఎఫ్సీడీఏ పరిధిలోకి తెచ్చారు. ఈ గ్రామాల అభివృద్ధిని క్షేత్రస్థాయి నుంచి పర్యవేక్షించాల్సిన ఎఫ్సీడీఏ ఆఫీసు మాత్రం మూడో నగరమైన (సైబరాబాద్) నానక్రాంగూడలో ఏర్పాటు చేయడం గమనార్హం. సీఎం కలల ప్రాజెక్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. అధికారంలోకి రాగానే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో ఫోర్త్ సిటీ అవసరమని ప్రకటించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జాతీయ రహదారుల మధ్యలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించి ఏడాది గడుస్తున్నా ఆశించిన స్థాయిలో ఆ దిశగా అడుగులు ముందుకు పడటం లేదు. పూర్తి స్థాయి సిబ్బంది లేకపోవడంతో అభివృద్ధి పనుల్లో పురోగతి కనిపించడం లేదు. రావిర్యాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి ఆకుతోట పల్లి వరకు 330 అడుగుల రతన్టాటా గ్రీన్ఫీల్డ్ రహదారికి భూ సేకరణ పనులు చురుగ్గా సాగగా.. పరిహారం ఇవ్వకుండానే నిర్మాణ పనులకు టెండర్లు పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించడంతో బ్రేక్ పడింది. దీంతో ఇప్పటివరకు ఈ ప్రాంతంలో స్కిల్ వర్సిటీ పనులు మాత్రమే కాస్తో కూస్తో సాగుతున్నాయి. సిబ్బంది కొరత 765.28 చదరపు కి.మీల విస్తీర్ణంలో ఫోర్త్ సిటీని అభివృద్ధి చేయాలన్నది రేవంత్ సర్కార్ లక్ష్యం. వివిధ విభాగాల నుంచి డెప్యుటేషన్పై 90 పోస్టులకు గత మార్చిలో మంత్రివర్గం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వీటిలో 34 రెగ్యులర్ పోస్టులు కాగా.. మిగిలిన 56 పోస్టులను ఔట్ సోర్సింగ్/కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయాల్సి ఉంది. కానీ.. ఇప్పటివరకు ఎఫ్సీడీఏ కమిషనర్ శశాంక మినహా పూర్తిస్థాయి సిబ్బంది నియామకం జరగలేదు. సిబ్బంది కొరతతో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ఇతర విభాగాల నుంచి డెప్యుటేషన్పై ఎఫ్సీడీఏ ప్లానింగ్ విభాగంలో పనిచేసేందుకు అధికారులు నిరాసక్తి చూపిస్తున్నారు. దీంతో ఎఫ్సీడీఏ మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో ఎలాంటి పురోగతి లేదు. మాస్టర్ ప్లాన్ హెచ్ఎండీఏదే.. ఫోర్త్సిటీలో ఐటీ, పారిశ్రామిక, ఆతిథ్య, పర్యాటక, క్రీడారంగాలకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు దేశ, విదేశీ సంస్థలు, పెట్టుబడులు తీసుకురావాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రతిబంధకాలు రాకుండా, అభివృద్ధి పనులు ప్రణాళికబద్ధంగా చకచకా సాగేలా ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందిచాలని నిర్ణయించారు. ఈ బాధ్యతలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అప్పగించినట్లు ఓ అధికారి తెలిపారు. గతంలో సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ (సీడీఏ), ఎయిర్పోర్ట్ అథారిటీ ప్లాన్ (ఏఏపీ) మాస్టర్ ప్లాన్లను హెచ్ఎండీఏనే అభివృద్ధి చేసిందని గుర్తు చేశారు. అలాగే ఎఫ్సీడీఏ పరిధిలోని గ్రామాలు గతంలో హెచ్ఎండీఏ పరిధిలోనే ఉన్నాయని, అందుకే ఎఫ్సీడీఏ మాస్టర్ ప్లాన్ను హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తోందని ఆయన వివరించారు. ఇప్పటికీ అడుగు పడని ప్రాజెక్టులు కేవలం స్కిల్ వర్సిటీకే పరిమితం గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు కోర్టు బ్రేక్ వేధిస్తున్న సిబ్బంది కొరత ప్లానింగ్లో పని చేసేందుకు అధికారుల నిరాసక్తి ఎఫ్సీడీఏ మాస్టర్ ప్లాన్ బాధ్యత హెచ్ఎండీఏ చేతికి -
కోహెడ మార్కెట్కు త్వరలో శంకుస్థాపన!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: కోహెడలో కొత్తగా నిర్మించతలపెట్టిన సమీకృత మార్కెట్ల నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. మొత్తం 250 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో పండ్లు, పూలు, కూరగాయలు, చేపలు, మాంసం ఉత్పత్తులకు సంబంధించిన మార్కెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే 241 ఎకరాలను సేకరించిన ప్రభుత్వం..తాజాగా మరో తొమ్మిది ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. సేకరించిన భూమిలో సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)ను కూడా సిద్ధం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయ నున్న ఈ మార్కెట్ నిర్మాణానికి రూ.2,890 కోట్లు ఖర్చు కానుందని అంచనా. త్వరలో టెండర్లు ఆహ్వానించి భూమిపూజ చేయనున్నట్లు తెలిసింది. కేజీబీవీలో ఎంఎల్టీ కోర్సు యాచారం: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఈ ఏడాది నుంచి ఎంఎల్టీ (మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్) ఇంటర్ కోర్సు ప్రారంభిస్తున్నట్లు విద్యాలయ ప్రత్యేకాధికారి అరుణశ్రీ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కోర్సులో 40 సీట్ల చొప్పున భర్తీ చేస్తామని తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో తరగతులు ఉంటాయన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. వివరాలకు 83318 33426 నంబర్లో సంప్రదించాలని ఆమె సూచించారు. ఎంఎల్టీ బోధించడానికి ఆసక్తి కలిగిన అధ్యాపకులు కూడా సంప్రదించాలని పేర్కొన్నారు. ఈత, తాటి చెట్లను నరకొద్దు ఎకై ్సజ్ సీఐ బద్యనాథ్చౌహాన్ ఆమనగల్లు: అనుమతి లేకుండా ఈత, తాటి చెట్లను నరికితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆమనగల్లు ఎకై ్సజ్ సీఐ బద్యనాథ్చౌహాన్ హెచ్చరించారు. పట్టణంలోని ఎకై ్సజ్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఈత, తాటి చెట్ల నుంచి వచ్చే కల్లును విక్రయించి గౌడ కులస్తులు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. వీరు ప్రభుత్వం నుంచి లైసెన్స్ కలిగి ఉన్నారన్నారు. ఈత, తాటి చెట్లను నరకడం చట్ట ప్రకారం నేరమని చెప్పారు. తెలంగాణ ఎకై ్సజ్ యాక్ట్ 1968 ప్రకారం సొంత భూమిలోని ఈత, తాటి చెట్లను తొలగించాలన్నా ఎకై ్సజ్ శాఖ అనుమ తులు పొందాల్సి ఉంటుందని వివరించారు. అవసరమైన వారు పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్ పర్యవేక్షణలోని త్రిసభ్య కమిటీ పరిశీలించి కలెక్టర్కు నివేదిక అందజేస్తుందని తెలిపారు. కలెక్టర్ అనుమతితో వీటిని తొలగించాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం ఒక్కో చెట్టుకు ప్రభుత్వానికి రూ.1,968 రుసుం చెల్లించాలన్నారు. ఎకై ్సజ్ శాఖ అనుమతి లేకుండా చెట్లను తొలగిస్తే మొదటి తప్పుగా భావించి 3 నెలల జైలు శిక్ష, రెండో సారి తొలగిస్తే 6 నెలల జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. -
ఆదివారం శ్రీ 8 శ్రీ జూన్ శ్రీ 2025
10లోuఆమనగల్లు: ప్రార్థనలు చేస్తున్న ముస్లింలుభక్తిశ్రద్ధలతో బక్రీద్ త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను జిల్లాలోని ముస్లింలు శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈద్గాలు, మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చిన్నాపెద్దా కలిసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మత పెద్దలు పండుగ విశిష్టత, దైవ సందేశాన్ని చదివి వినిపించారు. న్యూస్రీల్ -
బెర్త్ దక్కేనా..?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: తెలంగాణలోనే కీలకమైన జిల్లా నేతలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా కొనసాగారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఒక్కరికీ అవకాశం దక్కలేదు. ప్రభుత్వానికి ఆర్థిక, రాజకీయ వనరులను సమకూర్చిపెట్టే కీలకమైన ఆయా జిల్లాల నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో మంత్రి వర్గ విస్తరణ ఉండనున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జిల్లా నేతలకు ఈసారైనా అవకాశం దక్కేనా అనేది వేచిచూడాలి. సీనియార్టీనా.. సామాజిక సమీకరణాలా? గ్రేటర్కు ఆనుకుని ఉన్న జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వీటిలో ఇబ్రహీంపట్నం, షాద్నగర్, కల్వకుర్తి స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనుభవం ఉండగా, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా పని చేసిన అనుభవం ఉంది. షాద్నగర్ నుంచి వీర్లపల్లి తొలిసారిగా గెలుపొందారు. ఆయన బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చారు. కారుగుర్తుపై గెలుపొందిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మంత్రి పదవులు, అభివృద్ధి కోసం భారీ నిధుల పేరుతో హస్తం గూటికి చేరుకున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పదవులు దక్కే అవకాశం లేదు. మొదటి నుంచీ పార్టీనే నమ్ముకుని పని చేస్తున్న ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ..వారికి మంత్రి వర్గంలో స్థానం కల్పించకపోవడంపై కేడర్లో నిస్తేజం నెలకొంది. డీసీసీ వేదికగా జరిగిన పలు సమావేశాల్లోనూ ఇదే అంశంపై నేతలు బహిరంగ విమర్శలకు దిగడం గమనార్హం. కొంత మంది సీనియర్ నేతలు ఏకంగా ఢిల్లీకి చేరుకుని పార్టీ అధిష్టానాన్ని కలిసి విన్నవించడం తెలిసిందే. పార్టీలో ఎక్కువ పదవులు ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణలోనే కాదు కార్పొరేషన్, ఇతర పదువుల్లోనూ సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకోవాలని అధిష్టానం సూచించినట్లు తెలిసింది. సీనియార్టీకి ప్రాధాన్యత ఇస్తే మల్రెడ్డికి చాన్స్ ఉంటుంది. బీసీ నినాదాన్ని ఎత్తుకుంటే వీర్లపల్లికి అవకాశం ఉంది. ఇక ఎస్సీ కోటాకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే ఇప్పటికే శాసనసభ స్పీకర్గా కొనసాగుతున్న గడ్డం ప్రసాద్కుమార్కు చాన్స్ కల్పించనుంది. సమన్వయం చేసే వారు లేక .. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చి పెట్టడంలోనే కాదు పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనలో ముందు వరుసలో నిలిచే జిల్లాకు పూర్తిస్థాయి మంత్రి లేకపోవడం ఇబ్బందిగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలే కాదు చివరికి అధికారులు సైతం ప్రతి చిన్న పనికి ఇన్చార్జి మంత్రిని ఆశ్రయించాల్సి వస్తోంది. ఫ్యూచర్సిటీ కోసం భూ సేకరణ, కోహెడ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం, ఐటీ, అనుబంధ సంస్థలకు భూముల కేటాయింపు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు నిధుల సేకరణ వంటి కీలక అంశాలపై జిల్లా నేతలతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంది. అంతేకాదు ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని, సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి కారణమైన నేతలకు నామినేటెడ్ పదవులు ఇప్పించుకోవడం, వ్యక్తిగత, ఇతర సమస్యలతో వచ్చే వారికి సమయం ఇచ్చి, వాటి పరిష్కారం కోసం కృషి చేయాల్సి ఉంది. జిల్లాకు పూర్తిస్థాయి మంత్రి లేకపోవడంతో అభివృద్ధి సహా సంస్థాగతంగా కేడర్ను బలోపేతం చేసే దిశగా ఎలాంటి అడుగులు పడటం లేదు. ఇన్చార్జి మంత్రి ఉన్నప్పటికీ..ఆయనతో జిల్లా సెకండ్ కే డర్ నేతలకు పెద్దగా పరిచయాలు లేకపోవడం, అధ్యయనాల పేరుతో ఆయన తరచూ విదేశాల్లో పర్యటించాల్సి వస్తుండటం, కేవలం ముఖ్య నేతలు పాల్గొనే బహిరంగ సభలు, సమావేశాలకే పరిమితం అవుతుండటం జిల్లా నేతలకు ఇబ్బందిగా మారింది. జిల్లాస్థాయి సమీక్ష, సమావేశాలు కూడా నామమాత్రంగా నిర్వహించి వెళ్తుండటాన్ని కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. తాజాగా విస్తరణ కథనాలతో బెర్త్ ఎవరికి దక్కుతుందన్న చర్చలు మొదలయ్యాయి. మంత్రి వర్గంలో జిల్లాకు దక్కని ప్రాతినిధ్యం విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో మళ్లీ కదలిక ఎవరికి అవకాశం దక్కుతుందోనని చర్చలు -
ప్రభుత్వ భూములను కాపాడండి
మొయినాబాద్ రూరల్: మండలంలోని తోల్కట్ట రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములను కాపాడాలని పలువురు గ్రామస్తులు గురువారం డిప్యూటీ తహసీల్దార్ వినోద్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ విషయమై పలుమార్లు మండల, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని తెలిపారు. ఎక్స్ సర్వీస్మెన్ల పేరుతో ప్రభుత్వ అనుమతి లేకుండా కబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. కొంతమంది బడాబాబులకు అసైన్డ్ పట్టాలు, పాసు పుస్తకాలు జారీ చేస్తున్నారని ఆరోపించారు. పేదలు సాగు చేసుకునేందుకు మాత్రం అనుమతించడం లేదని మండిపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ఒకే సర్వే నంబర్లోని భూమిని ఇద్దరు సోదరుల్లో ఒకరికి పట్టా చేసి, మరొకరికి లావణి పట్టాలు ఇస్తున్నారని ఆరోపించారు. భూ భారతిలోనైనా బాధితులకు న్యాయం చేయాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో గ్రామస్తులు భిక్షపతి, జంగయ్య, మల్లయ్య, వెంకటయ్య తదితరులు ఉన్నారు. రెవెన్యూ సదస్సులో తోల్కట్టవాసుల వినతి -
మోతాదు మించొద్దు
స్థానికంషాబాద్: ఖరీఫ్లో పత్తి సాగు చేసే రైతులు తగిన మోతాదులో ఎరువులు వాడాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. అవసరానికి మించి వినియోగించడం వలన పెట్టుబడులు పెరగడంతో పాటు భూసారం దెబ్బతింటుందని వివరిస్తున్నారు. ఈ మేరకు గ్రామాల్లో నిర్వహిస్తున్న వ్యవసాయ సదస్సుల్లో కర్షకులకు అవగాహనకల్పిస్తున్నారు. అతివృష్టి, అనావృష్టి కారణంగా గడిచిన ఐదేళ్లుగా రైతులకు సరైన దిగుబడులు దక్కలేదు. దీంతో వరుస నష్టాలు చవిచూశారు. ఈ క్రమంలో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, పెట్టుబడులు అదుపులో ఉంచుకోవాలని శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖఅధికారులు సూచిస్తున్నారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలని చెబుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించే మార్గాలపై దృష్టిపెట్టాలని అవగాహన కల్పిస్తున్నారు. వినియోగం ఇలా.. ఎకరా పత్తి సాగుకు పొలం దున్నే సమయంలో 50 కిలోల డీఏపీ చల్లుకోవాలి. విత్తనం నాటిన 20, 40, 60 రోజులకు మూడు సార్లు మొత్తం 90 కిలోల యూరియాను వర్షం పడిన సమయంలో వేయాలి. 25 కిలోల పోటాష్ ఎరువును విత్తనం నాటిన 60 రోజులకు యూరియాతో కలిపి వేసుకోవాలి. కానీ రైతులు రెండింతల ఎరువులు వినియోగిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఎరువులు, పురుగు మందుల వినియోగంలో జాగ్రత్తలు తప్పనిసరి అధికంగా వాడితేభూసారానికి ముప్పు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిపై దృష్టి సారించాలి అవగాహన సదస్సుల్లో శాస్త్రవేత్తలు, అధికారులు సూచనలు పాటించాలి రైతులు దిగుబడిపైనే కాకుండా పొలాల్లో భూసారాన్ని కాపాడుకోవడంపై కూడా దృష్టిసారించాలి. అవసరానికి మించి రసాయన ఎరువులు వాడొద్దు. పురుగు మందుల వినియోగంలో అధికారుల సూచనలు పాటించాలి. – వెంకటేశం, వ్యవసాయశాఖ అధికారి, షాబాద్ -
టిక్కెట్ అడిగారని ‘ట్రాక్స్’పై పగ!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు తమిళనాడులోనూ రైలు పట్టాలపై రాళ్లు, రాడ్లు, కర్రలు పెట్టి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్తో (ఆర్పీఎఫ్) సహా జాతీయ దర్యాప్తు సంస్థనూ (ఎన్ఐఏ) పరుగులు పెట్టించిన నకిలీ బాబా చిక్కాడు. ఇతగాడిని తెలంగాణ ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్టు చేయగా... చైన్నె అధికారులు పీటీ వారెంట్పై అక్కడకు తరలించారు. ●ఉత్తరాఖండ్కు చెందిన విజయ్కుమార్ వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. బతుకుతెరువు కోసం ఒడిస్సాలో స్థిరపడిన ఇతగాడు కుటుంబాన్ని వదిలేసి హఠాత్తుగా బాబా అవతారం ఎత్తాడు. తన పేరును ఓంగా మార్చుకుని దేశ సంచారం మొదలుపెట్టాడు. భిక్షాటన చేసుకుంటూ జీవించడం, కనిపించిన రైలు ఎక్కడం, నచ్చిన చోట దిగడం, ప్లాట్ఫామ్స్పై దొరికినవి తినడం ఇవే దినచర్యలుగా కొన్నేళ్లు బతికేశాడు. ● రైళ్లు, రైల్వే ప్లాట్ఫామ్స్పై ఇలాంటి బాబాలు, భిక్షాటన చేసే వాళ్లు, హిజ్రాల బెడద పెరిగిపోతున్నాయంటూ ప్రయాణికుల నుంచి రైల్వే అధికారులకు వరుస ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్న ఇలాంటి వాళ్లను ఉపేక్షించవద్దని రైల్వే ఉన్నతాధికారులు స్పష్టమన ఆదేశాలను జారీ చేశారు. ● అప్పటి నుంచి టీసీలు, జీఆర్పీ, ఆర్పీఎఫ్ అధికారులు ఇలాంటి వాళ్లు ఎక్కడ కనిపించినా టిక్కెట్ తనిఖీ చేయడం, లేకపోతే దింపేయడం లాంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైలులో ఒడిస్సా నుంచి హైదరాబాద్ వస్తున్న ఓం బాబాను టిక్కెట్ లేని కారణంగా టీసీ మార్గమధ్యంలో దింపేశారు. ఈ విషయంలోనే ఓం బాబా హర్ట్ అయ్యాడు. దీంతో ఏకంగా రైల్వేల పైనే కక్ష పెంచుకున్నాడు. ● నగరంలోని కాచిగూడ–బుద్వేల్ మధ్య రైలు పట్టాలపై పెద్ద కర్రలు, రాళ్లు పెట్టాడు. వీటిని గుర్తించిన గ్యాంగ్మెన్లు తొలగించి, ఆర్పీఎఫ్కు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన అధికారులు నిందితుడిని పట్టుకునేందుకు మఫ్టీలో రంగంలోకి దిగడంతో పాటు గ్యాంగ్మెన్లను అప్రమత్తం చేశారు. ● కాటేదాన్ ప్రాంతంలో రైలు పట్టాల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓంను గుర్తించిన ఆర్పీఎఫ్ అతడిని అదుపులోకి తీసుకుంది. ● విచారణ నేపథ్యంలో ఈ నేరాలు తానే చేసినట్లు అతడు అంగీకరించడంతో అరెస్టు చేసి జైలుకు పంపారు. ● నగరంలో ఈ పని చేసి, అరెస్టు కావడానికి మధ్యలో చైన్నె వెళ్లిన ఓం అక్కడా ఇలాంటి పనే చేశాడు. విల్లివాక్కం, అంబత్తూరు, ఆవడి, అరక్కోణంలలో రైలు పట్టాలపై వస్తువులు పెట్టడంతో ఐదు కేసులు నమోదయ్యాయి. ● ఈ ఏడాది ఏప్రిల్ 26 ఉదయం 9.30 గంటలకు అవడి రైల్వే యార్డ్ వద్ద సిగ్నల్ ఆపరేషన్ విఫలమైంది. రైల్వే సిబ్బంది వెంటనే ట్రాక్ను పరిశీలించగా ఐరన్న్ పెండ్రాల్ క్లిప్లు తొలగించినట్లు గుర్తించారు. క్లిప్లు, రెండు అంగుళాల ఇనుప ముక్కలను ట్రాక్పై ఉంచినట్లు తేల్చారు. ● మరుసటి రోజు రాత్రి 7 గంటలకు అరక్కోణం రైల్వే స్టేషన్ సమీపంలోని ఆరు పాయింట్ల వద్ద బ్యాలస్ట్, ఇనుప ముక్కలు కనిపించాయి. అదే రోజు రాత్రి 11.47 గంటలకు అంబత్తూరు రైల్వే స్టేషన్లో ఐదు చోట్ల బ్యాలస్ట్లు ఉంచినట్లు ఆర్పీఎఫ్కి సందేశం వచ్చింది. ● రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై బ్యాలస్ట్ను తొలగించి, ట్రాక్పై రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఇక్కడి అధికారుల విచారణలో ఈ విషయాలు వెలుగులోకి రావడంతో చైన్నె ఆర్పీఎఫ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ● దీంతో ఓంపై అక్కడి కోర్టు నుంచి ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్ తీసుకొచ్చిన అధికారులు చైన్నె తరలించారు. ● తమిళనాడులో ఇతడు చేసిన పనితో ఎన్ఐఏ కూడా ఉలిక్కిపడింది. దీని వెనుక ఉగ్రకోణం ఉందని అనుమానించి రంగంలోకి దిగింది. చివరకు ఇది ఓ దొంగ బాబా పనిగా తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైలు నుంచి దించినందుకు విధ్వంసాలకు కుట్ర ఉత్తరాఖండ్కు చెందిన ఓ నకిలీ బాబా వ్యవహారం హైదరాబాద్తో పాటు తమిళనాడులోనూ కేసులు అరెస్టు చేసిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు -
మున్సిపాలిటీలకు అవార్డులు
శంకర్పల్లి/తుర్కయంజాల్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఉత్తమ పనితీరు కనబర్చిన మున్సిపాలిటీలకు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గత నెల 24న అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం నగరంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా శకంర్పల్లి, తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్లు యోగేశ్, కె.అమరేందర్ రెడ్డి అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్లు మాట్లాడుతూ.. అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరింత మెరుగ్గా పనిచేసేందుకు ఈ అవార్డులు దోహదం చేస్తాయన్నారు. -
భూ బేరం! టార్గెట్ రూ.5,000 కోట్లు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) మరోసారి భూ బేరానికి సన్నద్ధమవుతోంది. గతంలో వివిధ ప్రాంతాల్లో విక్రయించగా మిగిలిపోయిన స్థలాలను మరోసారి అమ్మకానికి పెట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పాత లే అవుట్లలో ఉన్న స్థలాలను విక్రయించడంతో పాటు కొత్త లే అవుట్లను సైతం సిద్ధం చేస్తున్నారు. నగరంలో చేపట్టనున్న పలు ప్రాజెక్టుల కోసం సుమారు రూ.5,000 కోట్లు ఆర్జించడమే లక్ష్యంగా హెచ్ఎండీఏ ఆన్లైన్ బిడ్డింగ్కు ప్రణాళికలను రూపొందిస్తోంది. గతంలో భారీ స్పందన లభించిన ప్రాంతాల్లో.. ● సికింద్రాబాద్ నుంచి డెయిరీఫాం వరకు, శామీర్పేట్ వరకు ఎలివేటెడ్ కారిడార్లకు ప్రతిపాదనలు రూపొందించిన సంగతి తెలిసిందే. ప్యారడైజ్ నుంచి డెయిరీఫాం వరకు టెండర్లను సైతం కేటాయించారు.శామీర్పేట్ రూట్లో ఆస్తుల సేకరణ తుది దశకు చేరింది. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి కనీసం రూ.3000 కోట్లకు పైగా ఖర్చు కానున్నట్లు అంచనా. అలాగే రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు సైతం రెండు దశల్లో రూ.2500 కోట్ల వరకు వ్యయం కానుంది. ● హైదరాబాద్ మహానగరాభివృద్ధిలో భాగంగా మెగా మాస్టర్ప్లాన్– 2050, సికింద్రాబాద్ స్కైవాక్, హుస్సేన్సాగర్ సుందరీకరణ, పార్కులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారుల విస్తరణ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని భూముల అమ్మకాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో కొనుగోలుదార్ల నుంచి భారీ స్పందన లభించిన ప్రాంతాల్లో మిగిలిపోయిన ప్లాట్లను మొదట విక్రయించి ఆ తర్వాత రెండు, మూడు దశల్లో వివిధ ప్రాంతాల్లోని స్థలాలను విక్రయించనున్నారు. మొదటి దశలో.. కోకాపేట్ నియోపొలిస్, ఇన్ముల్నర్వ, ఉప్పల్ భగాయత్, తుర్కయంజాల్లో గతంలో పెద్ద ఎత్తున స్పందన లభించింది. అప్పటి ప్రభుత్వానికి రూ.వేల కోట్ల ఆదాయం లభించింది. ఉప్పల్భగాయత్లో రెండు దశల్లో ప్లాట్లను విక్రయించారు. కోకాపేట్లో ఎన్నారైలు, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిర్మాణ సంస్థలు, రియల్టర్లు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. ప్రస్తుతం ఈ నాలుగు ప్రాంతాల్లో రైతుల నుంచి సేకరించిన భూములపై వారికి 60 శాతం ప్లాట్లను కేటాయించగా హెచ్ఎండీఏకు 40 శాతం ప్లాట్లు లభించాయి.వాటిలో మరో 385 ప్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెండు, మూడో దశల్లో.. మొదటి దశలో కొనుగోలుదారులు, వివిధ వర్గాల నుంచి లభించే స్పందన మేరకు ఆన్లైన్ బిడ్డింగ్ కొనసాగించనున్నారు. ఈ క్రమంలో బుద్వేల్, ప్రతాపసింగారం, బహదూర్పల్లి, హకీంపేట్, షేక్పేట్లలోని హుడాహైట్స్, కంది, కుత్బుల్లాపూర్, పెద్దకంజర్ల, ఫసల్వాడి, తదితర ప్రాంతాల్లో లే అవుట్లను అభివృద్ధి చేసి ప్లాట్లను విక్రయించనున్నారు. దశలవారీగా విక్రయించేందుకు హెచ్ఎండీఏ లే అవుట్లు.. ఏరియా మొత్తం హెచ్ఎండీఏ విక్రయించినవి ప్రస్తుతం ఉన్నవి ఎకరాల్లో ప్లాట్లులేమూరు 83.47 164 - 164 తొర్రూరు 117.375 885 392 493 కుర్మల్గూడ 16.75 145 86 59 బాచుపల్లి 27.36 206 204 2 మేడిపల్లి 53.21 208 91 117 (కొన్ని ప్లాట్లు కోర్టు కేసుల్లో ఉన్నాయి.) మోకిల 165.37 908 189 719 (కొన్ని స్థలాల రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉంది.) బుద్వేల్ 182.10 17 12 4 ప్రతాప సింగారం 126.12 24 - 24 బహదూర్పల్లి 40.00 221 152 69 హుడా హైట్స్ 12.45 37 - 37 కంది 47.14 341 - 341 ఆదాయ సముపార్జనకు హెచ్ఎండీఏ ప్రణాళికలు ఎలివేటెడ్ కారిడార్లు, గ్రీన్ఫీల్డ్ రోడ్డు తదితర ప్రాజెక్టుల కోసం.. మొదటి దశలో కోకాపేట్, ఇన్ముల్నర్వ, ఉప్పల్, తుర్కయంజాల్ ప్లాట్ల బిడ్డింగ్ నాలుగు ప్రాంతాల్లో 385 ప్లాట్లువిక్రయానికి సిద్ధం రెండు, మూడు దశల్లో మరో పది ప్రాంతాల్లో స్థలాల వేలం వివిధ ప్రాంతాల్లో ఆన్లైన్ బిడ్డింగ్కు సిద్ధంగా ఉన్న ప్లాట్లు ఏరియా మొత్తం హెచ్ఎండీఏ విక్రయించినవి ప్రస్తుతం ఉన్నవి ఎకరాల్లో ప్లాట్లు కోకాపేట్ 533.01 20 14 5(ఒకప్లాట్ రంగారెడ్డి కలెక్టరేట్కు తిరిగి ఇచ్చారు) ఇన్ముల్నర్వ 92.69 327 – – ఉప్పల్ భగాయత్ 56.39 64 23 41తుర్కయంజాల్ 9.00 34 22 12 మొత్తం హెచ్ఎండీఏ ప్లాట్లు : 1,141, రైతులకు కేటాయించినవి : 696, ఇప్పటి వరకు విక్రయించినవి : 59, అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి : 385 -
ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి
ఇబ్రహీంపట్నం: ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా సహకరించాలని మున్సిపల్ కమిషనర్ రవీంద్రసాగర్ కోరారు. 100 రోజుల స్పెషల్ డ్రైవ్లో భాగంగా గురువారం నాలుగోరోజు ఇబ్రహీంపట్నంలో దుకాణాలను తనిఖీలు చేసి ప్లాస్టిక్ ఉపయోగిస్తున్న వాటికి ఫెనాల్టీ విధించారు. అనంతరం మొక్కలు నాటి పర్యావరణంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ కవర్స్ వాడకంతో పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటోందని అన్నారు. కాలుష్య వాతావరణం ఏర్పడి మనుషులతోపాటు పశుపక్ష్యాదులపై దీని ప్రభావం పడుతుందన్నారు. దుకాణాల్లో వ్యాపారస్తులు ప్లాస్టిక్ కవర్స్ను ఉపయోగించొద్దని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ ప్రవీణ్రెడ్డి, పర్యావరణ ఇంజనీర్ ప్రణవ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
కడదామా.. వద్దా?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మెజార్టీ లబ్ధిదారులు వెనుకాడుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం.. ముడి సరుకుల ధరలు అమాంతం పెరగడం.. కూలీ ఖర్చులు రెట్టింపవడం.. నిర్మాణం 400 గజాలకు మించకూడదనే నిబంధన విధించడం.. ప్రభుత్వ అంచనాలకు, క్షేత్రస్థాయిలోని ఖర్చులకు పొంతన లేకపోవడం.. వెరసి ఇంటి నిర్మాణాలకు పెద్ద అడ్డంకిగా మారింది. తీరా ప్రొసీడింగ్స్ చేతికందిన తర్వాత క్షేత్రస్థాయిలోని ఖర్చులు, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీకి పొంతన లేకపోవడంతో ముగ్గు పోసేందుకే జంకుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో కొంతమంది అప్పు చేసి ఇళ్లు నిర్మిస్తుండగా, మరికొంత మంది ఖర్చుకు భయపడి ప్రొసీడింగ్స్ రద్దు చేసుకుంటున్నట్లు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం పది శాతం మంది లబ్ధిదారులు కూడా తమ ఇళ్లకు ముగ్గు పోయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చేతిలో పైసలు లేక.. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రభుత్వం నియోజకవర్గానికి 3,500 చొప్పున జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 28,000 ఇళ్లను మంజూరు చేసింది. కొత్తగా నిర్మించుకునే లబ్ధిదారులకు ఈ పథకం కింద రూ.5 లక్షలు వివిధ దశల్లో చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఇంటింటి సర్వేలో భాగంగా అధికారులు అర్హుల వివరాలు సేకరించి, ఇందిరమ్మ ఇళ్ల పోర్టల్లో కేటగిరీల వారీగా నమోదు చేశారు. అర్హుల జాబితాను గ్రామ సభల్లో చదివి వినిపించారు. పూరి గుడిసెలో/శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉంటూ ఖాళీ స్థలాలను కలిగి ఉన్న వారికి కేటాయింపులో తొలి ప్రాధాన్యత ఇచ్చారు. జిల్లాలోని 16 మున్సిపాలిటీల పరిధిలో 4,969 ఇళ్లను కేటాయించగా, వీటిలో 4,701 ఇళ్లకు మాత్రమే పాలనాపరమైన అనుమతులు లభించాయి. వీటిలో 1,354 ఇళ్లకు మాత్రమే ముగ్గుపోసినట్లు సమాచారం. అదే గ్రామీణ ప్రాంతాల్లో 12,471 ఇళ్లను మంజూరు చేసినప్పటికీ 11,916 ఇళ్ల నిర్మాణానికి మాత్రమే అనుమతులు లభించాయి. వీటిలో 2,730 ఇళ్లకు మాత్రమే ముగ్గు పోశారు. ఇప్పటి వరకు కేవలం 148 మంది లబ్ధిదారులకు మాత్రమే మొదటి దశ చెల్లింపులు చేశారు. నిర్మాణానికి అవసరమైన పైసలు లేకపోవడంతో మెజార్టీ లబ్ధిదారులు నిర్మాణానికి ఆసక్తి చూపడం లేదు. ఇదిలా ఉంటే జిల్లాలోని 21 మండలాల్లో 14 మోడల్ హౌస్లను నిర్మించారు. వీటిలో బీస్మెంట్ లేవల్లో ఐదు ఉండగా, స్లాబ్ లేవల్లో మరో ఐదు ఉన్నాయి. రూఫ్ లేవల్లో నాలుగు ఉండటం గమనార్హం. నియోజకవర్గాల్లో ఇదీ పరిస్థితి.. ● చేవెళ్లకు 2,800 ఇళ్లు కేటాయించగా, 2,641 ఇళ్లకు పాలనాపరమైన అనుమతులు వచ్చాయి. ఇప్పటి వరకు 557 ఇళ్లకు మాత్రమే ముగ్గు పోశారు. ● ఇబ్రహీంపట్నానికి 3,500 ఇళ్లు కేటాయించగా, 3,424 ఇళ్లకు అనుమతులు ఇవ్వగా కేవలం 991 ఇళ్లకు ముగ్గు పోశారు. ● కల్వకుర్తికి 2,150 ఇళ్లు కేటాయించగా, 2,131 ఇళ్లకు అనుమతులు లభించాయి. ఇప్పటి వరకు 519 ఇళ్లకు ముగ్గు పోశారు. ● మహేశ్వరానికి 3,390 ఇళ్లు కేటాయించగా, 3,141 ఇళ్లకు అనుమతులు దక్కాయి. వీటిలో ఇప్పటి దాకా 807 ఇళ్లకే ముగ్గు పోశారు. ● రాజేంద్రనగర్కు 2,100 ఇళ్లు కేటాయించగా, 1,819 ఇళ్లకు అధికారుల నుంచి అనుమతులు లభించాయి. ఇప్పటి వరకు 487 ఇళ్లకు మాత్రమే ముగ్గు పోశారు. ● షాద్నగర్కు 3,500 ఇళ్లు కేటాయించగా, 3,461 ఇళ్లకు అనుమతులిచ్చారు. 654 ఇళ్లకే ముగ్గు పోశారు. ఇందిరమ్మ ఇళ్లపై అయోమయం అంచనాలకు మించి నిర్మాణ ఖర్చులు వెనుకడుగు వేస్తున్న లబ్ధిదారులు ముగ్గు పోసేందుకు సైతం మొగ్గు చూపని వైనం పైలెట్ ప్రాజెక్టులో ఎంపిక చేసిన ఇళ్లు మంజూరు చేసినవి 970 మార్కింగ్ పూర్తి చేసినవి 404 మొదటి విడత నిధుల మంజూరు 148 బేస్మెట్ లెవల్లో ఉన్నవి 194 రూఫ్ లెవల్లో ఉన్నవి 23 స్లాబ్ లెవల్లో ఉన్నవి 08దశల వారీగా చెల్లింపులు ఇలా.. బేస్మెట్ లెవల్ రూ.1,00,000 రూఫ్ లెవల్ విత్ వాల్స్ రూ.1,00,000 స్లాబ్ లెవల్ రూ.2,00,000 నిర్మాణం పూర్తయ్యాక రూ.1,00,000 -
పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించండి
ఇబ్రహీంపట్నం రూరల్: విద్యా సంస్థలు పునఃప్రారంభమయ్యే నాటికి పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి గురువారం పాఠశాలలు, హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం పథకం, తాగునీటి వసతిపై ఎంపీడీఓలు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు ఈ నెల 12న ప్రారంభం అవుతున్న సందర్భంగా సమస్యలు ఉంటే పరిష్కరించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు త్వరలోనే గ్రౌండ్ చేయాలని తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకంపై మాట్లాడుతూ లబ్ధిదారులు అందరూ ఒకే విధమైన యూనిట్ ఎంపిక కాకుండా చూసుకోవాలని సూచించారు. పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఆర్ఓ సంగీత, డీఆర్డీఓ పీడీ శ్రీలత, హౌసింగ్ పీడీ హన్మంత్, తదితరులు పాల్గొన్నారు. వసతి గృహాల్లో సౌకర్యాలు కల్పించండి విద్యా సంవత్సరం ప్రారంభానికి సిద్ధం కండి అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం -
నామినేటెడ్ పదవులు ఇవ్వాలని వినతి
షాద్నగర్: నియోజకవర్గంలోని ముఖ్య నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కోరుతూ గురువారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్కు వినతిపత్రం సమర్పించారు. పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు అంతా పార్టీ గెలుపుకోసం కృషి చేశారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్రెడ్డితో పాటు నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నేతలకు కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ పదవులు ఇవ్వా లని వినతిపత్రంలో పేర్కొన్నారు. -
పట్టుబడ్డ గంజాయిని కొట్టేసి..
షాద్నగర్ రూరల్: వచ్చే జీతంతో తృప్తి పడని ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ పని చేసే స్టేషన్లోనే గతంలో పట్టుబడిన గంజాయిని దొంగిలించి.. విక్రయిస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటన పట్టణంలోని ఫరూఖ్నగర్ ఈద్గా వద్ద చోటుచేసుకుంది. పట్టణ సీఐ విజయ్కుమార్ గురువారం వివరాలు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా తాండూరు ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్లో గులామ్ సుల్తాన్ అహ్మద్ ఎకై ్సజ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. జల్సాలకు అలవాటుపడ్డ అతను వచ్చే వేతనం సరిపోక అక్రమ మార్గం ఎంచుకున్నాడు. వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తూ విలాస జీవితానికి అలవాటుపడ్డాడు. అక్కడ దొంగిలించి.. ఇక్కడ విక్రయిస్తూ స్టేషన్లో గతంలో పట్టుబడిన గంజాయిని గులామ్ సుల్తాన్ అహ్మద్ దొంగిలించేవాడు. దానికి తనకు వరుసకు కుమారుడైన షాద్నగర్ పట్టణానికి చెందిన అంజాద్కు విక్రయించేందుకు అప్పగించేవాడు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న రూ.75 వేల విలువ చేసే కిలోన్నర గంజాయిని విక్రయించేందుకు అంజాద్ బుధవారం రాత్రి ఈద్గా సమీపంలోకి చేరుకున్నాడు. అదే సమయంలో ఎస్ఐ దేవరాజ్ అధ్వర్యంలో సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అంజాద్ కవర్ పట్టుకొని అనుమానాస్పదంగా తచ్చాడడం గమనించారు. అతడి వద్ద ఉన్న కవర్ను పరిశీలించగా అందులో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. దీంతో విచారించగా నేరం అంగీకరించాడు. ఈ మేరకు ఇద్దరినీ రిమాండ్కు తరలించారు. కేసు విచారణలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను శంషాబాద్ డీసీపీ రాజేశ్, అడిషనల్ డీసీపీ పూర్ణచందర్, ఏసీపీ లక్ష్మీనారాయణ అభినందించారు. బంధువు ద్వారా విక్రయం ఎకై ్సజ్ కానిస్టేబుల్ నిర్వాకం పోలీసుల అదుపులో నిందితులు -
రంగారెడ్డి: గంజాయి కేసులో ఎక్సైజ్ కానిస్టేబుల్ అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి: గంజాయి కేసులో ఎక్సైజ్ కానిస్టేబుల్ గులం సుల్తాన్ అహ్మద్ను షాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. షాద్ నగర్లో పోలీసులు తనిఖీల్లో గంజాయితో ఓ యువకుడు పట్టుబట్టాడు. అతని వద్ద నుంచి 1.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.తనకు గంజాయి ఎక్సైజ్ కానిస్టేబుల్ ఇచ్చినట్టు ఆ యువకుడు తెలిపాడు. ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేసిన గంజాయిని ఆ యువకుడికి సుల్తాన్ ఇచ్చాడు. ఎక్సైజ్ కానిస్టేబుల్ సుల్తాన్ అహ్మద్, యువకుడు అంజాద్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్కు తరలించారు. -
కబ్జా కాకుంట
రంగారెడ్డిమున్సిపాలిటీ.. మారాలిక! మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.. వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తోంది.గురువారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 202510లోuమొద్దులకుంటలో మట్టి యాచారం: గాండ్లగూడెం సమీపంలోని మొద్దులకుంటను ఓ వ్యాపారి మట్టితో పూడ్చేసినట్లు గుర్తించిన పలువురు రైతులు బుధవారం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డికి ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 313లోని పట్టా భూమి యజమానులు కొన్ని రోజులుగా మట్టితో కుంటను పూడ్చేస్తున్నారని, ఎఫ్టీఎల్, బఫర్జోన్ కనిపించడకుండా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన ఆర్డీఓ వెంటనే పరిశీలించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ అయ్యప్ప, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. వెంటనే కుంట వద్దకు చేరుకున్న అధికారులుపోసిన మట్టిని తీసేయాలని, లేదంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.సాక్షి, రంగారెడ్డి జిల్లా: రియల్టర్ల భూ దాహానికి ఖాళీ ప్రభుత్వ స్థలాలే కాదు.. చెరువులు, కుంటలు సైతం మాయమవుతున్నాయి. భగ్గున మండుతున్న ఎండలకు చెరువులు, కుంటలన్నీ ఎండిపోయాయి. కాల్వలు, కట్టలు, అలుగులు సహా శిఖం భూములు ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో ఆ పక్కనే పట్టా భూములు కొనుగోలు చేసిన రియల్టర్లు కల్వర్టులు, కాల్వలను సైతం చదును చేసి తమ వెంచర్లలో కలిపేస్తున్నారు. వరదనీరు పారకుండా అడ్డుకట్టలు వేస్తూ.. రైతుల పొలాల మీదకు మళ్లిస్తున్నారు. చెరువులు, కుంటలపై ఎప్పటికప్పుడు నిఘా పెంచాల్సిన అధికార యంత్రాంగం అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. కళ్లముందే కుంటల ఆనవాళ్లను చెరిపేస్తుండటంతో కొంతమంది రైతులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. హద్దులు దాటి.. జిల్లా వ్యాప్తంగా 2,132 చెరువులు, కుంటలు 10,946 ఎంఎఫ్టీ సామర్థ్యం కలిగి ఉన్నాయి. వీటి పరిధిలో 70,067 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రభుత్వం వీటిలో ఏటా 1.20 కోట్ల చేప పిల్లలను వదులుతోంది. 400 టన్నుల కుపైగా దిగుబడి వస్తోంది. వేలాది మంది మత్య్సకారులు ఈ చెరువులు, కుంటలనే నమ్ముకుని జీవిస్తున్నారు. వేసవిలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. బఫర్జోన్లు, ఫుల్ ట్యాంక్ లెవల్లోని నీరు పూర్తిగా ఇంకిపోయింది. ఇదే అవకాశంగా భావిస్తున్న కొంతమంది అక్రమార్కులు రాత్రికి రాత్రే మట్టి నింపుతున్నారు. కల్వర్టులు, కాల్వలను ధ్వంసం చేసి నీటి ఆనవాళ్లు లేకుండా చెరిపేస్తున్నారు. ఆ తర్వాత పక్కనే ఉన్న తమ పట్టా భూముల్లో కలుపుకొంటున్నారు. భూ భారతి సదస్సుల్లో భాగంగా బుధవారం ఆయా గ్రామాలకు హాజరైన అధికారులకు ఈవిషయమై ప్రజలు ఫిర్యాదులు అందించారు. పోటోరైటప్: (04ఐబిఆర్19–640026) న్యూస్రీల్చెరువుల, కుంటల అన్యాక్రాంతంపై ఫిర్యాదులు భూ భారతి సదస్సుల్లో అధికారులకు వినతులు అక్రమార్కులకు అడ్డుకట్ట వేయాలని అభ్యర్థన -
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
మొయినాబాద్ రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ అన్నారు. మండలంలోని ఎత్మార్పల్లిలో బుధవారం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆమె రైతులు, గ్రామస్తుల నుంచి 36 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ వినోద్కుమార్, పంచాయతీ కార్యదర్శి మల్లేశ్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం చేవెళ్ల: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ కాంచనలత తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని స్పష్టంచేశారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అన్ని వసతులతో కూడిన భవనం అందుబాటులో ఉందన్నారు. అసక్తి ఉన్న వారు దోస్త్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్డుపై ప్రజాభిప్రాయ సేకరణ తుక్కుగూడ: రావిర్యాల ఎగ్జిట్– 13 నుంచి మీర్ఖాన్పేట వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులతో బుధవారం అధికారులు సమవేశం నిర్వహించారు. రావిర్యాల వార్డు కార్యాలయంలో స్పెషల్ డీప్యూటీ కలెక్టర్ జీఎల్వీ రాజు మాట్లాడుతూ.. మొదటి విడతలో 18.5 కిలోమీటర్ల మేర భూమి సేకరిస్తామని తెలిపారు. పరిహారం, పునరావసం, ఉపాధి కల్పనపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నామని స్పష్టంచేశారు. తమకు న్యాయం చేసిన తర్వాతే భూములు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. శుభ్రత తప్పనిసరి ఆమనగల్లు: హోటళ్లు, వాణిజ్య సముదాయాల నిర్వాహకులు స్వచ్ఛత నియమాలు పాటించాలని మున్సిపల్ కమిషనర్ శంకర్ హెచ్చరించారు. ఆమనగల్లులోని పలు బేకరీలు, దాబాలు, హోటళ్లను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుభ్రత పాటించని వారికి జరిమానాలు విధించారు. వాణిజ్య సంస్థలు విధిగా ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. సివిల్ ర్యాంకర్కు సన్మానం షాద్నగర్రూరల్: సివిల్స్ ఫలితాల్లో 905 ర్యాంకు సాధించిన షాద్నగర్ పట్టణానికి చెందిన భరద్వాజ్ను బుధవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఘనంగా సన్మానించారు. రాజ్భవన్లో సివిల్స్ ర్యాంకర్లతో గవర్నర్ ఇన్స్పైర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన వారిని ఆయన సన్మానించారు. జ్ఞాపికలు అందజేశారు. గంజాయి పట్టివేత షాద్నగర్రూరల్: అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని షాద్నగర్ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఫరూఖ్నగర్లోని ఈద్గా వద్ద గంజాయి అమ్ముతున్న అంజద్ను.. పోలీసులు పట్టుకొని, కిలోన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఓ ఎకై ్సజ్ కానిస్టేబుల్కు.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. -
‘చెరువుల అభివృద్ధి వేగంగా జరగాలి’
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చెరువుల అభివృద్ధి వేగంగా జరగాలని, మొదటి విడతగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఆరు చెరువులూ వీలైనంత త్వరలో అందుబాటులోకి రావాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. ఈ వర్షాకాలంలోనే ఆయా చెరువులన్నీ స్వచ్ఛమైన నీటితో కళకళలాడాలని స్పష్టం చేశారు. బుధవారం తమ్మిడికుంట, సున్నం చెరువులను ఆయన సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. తమ్మిడికుంటలో 26 ఎకరాల మేర నీరు నిలిచేలా, మరో నాలుగు ఎకరాల్లో పర్యావరణానికి పెద్ద పీట వేస్తూ అభివృద్ధి చేయాలని సూచించారు. చెరువు బండ్ బలంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. చెరువు కింద లోతట్టు ప్రాంతంతో పాటు భవనాలు ఉన్న దృష్ట్యా బండ్కు వెలుపల భాగంలో కాంక్రీట్తో నిర్మించాలని అన్నారు. ఈ పనులకు ఎక్కడా ఆటంకం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సున్నం చెరువు మొత్తం 32.20 ఎకరాలు కాగా ఇప్పుడు కేవలం 14.18 ఎకరాల్లోనే నీరు నిలుస్తోందని, దీన్ని పూర్తి స్థాయికి విస్తరించాలని రంగనాథ్ సూచించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ -
చోరీకి సోదరే సూత్రధారి
కొత్తూరు: చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సొంత తుమ్ముడి ఇంట్లో రూ.15 లక్షలు అపహరించింది బాధితుడి అక్కేనని గుర్తించారు. తమదైన శైలిలో విచారణ చేపట్టగా.. నేరం అంగీకరించి, కటకటాల పాలైంది. సీఐ నర్సింహరావు బుధవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధి స్టేషన్ తిమ్మాపూర్కు చెందిన వన్నాడ శివశంకర్గౌడ్ కుటుంబ సభ్యులు, ఇటీవల తమ పొలం విక్రయించడానికి ఇతరులతో ఒప్పందం చేసుకోగా.. కొనుగోలు చేసే వ్యక్తులు వారికి కొంత నగదును అడ్వాన్సుగా చెల్లించారు. కాగా శివశంకర్గౌడ్ తండ్రి, తల్లి పెద్ద కూతురుతో కలిసి విహారయాత్రకు వెళ్లే క్రమంలో ఇంట్లో ఉన్న రూ.15 లక్షల నగదును శివశంకర్గౌడ్కు ఇచ్చారు. పాత నేరస్తులతో కుట్ర ఈ నేపథ్యంలో గత నెల 30న షాబాద్ మండలంలో తమ బంధువుల అంత్యక్రియలకు వెళ్లే సమయంలో శివశంకర్గౌడ్ నగదును బీరువాలో పెట్టాడు. అప్పటికే పొలం విక్రయించిన డబ్బులు ఇంట్లో ఉన్న విషయం తెలుసుకున్న కొత్తూరు మున్సిపాలిటీ పరిధి కమ్మరిగూడలో నివాసం ఉంటున్న శివశంకర్ అక్క బోడమ్పల్లి స్వప్న, ఆ డబ్బును కాజేయాలని పథకం వేసింది. తనకు పరిచయం ఉన్న నేర చరిత్ర కలిగిన శంషాబాద్ మండలం షాపూర్కు చెందిన పానమోని అశోక్ను సాయం కోరగా.. అతను అదే మండలం రాళ్లగూడకు చెందిన రఘుతో కలిసి చోరీకి ప్రణాళిక సిద్ధం చేశాడు. ఒక ఆటోలో నిందితులు ముగ్గురు తిమ్మాపూర్లోని శివశంకర్గౌడ్ ఇంటికి చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న రాడ్తో తలుపు, బీరువా తాళాలు పగులగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణలో భాగంగా సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులకు.. శివశంకర్ అక్కపై అనుమానం కలిగింది. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకుంది. దీంతో వారి నుంచి నగదుతో పాటు కారు, ఆటో, స్కూటీ, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు. కేసు ఛేదనలో కృషి చేసిన సీఐ నర్సింహరావు, ఎస్ఐలు మురళీగౌడ్, శ్రీనివాస్చారి, సిబ్బంది కుమార్, నరేష్, రవికుమార్లను శంషాబాద్ డీసీపీ అభినందించారని సీఐ తెలిపారు. పాత నేరస్తులతో కలిసి కుట్ర తమ్ముడి ఇంట్లో రూ.15 లక్షలు అపహరణ వివరాలు వెల్లడించిన సీఐ నగదు, కారు రికవరీ -
పెద్దకుంట కబ్జా
కడ్తాల్: మండల పరిధిలోని వంపూగూడ గ్రామ సమీపంలో సర్వే నంబర్ 40లోని ‘పెద్దకుంట’కు సంబంధించిన 1.12 ఎకరాల ఎఫ్టీఎల్ భూమిని కబ్జా చేసిన వెంచర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బుధవారం గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రెవెన్యూ సదస్సుకు హాజరైన అధికారులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పోతుగంటి అశోక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం డిప్యూటీ తహసీల్దార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. వెంటనే పెద్దకుంటను సర్వే చేసి, హద్దులు నిర్ధారించాలని కోరారు. -
రైతు సంక్షేమమే ధ్యేయం
యాచారం: వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి తన ఆధీనంలో ఉన్న రూ.కోటిన్నర విలువ చేసే రెండు వేల గజాల స్థలాన్ని బుధవారం వ్యవసాయ శాఖకు అప్పగించారు. స్థానిక రైతులకు సేవలందించాలనే లక్ష్యంతో గతంలో భూస్వామి బొమ్మిడిక మల్లారెడ్డి తన 2వేల ఎకరాల స్థలాన్ని దానం చేశారు. నాటి నుంచి ఈ భూమి కోదండరెడ్డి స్వాధీనంలోనే ఉంది. అప్పటి రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు నిధులతో ఇందులో భవనాన్ని నిర్మించి శ్రీవేంకటేశ్వర రైతుమిత్ర సంఘం పేరుతో కర్షకులకు సేవలందిస్తున్నారు. సదరు స్థలాన్ని ప్రభుత్వానికి ఇవ్వడం ద్వారా రైతులకు మరింత న్యాయం జరుగుతుందని కోదండరెడ్డి భావించారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సమక్షంలో స్థలాన్ని డైరెక్టర్ ఆఫ్ అగ్రిలక్చర్ డాక్టర్ గోపికి అప్పగించారు. దీని చుట్టూ ప్రహరీ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. వెంటనే పంచాయతీరాజ్ డీఈఈ శ్రీనివాస్ను పిలిపించి ప్రతిపాదనలు సిద్ధం చేసి, నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. యాచారంలో మోడల్ కూరగాయల మార్కెట్ నిర్మాణం కోసం ఆర్టీసీ బస్టాండ్ పక్కనున్న స్థలాన్ని పరిశీలించారు. శేరిగూడకు చెందిన అక్కలి మధుకర్రెడ్డి తన రెండెకరాల భూమిని మోడల్ మార్కెట్ నిర్మాణం కోసం ప్రభుత్వానికి విక్రయించేందుకు ముందుకువచ్చారు. దీంతో కోదండరెడ్డి, రంగారెడ్డి అధికారులతో కలిసి స్థలాన్ని సందర్శించారు. వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి రూ.కోటిన్నర విలువైన స్థలాన్ని వ్యవసాయశాఖకు అప్పగింత ప్రహరీ నిర్మాణానికి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హామీ ఫ్యూచర్సిటీతో మహర్దశ ఫార్మాసిటీని రద్దు చేసిన రేవంత్రెడ్డి సర్కార్ ఇదే ప్రాంతంలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తోందని ఎమ్మెల్యే రంగారెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో యాచారానికి మహర్దశ పట్టనుందని తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. అనంతరం యాచారం రైతు వేదికలో అన్నదాతలకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అనంత్రెడ్డి, రైతు కమిషన్ సభ్యులు కేవీఎన్రెడ్డి, మరికంటి భవాని, రామ్రెడ్డి గోపాల్రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి నర్సింహరావు, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ జిల్లా అధికారి సురేష్, తహసీల్దార్ అయ్యప్ప, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మస్కు నర్సింహ, నాయకులు శ్రీనివాస్రెడ్డి, ఈసీ శేఖర్గౌడ్, బిలకంటి చంద్రశేఖర్రెడ్డి, అమృతాసాగర్, వెంకటేశ్ నాయక్ తదితరులు -
భూములు లాక్కుంటే ఇక్కడే చస్తాం
మొయినాబాద్: ‘భూమినే నమ్ముకుని బతుకుతున్నాం.. బలవంతంగా లాక్కుంటే పెట్రోల్ పోసుకుని ఇక్కడే చస్తాం.. మా శవాల మీద గోశాల కట్టండి’ అంటూ ఎనికేపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ పరిధిలోని ఎనికేపల్లి రెవెన్యూ సర్వేనంబర్ 180లోని 99.14 ఎకరాల భూమిలో గోశాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు, గ్రామ స్తులు బుధవారం ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓ రైతు ట్రాక్టర్తో భూమిని దున్నుతుండగా అడ్డుకున్న పోలీసులు అతన్ని స్టేషన్కు తరలించారు. దీనిపై ఆగ్రహానికి గురైన రైతులు నిరసన వ్యక్తంచేశారు. డైబ్బె ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములను గుంజుకుంటే తామెక్కడికి వెళ్లాలని వాపోయారు. పేదల భూములు పెద్దలకు జిల్లాలోని పేదల భూములను లాక్కుంటున్న ప్రభుత్వం పెద్దలకు కట్టబెడుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శి కాడిగాళ్ల భాస్కర్ ఆరోపించారు. ఎనికేపల్లి భూముల వద్ద ఆందోళన చేపడుతున్న రైతులకు సీపీఎం, బీఆర్ఎస్ నాయకులు మద్దతుగా నిలిచారు. ప్రజా ఉపయోగం కోసం ప్రభుత్వం భూ సేకరణ చేయాల్సి వస్తే 2013 భూ సేకరణ చట్టం ప్రకారం గ్రామసభ నిర్వహించి, ప్రజలతో చర్చించాలన్నారు. కానీ ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు దేవమొళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ.. మొయినాబాద్లోని విలువైన భూములపై ప్రభుత్వం కన్ను పడిందన్నారు. గోశాల ఏర్పాటుకు నల్లమల అటవీ ప్రాంతంలో చాలా భూములున్నాయని.. అక్కడ గోశాల ఏర్పాటు చేయొచ్చని తెలిపారు. పచ్చని పంటలు పండే భూములపై పడొద్దని కోరారు. రైతులతో అధికారుల చర్చలు గోశాల కోసం సేకరించనున్న భూముల రైతులతో చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్ గౌతమ్కుమార్, ఏసీపీ కిషన్ బుధవారం సాయంత్రం చర్చలు జరిపారు. డిమాండ్లను చెబితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సూచించారు. దీనిపై స్పందించిన రైతులు తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని కోరగా.. అది సాధ్యం కాదని తేల్చిచెప్పారు. మీ ఆధీనంలోని 99.14 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని.. రికార్డుల్లో ఎక్కడా మీ పేర్లు లేవని తెలిపారు. అయినా న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చర్చలను సోమవారానికి వాయిదా వేశారు. మా శవాలమీద గోశాల కట్టండి ఎనికేపల్లి రైతుల ఆందోళన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు మద్దతు తెలిపిన సీపీఎం, బీఆర్ఎస్ నేతలు -
మున్సిపాలిటీ వార్డుల జాబితా విడుదల
చేవెళ్ల: కొత్త మున్సిపాలిటీగా ఏర్పడిన చేవెళ్లలో 18 వార్డుల విభజనతో ముసాయిదా జాబితాను ప్రభుత్వం విడుదల చేసిందని కమిషనర్ పూర్ణచందర్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. చేవెళ్ల కొత్త మున్సిపాలిటీగా చుట్టూ ఉన్న 12 గ్రామాలు చేవెళ్ల, దామరగిద్ద, ఇబ్రహీంపల్లి, రామన్నగూడ, ఊరేళ్ల, దేవునిఎర్రవల్లి, మల్కాపూర్, పలుగుట్ట, మల్లారెడ్డిగూడ, కందవాడ, పామెన, కేసారం గ్రామాల విలీనంతో ఏర్పాటైనట్లు తెలిపారు. వార్డుల విభజనను చట్టం ప్రకారం నియమ నిబంధనలను పాటిస్తూ మున్సిపాలిటీ పరిధిలోని జనాభా, ఓటర్లు, ఇంటి నంబర్లు, గూగల్ మ్యాప్ల ఆధారంగా వార్డుల విభజన చేశామన్నారు. మొత్తం మున్సిపాలిటీలో ఓటర్లు 24,872లు కాగా వీటిని 18 వార్డులకు సమానంగా ఏర్పాటు చేయటంతో నిబంధనల మేరకు ఒక వార్డులో 1,516కి మించకుండా ఉన్నారన్నారు. ఓటర్లు, గ్రామ మ్యాపులను, సరిహద్దులను పరిశీలనలోకి తీసుకొని ఈ విభజన చేశామని పేర్కొన్నారు. వార్డులకు సంబంధించి ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే 5 నుంచి 11వ తేదీవరకు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్కు లిఖిత పూర్వకంగా అందించాలని కోరారు. వార్డుల విభజనకు సంబంధించిన జాబితాలను ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయంలో నోటీస్ బోర్డులలో పెట్టామని స్పష్టం చేశారు. ప్రజలు గమనించాలని కోరారు. దేవునిఎర్రవల్లి నుంచి 1వ వార్డుతో మొదలై ఊరేళ్ల, మల్కాపూర్, కేసారం, కందవాడ, పలుగుట్ట, మల్లారెడ్డిగూడ, పామెన, దామరగిద్ద, రామన్నగూడ, ఇబ్రహీంపల్లి, చేవెళ్ల గ్రామాల వారీగా వరుసగా ఈ 18 వార్డుల విభజన జరిగిందన్నారు. జాబితాపై నేటి నుంచి 11వ తేదీవరకు అభ్యంతరాలు, సలహాల స్వీకరణ మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్ -
నవ వధువు అదృశ్యం
శంషాబాద్ రూరల్: ప్రేమ వివాహం చేసుకున్న నవ వధువు అదృశ్యమైన ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఇస్తారి చేతన్, మౌనిక గత నెల 20న ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరూ ముచ్చింతల్లోని వినోద్ గార్డెన్లో నివాసముంటున్నారు. ఈ నెల 1న స్నేహితుడి పెళ్లికి వెళ్లడానికి దంపతులు సిద్ధమవుతుండగా.. ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. ఈ క్రమంలో ఈ నెల 3న ఉదయం చేతన్ డ్యూటీ కోసం తుక్కుగూడకు వెళ్లాడు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మౌనిక ఇంట్లోనే ఉంది. మధ్యాహ్నం మౌనికకు భర్త ఫోన్ చేయగా..స్విచ్చాఫ్ వచ్చింది. కాసేపటికి మౌనిక ఇంట్లో కనిపించడంలేదని చేతన్కు కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. దీంతో ఆమె కోసం అన్ని చోట్ల వెతికినా జాడ తెలియకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.బాలుడి అదృశ్యం కొందుర్గు: బాలుడు అదృశ్యమైన సంఘటన మండల పరిధి శ్రీరంగాపూర్ చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్రాపూర్ గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల అంజమ్మ, రామచంద్రయ్య దంపతుల కూతురు యాదమ్మను శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన చిటికెల నర్సింహులుకు ఇచ్చి 20 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి శ్రీశైలం, శ్రీకాంత్ ఇద్దరు కుమారులు. వీరి చిన్నతనంలోనే 13 ఏళ్ల క్రితం కుటుంబ తగాదాల కారణంగా తల్లి,తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో బాలలు ఇద్దరు స్వగ్రామంలోని నాయనమ్మ చంద్రమ్మ దగ్గరకు వచ్చారు. బుధవారం ఉదయం చిన్న మనవడు శ్రీకాంత్ ఇంటినుంచి వెళ్లిపోయాడు. తిరిగి రాలేదు. బంధువులు, పరిసర గ్రామాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో బాలుడి అమ్మమ్మ అంజమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రవీందర్ నాయక్ తెలిపారు.రోడ్లపై గెలుపు సంబరాలు.. ఇద్దరు యువకులపై కేసుగచ్చిబౌలి: ఐపీఎల్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్పై ఆర్సీబీ గెలుపుతో మంగళవారం రాత్రి సంబరాలు చేసుకునేందుకు యువకులు పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరుకున్నారు. కొండాపూర్ సిగ్నల్ వద్ద దాదాపు 150 మంది యువకులు బాణసంచా కాల్చుతూ వాహనాలకు దారి వ్వకుండా హల్చల్ చేసి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగించారు. హెచ్సీయూ డిపోకు చెందిన రూట్ నెంబర్ 10 హెచ్ బస్సు సికింద్రాబాద్ నుంచి కొండాపూర్ క్రాస్ రోడ్డుకు చేరుకుంది. అక్కడ బస్సు యూటర్న్ తీసుకోవాల్సి ఉండగా యువకులు రోడ్డుపై తిష్ట వేశారు. చాలా సేపు హారన్ కొట్టినా పక్కకు జరగకుండా బస్సును అడ్డుకున్నారు. ఇద్దరు గుర్తు తెలియని యువకులు బస్సు ఎక్కి ముందుకు కదలకుండా చేశారు. అంతే కాకుండా వాహనాల రాకపోకలకు తీవ్ర ఆంటంకం కల్గించడంతో ట్రాఫిక్జాం నెలకొంది. ఈ క్రమంలో ఇద్దరు గుర్తు తెలియని యువకులు తన విధులకు ఆటంకం కల్గించారని డ్రైవర్ పోచయ్య గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ప్రేమ పేరుతో మోసం.. పోక్సో చట్టం కింద నిందితుడి అరెస్టుబంజారాహిల్స్: ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతితో సన్నిహితంగా ఉన్న తర్వాత... మరో యువతిని వలలో వేసుకున్న ఘటనలో నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేసి బుధవారం రిమాండ్కు తరలించారు. పోలీసుల సమాచారం మేరకు... బిహార్కు చెందిన సునీల్యాదవ్ గచ్చిబౌలిలోని హైహోమ్ బుజా అపార్ట్మెంట్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఓ యువతి బతుకుదెరువు నిమిత్తం ఏడు నెలల క్రితం హైదరాబాద్కు రాగా ఆమెకు సునీల్ యాదవ్తో పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సునీల్ తరచూ ఆమెను బంజారాహిల్స్ రోడ్డునెంబర్–5లోని దేవరకొండ బస్తీలో ఉన్న తన స్నేహితుడి గదికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇటీవల సునీల్ మరో యువతితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడాన్ని గమనించిన బాధితురాలు ఇదేం పద్ధతి అంటూ ప్రశ్నించి గొడవ పడి తనను పెళ్లి చేసుకోవాలని నిలదీసింది. అందుకు నిందితుడు నిరాకరించడంతో తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సునీల్యాదవ్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
రెండు వాహనాలు ఢీ..
చేవెళ్ల: ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధి దామరగిద్ద బస్స్టేజి సమీపంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. హైదరాబాద్ చంపాపేట్కు చెందిన డ్రైవర్ శ్రీనివాస్.. ఎంజీ కారులో తనతో పాటు ముగ్గురు వ్యక్తులతో నగరం నుంచి వికారాబాద్వైపు వెళ్తున్నారు. చేవెళ్ల మండలం దామరగిద్ద సమీపంలోకి రాగానే.. వికారాబాద్ వైపు నుంచి చేవెళ్ల వైపు వస్తున్న ట్రాలీ ఆటో వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు, ఆటో ముందు భాగాలు దెబ్బతిన్నా యి. స్వల్పగాయాలతో ఆటో డ్రైవర్, కారులోని నలుగురు వ్యక్తులు బయటపడ్డారు. ఘటనా అనంతరం భారీగా ట్రాఫిక్ జాం అయింది. పోలీసులు వచ్చి రోడ్డుపై నుంచి రెండు వాహనాలను పక్కకు తొలగించి, ట్రాఫిక్ క్లియర్ చేశారు. గాయపడిన వారిని చేవెళ్లలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పో లీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.ఐదుగురికి స్వల్ప గాయాలు -
డిజిటల్ మోసాలతో దడ!
నగరంలో రోజురోజుకు సైబర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఆన్లైన్లో మోసగాళ్లు ఈజీగా నమ్మిస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. బిజినెస్ అవకాశాలు, యూపీఐ చెల్లింపులు, పొరపాటు నగదు బదిలీలతో మోసపోయిన వారంతా ఇప్పుడు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సనత్నగర్: నకిలీ వెబ్సైట్ ఆధారంగా ఆన్లైన్ ట్రేడింగ్లో రూ.24 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోవడంతో కలత చెందిన ఓ వ్యక్తి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఘటన సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సనత్నగర్ ఎస్సార్టీకాలనీకి చెందిన లారెన్స్ కుమారుడు రెవరెండ్ జాన్ డి బెనోని ఆన్లైన్ ట్రేడింగ్లో రూ.24 లక్షలు పెట్టుబడి పెట్టి పోగొట్టుకున్నాడు. దీనిపై వెంటనే గచ్చిబౌలిలోని సైబరాబాద్లోని సైబర్ క్రైమ్ బ్రాంచ్లో ఫిర్యాదు చేశాడు. కానీ జాన్ డి బెనోని మానసికంగా కుంగిపోయాడు. తీవ్ర కలత చెందడంతో పాటు భయపడిపోయి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రిజిస్టర్ చేయని బ్లూ యాక్టివా–7జి వాహనం తీసుకుని వెళ్లిపోయాడు. ఇంటికి తిరిగిరాకపోవడంతో తండ్రి లారెన్స్ పలుచోట్ల వాకబు చేసినా ఫలితం లేకుండాపోయింది. దీంతో తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకరికి యూపీఐ పేమెంట్ చేయబోయి మరొకరికి.. తోటి కోడలుకు నగదు బదిలీ చేయాలని భావించిన మహిళ పొరపాటు మరో వ్యక్తికి రూ.51,400 పంపించగా..అతను తిరిగి ఆ మొత్తాన్ని తిరిగి పంపించడానికి నిరాకరిస్తుండడంతో బాధితురాలు సనత్నగర్ పోలీసులను ఆశ్రయించింది. ఫతేనగర్లో నివాసం ఉండే లక్ష్మణ్ గాయత్రి గత నెల 22న తన తోటి కోడలుకు రూ.51,400 బదిలీ చేయాలని భావించింది. ఈ క్రమంలో పొరపాటున మరో వ్యక్తి నెంబర్కు పంపించింది. దీంతో లక్ష్మణ్ గాయత్రి ఆ నెంబర్లోని వ్యక్తిని సంప్రదించగా ఆ నగదును తిరిగి పంపించేందుకు నిరాకరిస్తూ వస్తున్నాడు. ఎంతగా బతిమాలినా పంపించకపోవడంతో బాధితురాలు బుధవారం సనత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నగదు అవసరమంటూస్నేహితుడి పేరిట సందేశం.. డబ్బు అవసరం ఉందని తన స్నేహితుడి పేరిట వచ్చిన వాట్సప్ సందేశానికి స్పందించిన ఓ వ్యక్తి రూ.50 వేలు పోగొట్టుకున్నాడు. సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సనత్నగర్ జెక్కాలనీ రోడ్డనెంబర్–1లోని వాసవీ డ్రీమ్స్ అపార్ట్మెంట్లో నివాసం ఉండే శామ్యూల్ బర్నబాస్కు గత నెల 26న తన స్నేహితుడికి అత్యవసరంగా డబ్బు అవసరమంటూ వాట్సప్లో సందేశం వచ్చింది. వెంటనే తన స్నేహితుడిగా భావించి రూ.50 వేలు పంపించాడు. అనంతరం స్నేహితుడిని ఫోన్లో సంప్రదించగా, డబ్బు కావాలంటూ తాను ఎలాంటి సందేశం పంపలేదని చెప్పడంతో శామ్యూల్ అవాక్కయ్యాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించి సనత్నగర్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హెలికాఫ్టర్ సేవల పేరుతో టోకరా ఇన్స్ట్రాగాం బిజినెస్ పేజీ వేదికగా ‘హెలీ’ సేవలకు సంబంధించిన ప్రకటనను చూసి ఓ వ్యక్తి రూ.34,616 కోల్పోయిన సంఘటన సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సనత్నగర్కు చెందిన నరేష్ గత నెల 27న ఇన్స్ట్రాగాం వ్యాపార పేజీని చూస్తున్న సమయంలో పాట్నా నుంచి కేదార్నాథ్కు హెలీ సేవలు అందిస్తున్నట్లుగా ఓ ప్రకటన వచ్చింది. ఆ ప్రకటనను చూసిన నరేష్ అందులో ఇచ్చిన నెంబర్ ఆధారంగా సంప్రదించాడు. అయితే ముందస్తు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అందుకు రూ.34,616 పంపించాల్సిందిగా అవతలి వ్యక్తి చెప్పా డు. దీనిని నిజమని భావించిన నరేష్ ఆ మొత్తాన్ని యూపీఐ ద్వారా పంపించాడు. నగదును పంపించినప్పటికీ మళ్లీ చెల్లించాలని కోరారు. దీనిపై అనుమానం కలగడంతో బాధితుడు బుధవారం సనత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలి కాలంలోభారీగా పెరిగిన ఆన్లైన్ ఫ్రాడ్స్ సొమ్ము కోల్పోతున్న అమాయకులు ఆపై పోలీసులను ఆశ్రయిస్తున్న వైనం -
మున్సిపాలిటీ.. మారాలిక!
షాద్నగర్: మున్సిపాలిటీల్లో అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వంద రోజుల ప్రణాళికను రూపొందించి, అమలు చేస్తోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ప్రారంభమైన కార్యక్రమం.. సెప్టెంబర్ 10 వరకు కొనసాగనుంది. కార్యాచరణ ఇలా.. మున్సిపాలిటీ పాలకవర్గాల గడువు ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిస్తోంది. పట్టణ ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించింది. మున్సిపాలిటీలోని అన్ని విభాగాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగుతోంది. నిత్యం అధికారులు వార్డుల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పచ్చదనం పెంపునకు.. వర్షాకాలం ప్రారంభం కావడంతో పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు చేపట్టారు. వార్డుల్లో, ప్రధాన కూడళ్లు, పార్కులు, మున్సిపాలిటీకి సంబంధించిన స్ధలాల్లో మొక్కలు నాటుతున్నారు. ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేయనున్నారు. వ్యాధులు ప్రబలకుండా.. వర్షాకాలం ప్రారంభం కావడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీంతో వీధులు, డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి తడి పొడి చెత్తను వందశాతం వేర్వేరుగా సేకరించడం, మురుగు కాల్వల పూడిక తీత, మురుగు కుంటలు, వరద నీటి కాల్వలను గుర్తించి శుభ్రం చేస్తున్నారు. దోమల నివారణకు మందు పిచికారీ చేసి, పారిశుద్ధ్యాన్ని మెరుగు పర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మహిళా శక్తి క్యాంటీన్లు పట్టణాల్లో కొత్తగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వీటిని ప్రారంభించేందుకు ఆసక్తి ఉన్న వారిని గుర్తించి, ఈ నెలాఖరు వరకు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా పట్టణాల్లో వీధి వ్యాపారులను గుర్తించి, వారికి రుణాలు ఇప్పించనున్నారు. కొత్తగా పొదుపు సంఘాలను ఏర్పాటుకు చేసి, మహిళల ఆర్థికాభివృద్ధికి తగిన ప్రోత్సాహాన్ని అందించనున్నారు. అభివృద్ధి పనులకు శ్రీకారం ఇంజినీరింగ్ విభాగంలో అభివృద్ధి పనులకు టెండర్లు నిర్వహించనున్నారు. వార్డుల్లో ఉన్న సమస్యలను అధికారులు గుర్తించి, అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. తాగునీటి సరఫరా మెరుగుపర్చడం, పైప్లైన్ లీకేజీలను గుర్తించి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయనున్నారు. అదేవిధంగా వార్డుల్లో అక్రమ నల్లా కనెక్షన్లను గుర్తించి, వాటిని క్రమబద్ధీకరించనున్నారు. అదేవిధంగా భువన్ యాప్లో ఇళ్ల లెక్క పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రతి ఇంటిని యాప్లో నమోదు చేయనున్నారు. స్వచ్ఛత పై అవగాహన పట్టణంలో పారిశుద్ధ్యంతో పాటు, స్వచ్ఛత ఆరోగ్యం పై అధికారులు దృష్టి సారించారు. ఇందుకు వార్డులో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంటి పరిసరాల శుభ్రత, తడి పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వైద్యశాఖ సమన్వయంతో క్షేత్ర స్థాయిలో వ్యాధుల వ్యాప్తిపై ఆరా తీస్తున్నారు. కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ మున్సిపాలిటీల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది ఆరోగ్యంపై వంద రోజుల ప్రణాళికలో ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. ప్రవేటు ఆసుపత్రుల సహకారంతో కార్మికులకు వైద్య శిబిరాలను నిర్వహించనున్నారు. మందులు పంపిణీ చేయనున్నారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ వారి ఖాతాల్లో జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. అభివృద్ధికి వంద రోజుల ప్రణాళిక వ్యాధులు ప్రబలకుండా చర్యలు పచ్చదనం పెంపునకు మొక్కల పంపిణీ తడి, పొడి చెత్తపై అవగాహన సదస్సులు సెప్టెంబర్ 10వరకు ప్రత్యేక కార్యాచరణ అందరు భాగస్వామ్యం కావాలి పట్టణ అభివృద్ధికి ప్రభు త్వం వంద రోజుల కార్యాచరణ రూపొందించింది. ప్రణాళికను పక్కాగా అమలు చేస్తున్నాం. స్వచ్ఛతకు, అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి – సునీత, మున్సిపల్ కమిషనర్, షాద్నగర్ -
ఔటర్.. ఔరా!
సాక్షి, సిటీబ్యూరో: భాగ్యనగరానికి మణిహారమైన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)ను ఉద్యోగ, ఉపాధి అవకాశాల కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కేంద్రాలతో అనుసంధానంగా ఉంటూ ఇతర నగరాలకు వెళ్లేందుకు అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో నిర్మితమైన ఔటర్ చుట్టూ ఐటీ, పరిశ్రమల స్థాపనకు శరవేగంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి ప్రాంతాల్లో సెజ్ తరహాలో కంపెనీలకు స్థలాలను కేటాయించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో సంస్థలకు చేరువలో నివాసాలు ఉండేలా కసరత్తు చేస్తున్నారు. దీంతో నగరాభివృద్ధి విస్తరించడంతో పాటు వాక్ టు వర్క్ విధానంలో ఆయా ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. కనిష్టంగా వెయ్యి ఎకరాలు ఔటర్ చుట్టూ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ భూములను సేకరించేందుకు రెవెన్యూ అధికారుల కసరత్తు చేస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఔటర్కు సమీపంలోని కొన్ని ప్రాంతాలు, విమానాశ్రయానికి దగ్గరగా ఉండే మరికొన్ని ప్రాంతాలను ఇప్పటికే పరిశీలించారు. శేరిలింగంపల్లి, మహేశ్వరం, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలో ఒక్కోచోట వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా భూములను సేకరించాలని అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. మరోవైపు గతంలో ఏవైనా సంస్థలకు స్థలాలు ఇచ్చి అవి ఇంకా కార్యకలాపాలు ప్రారంభించకపోతే వాటిని వెనక్కి తీసుకునే మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. ఇందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. వాక్ టు వర్క్ తరహాలో.. ఔటర్ చుట్టూ రానున్న పరిశ్రమలు వాక్ టు వర్క్ విధానంలో ఉండాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. కంపెనీలకు చేరువలోనే నివాసాలు ఉండేలా ప్రణాళికలు చేస్తున్నారు. స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్) తరహాలో ఒకేచోట 300 ఎకరాల భూములు సేకరించాలని, పరిశ్రమలు, ఐటీ సంస్థలకు సమీపంలో ప్రభుత్వ స్థలాలను అభివృద్ధి చేస్తే అక్కడ నివాసం ఉండేందుకు వీలుంటుందని రెవెన్యూ అధికారుల భావిస్తున్నారు. ఇందుకోసం 300 గజాల చొప్పున ప్లాట్లుగా విభజించాలని నిర్ణయించారు. రోడ్లు, తాగునీరు, మురుగు నీటి వ్యవస్థలను అందుబాటులో ఉండేలా ప్రణాళికలు చేస్తున్నారు. అభివృద్ధి విస్తరణ ఇప్పటికే ఫాక్స్కాన్ సంస్థ రంగారెడ్డి కలెక్టరేట్కు సమీపంలో యాపిల్ ఫోన్ విడిభాగాల తయారీ ప్లాంట్కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీంతో పాటు మహేశ్వరం మండలం తుక్కుగూడలో ఎలక్ట్రానిక్ సిటీ బాగా ప్రాచుర్యం పొందింది. ఈ రెండు పరిశ్రమలతో పాటు షాబాద్ మండలంలో విద్యుత్ బస్సుల తయారీ, టెక్స్టైల్స్ పరిశ్రమలు ఇప్పటికే తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐటీ, పరిశ్రమల హబ్లలో పరిశ్రమలు, ఐటీ సంస్థలతో పాటు వాటికి సమీపంలో విద్యా సంస్థలు, వినోద కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు, రెస్టారెంట్లను ప్రారంభిస్తే నాలుగైదేళ్లలోనే అక్కడ కూడా అభివృద్ధి పెరిగి నగరాభివృద్ధి మరింత విస్తరించే అవకాశముంది. ఓఆర్ఆర్ చుట్టూ అభివృద్ధికి సర్కారు అడుగులు Isîæ, ç³Ç{Ôèæ-Ð]l$-ÌSMýS$ çܦÌêÌS MóSsê-Ƈ$$…-ç³#-¯]lMýS$ MýSçÜÆý‡™èl$¢ òÜgŒæ ™èlÆý‡àÌZ HÆ>µr$ ^ólĶæ*ÌS° °Æý‡~Ķæ$… కంపెనీలు, నివాసాలు ఒకేచోట ఉండేలా ప్రణాళికలు -
పత్తి.. ఆసక్తి
యాచారం: తెల్ల బంగారం సాగువైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు. గతేడాది జిల్లా వ్యాప్తంగా పత్తి దిగుబడితో మంచి ఆదాయం పొందారు. ఈ ఏడాది సైతం సాగుకు దృష్టి సారిస్తున్నారు. పక్షం రోజుల క్రితం కురిసిన వర్షాలకు పొలాలను దున్ని విత్తనాలు విత్తుకోవడానికి సిద్ధం చేసి ఉంచారు. వర్షాలు కురిస్తే చాలు వెంటనే విత్తనాలు విత్తుకోవడానికి రెడీ అయ్యారు. జిల్లాలో గతేడాది లక్ష 20 వేల ఎకరాల వరకు పత్తి సాగైంది. మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్, యాచారం, ఆమనగల్లు, యాచారం, షాద్నగర్, నందిగామ, మహేశ్వరం, కందుకూరు తదితర మండలాల్లో గణనీయంగా సాగు చేశారు. గతేడాది ధర మార్కెట్లో రూ.7,400కు (సీసీఐ నిర్ణయించిన ప్రకారం) పైగా డిమాండ్ పలికింది. సాగు చేసిన రైతులకు రూ.లక్షల్లో లాభాలు కలిసొచ్చాయి. వర్షాలు అదునులో కురవడంతో దిగుబడికి ఢోకా లేకుండా పోయింది. దీంతో ఈ ఏడాది అదనంగా సాగు చేసే యోచనలో ఉన్నారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే విత్తనాలు విత్తారు. 450 కేంద్రాల్లో విత్తనాల కిట్స్ నిల్వ ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా లక్షన్నర ఎకరాలకు పైగా పత్తి సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. విస్తీర్ణానికి తగ్గట్టు విత్తనాలు నిల్వ చేసి ఉంచింది. సీడ్స్ లైసెన్స్లున్న 450 కేంద్రాల్లో కిట్స్ నిల్వ ఉంచింది. దాదాపు 4 లక్షల విత్తనాల కిట్స్ అవసరం ఉంటాయని ముందు జాగ్రత్త చర్యగా రెండున్నర లక్షల నాణ్యమైన కిట్స్ సిద్ధం చేసింది. మరో లక్ష కిట్స్ వెంటనే తెచ్చుకునేలా ఆర్డర్ పెట్టుకోవాలని డీలర్లకు సూచించింది. విత్తనాల ప్యాకెట్ల ధర, విక్రయాల స్టాక్ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపింది. విత్తనాల ప్యాకెట్లపై ఉన్న ధర ప్రకారమే విక్రయించాలని, కొనుగోలు చేసిన రైతులకు వెంటనే రసీదులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. నకిలీ కట్టడిపై ప్రత్యేక బృందాలు జిల్లా వ్యాప్తంగా పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశ ఉందని అంచనావేసిన వ్యవసాయ శాఖ నకిలీ విత్తనాలు కూడా భారీగా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు గుర్తించింది. ఇందు కోసం జిల్లా స్థాయిలో రెండు, డివిజన్ స్థాయిలో ఆరు, మండల స్థాయిలో ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసింది. ఇప్పటికే మండల స్థాయిలో వ్యవసాయాధికారి, పోలీస్ శాఖ, సీడ్స్ అధికారుల ఆధ్వర్యంలో లైసెన్స్డ్ డీలర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలు అరికట్టే విషయమై సూచనలు చేసింది. గతేడాది కొన్ని మండలాల్లో లైసెన్స్డ్ పొందిన డీలర్లే అధిక ఆదాయం ఆశతో నకిలీ విత్తనాలు విక్రయించడంతో పాటు కొరత సృష్టించి ప్యాకెట్లపై ఉన్న ధర కంటే రెండింతలు వసూలు చేశారు. అప్పట్లో అధికారులు కూడా డీలర్లతో కుమ్మకై ్కనట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఏడాది అలాంటి ఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా వ్యవసాయ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. అయినా అనేక గ్రామాలకు పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలు చేరినట్లు ప్రచారం జరుగుతోంది. 54 ఎకరాల్లో సాగుకు రెడీ గతేడాది పత్తి దిగుబడితో మంచి లాభాలు పొందాను. ఈ ఏడాది 54 ఎకరాల్లో సాగుకు సిద్ధమయ్యాను. పక్షం రోజుల క్రితం కురిసిన వర్షానికి పొలాన్ని దున్ని ఉంచాను. విత్తనాల కొనుగోలు, పొలాన్ని దున్నించడం కోసం ఇప్పటికే రూ.8 లక్షలకు పైగా ఖర్చు చేశాను. – బత్తుల కొండల్రెడ్డి, రైతు, మాడ్గుల విస్తీర్ణం పెరిగే అవకాశం ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. దీనికి తగ్గట్లు విత్తనాల కిట్స్ నిల్వ చేసేలా చర్యలు చేపట్టాం. కొరత రానివ్వం. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేశాం. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. – బి.నర్సింహారావు, జిల్లా వ్యవసాయాధికారి మాడ్గులలో పత్తి సాగుకు పొలాన్ని సిద్ధం చేస్తున్న రైతు తెల్ల బంగారంపై వైపు మొగ్గు చూపుతున్న కర్షకులు ఈ ఏడాది జిల్లాలో లక్షన్నర ఎకరాలకు పైగా అంచనా ఇప్పటికే పొలాలను సిద్ధం చేసి ఉంచిన రైతులు అవసరం మేరకు విత్తనాల నిల్వ నకిలీని అరికట్టడానికివ్యవసాయ శాఖ ప్రత్యేక నిఘా -
జూన్ పిడుగు
తుక్కుగూడ: నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు ‘జూన్ పిడుగు’ రానే వచ్చింది. ఈనెలలోనే విద్యా సంవత్సరం ప్రారంభం కానుండడం.. రైతులు వ్యవసాయం కోసం పెట్టుబడులు పెట్టాల్సి రావడం.. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు నగరానికి దగ్గరగా వచ్చి అద్దెలకు ఉంటుండడంతో ఖర్చు తడిసి మోపెడు కానుంది. ఏడాదంతా దాచుకున్న సొమ్ము ఒక్క జూన్లోనే ఆవిరికానుంది. డబ్బులు లేకుంటే అప్పు చేయడం, అవసరాలకు అనుగుణంగా సమాకూర్చుకోవడం కోసం ఆర్థిక స్థితిగతులపై అంచనాలు వేసుకుంటున్నారు. విద్యకు అధిక ఖర్చు నర్సరీ మొదలు డిగ్రీ.. ఆపై ఉన్నతస్థాయి చదువులు చదివే పిల్లలుంటే ఆ కుంటుంబానికి విద్యాపరమైన ఖర్చులు భారం కానున్నాయి. ప్రవేట్ విద్యా సంస్థల్లో చదివితే అడ్మిషన్ ఫీజు, ఏడాది ఫీజు, పుస్తకాలు, సేష్టనరీ, నోటు పుస్తకాలు, యూనిఫాం, షూ, ట్యూషన్ ఫీజు, లంచ్ బాక్స్లు, వాటర్ బాటిళ్లు, బ్యాగులు, ట్రాన్స్పోర్ట్ చార్జీలు ఇలా ఖర్చులు పెరిగిపోనున్నాయి. పాఠశాల, కళాశాల ఆధారంగా అంతే పెద్ద మొత్తం ఖర్చు చేయాల్సి వస్తోంది. వసతి గృహాల్లో ఉంటే హాస్టల్ ఫీజు అదనంగా భరించాల్సిందే. విద్యా సంస్థల్లో విడతల వారీగా ఫీజు వెసులుబాటు కల్పిస్తున్నప్పటికీ పెద్ద మొత్తంలో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్న తల్లిదండ్రులకు సైతం నోటు బుక్స్, సేష్టనరీ, వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు ట్రంక్ బాక్స్, డ్రెస్లు, ఇతర ఖర్చులు ఉంటున్నాయి. సాగు ఖర్చులూ ఇప్పుడే.. జూన్ నెల వచ్చిందంటే రైతులకు వ్యవసాయ పెట్టుబడులు భారం అవుతున్నాయి. రోహిణి కార్తె పూర్తికావస్తూ.. మృగశిర రానుండటంతో రైతులు వ్యవ సాయ పనులు చేపడుతున్నారు. తొలకరి వర్షాలు కురుస్తుండడంతో సాగుకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దున్నకాలు, విత్తనాలు, ఎరువులు, కూలీలు, కౌలు రైతులైతే కౌలు చెల్లించడం లాంటి ఖర్చులు ఉంటాయి. దసరా, దీపావళి అంటే అక్టోబర్, నవంబర్ నెలల్లో పంటలు చేతికి రానున్నాయి. అప్పటి వరకు రైతులు పెట్టుబడి ఖర్చులు చేయాల్సి వస్తోంది. అటు వ్యవసాయ ఖర్చులు, ఇటు పిల్లల చదువు ఖర్చులు మోయలేని భారంగా మారాయి. అద్దె ఇళ్లకు అడ్వాన్స్లు జిల్లా సరిహద్దు, లోపల అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. నాణ్యమైన విద్య నగరంలో అందుతుందని తల్లిదండ్రుల విశ్వాసం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారు జిల్లాకు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కొత్తగా వచ్చిన వారు ఇళ్లు అద్దెకు తీసుకోవడం, ఉన్న వారు అద్దె మారడం జరుగుతోంది. దీంతో వారిపై అద్దె అదనపు భారం పడుతోంది. జిల్లాలో అర్బన్ ప్రాంతం ఎక్కువుగా ఉండటంతో అద్దె కూడా అధికంగా ఉంటోంది. సాగుకు పెట్టుబడి కావాలి ప్రస్తుతం పంటల సాగుకు అనుకూలంగా వర్షాలు కురుస్తున్నాయి. వరి, కూరగాయల పంటలు సాగు చేయడానికి సిద్ధం అవుతున్నాను. విత్తనాలు, ఎరువుల కొనుగోలు, దున్నకాలు, కూలీలకు ఇలా రూ. 2లక్షల వరకు పెట్టుబడి కావాలి. – సియోదన్, రైతు, రావిర్యాల పిల్లల చదువులకు అప్పు ప్రతి సంవత్సరం బడి తలుపులు తెరుచుకుంటే చాలు భయంగా ఉంటోంది. పిల్లలకు పుస్తకాలు, దుస్తులు, ఫీజులు తదితర ఖర్చులు ఏటా పెరిగిపోతున్నాయి. పిల్లల భవిష్యత్తు కోసం అప్పులు చేస్తున్నాం. – బండ శ్రీను, ఇమూమ్గూడ అ‘ధన’పు భారం భయపెడుతున్న విద్యా సంవత్సరం తల్లిదండ్రులకు పెరిగిన ఖర్చు రైతులైతే అటు వ్యవసాయ పెట్టుబడులు, ఇటు విద్యా ఖర్చులు తడిసి మోపెడు -
మూడు రోజులుగా అవే తిప్పలు
ఇబ్రహీంపట్నం: మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తుండడంతో ఈ పాస్ సర్వర్లు సక్రమంగా పనిచేయక ఆహారభద్రత కార్డుదారులకు తిప్పలు తప్పడం లేదు. మూడు రోజులుగా ఇబ్బందులకు గురవుతున్నా అధికార యంత్రాంగం ఇంకా సరిచేయకపోవడం గమనార్హం. ఈనెల 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మూడు నెలల బియ్యం ముందస్తుగా అంటే ఒక యూనిట్కు 18 కిలోల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే బియ్యం కోటాలకు ఒకేసారి వేలిముద్రలు వేస్తే పనిచేయడం లేదు. వేర్వేరుగా ఆరుసార్లు మిషన్పై నొక్కాల్సి వస్తోంది. దీనికితోడు ఈ పాస్ సర్వర్లు మొరాయిస్తుండడంతో మరింత జాప్యం అవుతోంది. 15 నిమిషాలకు ఒక కార్డుదారుని వేలిముద్రల ప్రక్రియ పూర్తవుతుండడంతో గంటకు నాలుగైదు కార్డులకు మించి నమోదు చేయలేని పరిస్థితి. దీంతో పనులు పక్కన పెట్టి జనాలు గంటల తరబడి రేషన్ దుకాణాల వద్ద పడి గాపులు కాస్తున్నారు. కోటా పంపిణీలో జాప్యం కారణంగా పలు షాపులు తెరిచేందుకు దుకాణదారులు జంకుతున్నారు. ఈపాస్ సర్వర్ మిషన్ ఇబ్బందులు తొలగించేందుకు సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.రేషన్ దుకాణాల వద్ద తప్పని పడిగాపులు -
చచ్చినా.. భూములివ్వం
మొయినాబాద్: తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్నాం.. ఈ భూమి తప్ప మాకు మరెక్కడా భూమి లేదు.. మా భూములు తీసుకుంటే మేం ఎట్లా బతకాలి.. చస్తే ఇక్కడే చస్తాం కానీ భూములు వదిలిపెట్టమని .. మీరే న్యాయం చేయండి.. అంటూ కలెక్టర్ నారాయణరెడ్డి ఎదుట ఎనికేపల్లికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ పరిధిలోని ఎనికేపల్లి రెవెన్యూ సర్వేనంబర్ 180లోని 99 ఎకరాల ప్రభుత్వ భూమిని డైబ్బె ఏళ్లకు పైగా గ్రామానికి చెందిన యాబై మంది రైతులు సాగుచేసుకుంటున్నారు. ప్రభుత్వం ఆ భూమిని గోషాల ఏర్పాటుకోసం తీసుకుంటోంది. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం కలెక్టర్ నారాయణరెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్పరాజ్, చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్కుమార్తో కలిసి ఎనికేపల్లి భూములను పరిశీలించారు. అధికారులు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న రైతులు, గ్రామస్తులు ముందుగానే అక్కడికి చేరుకున్నారు. తాతల కాలం నుంచి భూమిని దున్నుకుని బతుకుతున్నామని.. 1954లో అప్పటి ప్రభుత్వం తోకపట్టాలు ఇచ్చిందని కలెక్టర్కు వివరించారు. అప్పటి నుంచి 1983 వరకు పన్నులు కట్టామని.. వర్షాధార పంటలు సాగుచేసుకుని జీవనం సాగిస్తున్న తమ పొట్ట కొట్టొద్దని వేడుకున్నారు. భూములు సాగుచేసుకునేది ఎస్సీ, బీసీ కులాలకు చెందిన పేదలమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం భూములు తీసుకుంటే తమకు ఎలాంటి న్యాయం చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. చర్చిద్దాం రండి.. ఎనికేపల్లిలో ప్రభుత్వ భూమి సాగుచేసుకుంటున్న రైతులతో మాట్లాడిన కలెక్టర్ నారాయణరెడ్డి రైతులకు, గ్రామానికి న్యాయం జరిగే విధంగా చూస్తామని చెప్పారు. ప్రభుత్వ అవసరం కోసం భూమిని తీసుకుంటోందని.. ఇందులో రైతులు దున్ని, విత్తనాలు వేయొద్దని అన్నారు. బుధవారం ఆర్డీఓ చంద్రకళ రైతులతో సమావేశమై వారి సమస్యలు, డిమాండ్లపై చర్చిస్తారన్నారు. రైతులు మధ్యాహ్నం 3 గంటలకు తహసీల్దార్ కార్యాలయానికి రావాలని సూచించారు. తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్నాం తీసుకుంటే ఎట్లా బతకాలి కలెక్టర్ ముందు ఎనికేపల్లి రైతుల ఆవేదన న్యాయం జరిగేలా చూస్తాం: కలెక్టర్ నారాయణరెడ్డి -
ఆపరేషన్ సిందూర్ దేశం సత్తా చాటింది
చేవెళ్ల: ఆపరేషన్ సిందూర్తో మన దేశం బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందని ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో మనం సైతం దేశంకోసం అనే నినాదంతో బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం చేవెళ్లలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మన దేశ సైనికుల వీరోచిత పోరాటానికి మద్దతు తెలుపుతూ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఉండే వాళ్లు దేశం నాశనం కోరితే ఇక్కడ ఉండే హక్కు లేదన్నారు. భారత సైన్యానికి దేశమంతా ఏకమై అభినందనలు తెలపాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు అనంత్రెడ్డి, మండల అధ్యక్షుడు ఎం. శ్రీకాంత్, మొయినాబాద్ అధ్యక్షుడు శ్రీకాంత్, చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రూ.కోటి విలువైన కొకై న్ పట్టివేత
జీడిమెట్ల: తిరుపతి నుండి హైదరాబాద్కు కొకై న్, ఇపిడ్రిన్ వంటి మత్తు పదార్థాలు తీసుకువచ్చి అమ్మేందుకు ప్రయత్నించిన ఐదుగురు వ్యక్తుల ముఠాను బాలానగర్ ఎస్వోటీ, కూకట్పల్లి పోలీసులు పట్టుకున్నారు. ఏపీలో టాస్క్ఫోర్స్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ప్రధాన నిందితుడు గుణశేఖర్ పరారీలో ఉన్నాడు. వీరి వద్ద రూ.కోటి విలువచేసే 820 గ్రాముల కొకై న్ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం షాపూర్నగర్లోని డీసీపీ కార్యాలయంలో ఇన్చార్జి డీసీపీ ఎన్.కోటిరెడ్డి, ఎస్వోటీ డీసీపీ డి.శ్రీనివాస్ తదితరులు కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రధాన నిందితుడు ఏపీలో టాస్క్ఫోర్స్ కానిస్టేబుల్.. తిరుపతికి చెందిన గుణశేఖర్ ఏపీలో టాస్క్ఫోర్స్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని స్నేహితుడు ఉన్నం సురేంద్రకు డబ్బు ఆశచూపి మే 29వ తేదీన 820 గ్రాముల కొకై న్ ఇచ్చి తిరుపతి నుంచి హైదరాబాద్కు పంపించాడు. గుణశేఖర్ చెప్పినట్లుగానే సురేంద్ర కొకై న్ తీసుకుని గుంటూరు మీదుగా నగరంలోని కూకట్పల్లికి చేరుకున్నాడు. ఇక్కడ సురేంద్ర తన మనుషులైన బాపట్ల జిల్లాకు చెందిన దోతిరెడ్డి హరిబాబురెడ్డి, దేవరాజు యేసుబాబులను హైదరాబాద్ రప్పించాడు. అదేవిధంగా సురేంద్ర చేగూడి, మెర్సి మార్గరెట్, షేక్ మస్తాన్ వలీలను సైతం పిలిపించుకున్నాడు. అందరూ కలిసి కూకట్పల్లిలోని జయనగర్లో కలుసుకున్నారు. జూన్ 2న పోలీసులు బిజీగాఉంటారని రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు జూన్2న పోలీసులు బిజీగా ఉంటారని..ఆరోజే కొకై న్ అమ్మేందుకు పథకం వేశారు. ఈ మేరకు కూకట్పల్లి భాగ్యనగర్ వైపు వెళ్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు వారిని ఆపి తనిఖీ చేయగా కొకై న్ లభించింది. వెంటనే ఐదుగురిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించి విచారించగా అసలు బండారం బయటపెట్టారు. అసలు కొకై న్ వీరికి ఎక్కడ నుండి వచ్చిందనే విషయం తెలియలేదు. ప్రధాన నిందితుడు గుణశేఖర్ పోలీసులకు పట్టుబడితే అసలు విషయాలు బయటకు వస్తాయి. సమావేశంలో కూకట్పల్లి ఏసీపీ రవికుమార్, ఇన్స్పెక్టర్ రాజేశ్, బాలానగర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్సై కట్కం గౌతం పాల్గొన్నారు. మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ముఠా అరెస్టు తిరుపతి నుంచి కొకై న్, ఎపిడ్రీన్ తదితర డ్రగ్స్ హైదరాబాద్కు తరలింపు ప్రధాన నిందితుడు ఏపీలోపోలీసు శాఖ ఉద్యోగి రూ.కోటి విలువచేసేకొకై న్ స్వాధీనం ప్రధాన నిందితుడుగుణశేఖర్ పరారీ -
‘ఆరోపణల్లో వాస్తవం లేదు’
తుర్కయంజాల్: దళితులను కులం పేరుతో దూషించానంటూ తనపై చేసిన ఆరోపణలు, ఫిర్యాదులో ఎలాంటి వాస్తవం లేదని బీజేపీ సీనియర్ నాయకుడు కందాల బల్దేవ్రెడ్డి అన్నారు. శనివారం కొహెడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అబ్దుల్లాపూర్మెట్ రెవెన్యూ పరిధి కొహెడలోని సర్వే నంబర్ 956లో తనకు ఓపెన్ ప్లాట్ ఉండటంతోనే ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్లో ప్రధాన కార్యదర్శి పదవిని తీసుకున్నాని వివరణ ఇచ్చారు. కులమతాలకు అతీతంగా గ్రామంలో గత ముప్పై ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నానని తెలిపారు. తాను ఎవరి హక్కులకు భంగం కలిగించలేదని స్పష్టంచేశారు. -
మళ్లీ పోలీస్ చేతికి జేమ్స్ స్ట్రీట్ భవనం
బన్సీలాల్పేట్: హెచ్ఎండీఏ మరమ్మతులు చేపట్టిన జేమ్స్ స్ట్రీట్ భవనాన్ని పోలీస్ శాఖకు అప్పగించారని, త్వరలోనే రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ ఇక్కడికి వస్తుందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని రాంగోపాల్పేట్ పురాతన పోలీసు స్టేషన్ను మంగళవారం ఉత్తర మండలం డీసీపీ రష్మి పెరుమాల్, నగర ట్రాఫిక్ డీసీసీ రాహుల్ హెడ్గే తదితరులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడారు. రాంగోపాల్పేట్ పాత పోలీసు స్టేషన్కు హెచ్ఎండీఏ మరమ్మతులు నిర్వహించి బ్రహ్మాండంగా తయారు చేశారన్నారు. సదరు స్టేషన్ను తిరిగి తమకు అప్పగించడం జరిగిందని తెలిపారు. త్వరలో హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. జేమ్స్ స్ట్రీట్ భవనం 1870 సంవత్సరంలో నిర్మించారు. అప్పటి నుంచి 2016 వరకు సుదీర్ఘకాలం రామ్గోపాల్పేట్ పోలీసు స్టేషన్ ఇక్కడే కొనసాగింది. ఆ తర్వాత మరమ్మతుల కోసం తొమ్మిదేళ్ల క్రితం హెచ్ఎండీఏ స్వాధీనం చేసుకుని..ఇప్పుడు అప్పగిస్తోంది. రానున్న కొద్ది రోజుల్లో రాంగోపాల్పేట్ పోలీసు స్టేషన్కు సంబంధించిన వస్తువులను తిరిగి ఇక్కడి తీసుకవచ్చి పోలీసు కార్యకలాపాలు సాగించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే పురాణి హవేలిలోని సిటీ పొలీసు కమిషనర్ కార్యాలయం మరమ్మతులు పూర్తి కావచ్చాయని, త్వరలో ఈ భవనాన్ని ప్రారంభించి అక్కడి నుంచీ నగర పోలీసు కార్యకలాపాలు కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ త్వరలో అక్కడికి తరలింపు సందర్శించిన సీపీ సీవీ ఆనంద్ -
భూ సమస్యలను పరిష్కరించండి
యాచారం/మంచాల: రెవెన్యూ సదస్సులతోనైనా రైతుల భూ సమస్యలను పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగుడాల యాదయ్య ఆకాంక్షించారు. మండల పరిధిలోని తమ్మలోనిగూడ గేట్ వద్ద మంగళవారం నిర్వహించిన మండల కమిటీ, గ్రామ శాఖ కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాడు బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన ధరణి పోర్టల్, నేడు కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన భూ భారతి చట్టంతో రైతులకు ఏ మేరకు న్యాయం జరుగుతుందో అనుమానంగా ఉందన్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా పల్లెల్లో రోజురోజుకు భూ సమస్యలు పెరుగుతూనే ఉన్నాయన్నారు. భూ సమస్యలను పరిష్కరించే విషయంలో అధికారులకు చిత్తశుద్ధి కొరవడిందన్నారు. ఏళ్లుగా తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా రైతులు సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఫార్మాసిటీ గ్రామాల్లోని నిషేధిత జాబితాలో ఉన్న 2,200 ఎకరాల పట్టా భూముల రికార్డులను రైతుల పేరుపై నమోదు చేయాలని తిరుగుతున్నా చలనం లేదన్నారు. సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి నర్సింహ, నాయకులు అంజయ్య, బ్రహ్మయ్య, జంగయ్య, చందునాయక్, వెంకటయ్య, తావునాయక్, జగన్, బాల్రాజ్, భూషణ్, రమేష్, యాదగిరి, శ్రీరాములు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భూములకు పట్టాలివ్వండి మంచాల మండలంలోని చీదేడ్లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ వెంకటప్రసాద్కు పలు సమస్యలపై సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య వినతిపత్రం అందజేశారు. గ్రామంలో 97, 119 సర్వేనంబర్లలోని భూములకు పట్టాలివ్వాలని కోరారు. ఏళ్లుగా సాగుచేసుకుంటున్న రైతులకు నేటికీ పట్టాలు లేకపోవడం బాధకరమన్నారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు శ్యామ్సుందర్, నర్సింహ, వెంకయ్య, సత్తయ్య, వెంకటేష్, యదేశ్వర్, జంగయ్య, రామకృష్ణ, రవి, పవన్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య -
నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లతో విదేశాలకు
శంషాబాద్: అమెరికా నుంచి డిపోర్ట్ అయిన విద్యార్థి సర్టిఫికెట్ నకిలీదిగా తేలడంతో హైదరాబాద్లోని ఓ నకిలీ సర్టిఫికెట్ విక్రయిస్తున్న కన్సెల్టెన్సీ గుట్టు రట్టైంది. శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్గౌడ్ తెలిపిన మేరకు..నల్గొండ జిల్లా పారేపల్లిగూడెం గ్రామానికి చెందిన పకీరు గోపాల్రెడ్డి 2018లో మధురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ పూర్తి చేసినట్లు సర్టిఫికెట్లు సమర్పించి ఏడాదిన్నర కిందట అమెరికాలోని వెబ్స్టర్ వర్సిటీలో 28 వేల డాలర్ల ఫీజు చెల్లించి ఉన్నత చదువులో ప్రవేశం పొందాడు. 15 నెలలు చదివిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చి ఐదు నెలలు ఇక్కడే ఉన్నాడు. నాలుగురోజుల కిందట అమెరికా వెళ్లిన అతడిని అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు యునివర్సిటీలో ఇన్యాక్టివ్ విద్యార్థిగా గుర్తించి స్వదేశానికి తిప్పిపంపారు. దీంతో తిరిగి వచ్చే క్రమంలో ఆదివారం శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అతడి వీసాతో పా టు విద్యార్హత సర్టిఫికెట్లు పరిశీలించగా నకిలీ సర్టిఫికెట్ గుట్టు బయటపడింది. దీంతో అతన్ని ఆర్జీఐఏ ఔట్పోస్టు పోలీసులకు అప్పగించారు. పదిహేను మందికి పైగా.. నకిలీ సర్టిఫికెట్లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గోపాల్రెడ్డిని విచారించగా బీఎన్రెడ్డి నగర్ టీచర్స్ కాలనీలో ఉన్న ధనలక్ష్మీ ఒవర్సీస్ ప్రై వేటు లిమిటెడ్ సంస్థలో రూ.80 వేలకు డిగ్రీ సర్టిఫికెట్ కొనుగోలు చేసినట్లు చెప్పాడు. సీఐ బాలరాజు ఆధ్వర్యంలో ఎస్ఐ సిద్దేశ్వర్ పోలీసుల బృందం ధనలక్ష్మీ ఒవర్సీస్ సంస్థపై దాడులు చేశారు. సంస్థ నిర్వాహకుడు కాతోజు అశోక్ను అరెస్ట్ చేయడంతో పాటు అక్కడ ఉన్న మధురై కామరాజ్, ఉస్మానియా వర్సిటీలకు చెందిన 17 నకిలీ డిగ్రీ, ప్రొవిజినల్ మార్కుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సరైన విద్యార్హత లేకుండా విదేశీ విద్యనభ్యసించాలనుకునే వారు ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తూ నకిలీ సర్టిఫికెట్ అందజేస్తున్నట్లు గుర్తించారు. పదిహేనుమందికిపైగా నకిలీ సర్టిఫికెట్లతో విదేశీ విద్యకు వెళ్లినట్లు విచారణలో అశోక్ వెల్లడించాడు. కేరళకు చెందిన వ్యక్తికి ఒక్కో సర్టిఫికెట్కు రూ.30 వేలు ఇస్తే..అతడే సర్టిఫికెట్లు తయారుచేసి పంపిస్తున్నట్లు తెలిపాడు. అశోక్ నుంచి నకిలీ సర్టిఫికెట్లతో పాటు వివిధ బ్యాంకులకు చెందిన నకిలీ స్టాంపులు, నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, రూ.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. గోపాల్రెడ్డి, అశోక్లను రిమాండ్కు తరలించగా కేరళకు చెందిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఓ కన్సల్టెన్సీ నిర్వాకం అమెరికా నుంచి తిరిగొచ్చిన విద్యార్థి సర్టిఫికెట్ పరిశీలనలో బయటపడ్డ వైనం కేరళలో తయారీ..హైదరాబాద్లో విక్రయం ఇద్దరి అరెస్ట్..ఒకరి పరారీ -
టీబీ పరీక్షలు తప్పనిసరి
యాలాల: రెండు వారాల పాటు ఎవరికై నా దగ్గు ఉంటే తప్పనిసరిగా టీబీ పరీక్షలు చేయించుకోవాలని జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ రవీంద్రయాదవ్ సూచించారు. మంగళవారం మండలంలోని అగ్గనూరు ఆరోగ్య ఉప కేంద్రంలో టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా మండల వైద్యాధికారి రుబియానాజ్తో కలిసి వైద్య శిబిరం నిర్వహించారు. రెండు వారాల పాటు దగ్గు, సాయంత్రం వేళ జ్వరం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, చాతిలో నొప్పిలాంటి లక్షణాలు కలిగిన 310 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. వారికి స్క్రీనింగ్ పరీక్షల అనంతరం 115 మందికి ఎక్స్రే తీసి వ్యాధిని గుర్తించినట్లు చెప్పారు. పాజిటివ్ వచ్చిన వారికి ఆరునెలల పాటు ఉచితంగా మందులతో పాట పౌష్టికాహారం కోసం నెలకు రూ. వెయ్యి చొప్పున రోగి ఖాతాలో జమ చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ఎన్ సుశీల, సూపర్వైజర్లు శోభారాణి, పల్లె దవాఖాన వైద్యురాలు భువనేశ్వరి, ఎంఎల్హెచ్పీ వైష్ణవి, టీబీ సూపర్వైజర్ రహత్ అలీ, ఏఎన్ఎంలు వీరమణి, రోజారమణి తదితరులు పాల్గొన్నారు. -
నైపుణ్యం కలిగిన యువతతోనే వికసిత భారత్
శంషాబాద్ రూరల్: దేశాభివృద్ధిలో తమ భాగస్వామ్యం ఏమిటో ప్రతి పౌరుడు ఆత్మ విమర్శ చేసుకోవాలి.. నైపుణ్యం కల్గిన యువతరమే వికసిత భారతానికి బాటలు వేయగలదని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ శివారులో ఉన్న స్వర్ణ భారత్ ట్రస్టు ఆవరణలో సోమవారం శిక్షణార్థులతో ఆయన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రస్టు శిక్షణార్థులు, భూభరతి లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు, మహిళలు, యువత అభివృద్ధిపై స్వర్ణ భారత్ ట్రస్టు ప్రధాన దృష్టి పెట్టిందన్నారు. ఒక పూట అన్నం పెట్టడం కాకుండా.. స్వశక్తితో రోజూ ఆహారాన్ని సమకూర్చుకునేలా నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. నిత్య జీవితంలో యోగా, ధ్యానం, ఆరోగ్యకర ఆహారాన్ని జీవన విధానంగా చేసుకోవాలని సూచించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు భూభారతి చట్టంతో సమస్యలు తొలగాలని ఆకాంక్ష -
పట్టాలపై మృత్యుఘంటికలు
రైల్వేట్రాక్లపై పెరుగుతున్న ప్రమాదాలు ● పట్టాలు దాటుతూప్రమాదాల బారిన పడుతున్న వైనం ● సెల్ఫీలు, రీల్స్ మాయలో పడి మృత్యువాత ● ఎంఎంటీఎస్, సబర్బన్ మార్గాల్లోనే ఎక్కువసాక్షి, సిటీబ్యూరో: పట్టాలు మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. పట్టాలు దాటుతూ రైళ్లు ఢీకొని కొందరు, బలవన్మరణాలకు పాల్పడుతూ మరికొందరు పట్టాలపైనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఏటా పెరుగుతున్న ప్రమాదాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ట్రాక్లకు రెండు వైపులా సరైన రక్షణ వ్యవస్థలు, కంచెలు లేకపోవడం వల్ల ప్రజలు యథేచ్చగా పట్టాలు దాటేస్తున్నారు. మరోవైపు ట్రైన్ తమను చేరే లోపు ట్రాక్ దాటేయొచ్చనే అతివిశ్వాసం కూడా నిండు ప్రాణాలను హరిస్తోంది. నగరంలోని ఎంఎంటీఎస్, సబర్బన్ ప్రాంతాల్లోనే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంఎంటీఎస్ రైళ్లు రాకపోకలు సాగించే ట్రాక్లకు రెండు వైపులా కాలనీలు, బస్తీలు ఉన్నాయి. రాత్రింబవళ్లు ఈ ట్రాక్లను దాటుతూ ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. దక్షిణమధ్య రైల్వేలోని జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు, అధికారుల అంచనాల ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 450 ప్రమాదాలు నమోదయ్యాయి. ప్రతి రోజు సగటున మూడు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. నిజానికి రైల్వే భద్రతా చట్టాల ప్రకారం పట్టాలు దాటడం నేరం. కానీ నగరంలోని వివిధ ప్రాంతాల్లో కాలనీలు, నివాస సముదాయాలకు సరైన రోడ్డు రవాణా సదుపాయాలు, పట్టాలు దాటవలసిన చోట ఫుట్ఓవర్ బ్రిడ్జి వంటి ఏర్పాట్లు లేకపోవడం వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లోనే పట్టాలు దాటాల్సి వస్తోందని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.‘‘పట్టాలను దాటుతూ ప్రమాదాల బారినపడాలని ఎవరూ కోరుకోవడం లేదు. కానీ ఇవి తమ దైనందిన జీవితంలో భాగమమయ్యాయి.’’ అని డబీర్పూరా ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఒక్క డబీర్పురా, ఉప్పుగూడ, మలక్పేట్, చాంద్రాయణగుట్ట వంటి ప్రాంతాలే కాదు. లింగంపల్లి నుంచి ఫలక్నుమా వరకు, నాంపల్లి నుంచి లింగంపల్లి వరకు, మేడ్చల్, మల్కాజిగిరి, చర్లపల్లి, ఉందానగర్, బీహెచ్ఈఎల్, సికింద్రాబాద్ వంటి అనేక చోట్ల పట్టాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. మలుపులు...మృత్యు పిలుపులు ‘‘లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే క్రమంలో నేచర్క్యూర్ హాస్పిటల్, భరత్నగర్, హఫీజ్పేట్, తదితర చోట్ల ట్రాక్ మలుపులు ఉన్నాయి. ఈ రూట్లో ట్రైన్ దగ్గరకు వచ్చే వరకు గుర్తించడం కష్టం. ట్రైన్ వచ్చేలోపు దాటేయవచ్చునని భావిస్తారు. ట్రైన్ శబ్దాన్ని విని చాలా దూరంగా ఉందనుకుంటారు. కానీ కేవలం 10 సెకన్ల వ్యవధిలోనే అది వందల మీటర్ల దూరం పరుగులు తీస్తుంది.’’ అని దక్షిణ మధ్య రైల్వే అధికారి ఒకరు చెప్పారు. ఈ మలుపుల వద్దనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మరోవైపు ఆత్మహత్యలకు పాల్పడేందుకు ట్రాక్లను ఆశ్రయిస్తున్నారు. దూసుకొచ్చే రైళ్లకు ఎదురెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు.‘‘ ట్రైన్కు ఎదురుగా మనిషి ఉన్నట్లు గుర్తించి బ్రేక్ అప్లయ్ చేస్తాం, కానీ అది కనీసం కిలోమీటర్ దూరంలో ఆగుతుంది. అప్పటికే ఆ వ్యక్తిని రైలు ఢీకొంటుంది.’’ అని ఎంఎంటీఎస్ లొకోపైలెట్ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో 189 మంది ఇలా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సోషల్ మీడియా మేనియా.... సామాజిక మాధ్యమాల పిచ్చి కూడా నిండుప్రాణాలను బలితీసుకుంటోంది. ట్రాక్లపైన నించొని రకరకాల రీల్స్ చేస్తున్నారు. రైళ్లకు ఎదురెళుతూ వీడియోలు తీసి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా వంటి వేదికల్లో తమ సాహసకృత్యాలను ప్రదర్శించుకుంటున్నారు. ముఖ్యంగా టీనేజ్ యువత ఇలాంటి సోషల్ మీడియా మేనియాలో పడి ప్రాణాలను కోల్పోతున్నారు. ఇటీవల ఓ యువకుడు సనత్నగర్ వద్ద పరుగులు తీస్తున్న ఎంఎంటీఎస్ పక్కన నించొని ఫొటోలు, వీడియోలు తీసుకొనేందుకు ప్రయత్నించి రైలు ఢీకొనడంతో చనిపోయాడు. ఫుట్బోర్డుపైన నిలుచుని గాలిలో ఊగుతూ వీడియోలు తీస్తూ దుస్సాహసాలకు పాల్పడుతున్నారు. ‘‘ తాము పట్టాల పక్కనే నించున్నాం. ప్రమాదం లేదనుకుంటారు. కానీ ట్రైన్ వెడల్పును అంచనా వేయలేరు.అలా ఢీకొని చాలా ప్రమాదాలు జరిగాయి.’’ అని ఆర్పీఎఫ్ సిబ్బంది ఒకరు తెలిపారు. ప్రమాదాలు ఇలా.. సంవత్సరం ప్రమాదాలు ఆత్మహత్యలు అనుమానాస్పద మృతి 2024 735 631 206 2025 (ఇప్పటికి) 214 189 57 – 2021లో 408 మంది ప్రమాదాలు బారిన పడగా, 2024 నాటికి ఆ సంఖ్య 735 కు చేరింది. -
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో గురుకుల బాలికల సత్తా
ఇబ్రహీంపట్నం: నల్లకంచె ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల విద్యార్థినులు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో సత్తాచాటారు. సోమవారం వెల్లడించిన ఫలితాల్లో గీతిక 905, నందు 1,956, అక్షయ 5,761, అనూష 2,504, రమ్య శ్రీ 5,416వ ర్యాంక్ సాధించారు. కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది విద్యార్థినులను అభినందించారు. మెరిసిన గిరిజన తేజం కేశంపేట: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో మండల పరిధిలోని దేవునిగుడితండాకు చెందిన గిరిజన విద్యార్ధిని వి.దీపన్విత ఆల్ ఇండియా 1,248వ ర్యాంక్ సాధించింది. తండాకు చెందిన బాలునాయక్ తన భార్యతో కలిసి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి కుమారుడు, కుతూరు ఉన్నారు. కుతూరు దీపన్విత 1వ తరగతిని తండాలోనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివింది. అనంతరం 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు షాద్నగర్ ఇంగ్లిష్ మీడియం పబ్లిక్ స్కూల్లో చదివింది. అనంతరం ఇంటర్మీడియట్ను హైదరాబాద్లోని అల్మాస్గూడలో ఉన్న సంకల్ప్ జూనియర్ కళాశాలలో ఎంపీసీ పూర్తి చేసింది. ఇంటర్మీడియట్లో 734 మార్కులను సాధించిన దీపన్విత జేఈఈలో (హల్టికెట్ నంబర్ 256125077) ఉత్తమ ర్యాంకు సాధించడంతో కుటుంబ సభ్యులతో పాటు తండావాసులతో అభినందించారు. ఉన్నత చదువులకు దాతలు సహకరించాలని తండ్రి కోరాడు. -
వందరోజుల ప్రణాళిక విజయవంతం చేయాలి
శంషాబాద్: శంషాబాద్ను స్వచ్ఛమైన.. పరిశుభ్రమైన పట్టణంగా మార్చుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించిన వంద రోజుల ప్రణాళికను విజయవంతం చేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ సూచించారు. శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ బి. సుమన్రావు అధ్యక్షతన మండలి భవనంలో ఏర్పాటు చేసిన ప్రతిజ్ఞా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. వంద రోజుల ప్రణాళికలో పరిశుభ్రత చర్యలు, పచ్చదనం, కాలుష్య నివారణ, ప్లాస్టిక్ నిషేధం వంటి ఎన్నో మంచి కార్యక్రమాలు ఉన్నాయన్నారు. మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రజలందరు భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవతం చేయాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు అన్ని పథకాలను అందజేస్తుందన్నారు. పర్యావరణహితంగా వ్యవహరించిన వాటర్మెన్ నాగేష్ను ఎమ్మెల్యే సన్మానించారు. మున్సిపల్ మేనేజర్ శ్రావణి, మాజీ వైస్చైర్మన్ బండిగోపాల్ యాదవ్, నార్సింగి ఏఎంసీ మాజీ చైర్మన్ డి.వెంకటేష్గౌడ్, మాజీ కౌన్సిలర్లు సంజయ్యాదవ్, వై.కుమార్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మైలారం సులోచన, స్థానిక నేతలు తోకల మురళి పాల్గొన్నారు. రైతులకు వరి విత్తనాల కిట్ల పంపిణీ శంషాబాద్ రూరల్: ‘గ్రామ గ్రామానికి వ్యవసాయ విశ్వ విద్యాలయం నాణ్యమైన విత్తన పంపిణీ’ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని రైతులకు ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ విత్తనాల కిట్లను అందజేశారు. మండల వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద కేఎన్ఎం 1638 వరి రకం విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. రైతులు నాణ్యమైన విత్తనాల సాగుతో అధిక దిగుబడి పొందవచ్చిని ఎమ్మెల్యే సూచించారు. రైతులు పండించిన తర్వాత వీటిని గ్రామాల్లోని మిగతా రైతులకు విత్తనం కోసం ఇవ్వాలన్నారు. మండలంలోని 19 గ్రామాలకు ముగ్గురు రైతుల చొప్పున వరి విత్తనాల కిట్లను పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయధికారి శ్వేత తెలిపారు. ఒక్కో రైతుకు పది కిలోల వరి విత్తనాలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఇంచార్జి ఏడీ కవిత, తదితరులు పాల్గొన్నారు. శంషాబాద్ను స్వచ్ఛమైన పట్టణంగా మార్చుకోవాలి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ -
అర్చనకు గ్రామీణ్ ప్రగతి స్కాలర్షిప్
ఆరేళ్ల పాటు రూ.లక్ష చొప్పున ఉపకార వేతనం కేశంపేట: మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని కుక్కల అర్చన పదోతరగతిలో 546 మార్కులు సాధించినందుకు గాను గ్రామీణ్ ప్రగతి ఉపకార వేతనానికి ఎంపిక చేశారు. ఫరూఖ్నగర్ పరిధి బూర్గుల శివారులో ఉన్న ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతీ ఏడాదికి రూ.లక్ష చొప్పున ఆరేళ్ల పాటు ఉపకార వేతనం అందించనున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ చంద్రశేఖర్, పాఠశాల హెచ్ఎం శ్రీశైలం, సీఆర్పీ మల్లేశ్ విద్యార్థినిని అభినందించారు. కేజీబీవీలో పనిచేసేందుకు దరఖాస్తుల ఆహ్వానం కొందుర్గు: కొందుర్గు కేజీబీవిలో పనిచేయటకు ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రత్యేకాధికారి షెకీనా నిస్సీ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. వంట పనివారు, నైట్వాచ్ ఉమెన్, డే వాచ్ ఉమెన్, అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. వంటపని, డే మరియు నైట్ వాచ్ ఉమెన్లకు 10వ తరగతి, అటెండర్కు ఇంటర్ అర్హత ఉండాలన్నారు. పై పోస్టులకు మండల పరిధిలోని మహిళలు మాత్రమే ఈ నెల 8వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 86861 58456 నంబర్లో సంప్రదించాలన్నారు. కారు బోల్తా.. డ్రైవర్ మృతి షాబాద్: కారు అదుపుతప్పి బోల్తా పడడంతో డ్రైవర్ మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన షాబాద్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కాంతారెడ్డి తెలిపిన ప్రకారం.. కొందుర్గు మండలం చిన్న ఉమ్మెంతాలకు చెందిన ఇసంతపురం శ్రీకాంత్(28) కొందుర్గులో ఓ వ్యక్తి వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 1న విధుల్లో భాగంగా కారులో షాబాద్కు వచ్చాడు. తన స్నేహితుడు మహేశ్తో కలిసి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో మరియాపురం శివారులో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కాలు విరగడంతో పాటు చేతికి బలమైన గాయాలయ్యాయి. మహేశ్ తలకు గాయమైంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు క్షతగాత్రులను అంబులెన్స్లో షాద్నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు డ్రైవర్ శ్రీకాంత్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మహేశ్ను మెరుగైన వైద్యం కోసం షాద్నగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సోమవారం మృతుడి భార్య అనూష పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది. -
అభివృద్ధే ధ్యేయం
పారదర్శకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు ఆకట్టుకున్న చిన్నారుల కళారూపాలు సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘జిల్లా అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేయాలి. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా చూడటంతో పాటు ఉద్యోగులు విధి నిర్వహణలో నీతి, నిజాయితీతో నిక్కచ్చిగా వ్యవహరించాలి’ అని ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. పథకాలతో ఎంతో చేశాం ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించింది. భవిష్యత్తు తెలంగాణకు ఇదో భగవద్గీత. దీనిలో భాగంగానే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాం. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో జిల్లాలో ఇప్పటి వరకు రూ.1,314 కోట్ల జీరో వడ్డీ రుణాలను పంపిణీ చేశాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. రూ.500కే వంటగ్యాస్ పథకం ద్వారా జిల్లాలో 2,10,276 కుటుంబాలకు లబ్ధి చేకూర్చాం. గృహజ్యోతి పథకం ద్వారా రూ.12.7 కోట్ల సబ్సిడీని మంజూరు చేశాం. 17,440 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. రుణమాఫీ పథకంలో భాగంగా 1,00,268 మంది రైతులకు సంబంధించి రూ.769.54 కోట్లు మాఫీ చేశాం. పెట్టుబడి సాయం కింద 2,19,418 మంది రైతుల ఖాతాల్లో రూ.180.92 కోట్లు జమ చేశాం. ధాన్యం కొనుగోలులో భాగంగా యాసంగిలో 18,112 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి, రూ.37.21 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 10,339 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారి ఖాతాల్లో మొదటి విడతగా రూ.6.24 కోట్లు జమ చేశాం. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తేవాలని భావించి ఇప్పటికే షాద్నగర్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టాం. ఫ్యూచర్సిటీ తలమానికం హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహా లో మరో అద్భుతనగరానికి శ్రీకారం చుట్టాం. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం.ఏఐ సిటీ, ఫార్మాసిటీ, స్పోర్ట్స్ సిటీ, లైఫ్ సైన్సెస్, హెల్త్సిటీలను ఏర్పాటు చేస్తున్నాం. అభివృద్ధి పనులు వే గంగా కొనసాగుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ‘ఫ్యూచర్ సిటీ డెవలెప్మెంట్ అథారిటీ’ ఏర్పా టు చేశాం. అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్, దావోస్, జపాన్ దేశాల్లో పర్యటించి భారీగా పెట్టు బడులు సాధించాం. ఏఐ గ్లోబల్ సమ్మిట్, బయో ఏసియా సదస్సు, ప్రపంచ సుందరి పోటీలను విజయవంతంగా నిర్వహించి జిల్లాను విశ్వవేదికపై నిలిపాం. వివిధ రుగ్మతలతో బాధపడుతున్న 61,245 మంది పేదలకు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచిత చికిత్సలు అందించాం. ఇందుకోసం రూ. 151.21 కోట్లు ఖర్చు చేశాం. భూ హక్కుల రికార్డు లను పక్కగా నిర్వహించేందుకు, భూ యజమానులకు భరోసా కల్పించేందుకు, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు భూ భారతి– 2025 చట్టాన్ని తీసుకొచ్చాం. జిల్లాలోని కొందుర్గు మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, రెవెన్యూ సదస్సులు నిర్వహించాం. రైతుల నుంచి 573 అర్జీలు రాగా, 464 అర్జీలను ఆమోదించాం. మంగళవారం నుంచి అన్ని మండలాల్లో భూభారతి అమల్లోకి వస్తుంది. భూ సమస్యలు లేకుండా పరిష్కరించుకోవాలి. జిల్లా అభివృద్ధి కోసం అధికారులంతా అంకిత భావంతో పని చేయాలి. అధికారులు అంకితభావంతోపని చేయాలి నీతి, నిజాయితీ, నిక్కచ్చిగా వ్యవహరించాలి జిల్లా అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలి రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి వేడుకలను పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన కళారూపాలను ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శేరిలింగంపల్లి నాగార్జున ఉన్నత పాఠశాల విద్యార్థులు ‘జయజయహే తెలంగాణ’ గీతానికి ప్రదర్శించిన నృత్యరూపకం మనసును కట్టిపడేసింది. కడ్తాల్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు దేశ సరిహద్దుల్లో ఆర్మీజవాన్లు చేస్తున్న పోరాటాన్ని తమ నృత్యరూపకంలో కళ్లకు కట్టారు. సరూర్నగర్ పల్లవి స్కూలు విద్యార్థులు ‘టంగుటుయ్యాల్లో..’అంటూ ప్రదర్శించిన నృత్యరూపకం, తుక్కుగూడ జెడ్పీ స్కూలు విద్యార్థినులు ప్రదర్శించిన బంజారా నృత్యరూపకం, తలకొండపల్లి కేజీబీవీ విద్యార్థులు ప్రదర్శించిన బతుకమ్మ ఆట, ఆమనగల్లు కేజీబీవీ విద్యార్థునులు ప్రదర్శించిన బోనాలు, పోతరాజు విన్యాసాలు, శివసత్తుల పూనకాలు అలరించాయి. కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ‘సెల్యూట్ టు సోల్జర్స్’
చైతన్యపురి: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నుంచి ప్రేరణ పొందిన ప్రజలు భిన్న రూపాల్లో దేశభక్తిని చాటుకున్నారని రిటైర్డ్ కలెక్టర్ ఎంవీ రెడ్డి అన్నారు. కోదాడ ఆత్మీయ ప్రవాస సమితి, అపోలో మెడికల్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ‘సెల్యూట్ టు సోల్జర్స్’ పేరిట చైతన్యపురిలోని అపోలో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బుర్రి రామయ్యతో కలిసి పాల్గొన్నారు. సంగోజు నాగాచారి అధ్యక్షతన జరిగిన సమావే శంలో ఆర్మీ అధికారులు పలువురు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం పోరాడుతున్న త్రివిధ ధళాల అధికారులు, సైనికుల సేవలను గుర్తు తెచ్చుకోవాలన్నారు. రిటైర్డ్ కల్నల్ సుంకర శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటి యువత ఆర్మీలో చేరేందుకు అవగాహన కల్పించాలన్నారు. ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న మేజర్ టి.సాయి భార్గవ్ తన అనుభవాలను వివరించారు. ఈసందర్భంగా మాజీ ఆర్మీ అధికారులు కల్నల్ స్వర్ణారెడ్డి, సుబేదార్ మేజర్ పీఎస్ఎన్ స్వామి, సార్జెంట్ జి.నర్సింహారెడ్డి, రామనాఽథం, వనం సుదర్శన్, దయా కర్రెడ్డి, సుబేదారు ఎస్.నర్సయ్య ను ఘనంగా సత్కరించి.. వారు చేసిన సేవలను కొని యాడారు. అనంతరం పహల్గాం మృతులు, పాకిస్తాన్ దాడుల్లో వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించారు. -
శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి
మంచాల: శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. మండల పరిధిలోని ఆగాపల్లిలో నాగార్జునసాగర్– హైదరాబాద్ రోడ్డుపై మంచాల పోలీసులు ఏర్పాటు చేసిన వాహన తనిఖీ శిబిరాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అక్రమ రవాణా, నేరాలను అరికట్టడంలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈనెల 7న బక్రీద్ను దృష్టిలో పెట్టుకొని ఆవుల అక్రమ రవాణా నివారణ కోసం చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఏసీపీ రాజు, మంచాల సీఐ మధు తదితరులు పాల్గొన్నారు. విద్యారంగాన్ని కాపాడుకుందాం టీఎస్యూటీఫ్ జిల్లా అధ్యక్షుడు గోపాల్నాయక్ కడ్తాల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచి విద్యారంగాన్ని కాపాడుకుందామని టీఎస్యూటీఫ్ జిల్లా అధ్యక్షుడు గోపాల్నాయక్ పిలుపునిచ్చారు. సంఘం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు మండల పరిధిలోని అన్మాస్పల్లిలో సోమవారం ప్రచార జాత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ హితం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. అన్ని రకాల మౌలిక వసతులతో పాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారన్నారు. మన ఊరి బడిలో మన పిల్లలను చేర్పించి, మన బడిని మనమే కాపాడుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి శంకర్నాయక్, మండల అధ్యక్షుడు జంగయ్య, మాజీ సర్పంచ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ‘బెస్ట్ ప్రాక్టీస్’కు వెంకమ్మగూడ పాఠశాల హెచ్ఎం ఎంపిక షాబాద్: హైదరాబాద్లోని రాష్ట్రస్థాయి విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధిలో వివిధ అభ్యసన పద్ధతులపై (బెస్ట్ ప్రాక్టీస్) నిర్వహించే ఉత్తమ ప్రదర్శనకు మండలంలోని వెంకమ్మగూడ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం సింహాద్రినాయుడు ఎంపికయ్యారు. ఈ మేరకు ఎంఈఓ లక్ష్మణ్నాయక్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి నూతన అభ్యసన ప్రక్రియ ప్రదర్శనలకు సంబంధించి జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రదర్శనకు ఎంపికై న వాటిని రాష్ట్రస్థాయికి పంపించాలని ప్రభుత్వం జిల్లా విద్యాశాఖను ఆదేశించిందని తెలిపారు. నిరంతరాయ విద్యుత్ సరఫరాకు కొత్త సబ్స్టేషన్ సాక్షి, రంగారెడ్డిజిల్లా: విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, హెచ్చు తగ్గుల నియంత్రణ, నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం కొంగరకలాన్లోని కలెక్టరేట్ భవన ఆవరణలో కొత్తగా 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మించనున్నట్లు సరూర్నగర్ ఎస్ఈ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన సబ్స్టేషన్ కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. సాధ్యమైనంత త్వరలో పనులు పూర్తి చేసి, సరఫరాను మెరుగుపర్చనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం డీఈ, ఏడీఈ, ఏఈ, ఇతర ఇంజనీర్లు ఉన్నారు. -
నీటితో కాసుల వేట!
● గ్రేటర్లో యథేచ్ఛగా అక్రమ వ్యాపారం ● అధికారుల కళ్లకు కనిపించని దందా ● ప్రైవేట్ స్థలాల్లో బోర్లు వేసి భారీ స్థాయిలో ● మూసీ తీరం నుంచీ పెద్దఎత్తున విక్రయం ● వాల్టా చట్టానికి అడుగడుగునా తూట్లు సాక్షి, సిటీబ్యూరో: నగరంతో పాటు మూసీ తీరం వెంట అక్రమ నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా భారీగా బోర్లు వేస్తున్న కొందరు ట్యాంకర్ల ద్వారా నీటిని విక్రయిస్తున్నారు. వాటర్–ల్యాండ్–ట్రీ యాక్ట్ను (వాల్టా చట్టం) అడ్డంగా ఉల్లంఘిస్తున్నా...ఒక్క రూపాయి పన్ను చెల్లించకుండా నిత్యం రూ.లక్షల్లో వ్యాపారం చేస్తున్నా సంబంధిత విభాగాలు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. అక్రమ నీటి వ్యాపారం ఫలితంగా అనేక కాలనీల్లో భూగర్భ జలాలు గణనీ యంగా పడిపోతున్నాయి. పట్టుమని పది సంస్థలూ లేవు గృహావసరాల కోసం బోరు వేయాలన్నా కచ్చితంగా స్థానిక తహసీల్దార్ నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. ఇలా వేసిన బోరు నీటిని గృహ, వ్యక్తిగత అవసరాలకు మాత్రమే వినియోగించాలి. ఒక్క ట్యాంకర్ కూడా విక్రయించడానికి ఆస్కారం లేదు. ప్లాంట్ ఏర్పాటు చేసి, అనుమతి పొందితే శుద్ధి చేసిన తాగు నీరు విక్రయించవచ్చు. ట్యాంకర్ల ద్వారా నీటిని అమ్మాలంటే కచ్చితంగా భూగర్భ జల శాఖ వద్ద అనుమతి తీసుకోవాలి. ఇలా అను మతి తీసుకున్న వ్యక్తులు, సంస్థలు కనీసం పది కూడా లేకపోవడం గమనార్హం. భూగర్భ జలాలు పరిమితంగా ఉన్న చోట ఇలా బోర్ల ద్వారా విక్రయానికి అనుమతి లభించదు. ప్రస్తుతం నగరంలో మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండా వందల అడుగుల బోర్లు వేసి ఆ నీటిని విక్రయిస్తున్న వాళ్లు పదుల సంఖ్యలో ఉన్నారు. పగటి కంటే రాత్రివేళ ఎక్కువగా.. సాధారణ రోజుల్లో అక్రమ నీటిదందా పగటి వేళలో కంటే రాత్రి వేళల్లోనే ఎక్కువగా జరుగుతుంది. వేసవి వచ్చిందంటే చాలు అక్రమ వ్యాపారులు ట్యాంకర్ల ద్వారా 24 గంటలూ నీటిని తరలిస్తూనే ఉంటున్నారు. భారీ పరిమాణంలో బోర్లు వేసిన అక్రమార్కులు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జనరేటర్లు వినియోగించి మరీ నీటిని తోడేస్తున్నారు. కనీసం ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించకుండా రూ.లక్షల్లో వ్యాపారం చేసేస్తున్నారు. ఒక్కో ట్యాంకర్ను దాని పరిమాణాన్ని బట్టి రూ.1,000 నుంచి రూ.3,000 వరకు విక్రయిస్తున్నారు. వినియోగం ఎంత శ్రేయస్కరం...? ఈ అక్రమ నీటి వ్యాపారం వెనుక ఆరోగ్యానికి చేటు కలిగించే కోణమూ ఉందని తెలుస్తోంది. ట్యాంకర్లలో నీటిని నింపే బోర్లలో కొన్ని మూసీ తీరంలో ఉన్నాయి. ఫలితంగా వీటి నుంచి వచ్చే నీళ్లల్లో మూసీలోని రసాయన వ్యర్థాలకు సంబంధించిన ఆనవాళ్లూ ఉంటున్నాయని తెలుస్తోంది. ఈ నీటిని తాగడానికి వాడకపోయినా ఇతర అవసరాలకు వాడేస్తున్నారు. వేసవి కాలంలో ఉండే నీటి డిమాండ్ను బోర్ల నిర్వాహకులు క్యాష్ చేసుకుంటున్నారు. పట్టంచుకోని సంబంధిత విభాగాలు అక్రమ నీటి దందాలను అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడట్లేదనే విమర్శలు ఉన్నాయి. ఇకనైనా స్పందించి నీటి అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. -
అవయవదానానికి ముందుకు రావాలి
కేశంపేట: సమాజంలో ప్రతిఒక్కరూ అవయవదానం చేసేందుకు ముందుకు రావాలని ఆల్ ఇండియా ఆర్గాన్ అండ్ బాడీ డోనర్స్ అసోసియేషన్ నేషనల్ కోఆర్డినేటర్ సోంటే శ్రీనివాస్ కోరారు. ఆదివారం హైదరాబాద్లోని మియాపూర్లో ఉన్న మై హోమ్ జెవెల్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాంగణంలో అవయవదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ గుడూరు సీతామహాలక్ష్మి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ అవయవాలను దానం చేస్తున్నట్టు అంగీకారపత్రాన్ని గాంధీ మెడికల్ ప్రిన్సిపాల్కు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూఢ నమ్మకాలను వదిలిపెట్టి మానవత దృక్పథంతో అవయవదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. మరణించిన తర్వాత శరీరాన్ని పూడ్చిపెట్టడం, కాల్చి వేయడంతో ఎలాంటి ఉపయోగం లేదన్నారు. అందుకే అందరూ మరణాంతరం అవయవదానానికి ముందుకు రావాలని సూచించారు. -
చెరువులో మునిగిన యువతి!
ఇబ్రహీంపట్నం: చెరువులోకి దిగిన యువతి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. నగరంలోని ఫలక్నుమాకు చెందిన రేష్మా(24) బాలపూర్కు చెందిన ఆమె స్నేహితుడు ఖాసీంతో కలిసి ఇబ్రహీంపట్నం చెరువు వద్దకు ఆటోలో వచ్చినట్లు తెలిసింది. ఖాసీం ఈత కొడుతుండగా రేష్మా కూడా చెరువులోకి దిగినట్లు సమాచారం. ఏమైయిందో ఏమోగాని ఆకస్మాత్తుగా యువతి చెరువు నీటిలో మునిగిపోయింది. చీకటి పడటంతో ఆమె ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టలేదు. ఈ సంఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బైక్ను ఢీకొన్న ట్రాక్టర్ ఒకరి దుర్మరణం ఆమనగల్లు: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆమనగల్లు పట్టణ సమీపంలో చోటు చేసుకుంది. ముర్తుజపల్లి గేటు వద్ద హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై బైక్ను ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఎస్ఐ వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి గ్రామానికి చెందిన రాయకుంట కృష్ణయ్య(35), ఆయన బంధువు శేఖర్ పని నిమిత్తం హైదరాబాద్లో స్థిరపడ్డారు. వీరు ఆదివారం ఉదయం ద్విచక్రవాహనంపై సొంతూరికి బయలుదేరారు. మార్గమధ్యలో పట్టణ సమీపంలోని ముర్తుజపల్లి గేటు వద్ద అతివేగంగా వచ్చిన ఓ ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణయ్య అక్కడికక్కడే మృతిచెందగా, శేఖర్ తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
‘జయ గ్రూప్స్’పై చర్యలు తీసుకోవాలి
పంజగుట్ట: తమ వద్ద ప్రీ లాంచింగ్ ఆఫర్లో ప్లాట్లు తీసుకుంటే తక్కువ ధరకు ఇస్తామంటూ అందంగా బ్రోచర్లు ముద్రించి వందలాది మంది నుంచి దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి మోసం చేసిన జయత్రి రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ (జయ గ్రూప్స్) సంస్థ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు వర్మ కుమార్, మూర్తి శ్రీనివాస్, ప్రసాద్ శివపురం, గణేష్, ఫణిలు మాట్లాడుతూ .. కాకర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి మరో 19 మంది డైరెక్టర్లతో కలిసి 2021 ఫిబ్రవరిలో కేపీహెచ్బీ కాలనీ 6వ ఫేస్లో అన్ని హంగులతో కార్యాలయం ఏర్పాటు చేశారని మొదటి వెంచర్గా హిల్టన్ జయ డైమెండ్ పేరుతో వెంచర్ ప్రారంభించినట్లు తెలిపారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ తమకు పదేపదే ఫోన్లు చేసి చందానగర్ లోని గోపనపల్లిలో తక్కువ ధరకు ప్లాట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారన్నారు. కార్యాలయానికి వెళ్లగా హంగు, ఆర్భాటాలతో పాటు దాదాపు వంద మందికి పైగా ఉద్యోగులు అక్కడ పని చేస్తున్నారన్నారు. సంస్థ ప్రతినిధుల మాటలు నమ్మి రూ. 20 లక్షల నుంచి రూ.1.80 కోట్ల వరకు పెట్టుబడి పెట్టామన్నారు. రెండేళ్లలో ప్లాట్లు అప్పగిస్తామని చెప్పారని. గడువు ముగిసిన తర్వాత అడిగితే నేడు రేపు అంటూ కాలయాపన చేస్తున్నారన్నారు. దీంతో తమకు చూపించిన స్థలం వద్దకు వెళ్లి ఆరా తీయగా సదరు ప్రాజెక్టు వేరే సంస్థకు చెందినదిగా తెలుసుకుని నివ్వెరపోయామన్నారు. మద్య తరగతికి చెందిన తాము పైసాపైసా కూడబెట్టుకుని ప్లాట్లు కోసం వెచ్చించామన్నారు. ఇదే సంస్థ గతంలో రాజమండ్రిలోనూ ఇదేతరహాలో మోసం చేసినట్లు తెలిసిందన్నారు. నిందితుడు కాకర్ల శ్రీనివాస్, మరోఇద్దరు డైరెక్టర్లను పోలీసులు అరెస్టు చేసినట్లు ప్రస్తుతం బెయిల్పై దర్జాగా తిరుగుతున్నారన్నారు. ఈ విషయమై పలుమార్లు పోలీసులకు, ఈడీ కార్యాలయంలో, మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినా ఫలి తం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు సంస్థ బాధితుల్లో రెండు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నా రని ఇరు ప్రభుత్వాలు చొరవ తీసుకుని నిందితులను అరెస్టు చేయాలని, వారి ఆస్తులను జప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రీ లాంచింగ్ ఆఫర్ల పేరుతో నిండా ముంచారు రూ.300 కోట్లకు పైగా వసూలు న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు -
సంచిని పడేసి.. పుస్తెలతాడుని తెంచేసి
వృద్ధురాలి మెడలో మంగళసూత్రం అపహరణ ఇబ్రహీంపట్నం: కూరగాయల కోసమొచ్చిన వృద్ధురాలి మెడలోని బంగారు మంగళసూత్రాన్ని ఓ దుండగుడు అపహరించుకొని పరారైన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మంచాల మండలం నోముల గ్రామానికి చెందిన లక్ష్మమ్మ(65) ఇబ్రహీంపట్నంలోని మార్కెట్కు ఆదివారం ఉదయం వచ్చింది. అక్కడ కూరగాయలు తీసుకొని తలపై పెట్టుకొని వెళుతుంది. ముఖానికి మంకి క్యాప్ ధరించిన దుండగుడు నడుచుకుంటూ వచ్చి ఆమె తలపై సంచిని కిందపడేసి మెడలోని నాలుగు తులాల బంగారు మంగళసూత్రాన్ని తెంచుకొని పరారయ్యాడు. దీంతో వృద్ధురాలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. స్థానిక ఏసీపీ కేపీవీ రాజు, సీఐ జగదీశ్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. కంటోన్మెంట్ బోర్డులో ఉద్యోగాల పేరుతో టోకరా నిందితుడి అరెస్టు రాంగోపాల్పేట్: కంటోన్మెంట్ బోర్డులో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడిన కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని ఉత్తర మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ సుధీంద్ర కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బోయిన్పల్లి బాపూజీనగర్కు చెందిన శ్రవణ్కుమార్ అమాయకులను ఎంచుకుని కంటోన్మెంట్ బోర్డులో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్నాడు. 2009 నుంచి 2024 వరకు బేగంపేట, తిరుమలగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలో 6 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. శ్రీలేఖ అనే మహిళ నుంచి రూ.22వేలు తీసుకుని ఫుడ్ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశాడు. పవన్ అనే వ్యక్తి నుంచి రూ.35వేలు, విశాల్ అనే వ్యక్తి నుంచి రూ.20వేలు, మరో వ్యక్తి నుంచి రూ.35వేలు, వేములవాడకు చెందిన కృష్ణ అనే వ్యక్తి నుంచి రూ.50వేలు తీసుకుని కంటోన్మెంట్ బోర్డులో ఫుడ్ ఇన్స్పెక్టర్తో పాటు డిఫెన్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడు. గత కొన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్న అతడిని ఆదివారం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి తిరుమలగిరి పోలీసులు అప్పగించారు. ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య సనత్నగర్: ఆర్థిక సమస్యలతో మనస్తాపానికి లోనైన ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మల్లిపెద్ది వెంకట్రెడ్డి అనే వ్యక్తి భార్య, కుమార్తెతో కలిసి కూకట్పల్లిలో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. ఈ నెల 30న ఇంటి నుంచి బయటికి వెళ్లిన అతను ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతడి భార్య ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. చింతల్లో ఉంటున్న అతడి బావ రాజశేఖర్రెడ్డికి గాలింపు చేపట్టగా వెంకట్రెడ్డి భరత్నగర్లోని ఓయో లివింగ్ ట్రీ రూమ్ నెంబర్ 301లో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ విషయమై మృతుడి తండ్రి మల్లారెడ్డికి సమాచారం అందించడంతో ఆయన సనత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంకట్ రెడ్డి ఇటీవలే ఇల్లు కొనుగోలు చేశాడని, అప్పుల భారం ఎక్కువ కావడంతో మనస్తాపానికిలోనై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని అతను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందిరమ్మ కమిటీ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం శంషాబాద్: శంషాబాద్ పట్టణంలోని తొండుపల్లి ఇందిరమ్మ కమిటీ తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడు బాత్కు నర్సింహా యాదవ్, జిల్లా కార్యదర్శి పరమేష్ మాట్లాడుతూ... పదో వార్డులోని ఇందిరమ్మ కమటీని స్థానిక మాజీ కౌన్సిలర్ తనయుడు అస్తవ్యస్తంగా మార్చారని ఆరోపించారు. ఆయనతో పాటు మిగతా సభ్యులు కూడా బీఆర్ఎస్ నేతలేనన్నారు. పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసే కమిటీలో అధికారులు ఇలాంటి వారికి ఎలా చోటు కల్పించారని ప్రశ్నించారు. ఎస్సీలకు కూడా కమిటీలో చోటు ఇవ్వలేదని ఆగ్రమం వ్యక్తం చేశారు. కమిటీ తీరు కారణంగా స్థానికంగా ఉన్న అర్హులకు సంక్షేమ పథకాలు అందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కల్పించుకుని సవరించాలని కోరారు. సమావేశంలో నాయకులు అశోక్, నర్సింహా, ఖదీర్, పి.నర్సింహా తదితరులు పాల్గొన్నారు. -
నీటి కషా్టలు
డయాలసిస్ చికిత్సకుశంషాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి రోగుల తాకిడి ● నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న వైద్యులు ● మౌలిక వసతులుకల్పించాలని విజ్ఞప్తిశంషాబాద్: ప్రభుత్వ దవాఖానాకు డయాలసిస్ రోగుల తాకిడి పెరుగుతోంది. గతంలో ప్రయివేటు లేదా ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితమైన డయాలసిస్ చికిత్స గత ఆరునెలలుగా ప్రభుత్వ దవాఖానాలో అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆర్థిక స్థోమత అంతంతమాత్రమే ఉండి డయాలసిస్ చికిత్స అవసరమైన రోగులు ఇప్పుడు ప్రభుత్వ దవాఖానా బాటపడుతున్నారు. నీరే ప్రధానం... డయాలసిస్ చికిత్సలో అత్యంత ప్రధానమైంది పూర్తిగా మంచినీరే. నీటితో పూర్తిగా డయాలసిస్ చికిత్సను అందజేస్తారు. ప్రస్తుతం పట్టణంలోని ప్రభుత్వ దవాఖానాలో ఆరు నెలల కిందట డయాలసిస్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని కోసం ప్రత్యేక గదితో పాటు ఐదు మంచాలు ఏర్పాటు చేశారు. ఒకే సమయంలో ఐదుగురు రోగులకు ఇక్కడ చికిత్స చేయడానికి కావాల్సిన పరికరాలతో పాటు అవసరమైన టెక్నీషియన్లు, నర్సులు కూడా ఉన్నారు. అన్ని ఉన్నా డయాలసిస్కు కావల్సిన ప్రధాన వనరై మంచి నీరు మాత్రం కావల్సినంతగా లేదు. దీంతో మూడు షిప్టులుగా సేవలందించేందుకు అవకాశమున్నా ప్రస్తుతం ఇక్కడ రోజు ఏడుగురు రోగులకు మాత్రమే డయాలసిస్ చికిత్సను అందజేస్తున్నారు. దవాఖానాలో ఉన్న బోరులో నీరు సరిపోకపోవడంతో మున్సిపాలిటీ ట్యాంకరును ఆశ్రయిస్తున్నారు. అయినా నీరు అవసరాలకు సరిపడా అందుబాటులో లేదని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగులకు తప్పని నిరీక్షణ మంచి నీటి కొరత కారణంగా కొత్తగా డయాలసిస్ కోసం వస్తున్న రోగులకు చికిత్స అందించలేని పరిస్థితి నెలకొంటుంది. నీటి సమస్య తీరితే రోగుల సేవలను పెంచేందుకు పూర్తి అవకాశాలున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీంతో రోగులు తమకు స్థానికంగానే డయాలసిస్ చికిత్స అందించాల్సిందిగా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో సిఫార్సులు సైతం చేయించుకుంటున్నారు. దాతలు ముందుకొస్తే... ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ రోగులతో పాటు సాధారణ రోగులకు సైతం నీటి కష్టాలు తీర్చేందుకు మరో బోరు వేయాల్సిన అవసరముంది. ప్రభుత్వ ఏర్పాటు చేసే లోపు దాతలు ముందుకొచ్చి బోరు వేయించి నీటి సమస్యను తీర్చితే రోగులకు సాంత్వన చేకూరుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మరో వైపు కొత్త ఆస్పత్రి నిర్మాణం త్వరగా చేపడితే నీటి కష్టాలు తీరే మార్గాలున్నాయని వైద్యులు, సిబ్బంది ఆశతో ఎదురుచూస్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి డయాలసిస్ చికిత్సకు వచ్చే రోగుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. డయాలసిస్ చికిత్సకు గదితోపాటు అన్ని పరికరాలు, టెక్నీషియన్లు, నర్సులు పూర్తి స్థాయిలో ఉన్నారు. చికిత్సకు ప్రధానమైన నీరే ఇక్కడ కొరతగా ఉంది. సమస్యను ఉన్నతాధికారులతో దృష్టికి తీసుకెళ్లాం. ప్రస్తుతం బోరు సరిగా రావడం లేదు. మున్సిపాలిటీ ట్యాంకరుతో నీటి సరఫరా చేస్తుంది. సమృధ్ధిగా నీటి సౌకర్యం పెరిగితే మూడు షిప్టుల్లో డయాలసిస్ చికిత్సను పెంచేందుకు అవకాశముంటుంది. – డాక్టర్ దుర్గలత, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
భగవద్గీత పోటీల్లో బంగారు పతకం
షాద్నగర్రూరల్: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో భగవద్గీతపై రెండు రాష్ట్రాల మధ్య పోటీలు నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ఈ పోటీల్లో పట్టణానికి చెందిన రాములు ప్రతిభ కనబరిచాడు. భగవద్గీతలోని 18 అధ్యాయాలు, 700 శ్లోకాలను అలవోకగా ఆలపించి పసిడి పతకాన్ని కై వసం చేసుకున్నాడు. ఈ మేరకు రాములును శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి అధ్యక్షుడు స్వరాజ్బాబు, కార్యదర్శి నక్కనర్సింలు అభినందించారు. హరీశ్రావుకు ఘన స్వాగతం షాద్నగర్: మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం అంజన్న తండాలో ఆదివారం పార్టీ నాయకుడు నిర్వహించిన విందుకు వెళ్తున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావుకు షాద్నగర్ ఆ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పట్టణ శివారులోని కేశంపేట చౌరస్తాలో నాయకులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎంఎస్ నట్రాజన్, నాయకులు రాంబల్ నాయక్, లక్ష్మణ్ నాయక్, ఈట గణేశ్, చందు, నర్సింగ్రావు, విజయ్, లక్ష్మణ్ నాయక్, మోతీలాల్ నాయక్, తదితరులు పాల్గొన్నారు. కష్టపడి చదివితే ఫలితాలు సొంతం ఇబ్రహీంపట్నం రూరల్: లక్ష్య సాధన కోసం కష్టపడి చదివితేనే ఫలితాలు సొంతం అవుతాయని హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్, ఎంసెట్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఇబ్రహీంపట్నం, యాచారం మండలాలకు చెందిన విద్యార్థులకు బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రాంరెడ్డి ఆధ్వర్యంలో అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు– 2025 ప్రదానం చేశారు. ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ సమీపంలోని ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకటాచారి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుందన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచి తమ లక్ష్యం వైపు అడుగులు వేయాలని సూచించారు. మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం 120 మంది విద్యార్థులకు నగదుతో పాటు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నరేందర్రెడ్డి, అంబర్పేట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ సీఐ వెంకట్రెడ్డి, ఎకై ్సజ్ సీఐ ఏడుకొండలు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కూలిన ఎకై ్సజ్ కార్యాలయం పైకప్పు కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు షాద్నగర్రూరల్: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లలో అపశృతి చోటు చేసుకుంది. ఎకై ్స జ్శాఖ కార్యాలయం పై కప్పు కూలి ఓ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలైన ఘటన షాద్నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలివీ.. పట్టణంలోని ప్రభుత్వ ఎకై ్సజ్శాఖ కార్యాలయం కొన్నేళ్లుగా అద్దె భవనంలో కొనసాగుతోంది. ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకోసం అధికారులు కార్యాలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లలో భాగంగా కార్యాలయంపై జెండా దిమ్మెను కట్టేందుకు కానిస్టేబుల్ విజయకుమార్ ఆదివారం భవనంపైకి ఎక్కాడు. పై కప్పు అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో విజయ్కుమార్కు తీవ్ర గాయాలు కావ డంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తర లించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్కు తరలించారు. విద్యార్థికి నగదుతో పాటు జ్ఞాపిక అందజేస్తున్న అతిథులు -
పంపిణీలో జాప్యం
షాద్నగర్: మూడు నెలలకు సంబంధించి కోటాను ఆదివారం నుంచి ఒకేసారి అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సర్కారు నిర్ణయించినా రేషన్ దుకాణాలకు మాత్రం పావు వంతు కూడా సరఫరా కాలేదు. నియోజకవర్గంలోని ఫరూఖ్నగర్లో 55 రేషన్ దుకాణాల్లో మూడు నెలలకుగాను 1,632 టన్నులు, కేశంపేటలో 29 దుకాణాలకు 682, కొత్తూరులో 13 షాపులకు 525, నందిగామలో 12 దుకాణాలకు 486, కొందుర్గులో 19 దుకాణాలకు 475, చౌదరిగూడలో 22 షాపులకు 505 టన్నుల బియ్యాన్ని స్టాక్ పాయింట్ నుంచి సరఫరా చేయాల్సి ఉంది. ఫరూఖ్నగర్కు 439 టన్నులు, కేశంపేటకు 93, కొందుర్గుకు 268, నందిగామకు 25, కొందుర్గుకు 60, చౌదరిగూడకు 48 టన్నుల బియ్యాన్ని పంపించారు. మొత్తం 4,312 టన్నులకు గాను సుమారు 1,200 టన్నుల మాత్రమే సరఫరా చేశారు. గత నెల 24వ తేదీ నుంచి అధికారులు బియ్యాన్ని లారీల ద్వారా సరఫరా చేస్తున్నా నేటికీ పూర్తి కాలేదు. -
స్లాట్ బుకింగ్ @సబ్ రిజిస్ట్రార్
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ పద్ధతి ద్వారా ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానం సోమవారం నుంచి అమలులోకి రానుంది. స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ స్లాట్ బుకింగ్ విధానంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ఏప్రిల్ 10న శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మొదటగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. గత నెల 12న మరో 25 కార్యాలయాల్లో ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన అన్ని కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం రిజిస్ట్రా ర్ కార్యాలయంలో స్లాట్ విధానం పద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఇందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. సమయం ఆదా స్లాట్ విధానంతో కేవలం 15 నిమిషాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. గంటల తరబడి కార్యాలయాల్లో క్రయవిక్రయదారులు నిరీక్షించాల్సిన తిప్పలు తప్పనున్నాయి. సమయం ఆదా కానుంది. పొరపాట్లకు తావులేకుండా.. స్లాట్ బుకింగ్ వ్యవస్థ అమలులోకి రానున్న నేపథ్యంలో ఇబ్రహీంపట్నానికి అదనంగా మరో సబ్రిజిస్ట్రార్ రానున్నారు. అధికంగా రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో ఎలాంటి పొరబాట్లు జరగకుండా త్వరతిగతిన ప్రక్రియ పూర్తి చేసేందుకు అదనంగా మరో సబ్ రిజిస్ట్రార్ను నియమిస్తున్నారు. ఇబ్రహీంపట్నం కార్యా లయంలో నిత్యం 60 నుంచి 70కిపైగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఈ విధానం ద్వారా ఒక్కో సబ్ రిజిస్ట్రార్ 48 రిజిస్ట్రేషన్ల మాత్రమే చేయాల్సి ఉంటుంది. పనిభారం తగ్గి, వేగంగా రిజిస్ట్రేషన్లు చేసేందుకు అదనపు సబ్ రిజిస్ట్రార్ తప్పనిసరి కావాల్సి ఉంటుంది. ఈ కార్యాలయానికి అదనపు సబ్ రిజిస్ట్రార్గా హనుమంతురావును నియమించినట్లు సమాచారం. ఇబ్రహీంపట్నంలో నేటి నుంచి అమల్లోకి.. అదనంగా మరో సబ్రిజిస్ట్రార్ కేటాయింపు 15 నిమిషాల్లోపు పూర్తికానున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ తగ్గనున్న పని భారం.. నిరీక్షణకు తెరఇబ్బందులు కలగకుండా.. సోమవారం నుంచి స్లాట్ బుకింగ్ విధానంతో రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. 15 నిమిషాల్లోపు రిజిస్ట్రే షన్ పూర్తవుతుంది. క్రయవిక్రయదారులకు ఇబ్బందులు కలగకుండా ఈ ప్రక్రియ దోహదపడుతుంది. – సోని, సబ్ రిజిస్ట్రార్, ఇబ్రహీంపట్నం -
పరేషన్!
సోమవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2025ఒకేసారి మూడు నెలల సరుకులతో తప్పనితిప్పలుసాక్షి, రంగారెడ్డి జిల్లా: మూడు నెలల రేషన్ సరుకులు ఒకేసారి పంపిణీ చేసే విధానంతో తొలిరోజు జిల్లాలోని రేషన్ డీలర్లు, లబ్ధిదారులు ముప్పుతిప్పలు పడ్డారు. మూడు నెలలకు సంబంధించిన సరుకులు ఒకే దఫా ఇవ్వడానికి అవకాశం లేకుండా పోయింది. ఒక్కో కార్డుదారుడికి బియ్యం పంపిణీలో ఆరు దఫాలు తూకం వేయాల్సి వస్తోంది. ఆరుసార్లు థంబ్ వేయాల్సి వస్తోంది. ఈ సమయంలో సర్వర్ డౌన్, ఇతర సమస్యలు చిరాకు తెప్పిస్తున్నాయని పలువురు వాపోయారు. బియ్యం పంపిణీ పూర్తయిన తర్వాత కూడా స్టాక్లో రేషన్ కట్ కాకపోవడంతో డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. ఒక్కో కార్డుకు బియ్యం ఇవ్వడానికి కనీసం 20 నిమిషాల నుంచి అరగంట పడుతోంది. కొన్ని రేషన్ దుకాణాల్లో సర్వర్ డౌన్ కావడంతో లబ్ధిదారులు బారులు తీరారు. ఎండలో ఎదురుచూసి, ఓపిక నశించి వెనుదిరిగారు. మరికొన్ని చోట్ల డీలర్లకు సాఫ్ట్వేర్పై అవగాహన లేకపోవడం, ఇతర సమస్యలతో రేషన్ దుకాణాలను తెరవలేదు. పలు దుకాణాల్లో సర్వర్ డౌన్ కావడంతో మూడు గంటలకు కేవలం ఒకరిద్దరికి మాత్రమే బియ్యం అందించారు. దీంతో దుకాణాల ఎదుట భారీగా బారులు తీరిన జనం డీలర్లతో వాగ్వాదానికి దిగారు. కొత్త సాఫ్ట్వేర్తో అవస్థలు రేషన్ సరుకుల పంపిణీలో కొత్త సాఫ్ట్ వేర్ కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త సాఫ్ట్ట్వేర్లో ఒక్కో వ్యక్తికి అందించాల్సిన ఆరు కిలోల బియ్యాన్ని విభజించి చూపిస్తోంది. కేంద్రం ఇచ్చే ఐదు కిలోల బియ్యం ఒక దఫా తూకం వేయగా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఒక్క కేజీ బియ్యం కోసం మరో దఫా తూకం వేయాల్సి వస్తోంది. ఒక నెలకు ఒక కార్డుదారుకు రెండు దఫాలు తూకం వేయాల్సి వస్తోంది. ఇలా మూడు నెలలకు ఆరు దఫాలు అన్నమాట. దీంతో చాలా సమయం వృథా అవుతోందని డీలర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి వచ్చే స్టాక్ గతంలో ఆటోమేటిక్గా డీలర్ డివైజ్లో కనిపించేది. ఇప్పుడు అప్డేట్ కావడం లేదని పేర్కొంటున్నారు. ఇలాంటి పంపిణీ వ్యవస్థను వ్యతిరేకించాలని డీలర్లు సంఘం పిలుపునిచ్చింది. దీనిపై పౌరసరఫరాల శాఖ కమిషనర్కు వినతి పత్రం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. కొత్త సాఫ్ట్వేర్తో చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలని డీలర్లు కోరుతున్నారు. తెరిచారు.. మూశారు కందుకూరు: మండలంలోని 46 రేషన్ దుకాణాల నుంచి ఆదివారం లబ్ధిదారులకు బియ్యం ఇవ్వాల్సి ఉండగా సాఫ్ట్వేర్ సమస్యతో సరఫరాను నిలిపివేశారు. ఒక్కో లబ్ధిదారు ఆరుసార్లు వేలిముద్రల స్కాన్ చేయాల్సి రావడంతో పాటు తీసుకుంటున్న రేషన్ బియ్యం అసలు స్టాక్ నుంచి తగ్గడంలేదు. దీంతో పాటు ఇతర సాఫ్ట్వేర్ సమస్యలు నెలకొన్నట్లు రేషన్ డీలర్లు వాపోతున్నారు. మరోవైపు వేలిముద్ర స్కాన్తో పాటు తప్పనిసరిగా మొబైల్ నంబర్ నమోదు చేయాలి. చాలామందికి మొబైల్ ఉండకపోవడం, ఒక్కో లబ్ధిదారుకు దాదాపు అరగంట సమయం పడుతుండటంతో ఇటు డీలర్లు, అటు లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తొలొరోజు కొన్ని గ్రామాల్లో రేషన్ షాపులు తెరిచి ఒకరిద్దరికి బియ్యం ఇవ్వగా అవి అసలు స్టాక్ నుంచి తగ్గకపోవడంతో అధికారుల సూచనల మేరకు నిలిపివేశారు. సగం దుకాణాలకే కోటా షాబాద్: మండలం మొత్తం 37 రేషన్ షాపులు ఉండగా ఆదివారం 15 దుకాణాల్లో మాత్రమే పంపిణీ చేశారు. రుద్రారం గ్రామంలో రేషన్ తీసుకునేందుకు లబ్ధిదారులు బారులు తీరారు. మండలంలో ఏడు షాపులకు పూర్తి బియ్యం సరఫరా కాగా, మిగతా దుకాణాలకు సగం కోటా సరఫరా చేసినట్లు డీలర్లు చెప్పారు. రేషన్ షాపుల వద్ద సర్వర్ సమస్య, బయో మెట్రిక్ సమస్యతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒకరికి రేషన్ తీసుకునేందుకు 15 నిమిషాల వరకు సమయం పట్టింది. న్యూస్రీల్ఈ నెల 30 వరకు అవకాశం వేర్వేరుగా చూపిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాగిన్ ఒక్కో కార్డుదారుడికి రెండు దఫాలుగా తూకం జిల్లాలో తెరుచుకోని కొన్ని దుకాణాలు తొలిరోజు పలు ప్రాంతాల్లో లబ్ధిదారుల పాట్లు రేషన్ సరుకుల పంపిణీ ఈ నెల 30 వరకు ఉంటుంది. గతంలో 15వ తేదీ తరువాత పంపిణీ నిలిచిపోయేది. తాజాగా మూడు నెలల సరుకులు ఒకేదఫా ఇవ్వాలన్న నిర్ణయంతో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఈ నెల 30 వరకు లబ్ధిదారులకు రేషన్ దుకాణాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఫలితంగా కార్డుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. -
గంటల తరబడి.. జనాల తాకిడి
ఇబ్రహీంపట్నం: ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీకి ఆదివారం మొదటిరోజు అడ్డంకులు ఎదురయ్యాయి. దుకాణాల్లోని ఈ పాస్ సర్వర్లు మొరాయించడంతో కార్డుదారులు ఇబ్బందులు పడ్డారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం కోటాలకు ఒకేసారి కాకుండా వేర్వేరుగా ఈ పాస్ మిషన్లపై వేలిముద్రలు వేయాల్సివచ్చింది. ఒక్కో కార్డుదారుడు ఆరుసార్లు వేలిముద్రలు వేయాల్సి పరిస్థితి వచ్చింది. దీనికితోడు సర్వర్లు మొరాయిస్తుండంతో ఒక్కొక్కరికి 15 నుంచి 20 నిమిషాలు సమయం పట్టింది. ఆయా దుకాణాల వద్ద గంటల తరబడి నిరీక్షించడం కనిపించింది. కొన్ని దుకాణాలను తెరవనేలేదు. నెలనెలా వచ్చే బాధ తప్పిందని భావించిన లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పలేదు. చర్యలు తీసుకోవాలి మూడు నెలల సన్న బియ్యం ఒకేసారి ఇస్తున్నారంటే సంతోషపడ్డాం. ప్రతీనెల రావాల్సిన పనితప్పిందని అనుకున్నాం. కానీ మిషన్లు సతాయిస్తుండటంతో గంటల తరబడి షాపు వద్ద ఎదురుచూడాల్సి వచ్చింది. సమయం వృథా అవుతోంది. కార్డుదారులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి. – బాల్రాజ్, ఇబ్రహీంపట్నం -
నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
షాద్నగర్: గుట్టు చప్పుడు కాకుండా నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న, కొనుగోలు చేసిన వారిని పోలీసులు పట్టుకొన్న సంఘటన షాద్నగర్లో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు గ్రామానికి చెందిన జంపాని నాగేశ్వర్రావు కొంత కాలంగా వికారాబాద్ జిల్లా ద్యాచర్ల గ్రామంలో కొంత పొలాన్ని రైతుల వద్ద కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పల్నాడు జిల్లా అమరావతి మండలానికి చెందిన వీర వసంతరావు ద్వారా నకిలీ పత్తి విత్తనాలు తెప్పిస్తున్నాడు. మేలైన విత్తనాలు అని నమ్మించి చుట్టు పక్కల ఉండే రైతులకు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి షాద్నగర్లో విక్రయించేందుకు ప్రయత్నించారు. పట్టణ శివారులోని బక్కర్మన్ గార్డెన్ ఎదుట ఉన్న ఖాళీ స్థలంలో నిషేధిత పత్తి విత్తనాలను కారులో తీసుకొచ్చి ముగ్గురు రైతులకు విక్రయించేందుకు ప్రయత్నించారు. పక్కా సమాచారం అందుకున్న షాద్నగర్ వ్యవసాయ అధికారులు, ఎస్ఓటీ, షాద్నగర్ పోలీసులు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న, కొనుగోలు చేస్తున్న వారిని పట్టుకొన్నారు. వారి నుంచి రూ.7.5లక్షల విలువ చేసే 300కిలోల నకిలీ విత్తనాలను, కారును స్వాధీనం చేసుకున్నారు. నాగేశ్వర్రావు, వీర వసంతరావుతోపాటు వికారాబాద్ జిల్లా ఐయాన్పూర్ గ్రామానికి చెందిన రైతు గంగారపు పాండు, దాచారం గ్రామానికి చెందిన టెక్నో సీడ్స్ కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ చాకలి రాములు, ఐనాపూర్కు చెందిన రైతు నెమలి రవిని అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో షాద్నగర్ ఇన్చార్జి ఏడీఏ నిషాంత్కుమార్, ఏఈఓ తేజ్కుమార్, ఎస్ఐ శరత్కుమార్, మేడ్చల్ ఎస్ఓటీ ఎస్ఐ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. రూ.7.50 లక్షల విలువైన 300 కిలోల నిషేధిత విత్తనాలు స్వాధీనం ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు -
అంత్యక్రియలకు వెళ్లొచ్చేసరికి చోరీ
కొత్తూరు: బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వచ్చేలోగా గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని నగదును ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన మున్సిపల్ పరిధిలోని తిమ్మాపూర్ రైల్వేస్టేషన్ కాలనీలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ మురళీగౌడ్ తెలిపిన ప్రకారం.. కాలనీలో నివాసం ఉంటున్న యువజన కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షుడు వన్నాడ శివశంకర్గౌడ్ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి షాబాద్లో బంధువుల అంత్యక్రియలకు హాజరయ్యాడు. సాయంత్రం ఇంటికి వచ్చే వరకు తాళాలు పగులగొట్టి ఉండడంతో అనుమానంతో పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. బీరువాలో ఉన్న రూ.15 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పో లీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. రూ.15లక్షల నగదు అపహరణ -
నర్సింగ్ హోం సీజ్
చేవెళ్ల: ఆపరేషన్ వికటించి వ్యక్తి మృతి చెందిన ఘటనలో చేవెళ్లలోని విజయ్ నర్సింగ్ హోం (ప్రజావైద్యశాల)ను వైద్యాధికారుల బృందం శుక్రవారం సీజ్ చేసింది. మున్సిపల్ పరిధిలోని కేసారం గ్రామానికి చెందిన కల్లెంల నర్సింలుకు విజయ్నర్సింగ్హోంలో ఆపరేషన్ చేశారు. వైద్య వికటించడంతో ఆయన గురువారం మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనల చేపట్టారు. వైద్యాధికారులకు అందిన ఫిర్యాదు మేరకు జిల్లా వైద్యాధికారులు చేవెళ్ల డిప్యూటీ డీఎంహెచ్ఓ వైద్య బృందాన్ని తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు నర్సింగ్ హోంకు వచ్చిన అధికారులు ఆస్పత్రికి తాళం వేసినట్లు గుర్తించారు. ఫోన్ సంప్రదించేందుకు యత్నించినా అందుబాటులోకి రాలేదు. దీంతో వైద్యాధికారుల బృందం ఆస్పత్రిని సీజ్ చేశారు. ఆస్పత్రి వైద్యాధికారుల విచారణ పూర్తయ్యే వరకు తాళం తీయొద్దని హెచ్చరించారు. గతంలోనూ ఈ నర్సింగ్హోంను వైద్యాధికారులు తనిఖీ చేసిన సమయంలో కాలం చెల్లిన మందులు ఉన్నాయని నోటీసులు జారీ చేసిన ఇప్పటీ వరకు స్పందించలేదన్నారు. ఈ తనిఖీల్లో మొయినాబాద్ వైద్యాధికారి అన్నపూర్ణ. చేవెళ్ల సబ్సెంటర్ వైద్యురాలు వేదశ్రీ తదితరులు ఉన్నారు. -
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే పీడీ యాక్ట్
అబ్దుల్లాపూర్మెట్: నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు విక్రయించి రైతులను మోసం చేసే డీలర్లపై కఠిన చర్యలతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామని వ్యవసాయ శాఖ ఏడీఏ సుజాత హెచ్చరించారు. శుక్రవారం రైతువేదికలో వ్యవసాయ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్ మండలాల్లోని అధీకృత డీలర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ.. డీలర్లు విధిగా రికార్డులు నిర్వహించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు పోలీసుల సహకారంతో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖ అధికారిణి పల్లవి, ఎస్ఐ భద్యానాయక్, డీలర్లు పాల్గొన్నారు. రైతులకు రసీదులు ఇవ్వాలి మహేశ్వరం: ఎరువులు, విత్తనాల దుకాణాదారులు రైతులకు అధిక ధరలకు విక్రయించరాదని మహేశ్వరం వ్యవసాయ శాఖ ఏడీఏ సుధారాణి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఎరువులు, విత్తనాల దుకాణాదారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎరువులు, విత్తనాల డీలర్లు స్టాక్, బిల్ బుక్స్ సక్రమంగా నిర్వహించాలన్నారు. రైతులు రసీదు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. అనుమతిలేని మందులు, విత్తనాలు, పురుగుల మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవపాయాధికారి నాగమణి, డివిజన్ టెక్నికల్ అధికారి యాదగిరిగౌడ్, డీలర్లు పాల్గొన్నారు. వ్యవసాయశాఖ ఏడీఏ సుజాత -
ప్రాణం కాపాడిన హైడ్రా
సాక్షి, సిటీబ్యూరో: హైడ్రా ఆధీనంలోని డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ (డీఆర్ఎఫ్) బృందాలు శుక్రవారం ఓ నిండు ప్రాణాన్ని కాపాడాయి. ఒకే సమయంలో రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు జరగడంతో ఎక్కడికక్కడ ఈ బృందాలు రంగంలోకి దిగాయి. అమీర్పేటలో జరిగిన ప్రమాదం నుంచి రాజేష్ను (25) సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. శుక్రవారం మధ్యాహ్నం అమీర్పేట, పటాన్చెరుల్లో ఒకే సమయంలో అగ్గి రాజుకుంది. సారథి స్టూడియో సమీపంలోని ఐదు అంతస్తుల దివ్య శక్తి అపార్ట్మెంట్స్ రెండో ఫ్లోర్లో మధ్యాహ్నం 3.30 గంటలకు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి ఓ డబ్బింగ్ స్టూడియోలో మంటలు అంటుకోగా... సమాచారం అందుకున్న హైడ్రా కంట్రోల్ రూమ్ డీఆర్ఎఫ్ బృందాలను హుటాహుటిన ఆ ప్రాంతానికి పంపింది. ఏసీ యూనిట్కు సంబంధించిన కంప్రెషర్ పేలడంతోనే మంటలు వ్యాపించినట్లు గుర్తించాయి. స్టూడిలో చిక్కుకుపోయిన రాజేష్ చౌదరిని బయటకు తీసుకువచ్చాయి. ఈ మంటలు ఇతర అంతస్తులకు వ్యాపించకుండా డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది నిలువరించారు. స్టూడియోలో చిక్కుకున్న రాజేష్ను ల్యాడర్ ద్వారా వెళ్లి కాపాడిన డీఆర్ఎఫ్ సభ్యుడు శ్రీకాంత్ను కమిషనర్ ఏవీ రంగనాథ్ అభినందించారు. అలాగే... పటాన్చెరు పారిశ్రామికవాడలోని పాటి గ్రామంలో అను ఫర్నీచర్ గోదాంలోనూ అదే సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడికి చేరుకున్న మూడు డీఆర్ఎఫ్ బృందాలు మంటల వ్యాప్తిని నిలువరించాయి. శుక్రవారం ఒకేసారి రెండుచోట్ల అగ్ని ప్రమాదాలు సమాచారం అందటంతోనే రంగంలోకి డీఆర్ఎఫ్ అమీర్పేటలో రాజేష్ అనే యువకుడి రెస్క్యూ -
గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
షాద్నగర్రూరల్: గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన శుక్రవారం మున్సిపల్ పరిధిలోని సోలీపూర్ శివారులోగల బీబీజీ వెంచర్లో చోటు చేసుకుంది. ఎస్ఐ దేవరాజ్ తెలిపిన ప్రకారం.. బీబీజీ వెంచర్లోని నిర్మానుష్య ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ(28) మృతదేహం ఉన్నట్లు వెంచర్ నిర్వాహకులు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియచేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ దేవరాజ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి వివరాలు తెలియరాలేదు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటం, ఎముకలు తేలిపోవడం చూస్తుంటే 10 రోజుల క్రితమే మహిళ మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. మహిళ ఆత్మహత్యకు పాల్పడిందా..? గుర్తు తెలియని వ్యక్తులు తీసుకువచ్చి హత్య చేశారా అనే కోణంలో విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వెంచర్ సూపర్వైజర్ ఇంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వృద్ధ్దుడి అదృశ్యం పహాడీషరీఫ్: అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. పహాడీషరీఫ్కు చెందిన షేక్ మహబూబ్(70), షానవాజ్ బేగం దంపతులు దర్గా వద్ద నివాసం ఉంటున్నారు. ఐదు నెలలుగా మహబూబ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నెల క్రితం చివరగా కుమారుడు ముజఫర్తో ఫోన్లో మాట్లాడిన మహబూబ్ అనంతరం అందుబాటులోకి రాలేదు. అప్పటి నుంచి అతని ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయమై ముజఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో గాని 87126 62367 నంబర్లో సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు. -
మినీ సిలిండర్తో మోది యువకుడి హత్య
రాజేంద్రనగర్: తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పాటు తన భార్య తన నుంచి దూరమయ్యేందుకు కారణమని భావించిన ఓ యువకుడు మరో యువకుడిని మినీ సిలిండర్తో తలపై మోది హత్య చేసిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై మామిడి కిశోర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజేంద్రనగర్ బుద్వేల్ ప్రాంతానికి చెందిన సాయి కార్తీక్ (31), నవీన్ స్నేహితులు. ఇద్దరూ ఓ నెట్వర్క్ కంపెనీలో పని చేస్తూ అద్దె గదిలో ఉంటున్నారు. అదే ప్రాంతంలో సిద్ధార్థ్ రెడ్డి తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. సిద్ధార్థ్ రెడ్డి ర్యాపిడో డ్రైవర్గా పని చేస్తూ జీవనం సాగించేవాడు. సిద్ధార్థ్ రెడ్డి, సాయి కార్తీక్, నవీన్లకు స్నేహం కుదిరింది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత అవసరాల నిమిత్తం సాయి కార్తీక్ సిద్ధార్థ్ రెడ్డి నుంచి రూ. 8 లక్షలు అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా కాలయాపన చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ రెడ్డి భార్య గత నెలలో అతడితో గొడవ పడి వెళ్లిపోయింది. సాయి కార్తీక్ ఇందుకు కారణమని సిద్ధార్థ్ రెడ్డి భావించాడు. గురువారం రాత్రి ముగ్గురు కలిసి సాయి కార్తీక్ రూమ్లో మద్యం తాగారు. ఈ సందర్భంగా సాయి కార్తీక్, సిద్ధార్థ్ రెడ్డి మధ్య మాట మాట పెరిగింది. దీంతో నవీన్ జోక్యం చేసుకుని వారికి నచ్చజెప్పాడు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి మళ్లీ వైన్స్ షాప్ వద్దకు వెళ్లి మద్యం కొనుగోలు చేసి గదికి వచ్చి మద్యం తాగారు. అనంతరం మరోసారి సాయి కార్తీక్, సిద్ధార్థ్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నవీన్ సముదాయించేందుకు ప్రయత్నించగా సిద్ధార్థ్ రెడ్డి అతడిని బయటికి పంపించాడు. అర గంట తర్వాత నవీన్ రూమ్ గదికి వెళ్లి చూడగా సాయి కార్తీక్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పక్కనే కూర్చుని ఉన్న సిద్ధార్థ్ రెడ్డిని ఏం జరిగిందని ప్రశ్నించగా మినీ సిలిండర్తో కొట్టి చంపేశానని... నిన్ను కూడా చంపుతానని దాడి చేసేందుకు ప్రయత్నించగా నవీన్ బయటికి పరుగులు తీశాడు. బుద్వేల్ ప్రధాన రహదారిపైకి వచ్చి స్థానికులకు ఈ విషయం చెప్పాడు. దీంతో వారు అక్కడికి వెళ్లి సిద్దార్థ్ రెడ్డిని పట్టుకుని రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహన్ని మార్చురీకి తరలించారు. సిద్ధార్థ్ రెడ్డిని అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.61లక్షలు టోకరా!
రూ.21 వేలతో మొదలుపెట్టిఆన్లైన్ ద్వారా ఎరవేసిన సైబర్ నేరగాళ్లుసాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగికి ఆన్లైన్ ద్వారా ఎర వేసిన సైబర్ నేరగాళ్లు ట్రేడింగ్ పేరుతో నిండా ముంచారు. భారీ లాభాలు వస్తాయంటూ ఆశపెట్టి, రూ.21 వేలతో మొదలుపెట్టి, వర్చువల్ ఖాతాలో బ్యాలెన్స్ చూపించి రూ.61 లక్షలు స్వాహా చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సికింద్రాబాద్కు చెందిన బాధితుడికి (68) ఆన్లైన్లో వచ్చిన ఎక్స్పర్ట్స్ ప్రో లిమిటెడ్ ప్రకటన కనిపించింది. బులియన్ మార్కెట్.కామ్ అనే వెబ్సైట్ ద్వారా ట్రేడింగ్ చేస్తే భారీ లాభాలు ఉంటాయని అందులో ఉంది. దీనికి ఆకర్షితుడైన అతను ఆ సంస్థకు చెందిన యాప్ను లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకున్నారు. దీని ద్వారా వర్చువల్ ట్రేడింగ్ అకౌంట్ తెరిచాడు. తొలిసారిగా ఈ ఏడాది మార్చి 27న రూ.21 వేలు పెట్టుబడి పెట్టారు. ఆపై బాధితుడితో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపిన నేరగాళ్లు స్థానిక మార్కెట్ కాకుండా అంతర్జాతీయ ట్రేడింగ్ చేస్తే డాలర్లలో లాభాలు వస్తాయని, అందుకు అవసరమైన సలహాలు సూచనలు తామే ఇస్తామని నమ్మించారు. ఇలా కొంత పెట్టుబడి పెట్టించిన తర్వాత ఆయా స్టాక్లకు సంబంధించిన మార్జిన్ వాల్యూస్ పడిపోతున్నాయని, లాభాలు పొందటంతో పాటు ఉన్న నిధులు కోల్పోకుండా ఉండాలంటే మరికొంత మొత్తం పెట్టుబడిగా పెట్టాలని భయపెట్టారు. ఆ మొత్తం పెట్టిన బాధితుడు తనకు ట్రేడింగ్లో ఆసక్తి లేదని, తనకు ఉన్న నిధులు డ్రా చేసుకుని నిష్క్రమించాలని భావిస్తున్నట్లు నేరగాళ్లకు చెప్పాడు. దీనికి అనుమతించని వారు మరికొంత పెట్టుబడి పెట్టాలని బెదిరించారు. తన వద్ద ఉన్న మొత్తం ఇన్వెస్ట్ చేసిన బాధితుడు ఇకపై తాను పెట్టుబడి పెట్టలేనని స్పష్టం చేశాడు. అయినా వారి ఫోన్లు, ట్రేడింగ్ కొనసాగింది. ఈ నెల 21న బాధితుడు తన కుటుంబంతో కలిసి వేరే ఊరు వెళ్లారు. అలా వెళ్తున్న విషయం నేరగాళ్లకు చెప్పి, తన ట్రేడింగ్ ఖాతా నిర్వహించమని కోరారు. అందుకు అంగీకరించిన వారు అతను తిరిగి వచ్చేలోపు అనేక ఫోన్లు చేశారు. ఇంటికి చేరుకున్న బాధితుడు వారిని సంప్రదించగా... అత్యవసరంగా రూ.10 లక్షలు చెల్లించకపోతే ట్రేడింగ్ ఖాతానే కోల్పోవాల్సి వస్తుందని బెదిరించారు. ఈ నేపథ్యంలో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి బాధితుడు చెల్లింపులు ఆపేశాడు. కొన్ని రోజులకు బాధితుడికి ఫోన్ చేసిన మరో నేరగాడు కోల్పోయిన నిధులను తిరిగి వచ్చేలా చేస్తానని నమ్మించాడు. దీనికోసం నామమాత్రం పెట్టుబడి పెట్టాలని, ట్రేడింగ్ యాప్లో 75 వేల అమెరికన్ డాలర్లు (రూ.64.16 లక్షలు) ఉన్నాయని చూపించాడు. కొన్నాళ్లుగా ట్రేడింగ్ చేయకపోవడంతో ఆ ఖాతా లాక్ అయిందని, ఆ మొత్తం విత్డ్రా చేసుకోవాలంటే అన్లాక్ చేయించాలన్నాడు. ఈ పేరుతో మరికొంత మొత్తం స్వాహా చేశారు. ఇలా మొత్తం రూ.61.95 లక్షలు సైబర్ నేరగాళ్లకు చెల్లించిన బాధితుడు తాను మోసపోయినట్లు గుర్తించారు. దీంతో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆన్లైన్లో ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ట్రేడింగ్లో లాభాలంటూ మోసం యాప్లో బ్యాలెన్స్చూపిస్తూ వ్యవహారం కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు -
ప్రపంచానికి భారత్ సత్తా తెలిసింది
మీర్పేట: ఆపరేషన్ సిందూర్తో ప్రపంచానికి భారత్ సత్తా తెలిసిందని రాజ్యసభ సభ్యుడు డా.లక్ష్మణ్ అన్నారు. వీర జవాన్లకు మద్దతుగా శుక్రవారం సాయంత్రం కార్పొరేషన్ పరిధి లెనిన్నగర్ నుంచి బాలాపూర్ చౌరస్తా వరకు బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన తిరంగా ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్ భారత్ పేరిట ప్రధాని మోదీ సారథ్యంలో దేశంలో తయారు చేసిన యుద్ధ యంత్రాలు, విమానాలు, ఆయుధాలు, ఆకాశ్, బ్రహ్మోస్ లాంటి క్షిపణులు, మిస్సైల్స్ ప్రపంచ దేశాలను అబ్బురపరిచాయని తెలిపారు. ఉగ్రవాదాన్ని యుద్ధనీతితో అంతం చేయాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో మన సైనికులు వీరోచితంగా పోరాటం చేసి విజయం సాధించారన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో దేశ వ్యాప్తంగా మతాలు, భాషలు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా మువ్వన్నెల జెండాలను ప్రదర్శిస్తూ దేశభక్తిని చాటిచెప్పడానికి చేపడుతున్నదే తిరంగా ర్యాలీ అని వివరించారు. ప్రధాని మోదీ ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీరీలకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు పర్యాటకాన్ని అభివృద్ధి చేసి సుందర నగరంగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. ర్యాలీలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజభూపాల్గౌడ్, నాయకులు బొక్క నర్సింహారెడ్డి, అందెల శ్రీరాములు యాదవ్, కొలన్ శంకర్రెడ్డి, మీర్పేట–1,2 అధ్యక్షులు భిక్షపతిచారి, ముఖేష్ ముదిరాజ్, గాజుల మధు, విక్కీసాగర్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు డా.లక్ష్మణ్ -
పెద్దఅంబర్పేటలో మరో పంచాయతీ విలీనం
అబ్దుల్లాపూర్మెట్: పెద్దఅంబర్పేట పురపాలక సంఘంలో మరో గ్రామ పంచాయతీ విలీనం అయ్యింది. ఈ మున్సిపాలిటీకి ఆను కుని ఉన్న యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలానికి చెందిన సాయినగర్ను తెలంగాణ మున్సిపల్ చట్టం –2025ను అనుసరించి మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం విలీనం చేసినట్లు కమిషనర్ రవీందర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు పంచాయతీ కార్యాలయంలోని రికార్డులన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. పంచా యతీ భవనానికి ఉన్న పేరును తొలగించి పెద్దఅంబర్పేట పురపాలక సంఘం వార్డు కార్యాలయంగా బోర్డును ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా విలీనం అయిన సాయినగర్ పంచాయతీతో కలిపి పెద్దఅంబర్పేట పురపాలక సంఘంలో మొత్తం 9 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. -
దోపిడీ లేని సమాజ నిర్మాణమే లక్ష్యం
చేవెళ్ల: దేశంలో దోపిడీలేని సమాజ నిర్మాణమే లక్ష్యమని జనసేవాదళ్ రాష్ట్ర కన్వీనర్ పంజాల రమేశ్ అన్నారు. చేవెళ్లలోని సత్యసాయి పాఠశాల ఆవరణలో సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి జనసేవాదళ్ శిక్షణ తరగతుల్లో భాగంగా శుక్రవారం సభ్యులకు లక్ష్యాలు, కర్తవ్యాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా జనసేవాదళ్ సభ్యులను తయారు చేస్తోందని తెలిపారు. డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే ముగింపు సభకు పదివేల మంది హాజరయ్యేలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ శిక్షణ శిబిరాలు కొనసాగుతున్నాయని చెప్పారు. సామాజిక అంశాలతోపాటు ప్రజలు విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు సేవా కార్యక్రమాలు చేపట్టేలా కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. పేద ప్రజల పక్షాన నిలబడి ఉద్యమించే విధంగా పార్టీకి ముందుండే నడిపించే సైనికుల్లా తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు, నియోజకవర్గం ఇన్చార్జి కె.రామస్వామి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ, నాయకులు వండ్ల మంజుల, మురళీమోహన్, కరుణకుమార్ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీని విజయవంతం చేయాలి చేవెళ్లలో కొనసాగుతున్న శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా శనివారం నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో నాయకులు ప్రభులింగం, సత్యనారాయణ, సత్తిరెడ్డి, మంజుల, మక్బుల్, మీనాక్షి, శివ, అంజయ్య తదితరులు ఉన్నారు. జనసేవాదళ్ రాష్ట్ర కన్వీనర్ పంజాల రమేశ్ -
‘ఉపాధి’ని నిర్వీర్యం చేసే కుట్ర
ఇబ్రహీంపట్నం రూరల్: పేద ప్రజలకు ఉపయోగపడుతున్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రను కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ మానుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద దేశంలో 30 కోట్ల మంది పేద ప్రజలు పని చేస్తున్నారని, మరో 65 లక్షల మంది పనికోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. పేదలకు ఉపాధి కల్పించే చట్టాని నిర్వీర్యం చేయాలని చూస్తే బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఉపాధి చట్టాన్ని రక్షించుకోవాలని, పెండింగ్ బిల్లులు ఇవ్వాలన్నారు. చట్టం ప్రకారం ప్రతి కూలీకి 100 రోజులు పని కల్పించాల్సిన ప్రభుత్వం 40 నుంచి 50 రోజులు మాత్రమే కల్పిస్తోందన్నారు. దేశంలో పనులు చేసే వారు లేరని మోదీ చెప్పడం హాస్యాస్పదమన్నారు. పని కోసం దరఖాస్తు చేసుకున్న 65 లక్షల మందికి ఎందుకు పనులు కల్పించడం లేదని ప్రశ్నించారు. దినసరి కూలీ రూ.307 చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు నేటికీ అమలు చేయడం లేదన్నారు. రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చాక పేదల కష్టాలు తీరుతాయనుకుంటే భూస్వాములు, పెట్టుబడిదారులకు దాసోహం అవుతున్నారని విమర్శించారు. వ్యవసాయ కార్మికులకు ఇస్తామన్న రూ.12వేల ప్రస్తావన లేదని, మహిళలకు రూ.2,500 మాటలేదని, ఆడబిడ్డ పెళ్లి కానుక తులం బంగారం మరిచిపోయారన్నారు. హామీలు అమలు చేయడం చేతకాని సీఎం ఎందుకని, కుర్చీ దిగిపోవాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య మాట్లాడుతూ.. జిల్లాలో ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.సామేలు, డి.జగదీష్, కందుకూరి జగన్, జిల్లా నాయకులు నర్సింహ, కిషన్ పాల్గొన్నారు. రాష్ట్రంలో గ్యారంటీల ఊసేలేదు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
వర్షాకాలంలో సమస్యలు తలెత్తకుండా చర్యలు
వానాకాలం ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకుని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘మాన్సూన్’ పేరిట వంద రోజుల ప్రణాళికకు సిద్ధం కావాలని ఆదేశించింది. డివిజన్ల వారీగా ఆయా కార్యక్రమాలు చేపడుతూ సమస్యలు పరిష్కరించాలని పేర్కొంది. ఈ మేరకు అధికారులకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. మీర్పేట: రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక నుంచి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వంద రోజుల ప్రణాళికకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వంద రోజుల ప్రణాళికలో భాగంగా ముందస్తుగా మురుగు కాలువలు, నాలాలు, ఓపెన్, భూగర్భ డ్రైనేజీల్లో పూడికతీత పనులు చేపట్టనున్నారు. ముఖ్యంగా ముంపు ప్రాంతాల్లో డ్రైనేజీలు శుభ్రం చేయడంతో పాటు పాడైపోయిన మ్యాన్హోళ్లను గుర్తించి మరమ్మతులు చేపట్టనున్నారు.ప్రజలకు ముందస్తుగా అవగాహనవంద రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ప్రజారోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. బస్తీలు, కాలనీలు, రహదారులు, ఇళ్ల మధ్యలోని ఖాళీ స్థలాల్లో ప్రతిరోజు బ్లీచింగ్ చేయడం, ఫాగింగ్ చేయడం, చెరువుల్లో దోమలు వృద్ధి చెందకుండా యాంటీ లార్వా ద్రావణాన్ని వేయడం చేయనున్నారు. వర్షాకాలంలో అంటురోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్యం, వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రజలకు ముందుస్తుగా అవగాహన కల్పించనున్నారు.ఉమెన్ అమృత మిత్ర 2.0మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వన మహోత్సవానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేయనున్నారు. ఈ మేరకు ‘ఉమెన్ అమృత మిత్ర 2.0’ కార్యక్రమంలో ఆయా మున్సిపాలిటీల్లో ప్రత్యేక ప్రదేశాన్ని గుర్తించి ‘ఉమెన్ ఫర్ట్రీ పేరిట’ మహిళలతో మొక్కలు నాటించి సంరక్షించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో పాటు మున్సిపాలిటీల్లోని అన్ని పార్కులు, ఇళ్ల వద్ద, చెరువు కట్టలు, వాకింగ్ ట్రాక్లు, శ్మశానవాటికలు, క్రీడా ప్రాంగణాలు, ప్రభుత్వ భవనాల వద్ద ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టనున్నారు.అన్ని చర్యలు తీసుకుంటాంప్రభుత్వ ఆదేశాల మేరకు కార్పొరేషన్లో వంద రోజుల ప్రణాళిక యాక్షన్ప్లాన్ ఇప్పటికే సిద్ధం చేశాం. ఏ రోజు ఏ కార్యక్రమం చేపట్టాలనే దానిపై అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశాం. రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. అంటు రోగాలు ప్రబలకుండా వైద్య శిబిరాలు నిర్వహిస్తాం.– జ్ఞానేశ్వర్, కమిషనర్, మీర్పేట మున్సిపాలిటీజిల్లాలోని మున్సిపాలిటీలుమీర్పేట, బడంగ్పేట, బండ్లగూడ జాగీర్ఆదిబట్ల, ఆమనగల్లు, చేవెళ్ల, కొత్తూరు, ఇబ్రహీంపట్నం, జల్పల్లి, మణికొండ, మొయినాబాద్, నార్సింగి, పెద్దఅంబర్పేట, షాద్నగర్, శంషాబాద్, శంకర్పల్లి, తుక్కుగూడ, తుర్కయంజాల్ కార్పొరేషన్లు. -
మక్తల్ ఎమ్మెల్యే వాహనాన్ని ఢీకొన్న కారు
షాద్నగర్రూరల్: నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ఘటన ఫరూఖ్నగర్ మండల పరిధిలోని రాయికల్ టోల్ప్లాజా వద్ద చోటుచేసుకుంది. వివరాలివీ.. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి శుక్రవారం తన కారులో హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్వైపు వెళ్తున్నారు. జడ్చర్లవైపు నుంచి షాద్నగర్వైపు వెళ్తున్న మరో కారు టోల్ప్లాజాలోని వేరే లైన్కు మారేందుకు డ్రైవర్ పక్కకు తిప్పాడు. ఎమ్మెల్యే వాహనం టోల్ప్లాజాను దాటి వెళ్తున్న సమయంలో పక్కనుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలూ దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి స్థానిక నేతలు గుమ్మడికాయ కొట్టి దిష్టి తీసి మరో వాహనంలో పంపించారు. -
గ్రామాల్లో బిహార్ బృందం పర్యటన
కందుకూరు: బిహార్ రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధుల బృందం మండల పరిధిలో పర్యటించింది. అక్కడి ప్రజాప్రతినిధులు 126 మంది హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీ(డా.మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం)లో శిక్షణ పొందుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని దాసర్లపల్లి, ముచ్చర్ల గ్రామాల్లో పర్యటించారు. దాసర్లపల్లిలో ఫాంపాండ్, ముచ్చర్లలో శ్మశానవాటిక, కంపోస్టు యార్డ్, పల్లె ప్రకృతి వనం, గ్రామ పంచాయతీ భవనం, ప్రాథమిక పాఠశాల, నర్సరీ, పౌల్ట్రీ షెడ్ తదితరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నారు.. పంచాయతీలో మౌలిక సదుపాయాలు ఏవిధంగా సమకూరుస్తున్నారు.. ఇంటి పన్నులు ఏవిధంగా వసూలు చేస్తున్నారు.. కేంద్రం నుంచి వచ్చే నిధులను ఎలా వినియోగించుకుంటున్నారు అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి అభివృద్ధి పనులు బాగున్నాయని కితాబిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సరిత, ఎంపీఓ గీత, ఏపీడీ చరణ్, ఏపీఓ రవీందర్రెడ్డి, ఎంసీఆర్హెచ్ఆర్డీ ఫ్యాకల్టీ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు లావణ్య, రమేష్, ఇంద్రసేన్, మహేశ్, ఈశ్వరి, రాజేష్, ఎఫ్ఏ వెంకటేశ్ పాల్గొన్నారు. -
రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వం
మొయినాబాద్: కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్నివిధాలా అండగా ఉంటుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని అప్పోజీగూడ, రెడ్డిపల్లి గ్రామాల కిసాన్ కవన్ కార్యక్రమంలో భాగంగా శ్రీ అస్పద చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ సహకారంతో రైతులకు మందులు పిచికారీ చేసే సమయంలో వేసుకునే కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించే పంటలకు ప్రభుత్వం మద్దతు ధర అందిస్తుందని తెలిపారు. పంటల సాగుతోపాటు మందుల పిచికారీలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రత్నం, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సన్వెల్లి ప్రభాకర్రెడ్డి, జిల్లా నాయకుడు గున్నాల గోపాల్రెడ్డి, మాజీ సర్పంచ్లు గొర్కంటి రాజు, వినిత, శ్రీ అస్పద చారిటబుల్ ఫౌండేషన్ కో ఫౌండర్ టీవీ దేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.డిగ్రీ అడ్మిషన్లకు సెకండ్ ఫేజ్ ‘దోస్త్’షాద్నగర్రూరల్: ఇంటర్మీడియెట్ విద్యను పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీ అడ్మిషన్లకు సెకండ్ ఫేజ్ దోస్త్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఔత్సాహిక విద్యార్థులు జూన్ 9 వరకు రిజిస్ట్రేషన్ చేసేకునేందుకు ఆవకాశం ఉందన్నారు. ఎంపీసీ, ఎంజెడ్సీ, బీజెడ్సీ, ఎంపీసీఎస్, బీఏ, బీకాం, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరాలనుకునే విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 63050 51490, 98850 03390, 97034 41345 నంబర్లలో సంప్రదించాలని ఆమె సూచించారు.బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యత పాటించాలిమొయినాబాద్రూరల్: ఈసీ వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు నాణ్యతతో ఉండాలని జిల్లా పంచాయతీరాజ్ ఎస్సీ శ్రీనివాస్రెడ్డి, ఈఈ శ్రీరాములు, సీఈ జోగిరెడ్డి అన్నారు. నక్కలపల్లి–హైతాబాద్ మధ్యలో ఈసీ వాగుపై కొనసాగుతున్న వంతెన పనులను శుక్రవారం వారు మండల డిప్యూటీ డీఈ విజయ్కుమార్తో కలిసి పర్యవేక్షించారు. ఈసీవాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం గత ప్రభుత్వం సీఆర్ఆర్ (కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్) కింద రూ.5 కోట్లు మంజూరు చేసినట్లు విజయ్కుమార్ అధికారులకు తెలిపారు. పనులు జరుగుతున్న తీరును వారికి వివరించారు. అధికారులు మాట్లాడుతూ.. వంతెన నిర్మాణంలో ఎలాంటి జాప్యం లేకుండా నాణ్యతతో నిర్మించేలా చూడాలని సూచించారు.పీసీసీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా నిరంజన్రెడ్డిఇబ్రహీంపట్నం రూరల్: పీసీసీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా ఆదిబట్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మర్రి నిరంజన్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మర్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. కమిటీలో చోటు కల్పించడం సంతోషంగా ఉందని అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
ఇందిరమ్మ ఇల్లు ఇక రాదని..
యాచారం: ఇందిరమ్మ ఇల్లు తనకు ఇక రాదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్ల గ్రామానికి చెందిన దొడ్డి అశోక్ (45) ప్లంబర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గ్రామంలో ఆయనకు ఇంటి స్థలం లేదు. ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు అర్హుడైనప్పటికీ స్థలం లేకపోవడంతో మొదటి విడతలో ఇల్లు మంజూరు కాలేదు. ఈ నెల 23న స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి యాచారంలో లబి్ధదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేసే సమయంలో లిస్టులో తన పేరు రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.ఆ రోజు నుంచి మనోవేదనకు గురయ్యాడు. ‘స్థానిక కాంగ్రెస్ నేతలు ఇల్లు రాకుండా అడ్డుకుంటున్నారు. ఎమ్మెల్యేకు చెప్పుకొందామంటే కలవనీయరు. పిల్లలు పెద్దవుతున్నా సొంత ఇల్లు లేదాయే’అంటూ కొద్ది రోజులుగా ఇక తాను చస్తానని గ్రామస్తులతో చెబుతూ వచ్చాడు. ఈ క్రమంలో తనకు ఇల్లు రాకపోవడానికి, తన చావుకు కారణం స్థానిక కాంగ్రెస్ నాయకుడు, తన బావ యాదయ్యనేనని చేతిపై రాసుకుని శుక్రవారం ఉదయం అద్దెకుంటున్న ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్దామనే సరికే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మృతదేహంతో ఆందోళన అశోక్ మృతికి సర్కారే కారణం అంటూ అతని కుటుంబీకులు, గ్రామస్తులు మృతదేహంతో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, సీఐ నందీశ్వర్రెడ్డి, తహసీల్దార్ అయ్యప్ప, ఎంపీడీఓ శైలజ గ్రామానికి చేరుకున్నారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డి సూచన మేరకు మృతుడు అశోక్ కుటుంబానికి గ్రామంలో ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు, ముగ్గురు కూతుళ్ల చదువు, ఇతర ప్రయోజనాలు కల్పిస్తామని తహసీల్దార్ అయ్యప్ప హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. -
ఠాణా ఎదుట మహిళ హల్చల్
ఇబ్రహీంపట్నం రూరల్: ‘నేను చచ్చిపోతేనే న్యాయం జరుగుతుంది.. ఎవరి వద్దకు వెళ్లినా ప్రయోజనం లేదు.. అధికారులెవరూ న్యాయం చేయడం లేదు’ అంటూ ఓ మహిళ ఆదిబట్ల ఠాణా ఎదుట హల్చల్ చేసింది. మహబూబ్నగర్ జిల్లా మూలమడ్తా తండా యోట్టం ప్రాంతానికి చెందిన కేతావత్ బుజ్జి, రామ్సింగ్ దంపతులు. 2021లో కుర్మల్గూడలో 100 గజాల ఇంటి స్థలం కొనుగోలు చేశారు. బడంగ్పేట్ మున్సిపాలిటీ అనుమ తులతో ఇంటి నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ స్థలంలో ఇల్లు ఉందని అక్కడ ఉన్న 20కిపైగా నిర్మాణాలను స్థానిక రెవెన్యూ అధికారులు ఏడాది క్రితం కూల్చివేశారు. అప్పటి నుంచి తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మీకు ప్లాటు అమ్మి న వారి మీద కేసు పెట్టండి అని ఆర్డీఓ చెప్పడంతో పలుమార్లు పోలీస్స్టేషన్ చుట్టూ తిరిగారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం బుజ్జి తన భర్త రామ్సింగ్ చంటి బిడ్డతో కలిసి వచ్చింది. తనకు ఒక్కతే కూతురు అని, ఆమె కోసమే రూ.లక్షలు పెట్టి ప్లాటు కొనుగోలు చేశామని పేర్కొంది. తనకు కిడ్నీ సమస్య ఉందని, తిరగలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం జరగడం లేదు.. చచ్చిపోతా అంటూ తన సంచిలో ఉన్న డబ్బా తీసి ఒంటిపై పోసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు లాక్కొని పడేశారు. తర్వాత అవి నీళ్లు అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎస్ఐ వెంకటేశ్ కలగజేసుకుని సర్దిచెప్పారు. చచ్చిపోతా అంటూ హైడ్రామా సంచిలోంచి డబ్బాతీసి ఒంటిమీద పోసుకున్న మహిళ నీళ్లు అని తేలడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు -
అడుగులోతులో.. అక్రమాలు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: గ్రేటర్లో భూగర్భ కేబుళ్ల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. అంచనాలకు భిన్నంగా పనులు చేయడంతో పాటు ప్రతిపాదిత మార్గానికి భిన్నంగా లైన్లు తవ్వుతుండటం.. నిర్ధేశిత ప్రమాణాలకు భిన్నమైన కేబుళ్లు, విద్యుత్ పరికరాలు వాడుతుండడంతో లైన్లు వేసిన కొద్ది రోజులకే దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా ఐటీ, అనుబంధ కంపెనీలకు, భారీ గృహ, వాణిజ్య సముదాయాలకు నిలయమైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో చేపడుతున్న భూగర్భ కేబుల్ (యూజీ) పనుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ప్రైవేటు కాంట్రాక్టర్లతో ఇంజనీర్లు కుమ్మకై.. ఆయా రియల్ ఎస్టేట్ డెవెలపర్స్, వినియోగదారులకు కుచ్చుటోపీ పెడుతున్నారు. వాస్తవ ఖర్చుకు భిన్నంగా అంచనాలు రూపొందించడంతో పాటు అడ్డగోలుగా లైన్లు వేస్తున్నారు. నాసిరకం పనులు చేపడుతుండటంతో వేసిన కొద్ది రోజులకే ఆయా లైన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు కారణమవుతున్నాయి. ఇప్పటికే కాన్సులేట్ కార్యాలయానికి చేపట్టిన యూజీ కేబుల్ పనులు సహా కొండాపూర్, ఇబ్రహీంబాగ్, గచ్చిబౌలి, రాజేంద్రనగర్, సరూర్నగర్, కందుకూరు, బంజారాహిల్స్, కూకట్పల్లి, మేడ్చల్, జీడిమెట్ల, హబ్సిగూడ డివిజన్ల పరిధిలో చేపడుతున్న యూజీ కేబుల్ పనులను శ్రీకేబుల్ టెస్టింగ్ వ్యాన్ల ద్వారా తనిఖీ చేపడితే అక్రమాలన్నీ బయటపడే అవకాశం ఉంది.ఓ డెవలపర్స్కు నోటీసులుపుప్పాల్గూడ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఓ ప్రైవేటు డెవలపర్స్ సంస్థ రెండేళ్ల క్రితం విద్యుత్ సరఫరా కోసం దరఖాస్తు చేసుకుంది. డిస్కం ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి అంచనాలు రూపొందించారు. సదరు సంస్థకు 9,951 కిలోవాట్స్ సామర్థ్యంతో కూడిన డిమాండ్ అవసరం ఉన్నట్లు గుర్తించారు. సమీపంలోని సబ్స్టేషన్ నుంచి భూగర్భ కేబుల్ లైన్ వేసుకోవాల్సిందిగా సూచించి, ఆ మేరకు ఏ సబ్స్టేషన్ నుంచి ఏ మార్గంలో లైను వేయాలి? ఎన్ని అడుగుల లోతు తవ్వాలి? ఎంత సామర్థ్యంతో కూడిన కేబుల్ వేయాలి? కేబుల్ రక్షణ కోసం ఎంత పరిమాణంలో ఇసుక పోయాలి? కేబుళ్లపై ఏ సైజులో ఉన్న షాబాద్ బండలు పరచాలి? వంటి అన్ని అంశాలను ఎస్టిమేషన్లో పొందుపర్చారు. పనులు దక్కించుకున్న ప్రైవేటు కాంట్రాక్టర్ అంచనాలకు భిన్నంగా కేబుల్ పనులు చేసినట్లు గుర్తించారు. నిజానికి 1.5 మీటర్ల లోతులో వేయాల్సిన కేబుళ్లను భూమిపైనే పరిచ్చారు. కేబుల్ కింది భాగంలో 50 ఎంఎం, పై భాగంలో 250 ఎంఎం మందం ఇసుక పోయాలి. ఆర్వాత కేబుల్కు రక్షణగా 40 ఎంఎం షాబాద్ బండలు అమర్చాల్సి ఉంది. కానీ సదరు కాంట్రాక్టర్ పూర్తి నాసిరకంగా పనులు చేపట్టినట్లు గుర్తించారు. అంతేకాదు అధికారులు సూచించిన ప్రాంతంలో కాకుండా మరో ప్రాంతం నుంచి స్ట్రంచ్ తవ్వినట్లు నిర్ధారించారు. కేబుళ్ల మధ్య ప్రతి మూడు మీటర్లకు ఇటుకలతో హారిజంటల్ లైన్ ఏర్పాటు చేయాలి. సదరు కాంట్రాక్టర్ ఇవేవీ పట్టించుకోలేదు. నాసిరకం పనులతో తరచూ కేబుళ్లు దెబ్బతినడం, విద్యుత్ లీకేజీ సహా షార్ట్సర్క్యూట్లు తలెత్తి ఆయా భవన సముదాయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు ప్రమాదవశాత్తు లైను మీదుగా వెళ్లేవారు షార్ట్సర్క్యూట్తో ప్రమాదానికి గురై మృతి చెందే అవకాశం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఈ పనులను నిలిపివేయాల్సిందిగా ఇప్పటికే డిస్కం సదరు డెవెలపర్స్కు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.ఆ భవనాలకు కుచ్చుటోపీభూగర్భ కేబుల్ కాంట్రాక్టర్లు అదే ప్రాంతంలోని ఓ ప్రముఖ ఆస్పత్రి సహా బ్యాంకు, ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలను మోసం చేశారు. ఆర్సీపురం 130 కేవీ సబ్స్టేషన్ నుంచి ఓ బ్యాంకు కోసం వేసిన భూగర్భ కేబుల్ లైన్ పనులు అంచనాలకు భిన్నంగా ఉన్నట్లు తెలిసింది. ఏకంగా 55 శాతం లెస్తో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఆ తర్వాత క్షేత్రస్థాయి ఇంజనీర్లతో కుమ్మక్కు..రివర్స్ టెండరింగ్ పేరుతో భారీ మోసానికి పాల్పడినట్లు సమాచారం. అదే విధంగా ఓ ప్రముఖ బహుళ అంతస్తుల భవనం సహా ఆస్పత్రి లైన్లను కూడా అంచనాలకు భిన్నంగా వేశారు. రెండు సంస్థల నుంచి వేర్వేరు చార్జీలు వసూలు చేసి, సింగిల్ స్ట్రంచ్ నుంచే కేబుల్స్ వేశారు. యూజీ కేబుల్ లైన్లపై దరఖాస్తుదారులకు కానీ, డెవెలపర్లకు కానీ సరైన అవగాహన లేకపోవడం కూడా కాంట్రాక్టర్లకు కలిసి వస్తోంది. భూగర్భ కేబుల్ పనులన్నీ ప్రైవేటు కాంట్రాక్టర్లే చేస్తున్నప్పటికీ.. ఆయా పనులను సంబంధిత డివిజన్ ఇంజనీర్లు పర్యవేక్షించాల్సి ఉంది. కానీ కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తి పడి వారు నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. తీరా పనులు పూర్తయిన తర్వాత కేబుళ్లు భూమిపై తేలి కన్పిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏదో ఒక పేరుతో ఆయా మార్గాల్లో తరచూ తవ్వకాలు చేపడుతుండటం.. కేబుల్ లైన్లపై ఎలాంటి హెచ్చరికల బోర్డులు లేకపోవడం.. భారీ వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుండటంతో వేసిన కొద్ది రోజులకే కేబుళ్లు దెబ్బతింటున్నాయి. షార్ట్ సర్క్యూట్లు తలెత్తి ఆయా సంస్థలకు సరఫరా నిలిచిపోతోంది. విషయం తెలియక ఆయా భవనాల్లోని వినియోగదారులు ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల వేదికగా డిస్కంపై తప్పుడు ప్రచారానికి దిగుతున్నారు. ఇటీవల ఈ తరహా ఫిర్యాదులనే డిస్కం ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తోంది. -
ఫ్యూచరా.. ఫార్మానా..?
ఇబ్రహీంపట్నం రూరల్: ఫ్యూచర్ సిటీనా లేక ఫోర్త్ సిటీనా ఫార్మాసిటీనా అనేదానిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి క్లారిటీ లేదని మాజీ మంత్రి సబితారెడ్డి అన్నారు. ఫార్మాసిటీతో పాటు జిల్లాలోని వివిధ భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో కలిసి గురువారం కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్మా కోసం 14వేల ఎకరాల భూములు సేకరించిందని గుర్తు చేశారు. రైతులకు మంచి పరిహారంతో పాటు ఇళ్ల స్థలాలు ఇచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వం లబ్ధిదారులకు పొజిషన్ చూపించాలన్నారు. పొజిషన్లో ఉండి కాగితాలు లేని రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు. పట్టా భూములు సేకరించిన రైతులకు నేటికీ పరిహారం ఇవ్వలేదని, కలెక్టర్ను అడిగితే కోర్టులో జమ చేశామని చెబుతున్నారని వెంటనే ఆ సమస్య తీర్చాలన్నారు. లేదంటే రైతులకు పట్టా భూములు విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు. కబ్జాలో ఉన్న రైతులకు కూడా న్యాయం చేయాలన్నారు. చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారు తప్ప పరిహారం ఇవ్వడం లేదన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని పనులు చేస్తే ఊరుకోబోమని, బలవంతంగా భూసేకరణ చేస్తే సహించబోమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే ఫార్మా రద్దు చేస్తాం, మీ భూములు మీకిస్తామని చెప్పి మాట తప్పారన్నారు. వెంటనే భూములను రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుర్రంగూడ భూసేకరణ సందర్భంగా ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ పొజిషనల్ చూపడం లేదన్నారు. కాంగ్రెస్ది రెండు నాల్కల ధోరణి ఫార్మా విషయంలో కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి విమర్శించారు. కోర్టుల్లో ఫార్మా అని ప్రభుత్వం సమర్పించి రైతులకు, ప్రజలకు మాత్రం ఫోర్త్ సిటీ అని చెప్పడం రెండు నాల్కల ధోరణి కాదా అని ప్రశ్నించారు. ఫోర్త్ సిటీ రోడ్డుకు భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇవ్వకుండానే రోడ్డు ప్రారంభించడం తగదన్నారు. పరిహారం విషయంలో చాలా మందికి అన్యాయం జరిగిందన్నారు. రైతులను ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్నారు. రైతులకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రమేష్గౌడ్, బాష, రామిడి రాంరెడ్డి, ప్రభాకర్, రాజు నాయక్, గోవర్థన్నాయక్, శేఖర్ గుప్తా, గుర్రం సాయికిరణ్రెడ్డి, హరికిషన్రెడ్డి , రమష్, శ్రీధర్రెడ్డి, అబీబుద్దీన్, బుగ్గరాములు పాల్గొన్నారు. ప్రభుత్వం స్పష్టతనివ్వాలి మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి -
చెరువులోకి చేరేదెన్నడో!
షాద్నగర్: వర్షాకాలంలో నిండిన చెరువులతో రైతులు సాగుబాట పడితే.. అవే చెరువులను మత్స్యకారులు జీవనోపాధిగా మలుచుకుంటున్నారు. మత్స్యకారుల ఉపాధిని ప్రోత్సహించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటి వరకు చేప పిల్లల పంపిణీకి సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఊసేలేదు. దీంతో ఈసారి చేప పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదీ పరిస్థితి జిల్లాలోని 27 మండలాల్లో మొత్తం నీటి వనరులున్న చెరువులు, కుంటలు వెయ్యి వరకు ఉన్నాయి. వీటి విస్తీర్ణం సుమారు 15వేల హెక్టార్ల వరకు ఉంటుంది. జిల్లాలో 210 పైగా మత్స్యసహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో మత్స్యకారులు 10వేల మంది, మత్స్యకార వృత్తిపై సుమారు 15వేల మంది చేపలు పట్టడం, వాటిని విక్రయించడం ద్వారా ఉపాధి పొందుతున్నారు. 2016–17లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. గత ఏడాది చేప పిల్లల పంపిణీ కోసం రూ.93 లక్షలు కేటాయించి అక్టోబర్లో సుమారు 400 చెరువుల్లో మాత్రమే చేపపిల్లలను వదిలారు. గత ప్రభుత్వ హయంలో మత్స్యశాఖపై అవినీతి ఆరోపణలు రావడంతో ప్రస్తుతం చేప పిల్లల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. ఊసేలేని టెండర్ ప్రక్రియ ప్రతి ఏడాది మేలోనే చేప పిల్లల కొనుగోలు కోసం ప్రభుత్వం టెండర్లను పిలిచేది. వర్షాలు కురిసి చెరువుల్లో నీరు చేరితే ఆగస్టులో మత్స్యకారులకు ఆ శాఖ అధికారులు వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేసేవారు. ఈ ఏడాది మే నెల పూర్తి కావస్తున్నా నేటికీ చేప పిల్లల పంపిణీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. చేప పిల్లల కొనుగోలుకు టెండర్ పిలవాల్సి ఉన్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్ట లేదు. దీంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు వర్షాలు ఈసారి నైరుతి రుతుపవనాలు ముందస్తుగా రావడంతో వర్షాలు ప్రారంభం అయ్యాయి. జలాశయాల్లో నీరు చేరే సమయానికి ఉచిత చేప పిల్లలను వదిలే అవకాశం ఉంటుందో లేదో అన్నది అనుమానంగా ఉంది. ఈ ఏడాది నేటికీ చేప పిల్లల టెండర్ ప్రక్రియ మొదలు కాకపోవడంతో మత్స్యకారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఏటా జిల్లాలో ఆగస్టు, సెప్టెంబర్ నెలలో చేప పిల్లల పంపిణీ జరిగేది. అప్పటి వరకు వర్షాలు పుష్కలంగా కురిసి చెరువుల్లో నీరు సమృద్ధిగా ఉంటాయి. ఆ సమయంలో చేప పిల్లలు వదిలితే అవి చక్కగా ఎదిగేందుకు అవకాశం ఉండడంతో పాటు ఎదిగిన చేపల విక్రయాల ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా లబ్ధి జరుగుతుంది. ఆలస్యం చేస్తే చేపలు ఎదగడం కష్టంగా మారుతుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు నాసిరకం చేప పిల్లలు పంపిణీ చేస్తున్నారని, దీంతో చేప పిల్లలు సరిగా ఎదగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. -
గోవాలో క్యాసినో సెక్యూరిటీ గార్డు హత్య
సాక్షి, సిటీబ్యూరో: పేకాట కోసం హైదరాబాద్ నుంచి గోవా వెళ్లిన ఓ రౌడీషీటర్ బుధవారం అర్థరాత్రి రెచ్చిపోయాడు. పనాజీలోని కంపాల్లో ఉన్న ఓ క్యాసినోలో వీరంగం సృష్టించాడు. స్వల్ప వివాదం నేపథ్యంలో విచక్షణ కోల్పోయి కర్రతో సెక్యూరిటీ గార్డులపై విరుచుకుపడ్డాడు. ఈ ఉదంతంలో ఓ సెక్యూరిటీ గార్డు చనిపోగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గోవా నుంచి పారిపోవడానికి దబోలిం విమానాశ్రయానికి వెళ్తుండగా సదరు రౌడీషీటర్ను పనాజీ పోలీసులు మార్గమధ్యంలో గురువారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. చార్మినార్లోని మిశ్రీగంజ్కు చెందిన అబ్దుల్ అల్తాఫ్కు నేరచరిత్ర ఉంది. ఈ నేపథ్యంలోనే ఇతడిపై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మైలార్దేవ్పల్లి పోలీసులు రౌడీషీట్ తెరిచారు. పేకాట కోసం తరచు గోవా వెళ్లివచ్చే ఇతగాడు రెండు రోజుల క్రితం అలానే వెళ్లాడు. బుధవారం రాత్రి గోవా రాజధాని పనాజీలోని కంపాల్లో ఉన్న క్యాసినో కార్నివాల్ అనే క్యాసినోకు వెళ్లాడు. అర్థరాత్రి దాటిన తర్వాత స్వల్ప విషయమై క్యాసినో నిర్వాహకులతో అల్తాఫ్కు వివాదం ఏర్పడింది. యాజమాన్యం ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఆ క్యాసినో సెక్యూరిటీ గార్డులు అల్తాఫ్కు సర్దిచెప్పడంతో పాటు అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో విచక్షణ కోల్పోయిన అల్తాఫ్ క్యాసినోలోని ఇంటర్నల్ స్టెయిర్ కేస్కు సంబంధించిన బ్లస్టర్ (పక్కన ఉండే కర్ర) విరగ్గొట్టి, దాన్ని తీసుకుని సెక్యూరిటీ గార్డులపై దాడి చేశాడు. ఈ బ్లస్టర్కు కింది భాగంలో ఇనుప తొడుగు ఉండటంతో మధ్యప్రదేశ్ నుంచి వెళ్లి గోవాలో పని చేస్తున్న ధీరు శర్మ, సౌత్ గోవాలోని షిరోడాకు చెందిన సత్యం గోవాన్కర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సహచర సెక్యూరిటీ గార్డులు బాంబోలింలోని గోవా మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ధీరు శర్మ చనిపోగా... సత్యం పరిస్థితి విషమంగా ఉంది. అదును చూసుకుని ఆ క్యాసినో నుంచి బయటపడిన అల్తాఫ్ తాను బస చేసిన హోటల్ గదికి వెళ్లాడు. అక్కడ నుంచి తన లగేజీ తీసుకుని నార్త్ గోవాలోని దబోలిం విమానాశ్రయానికి బయలుదేరాడు. విషయం పోలీసుల వద్దకు వెళ్లి, కేసు నమోదయ్యే లోపు హైదరాబాద్ వచ్చి అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలని భావించాడు. క్యాసినో కార్నివాల్లో జరిగిన ఈ ఘాతుకంపై గురువారం తెల్లవారుజామున 3.10 గంటలకు పనాజీ పోలీసులకు సమాచారం అందింది. తక్షణం అప్రమత్తమైన నార్త్ గోవా ఎస్పీ రాహుల్ గుప్తా నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. క్యాసినోలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి నిందితుడు అల్తాఫ్గా గుర్తించారు. అతడు విమానాశ్రయానికి వెళ్తున్నాడని తెలుసుకుని మార్గమధ్యంలో అరెస్టు చేశారు. ఈ నేరాన్ని లోతుగా దర్యాప్తు చేస్తున్న గోవా పోలీసులు అల్తాఫ్ అక్కడకు ఎందుకు వచ్చాడు? వివాదానికి కారణం ఏంటి? అనే విషయాలు ఆరా తీస్తున్నారు. స్వల్ప వివాదం నేపథ్యంలో చంపేసిన నగర వాసి నిందితుడు మైలార్దేవ్పల్లిఠాణా రౌడీషీటర్ అల్తాఫ్ దబోలిం ఎయిర్పోర్టు దారిలోపట్టుకున్న పనాజీ పోలీసులు -
ఆపరేషన్ వికటించి వ్యక్తి మృతి
చేవెళ్ల: ఆపరేషన్ వికటించి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన గురువారం చేవెళ్లలో చోటుచేసుకుంది, పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని కేసారానికి చెందిన కల్లెంల నర్సింలు (50) వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడు. ఇతనికి కడుపులోని బొడ్డు వద్ద గడ్డ ఉందని వైద్యులు గుర్తించారు. ఈక్రమంలో గత బుధవారం విజయ్ నర్సింగ్హోంకు వెళ్లి డాక్టర్ విజయ్కుమార్ను కలిశాడు. చిన్న ఆపరేషన్ ద్వారా తొలగించేద్దామని చెప్పడంతో ఆస్పత్రిలో చేరాడు. సాయంత్రం వేళ శస్త్రచికిత్స చేసి గడ్డను తొలగించారు. ఇదిలా ఉండగా గురువారం ఉదయం నర్సింలు నోరు తడి ఆరిపోతోందని, పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు డాక్టర్కు చెప్పారు. ఏమీ కాదని చెప్పిన ఆయన గ్లూకోజ్ పెట్టినా, ఎక్కకపోవడంతో అనుమానం వచ్చి మహేందర్రెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే నర్సింలు చనిపోయాడని ఆరోపిస్తూ అతని బంధువులు మృతదేహంతో వచ్చి విజయ్ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. అప్పటికే డాక్టర్లందరూ వెళ్లిపోయారు. పోస్టుమార్టం నిమిత్తం బాడీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య లక్ష్మమ్మ, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.చేవెళ్లలో ఘటన విజయ్ నర్సింగ్హోం ఎదుట బాధితుల ఆందోళన కేసు నమోదు చేసిన పోలీసులు -
ఆలయంలో బంగారు నగల చోరీ
యాచారం: మండల పరిధి నస్దిక్సింగారంలోని సీతారామాంజనేయస్వామి దేవాలయంలో బుధ వారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. దుండగులు దేవాలయంలోని తలుపులను పగులగొట్టి దేవతామూర్తుల మెడలో ఉన్న రూ.లక్ష లోపు విలువ జేసే బంగారు ఆభరణాలు, హుండీలో ఉన్న నగదును అపహరించారు. స్థానికుల సమాచారం మేరకు గురువారం ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి, ఎస్ఐ మధులు సీతారామాంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించి చోరీకి పాల్పడిన తీరును పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు. -
షార్ట్ సర్క్యూట్తో హోటల్ దగ్ధం
షాద్నగర్రూరల్: షార్ట్ సర్క్యూట్తో ఓ హోటల్ దగ్ధమైన సంఘటన ఫరూఖ్నగర్ మండల పరిధిలోని ఎలికట్టలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలిచంద్రయ్య హోటల్ నిర్వహిస్తూ జీవనోపాధిని పొందుతున్నాడు. బుధవారం రాత్రి ఎప్పటిలాగే హోటల్ను మూసివేసి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తరువాత షార్ట్ సర్క్యూట్ కావడంతో హోటల్లోని సామగ్రి, వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. గురువారం తెల్లవారుజామున చంద్రయ్య చూడగా దట్టమైన పొగతో నిండిపోయింది. హోటల్లోని ప్రిడ్జ్లు, కౌంటర్లు, కంప్యూటర్, ప్రింటర్, సీసీ కెమెరాల ఎక్విప్మెంట్, ఫ్యాన్లు, కుర్చీలు, కూల్ డ్రింక్, వాటర్ బాటిళ్లు పూర్తిగా కాలిపోయాయి. విషయాన్ని తెలుసుకున్న ఆర్ఐ సలీం, పంచాయతీ కార్యదర్శి తేజస్విని ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ షార్ట్ సర్క్యూట్తో దాదాపు రూ.2లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు హోటల్ యజమాని చంద్రయ్య తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు. -
రూ.11 లక్షలకు రైతుబజార్ వేలం
పహాడీషరీఫ్: జల్పల్లి మున్సిపాలిటీ రైతుబజార్ వేలంలో రూ.11,03,500కు పలికింది. మున్సిపాలిటీ కమిషనర్ బి.వెంకట్రామ్ సమక్షంలో గురువారం నిర్వహించిన ఈ వేలంలో ఆరుగురు సీహెచ్ నవీన్ గౌడ్, మహ్మద్ అలీ, ఎస్.కె.అమీర్, బి.నాగభూషణం, ఎండీ జ మీయువద్దీన్లు ముందుకు రావడంతో వేలం నిర్వహించగా రూ .11,03,500లకు మహ్మద్ అలీ దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా కమిషన ర్ మాట్లాడుతూ.. రైతుబజార్ దక్కించుకున్న వారు వచ్చే ఏడాది మే 31వ తే దీ వరకు వీధి వ్యాపారుల వద్ద రుసుంను వసూలు చేసుకునేందుకు అవకా శం ఉంటుందన్నారు. తాము సూచించనంత మేరకే వ్యాపారుల నుంచి డ బ్బులు వసూలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి జ్యో తి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ భానుచందర్, మహ్మద్ మస్తాన్ వలీ పాల్గొన్నారు. బెదిరిస్తున్న యువకుడిపై ఫిర్యాదు ఫిలింనగర్: నన్ను కాదంటే నువ్వు పెళ్లి ఎలా చేసుకుంటావో చూస్తానంటూ బెదిరించిన మాజీ ప్రియుడిపై ఓ యువతి ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే..షేక్పేట ఓయూ కాలనీలో నివసించే ప్రముఖ డిజైనర్ (26) ఓ బొటిక్ నడుపుతున్నది. ఆమెకు 2024లో అభిలాష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. అయితే ఇద్దరూ కొన్ని కారణాల వల్ల విడిపోయారు. అప్పటి నుంచి నిందితుడు అభిలాష్ ఆమెను బ్లాక్మెయిల్ చేయసాగాడు. ఆమె ఫొటోలను స్నేహితులకు పంపుతూ ప్రతిష్టను దిగజార్చసాగాడు. ఆమె ఫ్లాట్ వద్ద అనుమానాస్పదంగా తిరగడంతో పాటు జుమాటో డెలివరీ బాయ్గా అపార్ట్మెంట్లోకి ప్రవేశిస్తూ ఆమె ఫ్లాట్ వద్దకు వచ్చి డెలివరీ ఆర్డర్ తీసుకోవాలంటూ వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె రెండు రోజుల క్రితం అభిలాష్ సోదరుడి దృష్టికి తీసుకువెళ్లింది. వారు పట్టించుకోలేదు. తనపై ఫిర్యాదు చేస్తావా అంటూ అభిలాష్ మళ్లీ బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్కు పాల్పడసాగాడు. నిందితుడి వల్ల తాను బొటిక్ నడపలేకపోతున్నానని, వ్యాపారం దెబ్బతిన్నదని, పూర్తి నష్టాల్లో ఉన్నానని, తన పెళ్లి కూడా ఇతని చేష్టల వల్ల ఇబ్బందులకు గురవుతున్నదని ఆరోపిస్తూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు నిందితుడు అభిలాష్పై బీఎన్ఎస్ సెక్షన్ 78 (2), 336 (4), 351 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పెళ్లి చేసుకోపోతే సూసైడ్ చేసుకుంటానంటూ బెదిరింపు ఫిలింనగర్: తనను పెళ్లి చేసుకోపోతే సూసైడ్ చేసుకుంటానంటూ ఓ యువకుడు బెదిరించడమే కాకుండా ఆమె కళ్లముందే బ్లేడ్తో చేతిని కట్ చేసుకుని బ్లాక్మెయిల్కు పాల్పడిన ఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..యూసుఫ్గూడ ఎల్ఎన్ నగర్లో నివసించే యువతి (24) జూబ్లీహిల్స్లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తోంది. రెండేళ్ల క్రితం జూబ్లీహిల్స్ వెంకటగిరికి చెందిన ఎన్.అరవింద్ అనే దూరపు బంధువుతో పరిచయం ఏర్పడింది. అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోగా..వారి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో రెండు కుటుంబాలు ఒప్పుకోకపోతే తాను పెళ్లి చేసుకోనని యువతి చెప్పింది. ఆగ్రహించిన అరవింద్ గత మూడు నెలలుగా ఆమెను పెళ్లి చేసుకోవాలంటూ మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆమె తిరస్కరిస్తూ వస్తున్నది. దీంతో ఆమె పనిచేస్తున్న ఆస్పత్రి వద్దకు కూడా రోజూ వెళ్తూ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయసాగాడు. బుధవారం రాత్రి ఆమె విధులు ముగించుకుని ఆస్పత్రి పార్కింగ్ స్థలంలోకి వచ్చి స్కూటీ తీసుకుంటుండగా, అక్కడికి వచ్చిన అరవింద్ ఆమెను అడ్డుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని మరోసారి ఒత్తిడి చేశాడు. ఆమె కుదరదని చెప్పడంతో జేబులో ఉన్న బ్లేడ్ తీసి చేతిని కోసుకున్నాడు. తనను పెళ్లి చేసుకోకపోతే ఇక్కడే సూసైడ్ చేసుకుంటానంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు అక్కడి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిలింనగర్ పోలీసులు నిందితుడిపై బీఎన్ఎస్ సెక్షన్ 78 (2), 351 (2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘అవాస్తవాలప్రచారం సరికాదు’
ఇబ్రహీంపట్నం: తాను కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నట్లు ప్రచారం చేయడం సరికాదని ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటనర్సప్ప గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నట్లు చెప్పారు. తనపై ఉద్దేశ పూర్వకంగా కొందరు అవాస్తవాలు ప్రచారం చేసి, కార్మికులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు సూచనల మేరకే వ్యవహరిస్తున్నట్లు వివరించారు.విద్యుదాఘాతంతో పాడి ఆవు మృతిషాబాద్: విద్యుదాఘాతంతో ఓ పాడి ఆవు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని చర్లగూడలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నక్కల కిష్టయ్యకు చెందిన ఆవు మేత మేస్తూ మీరాపూర్ సమీపంలో విద్యుత్ టాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో షాక్ కొట్టి అక్కడిక్కడే మృతి చెందింది. దాని విలువ సుమారు రూ.లక్షల వరకు ఉంటుందని, ప్రభుత్వమే తనను ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.త్వరితగతిన ఎస్టీపీల పనులుసాక్షి, సిటీబ్యూరో: ఎస్టీపీల పనుల్లో వేగంపెంచి తుదిదశలో ఉన్న వాటిని ప్రారంభానికి సిద్ధం చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఈడీ మాయాంక్ మిట్టల్తో కలిసి అంబర్పేట్, అత్తాపూర్ ఎస్టీపీలను సందర్శించారు. తొలుత అంబర్పేట్ ఎస్టీపీకి వెళ్లిన ఆయన.. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. చిన్న చిన్న సివిల్ వర్క్లు, గార్డెనింగ్, పెయింటింగ్, అంతర్గత రోడ్ల నిర్మాణంలాంటి పనుల్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఎస్టీపీని ప్రారంభానికి సిద్ధం చేయాలని పేర్కొన్నారు. అనంతరం అత్తాపూర్ ఎస్టీపీని సైతం సందర్శించారు. పనుల పురోగతిని పరిశీలించిన ఎండీ మిగిలిపోయిన పనుల్ని సాధ్యమైనంత తొందరగా పూర్తిచేసి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ శ్రీధర్, సీజీఎం సుజాత, ఎస్టీపీ ప్రాజెక్టు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచానికి సైనిక సత్తా చాటాం
షాద్నగర్రూరల్: ఆపరేషన్ సిందూర్తో మన సైనికుల సత్తాను ప్రపంచ దేశాలకు చాటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్ గౌడ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయోత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలో తిరంగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాజ్భూపాల్గౌడ్ మాట్లాడుతూ.. మన సైనికులు దేశ ప్రజలకోసం పోరాడుతున్నారన్నారు. పాకిస్తాన్పై భారత సైనికులు చేసింది ఆపరేషన్ మాత్రమేనని యుద్ధం కాదన్నారు. యుద్ధానికి దిగితే పాకిస్తాన్ కనుమరుగువుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అందె బాబయ్య, శ్రీవర్ధన్రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి, మహేందర్రెడ్డి, రమేష్, వెంకటేష్గుప్తా, వెంకటేష్, హరిభూషణ్ పటేల్, శ్రీనివాస్రెడ్డి, నాగవర్దన్రెడ్డి, యువసత్తా లక్ష్మణ్కుమార్, శ్రీనివాస చారి, ప్రశాంత్, చంద్రశేఖరప్ప, వరలక్ష్మి, జలజ, శ్రీనివాస్, వంశీ, అశోక్, కుర్మయ్య, మనోహర్, శ్రీకాంత్, శంకర్, మమత తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్ గౌడ్ -
మైనింగ్ ఏర్పాటు వద్దు
● పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు ● సమావేశానికి బయటి వ్యక్తులను తీసుకువచ్చిన నిర్వాహకులు కందుకూరు: మైనింగ్ ప్రాజెక్టు ఏర్పాటుకు బుధవారం నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ఆందోళనల నడుమ ముగిసింది. కందుకూరు రెవెన్యూ సర్వే నంబర్ 338, 339లో 4.75 హెక్టార్ల భూమిలో మెస్సర్స్ గాంగే మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మైనింగ్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. అందుకు సంబంధించి పర్యావరణ అనుమతులకు కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకటనర్సయ్య, ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, తహసీల్దార్ గోపాల్ సమక్షంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. కాగా ఆ భూమికి చుట్టు పక్కల ఉన్న రైతులు మైనింగ్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఎస్.పాండు, మాజీ ఉప సర్పంచ్ జి.సుధాకర్రెడ్డి, రైతులు జగన్, బీరప్ప, విలాసిత్రెడ్డి తదితరులు మా ట్లాడుతూ.. 20 ఏళ్లుగా తమ భూముల పక్కనే మైనింగ్కు అనుమతులు ఇవ్వడంతో చాలా ఇబ్బందులు పడ్డా మని తెలిపారు. బ్లాస్టింగ్లతో బోర్లలో మోటార్లు కూరుకుపోవడం, పొలాల్లో రాళ్లు వచ్చి పడడం, దు మ్ము, ధూళితో పంట నష్టపోయామని వాపోయా రు. మైనింగ్ ఏర్పాటు చేయవద్దని తేల్చి చెప్పా రు. కొందరు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మైనింగ్ ఏర్పాటు చేయాలని, మరికొందరు మాత్రం రైతులకు ఇబ్బందులు కలుగకుండా వారిని ఒప్పించాలని సూచించారు. సమీప గ్రామం తిమ్మాయిపల్లికి చెందిన కొందరు మా త్రం మైనింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలోసంబంధం లేని వ్యక్తులు కాగా పర్యావరణ ప్రజాభిప్రాయం పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బుధవారం ఉదయం మైక్ ద్వారా దండోరా వేయించడం గమనార్హం. దీంతో చాలా మందికి అక్కడ అభిప్రాయ సేకరణ ఉందనే విషయమే తెలియదు. మరోపక్క మైనింగ్ కంపెనీ నిర్వాహకులు మాత్రం ముందు జాగ్రత్తగా బయటి ప్రాంతాల నుంచి సంబంధంలేని వ్యక్తులను తీసుకువచ్చి కూర్చోపెట్టారు. వారితో తమకు అనుకూలంగా చెప్పించుకునే ప్రయత్నం చేశారు. విషయాన్ని గుర్తించిన స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ప్రజాభిప్రాయ సేకరణలో వ్యక్తం చేసిన అంశాలను పైఅధికారులకు నివేదిస్తామని ఈ సందర్భంగా ఆర్డీఓ తెలిపారు. కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ రాజు, ఆర్ఐ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
అధికంగా పాలిచ్చే పశువుల వివరాలు నమోదు చేయాలి
జిల్లా పశు గణనాభివృద్ధి సంస్థ అధికారి అరుణశ్రీ మొయినాబాద్: సురభి చయాన్ శ్రకల కార్యక్ర మంలో భాగంగా పది లీటర్లకు పైగా పాలిచ్చే ఆవులు, గేదెల వివరాలను భారత్ పశుధన్ యాప్లో నమోదు చేయాలని జిల్లా పశు గణనాభివృద్ధి సంస్థ అధికారి డాక్టర్ అరుణశ్రీ గోపాల మిత్రలకు సూచించారు. బుధవారం మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్ మండలాల్లోని గోపాలమిత్ర కేంద్రాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ అరుణశ్రీ మా ట్లాడుతూ.. దేశంలో ఎక్కువ పాలిచ్చే జ న్యు వులు ఉన్న ఆవులు, గేదెలను గుర్తించేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తద్వా రా పశుపోషకదారులకు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రభుత్వం యోచిస్తుందన్నారు. గ్రామాల్లో పర్యటించి అధికంగా పాలిచ్చే ఆవులు, గేదెలను గుర్తించి భారత్ పశుధన్ యాప్లో వివరాలను నమోదు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో గోపాల మిత్రలు శ్రీనివాస్, యాదయ్య, బాలకిష్టయ్య, విద్యాసాగర్, రాజేశ్, నరేశ్ పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన రైతులు
● ఎకరాకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వండి ● లేదంటే డీఎల్ఐ ప్రాజెక్టు రద్దు చేయండి మాడ్గుల: డిండి లిఫ్ట్ ఇరిగేషన్(డీఎల్ఐ) ప్రాజెక్టు రద్దు చేయాలని కోరుతూ ఇర్విన్, నల్లచెరువు, రెడ్డిపల్లి రైతులు రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మాల్ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. నల్గొండ జిల్లా రైతులకు నీరందించేందుకు నిర్మించిన తలపెట్టిన డిండి లిఫ్ట్ ఇరిగేషన్తో తా ము నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.8లక్షల పరిహారం చెల్లిస్తున్నారని..ఆ పరిహారంతో గుంట భూమి దొరికే పరిస్థితి లేదని మండిపడ్డారు. ఎంత భూమి కోల్పోతే అంత భూమి లేదా ఎకరాకు రూ.50లక్షల చొప్పున పరిహారం చెల్లించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతులకు సమాచారం లేకుండానే పరిహారం జమ చేయడం సరికాదన్నారు. ప్రాణాలు పోయినా భూములిచ్చేది లేదంటూ భీష్మించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి తహసీల్దార్ వినయ్సాగర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
నిరుపేదలకు నాణ్యమైన విద్య
విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మంచాల: నిరుపేదలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. బుధవారం ఆయన జిల్లా విద్యాధికారి సుశీందర్రావు, ఎస్డీఎఫ్ సభ్యురాలు పద్మజతో కలిసి మంచాల జెడ్పీహెచ్ఎస్ను సందర్శించారు. పాఠశాల ఉపాధ్యాయ బృందంతో కలిసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందడం కష్టతరమైందని.. భవిష్యత్ తరాలకోసం ప్రజల భాగస్వామ్యంతో పాఠశాలలను మరింత అభివృద్ధి దిశగా తీసుకుపోవాలన్నారు. ఈ మేరకు జూన్ 6వ తేదీన మంచాల గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. వారి వెంట ఎంఈఓ రాందాస్, ఉపాధ్యాయులు ఉన్నారు. ‘ఉపాధి హామీ’ నిర్వీర్యానికి కేంద్రం కుట్ర సీపీఎం కార్యదర్శి పగడాల యాదయ్య యాచారం: కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య అన్నారు. బుధవారం ఆయన చింతపట్ల, నల్లవెల్లి గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ రక్షణ కోసం ఈ నెల 30న కలెక్టరేట్ ఎదుట చేపట్టనున్న ధర్నా ను విజయవంతం చేయాలన్నారు. కూలీల పొట్టకొడుతున్న కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కోట్లాది రూపాయల రుణమాఫీ చేస్తోందని మండిపడ్డారు. ఉపాధిహామీ చట్టా న్ని కాపాడకునేందుకు సమష్టి పోరాటం చేయా లని పిలుపునిచ్చారు. వేలాది మంది కూలీలు తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య, నాయకులు సత్యం, జంగయ్య, గిరి, శ్రీశైలం, ప్రభాకార్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. విజయలక్ష్మి ఆస్పత్రిపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి ఆస్పత్రిపై మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)కు బాధితుడు గణేశ్ బుధవారం ఫిర్యాదు చేశాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈనెల 4న విజయలక్ష్మి ఆస్పత్రిలో పురిటిలోనే పసికందులు మృత్యువాత పడ్డారని బాధితుడు తెలిపారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి సంబంధిత వైద్యురాలు అనూషరెడ్డిపై చర్యలు తీసుకుని ఆస్పత్రి లైసెన్స్ను రద్దు చేయాలని ముఖ్యమంత్రికి, కలెక్టర్, డీఎంహెచ్ఓలకు ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు వివరించారు. 8న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదం పంపిణీ హిమాయత్నగర్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జూన్ 8వ తేదీన చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిన గౌడ్స్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. బుధవారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దివంగత బత్తిని హరినాథ్ గౌడ్ తనయుడు బత్తిన అమర్నాథ్ గౌడ్ మాట్లాడారు. మృగశిర కార్తె అయిన జూన్ 8న ఆదివారం ఉదయం 10 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు. దేశ, విదేశాల నుండి లక్షలాది మంది వస్తుంటారని, ఎవ్వరికీ ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పంపిణీ సజావుగా సాగడానికి ఈ సంవత్సరం ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందని వివరించారు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఆర్టీసీ, మున్సిపాలిటీ, పోలీస్, విద్యుత్ శాఖలతో పాటు మత్య్సశాఖలతో సమావేశాలు ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉన్నామన్నారు. -
అవినీతి జలగలు!
రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లో తిష్ట సాక్షి, రంగారెడ్డి జిల్లా: కార్యాలయాల ఆవరణలో అవినీతి రహిత సేవలంటూ తాటికాయంత పెద్ద అక్షరాలతో ప్రకటనలు.. లోపల అడుగు పెడితే గుప్పుమనే అవినీతి వాసనలు. ఇదీ.. అక్రమ వసూళ్లకు, అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారిన ప్రభుత్వ కార్యాలయాల్లోని పరిస్థితి. ఇందులో దొరికిన వారే దొంగలు.. దొరకని వారు దర్జాగా దండుకుంటున్నారు. జిల్లాలోని రెవెన్యూ సహా రిజిస్ట్రేషన్, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లో అవినీతి జలగలెన్నో తిష్టవేసి కూర్చున్నాయి. ఆయా శాఖలకు తీరని మచ్చను తెచ్చిపెడుతున్నాయి. అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఒకరి తర్వాత మరొకరు ఏసీబీ వలకు చిక్కుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన అక్రమార్కులను అరెస్టు చేసి జైలుకు పంపుతున్నా.. వైఖరిలో మాత్రం మార్పురాకపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. అదనపు కలెక్టర్ ఘటన మరువక ముందే.. 14 గుంటల భూమికి పాసుపుస్తకం కోసం గుర్రంగూడకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.8 లక్షలు డిమాండ్ చేసి, ఏసీబీ కేసులో జైలుకు వెళ్లిన అదనపు కలెక్టర్ ఎంవీ భూపాల్రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్రెడ్డిల వ్యవహారాన్ని పూర్తిగా మరువక ముందే.. తాజాగా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ ఆఫీసులో మరో తిమింగలం ఏసీబీ వలకు చిక్కడం చర్చనీయాంశంగా మారింది. ఏడు గుంటల భూమికి పాసు పుస్తకం జారీకి రెవెన్యూ ఇన్స్పెక్టర్ జి.కృష్ణ రూ.12 లక్షలు డిమాండ్ చేయడంతో ఆదిబట్లకు చెందిన ఓ బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో బుధవారం ఆయన్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. రెవెన్యూలో మచ్చుకు కొన్ని.. ఐదేళ్ల క్రితం కేశంపేట తహసీల్దార్ లావణ్య, అప్పటి వీఆర్ఓ అనంతయ్య ఏసీబీకి పట్టుబడ్డారు. రెవెన్యూ రికార్డులో పేరు మార్పిడికి రూ.9 లక్షలు డిమాండ్ చేసి రూ.4 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది. తనిఖీల్లో భాగంగా ఆమె ఇంటి నుంచి రూ.93 లక్షల నగదు, భారీగా బంగారు ఆభరణాలు పట్టుబడటం అప్పట్లో సంచలనం రేపింది. మూడేళ్ల క్రితం కందుకూరు మాజీ ఎంపీఓ సహా పంచాయతీ మాజీ కార్యదర్శి సైతం ఏసీబీ వలకు చిక్కారు. నిషేధిత జాబితాలో ఉన్న వివాదాస్పద 98 దరఖాస్తులు తన ప్రమేయం లేకుండా ఆమోదం పొందాయని పేర్కొంటూ అప్పటి కలెక్టర్ భారతి హోళీకేరీ ఆదిబట్ల ఠాణాలో ఫిర్యాదు చేయడంతో ఇద్దరు ఆపరేటర్లను అరెస్టు చేశారు. విద్యుత్, ఇరిగేషన్లోనూ..జిల్లా నీటిపారుదలశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బన్సీలాల్, అసిస్టెంట్ ఇంజనీర్ కె.కార్తీక్, ఎస్ఈ ఆఫీసులోని ఏడబ్ల్యూ సెక్షన్ ఏఈ హెచ్.నిఖేష్కుమార్, గండిపేట మండల సర్వేయర్ పి.గణేశ్ ఏడాది క్రితం ఏసీబీకి చిక్కారు. వీరు బఫర్జోన్లలో నిర్మాణాలకు ఎన్ఓసీ జారీ చేసే విషయంలో నెక్నంపూర్కు చెందిన బొమ్మ నరేందర్రెడ్డి నుంచి రూ.2.50 లక్షలు డిమాండ్ చేసి మే 31న ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఇదే కేసులో పట్టుబడిన ఓ ఏఈ ఆస్తులు ఏకంగా వంద కోట్లకుపైగా ఉన్నట్లు గుర్తించారు. విద్యుత్ శాఖలోనూ పెద్ద సంఖ్యలోనే పట్టుబడ్డారు. గోపన్పల్లిలోని ఓ బహుళ అంతస్తుల భవనానికి ట్రాన్స్ఫార్మర్ సహా సిటీమీటర్ జారీ కోసం కాంట్రాక్టర్ శివారెడ్డి నుంచి రూ.50 వేలు తీసుకుంటూ గచ్చిబౌలి డివిజన్ ఏడీఈ సతీశ్ ఇటీవల ఏసీబీకి చిక్కారు. అంతకు ముందు ఇదే డివిజన్లో పని చేసిన ఏడీఈ రాములు, కొండాపూర్ డీఈ వెంకటరమణ ఇదే కేసుల్లో పట్టుబడ్డారు. ఇక గొర్రెల పంపిణీ పథకం స్కాంతో సంబంధం ఉన్న జిల్లాకు చెందిన అప్పటి పశు సంవర్థకశాఖ అధికారి అంజలప్ప, అప్పటి భూగర్భ జలవనరులశాఖ అధికారి రఘుపతి రెడ్డిలను ఏసీబీ అరెస్టు చేసింది. జిల్లాలో తరచూ వెలుగు చూస్తున్న ఘటనలు అడ్డంగా పట్టుబడి జైలుకు వెళ్తున్నా మారని తీరు -
పరిహారం.. పరిహాసం
● కేసు పెండింగ్లో ఉన్నా పట్టించుకోని అధికారులు ● అసలు పట్టాదారుకు కాకుండా మరొకరికి రూ.1.25కోట్లు, ఐదు ప్లాట్ల సర్టిఫికెట్ల అందజేత ● గ్రామస్తులతో కలిసి ఆర్డీఓని ఆశ్రయించిన బాధిత రైతు కందుకూరు: కోర్టులో కేసు.. అధికారుల వద్ద పూర్తి సమాచారం ఉన్నప్పటికీ ఫార్మాసిటీ భూ పరిహారం మాత్రం అసలు పట్టాదారుకు కాకుండా మరొకరికి అందింది. రూ.1.25 కోట్లతో పాటు అదనంగా ఐదు ప్లాట్ల సర్టిఫికెట్లు అందించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన ప్రకారం. మండల పరిధిలోని ముచ్చర్ల రెవెన్యూ సర్వే నంబర్ 288/1క్యూలో ముచ్చర్ల అనుబంధ గ్రామం ఊట్లపల్లికి చెందిన బొర్ర బుచ్చయ్యకు వారసత్వంగా వచ్చిన ఐదెకరాల పట్టా భూమి ఉంది. అదే గ్రామానికి చెందిన కుందేళ్ల రాములు రెవెన్యూ అధికారులతో కుమ్మకై ్క 2006–07లో తప్పుడు ప్రొసీడింగ్ నంబర్ 1621/1992తో తన పేరిట నమోదు చేయించుకున్నాడు. రాములు మృతి చెందడంతో 2011లో ఆయన భార్య జంగమ్మ తన పేరిట విరాసత్ చేయించుకుంది. ఆలస్యంగా గుర్తించిన బుచ్చయ్య రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నాడు. ఫలితం లేకపోవడంతో ఇబ్రహీంపట్నం కోర్టును ఆశ్రయించాడు. అనంతరం కేసు పరిశీలించిన జేసీ 2015లో రికార్డులు అసలు పట్టాదారుకు అనుకూలంగా మార్చాలంటూ ఆదేశాలిచ్చారు. అయినప్పటికీ మార్చలేదు. ఈ క్రమంలో 2016లో ఫార్మాసిటీ కోసం ఆ సర్వే నంబర్లోని భూములను ప్రభుత్వం సేకరించే పనులు ప్రారంభించింది. దీంతో పరిహారం తనకే చెల్లించాలని కోరుతూ అసలు పట్టాదారు బుచ్చయ్య హైకోర్టును ఆశ్రయించాడు. ఈ భూవివాదం పెండింగ్లో ఉండగానే 2023 అక్టోబర్ 19న కుందేళ్ల జంగమ్మకు ఎకరాకు రూ.25 లక్షల చొప్పున రూ.1.25 కోట్లు పరిహారం చెల్లించి ఎకరాకు 121 గజాల చొప్పున ఐదు ప్లాట్లు కేటాయిస్తూ సర్టిఫికెట్లు జారీ చేశారు. విషయాన్ని గుర్తించిన అసలు పట్టాదారు గ్రామస్తులతో కలిసి బుధవారం ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డిని కలిసి తన గోడు వెల్లబోసుకున్నాడు. కోర్టులో కేసుండగా పరిహారం ఎలా ఇస్తారంటూ ప్రశ్నించాడు. ఇందుకు స్పందించిన ఆర్డీఓ పూర్తి సమాచారం కలెక్టర్కు నివేదిస్తానని.. ఆయన ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులు ఎందరో! కాగా ఫార్మాసిటీ పరిహారం చాలా మంది రైతులకు ఇంకా పెండింగ్లోనే ఉంది. మరోపక్క అధికారులు భూములకు ఫెన్సింగ్ వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తమకు న్యాయం చేసిన తర్వాతే ఫెన్సింగ్ పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. మరోపక్క గతంలో పరిహారం ఇచ్చే సమయంలో బోర్లకు, షెడ్లకు, చెట్లకు ఇస్తామని చెప్పిన అధికారు లు పరిహారం చెల్లించే సమయంలో ఆ ఊసేలేదు. దీంతో రైతులు అధికంగా నష్టపోవాల్సి వచ్చింది. -
ఒక్కరి కోసం.. ఆరుగురు
ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో చివరి రోజు బుధవారం చేవెళ్ల పరీక్ష కేంద్రంలో ఒకే విద్యార్థినితో పరీక్ష కేంద్రం కొనసాగింది. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆదర్శ కళాశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ కోర్సులకు సంబంధించి చివరి పరీక్ష ఉండగా ఆదర్శ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది. ఒకే విద్యార్థిని హాజరవడంతో నిబంధనల ప్రకారం చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, ఎగ్జామినర్, సిట్టింగ్ స్క్వాడ్, కానిస్టేబుల్,ఏఎన్ఎం విధులకు హాజరయ్యారు. – చేవెళ్ల -
ప్రజల పక్షాన ఉద్యమించాలి
● ఉపాధి అవకాశాలు లేకనే కుటుంబ వ్యవస్థలు ఛిన్నాభిన్నం ● సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు బీఎస్ఆర్ మోహన్రెడ్డి చేవెళ్ల: గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి అవకాశాలు సన్నగించడంతోనే కుటుంబ వ్యవస్థలు ఛిన్నాభిన్నమవుతున్నాయని సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యు డు, చైతన్య విజ్ఞాన సమితి కార్యదర్శి బీఎస్ఆర్ మోహన్రెడ్డి అన్నారు. మున్సిపల్ కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రాష్ట్ర స్థాయి జన సేవాదళ్ శిక్షణ శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జన సేవాదళ్ రాష్ట్ర కన్వీనర్ పంజాల రమేశ్ అధ్యక్షతన మూడో రోజు బుధవారం భారత ఆర్థిక వ్యవస్థ–పరిణామాలు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్ఆర్ మోహన్రెడ్డి మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో నాల్గవ స్థానానికి తీసుకెళ్లామని గొప్పలు చెబుతున్న బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి కల్పించడంలో విఫలమవుతున్నాయని మండిపడ్డారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. దేశం అభివృద్ధి చెందుతోందని చెబుతూనే.. 80 కోట్ల మంది పేదలకు రేషన్ షాపుల నిత్యావసర సరుకులను అందిస్తున్నామని ప్రకటిస్తున్నారన్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ విధ్వంసానికి గురి చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడం లేదన్నారు. జన సేవాదళ్ సభ్యులు ప్రజల పక్షాన ఉద్యమించేందుకు సిద్ధమవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, జాతీయ జన సేవా ఇన్స్పెక్టర్ మురళి, జి.విష్ణు, గోస్కా మోహన్, ఎం.అనిల్కుమార్, సిద్దినేని కర్ణకుమార్, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు రామస్వామి, ప్రభులింగం, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయ ణ, నాయకులు సత్తిరెడ్డి, జంగయ్య, మక్బూల్, అంజయ్య, శివ, మంజుల, మినాక్షి, బాబురావు, జన సేవాదళ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
సైనికుల త్యాగాలు మరువలేనివి
కందుకూరు: జాతీయవాదాన్ని గుండెల నిండా నింపుకొని పోరాడుతున్న మన సైనికుల త్యాగాలు మరువలేనివని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఎన్.అంజిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. యుద్ధంలో గెలవడమే కాదు ప్రత్యర్థులను సైతం తన వైపు తిప్పుకొన్న గొప్ప నేత ప్రధాని మోదీ అని కొనియాడారు. భారత్ ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక శక్తిగా ఎదగడానికి మోదీ పాలనతోనే సాధ్యమైందన్నారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి అందెల శ్రీరాములుయాదవ్, కన్వీనర్ ఎల్మటి దేవేందర్రెడ్డి, రాష్ట్ర నాయకుడు కడారి జంగయ్య మాట్లాడుతూ.. ఓటు రాజకీయాలను పక్కన పెట్టి దేశం కోసం అంతా ఏకమై సైనికుల్లో ఆత్మస్థైర్యం నింపుదామన్నారు. నియోజకవర్గంలో 20 వేలకు పైగా రోహింగ్యాలు ఉన్నారని, వారిని గుర్తించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు బస్వ పాపయ్యగౌడ్, మిద్దె సుదర్శన్రెడ్డి, పి.కృష్ణగౌడ్, జిట్టా రాజేందర్రెడ్డి, ఎస్.మల్లారెడ్డి, కె.జంగారెడ్డి, మాజీ ఎంపీపీ అశోక్గౌడ్, టి.జగదీశ్వర్రెడ్డి, ఎ.సత్తయ్య, బి.మల్లేష్, బి.సత్యనారాయణరెడ్డి, ఎన్.నర్సింహారెడ్డి, ఊటు మహేందర్, ఎ.యాదగిరి తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి -
పల్లె మెరిసేలా..
పచ్చదనం పెంపొందేలా.. షాద్నగర్: పల్లెల్లో స్వచ్ఛదనం, పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పారిశుద్ధ్య కార్యక్రమాలు విస్తతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. పంచాయతీల్లో పారిశుద్ధ్య సమస్యలు పెరిగిపోవడం, సరిపడా కార్మికులు లేక పూర్తి స్థాయిలో పరిష్కారం కావడం లేదని గుర్తించింది. ఈ మేరకు పారిశుద్ధ్య జోన్లు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇంటింటా చెత్త సేకరణ.. తడి, పొడి వ్యర్థాల నిర్వహణ.. మురుగు కాల్వలు, అంతర్గత రహదారుల పరిశుభ్రత వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకుంటోంది. జోన్ల విభజన ఇలా.. జిల్లాలోని 19 మండలాల్లో 531 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులు అందుబాటులో లేరు. ప్రతి గ్రామంలోని ఇళ్లు, గ్రామ విస్తీర్ణం, కార్మికుల సంఖ్యకు అనుగుణంగా జోన్లుగా విభజిస్తున్నారు. పెద్ద పంచాయతీలైతే గరిష్టంగా నాలుగు, చిన్న పంచాయతీలైతే రెండు జోన్ల చొప్పున ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జోన్లను సూచిస్తూ పారిశుద్ధ్య మ్యాపును ఏర్పాటు చేస్తారు. జోన్ల పరిఽధిలో ఉండే ఇళ్లు, మురుగు కాల్వలు, సీసీ రోడ్ల పొడవు, ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ స్థలాలను మ్యాపులో పొందుపరుస్తారు. ఫొటోలు తీసి.. అప్లోడ్ షెడ్యూల్ ప్రకారం ఒక జోన్ పరిధిలో కార్మికులతో పారిశుద్ధ్య పనులు పూర్తి చేయించి, సమస్యను పరిష్కరిస్తారు. మరుసటి రోజు మరో జోన్లో ప్రారంభిస్తారు. ఇలా జోన్ల ప్రకారం నాలుగు రోజులకు తగ్గకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టే విధంగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. రోజువారీ పారిశుద్ధ్య నివేదిక (డీఎస్ఆర్)లో జోన్లలో చేస్తున్న పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేస్తారు. దీంతో ఏ జోన్లో పనులు ఏమేరకు జరిగాయో సులభంగా తెలుసుకోవచ్చు. ఎరువుల తయారీ పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా ఇళ్ల నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను వేరు చేయనున్నారు. తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేయనున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో కంపోస్టు షెడ్లు ఖాళీగా ఉన్నాయి. వాటిలో తడి చెత్త వేయడం ద్వారా సేంద్రియ ఎరువులు తయారు చేసి నర్సరీల్లోని మొక్కలకు వేయడం లేదా విక్రయించడం చేస్తారు. ఆదాయం పెంపునకు చర్యలు పొడి చెత్త నుంచి సేకరించిన ప్లాస్టిక్, గాజు ఇతర వస్తువులను తుక్కు దుకాణాలకు పంపించి ఆదాయం పొందనున్నారు. దీని ద్వారా వచ్చిన మొత్తాన్ని గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్కు జమ చేయనున్నారు. ఇందు కోసం ప్రత్యేక రిజిస్టర్ను నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను ఎంపీఓ, డీఎల్పీఓ, డీపీఓ, స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయనున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని పల్లె ప్రగతి యాప్లో అప్లోడ్ చేస్తారు. ప్రభుత్వం స్వచ్ఛ ప్రణాళిక పంచాయతీల్లో పారిశుద్ధ్య జోన్లు చెత్త సమస్యకు సత్వర పరిష్కారం పల్లె ప్రగతి యాప్లో ఎప్పటికప్పుడు ఫొటోల అప్లోడ్ జనాభా ఆధారంగా.. పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. పంచాయతీల్లో జనాభా ఆధారంగా జోన్లు ఏర్పాటు చేస్తున్నాం. దీంతో పారిశుద్ధ్య పనితీరు మరింత మెరుగుపడుతుంది. – సురేష్ మోహన్, జిల్లా పంచాయతీ అధికారి పల్లెలు పరిశుభ్రం గ్రామ పంచాయతీల్లో జోన్లు ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా పారిశుద్ధ్య సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించవచ్చు. పల్లెలు పరిశుభ్రంగా ఉంటాయి. – బన్సీలాల్, ఎంపీడీఓ, ఫరూఖ్నగర్ -
గురుకుల విద్యార్థులకు వృత్తి నైపుణ్య శిక్షణ
షాద్నగర్రూరల్: ఫరూఖ్నగర్ మండల పరిధిలోని కమ్మదనం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో గురుకుల పూర్వ విద్యార్థులకు వృతి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ విద్యుల్లత మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2017 నుంచి కమ్మదనం గురుకుల బాలికల కళాశాలలో విద్యనభ్యసించి ఇప్పటి వరకు ఉద్యోగం లేని విద్యార్థినులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. శిక్షణ ఇచ్చేందుకు ఉన్నతి ఫౌండేషన్ ముందుకు వచ్చినట్టు తెలిపారు. 19–25 ఏళ్ల మధ్య వయసు కలిగిన గురుకుల పూర్వ విద్యార్థులకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థినులు వెంటనే కమ్మదనం గురుకుల కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట షాద్నగర్ః కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎఫ్సీ) చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్ అన్నారు. మైనార్టీ మహిళా శక్తి పథకంలో భాగంగా పట్టణంలోని మండల పరిషత్ సమావేశశ మందిరంలో మంగళవారం 258 మంది మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఒబెదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం మైనార్టీలకు అండగా నిలుస్తోందని తెలిపారు. పేద మహిళలను ప్రోత్సహించి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తోందని, మహిళలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు బాబర్ఖాన్, రఘు నాయక్, కొంకళ్ల చెన్నయ్య, చెంది తిరుపతిరెడ్డి, శ్రీకాంత్రెడ్డి, జమృద్ఖాన్, సర్వర్పాషా, ఇబ్రహీం, ఖదీర్ తదితరులు పాల్గొన్నారు. మైసిగండి మైసమ్మ ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవత ఆలయ హుండీ ఆదాయాన్ని జిల్లా దేవాదాయ శాఖ తూర్పు విభాగ ఇన్స్పెక్టర్ ప్రణీత్ ఆధ్వర్యంలో మంగళవారం ఆలయ ప్రాంగణంలో లెక్కించారు. మొత్తం 60 రోజులకు గాను రూ.11,77,715 ఆదాయం సమకూరింది. ఈ మొత్తాన్ని కడ్తాల్ కెనరాబ్యాంక్లో డిపాజిట్ చేయనున్నట్లు ఈవో స్నేహలత తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ శిరోలీ, అన్నపూర్ణ సేవా ట్రస్ట్ సభ్యులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. సాగులో సేంద్రియ పద్ధతులు మేలు మొయినాబాద్: రైతులు పంటల సాగులో సేంద్రియ పద్ధతులు అవలంబించి అధిక లాభాలు పొందొచ్చని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్థాస్ జానయ్య అన్నారు. మున్సిపల్ పరిధిలోని చిన్నషాపూర్లో మంగళవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. సాగు పద్ధతులు, భూసారం పెంపు, నీటి వనరులు, పర్యావరణ పరిరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి జీవన ఎరువుల వాడకాన్ని పెంచాలన్నారు. తద్వారా భూమిలో భూసారం పెరిగి నేల ఆరోగ్యంగా ఉంటుందన్నారు. కూరగాయ పంటలకు డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్, మల్చింగ్ పేపర్ వాడుకోవడం ద్వారా నీటి వృథాను తగ్గించి కలుపు నివారించుకోవచ్చన్నారు. పర్యావరణ పరిరక్షణకోసం మొక్కలు పెంచాలని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం నోడల్ అధికారి వేణుగోపాల్రెడ్డి, శాస్త్రవేత్తలు నీలిమ, రేవతి, మండల వ్యవసాయాధికారి అనురాధ, ఏఈఓ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే
పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తిరుమలయ్యషాద్నగర్రూరల్: ప్రస్తుతం దేశంలో మావోయిస్టులపై జరుగుతున్న ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలేనని పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తిరుమలయ్య ఆరోపించారు. మావోయిస్టులపై జరుగుతున్న ఎన్కౌంటర్లను నిరసిస్తూ మంగళవారం పట్టణంలోని ముఖ్యకూడలిలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులు, ఆదివాసులను అత్యంత పాశవికంగా హతమార్చడం దారుణమని అన్నారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను వారి బంధువులకు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాలను పోలీసులే కాల్చివేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలు జీవించే హక్కులను కూడా హరిస్తోందని మండిపడ్డారు. మావోయిస్టులు, ఆదివాసులపై హత్యాకాండను వెంటనే విరమించుకోవాలని, లేదంటే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆదివాసి, గిరిజన కాంగ్రెస్ రాష్ట్ర కో ఆర్డినేటర్ రఘు, బీఆర్ఎస్ నాయకుడు రాజావరప్రసాద్, బీఎస్పీ నాయకుడు దొడ్డి శ్రీనివాస్, సీపీఎం నాయకుడు ఈశ్వర్నాయక్, కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి
మొయినాబాద్ రూరల్: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం టీడబ్ల్యూజేఎఫ్ నిరంతరం కృషి చేస్తోందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సైదులు అన్నారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తున్న అనేక మంది జర్నలిస్టులు పేదరికంలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వీరి అభ్యున్నతి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ముందుకెళ్తామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు చేగూరి రాజు, సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస్చారి, గణేశ్, సుదర్శన్, బుచ్చన్న, నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.