breaking news
Rangareddy
-
కులం పేరుతో దూషించిన వారిని శిక్షించాలి
తాండూరు టౌన్: ఎరుకల కుటుంబంపై దాడి చేసి, కులం పేరుతో దూషించిన వారిని అరెస్టు చేయాలని దళిత, ప్రజా, సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. తాండూరు మండలం చెన్గేష్ పూర్ గ్రామానికిచెందిన ఎరుకలి శారద, బస్వరాజ్ కుటుంబంపై అదే గ్రామానికి చెందిన రమేశ్ గౌడ్, నరేందర్ గౌడ్, నాని గౌడ్, నరేష్ గౌడ్, పవన్ గౌడ్లు అకారణంగా గత నెలలో దాడి చేశారని తెలిపారు. ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంత వరకు అరెస్టు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. లేని పంక్షంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, డీజీపీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు తమ పోరాటంలో భాగంగా ఈ నెల 4వ తేదీన ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దళిత, ప్రజాసంఘాల నాయకులు కె శ్రీనివాస్, చంద్రయ్య, నరేశ్, నవీన్ తదితరులుతెలిపారు. సీఐటీయూ, దళిత,ప్రజాసంఘాల డిమాండ్ 4న ఎస్పీ కార్యాలయం ముట్టడి -
సబ్బండ వర్గాల అభ్యున్నతికి కృషి
కుల్కచర్ల: సబ్బండ వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం కుల్కచర్ల మండల పరిధిలోని కుల్కచర్ల, చాపలగూడెం, తిర్మలాపూర్, లాల్సింగ్ తండా, రాంపూర్, కుస్మసముద్రం, అనంతసాగర్ తదితర గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. రాంపూర్, సాల్వీడు గ్రామాల్లోని చెంచు కాలనీలలో రూ. 50లక్షలతో మల్టీపర్పస్ భవనాలను నిర్మించేందుకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పరిగి నియోజకవర్గ పరిధిలో 3,500మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామన్నారు. ప్రతీ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 5,143మందికి నూతన రేషన్ కార్డులను అందజేశామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని దశల వారీగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, పీఏసీఎస్ చైర్మన్ కనకం మొగులయ్య, బ్లాక్ బి అధ్యక్షుడు భరత్కుమార్, మాజీ ఎంపీపీ సత్యమ్మ, మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, మాజీ మండల అధ్యక్షుడు పి.వెంకటయ్య, నాయకులు కుమ్మరి స్వామి, లక్ష్మయ్య, కృష్ణయ్య, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి -
నేషనల్ స్టార్స్ ఎక్సలెన్స్అవార్డుకు ఎంపిక
కొత్తూరు: కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఇండియా షోటోఖాన్ కరాటే మాస్టర్ శివకృష్ణగౌడ్ నేషనల్ స్టార్స్ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికయ్యాడు. ఆదివారం ఏపీలోని విజయవాడ నగరంలో వైఎంకే అకాడమి ఆధ్వర్యంలో గుజ్జల సరళదేవి ఫంక్షన్హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేశారు. వైంఎకే అకాడమి మాస్టర్ రూపస్పాల్ సినీహీరో భానుచందర్ చేతుల మీదుగా మెడల్, సర్టిఫికెట్ అందుకున్నట్లు శివకృష్ణగౌడ్ తెలిపారు. రాగన్నగూడ పోచమ్మ దేవాలయంలో నెత్తిన బోనంతో ఊరేగింపుగా వెళ్తున్న భక్తులు -
‘చలో గన్పార్క్’కుతరలిరండి
చేవెళ్ల: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని నిర్వహిస్తున్న చలో గన్ పార్క్ మహాధర్నాను విజయవంతం చేయాలని ఉద్యమకారుల ఫోరం చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జి యాలాల మహేశ్వర్రెడ్డి కోరారు. ఆదివారం చేవెళ్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 22న ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో చల్ గన్పార్క్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మొయినాబాద్లో ఉద్యమ అమరుడు యాదిరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కుక్కల దాడిలో మేకల మృతి కేశంపేట: మండల పరిధిలోని అల్వాల గ్రామంలో కుక్కలు దాడి చేయడంతో నాలుగు మేకలు మృతి చెందాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కురువ మల్లేశ్ మేకల పోషణతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. రోజు మాదిరిగా మేకలను శనివారం రాత్రి తన వ్యవసాయ పొలంలోని కొట్టాంలో ఉంచి ఇంటికి మల్లేశ్ వెళ్లాడు. మరుసటి రోజు ఆదివారం ఉదయం మంద వద్దకు వెళ్లి చూడగా కుక్కలు దాడి చేసి నాలుగు మేకలను చంపేసినట్లు గుర్తించి గ్రామస్తులకు తెలియజేశాడు. మేకల విలువ సుమారు రూ.50వేల వరకు ఉంటుందని, ప్రభుత్వమే తనని ఆదుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేస్తున్నాడు. పాఠశాలకు బెంచీల వితరణ కేశంపేట: మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు హైదరాబాద్లోని ఓ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బెంచీలను ఆదివారం అందించారు. సికింద్రాబాద్ జూనియర్ ఛాంబర్స్ చారిటబుల్ ట్రస్ట్ బెంచీమార్క్ త్రీ ప్రోగ్రాంలో భాగంగా పాఠశాలకు చైర్మన్ నాగశ్రీధర్ 40 బెంచీలను అందజేశారు. విద్యాభివృద్ధికి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రోత్సహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ మాజీ చైర్మన్ కమలాకర్ ముత్యాలు, ప్రధానోపాధ్యాయులు చక్రధర్రావు, మల్లికార్జున్, ఉపాధ్యాయులు విష్ణువర్ధన్రెడ్డి పాల్గొన్నారు. -
హైవేపై ట్రా‘ఫికర్’
నిత్యం వేలాది వాహనాలు కొత్తగా రోడ్డుపైకి వస్తున్నాయి. కానీ అందుకు తగిన రహదారి విస్తరణ, ట్రాఫిక్, వేగ నియంత్రణ చర్యలు సరిగా లేవు. దీనికి తోడు ఫుట్పాత్ ఆక్రమణలు. ఫలితంగా ట్రాఫిక్ కష్టాలుఉత్పన్నమవుతున్నాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు సకాలంలో గమ్యానికి చేరుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కడ్తాల్: మండల కేంద్రం మీదుగా శ్రీశైలం– హైదరాబాద్ జాతీయ రహదారిపై నిత్యం వేలాది వాహనాలు రాకోపోకలు సాగిస్తుంటాయి. రహదారికి ఇరువైపులా రోడ్డుపైనే చిరువ్యాపారులు జీవనోపాధి పొందుతుంటారు. ఇక ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, ప్రయాణికులను ఎక్కించుకోవడానికి రోడ్డుపై నిలుపుతుండటంతో పాదచారులు, ప్రయాణికులతో పాటు వాహనదారులూ ఇబ్బంది పడుతున్నారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై డివైడర్ ఏర్పాటు చేసి. నాలుగు వరుసలుగా రోడ్డును నిర్మించారు. దీంతో రోడ్డు వాహనాల పరుగులతో రద్దీగా ఉంటుంది. రోడ్డుకు ఇరువైపులా వాహనాల పార్కింగ్కు ఫుట్పాత్ను ఏర్పాటు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. కాలినడక ఏరియాలో చిరువ్యాపారులు దుకాణాలు కొనసాగిస్తుండటంతో వాహనదారులు ఇష్టానుసారంగా రోడ్డుపై తమ వాహనాలకు పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ జాం అవుతోంది. రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన అండర్గ్రౌండ్ డ్రైనేజీపై.. కొందరు షెడ్లు నిర్మించుకొని దుకాణాలు కొనసాగిస్తుండటంతో పాదచారులకు ఇబ్బంది తప్పడంలేదు. రోడ్డుపైనే ఆర్టీసీ బస్సులు రోడ్డుపైనే వాహనదారులు వారి వాహనాలను ఇష్టానుసారంగా నిలిపి ఉంచడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. బస్టాండ్ లేక పోవడంతో ఆర్టీసీ బస్సులు కూడా రోడ్డుపైనే ఆగుతున్నాయని, దీంతో వెనకాల వచ్చే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటున్నారు. మండల కేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా దుకాణ సముదాయాలు, హోటల్స్ ఉండటంతో కొనుగోలుదారులు తమ బైక్లను రోడ్డుపైనే పార్కింగ్ చేస్తున్నారు. వేల సంఖ్యలో పరుగులు తీసే శ్రీశైలం– హైదరాబాద్ జాతీయ రహదారిపై.. వాహనాలు నిలపకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకొని, ట్రాఫిక్ కష్టాలను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనలు శూన్యం శ్రీశైలం– హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల పార్కింగ్ ఫుట్పాత్ ఏరియాలో చిరువ్యాపారాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు, పాదచారులు -
‘ఓపెన్’ చాన్స్
కేశంపేట: అనివార్య కారణాలతో మధ్యలోనే చదువు నిలిపివేసిన యువతీ యువకులకు ఓపెన్ స్కూల్ వరంగా మారింది. చదువుకోవాలనే అశ ఉన్నా పాఠశాలలకు వెళ్లలేని వారికి చేయూతనివ్వాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ద్వారా విద్యను అందిస్తోంది. డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా, కొన్ని ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందాలన్నా పదో తరగతి ఉత్తీర్ణత అవసరం. దీంతో చాలా మంది ఓపెన్ విద్య వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. పనులు చేసుకుంటూనే సెలవు దినాల్లో తరగతులకు హాజరుకావచ్చు. అధ్యయన కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా 65 ఓపెన్ టెన్త్, ఇంటర్ అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. వీటిలో పహాడీషరీఫ్ జెడ్పీ ఉన్నత పాఠశాల, హఫీజ్పేట జెడ్పీ ఉన్నత పాఠశాల, ఎన్టీఆర్ నగర్ జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఉర్డూ మీడియంలో సైతం చదువుకునే అవకాశం ఉంది. వికారాబాద్ జిల్లాలో 28 ఓపెన్ టెన్త్, ఇంటర్ అధ్యయన కేంద్రాలు, మెడ్చల్ జిల్లాలో 34 అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం నిధులు వెచ్చిస్తూ తోడ్పాటు అందిస్తోంది. వీరు అర్హులు ● చదువు మధ్యలో ఆపేసినవారు, గృహిణులు, వివిధ కారణాలతో చదువుకు దూరమైన వారు, ఓపెన్ విద్యలో అడ్మిషన్లు పొందొచ్చు. ● 14 ఏళ్లు నిండిన వారు పదో తరగతిలో అడ్మిషన్ పొందేందుకు అర్హులు. ● ఆన్లైన్ లేదా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకొని సమీపంలోని అధ్యయన కేంద్రాల్లో సమర్పించాలి. ● అడ్మిషన్లు పొందిన వారు సెలవు దినాల్లో నిర్వహించే తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది. ● మరింత సమాచారం కోసం www.telanganaopenschool.orgలో సంప్రదించాలి. పదో తరగతి ప్రవేశాలకు.. ● 14 సంవత్సరాల వయస్సు నిండిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ● పదవ తరగతిలో ఐదు సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. ● గతంలో పదో తరగతి రెగ్యులర్ పరీక్షలు రాసి ఫెయిల్ అయిన వారు ఓపెన్లో రెండు సజ్జెక్టుల మార్కులను బదలాయించుకోవచ్చు. ● రూ.1,150 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ● ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తుంది. ● అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఐదేళ్ల వరకు పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఇంటర్మీడియెట్ ప్రవేశాలకు.. ● ఇంటర్మీడియెట్ అడ్మిషన్ల కోసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ● పదో తరగతి పాసై ఒక్క సంవత్సరం గ్యాప్ ఉంటేనే అర్హులు. ● విద్యార్థులకు ఐదు సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. ● రూ.1,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ● ప్రభుత్వం ఉచితంగా పాఠ్యా పుస్తకాలు అందిస్తుంది. అవసరమైన పత్రాలు ● ఇటీవల తీసిన పాస్పోర్టు సైజ్ ఫొటోలు ● ఆధార్కార్డు ● ఇంటర్మీడియెట్ చదివేవారికి ఎస్ఎస్సీ సర్టిఫికెట్ ● పుట్టిన తేదీ సర్టిఫికెట్ (పదో తరగతి అడ్మిషన్కు) ఆగస్టు వరకు అవకాశం ● పదో తరగతి, ఇంటర్మీడియెట్ చదివేందుకు ఈనెల 31 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా అడ్మిషన్ ఫీజుతో పాటు స్కూల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ● అపరాద రుసుం చెల్లించి ఆగస్టు 28వ తేదీ వరకు అడ్మిషన్లు పొందొచ్చు. అక్షరాస్యులుగా మార్చేందుకు .. నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా పాఠశాలల్లో చదివే విద్యార్థుల నుంచి నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల వివరాలు, మహిళా సంఘాల నుంచి నిరక్షరాస్యుల వివరాలు సేకరిస్తోంది. వీరిలో పదో తరగతి వరకు చదవలేని వారు, చదువును మధ్యలో ఆపేసిన వారు, చదవడం, రాయడం వచ్చిన వారిని ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతిలో చేర్పించేందుకు ప్రతి మండలంలో అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. చదువు మధ్యలో మానేసిన వారికి.. పదోతరగతి, ఇంటర్లో అడ్మిషన్లు ప్రత్యేక అధ్యయన కేంద్రాలు ఈనెల 31 వరకు గడువు అపరాధ రుసుముతో 28 ఆగస్టు వరకు సద్వినియోగం చేసుకోవాలి చదువును మధ్యలో అపివేసిన వారు, చదువుపై ఇష్టం ఉన్నవారికి ప్రభు త్వం అవకాశం కల్పించింది. ప్రతి మండల కేంద్రంలో ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేశాం. అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవాలి. – సత్యనారాయణ, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల కోఆర్డినేటర్ -
డిమాండ్లు పరిష్కరించాలి
అబ్దుల్లాపూర్మెట్: రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న పంచాయతీ కార్యదర్శుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.మధుసూదన్రెడ్డి డిమాండ్ చేశారు. హయత్నగర్లోని అబ్దుల్లాపూర్మెట్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆదివారం సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 14 నెలలుగా పంచాయతీల్లో పెండింగ్లో ఉన్న చెక్కులను వెంటనే విడుదల చేయడంతో పాటు కార్యదర్శుల క్యాడర్ స్ట్రెంత్ పెంపుదలను వేగవంతం చేయాలన్నారు. ఔట్సోర్సింగ్ విధానా న్ని రద్దు చేస్తూ ఓపీఎస్లను వెంటనే క్రమబద్ధీకరించాలని, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నాలుగు సంవత్సరాల సర్వీసును పరిగణలోకి తీసుకుంటూ పదోన్నతులు కల్పించాలని కోరా రు. జీఓ నం.317 ద్వారా నష్టపోయిన పంచా యతీ కార్యదర్శులను వారి సొంత జిల్లా లేదా జోన్లకు బదిలీ చేయాలని, మెడికల్ ఇన్వ్యాలిడేషన్ విధానంలో నియమించిన కార్యదర్శులకు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ.శ్రీనివాస్, కోశాధికారి పండరినాథ్, రాష్ట్ర కమిటీ సభ్యులు, వివిధ జిల్లాలకు చెందిన సంఘం జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి -
అడ్డగోలు బాదుడు!
సాక్షి, సిటీబ్యూరో: తిరుమలగిరి ఆర్టీసీ కాలనీకి చెందిన శ్రీనివాస్ ఆదివారం సాయంత్రం తార్నాక నుంచి ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ను ఆశ్రయించాడు. సాధారణంగా క్షణాల్లో బుక్ అయిపోయే సమయా నికి అనూహ్యంగా డిమాండ్ నెలకొంది. చివరకు పావుగంట తర్వాత ఓ అగ్రిగేటర్ సంస్థకు చెందిన క్యాబ్ బుక్ అయింది. ఆన్లైన్ యాప్లో కనిపించిన చార్జీలు చూసి అతడు బెంబేలెత్తాడు. సాధారణంగా తార్నాక నుంచి తిరుమలగిరికి రూ.250 లోపే ఉంటుంది. కానీ ఆదివారం సాయంత్రం ఏకంగా రూ.530 వరకు పెరిగింది. గత్యంతరం లేక ఎక్కువ చెల్లించేందుకు సిద్ధపడి క్యాబ్ ఎక్కేశాడు. ఇది కేవలం శ్రీనివాస్కు ఎదురైన సమస్య మాత్రమే కాదు, చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు క్యాబ్ అగ్రిగేటర్లకు కాసులు కురిపిస్తున్నాయి. ఆటోలు, క్యాబ్ల నిర్వహణలో స్లాక్ (రద్దీ లేని), పీక్ (రద్దీ ఉన్న) సమయాలుగా ఎలాంటి విభజన లేకపోయినప్పటికీ అడ్డగోలుగా చార్జీలు పెంచి ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్నారు. క్యాబ్ అగ్రిగేటర్లు ఇష్టారాజ్యంగా చార్జీలను పెంచకుండా అరికట్టేందుకు నియంత్రణ చర్యలు తీసుకోవాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ రవాణా శాఖ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దీంతో చార్జీలపైన నియంత్రణ కొరవడింది. ఆన్లైన్లోనే బేరసారాలు కొన్ని అగ్రిగేటర్ సంస్థలు ఆన్లైన్లోనే బేరసారాలకు దిగుతున్నాయి. ఉప్పల్కు చెందిన ఓ ప్రయాణికుడు సికింద్రాబాద్ వరకు వెళ్లేందుకు ఒక ఆటోను బుక్ చేసుకున్నాడు. మొదట రూ.150 వరకు చార్జీలు కనిపించాయి. సరేననుకొని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఎంపిక చేసుకున్న చార్జీలకు డ్రైవర్ సుముఖంగా లేడంటూ ఐదు నిమిషాల తర్వాత మొబైల్ స్క్రీన్పై కనిపించింది. అదనపు చార్జీలు చెల్లిస్తే ఆటో లభించవచ్చని సంకేతం, దాంతో మరో రూ.20 అదనంగా చెల్లించేందుకు సిద్ధమయ్యాడు. అయినా ఆటో రాలేదు. చివరికి రూ.50 ఎక్కువ చెల్లించేందుకు అంగీకరించిన తర్వాత క్షణాల్లో ఆటో వచ్చింది. దీంతో సదరు ప్రయాణికుడు బిత్తరపోయాడు. ఇలా కొన్ని ఆటో, క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలు ఆన్లైన్లోనే బేరసారాలకు దిగుతున్నాయి. మొదట తక్కువ చార్జీ ప్రదర్శించి ఆ తర్వాత ప్రయాణికుడి అత్యవసరాన్ని సొమ్ము చేసుకొనేందుకు బేరసారాలకు దిగుతున్నాయి. ● కొన్ని అగ్రిగేటర్ సంస్థలకు చెందిన యాప్లలో ఈ ఆప్షన్ కొత్తగా కనిపించడం గమనార్హం. మరోవైపు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులకు మాత్రం పలు సంస్థలకు చెందిన క్యాబ్లు పట్టపగలు చుక్కలు చూపిస్తున్నాయి. క్యాబ్ బుక్ అయిన తర్వాత ఆకస్మికంగా రద్దవుతున్నాయి. ఎంపిక చేసుకున్న క్యాబ్ కోసం చాలా సేపటి వరకు పడిగాపులు కాసి చివరకు ప్రయాణికులే తమకు తాముగా రద్దు చేసుకొనేవిధంగా కొందరు డ్రైవర్లు వ్యవహరిస్తున్నారు. ఆటోలు, క్యాబ్లకు అనూహ్యంగా డిమాండ్ ఇష్టారాజ్యంగా పెంచేసిన చార్జీలు మెట్రో రైళ్లలోనూ విపరీతమైన రద్దీ మెట్రోల్లో పెరిగిన రద్దీ వివిధ మార్గాల్లో మెట్రో రైళ్లలోనూ రద్దీ కనిపించింది. బోనాల సందర్భంగా ప్రయాణికులు వివిధ ప్రాంతాల మధ్య ఎక్కువగా రాకపోకలు సాగించారు. దీంతో నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్– మియాపూర్ కారిడార్లలో సాయంత్రం పలు మెట్రో స్టేషన్లలో సందడి నెలకొంది, సాధారణంగా సెలవు రోజుల్లో రద్దీ తగ్గుముఖం పడుతుంది. ఆదివారం బోనాల వేడుకలు, వర్షం కారణంగా ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయించారు. -
యజుర్వేద పారాయణ కరపత్రాల ఆవిష్కరణ
కొందుర్గు: చౌదరిగూడ ఆర్య సమాజంలో శ్రావణమాసంలో నిర్వహించనున్న యజుర్వేద పారాయణ యజ్ఞం కరపత్రాలను సభ్యులు ఆదివారం ఆవిష్కరించారు. సమాజహితం కోసం గత 45 ఏళ్లుగా ఆర్య సమాజం ఆధ్వర్యంలో యజుర్వేద పారాయణ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ఆగస్టు 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు యజ్ఞం చేపడుతున్నామని సంఘం ప్రతినిధి మచ్చ సుధాకర్రావు వివరించారు. యజ్ఞబ్రహ్మలుగా అరవింద్శాసీ్త్ర, వసుదాశాసీ్త్రలు వ్యవహరిస్తారని, ఆకారపు సుమతమ్మ, యాదగిరి దంపతులు భక్తులకు భోజన వసతి కల్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. -
నేడు ఎమ్మెల్యే రంగారెడ్డి పర్యటన
ఇబ్రహీంపట్నం రూరల్: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సోమవారం ఇబ్రహీంపట్నం మండలంలో పర్యటించనున్నారు. నెర్రపల్లి, పోచారం, ఎల్మినేడు, కప్పపహాడ్, తుర్కగూడ, చర్లపటేల్గూడ, కర్ణంగూడ గ్రామాల్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పట్నంలోని శాస్త్ర ఫంక్షన్హాల్లో మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో పాల్గొని, వడ్డీలేని రుణాలు, బీమా, యాక్సిడెంట్ బీమా చెక్కులను అందజేయనున్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక తుర్కయంజాల్: పురపాలక సంఘం ఇంజాపూర్లోని శాంతివనం కాలనీ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డి.కిరణ్ కుమార్, ఉపాధ్యక్షుడిగా శివ ప్రసాద్ రాజు, కోశాధికారిగా మెగావత్ గణేశ్, ప్రధాన కార్యదర్శిగా ఫణిందర్, కార్యదర్శిగా రాజు నాయక్, గౌరవ అధ్యక్షుడిగా నరసింహా రెడ్డిని నియమించారు. అనంతరం నూతన సభ్యులను కాలనీ వాసులు ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు ఇన్చార్జి తహసీల్దార్ సంతోష్ ఆమనగల్లు: ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని తలకొండపల్లి ఇన్చార్జి తహసీల్దార్ సంతోష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. ఖానాపూర్ గ్రామ శివారులో సర్వే నంబర్ 252, 256,253,1,39,42,22,18,38లో 64 ఎకరాల 19 గుంటల ప్రభుత్వ భూమి ఉందని తెలిపారు. ఆ జాగకు సంబంధించి కాంక్రిట్ పిల్లర్స్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎవరైన ఆ భూమిని చదును చేసినా, ఆక్రమించేందుకు యత్నించినా, కాంక్రీట్ పిల్లర్స్ తొలగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీపీఐ మున్సిపాలిటీ అధ్యక్షుడిగా రాజు తుర్కయంజాల్: సీపీఐ తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షుడిగా ఇంజాపూర్కు చెందిన అనంతుల కాటంరాజు గౌడ్ను ఎన్నుకున్నారు. ఆదివారం జరిగిన ఆ పార్టీ మహాసభల్లో రాజును నియమించామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాలమాకులజంగయ్య పేర్కొన్నారు. వర్షానికి కూలిన ఇల్లు మాడ్గుల: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఓ ఇల్లు కూలింది. ఈ సంఘటన మాడ్గుల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఉన్న ఇల్లు కూలి రోడ్డున పడ్డానని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితురాలు అరుణమ్మ కోరారు. దివ్యాంగులను ఆదుకోవాలి కడ్తాల్: దివ్యాంగులు, చేయూత పెన్షన్ దారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలం మాదిగ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. నిస్సహాయ స్థితిలో ఉండి కేవలం పింఛన్ మీదనే ఆధారపడి జీవిస్తున్న వారికి ఆసరా అందజేసి ఆదుకోవాలని కోరారు. పెన్షన్ దారుల హక్కుల సాధన కోసం ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం ఆమనగల్లులో నిర్వహించే దివ్యాంగుల, చేయూత పెన్షన్ దారుల ఆవేదన జిల్లా సన్నాహక సదస్సుకు.. సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ రానున్నారని తెలిపారు. వికలాంగులు, వృద్ధులు, వితంతువులు,ఒంటరి మహిళలు, గీత, బీడీ, నేత కార్మికులు, చేయూత పెన్షన్ దారులు తరలివచ్చి సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. -
మైసమ్మ సన్నిధిలో అచ్చంపేట ఎమ్మెల్యే
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవతను ఆదివారం ఉదయం అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఆయనకు తీర్థ ప్రసాదం అందజేసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ నరేశ్నాయక్, సింగిల్విండో డైరెక్టర్ వెంకటేశ్, నాయకులు జవహర్లాల్, హీరాసింగ్, తులసీ రాంనాయక్, మహేందర్గౌడ్ ఉన్నారు. గెస్ట్ అధ్యాపకుల కోసం దరఖాస్తుల ఆహ్వానం చేవెళ: మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీకళాశాలలో గెస్ట్ అధ్యాపకుల పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కాంచనలత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హిస్టరీ, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో బోధనకు దరఖాస్తులు కోరుతున్నటు తెలిపారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ పొంది ఉండాలని చెప్పారు. జనరల్ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ వర్గాలు 50 శాతం మార్కులు సాధించి ఉండాలన్నారు. అనుభవం, పీహెచ్డీ లాంటి అదనపు అర్హతలు కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తిగల, అర్హులైన అభ్యర్థులు సంబంధిత జిరాక్స్ ధ్రువపత్రాలతో కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు కళాశాలలో సంప్రదించాలని సూచించారు. ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి తుర్కయంజాల్: దేశంలో ఆర్థిక అసమానతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, సామాజిక అభివృద్ధి కుంటుపడి పోతోందని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన పార్టీ మున్సిపాలిటీ రెండో మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అసమానతలు లేని సమాజం కోసం పుట్టిందే ఎర్రజెండా అని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో పేదలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని, దేశంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య మత విద్వేషాలతో చిచ్చు పెడుతోందని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ స్టేట్ కంట్రోల్ కమిషన్ సభ్యుడు పుస్తకాల నర్సింగ్ రావు, రాష్ట్ర సమితి సభ్యులు ఓరుగంటి యాదయ్య, కావలి నర్సింహ, పానుగంటి పర్వతాలు, జిల్లా కార్యవర్గ సభ్యురాలు నీలమ్మ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పి.శివ కుమార్ గౌడ్ తదితరులు పాల్గోన్నారు. మొక్కలతోనే మానవ మనుగడ పరిగి: నేడు నాటిన మొక్క రేపటి తరానికి మేలు చేస్తుందని పరిగి సబ్జైల్ సూపరింటెండెంట్ రాజ్కుమార్ అన్నారు. ప్రభుత్వం పతి ష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవంలో భాగంగా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పరిగి పరిసర ప్రాంతాల్లో 200 సీడ్బాల్స్ చల్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీడ్ బాల్స్ చల్లడంతో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో మొక్కలను నాటే వీలుంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జైళ్ల శాఖ ఇప్పటి వరకు 2 లక్షల సీడ్బాల్స్ తయారు చేసి చల్లా మన్నారు. జైళ్ల శాఖ పెట్రోల్ బంక్ల్లో సీడ్బా ల్స్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ప్రతీ ఒక్కరూ చల్లాలని సూచించారు. కార్యక్రమంలో జైలు సిబ్బంది పాల్గొన్నారు. -
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
అబ్దుల్లాపూర్మెట్: నేరాల నియంత్రణతో పాటు నేరస్థులను పట్టుకోవడానికి సీసీ కెమెరాలు కీలక భూమిక పోషిస్తాయని ఏసీపీ కాశిరెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధి ఇనాంగూడ గ్రామం కార్తీక్హోమ్స్ ఫేస్– 2లో 16 సీసీ కెమెరాలనుసీఐ అశోక్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ నివాస, వ్యాపార, వాణిజ్య, విద్యాలయాల్లో కెమెరాలను విధిగా ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని సూచించారు. అనంతరం మత్తు పదార్థాలు, సైబర్ నేరాలు, షీటీం, డయల్ 100 తదితర వాటిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యడు ఊషయ్యగౌడ్, మాజీ సర్పంచ్ యశోద, ఎస్ఐ బద్యనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఉండలేం.. వచ్చేస్తాం!
జైళ్లను తలపిస్తున్న కార్పొరేట్ కాలేజీ హాస్టళ్లు సాక్షి, రంగారెడ్డిజిల్లా: కార్పొరేట్ జూనియర్ కాలేజీ వసతి గృహాలు చెరసాలలను తలపిస్తున్నాయి. ఉదయం నిద్ర లేచింది మొదలు.. విరామం లేకుండా తరగతులు నిర్వహిస్తుండటం.. కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా సమయం లేకపోతుండటంతో విద్యార్థులు ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. ఉండలేం.. వచ్చేస్తామంటూ బోరుమంటున్నారు. ఇంటర్మీడియెట్లో మెరుగైన ఫలితాలు, పోటీ పరీక్షల్లో ర్యాంకుల సాధన కోసం చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను కార్పొరేట్కాలేజీ వసతి గృహాల్లో చేర్పిస్తున్నారు. పిల్లల శక్తిసామర్థ్యాలు, ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా చేర్పిస్తుండటంతో చేరిన కొద్ది రోజులకే అక్కడ తాము చదవలేమని.. తిరిగి ఇంటికి తీసుకెళ్లిపోవాలని తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారు. కొంతమంది ఏమీ తినకుండా కడుపుమాడ్చుకుని నీరసంతో ఆస్పత్రుల్లో చేరుతుండగా.. మరికొంత మంది ఏకంగా బలవన్మరణాలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. అప్పటికే సగానికిపైగా ఫీజులు చెల్లించిన తల్లిదండ్రులు చేసేది లేక.. పిల్లలకు సర్దిచెబుతున్నారు. ఉదయం నుంచే ఉరుకులు పరుగులు జిల్లాలో 17 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 214 ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయి. ఒక్కో వసతి గృహంలో రెండు వేల నుంచి మూడు వేల మంది పిల్లలు చదువుతున్నారు. ఒక్కో గదిలో ఆరు నుంచి ఎనిమిది మందిని ఉంచుతున్నారు. వీరందరికీ ఒక్కటే మూత్రశాల, మరుగుదొడ్డి, స్నానాల గది ఉండటంతో ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి బాత్రూమ్ల ముందు క్యూ కడుతున్నారు. మరోవైపు ఇంటర్మీడియెట్ సబ్జెక్టును త్వరగా పూర్తి చేసి, ఐఐటీ, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక తరగతలు నిర్వహిస్తుంటారు. నిత్యం ఉద యం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు క్లాసులు జరుగుతుంటాయి. అల్పాహారం..మధ్యాహ్న భోజనం కోసం గంటన్నర మినహా ఇతర సమయంలో విరామం అంటూ లేకుండా పోతోంది. రాత్రి 11 తర్వాతే నిద్రపోవాల్సి వస్తోంది. కంటికి కునుకులేక, క్లాసులో లెక్చరర్ చెప్పింది అర్థం కాక, భోజనం నాసీరకంగా ఉండటంతో తరచూ అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. చిన్నతనంలోనే పెద్ద జబ్బులు సాధారణంగా ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు కనీస వ్యాయామం అవసరం. కానీ వసతి గృహాల్లో చదువుకుంటున్న వారికి ఆ సమయమే దొరకడం లేదు. చాలామంది పిల్లలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. రోజుకు పదహారు గంటల పాటు కూర్చోవాల్సి వస్తుండటం, కంటికి నిద్రలేకపోవడం, శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడంతో చిన్నతనంలోనే ఒత్తిడికి గురవడంతోపాటు ఊబకాయులుగా మారుతున్నారు. నిజానికి ప్రతి కాలేజీలో మానసిక నిపుణులను నియమించాల్సిఉన్నా.. ఎక్కడా పాటించడం లేదు. కౌన్సెలింగ్ నిర్వహించే వాళ్లు లేకపోవడంతో ప్రతి చిన్న విషయానికి మానసికంగా కుంగిపోతూ చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అద్దెభవనాలు.. అరకొర వసతులు మెజార్టీ కాలేజీలు అపార్ట్మెంట్లలోనే కొనసాగుతున్నాయి. కనీసం ఫైర్సేఫ్టీ కూడా లేని బహుళ అంతస్తుల భవనాలను అద్దెకు తీసుకుని వసతితో పాటు తరగతులు నిర్వహిస్తున్నారు. నిజానికి వీటిలో తరగతుల నిర్వహణకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. వసతి గృహాల నిర్వహణకు అనుమతులు లేవు. అయినా ఆయా భవనాల్లో తాత్కాలికంగా చిన్నచిన్న గదులను ఏర్పాటు చేసి ఒక్కో గదిలో ఎక్కువ మంది విద్యార్థులను కుక్కేస్తున్నారు. ఏడాదికి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. కార్పొరేట్ యాజమాన్యాలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, పరోక్షంగా వాటికి కొమ్ముకాస్తోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కరువైన మౌలిక వసతులు విరామం లేకుండా తరగతులు ఒత్తిడి తట్టుకోలేకపోతున్న విద్యార్థులు ఇళ్లకు వచ్చేస్తామంటూ తల్లిదండ్రులకు వేడుకోలు కొరవడిన ప్రభుత్వ నియంత్రణ అలవాటుపడలేక.. అప్పటి వరకు సాధారణ పాఠశాలలో చదువుకున్న పిల్లలను ఒకేసారి కార్పొరేట్ కాలేజీ హాస్టళ్లలో చేర్పించడంతో ఆ వాతావరణానికి ఇబ్బంది పడుతున్నారు. విరామం లేకుండా తరగతుల నిర్వహణతో మరింత ఒత్తిడికి లోనవుతున్నారు. పిల్లల మానసిక పరిస్థితిని తల్లిదండ్రులతో పాటు లెక్చరర్లు అర్థం చేసుకోవాలి. వారికి నచ్చజెప్పి ఇష్టంగా చదివే విధంగా తయారు చేయాలి. – డాక్టర్ నాగేందర్, మహేశ్వరం మెడికల్ కాలేజీ -
బీసీ సంక్షేమ సంఘం ఎన్నిక
కందుకూరు: బీసీ సంక్షేమ సంఘం మండల నూతన కమిటీని జిల్లా అధ్యక్షుడు ఎగ్గిడి సత్తయ్య ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆదివారం సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చేతుల మీదుగా నియామక పత్రాలను నూతన కమిటీకి అందజేశారు. అధ్యక్షుడిగా బండ ఆంజనేయులు, ఉపాధ్యక్షులుగా ఇంద్రకంటి రవీందర్గౌడ్, డేరంగుల శ్రీరాములు, శ్రీనివాస్గౌడ్, బొడ్డుపల్లి రవి, ప్రధాన కార్యదర్శులుగా జంగయ్య ముదిరాజ్, బాల్రాజ్, దామోదర్గౌడ్, కోశాధికారిగా శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా శేఖర్గౌడ్, కాళిదాసుచారి, బాబు, మహేందర్, శ్రీనివాస్చారి, ఎ.రమేష్గౌడ్, బి.రమేష్గౌడ్, నర్సింహ, ఎగ్గిడి కృష్ణ, నరేష్, వెంకటేశ్, జంగయ్య, రామకృష్ణ యాదవ్, శ్రీనివాస్ ముదిరాజ్, సురేందర్, ప్రచార కార్యదర్శులుగా వెంకటేశ్ గౌడ్, యాదయ్య ముదిరాజ్, లింగం యాదవ్, యాదయ్య, సీహెచ్ రవీందర్, అందె జైపాల్, బండ శ్రీను, మల్లేశ్, శంకర్, నర్సింహ, శివశంకర్, వరికుప్పల రాజు, ఢిల్లీ కృష్ణ, జగదీష్, సలహాదారులుగా బి.వెంకటేశ్, దేవేందర్, ఎస్.అంజయ్య, పి.వెంకటేశ్, ఎమ్మ అంజయ్య కుర్మలను నియమించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు ఆర్.కృష్ణయ్య తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. -
దూసుకొచ్చిన మృత్యువు అతివేగంతో దూసుకెళ్లిన కారు రోడ్డు పక్కన మొబైల్ టిఫిన్ సెంటర్ను ఢీకొట్టడంతో నిర్వాహకుడు మృతి చెందాడు.
సోమవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 20258లోuషాబాద్: మక్తగూడలో బోనంతో చిన్నారి న్యూస్రీల్ బోనం.. వైభవం ఆషాఢ బోనాల ఉత్సవాలు ఆదివారం జిల్లాలోని పలు గ్రామాల్లో అంగరంగ వైభవంగా జరిగాయి. మహిళలు బోనాలతో ఊరేగింపుగా బయలుదేరారు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. చల్లంగ చూడాలని వేడుకున్నారు. డప్పుల దరువులు.. శివసత్తుల పూనకాలు.. పోతురాజుల విన్యాసాలు.. యువత కేరింతలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. -
ఎనికేపల్లి రైతులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం
చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ మొయినాబాద్: గోశాల ఏర్పాటుకు ప్రతిపాదించిన భూములు సాగుచేసుకుంటున్న రైతులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ అన్నారు. మొయినాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఆమె ఆరు రైతు కుటుంబాలకు చెందిన 11 మందికి ప్రొవిజినల్ అలాట్మెంట్ ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులంతా పట్టాలు తీసుకుని ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఎకరాకు 300 గజాల చొప్పున ఇప్పటి వరకు 21 కుటుంబాలకు చెందిన 52 మందికి పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. మిగిలిన రైతులు పట్టుదలకు పోకుండా ఇళ్ల స్థలాల పట్టాలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ గౌతమ్కుమార్, డిప్యూటీ తహసీల్దార్ వినోద్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
మోడల్ మార్కెట్కు సహకరించండి
అతివేగమే ప్రాణాలు తీసింది బొంగ్లూర్ ఓఆర్ఆర్పై ప్రమాదంలో అతివేగమే ఐదుగురు ప్రాణాలు తీసిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.8లోuయాచారం: నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై యాచారం మండల కేంద్రంలో ఆదర్శ కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు సహకరించాలని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కమిషన్ సభ్యులు గోపాల్రెడ్డి, భవాని తదితరులతో వెళ్లి శనివారం నగరంలోని మంత్రి కార్యాలయంలో కలిశారు. కూరగాయలు, ఆకుకూరల ఉత్పత్తిని గణనీ యంగా పెంచడం కోసం రైతులను ప్రోత్సహించడానికి యాచారం మండలం మొండిగౌరెల్లి, గడ్డమల్లయ్యగూడ, చౌదర్పల్లి గ్రామాలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు. పైలెట్ కింద గుర్తించిన గ్రామాల్లో పండే కూరగాయలను రైతులు స్థానికంగా విక్రయించుకుని లాభాలు పొందే ఉద్దేశంతో యాచారం బస్టాండ్ పక్కనే రెండు ఎకరాలు ఇవ్వడానికి అంగీకరించినట్లు వివరించారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రైతులకు రాయితీపై యంత్ర పరికరాలు, విత్తనాలను అందించడం కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. మంత్రి సానుకూలంగా స్పందించి అవసరమైన నిధులు మంజూరు చేసేలా ఉన్నతాధికారులను ఆదేశిస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు వినతి -
ప్రభుత్వం రైతులను గోసపెడుతోంది
మొయినాబాద్: ఎన్నికల ముందు రైతులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భూములను గుంజుకుంటూ రైతులను గోసపెడుతోందని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి విమర్శించారు. మున్సిపల్ పరిధిలోని ఎనికేపల్లిలో గోశాల ఏర్పాటుతో భూములు కోల్పోతున్న రైతులు చేపడుతున్న రిలే దీక్షలో శనివారం ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు సాగుచేసుకుంటున్న భూములను గోశాలకోసం తీసుకోవడం అన్యాయమని అన్నారు. కోకాపేటలో ఉన్న గోశాలను ఎనికేపల్లికి తరలించడంతో ఎవరికి లాభం అని ప్రశ్నించారు. రైతుల భూములు గుంజుకోవడానికి ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రభుత్వానికి సహకరిస్తున్నారని.. అంతగా గోశాల ఏర్పాటుపై ఆసక్తి ఉంటే తన సొంతగ్రామం చించోలిపేట్లో ఏర్పాటు చేసుకోవాలని హితవు పలికారు. ఎకరాల భూమి తీసుకుని రైతులకు గజాల్లో ఇంటి స్థలం ఇవ్వడం ఏమిటని నిలదీశారు. రైతుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాష్, మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రవీందర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నిరంజన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మోర నర్సింహారెడ్డి, ఓబీసీ మోర్చా నియోజకవర్గం కన్వీనర్ వెంకటేశ్గౌడ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు డప్పు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తాం
ఇబ్రహీంపట్నం రూరల్: మున్సిపాలిటీల్లో ఉన్న మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ నిరంతరం పని చేస్తుందని మెప్మా పీడీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శనివారం ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు, స్వయం ఉపాధి సంఘాల మహిళలకు స్మార్ట్ ఈషా, సంరక్షణ ఆస్పత్రుల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులతో మేళా, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెప్మా పీడీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో సకల సౌకర్యాలు కల్పించాలని, పేదరిక నిర్మూలన కోసం కృషి చేయాలని తెలిపారు. స్వచ్ఛమైన తాగునీరు అందించాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో వంద రోజుల ప్రణాళిక ప్రత్యేకాధికారి శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది ప్రవీణ్గౌడ్, సాయికృష్ణారెడ్డి, ప్రవీణ్కుమార్రెడ్డి, శివలింగం తదిత రులు పాల్గొన్నారు. -
హర్షపాతం
ఆదివారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2025అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం షాద్నగర్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కమల శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో కంప్యూటర్ సైన్స్, ఇంగ్లిష్, సెరికల్చర్, తెలుగు, జువాలజీ బోధించే పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు ఆసక్తి గల వారు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పీజీలో సంబంధిత సబ్జెక్టుల్లో 50శాతం, ఇతరులు 55శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలని చెప్పారు. పీహెచ్డీ, ఎన్టీపీ, సెట్, ఎస్ఎల్ఈటీ అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. హయత్నగర్లోని డిగ్రీ కళాశాలలో ఈనెల 24న మౌఖిక పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఖాళీల భర్తీకి దరఖాస్తు చేసుకోండి ఇబ్రహీంపట్నం రూరల్: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను అతిథి అధ్యాపకుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రాధిక శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కంప్యూటర్సైన్స్ అప్లికేషన్లు–2, ఇంగ్లిష్–1, డెయిరీసైన్స్–1, క్రాప్ప్రొడక్షన్–1 మొత్తం ఐదు ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. పీజీలో జనరల్ అభ్యర్థులు 55 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 55 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. పీహెచ్డీ, నెట్, సెట్ కలిగిన వారికి, బోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 23 సాయంత్రం 4 గంటలలోపు కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. గురుకులంలో స్పాట్ అడ్మిషన్లుషాద్నగర్రూరల్: పట్టణ సమీపంలోని నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ, పీజీ కళాశాలలో మిగిలి ఉన్న ఎస్టీ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకున్న గిరిజన విద్యార్థినులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. బీకాం (కంప్యూటర్ సైన్స్), ఎంపీసీఎస్, బీజెడ్సీ, ఎంజెడ్సీ, ఎంపీసీ, ఐఎంఎస్సీ (ఇంటిగ్రేటెడ్ పీజీ) కోర్సులు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు 98850 03390, 97034 41345, 63050 51490 నంబర్లలో సంప్రదించాలని ఆమె సూచించారు. ఫీజు దోపిడీని అరికట్టాలి షాద్నగర్ః ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజు దోపిడీని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పవన్ చౌహాన్ డిమాండ్ చేశారు. పట్టణంలోని సంఘం కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజురీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో ఉన్నత విద్యకు దూరం అవుతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలని, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా నాణ్యమైన విద్యను అందించాలని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ మేరకు సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23న విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు సామేర్, శివశంకర్, కార్తీక్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల జిల్లా సదస్సును జయప్రదం చేయండి కడ్తాల్: ఆమనగల్లులో ఈనెల 21న జరిగే దివ్యాంగుల, చేయూత పెన్షన్దారుల జిల్లా స్థాయి సన్నాహక సదస్సును జయప్రదం చేయాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో శనివారం దివ్యాంగులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలు, చేయూత ఆసరా పెన్షన్ రూ.4 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఆమనగల్లులో జరిగే సభకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరుకానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు జంగయ్య, మండల అధ్యక్షుడు వెంకటేశ్ పాల్గొన్నారు. తుర్కయంజాల్: వర్షాకాలం ప్రారంభమై 50 రోజులు గడుస్తున్నా ఆశించిన మేర వర్షాలు లేక ఆకాశం కేసి ఎదురుచూసిన అన్నదాతలకు ఉపశమనం లభించింది. వాయుగుండం ప్రభావంతో జిల్లాలోని పలు చోట్ల రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆయా మండలాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. అనేక చోట్ల చెరువులు ఉప్పొంగి, వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి. మంచాలలో అధికంగా.. మంచాల మండలంలో సాధారణంగా 155.1 మి.మీ కాగా 242.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక్కడ 56 శాతం అధికంగా వర్షం కురిసింది. షాబాద్లో 54 శాతం, యాచారంలో 41 శాతం, మాడ్గులలో 39 శాతం, ఫరూఖ్నగర్లో 36 శాతం, ఆమనగల్లులో 21 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. రైతుల ఆనందం వర్షాధార పంటలు సాగు చేసిన రైతులు వరణుడి కరుణ కోసం నిరీక్షిస్తున్నారు. ఈ నెల 18వ తేదీ వరకు 9 మండలాల్లో లోటు వర్షపాతం ఉండగా శుక్ర, శనివారం కురిసిన భారీ వర్షాలతో శంకర్పల్లి, శేరిలింగంపల్లి, సరూర్నగర్, చేవెళ్లలో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు జీవం వచ్చిందని చెబుతున్నారు ఆ మండలాల్లో ఇంకా లోటే.. కొన్ని మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతున్నా మరి కొన్నిచోట్ల ఇప్పటికీ లోటు వర్షపాతమే ఉంది. గండిపేటలో –52 శాతం, రాజేంద్రనగర్లో –21 శాతం, హయత్నగర్లో –36 శాతం, అబ్దుల్లాపూర్మెట్లో –20 శాతం, కొందుర్గులో –34 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మెప్మా పీడీ వెంకటేశ్వర్లు హిమయత్సాగర్ జలాశయం పంటలకు ఊపిరి చేవెళ్ల: వర్షాలు లేక రైతులు దిగాలు చెందుతున్న తరుణంలో భారీ వర్షం ఊరటనిచ్చింది. పత్తి, మొక్కజొన్న, కంది పంటలకు ఊపిరిపోసినట్లు అయింది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షంతో రైతులు శనివారం ఉదయం సంతోషంగా పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఎరువులు, మందులు పిచికారీ చేయడంలో బిజీగా మారారు. జీవం పోసింది నాకున్న మూడు ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాను. ఖరీఫ్ మొదట్లో వర్షాలు కురిసినప్పుడు పంట వేశా ను. విత్తనాలు మొలకెత్తిన తరువాత వర్షాలు లేకపోవడంతో పెట్టిన పెట్టుబడులు పోయాయని అనుకున్నాను. నెలరోజులకుపైగా వర్షాలు లేకపోవటంతో పంట వాడిపోయే దశకు వచ్చింది. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో పంటలకు జీవంపోసినట్లు అయింది. పంటకు ఎరువులు, మందుల పిచికారీ చేసుకుంటున్నాను. – శ్రీశైలం, రైతు, రామన్పగూడ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి మొలకలకు ప్రాణమొచ్చింది నెల రోజుల నుంచి వర్షాలకోసం ఎదురుచూస్తున్నాం. మొదట్లో రోహిణి కార్తెలోనే వర్షాలు పడడంతో పత్తి విత్తనాలు నాటాం. అవి మొలకెత్తే సమయంలో వర్షాలు పడలేదు. నెలరోజుల నుంచి వానలు లేక ఎండిపోతాయనుకున్నాం. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మొలకలకు ప్రాణమొచ్చింది. వాగులు పారడంతో వరినాట్లు వేయడానికి కరిగెట్లు సిద్ధం చేస్తున్నాం. – బంటు జంగయ్య, రైతు, నక్కలపల్లి, మొయినాబాద్ మండలం సంప్రదింపులు ఎలా.. ‘ఒక్క లే అవుట్ కోసం దరఖాస్తు చేస్తే ఇటు ఎఫ్సీడీఏ అటు హెచ్ఎండీఏ అధికారుల చుట్టూ పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఫైల్ ఎక్కడ ఏ దశలో ఉందో తెలియడం లేదు. హెచ్ఎండీఏ పని పూర్తి చేసినా చివరకు ఎఫ్సీడీఏను ఆశ్రయించాల్సిందే. ఇలా రెండు సంస్థల చుట్టూ తిరగడం చాలా ఇబ్బందిగా ఉంది’ అని షాద్నగర్ ప్రాంతానికి చెందిన ఒక రియల్టర్ అభిప్రాయపడ్డారు. గతంలో డీటీసీపీ వద్ద అన్ని పనులు పూర్తయ్యేవి. మరో చోటికి వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ.. ఇప్పుడు అలా లేదని ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు. కొద్ది రోజులుగా రియల్ ఎస్టేట్ రంగంలో సానుకూల వాతావరణం నెలకొని ఉంది. అనుమతుల్లో జాప్యంతో ముందుకు వెళ్లలేకపోతున్నట్లు పలువురు చెబుతున్నారు. ● హెచ్ఎండీఏలోనే ఫ్యూచర్ సిటీ ఫైళ్ల పరిశీలన ● రెండు సంస్థల చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు సాక్షి, సిటీబ్యూరో: ఫ్యూచర్సిటీలో లే అవుట్లు, భవన నిర్మాణ అనుమతుల్లో గందరగోళం నెలకొంది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా హెచ్ఎండీఏ తరహాలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ)ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థకు ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా నియమించారు. అయినా.. ఎఫ్సీడీఏలో ఇప్పటి వరకు నిర్మాణరంగానికి సంబంధించిన అనుమతుల ప్రక్రియ గాడిలో పడలేదు. దీంతో భవన యజమానులు, రియల్టర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పరిశీలన దశలోనే.. ఎఫ్సీడీఏలో సిబ్బంది కొరత కారణంగా లేఅవుట్లు, బిల్డింగ్ల నిర్మాణం కోసం వచ్చే దరఖాస్తులన్నింటినీ హెచ్ఎండీఏ స్వీకరించి పరిష్కరిస్తుంది. అంతిమంగా ప్రొసీడింగ్లు (అనుమతులు) మాత్రం ఎఫ్సీడీఏ నుంచి లభిస్తాయి. కానీ ఈ ప్రక్రియ ఇంకా స్థిరంగా కొనసాగడం లేదు. వందలకొద్దీ దరఖాస్తులు పరిశీలన దశలోనే ఉన్నాయి. గతంలో డీటీసీపీ వద్ద నమోదైన వాటిని సైతం ప్రస్తుతం హెచ్ఎండీఏకు బదిలీ చేశారు. ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండీఏ పరిధికి చెందిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ యథాతథంగా కొనసాగుతోంది. హెచ్ఎండీఏ నుంచే స్వయంగా అనుమతులు లభిస్తున్నాయి. ఫ్యూచర్ సిటీ పరిధికి చెందిన దరఖాస్తుల పరిశీలనలో మాత్రం జాప్యంనెలకొంటోంది. దీంతో నిర్మాణ సంస్థలు, రియల్ ఎస్టేట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టి భూములు కొనుగోలు చేసినప్పటికీ సకాలంలో అనుమతులు లభించకపోవడంతో లే అవుట్లను అభివృద్ధి చేయలేకపోతున్నట్లు ఎఫ్సీడీఏ పరిధికి చెందిన పలు నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. కాలయాపన కారణంగా ఆర్థికంగా నష్టాలను చవిచూడాల్సి వస్తోందని పేర్కొన్నారు. కొరవడిన సమన్వయం.. ● హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధిని రీజనల్రింగ్ రోడ్డు వరకు విస్తరించిన సంగతి తెలిసిందే. దీంతో 7,250 చ.కి,మీల నుంచి 10,472 చ.కి.మీ వరకు హెచ్ఎండీఏ కార్యకలాపాలు విస్తరించాయి. 7 నుంచి 11 జిల్లాలకు ఈ పరిధి పెరిగింది. కొత్తగా 1,355 గ్రామాలు హెచ్ఎండీఏలో విలీనమయ్యాయి. మరోవైపు ఈ పరిధిలోనే ఉన్న 56 గ్రామాలను ప్రభుత్వం ఫ్యూచర్సిటీ పరిధిలోకి తెచ్చింది. దీంతో 765 చ.కి.మీ. ప్రాంతం ఫ్యూచర్సిటీ డెవలప్మెంట్ అథారిటీలో భాగమైంది. గతంలో డీటీసీపీ/హెచ్ఎండీఏ, స్థానిక గ్రామపంచాయతీల నుంచి నిర్మాణ అనుమతులు లభించగా ఇప్పుడు అనూహ్యంగా ఈ ప్రాంతాలన్నీ అనూహ్యంగా కొన్ని పంచాయతీలు హెచ్ఎండీఏ, మరికొన్ని ఎఫ్సీడీఏ పరిధిలోకి రావడంతో గందరగోళం నెలకొంది. ● ఎఫ్సీడీఏకు ప్రత్యేక అధికారిని, సిబ్బందిని నియమించిన అనంతరం ప్రభుత్వం జూన్ 15 నుంచి నిర్మాణరంగ అనుమతులను అందజేసే అధికారాలను సైతం ఆ సంస్థకు అప్పగించింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ హెచ్ఎండీఏ తరహాలో బలమైన ప్రణాళికా విభాగం ఎఫ్సీడీఏకు లేదు. దీంతో బిల్డ్నౌ ద్వారా ఆన్లైన్లో దర ఖాస్తుల స్వీకరణ దశ నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులను అందజేయడం వరకు హెచ్ఎండీఏ విధినిర్వహణలో భాగమైంది. అంతిమంగా ఎఫ్సీడీఏ నుంచి మాత్రం అధికారికంగా అనుమతులను (ప్రొసీడింగ్స్)ను అందజేస్తారు. ప్రస్తుతం ఈ రెండు సంస్థల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో కాలయాపన జరుగుతోందని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. న్యూస్రీల్ఫ్యూచర్ సిటీ.. ప్రొసీడింగ్స్ పిటీజిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు -
టీటీడీ నుంచి నిధులు ఇప్పించండి
యాచారం: మండల పరిధిలోని కుర్మిద్ద గ్రామస్తులు శనివారం ఉదయం నగరంలో కేంద్ర మంత్రి గంగాపురం కిషన్రెడ్డిని కలిశారు. గ్రామంలోని రమా సత్యనారాయణస్వామి దేవాలయాన్ని నిర్మిస్తున్నామని ఇందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నిధులు మంజూరు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బందె మహేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గొట్టే మల్లేశ్, మాజీ సర్పంచ్ రాజశేఖర్రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్పల్లి అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డికికుర్మిద్ద గ్రామస్తుల వినతి -
పెన్షనర్ల సమస్యలను కేంద్రానికి వివరించండి
ఎంపీ ఈటల రాజేందర్కు విశ్రాంత ఉద్యోగుల విజ్ఞప్తి యాచారం: పెన్షనర్ల సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్, ఉపాధ్యాయ సంఘం నేతలు కోరారు. శనివారం నగరంలోని ఈటల రాజేందర్ నివాసంలో ఎంపీని కలిసి 2025 ఆర్థిక బిల్లుతో పెన్షనర్లకు కలిగే నష్టాలను వివరించారు. బిల్లులో మార్పులు చేపట్టాలని లేదంటే నిలిపివేయాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎంపీ ఈటెల రాజేందర్ కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వినోద్కుమార్, శ్రీనువాస్, లిక్కి అనురుద్రరెడ్డి, పున్న నర్సింహ, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీ సీఎంకు ఆచారి శుభాకాంక్షలు
కడ్తాల్: జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి శనివారం ఉదయం ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తాను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆమె జన్మదినం సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గంజాయి విక్రేతకు రిమాండ్ శంకర్పల్లి: గంజాయి విక్రయిస్తున్న ఓ యువకుడిని రాజేంద్రనగర్ ఎస్ఓటీ, మోకిల పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మోకిల ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపిన ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన శిషీర్నాథ్(28) గతేడాది బతుకుదెరువు కోసం మోకిలకి వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు గాను, కొన్ని నెలలుగా గంజాయి అమ్ముతున్నాడు. శిషీర్ నాథ్ తన స్నేహితుడు గోకులనందనాథ్ ఇద్దరూ కలిసి ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి స్థానికంగా కార్మికులు పనిచేస్తున్న ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. పక్కా సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్ఓటీ, మోకిల పోలీసులు శనివారం దాడి చేయగా.. శిషీర్నాథ్ పట్టుబడ్డాడు. ఆయన వద్ద 4.3కిలోల గంజాయి, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. గోకులనందనాథ్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. పాము కాటుకు రైతు మృతి కడ్తాల్: తలకొండపల్లి మండల పరిధిలోని చుక్కాపూర్ లో పాము కాటుకు యువకు డు మృతి చెందాడు. వివరా లు.. గ్రామానికి చెందిన యువ రైతు కడారి తిరుపతి యాదవ్ (38) శనివారం సాయంత్రం తన పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తు చెట్ల పొదల్లో ఉన్న పింజర పాము కాటేసింది. వెంటనే బాధితుడు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో ఘటనాస్థలికి చేరుకుని పాముని చంపారు. బాధితుడిని చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. దరఖాస్తుల ఆహ్వానం శంషాబాద్: శంషాబాద్ ప్రభుత్వ డిగ్రీ (రాజేంద్రనగర్) కళాశాలలో గెస్ట్ లెక్చరర్లుగా పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబిందు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగు, హిందీ, చరిత్ర, పొలిటికల్ సైన్స్, బోటనీ, జువాలజీ, గణితం, కంప్యూటర్ సైన్స్, అప్లికేషన్ సబ్జెక్టుల్లో ఒక్కో పోస్టుకు, కామర్స్లో రెండు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నా రు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కు లు కలిగి ఉండాలి తెలిపారు. ఈ నెల 23న సాయంత్రం సంబంధిత ధ్రువ పత్రాలతో కళాశాలలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
సమాజ భద్రతకే కార్డన్ సెర్చ్
నందిగామ: సమాజ భద్రత కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని శంషాబాద్ డీసీపీ రాజేశ్ అన్నారు. శనివారం నందిగామ, అంతిరెడ్డిగూడ శివారులోని పృథ్వీకాలనీ, అయ్యప్ప స్వామి దేవాలయం పరిసర ప్రాంతాలలో నందిగామ పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కిరణా దుకాణాలు, పాన్షాపులు, వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శంషాబాద్ డీసీపీ రాజేశ్ మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో తొమ్మిది హాట్స్పాట్లను గుర్తించి కార్డన్ సెర్చ్ నిర్వహించామని చెప్పారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 42 ద్విచక్రవాహనాలు, నాలుగుచోట్ల గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తున్నట్లు గుర్తించి 37 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశామన్నారు. నాలుగు బెల్టు షాపుల్లో మద్యం, 8 కేజీల గుట్కా ప్యాకెట్లను, 285 గ్రాముల గంజాయి స్వాధీనం, ఓ పరిశ్రమలో పనిచేస్తున్న బాల కార్మికుడిని గుర్తించామని చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ పూర్ణచందర్, ఏసీపీ శ్రీకాంత్ గౌడ్, ఆరుగురు సీఐలు, పదిమంది ఎస్ఐలు, 20మంది ఏఎస్ఐలు, 35 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 170 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. శంషాబాద్ డీసీపీ రాజేశ్ -
బాలికల సంరక్షణ కోసం కృషి చేద్దాం
ఇబ్రహీంపట్నం రూరల్: బాలికా శిశు సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, అప్పుడే సమాజం బాగుంటుందని మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలోని రహదారుల వెంట శనివారం పోలీసు బృందంతో కలిసి పర్యటించారు. రోడ్డు వెంట నడుస్తున్న బాలికలను నిలిపి విద్యా బాగోగులు, రక్షణపై ఆరా తీశారు. అనంతరం ఇబ్రహీంపట్నం బస్టాండ్లో తనిఖీ చేశారు. విద్యార్థులను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. బాలికల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. బస్టాండ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పోకిరీల బెడద లేకుండా నిరంతరం వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు, బాలికలను వేధింపులకు గురి చేస్తే ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, సీఐలు మహేందర్రెడ్డి, రాఘవేందర్రెడ్డి, మధు, నందీశ్వర్రెడ్డి, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి -
అతివేగమే ప్రాణాలు తీసింది
ఇబ్రహీంపట్నం రూరల్: బొంగ్లూర్ ఓఆర్ఆర్పై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందిన విషయం విదితమే. ప్రమాద కారణాలపై ఆదిబట్ల పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, ఆదిబట్ల సీఐ రాఘవేందర్రెడ్డి ఆధ్వర్యంలో విచారణ వేగవంతం చేశారు. అర్ధరాత్రి జరిగిన ఘటనకు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతులు బాల్రాజ్, జనార్ధన్, కృష్ణ, భాస్కర్రావు, చందూలాల్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. లైన్ మార్చి ప్రయాణం ఈ ప్రమాదానికి కారణం అతివేగమేనని నిర్ధాణకు వచ్చారు. పెద్దఅంబర్పేట్ నుంచి మొయినాబాద్ మండల పరిధిలోని ఎనికేపల్లికి వెళ్లాల్సిన మృతులు ప్రయాణించిన కారు ప్రమాదం జరిగినప్పుడు 130 కిలోమీటర్ల వేగంగా ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓఆర్ఆర్పై రెండో లైన్లో వెళ్లాలంటే 120 కిలోమీటర్ల వేగం మాత్రమే ఉండాలి. అంతకు మించి వేగం ప్రమాదానికి కారణమైంది. ట్రక్కును గుర్తించిన పోలీసులు ప్రమాదం జరిగినప్పుడు కారు లారీని ఢీకొట్టిందని అంచనాకు వచ్చారు. కానీ ఫలానా లారీ అని పోలీసులకు తెలియలేదు. కారు ప్రమాదం జరిగిన చోట లారీ వెనుక బంపర్ పడిపోవడంతో దాన్ని అనుసరించి పోలీసులు దర్యాప్తు చేపట్టి టోల్గేట్ల వద్ద సీసీ పుటేజీలు సేకరించారు. శంషాబాద్ మీదుగా షాద్నగర్ వైపు వెళ్తున్న భారీ టస్కర్ ప్రమాదానికి కారణమని గుర్తించారు. షాద్నగర్ వద్ద ఐరెన్ చిప్స్ లోడ్తో వెళ్తున్న టస్కర్ను ఆదిబట్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ట్రక్కు బొంగ్లూర్ ఓఆర్ఆర్ మీదుగా 40–50 కిలోమీటర్ల వేగంతో 2వ, మూడవ లైన్ మధ్య నుంచి వెళ్లడంతో కారు ఢీకొట్టినట్లు గుర్తించారు. ట్రక్కులు, క్యాబ్లు మూడు, నాల్గవ లైన్లల్లో మాత్రమే వెళ్లాలి. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ భయంతో దూరం వెళ్లి వాహనం నిలిపి చూసుకున్నాడని.. ఐదుగురు ప్రాణాలు కోల్పోయినా చలించకపోవడం నేరమని భావించారు. డ్రైవర్పై కొత్త చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ట్రక్కును స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు నేతృత్వంలో త్వరలోనే ట్రక్కు డ్రైవర్ను రిమాండ్కు తరలించనున్నట్లు తెలిసింది. ఔటర్పై ప్రమాదంలో విచారణ వేగవంతం రోడ్డు భద్రతా నియమాలుపాటించని లారీ డ్రైవర్ కార్లు వెళ్లే మార్గంలో టస్కర్ ప్రయాణం వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు -
రోడ్డు కబ్జాపై తహసీల్దార్కు ఫిర్యాదు
కేశంపేట: మండల పరిధిలోని సంగెం రెవెన్యూ పరిధిలోని పొల్కోనిగుట్ట తండాలో వీవీఆర్ వెంచర్లో రోడ్డు కబ్జాకు గురైనట్టు గ్రామస్తులు తహసీల్దార్ అజాంఅలీకి ఫిర్యాదు చేశారు. గతంలో సంగెం రెవెన్యూ పరిధిలో సర్వేనంబర్లు 40, 41, 42, 43, 44లో వ్యవసాయ భూమిని వీవీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు కొనుగోలు చేసి వెంచర్ వేశారని.. ప్లాట్లు పూర్తి స్ధాయిలో అమ్మకాలు జరగకపోవడంతో అట్టి వెంచర్లోని ప్లాట్లను మళ్లీ వ్యవసాయభూమిగా విక్రయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంచర్లో రోడ్లుతో పాటుగా ఐదుగుంటల భూమిని వదిలేయడంతో పల్లె ప్రకృతి వనం ఏర్పాటుచేశామన్నారు. ప్రస్తుతం వెంచర్ హద్దులను చేరిపివేయడంతో పల్లె ప్రకృతి వనానికి వెళ్లేందుకు రోడ్డు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంచర్లోని రోడ్లుతో పాటుగా పల్లె ప్రకృతి వనం రోడ్డును కబ్జా నుంచి తొలగించాలని ఫిర్యాదులో కోరారు. ఈ కార్యక్రమంలో తారాసింగ్, రవి, రాజేష్, సాయికుమార్, శంకర్, శ్రీను, రాజేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లలో పారదర్శకత ఏదీ?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా జరగాల్సిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తలకే అన్నట్లుగా ఉంది’ అని చేవెళ్ల ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ కొండా విశ్వేశ్వర్రెడ్డి విమర్శించారు. ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించినప్పటికీ లబ్ధిదారుల ఎంపిక మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో కొనసాగిందని ఆరోపించారు. అడ్డుకోవాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర వహించారని, ఇది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అనర్హులకు ఇళ్లు కేటాయించడంతో వాళ్లు కట్టుకోలేక.. ఈ ఇళ్లు మాకొద్దు అంటూ ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్స్ తిప్పి పంపుతున్నారని గుర్తు చేశారు. కలెక్టరేట్లో శుక్రవారం కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ)సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవసాయం, పశు సంవర్థకశాఖ, పరిశ్రమలు, బ్యాంకింగ్ రుణాలు, మైనింగ్, ఇరిగేషన్, వైద్య ఆరోగ్యశాఖ, పౌర సరఫరాల, శిశు సంక్షేమశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, మత్స్య, మార్కెటింగ్, గృహ నిర్మాణ శాఖల పనితీరును సమీక్షించారు. దిశ అంటే ఓ మార్గం.. అభివృద్ధి కొండా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. దిశ అంటే ఒక మార్గం, అభివృద్ధి అని, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ల వివరాలను అందజేయాలని ఆదేశించారు. జిల్లాలో పుట్టగొడుగుల శిక్షణ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. జిల్లా మత్స్యకారులకు చేపలు పట్టే విధానంపై శిక్షణ ఇవ్వక పోవడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు..ఇక్కడికి వచ్చి చెరువులను లీజుకు తీసుకుని లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని మత్స్యకారులకు శిక్షణ ఇప్పించి, ఆర్థికంగా తోడ్పడాలని సూచించారు. కేంద్ర పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. నిలదీసిన సభ్యులు.. ఈదురుగాలులతో కూడిన వర్షాలకు పాలిహౌస్లు దెబ్బతిన్నాయని, పునరుద్ధరణకు ప్రభుత్వం సాయం చేస్తుందా అని చేవెళ్ల ఎమ్మెల్యే, కమిటీ సభ్యుడు కాలె యాదయ్య ప్రశ్నించారు. మొయినాబాద్, చేవెళ్ల, శంషాబాద్, శంకర్పల్లి మండలాల్లో పూల సాగు అధికంగా ఉంది. రైతులు రాత్రి పూట పూలు కోసి, అదేరాత్రి మార్కెట్కు తెస్తున్నారు. అక్కడి ఏజెంట్లు రైతుల నుంచి పది శాతం కమీషన్ వసూలు చేస్తున్నారు. నిలువు దోపీడీ చేస్తున్న ఏజెంట్లపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అని సభ్యుడు ప్రభాకర్రెడ్డి అధికారుల దృష్టికి తెచ్చారు. లెనిన్నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని రెండేళ్ల క్రితం కూల్చివేశారు. ఇప్పటికీ భవనం పూర్తి చేయలేదు అప్పటి వరకు అక్కడ చదువుకునే పిల్లలంతా చెల్లా చెదురైపోయారు అని మరో సభ్యుడు ఎ.శ్రీనివాస్ అన్నారు. ఇన్నర్ టు ఔటర్ను కలిపే పలు మార్గాలు ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయని, ఆ రహదారుల పనులను వెంటనే పూర్తి చేయాలని సభ్యుడు తోకల శ్రీనివాసరెడ్డి కోరారు. పశు సంవర్థకశాఖ కమిటీకి సమర్పించిన నివేదిక అసమగ్రంగా రూపొందించడంపై కలెక్టర్ నారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి తప్పని కరెంట్ కటకట అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై సభ్యులంతా సీరియస్గా చర్చిస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కీలక సమావేశం జరుగుతున్న సమయంలో పలు మార్లు రెంట్ నిలిచిపోవడంపై సభ్యులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకే అన్నట్లుగా ఉంది అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు కేంద్ర పథకాలను పక్కాగా అమలు చేయాలి చేవెళ్ల ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ కొండా విశ్వేశ్వర్రెడ్డి సమీక్ష సమావేశంలో ప్రశ్నల వర్షం కురిపించిన సభ్యులు -
మహిళల అభ్యున్నతికి కృషి చేయాలి
కందుకూరు: ఫ్యూచర్సిటీలో మహిళా సంఘాలకు వంద ఎకరాలు కేటాయించి, వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే సబితారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఇందిర మహిళా శక్తి సంబరాల్లో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో కందుకూరు, మహేశ్వరం మండలాలకు చెందిన మహిళా సంఘాల సభ్యులకు రుణాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి మహిళలను కోటీశ్వరుల్ని చేస్తానని చెబుతున్నారని, ఒక్కో మహిళకు రూ.కోటి రుణం ఇచ్చినప్పుడే అది సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వం మాటలతో కడుపు నింపే ప్రయత్నం చేస్తోందని, నిజంగా ఆడబిడ్డలపై ప్రేముంటే మూడేళ్లకాలం వడ్డీని వెంటనే విడుదల చేయాలన్నారు. మహిళలు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని, బ్యాంక్ లింకేజ్తో సంబంధం లేకుండా రుణాలు ఇవ్వాలని, సీనియర్ సిటిజన్లతో సంఘాలు ఏర్పాటు చేసి రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ డీపీఎం యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.కృష్ణనాయక్, ఏపీఎంలు కవిత, సత్యనారాయణ, ఎంపీఓ గీత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్.సురేందర్రెడ్డి, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి
మొయినాబాద్: మున్సిపల్ కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్లో ఆగస్టు 2న జరిగే సీపీఐ జిల్లా 17వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య కోరారు. ఈ మేరకు శుక్రవారం మహాసభల వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంద సంవత్సరాల భారత కమ్యూనిస్టు పార్టీ నాటి నుంచి నేటి వరకు భూమి, భుక్తి, విముక్తికోసం పేదల పక్షాన పోరాటం చేస్తోందన్నారు. పోరాటమే ఎజెండాగా జరుగనున్న జిల్లా మహాసభలను విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు పర్వతాలు, రామస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రభులింగం, మండల కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు సత్యనారాయణ, అంజయ్య, మంజుల, సుధాకర్గౌడ్, జలీల్ తదితరులు పాల్గొన్నారు. -
ఔటర్పై.. ఘోర ప్రమాదం
ఇబ్రహీంపట్నం రూరల్/ఇబ్రహీంపట్నం/మొయినాబాద్: బతుకుదెరువుకోసం పొట్ట చేతపట్టుకొని వలస వచ్చారు. నిత్యం పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. దైవ దర్శనం కోసం వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఏసీపీ కేపీవీ రాజు, సీఐ రాఘవేందర్రెడ్డి కథనం ప్రకారం.. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనికేపల్లికి చెందిన కావలి బాల్రాజ్ (40) చికెన్సెంటర్ నిర్వహిస్తున్నాడు. వరంగల్ జిల్లా మాసంపల్లితండాకు చెందిన మాలోతు చందులాల్ (29), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా కలంరాజుపేటకు చెందిన జడ కృష్ణ (25) మొయినాబాద్లోని డ్రీమ్ వ్యాలీ రిసార్ట్లో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వెదుళ్లవలసకు చెందిన దాసరి భాస్కర్రావు (39) డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. మహబూబబాద్ జిల్లా దాసరితండాకు చెందిన గుగులోతు జనార్దన్ (45) మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని సోలార్ విల్లాస్లో కూలీగా పనిచేస్తున్నాడు. బాల్రాజ్ నిర్వహిస్తున్న చికెన్ సెంటర్ వద్దకు వీరంతా తరచూ వస్తుండడంతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో అందరూ స్నేహితులుగా మారారు. గురువారం రాత్రి బాల్రాజ్ సొంత కారు (టీఎస్ 07 హెచ్డబ్ల్యూ 5858) తీసుకొని ఐదుగురూ కలిసి యాదగిరిగుట్టకు వెళ్లారు. దర్శనం అనంతరం శుక్రవారం తెల్లవారు జామున ఘట్కేసర్ నుంచి మొయినాబాద్కు ఔటర్రింగ్రోడు మీదుగా వస్తుండగా బొంగ్లూర్ ఎగ్జిట్ నంబర్ 12కు సమీపంలో 108 కేఎం వద్దకు రాగానే నిద్రమత్తు, అతివేగంతో కారు డ్రైవింగ్ చేస్తున్న చందులాల్ ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. కారు లారీ వెనుకభాగంలో ఇరుక్కుపోవడంతో కారు నుజ్జునుజ్జయింది. జనార్దన్, చందులాల్, బాల్రాజ్, భాస్కర్రావు కారులోనే ఇరుక్కుపోయి దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రెండు గంటల పాటు శ్రమించి మృతదేహాలను వెలికి తీశారు. కృష్ణ తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుండగా 108 అంబులెన్స్లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. చందులాల్కు జనార్దన్ వరుసకు బాబాయ్ అవుతాడు. వైద్యుల పనితీరుపై మాజీ ఎంపీ ఆగ్రహం వైద్యుల పనితీరుపై మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోతు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల్లో మహబూబాబాద్ నియోజకవర్గానికి చెంది నవారు ఉండడంతో వారి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు ఆమె ఉదయం పది గంటలకు ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. అప్పటికి పోస్టుమార్టం కోసం మృతదేహాలను తీసుకెళ్లకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత వైద్యుడు జవార్తో ఫోన్లో మాట్లాడగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆమె మండిపడ్డారు. ఉదయం ఆరున్నర గంటలలోపు మృతదేహాలను ఆస్పత్రికి తీసుకొస్తే పదిన్నర గంటలు కావస్తున్నా వైద్యులు అందుబాటులో లేరన్నారు. నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్న వైద్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ఫోన్లో వివరించారు. రోదనలతో మిన్నంటిన ఆస్పత్రి ప్రాంగణం నలుగురి మృతదేహాలను ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యులంతా అక్కడికి చేరుకుని అయ్యో దేవుడా ఎంత పని చేశావంటూ బోరున విలపించారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కృష్ణ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేశారు. బాధితులను ఓదార్చిన డీసీపీ మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, సీఐ రాఘవేందర్రెడ్డి ఔటర్పై జరిగిన ఘటనను పరిశీలించారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి విచ్చేసి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాల్రాజ్ కుటుంబంలో విషాదం చికెన్సెంటర్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న బాల్రాజ్ కుటుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. స్నేహితులతో కలిసి వెళ్లిన బాల్రాజ్ తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాల్రాజ్కు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. బాల్రాజ్ మరణంతో కుటుంబంలో మగదిక్కులేకుండా పోయిందని బందువులు, మహిళలు బోరున విలపించారు. బతుకుదెరువుకోసం వచ్చి.. రిసార్స్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న చందులాల్, కృష్ణ, సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న భాస్కర్రావు, సోలార్ విల్లాస్లో కూలీగా పనిచేస్తున్న జనార్దన్ ఇతర ప్రాంతాల నుంచి బతుకుదెరువుకోసం వచ్చారు. కుటుంబాలను వది లి వచ్చిన వారంతా రోడ్డు ప్రమాదంలో మృతి చెంది కుటుంబాల్లో విషాదాన్ని నింపారు. దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా.. అతివేగంతో వెళ్లి లారీని ఢీకొట్టిన కారు నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చికిత్స పొందుతూ మరొకరి మృతి రెండు గంటలు శ్రమించి మృతదేహాల వెలికితీత రోదనలతో మిన్నంటిన ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణ -
ఎనికేపల్లి రైతులకు న్యాయం చేయండి
మొయినాబాద్: గోశాల ఏర్పాటుతో భూములు కోల్పోతున్న ఎనికేపల్లి రైతులకు సమన్యాయం చేయాలని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం కలెక్టర్ నారాయణరెడ్డికి విన్నవించారు. ఈమేరకు శుక్రవారం రైతులతో కలిసి కలెక్టరేట్కు వెళ్లారు. కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. పరిహారంకోసం రైతులు రిలే దీక్ష చేస్తుంటే కొంత మందిని విడదీసి పట్టాలు ఇవ్వడం సరికాదన్నారు. రైతులను ఒప్పించి వారికి సరైన పరిహారం ఇవ్వాలన్నారు. కలెక్టర్ను కలిసినవారిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ప్రభాకర్రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు మోర నర్సింహారెడ్డి, నాయకులు వైభవ్రెడ్డి, వెంకట్రెడ్డి, శ్రీనివాస్, రైతులు ఉన్నారు. భూములు పరిశీలించిన సీపీఎం నాయకులుఎనికేపల్లి రైతులకు ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చి న్యాయం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య డిమాండ్ చేశారు. మున్సిపల్ పరిధిలోని ఎనికేపల్లి రైతులు చేపడుతున్న రిలే దీక్షలో శుక్రవారం ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రైవేటు గోశాలకు ప్రభుత్వం 99.14 ఎకరాల భూములు ఇవ్వడం సరికాదన్నారు. తరతరాలుగా భూమినే నమ్ముకుని జీవనాధారం పొందుతున్న పేద రైతులనోట్లో మట్టి కొట్టొద్దన్నారు. పేదల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కొని బడాబాబులకు కట్టబెడుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాడిగళ్ల భాస్కర్, జగదీష్, నాయకులు జగన్, ప్రకాష్ కారత్, అల్లి దేవేందర్, ప్రవీణ్కుమార్, శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్, వెంకటయ్య, అరుణ్కుమార్ తదితరులు ఉన్నారు. -
భారీ వర్షం.. రైతన్న హర్షం
చేవెళ్ల: ఎట్టకేలకు రైతు ఎదురుచూపులను వరుణ దేవుడు కరుణించాడు. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రోడ్లన్నీ జలమయ్యమయ్యాయి. ఆలూరు రోడ్డు బురదమయంగా మారి ప్రజలు ఇబ్బంది పడ్డారు. చేవెళ్లలో రోడ్లుపై వర్షపు నీరు పారింది. ఎస్సీ వసతిగృహం ఎదుట, చేవెళ్ల దేవాలయ కమాన్ ఎదుట నీరు నిలిచి చెరువును తలపించింది. పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదు మొయినాబాద్: అర్థరాత్రి కురిసిన కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. మూడు గంటల పాటు ఏకదాటిగా కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లాయి. పలు చోట్ల వరద తాకిడికి ప్రహారీలు కూలాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. భారీగా వరదలు రావడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మొయినాబాద్ మున్సిపాలిటీతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో గురువారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. అర్థరాత్రి ఒంటి గంట నుంచి శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల వరకు ఏగదాటిగా 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తిరిగి సాయంత్రం 5గంటల నుంచి 7.30గంటలకు మరో వారు వాన జోరు చూపింది. భారీగా వరదలు రావడంతో కాలువలు, లోతట్టు ప్రాంతాల్లో నిర్మించిన ప్రహారీలు కూలిపోయాయి. నాగిరెడ్డిగూడ, ఎనికేపల్లి దారి పక్కన నిర్మించిన ప్రహారీ గోడ వరద తాకిడికి కూలింది. ముర్తూజగూడ నుంచి డ్రీమ్వ్యాలీ రిసార్ట్స్కు వెళ్లే రోడ్డుకు ఇరువైపుల నిర్మించిన ప్రహారీ కూలిపోయింది. మొయినాబాద్ ఠాణా వెనుక ప్రహారీ గోడ కూలిపోయింది. ఇంత వర్షం 40 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదని స్థానికులు వాపోయారు. నాగిరెడ్డిగూడ, బాకారం, అమ్డాపూర్, వెంకటాపూర్, శ్రీరాంనగర్ గ్రామాలతోపాటు మున్సిపాలిటీ పరిధిలోని సురంగల్, ముర్తూజగూడ, ఎనికేపల్లి, అజీజ్నగర్, హిమాయత్నగర్, చిలుకూరు, పెద్దమంగళారం గ్రామాల్లో ప్రీకాస్ట్ వాల్స్ కూలిపోయాయి. ఆయా ప్రాంతాల్లో చెట్లు విరిగి విద్యుత్ లైన్లపై పడటంతో స్తంభాలు విరిగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శ్రీరాంనగర్ బోయవాగు, అమ్డాపూర్ పీతవాగు, బాకారం ఎర్రకుంట వాగు, నాగిరెడ్డిగూడ అబ్బుకుంట వాగుల్లో భారీగా వరదలు పారాయి. ఆయా వాగుల నుంచి ఈసీ వాగులోకి వెళ్లిన వరదనీరు హిమాయత్సాగర్ జలాశయంలోకి చేరింది. పలు చోట్ల కల్వర్టులపైనుంచి వరదనీరు పొంగి పొర్లింది. రోడ్లపైనుంచి వరదల పారడంతో నాగిరెడ్డిగూడ–బాకారం, అమ్డాపూర్–కాశీంబౌలి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై అజీజ్నగర్చౌరస్తా, హిమాయత్నగర్ చౌరస్తా, భాస్కర ఆసుపత్రి, బోస్ గార్డెన్, మొయినాబాద్లలో భారీగా వర్షం నీరు నిలిచింది. ఆయా ప్రాంతాల్లో కల్వర్టులు మూసివేయడంతో వరద నీరు రోడ్డుపై నిలిచిపోయింది. భారీ వరదలతో పలు గ్రామాల రోడ్లు దెబ్బతిన్నాయి. రోడ్లపై నుంచి వరదలు పారడంతో రోడ్డు, మట్టి కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల పంటలను నీట మునిగి దెబ్బతిన్నాయి. తెగిన ఎర్రకుంట కట్ట మొయినాబాద్ రూరల్: శుక్రవారం ఉదయం, సాయంత్రం 3గంటల నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించాయి. నీటితో నిండిన బాకారం ఎర్రకుంట చెరువు ఒక్కసారిగా తెగిపోయి కుంటలోని నీరంతా పల్లానికి ప్రవహించింది. దీంతో బాకారం, ఎన్కేపల్లి రహదారి దాదాపు రెండు గంటల పాటు నిలిచిపోయింది. వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్ డీఈ పరమేశ్వరచారి బాకారంలోని ఎర్రకుంటను సందర్శించి పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కట్టకు మరమ్మతులు నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సాయంత్రం 3 గంటల నుంచి ప్రారంభమైన వర్షం రాత్రి వరకు కురుస్తూనే ఉంది. దీంతో గ్రామాలు తడిసిముద్దైయ్యాయి. రోడ్లన్ని జలమయమైయ్యాయి. తెల్లవారుజామున కురిసిన వర్షానికి అప్పటికే వర్షం నీటితో నిండి ఉన్ప రోడ్లు, గుంతలు సాయంత్రం కురిసిన వర్షానికి మరింత వర్షం నీరు చేరింది. షాద్నగర్లో సహాయక చర్యలు షాద్నగర్: పట్టణంలో భారీగా వర్షం కురియడంతో లోతట్టుకాలనీలు జలమయమయ్యాయి. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారు జాము వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురియడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. కాలనీల్లో మురుగు కాల్వలు ఉప్పొంగాయి. వర్షం నీరు ఇళ్ళలోకి చేరయడంతో రాత్రివేళల్లో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మున్సిపల్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు కాలనీల్లో మున్సిపల్ కమిషనర్ సునీత పర్యటించి సహాయక చర్య లు చేపట్టారు. బీజేపీ నేత అందె బాబయ్య నాయకులు లోతట్టు కాలనీల్లో పర్యటించారు. మెట్ట పంటలకు జీవం యాచారం: మండల పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం రాత్రి, శుక్రవారం సాయంత్రం సమయాల్లో మోస్తారు వర్షం కురిసింది. ఈ వర్షంతో మెట్ట పంటలకు భారీ ఉపశమనం లభించింది. పక్షం రోజులుగా వర్షాలు లేక పత్తి, కంది, జొన్న, మొక్కజొన్న తదితర మెట్ట పంటలు వాడిపోయే దశకు చేరాయి. రెండు రోజులుగా కురిసిన వర్షంతో మెట్ట పంటలకు జీవం పోసినట్లయింది. యాచారం, అయ్యవారిగూడెం, నందివనపర్తి, మొండిగౌరెల్లి, చింతపట్ల తదితర గ్రామాల్లో రెండు గంటల పాటు వర్షం కురిసింది. నీటమునిగిన కాలనీలు మీర్పేట: శుక్రవారం కురిసిన భారీ వర్షానికి మీర్పేట కార్పొరేషన్ పరిధిలోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. మిథులానగర్, కమలానెహ్రూనగర్ కాలనీలను వరదనీరు ముంచెత్తడంతో వీధుల్లో మోకాలి లోతు వరకు నీరు చేరాయి. కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి వరదనీరు వెళ్లేలా చర్యలు చేపట్టారు. మంగళ్పల్లిలో అత్యధిక వర్షపాతం ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల మున్సిపాలిటీలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. మూడు గంటలకు పైగా ఆగకుండా వర్షం కురవడంతో రోడ్లుపై వరదలు పారాయి. కొంగరకలాన్లోని ఇళ్లలోకి నీరు చేరింది. పెద్దబంధం కాల్వ నుంచి దాతార్ చెరువులోకి భారీగా వరద నీరు రావడంతో కొంగరకలాన్–ఎల్మినేడు మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మున్సిపల్ పరిధిలోని మంగళ్పల్లిలో 85.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మొయినాబాద్లో కుండపోత పొంగి పొర్లిన వాగులు, వంకలు పలు గ్రామాలకు రాకపోకలు బంద్ కూలిన ప్రహారీలు.. విరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు -
అర్హులందరికీ ఆర్థికసాయం
యాలాల: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా కొత్త ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల విచారణను శుక్రవారం చేపట్టారు. గోవిందరావుపేట విచారణ అధికారిగా వ్యవహరిస్తున్న మండల వ్యవసాయ అధికారి శ్వేతారాణి, పంచాయతీ కార్యదర్శి ఆనంద్రావు, కోఆప్షన్ మాజీ సభ్యుడు అక్బర్బాబాతో కలిసి వివరాలు సేకరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం అందేలా చూస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగయ్య, నర్సింలు, చందు, ఉమేశ్, రాజు, లాలు, లక్ష్మప్ప, బుడ్డప్ప తదితరులు ఉన్నారు. మండల వ్యవసాయ అధికారి శ్వేతారాణి -
చర్లగూడ వంతెన పనులు పూర్తి చేయాలి
షాబాద్: చర్లగూడ వంతెన, రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేయాలని మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కంపేట ఆంజనేయులు కోరా రు. ఈ మేరకు శుక్రవారం ఆయన సంఘం నాయకులతో కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ.. చర్లగూడ గ్రామ బ్రిడ్జి అసంపూర్తిగా ఉండడంతో ప్రజలకు, విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. మూడేళ్లుగా 30 శాతం పనులు కూడా పూర్తి కాలేద ని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలకు విద్యార్థులకు, రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. గతంలో ఈ వాగులో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని గుర్తు చేశారు. చర్లగూడ బ్రిడ్జి, రోడ్డుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని కోరారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించి పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్ను కలిసిన వారిలో నాయకులు చంద్రశేఖర్, మల్లేశ్, అంజయ్య, సత్యనారాయణ, కృష్ణ, రాజు, శేఖర్ తదితరులున్నారు. పాఠశాల సమస్యలు పరిష్కరించండి కడ్తాల్: మండల పరిధిలోని చరికొండ గ్రామంలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలని చరికొండ గ్రామస్తులు శుక్రవారం కలెక్టర్ నారాయణరెడ్డిని కోరారు. పాఠశాలలో గణిత, భౌతిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని.. వెంటనే ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులకు న్యాయం చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ త్వరలోనే సమస్య పరిష్కరానికి కృషి చేస్తానని హమీ ఇచ్చారని గ్రామస్తులు తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో నాయకులు వెంకటయ్య, మహేందర్గౌడ్, కాటం ఉన్నారు. మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు -
చోటు లేక.. లోపలికి వెళ్లలేక
● కదులుతున్న బస్సు నుంచి జారి పడిన యువతి యాచారం: సరిపడా ఆర్టీసీ బస్సు సర్వీసులులేక విద్యార్థులు, ఉద్యోగులు అవస్థలు ఎదుర్కొంటున్నా అధికార యంత్రాంగంలో కదలిక లేదు. తాజాగా కిక్కిరిసిన బస్సులో ఎక్కిన ఓ యువతి ఫుట్బోర్డుపై ప్రయాణం చేస్తూ జారి పడిన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అయ్యవారిగూడేనికి చెందిన అఖిల నగరంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. రోజు మాదిరిగానే స్వగ్రామం వెళ్లడానికి గురువారం సాయంత్రం యాచారంలోని అంబేడ్కర్ చౌరస్తాలో యాచారం–కందుకూరు వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సులో ప్రయాణికులు, విద్యార్థులు అధికంగా ఉండడంతో ఫుట్బోర్డు నుంచి లోపలికి వెళ్తుండగా బస్సు కదిలింది. ప్రయాణికుల రద్దీతో పట్టుకోవడానికి అవకాశం లేకపోవడంతో ఆమె అదుపుతప్పి జారి కిందపడి పోయింది. వెంటనే ఆమెను యాచారం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు తెలుసుకున్నారు. యాచారం–కందుకూరు రూట్లో అదనపు బస్సు ట్రిప్పులు పెంచాలని స్థానికులు డిమాండ్ చేశారు. -
గండిపేటలో జలదోపిడీ
నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు నిజాం కాలంలో నిర్మించిన గండిపేట జలాశయం ఇప్పుడు నీటి వ్యాపారులకు అడ్డాగా మారింది. జలాశయం చెంతనే ఉన్న రైతుల బోర్లను లీజుకు తీసుకుని అక్రమార్కులు నీటి వ్యాపారం చేస్తున్నారు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ జలదోపిడీకి తెగబడుతున్నారు. జల వనరులను కాపాడాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో వ్యాపారుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ‘మూడు సంపులు.. ఆరు ట్యాంకర్ల’ చందంగా నిత్యం లక్షల లీటర్ల నీటిని నగరానికి తరలిస్తూ దర్జాగా ‘సొమ్ము’ చేసుకుంటున్నారు.బోర్లు లీజుకు తీసుకుని.. సంపుల ఏర్పాటు ● ట్యాంకర్ల ద్వారా నిత్యం లక్షల లీటర్ల తరలింపు ● ‘సొమ్ము’ చేసుకుంటున్న అక్రమార్కులు ● వాల్టా చట్టానికి యథేచ్ఛగా తూట్లు ● పట్టించుకోని సంబంధిత అధికారులు మొయినాబాద్: మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్నగర్లో నీటివ్యాపారులు బరితెగించారు. గండిపేట చెరువు ఒడ్డున ఉన్న రైతుల బోర్లను లీజుకు తీసుకున్నారు. చెరువు పక్కనే వ్యవసాయ పొలాల్లో గుంతలు తీసి టార్పలిన్లు వేసి తాత్కాలిక సంపులు నిర్మించారు. బోర్ల ద్వారా సంపుల్లో నీటిని నిల్వ చేస్తున్నారు. సంపుల్లో నుంచి మోటార్ల ద్వారా వాటర్ ట్యాంకుల్లో నింపి నగరానికి తరలిస్తున్నారు. ఒక్కో ట్యాంకర్లో 40 వేల నుంచి 50 వేల లీటర్ల నీటిని నింపుతున్నారు. ఒక్కో వ్యాపారి రోజుకు సుమారు 10–15 ట్యాంకర్ల ద్వారా లక్షల లీటర్ల నీటిని విక్రయిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. గండిపేట చెరువు ఒడ్డున హిమాయత్నగర్ రెవెన్యూలో ఇలా సుమారు పదికి పైగా సంపులను ఏర్పాటు చేశారు. చెరువు పక్కనే బోర్లువేసి.. నీటి వ్యాపారానికి వినియోగిస్తున్న బోర్లన్నీ గండిపేట చెరువు ఒడ్డునే ఉండటం గమనార్హం. ప్రస్తుతం చెరువులో నీళ్లు నిండుగా ఉండటంతో బోర్లలో సమృద్ధిగా వస్తున్నాయి. దీంతో వ్యాపారులకు కాసుల పంట పండుతోంది. వాల్టా చట్టం ప్రకారం నీటిని ఇష్టానుసారంగా తోడేసి వ్యాపారం చేయడానికి వీల్లేదు. కానీ రైతులు వేసిన బోర్లను లీజుకు తీసుకున్న వ్యాపారులు వాటి నుంచి ఇష్టానుసారంగా నీటిని తోడేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా నగరానికి తరలించే నీటిని కొత్తగా చేపడుతున్న నిర్మాణాలకు, కార్పొరేట్ కంపెనీలకు, అపార్టమెంట్లలో విక్రయించి లబ్ధి పొందుతున్నారు. 40 వేల లీటర్ల ట్యాంకర్ నీటిని రూ.20 వేల చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా ఒక్కో వ్యాపారి నిత్యం సుమారు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టించుకోని అధికారులు గండిపేట జలాశయం ఒడ్డున జోరుగా నీటివ్యాపారం జరుగుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. జలమండలి అధికారులగానీ, రెవెన్యూ అధికారులుగానీ అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. నీటి వ్యాపారులకు స్థానిక నేతలతోపాటు పోలీసులు సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చర్యలు తీసుకుంటాం గండిపేట చెరువు ఒడ్డున్న ఉన్న బోర్ల నుంచి నీటివ్యాపారం జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. విషయాన్ని జలమండలి అధికారులకు సైతం తెలియజేశాం. ఇప్పటికే మూడు బోర్లు సీజ్ చేశాం. నీటిని తరలిస్తున్న ట్యాంకర్లపై కేసులు నమోదు చేయించాం. నీటి వ్యాపారం ఇలాగే కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయిస్తాం. – గౌతమ్కుమార్, తహసీల్దార్, మొయినాబాద్ -
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
కొందుర్గు: విద్యుత్ షాక్తో వ్యక్తి మృతిచెందిన ఘటన జిల్లేడ్ చౌదరిగూడ మండలం గాలిగూడలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన శ్రీశైలం అనే రైతు తన పొలంలో విద్యుత్ తీగలు సరిచేయాలని లైన్మన్ చెన్న య్యకు సమాచారం అందించాడు. ఇందుకోసం ఎల్సీ తీసుకోమని సూచించాడు. ఎల్సీ ఇచ్చినట్లు చెప్పగానే ఇదే గ్రామానికి చెందిన కాత్రమోని నర్సింలు(46)ను కరెంటు స్తంభం ఎక్కించాడు. పనులు చేస్తుండగా ఒక్కసారిగా కరెంట్ రావడంతో నర్సింలు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. ఎల్సీ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయిన లైన్మన్ సబ్ స్టేషన్నుంచి సరఫరాకు అనుమతించడంతోనే ప్రమాదం జరిగిందని శ్రీశైలం ఆరోపించాడు. మృతుడికి భార్య, ముగ్గరు పిల్లలు ఉన్నారని, వీరికి న్యాయం చేయాలని బాధితులు సబ్స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. లాల్పహాడ్ చౌరస్తాలో షాద్నగర్– పరిగి రోడ్డుపై బైఠాయించారు. అక్కడికి చేరుకున్న చౌదరిగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. ఈ విషయమై ఎస్ఐ విజయ్ని వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. నర్సింలు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. ● మరొకరికి గాయాలు ● పొలం వద్ద తీగలు సరిచేస్తుండగా ప్రమాదం -
పావుకిలో చాలు
● కొండెక్కిన కూరగాయల ధరలు ● వారంలోనే అమాంతం పెరుగుదల ● ఏది కొనాలన్నా కిలో రూ.60 పైమాటే.. ● ఆకుకూరలదీ అదే పరిస్థితి ● కిలో కొనేవారు పావుకేజీతో సరి హుడాకాంప్లెక్స్: పచ్చిమిర్చి ధర ఘాటెక్కింది. నిన్న మొన్నటి వరకు కిలో రూ.30కే లభించగా ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో రూ.75 ధర పలుకుతోంది. అదే బహిరంగ మార్కెట్లో రూ.100 దాటింది. టమోటా కేజీ రూ.15లోపే ఉండగా రూ.30 నుంచి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. బెండకాయ, కాకరకాయ, వంకాయ, బీరకాయ, దోసకాయ, దొండకాయ ఇలా ఏ కూరగాయ కొనాలన్నా కిలోకి రూ.60పైనే ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆకుకూరల ధరలు సైతం పెరుగుతూ పోతున్నాయి. పాలకూర, చుక్కకూర, మెంతికూర, గోంగూర, తోటకూర ఇలా ఏ ఆకుకూర ధర చూసినా కట్టను బట్టి ఒక్కో కట్టకు రూ.7నుంచి రూ.10 చెల్లించాల్సి వస్తోంది. గతంలో కిలో కూరగాయలు కొనుగోలు చేసిన వారు పెరిగిన ధరలతో ప్రస్తుతం పావు కిలోతో సరి పెట్టుకుంటున్నారు. జిల్లాలోని సరూర్నగర్, ఎన్టీ ఆర్నగర్, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, మొయినాబాద్, శంషాబాద్, షాద్నగర్ మార్కెట్లతో పాటు కాలనీలు, బస్తీల్లో నిర్వహించే వారాంతపు సంతల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. భారీగా తగ్గిన సాగు జిల్లా కాయగూరల సాగుకు పెట్టింది పేరు. ఒకప్పుడు హైదరాబాద్ నగరవాసులకు సరిపడా ఇక్కడే పండించే వారు. ఇబ్రహీంపట్నం, యాచారం, చేవెళ్ల, శంషాబాద్, మొయినాబాద్, మహేశ్వరం మండలాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో సాగు చేసేవారు. వ్యవసాయ భూములన్నీ ప్రస్తుతం రియల్టర్ల చేతుల్లోకి వెళ్లడం, ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, చీడపీడల నేపథ్యంలో సాగు గణనీయంగా పడిపోయింది. 2021–22 వానాకాలంలో 14,096 ఎకరాల విస్తీర్ణంలో, యాసంగిలో 19,222 ఎకరాల విస్తీర్ణంలో సాగవగా 3,08,460 మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తి అయ్యేది. ప్రస్తుత వానాకాలంలో ఐదు వేల ఎకరాలకు మించి సాగవడం లేదు. మార్కెట్లో డిమాండ్ మేర దిగుబడి లేకపోవడంతో ఉమ్మడి ఏపీ జిల్లాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రవాణా ఖర్చుల భారం సైతం కొనుగోలుదారులపై పడుతోంది. రేట్లు భారీగా పెరిగాయి వారం రోజుల వ్యవధిలోనే కూరగాయల రేట్లు విపరీతంగా పెరిగాయి. గతవారం వరకు రూ.200 తీసుకుని మార్కెట్కు వెళ్తే వారానికి సరి పడా కాయగూరలు వచ్చేవి. ఆ డబ్బులతో ప్రస్తుతం రెండు మూడు కిలోలు కూడా రావడం లేదు. గతంలో కిలోకి తగ్గకుండా కొనేదాన్ని. ప్రస్తుతం పావు కేజీతో సరిపెట్టుకుంటున్నా. పప్పుల ధరకు దీటుగా పచ్చిమిర్చి ధర పలుకుతోంది. – విజయలక్ష్మి, గృహిణి గిరాకీ ఉండడం లేదు వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు సాగైతే కానీ ఽఇప్పట్లో ధరలు తగ్గే పరిస్థితి కన్పించడం లేదు. వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గడంతో వ్యాపారం కూడా లాభసాటిగా సాగడం లేదు. గతంలో రోజుకు రూ.2000 విలువ చేసే కాయగూరలను అమ్మితే ప్రస్తుతం రూ.500 కూడా అమ్మలేకపోతున్నాం. ఒకప్పుడు కిలో కొనుగోలు చేసే వారు సైతం ప్రస్తుతం పావు కిలో తీసుకెళ్తున్నారు. – లక్ష్మయ్య, వ్యాపారి -
లైన్ క్లియర్!యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్కు మార్గం సుగమం
సాక్షి, సిటీబ్యూరో ఎట్టకేలకు యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ ప్రాజెక్ట్లో కదలిక వచ్చింది. పదేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైన ప్రాజెక్టును రైల్వేశాఖ సొంతంగా నిర్మించేందుకు సన్నద్ధమైంది. ఘట్కేసర్ నుంచి యాదగిరిగుట్ట (రాయగిరి) వరకు 33 కి.మీ మార్గాన్ని కొత్తగా నిర్మించనున్నారు. మొదట్లో ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేశాఖ సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టాలని నిర్ణయించారు. ట్రాక్ నిర్మాణానికి అవసరమైన భూమి, వనరులు, నిధులు, ఇతర మౌలిక సదుపాయాలకయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమంగా పంచుకోవాలని భావించారు. ఈ ఒప్పందానికి అనుగుణంగా 2016లో దక్షిణమధ్య రైల్వే క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించింది. ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు లైన్ల నిర్మాణానికి ప్రణాళికలను రూపొందించింది. అనంతరం ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు, ఒకటి, రెండు బడ్జెట్ల్లో కేంద్రం కొన్ని నిధులను కేటాయించింది. అదేస్థాయిలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు, వనరులు లభించకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. ఈ క్రమంలో రైల్వేశాఖ సైతం వెనకడుగు వేసింది. ఇలా 2016 నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. ఇటీవల రూ.100 కోట్లు.. లక్షలాది మంది భక్తులు సందర్శించుకునే యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రానికి రైల్వే సదుపాయం అందుబాటులో లేకపోవడంతో రైల్వేశాఖ సీరియస్గా దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండానే ఇక్కడికి ఎంఎంటీఎస్ సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు గత సంవత్సరమే ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకనుగుణంగానే ఇటీవల రూ.100 కోట్లు అందజేసింది. ప్రాజెక్టును ప్రతిపాదించిన మొదట్లో రూ.10 కోట్లు, ఆ తర్వాత రెండు దఫాలుగా రూ.60 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.430 వరకు ఖర్చు కానున్నట్లు అంచనా. పదేళ్ల జాప్యం వల్ల నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది. సొంత నిధులతోనే పనులు.. రైల్వేశాఖ ఈ ప్రాజెక్టును సొంత నిధులతో నిర్మించనుందని ఆ శాఖ సహాయ మంత్రి రవనీత్సింగ్ భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డికి లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలోనూ స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీన పార్లమెంట్ సమావేశాల్లో ‘జీరో అవర్’లో యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ ప్రాజెక్టుపై ఎంపీ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు రైల్వేశాఖ సహాయమంత్రి రాతపూర్వకంగా తమ స్పందన తెలిపారు. అంతేకుండా ఈ ఆర్థిక సంవత్సరం రూ.100 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రరైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు ఎంపీ కిరణ్కుమార్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఈ ప్రాజెక్టును సొంతంగానే చేపట్టనున్నట్లు దక్షిణమధ్యరైల్వే అధికారులు సైతం స్పష్టం చేశారు. త్వరలోనే రైల్వికాస్నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) పనులు చేపట్టనుంది. లక్షలాది మందికి ఊరట... యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ ప్రాజెక్టు పూర్తయితే లక్షలాదిమంది భక్తులకు గొప్ప ఊరట లభించనుంది. ప్రస్తుతం ప్రతిరోజు ఆర్టీసీ బస్సులు,ప్రైవేట్ వాహనాల్లోనే ప్రయాణికులు యాదగిరిగుట్టకు రాకపోకలు సాగిస్తున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలకు ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ నేరుగా పుణ్యక్షేత్రం వరకు వెళ్లే సదుపాయం లేదు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే లింగంపల్లి, బేగంపేట్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మేడ్చల్, చర్లపల్లి తదితర ప్రాంతాల నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో నేరుగా రాయగిరి వరకు రాకపోకలు సాగించవచ్చు. అక్కడి నుంచి 4 కి.మీ. మాత్రం రోడ్డు మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే నగరంలో మొదటి, రెండో దశ ఎంఎంటీఎస్ ప్రాజెక్టులు పూర్తయినందువల్ల యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ మూడో దశ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పొత్తు లేకుండానే నిర్మించనున్న రైల్వేశాఖ ఇటీవల స్పష్టం చేసిన ఆ శాఖ సహాయ మంత్రి రూ.430 కోట్లతో 33 కి.మీ వరకు కొత్తగా ఎంఎంటీఎస్ లైన్లు 2015లోనే యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్కు ప్రతిపాదనలు త్వరలో పనులు చేపట్టనున్న దక్షిణమధ్య రైల్వే -
21న పెన్షన్దారుల జిల్లా సదస్సు
ఆమనగల్లు: పట్టణంలో ఈనెల 21న ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో చేయూత పెన్షన్దారుల జిల్లా సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపేందర్ మాదిగ తెలిపారు. ప్రభుత్వం చేయూత పెన్షన్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. పట్టణంలో గురువారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలు, చేయూత పెన్షన్ రూ.4 వేలకు పెంచి, అర్హులైన వారందరికీ అందించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా పెన్షన్ పెంచలేదని విమర్శించారు. పెన్షన్దారుల సమస్యలపై నిర్వహించే జిల్లా సదస్సుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నర్సింహమాదిగ, జిల్లా అధికార ప్రతినిధి పోతుగంటి కృష్ణమాదిగ, వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు జంగయ్యమాదిగ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ నాయకుడిపై హత్యాయత్నం
షాద్నగర్ రూరల్: వ్యక్తిగత కక్షల నేప థ్యంలో ఓ కాంగ్రెస్ నాయకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన చిల్కమర్రిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రవీందర్రెడ్డి షాద్నగర్లో నివాసం ఉంటున్నాడు. గురువారం రాత్రి గ్రామంలో నిర్వహించిన బోనాల పండుగకు హాజరయ్యాడు. ఉత్సవాల్లో పాల్గొన్న అతనిపై ద్యాప శివకృష్ణారెడ్డి అలియాస్ కోటి హఠాత్తుగా దాడికి పాల్పడ్డాడు. బ్లేడుతో గొంతు కోయడంతో తీవ్రంగా గాయపడిన రవీందర్రెడ్డిని వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. దాడిని ఆపేందుకు ప్రయత్నించిన సత్యంరెడ్డి అనే మరో వ్యక్తికి సైతం గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
‘డబుల్’ ఇళ్లకు వసతులు కల్పించండి
ఇబ్రహీంపట్నం: గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగుడాల యాదయ్య డిమాండ్ చేశారు. గురువారం డబుల్ బెడ్రూం లబ్ధిదారులతో కలిసి ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో డీటీ యశ్వంత్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ.. మంచాల మండలంలోని లింగంపల్లి గేట్ వద్ద నిర్మించిన 96 డబుల్ బెడ్రూం ఇళ్లను మంచాల, నోముల, లింగంపల్లి గ్రామాల పేదలకు తహసీల్దార్ సమక్షంలో లాటరీ పద్ధతిలో గత ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. అప్పట్లో లబ్ధిదారులను గృహ ప్రవేశం చేయించలేకపోయారన్నారు. అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తమకు కేటాయించిన ఇళ్లలోకి వెళుతామని పలుమార్లు లబ్ధిదారులు వినతిపత్రాలు అందజేసినా 18 నెలలుగా స్పందన లేదన్నారు. దీంతో లబ్ధిదారులే గృహ ప్రవేశం చేశారన్నారు. కానీ అక్కడ తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక సౌకర్యాలను ప్రభుత్వం కల్పించకపోవడం సిగ్గు చేటన్నారు. వెంటనే డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించకుంటే లబ్ధిదారుల కుటుంబసభ్యులతో కలిసి ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు జంగయ్య, శ్రీనివాస్రెడ్డి, శ్యాంసుందర్, కృష్ణ, యాదయ్య, జంగయ్య, గోపాల్, జంగమ్మ, బాలరాజు, సరిత, స్వాతి, భాను, మౌనిక, సంతోష లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య -
ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
షాద్నగర్రూరల్: భూమి కలిగిన ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఉష అన్నారు. ఫరూఖ్నగర్ మండలం వెల్జర్లలోని రైతు వేదికలో నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూమి ఉన్న రైతు ఫార్మర్ ఐడీని పొందేందుకు ఆధార్కార్డు, భూ యాజమాన్య పాస్పుస్తకం, ఆధార్కు లింకు చేయబడిన మొబైల్ నంబర్ను తీసుకొని సమీపంలోని వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం అమలుచేసే పథకాలు వర్తిస్తాయని తెలిపారు. నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు రైతులు పంటల సాగులో నాణ్యమైన విత్తనాలను ఉపయోగిస్తే అధిక దిగుబడులను సాధించవచ్చని ఉష అన్నారు. రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీ నుంచి మండలంలోని ముగ్గురు రైతులకు 108 రకం వరి నాణ్యమై విత్తనాలను (ఫౌండేషన్ సీడ్స్) అందజేశారు. కొండన్నగూడలో రైతు వెంకట్రెడ్డి పొలంలో నాణ్యమైన విత్తన రకం వరి నారుమడిని ఆమె క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నాణ్య మైన విత్తన రకం నుంచి వచ్చిన పంటతో రైతు స్వ తహాగా విత్తనాలు తయారు చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ రమాదేవి, ఏఓ టెక్నికల్ అధికారిణి శోభారాణి, ఏఓ నిషాంత్కుమార్, ఏఈఓలు తేజ్కుమార్, గోవర్ధన్ పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయాధికారి ఉష -
ఆర్థికంగా ఎదిగితేనే అభివృద్ధి
చేవెళ్ల: మహిళలు ఆర్థిక శక్తిగా ఎదిగినప్పుడే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మండలకేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో గురువారం నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు పంపిణీ చేశారు. ఐదు మండలాలకు చెందిన 4,128 మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.4.96 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి మహిళను శక్తివంతురాలుగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. వడ్డిలేని రుణలతో ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీలత, జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్లు పెంటయ్యగౌడ్, గోవిందమ్మ, పీఏసీఎస్ చైర్మన్లు ప్రతాప్రెడ్డి, వెంకట్రెడ్డి, ఆర్డీఓ చంద్రకళ, అడిషనల్ డీఆర్డీఏ జోజప్ప, డీపీఎం జయశ్రీ, తహసీల్దార్ కృష్ణయ్య, ఏపీఎం శోభారాణి తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య -
ప్రాణం తీసిన చేపల వేట
కడ్తాల్: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి నీట మునిగి మృతిచెందిన ఘటన మండల కేంద్రం సమీపంలోని కానుగుల కుంటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కందుకూరు మండలం ఉట్లపల్లికి చెందిన దొంతుల అంజయ్య(45) మేసీ్త్రగా జీవనం సాగిస్తున్నాడు. బుధవారం సాయంత్రం ఇదే గ్రామానికి చెందిన రాజు, కృష్ణయ్య, శ్రీనుతో కలిసి, చేపలు పట్టేందుకు కానుగుల కుంటకు వెళ్లారు. ఈ క్రమంలో చెరువులోకి దిగిన అంజయ్య ప్రమాదవశాత్తు నీట మునిగి, బయటికి రాలేకపోయాడు. మిగిలిన వాళ్లు వెతికినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బాధితులతో పాటు కడ్తాల్ పోలీసులు సంఘట న స్థలానికి చేరుకుని, బుధవారం అర్ధరాత్రి వరకు చెరువులో గాలించినా ఆ చూకీ లభించలేదు. గురువారం ఉదయం స్థానిక ఎస్ఐ వరప్రసాద్, పోలీసు సిబ్బంది, మహేశ్వరానికి చెందిన ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లు కుంటలో గాలించి ఊబిలో కూరుకుపోయిన మృతదేహన్ని బయటకు తీశారు. అనంత రం పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య శామంతతో పాటు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గంగాధర్ తెలిపారు. అంజయ్య మృతి తో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుంటలో మునిగి వ్యక్తి మృతి ఉట్లపల్లిలో విషాదం -
సాగు సంక్షోభం
వర్షాలు కురవక తగ్గిన సేద్యం వానాకాలం సాగు వివరాలు పంట అంచనా సాగైన పంటలు (ఎకరాల్లో) (ఎకరాల్లో) వరి 1,40,238 2,8510 జొన్న 5,562 3,608 సజ్జ 21 5 మొక్కజొన్న 52,207 50,922 రాగులు 30 2 కంది 14,308 14,563 ఆముదం 37 8 పత్తి 1,41,088 1,26,486 ఇతర పంటలు 4,382 1,500 యాచారం: వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో సాగు విస్తీర్ణం సగానికి తగ్గింది. సీజన్ ప్రారంభమైన నాటి నుంచి జిల్లాలో భారీ వర్షాల జాడే లేదు. ముసురు వర్షాలకే రైతులు సాగు ప్రారంభించారు. జిల్లా వ్యవసాయాధికారులు ఈ ఏడాది సాగు విస్తీర్ణం 3,58,089 ఎకరాలుగా అంచనా వేశారు. జూన్ 10 తర్వాత రెండు, మూడు రోజుల పాటు అడపాదడపా కురిసిన ముసురుకు రైతులు పత్తి, మొక్కజొన్న, సజ్జ తదితర పంటలను సాగు చేశారు. ఆ తర్వాత వరుణుడు మొహం చాటేయడంతో మొలకెత్తిన పంటలు వట్టిపోతాయోమానని రైతులు ఆందోళన చెందుతున్నారు. రూ.లక్షలు పెట్టుబడులు పెట్టామని వర్షాలకు కురవక పోతే పంటల ఎదుగుదల కష్టమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంటపైనే ఆశలు గతేడాది పత్తి పంట సాగుతో రైతుకు ఊహించని దిగుబడి, ధరలు వచ్చి లాభాలు ఆర్జించాడు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ ఏడాది లక్షన్నర ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని అంచనా వేసింది. జిల్లాలోని మాడ్గుల, యాచారం, మంచాల, కేశంపేట, షాబాద్, తలకొండపల్లి, ఆమనగల్లు, కడ్తాల్, షాద్నగర్, కందుకూరు, మహేశ్వరం తదితర మండలాల్లో 1,26,486 ఎకరాల్లో తెల్లబంగారం సాగు చేపట్టారు. మే నెలలో కురిసిన కొద్ది పాటి వర్షానికే కొందరు రైతులు పొలాలను సిద్ధం చేసుకుని ఆ వెంటనే పత్తి పంటను సాగు చేయగా, మరికొందరు జూన్లో కురిసిన వర్షాలకు పత్తి విత్తుకున్నారు. వరి పంటకు గడ్డుకాలమే.. 1,40,238 ఎకరాల్లో వరి పంట సాధారణ విస్తీర్ణం కాగా ఇప్పటి వరకు కేవలం 29 వేల ఎకరాల్లోనే సాగుచేపట్టారు. ఆశించిన వర్షాలు లేకపోవడంతో బోరు బావుల్లో భూగర్భజలాలు అడుగంటిని పరిస్థితి. భారీ వర్షాలు కురిస్తేనే చెరువులు, కుంటలు నిండి భూగర్భజలాలు పెరిగి నీరు అందే అవకాశం ఉంది. 24.07 లోటు వర్షపాతం ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా వర్షపాతం సాధారణంగానే ఉంది. జూన్లో 97.2 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా నేటికి కేవలం 73.8 మిల్లీమీటర్ల సగటు వర్షపాతమే కురిసింది. అంటే జూన్లోనే 24.07 మిల్లీ మీటర్ల సగటు లోటు వర్షపాతం నమోదయింది. యాచారం, మంచాల, మహేశ్వరం, మాడ్గుల, కేశంపేట, ఇబ్రహీంపట్నం, షాబాద్ మండలాల్లోనే కొంచెం అత్యఽధిక వర్షపాతం నమోదవగా. కడ్తాల్, ఫరూఖ్నగర్, చేవెళ్ల, అబ్దుల్లాపూర్మెట్, హయత్నగర్, కందుకూరు, కొందుర్గు, కొత్తూరు, రాజేంద్రనగర్, శంకర్పల్లి, శంషాబాద్ తదితర మండలాల్లో అత్యల్ప వర్షపాతం నమోదయింది. వర్షపాతం అత్యధికంగా ఉన్న మాడ్గుల, యాచారం, కేశంపేట, షాబాద్ తదితర మండలాల్లో పత్తి పంట సాగుకే మొగ్గు చూపారు. వరి పంటకు గడ్డుకాలం పదిరోజుల్లో వర్షాలు కురిస్తేనే పత్తి పంట ఎదుగుదల వర్షాలు కురిస్తేనే.. భారీ వర్షాలు కురిస్తేనే వరి పంటకు జీవం పోసినట్లు అవుతుంది. ఇప్పటికే రైతులు వరి నార్లు పోసుకున్నారు. వారం, పది రోజుల్లో భారీ వర్షాలు కురిస్తే నాట్లకు ఇబ్బంది ఉండదు. పత్తి పంట బాగా ఎదుగుతుంది. కొద్ది రోజులుగా వర్షాల జాడే లేకపోవడంతో పత్తి మొలకలు వాడిపోతున్నాయి. గతేడాది అధిక లాభాల దృష్ట్యా ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా పత్తి పంటపై రైతులు ఆసక్తి చూపారు. వర్షాలు కురిస్తే ఇతర పంటల సాగు విస్తీర్ణం కూడ పెరిగే అవకాశం ఉంటుంది. – డి.ఉష, జిల్లా వ్యవసాయాధికారి -
లెక్క తేలింది!
జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఖరారు ● జిల్లాలో 21 జెడ్పీటీసీ, 230 ఎంపీటీసీలు ● కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుతో తగ్గిన 32 సర్పంచ్, 27 ఎంపీటీసీ స్థానాలు సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎట్టకేలకు ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారం ఆయా స్థానాల జాబితాను విడుదల చేసింది. జిల్లాలో 27 మండలాలు ఉండగా, వీటి పరిధిలో 21 జెడ్పీటీసీ స్థానాలు సహా మరో 230 ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేసింది. కొత్తగా మెయినాబాద్, చేవెళ్ల మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడంతో పాటు పలు గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేయడంతో ఎంపీటీసీ స్థానాలతో పాటు గ్రామ పంచాయతీల సంఖ్య కూడా తగ్గింది. 2019లో జిల్లాలో 257 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ప్రస్తుతం వీటి సంఖ్య 230కి చేరింది. 27 ఎంపీటీసీ స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. గతంలో 558 గ్రామ పంచాయతీలుండగా, ప్రస్తుతం వీటి సంఖ్య 526కు చేరింది. వీటి పరిధిలో మొత్తం 7,94,653 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 3,99,404 మంది పురుషులు, 3,95,216 మంది మహిళలు, 33 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే స్థానిక సంస్థల్లో ఎన్నికల హడావుడి మొదలు కానుంది. నోటిఫికేషన్ రావడమే ఆలస్యం 2024 జనవరి 30తో స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ముగిసింది. నాటి నుంచి ఇప్పటి వరకు ఆయా గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. స్థానిక సంస్థలకు పాలకమండళ్లు లేక 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. దీంతో తాగునీటి బోర్లకు రిపేర్లు, వీధిలైట్లు, ట్రాక్టర్లకు డీజిల్ ఖర్చులకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. కొన్ని పంచాయతీల్లో అధికారులు అప్పులు చేయాల్సి వచ్చింది. స్థానిక సంస్థల్లో బీసీ కోటాను అమలు చేయాలని కోరుతూ కొంత మంది కోర్టును ఆశ్రయించడం, ఇదే అంశంపై హైకోర్టు ఇటీవల స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం, మూడు మాసాల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం కోర్టుకు హామీ ఇవ్వడం తెలిసిందే. తాజాగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ఖరారు చేసింది. నోటిఫికేషన్ జారీ చేయడమే ఆలస్యం ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇదే సమయంలో జిల్లా యంత్రాంగం జిల్లా ప్రాదేశికాలు, మండల ప్రాదేశికాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే ఈ పని దాదాపు పూర్తి చేసినట్లు తెలిసింది. పోలింగ్బూత్ల వారీగా బీఎల్ఓలను నియమించి, వారికి శిక్షణ సైతం పూర్తి చేసింది. మున్సిపాలిటీల్లో విలీనం ● చేవెళ్ల మండల పరిధిలో 37 గ్రామ పంచాయతీలుండగా, వీటిలో 12 గ్రామాలు కొత్తగా ఏర్పాటు చేసినా మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. ఇక్కడ 17 ఎంపీటీసీ స్థానాలకు.. ప్రస్తుతం ఏడు స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. ● మెయినాబాద్ మండల పరిధిలో గతంలో 28 గ్రామ పంచాయతీలుండగా, వీటిలో తొమ్మిది గ్రామ పంచాయతీలతో మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. దీంతో తొమ్మిది సర్పంచ్ స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. ఇక్కడ 17 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ప్రస్తుతం ఎనిమిదింటిని కోల్పోవాల్సి వచ్చింది. ● శంకర్పల్లి మండల పరిధిలోని జన్వాడ, మీర్జాగూడలను ఇటీవల నార్సింగి మున్సిపాలిటీలో విలీనం చేయగా, అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని తారామతిపేట్, కుత్బుల్లాపూర్, గౌరెల్లి, బాచారం గ్రామాలను పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలో విలీనం చేశారు. దీంతో ఆ మండలంలో నాలుగు సర్పంచ్, మూడు ఎంపీటీసీ స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. ● కొత్తూరు మండలంలో పది ఎంపీటీసీ స్థానాలు ఉండగా, మున్సిపాలిటీ ఏర్పాటుతో కొత్తగా నాలుగు స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. చిన్నగోల్కొండ, పెద్ద గోల్కొండ, శంకరాపురం, రషీద్గూడ, హమీదుల్లానగర్, బహదుర్గూడ పంచాయతీలను ఇటీవల శంషాబాద్ మున్సిపాలిటీలో విలీనం చేశారు. దీంతో ఈ మండలంలో మూడు ఎంపీటీసీ స్థానాలు సహా ఆరు సర్పంచ్ స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. -
మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు!
నేటి నుంచి లబ్ధిదారులకు చెక్కుల అందజేత సాక్షి, రంగారెడ్డిజిల్లా: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాల ద్వారా చిన్నపాటి వ్యాపారాలు చేసుకునే స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలను అందజేయాలని నిర్ణయించింది. ‘ఇందిరా మహిళా శక్తి’పథకం కింద అందజేసే ఈ రుణాలను ఈ నెల 17న చేవెళ్లలోని 3,441 పొదుపు సంఘాలకు రూ.3.58 కోట్లు, 18న మహేశ్వరంలోని 2,134 సంఘాలకు రూ.2.09 కోట్లు, 19న కల్వకుర్తిలోని 2,409 సంఘాలకు రూ.2.30 కోట్లు, రాజేంద్రనగర్లోని 983 సంఘాలకు రూ.0.90 కోట్లు పంపిణీ చేయనుంది. 21న ఇబ్రహీంపట్నంలోని 3,642 సంఘాలకు రూ.3.93 కోట్లు, 22న షాద్నగర్లోని 3,418 సంఘాలకు రూ.3.29 కోట్ల చెక్కులను పంపిణీ చేయనుంది. రైల్ భవన్కు ఎమ్మెల్యే షాద్నగర్ రైల్వే బ్రిడ్జి అనుమతుల పురోగతిపై ఆరా షాద్నగర్: పట్టణంలోని చటాన్పల్లి రైల్వే బ్రిడ్జి డిజైన్ అనుమతులు, పనులను ప్రారంభం కోసం బుధవారం ఎమ్మెల్యే వీర్లపల్లిశంకర్ రైల్ భవన్లో రైల్వే ఉన్నతాధికారులను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. షాద్నగర్ రైల్వే బ్రిడ్జి డిజైన్ అనుమతుల పురోగతికోసం రైల్వే ఉన్నతాధికారులను కలిసామని చెప్పారు.షాద్నగర్తో పాటుగాబుచ్చిగూడ, చటాన్పల్లి మూడు దిక్కులను కలి పే లా త్రిభుజాకారంలో జంక్షన్, చటాన్పల్లివైపు వేసే బ్రిడ్జి డిజైన్ పనులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సౌత్ సెంట్రల్ రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉదయ్నాథ్, చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ సాంబశివరావును కోరానన్నారు. త్వరలోనే రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తీర్చేందుకు కృషి చేస్తానని అన్నారు. రైల్వే ఉన్నతాధికారులను కలిసిన వారిలో రోడ్లు, భవనాలశాఖ ఏఈలు రవీందర్, సందీప్ ఉన్నారు. యంజాల్ ఎఫ్ఎస్సీఎస్కు అప్రిసియేషన్ అవార్డు తుర్కయంజాల్: ఉత్తమ పనితీరు కనబరిచిన తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘానికి అప్రిసియేషన్ అవార్డు వరించింది. బుధవారం నాబార్డు 44వ వ్యవస్థాపక దినోత్సవాన్ని తెలంగాణ రీజినల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాముల నిర్వాహణ, లాకర్ల సదుపాయం, ఎరువుల సరఫరా, వ్యవసాయ, వ్యవసాయేతర ఆర్థిక సేవలు, సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక కార్యక్రమాలు, ఉత్తమ పనితీరును పరిగణనలోకి తీసుకుని తుర్క యంజాల్ రైతు సేవా సహకార సంఘానికి అప్రిసియేషన్ అవార్డును ప్రకటించారు. ఈ మేరకు టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్, తుర్కయంజాల్ రైతుసేవా సహకార సంఘం చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్యకు వ్యవసాయ, సహకార, జౌలి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, నాబార్డు సీజీఎం బి.ఉదయ్భాస్కర్ అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ ఎం.రవీందర్ రావు, ఆర్సీఎస్ సురేంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు. హల్దీరాం గోదాంలో అగ్ని ప్రమాదం ఆల్విన్కాలనీ: కూకట్పల్లి డివిజన్, పాపిరెడ్డినగర్ సి బ్లాక్ రోడ్డు నెంబర్ 8లోని హల్దీరాం గోదాంలో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనిని గుర్తించిన స్థానికులు పోలీస్, ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల వారు భయాందోళనకు గురయ్యారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పనితీరు మార్చుకోవాలి
● సర్కార్కు చెడ్డపేరు తెస్తే ఊరుకోం ● రైతులు కార్యాలయాల చుట్టూ ఎన్నాళ్లు తిరగాలి ? ● రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి యాచారం: అధికారులు తమ పనితీరు మార్చుకోవాలి.. ఇంకా పాత పద్ధతినే కొనసాగిస్తామంటే కుదరదని, రైతులు ఎన్నాళ్లు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాలని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన యాచారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు పెద్ద సంఖ్యలో తహసీల్దార్ కార్యాలయం వద్ద వేచి ఉన్నారు. పలువురు రైతులు తమ భూ సమస్యలపై కోదండరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఏళ్ల నుంచి వేలాది రూపాయల ఫీజులు చెల్లించి, మీసేవల్లో దరఖాస్తులు చేసుకున్నా, రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసుకున్నా, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన చైర్మన్ తహసీల్దార్ అయ్యప్పను వీరి సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. ఇందుకు తహసీల్దార్ అయ్యప్ప, డిప్యూటీ తహసీల్దార్ కీర్తి సాగర్ నిబంధనలు, సాకులు చెబుతుండగా చైర్మన్ కలుగచేసుకుని మూస పద్ధతి మానండి, క్షేత్రస్థాయిలో సర్వే చేయండి, ప్రజల సమక్షంలో భూమి ఎవరిదో తెలుసుకోండి అని చెప్పారు. నిబంధనల పేరిట రైతులకు పట్టాదారు పాస్పుస్తకాలు ఇవ్వకపోవడం సరికాదన్నారు. లీప్స్ సంస్థ ప్రతినిధులు యాచారం మండలాన్ని దత్తత తీసుకుని 24 గ్రామాల్లో భూ సమస్యలను గుర్తించి నివేదిక ఇచ్చినప్పటికీ ఒక్క సమస్య పరిష్కరించకపోతే ఎలా అని ప్రశ్నించారు. అధికారుల తీరు వల్లే భూధాన్, సీలింగ్ అని రికార్డులు మారాయని మండిపడ్డారు. నింబంధనలు సాకులు చూపించి రైతులను ఇబ్బందులు పెడితే సహించేది లేదన్నారు. రేవంత్రెడ్డి సర్కార్ రైతాంగ సంక్షేమం, భూ సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేస్తుంది, సర్కార్కు చెడ్డపేరు తీసుకురావాలని చూస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, కందుకూరు, ఆమన్గల్లు, కడ్తాల్, మహేశ్వరం, షాద్నగర్ తదితర మండలాల నుంచి భూ సమస్యలపై రైతులు నిత్యం ఫోన్లు చేస్తున్నారు. త్వరలో కలెక్టర్ నారాయణరెడ్డితో సమావేశమై సాధ్యమైనంత వరకు భూ సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. -
కుర్మిద్దలో నెట్ జీరో సిటీ పీఎస్
● సర్వేనంబరు 311లో స్థల పరిశీలన చేసిన మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి యాచారం: ఫ్యూచర్ సిటీ భద్రతా దృష్ట్యా ప్రభుత్వం నెట్ జీరో సిటీ ఠాణా ఏర్పాటు చేయతలపెట్టింది. గత బీఆర్ఎస్ సర్కార్ ఫార్మాసిటీ ఏర్పాటు నేపథ్యంలో మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లిలో హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఫార్మాసిటీ భూముల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి చర్యలు చేపట్టిన విషయం విదితమే. గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్గా ఉంటే ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సర్కార్ రూటు మార్చింది. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పేరు మార్చేసి, ఇక నుంచి నెట్ జీరో సిటీగా కొనసాగించనుంది. అన్ని హంగులు, సకల సౌకర్యాలతో కూడిన నెట్ జీరో సిటీ పీఎస్ను నిర్మించాలని యోచిస్తోంది. ఈ మేరకు బుధవారం మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, గ్రీన్ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజు నెట్ జీరో సిటీ పీఎస్ ఏర్పాటుకు కావాల్సిన స్థలాన్ని పరిశీలించారు. కుర్మిద్ద సమీపంలో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఏర్పాటు చేయతలపెట్టిన సమీపంలోని సర్వే నంబరు 311లో ఐదు నుంచి పదెకరాల్లో నూతన నెట్ జీరో సిటీ పీఎస్ను నిర్మించేందుకు సర్కార్ సమాలోచనలు చేస్తోంది. -
బోధనేతర పనులు అప్పగించొద్దు
మంచాల: ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించడం తగ్గించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పుట్టపాక ప్రవీణ్కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని నోముల, లింగంపల్లి, మంచాల, తాళ్లపల్లిగూడ, తిప్పాయిగూడ, జాపాల, ఆరుట్ల పాఠశాలల్లో ఉపాధ్యాయులను కలిసి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకవైపు ఉపాధ్యాయులను చరవాణి ఉపయోగించ రాదని చెప్పి మరోవైపు ఫోన్లో అన్ని వివరాలు నమోదు చేయాలని ఆదేశించడం ఎంతవరకు సమాంజసమన్నారు. విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం, పరీక్ష ఫలితాలు తదితర వివరాలను ఫోన్లో నమోదు చేయాలన్నారు. కానీ సమయానికి యాప్లు సరిగ్గా పని చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఆరు నెలలుగా వేతనాలు అందలేదన్నారు. వెంటనే వారికి జీతాలు విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాండురంగారెడ్డి, నాయకులు సుధాకర్, జయానంద్, శ్రీనివాస్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్కుమార్ -
సర్కారు భూమి స్వాధీనం
● రూ.200 కోట్ల విలువ చేసే భూమి చుట్టూ ప్రీ కాస్ట్వాల్ నిర్మాణం ● పోలీసు బందోబస్తుతో కూల్చివేతలు చేపట్టిన రెవెన్యూ అధికారులు మొయినాబాద్: నగర శివారులో ఔటర్ రింగ్ రోడ్డుకు రెండు కిలోమీటర్ల దూరంలో రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు కబ్జాకోరల నుంచి కాపాడారు. దీని చుట్టూ అక్రమంగా నిర్మించిన ప్రీకాస్ట్ వాల్ను జేసీబీతో కూల్చివేసి స్వాధీనం చేసుకున్నారు. మున్సిపల్ పరిధిలోని అజీజ్నగర్ రెవెన్యూ సర్వేనెంబర్ 176లో పదెకరాల ప్రభుత్వ భూమిని నగరానికి చెందిన ఓ వ్యక్తి కబ్జా చేసి ప్రీకాస్ట్ వాల్ నిర్మించాడు. కబ్జాకు గురైన స్థలం ఓఆర్ఆర్కు అతి చేరువలో హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారికి ఆనుకుని ఉంది. ఇక్కడ ఎకరం రూ.20 కోట్ల వరకు పలుకుతోంది. ఈ లెక్కన కబ్జాకు గురైన భూమి విలువ సుమారు రూ.200 కోట్లు ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న మొయినాబాద్ రెవెన్యూ అధికారులు బుధవారం పోలీసులతో అక్కడికి వెళ్లారు. జేసీబీ సాయంతో ప్రీకాస్ట్ వాల్ను కూల్చివేస్తుండగా కబ్జాదారుడు వచ్చి అడ్డుకునేందుకు యత్నించాడు. ఓ మంత్రి పేరు చెప్పి బెదిరించాడు. అయినా రెవెన్యూ అధికారులు వెనక్కి తగ్గకుండా అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గౌతమ్కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల జోలికి వస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎంతటివారైనా ఉపేక్షించమన్నారు. ప్రభుత్వ భూముల చుట్టూ ఫెన్సింగ్ వేయిస్తున్నామని.. మొదటి విడతలో 300 ఎకరాలను గుర్తించి ఫెన్సింగ్ పనులు చేపడుతున్నామన్నారు. కూల్చివేతల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేశ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
నోటీసులిచ్చారు.. న్యాయం చేయండి
షాబాద్: ప్రభుత్వ భూమి నుంచి మట్టి తరలించిన వారిపై చర్యలు తీసుకోవాలని సోలిపేట్ రైతులు కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్రెడ్డిని కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 350 సర్వేనంబర్లోని భూమిని ప్రభుత్వం పలువురికి అసైన్ చేసిందని తెలిపారు. ఇందులో నుంచి అక్రమార్కులు మట్టి తరలించి, సొమ్ము చేసుకున్నారన్నారు. ఈ విషయం తెలియడంతో రెవెన్యూ అధికారులు రైతులకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. దీనిపై స్పందించిన మధుసూదన్రెడ్డి చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళతో మాట్లాడి ఇబ్బంది లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. బాధిత రైతుల వెంట జనార్దన్రెడ్డి, రాజేందర్రెడ్డి, కుమ్మరి విఠల్ తదితరులు ఉన్నారు. -
ఎన్నిక ఏదైనా.. గెలుపు బీఆర్ఎస్దే ఉండాలి
శంకర్పల్లి: రాష్ట్రంలో ఏఎన్నిక వచ్చినా గెలుపు బీఆర్ఎస్దే ఉండాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం శంకర్పల్లి మండలం జన్వాడలో మండల ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సబితారెడ్డి మాట్లాడుతూ.. నాయకులెవరైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని, ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నారు. నాయకులు పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని, రోజు మూడు నుంచి నాలుగు గ్రామాల్లో పర్యటించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలన్నారు. యువతను పార్టీలో భాగస్వామ్యం చేయాలని, పార్టీలో కొత్త, పాత అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమి లేదని, సభలు, సమావేశాల్లో కేసీఆర్ని తిట్టడం తప్ప వాళ్లు ఏం లేదని ఎద్దేవా చేశారు. గతంలో వైస్.రాజశేఖర్రెడ్డి, కేసీఆర్లు సీఎంగా ఉన్నప్పుడు వర్షాలు సమృద్ధిగా కురిసాయని.. ఇప్పుడు వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు రూ. 2,500 ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఓటమి భయంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని, చివరికి హైకోర్టు జోక్యంతో గత్యంతరం లేక, ఎన్నికలు నిర్వహించే పరిస్థితికి వచ్చిందన్నారు. ఇప్పటికై నా కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ జపం చేయకుండా, ప్రజలకు ఏదైనా మేలు చేసే పనులు చేయాలని కోరారు. గ్రామాలు, పట్టణాలు ఎక్కడ తిరిగినా ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వస్తుందని చెప్పడం సంతోషాన్ని కల్గిస్తోందన్నారు. సమావేశంలో శంకర్పల్లి, రాయదుర్గం పీఏసీఎస్ చైర్మన్లు శశిధర్రెడ్డి, అరవింద్రెడ్డి, శంకర్పల్లి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, మాజీ ఎంపీపీ గోవర్థన్రెడ్డి, నాయకులు రాజు నాయక్, వెంకటేశ్, బాలకృష్ణ, సత్యనారాయణ, నర్సింహారెడ్డి, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి సబితారెడ్డి జన్వాడలో శంకర్పల్లి ముఖ్యనాయకుల సమావేశం -
రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి
నందిగామ: ఉపాధి కల్పిస్తామని తమ వద్ద కారు చౌకగా భూములు కొనుగోలు చేసి ఎలాంటి పరిశ్రమలు స్థాపించకుండా పోవడమే కాకుండా ప్రశ్నించిన తమపై కేసులు పెట్టడమేమిటని మండలంలోని చేగూరు, నర్సప్పగూడ రైతులు బుధవారం పోలీస్స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. బాధిత రైతుల కథనం ప్రకారం.. చేగూరు రెవెన్యూ శివారులోని నర్సప్పగూడ గ్రామ పంచాయతీ పరిధిలో చేగూరు రోడ్డులో హైదరాబాద్ హైటెక్ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని, భూములు ఇచ్చిన రైతులకు ఉపాధి కల్పిస్తామని చెప్పి సుమారు 143 ఎకరాల భూమిని 2002, 2003లో కొనుగోలు చేశారన్నారు. అక్కడ నేటికి ఒక్క పరిశ్రమను స్థాపించలేదన్నారు. ఇదేంటని ప్రశ్నించిన తమపై కేసు నమోదు చేశారని వాపోయారు. టెక్స్టైల్ పార్క్ సొసైటీ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని, తమపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు సతీష్, ఆంజనేయులు, మల్లప్ప, సాయి, రమేష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నత చదువుతోనే ఉజ్వల భవిష్యత్
షాద్నగర్రూరల్: ఉన్నత విద్యను అభ్యసించినప్పుడే ఉజ్వల భవిష్యత్ లభిస్తుందని జేఎన్టీయూ ప్రొఫెసర్ డాక్టర్ శోభారాణి అన్నారు. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని మూన్రే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్(ఎంఐపీఎస్) కళాశాలలో బుధవారం మిప్స్కాన్–2025 జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా జేఎన్టీయూ ప్రొఫెసర్ డాక్టర్ శోభారాణి హాజరై జ్యోతి ప్రజ్వలనచేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రణాళికను రూపొందించుకొని నిరంతరం లక్ష్య సాధనకోసం శ్రమించాలని సూచించారు. సాధించాలనే కృషి, పట్టుదల ఉంటే విజయాలు వెన్నంటే ఉంటాయన్నారు. విద్యార్థులు తమ మేధస్సుకు పదునుపెట్టి తాము ఎంచుకున్న రంగాలలో ఘనవిజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. షాద్నగర్ ప్రాంతం పారిశ్రామిక ప్రాంతంగా వెలుగొందుతుందని, ఉత్తమ ఫలితాలను సాధించే విద్యారులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పారు. అనంతరం కళాశాల చైర్మన్ పర్వత్రెడ్డి మాట్లాడుతూ.. 2007లో 60 మంది విద్యార్థులతో ప్రారంభమైన కళాశాల అంచెలంచలుగా ఎదిగి ఎందరో విద్యార్థులకు ఉపాధి అవకాశాలను అందించిందని అన్నారు. అనంతరం ప్రొఫెసర్ డాక్టర్ శోభారాణిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ సాయికృష్ణ, ప్రిన్సిపాల్ రాజ్కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ డాక్టర్ శోభారాణి -
ప్రభుత్వ బడుల్లో వసతులు కల్పించాలి
ఆమనగల్లు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ కోరారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడానికి సర్వే నిర్వహించారు. అనంతరం సంతోష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. పాఠశాలల్లో అవసరమైన వసతులు కల్పించడంతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బాలుర ఉన్నత పాఠశాలలో పీఈటీ పోస్టును భర్తీ చేయాలని, విద్యార్థుల లైబ్రరీ సౌకర్యం కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు ఆంజనేయులు, రామ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. కిరోసిన్ డబ్బాలతో హల్చల్ న్యాయం చేయాలని రైతుల ప్రదర్శన నందిగామ: తమ భూములు కొనుగోలు చేస్తామని ఒప్పందం చేసుకొని పత్తాలేకుండా పోవడమే కాకుండా, మమ్మల్ని సదరు భూమిలోకి రాకుండా అడ్డుకుంటున్న రియల్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని మండలంలోని అప్పారెడ్డిగూడ రైతులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు కిరోసిన్ డబ్బాలతో తమ పొలాల వద్ద బుధవారం నిరసనకు దిగారు. అందుకు సంబంధించిన వివరాలు.. మండల పరిధిలోని వీర్లపల్లి రెవెన్యూ శివారు అప్పారెడ్డిగూడలో 370 నుంచి 377 వరకు గల సర్వే నంబర్లలో ముగ్గురు రైతుల నుంచి సుమారు 11 ఎకరాలను హైదరాబాద్కు చెందిన కొందరు వ్యాపారులు కొనుగోలు చేస్తామని, కొంత డబ్బులు చెల్లించి 2024 జూలైలో ఒప్పందం చేసుకున్నారు. గడువు తీరినా మిగతా డబ్బులు చెల్లించకపోవడమే కాకుండా సదరు భూమిలోకి పోలీసులను పంపించి తమని రానివ్వకపోడం ఏమిటని రైతులు రామయ్య, చెన్నయ్య, అనుసూజ తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒప్పందం మేరకు తమకు డబ్బులు ఇవ్వాలని, లేనట్లయితే తాము తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించి ఒప్పందం రద్దు చేసుకుంటామని చెప్పారు. పశువులు తరలిస్తున్న కంటైనర్ సీజ్ ● గోశాలకు మూగజీవాల తరలింపు ● కేసు నమోదు చేసి పోలీసులు కడ్తాల్: అక్రమంగా పశువులను తరలిస్తున్న కంటైనర్ను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. విజయవాడ నుంచి ఓ కంటైనర్లో అనుమతి లేకుండా హైదరాబాద్కు పశువులు తరలిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు కడ్తాల్ సమీపంలో వాహనాన్ని తనిఖీ చేశారు. కంటైనర్లో 64 ఆవులు, 41 ఎద్దులు ఉన్నట్లు గుర్తించారు. ఇరుకు స్థలంలో ఊపిరాడక 4ఆవులు మృతిచెందాయన్నారు. పశువులను జియాగూడ కామధేను సమర్థ గోశాలకు తరలించారు. వాహనాన్ని సీజ్ చేసి, యజమాని ఎండీ తలీమ్తో పాటు డ్రైవర్, మరో ముగ్గురు కార్మికులపై కేసు నమోదు చేసినట్లు సీఐ గంగాధర్ తెలిపారు. కొటారి నిర్మలకు డాక్టరేట్ ఇబ్రహీంపట్నం: కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ విభాగంలో చేసిన పరిశోధనలకుగాను కొటారి నిర్మలకు శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం డాక్టరేట్ను ప్రకటించింది. ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.ఉషారాణి పర్యవేక్షణలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో నిర్మల చేసిన పరిశోధనలపై సంతృప్తి వ్యక్తంచేసిన యూనివర్సిటీ డాక్టరేట్ పట్టా అందజేసింది. ప్రస్తుతం ఆమె ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా విధులను నిర్వహిస్తున్నారు. -
భారతి సిమెంట్తో నిర్మాణం వేగవంతం
సంస్థ టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్ చేవెళ్ల: భారతి అల్ట్రాఫాస్ట్ సిమెంట్తో నిర్మాణ ప్రక్రియ చాలా వేగవంతంగా అవుతుందని ఆ సంస్థ టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్ అన్నారు. చేవెళ్లలోని గణేశ్ స్టీల్ వద్ద భారతి సిమెంట్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం తాపీమేసీ్త్రలకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్తో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్తో నిర్మాణం ప్రక్రియ చాలా వేగవంతంగా పూర్తవుతుందన్నారు. తెలంగాణలో భారతి సిమెంట్ అల్ట్రాఫాస్ట్ పేరుతో ఫాస్ట్ సెంటింగ్ సిమెంట్ 5స్టార్ గ్రేడ్తో విడుదల చేసిందన్నారు. అల్ట్రాఫాస్ట్తో ముఖ్యంగా స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలు, రహదారులకు సరైన ఎంపిక అన్నారు. అల్ట్రాఫాస్ట్ వినియోగదారులకు ఉచిత సాంకేతిక సహాయం అందజేస్తున్నామని స్లాబ్ కాంక్రీట్ సమయంలో నిపుణులైన భారతి సిమెంట్ ఇంజనీర్లు సైట్ వద్దకే వచ్చి సహాయపడుతారని చెప్పారు. అనంతరం 50 మంది తాపీమేసీ్త్రలకు రు.లక్ష ప్రమాద బీమా బాండ్లను అంజేశారు. డీలర్ సదానందం మాట్లాడుతూ.. భారతి సిమెంట్ సర్వీస్ చాలా ఫాస్ట్గా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో సంస్థ టెక్నికల్ ఇంజనీర్ బృందం, తాపీమేసీ్త్రలు తదితరులు పాల్గొన్నారు. బస్సులు ఆపాలని వినతి తుర్కయంజాల్: సాగర్ రహదారి గుండా రాకపోకలు సాగించే ఇబ్రహీంపట్నం డిపో ఆర్టీసీ బస్సులను తుర్కయంజాల్లోని కట్టమైసమ్మ దేవాలయం నిలపాలని సీపీఎం నాయకులు కోరారు. బుధవారం ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ నర్సప్ప వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం ఇంజాపూర్ జోన్ బాధ్యుడు మండల సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆలయం వద్ద బస్సు నిలపకపోవడంతో కమ్మగూడ, ఇంజాపూర్లోని అనేక కాలనీల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఈ బస్స్టాప్కు సమీపంలోనే నాలుగు వీకర్ సెక్షన్ కాలనీలు ఉన్నాయని, వీరంతా ఉద్యోగ, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారని తెలిపారు. అందుకు ఆర్టీసీ సర్వీసే వారికి ప్రధాన మార్గమన్నారు. ప్రజల రవాణా సౌకర్యాన్ని గుర్తించి, బస్సులు ఆపాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణ, శంకరయ్య, కుమార్, సత్యం, సాయి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. ధర్మాస్పత్రి సమస్యలు పరిష్కరించాలి ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్కు బీజేపీ నేతలు బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు ముత్యాల మహేందర్ మాట్లాడుతూ.. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. దీంతో రోగులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. పేదలు ఎక్కువ శాతం సర్కారు దవాఖానలకే వస్తుంటారని, అలాంటి వారికి సకాలంలో వైద్యం అందక ప్రైవేటు ఆస్పత్రులు పరుగులు తీస్తున్నారని పేర్కొన్నారు. సాయంత్రం నుంచి వైద్యులు ఉండకపోవడంతో ఎమర్జెన్సీ కేసులను చూసే వారు లేరన్నారు. తాత్కాలికంగానైనా అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలని కోరారు. పాలకుల హామీ మేరకు వంద పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలన్నారు. నిరంతరం వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ రాఘువేంద్రస్వామి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి విజయ్కుమార్, కార్యవర్గ సభ్యులు అనిల్, మున్సిపల్ కార్యదర్శి సంతోష్ ఉన్నారు. విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి జిల్లా విద్యాధికారి సుశీందర్రావు శంకర్పల్లి: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా విద్యాధికారి సుశీందర్రావు అన్నారు. బుధవారం ఆయన మండల పరిధిలోని జన్వాడ జెడ్పీహెచ్ఎస్ను సందర్శించారు. ఎంఈఓ అక్బర్తో కలిసి కేఎన్ఏ ఫౌండేషన్ వారు రూ.3 లక్షలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ని ప్రారంభించారు. అనంతరం పాఠశాలను విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. చదువులో వెనకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాలరాజ్ పాల్గొన్నారు. చోరీ సొత్తు రికవరీ కందుకూరు: చోరీకి పాల్పడిన వ్యక్తిని చాకచక్యంగా గుర్తించి అతని నుంచి బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు రికవరీ చేశారు. ఈ సంఘటన కందుకూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సీతారామ్ తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని జబ్బార్గూడకు చెందిన గోల్కండ లక్ష్మి కుటుంబీకులు ఈ నెల 2న ఇంటికి తాళం వేసి పనులపై బయటికి వెళ్లారు. ఇది గమనించిన ఓ దొంగ ఇంట్లో చొరబడి నాలుగు తులాల బంగారం, 40 తులాల వెండి ఆభరణాలను తస్కరించాడు. ఈ విషయమై అదే రోజు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ ఆదేశాల మేరకు పెట్రోలింగ్ కానిస్టేబుల్ ఆఫీసర్ ఎం.రమేష్ ఆ గ్రామంలో దర్యాప్తు చేపట్టాడు. ఓ వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేయగా.. క్రైం కానిస్టేబుల్స్ పాండురంగారెడ్డి, శేఖర్ వెళ్లి అనుమానితుడ్ని చాకచక్యంగా పట్టుకుని విచారించగా చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు. దీంతో చోరీ సొత్తును సేకరించి బాధితురాలికి అప్పగించారు. నిందితుడ్ని రిమాండ్కు తరలించారు. -
భూముల వద్దే వంటావార్పు
● పదో రోజుకు చేరిన ఎనికేపల్లి రైతుల రిలే దీక్ష మొయినాబాద్: తమకు న్యాయం చేయాలంటూ ఎనికేపల్లి రైతులు చేపడుతున్న రిలే దీక్ష బుధవారం 10వ రోజు కొనసాగింది. మున్సిపల్ పరిధి ఎనికేపల్లిలో సర్వేనెంబర్ 180లోని 99.14 ఎకరాల భూమిని ప్రభుత్వం గోశాలకు కేటాయించడంతో ఆ భూములు సాగుచేసుకుంటున్న రైతులు రిలే దీక్ష చేపడుతున్నారు. కొందరు రైతులకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మంగళవారం పరిహారంగా ఎకరాకు 300 గజాల చొప్పున పట్టాలు అందజేశారు. మిగిలిన రైతులు దీక్షను కొనసాగిస్తున్నారు. బుధవారం భూముల వద్దనే వంటావార్పు చేసి నిరసన తెలిపారు. వారికి మద్ధతుగా బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్, ఇతర నాయకులు దీక్షలో కూర్చున్నారు. రైతులందరికీ పరిహారం గోశాల ఏర్పాటుతో భూములు కోల్పోతున్న రైతులందరికీ ప్రభుత్వం పరిహారం ఇస్తుందని చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ అన్నారు. బుధవారం మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆరు కుటుంబాలకు చెందిన 16 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఎనికేపల్లి సర్వేనెంబర్ 180లోని 99.14 ఎకరాల ప్రభుత్వ భూములను గ్రామానికి చెందిన కొందరు రైతులు చాలా కాలంగా సాగుచేసుకుంటున్నారని.. వారికి ప్రభుత్వం ఎకరాకు 300 గజాల స్థలాన్ని పరిహారంగా ఇస్తుందన్నారు. మంగళవారం పది కుటుంబాలకు చెందిన 26 మందికి ఎమ్మెల్యే యాదయ్య చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేశామన్నారు. రెండు రోజుల్లో మొత్తం 16 కుటుంబాలకు చెందిన 42 మందికి పట్టాలు ఇచ్చామని చెప్పారు. ఇంకా కొంత మంది రైతులు గురువారం వస్తారన్నారు. మిగిలినవారు సైతం రెండు మూడు రోజుల్లో వచ్చి పట్టాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గౌతమ్కుమార్, పీసీసీ సభ్యుడు షాబాద్ దర్శన్, డిప్యూటీ తహసీల్దార్ వినోద్కుమార్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
బోరు ఏర్పాటు విషయంలో ఘర్షణ
చేవెళ్ల: తాగునీటి అవసరాల కోసం బోరు వేస్తున్న విషయంలో ఇరువర్గాలకు ఘర్షణ జరిగిన సంఘటన మండలంలోని నాంచేరి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ పరిధిలోని ఇంద్రారెడ్డినగర్ ప్రభుత్వ భూమిలో మంగళవారం ఉదయం మిషన్ భగీరథ అధికారులు బోరు వేయించేందుకు సిద్ధమయ్యారు. స్థానికంగా ఉండే మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్యగౌడ్ అతని కుమారులు ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు. అదే సమయంలో మాజీ సర్పంచ్ అమరేందర్గౌడ్ వచ్చి ఇది యూత్ భవనం కోసం కేటాయించిన స్థలంగా చెప్పి, మరో చోట బోరు వేయాలని సూచించారు. అక్కడే ఉన్న మార్కెట్ చైర్మన్ కుమారులు జైపాల్, ప్రభాకర్ గతంలో మాజీ సర్పంచ్తో ఉన్న మనస్పర్థల కారణంగా గొడవకు దిగారు. ఆయనపై దాడికి యత్నించారు. అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారికి సర్ధి చెప్పి పంపించారు. అమరేందర్గౌడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అభివృద్ధికి ఓర్వలేకనే మాజీ సర్పంచ్ రాద్ధాంతం చేశారని మార్కెట్ చైర్మన్ పెంటయ్యగౌడ్ ఆరోపించారు. పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య కేశంపేట: తరుచూ ఫిట్స్ వస్తుండటంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని దేవునిగుడి తండాలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన నేనావత్ శ్రీను(28) ఫిట్స్ వ్యాధితో బాధపడేవాడు. ఇదే విషయమై పలుమార్లు మదన పడుతూ భార్య కమిలితో చెప్పేవాడు. ఆదివారం సాయంత్రం వ్యవసాయ పొలం వద్ద మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. గమనించిన భార్య గ్రామస్తుల సహాయంతో షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఉస్మానియాకు తరలించగా అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. దీనిపై మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ నరహరి తెలిపారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి మహేశ్వరం: ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ కోసం కృషి చేయాలని మంఖాల్ ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం మహేశ్వరం గేటు వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాల, కళాశాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. వన్య ప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తు తరాల కోసం ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. అడవుల్లో ఉండే వన్య ప్రాణులను సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో అటవీ క్షేత్ర అధికారి రాజేందర్రెడ్డి, ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం, ఫారెస్ట్ సెక్షన్ అధికారులు పవన్, లావణ్య, ప్రకాష్, సాయివరుణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉరేసుకొని విద్యార్థిఽని ఆత్మహత్య అబ్దుల్లాపూర్మెట్: ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఉమర్ఖాన్గూడలో నివాసముండే కపీంద్ర శ్యామల్ కూతురు శ్యామల్ ప్రియదర్శిని(18) మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా ప్రియదర్శిని అప్పటికే మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికీ తరలించి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రియదర్శిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వ్యాపారం కలిసిరాలేదని యువకుడి ఆత్మహత్య పంజగుట్ట: మానసిక వేదనకు గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం ప్రాంతానికి చెందిన సత్తు గురవయ్య ఎల్లారెడ్డిగూడ, శాలివాహన నగర్లో నివాసం ఉంటున్నాడు. ఇతడి కొడుకు అనిల్ కుమార్(27) ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదవగా..కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. తర్వాత కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న డెకరేషన్ షాపు పనులు చూసుకుంటున్నాడు. అందులోనూ కలిసి రాలేదు. 13న డెకరేషన్ వస్తువులను డెలివరీ చేసేందుకు నిజామాబాద్ వెళ్లిన అనిల్ కుమార్ అర్ధరాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. సోమవారం మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోతాను అని తల్లికి చెప్పి గదిలోకి వెళ్లి డోర్ పెట్టుకున్నాడు. రాత్రి అయినా బయటకు రాకపోవడంతో తలుపు విరగ్గొట్టి లోనికి వెళ్లి చూసేసరికి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. కిందకు దింపి చూడగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. -
యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రాం ప్రారంభం
కందుకూరు: కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ సహకారంతో యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రాం–2లో భాగంగా ఎంపికై న మండలంలోని నేదునూరు పరిధిలోని మోడల్ స్కూల్ విద్యార్థులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బ్యాడ్జ్లు అందించారు. మంగళవారం నాబార్డ్ సంస్థ 44వ ఆవిర్భావ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ముషీరాబాద్లోని వారి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రామ్–2ను లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఎంపికై న విద్యార్థులను ఆయన అభినందించి పర్యావరణ సంస్థ అందించిన కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాబార్డ్ సంస్థ ప్రముఖులు ఉదయ్భాస్కర్, సీజీఎం రాధాకృష్ణ, సీజీఎం ఎస్బీఐ నారాయణరావు, అసిస్టెంట్ డైరెక్టర్ జేఎస్ఆర్ అన్నమయ్య, ప్రోగ్రాం కోఆర్డినేటర్ రజనీకాంత్, మెంటార్ టీచర్ పుష్పలత, ఎర్త్ లీడర్లు పాల్గొన్నారు. -
ఆర్డినెన్స్ పేరిట మోసం
● రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు అమలు చేయాలి ● షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ షాద్నగర్: ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా బీసీ రిజర్వేషన్లను అమలుచేయాలని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నగరంలోని ఇందిరాపార్కు వద్ద బీఆర్ఎస్ మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ధర్నాకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ పేరుతో బీసీలను మోసం చేసేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. గతంలో చాలా బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పటికీ అవి అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ఏ బిల్లుకై నా రాజ్యాంగ పరమైన ఆమోదం లభించినప్పుడే అమల్లోకి వస్తుందని అన్నారు. ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పూర్తి స్ధాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా అమలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ధర్నాకు తరలిన వారిలో నాయకులు ఈట గణేశ్, ఎమ్మె శ్రీలత, సత్యనారాయణ, దేవేందర్ యాదవ్, తదితరులు ఉన్నారు. -
ఫార్మర్ రిజిసీ్ట్ర తప్పనిసరి
మహేశ్వరం: రైతులంతా ఫార్మర్ రిజిసీ్ట్ర తప్పక చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిణి డి.ఉష సూచించారు. మంగళవారం ఆమె మండల కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉష మాట్లాడుతూ.. రైతులు పట్టాపాస్ బుక్, ఆధార్, ఆధార్కు అనుసంధానం ఉన్న ఫోన్ నంబర్తో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలన్నారు. ప్రతీ రైతుకు 11 నంబర్లతో విశిష్ట సంఖ్య(యూనిక్ కోడ్)ని కేటాయించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. రైతు రుణాలు, ఇతర ఆర్థికసాయం పొందేందుకు ఈ నంబర్ తప్పనిసరి అని చెప్పారు. పంటలో కలుపు నివారణ, నానో యూరియా వాడే విధానం, వరి పంట సాగులో పాటించాల్సిన సస్యరక్షణ చర్యలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సుధారాణి, మండల వ్యవసాయాధికారి నాగమణి, టెక్నికల్ ఏఓ యాదగిరి గౌడ్, ఏటీఎం శ్రీవిద్య, విస్తరణ అధికారులు రైతులు పాల్గొన్నారు.జిల్లా వ్యవసాయాధికారి ఉష -
సస్యరక్షణే ముఖ్యం
కందుకూరు: పండ్ల తోటల్లో మామిడి తర్వాత అధికంగా సాగు చేసేది జామ పంట. నికరాదాయంతో పాటు ఏడాదికి రెండుసార్లు దిగుబడి వస్తుండటంతో రైతులు జామ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో దాదాపు 15,800 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం జామ సాగులో ఉంది. కాకపోతే విదేశాల నుంచి తెచ్చిన తైవాన్ రకం జామ ద్వారా దేశంలోకి నులి పురుగుల బెడద తీవ్రతరం అయింది. దీంతో తైవాన్ రకంతో పాటు దేశీయ రకాలైన అలహాబాద్ సఫేదీ, లక్నో–49 తదితర రకాలకు నులి పురుగులు ఆశించి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నులి పురుగులు వేర్లను ఆశించడంతో చెట్టు ఎండిపోయి చనిపోతుంది. లక్షణాలు గుర్తించక నీళ్లు పెట్టడం, అధికంగా ఎరువులు వేయడంతో ఉపయోగం ఉండటంలేదని కృషి విజ్ఞాన కేంద్రం క్రిడా నిపుణుడు జి.శ్రీకృష్ణ తెలిపారు. నులి పురుగుల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన సస్యరక్షణ చర్యలను గురించి ఆయన రైతులకు పలు సలహాలు, సూచనలు అందించారు. లక్షణాలు ● ఆకులు పసుపు రంగులోకి మారడం. ● కొమ్మలు, లేత చిగుర్లు వడలిపోవడం, నులి పురుగులు ఆశించిన తొలి దశలో భూమిలో తగినంత తేమ ఉన్నా మొక్కలు వాడిపోయి కన్పిస్తాయి. ● చెట్టు ఎదుగుదల లోపించడం, చెట్టు మోడు భారడం. ● పూత, పిందె రాలడం లేదా ఆలస్యం అవడం, వచ్చినా త్వరగా రాలిపోవడం. ● నీరు, ఎరువులు అందించినా మొక్క కోలుకోకపోవడం. ● ఈ లక్షణాలు అన్నీ ఎండు తెగులు లక్షణాలు పోలి ఉండటం. ● వేర్లు ముడులు ముడులుగా మారి, బుడిపెలని కలిగి ఉండటం, వేరు వ్యవస్థ క్షీణించి ఉండటం. ● నులి పురుగులు సోకిన వేరు భాగాల్లో ఎండు తెగులు శిలీంధ్రం ఆశించి వేరు కుళ్లి పోవడం. పంట నష్టం ఈ నులి పురుగులతో ఒక సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాల వరకు జామ తోటల్లో 60–100 శాతం, నర్సరీల్లోనైతే 90–100 శాతం వరకు నష్టం వాటిల్లుతుంది. వ్యాప్తి నివారణ చర్యలు ● నులి పురుగులు లేనివిగా నిర్ధారించబడిన నర్సరీల నుంచి మాత్రమే ఆరోగ్యవంతమైన జామ అంట్లను కొనుగోలు చేయాలి. ● జామ అంట్లు కట్టడానికి, నర్సరీల్లో అంటు మొక్కలను పెంచడానికి నులిపురుగులు లేని స్వచ్ఛమైన మట్టిని వాడుకోవాలి. ● ఆకులు పచ్చబారి, వాడిపోయి వేరుపై బొడిపెలు లాంటివి కలిగి ఉన్న మొక్కలను తోటలో నాటరాదు. నర్సరీలో యాజమాన్య పద్ధతులు ● ఒక టన్ను మట్టిలో 50–100 కిలోల వేప చెక్క పిండి లేదా గానుగ పిండి, జీవ నియంత్రణ కారకాలైన పర్పురియోసిల్లమ్ లిలాసినస్, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్, ట్రై కోడెర్మా హార్జియానమ్ ఒక్కో కిలో చొప్పున కలిపిన మట్టిని అంట్లు కట్టే ముందు సంచుల్లో నింపాలి. ● కార్బోఫ్యూరాన్ 3జీ లేదా ఫోరేట్ 10జీ 5 కిలోలను ఒక టన్ను మట్టికి కలపాలి. ● నారు మడులను, నారు మొక్కలను పెంచడానికి వాడే మట్టిని వేసవి కాలంలో తెల్లపాలిథీన్ షీటుతో (45–60 రోజులు) కప్పి ఉంచి సోలరైజేషన్ ప్రక్రియ ద్వారా నులి పురుగులను నివారించవచ్చు. ● డయాజోమెట్ గుళికలు ఎకరాకు 60 కిలోల చొప్పున వేసి కలియబెట్టి పాలిథీన్ షీటుతో కప్పి, ఒక వారం ఉంచి తర్వాత షీటును తీసి, మట్టిని తిరిగి కలియబెట్టి 2–3 రోజుల తర్వాత మొక్కలను నాటుకోవాలి. ఈ పద్ధతితో నులిపురుగులను త్వరితగతిలో నివారించవచ్చు. తోటల్లో యాజమాన్యం ● వేసవిలో లోతుగా దక్కులు దున్ని మట్టిని కలియబెట్టాలి. ● కొత్తగా జామ తోటలు వేసే ముందు మట్టిని నులిపురుగులకై పరీక్ష చేయించుకోవాలి. ● నులిపురుగులు ఉన్న భూమిలో మొక్కలు నాటే ముందు జీవనియంత్రణ కారకాలతో సమృద్ధి చేయబడిన వానపాముల ఎరువు లేదా వేప పిండి గుంటకి 5 కిలోల చొప్పున వేసుకుని అంట్లని నాటాలి. ● ఒక టన్ను వానపాముల ఎరువు లేదా పశువుల ఎరువు లేదా వేప పిండిలో 5 కిలోల చొప్పున పర్పూరియోసిల్లమ్ సిలాసినమ్, సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్, ట్రై కోడెర్మా హార్జినియమ్ కలిపి 30 రోజులు ఉంచి సమృద్ధి చేసిన మిశ్రమాన్ని 3–4 కిలోలు ఒక చెట్టుకు 6 నెలల వ్యవధిలో వేయాలి. ● పైన సూచించిన జీవ నియంత్రణ కారకాలతో ఉన్న వేప పిండి లేదా పశువుల ఎరువును 20 కిలోలను 200 లీటర్ల నీటిలో 2 రోజుల పాటు నానబెట్టి 2–3 లీటర్లతో ఒక్కో చెట్టు పొదళ్లు తడిపి నులి పురుగులను నివారించవచ్చు. జామ పంటలో నులిపురుగుల బెడద ముందస్తు చర్యలతో కట్టడి చేయవచ్చు కృషి విజ్ఞాన కేంద్రం క్రిడా నిపుణుడు శ్రీకృష్ణ -
కంపెనీ వాహనం ఢీకొని సెక్యూరిటీ గార్డ్ మృతి
పహాడీషరీఫ్: తాను పనిచేస్తున్న కంపెనీ వాహనం ఢీకొని ఓ సెక్యూరిటీ గార్డ్ మృతి చెందిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం...ఒడిశా రాష్ట్రానికి చెందిన సదానంద్ బెహరా కుమారుడు వికాస్ బెహరా(25) బతుకుదెరువు నిమిత్తం వలసవచ్చి పహాడీషరీఫ్ రంగ నాయకుల కాలనీలో నివాసం ఉంటున్నాడు. మామిడిపల్లి శివారులోని రాక్స్టోన్ క్రషర్ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డ్గా పని చేస్తున్నాడు. రోజు మాదిరిగానే సోమవారం రాత్రి డ్యూటీకి వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటలకు కంపెనీకి చెందిన లారీ ర్యాష్గా రివర్స్ తీసుకుంటూ వికాస్ పైనుంచి పోయింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కార్మికుల భద్రత పట్టదా..? మామిడిపల్లిలోని రాక్స్టోన్ క్రషర్ పరిశ్రమ నిర్వాహకులు కార్మికుల భద్రతను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బి.దత్తు నాయక్ ఆరోపించారు. సెక్యూరిటీ గార్డ్ మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆయన గ్రామస్తులతో కలిసి ఆందోళనకు దిగారు. మామిడిపల్లి మాజీ కార్పొరేటర్ యాతం పవన్ కుమార్ యాదవ్ కూడా అక్కడికి చేరుకొని కంపెనీ యజమాన్యంతో చర్చించారు. మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయానికి అంగీకరించడంతో ఆందోళన విరమించారు. -
స్తంభాన్ని తొలగించిన మున్సిపల్ సిబ్బంది
చేవెళ్ల: మున్సిపాలిటీ పరిధిలోని దామరగిద్దలో ప్రమాదకరంగా ఉన్న ఇనుప విద్యుత్ లైట్ల స్తంభాన్ని మున్సిపల్ అధికారులు మంగళవారం తొలగించారు. ఇటీవల సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ఎస్.వెంకటేశంతో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దామరగిద్ద వార్డు నుంచి రజినీకాంత్ నిరుపయోగంగా ఉన్న విద్యుత్ ఇనుప స్తంభాలను తొలగించాలని ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన చేవెళ్ల మున్సిపల్ అధికారులు స్తంభాన్ని క్రేన్ సహాయంతో తొలగించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశం మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు కృసి చేస్తున్నట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలి టీపీఎస్ఏ జిల్లా అధ్యక్షుడు రాజేశ్గౌడ్ ఇబ్రహీంపట్నం: గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలని టీపీఎస్ఏ(తెలంగాణ పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్) జిల్లా అధ్యక్షుడు రాజేశ్గౌడ్, ఉపాధ్యక్షుడు రాజ్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వారు జిల్లా పంచాయతీ అధికారి సురేశ్మోహన్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం రాజేశ్గౌడ్ మాట్లాడుతూ.. గ్రేడ్–4 పంచాయతీ కార్యదర్శులుగా రెగ్యులర్ చేయబడిన కార్యదర్శులకు మొదటి నియామకమైన 2019 ఏప్రిల్ 11 నుంచి వర్తింపులోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలని, జిల్లాలో ఓపీఎస్ క్యాటగిరీలో విధులు నిర్వహిస్తున్న వారిని జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా కన్వర్షన్ చేయాలని, పెండింగ్ జీతభత్యములు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు దేవేందర్, దీపిక, నయీం, గౌస్, నవీన్యాదవ్, శ్రీనివాస్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. మంచాల వ్యవసాయ అధికారిగా శ్రీలత మంచాల: మండల వ్యవసాయాధికారిగా ఎ.శ్రీలత మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన కృష్ణమోహన్ డిప్యూటేషన్పై షాబాద్ వెళ్లారు. ఆయన స్థానంలో కడ్తాల్ నుంచి శ్రీలత డిప్యూటేషన్పై వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమస్యలున్న రైతులు నేరుగా కార్యాలయానికి వచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. -
పర్యావరణ పరిరక్షణకు పాటుపడుదాం
హుడాకాంప్లెక్స్: పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం ఎంతో ముఖ్యమని డిప్యూటీ డైరెక్టర్ ఎన్.అజిత్కుమార్ అన్నారు. జాతీయ గణాంక కార్యాలయం 75వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం సరూర్నగర్లోని వీఎంహోం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ మనుగడకు వృక్షాలు ఎంతో ముఖ్యమైనదని అన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని అన్నారు. ఆక్సిజన్ మొక్కల పెంపకం ప్రధానమని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీనివాసరావు, నోడల్ అధికారి భరద్వాజ్, సీనియర్ స్టాటిస్టికల్ అధికారి, క్యూడియర్ స్టాటిస్టికల్ అధికారులు, సర్వే సూపర్వైజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఎఫ్టీఎల్లో ఆక్రమణల తొలగింపు
హయత్నగర్: అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని కొహెడలోని పిట్టెల చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో వెలసిన ఆక్రమ నిర్మాణాలను మంగళవారం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు తొలగించారు. సర్వే నంబర్ 141లోని కొంత భాగంలో చెరువు పరిధిలో ఉండగా ఎఫ్టీఎల్లోకి ప్రహరీ గోడలు వెలిశాయి. విషయం తెలుసుకున్న ఇరిగేషన్ ఏఈ వంశి ఆధ్వర్యంలో జేసీబి సహాయంతో గోడలను తొలగించారు. ఈ సందర్భంగా వంశి మాట్లాడుతూ... చెరువులు, కుంటలను రక్షించేందుకు కట్టుబడి ఉన్నామని, ఎవరైనా చెరువులను ఆక్రమించినా ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రైతు సంక్షేమమే లక్ష్యం
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మొయినాబాద్/మొయినాబాద్ రూరల్: రైతు సంక్షేమమే లక్ష్యమని, ప్రభుత్వం ఇందుకు కట్టుబడి ఉందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డితో కలిసి మంగళవారం ఎన్కేపల్లి భూ బాధితులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. మొయినాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వానికి చెందిన 99.14 ఎకరాల భూములను కొన్నేళ్లుగా ఎన్కేపల్లి రైతులు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. ఈ స్థలాన్ని ప్రభుత్వం గోశాలకు కేటాయించడంతో.. 53 మంది నిర్వాసితులకు 300 గజాల చొప్పున ప్రొవిజినల్ అలాట్మెంట్ పట్టాలు మంజూరు చేసిందని స్పష్టంచేశారు. దీంతో పాటు గోశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగం, ప్రభుత్వం అందజేసిన ప్లాటులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అంగీకరించిందని తెలిపారు. అనంతరం 26 మందికి పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్కుమార్, డిప్యూటీ తహసీల్దార్ వినోద్కుమార్, మండల అభివృద్ధి అధికారి సంధ్య, పీఏసీఎస్ చైర్మన్ చంద్రారెడ్డి, నాయకులు దర్శన్, అమర్నాథ్రెడ్డి, హన్మంత్యాదవ్, కాలె శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎన్కేపల్లి భూ నిర్వాసితులకు ప్లాట్ల పట్టాల పంపిణీ బీఆర్ఎస్ ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు రైతులు, పోలీసుల మధ్య తోపులాట -
అధికారుల నిర్లక్ష్యం తగదు
● పనితీరు మార్చుకోవాలి ● మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి బడంగ్పేట్: ప్రజా సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వీడాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొర్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడ, మామిడిపల్లి, మల్లాపూర్ పరిధిలో అభివృద్ధి పనులపై చర్చించారు. పెండింగ్ పనులపై అధికారులను నిలదీశారు. సమస్యలపై స్పందించకుంటే తాను ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాలు, తాగునీటి సరఫరా, ఎస్ఎన్డీపీ నాలా పనులు తదితర అంశాల్లో నేటికీ పురోగతి లేదని అసహనం వ్యక్తం చేశారు. అధికారులు పనితీరు మార్చుకోవాలని.. ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సరస్వతి, డీఈఈ వెంకన్న, ఏఈ హరీశ్, ఏఓ అరుణ, టీపీఓ కిరణ్కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ యాదగిరి, వర్క్ ఇన్స్పెక్టర్లు వినయ్, సంపత్, రాకేశ్, కల్యాణ్, మేనేజర్ నాగేశ్వర్రావు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
సర్కార్ బడుల్లో ఏఐ తరగతులు
● జిల్లా విద్యాధికారి సుశీందర్రావు ● ఎన్ఆర్ఐ సహకారంతో కొత్తపల్లి జెడ్పీహెచ్ఎస్కు రూ.8లక్షల విలువైన కంప్యూట్లర్లు యాచారం: విద్యార్థులు విలువలతో కూడిన విద్య ను అభ్యసించాలని జిల్లా విద్యాధికారి సుశీందర్రావు అన్నారు. మండల పరిధిలోని కొత్తపల్లికి చెందిన ఎన్ఆర్ఐ మౌనిక రెడ్డి గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ను దత్తత తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె పాఠశాలకు రూ.8లక్షల విలువైన కంప్యూటర్లు, విద్యార్థులకు స్టేషనరీ అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులు ఇష్టంతో చదువుకుని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. ప్రభుత్వ విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం పెంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తరగతులను నిర్వహిస్తామని చెప్పారు. ఎన్ఆర్ఐలు ప్రభుత్వ పాఠశాలలను దతత్త తీసుకుని అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల అభివృద్ధికి రూ.20 లక్షలకు పైగా వెచ్చించిన మౌనిక రెడ్డిని అభినందించారు. ఉన్నత చదువులకయ్యే ఖర్చు భరిస్తా: మౌనిక అనంతరం మౌనిక రెడ్డి మాట్లాడుతూ.. కొత్తపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థుల భవిష్యత్కు ఎంత ఖర్చయినా వెనుకాడనన్నారు. ఇప్పటికే రూ.పది లక్షలతో పాఠశాల రూపురేఖలు మార్చామన్నారు. తాజాగా మరో రూ.10లక్షలతో డిజిటల్, ఏఐ టెక్నాలజీ ఆధారిత బోధనకు కంప్యూటర్లు అందజేశామననారు. విద్యార్థులు ఉన్నతంగా చదువుకుని గ్రామానికి, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకరావాలని కోరారు. పదో తరగతిలో 500 మార్కులకు పైగా సాధించిన విద్యార్థుల ఉన్నత విద్యభ్యాసానికి అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మౌనికరెడ్డి తల్లితండ్రులు రవి, కృప, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్మోహన్, మండల పంచాయతీ అధికారి శ్రీలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
1,572 మందికి ఫార్మా ప్లాట్లు
● మొదటి విడతలో గైర్హాజరైన లబ్ధిదారులకు కందుకూరు ఆర్డీఓ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ● రెండో విడతలో ఐదు నుంచి 18 ఎకరాలు కోల్పోయిన రైతులకు కందుకూరు: ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు మీర్ఖాన్పేట రెవెన్యూలో టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లేఅవుట్లో ఇటీవల మొదటి విడత ప్లాట్ల కేటాయింపు పూర్తయింది. కాగా ఆయా తేదీల్లో హాజరు కాని లబ్ధిదారులకు ప్రస్తుతం కందుకూరు ఆర్డీఓ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టారు. కందుకూరు, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ పరిధిలో 4,170 మందికి అధికారులు లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు చేపట్టగా, అందులో 2,062 మంది రిజిస్ట్రేషన్ కోసం సంతకాలు చేశారు. 1,572 మంది గైర్హాజరు కాగా ప్రస్తుతం వారికి ఆయా ఆర్డీఓల పరిధిలో రిజిస్ట్రేషన్ కోసం వివరాలు సేకరిస్తున్నారు. మొదటి విడతలో కందుకూరు పరిధిలో 1,433 మంది లబ్ధిదారులకు గాను 1,234 మందికి 60 గజాల నుంచి 544(నాలుగున్నర ఎకరాలు)గజాల ప్లాట్లు కేటాయించారు. ఐదెకరాల నుంచి 18 ఎకరాల వరకు ఉన్న దాదాపుగా 200 మంది లబ్ధిదారులకు రెండో విడతలో ప్లాట్లను కేటాయించనున్నారు. ప్రస్తుతం వారికి ప్లాట్లు కేటాయించడానికి అధికారులు పనులు చేపట్టారు. కాగా లాటరీలో ప్లాట్లు పొందిన వారి నుంచి కొంత మంది పేర్లతో శాంపిల్గా సబ్రిజిస్ట్రార్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఎలాంటి సమస్యలు లేని వారి పేర్లతో రిజిస్ట్రేషన్లు పూర్తి చేయించనున్నట్లు అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడానికి దాదాపు నెల రోజులు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. -
అగ్రిమెంట్లు!
లావణి, అసైన్డ్ భూములపై అధికార పార్టీ నేతల కన్ను ● మంఖాల్ కేంద్రంగా మరో భూ దందా ● నిషేధిత జాబితాలోని భూమికి గుట్టుగా అగ్రిమెంట్లు ● రియల్టర్లకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ అధికారులు నిషేధిత భూములసాక్షి, రంగారెడ్డి జిల్లా: నాలా కన్వర్షన్, నిషేధిత జాబితాలో ఉన్న లావణి పట్టా భూమిపై ఎలాంటి అగ్రిమెంట్లు చెల్లవు. కానీ ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు ఉన్న ఓ రియల్టర్ ఏకంగా 33:67 రేషియోలో డెవలప్మెంట్ అగ్రిమెంట్ కం జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంలోని పెద్దల అండదండలు, రెవెన్యూ అధికారుల సహకారంతో డెవలపర్లు రెచ్చిపోతున్నారు. రైతులను మభ్యపెట్టి విలువైన భూములను అగ్గువకే కొల్లగొడుతున్నారు. ప్రభుత్వం ప్రతిషాత్మకంగా భావించిన ఫోర్త్సిటీకి ఆనుకుని ఉన్న మహేశ్వరం మండలం మంఖాల్ కేంద్రంగా ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఇప్పటికే పలు భూములను చెరబట్టిన రియల్టర్లు తాజాగా ఇదే రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 632/1/7లో మరో 1.05 ఎకరాల లావణి పట్టాకు గుట్టుగా అగ్రిమెంటు చేసుకోవడం గమనార్హం. క్రయవిక్రయాలు నిషేధం మిగులు భూముల చట్టం రాకతో భూస్వాముల నుంచి పెద్ద మొత్తంలో భూములు ప్రభుత్వం చేతికి అందాయి. ఈ మిగులు భూములను అప్పటి ప్రభుత్వాలు స్థానికంగా ఉన్న పేదలు సాగు చేసుకుంటూ జీవించేందుకు పంచాయి. రెవెన్యూ యాక్ట్ ప్రకారం ఈ భూములను అమ్మడం, కొనడం నిషిద్ధం. కానీ జిల్లాలో భూముల ధరలు ఆకాశాన్నంటడం, తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తంలో సంపాదించే అవకాశం ఉండటంతో కొంత మంది రియల్టర్లు ఈ భూములపై కన్నేశారు. పేద రైతులకు డబ్బులను ఆశచూపి, తక్కువ ధరలకే ఆయా భూములను చేజిక్కించుకుంటున్నారు. ఈ భూములు రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో 99 ఏళ్ల లీజు ప్రతి పాదికన అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఆ తర్వాత తమకున్న పరిచయాలు, ఆర్థిక బలంతో పైరవీల ద్వారా సీలింగ్ భూములను పట్టా భూములుగా మార్చేస్తున్నారు. జిల్లాలో ఇలా ఇప్పటికే మెజార్టీ భూమలు అన్యాక్రాంతమైనట్లు సమాచారం. ఫోర్త్సిటీ రాకతో మరిన్ని అక్రమాలు మీర్ఖాన్పేట్ కేంద్రంగా 30 వేల ఎకరాల్లో ప్రభుత్వం ఫోర్త్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు సైతం చేపట్టింది. ఈ ఫోర్త్సిటీకి ఇరువైపులా విస్తరించిన ఉన్న మహేశ్వరం, కందుకూరు, కడ్తాల్, ఇబ్రహీంపట్నం, మాడ్గుల, యాచారం, మంచాల మండలాల్లోని పట్టా భూములతో పాటు అసైన్డ్ భూములపై రియల్టర్ల కన్నుపడింది. ఇప్పటికే ఆయా భూములు భారీగా చేతులు మారాయి. అసైన్డ్, భూదాన్, లావణి భూముల పక్కనే ఉన్న కొద్దిపాటి పట్టా భూములను కొనుగోలు చేసి, అసైన్డ్, లావణి భూములను కలిపేస్తున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలతో రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి పట్టా భూములుగా మార్చేస్తున్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సహా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి ఫోర్టల్ నిషేధిత జాబితాలో ఆయా సర్వే నంబర్లు కన్పిస్తున్నా.. క్షేత్రస్థాయిలో భూముల పొజిషన్ మాత్రం కన్పించడం లేదు. -
దివ్యాంగులకు రాయితీపై రుణాలు
జిల్లాకు 42 యూనిట్లు మంజూరు ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా 2025–26 సంవత్సరానికి జిల్లాలోని దివ్యాంగులకు ఉపాధి కల్పించడానికి పునరావాస పథకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి శ్రీలత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులకు ఉపాధి పునరావాస పథకం కింద జిల్లాకు 42 యూనిట్లు మంజూరయ్యాని చెప్పారు. రూ.50 వేలకు 41 యూనిట్లు, రూ.3 లక్షలకు ఒక్కటి రాయితీతో మంజూరు చేశారన్నారు. అవసరమైన దివ్యాంగులు వెబ్సైట్లో ధ్రువీకరణ పత్రాలు జత చేసి ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. జిల్లా కమిటీ ఎంపిక చేసిన వారికి రుణాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు 88979 58726 నంబర్లో ఉదయం 10 గంటల నుంచి సాయత్రం 5గంటల వరకు సంప్రదించాలన్నారు. ట్రాన్స్జెండర్ల ఉపాధి కోసం దరఖాస్తులు ఆహ్వానం ఇబ్రహీంపట్నం రూరల్: జిల్లా పరిధిలో నిరు ద్యోగులైన ట్రాన్స్జెండర్లకు ప్రైవేట్రంగ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించడంతో పా టు, స్వయం ఉపాధి రంగాల్లో రాణించేందుకు నైపుణ్య శిక్షణ అందిస్తామని జిల్లా సంక్షేమాధి కారి శ్రీలత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖా స్తు చేసుకోవాలని సూచించారు. డ్రైవింగ్, ఫొ టో, వీడియో గ్రఫీ, బ్యుటీషియన్, జ్యూట్ బ్యా గ్ మేకింగ్, టైలరింగ్, లాజిస్టిక్స్ రంగాల్లో నైపు ణ్య శిక్షణ కోసం ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 96035 25866 నంబర్లో సంప్రదించాలన్నారు. వేంకటేశ్వరస్వామి సేవలో హీరోయిన్ రష్మిక కందుకూరు: సినీ హీరోయిన్ రష్మిక మందన మంగళవారం మండల పరిధిలోని గూడూరు గ్రామంలోని వేంకటేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆమెను సన్మానించి స్వామి వారి జ్ఞాపిక అందజేశారు. ‘పాలమూరు–రంగారెడ్డి’పై స్పష్టత ఇవ్వాలి సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య కొందుర్గు: పదేళ్ల క్రితమే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ సర్వేకు రూ.10వేలు కోట్లు నాటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కేటాయించారని.. నేటికీ సర్వే చేపట్టకపోవడం బాధాకరమని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. మంగళవారం పార్టీ నాయకులు మాణిక్యరావు, అనిత ఆధ్వర్యంలో జిల్లేడ్ చౌదరిగూడ మండల సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జంగయ్య మాట్లా డుతూ.. ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం స్పష్ట త ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.9 వేల కో ట్ల ఖర్చుతో జూరాల బ్యాక్ వాటరుతో 73 కిలో మీటర్లు నిర్మాణం పనులు చేపడితే 12 మండలాలలోని వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టు పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జంగయ్య, మండల కార్యదర్శి వెంకటేశ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎన్కేపల్లి భూముల కేసులో నిందితుడి పరార్ మొయినాబాద్: ఎన్కేపల్లిలోని రూ.వెయ్యి కోట్ల విలువైన భూములను నకిలీ పత్రాలతో విక్రయించిన వ్యక్తి కుటుంబంతో సహా అజ్ఞాతంలో కి వెళ్లిపోయాడు. 180 రెవెన్యూ సర్వే నంబర్ లోని 99.14 ఎకరాల ప్రభుత్వ భూమిని, ఇదే గ్రామానికి చెందిన డప్పు రమేశ్ ఫేక్ డాక్యు మెంట్లతో నగరానికి చెందిన పలువురు వ్యక్తుల కు విక్రయించేందుకు అగ్రిమెంట్ చేసుకున్నా డు. ఇందుకోసం అడ్వాన్స్గా రూ.1.50 కోట్లు తీసుకున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై బి.లింగారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం రాత్రి కేసు నమోదు చేశా రు. మంగళవారం ఉదయం రమేశ్ను అదుపు లోకి తీసుకోవాలని పోలీసులు భావించగా అప్పటికే అతను పరారైనట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలోని ప్రజాప్రతినిధులు, పెద్దలకు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ట్లు ప్రచారం సాగుతోంది. రమేష్ను అదుపులోకి తీసుకుని విచారిస్తేనే అన్ని విషయాలు బయటకొస్తాయని పోలీసులు చెబుతున్నారు. అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. -
పదవుల పండుగ
● ఎమ్మెల్యే ఎంపిక చేసిన వారే కాంగ్రెస్ మండల అధ్యక్షులు ● ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో భారీగా ఆశావహులు ● స్థానిక ఎన్నికల్లో ‘హస్త’గతమే లక్ష్యంగా నియామకం యాచారం: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులే సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులుగా గెలిచేలా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగా రెడ్డి దృష్టి సారించారు. ఇందులో భాగంగా నియోజకవర్గ పరిధిలో పార్టీ మండలాధ్యక్షుల నియామకానికి సమాలోచనలు చేస్తున్నారు. తన అనుచరులతో కలిసి ఏ వ్యక్తిని మండల అధ్యక్షుడిని చేస్తే పార్టీకి మేలు జరుగుతుందనే విషయమై చర్చలు సాగిస్తున్నారు. కొంతమంది ఫలానా వ్యక్తిని నియమిస్తే పార్టీకి మేలు చేకూరుతుందని.. సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లే సత్తా ఉందని చెబుతుండగా.. మరికొందరు ఫలానా నేతను వద్దంటూ ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో అంగ, ఆర్థిక బలమున్న నాయకులకే బాధ్యతలు అప్పగిస్తే మేలు జరుగుతుందని ఎమ్మెల్యే నిర్ణయించినట్లు తెలుస్తోంది. కుల సమీకరణలు కాంగ్రెస్ సర్కార్ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న నేపథ్యంలో బీసీలకు ప్రాధాన్యం కల్పించే అవకాశం ఉంది. ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, అబ్దుల్లాపూర్మెట్ మండలాల అధ్యక్షుల ఎంపికను పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే కసరత్తు చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనూ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో అత్యధికంగా కాంగ్రెస్ బలపర్చిన నేతలే సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులుగా గెలుపొందారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న నేపథ్యంలో అన్ని మండలాల్లో కాంగ్రెస్ జెండానే ఎగురవేసేలా చర్యలు తీసుకుంటున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపేందుకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇప్పటికే ఆయా మండలాల్లో సుడిగాలి పర్యటనలు చేసి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఎమ్మెల్యే ఆశీస్సులుంటేనే.. ఇప్పటికే కొందరు ఆశావహులు మండల అధ్యక్షులుగా తమ పేర్లే ప్రకటించేలా చూడాలని టీపీ సీసీ పెద్దలు, మంత్రుల నుంచి ఎమ్మెల్యేకు ఫోన్లు చేయిస్తున్నారు. ఇందుకు సమాధానంగా నియో జకవర్గంలో ఎవరిని అధ్యక్షుడిని చేస్తే పార్టీకి మేలు జరుగుతుందో తనకు తెలుసంటూ సున్నతంగా సమాధానం ఇస్తున్నట్లు సమాచారం. మండల అధ్యక్షుల నియామకంలో ఆయన ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ ఎన్ని కల పరిశీలకులు సైతం తాను పంపిన పేర్లే ఫైన ల్ చేయాలని కోరినట్లు తెలిసింది. ఎమ్మెల్యే ఆశీస్సులున్న వారే పార్టీ మండల, మున్సిపల్ అధ్యక్షులుగా ఎంపికయ్యే అవకాశం ఉంది. -
భూముల వద్ద రైతుల ఆందోళన
ఎన్కేపల్లి రైతులకు పట్టాల పంపణీ ఉద్రిక్తతల కు దారితీసింది. పరిహారం పెంచాలని కోరు తూ కొంతమంది బాధితులు మంగళవారం భూముల వద్ద రిలే దీక్షలు చేపట్టారు. బీఆర్ఎస్ నాయకుడు కార్తీక్రెడ్డి అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు సంఘీభావం తెలిపారు. అనంతరం చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళతో ఫోన్లో మాట్లాడారు. బాధితులకు అన్యాయం చేయొద్దని, రైతులను విడదీసి పట్టాలు ఎలా పంపిణీ చేస్తా రని ప్రశ్నించారు. ఈ విషయమై అడిగేందుకు అక్కడికే వస్తున్నామంటూ మహిళా రైతులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎంపీడీఓ కార్యాలయానికి కదిలారు. పోలీసులు బారికేడ్లు పెట్టి వీరిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఓ మహిళా కానిస్టేబుల్ రైతు చాకలి బాలమణిని కొట్టడంతో ఆమె పెద వికి గాయమైంది. ఈక్రమంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. వీరిని పోలీసులు కట్టడి చేయడంతో ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గేటు వద్దే ఆందోళన చేపట్టారు. ఎన్కేపల్లి మాజీ సర్పంచ్ అమర్నాథ్రెడ్డి కారు అటు వైపు రావడంతో ఆందోళనకా రులు వాహనంపై దాడి చేశారు. అడ్డుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కొద్దిసేపటి తర్వాత సొంత పూచీకత్తుపై వదిలేశారు. -
విద్యార్థుల ‘పొలం బాట’
ఇబ్రహీంపట్నం రూరల్: దేశానికి అన్నం పెట్టే అన్నదాత పడే కష్టాన్ని తెలియజెప్పడంతో పాటు పంటల సాగుపై అవగాహన కల్పించే దిశగా ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం సోమవారం విద్యార్థులు పొలంబాట పట్టించింది. వీరిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లిన సిబ్బంది వరి నాటు విధానాన్ని ప్రత్యక్షంగా చూపించారు. నిత్యం పాఠశాల గదుల్లో కూర్చుని బోర్డుపై పాఠాలు వినే చిన్నారులు.. పొలంలో గంతులేస్తూ సరదాగా కొత్త పాఠం విన్నారు. స్వయంగా నారు తీసుకువచ్చి, నాటు కూడా వేశారు. పొలంలో సందడి చేస్తున్న విద్యార్థులు -
బీఆర్ఎస్కే ప్రజల మద్దతు
చేవెళ్ల: రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పాలనే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితారెడ్డి అన్నారు. నగరంలోని ఆమె నివాసంలో సోమవారం మండలంలోని ముడిమ్యాలకు చెందిన కాంగ్రెస్పార్టీ నాయకులు, యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగు చెందిపోయారన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయటంతో పూర్తిగా విఫలమయ్యారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పని రాష్ట్రంలో అయిపోయిందని మళ్లీ బీఆర్ఎస్ పాలనే కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే వలసలు పెరుగుతున్నాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసి సత్తాను చాటుకుంటుందన్నారు. పార్టీలోకి వచ్చిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ క్రిష్ణారెడ్డి, నాయకులు ఆంజనేయులు, ప్రభాకర్, నారాయణ, రాజు, శశిపాల్, వెంకటేశ్, క్రిష్ణ, నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరోపక్క చేవెళ్లలోని పార్టీ కార్యాలయం వద్ద రాష్ట్ర యువ నాయకుడు కార్తీక్రెడ్డి సమక్షంలో రేగడిఘనాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి బీఆర్ఎస్లోకి పలువురి చేరిక -
ఔషధ మొక్కలకు భారతదేశం పుట్టినిల్లు
కందుకూరు: ఔషధ మొక్కలకు భారతదేశం పుట్టినిల్లని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ విష్ణుప్రియ అన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాంలో భాగంగా సోమవారం మండలంలోని నేదునూరు మోడల్ స్కూల్లో 20 రకాల ఔషద మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రపంచానికి వైద్యాన్ని, ఔషధాన్ని పరిచయం చేసిన గొప్ప దేశం మనదని కొనియాడారు. రోజు వారి దినచర్యలో ఔషధ మొక్కల వినియోగం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, వాటి ద్వారా పొందే ప్రయోజనాలు విద్యార్థులకు వివరించడానికి మెడిసినల్ గార్డెన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గురురాజారెడ్డి, పుష్పలత, శ్రీనివాసాచారి, సురేష్, కొండల్రావ్, దామోదర్, వెంకటరమణ, జ్యోతి, సునీత, శేఖర్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ రజనీకాంత్, విద్యార్థులు పాల్గొన్నారు. -
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
చేవెళ్ల: విద్యారంగ సమస్యలను పరిష్కరించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, అరుణ్కుమార్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సోమవారం కళాశాలల విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా నేటికీ విద్యాశాఖ మంత్రిని నియమించకపోవటం దురదృష్టమన్నారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.8,700 కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్స్ వెంటనే విడుదల చేయాలన్నారు. గతంలోనే పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికై నా స్పందించకపోతే ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న కళాశాలల విద్యార్థులతో చేవెళ్ల ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకొని విద్యార్థి సంఘం నాయకులను అరెస్ట్ చేసి ధర్నాను విరమింపజేశా రు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సమీర్, యశ్వంత్, చరణ్గౌడ్, చందు, తేజ, చిరంజీవి, ప్రశాంత్, ఆకాశ్, సోఫియాన్, మోసిన్, అజర్, వంశీ, సాయి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.చేవెళ్లలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చేవెళ్ల: ముందు వెళ్తు న్న కారు సడెన్ బ్రేక్ వేయటంతో వెనకనుంచి బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చనువెళ్లి గ్రామానికి చెందిన తలారి నర్సింలు(38) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం రాత్రి తన బైక్పై చేవెళ్లకు వెళ్తుండగా పామెన బస్స్టేజి సమీపంలోని పెట్రోల్ బంకు సమీపంలో ముందు వెళ్తున్న కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో నర్సింలు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్పై నుంచి ఎగిరి కిందపడి తీవ్రంగా గాయపడిన నర్సింలును చేవెళ్లలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య నలుగురు పిల్లలు ఉన్నారు. పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుదాఘాతంతో గేదె మృతి షాబాద్: విద్యుదాఘాతంలో పాడి గేదె మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని నాన్ంధార్ఖాన్పేట్లో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేకల మహేందర్ తన పాడి గేదె పొలంలో మేత మేస్తుండగా ప్రమాదవశాత్తు తెగిపడిన విద్యుత్ వైర్లకు తగిలి షాక్తో అక్కడికక్కడే మృతి చెందింది. విద్యుత్ స్తంభాలతో సహా వైర్లు కిందపడినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నారు. జారి పడి కూలీ మృతి గచ్చిబౌలి: గ్రిల్పై కూర్చుని ఫోన్ మాట్లాడుతూ ఓ కూలీ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఝార్ఖండ్, చత్ర జిల్లా, సిల్డాగ్కు చెందిన సుఖి భుయాన్(26) తన సోదరుడు చర్కు కుమార్తో కలిసి నగరానికి వలస వచ్చారు. గోపన్పల్లిలో అపర్ణ కన్స్ట్రక్షన్ కంపెనీలో కూలీగా పని చేస్తూ ఎన్టీఆర్ నగర్లో లేబర్ క్యాంప్ సి–2లో నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి మొదటి అంతస్తులో గ్రిల్పై కూర్చుని ఫోన్ మాట్లాడుతూ జారి కింద పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. మొదట సిటిజన్ ఆస్పత్రికి తరలించి అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మట్టి తరలిస్తున్న వాహనాలు సీజ్ దోమ: అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తున్న వాహనాలను టాస్క్ఫోర్స్ అధికారులు శనివారం రాత్రి పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ సీఐ అన్వర్ పాషా తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఊటుపల్లి గ్రామ సమీపంలో కొందరు టిప్పర్లలో మట్టిని నింపి యఽథేచ్ఛగా తరలిస్తున్నారని సమాచారం అందిందన్నారు. ఈ మేరకు సిబ్బందితో కలిసి అక్కడి చేరుకొని ఐదు టిప్పర్లు, ఓ జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను స్థానిక పోలీసులు సీజ్ చేసి ఏడుగురిపై కేసు నమోదు చేశారు. అక్రమ మట్టి వ్యాపారం చేస్తే ఉపేక్షించేది లేదని టాస్క్ఫోర్స్ సీఐ హెచ్చరించారు. -
ఊరిస్తున్న మబ్బులు
షాబాద్: మబ్బులు ఊరిస్తున్నాయి.. వాన ఎప్పుడు కురుస్తుందోనని రైతులు ఆకాశం వైపు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. సాధారణంగా కాలంతో పాటు కార్తెలను నమ్ముకొని వ్యవసాయం చేస్తుంటారు. బలమైన కార్తెల్లో పంటలను సాగు చేసినట్లయితే అధిక దిగుబడులు వస్తాయని రైతుల నమ్మకం. అందుకు అనుగుణంగానే ఈ ఏడాది రుతుపవనాలు కూడా ఇరవై రోజులు ముందుగానే ప్రవేశించడంతో రోహిణి కార్తెలోనే వర్షాలు కురిశాయి. దాంతో రైతులు దుక్కులను దున్నుకొని సాగుకు సిద్ధం చేశారు. ఆ తరువాత ఆరుద్ర కార్తెలో కురిసిన అడపాదపా జల్లులకు పత్తి విత్తనాలను నాటారు. ఇరవై రోజులుగా వర్షాలు లేకపోవడంతో విత్తనాలు భూమిలోనే ఉండిపోయాయి. వాతావరణం చల్లబడుతోంది కానీ చినుకు మాత్రం నేలజారడం లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో లోటు వర్షపాతం గత నెలలో జిల్లా వ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదైంది. ఈ నెలలో కూడా చిరుజల్లులు మాత్రమే కురిశాయి. జూన్ నెలలో జిల్లాలో సగటున 10 రోజులు మాత్రమే వర్షం కురియగా, అధిక లోటు వర్షపాతమే రికార్డు అయింది. పత్తికి మాత్రమే అనుకూలం జూన్ నెలలో మొదటి, నాలుగో వారాల్లో కురిసిన మోస్తరు వర్షాలు, ప్రస్తుతం కురుస్తున్న చిరుజల్లులు పత్తి పంటకు అనుకూలంగా మారాయి. గత నెల మొదటి వారంలో కురిసిన వర్షానికి రైతులంతా పత్తి గింజలు నాటారు. పక్షం రోజులు గడిచినా వానలు కురియకపోవడంతో ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే జూన్ చివరి వారం, ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో పత్తి పంటలకు ప్రాణం పోసినట్లు అయింది. వరి సాగు ఆలస్యం సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు కురియకపోవడంతో వరి సాగు ఆలస్యం అవుతుంది. గత నెల చివరి వారంలో కురిసిన వర్షాలకు కొందరు రైతులు వడ్లను అలికారు. ప్రస్తుతం వరి పైరు నారు దశలో ఉంది. మరిన్ని వర్షాలు కురిస్తే నాట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. బోర్లు ఉన్న రైతులు నాట్లు వేసేందుకు కూడా రెడీ అవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా బోర్లు లేని కర్షకులు ఇప్పటికీ వడ్లు అలకకుండా మరిన్ని వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ముఖం చాటేసిన వరుణుడు వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతన్నలు -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
మొయినాబాద్: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చేవెళ్ల ట్రాఫిక్ సీఐ వెంకటేశం అన్నారు. మొయినాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై సోమవారం ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. పెండింగ్ చలాన్లను వాహనదారులతో కట్టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించవద్దన్నారు. ద్విచక్రవాహనదారులు హెల్మెంట్ తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు. తనిఖీలు నిర్వహించినవారిలో ట్రాఫిక్ ఏఎస్సైలు, కానిస్టేబుళ్లు ఉన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టండి డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జగన్ ఇబ్రహీంపట్నం రూరల్: జిల్లాలో విచ్చలవిడిగా ప్రైవేట్ ఆస్పత్రుల ఫీజుల దోపిడీని అరికట్టాలని డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ నారాయణరెడ్డికి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పి.జగన్ మాట్లాడుతూ.. ఫీజుల దోపిడీ విచ్చలవిడిగా కొనసాగుతుందన్నారు. ప్రజల అవసరాన్ని అవకాశంగా తీసుకొని రూ.లక్షలు దండుకుంటున్నారని మండిపడ్డారు. అవసరం లేని టెస్టులు, మందులు ఇస్తున్నారన్నారు. ఆపరేషన్లు అవసరం లేకున్నా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆస్పత్రిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంస్థ జిల్లా ఉపాధ్యక్షుడు శివశంకర్, సభ్యుడు రాఘవేందర్, మహేష్, వినోద్, శ్యామ్ పాల్గొన్నారు. బ్రేక్ డౌన్.. ట్రాఫిక్ జాం గచ్చిబౌలి: రద్దీ సమయాల్లో వాహనాలు రోడ్లపై బ్రేక్డౌన్ అవుతుండడంతో ట్రాఫిక్ జాం నెలకొంటుంది. వాహనాల రాకపోకలకు అంతరాయం కల్గుతోంది. సోమవారం ఉదయం 10.10 గంటల సమయంలో గచ్చిబౌలి ఫ్లై ఓవర్పై ఓ ప్రైవేట్ బస్సు బ్రేక్డౌన్ అవడంతో టెలికాంనగర్ నుంచి ఇందిరానగర్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు ఆటంకం కల్గింది. మాదాపూర్, కూకట్పల్లి, మెహిదీపట్నం తదితర ప్రాంతాల నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, లింగంపల్లి వైపు వెళ్లే వాహనాల రాకపోకలు మందకొడిగా సాగాయి. మరమ్మతులు చేసిన అనంతరం రాయదుర్గం ట్రాఫిక్ పోలీసులు బస్సును పక్కకు తరలించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య దుద్యాల్: తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండల పరిధిలోని హస్నాబాద్లో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, కొడంగల్ ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన చాకలి వెంకటమ్మ, ఇస్వప్పకు ముగ్గురు కుమారులు. వ్యవసాయం చేసుకునే తల్లిదండ్రులకు పెద్ద కుమారుడు నవీన్(24) చేదోడువాదోడుగా ఉండేవాడు. ఇటీవల తన బైక్పై గుజరాత్, ఆరుణాచలంతో పాటు ఇతర సుదూర ప్రాంతాలకు వెళ్లి వచ్చాడు. ఈ విషయమై తల్లిదండ్రులు అతన్ని మందలించారు. బైక్పై వందల కిలోమీటర్ల ప్రయాణం సురక్షితం కాదని, ప్రమాదాలు జరిగే అవకాశంతో పాటు ఆరోగ్యం పాడవుతుందని చెప్పారు. పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల పేరుతో మరోసారి బైక్పై వెళ్లొద్దని సూచించారు. దీంతో మనస్తాపానికి గురైన నవీన్ సోమవారం ఉదయం పొలానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నాడు. చేతికి వచ్చిన చెట్టంత కొడుకు ఇలా చేస్తాడని ఊహించలేదని బాధిత తల్లిదండ్రులు రోదించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
కల్లు దుకాణాలపై ఎకై ్సజ్ దాడులు
యాచారం: కల్లు దుకాణాలపై ఇబ్రహీంపట్నం ఎకై ్సజ్ పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. సీఐ సీతారాం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పలు దుకాణాలపై దాడులు నిర్వహించి, విక్రయించే కల్లు నాణ్యమైనదేనా అని పరిశీలించారు. కొన్ని సీసాల్లో నిల్వ ఉన్న కల్లు తీవ్ర దుర్వాసన వస్తుండడంతో పరీక్షల నిమిత్తం శాంపిల్స్ సేకరించారు. కల్తీ కల్లు విక్రయిస్తే వ్యాపారులపై కేసులు తప్పవని హెచ్చరించారు. పరిశుభ్రత లేకుండా కల్లును నిల్వ చేసి ఉంచడం, సరైన జాగ్రత్తలు తీసుకోకుండా విక్రయించి రోగాల బారిన పడేలా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. -
విన్నపాలు.. బుట్టదాఖలు
‘ప్రజావాణి’కి జనాల బారులుసాక్షి, రంగారెడ్డిజిల్లా/ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ జిల్లాలో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుల నుంచి అర్జీలు స్వీకరించడం.. ఆన్లైన్లో నమోదు చేయడం మినహా శాశ్వత పరిష్కార మార్గం చూపడం లేదనే అపవాదు లేకపోలేదు. కలెక్టరేట్ చుట్టూ తిరిగి తిరిగి మోకాళ్లు అరుగుతున్నాయే కానీ.. సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని బాధితులు వాపోతున్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ పదేపదే చెబుతున్నా.. ఆయా శాఖల అధికారులు మాత్రం పెడచెవిన పెడుతూనే ఉన్నారు. ఫలితంగా అనేక వ్యయ ప్రయాసలకోర్చి సుదూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే కలెక్టరేట్కు చేరుకుంటున్న బాధితులు ఉసూరుమంటున్నారు. సాధారణంగా ప్రతి వారం 60 నుంచి 70 దరఖాస్తులు వస్తుండగా, తాజాగా ఈ వారం 152 అర్జీలు అందడం గమనార్హం. వీటిలో భూ సంబంధిత ఫిర్యాదులు 130 వరకు ఉండగా, ఇతర శాఖలకు సంబంధించినవి 22 వరకు ఉన్నాయి. వారం వారం అర్జీల వెల్లువ అపరిష్కృతంగానే సమస్యలు కలెక్టర్ ఆదేశించినాపట్టని క్షేత్రస్థాయి అధికారులు ప్రదక్షిణలు చేస్తున్న బాధితులు ఎనిమిదేళ్లుగా తిరుగుతున్నా ఇబ్రహీంపట్నం మండ లం నెర్రపల్లిలోని సర్వే నంబర్ 262లో 6.20 ఎకరాల పట్టా భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో భూదాన్ భూమిగా రికార్డైంది. ప్రస్తుతం నా వయసు 70 ఏళ్లు. ఎటూ నడవలేకపోతు న్నా. రికార్డుల్లో దొర్లిన తప్పును సరి చేయా లని ఎనిమిదేళ్లుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా. తిరిగి తిరిగి నా మోకాళ్లు అరిగిపోయాయే కానీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. – గుడ్ల సాయిలు యాదవ్, నెర్రపల్లి 20 సార్లు ఫిర్యాదు చేశా తలకొండపల్లి మండలం గట్టుఇప్పలపల్లి సర్వే నంబర్ 550, 542లలో 9.4 ఎకరాల పట్టా భూమి ఉంది. నా భూమికి ఆనుకుని సర్వే నంబర్ 550లో సీలింగ్ భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో సీలింగ్ భూమిని పట్టా భూమిగా మార్చి.. పట్టా భూమిని సీలింగ్ భూమిగా మార్చారు. నాకు రెండు కాళ్లు పని చేయడం లేదు. వీల్చైర్లో కలెక్టరేట్కు రావాల్సి వస్తోంది. ఇప్పటికే 20 సార్లు వచ్చి పోయాను. – గోవింద కృష్ణయ్య, గట్టుప్పలపల్లి -
ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
ఇబ్రహీంపట్నం రూరల్: ముఖ్యమంత్రిరేవంత్రెడ్డిని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నేతలు కలిసి ఘన స్వాగతం పలికారు. అబ్దుల్లాపూర్మెట్ మండలంలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన సీఎంకు ఆదిబట్ల మున్సిపల్ మాజీ చైర్మన్ మర్రి నిరంజన్రెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్రెడ్డి పుష్పగుచ్ఛం అందజేశారు. శంకర్పల్లికి వచ్చిన ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ శంకర్పల్లి: ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్ సోమవారం శంకర్పల్లి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చారు. మొయినాబాద్ మండలం చిన్నమంగళారం గ్రామ పరిధిలోని సుమారు 2000 వేల గజాల ఇంటి స్థలాన్ని అమ్మేందుకు వచ్చినట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి. దర్శకుడు వచ్చిన విషయం తెలియడంతో పలువురు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. విద్యార్థులు యుద్ధ విద్యల్లో రాణించాలి షాద్నగర్: విద్యార్థులు యుద్ధ విద్యల్లో రాణించాలని స్కూల్ స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తిన చెన్నయ్య ఆకాంక్షించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర పాఠశాలల క్రీడల కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 12వ సౌత్ ఇండియా కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో పట్టణంలోని గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు గీత వెండి పతకం, ఐశ్వర్య రజిత పతకం సాధించారు. వారిని సోమ వారం కళాశాలలో సత్కరించారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతోపాటు, ఆటలు, యుద్ధ విద్యలు అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శైలజ, వైస్ ప్రిన్సిపాల్ జ్యోతి, పీడీ రేణుక, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి తుర్కయంజాల్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. పురపాలక సంఘం పరిధి తుర్కయంజాల్లోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. కార్యక్రమంలో కమిషనర్ కె.అమరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షురాలు, మాజీ కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ, నాయకులు తాటిచెట్టు అశోక్ గౌడ్, తూళ్ల నర్సింహ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షుడు గౌని రాజు గౌడ్, మాజీ అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆలయ భూములను ఆక్రమిస్తే చర్యలు
● కబ్జాకు గురైతే సమాచారం ఇవ్వండి ● దేవాదాయ శాఖ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ కుల్కచర్ల: ఆలయ భూములను ఆక్రమించినా, క్రయ విక్రయాలు జరిపినా కఠిన చర్యలు తప్పవని దేవాదాయ శాఖ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ హెచ్చరించారు. సోమ వారం మంత్రి కొండా సురేఖ పర్యటనలో భాగంగా పాంబండ ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఎవరైనా దేవాలయ భూములను ఆక్రమిస్తే తమకు సమాచారం ఇవ్వాలని, అట్టి భూములను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఇటీవల కబ్జాకు గురైన తాండూరు సోమేశ్వర స్వామి ఆలయ భూమి (5 ఎకరాల 27 గుంటలు)ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 467 ఆలయాలకు 15, 779 ఎకరాల భూములు ఉన్నాయన్నారు. అర్చకుల ఆధీనంలో 4,740 ఎకరాలు ఉండగా, 2,302 ఎకరాలు కౌలుకు ఇచ్చినట్లు చెప్పారు. కౌలు ద్వారా రూ. 60 లక్షల ఆదాయం వస్తోందన్నారు. సాగుకు యోగ్యం కాని భూములు 3,035 ఎకరాలు ఉన్నా యని, మరో 4,481 ఎకరాలకు సంబంధించి కోర్టుల్లో కేసులు నడుస్తున్నట్లు చెప్పారు. ఆలయాల అభివృద్ధికి అందరి సహకారంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు ప్రణీత్కుమార్, శాంతకుమార్, రాజేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, బాలనర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
హెచ్ఎంను తొలగించాలని ధర్నా
● పాఠశాలకు చేరుకుని ఆరా తీసిన డీఈఓ ● ప్రధానోపాధ్యాయుడిని బదిలీ చేస్తున్నట్లు వెల్లడిషాబాద్: విద్యార్థులతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ బూతు మాటలతో ఇబ్బంది పెడుతున్న షాబాద్ బాలుర పాఠశాల హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సోమ వారం ఉదయం పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు విద్యార్థులతో కలిసి ధర్నాకు దిగారు. తమ పిల్లలను బూతు మాటలు తిడుతూ, కాళ్లతో తన్నిన హెచ్ఎం గోవింద్ను వెంటనే విధుల నుంచి తొలగించాలని బైఠాయించారు. వీరికి పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి గీత, పీడీఎస్యూ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ మద్దతు తెలిపారు. కలెక్టర్, డీఈఓ వచ్చేదాకా కదిలేది లేదని తేల్చిచెప్పారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాధికారి సుశీందర్రావు వెంటనే అక్కడికి చేరుకున్నారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో సమావేశమై హెచ్ఎంపై వచ్చిన ఆరోపణలపై ఆరా తీశారు. కలెక్టర్ ఆదేశానుసారం పాఠశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు. హెచ్ఎం గోవింద్ను బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. గతంలోనూ ఆయనపై ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని, వాటిపై కూడా విచారణ జరిపిస్తామన్నారు. తర్వాత సుశీందర్రావు షాబాద్ కేజీబీవీ పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. బాలికల ఉన్నత పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మణ్నాయక్, సిబ్బంది పాల్గొన్నారు. -
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి
● ప్రభుత్వ భూములను కాపాడండి ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఇబ్రహీంపట్నం రూరల్: అన్యాక్రాంతమైపోతున్న ప్రభుత్వ భూములను కాపాడి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. నిరుపేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో సోమ వారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాన్వెస్లీ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను వెలికి తీయాలన్నారు. పేదలు ఇళ్లు లేక, జాగలు కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డీజీ నర్సింహారావు, జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామేలు, చంద్రమోహన్, డి.జగదీష్, కందుకూరి జగన్ పాల్గొన్నారు. -
మొగిలిగిద్ద కళాశాలను అభివృద్ధి చేయండి
షాద్నగర్: ఇంటర్మీడియెట్ విద్యామండలి కమిషనర్ కృష్ణ ఆదిత్యను సోమవారం ఫరూఖ్నగర్ మండల పరిధిలోని మొగిలిగిద్ద గ్రామస్తులు కలిశారు. ప్రొఫెసర్ హరగోపాల్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన శ్యాంసుందర్, మల్లేష్ కమిషనర్ను కలిసి మొగిలిగిద్ద ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి కోసం వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గ్రామంలో పర్యటించినప్పుడు కళాశాల అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారని తెలిపారు. వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభించాలని కోరారు. సివిక్స్ పోస్టు ఖాళీగా ఉందని గెస్టు లెక్చరర్ను నియమించాలని, విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని, టెలివిజన్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన కమిషనర్ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
ఆయిల్ పామ్ సాగు మేలు
షాబాద్: రైతులు ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. మండల పరిధిలోని పెద్దవేడులో రైతు పీసరి అనిత సురేందర్రెడ్డి పొలంలో చేపట్టిన ఆయిల్ పామ్ ప్లాంటేషన్ను సోమవారం ఆయన ప్రారంభించారు. మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా పది ఉమ్మడి జిల్లా ల్లో ఆయిల్పామ్ కంపెనీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నగరానికి ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లా పచ్చగా ఉంటేనే తెలంగాణ మొత్తం పచ్చబడుతుందని పేర్కొన్నారు. రైతులు సాగు చేసే పంటలకు కావాల్సిన డ్రిప్ పరికరాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు ఎకరానికి ప్రభుత్వమే రూ.51వేలు ఖర్చులకు అందిస్తుందని చెప్పారు. గుడిమల్కాపూర్ మార్కెట్ను అజీజ్నగర్లో ఏర్పాటు చేయాలన్న ఇక్కడి ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ యస్మిన్భాషా, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సురేశ్, డీసీఓ సుధాకర్, చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ, పొల్యూషన్ బోర్డు మెంబర్ చింపుల సత్యనారాయణరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఉద్యానవనశాఖ అధికారులు, ఎంపీటీసీ మాజీ సభ్యులు, మాజీ సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. ● మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు -
బస్తీమే సవాల్.. తెల్లారితే పరార్
తల్లీపిల్లల ఆచూకీ లభ్యం తప్పిపోయిన తల్లీపిల్లల ఆచకూకీ లభ్యమైన సంఘటన కేశంపేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.8లోuకేశంపేట: ‘హైడ్రా పేరుతో పేదల గుడిసెలు కూల్చేందుకు బుల్డోజర్లు వెళ్తున్నాయని, పెద్దల ఇళ్ల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే.. బస్తీమే సవాల్ అంటాడు, తెల్లారితే పరార్ అవుతాడు’ అని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మండలంలోని వేములనర్వలో శనివారం జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కాకునూరు గ్రామంలో స్థానిక మహిళలతో కలిసి పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలందరికీ రూ.2,500 చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఒక్కో మహిళకు 18 నెలలకు సంబంధించిన రూ.45 వేలు చెల్లించాలని కోరుతూ ఢిల్లీలోని సోనియాగాంధీ అడ్రస్కు పోస్టు కార్డులు పంపించారు. రైతుబంధు సా యాన్ని పెంచుతామని, రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. రూ.2 లక్షల కోట్ల అప్పులు తెచ్చినప్పటికీ అభివృద్ధి చేయడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. ఫ్రీ బస్సు ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం బస్సుల సంఖ్య పెంచకుండా ఇబ్బంది పెడుతోందన్నారు. కరువుతో విలవిల్లాడిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు. ఆయన హయాంలో పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం తొంభై శాతం పూర్తయిందని, కేవలం పది శాతం పనులను చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదని మండిపడ్డారు. అమ్మ ఒడి వాహనాల్లో డీజిల్ లేక తోయాల్సిన పరిస్థితి హన్వాడలో చూశామన్నారు. తమ పాటలతో ఆకట్టుకున్న కాకునూ రుకు చెందిన అక్కమ్మ, రాములమ్మ జానపద బృందాన్ని శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ గండ్ర జగదీశ్వర్గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ అనురాధ పర్వాత్ రెడ్డి, కాకునూర్ మాజీ సర్పంచ్ గండ్ర లక్ష్మమ్మ, మాజీ ఎంపీటీసీ రమాదేవి కోటీశ్వర్, జంగారెడ్డి, రాములు, కుమారస్వామి పాల్గొన్నారు. ఇదీ ముఖ్యమంత్రి తీరు జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభయహస్తం మేనిఫెస్టో అమలుకు పోస్టుకార్డు ఉద్యమం సోనియాగాంధీకి లేఖలు -
చిరుతల కోసం అన్వేషణ
పహాడీషరీఫ్: బాలాపూర్లోని ఆర్సీఐ (రీసెర్చ్ సెంటర్ ఇమారత్)లో చిరుత పులులు సంచరించాయన్న వదంతుల నేపథ్యంలో అటవీశాఖ అధికారులు శనివారం వాటి జాడ కోసం గాలించారు. ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. ఆర్సీఐలో వాచ్మెన్గా పనిచేస్తున్న వ్యక్తి మూడు రోజుల క్రితం చిరుత కనిపించిందంటూ అధికారులకు వెల్లడించడం, మరుసటి రోజు ఓ శునకం ఇదే ఆవరణలో మృతి చెందడంతో చిరుతలు తిరుగుతుండొచ్చని భావించారు. ముందు జాగ్రత్తలో భాగంగా ఈ ఆవరణలోనే ఉన్న డిఫెన్స్ ల్యాబోరేటరీస్ స్కూల్ ప్రిన్సిపాల్.. విద్యార్థుల తల్లిదండ్రులకు ఇదే విషయాన్ని నోటీస్ రూపంలో పంపి, పాఠశాల నుంచి బయటకు వెళ్లకుండా చూసుకోవాలన్నారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అటు అటవీ శాఖ, ఇటు బాలాపూర్ పోలీసులు రంగంలోకి దిగారు. ఆర్సీఐ పరిసరాల్లో చిరుతల పాదముద్రల కోసం అన్వేషించారు. అలాంటి ఆనవాళ్లు ఏవీ లభించలేదని బాలాపూర్ ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్ తెలిపారు. వేరే ఏదైనా జంతువును చూసి చిరుతగా భావించి ఉండొచ్చని అటవీశాఖ అధికారులు తెలిపినట్లు తెలిసింది.ఆనవాళ్లు లభించలేదన్న అధికారులు -
డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం
వికారాబాద్: డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలని ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. జిల్లా కేంద్రం వికారాబాద్లో శనివారం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ నూతన కార్యాలయ భవవాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయితో పాటు ఇతర మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. పోలీస్, ఎకై ్సజ్ శాఖల అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి ఇవి ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయో నిఘా పెట్టాలని సూచించారు. ఇందుకోసం అవసరమైతే ఇతర రాష్ట్రాల సహకారం తీసుకోవాలన్నారు. ఈత, తాటి, కర్జూర చెట్లు పెంచాలి రాష్ట్ర వ్యాప్తంగా చెరువు కట్టల మీద, గుట్టలపైన, కాల్వల పక్కన ఈత, తాటి, కర్జూర వంటి మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రతి గ్రామంలో ఐదు ఎకరాల మేర స్థలంలో వీటిని నాటేలా చూడాలన్నారు. నగరానికి సమీపంలో ఉన్న వికారాబాద్ నుంచి హైదరాబాద్కు నీరా, కల్లు ఎగుమతి చేసే విషయంపై దృష్టి సారించాలని తెలిపారు. కల్లు దుకాణాలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ కల్తీ కల్లు విక్రయాన్ని అడ్డుకోవాలని ఆదేశించారు. ఇందుకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. అన్నివర్గాల ప్రజల ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కల్తీ కల్లు, మాదకద్రవ్యాల నివారణకు ప్రత్యేక శ్రద్ధ చూపా లని మహేందర్రెడ్డి, పల్లెలను పాడు చేస్తున్న డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపాలని ఎంపీ కొండా అన్నారు. కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ దశరథ్, సూపరింటెండెంట్ విజయభాస్కర్, అదనపు కలెక్టర్ సుధీర్, డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, ఆర్డీవో వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎకై ్సజ్ శాఖ సర్కిల్, సబ్ ఇన్స్పెక్టర్లు, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. కల్తీ కల్లు విక్రయాలను నిరోధించాలి ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వికారాబాద్లో శాఖ కార్యాలయం ప్రారంభం -
గోశాలకు సాగు భూములెందుకు?
మొయినాబాద్: గోశాల ఏర్పాటుకు రైతులు సాగు చేసుకుంటున్న భూములెందుకు ఇస్తున్నారు.. బీడులుగా మారిన ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి.. వాటిని ఇవ్వండని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని ఎనికేపల్లి రైతులు చేపడుతున్న రిలే నిరహార దీక్షలో శనివారం ఆయన పాల్గొన్నారు. పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలు తెలసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎనికేపల్లి 180 సర్వే నంబర్లోని 99.14 ఎకరాల భూముల్లో 30 ఎకరాలను 1954లోనే ప్రభుత్వం రైతులకు అసైన్డ్ చేసిందని అన్నారు. మిగతా భూమిని సైతం విడతలవారీగా అసైన్డ్ చేయగా కొంత ప్రభుత్వ భూమిగా ఉందన్నారు. మొత్తం భూమిని రైతులు సుమారు 80 ఏళ్లుగా సాగుచేసుకుంటున్నారని.. వర్షాధార పంటలు వేసుకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. అలాంటి పేద రైతుల భూములను గోశాలకోసం లాక్కోవడం సరికాదన్నారు. ప్రభుత్వం ఎకరాకు 300 గజాల ఇంటి స్థలం పరిహారంగా ఇస్తామని చెబుతోందని.. 80 ఏళ్ల క్రితం 50 కుటుంబాలుగా ఉన్న రైతులు నాలుగు తరాలు గడవడంతో ఇప్పుడు 500 కుటుంబాలకు పెరిగాయన్నారు. ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని పరిహారం ఇవ్వాలని సూచించారు. ఈ విషయమై త్వరలోనే సీఎం రేవంత్రెడ్డిని కలుస్తానని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సన్వెల్లి ప్రభాకర్రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్, పార్టీ మండల మాజీ అధ్యక్షులు నర్సింహారెడ్డి, పద్మనాభం, మాజీ సర్పంచ్ రాజు తదితరులు పాల్గొన్నారు. బీడు భూములు ఇవ్వండి ఎనికేపల్లి రైతులకు న్యాయం చేయండి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి -
ఇందిరమ్మ మాకొద్దు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అనువైన నివాస స్థలం ఉండి.. గూడులేని నిరుపేదలకు సొంతిల్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం జిల్లాకు 28 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు నాలుగు విడతల్లో రూ.5 లక్షల చొప్పున చెల్లించనున్నట్లు ప్రకటించింది. ముందస్తు ఖర్చులకు లబ్ధిదారుల వద్ద డబ్బులు లేకపోవడంతో ముగ్గు పోసేందుకే జంకుతున్నారు. ఆంక్షలు, ఆర్థిక ఇబ్బందుల మధ్య ఇళ్లు కట్టుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు. తమకు కేటాయించిన ఇళ్లను రద్దు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా లేఖలు అందిస్తుండడం విశేషం. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సాక్షి బృందం నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో అనేక అంశాలు వెలుగు చూశాయి. మండలాల్లో ఇలా.. ● శంకర్పల్లి మండలంలో 450 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 236 మంది నిర్మాణ పనులు చేపట్టారు. 186 మంది ఇతర కారణాలతో తమకు ఇళ్లు వద్దని అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. మరో 28 మంది ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. ● ఇబ్రహీంపట్నం మండలంలో 436 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 268 మంది నిర్మాణం మొదలు పెట్టారు. 36 ఇళ్లు బేస్మెంట్ వరకు పూర్తయ్యాయి. మరో 57 నిర్మాణానికి నిరాకరించారు. ● కందుకూరు మండలంలో 1,222 మందికి ఇళ్లు మంజూరు కాగా, 540 మంది నిర్మాణ పనులు చేపట్టగా, 129 ఇళ్లు మాత్రమే బేస్మెంట్ వరకు పూర్తయ్యాయి. ● షాబాద్ మండలంలో 700 మందికి ఇళ్లు మంజూరు కాగా, 439 మంది నిర్మాణలు ప్రారంభించారు. 113 ఇళ్లు బేస్మెంట్ లెవల్కు చేరుకు న్నాయి. 113 మంది నిరాకరించారు. ● మహేశ్వరం మండలంలో 1,054 ఇళ్లు మంజూరు కాగా, 598 మంది నిర్మాణ పనులు మొదలు పెట్టగా, 295 మంది నిరాకరించారు. 124 ఇళ్లు బేస్మెంట్ లెవల్కు చేరుకోగా, 25 ఇళ్లకు మాత్రమే రూ.లక్ష చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో జమైంది. ● కడ్తాల్ మండలంలో 349 ఇళ్లు మంజూరు కాగా, 271 మంది మాత్రమే పనులు మొదలు పెట్టారు. మరో 78 మంది ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. ● మొయినాబాద్ మండలంలో 500 ఇళ్లు మంజూరు కాగా, 276 ఇళ్లకు పనులు ప్రారంభమయ్యాయి. 224 మంది నిరాకరించారు. ● మంచాల మండలంలో 437 మందికి ఇళ్లు మంజూరు కాగా, వీరిలో ఇప్పటి వరకు 350 మాత్రమే వివిధ దశల్లో ఉన్నాయి. మిగిలిన వారు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ● యాచారం మండలంలో 440 ఇళ్లు మంజూరు కాగా, 316 నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. 50 మంది ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు. మరో 74 మంది నిరాకరించారు. ● కేశంపేట మండలంలో 745 మందికి ఇళ్లు మంజూరు కాగా, వీరిలో 525 మంది మాత్రమే నిర్మాణానికి ముగ్గు పోశారు. మిగిలిన వారు సందేహిస్తున్నారు. 133 ఇళ్లు బేస్మెట్ లేవల్కు చేరుకోగా, 98 మందికి మాత్రమే మొదటి విడతలో భాగంగా రూ.లక్ష చొప్పున వారి ఖాతాల్లో జమ చేశారు. ● కొత్తూరు మండలంలో 170 ఇళ్లు మంజూరు కాగా, 112 మంది మాత్రమే పనులు ప్రారంభించారు. మిగిలిన వారు ఏ నిర్ణయం తీసుకోలేదు. ● నందిగామ మండలంలో 402 ఇళ్లు మంజూరు కాగా, 270 మంది మాత్రమే నిర్మాణ పనులు ప్రారంభించారు. మిగిలిన వారు ఎటూ తేల్చుకోలేపోతున్నారు. మున్సిపాలిటీల్లో అలా.. ● శంకర్పల్లి మున్సిపల్ పరిధిలో 200 ఇళ్లు మంజూరు కాగా, 93 మంది మాత్రమే పనులు మొదలు పెట్టారు. 104 మంది తమకు ఇళ్లు వద్దని అధికారులకు స్పష్టం చేశారు. ముగ్గురు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ● ఆదిబట్ల మున్సిపల్ పరిధిలో 437 ఇళ్లు మంజూరు కాగా, 244 మంది మాత్రమే నిర్మాణ పనులు ప్రారంభించారు. 140 మంది ఆసక్తి చూపడం లేదు. ● తుర్కయాంజాల్ మున్సిపల్ పరిధిలో 437 ఇళ్లు మంజూరు కాగా, 310 ఇళ్లకు మాత్రమేగ్రౌండింగ్ మొదలైంది. మరో 80 మంది నిర్మాణానికి నిరాకరించారు. ● మొయినాబాద్ మున్సిపాలిటీలో 200 ఇళ్లు మంజూరు కాగా, 101 మంది పనులు మొదలు పెట్టారు. 99 మంది నిర్మాణానికి నిరాకరించారు. ● తుక్కుగూడ పరిధిలో 275 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు కాగా, 194 ఇళ్లకు మాత్రమే గ్రౌండింగ్ అయింది. ● బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలో 335 ఇళ్లు మంజూరు కాగా, 216 ఇళ్లుకు ముగ్గు పోశారు. 75 ఇళ్లు బేస్మెంట్ లెవల్కు చేరుకున్నాయి. పెరిగిన సిమెంట్, స్టీలు ధరలు.. మేసీ్త్ర, ఇతర కూలీల చార్జీలు.. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఇళ్లు నిర్మించుకోవాలనే నిబంధనలు.. క్షేత్రస్థాయిలోని ఖర్చులు, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీకి పొంతన లేకపోవడం.. ఖర్చుల కోసం చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం... వెరసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవరోధంగా మారాయి. మెజార్టీ లబ్ధిదారులు వెనుకాడుతున్నారు.నిర్మాణానికి జంకుతున్న లబ్ధిదారులు సామగ్రి ధరలతో బెంబేలు అంచనాలకు మించి ఖర్చులు ముగ్గు పోసేందుకు వెనుకడుగు ప్రొసీడింగ్స్ రద్దు చేసుకుంటున్న వైనం జిల్లాకు మంజూరైన ఇళ్లు: 2,800 నిర్మాణానికి నిరాకరిస్తున్నవారు: 1,304 ఎటూ తేల్చుకోలేనివారు: 403 -
బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యం
మహేశ్వరం: బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా నర్సింహా రెడ్డి పేర్కొన్నారు. తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తుందని అన్నారు. పట్టా పాసు బుక్ కలిగిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.6 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం, రూ. 2లక్షలలోపు రైతు రుణమాఫీ, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మహిళలకు రూ.500 గ్యాస్ సబ్సిడీ, పేదలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలు ఒక్కరికై నా డబుల్ బెడ్రూం నిర్మాణం చేసి ఇచ్చారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హ యాంలోనే ఇందిరాగాంధీ పేదలకు అసైన్డ్ భూముల పంపిణీ, ఇళ్ల స్థలాల పంపిణీ చేశారని, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్ను ఆదర్శంగా తీసుకొని సీఎం రేవంత్రెడ్డి పేదల సంక్షేమమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు చెప్పారు. బీఆర్ఎస్ బీసీలను ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
ఆర్యూపీపీటీఎస్ జిల్లా కమిటీ నియామకం
షాద్నగర్ః రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ (ఆర్యూపీపీటీఎస్) జిల్లా నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా నందిగామ మండలం నర్సప్పగూడ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్న అనురాధను, ప్రధాన కార్యదర్శిగా ఫరూఖ్నగర్ ఉర్దూమీడియం పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న దార్ల రాఘవేంద్రాచారిని ఎన్నుకున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ తెలిపారు. చిత్రకారులను కళాకారులుగా గుర్తించాలి చిత్ర కళాకారుల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట్రెడ్డి ఆమనగల్లు: చిత్రకారులను కళాకారులుగా గుర్తించాలని చిత్ర కళాకారుల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రూపం వెంకట్రెడ్డి కోరారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో చిత్రకారులకు చేతినిండా పని ఉండేదని.. ప్రస్తుతం పనిలేక జీవనోపాధి కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో చిత్రకారులు చురుకుగా పాల్గొన్నారని, కేసులకు భయపడకుండా ఆంధ్రప్రదేశ్గా ఉన్న బోర్డులను చెరిపి తెలంగాణ పదం చేర్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రకారుల బాధలను గుర్తించి న్యాయం చేయాలని కోరా రు. ఈ సమావేశంలో చిత్రకారులు కొండల్, లింగంగౌడ్, గోపి, యాదయ్య, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. మొక్కలతోనే మానవాళి మనుగడ కడ్తాల్: మానవాళి మనుగడకు వృక్షాలు ఎంతగానో తోడ్పతాయని, ఔషధాలతో పాటు, ప్రాణవాయువును అందిస్తాయని అఖిలాంఽఽధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు పరమాత్మ గిరిస్వామి, వేదపండితులు మేళ్లూరి వెంకటేశ్వరశర్మ అన్నారు. శనివారం కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సహకారంతో మండల కేంద్రంలోని హనుమన్ఘడ్ ఆంజనేయ స్వామి ఆలయంలో మొక్కలకు ప్రత్యేక పూజలు చేశారు. పరిసరాలలో వృక్ష ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన జీవనానికి చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని, అవసరమైన ఫలాలు అందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్రెడ్డి, సీజీఆర్ చైర్ పర్సన్ లీల, సీజీఆర్ వ్యవస్థాపకుడు లక్ష్మారెడ్డి, సీఐ గంగాధర్, ఎస్ఐ చంద్రశేఖర్, నాయకులు జంగారెడ్డి, గంప రాములు, గంజి అంజయ్య, మల్లారెడ్డి, భిక్షపతి, మల్లయ్య, వెంకటేశ్, రఘుపతిరెడ్డి, జంగయ్య, వెంకటేశ్వర శర్మ, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. చెంచుల సంక్షేమానికి కృషి అనంతగిరి: చెంచుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ ప్రసాద్కుమార్ అన్నారు. శనివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరిపల్లి చెంచు కాలనీలో ప్రధానమంత్రి జన్మాన్ పథకం కింద నిర్మించనున్న మల్టీ పర్పస్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెంచు కాలనీల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రూ.60 లక్షల వ్యయంతో మల్టీ పర్పస్ సెంటర్ భవనా న్ని నిర్మించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి కమలాకర్ రెడ్డి, ఆర్డీవో వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, డీసీసీబీ డైరక్టర్ కిషన్ నాయక్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు మైపాల్ రెడ్డి, షరీఫ్, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, సీనియర్ నాయకులు ఎండీ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు. -
అంతా కల‘రింగ్’
ౖపైపె పూతలతో రంగులు ● పటిష్టత లేని హంగులు ● ఫ్లై ఓవర్లకు ఇవేం పనులు? ● వృథా అవుతున్న రూ.కోట్లు ● ఇవి ఎవరి ప్రయోజనాల కోసమో.. ● కాంట్రాక్టర్ల జేబులు నింపడానికో.. సాక్షి, సిటీబ్యూరో: తెలుగుతల్లి.. నారాయణగూడ తదితర ప్రాంతాల్లోని ఫ్లై ఓవర్లకు రంగులేశారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. వాటి పటిష్టత ఎంత? అన్నది మాత్రం చెప్పలేని పరిస్థితి. ప్రపంచ సుందరి పోటీలు అనో, ఇంకో సందర్భమనో, ఏవీ కాకున్నా నగరం అందంగా కనపడాలనో పలు ప్రాంతాల్లోని ఫ్లై ఓవర్లకు రంగులేశారు. రూ.కోట్లు ఖర్చు చేశారు. ఆ చేసే పనేదో వాటికి పటిష్టత పరీక్షలు నిర్వహించి, అవసరమైన మరమ్మతులు చేశాక రంగులేస్తే ప్రయోజనం ఉండేది. కానీ.. ఎవరి ప్రయోజనాలకో, కాంట్రాక్టర్లకు జేబులు నింపడానికో ఇలాంటి పనులు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇంటికై నా మరో నిర్మాణానికై నా రంగులేశాక మరమ్మతులు చేస్తారా? మరమ్మతులు చేశాక రంగులేస్తారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఫ్లై ఓవర్లకు పెద్దగా మరమ్మతులంటూ అవసరం ఉండదు.. కానీ నిర్ణీత వ్యవధుల్లో నిర్మాణ పటిష్టత (స్ట్రక్చరల్ స్టెబిలిటీ) పరీక్షలు అవసరమంటున్నారు నిపుణులు. నగరంలోని కొత్త ఫ్లై ఓవర్లు మినహాయిస్తే పాత ఫ్లై ఓవర్లకు అవి తప్పనిసరి అని పేర్కొన్నారు. నగరంలో దశాబ్దం, రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన ఫ్లై ఓవర్లు 30కి పైగా ఉన్నాయి. బేగంపేట, సీటీఓ జంక్షన్, హరిహర కళాభవన్, తార్నాక, బషీర్బాగ్, మాసబ్ట్యాంక్, తెలుగుతల్లి తదితర ప్రాంతాల్లోని ఫ్లై ఓవర్లు నిర్మించి రెండు దశాబ్దాలు దాటింది. వీటన్నింటికీ స్టెబిలిటీ పరీక్షలు నిర్వహించి అవసరమైన మరమ్మతులు చేయాల్సి ఉంది. ఆ పని చేయకుండా ఫ్లైఓవర్లపై పడే గుంతలు పూడ్చేందుకు ౖపైపె కోటింగ్లు వేస్తూ పోతుండటంతో కొన్ని ఫ్లై ఓవర్ల మందం పెరిగిపోయింది. పటిష్ట చర్యలు అవసరం దీర్ఘకాలంలో ఫ్లై ఓవర్లకు సంబంధించిన బేరింగులు, ఎక్స్పాన్షన్ జాయింట్స్ వదులవుతాయని వాటిని పటిష్ట పరిచేందుకు మరమ్మతులు అవసరమని ఇంజినీరింగ్ నిపుణులు తెలిపారు. నగరంలోని పాత ఫ్లై ఓవర్లలో రెండు మూడు ఫ్లై ఓవర్లకు తప్ప మిగతా వాటికి మరమ్మతులు జరగలేదని సమాచారం. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్కు దాదాపు ఐదేళ్ల క్రితం స్వల్ప మరమ్మతులు మాత్రం చేశారు. పూర్తిస్థాయి మరమ్మతులు చేయకుండానే ప్రస్తుతం రంగుల హంగులు, పచ్చదనం పెంపు వంటి చర్యలకు సిద్ధమయ్యారు. నిర్ణీత వ్యవధుల్లో మరమ్మతులు అవసరం.. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, సాధారణంగా ఫ్లైఓవర్లలోని గర్డర్స్ ప్రాంతాల్లో కాంక్రీట్ దెబ్బతింటుంది. బేరింగులు అరిగిపోతాయి. ఎక్స్పాన్షన్ జాయింట్స్ వదులై బలహీనంగా మారతాయి. స్తంభాల పైభాగాలు (పయర్ క్యాప్స్) తుప్పుపడతాయి. బాక్స్గర్డర్స్ ఏటవాలు గోడల్లో పగుళ్లు ఏర్పడతాయి. నిర్ణీత వ్యవధుల్లో వాటికి మరమ్మతులు చేయాల్సి ఉన్నప్పటికీ అలా జరగడం లేదు. ఒక్కో ఫ్లైఓవర్కు దాదాపు 15–20 స్పాన్లుంటాయి. వాటిల్లో ఉండే బేరింగ్లను జాకీలు ఏర్పాటుచేసి మార్చాల్సి ఉంటుంది. బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ కొత్తలోనే జరిగిన ప్రమాదంతో కొత్తవి, పాతవి అన్నింటికీ అదనపు సేఫ్టీ ఏర్పాట్లు చేయాలని, వేగ పరిమితి హెచ్చరికలతోపాటు క్రాష్బారియర్స్, వ్యూకట్టర్స్ తదితర ఏర్పాట్లు చేయాలని భావించారు. కానీ ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. అధికారుల వద్ద ఈ అంశాలు ప్రస్తావించగా, త్వరలో తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. థర్డ్ పార్టీతో పరీక్షలు నగరంలోని పాత ఫ్లై ఓవర్ల పటిష్టతను నిర్దారించేందుకు థర్డ్పార్టీ నిపుణుల కమిటీని నియమించి, పరీక్షలు చేయించి అదిచ్చేనివేదిక మేరకు, కమిషనర్ సూచనలకు అనుగుణంగా స్పెషలైజ్డ్ మెయింటనెన్స్ ఆపరేషన్స్, రిట్రో ఫిట్టింగ్, రిస్టోరేషన్ పనులు జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ విభాగం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. పాట్హోల్స్ పూడ్చివేత, స్వల్ప పగుళ్ల ప్యాచ్వర్క్స్, దెబ్బతిన్న రెయిలింగ్స్కు మరమ్మతులతోపాటు అవసరమైన ప్రాంతాల్లో యాంటి కార్బొనేషన్ పూతలు వేసే పనులు నిర్వహణ విభాగం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. -
వ్యక్తి బలవన్మరణం
పహాడీషరీఫ్: తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ లక్ష్మణ్ తెలిపిన ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన అంబికా, సుధాకర్(45) దంపతులు 17 ఏళ్ల క్రితం జల్పల్లి శ్రీరామ కాలనీకి బతుకుదెరువు నిమిత్తం వలస వచ్చి అద్దె ఇంట్లో నివాసం ఉంటూ కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. తాగుడుకు బానిసైన సుధాకర్ మూడు నెలలుగా భార్యను వేధిస్తుండడంతో ఆమె పిల్లలతో కలిసి స్థానికంగా ఉండే తన తల్లిగారింటికి వెళ్లింది. ఐదు రోజులుగా పనికి రాకపోవడంతో శనివారం ఉదయం తెలుసుకుందామని తోటి కార్మికుడు దేవిదాస్ చూసేందుకు వెళ్లడంతో సుధాకర్ ఇంట్లోని కిటికి గ్రిల్స్కు ఉరేసుకొని కనిపించాడు. వెంటనే అతడు సుధాకర్ భార్యకు సమాచారం ఇవ్వడంతో ఆమె వెళ్లి పరిశీలించగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. సుధాకర్ శుక్రవారం రాత్రి కూడా బాగా తాగి కనిపించాడని, తాగుడుకు బానిసై మానసికంగా స్థితి సరిగ్గా లేక ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె పోలీసు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య రాజేంద్రనగర్: ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్గూడ ప్రాంతానికి చెందిన సునీల్ (19) పదో తరగతి వరకు చదివి ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నాడు. శనివారం ఉదయం తల్లి చదువుకోవాలని మందలించింది. దీంతో మనస్థాపం చెందిన సునీల్ ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. అనుమానంతో కుటుంబ సభ్యులు డోర్ తెరిచి చూడగా ఉరేసుకుని కనిపించాడు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పిచ్చికుక్క స్వైర విహారం ● పశువుల మందపై దాడి ● ఆవు మృత్యువాత ధారూరు: పశువుల మందపై పిచ్చికుక్క దాడి చేయడంతో ఓ ఆవు మృత్యువాత పడింది. ఈ ఘటన శనివారం మండల పరిధిలోని నాగసమందర్లో చోటు చేసుకుంది. వివరాలు.. మాజీ వైస్ ఎంపీపీ వరద మల్లికార్జున్కు చెందిన పశువులపాకలోకి ఓ పిచ్చి కుక్క వెళ్లి ఆవును కరవడంతో అది అక్కడికక్కడే మృత్యువాత పడింది. గ్రామంలో ఎక్కడ పశువులు కనిపించినా కుక్క వెంబడించింది. గమనించిన గ్రామస్తులు పట్టుకునేందుకు యత్నించినా దొరకలేదు. నాగారంలో చిన్నారిపై దాడి మండల పరిధిలోని నాగారంలో చాకలి కృష్ణయ్య కూతురుపై శుక్రవారం రాత్రి ఓ కుక్కదాడి చేసి గాయపరిచింది. దీంతో చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గ్రామాల్లో వీధి శునకాలను తరలించేందుకు అధికారులు చొర తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
రూ.50 కోట్ల రుణ మంజూరు పత్రాల పంపిణీ
శంషాబాద్ రూరల్: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ముచ్చింతల్ శివారులో గల స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆవరణలో గ్రామీణ స్వయం సహాయక సంఘాలు, వ్యవసాయ, పౌల్ట్రీ రంగాల వారికి రూ.50 కోట్ల రుణాల మంజూరు పత్రాలను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లు, మిల్లెట్ ఆహార పదార్థాలు ఆకట్టుకున్నాయి. అలాగే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నితేశ్ రంజన్, సీజీఎం–వన్ సుధాకర్రావు, హైదరాబాద్ జోన్ డిప్యూటీ జోనల్ హెడ్ సర్వేష్ రంజన్, సైఫాబాద్ రీజినల్ హెడ్ సోనాలికా తదితరులు పాల్గొన్నారు. -
పసికందును పారేశారు!
ఉప్పల్: ఆ కన్నతల్లికి పేగు బంధమే భారం అయిందా? శిశువును వదిలించుకోవాలని ఎవరైనా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారా? అనే రీతిలో అమానవీయ ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన.. ఇంకా కళ్లు కూడా సరిగా తెరవని పసికందును రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయిన ఘటన ఉప్పల్ పోలీస్స్టేన్ పరిధిలోని రామంతాపూర్ వివేక్నగర్లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారుజామున మగశిశువు ఏడుస్తున్న శబ్దం వినిపించడంతో కౌశిక్ అనే వ్యక్తి ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు 108 అంబులెన్స్లో శిశువును నగరంలోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి కంటికి గాయం కావడంతో కమిలిపోయి ఉంది. ఆస్పత్రిలో చిన్నారిని వైద్యులు పరీక్షించారు. శిశువుకు ఎలాంటి అపాయం లేదని వారు వెల్లడించినట్లు సమాచారం. కన్నతల్లే కావాలని శిశువును ఇలా రోడ్డుపై వదిలి వెళ్లిందా? లేక ఎవరైనా వేరే ప్రాంతం నుంచి తీసుకువచ్చి ఇక్కడ పారవేశారా? అనే విషయం తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
డెలివరీ బాయ్పై దాడి కేసులో ఇద్దరి రిమాండ్
అత్తాపూర్: డెలివరీ బాయ్పై దాడి కేసులో ఇద్దరిని రిమాండ్కు తరలించిన ఘటన అత్తాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. సులేమాన్నగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ రేహాన్ (20) పీవీఆర్ ఎక్స్ప్రెస్వే పిల్లర్ నంబర్ 208 సమీపంలో జీప్టో డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సులేమాన్ (25), యూనస్ (25)ను తోడుగా తీసుకువచ్చాడు. ఫుడ్ డెలివరీ చేసేందుకు ఆర్డర్లు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరో వ్యక్తిని ఎందుకు తీసుకువచ్చావు అని రేహాన్ సులేను ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మరో ఇద్దరు స్నేహితులు ఇమ్రాన్ (25) సలీం (22) పిలిచాడు. నలుగురు కలిసి రేహాన్పై దాడి చేయడంతో పాటు పదునైన కత్తితో ఎడమ చేయి, ఎడమ కాలుపై గాయాలు చేసి పారిపోయారు. రేహాన్ను చికిత్స కోసం ఉస్మానియాకు తరలించారు. రేహాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
అభివృద్ధి ఘనత మాదే
మాడ్గుల: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 శాతం స్థానాలను కైవసం చేసుకుంటుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే విజయానికి సోపానాలుగా నిలుస్తాయని అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం ఆయనతోపాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. కల్వకుర్తి ఎమెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి మండల కేంద్రంలో రూ.12.70 కోట్లతో నిర్మించే 30 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆమనగల్లు మండలం కోనాపూర్ నుంచి మాడ్గుల వరకు రూ.45 కోట్లతో చేపట్టే, మాడ్గుల నుంచి అందుగులకు రూ.30 కోట్లతో నిర్మించే బీటీ డబుల్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. 220 మందికి మంజూరైన కల్యాణ లక్ష్మి చెక్కులను పంపీణి చేశారు. అనంతరం ఆమనగల్లు మార్కెట్ మాజీ చైర్మన్ బట్టు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తోందని తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు సాగునీరందిస్తామని చెప్పారు. ట్రిపుల్ ఆర్, ఐటీ పరిశ్రమలు, గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణంతో రాబోయే రోజుల్లో మాడ్గులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్తోనే సామాజిక న్యాయం స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్తోనే సాధ్యమని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ఎప్పుడూ ప్రజల పక్షమేనని పేర్కొన్నారు. 30 ఏళ్లుగా సాగుతున్న మాదిగల వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూసి బిల్లుకు అసెంబ్లీలో ఆమోదించడం జరిగిందని తెలిపారు. మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే సంకల్పమని, ఆ దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో అధోగతి పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. ఆ అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తోందని చెప్పారు. బీసీ కులగణన చేపట్టడంతో పాటు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న ఘనత సీఎం రేవంత్రెడ్డికే దక్కిందన్నారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, పీసీసీ కార్యదర్శి సూదిని రాంరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ పద్మారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బట్టు కిషన్ రెడ్డి, టీపీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు మాడ్గుల పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు -
భూ సమస్యలు సత్వరం పరిష్కరించండి
యాచారం: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. యాచారం తహసీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆన్లైన్లో నమోదు చేసిన భూ సమస్యలు పరిష్కారం కాకపోతే ఎందుకు తిరస్కరించారో కూడా దరఖాస్తు దారులకు తెలియజేయాలని సూచించారు. ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన లబ్ధిదారులకే లాటరీల్లో ప్లాట్లు, రిజిస్ట్రేషన్లు చేసేలా చూడాలన్నా రు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం అయ్యేలా చూడాలని, గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా, నీటి ట్యాంకులు శుభ్రంగా ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. వర్షాలు కురిసిన వెంటనే విరివిగా మొక్కలు నాటేలా సిద్ధం కావాలని సూచించారు. సమావేశంలో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డి, యాచారం తహసీల్దార్ అయ్యప్ప, మండల పంచాయతీ అధికారి శ్రీలత, ఈజీఎస్ ఏపీఓ లింగయ్య పాల్గొన్నారు. బాల కార్మికులకు విముక్తి శంకర్పల్లి: ఆపరేషన్ స్మైల్లో భాగంగా శుక్రవారం మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురు బాల కార్మికులకు పోలీసులు విముక్తి కల్పించారు. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మోకిల, జన్వాడ గ్రామాల పరిఽధిలోని రెండు కన్స్ట్రక్షన్ కంపెనీల్లో పని చేస్తున్న ఆరుగురు బాల కార్మికులను పోలీసులు గుర్తించారు. అనంతరం వారిని ఠాణాకి తరలించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. రెండు కంపెనీలపై కేసు నమోదు చేశారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఆమనగల్లు: పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిని శుక్రవారం జిల్లా వైద్యాధికారి డా.వెంకటేశ్వర్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో స్టాఫ్ రిజిస్టర్, మందుల స్టాకును ఆయన పరిశీలించారు. ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాస్పత్రి వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రస్తుత సీజన్లో గ్రామాల్లో ప్రబలే వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులు ఇవ్వాలని తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు డా.మంజులాదేవి, డా.నాగరాజు, డా.మైమునాబేగం, డా.జయశ్రీ, సిబ్బంది తిరుపతిరెడ్డి, చంద్రశేఖర్, సునీత, వేణు, ఏసుమణి, ఇందిర తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్కందుకూరు: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను జిల్లా అధికారులు సస్పెండ్ చేశారు. ఎన్నికల విధుల్లో అలసత్వం ప్రదర్శించినందుకు మండలంలోని కొత్తగూడ పంచాయతీ కార్యదర్శి ఉమాదేవిని.. పారిశుద్ధ్యం, ట్రాక్టర్ నిర్వహణ, తడి పొడి చెత్త సేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తలకొండపల్లి మండలం గట్టుఇప్పలపల్లి పంచాయతీ కార్యదర్శి డి.అనితను కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం డీపీఓ సురేష్మోహన్ సస్పెండ్ చేశారు. నేడు నియామక పత్రాలు సాక్షి, సిటీబ్యూరో: రోజ్గార్ మేళా కింద ఎంపికై న కేంద్ర ప్రభుత్వ నూతన ఉద్యోగులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం నియామక పత్రాలను అందజేయనున్నారు. సికింద్రాబాద్ బోయిగూడలోని రైల్ కళారంగ్లో నిర్వహించనున్న రోజ్గార్మేళా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు నియామక లేఖలు అందజేస్తారు. -
నాలుగో రోజు 4,170 మంది
కందుకూరు: మండలంలోని మీర్ఖాన్పేట రెవెన్యూలోని ఏటీసీ సెంటర్లో నిర్వహిస్తున్న లాటరీ ద్వారా ఫార్మా ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను శుక్రవారం కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ తదితర అంశాలను పర్యవేక్షించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. నాలుగో రోజు 4,170 మంది లబ్ధిదారులకు ప్లాట్లను డ్రా తీసినట్లు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి తెలిపారు. అందులో 2,062 మంది హాజరు కాగా 1,572 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకోవడానికి గైర్హాజరైన వారు ఫారం 32ఏ, ఆధార్, పాన్కార్డు, పాస్పోర్టు సైజు ఫొటోలతో రావాలని సూచించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డి, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, నాయిబ్ తహసీల్దార్ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను పర్యవేక్షించిన కలెక్టర్ -
విద్యావ్యవస్థలో మార్పులు అవసరం
ఇబ్రహీంపట్నం: విద్యా వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. ఇందులో పేద, ధనిక అనే తేడా లేకుండా పిల్లలందరూ ఒకే చోట చదివిన రోజే నవ శకానికి అడుగులు పడుతాయని ఆకాంక్షించారు. సామాజిక బాధ్యతలో భాగంగా కెఫిన్ టెక్నాలజీ కార్పొరేట్ సంస్థ రూ.1.10 కోట్లు వెచ్చించి సంకల్ప్ పేరుతో ఇబ్రహీంపట్నంలోని గిరిజన బాలికల వసతి గృహాన్ని ఆధునీకరించింది. నూతన వసతుల ప్రారంభోత్సవానికి శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి హాజరైన ఆమె మాట్లాడుతూ.. కులమతాలు, పేద, ధనిక తారతమ్యం లేని విద్యాలయాల రూపకల్పన కోసం ప్రధాని, ముఖ్యమంత్రికి ప్రతీ ఇంటినుంచి ఒక లేఖ రాయాలని పిలుపునిచ్చారు. అమ్మాయిల చదువుతోనే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. బాగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థినులకు సూచించారు. స్వల్పకాలిక ఆనందాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదని, అవసరం మేరకే సోషల్ మీడియాను వినియో గించాలని తెలిపారు. ప్రైవేటు హాస్టళ్లతో పోలిస్తే ప్రభుత్వ వసతి గృహాల్లో మెరుగైన సదుపాయాలు ఉన్నాయన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, బాగా చదవాలని కోరారు. పాశ్చాత్య ధోరణులను, విష సంస్కృతిని విడనాడాలన్నారు. ఆడ పిల్లలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా పోలీసులను ఆశ్రయించాలని, వారి వివరాలు బయటపెట్టకుండా తానే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మహిళా కమిషన్కు వస్తున్న అధిక ఫిర్యా దులు లివింగ్ రిలేషన్షిప్లకు సంబంధించినవేనని తెలిపారు. వసతుల కల్పనకు కృషిచేసిన కేఫిన్ సంస్థను అభినందించారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ సెక్రటరీ పద్మజ, కెఫిన్ టెక్ సంస్థ హెచ్ఆర్ సుజన్, మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్రెడ్డి, వైస్ చైర్మన్ కరుణాకర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు భూపతిగాల్ల మహిపాల్, డీటీడీఓ రమాదేవి, డీఈఓ సుశీందర్రావు, డీఆర్డీఏ పీడీ శ్రీలత, సీఐ మహేందర్రెడ్డి పాల్గొన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద -
అధికారిక ముద్ర!
శనివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2025అక్రమాలకు.. సాక్షి, రంగారెడ్డిజిల్లా: లింకు డాక్యుమెంట్ నంబర్ లేకపోయినా.. ఇరువురి మధ్య ఆర్థికపరమైన లింకు కలిస్తే చాలు.. ఎలాంటి స్థలానికై నా ఇట్టే రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్, సబ్ రిజిస్ట్రా ర్లు అక్రమార్కులతో చేతులు కలుపుతూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. విలువైన స్థలాల ఆక్రమణలకు, ఘర్షణలకు కారణమవుతున్నారు. అక్రమ లే అవుట్కు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ సహా గండిపేట ఎస్ఆర్ఓ అధికారిక ముద్ర వేస్తే.. ఎలాంటి నిర్మాణాలు లేని ఖాళీ ప్లాట్లకు ఎల్బీనగర్ మున్సిపల్ అధికారులు ఇంటి నంబర్లు జారీ చేస్తున్నారు. లింకు డాక్యుమెంట్ నంబర్ లేని ప్లాట్లకు ఎల్బీనగర్ సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇక ఎల్ఆర్ఎస్ నిబంధనలకు విరుద్ధంగా నాలా కన్వర్షన్ కానీ ఖాళీ స్థలాలకు తాండూరు ఎస్ఆర్ఓ తేదీలు ఏమార్చి రెండు వందలకుపైగా ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయడం వివాదాస్పదమైంది. అదే గండిపేట రహస్యం సికిందర్గూడలోని పది ఎకరాల భూమిపై కోర్టులో వివాదం కొనసాగుతోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారిక రికార్డుల్లో ఆ భూములపై డీఏజీపీఏ (డెవలప్మెంట్ అగ్రిమెంట్, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) ఉన్నప్పటికీ తప్పుడు సమాచారంతో దాన్ని రద్దు చేసి, రాత్రికిరాత్రే నాలా కన్వర్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే ఓ తెల్లకాగితంపై లే అవుట్, అందులోని ఖాళీ ప్లాట్లకు బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ ఇంటి నంబర్లు జారీ చేయడం, తర్వాత వారు టీఎస్ బీపాస్కు దరఖాస్తు చేయడం, ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇంటి నిర్మాణానికి జారీ చేసిన తాత్కాలిక అనుమతుల ఆధారంగా ఏకంగా 23 ప్లాట్లకు గండిపేట సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్లు చేయడం గమనార్హం. మున్సిపల్ కార్పొరేషన్, రిజిస్ట్రేషన్ అధికారులు కలిసి అక్రమ లే అవుట్కు అధికారిక ముద్ర వేశారు. అప్పటికే జీపీఏ చేసుకున్న నిర్మాణ సంస్థ ఫిర్యాదుతో విషయం బయటపడింది. అవకాశంగా లొసుగులు సరూర్నగర్ మండలం కర్మన్ఘాట్ రెవెన్యూ సర్వే నంబర్ 60లోని భూమిని 45 ఏళ్ల క్రితమే అప్పటి పంచాయతీ అనుమతితో లే అవుట్ చేశారు. యజమానులు ఆయా ప్లాట్లన్నీ అమ్మేశారు. అప్పట్లో డాక్యుమెంట్లను ఆన్లైన్లో నమోదు చేసే వ్యవస్థ లేకపోవడం, ప్రస్తుతం ఆయా ప్లాట్ల వివరాలు ఆన్లైన్లో కన్పించక పోవడాన్ని ఓ ముఠా అవకాశంగా తీసుకుంది. తొలుత పాతస్టాంపు పేపర్లపై నోటరీ డాక్యుమెంట్ సృష్టించింది. తర్వాత ఆస్తికి వ్యాల్యూయేషన్ చేయించింది. ఎల్బీనగర్ మున్సిపల్ అధికారులకు డబ్బుల ఎర వేసి ఎలాంటి నిర్మాణాలు లేని ఖాళీ స్థలానికి ఇంటి నంబరు సహా ఆస్తిపన్ను చెల్లింపు రసీదులను సంపాదించింది. పూర్వ లింకుడాక్యుమెంట్ నంబర్, ఈసీ కూడా లేని ఖాళీ ప్లాట్కు ఎల్బీనగర్ సబ్రిజిస్ట్రార్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారో అంతు చిక్కడం లేదు. రూ.2 కోట్లకుపైగా విలువ చేసే ఖాళీ స్థలాన్ని ఇటీవలే ఓ ప్రైవేటు వ్యక్తికి కట్టబెట్టింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఇచ్చిన పత్రాల ఆధారంగానే తాను రిజిస్ట్రేషన్ చేయాల్సి వచ్చిందని, తర్వాత స్థానికుల నుంచి అందిన ఫిర్యాదుతో డాక్యుమెంట్ను బ్లాక్లిస్టులో పెట్టడం జరిగిందని ప్రస్తుత ఎస్ఆర్ఓ చెబుతుండటం విశేషం. ఈ ఒక్క లే అవుట్లోనే ఈ తరహా ప్లాట్లు మరో 20 వరకు ఉన్నట్లు సమాచారం. స్కానింగ్ చేయకపోవడంతో.. అనధికారిక లే అవుట్లో ఎల్ఆర్ఎస్ లేని ఖాళీ ప్లాట్లకు తాండూరు సబ్ రిజిస్ట్రార్ అధికారులు అధికారిక ముద్ర వేశారు. నిబంధనల ప్రకారం 2020 ఆగస్టు 26 నాటికి వేసిన లే అవుట్లోని ప్లాట్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లే అవుట్లో 10 శాతం ప్లాట్లు రిజిస్ట్రర్ అయిఉన్నప్పుడే మిగతావి కూడా రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలు కల్పించింది. ఈ ఉత్తర్వులను అవకాశంగా తీసుకుని కటాఫ్ తేదీ తర్వాత వేసిన లే అవుట్లోని ప్లాట్లను కటాఫ్ తేదీలోని ప్లాట్లుగా చూపించి 25 శాతం రాయి తీతో ఆరు రోజుల్లోనే రెండు వందలకుపైగా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారు. డాక్యుమెంట్లు స్కానింగ్ చేయకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. శేరిలింగంపల్లి మండలం నానక్రాంగూడ నాలా కన్వర్షన్ లేని 37,061 గజాల స్థలానికి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గుట్టుగా రిజిస్ట్రేషన్లు చేయడం వివాదాస్పదమైంది. న్యూస్రీల్లేని ఉద్యోగి పేరున.. నార్సింగి మున్సిపల్ పరిధి సర్వే నంబర్ 300 నుంచి 303 వరకు, 306 నుంచి 311 వరకు, 313 నుంచి 315లోని భూమిలో గతంలోనే మార్వటౌన్ షిప్–బి లే అవుట్ చేశారు. అందులోని 617 గజాల ఖళీ పార్కు స్థలాన్ని గతంలోనే పూర్వ పంచాయతీ పేరున మార్ట్గేజ్ చేశారు. రూ.6 కోట్ల విలువ చేసే ఈ ఖాళీ స్థలంపై ఓ ముఠా కన్నేసింది. పంచాయతీ పేరున మార్ట్గేజ్ చేసిన ప్లాట్ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రస్తుత మున్సిపాలిటీ పేరున డాక్యుమెంట్ సృష్టించి, రిజిస్ట్రేషన్కు యత్నించింది. ప్రస్తుత ఎస్ఆర్ఓ గుర్తించి, సంబంధిత మున్సిపల్ అధికారికి సమాచారం ఇవ్వగా విషయం బయటికి వచ్చింది. మున్సిపాలిటీలో లేని ఉద్యోగి పేరున ఫేక్ మార్టిగేజ్ రిలీజ్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తేలింది. -
పరిశీలిస్తాం.. పరిష్కరిస్తాం
శంకర్పల్లి: మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎ.యోగేశ్ తెలిపారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘ఫోన్ ఇన్’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పట్టణవాసులు పారిశుద్ధ్యం, అంతర్గత మురుగునీటి కాలువలు, రోడ్లు, వీధి కుక్కలు, ఆక్రమణలు వంటి అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని ఓపిగ్గా విని, నమోదు చేసుకుని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రశ్న: శంకర్పల్లిలో పంచాయతీగా ఉన్నప్పుడు నిర్మించిన దుకాణాలకు కాలం ముగిసినప్పటికీ రీ టెండర్లు వేయడం లేదు. మున్సిపాలిటీకి ఏటా కోట్లలో నష్టం వస్తోంది. – దయాకర్రెడ్డి (బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు), మహేందర్రెడ్డి (శంకర్పల్లి) కమిషనర్: దుకాణాల రీటెండర్ ప్రక్రియపై కసరత్తు చేస్తున్నాం. కలెక్టర్ వేసిన కమిటీ రిపోర్టు ఆధారంగా ముందుకు వెళ్తాం. వీలైనంత త్వరగా రీటెండర్ చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రశ్న: సింగాపురంలో శ్మశానవాటిక లేకపోవడంతో వర్షాకాలంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది. పలు కాలనీల్లో తాగునీటి సమస్య ఉంది. – వెంకట్రాంరెడ్డి, శశిధర్రెడ్డి (సింగాపురం) జవాబు: శ్మశానవాటిక కోసం స్థల అన్వేషణ చేస్తున్నాం. ఇప్పటికే రెవెన్యూ అధికారులతో చర్చిస్తున్నాం. త్వరలో స్థల సేకరణ చేసి, నిర్మిస్తాం. పాడైన బోర్లను వెంటనే గుర్తించి మరమ్మతులు చేయిస్తాం. ప్రశ్న: ఖాళీ ప్రదేశాల్లో పిచ్చిమొక్కలు, చెత్తా, చెదారం పెరిగిపోయాయి. పాములు, దోమల బెడద ఎక్కువైంది. కొన్నిచోట్ల రోడ్లు పాడై వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోంది. – మహమ్మద్ యూనస్ (బ్లూ ఉడ్ వెంచర్, శంకర్పల్లి) జవాబు: పారిశుద్ధ్య కార్మికులు, డోజర్లతో చెత్తను వెంటనే శుభ్రం చేయిస్తాం. రోడ్లు పాడైన చోట తాత్కాలికంగా మొరం వేసి బాగు చేస్తాం. ప్రశ్న: ఫత్తేపూర్ రైల్వే బ్రిడ్జి నుంచి శంకర్పల్లి చౌరస్తా వరకు రహదారి నిర్మాణం అసంపూర్తిగా ఉంది. పెద్ద ఎత్తున గుంతలు ఉండడంతో రాత్రి వేళ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. – శ్రీకాంత్రెడ్డి, మహేశ్ (రావులపల్లి) జవాబు: ఈ విషయమై ఇప్పటికే ఆర్అండ్బీ, పోలీసులతో కలిసి పరిశీలించాం. ఆర్అండ్బీ ఈఈతో మాట్లాడి వీలైనంత త్వరగా పూర్తి చేయిస్తాం. ప్రశ్న: ఆదర్శ్నగర్ కాలనీలో అంతర్గత మురుగునీటి కాలువలు, రోడ్లు, తాగునీరు, గుంతల్లో మొరం వేయడం వంటి సమస్యలు ఉన్నాయి. – రాంచందర్, రాములు, మాణిక్, అంజనేయులు (ఆదర్శ్నగర్ కాలనీ) జవాబు: అంతర్గత మురుగునీటి కాలువలు, రోడ్ల నిర్మాణం కోసం ఇప్పటికే ప్రతిపాదనలు పంపించాం. ఆమోదం రాగానే పనులు ప్రారంభిస్తాం. సిబ్బందిని పంపి రోడ్లపై గుంతల్ని పూడ్చి వేయిస్తాం. ప్రశ్న: పిచ్చి మొక్కలు విపరీతంగా ఉండడంతో దోమల బెడద ఎక్కువైంది. పిల్లలు ఆడుకోడానికి సరైన పార్కులు లేవు. కొంత మంది ఇంట్లో సెప్టిక్ ట్యాంకు నిర్మించుకోకుండా.. డ్రైనేజీలోకి వదిలేస్తున్నారు. – శ్రీనివాస్, రఘుపాల్రెడ్డి, రవీందర్, ఫణి రాజ్ (శ్రీరాంనగర్ కాలనీ) జవాబు: కాలనీలో పార్కు కోసం రూ.17 లక్షలతో ప్రతిపాదనలు పంపాం. అక్రమ నిర్మాణాలు, సెప్టిక్ ట్యాంకుల గురించి సిబ్బందిని పంపి విచారణ చేస్తాం. ఇష్టారీతిన చెత్త, చెదారం వేసే వాళ్లకు జరిమానా వేసేందుకు సిద్ధం అవుతున్నాం. ప్రశ్న: మణిగార్డెన్ ఎదురుగా ఉన్న కాలనీలో 30 ఇళ్లకుపైగా ఉన్నప్పటికీ నీటి కనెక్షన్ లేదు. ఉన్న బోరును కూడా మరమ్మతులకు గురైన ప్రతీసారి మేమే సొంతంగా బాగు చేయించుకుంటున్నాం. అంతర్గత మురుగునీటి సమస్య సైతం ఉంది. – మాణిక్యప్రభు, వెంకటేశ్వరరావు, వీరేశం, లక్ష్మారెడ్డి, రాజేందర్రెడ్డి (9వ వార్డు, మణిగార్డెన్ ఎదురుగా) జవాబు: అమృత్ 2.0 కింద పట్టణంలో ఆరు తాగునీటి ట్యాంకులను నిర్మిస్తున్నాం. వాటి ద్వారా సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. పాడైనా బోర్లకు వెంటనే మరమ్మతులు చేయిస్తాం. ప్రశ్న: గీతా మందిర్ ప్రాంతంలో ఆరు నెలలుగా వీధిదీపాలు వెలగడం లేదు. రాత్రి వేళ ఇంటి నుంచి బయటికి రావడానికి ఇబ్బంది అవుతోంది. – దామోదర్, రమేశ్, సందీప్, విజయ్ (గీతా మందిర్) జవాబు: సిబ్బందిని పంపి వెంటనే అవసరమున్న చోట వీధి దీపాలను ఏర్పాటు చేయిస్తాం. ప్రశ్న: పోలీస్ క్వార్టర్స్కి సమీపంలో కొత్త సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో మితిమీరిన వేగంతో వెళ్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో కొంత మంది ప్రభుత్వ స్థలాన్ని అక్రమిస్తున్నారు. – గోవర్థన్, నర్సింగ్రావు (15వ వార్డు) జవాబు: ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులను పంపి సమస్యను పరిష్కరిస్తాం. ప్రశ్న: మున్సిపల్ పార్కులో పిచ్చి మొక్కలు పెరిగాయి, సెంట్రల్ లైటింగ్ సిస్టం పాడైంది. – సంపత్, రవీందర్రెడ్డి (గాయత్రీ నగర్) జవాబు: సిబ్బందిని పంపి, వీలైనంత త్వరగా సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తాం. వీలైనంత త్వరగా చర్యలు శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్ యోగేశ్ ఫోన్ఇన్ కార్యక్రమానికి స్పందన -
ఇంజినీరింగ్లో మహేశ్కు డాక్టరేట్
మొయినాబాద్రూరల్: ఇంజినీరింగ్లో పరిశోధన చేసిన ఎనుముల మహేశ్కు డాక్టరేట్ లభించింది. ఇంజినీరింగ్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆర్టిలిజేన్స్ ఇంటలిజెన్స్లో పరిశోధనకు గాను రాజస్థాన్ ఆజ్మిర్లోని భగవత్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ పట్టాను అందుకున్నాడు. ఈ పరిశోధనకు 2021లో మహేశ్.. ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి పెటెంట్ పొందారు. పరిశోధన ఫలితాలను జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ప్రచురించిన నేపథ్యంలో వాటి ఆధారంగా డాక్టరేట్ దక్కింది. పట్టాను భగవత్ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి.కె.శర్మ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు మహేశ్ను అభినందించారు. -
తరగతులు ఐదు.. గది ఒక్కటి
మొయినాబాద్రూరల్: ‘ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను బోధిస్తున్నాం. చిన్నారులకు ఉచితంగా పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. మౌలిక వసతులు కల్పిస్తున్నాం. మీ పిల్లల భవిష్య త్తు మాది’అని ఈ విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు చేపట్టిన బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యాధికారులు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. బడీడు పిల్లలను, ప్రైవేటు బడి బాటలో ఉన్నవారిని సైతం సర్కారు బడుల్లో చేర్పించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంత వరకు బాగనే ఉన్నా.. పాఠశాలల ప్రారంభం అనంతరం సర్కారు బడుల్లో తిష్టవేసిన సమస్యలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నా యి. తరగతి గదులు, సౌకర్యాల కొరత, ఉపాధ్యా యుల లేమితో చిన్నారుల విద్యాభ్యాసం ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు మొయినాబాద్మండలం అప్పారెడ్డిగూడ పాఠశాలే నిదర్శనం. రోడ్డు పక్కన చెట్ల కింద.. మండల పరిధి అప్పారెడ్డిగూడ ప్రాథమిక పాఠశాలలో 1– 5వ తరగతులు కొనసాగుతున్నాయి. విద్యార్థుల సంఖ్య 50కి పైగానే ఉంది. ఇద్దరు ఉపాధ్యాయులు పాఠాలు భోదిస్తున్నారు. గత సంవత్సరంలో చిన్నారు సంఖ్య 38 ఉండగా.. ఈ ఏడాది అది స్వల్పంగా పెరిగింది. పాఠశాలకు మొత్తం ఒకే తరగతి ఉండటంతో ఐదు తరగతుల విద్యార్థులు బోధించడం కష్టంగా మారింది. దీంతో క్లాస్ రూమ్లో 1,2 తరగతులు, వరండాలో రెండు తరగతులు, రోడ్డు పక్కన చెట్ల కింద 5వ తరగతి వారికి పాఠాలు చెబుతున్నారు. బోధన విషయంలో ఉపాధ్యాయులు కృషి బాగానే ఉన్నా.. అదనపు గదులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరిన్ని గదులు నిర్మిస్తే నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తామని టీచర్లు పేర్కొంటున్నారు. రోడ్డు పక్కనేవిద్యార్థులకు బోధన పట్టించుకోని విద్యాధికారులు సర్కారు బడులఅభివృద్ధిపై ప్రశ్నిస్తున్న గ్రామస్తులు అదనపు గదులునిర్మించాలంటూ డిమాండ్ -
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య షాబాద్: నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరమని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని నాగర్కుంట గ్రామానికి చెందిన పాలమాకుల ఆనందంకు రూ.1 లక్ష 48 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మక్దూం భనన్లో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహకారంతో చెక్కు మంజూరు అయిందని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు నర్వతాలు, మండల కార్యదర్శి శ్రీశైలం తదితరులు ఉన్నారు. నిర్మాణ దారుడిపైకేసు నమోదు ఇబ్రహీంపట్నం రూరల్: బాలకతో వెట్టిచాకిరి చేయిస్తున్న ఓ రియల్ ఎస్టేట్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం ఆదిబట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధి ఎంపీపటేల్గూడ సమీపంలో అనిల్ కన్స్ట్రక్షన్ యజమాని, భవన నిర్మాణ రంగంలో జార్ఖండ్కు చెందిన 16 ఏళ్ల బాలికతో పనిచేయిస్తుండగా.. బాలికకు విముక్తి కల్పించారు. అనంతరం యజమానిపై కేసు నమోదు చేశారు. హ్యుందాయ్ డిజిటల్ ఫ్లోట్ వ్యాన్లు ప్రారంభం సాక్షి, సిటీబ్యూరో: భారతదేశంలో మొదటి స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్, అతిపెద్ద ఎగుమతిదారు హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఇటీవల గ్రామీణ అవుట్లెట్లలో డిజిటల్ ఫ్లోట్ కార్యకలాపాలను ప్రారంభించింది. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలలో లోతైన, గణనీయమైన వ్యాప్తి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని డిజిటల్ ఫ్లోట్ కాన్సెప్ట్ను ప్రవేశపెట్టారు. హ్యుందాయ్ హ్యాచ్బ్యాక్ ఎస్యూబీ ఎక్స్టర్, వెన్యూ, గ్రాండ్ ఐ10 నియోస్ వినియోగదారుల ఇంటి వద్దకు నేరుగా రవాణా చేస్తారు. కార్యక్రమాన్ని హ్యుందాయ్ మోటా ర్ ఇండియా లిమిటెడ్ ఆర్ఎస్హెచ్ రామ్కుమార్ జి, ఆర్పిఎస్హెచ్ మనోజ్ బాథం, హైదరాబాద్ నుంచి డిజిటల్ ఫ్లోట్ వ్యాన్లను జెండా ఊపి ప్రారంభించారు. ఇవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రయాణించనున్నాయని వారు తెలిపారు. హైటెన్షన్ టవర్ ఎక్కి యువకుడి హల్చల్ గచ్చిబౌలి: మతిస్థిమితం లేని ఓ యువకుడు హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన సంఘటన శుక్రవారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగ్నంగా తిరుగుతున్న ఓ యువకుడు శుక్రవారం ఉదయం రాఘవేంద్ర కాలనీలో రోడ్డులో హైటెన్షన్ టవర్ ఎక్కాడు. దీనిని గుర్తించిన వాహనదారులు, స్థానికులు అతడిని కిందికు దిగాలని కేకలు వేసినా వినకుండా టవర్ చివరి వరకు ఎక్కాడు. దీంతో వారు డయల్ 100కు సమాచారం అందించడంతో గచ్చిబౌలి పెట్రోల్ మొబైల్ సిబ్బంది అక్కడికి చేరుకుని కిందకు దిగాలని అతడికి నచ్చజెప్పారు. దాదాపు గంట సేపటి తర్వాత అతను కిందకు దిగిరావడంతో దుస్తులు వేయించి పీఎస్కు తీసుకెళ్లారు. అతడిని రాజరాజేశ్వరీనగర్లో నివాసం ఉంటున్న ఆకాష్ ఆర్కంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
విద్యార్థుల అభివృద్ధికి సదస్సు దోహదం
షాద్నగర్రూరల్: విద్యార్థుల అభివృద్ధికి జాతీయ సదస్సులు దోహదపడతాయని మూన్రే కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజ్కుమార్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలం రాయికల్ శివారులోని మూన్రే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్(ఎంఐపీఎస్) కళాశాలలో ఈ నెల 16, 17న మిప్స్కాన్–2025 జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. శుక్రవారం కళాశాలలో సంస్థ అధ్యక్షుడు పర్వత్రెడ్డి అధ్యక్షతన సదస్సుకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ రాజ్కుమార్ మాట్లాడుతూ.. జాతీయసదస్సుల ద్వారా విద్యార్థులకు పరిశోధన,నైపుణ్యం, పరిశ్రమలలో అనుసంధానంతదితర అంశాలపై అవగాహన పెరుగుతుందన్నారు. ఈ మిప్స్కాన్ జాతీయ సదస్సుకుదేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, పరిశోధకులు పాల్గొంటుండటంతో ఒక గొప్ప శాసీ్త్రయ వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్, అభివృద్ధికి ఇలాంటి సదస్సులు ఎంతగానోదోహదపడతాయని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, విద్యా ప్రయాణానికి మైలురాయిగా మలుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ రాజ్కుమార్ -
పోగొట్టుకున్న నగదు బ్యాగు అప్పగింత
కందుకూరు: పోగొట్టుకున్న నగదు సంచిని పోలీసులు బాధితులకు అప్పగించారు. సీఐ సీతారామ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమనగల్లు మున్సిపాలిటీ విఠాయిపల్లికి చెందిన ఎంకే విష్ణువర్ధన్ వద్ద పని చేసే సురేష్.. గురువారం సాయంత్రం మండల పరిధి జైత్వారం సమీపంలోని రాంరెడ్డి ఫౌల్ట్రీ ఫాంనకు వచ్చాడు. అక్కడ నుంచి రూ.4,01,400(నాలుగు లక్షల పద్నాలుగు వందల రూపాయలు)లను బ్యాగులో పెట్టుకుని బైక్పై తిరిగి విఠాయిపల్లికి బయలుదేరాడు. మార్గమధ్యలో కొత్తగూడ శ్రీ నిఖేతన్ స్కూల్ వద్ద డబ్బుల బ్యాగు పడిపోయింది. కొద్దిసేపటికి కిందపడ్డ ఆ బ్యాగ్ను గుర్తించిన ఆ స్కూల్ అడ్మిన్ రోజ.. ఆ నగదు సంచిని భద్రపరిచారు. పోగొట్టుకున్న వారు ఎవరైనా వస్తే ఇద్దామని వేచి ఉన్నారు. బ్యాగ్ పడిపోయిన విషయాన్ని బాధితుడు సురేష్.. తన యజమానికి చెప్పాడు. ఆయన అక్కడి కౌన్సిలర్ సుజాత సహాయంతో కందుకూరు పీఎస్కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సీఐ సీతారామ్, ఎస్ఐ సైదులు ఆ మార్గంలోని అన్ని సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేయాలని కానిస్టేబుల్ కృష్ణ, హోంగార్డు రమేష్ను ఆదేశించారు. దీంతో వారు జైత్వారం నుంచి కెమెరాలను పరిశీలన చేసుకుంటూ.. కొత్తగూడ వైపునకు వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కొత్తగూడ పరిధి శ్రీ నిఖేతన్ హైస్కూల్ వద్ద కెమెరాల తనిఖీకి వచ్చిన పోలీసులకు.. ఆ పాఠశాల ఇన్చార్జి మధుసూదన్రెడ్డి నగదు బ్యాగు భద్రపరిచిన విషయం చెప్పారు. అనంతరం పోలీసుల సమక్షంలో.. పాఠశాల నిర్వాహకులు నగదు బ్యాగ్ను బాధితులకు అప్పగించారు. -
గొలుసు దొంగ రిమాండ్
మీర్పేట: చైన్ స్నాచర్ను మీర్పేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ నాగరాజు కథనం ప్రకారం.. మీర్పేటవందనపురి కాలనీకి చెందిన చెవుల సంధ్య ఈ నెల 9న మధ్యాహ్నం సరుకుల కోసం సమీపంలోని కిరాణ దుకాణానికి వెళ్లింది. తిరిగి వస్తుండగా.. నాగర్కర్నూలు జిల్లా బిచినేపల్లి మండలానికి చెందిన సెంట్రింగ్ పనిచేసే కందనూలు మల్లేశ్(28) ఇల్లు అద్దెకు కావాలని ఆమెను వెంబడించాడు. సదరు మహిళ ఇంట్లోకి వెళ్లగా.. మరలా వచ్చి ఏదైనా పని ఇప్పించాలని అడిగి, ఆమె మెడలోని రెండు తులాల పుస్తెలతాడును తెంచుకుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. బంగారు గొలుసు, ద్విచక్ర వాహనాన్ని స్వాఽధీనం చేసుకుని, రిమాండ్కు తరలించారు. యువకుడు అదృశ్యం పహాడీషరీఫ్: యువకుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఆమనగల్లు గ్రామానికి చెందిన నర్సింహ కుమారుడు పాతకోట యాదగిరి(35) తుక్కుగూడలోని మారుతీ షోరూంలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 7న రోజు మాదిరిగానే విధులకు వెళ్లిన యువకుడు తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. అతనికోసం తెలిసిన ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో సదరు వ్యక్తి బామ్మర్ది జగన్ గురువారం ఇచ్చి న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. వివరాల తెలిసిన వారు ఠాణాలో కానీ.. 87126 62367 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
శంకర్పల్లి: కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్రెడ్డి కార్యకర్తలకు సూచించారు. గురువారం మండలంలోని పిల్లిగుండ్ల గ్రామ శివారులో యూత్ కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుడు మహిపాల్ ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ సమావేశం ఏర్పాటు చేయగా.. నాగేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చే ఏ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అదేవిధంగా పార్టీ సిద్ధాంతాలను గడపగడపకూ చేరేలా చూడాలన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, పార్టీ ఇన్చార్జి పామెన భీంభరత్లతో సమన్వయం చేసుకుంటూ యువత ముందుకు సాగాలని కోరారు. యూత్ కాంగ్రెస్లో ఎవరికై నా సమస్యలు ఉంటే, జిల్లా నాయకత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి అరవింద్, అసెంబ్లీ ఇన్చార్జి వసీం, మండల అధ్యక్షుడు బొల్లారం ప్రశాంత్రెడ్డి, నాయకులు సంజయ్, దయాగౌడ్, నర్సింహారెడ్డి, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్రెడ్డి -
జనాభా.. గబగబా!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఉద్యోగ, ఉపాధి నిమిత్తం జిల్లాకు వచ్చి స్థిరపడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. జనాభాతో పాటే నిర్మాణాలు కూడా భారీగా పెరిగాయి. పల్లెలు, పట్టణాలకు తేడా లేకుండా పోయింది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 24,46,265 మంది ఉండగా.. వీరిలో 12,54,184 మంది పురుషులు, 11,92,081 మంది మహిళలు ఉన్నారు. ఐటీ అనుబంధ సంస్థలు, రియల్ ఎస్టేట్, భారీ పరిశ్రమలతో 13 ఏళ్ల వ్యవధిలోనే జిల్లా జనాభా డబుల్ (48 లక్షలు) అయ్యింది. భారీగా పెరిగిన వలసలు 2023 నవంబర్లో ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం 18 ఏళ్ల పైబడిన వారి సంఖ్య 35,23,219 చేరుకుంది. వీరిలో 18,23,165 మంది పురుషులు ఉండగా, 16,99,600 మంది మహిళలు, 454 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. వీరు కాకుండా 18 ఏళ్లలోపు వారు మరో 12.50 లక్షల మంది ఉన్నట్లు అంచనా. అత్యధిక జనాభా ఉన్న నియోజకవర్గాల జాబితాలో శేరిలింగంపల్లి మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాలు ఉన్నా యి. మొత్తం జనాభాలో 18 ఏళ్లలోపు వారు 12.50 లక్షల మంది ఉండగా, ఆ తర్వాతి వయ స్కులు 35 లక్షల మందికిపైగా ఉండటం గమనార్హం. పెరిగిన నిత్యావసరాల ధరలు, వైద్య ఆరోగ్య ఖర్చులు, పిల్లల చదువులకు భారీగా ఖర్చవుతుండటంతో మెజార్టీ యువత ఒకరు లేదా ఇద్దరితోనే సరిపెట్టుకుంటున్నప్పటికీ.. వలసల కారణంగా జనాభా అనూహ్యంగా పెరుగుతూనే ఉంది. 2011లో 5,63,565 నివా సాలు ఉండగా, 2025 నాటికి గృహ విద్యుత్ కనెక్షన్ల సంఖ్య ఆధారంగా 13,22,646 చేరింది. మరోవైపు ఉమ్మడి కుటుంబాల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఒక్కో ఇంట్లో ఆరు నుంచి ఎనిమిది మంది ఉండగా, ప్రస్తుతం సగటున ముగ్గురు నుంచి నలుగురు మాత్రమే ఉంటున్నారు. వయసుల వారీగా పరిశీలిస్తే.. ● ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 18 నుంచి 19 ఏళ్ల వయసు ఉన్న వారు 92,540 మంది ఉండగా, 20 నుంచి 29 ఏళ్ల వయసు ఉన్న వారు 6,37,940 మంది ఉన్నారు. 30 నుంచి 39 ఏళ్ల వయసు ఉన్న వారు 10,73,733 మంది, 40 నుంచి 49 ఏళ్ల వయసు ఉన్న వారు 7,77,548 మంది ఉన్నారు. 50 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న వారు 4,77,325 మంది ఉండగా, 60 నుంచి 69 ఏళ్ల వారు 2,81,235 మంది ఉన్నారు. 70 నుంచి 79 ఏళ్ల వయసు వారు 1,38,324 మంది, 80 ఏళ్లు పైబడిన వారు 43,775 మంది ఉండ డం గమనార్హం. ● వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏటా సగటున 42 వేల ప్రసవాలు జరుగుతున్నట్లు అంచనా. వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెరగడం, ఆరోగ్య సూత్రాలు పాటిస్తుండటం, అనేక ఆస్పత్రులు అందుబాటులోకి రావడంతో సగటు మనిషి ఆయుఃప్రమాణం భారీగా పెరిగింది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు 4.63 లక్షల మందికిపైగా ఉండడం విశేషం. ● వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం డేటా ప్రకారం ఐదేళ్లలోపు పిల్లలు సుమారు రెండున్నర లక్షల మంది ఉన్నట్లు అంచనా. ● విద్యాశాఖ లెక్కల ప్రకారం ఆరు నుంచి 14 ఏళ్లలోపు వారు 7.50 లక్షల మంది ఉన్నట్లు అంచనా. 15 నుంచి 17 ఏళ్ల వయసు ఉన్న వారు (ఇంటర్మీడియెట్/డిగ్రీ కోర్సులు చదువుతున్నవారు) రెండున్నర నుంచి మూడు లక్షల మంది ఉన్నట్లు అంచనా. జిల్లాలో శరవేగంగా పెరుగుతున్న ప్రజలు ఉపాధి, ఉద్యోగావకాశాల కోసం భారీగా రాక ఆ తర్వాత ఇక్కడే స్థిర నివాసం 2011తో పోలిస్తే 2025లో రెండింతలు నేడు ప్రపంచ జనాభా దినోత్సవం -
లారీ, కారు ఢీ ఇద్దరి దుర్మరణం
కొత్తూరు: లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో మాజీ సర్పంచ్తో పాటు అతని బంధువు చనిపోయిన సంఘటన కొత్తూరు మున్సిపల్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం, దిలావర్గూడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పరిగి చంద్రశేఖర్రెడ్డి (45), అతని బంధువు నందిగామ మండలం, దేవుని మామిడిపల్లికి చెందిన ఎర్రగుంట చంద్రశేఖర్రెడ్డి ఇంటికి వచ్చాడు. అనంతరం రాత్రి కారులో నందిగామ నుంచి కొత్తూరు రైల్వే బ్రిడ్జిపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నర్సింహారావు తెలిపారు. మాజీ మంత్రి నివాళి..మహేశ్వరం: చంద్రశేఖర్రెడ్డి మృతి విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరులు దిలావర్గూడకు చేరుకున్నారు. మృతుడికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు హన్మగళ్ల చంద్రయ్య, సుభాన్పూర్ మాజీ సర్పంచ్ గుత్తి పద్మ పాండు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చంద్రశేఖర్రెడ్డి, మాజీ సర్పంచ్ నర్సింహగౌడ్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మృతుల్లో దిలావర్గూడ మాజీ సర్పంచ్, అతని బంధువు కొత్తూరు రైల్వే బ్రిడ్జిపై ప్రమాదం -
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ
ఇద్దరికి తీవ్ర గాయాలు శంకర్పల్లి: ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ఓ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ఇద్దరికి గా యాలైన సంఘటన శంకర్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు స్నేహితులు రావత్(25), సమేహ(25) కలిసి గురువారం ఉదయం తమ ద్విచక్రవాహనంపై ఉద్యోగ రీ త్యా మోమిన్పేట్ వైపు వెళ్తున్నారు. అయితే మండలంలోని లక్ష్మారెడ్డిగూడ గేట్ వద్ద వికారాబాద్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో రావత్, సమేహకి బలమైన గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో రావత్ పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. విద్యుదాఘాతంతో ఆవు మృతి షాబాద్: విద్యుదాఘాతంతో ఓ పాడి ఆవు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కేసారం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కావలి రవీందర్ తన పాడి ఆవును పొలంలో మేత మేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద వైర్ తగిలి షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. రోజుకు 12 లీటర్ల పాలు ఇచ్చే పాడి ఆవు మృతి చెందడంతో రైతు బోరున విలపించాడు. ప్రభుత్వం స్పందించి ఆర్థికసాయం అందజేయాలని కోరారు. రైల్వే పట్టాల పక్కన మృతదేహం లభ్యం కొత్తూరు: రైల్వే పట్టాల పక్కన ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన సంఘటన కొత్తూరు మున్సిపల్ పరిధి తిమ్మాపూర్ రైల్వేస్టేషన్సమీపంలో గురువారం వెలుగు చూసింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ మల్లేష్ తెలిపిన వివరాల మేరకు.. రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాల పక్కన ఓ మృతదేహం పడి ఉందనే సమాచారంతో అక్కడికి చేరుకొని పరిశీలించారు. దాదాపు రెండు రోజుల క్రితం కదులుతున్న రైలు నుంచి గుర్తు తెలియని వ్యక్తి కిందపడి మృతిచెందినట్లు స్థానికులు భావిస్తున్నారు. స్టేషన్ మాస్టర్ ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. జడ్సీ లాగిన్ ఓపెన్ చేసేందుకు యత్నం విధుల నుంచి ఆపరేటర్ తొలగింపు గచ్చిబౌలి: జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి వెస్ట్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖాడే లాగిన్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవుట్ సోర్సింగ్లో సెక్షన్ రైటర్గా ఉన్న అభిలాష్ కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు. రెండు రోజుల క్రితం రాత్రి అతను శేరిలింగంపల్లి వెస్ట్ జోనల్లో కమిషనర్ హేమంత్ బోర్ఖాడే లాగిన్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించాడు. జ డ్సీ ఫోన్కు ఓటీపీ వెళ్లడంతో అప్రమత్తమైన ఆయన అంతర్గత విచారణ చేపట్టగా అభిలాష్కు చెందిన ఐడీగా నుంచి ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. అభిలాష్పై చర్యలు తీసుకోవాలని సిటీ ప్లానర్ శ్యామ్ కుమార్ జోనల్ కమిషనర్కు లేఖ రాశారు. దీంతో జోనల్ కమిషనర్ సంబంధిత ఏజెన్సీకి అతడిని సరెండర్ చేశారు. జోనల్ కమిషనర్ లాగిన్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. అవినీతికి కేరాఫ్గా మారిన టైన్ప్లానింగ్ విభాగంలో అవుట్ సోర్సింగ్, ప్రైవేట్ సిబ్బంది తరచూ అధికారుల లాగిన్లను వాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ వలలో మహిళా పీఎస్ ఎస్ఐ గచ్చిబౌలి: ఓ కేసులో పేరు తొలగించేందుకు డబ్బులు తీసుకుంటూ గచ్చిబౌలి ఉమెన్ పీఎస్ ఎస్ఐ వేణుగోపాల్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే..కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ భర్తతో పాటు అత్తింటి వారిపై గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇరు పక్షాలను పిలిచి మాట్లాడారు. గృహహింస కేసులో తల్లి పేరును తొలగించేందుకు ఎస్ఐ వేణు గోపాల్ రూ.25 వేలు డిమాండ్ చేశాడు. దీంతో సదరు మహిళ భర్త ఏసీబీ అధికారులను అశ్రయించారు. గురువారం మహిళా పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వేణుగోపాల్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో దాడి చేసిన పోలీసులు అతడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతడి రూ.25 వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. -
ప్రభుత్వానిది భూ దందా
మొయినాబాద్: భూ దందా చేయడానికే ప్రభుత్వం పేదల భూములు గుంజుకుంటోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజభూపాల్గౌడ్ ఆరోపించారు. మున్సిపల్ పరిధిలోని ఎనికేపల్లిలో ధర్నా చేస్తున్న రైతులకు గురువారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోశాలకు ఇవ్వడానికి ప్రభుత్వానికి పేదలు సాగుచేసుకునే భూములే దొరికాయా..? ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి.. వాటిలో ఏర్పాటు చేస్తే ఏమవుతుంది అని ప్రశ్నించారు. కోకాపేటలో ఉన్న గోశాలను ఎనికేపల్లికి తరలించి అక్కడి భూములను ప్రభుత్వం అమ్మడానికి చూస్తోందన్నారు. దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న భూములను వదిలిపెట్టొద్దని.. రైతుల పోరాటానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సన్వల్లి ప్రభాకర్రెడ్డి, కిసాన్ మోర్చ జిల్లా క్యాదర్శి మోర నర్సింహారెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్గౌడ్, నియోజకవర్గం కన్వీనర్ వెంకటేశ్గౌడ్, బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, మాజీ అధ్యక్షుడు క్యామ పద్మనాభం, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజభూపాల్గౌడ్ -
యువకుడి అదృశ్యం
పహాడీషరీఫ్: యువకుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచాల మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన కేశగోని హరి ప్రసాద్(27) తుక్కుగూడలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటాడు. ఈ నెల 9వ తేదీన ఉదయం 9 గంటలకు డ్యూటీకీ వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన హరిప్రసాద్ సాయంత్రమైనా రాలేదు. అతడు ఫోన్లో కూడా అందుబాటులోకి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సాధ్యమైన ప్రాంతాలలో వెతికినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయమై అతని తండ్రి స్వామి గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసన వారు పోలీస్స్టేషన్లో గాని 87126 62367 నంబర్లో గాని సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. -
నేడు శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్తో ‘ఫోన్ ఇన్’
శుక్రవారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2025సమస్యలు వింటున్నమున్సిపల్ కమిషనర్ వెంకటేశం శంకర్పల్లి: మున్సిపల్ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో భాగంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో శుక్రవారం శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్ ఎ.యోగేశ్తో ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. మున్సిపల్ పరిధిలోని ప్రజలు ఆయా వార్డుల్లోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావచ్చు. సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.చేవెళ్ల: అందరికీ అందుబాటులో ఉంటూ.. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ.. మున్సిపాలిటీని అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ ఎస్.వెంకటేశం అన్నారు. మున్సిపల్ పరిధిలో సమస్యలు.. పరిష్కార మార్గాలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘ఫోన్ ఇన్’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను స్థానికులు కమిషనర్ దృష్టికి తెచ్చారు. వాటిని సావధానంగా ఆలకించిన ఆయన వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రశ్న: మల్కాపూర్ వార్డుకు వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. నీటి సమస్య ఉంది. చెత్త సేకరణ సక్రమంగా చేయడం లేదు. – గోపాల్రెడ్డి, వెంకటేశ్, మాణిక్యరెడ్డి (మల్కాపూర్) కమిషనర్: పారిశుద్ధ్య, నీటి సమస్యలు వెంటనే పరిష్కరించేలా అధికారులను ఆదేశిస్తా. రోడ్డు సమస్యకు సంబంధించి నిధులు వచ్చిన వెంటనే పరిష్కారం అవుతుంది. ప్రశ్న: మున్సిపల్ పరిధిలో మిషన్ భగీరథ సమస్యలు ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు లేక ఇబ్బంది ఏర్పడుతోంది. టెంపుల్ కమాన్ వద్ద ఎప్పుడూ వర్షపు నీరు నిలువ ఉంటోంది. వచ్చిపోయే వారికి ఇబ్బందిగా మారింది. ఏ సమస్యకు ఎవరిని సంప్రదించాలో తెలియజేస్తే బాగుంటుంది. – బురాన్ ప్రభాకర్ (హౌసింగ్బోర్డు కాలనీ) జవాబు: ఆయా సమస్యలపై తక్షణమే చర్యలు చేపడతాం. మీ సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం. మున్సిపల్ పరిధిలోని అధికారుల వివరాలను ప్రత్యేకంగా సోషల్ మీడియా గ్రూప్ ఏర్పాటు చేసి ప్రజలకు తెలిసేలా చూస్తాం. ప్రశ్న: ఎల్ఆర్ఎస్కు సంబంధించి ఆన్లైన్లో డబ్బులు చెల్లించాం. దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఎన్ఓసీ వచ్చింది. ఎఫ్టీఎల్ అని డ్యాక్యుమెంట్ పెండింగ్ అంటూ సమస్యలు వస్తున్నాయి. – మంగలి నర్సింలు, రంగారెడ్డి (దేవునిఎర్రవల్లి), జనార్దన్రెడ్డి (పలుగుట్ట), ఎం.డీ.ఇబ్రహీం (కిష్టారెడ్డినగర్), శ్రీనివాస్రెడ్డి (ఇంద్రారెడ్డినగర్) జవాబు: టెక్నికల్గా కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి పైనుంచి క్లియర్ చేయాల్సి ఉంది. మా పరిధిలో ఉన్నవాటిని పెండింగ్లో లేకుండా చూస్తున్నాం. టౌన్ ప్లానింగ్ అధికారి ద్వారా సమస్యలు పరిష్కరించేలా చూస్తాం. ప్రశ్న: వీధిలైట్లు వెలగడం లేదు. చెత్త సేకరణ సిబ్బంది రావడం లేదు. డ్రైనేజీ తరచూ జామ్ అవుతున్నా పట్టించుకోవడం లేదు. సీసీ రోడ్డు లేక ఇబ్బందులు ఉన్నాయి. – సుశాంత్, వై.శ్రీనివాస్, ఎండీ నసీర్ఖాన్ (రంగారెడ్డి కాలనీ) జవాబు: సిబ్బందిని పంపించి సమస్యలను పరిశీలిస్తాం. త్వరలోనే వాటిని పరిష్కరిస్తాం. ప్రశ్న: నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. జాబితాలో పేరు వచ్చింది కానీ ప్రొసీడింగ్ ఇవ్వలేదు. ఇల్లు కట్టుకోవచ్చా. – ఎండీ చాన్పాషా (ఇబ్రహీంపల్లి) జవాబు: ఇల్లు మంజూరైతే తప్పకుండా ప్రొసీడింగ్ వచ్చి ఉండాలి. ఎందుకు రాలేదో తెలుసుకుంటాను. మీరు కూడా మరోసారి చెక్ చేసుకోండి. రాకపోతే తప్పకుండా ఇప్పిస్తాం. ప్రశ్న: మా వార్డులో వీధి లైట్లు వెలగడం లేదు. ఇనుప స్తంభాలు ప్రమాదకరంగా ఉన్నాయి. గేట్ నుంచి రోడ్డు గుంతలమయంగా మారింది. రాత్రిళ్లు ప్రయాణం ఇబ్బందిగా ఉంది. – రజినీకాంత్ (దామరగిద్ద) జవాబు: మీ వార్డులో ఇటీవలే పర్యటించాను. సమస్యలు దృష్టికి వచ్చాయి. ఇనుప స్తంభాలు తొలగించే చర్యలు తీసుకుంటున్నాం. రోడ్డు మరమ్మతులపై సంబంధిత అధికారులకు నివేదిస్తాం. ప్రశ్న: మా వార్డులో వీధి లైట్లు వెలగడం లేదు. సీసీ రోడ్లు లేవు. – రాంచందర్, గీత (గ్రీన్ సిటీ) జవాబు: సమస్యలు నోట్ చేసుకున్నాం. పరిశీలించి చర్యలు చేపడతాం. ప్రశ్న: మెయిన్రోడ్డుపై డ్రైనేజీ లేక ఇబ్బందులు ఉన్నాయి. లేబర్ గుడిసెలు వేసుకొని కాలనీలను అపరిశుభ్రం చేస్తున్నారు. – కృష్ణ, రాజు (వీరభద్రకాలనీ) జవాబు: సమస్యలు ఉన్న కాలనీల్లో పర్యటించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం. ప్రశ్న: డ్రైనేజీ సమస్య ఎక్కువైంది. నిత్యం లీకవుతోంది. – సత్యనారాయణ, అమీర్ (భగత్సింగ్కాలనీ) జవాబు: పరిశీలన చేసి పరిష్కరిస్తాం. ప్రశ్న: వార్డులో రోడ్డు సమస్య ఉంది. తాగునీరు రావడం లేదు. జంగంగుట్ట వద్ద ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలంలో చెత్త డంపింగ్ చేస్తుండడంతో నీళ్లు కలుషితం అవుతున్నాయి. – చంద్రశేఖర్రెడ్డి, సురేందర్రెడ్డి (పలుగుట్ట) జవాబు: రోడ్డు సమస్యను సంబంధిత అధికారులకు నివేదిస్తాం. డంపింగ్ యార్డు కోసం స్థల అన్వేషణ చేస్తున్నాం. ప్రశ్న: వారం రోజులుగా కరెంట్ సమస్యతో నీళ్లు రావడం లేదు. వీధి లైట్లు వెలగడం లేదు. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు. – మాల్లారెడ్డి, శ్రీకాంత్, వెంకటేశ్ (పామెన) జవాబు: వార్డులో తప్పకుండా పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తాం. కరెంట్ సమస్యపై విద్యుత్ అధికారులకు సమాచారం ఇస్తాం. ప్రశ్న: కుక్కల బెడద, కోతుల బెడద ఎక్కువ అవుతోంది. – రవీందర్ (హౌసింగ్ బోర్డు కాలనీ) జవాబు: మున్సిపల్ పరిధిలో ఇలాంటి సమస్యలు ఎక్కడున్నా గుర్తించి ఏం చేయాలో నిర్ణయిస్తాం. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఫోన్ చేయాల్సిన నంబర్: 73311 27776, 96764 84485ప్రజల సమస్యలను నమోదు చేసుకుంటున్న సిబ్బందిన్యూస్రీల్ -
ఆడిట్ బృందం ఆకస్మిక తనిఖీలు
తుర్కయంజాల్: పురపాలక సంఘం పరిధిలో గురువారం డిస్ట్రిక్ట్ స్పెషల్ ఆడిటర్ మహ్మద్ ఖాజా బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా పలు వార్డుల్లో చేపడుతున్న రోడ్ల శుభ్రత, వాటర్ ట్యాంకులు, డివైడర్లపై మొక్కలు, ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల నిర్వహణ, వంటశాలలు, మరుగుదొడ్లు, కంపోస్ట్ యార్డ్ల నిర్వహణ, తడి, పొడి చెత్తను వేరుచేయడం, వనమహోత్సవంలో నాటిన మొక్కలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశా రు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా కోహెడ ప్రభుత్వ పాఠశాలలో ప్లాస్టిక్ నిషేధం, పర్యావరణ కాలుష్యం వంటి అంశాలపై నిర్వహించిన స్వచ్ఛత పోటీల్లో గెలిచిన వారికి మెమొంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ వినయ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సురేష్ పాల్గొన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణల తొలగింపు హయత్నగర్: అబ్దుల్లాపూర్మెట్టు మండలం కొహెడలోని తాళ్లకుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను గురువారం ఇరిగేషన్ అధికారులు కూల్చివేశారు. సర్వే నంబర్ 883, 886లలో విస్తరించి ఉన్న చెరువు ఎఫ్టీఎల్లో రెండు ప్లాట్లలో ప్రహరీలు నిర్మించారు. సమాచారం అందుకున్న ఇరిగేషన్ ఏఈ వంశీ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బందితో కలిసి జేసీబీ సాయంతో వాటిని కూల్చివేశారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ.. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టినా, కాలువలను పూడ్చివేసినా చర్యలు తప్పవని అన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలి ఎంఈఓ ఆఫీసుకు తాళం వేసి ఆందోళన ఇబ్రహీంపట్నం: మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు, గౌరవ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి కార్యాలయానికి కార్మికులు తాళం వేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న మాట్లాడుతూ.. ఏడాదిగా బిల్లులు, గౌరవ వేతనం చెల్లించడం లేదని అన్నారు. గుడ్లు, రాగి జావ పెట్టాలని ప్రభుత్వం చెబుతోంది తప్ప అందుకు తగ్గ నిధులు మంజూరు చేయడంలేదన్నారు. అప్పులు చేసి గుడ్లు తీసుకొచ్చి పెడుతున్నప్పటికీ బిల్లులు ఇవ్వడం లేదన్నారు. ఎంఈఓ, ఎస్టీఓ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగతున్నా మోక్షం కలగడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎస్ఐ నాగరాజు ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పి తాళం తీయించారు. ఎస్ఎఫ్ఐ, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు ఆందోళనకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ మున్సిపల్ కన్వీనర్ ఎల్లేశ్, కార్మికులు పాల్గొన్నారు. -
ఆటో.. రూట్ ఎటో!
డీలర్ల అక్రమార్జన కోసమే 20 వేల ఎల్పీజీ, సీఎన్జీ పర్మిట్లు సాక్షి, సిటీబ్యూరో: రాజధాని నగరంలో ఆటోపర్మిట్ల దోపిడీ పర్వం మొదలైంది. వారం రోజులుగా ఆటోరిక్షాల షోరూంలలో డ్రైవర్ల నమోదు ప్రక్రియ చేపట్టారు. మొదట వచ్చినవారికి మొదట కేటాయింపు (ఫస్ట్ టూ ఫస్ట్ కమ్) పద్ధతిలో జరుగుతున్న ఈ నమోదు వల్ల డ్రైవర్లు షోరూమ్లకు పరుగులు తీస్తున్నారు. కేవలం డ్రైవర్ల వివరాలను నమోదు చేసేందుకే సుమారు రూ.5000 చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆటో రిక్షాల ధరలను బహిరంగంగా ప్రకటించకుండా డ్రైవర్లను నమోదు చేసుకోవడం వల్ల బ్లాక్ మార్కెటింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవైపు ఔటర్రింగ్ రోడ్డు వరకు ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే వినియోగించాలంటూనే మరోవైపు ఏకంగా 20 వేల సీఎన్జీ, ఎల్పీజీ ఆటోలకు అనుమతులను ఇవ్వడంలో ఆంతర్యమేమిటని పలు ఆటోసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ అంశంపై ఆటో సంఘాల నాయకులు న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. ఈవీలకు ప్రోత్సాహం ఏమైనట్టో..? నగరంలోని ఆటోల స్థానంలో ఔటర్ వరకు పూర్తిగా ఎలక్ట్రిక్ ఆటోలను అందుబాటులోకి తేనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలోనే ప్రకటించారు. కేంద్రం రూపొందించిన ఈవీ పాలసీకి అనుగుణంగా ఎలక్ట్రిక్ ఆటోలకు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. ఒకవైపు ఈవీ పాలసీ కొనసాగుతుండగా కొత్తగా 65 వేల ఆటో పర్మిట్లకు అనుమతులను ఇవ్వడంలో మతలబు ఏంటని ఆటో సంఘాలు, పర్యావరణ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. కేవలం ఈవీల ముసుగులో 20 వేల ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలను విక్రయించేందుకే ప్రభుత్వం ఈ పర్మిట్లను విడుదల చేసినట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎడాపెడా డ్రైవర్లను నమోదు చేసుకొన్న అనంతరం కొత్త ఆటోలకు కృత్రిమ కొరతను సృష్టించి భారీ ఎత్తున ధరలు పెంచేందుకు కొందరు డీలర్లు, ఫైనాన్షియర్లు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్లు ఆటో సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. పాతవాటికి రిట్రోఫిట్మెంట్ ఎందుకు? అక్రమార్కులకు కొమ్ముకాసే విధంగా ఉన్న కొత్త పర్మిట్ల విధానం పూర్తి లోపభూయిష్టంగా ఉంది. ఒకవైపు ఈవీ పాలసీ కొనసాగుతుండగా కొత్తగా 20 వేల ఈవీలతో పాటు మరో 20 వేల ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలకు అనుమతులను ఇచ్చారు. ఇవి కాకుండా 25 వేల పాత ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకొనేందుకు రిట్రోఫిట్మెంట్ అనుమతులను ఇచ్చారు. అక్రమార్కులకు కొమ్ముకాస్తూ విడుదల చేసిన ఆటోరిక్షా పర్మిట్ల పందేరంలో సామాన్య, నిరుపేద డ్రైవర్లే మరోసారి సమిధలుగా మారనున్నారు. నమోదైన చోట కొనేందుకేనా... ఆటోడ్రైవర్లు తెలంగాణలో ఎక్కడైనా కొనుగోలు చేయవచ్చునని ఆర్టీఏ విధివిధానాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు షోరూమ్లలో రవాణాశాఖ లాగిన్ సౌకర్యం కల్పించారు. షోరూమ్ల వద్ద నుంచి వచ్చే డ్రైవర్ల వివరాల ఆధారంగా ఆర్టీఏ అధికారులు పర్మిట్లను విడుదల చేస్తారు.ఈ పర్మిట్లపైన సదరు డ్రైవర్ కొత్త ఆటోను కొనుగోలు చేసుకోవచ్చు. కానీ తమ వద్ద ఆటోను కొనుగోలు చేసే డ్రైవర్ల వివరాలను మాత్రమే షోరూమ్లలో నమోదు చేస్తున్నారు. ఇందుకోసం ముందస్తుగా రూ.5000 చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఒకవైపు ఇలా గుట్టుగా అక్రమాలు చోటుచేసుకుంటుండగా రవాణా అధికారులు ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడం గమనార్హం. ఔటర్ వరకు ఈవీలంటూనే ఎల్పీజీకి అనుమతులు పాత ఆటోలకు ఈవీ రిట్రోఫిట్మెంట్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆటో సంఘాలు అడ్డగోలుగా ఇచ్చిన ఆటో పర్మిట్లలో అన్నీ లొసుగులే -
రైతులను గుర్తించని ప్రభుత్వం
ఇబ్రహీంపట్నం: రైతులను ప్రభుత్వం గుర్తించడం లేదని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి ఆరోపించారు. వారికి గుర్తింపు కార్డుల ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. ఇబ్రహీంపట్నం వ్యవసాయ కార్యాలయం వద్ద గురువారం రైతులు, బీఆర్ఎస్ నేతలతో కలిసి నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రైతుల గుర్తింపు కార్డుల నమోదు పక్రియను ప్రారంభించి రెండున్నర నెలలు గడుస్తున్నా.. రాష్ట్రంలో పది శాతం నమోదును ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో మీ సేవా, తదితర కేంద్రాల్లో రైతుల గుర్తింపు కార్డుల నమోదు చేస్తుంటే, ఇక్కడ పట్టించుకునే నాథుడే కరువైయ్యాడని పేర్కొన్నారు. కేవలం వ్యవసాయ విస్తరణాధికారికి మాత్రమే ఆన్లైన్ లాగిన్ ఇవ్వడంతో సగటున రోజుకు 40 మందికి మించి నమోదు చేయలేకపోతున్నట్లు తెలిపారు. గుర్తింపు కార్డులు లేకుంటే రైతుభరోసా, రైతుబీమా, పీఎం కిసాన్ లాంటి పథకాలు నిలిచిపోతాయనే ఆందోళన రైతుల్లో వ్యక్తం అవుతుందన్నారు. మీ సేవ కేంద్రాల్లో రైతు గుర్తింపు నమోదుకు అవకావం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చిలుకల బుగ్గరాములు, నిట్టు జగదీష్, సుధాకర్రెడ్డి, నర్సింహ్మారెడ్డి, మైసయ్య, మహేందర్, గోపాల్,శంకరయ్య, చంద్రశేఖర్, శ్రీశైలం , శ్రీనివాస్లు పాల్గొన్నారు. గుర్తింపు కార్డుల జారీలో తీవ్రజాప్యం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి -
వైభవంగా గురుపూర్ణిమ మహోత్సవం
కందుకూరు: గురువు సూచించిన మార్గంలో నడిస్తే భగవంతుడి కృప త్వరగా ప్రాప్తిస్తుందని బ్రహ్మశ్రీ గురూజీ అనిల్కుమార్జోషి అన్నారు. మండలంలో ని పులిమామిడి పరిధిలోని శ్రీనిఖిల్ చేతనా కేంద్రంలో గురువారం గురు పూర్ణిమ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి నిఖిలేశ్వరానంద విగ్రహానికి అభిషేకం, పాదుకా పూజలు చేశారు. అనంతరం గురూజీకి తులాభారం వేశారు. గురూజీ సాధకులతో ప్రత్యేకంగా సాధనలు చేయించి గురు పూర్ణిమ విశిష్టతను వివరించారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
టీఎన్జీవీఏ జిల్లా కార్యవర్గం ఎన్నిక
కేశంపేట: తెలంగాణ నాన్ గెజిటెడ్ వెటర్నరీ అసోసియేషన్ (టీఎన్జీవీఏ) జిల్లా ఎన్నికలు హైదరాబాద్ సీతరాంబాగ్లోని సంఘం రాష్ట్ర భవనంలో జరిగాయి. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బింగి సురేష్ అధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో జిల్లాలోని 96 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లా నూతన అధ్యక్షుడిగా రాజీవ్ పైలెట్, కార్యదర్శిగా భరత్చారి, అసోసియేట్ అధ్యక్షుడిగా ఆనంద్, కోశాధికారిగా శివకుమార్ గెలుపొందారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రాజీవ్ పైలెట్ మాట్లాడుతూ.. వెటర్నరీలో నాన్ గెజిటెడ్ అధికారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి అభిషేక్రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ రతన్, ట్రెజరీ సుధాకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న ప్లాట్ల కేటాయింపు
కందుకూరు: ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు మండలంలోని మీర్ఖాన్పేట రెవెన్యూలో ఏర్పాటు చేసిన లేఅవుట్లో లాట రీ ద్వారా చేపట్టిన ప్లాట్ల పంపిణీ కార్యక్రమం గురువారం నాలుగో రోజు కొనసాగింది. కందుకూరు, ఇబ్రహీంపట్నం ఆర్డీఓలు జగదీశ్వర్రెడ్డి, అనంత్రెడ్డి, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 242 గజాలు, 302 గజాలకు సంబంధించిన ప్లాట్లను లాటరీ ద్వారా రైతులకు కేటాయించారు. శుక్రవారం అన్ని గ్రామాలకు సంబంధించి 363 గజాలు, 423 గజాలు, 484 గజాలు, 544 గజాలు పొందినవారికి ప్లాట్లు కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. లాటరీ ప్రక్రియను పరిశీలించిన సీపీ లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను గురువారం రాచకొండ సీపీ సుధీర్బాబు పరిశీలించారు. ప్లాట్ల పంపిణీ, బందోబస్తును పర్యవేక్షించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ తదితర అంశాల గురించి అధికారులను ఆరా తీశారు. శాంతిభద్రతలకు ఆటంకం కలుగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, అదనపు డీసీపీ సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, గ్రీన్ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజు తదితరులు ఉన్నారు. -
పోలింగ్ సరళిపై అవగాహన
బడంగ్పేట్: బాలాపూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో గురువారం నేషనల్ ట్రైనింగ్ అండ్ ఆర్గనైజేషన్ పోగ్రాం, బూత్ లెవల్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా కుందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి హాజరై బీఎల్ఓలకు అవగాహన కల్పించారు. పోలింగ్ రోజుకు ముందు పోలింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఓటరు సమాచారం స్లిప్పులను వేరే వారికి ఇవ్వకుండా చూడాలని కోరారు. 1961 ఎన్నికల నిర్వహణ నియమాలు వివరిస్తూ బీఎల్ఓలకు అవగాహన కల్పించారు. అలాగే 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో తహసీల్దార్ ఇందిరాదేవి, బడంగ్పేట కార్పొరేషన్ మేనేజర్ నాగేశ్వర్రావు, డిప్యూటీ తహసీల్దార్ మణిపాల్రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మీడియా స్వేచ్ఛను అడ్డుకోవద్దు
షాద్నగర్రూరల్: ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం పట్టణంలోని సాయిరాజా ఫంక్షన్ హాలులో టీడబ్ల్యూజేఎఫ్ తాలుకా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేందర్గౌడ్, నరేశ్, నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ‘ప్రజాస్వమ్యంలో మీడియా స్వేచ్ఛ’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ.. నాటి స్వాతంత్య్ర ఉద్యమంతో పాటుగా తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో మీడియా పాత్ర ఎంతో కీలకమన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంలో మీడియాను నాలుగో స్తంభంగా గుర్తించడంతో పాటుగా పూర్తి స్వేచ్ఛను కల్పించాయన్నారు. గత ప్రభుత్వం మీడియా విలువలకు తిలోధకాలను ఇస్తూ పాత్రికేయుల హక్కులను కాలరాసిందని ఆరోపించారు. సమాజంలో జరుగుతున్న నిజాలను రాస్తే కొందరు నాయకులు జీర్ణించుకోలేక హత్యలు, దాడులు చేయడం, కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రాతికేయులు అసత్యాలను కాకుండా నిజాలను నిర్భయంగా రాయాలని, అప్పుడే వారికి సమాజం అండగా నిలబడుతుందన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నర్సింలు మాట్లాడుతూ.. గతంలో పత్రికకు ఎంతో విలువ ఉండేదని, వచ్చిన వార్తలకు స్పందించి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకునే వారమన్నారు. ఇప్పుడు పత్రికలలో వార్తలు రాస్తే దాడులు, కేసులు, బెదిరింపులకు పాల్పడే సంస్కృతి పెరిగిందని, ఇది సరికాదని హితవు పలికారు. జర్నలిస్టులు తమ స్వేచ్ఛను సక్రమంగా వినియోగించుకోవాలని, దుర్వినియోగం చేయొద్దని సూచించారు. సమావేశంలో నేతలు రఘునాయక్, చెంది తిరుపతిరెడ్డి, కొంకళ్ల చెన్నయ్య, ఎండీ.ఇబ్రహీం, శ్రీనునాయక్, పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి, అందె బాబయ్య, చెంది మహేందర్రెడ్డి, కక్కునూరి వెంకటేశ్గుప్తా, ప్రశాంత్, రాజా వరప్రసాద్, రాజు, నర్సింహ, బీసీసేన నాయకులు చంద్రశేఖరప్ప, జక్కుల జలజ, జయశ్రీకాంత్, భాగ్యలక్ష్మి, స్రవంతిరాజ్ తదితరులు పాల్గొన్నారు. తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో మీడియా పాత్ర ఎంతో కీలకం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ -
లేబర్ కోడ్లను రద్దు చేయాలి
● కార్మికుల సమస్యల పరిష్కారంలోకేంద్రం విఫలం ● సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు షాద్నగర్రూరల్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం సార్వత్రిక సమ్మెను నిర్వహించారు. ఈ సమ్మెకు సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, టీడబ్ల్యూజేఎఫ్, రైతుసంఘం, అంగన్వాడీ, ఏఎన్ఎంలు, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికులు, మున్సిపల్, జీపీ వర్కర్లు, ప్రజాసంఘాలు సమ్మెకు పూర్తి మద్ధతు తెలిపాయి. సమ్మెలో భాగంగా ఎంపీడీఓ కార్యా లయం నుంచి రైల్వేస్టేషన్, మెయిన్రోడ్డు, ముఖ్యకూడలి మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజు మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కార్మికవర్గం సమరశీల పోరాటాలద్వారా వందేళ్లలో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని అన్నారు. చాలీచాలని వేతనాలతో దుర్భర జీవితాలను వెల్లదీస్తున్న కార్మికులకు కనీస వేతనం కింద రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.జర్నలిస్టులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమప్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఖాజాపాష, రాఘవేందర్గౌడ్, రమేష్కుమార్, నర్సింహారెడ్డి, నరేశ్, సీనయ్య, వెంకట య్య, నాయకులు రాజు, శ్రీనునాయక్, నర్సింలు గౌడ్, సాయిబాబు, ఈశ్వర్నాయక్, జయమ్మ, మల్లేశ్, జైపాల్రెడ్డి, గణేశ్, మల్లేశ్, సత్యం, కోటేశ్వర్రావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు చేవెళ్ల మున్సిపల్ కమిషనర్తో ‘ఫోన్ ఇన్’
గురువారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 20258లోuచేవెళ్ల: మున్సిపల్ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో భాగంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో గురువారం చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ వెంకటేశంతో ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. మున్సిపల్ పరిధిలోని ప్రజలు ఆయా వార్డుల్లోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావచ్చు. సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. సాక్షి, రంగారెడ్డిజిల్లా: పశువైద్యశాలల్లో మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పశువుల నిష్పత్తి మేరకు మందులు సరఫరా చేయకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో రైతులు తమ పశువులను తీసుకుని ప్రైవేటు క్లినిక్లను ఆశ్రయించాల్సి వస్తోంది. సాధారణంగా పశువులు, గొర్రెలకు వైరస్, బ్యాక్టీరియా కారణంగా (కౌఫాక్స్, నీలినాలుక, గాలికుంటు, క్షయ, ఆంథ్రాక్స్, బ్లాక్ క్వార్టర్ (బ్లాక్ లెగ్), జోన్స్ డిసీజ్, ఫౌల్ టైఫాయిడ్, మాస్టిన్, బ్రూ సిల్లోసిస్(బాంగ్స్వ్యాధి, ఫుట్ రాట్) వంటి వ్యా ధులు వస్తుంటాయి. సీజన్ల వారీగా వచ్చే జబ్బు లను ముందే గుర్తించి, వ్యాధి నిరోధక టీకా వేయించాల్సి ఉంటుంది. నట్టల నివారణ మందును తా గించాల్సి ఉంది. కానీ మూడేళ్లుగా నట్టల నివారణ మందు సరఫరా కావడం లేదు. గొర్రెలు, మేకల రైతులే వాటిని సమకూర్చుకోవాల్సి వస్తోంది. పది నెలలుగా నిలిచిన సరఫరా పశు వైద్యుడు అందుబాటులో ఉన్న పశువైద్యశాలకు రూ.60 వేల విలువ చేసే 69 రకాల మందులు, అదే పూర్తిస్థాయి వైద్యుడు లేని ఒక్కో సబ్ సెంటర్కు రూ.40 వేల విలువ చేసే మందులు ప్రతీ మూడు మాసాలకోసారి సరఫరా చేయాల్సి ఉంది. చివరిసారిగా 2024 సెప్టెంబర్లో మందులు సరఫరా చేశారు. దీంతో సబ్సెంటర్లకు పంపిణీ చేయాల్సిన మందులను పశువైద్యుడు పని చేస్తున్న చోటే వినియోగిస్తున్నారు. అది కూడా వచ్చిన పశువులకు సగం సగం మందులతోనే సరిపెడుతున్నారు. పెన్సిలిన్, యాంటిబయాటిక్స్, పశువులకు ప్రథమ చికిత్స చేసేందుకు అవసరమైన సర్జికల్ స్పిరిట్ కూడా అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 87 సబ్సెంటర్లు ఉండగా, వీటిలో ఏ ఒక్క చోట మందులు లేవంటే ఆశ్చర్యపోనవసరం లేదు. మృత్యువాత పడుతున్న దూడలు సాధారణంగా పశువుల్లో సీజన్తో సంబంధం లేకుండా ‘లంపీస్కిన్’వ్యాధి (ముద్ద చర్మవ్యాధి) సోకుతుంది. ఇప్పటి వరకు ఈ వ్యాధి నియంత్రణకు సరైన వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ప్రత్యామ్నాయం లేక మేకలకు వాడే ‘గోట్ఫాక్స్’వ్యాక్సిన్నే పశువులకు ఇస్తున్నారు. ఇది ఒక పశువు నుంచి మరో పశువుకు వ్యాప్తి చెందుతుంది. తెల్లజాతి ఆవుల్లో ఎక్కువగా కన్పిస్తుంది. శరీరమంతా కురుపులు, నల్లని మచ్చలతో కన్పిస్తుంది. ఈ సమయంలో జ్వరం అధికంగా ఉంటుంది. వ్యాధి ముదిరితే పశువు మృత్యువాత పడే ప్రమాదం ఉంది. ఆవులకు వ్యాక్సిన్ వేయడం వల్ల అవి ప్రమాదం నుంచి బయటపడుతున్నాయి. కానీ వాటికి పుట్టిన దూడలు మాత్రం చనిపోతున్నాయి. నట్టల నివారణకు మందు కరువే మూడేళ్లుగా నట్టల నివారణ మందు సరఫరా కావడం లేదు. అనారోగ్యంతో బాధపడుతున్న జీవాలను కాపాడుకునేందుకు రైతులు ప్రైవేటుగా మందులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. గొర్రెలు, మేకలకు గతంలో ఏటా నాలుగు సార్లు నట్టల నివారణ మందులు సరఫరా చేసేది. మూడేళ్లుగా సరఫరా నిలిచిపోయింది. సీజన్కు ముందు వ్యాక్సిన్ వేసి, నట్టల మందు తాగిస్తే జీవాలు ఆరోగ్యంగా ఉంటాయి. వ్యాక్సిన్ వేసినా.. నట్టల మందు తాగించకపోవడంతో జీవాలు జబ్బుబారిన పడుతుంటాయి. ఆవులు, దూడలకు టాబ్లెట్స్ ఇస్తున్నారు కానీ గొర్రెల, మేకలకు ఇవ్వడం లేదు. మార్కెట్లో లీటరు రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఫోన్ చేయాల్సిన నంబర్: 73311 13243, 98665 07624న్యూస్రీల్వేధిస్తున్న వైద్యనిపుణుల కొరత మూగజీవాలకు సత్వర వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం జిల్లాలో నాలుగు ఏరియా వెటర్నరీ, 46 ప్రాథమిక పశు వైద్యశాలలు, ఐదు మొబైల్ క్లినిక్స్ సహా మరో 87 సబ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. కొత్తూరు, కనకమామిడి (వైద్యులు లివ్లో వెళ్లగా), మేకగూడ, ఆరుట్ల, కందుకూరు వైద్యులు (ఇన్సర్వీసు పీజీకి వెళ్లారు). పాల్మాకుల, ఇర్విన్లో వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సమీప సెంటర్లలో పని చేస్తున్న వైద్యులు సేవలు అందిస్తున్నారు. వెటర్నరీ అసిస్టెంట్లకు ఇటీవల పదోన్నతులు కల్పించడంతో ఆయా పోస్టులు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం మెజార్టీ కేంద్రాల్లో వైద్యులకు సహాయకులు లేరు. అటెండర్లు లేని చోట వైద్యులే ఆ పని కూడా చేయాల్సిన దుస్థితి. సిబ్బంది కొరతతో నిర్దేశిత సమయంలో వ్యాక్సిన్లు వేయలేని పరిస్థితి. -
ఆ స్థలాన్ని వదులుకునేది లేదు
ఉప్పల్ క్రికెట్ స్టేడియం గేట్ల వద్ద ప్రైవేట్ సంస్థ ప్రహరీ నిర్మాణం● స్టేడియం గేట్లకు గోడలు అడ్డుగా ఉన్నాయని తొలగింపు ● ఘటనా స్థలానికి చేరుకున్న వీహెచ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ● సదరు భూమిని కాపాడుకుంటామన్న కాంగ్రెస్, బీజేపీ నేతలు ● నాటకీయ పరిణామాల మధ్య ప్రహరీ కూల్చివేతలు ఉప్పల్: నగరలోని ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద బుధవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. క్రికెట్ స్టేడియం వద్ద ఓ ప్రైవేట్ సంస్థ ప్రహరీ నిర్మించి గేట్లు మూసివేశారన్న సమాచారంతో మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు ఉప్పల్ మున్సిపల్ మాజీ చైర్మన్ మేకల శివారెడ్డితో కలిసి ఉదయమే తన అనుచరులతో స్టేడియం ఆవరణలోకి వచ్చారు. ఉప్పల్ ఐలా అధికారులకు సమాచారం ఇచ్చారు. నిర్మించిన ప్రహరీని వెంటనే తొలగించాలని చెప్పడంతో ఐలా మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గేట్లకు అడ్డుగా ఉన్న ప్రహరీని తొలగించారు. ఈసందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. ఉప్పల్లో క్రికెట్ స్టేడియం ఏర్పాటుతోనే ఈ ప్రాంతానికి గుర్తింపు వచ్చిందని, స్థలాన్ని పోనివ్వమన్నారు. ప్రహరీని పూర్తిగా తొలగించే వరకు ఆయన అక్కడే బైఠాయించారు. స్వయంగా జేసీబీని తెప్పించి ప్రహరీని పూర్తిగా తొలగించే ప్రయత్నం చేయించడంతో పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత ఐలా ఆధ్వర్యంలో పూర్తిగా తొలగించడంతో వీహెచ్ అక్కడినుంచి అనుచరులతో కలిసి వెళ్లిపోయారు. కాగా.. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సదరు స్థలం ఐలా అధీనంలోనే ఉందని, ఎలాంటి సంస్థకు అప్పగించ లేదన్నారు. అందుకే కూల్చివేశాం.. ఉప్పల్ ఐలా కమిషనర్ ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ.. సదరు స్థలం కోర్టు వివాదంలో ఉందన్నారు. ప్రస్తుతం అది ఐలా అధీనంలోనే ఉందని తెలిపారు. ప్రహరీ, స్టేడియం గేట్ల ముందు నిర్మించిన వాటికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతోనే కూల్చివేస్తున్నామన్నారు. ఎందుకీ స్థల వివాదం? ఉప్పల్ ప్రధాన రహదారిపై కొంత పారిశ్రామికవాడ స్థలం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇతరులతో పాటు పెంగ్విన్ టెక్స్టైల్స్కు కలిపి 46 ఎకరాల స్థలాన్ని కేటాయించిది. అందులో కొన్నాళ్లు పరిశ్రమ నడిపించిన సంస్థ లాకౌట్ చేసి వెళ్లిపోయింది. పరిశ్రమ నెలకొల్పే సమయంలో బ్యాంక్ నుంచి రుణాలు పొందింది. లాకౌట్ కారణంగా రుణం ఇచ్చిన బ్యాంకు సదరు స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ఇందులో నుంచి 16 ఎకరాల స్థలాన్ని అప్పటి ప్రభుత్వ చొరవతో ఏపీఐఐసీ ఉప్పల్ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కేటాయించింది. స్టేడియం నిర్మాణ సమయంలోనే అదనంగా 7 ఎకరాల 20 గుంటల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టింది. కాగా.. అది కూడా వివాదం కావడంతో పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకుని రెగ్యులరైజ్ చేయించినట్లు సమాచారం. మిగిలిన 22.5 ఎకరాల స్థలాన్ని ఓ ప్రైవేట్ సంస్థ వేలం ద్వారా దక్కించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సమాచారం. -
కుక్కల దాడిలో 21 గొర్రెలు మృతి
● కేశంపేట మండలం చౌలపల్లిలో ఘటన ● బాధితుడికి రూ.2 లక్షల నష్టం కేశంపేట: కుక్కల దాడిలో 21 గొర్రెలు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని చౌలపల్లిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎలిగపల్లి కృష్ణయ్య గొర్రెల పెంపకంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజు మాదిరిగానే గ్రామ శివారులోని తన వ్యవసాయ పొలంలోని దొడ్లో జీవాలను తోలాడు. మంగళవారం రాత్రి కుక్కలు మూకుమ్మడిగా మందపై దాడి చేశాయి. ఈ ఘటనలో 21 జీవాలు చనిపోగా పలు తీవ్రంగా గాయపడ్డాయని బాధితుడు తెలిపాడు. సుమారు రూ.2 లక్షలు నష్టపోయానని, ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూడాలని కోరాడు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె బాబయ్య చౌలపల్లిలోని రైతు పొలానికి వెళ్లి పరామర్శించారు. ఆయన వెంట బీజేపీ మండల అధ్యక్షురాలు రొల్లు రాధిక, నాయకులు పసుపుల ప్రశాంత్, రఘురాంగౌడ్, కృష్ణయ్య, రమేష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి
శంకర్పల్లి: ఎన్నికలు నిర్వహణకు సిద్ధంగా ఉండాలని చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా బూత్ లెవల్ అధికారులకు ఫారం 6,7,8లకు సంబంధించి ప్యూరిఫికేషన్, అప్లికేషన్ను ఏ విధంగా ఉపయోగించాలి అనే విషయంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి సూపర్వైజర్గా జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు వ్యవహరించగా, బాలాజీ, ఆశీర్వాదం, షేక్ మహ్మద్ రోషన్లు మాస్టర్ ట్రైనర్లుగా ఉన్నారు. వారు మాట్లాడుతూ.. శంకర్పల్లి మండలం, పట్టణంలో మొత్తం ఆరుగురు సూపర్వైజర్లు, 69 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఎన్నికల సమయంలో బీఎల్ఓల పాత్ర కీలకమని, వారికిచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. యాప్ డౌన్లోడ్ చేసుకుని, వివరాలను అందులో పొందుపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్పల్లి తహసీల్దార్ సురేందర్, డిప్యూటీ తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ -
వేధిస్తున్నాడని.. భర్తను హత్య చేసిన భార్య
మైలార్దేవ్పల్లి: నిత్యం మద్యం తాగి వచ్చి వేధిస్తుండడంతో భర్తను భార్య హతమార్చిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం..వట్టేపల్లి సైఫ్ కాలనీ ప్రాంతానికి చెందిన మహమ్మద్ సైఫ్ (30), ఫరీదా సుల్తానాలు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. ఫరీదా ప్రతిరోజు కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నది. మద్యానికి బానిసైన మహమ్మద్ సైఫ్ ప్రతి రోజు భార్యను వేధిస్తున్నాడు. బుధవారం రాత్రి కూడా మద్యం తాగి వచ్చి వేధించగా..ఫరీదా కోపంతో బండరాయితో తలపై మోదడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనాస్థలికి చేరుకుని సుల్తానాను అరెస్టు చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం ● కేశంపేట పీఎస్లో ఫిర్యాదు ●కేసు నమోదు చేసిన పోలీసులు కేశంపేట: కుటుంబ కలహాలతో తల్లి, ఇద్దరు పిల్లలు అదృశ్యమైన సంఘటన మండల పరిధిలోని లేమామిడి శివారులో చోటుచేసుకుంది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిడ్జిల్ మండల పరిధిలోని డోకూరుకు చెందిన అర్కే శివలింగానికి కుర్మిద్దకు చెందిన దీపిక (25)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి సంజయ్కుమార్ (07), కీర్తన (05) సంతానం. శివలింగం ఉపాధి నిమిత్తం లేమామిడి శివారులోని వెంకో రీసెర్చ్ బ్రీడింగ్ ఫాంలో ఎనిమిది నెలల క్రితం పనికి కుదిరాడు. కుటుంబంతో కలిసి ఇక్కడే ఓ గదిలో జీవిస్తున్నారు. ఇదిలా ఉండగా గత మంగళవారం ఉదయం దీపిక గుర్తు తెలియని వ్యక్తితో ఫోన్ మాట్లాడుతున్నట్లు గుర్తించిన శివలింగం ఆమెను మందలించడంతో పాటు చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన దీపిక తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్తున్నట్లు పొరుగువారికి చెప్పింది. మధ్యాహ్నం భోజన సమయంలో ఇంటికి వచ్చిన శివలింగానికి భార్యాపిల్లలు కనిపించకపోవడంతో పొరుగువారిని ఆరా తీశాడు. దీపిక పుట్టింటికి ఫోన్ చేసి అడగగా అక్కడికి రాలేదని చెప్పారు. బంధువులతో పాటు చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ నరహరి తెలిపారు. కిలోన్నర ఎండు గంజాయి స్వాధీనం ఇద్దరు వ్యక్తులకు రిమాండ్ హయత్నగర్: ఇద్దరు వ్యక్తల నుంచి కిలోన్నర ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ షాపూర్నగర్కు చెందిన అన్నపూరి వెంకటేశ్, ఇబ్రహీంపట్నం అలిమియాకుంటకు చెందిన మహ్మద్ షోయబ్ పెద్దఅంబర్పేట్ ప్రాంతంలో గంజాయిని క్రయవిక్రయాలు నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న మహేశ్వరం ఎస్ఓటీ, హయత్నగర్ పోలీసులు పెద్దఅంబర్పేట్లోని కేవీకే వాటర్ వాషింగ్ సెంటర్పై దాడి చేసి, గంజాయిని విక్రయిస్తున్న వెంకటేశ్ను, కొనేందుకు వచ్చిన మహ్మద్ వాజిద్ఖాన్ను అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని విక్రయించేందుకు వచ్చిన మహ్మద్ షోయబ్, కొనేందుకు వచ్చిన మహ్మద్ మస్తాన్వలి తప్పించుకున్నారు. వెంకటేశ్పై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి కిలోన్నర ఎండు గంజాయి, బైకు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బదిలీల తర్వాతే ప్రమోషన్లు ఇవ్వాలి ఆమనగల్లు: ఉపాధ్యాయుల బదిలీ తర్వాతే ప్రమోషన్లు ఇవ్వాలని గెజిటెడ్ హెడ్ మాస్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి గిరిధర్గౌడ్ కోరారు. ఈ మేరకు బుధవారం నగరంలో పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ను కలిసి వినతిపత్రం అందించారు. ఉపాధ్యాయుల బదిలీల తర్వాత ప్రమోషన్లు ఇస్తేనే న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు రమేశ్గౌడ్ పాల్గొన్నారు. -
విద్యార్థులకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కమిటీ సభ్యులు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 26వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలో 22 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, వీరిలో 90 శాతం విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలలకు దూరంగా నివాసం ఉంటున్నారని, ప్రతీ ప్రభుత్వ, ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న ప్రతీ 30 మందికి ఒక బస్సు ఏర్పాటు చేసి బడికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లాలయ్య ముదిరాజ్, రాజు ముదిరాజ్, భవాని శేఖర్, రవీందర్ పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ -
నిద్రలోనే మృత్యు ఒడికి
మొయినాబాద్: తలనొప్పిగా ఉందని టాబ్లెట్ వేసుకుని, కుర్చీలో కునుకు తీసిన ఓ వ్యక్తి నిద్రలోనే మరణించాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గండిపేట మండలం వట్టినాగులపల్లికి చెందిన గోలియా శ్యామ్ సుందర్సింగ్(55) నాగిరెడ్డిగూడ రెవెన్యూలోని సుజాత స్కూల్లో వాచ్మన్గా పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తలనొప్పిగా ఉందని టాబ్లెట్ వేసుకుని కుర్చీలో నిద్రపోయాడు. కొంత సేపటి తర్వాత తోటి ఉద్యోగులు నిద్రలేపే ప్రయత్నం చేయగా లేవలేదు. వెంటనే భాస్కర ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కదులుతున్న కారు నుంచి మంటలు కేశంపేట: కదులుతున్న వాహనంలో మంటలు వ్యాపించి ఓ కారు దగ్ధమైంది. ఈ ఘటన బుధవారం మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఫరూఖ్నగర్ మండలం గంట్లవెళ్లికి చెందిన మిద్దె కృష్ణయ్య తన షిఫ్ట్ డిజైర్ కారులో పాపిరెడ్డిగూడ శివారు నుంచి వెంచర్ రోడ్డ్డులో స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కారు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన కృష్ణయ్య వెంటనే కారు నుంచి దిగి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో షాద్నగర్ నుంచి వచ్చిన ఫైర్ ఇంజిన్ మంటలార్పేసింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. జీహెచ్ఎంసీ కార్యాలయంలో బోనాలు రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో బుధవారం బోనాల పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయం ఆవరణలోని అమ్మవారి దేవాలయాన్ని చూడముచ్చటగా అలంకరించారు. -
ఫార్మాప్లాట్లు
2,200 ఎకరాలు సర్కార్ స్వాధీనంలోనే! ● అథారిటీలో పరిహారం తీసుకోండి.. లేదంటే కొట్లాడి మరింత పెంచుకోండి ● ప్లాట్ల లాటరీల లిస్టులో 700 మంది రైతులు పేర్లు ● ఆందోళన చెందుతున్న కర్షకులు యాచారం: గత ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటుకు సేకరించిన భూములకు కాంగ్రెస్ సర్కార్ ఈ నెల 7 నుంచి లాటరీ విధానంలో ప్లాట్ల పట్టాలిస్తోంది. మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన 700 మందికి పైగా రైతులు తమ పట్టాభూమి ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో అధికారులు 2,200 ఎకరాల పట్టా భూమికి అవార్డులు పాస్ చేసి పరిహారాన్ని అథారిటీలో జమచేశారు. భూ రికార్డులను టీజీఐఐసీ పేరిట మార్చేశారు. రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో రైతుల పేరిట భూ రికార్డులు మార్చి రైతు భరోసా, బ్యాంకు రుణాలు, రుణమాఫీ వర్తింప చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. రైతులు తమకు న్యాయం చేయాలంటూ సీసీఎల్ఏ, కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రస్తుతం ప్లాట్లు కేటాయిస్తున్నామని రైతులు లాటరీలో పాల్గొనాలని అధికారులు ఆయా గ్రామ పంచాయతీల్లో లిస్ట్లు ఏర్పాటు చేశారు. ఇది చూసిన రైతులు తమ ప్రమేయం లేకుండానే భూ రికార్డులు మార్చి తమ పట్టాభూములు గుంజుకుంటున్నారని ఆందోళన చెందుతున్నారు. పరిహారం పెంపునకు ఓకే నిబంధనల ప్రకారం నాలుగు గ్రామాల్లోని 2,200 ఎకరాల పట్టాభూములు టీజీఐఐసీ ఆధీనంలోనే ఉన్నాయి. రైతులు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా రికార్డులు మార్చడం కుదరదు. పరిహారం పెంచే అవకాశం మాత్రమే ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. రైతులు అనుకూలంగా ఉంటే వారితో సంప్రదింపులు జరిపి ఎకరాకు రూ.35 లక్షల నుంచి రూ.50లక్షల లోపు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇందుకు రైతులు నిరాకరించడంతో పాటు అధికారులు సైతం తమ వైఖరి మార్చుకోవడం లేదు. లిస్ట్లో 150 మంది పేర్లు అథారిటీలో పరిహారాన్ని జమ చేసిన రైతులకు ఎకరాకు 121 గజాల చొప్పున ఫార్మా ప్లాట్లు కేటాయించారు. 700 మందికి పైగా రైతులకు భూరికార్డుల్లో ఉన్న ఎకరాలను బట్టి ఫార్మా ప్లాట్లను కేటాయించి లాటరీ లిస్టుల్లో పేర్లను ప్రకటిస్తున్నారు. రైతులు మాత్రం మేము భూములే ఇవ్వలేదు.. ప్లాట్లు మాకెందుకని తిరస్కరిస్తున్నారు. అధికారులు ఈ నెల 7వ తేదీ నుంచి రైతుల పేర్లను ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల వద్ద ప్రదర్శించి లాటరీలో పాల్గొనాలని మీకు కేటాయించిన ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్లాట్లను తీసుకోకపోతే భవిష్యత్లో ఇబ్బందులొస్తాయని అధికారులు చెబుతున్నారు. ఫార్మాకు మేము పట్టా భూములు ఇవ్వలేదు, మాకు ప్లాట్లు వద్దని, లాటరీ లిస్టుల్లో తమ పేర్లు తొలగించాలంటూ అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నారు. కుర్మిద్ద అనుబంధ గిరిజన తండాలైన మర్లకుంట, మంగలిగడ్డ, పోతుబండ తండాలకు చెందిన 150 మంది రైతులకు చెందిన 200 ఎకరాల పట్టా భూమికి మొత్తం లాటరీ లిస్టుల్లో పేర్లొచ్చాయి. -
సమోసాలో బల్లి!
మొయినాబాద్: స్వీట్ షాపులో సమోసాలు తిన్నవారికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. సమోసాలో బల్లి దర్శనమివ్వడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మొయినాబాద్ మండలం తోలుకట్ట గేటు వద్ద కలకలం రేపింది. చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన కుమార్ తన కూతురు సంజనతో కలిసి బుధవారం మొయినాబాద్లో కూరగాయలు విక్రయించడానికి వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్తూ మార్గ మధ్యలో తోలుకట్ట గేటు వద్ద స్వీట్ షాపులో సమోసాలు తీసుకుని, తింటుండగా అందులో బల్లి కనిపించింది. అప్పటికే రెండు సమోసాలు తిన్న వారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అంతనలోనే సంజన వాంతులు చేసుకోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. స్వీట్ హౌస్ ఓనర్ షాపు మూసివేసి పారిపోయాడు. ఈ విషయమైన బాధితులు మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
విద్యారంగ సమస్యలపై పోరాటం
షాద్నగర్రూరల్: విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఏబీవీపీ అలుపెరగని పోరాటం చేస్తోందని ఆ సంఘం తెలంగాణ ప్రాంత సహ సంఘటన మంత్రి విష్ణు అన్నారు. బుధవారం ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని విశ్వభారతి జూనియర్ కళాశాలలో ఏబీవీపీ నగర కార్యదర్శి నవీన్నాయక్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విష్ణు భరతమాత చిత్రపటానికి పూలమాల వేసి ఏబీవీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. దేశంకోసం, ధర్మంకోసం పని చేసే ఏకై క విద్యార్థి సంఘం ఏబీవీపీ అన్నారు. దేశంలో భారతీయత, జాతీయ భావజాలం కలిగిన అతిపెద్ద విద్యార్థి సంఘంగా గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సందీప్, వంశీ, నవీన్, రాకేశ్, అభి, సాయి, యశ్వంత్, పవన్, రామ్చరణ్, నందకోమల్, అమరేందర్రెడ్డి, రాకేశ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ● ఏబీవీపీ తెలంగాణ ప్రాంతసహ సంఘటన మంత్రి విష్ణు -
ఆక్రమణలను తొలగిస్తాం
తుర్కయంజాల్: ఆక్రమణలను తొలగించి మాసబ్ చెరువు నాలాను పునరుద్ధరిస్తామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. బుధవారం ఆయన హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి నాలాను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తుర్కయంజాల్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోందని.. ఇప్పుడే నాలా ఆక్రమణలు తొలగిస్తే భవిష్యత్ ఇబ్బందులు తలెత్తవన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాఽథ్ మాట్లాడుతూ.. ఇరిగేషన్, రెవెన్యూ, శాటిలైట్ మ్యాప్లను పరిశీలించి నాలా వెడల్పును శాసీ్త్రయంగా నిర్ధారించుకున్న తరువాత పూడీకతీత పనులను చేపడుతామన్నారు. ఇప్పటికే తుర్కయంజాల్–ఇంజాపూర్ దిలావర్ఖాన్ చెరువు, పెద్ద అంబర్పేటలోని ఈదుల చెరువు వరకు ఉన్న ఏడున్నర కిలోమీటర్ల నాలాను డ్రోన్ సాయంతో పరిశీలించామని చెప్పారు. ఈ సర్వేలో పలు చోట్ల నాలా వెడల్పు, మరికొన్ని చోట్ల లోతు తగ్గినట్లు గుర్తించామని వెల్లడించారు. మాసబ్ చెరువు నాలా పూడీకతీత పనులను ఒక మోడల్గా ఎంచుకుని చేపడుతామని, నివాస ప్రాంతాలకు మినహాయింపు ఇచ్చి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి, ఇరిగేషన్ డీఈ చెన్నకేశవ రెడ్డి, ఏఈ వంశీ, మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి మాసబ్చెరువు నాలా పరిశీలన -
ఆర్టీసీ బస్సు నుంచి దింపివేత.. అంబులెన్స్ వచ్చేలోపు మృత్యువాత
కేశంపేట: చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తున్న వృద్ధురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులను ఆర్టీసీ సిబ్బంది బస్సులో నుంచి దింపేశారు. ఆతర్వాత కొద్ది నిమిషాలకే బాధితురాలు మృతిచెందింది. ఈ ఘటన మంగళవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కేశంపేటకు చెందిన నారని అనసూయమ్మ (64)కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు సంతానం. భర్త రాములు మూడేళ్ల క్రితం, పెద్ద కూతురు ఎనిమిదేళ్ల క్రితం మృతిచెందారు. ప్రస్తుతం అనసూయమ్మ కేశంపేటలోనే కుమారుడి వద్ద ఉంటోంది. ఇటీవల ఆరోగ్యం బాగో లేకపోవడంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. పదిహేను రోజులుగా దగ్గు, దమ్ము అధికం కావడంతో మూడుసార్లు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరోసారి హైదరాబాద్ వెళ్లేందుకు అనసూయను తీసుకుని ఆమె కొడుకు, కోడలు మంగళవారం కేశంపేటలో ఆర్టీసీ బస్సు ఎక్కారు. బస్సు కొత్తూర్ వద్దకు రాగానే అనసూయనకు దమ్ము ఎక్కువైందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇది గమనించిన ఆర్టీసీ సిబ్బంది ముగ్గురినీ కిందకు దింపేశారు. బాధితులు 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా అంబులెన్స్ వచ్చే సరికే అనసూయ మృతిచెందారు. -
నిబంధనలు పాటించని క్లినిక్ల సీజ్
షాబాద్: వచ్చిరాని వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ఎంపీపై కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ డీఎంహెచ్ఓ నాగేంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న క్లినిక్లను సీజ్ చేశారు. అర్హత లేకున్న నిర్వహిస్తున్న ఆర్ఎంపీలపై చర్యలు తప్పవని మండిపడ్డారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. షాబాద్లో నిర్వహిస్తున్న క్లినిక్లపై తమకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిని తనిఖీ చేసేందుకు వెళ్లగా, అప్పటికే వారు మూసివేసి వెళ్లడంతో ఉన్నతాధికారుల ఆదేశానుసారం క్లినిక్లను సీజ్ చేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా క్లినిక్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట వైద్య సిబ్బంది ఉన్నారు. కఠిన చర్యలు తప్పవు డిప్యూటీ డీఎంహెచ్ఓ నాగేంద్రబాబు -
డెలివరీ బాయ్పై దాడి
జగద్గిరిగుట్ట: డెలివరీ బాయ్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జగద్గిరిగుట్ట సీఐ నర్సింహ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దేవమ్మ బస్తీకి చెందిన శ్రీకాంత్ జియో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. కాగా సోమవారం రాత్రి పనులు ముగించుకు ఐడీపీఎల్ నుంచి జగద్గిరిగుట్ట వైపు వెళుతుండగా పాపిరెడ్డి నగర్ ప్రధాన రహదారిలో గుర్తు తెలియని వ్యక్తు లు అతడి బైకును అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వాగ్వాదం జరగడంతో వారు దీంతో శ్రీకాంత్పై ముక్కుముడిగా దాడి చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన శ్రీకాంత్ను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సెక్యూరిటీ గార్డు దారుణ హత్య గచ్చిబౌలి: నిర్మాణంలో ఉన్న భవనంలో సెక్యూరిటీ గార్డు దారుణ హత్యకు గురైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మయూరి బిల్డింగ్స్లో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గచ్చిబౌలి సర్వే నెంబర్ 90/1లో ఓఆర్ఆర్ సర్కిల్లో నిర్మాణంలో ఉన్న మయూరి బిల్డింగ్లో మైక్రాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎలక్ట్రికల్ పనులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బేస్మెంట్ 3లో ఎలక్ట్రికల్ సామగ్రి స్టోర్ రూమ్ ఏర్పాటు చేశారు. జగద్గిరిగుట్టకు చెందిన దాసరి రాజు(59) అక్కడ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి డ్యూటీకి వచ్చిన అతను మంగవారం ఉదయంరక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించిన స్టోర్ ఇన్చార్జి అనిల్ డయల్ 100కు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఇనుప రాడ్డుతో రాజు తలపై కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు గుర్తించారు. సమీపంలోని సీసీ పుటేజీలను పరిశీలించగా గుర్తుతెలియని వ్యక్తి లోపలికి వె వెళ్లినట్లుగా గుర్తించారు. ఆటోలో వెళ్లిన అనుమానితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఒడిశా టు హైదరాబాద్
శంకర్పల్లి: హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్న నలుగురు యువకులను మంగళవారం మోకిల పోలీసులు, రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ తరలించారు. నార్సింగి ఏసీపీ రమణగౌడ్ మోకిల పీఎస్లో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన స్నేహితులు దాశరథి ప్రధాన్(26), సిబానాహక్(21), నీలుమండల్(21), సాగర్సాస్మల్(25) సులభంగా డబ్బు సంపాదించి, జల్సాలకు అలవాటు పడ్డారు. ఇందులో భాగంగా తక్కువ ధరకు ఒడిశా నుంచి గంజాయి తీసుకువచ్చి, నగరంలోని కార్మిక ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఈక్రమంలో ఒడిశాలోని ప్రదీప్ అనే వ్యక్తి వద్ద రూ.16 వేలకు 38 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. దీన్ని హైదరాబాద్కు తరలిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో కొల్లూర్ గేట్ సమీపంలోని బృందావనం గార్డెన్స్ వద్ద దాడి చేశారు. వీరి నుంచి 38కిలోల గంజాయి, 5ఫోన్లు, రూ.2 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన మోకిల సీఐ వీరబాబు, ఎస్ఓటీ సీఐ అంజయ్య, ఎస్ఐ కోటేశ్వరరావు, సిబ్బందిని ఏసీపీ ప్రత్యేకంగా అభినందించారు. గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్టు 38 కిలోల గంజాయి స్వాధీనం నిందితులకు రిమాండ్ -
సీఐటీయూ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
ఇబ్రహీంపట్నం: దేశ వ్యాప్తంగా బుధవారం నిర్వహించే సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ఇబ్రహీంపట్నం మండలంలో బైక్ ర్యాలీ చేపట్టారు. స్థానిక ఆర్టీసీ డిపో వద్ద కార్మికులతో కలిసి కరపత్రాలను పంపిణీ చేశారు. కార్మికులు, కర్షకులు పెద్ద సంఖ్యలో సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ నేతలు కోరారు. కార్యక్రమంలో నాయకులు ఎల్లేశ్, స్వప్న, వీరేశం, దుర్గయ్య, వెంకటయ్య, ఆర్టీసీ డిపో ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు నర్సింహ, జంగయ్య, దిలీప్ పాల్గొన్నారు. కల్లు కాంపౌండ్లో బాలిక కిడ్నాప్ శంషాబాద్: కల్లుకాంపౌండ్ వద్ద ఓ చిన్నారిని మచ్చిక చేసుకున్న గుర్తు తెలియని మహిళ బాలికను కిడ్నాప్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్జీఐ ఎస్ఐ బాలరాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబ్నగర్ జిల్లా, మిడ్చిల్ మండలం, కంచన్పల్లి గ్రామానికి చెందిన లక్షమ్మ తన కుమార్తెలు కీర్తన (6) అర్చన్ (3)తో పాటు తమ మావతో కలిసి ఈ నెల 1న శంషాబాద్ కల్లు కంపౌండ్కు వచ్చింది. కల్లు తాగుతున్న క్రమంలో ఎదురుగా కూర్చున్న గుర్తు తెలియని మహిళ లక్షమ్మ కుమార్తె కీర్తనను దగ్గరకు తీసుకుని మాటలు కలపడంతో పాటు కల్లు తాగించింది. అనంతరం కంపౌండ్ బయట తినడానికి ఏమైనా ఇప్పిస్తానని తల్లికి చెప్పి చిన్నారిని తీసుకుని బయటికి వెళ్లింది. ఆమె తిరిగి రాకపోవడంతో లక్ష్మమ్మ పరిసర ప్రాంతాల్లో గాలించింది. గ్రామానికి వెళ్లిపోయిన అనంతరం వారి కుటుంబసభ్యుల సూచన మేరకు మంగళవారం ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా మధ్యవయస్సురాలైన ఓ మహిళ కీర్తనను వెంటబెట్టుకుని వెళ్లిన ట్లు గుర్తించారు. మూడు బృందాలు ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలిస్తున్నారు. థ్యాంక్యూ..సీఎం సార్.. పారదర్శకంగా పదోన్నతులు, పోస్టింగ్లపై హర్షం సాక్షి, సిటీబ్యూరో: త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని, పారదర్శకంగా పోస్టింగ్లు ఇవ్వడం పట్ల వైద్య సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డా.కిరణ్ బొల్లేపాక, కార్యదర్శి మాదాల కిరణ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వైద్యుల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్న సీఎం రేవంత్రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహలకు ధన్యవాదాలు తెలిపారు. దశాబ్దంగా ఎన్నడూ పోస్టింగ్లు, పదోన్నతులు ఇంత పారదర్శకంగా జరిగినట్లు చూడలేదన్నారు. ప్రొఫెసర్ల పదోన్నతులను పరిగణలోకి తీసుకోవడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సమస్యలకు పరిష్కారం లభించిందని వారు పేర్కొన్నారు. -
ప్రభుత్వ బడుల్లో వసతులు కల్పించండి
ఆమనగల్లు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ డిమాండ్ చేశారు. ఆమనగల్లు పట్టణంలోని ఎంఆర్సీ కార్యాలయంలో మంగళవారం ఎంఈఓ పాండుకు పీడీఎస్యూ నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పాఠశాలల్లో వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. సర్కారు బడులను బలోపేతం చేయకుండా విచ్చలవిడిగా ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు ఇస్తున్నారని విమర్శించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు అనిల్, సాయి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ -
రైతులకు పట్టాలివ్వండి
మంచాల: రాచకొండ రెవెన్యూ పరిధిలో తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మాదగోని జంగయ్యగౌడ్, మేఘావత్ లక్ష్మణ్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సంస్థాన్ నారాయణపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ శేఖర్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాచకొండ రెవెన్యూ పరిధిలోని 273 సర్వే నంబర్లోని వందలాది ఎకరాల భూములను మంచాల మండలం పటేల్చెరువు తండాకు చెందిన గిరిజనులు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వం ధరణి చట్టాన్ని తీసుకురావడంతో వీరికి కొత్త పాసు పుస్తకాలు ఇవ్వలేదన్నారు. గతంలోని పాత పట్టా పాసు పుస్తకాలతో బ్యాంకు రుణాలు కూడా పొందారని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వీరికి తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో బాధిత రైతులకు న్యా యం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు కావలి బుగ్గరాములు, రైతులు రవినాయక్, జూలనాయక్, నరేందర్నాయ క్, మోతీరాంనాయక్, శ్రీధర్నాయక్ పాల్గొన్నారు.