breaking news
Rangareddy
-
కాంగ్రెస్కు ఓటుతో గుణపాఠం చెప్పండి
వెంగళరావునగర్: ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. యూసుఫ్గూడ డివిజన్ పరిధిలోని హైలాంకాలనీ, శ్రీకృష్ణానగర్ తదితర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఆయన ర్యాలీ నిర్వహించి ప్రజలను స్వయంగా కలుసుకుని కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓటు వేయడమంటే మన వేలితో మనం పొడుచుకోవడమే అవుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పోలీసులను, డబ్బును నమ్ముకున్నదేగాని, ప్రజలకు చేసిన వాగ్దానాలను మరచిపోతున్నట్టు చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు డబ్బులకో, మద్యం సీసాలకో అమ్ముడు పోవద్దని సూచించారు. రేవంత్ పంచే డబ్బులు, మద్యం సీసాలను ఎదురించి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని తెలియజేశారు. గత కొన్నేళ్ళుగా ఇక్కడ దివంగత ఎమ్మెల్యే మాగంటి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి తమ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలని కోరారు. గోపీనాథ్ ఎలాగైతే సేవలందించారో అదే విధంగా సునీత కూడా అందిస్తారని తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటారని, ఆయనకు మనం నివాళులర్పించడమంటే సునీతను గెలిపించడమేనని పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీలకు 203 గురుకులాలు పెట్టి దేశంలోనే అత్యంతగా గౌరవించింది కేసీఆర్ మాత్రమేనన్నారు. రేవంత్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ మరిచారని, ప్రజలకు గ్యారంటీ కార్డులు ఇచ్చి మరచిన కాంగ్రెస్ను ఓడించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కార్పొరేటర్లు దేదీప్య విజయ్, రాజ్కుమార్, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి హరీశ్రావు -
దైవ దర్శనానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు
ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం ● కొందుర్గుకు చెందిన బాలిక మృతి కొందుర్గు: దైవ దర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక మృత్యువాత పడిన ఘటన స్థానికంగా కలచి వేసింది. స్థానికులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. కొందుర్గు గ్రామానికి చెందిన దోరపల్లి అనిత తన కూతురు నిహారిక(13), కుమారుడు విఘ్నేష్తో కలిసి నందిగామకు చెందిన తమ బంధువు శ్రీను కుటుంబ సభ్యులతో శనివారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనృసింహస్వామి దర్శనం కోసం కారులో బయలుదేరారు. మార్గమధ్యలో హైదరాబాద్లోని ఘట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డుపై వెళుతుండగా ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నిహారికకు తీవ్ర గాయాలు కాగా విఘ్నేష్కు కాలు విరగడంతోపాటు అనితకు గాయాలయ్యాయి. స్థానికులు, బంధువులు క్షతగాత్రులను నగరంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. నిహారిక పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడే చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి బాలిక మృతి చెందింది. మృతురాలు కొందుర్గు ఆక్స్ఫర్డ్ స్కూల్లో 9వ తరగతి చదువుతుంది. ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. గాయాలైన అనిత, విఘ్నేష్లు ఆసుపత్రి నుంచి వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. దైవ దర్శనానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం
యాచారం: శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ పేర్కొన్నారు. పీఎస్ పరిధిలోని మీర్ఖాన్పేట గ్రామంలో ఆదివారం సాయంత్రం ప్రజలతో ఆయన సమావేశమయ్యారు. పండుగల సందర్భంగా ప్రజలు విలువైన వస్తువులు, బంగారు నగలను ఇంట్లో ఉంచి వెళ్లరాదని సూచించారు. కొత్త వ్యక్తుల సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే ఫిర్యాదు చేయాలని చెప్పారు. మద్యం, డ్రగ్స్, గంజాయి వంటి వారికి బానిస కావద్దన్నారు. వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్ఐ వంశీ, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో విద్యుత్ టవరెక్కి హల్చల్
మైలార్దేవ్పల్లి/జవహర్నగర్: మద్యం మత్తులో ఓ వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి హల్చల్ చేశారు. రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... మైలార్దేవ్పల్లి డివిజన్ లక్ష్మీగూడ వాంబే కాలనీకి చెందిన ఇంజమూరి వేణు రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆదివారం ఉదయం ఇతను పోలీస్ స్టేషన్కు వచ్చి ఇంటి పక్కనే ఉన్న మల్లారెడ్డి, శిరీష అనే ఇద్దరు తనను కొట్టారని ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేయగా...తన ఇంటి పక్కనే ఉన్న వారికి వేణు గతంలో డబ్బులు ఇచ్చాడని, ఆ డబ్బులు ఇవ్వమని మద్యం మత్తులో వెళ్లి అడుగగా వారు అతన్ని బెదిరించి పంపించారని తేలింది. ఈ క్రమంలోనే వేణు తను అప్పుగా ఇచ్చిన రూ.1500 ఇవ్వడం లేదని పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశాడు. మద్యం మత్తులో పోలీసులను కూడా ఇబ్బంది పెట్టడంతో వారు నచ్చజెప్పి పక్కన కూర్చోబెట్టారు. ఇంతలోనే వేణు బయటకు వెళ్లి తనకు న్యాయం జరగడం లేదంటూ పోలీస్ స్టేషన్ ముందు ఉన్న 33 కేవీ హైటెన్షన్ పోల్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం అందించి కరెంటు సరఫరా నిలిపివేయించారు. అనంతరం ఘటన స్థలికి చేరుకున్న రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్, క్రైమ్ ఇన్స్పెక్టర్ మక్సూద్, ఎస్ఐలు పైడినాయుడు, విశ్వనాథ్రెడ్డి, డీఆర్ఎఫ్ బృందాలు కలిసి పైకి ఎక్కిన వేణును బుజ్జగించి కిందకి దింపారు. అతన్ని వైద్యం నిమిత్తం ఆస్పత్రికి చేర్చారు. ఈ ఘటనతో దుర్గానగర్ నుంచి చంద్రాయణ గుట్ట వెళ్లే రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. జవహర్నగర్లో... జవహర్నగర్ వికలాంగుల కాలనీలోనూ ఓ వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి హంగామా సృష్టించాడు. పోలీసులు తెల్పిన మేరకు వెంకటేష్, లక్ష్మి దంపతులు కాగా ముగ్గురు పిల్లలతో కలిసి వికలాంగుల కాలనీలో ఉంటున్నారు. వెంకటేష్ మద్యానికి బానిసై ప్రతిరోజు భార్యను వేధింపులకు గురిచేసేవాడు. శనివారం భార్యా భర్తల మధ్య గొడవ పెద్దగా అవడంతో భార్య లక్ష్మి చేతులను విరగొట్టాడు. దీంతో లక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తనని కొడతారనే భయంతో విద్యుత్ టవర్ ఎక్కి చనిపోతానంటూ బెదిరింపులకు దిగాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకొని వెంకటేష్ని కిందికి దించారు. అయితే వెంకటేష్ గతంలో కొన్నిసార్లు చనిపోతానంటూ ఆత్మహత్యా యత్నం చేశారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నేటి ప్రజావాణి రద్దు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన సందర్భంగా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈవారం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. జిల్లా ప్రజలు, ఫిర్యాదుదారులు విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. షాద్నగర్: దసరా సెలవులు ముగిసాయి.. పండుగకు స్వగ్రామాలకు వచ్చిన వారంతా పట్నానికి తిరుగు పయనం అయ్యారు. ఫలితంగా హైదరాబాద్ – బెంగళూరు 44వ నంబర్ జాతీయ రహదారి రద్దీగా మారింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ వైపు వాహనాలు క్యూ కట్టాయి. షాద్నగర్ పరిధిలోని రాయికల్ టోల్ప్లాజా వద్ద బారులు తీరి కనిపించాయి. వాహనదారులకు ఎలాంటి ఆటంకం కలగకుండా టోల్సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. తుర్కయంజాల్: పెద్దలను వదిలి పేదలు, చిరు వ్యాపారులపై చర్యలు తీసుకోవడం దారుణమని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి.కిషన్ అన్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆదివారం మున్సిపల్ అధికారులు చిరు వ్యాపారుల గుడిసెలను తొలగించి, వారిని ఉపాధికి దూరం చేశారని ఆరోపించారు. ఏళ్లుగా రోడ్డుకు ఇరువైపులా చిన్న చిన్న గుడిసెలను వేసుకుని, మధ్యాహ్న భోజనం, పండ్లను విక్రయిస్తున్నారని, అలాంటి వారికి శానిటరీ ఇన్స్పెక్టర్ వనిత ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేశారని విమర్శించారు. రోజువారీ అప్పులు చెల్లిస్తూ, ఉపాధి పొందుతున్న వారిపై చర్యలు తీసుకోవడంతో పస్తులుండాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సీపీఎం, సీఐటీయూ నాయకులు ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు ఈ.నరసింహ, సీహెచ్ ఎల్లేశ్, సత్యనారాయణ, యాదయ్య, కృష్ణ, రవి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కందుకూరు: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండు రంగారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ నాయకుడు అందుగుల సత్యనారాయణతో పాటు పలువురు ఆదివారం ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజా సమస్యలపై నాయకులు, కార్యకర్తలు పోరాడాలని, జిల్లాలో జాగృతి బలోపేతం కోసం కృషి చేయాలని ఆమె నేతలకు సూచించారు. కార్యక్రమంలో నాయకులు బండారి లావణ్య, కోల శ్రీనివాస్, అర్చన, సేనాపతి, బాబురావు, గణేష్ నాయక్, రవి నాయక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సాక్షి, సిటీబ్యూరో: అంబర్పేటలోని బతుకమ్మ కుంటలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఆదివారం నుంచి ‘ఆపరేషన్ క్లీనింగ్’ ప్రారంభించింది. ఇన్స్పెక్టర్ బాలగోపాల్ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్), మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ (ఎంఈటీ) సిబ్బంది బతుకమ్మ వేడుకల అనంతరం కుంటలో వదిలిన బతుకమ్మలను బయటకు తీస్తున్నారు. పువ్వులు చెరువులో కుళ్లిపోయి, నీటి కాలుష్యానికి కారణం కాకుండా తొలగిస్తున్నారు. బతుకమ్మలను తయారుచేయడానికి పూలను పేర్చిన ట్రేలు పెద్ద సంఖ్యలో ఈ చెరువులో ఉండటంతో వాటినీ బయటకు తీస్తున్నారు. -
విషాదం మిగిల్చిన సరదా
యాలాల: దసరా పండుగకు స్వగ్రామానికి వచ్చిన ఓ పాలిటెక్నిక్ విద్యార్థి సరదాగా ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు నీట మునిగి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన యాలాల మండలం ముకు ందాపూర్తండాలో ఆదివారం చోటు చేసుకు ంది. ఎస్ఐ విఠల్రెడ్డి, తండావాసులు తెలిపిన వివ రాల ప్రకారం.. తండాకు చెందిన రతన్నాయక్, బాలిబాయి దంపతుల కొడుకు సునీల్(17) సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతడు ఎప్పటిలాగే దసరా పండుగకు ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. తోటి స్నేహితులతో కలిసి సరదాగా గ్రామ శివారులోని ముద్దాయి చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. చెరువులో ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు ఈత కొడుతుండగా మధ్యలో అలసిపోయి నీటమునిగాడు. గమనించిన మి త్రులు ఈ విషయాన్ని తండావాసులకు చెప్పడంతో చెరువులో గాలించి సునీల్ మృతదేహాన్ని వెలికి తీశారు. పండగకు వచ్చిన కొడుకు అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చెరువులో నీట మునిగి పాలిటెక్నిక్ విద్యార్థి మృతి -
రైలు దిగుతుండగా కిందపడి మహిళ దుర్మరణం
సికింద్రాబాద్: లగేజీ తీసుకొని రైలు దిగుతుండగా ప్రమాదవశాత్తు రైలు, ప్లాట్ఫాం మధ్యలో పడి ఓ ప్రయాణికురాలు మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్స్టేషన్ పరిఽధిలో జరిగింది. హెడ్కానిస్టేబుల్ డేవిడ్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం. రాజస్థాన్కు చెందిన కమలాదేవి(45) కుటుంబసభ్యులతో కలిసి కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి అమీన్పూర్లోని బీరంగూడలో స్థిరపడ్డారు. అయితే, తన తల్లి అనారోగ్యంగా ఉండడంతో ఇటీవల తమ స్వగ్రామమైన రాజస్థాన్కు వెళ్లారు. తిరిగొస్తున్న క్రమంలో ఈ నెల 5న మధ్యాహ్నం 3 గంటల సమయంలో మల్కాజ్గిరి రైల్వే స్టేషన్లో కమలాదేవి తన కుటుంబసభ్యులతో కలిసి రైలు దిగింది. ఒక లగేజీ బ్యాగ్ మరిచిపోవడంతో మళ్లీ రైలెక్కి బ్యాగు తీసుకొస్తుండగా రైలు కదిలింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రైలు, ప్లాట్ ఫాం నెం.2 మధ్యలో పడిపోవడంతో రెండు కాళ్లు విరిగిపోయాయి. వెంటనే చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. -
సినీ నటిపై దాడి.. యువకుడిపై కేసు
బంజారాహిల్స్: తన అపార్ట్మెంట్ ముందు పార్కింగ్ స్థలంలో ఓ వ్యక్తి బహిరంగ మూత్ర విసర్జన చేస్తుండగా ఇదేమిటని అడిగినందుకు ఆ యువకుడు కోపంతో సినీనటితో పాటు ఆమె పీఏపై దాడి చేసి గాయపర్చిన ఘటన పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎల్లారెడ్డిగూడలో నివసించే సినీ నటి ఈ నెల 1వ తేదీన దైవ దర్శనం చేసుకుని ఇంటికి వస్తుండగా అపార్ట్మెంట్ ముందు పార్కింగ్ స్థలంలో దేవేందర్ అనే వ్యక్తి బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నాడు. దీంతో నటి పీఏ బయటకు వచ్చి దేవేందర్ను ఇదేమి పద్ధతి అని నిలదీశాడు. దీంతో దేవేందర్ ఆగ్రహంతో ఊగిపోతూ మరో ఇద్దరు మహిళలతో కలిసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ దాడికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో దేవేందర్ ఈ ఘటనకు పాల్పడ్డాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పంజగుట్ట పోలీసులు దాడికి పాల్పడ్డ నిందితుడిపై బీఎన్ఎస్ సెక్షన్ 74, 115 (2), 79, 292 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారికి చిత్రహింసలు తల్లి, సవతి తండ్రిపై కేసు నమోదు మియాపూర్: ఓ చిన్నారిని చిత్రహింసలకు గురిచేసిన కన్నతల్లితో పాటు సవతి తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ శిరీష తెలిపిన వివరాల మేరకు హాఫీజ్పేటలో నివా సం ఉంటున్న షభా నజ్వీన్, ముషీరాబాద్కు చెందిన తాజుద్దీన్ అనే వ్యక్తిని 2020లో వివా హం చేసుకుంది. వీరికి నాలుగు, రెండు సంవత్సరాల వయసున్న ఇద్ద రు కుమార్తెలు ఉన్నారు. భార్యా భర్తల మధ్య గొడవలు జరగడంతో ఆరు నె లల క్రితం షభా నజ్వీన్ భర్తతో విడాకులు తీసుకుంది. ఈ క్రమంలో గత రెండు నెలల కిందట జోగిపేటకు చెందిన మహమ్మద్ జావిద్ను రెండో పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి హాఫీజ్పేటలో నివాసముంటుంది. మహమ్మద్ జావిద్ ఆటో నడుపుతుండగా షభా నజ్వీన్ ఇంటి వద్దే ఉంటుంది. గత కొంతకాలంగా షబా నజ్వీన్ తన నాలుగేళ్ల పెద్ద కుమార్తెను కొడుతూ తిడుతూ చిత్రహింసలకు గురి చేస్తోంది. తన రెండో భర్తతో కలిసి చిన్నారికి వాతలు పెట్టడంతో తీవ్రంగా గాయపడింది. ఈ నెల 1న చిన్నారి ఇంటి నుంచి బయటకు రాగా కాలిన గాయాలు చూసి స్థానికులు ప్రశ్నించగా తన తల్లి, సవతి తండ్రి కొట్టారని, వాతలు పెట్టారని చిన్నారి తెల్పడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. విషయాన్ని పోలీసులకు తెల్పడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలికకు చిత్ర హింసలు నిజమని తేలడంతో షబా నజ్వీన్తో పాటు సవతి తండ్రి మహమ్మద్ జావిద్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చిన్నారులను వసతిగృహానికి తరలించి..అక్కడి నుంచి స్వంత తండ్రి తాజుద్దీన్కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మైల్వార్లో ఇసుక ట్రాక్టర్ సీజ్ బషీరాబాద్: రాత్రిపూట అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్ను పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ నుమాన్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మైల్వార్ గ్రామానికి చెందిన మున్నూరు శ్యామప్ప అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రివేళల్లో అక్రమంగా ఇసుక తలిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం మేరకు గత కొన్ని రోజులుగా నిఘాపెట్టినట్లు చెప్పారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి మైల్వార్ వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పెట్రోలింగ్ చేస్తున్న కానిస్టేబుల్స్ పట్టుకున్నారని అన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ట్రాక్టర్ను సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కల్లు ధర తగ్గించాలని ధర్నా తాండూరు రూరల్: కల్లు ధరను తగ్గించాలని పలువురు డిమాండ్ చేశారు. ఆదివారం పెద్దేముల్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించారు. వారు మాట్లాడుతూ.. పెద్దేముల్, మంబాపూర్తో పాటు పలు గ్రామాల్లో రెండు రోజులుగా కల్లు దుకాణాలు మూసివేశారన్నారు. గతంలో ఒక్క కల్లు సీసా రూ.10 ఉంటే ప్రస్తుతం రూ.15కు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ ఉందని ధర్నా చేస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించడతో వెళ్లిపోయారు. -
గుణపాఠం చెప్పండి త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.
ఉరిమింది.. మెరిసింది.. కురిసింది చేవెళ్ల: నియోజకవర్గవ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎక్కడ చూసినా వర్షపు నీరు నిలిచిపోయాయి. రోడ్లన్నీ బురదమయంగా మారాయి. చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, మొయినాబాద్ మండలాల్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గ్రామాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. తంగడపల్లి, మడికట్టు వద్ద ఉన్న వాగు బ్రిడ్జి పైనుంచి వరద నీరు ప్రవహించింది. చేవెళ్లలోని నవచైనత్య పాఠశాలపై పిడుగు పడింది. రాత్రిపూట ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది. భవనం గోడకు పగుళ్లు వచ్చాయి. మరోవైపు పంటలు నీటమునిగాయి. చేవెళ్ల నియోజకవర్గంలో భారీ వర్షం -
వరుసపెట్టి.. ఆరు కార్లు ఢీకొట్టి
● ఓఆర్ఆర్పై ప్రమాదం ● ఇద్దరికి స్వల్ప గాయాలు రాజేంద్రనగర్: ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్న ఓ కారు వేగం ఒక్కసారిగా నెమ్మదించడంతో వెనుక వస్తున్న మరో ఐదు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరు కార్లు ధ్వంసం కాగా.. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నానికి చెందిన గంగాధర్ ఆదివారం మధ్యాహ్నం ఔటర్ రింగ్ రోడ్డుపై శంషాబాద్ మీదుగా గచ్చిబౌలి వైపు కారులో వెళ్తున్నాడు. హిమాయత్సాగర్ ప్రాంతంలోకి రాగానే కారు వేగాన్ని ఒక్కసారిగా తగ్గించాడు. దీంతో వెనకాలే వస్తున్న మరో ఐదు కార్లు ఒకదానికొకటి ఢీకొంటూ గంగాధర్ వాహనాన్ని ఢీకొట్టాయి. ఈ ఘటనలో మొత్తం ఆరు వాహనాలు ఒకదాని వెనుక ఒకటి ఢీకొనడంతో ధ్వంసమయ్యాయి. గంగాధర్తో పాటు మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ఘటన జరగడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ధ్వంసమైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మూసీలోకి భారీ వరద
జంట జలాశయాల పది గేట్లు ఎత్తివేతహిమాయత్సాగర్ వరదనీటిలో చేపల వేటసాక్షి, సిటీబ్యూరో/మణికొండ: మూసీలోకి వరద ప్రవాహం పెరిగింది. జంట జలాశయాల 10 గేట్లు 3 అడుగుల చొప్పున ఎత్తి దిగువకు సుమారు ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండటంతో వరద ఉద్ధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్లకు ప్రవాహం పెరిగింది. ఇప్పటికే రెండు రిజర్వాయర్ల పూర్తిస్థాయి నీటి మట్టం వరకు నీరు చేరడంతో ఆదివారం ఎగువ నుంచి వచ్చిన వరదను దిగువకు విడుదల చేశారు. దీంతో దిగువ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఉస్మాన్ సాగర్ (గండిపేట) 8 గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి మూసీ నదికి 2,704 క్యూసెక్కుల వరద నీటిని వదిలారు. దీంతో నార్సింగి, హైదర్షాకోట్, మంచిరేవుల నుంచి మూసీ నది పొంగి ప్రవహిస్తోంది. హిమాయత్ సాగర్కు పైనుంచి 1,600 క్యూసెక్కుల వరద వస్తుండటంతో రెండు గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 1,981 క్యూసెక్కుల నీటిని ఈసీ నదికి వదిలారు. లంగర్హౌస్లో మూసీ నదిలో కలవటంతో అక్కడి నుంచి మరింత ఉధృతంగా నీరు ప్రవహిస్తోంది. గండిపేట నుంచి 8 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తుండటంతో నార్సింగి మున్సిపల్ కేంద్రం నుంచి మంచిరేవులకు, ఔటర్ ఓ వైపు సర్వీసు రోడ్ల మీదుగా నీరు పారడంతో రాకపోకలను నిలిపివేశారు. పరీవాహక ప్రాంతం నుంచి వచ్చే వరదను బట్టి మరిన్ని గేట్లను తెరవటం, మూయటం చేస్తామని మూసీ నది పరీవాహకంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి, రెవెన్యూ, పోలీసు అధికారులు సూచించారు. జలాశయాల నీటి విడుదలతో స్థానికులు కొందరు గాలాలతో చేపలు పడుతూ కనిపించారు. -
పబ్.. డబ్!
స్థానిక పోలీసులకు దడ పుట్టిస్తున్న పబ్స్ సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలోని పబ్ కల్చర్ యువతలోనే కాదు.. ఐపీఎస్లు, అత్యున్నత అధికారుల్లోనూ పెరిగిపోయింది. వీకెండ్ వచ్చిందంటే చాలు అనేక మంది యూనిఫాం తీసేసి పబ్స్లో వాలిపోతున్నారు. ఈ పరిణామం స్థానిక పోలీసులకు.. ప్రధానంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఆ అధికారులకు అవసరమైన ప్రొటోకాల్ సేవలు చేయడంతో పాటు బిల్లులు విషయంలోనూ నానా తంటాలు పడుతున్నారు. ఇప్పుడు కింది స్థాయి పోలీసు వర్గాల్లో ఇదే హాట్ టాపిక్గా మారడంతో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఒకప్పుడు ఆదాయ మార్గాలుగా.. రాజధానిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో పని చేసే కొందరు అధికారులకు అనేక ‘ఆదాయ మార్గాలు’ ఉంటాయి. అలాంటి వాటిలో భూ వివాదాలతో పాటు వైన్షాపులు, బార్లు, పబ్స్ కూడా ఉంటాయి. ఈ కారణంగానే ఇవి ఎక్కువగా ఉన్న పోలీసుస్టేషన్లకు మంచి డిమాండ్ ఉంటుంది. అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా (ఎస్హెచ్ఓ) పోస్టింగ్ పొందడానికి ఏ స్థాయి పైరవీ చేయడానికై నా సిద్ధమవుతుంటారు. ఇటీవల కాలంలో పబ్స్ ఉన్న పోలీసుస్టేషన్ల ఎస్హెచ్ఓల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రధానంగా హైదరాబాద్తో పాటు సైబరాబాద్ కమిషనరేట్ లోని కొన్ని ఠాణాల్లో పని చేస్తున్న వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. వీకెండ్ వచ్చిందంటే చాలు వీరికి నిద్రపట్టట్లేదు. అధికారుల తాకిడే ప్రధాన కారణం ఒకప్పుడు ఎస్హెచ్ఓలకు తన బ్యాచ్మేట్స్, స్నేహితులు, పరిచయస్తుల నుంచే పబ్లకు సంబంధించిన సిఫార్సులు వచ్చేవి. తామో, తమ సంబంధీకులో ఫలానా పబ్కు వెళ్తున్నారని, బిల్లులో ఎంతో కొంత తగ్గించేలా చూడాలని కోరేవారు. అలా వచ్చే వాళ్లు కూడా కొన్ని పబ్స్కే వెళ్లడానికి ఆసక్తి చూపించడం ఎస్హెచ్ఓలకు తలనొప్పిగా మారేది. కొన్నాళ్లుగా కొన్ని పబ్స్కు పోలీసు విభాగానికే చెందిన అత్యున్నత అధికారుల తాకిడి పెరిగింది. వీకెండ్ వచ్చిందంటే చాలా వీళ్లు తమ స్నేహితులు, సన్నిహితులతో వాలిపోతున్నారు. పబ్స్లో ప్రత్యేక కార్యక్రమాలు, కొందరి ఆర్కెస్ట్రాలు ఉన్నప్పుడు ఎంట్రీకి భారీ డిమాండ్ ఉంటుంది. అలాంటి సమయాల్లోనూ తాము వస్తున్నామని, తొలి వరుసలో, ప్రత్యేకంగా సీట్లు కావాలంటూ ఆయా అధికారులు హుకుం జారీ చేస్తుండటం స్థానిక అధికారులకు ఇబ్బందికరంగా మారుతోంది. తగ్గింపు కాదు పూర్తిగా ‘భరింపు’ పబ్స్కు వస్తున్న పోలీసు ఉన్నతాఽధికారులకు ప్రొటోకాల్ సంబంధిత మర్యాదలూ స్థానిక పోలీసులకు తప్పట్లేదు. సాధారణంగా ఆయా అధికారులు ఆలస్యంగా వస్తుంటారు. దీంతో వారిని రిసీవ్ చేసువడానికి, సపర్యలు చేయడానికి కనీసం ఓ హోంగార్డుని కేటాయించాల్సి వస్తోంది. ఇంత వరకు సర్దుకుపోతున్నా.. బిల్లుల వద్దకు వచ్చేసరికి కొందరు అధికారుల తీరు ఎస్హెచ్ఓలకు కొత్త తలనొప్పులు తెస్తోంది. ఆయా అధికారులకు ఆ పబ్లో లభించే అతి ఖరీదైనవే సరఫరా చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన బిల్లుల్లో రాయితీ కోరితే కొంత వరకు ఇబ్బంది ఉండదు. అయితే కొందరు అధికారులు అసలు బిల్లులే చెల్లించకుండా వెళ్లిపోతున్నారు. దీంతో పబ్స్ యజమానుల నుంచి ఒత్తిడి పెరిగడంతో ఎస్హెచ్ఓలే వాటిని చెల్లించాల్సి వస్తోంది. కొన్ని పోలీసుస్టేషన్లకు చెందిన ఎస్హెచ్ఓలు నెలకు గరిష్టంగా రూ.2 లక్షల వరకు తమ ‘కష్టార్జితం’ ఇలాంటి చెల్లింపుల కోసం వెచ్చించాల్సి వస్తోంది. సమయం మీరినా కొనసాగింపు ఇలాంటి అత్యున్నత అధికారులు పబ్స్కు వచ్చినప్పుడు అతిథి మర్యాదలు, బిల్లుల చెల్లింపులతో పాటు సమయం అనేదీ ఎస్హెచ్ఓలకు ఇబ్బందికరంగా ఉంటోంది. తమ దైనందిన విధులు, ఇతర కార్యకలాపాలు ముగించుకునే ఆయా అధికారులు చాలా ఆలస్యంగా పబ్స్కు వస్తున్నారు. వాటి సమయం ముగిసినప్పటికీ తమ పార్టీలు పూర్తికాలేదంటూ కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఎస్హెచ్ఓల ద్వారా పబ్ నిర్వాహకులు, యజమానులపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో గత్యంతరం లేక ప్రధాన ద్వారాలు మూసేసి, ఇతరుల్ని పంపించేసి కొన్ని పబ్స్ నడిపించాల్సి వస్తోంది. సాధారణ సమయంలో సమయం మీరినా, పరిమితికి మించి మ్యూజిక్ పెట్టినా కేసులు నమోదు చేస్తుంటామని, అలాంటిది ఇలాంటి ఉన్నతాధికారుల కోసం తాము ఉల్లంఘనలు చేయిస్తే మరోసారి కేసులు ఎలా నమోదు చేస్తామంటూ ఎస్హెచ్ఓలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇది కింది స్థాయి అధికారుల్లో హాట్టాపిక్గా మారడంతో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. అత్యున్నత అధికారుల రాకపోకలే దీనికి కారణం బిల్లుల చెల్లింపులు, ‘ప్రొటోకాల్’ తలనొప్పులు ప్రతి నెలా భారీ మొత్తం భరిస్తున్న ఎస్హెచ్ఓలు -
అన్వేషణ!
బస్సెక్కితే బాదుడే! గ్రేటర్ పరిధిలో పెంచిన ఆర్టీసీ చార్జీలతో ప్రయాణికులపై ప్రతి నెలా రూ.15 కోట్ల వరకు భారం పడనుంది. అభ్యర్థుల కోసంసాక్షి, రంగారెడ్డిజిల్లా: స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయపార్టీలు అడుగులు వేస్తున్నాయి. బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. మెజార్టీ సాధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఖరారైన రిజర్వేషన్లపై ఆయా పార్టీలు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చాయి. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్రమంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల నుంచి పోటీ చేయాలని భావించే వారి పేర్లను సేకరించే పనిలో ఆయా పార్టీలు నిమగ్నమయ్యాయి. ఈ నెల 8 వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. కోర్టు తీర్పు తర్వాతే ముందుకు వెళ్లాలని యోచిస్తున్నాయి. మంత్రి చేతిలో కాంగ్రెస్ అభ్యర్థుల చిట్టా ఇప్పటికే జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వికారాబాద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో సమావేశమయ్యారు. ఒక్కో జెడ్పీటీసీ స్థానం నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లను సేకరించారు. క్షేత్రస్థాయి సర్వే తర్వాతే ఆయా అభ్యర్థుల పేర్లను వెల్లడించే అవకాశం ఉంది. ప్రజల్లో మంచి ఆదరణ ఉండి.. మొదటి నుంచి పార్టీనే నమ్ముకుని పని చేస్తున్న కార్యకర్తలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అభ్యర్థుల గెలుపు బాధ్యతను ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలపై పెట్టనుంది. జిల్లాలో 41 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, వీటిలో మెజార్టీ స్థానాలను కై వసం చేసుకుని, రెండు జెడ్పీ పీఠాలను అధిష్టించాలని భావిస్తోంది. కార్యకర్తల అభిప్రాయానికే బీజేపీ పెద్దపీట అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటోంది. గ్రామ, మండల స్థాయిలో బరిలో నిలవాలని భావించే ఆశావహుల పేర్లను నమోదు చేసుకుని సిద్ధంగా ఉంది. కోర్టు తీర్పు తర్వాతే కార్యాచరణ ముమ్మరం చేయనుంది. బూత్ స్థాయి నుంచి కార్యకర్త వరకు అందరి అభిప్రాయాలు సేకరిం చిన తర్వాతే అభ్యర్థికి పార్టీ తరపున బీ–ఫాం అందజేయనుంది. కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్ ఇచ్చే అవకాశం తక్కువే. ఆచితూచి వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొంత కాలంగా ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి కొనసాగుతున్నప్పటికీ ఆయన తన నియోజకవర్గం దాటి బయటికి రావడం లేదు. దీంతో ఆయా మండలాల జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక, గెలుపు బాధ్యతను నియోజకవర్గ ఇన్చార్జిలతో పాటు సబితారెడ్డి చూసుకోవాల్సి వస్తోంది. ఆమె ఒక వైపు తన నియోజకవర్గాల్లో పర్యటిస్తూనే మరోవైపు ఇతర నియోజకవర్గాల్లో పార్టీలో చేరికలపై దృష్టి సారించారు. మహేశ్వరం, చేవెళ్ల నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్కు దీటుగా బలమైన అ భ్యర్థుల కోసం అన్వేషిస్తున్నారు. పార్టీ రహితంగా జరిగే సర్పంచ్ ఎన్నికలకు ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉత్సాహం చూపిస్తున్నారు. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు పోటీపడుతున్నారు. గ్రామ స్థాయి కార్యకర్తల అభిప్రాయం మేరకు వ్యవహరించాలని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు నచ్చజెప్పాలని, అయినా వినకుంటే ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై సమాలోచనలు చేస్తున్నాయి. -
బస్సెక్కితే బాదుడే!
● ప్రయాణికులపై నెలకు రూ.15 కోట్ల అదనపు భారంసాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో పెంచిన ఆర్టీసీ చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. అదనపు చార్జీల వల్ల ప్రయాణికులపై ప్రతి నెలా దాదాపు రూ.15 కోట్ల వరకు భారం పడనుంది. ప్రస్తుతం నగరంలో ప్రతి రోజు సుమారు రూ.2.5 కోట్లు టికెట్లపై నగదు రూపంలో లభిస్తుండగా, మరో రూ.4 కోట్ల వరకు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు అందజేసే ఉచిత ప్రయాణ సదుపాయం నుంచి రీయింబర్స్మెంట్ ఆర్టీసీ ఖాతాలో జమ అవుతున్నాయి. మొత్తంగా ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్లో ప్రతిరోజూ రూ.6.5 కోట్లు లభిస్తున్నాయి. పెంచిన చార్జీలు రోజుకు రూ.50 లక్షల చొప్పున నెలకు రూ.15 కోట్ల వరకు ఆదాయం లభించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆర్టీసీ లెక్కల ప్రకారం నగరంలో నిత్యం సుమారు 25 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. వీరిలో 16 లక్షలకు పైగా మహిళా ప్రయాణికులు. 9 లక్షల మంది పురుషులు ప్రయా ణిస్తున్నారు. దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులు.. నగరంలోని 25 డిపోల నుంచి 3,100 బస్సులు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. వీటిలో ప్రస్తుతం 265 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి మరో 275 ఈవీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. దశలవారీగా గ్రేటర్లో 2027 నాటికి 2,800 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ బస్సులకు చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు హైటెన్షన్ కనెక్షన్ల కోసం రూ.8 కోట్ల వరకు ఖర్చవుతోంది. రానున్న రోజుల్లో 2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కోసం 19 డిపోల్లో చార్జింగ్ కేంద్రాల ఏర్పాటును లక్ష్యంగా చేసుకొని ప్రస్తుతం టికెట్ చార్జీలు పెంచినట్లు అధికారులు తెలిపారు. నిర్వహణ ఖర్చులే అధికం.... గ్రేటర్ ఆర్టీసీకి రోజుకు రూ.6.5 కోట్లు లభిస్తున్నప్పటికీ నిర్వహణ వ్యయం కూడా అదే స్థాయిలో ఉన్నట్లు అధికారుల అంచనా. ప్రస్తుతం గ్రేటర్లోని 25 డిపోల్లో సుమారు 1,5000 మంది పని చేస్తున్నారు. వీరిలో 7,000 మంది కండక్టర్లు. 5,700 మంది డ్రైవర్లు. మిగతా వారిలో మెకానిక్లు, శ్రామిక్లు మొదలుకొని డిపోల్లో వివిధ స్థాయిల్లో పని చేసే అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. ఆర్టీసీకి లభించే ఆదాయంలో సుమారు 50 శాతం సిబ్బంది జీతభత్యాలకే ఖర్చవుతోంది. మరో 25 శాతం ఇంధనం కోసం వినియోగిస్తుండగా, వివిధ అవసరాల కోసం మిగతా మొత్తాన్ని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి లాభనష్టాల్లేకుండా బస్సులను నడపడమే ఆర్టీసీకి సవాల్గా మారింది. ఈ క్రమంలో తాజాగా పెంచిన చార్జీలతో ప్రయాణికులకు భారమే అయినా ఆర్టీసీకి మాత్రం కొంత ఊరటగా చెప్పవచ్చు. గ్రేటర్లో పెరిగిన ఆర్టీసీ చార్జీల అమలు నేటి నుంచే చార్జీల పెంపు మచ్చుకు ఇలా.. సిటీ ఆర్డినరీ, మెట్రోఎక్స్ప్రెస్, ఈ–ఆర్డినరీ, ఈ–ఎక్స్ప్రెస్ బస్సుల్లో మొదటి మూడు స్టేజీలకు రూ.5 చొప్పున పెంపు. 4వ స్టేజి నుంచి రూ.10 అదనపు చార్జీ. మెట్రో డీలక్స్, ఈ– మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5 చొప్పున పెంచారు. రెండో స్టేజీ నుంచి రూ.10 చొప్పున పెంపు. ఈ లెక్కన ప్రస్తుతం రూ.20 చెల్లించి ప్రయాణం చేసేవారు ఇక నుంచి రూ.30 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్ వరకు ఇప్పటి వరకు రూ.30 ఉండగా, సోమవారం నుంచి రూ.40 చొప్పున చార్జీ ఉంటుంది. అలాగే.. మెహిదీపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు రూ.25 నుంచి రూ.35 వరకు పెరగనుంది. మియాపూర్ –అమీర్పేట్ల మధ్య రూ.60 నుంచి రూ.70కి పెరగనుంది. -
వర్షపాతం ఇలా.. (మిల్లీమీటర్లలో.. )
జిల్లా సాధారణం కురిసింది అధిక శాతం సాధారణం కురిసింది అధిక శాతం హైదరాబాద్ 627.2 917.9 46.0 615.4 825.5 34.0 రంగారెడ్డి 603.7 840.3 50.0 530.4 701.8 32.0 మేడ్చల్–మల్కాజిగిరి 547.7 822.3 39.0 598.6 722.2 21.0 సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో భూగర్భ జలమట్టం పెరిగింది. ప్రస్తుత సీజన్లో సాధారణ వర్షపాతం కంటే 45 శాతం ఎక్కువ నమోదు కావడంతో భూగర్భజలాలు ఉబికి వచ్చాయి. గత ఏడాదితో పోల్చితే సగటున రెండు నుంచి మూడు అడుగులు పెరిగినట్లు భూగర్భ జలాల శాఖ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే మేడ్చల్– మల్కాజిగిరిలో సగటున 2.64 అడుగులు, రంగారెడ్డిలో 1.94 అడుగులు, హైదరాబాద్లో 0.75 అడుగులు పెరిగాయి. నగరంలో సగటు భూగర్భ నీటిమట్టం 11.94 మీటర్లు కాగా మే చివరి నాటికి మరో పది అడుగుల లోతుకు పడిపోయాయి. ఈ వర్షాకాల సీజన్లో ముందస్తు వర్షాలు ప్రారంభమైనప్పటికీ.. మొదటి రెండు నెలలు సాధారణ కంటే లోటు వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత వర్షాలు ఊపందుకున్నాయి. వరుసగా కుండపోతగా కురిశాయి. వేసవిలో 20 మీటర్ల లోతుకు వేసవిలో భూగర్భ జలాలు పాతాళంలోకి పడిపోయాయి. ఈ ఏడాది జనవరి నుంచి మే నెలాఖరులోగా చాలా ప్రాంతాల్లో 20 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు పడిపోయినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది సాధారణం కన్నా 29 శాతం అధికంగా వర్షపాతం నమోదైనా కాంక్రీట్ కట్టడాలతో ఆ వరద భూమిలోకి ఇంకే పరి స్థితి లేకపోవడం, విచ్చలవిడిగా బోర్ల తవ్వకం, చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కారణంగా భూగర్భజలాలు పాతాళంలోకి చేరాయి. ఎండా కాలంలో పెరుగుతున్న ఉష్టోగ్రతలకు తోడు వర్షపు నీటి సంరక్షణలో నిర్లక్ష్యం భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఓఆర్ఆర్ వరకు ఉన్న 46 మండలాల్లో 57 ఫిజో మీటర్ల ద్వారా వేసవిలో పరిస్థితిని రాష్ట్ర భూగర్భ జల శాఖ విశ్లేషించింది. ఈ పరిశీలనలో ఏటికేడు నగరంలో నీటిమట్టాలు గణనీయంగా పడిపోతున్నట్లు గుర్తించింది. తాజాగా వర్షాకాల సీజన్లో భూగర్భ జలాల పరిస్థితి సాధా రణానికి చేరాయి. ఈసారి సీజన్లో గత ఏడాదితో పోల్చితే 16 శాతం వర్షాలు అధికంగా కురిసినట్లు వాతావరణ శాఖ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చివరి పక్షం రోజుల్లో మేఘాల విస్ఫోటంతో ఆకాశానికి చిల్లులు పడిన చందంగాకుండపోత కురిసింది. 2025 గత ఏడాది కంటే రెండు అడుగులపైనే ఈ సీజన్లో భారీగా కురిసిన వర్షాలు -
సమన్వయంగా ఎన్నికల నిర్వహణ
షాద్నగర్ రూరల్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎంపీడీఓ బన్సీలాల్ అన్నారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్, జోనల్, రూట్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. పోలింగ్ బూత్ల వద్ద అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణకు ఐదు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. తహసీల్దార్ నాగయ్య మాట్లాడుతూ.. చనిపోయిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తామని తెలిపారు. పట్టణ సీఐ విజయ్కుమార్ మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ, రెవెన్యూ, పోలీసు శాఖల సిబ్బంది పాల్గొన్నారు. ప్రజావాణి రద్దు కలెక్టర్ ప్రతీక్జైన్ అనంతగిరి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్జైన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యే వరకు కార్యక్రమం ఉండదని తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. అర్జీలతో ఎవరూ కలెక్టరేట్కు రావొద్దని సూచించారు. అఖిల్ యాదవ్కు ఉచిత మెడికల్ సీటు కొడంగల్: పట్టణానికి చెందిన అఖిల్ యాద వ్ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో ఏ కేటగిరీ జన రల్ కోటాలో ఉచితంగా మెడికల్ సీటు సాధించాడు. శనివారం కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నట్లు అఖిల్ యాదవ్ తండ్రి ఏవీ పృథ్వి రాజ్ తెలిపారు. నీట్లో ర్యాంక్ రావడంతో ఎంబీబీఎస్ సీటు ఉచితంగా వచ్చిందన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్షలో 469 మార్కులు రావడంతో కాళోజీ నారాయణరావ్ యూనివర్సిటీ ఎంబీబీఎస్ సీటు కేటాయించింది. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్లో మహబూబ్నగర్లోని ఎస్వీఎస్లో సీటు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అఖిల్ యాదవ్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు పృథ్విరాజ్, అనంతలక్ష్మి ప్రోత్సాహంతో సీటు సాధించినట్లు చెప్పారు. భవిష్యత్తులో వైద్య వృత్తిలో స్థిరపడి రోగులకు సేవ చేయనున్నట్లు తెలిపారు. రూ.లక్ష పలికిన చీరలు దుద్యాల్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత ధరించిన చీరలకు శనివారం వేలం నిర్వహించారు. మండలంలోని హస్నాబాద్లో మూడు చోట్ల అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అక్కడ చీరలకు వేలం నిర్వహించారు. గౌడ్స్ కాలనీలో బాలగౌడ్ రూ.1.15 లక్షలకు దుర్గమ్మ చీరను సొంతం చేసుకున్నారు. గాంధీ చౌక్లో గోపాల్ ఆనంద్ రూ.1.17 లక్షలకు, వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం వద్ద బీ సందప్ప రూ.95 వేలకు అమ్మవారి చీరను దక్కించుకున్నారు. టెంట్ హౌస్ దగ్ధం తాండూరు టౌన్: ప్రమాదవశాత్తు ఓ టెంట్ హౌస్ దుకాణం అగ్నికి ఆహుతైంది. షాపులోని సామగ్రి మొత్తం కాలి బూడిదైంది. ఈ ఘటన శనివారం తాండూరు పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన నసీర్ అనే వ్యక్తి ఓ షెట్టర్లో ఎంఎస్ టెంట్ హౌస్ నిర్వహిస్తున్నాడు. షెట్టర్ నుంచి దట్టమైన పొగ, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం చేరవేశారు. వారు వచ్చి మంటలను ఆర్పేశారు. అప్పటికే దుకాణంలోని సామగ్రి కాలిపోయింది. పక్కనే ఉన్న ఆటోమొబైల్ షాపు, వెల్డింగ్ షాపులకు కూడా నిప్పంటుకుంది. ఫైర్ సిబ్బంది మంటలు వ్యాపించకుండా అడ్డుకున్నారు. ఎవరో కావాలనే నిప్పు పెట్టి ఉంటారని, దీనిపై విచారణ జరపాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ప్రమాదంతో రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు యజమాని నసీర్ తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
మగువకే మకుటం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మహిళా శక్తి మరింత బలపడుతోంది. విద్య, ఉపాధి రంగాల్లోనే కాదు రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. లీడర్షిప్తో పాటు ఇతర అభ్యర్థుల గెలుపోటములను సైతం నిర్ణయిస్తూ.. పురుషులకు ఏమాత్రం తీసిపోబోమని నిరూపిస్తున్నారు. ఈసారి స్థానిక సంస్థల రిజర్వేషన్లలోనూ అతివలకు పెద్దపీట వేశారు. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత జెడ్పీ పీఠం ఎస్సీకి రిజర్వ్ కాగా.. తొలిసారిగా మహిళా అభ్యర్థి(ఎస్సీ) చైర్పర్సన్గా ఆసీనులు కానున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. ఇక జిల్లా వ్యాప్తంగా 21 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, వీటిలో తొమ్మిది సీట్లను, 230 ఎంపీటీసీ స్థానాలకు గానూ 94 సీట్లను మహిళలకే కేటాయించారు. మరోవైపు తొమ్మిది ఎంపీపీ స్థానాల్లోనూ వీరే కొలువుదీరనున్నారు. ఇక 526 సర్పంచ్ స్థానాలు,4,668 వార్డులు ఉండగా.. 45శాతం స్థానాలను మగువలే దక్కించుకోనున్నారు. గతంతో పోలిస్తే ఈసారి వీరి సంఖ్య కొంత తగ్గినప్పటికీ.. మెజార్టీ స్థానాల్లోనూ కీలకం కాబోతున్నారు. ఆత్మీయ పలకరింపులు.. స్వయంగా పోటీలో నిలబడటంలోనే కాదు ఇతర అభ్యర్థుల గెలుపు ఓటముల్లోనే మహిళల ఓట్లే కీలకంగా మారబోతున్నాయి. మహిళలు మాత్రమే అభ్యర్థుల తలరాతలను మార్చగలరు. జిల్లా వ్యాప్తంగా 21 మండలాల పరిధిలోని 526 పంచాయతీల్లో మొత్తం 7,94,653 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 3,99,404 మంది పురుషులు ఉన్నారు. ఇక మహిళలు 3,95,216 మంది ఉండగా.. ఇతరులు 33 మంది ఉన్నారు. బరిలో ఉన్న తోటి మహిళల గెలుపులోనే కాదు.. ఓటమిలోనే వీరే ఓట్లే కీలకం కాబోతున్నారు. మహిళలను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు ఇప్పటికే వారి ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు మొదలు పెట్టారు. గతంలో మచ్చుకైనా మాట్లాడని పురుష నాయకులు ప్రస్తుతం.. అక్కా, అత్తా, అత్తా, అమ్మా.. అమ్మమ్మా అంటూ కొత్త వరసలు కలుపుతున్నారు. ఆత్మీయంగా పలకరిస్తూ మచ్చిక చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. వీరు ఎవరిని ఆశీర్వదిస్తారో.. తేలాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.ఎస్సీ మహిళకు జెడ్పీ పీఠం ఇరవై ఏళ్ల తర్వాత తొలిసారి దక్కనున్న అవకాశం తొమ్మిది మంది జెడ్పీటీసీలు, తొమ్మిది మంది ఎంపీపీలు కూడా వారే 94 ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలూ కేటాయింపు -
గెలిచేవారికే టికెట్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జెడ్పీటీసీ పీఠాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజిక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ భావిస్తోంది. ఉమ్మడి జిల్లా చరిత్రలో ఇప్పటి వరకు కాంగ్రెస్ గెలుపొందిన దాఖలాల్లేవు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండటం, సీఎం రేవంత్రెడ్డి సైతం ఇదే ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో ఈ ఎన్నికలను హస్తం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా మెజార్టీ జెడ్పీటీసీ స్థానాలతో పాటు జెడ్పీ పీఠాన్ని కై వసం చేసుకుని తీరాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షినటరాజన్ సహా పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ ఆదేశం మేరకు జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీధర్బాబు శనివారం తన నివాసంలో డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే కె.శంకరయ్య, తాండూరు ఎమ్మెల్యే బి.మనోహర్రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్ కేఎల్లార్, చేవెళ్ల ఇన్చార్జ్ భీంభరత్, రాజేంద్రనగర్ ఇన్చార్జ్ నరేందర్తో భేటీ అయ్యారు. సంస్థాగతంగా పార్టీ బలాలు, బలహీనతలు సహా స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. భేటీకి దూరం.. రంగారెడ్డి జిల్లాలో 27 మండలాలు ఉండగా, వీటిలో సరూర్నగర్, బాలాపూర్, హయత్నగర్, గండిపేట్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ పూర్తిగా జీహెచ్ఎంసీలో విలీనమయ్యాయి. మిగిలిన 21 జెడ్పీటీసీ స్థానాలు సహా వికారాబాద్ జిల్లాలోని 20 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పార్టీ గుర్తుపై నిర్వహించే ఈ ఎలక్షన్లను అధికార కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మెజార్టీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులే గెలుపొందే విధంగా వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్యే నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లను సేకరించింది. ఎమ్మెల్యేలు లేని చోట పార్టీ ఇన్చార్జ్ల నుంచి అభ్యర్థుల పేర్లను సేకరించింది. వీరు ప్రతిపాదించిన అభ్యర్థులపై అంతర్గత సర్వే చేయించి, ప్రజల్లో ఆదరణ ఉన్న వ్యక్తికే టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ సహా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కూడా అధిష్టానానికి పలువురి పేర్లను ప్రతిపాదించారు. కానీ ఈ భేటికి మాత్రం దూరంగా ఉన్నారు. మొదటి నుంచి పార్టీ కోసం పని చేసిన గెలుపు గుర్రాలకే టికెట్ ప్రకటించనుంది. ఆరు గ్యారంటీలే అస్త్రాలు సంస్థాగతంగా పార్టీ కేడర్ మధ్య ఎలాంటి సమన్వయ లోపం తలెత్తకుండా చూసుకోవడంతో పాటు అన్ని స్థానాల్లోనూ గెలుపొందేలా ముందుకెళ్లాలని మంత్రి శ్రీధర్బాబు ఎమ్మెల్యేలకు సూచించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గృహాలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రుణమాఫీ, రైతు భరోసా, 24 గంటల ఉచిత కరెంట్, రూ.500లకే గ్యాస్ సరఫరా, వంటి పథకాలే ప్రధాన ప్రచారాస్త్రాలుగా ముందుకు వెళ్లాలని మార్గనిర్దేశం చేశారు. గత ప్రభుత్వ వైఫల్యాలు, ఈ రెండేళ్లలో కాంగ్రెస్ సాధించిన అభివృద్ధి, సంక్షేమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన కొత్త వారికి కాకుండా ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముకుని ఉన్నవారిని బరిలో దింపడం ద్వారా సంస్థాగతంగా పార్టీ మరింత బలపడే అవకాశం ఉందని, ఆదిశగా పరిశీలించాలని చెప్పినట్లు తెలిసింది. సర్వే ఆధారంగానే జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురి పేర్ల సేకరణ ఉమ్మడి జిల్లా నేతలతో ఇన్చార్జ్ మంత్రి శ్రీధర్బాబు భేటీ స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ -
ఎఫ్సీడీఏలో లేనట్లేనా?
యాచారం: మండల పరిధిలోని తమ నాలుగు గ్రామాలను ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ(ఎఫ్సీడీఏ) పరిధిలో కలపాలంటూ చేస్తున్న ప్రజల అభ్యర్థనలు కార్యరూపం దాల్చడం లేదు. ఎఫ్సీడీఏలోకి వచ్చే 56 రెవెన్యూ గ్రామాల మ్యాప్ను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వారం రోజుల క్రితం సీఎం రేవంత్రెడ్డి మీర్ఖాన్పేట సమీపంలో అథారిటీ భవనానికి భూమి పూజ నిర్వహించిన విషయం తెలిసిందే. జిల్లాలోని ఏడు మండలాలు, 56 రెవెన్యూ గ్రామాలు, 765 చదరపు కిలోమీటర్ల పరిధిని ఎఫ్సీడీఏలోకి తీసుకుని ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేలా ఫోర్త్ సిటీని నిర్మించాలని రేవంత్రెడ్డి సర్కార్ దృఢ సంకల్పంతో ఉంది. ఎఫ్సీడీఏ పరిధిలోకి తీసుకునే ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, కందుకూరు, ఆమనగల్లు, కడ్తాల్, మహేశ్వరం మండలాల్లో అత్యధికంగా యాచారం మండలంలోనే 17 రెవెన్యూ గ్రామాలను తీసుకున్నారు. యాచారంలో మొత్తం 21 రెవెన్యూ గ్రామాలు ఉండగా, కేవలం నాలుగింటిని వదిలేశారు. ఎఫ్సీడీఏ ఏర్పాటైన మార్చి నెలలోనే యాచారం మండల పరిధిలోని మొండిగౌరెల్లి, మంతన్గౌరెల్లి, సూల్తాన్పూర్ ప్రజలు తమ గ్రామాలను సైతం అథారిటీలో కలపాలని ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. యాచారం పక్కనే మొండిగౌరెల్లి.. యాచారం మండల కేంద్రానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న మొండిగౌరెల్లిని వదిలేసి, ఆతర్వాత వచ్చే చింతపట్ల, నల్లవెల్లిని ఎఫ్సీడీఏలో కలిపారు. నల్లవెల్లిని అనుకుని ఉన్న మంతన్గౌరెల్లి, మంతన్గౌడ్, సూల్తాన్పూర్ను వదిలేశారు. మొండిగౌరెల్లి, మంతన్గౌరెల్లిలో పంచాయతీ ఆఫీసులు ఉన్నాయి, కానీ మంతన్గౌడ్, సూల్తాన్పూర్లు వ్యవసాయ భూముల రికార్డుల పరంగా రెవెన్యూ గ్రామాలైనప్పటికీ ప్రత్యేక జీపీలు లేవు. ఫలితం శూన్యం మండలంలోని మొండిగౌరెల్లి, మంతన్గౌరెల్లి, మంతన్గౌడ్, సూల్తాన్పూర్ను కూడా ఎఫ్సీడీఏలోకి తీసుకోవాలని ఆయా గ్రామాల రైతులు, ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మొండిగౌరెల్లి, మంతన్గౌరెల్లి నుంచి మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు కలెక్టర్ నారాయణరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు అందజేసినా ఫలితం కనిపించడం లేదు. నేతలు, అధికారులు సానుకూలంగా హామీ ఇచ్చినప్పటికీ అమలులో కార్యరూపం దాల్చడం లేదు. తాజాగా సర్కార్ ఎఫ్సీడీఏ అధికారిక మ్యాప్ను ప్రకటించడంతో మళ్లీ వీరిలో ఆందోళన నెలకొంది. తమ నాలుగు రెవెన్యూ గ్రామాలను అటు నల్గొండ జిల్లా మర్రిగూడ మండల పరిధిలో కలుపుతారా.. లేక యాచారం మండలం పక్కనే ఉన్న మంచాల మండలంలో కలుపుతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ నాలుగు గ్రామాలపై ఎటూ తేల్చని వైనం ప్రజల అభ్యర్థనలపై స్పష్టత ఇవ్వని నేతలు, అధికారులు ఎఫ్సీడీఏ మ్యాప్ విడుదలతో మరింత ఆందోళనమొండిగౌరెల్లి, మంతన్గౌరెల్లి ప్రజలు తమ గ్రామాలను ఎఫ్సీడీఏలోకి కలపాలని కోరుతున్నారు. ఈ విషయమై గతంలో ఉన్నతాధికారులకు లేఖ రాశా. నేరుగా సీఎం రేవంత్రెడ్డిని కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. – మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం యాచారానికి కూత వేటు దూరంలో ఉన్న మొండిగౌరెల్లిని ఎఫ్సీడీఏలో కలెక్టర్, ఎమ్మెల్యేను కలిసి విన్నవించాం. ఇందుకు వారు సానుకూలంగా స్పందించినప్పటికీ స్పష్టత రాలేదు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన మ్యాప్లో కూడా మా గ్రామాన్ని చేర్చలేదు. – తాండ్ర రవీందర్, మొండిగౌరెల్లి -
వేడుక ముగిసే.. వ్యర్థాలు మిగిలే
వేడుక ముగిసె.. వ్యర్థాలు మిగిలే తుర్కయంజాల్: వినాయక చవితి ఉత్సవాలు ముగిశాయి. గణనాథుడి నిమజ్జన క్రతువు అట్టహాసంగా జరిగింది. నెలరోజులు గడిచింది. కానీ చెరువు వద్ద సేకరించి, కట్టకింద డంప్ చేసిన వ్యర్థాలు మాత్రం అలాగే ఉన్నాయి. కుప్పలుగా పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. అయినా సంబంధిత అధికారులు చెత్త తొలగింపును విస్మరించారు. నేటికీ చెత్తాచెదారం తొలగించేందుకు టెండర్ ప్రక్రియను పూర్తి చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. నాలుగు వేల విగ్రహాలు.. పురపాలక సంఘం పరిధి మాసబ్ చెరువులో గణనాథుల నిమజ్జన ప్రక్రియను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. ఉన్నతాధికారులు మెప్పు పొందారు. కాగా.. సుమారు నాలుగు వేలకు పైగా ప్రతిమలు గంగమ్మ ఒడికి చేరాయి. ఆయా విగ్రహాలతో పాటు.. పూలు, పండ్లు, ఆకులు తదితర పూజా సామగ్రిని సైతం భక్తులు తెస్తుంటారు. అలా తెచ్చిన వాటిని సిబ్బంది సేకరించారు. అనంతరం వాటిని దూర ప్రాంతాలకు తరలించాల్సిన అధికారులు.. చెరువుకు రెండు వందల మీటర్ల దూరన డంప్ చేయించారు. నెలరోజులైనా ఆ వ్యర్థాలను అక్కడి నుంచి తీయకపోవడంతో సమీప కమ్మగూడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వెలువడుతున్న దుర్వాసనతో ఇంట్లో ఉండలేక పోతున్నామని వాపోతున్నారు. డంపింగ్ యార్డ్లా.. నిమజ్జన సమయంలో 24 గంటల పాటు శానిటేషన్ ప్రక్రియను అధికారులు నిర్వహించారు. ఆ సమయంలో బిజీగా ఉండటం, సిబ్బంది కొరతతో తడి, పొడి చెత్తను వేరుచేయకుండా ఒకే చోట డంప్ చేశారు. ఆ తరువాత అయినా దానిని వేరు చేయాలనే ఆలోచనను మరిచారు. ఆ తరువాత వరుసగా భారీ వర్షాలు కురవడంతో.. ఆ చెత్త పెద్ద సమస్యగా మారింది. గతంలో నిమజ్జన ప్రక్రియ ముగిసే వరకు ఇక్కడ డంప్ చేసి, ఆ తరువాత ఇతరప్రాంతాలకు తరలించేవారు. కానీ ఈ సారి అలాగే వదిలేయడంతో ఆ ప్రాంతం డంపింగ్ యార్డ్ను తలపిస్తోంది. ఇదిలా ఉండగా.. చెత్త తొలగించకపోవడంతో ఈ ప్రాంతం పందులకు ఆవాసంగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. అపరిశుభ్రత వాతావరణం వలన దోమల బెడద పెరిగిందని వాపోతున్నారు. దీని కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అధికారులు స్పందించి, నిమజ్జన వ్యర్థాలను వెంటనే తొలగించే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. చెరువు కట్ట కింద చెత్త డంప్ నెలరోజులైనా తొలగించని వైనం దుర్వాసన, దోమలతోస్థానికుల ఇబ్బంది పట్టించుకోని అధికార యంత్రాంగం తొలగిస్తాం.. సిబ్బంది కొరతతో చెత్త తరలింపు ఆలస్యం అయింది. వెంటనే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి, వ్యర్థాలను తరలించే ఏర్పాట్లు చేస్తాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాం. – వనిత, శానిటరీ ఇన్స్పెక్టర్, మున్సిపాలిటీ -
గంజాయి విక్రేతల అరెస్టు
8.400 కిలోల గాంజా స్వాధీనం యాచారం: ఇద్దరు గంజాయి విక్రేతలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 8.400 కిలోల గాంజాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన నాగార్జునసాగర్– హైదరాబాద్ రహదారి గునుగల్ గేట్ వద్ద చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లాకుచెందిన బలరామ్ కోబాసి, ఉంగా పడియామిలు ఇద్దరు.. హైదరాబాద్కు చెందిన నిరజ్కుమార్ యాదవ్కు రూ.80 వేలకు విక్రయించడానికిగంజాయిని తీసుకువచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం గునుగల్ గేట్ వద్ద అనుమానాస్పదంగాసంచరిస్తున్న వీరిని.. అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాగ్లను తనిఖీ చేయగా.. గంజాయి పట్టుబడింది. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయితో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. ఒడిశా అటవీ ప్రాంతంలో పండించిన గాంజాను తెచ్చి, నగరంలో విక్రయిస్తుంటామని ఒప్పుకొన్నారు. వీరిద్దరిని శనివారం రిమాండ్కు తరలించామని సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు. -
జంట జలాశయాలకు వరద
వాతావరణం శాఖఆరెంజ్ అలెర్ట్ జారీ ● అప్రమత్తమైన జలమండలి సాక్షి, సిటీబ్యూరో: జంట జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తు న్న భారీ వర్షాలు, నాగార్జున సాగర్ గేట్ల ఎత్తివేతతో వరద ప్రవాహం పెరిగింది. మరో వైపు వాతావరణం శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ముందస్తు జాగ్రత్తగా జలమండలి అప్రమత్తమైంది. జంట జలాశయాలకు చేరుతున్న నీటిని వచ్చినట్టే దిగువన మూసీలోకి వదులుతున్నారు. శనివారం జలమండలి ఎండీ అశోక్ రెడ్డి జంట జలాశయాలను అధికారులతో కలిసి సందర్శించారు. వాతావరణం శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయడంతో రెవెన్యూ, సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు జంట జలాశయాలు ఇలా.. ఉస్మాన్ సాగర్ పూర్తి నీటి మట్టం: 1790.00 అడుగులు (3.900 టీఎంసీలు) ప్రస్తుత మట్టం: 1789.35 అడుగులు (3.751టీఎంసీలు) ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద : 600 క్యూసెక్కులు దిగువకు వదులుతున్న వరద: 2652 క్యూసెక్కులు గేట్లు ఎత్తివేత: 4 అడుగుల ఎత్తుకు 6 గేట్లు హిమాయత్ సాగర్ పూర్తి నీటి మట్టం: 1763.50 అడుగులు (2.970 టీఎంసీలు) ప్రస్తుత మట్టం: 1762.95 (2.780 టీఎంసీలు) ఎగువ ప్రాంతాలనుంచి వస్తున్న వరద: 400 క్యూసెక్కులు దిగువకు వదులుతున్న వరద : 1981 క్యూసెక్స్ గేట్లు ఎత్తివేత: 3 అడుగుల ఎత్తుకు 2 గేట్లు -
మరపురాని నేత ఇంద్రారెడ్డి
చేవెళ్ల: మరపురాని మహానేత, ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు ఇంద్రారెడ్డి అని ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అన్నారు. హోశాఖ మాజీ మంత్రి ఇంద్రారెడ్డి జయంతిని పురస్కరించుకొని శనివారం మండల పరిధి కౌకుంట్లలో ఆయన సమాధి వద్ద కుమారులు కార్తీక్రెడ్డి, కౌసిక్రెడ్డి, కల్యాణ్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఇంద్రారెడ్డి జ్ఞాపకాలు, ఆశయాలు మరపురానివని పేర్కొన్నారు. నిరంతరం ఆయన ప్రజలకోసం తపించారని, వారి ఆశయాలకు అనుగుణంగా తమ కుటుంబం పనిచేస్తుందని తెలిపారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పి.కృష్ణారెడ్డి, మమేందర్రెడ్డి, మాజీ ఎంపీపీ ఎం.బాలరాజ్, పార్టీ మండల అధ్యక్షుడు పి.ప్రభాకర్, కరుణాకర్రెడ్డి, హన్మంత్రెడ్డి, నాగేశ్వర్రెడ్డి, శ్రీధర్రెడ్డి, దర్శన్, రాజు, మానిక్యరెడ్డి, మాదవ్గౌడ్, కరుణాకర్రెడ్డి, నర్సింహులు, కృష్ణ, మల్లారెడ్డి, గోపాలకృష్ణ, అంజయ్య, శేఖర్, ప్రసాద్ పాల్గొన్నారు.ఎమ్మెల్యే సబితారెడ్డి -
యువతి ఆత్మహత్య
కుషాయిగూడ: కుటుంబంలోని విభేదాలతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శనివారం చర్లపల్లి పోలీస్ష్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. చర్లపల్లిలోని మధుసూదన్రెడ్డినగర్కు చెందిన బత్తుల గోపాల్, ప్రసన్న దంపతులు గత మే నెలలో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో వారి కుమార్తె సృష్టిత (21) తల్లి ప్రసన్నతో కలిసి మధుసూదన్రెడ్డినగర్లో ఉంటుండగా...భర్త వేరుగా ఉంటున్నాడు. సృష్టిత డిగ్రీ చదువుతుండగా, తల్లి ప్రైవేటుగా ఉద్యోగం చేస్తుంది. శుక్రవారం ప్రసన్న రోజులానే ఉద్యోగానికి వెళ్లింది. ఆ సమయంలో కూతురు సృష్టిత ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ రోజు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో తల్లి కుమార్తెతో ఫోన్లో మాట్లాడింది. తిరిగి సాయంత్రం 6:30 గంటలకు మరోమారు ఫోన్ చేస్తే సృష్టిత ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పలుమార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆందోళన చెందిన తల్లి ఇంట్లో కిరాయిదారులకు ఫోన్ చేసి కూతురు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడాన్ని తెలిపి ఇంటికి వెళ్లి చూడమని కోరింది. వారు తలుపు తట్టి ప్రయత్నించినా ఎలాంటి సమాధానం రాలేదు. తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా సృష్టిత తన గదిలో ఫ్యాన్కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. దీంతో విషయాన్ని తల్లి ప్రసన్నకు తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా తల్లిదండ్రుల మధ్య ఉన్న విభేదాల వల్లే మనస్థాపం చెంది యువతి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు
దుద్యాల్: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ యాదగిరి హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందునా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా రాజకీయ పార్టీలపై, కులమతాల పేరిట దుష్ప్రచారం చేసినా, అవమానకరమైన వ్యాఖ్యలు, రెచ్చగొట్టె ప్రసంగాలు చేయొద్దని సూచించారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు కథనాలు, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయా వ్యక్తులను టార్గెట్ చేసి మాట్లాడినా, ప్రసారాలు చేసినా అన్నీ ఎన్నికల నేరం కింద పరిగనింపబడుతాయని ఎస్ఐ వివరించారు. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా ప్రజలకు ఇచ్చే సూచనలు .. ● ఇతర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో తమ వెంట రూ. 50,000లకు మించి నగదు ఉండొద్దు. ● ఎన్నికల సమయంలో అక్రమంగా మద్యం పంపిణీ చేసినా, తమ దగ్గర ఉన్నా నేరమే. ● ఓటు కోసం రాజకీయ పార్టీల నుంచి, పోటీ దారుల నుంచి ఎటువంటి బహుమతులు, నగదు, వస్తువు రూపేణ తీసుకోవడం నిషేధమే. ● ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా అందరు ప్రభుత్వానికి సహకరించాలి. ● లంచం, బెదిరింపులు, డబ్బు లేదా మద్యం పంపిణీ, కులమత భేదాల ఆధారంగా ప్రచారంచేయడం వంటివి చేయొద్దు. పై విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినా పలు రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ యాదగిరి హెచ్చరించారు.ఎస్ఐ యాదగిరి -
కేసీఆర్ పాయే.. భగీరథ నీళ్లు పోయే!
● మాజీ మంత్రి సబితారెడ్డి ఆవేదన ● ఆడబిడ్డలకు మళ్లీ నీటికష్టాలు వచ్చాయని అసహనంచేవెళ్ల: ‘కేసీఆర్ పాయే.. భగీరథ నీళ్లు పోయే.. గ్రామాల్లో చిన్నపిల్లలకు ఏమిటి ఈబాధ’ అని మాజీ మంత్రి సబితారెడ్డి అన్నారు. దివంగత నాయకుడు ఇంద్రారెడ్డి జయంతి సందర్భంగా శనివారం కౌకుంట్లకు వెళ్తున్న ఆమె అంతారంలో రోడ్డు పక్కన బిందెల్లో నీళ్లు పడుతున్న ఇద్దరు చిన్నారులను చూసి వాహనం ఆపారు. ఇంట్లో నల్లా నీళ్లు రావటం లేదా..? ఇక్కడ ఎందుకు పడుతున్నారని ప్రశ్నించగా.. నీళ్లు రావడం లేదని బాలుడు బదులిచ్చాడు. మీ అమ్మ ఎక్కడికి వెళ్లిందని అడగగా.. పనికి పోయిందని చెప్పాడు. అనంతరం అక్కడే ఉన్న గ్రామస్తులను పలకరించిన సబితారెడ్డి నల్లా నీళ్లు రావడం లేదా అని అడిగారు. వారం రోజులుగా భగీరథ నీళ్లు రావడం లేదని, ఓ వ్యవసాయ బావి మోటారు నుంచి నల్లా పైపు కనెక్షన్ తీసుకుని వాడుకుంటున్నామని చెప్పారు. దీంతో అసహనం వ్యక్తంచేసిన ఆమె కేసీఆర్ దిగిపోవడంతో ఆడబిడ్డలు, చిన్నారులకు మళ్లీ నీటి కష్టాలు వచ్చాయని, కాంగ్రెస్ పాలనలో పాత రోజులను గుర్తుకు తెస్తోందన్నారు. -
అలైన్మెంట్ మార్చండి
● ట్రిపుల్ఆర్ బాధితుల ఆవేదన ● కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి వినతిపత్రంషాద్నగర్ రూరల్: త్రిపుర్ఆర్ రోడ్డు నిర్మాణంలో భూములను కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఈ మేరకు కొందుర్గు మండలం తంగెళ్లపల్లి గ్రామానికి చెందిన పలువురు శనివారం కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని కలిసి విన్నవించారు. పేద రైతులను దృష్టిలో పెట్టుకొని త్రిపుల్ఆర్ నిర్మాణం అలైన్మెంట్ను మార్చాలని కోరారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ.. త్రిపుల్ఆర్ బాధితుల్లో చాలా మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారన్నారు. ఉన్న కొద్దిపాటి భూములను కోల్పోతే ఉపాధి కూడా ఉండదని పేర్కొన్నారు. పేదల భూములనే టార్గెట్ చేస్తూ ఒక్కోచోట ఒక్కో రకంగా అలైన్మెంట్ మార్కింగ్ ఇచ్చారన్నారు. పేద రైతుల కష్టాలను పట్టించుకోకుండా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే త్రిపుల్ఆర్ అలైన్మెంట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి భూములను కోల్పోతున్న పేద రైతులకు న్యాయం చేయాలని కోరారు. మంత్రి కిషన్రెడ్డి ఇందుకు సానుకూలంగా స్పందించారు. ఆయనను కలిసిన వారిలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్, తంగెళ్లపల్లి మాజీ సర్పంచ్ బాల్రాజ్, రైతులు రవీందర్రెడ్డి, వెంకటయ్య, మల్లేశ్ తదితరులు ఉన్నారు. -
కంటైనర్లో అకస్మాత్తుగా మంటలు
చేవెళ్ల: ఓ లారీ కంటైనర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగటంతో క్యాబిన్ ముందుభాగంలో మంటలు అంటుకున్నాయి. ఈ సంఘటన చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని పామెన బస్స్టేజీ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. షాబాద్ నుంచి శుక్రవారం చేవెళ్ల మీదుగా కంటైనర్ లారీ ఎలక్ట్రికల్ పైపులతో ముంబైకి వెళ్తోంది. పామెన బస్స్టేజీ వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్, క్లీనర్ అప్రమత్తమైన రోడ్డు పక్కన ఆపి కిందికి దిగారు. మంటలు క్యాబిన్ మొత్తం వ్యాపించాయి. స్థానికుల సాయంతో ఫైర్స్టేషన్కు సమాచారం ఇవ్వగా ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. -
సీపీఎం అభ్యర్థులను గెలిపించండి
యాచారం: స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య పిలుపునిచ్చారు. మాల్ గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల తరఫున నిత్యం పోరాటాలు చేసే సీపీఎం అభ్యర్థులను గెలిపిస్తే మేలు జరుగుతుందన్నారు. ఆరు గ్యారంటీ పథకాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ, జిల్లా కమిటీ సభ్యుడు అంజయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యులు పి.బ్రహ్మయ్య, జంగయ్య, చందునాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పాతబస్తీలో కొత్త మార్గం
బార్కాస్ జంక్షన్ నుంచి చార్మినార్ వరకు తగ్గనున్న ట్రాఫిక్ చిక్కులు● ఫలక్నుమా వద్ద రెండో ఆర్ఓబీ ప్రారంభం ● పాల్గొన్న మంత్రి పొన్నం, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీలోని ఫలక్నుమా జంక్షన్ (జీమ్యాక్స్ కన్వెన్షన్) నుంచి ఫలక్నుమా బస్డిపోతో పాటు చార్మినార్ వరకు వెళ్లే వారికి ఇప్పటిదాకా ఉన్న ట్రాఫిక్ చిక్కులు తగ్గనున్నాయి. సికింద్రాబాద్ –ఫలక్నుమా బ్రాడ్గేజ్ లైన్లోని ఫలక్నుమా వద్ద ఇప్పటికే ఉన్న ఆర్ఓబీకి సమాంతరంగా రూ. 52.03 కోట్లతో నిర్మించిన కొత్త ఆర్ఓబీని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ప్రారంభించారు. పాత ఆర్ఓబీ పునరుద్ధరణతో పాటు కొత్త ఆర్ఓబీని నాలుగు వరుసల క్యారేజ్వేతో నిర్మించడంతో బార్కాస్ జంక్షన్ నుంచి ఫలక్నుమా బస్ డిపో, రైల్వే స్టేషన్, చార్మినార్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తొలగనున్నాయి. ఎంతో సమయం ఆదాతో కావడంతో పాటు గంటల తరబడి నిలిచిపోయే ట్రాఫిక్ నుంచి ఉపశమనం లభించనుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీలు మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ, మీర్జా రహమత్ బేగ్ , ఎమ్మెల్యేలు మహమ్మద్ ముబీన్, మీర్ జల్ఫికర్ అలీ, మేయర్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. తొలుత ఈ ఫ్లై ఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని ప్రకటించినప్పటికీ, ఆయన కార్యక్రమానికి హాజరు కాలేదు. -
‘డబుల్’ ఇళ్ల కేటాయింపు పత్రాల అందజేత
బంజారాహిల్స్: గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించి కోర్టులో కేసు కారణంగా ఆగిపోయి తిరిగి కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చిన పలువురు లబ్ధి దారులకు హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టాలు పంపిణీ చేశారు. మినిస్టర్ క్వార్టర్స్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, ఎంపీ అనిల్కుమార్యాదవ్, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో కలిసి పత్రాలను అందజేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు పథకంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంకల్ గ్రామంలో ఇళ్ల నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ చేపట్టింది. హైదరాబాద్ జిల్లాకు చెందిన 1730 మంది లబ్ధిదారుల జాబితాను కలెక్టర్ ప్రచురించగా వీరికి మంకల్ ఫేజ్–2 స్థానంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు. అందులో భాగంగా చార్మినార్, మలక్పేట, యాకుత్పురా, చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఉన్న లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. 75 మంది లబ్ధిదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా పట్టాలు అందజేశారు. -
పూటకో మాట.. రోజుకో తీరు
‘తెలంగాణ తల్లి’ బోర్డు తెర తీశారు సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్ బోర్డుకు సంబంధించి జీహెచ్ఎంసీ తీరు ప్రజలకు అంతుచిక్కడం లేదు. ఫ్లై ఓవర్ ఒకవైపు (పాత సచివాలయం వైపు) ప్రవేశ మార్గంలో గత మంగళవారం ప్రజలకు దర్శనమిచ్చిన బోర్డును సాయంత్రానికి అక్షరాలు కనిపించకుండా తెర వేశారు. తెలుగుతల్లిగా ఉన్న పేరును తెలంగాణ తల్లిగా మార్చడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో జీహెచ్ఎంసీ చేసిన ఆ పనితో పలు సంశయాలు వెల్లువెత్తాయి. సోషల్మీడియాలో వైరల్గా మారడంతో ఫ్లై ఓవర్ రెండో వైపు (లోయర్ట్యాంక్బండ్) ప్రవేశమార్గంలో కూడా బోర్డు ఏర్పాటు చేశాక రెండింటినీ కలిపి ఒకేసారి ప్రారంభిస్తామని జీహెచ్ఎంసీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రెండు రోజుల్లో రెండింటినీ కలిపి ఒకేసారి ప్రారంభిస్తామని పేర్కొంది. కానీ.. రెండో వైపు బోర్డు ఏర్పాటు కాకుండానే సచివాలయం వైపు బోర్డుకు వేసిన తెరను తొలగించి, తిరిగి అక్షరాలు కనిపించేలా చేసింది. ఇంతమాత్రానికి ఈ తతంగమంతా ఎందుకు? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తొలుత ఒకవైపు మాత్రమే ఏర్పాటు చేస్తే ఎవరైనా కాదన్నారా? ఎందుకు మూసేశారు? రెండోవైపు ఏర్పాటు కాకున్నా మళ్లీ ఎందుకు తెర తీశారు? రెండూ ఒకేసారి ప్రారంభిస్తామని ఎందుకు ప్రకటించారు? అంటూ పలువురు జీహెచ్ఎంసీ చర్యల్ని తప్పుపడుతున్నారు. -
పండుగకు వెళ్లి వస్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి ● ముగ్గురికి గాయాలువ్యక్తి ఆత్మహత్య కొడంగల్ రూరల్: చెట్టుకు ఉరేసుకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మున్సిపల్ పరిధిలోని అయినన్పల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మల్లేశం(39) మద్యానికి బానిసై తరచూ ఇంట్లో గొడవ పడేవాడు. ఇదే క్రమంలో గురువారం రాత్రి గొడవ జరగడంతో బయటకు వెళ్లిపోయాడు. అయినన్పల్లి గేటు సమీపంలోని వెంచర్లో ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. శుక్రవారం ఉదయం గమనించిన అక్కడి వారు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడి చిన్నాన్న నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ –2 సత్యనారాయణరాజు తెలిపారు. మృతుడికి భార్య లలితమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
మమ్మీ నన్ను క్షమించు.. నాకు బతకాలని లేదు
బాలిక ఆత్మహత్య సాక్షి, సిటీబ్యూరో: ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా దేశంలోకి ప్రవేశించి, డ్రగ్ పెడ్లర్స్తో కలిసి సంచరిస్తున్న నైజీరియన్ జియోఫ్రీ డోజియోబిబ్ను ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు డిపోర్ట్ చేశారు. ఈ ప్రక్రియలో ఫారెనర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) సహకరించిందని అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు శుక్రవారం ప్రకటించారు. నైజీరియాకు చెందిన జియోఫ్రీ డోజియోబిబ్ 2019లో అక్రమంగా దేశంలోకి వచ్చాడు. నైజీరియా నుంచి నేపాల్ చేరిన ఇతగాడు ఎలాంటి పత్రాలు లేకుండా రోడ్డు మార్గంలో ఢిల్లీ వచ్చాడు. అక్కడ నుంచి నగరానికి చేరుకున్న జియోఫ్రీ టోలీచౌకీలో అక్రమంగా నివసిస్తున్నాడు. బెంగళూరు, హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తున్న ఇతగాడు కొందరు డ్రగ్ పెడ్లర్స్తోనూ కలిసి తిరుగుతున్నట్లు ఈస్ట్జోన్ టాస్క్ ఫోర్స్కు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ నేతృత్వంలోని బృందం జియోఫ్రీని టోలీచౌకీలో అదుపులోకి తీసుకుంది. విచారణలో పొంతన లేని సమాధానాలు చెప్పడం, ఎలాంటి పత్రాలు లేకపోవడంతో తనిఖీలు చేసింది. అతడి వద్ద ఎలాంటి మాదకద్రవ్యాలు లభించకపోవడంతో అక్రమంగా ఉంటున్న ఆరోపణలపై సీసీఎస్లోని డిటెన్షన్ సెంటర్లో ఉంచింది. నగర పోలీసు ఉన్నతాధికారులు, ఎఫ్ఆర్ఆర్ఓ అధికారుల సాయంతో అవసరమైన ప్రక్రియలు పూర్తి చేశారు. ఆపై ముంబై విమానాశ్రయం నుంచి నైజీరియాకు డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా బలవంతంగా తిప్పి పంపింది. -
తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడిగా కప్పాటి
మీర్పేట: అహింసా, సత్యాగ్రహం ద్వారా బ్రిటీష్ పాలన నుంచి దేశానికి స్వాతంత్య్రం సాధించడంలో మహాత్మాగాంధీ కీలకపాత్ర పోషించారని టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి అన్నారు. జిల్లెలగూడ చందన చెరువు కట్టపై గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వ ర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు చల్లా బాల్రెడ్డి, సిద్ధాల శ్రీశైలం, వెంకటేశ్గౌడ్, గజ్జెల రాంచందర్, ఓంప్రకాశ్, విజయవర్ధన్రెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి, పరశురాం పాల్గొన్నారు. తుర్కయంజాల్: పురపాలక సంఘం పరిధి మునగనూర్లో నిర్మాణంలో ఉన్న వేంకటేశ్వర అభిషేక ఆనంద ఆలయం గర్భాలయం ప్రధాన ద్వారం ప్రతిష్ఠ కార్యక్రమానికి శుక్రవారం పీసీసీ చీఫ్ మహేశ్ మార్ గౌడ్ ఎమ్మెల్మే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన ద్వారం గడప పూజ, కల్యాణ మహోత్సవం, పూర్ణాహుతిని వేద పండితులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తుర్కయంజాల్: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పురపాలక సంఘం పరిధి మునగనూర్కు చెందిన డా.ఉదావత్ లచ్చిరాంకు భారత్ బ్రాండ్ బుక్ ఆఫ్ రికార్డ్ న్యూఢిల్లీ సీఈఓ డి.కె.రాజ్ శుక్రవారం ఆన్లైన్లో గ్లోబల్ పీస్ అవార్డ్–2025 అందజేశారు. ఈ సందర్భంగా లచ్చిరాం మాట్లాడుతూ.. పాఠశాల విద్యార్థులకు స్వాతంత్ర ఉద్యమం నాటి సంఘటనలు వివరించడం, కేంద్రం నిర్వహిస్తున్న క్విజ్ పోటీల్లో పాల్గొనేలా చేయడం, అహింసా మార్గాన్ని బోధించడంలో కృషి చేసినందుకు ఈ అవార్డు వరించిందని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మేడ్చల్ రూరల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన బడికోల్ భాస్కర్ రెడ్డి కుటుంబం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని జమున వెంచర్ లో నివాసముంటోంది. భాస్కర్ రెడ్డి కుమారుడు అజయ్ రెడ్డి(21) డిగ్రీ చదువుతూ తండ్రి నిర్వహించే వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. గురువారం దసరా పండుగ సందర్భంగా కాళకల్లో ఉన్న స్నేహితులను కలిసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తిరిగి వస్తుండగా రేకుల బావి ప్రాంతానికి సమీపంలో వాహనం అదుపు తప్పి, గుంతలో పడిపోయాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలై, అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు దోపిడీ దొంగల అరెస్టు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ఫోన్ దొంగతనాలకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బోరబండ ఎస్సార్టీనగర్లో నివసించే పసుపులేటి అన్వేష్ అలియాస్ అన్నూ(24) ఆఫీస్బాయ్గా పనిచేస్తుండగా, బోరబండకే చెందిన మహ్మద్ సోహైల్(24) డెలివరీబాయ్గా పనిచేస్తున్నాడు. వీరికి అల్లాపూర్కు చెందిన ఎండీ అజర్(23)తో పాటు మరో మైనర్ బాలుడు తోడయ్యాడు. వీరంతా రాత్రిపూట వీధుల్లో తిరుగుతూ ఒంటరిగా వెళ్తున్నవారిని లక్ష్యంగా చేసుకుని దారికాచి కత్తులు, బ్లేడ్లతో బెదిరిస్తూ సెల్ఫోన్లు, గొలుసులు, నగదు దోచుకుంటున్నారు. గత నెల 30వ తేదీన సినిమా షూటింగ్ల్లో పనిచేసే రహమత్నగర్ నివాసి సాదిక్ షూటింగ్ ముగించుకుని వెళ్తుండగా మెట్రో పిల్లర్ నెంబర్ 1540 వద్ద నెంబర్ ప్లేట్ లేని బైక్పై వచ్చిన ఈ నలుగురు అడ్డగించి కొట్టి సెల్ఫోన్ను బలవంతంగా లాక్కొని పరారయ్యారు. అదే రోజు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్ క్రైమ్ పోలీసులు యూసుఫ్గూడ చెక్పోస్టులో నిఘా వేసి వీరిని అదుపులోకి తీసుకున్నారు. సెల్ఫోన్తో పాటు డ్యూయో బైక్ను స్వాధీనం చేసుకుని అన్వేష్, సోహైల్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు అజర్ పరారీలో ఉండగా, మైనర్ బాలుడిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. -
పారాహుషార్.. ప్లేట్లో డేంజర్
సాక్షి, సిటీబ్యూరో: దేశవ్యాప్తంగా నిర్వహించిన ఒక తాజా సర్వే.. పెరుగుతున్న మధుమేహం, ఊబకాయం గుండె జబ్బులకు ఆహారం జీవనశైలి మార్పులే కారణమని నిర్ధారించింది. సగటున వయసు 40 సంవత్సరాలున్న పురుషులు, మహిళలను ఎంచుకున్న ఈ సర్వే ఫలితం దేశంలో తీవ్రతరమవుతున్న ఆరోగ్య సంక్షోభపు స్థాయిని వెల్లడించింది, ఆహారం జీవనశైలిలో మార్పులు మధుమేహం, ఊబకాయం గుండె జబ్బులతో నేరుగా ఎలా ముడిపడి ఉన్నాయో తేల్చి చెప్పింది. సర్వసాధారణంగా .. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్– ఇండియా డయాబెటిస్ (ఐసీఎంఆర్–ఐఎన్డీఐఏబీ) ప్రాజెక్ట్లో భాగమైన ఈ పరిశోధన, 83 శాతం మంది కనీసం ఏదో ఒక మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్ కలిగి ఉన్నారని, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం మధుమేహం ఇప్పుడు సర్వసాధారణంగా మారాయని తేల్చింది. మొత్తం 18,090 మందిపై జరిగిన ఈ పరిశోధన నేచర్ మెడిసిన్లో ప్రచురితమైంది. సంప్రదాయ ఆహార విధానాలు చురుకై న జీవనశైలి స్థానంలో నిశ్చల దినచర్యలు, అధిక–కార్పొహైడ్రేట్ ఆహారాలు చేరడమే ముప్పునకు కారణమని వెల్లడించింది. రక్తపోటు.. ప్రీ డయాబెటిస్ దాదాపు మూడింట ఒక వంతు మందికి అధిక రక్తపోటు (తీవ్రంగా అధిక రక్తపోటు) ఉన్నట్లు కనుగొంటే 9% మందికి కొత్తగా నిర్ధారణ అయిన టైప్ 2 డయాబెటిస్ ఉంది. భవిష్యత్తులో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని సూచించే ప్రీడయాబెటిస్ 41% కన్నా ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. పాలతో ప్రీ డయాబెటిస్, గుడ్డుతో చెక్ ● రకరకాలుగా కార్బోహైడ్రేట్ల వాడకాన్ని తగ్గించకుండా శుద్ధి చేసిన తెల్ల బియ్యం వంటి వాటిని ఽ గోధుమలు.. తదితరాలతో భర్తీ చేయడం మధుమేహం లేదా ఊబకాయం ప్రమాదాన్ని తగ్గించ లేదని అధ్యయనం స్పష్టం చేసింది. ఆహారంలో ప్రొటీన్ బాగా పెంచాల్సిన అవసరం ఉందని, కొన్ని కార్బోహైడ్రేట్లను ప్రోటీన్తో భర్తీ చేసినప్పుడు అత్యంత ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయని వెల్లడించింది. శాకాహారం,, పాల ఉత్పత్తులు, గుడ్డు లేదా చేప ద్వారా ప్రొటీన్లను తీసుకోవడం టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం 9–11% తగ్గిస్తుందని, ప్రీడయాబెటిస్ ప్రమాదం 6–18% తగ్గిస్తుందని తేల్చింది. ● ముఖ్యంగా ప్రీడయాబెటిస్ను నివారించడంలో పాల ద్వారా వచ్చే ప్రోటీన్ మంచి పనితీరు చూపింది, అదే సమయంలో గుడ్డు ద్వారా వచ్చే ప్రొటీన్ డయాబెటిస్కు వ్యతిరేకంగా పనిచేస్తోంది. మొత్తంగా చూస్తే వ్యాధుల భారాన్ని తగ్గించడానికి ప్రోటీన్–రిచ్ ఫుడ్ను ఎక్కువగా తీసుకునేందుకు ప్రోత్సహించాలని అధ్యయనం సూచిస్తోంది. తక్షణం ఈ మార్పుల వైపు దృష్టి సారించాలని లేకపోతే పరిణామాలు వినాశకరమైనవి కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం మధుమేహం కలయిక గుండె జబ్బులు స్ట్రోక్ రేటును వేగవంతం చేసి దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై అపారమైన భారాన్ని మోపుతుందని హెచ్చరిస్తున్నారు. 83శాతం మందిలో కనిపించిన మెటబాలిక్ రిస్క్ 41శాతం మందిలో ప్రీ డయాబెటిస్ మార్పు చేర్పులు, ప్రొటీన్ కూర్పులతోనే పరిష్కారం తాజాగా వెల్లడించిన ఐసీఎంఆర్ అధ్యయనం ఊబకాయం రేట్లు కూడా అంతే ఆందోళనకరంగా ఉన్నాయి. దేశ సగటు బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 22.2 మధ్యస్థంగా కనిపించినప్పటికీ, 43% మంది పెద్దవాళ్లు అధిక బరువుతో ఉన్నారు. అలాగే ఆసియా ప్రాంత ప్రమాణాల ప్రకారం చూస్తే 26% మంది ఊబకాయంతో ఉన్నారు. నడుము చుట్టూ అదనపు కొవ్వుతో వచ్చే ఉదర ఊబకాయం, 36 శాతం మందిలో ఉంది ఇదే గుండె ఆరోగ్యానికి ముఖ్యమైన హాని కారకంగా మారుతోంది. మరోవైపు కొలెస్ట్రాల్ సమస్యలు విస్తతమై సగం మందిలో డిస్లిపిడెమియా లేదా అసాధారణ లిపిడ్ స్థాయిలు కనిపిస్తున్నాయి. పట్టణాలు, నగరాల్లో ఇది మరింత తీవ్రంగా ఉంది, ఇక్కడ నిశ్చల జీవనశైలి ఆహారపు అలవాట్లు ప్రమాదాలను పెంచుతున్నాయి. గ్రామీణ నివాసితులతో పోలిస్తే అధిక బరువు, ఊబకాయం లేదా అధిక రక్తపోటు ఉన్నవారు నగరాల్లో ఎక్కువగా ఉన్నారు. మహిళలు అధిక స్థాయిలో ఊబకాయాన్ని కలిగి ఉంటే పురుషులకు అధిక రక్తపోటు కొలెస్ట్రాల్ సంబంధిత అసాధారణ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. తెల్ల బియ్యం సహా అనేక అనారోగ్య కారకాలు జీవనశైలి, దేశ ఆహార అలవాట్లు జీవక్రియ వ్యాధికి దాని సంబంధాలను అధ్యయనం లోతుగా పరిశీలించింది. దాని ప్రకారం.. రిఫైన్డ్/ శుద్ధి చేసిన గోధుమలు అదనపు చక్కెర. అదే సమయంలో, శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రోటీన్ కొరత పెరుగుతోంది. ఈ అసమతుల్యత డయాబెటిస్ ఊబకాయాలకు ప్రధాన కారణమవుతోంది. మొత్తంగా ఆహారం తక్కువగా తీసుకునే వారితో పోలిస్తే అధిక కార్బోహైడ్రేట్లు తీసుకున్న వ్యక్తులకు ఆరోగ్య సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. వీరికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు 30% ప్రీడయాబెటిస్ వచ్చే అవకాశాలు 20%,సాధారణ ఊబకాయం వచ్చే అవకాశాలు 22% ఉదర ఊబకాయం వచ్చే అవకాశాలు 15% ఎక్కువగా కనిపించింది. -
చికిత్స పొందుతూ మహిళ మృతి
● వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యుల ఆరోపణ ● ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ మహేశ్వరం: చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని తుమ్మలూరు గ్రామానికి చెందిన మారమోని శివకుమార్ భార్య స్వాతి (26) కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం మండల కేంద్రంలోని మ్యాక్స్వెల్ ఆస్పత్రిలో 20 రోజుల క్రితం చేరింది. వైద్యులు ఆపరేషన్ చేసిన కొద్ది రోజుల తర్వాత ఆమెకు డెంగీ జ్వరం వచ్చింది. అదే ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు ఏమీకాదులే అని నిర్లక్ష్యంగా వ్యవహరించి మందులు రాసిచ్చి పంపించారు. తర్వాత రక్తకణాలు తగ్గి బలహీనం కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. రక్తకణాలు పూర్తిగా తగ్గిపోయాయని తాము ఏమీ చేయలేమని వైద్యులు చేతులెత్తేశారు. దీంతో కుటుంబ సభ్యులు మహేశ్వరం గేటు వద్ద ఉన్న మరో ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించిందని ధ్రువీకరించారు. మ్యాక్స్వెల్ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య స్వాతి మృతి చెందిందని భర్త శివకుమార్ ఆరోపించారు. వైద్యులు, ఆస్పత్రి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆస్పత్రి యాజమాన్యాన్ని వివరణ కోరగా రక్తకణాలు తగ్గిపోయి, గుండె పోటు వచ్చి చనిపోయిందన్నారు. మహేశ్వరం పోలీసులు ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. -
అలయ్.. బలయ్.. రుచులు అదిరాయ్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో శుక్రవారం జరిగిన అలయ్ బలయ్ ఆద్యంతం ఆకట్టుకుంది. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో వేదిక చూడముచ్చటగా కనిపించింది. అలాగే.. అతిథులకు సుమారు 80 రకాలకు పైగా వంటకాలను వడ్డించారు. తెలంగాణ సంప్రదాయల రుచులు ఎంతగానో నోరూరించాయి. సుమారు 12వేల మందికి ఇక్కడ భోజన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులకు చికెన్, మటన్ బిర్యానీ, భగారా, బోటీ, తలకాయ, చేపల ఇగురు, బొమ్మిడాల పులుసు, రొయ్యలు, తదితర మాంసాహారాలు కర్రీ, ఫ్రై, రకాలు అందుబాటులో ఉంచారు. వీటితో పాటు చపాతీలు, వడలు, జొన్నరొట్టెలు, రుమాల్ రోటీ వంటి డైట్ ఫుడ్, తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు ఉన్న డబుల్కా మీఠాతో పాటు వివిధ రకాల స్వీట్స్ను తయారు చేయించారు. తెలంగాణలో గుర్తింపు పొందిన రకరకాల పిండి వంటలు నోరూరించాయి. అలాగే.. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ వేషధారణలు, డబ్బు వాయిద్యాలు, జానపద కళాకారులు సందర్శకులను ఆకట్టుకున్నారు. అలయ్ బలయ్పై గాయని మంగ్లీ ఆలపించిన గీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
ఫోను చోరీ.. ఖాతా ఖాళీ!
సాక్షి, సిటీబ్యూరో: తన ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడి సెల్ఫోన్ తస్కరించిన ఆటోడ్రైవర్ అందులో ఉన్న ఫోన్పే యాప్ ఆధారంగా బాధితుడి బ్యాంకు ఖాతా ఖాళీ చేశాడు. ఈ వ్యవహారంలో అతడికి కారు డ్రైవర్తో పాటు కూరగాయల వ్యాపారి సహకరించాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ దార కవిత శుక్రవారం వెల్లడించారు. ఈస్ట్ ఆనంద్ బాగ్లోని ఎన్ఎండీసీ కాలనీకి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి (68) గత నెల 17 రాత్రి ఉప్పల్ నుంచి తార్నాక వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో బాలానగర్కు చెందిన మహ్మద్ మొయినుద్దీన్ నడిపే షేర్ ఆటో ఎక్కారు. అదే ఆటోలో మొయినుద్దీన్ స్నేహితుడైన కారు డ్రైవర్ మహ్మద్ సయ్యద్ సల్మాన్ కూడా ఉన్నాడు. ఆటో ఎక్కిన వెంటనే తనకు చెల్లించాల్సిన మొత్తం ఫోన్పే ద్వారా బదిలీ చేయాలంటూ బాధితుడిని మొయినుద్దీన్ కోరాడు. దీంతో తన ఫోన్ అన్లాక్ చేసి, దానిలోని ఫోన్పే యాప్ ఓపెన్ చేసిన బాధితుడు నిర్ణీత మొత్తం క్యూర్ కోడ్ స్కానింగ్ ద్వారా మొయినుద్దీన్కు బదిలీ చేశాడు. ఆ సందర్భంలో అతగాడు బాధితుడి ఫోన్తో పాటు ఫోన్పేలకు సంబంధించిన ఆన్లాక్, నగదు బదిలీకి సంబంధించిన పిన్స్ తెలుసుకున్నాడు. ఆపై ఆటోలో ప్రయాణిస్తుండగా సల్మాన్తో కలిసి బాధితుడి దృష్టి మరల్చడం ద్వారా ఫోన్ తస్కరించాడు. ఈ విషయం గమనించని బాధితుడు తార్నాకలో దిగిపోయారు. తన ఇంటికి చేరిన తరవాత ఫోన్ పోయిన విషయం గుర్తించిన బాధితుడు మర్నాడు సిమ్ బ్లాక్ చేయించి వేరేది తీసుకున్నారు. బాధితుడి ఆ ఫోన్లోని యాప్ వినియోగించిన నిందితులు 17 నుంచి 20వ తేదీ వరకు 13 లావాదేవీల ద్వారా రూ.1.95 లక్షలు కాజేశారు. అన్లాక్, నగదు పేమెంట్స్కు సంబంధించిన పిన్స్ తెలిసి ఉండటంతో వీరి పని తేలికై ంది. పెట్రోల్ బంకుల్లో చెల్లింపులకు, బదిలీ ద్వారా నగదు తీసుకోవడం చేసి కాజేశారు. ఈ మొత్తంలో కొంత ఎంఎం పహాడ్కు చెందిన కూరగాయల వ్యాపారి మహ్మద్ హుస్సేన్ సహకారంతో స్వాహా చేశారు. అతడి సహకారంతో బాధితుడి ఫోన్పే ఖాతా నుంచి రూ.90 వేల వివిధ గేమింగ్ ప్లాట్ఫామ్స్కి పంపారు. అట్నుంచి హుస్సేన్ ఖాతాలోకి మళ్లించి నగదు డ్రా చేసి ఇచ్చాడు. ఈ మొత్తాన్ని ముగ్గురు నిందితులూ పంచుకున్నారు. గత నెల 20న రూ.5 వేల లావాదేవీకి సంబంధించిన సందేశం తన ఫోన్కు రావడంతో బాధితుడు షాక్ అయ్యాడు. బ్యాంకు ఖాతాను సరిచూసుకోగా మొత్తం రూ.1.95 లక్షలు పోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ పి.ప్రమోద్ కుమార్ నేతృత్వంలో ఎస్సై షేక్ అజీజ్ తన బృందంతో ఈ కేసు దర్యాప్తు చేశారు. బ్యాంకు ఖాతాల వివరాలతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. మరో ఇద్దరితో కలిసి ఫోన్పే ద్వారా నగదు స్వాహా ముగ్గురిని అరెస్టు చేసినసిటీ సైబర్ క్రైమ్ పోలీసులు -
జాగృతి అధ్యక్షురాలికి స్వాగతం
కందుకూరు: విదేశాల్లో బతుకమ్మ మహోత్సవాలు పూర్తి చేసుకుని వచ్చిన జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవితను బుధవారం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో జాగృతి నాయకులు పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లోనూ ప్రచారం చేస్తున్న కవితకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో జాగృతి నాయకులు సత్యనారాయణ, శ్రీనివాస్, బాబురావు, సభావత్ గణేశ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. గిరిజనులు అభివృద్ధి సాధించాలి ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్నాయక్ కడ్తాల్: గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఎల్ఎచ్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జర్పుల దశరథ్నాయక్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని గానుగుమార్ల తండాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనులు ఆర్థికంగా, సామాజికంగా, విద్య, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి సాధించాలని సూచించారు. అనంతరం తండాలో నిరుద్యోగ యువకుడు ఏర్పాటు చేసిన వ్యాపార కేంద్రాన్ని ప్రారంభించారు. యువత స్వయం ఉపాధి రంగాలపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగిల్విండో డైరెక్టర్ సేవ్యానాయక్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బీక్యానాయక్, లక్పతినాయక్, మోత్యానాయక్, శ్రీను, భీమన్, టిక్లాల్, రాజు, చందర్, లక్ష్మణ్, పవన్, శ్రీను, పవన్, పద్మ పాల్గొన్నారు. రైలు ప్రమాదంలో ఏఎస్ఐ దుర్మరణం తాండూరు: విధులకు వెళ్లేందుకు రైలు ఎక్కుతున్న కర్ణాటక రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన ఏఎస్సై రైలు ప్రమాదానికి గురై మృతి చెందిన సంఘటన స్థానిక రైల్వే స్టేషన్లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని చించోళి తాలూకా మర్పల్లికి చెందిన మారుతి(49) కల్బుర్గి జిల్లాలోని జేడీ హల్లి పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. స్వగ్రామానికి వచ్చిన మారుతి తిరిగి విధులకు వెళ్లేందుకు తాండూరు రైల్వే స్టేషన్కు వచ్చాడు. రైలులో కల్బుర్గి వెళ్లేందుకు యశ్వంత్పూర్ రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి రైలు కింద పడ్డారు. దీంతో మారుతి రెండు కాళ్లు విరిగిపోయి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం గమనించిన రైల్వే పోలీసులు వెంటనే అతన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక వైద్యం అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కల్బుర్గి జిల్లాకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతు బుధవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. -
బాకీ కార్డే ప్రచార అస్త్రం
చేవెళ్ల: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్స్కు కాంగ్రెస్ ఇచ్చిన హామీల బాకీ కార్డు వజ్రాయుధమని.. ఆ కార్డుతోనే ఎన్నికల ప్రచారం చేపట్టి విజయం సాధిస్తామని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని ముడిమ్యాలలో పార్టీ నాయకుడు గోనె కరుణాకర్రెడ్డి ఫాంహౌస్లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు ఒకే సారి పెట్టి గందరగోళం సృష్టించారన్నారు. అశావాహులంతా కలిసి కూర్చుని గెలిచే అవకాశం ఉన్నవారిని అభ్యర్థిగా ఎంపిక చేసి ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలు.. వాటిని అమలు చేయకపోవడాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ బాకీ కార్డును చూపిస్తే చాలు బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వర్లును చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఒక్క కోటీశ్వరాలును చూపాలని ఎద్దేవా చేశారు. ఒక్క యూరియా బస్తాకోసం మహిళలు సర్కస్ ఫీట్లు చేస్తున్నారన్నారు. పార్టీ శ్రేణులు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇతర పార్టీకు చెందిన వారితో కలిసి తిరగడం, మాట్లాడం మానేయాలని.. ఇది ప్రజల్లోకి చెడు సంకేతాలు తీసుకెళ్తుందన్నారు. తాను భౌతికంగా మాత్రమే వేరే చోట ఉన్నానని.. మనస్సు మొత్తం చేవెళ్ల చుట్టే తిరుగుతుందన్నారు. జెడ్పీ చైర్పర్సన్ రిజర్వేషన్ వచ్చిన నాలుగు జెడ్పీటీసీ స్థానాలు చేవెళ్ల, మహేశ్వరం పరిధిలోనే ఉన్నాయని వీటిని గెలిపించి కేసీఆర్కు చైర్మన్ పీఠం గిఫ్ట్గా ఇద్దామన్నారు. ఈ సమావేశంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పి.కృష్ణారెడ్డి, నియోజకవర్గ నాయకులు ఆంజనేయులు, కనీస వేతన బోర్డు మాజీ చైర్మన్ నారాయణ, పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, యూత్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ శివప్రసాద్, సీనియర్ నాయకులు కరుణాకర్రెడ్డి, హన్మంత్రెడ్డి, దర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
‘స్థానిక’ ఎన్నికల్లో పోటీ
డీఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భిక్షపతి షాద్నగర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ధర్మ సమాజ్ పార్టీ(డీఎస్పీ) పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భిక్షపతి అన్నారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని చటాన్పల్లి కమ్యూనిటీ హాల్లో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజానికి కొత్త నాయకత్వం అవసరముందని.. అది విశారదన్ మహారాజ్ నాయకత్వంలోని డీఎస్పీతోనే సాధ్యమన్నారు. పార్టీ నాయకులు అభ్యర్థుల గెలుపనకు శక్తి వంచన లేకుండా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు అహ్మద్పాషా, రాకేశ్, మల్లేశ్, నర్సింహ, దాసు, రాములు, పెంటయ్య, భవానీ శేఖర్, రవీంద్ర, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. సన్మానం పహాడీషరీఫ్: గృహిణులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతూ.. వారికి న్యాయం చేసేందుకు అండగా నిలుస్తున్న ఫాతిమా మహిళా మండలి అధ్యుక్షురాలు మస్రత్ ఫాతిమాను హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మండలి కార్యదర్శి అబ్దుల్ బషీర్ అల్ ఖురేషీ, సోషల్ జస్టిస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖాజా పాషాను హెచ్ఆర్సీ ప్రతినిధి మహ్మద్ ఫెరోజ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించారు. ముస్లిం మైనార్టీలకు గృహహింసకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు చేపడుతూ.. వారికి న్యాయపరంగా సహాయ సహకారాలు అందించడం గొప్ప విషయమన్నారు. ట్రక్కు–బైక్ ఢీకొని వ్యక్తి మృతి మొయినాబాద్రూరల్: ట్రక్కు బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం దామరగిద్ద గ్రామానికి చెందిన జోగు సురేందర్(43), మొయినాబాద్ మండలం మెడిపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని.. టీఎస్07 జేక్యూ0572 ద్విచక్ర వాహనపై తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో వీరన్నపేట్ సమీపంలో.. ఎదురుగా వస్తున్న టాటా ట్రక్ ఏపీ39 యూఎక్స్2658 ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సురేందర్ తలకు తీవ్రగాయాలు అయి.. అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఉస్మానియాకు తరలించారు. -
పల్లె పోరు.. విందుల జోరు!
షాద్నగర్: అసలే దసరా సమయం.. ఆపై ఎన్నికల సమరం.. ఇంకేముంది పల్లెల్లో విందుల సందడి మొదలైంది. నాయకులను, ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పార్టీ అధిష్టానాలు కూడా గెలుపు గుర్రాల వేట మొదలు పెట్టడంతో రాజకీయం రసవత్తంగా మారింది. మచ్చిక చేసుకునేందుకు.. ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేయాలనుకునే వారు.. సర్పంచ్ పదవి కోసం పార్టీలతో సంబంధం లేకుండా బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్న వారిలో కొందరు ఇప్పటికే భారీగా ఖర్చు పెట్టారు. ఇందులో రిజర్వేషన్లు అనుకూలించని నాయకులు ఆవేదనలో ఉండగా అనుకూలంగా వచ్చిన వారు అటు పార్టీల నాయకులను, ఇటు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ప్రాదేశిక, పంచాయతీ సమరానికి నగారా మోగిన నేపథ్యంలో పల్లెలో విందుల జోరు కొనసాగుతోంది. విందు రాజకీయాలు గ్రామాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు పంచాయతీ ఎలక్షన్ల హడావుడి మొదలైంది. దీంతో బరిలో ఉండాలనుకుంటున్న నాయకులు ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. రిజర్వేషన్ల పు ణ్యమా అని కొన్ని చోట్ల టికెట్ పోరు లేకపోగా, మ రికొన్ని చోట్ల తీవ్ర పోటీ నెలకొంది. దీంతో మందు, విందులతో సత్తాచాటేందుకు పోటీదారులు ఏర్పా ట్లు చేసుకుంటున్నారు. ఇదే అదనుగా వీరి జేబులు ఖాళీ చేసేందుకు కొంత మంది ఓటర్లు ఇప్పటికే నాయకుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సందిగ్ధంలో నేతలు తాజాగా బీసీలకు ప్రభుత్వం కల్పించిన 42శాతం రిజర్వేషన్ల వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. దీంతో రిజర్వేషన్లపై ప్రజల్లో సందిగ్ధత నెలకొంది. ఈ విషయంపై వారం రోజుల్లో కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందోననే భయం ఆశావహులను వెంటాడుతోంది. ప్రధానంగా బీసీ రిజర్వుడు స్ధానాలు 42శాతం కొనసాగుతాయా..? ఏమైనా మార్పులు ఉంటాయా అనే అంశంపైనే ఉత్కంఠ సాగుతోంది. అయితే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదనే చర్చ కూడా సాగుతోంది. ముందే కిక్కు ఈసారి దసరా పండుగ, గాంధీ జయంతి ఒకే రోజు రావడంతో మద్యం, మాంసం దుకాణాలు తెరుచుకునే అవకాశం లేకుండాపోయింది. ఈక్రమంలో తమ మద్దతుదారులు, అనుచరులను మత్తులో ముంచేందుకు నాయకులు ముందుగానే మద్యం కొనుగోలు చేశారు. గత రెండు రోజులుగా మద్యం దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. పెద్ద ఎత్తున స్టాక్ విక్రయించినట్లు వ్యాపారులు పేర్కొన్నారు. -
ఇబ్బంది పెట్టేందుకే సర్కార్ కుట్ర
యాచారం: సర్కార్ కావాలనే ఇబ్బందులకు గురి చేస్తోందని ఫార్మాసిటీ భూబాధిత రైతులు అవేదన వ్యక్తం చేశారు. కుర్మిద్ద, నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి గ్రామాలకు చెందిన 150 మందికి పైగా రైతులకు పక్షం రోజుల క్రితం అథారిటీ నోటీసులు ఇచ్చిన వివషయం విదితమే. రైతులకు సమాచారం లేకుండానే పట్టా భూముల పరిహారాన్ని గత బీఆర్ఎస్ సర్కార్ అథారిటీలో జమ చేసింది. ఈ పరిహారం తీసుకునే విషయంలో అభ్యంతరాలు తెలపాలని అథారిటీ నుంచి రైతులకు నోటీసులు అందాయి. దీంతో అయా గ్రామా లకు చెందిన రైతులు బుధవారం నాంపల్లిలోని అథారిటీ కోర్టుకు హాజరయ్యారు. నోటీసుల్లో తేదీ ప్రకారం ఆథారిటీ వద్దకు వెళ్లగా జడ్జి సెలవులో ఉన్నారని అధికారులు సైతం ఈ రోజు రారని సిబ్బంది రైతులకు తెలియజేశారు. నోటీసులు అందిన తేదీ ప్రకారం అథారిటీ వద్దకు వచ్చామని జడ్జి సెలవు తీసుకుంటే.. అధికారులు ఎవరూ రాకపోతే తమ అభ్యంతరాలు, బాధలు ఎవ్వరికి చెప్పుకోవాలని అవేదన వ్యక్తం చేశారు. ముందే సమాచారం ఇస్తే రాకపోయే వారం కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అథారిటీ ఎదుట నోటీసులు చూపుతూ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రైతులను కోదండరాం సంఘీభావం నాంపల్లిలోని అథారిటీ వద్దకు వచ్చిన రైతులతో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు. ఆరు నెలలుగా ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో సర్కార్ పోలీసుల బందోబస్తు నడుమ ఫెన్సింగ్ వేస్తోందని.. బెదిరింపులకు పాల్పడుతోందని వివరించారు. ఇందుకు స్పందించిన కోదండరాం వెంటనే జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబుతో మాట్లాడి సమస్యలు తీరుస్తానని భరోసా ఇచ్చారు. ఫార్మాసిటీ భూ బాధితులు -
‘మర్యాద’ యాదన్న!
వికారాబాద్: అందరూ మర్యాద యాదయ్యగా పిలుచుకునే చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఇరకాటంలో పడ్డారు. బీఆర్ఎస్ బీఫాంపై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హస్తం గూటిలో తలదాచుకున్న ఆయనకు స్థానిక ఎన్నికలతో పాటు పార్టీ ఫిరాయింపుల చట్టం ఇరకాటంలో పడేసింది. ఒకే సమయంలో స్పీకర్ నోటీసులు, విచారణ, స్థానిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడం లాంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో ఎప్పుడూ లేని వింత పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోంది. మంగళవారం తన సొంత మండలం నవాబుపేటలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని ఆ పార్టీ నేతలు ఎమ్మెల్యే యాదయ్యను ఇరకాటంలో పెట్టేందుకు వాడుకున్నారు. స్టీజ్పై కుర్చి వేసి.. దానికి ఎమ్మెల్యే కాలె యాదయ్య అని పేపరు అతికింది వేదికపైకి రావాలంటూ ఆహ్వానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సొంత మండలం నుంచి.. సొంత మండలం నవాబుపేట నుంచి ఎంపీపీగా, జెడ్పీటీసీగా ఆ తర్వాత టీటీడీ బోర్డు సభ్యుడిగా కాలె యాదయ్య ఎదిగారు. కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి మొదటి సారి ఆ పార్టీ నుంచే ఎమ్మెలేగా గెలుపొందారు. రాష్ట్రం విడిపోవడం, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం రావడంతో కారు పార్టీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీంఫారంతో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలు పొందిన ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో హస్తం గూటికి చేరారు. ఒకరు తరువాత మరొకరు పార్టీని వీడుతుండటంతో కారు పార్టీ అలర్టయ్యింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయా లని కోర్టు గడప తొక్కిన విషయం తెలిసింది. చివరకు ఆ వివాదం సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్లడం, ఫిరాయింపు ఎమ్మెలేల విషయంలో ఏదో ఒక నిర్ణ యం తీసుకోవాలంటూ కోర్టు స్పీకర్కు సూచించింది. దీంతో ఇటీవల స్పీకర్ ట్రిబ్యునల్ ముందు ఎమ్మెల్యేలు హాజరై వివరణ ఇచ్చారు. వీరిలో కాలె యాయద్య కూడా ఉన్నారు. ఈ పరిణామాలు జరుగుతున్న సమయంలోనే ఎమ్మెల్యే చేవెళ్లలో మాట్లాడుతూ.. తాను పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే ఉన్నానని వ్యాఖ్యానించారు. దీన్ని ఆసరాగా చేసుకున్న బీఆర్ఎస్ ఇటీవల యాదయ్య సొంత మండలం నవాబుపేటలో జరిగిన సమావేశంలో ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చింది. పార్టీలో ఉంటే స్టేజ్పైకి వచ్చి కూర్చోవాలంటూ ఆయన పేరుతో ఓ కుర్చీ వేసి ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి సబితారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ తదితరులు హాజరైన కార్యకర్తల సమావేశంలో కార్యక్రమం పూ ర్తయ్యే వరకు కుర్చీ స్టేజ్పై ఆలాగే ఉంచి యాద య్యను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. ఇరకాటంలో చేవెళ్ల ఎమ్మెల్యే కుమారుడికి జెడ్పీ పీఠం కోసం..2018 అసెంబ్లీ ఎన్నికల్లో యాదయ్య ఎమ్మెల్యేగా రెండోసారి గెలుపొందగా, 2019లో జరిగినపరిషత్ ఎన్నికల్లో కుమారుడు మొయినాబాద్ జెడ్పీటీసీగా, కోడలు నవాబుపేట ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఒకే ఇంట్లో మూడు పదవులు దక్కడంతో యాదయ్య కుటుంబం వార్తల్లోకెక్కింది. ఇదంతా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో జరిగిందే. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉండగా పాత సంప్రదాయాన్ని మళ్లీ కొనసాగించేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయగా చేవెళ్ల నియోజకవర్గంలోని మూడు మండలాలు ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ చేయబడ్డాయి. ఇదే సమయంలో రంగారెడ్డి జెడ్పీ పీఠం కూడా అదే సామాజిక వర్గానికి రిజర్వ్ అయ్యింది. దీంతో చేవెళ్ల మండలం నుంచి కుమారుడిని జెడ్పీటీసీగా బరిలోకి దింపడం ద్వారా జెడ్పీ పీఠంపై కూర్చోబెట్టాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కుమారుడు కాలె శ్రీకాంత్ ఇటీవల చేవెళ్ల మండల రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే ఇలాంటి కీలక సమయంలో ఎమ్మెల్యే యాదయ్యకు స్పీకర్ నోటీసులు ఇవ్వడం.. ఆయనకు పదవీ గండం పొంచి ఉండటం ఆ కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది. -
నగదుపై నజర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్థానిక సంస్థలకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో నగదు తరలింపుపై దృష్టి సారించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలకు పోటీ చేయాలని భావించే ఆశావహులు, వారి బంధు మిత్రులపై నిఘా ఉంచింది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉన్నందు న వారి రాక పోకలు సహా బ్యాంక్ అకౌంట్లపైనా దృష్టి పెట్టింది. తనిఖీల్లో రూ.50 వేలకు మించి నగదు దొరికితే పోలీసులు స్వాధీనం చేసుకోనున్నారు. జిల్లా, మండల, గ్రామ సరిహద్దులు, ప్రధాన రహదారులపై పోలీస్ పికెట్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే తనిఖీ విభాగాలకు మండల తహసీల్దార్లను నోడల్ అధికారులుగా నియమించింది. సరైన ఆధారాలు(వస్తు కొనుగోలు/అమ్మకాలకు సంబంధించిన రసీదులు) చూపిస్తే సరి.. లేదంటే ఆయా నగదును స్వాధీనం చేసుకోనుంది. పెద్ద మొత్తంలో మద్యం కొనుగోళ్లు, సరఫరా, బంగారం, వెండి వస్తువులు, చీరలు, ఇతర వస్తు కొనుగోళ్లపైనా నిఘా పెంచారు. ఇప్పటికే ఆయా దుకాణాల యజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై క్రిమినల్ కేసులు నమోదుతో పాటు జైలుకు పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 12 విభాగాలకు నోడల్ అధికారులు 21 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 230 ఎంపీటీసీ స్థానాలకు తొలి విడతలో, 526 గ్రామ పంచాయతీలు, 4,668 వార్డులకు మలి విడతలో ఎన్నికలు నిర్వహించనుంది. పోలింగ్, కౌంటింగ్ కోసం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఇందుకు ఎన్నికల కమిషన్ 12 విభాగాలను ఏర్పాటు చేసింది. వీటికి ఒక్కో నోడల్ అధికారిని నియమించింది. పోలింగ్కు ఎంత మంది సిబ్బంది అవసరం? ఎక్కడ విధులు నిర్వర్తించాలి? ఓటింగ్లో ఎవరు పాల్గొనాలి? కౌంటింగ్లో ఎవరు పాల్గొనాలి? తదితర పనుల పర్యవేక్షణకు మానవవనరుల విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ హెచ్ఆర్ విభాగానికి డీసీఐ జీఎం ఎం.శ్రీలక్ష్మిని నోడల్ ఆఫీసర్గా నియమించింది. బ్యాలెట్ బాక్సులు ఎన్ని అవసరం? ఎలా సమకూర్చాలి? పోలింగ్ కేంద్రానికి ఎలా తరలించాలి? అటు నుంచి స్ట్రాంగ్రూమ్కు.. ఆ తర్వాత కౌటింగ్ హాల్కు ఎలా తరలించాలి? వంటి పర్యవేక్షణకు బ్యాలెట్ బాక్సుల విభాగాన్ని ఏర్పాటు చేసింది. డీపీఓ సురేశ్ మోహన్ను దీనికి నోడల్ ఆఫీసర్గా నియమించారు. బ్యాలెట్ బాక్సులు, సిబ్బందిని పోలింగ్ బూత్లకు తరలింపు, అటు నుంచి మళ్లీ వారి గమ్యస్థానాల కు చేర్చేందుకు వాహనాలను పెద్ద సంఖ్యలో సమకూర్చాల్సి ఉంది. ఇందుకు ఇబ్రహీంపట్నం ఆర్టీఓ సుభాశ్ చందర్రెడ్డిని నోడల్ ఆఫీసర్గా నియమించింది. సిబ్బందికి శిక్షణకు డీఈ ఓ సుశీందర్రావు, మెటీరియల్ మేనేజ్మెంట్ విభాగానికి శ్రీరామ్ రాములును నోడల్ ఆఫీసర్లుగా నియమించింది. అభ్యర్థుల ఖర్చులపై నిఘా ఎన్నికలప్రచారంలో అభ్యర్థులు భారీగా ఖర్చు చేస్తుంటారు. వాహనాల ర్యాలీలు నిర్వహిస్తుంటారు. గ్రామాల పర్యటన కు వాహనాల వినియోగం, బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు సమకూర్చుకుంటారు.వీటితో పాటు వెంట తిరిగే కార్యకర్తల కు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, మద్యం, మాంసాహా రాలను సమకూర్చుతుంటారు.లెక్కకు మించి ఖర్చు చేసే వారి పై గట్టి నిఘాను ఏర్పాటు చేసింది. ఎంసీసీ మానిటరింగ్ నోడల్ ఆఫీసర్గా సీపీఓ సౌమ్యను,ఎన్నికల ఖర్చుల పర్యవేక్షణ విభాగం నోడల్ ఆఫీసర్గా జిల్లా ఆడిట్ ఆఫీసర్ ఎన్. వెంకట్ను, ఎన్నికల పరిశీలకులుగా ఎస్ఎల్ఆర్ ఏడీ కె.శ్రీనివాస్ను, ఫిర్యాదుల స్వీకరణ విభాగం నోడల్ ఆఫీసర్గా డీఆర్డీఓ పీడీ ఎల్.శ్రీలతను, ప్రచార విభాగం నోడల్ ఆఫీసర్గా డీపీఆర్ఓ పీసీ వెంకటేశ్ను, రిటర్న్స్ విభాగం నోడల్ ఆఫీసర్గా బి.రంగారావును నియమించింది. వీరంతా కలెక్టరేట్ కేంద్రంగా ఆయా పనులను పర్యవేక్షిస్తుంటారు. -
ఆటపాటలతో బతుకమ్మ సందడి
ఆమనగల్లు: తెలంగాణ సంస్కృతి సంప్రదాయం అయిన బతుకమ్మ సంబురం బుధవారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా తీరొక్క పూలతో పేర్చిన పూలగోపురాలను పట్టణంలోని హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో ప్రతిష్ఠించారు. అనంతరం మహిళలు, యవతులు ఆటపాటలతో సందడి చేశారు. సురసముద్రం చెరువులో నిమజ్జనం చేశారు. వేడుకలకు మున్సిపాలిటీ, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఉత్సవంలో మున్సిపల్ కమిషనర్ శంకర్, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, సీఐ జానకిరాంరెడ్డి, ఎస్ఐ వెంకటేశ్, ఉత్సవ కమిటీ సభ్యులు గుర్రం కేశవులు, కండె హరిప్రసాద్, దుర్గయ్య, నర్సింహ, అప్పం శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి కడ్తాల్: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని టాస్క్ సీఈఓ, ఐక్య ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండల పరిధిలోని గోవిందాయిపల్లిలో దుర్గామాత మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామునాయక్, నాయకులు శేఖర్గౌడ్, ఎల్లాగౌడ్, శ్రీకాంత్, రాఘవేందర్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన వేగం
పహాడీషరీఫ్: రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు గాయాలపాలయ్యాడు. రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పీఎస్ పరిధిలో బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. రాజేంద్రనగర్లోని హనుమాన్నగర్కు చెందిన కొండ రామకృష్ణ కుమారుడు అరుణ్ (24) సాయంత్రం 6.30 గంటలకు తన పల్సర్ బైక్ (టీజీ 08సి 4722)పై పెద్ద గోల్కొండలోని బంధువుల ఇంటికి వెళ్తున్నాడు. ఇదే సమయంలో హర్షగూడకు చెందిన ఇస్లావత్ నరేష్ కుమారుడు, స్కూల్ బస్సు క్లీనర్గా పనిచేసే మోహన్ (18), రమావత్నర్స్ కుమారుడు ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సిద్ధూ(17), ఇస్లావత్ సేవ్య కుమారుడు సింహాద్రి (17) యూనికార్న్ బైక్ (టీఎస్07జేఏ 9052)పై పూజా సామగ్రి కొనుగోలు చేసేందుకు హర్షగూడ నుంచి తుక్కుగూడకు వస్తున్నారు. అతివేగం, నిర్లక్ష్యంగా వెళ్తున్న వీరి బైక్లు.. అవుటర్ సర్వీస్ రోడ్డులోని పీవీఆర్ క్రికెట్ గ్రౌండ్ వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో అరుణ్తో పాటు యూనికార్న్ నడిపిన సిద్ధూ, వెనుక కూర్చున్న మోహన్లు దూరంగా ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందారు. సింహాద్రికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేందర్రెడ్డి, ఎస్ఐ దయాకర్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయాలపాలైన సింహాద్రిని వెంటనే ఆస్పత్రికి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మోహన్, సిద్ధూ వరుసకు బావ బావమరుదులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్నికల పోటీకి ఎవరు అర్హులు?
● నామినేషన్ పరిశీలన నాటికి 21 సంవత్సరాలుండాలి ● కందుకూరు ఎంపీడీఓ సరిత కందుకూరు: స్తానిక సంస్థల(ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులు, వార్డు సభ్యులు) ఎన్నికల్లో పోటీ చేయదలచిన అభ్యర్థులకు ఎదురయ్యే సందేహాలపై మంగళవారం ఎంపీడీఓ సరిత సమాధానాలతో నివృత్తి చేశారు. ప్రశ్న: స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి కనీస వయస్సు ఎంత? జ: నామినేషన్ పరిశీలన తేదీ నాటికి అభ్యర్థి వయస్సు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ప్రశ్న: సంబంధిత ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల పరిధిలోని ఓటరు జాబితాలో ఓటరుగా నమోదు కాకపోయినా పోటీ చేయవచ్చా? జ: లేదు. తెలంగాణ పంచాయతీ రాజ్ నియమావళి ప్రకారం సంబంధిత ఓటరు లిస్టులో తప్పనిసరిగా ఓటరుగా నమోదై ఉండాలి. ప్రశ్న: అభ్యర్థులకు ఇద్దరు పిల్లల నిబంధన తొలగించారా? జ: పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే అనర్హులే. 1995 మే 31 ముందు ఇద్దరి కంటె ఎక్కువ మంది సంతానం ఉంటే అర్హులు. 1995 జూన్ 1 తర్వాత పుట్టిన వారితో కలిపి ఇద్దరి కంటే ఎక్కువ ఉన్నప్పుడు అనర్హులవుతారు. ప్రశ్న: ముగ్గురు సంతానం ఉన్నప్పుడు ఒకరిని దత్తత ఇస్తే పోటీ చేయొచ్చా? జ: ఉమ్మడి రాష్ట్రంలోని హైకోర్టు తీర్పు ప్రకారం దత్తత ఇచ్చిన పిల్లలు స్వంత తల్లిదండ్రులకు చెందిన పిల్లలుగానే పరిగణించబడతారు. ముగ్గురు సంతానం ఉండి ఒకరిని దత్తత ఇచ్చినా వారు పోటీకి అనర్హులే. వారికి ముగ్గురు సంతానం ఉన్నట్లే పరిగణించబడతారు. ప్రశ్న: ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉండి వారికి ఒక్కొక్కరికి ఇద్దరు చొప్పున ఉన్నప్పుడు ఏవిధంగా పరిగణిస్తారు? జ: అప్పుడు భార్యలు పోటీకి అర్హులు అవుతారు, భర్తకు అవకాశం ఉండదు. ప్రశ్న: పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 1995 మే 31 కంటె ముందు ఇద్దరు పిల్లలు ఉండి, పోటీ చేసిన తర్వాత మరొకరు పుడితే ఎలా? జ: నామినేషన్ల పరిశీలన పూర్తయ్యే సమయానికి అప్పటికే ఇద్దరు పిల్లలు ఉండి, పోటీ చేసే వ్యక్తి భార్యగాని, పోటీ చేసే మహిళనే మళ్లీ గర్భవతిగా ఉన్నా పోటీకి అర్హులే అవుతారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత బిడ్డకు జన్మనిచ్చినా పోటీకి అర్హులే అవుతారు. -
కృష్ణా నదిలో విద్యార్థి గల్లంతు
నాగార్జునసాగర్: స్నేహితులతో కలిసి హైదరాబాద్ నుంచి మంగళవారం నాగార్జునసాగర్ ప్రాజెక్టును చూసేందుకు వచ్చిన ఇంటర్మీడియట్ విద్యార్థి కృష్ణా నదిలో గల్లంతయ్యాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం..కూకట్పల్లికి చెందిన హర్షవర్ధన్, జ్ఞానేందర్, సుమన్, మణికంఠరెడ్డి, వెంకటేష్, చాణక్య (16)స్నేహితులు. వీరంతా వేర్వేరు కళాశాలల్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నారు. వీరంతా కలిసి నాగార్జునసాగర్ ప్రాజెక్టును చూడటానికి మంగళవారం రెండు బైక్లపై వచ్చారు. అందరూ కలిసి నాగార్జునసాగర్ డ్యాం దిగువన ఫొటోలు తీసుకున్నారు. అనంతరం కొత్త బ్రిడ్జి సమీపంలో చింతలపాలెం వెళ్లే దారి వెంట ఉన్న ఆంజనేయ పుష్కర ఘాట్లోకి దిగి స్నానాలు చేస్తుండగా.. చాణక్య నీటి ఉధృతికి కృష్ణా నదిలో కొట్టుకుపోయాడు. అతడి స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా..వారు గజ ఈతగాళ్లతో కృష్ణా నది తీరం వెంట గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం సాయంత్రం వరకు కూడా గల్లంతైన విద్యార్థి ఆచూకీ లభించలేదు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం కుల్కచర్ల: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకమని కుల్కచర్ల ఎస్ఐ రమేశ్ పేర్కొన్నారు. మంగళవారం కుల్కచర్ల మండలం పుట్టపహాడ్ గ్రామంలో సీసీ కెమెరాలపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతీ గ్రామంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా దుకాణదారులు ఏర్పాటుచేయించుకుంటే నేరాలు అదుపుచేయొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కవిత, స్థానిక నాయకులు వెంకట్రాములు, రాజశేఖర్, వెంకన్న, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక పోరుకు సిద్ధం కండి
బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కిషన్రెడ్డి అబ్దుల్లాపూర్మెట్: స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని లష్కర్గూడ గ్రామంలో మంగళవారం పార్టీ మండల అధ్యక్షుడు కొత్త కిషన్గౌడ్ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంచిరెడ్డి హాజరై మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ కారు ్డగురించి వివరించారు. పార్టీ నాయకులు ఐక్యంగా పనిచేసి, స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు కట్టుబడి ఉండాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రాంరెడ్డి, జగదీశ్, చక్రవర్తిగౌడ్, వెంకట్రెడ్డి, ధనుంజయగౌడ్, కిరణ్కుమార్గౌడ్, సాయికుమార్గౌడ్, గౌరీశంకర్, రాధాకృష్ణ, రంగయ్య, వివిధ గ్రామాల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పరామర్శ మండలంలోని ఇనాంగూడలో పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు పిట్టల బాలశివుడు తండ్రి మాజీ ఉప సర్పంచ్ సత్తయ్య ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి బాలశివుడిని మంగళవారం పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతలతో పాటు సంక్షేమానికీ ప్రాధాన్యం
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు కమిషనరేట్లో పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్ ఆవిష్కృతం కానుందని కొత్త కొత్వాల్ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనర్ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నిరోధంతో పాటు ప్రజా సంక్షేమానికీ పెద్దపీట వేస్తూ విధానాలు రూపొందిచనున్నామని ఆయన పేర్కొన్నారు. బంజారాహిల్స్లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేడెట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో (టీజీఐసీసీసీ) మంగళవారం నగర పోలీసు కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రస్తుత విధానాలే కొనసాగింపు.. గడచిన కొన్నేళ్లుగా నగర పోలీసింగ్లో అనేక సంస్కరణలు వచ్చాయి. అమలులో ఉన్న విధానాలు కొనసాగిస్తూనే అవసరమైన స్థాయిలో కొత్తవి అందుబాటులోకి తీసుకువస్తాం. ప్రజా సంక్షేమ పోలీసింగ్లో భాగంగా నగర ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడతాం. ఆహార కల్తీని నిరోధించడానికి ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తాం. ఏయే సరుకులు ఎలా కల్తీ అవుతున్నాయో గుర్తించడానికి మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ యూనిట్కు రూపమిస్తాం. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతాం. ఈ కేసుల్లో నిందితులతో డేటా బ్యాంక్ ఏర్పాటు చేసి ఇతర విభాగాలతో సమన్వయంతో పని చేస్తాం. సైబర్ నేరాలపై పోరు.. ఎప్పటికప్పుడు పంథా మారుస్తూ నానాటికీ రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లకు చెక్ చెప్పడానికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తాం. ఇటీవల కాలంలో వృద్ధులే ఎక్కువగా టార్గెట్గా మారుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లోని వృద్ధులపై దృష్టి పెట్టాలి. పోలీసు విభాగానికి దూరంగా ఉన్నా బెట్టింగ్ యాప్స్పై ఇప్పటికే ‘హ్యాష్ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ పేరుతో ఉద్యమం చేశా. ఫలితంగానే వాటిని నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మల్టీ లెవల్ మార్కెటింగ్స్, రియల్ ఎస్టేట్ మోసాలు, భూ కబ్జాలపై కఠిన వైఖరి ఉంటుంది. మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ నేరాలకు పాల్పడే వారు తమ ఇంట్లో ఉన్న తల్లి, సోదరి, భార్యల్ని గుర్తు చేసుకుని, మహిళల్ని గౌరవించాలి. ప్రతి ఒక్కరి ‘ఫ్యామిలీ టైమ్’ పెంచుతాం... నగరంలో నానాటికీ వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. ట్రాఫిక్ సమస్యలతో వాహనచోదకులు ఎక్కువ సమయం రోడ్లుపై ఉండాల్సి వస్తోంది. ఈ ప్రభావంతో వారు కాలుష్యం బారినపడి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. కుటుంబాలతో వారు గడిపే సమయం కూడా తగ్గిపోతోంది. రహదారులపై వాహనాల సరాసరి వేగం పెంచడంతో పాటు కాలుష్యం తగ్గించి, నగర వాసులు తమ కుటుంబాలతో గడపడానికి ఎక్కువ సమయం మిగిలేలా చేస్తాం. డ్రంక్ డ్రైవింగ్ అనేది రోడ్ టెర్రరిజం. డ్రంక్ డ్రైవర్లు సూసైడ్ బాంబర్లు. వీరి వల్ల ఎన్ని ప్రాణాలైనా పోవచ్చు. కుటుంబాలు వీధినపడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. పోలీసింగ్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డ్రోన్లు వినియోగిస్తాం. పెద్దల్ని వదిలేస్తే సీనియర్ సిటిజన్స్ యాక్ట్.. ఇటీవల కాలంలో అనేక మంది వృద్ధులైన తమ కుటుంబీకుల్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు బహిరంగ ప్రదేశాల్లో వదిలేసి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే ఇలాంటి వారిపై రెస్క్యూ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇకపై ఈ పని ఎవరైనా చేస్తే సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటాం. నగరంలోని ప్రతి భవనంపైనా ఓ సీసీ కెమెరా ఉండాలి. ప్రస్తుతం ఉన్న వాటిని ఆడిటింగ్ చేయడం ద్వారా అన్నీ పని చేసేలా చర్యలు తీసుకుంటాం. అహర్నిశలు కష్టపడే పోలీసు సిబ్బంది సంక్షేమానికీ పెద్దపీట వేస్తాం. ఉత్తమ పనితీరును కనబరిచిన ఉన్నతాధికారి నుంచి హోంగార్డు వరకు అందరికీ రివార్డులు అందిస్తాం. దీనికోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. నేరగాళ్లకు జ్యురిస్డిక్షన్ ఉండదు. ఈ నేపథ్యంలోనూ మూడు కమిషనరేట్లు సమన్వయంతో పని చేయనున్నాయి. సోషల్మీడియాను దుర్వినియోగం చేసే వారిపై చర్యలు తప్పవు. మీ పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి.. మైనర్లు చేసే నేరాలు పెరిగిపోతున్నాయి. వాళ్లు ఆ పని చేసే వరకు తల్లిదండ్రులకూ వారి ప్రవర్తన తెలియట్లేదు. స్మార్ట్ఫోన్ యుగంలో ప్రతి ఒక్కరూ వారి బిడ్డల కార్యకలాపాలు, ఆన్లైన్ స్నేహాలు, క్రయవిక్రయాలపై కన్నేసి ఉంచాలి. టీజీఐసీసీసీలోని కమిషనరేట్, బషీర్బాగ్లోని ఓల్డ్ కమిషనరేట్, పాతబస్తీలోని కొత్వాల్ హౌస్ల నుంచి పని చేస్తా. ఎప్పడు ఎక్కడ ఉంటాననే ప్రణాళికను త్వరలోనే విడుదల చేస్తా. ప్రతి పౌరుడు ఓ పోలీసు లాంటి వాడే. తమ చుట్టూ ఉన్న అసాంఘికశక్తులు, కార్యకలాపాలపై కన్నేసి ఉంచి పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలి. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా, సహాయం కావాలన్నా అన్ని స్థాయిల్లోని అధికారులం నిర్విరామంగా అందుబాటులో ఉంటాం. హైదరాబాద్ యాంటీ నార్కోటిక్స్ వింగ్కు (హెచ్–న్యూ) సిబ్బంది, వనరులు కేటాయించి దాన్ని బలోపేతం చేస్తాం. -
హిందువులకు రక్షణగా ఆర్ఎస్ఎస్
పహాడీషరీఫ్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాలను మామిడిపల్లి గ్రామంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. చార్మినార్ బాగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా సహ బౌద్దిక్ లాలూ యాదవ్ జీ మాట్లాడుతూ.. సంఘ్ కార్యకర్తలు ప్రతి పనిలోనూ దేశ ప్రయోజనలే పరమావధిగా భావిస్తారన్నారు. 1925 సంవత్సరంలో విజయదశమి రోజున ప్రారంభించిన ఆర్ఎస్ఎస్ హిందువులకు అన్ని రకాలుగా రక్షణగా ఉంటుందన్నారు. హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తూ ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో బస్తీ ప్రముఖ్ నందీశ్వర్, సతీష్గౌడ్, విశ్వనాథ్గౌడ్, విజయేందర్రెడ్డి, రంగనాథ్, పంచముఖి హనుమాన్ వ్యాయామ శాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
నెల రోజులుగా ఏం చేస్తున్నట్లు..?
మొయినాబాద్: రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడినా పట్టించుకోరా అంటూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ పరిధిలోని చిలుకూరులో నెల రోజులకుపైగా పెద్ద చెరువు అలుగు పారుతూ రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. మంగళవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, మున్సిపల్ అధికారులతో కలిసి చిలుకూరు వద్ద రోడ్డుపై ఏర్పడిన గుంతలను పరిశీలించారు. అదే సమయంలో మండల పరిధిలోని రెడ్డిపల్లిలో తన ఫాంహౌస్కు వెళ్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చిలుకూరులో ఆగారు. చెరువు అలుగు పారుతూ రోడ్డుపై గుంతల పడితే ఇలానే వదిలేస్తారా.? నెల రోజులుగా ఇలాగే ఉంది. వాహనాలు రాకపోకలకు తాత్కాలిక మరమ్మతులైనా చేపట్టాలి కదా.. అసలు అధికారులు పనిచేస్తున్నారా.. లేదా..? నెల రోజులుగా రాకపోకలకు తీవ్ర ఇబ్బంది అవుతున్నా ఏం చేస్తున్నారంటూ అధికారులపై మండిపడ్డారు. అలుగు నీరు వెళ్లేందుకు వీలుగా పైపులు వేసి తాత్కాలిక మరమ్మత్తులైనా చేపట్టాలి కదా అంటూ ఆర్ అండ్ బీ, మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచే ఆర్ అండ్ బీ ఎస్ఈ, ఇరిగేషన్ ఎస్ఈలకు ఫోన్ చేసి మాట్లాడారు. వెంటనే పైపులు వేసి వాహనాలు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం వల్లే సమస్య ఎక్కువైందని స్థానికులు కోమటిరెడ్డికి వివరించారు. కుంటలు కబ్జా కావడంతోపాటు డ్రైనేజీ నీరంతా పెద్ద చెరువులోకి చేరడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. రోడ్డుపై ఏర్పడిన గుంతను పరిశీలించిన వారిలో ఆర్ అండ్ బీ ఈఈ రవీందర్కుమార్, డీఈ అజయ్కుమార్, ఇరిగేషన్ ఈఈ రేణుకాదేవి, డీఈ పరమేశ్వర్, ఏఈ ప్రియాంక, వర్క్ఇన్స్పెక్టర్ నర్సింహ, మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్, మాజీ సర్పంచ్ పురాణం వీరభద్రస్వామి తదితరులు ఉన్నారు. అధికారుల తీరుపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ఆగ్రహం -
అంతర్రాష్ట్ర మద్యం పట్టివేత
పహాడీషరీఫ్: ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి తీసుకొస్తున్న మద్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారు తెలిపిన ప్రకారం.. రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ జీవన్ కిరణ్ ఆధ్వర్యంలో పహాడీషరీఫ్లో దాడులు నిర్వహించి 41 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గోవా, హరియాణ, ఢిల్లీ ప్రాంతాల నుంచి మద్యం బాటిళ్లను దిగుమతి చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బాటిళ్లను సరూర్నగర్ ఎకై ్సజ్ పోలీసులకు అప్పగించారు. శంషాబాద్ ఏరియాలో ఎస్టీఎఫ్ బీ అండ్ డీ టీమ్లు నిర్వహించిన దాడుల్లో 45 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్టీఎఫ్సీ టీమ్ సీఐ బిక్షారెడ్డి, డీ టీమ్ సిఐ నాగరాజులు చేపట్టిన ఈ వాహనాల తనిఖీలలో రెండు చోట్ల పట్టుబడిన మద్యం విలువ రూ.2.5 లక్షలుగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. -
ఎన్నికలకు సిద్ధం కండి
కేంద్ర మంత్రి బండి సంజయ్ చేవెళ్ల: స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీశ్రేణులు సిద్ధంగా ఉండాలని కేంద్రమంత్రి బండి సంజయ్ సూచించారు. మంగళవారం మంగళవారం కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో పూజలకు హాజరైన బండి సంజయ్ను ఇటీవల బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన గణేశ్ కండెతో పార్టీ పార్టీ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్రం మంత్రి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో అధిక సీట్లను గెలుచుకునేలా పనిచేయాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడే వారికి సముచిత స్థానం ఉంటుందన్నారు. ఆయన్ను కలిసిన వారిలో చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు ఎ.అనంత్రెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు పాండురంగారెడ్డి, యువ నాయకుడు డాక్టర్ మల్గారి వైభవ్రెడ్డి, ప్రవీణ్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు. టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి ఆమనగల్లు: ఐక్యత స్వచ్ఛంద సంస్థ సేవలను కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఫౌండేషన్ కార్యాలయంలో మంగళవారం ఆయన మేడిగడ్డ తండా ముత్యాలమ్మ ఆలయాభివృద్ధికి రూ.లక్ష చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాలే లక్ష్యంగా ఫౌండేషన్ పనిచేస్తుందన్నారు. ఈ కార్యరక్రమంలో మాజీ సర్పంచ్ అంబర్సింగ్, మాజీ ఉపసర్పంచ్ మల్లేశ్నాయక్, ఆలయ పూజారి వినోద్కుమార్, నాయకులు రాంజ్యనాయక్, మల్లేశ్, తావు, మల్య, మణిపాల్, కిషన్నాయక్, శ్రీనునాయక్, కుబ్య, రాజు, దేవ్య, సీతారాం, రాజు తదితరులు పాల్గొన్నారు. అందుబాటులో యూరియా జిల్లా వ్యవసాయాధికారి ఉష కొందుర్గు: రైతులు సాగుచేసిన పంటలను రైతు విస్తరణాధికారి వద్ద నమోదు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఉష సూచించారు. మంగళవారం ఆమె కొందుర్గు, రామచంద్రాపూర్ గ్రామాలను సందర్శించి రైతు ఆగ్రో కేంద్రం, మన గ్రోమోర్ సెంటర్, పీఏసీఎస్లలో రికార్డులను పరిశీలించారు. యూరియా స్టాకు, రైతులకు అందజేసిన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం డీఏఓ ఉష మాట్లాడుతూ.. రైతుల అవసరం మేరకు యూరియా అందుబాటులో ఉందన్నారు. రైతులకు నాణ్యమైన పురుగుమందు విక్రయించాలని.. కొనుగోలు సమయంలో విధుగా రసీదు ఇవ్వాలని సూచించారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రైతులకు రాయితీపై ట్రాక్టర్ పనిముట్లు, స్ప్రేయర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అవసరమైన రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్కార్డు జతచేసి సంబంధిత వ్యవసాయ విస్తరణాధికారికి దరఖాస్తు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సురేశ్ రెడ్డి, ఏఈఓ వాసవి పాల్గొన్నారు. ఇన్చార్జి డీఎంహెచ్ఓగా లలితాదేవి సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లా ఇన్చార్జి వైద్యాధి కారి డాక్టర్ లలితాదేవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేసిన డాక్టర్ వెంకటేశ్వర్రావు రిటైర్డ్ అవ్వడంతో ఆయన స్థానంలో డాక్టర్ లలితాదేవికి ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలను బలోపేతం చేస్తామన్నారు. -
ప్రశాంతంగా ఎన్నికలు!
పారదర్శకంగా... సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పటికే ఓటర్ల జాబితా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాల గుర్తింపు, రిజర్వేషన్ల కేటాయింపు, ఎన్నికల షెడ్యూల్ విడుదల ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. షెడ్యూల్ విడుదలతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, ఎన్నిల నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నామినేషన్ల స్వీకరణకు కేటాయించిన తేదీల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అవకాశం ఉంటుందన్నారు. హోర్డింగ్లు తొలగించాల్సిందే జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశామన్నారు. ఎన్నికల సిబ్బంది ఎంపిక, శిక్షణ, ఓటింగ్ నిర్వహణ, లెక్కింపు వంటి అంశాలపై వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోని రాజకీయ నేతల ఫొటోలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, బ్యానర్లను తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో 24 గంటల వ్యవధిలో, బస్టాండ్, రైల్వే స్టేషన్ పెట్రోల్ బంక్ తదితర పబ్లిక్ ప్రదేశాల్లో 48 గంటల వ్యవధిలో, అనుమతి లేని ప్రైవేట్ స్థలాల్లో 72 గంటల వ్యవధిలో తొలగించాలన్నారు. అంతకు ముందు రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి, డీపీఓ సురేశ్మోహన్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవుల యాదయ్య, నవీన్ కుమార్, జంగారెడ్డి, బీఆర్ఎస్ నుంచి సత్తు వెంకటరమణ రెడ్డి, మిట్టు జగదీశ్వర్, బీజేపీ నుంచి అందెల శ్రీరాములు, దేవేందర్రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమర్థవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధం అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి విలేకరుల సమావేశంలో కలెక్టర్ నారాయణరెడ్డిఫేజ్–1 నోటిఫికేషన్ అక్టోబర్ 9 నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 9– 11 వరకు పోలింగ్ అక్టోబర్ 23 లెక్కింపు నవంబర్ 11 ఫేజ్–2 నోటిఫికేషన్ అక్టోబర్ 13 నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 13– 15 వరకు పోలింగ్ అక్టోబర్ 27 లెక్కింపు నవంబర్ 11 ఫేజ్–1 నోటిఫికేషన్ అక్టోబర్ 17 నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 17– 19వరకు పోలింగ్ అక్టోబర్ 31 ఫేజ్–2 నోటిఫికేషన్ అక్టోబర్ 21 నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 21–23 వరకు పోలింగ్ నవంబర్ 4 ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వివరాలు సర్పంచ్లకు ఇలా -
నిధుల స్వాహాపై చర్యలు నిల్
యాచారం: స్వయం సహాయక సంఘాలపై మహిళలు విశ్వాసం కోల్పోతున్నారు. తాము పొదుపు చేసే డబ్బులు, బ్యాంకుల నుంచి అందే రుణాల విషయంలో రక్షణ లేక.. భారీ అవకతవకలు జరిగినా పట్టించుకునే వారే లేకపోవడంతో మహిళలు సంఘాల నుంచి విత్డ్రా అయ్యే యోచనలో ఉన్నారు. నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకునే విషయంలో డీఆర్డీఓ అధికారులు, బ్యాంకు ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో మహిళల్లో అభద్రతాభావం నెలకొంది. మండల పరిధిలోని చౌదర్పల్లి గ్రామంలో ఓ వీబీకే(విలేజ్ బుక్ కీపర్), బ్యాంకు సిబ్బంది కలిసి దాదాపు 20 స్వయం సహాయక సంఘాలకు దక్కాల్సిన రూ.కోటిన్నరకు పైగా నిధులు దుర్వినియోగం చేసి సంచలనంగా మారిన విషయం విదితమే. గ్రామానికి చెందిన మహిళలు స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దృష్టికి తీసుకెళ్లడం, స్పందించిని ఎమ్మెల్యే వెంటనే డీఆర్డీఓ, బ్యాంకు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించినా ఫలితం లేకుండా పోయింది. తొలుత హంగామా చేసి ఆ తర్వాత మిన్నకుండిపోయారు. పక్షం రోజుల విచారణ చేసి.. చౌదర్పల్లి గ్రామంలోని 20కి పైగా స్వయం సహాయక సంఘాల్లో జరిగిన నిధుల స్వాహాపై డీఆర్డీఓ శ్రీలత ఆదేశాల మేరకు డీపీఎం యాదయ్య, లీలాకుమారి 15 రోజుల పాటు విచారణ చేశారు. గ్రామానికి చెందిన రికార్డులను ఆడిట్ సిబ్బంది శ్రీనివాస్, మధు క్షుణ్ణంగా పరిశీలించి.. ప్రతీ స్వయం సహాయక సంఘం పేరు మీద యాచారం ఎస్బీఐలో రూ.లక్షలాది రుణాలు పొందినట్లు, ఆ డబ్బును సంఘంలో సభ్యులుగా లేని మహిళల బ్యాంకు ఖాతాల్లోకి మల్లించినట్లు గుర్తించారు. ఒక్కో సంఘంలో రూ.10 నుంచి రూ.15 లక్షలు బినామీ పేర్లపై బదిలీ అయినట్లు గుర్తించారు. గ్రామానికి చెందిన మహిళలు స్వయంగా మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయానికి వచ్చి విచారణ అధికారులకు ఫిర్యాదులు చేశారు. విచారణ పూర్తి చేసి పక్షం రోజులు గడిచిపోయినా బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో బోధపడడం లేదు. మాఫీ.. లేదా రికవరీ చేయండి నిధుల దుర్వినియోగంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ సంఘాల సభ్యులు అధికారులను ప్రాధేయపడుతున్నారు. ఐకేపీ కార్యాలయం సిబ్బంది, ఎస్బీఐ అధికారులను కలిసినా ఎటువంటి సమాధానం లభించడం లేదు. రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని లేదంటే.. స్వాహా చేసిన అధికారుల నుంచి రికవరీ చేయాలని వేడుకుంటున్నారు. విచారణకు వచ్చిన డీఆర్డీఏ అధికారులు ఐకేపీ కార్యాలయానికే పరిమితమయ్యారు. ఏ ఒక్క రోజు సంఘం సభ్యులను కలిసి దాఖలాలు లేవంటూ ఆరోపిస్తున్నారు. నిధుల దుర్వినియోగం సమయంలో యాచారం ఎస్బీఐ మేనేజర్, తాజాగా చౌదర్పల్లి ఐకేపీ సీసీ జంగయ్య సైతం బదిలీ అవ్వడంతో మహిళల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. యాచారం ఐకేపీ కార్యాలయం రూ.కోటిన్నరకు పైగా గోల్మాల్ చేసిన వీబీకే, బ్యాంకు సిబ్బంది నిత్యం ఐకేపీ, యాచారం ఎస్బీఐ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న చౌదర్పల్లి డ్వాక్రా సంఘాల మహిళలు అభద్రతాభావంలో సభ్యులు సభ్యత్వం రద్దు చేసుకునేయోచనలో మహిళలు -
రైతు సంక్షేమమే ధ్యేయం
మాట్లాడుతున్న సత్తయ్యతుర్కయంజాల్: రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. రాగన్నగూడలోని ఓ ఫంక్షన్ హాల్లో తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం 53వ మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ 2024–25 ఆర్థిక సంవత్సరంలో సంఘం రూ.4.5కోట్ల నికర లాభం సాధించిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. రైతులు పంట రుణాలను సకాలంలో చెల్లించి సంఘ అభివృద్ధికి సహకరించాలని కోరారు. గత ప్రభుత్వం హయాంలో కొహెడలో ఐదెకరాల్లో గోదాములు నిర్మించి నెలకు రూ.7.5లక్షల అద్దెవస్తుందని వివరించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరావు నాబార్డు 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఉత్తమ సంఘం అవార్డును సాధించామని గుర్తుచేశారు. స్టడీ టూర్ నిమిత్తం కేరళ, హిమాచల్ ప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోని అనేక సహకార సంఘాల ప్రతినిధులు, ఉద్యోగుల బృందం పరిశీలనకు వచ్చిందని గుర్తుచేశారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సహకారంతో ఆదిబట్లలో ఖరీదైన ప్రాంతంలో ప్రభుత్వం డీసీసీబీ కార్యాలయ నిర్మాణానికి ఎకరం భూమిని కేటాయించిందన్నారు. త్వరలోనే ఈ స్థలంలో భవన నిర్మాణ పనులను చేపడతామన్నారు. అనంతరం సంఘం సెక్రటరీ వై.రాందాస్ 2025–26 ఆర్థిక సంవత్సరంలో 2025 ఆగస్టు 31 వరకు జరిగిన లావాదేవీలు, జమ, ఖర్చులను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో పీఐసీ సభ్యులు వంగేటి లక్ష్మారెడ్డి, సామ సంజీవరెడ్డి, కొండ్రు స్వప్న శ్రీనివాస్, చాపల యాదగిరి, కొత్త రాంరెడ్డి, కృష్ణారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, మాజీ చైర్మన్లు సంరెడ్డి బాల్రెడ్డి, కొంతం మల్లారెడ్డి, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ సత్తయ్య -
స్థానికం..సందిగ్ధం
ఖర్చు చేశాక.. రాత మారితే! సాక్షి, రంగారెడ్డిజిల్లా: అసలే దసరా పండుగ.. ఆపై స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్.. దీనికి తోడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై అయోమయం.. వెరసి ఆశావహుల గుండెల్లో దడపుట్టిస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. అయితే ఇదే అంశంపై హైకోర్టులో కేసు కొనసాగుతోంది. నవంబర్ 8న ఈ కేసు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా స్థానాలకు ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు.. ఆశావహుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తీరా ఖర్చు చేసిన తర్వాత రిజర్వేషన్లు మారితే.. తమ భవిష్యత్ ఏమిటనే ప్రశ్న ప్రతీ ఒక్కరిని తొలిచేస్తోంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే కన్నా. .రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు తీర్పు తర్వాతే ముందుకు వెళ్లాలని మెజార్టీ ఆశావహులు భావిస్తున్నట్లు తెలిసింది. దావత్లు, ఇతర ఖర్చుల విషయంలో అప్పటి వరకు వేచి చూడడమే ఉత్తమమనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. దడపుట్టిస్తున్న దసరా ఎన్నికల కమిషన్ ఎంత చెప్పినా.. నిబంధనలను కఠినంగా అమలు చేసినా.. ఫ్లెక్సీలు, పత్రిక ప్రకటనల రూపంలో హెచ్చరికలు జారీ చేసినా.. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఓటుకు నోటు కామనే. పోటీలో ఉండాలని భావించే ఆశావహుల నుంచి ఓటర్లు ఎంతో కొంత ఆశిస్తూనే ఉంటారు. నామినేషన్ మొదలు.. ఇంటింటి ప్రచారంలో భాగంగా కరపత్రాలు, వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలకు ఎంతో కొంత ఖర్చు చేయాల్సిందే. ప్రచారంలో భాగంగా రోజూ వెంట వచ్చే కార్యకర్తలు, ముఖ్య నాయకులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి మద్యం సరఫరా చేయాల్సిందే. జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి కనీసం రూ.కోటి, ఎంపీపీ పదవిని ఆశించే అభ్యర్థి కనీసం రూ.50 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా. ఈ నేపథ్యంలో మామూళ్లు ఇచ్చిపుచ్చుకోవడం సహజం. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని కొంత మంది ఆశావహుల నుంచి మద్యం ఆశిస్తుంటారు. అసలే ఎన్నికల సమయం.. అడిగిన వాళ్లను కాదంటే తమకు ఓటు వేయబోరనే భయం అభ్యర్థులను వెంటాడుతుంటోంది. తమ వద్ద లేకపోయినా..అప్పు చేసైనా ఆయా ఓటర్ల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఈ ఖర్చులను భరించే శక్తిలేని వాళ్లు.. ఏదో ఓ సాకుతో ఊరు నుంచి ఇతర ప్రాంతాలకు కన్పించకుండా వెళ్లిపోతున్నారు. మరికొంతమంది ఏకంగా ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. రిజర్వేషన్ల వ్యవహారం కోర్టులో ఉండటంతో అనిశ్చితి 9వ తేదీ తర్వాతే స్పీడ్ పెంచే యోచనలో రేసుగుర్రాలు అప్పటి వరకు వేచి చూస్తేనే మంచిదనే ధోరణిలో ఆశావహులు తీర్పు భిన్నంగా వస్తే..జిల్లాలో 21 జెడ్పీటీసీ స్థానాలుండగా, 230 ఎంపీటీసీ స్థానాలు, 526 గ్రామ పంచాయతీలు, 4,668 వార్డులు ఉన్నాయి. పార్టీ గుర్తుపై నిర్వహించే ఒక్కో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానానికి అధికార కాంగ్రెస్ నుంచి ఒకరు, ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ ఒక్కొక్కరు చొప్పున బరిలో నిలిచే అవకాశం ఉంది. వీరితో పాటు మరో నలుగురు స్వతంత్రులు పోటీ చేయనున్నారు. ఇలా ఒక్కోస్థానం నుంచి కనీసం పది మంది వదరకు పోటీలో ఉండనున్నారు. జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీ స్థానాలకు 200–210 మంది వరకు, ఎంపీటీసీ స్థానాలకు 2,300 మంది వరకు పోటీ చేయనున్నారు. ఇక పార్టీ గుర్తులకు అతీతంగా నిర్వహించే ఒక్కో సర్పంచ్ స్థానానికి కనీసం ముగ్గురు నుంచి నలుగురు అభ్యర్థుల చొప్పున రెండు వేల మంది వరకు పోటీలో ఉండనున్నారు. ఒక్కో వార్డుకు ఇద్దరు ముగ్గురు చొప్పున పది వేల మంది అభ్యర్థులు పోటీలో ఉండనున్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనే రాజ్యాంగ సూత్రానికి విరుద్ధంగా జీఓ జారీ చేయడం, కొంత మంది ఇప్పటికే ఆ అంశంపై కోర్టుకు వెళ్లడం, నవంబర్ 8న విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు వెల్లడించడం తెలిసిందే. ప్రకటించిన రిజర్వేషన్లకు భిన్నంగా తీర్పు వస్తే తమ పరిస్థితి ఏమిటనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. జెడ్పీటీసీ స్థానాలు 21 ఎంపీటీసీ స్థానాలు 230 గ్రామ పంచాయతీలు 526 వార్డులు 4,668 -
ఆలయ అభివృద్ధికి ఐక్యత తోడ్పాటు
ఆమనగల్లు: దేవాలయాల అభివృద్ధికి ఐక్యత ఫౌండేషన్ తోడ్పాటునందిస్తుందని ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి అన్నారు. మాడ్గుల మండలం కాట్రాంతండాలో నూతనంగా నిర్వహించిన తుల్జాభవానీ ఆలయంలో సోమవారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి.. ఆలయ నిర్వాహకులకు రూ.1 లక్ష విరాళంఅందజేసి మాట్లాడారు. ఈ ఆలయానికి గతంలో రూ.4 లక్షలు ఇచ్చానని, ప్రస్తుతం మరో లక్ష అందజేశానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాట్రావత్ హంసీ రాంలాల్, ఆలయ కమిటీ సభ్యులు అమర్సింగ్, రవీంద్ర, పవన్, నర్సింహ, దేవ్, రాములు, రాజ్కుమార్, హరి, రాజు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ లయన్స్క్లబ్గా ఆమనగల్లు
ఆమనగల్లు: లయన్స్క్లబ్ జిల్లా 320ఎ పరిధి క్లబ్లలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి అత్యుత్తమ క్లబ్గా ఆమనగల్లు లయన్స్క్లబ్ నిలిచింది. అలాగే 2024– 25 ఏడాదికి క్లబ్ గత అధ్యక్షుడు లక్ష్మారెడ్డి ఉత్తమ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు నగరంలోని ఓ కన్వెన్షన్హాలులో.. సోమ వారం జరిగిన కార్యక్రమంలో క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కోటేశ్వర్రావ్ అవార్డులు అందజేశారు. అలాగే వైద్య శిబిరాలకు, వీల్స్ ఆన్ మీల్స్ కార్యక్రమానికి పర్మినెంట్ ప్రాజెక్ట్కు గాను అవార్డులు దక్కాయి. క్లబ్ జిల్లా గవర్నర్ మహేందర్ కుమార్రెడ్డి, ఇంటర్నేషనల్ డైరెక్టర్ సునీల్కుమార్, వైస్ గవర్నర్లు సురేశ్ జిఘ్నాని, శశికాంత్, మాజీ గవర్నర్ చెన్నకిషన్రెడ్డి, నరేందర్రెడ్డి, జోన్చైర్మన్ లింగయ్య, జిల్లా చైర్మన్ రమేశ్, క్లబ్ సభ్యులు నర్సింహ, సత్యం, పీఆర్ఓ పాషా పాల్గొన్నారు. -
రుణాలు సకాలంలో చెల్లించండి
మంచాల: రుణాలు సకాలంలో చెల్లించి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) అభివృద్ధికి సహకరించాలని సంఘం చైర్మన్ వెదెరె హన్మంత్రెడ్డి అన్నారు. సంఘం కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగా రూ.50 లక్షలు పంట రుణాలు అందించామని తెలిపారు. గతంలో తీసుకున్న రుణ బకాయి రూ.34 కోట్లు ఉందని, వాటిని త్వరగా చెల్లిస్తే కొత్తగా రుణాలు ఇస్తామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సంఘం అభివృద్ధిలో భాగంగా మార్పులు తప్పనిసరన్నారు. ఆరుట్లలో రూ.50 లక్షలతో మార్కెట్ ఏర్పాటు చేశామని, రైతుల సహకారంలో పాల సేకరణ కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సంఘం వైస్ చైర్మన్ బోద్రమోని యాదయ్య, డైరెక్టర్లు సత్యనారాయణ, అరుణమ్మ, జెనిగె వెంకటేశ్, పి.రమేష్, సంఘం సీఈఓ రమేష్, క్యాషియర్ సంతోష్, క్లర్క్ లింగం, సేల్స్మెన్ పి.శ్రీకాంత్, సిబ్బంది బుగ్గరాములు, రంగయ్య, సద్గుణ తదితరులు పాల్గొన్నారు.పీఏసీఎస్ చైర్మన్ హన్మంత్రెడ్డి -
హైటెన్షన్ లైన్ మార్చండి
కడ్తాల్: వ్యవసాయ పొలాల మీదుగా తీస్తున్న 765కేవీ హైటెన్షన్ సోలార్ విద్యుత్ లైన్ అలైన్మెంట్ను మార్చాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. అలైన్మెంట్ను మార్చాలని కోరుతూ బాధిత రైతులు చేస్తున్న దీక్ష సోమవారానికి 22వ రోజుకు చేరుకుంది. దీక్షకు బీజేపీ మండల అధ్యక్షుడు మహేశ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బీచ్యానాయక్ సంఘీభావం తెలిపారు. ఇందులో సింగిల్విండో డైరెక్టర్ వెంకటేశ్, మాజీ ఉప సర్పంచ్ రామకృష్ణ, పాండు లక్ష్మణ్, గోరటి కృష్ణ, రాములుయాదవ్, రాజేందర్, పర్వత్కుమార్, పెంటారెడ్డి, జంగయ్యయాదవ్, వెంకట్రాములుగౌడ్ ఉన్నారు ఎమ్మెల్యేను కలిసిన ఉద్యమకారులు ఇబ్రహీంపట్నం: ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని తెలంగాణ ఉద్యమకారులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 250 గజాల ఇంటి స్థలాన్ని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమస్యను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, న్యాయం చేస్తానని చెప్పారు. ఇందులో ఉద్యమకారులు శ్రీనివాస్, జగదీశ్వర్యాదవ్, యాదగిరిరెడ్డి, విష్ణువర్ధన్, వీరేశ్కుమార్, లక్ష్మణ్, గోపాల్, నారాయణరెడ్డి, జంగయ్యగౌడ్, శివలింగం, బాబులాల్, ఎండీ అస్లం పాల్గొన్నారు. -
ఆలయాభివృద్ధికి వేతనం వితరణ
యాచారం: కొలువుల కల్పవల్లిగా విలసిల్లుతున్న నందివనపర్తి జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాభివృద్ధికి ఓ యువకుడు తన మొదటి నెల జీతాన్ని విరాళంగా ఇచ్చి, మొక్కు తీర్చుకున్నాడు. యాచారం గ్రామానికి చెందిన వూరె రజిత, శ్రీనువాస్గుప్తా దంపతుల కుమారుడు సాయి తనీష్ యూఎస్ఏలో ఎంఎస్ చదివి, సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాడు. అమ్మవారి దయతోనే విదేశంలో కొలువు వచ్చిందని భావించి, కుటుంబీకులతో కలిసి సోమవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. విరాళంగా నెల జీతం రూ.2,91,699లను ఆలయ ఫౌండర్ సదా వెంకట్రెడ్డికి అందజేశారు. భవిష్యత్తులో మరింత సహాయపడతానని తెలిపారు. అనంతరం సాయి కుటుంబ సభ్యులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. -
బారికేడ్లను తొలగించి.. ప్రవాహంలో పయనించి
ఆ రోడ్డు ప్రమాదకరంగా మారింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఎగువ నుంచి వస్తున్న వరద.. రహదారిని ముంచెత్తి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గం పూర్తిగా జలదిగ్బంధంలో మునిగిపోయింది.రోడ్డు ధ్వంసం అయింది. అయినావాహనదారులు ప్రవాహంలో పయనిస్తూ ప్రమాదంలో చిక్కుకొంటున్నారు. తుర్కయంజాల్: పురపాలక సంఘం పరిధి ఇంజాపూర్– తొర్రూర్ రోడ్డు అధ్వానంగా మారింది. డబుల్ బెడ్ రూమ్ల వద్ద భారీగా గోతులు ఏర్పడ్డాయి. ప్రమాదకరంగా వరద ప్రవాహం పోటెత్తుతోంది. అయినా వాహనదారులు ప్రమాదకరమైన దారిలో పయనిస్తూ.. అపయాన్ని కొని తెచ్చుకొంటున్నారు. అయినప్పటికీ.. మున్సిపల్ అధికారులు, పోలీసులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. బారికేడ్లతో సరి.. మాసబ్ చెరువు నుంచి ఇంజాపూర్లోని దిలావర్ఖాన్ చెరువుకు నీరు వచ్చే వాగుపై కేవలం 10 రోజుల వ్యవధిలో 20కి పైగా కార్లు రోడ్లపై ఏర్పడ్డ గుంతల్లో పడిపోవడంతో పాటు.. కొన్ని నీటిలో కొట్టుకుపోయాయి. ఒక్క సోమవారం నాడే.. ఒక కారు వాగులో పడిపోగా, మరో కారు గుంతలో కుంగిపోయింది. క్రేన్ల సహాయంతో వాటిని బయటకు తీశారు. ఇక్కడ రోడ్డుపై నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవహించడంతో పాటు.. రోడ్డు పూర్తిగా ధ్వసం అయింది. వాహనాల రాకపోకలకు అనుకూలంగా లేదు. దీంతో ఈ మార్గంలో వరద పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు వాహనాల రాకపోకలను నిలిపివేయాల్సిన అధికారులు.. కేవలంరెండు వైపులా బారికేడ్లను ఏర్పాటుచేసి చేతులు దులుపుకొన్నారు. వారించినా వినకుండా.. ఎలాంటి ప్రమాదం జరగకుండా.. ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు రోడ్డుకు ఇరువైపులా అడ్డంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. కానీ కొందరు వాహనదారులు వాటిని పక్కకు జరిపి.. ప్రవాహంలో వాహనంతో దూసుకెళ్తున్నారు. స్థానికులు వారించినా.. వినిపించుకోవడం లేదు. ఫలితంగా కొన్ని మీటర్ల దూరం వెళ్లగానే.. గుంతల్లో పడి, వాగులోకి జారిపోతున్నారు. అధికారుల హెచ్చరికలను లెక్కచేయకుండా ప్రాణాల మీదకు తెచ్చుకొంటున్నారు. వరుసగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నా.. వాహన చోదకుల్లో మార్పు రావటం లేదు. ఇదే విషయమై.. వనస్థలిపురం సీఐ మహేశ్ గౌడ్ను వివరణ కోరగా.. వరద ప్రవాహం మొదలు నుంచి బారికేడ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అయినా కొందరు వాటిని తొలగించి ముందుకు వెళ్లేందుకు యత్నించి, ప్రమాదం బారిన పడుతున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డితో చర్చించి, రక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధ్వానంగా ఇంజాపూర్–తొర్రూర్ రోడ్డు రక్షణ చర్యలు శూన్యం పట్టించుకోని అధికార యంత్రాంగం -
లయన్స్క్లబ్ సేవలు వినియోగించుకోండి
కడ్తాల్: లయన్స్క్లబ్ సేవా కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ చెన్నకిషన్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రం ప్రధాన కూడలిలో క్లబ్ ఆఫ్ ఆమనగల్లు– బాలాజీనగర్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీల్స్ ఆన్ మీల్స్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 450 మందికి అన్నదానం చేశారు. ఇందులో క్లబ్ ఆమనగల్లు అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, కార్యదర్శి గంపశ్రీను, పీఆర్ఓ పాష, సభ్యులు వెంకటేశ్, చేగూరి వెంకటేశ్, రాజేందర్యాదవ్, బీచ్యానాయక్, లక్ష్మయ్య తదితరులు ఉన్నారు. స్థానిక ఎన్నికలపై శిక్షణ మంచాల: నిబంధనల మేరకు ఎన్నికల నియమావళిని అమలు పర్చాలని ఎంపీడీఓ బాలశంకర్ అన్నారు. సోమవారం మండల కార్యాలయంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రిసైడింగ్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలు, వాటి అమలు తీరుపై అధికారులకు అవగాహన కల్పించామని చెప్పారు. కార్యక్రమంలో ఎంఈఓ రాందాస్, సూపరిండెంట్ అజిమ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రోడ్డు పక్కకు ఒరిగిన లారీ తుర్కయంజాల్: ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి.. ఓ లారీ రోడ్డు పక్కకు ఒరిగింది. దారి సమాంతరంగా లేకపోవడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. సాగర్ రహదారి నుంచి సబ్స్టేషన్ మీదుగా తుర్కయంజాల్ గ్రామానికి వచ్చే రోడ్డును హెచ్ఎండీఏ నిధులతో ఆర్అండ్బి అధికారులు నిర్మించారు. నిర్మాణం పూర్తయి మూడు నెలలు అవుతున్నా.. రోడ్డుకు ఇరువైపులా సమాంతరంగా మట్టి పోయలేదు.దీంతో సోమవారం లోడ్తో వెళ్తున్న ఓ లారీ.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు దిగువకు ఒరిగింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డును సమాంతరం చేయాలని వాహనదారులుకోరుతున్నారు. మాడ్గులకు కృష్ణా జలాలు మాడ్గుల: దశాబ్దాల కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్న కృష్ణా జలాల కల నెరవేరింది. ఎట్టకేలకు సోమవారం డి–82 కాల్వల ద్వారా కృష్ణా జలాలు రావడంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బట్టు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు, నాయకులు కష్ణా జలాలకు దోడ్లపహడ్ గ్రామంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిచిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. విజయ డెయిరీ చైర్మన్ బొజ్జ సాయిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ జంగయ్య గౌడ్, నాయకులు కొండల్ రెడ్డి తదితరులు ఉన్నారు. -
ఘనంగా అ‘పూర్వ’ సమ్మేళనం
కడ్తాల్: అపూర్వ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఎక్కడెక్కడో స్థిరపడిన బ్యాలమిత్రులంతా మూడు దశాబ్దాల అనంతరం ఒకే వేదికగా సందడి చేశారు. ఆప్యాయంగా పలకరించుకుంటూ, నాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నారు. ఆటపాటలతో సందడి చేశారు. మండల పరిధి మైసిగండిలోని ఓ కన్వెన్షన్హాలులో సోమవారం కల్వకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1995– 96 విద్యాసంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన నాటి విద్యార్థులు.. ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 30 సంవత్సరాల తర్వాత కలుసుకున్న 65 మంది చిననాటి స్నేహితులంతా క్షేమసమాచారం తెలుసుకున్నారు. వారి మధ్య లేని వారిని గుర్తుకు చేకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా నాటి విదార్థుల్లో ఒకరైన రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేశ్ మాట్లాడుతూ.. చదువు విషయంలో ఎవరికి ఎలాంటి సహకారం కావలన్నా.. అందిస్తానని తెలిపారు. అనంతరం ఆయనను మిత్రబృందం సన్మానించింది. కార్యక్రమంలో యాదయ్య, రాఘవేందర్, ఆంజనేయులు, బాలస్వామి, చంద్రయ్య, బాలరాజు, జంగయ్య, బాలయ్య, కిరణ్, వెంకట్రెడ్డి, కృష్ణారెడ్డి, సుల్తాన్ గఫార్, శ్రీను, అచ్చయ్య, దాస్యనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం
నందిగామ: పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, రాజస్థాన్ ఏఐసీసీ ఇన్చార్జి సుఖ్జిందర్ సింగ్ రంధావాకు మండల ముఖద్వారమైన బైపాస్ రహదారి వినాయక్ స్టీల్ పరిశ్రమ సమీపంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కాంగ్రెస్ నాయకులు సోమవారం ఘన స్వాగతం పలికారు. చాకలిదాని గుట్ట తండాకు చేరుకొని గిరిజన మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి నృత్యం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు జంగ నర్సింహ యాదవ్, మాజీ సర్పంచ్ రాజు నాయక్, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అస్తిత్వ పోరాటానికి సిద్ధం అవుదాం షాద్నగర్: అస్థిత్వ పోరాటానికి మాలలు సిద్ధం కావాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మహేశ్ మాల పిలుపునిచ్చారు. పట్టణంలోని ఆర్ఆండ్బీ అతిథి గృహంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేపట్టే ఎస్సీ ఉప వర్గీకరణను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, రోస్టర్ పాయింట్లను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం నవంబర్ 2న హైదరాబాద్లో భారీ ఎత్తున మాలల రణభేరి మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. అనంతరం రణభేరికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు సుంకం నర్సింహ, శ్రీను, కబీర్, మల్లేష్, గాలయ్య, వినోద్, నరేష్, శ్రీను, కుమార్, చిట్టి, అంజి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. సదర్ ఉత్సవ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా రవియాదవ్ షాద్నగర్: సదర్ ఉత్స వ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా షాద్నగర్ పట్ట ణానికి చెందిన చీపిరి రవి యాదవ్ ఎన్నికయ్యారు. హైదరాబాద్ లోని సైదాబాద్లో సోమవారం సదర్ ఉత్సవ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యదర్శి లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీందర్, సదర్ ఉత్సవ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ యాదవ్ చేతుల మీదుగా చీపిరి రవియాదవ్ నియామక పత్రం అందుకున్నారు. కాంగ్రెస్కు కాలం చెల్లింది బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇబ్రహీంపట్నం: కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని, రాష్ట్రంలో రెండేళ్ల పాలన పూర్తికాకముందే ఆ పార్టీ నిజస్వరూపాన్ని ప్రజలు గుర్తించారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ కమిటీ సమావేశం సోమవారం శేరిగూడలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబద్ధాల మాటలతో, మోసపు వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్కు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు ప్రజలుసిద్ధంగా ఉన్నారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీపీ కృపేశ్ తదితరులు పాల్గొన్నారు. -
వర్షాలు.. వరదలతో..
సాక్షి, రంగారెడ్డి జిల్లా/మొయినాబాద్: హైదరాబాద్ మహానగర ప్రజల దాహార్తి తీర్చేందుకు నిర్మించిన జంట జలాశయాలు ప్రమాదంలో పడ్డాయి. చుట్టూ పెద్ద గద్దలు వాలడం, ఆక్రమణలు జరగడం, పూడిక పేరుకుపోవడం, అధికారుల సమన్వయ లోపంతో జలాశయాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలతో జలాశయాల్లోకి భారీ వరదలు రావడంతో నిర్వహణ లోపాలు బయట పడుతున్నాయి. పెద్దల ఫాంహౌస్ల్లోకి నీళ్లు వెళ్లకుండా వచ్చిననీళ్లు వచ్చినట్లే వదిలేయడంతో దిగువన పేదల ఇళ్లు మునిగాయి. జలాశయాల ఎగువ ప్రాంతాల్లో భారీ వరదలు పంటపొలాలను ముంచెత్తాయి. కబ్జాలను గుర్తించినా చర్యలు శూన్యం నగర శివారుల్లో నిజాం కాలంలో హైదరాబాద్కు వరద ముప్పును తప్పించడంతోపాటు తాగునీటిని అందించేందుకు ఉస్మాన్సాగర్(గండిపేట), హిమాయత్సాగర్ జలాశయాలను నిర్మించారు. దశాబ్దాల పాటు జంట జలాశయాల నుంచి హైదరాబాద్కు తాగునీరు అందుతోంది. కొన్నేళ్లుగా గండిపేట, హిమాయత్సాగర్ జలాశయాల చుట్టూ పెద్దలు భూములు కొనుగోలు చేశారు. రాజకీయ, వ్యాపార, సినీ రంగాలతోపాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం జలాశయాలను ఆనుకుని ఉన్న భూములను కొనుగోలు చేసి ఫాంహౌస్లు, ఇతర నిర్మాణాలు చేపట్టారు. కొందరు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ను సైతం ఆక్రమించి మట్టితో నింపి ఎత్తు పెంచి నిర్మాణాలు చేపట్టారు. పదిహేనేళ్ల క్రితమే హెచ్ఎండీఏ, జలమండలి, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల ఆధ్వర్యంలో సర్వేలు చేసి సుమారు 600 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు తేల్చారు. హిమాయత్సాగర్ జలాశయం పరిధిలో 390 ఎకరాలు, గండిపేట జలాశయం పరిధిలో 210 ఎకరాల వరకు కబ్జాలకు గురైనట్లు గుర్తించారు. ఇప్పటి వరకు ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోలేదు. దీనికి తోడు వందేళ్ల క్రితం నిర్మించిన జలాశయాల్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పూడిక తీయకపోవడంతో జలాశయాలు కుంచించుకుపోయాయి. మరోవైపు జలాశయాలకు వరద నీరు వచ్చే ఈసీ, మూసీ పరీవాహక ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగాయి. వాగులు, వంకలను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల ప్రభావం భారీ వరదలతో పంటపొలాలపై పడింది. పరీవాహక ప్రాంతంలోని పంటలు నీటమునగడంతోపాటు పొలాలు కోతకు గురయ్యాయి. అధికారుల సమన్వయ లోపం జలాశయాల్లోకి రెండు రోజుల క్రితం వచ్చిన వరదను అధికారులు ముందుగానే అంచనా వేయలేకపోయారు. భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ ముందు నుంచే హెచ్చరికలు జారీ చేసినా జల మండలి అధికారుల సమన్వయ లోపం మూసీ ఉగ్రరూపం దాల్చడానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 26, 27న వికారాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. 26న తెల్లవారుజాము నుంచే వికారాబాద్ జిల్లాలోని పరిగి, పూడూరు, వికారాబాద్, మోమిన్పేట్, నవాబ్పేట్ మండలాలతోపాటు రంగారెడ్డి జిల్లాలోని జిల్లేడ్ చౌదరిగూడ, కొందుర్గు, షాబాద్, చేవెళ్ల, మండలాల్లో భారీ వర్షా లు కురిసాయి. ఈసీ, మూసీ నదులు ఒక్కసారిగా ఉప్పొంగి ప్రవహించి మొయినాబాద్, శంకర్పల్లి, శంషాబాద్ మండలాల్లోని వందల ఎకరాల్లో పంట పొలాలను ముంచెత్తాయి.ఎగువన కురిసిన వర్షాని ,భారీగా వస్తున్న వరదలను ముందుగానే అంచనా వేయడంలో జలమండలి అధికారులు విఫలమ య్యారు. జలాశయాల్లోకి ఇన్ఫ్లో పెరిగిన కొద్దీ దిగువకు ఔట్ఫ్లోను గంట గంటకూ పెంచుతూ వెళ్లారు. దీంతో మూసీ తన ఉగ్రరూపాన్ని చూపించి హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది.రెండు నెలలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అప్పటి నుంచి జంట జలాశయాల్లోకి ఈసీ, మూసీ వాగుల ద్వారా వరద వస్తూనే ఉంది. నెల రోజుల క్రితమే జలాశయాలు నిండుకుండలను తలపించడంతో దిగువకు నీటిని వదులుతున్నారు. జలాశయాల చుట్టూ ఉన్న పెద్దల భూముల్లోకి బ్యాక్ వాటర్ వెళ్లకుండా జలాశయాల పూర్తిస్థాయి నీటి మట్టం కంటే ఒక అడుగు మేర తక్కువ ఉన్నప్పుడే నీటిని దిగువకు వదులుతున్నారు. నెల రోజుల నుంచి వచ్చిననీళ్లు వచ్చినట్లే మూసీలోకి వదులుతున్నారు. జంట జలాశయాల చుట్టూ వాలిన గద్దలు!పెద్దల భూములు మునగకుండా.. వచ్చిన నీళ్లు వచ్చినట్లే దిగువకు -
స్థానిక నగారా
షెడ్యూల్ విడుదల సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎప్పుడెప్పుడా అని అంతా ఆశగా ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. ఇప్పటికే ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీఓ జారీ చేసిన నేపథ్యంలో తాజాగా ఎన్నికల సంఘం పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. దీంతో ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆశావహులు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. తొలి విడతలో పార్టీ గుర్తులపై నిర్వహించే జిల్లా/మండల ప్రాదేశిక స్థానాలకు ఎన్నికలు నిర్వహించి, తర్వాత సర్పంచ్, వార్డులకు ఓటింగ్ జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా, మన జిల్లాలో మాత్రం రెండు (ఫేజ్–2, ఫేజ్–3) విడతల్లోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. ఇదిలా ఉంటే ఆశించిన దానికి భిన్నంగా స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఖరారు కావడం, ఇప్పటి వరకు ఆయా స్థానాల్లో పోటీ చేయాలని భావించి ఆశావహులకు తీరా పోటీ చేసే అవకాశం లేకుండా పోయిన విషయం తెలిసి నిరాశలో మునిగిపోయా. జిల్లాలో 21 జెడ్పీటీసీ స్థానాలు, 230 ఎంపీపీ స్థానాలు ఉన్నాయి.ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు అక్టోబర్లో రెండు విడతల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి నవంబర్ 11న ఫలితాలు ప్రకటించనున్నారు. జిల్లాలో మొత్తం 526 పంచాయతీలు ఉండగా, 4,668 వార్డులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనుండగా జిల్లాలో మాత్రం రెండు (ఫేజ్–2, ఫేజ్–3) విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓటింగ్ ముగిసిన వెంటనే ఫలితాలు ప్రకటించనున్నారు. ఓటర్ల వివరాలుమొత్తం : 7,94,653 పురుషులు : 3,99,404 మహిళలు : 3,95,216 ఇతరులు : 33 -
బీసీలకు..
పూల పరిమళం.. రికార్డు సంబురంరాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో సరూర్నగర్ స్టేడియంలో సోమవారం ‘మహా బతుకమ్మ’ వేడుకలు నిర్వహించారు. 1,500 మందితో తెలంగాణ బతుకమ్మ ఫోక్ డ్యాన్స్ అబ్బుర పరిచింది. 63 అడుగుల ఎత్తయిన భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ రెండు ప్రదర్శనలు అతిపెద్ద జానపద నృత్యంగా, అతిపెద్ద బతుకమ్మగా రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించాయి. మరోవైపు జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఎటు చూసినా సందడి కనిపించింది. – హుడాకాంప్లెక్స్ మహిళలకుసాక్షి, రంగారెడ్డిజిల్లా: స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు సోమవారం జిల్లా ఎన్నికల కమిషన్ గెజిట్ విడుదల చేసింది. ఇప్పటికే జెడ్పీ పీఠాన్ని ఖరారు చేసిన ఎన్నికల కమిషన్ తాజాగా జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సహా గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేసి జాబితాను వెల్లడించింది. జిల్లాలో 21 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ఉండగా, వీటిలో తొమ్మిది బీసీలకు, నాలుగు ఎస్సీలకు, మూడు ఎస్టీలకు, ఐదు జనరల్ కేటగిరీ కోసం కేటాయించారు. మొత్తం జెడ్పీటీసీ, ఎంపీపీ సీట్లలో తొమ్మిది మహిళలకు కేటాయించారు. 230 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, వీటిలో 94 స్థానాలను మహిళలకు కేటాయించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 25 స్థానాలు ఎస్టీలకు, 49 స్థానాలు ఎస్సీలకు కేటాయించారు. డెడికేషన్ కమిటీ నివేదిక ప్రకారం 97 స్థానాలు బీసీలకు కేటాయించారు. మిగిలిన 59 స్థానాలను జనరల్ కేటగిరీ కోసం కేటాయించారు. ఇదిలా ఉంటే జిల్లాలో 526 పంచాయతీలకు సైతం రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లా ప్రాదేశిక స్థానాలకు రిజర్వేషన్లు ఇలా ఎస్టీ: మంచాల, కొత్తూరు, ఫరూఖ్నగర్ (మహిళ). ఎస్సీ: శంకర్పల్లి, చేవెళ్ల, కందుకూరు (మహిళ), షాబాద్ (మహిళ). బీసీ: మొయినాబాద్ (మహిళ), కొందుర్గు, ఇబ్రహీంపట్నం (మహిళ), కేశంపేట యాచారం, మహేశ్వరం (మహిళ), తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల్ (మహిళ). జనరల్: అబ్దుల్లాపూర్మెట్ (మహిళ), జిల్లేడుచౌదరిగూడెం, నందిగామ (మహిళ) శంషాబాద్, ఆమనగల్లు. మండల పరిషత్ల రిజర్వేషన్లు ఇలా.. ఎస్టీ: కొత్తూరు (మహిళ), ఫరూఖ్నగర్, తలకొండపల్లి. ఎస్సీ: శంకర్పల్లి (మహిళ), చేవెళ్ల, షాబాద్, శంషాబాద్ (మహిళ). బీసీ: జిల్లేడు చౌదరిగూడెం, మొయినాబాద్, కొందుర్గు, ఇబ్రహీంపట్నం (మహిళ), కేశంపేట (మహిళ), కందుకూరు (మహిళ), యాచారం, మహేశ్వరం (మహిళ), మంచాల జనరల్: అబ్దుల్లాపూర్మెట్ (మహిళ), నందిగామ, మాడ్గుల, కడ్తాల్(మహిళ), ఆమనగల్లు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరిస్తూ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన విధులను నిర్వర్తించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, నోడల్ అధికారులు, ఆర్డీఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. జెడ్పీటీసీ/ఎంపీపీ స్థానాల కేటాయింపు ఇలా.. కేటగిరీ మొత్తం మహిళలు పురుషులు/ మహిళలు ఎస్టీ 3 1 2 ఎస్సీ 4 2 2 బీసీ 9 4 5 జనరల్ 5 2 3 మొత్తం 21 9 12 -
శాకాహారంతో ఆరోగ్యానికి మేలు
ఎమ్మెల్యే కాలె యాదయ్య చేవెళ్ల: ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతిఒక్కరూ శాకహారం అలవాటు చేసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మున్సిపాలిటీ కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో ఆదివారం బ్రహ్మర్షి పితామహా పత్రీజీ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూమ్మెంట్ జిల్లా అధ్యక్షుడు నడిమొళ్ల శంకర్ ఆధ్వర్యంలో మహాకరుణ అహింసా శాకాహార ర్యాలీ, ధ్యాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజలకు ఆరోగ్యం సమాజం, ప్రకృతి కోసం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. శాకాహారం అనేది ఆరోగ్యానికి, ఆధ్యాత్మికతకు మంచిదన్నారు. ధాన్యంతో ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. ప్రతిఒక్కరూ ధ్యానం అలవాటు చేసుకుంటే మానసిక ప్రశాంతత ఆరోగ్యం లభిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు సత్యనారాయణరెడ్డి, మాజీ సర్పంచులు శైలజ, భీమయ్య, ప్రభాకర్, నాయకులు వసంతం, వెంకట్రెడ్డి, పెంటయ్యగౌడ్, ఆగిరెడ్డి, శ్రీనివాస్గౌడ్, వెంకటరంగారెడ్డి, రాములు, శ్రీశైలం, ప్రభాకర్, రాజు, నర్సింలు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
యాచారం: హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కందుకూరు మండల పరిధిలోని బేగరికంచె గ్రామానికి చెందిన ఢిల్లీ రాంచంద్రి(50) అమెజాన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మీరాఖాన్పేటలో వ్యక్తిగత పనుల నిమిత్తం వచ్చి తిరిగి బైక్పై ఆదివారం రాత్రి 7 గంటలకు ఇంటికి వెళ్తున్నాడు. మార్గ మధ్యలో ఎదురుగా అతి వేగంగా వచ్చిన ఓ బొలెరో వాహనం ఆయన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య రాణి, ముగ్గురు పిల్లలున్నారు. ఇదిలా ఉండగా ఫ్యూచర్సిటీ కార్యాలయ శంకుస్థాపనకు సీఎం రేవంత్రెడ్డి రావడంతో పోలీసులు మీరాఖాన్పేట–కందుకూరు గ్రామాల మధ్య డబుల్రోడ్డులో ఒక మార్గాన్ని పూర్తిగా మూసేశారు. సాయంత్రం వరకు క్లియర్ చేయకపోవడంతో వన్ వేలోనే ఎదురెదురుగా వాహనాల రాకపోకలు సాగించాయి. ఈ క్రమంలోనే రాంచంద్రి మృతి చెందినట్లు బేగరికంచె గ్రామస్తులు ఆరోపించారు. మృతుడి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని బంధువులు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ తెలిపారు. ఔటర్పై కారు బోల్తా: ఐటీ ఉద్యోగి.. శంషాబాద్: ఔటర్పై అదుపు తప్పి కారు బోల్తా పడటంతో ఐటీ ఉద్యోగి మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ఆర్జీఐఏ సీఐ బాలరాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన అశోక్కుమార్(35) నగరంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నారు. శనివారం రాత్రి అతను భార్య జానకమ్మతో పాటు ఆమె సోదరుడు ఉదయ్ భాస్కర్రెడ్డి పిల్లలతో కలిసి ప్రకాశం జిల్లా నుంచి కారులో మణికొండకు బయలుదేరారు. తెల్లవారు జామున శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడటంతో తీవ్రంగా గాయపడిన అశోక్కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని కుమార్తె నితిష, ఉదయ్భాస్కర్రెడ్డిలకు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు వారిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వానొస్తే.. గండమే!
కొందుర్గు: గ్రామాల్లో వాగులపై వంతెనలు లేకపోవడంతో సామాన్యులు ప్రాణాలు కోల్పోవాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది. భారీ వర్షాలు కురిసినప్పుడు వాగులు ఉప్పొంగడంతో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయినా పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరం. ఈ ఏడాది కురుస్తున్న అధిక వర్షాలకు కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండలాల్లో ఇప్పటికే చెరువులు, కుంటలు నిండి అలుగు పారుతున్నాయి. ఇటీవల కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఏ చిన్న పని కోసం బయటికి వెళ్లాలన్నా వాగులు దాటాలి. వాటిపై వంతెనలు లేకపోవడంతో బయటికి వెళ్లిన వారు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకుంటారా లేదా అనే సందిగ్ధం నెలకొంది. ఘటనలు అనేకం పదేళ్ల క్రితం కొందుర్గు మండలం ముట్పూర్ గ్రామానికి చెందిన కావలి సత్యమ్మ పంట పొలానికి వెళ్లి తిరిగి వస్తూ వాగు దాటే ప్రయత్నంలో వరదలో కొట్టుకుపోయి మృతిచెందింది. రెండేళ్ల క్రితం విశ్వనాథ్పూర్ గ్రామానికి చెందిన జాహంగీర్ పక్క గ్రామమైన తంగెళ్లపల్లికి వెళ్లి వస్తుండగా చిన్న వాగు దాటుతూ ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా శుక్రవారం జిల్లేడ్ చౌదరిగూడ మండలం గుర్రంపల్లి గ్రామానికి చెందిన ఎన్కెపల్లి సత్తయ్య పక్క గ్రామమైన ఇంద్రానగర్ వెళ్లి తిరిగి వస్తుండగా వాగు వరద ఉధృతిలో కొట్టుకుపోయి మృతిచెందాడు. కొందుర్గు మండలం వెంకిర్యాల గ్రామానికి లింగమయ్య(42) శుక్రవారం సాయంత్రం విశ్వనాథ్పూర్ నుంచి తంగెళ్లపల్లి వెళ్లే ప్రయత్నంలో వాగు దాటుతూ కొట్టుకుపోయాడు. శనివారం ఉదయం వాగు పక్కన ముళ్లపొదలకు తట్టుకొని శవమై తేలాడు. ఇలా వంతెనలు లేకపోవడంతో అభాగ్యుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి రోడ్లపై వంతెనలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ఎక్స్గ్రేషియా ప్రకటించాలి ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే ప్రజలు చనిపోతున్నారు. ప్రస్తుం ఇవన్నీ సర్కారు హత్యలే. గడిచిన పదేళ్లలో వంతెనలు నిర్మించలేదు. అప్పట్లో కాంగ్రెస్ నాయకులు వంతెనల కోసం పాదయాత్రలు చేశారు. కానీ ప్రస్తుతం వాగులు దాటుతూ ప్రజలు చనిపోతున్నా పట్టించుకోవడం లేదు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. – లక్ష్మీకాంత్రెడ్డి, బీజేపీ కొందుర్గు అధ్యక్షుడు వరద ఉధృతి ఎక్కువ గతంలో గ్రామాలకు వెళ్లే దారుల్లో లో లెవల్ వంతెనలున్నాయి. ప్రస్తుతం వరదల ఉధృతి తీవ్రంగా ఉంది. అన్ని గ్రామాలకు వెళ్లే దారుల్లో హైలెవల్ వంతెనలు నిర్మించాలి. ఇప్పటికే విశ్వనాథ్పూర్ చిన్న వాగు దాటుతూ ఇద్దరు మృతిచెందారు. ఇతర అభివృద్ధి పనులు నిలిచిపోయినా అత్యవసరంగా వంతెనలు పూర్తి చేయాలి. – శ్రీధర్రెడ్డి, బీఆర్ఎస్ కొందుర్గు అధ్యక్షుడు వాగు దాటే క్రమంలో ప్రాణాలు కోల్పోతున్న వైనం వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ముగ్గురు మృతి పట్టించుకోని పాలకులు, అధికారులు వంతెనలు లేని గ్రామాలు కొందుర్గు మండలం రేగడిచిల్కమర్రి, ముట్పూర్, టేకులపల్లి, ఉత్తరాసిపల్లి, ౖబైరంపల్లి, లాలపేట, గంగన్నగూడ, విశ్వనాథ్పూర్, జిల్లేడ్ చౌదరిగూడ మండలం రావిర్యాల, తూంపల్లి, తుమ్మలపల్లి, లచ్చంపేట, పద్మారం, చేగిరెడ్డిఘనాపుర్, జాకారం, గుంజల్పహాడ్, పీర్జాపూర్, ముష్టిపల్లి తదితర గ్రామాలకు వెళ్లే దారుల్లో వంతెనలు లేకపోవడంతో వర్షాలు కురిస్తే రాకపోకలు నిలిచిపోతాయి. -
పిటిషన్ వెనక్కి తీసుకోవాలి
షాద్నగర్: ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ జీఓ జారీ చేస్తే రెడ్డి జాగృతి సంస్థ సభ్యులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సరికాదని షాద్నగర్కు చెందిన బీసీ జేఏసీ నాయకులు టీజీ శ్రీనివాస్, రవీంద్రనాథ్, అర్జున్, నర్సింలు తదితరులు డిమాండ్ చేశారు. పిటిషన్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం పట్టణ చౌరస్తాలో ప్లకార్టులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేస్తే దానిని వ్యతిరేకిస్తూ రెడ్డి జాగృతి సంస్థ కోర్టుకు వెళ్లడం సరికాదన్నారు. ప్రభుత్వం విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూసీ కోటాలో పదిశాతం పెంచినప్పుడు బీసీలు ఎప్పుడు వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. కానీ బీసీలకు ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తే రెడ్డి జాగృతి కోర్టుకు వెళ్లడంతో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రెండు వర్గాల మధ్య అలజడి సృష్టించే విధంగా రెడ్డి జాగృతి సంస్థ వ్యవహరించడం సరికాదన్నారు. కార్యక్రమంలో నాయకులు నర్సింలుగౌడ్, కరుణాకర్, చంద్రశేఖర్, వెంకటేష్, శంకర్, శ్రీను, నర్సింలు, నరేష్, రామలింగం, శేఖర్గౌడ్, కృష్ణ, బిజిలి సత్యం తదితరులు పాల్గొన్నారు. బీసీ జేఏసీ నేతల డిమాండ్ -
కారు–బైక్ ఢీ.. యువకుడి దుర్మరణం
ఆమనగల్లు: పట్టణంలో హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం కారు–బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడి మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పోలెపల్లి గ్రామ పరిధిలోని పాపర్లబోడుతండాకు చెందిన కేతావత్ వినోద్నాయక్(28) వ్యక్తిగత పని నిమిత్తం బైక్పై ఆమనగల్లు వచ్చాడు. హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై వస్తుండగా అచ్చంపేట వైపునకు వెళుతున్న కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో వినోద్నాయక్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు, తండావాసులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేశారు. దాదాపు అరగంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆమనగల్లు ఎస్ఐ వెంకటేశ్ నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై కేసునమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. పోచారం: ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు మోసం చేసిన సంఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. పెద్దపల్లి జిల్లా, హనుమాన్నగర్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిణి వల్లపురెడ్డి సుశ్రుత పోచారంలోని సింగపూర్ టౌన్షిప్లో నివాసం ఉంటోంది. ఈ నెల 24న ఆమె సోదరి వాట్సాప్ నుంచి రూ. 4600 కావాలని మెసేజ్ రావడంతో డబ్బు పంపింది. మళ్లీ రూ. 20 వేలు కావాలని మెసేజ్ రావడంతో రూ. 10 వేలు పంపిన తర్వాత సోదరికి ఫోన్ చేయగా తన వాట్సాప్ హ్యాక్ అయిందని చెప్పింది. దీంతో సైబర్ నేరగాళ్లు తనను మోసం చేసినట్లు గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్యాస్ సిలిండర్ పేలి గృహోపకరణాలు దగ్ధం ఆల్విన్కాలనీ: గ్యాస్ సిలిండర్ పేలి గృహోపకరణాలు దగ్ధమైన సంఘటన ఎల్లమ్మబండ, అంబేడ్కర్ నగర్లో చోటు చేసుకుంది. అంబేడ్కర్ నగర్కు చెందిన బోయరాజు అనే వ్యక్తి కొన్నేళ్లుగా కమర్షియల్ సిలిండర్లను తెచ్చి చిన్న సిలిండర్లలో నింపి విక్రయిస్తున్నాడు. ఆదివారం ఉదయం శివ అనే వ్యక్తి అతడి వద్ద సిలిండర్ తీసుకెళ్లాడు. ఇంట్లో వంట చేసుకునేందుకు స్టవ్ వెలిగించడంతో ఒక్కసారిగా సిలిండర్ పేలి మంటలు చెలరేగడంతో గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విద్యుదాఘాతంతో గుర్తుతెలియని వ్యక్తి మృతి విజయనగర్కాలనీ: మేకలకు ఆకులు తెంపడానికి వెళ్లి ఓ వ్యక్తి పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన ఆదివారం ఆసీఫ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ దయానంద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం ఆసిఫ్నగర్ సయ్యద్అలీగూడలోని ఓ అపార్ట్మెంట్ వద్ద ఉన్న రావిచెట్టు ఆకులు తెంపడానికి ప్రహరీ పైకి ఎక్కాడు. ఆకులు తెంపే క్రమంలో ప్రమాద వశాత్తు పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై కింద పడ్డాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఆసిఫ్నగర్ పోలీసులు 108కు సమాచారం అందించారు. అతడిని పరీక్షించిన అంబులెన్స్ సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుని సంబంధికులు ఆసిఫ్నగర్ పోలీస్స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. -
ఇళ్ల కూల్చివేతలపై కేసు నమోదు
ఇబ్రహీంపట్నం రూరల్: అక్రమంగా ఇళ్లను కూల్చి వేసిన వారిపై ఆదిబట్ల పోలీసులు ఆదివారం కేసులు నమోదు చేశారు. ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి, 4 జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ నోయల్రాజ్ కథనం ప్రకారం.. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కమ్మగూడ, శ్రీశ్రీనగర్ కాలనీలో సర్వే నంబరు 338లో ఉన్న ప్లాటు నంబరు 140, 143, 163 నుంచి 166 వరకు గల ప్లాట్లను గుర్రం జైపాల్రెడ్డి, కర్ర గోవర్ధన్రెడ్డిల ప్రోత్సాహంతో నేనావత్ అశోక్కుమార్, రత్లావత్ రవి 20 రోజుల క్రితం ప్లాట్లు కొనుగోలు చేశారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం శనివారం తెల్లవారు జామున 5 జేసీబీలు తీసుకొచ్చి 9 ఇళ్లను కూలగొట్టి ఇంట్లో ఉన్న వారిని బయటకు పంపించి సామాన్లు బయట వేశారు. ఇళ్లలో ఉన్న విలువైన వస్తువులను దొంగిలించారు. కోటి రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బంజారాహిల్స్: నిబంధనలు ఉల్లంఘించి పోలీసుల కళ్లుగప్పి తెల్లవారుజాము వరకు పబ్ నిర్వహిస్తున్న యజమానిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–36లోని పోలీస్స్టేషన్ సమీపంలోని ఎన్–ఓల్ అనే పబ్ రాత్రి ఒంటి గంటకు కార్యకలాపాలు ముగించాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా ఆదివారం తెల్లవారుజామున 3 గంటల వరకు కస్టమర్లకు లిక్కర్ సరఫరా చేయడమే కాకుండా డీజే సౌండ్తో న్యూసెన్స్ క్రియేట్ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టగా పబ్లో కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు గుర్తించారు. దీంతో ఎన్–ఓల్ పబ్ యజమాని చిలంకుర్తి శంకర్, మేనేజర్ వీరగోని వంశీ, బౌన్సర్లు మహమూద్, సూర్యకిరణ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుర్గామాతకు ఎంపీ పూజలు ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధి కొంగరకలాన్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ దుర్గమాతను ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. శివాలయం వీధిలో కొలువైన అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎంపీని సన్మానించారు. సికింద్రాబాద్: పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్స్టేషన్ పరిఽధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బీహార్ రాష్ట్రం, సమస్తిపూర్ జిల్లా, దౌలత్పూర్ గ్రామానికి చెందిన హీరా కుమార్(31) మల్లాపూర్లోని ఎఫ్సీఐ గోదాములో హమాలీగా పని చేస్తున్నాడు. ఈ నెల 27న తన స్నేహితుడు అభిషేక్ అనే వ్యక్తిని రైలు ఎక్కించేందుకు చర్లపల్లి రైల్వే స్టేషన్కు వెళ్లి దర్బంగా ఎక్స్ప్రెస్ రైలెక్కించాడు. మల్లాపూర్లోని తన రూమ్కు తిరిగి వెళ్లేందుకు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన రైలు హీరా కుమార్ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం తెల్లవారుజామున సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. -
రిటైర్డ్ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి
ఆమనగల్లు: రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గోపాల్రెడ్డి డిమాండ్ చేశారు. పెన్షనర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించిన జీఓలను వెంటనే విడుదల చేయాలని కోరారు. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాల రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గోపాల్రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రావాల్సిన ఐదు విడతల డీఏను వెంటనే ప్రకటించాలని అన్నారు. నగదు రహిత హెల్త్కార్డులు అందించాలని, నూతన పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, ఆమనగల్లు శాఖ అధ్యక్షుడు కసిరెడ్డి పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఆమనగల్లు సెక్టార్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని జిల్లా ఎన్నికల అధికారి జగదీశ్వర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రామనాథం, ప్రధాన కార్యదర్శిగా జంగయ్య, ఆర్థిక కార్యదర్శిగా సుదర్శన్రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎంగలి బాలకృష్ణయ్య, ఉపాధ్యక్షులుగా వెంకట్రెడ్డి, సుజాత, సంయుక్త కార్యదర్శిగా నారాయణగౌడ్, కార్యదర్శిగా హరికిషన్రెడ్డి, ప్రచార కార్యదర్శిగా శ్రీనివాస్రెడ్డి, జిల్లా కౌన్సిలర్లుగా పురుషోత్తంరెడ్డి, భద్రయ్య, నర్సిరెడ్డి, విద్యాధర్, మహాలింగం, ఆంజనేయులు ఎన్నికయ్యారు. -
శ్రమించి.. కొలువు సాధించి
మాడ్గుల: మండలంలోని నాగిళ్ల గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు గ్రూప్–2 ఫలితాల్లో మెరిశారు. ఒకే కుటుంబానికి చెందిన కంచనపల్లి ఆనంద్గౌడ్, కంచపల్లి సురేష్గౌడ్ ఉన్నత ఉద్యోగాలు సాధించడంతో కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు అభినందించారు. ఆనంద్గౌడ్కు డిప్యూటీ తహసీల్దార్, సురేష్గౌడ్కు అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్గా కేటాయించారు. బండలేమూర్ వాసి ప్రతిభ ఇబ్రహీంపట్నం: మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న దేవరాం గ్రూప్–2 ఫలితాల్లో అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ ఉద్యోగాన్ని సాధించారు. మంచాల మండలం బండలేమూర్ గ్రామానికి చెందిన దేవరాం వికారాబాద్ జిల్లా కుల్కచర్లలోని గురుకుల విద్యాలయంలో పదో తరగతి వరకు, ఇబ్రహీంపట్నంలోని కార్తికేయ కళాశాలలో ఇంటర్, నగరంలోని నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. గతేడాది వెలువడిన గ్రూప్–4 ఫలితాల్లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో పనిచేస్తున్నాడు. తాజాగా గ్రూప్–2లో ఫలితాల్లో ఏసీటీఓ ఉద్యోగాన్ని సాధించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని దేవరాం అన్నారు దృఢ సంకల్పంతో చదివి ఇబ్రహీంపట్నం రూరల్: మండలంలోని పోల్కంపల్లి గ్రామానికి చెందిన గుండ్ల రాకేష్గౌడ్ గ్రూప్–2 ఫలితాల్లో అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్గా ఉద్యోగం సాధించారు. చిన్నప్పటి నుంచి ఆయన చదువుల్లో చురుకు. తల్లిదండ్రులు కూలీ పనులు చేసి చదివించారు. దృఢ సంకల్పంతో ఉన్నత చదువులు చదవి గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. ప్రస్తుతం హెచ్ఎండీఏలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా వెలువడించిన ఫలితాల్లో ఏసీటీగా ఉద్యోగం సాధించారు. దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. కొత్తపల్లివాసికి 27వ ర్యాంక్ శంకర్పల్లి: గ్రూప్–2 ఫలితాల్లో 27వ ర్యాంక్ సాధించి మండలవాసి సత్తా చాటాడు. కొత్తపల్లి గ్రామానికి చెందిన చంద్రకాంత్కి చార్మినార్ జోన్లో డిప్యూటీ తహసీల్దార్గా నియామకం అయినట్లు తెలిపారు. ఇప్పటికే ఆయన రామచంద్రపురంలోని ప్రభుత్వ కళాశాలలో జూనియర్ లెక్చరర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన గతంలోనూ చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా.. అంతకు ముందు పోస్టల్ శాఖలో జాబ్ సైతం చేశారు. తాజాగా డిప్యూటీ తహసీల్దార్గా నియామకం అవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు ఆదివారం టీజీపీఎస్సీ వెల్లడించిన గ్రూప్–2 ఫలితాల్లో సత్తా చాటారు. వివిధ శాఖల్లో ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు. గ్రూప్–2 ఫలితాల్లో సత్తా చాటిన జిల్లా అభ్యర్థులు -
మీనాల మృత్యుఘోష
మీర్పేట: మూడురోజుల క్రితం చెరువులోకి మురుగునీరు వదలడంతో వందలాది చేపలు మృత్యువాత పడ్డాయి. ఆదివారం తేలి ఒడ్డుకు చేరుకోవడంతో వాకర్స్ గమనించి మత్స్యకారులకు సమాచారం అందించారు. వివరాలివీ.. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్ద చెరువులో ఎనిమిది నెలల క్రితం మత్స్య సొసైటీ ఆధ్వర్యంలో 4 లక్షల వరకు చేప పిల్లలను వదిలారు. తాజాగా 20 రోజుల క్రితం చేపలు పట్టడం ప్రారంభించారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు బడంగ్పేట ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరదనీటి ప్రవాహానికి తోడు మురుగునీటిని కూడా ట్రంక్లైన్ ద్వారా నేరుగా చెరువులోకి వదిలారు. దీంతో 3 నుంచి 5 కిలోలు ఉన్న భారీ సైజు చేపలు సైతం మృతి చెందాయి. పట్టి అమ్మకానికి సిద్ధంగా ఉన్న చేపలు ఇంతలోనే మృత్యువాత పడడంతో మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని వాపోయారు. చెరువులో మురుగునీరు కలపొద్దని తాము ఎన్నిసార్లు మున్సిపాలిటీ వారికి చెప్పినా పట్టించుకోలేదని, గత సంవత్సరం లాగే ఈసారి కూడా పెద్ద ఎత్తున చేపలు మృతి చెందాయని ఆందోళన వ్యక్తం చేశారు. చేపలన్నీ మృతి చెంది ఒడ్డుకు చేరుకోవడంతో చెరువు పరిసర ప్రాంతమంతా తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. భరించలేని వాసన రావడంతో వాకింగ్ చేయలేకపోతున్నామని వాకర్స్ తెలిపారు. మృతి చెందిన చేపలను వెంటనే సంబంధిత అధికారులు తొలగించే చర్యలు తీసుకోవాలని కోరారు. మీర్పేట చెరువులో కుప్పలుగా తేలిన చేపలు చెరువు ప్రాంతమంతా దుర్వాసన రూ.10 లక్షల వరకు నష్టం జరిగినట్టు అంచనా మురుగునీరు కలవడంతో మృతి చెందాయంటున్న మత్స్యకారులుమురుగునీరు చెరువులోకి వదలడంతో చేపలన్నీ మృతి చెందాయి. గత సంవత్సరం కూడా ఇలాగే జరిగింది. ఈ ఏడు పెద్ద ఎత్తున చేప పిల్లలను చెరువులో వదలడం జరిగింది. 3 నుంచి 5 కిలోల వరకు పెద్దవయ్యాక మృత్యువాత పడడం బాధాకరం. భవిష్యత్తులో పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. – గువ్వల శ్రీకాంత్, మత్స్యకారుడు -
నటికి కాబోయే భర్త ఆత్మహత్య
బంజారాహిల్స్: నేను జీవితంలో చాలా తప్పులు చేశాను... ఇక మళ్లీ అలాంటి తప్పులు చేయను అంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసిన ఓ నటికి కాబోయే భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... రాజస్థాన్కు చెందిన సోహాని బాలీవుడ్, టాలీవుడ్తో పాటు పలు భాషల్లో సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల ఆమెకు రాజస్తాన్కు చెందిన సవాయ్ సింగ్ అనే యువకుడితో ఇన్స్టాలో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. గత జూలైలో ఇద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లోని ఓ ఫ్లాట్ను అద్దెకు తీసుకున్న సోహాని కుమారి అక్కడే ఉంటూ సినిమాల్లో నటిస్తోంది. శనివారం ఉదయం సవాయ్ సింగ్ ప్రశాసన్నగర్లోని ఆమె ఇంటికి వచ్చాడు. తర్వాత ఇద్దరూ కలిసి గచ్చిబౌలిలోని ఎవరి కార్యాలయాలకు వారు వెళ్లి పోయారు. సాయంత్రం సోహాని ఇంటికి వచ్చి తాళం తీసి లోపలికి వెళ్లి చూడగా డైనింగ్ హాల్లో సవాయ్ సింగ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఆత్మహత్య చేసుకునే ముందు అతను సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు గుర్తించారు. సోహాని కుమారితో పరిచయానికి ముందు సవాయ్ సింగ్కు మరో యువతితో స్నేహం ఉండేదని ఆమెను మర్చిపోలేకపోవడం, ఆర్థిక సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోహాని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించగా శుక్రవారం ఉదయం 11.47 గంటలకు సవాయ్ సింగ్ ఆమె ఉంటున్న ఫ్లాట్ వెనుక డోర్ ద్వారా ఇంట్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకునిని దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఆయన మాజీ స్నేహితురాలిని కూడా విచారిస్తున్నారు. -
రైలులో ప్రయాణికుడి మృతి
సికింద్రాబాద్ః రైలులో ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పరిధిలో జరిగింది. రైల్వే కానిస్టేబుల్ పండరి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జార్ఖండ్కు చెందిన ఆలమ్ అన్సారి(27) అనే యువకుడు హౌరా నుంచి సికింద్రాబాద్కు ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నాడు. ఆదివారం ఉదయం అతను కోచ్ నంబర్ 5లోని సీట్ నెం. 32లో మృతి చెంది ఉన్నాడు. విధుల్లో ఉన్న రైల్వే టీటీఐ ద్వారా సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని గాంధీ మార్చురీకి తరలించారు. -
పిటిషన్ వెనక్కి తీసుకోవాలి ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ జీఓ జారీ చేస్తే కోర్టులో పిటిషన్ వేయడం సరికా దని జేఏసీ నాయకులు అన్నారు.
● సీఎం ఆస్తుల విలువ పెంచుకొనేందుకే ఆ రోడ్లు ● అందుకే గ్రీన్ఫీల్డ్ రోడ్డు, ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్పు ● రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది ● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవన్నీ తప్పుడు ‘మార్గాలు’కడ్తాల్: సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబం, బంధువుల ఆస్తుల విలువ పెంచుకోవడానికే గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఏర్పాటు చేయడంతో పాటు ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్చడం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కడ్తాల్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల మీదుగా ఏర్పాటు చేస్తున్న 765 హైటెన్షన్ విద్యుత్లైన్ అలైన్మెంట్కు వ్యతిరేకంగా బాధిత రైతులు చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం 21వ రోజుకు చేరుకున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగర్జన సభకు వెళ్తున్న కేటీఆర్ దీక్ష శిబిరం వద్దకు చేరుకుని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి ఉద్దేశపూర్వకంగా సొంత భూముల విలువ పెంచుకోవడానికి ఎవరికీ అవసరం లేని గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. రోడ్డు నిర్మాణం కోసం 1,200 ఎకరాల పట్టా భూములను రైతుల నుంచి సేకరిస్తుండంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. సొంత ఆస్తుల విలువను పెంచుకోవడంతో పాటు అనుయాయులకు దోచిపెట్టేందుకు సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని, రైతులకు అండగా ఉంటామన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో పేదల కడుపుకొట్టకుండా, వారికి నష్టం కలుగకుండా అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తు చేశారు. హైటెన్షన్ విద్యుత్లైన్ బాధిత రైతులు కలిసి వస్తే న్యాయస్థానంలో వారి పక్షాన పోరాడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్రెడ్డి, మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, సింగిల్విండో చైర్మన్ వెంకటేశ్గుప్తా, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ రజనీ సాయిచంద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పరమేశ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దశరథ్నాయక్, సర్పంచ్ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు మంత్రి శ్రీధర్బాబు రాక
మొయినాబాద్: మున్సిపల్ పరిధిలోని అజీజ్నగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవానికి సోమవారం ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు రానున్నట్లు మండల తహసీల్దార్ గౌతమ్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. మంత్రితోపాటు స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరవుతారని చెప్పారు.ఎర్త్ సెంటర్ను సందర్శించిన స్వీడన్ దేశస్తులుకడ్తాల్: మండల పరిధిలోని అన్మాస్పల్లి సమీపంలోని ఎర్త్సెంటర్ను ఆదివారం స్వీడన్ దేశస్తులు జాన్బుచ్ అండర్సన్, డాక్టర్ ఒయింకన్ పీటర్, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ సెంటర్ సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా ఎర్త్ సెంటర్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు సీజీఆర్ సంస్థ చేస్తున్న సేవలు బాగున్నాయని ప్రశంసించారు. అనంతరం స్థానిక వీరాంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీజీఆర్ చైర్ పర్సన్ లీలా లక్ష్మారెడ్డి, సీజీఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ సెంటర్ అధ్యక్షుడు సీతారావు, కార్యదర్శి నరసింహన్, వీరనారి చాకలి ఐలమ్మ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ప్రియాకుమారి తదితరులు పాల్గొన్నారు.ఏదుళ్ల బాల్రాజ్కు కీర్తిరత్నఇబ్రహీంపట్నం రూరల్: సాహిత్య రంగంలో తెలుగు భాషకు వన్నె తెస్తూ విశేషమైన కృషి కనబర్చినందుకు గాను మండలంలోని నాగన్పల్లి గ్రామానికి చెందిన ఏదుళ్ల బాల్రాజ్ను జాతీయస్థాయి కీర్తిరత్న పురస్కారం వరించింది. ఈ మేరకు ఆదివారం నగరంలోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో భవానీ సాహిత్య వేదిక ప్రధాన కార్యదర్శి వియల్ భవాని, అధ్యక్షుడు వైరాగ్యం ప్రభాకర్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పురస్కారం రావడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు భాషను కాపాడడం కోసం మరింతగా కృషి చేస్తానని తెలిపారు. బాల్రాజ్ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.మూసీలో తగ్గిన వరద ఉద్ధృతిమణికొండ: ఉస్మాన్సాగర్ (గండిపేట), హిమాయత్ సాగర్లకు వరద ఉద్ధృతి తగ్గిపోవటంతో గేట్లను తగ్గించారు. దీంతో మూసీ నదిలో నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఉదయం నుంచి జంట జలాశ యాల గేట్లను మూస్తూ వచ్చారు. మధ్యాహ్నం తర్వాత గండిపేట నుంచి 4 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 920 క్యూసెక్కుల నీటిని మాత్రమే వదిలారు. పూర్తి స్థాయి నీటి మట్టం 1,790 అడుగులకు 1,789.15 అడుగులుగా నీటి మట్టం ఉండగా ఎగువ నుంచి 1,300 క్యూసెక్కుల వరద వస్తోందని అధికారులు తెలిపారు. ిహిమాయత్సాగర్ నీటి మట్టం 1763.50కి గాను ప్రస్తుతం 1,762.35 అడుగుల నీరు ఉందని, పైనుంచి 2,600 క్యూసె క్కుల వరద వస్తోందన్నారు. రెండు గేట్లను 3 అడుగుల మేర ఎత్తి 1981 క్యూసెక్కుల నీటిని మూసీ నదికి వదులుతున్నామన్నారు.తెరుచుకున్న రోడ్లుశనివారం రాత్రి వరకు మూసీ నదిలో పెద్ద ఎత్తున నీరు రావటంతో నార్సింగిలోని ఔటర్ సర్వీసు రోడ్లతో పాటు నార్సింగి నుంచి మంచిరేవుల గ్రామానికి వెళ్లే రోడ్లను మూసి వేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం నుంచే గండిపేట గేట్లను తగ్గించటంతో మూసీలో వరద తగ్గిపోయింది. తిరిగి వర్షం కురిసి, వరద వస్తుందనే ఉద్దేశంతో సాయంత్రం వరకు రోడ్లను అలాగే మూసి ఉంచారు. సాయంత్రానికి వర్షం వచ్చే అవకాశం, పరీవాహకం నుంచి చెరువులోకి వరద తగ్గిపోవటంతో నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో మూసిన అన్ని రోడ్లనూ తెరిచి రాకపోకలను పునరుద్ధరించారు. -
స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేస్తాం
● మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ● జిల్లా ముఖ్య నేతల సమావేశం సాక్షి, రంగారెడ్డిజిల్లా: స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కనిపించడం లేదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా రెడ్డి అన్నారు. ఒకవేళ నిర్వహిస్తే జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలన్నీ బీఆర్ఎస్ కై వసం చేసుకోవడం ఖాయమని చెప్పారు. ఈ మేరకు ఆదివారం శంషాబాద్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో 22 నెలలుగా నాటకాలాడుతున్న రేవంత్ ప్రభుత్వం మొదట్లోనే ఎందుకు జీఓ జారీ చేయలేదని ప్రశ్నించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చాక అమలు చేయడం లేదని అన్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించితే రాజ్యాంగబద్ధంగా చర్యలు చేపట్టాల్సింది పోయి జీఓ జారీ చేయడం కాలయాపన కోసమేనని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీ తీర్మానం, గవర్నర్ ఆమోదం, కేంద్ర ఆమోదం కోసం ఢిల్లీలో ధర్నా తదితర డ్రామాలతో కాలయాపన చేసిన రేవంత్ చివరికి మోసపూరిత జీవో జారీచేసి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. వాస్తవా లను గమనించలేనంత అమాయకులు ప్రజలు కారని, మోసకారి కాంగ్రెస్కు కర్రకాల్చి వాత పెట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏ రిజర్వేషన్లు వచ్చినా పోటీకి సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణేలకు పిలుపునిచ్చారు. సమావేశంలో షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, సీనియర్ నాయకుడు క్యామ మల్లేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పి.కృష్ణారెడ్డి, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు చిలకమర్రి నర్సింహ, జెడ్పీటీసీ మాజీ సభ్యులు పట్నం అవినాష్ రెడ్డి, బూర్కుంట సతీష్, రమేశ్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు నర్సింగ్ రావు, నారాయణరెడ్డి, సీనియర్ నాయకులు దేశమోల్ల ఆంజనేయులు, కార్మిక నాయకుడు పి.నారాయణ పాల్గొన్నారు. -
ఇకపై పాలన ఫ్యూచర్ సిటీ నుంచే: సీఎం రేవంత్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: త్వరలో భారత్ ఫ్యూచర్ సిటీ నుంచే పరిపాలన సాగిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఇకపై సచివాలయంలో కాకుండా ఫ్యూచర్సిటీ ఆఫీ సులో కూర్చు ని పనిచేస్తానని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) భవన నిర్మాణంతోపాటు రావిర్యాల నుంచి ఆమనగల్ వరకు నిర్మించనున్న రేడియల్ రోడ్డు పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి సీఎం ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘భూమి విలువ నాకు తెలుసు. వ్యవసాయంతోనే కాదు వ్యాపారంలోనూ భూమితో నాకు సంబంధం ఉంది. మీ తాతల నాటి ఆస్తులు గుంజుకునే ఆలోచన నాకు లేదు. బాధితులకు పూర్తిగా న్యాయం చేసిన తర్వాతే భూములు తీసుకుని ముందుకు వెళ్తాం. డిసెంబర్లో యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించుకోబోతున్నాం. ఫ్యూచర్సిటీ అభివృద్ధి పనులను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తాం. ఇకపై సచివాలయంలో కాకుండా ఫ్యూచర్సిటీ ఆఫీసులో కూర్చుంటా. నెలకు మూడుసార్లు ఇక్కడే ఉంటా. ఏ అభివృద్ధి కార్యక్రమమైనా ఇకపై ఇక్కడి నుంచే చేపడుతా. నాతోపాటు ఉపముఖ్య మంత్రి భట్టి కూడా నెలకు నాలుగుసార్లు ఇక్కడికి వస్తారు. ఆయన కూడా తన కార్యకలాపాలను ఇక్కడి నుంచే కొనసాగిస్తారు. సింగరేణి సంస్థ కోసం 10 ఎకరాలు కేటా యించి, 2026 డిసెంబర్లోగా ఆఫీసును ప్రారంభించాల్సిందిగా కోరుతున్నా. ఫ్యూచర్సిటీలో ఓవర్హెడ్ విద్యుత్ లైన్లు కూడా తొలగించి, యూజీ కేబుల్స్ వేయబోతున్నాం. ఈ ఫ్యూచర్సిటీలో ఫార్చూన్ 500 జాబితాలోని కంపెనీలు ఉండాలని కోరుకుంటున్నా. ఇప్పటివరకు నగరంలో 85 వరకే ఉన్నాయి. రాబోయే పదేళ్లలో ప్రతి కంపెనీ ఇక్కడ పెట్టుబడి పెట్టే విధంగా తీర్చిదిద్దుతున్నాం’అని వివరించారు. భావితరాల కోసమే మా తపన భావితరాల బంగారు భవిష్యత్తు కోసమే తమ ప్రభుత్వం కష్టపడుతోందని సీఎం రేవంత్ తెలిపారు. ‘ఈరోజు కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. కానీ మంచి సంకల్పంతో చేపట్టిన నవ్య.. భవ్య.. భారత్ ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన కోసం వరుణుడ కూడా సహకరించాడు. రేవంత్రెడ్డికి భూములున్నాయని చెప్తున్నారు. ఆయన కోస మే నగరం కడుతున్నారని ఆరోపిస్తున్నారు. నాకు భూమి ఉంటే భూమి మీదే ఉంటుంది. రహస్యంగా దాచుకోవడానికి నా దగ్గరేమీ లేదు. నేను నాగురించో.. నా సహచర మంత్రుల గురించో ఆలోచన చేయడం లేదు. మేమంతా రేపటి తరాల కోసమే ఆలోచన చేస్తున్నాం’అని సీఎం పేర్కొన్నారు. న్యూయార్క్లో ఉన్నవాళ్లు చెప్పుకునేలా చేస్తా ‘కుతుబ్షాహీలు, నిజాంలు పునాదులు వేసిన హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు నేడు ఎంతో అభివృద్ధి చెందాయి. నాడు చంద్రబాబు, వైఎస్సార్ మాకెందుకు అనుకుని ఉంటే..ఇవాళ హైటెక్సిటీ, ఔటర్రింగ్రోడ్డు, శంషాబాద్ ఎయిర్పోర్టు వచ్చేవి కాదు. నాటి నాయకుల ఆలోచన వల్లే ఫార్మా, ఐటీ రంగంలో ప్రపంచంతో పోటీపడుతున్నాం. సిలికాన్ వ్యాలీలో మన పిల్లలు గొప్ప స్థానాల్లో ఉన్నారు. గతకాలపు నేతల నుంచి మంచిని నేర్చుకుని భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలి. భవిష్యత్తు తరాల కోసమే భారత్ ఫ్యూచర్ సిటీ. న్యూయార్క్, టోక్యో, సింగపూర్, దుబాయ్ తరహాలో ఫ్యూచర్సిటీ గురించి గొప్పగా చెప్పుకునేలా తీర్చిదిద్దుతాం. నాకు పదేళ్లు అవకాశం ఇవ్వండి. న్యూయార్క్లో ఉన్నవాళ్లు కూడా ఫ్యూచర్ సిటీ గురించి చెప్పుకునేలా అభివృద్ధి చేస్తాం’అని సీఎం తెలిపారు. గ్రీన్ఫీల్డ్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి చెన్నై, బెంగళూరుకు బుల్లెట్ రైళ్లు.. బందర్కు రోడ్డు ఫ్యూచర్సిటీకి తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, ఇతర నగరాలకు రవాణా సౌకర్యం, అంతర్జాతీయ విమానాశ్ర యం వంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయని సీఎం తెలిపారు. ‘ఫ్యూచర్ సిటీ నుంచి శ్రీశైలం వరకు 100 మీటర్ల రోడ్డు వేస్తున్నాం. ఇటు ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరు వరకు రోడ్డు, బుల్లెట్ ట్రైన్ మంజూరు చేయించుకున్నాం. దక్షిణ భారతదేశంలో నౌకాశ్రయం లేని రాష్ట్రం తెలంగాణ మాత్ర మే. ఈ కొరతను తీర్చేందుకు మచిలీపట్నం వరకు రోడ్డు వేస్తున్నాం. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్కు కేంద్రం అనుమతించింది’అని చెప్పారు. రైతులు నాయకుల ఉచ్చులో చిక్కుకుని నష్టపోవద్దని సూచించారు. బాధిత రైతులతో మాట్లాడి సమస్య లేకుండా చూడాలని కలెక్టర్, టీజీఐఐసీ అధికారులను ఆదేశించారు. ‘అందరికీ న్యాయం చేస్తా. కోర్టు బయట కూర్చొని నష్టాన్ని పూడ్చుకుందాం’అని సూచించారు. భవిష్యత్తు అంతా ఇక్కడే దేశ భవిష్యత్తు అంతా ఫ్యూచర్ సిటీ చుట్టే తిరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దేశంలో ఏ నగరానికి లేని రేడియల్ రోడ్లు, సరీ్వసు రోడ్లు, మెట్రో సౌకర్యం దీనికి ఉన్నాయని చెప్పారు. భవిష్యత్తులో ఈ సిటీ ప్రపంచానికే తలమానికం అవుతుందన్నారు. ఈ ప్రాంత వాసులకు అత్యాధునిక వైద్యశాలలు, కాలేజీలు, వర్సిటీలు, పరిశ్రమలు అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు. సింగరేణి గ్లోబల్ కార్పొరేషన్ ఆఫీసు నిర్మాణాన్ని ఏడాదిలోపే పూర్తి చేస్తామని వెల్లడించారు. కొత్త యుగానికి కొత్త బాటలు వేయాలనే ఆలోచనతో ప్రణాళికాబద్ధమైన ఫ్యూచర్సిటీకి శంకుస్థాపన చేసినట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. చండీగఢ్ కంటే పది రెట్లు భిన్నంగా ఫ్యూచర్సిటీ రాబోతోందని చెప్పారు. సిటీ నిర్మాణం, అభివృద్ధిలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. -
న్యూయార్క్లో ఉన్న వాళ్లను ఫ్యూచర్ సిటీకి రప్పిస్తా: సీఎం రేవంత్
సాక్షి, రంగారెడ్డి: ఇంకెన్నాళ్లు టోక్యో, న్యూయార్క్ అంటూ గొప్పలు చెప్పుకుంటామని.. భావితరాలకూ అలాగే ఓ నగరం ఉండాలనే ఆలోచనతో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఆదివారం కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఫ్యూచర్ సిటీని అడ్డుకునేందుకు చాలామంది కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. చేయకూడని రాద్ధాంతాలు చేస్తున్నారు. ఇక్కడ రేవంత్కు భూములు ఉన్నాయని, అందుకే నగరాన్ని నిర్మిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. భూములుంటే దాచితే దాగేది కాదు. రికార్డుల్లో ఉంటాయి. అందరికీ తెలిసిపోతుంది. కుతుబ్షాహీలు నగరాన్ని నిర్మిస్తే.. వైఎస్ రాజశేఖర్రెడ్డి లాంటి నాయకులు ఆలోచన చేశారు. అలాంటి వాళ్లు మాకెందుకులే అనుకుని ఉంటే ఇవాళ ఓఆర్ఆర్, శంషాబాద్లు ఏవీ వచ్చేవి కావు. గత అనుభవాలు పునాది కావాలి. భూముల విలువ నాకు తెలుసు. నేను ఎవరికీ అన్యాయం చేయను. చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించుకుందాం. ఫ్యూచర్ సిటీకి స్థానికులు సహకరించాలి. ఇంకెన్నాళ్లు న్యూయార్క్, టోక్యో నగరాలంటూ మాట్లాడుకుందాం. ఎందుకు మనమే ఫ్యూచర్ సిటీ నిర్మించుకోవద్దు. నాకు పదేళ్లు అవకాశం ఇవ్వండి. న్యూయార్క్లో ఉన్నవాళ్లు కూడా ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చేస్తాం. బుల్లెట్ రైలు వచ్చేలా కేంద్రాన్ని ఒప్పించాం. ఫ్యూచర్ సిటీ మన కోసం కాదు.. భవిష్యత్తు తరాల కోసం అని సీఎం రేవంత్ అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ నుంచి బందరుపోర్ట్ వరకు అమరావతి మీదుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సీఎం రోడ్డు మంజూరు చేయించారు. ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరు వరకు రోడ్డు నిర్మాణం చేయనున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అభివృద్ధి పనులు ఫ్యూచర్ సిటీ లో జరగనున్నాయి. భవిష్యత్ లో ఫ్యూచర్ సిటీ ప్రపంచానికి తలమానికం కానుంది. రేవంత్ రెడ్డి సంకల్పం త్వరితగతిన పూర్తికావాలని కోరుకుంటున్నా అని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేసుకున్నాం. ప్రణాళిక బద్దమైన నగరంగా చండీఘడ్ నిర్మించారు. అదే తరహాలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తున్నాం. వాణిజ్యం, వ్యాపారం చేసే వారికి అనుకూలంగా అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నాం. స్పోర్ట్స్ క్యాపిటల్ చేసే విధంగా క్రీడా విశ్వవిద్యాలయం అందేలా చర్యలు చేపడతాం. జీరో పోల్యూటెడ్ ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం. భారత్ ఫ్యూచర్ సిటీ గా రూపుదిద్దడానికి స్థానికులు భాగస్వాములు కావాలని కోరుతున్నా అని ప్రసంగించారు. ఇదీ చదవండి: ఫోర్త్ సిటీ కాదు.. ఉన్న సిటీని పట్టించుకోండి -
‘ఫ్యూచర్సిటీ’కి సీఎం రేవంత్ శంకుస్థాపన
సాక్షి, రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్సిటీకి పునాది రాయి పడింది. కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలో ఫ్యూచర్సిటీ డెవలప్మెంట్ అథారిటీ(ఎఫ్సీడీఏ) కార్యాలయానికి ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు 15 వేల చదరపు అడుగుల్లో రూ.20 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా నాలుగు నెలల్లో ఈ భవన నిర్మాణం పూర్తికానుంది. అనంతరం ఫ్యూచర్సిటీలో జరిగే అభివృద్ధి పనులు, లేఅవుట్లు, పరిశ్రమలకు ఎఫ్సీడీఏ అధికారులు అనుమతులివ్వనున్నట్లు సమాచారం. రావిర్యాల నుంచి అమన్గల్ వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్-1నిర్మాణానికి భూమి పూజ కూడా చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంరేవంత్తో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రులు శ్రీధర్బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా, ఉద్యోగ అవకాశాల కేంద్రంగా, పర్యావరణ పరిరక్షణతో కూడిన అభివృద్ధి మోడల్గా తీర్చిదిద్దే లక్ష్యంతో భారత్ ఫ్యూచర్ సిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. మొత్తం 30 వేల ఎకరాల్లో.. 15,000 ఎకరాలు ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి, మరో 15,000 ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్గా(హరిత ఊపిరి)గా కేటాయించింది. -
బలవంతపు భూ సేకరణ వద్దు
అనంతగిరి: రైతుల అనుమతి లేకుండా బలవంతంగా భూములు సేకరిస్తే పోరాటం తప్పదని సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చడం ద్వారా రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. పేదల పొలాల్లో రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రింగ్ రోడ్డు వేయడమేంటని ప్రశ్నించారు. రైతుల అభిప్రాయం తీసుకోకుండా భూములు తీసుకోవద్దని సూచించారు. పాత అలైన్మెంట్ ప్రకారమే రోడ్డు వేయాల ని డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, సత్యనారాయణ, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
చైతన్యయాదవ్ అంత్యక్రియలు పూర్తి
బడంగ్పేట్: కార్పోరేషన్ పరిధి నాదర్గుల్కు చెందిన తర్రె ఐలయ్య యాదవ్, మంగమ్మ దంపతుల కుమారుడు చైతన్యయాదవ్ అలియాస్ అభి (22) ఈ నెల 1వ తేదీన బ్రిటన్లో రోడ్డు ప్రమాదానికి దుర్మరణం చెందిన విషయం విదితమే. ఈ మేరకు శుక్రవారం రాత్రి మృతదేహం ఇంటికి రావడంతో శనివారం అశ్రునయనాల మధ్య నాదర్గుల్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. చెరువులను కాపాడుకోవాలి ఇంగ్లండ్ హై కమిషనర్మణికొండ: మన పరిసరాల్లో ఉన్న చెరువులను కాపాడుకోవటంతో పాటు వాటిని పరిశుభ్రంగా ఉంచుకుని వాటి వద్ద సేద తీరాలని ఇంగ్లండ్ (యూకే) హై కమిషనర్ గరేత్ అన్నారు. నార్సింగి మున్సిపాలిటీ, కోకాపేట కొత్త చెరువు వద్ద దృవాన్ష్ ఎన్జీఓ వారు నిర్వహించిన స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చెరువులను సుందరంగా తయారు చేసుకుని వాటి వద్ద ప్రజలు మంచి వాతావరణాన్ని ఆస్వాదించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన చెరువు పరిసరాల్లో పడిన చెత్తను తొలగించారు. దృవాన్ష్ ఎన్జీఓ చేస్తున్న క్లీనింగ్ పనులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో దృవాన్ష్ ఎన్జీఓ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు. -
అనంతుడి సేవలో హైకోర్టు జడ్జి
అనంతగిరి: వికారాబాద్ సమీపంలోని అనంతగిరి గుట్టపై వెలసిన శ్రీ అనంత పద్మనాభస్వామిని శనివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, వికారాబాద్ జిల్లా పోర్ట్పోలియో జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు దర్శించుకున్నారు. ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చరిత్ర, దేవుని మహత్యం గురించి ప్రధాన అర్చకులు వివరించారు. తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు ఇచ్చి జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆయన వికారాబాద్ కోర్టు భవన సముదాయాన్ని సందర్శించారు. జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. జిల్లా కోర్టు ఆవరణలో మరో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు మంజూరు చేయాలని కోరారు. మంజూరైన జిల్లా కోర్టు నూతన భవనాన్ని త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్జైన్, ఎస్పీ నారాయణరెడ్డి హైకోర్టు జడ్జిని మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్. సున్నం శ్రీనివాస్రెడ్డి, జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్రకిశోర్, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శాంతిలత, పరిగి జూనియర్ సివిల్ జడ్జి ఎన్ శిల్ప, కొడంగల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీరామ్, తాండూరు జూనియర్ సివిల్ జడ్జి శివలీల, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బస్వరాజ్ పటేల్ పాల్గొన్నారు. -
ప్రయాణికుడి వద్ద విదేశీ బల్లులు, తాబేళ్ల పట్టివేత
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతాధికారుల తనిఖీల్లో ఓ ప్రయాణికుడి వద్ద విదేశీ బల్లులు, తాబేళ్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలివీ... శనివారం సాయంత్రం ఇండిగో విమానం 6ఈ–1068లో విమానంలో బ్యాంకాక్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న లోకేష్ జయచంద్రన్ అనే ప్రయాణికుల లగేజీని అధికారులు తనిఖీ చేశారు. అందులో 8 కీలేడ్ బల్లులు, ఒక గిర్డిల్ బల్లి, ఒక రెండు తలలు కలిగిన తాబేలు బయటపడ్డాయి. దీంతో ప్రయానికుడిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. తీసుకొచ్చిన జీవులకు మరో విమానంలో బ్యాంకాక్కు తిరిగి పంపారు. -
కొత్త మార్కింగ్తో రైతులకు నష్టం
షాద్నగర్రూరల్: ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మాణంలో కొత్త మార్కింగ్తో ఎక్కువ మంది పేద రైతులు భూములు కోల్పోతున్నారని సీపీఎం జిల్లా నాయకుడు రాజు అన్నారు. శనివారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ట్రిపుల్ఆర్ బాధిత రైతులకు మద్దతుగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని భీమారం, అయ్యవారిపల్లి, ఉప్పరిగడ్డతాండ, కేశంపేట మండల పరిధిలోని నిడదవెళ్లి, తొమ్మిదిరేకుల, కొందుర్గు మండల పరిధిలోని తంగెళ్లపల్లి, చెరుకుపల్లి, తుమ్మలపల్లి గ్రామాలకు చెందిన రైతులు తరలివెళ్లి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ట్రిపుల్ఆర్ నిర్మాణానికి అలైన్మెంట్ను ఇస్తున్నట్లు రూట్ మ్యాప్తో పాటుగా సర్వే నంబర్లను ప్రకటించడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఎకరం, రెండు ఎకరాల భూమి ఉన్న పేద రైతులే అధికంగా ఉన్నారని, వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న రైతులు భూములను కోల్పోతుండటంతో వారి జీవనోపాఽధి అగమ్యగోచరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు పెట్టుబడిదారుల ప్రయోజనాలకోసం పేదల భూములను లాక్కొని వారి పొట్టకొట్టొద్దని ఆగ్రహం వెల్లిబుచ్చారు. పాత అలైన్మెంట్ ప్రకారమే రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతా మని హెచ్చరించారు. కలెక్టరేట్కు తరలిన వారిలో సీపీఎం నాయకులు జగన్, రాజు, కుర్మయ్య, వెంకటయ్య, రైతులు లక్ష్మయ్య, నగేష్, శ్రీనివాస్, చంద్రకాంత్, రమేష్, రాంసింగ్, రాజు, రాంజీనాయక్, రవినాయక్, అమృనాయక్, మంగ్యనాయక్, పాండునాయక్, బద్రినాయక్ తదితరులు ఉన్నారు.సీపీఎం జిల్లా నాయకుడు రాజు -
వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి..
శవమై తేలాడు ● మృతదేహంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బైఠాయించిన బీజేపీ నేతలు ● ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు షాద్నగర్రూరల్/కొందర్గు: వాగులో పడి మృతి చెందిన దస్తగిరి లింగమయ్య(42) మృతదేహంతో బీజేపీ నేతలు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆందోళన చేశారు. దీంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వివరాలు.. కొందుర్గు మండల పరిధిలోని వెంకిర్యాల గ్రామానికి చెందిన లింగమయ్య శుక్రవారం విశ్వనాథ్పూర్ వద్ద వాగుదాటుతూ కొట్టుకుపోయాడు. శనివారం ఉదయం మృతదేహం లభ్యమైంది. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి లింగమయ్య మృతదేహం, వారి కుటుంబ సభ్యులతో కలిసి శనివారం బీజేపీ నేత ప్రశాంత్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బైఠాయించారు. ప్రభుత్వం వాగుపై బ్రిడ్జి నిర్మించకపోవడంతోనే లింగమయ్య మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ విజయ్కుమార్ పోలీసు సిబ్బందితో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. క్యాంపు కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించిన బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. అనంతరం ప్రశాంత్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రశాంత్ను సొంతపూచీకత్తుపై వదిలిపెట్టారు. -
రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి
జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డితో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మహిళా రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ రిజర్వేషన్లకు సంబంధించి మహిళా రిజర్వేషన్ కోసం లాటరీ పద్ధతిన కేటాయింపు నిర్వహించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, బీసీ డెడికేషన్ కమిటీ నివేదిక ప్రకారం బీసీ రిజర్వేషన్లు చేపట్టినట్టు తెలిపారు. 21 జెడ్పీటీసీ స్థానాల్లో మూడు ఎస్టీ, నాలుగు ఎస్సీ, తొమ్మిది బీసీ, ఐదు జనరల్ కేటగిరీలకు కేటాయించినట్లు తెలిపారు. ఇదే ప్రాతిపదికన ఎంపీపీ స్థానాలకు కూడా రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు చెప్పారు. సంబంధిత రిజర్వేషన్ స్థానాల కేటాయింపు వివరాలను ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్లలో తొమ్మిది చొప్పున స్థానాలను మహిళలకు కేటాయించినట్లు వివరించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
రేపు ఉద్యోగ మేళా
తుక్కుగూడ: జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశం కల్పించడానికి ఈ నెల 29న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి జయశ్రీ ఒక ప్రటకనలో పేర్కొన్నారు. నగరంలోని ఫాక్స్కాన్ కంపెనీలో పోస్టులు ఉన్నట్టు చెప్పారు. డిప్లొమా ఎలక్ట్రానిక్స్, మెకానిక్ ఇంజనీరింగ్ విద్యార్హత కలిగి ఉండాలన్నారు. 18 నుంచి 30 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నవారు అర్హులని తెలిపారు. వివరాలకు ఉపాధి కార్యాలయం, శాంతినగర్, ఐటీఐ క్యాంపస్, మల్లేపల్లి, హైదరాబాద్లో లేదా 90630 99306, 89771 75394 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. నందిగామ: ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంపై అవగాహన పెంపొందించడంతో పాటు ధ్యానాన్ని ప్రోత్సహించేందుకు 56 ఏళ్ల వ్యక్తి ఉత్తర్ప్రదేశ్ నోయిడా నుంచి 14 రోజుల పాటు 1,700 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టి శనివారం కన్హా శాంతి వనానికి చేరుకున్నాడు. దేశ యువతను వ్యసనాల నుంచి దూరంగా ఉంచి, ధ్యానాన్ని ఆహ్వానించాల ని పిలుపునిస్తూ నోయిడాకు చెందిన తరుణ్ సర్కార్ ఈ నెల 13న సైకిల్ యాత్ర ప్రారంభించాడు. మధుర, ఆగ్రా, గ్వాలియర్, వివపురి, గునా, బియావారా, భోపాల్, ఇటార్సి, బేతూల్, నాగ్పూర్, నిర్మల్, కామారెడ్డి మీదుగా కన్హాకు చేరుకున్నట్లు చెప్పారు. హార్ట్ఫుల్ నెస్ గురూజీ కమ్లేష్ పటేల్ జన్మదినం సందర్భంగా ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రమైన కన్హా ఆశ్రమానికి చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తరుణ్ సర్కార్ను కమ్లేష్ పటేల్ అభినందించారు. యాచారం: కందుకూరు–మీరాఖాన్పేట గ్రామాల మధ్య శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో పది మంది గాయాలపాలు కావడంతో వారి స్వగ్రామం కుర్మిద్దలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన వారితో పాటు క్షతగాత్రులంతా నిత్యం రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కూలీలు. గ్రామం నుంచి నిత్యం రావిరాల సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేయడానికి వెళ్తుంటారు. రోజు మాధిరిగా విధులు ముగించుకుని ఆటోలో వస్తున్న క్రమంలో రోడ్డుపై నిలిపి ఉన్న సిమెంట్ మిక్సర్ మిల్లర్ను ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నడుపుతున్న సురిగిరి శ్రీనివాస్ (39), పంది శ్రీధర్ (26), పంది సత్తమ్మ (49) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో పదిమంది గాయపడ్డారు. మృతదేహలకు ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించి శనివారం రాత్రి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అందరూ ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు కమిషనర్గా 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పని చేస్తున్న సీవీ ఆనంద్ను హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది ఐపీఎస్ అధికారుల బదిలీల నేపథ్యంలో.. హైదరాబాద్ కమిషనరేట్లో కీలక మార్పుచేర్పులు చోటు చేసుకున్నాయి. అదనపు సీపీగా (శాంతిభద్రతలు) పని చేస్తున్న విక్రమ్సింగ్ మాన్ను అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్గా నియమించింది. ఈ స్థానంలో తఫ్సీర్ ఇక్బాల్ను సంయుక్త సీపీ హోదాలో నియమించింది. ప్రస్తుతం సీఐడీలో ఐజీ హోదాలో ఉన్న ఎం.శ్రీనివాసులుకు అదనపు సీపీ (నేరాలు, సిట్)గా పోస్టింగ్ ఇచ్చింది. ఇక్కడ పని చేస్తున్న పి.విశ్వప్రసాద్ ఇటీవల తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) సభ్యులుగా నియమితులైన విషయం విదితమే. వెస్ట్జోన్ డీసీపీగా పని చేస్తున్న ఎస్ఎం విజయ్కుమార్ సిద్ధిపేట పోలీసు కమిషనర్గా వెళ్తున్నారు. ఆ స్థానంలోకి రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ బదిలీ అయ్యారు. సిద్ధిపేట సీపీ డాక్టర్ బి.అనురాధ ఎల్బీనగర్ జోన్ డీసీపీగా వస్తున్నారు. నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ రాజేంద్రనగర్ డీసీపీగా బదిలీ అయ్యా రు. ఏసీబీలో పని చేస్తున్న రితిరాజ్ను మాదా పూర్ డీసీపీగా ప్రభుత్వం నియమించింది. -
‘భవిష్యత్తు’కు బాటలు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో భారత్ ఫ్యూచర్ సిటీకి ఆదివారం ఉదయం అంకురార్పణ జరగబోతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ సిటీల తరహాలో ఈ కొత్త నగరానికి వడివడిగా బాటలు పడుతున్నాయి. ప్రపంచ బ్యాంకు సహా జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) ఆర్థిక సహాయంతో అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఫ్యూచర్సిటీ రూపుదిద్దుకోబోతోంది. ఇప్పటికే కందుకూరు మండలం మీర్ఖాన్పేట కేంద్రంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పనులను ప్రారంభించిన ప్రభుత్వం.. తాజాగా ఇదే కేంద్రంగా నిర్మించతలపెట్టిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) పరిపాలన భవనాలు సహా గ్రీన్ఫిల్డ్ రేడియల్ రోడ్డు–1కు జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి సీఎం రేవంత్రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. 56 గ్రామాలు.. 765 చదరపు కిలోమీటర్లు మొత్తం 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్సిటీ (ఫోర్త్ సిటీ)ని తీర్చిదిద్దనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు గ్రేటర్లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు.. ఏడు మండలాలు.. 56 రెవెన్యూ గ్రామాలు..765 చదరపు కిలోమీర్ల పరిధితో ఈ ఏడాది మార్చి 12న ఎఫ్సీడీఏను ఏర్పాటు చేసింది. సీనియర్ కలెక్టర్ శశాంకను కమిషనర్గా నియమించింది. కర్బన ఉద్గారాలు, ఇతర గ్రీన్హౌస్ వాయువులను పీల్చుకుని, మానవాళికి అవసరమైన ఆక్సిజన్ను ఇచ్చే వృక్ష సంపదను పెంచి, ఈ ప్రాంతాన్ని నెట్జీరో సిటీగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఇందుకోసం 15 వేల ఎకరాల్లో అర్బన్ఫారెస్ట్రీని అభివృద్ధి చేయనుంది. 13,973 ఎకరాలు.. పది జోన్లు ప్రభుత్వం ఇప్పటి వరకు సేకరించిన 13,973 ఎకరాల భూమిని పది జోన్లుగా విభజించింది. దీనిలో 34 శాతం భూమిని ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ పరిశ్రమలకు కేటాయించించింది. ఆ తర్వాత లైఫ్సైన్స్ (ఫార్మా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్) హబ్కు 30 శాతం ప్రాధాన్యం ఇచ్చింది. 9 శాతం భూమిని రెసిడెన్షియల్ మిక్స్డ్ యూజెస్ కోసం, మరో ఏడు శాతం రెసిడెన్షియల్ జోన్ కోసం కేటాయించింది. స్పోర్ట్స్ హబ్కు ఐదు, హెల్త్, ఎడ్యుకేషన్, వినోదం, పర్యాటకం కోసం మూడు శాతం చొప్పున, ఫర్నిచర్, ఏఐ సిటీల కోసం రెండు శాతం చొప్పున భూములు కేటాయించింది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) కూడా సిద్ధం చేసింది. మీర్ఖాన్పేట్, బేగరికంచె, ముచ్చర్ల, పంజాగూడ రెవెన్యూల పరిధిలో ఫోర్త్సిటీతో పాటు దానికి ఇరువైపులా విద్య, వైద్యం, పర్యాటక, క్రీడా సంస్థల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక జనావాసాలకు దూరంగా కుర్మిద్ద, కడ్తాల్ రిజర్వుడ్ ఫారెస్ట్కు ఆనుకుని ఉన్న భూములను ఫార్మా, ఆర్అండ్డీ పరిశ్రమలకు కేటాయించింది. 41.50 కి.మీ.. ఆరు లేన్లు ● రావిర్యాల ఇంటర్ఛేంజ్ నుంచి ఆమనగల్లు వరకు నిర్మించనున్న 41.50 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ రోడ్డు (రతన్ టాటా రోడ్డు) పనులను రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ రోడ్డును రెండు దశలుగా నిర్మించనున్నారు. ● మొదటి దశలో రావిర్యాల నుంచి (టాటా ఇంటర్ చేంజ్) నుంచి మీర్ఖాన్పేట్ వరకు 19.2 కిలోమీటర్లు పూర్తి చేస్తారు. ఇందుకోసం రూ.1,665 కోట్లతో అంచనాలు రూపొందించారు. ● రెండో దశలో మీర్ఖాన్పేట్ నుంచి ట్రిపుల్ఆర్ వద్ద ఆమనగల్లు వరకు రూ.2,365 కోట్లతో 22.3 కిలోమీటర్లు నిర్మించనున్నారు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం, కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లోని 14 గ్రామాలకు ఈ రోడ్డుతో అనుసంధానం ఏర్పడనుంది. ఫ్యూచర్ సిటీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి ప్రపంచ బ్యాంకు, జైకా ఆర్థిక సహాయంతో అభివృద్ధి అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ మౌలిక సదుపాయాలు ఎలక్ట్రానిక్, ఏఐ, హెల్త్, లైఫ్ సైన్సెస్, ఎడ్యుకేషన్ జోన్లు నేడు ఎఫ్సీడీఏ భవనం, రేడియల్ రోడ్డుకు సీఎం శంకుస్థాపన ఇది 100 మీటర్ల వెడల్పుతో కూడిన యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే. ఆరు లేన్ల ప్రధాన రహదారి (3+3 లేన్) ఈ రహదారిని భవిష్యత్తులో 8 లేన్లకు (4+4) విస్తరించే అవకాశం ఉంది. ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్డు మధ్యలోనే మెట్రో కారిడార్ కోసం 20 మీటర్ల భూమిని కేటాయిస్తారు. ఈ మార్గంలో ఎట్ గ్రేడ్ (భూ మార్గంలో) గా మెట్రో కారిడార్ రానుంది. గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు రెండు వైపులా 3–లేన్ల సర్వీస్ రోడ్లు ఉంటాయి. 2 మీటర్ల చొప్పున గ్రీన్బెల్ట్ను (పచ్చదనం) ఏర్పాటు చేస్తారు. రెండు వైపులా 3 మీటర్ల సైకిల్ ట్రాక్ నిర్మించనున్నారు. అలాగే 2 మీటర్ల వెడల్పుతో ఫుట్పాత్ ఉంటుంది. మరో 2 మీటర్ల యుటిలిటీ కారిడార్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. -
మైసిగండికి ట్రస్ట్ బోర్డు!
● వడివడిగా పడుతున్న అడుగులు ● ఇప్పటికే దేవాదాయ శాఖ నోటిఫికేషన్ ● సభ్యుల నియామకానికి ఉత్తర్వులు జారీ ● పదవి కోసం ఆశావహుల ప్రయత్నాలు కడ్తాల్: దక్షిణ తెలంగాణలోనే అత్యంత పేరుగాంచిన మైసిగండి మైసమ్మ శివాలయ, రామాలయ దేవస్థానం ట్రస్ట్ బోర్డు (నాన్– హెరిడిటరీ) ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. ఇప్పటికే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, మైసిగండి మైసమ్మ దేవత, శివ రామాలయాల ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకం కోసం ఈనెల 16న నోటిఫికేషన్ జారీ చేశారు. మైసిగండి మైసమ్మ ఆలయానికి ఏడాదికి రూ.50 లక్షల నుంచి రూ.కోటికి పైగా ఆదాయం సమకూరుతోంది. వార్షిక ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోగా 6ఏ ఆలయ హోదా పొందింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలకు పాలక మండళ్లు నియమించేందుకు దేవాదాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా మైసిగండి మైసమ్మ ఆలయానికి ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకానికి చర్యలు ప్రారంభించింది. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ ఆదేశాల మేరకు అధికారులు ఇప్పటికే త్తర్వులు జారీ చేశారు. వార్షికాదాయం ప్రకారం.. దేవాలయాల వార్షికాదాయం ప్రకారం పాలకమండలి సభ్యులను నియమించనున్నట్టు సమాచారం. వార్షికాదాయం రూ.2 లక్షలు మొదలు రూ.25 లక్షలు ఉంటే ఏడుగురు సభ్యులు, రూ.25 లక్షల నుంచి రూ.కోటికి పైగా ఉంటే 14 మంది సభ్యులను నియమించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో వార్షికాదాయం రూ.50 లక్షల నుంచి రూ.కోటి ఆపైన ఆదాయం ఉన్న మైసిగండి మైసమ్మ ఆలయానికి 14 మంది సభ్యులను నియమించే అవకాశం ఉంది. పాలక మండలి సభ్యులుగా నియమితులైన వారు ఏడాది పాటు పదవిలో కొనసాగనున్నారు. దేవాదాయ శాఖ గైడ్లైన్స్ ప్రకారం నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ఆసక్తి, అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలి. కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ హైదరాబాద్, జాయింట్ కమిషనర్ హైదరాబాద్, డిప్యూటీ కమిషనర్ హైదరాబాద్ జోన్, సహాయ కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ రంగారెడ్డికి నిర్ణీత నమూనాలో పంపించాలని అధికారులు సూచిస్తున్నారు. ట్రస్ట్ బోర్డు ఏర్పాటుతో అభివృద్ధి ఆది, మంగళ, గురువారాల్లో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ప్రత్యేకించి ఆలయం స్థానిక బంజారా ప్రజల సాంస్కృతిక, ఆధ్యాత్మిక భావాలను ప్రతిబింబిస్తోంది. ఆలయం మరింత అభివృద్ధి చెందేందుకు పాలకమండలి సభ్యుల నియామకం దోహదపడుతుందని స్థానికులు, భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఆలయ నిర్వహణ, భక్తులకు సౌకర్యాలు, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ, పారదర్శకత, జవాబుదారీ తనం పెరుగుతుందని ఆశిస్తున్నారు. ఎవరికి వారు పైరవీలు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుల పదవి కోసం ఆశవాహులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సామాజిక సేవ, ధార్మిక సంస్థలకు చెందిన పలువురు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. తమకు ఉన్న పరిచయాలతో ఆయా స్థాయిల్లో ప్రముఖులను ప్రసన్నం చేసుకునే పని ప్రారంభించారని వినికిడి. నేతల ఆశీస్సులు ఎవరి ఉంటాయే వారినే పదవులు వరించే అవకాశం ఉండడంతో, ఆ దిశగా తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారని ప్రచారం సాగుతోంది. -
భగత్సింగ్ స్ఫూర్తితో ఉద్యమిద్దాం
ఇబ్రహీంపట్నం: భగత్సింగ్ పోరాట స్ఫూర్తితో అసమానతలు లేని సమాజం కోసం ఉద్యమిద్దామని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేశ్ పిలుపునిచ్చారు. భగత్ సింగ్ 118వ జయంతిని పురస్కరించుకొని ఇబ్రహీంపట్నంలో శనివారం డీవైఎఫ్ఐ అధ్వర్యంలో భగత్సింగ్ సందేశ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, భారతదేశ విముక్తి కోసం స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం 23 ఏళ్ల ప్రాయంలోనే ఉరి కొయ్యకు ప్రాణాలర్పించిన వీర కిషోరం భగత్సింగ్ అని కొనియాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భగత్సింగ్ ఆలోచనలకు విరుద్ధంగా మతోన్మాద విధానాలతో తినే తిండి, కట్టే బట్టపై ఆంక్షలు విధిస్తోందని ఆరోపించారు. భగత్సింగ్ జీవిత చరిత్రను కనుమరుగు చేసేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భగత్సింగ్ జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శంకర్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి.జగన్, నాయకులు జంగయ్య, రాఘవేందర్, మహేశ్, వినోద్, లింగం, తరంగ్, శ్రీకాంత్, వంఽశీ, శివ పాల్గొన్నారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ -
కొండా లక్ష్మణ్ త్యాగం మరువలేనిది
మహేశ్వరం: తెలంగాణ ఉద్యమానికి కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన త్యాగం మరువలేనిదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా మండల కేంద్రంలో శనివారం ఆయన విగ్రహాన్ని పద్మశాలీ సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 1969లో తొలి దశ పోరాటంలోనే కీలక పాత్ర పోషించి, మంత్రి పదవిని కూడా త్యజించిన త్యాగశీలి బాపూజీ అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల కోసం ఆయన చేసి కృషి అభినందనీయమన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనపై కొండా లక్ష్మణ్ బాపూజీ ఆలుపెరగని పోరాటం చేశారన్నారు. ఆయన సిద్ధాంతాలను, ఉద్యమ స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్భూపాల్ గౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్, పీసీసీ సభ్యుడు దేప భాస్కర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చాకలి యాదయ్య, పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు బి.శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు కె.మనోహర్, మాజీ ఎంపీపీ ఎం.స్వప్న, శివగంగ ఆలయ మాజీ చైర్మన్ ఎం.నవీన్ తదితరులు పాల్గొన్నారు. త్యాగానికి ప్రతిరూపం కొండా బాపూజీ ఇబ్రహీంపట్నం రూరల్: త్యాగానికి ప్రతి రూపం కొండా లక్ష్మణ్ బాపూజీ అని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. 110వ జయంతి సందర్భంగా శనివారం కలెక్టరేట్లో వెనుకబడిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. స్వరాష్ట్ర సాధన కోం, బలహీన వర్గాల బలోపేతానికి కృషి చేశారని కొనియాడారు. తెలంగాణవచ్చే వరకు ఎలాంటి పదవులు అనుభవించకుండా త్యాగం చేశారన్నారు. నేటి తరానికి మార్గదర్శకులుగా నిలిచారన్నారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి కేశురాం, బీసీ సంఘల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి -
భయపెట్టిన మూసీ
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/సాక్షి, రంగారెడ్డి జిల్లా/పాపన్నపేట(మెదక్): హైదరాబాద్ నగరాన్ని మూసీ నది వణికించింది. దాదాపు మూడు దశాబ్దాలలో ఎన్నడూ చూడని విధంగా ఉగ్రరూపం దాల్చింది. పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తటంతో శుక్రవారం సాయంత్రం నుంచి నది గట్టుదాటి ప్రవహించింది. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జంట జలాశయాల గేట్లను ఒకేసారి ఎత్తడంతో శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా వరద వచ్చి నగరంపై పడింది. దీంతో ఎన్నడూలేని విధంగా మహాత్మాగాంధీ బస్స్టేషన్ (ఎంజీబీఎస్)ను వరద ముంచెత్తిన విషయం తెలిసిందే. శనివారం కాస్త శాంతించినప్పటికీ వరద ఉధృతి కొనసాగింది. ఎంజీబీఎస్ బస్స్టేషన్ను తాత్కాలికంగా మూసివేశారు. మూసీ పరీవాహక ప్రాంతాలైన బాపూఘాట్ నుంచి మూసారాంబాగ్ బ్రిడ్జి వరకు అనేక లోతట్టు ప్రాంతాలు, రోడ్లు, కాలనీలు నీటమునిగాయి. మూసానగర్, శంకర్నగర్, మలక్పేట తదితర చోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరటంతో దాదాపు 3,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.చాదర్ఘాట్ బ్రిడ్జి, ఎంజీబీఎస్ బస్స్టేషన్, మలక్పేటలోని పునరావాస కేంద్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందనతో కలిసి సందర్శించారు. వరద నీరు చేరటంతో చాదర్ఘాట్, మూసారాంబాగ్ కాజ్వేలను మూసివేశారు. మూసారాంబాగ్ కాజ్వే పక్కనే నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జిని సైతం వరద నీరు తాకింది. నార్సింగి, హిమాయత్సాగర్ వద్ద సర్వీస్ రోడ్డును మూసివేశారు. మంచిరేవుల – నార్సింగి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పూరానా పూల్ బ్రిడ్జి వద్ద మూసీ ప్రమాదకర స్థాయికి చేరింది. శివాలయం నీటమునిగింది. ఆలయ పూజారి కుటుంబం గుడిలోనే చిక్కుకుపోవడంతో హైడ్రా సిబ్బంది క్రేన్¯ సాయంతో బయటికి తీసుకొచ్చారు. మూసీ వరద ఉధృతిపై అధికారులతో సీఎం రేవంత్ ఆరా తీశారు. ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ, విద్యుత్తు విభాగాలన్నీ అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. కాస్త తగ్గిన వరద మూసీ నదికి శనివారం సాయంత్రానికి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. జంట జలాశయాల నుంచి మూసీలోకి వదులుతున్న వరద 36 వేల క్యూసెక్కుల నుంచి 15 వేల క్యూసెక్కులకు తగ్గింది. ఉస్మాన్సాగర్ జలాశయానికి 9,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా, 11 గేట్లు తొమ్మిది అడుగుల మేర ఎత్తి దిగువకు 9,284 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. హిమాయత్సాగర్కు ఎగువ నుంచి 7,000 క్యూసెక్కుల వరద వస్తుండగా, నాలుగు గేట్లు 5 అడుగుల మేర ఎత్తి దిగువకు 6,420 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వర్ష భీభత్సం రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో శనివారం భారీ వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. వీర్శెట్టిపల్లి, సంగెంకలాన్, జీవన్గీ గ్రామాలను వరద చుట్టుముట్టింది. ఓగిపూర్ సమీపంలోని సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్తూ జుట్టూరు వాగులో చిక్కుకున్న ఇద్దరు లారీ డ్రైవర్లను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. కాగ్నా నది ఉధృతికి యాలాల మండలంలోని కోకట్ బ్రిడ్జి తెగిపోయింది. దీంతో తాండూరు, పరిగి, హైదరాబాద్కు రాకపోకలు నిలిచిపోయాయి. విశ్వనాథ్పూర్ వాగు దాటే క్రమంలో కొందుర్గు మండలం వెంకిర్యాలకు చెందిన లింగమయ్య (42) కొట్టుకుపోయి మరణించాడు. కోట్పల్లి మండలం కొత్తపల్లికి చెందిన చింతకింది రవికుమార్ (35) కొత్తపల్లి చెరువు అలుగులో కొట్టుకుపోయిన చనిపోయాడు. బషీరాబాద్ మండలం జీవన్గీలోని కాగ్నా ఒడ్డున ఉన్న గోశాలను వరద ముంచెత్తటంతో గోవులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్, ఎస్పీ నారాయణరెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షించారు. సంగారెడ్డి జిల్లాలో శనివారం కూడా భారీ వర్షాలు కురిశాయి. మనూరు మండలంలో 9.2 సెం.మీల వర్షపాతం రికార్డయింది. సదాశివపేట మండలం పెద్దాపూర్లో ఉన్న హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు పంప్హౌజ్ పూర్తిగా నీట మునిగింది. దీంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాలకు నీటిసరఫరాలో అంతరాయం ఏర్పడింది. కొండాపూర్ మండలం సైదాపూర్ గ్రామ శివారులో రహదారి కొట్టుకుపోవటంతో సదాశివపేట, టేకులపల్లి, అనంతసాగర్, మోమిన్పేటల వైపు రాకపోకలు నిలిచిపోయాయి. మునిపల్లి మండలంలో పంటలు నీట మునిగాయి. పత్తి, సోయా పంటలు దెబ్బతిన్నాయి. జహీరాబాద్ ప్రాంతంలో కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొండాపూర్ మండలంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
బస్సెక్కు.. బహుమతి పట్టు
షాద్నగర్: దసరా సందర్భంగా మీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణించనున్నారా.. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సొంతూళ్లకు వెళ్తున్నారా.. అయితే మీరు నగదు బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని టీఎస్ఆర్టీసీ కల్పిస్తోంది. లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు అందించాలని నిర్ణయించింది. నేటి నుంచి అక్టోబర్ 6 వరకు ఈనెల 27 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు డీలక్స్, సూపర్ లగర్జీ, అన్ని ఏసీ బస్సుల్లో ప్రయాణించేవారికి నగదు బహుమతులు అందజేయనున్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద నగదు అందించనున్నారు. నిర్ణయించిన బస్సుల్లో ప్రయాణించే వారు బస్సులో తీసుకున్న టికెట్ వెనుక పేరు, ఫోన్ నంబర్, చిరునామా రాసి బస్సుల్లో, బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్సుల్లో వేయాలి. అక్టోబర్ 10న లక్కీ డ్రా అధికారులందరి సమక్షంలో అక్టోబర్ 10న లక్కీ డ్రా నిర్వహించనున్నారు. రీజియన్ పరిధిలో లక్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు మొదటి బహుమతి రూ.25వేలు, రెండో బహుమతి రూ.15వేలు, మూడో బహుమతి రూ.10వేలు ఇవ్వనున్నారు. ప్రత్యేక బస్సులు బతుకమ్మ, దసరా వేడుకల సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించనుంది. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు అధికంగా ప్రయాణించే ప్రాంతాలకు అదనపు బస్సులు నడిపిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో పలు డిపోల్లో అదనపు సరీ్వసులు తిరుగుతున్నాయి. -
సేల్స్మెన్ దారుణ హత్య
● జల్పల్లి శ్రీరామ కాలనీలో ఘటన ● స్నేహితుడే హంతకుడు పహాడీషరీఫ్: మంచి ఆదాయ మార్గంగా ఉన్న స్నేహితుడి పోస్ట్పై కన్నేసిన ఓ యువకుడు, అతన్ని దారుణంగా హత్య చేసిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం వెలుగుచూసింది. స్థానికులు, ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్కు చెందిన కొండకింది సురేందర్రెడ్డి జల్పల్లి శ్రీరామ కాలనీలోని తన షెడ్డును రాజస్థాన్కు చెందిన జగదీశ్ అనే వ్యక్తికి అద్దెకిచ్చాడు. ఇందులో ఖుష్బూ కలర్, కెమికల్స్ కంపెనీ నిర్వహణతో పాటు మిగిలిన స్థలంలో ముడి సరుకును నిల్వ ఉంచుతున్నారు. ఇందులో సన్వర్ మాల్ అనే వ్యక్తి సూపర్వైజర్గా, రాజస్థాన్కు చెందిన టెక్ చందు తివారీ (35) అనే యువకుడు సేల్స్మెన్గా పని చేస్తున్నారు. టెక్ చందు తివారీ అసిస్టెంట్గా తన స్నేహితుడు ఇమ్రాన్ను నియమించుకొని, కంపెనీలోని ఓ గదిలో నివాసం ఉంటున్నారు. రాజస్థాన్లో నివాసం ఉండే యజమాని కంపెనీపై అంతగా పర్యవేక్షణ చూపకపోవడంతో సేల్స్మెన్గా ఉన్న తివారీ వ్యాపారం మొత్తాన్ని తన కనుసన్నల్లో నడుపుతూ దండిగా డబ్బులు సంపాదించసాగాడు. ఈ విషయాన్ని తన అనుచరుడిగా ఉన్న ఇమ్రాన్తో పంచుకునేవాడు. ఈ క్రమంలోనే ఇమ్రాన్ కూడా తనకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలంటూ తివారీతో తరచూ గొడవ పడేవాడు. అయినప్పటికీ అతడు పెద్దగా పట్టించుకోకపోవడంతో, తివారీని మట్టుబెట్టితే ఆ పోస్ట్ తనకు వస్తుందని భావించాడు. రోజూ మాదిరిగానే శుక్రవారం ఉదయం 10 గంటలకు వీరి గదికి వెళ్లిన సన్వర్ మాల్కు.. టెక్ చందు తివారీ మంచంపై మృతి చెంది కనిపించాడు. వెంటనే యజమాని, పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా తివారీ తల వెనుక భాగంలో, కాలు, ఇతర భాగాలలో కత్తితో పొడిచిన గాయాలున్నాయి. మృతదేహం పక్కనే కత్తితో పాటు ఓ కర్ర లభ్యమైంది. తివారీ, ఇమ్రాన్ల నడుమ గొడవల కారణంగానే ఇమ్రాన్ హత్య చేసి పరారయ్యాడని సురేందర్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై హత్యానేరం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇమ్రాన్ కోసం గాలింపు చేపట్టారు. -
పని చేస్తున్న చోటే చోరీ
షాద్నగర్రూరల్: తాము పని చేస్తున్న గోదాంలోనే చోరీకి పాల్పడి లాకర్లో ఉన్న డబ్బులను దొంగిలించిన నిందితులను షాద్నగర్ పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు పట్టణ సీఐ విజయ్కుమార్ వెల్లడించారు. నందిగామ మండలం అప్పారెడ్డిగూడ గ్రామానికి చెందిన వత్తి శ్రీకాంత్, ఫరూఖ్నగర్కు చెందిన మొదంపల్లి మఽధు, షాద్నగర్లో నివాసం ఉంటున్న గుజరాత్ రాష్ట్రానికి చెందిన మౌలిక్ దిలీప్ బాయ్ దేవ్లు షాద్నగర్ శివారులోని జడ్చర్ల రోడ్డులో ఉన్న ఎన్టీఎక్స్ గ్రాసరీ గోదాంలో కొంత కాలంగా పని చేస్తున్నారు. గోదాంలోని సరుకులను వివిధ ప్రాంతాలకు వారు డెలివరీ చేయడంతో పాటుగా డబ్బులుకలెక్షన్ చేస్తున్నారు. అక్కడే మేనేజర్గా పని చేస్తున్న ప్రవీణ్ ఈనెల 17న కలెక్షన్ ద్వారా వచ్చిన రూ.4.21లక్షలు లాకర్లో ఉంచి ఇంటికి వెళ్లాడు. అదే రోజు రాత్రి గోదాంలో పని చేస్తున్న శ్రీకాంత్, మధు, మౌలిక్ దిలీప్ బాయ్ షెట్టర్ తాళాలను పగలగొట్టి లాకర్ను దొంగిలించారు. ఈ మేరకు గోదాం మేనేజర్ ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక నైపుణ్యంతో నగదు చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను షాద్నగర్, శంషాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నిందితుల నుంచి కారు, మూడు సెల్ఫోన్లు, రూ.12వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు -
డీజీపీగా తులేకలాన్ బిడ్డ
ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ నూతన డీజీపీగా నియమితులైన శివధర్రెడ్డి మన జిల్లా వాసే. ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ ఆయన స్వగ్రామం. తల్లిదండ్రులు రాజకిషన్రెడ్డి –రాజ్యలక్ష్మి. అక్కలు నర్సమ్మ, అరుణమ్మ, రుద్రమ్మ, తమ్ముడు రంగనాథ్రెడ్డి ఉన్నారు. వీరి చిన్నతనంలోనే తల్లి మరణించింది. తండ్రి కూడా అనతి కాలంలోని వారికి దూరమయ్యాడు. దీంతో మేనత్త అనంతమ్మ పెంపకంలో పెరిగాడు. ప్రాథమిక విద్య గున్గల్, తులేకలాన్ గ్రామాల్లో అభ్యసించాడు. అనంతరం రెండో అక్క నర్సమ్మ వద్ద హైదరాబాద్లోని లింబోలిఅడ్డాలో పెరిగాడు. చాదర్ఘాట్ బాలుర పాఠశాలలో విద్యాభ్యాసం సాగించాడు. ఇంటర్మీడియెట్ బడిచౌడిలోని చైతన్య కళాశాలలో, డిగ్రీ లక్డీకాపూల్లోని బీజేఆర్ డిగ్రీ కళాశాలలో, ఎల్ఎల్బీ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాడు. వ్యవసాయ పనులు చూస్తూ.. అప్పట్లో కూలీలు హర్తాల్ చేసే సమయంలో గ్రామానికి వస్తుండేవాడు. అప్పుడప్పుడు వ్యవసాయ పనులు చూసుకోవడం చేస్తుండేవాడు. ఎప్పుడూ చేతిలో కెరియర్ గైడెన్స్ పుస్తకం పట్టుకొని చదువుతుండడం అలవాటు. కెప్టెన్ లింగాల పాండురంగం అనే రిటైర్డ్ ఆర్మీమెన్ దగ్గర శిశ్యరికం చేస్తుండేవాడు. లా చదువుకొని న్యాయవాద వృత్తిలో కొనసాగుతుండగానే సివిల్ సర్వీసెస్ పరీక్ష రాశాడు. 1994లో ఐపీఎస్గా ఎంపికయ్యాడు. వివిధ హోదాల్లో.. మొదటి పోస్టింగ్ ఏఎస్పీగా విశాఖపట్నంలోని అనకాపల్లిలో వచ్చింది. నర్సీపట్నం, చింతపల్లిలో పని చేశారు. గ్రేహౌండ్స్, స్క్వాడ్రన్ కమాండర్గా, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్లగొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా సేవలందించారు. ఎస్పీగా, డీఐజీ, ఎస్ఐబీగా మావోయిస్టుల అణిచివేతలో కీలకపాత్ర పోషించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్గా వ్యవహరించారు. పేదల సంక్షేమానికి తోడ్పాటు గ్రామస్తులతో శివధర్రెడ్డికి ఎనలేని అనుబంధం ఉంది. ఏటా దసరా, సంక్రాంతి పండగలకు గ్రామానికి విచ్చేసి స్థానికులతో మమేకమవుతుంటారు. గ్రామం అభివృద్ధిలో భాగంగా పేదలకు సొంత భూమిలో ఇళ్ల స్థలాలకు భూమి ఇచ్చారు. అంబేడ్కర్ భవనానికి, చర్చికి స్థలాలు కేటాయించారు. లైబ్రరీ నిర్మాణం కోసం కృషి చేశారు. అక్కాచెల్లెళ్ల వివాహాల కోసం వారికి భూములు రిజిస్ట్రేషన్లు చేశారు. ఇబ్రహీంపట్నం, తులేకలాన్ అంటే ఆయనకు ఎనలేని అభిమానం. డీజీపీగా తమప్రాంతంవాసి నియమితులు కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. పోలీస్బాస్గా శివధర్రెడ్డి నియామకం స్వగ్రామంలో సామాజిక కార్యక్రమాలు గ్రామ ప్రజలతో అనుబంధం -
ఆర్టీసీ బస్సుల రద్దు
బంట్వారం: బంట్వారం, కోట్పల్లి మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కంకణాలపల్లి, నూరుల్లాపూర్ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వికారాబాద్, కోట్పల్లి లోకల్ బస్సును శుక్రవారం పూర్తిగా రద్దు చేశారు. ధారూరులో కుండపోత ధారూరు: కుండపోత వానకు మండలంలోని మోమిన్కుర్దు–మోమిన్కలాన్, హరిదాస్పల్లి–చింతకుంట, నాగారం–మైలారం, తరిగోపుల–జైదుపల్లి గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. దాదాపు 13 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. రుద్రారం–నాగసమందర్ గ్రామాల మధ్య కోట్పల్లి ప్రాజెక్టు అలుగు నీరు ప్రవహిస్తున్నాయి. -
శనివారం శ్రీ 27 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
షాబాద్: పారుతున్న పహిల్వాన్ చెరువు అలుగు రోజంతా వాన సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లాలో వర్షం దంచి కొట్టింది. వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. చెరువులు, కుంటలు మత్తడి దూకాయి. జిల్లేడు చౌదరిగూడ మండలం గుర్రంపల్లి గ్రామానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తి వాగు దాటుతూ వరదలో కొట్టుకుపోయి చనిపోయాడు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భారీ వర్షంతో జనజీవనం పూర్తిగా స్తంభించి పోయింది. ఓఆర్ఆర్ సహా విజయవాడ జాతీయ రహదారితో పాటు చేవెళ్ల, శ్రీశైలం, షాద్నగర్ జాతీయ రహదారులపైకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. షాబాద్లో అత్యధిక వర్షపాతం తెలంగాణలోనే అత్యధికంగా షాబాద్ మండలం తాళ్లపల్లిలో 10.50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, మండల కేంద్రంలో 10.23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చందనవెల్లిలో 8.63 సెం.మీ, మొగిలిగిద్దలో 7.95 సెం.మీ, కొందుర్గులో 7.60 సెం.మీ, చౌదరిగూడ మండలం కాసులాబాద్లో 6.78 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈసీ, మూసీ వాగులకు వరద పోటెత్తడంతో జంట జలాశయాల గేట్లు బార్లా తెరిచారు. జంట జలాశయాల నుంచి నీటి విడుదల స్తంభించిన జనజీవనం రాకపోకలకు అంతరాయం నీట మునిగిన పంటలు -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గ్యార పాండు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం డీపీఓ సురేష్ మోహన్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 3,116 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారని తెలిపారు. నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పండగ పూట పంచాయతీ కార్మికులను పస్తులుంచడం తగదని పేర్కొన్నారు. న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు పోచమోని కృష్ణ, ఎస్.చందునాయక్, శ్రీను, జోగు మాధవి, జాపాల జంగయ్య, దేవదాస్, కవిత, కృష్ణ, పాండు, భాస్కర్, కవిత, శంకరయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. జీపీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పాండు -
అలుగు కాలువ తవ్వకం
● తొర్రూరు–బ్రాహ్మణపల్లి రహదారిలో పనులు ● హైడ్రా, ఇరిగేషన్ అధికారులను అడ్డుకున్న రైతులుతుర్కయంజాల్: తొర్రూరు బ్రాహ్మణపల్లి రోడ్డులో శుక్రవారం హైడ్రా అధికారులు అలుగు కాలువ తవ్వడంతో స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ పరిధి తొర్రూరు ఎర్రకుంటలోని నీరు దిగువకు వెళ్లేలా తొర్రూరు–బ్రాహ్మణపల్లి రహదారిలో అలుగు నిర్మాణం చేపట్టేందుకు గత సంవత్సరం ఇరిగేషన్ అధికారులు పనులు ప్రారంభించగా స్థానిక రైతుల ఆందోళనతో తాత్కాలికంగా నిలిపివేశారు. అలుగు నిర్మాణం కోసం రోడ్డును తవ్విన అధికారులు తిరిగి పునరుద్ధరించకపోవడంతో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు రహదారిలో పూర్తిగా వరదనీరు నిలిచి రాకపోకలు నిలిచిపోయాయి. ఇరు ప్రాంతవాసుల విజ్ఞప్తి మేరకు తాజాగా హైడ్రా, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల అధికారులు ఎర్రకుంట కాలువ తవ్వకం చేపట్టారు. ఈ క్రమంలో అలుగు దిగువన తమ భూమి నుంచి కాలువను తీయొద్దంటూ తొర్రూరుకు చెందిన రైతులు రాజ్కిరణ్, ఇందిరమ్మ కుటుంబ సభ్యులు హైడ్రా అధికారులను అడ్డుకున్నారు. రాజకీయ ఒత్తిళ్లతోనే తమ పొలం నుంచి కాలువ తీస్తున్నారని, తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రకుంట చెరువు దిగువన కొందరి భూములను ఎఫ్టీఎల్ పరిధి నుంచి తొలగించడానికే అలుగు లేని చోట నుంచి కాలువ తవ్వుతున్నారని ఆరోపించారు. హైడ్రా అధికారులు వారిని అదుపులోకి తీసుకుని తవ్వకం చేపట్టారు. అనంతరం హైడ్రా అధికారి తిరుమలేష్ మాట్లాడుతూ.. తొర్రూరు– బ్రాహ్మణపల్లి రహదారిలో నీరు భారీగా నిలిచిపోవడంతో ఇరు ప్రాంతాలకు రాకపోకలు ఆగిపోయాయని తెలిపారు. ప్రస్తుతం వరదనీరు వెళ్లడానికి కాలువ తవ్వుతున్నామని, ఇంకా అలుగు నిర్ధారణ కాలేదని స్పష్టం చేశారు. నిర్ధారణ అయిన తరువాతే అలుగు నిర్మాణం చేపట్టి కాలువను పూర్తి స్థాయిలో తవ్వుతామని వెల్లడించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఇరిగేషన్ డీఈ చెన్నకేశవరెడ్డి, ఏఈ వంశీధర్గౌడ్, తుర్కయంజాల్ మున్సిపాలిటీ టౌన్ప్లానింగ్ విభాగం అధికారి దినేష్, హయత్నగర్ పోలీసులు, హైడ్రా సిబ్బంది పాల్గొన్నారు. -
అప్రమత్తం చేసిన రెవెన్యూ యంత్రాంగం
రోజంతా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండటంతో అత్యవసర పనులున్న వారు మినహా ఇతరులెవరూ ఇంటి గడపదాట లేదు. వర్షానికి చలిగాలులు తోడవడంతో చిన్నారులు, వృద్ధులు రోజంతా దుప్పట్లోనే ముసుగేసి కన్పించారు. చెరువులు, కుంటలు పొంగి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను జిల్లా రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తం చేసింది. శంకర్పల్లి మండలం టంగుటూరు వద్ద మూసీ వాగు పొంగి ప్రవహిస్తుండటంతో స్థానికులను అలెర్ట్ చేసింది. హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ దిగువ ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసింది. శిథిల భవనాల నుంచి తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. -
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం
కందుకూరు: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం సానుకూల ధృక్పథంతో ముందుకెళ్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. మండల కేంద్రంలోని శుభం కన్వెన్షన్లో శుక్రవారం జిల్లా టీడబ్ల్యూజేఎఫ్ మూడో మహాసభలు నిర్వహించారు. సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులు సమాజానికి అద్దం పట్టే వృత్తిదారులని, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపు, విద్యార్థులకు ఫీజు రాయితీ, ఆరోగ్య భద్రత వంటి అంశాలను దశలవారీగా పరిష్కరిస్తామన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఇళ్ల స్థలాల విషయంలో సందిగ్ధత ఏర్పడిందని, న్యాయ నిపుణులు సూచించిన మార్గంలో న్యాయం చేసేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నవీన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పి.కార్తీక్రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు చిలకమర్రి నర్సింహ, సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, పీసీసీ ప్రధానకార్యదర్శి ఏ.జంగారెడ్డి, పీసీసీ సభ్యుడు దేప భాస్కర్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బి.జంగారెడ్డి, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సోమయ్య, బస్వపున్నయ్య, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సత్యనారాయణ, సైదులు, సంఘం నాయకులు పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్బాబు -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
యాచారం: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని డీఆర్డీఓ శ్రీలత పేర్కొన్నారు. స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని గడ్డమల్లయ్యగూడలో శ్రమదానం నిర్వహించి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వర్షాలు కురుస్తున్న దృష్ట్యా తాగునీటి ట్యాంకులను శుభ్రంగా ఉంచుకోవాలని, తాగునీటి పైపులు లీకేజీ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏటా మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ చరణ్సింగ్, ఎంపీడీఓ రాధారాణి, ఎంపీఓ శ్రీలత, ఏపీఓ లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమమే లక్ష్యం
ఆమనగల్లు: అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనలో పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందని తెలిపారు. మున్సిపల్ పరిధిలో రూ.10 కోట్లతో నిర్మించే సీసీ రోడ్లు, భూగర్భ మురుగుకాలువలు, సురసముద్రం చెరువు సుందరీకరణ పనులకు గురువారం రాత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పనిచేసే ప్రభుత్వానికి ప్రజలంతా అండగా ఉండాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శంకర్, పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్గౌడ్, పీసీసీ కార్యదర్శి మధుసూదన్రెడ్డి, మార్కెట్చైర్మన్ యాట గీత, వైస్ చైర్మన్ భాస్కర్రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్, పట్టణ అధ్యక్షుడు మాణయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఎల్మినేడు హెచ్ఎంకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
ఇబ్రహీంపట్నం రూరల్: ఎల్మినేడు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కలమండల శ్రీనివాస్ను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వరించింది. విద్యార్థుల్లో ఆసక్తి పెంచుతూ వినూత్న రీతిలో బోధన చేస్తున్నందుకు శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోని బిర్లా ఆడిటోరియంలో గురువారం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు అందజేశారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఇటికాల పురుషోత్తం, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, సినీనటులు రఘు కరుమంచి, పసునూరి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. ఎల్మినేడు గ్రామ సభ్యులు చక్రపాణి, విజయేందర్ శుభాకాంక్షలు తెలిపారు. -
ఓయూలో ఎన్నికల హోరు
లాలాపేట: ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగాల సంఘాల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ నెల 27న పలు ఉద్యోగ సంఘాల ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో గురువారం ఎన్జీఓస్ స్టాఫ్ అసోసియేషన్ అబ్దుల్ కదీర్ ఖాన్, బి. వెంకటేశ్ ప్యానెల్ 43 హామీలతో రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఓయూ లోని నాన్ టీచింగ్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్జీఓస్ స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్ష అభ్యర్థి అబ్దుల్ కదీర్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అభ్యర్థి బి.వెంకటేశ్ మాట్లాడుతూ.. తమ ప్యానెల్లోని 9 మందిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. తాము గెలిస్తే ఉద్యోగుల సంక్షేమానికి, వారి హక్కుల పరిరక్షణకు పాటుపడతామన్నారు. ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు, సీపీఎస్, ఓపీఎస్ విధానం అమలు చేయిస్తామన్నారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. -
దీన్ దయాల్ సేవలు మరువలేనివి
చేవెళ్ల: సమాజ సేవ, భారతీయ భావాలను ప్రపంచానికి చాటిన వ్యక్తి దీన్దయాల్ ఉపాధ్యాయ అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. దీన్దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా మండలకేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం ఆయ న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించా రు. పుష్కరణి సమీపంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంకోసం పనిచేసిన నాయకుల్లో ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారన్నారు. కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు ఎ.అనంత్రెడ్డి, యువ నాయకుడు డాక్టర్ మల్గారి వైభవ్రెడ్డి, నాయకులు కుంచం శ్రీనివాస్, వెంకట్రాంరెడ్డి, కృష్ణ, మధుసూదన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, బాలయ్య, ప్రవీణ్రెడ్డి పాల్గొన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి -
నిషేధిత జాబితా భూములపై ఆరా
హైకోర్టు ఆదేశాల మేరకు కదిలిన రెవెన్యూ యంత్రాంగంసాక్షి, రంగారెడ్డిజిల్లా: నిషేధిత జాబితాలో ఉన్న భూములపై జిల్లా రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించింది. హైకోర్టు ఆదేశాల మేరకు గ్రామాల వారీగా ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్, వక్ఫ్, దేవా దాయ, సీలింగ్ భూములు సహా ఏసీబీ, సీబీఐ, ఈడీ, కోర్టు కేసులున్న భూముల సర్వే నంబర్లు, విస్తీర్ణం ప్రకారం ప్రత్యేక జాబితాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. నిజానికి ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. జాబితా రూపకల్ప నపై క్షేత్రస్థాయి అధికారులకు పలు అనుమానాలు తలెత్తడంతో వివరాల సేకరణలో జాప్యం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం కలెక్టర్ నారాయణరెడ్డి ఇదే అంశంపై సంబంధత రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల తహసీల్దార్లతో చర్చించి స్పష్టత ఇచ్చారు. 80 శాతం భూముల డేటాను ఇప్పటికే సేకరించి కలెక్టరేట్కు చేరవేశారు. రెండు మూడు రోజుల్లో మిగిలిన ప్రక్రియ పూర్తికానుంది. ఈ నెలాఖరులోగా తుది జాబితా సిద్ధం చేసి హైకోర్టుకు సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఐజీఆర్ఎస్లో ఒకలా.. రెవెన్యూలో మరోలా భూ రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. పర్యవేక్షణ లోపానికి తోడు రెవెన్యూ యంత్రాంగంలో నెలకొన్న అవినీతి, అక్రమాలతో అనేక ప్రభుత్వ భూములు ఇప్పటికే అన్యాక్రాంతమయ్యాయి. జిల్లాలో మొత్తం 12,43,035 ఎకరాల భూములు ఉండగా, వీటిలో 2,18,530.2 ఎకరాల ప్రభుత్వ, 64,803 ఎకరాలు అటవీ, 90,911 ఎకరాలు అసైన్డ్, 21,931.03 ఎకరాల భూదాన్, 9,360.01 ఎకరాల దేవాదాయ, 14,785.17 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయి. ఇక 9000కు పైగా సీలింగ్ భూములు ఉన్నట్లు అంచనా. సర్వే నంబర్లు, విస్తీర్ణానికి విరుద్ధంగా రికార్డులు ఉన్నాయి. భూ విస్తీర్ణానికి మించి పట్టాదారు పాసుపుస్తకాలు జారీ అయ్యాయి. పాత పహాణీలకు భిన్నంగా ధరణి, భూ భారతి పోర్టల్లో భూముల స్వభావం, సర్వే నంబర్లు, విస్తీర్ణం, కాస్తులో ఉన్న రైతుల పేర్లు నమోదయ్యాయి. పట్టా భూములు అసైన్డ్ భూములుగా.. సీలింగ్ భూములు పట్టాగా రికార్డయ్యాయి. సర్వే నంబర్లో ఒక రైతు కోర్టుకు వెళ్తే.. మిగిలిన రైతుల భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. పట్టా భూములను అసైన్డ్, సీలింగ్గా రికార్డు చేయడాన్ని సవాల్ చేస్తూ వందలాది మంది రైతులు కోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ రికార్డుల్లో ఒకలా.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో మరోలా వివరాలు నమోదై ఉండటాన్ని హైకోర్టు సీరియస్గా తీసుకుంది. నిషేధిత జాబితాలో ఉన్న రికార్డులను పక్కగా సేకరించి పంపాల్సిందిగా రెవెన్యూశాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఆ పనిలో నిమగ్నమైంది. గ్రామాల వారీగా వివరాల సేకరణలో అధికారులు నిమగ్నం రెండు మూడు రోజుల్లో పూర్తి కానున్న ప్రక్రియ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లశాఖతో అనుసంధానం చేయనున్న ప్రభుత్వం22–ఎలో ప్రభుత్వ, అసైన్డ్ భూముల వివరాలు ఉండగా, 22–1బిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన భూములు, 22–1సీలో వక్ఫ్, భూదాన్, దేవాదాయశాఖలకు సంబంధించిన భూములు, 22–1డిలో సీలింగ్ భూముల వివరాలు ఉంటాయి. 22–1ఇలో ఐటీ, ఈడీ, ఏసీబీ అటాచ్ చేసిన భూముల వివరాలతో పాటు కోర్టు కేసులకు సంబంధించిన సర్వే నంబర్లు ఉంటాయి. రెవెన్యూ రికార్డుల్లో ఒకలా .. రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ విభాగంలో మరోలా వివరాలు నమోదై ఉండటం అనేక వివాదాలకు కారణమవుతోంది. నిషేధిత జాబితా నుంచి తమ పట్టా భూములకు విముక్తి కల్పించాల్సిందిగా బాధితులు జిల్లా రెవెన్యూ యంత్రాం గానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేక పోవడంతో వారంతా కోర్టును ఆశ్రయించారు. రెండు ప్రభుత్వ విభాగాల్లో ఆయా భూముల వివరాలు వేర్వేరుగా నమోదై ఉండటాన్ని కోర్టు తప్పు పట్టింది. పదిహేను వారాల్లోగా నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలను సమర్పించాల్సిందిగా ఆదేశించింది. రెండు రోజుల క్రితమే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నా క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారుల్లో తలెత్తిన సందేహాలు జాప్యానికి కారణమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. రెవెన్యూ శాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా ఎస్ఆర్ఓల భూ జాబితాలోనూ మార్పులు చేర్పులు చేపట్టే అవకాశం ఉంది. -
అన్నదాతల గోస పట్టదా?
యాచారం: అన్నదాతలు గోస తీస్తున్నా పాలకులకు పట్టింపులేదని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొంతం మాధవరెడ్డి విమర్శించారు. రైతులకు అవసరమైన యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ గురువారం యాచారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్నం పెట్టే రైతులు పంటలు పండించడానికి కావాల్సిన ఎరువులు కోసం కడుపు మాడ్చుకుని తెల్లవారుజామునే పీఏసీఎస్ల ముందు క్యూలో ఉండాల్సిన దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు పూర్తి స్థాయిలో యూరియా అందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ అయ్యప్పకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా నారాయణరెడ్డి, నాయకులు జగన్ మోహన్రెడ్డి, శ్రీకాంత్, విజయ, అలీముద్దీన్, నీలమ్మ, అనంత్రెడ్డి, అండాలు తదితరులు పాల్గొన్నారు. -
మురుగు శుద్ధిలో ముందడుగు
● నేడు 39 అమృత్ ఎస్టీపీలకు సీఎం శంకుస్థాపన ● ఆరు ఎస్టీపీలను ప్రారంభించనున్న రేవంత్రెడ్డి సాక్షి, సిటీబ్యూరో: దక్షిణాసియాలోనే వంద శాతం మురుగును శుద్ధి చేసే తొలి నగరంగా రికార్డు సృష్టించేందుకు మహా హైదరాబాద్ సిద్ధమవుతోంది. రాబోయే పదేళ్ల వరకు ఉత్పత్తయ్యే మురుగును సైతం శుద్ధి చేసేందుకు ముందస్తు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో జలమండలి అడుగులు వేస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద మంజూరైన ఎస్టీపీల నిర్మాణాలకు సిద్ధమైంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 39 ప్రాంతాల్లో సుమారు 972 ఎమ్మెల్డీల సామర్థ్యంతో నిర్మించే ఎస్టీపీల పనులకు శుక్రవారం అంబర్పేట వద్ద సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న మరో 6 ఎస్టీపీలను ఆయన లాంఛనంగా ప్రారంభించనున్నారు. రెండేళ్లలో నిర్మాణాలు పూర్తయ్యేలా.. కేంద్రం అమృత్ 2.0 పథకం కింద మంజూరు చేసిన 39 మురుగు నీటి శుద్ధి కేంద్రాలను రెండు ప్యాకేజీల కింద నిర్మాణాలను పూర్తి చేసేలా జలమండలి చర్యలు చేపట్టింది. మొత్తం ఎస్టీపీల్లో ఒకటి పీపీపీ మోడ్లో.. మిగిలిన రెండు ప్యాకేజీల్లో 38 హైబ్రిడ్ అన్నూయిటీ మోడల్ (హ్యామ్)విధానంలో నిర్మాణ పనులు పూర్తి చేయనున్నారు. ప్యాకేజీ–1లో 16 ఎస్టీపీలు, ప్యాకేజీ–2లో 22 ఎస్టీపీలు నిర్మిస్తారు. మొత్తం అంచనా సుమారు రూ.3,849.10 కోట్లు. ఇందులో ఎస్టీపీల నిర్మాణ వ్యయం రూ. 2,569.81 కోట్లు. 15ఏళ్ల పాటు నిర్వహణకు రూ.1,279.29 కోట్లు వెచ్చించనున్నారు. ఎస్టీపీల ప్రాజెక్టుల నిర్మా ణ వ్యయంలో కేంద్రం 30శాతం, రాష్ట్రం30 శాతం, నిర్మాణ సంస్థ 40 శాతం నిధులు సమకూర్చనుంది. పదేళ్లలో 2,850 ఎమ్మెల్డీ మురుగు శుద్ధి రాబోయే పదేళ్లలో మురుగు ఉత్పతి 2,815 ఎమ్మెల్డీ కావచ్చని జలమండలి అంచనా వేస్తోంది. అమృత్ 2.0 కింద 39 ఎస్టీపీలు పూర్తయితే 2,850 ఎమ్మెల్డీలను శుద్ధి చేసే అవకాశం ఉంటుందని భావిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో రోజువారీగా 1950 మిలియన్ లీటర్ గ్యాలన్ల (ఎమ్మెల్డీ) మురుగు నీరు ఉత్పన్నమవుతోంది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 1,650 ఎమ్మెల్డీ ఉంటుంది. ఇప్పటికే 37 ఎస్టీపీల ద్వారా 1,444 ఎమ్మెల్డీ మురుగు నీటిని శుద్ధి చేస్తోంది. మరో 332.5 ఎమ్మెల్డీ సామర్థ్యం గల ఆరు ఎస్టీపీలు అందుబా టులో రానున్నాయి. మిగిలిన రెండు పూర్తయితే 1,878 ఎమ్మెల్డీల మురుగు శుద్ధి చేయొచ్చు. -
పార్కు స్థలాల పరిరక్షణకు చర్యలు
తుర్కయంజాల్:ప్రజా ప్రయోజనార్థం వదిలిన భూములు, పార్కు స్థలాల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ కె.అమరేందర్రెడ్డి తెలిపారు. పురపాలక సంఘం పరిధి ఇంజాపూర్లోని సర్వే నంబర్ 95లోని 4వేల గజాల భూమికి చుట్టూ ప్రహరీ నిర్మిస్తుండగా గురువారం స్థానిక రైతులు కొందరు అడ్డుకున్నారు. దీంతో కమిషనర్ ఆదేశాల మేరకు డీఈ భిక్షపతి, ఏఈ చంద్రశేఖర్ రెడ్డిలు అక్కడికి చేరుకుని రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ.. మున్సిపాలిటీకి 4వేల గజాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉందని, దాని ప్రకారమే టెండర్ పిలిచి నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే సర్వే చేయించుకోవాలని, భూమి మీదని తేలితే నిర్మాణ పనులను నిలిపివేస్తామని తెలిపారు. -
యువతి కిడ్నాప్ కేసులో ముగ్గురి అరెస్ట్
కీసర: నవ వధువును బలవంతంగా తీసుకెళ్లిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకుందన్న కారణంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సంపల్లిలో శ్వేత అనే యువతిని ఆమె తల్లిదండ్రులు బుధవారం బలవంతంగా లాక్కెళ్లారు. దీంతో శ్వేత భర్త ప్రవీణ్ అతడి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని కోరుతూ గురువారం కీసర పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు చేపట్టారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఆంజనేయులు మాట్లాడుతూ శ్వేత కిడ్నాప్ కేసులో ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. శ్వేత ఆచూకీ కోసం రెండు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఎస్.ఐ శ్రీనివాస్రెడ్డితో శ్వేత తండ్రి ఫోన్లో మాట్లాడించారు. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రుల వద్ద క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే ఆమెను కీసర పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి భర్తకు అప్పగించనున్నట్లు తెలిపారు. -
అన్నదాతకు ఆసరా
కిసాన్ మాన్ధన్తో ఆర్థిక చేయూత ● వృద్ధాప్యంలో రైతులకు పింఛన్ ప్రయోజనం షాబాద్: అన్నదాతలకు సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. రైతులు వ్యవసాయం చేస్తున్న సమయంలోనే చాలా పథకాలు ఉపయోగ పడుతున్నాయి. వృద్ధాప్యంలో రైతులు ఆదాయ మార్గాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకు వయసులో ఉండగానే కొంత ప్రీమియం చెల్లిస్తే వృద్ధాప్యంలో ప్రతీ నెల పింఛన్ రూపంలో ఆదాయం అందేలా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. 60 ఏళ్లు నిండిన రైతులకు ప్రతీ నెలా రూ.3వేల పింఛన్ అందించడం ఈ పథకం ఉద్దేశం. నెలకు రూ.55 మాత్రమే 18–40 ఏళ్లున్న రైతులు ప్రతీ నెలా వారి వయసుల ప్రకారం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 18 నుంచి 20 ఏళ్లు వరకు రూ.55లు చెల్లించాల్సి ఉంటుంది. రైతు రూ.55 చెల్లిస్తే కేంద్రం తన వాటాగా రూ.55 చెల్లించి మొత్తం రూ.110 ప్రీమియం చెల్లిస్తుంది. ఇలా 40 ఏళ్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత సంబంధిత రైతుకు నెలకు రూ.3వేల పింఛన్ అందుతుంది. ఒకవేళ రైతు మరణిస్తే వారి నామినికి రూ.1,500 పింఛన్ అందజేస్తారు. ఎవరు అర్హులు 18–40 ఏళ్లు ఉండి.. ఐదెకరాల లోపు భూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు. సొంత భూమి కలిగి పట్టా పాసుపుస్తకం ఉండాలి. జాతీయ పింఛన్ పథకం(ఎన్పీఎస్), ఈపీఎఫ్ పరిధితో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపన్ను చెల్లింపుదారులు అనర్హులు. దరఖాస్తు సులువే పీఎం కిసాన్ మాన్ధన్ పింఛన్ కోసం ఆసక్తి, అర్హత ఉన్న రైతులు సమీపంలోని మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని రైతు నామిని, ఆధార్ కార్డు వివరాలు నమోదు చేయాలి. అనంతరం పింఛన్ కార్డు వస్తుంది. పీఎం కిసాన్ పథకానికి అనుసంధానమైన బ్యాంకు నుంచి ప్రీమియం నగదు చెల్లించాలి. ఆధార్ కార్డు, భూమి రికార్డు, బ్యాంకు ఖాతా పత్రాలు ఉండాలి. అవగాహన కల్పిస్తున్నాం కిసాన్ మాన్ధన్ పథకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రైతు వేదికల్లో జరిగే సమావేశాలతో పాటు వ్యక్తిగతంగా తెలియజేస్తున్నాం. ఈ పథకం వృద్ధాప్యంలో ఎంతో ఆసరాగా నిలుస్తుంది. ఆసక్తి ఉన్న రైతులు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు మండల వ్యవసాయ అధికారి కార్యాలయాల్లో సంప్రదించండి. – కృష్ణమోహన్, ఏఓ, షాబాద్ ప్రీమియం చెల్లింపు ఇలా.. వయసు 18–20 21–24 25–29 30–34 35–39 40 ఫీజు రూ.55 61 80 106 150 200 -
వృద్ధులకు పోలీసుల కొండంత అండ
పహాడీషరీఫ్: నవ మాసాలు మోసి కనిపెంచిన పిల్లలు పట్టించుకోకపోవడంతో అనాథలైన వృద్ధులు.. పిల్లలు విదేశాలలో ఉంటూ యోగా క్షేమాలు పట్టించుకోకపోవడంతో ఒంటరైన వయోజనులకు రాచకొండ పోలీసులు బాసటగా నిలుస్తున్నారు. రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సౌజన్యంతో కమిషనర్ సుధీర్ బాబు పర్యవేక్షణలో కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్లలో ఒంటిరిగా ఉంటున్న వయో వృద్ధులకు పోలీసులు అండగా ఉండేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గురువారం పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేందర్ రెడ్డి స్థానికంగా ఉన్న దేవేందర్ నగర్ కాలనీ, రంగ నాయకుల కాలనీలలో నా అనే వారు లేక ఒంటరి జీవితం గడుపుతున్న వారిని గుర్తించి, వారి ఇళ్ల వద్దకే ఎస్ఐ దయాకర్ రెడ్డితో కలిసి స్వయంగా వెళ్లి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసి ఆహార పదార్థాలతో కూడిన కిట్లను అందజేశారు. ఒంటరిగా జీవనం వెళ్లదీస్తున్న పెద్దలు ఎవరూ కూడా అధైర్య పడరాదని సూచించారు. సమాజంలో పౌరులకు ఆపద సమయంలో కూడా సేవలందించేందుకు పోలీస్ వ్యవస్థ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. -
విద్యుత్ తీగల చోరీ ముఠా అరెస్ట్
కడ్తాల్: పలు వెంచర్లలో విద్యుత్ తీగల చోరీకి పాల్పడుతున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ మేరకు సీఐ గంగాధర్ పోలీస్ స్టేషన్లో వివరాలను వెల్లడించారు. మండల పరిధిలోని వివిధ వెంచర్లలో ఇటీవల దుండగులు విద్యుత్ స్తంభాల నుంచి అల్యూమినియం తీగలను రాత్రి వేళలో ఎత్తుకెళ్లారు. ఈ మేరకు యాజ మానులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గురువారం హైదరాబాద్ నుంచి ఆమనగల్లు వైపు అనుమానాస్పదంగా వెళుతున్న కారులో ముఠాను పోలీసులు తనిఖీ చేశారు. వీరు ఉత్తర్ప్రదేశ్కు చెందిన సత్యం చౌబే, ధీరజ్కుమార్, ఒడిశాకు చెందిన జనరోహన్, బిహా ర్కు చెందిన శ్యామ్బాబురామ్గా గుర్తించారు. జల్సాలకు అలవాటు పడిన వీరు బృందంగా ఏర్ప డి నగరంలోని జీడిమెట్ల ఉంటూ చోరీలు పాల్పడుతున్నారు. గూగుల్ లోకేషన్ ఆధారంగా కడ్తాల్ పరిధిలో విద్యుత్ తీగల చోరీలకు ప్రణాళికలు రచించా రని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ.40 వేల నగదు, కారు, రెండు సెల్ఫోన్లు, మూ డు కట్టర్లు, స్క్రూ డ్రైవర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న ధీరజ్కుమార్ ఉన్నట్లు చెప్పారు. కేసును చాకచక్యంగా సీసీ కెమెరాలను ఉపయోగించి ఛేదించిన కానిస్టేబుల్ రాంకోటి, రాజశేఖర్లను అఅభినందించారు. -
బరిలో తొమ్మిది మంది
● మదర్ డెయిరీ సభ్యుల నియామకానికి 27న ఎలక్షన్ హయత్నగర్: నల్లగొండ– రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సమాఖ్య లిమిటెడ్(నార్ముల్ మదర్ డెయిరీ) పాలకవర్గ ఎన్నికల్లో తొమ్మిది మంది చివరి బరిలో నిలిచారు. డెయిరీలో ఖాళీగా ఉన్న ముగ్గురు సభ్యుల నియామకం కోసం దాఖలు చేసిన నామినేషన్ల ఉప సంహరణ, స్క్రూటినీ అనంతరం తొమ్మిది మంది తుది పోటీ లో ఉన్నారు. మహిళా రిజర్వేషన్ స్థానానికిగానూ కర్నాటి జయశ్రీ, గుంట్ల రాధిక, మోతె పూలమ్మ, సుదగాని విజయ తలపడనున్నారు. మిగిలిన రెండు అన్రిజర్వ్ స్థానాల్లో కుంచాల ప్రవీణ్రెడ్డి, పెద్దిరెడ్డి భాస్కర్రెడ్డి, రచ్చ లక్ష్మీనర్సింహ్మారెడ్డి, శీలం వెంకటనర్సింహ్మారెడ్డి, సందిల భాస్కర్గౌడ్ పోటీ పడుతున్నారని ఎన్నిల అధికారి వెంకట్రెడ్డి తెలిపారు. హయత్నగర్లోని ఎస్వీ కన్వెన్షన్ హాల్ లో శనివారం ఉదయం 8 గంటల నుంచి ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగుతుందని స్పష్టంచేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు, విజేతల ప్రకటన ఉంటుందన్నారు. ఎన్నికయ్యే సభ్యులు అక్టోబర్ 1న బాధ్యతలు చేపడుతారని వెల్లడించారు. అర్హులైన సొసైటీల చైర్మన్లు ఐడీ కార్డుతో వచ్చి ఓటింగ్లో పాల్గొనాలన్నారు. -
జీఎస్టీపై అపోహలు నమ్మొద్దు
చేవెళ్ల: జీఎస్టీ తగ్గింపుపై ప్రతిపక్షాల దుష్ప్రచారాలను నమ్మొద్దని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సూచించారు. బుధవారం ఆయన నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నంతో కలిసి పర్యటించారు. దుకాణదారులకు జీఎస్టీ తగ్గింపుపై సందేహాలను నివృత్తి చేశారు. ఎలక్ట్రికల్ దుకాణం, కార్లు, బైక్ షోరూంలు, మెడికల్ షాపు తదితర వ్యాపారస్తులను కలిసి జీఎస్టీ తగ్గింపుతో ఎలాంటి ప్రయోజనాలున్నాయో అడిగి తెలుసుకున్నారు. పలువురు దుకాణాదారులు ముందుగానే స్టాక్ తెచ్చుకోవడంతో వ్యాపారులకు నష్టం వాటిల్లుతోందన్నారు. ముందుగా తెచ్చుకున్న వాటి జీఎస్టీ మళ్లీ వెళ్లినప్పుడు తగ్గించి చెల్లిస్తారని చెప్పారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం దేశంలోని ప్రజలకు, వ్యాపారులకు మేలు చేకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రతీ ఒక్కరు పన్నులు చెల్లించే విధానంతో వ్యాపార నిర్వహణలో పారదర్శకత పెరిగిందన్నారు. ప్రభుత్వాల ఆదాయం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎస్.ప్రభాకర్రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి జి.వెంకట్రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాములు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు వాసుదేవ్కన్నా, వెంకట్రాంరెడ్డి, బీజేవైఎం అధ్యక్షుడు సత్యనారాయణ, మానిక్యరెడ్డి, జి.కృష్ణగౌడ్, నాయకులు కృష్ణమోహన్, ప్రవీణ్, కృష్ణ, నర్సింలు, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి -
అభివృద్ధి పనులు వేగిరం చేయండి
● రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి ● ఆరుట్ల, మంచాల పాఠశాలలను సందర్శించిన అధికారుల బృందం మంచాల: తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల(టీపీఎస్) అభివృద్ధి పనులను వేగిరం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి, డైరెక్టర్ నవీన్ నికోలస్ అన్నారు. బుధవారం వారు మంచాల మండల పరిధిలోని ఆరుట్ల, మంచాల ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఆయా పాఠశాలల అభివృద్ధి ప్రణాళిక, జరుగుతున్న పనులు తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరుట్లలో ప్రీ ప్రైమరీ పాఠశాల నుంచి ఇంటర్మీడియెట్ వరకు ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తే అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు సులువుగా ఉంటుందన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సౌకర్యాలు కల్పిస్తున్నామని.. విద్యార్థుల సంఖ్య సైతం అదే విధంగా పెరిగిందన్నారు. డిజిటల్ తరగతులు, క్రీడా ప్రాంగణం, పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. పనులు మరింత వేగిరం చేయాలని సూచించారు. పాఠశాలల అభివృద్ధితోనే పిల్లల భవిష్యత్ మారుతుందన్నారు. అనంతరం ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. అదనపు తరగతి గదులు, లైబ్రరీ, సరిపడా ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలని పేరెంట్స్ కమిటీ కోరింది. అనంతరం మంచాల ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అక్కడ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను మ్యాప్ ద్వారా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సుశీందర్రావు, విద్యా కమిషన్ సభ్యులు పద్మజాషా, జ్యోత్స్న, ఎంఈఓ రాందాస్, మంచాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తిరుపతయ్య, ప్రధానోపాధ్యాయులు గిరిధర్గౌడ్, నారాయణరెడ్డి, ఝాన్సీ, రుబియానా బేగం, మోహన్రెడ్డి, ఆయా పాఠశాలలకు చెందిన పేరెంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 14 సీఎం రాక? ఈ నెల 22న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వసతులు, విద్యాశాఖ అధికారులతో సమావేశమై విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే భాగంగానే పనులు వేగవంతగా చేపట్టాలని ఉన్నత స్థాయి అధికారులు సందర్శనార్థం వచ్చినట్లు సమాచారం. నవంబర్ 14న సీఎం వచ్చే అవకాశం ఉందని వినికిడి. -
27న కలెక్టరేట్లో బతుకమ్మ సంబురాలు
తుక్కుగూడ: టీజీఓఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 27న కలెక్టర్ కార్యాలయంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ఉత్సవాలకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.రామారావు, కార్యదర్శి శ్రీనేశ్ కుమార్, నాయకులు శాంతిశ్రీ, మహేశ్వరి, పద్మావతి, అలివేలు, సైదమ్మ, వెంకటేశ్, లక్ష్మణస్వామి, రాకేశ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ నారాయణరెడ్డి -
అందరి చూపు.. రిజర్వేషన్ల వైపు
ఆశావహుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు రోజులుగా జిల్లా యంత్రాంగం అంతా ఇదే పనిలో నిమగ్నమైంది. జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని కలెక్టర్, జెడ్పీ సీఈఓలు కలిసి జెడ్పీటీసీ స్థానాలకు ఆర్డీఓలు ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు, వార్డులకు ఎంపీడీఓలు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఈ జాబితాను గోప్యంగా ఉంచారు. సిద్ధం చేసిన రిజర్వేషన్ల తుది జాబితా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి చేరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాగా ఈ విషయాన్ని జిల్లా యంత్రాంగం ధ్రువీకరించాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటికే పోటీ చేయాలని భావించి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్న ఆశావహుల్లో ఈ రిజర్వేషన్ల అంశం మరింత ఉత్కంఠను రేపుతోంది. ఏ సీటు ఏ వర్గానికి రిజర్వ్ అవుతుందో? తెలియక ఆందోళన చెందుతున్నారు. ఒక వేళ రిజర్వేషన్లు మారితే.. ఆయా స్థానాల్లో ఎవరిని బరిలోకి దించాలనే చర్చ సైతం మొదలైంది. జీఓ విడుదల చేయడమే ఆలస్యం జిల్లాలో 27 మండలాలు, 15 మున్సిపాలిటీలు, మూడు మున్సిపల్ కార్పొరేషన్లు, 526 గ్రామ పంచాయతీలు, 4,668 వార్డులు ఉన్నాయి. వీటిలో హయత్నగర్, సరూర్నగర్, బాలాపూర్, గండిపేట్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి మండలాలు జీహెచ్ఎంసీ పరిధిలోకి వెళ్లిపోయాయి. 21 మండలాలు మాత్రమే రూరల్ ఏరియాలో మిగిలాయి. ఆయా మండలాల పరిధిలోని జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ లెక్కన జిల్లాలో తొమ్మిది జెడ్పీటీసీ స్థానాలను బీసీలకు కేటాయించినట్లు తెలిసింది. ఎంపీపీ స్థానాలకు కూడా ఇదే రేషియోలో కేటాయించినట్లు సమాచారం. 97 ఎంపీటీసీ స్థానాలు, 221 పంచాయతీలు, 1,961 వార్డులను బీసీలకు కేటాయించినట్లు తెలిసింది. ప్రభుత్వం జీఓ విడుదల చేసిన తర్వాతే ఆయా రిజర్వేషన్ల స్థానాలను బయటికి వెల్లడించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన గడువు చివరి దశకు చేరింది. ఈ ఎన్నికలపై కోర్టు మళ్లీ జోక్యం చేసుకోకుండా ఉండాలంటే ప్రక్రియను ముందే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. 48 గంటల వ్యవధిలో రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా యంత్రాంగం ఓటర్ల జాబితా సహా రిజరేషన్ల జాబితాను సిద్ధం చేసి ఉంచింది. పార్టీ పరంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయనుండటంతో తొలుత పార్టీ గుర్తుపై జరిగే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. తద్వారా పార్టీలోని అంతర్గత విభేదాలు తొలగి.. మెజార్టీ పంచాయతీలను కై వసం చేసుకోవచ్చని భావిస్తున్న అధికార పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ముగిసిన రిజర్వేషన్ల ప్రక్రియ కలెక్టర్ చేతిలో జాబితా తొమ్మిది జెడ్పీటీసీ స్థానాలు బీసీలకు కేటాయింపు అదే రేషియోలో ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు స్థానాలు జీఓ విడుదల చేసిన వెంటనే వెల్లడించే అవకాశం -
పాడి పరిశ్రమ స్థాపనతో లాభాలు
పశువైద్య విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ కొండల్రెడ్డి షాబాద్: మహిళలు, యువత పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకుని లాభాలు ఆర్జించవచ్చునని పశువైద్య విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ కొండల్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ముదిరాజ్ భవన్లో సేవాస్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్టు మేనేజర్ రత్నాకర్, పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ వారి ఆధ్వర్యంలో ‘జిల్లా శాసీ్త్రయ పద్ధతుల డెయిరీసాగు, పాల ఉత్పత్తుల విలువల జోడింపు’ పై ఒక రోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసీ్త్రయ పద్ధతిలో పాడి పశువుల పెంపకం, పాల పదార్థాల తయారీపై రైతులకు అవగాహన కల్పించామన్నారు. డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ (పీవీఎన్టీవీయూ) డాక్టర్ కిషన్కుమార్ మాట్లాడుతూ.. శాసీ్త్రయ పద్ధతుల ఆధారంగా ఆధునిక డెయిరీ ఫారాల స్థాపనపై సూచనలు ఇచ్చారు. పశుపోషణ, షెడ్ నిర్మాణం, తక్కువ లాభాలు వంటి అంశాలపై వివరించారు. సేవాస్ఫూర్తి ప్రాజెక్టు మేనేజర్ రత్నాకర్ మాట్లాడుతూ.. డెయిరీ రంగంలో గ్రామీణ మహిళల సాధికారత అంశంపై పాడి రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రభుత్వ పథకాల వినియోగం, వ్యాపార నైపుణ్యాల సాధన ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని ప్రోత్సహించారు. మజ్జిగ, నెయ్యి, క్రీమ్ తయారీపై డెమో ఇచ్చారు. ప్రొఫెసర్ శశికుమార్, సాహిత్య రాణి, అసోసియేషన్ ప్రొఫెసర్ లైవ్స్టాక్, ప్రొడక్ట్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో కోవా, కలాకండ్, పనీర్ చన్నా, రసగుల్లా, రసమలై, బాసుంది, మజ్జి గ, లస్సీ, ప్లేవర్ మిల్క్ వంటి విలువ ఆధారిత పా ల ఉత్పత్తుల తయారీపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశువైద్యధికారి స్రవంతి, పాడి రైతులు యాదయ్య, మాణిక్యం, రాములు, శ్రీని వాస్, రాజు, గౌరీశ్వర్, మహేశ్, పూర్ణచందర్, ర మ్య, స్వరూప, యజ్ఞశ్రీ, పద్మ, తదితరులున్నారు. -
హైటెన్షన్ అలైన్మెంట్ మార్చండి
కడ్తాల్: హైటెన్షన్ విద్యుత్ లైన్ అలైన్మెంట్ మార్చాలని బాధిత రైతులు నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవిని బాధిత రైతులు కోరారు. బుధవారం వారు హైదరాబాద్లోని ఎంపీ నివాసంలో కలిసి తమ గోడును వివరించారు. రైతులకు సమాచారం ఇవ్వకుండానే 765 కేవీ హైటెన్షన్ సోలార్ పవర్గ్రిడ్లైన్ను వేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని అలైన్మెంట్ మార్చేందుకు చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఇందుకు స్పందించిన ఎంపీ మల్లు రవి కలెక్టర్కు ఫోన్ చేసి రైతుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్రెడ్డి, రైతులు శివరామకృష్ణ, పెంటారెడ్డి, రాములుయాదవ్, గోరటి కృష్ణ, మధుసూదన్రెడ్డి, జంగయ్య, రాజేశ్, పర్వత్కుమార్, వెంకటేశ్, క్యామ వెంకటేశ్, అభిషేక్రెడ్డి, కరీం తదితరులు ఉన్నారు. ఎంపీ మల్లు రవికి బాధిత రైతుల వినతి -
ప్లాస్టిక్ గోదాంలో అగ్ని ప్రమాదం
పహాడీషరీఫ్: ప్లాస్టిక్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సంఘటన బుధవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాం కాలనీలోని ఇందిరా సొసైటీలో మధుబన్ కాలనీకి చెందిన శేషు, ప్లాస్టిక్ రీసైక్లింగ్ గోదాం నిర్వహిస్తున్నారు. ఉదయం 4 గంటల సమయంలో కర్మాగారంలో అగ్ని కీలలు ఎగిసి పడ్డాయి. గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. అప్పటికే అందులోని ప్లాస్టిక్ స్క్రాప్ పూర్తిగా కాలిపోయింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, రూ.8 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని యజమాని తెలిపారు. ఎలాంటి ఫిర్యాదు అందనందున కేసు నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు. -
భక్తి భావంతో మానసిక ప్రశాంతత
కడ్తాల్: ప్రతి ఒక్కరూ భక్తిమార్గం ఎంచుకోవాలని, తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జర్పుల దశరథ్నాయక్ అన్నారు. బుధవారం మండల పరిధి మద్దెలకుంట తండాలో సంత్ సేవాలాల్ మహారాజ్ మాలధారణ భక్తుల ఆధ్వర్యంలో ఇరుముడి పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా దశరథ్నాయక్ మాట్లాడుతూ.. సేవాలాల్ సత్యం,ఽ ధర్మం, సమానత్వం, ఽభక్తి విలువలు బోధించారని, ఆయన చూపిన మార్గంలో యువత నడుచుకోవాలని సూచించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజశాంతికి దోహదపడతాయని తెలిపారు. ఇందులో మాజీ సర్పంచ్ కస్ననాయక్ పాల్గొన్నారు. ఘనంగా సీఎం సతీమణి పుట్టినరోజు మాడ్గుల: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీత పుట్టినరోజు వేడుకలు ఆమె స్వగ్రామం మాడ్గుల మండల కేంద్రంలో బుధవారం ఘనంగా జరిగాయి. రేవంత్ మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆసీఫ్ ఆలీ ఆధ్వర్యంలో కేక్కట్ చేసి, బాణసంచా కాల్చారు. శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జంగయ్య, పాండు గౌడ్, భాస్కర్, కష్ణయ్య, శివ తదితరులు పాల్గొన్నారు. కుమార్తైపె లైంగిక దాడి.. తండ్రికి జీవిత ఖైదు జగద్గిరిగుట్ట: కుమార్తైపె లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధించారు. పోలీసుల వివరాల ప్రకారం..జగద్గిరిగుట్ట అంజయ్యనగర్కు చెందిన అనిల్గౌడ్ తన కుమార్తైపె పలుమార్లు పాల్పడగా..బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత సంవత్సరం ఏప్రిల్లో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
అమ్మానాన్న దూరమైనా..చదువులమ్మకు దగ్గరై..
● ఎంబీబీఎస్ సీటు సాధించిన నిరుపేద విద్యార్థి ● చిన్నాన్న చిన్నమ్మ సహకారంతో ముందుకు ● డాక్టర్ అయి.. ప్రజాసేవలో తరిస్తా: వంశికొందుర్గు: జిల్లేడ్ చౌదరిగూడ మండలం చేగిరెడ్డి ఘనాపూర్ గ్రామానికి చెందిన వెన్నశెట్టి మంజుల, జంగయ్య దంపతులకు వంశీకృష్ణ, నందిని ఇద్దరు సంతానం. వీరిద్దరు మూడేళ్లలోపు ఉన్నప్పుడే కన్నవారు దూరం కాగా.. అన్నా, చెల్లెలు అనాథలుగా మిగిలారు. వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆ సమయంలో ఆ చిన్నారులను చిన్నాన్న బీమయ్య, చిన్నమ్మ యాదమ్మ దంపతులు అక్కున చేర్చుకున్నారు. ఆదర్శంగా తీర్చిదిద్దారు. చేరదీసినందుకు.. ఉన్నతంగా.. వంశీకృష్ణ, నందినిని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి వరకు చదివించారు. ఆ తరువాత ఇద్దరు గురుకుల పాఠశాలకు ఎంపికై ఉన్నత చదువులు పూర్తిచేశారు. వంశీకృష్ణ గౌలిదొడ్డి గురుకుల కళాశాలలో ఇంటర్లో 920 మార్కులు సాదించాడు. ఆపై నీట్ ప్రవేశ పరీక్ష రాసి 407 మార్కులతో నాగర్కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సంపాదించాడు. అన్నను ఆదర్శంగా తీసుకున్న చెల్లెలు నందిని.. షాద్నగర్ పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఇంటర్ పూర్తిచేసి, నాగర్కర్నూల్ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఎవరినీ మరువను.. వంశి తల్లిదండ్రులను కోల్పోయిన మమ్మల్ని చిన్నాన్న, చిన్నమ్మలు చేరిదీసి కన్నబిడ్డలా చూసుకున్నారు. వారి కష్టాన్ని వృథా కానీయకుండా గుర్తింపు తెచ్చుకున్నాను. అండగా నిలిచిన వారిని మరువను. డాక్టర్ను అయి.. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తాను. ఆర్థికంగా అండగా ఉంటా వంశీకృష్ణ మెడికల్ సీటు సాధించగానే.. అండగా ఉంటామంటూ దాతలు ముందుకు వచ్చారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విద్యార్థిని శాలువాతో సత్కరించి, ఆర్థికంగా ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుడు కృష్ణ రూ.25 వేలు అందజేశారు. బీఆర్ఎస్ నాయకుడు చందునాయక్ రూ.11 వేలు ఇచ్చారు. మరికొందరు తాము సైతం అంటున్నారు. బతుకు బాటను చూపించారు అమ్మానాన్న పోవడంతో మా చిన్నాయన, చిన్నమ్మలు చేరదీసి చదివించారు. నాడు ఉపాధ్యాయులు శివాజీ, వెంకట్రావు మమ్మల్ని బాగా చూసుకున్నారు. పాఠాలు చెప్పడమే కాదు.. బతుకు బాటను చూపించారు. వారి స్ఫూర్తితోనే ఉన్నతంగా చదువుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నదే నా తపన. – నందిని -
ఇంట్లోకి చొరబడి.. పుస్తెలతాడును అపహరించి
శంకర్పల్లి: వంట గదిలో ఉన్న వృద్ధురాలి మెడలో నుంచి దుండగులు పుస్తెలతాడును అపహరించారు. ఈ సంఘటన మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి కొండకల్ గ్రామానికి చెందిన నారాయణరెడ్డి(82), పద్మమ్(70) దంపతులు. వీరితో కుమారుడు, కోడలు ఉంటున్నారు. బుధవారం కుమారుడు, కోడలు బయటకు వెళ్లారు. మధ్యాహ్నం భర్తకు భోజనం పెట్టేందుకు ఆమె వంట గదిలోకి వెళ్లింది. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దొంగలు.. ఇంటి ముందు ఆగారు. ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి వృద్ధురాలి మెడలో నుంచి పుస్తెలతాడుని లాక్కొని.. వెంట వచ్చిన వ్యక్తితో బైక్పై పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ వీరబాబు, డీఐ సమరంరెడ్డి వివరాలు సేకరించారు. చుట్టూ పక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి, వెలిమల గ్రామం వైపు వెళ్లినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. బైక్పై ఉడాయించిన దుండగులు -
నిర్మాణ రంగంలో ‘భారతి సిమెంట్’ రారాజు
అనంతగిరి: నిర్మాణ రంగంలో రారాజు భారతి సిమెంట్ అని ఆ సంస్థ టెక్నికల్ ఇంజినీర్ సామ్రాట్ అన్నారు. వికారాబాద్లోని ఓం సాయి ట్రేడర్స్ డీలర్ దుకాణంలో బుధవారం తాపీ మేస్రీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మార్కెట్లో లభించే ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్తో నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుందని తెలిపారు. ముఖ్యంగా స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలు, రహదారుల నిర్మాణానికి సరైన ఎంపిక అని పేర్కొన్నారు. అల్ట్రాఫాస్ట్ వినియోగదారులకు ఉచితసాంకేతిక సహాయం అందజేస్తామని, స్లాబ్కాంక్రిట్ సమయంలో నిపుణులైన సంస్థ ఇంజినీర్లు సైట్ వద్దకే వచ్చి సహాయపడతారని చెప్పారు. ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్కు రూ.20 అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రూ.1 లక్ష ప్రమాద బీమా బాండ్లను 60 మంది తాపీ మేసీ్త్రలకు అందజేశారు. అనంతరం డీలర్ కృష్ణ మాట్లాడుతూ.. భారతి సిమెంట్ పనితీరు చాలా ఫాస్ట్గా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ వీరాంజనేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మురుగుమయంగా కోఠి ఈఎన్టీ..!
ఆసుపత్రి ఆవరణలో పొంగిపొర్లుతున్న వైనం సుల్తాన్బజార్: కోఠి ఈఎన్టీ ఆసుపత్రి మురుగుమయంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మురుగునీరు చేరడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం 1000 మంది వరకు అవుట్ పేషెంట్ రోగులు వైద్య సేవలు పొందుతుంటారు. అయితే ఆసుపత్రిలోని క్యూలైన్ వద్ద, ఆసుపత్రి క్యాంటీన్ వద్ద మురుగు నీరు రోజుల తరబడి నిల్వ ఉంటున్నది. ప్రభుత్వం పంపిణీ చేసే ఆహారం సైతం మురుగునీటిలోనే రోగులకు అందజేస్తుండడంతో దుర్వాసనతో రోగులు ఇక్కట్లకు గురవుతున్నారు. వారం రోజులుగా ఆసుపత్రిలో మురుగు నీరు ప్రవహిస్తుండడంతో ఆసుపత్రి ప్రాంగణం మొత్తం మూసీ నదిని తలపిస్తోంది. రోగులకు తప్పని తిప్పలు... కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో ఎటు చూసినా మురుగునీరు ప్రవహిస్తుండడంతో ఆసుపత్రికి వచ్చే ప్రజలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోగం నయం చేసుకునేందుకు వచ్చే రోగులు కొత్త వ్యాధులు సోకుతున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. వైద్యులు సైతం దుర్వాసన భరించలేక మాస్క్లు పెట్టుకుని చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం డీఎంఈ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆసుపత్రిని సందర్శించి మురుగునీటి సమస్యను పరిష్కరించాలని చెప్పినా ఆసుపత్రి, జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ఈఎన్టీ ఆసుపత్రిలో మురుగునీటి సమస్యను పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు. -
జీఓ ప్రకారం వేతనాలు ఇవ్వాలి
మొయినాబాద్: మున్సిపల్ కార్మికులకు జీఓ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రుద్రకుమార్, అల్లి దేవేందర్ డిమాండ్ చేశారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం పుర కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పురపాలిక సంఘం ఏర్పడి 9 నెలలు అవుతున్నా.. వేతనాల విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ చట్టం ప్రకారం వేతనాలు, యూనిఫాంలు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో విధులు బహిష్కరించి, ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ మేనేజర్ జమీర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ ప్రవీణ్కుమార్, నాయకులు మహేందర్, అశోక్, నగేష్గౌడ్, రత్నం, సుధాకర్, సురేష్, కృష్ణ, జగన్, నర్సింహ్మ, వెంకటేశ్, ప్రమీల ఉన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు -
భారీగా నల్లబెల్లం పట్టివేత
కడ్తాల్: ఎకై ్సజ్ పోలీసుల తనిఖీల్లో భారీగా నల్లబెల్లం, పటిక పట్టుబడిన సంఘటన కడ్తాల్ టోల్ప్లాజా వద్ద చోటు చేసుకుంది. ఆమనగల్లు ఎకై ్సజ్ సీఐ బద్యానాథ్ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం.. దసరా పండుగకు సారా తయారీ కోసం నల్లబెల్లాన్ని హైదరాబాద్ నుంచి వివిధ గ్రామాలకు తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అందడంతో మంగళవారం తెల్లవారు జామున ఎకై ్సజ్ సిబ్బంది కడ్తాల్ టోల్ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టింది. ఇందులో అనుమానాస్పదంగా నిలిపి ఉన్న వాహనాన్ని తనిఖీ చేయగా.. 65 బ్యాగుల్లో సుమారు 1,950 కిలోల నల్లబెల్లం, 40 కిలోల పటిక స్వాధీనం చేసుకున్నారు. మరో వాహనాన్ని తనిఖీ చేయగా సుమారు 300 కిలోల నల్లబంె ఫౌడర్, 10 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. ఈ మేరకు నల్లబెల్లం తరలిస్తున్న మహర్షి, కాశీం, ఎల్లస్వామిలపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. దాడుల్లో మొత్తం 2,250 కిలోల సారాముడి పదార్థాలతో పాటు, రెండు వాహనాలను, 50 కిలోల పటికను సీజ్ చేసినట్లు వివరించారు. ఈ దాడుల్లో ఎస్ఐ అరుణ్కుమార్, హెడ్ కానిస్టేబుల్ శంకర్, సిబ్బంది లోక్యా, బాబు, ఉపేందర్, ఆమని తదితరులు ఉన్నారు. కడ్తాల్ టోల్ప్లాజా వద్ద ఎకై ్సజ్ పోలీసుల తనిఖీలు -
సరిపడా రాక.. వెతలు తీరక
యాచారం: అన్నదాతలను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. నిత్యం తెల్లవారుజాము నుంచే మండల కేంద్రాల్లో ఉన్న పీఏసీఎస్ల వద్దకు రైతులు క్యూ కడుతున్నారు. వ్యవసాయ పనులు వదులుకొని, పాడి సంరక్షణ చూసుకోకుండానే యూరియా కోసం పరుగులు తీస్తున్నారు. ఇబ్రహీంపట్నం డివిజన్లోని ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, అబ్దుల్లాపూర్మెట్ మండలాల్లో ఈ సీజన్లో వరి, పత్తి, జొన్న, మొక్కజొన్న, కంది తదితర పంటలను 55 వేల ఎకరాలకు పైగా సాగు చేశారు. యాచారం, మంచాల వ్యాప్తంగా పత్తి, వరి అత్యధికంగా సాగు చేస్తున్నారు. ఆయా మండలాల్లో పత్తి పంటను 2,500 ఎకరాల్లో సాగు చేయగా, అత్యధికంగా వరిని 25 వేల ఎకరాల్లో సాగు చేసినట్లు వ్యవసాయాధికారులు గుర్తించారు. పీఏసీఎస్ల వద్ద క్యూ రాయితీపై అందజేసే యూరియాను పీఏసీఎస్ల ద్వారా రైతులకు విక్రయిస్తున్నారు. బస్తా యూరియా రూ.266.05కే లభిస్తుంది. తక్కువ ధరకు లభించే యూరియా ప్రైవేట్ వ్యాపారులతో విక్రయిస్తే ధరలు పెంచి రైతులను మోసం చేస్తారనే ఉద్దేశంతో ప్రభుత్వం పీఏసీఎస్ల పర్యవేక్షణలో సరఫరా చేస్తోంది. యూరియా బస్తాల కోసం రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకాలతో పాటు ఆధార్ కార్డుల వివరాలు అందిస్తున్నారు. పలు గ్రామాల్లోని ఒక్కో రైతుకు సాగు చేసిన పంటకు సరిపడా యూరియా అందడం లేదని వాపోతున్నారు. అందిన 2,101 మెట్రిక్ టన్నులు ఈ వానాకాలం కింద ఇబ్రహీంపట్నం డివిజన్కు 2,101.205 మెట్రిక్ టన్నుల యూరియా అందింది. ఇందులో అబ్దుల్లాపూర్మెట్–227.875, హయత్నగర్–100.00, ఇబ్రహీంపట్నం–934.915, మంచాల–330.00, యాచారం–508.415 మేర యూరియా సరఫరా చేశారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని దండుమైలారం, రాయపోల్, పోల్కంపల్లి, ముకునూర్, తుర్కగూడ, కప్పాడు, చర్లపటేల్గూడ తదితర గ్రామాల్లో వరి పంటను అత్యధికంగా సాగు చేశారు. అందుకే 934.915 మెట్రిక్ టన్నుల యూరియాను అందించారు. రైతులు ఎకరాకు కేవలం ఒకటి లేదా, రెండు బస్తాల యూరియా అందించాల్సి ఉండగా మూడు నుంచి నాలుగు బస్తాల యూరియాను వాడుతున్నారు. రైతులను వెంటాడుతున్న యూరియా కష్టాలు మోతాదుకు మించి వాడకంతో ఏర్పడిన కొరత ఇబ్రహీంపట్నం డివిజన్లో 55 వేల ఎకరాల్లో సాగైన పంటలు వెల్లడించిన వ్యవసాయశాఖ అధికారులు పడరాని పాట్లు ఈ సీజన్లో ఎప్పుడు లేని విధంగా యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నాం. ఆరు ఎకరాల్లో వరి పంట, 18 ఎకరాల్లో పత్తి సాగు చేశాను. మొత్తంగా 55 బస్తాల యూరియాను వాడాను. దీనికోసం యాచారం పీఏసీఎస్తో పాటు ఉప్పరిగూడ, తుర్కయంజాల్ పీఏసీఎస్ల వద్దకు వెళ్లి యూరియా తెచ్చాను. – బాషా, రైతు, నక్కర్తమేడిపల్లి అధికంగా వాడితే నష్టం యూరియా వాడకంలో రైతులకు ఎంత చెప్పినా వినడం లేదు. డివిజన్కు 2,101 మెట్రిక్ టన్నులకు పైగా యూరియా వచ్చింది. ఏ పంటకై నా ఒక బస్తా యూరియా చల్లాలి. కానీ రైతులు ఎకరాకు రెండు నుంచి మూడు బస్తాలు చల్లుతున్నారు. యూరియా అధికంగా వాడితే నష్టమే తప్పా, లాభం ఉండదు. – సుజాత, ఏడీఏ, ఇబ్రహీంపట్నం -
ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పాలన
తుర్కయంజాల్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పాలన చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి విమర్శించారు. మంగళవారం పురపాలక సంఘం పరిధి ఇంజాపూర్కు చెందిన బొక్క మురళీధర్ రెడ్డి బెయిల్పై ఇటీవల విడుదల కావడంతో ఆయన ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న కేసులకు భయపడే ప్రసక్తే లేదని, వాట్సాప్లో పెట్టిన పోస్టు ఆధారంగా పలు సెక్షన్ల కింద కేసులను బనాయించి జైలుకు పంపడం సరైనది కాదన్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు పోలీసులు, అధికారులు తలొగ్గి పనిచేయడం హేయమన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి నియోజకవర్గం అభివృద్ధిపైన ధ్యాసే లేదని, కేవలం వసూళ్ల మీదే ఉందని ఆరోపించారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీలో అధికార పార్టీ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి, నాయకులు ఆనంద్రెడ్డి, కల్యాణ్నాయక్, కె.లక్ష్మారెడ్డి, మల్లేశ్, చంద్రశేఖర్రెడ్డి, చిన్నయ్య, దశరథ, సంపతీశ్వర్రెడ్డి, అశోక్, గౌతమ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కిషన్రెడ్డి -
నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్గా చంద్రశేఖర్
నగర కమిషనరేట్లో ఆరుగురు అధికారుల బదిలీ సాక్షి, సిటీబ్యూరో: ఉత్తర మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్గా కమతం చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఈయనతో పాటు మొత్తం ఆరుగురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ కొత్వాల్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం చంద్రశేఖర్ సీసీఎస్లో పనిచేస్తున్నారు. ఈయన స్థానంలోకి నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ పసుల రాఘవేంద్రను బదిలీ చేశారు. వీరితో పాటు ఎస్.విష్ణువర్థన్రెడ్డిని బండ్లగూడ డీఐ, బి.శ్రీనివాసరావును చాదర్ఘాట్ డీఐ, డి.రాజేందర్గౌడ్ను ఐటీ సెల్ ఇన్స్పెక్టర్, సీహెచ్ సురేష్ బాబును యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్స్పెక్టర్గా బదిలీ చేశారు. డ్రగ్స్ విక్రేతల అరెస్టు రాజేంద్రనగర్: ఉన్నత చదువులు చదివి..దురలవాట్లకు బానిసై..డబ్బు అవసరాలు తీర్చుకునేందుకు మత్తు పదార్థాల విక్రేతలుగా మారిన ముగ్గుర్ని మంగళవారం బుద్వేల్ బన్సీలాల్నగర్ ప్రాంతంలో పట్టుకున్నారు. ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం..యాదాద్రి బీబీనగర్కు చెందిన మహ్మద్ అన్వర్, అచ్చంపేటకు చెందిన వాసు బీటెక్ విద్యార్థులు. చదువుకునేందుకు నగరానికి వచ్చి చాంద్రాయణగుట్ట ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరికి అదే ప్రాంతానికి చెందిన మజ్హర్ అలీతో స్నేహం ఏర్పడింది. వీరంతా దురలవాట్లకు బానిసయ్యారు. తమ అలవాట్లను తీర్చుకునేందుకు డబ్బు అవసరమై డ్రగ్స్ విక్రయించాలని నిర్ణయించుకున్నారు. బెంగళూరుకు వెళ్లి ఎండీఎంఏ మాత్రలు, వైజాగ్కు వెళ్లి గంజాయిని తీసుకొచ్చారు. వీటిని తమకు తెలిసిన వారికి విక్రయించడం ప్రారంభించారు. దీనిపై సమాచారం అందుకున్న ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం ఉదయం బుద్వేల్ బన్సీలాల్నగర్ రోడ్డు గుండా వెళుతున్న సమయంలో పట్టుకొని సోదాలు చేశారు. నిందితుల వద్ద కిలోన్నర గంజాయి, 6.6 గ్రాముల ఎండీఎంఏ మాత్రలు లభించాయి. నిందితులను పట్టుకొని తదుపరి విచారణ నిమిత్తం శంషాబాద్ ఎకై ్సజ్ పోలీసులకు అప్పగించారు. యువకుడిపై దాడి చేసి బంగారు గొలుసు చోరీ మణికొండ: కారు చెడిపోయి..రోడ్డు పక్కగా నిల్చున్న ఓ యువకుడిపై ఆరుగురు వ్యక్తులు దాడి చేసి కొట్టి..అతని వద్ద ఉన్న 10 గ్రాముల బంగారు గొలుసు, ఐ ఫోన్ను చోరీ చేసిన సంఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని కోకాపేట నియోపోలీస్ గుట్టపై సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండకు చెందిన బి.సునీల్ భాస్కర్ సోమవారం రాత్రి 11.30 గంటలకు గౌలిదొడ్డి వైపు నుంచి కోకాపేట నియోపోలిస్ వెంచర్కు వెళ్లాడు. అక్కడ కారు చెడిపోవటంతో రోడ్డు పక్కన ఆపి అతని సోదరుడు శేఖర్కు సమాచారం ఇచ్చాడు. రాత్రి 11.55 గంటల సమయంలో రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఆరుగురు గుర్తు తెలియని అతన్ని కొట్టి మెడలోని బంగారు చైన్, జేబులోని ఐఫోన్ను లాక్కుని పారిపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
రైతులందరికీ యూరియా అందిస్తాం
షాబాద్: రైతులందరికీ అవసరమైన ఎరువులు అందించాలని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని జిల్లా వ్యవసాయాధికారి ఉష పేర్కొన్నారు. మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయంలోని యూరియా గోదాంను మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం మాచన్పల్లి రైతువేదికలో నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమానికి హాజరై రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె డీలర్లు, అధికారులకు పలు సూచనలు చేశారు. యూరియా అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రైతులు కూడా సంయమనం పాటించాలని సూచించారు. అవసరం మేరకు యూరి యా అందుబాటులో ఉందని, అందరికీ అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందొద్దని తెలిపారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ చల్లా శేఖర్రెడ్డి, ఏడీఏ సురేశ్బాబు, ఏఓ కృష్ణమోహన్, ఏఈ ఓలు శివతేజ, కిరణ్మయి, రాజేశ్వరి పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయాధికారి ఉష -
భూ సేకరణ వేగవంతం చేయండి
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ బంజారాహిల్స్: గ్రేటర్ పరిధిలో ట్రాఫిక్కు చెక్ పెట్టేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్–సిటీ పనులకు సంబంధించి భూసేకరణను వేగవంతం చేయాలని, పనుల గ్రౌండింగ్ సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, చీఫ్ ఇంజినీర్ (ప్రాజెక్ట్స్) భాస్కర్రెడ్డి, జూబ్లీహిల్స్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్యతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–2 నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వరకు కేబీఆర్ పార్కు ప్రాజెక్టు భూసేకరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హెచ్–సిటీలో కీలకమైన కేబీఆర్ పార్కు ప్రాజెక్టులో భాగంగా చుట్టుపక్కల ఏడు కీలక జంక్షన్లలో రాబోయే రోజుల్లో 4.6 కిలోమీటర్ల పొడవు ఫ్లైఓవర్లు, 2.8 కిలోమీటర్ల అండర్పాస్లు నిర్మించనున్నారు. వీటితో నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ప్రవాహం సులభతరం కావడంతో పాటు, రద్దీ గణనీయంగా తగ్గనుంది. ఈ సందర్భంగా కమిషనర్ ఆర్వీ కర్ణన్ కేబీఆర్ పార్కు ప్రాజెక్టు గ్రౌండింగ్కు జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పనుల గ్రౌండింగ్ వేగంగా చేపట్టడంతో పాటు పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. -
జీఎస్టీ తగ్గింపుతో ప్రయోజనం
షాద్నగర్: కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఏబీ కాంప్లెక్స్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసేందుకు ప్రధాని మోదీ సంస్కరణలు చేపట్టారని తెలిపారు. జీఎస్టీ తగ్గింపుతో నిత్యావసరాలతో పాటు మందులు, వస్త్రాలు, క్రీడా, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాల రేట్లు ఎంతో తగ్గాయన్నారు. దీంతో సామాన్యుల ఆదాయంలో 20శాతం ఆదా జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పనితీరుపై సీఎం రేవంత్రెడ్డి గాలిమాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె బాబయ్య, శ్రీవర్ధన్రెడ్డి, నాయకులు డాక్టర్ విజయ్కుమార్, కక్కునూరి వెంకటేశ్గుప్తా, దేపల్లి అశోక్గౌడ్, హరిభూషణ్ పటేల్, మురళి, శ్యాంసుందర్, మోహన్సింగ్, చెట్ల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్రెడ్డి -
‘స్కైవాక్’పై కదలిక
సాక్షి, సిటీబ్యూరో: హుస్సేన్సాగర్ చుట్టూ స్కైవాక్ సైక్లింగ్ ప్రాజెక్టుపై ఎట్టకేలకు కదలిక వచ్చింది. కోర్ అర్బన్ సుందరీకరణలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హుస్సేన్సాగర్ 2.0 అంశాన్ని ప్రస్తావించారు. దేశ, విదేశాలకు చెందిన పర్యాట కులను ఆకట్టుకొనే విధంగా హుస్సేన్సాగర్ చుట్టూ స్కైవాక్, సైక్లింగ్, ఎంటర్టైన్మెంట్, నైట్లైఫ్ షాపింగ్ వంటి సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అనుబంధ హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (హుమ్టా) గతంలోనే ప్రణాళికలను సిద్ధం చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక ఎంటర్టైన్మెంట్ డిజైన్లను రూపొందించింది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో ఈ ప్రాజెక్టును చేపట్టాలని ప్రతిపాదించారు. కానీ అప్పట్లో ప్రభుత్వం నుంచి స్పందన లభించలేదు. తాజాగా సీఎం ఈ ప్రాజెక్టును ప్రత్యేకంగా ప్రస్తావించడంతో మరోసారి ఇది తెరపైకి వచ్చింది. స్కైవాక్ సైకిల్ట్రాక్ ప్రాజెక్టు నిర్మిస్తే నెక్లెస్రోడ్డు, ట్యాంక్బండ్ ప్రాంతాలు మరిన్ని పర్యాటక హంగులతో ఆకట్టుకోనున్నాయి. శ్వేతసౌధం వంటి సచివాలయం, బాబాసాహెచ్ అంబేడ్కర్ భారీ విగ్రహం, ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీపార్కు, సంజీవయ్య పార్కు, లేక్వ్యూ పార్కులకు ఇది మణిహారంగా మారనుంది. దేశంలోనే మొదటిది.. హుస్సేన్సాగర్ అందాలను ఆకాశంలోంచి వీక్షించేందుకు అనుగుణంగా సుమారు 10 కిలోమీటర్ల మార్గంలో స్కైవాక్, సైకిల్ ట్రాక్ నిర్మించాలనేది ప్రతిపాదన. ఖైరతాబాద్ మెట్రోస్టేషన్ నుంచి ఐమాక్స్ థియేటర్ మీదుగా నెక్లెస్రోడ్డు, పీపుల్స్ప్లాజా, ట్యాంక్బండ్, తదితర ప్రాంతాలను కలుపుతూ ఇందిరాపార్కు వరకు స్కైవాక్ నిర్మిస్తారు. దీంతో సాగరానికి అన్ని వైపులా రాకపోకలు సాగించవచ్చు. సంజీవయ్య పార్కు, పీపుల్స్ప్లాజా, జలవిహార్, ఎంఎంటీఎస్ స్టేషన్, లేక్వ్యూపార్కు, ఎన్టీఆర్ పార్కు, లుంబిని పార్కు, సెక్రటేరియట్, అంబేడ్కర్ విగ్రహం తదితర సందర్శనీయ స్థలాలను ఆకాశ నడకతోలోనే చేరుకోవచ్చు. దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా ఇలాంటి స్కైవాక్లు లేవని, హైదరాబాద్లో హుస్సేన్సాగర్పై ఏర్పాటు చేయనున్నదే మొట్టమొదటి స్కైవాక్ కానుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో నగరానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించనుందని పేర్కొన్నారు. సుమారు రూ.200 కోట్లతో అంచనాలు... ● హుస్సేన్సాగర్ చుట్టూ నిర్మించనున్న స్కైవాక్కు ఒక కిలోమీటర్కు రూ.20 కోట్ల చొప్పున మొత్తం 10 కిలోమీటర్ల మార్గానికి రూ.200 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ● ప్రాజెక్టులో భాగంగానే హుస్సేన్సాగర్లో నీటిపై తేలియాడే బాస్కెట్బాల్ కోర్టు, క్రికెట్ స్టేడియం వంటివి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. ప్రస్తుతం సింగపూర్లో ఈ తరహా వేదికలున్నట్లు అధికారులు తెలిపారు. ● ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేలా షాపింగ్ కేంద్రాలు, రెస్టారెంట్లు వంటివి కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. హుస్సేన్సాగర్ 2.0పై ముఖ్యమంత్రి ప్రస్తావన 10 కి.మీ.మార్గంలో సైకిల్ ట్రాక్, స్కై వాక్ గతంలోనే ప్రతిపాదనలు రూపొందించిన హెచ్ఎండీఏ సీఎం కోర్ అర్బన్ అభివృద్ధి ప్రణాళికలతో మార్గం సుగమం వాకింగ్తో పాటే సైక్లింగ్.. సాగర్ చుట్టూ సుమారు 10 కిలోమీటర్ల మార్గంలో నిర్మించనున్న స్కైవాక్పైకి చేరుకొనేందుకు, కిందకు దిగేందుకు వివిధ ప్రాంతాల్లో ప్రవేశ, నిష్క్రమణదారులు ఉంటాయి. స్కైవాక్ మొత్తం 5.5 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇందులో 3 మీటర్లు సైకిల్ ట్రాక్ కోసం కేటాయిస్తారు. సైకిలిస్టులు ఈ మార్గంలో రాకపోకలు సాగించవచ్చు. 0.5 మీటర్ల వెడల్పుతో ఆహ్లాదకరమైన పచ్చదనంతో కూడిన సెంట్రల్ మీడియన్ ఉంటుంది. దానిని ఆనుకొని 2 మీటర్ల వెడల్పుతో ఫుట్పాత్ను ఏర్పాటు చేస్తారు. దీంతో సందర్శకులు ఒకే ట్రాక్పైన నడిచేందుకు, సైకిలింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ట్రాక్కు రెండు వైపులా గ్రీనరీని ఏర్పాటు చేస్తారు. కేవలం పర్యాటకులు, సందర్శకులే కాకుండా ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసేందుకు కూడా స్కైవాక్ను వినియోగించుకోవచ్చు.