breaking news
Rangareddy
-
ఇవి మా ఇళ్లు.. వదిలి వెళ్లం
మంచాల(రంగారెడ్డి): డబుల్ బెడ్రూం ఇళ్లను అందజేయటంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ.. లబ్ధిదారులు ఆ ఇళ్లను నేరుగా ఆక్రమించుకున్నారు. ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన మాటలపై నమ్మకం సన్నగిల్లిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లి గేట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని మంచాల, నోముల, లింగంపల్లి గ్రామస్తుల కోసం లింగంపల్లి గేట్ వద్ద డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించారు. ఏడాదిన్నర క్రితం లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇళ్లను మాత్రం అప్పగించలేదు. అప్పటి నుంచి లబ్ధిదారులు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఈ నెల 23న ఇళ్లు కేటాయిస్తామని అధికారులు తెలపటంతో లబ్ధిదారులు ఆశగా ఎదురుచూశారు. కానీ ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు. ఈ నెల 28న ఇస్తామని మరోసారి చెప్పారు. ఆ గడువు కూడా దాటిపోవడంతో విసిగిపోయిన లబ్ధిదారులంతా కలిసి ఇళ్లను శుభ్రం చేసుకొని ఆక్రమించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేశ్ అక్కడికి చేరుకొని లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం అధికారికంగా ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాతే రావాలని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా లబ్ధిదారులు ససేమిరా ఒప్పుకోలేదు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ఇందిరమ్మ ఇళ్లు కూడా కేటాయించలేదని, ప్రస్తుతం తాము ఉన్న ఇళ్లు వర్షాలకు కురుస్తున్నాయని, ఎక్కడ తలదాచుకోవాలని నిలదీశారు. అప్పుడు, ఇప్పుడు అంటూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితిలో ఇళ్లను వదిలి వెళ్లేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో చేసేది లేక అధికారులు వెనుదిరిగారు. -
హస్తం.. నిర్వేదం!
కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త జ్వాలలు సాక్షి, రంగారెడ్డిజిల్లా: హస్తం పార్టీలో అసంతృప్తి జ్వాల రగులుతోంది. ఎమ్మెల్యేలు మొదలు చోటా మోటా లీడర్ల వరకు అంతా నారాజ్లో ఉన్నారు. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని ఆశించారు. పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటినా ఇప్పటి వరకు ఎలాంటి అవకాశాలు రాకపోవడంతో వారంతా నైరాశ్యంలోకి వెళ్లారు. అధినాయకుల వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. వారు కూడా ఏమీ చేయలేక నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి ఆశించి.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవిని ఆశించారు. ఇప్పటికే రెండు విడతలుగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కలేదు. దీంతో ఆయన ఇటీవల అలకపాన్పు ఎక్కడం, అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించడంతో పీసీసీ చీఫ్ సహా ఇతర నేతలు బుజ్జగించారు. తాత్కాలికంగా శాంతించినప్పటికీ పదవి దక్కలేదనే అసంతృప్తి మాత్రం వెంటాడుతోంది. ఇక వికారాబాద్ ఎమ్మెల్యే, ప్రస్తుత స్పీకర్ గడ్డం ప్రసాద్ సహా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి సైతం మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. డీసీసీ పీఠంపై సీనియర్ల కన్ను ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కకు ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందిన ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డిని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించింది. చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన డీసీసీని గాలికొదిలేశారు. నియోజకవర్గాల్లో ఎవరైనా సమావేశాలు ఏర్పాటు చేస్తే వెళ్లి రావడం మినహా పార్టీ పటిష్టత కోసం తీసుకుంటున్న చర్యలు కూడా ఏమీ లేవు. ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించనున్నారనే ప్రచారం కూడా జరిగింది. దీంతో మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేత దేపభాస్కర్రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గానికి చెం దిన గౌరీసతీష్, భీంభరత్ మరికొంత మంది నేతలు ఈ పీఠాన్ని ఆశించారు. ఆ మేరకు వారు ముఖ్యనేతలను కలిసి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. అధిష్టానం నుంచి స్పష్టత లేకపోవడంతో ఇప్పటికీ వారి ఆశలు అడియాసలుగానే మిగిలిపోయాయి. పుట్టిముంచనున్న సమన్వయ లేమి ఉమ్మడి ఏపీలోనూ జిల్లా నేతలకు సముచిత స్థానం లభించేది. ఇటు మంత్రి వర్గంలోనే కాదు అటు పార్టీలోనూ జిల్లా నేతలు కీలకంగా వ్యవహరించేవారు. సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం జిల్లా నేతలను పూర్తిగా విస్మరించింది. ఒకరిద్దరు తమ అనుచరులకు కార్పొరేషన్ పదవులు కట్టబెట్టడం మినహా ముఖ్య పదవులేవీ కేటాయించలేదు. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. ఆయా నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్ లీడర్లకు బీఆర్ఎస్ నుంచి కొత్తగా చేరిన నేతలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి భీంభరత్ వర్గం ఏకంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షినటరాజన్కు ఫిర్యాదు చేసింది. కొత్త, పాత నేతల మధ్య సమన్వయం లేకపోవడం, ప్రస్తుత డీసీసీ చీఫ్ కూడా వారిని ఒక్క తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయకపోవడంతో ఆయా మండలాలు, గ్రామాల్లో పార్టీ రెండుగా చీలిపోయి కన్పిస్తోంది. అంతర్గత విభేదాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పుట్టిముంచే ప్రమాదం లేకపోలేదు. ఎమ్మెల్యేల నుంచి కార్యకర్తల దాకా.. పదవులు ఆశించి భంగపడిన నేతలు డీసీసీ పీఠంపై పలువురి గురి ఆశావహుల ఎదురుచూపులు సంస్థాగత కమిటీల్లోనైనా సముచిత స్థానం దక్కేనా?సామాజిక న్యాయం దక్కేనా..? ఇప్పటి వరకు పార్టీలో రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యమే కొనసాగుతూ వస్తోంది. నామినేటెడ్ పదవుల్లోనూ వారే కీలకంగా ఉన్నారు. పార్టీ అధినేత రాహుల్ గాంధీ సంస్థాగత పదవుల్లోనూ 42 శాతం రిజర్వేషన్ పాటించి తీరాలని ఆదేశిస్తున్నా జిల్లాలో ఇప్పటి వరకు ఈ సూత్రం అమలు కాలేదు. కనీసం గ్రామ, మండల, బ్లాక్, జిల్లా కమిటీల్లోనైనా ఇతర నేతలకు సముచిత స్థానం దక్కుతుందో లేదో తేలిపోనుంది. జూలై 4లోగా సంస్థాగత కమిటీల ఏర్పాటు పూర్తి చేయాల్సిందిగా ఇప్పటికే అధిష్టానం ఆదేశించింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జూలై మొదటి వారంలో రాష్ట్రానికి రానున్నారు. గ్రామ, మండల, బ్లాకు, జిల్లా, రాష్ట్ర కమిటీల ముఖ్యనేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పని చేస్తున్న సామాన్య ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్యకర్తలు, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన నాయకులకు గుర్తింపు లభిస్తుందా అనేది వేచిచూడాలి. -
అర్ధరాత్రి విహరిస్తే కఠిన చర్యలు
మీర్పేట: వేడుకలు, ఇతర కారణాలతో అనవసరంగా అర్ధరాత్రి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మీర్పేట పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ నాగరాజు యువతను హెచ్చరించారు. శనివారం అర్ధరాత్రి తరువాత స్టేషన్ పరిధి నందనవనం, ఆర్ఎన్రెడ్డినగర్, భూపేష్గుప్తానగర్లలో పోలీసులు ఆపరేషన్ చబుత్ర చేపట్టారు. ఈ సందర్భంగా రాత్రిళ్లు రోడ్లపై తిరుగుతున్న 122 మంది యువకులను గుర్తించారు. జన్మదిన వేడుకల పేరుతో కాలనీ కూడళ్లు, ప్రధాన రహదారులపైకి రావడం, అదే విధంగా రాత్రంతా బాక్స్ టైపు క్రికెట్ ఆడుతూ ఇతరులను ఇబ్బందులకు గురి చేయవద్దని ఇన్స్పెక్టర్ సూచించారు. ఏ కారణం లేకున్నా యువత రోడ్లపై ద్విచక్ర వాహనాలను విచ్చలవిడిగా నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకోవడంతో పాటు గొడవలకు కారణమవుతాయని అవగాహన కల్పించారు. ఆపరేషన్ చబుత్రలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గౌరునాయుడు, ఎస్ఐ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. అనవసరంగా రోడ్లపైకి రావొద్దు మీర్పేట సీఐ నాగరాజు -
కొరత చూపి.. రైతులను దోచేసి
కొందుర్గు: ప్రస్తుత వానాకాలం సీజన్లో రైతులు పత్తి, మొక్కజొన్న, వరి తదితర పంటల సాగు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇందుకోసం ప్రస్తుతం మొదటి దఫా అధికంగా రైతులు డీఏపీ వాడుతారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీఏపీ బస్తా ధర రూ.1,350 ఉంటే డీలర్లు రూ.1,500 వరకు అన్నదాతలకు విక్రయిస్తున్నారు. అదే విధంగా యూరియా బస్తా ధర రూ.266 ఉండగా రూ.300 పైనే అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. షాద్నగర్ నియోజకవర్గంలోనే కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండలాల్లో అధికంగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తారు. ఇక్కడ పత్తి, మొక్కజొన్న పంటలను అధికంగా సాగు చేస్తారు. కానీ ప్రస్తుతం డీఏపీ, యూరియా కొరత సృష్టించడంతో తాము అధిక ధరలకు ఎరువులు కొనుగోలు చేసి నష్టపోతున్నామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై వ్యవసాయాధికారులను వివరణ కోరగా డీఏపీ కొరత ఉన్నది వాస్తవమేనని, వాటి స్థానంలో కాంప్లెక్స్ ఎరువులు వాడా లని సూచిస్తున్నారు. కాగా కాంప్లెక్స్ ఎరువులు మొదటి దఫాలో వాడడంతో పంటలు బాగా పెరిగి చీడపీడలకు గురయ్యే ప్రమాదం ఉంటుందని వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. అధిక ధరలకు ఎరువుల విక్రయాలు వానాకాలం సాగులో ఇక్కట్లు -
ఘనం.. రెండో బోనం
గోల్కొండ కోటకు వెల్లువలా భక్తులు గోల్కొండ: గోల్కొండ కోటలో శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి ఆదివారం 2వ బోనం పూజ ఘనంగా జరిగింది. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో కోటలోని నగినాబాగ్, రాణీమహల్ తదితర ప్రాంతాలన్నీ కిటకిటలాడాయి. మహిళలు నాగదేవత పుట్టకు పూజలు నిర్వహించారు. అనంతరం తలలపై అందంగా అలంకరించిన బోనం కుండలతో కోటపైకి అమ్మవారి దర్శనానికి బయల్దేరి వెళ్లారు. గోల్కొండ ఫతే దర్వాజా నుంచి భక్తులు తొట్టెలతో ఊరేగింపుగా వచ్చారు. కోట చౌరస్తా శివసత్తుల పూనకాలతో ఆధ్యాత్మిక వాతావరణంతో నెలకొంది. ఆలయ కార్యనిర్వహణాధికారి వసంత, బోనాల ఉత్సవ నిర్వహణ కమిటీ చైర్మన్ కె.చంటిబాబు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
తేలేదెప్పుడో..?
మొయినాబాద్: ఎనికేపల్లి భూముల వ్యవహారం ఎటూ తేలడంలేదు. పరిహారం విషయంలో అటు అధికారులు, ఇటు రైతులు పట్టు వీడడంలేదు. ఇప్పటికే పలు దఫాలుగా అధికారులు రైతులతో చర్చలు జరిపారు. పరిహారం విషయంలో ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో నెల రోజులుగా సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. రెవెన్యూ రికార్డుల్లో సర్కారు భూమి ఎనికేపల్లి సర్వేనంబర్ 180లోని 99.14 ఎకరాలు 1954 నుంచి రెవెన్యూ రికార్డుల్లో సర్కారు భూమిగానే నమోదవుతూ వస్తోంది. 1954లో ఈ భూమిని దళితులు సాగుచేసుకోవడానికి ఇచ్చినట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. కొన్నేళ్ల పాటు రైతుల పేరు కబ్జా కాలంలో వచ్చాయి తప్ప అసైనీలుగా పేర్కొనలేదు. రెవెన్యూ రికార్డుల్లో పూర్తిగా సర్కారు భూమిగా కొనసాగుతూ వచ్చింది. గ్రామానికి చెందిన సుమారు 50 మంది రైతులు డైబ్బె ఏళ్లుగా ఇక్కడ సాగుచేసుకుంటున్నారు. ఈ భూములను ప్రభుత్వం ఇటీవల గోశాల ఏర్పాటుకు కేటాయించింది. విషయం తెలిసిన గ్రామస్తులు నెల రోజుల నుంచి ఆందోళన మొదలు పెట్టారు. ఈ భూములనే నమ్ముకుని జీవిస్తున్నామని, తమకే అసైన్డ్ చేయాలని డిమాండ్ చేశారు. పలు రాజకీయ పార్టీల నేతలు సైతం భూములను పరిశీలించి రైతులకు మద్దతుగా ఉంటామని ప్రకటించారు. చర్చలు విఫలం భూములు సాగుచేసుకుంటున్న రైతులతో రెవెన్యూ అధికారులు పలుమార్లు చర్చలు జరిపారు. చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్కుమార్ పరిహారం విషయంపై వారితో చర్చించారు. ఎకరాకు వెయ్యి గజాల చొప్పున పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరాకు 200 గజాల చొప్పున ఇస్తామని అధికారులు తేల్చి చెప్పారు. మూడుసార్లు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. ఎమ్మెల్యేపై భారం వేసిన రైతులు పరిహారం విషయంలో రైతులు ఎమ్మెల్యే కాలె యాదయ్యపై భారం వేశారు. పలుమార్లు ఆయనను కలిసి ప్రభుత్వంతో చర్చించి మంచి పరిహారం ఇప్పించాలని కోరారు. రైతులను తీసు కుని కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే పరిహారం విషయంపై చర్చించారు. ఎకరాకు 800 గజాలు పరిహారంగా ఇవ్వాలని ఎమ్మెల్యే కోరగా 250 గజాలు ఇస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. కనీసం ఎకరాకు 400 గజాలైనా ఇవ్వాలని ఎమ్మె ల్యే కోరారు. ఈ విషయమై శనివారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి చర్చించారు. ఎకరాకు 350 గజాల స్థలం ఇచ్చేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ పరిహారంపై కొందరు రైతులు సంతృప్తిగానే ఉన్నట్లు సమాచారం. రెండు సార్లు సర్వే చేయకుండానే.. గోశాలకు కేటాయించిన భూములను సర్వే చేసేందుకు హెచ్ఎండీఏ అధికారులు రెండుసార్లు వచ్చారు. పరిహారం విషయం తేలకపోవడంతో సర్వే చేయకుండానే వెనుదిరిగారు. మరోవైపు ఎనికేపల్లి భూముల వద్ద పోలీస్ పహారా కొనసాగుతోంది. కొత్త వ్యక్తులు, రైతులను అటువైపు రాకుండా కాపలా కాస్తున్నారు. కొలిక్కిరాని ఎనికేపల్లి భూముల వ్యవహారం ఎన్నిసార్లు చర్చలు జరిగినా తేలని పరిహారం రెండుసార్లు సర్వే చేయకుండానే వెనుదిరిగిన అధికారులు కొనసాగుతున్న పోలీస్ పహారా ప్రభుత్వమే ఆదుకోవాలి సాగుచేసుకుంటున్న భూములు తీసుకుంటే మా బతుకులు ఆగమైతయి. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. ఎంత పరిహారం ఇస్తామన్న విషయం అధికారులు సరిగా చెప్పడంలేదు. ఎమ్మెల్యేపైనే భారం పెట్టాం. ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడి పరిహారం ఇప్పిస్తామని చెప్పారు. – అనుసూయ, మహిళా రైతు, ఎనికేపల్లి మా బతుకులు ఏం కావాలి తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్నాం. ప్రభుత్వం ఇప్పుడు గోశాలకు ఇస్తే మా బతుకులు ఏం కావాలి. 1954 నుంచి 1998 వరకు పహణీల్లో మా పేర్లు వచ్చాయి. తరువాత సర్కారు భూమి అని వచ్చింది. మోకిలలో ఇచ్చినట్లు ఎకరాకు 750 గజాల చొప్పున పరిహారం ఇస్తే మంచిది. – న్యాలట మహిపాల్, రైతు, ఎనికేపల్లి -
రక్తదానానికి ముందుకు రావాలి
పహాడీషరీఫ్: తలసేమియా బాధితులను ఆదుకునేందుకు రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని సరూర్నగర్ మండల మాజీ వైస్ ఎంపీపీ ఉమర్ బామ్ అన్నారు. మజ్లిస్–ఏ–ఉలమాయే హుఫాజ్ వా దానిశ్వరనే మిల్లత్ ఆధ్వర్యంలో షాహిన్నగర్లో ఆదివారం ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నెల నెల రక్తమార్పిడి అవసరమయ్యే వారికి రక్తదానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏటా మనదేశంలో 10–12 వేల మంది తలసేమియా పిల్లలు జన్మిస్తున్నారన్నారు. ప్రభుత్వాలు కూడా తలసేమియాను ప్రజారోగ్య సమస్యగా ప్రకటించాలన్నారు. ఎర్ర రక్తకణాలలో హీమోగ్లోబిన్ లోపం వల్ల ఒక మాదిరి నుంచి తీవ్రమైన రక్తహీనత లక్షణాలు కలిగి, రక్త సంబంధమైన అనువంశిక రుగ్మతే తలసేమియా మేజర్గా పేర్కొంటారన్నారు. దాదాపు 390 మంది దాతలు రక్తదానం చేసి తలసేమియా సికిల్ సెల్ సొసైటీకి అందజేశారు. కార్యక్రమంలో హాఫీజ్ అబ్దుల్ హాది, డాక్టర్ ముస్తఫా అలీ సుఫియానీ, సయ్యద్ యూసుఫ్ పటేల్, అబ్దుల్ రవూఫ్, ఎం.ఎ.బారీ, అలీం బేగ్ తదితరులు పాల్గొన్నారు. -
చైతన్యంతోనే సమస్యలకు పరిష్కారం
ఇబ్రహీంపట్నం: రాజకీయంగా చైతన్యవంతులై ఎదిగితేనే సమస్యలను పరిష్కరం అవుతాయని.. ఆ లక్ష్యం దిశగా ముందుకుసాగాలని సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పురి శేఖర్ పిలుపునిచ్చారు. మున్సిపల్ పరిధిలోని ఓ గెస్ట్ హౌస్లో ఆదివారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక గ్రామాల్లో సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా పోటీ చేయాలని పిలుపునిచ్చారు. సగరులు నివసిస్తున్న గ్రామాల్లో కుల గురువైన శ్రీ భగీరథ మహర్షి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్నారు. రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముత్యాల హరికిషన్ మాట్లాడుతూ.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నాయకత్వ పటిమతో సగరులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మార్క సతీష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుక శ్రీకాంత్, నాయకులు నాగేశ్వర్, నవీన్ పాల్గొన్నారు. -
ఫుట్పాత్ల ఆక్రమణలపై
శంషాబాద్: 15 రోజుల కిందట సాతంరాయిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీకి సమీపంలో రోడ్డుకు ఆనుకుని ఉన్న చిరువ్యాపారాలకు సంబంధించిన డబ్బాలు తొలగించాలని ఉన్నతస్థాయి నుంచి అందిన ఆదేశాలను అధికారులు క్షణాల్లో పూర్తి చేశారు. పక్కాగా పోలీసుల సహకారంతో జేసీబీలను ఏర్పాటు చేసి అక్కడున్న గరీబోళ్ల డబ్బాలను వెంటనే తొలగించి పెద్దసార్ల ఆదేశాలను ఆదేశాలను తూచాతప్పకుండా పూర్తి చేశారు. నాలాను ఆనుకుని ఆక్రమణలున్న కారణంగానే ఫిర్యాదులు అందగానే వాటిని తొలగించినట్లు మున్సిపల్ అధికారులు చెప్పుకొచ్చారు. మరి ఇక్కడ..? శంషాబాద్ పట్టణ ప్రధాన కేద్రంలో ప్రజలకు తీవ్ర ఇబ్బంది కరంగా మారుతున్న ఫుట్పాత్ల ఆక్రమణపై మున్సిపల్ అధికారులు ఏడేళ్లుగా ఒక్కటంటే ఒక్కసారి కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గతంలో అనేక మార్లు ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు కౌన్సిల్లో తీర్మానాలు చేసి అవి కార్యాచరణకు నోచుకున్న దాఖలు కూడా లేవు. రోడ్డులను ఆక్రమించి హోటళ్లు, వ్యాపారాలు చేసుకుంటున్నా కన్నెత్తి చూసిన పాపాన పోవడం లేదు. అద్దెకిచ్చేస్తున్నారు... ఫుట్పాత్లను ఆక్రమించి కొందరు సొంత వ్యాపారాలను విస్తరిస్తుండగా మరికొందరు తమ దుకాణాల ముందు చిరువ్యాపారులకు అద్దెకిస్తున్నారు. రోడ్డును అద్దెకిచ్చి ఏళ్లుగా లక్షల రూపాయలు సంపాదిస్తున్న తీరు కూడా ఇక్కడ షరామాములే అన్నట్లుగా మారింది. పట్టణంలోని రాళ్లగూడ రహదారిలో ఫిరంగి నాలాను ఆనుకుని పదుల సంఖ్యలో డబ్బాలను ఏర్పాటు చేసి అద్దెకిచ్చేస్తున్నారు. దీనిపై ఇంతవరకు మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఫుట్పాత్ల ఆక్రమణ కారణంగా సాధారణ ప్రజలతో పాటు ప్రయాణికులు సైతం నిత్యం నరకం చూస్తున్నారు. జనాభా రద్దీలేని సాతంరాయిలో పెద్దసార్ల ఆదేశాలతో ఆగమేఘాల మీద ఆక్రమణ తొలగింపులు చేసిన అధికారులు అదే రీతిన పట్టణంలో ఉన్న ఫుట్పాత్ల ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హైవే ఫుట్పాత్పై కంటైనర్ వేసి ఏర్పాటు చేసిన హోటల్ శంషాబాద్లో విచ్చలవిడిగా ఫుట్పాత్ల ఆక్రమణ కంటైనర్ల ఏర్పాటు చేసిదందా చేస్తున్నా చర్యలు శూన్యం సాతంరాయిలో యుద్ధప్రాతిపదికన డబ్బాలు తొలగించిన మున్సిపల్ అధికారులు పట్టణ ప్రధాన కేంద్రంలో పట్టించుకోని యంత్రాంగంఆక్రమణలను తొలగిస్తాం.. పట్టణంలో ఫుట్పాత్లను ఆక్రమించుకుని ఉ న్న కట్టడాలు, డబ్బాలను తప్పకుండా తొలగిస్తాం. రహదారులను ఆక్రమించి ఉంటే కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఆక్రమణలు ఎవరివైనా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. – సుమన్రావు, శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ -
నూతన పీఆర్సీని వెంటనే అమలు చేయాలి
షాద్నగర్ః ఉద్యోగ, ఉపాధ్యాయులకు నూతన పీఆర్సీని వెంటనే అమలు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో ఆదివారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించేందుకు రూ.700కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చి రూ.180 కోట్లు మాత్రమే విడుదల చేసిందని అన్నారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి రెండేళ్లు గడిచిపోయిందన్నారు. కమిటీ నివేదికను అమలు చేయకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించాలని లేని పక్షంలో జేఏసీతో చర్చలు జరిపి దశల వారీగా పోరాటాలు చేసేందుకు వెనుకాడేది లేదని హెచ్చరించారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గోపాల్ నాయక్, ప్రధాన కార్యదర్శి వెంకటప్ప, నాయకులు రాములయ్య, జగన్నాథ్ శర్మ, బుగ్గ రాములు, శంకర్ నాయక్, రాములయ్య, యాదగిరి పాల్గొన్నారు. -
యువత వ్యసనాల బారిన పడొద్దు
యాచారం: యువత చెడు అలవాట్లకు గురై జీవితాలను నాశనం చేసుకోవద్దని హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజు సూచించారు. పీఎస్ పరిధిలోని కుర్మిద్ద గ్రామంలో ఆదివారం సాయంత్రం గంజాయి, డ్రగ్స్ నియంత్రణ, రోడ్డు నిబంధనలు, ఘర్షణల వల్ల జీవితాల నాశనం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు యువతనేనని, అలాంటి వారు వ్యసనాలకు గురై జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. గొప్ప లక్ష్యంతో యువత ఆసక్తి కలిగిన రంగాల్లో రాణించాలని సూచించారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో కేసులు నమోదుతో పాటు జరిమానాలు విధిస్తామన్నారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, బంధువుల ఇళ్లకు, శుభకార్యాలకు వెళ్లేటప్పుడు విలువైన వస్తువులు, బంగారు నగలను ఇంట్లో ఉంచి వెళ్లరాదని సూచించారు. సమావేశంలో రాచకొండ సీఐ జోసఫ్, ఎస్ఐ తేజంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజు -
పనికి వెళ్లడం లేదని..
తల్లి మందలించడంతో కొడుకు అదృశ్యం పహాడీషరీఫ్: పనికి వెళ్లడం లేదని తల్లి మందలించడంతో కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి వాదే ముస్తఫా బస్తీకి చెందిన షేక్ సమియుద్దీన్ షరీఫ్ కుమారుడు అకేఫుద్దీన్ షరీఫ్(21) ప్రైవేట్గా పని చేస్తుంటాడు. కొన్ని రోజులుగా పనికి పోకపోవడంతో తల్లి ఫర్హానా బేగం ఈ నెల 19వ తేదీన ఉదయం మందలించింది. అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. 21న తిరిగి తల్లి ఫోన్కు కాల్ చేసిన షరీఫ్ ‘నేను పనికి వెళ్లడం లేదని నన్ను తిడుతున్నారు.. నేను ఎక్కడికై నా వెళ్లిపోతాను’ అంటూ కట్ చేశాడు. ఎంతకి అందుబాటులోకి రాకపోవడంతో సాధ్యమైన ప్రాంతాలలో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విషయమై యువకుడి తల్లి ఆదివారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇతడి ఆచూకీ తెలిసిన వారు పోలీస్స్టేషన్లో గాని 87126 62367 నంబర్లో గాని సమాచారం అందించాలని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. శిథిలావస్థకు చెరువు తూము దుద్యాల్: మండలంలోని ఆలేడ్ గ్రామంలో ఉన్న తూము లీకేజీ కావడంతో చెరువులో ఉన్న నీరు వృథాగా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది పూర్తిస్థాయి నీటి మట్టం నిండుకుంది. చెరువు తూము లీకేజీ కావడంతో నీరు వృథాగా పోయిందని రైతులు వాపోతున్నారు. తూము నుంచి నీరు బయటకు పోకుండా ఉపయోగించే ఇనుప రాడ్డు పూర్తిగా లోపలికి పడిపోయిందని అన్నదాతలు పేర్కొంటున్నారు. చెరువు తూము లీకేజీ అవుతున్నా ఇప్పటివరకు ఏ అధికారి కూడా పరిశీలించిన దాఖలాలు లేవు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తూముకు మరమ్మతులు చేయాలని వ్యవసాయదారులు కోరుతున్నారు. -
కనకదుర్గమ్మకు జోడు బోనాలు
చార్మినార్: ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం విజయవాడ కనక దుర్గ అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించారు. భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ ఆధ్వర్యంలో పాతబస్తీలోని వివిధ దేవాలయాలకు చెందిన ప్రతినిధుల బృందంతో పాటు అక్కన్న మాదన్న దేవాలయం కమిటీ సభ్యులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. జోగిని శ్యామల వెండి బోనం ఎత్తారు. ఈసారి బంగారు బోనాన్ని కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ సతీమణి సంగీత ఎత్తుకున్నారు. ఈసారి విజయవాడ కనక దుర్గమ్మకు బంగారు, వెండి పాత్రల్లో జోడు బోనాలు సమర్పించారు. -
క్రీడాకారులను ప్రోత్సహిస్తాం
షాబాద్: గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ స్టేడియంలో ఆదివారం ఏఎంఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో చైర్మన్ ఎలుగంటి అభిరామ్రెడ్డి నిర్వహిస్తున్న ఎస్పీఎస్–3 క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రాంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూధన్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు క్రీడాపాలసీకి రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పాఠశాలలో ఒక స్పోర్ట్స్ టీచర్ ఉండేలా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. అన్ని మండలాల్లో ఉన్న స్టేడియాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. క్రీడాపోటీలతో స్నేహ సంబంధాలు ఏర్పడతాయని అన్నారు. గెలుపోటములు సమానంగా స్వీకరించి లక్ష్యం దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, ముడిమ్యాల, పెద్ద మంగళారం సహకార సంఘాల చైర్మన్లు ప్రతాప్రెడ్డి, చంద్రారెడ్డి, పీసీసీ సభ్యుడు షాబాద్ దర్శన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఎంపీటీసీ మాజీ సభ్యులు, మాజీ సర్పంచ్లు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి -
తెలంగాణ సాహిత్యాన్ని కాపాడుకోవాలి
చేవెళ్ల: మన కవుల సాహిత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అనంత సాహిత్యం–సాంస్కృతిక వేదిక వ్యవస్థాపకుడు దోరవేటి చెన్నయ్య, అధ్యక్షుడు తూర్పు మల్లారెడ్డి సూచించారు. ఆదివారం మండల కేంద్రంలోని వివేకానంద కళాశాలలో అనంత సాహిత్యం–సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ మహాకవుల జయంతిని ఘనంగా నిర్వహించుకుని, భావితరాలకు అందించాలన్నారు. అనంతరం సంస్థ నూతన కమిటీని ఎన్నుకున్నారు. వారు ఈ సంవత్సరం నిర్వహించే కార్యక్రమాల క్యాలెండర్ను రూపొందించుకున్నట్లు తెలిపారు. జూలై 27న వికారాబాద్లో దాశరథి, సి.నారాయణరెడ్డిల జయంతి, చేవెళ్లలో కాళోజీ జయంతి నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆయా శాఖల వారీగా ఉగాది కవి సమ్మేళనాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చేవెళ్ల ప్రాంతం నుంచి అనంత ప్రతినిధులుగా ఘనపురం పరమేశ్వర్, పాపిరెడ్డిలను ఎన్నుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ప్రముఖ కవి కడియాల మధుసూదన్, అనంత సాహిత్యం–సాంస్కృతిక వేదిక ప్రధాన కార్యదర్శి కమలేశ్, కార్యదర్శి శ్రీనివాస్, హనుమంత్, సభ్యులు ఆశీర్వాదం, నర్సయ్య, ప్రసాద్, శ్రీనయ్య తదితరులు పాల్గొన్నారు.అనంత సాహిత్యం–సాంస్కృతిక వేదిక సభ్యులు -
వర్సిటీ ఫుట్బాల్ చాంపియన్ ఎక్సలెన్సియా
మొయినాబాద్: వర్సిటీ ఫుట్బాల్ ట్రోఫీ చాంపియన్షిప్ను ఎక్సలెన్సియా జట్టు కై వసం చేసుకుంది. అజీజ్నగర్లోని డెక్కన్ అరేనా గ్రౌండ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గార్డియం జట్టుపై ఎక్సలెన్సియా జట్టు విజయం సాధించింది. రాష్ట్రంలోని వివిధ పాఠశాలల నుంచి 60 జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్ నాలుగు నెలలపాటు కొనసాగింది. ఫైనల్స్లో ఎక్సలెన్సియా జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. మొదటి ఆఫ్లో ఇరు జట్లు 0–0 స్కోర్తో ఉన్నా సెకండ్ ఆఫ్ 58వ నిమిషంలో నిమిష్ 30 యార్డ్ దూరం నుంచి అద్భుతమైన షాట్ కొట్టి ఎక్సలెన్సియా జట్టుకు గోల్ అందించాడు. చివరి వరకు గార్డియా జట్టు గోల్ చేయకపోవడంతో ఎక్సలెన్సియా జట్టు 1–0తో విజయం సాధించింది. విజేత జట్టుకు నిర్వాహకులు బహుమతి అందించారు. గోల్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించిన మినిష్కు బ్యాలన్ డి ఓర్, గోల్డెన్ బూట్ అవార్డులు లభించాయి. ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయండి కేశంపేట: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జూలై 1న నిర్వహించనున్న లంబాడా హక్కుల పోరా ట సమితి ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందర్నాయక్ పిలుపునిచ్చారు. ఈ మేరకు నంగారా భేరి కరపత్రాలను మండల పరిధిలోని ఎక్లాస్ఖాన్పేటలో ఆదివారం ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా చందర్ నాయక్ మాట్లాడుతూ.. లంబాడా హక్కుల పోరాట సమితి ఏర్పడి ఏళ్లు పూర్తవుతున్నందున తండాల్లో ఆవిర్భవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో మోహన్నాయక్, గోపాల్నాయక్, బాబురాజ్ నాయక్, శ్రీనివాస్ నాయక్, సంతోష్ నాయక్, పరశురాంనాయక్, రవి నాయక్, రాజేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఐస్ స్కేటింగ్లో చిన్నారి సత్తా పహాడీషరీఫ్: బాలాపూర్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల చానస్య గౌడ్ 20వ జాతీయ ఐస్ స్కేటింగ్ చాంపియన్షిప్–2025 పోటీల్లో సత్తా చాటింది. ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో శనివారం జరిగిన పోటీలో చానస్య ఒక రజతం, ఒక కాంస్య పతకాన్ని సాధించింది. 9–10 ఏళ్ల విభాగంలో నిర్వహించిన ఈ పోటీల్లో చానస్య మంచుపై దృఢ సంక్పంతో అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించింది. చిన్నారి ఆసక్తిని గమనించిన ఆమె తండ్రి శ్రీనివాస్ గౌడ్ ప్రోత్సహించడంతో ఆమె ఈ ఘనత సాధించింది. విద్య, ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం పరిగి: విద్య, ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడుతామని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని తపస్ కార్యాలయంలో జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ప్రతీ ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలున్నా తమదృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రతీ పాఠశాలలో తాగునీటి వసతి కల్పిస్తామన్నారు. ఉపాధ్యాయుల నుంచి వస్తున్న మల్టీ జోన్–2లో ఖాళీగా ఉన్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. -
వ్యక్తి అదృశ్యం
పహాడీషరీఫ్: వ్యక్తి అదృశ్యమైన సంఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పహాడీషరీఫ్కు చెందిన హబీబుల్లాఖాన్ కుమారుడు రహ్మతుల్లాఖాన్(40) తాగుడకు బానిసయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు 2024 జనవరిలో బాలాపూర్ మెట్రో సిటీలోని మా హెల్ప్ డిటెక్షన్ సెంటర్లో చేర్పించారు. ఆరు నెలల పాటు చికిత్స పొందిన అనంతరం రహ్మతుల్లా ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. అతని ఆచూకీ కోసం వెతికినా లాభం లేకపోవడంతో సోదరుడు అంజదుల్లాఖాన్ శుక్రవారం రాత్రి పీఎస్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు బాలాపూర్ పీఎస్లో లేదా 87126 62366 నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
అగ్నివీర్ శిక్షణ కేంద్రం నుంచి యువకుడి అదృశ్యం
కందుకూరు: బెంగళూరులో అగ్నివీర్ శిక్షణ పొందుతున్న మండల పరిధిలోని బేగంపేటకు చెందిన యువకుడు దయ్యాల సతీష్ అదృశ్యమయ్యాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం.. దయ్యాల కొమురయ్య రెండో కొడుకు సతీష్ (20) ఈఏడాది మార్చి నెలలలో అగ్నివీర్కు ఎంపికయ్యాడు. శిక్షణ కోసం బెంగళూరు వెళ్లాడు. రెండు నెలలుగా ట్రైనింగ్ పొందుతున్న సతీష్ ఈనెల 24న అదృశ్యమయ్యాడు. శిక్షణలో ఓ సార్ తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని స్నేహితులకు మెస్సేజ్ చేశాడు. ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వెంటనే బెంగళూరుకు చేరుకుని ఈనెల 27న హోల్సూర్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. శనివారం విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు వి.బాల్రాజ్ తదితరులతో కలిసి బేగంపేటలోని సతీష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. బెంగళూరులోని హోల్సూర్ పీఎస్లో బాధితుల ఫిర్యాదు -
కోర్టు కాంప్లెక్స్ సందర్శన
ఇబ్రహీంపట్నం: జిల్లా ప్రధాన న్యాయయూర్తి కర్ణ కుమార్ శనివారం ఇబ్రహీంపట్నం కోర్టు కాంప్లెక్స్ను సందర్శించారు. ఇక్కడ కొనసాగుతున్న 15వ అదనపు జిల్లా న్యాయస్థానం, సీనియర్, జూనియర్ కోర్టులను పరిశీలించి, ప్రాంగణంలో మొక్కలు నాటారు. అదనంగా కోర్టు బిల్డింగ్, క్యాంటిన్, ఫ్యామిలీ కోర్టు తదితర అవసరాలకు సంబంధించిన ప్రతిపాదనలను పంపిస్తే.. తాను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి పనులు వేగవంతమయ్యేలా చూస్తా నని తెలిపారు. ఆయన వెంట ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్ శ్రీదేవి, అదనపు సీనియర్ సివిల్ జడ్జి రీటా లాల్చంద్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి యశ్వంత్సింగ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముద్దం వెంకటేశం, ప్రధాన కార్యదర్శి అరిగే శ్రీనివాస్కుమార్, ఉపాధ్యక్షులు భాస్కర్, సహాయ కార్యదర్శి కృష్ణ, సీనియర్ న్యాయవాదులు శ్రీనివాస్రెడ్డి, అంజన్రెడ్డి, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం బార్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయమూర్తి కర్ణకుమార్ను ఘనంగా సన్మానించారు. ఆవరణలో మొక్కలు నాటిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణకుమార్ బార్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం -
దేశ రక్షణలో యువత కీలకం
మొయినాబాద్ రూరల్: దేశ రక్షణలో యువత కీలకమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. హిమాయత్నగర్ చౌరస్తాలోని స్వామి నారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ పాఠశాలలో శనివారం నిర్వహించిన ఇన్వెస్టించర్ కార్యక్రమ ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే దేశభక్తితో పాటు రాజకీయాలపై మక్కు వ పెంచుకోవాలన్నారు. దేశ భద్రతలో భాగస్వా ములు కావాలని పిలుపునిచ్చారు. పాఠశాల ప్రధా న స్వామీజీ సుక్వల్లభ్, ప్రిన్సిపల్ ప్రవీణ్కుమార్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ -
ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం
మొయినాబాద్: నగర శివారుల్లో ప్రభుత్వ భూములపై కబ్జాదారులు కన్నేశారు. మండల పరిధిలోని కనకమామిడి రెవెన్యూలో రూ.15 కోట్ల విలువచేసే మూడెకరాల ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జాచేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అడ్డుకుని కబ్జారాయుడిపై కేసు నమోదు చేశారు. వివరాలు.. కనకమామిడి రెవెన్యూ సర్వేనెంబర్ 510లో 300 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఇదే సర్వే నెంబర్లో కేతిరెడ్డిపల్లి వెళ్లే మార్గంలో మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని నగరానికి చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి కబ్జా చేస్తున్నాడు. జేసీబీతో భూమిని చదును చేసి ఫ్రీకాస్ట్ వాల్తో రూంలు నిర్మిస్తున్నాడు. విషయం తెలుసుకున్న మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్కుమార్, పోలీసులు, సిబ్బందితో అక్కడికి వెళ్లి కబ్జాను అడ్డుకున్నారు. కబ్జాదారుడు భూమి తనదని అధికారులతో వాగ్వాదానికి దిగాడు. అధికారులు భూమికి సంబంధించిన పత్రాలు చూపాలని కోరడంతో అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తూ వీరంగం చేశాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునేందుకు యత్నించడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ప్రభుత్వ భూమిని కబ్జాచేస్తూ వేసిన ఫెన్సింగ్, ఫ్రీకాస్ట్వాల్ను రెవెన్యూ అధికారులు తొలగించారు. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని బోర్డులు ఏర్పాటు చేశారు. దీనిపై రెవెన్యూ అధికారులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కబ్జాదారుడిపై కేసు నమోదు చేశారు. వరుస ఘటనలు మొయినాబాద్ మండలంలో ప్రభుత్వ భూముల కబ్జా ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. గురువారం మండల పరిధిలోని తోలుకట్టలో సర్వే నంబర్ 155లో రూ.5 కోట్లు విలువ చేసే 1.14 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ నిర్మించిన ఫ్రీకాస్ట్వాల్ను తొలగించి కబ్జా చెరనుంచి విడిపించారు. శుక్రవారం అజీజ్నగర్లో సర్వేనెంబర్ 177లో రూ.30 కోట్లు విలువ చేసే రెండు ఎకరాల ప్రభుత్వ భూమిలో చేపట్టిన నిర్మాణాలను తొలగించి భూమిని స్వాధీనం చేసుకుని బోర్డులు పెట్టారు. శనివారం కనకమామిడిలో 510 సర్వే నెంబర్లో రూ.15 కోట్ల విలువ చేసే మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చెరనుంచి కాపాడి బోర్డులు పెట్టారు. అడ్డుకున్న రెవెన్యూ అధికారులు కబ్జాదారుడిపై కేసు భూముల జోలికొస్తే జైలుకే ప్రభుత్వ భూములు ఖాళీగా కనిపిస్తే కొంత మంది అక్రమార్కులు కబ్జాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ భూములు కబ్జాచేసేవారు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదు. క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తాం. ప్రభుత్వ భూములను కాపాడేందుకు ప్రత్యేక దృష్టి సారించాం. ప్రభుత్వ భూముల చుట్టూ ఫెన్సింగ్ పనులు చేపడుతున్నాం. – గౌతమ్కుమార్, తహసీల్దార్, మొయినాబాద్ -
రేషన్ డీలర్పై సస్పెన్షన్ వేటు
ఆమనగల్లు: పట్టణానికి చెందిన రేషన్ డీలర్ గాజుల భార్గవిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక రెవెన్యూ శాఖ అధికారులు ఆమెకు ఉత్వర్వులు ఇచ్చేందుకు వెళ్లగా అందుబాటులోకి రాలేదు. దీంతో షాప్కు ఉత్తర్వుల కాపీని అంటించి దుకాణానికి సీజ్ చేశారు. భూధార్ రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలి జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు చేవెళ్ల: భూధార్ కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని డీఏఓ నర్సింహారావు వ్యవసాయాధికారులను ఆదేశించారు. శనివారం ఆయన శంకర్పల్లి మండలం టంగుటూర్లో భూదార్ కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆయన చేవెళ్ల వ్యవసాయ డివిజన్ కార్యాలయంలో ఏడీఏ సురేశ్బాబు, ఏఓ శంకర్లాల్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒక గుంట మొదలుకుని ఎన్ని ఎకరాలున్నా భూధార్ కార్డు కోసం వ్యవసాయాధికారుల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే అన్ని పథకాలు ఇక భూదార్ కార్డు ఆధారంగానే కొనసాగుతాయని చెప్పారు. రైతులంతా వ్యవసాధికారులకు సహకరించి ఈ రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని కోరారు. రైతు క్లస్టర్ సందర్శన మొయినాబాద్ రూరల్: రైతులు భూధార్ తప్పక చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి నర్సింహారావు అన్నారు. శనివారం ఆయన మండల కేంద్రంలోని రైతు క్లస్టర్ను సందర్శించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఆయన వెంట చేవెళ్ల ఏడీఏ సురేశ్, మండల వ్యవసాయ అధికారి అనురాధ, సునీల్ తదితరులు పాల్గొన్నారు. నేటి పొదుపు భవిష్యత్కు భరోసా సహకార భారతి రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్రెడ్డి షాద్నగర్రూరల్: మనం చేసే పొదుపు భవిష్యత్కు ఆర్థిక భరోసా ఇస్తుందని సహకార భారతి రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఏబీ కన్వెన్షన్ హాలులో శ్రీరామలింగేశ్వ సహకార సంఘం సమితి 13వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ.. మనం ఎంత సంపాదించామనేది ప్రధానం కాదని, ఎంత పొదుపు చేస్తున్నామనేది ముఖ్యమని అన్నారు. అనవసర ఖర్చులను తగ్గించుకుని కొంత మొత్తాన్ని పొదుపు చేసుకుంటే భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుందని వివరించారు. పొదుపు సహకార సంఘాలద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆర్థిక చేయూతనందిస్తున్నామని చెప్పారు. అనంతరం దుర్గావాహిణి సంస్థ రాష్ట్ర కన్వీనర్ వాణిసక్కుబాయి మాట్లాడుతూ.. పొదుపు సంఘాలు ప్రజల ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. నియోజకవర్గంలో దాదాపు 50 గ్రామాల్లో పొదుపు సంఘాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పొదుపు సంఘాలతో స్వయం ఉపాధి అవకాశాలను కల్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామలింగేశ్వర సహకార సంఘం వ్యవస్థాపకుడు కుమారస్వామి, అధ్యక్షుడు మల్లేశ్ పూజారి, ఉపాధ్యక్షుడు మహేందర్, సీఈఓ సుమంత్కుమార్, మేనేజర్ రాఘవేందర్, గ్రామ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. హారికకు ‘ప్రావీణ్య పురస్కార్’ కొడంగల్: పట్టణంలోని నవీన ఆదర్శ పాఠశాల విద్యార్థిని హారికకు రాష్ట్ర స్థాయిలో ప్రావీ ణ్య పురస్కార్ అవార్డు వరించింది. జాతీయ సెమ్స్ ఒలంపియాడ్ ఆధ్వర్యంలో మార్చిలో జాతీయ స్థాయి పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ పోటీల్లో రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించిన హారికను శనివారం నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో సెమ్స్ ఫౌండేషన్ డైరెక్టర్ రాంచందర్రెడ్డి, ట్రస్టు రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి అవార్డు, మెమొంటో, మెడల్తో సత్కరించారు. శాలువా కప్పి అభినందించారు. నవీన ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేష్ రాజ్ను విశేష పురస్కార్ అవార్డుతో సన్మానించారు. -
చికిత్స పొందుతున్న మహిళ మృతి
స్కూటీని కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురికి చేరిన మృతులు మొయినాబాద్: కారు, స్కూటీని ఢీకొట్టిన ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. మండల పరిధిలోని రెడ్డిపల్లి సమీపంలోని ఈ నెల 25న స్కూటీపై వెళ్తున్న మహిళను ఎదురుగా అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో హిమాయత్నగర్లో అద్దెకుండే ఖైరతాబాద్కు చెందిన అశ్విని(37), మేడిపల్లికి చెందిన సుశీల(60) మృతి చెందిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో గాయపడిన అశ్విని మరుదలు లక్ష్మి(35) నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువతి అదృశ్యం పహాడీషరీఫ్: యువతి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జయరాం కుటుంబం తుక్కుగూడలోని నార్త్ స్టార్ ఏర్పోర్ట్ బాలియార్డ్ విల్లాలో నివాసం ఉంటోంది. ఈయన కుమార్తె సురేఖ వెంకట దుర్గ(24) ప్రైవేట్ ఉద్యోగి. ఈ నెల 23వ తేదీన కుటుంబ సభ్యులు నిద్రలేచి చూసేసరికి వెంకట దుర్గ కనిపించలేదు. ఆమె ఆచూకీ కోసం వెతికినా లాభం లేకుండా పోయింది. శివ అనే యువకుడిపై అనుమానం ఉందని తల్లి దేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది. ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్టు శంషాబాద్ రూరల్: ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..ఊట్పల్లిలో ఉన్న డైమండ్ ఎస్టేట్ కాలనీలో తారకేశ్వర్ తన కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఇతనికి ఖైనీ, గుట్కా నమలడం అలవాటు ఉంది. ఈ క్రమంలో కొన్ని నెలల నుంచి వీటిని అతను ఓఆర్ఆర్ వంతెన వద్ద కొంత మంది ద్వారా కొనుగోలు చేస్తున్నాడు. వాటితో పాటు వారు ఇతనికి గంజాయిని కూడా విక్రయించారు. గంజాయిలో విత్తనాలు కనిపించగా..వాటిని తన ఇంటి ఆవరణలో కూరగాయాలతో పాటు పెంచుతున్నాడు. ఈ విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతన్ని ఇంటికి వెళ్లి విచారణ చేయడంతో గంజాయి మొక్కలు కనిపించాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డబ్బుతో ఉడాయించిన వ్యక్తిపై ఫిర్యాదు రాజేంద్రనగర్: ఆన్లైన్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేసుకొని ఉడాయించిన నేరస్తుడి కోసం రాజేంద్రనగర్ పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం..కిస్మత్పూర్లో ఓ వ్యక్తి తన చిల్లర దుకాణంలోనే ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ను చేస్తుంటాడు. శుక్రవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి (30) ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా రూ.75 వేల నగదు కావాలని కోరాడు. డబ్బులు అర్జెంట్ ఉందని..రూ.5 వేలు అదనంగా ఇస్తానని తెలిపాడు. దీంతో దుకాణ నిర్వాహకుడు డబ్బును గుర్తు తెలియని వ్యక్తికి ఇచ్చాడు. ఆన్లైన్ పేమెంట్ చేస్తానంటూ అతన్ని మాటల్లో దింపి అక్కడి నుంచి జారుకున్నాడు. దీంతో బాధితుడు రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించాడు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నిందితుడు హిమాయత్సాగర్కు చెందిన పాత నేరస్తుడిగా గుర్తించారు. నిందితుని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నేడు శ్రీరాంనగర్ ఎన్నికలు మణికొండ: శ్రీరాంనగర్ (సెక్రటేరియట్) కాలనీ సంక్షేమ సంఘం ఎన్నికలు ఆదివారం కమ్యూనిటీహాల్లో నిర్వహిస్తున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ఉంటుందన్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత కౌటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తామన్నారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కోశాధికారి పదవులకు పోటీ అధికం కావడంతో ఎన్నికలు నిర్వహిస్తున్నామని, మిగతా పదవులకు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగిపోయిందన్నారు. -
ఆలయాలకు దారి మూసేయడం తగదు
పహాడీషరీఫ్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నగర శివారులోని విలువైన ప్రభుత్వ భూములను విక్రయించడమే పనిగా పెట్టుకుందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి విమర్శించారు. శనివారం ఆమె గ్రామస్తులతో కలిసి హౌజింగ్ బోర్డు అధికారులు ప్రీ కాస్ట్ గోడలను నిర్మిస్తున్న మామిడిపల్లిలోని దొంతరాల గుట్టపై ఉన్న మల్లన్న స్వామి, ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆలయానికి వెళ్లకుండా అధికారులు ప్రహారీ నిర్మిస్తున్నారని స్థానికులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ ఎక్కడ ప్రభుత్వ భూములున్నాయో గుర్తించి, వాటిని అమ్మడమే ఎజెండాగా పెట్టుకుందన్నారు. హెచ్సీయూ భూముల విక్రయం వెలుగులోకి వచ్చి ఆగిపోవడంతో, చివరకు ఆ భూములను తాకట్టు పెట్టి బ్యాంక్లలో రూ.10 వేల కోట్లు రుణం తీసుకొచ్చిందన్నారు. ఇతర ప్రాంతాలలోని భూములను కూడా విక్రయించడంలో భాగంగానే రావిరాలలోని భూముల వద్దకు రావడంతో అడ్డుకున్నామన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నిర్మాణ సమయంలో మామిడిపల్లి రైతులు పెద్ద ఎత్తున పొలాలు ఇచ్చారన్నారు. ఇందులోని 50 ఎకరాలను ప్రభుత్వం హౌజింగ్ బోర్డుకు కేటాయించిందన్నా రు. రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వనందున, హౌజింగ్ బోర్డు అధికారులు స్థలాన్ని ఆధీనంలోకి తీసుకునే సమయంలో రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని అప్పట్లోనే కోరామని గుర్తు చేశారు. విమానాశ్రయం నిర్మాణానికి ముందే ఇక్కడ ఆలయాన్ని నిర్మించుకున్నారని, ప్రస్తుతం ఆలయానికి కూడా వెళ్లకుండా అధికారులు ప్రీ కాస్ట్ వాల్ నిర్మించడం సరికాదన్నారు. దేవాలయం జోలికి రావద్దని అధికారులకు సూచించారు. రావిరాల జొన్నాయిగూడలో లక్ష్మీనర్సింహ స్వామి ఆలయానికి గతంలో 30 ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందని, ప్రస్తుతం అవసరం లేనప్పటికీ, పాత రోడ్డును వదిలేసి ఆలయు భూ ముల్లో నుంచి కొత్త రోడ్డు వేస్తున్నారన్నారు. అనంతరం ఆమె హౌజింగ్ బోర్డు అధికారులను ఫోన్లో సంపద్రించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పవన్ కుమార్ యాదవ్, శివకుమార్, ఆలయ కమిటీ ప్రతినిధులు నరేష్ యాదవ్, గోపాల్ యాదవ్, బాలరాజు యాదవ్, గ్రామస్తులు నందీశ్వర్, దశరథ, శ్రీనివాస్ రెడ్డి, రంగనాథ్, మహేందర్ యాదవ్, శంకర్ యాదవ్, చంద్రయ్య యాదవ్, ఎల్.శ్రీనివాస్, ఎన్.యాదగిరి, కె.బాబు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి సబితారెడ్డి -
ఉద్యాన పంటలకు ప్రోత్సాహం
చేవెళ్ల: ఉద్యాన పంటలు, డెయిరీల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. మున్సిపల్ పరిధిలోని దేవునిఎర్రవల్లిలో శనివారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణరెడ్డి పొలంలో 21 ఎకరాల్లో చేపట్టిన ఆయిల్పామ్ ప్లాంటేషన్ను స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఉద్యానశాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్బాషాలతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆయిల్పామ్ డిమాండ్కు తగిన విధంగా రైతులు ముందుకురావాలన్నారు. సంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటలపై దృష్టిసారించాలని సూచించారు. రాష్ట్రంలో డిమాండ్కు సరిపడా కూరగాయలు పండకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని తెలిపారు. ఆయిల్పామ్ సాగుకు తెలుగు రాష్ట్రాల భూములు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. దేశానికి సరిపడా కావాలంటే 70లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయాల్సి ఉందన్నారు. తెలంగాణలో జిల్లాకో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటే లక్ష్యమని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్ల రైతుభరోసా నిధులు విడుదల చేశామని వెల్లడించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ డ్రిప్ పరికరాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జిల్లాలో శనివారం ఒక్కరోజే 557 ఎకరాల్లో ప్లాంటేషన్ చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. 5వేల ఎకరాల్లో పంట సాగుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముప్పై ఏళ్ల పాటు ఆదాయం హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ.. ఆయిల్పామ్ సాగుకు ఎకరానికి 52 వేల సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు. ఒక్కసారి సాగు చేస్తే ముప్పై ఏళ్ల పాటు ఆదాయం వస్తుందన్నారు. ఇది రైతులకు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వంటి కార్యక్రమమని స్పష్టంచేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేయండి జిల్లాతోపాటు చేవెళ్ల నియోజకవర్గంలోని రైతుతులు ఎక్కువగా ఆయిల్పామ్సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. స్థానికంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. అందరికీ అందుబాటులో ఉండేలా గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్లో లేదా అజీజ్నగర్లో ఏర్పాటు చేసేలా కృషి చేయాలన్నారు. డ్రోన్ ఇప్పించండి.. సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. మంత్రి స్ఫూర్తితోనే ఆయిల్పామ్సాగుకు ముందుకు వచ్చినట్లు చెప్పారు. తమ గ్రామంలోని రైతు సంఘానికి ఓ డ్రోన్ ఇప్పించాలని, చేవెళ్లలో డివిజన్ వ్యవసాయ, ఉద్యాన కార్యాలయలకు భవనాలు కేటాయించాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో గిండ్డంగుల సంస్థల చైర్మన్ ఆర్.నాగేశ్వర్రావు, ఆర్డీఓ చంద్రకళ, జేడీఏ నర్సింహ్మరావు, పీఏసీఎస్ చైర్మన్లు వెంకట్రెడ్డి, సురేందర్రెడ్డి, గోనే ప్రతాప్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్యగౌడ్, గోపాల్రెడ్డి, నాయకులు జనార్దన్రెడ్డి, కృష్ణారెడ్డి, మానిక్యరెడ్డి, మధుసూదన్గుప్తా, ఆగిరెడ్డి, వసంతం, దర్శన్, కాలె శ్రీకాంత్, ప్రభాకర్, గోపాల్రెడ్డి, మధుసూదన్రెడ్డి, తహసీల్దార్ కృష్ణయ్య, వ్యవసాయశాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, తదితరులు ఉన్నారు. వాణిజ్య రైతులు దృష్టిసారించాలి Ð]lÅÐ]l-ÝëĶæ$ Ô>Q Ð]l$…{† ˘™èl$Ð]l$ÃÌS ¯éVóS-ÔèæÓ-ÆŠ‡-Æ>Ð]l# దేవునిఎర్రవల్లిలో ఆయిల్పామ్ సాగు ప్లాంటేషన్ -
ఎఫ్టీఎల్లో ఇళ్లు!
తుర్కయంజాల్: చెరువులు, కుంటల పరిరక్షణకు ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కూల్చివేతలు చేపడుతున్నా కొందరు అధికారుల తీరులో మార్పు కనిపించడం లేదు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను పరిశీలించకుండానే అనుమతులు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలోని ఇంజాపూర్, తుర్కయంజాల్, మన్నెగూడ, తొర్రూర్, మునగనూర్, కొహెడ రెవెన్యూలోని అనేక చెరువులు, కుంటల పరిధిలో పలు నిర్మాణాలకు అధికారులు అనుమతులు జారీ చేయడం, అవి ఆలస్యంగా బయటకు పొక్కుతుండడం చర్చకు దారితీస్తున్నాయి. ఎఫ్టీఎల్లోనే వెంచర్ ఇంజాపూర్లోని సర్వే నెంబర్లు 96, 97, 98, 99, 100, 104, 105లో 15.9 ఎకరాల ఎఫ్టీఎల్, 2.10 ఎకరాల బఫర్ జోన్తో గుడెం కుంట చెరువు విస్తరించి ఉంది. 2017లో హెచ్ఎండీఏ ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసి, 2024 సెప్టెంబర్లో ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చింది. కొన్నేళ్ల క్రితం నగరానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు తనకున్న అధికార బలంతో ఎఫ్టీఎల్ పరిధిలో వెంచర్ చేశాడు. ఆ తరువాత యథేచ్ఛగా ప్లాట్లను విక్రయించాడు. యథేచ్ఛగా ఇంటి నిర్మాణ అనుమతులు 2023 డిసెంబర్, 2024 జనవరిలో 12 ప్లాట్లకు ఎన్ఓసీలు లేకుండానే అప్పటి టౌన్ ప్లానింగ్ అధికారి, కమిషనర్ ఇంటి నిర్మాణ అనుమతులు జారీ చేశారు. ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. ఇది తెలుసుకున్న పలువురు స్థానికులు పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. 18 నెలలు పూర్తి అవుతున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వీటిని రద్దు చేసే విషయంలో వెనకడుగు వేస్తుడటం సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. ఎల్ఆర్ఎస్ చెల్లించేందుకు విఫలయత్నం ఇటీవల ప్రభుత్వం ఎల్ఆర్ఎస్–2020లో దరఖాస్తు చేసుకున్న వారు రాయితీపై ఫీజు చెల్లించే అవకాశం కల్పించడంతో ఈ లే అవుట్లోని ప్లాట్ల యజమానులు చెల్లించేందుకు యత్నించినా సాధ్యం కాలేదు. దీంతో గతంలో మాదిరిగా అధికారులనే ప్రసన్నం చేసుకుని అనుమతులు పొందాలని భావించి పలు ప్లాట్లకు డబ్బులు సైతం చెల్లించారనే ప్రచారం సాగుతోంది. అధికారులు వినకపోవడంతో ఓ ప్రజా ప్రతినిధితో చెప్పించేందుకు యత్నించారని గుసగుసలు వినిపించాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఎఫ్టీఎల్ పరిధిలో జారీ చేసిన నిర్మాణ అనుమతులను రద్దు చేయడంతో పాటు, చెరువును కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. గుడెం కుంట చెరువుపరిశీలించిన తర్వాతే అనుమతులు చెరువులు, కుంటల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో మున్సిపల్ అధికారులు ఇంటి నిర్మాణ అనుమతులు జారీ చేయవద్దు. గతంలో జారీ చేసిన వాటిని రద్దు చేసే అధికారం వారికే ఉంది. ఇప్పటికే అన్ని చెరువులకు సంబంధించిన మ్యాప్లను అధికారులకు అందజేశాం. వీటిని పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇవ్వాలి. – వంశీ, ఇరిగేషన్ ఏఈఈ, అబ్దుల్లాపూర్మెట్ చర్యలు తీసుకుంటాం గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు గుడెం కుంటలో ఇంటి నిర్మాణ అనుమతులు జారీ చేసిన విషయం ఆలస్యంగా తెలిసింది. దీనిపై విచారణ చేపడుతున్నాం. ప్లాట్లను పరిశీలించాక తగిన చర్యలు తీసుకుంటాం. ఇంటి నిర్మాణ అనుమతులను రద్దు చేస్తాం. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలను చేపట్టవద్దు. – కె.అమరేందర్ రెడ్డి, కమిషనర్, తుర్కయంజాల్ అధికార బలంతో వెంచర్ 2023–24లో అనుమతులు ఇచ్చిన టీపీఓ, కమిషనర్ రద్దు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం గుడెం కుంటను కాపాడలని స్థానికుల వినతి -
మహేశ్వరం జీఎంసీ ఆకస్మిక తనిఖీ
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శనివారం ఆమె ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని భారత్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనతరం నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ త్రివేణిని అడిగి పనులుపై ఆరా తీశారు. ల్యాబ్లను పరిశీలించిన ఆమె విద్యార్థులకు కావాల్సిన సామగ్రి తెప్పించాలని సూచించారు. మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రస్తుతం 50 మంది మాత్రమే ఉన్నారని వారికి ఎలాంటి లోటు లేకుండా చూడాలన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. త్వరలో నిర్వహించనున్న మొదటి సంవత్సరం పరీక్షలకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. మరో మారు హైలెవల్ కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు. అప్పటి వరకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని వసతులు కల్పించి విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం తహసీల్దార్ సునీతారెడ్డి, వైస్ప్రిన్స్పాల్ నాగమణి, డాక్టర్ మహ్మద్ టాకుద్దీన్ తదితరులు ఉన్నారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తాం మొదటి ఏడాది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేస్తాం అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ -
చోరీ కేసుల్లో రికవరీ పెరగాలి
● ఎప్పుడొస్తారో.. ఎప్పుడిస్తారో ప్రతి నెల 1వ తేదీ నుంచి ఇవ్వాల్సిన పింఛన్లు పోస్టల్ సిబ్బంది నెలాఖరులో ఇస్తున్నారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని అజీజ్నగర్లో సుమారు 500 మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు. ఈ నెలలో ఇవ్వాల్సిన పింఛన్లు ఇప్పటి వరకు ఇవ్వలేదు. లబ్ధిదారులు నిత్యం మున్సిపల్ కార్యాలయానికి వచ్చి వెళ్తున్నారు. శుక్రవారం సైతం ఇలా రోజంతా పడిగాపులు కాశారు. సాయంత్రం వరకు కూడా పోస్టల్ సిబ్బంది రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. – మొయినాబాద్ఇబ్రహీంపట్నం రూరల్: చోరీ కేసుల్లో సొత్తు రికవరీ శాతం పెరగాలని, ఆ దిశగా పనిలో వేగం పెంచాలని రాచకొండ పోలీస్కమిషనర్ సుధీర్బాబు ఆదేశించారు. ఆదిబట్ల పోలీస్స్టేషన్ను శుక్రవారం ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ నిర్వహణకు సంబంధించి సీఐ రాఘవేందర్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. మాదక ద్రవ్యాల కేసులో సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయాలని సూచించారు. ఎన్బీడబ్ల్యూ కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. కేసుల ఛేదన, రిసెప్షన్ నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. మహిళా కేసుల విచారణ వేగవంతం చేయాలని చెప్పారు. రౌడీీషీట్ చెకింగ్, లాంగ్ పెండింగ్ కేసులు తేల్చాలని పేర్కొన్నారు. ఏడాది కాలంగా ఆదిబట్ల పోలీస్స్టేషన్ నిర్వహణ బాగుందని, చోరీ కేసుల్లో జోన్ పరిధిలో మంచి ఫలితాలు సాధించారని కితాబిచ్చారు. లోక్ అదాలత్లో కేసులు రాజీ చేయడంలో చొరవ బాగుందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం మరింతగా శ్రమించాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐలు రాజు, వెంకటేశ్, బాల్రాజ్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.రాచకొండ సీపీ సుధీర్బాబు బోడకొండ గుట్టల సందర్శన మంచాల: మండలంలోని బోడకొండ గుట్టలను శుక్రవారం రాచకొండ సీపీ సుధీర్బాబు సందర్శించారు. వాటర్ఫాల్స్ను పరిశీలించి స్థానిక పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాటర్ఫాల్స్ పూర్తిగా బండరాళ్లతో కూడి ఉందని, ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రాణాలకు ప్రమాదమని అన్నారు. ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అవసరమైతే పికెటింగ్ ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, మంచాల సీఐ మధు, ఎస్ఐ లాలయ్య తదితరులు ఉన్నారు. -
ప్రభుత్వ భూములను పరిరక్షించండి
మహేశ్వరం: అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్ భూములను పరిరక్షించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. మండల కేంద్రంలోని ఎస్వీజే కన్వెన్షన్ హాలులో శుక్రవారం పార్టీ 12వ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహేశ్వరం, కందుకూరు మండలాల్లో ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్ భూములు కబ్జాకు గురవుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. రూ.కోట్ల విలువ చేసే భూములు కొంత మంది కబ్జాదారుల చేతిలో ఉన్నాయని ఆరోపించారు. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కునే ప్రయ త్నాలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. మహేశ్వరం మండలంలోని రావిరాల కొంగరఖుర్దు, నాగిరెడ్డిపల్లి, కందుకూరు మండలం అన్నోజిగూడలో ఐటీ, ఎలక్ట్రానిక్ పార్కుల కోసం కార్పొరేట్ కంపె నీలకు కట్టబెట్టేందుకు రైతుల నుంచి బలవంతంగా తీసుకుంటోందని మండిపడ్డారు. అంతకు ముందు ఆయన కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందోజు రవీంద్రాచారి, రాష్ట్ర కమిటీ సభ్యుడు పానుగంటి పర్వతాలు, నియోజకవర్గ కన్వీనర్ దత్తు నాయక్, మండల కార్యదర్శి పల్నాటి యాదయ్య, కందుకూరు మండల కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమ కళాకారులను ఆదుకోవాలి
హయత్నగర్: తెలంగాణ ఉద్యమంలో కళాకారులు ముందుండి పోరాటం చేశారని, వారికి తగిన గుర్తింపు ఇచ్చి ఆదుకోవాలని ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ, జిల్లా ఇన్చార్జి ముత్యాల యాదిరెడ్డి అన్నారు. కుంట్లూరు రావినారాయణరెడ్డి కాలనీలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రజానాట్యమండలి జిల్లా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం సమగ్ర సాంస్కృతిక విధానాన్ని ప్రకటించాలని, కళాకారులకు గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు, పిల్లల చదువులకు ఫీజులో రాయితీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ నెల 30న జరిగే సదస్సులో కళాకారుల సమస్యలపై చర్చిస్తామని, తీర్మానాన్ని ఆమోదించి ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. జిల్లా సహాయ కార్యదర్శి రాము అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మండల కార్యదర్శి హరిసింగ్నాయక్, జిల్లా కార్యదర్శి వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు. -
పరిహారం మెరుగు!
యాచారం: ఫార్మా రైతులకు త్వరలో తీపి కబురు అందనుందా అంటే ఔననే సమాధానం వస్తోంది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఫార్మాసిటీకి పట్టా భూములు ఇవ్వడం లేదని మొండికేసిన రైతుల భూ రికార్డులను టీజీఐఐసీ పేరు మీద మార్చి, పరిహారాన్ని అథారిటీలో జమ చేసిన రైతులకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించింది. టీజీఐఐసీ పేరు మీద మార్చేసిన భూ రికార్డులను తమ పేరిట మార్చాలని రైతులు హైకోర్టును ఆశ్రయించడం, కోర్టు సానుకూల ఉత్తర్వులు ఇవ్వడం తెలిసిందే. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు నిత్యం తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, సీసీఎల్ఏ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. భూరికార్డుల మార్పుతో నాలుగేళ్లుగా బాధిత రైతులు రైతు బంధు, రైతు భరోసా, బ్యాంకు రుణాల మాఫీ కోల్పోవడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో విక్రయించుకుందామంటే అవకాశమే లేకుండా పోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు మద్దతుగా మాట్లాడిన కాంగ్రెస్ పెద్దలు అధికారంలోకి వచ్చాక స్పందించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రైతుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. నాలుగేళ్లుగా బాధిత రైతుల చక్కర్లు యాచారం మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఫార్మాసిటీకి 9,851 ఎకరాల అసైన్డ్, పట్టా భూమిని సేకరించడానికి నిర్ణయించారు. అందులో భాగంగా 7,640 ఎకరాలు సేకరించారు. నిర్ణయించిన మేరకు పరిహారం అందజేశారు. ఆయా గ్రామాల్లో దాదాపు 1,500 మందికి పైగా రైతులకు చెందిన 2,211 ఎకరాల పట్టా భూమిని ఫార్మాకు ఇవ్వాలని అప్పట్లో అధికారులు తీవ్ర ఒత్తిళ్లు తెచ్చారు. రైతులు ససేమిరా అనడంతో రాత్రికిరాత్రే అవార్డులు పాస్ చేసి, పరిహారం డబ్బులను అథారిటీలో జమ చేశారు. కొన్ని రోజుల వ్యవధిలోనే భూ రికార్డులను టీజీఐఐసీ పేరు మీద మార్చేశారు. నాలుగేళ్లుగా ఆయా గ్రామాల రైతులు తమ పేర్ల మీద మార్చాలని అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. గతంలోకంటే మెరుగ్గా.. పట్టా రైతుల భూ రికార్డుల విషయం కోర్టు పరిధిలో ఉండడంతో అధికారులు సైతం ఏమీ చేయలేకపోయారు. విషయాన్ని కొద్దిరోజుల క్రితం రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రైతులు భూమికి భూమి ఇచ్చినా పరవాలేదు అంటుండగా సర్కార్లోని పెద్దలు మాత్రం భూమికిభూమి ఇస్తే రాష్ట్రమంతా అదే సమస్య వస్తుందనే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు గతంలో ఇచ్చిన దానికంటే మెరుగైన పరిహారం ఇప్పించి, మెప్పించేలా దృష్టి సారించినట్టు తెలిసింది. పట్టా భూములకు మొదట్లో ఎకరాకు రూ.12.50 లక్షలు, ఆ తర్వాత రూ.16 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పెంచి ఇచ్చారు. పరిహారంతో పాటు ఎకరా భూమికి 121 గజాల ప్లాటు ఇచ్చారు. ప్రస్తుతం ఎకరాకు రూ.50 లక్షలలోపు పరిహారం, ఎకరాకు 121 గజాల ప్లాటు ఇచ్చేలా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. త్వరలో జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబు ఆధ్వర్యంలో రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలు సీఎం రేవంత్రెడ్డిని కలిసి రైతులకు తీపి కబురు అందించనున్నట్టు తెలుస్తోంది. ఫార్మా రైతులకు తీపి కబురు న్యాయం జరిగేలా సర్కార్ దృష్టి ఎకరాకు రూ.50 లక్షలలోపు పరిహారం, 121 గజాల ప్లాటు ఇచ్చేలా యోచన నాలుగేళ్ల నిరీక్షణకు తెర -
తాగునీటిని సక్రమంగా సరఫరా చేయాలి
షాబాద్: ప్రజలకు తాగునీటి ఇక్కట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. మండల పరిధిలోని అంతారం గ్రామ సమీపంలో ఉన్న మిషన్ భగీరథ ప్లాంట్ను శుక్రవారం పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి పరిశీలించారు. నీటిని సక్రమంగా శుద్ధి చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథ తాగునీటిని సక్రమంగా సరఫరా చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలంలో ఎక్కడా లీకేజీలు లేకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట మిషన్ భగీరథ ఈఎస్సీ కృష్ణాకర్రెడ్డి, ఎస్ఈ ఆంజనేయులు, వాటర్ గ్రిడ్ ఈఈ చల్మారెడ్డి, ఇంట్రా ఈఈ రాజేశ్వర్రావు, డీఈ వెంకటేశ్వర్లు, ఏఈలు ప్రపుల్లాకుమార్, గంగ, ప్రియదర్శిని తదితరులు ఉన్నారు. త్వరగా బ్రిడ్జి పనులు పూర్తి చేయాలి మొయినాబాద్రూరల్: మొయినాబాద్–శంకర్పల్లి మండలాలను కలుపుతూ చిన్నమంగళారం సమీపంలో ఈసీ వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను త్వ రగా పూర్తి చేసి, ప్రజలకు ఉపయోగపడేలా చూడా లని రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ అన్నారు. చిన్నమంగళారం సమీపంలో మూసీవాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కనకరత్నం, ఎస్సీ శ్రీనివాస్రెడ్డి, ఈఈ శ్రీరాములు, ఏఈ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్ -
ఆ ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
కేశంపేట: మండల పరిధిలోని పాటిగడ్డ కేజీబీవీలో విధులు నిర్వర్తిస్తున్న ఏడుగురు ఉపాధ్యాయులకు జిల్లా విద్యాధికారి సుశీందర్రావు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు మండల విద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. ‘సాక్షి’లో ఈ నెల 21 ‘టీచర్లు ఫంక్షన్కి.. పాఠాలు గాలికి’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం విధితమే. దీనికి స్పందించిన డీఈఓ సదరు ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేశారు. దీంతో వారు శుక్రవారం జిల్లా కార్యాలయానికి వెళ్లి వివరణ ఇచ్చారు. ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి తుర్కయంజాల్: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలని మహేశ్వరం ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ అన్నారు. పురపాలక సంఘం పరిధి తుర్కయంజాల్లో శుక్రవారం సీఐ గురునాయుడుతో కలిసి వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ప్రమాదాల బారిన పడ్డప్పుడు తలకు బలమైన గాయాలు తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. హెల్మెట్ ఉంటే ప్రాణాలు కాపాడుకోవచ్చని చెప్పారు. అనంతరం హెల్మెట్ లేకుండా సాగర్ రహదారిపై ప్రయాణిస్తున్న వారికి చలాన్లకు బదులు కొత్త వాటిని కొనుగోలు చేయించారు. ఆయన వెంట ఎస్ఐ సాయినాథ్ ఉన్నారు. సహకార సంఘాన్ని సందర్శించిన విద్యార్థులుతుర్కయంజాల్: ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కో ఆపరేషన్–2025ను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్లో ఇంటర్న్షిప్లో ఉన్న నిజాం కళాశాల, బేగంపేట్ డిగ్రీ కళాశాల విద్యార్థుల బృందం శుక్రవారం తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘాన్ని సందర్శించింది. సంఘం రైతుల కోసం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పని విధానాన్ని ఈ సందర్భంగా విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్యను కలిసి పలు విషయాలపై చర్చించారు. కొహెడలోని గోదాములను పరిశీలించిన అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీసీఓ సుధాకర్, సహకార యూనియన్ ఫ్యాకల్టీ ఆర్.సురేఖా రాణి, వై.పరిమళా దేవి, బి.నాగేశ్వర రావు, సీఈఓ వై.రాందాసు పాల్గొన్నారు. జిల్లా పశువైద్యాధికారిగా డాక్టర్ మధుసూదన్ సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లా పశు సంవర్థకశాఖ అధికారిగా డాక్టర్ మధుసూదన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ పని చేసిన ఆర్జేడీ బాబుబేరిపై పలు ఆరోపణలు రావడం, ఉన్నతాధికారులు ఆయన్ను ఆ స్థానం నుంచి తప్పించి, ఆ స్థానంలో మధుసూదన్ను నియమించడం తెలిసింది. దీంతో ఆయన జిల్లా పశు వైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడిపరిశ్రమ అభివృద్ధికి కోసం పాటు పడుతానని తెలిపారు. పశు వైద్య సిబ్బంది అంతా బాధ్యతగా పని చేయాలన్నారు. బాబుబేరిపై చర్యలు తీసుకోవాలి ఇప్పటి వరకు ఇక్కడ ఆర్జేడీగా పని చేసిన బాబుబేరిపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని, గొర్రెల పంపిణీ పథకంలో ఆయన అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగానే జిల్లా వైద్య సిబ్బందిపై పలు రకాల వేధింపులకు పాల్పడాడ్డని హైదర్గూడ పీవీసీ డాక్టర్ ఎంకే శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు ఆయన సాక్షితో మాట్లాడారు. బాబు బేరి తనపై కక్షగట్టాడని, ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ఫిర్యాదులు చేసు న్నాడని పేర్కొన్నారు. సరిపడా స్టాఫ్ లేకపోవడంతోనే టీకాలు సకాలంలో వేయలేకపోయినట్లు తెలిపారు. రిఫ్రిజిరేటర్లో భద్రపరిచిన వ్యాక్సిన్లను ఉద్దేశపూర్వకంగా సీజ్ చేసి, వాటిని పాడు చేయడమే కాకుండా ప్రభుత్వానికి నష్టం కలిగించిన ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఫ్యూచర్సిటీలోకి మరో ప్రభుత్వరంగ సంస్థ
కందుకూరు: ఫ్యూచర్సిటీలోకి మరో ప్రభుత్వరంగ సంస్థ రాబోతోంది. ఈ మేరకు అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన చేపట్టారు. మండల పరిధిలోని మీర్ఖాన్పేట రెవెన్యూ సర్వే నంబ ర్ 119, 120లో టీజీఐఐసీ సేకరించి ఫ్యూచర్సిటీకి కేటాయించిన భూముల్లోని 20 ఎకరాల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ కార్యాల యం ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి శ్రీదేవి, ఎఫ్సీడీఏ కమిషనర్ శశాంక సదరు సర్వే నంబర్లలోని భూములను పరిశీలించారు. రెండు ప్రదే శాల్లో ఏదో ఒకదాన్ని త్వరలో ఆ సంస్థ ఏర్పాటుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. వారి వెంట తహసీల్దార్ గోపాల్, ఇతర అధికారులు ఉన్నారు. భూములను పరిశీలించిన అధికారులు -
అప్పులు తీర్చేందుకు చోరీల బాట
● సీసీ కెమెరాలకు చిక్కిన నిందితులు ● అన్నదమ్ములకు రిమాండ్ యాచారం: ప్రైవేట్ ఉద్యోగస్తులైన ఇద్దరు అన్నదమ్ము లు అప్పులు తీర్చేందుకు చోరీల బాటపట్టారు. చివరకు సీసీ కెమె రాల ఆధారంగా పోలీసులకు చిక్కారు. ఈ మేరకు శుక్రవారం వారిని రిమాండ్కు తరలించారు. యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని కుర్మిద్ద గ్రామానికి చెందిన నరేశ్, ఇబ్రహీంపట్నం మండలం మంగల్పల్లికి చెందిన వెంకటేశ్ వరుసకు అన్నదమ్ములు. ఈ నెల 23న మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లికి చెందిన బండ పార్వ తమ్మ నక్కర్తమేడిపల్లిలో బంధువుల ఇంటికి వచ్చి స్వగ్రామానికి వెళ్లే క్రమంలో తక్కళ్లపల్లి గేట్ వద్ద బస్సు ఎక్కేందుకు రోడ్డుపై వేచియుంది. ఈ క్రమంలో ఆమె ఒంటరిగా ఉందని గమనించిన అనదమ్ము లు హెల్మెట్లు ధరించి బైక్వచ్చి పార్వతమ్మ మెడలోంచి మూడు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కెల్లారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసు లు శుక్రవారం వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. ఈ మేరకు వారి వద్ద నుంచి అపహరించిన పుస్తెలతాడును స్వాధీ నం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించామని పోలీసులు తెలిపారు. -
బందోబస్తు మధ్య గుడిసె తొలగింపు
నందిగామ: మోత్కులగూడలోని ఓ వివాదాస్పద స్థలంలో ఏర్పాటు చేసిన గుడిసెను గ్రామ కార్యదర్శి చెన్నయ్య శుక్రవారం పోలీసు బందోబస్తు మధ్య తొలగించారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ స్థలాన్ని గతంలో ప్రభుత్వం మాకే కేటాయించిందని ఒకరు, కాదు మాకే కేటాయించిందని మరొకరు గొడవ పడుతున్నారు. ఇరువురి మధ్య నెలకొన్న ఈవివాదం చినికిచినికి గాలివానలా మారడంతో రాజకీయ రంగు పులుముకుంది. ఈ స్థలంలో ఓ వ్యక్తి ఇటీవల ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోయగా, ఆ స్థలం తమదేనని, తనకు పట్టాతో పాటు, ఏళ్ల తరబడి కబ్జాలో ఉన్నామని మరో వ్యక్తి నిర్మాణాన్ని అడ్డుకున్నాడు. ఇరవై రోజులుగా ఈ పంచాయితీ కొనసాగుతోంది. ఇరువురూ ఒకరిపై ఒకరు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. తనకు పట్టా ఉందని చెబుతున్న వ్యక్తి సదరు స్థలంలో ఇటీవల గుడిసె వేశారు. దీన్ని తొలగించాలని కోరుతూ మరో వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో శుక్రవారం గ్రామ కార్యదర్శి చెన్నయ్య స్థానిక పోలీసుల బందోబస్తు మధ్య గుడిసెను తొలగించారు. ఈసమయంలో ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పటికీ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ విషయమై ఎంపీడీఓ సుమతిని వివరణ కోరగా.. ఇరువురు వ్యక్తులు ప్లాట్లు తమవేనంటున్నారని తెలిపారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టా సర్టిఫికెట్లు, లే అవుట్ మ్యాప్ను పరిశీలించి ప్లాటు ఎవరిదో నిర్ధారిస్తామని, అప్పటివరకు ఎవరూ అందులోకి వెళ్లకూడదని చెప్పామన్నారు. మోత్కులగూడలో ఉద్రిక్త పరిస్థితులు సదరు స్థలంలోకి ఎవరూ వెళ్లొద్దన్న అధికారులు -
ప్రభుత్వ పాఠశాల స్థలంలో ఇళ్ల నిర్మాణం
కూల్చివేయించిన రెవెన్యూ అధికారులు చేవెళ్ల: ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చేవెళ్ల తహసీల్దార్ కృష్ణయ్య హెచ్చరించారు. నాంచేరి రెవెన్యూ పరిధిలోని ఇంద్రారెడ్డి నగర్లో ప్రభుత్వ పాఠశాలకు కేటాయించిన స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న ఏడు ఇళ్లను శుక్రవారం పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఇంద్రారెడ్డి నగర్లో ప్రభుత్వ పాఠశాలకు సర్కార్ 2.20 ఎకరాల స్థలం కేటాయించింది. ఇక్కడ ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల కొనసాగుతోంది. చుట్టూ ఖాళీ స్థలం ఉండడంతో ఏడుగురు స్థానికులు ఆక్రమించి ఎలాంటి అనుమతులు లేకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ కృష్ణయ్య, ఆర్ఐలు చంద్రమోహన్, పవన్, సీఐ భూపాల్ శ్రీధర్, ఎస్ఐ సంతోష్కుమార్ వెళ్లి నిర్మాణాలను కూల్చివేశారు. ఈ కూల్చివేతల్లో రెవన్యూ సిబ్బంది నర్సింలు, ప్రకాశ్, ఆంజనేయులు, రవీందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నిర్మాణాల్లో అధికార పార్టీకి చెందిన నాయకుడి కుమారుడి ఇళ్లు ఉండడం విశేషం. వీధి కుక్క స్వైర విహారం కొందుర్గు: జిల్లేడ్ చౌదరిగూడ మండలం వాచ్చతండా గ్రామపంచాయతీ దేవులనాయక్తండాలో శుక్రవారం వీధికుక్క స్థైర్య విహారం చేసింది. తండాకు చెందిన ముగ్గురు వ్యక్తులపై దాడిచేసి, గాయపరిచింది. మేకలు, కోళ్ల వెంటపడుతున్న కుక్కను నేనావత్ చందర్, సబావత్ సక్రీబాయ్ అదిలించే ప్రయత్నం చేయగా వారిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచిందని స్థానికులు తెలిపారు. పక్కనే ఉన్న ముడావత్ హర్షవర్ధన్(5)పై దాడిచేసి గాయపరిచిందని పేర్కొన్నారు. కుక్కల దాడిలో గాయపడిన వారిని చికిత్స కోసం షాద్నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి కుల్కచర్ల ఎస్ఐ రమేశ్ కుల్కచర్ల: దుకాణదారులు ప్రతీ ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవానలి కుల్కచర్ల ఎస్ఐ రమేశ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా వంద కెమెరాలతో సమానమన్నారు. రోడ్డు ప్రమాదాలు, చోరీలు జరిగిన సమయంలో నిందుతులను సులువుగా పట్టుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
గోదాం పైనుంచి పడి కూలీ మృతి
హయత్నగర్: రేకుల షెడ్డు పైకప్పు నుంచి కింద పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన హయత్నగర్ పోలీస్టేషన్ పరిఽధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తుర్కయంజాల్ మున్సిపాలిటీ కొహెడకు చెందిన పొట్లచెరువు మల్లేశ్(55) తోటి కార్మికులతో కలిసి శుక్రవారం ఉదయం స్థానికంగా ఉన్న ఓ విత్తనాల కంపెనీ గోదాం పైకప్పు రేకులను మార్చే పని చేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడ్డాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయమైంది. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మనస్తాపంతో ఆత్మహత్య ఇబ్రహీంపట్నం: బిహార్ రాష్ట్రానికి చెందిన యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన శుక్రవారం సాయంత్రం ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్కు చెందిన వివేక్(23) ఇదే రాష్ట్రానికి చెందిన కాంచన అనే అమ్మాయిని ఐదు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం ఇబ్రహీంపట్నానికి వచ్చి ప్రగతినగర్లో నివాసముంటూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వారం రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన వివేక్ భార్య బయటకు వెళ్లిన సమయంలో, వెంటిలెటర్కు చీర కట్టి ఉరేసుకుని, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య వచ్చి తలుపులు తీసి చూడగా చలనం లేకుండా కనిపించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. హుండీ చోరీకి విఫలయత్నం ఇబ్రహీంపట్నం: గుర్తు తెలియని దుండగులు దర్గాలో హుండీ చోరీకి విఫలయత్నం చేశారు. ఈ ఘటన ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన ్పరకారం.. చర్లపటేల్గూడకు వెళ్లే మార్గంలోని జహంగీర్పీర్ దర్గా వద్ద హుండీని భూమిలోకి ఉంచి చుట్టూ సిమెంట్తో ఏర్పాటు చేశారు. ఈ హుండీని పెకిలిచేందుకు గుర్తు తెలియని దుండుగుల చుట్టూ ఉన్న సిమెంట్ తవ్వారు. ప్రయత్నం విఫలమవడంతో మధ్యలోనే వదిలి వెళ్లారు. దుండగుల ఆచూకీకి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
మూగ వేదన!
సుస్తీ చేసిన పశువులకు చికిత్స కరువు● మృత్యువాత పడుతున్న మూగజీవాలు ● అందుబాటులో ఉండని పశువైద్యులు ● వ్యాక్సిన్లు వేయకున్నా వేసినట్లు రికార్డులు ● ప్రభుత్వ ఆస్పత్రిలో జీతం.. ప్రైవేటులో విధులుసాక్షి, రంగారెడ్డిజిల్లా: పశువులకు సుస్తీ చేస్తే సరైన చికిత్స అందక మూగ వేదన అనుభవిస్తున్నాయి. వివిధ రకాల వ్యాధులతో మృత్యువాతపడుతున్నాయి. వాటినే జీవనాధారంగా జీవనం సాగిస్తున్న రైతులకు తీరని శోకం మిగుల్చుతున్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పశు వైద్య కేంద్రాల్లో పశువైద్యులు నిత్యం అందుబాటులో ఉండాలి. ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యటించి, సీజన్ల వారీగా పశువులకు వచ్చే గాలికుంటు, ముద్ద చర్మ వ్యాధులు, పీపీఆర్(పారుడు), నట్టలతో వచ్చే జబ్బులపై అవగాహన కల్పించాలి. కొంత మంది వైద్యులు రోజుల తరబడి పశువైద్య కేంద్రాల ముఖం కూడా చూడడం లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అభాసుపాలు చేస్తున్నారు. వ్యాక్సిన్లు వేయకుండానే వేసినట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి ఇటీవల చేపట్టిన వరుస తనిఖీల్లో విస్తుగొలిపే అంశాలు వెలుగుచూశాయి. ఆస్పత్రుల ముఖం చూడని వైద్యులు జిల్లాలో 10,31,460 పశువులు, 2,40,69,700 కోళ్లు, 1.67 లక్షల గేదెలు, 7,67,125 మేకలు, 2,56,632 గొర్రెలు, 6,076 పందులు, 1,535 గుర్రాలు, 16 గాడి దలు, 27,200 కుక్క లు, 2,947 కుందేళ్లు ఉన్నట్లు అంచనా. సీజన్ మారిన సమ యాల్లో పశువులు పలు వ్యాధుల బారినపడుతుంటాయి. వాటికి సత్వర చికిత్స కోసం ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా నాలుగు ఏరియా వెటర్నరీ ఆస్పత్రులు, 46 ప్రాథమిక కేంద్రాలు, ఐదు మొబైల్ క్లినిక్స్, 87 సబ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఆరుగురు సహాయ సంచాలకులతో పాటు 48 మంది పశు వైద్య సహాయ శస్త్రచికిత్సకులు, 16 మంది వెటర్నరీ లైవ్స్టాక్ ఆఫీసర్లు, 31 మంది జూనియర్ వెటర్నరీ ఆఫీసర్లు, 53 మంది లైవ్ స్టాక్ అసిస్టెంట్లు, 37 మంది వెటర్నరీ అసిస్టెంట్లు, 117 మంది ఆఫీసు సబార్డినేటర్లను నియమించింది. వీరంతా నిత్యం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయా పశువైద్య కేంద్రాల్లో అందుబాటులో ఉండాలి. మెజార్టీ పశువైద్యులు ఆస్పత్రులకు రావడం లేదు. మచ్చుకు కొన్ని.. ● కొందుర్గు ప్రాథమిక వెటర్నరీ క్లినిక్ వైద్యుడు ప్రభుత్వ పశువైద్యశాలలో కంటే.. తన ప్రైవేటు క్లినిక్లోనే ఎక్కువ ఉంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తరచూ విధులకు గైర్హాజరవుతుండడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఉన్నతాధికారుల తనిఖీల్లో ఇదే అంశం స్పష్టమైంది. ● కనకమామిడి ప్రాథమిక వెటర్నరీ క్లినిక్ వైద్యుడిది సైతం ఇదే ధోరణి. ● ఆమనగల్లు వెటర్నరీ క్లినిక్లో పశువులకు చేసిన వైద్య పరీక్షలు, అందించిన చికిత్సల వివరాలు వైద్యుడు రాకపోవడంతో కిందిస్థాయి సిబ్బందే రికార్డు చేస్తుండటం విశేషం. బక్రీద్ విధుల్లో భాగంగా ఇక్కడి వైద్యుడికి శంకర్పల్లిలో డ్యూటీ వేయగా అంతదూరం వెళ్లనని చెప్పి, తర్వాత అదనపు డైరెక్టర్ ఆర్డర్ను సైతం ట్యాంపరింగ్ చేసి తనకు అనుకూలమైన ప్రాంతానికి వెళ్లినట్లు తెలిసింది. వ్యాక్సిన్ సీలు కూడా తీయకుండా.. గాలికుంటు వ్యాధి రహిత దేశంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గాలికుంటు వ్యాధి నిరోధక (ఎఫ్ అండ్ ఎండీ) టీకాల కార్యక్రమాన్ని ప్రతిష్టా త్మకంగా తీసుకుంది. ఇందుకు ఏటా రూ.40 లక్షల వరకు ఖర్చు చేస్తోంది. హైదర్గూడ ప్రభుత్వ ప్రాథమిక పశువైద్య కేంద్రం(పీవీసీ)లోని వైద్య సిబ్బంది వ్యాక్సిన్ వేయకుండానే వేసినట్లు రికార్డు చేశారు. ఈ సెంటర్కు 110 ఎఫ్ఎండీసీ వ్యాక్సిన్ బాటిళ్లను సరఫరా చేయగా, ఒక్కో బాటిల్ 50 పశువుల చొప్పున 5,249 పశువులకు వ్యాక్సిన్ వేసినట్లు రాశారు. ఏ ఒక్క దానికీ వ్యాక్సిన్ వేయలేదు. సీల్ కూడా తీయని 25 బాటిళ్లను ఇటీవల తనిఖీ కోసం వచ్చిన జిల్లా అధికారి గుర్తించి స్వాధీనం చేసుకోవడం విశేషం. ఇక ఒక బాటిల్ 30 పశువులకు మాత్రమే వచ్చే బ్లాక్ వాటర్ వ్యాక్సిన్ను ఏకంగా 134 పశువులకు వేసినట్లు రికార్డుల్లో నమోదు చేశా రు. ఇచ్చిన మూడు బాటిళ్లలో సీల్కూడా తీయని రెండు బాటిళ్లు అక్కడే ఉన్నాయి. ఆయా బాటిళ్లను జిల్లా అధికారి ఇటీవల సీజ్ చేశారు. తనిఖీ సమ యంలో ఆస్పత్రికి తాళం వేసినట్లు గుర్తించి, సదరు వైద్యురాలిని హెచ్చరించారు. వరుస తనిఖీలతో హడలెత్తించిన సదరు జిల్లా వైద్యాధికారిపై కొంత మంది ఉద్దేశపూర్వకగా ఆశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి బదిలీ చేయించారు. ఈ అంశాన్ని కలెక్టర్ సీరియస్గా తీసుకున్నట్లు తెలిసింది. -
క్షయవ్యాధి నిర్మూలనే ధ్యేయం
షాద్నగర్రూరల్: క్షయవ్యాధిని నిర్మూలించడమే ప్రభుత్వ ధ్యేయమని హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు అన్నారు. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని ఎలికట్టలో గురువారం చించోడ్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యురాలు స్రవంతి ఆధ్వర్యంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓపీ, హెచ్ఐవీ, ఎక్స్రే పరీక్షలు నిర్వహించారు. అనంతరం హెల్త్ ఎడ్యుకేటర్ మాట్లాడుతూ.. టీబీ లక్షణాలు ఉన్నవారు వెంటనే గల్ల పరీక్ష, ఎక్స్రే తీయించుకోవాలని తెలిపారు. ఈ పరీక్షలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా చేస్తారన్నారు. టీబీ ఉన్నట్లు నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వం మందులను ఉచితంగా ఇస్తుందని, క్రమం తప్పకుండా ఆరు నెలలు వాడితే వ్యాధి నయమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ, డాక్టర్ విజయలక్ష్మి, హెల్త్ సూపర్వైజర్లు, టీబీ సూపర్వైజర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూముల కబ్జాను సహించేది లేదు
తుర్కయంజాల్: ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని అబ్దుల్లాపూర్మెట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇంద్రాణి తెలిపారు. ఇంజాపూర్ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ సర్వే నంబర్ 199లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం కూల్చివేశా రు. ఈ సందర్భంగా ఇంద్రాణి మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది సంజీవ్ పాల్గొన్నారు. అధిక ఫీజులను నియంత్రించాలి షాద్నగర్ః అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పుట్టా లక్ష్మణ్ డిమాండ్ చేశారు. పట్టణంలో గురువారం సంఘం జిల్లా సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టేషనరీ, పుస్తకాలు, డొనేషన్లు, ఫీజుల పేరుతో లక్షల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. విద్యార్థుల తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పవన్కుమార్, నాయకులు మణికంఠ, అరుణ్, వినోద్, వంశీవర్ధన్రెడ్డి పాల్గొన్నారు. హక్కుల కోసం మరో పోరాటానికి సిద్ధం యాచారం: మండలంలోని తాడిపర్తి, నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, కుర్మిద్ద గ్రామాలకు చెందిన ఫార్మాసిటీ భూ బాధిత రైతులు గురువారం సమావేశమయ్యారు. టీజీఐఐసీ పేరు తీసేసి రికార్డుల్లో రైతుల పేర్లు నమోదు చేయాలని హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులిచ్చినా అధికారుల్లో స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కులను ఎలా సాధించుకుందా మని చర్చించారు. హైకోర్టు ఉత్తర్వులు, రికార్డుల్లో రైతుల పేర్లు నమోదు చేసి రైతు భరోసా కల్పించడం, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలు తదితర విషయాలపై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. రైతుల హక్కుల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని తీర్మానించారు. కార్యక్రమంలో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు కవులు సరస్వతి, నారాయణ, నిరంజన్, వినోద్రెడ్డి, గణేశ్, మహేందర్రెడ్డి పాల్గొన్నారు. న్యాయం చేయండి తుర్కయంజాల్: అబ్దుల్లాపూర్మెట్ మండలం ఇంజాపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 383లో హెచ్ఎండీఏ వెంచర్ ఏర్పాటు కోసం భూమి ఇచ్చిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. వెంచర్లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న భూమిని కోల్పోయినందుకుగాను 100 మంది రైతులకు 300 గజాల చొప్పున ప్లాట్ కేటాయిస్తున్నట్లు అప్ప టి ఆర్డీఓ, తహసీల్దార్ పత్రాలు అందజేశా రని తెలిపారు. అప్పట్లో ముగ్గురికి మాత్రమే రిజిస్ట్రేషన్ చేశారని, మిగతా వారిని అలానే వదిలేశారన్నారు. నాలుగేళ్లు గడుస్తున్నా నేటికీ రిజిస్ట్రేషన్ చేయకుండా కాలాయపన చేస్తున్నా రని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఆర్డీఓ, తహసీల్దార్ను కలవగా ఫైల్ తమ వద్ద లేదని, తాము ఏమీ చేయలేమని చెబుతున్నారని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
పోలీస్ పహారాలో ఎనికేపల్లి
మొయినాబాద్: గోశాల ఏర్పాటుకు కేటాయించిన ఎనికేపల్లి భూముల్లో పోలీస్ పహారా కొనసాగుతోంది. సర్వేనంబర్ 180లోని 99.14 ఎకరాల భూమిని ప్రభుత్వం గోశాల ఏర్పాటుకు కేటాయించిన విషయం తెలిసిందే. ఏడు దశాబ్దాలుగా భూములు సాగుచేసుకుంటున్న రైతులకు పరిహారం ఇస్తామని చెప్పిన అధికారులు పూర్తి స్థాయిలో పరిష్కరించలేదు. ఈ క్రమంలో గురువారం ఉదయం హెచ్ఎండీఏ అధికారులు భూములు సర్వే చేసేందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న కొంతమంది రైతులు అక్కడికి చేరుకున్నారు. మహిళా రైతులు అక్కడే కూర్చొని రోదిస్తూ నిరసన వ్యక్తం చేశారు. భూముల్లోకి ఎవరినీ వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి పంపించారు. హెచ్ఎండీఏ అధికారులు సర్వే చేయకుండానే వెనుతిరిగారు. పోలీసుల పహారా సాయంత్రం వరకు కొనసాగింది. ఎమ్మెల్యే యాదయ్యను కలిసిన రైతులు భూములు కోల్పోతున్న రైతులు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యను ఆయన నివాసంలో కలిశారు. తమకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం పెంచాలని.. ఎకరాకు సుమారు వెయ్యి గజాల స్థలాన్ని ఇవ్వాలని కోరారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే కలెక్టర్ నారాయణరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. అనంతరం రైతులను తీసుకుని కలెక్టర్ వద్దకు వెళ్లారు. ఎకరాకు 800 గజాల స్థలాన్ని ఇవ్వాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అంత ఇవ్వలేమని ప్రభుత్వ నిబంధనల ప్రకారం 200 గజాలు ఇస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. కనీసం 400 గజాలైనా ఇవ్వాలని కోరగా అంత ఇవ్వలేమని కలెక్టర్ తేల్చి చెప్పారు. దీంతో మీపని మీరు చేసుకోండి.. వారిపని వారు చేసుకుంటారని చెప్పి ఎమ్మెల్యే వెళ్లిపోయారు. పరిహారం విషయం ఎటూ తేలలేదు. సర్వే చేసేందుకు వచ్చిన హెచ్ఎండీఏ అధికారులు విషయం తెలిసి అక్కడికి చేరుకున్న రైతులు అడ్డుకుని వెనక్కి పంపించిన పోలీసులు ఎమ్మెల్యే, కలెక్టర్ను కలిసిన బాధితులు ఎటూ తేలని పరిహారం విషయం -
కొండంత బోనం.. కోటంత సంబురం
గోల్కొండ కోట ఆధ్యాత్మిక పరిమళాలతో అలరారింది. పోతురాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాలతో పరవశించింది. ఆషాఢ మాసం బోనాల జాతరలో భాగంగా గోల్కొండ శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి గురువారం తొలి బోనం పూజ ఘనంగా జరిగింది. ఆషాఢ మాసంలో గురు, ఆదివారాల్లో జరిగే మొత్తం తొమ్మిది బోనాల ఉత్సవాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. మొదటి వారం బోనాల జాతరకు వీఐపీలతో పాటు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. గోల్కొండ ఫతేదర్వాజా నుంచి ఘటాల ఊరేగింపు ముందుకు సాగింది. – సాక్షి, సిటీబ్యూరో -
ప్రభుత్వ విద్యను పరిరక్షించాలి
షాద్నగర్రూరల్: ప్రభుత్వ విద్యను విధ్వంసం చేసేందుకు పన్నుతున్న కుట్రలను ఆపాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యాపరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కువద్ద శుక్రవారం చేపట్టనున్న ధర్నా కరపత్రాన్ని గురువారం పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ.. సర్కారు బడులను బలోపేతం చేసేందుకు అధిక నిధులు కేటాయించాలని అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో 10 శాతం నిధులు కేటాయించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేయాలన్నారు. ఖాళీగా ఉన్న డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఆడిట్ కన్వీనర్ రవీంద్రనాథ్, జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకుడు అర్జునప్ప తదితరులు పాల్గొన్నారు. -
మట్టి లారీల సీజ్
ఇబ్రహీంపట్నం: అధిక మట్టి లోడుతో వెళ్తున్న ఐదు లారీలను ఆర్టీఏ అధికారులు సీజ్ చేసిన సంఘటన ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. ప్రాంతీయ రవాణా కార్యాలయ అధికారి(ఆర్టీఓ) సుభాష్ చంద్రరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో సమీపంలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు సుశీల్రెడ్డి, శ్రీనివాస్రెడ్డిలు తనిఖీలు చేపట్టారు. అధిక లోడ్తో మట్టిని తరలించడమేగాక, మట్టిపై ఎలాంటి కవర్ వేయకుండా తోటి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్న ఐదు టిప్పర్లను పట్టుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. వాహనాలను తాత్కాలికంగా ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో ఉంచారు. లోడ్పై కవర్ కప్పాలి వాహనాల్లో తరలించే మట్టి లోడ్పై తప్పని సరిగా కవర్లను కప్పాలని ఆర్టీవో సూచించారు. కవర్స్ కప్పక పోవడంతో ఆ వాహనాల నుంచి మట్టి ఎగిరిపడుతూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తుందన్నారు. అధిక లోడ్తో వెళ్లే వాహనాలపై చట్టరీత్యా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. -
కారు ఢీకొని డీసీఎం డ్రైవర్ మృతి
షాద్నగర్ రూరల్: కారు ఢీకొన్న ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ మృతి చెందిన సంఘటన పట్టణ సమీపంలోని కేశంపేట బైపాస్ చౌరస్తాలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ రాజేశ్వర్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్లోని కిషన్బాగ్కు చెందిన డ్రైవర్ జావిద్అలీ (55) డీసీఎం తీసుకుని మహబూనగర్ నుంచి హైదబాద్వైపు వెళుతున్నాడు. డీసీఎంలోని సామాను దింపేందుకు షాద్నగర్ బైపాస్ వద్ద వాహనాన్ని ఆపి, కిందికి దిగి డీసీఎం వెనక వైపునకు వచ్చాడు. ఈ సమయంలో మహ్మద్ ఫసియొద్దీన్ కారులో మహబూబ్నుంచి హైదరాబాద్వైపు అతివేంగంగా వెళ్తూ.. అదుపు తప్పడంతో ఆటోను ఢీ కొట్టాడు. అనంతరం డీసీఎం వెనక నిలబడి ఉన్న జావిద్అలీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో జావిద్అలీకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడిడక్కడే మృతి చెందాడు. ఆటో నడుపుతున్న నర్సింలు కాలు విరిగింది. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఎస్ఐ రాజేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి వివరాలను తెలుసుకొని కుటుంబ సభ్యులకు తెలియచేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆటో డ్రైవర్ను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ కుమారుడు గౌతమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రాజేశ్వర్ తెలిపారు. ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలు కేశంపేటబైపాస్ చౌరస్తాలో ప్రమాదం -
ఇంటి నుంచి బయటకు వెళ్లి
పహాడీషరీఫ్: యువతి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ దయాకర్రెడ్డి గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడ గ్రామానికి చెందిన జర్పుల దేశ్య కుమార్తె రజిత(26) ప్రైవేట్ ఉద్యోగి. ఈ నెల 25వ తేదీన మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. ఆచూకీ కోసం సాధ్యమైన ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె తల్లి సీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 87126 62367 నంబర్కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. షాబాద్లో వివాహిత.. షాబాద్: ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన షాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ గ్రామానికి చెందిన సొన్నాయిల స్వాతి ఈ నెల 22వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఆమె కోసం బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో గురువారం ఆమె భర్త నరేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరికై నా ఆచూకీ తెలిస్తే వెంటనే 99897 92750 నంబరుకు సమాచారం అందించాలని సూచించారు. వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళల అదృశ్యం -
జేసీబీతో పని పేరిట మోసం
సిరిసిల్ల క్రైం: జిల్లాలో పలు ప్రాంతాల్లో జేసీబీతో భూమి చదును చేసే పనులు ఉన్నాయంటూ నమ్మబలికి డబ్బులు గుంజుతున్న ఇద్దరిని తంగళ్లపల్లి పోలీసులు గురువారం రిమాండ్కు తరలించారు. సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్కు చెందిన గోల్కొండ చందుకుమార్, చింతపట్టి అనే ఇద్దరు యువకులు జిల్లాలోని పలువురు జేసీబీ యజమానులకు ఫోన్ చేశారు. వేములవాడ సమీపంలోని అగ్రహారంలో కొత్తగా వెంచర్ వేస్తున్నారని.. అందులో చెట్లను చదును చేయడానికి జేసీబీ కావాలని కోరారు. ఎంట్రీ ఫీజు కోసం రూ.9వేలు ఇవ్వాల్సి ఉంటుందని నమ్మబలికారు. అంతేకాకుండా వారి ఫోన్లకు డబ్బులు స్కానర్ ద్వారా పంపించుకున్నారు. డబ్బులు పంపిన వారు పని కోసం ఫోన్చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయామని గ్రహించి తంగళ్లపల్లి ఠాణాలో ఫిర్యాదు చేశారు. వీరి బాధితులు ముస్తాబాద్ మండలం ఆవునూరులో ఇద్దరు, ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారంలో ఒకరు ఉన్నట్లు తెలిపారు. తంగళ్లపల్లి స్టేషన్లో ఫిర్యాదు ఇద్దరి రిమాండ్ -
మొక్కుబడిగా సామాజిక తనిఖీ
మంచాల: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల నిర్వహణపై మంచాలలో ఏర్పాటు చేసిన సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం గురువారం మొక్కుబడిగా సాగింది. ప్రజలు ఎవరూ హాజరు కాకపోవడంతో అధికారులు, సోషల్ ఆడిట్ సిబ్బందితోనే కార్యక్రమం ముగిసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో ఉపాధి హామీ పథకం కింద రూ.3.51 కోట్లు, అటవీ శాఖ ఆధ్వర్యంలో రూ. 2.32 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.1.71 కోట్లు పని జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ పనుల నిర్వహణపై ప్రజా వేదికను డీఆర్డీఓ శ్రీలత ఆధ్వర్యంలో నిర్వహించారు. పనుల కొలతల్లో తేడాలు, బినామీల పేర్లతో పనులు చేసినట్లు తెలిసింది. పనుల వివరాలను రికార్డు నమోదు కూడా సక్రమంగా చేయలేదని తేలింది. ప్రధానంగా పని చేయని వారి పేర్ల మీద పని చేసినట్లు హాజరు నమోదైంది. ఈసీ ఫీల్డ్ విజిట్ చేయకుండా మంచాలలో నెల రాక ముందే రికార్డులు నమోదు చేశారు. ఏపీఓ సంతకాలు లేకుండా మస్టర్లు తయారు చేశారని ఆరోపించారు. రంగాపూర్ నర్సరీలో 40 వేల మొక్కలు ఎక్కడ నాటారనే విషయంలో స్పష్టత లేదు. అనంతరం డీఆర్డీఓ కల్పించుకొని.. కచ్చితంగా నర్సరీలలో పెంచిన మొక్కలు గ్రామంలో ఎక్కడెకక్కడ నాటారో రికార్డు చేయాలన్నారు. కొన్ని గ్రామాల్లో మస్టర్ పూర్తి చేసిన అనంతరం తిరిగి రాశారని సామాజిక తనిఖీ బృందం ఆరోపించింది. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ సుభాషిణి, ఎంపీడీఓ బాలశంకర్, అంబుడ్స్మెన్ సునీత, విజిలెన్స్ అధికారి కొండయ్య, ఏపీడీ చరణ్ గౌతమ్, సామాజిక తనిఖీ అధికారి అంజయ్యగౌడ్, ఎంపీఓ ఉమారాణి, ఏపీఓ వీరాంజనేయులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. రికార్డుల నిర్వహణలో అవకతవకలు సమావేశంలో డీఆర్డీఓ శ్రీలత -
ఉద్యోగం చేస్తూ పీహెచ్డీ పట్టా
ప్రతిభ చాటిన నంద్యాతండావాసి రాజునాయక్ కొందుర్గు: జిల్లేడ్ చౌదరిగూడ మండలం నంద్యా తండాకు చెందిన రాజునాయక్ పీహెచ్డీ పట్టా పొందారు. లక్ష్మి, బోట్యానాయక్ దంపతులకు జన్మించిన ఆయన పదో తరగతి వరకు పరిసర గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. మిగతా చదువులు కూడా సర్కారు కళాశాలలోనే పూర్తి చేశాడు. డిగ్రీ అనంతరం 2019 ఏప్రిల్ 11న జిల్లేడ్ చౌదరిగూడ మండలం ఎల్కగూడ పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం ఫరూఖ్నగర్ మండలం కంసాన్పల్లి కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు తన విద్యాభ్యాసం కొనసాగించారు. ‘ట్రైబుల్ డెవలప్మెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఏ స్టడీ ఆఫ్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ స్టేట్’ అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ బ్రహ్మానందం పర్యవేక్షణలో పరిశోధన చేశారు. ఇందుకుగాను గురువారం యూనివర్సిటీ అధికారుల చేతుల మీదుగా పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా రాజునాయక్ను మండల వాసులు అభినందించారు. పాలశీతలీకరణ కేంద్రం మేనేజర్గా ప్రాణేశ్కుమార్ కడ్తాల్: మండల కేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రం నూతన మేనేజర్గా ప్రాణేశ్కుమార్ నియమితులయ్యారు.ఈ మేరకు గురువారం పాలశీతలీకరణ కేంద్రంలోని కార్యాలయంలో మేనేజర్గా బాధ్యతలు స్వీకరించారు. గత కొంత కాలంగా పాలశీతలీకరణ కేంద్రానికి మేనేజర్ లేక పోవడంతో, ఇన్చార్జి మేనేజర్గా ఉదయశ్రీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ పాడి పారిశ్రామిభివృద్ధి సహాకార సమాఖ్య ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, మహాబూబ్నగర్ పాలశీతలీకరణ కేంద్రం నుండి ప్రాణేశ్కుమార్ బదిలీపై కడ్తాల్ పాలశీతలీకరణ కేంద్రానికి రావడం జరిగింది.ఈ సందర్భంగా ప్రాణేశ్కుమార్ మాట్లాడుతూ, పాలశీతలీకరణ కేంద్రం పరిధిలో రైతులు నాణ్యమైన పాలను పోసి, అధిక ధరలను పొందాలని సూచించారు. పాలసేకరణ దారులు కూడ పాడి రైతులకు అవగాహన కల్పించి, నాణ్యమైన పాలను సేకరించాలని కోరారు. పాడి రైతులకు అందుబాటులో ఉండి పాడి రైతుల సమస్యల పరిష్కారాని కృషి చేస్తానని తెలిపారు. కుక్కల దాడిలో ఐదు మేకల మృతి యాచారం: మండల పరిధిలోని కుర్మిద్ద గ్రామంలో వీధి కుక్కల దాడిలో ఐదు మేకలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన అనేమోని రవీందర్ గురువారం మధ్యాహ్నం తన మేకలను పొలంలో మేపుతున్నాడు. గ్రామంలో ఉన్న వీధి కుక్కలు గుంపులుగా వచ్చి మేకలపై దాడి చేసి గాయపర్చడంతో ఐదు అక్కడికక్కడే మృతి చెందాయి. దాదాపు రూ.లక్షకు పైగా నష్టం జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని పౌల్ట్రీఫాంల యజమానులు మృతి చెందిన కోళ్ల కళేబరాలను పొలంలో ఇష్టానుసారంగా పడేయడంతో వాటిని తింటున్న వీధి కుక్కలు మాంసం రుచి మరిగి జీవాలపై దాడులు చేస్తున్నాయని వాపోతున్నారు. హైడ్రా పేరుతో బెదిరింపులు నార్సింగి పీఎస్లో ఇద్దరిపై కేసు నమోదు సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పేరు చెప్పి బెదిరించిన ఇద్దరిపై నార్సింగి పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. కరీంనగర్ నుంచి వచ్చి కారుడ్రైవర్గా పని చేస్తున్న మిరియాల వేదాంతం అల్కాపురి టౌన్షిప్లో నివసిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఈ ద్వయం నెక్నాంపూర్లోని అల్కాపూర్ టౌన్షిప్లో ఉన్న ఓ ఇంటి వద్దకు వెళ్లింది. నలుపు రంగు కారులో వచ్చిన వీరిద్దరూ ఆ ఇంటి ఆవరణలోకి వెళ్లి పరిశీలిస్తుండగా గమనించిన ఇంటి వద్ద పని చేసే గుంతకల్ మల్లికార్జున్ వారిని ఎవరంటూ ప్రశ్నించారు. తాము హైడ్రా నుంచి వచ్చామని చెప్పిన ద్వయం ఆ ఇంటిని కూల్చేస్తామని, దానికి సంబంధించిన సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. దీంతో మల్లికార్జున్ ఈ విషయంపై ఇంటి యజమానితో మాట్లాడాలని సూచించగా అక్కడ నుంచి జారుకున్నారు. ఈ మేరకు మల్లికార్జున్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన అధికారులు ఇరువురినీ కస్టడీలోకి తీసుకున్నారు. హైడ్రా పేరు చెప్పి ఎవరైనా మోసాలకు, బెదిరింపులకు పాల్పడితే వెంటనే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని హైడ్రా గురువారం ఒక ప్రకటనలో కోరింది. ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, నేరుగా తమకు ఆ సమాచారం ఇచ్చినా వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఏదైనా విషయంపై హైడ్రా ఉద్యోగులు విచారణ చేపడితే... అడిగిన వారికి పూర్తి వివరాలు అందిస్తారని పేర్కొంది. హైడ్రా ఉద్యోగుల్లో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడినా, హైడ్రా పేరును దుర్వినియోగం చేసినా వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఇలాంటి బెదిరింపు వ్యవహారాలు గమనిస్తే 8712406899 నంబరుకు ఫోను చేసి లేదా వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలని కోరింది. వీలుంటే వీరి ఫొటోలు కూడా షేర్ చేయాలని పేర్కొంది. జాతీయ స్థాయి శిక్షణకు ఎంపిక పూడూరు: కంకల్ పాఠశాల ఉపాధ్యాయుడు ఈశ్వరరావు జాతీయ స్థాయి శిక్షణకు ఎంకయ్యారని మండల విద్యాధికారి సాయిరెడ్డి తెలిపారు. రాష్ట్ర స్థాయి విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎన్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రదర్శనలో సత్తాచాటారన్నారు. నూతన అభ్యసన ప్రక్రియలకు సంబంధించి అన్ని జిల్లాల నుంచి ప్రదర్శనలు రాగా ఉత్తమ ప్రదర్శన అందించిన ఉపాధ్యాయులను జాయతీ స్థాయికి ఎంపిక చేశారన్నాని స్పష్టంచేశారు. వీరు జూలై 3నుంచి 17వ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహించే శిక్షణలో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా గురువారం కాంప్లెక్స్ హెచ్ఎం పుష్ప, లక్ష్మణ్, ఉపాధ్యాయులు ఈశ్వరరావును సన్మానించారు. -
రైల్వే ట్రాక్పై 7 కిలో మీటర్లు కారు నడిపి.. ఇంతకీ ఎవరీ యువతి?
సాక్షి, హైదరాబాద్: పట్టాలపై కారు నడుపుతూ ఓ యువతి కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, రైల్వే చరిత్రలో ఇలాంటి ఘటన మొదటిసారి అంటూ రైల్వే అధికారులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా రైల్వే శాఖలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం కొండకల్ వద్ద రైల్వే ట్రాక్పై కారు నడిపిన యువతిని వోమిక సోనీగా గుర్తించారు. చేవెళ్లలో వైద్య పరీక్షల అనంతరం ఆమెను ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తరలించారు. మానసిక స్థితిపై వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొండకల్ నుంచి చిన్న శంకర్పల్లి వరకు సుమారు 7 కిలోమీటర్లు రైల్వే ట్రాక్పై ఆమె కారు నడిపింది. దీంతో గంట 20 నిమిషాల పాటు రైళ్లను నిలిపివేశారు. 8 ప్యాసింజర్, గూడ్స్ రైళ్లను అధికారులు నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఉదయం 6.20 నిమిషాల నుంచి 7:40 వరకు ట్రాక్ పైనే వోమిక సోనీ కారును నడిపినట్లు అధికారులు వెల్లడించారు. ఆమె కారును శంకర్పల్లి రైల్వే స్టేషన్కు తరలించారు.కారును సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు పరిశీలించారు. అందులో డాగ్ బిస్కెట్లు, అగ్గిపెట్టె, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. నాన్ చాక్తో స్థానికులపై వోమిక సోనీ దురుసుగా ప్రవర్తించింది. ఆమె మత్తులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మతిస్థిమితం, డ్రగ్స్ తీసుకున్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.🚨 Shocking in Shankarpalli, Vikarabad A woman was spotted driving her car on a railway track towards Hyderabad! Railway staff halted trains, including one from Bengaluru to Hyderabad. Despite efforts to stop her, the woman kept driving on the tracks. Authorities are… pic.twitter.com/BK1MfZDHb8— Sowmith Yakkati (@YakkatiSowmith) June 26, 2025కాగా, వోమిక సోనీ.. గత కొన్నిరోజులగా తల్లిదండ్రులు, భర్తకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం ఉద్యోగం పొగొట్టుకున్న సోని డ్రిపెషన్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తర ప్రదేశ్ లక్నోకి చెందిన సోనీ స్థానికంగా పుప్పాల గూడలో నివాసం ఉంటుంది. ఆమెపై రైల్వే సెక్షన్లు 147 ట్రేస్ పాస్, 153 రైళ్ల రాకపోకలకు అంతరాయం కింద కేసులు నమోదు చేశారు. కారు నుంచి బయటికి రాకపోవడంతో కారు డోర్స్ బ్రేక్ చేసి మరి.. స్థానికులు, అధికారులు బయటికి దింపారు. స్థానికులు, అధికారులపైకి నాన్ చాక్తో దాడికి దిగింది. -
‘స్థానిక’ సందడి!
● హైకోర్టు తీర్పుతో పల్లెల్లో మళ్లీ కదలిక ● పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులు ● రిజర్వేషన్లపై కొనసాగుతున్న ఉత్కంఠ సాక్షి, రంగారెడ్డిజిల్లా: స్థానిక సంస్థల ఎన్నికలకు లై న్ క్లియరైంది.మూడు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటి కే గ్రామ పంచాయతీలు, వార్డులు, ఓటర్ల జాబితా ను సిద్ధంగా ఉంచిన అధికార యంత్రాంగం మరో సారి వాటిని సరి చూసుకునే పనిలో నిమగ్నమైంది. 2024 జనవరి 30తో స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ముగిసింది. నాటి నుంచి ఇప్పటి వరకు ఆయా గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. పాలక మండళ్లు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు అందక అధికారులు ట్రాక్టర్ డీజిల్ ఖర్చులు, వీధి లైట్లు, డ్రైనేజీల క్లీనింగ్, బోరుబావుల, మోటార్ల రిపేర్లకు అప్పులు చేయాల్సిన దుస్థితి. దీంతోపాటు ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన వారు సైతం ఓటర్లను ఆకర్షించేందుకు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చింది. ఎన్నికల నిర్వహణ పై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఆయా గ్రామాల్లో మళ్లీ సందడి మొదలైంది. అయితే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు అంశంపై ఇప్పటికీ ఓ స్పష్టత రాకపోవడం ఆశావహులను ఒకింత ఆందోళనకు గురి చేస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలా? సర్పంచ్లా? జిల్లాలో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు.. ఔటర్ లోపల ఉన్న పాత మున్సిపాలిటీల్లో సమీప గ్రామా ల విలీనంతో జిల్లాలో ఎంపీటీసీ స్థానాలతో పాటు సర్పంచ్ స్థానాలు తగ్గాయి. గతంలో 13 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లు ఉండగా, కొత్తగా మెయినాబాద్, చేవెళ్ల మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారు. ఎంపీటీసీ స్థానాల సంఖ్య 257 నుంచి 232 కి తగ్గింది. జిల్లా వ్యాప్తంగా గతంలో 558 గ్రామ పంచాయతీలుండగా, ప్రస్తుతం 32 గ్రామాలు ఆ యా మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో వీటి సంఖ్య 526కు చేరింది. ఇటీవల కొత్తగా మరికొన్ని గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. అయితే స్థానిక సంస్థల్లో బీసీ కోటా అమలు చేయాలని కోరుతూ కొంత మంది కోర్టును ఆశ్రయించడం, ఇదే అంశంపై ప్రభుత్వం కొంత వరకు కసరత్తు చేయడం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ ఎన్నికల్లోనూ పాత రిజర్వేషన్ పద్ధతినే కొనసాగిస్తారా? కొత్తగా ఏమైనా మార్పులు తీసుకొస్తారా? అనే అంశంపై స్పష్టత కొరవడింది. ముందుగా జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారా? లేక సర్పంచులు, వార్డు సభ్యులకు నిర్వహిస్తారా? అనేది కూ డా తేలాల్సి ఉంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జిల్లా పంచాయతీ అధికారులు అలెర్ట్ అయ్యారు. ఓటర్ల జాబితా, వార్డులు, పంచాయతీలు తదితర వివరాలను సరిచూసుకునే పనిలో పడ్డారు.జీహెచ్ఎంసీ డివిజన్లు మహేశ్వరం 02 ఎల్బీనగర్ 11 గచ్చిబౌలి 07 రాజేంద్రనగర్ 05 -
మరకత శివాలయంలో ప్రత్యేక పూజలు
శంకర్పల్లి: మండల పరిధిలోని చందిప్ప మరకత శివాలయాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కోడలు సుహాసిని సందర్శించారు. బుధవారం ఆమె ఆలయంలోని మరకత శివలింగానికి సమీప బంధువుతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమెకు(నీలి రంగు చీర ధరించిన) ఆలయ గౌరవ అధ్యక్షుడు సదానందంగౌడ్, చైర్మన్ గోపాల్రెడ్డి, ప్రధాన అర్చకుడు సాయిశివలు శాలువాతో సత్కరించారు. మరకత శివాలయాలు చాలా అరుదుగా ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దర్శన్గౌడ్, అనంత్రెడ్డి పాల్గొన్నారు. -
రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు
● జిల్లా వ్యవసాయ శాఖ ఏడీఏ పద్మావతియాచారం: విత్తనాలు, ఎరువుల విక్రయాల్లో రైతులను మోసం చేస్తే జైలు శిక్ష తప్పదని జిల్లా వ్యవసాయ శాఖ ఏడీఏ పద్మావతి హెచ్చరించారు. బుధవారం ఆమె మండల కేంద్రంలోని పలు విత్తనాలు, ఎరువులు విక్రయించే దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి ఏ ధరకు విత్తనా లు, ఎరువులు అమ్ముతున్నారు, ధరలు ఎలా ఉన్నా యి, రైతులకు రసీదులు ఇస్తున్నారా.? కాలం చెల్లిన విత్తనాలను, ఎరువులను రైతులకు విక్రయిస్తున్నా రా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యాపారులు అధిక లాభార్జన ఆశతో రైతులను మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోళ్లపై రైతులకు వెంటనే రసీదులు ఇవ్వాలని సూచించారు. స్టాక్బోర్డులు, ధరల పట్టిక ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టాస్క్పోర్స్ సీఐ ముద్రాస్ అలీ, సీడ్స్ సర్టిఫికేషన్ అధికారి లావణ్య, యాచారం మండల వ్యవసాయాధికారి రవినాథ్ పాల్గొన్నారు. ఫెర్టిలైజర్ షాపుల తనిఖీ మాడ్గుల: మండల స్థాయి అధికారులు రైతులకు అందుబాటులో ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించాలని జిల్లా వ్యవసాయ శాఖ ఏడీఏ పద్మజ అన్నారు. బుధవారం ఆమె మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. ఫెర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. అనంతరం వ్యవసాయ అధికారి కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. పంటల వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విత్తన ధ్రువీకరణ అధికారి లావణ్య, ఎస్ఓటీ అధికారులు ముదస్సిర్ అలీ, వ్యవసాయ అధికారి అరుణకుమారి తదితరులు ఉన్నారు. -
భూములు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు
మొయినాబాద్: ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్కుమార్ హెచ్చరించారు. మండల పరిధిలోని తోలుకట్ట రెవెన్యూలోని సర్వేనెంబర్ 155లో 1.14 ఎకరా ల ప్రభుత్వ భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాల ను బుధవారం రెవెన్యూ అధికారులు పోలీసులతో కలిసి జేసీబీతో కూల్చివేశారు. కబ్జాకు గురైన ప్రభు త్వ భూమిని కాపాడి బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కబ్జాదారులు ప్రభుత్వ భూముల జోలికొస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి రక్షించడంకోసం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ ఆదేశాలతో త్వరలో ఫెన్సింగ్ వేయడానికి ఏర్పాటు చేస్తున్నామన్నారు. సూచిక బోర్డులు సైతం ఏర్పా టు చేసి ప్రభుత్వ భూములపై నిఘా పెడతామన్నా రు. ఎవరైనా ప్రభుత్వ భూము ల్లో అక్రమ నిర్మా ణాలు చేపట్టినా, కబ్జా చేసిన స్థానిక ప్రజలు రెవె న్యూ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కూల్చివేతల్లో ఆర్ఐ రాజేశ్, సిబ్బంది భాస్కర్, భరత్, అంజయ్య తదితరులు ఉన్నారు. మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్కుమార్ -
విద్యావ్యవస్థలో మార్పే లక్ష్యం
● అభివృద్ధిలో ప్రజా భాగస్వామ్యమే ప్రధానం ● విద్యాశాఖ చైర్మన్ ఆకునూరి మురళి మంచాల: అభివృద్ధిలో ప్రజా భాగస్వామ్యం ఉంటేనే ఏ కార్యక్రమైనా విజయవంతం అవుతుందని రాష్ట్ర విద్యాశాఖ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. మండల పరిధిలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్స్కూ ల్లో కొనసాగుతున్న పనులు, పాఠశాల నిర్వహణ తీరును పరిశీలించేందుకు బుధవారం నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన వంగూరు, పోల్కంపల్లి గ్రామాలకు చెందిన పేరెంట్స్ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు 150 మంది విచ్చేశారు. ఈ సందర్భంగా ఆకునూరి మురళి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విద్యావ్యవస్థలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని వివరించారు. ఇందులో భాగంగా ఆరుట్ల ప్రభుత్వ పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మార్చామన్నారు. పేరెంట్స్ కమిటీ సహకారంతో 90 శాతం పనులు పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం పాఠశాలలో 2 వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారని చెప్పారు. పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు రాష్ట్రంలో ఆదర్శంగా నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంచాల ఎంఈఓ రాందాస్, ప్రధానోపాధ్యాయుడు గిరిధర్గౌడ్, సుప్రియ, ఉపాధ్యాయులు కిషన్ చౌహాన్, మోహన్, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు ఎం.డీ.జానీపాష, నూకం రాజు, భాస్కర్, జంగయ్య, శ్రీశైలం, స్వాతి, జ్యోతి, పారిజాత, సంధ్య, పార్వతి, మల్లేశ్ తదితరులుపాల్గొన్నారు. -
సర్వే నంబర్లు మాయం
రికార్డుల్లో ఒకరు.. పొజిషన్లో మరొకరు● పక్కాగా నిర్ధారిస్తే తప్పా తేలని పంచాయితీ ● వేధిస్తున్న సర్వేయర్ల కొరత ● రెవెన్యూ సదస్సుల్లో సర్వేనంబర్ల మిస్సింగ్కు 8,996 ఫిర్యాదులు ● జూలై 10లోగా సమస్యల పరిష్కారం సాధ్యమేనా..? సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లాలోని పలు భూముల సర్వే నంబర్లు మాయమయ్యాయి. క్షేత్రస్థాయిలోని భూములకు, రెవెన్యూ కార్యాలయాల్లోని రికార్డులకు అసలు పొంతన కుదరడం లేదు. జూన్ మూడు నుంచి 23 వరకు నిర్వహించిన భూ భారతి సదస్సుల్లో భాగంగా ప్రజల నుంచి సర్వే నంబర్ల మిస్సింగ్కు సంబంధించిన దరఖాస్తులే ఎక్కువగా అందాయి. ప్రజల నుంచి వచ్చిన ఈ అర్జీలను జూలై 10లోగా పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వం సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించింది. భూ కొలతలు పక్కగా నిర్వహించకుండా, ఉన్న భూములకు హద్దులు నిర్ధారించకుండా, ఏ సర్వే నంబర్లో..? ఏ ఏ పట్టా దారులున్నారో? తేల్చకుండా భూ సమస్యలు పరిష్కారం అవు తా యా అంటే అధికారుల వద్ద సమాధానం లేదు. అందిన అర్జీలను పెండింగ్లో పెట్టకుండా, ఆమోదించడమో..తిరస్కరించడమో? చేయాల్సి ఉంది. అకా రణంగా తిరస్కరిస్తే.. ఆయా అర్జీదారులు అప్పీల్కు వెళ్లే అవకాశం ఉండటంతో ఏం చేయాలో? తోచక అధికారులు తలపట్టుకుంటున్నారు. హద్దులు దాటిన గద్దలు జిల్లాలో 12,43,035 లక్షల ఎకరాల భూములుండగా వీటిలో 2,18,53.02 ఎకరాల ప్రభుత్వ, 64,803 ఎకరాలు అటవీ భూములున్నాయి. జిల్లా వ్యాప్తంగా 90,911 ఎకరాల అసైన్డ్ భూమి ఉండగా ఇందులో 52,315 మంది నిరుపేద రైతులకు 75,450.29 ఎకరాలను అసైన్ చేసింది. మరో 25, 597.35 ఎకరాలు ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది.అసైన్డ్ చేసిన భూమిలో ఆ తర్వాత 9,8 85.13 ఎకరాలు చేతులు మారినట్లు గుర్తించి, 42, 278 అసైన్డ్ ఉల్లంఘన కేసులను నమోదు చేసింది. ● భూదాన్ బోర్డు పేరున 21,931.03 ఎకరాలుండగా, దీనిలో 9,678 మంది నిరుపేదలకు పంచారు. మిగలిన భూమి కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లింది. – దేవాదాయశాఖకు 9,360.01 ఎకరాల భూములు ఉండాల్సి ఉండగా, వీటిలో ఇప్పటికే 1,148.15ఎకరాలు అన్యాక్రాంతమైంది. ● భూపరిమితి చట్టం(యూఎల్సీ) పరిధిలో 9 వేల ఎకరాలకుపైగా భూములుండగా.. వీటిలో 840 ఎకరాలు కోర్టు కేసుల్లో ఉన్నాయి. ● వక్ఫ్బోర్డు పరిధిలో 14,785.17 ఎకరాలు ఉండగా, వీటిలో ఇప్పటికే 13,480.25 ఎకరాలు ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లింది. పొజీషన్కు భిన్నంగా సర్వే నంబర్లు ప్రభుత్వ, పట్టా భూములతో పాటు అటవీ,సీలింగ్, లావణి, శిఖం పట్టా భూములు కూడా ఉన్నాయి. అనేక సర్వే నంబర్లలోని భూములు రెవెన్యూ నక్షకు, విస్తీర్ణానికి భిన్నంగా ఉన్నాయి. గత ప్రభు త్వం భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్లోనూ ఈ లోపాలు భారీగా బయటపడ్డాయి. భూ విస్తీర్ణానికి మించి రికార్డుల్లో పేర్లు నమోదయ్యాయి. పొజిషన్కు భిన్నంగా సర్వే నంబర్లు, రికార్డులు,పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేశారు. నిజమైన లబ్ధిదారులతో పాటు అడ్డదారుల్లో భూములు కొల్లగొట్టిన వారు సైతం దరఖాస్తులు సమర్పించారు. భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో భాగంగా ఆయా బాధితులు మాన్యువల్గా అందజేసిన దరఖాస్తులను, ప్రస్తుతం సిటిజన్ పోర్టల్లో నమోదు చేసే ప్రక్రియను చేపట్టారు. ఆయా ఆర్జీలన్నీ భూ భారతి పోర్టల్కు చేరుకోనున్నాయి. కొత్త నియామకాలు చేపట్టకుండా.. భూములన్నీ నగరానికి ఆనుకుని ఉండడం, ఐటీ, రియల్ ఎస్టేట్ కారణంగా జిల్లాలోని భూ ముల ధరలు అమాంతం పెరిగిపోవడం, అదే స్థాయిలో భూవిస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, సరిహ ద్దు వివాదాలు వెలుగు చూడటం తెలిసిందే. ఈ వివాదాల పరిష్కారంలో సర్వేయర్లు ఇచ్చే రెవె న్యూ నివేదికలే కీలకంగా మారుతుంటాయి. జిల్లాలో 27 మండలాలుండగా, 526 గ్రామ పంచాయతీలున్నాయి. వీటి పరిధిలో కేవలం 14 మంది మాత్రమే సర్వేయర్లు పని చేస్తున్నారు. రెండు మండలాలకు ఒకరే సర్వేయర్ పని చేస్తున్నారు. భూ కొలతల నిర్ధారణకు సంబంధించి ప్రస్తుతం క్షేత్రస్థాయిలోని బాధితుల నుంచి వస్తున్న అభ్యర్థనలకు.. హద్దులు నిర్ధారించి ఇస్తున్న నివేదికలకు అసలు పొంతనే ఉండడం లేదు. ఒక్కో విస్తీర్ణాన్ని రెండు నుంచి మూడు సార్లు సర్వే చేయాల్సి వస్తుండడం, ప్రభుత్వ ప్రాజెక్టులకు భూమిని సేకరించడం, ప్రైవేటు వ్యక్తుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించాల్సి వస్తుండడం ఇబ్బందిగా మారింది. పని భారంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఇటీవల అర్హులైన ప్రైవేటు వ్యక్తులను (లైసెన్స్డ్ సర్వేయర్లు) ఎంపిక చేసి నెల రోజులుగా శిక్షణ ఇస్తోంది. ఏళ్ల తరబడి కొత్త వాళ్లను నియమించకుండా పాతవాళ్లకు పని భారాన్ని తగ్గించకుండా మాయమైన ఈ సర్వే నంబర్ల గుర్తింపు ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వం ఆశిస్తున్నట్లు జూలై పదిలోగా ఈ సమస్యలన్నీంటికీ పరిష్కార మార్గం లభిస్తుందా? అంటే అనుమానమే. రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులు ఇలా..అంశం అర్జీలు పంపిణీ చేసిన దరఖాస్తులు 34,453 ప్రజల నుంచి అందిన ఆర్జీలు 21,050 మిస్సింగ్ సర్వేనంబర్లు 8,966 మ్యూటేషన్ పెండింగ్ 1,165 డీఎస్ పెండింగ్ 1,158 ఎక్స్టెంట్ కరెక్షన్ 1,932 లాండ్ నేచర్/క్లాసిఫికేషన్ 967 నేమ్ కరెక్షన్ 742 నిషేధిత జాబితా నుంచి తొలగించుటకు 1,557 నిషేధిత జాబితాలో చేర్చేందుకు 08 అసైన్డ్ భూముల సమస్యలు 656 ఓఆర్సీ నాట్ ఇష్యూడ్ 142 38ఇ సర్టిఫికెట్ నాట్ ఇష్యూడ్ 24 సక్సేషన్ పెండింగ్ 1,652 భూ సేకరణ 64 ఇతర సమస్యలు 2,217 -
రేపు మార్కెట్ దుకాణ సముదాయం ప్రారంభం
ఆమనగల్లు: ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్యార్డులో నిర్మించిన దుకాణ సముదాయాన్ని ఈ నెల 27న ప్రారంభించనున్నట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, ఏఎంసీ వైస్ చైర్మన్ గూడురు భాస్కర్రెడ్డి తెలిపారు. బుధవారం వారు పట్టణంలోని వ్యవసాయ మార్కె ట్యార్డులో దుకాణ సముదాయం ప్రారంభ ఏర్పాట్లను మార్కెట్ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం నర్సింహ, భాస్కర్రెడ్డి మాట్లాడుతూ.. మార్కె ట్ యార్డులో రూ.65లక్షలు వెచ్చించి ఎనిమిది దుకాణాలు నిర్మించామని.. ఈ దుకాణాలను శుక్రవారం నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభింస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్లు శ్రీశైలం, పాండురంగయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. విద్యాహక్కు చట్టం అమలు చేయండి డాక్టర్ చంటి ముదిరాజ్ సాక్షి, రంగారెడ్డిజిల్లా: అధిక ఫీజులు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేటు పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చంటి ముదిరాజ్, అధ్యక్షురాలు సూర స్రవంతి, ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం డీఈఓ సుశీందర్రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఫీజులను నియంత్రించి, విద్యాహక్కు చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు. ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేదలకు ఉచితంగా కేటాయించాలని కోరారు. ఆ మేరకు యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు చింతల రాఘవేందర్ ముదిరాజ్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.దిలీప్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి ఆమనగల్లు: మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జి ల్లా అధ్యక్షుడు సక్రునాయక్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మున్సిపల్ కార్యాలయం కమిషనర్ శంకర్నాయక్కు వినతిపత్రం అందజేశారు. సక్రునాయక్ మాట్లాడుతూ.. ప్రభు త్వం మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తూ రూ.25 వేల కనీస వేతనం, కార్మికులకు ఇచ్చే కిట్లు, వారాంతపు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్మికులు విజయ, వెంకటమ్మ, లక్ష్మమ్మ, పెంటయ్య,రాములు, మహేందర్, శ్రీను, మహేశ్, ప్రశాంత్, విజయ్, మేగ్య పాల్గొన్నారు. బోనాల నిర్వహణకు రూ.20 కోట్లు సాక్షి, సిటీబ్యూరో: నగరంలో బోనాల నిర్వహణకు 2,783 దేవాలయాలకు ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలో బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి వివరించారు. బోనాల సందర్భంగా దేవాలయాల్లో ఊరేగింపు దశ గతంలో స్వాగతం, శోభాయాత్ర, తొట్టెల ఊరేగింపు, పోతురాజుల వీరంగాలు , ఎదుర్కోలు, అమ్మవార్లకు బోనాల సమర్పణ, పట్టు వస్త్రాల సమర్పణ, కళా ప్రదర్శనలు కార్యక్రమాల నిర్వహణకు నిధులు వెచ్చించనున్నట్లు మంత్రిపేర్కొన్నారు. -
అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్ అరెస్టు
షాద్నగర్రూరల్: మహిళల మెడలో బంగారు పుస్తెల తాళ్లనే లక్ష్యంగా చేసుకొని చోరీలకు తెగబడుతున్న ఓ దుండగుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల పాలు చేశారు. బుధవారం పట్టణంలోని పోలీస్స్టేషన్లో సీఐ విజయ్కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని నాగులపల్లి గ్రామానికి చెందిన నల్లపురం బల్వంత్రెడ్డి, అనసూయ దంపతులు ఈ నెల 11న ద్విచక్ర వాహనంపై రామేశ్వరం దైవ దర్శనానికి వెళుతున్నారు. హజిపల్లి శివారు దాటుతుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వెనక నుంచి వచ్చి అనసూయ మెడలో ఉన్న నాలుగున్నర తులాల బంగారు పుస్తెల తాడును తెంచుకొని పారిపోయారు. ఈ ఘటనపై దంపతులు అదే రోజు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఉత్తర్ప్రదేశ్కు చెందిన వారీగా సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించారు. పోలీసులు లక్నోలో ప్రధాన నిందితుడు మహేంద్రరాస్తోగిని అరెస్టు చేయగా, మరో నిందితుడు చాంద్బాబు పరారీలో ఉన్నాడు. తమదైన శైలిలో విచారించగా ప్రధాన నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. నిందితుడి నుంచి ద్విచక్రవాహనం, సెల్ఫోన్ స్వాఽధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. అతడిపై కర్నూల్, విజయనగరం, ఆదిలాబాద్, మహబూబ్నగర్, షాద్నగర్, అల్వాల్, బాచుపల్లితో పాటుగా ఉత్తర్ప్రదేశ్లో బైక్, చైన్స్నాచింగ్, మర్డర్, గంజాయికి సంబంధించి 20పైగా కేసులు ఉన్నాయి. చాకచాక్యంగా కేసును ఛేదించిన క్రైమ్ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. బంగారం చోరీ చేసి యూపీకి పరారీ -
బీసీల హక్కులపై చర్చించండి
షాద్నగర్రూరల్: హైదరాబాద్లోని విద్యానగర్లో రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యను బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ ఆధ్వర్యంలో నాయకులు బుధవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా బీసీల హక్కుల సాధన కోసం, బీసీసేన గ్రామ కమిటీలు, కార్యాచరణపై చర్చించారు. బీసీలకు రావాల్సిన 42 శాతం రిజర్వేషన్పై ప్రభుత్వంతో చర్చించాలని ఆర్.కృష్ణయ్యను నాయకులు కోరారు. గ్రామీణ స్థాయి నుంచి బీసీసేన కమిటీలను పటిష్టంగా వేసుకోవాలని, కులాలకతీతంగా భాగస్వాములను చేయాలని కృష్ణయ్య సూచించారు. బీసీలను అన్ని రంగాల్లో చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయనను నాయకులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీసేన నాయకులు సుధాకర్, దయాకర్చారి, బాల్రాజ్, మహేందర్గౌడ్, వెంకటయ్య, శ్రీకాంత్, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
చేవెళ్ల: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీఓ నిరంతరం పోరాటం చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు. మండల కేంద్రంలోని అట్లాస్ మినీ ఫంక్షన్ హాల్లో బుధవారం టీఎన్జీఓ చేవెళ్ల తాలూకా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పెద్ద మనసుతో ఒక డీఏ ఇచ్చిందని, త్వరలో మిగతా సమస్యలు కూడా పరిష్కరిస్తుందన్నారు. అర్థ గణాంక, ఐసీడీఎస్ శాఖల్లో పోస్టుల ఏర్పాటులో టీఎన్జీఓ కీలకంగా పనిచేసిందన్నారు. సీపీఎస్ విధానం రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘాన్ని బలోపేతం చేయటంతోపాటు ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఉద్యోగులు మెడికల్ బిల్లులు ఇప్పటికే క్లియర్ చేశారని జీపీఎఫ్ బిల్లులు కూడా త్వరలో క్లియర్ అవుతాయని చెప్పారు. టీఎన్జీఓలంతా సమష్టిగా ఉండి సమస్యలను పరిష్కరించుకుందామన్నారు. కార్యక్రమంలో టీఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్, జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు మాధవ్గౌడ్, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు విజయ్కుమార్, అజ్మత్పాషా, చేవెళ్ల తాలూకా అధ్యక్ష కార్యదర్శులు శివకుమార్, జ్యోతి, డివిజన్ కోఆర్డినేటర్ శేఖర్, శ్రీకాంత్గౌడ్, నాయకులు వాణి, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు. టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్ -
కారు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి
మొయినాబాద్: కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఇద్దరు మహిళలను బలిగొంది. మరో మహిళ మృత్యువుతో పోరాడుతోంది. స్థానికులు, ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఖైరతాబాద్కు చెందిన నందకిషోర్, అశ్విని(37) దంపతుల పిల్లలు మొయినాబాద్లోని సుజాత స్కూల్లో చదువుతున్నారు. దీంతో వీరి కుటుంబం కొంతకాలంగా హిమాయత్నగర్లో అద్దెకు ఉంటున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు అశ్విని తన మరదలు లక్ష్మి స్కూటీపై రెడ్డిపల్లిలోని మీసేవ కేంద్రానికి బయలుదేరారు. చిలుకూరుకు వెళ్లగానే మేడిపల్లికి చెందిన కుమ్మరి సుశీల(60) యూకో బ్యాంకుకు వచ్చి తిరిగి వెళ్లేందుకు వీరిని లిఫ్ట్ అడిగింది. ముగ్గురూ స్కూటీపై వెళ్తుండగా రెడ్డిపల్లి సమీపంలో ఎదురుగా వచ్చిన కారు అతివేగంతో ఢీకొట్టింది. దీంతో ముగ్గురూ ఎగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్ర గాయాలపాలైన వీరిని చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అశ్విని, సుశీల మృతిచెందారు. లక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. అర కిలోమీటర్ దూరంలోనే... స్కూటీపై వెళ్తున్న మహిళలు మరో రెండు నిమిషాల్లో గమ్య స్థానానికి చేరుకునేవారు. అరకిలోమీటర్ దూరంలో దూరంలో ప్రమాదానికి గురికావడంతో ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిశాయి. కారు అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన చోట ఓ షాపులో ఉన్న సీసీ కెమరాల్లో ప్రమాదం జరిగిన తీరు నిక్షిప్తమైంది. కారు అతివేగంతో వచ్చి స్కూటీని ఢీకొట్టినట్లు సీసీ టీవీలో రికార్డయ్యింది. ప్రాణాపాయ స్థితిలో మరో మహిళ స్కూటీని కారు ఢీకొట్టడంతో ప్రమాదం మొయినాబాద్ మండలం రెడ్డిపల్లి సమీపంలో ఘటన -
భూదాన భూములను కాపాడాలి
షాబాద్: అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ, భూదాన భూములను కాపాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని ముదిరాజ్ భవన్లో సీపీఐ మండల మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమార్కులు అసైన్డ్ భూములను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. సీపీఐ వందేళ్ల ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించాలన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఆనాటి బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమ స్ఫూర్తితో ఈ దేశంలో విప్లవ ఉద్యమాలు జరిగాయన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ కార్యకర్తలు ప్రజలు ఆందోళన నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు రామస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రభులింగం, మండల కార్యదర్శి జంగయ్య, నాయకులు సత్తిరెడ్డి, మక్బూల్, మంజుల, అంజయ్య, రఘురాం, మధు, నారాయణ, రుక్కయ్య తదితరులు పాల్గొన్నారు. నూతన కమిటీ ఎన్నిక అనంతరం సీపీఐ షాబాద్ మండల నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జంగయ్య ప్రకటించారు. మండల కార్యదర్శిగా నాగర్కుంట గ్రామానికి చెందిన పాలమాలకు శ్రీశైలంను ఎనుకున్నారు. సహాయ కార్యదర్శులుగా గడ్డం వెంకటేష్, రాములు, వీరితో పాటు 15 మంది కౌన్సిల్ సభ్యులను కమిటీలోకి తీసుకున్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
కేశంపేట: పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగిరాకపోవడం, చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని లేమామిడి శివారు తుర్కలపల్లికి చెందిన దిద్దెల ప్రశాంత్ (30) కూలీ పనులు చేస్తూ భార్య కృష్ణవేణి, ఇద్దరు పిల్లలతో కలిసి జీవించేవాడు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలు నెలకొడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం కృష్ణవేణి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈనెల 23న ఆమెను తీసుకువచ్చేందుకు వెళ్లగా తిరస్కరించడంతో మరుసటి రోజు తిరిగి వచ్చేశాడు. ఈక్రమంలో మంగళవారం రాత్రి తన ఇంట్లోని రేకుల పైపునకు ఉరేసుకున్నాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని, తలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యల కారణంగానే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రశాంత్ తండ్రి దిద్దెల పెద్దయ్య పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ నరహరి తెలిపారు. -
లారీ ఢీకొని ఒకరి మృతి
ఇబ్రహీంపట్నం: వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి స్కూటర్ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలోని మంగల్పల్లి చౌరస్తా వద్ద బుధవారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఉప్పరిగూడ గ్రామానికి చెందిన బుట్టి ప్రేమ్రాజ్(65) వాటర్ ప్లాంట్ వర్కర్గా పనిచేస్తూ బొంగుళూర్లో నివాసముంటున్నాడు. ఉప్పరిగూడ నుంచి ఇంటికెళుతుండగా ప్రేమ్రాజ్ స్కూటర్ను ఇబ్రహీంపట్నం వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలవ్వడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని, మృతదేహన్ని మార్చురీకి తరలించినట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. పట్టుబడిన నల్లబెల్లం ధ్వంసం ఆమనగల్లు: వివిధ కేసుల్లో పట్టుబడిన నాటుసారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, ఇతర ముడి పదార్థాలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆమనగల్లు ఎకై ్సజ్ సీఐ బద్యానాద్చౌహాన్ ఆధ్వర్యంలో బుధవారం ధ్వంసం చేశారు. పట్టణ సమీపంలో పెద్ద గోతిని తీసి మున్సిపాలిటీ సిబ్బంది సహాయంతో వివిధ కేసులలో పట్టుబడిన 780 కిలోల నల్లబెల్లం, 80 కిలోల పటిక, 40 కిలోల విప్ప పువ్వును నాశనం చేశారు. కార్యక్రమంలో ఎస్ఐలు కృష్ణప్రసాద్, అరుణ్కుమార్, సిబ్బంది శంకర్, దశరథ్, బాబు, లోక్య, శ్రీను, ఉపేందర్, శ్రీజ, ఆమని తదితరులు పాల్గొన్నారు. -
మోదీ పాలనలో దేశం పురోగతి
చేవెళ్ల: దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రధాని మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్.రత్నం అన్నారు. స్థానిక కేవీఆర్ గ్రౌండ్లో సోమవారం చేవెళ్ల మున్సిపాలిటీ బూత్స్థాయిలో తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులర్పించారు. మోదీ సారథ్యంలో దేశం ఎంతో పురోగతి సాధించిందన్నారు. తల్లికి వందనంతో దేశంలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతీ బూత్లో కనీసం 50 మొక్కలు నాటాలని, నియోజకవర్గంలో 25వేల మొక్కలు నాటాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్వానం పాలన సాగిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్రెడ్డి, యువ నాయకుడు డాక్టర్ మల్గారి వైభవ్రెడ్డి, రాష్ట్ర నాయకులు విఠల్రెడ్డి, జిల్లా నాయకులు వెంకట్రెడ్డి, వెంకట్రాంరెడ్డి, కుంచం శ్రీనివాస్, నాయకులు మధుసుధన్రెడ్డి, ప్రవీణ్రెడ్డి, మధుసుధన్రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం -
మహిళ మెడలోంచిపుస్తెలతాడు చోరీ
యాచారం: బస్సు కోసం వేచి చూస్తున్న మహిళ మెడలోంచి గుర్తు తెలియని వ్యక్తులు బంగారు పుస్తెల తాడును అపహరించారు. యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లికి చెందిన బండ పార్వతమ్మ(58) సోమవారం మధ్యాహ్నం స్వగ్రామా నికి వెళ్లేందుకు నక్కర్తమేడిపల్లిలోని బంధువు ల ఇంటి నుంచి తక్కళ్లపల్లి గేట్ వద్దకు వచ్చింది. ఇది గమనించిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు హెల్మెట్ ధరించి, బైక్పై వచ్చారు. బస్సు కోసం వేచి చూస్తున్న పార్వతమ్మ మెడలోని మూడు తులాల పుస్తెల తాడును లాక్కెళ్లారు. ఈ సమయంలో పార్వతమ్మ కిందపడిపోయినా దుండగులు మాత్రం తాడు వదల్లేదు. ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, నాగార్జునసాగర్– హైదరాబాద్ రహదారి వెంట ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మేస్త్రీ అదృశ్యం మొయినాబాద్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన మేస్త్రీ అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పో లీసులు తెలిపిన ప్రకారం మహబూబ్నగర్ జిల్లా దౌల్తాబాద్కు చెందిన దాగునపురం రాములు(40) భార్య లక్ష్మితో కలిసి మున్సిపాలిటీ పరిధిలోని చిలుకూరులో నివాసం ఉంటూ మేస్త్రీ పనిచేస్తున్నాడు. కాగా ఆదివారం రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పరిసర ప్రాంతాలు, బంధువు లు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో సోమవారం మొయినాబాద్ ఠా ణాలో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. సీసీ కెమెరాలు, ఎన్వీఆర్ డివైస్ తస్కరణ కడ్తాల్: మండల కేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రంలో సీసీ కెమెరాలతో పాటు, ఎన్వీఆర్ డివైస్ చోరీకి గురైంది. ఈ ఘటన సోమ వారం వెలుగులోకి వచ్చింది. సీఐ గంగాధర్ తెలిపిన ప్రకారం.. పాలశీతలీకరణ కేంద్రంలోని ల్యాబ్లో నిఘా కోసం ఏర్పాటు చేసిన రెండు సీసీ కెమెరాలు, ఎన్వీఆర్ డివైస్ను ఏర్పాటు చేశారు. ఈ నెల 21న గుర్తు తెలియని దుండగులు వీటిని ఎత్తుకెళ్లారు. సోమవారం గమనించిన పాలశీతలీకరణ కేంద్రం ఇన్చార్జి మేనేజర్ ఉదయశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది. -
విపక్షాలది దుష్ప్రచారం
● నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి ఆమనగల్లు: రాష్ట్రంలో ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వంపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని నాగర్కర్నూల్ ఎంపీ డా.మల్లురవి అన్నారు. పట్టణంలో సోమవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒక్క ఇల్లూ ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని తెలిపారు. తొమ్మిది రోజుల్లో రూ.9వేల కోట్లు రైతుభరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని ఎంపీ మల్లురవి మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో పీసీబీ మాజీ సభ్యుడు బాలాజీసింగ్, పీసీసీ కార్యదర్శి మధుసూదన్రెడ్డి, మార్కెట్ మాజీ వైస్చైర్మన్ గుర్రం కేశవులు, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు మండ్లి రాములు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మాణయ్య, చేనేత సంఘం మాజీ అధ్యక్షుడు కోట కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
తక్కువ ధరకు బంగారమంటూ టోకరా!
సాక్షి, సిటీబ్యూరో: చౌటుప్పల్కు చెందిన ఓ రియల్టర్ వ్యాపారాభివృద్ధి కోసం తన పేరు, ఫోన్ నెంబర్ కార్యాలయంపై రాసుకోవడమే శాపమైంది. అలా లభించిన ఫోన్ నెంబర్ ఆధారంగా ఆయనకు కాల్ చేసిన కర్ణాటక ముఠా తక్కువ ధరకు బంగారం పేరుతో రూ.65 లక్షలు స్వాహా చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న అఫ్జల్గంజ్ పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు. ఫలితంగా ప్రధాన సూత్రధారిని పట్టుకోవడంతో పాటు రూ.40 లక్షలు రికవరీ చేసినట్లు తూర్పు మండల డీసీపీ డాక్టర్ బి.బాలస్వామి సోమవారం తెలిపారు. అదనపు డీసీపీ జె.నర్సయ్య, సుల్తాన్బజార్ ఏసీపీ ఎం.మట్టయ్యలతో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ మోసాలు కర్ణాటకలోని రాయచూర్కు చెందిన కొన్ని ముఠాలు తెలుగు రాష్ట్రాలనే టార్గెట్గా చేసుకుని మోసాలు చేస్తున్నాయి. పొలం దున్నుతుంటేనో, పాత ఇంటిని కూలుస్తుంటేనో నిధి లభించిందని చెప్తారు. అందులో ఉన్న బంగారం ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా దాచామని, సగం ధరకే ఇస్తామంటూ ఎర వేస్తారు. వీళ్లు టార్గెట్లను ఎంచుకోవడానికి వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ వ్యాపార ప్రకటనలు, దుకాణాలపై ఉన్న పేర్లు, ఫోన్ నెంబర్లు ఎంచుకుంటారు. వీరి వల్లోపడుతున్న వారిలో అత్యధికులు రియల్టర్లు, చిన్న స్థాయి బంగారం వ్యాపారులే ఉంటున్నారు. ఇలాంటి ముఠాల్లో తాళ్ల వ్యాపారి జయ కుమార్ది ఒకటి. తన బావమరిది ఉదయ్, స్నేహితుడు సందీప్తో కలిసి రంగంలోకి దిగాడు. బోర్డుపై ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా చౌటుప్పల్కు చెందిన మునుకుంట్ల నిరంజన్ అక్కడి భరత్నగర్ కాలనీలో శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్స్ పేరుతో సంస్థను నిర్వహిస్తున్నారు. జయ కుమార్ నేతృత్వంలోని ముఠా ఈ ఏడాది మార్చిలో ద్విచక్ర వాహనాలపై సిటీకి వచ్చింది. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో సంచరిస్తూ టార్గెట్ల కోసం అన్వేషించింది. చౌటుప్పల్లో సంచరిస్తున్నప్పుడు వారి కంట్లో నిరంజన్ కార్యాలయం బోర్డు పడింది. అందులో ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా రెడ్డి పేరుతో ఉదయ్ సంప్రదించాడు. సగం ధరకు బంగారమంటూ ఎర వేశాడు. అదే నెల్లో రూ.25 వేలు తీసుకుని అరతులం బంగారం ఇచ్చాడు. దీన్ని పరీక్షించిన నిరంజన్ మేలిమి బంగారంగా తెలుసుకున్నారు. ఆపై తన స్నేహితుడు దేవేందర్తో కలిసి రూ.65 లక్షలకే కేజీ ఖరీదు చేయడానికి సిద్ధయ్యారు. ఈ సందర్భంలో వీరితో రఘు పేరుతో సందీప్ కూడా సంప్రదింపులు జరిపాడు. ‘అంబర్పేట’ నుంచి అఫ్జల్గంజ్ వరకు గత నెల 12న కేజీ బంగారం సిద్ధంగా ఉందని ఫోన్ చేసిన రఘు నగదు తీసుకుని పెద్ద అంబర్పేట రమ్మని చెప్పాడు. దీంతో నిరంజన్ (రూ.45 లక్షలు), ఇతడి స్నేహితుడైన ధర్మేంద్ర (రూ.20 లక్షలు) ఇద్దరూ కలిసి రూ.65 లక్షలు తీసుకుని తమ కారులో పెద్ద అంబర్పేటకు వచ్చారు. నిరంజన్తో ఫోనులో సంప్రదింపులు జరుపుతున్న రెడ్డి... అక్కడ నుంచి వారిని ఎల్బీనగర్కు, ఆపై దిల్సుఖ్నగర్ రప్పించి చివరకు ఎంజీబీఎస్ సమీపంలోకి రమ్మన్నారు. అక్కడ వీరిని కలిసిన రఘు వారి వాహనంలోనే ఎక్కాడు. కొద్దిసేపటికి ద్విచక్ర వాహనంపై వచ్చిన జయ కుమార్, రెడ్డి బంగారం ఉందంటూ ఓ బ్యాగ్ ఇచ్చి, నగదుతో కూడిన బ్యాగ్ పట్టుకుపోయారు. అప్పటి వరకు వారితోనే ఉన్న రఘు సైతం దృష్టి మళ్లించి మరో వాహనంపై ఉడాయించాడు. నిరంజన్ ఆ బ్యాగ్ తెరిచి చూడగా... పైన చీరలు, కింద నాపరాళ్లు కనిపించడంతో మోసపోయినట్లు గుర్తించాడు. చౌటుప్పల్ వ్యాపారి నుంచి రూ.65 లక్షలు స్వాహా చాదర్ఘాట్లోని ఎంజీబీఎస్ సమీపంలో ఘటన కర్ణాటకకు చెందిన ప్రధాన సూత్రధారి అరెస్ట్ రూ.40 లక్షలు రికవరీ,పరారీలో మరో ఇరువురు ముమ్మరంగా గాలించినప్రత్యేక బృందం బాధితుల ఫిర్యాదుతో అఫ్జల్గంజ్ ఠాణాలో కేసు నమోదు కాగా... ఇన్స్పెక్టర్ ఎన్.రవి, డీఐ రవికిరణ్ నేతృత్వంలో ప్ర త్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సాంకేతిక అంశాలతో పాటు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా నిందితుల ఆచూకీ కనిపెట్టారు. నిందితుల కోస ం కర్ణాటకతో పాటు నగరంలోనూ ముమ్మరంగా గాలించారు. సోమవారం ఎంజీబీఎస్ వద్దకు కారులో చేరుకున్న జయ కుమార్ను పట్టుకున్నారు. ఇతడి నుంచి కారుతో పాటు రూ.40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన రూ.25 లక్షలు ఉదయ్, సందీప్ వద్ద ఉన్నట్లు జయ కుమార్ బయటపెట్టాడు. దీంతో పరారీలో ఉన్న వారి ద్దరి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. -
ముగిసిన మాన్సూన్ పోలో చాంపియన్షిప్
శంకర్పల్లి: మండల పరిధిలోని జన్వాడ నాసర్ పోలో హార్స్ రైడింగ్ క్లబ్లో మూడు రోజులుగా మాన్సూన్ పోలో చాంపియన్ షిప్–2025 పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో రాజస్థాన్ రంబుల్, హర్యానా హరికేన్, తెలంగాణ థండర్ తదితర జట్లు పాల్గొన్నాయి. ఆదివారం నిర్వహించిన ఫైనల్లో తెలంగాణ థండర్స్ తొమ్మిది గోల్స్ చేయగా.. హర్యానా హరికేన్ 11గోల్స్ చేసింది. దీంతో రెండు గోల్స్ తేడాతో హర్యానా హరికేన్ జట్టు చాంపియన్ షిప్–2025 కప్ని సొంతం చేసుకుంది. విజేత జట్టుకు తెలంగాణ–ఆంధ్ర సబ్ ఏరియా ఆఫీసర్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా షీల్డ్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఆసఫ్ జాహీ వంశానికి చెందిన 9వ నవాబు రౌనక్ యార్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాసర్ పోలో హార్స్ రైడింగ్ క్లబ్ సీఈఓ మీర్ హఫీజుద్ధీన్ మాట్లాడుతూ.. హార్స్ రైడింగ్ చేసేందుకు యువత ఆసక్తి చూపుతున్నారని.. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. -
ఓఆర్ఆర్ పరిధిలోనూ భరోసా ఇవ్వాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ఓఆర్ఆర్ను ఆనుకుని ఉన్న మండలాలకు రైతు భరోసా విడుదల చేయాలని ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ కృపేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వారు బీఆర్ఎస్ ఎల్మినేడు గ్రామ అధ్యక్షుడు దొమకొండ నర్సింహ అధ్యక్షతన మహాధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కృపేష్, బుగ్గరాములు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెండు దఫాలుగా రైతు భరోసా ఇవ్వకపోవడం సిగ్గు చేటు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం మండలాల రైతులు ఓట్లు వేయలేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో వివక్ష చూపకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తోందన్నారు. రైతులపై వివక్ష చూపడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు భరోసా విడుదల చేయకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల మాజీ అధ్యక్షుడు మొద్దు అంజిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మహేందర్రెడ్డి, బుట్టి మహేశ్, నిట్టు జగదీశ్వర్, బాష, యాదయ్య, రాజు, విష్ణువర్ధన్రెడ్డి, రాంరెడ్డి, పలువరు రైతులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ కృపేశ్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎల్మినేడులో ధర్నా -
రూ.7 కోట్ల విలువైన భూమికి ఎసరు!
షాద్నగర్ రూరల్: ధరణి లొసుగులు.. మీసేవ నిర్వాహకుల సహకారంతో తండ్రీకొడుకులు రూ.7 కోట్ల విలువైన నాలుగు ఎకరాల భూమికి ఎసరుపెట్టారు. ప్రభుత్వం ఇటీవల చిల్కమర్రిలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. బాధితులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించడంతో తహసీల్దార్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీసేవ నిర్వాహకులతో కుమ్మకై ్క.. గ్రామానికి చెందిన కొత్తపల్లి వినోద, శ్రీనివాస్రెడ్డి దంపతులు. కొంత కాలం క్రితం శ్రీనివాస్రెడ్డి చనిపోవడంతో ఆయన పేరిట ఉన్న 2.8 ఎకరాల భూమి 2022లో వినోద పేరిట విరాసత్ జరిగింది. ఈ భూమిపై కన్నేసిన వినోద మామ సుభాన్రెడ్డి, బావ మధుసూదన్ రెడ్డి పట్టణంలోని ఓ మీసేవ నిర్వాహకులతో కుమ్మక్కయ్యారు. వినోదకు తెలియకుండా ఆమె ఫోన్కు వచ్చిన ఓటీపీని సంపాదించి దొంగ జీపీఏ డాక్యుమెంట్ సృష్టించారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో భూ వివరాలు తెలుసుకునేందుకు రెవెన్యూ అధికారులను ఆశ్రయింగా జీపీఏ ద్వారా ఇతరులకు మారిందని చెప్పారు. సదస్సులు ముగిసిన తర్వాత వినోద తహసీల్దార్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఇదే గ్రామంలో మరొకరి భూమిని ఇదే గ్రామానికి చెందిన కొత్తపల్లినర్సింహారెడ్డి, నవనీత దంపతులకు మనస్పర్థలు రావడంతో వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. నర్సింహారెడ్డి పేరిట 1.29 ఎకరాల భూమిని కాజేసేందుకు సుభాన్రెడ్డి, మధుసూదన్రెడ్డి ఆమె భార్య నవనీతను రంగంలోకి దింపారు. భర్త ఫోన్ నవనీత దగ్గరే ఉండడంతో ఓటీపీ తీసుకుని జీపీఏ డాక్యుమెంట్ సృష్టించారు. సదరు భూమిని దేవిరెడ్డి శ్రీకాంత్రెడ్డికి సేల్డీడ్ చేశారు. తహసీల్దార్ విచారణలో ఈ తతంగమంతా బయటపడింది. ఇద్దరు పట్టాదారులకు సంబంధించి రూ.7కోట్ల విలువైన దాదాపు నాలుగు ఎకరాల భూమిని కాజేసినట్లు తేలింది. పోలీస్స్టేషన్లో తహసీల్దార్ ఫిర్యాదు పట్టాదారులకు తెలియకుండా భూములు చేతులు మారడంతో తహసీల్దారు పార్థసారధి సదరు భూముల రిజిస్ట్రేషన్పై విచారించారు. స్లాట్ బుకింగ్, డాక్యుమెంట్ తయారీ ఎక్కడ జరిగిందనే విషయాలను పరిశీలించారు. మీసేవ సెంటర్లో ఓటీపీలతో డాక్యుమెంట్ తయారు చేసినట్లు గుర్తించారు. సదరు మీసేవ నిర్వాహకులతో పాటుగా దొంగ జీపీఏ, రిజిస్ట్రేషన్ చేసిన వారిపై ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చిల్కమర్రి రెవెన్యూ సదస్సులో వెలుగులోకి.. అధికారులను ఆశ్రయించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసిన తహసీల్దార్ -
అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలి
● కలెక్టర్ నారాయణరెడ్డిఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణి ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి తక్షణమే పరిష్కరించే విధంగా అధికారులు చొర వచూపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్ సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఆర్ఓ సంగీతతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో శాఖల వారీగా స్వీకరించిన అర్జీలపై సంబంధిత అధికారులు సత్వరమే స్పందించాలన్నారు. పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమస్యలను పరిష్కరించేలా చూడాలన్నారు. ఈ వారం 76 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. వనమహోత్సవానికి ఏర్పాట్లు చేయండి వన మహోత్సవంలో జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తించాలని, గుంతలు తీసి సిద్ధంగా ఉంచాలన్నారు. అవసరమైన మొక్కలను నర్సరీల్లో అందుబాటులో ఉంచాలని, నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని తెలిపారు. వర్షకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు. రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎక్క డా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వ్యవసాయాధికారులకు చెప్పారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల తహసీల్దారులు, మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు.ఎరువుల కొరత రానివ్వొద్దు సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎరువుల కొరత రానివ్వొద్దని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమ వారం కలెక్టరేట్లో వ్యవసాయశాఖ అధికారులు, డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా పండే పంటలు, అవసరమైన ఎరువులపై ముందే ఒక అంచనాకు రావాల్సి ఉందన్నారు. రైతుల అవసరాల మేరకు ఎరువులను అందుబాటులో ఉంచాలని, గోదాముల్లో నిల్వ చేయాలని సూచించారు. నకిలీ విత్తనాలు, నిర్దేశిత ధరలకు మించి ఎరువులను విక్రయించే వారిపై చర్యలు తప్పవన్నారు. ఉద్దేశ పూర్వకంగా రైతులను ఇబ్బందులకు గురి చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు, డీసీఎస్ఓ, మండలాల వ్యవసాయ అధికారులు, డీలర్లు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
సేవలు అంతంతే..
సర్కారు ఆస్పత్రులు సమస్యలు బోలెడు● సమయపాలన పాటించని వైద్యులు ● అత్యవసర పరిస్థితుల్లో స్టాఫ్నర్సులు, ఫార్మాసిస్టులు, ఆయాలే దిక్కు ● వేధిస్తున్న సిబ్బంది కొరత ● బాధితులకు తప్పని తిప్పలు సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ ఆస్పత్రులను నిర్లక్ష్యపు జబ్బు పట్టి పీడిస్తోంది. మందుల కొరత.. మౌలిక సదుపాయాల లేమి.. వెరసి అత్యవసర పరిస్థితుల్లో ఆయా ఆస్పత్రులకు చేరుకున్న నిరుపేద రోగులకు కనీస వైద్య సేవలు అందడం లేదు. ఉదయం 9 గంటలకే ఓపీలో కూర్చోవాల్సిన వైద్యులు 11 దాటినా కన్పించడం లేదు. కొన్ని చోట్ల ఎక్సరే మిషన్లు పని చేయడం లేదు. రేడియాలజిస్టులు లేకపోవడంతో అల్ట్రాసౌండ్ మిషన్లు పనికిరాకుండా పోతున్నాయి. టెక్నీషియన్ల కొరతతో డయాలసిస్ సేవలు అందడం లేదు. వ్యాధి నిర్దారణ కోసం బాధితుల నుంచి రక్త, మూత్ర పరీక్షల నమూనాలు సేకరించినప్పటికీ రిపోర్టుల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అప్పటికే జబ్బు మరింత ముదురుతుండడంతో మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. సోమవారం ‘సాక్షి’ బృందం జిల్లా వ్యాప్తంగా పట్ట ణ ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాల పని తీరుపై విజిట్ నిర్వహించింది. జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులతో బాధపడుతూ ఉదయం ఎనిమిది గంటలకే అనేక మంది ఆయా ఆస్పత్రులకు చేరుకున్నారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. మరికొంత మందికి ఫార్మాసిస్టులు, స్టాఫ్ నర్సులే దిక్కయ్యారు. పది దాటినా పత్తాలేని వైద్యులు ఆమనగల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో నలుగురు వైద్యు లకు ఉదయం 10.30 గంటల వరకు ఒక్కరూ రాలేదు. వైద్యులు లేకపోవడంతో కుర్చీలు ఖాళీగా కన్పించాయి. ఆలస్యంగా ఆస్పత్రికి రావడమే కాకుండా నిర్దేశిత సమయానికి ముందే తిరిగి వెళ్లిపోయారు. యాచారం సీహెచ్సీలోనూ ఇదే పరిస్థితి. పది గంటలలోపు వచ్చిన రోగులకు స్టాఫ్ నర్సులే మందులు, ఇంజక్షన్లు ఇచ్చి పంపారు. కందుకూరు పీహెచ్సీ వైద్యురాలు ఉదయం 10.58 గంటలు దాటినా ఆస్పత్రికి చేరుకోలేదు. ఫార్మాసిస్ట్ కూడా ఆలస్యంగా వచ్చారు. వచ్చిన రోగులకు ఏఎన్ఎం పెద్ద దిక్కుగా నిలిచింది. డయాలసిస్కు తప్పని నీటికొరత ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో మూడు విడతల్లో 32 మందికి డయాలసిస్ చేస్తున్నారు. మరో 18 మంది వెయింటింగ్ లిస్ట్లో ఉంటున్నారు. డయాలసిస్ కోసం సరిపడా నీరులేకపోవడంతో వచ్చిన రోగులందరికీ సేవలు అందించలేని పరిస్థితి. ఆస్పత్రిలో ఎనిమిది మంది వైద్యులున్నప్పటికీ సాయంత్రం నాలుగు తర్వాత అందుబాటులో ఉండటం లేదు. పది మందికి వచ్చింది ఆరుగురే.. చేవెళ్ల ఏరియా ఆస్పత్రిలో పది మంది వైద్యులు ఉండగా, ఆరుగురే విధులకు హాజరయ్యారు. ఫార్మాసిస్ట్, ఎక్స్రే టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్ల కొరతతో వైద్యసేవల్లో జాప్యం జరుగుతోంది. విపరీతమైన జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతూ ఆస్పత్రికి చేరుకుంటున్న బాధితులకు సగం మందులతో సరిపెడుతున్నారు.లేనివాటిని ప్రైవేటులో కొనుక్కోవాల్సిందిగా సూచిస్తున్నారు. కొందుర్గు పీహెచ్సీలో వైద్య సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇద్దరు వైద్యులకు ఒక్కరే, అదీ పగటి పూటే అందుబాటులో ఉంటున్నారు. ఏఎన్ఎంలే స్టాఫ్ నర్సుల అవతారం ఎత్తుతున్నారు. కొత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎక్స్రే, అల్ట్రాసౌండ్ పరీక్షల సేవలు అందడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను బయటికి సిఫార్సు చేస్తున్నారు. కేశంపేట ఆస్పత్రిలో పని చేసే ల్యాబ్టెక్నీషియన్ డిప్యూటేషన్పై కొండాపూర్ ఆస్పత్రికి వెళ్లారు. దీంతో నందిగామ, కొందుర్గు పీహెచ్సీ టెక్నీషియన్ వారానికి ఒకరోజు వచ్చి వెళ్తున్నారు. మహేశ్వరం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరు పోస్టులు ఖాళీ ఉన్నాయి. 16 మంది వైద్యులకు 9మంది మాత్రమే హాజరవుతున్నారు. నర్సే చికిత్స చేశారు చికిత్స కోసం ఉదయం 9 గంటలకే కందుకూరు పీహెచ్సీకి వచ్చాను. 10.30 గంటల వరకు చూసినా డాక్టరు రాలేదు. నర్సుతో చికిత్స చేయించుకుని, మందులు తీసుకుని వెళ్తున్నాను. ఇప్పటికి ఇక్కడికి మూడుసార్లు వచ్చాను. ఇంత వరకు వైద్యులతో చికిత్స చేయించుకోలేకపోయాను. – శ్రీనివాస్రెడ్డి, కొత్తూరు, కందుకూరు మండలం -
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి
● బనకచర్ల ప్రాజెక్టుతో రాష్ట్రానికి నష్టం జరగనీయం ● మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ షాద్నగర్: సంచనలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. కమ్మదనం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను హరిస్తూ గత పాలకులు స్వార్థరాజకీయాలకు పాల్పడి, ప్రజా జీవితాలకు భంగం కలిగే విధంగా వ్యవహరించారని విమర్శించారు. భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలు కూడా వినడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన సూత్రధారులు, పాత్రదారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బనకచర్ల ప్రాజెక్టు గురించి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కేంద్రంతో మాట్లాడారని, తెలంగాణకు ఏవిధంగా నష్టం జరుగుతుందో స్పష్టంగా వివరించారని తెలిపారు. ఈ విషయంలో కేంద్రానికి స్పష్టత ఉందన్నారు. ఏ ప్రాజెక్టు విషయంలోనైనా తెలంగాణకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం పార్టీ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి, శ్రీవర్ధన్రెడ్డి, నాయకులు మహేందర్రెడ్డి, అశోక్గౌడ్, మోహన్సింగ్, విజయ్ భాస్కర్, ఇస్నాతి శ్రీనివాస్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూములను కాపాడాలని వినతి
మొయినాబాద్రూరల్: మండల పరిధిలోని తోల్కట్టలో ప్రభుత్వ భూములను కాపాడాలని సోమవారం గ్రామస్తులు కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని సర్వే నంబర్ 143, 108, 155, 124, 135, 134, 107లలో పూర్తిగా ప్రభుత్వ భూములు ఉన్నాయని తెలిపారు. ధరణి వచ్చిన తరువాత సర్వే నంబర్లు 107, 124, 135 అక్రమంగా పట్టాలుగా మార్చుకున్నారని, మిగతావి సైతం కబ్జాకు గురవుతున్నాయని అన్నారు. తహసీల్దార్, ఆర్డీఓ, జిల్లా అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా చొరవ తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడాలని కలెక్టర్కు విన్నవించారు. కలెక్టర్ను కలిసిన వారిలో శివశంకర్గౌడ్, మల్లేష్, అంజయ్య తదితరులు ఉన్నారు.అదుపు తప్పిన ఆర్టీసీ బస్సుకందుకూరు: ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రో డ్డు పక్కకు దూసుకెళ్లింది. వివరాలివీ.. ఇబ్ర హీంపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం మధ్యాహ్నం గుమ్మడవెల్లి మీదు గా ఆకులమైలారం వెళ్లే క్రమంలో అదుపు తప్పింది. గుమ్మడవెల్లి రైతు వేదిక సమీపంలో పొలాలకు వేసిన కడియ రాళ్లను ఢీకొట్టి ఆగిపోయింది. కొంత సేపటి తర్వాత బస్సును అక్కడి నుంచి డ్రైవర్ తీసుకెళ్లాడు. ప్రమాద సమయంలో బస్సులో 25మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.గొలుసుకట్టు కాలువల పునరుద్ధరణకు కృషిఇరిగేషన్ డీఈ చెన్నకేశవ రెడ్డితుర్కయంజాల్: గొలుసుకట్టు కాలువలను పునరుద్ధరించి ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీరు సులువుగా ప్రవహించేలా చర్యలు చేపట్టనున్నట్టు ఇరిగేషన్ డీఈ చెన్నకేశవ రెడ్డి తెలిపారు. భారీ వర్షాలు కురిస్తే చెరువులు అలుగు పారే అవకాశాలు ఉండడంతో తుర్కయంజాల్లోని మాసబ్ చెరువు, ఇంజాపూర్లోని దిలావర్ ఖాన్ చెరువు, ఈదుల చెరువుల కాలువలను ఏఈ వంశీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ.. కాలువులు పూడిక తీయకంపోవడంతో పలు చోట్ల ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. వరద వచ్చినా సులువుగా ప్రవహించి, కాలనీలు ముంపునకు గురవకుండా చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు.యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాంకు పులిమామిడి జెడ్పీహెచ్ఎస్కందుకూరు: డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ (సీజీఆర్) సంయుక్తంగా నిర్వహిస్తున్న యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాంకు మండల పరిధిలోని పులిమామిడి జిల్లా పరిషత్ పాఠశాల ఎంపికై ంది. ఇందులో భాగంగా పాఠశాల పరిధిలో వాటర్ హార్వెస్టింగ్ పిట్, కంపోస్టు పిట్, డిక్లేర్ నో ప్లాస్టిక్ జోన్, డిక్లరేషన్ ఆఫ్ మదర్ ట్రీ, కిచెన్ గార్డెన్, సాయిల్ అండ్ సీడ్ మ్యూజియం, మెడిసినల్ గార్డెన్, రెన్యూవల్ ఎనర్జీ (సోలార్), ప్రిపరేషన్ ఆఫ్ విలేజ్ జియోగ్రఫీ మ్యాప్ అండ్ రిపోర్టు, ప్లాంటేషన్ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం సీజీఆర్ సంస్థ జిల్లా కో–ఆర్డినేటర్ రజనీకాంత్ హెచ్ఎం రవీందర్రెడ్డికి ధ్రువపత్రం అందించారు. -
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం
● షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ కేశంపేట: సమాజంలో అందరూ యూనిఫాం లేని పోలీసులేనని షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించి నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమ వారం యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేయా లని పిలుపునిచ్చారు. డ్రగ్స్ అమ్మినా, కొనుగోలు చేసినా, రవాణా చేసినా, నిల్వ కలిగి ఉన్నా చట్టరీత్యా నేరామని తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ నమ్మొద్దని, ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దన్నారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని ఆయన సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీఐ నరహరి, ఎస్ రాజ్కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విద్యావతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
త్వరలో స్వచ్ఛ ‘సర్వే’క్షణ్
● పంచాయతీలకు ర్యాంకులు ● సర్వే ఆధారంగా ఎంపిక ప్రక్రియ ● ఉత్తమ గ్రామాలకు పురస్కారం ● పారిశుద్ధ్యం మెరుగుపర్చడమే లక్ష్యం ఉన్నతాధికారుల సూచన మేరకు.. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంపై త్వరలో సమావేశం జరుగుతుంది. ఉన్నతాధికారుల సూచ నల మేరకు గ్రామాల్లో అన్ని రకాల పనులు చేపడతాం. ఇప్పటికే అన్ని పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్తను సేకరించడం జరుగుతోంది. – విజయలక్ష్మి, ఎంపీఓ, కొత్తూరు కొత్తూరు: పంచాయతీల మధ్య పోటీతత్వాన్ని పెంచడంతో పాటు పారిశుద్ధ్య పరిస్థితులను మరింత మెరుగుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అధికారులు, సిబ్బంది గ్రామాల్లో పర్యటించి సర్వే చేసిన వివరాల ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. ఆయా విభాగాల్లో ఎక్కువ పాయింట్లు సాధించిన పంచాయతీలను గుర్తించి ర్యాంకులు ప్రకటించి పురస్కారాలు అందజేస్తారు. ఈ ఏడాది (2025) సైతం త్వరలో కేంద్ర బృందాలు గ్రామాల్లో పర్యటించి సర్వే చేపట్టనున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు, అభివృద్ధి పనులపై అధికారులు పంపిన నివేదికల ఆధారంగా సభ్యులు క్షేత్రస్థాయిలో సర్వే చేయనున్నారు. పరిశీలించే అంశాలు ● ప్రతిఇంట్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందా.. ఇంకా గ్రామాల్లో బహిరంగ మలవిసర్జన జరుగుతోందా.. అందరూ మరుగుదొడ్లు వినియోగిస్తున్నారా.. అనే విషయాలు తెలుసుకుంటారు. ● పారిశుద్ధ్య సిబ్బంది నిత్యం చెత్తను సేకరించే విధానం.. వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంచేందుకు అధికారులు ఇంకుడు గుంతల నిర్మాణాలపై అవగాహన కల్పించారా.. ప్రజలు స్వతహాగా నిర్మించుకున్నారా.. అనేది గ్రహిస్తారు. ● డంప్యార్డుల నిర్మాణం, వ్యర్థాల నిర్వహణ, మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను గుర్తిస్తారు. ● అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, తాగునీటి సరఫరా, బహిరంగ ప్రదేశాల్లో పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించనున్నారు. ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా.. వాటి ద్వారా లబ్ధి పొందుతున్నారా.. అనే విషయాలు తెలుసుకుంటారు. ● పలు అంశాల్లో సభ్యులు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి వెయ్యి మార్కులకు గాను అధిక స్కోర్ సాధించిన గ్రామాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు. ముందస్తు సమాచారం ఉండదు స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా ఆయా గ్రామాలకు వెళ్లే అధికారుల ముందస్తు సమాచారం సంబంధిత పంచాయతీలకు ఉండదు. అధికారులు నిర్ణయించుకున్న మేరకు వెళ్లి పలు నివాస గృహాలు, వ్యాపార సముదాయాలతో పాటు పలుచోట్ల సర్వే చేపట్టనున్నారు. -
రీల్స్ కోసం బైక్పై ప్రమాదకర స్టంట్
రాజేంద్రనగర్: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది యువకులు ఓ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంపై అర్ధరాత్రి రీల్స్ కోసం స్టంట్ చేశారు. జాతీయ రహదారిపై ఈ స్టంట్ కొనసాగుతుండటంతో ఈ దారి గుండా వెళ్తున్న వారు తమ సెల్ఫోన్లో బంధించి ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు వెళ్లే దారిలో ఇలాంటి స్టంట్ అర్ధరాత్రి వేళ జరుగుతుండటంతో పలువురు తమ ఎక్స్ వేదికల ద్వారా దీనిని సైబరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు నిందితులను పట్టుకొని ఆర్జీఐ పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన వారిలో ముగ్గురు మైనర్లు ఉండటం గమనార్హం. రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 21న అర్థరాత్రి 1.30 గంటల సమయంలో శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది యువకులు ద్విచక్ర వాహనంపై శంషాబాద్ నుంచి ఆరాంఘర్ వైపు పయనమయ్యారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు మైనర్లతో పాటు ఐదుగురు యువకులు పయనిస్తూ రీల్స్ చేశారు. ప్రమాదభరితంగా ఈ జాతీయ రహదారిపై స్టంట్ నిర్వహించారు. ఈ దృశ్యాలను అటుగా వెళుతున్న పలువురు చిత్రీకరించి ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు వెళ్లే ఈ రహదారి రాత్రి సమయాల్లో బిజీగా ఉంటుంది. అర్ధరాత్రి సమయంలో వీఐపీల రాకపోకలతో అలర్ట్గా ఉంటుంది. ఈ స్టంట్ విషయమై పలువురు సైబరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితులను సోమవారం గుర్తించారు. ద్విచక్ర వాహనంతో పాటు ఐదుగురు యువకులను, ముగ్గురు మైనర్లను రాజేంద్రనగర్ పోలీసులకు సోమవారం సాయంత్రం అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎనిమిది మంది యువకుల అరెస్టు -
బలహీనవర్గాల అభ్యున్నతే ధ్యేయం
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీమంచాల: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిషలు పని చేసేది సీపీఎం అని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. మండలంలోని ఆస్మత్పూర్లో సోమవారం నిర్వహించిన పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప సర్పంచ్ నర్ల భిక్షపతి వర్ధంతి సభకు ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. నర్ల భిక్షపతి స్థూపం నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంతాప సభలో ఆయన మాట్లాడారు. కార్మికులు, కర్షకులను చైతన్యపర్చి, వారి హక్కుల కోసం ఉద్యమించే పార్టీ సీపీఎం అని పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాటాలు చేసి ఎంతోమంది అమరులయ్యారని తెలిపారు. ఈ ప్రాంతంలో అనేక భూ పోరాటాలు, రైతు, కూలీ సమస్యలపై ఉద్యమాలు నడిపిన చరిత్ర ఉందన్నారు. అట్టడుగు వర్గాల కోసం కమ్యూనిస్టులు చేసిన తాగ్యాలు మర్చిపోలేనివన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పగుడాల యాదయ్య, మండల కార్యదర్శి రావుల జంగయ్య, మండల నాయకులు కె.శ్రీనివాస్రెడ్డి, శ్యాంసుందర్, గోరెంకల నర్సింహ, మాజీ వైస్ ఎంపీపీ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘టెక్స్టైల్’ భూముల విక్రయానికి యత్నం!
నందిగామ: టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసి, స్థానికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కొనుగోలు చేసిన భూమిని విక్రయించేందుకు కొందరు డైరెక్టర్లు యత్నిస్తున్నారని సొసైటీ సభ్యులు ఆరోపించారు. కొందరు రైతులతో కలిసి ఆదివారం హైదరాబాద్ హైటెక్ టెక్స్టైల్ పార్క్ వద్ద ఆదివారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. 2002, 2003 సంవత్సరంలో టెక్స్టైల్ పార్క్ కోసం చేగూరు రెవెన్యూ పరిధి నర్సప్పగూడ గ్రామ శివారులో 142 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని తెలిపారు. ఆ సమయంలో 108 మంది సభ్యులు, 8 మంది డైరెక్టర్లతో ఒక సొసైటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆ భూమిలో ప్రభుత్వ రాయితీతో పరిశ్రమలు ఏర్పాటు చేసి, స్థానికులకు, భూములుఇచ్చిన రైతు కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చామని వివరించారు. కానీ అనుకున్న ఆశయం నెరవేరకుండా కొందరు డైరెక్టర్లు ఎవరికీ తెలియకుండా ఆ భూములను అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. తామంతా కష్టపడి సంపాదించిన డబ్బులతో భూములు కొనుగోలు చేశామని, మా భూములు మాకు కేటాయిస్తే పరిశ్రమలు స్థాపించి, పలువురికి ఉపాధి చూపుతామని చెప్పారు. సంబంధిత అధికారులుస్పందించి, జాగల విక్రయానికి యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుని, ఆ భూములను తమకు అప్పగించాలని కోరారు. కార్యక్రమంలో బోర్డు సభ్యులు పురుషోత్తం, గడ్డం దేవదాస్, వెంకటరమణ, శ్రీరాములు, సురేంద్ర, రవి, రమేష్, బలరాం తదితరులు పాల్గొన్నారు.నిరసన వ్యక్తంచేసిన సొసైటీ సభ్యులు -
నిధులు లేక కటకట
● పంచాయతీ నిర్వహణకుఅప్పులభారం ● ట్రాక్టర్ డీజిల్కు సైతం ఇబ్బంది ● సొంత నిధులు వెచ్చించలేమని కార్యదర్శుల ఆవేదన ● గ్రామాల్లో అటకెక్కిన పరిపాలన పరిగి: గ్రామాల్లో ప్రత్యేక పాలన వెక్కిరిస్తోంది. నిధులు లేకపోవడంతో పనులు సాగడం లేదు. దీంతో పాలన కార్యదర్శులకు రోజురోజుకూ భారంగా మారుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు నెలల తరబడి విడుదల కాకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు అప్పుల పాలవుతున్నారు. చిన్న పంచాయతీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇటీవల పరిగి, దోమ మండలాల్లోని అన్ని గ్రామాల కార్యదర్శులు సమస్యల పరిష్కారానికి డబ్బులు లేవని ఎంపీఓ, ఎంపీడీఓలకు వినతిపత్రం అందజేసి పంచాయతీ ట్రాక్టర్ల తాళాలను అందజేశారు. అదే బాటలో మిగతా కార్యదర్శులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న జీపీలు కుదేలు జిల్లాలో 20 మండలాలు ఉండగా 566 గ్రామ పంచాయతీలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కాక పోవడంతో విద్యుత్ బిల్లులు, కార్మికుల వేతనాలు, వీధి దీపాల బిల్లులు, ట్రాక్టర్ నిర్వహణ, బోరు మోటార్ల మరమ్మతులు తదితర వాటికి కాసులు లేక అరిగోసలు పడుతున్నారు. పెద్ద పంచాయతీలకు వస్తున్న కొద్దిపాటి ఆదాయంతో అభివృద్ధి పనులు ఓ మోస్తరుగా సాగుతున్నాయి. కానీ చిన్న పంచాయతీల్లో మాత్రం ఎలాంటి పనులు జరగడం లేదు. రోజు రోజుకూ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి దీనంగా మారుతుందని, అప్పుల కుప్పలుగా మారుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. తాము గ్రామాల్లో సొంత ఖర్చులతో పనులు చేయలేమని కార్యదర్శులు ఉన్నతాధికారులకు తేల్చి చెప్పారు. కొరవడిన ప్రభుత్వ సహకారం కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు విడుదల కావడం లేదు. గత 20 నెలలుగా గ్రామాలకు ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. ఇక రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులైతే 2022 నుంచి నిలుపుదల చేశారు. స్థానిక సంస్థల్లో పాలకవర్గం లేకపోవడంతో గ్రామ పంచాయతీలకు కేంద్రం నిధులు విడుదల చేయడం లేదు. కొంత కాలంగా పల్లెల్లో సమస్యలను పంచాయతీ కార్యదర్శులే నిర్వహిస్తున్నారు. ఇలా చాలా మంది కార్యదర్శులు అప్పులు చేసి పనులు చేపట్టారు. అయినా ప్రభుత్వం నుంచి సహకారం రాకపోవడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేశాం గ్రామంలో నిత్యం ఎక్కడో ఒక చోట సమస్యలుంటాయి. తొలుత ప్రత్యేక పాలనలో ఇబ్బందులు రాకున్నా దినదినం భారంగా మారుతుంది. వచ్చే జీతం డబ్బులు కూడా గ్రామ సమస్యల కోసం ఖర్చు చేస్తున్నాం. అవి సరిపోకపోవడంతో అప్పులు చేశాం. ఊరిలో సమస్యలు పరిష్కరించాలంటే ఇక సొంత డబ్బులు ఖర్చు చేయలేము. – వేమారెడ్డి, పంచాయతీ కార్యదర్శి, రాఘవపూర్ -
చెరువులో మునిగి ఇద్దరు మృతి
అబ్దుల్లాపూర్ మెట్: చెరువు పక్కన ఉన్న బండరాయిపై ఆడుకుంటున్న ఓ చిన్నారి ప్రమాదవశాత్తు చెరువులో పడింది. ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన మరో యువకుడు కూడా చెరువులో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన చిన్నపురెడ్డి ప్రతాప్ రెడ్డి, భార్య ఇద్దరు పిల్లలతో కలిసి అబ్దుల్లాపూర్ మెట్లోని లక్ష్మీ ప్రియానగర్కాలనీలో నివాసం ఉంటున్నారు. అనాజ్పూర్ సమీపంలోని ఇందిరమ్మ చెరువు దగ్గర వెంచర్లో ప్రతాప్రెడ్డి పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం కూతురు ప్రణీత(10)తో పాటు బంధువులతో కలిసి వెంచర్ దగ్గరికి వెళ్లాడు. వెంచర్ సమీపంలో ఉన్న చెరువు వద్దబండరాయిపై ఆడుకుంటున్న ప్రణీత.. ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగిపోయింది. గమనించిన ప్రతాప్రెడ్డి బంధువు చింతంరెడ్డి ఇంద్రసేనారెడ్డి(20) ఆమెను కాపాడే ప్రయత్నంలో అతను కూడా మునిగి ఇద్దరూ చనిపోయారు. చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నిమ్స్కు తరలించారు. వేడుకగా వీరభద్రస్వామి ఆలయ వార్షికోత్సవం రాజేంద్రనగర్: బుద్వేల్లోని వీరభద్రస్వామి భద్రకాళి ఆలయ మూడవ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆ సందర్భంగా దేవాలయాన్ని వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. ఉదయం అభిషేకం, అలంకరణ అనంతరం భక్తులకు వీరభద్ర స్వామి భద్రకాళి అమ్మవారి దర్శనాన్ని ప్రారంభించారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా తగు ఏర్పాట్లు చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామి, అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. -
డ్రైనేజీ నిర్మాణం.. అస్తవ్యస్తం..!
శంషాబాద్: శంషాబాద్ పట్టణ ప్రధాన రహదారిలో చేపట్టిన డ్రైనేజీ పనులు.. మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ వెళ్లే రహదారిలో రైల్వే కమాన్ వద్ద ప్రధాన మార్గంలో డ్రైనేజీ లైను కలిపేందుకు రెండు రోజుల క్రితం పనులు చేపట్టారు. పైపులు వేసిన తర్వాత దానిని రహదారికి సమాంతరంగా కాకుండా చాలా ఎత్తులో సిమెంట్ పనులు చేశారు. దీంతో పైపులపై వేసిన సిమెంట్ వల్ల అది కాస్తా ఎత్తైన స్పీడు బ్రేకర్లా తయారైంది. ● ఇది ఒక ఎత్తైతే నాణ్యత లేకుండా నిర్మించినందున గడచిన దానిపై రంద్రాలు ఏర్పడ్డాయి. ఈ కారణంగా రెండు రోజుల్లోనే అదికాస్తా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులను కల్గిస్తోంది. కింద ఉన్న డ్రైనేజీ బయటపడేలా కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో వేగంగా వచ్చే వాహనాలు ఎత్తుగా ఉండటంతో ఒక్కసారిగా బ్రేక్ వేయాల్సి వస్తుండటంతో తరచూ ప్రమాదాలూ చోటుచేసుకుంటున్నాయి. ● ఇకనైనా మున్సిపల్ అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించి నాణ్యత లేమితో చేపట్టిన పనులను వెంటనే సరిద్దాలని స్థానికులు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ● ఈ ప్రాంతంలోనే ఆరు నెలల క్రితం బస్టాప్ ఏ ర్పాటు చేశారు. అప్పట్లో మిగిలిన మట్టి, రా తిపౌడర్ ఇతర వ్యర్థాలను అక్కడే వదిలేశారు. అ వి పూ ర్తిగా గట్టిపడిపోయాయి. కొంతకాలంగా రహ దా రికి అడ్డుగా ఉన్నందున రాకపోకలు సా గించే వా హనదారులు ఇబ్బందులు పడుతున్నా రు. అ యి నా మున్సిపల్ అధికారులు మాత్రం దా నిని తొలగించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. పనుల్లో నాణ్యతాలోపం రెండు రోజులకేగుంతలుగా మారిన వైనం ప్రమాదాల బారిన వాహనదారులు అధికారుల తీరుపై ప్రజాగ్రహం సరిదిద్దుతాం ఔట్ లెట్కు సమాంతరంగా ఉన్న కారణంగా రోడ్డుకన్నా ఎక్కువ ఎత్తులో డ్రైనేజీని నిర్మించా ల్సి వచ్చింది. వ్యర్థాలను వెంటనే తొలగించి.. మిగిలిన పనులను పూర్తిచేసి రోడ్డును సరిదిద్దు తాం. వాహనదారులు, పాదచారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. – నరేష్, ఏఈ శంషాబాద్ మున్సిపాలిటీ -
42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
షాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం షాబాద్ మండల పరిధి చందనవెళ్లి గ్రామంలో బీసీసేన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎనుకున్నారు. అధ్యక్షుడిగా చాకలి శ్రీశైలం, ఉపాధ్యక్షుడిగా గడీల మహిపాల్, ప్రధాన కార్యదర్శిగా మల్లేశ్, యువజన కమిటీ అధ్యక్షుడిగా చిప్పలపల్లి శ్రీశైలం, ఉపాధ్యక్షుడిగా శివలను నియమించారు. అనంతరం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో అభివృద్ధి సాధించాలంటే గ్రామస్తాయి నుంచే ఐక్యమత్యం కావాలన్నారు. అందుకే ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీలను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీసేన మండల అధ్యక్షుడు కమ్మరి దయాకర్చారి, జిల్లా నాయకులు వెంకటేశ్, నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి, కార్యదర్శి చంద్రశేఖర్, నందిగామ మండల ఉపాధ్యక్షుడు నర్సింహులు, షాబాద్ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్, గ్రామ పెద్దలు చేవెళ్ల స్వామి, మాజీ సర్పంచ్లు లింగం, శ్రీనివాస్గౌడ్, నాయకులు రాఘవచారి, మల్లేశ్, వెంకటేశ్, వడ్ల మల్లేశ్, తదితరులు ఉన్నారు. బీసీసేన జాతీయ అధ్యక్షుడు కృష్ణ -
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి
మొయినాబాద్రూరల్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు యు.పోచయ్య అన్నారు. ఆదివారం హిమాయత్నగర్ సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో స్కూల్ టీచర్ సమైక్య(ఎస్టీఎఫ్) తెలంగాణ ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచయ్యకు ఓడీ సౌకర్యం లభించడంతో ఆయనను ఆ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. దాంతో పాటే ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి.గోపాల్, ప్రతినిధులు విఠల్, రమేష్, రాంచంద్రయ్య, రాంచందర్, నర్సింహులు, లక్ష్మినారాయణ, దిలీప్, భగవత్గీత, రాజారావు, మొయినాబాద్ మండల అధ్యక్షుడు పి.సుధాకర్, వెంకటస్వామి, రజిత, సంతోష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పోచయ్య -
ఉద్యోగి అనుమానాస్పద మృతి
మీర్పేట: అనుమానాస్పద స్థితిలో ఓ ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందిన సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కాలనీవాసులు, ఇన్స్పెక్టర్ నాగరాజు కథనం ప్రకారం.. ఏపీ కృష్ణా జిల్లా పెద్దమద్దాలి గ్రామానికి చెందిన బండి వెంకటేశ్వరరావు(59) పదేళ్లుగా బడంగ్పేట సాయిప్రభు హోమ్స్ కాలనీలో భార్య జయంతి, కుమారుడు రాజ్భరత్, కోడలు గౌతమితో కలిసి ఉంటున్నాడు. ఆయన ఆబిడ్స్లోని పేఅండ్ అకౌంట్స్ కార్యాలయంలో ఆడిటర్గా విధులు నిర్వహించేవాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం వెంకటేశ్వరరావు నీటి సంపులో శవమై తేలాడు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియాకు తరలించారు. మృతిపై సందేహాలు కొంత కాలంగా తనను భార్య, కుమారుడు, కోడలు వేధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మృతుడు వెంకటేశ్వరరావు తరచూ తమతో చెప్పేవాడని కాలనీవాసులు పేర్కొన్నారు. తండ్రి చనిపోతే కుమారుడికి ఉద్యోగం వస్తుందని, అందుకే మానసికంగా వేధిస్తున్నారని తెలిపినట్లు చెప్పారు. ఇక్కడే ఉంటే తనను చంపేలా ఉన్నారని, వారం రోజుల్లో మలక్పేటలోని ప్రభుత్వ క్వార్టర్కు మారుతానని శనివారం రాత్రి చెప్పినట్లు స్థానికులు వెల్లడించారు. ఆయన మృతిపై అనుమానం ఉందని, మృతుడి కుమార్తె ధరణిదేవి మీర్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఆదివారం ఆగని దందా
షాద్నగర్రూరల్: ప్రైవేట్ పాఠశాలల్లో సెలవురోజున పుస్తకాల దందా కొనసాగుతోందని, నిబంధనలు పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆదివారం బుక్స్ విక్రయిస్తుండగా.. ఎస్ఎఫ్ఐ నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇదేమిటని ప్రశ్నించిన తమపై అక్కడి సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్చేసి రాత పుస్తకాలు తీసుకుంటేనే పాఠ్యపుస్తకాలు ఇస్తామని మెలిక పెడుతూ.. ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. అధిక ధరలకు నోట్స్ను అంటకడుతూ డబ్బులు దండుకుంటున్నారని తెలి పారు. పాఠశాలల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా.. విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇదే విషయమై గతంలో మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి.. బుక్స్, యూనిఫాంలు అమ్ముతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆదిల్, రఘు, నవీన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సెలవు రోజుల్లోనూ పుస్తకాల విక్రయం నిబంధనలు పాటించని పాఠశాలలు చర్యలు తీసుకోవాలంటూఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్ -
లారీ ఢీకొని యువకుడి మృతి
ఆమనగల్లు: లారీ ఢీకొ న్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం పట్టణంలోని హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎస్ఐ సీతారాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆమనగల్లు మున్సిపాలిటీ ముర్తుజపల్లి గ్రామానికి చెందిన మహేందర్నాథ్ అలియాస్ టిల్లు(23) బైక్పై వెళ్తున్న క్రమంలో కల్వకుర్తి నుంచి మధ్యప్రదేశ్కు పత్తిలోడ్తో వెళ్తున్న లారీ కాటన్మిల్లు సమీపంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఇదే సమయంలో కల్వకుర్తి నుంచి నగరానికి వెళ్తున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించాడు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆర్థిక సహాయం అందజేశారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చెట్టును ఢీకొన్న బైక్, ఒకరి మృతి యాచారం: బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపిన వివరాలు.. నగర శివారులోని జిల్లెలగూడకు చెందిన శ్రీనాథ్(18), స్నేహితులు మణిదీప్, చరణ్లతో కలిసి శనివారం నల్గొండ జిల్లా దేవరకొండ సమీపంలోని వైజాక్ కాలనీకి వెళ్లారు. ఆలస్యం కావడంతో రాత్రి చింతపల్లి మండలం వింజమూర్లోని బంధువుల ఇంట్లో నిద్రించారు. ఆదివారం తెల్లవారు జామున నాలుగున్నర గంటలకు శ్రీనాథ్.. మిత్రులతో కలిసి బైక్పై నగరానికి బయలుదేరాడు. మార్గ మధ్యలో సాగర్రోడ్డుపై చౌదర్పల్లి గేట్ వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీనాథ్ దుర్మరణం చెందగా.. మణిదీప్, చరణ్లు గాయపడ్డారు. కేసు దర్యాప్తులో ఉంది. అగ్ని ప్రమాదం మైలార్దేవ్పల్లి: మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని శాసీ్త్రపురం కాలనీలోని ప్లాస్టిక్ చైర్ పరిశ్రమంలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలను గమనించిన స్థానికులు అగ్నిపమాక, పోలీసులకు సమాచారం అందించారు. రాజేంద్రనగర్, చందులాల్ బారాదారి అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకోని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమా దం జరిగినప్పుడు పరిశ్రమలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. -
గెస్ట్ ఫ్యాకల్టీ కోసం దరఖాస్తుల ఆహ్వానం
చేవెళ్ల: స్థానిక కస్తూర్బాగాంఽధీ బాలికల పాఠశాలలో బోధించేందుకు గెస్ట్ ఫ్యాకల్టీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ఇన్చార్జి శ్వేతారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాల ఈఏడాది నుంచి ఇంటర్ మొదటి సంవత్సరానికి అప్గ్రేడ్ అయిందని తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు బోధన చేసేందుకు బోటనీ, కెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించిన గెస్ట్ ఫ్యాకల్టీ అవసరం ఉందన్నారు. అభ్యర్థులు పీజీ, బీఎడ్ అర్హతలు కలిగి ఉండాలని చెప్పారు. ఎంఎల్టీ కోర్సు (మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్) బోధించేందుకు సైతం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వసతిగృహానికి డే వాచ్ఉమెన్ పోస్ట్ ఖాళీగా ఉందని, పదో తరగతి చదివిన మహిళలు అర్హులని తెలిపారు. ఆయా పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 91004 39368 నంబర్లో సంప్రదించాలని సూచించారు. వేంకటేశ్వరస్వామి సన్నిధిలో టీటీడీ బోర్డు సభ్యుడు షాద్నగర్ః పట్టణంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని ఆదివారం టీటీడీ బోర్డు సభ్యుడు సదాశివరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయానికి విచ్చేసిన ఆయనను అర్చకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో న్యాయవాది మోముల బసప్ప, నాయకులు బస్వం, దండు వాసు, ఒగ్గుకిశోర్, జాంగారి రవి, మార్గం రాజేష్, రాంభూపాల్ తదితరులు పాల్గొన్నారు. మరకత శివాలయాన్ని దర్శించుకున్న వెన్నెల శంకర్పల్లి: మండలంలోని చెందిప్ప గ్రామంలో వెలసిన 11వ శతాబ్దపు బ్రహ్మసూత్ర మరకత శివాలయాన్ని ఆదివారం తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్, గద్దర్ కుమార్తె గుమ్మడి వెన్నెల దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆమెకి శేషవస్త్రం కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం వెన్నెల మాట్లాడుతూ.. మరకత శివాలయాన్ని సందర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. మళ్లీ సమయం తీసుకొని వస్తానని, ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు సదానందం గౌడ్, చైర్మన్ గోపాల్రెడ్డి, సభ్యులు మోహన్, హన్మంతు తదితరులు పాల్గొన్నారు. చీకటి వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శన కందుకూరు: మండలంలోని పులిమామిడి పరిధిలోని చీకటి వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని ఆదివారం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ సంతోష్కుమార్ పాండ్యే సందర్శించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయంలో అధికారులు, పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయ నిర్వాహకులు ఆలయ చరిత్రను ఆయనకు వివరించారు. తెలంగాణలో వ్యక్తిగత పర్యటనలో భాగంగా ఆయన నిత్యం నాలుగు పురాతన దేవాలయాలను సందర్శించి మొక్కులు చెల్లించుకోనున్నట్లు తెలిసింది. -
రేషన్ బియ్యం ప్లీజ్
సాక్షి, సిటీబ్యూరో: సన్నబియ్యం కోసం రేషన్ దుకాణాల చుట్టూ లబ్ధిదారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. డీలర్ల నుంచి స్టాక్ లేదనే సమాధానమే వస్తోంది. తుది గడువు సమీపిస్తుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రకృతీ వైపరీత్యాల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో తెలంగాణ సర్కారు మూడు నెలలకు సంబంధించిన సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ నెల 1 నుంచి ఆహార భద్రత కార్డుల లబ్ధిదారులకు పంపిణీ ప్రారంభించారు. మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లాలో ఇప్పటికీ సన్నబియ్యం పొందని లబ్ధిదారులు 20 శాతం ఉన్నారు. ప్రభుత్వం మూడు నెలలకు సంబంధించి సన్న బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో.. పోర్టబిలిటీని దృష్టిలో పెట్టుకుని జీవనోపాధి కోసం వలస వచ్చిన కుటుంబాల కార్డుల సంఖ్యకు అనుగుణంగా బియ్యం సేకరణ చేపట్టాల్సిన అధికారులు సకాలంలో స్పందించక పోవడంతో రేషన్ దుకాణాల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి నెలకొంది. మరో 11 వేల మెట్రిక్ టన్నులు వస్తేనే.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో మొత్తం 5,37,805 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. మూడు నెలల బియ్యం కోటాకు సంబంధించి 34,535 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని జిల్లా పౌరసరఫరాల శాఖ లెక్కలేసింది. జిల్లాలో జీవనోపాధి కోసం వచ్చిన వలస కుటుంబాలకు సంబంధించి లక్షకు పైగా ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. వీరంతా ఇక్కడే రేషన్ బియ్యం తీసుకుంటున్నారు. పోర్టబిలిటీతో కలిపి జిల్లాకు 45,535 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం కాగా, 34,535 మెట్రిక్ టన్నులు మాత్రమే దిగుమతయ్యాయి. లబ్ధిదారులు రేషన్ దుకాణం వద్దకు వస్తే డీలర్ల నుంచి స్టాక్ లేదన్న సమాధానం వస్తుండటంతో నిత్యం తిరగాల్సి వస్తోంది. మరో 11 వేల మెట్రిక్ టన్నుల బియ్యం వస్తేనే లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అందనున్నాయి. రంగారెడ్డి జిల్లాలోనూ ఇదే పరిస్థితి రంగారెడ్డి జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గ్రేటర్లోని మూడు జిల్లాల పరిధిలో జీవనోపాధి కోసం వచ్చిన వలస కుటుంబాలు అత్యధికంగా ఉండటంతో పాటు.. సన్నబియ్యం కూడా ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి తరలించాల్సి రావటంతో జాప్యం ఏర్పడింది. దీంతో లబ్ధిదారులు రేషన్ దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోందని సంబంధిత అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కార్డుల సంఖ్యకు అనుగుణంగా రేషన్ దుకాణాలు లేకపోవటం కూడా మరో కారణం. 30తో ముగియనున్న పంపిణీ గడువు స్టాక్ లేదని తిప్పి పంపుతున్న రేషన్ డీలర్లు లబ్ధిదారుల్లో కొనసాగుతున్న ఆందోళన వలస కుటుంబాల పరిస్థితి దయనీయంలబ్ధిదారులందరికీ అందజేస్తాం ఆహార భద్రత కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తాం. పోర్టబిలిటీతో పాటు మూడు నెలలకు సన్నబియ్యం ఒకేసారి ఇస్తుండటంతో జాప్యం ఏర్పడుతోంది. దుకాణాలకు పంపిణీ చేయడంతో పాటు ఈ నెలాఖరు కల్లా లబ్ధిదారులందరికీ సన్నబియ్యం అందేలా చూస్తాం. – శ్రీనివాస్రెడ్డి, డీఎస్ఓ, మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా -
వారి రూటే సెపరేటు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: అనధికార లే అవుట్లలో ఖాళీ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు.. వివాదాస్పద స్థలాలు.. నిషేధిత యూఎల్సీ.. అసైన్డ్ భూముల్లోని ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్లు.. నాలా కన్వర్షన్ చేయని భూముల రిజిస్ట్రేషన్లు కొంత మంది సబ్ రిజిస్ట్రార్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఎలాంటి లింకు డాక్యుమెంట్లు లేని ఖాళీ స్థలాలకు/ లే అవుట్లలో ప్రజా ప్రయోజనాల కోసం వదిలిన పార్కులకు పాతస్టాంప్ పేపర్లపై గుట్టుగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. కొంతమంది డాక్యుమెంట్ రైటర్లను ఏజెంట్లుగా నియమించుకుని ఒక్కో డాక్యుమెంట్పై భూమి విలువ, విస్తీర్ణాన్ని బట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏళ్ల తరబడి ఒకేచోట పని చేస్తుండటం, ఎప్పటికప్పుడు బదిలీలు చేయకపోవడం వీరికి కలిసి వస్తోంది. జిల్లాలో రోజుకు సగటున 650 నుంచి 700 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరుగుతుంటాయి. వీటిలో అత్యధికంగా శేరిలింగంపల్లి, గండిపేట, ఎల్బీనగర్, చంపాపేట్, వనస్థలిపురం, హయత్నగర్, రాజేంద్రనగర్, శంషాబాద్, మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, శంకర్పల్లి, అబ్దుల్లాపూర్మెట్ ఎస్ఆర్ఓ (సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్) సెంటర్లలో రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. ఆయా రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఏళ్లుగా అక్రమార్కులు తిష్టవేశారు. ఒక్కో డాక్యుమెంట్కు ఒక్కో రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారు.ప్రైవేటు వ్యక్తులదే హవాఎస్ఆర్ఓల్లో ప్రభుత్వ ఉద్యోగుల కంటే ప్రైవేటు వ్యక్తుల హవానే ఎక్కువగా కొనసాగుతోంది. డాక్యుమెంటేషన్ మొదలు.. స్కానింగ్ వరకు ప్రతి పనిలో వారే కీలకంగా వ్యవహరిస్తున్నారు. కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (కార్డ్) అమల్లోకి వచ్చిన 1998 నుంచి అన్ని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో రిజిస్ట్రర్డ్ డాక్యుమెంట్లు స్కానింగ్ చేస్తున్నారు. స్కానింగ్ కోసం యంత్రాలు కొనుగోలు చేసిన అధికారులు సిబ్బందిని నియమించలేదు. దీంతో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు బయటి (జిరాక్స్ సెంటర్లు) వ్యక్తులపై ఆధారపడాల్సి వస్తోంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన రెండు మూడు రోజుల్లోనే పత్రాలు సంబంధిత యజమానికి అందజేయాల్సి ఉంది. కానీ స్కానింగ్లో జాప్యంతో వారం పది రోజులు పడుతోంది. అంతేకాదు విలువైన ఆస్తి పత్రాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుండడంతో ఒకే ప్లాటుకు రెండు మూడు డాక్యుమెంట్లు అవుతున్నట్లు తెలుస్తోంది. డాక్యుమెంట్లలో దొర్లిన తప్పులను సరి చేసే (ఎడిట్ ఇండెక్స్) అధికారం స్థానిక ఎస్ఆర్ఓలకు ఉండేది. ఇటీవల ఈ బాధ్యతను జిల్లా ఎస్ఆర్ఓకు అప్పగించారు. చేయి తడపనిదే ఎడిట్ ఇండెక్స్ ఫైళ్లు కదలడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.మచ్చుకు కొన్ని కేసులు● జెడ్పీ రోడ్డు సర్వే నంబర్ 58, సర్వే నంబర్ 60లో వెలసిన లే అవుట్లలో ప్రజావసరాల కోసం వదిలిన ఖాళీ స్థలాలకు ఎల్బీనగర్ ఎస్ఆర్ఓ రిజిస్ట్రేషన్లు చేయడం వివాదాస్పదంగా మారింది. నిజానికి ఏదైనా ప్లాటు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆ భూమికి సంబంధించిన పూర్వాపరాలు పరిశీలించాలి. లింక్ డాక్యుమెంట్లు సరి చూడాలి. ఇక్కడి ఎస్ఆర్ఓ ఇవేవీ పట్టించుకోకుండా రిజిస్ట్రేషన్ చేశారు. ప్రజా వసరాల కోసం వదిలిన ఖాళీ స్థలాన్ని పక్కప్లాటు వ్యక్తి ఆక్రమించుకుని గుట్టుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అంశంపై ఇటీవల ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించడం, సంబంధిత అధికారులపై న్యాయమూర్తి సీరియస్ కావడం చర్చనీయాంశంగా మారింది.● వ్యవసాయ భూమిని వ్యవసాయేతర (నాలా కన్వర్షన్) భూమిగా మార్చేందుకు మార్కెట్ విలువ ప్రకారం 3 శాతం, ఏదైనా నిర్మాణాలు ఉంటే 4.5 శాతం చొప్పున రుసుం చెల్లించాలి. శేరిలింగంపల్లి మండలం నానక్రాంగూడ సర్వే నంబర్ 48లోని ఏడున్నర ఎకరాల భూమి రిజి స్ట్రేషన్ విషయంలో అక్రమాలకు పాల్పడ్డారు. ఈ భూమి విలువ రూ.166.40 కోట్లు ఉన్నట్లు అంచనా. ఈ లెక్కన ఏడున్నర ఎకరాలకు రూ.4.99 కోట్ల వరకు నాలా రుసుం చెల్లించాల్సి ఉంది. నాలా కన్వర్షన్ కాని ఈ భూమిని 37,061 గజాల చొప్పున మార్చి గుట్టుగా రిజిస్ట్రేషన్లు చేశారు. జిల్లా రిజిస్ట్రార్ దీన్ని గుర్తించి అబెయన్స్లో పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రిజిస్ట్రేషన్ చేసేప్పుడు లింకు డాక్యుమెంట్లతో పాటు నాలా, ప్రభుత్వ, ప్రైవేటు, వివాదాస్పద భూములు ఏమైనా ఉన్నాయా అనే అంశాన్ని ధ్రువీకరించుకున్న తర్వాతే రిజిస్ట్రేషన్లు చేయాలి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు సిబ్బంది ఇవేవీ పట్టించుకోలేదు.● ఎల్ఆర్ఎస్కు సంబంధించి ఒక లే అవుట్లో కనీసం పది ప్లాట్లు రిజిస్ట్రర్ అయితే అందులోని మిగిలిన ప్లాట్లను సైతం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించడాన్ని అవకాశంగా తీసుకుని అక్రమాలకు తెరలేపారు. రోజుకు 12 ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్ కాని, వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కేవలం ఆరు రోజుల్లోనే 220 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారు. ఎల్ఆర్ఎస్ కటాఫ్ తేదీ (2020 ఆగస్టు 26) తర్వాత వెలసిన లే అవుట్లలోని ప్లాట్లు కూడా అంతకు ముందు తేదీలు వేసి, 25 శాతం రాయితీతో రిజిస్ట్రేషన్లు చేసి ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో గండి కొట్టారు. డాక్యుమెంట్లు స్కానింగ్ చేయకపోవడంతో అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం బయటికి పొక్కింది.● బాలాపూర్ మండలం అల్మాస్గూడ రెవెన్యూ సర్వే నంబర్ 129,130,131,132లో ప్రజావసరాల కోసం వదిలిన ఖాళీ ప్లాట్లకు చంపాపేట ఎస్ఆర్ఓ గుట్టుగా రిజిస్ట్రేషన్లు చేశారు. మున్సిపల్ టౌన్ప్లానింగ్ అధికారులు నిర్మాణాలకు అనుమతులు జారీ చేశారు. ఎలాంటి లింకు డాక్యుమెంట్లు లేని, కోర్టు వివాదంలో ఉన్న ఈ లే అవుట్లోని ఖాళీ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఎస్ఆర్ఓ, టౌన్ప్లానింగ్ అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినా ఇప్పటి వరకు ఏ ఒక్కరిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. -
ఉత్సాహంగా ‘ఎథ్నిక్ రన్’
శంకర్పల్లి: మండలంలోని పిల్లిగుండ్ల గ్రామంలో ఆదివారం గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ‘ఎథ్నిక్ రన్ –2025’ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద నేరెళ్ల, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గుమ్మడి వెన్నెల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వందలాది మంది మహిళలు సంప్ర దాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శారద నేరెళ్ల మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యం, ప్లాస్టిక్ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేపట్టాలని ఆకాంక్షించారు. గుమ్మడి వెన్నెల మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేస్తూ యువతలో ఆసక్తి పెంపొందించడంలో గండిపేట వెల్ఫేర్ సొసైటీ విజయవంతమైందని అభినందించారు. సొసైటీ జాయింట్ సెక్రెటరీ వాణి మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం తమ సొసైటీ ఏర్పడిందని, అప్పటి నుంచి మహిళల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిర్మూలన అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. ఏడు ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు నడుపుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు స్ఫూర్తి
సమస్యల పరిష్కారానికి కృషి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పోచయ్య అన్నారు. 8లోuకేశంపేట: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ప్రయోగాల వైపు నడిపించి, వారిలో వినూత్న ఆలోచనలకు పదును పెట్టి భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ మే రకు ‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్’ (ఇన్స్పైర్) పేరుతో ఇన్స్పైర్ మనక్ పురస్కారాలను అందిస్తోంది. ఆన్లైన్ ద్వారా 2025–26 విద్యా సంవత్సరానికి నామినేషన్లు స్వీకరిస్తోంది. ఎవరు అర్హులంటే.. 10 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 6 నుంచి 10వ తరగతి చదివే ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవకాశం. ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల, మోడల్ స్కూల్స్, కేజీబీవీ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు అర్హులు. వీరు పాఠశాలలోని సైన్స్ ఉపాధ్యాయుడి గైడ్లైన్స్ పాటిస్తూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే విధానం ● ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ● www.inspireawards-dst.gov.in వెబ్సైట్లోకి వెళ్లి న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ● పాఠశాలకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకొని, సేవ్ చేసుకోవాలి. ఈ దరఖాస్తు జిల్లా అథారిటీకి వెళ్తుంది. ● వీరు ఆమోదిస్తే విద్యార్థికి సంబంధించి పొందుపర్చిన మెయిల్ ఐడీకి యూజర్ ఐడీతో కూడిన లింక్ వస్తుంది. ● అప్పుడు విద్యార్థులు యూజర్ ఐడీకి పాస్వర్డ్ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ● విద్యార్థి తన సమాచారంతో పాటు బ్యాంక్ అకౌంట్ నంబర్, ఆధార్ నంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది. ● విద్యార్థి ప్రదర్శించాలనుకున్న ప్రాజెక్టును సంక్షిప్తంగా వెబ్సైట్లో నమోదు చేయాలి. ● ఎంపికై న ప్రాజెక్టు ప్రయోగ నిమిత్తం విద్యార్థి బ్యాంక్ ఖాతాకు రూ.పదివేలు జమ చేస్తారు. ● రాష్ట్ర స్థాయికి ప్రాజెక్టు ఎంపికై తే రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అందిస్తారు. ● ఆన్లైన్లో ఉచితంగా విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఎప్పటిలోగా అంటే.. విద్యార్థులు తమ పేర్లను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 15 వరకు కేంద్ర ప్రభుత్వం గడువు విధించింది. విద్యార్థులు తాము చదువుతున్న పాఠశాలల్లో సైన్స్ ఉపాధ్యాయులతో కలిసి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. గత విద్యా సంవత్సరం.. 2024–25 విద్యా సంవత్సరంలో జిల్లా స్థాయికి 1,881 నామినేషన్లు ఎంపికయ్యాయి. వీటి నుంచి ఉత్తమ ప్రతిభ కనబర్చిన 198 నామినేషన్లు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. వీటి నుంచి నాలుగు జాతీయ స్థాయికి వెళ్లాయి. ఈ విద్యా సంవత్సరం జాతీయ స్థాయిలో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటే విధంగా సైన్స్ ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్లో అతిథ్యం.. స్వయానా రాష్ట్రపతితో అభినందనలు.. కేంద్ర మంత్రులతో ప్రశంసలు.. దిగ్గజ శాస్త్రవేత్తలతో సమాలోచనలు.. ఇలాంటి అరుదైన అవకాశం వస్తుందంటే ఎవరు మాత్రం కాదంటారు.. కానీ అందుకోసం విద్యార్థులు కాస్త కష్టపడాల్సి ఉంటుంది. తమ తెలివికి పదును పెట్టాలి. జాతీయ స్థాయిలో ‘ఇన్స్పైర్ మనక్’ స్టూడెంట్స్ ఆవిష్కరణలకు ఆహ్వానం ప్రతిభ చూపినవారికి నగదు పురస్కారాలు ఆన్లైన్ ద్వారా సెస్టెంబర్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ సద్వినియోగం చేసుకోవాలి విద్యార్థులు తమలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇన్స్పైర్ ఎంతగానో దోహదపడుతుంది. ఉపాధ్యా యుల సహకారంతో పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటాలి. ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులు పోటీల్లో పాల్గొనేలా సైన్స్ ఉపాధ్యాయులు కృషి చేయాలి. – వై.శ్రీనివాసరావు, జిల్లా సైన్స్ అధికారి -
అసెంబ్లీ ఎదుట భారీ వాహనంలో మంటలు
నాంపల్లి: అసెంబ్లీ సమీపంలో ఓ భారీ వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఊహించని విధంగా వాహనంలో ఎగిసిపడటంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. మంటలు అంటుకున్న సమయంలో వాహనంలోని డ్రైవరుతో పాటు మరొకరు క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆదివారం మధ్యా హ్నం అసెంబ్లీ ఉస్మానియా గేటు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వాహనం రోడ్డుపైనే పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఫలితంగా కొంతసేపు నాంపల్లి నుంచి లక్డీకాపూల్ వెళ్లే దారిలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. -
సామాన్యులను విస్మరిస్తున్న కేంద్రం
కందుకూరు: నరేంద్రమోదీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చుపెడుతోందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కోట రమేష్, జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య విమర్శించారు. మండల పరిధిలోని నేదునూరు గేట్ వద్ద ఉన్న ఓ ఫామ్ హౌస్లో ఆదివారం పార్టీ కార్యదర్శివర్గ సభ్యుడు డి.రాంచందర్, మండల కార్యదర్శి బుట్టి బాల్రాజ్ ఆధ్వర్యంలో కందుకూరు, మహేశ్వరం, తలకొండపల్లి, ఆమనగల్లు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలకు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కోట రమేష్, పగడాల యాదయ్య మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ సామాన్య ప్రజలను విస్మరిస్తోందనిపేర్కొన్నారు. రైల్వే, విమానయానం, ఎల్ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం బాధాకరమన్నారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపుని చ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సెక్రటరీ సభ్యురాలు కవిత, ఆమనగల్లు, మహేశ్వరం పార్టీ కార్యదర్శులు శివశంకర్, ఏర్పుల శేఖర్, సీఐటీయూ నాయకులు గుమ్మడి కుర్మయ్య, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కోట రమేష్ -
ఘనంగా ప్లేస్మెంట్ అచీవర్స్ డే
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం శేరిగూడలోని శ్రీదత్త విద్యా సంస్థల్లో శనివారం ప్లేస్మెంట్ అచీవర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. 2024– 25 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత పొంది, క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను సత్కరించారు. విద్యా సంస్థల చైర్మన్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ.. నాణ్యమైన సాంకేతిక విద్యతో పాటు అత్యాధునిక టెక్నాలజీలో శిక్షణ ఇస్తూ గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులకు వందశాతం ప్లేస్మెంట్ కల్పిస్తున్నామని తెలిపారు. 46 మల్టీ నేషనల్ కంపెనీల్లో శిక్షణ ఇప్పిస్తూ పాటు వందశాతం ఉపాధి కల్పించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అకాడమిక్స్ డీన్ వెంకట అచ్యుతరావు, ప్రిన్సిపాల్ సెంథిల్కుమార్, డాక్టర్ మదుసూధన్రెడ్డి, టీపీఓ డాక్టర్ మయూరి, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. -
పంచాయతీలకు కొత్త భవనాలు
యాచారం: ఈజీఎస్ పథకం నుంచి రూ.20 లక్షల చొప్పున నందివనపర్తి, మంతన్గౌరెల్లి గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. ఏళ్ల క్రితం నిర్మించిన శిథిల భవనాల్లోనే ఇబ్బందుల నడుమ ప్రజాప్రతినిధులు, అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. వర్షాలకు నీరంతా గదుల్లోకి చేరి విలువైన రికార్డులు తడిసిపోయేవి. తాజాగా పంచాయతీ భవన నిర్మాణాలకు నిధులు మంజూరవడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంతన్గౌరెల్లిలో భవన నిర్మాణ పనులు జోరందుకున్నాయి. నందివనపర్తిలో పనులు ప్రారంభించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు తాడిపర్తి, చౌదర్పల్లి, తమ్మలోనిగూడ, ధర్మన్నగూడ, కేసీతండా, తక్కళ్లపల్లి తండా, అయ్యవారిగూడెం గ్రామాల్లోనూ నూతన పంచాయతీ భవనాల నిర్మాణాల కోసం ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపించారు. తాడిపర్తి, చౌదర్పల్లి, తమ్మలోనిగూడ గ్రామాల్లో ఏళ్ల కింద నిర్మించిన భవనాలుండగా కేసీతండా, ధర్మన్నగూడెం, అయ్యవారిగూడెం, తక్కళ్లపల్లి తండాలు కొత్తగా గ్రామ పంచాయతీలుగా అప్గ్రేడ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ నాలుగు గ్రామాల్లో ప్రభుత్వ భవనాల్లోనే పాలన కొనసాగుతుండగా, శాశ్వత భవన నిర్మాణాల కోసం నిధుల మంజూరుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. నిధులు మంజూరైతే కొత్త పంచాయతీలకు సైతం శాశ్వత భవనాలు ఉంటాయని మండల పంచాయతీ అధికారి శ్రీలత తెలిపారు. నందివనపర్తి, మంతన్గౌరెల్లి గ్రామాలకు ఈజీఎస్ నుంచి రూ.20 లక్షల చొప్పున నిధులు మరో ఏడు గ్రామాలకు ప్రతిపాదనలు త్వరలో ప్రారంభిస్తాం నందివనపర్తిలో ఏళ్ల కింద నిర్మించిన ఇరుకై న గదిలోనే పాలన కొనసాగిస్తున్నాం. సమావేశాల సమయంలో ఇబ్బంది అవుతుంది. పంచాయతీ, రెవెన్యూ, వైద్య, ఇతర సిబ్బంది వచ్చినప్పుడు కష్టంగా విధులు నిర్వర్తిస్తున్నాం. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. – ఈర్లపల్లి శ్రీనువాస్, పంచాయతీ కార్యదర్శి, నందివనపర్తి -
విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు
షాద్నగర్: ఉపాధ్యాయులు విధి నిర్వాహణలో నిర్లక్ష్యం వహించడం తగదని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు వడ్ల శ్రీకాంత్ అన్నారు. శనివారం ఆయన పట్టణంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉపాధ్యాయులు వారికి నాణ్యమైన విద్యను అందిస్తూ వారి భవిష్యత్కు బంగారు బాటలు వేయాలన్నారు. వారితో పనులు చేయించడం సరికాదన్నారు. ఇటీవల నేరేళ్లపల్లి పాఠశాలలో విద్యార్థులతో మూత్రశాలలు కడిగించడం, పాటిగడ్డలో ఉపాధ్యాయులు విధులకు సెలవు పెట్టి సొంత పనులకు వెళ్లడం వెళ్ళడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతారన్నారు. అటువంటి ఉపాధ్యాయులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు శివశంకర్, ఆదిల్, తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ -
వీఎంహోంలో అంతర్జాతీయ యోగా వేడుకలు
హుడాకాంప్లెక్స్: శరీరం, మనస్సు, ఆత్మను ఏకం చేసే విధానమే యోగా అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. శనివారం సరూర్నగర్లోని విక్టోరియా మెమోరియల్ హోం మైదానంలో స్థానిక కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా వేడుకలకు ఎంపీతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెల శ్రీరాములు యాదవ్ హాజరయ్యారు. యోగా గురువులు ఆసనాలు, ప్రాణాయామం, సూర్యనమస్కారాలు చేయించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రశాంతంగా జీవించాలంటే యోగా అవసరమన్నారు. యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని, ప్రాచీన ఆధ్యాత్మిక పతంజలి యోగాను నిత్యం అభ్యసించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సుజీత, ఇన్స్పెక్టర్లు సైదిరెడ్డి, వినోద్కుమార్, వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
డెకరేషన్ గోడౌన్లో అగ్నిప్రమాదం
పహాడీషరీఫ్: డెకరేషన్ గోడౌన్లో అగ్నిప్రమాదం సంభవించిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. వాదే ముస్తఫా బస్తీలో వివాహాదిశుభకార్యాలకు వినియోగించే డెకరేషన్ సామగ్రి గోడౌన్ ఉంది. శనివారం సాయంత్రం పక్కనే ఉన్న చెత్తకుప్పకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో గోడౌన్కు మంటలు వ్యాపించాయి. డెకరేషన్ సామగ్రిలో ప్లాస్టిక్, ఫైబర్ ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. జనావాసాల నడుమ ఉన్న ఈ గోడౌన్ నుంచి మంటలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
కులంపేరిట దూషించిన వారిపై చర్యలకు డిమాండ్
నందిగామ: తనను కులం పేరుతో దూషించిన వ్యక్తులపై నందిగామ ఠాణాలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల పరిధిలోని మోత్కులగూడ గ్రామానికి చెందిన వానరాసి నర్సింలు శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ను ఆశ్రయించాడు. ఈ మేరకు ఫిర్యాదు కాపీలను స్థానిక విలేకరులకు అందజేశాడు. ఈ నెల 4న గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ప్లాటు విషయమై అధికారులతో మాట్లాడుతున్న సమయంలో గ్రామానికి చెందిన జెట్ట శంకరయ్య, జెట్ట రవి, జెట్ట హరీశ్ తనను గ్రామస్తుల సమక్షంలోనే కులం పేరుతో దూషించి, అవమానపరిచి, బెదిరించారని, ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు వారిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కొన్ని రోజులుగా తనను, తన కుటుంబ సభ్యులను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్న శంకరయ్య, రవి, హరీశ్లపై విచారణ జరిపి ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ను ఆశ్రయించిన బాధితుడు -
విద్యార్థి అదృశ్యం
చేవెళ్ల: ఇంటి నుంచి బయటకు వెళ్లిన విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన శనివారం పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపిన ప్రకారం.. పట్టణ కేంద్రంలోని సాయినగర్ కాలనీకి చెందిన మెకానిక్గా రాము కుమారుడు జశ్వంత్(18) ఆదర్శ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. ఇంట్లో నుంచి వెళ్లిన జశ్వంత్ సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేశారు. స్విచ్ఛాఫ్ రావడంతో స్నేహితులు, బంధువుల వద్దవెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
9999 @ రూ.5.50 లక్షలు
షాద్నగర్ః ఫ్యాన్సీ నంబర్లపై వాహన యజమానుల్లో ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. తమకు ఇష్టమైన, కలిసొచ్చే నంబర్లను దక్కించుకోవడానికి ఎంత చెల్లించడానికై నా వెనుకంజ వేయడం లేదు. షాద్నగర్లోని రవాణా కార్యాలయంలో శనివారం జరిగిన వేలంలో టీజీ 07బీ 9999 నంబర్ ఏకంగా రూ.5.50 లక్షలు పలికింది. కంసాన్పల్లికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ బసిరెడ్డి పద్మ నరేందర్రెడ్డి తన ఓల్వో కారుకు ఈ నంబర్ను వేలంలో దక్కించుకున్నాడు. న్యాయపరిపాలనలో శిక్షణకు ఆహ్వానం ఇబ్రహీంపట్నం రూరల్: న్యాయ పరిపాలనలో శిక్షణకు రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల నుంచి షెడ్యూల్డ్ కులాలకు చెందిన లా గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రామారావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025–26 సంవత్సరానికి గాను సెంట్రల్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్చే గుర్తించిన ఇన్స్టిటూషన్స్, సెంట్రల్ యాక్ట్, ప్రొవిజనల్ యాక్ట్ లేదా ఇన్ కార్పొరేషన్ చేసిన లేదా స్థాపించబడిన దేశంలోని ఏదేని యూనివర్సిటీ నుంచి ఏదేని ఫ్యాకల్టీలో బేసిక్ డిగ్రీ, లా డిగ్రీ పొందిన వారు అర్హులని తెలిపారు. వార్షికాదాయం రూ.2 లక్షలు మించొద్దని, అభ్యర్థి గత సంవత్సరంలో ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని ఉండకూడదని చెప్పారు. ఎంపికై న అభ్యర్థులు న్యాయ పరిపాలనలో మూడేళ్ల వ్యవధికి శిక్షణ పొందాల్సి ఉంటుందన్నారు. నెలకు రూ.3వేలు స్టయిఫండ్, మొదటి సంవత్సరం లా పుస్తకాలు, ఫర్నిచర్ కొనుగోలు నిమిత్తం రూ.50 వేలు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. ఎంపికై న అభ్యర్థులు జిల్లా కోర్టులు, మొబైల్ కోర్టులు, సెషన్ కోర్టు, డివిజన్ స్థాయి, తాలుకా స్థాయి కోర్టుల్లో గవర్నమెంట్ ప్లీడర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వద్ద శిక్షణ పొందాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 30న ఒరిజినల్ సర్టిఫికెట్లతో రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో హాజరుకావాలని ఆయన సూచించారు. గౌడ సంఘం జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలిగా అనురాధ హయత్నగర్: అఖిల భారత గౌడ సంఘం జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలిగా అబ్దుల్లాపూర్మెట్ మండలం కుంట్లూర్కు చెందిన మాడుగుల అనురాధ నియమితులయ్యారు. చింతల్కుంటలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూరెళ్ల వేములయ్యగౌడ్ చేతుల మీదుగా ఆమె నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ.. గౌడ విద్యార్థులు, మహిళలు సామాజికంగా ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లేషంగౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దగోని నాగేష్గౌడ్, ఉపాధ్యక్షుడు బోయిపల్లి శేఖర్గౌడ్, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ రజిత, జిల్లా ఉపాధ్యక్షుడు పండాల దశరథగౌడ్, కార్యదర్శి గోపగాని వెంకటేశ్గౌడ్ పాల్గొన్నారు. భూ బాధితులకు సుంకాల నుంచి మినహాయింపు మహేశ్వరం: మండల పరిధిలోని రావిర్యాల ఫ్యాబ్సిటీ (ఈ–సిటీ)లో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఇచ్చే ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం 222 మంది రైతులకు స్టాంపు, రిజిస్ట్రేషన్, సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చింది. టీజీఐఐసీ అధికారులు హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం హౌసింగ్ లేఅవుట్ అభివృద్ధి పర్చి అందులో అన్ని వసతులతో ప్లాట్లు ఇవ్వనున్నారు. ప్రభుత్వం పరిహారంగా ఇచ్చే ప్లాట్లకు స్టాంపు, రిజిస్ట్రేషన్, ఇతర సుంకాల నుంచి రూ.3,72,91,500 మినహాయింపు ఇచ్చినట్లు కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, టీజీఐఐసీ శంషాబాద్ జోనల్ మేనేజర్ శ్రవణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. చదరపు గజానికి రూ.2,800 స్టాంపు, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇచ్చారు. ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి అనంతగిరి: హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్లో 2025 – 26 సంవత్సరానికి సివిల్స్, ప్రిలిమ్స్, మెయిన్స్లో ఉచిత శిక్షణ కోసం అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ అధికారి కమలాకర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 7వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. -
మైనార్టీల అభివృద్ధికి కృషి
మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ చేవెళ్ల: మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో శనివారం ఇందరిమ్మ మైనార్టీ మహిళా శక్తి పథకం, రేవంత్అన్న భరోసా పథకం ద్వారా నియోజకవర్గంలోని 205 మంది మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సహకారంతో మైనార్టీ కార్పొరేషన్ ద్వారా యువత, మహిళలకు రుణాలు అందించే వెసులుబాటు కల్పి స్తామని తెలిపారు. మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు సత్యనారాయణరెడ్డి, టీపీసీసీ నాయకుడు జనార్దన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు డి.వెంకట్రెడ్డి, ప్రతాప్రెడ్డి, నాయకులు దర్శన్, గోపాల్రెడ్డి, శ్రీకాంత్, కృష్ణారెడ్డి, వీరేందర్రెడ్డి, ఆయా మండలాలకు చెందిన మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
పేదల ఇళ్లు కూల్చేయొద్దు
పహాడీషరీఫ్: దశాబ్దాలుగా నివాసం ఉంటూ ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్న పేదల ఇళ్లను కూల్చే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి డిమాండ్ చేశారు. జల్పల్లి మున్సిపల్ పరిధి ఎర్రకుంట సమీపంలోని షాహిన్నగర్ మర్కజ్, క్యూబా కాలనీవాసులతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానికులు తమ గోడు వెల్లబోసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రూపాయి రూపాయి కూడబెట్టుకుని కష్టపడి ఇళ్లు కట్టుకొని 15–20 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న వారిని ఇబ్బంది పెట్టడం సరైంది కాదన్నారు. దాదాపు 400 ఇళ్లను ఎఫ్టీఎల్లో ఉన్నాయంటూ కూల్చేందుకు మార్కింగ్ చేయడం తగదన్నారు. ప్రభుత్వం ఒక స్పష్టత అంటూ లేకుండా పాలన సాగిస్తోందని విమర్శించారు. పట్టణ ప్రాంత చెరువులు, గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులను వేర్వేరుగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. హైడ్రా పేరుతో ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. వీధి వ్యాపారులను సైతం రోడ్డున పడేస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి.వెంకట్రాం, మాజీ చైర్మన్ అబ్దుల్లా సాది, స్థానిక బీఆర్ఎస్ నాయకులు బదర్ అలీ, హుస్సేనీ, సూరెడ్డి కృష్ణారెడ్డి, షర్ఫుద్దీన్ హామెద్, అలీ మన్సూరీ, పల్లపు శంకర్, హసన్ షా, దస్తగిర్, బర్కత్ అలీ తదితరులు పాల్గొన్నారు. నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి -
అర్జీల వెల్లువ
భూ భారతి సదస్సులకు బాధితుల క్యూ ● జిల్లా వ్యాప్తంగా 21,200 దరఖాస్తులు రాక ● ఆన్లైన్ ద్వారా ఇప్పటికే 17 వేలకుపైగా పెండింగ్ ● తీవ్ర పని ఒత్తిడిలో రెవెన్యూ యంత్రాంగం ● మాడ్యుల్స్ వారీగా వివరాలు నమోదు చేస్తున్న అధికారులుసాక్షి, రంగారెడ్డిజిల్లా: ఏళ్ల తరబడి అపరిష్కృతంగా మిగిలి ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిస్కారం చూపే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈనెల 3 నుంచి గ్రామాల వారీగా భూ భారతి సదస్సులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లు బృందాలుగా విడిపోయి గ్రామాలకు చేరుకుని బాధితుల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరిస్తుండడం విధితమే. 27 మండలాల్లో 613 రెవెన్యూ సదస్సులు నిర్వహించి, భూ బాధితుల నుంచి 21,200 దరఖాస్తులు స్వీకరించారు. అత్యధిక దరఖాస్తులు అందిన మండలాల జాబితాలో మంచాల (2,459) ముందు వరుసలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో యాచారం (1,867), కందుకూరు (1,863) ఉన్నాయి. అత్యల్ప అర్జీలు అందిన మండలాల జాబితాలో సరూర్నగర్ (0), హయత్నగర్ (3), రాజేంద్రనగర్ (7) నిలిచాయి. ఇప్పటికే 17 వేల మందికిపైగా బాధితులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఆయా దరఖాస్తులన్నీ కలెక్టర్, అదనపు కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, తహసీల్దార్ల వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఇవి కాకుండా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో మరో 60 అర్జీల వరకు వచ్చి చేరుతున్నాయి. రోజుకు సగటున 150 దరఖాస్తులను ఆమోదించడమో/ తిరస్కరించడమో చేస్తున్నారు. కొత్తగా అదే స్థాయిలో వచ్చి చేరుతున్నాయి. తాజాగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో మరికొన్ని దరఖాస్తులు రావడం గమనార్హం. ఇప్పటికే పెండింగ్లో ఉన్న వాటితో పాటు కొత్తగా వచ్చి చేరిన అర్జీల పరిష్కారం రెవెన్యూ అధికారుకుల తలకుమించిన భారంగా మారుతోంది. ఆయా మండలాల్లో ఇదీ పరిస్థితి ● పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసిన కొందుర్గు మండలం నుంచి 573 అర్జీలు స్వీకరించారు. ● యాచారం మండలం మంతన్గౌరెల్లి, కొత్తపల్లి, తక్కళ్లపల్లి, యాచారం, చింతపట్ల, మాల్, నల్లవెల్లి, నస్దిక్సింగారం గ్రామాల్లోనే ఎక్కువ భూ సమస్యలు ఉన్నట్లు తేలింది. కందుకూరులో మిస్సింగ్ సర్వే నంబర్లు సరి చేయడం కోసం 583, పెండింగ్ మ్యూటేషన్లు 172, డీఎస్ పెండింగ్ 101, విస్తీర్ణం సరిచేయడం కోసం 266, భూమి స్వభావానికి సంబంధించి 22, పట్టాదారు పేరు సరిచేయడం 77, నిషేధిత జాబితా నుంచి తొలగించాలని 253, ఓఆర్సీ కోసం 338, ఈ సర్టిఫికెట్ కోసం 1, సక్సేషన్ కోసం 213, ఇతర సమస్యల పరిష్కారం కోసం 172 దరఖాస్తులు అందాయి. ● కడ్తాల్ మండలంలో మిస్సింగ్ సర్వే నంబర్లు 270, పెండింగ్ మ్యూటేషన్ 65, విస్తీర్ణం తగ్గుదల 178, భూమి స్వరూపం మార్పు 62, నిషేధిత జాబితా నుంచి తొలగింపు కోసం 85, వారసత్వ పట్టా అమలు కోసం 38, కొత్త పాసుబుక్ల కోసం74, పేర్ల నమోదులో దొర్లిన తప్పులను సరి చేయడం, ఆధార్ నమోదు, కులం తప్పుగా నమోదుకు సంబంధించి 65, ఇతర దరఖాస్తులు 74 వరకు ఉన్నాయి. ● ఇబ్రహీంపట్నంలో 1,185 అర్జీలు అందగా, వీటిలో ఆరు సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలినవి ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉండిపోయాయి. ● కేశంపేటలో మిస్సింగ్ సర్వేనంబర్ 165, మ్యూటేషన్ పెండింగ్ 6, డీఎస్ పెండింగ్ 30, ల్యాండ్ విస్తీర్ణం 44, భూమి స్వభావం 12, భూ యజమాని వివరాలు 10, నిషేధిత జాబితా 46, అసైన్డ్ల్యాండ్ 3, విరాసత్ 9 దరఖాస్తులు ఉన్నాయి. ● చేవెళ్లలో సర్వేనంబర్కు సంబంధించి 542, పెండింగ్ మ్యూటేషన్, కోర్టు ఆర్డర్కు సంబంధించి 48, డీఎస్ పెండింగ్ 153 అర్జీలు రాగా, ఎక్స్టెంట్ కరెక్షన్కు సంబంధించినవి 37, పేర్లు తప్పులు, మిస్సింగ్ 74, నిషేధిత జాబితా 57, అసైన్డ్ భూమికి సంబంధించి 1, ఓఆర్సీపై 4, సక్సేషన్ 39, ఆక్రమణలకు సంబంధించి 9, ఇతర సమస్యలపై 24 ఫిర్యాదులు అందాయి. ● మొయినాబాద్ మండలంలో 377 మిస్సింగ్ సర్వే నంబర్లు, 46 డీఎస్ పెండింగ్, 56 ఎక్స్టెంట్ కరెక్షన్, 76 భూ స్వభావం, 16 పట్టాదారు పేర్లలో తప్పులు, 107 నిషేధిత జాబితా, 112 సక్సేషన్, 121 ఇతర సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయి. పరిష్కారం దొరుకుతుంది గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాం. వచ్చిన అర్జీలను స్వీకరించాం. ఎప్పటికప్పుడు నమోదు చేసుకున్నాం. ఆయా సమస్యలను బట్టి సమయానుకూలంగా నోటీసులు ఇచ్చి భూ భారతిలో పరిష్కరించే విధంగా చూస్తాం. – కృష్ణయ్య, తహసీల్దార్, చేవెళ్ల -
భూ రికార్డులు మార్చేలా చూడండి
ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరామ్కు రైతుల వినతి యాచారం: ఫార్మాసిటీకి భూములు ఇవ్వని రైతుల భూ రికార్డులను తిరిగి రైతుల పేర్లపై నమోదు చేసేలా కృషి చేయాలని తాడిపర్తి గ్రామ రైతులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్కు విన్నవించారు. నగరంలో శనివారం ఆయనను కలిసిన వారు ఫార్మాసిటీ భూసేకరణ చట్ట వ్యతిరేకంగా జరిగిందని, అవార్డులు అన్నీ రద్దు చేయాలని, టీజీఐఐసీ పేరు మీదున్న భూ రికార్డులను రైతుల పేర్లపై నమోదు చేయాలని హైకోర్టు స్పష్టంగా ఉత్తర్వులిచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. చట్ట విరుద్ధంగా ఫార్మాసిటీకి సేకరించిన భూములకు బలవంతంగా ఫెన్సింగ్ వేసి తమను వెళ్లకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీజీఐఐసీ పేరు మీద మార్చేసిన 2,211 ఎకరాల పట్టా భూమికి మరోచోట భూమి చూపించేలా సర్కార్పై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తాడిపర్తి మాజీ సర్పంచ్ దూస రమేశ్, టీజీఎస్ రాష్ట్ర నాయకులు దార సత్యం, సామ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
హ్యాట్సాఫ్ లేడీ పోలీస్
మీర్పేట: భార్యాభర్తలిద్దరూ తమ రెండేళ్ల కొడుకును తీసుకుని పరీక్ష రాసేందుకు సెంటర్కు చేరుకున్నారు. చిన్నారిని ఎవరి వద్ద ఉంచాలో తెలియక తికమకపడుతున్న సమయంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుళ్లు పరీక్ష పూర్తయ్యే వరకూ గంటపాటు చిన్నారిని ఆడించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మీర్పేటలోని టీకేఆర్ కళాశాలలో శనివారం తెలంగాణ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ పరీక్ష నిర్వహించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తమ చిన్నారిని తీసుకుని సెంటర్కు చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు సమయం అవుతుండటంతో టెన్షన్ పడుతూ కనిపించారు. ఈ విషయమై ఆరా తీసిన మీర్పేట్ పీఎస్ హోంగార్డు కళ్యాణి, కానిస్టేబుళ్లు దుర్గ, కవిత చిన్నారిని తాము చూసుకుంటామని, పరీక్ష బాగా రాసి రావాలని సూచించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు (పరీక్ష పూర్తయ్యే వరకూ) చిన్నారిని లాలించారు. ఇది చూసిన పలువురు అభ్యర్థులు పోలీసుల మానవత్వాన్ని అభినందించారు. -
పాడిపరిశ్రమతో మంచి లాభాలు
షాబాద్: వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకుంటే మంచి లాభాలు వస్తాయని డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అధికారి డా.కె కిషన్ కుమార్, రిటైర్డ్ ప్రొఫెసర్ కొండల్రెడ్డి, సేవాస్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ రత్నాకర్ పేర్కొన్నారు. మండల పరిధిలోని మల్లారెడ్డిగూడలో శనివారం శాసీ్త్రయ పద్ధతుల ద్వారా డెయిరీ, పాల ఉత్పత్తుల విలువల అభివృద్ధిపై రైతులకు ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శాసీ్త్రయ పద్ధతులు, ప్రభుత్వ పథకాల వినియోగం, వ్యాపార నైపుణ్యాల సాధన ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. పశుపోషణ, ఆవుల గదుల నిర్మాణం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే విధానాల వంటి అంశాలను వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో సులభంగా చేయగల మజ్జిగ, నెయ్యి, క్రీమ్ తయారీపై డెమో ఇచ్చారు. అనంతరం కోవా, కలాకండ్, పనీర్ చన్నా, రసగుల్లా, రసమలై, బాసుంది, మజ్జిగ, లస్సీ, ఫ్లేవర్డ్ మిల్క్, వే డ్రింక్స్ వంటి విలువ ఆధారిత పాల ఉత్పత్తుల తయారీపై వర్క్షాప్ నిర్వహించారు. డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి పశు ఆరోగ్య సంరక్షణ గురించి వివరించారు. కార్యక్రమంలో పాడి రైతులు పాల్గొన్నారు. -
నీటిని తరలిస్తున్న ట్యాంకర్ల సీజ్
శంకర్పల్లి: పంట పొలాల వద్ద బోర్ల నుంచి అక్రమంగా నీటిని నింపి ఇతర అవసరాలకు తరలిస్తున్న లారీలను శుక్రవారం రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. శంకర్పల్లి తహసీల్దార్ సురేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని జన్వాడలో కొంత మంది వ్యక్తులు వ్యవసాయ బోర్ల నుంచి వ్యవసాయేతర అవసరాల నిమిత్తం నీటిని ట్యాంకర్ల ద్వారా వాడుతున్నట్లు పక్కా సమాచారం అందింది. దీంతో ఆర్ఐ తేజ, ఇతర సిబ్బంది కలిసి జన్వాడ గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ నీటిని నింపుకొంటున్న 6 ట్యాంకర్లను గుర్తించారు. ఆ వ్యవసాయ భూములకు సంబంఽధించిన విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. నీటిని నిల్వ చేసేందుకు తవ్వించిన గుంతలను జేసీబీ సాయంతో కూల్చివేయించారు. అనంతరం సీజ్ చేసిన లారీలను మోకిల పోలీసులకు అప్పగించినట్లు తహసీల్దార్ తెలిపారు. -
అదృశ్యమైన చిన్నారులు క్షేమం
శంకర్పల్లి: ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఇద్దరు చిన్నారుల కథ చివరికి సుఖాంతం అయింది. శంకర్పల్లి సీఐ శ్రీనివాస్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం సేడం తాలుకాలోని మోత్కుపల్లి గ్రామానికి చెందిన సంతోష్కుమార్, నాగమ్మలు దంపతులు. వీరు కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బంగ్లగడ్డకి వచ్చారు. అప్పటి నుంచి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే వీరికి రేణుక(13), సంతోష్(8) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాఠశాలలకు సెలవులు రావడంతో సొంతూరికి వెళ్లిన పిల్లలిద్దరూ ఇటీవల శంకర్పల్లికి వచ్చారు. ఇంట్లో ఇతర విషయాలపై తల్లి మందలించడంతో చిన్నారులిద్దరూ కలిసి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయారు. తల్లిదండ్రులు పీఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేశారు. చివరికి చిన్నారులు ఇద్దరూ వారి సొంత ఊరిలో తన చిన్నాన్న ఇంటికి చేరుకున్నట్లు గుర్తించారు. చిన్నారులు కనిపించకకుండా పోయారనే వార్తతో శుక్రవారం శంకర్పల్లి అంతా అలజడి వాతావరణం నెలకొంది. -
కామాంధుడికి రిమాండ్
యాచారం: మద్యం మత్తులో తొంభై ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడిని పట్టుకున్న పోలీసులు, అతన్ని న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు. సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలో ఈనెల 11న అర్ధరాత్రి ఓ తొంభై ఏళ్ల వృద్ధురాలిపై లైంగికదాడి జరిగిన విషయం విదితమే. ఈ కేసులో 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వీరిని పలుమార్లు విచారించారు. ఈ సమయంలో గమనించిన విషయాలతో పాటు, బాధితురాలు తెలిపిన వివరాల ఆధారంగా గ్యార శివ(23) ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. శుక్రవారం అతన్ని అదుపులోకి తీసుకుని, తమదైన శైలిలో విచారించగా నిజం అంగీకరించాడు. మద్యం మత్తులో తానే ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్లు వెల్లడించారు. నగరంలో ప్రైవేటు ఉద్యోగం చేసే శివ తరచూ గ్రామానికి వచ్చి వెళ్తుంటాడు. ఇతనిపై గతంలోనూ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. -
నిబంధనలొద్దు!
నిధులే ముద్దు.. ‘రోడ్ సేఫ్టీ’ లేకుండా జీహెచ్ఎంసీ ఇంజినీర్ల నిర్లక్ష్యం సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఇంజినీర్లకు కాంట్రాక్టర్లతో కలిసి రోడ్లు వేయకుండానే బిల్లులు కాజేయడం తెలుసు. ఎక్కడా లేని నిబంధనలతో కావాల్సిన వారికే టెండర్లు కట్టపెట్టడమూ తెలుసు. నాణ్యత లేమితో తూతూమంత్రంగా పనులు చేయడమూ తెలుసు. ఎటొచ్చీ జేబులు నింపుకొనేందుకు చూపిస్తున్న శ్రద్ధ ప్రజలకు ప్రమాదాలు జరగకుండా ఉండటంపై చూపడం లేదు. నాసిరకం రోడ్లే కాదు.. రోడ్డు ప్రయాణాలు చేసేవారికి చూపాల్సిన మార్గదర్శకాలు పట్టించుకుంటే ఒట్టు. చివరకు సైనేజీలపైనా శీతకన్నే. సైనేజీలు, లేన్మార్కింగ్లు, అడ్డగోలు రంబుల్స్ట్రిప్స్ వల్ల ప్రజలకు ఎలా ప్రమాదాలకు ఆస్కారం ఉందో నగరంలో వాహనాల మొబిలిటీ ఎందుకు తగ్గుతుందో జీహెచ్ఎంసీలోని మరో విభాగమే క్షేత్రస్థాయిలో సర్వే చేసి లోపాలు తెలియజేయడం విశేషం. అంతేకాదు, రోడ్సేఫ్టీ చర్యల్లో భాగంగా.. రహదారుల ప్రమాణాలకు సంబంధించి దేశంలోనే అత్యున్నత సంస్థలైన ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ), మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ (మోర్త్) ప్రమాణాలకనుగుణంగా ఎలా ఉండాలో సూచిస్తూ జీహెచ్ఎంసీ ట్రాఫిక్ విభాగం రూపొందించిన స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను జీహెచ్ఎంసీ ఇంజినీర్లు తప్పనిసరిగా పాటించాల్సిందిగా కమిషనర్ ఆదేశించారు. క్షేత్రస్థాయి సర్వే నివేదిక మేరకు .. రోడ్ మార్కింగ్లు వేస్తున్నామా అంటే వేస్తున్నాం. స్పష్టంగా కనిపించడం లేదు. చార్మినార్ నుంచి బంజారాహిల్స్, హైటెక్ సిటీ దాకా అదే దుస్థితి. రద్దీప్రాంతాల్లో పాదచారులకుకానీ, పాఠశాలల వద్ద విద్యార్థులకు కానీ సురక్షితంగా రోడ్డు దాటేందుకు జీబ్రా లేన్స్ లేవు. అబిడ్స్ వంటి ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందిన గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో సైతం పాదచారులు రోడ్డు దాటేందుకు ముప్పుతిప్పలు పడాల్సి వస్తోంది. లేన్ మార్కింగ్లెందుకు? బస్సులు వెళ్లేందుకు, సైకిళ్లు, పాదచారుల కోసం వేర్వేరు విభాగాలుగా ఉండేందుకు లేన్ మార్కింగ్లు అవసరం.. కానీ నగరంలో చాలా ప్రాంతాల్లో ఇవి కనిపించడం లేదు. దీంతో డ్రైవర్లు లేన్లను మారుస్తుండటంతో బాటిల్నెక్స్ ఏర్పడుతున్నాయి. అందుకు తాజా ఉదాహరణ చాదర్ఘాట్. ఈ గుర్తులేవీ? అవసరమైన ప్రాంతాల్లో ‘స్టాప్’, ‘నో యూ టర్న్’ ‘ముందుకు స్పీడ్బ్రేకర్’ ఉంది వంటి హెచ్చరికలు లేవు. ఎన్నో ప్రధాన రహదారులు, జంక్షన్లలోనూ అదే దుస్థితి. జంక్షన్ల వద్ద ఏ దారి ఎటువైపు వెళ్తుందో సూచించే సైనేజీలూ (నేవిగేషన్) లేవు. ఉన్నా ప్రైవేటు ప్రకటనల్లో మూసుకుపోయాయి. దీంతో నగరానికి కొత్తగా వచ్చిన వారికి కానీ, ఇతర ప్రాంతాలకు వెళ్లే నగర ప్రజలకు కానీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రంబుల్స్ట్రిప్స్తో ప్రమాదాలు అడ్డదిడ్డంగా ఇష్టానుసారంగా వేసిన రంబుల్స్ట్రిప్స్ వేగాన్ని తగ్గించేందుకు బదులు ప్రమాద హేతువులవుతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు వాటిని దాటేటప్పుడు అదుపుతప్పి కింద పడిపోతున్నారు. ఓఆర్ఆర్ వంటి ప్రాంతాల్లో పెద్ద వాహనాలు సైతం అదుపు తప్పుతున్నాయి. ఎల్బీనగర్ – ఉప్పల్ మార్గంలో తరచూ ప్రమాదాలకు ఇది కూడా కారణమే. రంబుల్స్ట్రిప్స్ ఐఆర్సీ మార్గదర్శకాల మేరకు 10–17 మిమి ఎత్తు, 250–300 వెడల్పుతో ఉండాలి. 600 ఎంఎం గ్యాప్తో 6 స్ట్రిప్స్ ఉండాలి కానీ నగరంలో ఎత్తు మాత్రం పెంచారు.అవి సైతం ఎక్కడ పడితే అక్కడ కాకుండా పాదచారులు రోడ్డు దాటే మార్గాలకు ముందు, జంక్షన్ల వద్ద ఏర్పాటు చేయాలి. ‘రంబుల్స్ట్రిప్స్ ముందు ఉన్నాయి’ అనే సూచికలు ఉండాలి. సాఫీగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలి కానీ లోపభూయిష్ట డిజైన్లతో నడుములు విరుగుతున్నాయి. ఏం చేయాలి ? లోపాలను చక్కదిద్దడంతో పాటు నగరం విశ్వనగరంగా ఉండాలంటే ఆధునిక సాంకేతికతతో కూడిన కొత్త విధానాలు అందుబాటులోకి తేవాలి. సైనేజీలు, సూచికల వంటి వాటి ఏర్పాటుతోపాటు ప్రజలకు వాటి గురించి అవగాహన కలిగేలా నిరంతరం కార్యక్రమాలుండాలి. స్కూల్స్, హాస్పిటల్స్ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక గుర్తులుండాలి. ‘పాదచారి దారిలో ఉన్నారు’, ఓవర్ టేక్ చేయవద్దు, స్పీడ్లిమిట్ వంటి సూచనలు రిఫ్లెక్లివ్ బోర్డులతో ఏర్పాటు చేయాలి. జంక్షన్ల వద్ద కౌంట్డౌన్ టైమర్లతో కూడిన లైన్లు, పెలికాన్ క్రాసింగ్బటన్లు ఉండాలి. రంబుల్ స్ట్రిప్స్ ఇష్టానుసారం కాకుండా అవసరమైన ప్రాంతాల్లోనే వేయాలి. బస్బేస్, ఆన్స్ట్రీట్, ఆఫ్స్ట్రీట్ పార్కింగ్ ప్రాంతాలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి. ఇరుకు రోడ్లకు, డివైడెడ్ రోడ్లకు వేర్వేకు మార్కింగ్ నిబంధనలుండాలి. ఫ్లై ఓవర్లు, జంక్షన్లు, వలయాకారపు జంక్షన్లు వంటి ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించే లేన్లు, మార్గదర్శక సూచనలు ఉండాలి. మలుపులున్న ప్రాంతాల్లో 15 ఎంఎం వెడల్పుతో రోడ్డుకు ఇరువైపులా తెలుపురంగు ఉండాలి. రాత్రిళ్లు కనపడేలా స్టడ్స్ ఉండాలి. సెన్సర్ ఆధారిత రంబుల్స్ట్రిప్స్ బదులు కాలం చెల్లిన స్టాటిక్ సిస్టమ్నే వాడుతున్నారు. వాటిని మార్చడంతోపాటు రంబుల్స్ట్రిప్స్ లొకేషన్స్, స్థితిగతులకు సంబంధించి సెంట్రలైజ్డ్ డేటాబేస్ అవసరం. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్, ఆర్అండ్బీ, హెచ్ఎంఆర్ల మధ్య సమన్వయ లోపం వల్ల రోడ్డునిబంధనలు సవ్యంగా అమలు కావడం లేదు. సైనేజీలు, లేన్మార్కింగ్లు, నేవిగేషన్లు పట్టవు పాఠశాలలున్నా.. ప్రమాదాలు జరిగినా అంతే.. అడ్డగోలుగా రోడ్ల నిర్మాణం, ఎక్కడపడితే అక్కడ రంబుల్స్ట్రిప్స్ ఎట్టకేలకు నిద్రలేచిన బల్దియా యంత్రాంగం -
నక్షత్ర తాబేళ్లు స్వాధీనం
గచ్చిబౌలి: రాయదుర్గం పరిధిలో నిషేధిత నక్షత్ర తాబేళ్లు విక్రయించేందుకు యత్నించిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన ప్రకారం..మణికొండ సాయిరాంనగర్లో న్యూ బ్లే స్టార్క్ అక్వేరియం నిర్వహించే చెరుకుల బాలస్వామి నక్షత్ర తాబేళ్లు అమ్మేందుకు సిద్ధంగా ఉంచారని సమాచారం అందడంతో ఎస్ఓటీ, రాయదుర్గం పోలీసులు దాడులు నిర్వహించారు. నిందితుడి నుంచి నాలుగు నక్షత్ర తాబేళ్లు, రెండు రెడ్ ఇయర్డ్ స్లైడర్ తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. అతని స్నేహితుడు సురేష్ కుమార్ చైన్నె నుంచి తాబేళ్లను సరఫరా చేస్తున్నాడు. నిందితుడు బాలస్వామికి నోటీసు జారీ చేస్తామని, తాబేళ్లను అటవీ శాఖ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. మరో నిందితుడు సురేష్ పరారీలో ఉన్నాడని చెప్పారు. కేసు ఫారెస్ట్ విభాగానికి బదిలీ చేస్తామని చెప్పారు. ‘విద్యుత్’ మరమ్మతులపై సమాచారం ఇవ్వాలి సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్ లైన్ల పునరుద్ధరణ, మరమ్మతు పనులపై వినియోగదారులకు ఒక రోజు ముందే సమాచారం ఇవ్వాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ సంబంధిత ఇంజనీర్లకు సూచించారు. ఆటో/బైక్లపై సౌండ్ బాక్సులను ఏర్పాటు చేసుకుని ఆయా ప్రాంతాల్లో ప్రచారం చేయాలని, వినియోగదారుల మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ ద్వారా విద్యుత్ సరఫరా నిలిపివేసే వేళలకు సంబంధించిన పూర్తి సమాచారం అందజేయాలని కోరారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా సరఫరా నిలిపివేయడం వల్ల వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం మాన్సూన్ ఏర్పాట్లపై సంబంధిత ఇంజనీర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లు తమ పరిధిలో నిర్వహిస్తున్న మరమ్మతు పనుల షెడ్యూల్ను పరిశీలించడంతో పాటు విధిగా తనిఖీ చేయాలని, సిబ్బంది స్వీయ భద్రతా చర్యలు పాటించాలని, షెడ్యూల్ ప్రకారంగా పని పూర్తి చేయాలని సూచించారు. ఈ నెల 26 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ రామంతాపూర్: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి రెండు విడతల్లో ప్రవేశాల ప్రక్రియ జరగనుందని రామంతాపూర్ ప్రభుత్వ జేఎన్ పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్డెస్క్ కో ఆర్డినేటర్, ప్రిన్సిపాల్ వినయ్కుమార్ తెలిపారు. జూన్ 24 నుంచి 28 వరకు ఆన్లైన్లో నమోదు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చునని, జూన్ 26 నుంచి 29 వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన, 26 నుంచి జూలై 1 వరకు ఆప్షన్ల ఎంపికకు అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. జూలై 4 నుంచి 6 వరకు అభ్యర్థులకు సీట్లు కేటాయించిన కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
బ్రాస్ బ్యాండ్ టీమ్ ప్రదర్శన భేష్
బండ్లగూడ: తెలంగాణ పోలీస్ అకాడమీలో 53 మంది అధికారుల బ్రాస్బ్యాండ్, బిగులర్ (వెలిడిక్షన్) పోలీస్ శిక్షణ ముగింపు కార్యక్రమం శుక్రవారం జరిగింది. ముఖ్యఅతిథిగా రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జితేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బ్రాస్ బ్యాండ్ టీం ప్రదర్శన చాలా బావుందని, ఇది భవిష్యత్తులో రాష్ట్రంలో బెస్ట్ బ్యాండ్గా గుర్తింపు పొందుతుందని ప్రశంసించారు. రాబోయే ఆగస్టు 15, రిపబ్లిక్ డే, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ టీమ్లతో ప్రదర్శనలు ఏర్పాటు చేయిస్తామన్నారు. గతంలో 10 పోలీస్ యూనిట్స్ ఉండేవని, రాష్ట్ర విభజన తర్వాత బ్రాస్ బ్యాండ్ టీమ్స్ తక్కువగా ఉన్నాయని, అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ ముందుచూపుతో ఇలాంటి నాలుగు నెలల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమన్నారు. ఇక్కడ దాదాపు 53 మంది అధికారులు కఠినమైన శిక్షణ పొందారన్నారు. అనంతరం వీరికి ప్రశంసాపత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్, అకాడమీ జాయింట్ డైరెక్టర్ డి.మురళీధర్, డిప్యూటీ డైరెక్టర్లు ఎన్.వెంకటేశ్వర్లు, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. డీజీపీ డాక్టర్ జితేందర్ -
దేశంలో మతోన్మాద పాలన
శంకర్పల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం శంకర్పల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ గార్డెన్స్లో సీపీఐ 12వ మహాసభ ఏర్పాటు చేయగా.. ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, దేశంలో మతోన్మాద పాలన కొనసాగిస్తుందన్నారు. అదే విధంగా కార్మికులకు నల్ల చట్టాలపై ఇచ్చిన హామీలపై మాట మార్చుతుందని, మావోయిస్టులపై జరుపుతున్న ఎన్కౌంటర్లను తక్షణమే నిలిపివేయాలన్నారు. సభలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రభులింగం, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ మంజుల, శంకర్పల్లి మండల అధ్యక్షుడు సుధీర్, నాయకులు సుభాన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య -
సారాపై ఉక్కుపాదం
నీటి ట్యాంకర్ల సీజ్ పొలాల వద్ద బోర్ల నుంచి నీటిని నింపి ఇతర అవసరాలకు తరలిస్తున్న లారీలను అధికారులు సీజ్ చేశారు.10లోuఆమనగల్లు: గ్రామాలు, తండాల్లో నాటుసారా, గుడుంబా నిరోధానికి కఠినంగా వ్యవహరించాలని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ సూచించారు. డ్రగ్స్, నాటుసారా రహిత తెలంగాణ కోసం అందరూ సహకరించాలని కోరారు. పట్టణంలోని ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ను శుక్రవారం ఎకై ్సజ్ డీపీఈఓ ఉజ్వలారెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్ మండలాల్లో కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ కేసుల్లో పట్టుబడిన నాటుసారాను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా దశరథ్ మాట్లాడుతూ.. అనుమతిలేకుండా ఫంక్షన్హాళ్లు, రిసార్ట్స్, ఫాం హౌస్ల్లో మద్యం వినియోగించరాదని అన్నారు. గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అంతకుముందు గీత కార్మికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ సీఐ బద్యనాథ్చౌహాన్, ఎస్ఐలు కృష్ణప్రసాద్, అరుణ్కుమార్, స్వప్న, సిబ్బంది శంకర్, సురేశ్బాబు, దశరథ్, ఉపేందర్, బాబు, నర్సింహ, శ్రీను, శ్రీజ, ఆమని తదితరులు పాల్గొన్నారు. గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి.. కడ్తాల్: గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్, సరూర్నగర్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆఫీసర్ ఉజ్వలా రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ముద్వీన్లో నీరా తయారీ కేంద్రాన్ని శుక్రవారం వారు పరిశీలించారు. కేంద్రంలో తయారవుతున్న ఉత్పత్తుల ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చరికొండ, ముద్వీన్, నాగిళ్ల, శెట్టిపల్లి తదితర గ్రామాల నుంచి హైదరాబాద్కు కల్లు రవాణా చేసేవారితో సమావేశమయ్యారు. కార్యక్రమంలో ఎకై ్స జ్ సీఐ బద్యనాథ్ చౌహన్, ఎస్ఐలు కృష్ణప్రసాద్, అరుణ్కుమార్, స్వప్న పాల్గొన్నారు.ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ -
మున్సిపాలిటీల్లో ‘ఉపాధి’ ప్రారంభించాలి
షాద్నగర్: మున్సిపాలిటీల్లో ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య డిమాండ్ చేశారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో పేదలకు కూలి పనులు చేసుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీల సమస్యల సాధన, భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు వచ్చే నెల 5,6 తేదీల్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం ఫరూఖ్నగర్ మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రాములు, ప్రధాన కార్యదర్శిగా రాజు నాయక్, ఉపాధ్యక్షులుగా జంగయ్య, శంకర్, కార్యదర్శులుగా రాములుగౌడ్, చెన్నయ్య ఎన్నికయ్యారు. కార్యక్రమంలో నాయకులు బుద్దుల జంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
రక్షణ
శనివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2025ప్రభుత్వ భూములకు సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ భూములకు హద్దులు నిర్ణయించి, హెచ్చరిక బోర్డులతో పాటు ఆయా భూముల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. గ్రామాలు, సర్వే నంబర్ల వారీగా భూముల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే మెజార్టీ భూములు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లాయి. కొన్ని కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయి. ఏ వివాదం లేని ఖాళీ భూములకు హద్దులు నిర్ణయించే పని కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని మండలాల్లో భూముల చుట్టూ ఫెన్సింగ్ వేయగా, మరికొన్ని మండలాల్లో సర్వే కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఫెన్సింగ్ వైర్లు, కడీలు, హెచ్చరిక బోర్డులు, కూలీల చార్జీల చెల్లింపు కోసం అయ్యే ఖర్చులకు అంచనాలు రూపొందించి, కలెక్టర్కు పంపారు. నిధులు మంజూరు కావడమే ఆలస్యం ఆయా భూముల చుట్టూ ఫెన్సింగ్ వేయనున్నారు. పట్టణ భూపరిమితి చట్టం (యూఎల్సీ)లో తొమ్మిది వేల ఎకరాల యూఎల్సీ భూములు ఉన్నాయి. వీటిలో 840 ఎకరాలు కోర్టు కేసుల్లో చిక్కుకున్నాయి. ఆయా భూముల సర్వే నంబర్లు సహా కోర్టుల్లో హియరింగ్ తేదీలను తెలుసుకునేందుకు కొత్తగా ఈ కోర్టు పోర్టల్ను అందుబాటులోకి తెచ్చారు. ఆయా భూముల విస్తీర్ణం, నేపథ్యం, కేసు పూర్వాపరాలను క్షేత్రస్థాయిలోని రెవెన్యూ ఇన్స్పెక్టర్ మొదలు..కలెక్టర్ వరకు అధికారులంతా తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. గుర్తించినవి ఇవీ.. ● సరూర్నగర్ సర్వే నంబర్ 9/7లోని 3.23 ఎకరాలు, సర్వే నంబర్ 9/1లో 0.24 ఎకరాలు, సర్వే నంబర్ 9/1పీలో 0.39 ఎకరాలు, సర్వే నంబర్ 9/1లో 400 గజాలు, సర్వేనంబర్13లో 2 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించారు. లింగోజిగూడ సర్వే నంబర్ 86లో 1.21 ఎకరాలు, మన్సూరాబాద్ సర్వే నంబర్ 4/పీలో 0.23 ఎకరాలు, చంపాపేట్ సర్వే నంబర్ 3లోని 850 గజాలు, బైరమల్గూడ సర్వే నంబర్ 24లో 0.10 ఎకరాలు, కర్మన్ఘాట్ సర్వే నంబర్ 51లో ఎకరం, సర్వే నంబర్ 73/1లో 2000 గజాలు, గడ్డిఅన్నారం సర్వే నంబర్ 31/2లో 104 గజాలను గుర్తించారు. ● కేశంపేట మండల పరిధిలోని వేములనర్వ సర్వే నంబర్ 119లో 15.27 ఎకరాలు, సర్వే నంబర్ 120లో 12.08 ఎకరాలు, సర్వే నంబర్ 121లో 10.06 ఎకరాలు, సర్వే నంబర్ 122లో 13.03 ఎకరాలు (మొత్తం 51.04 ఎకరాలు) ఉన్నట్లు గుర్తించి, ఆయా భూముల చుట్టూ ఫెన్సింగ్ చేశారు. బైర్ఖాన్పల్లి సర్వే నంబర్ 53/1లో 15 ఎకరాలు ఉన్నట్లు గుర్తించి ఫెన్సింగ్ పనులు చేపట్టారు. కేశంపేట సర్వే నంబర్ 70లో సుమారు మూడు ఎకరాలు ఉన్నట్లు గుర్తించి ఫెన్సింగ్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ● కడ్తాల్ మండల పరిధిలో 15 రెవెన్యూ గ్రామాలు ఉండగా కడ్తాల్, కర్కల్పహాడ్లో 110 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఆయా భూముల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అన్మాస్పల్లి సర్వే నంబర్ 129లో 1.24 ఎకరాలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కడ్తాల్ సర్వే నంబర్ 260లోని 80 ఎకరాల చుట్టూ హద్దురాళ్లు నాటారు. ● గండిపేట మండల పరిధిలోని గంధంగూడ సర్వే నంబర్62లో 5 ఎకరాలు, సర్వే నంబర్ 43లో ఐదు ఎకరాలు, సర్వే నంబర్ 62లో ఐదు గుంటలు, కిస్మత్పూర్ సర్వే నంబర్ 159లో 159.10 ఎకరాలు, సర్వే నంబర్ 86లో 15 గుంటలు, కోకాపేట సర్వే నంబర్ 100లో 35 ప్లాట్లు, సర్వే నంబర్ 117లో రెండు ఎకరాలు, బండ్లగూడ సర్వే నంబర్ 50లో ఐదు గుంటలు, వట్టినాగులపల్లి సర్వే నంబర్ 132లో 56 ఎకరాలు, సర్వే నంబర్ 130లో 17.27 ఎకరాలు, సర్వే నంబర్ 274లో 8 ఎకరాలు, సర్వే నంబర్ 275లో 5.28 ఎకరాలు, సర్వే నంబర్ 294లో 13 గుంటలు ఉన్నట్లు గుర్తించారు. పుప్పాల్గూడ సర్వే నంబర్ 290లో ఎకరం, మణికొండ సర్వే నంబర్ 84లో ఎనిమిది గుంటలు, సర్వే నంబర్ 229లో నాలుగు గుంటలు, నార్సింగి సర్వే నంబర్ 134లో ఎకరం, సర్వే నంబర్ 126లో మూ డు ఎకరాలు, మంచిరేవుల సర్వే నంబర్ 283లో 10 గుంటలు, బైరాగిగూడ సర్వే నంబర్ 15లో పది గుంటలు ఉన్నట్లు తేల్చారు. ఇప్పటికే ఆ యా భూముల్లో ఆక్రమణలు తొలగించారు. ఫె న్సింగ్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి, నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి పంపారు. ● మొయినాబాద్ మండలం కనకమామిడిలో 200 ఎకరాలు, పెద్దమంగళారంలో 300 ఎకరాలు, చిలుకూరులో 30 ఎకరాలు, అజీజ్నగర్లో 150 ఎకరాలు గుర్తించారు. చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులు పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ● ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల, ఖానాపూర్, రామిరెడ్డిగూడ, దండుమైలారం, నాగన్పల్లి, మంగల్పల్లి, నర్రేపల్లిలో 60 ఎకరాలకుపైగా గుర్తించారు. ఆయా భూముల ఫెన్సింగ్ కోసం రూ.40 లక్షలకుపైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. ● చేవెళ్ల మండలం హస్తేపూర్, అంతారం, కమ్మెట, కందవాడ, పామెన, కుమ్మేర, రావులపల్లిలో 200పైగా ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. హద్దులను నిర్ధారించి, హెచ్చరిక బోర్డులు నాటేందుకు సిద్ధం చేస్తున్నారు. కేశంపేట మండలంలో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డున్యూస్రీల్రూ.వందల కోట్ల విలువైన స్థలాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు సర్వే నంబర్ల వారీగా గుర్తింపు కబ్జాల చెర నుంచి విముక్తి హద్దులు నిర్ణయించి హెచ్చరిక బోర్డుల ఏర్పాటు ఫెన్సింగ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు -
యోగం
ఆరోగ్య ఆనంద యోగాతో ఒత్తిళ్లకు చెక్ ● రుగ్మతలకు దివ్య ఔషధం ● రోజంతా ఉల్లాసం.. ఉత్సాహం ● ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి ● నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం షాద్నగర్: యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదు.. మనస్సును, శరీరాన్ని సంపూర్ణంగా అదుపులో ఉంచే ఒక సాధనం.. యోగా ద్వారా ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని పొందొచ్చు.. నిద్రానంగా దాగి ఉన్న శక్తిని వెలికి తీయొచ్చు.. యోగాసనాలు వేయడం ద్వారా ఏకాగ్రత, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతాయి.. మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది.. దైనందిన జీవితంలో పని ఒత్తిడిని, అలసటను అధిగమించేందుకు యోగా ఔషధంగా పనిచేస్తుంది.. ప్రజల్లో రోజురోజుకూ దీనిపై ఆసక్తి పెరుగుతోంది.. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యోగా చేయొచ్చు.. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. సర్వరోగ నివారిణి యోగా సాధన ద్వారా మనిషిలో ఉన్న సర్వరోగాలు మటుమాయం అవుతాయి. కండరాలకు కావాల్సిన శక్తి రావడంతో పాటు ద్రుఢంగా మారుతాయి. శరీరంలోని అన్ని అవయవాలకు రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. శారీరక, మానసిక ప్రశాంతత, మనో బలం, సంగ్రహణ శక్తి పెంపొందుతాయి. ధ్యానం చేయడం ద్వారా ఏకాగ్రత పెంచుకోవచ్చు. ఆసనాల్లో అనేక రకాలు యోగాసనాల్లో చాలా రకాలు ఉన్నాయి. నిలబడి, కూర్చొని, పడుకొని చేసే ఆసనాలు ఉన్నాయి. వజ్రాసనం, అర్ధ ఉష్ట్రాసనం, శశాంకాసనం, ఉత్తానమండూకాసనం, వక్రాసనం, మకరాసనం, తడాసనం, వృక్షాసనం, పాదహస్తాసనం, అర్ధచక్రాసనం, త్రికోణాసనం, భద్రాసనం, సరళభుజంగాసనం, పవన యుక్తాసనం, శలభాసనం, సేతు బంధానసం, ఉత్తానపాదాసనం, అర్ధహలాసనం, పవన ముక్తాసనం, శవాసనం ఇలా అనేక రకాలు ఉన్నాయి. ప్రాణాయామాలు కపాల భాతి, అనులోమ విలోమ, శీతలీ ప్రాణాయామం, బ్రమరీ ప్రాణాయామం, ధ్యానం ఉన్నాయి. విస్తరిస్తున్న యోగా యోగా క్రమక్రమంగా గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరిస్తోంది. చాలా మంది యోగాసనాలు వేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంనేందుకు ప్రతిరోజు కొంత సమయాన్ని యోగాకు కేటాయిస్తున్నారు. తెల్లవారుజాము మొదలు ఉదయం సూర్యకిరణాలు బాగా వచ్చేంత వరకు సాధన చేస్తున్నారు. వృద్ధాశ్రమాల్లో పతంజలి యోగా సమితి వారు యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆశ్రమాల్లో చాలా మంది వయస్సుపై బడిన వారు ఉండటంతో ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటారు. సమస్యను దూరం చేసుకునేందుకు యోగా సాధన చేస్తున్నారు. రోగ నిరోధక శక్తి నిత్యం యోగా చేయడం ద్వారా ఆర్యోగంగా ఉంటారు. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం ఉల్లాసంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ రోజు కొంత సమయాన్ని యోగాకు కేటాయించాలి. – శ్రీజారెడ్డి, యోగా శిక్షకురాలు, షాద్నగర్ఒత్తిళ్లను అధిగమించొచ్చు నిత్య యోగా సాధనతో మానసిక, శారీరక ఒత్తిళ్లను అధిగమించొచ్చు. అన్ని అవయవాలకు రక్తప్రసరణ మంచిగా జరుగుతుంది. అలసటను పూర్తిగా తగ్గిస్తుంది. రోగాలకు ఆస్కారం ఉండదు. – పానుగంటి శశిధర్, పతంజలి యోగా సమితి వ్యవస్థాపకుడు, షాద్నగర్ -
జోలె పట్టి విరాళాల సేకరణ
ఆమనగల్లు: ప్రభుత్వం పంచాయతీల నిర్వహణకు నిధులు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. పంచాయతీల్లో చెత్త సేకరించే ట్రాక్టర్ నిర్వహణ కోసం విరాళాలు సేకరించి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తలకొండపల్లి మండలం గట్టుప్పలపల్లిలో కొన్ని రోజులుగా చెత్త ట్రాక్టర్ లేకపోవడంతో ఎక్కడిచెత్త అక్కడే పేరుకుపోయింది. దీంతో గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకటయ్య, బీఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్రెడ్డి గ్రామ కార్యదర్శిని సంప్రదించగా ట్రాక్టర్ నడిపించడానికి డీజిల్ లేదని సమాధానం ఇచ్చారు. దీంతో వారు వెంటనే గ్రామంలో తిరిగి జోలెపట్టి విరాళాలు సేకరించారు. వచ్చిన రూ.11,350ను పంచాయతీ సిబ్బందికి అందించారు. కనీసం డీజిల్ ఖర్చులు కూడా ప్రభుత్వం అందించకపోతే పారిశుద్ధ్య పనులు ఎలా చేపడతారని వారు ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజు, జంగయ్య, శరత్చంద్రశర్మ, అశోక్గౌడ్, కృష్ణయ్య, జైపాల్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, కృష్ణయ్య, రాజు, విజేందర్, నర్సింహ, జీవ, కొండల్, ఆంజనేయులు, యాదయ్య, శరత్చంద్ర తదితరులు పాల్గొన్నారు. చెత్త ట్రాక్టర్ డీజిల్ ఖర్చుల కోసం.. -
కాలిపోయిన డమ్మీ హెలికాప్టర్
బడంగ్పేట్: ఓ డమ్మీ హెలికాప్టర్ కాలిపోయిన సంఘటన కార్పొరేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గుర్రంగూడలోని పోచమ్మ టెంపుల్ పక్కన గోకార్టింగ్ ఎదురుగా కొన్నేళ్ల క్రితం సినిమా షూటింగ్ కోసం డమ్మీ హెలికాప్టర్ తయారు చేయించారు. షూటింగ్ అయిపోయిన తర్వాత రోడ్డు పక్కన మైదానంలో ఉంచారు. శుక్రవారం అకస్మాత్తుగా అది కాలిపోయింది. స్థానికులు గమనించి మంటలు ఆర్పేశారు. అనంతరం మీర్పేట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హెలికాప్టర్ కాలిపోతున్న దృశ్యాలను కొందరు వీడియోలు తీసి వైరల్ చేశారు. అది చూసి అంతా నిజమైన హెలికాప్టర్కు ప్రమాదం జరిగిందని అనుకున్నారు. ప్రమాదంలో కాలిపోయిందా లేక గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనుల పరిశీలన కందుకూరు: మండలంలోని మీర్ఖాన్పేట రెవెన్యూలో నిర్మాణంలో ఉన్న స్కిల్స్ యూనివర్సిటీని శుక్రవారం ఫ్యూచర్సిటీ డెవలెప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) కమిషనర్ శశాంక సందర్శించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం అక్కడి సైట్ ఇంజనీర్లతో మాట్లాడారు. ఎక్కడెక్కడ ఎలాంటి నిర్మాణాలు రాను న్నాయి, ఇప్పటి వరకు ఎంత మేర పనులు చేశారని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట టీజీఐఐసీ జోనల్ మేనేజర్ శ్రావణ్కుమార్, తహసీల్దార్ గోపాల్ ఉన్నారు. టీచర్లు ఫంక్షన్కి.. పాఠాలు గాలికి కేశంపేట: విద్యార్థినులకు పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయులు ఏడుగురు మూకుమ్మడి సెలవు పెట్టి ఫంక్షన్కు వెళ్లారు. మండల పరిధిలోని పాటిగడ్డ కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం, కళాశాల (కేజీబీవీ)లో సుమారు 350 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇక్కడ ఆరు నుంచి ఇంటర్మీడియెట్ వరకు తరగతులు కొనసాగుతున్నాయి. పాఠశాల ఎస్ఓగా గౌసియాబేగం విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి స్వగ్రామమైన మహబూబ్నగ ర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విందుకు ఉపాధ్యాయులు కవిత, మంజుల, సుశీల, గౌసియాబేగం, రజిత, అలేఖ్య, వరలక్ష్మి హాఫ్డే సెలవు అంటూ లెటర్ పెట్టుకొని వెళ్లారు. పాఠశాలలో ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఇలా పిల్లలను వదిలేసి అంతా ఫంక్షన్కు వెళ్లడం చర్చనీయాంశమైంది. వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ షాద్నగర్రూరల్: ప్రభుత్వ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో నెలకొన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వ వసతి గృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయన్నారు. వాటిలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రాత్రివేళల్లో గిరిజన వసతి గృహానికి వాచ్మెన్ లేకపోవడంతో భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శివశంకర్, ఆదిల్ తదితరులు పాల్గొన్నారు. -
ఎనికేపల్లి రైతులకు న్యాయం చేయండి
మొయినాబాద్: గోశాల ఏర్పాటుతో భూములు కోల్పోతున్న ఎనికేపల్లి రైతులకు న్యాయం చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కలెక్టర్ నారాయణరెడ్డికి విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం రైతులతో కలిసి వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ పరిధిలోని ఎనికేపల్లి సర్వేనంబర్ 180లోని 99.14 ఎకరాల భూమిని సాగుచేసుకుంటున్న రైతులంతా పేదకుటుంబాలకు చెందినవారని అన్నారు. ఈ భూములను గోశాల కోసం తీసుకుంటే రైతులకు ఎకరాకు వెయ్యి గజాల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో రెండు రోజుల్లో సీఎం రేవంత్రెడ్డిని కలిసి మాట్లాడతామని.. అప్పటి వరకు గోశాల ఏర్పాటు పనులు చేపట్టొద్దని అన్నారు. కలెక్టర్ను కలిసినవారిలో టీపీసీసీ సభ్యుడు షాబాద్ దర్శన్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీకాంత్, మాజీ సర్పంచ్ అమర్నాథ్రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు రాంరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ రమేష్ తదితరులు ఉన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డికి చేవెళ్ల ఎమ్మెల్యే వినతి -
ఎస్సీ, ఎస్టీలకే సబ్ప్లాన్ నిధులు
అనంతగిరి: ప్రతీ మూడు నెలలకు ఓసారి డీవీఎంసీ (డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ) సమావేశాలు నిర్వహించి సంబంధిత శాఖల అధికారులు పాల్గొని జిల్లాలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. గురువారం ఆయన ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నుంచి వివిధ శాఖల ద్వారా ఎస్సీ వర్గాలకు వెచ్చిస్తున్న నిధులపై కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవన్నారు. ఎస్సీ, ఎస్టీ సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలన్నారు. జనాభా ప్రాతిపదికన వాటాలకు అనుగుణంగా నిధులు ఖర్చు చేయాలని అధికారులకు సూచించారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ భూ సమస్యలు పరిష్కారం చూపాలన్నారు. జూలై నుంచి ప్రతీ నెల చివరి శనివారం పౌర హక్కుల దినం నిర్వహించి ఈ కార్యక్రమానికి తహసీల్దార్, పోలీస్ అధికారి తప్పక హాజరయ్యేలా చూడాలని కలెక్టర్ ప్రతీక్జైన్కు సూచించారు. చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాస్ పథకాల్లోనూ వాటాలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు అవకాశాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవు ప్రతీ నెల చివరి శనివారం పౌరహక్కుల దినోత్సవం నిర్వహించాలి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
మోడల్ స్కూల్లో అడ్మిషన్ల దరఖాస్తుకు నేడే ఆఖరు
కందుకూరు: నేదునూరు వద్ద ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ విష్ణుప్రియ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతిలో చేరే విద్యార్థులు శనివారం సాయంత్రం వరకు పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 23న మధ్యాహ్నం 2గంటలకు రాత పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. తహసీల్లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి శంకర్పల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్రెడ్డి గురువారం శంకర్పల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. జన్వాడలో తాను కొనుగోలు చేసి ఎకరా ఇరవై గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ ప్రక్రియ పూర్తవగానే వెళ్లిపోయారు. పలువురు ఆయనతో ఫొటోలు తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు. భావి ప్రధాని రాహుల్ గాంధీ షాద్నగర్: భారత భావి ప్రధాని రాహుల్గాంధీ అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం రాహుల్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నిర్వహించి భారత్ జోడో యాత్ర ద్వారా.. బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాబర్ఖాన్, బాల్రాజ్గౌడ్, కొంకళ్ళ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలిగా పుష్పవతి మొయినాబాద్: హిమాయత్నగర్కు చెందిన ముత్యాల పుష్పవతి మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం అధ్యక్షురాలు పామెన జ్యోతి నుంచి నియామకపత్రం అందుకున్నారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని పుష్పవతి తెలిపారు. ప్రభుత్వ విద్యార్థులకు చేయూత మొయినాబాద్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి స్వచ్ఛంద సంస్థలు, దాతల ప్రోత్సాహం ఎంతో అవసరమని ఎంఈఓ మల్లయ్య అన్నారు. స్వేచ్ఛ ఫౌండేషన్ సౌజన్యంతో గురువారం మొయినాబాద్ స్కూల్లోని 250 మంది విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు, పలకలు, స్టేషనరీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్వేచ్ఛ ఫౌండేషన్ చైర్మన్ వాసుదేవ్, ఫౌండర్ సభ్యులు శేషగిరిరావు, హెచ్ఎంలు జోసఫ్రెడ్డి, హమీద్, శేఖర్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ఇటు రసాభాస!
ఇద్దరికి గాయాలు టిప్పర్ , బైకు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ఇన్ముల్నర్వ లో చోటు చేసుకుంది. కర్షకుల ఖాతాల్లో పంట సాయం జమ● మాకెందుకు రాలేదంటూ ఔటర్ సమీప రైతుల ఆందోళన ● బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మద్దతు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుభరోసా పథకం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఓ వైపు తమ ఖాతాల్లో డబ్బులు జమయ్యాయని అన్నదాతలు హర్షం వ్యక్తంచేస్తుండగా.. ఔటర్ సమీపంలోని మండలాల రైతులు ఆందోళన బాట పట్టారు. తమకు పంట సాయం అందలేదని మండిపడుతున్నారు. వీరికి ప్రతిపక్ష నాయకులు మద్దతు తెలపడంతో గందరగోళ వాతావరణం నెలకొంది.శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 202510లోuఅటు భరోసాసాక్షి, రంగారెడ్డి జిల్లా: వానాకాలం పంట సాయం కింద రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తోంది. రైతు భరోసా పేరుతో అర్హులైన అకౌంట్లలో డబ్బులు వేస్తోంది. తొలి రోజు రెండు ఎకరాల లోపు రైతుల ఖాతాల్లో నగదు జమ చేయగా, రెండో రోజు మూడు ఎకరాలు, నాలుగో రోజు నాలుగు ఎకరాలు, ఐదో రోజు ఐదెకరాలోపు భూములు ఉన్న వారికి నగదు పంపిణీ చేసింది. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉండగా అర్బన్ మండలాల రైతులు మాత్రం నిరాశకు గురయ్యారు. ఓఆర్ఆర్కు ఇరువైపులా ఉన్న మెజార్టీ పొలాలు వ్యవసాయేతర భూములుగా మారడం, ఖాళీ భూముల్లోనూ పంటలు లేకపోవడం, మార్కెట్లో వీటికి మంచి ధర లభిస్తుండటంతో ప్రభుత్వం ఆయా మండలాల్లోని రైతులకు గత యాసంగి నుంచే ఈ పథకం అమలును నిలిపివేసింది. ఇతర రైతులకు మాత్రం ఎకరానికి రూ.ఆరు వేల చొప్పున ఖాతాల్లో జమ చేసింది. ఈ నగదును వానాకాలం పెట్టుబడుల కోసం వినియోగించాలని ప్రభుత్వం, అధికారులు సూచిస్తున్నారు.● అందరికీ ఇవ్వండి అబ్దుల్లాపూర్మెట్: జిల్లాలోని మెజార్టీ రైతులకు భరోసా పథకం అందలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, మాజీ మంత్రి సబితారెడ్డి, రాష్ట్ర నాయకుడు ప్రశాంత్కుమార్రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. పంటల సాగు కోసం తక్షణమే రైతుల ఖాతాల్లో నగదు చేయాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో రైతుబంధు జిల్లా మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొత్త కిషన్గౌడ్, సహకార సంఘం మాజీ చైర్మన్ లెక్కల విఠల్రెడ్డి, కోటా వెంకట్రెడ్డి తదితరులు ఉన్నారు. న్యూస్రీల్రంగారెడ్డిలో చెల్లింపులు ఇలా.. తేదీ విస్తీర్ణం రైతులు ఖాతాల్లో నగదు జమ 16 2 ఎకరాలు 1,54,622 రూ.81,34,19,493 17 3 ఎకరాలు 1,87,435 రూ.12,78,89,726 18 4 ఎకరాలు 2,06,736 రూ.165,95,67,080 19 5 ఎకరాలు 2,19,938 రూ.199,35,21,916 వికారాబాద్లో తేదీ విస్తీర్ణం రైతులు ఖాతాల్లో నగదు జమ 16 2 ఎకరాలు 1,62,596 రూ.98,99,42,656 17 3 ఎకరాలు 2,05,637 రూ.163,74,49,371 18 4 ఎకరాలు 2,30,844 రూ.216,60,10,315 19 5 ఎకరాలు 2,48,374 రూ.264,21,56,042 -
కసాయి కొడుకుకు కటకటాలు
కందుకూరు: కన్నతండ్రినే అతి కిరాతకంగా హతమార్చిన ఘటనలో కొడుకును పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన కందుకూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సీతారామ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పులిమామిడి గ్రామానికి చెందిన భార్యాభర్తలు పసుపుల చిన్న జంగయ్య, పద్మమ్మలకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. వీరందరికి వివాహాలు చేశారు. గ్రామంలో ఉన్న అర ఎకరం పొలం దున్నుకుంటూ మరోపక్క గొర్రెలు మేపుకొంటూ జీవిస్తున్నారు. కాగా కొడుకు శేఖర్ తన భార్య పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్దనే ఉండేవాడు. ఏడాది క్రితం పాత ఇల్లు కూల్చివేసి కొత్తగా ఇంటిని నిర్మించే క్రమంలో భార్య పిల్లలతో కలిసి వేరే చోటుకి మారాడు. పిల్లర్లు, స్లాబ్ మాత్రమే వేసి ఆగిన ఇంట్లో తల్లిదండ్రులు ఉంటున్నారు. రాత్రిపూట తల్లి గ్రామంలో ఉండే చిన్న కుమార్తె ఇంటికి వెళ్లి నిద్రించేది. కాగా డబ్బులు లేక నిర్మాణం మధ్యలో ఆగడంతో ఉన్న అర ఎకరం పొలం అమ్మి ఇల్లు పూర్తి చేయాలని కొడుకు తరచూ తల్లిదండ్రులతో గొడవ పడేవాడు. పెద్దలు పంచాయితీ పెట్టి చెప్పినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. కాగా రెండు రోజుల క్రితం భార్య పిల్లలు పుట్టింటికి వెళ్లారు. దీంతో 17న రాత్రి తన తల్లిదండ్రులతో కలిసి శేఖర్ నిర్మాణంలో ఉన్న ఇంట్లోనే భోజనం చేశాడు. అనంతరం కొడుకు అద్దె ఇంటికి, తల్లి చిన్న కుమార్తె వద్దకు నిద్రించడానికి వెళ్లగా, చిన్నజంగయ్య అక్కడే నిద్రించాడు. ఇదే అదునుగా చూసుకుని అర్ధరాత్రి శేఖర్ తండ్రి వద్దకు వచ్చి బండరాయితో పాటు కర్రతో మోది హతమార్చిన ఘటన విదితమే. కాగా నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం రిమాండ్కు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టామని సీఐ తెలిపారు.కన్న తండ్రిని హతమార్చిన కేసులో రిమాండ్ -
పారిశ్రామిక పరుగులు
రైతుల నిర్బంధాలు, ప్రతిఘటనలు, నిరసనగళంతో గతంలో అట్టుడికిన దుద్యాల్ మండలంలో ప్రస్తుతం పారిశ్రామికవాడ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అందులో సింహభాగం భూ సేకరణ జరిగిందని అధికారులుపేర్కొంటున్నారు. దుద్యాల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలోని హకీంపేట్, పోలేపల్లి, లగచర్ల, పులిచర్లతండా, రోటిబండతండా గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. నిత్యం ఏదో ఒక శాఖకు చెందిన ఉద్యోగులు వచ్చి భూములకు హద్దులు నిర్ధారిస్తున్నారు. ఎన్నో ఆటంకాల మధ్య సాగిన భూ సేకరణ చివరి దశకు చేరుకుందని వారు తెలుపుతున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) అధికారులు పారిశ్రామికవాడ భూములను పరిశీలించారు. పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ప్రభుత్వం 1,177.35 ఎకరాలకు నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. అధికారులు నేటివరకు 658 మంది పట్టాదారులకు సంబంధించిన 914.12 ఎకరాల భూమిని సేకరించారు. పోలేపల్లి గ్రామంలో 48 ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం టీజీఐఐసీకి అప్పగించారు. వాటికి పరిహారంగా దాదాపు రూ.180 కోట్ల వరకు చెల్లించారు. భూ సేకరణ పోలేపల్లిలో పూర్తి కాగా లగచర్ల, హకీంపేట్ రెవెన్యూ గ్రామాల్లో ఇంకా 263.23 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇక కంపెనీల ఏర్పాటు ఇప్పటివరకు సేకరించిన భూముల్లో ప్రభుత్వం త్వరలో కంపెనీల ఏర్పాటుకు శంకుస్థాపన చేసే అవకాశం ఉందని స్థానిక నాయకులు చెబుతున్నారు. ఫార్మా ఏర్పాటు రద్దు చేసిన నేపథ్యంలో ఎలాంటి కంపెనీలు ఏర్పాటు చేస్తారో అనే చర్చ కొనసాగుతోంది. కాలుష్య రహిత కంపెనీలు ఏర్పాటు చేయాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు. ఉపాధి పండుగ కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభమైతే నియోజకవర్గంలోని కూలీలకు, 10వ, ఇంటర్ స్థాయిలో చదువుకున్న వారికి సూపర్వైజర్లుగా ఉపాధి లభిస్తుంది. స్థానిక కాంట్రాక్టర్లకు సైతం చేతినిండా పనులు దొరుకుతాయని భావిస్తున్నారు. కంపెనీల నిర్మాణ దశలో వేల సంఖ్యలో కూలీలు అవసరం ఉంటుందని, ఇక్కడి ప్రాంత వాసులు ఇరత ప్రాంతాలకు వెళ్లి పనులు చేయాల్సిన అవసరం లేదనే సంతోషంలో ఉన్నారు. భూ సేకరణలో వేగం పెంచిన అధికారులు నిర్ధారించిన హద్దులకు రంగులు ఇప్పటి వరకు సేకరించిన భూమి 914.12 ఎకరాలు మిగిలింది మరో 263.23 ఎకరాలే త్వరలో కంపెనీలకు అప్పగించే అవకాశం! పరిశీలించిన టీఎస్ఐఐసీ అధికారులుసేకరించిన భూ వివరాలు పారిశ్రామవాడ ఏర్పాటుకు ప్రభుత్వం 1,177.35 ఎకరాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా పోలేపల్లి గ్రామంలో 38 మంది రైతుల నుంచి 73.39 ఎకరాల అసైన్డ్ భూమితో పాటు 48 ఎకరాల ప్రభుత్వ భూమిని అదనంగా స్వాధీనం చేసుకున్నారు. హకీంపేట్లో 172 మంది రైతులకు సంబంధించి 261.33 ఎకరాల అసైన్డ్, 143.21 ఎకరాల పట్టాభూమి, లగచర్ల రెవెన్యూ పరిధిలో 64 మంది రైతులకు సంబంధించి 72.26 ఎకరాల అసైన్డ్, 212 మంది రైతుల నుంచి 314.13 ఎకరాల పట్టా భూమిని అందించారు. ఇప్పటికే 862.02 ఎకరాలు సేకరించిన అధికారులు మరో 263.23 ఎకరాలు సేకరించాల్సి ఉందని చెప్పారు. సేకరణకు రైతులు అనుకూలం రైతులతో మాట్లాడుతున్నాం. త్వరలో మిగిలిన భూమి సేకరిస్తాం. రైతులు అనుకూలంగా ఉన్నారు. అన్నదమ్ముల, తాతల భాగాల్లో తేడా ఉన్నందున సరి చేసుకుని ఇస్తామని చెబుతున్నారు. వారితో నిరంతరం మాట్లాడుతున్నాం. – కిషన్, తహసీల్దార్ దుద్యాల్ -
నాణ్యమైన పాలే సేకరించాలి
కడ్తాల్: పాడి రైతుల నుంచి నాణ్యమైన పాలు సేకరించాలని తెలంగాణ పాడి పారిశ్రామికాభివృద్ధి సహకార సమాఖ్య (టీజీడీడీసీఎఫ్) చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారి కవిత సూచించారు. కడ్తాల్ పాలశీతలీకరణ కేంద్రం పరిధిలోని సొసైటీల అధ్యక్షులు, వేతన కార్యదర్శులతో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విజయ డెయిరీ ద్వారా సేకరించే పాలు నాణ్య త ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయన్నా రు. పాలు నాణ్యంగా ఉంటేనే వినియోగదారుల మెప్పు పొందగలమని చెప్పారు. కడ్తాల్ పాల శీతలీకరణ కేంద్రం పరిధి నుంచి రాష్ట్రంలోనే అత్యధికంగా నిత్యం 30 వేల లీటర్ల పాలను సేకరిస్తున్నామని చెప్పారు. ఇందులో 3.5, 3.6 ప్యాట్ మాత్రమే ఉంటోందన్నారు. వీటిని బయట మార్కెటింగ్ చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. పాడి ఆవులు, గేదెలకు సరైన దాణా అందించాలని సూచించారు. ఇకనుంచి 8.3నుంచి 8.5 ఎస్ఎన్ఎఫ్ ఉండేలా చూడాలన్నారు. 8.3 కన్నా త క్కువగా ఉన్న పాలు సేకరణకు యోగ్యం కా వని స్పష్టంచేశారు. పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్ బాబు బేరి మాట్లాడుతూ.. పాడి పోషణ, పశువులకు అందించాల్సిన పోషకాహారం, పాల నాణ్యతకు సంబంధించిన అంశాలను సమగ్రంగా వివరించారు. విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ మోహన్ మురళి మాట్లాడుతూ.. పాల సేకరణ, నాణ్యత, నిల్వ, రవాణా అంశాలపై అగవాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ మేనేజర్ ఉదయశ్రీ, సింగిల్ విండో డైరెక్టర్ చేగూరి వెంకటేశ్, వివిధ పాల కేంద్రాల సోసైటీ అధ్యక్షులు, పెయిడ్ సెక్రటరీలు, రైతులు, డెయిరీ సిబ్బంది ఉన్నారు. టీజీడీడీసీఎఫ్ చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారి కవిత కడ్తాల్లో పాడి రైతులకు అవగాహన సమావేశం -
ప్రైవేట్ బడుల దోపిడీ అరికట్టాలి
చేవెళ్ల: ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫాంలు, పెన్నులను అమ్ముతూ దందాను కొనసాగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మహేశ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన జిల్లా విద్యాధికారి కార్యాలయంలోని అసిస్టెంట్ డైరెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు, అధిక ఫీజులు, అడ్మిషన్ పేరిట రూ.లక్షలు వసూళ్లు చేస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి ప్రైవేటు పాఠశాలలను గుర్తించి వాటిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పించకుండా పేద విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నారని మండిపడ్డారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మహేశ్ -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
కొత్తూరు: టిప్పర్ లారీ, బైకు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్నర్వ గ్రామ శివారులో జేపీదర్గా రోడ్డులో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... నందిగామ మండలం మేకగూడ గ్రామానికి చెందిన నరేష్(38) తన బంధువు(వృద్ధురాలు)తో కలిసి బైకుపై ఇన్ముల్నర్వ నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. కాగా మార్గమధ్యలో వేంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా వెనకాల నుంచి వచ్చిన టిప్పర్ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం శంషాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని పరిశీలించారు. -
భక్తిభావం కలిగి ఉండాలి
శ్రీ హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామిజీ యాచారం: భక్తిభావం ఉన్న చోట ప్రజలు సంతోషంగా ఉంటారని, పసిడి పంటలు సస్యశ్యామలంగా ఉంటాయని శ్రీ హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామిజీ పేర్కొన్నారు. తక్కళ్లపల్లి తండాలోని శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో గురువారం వార్షికోత్సవంలో స్వామిజీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు భక్తిభావం పట్ల దృష్టి పెట్టాలని సూచించారు. నూతన దేవాలయాల నిర్మాణం, పూరాతన దేవాలయాలను అభివృద్ధి చేయడం కోసం కృషి చేయాలన్నారు. పర్వతారోహకుడు అంగోత్ తుకారం చిన్న తనంలోనే బంగారు మైసమ్మ దేవాలయాన్ని నిర్మించి ఘనంగా నిత్య పూజలు, ఏటా వార్షికోత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అంగోత్ తుకారాం, మానస దంపతులతో పాటు కుటుంబ సభ్యులు రాందాసు, జంకు, వెంకటేష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. రసీదులు తప్పనిసరి చేవెళ్ల: రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే సమయంలో రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలని మండల వ్యవసాధికారి శంకర్లాల్ సూచించారు. మండలంలోని సీడ్స్, ఫర్టిలైజర్ దుకాణాల్లో వ్యవసాయశాఖ అధికారులు గురువారం దాడులు చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి విత్తనాలు, ఎరువులు, ఫర్టిలైజర్ల నిల్వలను పరిశీలించారు. స్టాక్ రిజిస్టార్లను చెక్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దుకాణాల్లో ఎప్పటికప్పుడు స్టాక్ నిల్వల వివరాలను బోర్డులపై పెట్టాలన్నారు. రైతులకు తప్పనిసరిగా రసీదును అందించాలని సూచించారు. నాణ్యత లేని విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే దుకాణాదారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వసతుల కల్పనకు కృషి అమెజాన్ సీఎస్ఆర్ విభాగాధిపతి తాతాజీ షాబాద్: పేద విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలంటే పాఠశాలలో మెరుగైన మౌలిక సదుపాయాలు ఉండాలని అమెజాన్ సీఎస్ఆర్ విభాగాధిపతి తాతాజీ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని తెలంగాణ మోడల్ స్కూల్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ పవర్ గ్రిడ్ను పర్యావరణవేత్త లిబోకోహెన్, రాజేష్మైసా, రీజనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ వినయ్కుమార్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యా, వైద్యం కోసం అమెజాన్ వెబ్ సర్వీసు ఎంతో ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో షాబాద్లోని ఆదర్శ పాఠశాలనుఅభివృద్ధి చేస్తామన్నారు. కార్పొరేట్ విద్యాలయాలకు దీటుగా సంస్థ మౌలిక వసతులు కల్పించిన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కవిత, అమెజాన్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
రైతు భరోసాలో కత్తెర
ధారూరు: ప్రభుత్వం విడుదల చేసిన రైతు భరోసా నగదుపై మండల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో పలు అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నారు. పట్టా పాసు పుస్తకాల్లో ఉన్న భూ విస్తీర్ణం కంటే తక్కువగా భరోసా డబ్బులు తమ ఖాతాల్లో జమ అయ్యాయని గురువారం మండిపడ్డారు. అందులో మచ్చుకు.. తరిగోపుల గ్రామానికి చెందిన అల్లాడ రాంచంద్రారెడ్డికి 1.33 ఎకరాల పొలం ఉంటే కేవలం 29 గుంటలకే రైతు భరోసా డబ్బులు వచ్చాయి. రూ.10,950కి బదులుగా రూ.4,350 ఖాతాలో జమ అయ్యాయని వాపోయాడు. అంతా పంట పొలమే అయినా మొత్తం డబ్బులు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై వ్యవసాయశాఖ అధికారులను సంప్రదిస్తే.. ప్రభుత్వం చేయించిన ఆన్లైన్ సర్వే ప్రకారం నగదు జమ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం. అదే గ్రామానికి చెందిన ఆనంద్రెడ్డి, మహేందర్రెడ్డి, పాండురంగారెడ్డి తదితరులు సైతం భూమి ఎక్కువ ఉంటే డబ్బులు సగానికి సగం తగ్గించి వేశారని లబోదిబోమంటున్నారు. సగానికి సగం భూమి తగ్గించి రైతుల ఖాతాలో నగదు జమ లబోదిబోమంటున్న అన్నదాతలు వెంటనే జమ చేయాలి పట్టా పాసుపుస్తకాల్లో ఎన్ని ఎకరాలు ఉంటే అంతకు భరోసా నగదు జమ చేయాలి. సాగు చేసిన పొలానికి సైతం పెట్టుబడి సాయం అందక పోవడం బాధాకరం. రైతు భరోసాలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తాం. శాసనసభ స్పీకర్ ఈ విషయంలో తగిన చొరవ తీసుకుని పొలం ఉన్నంత మేర డబ్బులు వేయించాలి. – జైపాల్రెడ్డి, బీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు -
టీచింగ్ స్టాఫ్.. స్టాప్!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, కేన్సర్, ఫీవర్ ఆస్పత్రులు ఆరోగ్య ప్రదాయినులుగా నిలుస్తున్నాయి. ఆయా ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేక వైద్య సేవల కోసం రిఫరల్ కేసులు పెద్ద సంఖ్యలో వస్తుంటాయి. ఇంతటి ప్రాధాన్యమున్న బోధనాస్పపత్రుల్లో టీచింగ్ స్టాఫ్ కొరత వేధిస్తోంది. పోస్టులు భర్తీ చేయడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 40 శాతం మంది వైద్యులు (టీచింగ్) పోస్టులు ఖాళీలు ఉన్నాయని సమాచారం. వైద్య కళాశాలకు అవసరమైన పోస్టులను జాతీయ మెడికల్ కౌన్సిల్ నిర్ణయిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలతో కలిసి ఉన్న ఆస్పత్రి, అందులో పడకలు ఆధారంగా పోస్టులను కేటాయిస్తోంది. దీంతో ఈ రెండింటి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఫలితంగా మెడికల్ కళాశాలల్లో బోధన సిబ్బంది సరిపడా ఉన్నారంటే ఉన్నారు. లేరంటే లేరనే వాదనలు వినిపిస్తున్నాయి. సమర్థించుకునేవారు ఎన్ఎంసీ లెక్కలను చూపిస్తున్నారు. ఈ అంకెల ఆధారంగా చూస్తే కళాశాల అవసరాల కంటే ఎక్కువ మంది ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే.. రాష్ట్ర ప్రభుతకేటాయింపులను పరిశీలిస్తే మాత్రం అసలు విషయం వెలుగుచూస్తోంది. రోగులకు అందే సేవలు, వైద్య విద్యార్థుల తరగతులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం పరిశోధనలపై ఫోకస్ చేసే అవకాశమే లేదని పలువురు వైద్యులు పేర్కొంటున్నారు. వైద్య సేవలపై ప్రభావం.. నగరంలోని ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగుల్లో అత్యధిక శాతం మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారే ఉంటారు. సిబ్బంది కొరతతో నాణ్యమైన వైద్య సేవలు అందించే అవకాశం లేకుండాపోతోంది. బెడ్లు ఎక్కువ, వైద్యులు సంఖ్య తక్కువగా ఉండటమే దీనికి కారణంగా కనిపిస్తోంది. కొన్ని విభాగాల్లో ఒక్కరూ లేని పరిస్థితి. ఉదాహరణకు గాంధీ వైద్య కళాశాలకు ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం 147 మంది బోధన సిబ్బంది (ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్) ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు కేటగిరీలు కలిపి 330 మందికిపైగా సిబ్బందిని కేటాయించింది. ప్రస్తుతం ఇక్కడ పని చేస్తున్న వారు సుమారు 200 మంది ఉన్నారు. మిగతా 130 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ 2 వేల పడకల ఆస్పత్రి ఉంది. నిత్యం వేలాది మంది ఓపీ, ఐపీ ఉంటుంది. ఉస్మానియా పరిధిలోని ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్ ఆస్పత్రుల్లోనూ సుమారు 40 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. దీంతో ఉన్న వారిపై ఒత్తిడి పెరుగుతోందని చెబుతున్నారు. ఖాళీల ప్రభావం రోగులకు అందించే సరైన వైద్యం అందించే అవకాశం లేకుండాపోతోంది. రోగులు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులకు సరైన బోధన అందుతోందా అంటే అదీ కష్టమే అంటున్నారు.వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది కొరత పోస్టుల భర్తీపై ఎన్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం చెరో దారి వైద్య విద్య, రోగులకు సేవలు, పరిశోధనలపై తీవ్ర ప్రభావం గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, కేన్సర్, ఫీవర్ ఆస్పత్రుల్లో పని భారం పరిశోధనలపై ఫోకస్ నిల్.. వైద్య కళాశాలల్లో బోధనతో పాటు రోగులకు అందించే వైద్య సేవలు, పరిశోధనలూ కీలకంగా ఉంటాయి. బోధనాస్పత్రుల్లో సిబ్బంది కొరతతో ఉన్న వారిపై ఒత్తిడి పెరుగుతోంది. పలు రకాల కమిటీల్లో సభ్యులుగా ఉండటం, పరిపాలనా విధులు అప్పగించడం వంటివి అదనపు భారంగా మారుతున్నాయని పలువురు వైద్యులు పేర్కొంటున్నారు. పరిశోధనలు చేపట్టే అవకాశమే లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పరిశోధనలు ప్రారంభించాలని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కావడంలేదని ఆరోపిస్తున్నారు. 2023లో చివరిసారిగా నియామకాలు చేపట్టారు. అనంతరం రెండేళ్లు కావస్తున్నా ఖాళీల భర్తీకి ఎలాంటి చర్యలు చేపట్టడంలేదంటున్నారు. కాగా.. కొంత మంది వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్ చేసుకుంటున్నారన్న ఆరోపణలూ లేకపోలేదు. -
ఇందిరమ్మ నిర్మాణాల్లో వేగం పెంచండి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం, వన మహోత్సవంపై బుధవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బేస్మెట్ లెవల్ పూర్తయిన ఇళ్లకు బిల్లులు చెల్లించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 56.33శాతం ఇళ్ల గ్రౌండింగ్ పూర్తయిందని, మిగిలినవి కూడా త్వరగా ప్రారంభించాలని తెలిపారు. 25లోపు ప్రాంభించాలి జూన్ 25 వరకు అన్ని ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేలా చూడాలని కలెక్టర్ సూచించారు. ఇందుకోసం అవసరమైతే పేద మహిళకు బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు చేయించాలన్నారు. గ్రౌండింగ్ పూర్తయిన 15 రోజుల్లో పనులు లెంటల్ లెవెల్కు చేరేలా చూడాలన్నారు. 25లోపు కూడా గ్రౌండింగ్ కాని ఇళ్లను రద్దు చేసి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని తెలిపారు. ఇప్పటి వరకు మొయినాబాద్, నార్సింగి, ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల మున్సిపాలిటీల్లో తక్కువ గ్రౌండింగ్ నమోదైందని వివరించారు. ఆయా మండలాల అధికారులు అప్రమత్తం కావాలని దిశానిర్దేశం చేశారు. అందుబాటులో ఉన్న ప్రాంతాల నుంచి ఇసుక తెచ్చుకోవాలని సూచించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ వర్షాకాలం ప్రారంభమైనందున గ్రామ, మున్సిపల్ పరిధిలో ఈనెల 20నుంచి 28 వరకు పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. డ్రైనేజీలను శుభ్రం చేయించి, రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలు లేకుండా చూడాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా చూడాలని, లీకేజీలను సరిచేయాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, రోడ్లపై గుంతలను పూడ్చాలని ఆదేశించారు. జూలై మొదటి వారంలో ఆడిట్ బృందాలు తనిఖీకి వస్తాయని, సరిగా పనిచేయని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను గుర్తించి, గుంతలు తీయాలని తెలిపారు. సమావేశంలో డీఆర్ఓ సంగీత, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, సోషల్ వెల్ఫేర్ అధికారి రామారావు, డీపీఓ సురేష్ మోహన్, మైనార్టీ వెల్ఫేర్ అధికారి నవీన్ కుమార్రెడ్డి, బీసీ సంక్షేమ అధికారి కేషురామ్, హౌసింగ్ పీడీ హనుమంతు నాయక్, గ్రామీణ అభివృద్ధి శాఖ పీడీ శ్రీలత, మెప్మా పీడీ మల్లీశ్వరి, డీఈఓ సుశీందర్రావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులతో సమీక్ష -
తండ్రిని చంపిన తనయుడు
కందుకూరు: ఓ కొడుకు కన్నతండ్రిని దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పులిమామిడిలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పసుపుల చిన్న జంగయ్య(65), పద్మమ్మ భార్యభర్తలు. తముకున్న అర ఎకరం పొలాన్ని సాగు చేయడంతో పాటు గొర్రెలను పోషిస్తూ బతుకుతున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. అందరికీ వివాహాలు కాగా కొడుకు శేఖర్ సెంట్రింగ్ పనిచేస్తూ భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. కొంతకాలంగా పొలాన్ని అమ్మాలంటూ శేఖర్ తల్లిదండ్రులను వేధిస్తున్నాడు. ఇటీవల పాత ఇంటి స్థలంలోనే కొత్త ఇల్లు నిర్మిస్తున్నారు. పొలం అమ్మి ఇల్లు పూర్తి చేద్దామని శేఖర్ గొడవ పడుతున్నాడు. ఈవిషయమై పలుమార్లు గ్రామస్తుల మధ్య పంచాయితీ నిర్వహించగా అతన్ని మందలించారు. పిల్లర్లు, స్లాబ్ పూర్తి కావడంతో జంగయ్య దంపతులు పరదాలు కట్టుకుని ఇక్కడే ఉంటున్నారు. శేఖర్ గ్రామంలోని ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. మంగళవారం రాత్రి పద్మమ్మ ఇదే ఊరిలో ఉండే తన బిడ్డ ఇంటికి వెళ్లింది. దీంతో జంగయ్య ఒక్కడే కొత్త ఇంటి వద్ద నిద్రపోయాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత అక్కడికి వెళ్లిన శేఖర్ నిద్రపోతున్న తండ్రి తలపై బండరాయితో మోది, కట్టెతో కొట్టి చంపేశాడు. అనంతరం ఏమీ ఎరగనట్లు అద్దె ఇంటికి వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం 5.45 గంటల సమయంలో ఇంటికి వచ్చిన పద్మమ్మ రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను చూసి గుండెలు బాదుకుంది. అక్కడికి చేరుకున్న గ్రామస్తులు, బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. శేఖరే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని అతనిపై దాడికి ప్రయత్నించగా అక్కడికి చేరుకున్న సీఐ సీతారామ్, ఎస్ఐ సైదులు అతన్ని అదుపులోకి తీసుకుని, పీఎస్కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తన కొడుకే ఈ దారుణానికి పాల్పడ్డాడని పద్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.వృద్ధాప్యంలో అండగా నిలవాల్సిన కన్నకొడుకే తండ్రి పాలిట యముడయ్యాడు. పొలం అమ్మనివ్వడం లేదని కక్ష పెంచుకుని.. నిద్రపోతున్న తండ్రిపై పాశవికంగా దాడి చేసి, కాటికి పంపించాడు. కందుకూరు మండలం పులిమామిడిలో దారుణం భూమి అమ్మనివ్వడం లేదని కక్ష పెంచుకున్న కొడుకు బండరాయితో మోది, కర్రతో బాది హత్య పోలీసుల అదుపులో నిందితుడు -
బస్ పాస్ చార్జీలు తగ్గించాలి
షాద్నగర్: బస్ పాస్ల ధరలు పెంచడంతో విద్యార్థులపై భారం పడుతోందని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పవన్ చౌహాన్ అన్నారు. పెంచిన 20శాతం చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బుధవారం డిపో మేనేజర్ సుధాకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన తప్పదని హెచ్చరించారు. విద్యార్థి నాయకులు ఆకాశ్, రాహుల్, శ్రీను పాల్గొన్నారు. నాణ్యమైన విద్యుత్ కోసం బీఆర్ఎస్ ధర్నా ఆమనగల్లు: వ్యవసాయానికి కోతలు లేకుండా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం పలువురు రైతులతో కలిసి గట్టుప్పలపల్లి సబ్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. చిన్నపాటి వర్షం కురిసినా, గాలివీచినా గంటల తరబడి సరఫరా నిలిపేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు చంద్రశేఖర్రెడ్డి, వెంకటయ్య, కృష్ణయ్య, రాజు, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు షాబాద్: సమాచార కమిషనర్గా నియమితులైన పీవీ శ్రీనివాస్కు పలువురు జర్నలిస్టులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్ మల్లారెడ్డి బుధవారం ఆయనను కలిసి పూలబొకే అందజేశారు. గడ్డమల్లయ్యగూడలో ఐఈఎస్ అధికారుల పర్యటన యాచారం: ఐఈఎస్(ఇండియన్ ఎకనామికల్ సర్వీస్) అధికారుల బృందం బుధవారం గడ్డమల్లయ్యగూడలో పర్యటించింది. ఈజీఎస్ నిధులతో గ్రామంలో చేపట్టిన డంపింగ్ యార్డ్, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, పంచాయతీ భవనాలను పరిశీలించారు. రికార్డుల నిర్వహణ, గ్రామ పాలనపై అధ్యయనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి మాధవరావు, ఎంపీడీఓ బాలశంకర్, ఎంపీఓ శ్రీలత, ఈజీఎస్ ఏపీఓ లింగయ్య, ఈసీ శివశంకర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి స్వప్న తదితరులు పాల్గొన్నారు. ‘శిల్పా’ ఫ్లై ఓవర్కు పీజేఆర్ పేరు 28న ప్రారంభించనున్న సీఎం రేవంత్రెడ్డి సాక్షి, సిటీబ్యూరో: కొండాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు ట్రాఫిక్ చిక్కులు తొలగించేందుకు నిర్మించిన శిల్పా లేఔట్–2 ఫ్లై ఓ వర్ను ఈ నెల 28న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించనున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దివంగత పి.జనార్దన్రెడ్డి (పీజేఎర్) జ్ఞాపకార్థం ఈ ఫ్లైఓవర్కు పీజేఆర్ పేరు పెట్టాలని సీఎం సూచించారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవానికి ముందే పెయింటింగ్, సుందరీకరణలతో సహా అన్ని పనులను పూర్తి చేయాలని మేయర్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ను ఆదేశించారు. నగర పౌరులకు ప్రయోజనం చేకూర్చే నాణ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అందించడానికి జీహెచ్ఎంసీ కట్టుబడి ఉందని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. -
హైడ్రా కమిషనర్ ఫీల్డ్ విజిట్
సాక్షి, సిటీబ్యూరో: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ఆయన క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. పోచారం మున్సిపాలిటీలోని సంస్కృతి టౌన్షిప్తో పాటు ఏకశిలా నగర్కు సంబంధించి వచ్చిన ఫిర్యాదుల పూర్వాపరాలను పరిశీలించారు. సంస్కృతి టౌన్షిప్లో 100 ఫీట్ల రహదారికి అడ్డంగా స్థల యజమానులు పెట్టిన గేట్లను హైడ్రా కమిషనర్ తెరిపించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 ఫీట్ల రహదారికి మార్కింగ్ చేసి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొర్రెముల గ్రామంలోని ఏకశిలానగర్ లేఔట్కు సంబంధించి వివాదం పైనా ఆయన ఆరా తీశారు. కోర్టు తీర్పులు తమకు అనుకూలంగా ఉన్నా కబ్జాదారులు ఇల్లు కట్టుకొనివ్వడం లేదని ప్లాట్ల యజమానులు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ వివాదానికి సంబంధించి ఇరుపక్షాలను పిలిచి అన్ని రికార్డులను పరిశీలిస్తామని రంగనాథ్ హామీ ఇచ్చారు. నెక్నాంపూర్లో ప్రధాన రహదారి నిర్మాణానికి ఉన్న ఆటంకాలను ఆయన పరిశీలించారు. అక్కడ దాదాపు 20 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉండగా కొందరు స్థానికులు అది తమదే అంటూ రోడ్డు వేయనీయకుండా అడ్డుకోవడాన్ని ఆయన పరిశీలించారు. హైటెన్షన్ వైర్ల కింద నిర్మిస్తున్న రోడ్డుకు ఆటంకాలు కల్పించవద్దని కమిషనర్ స్థానికులకు సూచించారు. దీనిపైనా వచ్చే వారం సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. గచ్చిబౌలిలోని జనార్దన హిల్స్ వద్ద జరుగుతున్న వరద కాలువ పనులను, చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణలు ఆయన పరిశీలించారు. ఖైతలాపూర్ వద్ద ముల్లకత్వ చెరువు నుంచి ఐడీఎల్ చెరువుకు వెళ్లే వరద కాలువ ఆక్రమణలను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. ఐడీఎల్ చెరువు నుంచి కూకట్పల్లి నాలాలకు వెళ్లే వరద కాలువ ఆక్రమణలను తనిఖీ చేశారు. ఐడీఎల్ చెరువు నుంచి వెళ్లే నాలా ఆక్రమణ జరిగినట్టు గుర్తించిన హైడ్రా కమిషనర్ నాలా విస్తరణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మూసాపేట మెట్రో స్టేషన్ పరిసరాల్లో నాలా కుంచించుకుపోవడంతో వరద ముంచెత్తుతోందని స్థానికులు రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. శివశక్తినగర్లో నాలా విస్తరణతో ఈ సమస్య పరిష్కారం అవుతుందని, వెంటనే ఆ పనులు చేపట్టాలని అధికారులకు రంగనాథ్ సూచించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై విచారణ -
మూత్రశాలలు శుభ్రం చేసిన విద్యార్థులు
ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు, తల్లిదండ్రులు షాద్నగర్రూరల్: ఫరూఖ్నగర్ మండల పరిఽధిలోని నేరళ్లచెరువు గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం ఉపాధ్యాయులు విద్యార్థులతో మూత్రశాలలను శుభ్రం చేయించారు. దీనిపై తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాబుద్ధులు చెప్పి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే చిన్నారులతో మూత్రశాలలను శుభ్రం చేయించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలో స్వీపర్ చేయాల్సిన పనులను పిల్లలతో చేయిస్తున్నారని.. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఉపాధ్యాయులపై మండిపడుతున్నారు. చిన్నారులు మూత్రశాలలను శుభ్రం చేస్తున్న సమయంలో గ్రామస్తులు వీడియో తీశారు. చిన్నారులతో ఎందుకు చేయిస్తున్నారని ప్రధానోపాధ్యాయురాలితో పాటు ఉపాధ్యాయులను ప్రశ్నించగా అలాంటిది ఏమీ లేదని బుకాయించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
దివ్యాంగుడికి చేయూత
ఆమనగల్లు: పట్టణానికి చెందిన దివ్యాంగుడు వస్పుల ఆనంద్కుమార్ కుటుంబానికి హోప్ ఫర్ స్పందన సంస్థ అండగా నిలిచింది. అతనికి రూ.70 వేలతో కిరాణా దుకాణం పెట్టించింది. నార్త్ అమెరికా తెలుగు సంఘం ఆర్థిక సహకారంతో ఏర్పాటైన ప్రవాస భారతీయుల స్వచ్ఛంద సేవాసంస్థ దివ్యాంగుల ఉపాధికి చేయూతనిస్తోంది. ఇందులో భాగంగా పట్టణానికి చెందిన దివ్యాంగుడు ఆనంద్కుమార్కు రిఫ్రిజిరేటర్, కిరాణ సామన్లు అందించి స్వయం ఉపాధి కల్పించింది. హోప్ ఫర్ స్పందన తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త డాక్టర్ అరికపుడి రఘు బుధవారం షాపును ప్రారంభించారు. ఇప్పటివరకు 119 మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించామని చెప్పారు. వెయ్యిమందికి చేయూతనివ్వడమే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు కోట లక్ష్మీ నర్సింహం, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సకాలంలో రుణాలు చెల్లించాలి
చేవెళ్ల: సొసైటీ బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని నాబార్డ్ డీసీఓ సుధాకర్, డీడీఎం హర్ష, డీసీసీబీ ఎఫ్ఎల్సీ లక్ష్మీకాంత్, డీసీఓ నాగేశ్వర్ అన్నారు. చేవెళ్ల సహకారం సంఘం కార్యాలయంలో బుధవారం సోసైటీ చైర్మన్ దేవర వెంకట్రెడ్డి అధ్యక్షతన రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకోసం పనిచేసే సోసైటీలను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా రైతులపైనే ఉందన్నారు. మార్టిగేజ్ ద్వారా భూములపై అందించే రుణాల పరిమితిని పెంచుతున్నాట్లు స్పష్టంచేశారు. రుణాల చెల్లింపులో ఉత్తమ ఖాతాదారులుగా ఎంపికై న మధుసుధన్రెడ్డి, గిరీష్రెడ్డి, ఆనంద్ను సన్మానించారు. కార్యక్రమంలో సొసైటీ బ్రాంచ్ మేనేజర్ బాలకృష్ణ, కార్యదర్శి వెంటకయ్య, డైరెక్టర్లు మధుసుధన్రెడ్డి, ప్రతాప్రెడ్డి, శ్యామలయ్య, నర్సింలు, రాములు, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. నాబార్డ్ డీసీఓ సుధాకర్, డీడీఎం హర్ష సొసైటీ బ్యాంకుల ఉత్తమ ఖాతాదారులకు సన్మానం -
కొత్త కలెక్టర్.. పెట్టండి నజర్!
ఇదీ పరిస్థితి ● హైదరాబాద్ జిల్లా రెవెన్యూ పరిధిలో సుమారు 16 మండలాలు ఉన్నాయి. పదేళ్ల క్రితం వరకు ల్యాండ్ బ్యాంక్లో 1,138 పార్శిల్స్ ఉండగా ప్రస్తుతం వాటి 1075 పార్శిల్స్కు చేరినట్లు అధికార గణాంకలు స్పష్టం చేస్తున్నా.. వాస్తవ పరిస్థితిలో పార్శిల్స్ మరింత తగ్గినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద 890 ల్యాండ్ పార్శిల్స్లో ఎలాంటి వివాదాలు లేకుండా 40,66,914.08 చదరపు గజాల విస్తీర్ణం గల ఖాళీ స్థలం ఉంది. మిగతా పార్శిల్స్లో సుమారు 11,45,334.95 చదరుపు గజాల విసీర్ణం గల ఖాళీ స్ధలం ఆక్రమితకు గురైనట్లు తెలుస్తోంది. సుమారు 169 పార్శిల్స్లోని దాదాపు 11,93,595.12 చదరపు గజాల విస్తీర్ణ గల ఖాళీ స్థలంతోపాటు 445098.64 చదరపు గజాల ఆక్రమిత భూమి కోర్టు కేసుల్లో ఉనట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో భూమి బంగారమే. గజం స్థలం విలువ తులం బంగారానికి కంటే అధికమే. ఇప్పటివరకు రెవెన్యూ యంత్రాంగం ఉదాసీన వైఖరి, క్షేత్రస్థాయిలో తహసీల్ అధికారులు, సిబ్బంది అండదండలతో ప్రభుత్వ ఖాళీ స్థలాలు కనుమరుగవుతూనే ఉన్నాయి. నగరంలో రెవెన్యూ అంటే ప్రభుత్వ స్థలాల పరిరక్షణే ప్రధానంగా పని చేయాల్సి ఉంటుంది. కానీ.. కంచే చేను మేసిన విధంగా రెవెన్యూ యంత్రాంగం పనితీరు తయారైంది. ఇటీవల కొత్తగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన యువ ఐఏఎస్ అధికారిణి హరిచందన దాసరి.. సర్కారు స్థలాల పరిరక్షణపై దృష్టి సారించాల్సిన అవసరముందని నగర పౌరులు ఆశిస్తున్నారు. అందరి మాదిరిగానే కేవలం సమావేశాలు, ఆదేశాలకు పరిమితమైతే మాత్రం.. సర్కారు స్థలాల పరిరక్షణ హుళక్కే అన్న చందంగా మారుతుంది. కబ్జాదారులపై ఆమె కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉంది. ప్రభుత్వ భూముల్లో పాగా.. నగరంలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అక్రమార్కులు దర్జాగా పాగా వేస్తున్నారు. ప్రభుత్వ స్థలం అంటూ సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నా.. వాటిని సైతం తొలగిస్తూ దర్జాగా తొలగించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఖాళీ స్థలాలపై నిర్మాణాలు వెలసిన తర్వాత ఫిర్యాదులు, ఒత్తిళ్లు వస్తే గానీ స్థానిక రెవెన్యూ యంత్రాంగం స్పందించక పోవడం నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపానికి అద్దం పడుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో సర్కారు స్థలాల్లో వెలుస్తున్న అక్రమ కట్టడాలపై చర్యలకు ఉపక్రమించేలోపు.. అవి కోర్టు వివాదాల్లో చిక్కుకోవడం సర్వసాధారణంగా తయారైంది. ఇలా కోర్టు కేసుల్లో చిక్కుకున్న వందల కోట్ల రూపాయల విలువైన భూములపై సమగ్ర ఆధారాలు, వాదనలు లేక ఏళ్ల తరబడి పెండింగ్లో మగ్గడం షరామాములుగా మారింది. కొన్ని కేసులకు ఏళ్ల తరబడి కౌంటర్ దాఖలు కాని పరిస్థితి కూడా లేకపోలేదన్న ఆరోపణలు వినపిస్తున్నాయి. రెవెన్యూ యంత్రాంగం వద్ద స్థలాలకు సంబంధించిన సమగ్ర ఆధారాలు లేని కారణంగా క్రమంగా అక్రమ కట్టడాలు సక్రమ కట్టడాల జాబితాలో చేరిపోతున్నాయి. కలెక్టర్లు మారినప్పుడల్లా.. జిల్లా కలెక్టర్ మారి కొత్త వచ్చినవారు సర్కారు స్థలాలపై దృష్టి సారించడం.. పరిరక్షణకు పలు చర్యలు చేపట్టినా.. క్షేత్ర స్థాయిలో అమలు మూణ్నాళ్ల ముచ్చటగానే తయారవుతోంది. ఆరేళ్ల క్రితం అప్పటి కలెక్టర్ యోగితా రాణా ప్రత్యేకంగా ల్యాండ్ బ్యాంక్ యాప్ రూపకల్పన చేసి ప్రభుత్వ స్థలాలకు కంచె, సైన్ బోర్డుల ఏర్పాటు, ఆన్లైన్ మానిటింగ్, ఫొటోలు తీసి వెబ్సైట్లో భద్రపర్చడం లాంటి చర్యలు చేపట్టారు. వీఆర్వోలకు బాధ్యతలు అప్పగించి ప్రతిరోజూ భూములపై పర్యవేక్షణతో పాటు పక్షం రోజులకోసారి తనిఖీ చేసి తగిన సమాచారాన్ని సంబంధిత తహసీల్దార్, భూ పరిరక్షణ అధికారులకు అందించేలా కసరత్తు చేశారు. ● యోగితా రాణా బదిలీ తర్వాత ల్యాండ్ బ్యాంక్ యాప్ అమలు మూలకుపడింది. ఆరు నెలల క్రితం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ల్యాండ్ బ్యాంక్ యాప్ను పునరుద్ధరించి భూముల వివరాల అప్డేట్ ప్రక్రియతో పాటు రక్షణ కోసం చర్యలకు ఉపక్రమించినా.. ఆచరణలో ముందుకు సాగలేదు. ప్రభుత్వ జాగాల్లో అక్రమార్కుల పాగా గ్రేటర్లో మాయమవుతున్న ఖాళీ స్థలాలు సైన్ బోర్డులు పెట్టినా మూణ్నాళ్ల ముచ్చటే.. కబ్జాదారులకు క్షేత్రస్థాయిలో అండదండలు రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యమే కారణం కఠినంగా వ్యవహరించాలని హరిచందనకు పౌరుల వినతి -
స్థానిక పోరులో సత్తా చాటాలి
షాబాద్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు సత్తా చాటాలని బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ ఆకాంక్షించారు. మండలంలోని దామర్లపల్లి గ్రామంలో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు కమ్మరి దయాకర్చారి ఆధ్వర్యంలో యువజన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బోకుల మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా బోకుల మహేందర్, ఉపాధ్యక్షులు బండ కుమార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బర్క కృష్ణ మాట్లాడుతూ.. బీసీలు ఐకమత్యంతో ఉంటూ ముందుకు సాగాలని, అప్పుడే ఏదైనా సాధించగలమన్నారు. దేశ వ్యాప్తంగా బీసీలను చైతన్యం చేసి గ్రామస్థాయి నుంచి బలమైన ఉద్యమాన్ని నిర్మించి హక్కులను సాధించాలన్నారు. దేశ జనాభాలో బీసీలు అధిక శాతం ఉన్నప్పటికీ అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా అణచివేతకు గురవుతూనే ఉన్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, నాయకులు లింగం, మచ్చేందర్, వెంకటేష్ముదిరాజ్, వరలక్ష్మి, శారదగౌడ్, నర్సింహలు, బాల్రాజ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ -
అసంపూర్తి పనుల పరిశీలన
బడంగ్పేట్: కార్పొరేషన్ పరిధిలోని దావుత్ఖాన్గూడలో నిలిచిపోయిన పాఠశాల నిర్మాణ పనులు బుధవారం రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ జ్యోత్స్నశివారెడ్డితో కలిసి మాజీ మేయర్ చిగురింత పారిజాత సందర్శించారు. ఈ సందర్భంగా పారిజాత మాట్లాడుతూ.. ఈ ఏడాది అకాడమిక్లోపు పాఠశాల నిర్మాణ పనులు పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని గతంలో కమిషన్ మెంబర్కు విన్నవించగా ఆ ఫిర్యాదు మేరకు సందర్శించారన్నారు. ఒకేచోట డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీలు ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. బడంగ్పేటలోని జిల్లా పరిషత్ పాఠశాల, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలలను సందర్శించి ఆమె వివరాలు తీసుకున్నారన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ కృష్ణయ్య, మాజీ కార్పొరేటర్ సుదర్శన్రెడ్డి, నాయకులు బోయపల్లి రాఘవేందర్రెడ్డి, రాళ్లగూడం శ్రీనివాస్రెడ్డి, గట్టు బాలకృష్ణ, బి.కుమార్, విజయ్ తదితరులు ఉన్నారు. -
ABCD ముద్దు
గురువారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2025కనుమరుగవుతున్న తెలుగు మీడియంఅఆలు వద్దు సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రైవేటులోనే కాదు ప్రభుత్వ స్కూళ్లలోనూ తెలుగు మీడియం కనుమరుగవుతోంది. తెలుగు ఒక సబ్జెక్టుగా మినహా.. మిగిలినవన్నీ ఆంగ్ల మాధ్యమంలోనే బోధిస్తున్నారు. భవిష్యత్తు మొత్తం ఇంగ్లిష్తోనే ముడిపడి ఉంటుందని తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు సైతం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నమెంట్ స్కూళ్లలో కూడా ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రవేశపెట్టింది. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో పుస్తకాలను ముద్రిస్తోంది. విద్యార్థులంతా ఇంగ్లిష్ మీడియంపైనే మక్కువ చూపుతుండటంతో.. తెలుగు మీడియం చదివి, ఉద్యోగం చేస్తున్న ఉపాధ్యాయులు సైతం ఇంగ్లిష్ నేర్చుకుని పాఠాలు బోధించాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా 1,300పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1.30 లక్షల మందికిపైగా చదువుతున్నారు. వీరిలో కేవలం 15 వేల మంది మాత్రమే తెలుగు మీడియంలో అభ్యసిస్తున్నారు. పూర్వ ప్రాథమిక దశలోనే చిన్నారులను ఇంగ్లిష్ మీడియంలో చేర్పిస్తుండటంతో తెలుగు మీడియం స్కూళ్ల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ప్రైవేటులో ఒక్క తెలుగు మీడియం స్కూల్ లేకపోవడంపై భాషా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్బన్లో ఫుల్.. తండాల్లో నిల్.. జిల్లాలో మొత్తం 3,203 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉండగా, వీటిలో 9,50,079 మంది చదువుతున్నారు. 1,637 ప్రైవేటు స్కూళ్లలో 6,06,140 మంది, 107 సీబీఎస్ఈ స్కూళ్లలో 1,34,063 మంది, 10 ఐసీఎస్ఈ పాఠశాలల్లో 14,008 మంది చదువుతున్నారు. మిగిలిన వారంతా ప్రభుత్వ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వసతి గృహాలు, కేజీబీవీలు, జ్యోతి బాపూలే వసతి గృహాల్లో అభ్యసిస్తున్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. కోర్ సిటీకి ఆనుకుని ఉన్న ప్రభుత్వ పాఠశాలు సహా మండల కేంద్రాల్లోని ప్రభుత్వ స్కూళ్లకు విద్యార్థులు పోటెత్తుతున్నారు. మారుమూల తండాల్లోని స్కూళ్లకు మాత్రం ఆశించిన ఆదరణ లభించడం లేదు. గత విద్యా సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 96 ప్రభుత్వ పాఠశాలల్లో జీరో పర్సంటేజీ అడ్మిషన్లు నమోదయ్యాయి. సింగిల్ టీచర్, మధ్యాహ్న భోజన పంపిణీ, పాఠశాల నిర్వహణ భారంగా మారడంతో గతేడాదే వీటిని మూసివేశారు. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకునే ప్రక్రియలో భాగంగా జిల్లా విద్యాశాఖ బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది. ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను అభ్యర్థిస్తున్నారు. అయినప్పటికీ ఆశించిన స్పందన లభించడం లేదు. న్యూస్రీల్ ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లిష్కే మొగ్గు భవిష్యత్తు ఆంగ్లానిదేననే భావనలో తల్లిదండ్రులు, విద్యార్థులు వెనుకాడుతున్న తల్లిదండ్రులు.. కొందుర్గు మండలం రామన్నగూడతండా, జిల్లెడుచౌదరిగూడ మండలం వేపకుంచతండా, దారరగిద్దతండా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది కూడా అడ్మిషన్లు రాలేదు. చేవెళ్ల మండలం నారాయణదాసుగూడ, జాలగూడ, ఇబ్రహీంపల్లిలోనూ ఈసారి కూడా జీరో అడ్మిషన్లే. షాబాద్ మండలం మల్లారెడ్డిగూడ పాఠశాల రెండేళ్లుగా మూతబడి ఉంది. బడిబాటలో భాగంగా ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి విద్యార్థులను పంపాల్సిందిగా కోరినా.. ఒక్క అడ్మిషన్ కూడా కాలేదు. కొత్తూరు మండలం పీఎస్రెడ్డిపాలెం స్కూలు మూతపడింది. ఉపాధ్యాయులు తెరిచే ప్రయత్నం చేసినా.. తల్లిదండ్రుల నుంచి స్పందన రావడం లేదు. శంకర్పల్లి మండలం కచ్చిరెడ్డిగూడ పాఠశాలో ఇప్పటి వరకు కేవలం రెండు అడ్మిషన్లు మాత్రమే నమోదయ్యాయి. లచ్చిరెడ్డిగూడ పాఠశాలల్లో కూడా ఒక్క అడ్మిషన్ కూడా రాలేదు. లక్ష్మారెడ్డిగూడ, ఇరుకుంటతండా స్కూల్లో అడ్మిషన్లు లేక గతంలో మూసివేశారు. ప్రస్తుతం లక్ష్మారెడ్డిగూడలో నాలుగు, ఇరుకుంట తండాలో రెండు అడ్మిషన్లు అయినా.. వీటి భవితవ్యం ప్రశ్నార్థకమే. మొయినాబాద్ మండలం చిన్నషాపూర్ స్కూల్ను గతంలో అడ్మిషన్లు లేక మూసేశారు. ఇటీవల ఐదురుగు విద్యార్థులు చేరారు. -
ఆదరణ తగ్గుతున్న ‘గ్రామీణాభివృద్ధి’
ఏజీవర్సిటీ: 1980 దశకం వరకు చేసిన ప్రయత్నాలతో పోలిస్తే కొన్ని దశాబ్దాలుగా అంతర్జాతీయ స్థాయిలో గ్రామీణాభివృద్ధి అనే అంశం ఆదరణ కోల్పోతోందని ఎన్ఐఆర్డీపీఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జి.నరేంద్రకుమార్ అన్నారు. రాజేంద్రనగర్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ సంస్థ(ఎన్ఐఆర్డీపీ)లో ప్రపంచ గ్రామీణాభివృద్ధి దినోత్సవ పోస్టర్ను బుధవారం ఆవిష్కరించారు. ఇందులో ప్రధానంగా మూడు సంస్థలు ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సెంటర్(సీఐఆర్డీఏపీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్(ఎన్ఐఆర్డీపీఆర్), రూరల్ ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ(ఆర్ఈఈడీఎస్)లు పాల్గొన్నాయి. ఆయన మాట్లాడుతూ జూలై 6న ప్రపంచ గ్రామీణాభివృద్ధి దినోత్సవం సందర్భంగా గ్రామీణాభివృద్ధి విధానాలు, కార్యక్రమాలను పంచుకోవడానికి రాజకీయ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు గ్రామీణ వర్గాలతో ముఖాముఖి చర్చలు జరుపుతున్నారన్నారు. ప్రొఫెసర్ అనిల్ కె.గుప్తా పన్ని మాట్లాడుతూ అభివృద్ధి పటంలో ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయని అన్నారు. ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ మోడల్ ఈ అంతరాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని తెలిపారు. ఐటీ రంగంలో పట్టణ స్టార్టప్లకు కేటాయించిన రిస్క్ క్యాపిటల్ మాదిరిగానే గ్రామీణ స్టార్టప్లకు సమానమైన మద్దతు అవసరమని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఇండోనేషియా, శ్రీలంక, మలేషియా, వియత్నాం, లవోపీడీఆర్, మయన్మార్, థాయిలాండ్, పీజీ, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, భారతదేశం వంటి 11 సీఐఆర్డీఏపీ సభ్య దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మతం ముసుగులో మోదీ పాలన
హయత్నగర్: మోదీ సర్కార్ మతాన్ని అడ్డుపెట్టుకుని పాలన సాగిస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకట్రెడ్డి ఆరోపించారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై కులమతాల దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీ తట్టిఅన్నారంలో బుధవారం నిర్వహించిన పార్టీ అబ్దుల్లాపూర్మెట్ మండల మహాసభలో ఆయన మాట్లాడారు. మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. దేశ సరిహద్దులో ఉన్న శత్రువులను పారదోలాల్సిన కేంద్ర ప్రభుత్వం.. కగార్ పేరుతో అమాయక ప్రజలను ఎన్కౌంటర్ చేస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపేసి, మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సీపీఐ.. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతోందన్నారు. రావి నారాయణరెడ్డి కాలనీ– 3లో గుడిసెలు వేసుకుని ఇళ్ల కోసం పోరాటం చేస్తున్నవారికి నివాస స్థలాలు సాధించే వరకు అండగా ఉంటామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవింద్రచారి, కౌన్సిల్ సభ్యుడు యాదిరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు హరిసింగ్ నాయక్, మాజీ కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్, నాయకులు నర్సింహ, నవనీత, అరుణ, మాధవరెడ్డి, వేణు, ప్రసాద్, మధు తదితరులు పాల్గొన్నారు. కగార్ పేరుతో అమాయకులను ఎన్కౌంటర్ చేస్తున్న కేంద్రం సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకట్రెడ్డి -
పారిశుద్ధ్యంపై దృష్టిసారించండి
ఇబ్రహీంపట్నం: వర్షాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు వ్యాధుల బారిన ప్రజలు పడకుండా చూడాలని జిల్లా పంచాయతీ అధికారి వి.సురేష్మోహన్ సూచించారు. బుధవారం దండుమైలారం గ్రామ పంచాయతీని సందర్శించి, రికార్డులను తనిఖీ చేశారు. నర్సరీ, డంపింగ్యార్డును, వనమహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు తీసిన గుంతలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వానాకాలంలో ఈగలు, దోమలు వ్యాప్తిచెంది వ్యాధులు ప్రబలే అవకాశముంటుందన్నారు. క్రమంతప్పకుండా పారిశుద్ధ్య పనులు చేయించాలని సూచించారు. ట్యాంకులను శుభ్రపరిచి క్లోరినేషన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి ఎస్ రఘు, పంచాయతీ కార్యదర్శి పి.శివకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోండి డీపీఓ సురేష్మోహన్ దండుమైలారంలో పర్యటన -
గిరిజనుల స్థితిగతులపై సర్వే
కడ్తాల్: గిరిజనుల సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పేర్కొన్నారు. ధరి ఆబా జంజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్లో భాగంగా మంగళవారం మండలంలోని వాసుదేవ్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కాడ్యతండా, నేరేళ్లకోలుతండా, చెన్నారంతండా, సాలార్పూర్ గ్రామ పంచాయతీలలో వారు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా తండాల్లో గిరిజనులతో సమావేశాలు నిర్వహించి వారి స్థితిగతులపై సర్వే చేశారు. విద్యుత్, మరుగుదొడ్లు, అసైన్డ్ భూములు, సాగు వివరాలు, వైద్య సేవలు, అంతర్గత రహదారుల వివరాలు తెలుసుకుని నమోదు చేసుకున్నారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ.. గిరిజనుల సామాజిక ఆర్థికాభివృద్ధికి కోసం ధరి ఆబా జంజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కింద కృషి చేయనుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నోడల్ అధికారి రాములు, సర్వే అధికారి బీమ్లానాయక్ ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు.