Rangareddy
-
పేదల భూముల వ్యవహారం.. ఆర్ఎఫ్సీకి అల్టిమేటం జారీ
రంగారెడ్డి, సాక్షి: పేదలకు ఇచ్చిన భూములను ఆక్రమించిన రామోజీ ఫిల్మ్ సిటీ(Ramoji Film City) యాజమాన్యానికి అల్టిమేటం జారీ అయ్యింది. వైఎస్సార్ హయాంలో ప్రభుత్వం ఇచ్చిన భూముల్ని ఆర్ఎఫ్సీ యాజమాన్యం తమ గుప్పిటే ఉంచుకుంది. అయితే.. తమ భూములు తమకు ఇవ్వకపోతే ఫిల్మ్ సిటీని ముస్తామని పేద లబ్ధిదారులు హెచ్చరించారు. తాజాగా.. సీపీఎం ఆధ్వర్యంలో లబ్ధిదారులు రంగారెడ్డి కలెక్టరేట్(Rangareddy Collectorate) ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంతో.. నేడు చర్చల కోసం ఇరు వర్గాలను ఆర్డీవో ఆహ్వానించారు. అయితే.. చర్చలకు రాకుండా ఆర్ఎఫ్సీ యాజమాన్యం డుమ్మా కొట్టింది. ఈ పరిణామంతో బాధితులు మరోసారి ఆందోళకు దిగారు.ఈ పరిణామాన్ని ఆర్డీవో తీవ్రంగా పరిగణించారు. గురువారం చర్చలకు ఖచ్చితంగా రావాల్సిందేనంటూ ఆర్ఎఫ్సీ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారాయన. మరోవైపు.. ప్రత్యామ్నాయ భూములు ఇస్తామని RFC యాజమాన్యం లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చిందని, ఏడాది కాలంగా సమస్య పరిష్కారం చేయకుండా సాగదీస్తోందని బాధితులు వాపోతున్నారు. రేపు చర్చల్లో పాల్గొని తమ స్థలాలను చూపించకపోతే గనుక.. రామోజీ ఫిల్మ్ సిటీని ముట్టడిస్తామన్న సీపీఎం(CPM) నేతలు, లబ్ది దారులు హెచ్చరికలు జారీ చేశారు. -
అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి
మన్సూరాబాద్: డివిజన్లో జరిగే అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి సూచించారు. హయత్నగర్ పరిధి కొలను శివారరెడ్డినగర్ కాలనీలో నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. భవిష్యత్లో ఇబ్బందులు తలెత్తకుండా డ్రైనేజీ లెవల్స్ కచ్చితంగా పాటించాలన్నారు. కాలనీవాసులు అభివృద్ధి పనులను పర్యవేక్షించుకోవాలని కోరారు. కాలనీలో మిగిలి ఉన్న పనులకు నిధులు మంజూరు చేయించి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొలను నరేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, యాదిరెడ్డి, మధుసూధన్, వెంకటేష్ నాయకులు పాతూరి శ్రీధర్గౌడ్, కడారి యాదగిరియాదవ్ పాల్గొన్నారు. -
మొక్కల రక్షణకు చర్యలు తీసుకోండి
ఇబ్రహీంపట్నం: ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో నర్సరీల్లోని మొక్కలను జాగ్రత్తగా సంరక్షించాలని, ఇందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డీఆర్డీఏ ప్లాంటేషన్ సూపర్వైజర్ సక్కుబాయి సూచించారు. మంగళవారం ముకునూర్ గ్రామ పంచాయతీని సందర్శించిన ఆమె మొక్కలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రోజురోజుకు ఎండాల తీవ్రత పెరుగుతున్నందున నర్సరీల్లో పనిచేసే సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉదయం, సాయంత్రం విధిగా నీళ్లు పట్టాలని సూచించారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా లక్షలాది రూపాయలు ఖర్చు చేసిన పెంచుతున్న మొక్కలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. ఆమె వెంట గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజ్కుమార్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లింగం, నర్సరీ సంరక్షకుడు రాములు ఉన్నారు. డీఆర్డీఏ ప్లాంటేషన్ సూపర్వైజర్ సక్కుబాయి ముకునూర్ నర్సరీలో మొక్కల పరిశీలన -
కేటీఆర్కు ఘన స్వాగతం
కందుకూరు: ఆమనగల్లులో నిర్వహిస్తున్న రైతు దీక్ష కార్యక్రమానికి వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే సబితారెడ్డికి మంగళవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీఎత్తున స్వాగతం పలికారు. భారీ గజమాలతో సత్కరించి జేసీబీ యంత్రాలతో గులాబీ పూలను చల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కందుకూరు చౌరస్తాతో పాటు దెబ్బడగూడ గేట్ వద్ద పార్టీ జెండాను కేటీఆర్ ఆవిష్కంచారు. అనంతరం ఆయన వెంట రైతుదీక్షకు తరలివెళ్లారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మేఘనాథ్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్.సురేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ డి.చంద్రశేఖర్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు జి.లక్ష్మినర్సింహారెడ్డి, గణేశ్రెడ్డి, కార్యదర్శి మహేందర్రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దొంగల చేతివాటం కందుకూరు చౌరస్తాలో కేటీఆర్కు స్వాగతం పలికే పనుల్లో నాయకులు బిజీగా ఉండటంతో ఇదే అదనుగా దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శించారు. మురళీనగర్ గ్రామానికి చెందిన బాల్రాజ్ జేబులో నుంచి రూ.25 వేలు తస్కరించారు. దీంతో అతను కార్యక్రమం అయిన తర్వాత చూసుకొని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. తుక్కుగూడ ఔటర్ వద్ద.. తుక్కుగూడ: ఆమనగల్లులో మంగళవారం చేపట్టిన రైతు దీక్ష కార్యక్రమానికి వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తుక్కుగూడ ఔటర్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు జల్లాల లక్ష్మయ్యయాదవ్, మాజీ కౌన్సిలర్ రవినాయక్, సుమన్, లావణ్య, నాయకులు తదితరులు ఉన్నారు. -
చాక్లెట్లు పంచితే హెచ్ఎంను సస్పెండ్ చేస్తారా?
హస్తినాపురం: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా నందనవనం కాలనీలో రోడ్డుపై కేక్కట్ చేసి కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటి విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేస్తే ఆ పాఠశాల హెచ్ఎంను సస్పెండ్ చేయడం ఎంత వరకు సమంజసమని హస్తినాపురం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆండోజు సత్యంచారి, మాజీ కార్పొరేటర్ రమావత్ పద్మానాయక్ ప్రశ్నించారు. మంగళవారం హస్తినాపురం డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ రోడ్డులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. హస్తినాపురం డివిజన్ కార్పొరేటర్ బానోతు సుజాతానాయక్ వ్యక్తిగతంగా చాలా మంచివారని ఆమె పీఏ చంద్రశేఖర్రెడ్డి కావాలని డివిజన్లో రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నాయకులు నారగోని శ్రీనివాస్యాదవ్, మాజీ అధ్యక్షుడు గోదల రఘుమారెడ్డి, సయ్యద్, రమావత్ శ్రీనివాస్నాయక్ పాల్గొన్నారు. -
అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు
లింగోజిగూడ: రోడ్డు కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్, లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్రెడ్డి హెచ్చరించారు.కర్మన్ఘాట్ ప్రధాన రహదారిలో నూతనంగా నిర్మించిన అపార్ట్మెంట్ల సముదాయం వద్ద రోడ్డును కబ్జాచేసి చెట్లు పెట్టేందుకు నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయం స్థానికులు కార్పొరేటర్ రాజశేఖర్రెడ్డి దృష్టికి తీసుకురావడంతో జీహెచ్ఎంసీ అధికారులు సహకారంతో నిర్మాణాలను తొలగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కర్మన్ఘాట్ ప్రధాన రహదారిలో భవిష్యత్కు అనుగుణంగా అధికారులు అనుమతులు ఇస్తున్నారని అనుమతుల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తే చర్యలు
తుక్కుగూడ: మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ ఏ.వాణి పేర్కొన్నారు. మంగళవారం పుర కేంద్రంలోని శ్రీశైలం జాతీయ రహదారిపై మున్సిపాలిటీ అనుమతులు లేకుండా అక్రమంగా భవనాలపై ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. హైడ్రా జోనల్ ఇన్చార్జి బి.సుదర్శన్రెడ్డి ఇటీవల తుక్కుగూడలో పర్యటించి వీటిని గుర్తించారన్నారు. హైడ్రా ఆదేశాల మేరకు వీటిని తొలగించామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ వాణి -
కులగణన రీసర్వేలో అందరూ పాల్గొనండి
దిల్సుఖ్నగర్: కులగణ రీసర్వేలో అందరూ పాల్గొనాలని బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆర్కేపురం డివిజన్లోని పలు కాలనీల్లో ఆయన పర్యటించి గతంలో కులగణనలో పాల్గొనని వారిని కలిసి ఈ సారి వివరాలు ఇవ్వాలని కోరారు. కులగణన సర్వేపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలో నిజం లేదని కొంత మంది ఉద్దేశపూర్వకంగానే సర్వేలో పాల్గొనలేదన్నార. కులగణన సర్వేను సమగ్రంగా నిర్వహించేందుకు బీసీ కమిషన్ చిత్తశుద్ధితో పనిచేస్తుందని అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి సర్వేలో పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పున్న గణేష్ నేత, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ సభ్యులు బండి మధుసూదన్ రావు, గట్ల రవీంద్ర, తల్లాటి రమేష్ నేత, శివ, ధనరాజ్ గౌడ్, గుండా నరసయ్య, జల్లా జగన్నాథం, దోర్నాల చంద్రమౌళి, దుర్గాప్రసాద్, ఆనంద్ కుమార్, ఇమ్రాన్, శ్రీశైలం పాల్గొన్నారు. -
తప్పుడు వార్తలు రాసే వారిపై చర్యలు తీసుకోవాలి
నాగోలు: తనపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాసే వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి మాజీ పీఏ దేవిరెడ్డి సతీష్రెడ్డి మంగళవారం ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్కుమార్కు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై సోషల్ మీడియా వస్తున్న వార్తలను ఖండిస్తున్నాని నేను ఎక్కడికి వెళ్లలేదని హైదరాబాదులోనే ఉన్నానన్నారు. రాజకీయాలలోనే ఉన్నత విలువలు కలిగిన నాయకుడిగా పేరున్న రాజగోపాల్ రెడ్డి దగ్గర గత 16 ఏళ్లుగా పనిచేస్తున్న నేను రాజగోపాల్ రెడ్డి కానీ.. నా కుటుంబానికి కానీ మచ్చ తెచ్చే పని చెయ్యలేదన్నార. కొన్ని సోషల్ మీడియా వేదికలు బాధ్యతారాహిత్యంగా ప్రచారం చేసిన వార్తలతో నేను నా కుటుంబ సభ్యులు మనోవేదనకు గురవుతున్నామన్నారు. -
కాంగ్రెస్, బీజేపీని నమ్మే పరిస్థితి లేదు
యాచారం: రాష్ట్రంలో కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, కాంగ్రెస్, బీజేపీలను నమ్మే పరిస్థితి లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. నందివనపర్తి మాజీ సర్పంచ్ వర్థ్యావత్ రాజునాయక్ తల్లి రూప్లీబాయి మొదటి వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయన బొల్లిగుట్టతండాకు చేరుకుని ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం నందివనపర్తిలో విలేకరుల సమావేశం నిర్వహించి, మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ప్రజల మెప్పు పొందలేదన్నారు. హామీల అమలులో ప్రభుత్వం చతికిల పడిందని ఎద్దేవా చేశారు. కులగణనలో అలసత్వం వహించొద్దు చాదర్ఘాట్: కులగణన సర్వేలో ఎన్యుమరేటర్లు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని డీసీ జయంత్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వే రెండో దఫాలో మలక్పేట్ సర్కిల్లో 5307 కుటుంబాల సర్వే చేయాల్సి ఉందన్నారు. గత మూడు రోజుల నుంచి దాదాపు 972 కుటుంబాల వివరాలు సేకరించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన గడువులోని పూర్తిస్థాయిలో సర్వే చేస్తామన్నారు. మలక్పేట్లో అధికారులపై విజిలెన్స్ విచారణ చాదర్ఘాట్: మలక్పేట్ సర్కిల్–6లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులపై గత నెల రోజుల నుంచి విచారణ పేరుతో హడావుడి నెలకొంది. టౌన్ప్లానింగ్ ఏసీపీ అధికారిపై అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే స్పందించడం లేదని పలువురు మలక్పేట్ నుంచి హైదరాబాద్ గ్రేటర్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. వెంటనే సంబందిత అధికారికి ఫోన్చేసి ఏసీపీకి మెమోతో పాటు విచారణ చేయాల్సిందిగా డీసీకి ఆదేశాలు ఇచ్చారు. శానిటేషన్ సూపర్వైజర్ అధికారిపై ట్రేడ్ లైసెన్స్ జారీ చేయడంలో అవినీతి జరిగిందని పలువురు ఫిర్యాదులు చేయడంపై కమిషన్ విజిలెన్స్ విచారణకు ఆదేశాలు ఇచ్చారని అధికారులు వెల్లడించారు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చాదర్ఘాట్: కుటుంబ కలహాలతో ఉరేసుకుని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చాదర్ఘాట్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై భరత్కుమార్ వివరాల ప్రకారం.. ఓల్డ్మలక్పేట్లోని వాహెద్నగర్కు చెందిన సయ్యద్ ఆజమ్(43), సబాబేగం దంపతులు. వీరికి నలుగురు సంతానం. గత కొన్ని రోజులుగా ఇరువురి నడుమ వివాదం జరుగుతోంది. మనస్తాపానికి గురైన సయ్యద్ ఆజమ మంగళవారం ఫ్యాన్కు చీరతో ఉరివేసుకొని మృతి చెందాడు. క్యాట్ ఒలింపియాడ్ పరీక్షలో ప్రతిభ చైతన్యపురి: ఇటీవల నిర్వహించిన క్యాట్ ఒలింపియాడ్ పరీక్షల్లో వీవీనగర్లోని పాణినీయ మహా విద్యాలయ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపల్ ఉషారాణి తెలిపారు. 6–10 తరగతుల 73 మంది విద్యార్థులు పాల్గొనగా 11 మంది ప్రైజ్మనీ, 38 మంది మెడల్స్, మెరిట్ సర్టిఫికెట్లు సాధించారన్నారు. మంగళవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, నాగేశ్వరరావు,జ్యోతి పాల్గొన్నారు. -
హామీలు అమలు చేయాలి
ఇబ్రహీంపట్నం: అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల నాయకుడు మైసయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దళితబంధు కింద రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తడం లేదని పేర్కొన్నారు. మహిళలకు ప్రతినెలా రూ.2500 పెన్షన్ ఇవ్వాలని, తులం బంగారం అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి అబ్దుల్లాపూర్మెట్: నైపుణ్యాలపై దృష్టి సారించడంతో పాటు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఐసీఎల్ఎస్ అసిస్టెంట్ డైరెక్టర్, పీఎం ఇంటర్న్షిప్ ప్రాజెక్టు ప్రాంతీయ నోడల్ ఆఫీసర్ అనుముల శ్రీకర్ విద్యార్థులకు సూచించారు. మండల కేంద్రంలోని బ్రిలియంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ క్యాంపస్లో ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంపై మంగళవారం ఒకరోజు అవగాహన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎస్కే రుస్తుం పాల్గొన్నారు. ఉపాధి సమస్యలపై ఆరా యాచారం: ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ నరేందర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని మల్కీజ్గూడ, నక్కర్తమేడిపల్లి గ్రామాల్లో మంగళవారం కూలీల వద్దకు వెళ్లి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జాబ్ కార్డులున్న ప్రతి కూలీ ఉపాధి పనులకు రావాలని సూచించారు. నింబంధనల ప్రకారం పనులు చేస్తే కూలి గిట్టుబాటు అవుతుందన్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం ఆయా గ్రామాల్లోని నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను పరిశీలించి ఎండిపోకుండా సంరక్షించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీఓ లింగయ్య ఉన్నారు. రైతు దీక్షకు తరలిన నాయకులు మాడ్గుల: కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని మాజీ వైస్ ఎంపీపీ శంకర్ నాయక్ అన్నారు. మంగళవారం ఆమనగల్లులో నిర్వహించిన రైతు దీక్షకు మాడ్గుల నుంచి తరలివెళ్లారు. వీరిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ తిరుమల్ రెడ్డి, డైరెక్టర్ రాజావర్ధన్రెడ్డి, నాయకులు జైపాల్రెడ్డి, శంకర్నాయక్, విజయ్, రాజు, నిరంజన్, తదితరులు ఉన్నారు. హాస్టళ్లలోని సమస్యలు పరిష్కరించాలి నాగోలు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫ్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్సీ స్టూడెంట్ హాస్టల్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు కుమార్, ఇతర సభ్యులు మంగళవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖలో ఉన్న పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ (210) కాలేజీ హాస్టల్స్, ఫ్రీ మెట్రిక్ హాస్టల్స్ (670) స్యూల్ హాస్టల్స్లలో ఉన్న సమస్యలపై గతంలో జీవోలను ప్రభుత్వం ద్వారా సాధించడం జరిగిందని కాని ఇప్పుడు ఉన్న పరిస్థితులలో జీవోలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదన్నారు. గతంలో జారీ చేసిన జీవోలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. నేడు రైతుబజార్కు సెలవు దిల్సుఖ్నగర్: సరూర్నగర్ రైతు బజార్కు బుధవారం సెలవు ఉన్నందున ఎలాంటి క్రయ విక్రయాలు ఉండవని ఈఓ స్రవంతి తెలిపారు. ప్రతి నెల మూడో బుధవారం రైతు బజార్కు సెలవు ఉంటుందని గురువారం యథావిధిగా క్రమవిక్రయాలు కొనసాగుతాయన్నారు. -
అభివృద్ధిని అడ్డుకునేందుకే కేటీఆర్ దీక్షలు
ఆమనగల్లు: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకే మాజీ మంత్రి కేటీఆర్ దొంగ దీక్షలు చేస్తున్నారని పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఎన్నికల హామీలను వరుసగా అమలు చేస్తోందని తెలిపారు. ఇందులో ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోందని స్పష్టంచేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ.. సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని వెల్లడించారు. గత ప్రభుత్వం రైతులకు చేసిన రుణమాఫీ మిత్తీకి కూడా సరిపోలేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణ, సంక్షేమ పథకాల అమలును చూసి ఓర్వలేక కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మాడ్గుల ప్రాంతంలో రేవంత్రెడ్డికి 1,500 ఎకరాల భూమి ఎక్కడ ఉందో చూపించాలని సవాలు విసిరారు. సర్పంచుల పెండింగ్ బిల్లుల పాపం గత సర్కార్దేనని తెలిపారు. సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, ఆమనగల్లు, కడ్తాల్ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు జగన్, బిచ్చానాయక్, పట్టణ అధ్యక్షుడు మానయ్య, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరి శ్రీనివాస్రెడ్డి, సింగిల్విండో డైరెక్టర్ చేగూరి వెంకటేశ్, కాంగ్రెస్ నాయకులు ధనుంజయ, ఖలీల్, అలీం, ఖాదర్, ఖరీం తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్గౌడ్ -
కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
దిల్సుఖ్నగర్: ఆర్కేపురం డివిజన్లోని కుర్తాళ పీఠం శ్రీ ప్రత్యంగిరా దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుర్తాళ పీఠ ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ మాచవోలు రమేష్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవార పసుపు కుంకుమ అలంకరణలో దర్శనమిచ్చారు. దేవాలయ ప్రాంగణంలో మహిళల సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. పూజల్లో మునిపల్లె శ్రీనివాస్, మునిపల్లె సువర్ణ లత, విఠల్ శర్మ, హేమంత్ శర్మ, శ్రీపతి, అన్నపూర్ణ, హేమ, దేవి, హిమబిందు పాల్గొన్నారు. నేడు అన్నాభిషేకం.. దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యంగిరా అమ్మావారికి అన్నాభిషేకం, పల్లకి సేవ నిర్వహిస్తున్నట్లు ఆలయ సెక్రటరీ మునిపల్లె శ్రీనివాస్ తెలిపారు. -
రంగరాజన్పై దాడిని ఖండిస్తున్నాం
మన్సూరాబాద్: హిందూ దర్మలో విద్వేషానికి తావులేదని, చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని హిందూస్ ఫర్ పూరలిటీ అండ్ ఈక్వాలిటి జాతీయ ప్రధాన కార్యదర్శి రమణమూర్తి అన్నారు. ఎల్బీనగర్ సూర్యోదయనగర్కాలనీలోని జైభారత్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం వేదవాదం–శాంతినాదం వేద సూక్తల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహుళత్వానికి, సమానత్వానికి, ద్వేష రహిత్యానికి హిందూ ధర్మం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. రంగారాజపై దాడికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో విజయశంకర్స్వామి, రజనీకుమార్, యడ్లపల్లి మోహన్రావు, త్రినాథ్, ఉమారాణి, నర్సింహాచార్యులు, సాధు త్రినాథ్, సుబ్రహ్మణ్యశర్మ, లక్ష్మినారాయణశర్మ, శరణ్శర్మ, దత్తాత్రేయశర్మ, గౌరీశంకర్శర్మ, వసుధాశర్మ పాల్గొన్నారు. -
కలగానే బస్టాండ్!
కడ్తాల్: మండల కేంద్రంలో ప్రయాణ ప్రాంగణం ఏర్పాటు కలగానే మిగిలిపోతోంది. బస్ షెల్టర్లు ఒక చోట ఉండగా.. బస్సులు మరో చోటు నిలుపుతున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ప్రధాన రహదారి పక్కన లయన్స్క్లబ్ వారు ఏర్పాటు చేసిన చిన్న బస్షెల్టర్ ఉండేది. పదిహేను సంవత్సరాలుగా ప్రయాణికులను ఎండా, వానల నుంచి రక్షించింది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా దీన్ని కూల్చేయడంతో ప్రస్తుతం నిలువ నీడ లేకుండా పోయింది. రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లు రెండు చోట్ల బస్ షెల్టర్లు ఏర్పాటు చేసినా, బస్సులను ఇక్కడ నిలపడం లేదు. దీంతో అవి నిరుపయోగంగా మారుతున్నాయి. వాణిజ్య, వ్యాపారపరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతానికి నిత్యం అనేక మంది వచ్చివెళ్తున్నారు. ఇలాంటి వారికి సేదతీరేందుకు కనీసం నీడ కూడా కరువైంది. గతంలో రోడ్డు విస్తరణ చేపట్టక ముందు, బస్సుల కోసం వేచి ఉండటానికి ప్రధాన రహదారి పక్కన కనీసం చెట్లయినా ఉండేవి. పనుల్లో భాగంగా వీటిని తొలగించడంతో పరిస్థితి దారుణంగా మారింది. ఎండ, దుమ్ములో బస్సుల కోసం నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా కడ్తాల్ గ్రామంలో రెండు కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రోడ్డును నిర్మించారు. నిత్యం రద్దీ మండల కేంద్రం మీదుగా నిత్యం వందలాది బస్సులు తిరుగుతుంటాయి. వీటిని బస్ షెల్టర్ల వద్ద కాకుండా రోడ్డు పక్కనే నిలపడంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు గంటల తరబడి రోడ్డు పక్కన నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. దుకాణ సముదాయల ఎదుట నిలబడితే యజమానుల నుంచి ఛీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తోందని విద్యార్థులు చెబుతున్నారు.సంబంధిత అధికారులు స్పందించి ప్రజలకు అవసరమైన చోట బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కడ్తాల్లో నిలువ నీడ కరువు ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, విద్యార్థులు రోడ్డుపైనే వాహనాల నిలుపుదల తరుచూ ట్రాఫిక్ సమస్యలు -
కబ్జా చెరలో పులందరి వాగు
ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని ఎంపీపటేల్గూడలో ఉన్న పులందరి వాగు ఆక్రమణకు గురైంది. ఔటర్రింగ్రోడ్డు నుంచి ఎంపీపటేల్గూడ మీదుగా మంగళ్పల్లి నుంచి మల్సెట్టిగూడలో ఉన్న చెక్డ్యాంకు ఈ వాగు నుంచే నీరు పారుతుంది. కాలువపై మట్టి పోసి కిలోమీటర్ మేర కబ్జా చేశారు. అక్రమార్కులు ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారు. ఎంపీపటేల్గూడ పట్టణానికి ఆనుకొని ఉన్న చోట సుమారు 500 మీటర్ల మేర కబ్జాకోరులు టిప్పర్లతో మట్టి తెచ్చి కాలువను నింపేశారు. బఫర్ జోన్లోనే నిర్మాణం చేపట్టారు. దీంతో కాలువ మొత్తం కుంచించుకుపోయింది. వర్షాకాలం వస్తే పెద్ద ప్రవాహం వచ్చే కాలువ చిన్నగా అయిపోయింది. -
నీటి ఎద్దడి లేకుండా చూడండి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: రానున్న వేసవిలో జిల్లాలో ఎక్కడా నీటి ఎద్దడి ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, పైపులైన్లకు మరమ్మతులు చేయించి, లీకేజీలను నియంత్రించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడారు. వేసవిలో నీటి సరఫరాలో ఎక్కడ సమస్యలు ఉత్పన్నమవుతాయో గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. గ్రామ పంచాయతీ, మండల, మున్సిపల్ అధికా రులు సమన్వయంతో ప్రణాళిక బద్ధంగా పని చేయాలన్నారు. జిల్లాలో గ్రౌండింగ్ అయిన పనులు పెండింగ్లో ఉంటే వెంటనే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణికి 64 ఫిర్యాదులు ప్రజావాణి అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్ప టికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారులు అంద జేసిన అర్జీలను అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీతతో కలిసి స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 41, ఇతర శాఖలకు సంబంధించి 23 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు అందించే వినతులపై సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు. వేసవిలో ఎక్కడా ఇబ్బంది రావొద్దు అధికారులకు కలెక్టర్ ఆదేశం -
పోలీస్ కస్టడీకి వీరరాఘవరెడ్డి
● అనుమతించిన కోర్టు మొయినాబాద్: చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని మూడు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు పోలీసులు అతన్ని విచారించనున్నారు. ఈ నెల 7న రామరాజ్యం సైన్యం పేరుతో వీరరాఘవరెడ్డితో పాటు మరో 25 మంది చిలుకూరు బాలాజీ దేవాలయానికి వచ్చి అర్చకుడు రంగరాజన్ ఇంట్లో ఆయనపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని ఈ నెల 8న పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు పంపారు. ఈ కేసులో కీలక విషయాలను రాబట్టేందుకు పోలీస్ కస్టడీకి ఇవ్వా లని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చింది. మంగళవారం పోలీసులు అతన్ని చర్లపల్లి జైలు నుంచి కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 18 మందిని అరెస్టు చేసిన పోలీసులు మరో 8 మంది నిందితులకోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గాలిస్తున్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
నందిగామ: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థులకు చిన్నవయస్సులోనే పర్యావరణ స్పృహను పరిచయం చేయాలని కామన్వెల్త్ నేషన్స్ సెక్రటరీ జనరల్ పాట్రిసియా స్కాట్లాండ్ అన్నారు. మండల పరిధిలోని కన్హా శాంతి వనంలో హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సస్టెనబిలిటీ ఇన్ క్లాస్ రూమ్’ కార్యక్రమం సోమ వారం రెండో రోజు కొనసాగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పాట్రిసియా స్కాట్లాండ్ కన్హాలోని హార్ట్ఫుల్ నెస్ ఇంటర్నేషనల్ స్కూల్ను సందర్శించిన అనంతరం మాట్లాడారు. ఆచరణాత్మక విధానంతో తరగతి గదులకు స్థిరత్వాన్ని తీసుకురావడంలో హార్ట్ఫుల్నెస్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రత్యేక చొరవ తీసుకుంటోందని అభినందించారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ అన్నా రాజ్కుమార్, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి షాద్నగర్: విద్యార్థుల కంటి పరిరక్షణకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిణి షబా హయత్ అన్నారు. షాద్నగర్లోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిలో విద్యార్థులకు నిర్వహిస్తున్న కంటి పరీక్షల శిబిరాన్ని సోమవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి శరీర భాగంలో కళ్లు ఎంతో ప్రధానమైనవని అన్నారు. సున్నితమైన కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల కళ్లను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో వార్షిక పరీక్షలను దృష్టిలో పెట్టుకొని వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో కంటి వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. పది రోజుల పాటు శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమనగల్లు, శంషాబాద్, మహేశ్వరం నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, డాక్టర్ పుష్పలత, చంద్రశేఖర్, రమేష్, నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు విద్యా విధానంపై బహిరంగ విచారణ లక్డీకాపూల్: హైదరాబాద్ జిల్లాలో విద్యా విధానంపై తెలంగాణ విద్యా కమిషన్ బహిరంగ విచారణను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు రాష్ట్ర విద్యా కమిషన్ చైర్పర్సన్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో పబ్లిక్ హియరింగ్ జరుగుతుందన్నారు. కార్యక్రమా నికి సంబంధిత శాఖల అధికారులు విధిగా హాజరు కావాలని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రేటర్ ఇమేజ్ను పెంచుదాం బంజారాహిల్స్: దేశవ్యాప్తంగా హైదరాబాద్ ఇమేజ్ను పెంచేందుకు నగరంలో సుందరీకరణ పనులను చేపట్టినట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. సోమవారం సాయంత్రం రోడ్డు నంబర్.45, షేక్పేట నాలా జంక్షన్ వద్ద మొత్తం రూ.49 లక్షల వ్యయంతో సుందరీకరించిన జంక్షన్లను మేయర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ.. హైదరాబాద్కు పర్యాటక రంగంలో అంతర్జాతీయ నగరంగా గుర్తింపు ఉన్న నేపథ్యంలో ఇమేజ్ను మరింత పెంచాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకు న్నట్టు తెలిపారు. నగరవ్యాప్తంగా రూ.150 కోట్ల అంచనా వ్యయంతో 106 ప్రదేశాల్లో పనులను చేపట్టే లక్ష్యంలో భాగంగా ఇప్పటివరకు 78 పనులను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. షేక్పేట నాలా వద్ద రూ.24 లక్షల వ్యయంతో చేపట్టగా జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్.45 వద్ద చేపట్టిన సుందరీకరణ పనులకు రూ.25 లక్షల వ్యయంతో చేపట్టారని వివరించారు. కార్యక్ర మంలో జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, డీసీ ప్రశాంతి, ఎస్ఈ రత్నాకర్, ఈఈ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
● చిన్నదైన ‘పెద్ద’ చెరువు
చెరువు కట్టపై వేసిన బండరాళ్లు సుదీర్ఘకాలం పాటు నీటితో కళకళలాడిన కొత్తూరు మండలం ఇన్ముల్నర్వలోని పెద్ద చెరువు పూర్తిగా రియల్ వ్యాపారులు, మైనింగ్ నిర్వాహకుల కబంధ హస్తాల్లోకి వెళ్లింది. చెరువు శిఖంలో ఆక్రమణలతోపాటు స్టోన్క్రషర్ నిర్వాహకులు యథేచ్ఛగా రాళ్ల వ్యర్థాలు పారబోస్తు న్నారు. రికార్డుల్లో మాత్రమే చెరువు భద్రంగా ఉంది. క్షేత్రస్థాయిలో గుట్టలు, వెంచర్లోని ప్లాట్లు దర్శనమిస్తున్నాయి. అప్పట్లో మైనింగ్ వ్యాపారు లకు స్థానిక నాయకులు, కొందరు అధికారులు తోడవడంతో పది ఎకరాల్లో విస్తరించిన చెరువు ప్రస్తుతం ఐదెకరాలు కూడా లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆయా శాఖల అధికారులు స్పందించి, చెరువును పరిరక్షించా లని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదీ పరిస్థితి ఇన్ముల్నర్వలో రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 254లో సుమారు 10.6 ఎకరాల్లో పెద్ద చెరువు విస్తరించి ఉంది. పదేళ్ల క్రితం చెరువు సమీపంలో ఏర్పాటైన ఓ గ్రానైట్ క్వారీ నిర్వాహ కులు మైనింగ్ అనంతరం వచ్చే బండరాళ్లను చెరువు కట్టతో పాటు చెరువులో పడేశారు. బండరాళ్లపై మట్టి పోసి తమ వాహనాల రాకపోకల కోసం చదును చేశారు. మరోవైపు సర్వే నంబర్లు 249, 250, 251లో చెరువు ఎఫ్టీఎల్ లెవల్లోనే ఓ భారీ వెంచర్ ఏర్పాటు చేశారు. ఏకంగా చెరువు శిఖంలోనే ప్లాట్ల రాళ్లను పాతారు. చెరువు ఆక్రమణలు, పూడ్చివేతలతో ఉనికిని కోల్పోతున్నప్ప టికీ అటు హెచ్ఎండీఏ, ఇటు ఇరిగేషన్ అధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదు. -
కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు
మహేశ్వరం: కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు తప్పకుండా ఉంటుందని రోడ్డు రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పేర్కొన్నారు. ఘట్టుపల్లి శివారులోని కోరుపోలు చంద్రారెడ్డి రిసార్ట్స్లో యూత్ కాంగ్రెస్ నాయకులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం సోమవారం రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఓపిక, నిబద్ధత, క్రమశిక్షణ, సమన్వయంతో పని చేసే నాయకులకు పార్టీ, నామినేటెడ్ పదవులు వరిస్తాయన్నారు. ప్రతి యూత్ కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతం చేయాలన్నారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యే, నాయకులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని ఆయన సూచించారు. రాబోయే కాలం యూత్ కాంగ్రెస్దే అన్నారు. అంతకు ముందు జాతీయ యువజన కాంగ్రెస్ ఇన్చార్జి శ్రీకృష్ణ అల్లవారు, అధ్యక్షుడు ఉదయ్భాను ఛిబ్ ‘చలో పంచాయతీ వార్డు 2025, నా ఓటు–నా బాధ్యత’ బ్రోచర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివ సేనరెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్, కాంగ్రెస్ పార్టీ సినీయర్ నాయకులు కోరుపోలు రఘుమారెడ్డి, దేప భాస్కర్రెడ్డి, రాకేష్రెడ్డి, కరుణాకర్రెడ్డి, ప్రశాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి మంత్రి పొన్నం ప్రభాకర్ -
అభివృద్ధిలో రాజకీయాలొద్దు
షాద్నగర్: ఎన్నికల వరకే రాజకీయాలని, అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయొద్దని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకంలో భాగంగా షాద్నగర్ మున్సిపాలిటీకి మంజూరు చేసిన రూ.28 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పట్టణాలు అభివృద్ధి చెందితేనే దేశం త్వరితగతిన ప్రగతి సాధిస్తుందని తెలిపారు. పట్టణాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టిందని చెప్పారు. అమృత్ పథకంలో భాగంగా లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. పట్టణాల్లో 24 గంటలు తాగునీరు అందించేందుకు అమృత్ పథకాన్ని చేపట్టిందని అన్నారు. మంజూరైన నిధులతో ట్యాంకులు, పైప్లైన్ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. పార్టీలు వేరైనా అభివృద్ధి విషయంలో నియోజకవర్గ పరిధిలోని అందరు ఎమ్మెల్యేలతో కలిసి పని చేస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు బాబర్ఖాన్, రఘు నాయక్, చెంది తిరుపతిరెడ్డి, శ్రీవర్ధన్రెడ్డి, అందె బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి, జమృత్ఖాన్, శ్రావణి, ఇబ్రహీం, ఎంకనోళ్ల వెంకటేశ్ పాల్గొన్నారు. అంతా కలిసి పనిచేయాలి మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ -
అభివృద్ధి ఘనత ఆయనదే
ఇబ్రహీంపట్నం: తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను సాకారం చేసిన ఉద్యమనేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రజలు ఎప్పటికీ మరువరని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం ఇబ్రహీంపట్నం అంబేడ్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రాణత్యాగానికి సిద్ధపడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. అనివర్గాలు, ప్రాంతాల ప్రజలకు సమ న్యాయం చేసి అభివృద్ధి దిశగా పాలన కొనసాగించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోయారని.. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. స్ఫూర్తి జ్యోతి అంధుల ఆశ్రమంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చంద్రయ్య, మాజీ ఎంపీపీ కృపేశ్, ఎంపీటీసీల సంఘం మండల మాజీ అధ్య క్షుడు ఏనుగు భరత్రెడ్డి, మాజీ సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గరాములు పాల్గొన్నారు. -
నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు
ఫిలింనగర్: నకిలీ సర్టిఫికెట్ల విక్రయ ముఠా గుట్టును ఫిలింనగర్ పోలీసులు బట్టబయలు చేశారు.పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్కు చెందిన వజాహత్ అలీ (27) టోలిచౌకీలో నివాసం ఉంటున్నాడు. అతను అవసరమైన వారికి నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అతడిపై నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి షేక్పేట నాలా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వజాహత్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు భారీగా నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. విదేశాలకు వెళ్లే వారే టార్గెట్.. దుబాయ్, కువైట్, మస్కట్, సౌదీ ఆరేబియా, బెహ్రైన్, అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు వెళ్లే యువకులు అందుకు అవసరమైన సర్టిఫికెట్ల కోసం వజాహత్ను సంప్రదించేవారు. దీంతో అతను తనకు పరిచయస్తుడైన రఫీవుల్లాతో సంప్రదింపులు జరిపి సర్టిఫికెట్లు అవసరమైన వారి సమాచారం, యూనివర్సిటీ వివరాలు అందజేసేవాడు. వాటిని రఫీవుల్లా మలక్పేటలోని ఫ్లై అబ్రాడ్ కన్సల్టెన్సీలో పని చేసే హబీబ్కు అందజేసేవాడు. హబీబ్ వాటిని ఖాన్పూర్కు పంపడంతో అక్కడ ఉన్న నకిలీ సర్టిఫికెట్ల తయారీదారు సదరు వివరాలతో అవసరమైన యూనివర్సిటీ సర్టిఫికెట్లను ముద్రించి కొరియర్లో నగరానికి పంపేవాడు. ఇందుకు గాను ఒక్కో సర్టిఫికెట్కు వజాహత్ రూ.80 వేల వరకు వసూలు చేసేవాడు. అందులో రూ.10 వేలు కమీషన్ తీసుకుని మిగతా రూ.70 వేలు రఫీవుల్లాకు అందజేసేవాడు. రఫీవుల్లా రూ.10 వేలు కమీషన్ తీసుకుని రూ.60 వేలు హబీబ్కు ఇస్తే, అతను రూ.20 వేలు మినహాయించుకుని రూ.40 వేలు ఖాన్ఫూర్లో ఉంటున్న నకిలీ సర్టిఫికెట్ల తయారీదారుడికి ఇచ్చేవాడు. ఈ తరహాలో వీరు ఆంధ్రా యూనివర్సిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, సింబియాసిస్ యూనివర్సిటీ తదితర 20 ప్రఖ్యాత యూనివర్సిటీలకు చెందిన సర్టిఫికెట్లను అచ్చు గుద్దినట్లు తయారుచేసి విక్రయిస్తున్నట్లుగా విచారణలో వెల్లడైంది. నిందితుడు వజాహత్ను అరెస్టు చేసిన పోలీసులు సోమవారం రిమాండ్కు తరలించారు. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి రిమాండ్ భారీగా సర్టిఫికెట్ల స్వాధీనం -
బాలుడి చేతిలో యువకుడి దారుణ హత్య
మేడ్చల్రూరల్: మద్యానికి బానిసైన ఓ యవకుడు తన కుటుంబ సభ్యులను వేధిస్తుండటంతో ఆగ్రహానికి లోనైన ఓ బాలుడు తన మేనత్త కొడుకు(బావ)ను దారుణంగా హత్య చేసిన సంఘటన సోమవారం మేడ్చల్ పట్టణంలో చోటు చేసుకుంది. మేడ్చల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్ పట్టణం, రాఘవేంద్రనగర్ కాలనీలో రాధ తన తండ్రి జంగయ్య, ఇద్దరు కుమారులు శ్రీనివాస్, వెంకటరమణ(30), తమ్ముడి కుమారుడి(16)తో కలిసి నివాసం ఉంటోంది. వెంకటరమణ కిష్టాపూర్, అర్చన కాలనీ శివాలయంలో పూజారిగా పని చేసేవాడు. కొంత కాలంగా మద్యానికి బానిసై అర్చక వృత్తిని వదిలేసిన అతను కుటుంబ సభ్యులను వేధించేవాడు. ఐదు రోజుల క్రితం రాధ, తండ్రి జంగయ్యతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లగా, ఇంట్లో వెంకటరమణ ,అతని బావమరిది అయిన మైనర్ బాలుడు ఉన్నారు. ఆదివారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే అప్పటికే అతడి వైఖరితో విసిగిపోయిన బాలుడు వెంకటరమణను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చి నిద్రిస్తున్న వెంకటరమణను కత్తితో గొంతు నరికి హత్య చేశాడు. సోమవారం ఉదయం మృతుడి సోదరుడికి ఫోన్ చేసి వెంకటరమణ మృతి చెందినట్లు చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దీనిపై సమాచారం అందుకున్న మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ సత్యనారాయణ ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. మైనర్ బాలుడే హత్యకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
షాద్నగర్: జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని దేవీ గ్రాండ్ హోటల్లో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు మిద్దెల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ అదే బాటలో నడుస్తోందని ధ్వజమెత్తారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనందం, బండి విజయ్కుమార్, కార్యదర్శి జగదీశ్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు దేవేందర్, జిల్లా కార్యదర్శి సైదులు, జిల్లా కమిటీ సభ్యులు మల్లేశ్, నరేష్, నరసింహారెడ్డి, ఆంజనేయులు, భరత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య -
చోరీ కేసులో వ్యక్తి అరెస్ట్, రిమాండ్
కడ్తాల్: పార్కింగ్ చేసిన ఆటోను అపహరించిన కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని, రిమాండ్కు తరలించారు. సీఐ శివ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూర్ మండలం నేదునూర్ గ్రామానికి చెందిన సదానందంగౌడ్, రామచంద్రయ్య ఇరువురు ఆటోలో ఈ నెల 9న మండల కేంద్రంలోని అగస్త్య ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చారు. ఆస్పత్రి ఎదుట ఆటోను పార్కింగ్ చేసి, వైద్యం చేయించుకుని వచ్చేసరికి ఆటో కనిపించలేదు. వెంటనే డ్రైవర్ సదానందంగౌడ్.. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. క్రైమ్ టీం సిబ్బంది రాజశేఖర్, రాంకోటీలు సోమవారం మండల కేంద్రంలోని తలకొండపల్లి క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం కోమటికుంటకు చెందిన నాగశేషు అనుమానస్పదంగా వ్యవహరించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం ఒప్పుకున్నాడు. అనంతరం అతన్ని అరెస్టు చేసి, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు నాగశేషును రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచి, జైలుకు తరలించారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన క్రైమ్ టీం సిబ్బందికి పోలీసు ఉన్న తాధికారులు అభినందించినట్లు సీఐ వెల్లడించారు. -
‘ప్రజావాణి’కి అభాగ్యురాలు
ఇబ్రహీంపట్నం: చేతిలో ప్లాస్టిక్ సంచి, అందులో పాత గుడ్డలతో పాటు ఆధార్, డిజేబుల్డ్ (దివ్యాంగుల) జిరాక్స్ పత్రాలు, కిరాణా దుకాణానికి నిధులు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి రాసిన లేఖతో ఓ అభాగ్యురాలు సోమవారం ప్రజావాణి కార్యక్రమం వద్దకు వచ్చింది. ఆర్డీఓ అనంతరెడ్డి ఏం కావాలని అడిగినా సమాధానం చెప్పలేకపోవడంతో సిబ్బందిని పిలిపించి ఆమె సమస్యను తెలుసుకోవాలని సూచించారు. దీంతో వారు వెళ్లి చేతిలోని సంచిని పరిశీలించగా.. అండేకార్ స్వర్ణలత, వయస్సు 44, తుర్కయంజాల్ వివరాలతో ఆధార్ కార్డుజిరాక్స్, దివ్యాంగురాలిగా పేర్కొన్న డిజేబుల్డ్ జిరాక్స్ కార్డు లభించాయి. దీంతో తుర్కయంజాల్ పరిధిలోని పలువురికి ఫోన్ చేసి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేశారు. అనంతరం ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వడంలో అంగన్వాడీ సూపర్వైజర్ పల్లవి అక్కడికి చేరుకున్నారు. సదరు మహిళను పలుమార్లు ప్రశ్నించగా.. తన స్వగ్రామం మండల పరిధిలోని పోచారం అని ఒకసారి, మహబూబ్నగర్ జిల్లా అని మరోసారి చెప్పింది. తనకు ట్రై సైకిల్ కావాలని, తాను బస్టాండ్ల వద్ద ఉండి జీవనం కొనసాగిస్తున్నానని తెలిపింది. తినడానికి తిండి, ఉండేందుకు చోటు ఉంటే సరిపోతుందని, తనకు రావాల్సిన దివ్యాంగుల పింఛన్ అందడం లేదని పేర్కొంది. దీంతో ఆమెను సఖి సెంటర్కు తరలించారు. చేరదీసిన అధికారులు సఖి సెంటర్కు తరలింపు -
రైతు దీక్షకు అంతా సిద్ధం
ఆమనగల్లు: ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆమనగల్లు పట్టణంలో మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతు దీక్షకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. కార్యక్రమానికి అనుమతి కోరగా మొదట పోలీసులు నిరాకరించారు. దీంతో బీఆర్ఎస్ నాయ కులు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమనగల్లు పట్టణ సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏర్పాట్లను సోమవారం మాజీ ఎమ్మెల్యేలు జైపాల్యాదవ్, గువ్వల బాలరాజు, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, సింగిల్విండో చైర్మన్ గంప వెంకటేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పత్యానాయక్ తదితరులు పరిశీలించారు. నేడు ఆమనగల్లుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏర్పాట్లను పరిశీలించిన పార్టీ నాయకులు -
ప్రజల గుండెల్లో కేసీఆర్
మీర్పేట: ఫ్లెక్సీలు చించినంత మాత్రాన ప్రజల గుండెల్లో నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను తొలగించలేరని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా రెడ్డి అన్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా సోమవారం మీర్పేట మంత్రాల చెరువు వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 14 ఏళ్లు అన్ని వర్గాలు, సంఘాలను ఒక్క తాటిపైకి తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. పదేళ్లు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుంచిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అంతకు ముందు బీఆర్ఎస్ నాయకులు లలితానగర్ చౌరస్తాలో కేక్ క్ట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు అర్కల భూపాల్రెడ్డి, రామిడి రాంరెడ్డి, అనిల్యాదవ్, అర్కల కామేశ్రెడ్డి, జటావత్ శ్రీనునాయక్, రజాక్, దిండు భూపేష్గౌడ్, సిద్ధాల లావణ్య, దోమలపల్లి ధనలక్ష్మి పాల్గొన్నారు. మహనీయుల విగ్రహావిష్కరణ మీర్పేట కార్పొరేషన్ 39వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మాదరి సురేఖ రమేష్ ఆధ్వర్యంలో జిల్లెలగూడ కమలానగర్లో ఏర్పాటు చేసిన అంబేడ్కర్, బాబు జగ్జీవన్రాం, మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాలను ఆదివారం రాత్రి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు గజ్జెల రాంచందర్, మాదరి శ్రీనివాస్, లప్ప లక్ష్మణ్, బాలకృష్ణ, ఎన్.శ్రీనివాస్, బొజ్జ భాస్కర్, జి.శైలేందర్, గౌతం, ఎన్.హరికాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సబితా రెడ్డి -
పార్టీల మధ్య ఫ్లెక్సీల వివాదం
బడంగ్పేట్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఫ్లెక్సీల తొలగింపు వివాదాస్పందంగా మారింది. ఇదెలా జరిగిందంటూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఫ్లెక్సీల విషయంలో అధికార పార్టీ నేతలు కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు సైతం కాంగ్రెస్ వారికే మద్దతు తెలుపుతున్నారని విమర్శించారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ శ్రేణులు.. రోడ్లకు ఇరువైపులా కటౌట్లు, బ్యానర్లు, ఫెక్సీలు ఏర్పాటు చేయగా.. ఆదివారం రాత్రికిరాత్రే వాటిని మున్సిపల్ సిబ్బంది తొలగించారు. దీంతో గులాబీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ.. సోమవారం కమిషనర్ సరస్వతికి ఫిర్యాదు చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. బ్యానర్లు తొలగించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీల కతీతంగా విధులు నిర్వహించాలని కమిషనర్కు సూచించారు. మరోసారి ఇలాంటివి జరిగితే.. ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. దీనికి స్పందించిన ఆమె.. ఫ్లెక్సీలు ఎవరు, ఎందుకు తొలగించారో తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ కార్పొరేషన్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ అర్జున్, మాజీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు ఉన్నారు. బ్యానర్ల తొలగింపుపై బీఆర్ఎస్ నాయకుల ఆందోళన కమిషనర్ సరస్వతికి ఫిర్యాదు -
● ఫిర్యాదు చేసినా స్పందన శూన్యం
గతంలో కాలువను మరోచోట కబ్జా చేసి పైపులు వేశారు. దీనిపై పత్రికల్లో కథనాలు రావడంతో పైపులు తొలగించారు. తాజాగా టిప్పర్లతో మట్టి తెచ్చి పోస్తున్నారు. కాలువను కబ్జా చేస్తున్నారని ఆదిబట్ల మున్సిపాలిటీలో, కలెక్టరేట్లో ఎంపీపటేల్గూడ వాసులు ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఓవైపు మున్సిపాలిటీ అధికారులు అండర్ డ్రైనేజీ నీరు ఇదే వాగులోకి కలిపి కలుషితం చేశారని, మరోవైపు కబ్జా పాలవుతున్న పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇలాగే వదిలేస్తే వాగు మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కాలువను పరిరక్షించాలని కోరుతున్నారు. -
టిప్పర్ సీజ్
దోమ: ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ఓ లారీని పోలీస్లు సీజ్ చేశారు. ఈ ఘటన బొంరాస్పేట మండలం బొట్లబోని తండాలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ ఆనంద్కుమార్ తెలిపిన ప్రకారం.. తండాకు చెందిన రమావత్ దేశ్యనాయక్ తండ్రి హీర్యానాయక్(44) తనకున్న టిప్పర్తో ఇసుక వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన ఆదివారం రాత్రి బుద్లాపూర్ మీదుగా ఇసుక తీసుకెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు లారీని పట్టుకుని అనుమతి పత్రాలు, వాహన పేపర్లను పరిశీలించగా ఏవీ లేవని సమాధానం వచ్చింది. దీంతో పోలీసులు టిప్పర్ను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ మేరకు సోమవారం పోలీసులు దేశ్యానాయక్పై కేసు నమోదు చేసి వాహనాన్ని తహసీల్దార్కు అప్పగించామని ఎస్ఐ చెప్పారు. నేడు వాహనాల వేలం మోమిన్పేట: మండల కేంద్రంలోని ఎకై ్సజ్ కార్యాలయంలో ఉన్న వాహనాలను మంగళవారం వేలం వేయనున్నట్లు ఎకై ్సజ్ ఎస్హెచ్ఓ సహదేవుడు ఓ ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనే వ్యక్తులకు ప్రభుత్వ నిబంధనలు వర్తిస్తాయన్నారు. ఆసక్తి గలవారు ఉదయం 10–30 నిమిషాలకు కార్యాలయానికి రావా లని సూచించారు. ఈ వాహనాలు నిషేధిత వస్తువుల నేరాలకు సంబంధించి సీజ్ చేసినవిగా ఆయన తెలిపారు. -
విద్యుదాఘాతంతో బాలుడి మృతి
సుభాష్ నగర్: కరెంటు తీగను కట్ చేస్తుంగా విద్యుదాఘాతానికి గురై ఓ బాలుడు మృతి చెందిన సంఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కై సర్ నగర్ చెందిన మహమ్మద్ అలీమ్ ఖాన్ కుమారుడు ఎజాజ్ హలీమ్ ఖాన్ (13) కరెంట్ పని చేసేవాడు. సోమవారం సాయంత్రం అత ను నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో కరెంట్ తీగను కట్ చేస్తుండగా సమీపంలో ఉన్న విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం మత్తులో కానిస్టేబుల్పై దాడి
ఆరుగురు యువకుల అరెస్ట్ బంజారాహిల్స్: మద్యం మత్తులో ఆరుగురు యువకులు ఓ కానిస్టేబుల్పై దాడి చేసిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... బోరబండ అన్నానగర్ సైట్–3లో నివసించే ప్రసాద్ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తూ ఓ వీవీఐపీకి డ్రైవర్గా అటాచ్ అయ్యాడు. ఆదివారం రాత్రి అతను ఇందిరానగర్లోని అమృతాబార్ నుంచి బయటికి వచ్చాడు. అదే సమయంలో ఇద్దరు యువకులు గొడవపడుతుండటంతో అక్కడికి వెళ్లిన ప్రసాద్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో వారు నీవెవరు మాకు చెప్పేందుకు అంటూ అతడిపై దాడి చేయడమే కాకుండా తమ స్నేహితులు మరో ఐదుగురిని అక్కడికి పిలిపించారు. అకారణంగా ఏడుగురు కలిసి ప్రసాద్ను చితకబాదడమేగాక అతడి మెడలో ఉన్న బంగారు గొలుసు, రిస్ట్వాచ్ లాక్కున్నారు. అదే సమయంలో పోలీసు వాహనం వస్తుండటాన్ని గుర్తించిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే బాధితుడు స్కూటర్ నెంబర్ నోట్ చేసుకుని పోలీసులకు అందజేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను శ్రీకృష్ణానగర్ ప్రాంతానికి చెందిన తనాల సాయికిరణ్, ప్రణీత్గౌడ్, నందిపాటి నవీన్, బండి సత్యకిరణ్, పందగడ శ్రీనివాస్గా గుర్తించి సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సలీం అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. బాధితుడు అధికార పార్టీకి చెందిన ప్రముఖురాలి వద్ద పని చేస్తుండటంతో కేసును మరింత సీరియస్గా తీసుకున్నారు. ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య రాంగోపాల్పేట్: అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపానికి లోనైన ఓ పోలీస్ కానిస్టేబుల్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సిటీ పోలీస్ ఐటీసెల్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న రంగనాథ్రావు (36) కళాసీగూడ కామాక్షి దేవాలయం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతడికి భార్య గాజుల దాక్షాయణి, కుమార్తె ఉన్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతను అందుకు సంబంధించి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అయినా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో డిప్రెషన్కు లోనయ్యాడు. ఆదివారం కుమార్తెతో కలిసి బోయిన్పల్లిలోని పుట్టింటికి వెళ్లిన అతడి భార్య దాక్షాయణి అక్కడి నుంచి భర్తకు వీడియో కాల్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో రాత్రి ఇంటికి వచ్చి చూడగా రంగనాథ్ వెంటిలేటర్ గ్రిల్కు ఉరివేసుకుని కనిపించాడు. స్థానికుల సహాయంతో అతడిని కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. దీనిపై సమాచారం అందడంతో మహంకాళి ఇన్స్పెక్టర్ పరశురాం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వేధింపులు తాళలేకే.. యువకుడి హత్య కేసులో నిందితుల రిమాండ్ మేడ్చల్రూరల్: మేడ్చల్ పట్టణంలో ఆదివారం జరిగిన దారుణ హత్య కేసులో నిందితులను మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సోమవారం మేడ్చల్ పోలీస్ స్టేషన్న్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మేడ్చల్ జోన్ డీసీపీ కోటి రెడ్డి వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా, సోమారపుపేట గ్రామానికి చెందిన గుగులోతు గన్యా పెద్ద కుమారుడు ఉమేశ్ (24) మేడ్చల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన అతను తరచూ కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన అతడి సోదరుడు రాకేశ్, చిన్నాన్న కుమారుడు లక్ష్మణ్, బంధువులు బుక్యా నవీన్, బుక్యా నరేశ్, బుక్యా సురేశ్తో కలిసి అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆర్టీసీ కాలనీలోని అతడి ఇంటిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ సందర్భంగా నవీ, నరేశ్, సురేశ్ ఉమేష్ను పట్టుకోగా రాకేశ్, లక్ష్మణ్ కత్తులతో దాడి చేశారు. వారి నుంచి తప్పించుకున్న ఉమేష్ పారిపోతుండగా అతడిని వెంబడించిన రాకేశ్, లక్ష్మణ్ మేడ్చల్ బస్ డిపో ఎదుట జాతీయ రహదారిపై కత్తులతో పొడిచి హత్య చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మేడ్చల్ పోలీసులు సోమవారం ఉదయం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు సెల్ఫోన్న్లు, రెండు కత్తులు, రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మృతుడు ఉమేశ్కు నేర చరిత్ర ఉందని, అతడిపై కామారెడ్డి జిల్లాలో 14 కేసులు ఉన్నట్లు తెలిపారు. కేసును గంటల వ్యవధిలో ఛేదించిన ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ సత్యనారాయణ, డీఐ సుధీర్ కృష్ణ, ఎస్సై మన్మథరావును డీసీపీ అభినందించారు. -
చేసేది చీటింగ్స్!
చదివింది ఎంటెక్...సాక్షి, సిటీబ్యూరో: ఎంటెక్ చదివిన ఓ వ్యక్తి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల్లో పని చేసి వాటిలో జరిగే ఎంపిక ప్రక్రియ తెలుసుకున్నాడు. ఆపై తానే సొంతంగా ఓ డమ్మీ కంపెనీ ఏర్పాటు చేసి ఉద్యోగాల పేరుతో ఎర వేశాడు. నిరుద్యోగుల నుంచి అందినకాడికి దండుకుని నకిలీ అపాయింట్మెంట్ లెటర్లతో మోసం చేశాడు. ఇతడిపై ఇప్పటివరకు నాలుగు కేసులు నమోదు కావడంతో సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం టాస్క్ఫోర్స్ వైవీఎస్ సుధీంద్ర వివరాలు వెల్లడించారు. చింతల్ వెంకటేశ్వర నగర్కు చెందిన కె.భార్గవ్ ఎంటెక్ పూర్తి చేసి కొన్ని ఐటీ కంపెనీల్లో హెచ్ఆర్ మేనేజర్గా పని చేశాడు. ఇలా ఇతడికి ఆయా కంపెనీల్లో ఉద్యోగుల ఎంపిక ప్రక్రియపై పూర్తి అవగాహన ఏర్పడింది. దీనిని క్యాష్ చేసుకోవాలని భావించిన అతను ఐటీ ఉద్యోగాల పేరుతో మోసాలకు తెరలేపాడు. ఇందులో భాగంగా హైటెక్ సిటీ వద్ద ఓ కార్యాలయాన్నీ అద్దెకు తీసుకుని అందులో నియోజీన్ సాఫ్ట్టెక్ పేరుతో కార్పొరేట్ లుక్తో ఆఫీస్ ఏర్పాటు చేశాడు. అందులో కొందరిని ఉద్యోగులుగా నియమించడంతో పాటు ప్రత్యేక వెబ్సైట్ డిజైన్ చేశాడు. తన కార్యాలయం ఫొటోలను ఈ వెబ్సైట్లో పొందుపరిచాడు. క్లౌడ్ సర్వీసెస్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, వెబ్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ రంగాల్లో వివిధ ఉద్యోగాలు ఉన్నట్లు ఆన్లైన్లోనే ప్రకటన ఇచ్చాడు. జూనియర్ డెవలపర్స్, సాఫ్ట్వేర్ ఇంజినీర్స్ తదతర ఉద్యోగాలకు ఆకర్షణీయమైన వేతనాలు ఇస్తామని పేర్కొన్నాడు. కొందరు ఉద్యోగార్థులు ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఈ కంపెనీ వెబ్సైట్, అందులో ఉన్న ఫొటోలు చూసి పెద్ద కంపెనీగా భావించారు. దరఖాస్తు చేసిన వారికి కన్సల్టెంట్స్ ద్వారా శిక్షణ కూడా ఇప్పించాడు. ఆపై ఆన్లైన్ ఇంటర్వ్యూలు నిర్వహించి కొందరు ఎంపికై నట్లు ప్రకటించాడు. వీరికి ఈ–మెయిల్ ద్వారా జాబ్ ఆఫరింగ్ లెటర్లు పంపి... వారి నుంచి అడ్వాన్సులు, డిపాజిట్ల పేరుతో రూ.లక్ష, రూ.2 లక్షలు చొప్పున వసూలు చేశాడు. భారీ మొత్తం దండుకున్న తర్వాత తన కార్యాలయం మూసేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇతడి చేతిలో మోసపోయిన వారి ఫిర్యాదుతో లాలాగూడ, జీడిమెట్ల, మాదాపూర్, కల్వకుర్తి ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. భార్గవ్ ఆచూకీ కనిపెట్టడానికి మధ్య మండల టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. సోమవారం అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రూ.లక్ష నగదు, నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు, గుర్తింపుకార్డులు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని లాలాగూడ పోలీసులకు అప్పగించారు. ఈ మోసాలు చేయడంలో ఇతడికి సహకరించిన వారు మరికొందరు ఉన్నారని గుర్తించిన టాస్క్ఫోర్స్ వారి కోసం గాలిస్తోంది. మోసాల కోసం ఐటీ కంపెనీనే స్థాపించిన వైనం ఉద్యోగాల పేరుతో పలువురికి ఎర అడ్వాన్సులు, డిపాజిట్లంటూ భారీగా వసూళ్లు నిందితుడిని అరెస్టు చేసిన టాస్క్ఫోర్స్ టీమ్ -
చిక్కుల్లో రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం!
రంగారెడ్డి, సాక్షి: రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్య అరాచకాలపై పేదలు నిరసన గళమెత్తారు. ఆక్రమించుకున్న తమ ఇళ్ల స్థలాలను తిరిగి అప్పజెప్పాలంటూ సోమవారం కలెక్టరేట్ ఎదుట పోరాటానికి దిగారు. ఈ ఆందోళనకు వామపక్ష సీపీఎం తమ మద్దతు ప్రకటించింది. దివంగత మహానేత వైఎస్సార్(YSR) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు పంచింది. ఇందుకుగానూ ఇబ్రహీంపట్నం మండలం నాగన్ పల్లి సర్వే నెంబర్ 189, 203లో 20 ఎకరాలను 577 మందికి పంపిణీ చేశారు. అయితే.. 2007 నుంచే ఆ స్థలాలను రామోజీ ఫిల్మ్ సిటీ(Ramoji Film City) యాజమాన్యం తమ గుప్పిట్లో ఉంచుకుంది. అప్పటి నుంచి వాళ్ల పోరాటం కొనసాగుతూనే వస్తోంది. అయితే.. లబ్ధిదారులను తమ ప్లాట్ల వద్దకు వెళ్లకుండా గేట్లు, ప్రహరీ గోడలు నిర్మాణం చేసుకుంది ఫిల్మ్ సిటీ యాజమాన్యం. దీంతో.. సీపీఎం(CPM) ఆధ్వర్యంలో బాధితులు ఇవాళ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. వైఎస్సార్ హయాంలో కేటాయించిన.. ఆ ఇళ్ల పట్టాల స్థలాలను చూపించాలంటూ కలెక్టర్ను డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ఎప్పుడూ లేని సంతోషం
ఈ వేడుక ఒక పూర్వ విద్యార్థి గా ఎప్పుడూ లేని సంతోషాన్ని కలిగించింది. మనం చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలనే ఆలోచనలోంచి వచ్చిందే ఈ స్వర్ణోత్సవ వేడుక. మాకు చదువు చెప్పిన గురువులను మేము గౌరవిస్తుంటే.. మేము చదువు చెప్పిన విద్యార్థులు సైతం ఈ వేడుకల్లో పాల్గొని వారి అనుభవాలను పంచుకున్నారు. ఇది మరిచిపోలేని అనుభూతిని మిగిల్చింది. పాఠశాల ప్రారంభించి 70 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి చదువుకున్న విద్యార్థులు వేడుకలకు హాజరుకావడం బాగుంది. – బురాన్ ప్రభాకర్, 1982–83 బ్యాచ్ విద్యార్థి -
ఆమనగల్లు లయన్స్క్లబ్కు అవార్డుల పంట
ఆమనగల్లు: లయన్స్క్లబ్ రీజియన్ పరిధిలో చేపట్టిన సేవా కార్యక్రమాల నిర్వహణకు గాను ఆమనగల్లు లయన్స్క్లబ్కు అవార్డుల పంట పండింది. ఏటా రీజియన్ పరిధిలో అత్యుత్తమ సేవలు అందించే లయన్స్క్లబ్లకు అవార్డులు అందిస్తారు. ఈ ఏడాది నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని తేజ కన్వెన్షన్ హాలులో ఆదివారం జరిగిన లయన్స్క్లబ్ రీజియన్ సమావేశంలో రీజియన్ చైర్మన్ డా.శ్రీను లయన్స్క్లబ్లకు అవార్డులను అందించారు. 2024–25 సంవత్సరానికి గాను చేపట్టిన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా మొత్తం వివిధ విభాగాల్లో ఆమనగల్లు లయన్స్క్లబ్ 33 అవార్డులు దక్కించుకుంది. రీజియన్ పరిధిలో ఎక్సలెంట్ క్లబ్గా ఆమనగల్లు లయన్స్క్లబ్, అత్యుత్తమ లయన్స్క్లబ్ అధ్యక్షుడిగా ఆమనగల్లు లయన్స్క్లబ్ అధ్యక్షుడు పసుల లక్ష్మారెడ్డి, ఉత్తమ కార్యదర్శిగా మహేశ్, ఉత్తమ కోశాధికారిగా నర్సింహ, అత్యుత్తమ పీఆర్ఓగా పాష అవార్డులు అందుకున్నారు. అలాగే రక్తదాన శిబిరాలు, మెగా వైద్య శిబిరాలు, మధుమేహ పరీక్షల శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలకు గాను అవార్డులు దక్కాయి. ఆమనగల్లు లయన్స్క్లబ్కు అవార్డులు రావడానికి సహకరించిన లయన్స్క్లబ్ మల్టీపుల్ ఏరియా లీడర్ నరేందర్రెడ్డి, కోఆర్డినేటర్ చెన్నకిషన్రెడ్డి, మాజీ లయన్స్ గవర్నర్లు రమేశ్బాబు, రాధాకృష్ణ, రాంరెడ్డి తదితరులకు లయన్స్క్లబ్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, పీఆర్ఓ పాషా కృతజ్ఞతలు తెలిపారు. వృక్షార్చన జయప్రదం చేయండి పరిగి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం నిర్వహించనున్న వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన పట్టణ కేంద్రంలోని తన నివాసంలో ఇందుకు సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేశ్రెడ్డి మాట్లడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రతీ కార్యకర్త మూడు మొక్కలు నాటాలని సూచించారు. నాటిన మొక్కతో దిగిన సెల్ఫీని 90003 65000 నంబర్కు వాట్సాప్ చేయాలని కోరారు. భూగోళాన్ని నివాసయోగ్యంగా మార్చాలనే సంకల్పంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అరవింద్రావు, పార్టీ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురేందర్, సీనియర్ నాయకులు ప్రవీణ్రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మోడల్ స్కూల్ అడ్మిషన్లకు దరఖాస్తులుతాండూరు రూరల్: మండల పరిధిలోని జినుగుర్తి గేటు వద్ద ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ శ్రీదేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో 100 సీట్లు, 7 నుంచి 10వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల కోసం ఆన్లైన్లో ఈనెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 13న ఎంట్రెన్స్ పరీక్ష ఉంటుందన్నారు. ఓసీలు రూ.200, ఇతరులు రూ.125 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. -
వన మహోత్సవానికి కార్యాచరణ
షాద్నగర్: పుడమి తల్లిని మరింత పచ్చగా మార్చేందుకు.. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం వన మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మొక్కలు నాటేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ప్రతీ గ్రామ పంచాయతీలో పదివేల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించడంతో ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలతో నర్సరీల్లో బ్యాగుల్లో మట్టి నింపడం, విత్తనాలు నాటడం వంటి పనులు చేపడుతున్నారు. వేడిని తట్టుకునేందుకు.. నర్సరీల్లో పెంచే ప్రతీ మొక్కను బతికించుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వేసవి కాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో నర్సరీల్లో పెంచే మొక్కలు ఎండకు ఎండిపోకుండా గ్రీన్నెట్.. వాటి కింద మొక్కలను పెంచుతున్నారు. వర్షాకాలం ప్రారంభం అయిన వెంటనే గుంతలు తీసి నాటేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. నీడ నిచ్చే మొక్కలకు ప్రాధాన్యత నర్సరీల్లో నీడనిచ్చే మొక్కలతో పాటు వివిధ రకాల పండ్ల మొక్కలను పెంచుతున్నారు. నీడనిచ్చే కానుగ, రావి, మర్రి, చింత చెట్లతో పాటు ఈత, తాటి, ఇంటి ఆవరణలో పెంచేందుకు దానిమ్మ, నిమ్మ, సీతాఫలం, తులసి, నేరేడు, లిల్లీ, మందారం, పారిజాతం, గులాబీ, గన్నేరు, మందారం, కరివేపాకు, బొప్పాయి, మునగ, జామ మొక్కలను నర్సరీల్లో పెంచుతున్నారు. ఆయా గ్రామాలకు నర్సరీల నుంచి పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నర్సరీల్లో మొక్కల పెంపకం ఉపాధి కూలీలతో పనులు వర్షాకాలం ప్రారంభమైన వెంటనే నాటేలా ఏర్పాట్లు ప్రత్యేకంగా దృష్టి సారించిన అధికారులు అవసరమైన మొక్కలు సిద్ధం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రా మాల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తు న్నాం. అవసరమైన మొ క్కలు నర్సరీల్లో సిద్ధం చేస్తున్నాం. నర్సరీల్లో నీడనిచ్చే మొక్కలతో పాటు వివిధ రకాల పండ్ల మొక్కలను పెంచుతున్నాం. – అరుణ, ఏపీఓ, ఫరూఖ్నగర్ -
ఆర్టీసీలో ఐ టిమ్స్
సాక్షి, సిటీబ్యూరో: సిటీబస్సుల్లో డిజిటల్ చెల్లింపులను అమలులోకి తేనున్నారు. ఈ మేరకు అన్ని బస్సుల్లో త్వరలో ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ యింగ్ మిషన్స్ (ఐటిమ్స్)ను ప్రవేశపెట్టనున్నారు. ప్రయాణికులు ప్రస్తుతం సిటీ బస్సుల్లో పయనించేందుకు టికెట్ కొనుగోళ్ల కోసం నగదు చెల్లించాల్సి వస్తోంది. దైనందిన జీవితంలోని అన్ని రంగాల్లో డిజిటల్ కరెన్సీ నిత్యకృత్యంగా మారిన ప్రస్తుత తరుణంలో ఈ నగదు చెల్లింపుతో ప్రయాణికులు తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో చిల్లర సమస్య కూడా తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఫోన్పే, గూగుల్పే తదితర సదుపాయాలను వినియోగించుకుని టికెట్లు తీసుకొనే సదుపాయాన్ని ప్రవేశపెట్టాలనే ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్లో ఉంది. ప్రస్తుతం బస్పాస్ల కౌంటర్లలో మాత్రం ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో బస్సులతో పాటు టికెట్ రిజర్వేషన్ కేంద్రాలు, అధీకృత టికెట్ బుకింగ్ ఏజెన్సీల్లోనూ డిజిటల్ చెల్లింపులకు అవకాశం కల్పించాలని ఆర్టీసీ భావిస్తోంది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 28 డిపోల్లో వినియోగించేందుకు సుమారు 6500 ఐ టిమ్స్ను కొనుగోలు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలి పారు. ప్రస్తుతం ఐటిమ్స్ పరీక్షలు తుది దశలో ఉన్నాయని, కొద్దిపాటి మార్పుల అనంతరం మార్చి నుంచి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఆటోమేటిక్గా చెల్లింపులు.. ఐటిమ్స్లో ఉన్న సాంకేతిక వ్యవస్థల ఆధారంగా ఎప్పటికప్పుడు లొకేషన్ నిర్ధారణ అవుతుంది. ప్రయాణికులు కోరిన చోటికి వెళ్లేందుకు అయ్యే చార్జీని కూడా ఈ లొకేషన్ ప్రకారం సిద్ధంగా ఉంచుతారు. ప్రయాణికులు బస్సెక్కిన వెంటనే రానున్న లొకేషన్కు అనుగుణంగా టిక్కెట్ ఇష్యూ అవుతుంది. ఆ మేరకు ఫోన్ పే లేదా గూగుల్ పే చేస్తే చాలు. ప్రస్తుతం నగరంలోని సుమారు 1,150 రూట్లలో నిత్యం సుమారు 2800 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. సుమారు 22 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. సుమారు 14 లక్షల మంది మహిళా ప్రయాణికులు మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకుని ఉచిత ప్రయాణం చేస్తున్నారు. వచ్చే నెల నుంచి అమలుకు చర్యలు గ్రేటర్లో సుమారు 6,500 ఐ టిమ్స్ వినియోగం టికెట్ కొనుగోళ్లకు డిజిటల్ చెల్లింపులు -
సర్కార్ బడి.. జ్ఞాపకాల జడి
చేవెళ్ల: వారంతా సర్కార్ బడిలో ఓనమాలు దిద్దారు.. అంచలంచెలుగా ఎదిగి జీవితంలో స్థిరపడ్డారు.. 50 ఏళ్ల కాలంలో కలిసి చదువుకున్న వారంతా ఒక్కచోట చేరారు.. జ్ఞాపకాల జడిలో తడిసి ముద్దయ్యారు.. వయసును మరిచి, హోదాలను పక్కన పెట్టి ఆటపాటలతో సందడి చేశారు.. ఈ అ‘పూర్వ’ ఘట్టానికి చేవెళ్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదికగా మారింది. ఈ పాఠశాలలో 1955 నుంచి 2005 వరకు 50 ఏళ్ల కాలంలో కలిసి చదువుకున్న వివిధ బ్యాచ్లకు చెందిన విద్యార్థులు ఆదివారం స్వర్ణోత్సవాలను సంబరంగా జరుపుకొన్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. అప్పటి ఉపాధ్యాయులను ఆహ్వానించి.. వేడుకలకు 1955 నుంచి 1980 వరకు విద్యాబుద్ధులు చెప్పిన ఉపాధ్యాయులను సాదరంగా ఆహ్వానించారు. వారిని ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేసి ఉద్యోగ విరమణ చేసిన వారిని సైతం సత్కరించారు. చాలాకాలం తర్వాత అంతా కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వేడుక తమ జీవితంలో ఒక జ్ఞాపకంగా గుర్తుండిపోతుందని పలువురు పూర్వ విద్యార్థులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఈ పాఠశాల అభివృద్ధికి కలిసి కృషి చేస్తామని ప్రకటించారు. ఆరు నెలలుగా 1981–82 బ్యాచ్ విద్యార్థులు చేసిన కృషితో పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఇలాంటి వేడుక ఎప్పుడూ చూడలేదని పూర్వ ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఆ నాడు తాము చదువులు చెప్పిన విత్తనాల్లాంటి విద్యార్థులు నేడు మహావృక్షాలుగా ఎదగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఉత్సాహంగా గడిపారు. పూర్వ విద్యార్థి శ్రీనివాస్గౌడ్ తన ఆర్కెస్ట్రా బృందంతో ఆలపించిన పాటలు అలరించాయి. వేడుకకు సహకారం అందించిన దాతలు కృష్ణారెడ్డి, దేవర వెంకట్రెడ్డి, ఆగిరెడ్డిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయలు బుగ్డారెడ్డి, మల్లయ్యగౌడ్, ఖుర్షీద్ అలీ, నర్సింలు, గాంధీ, పద్మ, సులోచన, భానుమతి, నిర్వాహకులు ఆర్.శ్రీనివాస్, బురాన్ ప్రభాకర్, గోపాలచారి, షఫీ, వెంకట్రెడ్డి, మాణిక్యం, పెంటయ్య, ఖాజాపాషా, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో 50 ఏళ్ల సంబరం అంగరంగ వైభవంగా స్వర్ణోత్సవాలు సందడి చేసిన అప్పటి విద్యార్థులు చేవెళ్ల పాఠశాలలో అ‘పూర్వ’ ఘట్టం -
అంతా కలిస్తే బాగుంటుందనే..
చదువుకున్న పాఠశాలను అభివృద్ధి చేయాలని 1981–82 బ్యాచ్ పూర్వ విద్యార్థులం అంతా అనుకున్నాం.. పాఠశాలలో చదివిన అన్ని బ్యాచ్ల విద్యార్థులు కలిస్తే బాగుంటుందని, పాఠశాల అభివృద్ధికి మరింత తోడవుతుందని ఆలోచన వచ్చింది. దీనికి 50 ఏళ్ల స్వర్ణోత్సవ వేడుక కూడా కుదిరింది. ఆరు నెలలుగా పూర్వ విద్యార్థులను అందరినీ కలుస్తూ గ్రూప్ క్రియేట్ చేసి ఏకం చేసేందుకు కృషి చేశాం. పూర్వ విద్యార్థులంతా వేడుకలకు హాజరుకావడం.. పాఠశాల అభివృద్ధికి సహకారం అందిస్తామని ప్రకటించడం మరింత సంతోషాన్ని నింపింది. – ఆర్. శ్రీనివాస్గుప్తా, పూర్వ విద్యార్థి -
యువతకు స్ఫూర్తినిచ్చేలా..
పూర్వ విద్యార్థుల సమ్మేళనం యువతకు స్ఫూర్తినిచ్చేలా ఉంది. ఈ పాఠశాలలో చదివిన మాకు ఇన్నేళ్ల చరిత్ర, ఇంత మంది ఉన్నారనే విషయం ఇక్కడ కలిసే వరకు తెలియదు. 50ఏళ్ల నాటి పూర్వ విద్యార్థులను ఒకచోట కలిసేలా ఏకం చేసిన నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు. పాఠశాల అభివృద్ధికి అంతా కలిసి కృషి చేయాలనే ఆలోచన అద్భుతం. మాకు పాఠాలు చెప్పిన గురువులు, వారి గురువులను గౌరవించే వేడుకలో పాల్గొనం ఎంతో సంతోషంగా ఉంది. భవిష్యత్ తరానికి ఆదర్శంగా నిలిచేలా ఈ వేడుక మిగులుతుంది. – ఎ.అనంత్రెడ్డి, 2002–03 బ్యాచ్ విద్యార్థి -
‘స్థానిక’ పోరులో గుణపాఠం తప్పదు
ఆమనగల్లు: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ నెల 18న ఆమనగల్లులో నిర్వహించే రైతుదీక్షకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారని ఆయన తెలిపారు. పట్టణంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్స్లో రైతుదీక్ష వేదిక ఏర్పాట్లను ఆదివారం ఆయన మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, ఆమనగల్లు సింగిల్విండో చైర్మన్ గంప వెంకటేశ్, తలకొండపల్లి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దశరథ్నాయక్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై స్థానిక నాయకులకు పలు సూచనలు చేశారు. అనంతరం లక్ష్మారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు అధికారం కోసం ప్రజలకు అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రైతులకు రుణమాఫీ పూర్తిగా జరగలేదని, రైతుభరోసా అందలేదని అన్నారు. మహిళలకు నెలనెలా రూ.2,500 ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కేటీఆర్ దీక్షకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తరలివచ్చి జయపరదం చేయా లని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆమనగల్లు మున్సిపాలిటీ బీఆర్ఎస్ కన్వీనర్ పత్యానాయక్, మాజీ ఎంపీపీ నిర్మల, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు నర్సింహ, మాజీ సర్పంచ్లు శ్రీనునాయక్, జ్యోతయ్య పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం రైతు దీక్షను జయప్రదం చేయాలి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి -
ఇంటి బాల్కనీలో గంజాయి మొక్క సాగు
బంజారాహిల్స్: ఇంటి బాల్కనీలో గంజాయి మొక్క పెంచుతున్న ఆటోడ్రైవర్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ వెంకటగిరి బేగ్ రెసిడెన్సీలో నివాసం ఉంటున్న ఆటోడ్రైవర్ మహమ్మద్ అర్షద్ అలీ తన ఇంటి బాల్కనీలో గంజాయి మొక్క పెంచుతున్నట్లు సమాచారం అందింది. దీంతో ఆదివారం దాడి చేసిన పోలీసులు కుండీలో పెంచుతున్న గంజాయి మొక్కను గుర్తించారు. కొన్ని నెలలుగా దీనిని పెంచుతున్నట్లు నిందితుడు అంగీకరించడంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నైజీరియన్ డిపోర్టేషన్ ఎఫ్ఆర్ఆర్ఓ సహకారంతో పంపిన హెచ్–న్యూ సాక్షి, సిటీబ్యూరో: వీసా గడువు ముగిసినా నగరంలోనే అక్రమంగా నివసిస్తున్న నైజీరియన్ ఇకేచుకు సిల్వెస్టర్ మాంబా హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అతడి దేశానికి డిపోర్టేషన్ విధానంలో బలవంతంగా తిప్పి పంపింది. ఫారెనర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) సహకారంతో ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు డీసీపీ వైవీఎస్ సుదీంద్ర ఆదివారం ప్రకటించారు. ఇకేచుకు సిల్వెస్టర్ 2012లో బిజినెస్ వీసాపై ముంబై వచ్చాడు. తొలినాళ్లల్లో వస్త్ర వ్యాపారం చేపట్టిన అతను... ముంబైలో తక్కువ ధరకు వస్త్రాలు కొనుగోలు చేసి తన దేశానికి ఎగుమతి చేసేవాడు. పాస్పోర్టు గడువు ముగిసినా రెన్యువల్ చేయించుకోకుండా అక్కడే ఉండిపోయాడు. దీంతో ముంబైలోని తలోజా పోలీసులు 2019లో ఇతడిని పట్టుకుని పాస్పోర్టు యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అప్పట్లో రెండేళ్లు జైల్లో జైల్లో ఉన్న ఇతగాడు బయటకు వచ్చిన తర్వాత నవీ ముంబైలోని ఉల్వేలో ఉన్న స్నేహితుడి ఇంటికి మకాం మార్చాడు. డ్రగ్స్ దందాలో ఉన్న అతడితో కలిసి ఇతనూ పెడ్లర్గా మారాడు. ఇందులో భాగంగా నగరానికి చేరుకున్న ఇకేచుకు సిల్వెస్టర్ హుమాయున్నగర్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతూ ఈ నెల 5న హెచ్–న్యూకు చిక్కాడు. విచారణ నేపథ్యంలో వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో అతడిని డిటెన్షన్ సెంటర్కు తరలించిన హెచ్–న్యూ అధికారులు డిపోర్టేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఇన్స్పెక్టర్ జీఎస్ డేనియేల్, ఎస్సై వెంకట రాములు తమ బృందాలతో ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. ఎట్టకేలకు ఎఫ్ఆర్ఆర్ఓ నుంచి ఉత్తర్వులు పొంది నైజీరియాకు డిపోర్టేషన్ చేశారు. ఇటీవల కాలంలో అనేక మంది విదేశీయులు మెడికల్, స్టూడెంట్, బిజినెస్ వీసాలపై వచ్చి ఇక్కడే తిష్ట వేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి వారిలో అనేక మంది డ్రగ్స్ దందాలోకి దిగుతున్నారని, వీరిపై సమాచారం తెలిస్తే 8712661601కు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. 5.5 కిలోల గంజాయి పట్టివేత ఉప్పల్: గంజాయి విక్రయిస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్న ఘటన ఉప్పల్ ఎకై ్సజ్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ ఓం కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో అల్వాల్, వెంకటాపురానికి చెందిన అభిషేక్ కుమార్ సింగ్ గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎకై ్సజ్ పోలీసులు దాడి చేశారు. నిందితుడిని అదుపులలోకి తీసుకుని అతడి నుంచి 5.5 కేజీల గంజాయితో పాటు బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
విభజించు.. మోసగించు!
సాక్షి, సిటీబ్యూరో: సైబర్ నేరగాళ్ల మోసాలపై ప్రజల్లో అవగాహన వచ్చేలోగా.. వారు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. ఒకప్పుడు బ్యాంకు వివరాల అప్డేట్, క్రెడిట్ కార్డు, వర్క్ ఫ్రమ్ హోమ్ పేర్లతో వల వేసేవారు. ఇప్పుడు రూటు మార్చి వ్యక్తులు, వారి వయస్సుల ఆధారంగా దోచేస్తున్నారు. వృద్ధులైతే కరెంటు, నల్లా బిల్లులు కట్టలేదంటూ.. మహిళలు, గృహిణులకు తక్కువ ధరతో గృహోపకరణాలు, యువకులైతే క్రిప్టో కరెన్సీ పెట్టుబడులకు లాభాలంటూ వల విసిరి నిండా ముంచుతున్నారు. డేటాతోనే అసలు గుట్టంతా.. సైబర్ నేరాలకు మూలం ప్రజల వ్యక్తిగత వివరాలు అంగట్లో సరకులా మారడమే. ప్రజల డేటా విభజించుకుని దాని ఆధారంగా మోసాలు చేస్తున్నారు. వీటికితోడు గూగుల్లో తప్పుడు ప్రకటనలు, నకిలీ వెబ్సైట్లు భారీగా పుట్టుకొస్తున్నాయి. ఏ అంశంపై సెర్చ్ చేసినా దానికి సంబందించిన ప్రకటనలు తెరపైకి వస్తుంటాయి. ప్రత్యేక సందర్భాల్లో కొన్ని సంస్థలకు వ్యక్తిగత వివరాలు అందిస్తుంటాం. ఇవన్నీ నేరగాళ్లకు చేరుతున్నాయి. ఇవే వివరాలతో మోసగాళ్లు ఫోన్లో సంప్రదించి డబ్బు కొల్లగొడుతున్నారు. మోసాల్లో వీరే ఎక్కువ.. ఇటీవలి కాలంలో నగరంలో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందంటూ కస్టమ్స్, సీబీఐ, ఎన్సీబీ అధికారులమంటూ ఫోన్లు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ తరహా మోసాలపై ఒక్క సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఈ ఏడాది దాదాపు 200 వరకు ఫిర్యాదులు అందాయి. బాధితుల్లో యువతే ఎక్కువ. తక్కువ ధరకు గృహోపకరణాలు, ఇంట్లో ఉంటూ ఉద్యోగం తదితర మోసాల బాధితుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారు. కస్టమర్ కేర్, క్రిప్టో కరెన్సీ, పెట్టుబడికి రెండింతల లాభాలు, లోన్ యాప్ మోసాల్లో 20 40 ఏళ్ల లోపు వారు అధికం. సైబర్ మోసాల బారిన పడితే ఆలస్యం చేయకుండా 1930 టోల్ ఫ్రీకి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల కొత్తపంథా వర్గాల వారీగా గుర్తించి వల ఏమరపాటుగా ఉంటే ఖాతాలు ఖాళీ -
ఉరేసుకుని యువతి ఆత్మహత్య
కీసర: ఉరివేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం కీసర పోలీస్స్టేషన్ పరిధిలోని కీసర దాయరలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి కీసర దాయరకు చెందిన ప్రవళిక(23) నగరంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తోంది. ఆదివారం మధ్యాహ్నం ఆమె తల్లిదండ్రులతో పాటు, సోదరుడు బయటికి వెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చే సరికి ప్రవళిక ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందన్నారు. -
గ్రామాలు గప్చుప్
స్థానిక సంస్థల ఎన్నికలు లేక ఆశావహుల ఆవేదన ● ఇప్పటికే ప్రజల మద్దతుకు రూ.లక్షలు ఖర్చు ● ప్రస్తుతం జనాల్లో తిరగకుండా పోటీదారుల పాట్లు యాచారం: గ్రామాల్లో అంతా గప్చుప్ వాతావరణం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలుగా పోటీ చేయడానికి సిద్ధమైన ఆశావహులు నేడు ప్రజల మధ్యన కనిపించని పరిస్థితి ఉంది. దీనికి ప్రధాన కారణం ఎన్నికల ప్రక్రియ ఆలస్యమవ్వడమే. స్థానిక సంస్థల పోరుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చకచక పూర్తి చేయడం, త్వరగా ఎన్నికలు ఉంటాయనే సాంకేతాలతో గ్రామాల్లో ఆశావహుల హడావుడి మొదలైంది. రిజర్వేషన్లు కలిసోస్తే సర్పంచ్ లేదా ఎంపీటీసీగా పోటీ చేసి గెలుస్తామనే ధీమాతో పోటీదారులు గ్రామాల్లో హంగామా సృష్టించారు. ప్రజలను మచ్చిక చేసుకోవడం కోసం పిలువకున్నా వాళ్ల ఇళ్లకు వెళ్లి బాగున్నావా పెద్దమ్మ... పెద్దనాన్న... తమ్ముడు ఏం చేస్తున్నాడు.. చెల్లిలు ఇంటికొస్తుందా అంటూ ఆత్మీయ పలకరింపులు చేశారు. కొందరైతే గ్రామాల నుంచి ఉద్యోగ, వ్యాపార రీత్యా నగరంలో ఉన్న వాళ్లను కలిసి మద్దతు కూడగట్టుకోవడమే కాక, ఫోన్లు చేసి అన్నా.. ముందు అడుగుతున్నా.. నాకే నీ మద్దతు కావాలి.. అంటూ కాళ్ల బేరమాడారు. సిద్ధం చేసుకున్న ఆర్థిక వనరులు రాత్రి, పగలు ప్రజలకు సేవ చేసినా.. ఆపదకు ఆదుకున్నా సరే.. ఎన్నికలప్పుడు ప్రజలకు పచ్చనోటు ఇవ్వనిదే ఓట్లు రాలవనే భావన నేతల్లో ఉంటుంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయనే ఆశతో గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలుగా పోటీ చేయడానికి సిద్ధమైన ఆశావహులు కావాల్సిన డబ్బును సిద్ధం చేసి పెట్టుకున్నారు. యాచారం మండలంలోనే చూసుకుంటే 24 గ్రామ పంచాయతీలు, 14 ఎంపీటీసీలు ఉన్నాయి. మొత్తం 50,975 ఓటర్లు ఉన్నారు. మేజర్ గ్రామ పంచాయతీలైన మాల్, యాచారం, నక్కర్తమేడిపల్లి, నందివనపర్తి, గునుగల్, కొత్తపల్లి, మంతన్గౌరెల్లి, చింతుల్ల, చింతపట్ల, నల్లవెల్లి, తక్కళ్లపల్లి, కుర్మిద్ద తదితర గ్రామాల్లో పోటీలో ఉండటానికి రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షలకు పైగానే సిద్ధం చేసుకున్నట్లు వినికిడి. ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు వస్తే రూ.50 లక్షల్లోపు ఖర్చు, జనరల్ అయితే మాత్రం రూ.కోటి వరకు ఖర్చు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఆశావహులంతా వ్యవసాయ భూములు, ప్లాట్లను తక్కువ ధరలకు అమ్మి కొందరు డబ్బులు జమ చేసుకోగా, మరికొందరైతే రూ.5కు చొప్పున వడ్డీకి డబ్బులు మాట్లాడుకుని తమ వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్లు చేశారు. ఎన్నికలు కోడ్ వస్తే డబ్బులు పోగు చేసుకోవడం కష్టంగా మారుతుందని గ్రామాల్లోని తెలిసినవాళ్ల వద్ద డబ్బులు దాచి పెట్టుకున్నారు. ఎన్నికల లేవని ఆందోళన స్థానిక సంస్థల ఎన్నికలు కులగణన తర్వాతే ఉంటాయనే సాంకేతాలతో ఆశావహులు లబోదిబోమంటున్నారు. ‘ఎన్నికల కోసమే అప్పులు చేశాం.. వ్యవసాయ భూములు, ప్లాట్లు అమ్మినాం.. రిజిస్ట్రేషన్లు చేసి రూ.5కు వడ్డీకి అప్పులు తెచ్చి పెట్టుకున్నాం’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రీడాపోటీలు, మహిళలకు చీరలు, దేవాలయాల నిర్మాణాలకు చందాలు, నిత్యం ఓ కాలనీలో విందులు, యాత్ర పర్యటనల కోసం స్వచ్ఛంద సేవా కార్యక్రామలతో పేరుతో రూ.లక్షలాధి ఖర్చు చేశారు. పార్టీల వారీగా కూడా పెద్ద నేతలను మచ్చిక చేసుకోవడం కోసం నిత్యం దావత్లు ఇచ్చారు. నిప్పుల మీద నీళ్లు పోసినట్లుగా సర్కార్ ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు లేవని సాంకేతాలతో ఇన్నాళ్లు ప్రజలకు దావత్లు ఇచ్చిన ఆశావహులంతా కొద్ది రోజులుగా కనిపించకుండా తిరుగుతున్నారు. -
జీతం సరిగా వస్తలేదు
నెలనెలా జీతం వస్తుందనే ఆశతో పనిచేస్తున్నా. మూడు నాలుగు నెలలకోసారి ఇస్తున్నారు. జీతం అందక, ఇల్లు గడవక అప్పు చేయాల్సి వస్తోంది. రోజుఏదో ఒకచోట పూడికతీత, చెత్త తొలగింపు వంటి పనిచేస్తూనే ఉంటాం. అధికారులు స్పందించి వేతనం సరిగా అందేలా చూడాలి. – గడ్డమీది లక్ష్మయ్య, జీపీ కార్మికుడు, తాళ్లపల్లి, షాబాద్ మండలం అప్పులు తెచ్చి పనులు గతంలో చేసిన పనులకు బిల్లులు రాక అప్పులపాలయ్యాం. గ్రామాల్లో సర్పంచ్లు లేక పోవడంతో కార్యదర్శులు అప్పులు తెచ్చి పనులు చేయిస్తున్నారు. ఇప్పటి వరకు నిధులు లేక, అభివృద్ధి పనులు లేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం వచ్చి 14 నెలలు గడుస్తున్నా ఎన్నికలు నిర్వహించకపోవడం దారుణం. – చందిప్ప జంగయ్య, మాజీ సర్పంచ్, మల్లారెడ్డిగూడ, షాబాద్ -
ఆర్టీసీ బస్సులో నగదు చోరీ
వెంగళరావునగర్: ఆర్టీసీ బస్సులో నగదు చోరీకి గురైన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చింతల్ ప్రాంతానికి చెందిన పి.అరుణ, శివప్రసాద్ దంపతులు శనివారం ప్లాట్ కొనుగోలు చేసేందుకు నగదు తీసుకుని ఆర్టీసీ అమీర్పేటకు బస్సులో వచ్చారు. అమీర్పేటలోని రియల్ ఎస్టేట్ కార్యాలయం వద్ద బ్యాగ్లో చూసుకోగా అందులో ఉన్న రూ.1.40 లక్షలు నగదు కనిపించలేదు. దీంతో బస్సులో నగదు చోరీకి గురైనట్లుగా భావించినా వారు మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రూ.4 లక్షల విలువైన మత్తు పదార్థాల పట్టివేత ముగ్గురి అరెస్ట్ఉప్పల్: గంజాయి, డ్రగ్స్ విక్రయ కేంద్రంపై ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ఆదివారం దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 4 లక్షల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన జగదీశ్ రెడ్డి, కడప ప్రాంతానికి చెందిన అక్బన్ హూస్సేన్, కర్నూలు జిల్లాకు చెందిన అజయ్ కుమార్ చిలుకానగర్ శ్రీనివాస్ హైట్స్ సమీప కాలనీలో ఉంటూ డ్రగ్స్ దందా చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న రంగారెడ్డి జిల్లా ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ సుభాష్ బృందం వారి స్థావరంపై దాడి చేసి 18 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, 53 గ్రాముల ఓజికుష్, 1.24 కేజీల గంజాయి, విదేశీ మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం ఉప్పల్ ఎకై ్సజ్ పోలీసులకు అప్పగించారు. ఈ దాడుల్లో ఎస్సై చంద్ర, వెంకట్, రవి, శ్రీను, శ్యామల తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లి పేరుతో టోకరా
అమీర్పేట: స్నాప్ చాట్ ద్వారా పరిచయమైన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ యువకుడు ఆమె పేరిట రుణం తీసుకుని తప్పించుకొని తిరుగుతున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీనాథ్రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎస్ఆర్నగర్కు చెందిన యువతికి కూకట్పల్లి సమీపంలోని గోపాల్నగర్కు చెందిన ధీరజ్రెడ్డి (26)తో స్నాప్ చాట్ ద్వారా పరిచయం ఏర్పడింది. నీవు నాకు నచ్చావని, ఇంట్లో పెద్దవారితో చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అనంతరం సదరు యువతి పేరున ఆన్లైన్ యాప్ ద్వారా రుణాలు తీసుకున్నాడు.అలాగే కారు, స్కూటీతో పాటు ఐపాడ్ ఇంటి వస్తువులు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత గత నవంబర్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితురాలు ఇటీవల ధీరజ్రెడ్డి ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని అతడి తల్లిదండ్రులకు చెప్పింది. సానుకూలంగా స్పంచిందినట్లు నటించిన వారు అప్పటికి ఆమెకు నచ్చజెప్పి పంపారు. మర్నాడు ఆమె వారికి ఫోన్ చేయగా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ● స్నాప్ చాట్లో పరిచయం ● ఆమె పేరుతో రుణం ● కారు, బైక్ కొనుగోలు ● నిందితుడిపై కేసు నమోదు -
సమన్వయంతో హెచ్–సిటీ పనులు వేగిరం
గచ్చిబౌలి: హెచ్– సిటీ పనుల వేగవంతానికి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సూచించారు. ఆదివారం శేరిలింగంపల్లి వెస్ట్ జోనల్ పరిధిలో చేపడుతున్న హెచ్–సిటీలో ప్రతిపాదించిన ఫ్లై ఓవర్లు, రోడ్ల విస్తరణతో పాటు జంక్షన్ల విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. జంక్షన్ల వద్ద స్థల సేకరణ వేగవంతంగా చేపట్టాలన్నారు. సంబంధిత విభాగాల అధికారులు బస్సులో ప్రయాణించి యుటిలిటీ విద్యుత్, వాటర్ వర్క్స్, టెలిఫోన్ వైర్లను వెంటనే తొలగించాలని సూచించారు. ఖాజాగూడ, సైబరాబాద్ కమిషనరేట్, గచ్చిబౌలి, ట్రిపుల్ ఐటీ, విప్రో జంక్షన్లు, డీఎల్ఎఫ్ రోడ్డు, మసీద్ బండ, చందానగర్ రైల్వే స్టేషన్, లింగంపల్లి ఆర్ఓబీ, శ్రీదేవి టాకీస్, గంగారం రోడ్డు, ఆల్విన్ క్రాస్ రోడ్డు తదితర ప్రాంతాలలో హెచ్సిటీలో ప్రతిపాదిత పనులను పరిశీలించారు. కార్యక్రమంలో హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, పురపాలక శాఖ డిప్యూటీ సెక్రటరీ ప్రియాంక, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్, చీఫ్ ఇంజినీర్ భాస్కర్ రెడ్డి, టీజీఎస్పీడీసీఎల్ అధికారులు శేఖర్, పాండ్యన్, వెస్ట్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్, వేణుగోపాల్ రెడ్డి, టీజీఎస్ఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. -
బీటీ రోడ్లు నిర్మించండి
మంచాల: గ్రామాల్లో బీటీ రోడ్లు నిర్మించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని చెన్నారెడ్డిగూడలో పార్టీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి 15 ఏళ్లు అధికారంలో ఉండి చెన్నారెడ్డిగూడ, బండలేమూరు, అజ్జినతండా గ్రామల్లో సీపీఎం బలంగా ఉందని వివక్ష చూపి రోడ్డు నిర్మించకుండా కాలం వెళ్లదీశారని ఆరోపించారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఈ గ్రామాలకు రోడ్డు నిర్మిస్తున్నామని చెప్పి చెన్నారెడ్డిగూడలో శిలాఫలకం వేసి దాదాపు సంవత్సరం అవుతున్నా ఇప్పటికీ చలనం లేదన్నారు. ఈ గ్రామాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయన్నారు. ప్రభుత్వానికి కనీసం ఎన్నికల హామీలను అమలు చేసే పరిస్థితి లేదన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో చెన్నారెడ్డిగూడ, బండలేమూరు, అజ్జినతండా గ్రామాలను ఏకం చేసి పోరు చేస్తామన్నారు. నూతన రోడ్డు సాధించేవరకు అధికారులు, నాయకులను నిలదీస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి వర్గసభ్యుడు స్వామి, నాయకులు పాండు, చంద్రయ్య, మోతిలాల్, సురేష్, వెంకటేష్, ప్రహ్లాద్, కృష్ణ్ణ, ప్రవీణ్, జంగయ్య, పరమేశ్, భిక్షపతి, ఇబ్రహీం, ,లచ్చిరాం, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య -
అడవిలో మంటలార్పిన హెడ్కానిస్టేబుల్
ఇబ్రహీంపట్నం రూరల్: పోలీసంటే ఉద్యోగమే కాదు సామాజిక బాధ్యతని నిరూపించాడో హెడ్కానిస్టేబుల్. అడవిలో మంటలు ఎగిసిపడుతుండగా కర్రకు బట్ట కట్టి అదుపు చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఆదివారం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగ్లూర్ ఔటర్ సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న చెట్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీంతో అటువైపు వెళ్తున్న పెట్రోలింగ్ మొబైల్ ఉన్న హెడ్కానిస్టేబుల్ బాల్రాజ్యాదవ్ గమనించాడు. వెంటనే కారు దిగి పెద్ద కర్రకు బట్టను కట్టి వ్యాప్తి చెందకుండా అడ్డుకున్నాడు. అతనితో పాటు ఉన్న రామకృష్ణ అనే డ్రైవర్ ఫైర్స్టేషన్కు ఫోన్ చేసి రప్పించాడు. అరగంట పాటు బాల్రాజ్యాదవ్ శ్రమించిన తీరును స్థానికులు మెచ్చుకున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి పూర్తిగా మంటలు ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలిపారు. -
ఘనంగా సందల్ ఊరేగింపు
పహాడీషరీఫ్: పహాడీషరీఫ్ బాబా షర్ఫూద్దీన్ దర్గా సందల్ ఊరేగింపు ఆదివారం ఉదయం వైభవంగా కొనసాగింది. 759వ ఉర్సు ఉత్సవాలలో భాగంగా బాలాపూర్లో బాబా అడుగీడిన నివాసం నుంచి శనివారం అర్ధరాత్రి ప్రత్యేక ప్రార్థనలనంతరం సందల్ ఊరేగింపు ప్రారంభమయ్యింది. కొత్తపేట, వెంకటాపూర్, షాహిన్నగర్, జల్పల్లి కమాన్ల మీదుగా ఉదయం 9 గంటలకు పహాడీషరీఫ్ దర్గాకు చేరుకుంది. అనంతరం గంధంను కొండపై ఉన్న షర్ఫూద్దీన్ బాబా సమాధిపై ఉంచి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. వేలాది మంది పాల్గొంటున్న ఊరేగింపు కావడంతో పహాడీషరీఫ్, బాలాపూర్ పోలీసులు అదనపు బలగాలతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మహేశ్వరం డీసీపీ సునితా రెడ్డి, ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి, పహాడీషరీఫ్, బాలాపూర్ల ఇన్స్పెక్టర్లు గురువారెడ్డి, సుధాకర్లు బందోబస్తును పర్యవేక్షించారు. ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ పాల్గొని ప్రార్థనలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి తలపై పూలు, చాదర్తో వెళ్లి సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు యూసుఫ్ ఖాద్రీ, కొండల్యాదవ్, యాదగిరి, దస్తగిర్, అబ్దుల్లాబిన్ అవద్, శ్రీధర్, రవికుమార్ పాల్గొన్నారు. పహాడీషరీఫ్ దర్గా వద్ద వేలాది భక్తజనం -
డబ్బికార్ శ్రీనివాస్కు అవార్డు ప్రదానం నేడు
ఇబ్రహీంపట్నం: ఆరెకటిక సంఘం జాతీయ నాయకుడు, ఇబ్రహీంపట్నానికి చెందిన డబ్బికార్ శ్రీనివాస్ సేవలను గుర్తించిన వల్లూరి ఫౌండేషన్ అతన్ని బంగారు నంది అవార్డుకు ఎంపిక చేసింది. నగరంలోని రవీంద్రభారతిలో ఆదివారం శ్రీనివాస్కు అవార్డు ప్రదానం చేయనున్నారు. విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి కొత్తూరు: విద్యుదాఘాతంతో ఓ కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన కొత్తూరు పట్టణ సమీపంలోని వినాయకస్టీల్ ఐరన్ పరిశ్రమలో శనివారం చోటు చేసుకుంది. సీఐ నర్సింహారావు తెలిపిన ప్రకారం.. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ప్రీతంకుమార్(19) ఐరన్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కాగా విధుల్లో భాగంగా ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా విద్యుత్షాక్కు గురయ్యాడు. గమనించిన పరిశ్రమ యాజమాన్యం చికిత్స నిమిత్తం హైద్రాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
నేటి నుంచి ‘కులగణన’
ఈనెల 28 వరకు మరో అవకాశం సాక్షి, రంగారెడ్డిజిల్లా: సమగ్ర కుటుంబ/కులగణన సర్వేలో పాల్గొనని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఆదివారం నుంచి ఈ నెల 28 వరకు వివరాలు నమోదు చేయనుంది. గతంలో అధికారులు ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సర్వేలో పాల్గొనని వారి వివరాల నమోదుకు మూడు మార్గాలను ఎంపిక చేసింది. టోల్ ఫ్రీ నంబర్ సహా ఆన్లైన్లో ఫాం డౌన్లోడ్ చేసుకుని, వివరాలన్నీ పూర్తి చేసి ఇవ్వొచ్చు. మున్సిపాలిటీలు/ మండల కేంద్రాల్లో ఎంపిక చేసిన 37 ప్రజా పాలన సేవా కేంద్రాలకు నేరుగా వెళ్లి వివరాలు సమర్పించొచ్చని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదిబట్లలో హైడ్రా మార్క్ అనుమతులు లేని హోర్డింగ్ల తొలగింపు ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్లలో హైడ్రా కొరడా ఝులిపించింది. అక్రమ హోర్డింగలపై కన్నెర్ర చేసింది. మున్సిపల్ పరిధిలో శనివారం హైడ్రా అధికారులు పర్యటించారు. కొంగరకలాన్, బొంగ్లూర్, ఎంపీ పటేల్గూడ, మంగళ్పల్లిలో అనుమతులు లేకుండా 16 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హోర్డింగ్లను స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. వెంటనే సిబ్బందిని పిలిపించి హోర్డింగ్లను తొలగించారు. కొంగరకలాన్ అంబేడ్కర్ చౌరస్తా, కల్వకోలు లక్ష్మీదేవమ్మ ఫంక్షన్ హాల్ సమీపంలో, స్టేట్బ్యాంకు వద్ద, మంగళ్పల్లిలో ఉన్న హోర్డింగ్లను పూర్తిగా తీసివేశారు. కొన్నింటికి సాంకేతిక పరమైన చిక్కులు వచ్చాయని వదిలిపెట్టారు. మరికొన్ని హోర్డింగ్లను యాజమాన్యాలే స్వయంగా తొలగించుకోవడం విశేషం. మున్సిపల్ కార్యాలయం నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగానే హోర్డింగ్లు తొలగించినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. హెచ్ఎండీఏ, మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి మొయినాబాద్ రూరల్: చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందరరాజన్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆలయాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. నిజాం ప్రభుత్వం హయాంలో హైదరాబాద్ దేవాదాయ, ధర్మదాయ క్రమబద్ధీకరణ ప్రకారం కీ.శే. శఠగోపాలచారి చిలుకూరు బా లాజీ దేవాలయానికి హక్కుదారునిగా ఉన్నా రని అన్నారు. తమ పూర్వీకుల నుంచి తరతరా లుగా తమ కుటుంబమే దేవాలయ నిర్వ హణ బాధ్యతలు చూస్తున్నామని గుర్తుచేశారు. దైవం అస్తిత్వాన్ని దెబ్బతీసే వారికి దేవాలయ నిర్వహణలో హక్కుకానీ దైవ సంబంధమైన అంశాలపై మాట్లాడే అర్హత కానీ లేవన్నారు. బీఎండబ్ల్యూ కారు ఢీ.. ట్రాఫిక్ పోలీస్ బూత్ ధ్వంసం బంజారాహిల్స్: మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టడంతో జూబ్లీహిల్స్ చెక్పోస్టులో ట్రాఫిక్ పోలీసు బూత్ పూర్తిగా ధ్వంసమైంది. డివైడర్లు, దిమ్మెలు విరిగిపడ్డాయి. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. దోమలగూడకు చెందిన ప్రముఖ వ్యాపారి ఆయుష్ మాలిక్ శుక్రవారం రాత్రి జన్వాడ ఫామ్హౌస్లో తన స్నేహితుడి విందుకు హాజరయ్యాడు. రాత్రంతా అక్కడే ఉండి తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరాడు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపు వస్తుండగా ఆయన ముందు రెండు కార్లు ఇష్టానుసారంగా నడుపుతుండగా చూసుకుని నడపాలంటూ చెప్పే క్రమంలో బయటకు తల తిప్పి చూడడంతో కారు అదుపుతప్పి ట్రాఫిక్ పోలీసు బూత్ను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కారు మొత్తం పూర్తిగా దెబ్బతింది. ఎయిర్బెలూన్స్ తెరుచుకోవడంతో ఆయుష్ మాలిక్ క్షేమంగా బయటపడ్డాడు. జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆయుష్కు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేయగా మద్యం తాగలేదని తేలింది. కారు మాలిక్ జెమ్స్ అండ్ జ్యువెలరీ పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యిందని, రెండు పెండింగ్ చలాన్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
స్నానానికి వెళ్లి.. చెరువులో పడి
ఆగిర్యాలలో వ్యక్తి దుర్మరణంకొందుర్గు: స్నానం చేయడానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందిన ఘటన మండలంలోని ఆగిర్యాలలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్ నాయక్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శంకరయ్య(30) శనివారం మద్యాహ్నం 2 గంటల సమయంలో ఆగిర్యాల శివారులోని చెరువులో స్నానం చేసేందుకు వెళ్లి, అందులో పడిపోయాడు. గమనించిన స్థానికులు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు చెరువు వద్దకు చేరుకొని గాలించగా మృతదేహం లభించింది. మృతుడి తల్లి పోచమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
సర్కారు బడులకు కాంట్రాక్టు టీచర్లు
బషీరాబాద్: ప్రభుత్వం డీఎస్సీ 2008 అభ్యర్థులకు పోస్టింగ్లు ఇచ్చింది. దీంతో ఇక ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్టు టీచర్లు కొలువుదీరనున్నారు. 2008లో ఎస్జీటీ పోస్టుల భర్తీలో డీఎడ్ అభ్యర్థులకు 30శాతం వెయిటేజీ ఇవ్వడంతో అప్పడు మెరిట్ జాబితాలో పేరున్నప్పటికీ 2,367 మంది ఉద్యోగానికి దూరమయ్యారు. దీంతో వారు అప్పటి నుంచి పోరాటాలు చేయడంతో 2024 ఫిబ్రవరిలో వీరిని కాంట్రాక్టు పద్ధతిన నియమించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ధర్మాసనం ఆదేశాలతో 1,375 మందిని అర్హత కలిగిన అభ్యర్థులుగా ప్రభుత్వం గుర్తించింది. వీరి నియామకానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చి అభ్యర్థుల సర్టిఫికెట్లు సైతం వెరిఫికేషన్ చేసింది. పోస్టింగులు ఇవ్వడానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకులు ఉన్నాయని కొంత కాలయాపన చేయడంతో మరోసారి హైకోర్టు జోక్యం చేసుకుంది. ఎన్నికల కోడ్ ఎలాంటి అడ్డుకాదని చెప్పడంతో విద్యాశాఖ పోస్టింగుల ప్రక్రియను ప్రారంభించింది. దీంతో అభ్యర్థుల 17 ఏళ్ల పోరాటానికి ఫుల్స్టాప్ పడింది. ఇకపై కాంట్రాక్టు టీచర్లతో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉన్న ఎస్జీటీ ఖాళీలన్నీ వంద శాతం పూర్తికానున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 219 మంది ఎస్జీటీ అభ్యర్థులకు శనివారం అధికారులు నియామక పత్రాలు అందజేశారు. వంద పోస్టుల్లో ముగ్గురికి ఉర్దూ మీడియంలో పోస్టింగ్ ఇచ్చారు. ఉద్యోగం రెన్యూవల్ కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన టీచర్లను ప్రతీ విద్యా సంవత్సరం ప్రభుత్వం రెన్యూవల్ చేయనుంది. ఇందుకోసం వీరంతా ఏటా అగ్రిమెంట్ సమర్పించాల్సి ఉంటుంది. వీరి వేతనం బేసిక్ స్కేల్ రూ.31,040గా నిర్ణయించింది. ఎలాంటి అలవెన్సులు వర్తించవని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇతర కాంట్రాక్టు ఉద్యోగుల మాదిరి సెలవులు మాత్రం వర్తించనున్నాయి. 17 సంవత్సరాల పాటు సర్వీసును కోల్పోయిన కాంట్రాక్టు టీచర్లకు ప్రభుత్వం న్యాయం చేయాలని వివిధ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 2008 డీఎస్సీ అభ్యర్థుల ఉద్యోగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉద్యమాలు నడిపించిన వనపర్తి జిల్లాకు చెందిన శ్రీనివాస్ నాయక్ను వికారాబాద్ జిల్లాకు కేటాయించారు. ఈ మేరకు పీఆర్టీయూ జిల్లా నాయకులు చంద్రశేఖర్, అమర్నాథ్, శ్రీధర్రెడ్డి, నర్సింహారెడ్డి వివిధ మండలాల అధ్యక్షులు కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 2008 డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 219 మంది నియామకం ప్రాథమిక పాఠశాలల్లో వందశాతం ఖాళీలు భర్తీ ఫలించిన అభ్యర్థుల 17 ఏళ్ల పోరాటం జిల్లాల వారీగా కేటాయించిన ఎస్జీటీ పోస్టులు జిల్లా పోస్టులు వికారాబాద్ 100 రంగారెడ్డి 99 మేడ్చల్ మల్కాజిగిరి 20 -
‘ఎనిమి’ ఆస్తుల లెక్క తేల్చండి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎనిమి ఆస్తుల (కస్టోడియన్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా (సెపీ) సంరక్షణలోని శత్రు ఆస్తుల) లెక్క మార్చిలోగా పక్కాగా తేల్చాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శనివారం హోటల్ టూరిజం ప్లాజాలో సీసీఎల్ఏ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణరెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్, వికారాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా కొత్వాల్గూడలో 600 ఎకరాలకుపైగా, మియాపూర్లో 291 ఎకరాలకుపైగా ఉన్న ఎనిమి ప్రాపర్టీస్పై పురోగతి ఏమిటి అని కలెక్టర్ నారాయణరెడ్డిని ప్రశ్నించారు. మార్చిలోగా సర్వే పూర్తి చేసి, సమగ్ర వివరాలు సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిందే.. హైదరాబాద్ జిల్లా బాకారంలో 25,503 గజాల వివాదాస్పద స్థలంలో ఎనిమి ప్రాపర్టీస్ వాటా కింద ఉన్న 5,578 గజాలు, బహుదుర్పురాలోని రికాబ్గంజ్లోని 710,724,778,784 సర్వే నంబర్లలో ఉన్న 3,300 గజాలు, కొత్తగూడెం పాల్వంచలోని సర్వే నంబర్లు 126/111, 126/112లోని 40 ఎకరాలు, వికారాబాద్ జిల్లా అల్లంపల్లి సర్వే నంబర్లు 426, 427, 428లో 17.22 ఎకరాలు ఎనిమి ప్రాపర్టీస్ ఉన్నట్లు రికార్డులు ఉన్నాయని అన్నారు. సెపీ అధికారులతో కలిసి జిల్లా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి సెక్షన్ 8ఏ ప్రకారం వివాదాలను పరిష్కరించాలని సూచించారు. హైదరాబాద్ సహా రంగారెడ్డి ఇతర జిల్లాల్లోని ఎనిమి ఆస్తులు ఇప్పటికే పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయినట్లు ఆయా జిల్లాల అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వాటిని కాపాడి తీరాల్సిందేనని మంత్రి ఆదేశించారు. ఎనిమి ప్రాపర్టీస్ అంటే? 1962లో చైనీస్ దండయాత్ర, 1965 నుంచి 1971 వరకు జరిగిన ఇండో–పాక్ యుద్ధం అనంతరం భారత్ నుంచి వెళ్లిపోయి పాకిస్తాన్, చైనాలో స్థిరపడి ఆయా దేశాల పౌరసత్వం తీసుకున్న వ్యక్తులకు సంబంధించి భారత్లో ఉన్న ఆస్తులను శత్రు (ఎనిమి ప్రాపర్టీ) ఆస్తులుగా ప్రభుత్వం గుర్తించింది. వీటి సంరక్షణ బాధ్యతలను సెపీకి అప్పగించింది. తెలంగాణ, ఏపీతోపాటు దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాదాపు 13 వేల వరకు శత్రు ఆస్తులున్నట్లు కేంద్రం వద్ద రికార్డులున్నాయి. వీటి మార్కెట్ విలువ రూ.వేల కోట్లు ఉన్నట్లు గుర్తించింది. ఎనిమి ప్రాపర్టీ చట్టంలోని సెక్షన్ 8 (ఏ) ప్రకారం ఈ ఆస్తులను విక్రయించే అధికారం కేంద్రానికి ఉంది. నాటి నుంచి నేటి వరకు ఈ ఆస్తులు చాలా చోట్ల అన్యాక్రాంతమయ్యాయి. మరికొన్ని ఆస్తులకు సంబంధించి న్యాయ వివాదాలు నడుస్తున్నాయి. ఆస్తుల వివాదాల పరిష్కారంపై బండి సంజయ్ సమీక్ష నిర్వహించారు. మార్చిలోగా సర్వే పూర్తి చేయండి సమగ్ర వివరాలు సమర్పించండి కేంద్ర మంత్రి బండి సంజయ్ -
రెడీ
రేసుకు గుర్రపు స్వారీ.. చూసొద్దామా మరి ● ఈక్వెస్ట్రియన్ చాంపియన్ షిప్–2025కు అంతా సిద్ధం ● వేదిక కానున్న శంకర్పల్లి మండలం జన్వాడ ● అతిథ్యమివ్వనున్న నాసర్ పోలో హార్స్ రైడింగ్ క్లబ్ ● దేశం నలుమూలల నుంచి పాల్గొననున్న హార్స్ రైడర్లు పోలో: సిలికా ఎరినా (గ్రౌండ్)లో నిర్వహిస్తారు. ఈ విభాగంలో మొత్తం రెండు జట్లు పోటీ పడతాయి. ఒక్కో జట్టులో ముగ్గురు రైడర్లు ఉంటారు. ఒక్కో గేమ్ 7 నిమిషాల పాటు సాగుతుంది. మూడున్నర నిమిషాలకోసారి విరామం ఇస్తారు. షో జంపింగ్: మట్టి కోర్టులో నిర్వహిస్తారు. ఈ విభాగంలో ఒక్కో రైడర్ మాత్రమే పోటీ పడతారు. 5 నిమిషాల పాటు సాగే ఈ గేమ్లో.. రెండున్నర నిమిషాలకు విరామం ఇస్తారు. హార్డిల్స్ని 60 సెం.మీ, 80 సెం.మీ, 100 సెం.మీ, 110 సెం.మీ ఎత్తులో ఉంచి, వాటి పై నుంచి గుర్రాలు జంప్ చేసేలా పోటీలు ఉంటాయి. డ్రెసాజ్: మట్టి కోర్టులోనే నిర్వహిస్తారు. మార్చ్ ఫాస్ట్, గుర్రం, రైడర్ల నైపుణ్యం, కచ్చితత్వం వంటి వాటిపై పోటీ ఉంటుంది. ఈ గేమ్ 5 నిమిషాల పాటు సాగుతుంది. రెండున్నర నిమిషాలకు విరామం ఇస్తారు. జన్వాడలోని నాసర్ పోలో హార్స్ రైడింగ్ క్లబ్ని 1988లో హైదరాబాద్ నవాబ్లకు చెందిన మీర్ అహ్మద్ ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. మీర్ అహ్మద్ 60 ఏళ్ల క్రితమే ఖైరతాబా ద్లో బాలికల, గచ్చిబౌలిలో బాలుర పాఠశాలలను ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించి, విద్యార్థులకు శిక్షణ ఇచ్చి పోటీలకు పంపాలన్న ఉద్దేశంతో నాసర్ పోలో హార్స్ రైడింగ్ క్లబ్కు శ్రీకారం చుట్టారు. క్లబ్లో దాదాపు 40కి పైగా శిక్షణ పొందిన గుర్రాలు, నిష్ణాతులైన కోచ్లను ఏర్పాటు చేశారు. పోలో కోసం ప్రత్యేకంగా సిలికా ఎరినా (గ్రౌండ్) అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారు. రాత్రి సమయంలోనూ శిక్షణ పొందేందుకు ఫ్లడ్ లైటింగ్ సిస్టం సైతం ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా ఆరు క్లబ్లు ఉండగా జన్వాడలోని క్లబ్ ఒకటి కావడం విశేషం. ఈనెల 22,23 తేదీల్లో అర్హత పోటీలు జూనియర్ నేషనల్ ఈక్వెస్ట్రియన్ చాంపియన్షిప్– 2025 పోటీల కోసం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జన్వాడలోని నాసర్ పోలో హార్స్ రైడింగ్ క్లబ్లో ఈ నెల 22,23 తేదీల్లో జాతీయ అర్హత పోటీలు నిర్వహించనున్నారు. దేశంలో గుర్తింపు పొందిన హార్స్ రైడింగ్ క్లబ్బుల నుంచి అండర్ –11, అండర్–14, అండర్–18 కేటగిరీల్లో ఉన్న హార్స్ రైడర్స్ మాత్రమే పాల్గొంటారు. పోటీలకు వచ్చే రైడర్లు, అతిథుల కోసం నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కో రైడర్ ఒక్కోసారి మాత్రమే (నాకౌట్) పోటీ పడేందుకు అవకాశం ఉంటుంది. అర్హత పోటీల్లో గెలుపొందిన విజేతలు ఢిల్లీలో నిర్వహించే చాంపియన్షిప్ –2025 ఫైనల్స్లో తలపడతారు. ఈక్వెస్ట్రియన్లో మొత్తం మూడు విభాగాలు (పోలో, షో జంపింగ్, డ్రెసాజ్) ఉంటాయి. గుర్రాలు లేనివాళ్లకు రెంటుకు జాతీయ అర్హత పోటీల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున హార్స్ రైడర్లు వచ్చే అవకాశం ఉంది. కొందరు తమ సొంత గుర్రాలను తెచ్చుకోవడంలో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసం తమ వద్ద ఉన్న గుర్రాలను రోజుకు రూ.1000 అద్దె చెల్లించి, పోటీలకు వినియోగించుకోవచ్చని నాసర్ పోలో నిర్వాహకులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చే గుర్రాలకు ప్రత్యేకమైన స్థలాన్ని ‘స్టేబుల్’ అనే పేరుతో షో జంపింగ్, డ్రెసాజ్ల కోసం సిద్ధం చేసిన మట్టి కోర్టుప్రవేశం ఉచితం జన్వాడలోని నాసర్ పోలో హార్స్ రైడింగ్ క్లబ్లో నిర్వహించే జాతీయ స్థాయి అర్హత పోటీలు చూసేందుకు అభిమానులకు ఫ్రీ ఎంట్రీ అవకాశం కల్పించారు. -
కుక్కను తప్పించబోయి.. డివైడర్ను ఢీకొట్టి
● ద్విచక్ర వాహనం బోల్తా ● అక్కడికక్కడే వ్యక్తి మృతి చేవెళ్ల: ముంబై లింక్ హైవేలో బైక్పై వెళ్తున్న వ్యక్తి కుక్కను తప్పించబోయి బోల్తా పడ్డాడు. శుక్రవారం రాత్రి చేవెళ్ల దేవునిఎర్రవల్లి బస్టేజీ సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని ఎన్కేపల్లికి చెందిన బేగరి పాండు (35) వ్యవసాయంతోపాటు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ భార్యాపిల్లలతో కలిసి చేవెళ్లలో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం స్వగ్రామానికి వెళ్లిన పాండు బైక్పై తిరిగి వస్తున్నాడు. దేవునిఎర్రవల్లి స్టేజీ వద్దకు రాగానే అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన కుక్కను తప్పించబోయి, బైక్ అదుపు తప్పి, డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడ్డాడు. తలకు బలమైన గాయంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులకు సంఘటన స్థలానికి వెళ్లి, వివరాలు సేకరించారు. మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి శనివారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతునికి భార్య పుష్ప, ఓ కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పుష్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్మాని పోలీసులు తెలిపారు. -
కానిస్టేబుల్కు సన్మానం
ఇబ్రహీంపట్నం: చెరువులోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ ప్రాణాలు కాపాడిన ఎస్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ జగదీశ్ను మూడో బెటాలియన్ అధికారులు శనివారం సన్మానించి, అభినందనలు తెలిపారు. ఇబ్రహీంట్నానికి చెందిన తాటిపల్లి అంజమ్మ(50) శుక్రవారం రాత్రి స్థానిక పెద్దచెరువులో దూకి కొన ఉపిరితో కొట్టుమిట్టాడుతుండటాన్ని గమనించిన జగదీశ్ వెంటనే చెరువులోకి దూకి ఆమెను రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చాడు. అనంతరం అక్కడున్న తోటి పోలీసులు వేణు, ప్రవీణ్, ముఖేష్, కార్తిక్, నాగులుతో ఆమెను కట్టపైకి తీసుకొచ్చి ప్రథమ చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. ఎంతో ధైర్యసహసాలతో మహిళను రక్షించిన జగదీశ్ను 3వ బెటాలియన్ కమాండెంట్ సయ్యద్ జమీల్పాష, అడిషనల్ కమాండెంట్ శ్రీనివాస్రావు, ఎస్డీఆర్ఎఫ్ ఇన్చార్జి మహేశ్లు శాలువ కప్పి, సన్మానించి అభినందనలు తెలిపారు. -
గడ్డివాము దగ్ధం
షాబాద్: గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో గడ్డివాము దగ్ధమైన సంఘటన షాబాద్ మండల పరిధిలోని కుర్వగూడలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అశోక్ తన వ్యవసాయ పొలం వద్ద పశువులకు కొట్టం ఏర్పాటు చేసుకుని, అక్కడే వరిగడ్డి వాము పెట్టుకున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు దీనికి నిప్పంటించడంతో కాలి బూడిదైంది. దీంతో తనకు సుమారు రూ.50 వేల నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. ఈ మేరకు షాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి
సీఐటీయూ ఆధ్వర్యంలో సాగర్ రోడ్డుపై ధర్నా యాచారం: ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పి.బ్రహ్మయ్య డిమాండ్ చేశారు. మండల పరిధి మాల్ కేంద్రంలోని సాగర్ రోడ్డుపై శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని తాము వ్యతిరేకించడం లేదని, లక్షలాది రూపాయల అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేసిన ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని తెలిపారు. వీరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈఎంఐలు చెల్లిండంతో పాటు, వడ్డీలేని రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. బతుకు భారమై ఎంతో మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ చందునాయక్, నాయకులు దాసరి సతీష్, మహేశ్, శ్రీరాములు, రమేశ్ జంగయ్య, శ్రీనువాస్ తదితరులు పాల్గొన్నారు. -
పదవీ కాలం పొడిగింపుపై హర్షం
ఇబ్రహీంపట్నం రూరల్: సహకార సంఘాలు, డీసీసీబీల పద వీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించడంపై పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం టీజీక్యాబ్ చైర్మన్ మార్నెని రవీందర్రావు, వైస్ చైర్మన్ సత్తయ్య, డీసీసీబీ చైర్మన్లు శనివారం పలువురు నేతలను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి, మహబూబ్బాద్ ఎంపీ బలరాంనాయక్, డోర్నకల్ శాసన సభ్యులు రామచంద్రనాయక్ను కలిసి పుష్పగుచ్చం అందజేసి, శాలువతో సత్కరించారు. వీరిలో డీసీసీబీ చైర్మన్లు రమేష్రెడ్డి, దేవెందర్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, భోజారెడ్డి, వెంకటేశ్వరరావు ఉన్నారు. -
ప్రజలు తిరగబడటం ఖాయం
● ప్రభుత్వానికి ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి ● బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ● కడ్తాల్లో పార్టీ నాయకుల సమావేశం కడ్తాల్: ప్రభుత్వంపై ప్రజలు తిరగబడటం ఖాయమని, ఆ రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ దారుణంగా విఫలమైందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల కేంద్రంలోని తన నివాసంలో శనివారం బీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈనెల 18న పార్టీ ఆధ్వర్యంలో ఆమనగల్లులో నిర్వహించనున్న రైతు దీక్షకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు మాయమాటలు, మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ఆతర్వాత వీటిని విస్మరించిందని మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థ విధానాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందని విమర్శించారు. చాలా గ్రామాల్లో రైతులకు రుణమాఫీ కాలేదని, రైతు భరోసా అందలేదని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని స్పష్టంచేశారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి సత్తాచాటాలని పిలుపునిచ్చారు. ఈనెల 18న ఆమనగల్లు పట్టణంలో నిర్వహించనున్న రైతు దీక్షలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారని తెలిపారు. నియోజకవర్గంలోని నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్మ సత్యం, జెడ్పీటీసీ మాజీ సభ్యులు దశరథ్నాయక్, అనురాధ, విజితారెడ్డి, మాజీ ఎంపీపీలు నిర్మల, శ్రీనివాస్యాదవ్, రాంరెడ్డి, జైపాల్నాయక్, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పరమేశ్, నాయకులు శంకర్, రాజేందర్యాదవ్, రామకృష్ణ, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. -
● నాణ్యత, శుభ్రత పాటించని వారికి భారీగా జరిమానా ● నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక
హోటళ్లలో తనిఖీలు శంకర్పల్లి: ఆహార నాణ్యత పాటించని హోటళ్లు, బేకరీలపై శంకర్పల్లి మున్సిపల్ అధికారుల కొరడా ఝులిపించారు. శనివారం పట్టణంలోని పలు హోటళ్లు, బేకరీలలో మున్సిపల్ కమిషనర్ యోగేశ్, పర్యావరణాధికారి ఆనంద్తో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పల్లె రుచులు, మసూల్దార్ మండి, ఎస్వీఆర్ బేకరీలు నాణ్యత పాటించడం లేదని, కిచెన్ నిర్వహణ సైతం సక్రమంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయా హోటళ్లలో నిల్వ ఉంచిన అన్నం, చికెన్, అల్లం పేస్ట్ను గుర్తించారు. అనంతరం మసూల్దార్ మండికి రూ.30 వేలు, పల్లె రుచులుకు రూ.5 వేలు, ఎస్వీఆర్ బేకరీకి రూ.5 వేలు జరిమానా విధించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
400 టన్నుల ఇసుక సీజ్
● పది మందిపై కేసు నమోదు ● ఏసీపీ కేపీవీ రాజు ఇబ్రహీంపట్నం: అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణాతోపాటు, పలుచోట్ల డంప్ చేసి విక్రయిస్తున్న వారిపై పోలీసులు డేగ కన్ను పెట్టారు. ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం పీఎస్ల పరిధిలో 15 మందిపై కేసులు నమోదు చేసి సుమారు 400 టన్నుల ఇసుకను శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఏసీపీ కేపీవీ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం పరిధిలో ఇసుక డంప్ చేసి విక్రయిస్తున్న పది మందిపై కేసులు నమోదు చేసి 300 టన్నుల ఇసుక, ఆదిబట్ల పీఎస్ పరిధిలో ఐదుగురిపై కేసు నమోదు చేసి సుమారు 100 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిల్వలను తహసీల్దార్కు అప్పగించామని చెప్పారు. ఈ మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇసుక ఆక్రమ రవాణాపై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నామని, అక్రమంగా విక్రయించినా, డంప్ చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈము రైతులకు రుణ విముక్తి కల్పించండి షాద్నగర్: ఈము రైతులకు ప్రభుత్వం రుణ విముక్తి కల్పించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పటోళ్ళ వెంకటేశ్వర్రెడ్డి కోరారు. శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన నాబార్డు స్టేట్ క్రెడిట్ సెమినార్కు హాజరైన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కు, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును కలిసి వినతిపత్రం అందజేశారు. వ్యవసాయానికి అనుబంధంగా, లాభసాటిగా ఉంటుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించడంతో 15 ఏళ్ల క్రితం ఈము పక్షుల పెంపకం చేపట్టామన్నారు. ఇందుకోసం నాబార్డు సహకారంతో సబ్సిడీ కింద రుణాలు పొందామని స్పష్టంచేశారు. ఆశించిన స్థాయిలో లాభాలు, మార్కెట్ లేకపోవడంతో చాలా మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకపోయారని, కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈము రైతులకు సంబంధించి ఆయా బ్యాంకుల్లో సుమారు రూ.14 కోట్ల రుణాలు ఉన్నాయని, వీటిని మాఫీ చేసి విముక్తి కల్పించాలని కోరారు. మహిళా సమాఖ్యలో సీసీలు, ఏపీఎంలకు శిక్షణ కందుకూరు: మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో శుక్రవారం ఫుడ్ న్యూట్రీషన్ హెల్త్ వాష్(ఎఫ్ఎన్హెచ్డబ్ల్యూ) కార్యక్రమం నిర్వహించారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని ఆయా మండలాలకు చెందిన సెర్ప్ సీసీలు, ఏపీఎంలకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ శ్రీలత మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని. భోజనం చేసేముందు చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలని సూచించారు. అన్ని స్వయం సహాయక సంఘాలకు ఈ అంశాలను వివరించాలని తెలిపారు. కార్యక్రమంలో డీపీఎం నర్సింహ, యాదయ్య, బాలరాజు పాల్గొన్నారు. జాతీయ పోటీలకు గిరిజన విద్యార్థి రంజిత్ యాలాల: డిస్కస్ త్రో విభాగంలో జాతీయ స్థాయి పోటీలకు మండల పరిధిలోని దేవనూరు అనుబంద గ్రామం దుబ్బతండాకు చెందిన రంజిత్కుమార్ ఎంపికయ్యాడు. వికారాబాద్లో పాలిటెక్నిక్ చదువుతున్న రంజిత్కుమార్ ఫిబ్రవరి 12న నగరంలోని రామంతాపూర్లో నిర్వహించిన స్టేట్ లెవల్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో ప్రాతినిధ్యం వహించి రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. దీంతో ఆయన్ను దక్షిణ భారత దేశం నుంచి జాతీయ స్థాయి డిస్కస్ త్రో పోటీలకు అర్హత సాధించాడు. డిస్కస్ త్రోలో సౌత్ జోన్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన దుబ్బతండా గిరిజన విద్యార్థికి మండలంలోని నాయకులు, యువకులు అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్రంతో పాటు తండాకు మంచిపేరు తీసుకురావాలని పట్టుదలతో ముందుకు సాగాతున్నట్లు రంజిత్కుమార్ పేర్కొన్నారు. -
రైతు లేనిదే రాజ్యం లేదు
ఇబ్రహీంపట్నం రూరల్: అన్నంపెట్టే అన్నదాత లేనిదే రాజ్యం లేదని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీ కేంద్రంలో శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్యతో కలిసి హైదరాబాద్ డీసీసీబీ బ్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. జిల్లాకు డీసీసీబీ బ్యాంకు రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఎకరా స్థలంలో రూ.10 కోట్లతో అత్యాధునికంగా భవనం నిర్మిస్తే.. రూ.100 కోట్ల ఆస్తి అవుతుందని తెలిపారు. 9 నెలల్లో నిర్మాణం పూర్తిచేసి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో ప్రారంభిస్తామని చెప్పారు. ప్రస్తుతం బ్యాంకు రూ.600 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల టర్నోవర్తో కొనసాగుతుందని తెలిపారు. నాలుగు జిల్లాల కర్షకులకు కష్టకాలంలో నిధులు సమకూరుస్తూ.. అండగా నిలుస్తుందని వెల్లడించారు. రుణాలు, వడ్డీలు ముఖ్యం కాదని, రైతుల ప్రయోజనమేనని స్పష్టంచేశారు. దేశంలో అతిపెద్ద మార్కెట్ బాటసింగారంలో నిర్మిస్తున్నట్లు వివరించారు. ఆదర్శ డీసీసీబీగా నిలపాలి ‘గతంలో డీసీసీబీలో అప్పు తీసుకుంటే భయం ఉండేది. ప్రస్తుతం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా రుణాలు ఇచ్చి రైతులను ఆదుకుంటున్నాం. కొన్నేళ్లుగా ఆన్లైన్ సేవలు అందిస్తున్నాం. డీసీసీబీలను టెస్కాబ్కు అనుసంధానం చేసి ఆధునికీకరించాము’ అని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అన్నారు. ప్రతి సొసైటీకి రూ.50 లక్షల రుణాలు ఇచ్చి, ఆదుకుంటూ ముందుకు తీసుకెళ్లామని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోనే ఆదర్శ వంతమైన డీసీసీబీగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్గౌడ్, సీఈఓ భాస్కర్ సుబ్రహ్మణ్యం, డీసీఓ సుధాకర్, జీఎంలు ప్రభాకర్రెడ్డి, శ్రీరామ్, డీజీఎంలు కిరణ్కుమార్, సతీష్రెడ్డి, నాగాంజలి, ఆదిబట్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ నిరంజన్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్, ఈసీ శేఖర్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ పాండురంగారెడ్డి, డైరెక్టర్లు, పీఏసీఎస్ చైర్మన్లు, సీఈఓలు పాల్గొన్నారు. కర్షకుల ప్రయోజనమే ముఖ్యం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ డీసీసీబీ బ్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన -
నీటి ఎద్దడి రానీయొద్దు
సాక్షి, రంగారెడ్డి: రానున్న వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కలెక్టరేట్లో సంబంధిత ఏఈలతో సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ గ్రిడ్ ఇంట్రా తాగునీటి సరఫరాలో భాగంగా చేపట్టిన పనులు, ప్రస్తుతం నీటి సరఫరా జరుగుతున్న ఆవాసాలు, వాటర్ స్టోరేజీ ఇబ్బందులు, తదితర అంశాలపై కలెక్టర్ డివిజన్ల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరా సమస్యలు ఎక్కడ ఉత్పన్నమవుతాయో గుర్తించి పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇంట్రాలో లీకేజీ మరమ్మతులు ఏమైనా ఉంటే సరిచేయాలని సూచించారు. గ్రామ పంచాయతీల పరిధిలో ప్రస్తుత నిధులతో పైప్లైన్లు, చిన్నచిన్న మరమ్మతులు చేయించి నీటి ఎద్దడిని నివారించాలన్నారు. గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా నివాస ప్రాంతాలకు తాగునీరు అందే విధంగా పనులు చేపట్టాలని అన్నారు. నీటి పంపులు, మోటార్లు, వాల్వ్లు, పైపులకు సంబంధించి మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఈఈ రాజేశ్వర్, ఏఈలు, డీఈలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం -
సర్కారు బడిలో స్వర్ణోత్సవాలు
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో 1955లో జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ప్రారంభించారు. నేటికి ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 1955 నుంచి 2005 వరకు అంటే 50 ఏళ్లు కలిసి చదువుకున్న వారందరూ అపూర్వ కలయిక నిర్వహించాలని నిర్ణంచారు. అనుకున్నదే తడవుగా ఆరు నెలలుగా తీవ్ర కసరత్తు చేశారు. ఆదివారం వేడుకకు ముహూర్తం ఖరారు చేశారు. అందరిలో ఆతృత కొంత మంది పూర్వ విద్యార్థులు స్వర్ణోత్సవం నిర్వహించేందుకు కంకణం కట్టుకున్నారు. బాధ్యతగా పాఠశాలలో విద్యనభ్యసించిన వారందరి వివరాలను సేకరించారు. సాంకేతిక సహాయం వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, అందరికీ సమాచారం చేరవేశారు. 50 ఏళ్లలో చదివిన వారందరూ ఆహ్వానితులని పేర్కొంటూ కరపత్రాలను పంపిణీ చేశారు. సమ్మేళనంలో 1955 నుంచి 1980 వరకు పనిచేసిన పూర్వ ఉపాధ్యాయులు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఇంత పెద్ద కలయిక కార్యక్రమం ఎలా నిర్వహిస్తారోనని పూర్వ విద్యార్థులతో పాటు.. ప్రాంత ప్రజలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆత్మీయ కలయిక, ఉపాధ్యాయులకు సన్మానం, ఏడు దశాబ్దాల గుర్తుగా నిర్వహించే వేడుక తీపి జ్ఞాపకంలా మిగిలిపోవాలని భావిస్తున్నారు. చేవెళ్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవాలకు సిద్ధమవుతోంది. గత యాభై ఏళ్లుగా ఇక్కడ కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీనికి ఆదివారం మహూర్తం ఖరారు చేశారు. ఈ స్కూల్లో అక్షరాలు దిద్ది ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్న ఎంతో మంది తమ చిన్ననాటి మిత్రులతో కలిసి సందడి చేయనున్నారు. సంబరాలకు సిద్ధమైన చేవెళ్ల జెడ్పీహెచ్ఎస్ 70 వసంతాల పాఠశాలలో.. 50 ఏళ్ల వేడుక రేపు కలుసుకోనున్న బాల్యమిత్రులు ఆరు నెలల శ్రమ చదువుకున్న పాఠశాలను మరిచిపోవద్దనే ఆలోచనతో 1981– 82 విద్యాసంవత్సరానికి చెందిన బాల్య మిత్రులం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒక బ్యాచ్ వారే ఎందుకు కలవాలి? ఇక్కడ విద్యనభ్యసించిన వారందరూ ఏకమైతే ఎలా ఉంటుందోనన్న ఆలోచణ వచ్చింది. దీంతో ఆరు నెలలుగా జెడ్పీహెచ్ఎస్ వేదికగా సమీక్ష నిర్వహించాం. కార్యాచరణ రూపొందించాం. స్వర్ణోత్సవాలకు శ్రీకారం చుట్టాం. – రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా, పూర్వ విద్యార్థి -
అర్చకుడిపై దాడిని ఖండిస్తున్నాం
మొయినాబాద్ రూరల్: చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని ఎంపీలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాశ్ అన్నారు. పలువురు పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం వారు వేర్వేరుగా రంగరాజన్ను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు అంజన్కుమార్గౌడ్, నాయకులు గోపాల్రెడ్డి, మధుసుధన్రెడ్డి, శ్రీకాంత్, కిషన్ పాల్గొన్నారు. విభేదాలు సృష్టించేందుకే.. రాముడి పేరుతో దాడులు చేయడం సిగ్గుచేటని, నిత్యం దైవ సన్నిధిలో ఉండే వారిపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం సరికాదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. చిలుకూరు బాలాజీని సందర్శించిన అనంతరం ప్రధాన పూజారి రంగరాజన్ను కలిసి దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. హిందువుల మధ్య విభేదాలు సృష్టించాలనే ఇలాంటి కుట్రలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. ఇందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీ భీమ్భరత్, ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఈటల రాజేందర్, ఎమ్మార్పీ ఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ రంగరాజన్కు నేతల పరామర్శ -
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
ఇబ్రహీంపట్నం: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నంలోని పాషనరహరి స్మారక కేంద్రంలో శుక్రవారం సీపీఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఫార్మాసిటీ రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణ నిలిపి వేయాలని, ఫార్మాసిటీపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. కప్పపహాడ్ గ్రామంలో 98 ఏకరాల బినామీ భూమిని పేదలకు పంపిణీ చేయాలని, ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన వారికే కేటాయించాలని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నామని, జనాభా ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేపట్టి, చట్టబద్ధత కల్పించాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి, ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. దేశ వ్యాప్త కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.భాస్కర్, సామేల్, రాంచందర్, నర్సింహ్మా, కందుకూరి జగన్, జగదీశ్, జిల్లా నాయకులు జంగయ్య, అలంపల్లి నర్సింహ్మా, బుగ్గరాములు, జగన్, బాల్రాజ్, దేవేందర్, పెంటయ్య, శేఖర్లు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఇబ్రహీంపట్నంలో పార్టీ జిల్లా కార్యకర్తల సమావేశం -
కులగణన లెక్కలు వెల్లడించండి
షాద్నగర్: ప్రభుత్వం యాదవుల జనాభా గణాంకాలను వెల్లడించాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి దామోదర్యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... దేశంలో అగ్రకుల జనాభా అత్యంత తక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. రాష్ట్ర జనాభాలో యాదవులు అధికశాతం మంది ఉన్నారన్నారు. అయితే ప్రభుత్వం యాదవుల సంఖ్య తక్కువగా ఉందని చూపించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇటీవల నిర్వహించిన కుటుంబ సర్వే ఫలితాలను కులాల వారీగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. బీసీల సంఖ్యను తక్కువగా చూపించి వారి రాజకీయ, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను దెబ్బ తీసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. రిజర్వేషన్ల విషయంలో తమకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అంజన్యాదవ్, నాయకులు తిరుమలేష్, చెన్నకేశవులు, నర్సింగ్యాదవ్, సాయికుమార్ పాల్గొన్నారు. యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శి దామోదర్యాదవ్ -
తాగునీటి సమస్యను పరిష్కరించండి
బండ్లగూడ: హైదర్షాకోట్ శాంతినగర్ కాలనీ రోడ్ నెంబర్–3 వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాలనీలో తాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని, కమ్యూనిటీహాల్ నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ..గృహ అవసరాల నీటి కోసం బోర్ల ద్వారా మాత్రమే ఆధారపడి ఉన్నామన్నారు. వేసవి కాలం మొదలవడంతో బోర్లు ఎండిపోతున్నాయన్నారు. జలమండలి అధికారులు నాలుగు రోజులకు ఒకసారి అది కూడా కేవలం ఒక గంట మాత్రమే నీటిని వదులుతున్నారన్నారు. రోజు విడిచి రోజు నీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరామన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కె.నాగేష్, ప్రధాన కార్యదర్శి ఏ.వినయ్కుమార్గౌడ్, కోశాధికారి పి.కోటేశ్వర్రెడ్డి, ఉపాధ్యక్షులు అమర్సింగ్, మనోహర్ పాల్గొన్నారు. వేసవి రాకముందే నీటి కష్టాలు.. వేసవి రాకముందే నీటి కష్టాలు ప్రారంభమైయ్యాయని ఈ సమస్యను పరిష్కరించేందుకు జలమండలి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రావులకోళ్ల నాగరాజ్ కోరారు. నీటి కటకటపై జలమండలి అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాటత్లాడుతూ..బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మాధవీనగర్ కాలనీ, పీజీ కాలనీ ఇతర కాలనీల వాసులకు నీటి సమస్య తీవ్రంగా ఉండడంతో నీటి దాహార్థిని తీర్చాలని నీటి ఎద్దడి తలెత్తకుండా పరిష్కారం చూపాలన్నారు. హిమాయత్సాగర్ నుంచి వాటర్ వస్తాయని ఈ మధ్యనే వాటర్ గ్రిడ్ ప్రారంభోత్సవం చేశారన్నారు. మరి ఎందుకు వాటర్ రావడం లేదన్నారు. గతంలో కేసీఆర్ సర్కార్ మిషన్ భగీరథతో తాగునీటి కష్టాలు తీర్చిందని మండు వేసవిలోనూ నీటి కష్టాలు లేకుండా తాగునీటి కష్టాలు తీర్చిందని గుర్తుచేశారు. మార్చి, ఏప్రిల్, మే నెలలో తమ పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. ఇప్పటికై నా జలమండలి అధికారులు స్పందించి వాటర్ సమస్య లేకుండా రోజు విడిచి రోజు నీళ్లు సక్రమంగా విడుదల చేయాలని అధికారులను కోరారు. -
ఆ ఇద్దరూ అమన్, అలోక్!
సాక్షి, సిటీబ్యూరో: కర్నాటకలోని బీదర్, నగరంలోని అఫ్జల్గంజ్లో తుపాకులతో విరుచుకుపడిన ఇద్దరు దుండగులు బీహార్లోని వైశాలీ జిల్లా, ఫతేపూర్ పుల్వారియాకు చెందిన అమన్ కుమార్, అలోక్ కుమార్గా తేలింది. వీరిపై కర్ణాటక పోలీసులు రూ.5 లక్షల రివార్డు సైతం ప్రకటించారు. ఈ మేరకు లుక్ ఔట్ నోటీసులు రూపొందించి దేశ వ్యాప్తంగా అన్ని నగరాలకు పంపారు. ఈ గ్యాంగ్లో మొత్తం నలుగురు ఉండే వారని, 2023లో ఉత్తరప్రదేశ్లో ఇదే తరహా నేరానికి పాల్పడినట్లు బీదర్ అధికారులు చెబుతున్నారు. మీర్జాపూర్లోనూ ఓ గార్డు హత్య... ఈ గ్యాంగ్ బైక్లపై తిరుగుతూ, పట్టణ శివార్లలో రెక్కీ చేసి, ఏటీఎం మిషన్లలో నగదు నింపే వాహనాలనే టార్గెట్గా చేసుకుంటోంది. అలోక్ కుమార్ నేతృత్వంలో సాగే ఈ ముఠాలో అమన్, చందన్ కుమార్, రాజీవ్ సాహ్ని సభ్యులుగా ఉండేవారు. వీళ్లు 2023 సెప్టెంబర్ 12న ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్లో పంజా విసిరారు. రెండు ద్విచక్ర వాహనాలపై వెళ్లి యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం మిషన్లలో నగదు నింపే వాహనంపై దాడి చేసి కాల్పులు జరిపారు. పట్టపగలు, నడిరోడ్డుపై సెక్యూరిటీ గార్డు జై సింగ్ను హత్య చేసి రూ.40 లక్షలు ఉన్న ట్రంకు పెట్టెతో ఉడాయించారు. ఈ కేసు కొలిక్కి తీసుకురావడానికి ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రత్యేకంగా ఓ స్పెషల్ టాస్క్ఫోర్స్ (ఎస్టీఎఫ్) ఏర్పాటు చేసింది. అప్పట్లో ఈ గ్యాంగ్లో ఒక్కొక్కరిపై రూ.లక్ష చొప్పున రివార్డు ప్రకటించింది. ఎస్టీఎఫ్కు ఇద్దరు మాత్రమే చిక్కారు... ఒక ఏసీపీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, 30 మంది సిబ్బందితో ఏర్పాటైన ఈ ఎస్టీఎఫ్ దాదాపు ఏడాది పాటు దేశ వ్యాప్తంగా గాలించింది. ఎట్టకేలకు గత ఏడాది సెప్టెంబర్లో చందన్ కుమార్ను ముంబైలో, రాజీవ్ సాహ్నిని వైశాలీలో పట్టుకుంది. అప్పట్లో అమన్, అలోక్లు వైశాలీ జిల్లాలోని మహిసౌర్ జనధన్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. వీరి కోసం వేట ముమ్మరం చేయగా... ఇరువురూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆపై బీహార్లోనూ ఈ ద్వయం పలు నేరాలు చేసినట్లు తేలింది. చివరకు గత నెల 16న బీదర్లో పంజా విసిరింది. ఎస్బీఐ ఏటీఎం మిషన్లలో నగదు నింపే సీఎంఎస్ సంస్థ ఉద్యోగి గిరి వెంకటేష్ను చంపి, శివకుమార్ను గాయపరిచి రూ.83 లక్షలతో ఉడాయించారు. నగరంలో షెల్టర్ తీసుకున్న అమన్, అలోక్ నగదుతో తిరిగి ఇక్కడికే వచ్చి నేరానికి వాడిన ద్విచక్ర వాహనాన్ని ఎంజీబీఎస్ పార్కింగ్లో ఉంచారు. రివార్డు ప్రకటించిన కర్ణాటక పోలీసులు... అఫ్జల్గంజ్లోని రోషన్ ట్రావెల్స్ నుంచి ప్రైవేట్ బస్సులో రాయ్పూర్ వెళ్లేందుకు అమిత్కుమార్ పేరుతో టిక్కెట్ బుక్ చేసుకున్నారు. అక్కడ జరిగిన పరిణామాలతో మేనేజర్ జహంగీర్పై కాల్పులు జరపడం, పారిపోవడం జరిగిపోయాయి. ఈ హత్యాయత్నం ఘటనపై అఫ్జల్గంజ్ ఠాణాలోనూ కేసు నమోదైంది. ఈ దోపిడీ దొంగలు నగరం నుంచి కడప, నెల్లూరు మీదుగా చైన్నె వరకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆపై వీరి కదలికలు కనిపెట్టడం కష్టసాధ్యంగా మారింది. దీంతో వీరిపై కర్ణాటక పోలీసులు రూ.5 లక్షల చొప్పున రివార్డు ప్రకటించారు. ఈ మేరకు జారీ చేసిన లుక్ ఔట్ నోటీసుల్లో దుండగుల ఫొటోలను జత చేశారు. వీరికి సంబంధించిన సమాచారం తెలిసిన వారు కలబురిగి డీఐజీ (9480800030) లేదా బీదర్ ఎస్పీ (9480803401) లేదా బీదర్ డీఎస్పీలకు (9480803420) సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.బీదర్, అఫ్జల్గంజ్ కాల్పులు వీరి పనే ఇరువురిదీ బీహార్లోని వైశాలీ జిల్లానే రూ.5 లక్షల రివార్డు ప్రకటించిన కర్ణాటక 2023 నుంచి యూపీ పోలీసులకూ వాంటెడ్ -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
ఐదుగురికి గాయాలు షాద్నగర్రూరల్: ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పట్టణంలోని పరిగి రోడ్డులో పోచమ్మ దేవాలయం వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మహబూబ్నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్కు వెళ్లేందుకు షాద్నగర్ డిపో నుంచి బయలుదేరింది. పరిగి రోడ్డులో పోచమ్మ దేవాలయం వద్ద బస్సును డ్రైవర్ యూటర్న్ తీసుకుంటుండగా షాద్నగర్ వైపు వస్తున్న లారీ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అనంతరెడ్డికి కాలు విరగగా ప్రయాణికులు సుబ్రమణ్యస్వామి, కమ్మరి బాలమణి, జంపుల బాలమణి, అవుసుల సత్యమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డీఎం ఉష, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బస్సు కండక్టర్ శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్ఐ అనంతరాములు తెలిపారు. -
పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలి
చేవెళ్ల: స్వాతంత్య్రం సిద్ధించిన ఇన్నేళ్లలో ఇంకా పేదలు గూడు కోసం పోరు చేయాల్సిన దుస్థితి నెలకొందని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కె.రామస్వామి అభిప్రాయపడ్డారు. మండల కేంద్రంలోని 75 సర్వే నంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిలో రెండేళ్లుగా గుడిసెలు వేసుకొని పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అక్కడ రామస్వామి మాట్లాడుతూ.. రెండేళ్లుగా పేదలు గుడిసెలు వేసుకొని ఇళ్ల పట్టాల కోసం పోరాటం చేస్తున్నారని, వారికి ఎర్రజెండా అండగా నిలబడిందన్నారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా పేదలను పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. కనీస సౌకర్యాలు సైతం లేకుండానే రెండేళ్లుగా గుడిసెల్లో పేదలు కాలం వెళ్లదీస్తున్నారన్నారు. పట్టాల కోసం భూపోరాటం చేస్తున్న పేద ప్రజలకు సీపీఐ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి గుడిసెల్లో ఉండే పేదలకు ఇళ్ల పట్టాలు అందించాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు సత్తిరెడ్డి, ప్రభులింగం, సుధాకర్గౌడ్, అంజయ్య, శ్రీనివాస్, జంగయ్య, మక్బుల్, మంజుల, శివ, సుగుణమ్మ, రమాదేవి, పెంటయ్య, శ్రీకాంత్, యాదగిరి, గుడిసెవాసులు తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రామస్వామి