breaking news
Rangareddy
-
కదిలిస్తే..కన్నీళ్లే..
మీర్జాగూడ ప్రమాదం మృతుల కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది.. తమ వారిని తలచుకుని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.. అశ్రునయనాలతో కడసారిగా సాగనంపారు.. నిన్నటివరకు తమతోనే ఉన్నవారు ఇక తిరిగిరారన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.. ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు.. ఎవరిని కదిలించినా కన్నీళ్లే.. అంతులేని ఆవేదనే.. ఎక్కడ చూసినా ఇదే చర్చ.. ఏ నోట విన్నా ‘అయ్యో ఎంతటి ఘోరం’ అన్న మాటలే.. మరోవైపు ప్రమాదంలో గాయపడినవారు ఆయా ఆస్పత్రుల్లో కోలుకుంటున్నారు.. తమవారిని ఈ స్థితిలో చూసి అయినవారు తల్లడిల్లిపోతున్నారు.. ● తేరుకోని బాధితులు ● తల్లడిల్లిన హృదయాలు ● అంతులేని విషాదం నింపిన మీర్జాగూడ ప్రమాదం మృతురాలి తండ్రి చాంద్పాషా ఆవేదన తాండూరు రూరల్: మండలంలోని కరన్కోట్ గ్రామానికి చెందిన చాంద్పాషా గౌతాపూర్లో నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమార్తె పెళ్లి చేసి అత్తారింటికి పంపాం. చిన్న కూతురు ముస్కాన్ బేగం. తాండూరులో ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్లోని కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ముస్కాన్బేగం నాకు కొండంత ధైర్యమని చాంద్పాషా తెలిపాడు. కొడుకు లేడన్న లోటును తీర్చిందన్నారు. వ్యాపారంలో, కుటుంబ విషయంలో ఆమె చెప్పినట్లే వినేవాడిని పేర్కొన్నారు. చదువులో ఫస్ట్గా ఉండేదని, వ్యాపారం లేదా టీచర్ ఉద్యోగంలో రాణిస్తానని చెప్పేదన్నారు. బస్సు ప్రమాదంలో చిన్న కూతురు చనిపోయిందని ఇంకా ఆ షాక్లోనే ఉన్నానని తెలిపారు. మృత్యువులోనూ వీడని స్నేహం యాలాల మండలం పేర్కంపల్లికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ముస్కాన్బేగంకు సాయిప్రియ తోపాటు అమె చెల్లి, అక్క స్నేహితులు. అందరూ హైదరాబాద్లో చదువుకుంటున్నారు. కళాశాలకు సెలవు ఉంటే అందరూ తాండూరు వస్తారు. ఆ తర్వాత అందరూ కలిసే హైదరాబాద్ వెళ్తారు. ఇలా సోమవారం తెల్లవారుజమూనా కూడా నగరానికి వెళ్తూ కానరాని లోకానికి వెళ్లిపోయారని తండ్రి చాంద్పాషా ఆవేదన వ్యక్తం చేశారు. చాంద్పాషా అయినవారి ఆక్రందనలు -
బతుకుతామనుకోలే..
మహేశ్వరంలో భీకర వాన కుండపోత వర్షం మహేశ్వరం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో జనజీవనాన్ని అతలాకుతలం చేసింది.● కంకరలో ఇరుక్కున్నాం ● నరకం అనుభవించాం ● ఎలాగోలా బయటపడ్డాం ● భయానక ప్రయాణం ● ఆస్పత్రిపాలవుతామనుకోలేదు ● క్షతగాత్రుల మనోగతం చేవెళ్ల: మీర్జాగూడ వద్ద జరిగిన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారిలో ప్రస్తుతం 13 మంది చేవెళ్లలోని పట్నం మహేందర్రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద ఘటనపై వారిని కదిలించగా ఉబికివచ్చే కన్నీళ్లతో తమ అనుభవాలను పంచుకున్నారు. మృత్యువు అంచులవరకు వెళ్లి వచ్చినట్లుగా ఉందని, షాక్ నుంచి తేరుకోవడానికి సమయం పట్టిందని పేర్కొన్నారు. తలచుకుంటేనే భయంగా ఉంది బస్సు తాండూరులోనే నిండిపోయింది. ధారూరు, వికారాబాద్ వచ్చేసరికి సీట్లు లేక చాలామంది నిల్చున్నారు. ప్రమాదంలో నడుం వరకు కంకరలో కూరుకుపోయాను. నా కాలుకు రేకు దిగింది. రెండు ఫీట్లు ముందుండి ఉంటే ప్రాణాలు పోయేవి. బతికిపోయాను అనుకున్నా. తలచుకుంటేనే భయంగా ఉంది. – బస్వరాజ్, కోకట్ ప్రాణాలు పోతాయనుకున్నా.. నగరంలో స్వీపర్గా పనిచేస్తాను. ధారూరు నుంచి రోజూ తాండూరు నుంచి వచ్చే మొదటి బస్సుకే వెళ్తుంటాను. సోమవారం కూడా ఎప్పటిలాగే బస్సు ఎక్కగా సీట్లు లేకపోవడంతో డ్రైవర్ పక్కనే ఉన్న బ్యానెట్పై కూర్చున్నా. మీర్జాగూడ గేట్ రాగానే మలుపులో ఎదురుగా వేగంగా వస్తున్న టిప్పర్ను చూసి లారీ వస్తుంది తమ్మి అని డ్రైవర్కు చెప్పా. డ్రైవర్ బస్సును పక్కకు మలిపేలోపు టిప్పర్ ఢీకొట్టింది. కంకరలో మొత్తం మునిగిపోయా. నా చేయి మాత్రమే పైకి ఉండిపోయింది. తోటి ప్రయాణికులు నా చేయి పట్టుకొని బయటకు తీశారు. ప్రాణాలు గాలిలో కలిసిపోతాయనుకున్నా. తీవ్ర గాయాలతో బతికిబయటపడ్డా. – నాగమణి, ధారూరు రైలు మిస్ కావడంతో.. హైదరాబాద్లో సేల్స్మెన్గా పనిచేస్తున్నాను. వీక్లీ ఆఫ్ కావడంతో ఇంటికి వచ్చాను. ఎప్పుడు వచ్చినా రైలుకు వెళ్తాను. సోమవారం ఉదయం 4.30కు రైలు మిస్ కావడంతో 4.40 గంటలకు తాండూరు నుంచి వెళ్లే మొదటి బస్సు ఎక్కాను. బస్సు డ్రైవర్ కంట్రోల్ చేశాడు. కానీ టిప్పర్ డ్రైవర్ వచ్చి ఢీకొట్టాడు. నిలబడి ఉన్న నేను కంకరలో ఇరుక్కుపోయాను. నా ముందు ఒకతని ప్రాణాలు పోయాయి. జేసీబీ వచ్చే వరకు బయటకు రాలేకపోయా. ఇలా ఆస్పత్రి పాలవుతాననుకోలేదు. – బి.శ్రీనివాస్, తాండూరు కంకరలో కూరుకుపోయా.. మన్నెగూడ నుంచి చేవెళ్లలో ఆస్పత్రికి చూపించుకునేందుకని బస్సు ఎక్కాను. బస్సు పూర్తిగా నిండిపోవడంతో నిలబడి పోయాను. ప్రమాదంతో కంకరలో సగం వరకు కూరుకుపోయా. డోర్కు దగ్గరలో ఉండడంతో స్థానికులు రెండు చేతులు పట్టి బయటకు లాగారు. లేదంటే ప్రాణాలు పోయేవి. రోడ్డు బాగాలేకే ఈ ప్రమాదం జరిగింది. అసలే అనారోగ్యంతో ఉన్నాను. ఈ ప్రమాదంతో మరింతగా బాధపడుతున్నాను. – అనుసూయ, బొంగుపల్లి ఏం జరిగిందో అర్థం కాలేదు వికారాబాద్లో ఉంటూ హైదరాబాద్లో డ్రైవర్గా పనిస్తున్నాను. వారానికి ఒకరోజు ఇంటికి వచ్చి వెళ్తాను. ఆదివారం వచ్చి సోమవారం హైదరాబాద్కు వెళ్తున్నాను. బస్సులో ఉన్న నాకు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. తరువాత చూస్తే అంతా దుమ్ము, కంకర. అందులో పడిన వారి అరుపులు వినిపించాయి. నాకు ముక్కుకు, తలకు కంకర తగిలి గాయలయ్యాయి. – ఆర్.అఖిల్, పూడూరు -
ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి?
తాండూరు టౌన్: తాండూరు – హైదరాబాద్ రోడ్డును నాలుగు లేన్లగా విస్తరించాలంటూ తాండూరు డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ప్రజలు రోడ్డెక్కారు. మంగళవారం స్థానిక విలియంమూన్ చౌక్లో బైఠాయించి నిరసన తెలిపారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భీష్మించుకున్నారు. దీంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఏళ్ల తరబడిగా తాండూరు – హైదరాబాద్ రోడ్డు నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. ప్రజలు ఎన్నిమార్లు మొత్తుకున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఎంతమంది ప్రాణాలు పోవాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడగామని హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడాలని బీఆర్ఎస్ నాయకులు కోరగా కొందరు అడ్డుకన్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడు రోజుల్లో రోడ్డు పనులపై ప్రణాళిక విడుదల చేయాలని లేకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ తారాసింగ్కు వినతిపత్రం అందజేశారు. ఈ ఆందోళనలో తాండూరు డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్లు గోపాలకృష్ణ, కమాల్ అతర్, బాసిత్ అలీ, సోమశేఖర్, రాజ్కుమార్, విజయలక్ష్మి పండిట్, హాదీ, రాజుగౌడ్, సుదర్శన్ గౌడ్, షుకూర్, రాంబ్రహ్మం, శ్రీనివాస్, శోభారాణి, అనురాధ, నయీమ్, రామకృష్ణ, జావీద్, ఇంతేయాజ్, తాండూరు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తాండూరు – హైదరాబాద్ రోడ్డును విస్తరించాల్సిందే .. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం తాండూరు డెవలప్మెంట్ ఫోరం రాజకీయాలకు అతీతంగా ధర్నా -
బీసీ రిజర్వేషన్లు పక్కాగా అమలు చేయాలి
ఇబ్రహీంపట్నం రూరల్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పక్కగా అమలు చేయాలని బీసీ రిజర్వేషన్ల సాధన సమితి జిల్లా జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం డీఆర్ఓ సంగీతకు వినతిపత్రం అందజేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చి వెంటనే అమలు చేయాలని కోరారు. లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర నాయకుడు అబ్దుల్ రెహమాన్, జిల్లా కన్వీనర్ శేఖర్ చారి, నాయకులు తులసిగారి రవీందర్, జానకమ్మ, భవాని శేఖర్, అమరేందర్, స్టాలిన్, నర్సింహ, మహేశ్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. హుడాకాంప్లెక్స్: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజనోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాస్థాయి యువకళాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్టు జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటేశ్వర్ రావు మంగళవారం ఒక ప్రటకనలో పేర్కొన్నారు. సరూర్నగర్ ఇండోర్స్టేడియంలో ఈనెల 17న ఉదయం 9 గంటల నుంచి ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ మేరకు జానపద సంగీతం, జానపద నృత్యం, కథారచన, పెయింటింగ్, వక్తృతం, కవిత్వం తదితర పోటీలకు ఆహ్వానం పలుకుతున్నట్టు చెప్పారు. అభ్యర్థులు 15 నుంచి 29 ఏళ్ల లోపువారై ఉండాలన్నారు. జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన కళాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవుతారని, రాష్ట్రస్థాయిలో ఎంపికై న వారు జనవరి 10న న్యూఢిల్లీలో జరిగే 29వ జాతీయ యువజనోత్సవాల్లో పాల్గొనేందుకు అవకాశం పొందుతారని వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 15వ తేదీ లోపు తమ వివరాలను dysorangareddy@gmail.com ఈ మెయిల్ ద్వారా లేదంటే సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలోని జిల్లా యువజన, క్రీడల అధికారి కార్యాలయంలో నేరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు 9849909077 నంబర్లో సంప్రదించాలని సూచించారు. నందిగామ: మహిళా సంఘాలు బలోపేతం కావడానికి పంచసూత్రాలను విధిగా పాటించాలని సెర్ప్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ స్వర్ణలత అన్నారు. మండల కేంద్రంలోని మండల మహి ళా సమాఖ్య భవనంలో మంగళవారం ఏపీఎం భగవంతు ఆధ్యక్షతన సీనియర్ సీఆర్పీలు, సభ్యులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ.. పంచసూత్రాలైన ప్రతీ నెల సమావేశాలు నిర్వహించుకోవడం, పొదుపు చేసుకోవడం, అప్పు ఇచ్చుకోవడం, ఇచ్చిన అప్పులను సకాలంలో వసూలు చేయడం, పుస్తకాలు రాసుకోవడం తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు. 15 నుంచి 18 ఏళ్ల బాలికలను గుర్తించి కిశోర బాలికల సంఘాలను ఏర్పాటు చేయాలని, వీటితో పాటు దివ్యాంగుల సంఘాలు, వృద్ధుల సంఘాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఆర్పీలు హైమావతి, కావేరి, సంఘాల సభ్యులు పాల్గొన్నారు. కడ్తాల్: మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం ఇంటర్ బోర్డు అధికారి శశిధర్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా తరగతి గదులు, పరిసరాలు, వంటగది, స్టోర్ రూమ్ను బృందం సభ్యులు పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి అందుతున్న వసతులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లు, రికార్డ్స్, యూ డైస్, డేటా ఎంట్రీ, టోటల్ అడ్మిషన్స్, ఎఫ్ఆర్ఎస్, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. అనంతరం పాఠశాల అధ్యాపకులతో సమావేశమయ్యారు. పాఠ్య ప్రణాళికను సకాలంలో పూర్తి చేయాలని, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కేజీబీవీ ఎస్ఓ అనిత, పీజీ సీఆర్టీలు ఉన్నారు. -
గుర్తుతెలియని వాహనం ఢీ..
● ఫీల్డ్ అసిస్టెంట్కు తీవ్రగాయాలు ● పరిస్థితి విషమం యాచారం: నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపిన ప్రకారం.. గునుగల్ గ్రామానికి చెందిన ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ రమేశ్ మంగళవారం మధ్యాహ్నం విధులు ముగించుకుని బైక్పై గునుగల్ గేట్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు. రోడ్డు దాటుతున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన కుడి కాలు నుజ్జునుజ్జయింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దివ్యాంగుడైన రమేశ్కు కుడి కాలుకు తీవ్రంగా గాయం కావడంతో కదల్లేని స్థితిలో ఉన్నాడు. రమేశ్ను ఢీకొట్టిని వాహనాన్ని గుర్తించేందుకు యాచారం పోలీసులు గునుగల్ గేటు వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాద విషయాన్ని డీఆర్డీఓ శ్రీలత దృష్టికి తీసుకెళ్లామని.. ప్రభుత్వ నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటామని యాచారం ఎంపీడీఓ రాధారాణి తెలిపారు. -
పత్రాలు లేని వాహనాలు సీజ్
రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్గౌతం మొయినాబాద్: ప్రతి వాహనానికి సరైన పత్రాలు ఉండాలని.. లేదంటే సీజ్ చేస్తామని రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్ గౌతం అన్నారు. మున్సిపల్ కేంద్రంలో హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. ప్రతీ వాహనం పత్రాలను పరిశీలించారు. ఆర్టీసీ బస్సుల్లో లగేజీ, ప్రైవేటు వాహనాల్లో తరలిస్తున్న వస్తువులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు దగ్గర ఉంచుకోవాలన్నారు. మధ్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగి కుటుంబాలు నష్టపోతాయన్నారు. జాతీయ రహదారి కావడంతో మాదక ద్రవ్యాల రవాణా జరిగే అవకాశం ఉందని.. వాటితోపాటు ప్రమాదాల నివారణకోసం తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. తనిఖీల్లో మొయినాబాద్ ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి, ఎస్ఐలు వెంకటన్న, నయీమొద్దీన్, పోలీసు సిబ్బంది ఉన్నారు. పిడుగుపాటుకు లేగదూడ మృతి కేశంపేట: పిడుగుపాటుతో లేగదూడ మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని కాకునూరులో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రుమాండ్ల కుమారస్వామికి చెందిన లేగదూడ మేతమేస్తున్న క్రమంలో హఠాత్తుగా పిడుగు పడింది. దీంతో లేగదూడ మృత్యువాత పడింది. లేగదూడ విలువ సుమారు రూ.20 వేలు ఉంటుంది. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు. -
ఇందిరమ్మ ఇంటి కోసం.. చిన్నమ్మ జాగకు ఎసరు
● ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ కార్యాలయంలో వృద్ధురాలి ఫిర్యాదు ● ప్రజావాణిలో ఫిర్యాదు చేసినాపట్టించుకోలేదని ఆవేదన ఇబ్రహీంపట్నం రూరల్: మండల పరిధిలోని ఎల్మినేడుకు చెందిన మంచిరెడ్డి రాధమ్మ(71) తన ఇంటిజాగను కాపాడాలని ఎంపీడీఓ కార్యాలయ అధికారులను కోరింది. ఈ మేరకు మంగళవారం సూపరింటెండెంట్ జంగయ్యకు ఫిర్యాదు అందజేసింది. తనకు 200 గజాల ఇంటి స్థలం ఉందని.. మా మరి ది కుమారుడు చెన్న కిషన్రెడ్డి తనను ఇంటి నుంచి వెళ్లగొట్టి స్థలాన్ని కబ్జాచేసి ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకునేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించింది. గతంలో కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా డీపీఓ విచారిస్తామని చెప్పారని.. ఇప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయింది. ఒంటరిగా ఉన్న తనకు న్యాయం చేసేందుకు చెన్నకిషన్రెడ్డి ఇందిరమ్మ ఇంటి నిర్మాణ ప్రొసీడింగ్స్ రద్దు చేయాలని.. తనను మానసిక క్షోభకు గురిచేస్తున్న వారినుంచి రక్షించాలని కోరింది. -
మహేశ్వరంలో భీకర వాన
అలుగు పారిన కోటిరెడ్డి కుంట ● వరద ప్రవాహంలో చిక్కుకున్న కేజీబీవీ విద్యార్థులు మహేశ్వరం: కుండపోత వర్షం మహేశ్వరం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. వరద ఉధృతిలో కేజీబీవీ విద్యార్థులు చిక్కుకొని తీవ్ర అవస్థలు పడ్డారు. మంగళవారం సాయంత్రం ఎడతెరిపి లేకుండా వాన కురవడంతో చెరువులు, కుంటలకు భారీగా వరదనీరు చేరుకుంది. మండల పరిధిలోని కోత్వాల్ చెర్వుతండా, కావలోనిబాయి తండా, మహేశ్వరం, రామచంద్రగూడ, మన్సాన్పల్లి, గంగారం, పెండ్యాల, తుమ్మలూరు, సిరిగిరిపురం పలు గ్రామాల్లో వరద నీరు ఏరులై పారింది. రామచంద్రగూడేనికి ఆనుకొని ఉన్న కోటిరెడ్డి కుంటలోకి భారీగా వరదనీరు చేరడంతో కుంట నిండి అలుగు పారింది. ప్రవాహం మెగుళ్ల చెరువులోకి అక్కడి నుంచి అమీర్పేట్ తాళ్ల చెరువులోకి వెళ్లింది. రాజరాజేశ్వర ఆలయంలోకి నీరు మండల కేంద్రంలో కొలువైన శివగంగ రాజరాజేశ్వర ఆలయంలోకి భారీగా వరద నీరు చేరుకుంది. రాజరాజేశ్వరీ అమ్మవారి గర్భ గుడిలోకి వర్షం నీరు చేరింది. నీటిని మోటార్ల ద్వారా తీసేందుకు ఆలయ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మహేశ్వరం మోడల్ స్కూల్ ప్రాంగణంలోకి సైతం వరద నీరు చేరింది. కేసీతండా సమీపంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం ప్రాంగణంలోకి భారీగా వరద నీరు చేరుకుంది. హాస్టల్ పరిసరాలు, వంటగదిని వరద ముంచెత్తింది. నీట మునిగిన కస్తూర్బా గాంధీ హాస్టల్ భవనం ఉధృతంగా ప్రవహిస్తున్న కోటిరెడ్డి కుంట అలుగు -
మృతురాలి కుటుంబానికి పరిహారం
అందజేసిన స్పీకర్ ప్రసాద్కుమార్ అనంతగిరి: మీర్జాగూడ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వికారాబాద్కు చెందిన తారిబాయి ఇంటిని మంగళవారం స్పీకర్ ప్రసాద్కుమార్, కలెక్టర్ ప్రతీక్జైన్ సందర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభు త్వం తరఫున రూ.7 లక్షలు, స్పీకర్ తన వంతుగా లక్ష రూపాయలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బస్సు ప్రమాదం దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, డీసీసీబీ డైరక్టర్ కిషన్ నాయక్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 19 మందిలో.. 13 మంది మహిళలే బషీరాబాద్: మీర్జాగూడ బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందడం రాష్ట్రంలో సంచలనం కలిగించింది. అయితే ఈ ఘటనలో ఆసక్తికర విషయం తెరమీదకు వచ్చింది. సోమవారం తాండూరు నుంచి బయలు దేరిన బస్సులో 70 శాతం ప్రయాణికులు మహిళలే ఉన్నట్లు తెలిసింది. వారికి బస్సులో కుడివైపు సీట్లు రిజర్వు ఉండడంతో డ్రైవర్ వెనుకాల వరుసలో ఎక్కువ మంది మహిళలు కూర్చున్నారు. టిప్పర్ కుడివైపున ఢీకొట్టడంతో డ్రైవర్ వెనుక వరుసలో కూ ర్చున్న 13 మంది దుర్మరణం చెందారు. చాలా మంది మహిళలు గాయాలపాలయ్యా రు. మృతుల్లో కల్పన(42), గున్నమ్మ (60), తారీబాయి(44), గుర్రాల అఖిల (23), నాగమణి(54), తబస్సుమ్జాన్(38), నందిని (22), సాయిప్రియ(18), తనూష (20), వెంకటమ్మ(21), లక్ష్మి(40), సెలా (20), ముస్క న్ బేగం (21) ఉన్నారు. ఇద్దరు డ్రైవర్లతో కలిపి పురుషులు ఆరుగురు ఉన్నారు. ● మీర్జాగూడ ప్రమాదం ఘటనలో పలువురు మహిళలకు గాయాలు ● కుడిపక్కన కూర్చోవడంతో అధిక ప్రాణనష్టం -
రోడ్డు విస్తరణకు కృషి చేస్తున్నా
చేవెళ్ల: హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ కోసం తాను 2005 నుంచి కృషి చేస్తున్నాని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. చేవెళ్లలో మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందటం, పలువురు గాయపడటం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు, గాయపడినవారికి సహకారం అందిస్తుందని చెప్పారు. జాతీయ రహదారి కోసం 2005 నుంచి అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్కు వినతిపత్రం అందించినట్లు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డికి కూడా ఈరోడ్డు కోసం చర్యలు తీసుకోవాలని కోరానన్నారు. కేంద్రంలో ఉన్న నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందన్నారు. ఎన్జీటీలో కేసు వేయటంతో ఇన్నాళ్లు ఆలస్యం జరిగిందన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చొరవతో రామ్మోహన్రెడ్డి, పర్యావరణ వేత్తలతో కలిసి చర్చలు జరిపి క్లీయర్ చేశామన్నారు. రోడ్డు పనులు ఇక ఆగకుండా త్వరగా పూర్తి చేయించేందుకు కృషి చేస్తానని చెప్పారు. సమావేశంలో ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్యగౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు వీరేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు వెంకట్రెడ్డి, ప్రతాప్రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వరుస ప్రమాదాలు
షాద్నగర్: ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి ఆరోపించారు. మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చేవెళ్ల బస్సు ప్రమాదం తనను ఎంతో కలిచి వేసిందన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. బీజాపూర్ –హైదరాబాద్ మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిసినా విస్తరించడం లేదని తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ మార్గంలో ఓవర్ లోడ్తో వెళ్తున్న లారీలు, టిప్పర్లను నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. మామూళ్ల మాయలో పడి చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వం ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు మోహన్సింగ్, నర్సింహ్మ యాదవ్, సుధాకర్, చిట్టెం లక్ష్మీకాంత్రెడ్డి, మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విష్ణువర్ధన్రెడ్డి -
నేటి నుంచి మైసిగండి జాతర
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో కొలువైన, భక్తుల ఇలవేల్పు.. కొలిచిన వారికి కొంగుబంగారం.. శ్రీ మాత మైసిగండి మైసమ్మ తల్లి వార్షిక జాతర ఉత్సవాలు నేటి నుంచి 10వ తేదీ వరకు ఆరు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ప్రతీ ఏడాది కార్తీక పౌర్ణమి రోజున ప్రారంభమయ్యే ఈ జాతరకు జిల్లా వాసులతో పాటు మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్, వికారాబాద్, మేడ్చల్, నల్గొండ, హైదరాబాద్, మెదర్ తదితర తెలంగాణ జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై ఉన్న అమ్మవారి ఆలయానికి నిత్యం భక్తుల తాడికి ఉంటుంది. ఆది, మంగళ, గురువారాల్లో మొక్కులు తీర్చుకునే భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతుంటాయి. జాతర ఉత్సవాలలో భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఉత్సవ కమిటీ సభ్యులు ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగసుందరంగా అలకరించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ట్రస్టీ శిరోలి, ఈఓ స్నేహలత తెలిపారు. రవాణా సదుపాయం హైదరాబాద్ ఇమ్లీబన్ బస్టాండ్ నుంచి ప్రతీ ఐదు నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంది. నల్గొండ ఎక్స్ రోడ్స్, ఐఎస్ సదన్, సంతోష్నగర్, చంద్రయాన్గుట్ట నుంచి ప్రతీ ఐదు నిమిషాలకు బస్సు సౌకర్యం కలదు. కల్వకుర్తి, నాగర్కర్నూల్, అచ్చంపేట్ నుంచి బస్సులు ఉన్నాయి. ఆరు రోజులపాటు మైసమ్మ తల్లి ఉత్సవాలు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు జాతర కార్యక్రమ వివరాలు వారం పూజలు బుధ క్షీరాభిషేకం, కుంభ హారతి, విశేష అలంకరణ గురు సహస్ర చండీయాగం, విశేష పూజలు, రాత్రి పుష్పరథోత్సవం, చిన్న తేరు ఊరేగింపు శుక్ర సహస్ర చండీయాగం, విశేష పూజలు, పెద్ద రథోత్సవం శని సహస్ర చండీయాగం, విశేష పూజలు, పూర్ణాహుతి ఆది బోనాలు, బండ్లు తిప్పుట సోమ కూరగాయలతో అలంకరణ, అన్నదానం -
భూసార పరీక్షలు తప్పనిసరి చేయించుకోవాలి
జిల్లా వ్యవసాయాధికారి ఉష నందిగామ: రైతులు తమ భూములకు సంబంధించి భూసార పరీక్షలను తప్పనిసరి చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఉష అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం రైతులకు భూసార పరీక్షలకు సంబంధించి సాయిల్ హెల్త్కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు తమ భూములు ఏ పంటలకు అనుకూలంగా ఉన్నాయో తెలుసుకోవడానికి భూసార పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. దీంతో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. రైతులకు ఏమైనా సమస్యలుంటే సంబంధిత వ్యవసాయాధికారులను సంప్రదించాలని చెప్పారు. రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువులను వాడాలని సూచించారు. కార్యక్రమంలో షాద్నగర్ ఏడీఏ రమాదేవి, టెక్నికల్ ఏఓలు శిల్ప, శోభారాణి, మండల వ్యవసాయాధికారి రామశివరావు, ఏఈఓలు శిరీష, రవి కుమార్, ఏఎంసీ డైరెక్టర్ నర్సింహ తదితరులు పాల్గొన్నారు. మెడికో రూమ్లో డ్రగ్స్ ● టాస్క్ఫోర్స్ పోలీసుల దాడి ● పీజీ వైద్యుడు జాన్పాల్ అరెస్టు ముషీరాబాద్: డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా గుట్టుచప్పుడు కాకుండా ఇతరులకు విక్రయిస్తున్న ఓ పీజీ డాక్టర్ను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... తెనాలికి చెందిన జోసెఫ్ జాన్పాల్ ఎంబీబీఎస్ పూర్తి చేసి గాంధీ మెడికల్ కళాశాలలో ఫోరెన్సిక్ సబ్జెక్ట్పై పోస్ట్ గ్రాడ్యూయేషన్ (పీజీ) చేస్తున్నాడు. ఇతడు గాంధీ మెడికల్ కళాశాల సమీపంలోని బాకారం సాగర్ లాల్ ఆసుపత్రి వీధిలో ఓ రూమ్ను అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. ఇతడికి ప్రమోద్, సందీప్, శరత్లు అనే స్నేహితులు ఉన్నారు. ఇందులో ఒకరు డాక్టర్, ఇద్దరు సాప్ట్వేర్ ఇంజనీర్లు. ఈ ముగ్గురి ద్వారా జాన్పాల్కు డ్రగ్స్ అలవాటైంది. ఈ క్రమంలో డ్రగ్స్ కొనేందుకు డబ్బులు సరిపోకపోవడంతో వీరు విక్రేతలుగా మారారు. ఢిల్లీ, బెంగళూర్ నుంచి తీసుకువచ్చిన డ్రగ్స్ను జాన్పాల్ రూమ్లో దాచి అవసరమైన వారికి విక్రయిస్తున్నారు. దీనిపై అందిన సమాచారం మేరకు తెలంగాణ ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ బీ టీమ్ లీడర్ ప్రదీప్రావు, ఎస్సై బాలరాజు, సిబ్బంది మంగళవారం ఉదయం రూమ్పై దాడి చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓజీ, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ, కొకై న్, హాష్ ఆయిల్, గంజాయి తదితర మాదక ద్రవ్యాలు 26 గ్రాములు దోరికాయి. వీటి విలువ దాదాపు మూడు లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. విచారణ నిమిత్తం జాన్పాల్ను అరెస్టు చేసి ముషీరాబాద్ ఎకై ్సజ్ పోలీసులకు అప్పగించగా సీఐ రామకృష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. జాన్పాల్ను రిమాండ్కు తరలించి పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. -
మొయినాబాద్లో ఇద్దరి అదృశ్యం
మొయినాబాద్: బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన షానుబేగం, మహ్మద్ రఫీక్ దంపతులు నాలుగేళ్ల క్రితం తమ ముగ్గురు కొడుకులు, ఒక కూతురుతో కలిసి జీవనోపాధి కోసం మొయినాబాద్కు వలసవచ్చారు. పెద్దమంగళారంలో ఉంటూ కూలీపని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి పెద్దకుమారుడు షకీల్బాబా(25) ఈ నెల 2న ఉదయం 11 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం మొయినాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులతో గొడవ పడి.. భూమికి సంబంధించిన డబ్బు ల విషయంలో తల్లి, అన్నతో గొడవ పడిన ఓ వ్యక్తి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకుండా అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమంగళారంకు చెందిన ఉషంగారి హరీష్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. కాగా ఈ నెల 2న భూమికి సంబంధించిన డబ్బుల విషయంలో తన తల్లి, అన్నతో గొడవ పడ్డాడు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం మొయినాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
కోలుకుంటున్న క్షతగాత్రులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా/ చేవెళ్ల/మొయినాబాద్: మీర్జాగూడ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు కోలుకుంటున్నారు. స్వల్ప గాయాలతో వికారాబాద్, చేవెళ్ల ఆస్పత్రుల్లో చేరిన 27 మందిలో ఇప్పటికే ఆరుగురు డిశ్చార్జ్ కాగా, మంగళవారం మరో ఐదుగురు ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తు తం ఉస్మానియా ఆస్పత్రిలో ఆరుగురు, పీఎంఆర్లో 12 మంది, వికారాబాద్లో ఒకరు, నిమ్స్లో ఇద్దరు, మెడ్లైఫ్లో ఒకరు చికిత్స పొందుతున్నారు. స్వల్ప గాయాలతో చేవెళ్ల పీఎంఆర్ ఆస్పత్రిలో చేరిన ఎండీ యోనస్, జె.జగదీశ్తోపాటు వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన బి.ప్రవీణ, సయ్యద్ తహ్రా, సయ్యద్ ఖాతిజలు కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి ఇంటికి పంపారు.మెరుగైన వైద్యం కోసం ఉస్మానియాకు.. తలకు తీవ్ర గాయాలైన సయ్యద్ అస్మాను మెరుగైన చికిత్స కోసం ఉస్మానియాకు తరలించారు. షేక్ తస్లీమా, సయ్యద్ అబ్దుల్లా, సయ్యద్ ఖాజావలి, సయ్యద్ షఫీలను కూడా ఉస్మానియాకు పంపారు. ప్రస్తుతం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో మోహిని స్వప్న మాత్రమే చికిత్స పొందుతోంది. పీఎంఆర్ ఆస్పత్రిలో 12 మందికి చికిత్స అందిస్తున్నారు. సుజాత, నందినికి నిమ్స్లో చికిత్స చేశారు. టిప్పర్ యజమాని లక్ష్మణ్నాయక్ బండ్లగూడ జాగీర్లోని మెడ్లైఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శకలాలే ఆనవాళ్లు.. ఘోర ప్రమాదంతో భీతావహంగా మారిన మీర్జాగూడ మంగళవారం నిశ్శబ్దంగా కనిపించింది. కంకర లోడుతో వచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 19 మంది మరణించగా, 27 మంది గాయపడిన విషయం తెలిసిందే. సోమ వారం శవాల దిబ్బలు, క్షతగాత్రుల ఆర్తనాదాలు, బంధువుల రోదనలతో కంపించిన ఈ ప్రాంతం సాధారణంగా మారిపోయింది. ఆ మార్గంలో వెళ్లేవాళ్లు ప్రమాద స్థలాన్ని ఆసక్తిగా, ఒకింత భయంగా పరిశీలిస్తూ ఘటనపై చర్చించుకున్నారు. రోడ్డు పక్కన కంకర దిబ్బలు, వాహనాల శకలాలు ప్రమాదానికి ఆనవాళ్లుగా మిగిలాయి. టిప్పర్, బస్సును చేవెళ్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. నిద్ర వస్తుంటే మధ్యలో చాయ్ తాగాం ఏడాది క్రితమే టిప్పర్ కొనుగోలు చేశాను. అప్పటికే నాతో కలిసి పనిచేసిన మహారాష్ట్రకు చెందిన ఆకాశ్కాంబ్లేను డ్రైవర్గా నియమించుకున్నా. ఆదివారం రాత్రి లక్డారం సమీపంలోని క్వారీలో కంకర లోడ్ చేయించాం. సోమవారం తెల్లవారుజాము వరకు నేనే టిప్పర్ నడిపాను. రాత్రంతా డ్రైవింగ్ చేయడం వల్ల నిద్ర వస్తుంటే మధ్యలో ఓ హోటల్ వద్ద ఆపి ఇద్దరం చాయ్ తాగాం. అప్పటి వరకు నా చేతిలో ఉన్న స్టీరింగ్ను ఆకాశ్ కాంబ్లే తీసుకున్నాడు. గమ్యస్థానానికి మరికొద్ది నిమిషాల్లో చేరుకుంటామనగా ఈ దుర్ఘటన జరిగింది. ఆ సమయంలో ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. టిప్పర్లోనే స్పృహ తప్పిపోయాను. పోలీసులు నన్ను బయటికి తీసి వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. నేను కానీ, ఆకాశ్ కాంబ్లే కానీ మద్యం సేవించలేదు. – లక్ష్మణ్ నాయక్, టిప్పర్ యజమానిప్రాణం పోవడం ఖాయమనుకున్నా నిమ్స్లో చికిత్స పొందుతున్న జయసుధ లక్డీకాపూల్/ధారూరు: ‘బస్సులో కంకరలో కూరుకుపోయి ప్రాణాలపై ఆశ వదులుకున్నా.. సీటు దొరక్కపోవడంతో కండక్టర్తో మాట్లాతుండగా టిప్పర్ ఢీకొట్టింది.. క్షణాల్లో అంతా జరిగిపోయింది. నా ప్రాణం పోవడం ఖాయమనుకున్నా. బస్సు మొత్తం కంకరతో నిండిపోయింది. చేతుల వరకు కూరుకుపోయా, కాపాడాలని మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. చివరకు ఒకరి వద్ద ఫోన్ అడుక్కొని తమ్ముడికి కాల్ చేశా. గంటలోపు తమ్ముడు, భర్త వచ్చారు. అప్పటి వరకు అలాగే ఉన్నా. నా ఎడమ కాలుపై ఇద్దరు పడ్డారు. కుడి కాలు బస్సు సీటులో ఇరుక్కుపోయి విరిగిపోయింది.నా కాలుపై పడిన ఇద్దరు ఎప్పుడో చనిపోయారు. భర్త, తమ్ముడు రాగానే చేతులతో కంకర తీయడం మొదలుపెట్టారు. వాళ్ల చేతులు రక్తమయంగా మారాయి. చివరకు బయటపడ్డా’అని ధారూరు మండలం కేరెళ్లికి చెందిన జయసుధ తెలిపారు. చేవెళ్లలోని గురుకుల పాఠశాలలో పార్ట్టైమ్ టీచర్గా పనిచేస్తూ రోజూ గ్రామం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. మీర్జాగూడ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో గాయపడింది. ఎడమ కాలు పక్క ఎముకలు విరిగ్గా, కుడి కాలుకు కూడా గాయాలయ్యాయి. జయసుధ కాలుకు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం ఆమె నిమ్స్ చికిత్స పొందుతున్నారు. -
సర్కారు దవాఖానకు వెళ్లొస్తామని..
యాలాల: మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన కుడుగుంట బందెప్ప (45), కుడుగుంట లక్ష్మి (43) దంపతులు. అడ్డాకూలీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం వారిది. ఏడాదిగా లక్ష్మి కడుపులో పెరుగుతున్న కణితి కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతోంది. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకునే స్థోమత లేకపోవడంతో హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో చూపించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున పొరుగింటివారి వద్ద తమ ఇద్దరు పిల్లలు శిరీష, భవానీలను వదిలి సాయంత్రం వరకు తిరిగి వస్తామని చెప్పి వెళ్లారు. తెల్లవారుజామున ప్రైవేటు ఆటోలో తాండూరుకు వచ్చారు. అక్కడ బస్సు ఎక్కిన దంపతులు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. సమాచారం అందుకున్న హాజీపూర్ గ్రామస్తులు వారి పిల్లలను వెంటబెట్టుకొని చేవెళ్లకు వెళ్లారు. నిర్జీవంగా పడి ఉన్న తల్లిదండ్రులను చూసిన పిల్లలు కన్నీరు మున్నీరయ్యారు. తల్లిదండ్రుల మరణంతో అనాథలైన పిల్లలను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. ఉదయం నుంచి వారి ఇంటి వద్ద గుమిగూడారు. -
శోకసంద్రంలో పేర్కంపల్లి
యాలాల: ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు తనూష, సాయిప్రియ, నందిని మృతి చెందడంతో వారి స్వగ్రామం పేర్కంపల్లి శోక సంద్రంలో మునిగిపోయింది. పేర్కంపల్లికి చెందిన ఎల్లయ్యగౌడ్ కుటుంబం కొన్నేళ్ల క్రితం తాండూరుకు వెళ్లి ిస్థిరపడింది. వారికి గ్రామంలో మూడెకరాల భూమి ఉంది. గ్రామానికి తరచూ వచ్చి వెళ్తుంటారు. కూతుళ్లను ఉన్నత చదువులు చదివించేందుకు ఊరు విడిచి మృతదేహాలతో గ్రామానికి వచ్చావా అంటూ ఎల్లయ్యగౌడ్ను చూసిన మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ముగ్గురి అంత్యక్రియలు సాయంత్రం నిర్వహించారు. -
క్షతగాత్రులను పరామర్శించిన స్పీకర్
చేవెళ్ల/మొయినాబాద్: రోడ్డు ప్రమాద ఘటనపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడి చేవెళ్లలోని పట్నం మహేందర్రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని సోమవారం మధ్యాహ్నం పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. చేవెళ్ల/మొయినాబాద్: ప్రమాద ఘటన తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు రోడ్డు నాలుగు లేన్లుగా మారితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదన్నారు. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్ అనంతగిరి: బస్సు ప్రమాదంలో గాయపడి వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పదిమందిని కలెక్టర్ ప్రతీక్జైన్ పరామర్శించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని తెలియజేయాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ వాసుచంద్ర, సీఐ భీంకుమార్ ఉన్నారు. రోడ్డు ప్రమాదం కలచివేసింది. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. రోడ్డు మంజూరై ఆరేడేళ్లు అవుతున్నా ఎన్జీటీలో కేసు కారణంగా ఆలస్యమైంది. అప్పా నుంచి మన్నెగూడ రోడ్డుకు ఇటీవలే లైన్ క్లియర్ అయ్యింది. త్వరలో పనులు చేపట్టేలా కృషి చేస్తాను. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. – కాలె యాదయ్య, ఎమ్మెల్యే, చేవెళ్ల మృతదేహాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య -
అద్దె బస్సే కొంప ముంచిందా?
తాండూరు/తాండూరు టౌన్: ఆర్టీసీ అద్దెకు తీసుకున్న ప్రైవేటు బస్సులతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. తాండూరు డిపోలో మొత్తం 90 బస్సులు ఉండగా అందులో 57 సంస్థకు చెందినవి కాగా, 33 ప్రైవేటు వ్యక్తుల నుంచి అద్దెకు తీసుకున్నవి. డిపోలో మొత్తం 132 మంది డ్రైవర్లు, 165 మంది కండక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అద్దె బస్సులను ప్రైవేటు డ్రైవర్లే నడిపిస్తున్నారు. ఐదేళ్లుగా తాండూరు డిపోకు చెందిన బస్సులు పెద్ద ఎత్తున ప్రమాదాలకు గురయ్యాయి. తాండూరు– భద్రాచలం వైపు వెళ్లే బస్సు ప్రమాదానికి గురికావడం అప్పట్లో సంచలనంగా మారింది. తర్వాత వరుసగా అనంతగిరి గుట్టలో బస్సు బొల్తాపడింది. చేవెళ్లలోని ఆలూరు వద్ద ఓ బస్సు ప్రమాదానికి గురైంది. తాజాగా మీర్జాగూడ వద్ద (34టీఏ6354)ఇదే డిపో బస్సు ప్రమాదానికి గురైంది. దీంతో తాండూరు డిపో నిర్వహణ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి డిపోలో సుమారు 30 వరకు ప్రైవేటు వ్యక్తులకు చెందిన బస్సులు అద్దెకు తిప్పుతున్నారు. ప్రైవేటు బస్సులు నడిపించే డ్రైవర్ల పని తీరును డిపో అధికారులు పరిశీలించాల్సి ఉంది. అయితే సోమవారం తెల్లవారు జామున 4.40 గంటలకు తాండూరు ప్రాంతానికి చెందిన ప్రైవేట్ డ్రైవర్ దస్తగిరి బాబా హైదరాబాద్కు బయలు దేరేందుకు బస్సు ఎక్కాడు. అతడికి ఆరోగ్య పరీక్షలు చేయకుండానే బస్సును డిపో నుంచి పంపించారు. సదరు డ్రైవర్ గతంలో అనంతగిరి గుట్టపై బస్సును బోల్తా కొట్టించాడు. అదే డ్రైవర్కు తిరిగి బస్సు నడిపించేందుకు అవకాశం ఎలా ఇచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. డిపోకు చెందిన బస్సును, సంస్థ సిబ్బందిని ఫస్ట్ ట్రిప్లో పంపించకపోవడం డిపో అధికారుల నిర్లక్ష్యమేనని విమర్శిస్తున్నారు. శాణమ్మ పేరిట రిజిస్ట్రేషన్ అద్దెకు తీసుకున్న ప్రైవేటు బస్సు శాణమ్మ పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉంది. 2026 సెప్టెంబర్ వరకు అగ్రిమెంట్ ఉంది. ఆరేళ్లుగా బస్సు డిపోలో నడుస్తోంది. ప్రైవేటు బస్సు కావడంతో డిపోలోకి వెళ్లవు. బయటి నుంచి మాత్రమే వెళ్తాయి. -
ప్రభుత్వం ఆదుకుంటుంది
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి పరిగి: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్రెడ్డి అన్నారు. మృతిచెందిన కుటుంబాలను, క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో కలిసి పరామర్శించారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో ఇంతమంది ప్రయాణికులు మృతిచెందడం బాధాకరమని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంతోనే ఇప్పటి వరకు రోడ్డు విస్తరణ పనులు జరగలేవని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్నకేసును విరమింపచేసేలా కృషి చేసిందన్నారు. పనులు కూడా జరుగుతున్నాయన్నారు. -
అభివృద్ధికి సహకరించండి
● భూములు ఇచ్చిన వారికితగిన పరిహారం: ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి కందుకూరు: అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం భూములు సేకరిస్తుందని, అందుకు రైతులు సహకరించాలని ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి అన్నారు. భూము లు ఇచ్చిన వారికి.. భూసేకరణ చట్టం కంటే అదనంగా ఎకరాకు రూ.82 లక్షల చొప్పున పరిహారం అందజేయడంతో పాటు.. 121 గజాల ప్లాటును ఇస్తామని చెప్పారు. ఫ్యూచర్సిటీలో భాగంగా టీజీఐఐసీ ఆధ్వర్యంలో ప్రభుత్వం మండల పరిధి తిమ్మాపూర్ రెవెన్యూలోని సర్వే నంబర్ 38, 162లలో పారిశ్రామిక పార్కు కోసం భూసేకరణ చేపట్టింది. ఆ సర్వే నంబర్లలోని మొత్తం 562 ఎకరాల అసైన్డ్ భూములను సేకరించనుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఆర్డీఓ.. మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆ భూములకు చెందిన రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఎకరాకు రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ.. భూ సేకరణలో మొత్తం భూమి కోల్పోయిన వారికి ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోపాల్, టీజీఐఐసీ డిప్యూటీ జీఎం ప్రసాద్, నాయబ్ తహసీల్దార్లు శేఖర్, రాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించండి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఆయనతో పాటు.. డీఆర్ఓ సంగీతలు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ.. అర్జీదారులను ఇబ్బందులకు గురి చేయకుండా.. వారి సమస్యలకు పరిష్కారం మార్గం చూపాలని సూచించారు. ప్రజావాణికి 25 దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి నివాళి అర్పించి, మౌనం పాటించారు. పరిహారం పెంచి ఇవ్వండి గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం పెంచి ఇవ్వాలని కొంగరకలాన్ రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం బాధిత రైతులు మా ట్లాడారు. కొంగరకలాన్ రెవెన్యూలో భూములు కో ల్పోతున్న వారికి, భూ విలువ పెంచకుండా పరి హారం ఇస్తామనడటం మంచిది కాదన్నారు. బహి రంగ మార్కెట్లో ఎకరాకు రూ.పది కోట్లు పలుకుతుండగా.. మార్కెట్ ధర పెంచకుండా పరిహారం ఇవ్వాలని చూడటం తగదన్నారు. ఎకరాకు రూ.15 లక్షలు ఉన్న ధరను.. కోటికి పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిలత, ప్రహ్లాద్, శ్రీశైలం, మల్లేశ్, నర్సింహ, శ్రీనివాస్రెడ్డి, పాశం రాజు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి -
గ్రామస్తుల ఆందోళన
మొయినాబాద్ రూరల్: మీర్జాగూడ రోడ్డు ప్రమాద విషయం తెలుసుకున్న చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో అక్కడకు వస్తున్న అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రశ్నించి రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ రోడ్డుపై హైదరాబాద్ అప్పా మొదలుకొని తాండూరు, పరిగి, కొడంగల్ ప్రాంతాలకు ముఖ్యమంత్రితో పాటు స్పీకర్, ఎమ్మెల్యేలు తిరుగుతున్నా గుంతలు కనపడడం లేదని ఆందోళన చేపట్టారు. తాండూరు ప్రాంతానికి చెందిన ప్రయాణికులు కావడంతో తాండూరువాసులు అధికంగా వచ్చారు. జాతీయ రహదారిపై సంఘటనా స్థలంలో జనసందోహం ఏర్పడింది. మెరుగైన వైద్యం అందిస్తున్నాం రాష్ట్ర వైద్యాధికారి అనంతగిరి: బస్సు ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరో గ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ నరేంద్రకుమార్ తెలిపా రు. సోమవారం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికి త్స పొందుతున్న వారిని పరామర్శించి, వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. లక్ష్మణ్ తలకు తీవ్ర గాయాలు కావడంతో నిమ్స్కు తరలించామన్నారు. మిగితా వారి పరిస్థితి నిలకడగా ఉందన్నా రు. ఆయన వెంట వైద్యశాఖ ఉన్నతాధికారులు, ఆస్ప త్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి ఉన్నారు. అండగా ఉంటాం తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి తాండూరు: బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి తెలిపారు. సోమవారం చేవెళ్ల ఆస్పత్రిలో బాధిత కుటుంబాలను ఓదార్చారు. అంత్యక్రియల నిమిత్తం ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన వెంట తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి ఉన్నారు. -
అంతులేని విషాదం
తాండూరు: చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తాండూరులో మహా విషాదాన్ని నింపింది. సోమవారం తెల్లవారు జామున 4.40 గంటలకు తాండూరు డిపో నుంచి హైదరాబాద్కు బస్సు బయలు దేరింది. అలా బయలుదేరిన రెండు గంటల్లోనే ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తాండూరు నియోజకవర్గానికి చెందిన 14 మంది మృత్యువాత పడ్డారు. అందులో 10 మంది మహిళలు, ముగ్గురు పురుషులు, రెండు నెలల శిశువు ఉన్నారు. తాండూరులో ఉంటున్న పేర్కంపల్లికి చెందిన ఒకే కుంటుబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు తనూష, సాయిప్రియా, నందిని ప్రమాదంలో చనిపోయారు. పట్టణానికి చెందిన సాలేహా, రెండు నెలల శిశువు, విశ్వంబర కాలనీకి చెందిన తబస్సుమ్, యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్కు చెందిన అఖిల ప్రాణాలు కోల్పోయారు. యాలాల మండలం హాజీపూర్కు చెందిన లక్ష్మి, బందెప్ప దంపతులు, కరన్కోట్ గ్రామానికి చెందిన ముస్కాన్ బేగం మృత్యువాత పడ్డారు. బస్సు డ్రైవర్ దస్తగిరి కూడా మృత్యువాత పడ్డారు. తాండూరు పట్టణం వాల్మీకి నగర్కు చెందిన వెంకటమ్మ అలియాస్ స్వాతి(22) మృతి చెందారు. చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రి వద్ద విగత జీవులుగా పడి ఉన్న తమవారిని చూసిన బంధువులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఇక్కడికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులపై బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారు. ఎక్కడ చూసినా బస్సు ప్రమాదం గురించే మాట్లాడుకోవడం కనిపించింది. చేవెళ్ల బస్సు ప్రమాదంలో14 మంది తాండూరు వాసుల మృతి -
రెండు బస్సులు ఢీ.. ప్రయాణికులు సురక్షితం
డివైడర్లను గుర్తించకపోవడంతోనే ప్రమాదం ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ బస్సును ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం శేరిగూడ సమీపంలో సోమవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్– నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై ఇందు కళాశాల వద్ద ఆదివారం స్పీడ్ బ్రెకర్లను ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ ఎలాంటి సూచికలు ఏర్పాటు చేయలేదు. దీంతో వీటిని గమనించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పొదిలి డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కి పడి లేచారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. రెండు బస్సుల ముందు భాగాలు దెబ్బతిన్నాయి. కేసు దర్యాప్తులో ఉంది. వరుస ప్రమాదాలు కళాశాల వద్ద వారంలో రెండుసార్లు ఒకే స్థానంలో స్పీడ్ బ్రెకర్స్ను ఆర్అండ్బీ అధికారులు ఏర్పాటు చేశారు. అక్కడ లైట్లు లేకపోవడం, సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వెంటనే ఆ స్పీడ్ బ్రెకర్లను అధికారులు తొలగించారు. తాజాగా ఆదివారం రాత్రి చిన్న స్పీడ్ బ్రెకర్లు దగ్గరదగ్గర నాలుగు వేశారు. సూచిక, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో తాజా ఘటన చోటు చేసుకుంది. -
కలల తీరం చేరకుండానే..
సుల్తాన్బజార్: కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ యూనివర్సిటీకి చెందిన ముగ్గురు విద్యార్థినులు చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ కుమార్తెలు సాయి ప్రియ మహిళా యూనివర్సిటీలో ఎంఎస్డీఎస్, నందిని ఎంపీసీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. తమ బంధువుల పెళ్లి ఉండడంతో తాండూరు వచ్చి అనంతరం కళాశాలకు తిరిగి వెళ్తున్న క్రమంలో బస్సు చేవెళ్లలో బస్సు ప్రమాదంలో బలయ్యారు. ఈ ప్రమాదంలో వీరితో పాటు ఇదే యూనివర్సిటీలో బీకాం హానర్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న తాండూరుకు చెందిన ముస్కాన్ అనే విద్యార్థిని సైతం మృత్యువాత పడింది. మహిళా విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు బస్సు ప్రమాదంలో మృతి చెందడంతో తోటి విద్యార్థినులు కన్నీటి పర్యంతమయ్యారు. విశ్వవిద్యాలయం వైస్చాన్సలర్ ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్, ప్రిన్సిపల్ లోక పావని, అధ్యాపకులు సంతాపం వెలిబుచ్చారు. -
అరుస్తాం.. అడ్డొస్తే కరుస్తాం!
కొత్తూరు 5వ వార్డులో కుక్కల గుంపువీధి కుక్కల బెడద ఎక్కువైంది. గుంపులుగా తిరుగుతున్నాయి. గుర్రుమంటూ అకారణంగా దాడులకు పాల్పడుతూ.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కొత్తూరు: పట్టణంతో పాటు పల్లెల్లో గ్రామ సింహాలు రెచ్చిపోతున్నాయి. పదుల సంఖ్యలో స్వైరవిహారం చేస్తున్నాయి. అటుగా వెళ్తున్నవారిపై గుర్రుగా చూస్తూ.. దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో కుక్కలు కనిపిస్తే చాలు పిల్లలు, పెద్దలుజంకుతున్నారు. వీటి నియంత్రణకు సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. సంతతి భారీగా పెరిగింది. మండలంలోని గూడూరు, పెంజర్ల, ఇన్ముల్నర్వతో పాటు మున్సిపాలిటీలోని 8,9,10వ వార్డుల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. ఆడుకుంటుండగా.. గూడూరు గ్రామంలో ఓ కుక్క.. అక్టోబర్ 14నఇంటి ఎదుట ఆడుకుంటున్న రిషి(08)పై దాడి చేసింది. ఈ ఘటనలో బాలుడి పెదాలకు తీవ్ర గాయమైంది. అనంతరం అదే శునకం.. మరో నలుగురిని కాటువేసింది. అదే నెల 20న నారాయణగూడ కాలనీలో.. శ్రీనివాస్ తనబైకుపై ఆర్కే బేకరి రోడ్డుగుండా వెళ్తుండగా.. కుక్కలు అతన్ని వెంబడించాయి. దీంతో భయంతో బైకును వేగంగా నడిపి, కిందపడి గాయాల పాలయ్యాడు. అంతకు ముందు నెల 3న కొత్తూరు పట్టణానికి చెందిన వెంకటేశ్.. వై జంక్షన్ కూడలీలోని శివాలయానికి వెళ్లాడు. తిరిగి వస్తుండగా కుక్క దాడి చేసి, గాయపర్చింది. గతేడాది ఓ విద్యార్థి మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చి, పాఠశాలకు వెళ్లే క్రమంలో కుక్కలు ఎగబడి, విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాయి. ఇలా కుక్క కాటు బాధితులు మున్సిపాలిటీలో అనేకంగా ఉన్నారు. నియంత్రణ శూన్యం గతంలో నగరంతో పాటు.. చాలా ప్రాంతాల్లో కుక్కల దాడిలో పలువురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. దీంతో హైకోర్టు ఆగ్రహించడంతో.. అధికారులు శునకాల నియంత్రణ,సంతాన నిరోధక టీకాలు వేసేందుకు చర్యలుచేపట్టారు. కానీ.. కొత్తూరులో మాత్రం వాటిసంఖ్యను లెక్కించడంతోనే సరిపెట్టారు. అప్పట్లో మండలం, మున్సిపాలిటీ పరిధి వార్డుల్లో సుమారు 800 కుక్కలు ఉన్నట్లు గుర్తించారు. తర్వాత వాటి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో వాటి సంఖ్య ఎన్నోరెట్లు పెరిగింది. కుక్కకాటు బాధితులు సంవత్సరం కేసులు 2021 301 2022 290 2023 439 2024 427 2025 388 వీధుల్లో కుక్కల స్వైరవిహారం గుంపులుగా సంచారం.. గుర్రుమంటూ అందినచోట కాటు అకారణంగా దాడులకుపాల్పడుతున్న వైనం -
సాంబారు, సేమియాలో ఈగలు
తుక్కుగూడ: రుచికరమని హోటల్లో తింటే.. సుచి కరువై.. ఆరోగ్యానికి చేటని మరోసారి రుజువైంది. నిర్వాహకుల నిర్లక్ష్యంతో రుచి, శుభ్రత సంగతి ఎలా ఉన్నా.. సాంబర్, సేమియాలో ఈగలు ప్రత్యక్షమై.. భోజన ప్రియులకు వికారం తెప్పించాయి. ఈ సంఘటన సోమవారం పుర పరిధి ఇమూమ్గూడ తాజ్ హోటల్లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రావిర్యాల గ్రామానికి చెందిన పాల్లకూర్ల వెంకటేశ్.. మధ్యాహ్న వేళలో భోజనం చేయడానికి హోటల్కు వచ్చారు. మీల్స్ ఆర్డర్ చేయగా.. నిర్వాహకులు అన్నం, సాంబర్, స్వీట్ తదితర పదార్థాలను వడ్డించారు. అందులో సాంబర్, సేమియాలో ఈగలు కనిపించాయి. ఇదే విషయమై..వినియోగదారుడు, యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. వారు నిర్లక్ష్య సమాధానం ఇచ్చారు.దీంతో పుర అధికారులు ఫిర్యాదు చేస్తానని సదరు వ్యక్తి తెలిపారు. ‘హైటెన్షన్’తో నష్టపోతున్నాం.. ఆదుకోండి కేంద్ర మంత్రికి విన్నవించిన రైతులు కడ్తాల్: హైటెన్షన్ లైన్తో నష్టపోతున్నామని, అలైన్మెంట్ను మార్చి న్యాయం చేయాలని బాధిత రైతులు కోరారు. సోమవారం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఆధ్వర్యంలో రైతులు ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో కేంద్ర విద్యుత్శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ను కలిసి విన్నవించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. కడ్తాల్ మండలకేంద్రంతో పాటు.. పలు గ్రామాల మీదుగా తప్పుడు అలైన్మెంట్తో సన్న చిన్న కారు రైతులకు సమాచారం ఇవ్వకుండా, వారి పంటపొలాల మీదుగా 765 కేవీ హైటెన్షన్ సోలార్ పవర్ గ్రిడ్లైన్ను తీయడం అన్యాయమని పేర్కొన్నారు. దీనికి స్పందించిన మంత్రి.. సంబంధిత అధికారులతో మాట్లాడి, న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారని రైతులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, బీసీ సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశ్, మాజీ ఉప సర్పంచ్ రామకృష్ణ, రైతు నాయకులు పెంటారెడ్డి, పర్వతాలుయాదవ్, శివరామకృష్ణ, సత్యం తదితరులు ఉన్నారు. మార్కెట్ భూమి హెచ్ఎండీఏదే.. సాక్షి, సిటీబ్యూరో: బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ భూమి హెచ్ఎండీఏదేనని ది ఫ్రూట్ కమీషన్ ఏజెంట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అచ్చ శ్రీనివాస్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. కొందరు మార్కెట్ అసోసియేషన్ల నేతలు.. ఆ భూమి కమీషన్ ఏజెంట్లు, వారి బంధువులదని ప్రచారం చేస్తున్నారని, అది అవాస్తవమన్నారు. మార్కెట్ కమిటీ, కార్యదర్శి వద్ద నెలనెలా ఎవరు అద్దె చెల్లిస్తున్నారో రికార్డు ఉందని పేర్కొన్నారు. మామడి సీజన్లోనూ అద్దెకు తీసుకుంటున్న భూమి కూడా వారిది కాదని స్పష్టం చేశారు. ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్పై సీఎంకు నివేదిక ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి షాద్నగర్: గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ వ్యవహార శైలి, కళాశాల దుస్థితిపై త్వరలో సీఎం రేవంత్రెడ్డికి నివేదిక అందజేయనన్నామని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి తెలిపారు. సోమవారం పట్టణ శివారు నూర్ ఇంజినీరింగ్ కళాశాలలో కొనసాగుతున్న నాగర్కర్నూల్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల డిగ్రీ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు. వారి పట్ల ప్రిన్సిపాల్ శైలజ వ్యవహరించిన తీరుపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని చెప్పారు. ప్రిన్సిపాల్పై సస్పెషన్ వేటు విద్యార్థులను వేధింపులకు గురి చేస్తూ, అవినీతికి పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో నాగర్కర్నూల్ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శైలజపై ఉన్నతాధికారులు సస్పెషన్ వేటు వేశారు. ఈ మేరకు సోమవారం నాగర్కర్నూల్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అమరేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రిన్సిపాల్ వేధింపులకు నిరసనగా.. ఆదివారం విద్యార్థినులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాథమిక విచారణ అనంతరం ఆమె సస్పెషన్ వేటు పడింది. -
'టిప్పర్ టెర్రర్'
ఉద్యోగానికి వెళ్లేవారు కొందరు.. కాలేజీకి వెళ్లేవారు మరికొందరు.. ఆస్పత్రికి వెళ్లేవారు ఇంకొందరు.. ఎవరి పనికోసం వారు బస్సెక్కారు.. తెల్లవారుజామున వారితోపాటు వారి ఆశలు, అవసరాలను కూడా మోసుకొని బయలుదేరిన ఆర్టీసీ బస్సు.. హైదరాబాద్ వైపు దూసుకుపోతోంది. తెలతెలవారుతుండగా టిప్పర్ రూపంలో మృత్యువు వాయువేగంతో ఎదురుగా దూసుకొచ్చింది. కంకర ఓవర్లోడుతో ఉన్న భారీ టిప్పర్ బస్సును బలంగా ఢీకొట్టడటంతోపాటు ఆ బస్సుపైనే ఒరిగిపోయింది. టిప్పర్లో ఉన్న 60 టన్నుల కంకర మొత్తం ఒక్కసారిగా బస్సుపై పడిపోయింది. దీంతో నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే 19 మంది ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. కంకర కింద నలిగిపోతూ కొందరు ప్రయాణికులు చేసిన ఆర్తనాదాలతో అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం భీతావహంగా మారిపోయింది. సోమవారం ఉదయం 6.40 గంటల ప్రాంతంలో రంగారెడ్డి చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద హైదరాబాద్– తాండూర్ రహదారిపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదం బాధితుల కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. అత్యంత భీతావహంగా ఉన్న ఈ ప్రమాదంలో 19 మంది మరణించగా, 27 మంది గాయపడ్డారు. మృతుల్లో 13 మంది మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. మృతుల్లో నెలల పసికందు కూడా ఉండటం, తల్లి తన బిడ్డను కాపాడేందుకు పొత్తిళ్లలో పొదువుకొని అలాగే ప్రాణాలు విడువటం అందరి హృదయాలను కలచివేసింది.హృదయ విదారక దృశ్యాలు..⇒ ప్రమాదానికి గురైన బస్సు సోమవారం తెల్లవారుజామున 4.59 గంటలకు తాండూరు బస్స్టాండు నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. 72 మందితో కిక్కిరిన బస్సు ఉదయం 6.40 గంటలకు చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలోకి రాగానే ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ టిప్పర్ పటాన్చెరు లక్డారం నుంచి కంకర లోడ్తో వికారాబాద్ దగ్గర్లోని చిట్టెంపల్లికి వెళ్తోంది. రోడ్డుపై ముందు ఉన్న గుంతను తప్పించబోయిన టిప్పర్ డ్రైవర్.. ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టాడు. టిప్పర్ ఢీకొన్న వేగానికి బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయింది. కంకర కింద పడి ప్రయాణికులు సజీవ సమాధి అయ్యారు. బస్సు సీట్ల కింద ఇరుక్కుపోయిన మరికొందరు ప్రయాణికులు కంకర కింద చిక్కుకుపోయారు. తాండూరు బస్టాండ్ నుంచి బయలుదేరుతున్న బస్సు క్షతగాత్రుల హాహాకారాలతో ఆ పరిసరాలు భీతావహంగా మారాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. కంకర కింద చిక్కుకుపోయిన వారిని వెలికి తీశారు. వారిలో కొందరు అప్పటికే మృతి చెందగా.. కొన ఊపిరితో ఉన్న కొందరిని బతికించేందుకు సీపీఆర్ సహా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రమాదంలో బస్సు, లారీ డ్రైవర్లు ఇద్దరూ మరణించారు. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్లలో చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి, పీఎంఆర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు కండక్టర్ రాధ ఇచ్చిన ఫిర్యాదుతో (క్రైమ్ నెం. 723/2025యు/ఎస్ 106(1)బీఎన్ఎస్ చట్టం కింద) చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తిగా ధ్వంసమైన బస్సు మృతులు వీరే.. ⇒ బోరబండ కార్మికనగర్కు చెందిన కల్పన (42), గున్నమ్మ (60), వికారాబాద్ జిల్లా దన్నారం తండాకు చెందిన హౌస్కీపింగ్ వర్కర్ తారీబాయి (44), యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్కు చెందిన విద్యార్థిని గుర్రాల అఖిల (23), కర్ణాటక రాష్ట్రం గుల్బార్గాకు చెందిన బచ్చన్ నాగమణి (54), దౌల్తాబాద్ మండలం నీటూరుకు చెందిన రైతు మగళ్ల హన్మంతు (44), తాండూరు ఇంద్రానగర్ కాలనీకి చెందిన ఎండీ ఖాలీద్ (43), తాండూరు బృందావన్కాలనీకి చెందిన గృహిణి తబస్సుమ్ జాన్ (38), యాలాల మండలం పెర్కంపల్లికి చెందిన విద్యార్థులు ఈడిగ నందిని (22), సాయిప్రియ (18), తనూష (20), బషీరాబాద్ మండలం మంతాటికి చెందిన బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా, తాండూరులోని వాల్మీకినగర్కు చెందిన కిష్టాపూర్ వెంకటమ్మ (21), యాలాల్ మండలం హాజీపూర్కు చెందిన లక్ష్మీ(40), కె.బందెప్ప (42), తాండూరు ఇంద్రానగర్కు చెందిన సెలా (20), తాండూరుకు చెందిన జహీరా ఫాతిమా (40 రోజుల బేబీ), తాండూరు గౌత్పూర్కు చెందిన విద్యార్థిని ముస్కన్ బేగం (21), టిప్పర్ డ్రైవర్ ఆకాష్కాంబ్లే (24).ప్రమాదానికి కారణాలివి.. రోడ్డుపై గుంతలు.. చేవెళ్ల నుంచి తాండూరు వెళ్లే రోడ్డు గుంతలమయంగా ఉండడంతోపాటు ఎన్నో ప్రమాదకర మలుపులు ఉన్నాయి. తాండూరు వైపు వేగంగా వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ ఆకాశ్ కాంబ్లే రోడ్డుపై గుంతను గమనించి వాహనాన్ని అంతే వేగంతో కుడివైపుకు తిప్పాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టాడు. దీంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.ఓవర్ లోడ్.. ఓవర్ స్పీడ్..టిప్పర్లో కంకర తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధమని తెలిసింది. ప్రమాద సమయంలో టిప్పర్లో మొత్తం 60 టన్నులకు పైగా కంకర ఉందని సమాచారం. ఓవర్ లోడ్తో ఉన్న టిప్పర్ బలంగా ఢీకొట్టడం ప్రమాద తీవ్రత పెరిగిందని ఘటనా స్థలాన్ని పరిశీలించిన సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ‘సాక్షి’కి తెలిపారు. ఆర్టీసీ బస్సు సైతం ఓవర్ కెపాసిటీతోనే ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నారని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ‘సాక్షి’కి వివరించారు. టిప్పర్ బస్సును ఢీకొట్టిన తర్వాత దాదాపు 50 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది.టార్పాలిన్ కప్పి ఉంటే.. కొంత ముప్పు తప్పేది కంకర లోడ్తో వెళ్లే వాహనాలు విధిగా టార్పాలిన్ పట్టాను కంకరపై కప్పాలి. కంకర, ఇసుక, ఇతర సామగ్రితో వెళ్లే వాహనాల కారణంగా దుమ్ము ఇతర వాహనదారులను ఇబ్బంది పెట్టకుండా, అందులోని మెటీరియల్ బయటికి రాకుండా ఈ జాగ్రత్త తీసుకోవాలి. కానీ, ప్రమాదానికి కారణమైన టిప్పర్లో కంకరపై టార్పాలిన్ పట్టా కట్టకపోవడంతో ప్రమాదం జరిగిన తర్వాత అందులోని కంకర అంతా ప్రయాణికులపై ఒక్కసారిగా పడింది. దీంతో వారు దానికి కింద చిక్కుకుపోయారు.ఊపిరాడనివ్వని దుమ్ము టిప్పర్ ఢీకొట్టగానే డ్రైవర్ సహా..అదే వైపు సీట్లలో ఉన్న ప్రయాణికులు చెల్లాచెదురుగా పడ్డారు. కొందరు సీట్ల కింద చిక్కుకుపోయారు. ఏం జరుగుతుందో గ్రహించే లోపే టిప్పర్లోని కంకర వారిని కప్పేసింది. ఓవైపు కంకర బరువుకు బయటికి రాలేక కొట్టుకుంటున్న వారికి కంకరలోని దుమ్ము ఊపిరాడనివ్వలేదు. దీంతో మృతుల సంఖ్య పెరిగింది. ఆర్టీసీ బస్సును ఢీకొని దానిపై పూర్తిగా ఒరిగిపోయిన కంకర లోడుతో ఉన్న టిప్పర్ సీట్ల కెపాసిటీకి మించి ప్రయాణికులుతాండూరు నుంచి హైదరాబాద్కు సోమవారం ఉదయం సమయంలో మూడు బస్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే, ప్రయాణికులు అందుబాటులో ఉన్న బస్సులో సీట్లు నిండిపోయినా త్వరగా వెళ్లాలన్న తొందరలో ప్రమాదానికి గురైన బస్సు ఎక్కినట్టు తెలుస్తోంది. వాస్తవానికి బస్సులో సీట్ల కెపాసిటీ 51 ఉండగా.. 72 మంది ప్రయాణికులు బస్సెక్కారు. కిక్కిరిసిన బస్సులో నుంచి తప్పించుకోవడం కష్టమైందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి ముందు మారిన డ్రైవర్లచ్చానాయక్ తన భార్య ఉదిత్య అనిత పేరిట ఉన్న టిప్పర్లో కంకర సరఫరా చేస్తుంటాడు. ఓనర్ కమ్ డ్రైవర్గా పనిచేసే లచ్చానాయక్ తనతోపాటు మహారాష్ట్రకు చెందిన ఆకాశ్ కాంబ్లేను డ్రైవర్గా నియమించుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున కంకర లోడ్ వేసుకుని కాంబ్లేతోపాటు బయలు దేరిన లచ్చానాయక్..తొలుత చేవెళ్ల వరకు టిప్పర్ నడిపాడు. చేవెళ్లలో ఆకాశ్ కాంబ్లేకు టిప్పర్ను నడిపేందుకు ఇచ్చాడు. ప్రమాద స్థలికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో స్టీరింగ్ అందుకున్న కాంబ్లే టిప్పర్ను మృత్యుశకటంగా మార్చాడు. ప్రమాద సమయంలో టిప్పర్ డ్రైవర్ ఆకాశ్ కాంబ్లే మద్యం సేవించి ఉన్నాడా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ తప్పులేదు: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఎదురుగా ఓవర్ స్పీడ్తో టిప్పర్ రావడాన్ని గమనించి డ్రైవర్ బస్సు వేగాన్ని తగ్గిచడంతోపాటు సైడ్కు తప్పించే ప్రయత్నం చేసినట్టు కండక్టర్ ద్వారా తెలిసింది. బస్సు డ్రైవర్ సురక్షితంగా డ్రైవ్ చేస్తున్నప్పటికీ టిప్పర్ అదుపు తప్పి వేగంగా రావడంతో ప్రమాదాన్ని తప్పించలేకపోయారని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. బస్సు డ్రైవర్ దస్తగిరి ఎంతో కాలంగా పనిచేస్తున్నారని, గతంలో ఎలాంటి ప్రమాదాలు చేసిన దాఖలాలు లేవని చెప్పారు. తాండూరు నుంచి హైదరాబాద్కు చాలా బస్సులు ఉన్నా.. ప్రయాణికులు త్వర గా వెళ్లాలన్న తొందరలోనే ఎక్కువ మంది బస్సు ఎక్కినట్టు పేర్కొన్నారు. కారణాలు ఇప్పుడే నిర్ధారించలేం ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించాం. అయితే, ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై ఇప్పుడు కచ్చితమైన కారణాలు చెప్పలేం. దర్యాప్తు కొనసాగుతోంది. టిప్పర్ వేగంగా, ఓవర్ లోడ్తో వచ్చి బస్సును ఢీకొట్టినట్టుగా క్రైం సీన్ చూస్తే తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాం. – అవినాశ్ మహంతి, సీపీ, సైబరాబాద్ రెండు వాహనాలపై చలాన్లు ప్రమాదానికి కారణమైన టిప్పర్ ఈ ఏడాది జనవరి 9న జహీరాబాద్ ఆర్టీఏ కార్యాలయం పరిధిలో రిజిస్టర్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి ఇన్సూరెన్స్, పర్మిట్, ఫిట్నెస్ 2027 వరకు ఉన్నట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. కాగా, ప్రమాదానికి గురైన టిప్పర్తోపాటు బస్సుపై కూడా ట్రాఫిక్ చలాన్లు పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది. బస్సుపై నాంపల్లి, అబిడ్స్ పోలీస్స్టేషన్ల పరిధిలో రూ.2,305 చలాన్లు జారీ చేశారు. సిగల్న్ జంప్, స్టాప్లైన్ క్రాసింగ్ ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఈ చలాన్లు జారీ అయ్యాయి. టిప్పర్పై హైదరాబాద్లోని రామచంద్రాపురం, మియాపూర్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో పోలీసులు రూ.3,600 చలాన్లు విధించారు. టిప్పర్ ఓనర్కు తీవ్ర గాయాలు అనంతగిరి: ప్రమాద సమయంలో టిప్పర్ ఓనర్ లక్ష్మణ్నాయక్ తన వాహనంలోనే ఉన్నారు. డ్రైవర్ వాహనం నడుపుతుంగా పక్క సీట్లో కూర్చున్నారు. ప్రమాదంలో లక్ష్మణ్ కుడి కన్నుకు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్కు తరలించారు. ఉస్మానియా నుంచి వైద్యబృందం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు ఉస్మానియా ఆస్పత్రి నుంచి పది మంది ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని, సహాయక సిబ్బందిని పంపారు. ఉస్మానియా మార్చురీ ప్రాంగణంలో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు. ఉస్మానియా ఆస్పత్రి ఫోరెన్సిక్ విభాగం అధిపతి డా.యాదయ్య ఆధ్వర్యంలో ప్రొఫెసర్లు సరేంద్ర, లక్ష్మీనారాయణ, వైద్యులు రాహుల్, దీన్దయాల్, రాజ్కుమార్, విష్ణు, ఫజిల్, తుదీక, అవినాష్, సహాయక సిబ్బంది రవి, ధన్రాజ్, సుధార్, రాజు, గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్యుడు లక్ష్మీకాంత్ను చేవెళ్లకు పంపించారు. ఊపిరాడకనే మృతి తలకు గాయాలు, కంకర మీదపడి ఊపిరాడక మృతి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. గాయాలు బలంగా తగిలాయి. మా వైద్యం బృందం సహకారంతో చేవెళ్ల ఆస్పత్రిలో 19 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించాం. – డా.రాజేంద్రప్రసాద్, సూపరింటెండెంట్, చేవెళ్ల ఆస్పత్రి -
చేవెళ్ల ప్రమాదంలో మృత్యువుకు బలయ్యాడు!
సాక్షి,రంగారెడ్డి: చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా కూడా ఉన్నారు. గతంలో తన చాకచక్యంతో అనేక ప్రాణాలను కాపాడిన ఆయన.. ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో మరణించడం పట్ల తోటి ఆర్టీసీ ఉద్యోగులు,అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు గతంలో దస్తగిరి బాబా ప్రదర్శించిన అద్భుత ధైర్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఏడాదిన్నర క్రితం, వికారాబాద్లోని అనంతగిరి కొండపై బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. ఆ సమయంలో దస్తగిరి చాకచక్యంగా వ్యవహరించి, బస్సులోని ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు.అప్పట్లో తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి ప్రయాణికులను రక్షించిన దస్తగిరి.. చేవెళ్ల ప్రమాదంలో మృతి చెందడంపై ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కాపాడండి’.. నడుములోతు కంకరలో ఇరుక్కుని టీచర్ ఆర్తనాదాలు ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి -
బీఆర్ఎస్లో భారీగా చేరికలు
పహాడీషరీఫ్: పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు బీఆర్ఎస్లో సముచిత స్థానం ఉంటుందని మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు సబితారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీలోని కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు కార్యకర్తలు ఆదివారం ఆమె సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. జల్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం సబితారెడ్డి ఏళ్ల తరబడిగా ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ ప్రాంతంపై ఆమెకున్న ప్రత్యేక శ్రద్ధ, కాంగ్రెస్, బీజేపీల ద్వంద్వ వైఖరీలు నచ్చలేకే తాము బీఆర్ఎస్లో చేరుతున్నామన్నారు. సబితమ్మ నాయకత్వంలో ఈసారి జల్పల్లి మున్సిపాలిటీ స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని పేర్కొన్నారు. -
భూములు తీసుకోకుండా చూడండి
యాచారం: తమ భూములను సర్కార్ సేకరించకుండా చూడాలని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని మండలంలోని మొండిగౌరెల్లి గ్రామ రైతులు వేడుకున్నారు. తొర్రూర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉదయం వారు ఎమ్మెల్యేను కలిశారు. గ్రామంలోని 600 మందికి పైగా రైతులకు చెందిన 822 ఎకరాల అసైన్డ్, పట్టా భూమిని పారిశ్రామిక పార్క్ల కోసమని సేకరించడానికి సర్కార్ నోటిఫికేషన్ వేసింది. ఆ భూములు తీసుకుంటే గ్రామంలోని ప్రతి కుటుంబం ఉపాధి కోల్పోతుందని తెలియజేశారు. అధికారులేమో కచ్చితంగా ఆ భూములు తీసుకుంటామని అంటున్నారు, అసైన్డ్ భూమి ఎకరాకు రూ.22 లక్షల పరిహారం, 121 గజాల ప్లాటు ఇస్తామని అంటున్నారు. యాచారం మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న మొండిగౌరెల్లిలో ఎకరాకు రూ.కోటిన్నరకు పైగానే డిమాండ్ ఉంది. కానీ రూ.22 లక్షల పరిహారం ఇస్తే ఎట్లా అని ఎమ్మెల్యేకు తెలియజేశారు. వెంటనే ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డికి ఫోను చేసి పరిహారం చెల్లింపు విషయంలో న్యాయంగా వ్యవహరించాలన్నారు. క్యాంపు కార్యాలయంలోనే రైతులతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. న్యాయమైన పరిహారం చెల్లింపు కోసం కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రంగారెడ్డికి వినతిపత్రం ఇచ్చిన మొండిగౌరెల్లి రైతులు -
ఎజాజ్ ‘పిలిస్తే’ నైజీరియన్లూ ‘పలుకుతారు’!
సాక్షి, సిటీబ్యూరో: ఉత్తరాదిన ఉన్న మెట్రో నగరాల్లో డ్రగ్స్ సప్లయర్స్గా ఉన్న నైజీరియన్లు ఏ పెడ్లర్కీ కనిపించరు. కేవలం సోషల్మీడియా సంప్రదింపులతో, డెడ్ డ్రాప్ విధానంలో పని పూర్తి చేస్తారు. అయితే బెంగళూరులో స్థిరపడిన ఘరానా పెడ్లర్ ఎజాజ్ అహ్మద్కు ఉన్న డిమాండే వేరు. ఇతడు ఫోన్ చేస్తే పెద్ద పెద్ద సప్లయర్స్గా ఉన్న నల్లజాతీయులు ఇంటికి వచ్చి మరీ సరుకు ఇచ్చి వెళ్తారు. నగరంలో ఉన్న కస్టమర్కు డ్రగ్స్ డెలివరీ చేయడానికి వచ్చిన ఈ పెడ్లర్ హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్కు (హెచ్–న్యూ) చిక్కినట్లు డీసీపీ వైవీఎస్ సుధీంద్ర ఆదివారం వెల్లడించారు. ఇతడి నుంచి రూ.12 లక్షల విలువైన నాలుగు రకాలైన మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. బీటెక్ మధ్యలో ఆపేసి... బిహార్కు చెందిన ఎజాజ్ తండ్రి బడా సివిల్ కాంట్రాక్టర్. ఈ నేపథ్యంలోనే వీరి కుటుంబం కర్ణాటక–గోవా సరిహద్దుల్లో ఉన్న కార్వార్ ప్రాంతంలో స్థిరపడింది. బీటెక్ విద్యనభ్యసించడం కోసం ఎజాజ్ బెంగళూరుకు వచ్చారు. ఫోర్త్ ఇయర్ చదువుతూ మధ్యలోనే మానేసిన ఇతగాడు సివిల్ కాంట్రాక్టర్గా మారాడు. కొన్నాళ్లు సజావుగా సాగిన ఈ వ్యాపారంతో విలాసవంతమైన జీవనశైలికి అలవాటుపడ్డాడు. ఆపై నష్టాలు రావడంతో తన తండ్రితో కలిసి ఆయన కాంట్రాక్టులు చూసుకున్నాడు. 2020లో అమలైన లాక్డౌన్ సందర్భంలో స్నేహితుల రూమ్కు పరిమితమయ్యాడు. అక్కడ వారితో కలిసి డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభించాడు. కస్టమర్ నుంచి పెడ్లర్గా మారి... కొన్నాళ్లకు తానే స్వయంగా నైజీరియన్ల వద్ద నుంచి డ్రగ్స్ ఖరీదు చేసి వినియోగించడం ప్రారంభించాడు. అప్పటికే తన విలాసాలకు అవసరమైన డబ్బు తేలిగ్గా సంపాదించడానికి అనువైన ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. అప్పుడే ఇతడికి తానే పెడ్లర్గా మారి కస్టమర్లకు సరఫరా చేస్తే లాభాలు ఉంటాయనే ఆలోచన వచ్చింది. ఇతడు కస్టమర్గా ఉండగా ఫోన్ చేసిన వెంటనే నైజీరియన్లు డ్రగ్స్ తీసుకువెళ్లి ఇంటి వద్ద ఇచ్చి వచ్చే వాళ్లు. అదే విధానం కొనసాగిస్తూ మాదకద్రవ్యాలు ఖరీదు చేస్తూ... బెంగళూరుతో పాటు హైదరాబాద్లో ఉన్న కస్టమర్లకు విక్రయిస్తున్నాడు. సోషల్మీడియా ద్వారా ఆర్డర్లు తీసుకుంటూ తానే నేరుగా వచ్చి ‘క్యాష్ ఆన్ డెలివరీ’ విధానంలో లేదంటే కొరియర్ ద్వారా సరఫరా చేసేవాడు. బస్టాండ్లో ఉండి బైక్ ట్యాక్సీల ద్వారా... కొన్నిసార్లు సరుకుతో హైదరాబాద్ వచ్చే ఎజాజ్ తాను బస్సు దిగిన చోటే ఉండేవాడు. అక్కడ నుంచి కస్టమర్కు బైక్ ట్యాక్సీ ద్వారా సరుకు పంపిస్తుండేవాడు. కొరియర్ చేయాల్సి వస్తే వివిధ కాగితాల మధ్యలో ఈ డ్రగ్ ఉంచి పంపేవాడు. నగదు లావాదేవీలన్నీ ఆన్లైన్లో జరిగేవి. ఇతడు సరుకు తీసుకుని నగరానికి వస్తున్నాడని హెచ్–న్యూకు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ జీఎస్ డానియేల్ నేతృత్వంలో ఎస్ఐ సి.వెంకట రాములు తమ బృందంతో మాసబ్ట్యాంక్ వద్ద కాపుకాశారు. ఎండీఎంఏ, కొకై న్, ఓజీ ఖుష్, ఎక్స్టసీ పిల్స్తో వచ్చిన ఎజాజ్ను మాసబ్ట్యాంక్ పోలీసుల సాయంతో పట్టుకున్నారు. ఇతడు బెంగళూరులో ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. ఓ గెటెడ్ కమ్యూనిటీలోని ఫ్లాట్లో నెలకు రూ.70 వేల అద్దెకు నివసిస్తున్నాడు. నైకీ బూట్లు, బఫెల్లో జీన్స్లు, ఎడిడాస్ టీషర్టులు మాత్రమే వాడుతుంటాడు. ఇతడి వినియోగదారులతో పాటు సప్లయర్లుగా ఉన్న నైజీరియన్లను గుర్తించడంపై హెచ్–న్యూ దృష్టి పెట్టింది. అలవాటుపడిన వాళ్లూ విక్రేతలు అవుతున్నారు విద్యార్థులు, ఉద్యోగుల్లో అనేక మంది మాదకద్రవ్యాల వినియోగానికి అలవాటుపడి... అందుకు అవసరమైన డబ్బు కోసం వాళ్లే పెడ్లర్స్గా మారుతున్నారు. ఇలాంటి వారి వల్ల సమాజానికి పెను ముప్పు పొంచి ఉంది. ఇలాంటి వారిపై కన్నేసి ఉంచాలని కోరుతున్నాం. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. మాదకద్రవ్యాల వినియోగం, క్రయవిక్రయాలపై సమాచారం తెలిస్తే 8712661601కు ఫోన్ చేసి తెలపండి. ఇలా సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతాం. – వైవీఎస్ సుధీంద్ర, డీసీపీ నగరానికి నాలుగు రకాలైన మాదకద్రవ్యాల సరఫరా డెలివరీ కోసం వచ్చి హెచ్–న్యూకు పట్టుబడిన వైనం రూ.12 లక్షల విలువైన 7.7 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం -
ఉబికి వస్తున్న గంగమ్మ
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా మండలంలోని బాటసింగారం గ్రామానికి చెందిన హరిబాబు ఇంట్లో ఉన్న బోరు బావి నుంచి గంగమ్మ పైకి ఉబికి వస్తోంది. కొన్ని రోజులుగా భూమిలోంచి నీరు పైకి వస్తుందని, మూడేళ్లుగా ప్రతి అక్టోబర్–నవంబర్ మాసాల్లో ఇలా నీరు పైకి పొంగి వస్తుంటుందని హరిబాబు పేర్కొన్నారు. తాము ఇంటి నిర్మాణం చేయించే సమయంలో 780 అడుగుల లోతు వరకూ బోరు బావిని తవ్వించామని, అప్పుడు తమ అవసరాలకు సరిపడా నీళ్లు మాత్రమే వచ్చేవని, మూడేళ్లుగా ఇలా నీరు పైకి పొంగుతున్నాయన్నారు. – అబ్దుల్లాపూర్మెట్ -
విద్యారంగం బలోపేతం కావాలి
ఆమనగల్లు: ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అభిప్రాయపడ్డారు. మాడ్గుల మండలం గిరికొత్తపల్లి గ్రామానికి చెందిన కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడె, నమస్తే ఉపాధ్యాయ పత్రిక సహ సంపాదకుడు కృష్ణారెడ్డి ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం హైదరాబాద్లోని ఓ ఫంక్షన్హాలులో ఆదివారం నిర్వహించారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కృష్ణారెడ్డి, రజిత దంపతులను పలువురు ఘనంగా సత్కరించారు. ఉద్యోగ విరమణ పొందుతున్న ఉపాధ్యాయులు సమాజసేవకు అంకితం కావాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్, మాజీ ఎమ్మెల్సీ నర్సింహారెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రవి, ప్రధాన కార్యదర్శి సదానంద్గౌడ్, మాజీ అధ్యక్షుడు పర్వత్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అనురుద్రారెడ్డి, ఎంఈఓ రామారావు, శృతిలయ కల్చరల్ అకాడమీ చైర్మన్ చిత్తరంజన్దాస్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సుధాకర్రెడ్డి, ప్రేమ్కుమార్, రాధా, జయలక్ష్మి, శిరీష, విశ్వశాంతి, యాదవరెడ్డి, వనజాత, ప్రమోదిత, రమణారెడ్డి, సబిత, వికాస్, రజవర్ధన్రెడ్డి, సాయికిశోర్ తదితరులు పాల్గొన్నారు.శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి -
‘కాపాడండి’.. నడుములోతు కంకరలో ఇరుక్కుని టీచర్ ఆర్తనాదాలు
సాక్షి,రంగారెడ్డి: చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఓవర్లోడ్తో వెళ్తున్న కంకర లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ప్రమాదానికి కారణంగా భావిస్తున్న టిప్పర్లో 30 టన్నులకు బదులుగా 50 టన్నుల కంకర లోడ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఢీకొట్టిన వెంటనే టిప్పర్లోని కంకర మొత్తం బస్సులోకి ప్రవేశించి, ప్రయాణికులపై పడటంతో ఊపిరాడక అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కంకరలో ఇరుక్కుని బయటకు రాలేక ప్రయాణికులు చేసిన ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టించాయి.ఈ ప్రమాదంలో తోల్కట్టలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మ్యాథ్స్ కాంట్రాక్ట్ టీచర్గా పనిచేస్తున్న జయసుధ తీవ్రంగా గాయపడ్డారు. నడుములోతు కంకరలో ఇరుక్కుని ఆమె కాళ్లు వాచిపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేరెల్లి గ్రామానికి చెందిన జయసుధ వికారాబాద్లో బస్సు ఎక్కగా, ఆమెతో పాటు రావాల్సిన మరో నలుగురు ఉపాధ్యాయులు ఆలస్యంగా రావడంతో వేరే బస్సులో ప్రయాణించి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.ప్రమాదం తీవ్రతకు బస్సు డ్రైవర్ వైపు సీట్లలో ఉన్న ప్రయాణికులు అధికంగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఘటనా స్థలంలో దృశ్యాలు హృదయవిదారకంగా ఉండగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
చేవెళ్ల దుర్ఘటన.. కారణాలు ఇవే!
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాద దుర్ఘటనకు (Chevella Bus Accident) టిప్పర్ ఓవర్ లోడ్, ఓవర్ స్పీడ్ కారణమని ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. పరిమితికి మించి కంకర నింపుకుని, మితిమీరిన వేగంతో వెళుతూ బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 19 మంది చనిపోగా, 32 మంది వరకు గాయపడినట్టు సమాచారం.మరోవైపు రోడ్డుపైన ఉన్న భారీ గుంత (గొయ్యి) కూడా ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. గుంతను తప్పించబోయి టిప్పర్ డ్రైవర్ బస్సును ఢీకొట్టాడని అంటున్నారు. ఢీకొట్టిన వెంటనే టిప్పర్.. బస్సుపైకి ఒరిగిపోవడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. టిప్పర్లోని కంకర.. ఒక్కసారిగా బస్సులోని ప్రయాణికులపై పడడంతో వారిలో చాలా మంది ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు. టిప్పర్లో 35 టన్నుల కంకర ఉండాల్సి ఉండగా 60 టన్నుల కంకర ఉన్నట్టు తెలుస్తోంది. బస్సు డ్రైవర్ వైపు సీట్లు అన్ని నుజ్జు నుజ్జు అయ్యాయి. దీంతో ఈ వరుసలోని వారందరూ దాదాపు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు పురుషులు ఉన్నారు. చదవండి: అలా ప్రమాదం నుంచి బయటపడ్డానుప్రమాదానికి కారణాలు1. టిప్పర్ ఓవర్ లోడ్, ఓవర్ స్పీడ్2. రోడ్డుపైన భారీ గుంత3. టిప్పర్లో పరిమితికి మించిన కంకర4. గొయ్యి రావడంతో తప్పిన టిప్పర్ కంట్రోల్5. టిప్పర్లోని కంకరపై టార్పాలిన్ లేకపోవడం6. టిప్పర్లోన కంకర మొత్తం బస్సుపై పడడం7. బస్సులో సీట్లకు మించి ప్రయాణికులు -
ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి
సాక్షి, చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందినట్టు మంత్రి పొన్న ప్రభాకర్ అధికారికంగా ప్రకటించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరోవైపు.. ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలను అధికారులు, పోలీసులు గుర్తిస్తున్నారు. బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెలు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కూతుళ్లు నందిని (డిగ్రీ ఫస్టియర్), సాయిప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), తనూష (ఎంబీఏ) హైదరాబాద్లో చదువుకుంటున్నారు. ఇటీవల బంధువుల పెళ్లి ఉండటంతో ముగ్గురు సొంతూరుకు వచ్చారు. ఈరోజు తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం కారణంగా మృతి చెందారు. దీంతో, వారి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. పోస్టుమార్టం అనంతరం తనూష, సాయి ప్రియా, నందిని మృతదేహాలు గ్రామానికి చేరుకున్నాయి,. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఈ ప్రమాదంలో పది మంది మహిళలు, ఒక చిన్నారి, ఎనిమిది మంది పురుషులు ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా పలువురి మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు. 1.దస్తగిరి బాబా, డ్రైవర్; 2.తారిబాయ్ (45), దన్నారమ్ తండా; 3.కల్పన(45), బోరబండ; 4.బచ్చన్ నాగమణి(55); భానూరు; 5.ఏమావత్ తాలీబామ్, ధన్నారం తాండ; 6.మల్లగండ్ల హనుమంతు, దౌల్తాబాద్ మండలం;7.గుర్రాల అభిత (21) యాలాల్; 8.గోగుల గుణమ్మ,బోరబండ;9.షేక్ ఖాలీద్ హుస్సేన్, తాండూరు;10.తబస్సుమ్ జహాన్, తాండూరు.11. తనూషా, సాయిప్రియ, నందిని(ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెల్లు)12. అఖిల(తాండూరు).13. ఏనుగుల కల్పన14. నాగమణి, 15. జహంగీర్. క్షతగాత్రులు వీరే..వెంకటయ్యబుచ్చిబాబు-దన్నారమ్ తండాఅబ్దుల్ రజాక్-హైదరాబాద్వెన్నెలసుజాతఅశోక్రవిశ్రీను- తాండూరునందిని- తాండూరుబస్వరాజ్-కోకట్ (కర్ణాటక)ప్రేరణ- వికారాబాద్సాయిఅక్రమ్-తాండూరుఅస్లామ్-తాండూరు -
ఎమ్మెల్యేపై దాడికి యత్నం.. చేవెళ్ల ప్రమాదస్థలి వద్ద ఉద్రిక్తత
సాక్షి, రంగారెడ్డి: చేవెళ్ల మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సహాయక చర్యలు కొనసాగుతుండడంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంటున్నారు. తాజాగా ఘటనాస్థలికి వెళ్లిన ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ తలిగింది. రోడ్డు విస్తరణ ఎందుకు చేపట్టలేకపోయారు? అంటూ స్థానికులు ఆయన్ని నిలదీశారు. చేవెళ్ల ఘటనా స్థలంలో సోమవారం ఉదయం స్థానికులు ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారిపై ఇప్పటిదాకా రోడ్డు విస్తరణ చేపట్టకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే కాలె యాదయ్యను నిలదీశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ యాదయ్యపై దాడికి యత్నించబోయారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని శాంతింపజేశారు. దీంతో ఎమ్మెల్యే యాదయ్య వచ్చిన కారులో అలాగే వెళ్లిపోయారు.తాండూరుకు చెందిన ఆర్టీసీ బస్సు ఈ ఉదయం 4.45గం. బస్టాండ్ నుంచి హైదరాబాద్కు బయల్దేరింది. అయితే అక్కడ 30 మంది ఎక్కారు. ఫస్ట్ ట్రిప్ కావడం.. ఎక్స్ప్రెస్ బస్సే అయినప్పటికీ పల్లె వెలుగు పేరిట నడపం, ప్రతీ స్టాపులో ఆపుతూ రావడంతో విద్యార్థులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో ఎక్కారు. కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ మీర్జాగూడ టర్నింగ్ పాయింట్లో స్పీడ్ను కంట్రోల్ చేయలేకపోవడంతో అదుపుతప్పింది. బస్సును ఢీ కొట్టి ఆపై.. గుంత కారణంగా అదుపు తప్పి అలాగే బస్సు మీద ఒరిగిపోయింది. టిప్పర్ లారీ అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు నిర్థారించగా.. బస్సు మీదకు ఒరిగిపోవడం, ఈ క్రమంలో కంకర మొత్తం బస్సులో పడిపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని చెబుతున్నారు. బస్సుకు కుడి వైపు కూర్చున్న 21 మంది స్పాట్లోనే మరణించినట్లు చెబుతున్నారు. ఘటనలో టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్ దస్తగిరి స్పాట్లోనే చనిపోగా.. కండక్టర్ రాధ ప్రాణాలతో బయటపడింది. మృతులంతా తాండూరు, చేవెళ్ల వాసులుగా తెలుస్తోంది. స్థానికులు, పోలీసులు కంకర నుంచి ప్రయాణికులను బయటకు తీసి రక్షించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్రెడ్డి.. యుద్ధప్రతిపాదికన సహాయక చర్యలు చేపట్టాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను హైదరాబాద్కు తరలించే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. -
ఎన్హెచ్-163.. నెత్తుటి రహదారిపైనే ఘోర విషాదం
చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదంతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఘటనలో 17 మంది అక్కడికక్కడే మరణించగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ప్రమాదానికి అపోజిట్ వెహికల్ అతివేగం కారణమని తెలుస్తున్నప్పటికీ.. స్థానికులు మాత్రం ‘అలసత్వం’ కూడా ఓ కారణమనే విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన మార్గాల్లో హైదరాబాద్–బీజాపూర్ NH-163 రహదారి ఒకటి. వాణిజ్య, వ్యవసాయ, ప్రయాణ అవసరాలకు కీలకంగా ఉపయోగపడుతోంది. అయితే చాలా ఏళ్లుగా ప్రమాదాలకు కేంద్రబిందువుగా మారింది కూడా. తాజాగా వేగంగా దూసుకొచ్చిన కంకర టిప్పర్ బస్సును ఢీ కొట్టి బోల్తాపడి ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇరుకు రోడ్డులో ఆ టిప్పర్ స్పీడ్ కంట్రోల్ కాకనే ఈ ఘోరం జరిగినట్లు స్పష్టమవుతోంది. దీంతో.. రహదారి విస్తరణ జరగకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు అంటున్నారు. నిరుడు.. ఇదే సమయంలో ఈ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. డిసెంబర్లో ఆలూరు వద్ద లారీ అదుపు తప్పి కూరగాయలు అమ్ముకునేవాళ్లపై దూసుకెళ్లడంతో ఆరుగురు మరణించారు. ఆ సమయంలో స్థానికులు రోడ్డుపై భైఠాయించి.. రహదారి విస్తరణను డిమాండ్ చేశారు. అంతకు ముందు.. సెప్టెంబర్లో ఒకే రోజు జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మరణించారు. ఈ ఏడాది జూన్లో కేజీఆర్ గార్డెన్ సమీపంలో ఓ భారీ గుంతలో వాహనం బోల్తా పడి ఇద్దరు మరణించారు.ప్రమాదాలకు కారణాలివే.. ఇరుకైన రహదారి: రెండు వైపులా వాణిజ్య కార్యకలాపాలు, కూరగాయల మార్కెట్లు ఉండటంతో వాహనాల రాకపోకలు కష్టతరంగా మారాయి.రోడ్డు విస్తరణ జాప్యం: NH-163గా గుర్తింపు వచ్చినప్పటికీ, 46 కిలోమీటర్ల విస్తరణ పనులు ఇంకా పూర్తికాలేదు.గుంతలు, మలుపులు: వర్షాకాలంలో నీరు నిలిచే గుంతలు, అజాగ్రత్త మలుపులు ప్రమాదాలకు దారితీస్తున్నాయి.సిగ్నలింగ్ లోపం: ట్రాఫిక్ నియంత్రణ, స్పీడ్ బ్రేకర్లు, జాగ్రత్త సూచనలు లేకపోవడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి.మొదలైన రెండు రోజులకే.. ఎన్హెచ్-163 ఇరుకు రోడ్డు వల్ల మొయినాబాద్ నుంచి చేవెళ్ల వరకు నిత్యం ప్రమాదాలు జరుగుతూ, వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు సుమారు 46 కి.మీ మేర నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ కోసం గత ప్రభుత్వ హయాంలో రూ. 920 కోట్లు మంజూరయ్యాయి. ఈలోపు రోడ్డు విస్తరణలో చెట్లకు నష్టం కలుగుతుందని పేర్కొంటూ పర్యావరణ ప్రేమికులు అడ్డుపడ్డారు. కొన్ని గ్రామాల పెద్దలతో కలిసి జాతీయ పర్యావరణ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆశ్రయించడంతో పనులు నిలిచిపోయాయి. అయితే.. ప్రజాప్రతినిధుల చొరవతో ఈ అంశంలో పురోగతి చోటు చేసుకుంది. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా మొత్తం 950 చెట్లకు సంబంధించి అధికారులు ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. 150 చెట్లను రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లో నాటించేందుకు అధికారులు హామీ ఇచ్చారు. మిగిలిన చెట్లను రోడ్డుకు మధ్యలో ఉంచడానికి వీలుగా డిజైన్ చేశారు. ఈ విజ్ఞప్తులతో పర్యావరణ ప్రేమికులు ఆ పిటిషన్లను ఉపసంహరించుకోగా.. మొన్న శుక్రవారమే(అక్టోబర్ 31) మొయినాబాద్-చేవెళ్ల రహదారి విస్తరణ పనులు ప్రారంభం అయ్యాయి. ఇంతలోనే ఈ ఘోరం చోటు చేసుకోవడం గమనార్హం. -
చేవెళ్ల దుర్ఘటన.. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
Chevella road accident Updates..చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశంచేవెళ్ల బస్సు ప్రమాదంపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశంఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటనఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి మీర్జాగూడ ప్రమాదం కలచివేసింది.మృతుల కుటుంబాలను ఆదుకుంటాం ప్రభుత్వ పరిహారంతోపాటు సాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం ఆర్టీసీ ఇన్సూరెన్సును కూడా అందిస్తాం బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చే చర్యలు చేపడతాం గ్రీన్ ట్రిబునల్లో ఉండటం వల్ల రోడ్డు విస్తరణ ఆలస్యంరంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి చేవెళ్లలో బస్సు ప్రమాదం జరిగిందిఈ ప్రమాదంలో మొత్తం 19మంది మంది మృతి చెందారుప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి,పీఎం హాస్పిటల్కు తరలించాంమృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు గ్రీన్ ట్రిబునల్లో ఉండటం వల్ల రోడ్డు విస్తరణ ఆలస్యం అయ్యింది మూడు రోజుల క్రితం దాన్ని డిస్మిస్ చేయడం జరిగిందికొద్దిరోజుల్లో రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయి కానీ అనుకోని విధంగా ఈ ప్రమాదం జరిగిందిచేవెళ్ల బస్సు ప్రమాదంతో భారీ ట్రాఫిక్ జామ్చేవెళ్ల బస్సు ప్రమాదంతో భారీ ట్రాఫిక్ జామ్ రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్-బీజాపూర్ హైవేపై స్తంభించిన వాహనాలుచేవెళ్ల-వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయిచేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతిచేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ఆమె ప్రార్థించారు. ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.కేసు నమోదు..మీర్జాగూడ ప్రమాద ఘటనపై కేసు నమోదు..బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు.ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ గుర్తింపు.మహారాష్ట్రకు చెందిన ఆకాశ్ కాంబ్లేగా గుర్తించారు.ప్రమాదంలో బస్సు డ్రైవర్ దస్తగిరి(38) మృతి. ఆలూరు నుంచి వాహనాల మళ్లింపుమీర్జాగూడ దగ్గర బస్సు ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్.చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో స్తంభించిన ట్రాఫిక్.ఆలూరు నుంచి వాహనాల మళ్లింపు.ఆలూరు-చేవెళ్ల మీదుగా హైదరాబాద్కు మళ్లింపు. మంత్రి పొన్నం ఎక్స్గ్రేషియా ప్రకటన.. ఇప్పటి వరకు 19 మంది మృతి చెందారు.బస్సు ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం ఆదేశిస్తుంది.గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందిస్తున్నాం.రోడ్డు విస్తరణను ఎవరు అడ్డుకుంటున్నారో అన్ని బయటకు వస్తాయి.ఘటనపై రాజకీయం చేసేందుకు ఇది సమయం కాదు.బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు ఎక్స్గ్రేషియాక్షతగాత్రులకు రెండు లక్షల పరిహారం.కాసేపట్లో ఘటనా స్థలానికి సీఎం రేవంత్.. స్పాట్కు చేరుకున్న ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిఘటనా స్థలికి చేరుకున్న ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి.కాసేపట్లో చేరుకోనున్న రవాణా మంత్రి పొన్నంతీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాద్కు తరలిస్తున్న అధికారులు..కొనసాగుతున్న సహాయక చర్యలు.మృతుల సంఖ్య పెరిగే అవకాశం.తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కామెంట్స్..రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నన్ను తీవ్రంగా కలచివేసింది.ఈ ప్రమాదంలో మహిళలు, పిల్లలు సహా 20 మంది ప్రాణాలు కోల్పోయారు.నా ఆలోచనలు, ప్రార్థనలు తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలతో ఉన్నాయి.ఈ దుఃఖ సమయంలో వారికి ఓదార్పు లభిస్తుందని ఆశిస్తున్నాను.ప్రమాదంలో గాయపడిన వారికి నా సానుభూతిని అందిస్తున్నాను.వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.చేవెళ్ల ఘటనపై సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటుప్రమాద వివరాలు - అధికారుల మధ్య సమన్వయం చేయనున్న కంట్రోల్ రూమ్.ప్రమాద సమాచారం కోసం AS: 9912919545SO: 9440854433 నంబర్లను సంప్రదించాలని కోరిన ప్రభుత్వంఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తీవ్ర దిగ్బ్రాంతి..ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడిన మంత్రిచేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న మంత్రిఅవసరమైన వారందరినీ హైదరాబాద్కు తరలించి చికిత్స అందించాలని ఆదేశాలు. ఉన్నతాధికారులంతా తక్షణమే ఆసుపత్రికి వెళ్లాలని మంత్రి ఆదేశంమంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర విచారంక్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం.ప్రమాదానికి గల కారణాలపై ఆరా, దిగ్భ్రాంతిసీఎం ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం సహాయక చర్యలు వేగం.బాధితులకు న్యాయం చేస్తాం.క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్స అందిస్తుంది.ఎంపీ డీకే అరుణ తీవ్ర దిగ్భ్రాంతి..ప్రమాదంలో 19 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరంఈ దుర్ఘటన వార్త తీవ్రంగా కలిచివేసిందిమృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాక్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలిఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలిప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిప్రమాద ఘటనపై స్పందించిన కిషన్ రెడ్డి.మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.మంత్రి శ్రీధర్ బాబు దిగ్భ్రాంతి..బస్సు ప్రమాద దుర్ఘటనపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి.జిల్లా కలెక్టర్, పోలీస్, ఇతర విభాగాల ఉన్నతాధికారులను అప్రమత్తం చేసిన మంత్రిప్రమాదం జరిగిన తీరును, క్షతగాత్రుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించాలని ఉన్నతాధికారులను ఆదేశంక్షతగాత్రులకు చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందించాలని ఆదేశం.ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబుగాయపడిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్న హామీ.క్షతగాత్రులకు సంబంధించిన పూర్తి సమాచారం కుటుంబ సభ్యులకు తెలియజేసే ఏర్పాట్లు చేయాలని ఆదేశంమృతుల కుటుంబాలను ఆదుకోవాలి: కేసీఆర్ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.కేటీఆర్ సంతాపం..ప్రమాదంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికులు మృతి చెందడంచ, పలువురు తీవ్రంగా గాయపడటం పట్ల ఆయన సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని, మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం, ఖానాపూర్ స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందడం అత్యంత బాధాకరం.మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. పలువురు తీవ్రంగా గాయపడటం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను.ప్రభుత్వం తక్షణమే స్పందించి వెంటనే…— KTR (@KTRBRS) November 3, 2025టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి..బస్సు ఘోర ప్రమాదంపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చేవెళ్ళేలో జరిగిన రోడ్డు ప్రమాదంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డవారికి తగిన వైద్య చికిత్సలు చేయాలని సూచించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మృతులను తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.సీఎం రేవంత్ విచారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులకు సూచించారు. మంత్రులు ఘటనా స్థలానికి చేరుకోవాలని సూచించారు. 👉మరోవైపు... మీర్జాగూడలో ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన సంబంధించి వివరాలు, కారణాలపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మాట్లాడారు. అలాగే, క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు మంత్రి పొన్నం సూచించారు. ఆర్టీసీ అధికారులు ఘటన స్థలానికి వెళ్లాలని మంత్రి ఆదేశించారు.👉ఇదిలా ఉండగా.. మీర్జాగూడ వద్ద తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మూడు జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.👉ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు హైదరాబాద్లోని పలు కళాశాలల్లో చదువుతున్నట్లు సమాచారం. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి.. తిరిగి నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్-బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్జామ్ అయింది. చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. -
చేవెళ్లలో ఘోర ప్రమాదం.. 20 మంది మృతి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో సోమవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చేవెళ్ల వద్ద ఆర్టీసీ బస్సును కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీ కొట్టి బోల్తా పడిపోయింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదంలో 19మంది మరణించారని రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. క్షతగాత్రులకు చికిత్స అందుతుండగా.. వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చేవెళ్ల మండల పరిధిలో సోమవారం వేకువ ఝామున ఈ ఘోరం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు ఈ వేకువ జామున హైదరాబాద్కు బయల్దేరింది. తొలి ట్రిప్పు బస్సు కావడంతో అధిక సంఖ్యలో జనాలు ఎక్కారు. ఈలోపు.. బస్సు మీర్జాగూడ వద్దకు చేరుకోగానే కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ వేగంగా దూసుకొచ్చి ఢీ కొట్టింది. ఆపై టిప్పర్ ఒరిగిపోవడంతో కంకర లోడ్ మొత్తం బస్సులోకి పడిపోయింది. తాండూరు బస్టాండ్ నుంచి బస్సు బయల్దేరిన దృశ్యంప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం ధ్వంసం అయ్యింది. బస్సు, టిప్పర్ డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన గురించి సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వాళ్లను బయటకు తీసి ఆస్పత్రులకు తరలించారు. ఘటనా స్థలం వద్ద, బస్సుల్లో దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. తమను కాపాడాలంటూ కంకరలో కూరుకుపోయిన వాళ్లు వేడుకోవడం.. అచేతనంగా కొందరు పడి ఉండడం కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ ప్రమాదంలో 20 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మరో 32 మందికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడినవాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.బస్సులో కంకర మధ్య విగతజీవిగా యువతి.. ఆ వెనక సగం కూరుకుపోయి సాయం కోసం ఎదురు చూస్తున్న యువకుడుకంకర టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన టిప్పర్.. అదుపు తప్పి బస్సుపై బోల్లా పడిందని పోలీసులు చెబుతున్నారు. కంకర మొత్తం బస్సులో పడిపోవడంతో ఈ తీవ్రత ఎక్కువైందని అంటున్నారు.ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం సెలవు కావడంతో సిటీ నుంచి వెళ్లినవాళ్లు తిరుగు పయనమైనట్లు స్పష్టమవుతోంది. అందులో విద్యార్థులు, ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. మొత్తం 20 మంది మృతుల్లో 10 మంది మహిళలు, ఒక చిన్నారి, 8 మంది పురుషులు(ఇద్దరు డ్రైవర్లుసహా) ఉన్నారు. మృతుల్లో పది నెలల పసికందు, ఆమె తల్లి కూడా ఉండడం కలిచివేస్తోంది. కేబిన్లలో ఇరుక్కుపోయిన టిప్పర్ డ్రైవర్, బస్సు డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు. మరో 15 మంది ప్రయాణికులను కాపాడగలిగారు. కంకరను పూర్తిగా తొలగించేందుకే జేసీబీ సహాయం తీసుకున్నారు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఇదిలా ఉంటే.. సహయ చర్యల్లో పాల్గొన్న సీఐ భూపాల్కు గాయాలయ్యాయి. జేసీబీ ఆయన కాలు మీదకు ఎక్కింది. దీంతో ఆయనకు చికిత్స అందించారు. ఇక ఈ ప్రమాదం వల్ల చేవెళ్ల-వికారాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మూడు కిలోమీటర్ల వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో అధికారులు రంగంలోకి ట్రాఫిక్ను క్లియర్ చేసే పనిలో ఉన్నారు. -
వేధింపుల ప్రిన్సిపాల్ మాకొద్దు
షాద్నగర్: ‘అడుగడుగునా వేధిస్తోంది.. లంచాలు అడుగుతోంది.. కులం పేరుతో దూషిస్తోంది.. మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.. ఈ ప్రిన్సిపాల్ మా కొద్దు.. ఆమె నుంచి విముక్తి కల్పించండి’ అంటూ విద్యార్థినులు రోడ్డెక్కారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని కమ్మదనం గ్రామ శివారులో నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో నాగర్కర్నూల్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాల కొనసాగుతోంది. ఇక్కడ సుమారు 600 మంది విద్యార్థినులు విద్యాభ్యాసం సాగిస్తున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ శైలజ తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపిస్తూ ఆదివారం విద్యార్థినులు ప్లకార్డులు పట్టుకొని పెద్దసంఖ్యలో హాస్టల్ నుంచి బయటికి వచ్చారు. సుమారు రెండున్నర కిలోమీటర్లకు పైగా ర్యాలీగా వెళ్లి షాద్నగర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు.వీరి ఆందోళనకు ఎస్ఎఫ్ఐ నాయకులు మద్దతు తెలిపారు. ఓ దశలో విద్యార్థినులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కొందరు విద్యార్థినులు సొమ్మసిల్లి కింద పడిపోయారు. మఫ్టీలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ విద్యార్థినులను బలవంతంగా వాహనంలో ఎక్కించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఓ విద్యార్థినిని చెంపపై కొట్టడంతో అంతా ఆగ్రహంతో ఆమెను జుట్టుపట్టి కొద్దిదూరం ఈడ్చుకెళ్లి చితకబాదారు.పట్టణ సీఐ విజయ్కుమార్ విద్యార్థినులకు నచ్చజెప్పి పోలీస్స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. త్వరలో కమిటీ వేసి సమస్యను పరిష్కరిస్తామని జోనల్ ఆఫీసర్ నిర్మల చెప్పినా వారు వినలేదు. ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాల్సిందేనని, అప్పటివరకు హాస్టల్కు వెళ్లబోమని భీష్మించుకుని ఠాణా ఎదుటే కాసేపు బైఠాయించారు. తిరిగి చౌరస్తా వద్దకు వచ్చి ధర్నా చేపట్టారు. పోలీసులు మరోసారి వారికి సర్దిచెప్పి బస్సుల్లో హాస్టల్కు పంపించారు. -
వికారాబాద్లో దారుణం.. భార్యపై అనుమానంతో వదిన, కూతురును..
సాక్షి కులకచర్ల: వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కులకచర్ల మండల కేంద్రంలో భార్య, ఇద్దరు పిల్లలు, వదినను వేపూరి యాదయ్య అనే వ్యక్తి కత్తితో దారుణంగా నరికి చంపాడు. అనంతరం నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.వివరాల ప్రకారం.. యాదయ్య, అలవేలు భార్యాభర్తలు. వారికి అపర్ణ, శ్రావణి ఇద్దరు కుమార్తెలు. రోజువారీ కూలీగా పనిచేసే యాదయ్యకు భార్య అలవేలుపై అనుమానం ఎక్కువ అని కుటుంబ సభ్యులు, స్థానికులు చెబుతున్నారు. ఆమెపై అనుమానంతో ప్రతీరోజు గొడవ పడేవాడని చుట్టుపక్కల వారు తెలిపారు. ఈ క్రమంలోనే వారం రోజులుగా భార్యాభర్తల మధ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి. భార్యను యాదయ్య తీవ్రంగా కొట్టినట్టు కూడా తెలిసింది.దీంతో, ఇద్దరిని రాజీ చేసేందుకు వదిన హన్మమ్మ వారి ఇంటికి వచ్చింది. శనివారం రాత్రి వారి మధ్య చర్చలు జరిగాయి. ఆ తరువాత అందరూ పడుకున్న సమయంలో అర్ధరాత్రి యాదయ్య దారుణానికి ఒడిగట్టాడు. భార్య అలవేలు (32), కూతురు శ్రావణి (13), వదిన హన్మమ్మ (40)ను కోడవలితో గొంతుకోసి హత్య చేశాడు. పెద్దకుమార్తె అపర్ణపై కూడా దాడి చేయబోగా ఆమె తప్పించుకొని పారిపోయింది. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పడంతో.. వారు వచ్చేలోపే యాదయ్య ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిగి డీఎస్పీ శ్రీనివాస్ హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. నలుగురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
దీపాదాస్ మున్సీపరువునష్టం కేసు వాయిదా
● వచ్చే విచారణలోగా ప్రాసిక్యూషన్ తరఫున సాక్ష్యాలు దాఖలు చేయాలి ● జనవరి 23కు విచారణ వాయిదా సిటీ కోర్టులు : బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్పై దాఖలైన పరువు నష్టం కేసుపై శుక్రవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు విచారణకు ఫిర్యాదుదారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ప్రతివాది బీజేపీ నేత ప్రభాకర్ గైర్హాజరయ్యారు. దీపాదాస్ మున్షీ తరుఫున న్యాయవాది థామస్ లాయిడ్, ప్రభాకర్ తరుఫున న్యాయవాది వేణుగోపాల్ హాజరై పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణను జనవరి 23కు వాయిదా వేసింది. ఆ రోజు ప్రాసిక్యూషన్ తరుఫున సాక్ష్యం దాఖలు చేయాలని పోలీసులకు సూచించింది. కాంగ్రెస్ నేతల నుంచి ఆ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీ బెంజ్ కారు లబ్ధి పొందినట్లు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గతంలో అసత్యపు ఆరోపణలు చేశారని ఆమె నాంపల్లి కోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఎంపీ టికెట్ ఆశావహుల్లో ఒకరు దీపాదాస్ మున్షీకి బెంజ్ కారును బహూకరించారని, ఇందుకు సంబంధించి తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని ఆయన ఆరోపణలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే బీజేపీ నేత తనపై అసత్యపు ఆరోపణలు చేశారని, తన పరువుకు భంగం కలిగించిన ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేసిన విషయం కూడా తెలిసిందే. బైక్ను ఢీకొట్టిన కారు ● భార్యాభర్తలకు గాయాలు ● మీనపల్లికలాన్లో ఘటన నవాబుపేట: అతివేగంగా వచ్చిన కారు బైక్ ను ఢీకొట్టడంతో భార్యాభర్తలకు గాయాలయ్యా యి. ఈ ఘటన మీనపల్లికలాన్లో చో టుచేసుకుంది. ప్రత్యక్ష్య సాక్షులు, పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి.. మీనపల్లికలాన్కు చెందిన చాకలి శ్రీనివాస్ శంకర్పల్లిలోని బీడీఎల్ కంపెనీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా, ఇతని భార్య కావేరి శంకర్పల్లిలోని అపోలో ఫార్మసీలో పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం బైక్పై విధులకు బయల్దేరా రు. గ్రామ శివారులో ఎదురుగా, అతివేగంతో వచ్చిన కారు (టీఎస్13 ఈకే 8297) వీరిని ఢీ కొట్టింది. గాయాలపాలైన దంపతులను సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు హాస్పటల్కు తరలించారు. ఇదిలా ఉండగా కారు నడుపుతున్న యజమాని, విశ్రాంత ఆర్మీ ఉద్యోగి గండయ్య కొద్దిదూరం వెళ్లి అక్కడే కారును వదిలేసి వెళ్లిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పుండ్లిక్ తెలిపారు. పనికి రాలేదని కూలీపై దాడి పరిగి: పనికి రాలే దని ఓ కూలీని యజమాని కుమారుడు చితకబాదిన ఘటన పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ మోహన్కృష్ణ కథనం మేరకు.. చిగురాల్పల్లికి చెందిన కాకి మాణిక్యం అదే గ్రామానికి చెందిన మదర్ వద్ద గేదెలు కాసే పనిలో చేరాడు. తల్లి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో రెండు రోజులుగా పనులకు రాలేదు. ఆగ్రహించిన యజమాని కుమారుడు ఫహత్ కర్రలతో మాణిక్యంపై దాడి చేసి గాయపరిచాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చేతిలోనే వైరస్..
అబ్దుల్లాపూర్మెట్: సెల్ఫోన్, కంప్యూటర్ కీబోర్డు, టీవీ రిమోట్, కరెన్సీ నోట్లు, లిఫ్ట్ తదితర వస్తువులు నిత్యం మనం వినియోగించే నేస్తాలు. ఈ క్రమంలో మనకు తెలియకుండానే, ఎంత పరిశుభ్రంగా ఉన్నా.. వీటిపై ప్రమాదకరమైన బ్యాక్టీరియా(ఏకకణ సూక్ష్మజీవులు) అవశేషాలు పోగుపడుతున్నాయి. కంటికి కనిపించకుండా మన వెంటే ఉంటుంది. అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా మైక్రోబయాలజీ విభాగం ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో కొన్ని ఆశ్ఛర్యకరమైన వివషయాలు వెలుగు చూశాయి. మనం రోజు వారీ చేసే పనుల్లో కొన్ని ఆరోగ్యానికి ముప్పుగా పరిణమిస్తాయని వెల్లడవడం షాక్కు గురిచేస్తోంది. ఇలా వాడే ఏ వస్తువులో ఎలాంటి బ్యాక్టీరియా ఉందో, దాని వలన కలిగే నష్టం గురించి తెలుసుకుందాం.. ఫోన్ ద్వారా చేరువగా.. నిత్యం రకరకాల వస్తువులను పట్టుకుంటాం. ఆ చేతితోనే సెల్ఫోన్లు వాడతాం. దీంతో బ్యాక్టీరియా ఫోన్ ద్వారా మనకు చేరువ కాగా.. అవే చేతులతో ఆహార పదార్థాలు తింటే రోగాలను కొని తెచ్చుకున్నట్లే. సెల్ఫోన్ స్క్రీన్పై సుమారు 25 వేల క్రిములు ఉంటాయని పరిశోధనల్లో తేలింది. మొత్తం 250 ఫోన్లను పరీక్షించి 94.5 శాతం ఫోన్లపై బ్యాక్టీరియా అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. ఆశ్ఛర్యకరమైన విషయం ఏమిటంటే.. బాత్రూంలో ఉండే బ్యాక్టీరియా కంటే 18 రేట్లు ఎక్కువ సెల్ఫోన్లే ప్రమాదకర బ్యాక్టీరియాకు నిలయమని అవగతమవుతోంది. సాఫ్ట్ కోకస్, కోయాడ్యుటేజ్ నెగిటివ్ స్టాఫ్ వంటి బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. వీటి వలన రక్తంలో ఇన్ఫెక్షన్, చర్మ, ఎముకల సంబంధిత వ్యాధులు వచ్చేఅవకాశం ఉంది. కీ బోర్డు, రిమోట్తో జాగ్రత్త కార్యాలయాలు, ఇంట్లో వాడే కంప్యూటర్లు, లాప్టాప్ కీబోర్డులు అత్యంత ప్రమాదకరమైనవే.. పీసీ స్క్రీన్, కీబోర్డు, మౌసులు కూడా బ్యాక్టీరియాకు చిరునామాగా మారాయి. ఇంట్లో ఉండే కీబోర్డుల కంటే.. నెట్ సెంటర్లు, సైబర్ కేఫ్లలో ఉండే వాటిపై వందరెట్ల క్రిములు అధికంగా ఉంటాయని పరిశోధనలో తేలింది. ఎంటిరోకేకస్, పీజీఎం స్టాఫికోకస్ వంటి క్రిములు వీటిపై ఆవహించిఉంటాయి. వీటితో ఊపిరితిత్తుల వ్యాధులు, రక్తంలో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇక ప్రతిఇంట్లో టీవీ తప్పనిసరి. దాని రిమోట్ను కుటుంబీకులు అందరూ ఆపరేట్ చేస్తుంటారు. ఫలితంగా దగ్గినా.. తుమ్మినా వైరస్ దీనికి చేరువవుతుంది. ఒక్కో టీవీపై 324 రకాల క్రిములు ఉంటాయని అంచనా. టీవీల కంటే రిమోట్లు అత్యంత ప్రమాదకరమైనవి. హోటళ్లు, ఆస్పత్రుల్లోని రిమోట్లలో బ్యాక్టీరియా అధికంగా పోగుపడి ఉంటుంది. కరెన్సీ నోట్లు ప్రమాదకరమే.. నిత్య వినియోగంలో ఉండే కరెన్సీ కోట్లాది మంది చేతులు మారుతుంది. వీటిపై అధిక శాతం క్రిములు ఉంటాయి. పేపర్ ఆధారిత కరెన్సీ నోట్లపై బ్యాక్టీరియా అధికంగా చేరుతుంది. కొన్ని అంగులం వెడల్పు ఉండే నోట్లపై 100కు పైగా క్రిములు ఆశించి ఉంటాయి. అవి మన శరీరంపై శరవేగంగా దాడి చేస్తాయి. లిఫ్ట్ బటన్.. నగరంలో గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్ కల్చర్ విపరీతంగా పెరిగింది. ప్రతి చోట లిఫ్ట్లు ఉండడం సాధారణంగా మారింది. కామన్ లిఫ్ట్ బటన్ బ్యాక్టీరియా స్థావరంగా చెప్పొచ్చు. షాపింగ్ మాల్స్, ఆస్పత్రుల్లో కొన్ని వందల మంది బటన్లు నొక్కుతుంటారు. అధిక రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఉన్న వాటిపై.. నివాస ప్రాంత బటన్ల కంటే వంద రెట్లు ఎక్కువ క్రిములు ఉంటాయి. నిత్య నేస్తాలు.. బ్యాక్టీరియాకు ఆవాసం ఆరోగ్యానికి పొంచిఉన్న ముప్పు పరిశుభ్రతే రక్ష.. నిర్లక్ష్యం చేస్తే శిక్ష అప్రమత్తత అవసరం.. నిత్యం వాడే వస్తువులపై బ్యాక్టీరియా, వైరస్లు చేరడం సాధారణ అంశం. క్రిములు 24 గంటలు జీవిస్తాయి. సెల్ఫోన్, రిమోట్, కంప్యూటర్లు వినియోగించిన తర్వాత యాంటీ బ్యాక్టీరియల్ లిక్విడ్స్, శానిటైజర్స్తో చేతులు శుభ్రం చేసుకోవాలి. లేని పక్షంలో ఆహార పదార్థాలు తింటే జీర్ణకోశ సంబంధిత వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది. – డాక్టర్ సందీప్, కొత్తపేట -
పెళ్లయిన నెల రోజుల్లోనే వరుడి మృతి
పహాడీషరీఫ్: వివాహం జరిగిన నెల రోజుల లోపే వరుడు మృతిచెందాడు. ఈ సంఘటన జల్పల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోలెమోని భిక్షపతి కుమారుడు శివనాథ్ ముదిరాజ్(35)కు, అక్టోబర్ 11న శంషాబాద్కు చెందిన యువతితో వివాహం జరిగింది. వారం అనంతరం అనారోగ్యానికి గురైన యువకుడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. యువకుడి అకాల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రచార బోర్డును ఢీకొన్న కారు ఒకరి మృతి కొత్తూరు: ప్రచార బోర్డును కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన కొత్తూరు పట్టణం పెంజర్ల కూడలీ జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని నార్సింగి ప్రాంతానికి చెందిన హరినాథ్రెడ్డి(55), కొంత కాలంగా నందిగామ మండలం మేకగూడ గ్రామంలోని హిమాక్షి బేకర్స్ పరిశ్రమలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే తన కారులో విధులకు వస్తుండగా.. రోడ్డు పక్కనే ఉన్న ఓ ప్రచార బోర్డును ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడిన హరినాథ్ను.. స్థానికులు పరిశ్రమ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. వారు క్షత్రగాత్రున్ని చికిత్స నిమిత్తం శంషాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. మృతుడి బంధువు మురళీమోహన్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
స్కూటర్ను ఢీకొట్టిన కారు
వ్యక్తికి గాయాలు మొయినాబాద్: యూటర్న్ తీసుకుంటున్న స్కూటర్ను కారు ఢీకొట్టడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కనకమామిడి గ్రామానికి చెందిన జుంజూరి సామయ్య కూలి పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో తన స్కూటర్పై వెళ్తూ తహసీల్దార్ కార్యాలయం వద్ద హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై యూటర్న్ తీసుకుంటుండగా మొయినాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు (టీఎస్ 09 ఎఫ్వీ 4815) వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సామయ్య తల, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి నుంచి వెళ్లిన మహిళ అదృశ్యం మొయినాబాద్: కూతురును ఇంట్లో వదిలి బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైంది. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని చిలుకూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని చిలుకూరుకు చెందిన కనగల్ల శ్రీలత (30) హౌస్కీపింగ్ పనిచేస్తోంది. అక్టోబర్ 27న రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన కూతురు రిషికను ఇంట్లో వదిలేసి బయటకు వెళ్లింది. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో శుక్రవారం మొయినాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలో కూడా శ్రీలత ఇలాగే ఇంట్లో నుంచి వెళ్లిపోయి కొన్ని రోజుల తరువాత తిరిగి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దేశాన్ని ఏకం చేసిన ఉక్కుమనిషి
పరిగి/ తాండూరు టౌన్: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో.. భారత్లో ఐదు వందలకు పైగా స్వతంత్య్ర రాజ్యాలు ఉండేవి. వాటన్నింటినీ ఏకం చేసిన గొప్ప నాయకుడు సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ అని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. ఉక్కుమనిషి, దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం పట్టణ కేంద్రంలో ఐక్యతా ర్యాలీ(రన్ ఫర్ యూనిటీ) నిర్వహించారు. తహసీల్దార్కార్యాలయం నుంచి కొడంగల్ కూడలి వరకు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పటేల్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీమన్నారు. చిన్న చిన్న రాజ్యలను ఏకం చేసి, అఖండ భారతదేశాన్ని నిర్మించారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సమైక్యతే మహాబలం దేశంలో వందలాది సంస్థానాలను ఏకం చేసి, నవ భారతాన్ని నిర్మించిన మహనీయుడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అని తాండూరు డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి అన్నారు. సమైక్యతతో ఏదైనా సాధించవచ్చని, అదే మహాబలమని నిరూపించిన ఘనుడు అని పేర్కొన్నాడు. దేశ తొలి ఉప ప్రధాని వల్లభ్ భాయ్ జయంతిని పురస్కరించుకొని తాండూరు డివిజన్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ ర్యాలీ నిర్వహించారు. రూరల్ సీఐ నగేష్, పట్టణప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక విలియంమూన్ కూడలి నుంచి ఇందిరాచౌక్ వరకు ర్యాలీ తీశారు. కార్యక్రమంలో కృష్ణ ముదిరాజ్, భద్రేశ్వర్, సుదర్శన్ గౌడ్, మల్లేశం, జుంటుపల్లి వెంకటేశ్, దత్తాత్రేయ, యువత, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సర్దార్ సేవలు చిరస్మరణీయం డీఎస్పీలు శ్రీనివాస్, బాలకృష్ణారెడ్డి ఘనంగా సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ జయంతి -
గ్రామానికి వస్తా.. భూములు పరిశీలిస్తా
● ప్రభుత్వంతో మాట్లాడి.. న్యాయం చేస్తా ● బాధిత రైతులతోరైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి యాచారం: ‘భూ సేకరణకు నోటిఫికేషన్ ప్రకటించిన భూములను పరిశీలించడానికి అధికారులతో కలిసి గ్రామానికి వస్తా. ప్రభుత్వంతో మాట్లాడి బాధిత రైతులకు న్యాయం చేస్తా’ అని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి అన్నారు. నగరంలోని రైతు కమిషన్ కార్యాలయంలో శుక్రవారం మొండిగౌరెల్లి గ్రామ రైతులు ఆయనను కలిశారు. ‘ఏళ్లుగా సాగులో ఉన్న భూములను పారిశ్రామిక పార్కుల కోసమని సేకరిస్తున్నారు. అసైన్డ్ భూములకు పరిహారం ఎకరాకు రూ.22 లక్షలు, 121 గజాల ప్లాటు ఇస్తామనిఅధికారులు చెబుతున్నారు. యాచారం మండల కేంద్రానికి సమీపంలోని మొండిగౌరెల్లిలో ఎకరా భూమికి రూ.కోటిన్నరకు పైగానే డిమాండ్ ఉంది. అసైన్డ్ కమిటీలో పేర్లున్న కొంత మంది రైతుల పేర్లు.. రికార్డుల్లో నమోదు కాలేదు. కానీ నకిలీల పేర్లు కొన్ని రికార్డుల్లో నమోదై పట్టాదారు, పాసుపుస్తకాలు వచ్చాయని’ కోదండరెడ్డికి వారు వివరించారు. అనంతరం ఆయన.. ఇదే విషయమై ఇబ్ర హీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎవరికి అన్యాయంజరగకుండా చూస్తానని రైతులకు హామీ ఇచ్చారు. రాజకీయాలు పక్కన పెట్టి, ఐక్యంగా ఉండాలని సూచించారు. -
నరేష్కు డాక్టరేట్
మంచాల: దళిత యువకుడికి డాక్టరేట్ వరించింది. నిరుపేద యువకుడే అయినా.. పట్టుదల, కృషి ఉంటే పేదరికం ఉన్నత చదువులకు అడ్డు కాదని నిరూపించాడు. మండల పరిధి చెన్నారెడ్డి గూడ గ్రామానికి చెందిన గ్యార ఎల్లయ్య– ఎల్లమ్మదంపతుల రెండో కుమారుడు నరేష్.. గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి వరకు చదువుకున్నాడు. ఎనిమిది నుంచి పది వరకు ఆరుట్ల, ఇంటర్మీడియట్ ఇబ్రహీంపట్నం ప్రతిభ కళాశాలలో పూర్తి చేశాడు. ఎంసెట్ పరీక్షలో అర్హత సాధించి పట్నంలోని సెయింట్ ఇంజినీరింగ్కళాశాలలో విద్యనభ్యసించాడు. అనంతరం గెట్లో ఉత్తీర్ణత సాధించి, ఓపెన్ కేటగిరీలో ఓయూలో సీటు సంపాదించి, ఎంటెక్ పూర్తి చేశాడు. పీహెచ్డీలో సీటు పొందాడు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ ఈ.విద్యాసాగర్ పర్యవేక్షణలో.. (మినీమైజేషన్ ఆఫ్ లాసెస్ ఇన్ ది డిస్ట్రిబ్యూషన్ సిస్టం బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్) అనే అంశంపై పరిశోధనలు పూర్తి చేసి, డాక్టరేట్ పట్టా పొందాడు. దీంతో గ్రామస్తులు నరేష్కు అభినందనలు తెలిపారు. -
5 నుంచి రామలింగేశ్వర స్వామి జాతర
మంచాల: బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏ ర్పాటు పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. వేడుకకు రాష్ట్ర నలు మూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి రానుండటంతో.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సహకారంతో రూ.కోటి 5లక్షలతో బీటీరోడ్డు నిర్మాణం, మరో 20 లక్షలతో సీసీరోడ్డు, భక్తులసౌకర్యార్థం బాత్రూంల నిర్మాణం చేపట్టారు. ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. దాత పీఏసీఎస్ చైర్మన్ వెదెరె హన్మంత్ రెడ్డి.. ఆయన తండ్రి రామ కృష్ణారెడ్డి జ్ఞాపకార్థంగా ప్రసాద విక్రయకేంద్రాన్ని నిర్మించారు. జాతర పనులను హన్మంత్రెడ్డితో పాటు.. మాజీ సర్పంచ్లు విష్ణు వర్ధన్రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. జాతర ప్రారంభం రోజున మరో రూ.25 లక్షలతో ఎమ్మెల్యే మల్రెడ్డి.. ఆలయ గెస్ట్హౌస్ నిర్మాణం పనులను ప్రారంభించనున్నారు. రూ.1.25 కోట్లతో కొనసాగుతున్న ఏర్పాట్లు -
12 కిలోల వెండి మాయం
ఫిర్యాదు చేసిన చైన్నె వ్యాపారులు శంషాబాద్: కార్గోలో రావల్సిన 12 కేజీల వెండి మాయమైనట్లు చైన్నెకి చెందిన వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన శంషాబాద్ ఎయిర్పోర్టులో చోటు చేసుకుంది. వివరాలివీ... ఈ నెల 20న హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి చైన్నెకి 12 కేజీల వెండి కన్సైన్మెంట్ ఉండగా దానిని స్వీకరించేవారికి అది చేరలేదు. దీంతో సంబంధిత వ్యక్తులు కార్గో రవాణాపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆర్జీఐఏ ఔట్పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంబంధిత పత్రాల ఆధారంగా వెండి కొనుగోళ్లు.. దాని సరఫరా చేస్తున్న ఎజెన్సీలపై అనుమానం వ్యక్తం చేస్తే దానిని స్వీకరించే వ్యక్తులు శుక్రవారం ఆర్జీఐఏ ఔట్పోస్టు పోలీసులకు సమాచారం అందజేయడంతో కేసు నమోదు చేసుకుని సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు సమాచారం. ఇద్దరు పిల్లలతో కలిసి వివాహిత అదృశ్యం రాజేంద్రనగర్: భర్తతో గొడవపడిన ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి కనిపించకుండా పోయిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మామిడి కిశోర్ తెలిపిన వివరాల ప్రకారం... హైదర్గూడ ఎర్రగూడా ప్రాంతానికి చెందిన వెంకటేశ్, అరుణలు దంపతులు. వీరికి మేఘన(6), మేఘనాథ్(7)లు సంతానం. భార్యాభర్తలు ఇరువురు డబ్బు విషయమై గురువారం ఉదయం గొడవపడ్డారు. అనంతరం వెంకటేశ్ ఉదయం ఇద్దరు పిల్లలను స్థానికంగా ఉన్న పాఠశాల వద్ద దింపాడు. అరుణ ఉదయం 11 గంటల ప్రాంతంలో స్కూల్ వద్దకు వెళ్లి ఇద్దరు పిల్లలను తీసుకొని వెళ్లిపోయింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన వెంకటేశ్ ఫోన్ చేయగా స్వీచాఫ్ వచ్చింది. ఇంటి వద్ద వచ్చి చూడగా ఇంటికి తాళం ఉంది. చుట్టు పక్కల వారిని, బంధు, మిత్రులు, స్థానికంగా వాకబు చేయగా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో శుక్రవారం రాత్రి రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కార్తీక దీపోత్సవం
ఇబ్రహీంపట్నం: కార్తీక మాసం శ్రావణ నక్షత్రాన్ని పురస్కరించుకొని గురువారం పట్నంలోని భవాని నాగలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాయంత్రం దీపోత్సవం నిర్వహించారు. శివలింగం, స్వస్తిక్, ప్రమిదల రూపాలను పూలతో అలంకరించి, అఖండ దీపాన్ని, ప్రమీదల్లోని దీపాలను భక్తులు భక్తి శ్రద్ధలతో వెలిగించారు. ఉసిరిక, మట్టి దీపాన్ని, వస్త్ర దానాలు శ్రావణ నక్షత్రం రోజు చేస్తే కోటి సోమవారాల వ్రత ఫలితం దక్కుతుందన్న విశ్వాసం భక్తుల్లో ఉంది.శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు చేసి, దీపాలను ఆలయంలోని అయ్యగారికి దానం చేశారు. -
విద్యార్థుల జీవితాలతో ఆటలొద్దు
● బోధన రుసం బకాయి చెల్లించండి ● విద్యార్థి సంఘం నాయకుల డిమాండ్ ● ఎస్ఎఫ్ఐ కళాశాల బంద్ విజయవంతం ఇబ్రహీంపట్నం: ఉపకార వేతనం, బోధన రుసం బకాయి చెల్లించకుండా పాలకులు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు బోడ వంశీ, మండల అధ్యక్షుడు శ్రీకాంత్ విమర్శించారు. ఎస్ఎఫ్ఐ పిలుపు మేరకు ఇంటర్, డిగ్రీ, పారా మెడికల్, ఇంజినీరింగ్, లా కళాశాలలను ఆ సంఘం ఆధ్వర్యంలో పట్నంలో గురువారం బంద్ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్ల స్కాలర్షిప్, ఫీజురీయింబర్స్ మెంట్ బిల్లులుపెండింగ్ పెడితే.. అధికారంలో ఉన్న కాంగ్రెస్..రెండేళ్లుగా వాటి ఊసేత్తడం లేదని ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన తప్పే.. రేవంత్ సర్కార్ చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికై నా స్పందించి, పేరుకుపోయిన సుమారు రూ.8,500 కోట్లనువెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా స్థానిక గురునానక్ ఇంజినీరింగ్కళాశాల వద్ద, విద్యార్థి సంఘం నేతలను లోపటికి రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో వారు గేట్ దూకి వెళ్లి, కళాశాలను బంద్ చేయించారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఎఫ్ నేతలు రామ్ చరణ్, అజయ్, జశ్వంత్, సాయిరాం, సిద్దు, ప్రశాంత్, వినయ్, మనీలు పాల్గొన్నారు. -
విరుల తోట.. సిరుల పంట
షాబాద్: ఉన్న కొద్దిపాటి పొలంలో తక్కువ నీటితో ఎక్కువ లాభాలు పొందేందుకు రైతులు పూల సాగుపై దృష్టి సారించారు. సీజన్లలో చామంతి, బంతి, జర్మన్, గులాబీ తదితర వారికి డిమాండ్ ఉండడంతో విరులు విరబూయిస్తూ.. వారింట సిరుల పంట పండించుకొంటున్నారు. సంప్రదాయ పంటలను వదిలి.. సంప్రదాయ పంటలను వదిలి ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో రైతులు చాలా మంది వివిధ రకాల పూల తోటల సాగుపై మొగ్గు చూపుతున్నారు. షాబాద్ మండలం ఏట్ల ఎర్రవల్లి, మాచన్పల్లి, హైతాబాద్, మద్దూరు, సోలీపేట్, నాంధార్ఖాన్పేట్ తదితర గ్రామాల్లో సాగు చేస్తున్నారు. శివస్వాములు, హనుమాన్, అయ్యప్ప భక్తులు పూజలకు, పెళ్లిళ్ల సీజన్లు, పండుగల సమయాల్లో పూల వినియోగం అధికంగా ఉంటుంది. దీంతో కాలానికి అనుగుణంగా లాభదాయకంగా ఉండే పుష్పాలను పండిస్తున్నామని రైతులు పేర్కొంటున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందుతున్నామని తెలిపారు. సీజన్లో మంచి ధర సర్దార్నగర్ గ్రామానికి చెందిన దాదె రాజు, స్వప్న దంపతులు పూల సాగులో ఆదర్శంగా నిలుస్తున్నారు. మూడు ఎకరాల్లో గులాబీ, చామంతి, బంతిని సాగు చేస్తూ లాభాలు అర్జిస్తున్నారు. అంతిరెడ్డిగూడలో రైతు గడ్డం రాజు.. ఎకరా భూమిలో గులాబీ తోట విరబూయిస్తున్నారు. నగరంలోని పూల మార్కెట్లకు తరలించి, విక్రయిస్తున్నారు. కిలో పూలకు రూ.300 నుంచి రూ.400 వరకు ధర పలుకుతోందని చెబుతున్నారు. వివాహాలు, పేరంటాలకు పరిసర ప్రాంతాల ప్రజలు.. తోట వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. పెట్టుబడి తక్కువ.. ఎకరా పొలంలో ఏటా గులాబీ, బంతి, చామంతిని సాగు చేస్తూ అధిక లాభాలు పొందుతున్నాం. వివాహాలు, పూజ కార్యక్రమాలు, పండుగల సమయాల్లో గిరాకీ బాగా ఉంటుంది. చామంతి పూలను నగరంలోని గుడిమల్కాపూర్ పూల మార్కెట్కు తరలించి విక్రయిస్తున్నాం. తక్కువ పెట్టుబడితో అధికంగా లాభాలు పొందుతున్నాం. – దాదె రాజు, రైతు, సర్దార్నగర్ పూల సాగు.. ఆదాయం బాగు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సీజన్లో పూలకు డిమాండ్ పూ తోటలతో ఆదర్శంగా నిలుస్తున్న రైతులు -
బీసీ బిల్లును కేంద్రం ఆమోదించాలి
షాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిపంపిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును..కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలనికాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి పామెన భీంభరత్ డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల సాధన కోసం మండల కేంద్రంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష గురువారంతో 19వ రోజుకుచేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీసీ బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి, రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. రిజర్వేషన్ల అమలుపై కేంద్రం రాజకీయ ఆటలు ఆడుతోందని, సామాజిక న్యాయం కోసం, పేద, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి అవసరమైన బిల్లును అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన బిల్లును పార్లమెంట్లో చట్టం చేయాలని కోరారు. కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్కుమార్, వీరశైవ లింగాయత్ సంఘం మండల నాయకులు మల్లికార్జున్, నవీన్, యాదగిరి, రాజేష్, పరిషవేది, బాబు, బీసీ రిజర్వేషన్ సాధన సమితి సభ్యులు రాజేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి భీంభరత్ -
ఔటర్పై ‘నో పార్కింగ్’
● ఐఆర్బీ గోల్కొండ ఎక్స్ప్రెస్వే ప్రచారం ● రహదారి భద్రతపై అవగాహన ● జీరో డెత్ కారిడార్ లక్ష్యంగా కార్యక్రమాలు సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగురోడ్డుపై ప్రమాదాలను అరికట్టేందుకు ఐఆర్బీ ‘గోల్కొండ ఎక్స్ప్రెస్వే’ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘ఓఆర్ఆర్పై నో పార్కింగ్’ అనే ప్రచారం చేపట్టింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), ట్రాఫిక్ పోలీసులు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్)తో కలిసి నెల రోజుల ప్రచారం కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ‘ఓఆర్ఆర్పై పార్కింగ్ సురక్షితం కాదు’ అనే కీలకమైన సందేశాన్ని అందరికీ చేరవేయడం ఈ ప్రచారం లక్ష్యం. హైస్పీడ్ కారిడార్ మీద అక్రమంగా వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని వాహనదారులకు అవగాహన కల్పించేందుకే దీన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ● 158 కిలోమీటర్ల పొడవున్న ఓఆర్ఆర్పై గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ఎలాంటి ఆటంకం లేకుండా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో కొన్నిచోట్ల వాహనాలను పార్కింగ్ చేయడంతో తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలావరకు లారీలు, ట్రక్కులను ఇలా పార్క్ చేయడంతో ఇవి వేగంగా వచ్చే వాహనదారులకు ప్రమాదకరంగా మారుతున్నట్లు గుర్తించారు. ప్రమాదాన్ని సూచించే లైట్లు లేదా రిఫ్లెక్టివ్ వార్నింగ్ పరికరాలు ఏవీ లేకుండానే ఇలా అక్రమంగా భారీ వాహనాలను పార్కింగ్ చేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని భద్రతాధికారులు, నిపుణులు హెచ్చరించారు ఇది పార్కింగ్ జోన్ కాదు.. హెచ్జీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తూ.. ఔటర్ రింగురోడ్డుపై వాహనాలు వేగంగా వెళ్లడానికే.. పార్కింగ్ కోసం కాదన్నారు. ఐఆర్బీ గోల్కొండ ఎక్స్ప్రెస్ వే డైరెక్టర్ మాట్లాడుతూ.. ఓఆర్ఆర్ అంతర్జాతీయ మొబిలిటీ కారిడార్ అని, అది హైదరాబాద్ వృద్ధి, సామర్థ్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు. నెలరోజుల పాటు నిర్వహించే ఈ ప్రచారంలో ఐఆర్బీ గోల్కొండ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్, దాని భాగస్వా ములు కలిసి క్షేత్రస్థాయిలో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు, డిజిటల్ ప్రచారాలు, వాణిజ్య డ్రైవర్లతో, లాజిస్టిక్ సంస్థల నిర్వాహకులు, ప్రైవేటు వాహనాల యజమానులతో సెషన్లు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. -
పెళ్లికి వెళ్లేలా.. వారధికి మరమ్మతు!
ధారూరు: మండల పరిధిలోని రుద్రారం– నాగసమందర్ మధ్య ఉన్న వంతెన.. కోట్పల్లి ప్రాజెక్టు అలుగు నీటి ప్రవాహంతో గురువారం తెల్లవారుజామున ధ్వంసమైంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలోని పలు మండలాలతో పాటు కర్ణాటకలోని కుంచారం వెళ్లేందుకు ఇదొక్కటే దారి. మరో రూట్లో వెళ్లాలంటే 30 కిలోమీటర్లకుపైగా అదనంగా తిరగాల్సిందే. ఇదిలా ఉండగా నాగసమందర్ గ్రామానికి చెందిన కుమ్మరి వీరేశం తన కూతురు వివాహాన్ని శుక్రవారం వికారాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు బంధువులందరూ ఈ మార్గంలోనే వేడుకకు వెళ్లాల్సి ఉంది. దెబ్బతిన్న వంతెనను అధికారులు బాగుచేయిస్తారని అంతా భావించారు. కానీ ఎవరూ అటువైపు రాకపోవడంతో పెళ్లి కూతురు తండ్రి వీరేశం తన సొంత డబ్బులతో వంతెనపై మట్టి వేయించి, జేసీబీతో చదను చేయించారు. దీంతో సాయంత్రం వేళ రాకపోకలు ప్రారంభమయ్యాయి. -
అమరుల త్యాగాలు మరువలేనివి
ఇబ్రహీంపట్నం: పోలీసు అమరవీరుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు చేపట్టాలని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా గురువారం ఇబ్రహీంపట్నంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమరుల త్యాగాలు ఎన్నటికీ మరువలేమని.. వారిచ్చిన స్ఫూర్తితో ప్రజలకు రక్షణగా, అండగా పోలీసులు సేవలందించాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ కేపీవీ రాజు, సీఐ మహేందర్రెడ్డి, ఎస్ఐలు నాగరాజు, రామకృష్ణ, ఆదిబట్ల, ఫార్మాసిటీ, యాచారం, మంచాల, మాడ్గుల పోలీస్స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. మహేశ్వరంలో మెగా రక్తదాన శిబిరం మహేశ్వరం: పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి అని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని శివగంగ రాజరాజేశ్వర ఆలయ ప్రాంగణంలో గురువారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదానం చేసిన యువకులు, కార్మికులు, పోలీసులకు ఆమె పండ్లు పంపిణీ చేసి అభినందించారు. వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి, మహేశ్వరం, కందుకూరు, పహాడిషరీఫ్, బాలాపూర్ సీఐలు వెంకటేశ్వర్లు, సీతారాం, రాఘవేందర్రెడ్డి, సుధాకర్, ఎస్ఐలు ప్రసాద్, రాఘవేందర్ రావు, ధనుంజయ్, మహేశ్వరం ప్రభుత్వ వైద్యాధికారి డా.అమీర్ సిద్దీఖీ పాల్గొన్నారు. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి -
లక్కీభాస్కర్లకు గాలం!
శేరిలింగంపల్లికి చెందిన ఓ మద్యం వ్యాపారి ఎప్పటిలాగే ఈసారి కూడా వేర్వేరు క్లస్టర్లలోని పది మద్యం దుకాణాలకు టెండర్లు వేశాడు. లక్కీడ్రాలో ఆయనకు ఒక్కషాపు కూడా దక్కలేదు. పదేళ్లుగా ఇదే వ్యాపారంలో ఉండడం.. వేరే వ్యాపారంలోకి వెళ్లేందుకు ఇష్టం లేకపోవడంతో ఎలాగైనా ఏదో ఒక షాపును చేజిక్కించుకోవాలని భావించాడు. మద్యం వ్యాపారంలో ఇప్పటి వరకు ఎలాంటి అనుభవం లేకపోయినా లక్కీడ్రాలో షాపును దక్కించుకున్న వ్యక్తికి ఏటా రూ.కోటి ఆఫర్ చేయడంతో పాటు దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలతో పాటు గుడ్విల్ చెల్లింపులకు సిద్ధమయ్యాడు. ఇందుకు నిరాకరించిన సదరు లక్కీభాస్కర్పై స్థానికంగా ఉన్న ఓ కీలకనేత ద్వారా బెదిరింపులకు దిగాడు. చేసేది లేక చివరికి అతను సిండికేట్కు తలొంచాల్సి వచ్చింది. సికింద్రాబాద్కు చెందిన ఓ మద్యం వ్యాపారి పలువురి పేరున జాతకం చూపించి మరీ టెండర్లు దాఖలు చేశాడు. ఫీజుల రూపంలో రూ.కోటి వరకు ఖర్చు చేశాడు. అదృష్టానికి బదులు.. ఈసారి దురదృష్టం వెంటాడింది. లక్కీడ్రాలో ఒక్క షాపు కూడా దక్కలేదు. లాటరీలో మద్యం షాపును దక్కించుకున్న ఓ వ్యక్తిని కలిశాడు. షాపులో అంత ఆదాయం వచ్చే అవకాశం లేకపోయినా కేవలం వ్యాపారానికి దూరంగా ఉండలేక లక్కీభాస్కర్ పెట్టిన డిమాండ్లకు అంగీకరించాడు. సాక్షి, రంగారెడ్డి జిల్లా: లక్కీ డ్రాలో వైన్షాపులు దక్కించుకున్నవారి నుంచి ఆయా షాపులను సొంతం చేసుకునేందుకు సిండికేట్ వ్యాపారులు రంగంలోకి దిగారు. ఈ వ్యాపారంలో కనీస అనుభవం లేని, తొలిసారిగా టెండర్లలో పాల్గొన్న లక్కీ భాస్కర్లను లక్ష్యం చేసుకుంటున్నారు. వారికి పలు ఆఫర్లు సైతం ఇస్తున్నారు. ఏడాదికి రూ.కోటి సహా దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలతో పాటు రెండేళ్లు గుడ్విల్ చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. ఇచ్చేందుకు నిరాకరిస్తున్న వాళ్లకు ఈ సిండికేట్ల నుంచి ఒత్తిడి మొదలైంది. ఆఫర్లకు తలొగ్గని వారికి తప్పని ఒత్తిళ్లు హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సరూర్నగర్, శంషాబాద్, వికారాబాద్ ఎకై ్సజ్ డివిజన్ల పరిధిలో 693 మద్యం షాపులకు టెండర్లు పిలువగా మొత్తం 36,266 మంది పోటీ పడ్డారు. టెండర్లు దాఖలు చేసిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. అత్యధిక దరఖాస్తులు సరూర్నగర్, శంషాబాద్ ఎకై ్సజ్ డివిజన్ల నుంచే వచ్చాయి. ఇప్పటికే ఈ లిక్కర్ వ్యాపారంలో అనుభవం ఉన్న వాళ్లు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ అదృష్టం వరించకపోవడంతో ఇతరులపై ఆధారపడాల్సి వచ్చింది. కొత్తగా షాపులు దక్కించుకున్న వాళ్లను గుర్తించి పలు ఆఫర్లు ఇస్తున్నారు. అయినా ఇచ్చేందుకు నిరాకరించిన వాళ్లకు స్థానిక నేతలు, రాజ కీయ అనుచరుల నుంచి ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. చేసేది లేక కొంత మంది లొంగిపోతుండగా, మరికొంత మంది వేచి చూసే ధోరణిలో ఉన్నారు. అంతర్గతంగా ఇంత జరుగుతున్నా.. ఆయా ఎకై ్సజ్ డివిజన్ల అధికారులు మాత్రం తమకేమీ తెలియదన్నట్లుగా వ్యవహరిస్తుండడం కొసమెరుపు. మరోవైపు దుకాణాలు దక్కించుకున్న వాళ్లకు షాపింగ్ కాంప్లెక్స్ల యజమానులు చుక్కలు చూపిస్తున్నారు. అప్పటి వరకు రూ.10 వేల లోపే ఉన్న నెలవారీ అద్దెలను అమాంతం పెంచేస్తున్నారు. మద్యం షాపులు దక్కించుకున్న వారితో భేరసారాలు ఒక్కో దుకాణానికి భారీ మొత్తంలో ఆఫర్ అప్లికేషన్ ఫీజు సహా గుడ్విల్ ఇచ్చేందుకు అంగీకారం ఒప్పుకోని వాళ్లపై పలుకుబడితో ఒత్తిళ్లు -
స్కాలర్షిప్ విడుదల చేయాలి
అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వికారాబాద్లో కళాశాలల బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు ఎస్ఎఫ్ఐ నాయకులను అరెస్టు చేశారు. అనంతరం అక్బర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యా సంస్థల యాజమాన్యాలు ధ్రువపత్రాలు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో రూ.8,150 కోట్ల దాకా పెండింగ్లో ఉన్నాయన్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖను పట్టించుకోని ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. పోలీసుల అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు తేజ, రాకేష్, సిద్దు, రెహాన్, జునేద్, అఖిల్, రాజు, ఇస్మాయిల్, దీపక్, చందు పాల్గొన్నారు. ఇబ్బందుల్లో విద్యార్థులు పరిగి: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా నేత అనిల్ అన్నారు. గురువారం ఎస్ఎఫ్ఐ పిలుపు మేరకు పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని కళాశాల బంద్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభు త్వం విద్యార్థులకు స్కాలర్షిప్లను విడుదల చేయ కపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రన్నారు. కార్యక్రమంలో నాయకులు శివ, అరుణ్, రియాజ్, రేహాన్, ఇర్ఫాన్, షాహిద్ పాల్గొన్నారు. -
ఫోం పరిశ్రమలో అగ్నిప్రమాదం
షాద్నగర్రూరల్: ఫోం పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. ఈ సంఘటన ఫరూఖ్నగర్ మండల పరిధి చెల్కచిల్కమర్రి గ్రామశివారులోని ఓ పరిశ్రమలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. న్యూఎర్త్ పాలీఫోం పరిశ్రమలో సుమారు 40 మంది కార్మికులు పని చేస్తున్నారు. ప్లాస్టిక్ను రీ సైక్లింగ్ చేసి, ఫోం తయారు చేస్తున్న ఆర్పీపీ యంత్రంవద్ద అభిషేక్, లాలుబాబులు పనిచేస్తుండగా.. అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఎలాంటి రక్షణ పరికరాలు లేకపోవడంతో ఇద్దరికి గాయాలు అయ్యా యి. తోటి కార్మికులు వీరిని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యంకోసం శంషాబాద్కు తీసుకెళ్లారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలికి చేరుకొని ఫైరింజన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పరిశ్రమలో పక్క గోదాంలో నిల్వ ఉంచిన ఫోం మెటీరియల్కు మంటలు వ్యాపించలేదు. నిప్పు అంటుకొని ఉంటే భారీ ప్రమాదం జరిగి, ప్రాణనష్టం జరిగే అవకాశం ఉండేది. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ ప్రమాద విషయం తెలుసుకున్న ఏసీపీ లక్ష్మీనారాయణ.. పట్టణ సీఐ విజయ్కుమార్, సిబ్బందితో కలిసి పరిశ్రమను పరిశీలించారు. ప్రమాదానికిగల కారణాలను తెలుసుకున్నారు. ఎంతమంది కార్మికులు పని చేస్తున్నారు, ప్రమాదంలో గాయపడిన వారి వివరాలను సేకరించారు. సేఫ్టీ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని యాజమాన్యానికి సూచించారు. ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు -
ముష్కి చెరువులో ఆక్రమణలు తొలగిస్తాం
హైడ్రా కమిషనర్ రంగనాథ్ మణికొండ: నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల సరిహద్దులోని ముష్కి చెరువులోని ఆక్రమణలను తొలగిస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. గురువారం ఆయన కార్యాలయంలో చెరువు సమీప ప్రాంతాల నివాసితులు, రైతులు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెరువు పరిరక్షణకు పోరాటం చేస్తున్న నివాసితుల ప్రతినిధి గౌతంరెడ్డి కథనం ప్రకారం.. వారం రోజుల్లో చెరువును పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారన్నారు. ఫుల్ ట్యాంక్ లెవల్ పరిధిలో పట్టా భూములు ఉంటే పరిహారం ఇచ్చి వాటిని స్వాధీనం చేసు కుని చెరువును రికార్డుల ప్రకారం 60 ఎకరాలలో పునరుద్ధరిస్తామన్నారు. అనంతరం చెరువును సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చిన తత్త్వ ఆర్గనైజేషన్ వారికి అప్పగిస్తామని, వారు అభివృద్ధి పనులు చేపడతారన్నారు. అంతలోపు చెరువు కట్ట అభివృద్ధి పనులను చేపట్టాలని వారికి కమిషనర్ సూచించారన్నారు. రైతులతో పాటు పక్కనే ఉన్న సంకట హర హనుమాన్ దేవాలయ భూములకు హద్దులు నిర్ణయిస్తామన్నారు. -
‘పార్ట్టైమ్’ పాఠాలు!
హుడాకాంప్లెక్స్: చారిత్రక విక్టోరియా మెమోరియల్ స్కూల్ (వీఎం హోమ్) విద్యార్థులను ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అర్హత, అనుభవం ఉన్న రెగ్యులర్ టీచర్లను నియమించకపోవడంతో పార్ట్టైమ్ ఉద్యోగులతో నెట్టుకొస్తున్నారు. పదో తరగతి పరీక్షల్లో పలువురు విద్యార్థులు ఫెయిల్ అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా విద్యాశాఖ నుంచి డిప్యూటేషన్పై సబ్జెక్టు నిపుణులను ఇక్కడికి పంపే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదు. హోమ్ నిర్వాహకుల తీరుతో విద్యార్థులు నష్టపోవాల్సి వస్తోంది. 750 మంది విద్యార్థులు తల్లిదండ్రులు లేని అనాథలకు వీఎం హోం పెద్ద దిక్కుగా నిలుస్తోంది. 120 ఏళ్ల చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో ప్రస్తుతం 750 మందికిపైగా విద్యార్థులు వివిధ తరగతుల్లో విద్యాభ్యాసం సాగిస్తున్నారు. సాంఘీక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ పాఠశాలలో ఏళ్లుగా నియామకాలు చేపట్టలేదు. విధిలేని పరిస్థితుల్లో నిర్వాహకులు పార్ట్టైం ప్రాతిపదికన నియామకాలు చేపట్టి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. ప్రతి 40 మందికి ఒక రెగ్యులర్ ఉపాధ్యాయుడు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం ప్రిన్సిపాల్ సహా మరో ఇద్దరే ఉన్నారు. మిగిలిన వారంతా పార్ట్టైం కింద వచ్చిన వారే. పర్యవేక్షణ లేకపోవడంతో.. పాలకమండళ్లు మారిన ప్రతీసారి ఎవరికి నచ్చిన వాళ్లను వారు పార్ట్టైం టీచర్లుగా నియమించుకుంటూ పోతున్నారు. అనుభవం, అర్హతను పరిగణలోకి తీసుకోకపోవడంతో వారు చెప్పే పా ఠ్యాంశాలు పిల్లలకు అర్థంకాని పరిస్థితి నెలకొంది. డీఎస్సీ ద్వారా ఎంపికై విద్యాశాఖ పరిధిలో పని చేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులను ఇంటర్నల్ డిప్యూటేషన్పై రప్పించుకునే అవకాశం ఉన్నా అటువైపు దృష్టి సారించడం లేదు. పాఠశాలలోనే కాదు వసతి గృహంలోనూ రెగ్యులర్ ఉద్యోగులు ఒక్కరు కూడా లేరు. పిల్లలపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో తరచూ పారిపోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ వేసవి విడిది కోసం సరూర్నగర్లోని 70 ఎకరాల విస్తీర్ణంలో విశ్రాంత భవనం నిర్మించారు. దక్కన్శైలిలో 420 అడుగుల పొడవు, 285 అడుగుల వెడల్పు, 32 అడుగుల ఎత్తు, రెండు అంతస్తుల్లో నిర్మించారు. బ్రిటీష్ రాణి విక్టోరియా మరణం (1901) తర్వాత ఆమె స్మృత్యార్థం దీన్ని అనాథ బాలల ఆశ్రమంగా మార్చారు. 1905 ఫిబ్రవరి 14న ప్రారంభించారు. వరంగల్ నుంచి 54 మంది అనాథలను ఇక్కడికి తరలించారు. 1953లో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దీన్ని సందర్శించి, అప్పటి వరకు వాడుకలో ఉన్న ‘ఆర్పరేజ్’ అనే పదాన్ని తొలగించి హోమ్గా మార్చారు. 2017లో రాచకొండ పోలీసు కమిషనరేట్కు ఇక్కడ కొంత భూమిని కేటాయించగా, పూర్వ విద్యార్థుల ఆందోళనతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 120 సంవత్సరాల చారిత్రక భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. వీఎం హోమ్లో ఉపాధ్యాయుల కొరత తాత్కాలిక ఉద్యోగులతో పాఠ్యాంశాల బోధన అయోమయంలో విద్యార్థుల భవిత పట్టించుకోని సంక్షేమశాఖ -
సీఎంకు పౌల్ట్రీ రైతుల కృతజ్ఞతలు
షాద్నగర్: ప్రభుత్వం పౌల్ట్రీ రైతుల ఆస్తి పన్ను బకాయిలను రద్దు చేయడంతో బుధవారం వారు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. షాద్నగర్కు చెందిన పలువురు పౌల్ట్రీ రైతులు హైదరాబాద్లోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పౌల్ట్రీ రైతులు వెంకట్రావు, వసంతరావు, మల్లేశ్వర్రావు, శ్రీనివాసరావు, సాంబశివరావు, సురేశ్ పాల్గొన్నారు. ఆమనగల్లు: ధ్యానంతో మానసిక ఒత్తిడి తగ్గించుకుని ఆనందమయ జీవితం గడపవచ్చని హార్ట్ఫుల్నెస్ సంస్థ, శ్రీరామచంద్ర మిషన్ శిక్షకులు నాగరాజు, విజయతులసి, సంధ్యారాణి, సుందరి, సత్యనారాయణ అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణ లో బుధవారం ప్రభుత్వశాఖల అధికారులు, సిబ్బందికి ధ్యానంపై ఉచిత శిక్షణ అందించా రు. ఈ సందర్భంగా శిక్షకులు మాట్లాడుతూ.. ధ్యానంతో సంపూర్ణజీవితం ఆనందంగా గడపవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా శారీరక, మానసిక ఒత్తిడి జయించడానికి చేయాల్సిన ధ్యాన పద్ధతులను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కుసుమ మాధురి, పీఆర్ డీఈఈ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శంకర్, ఎస్ఐ వెంకటేశ్, ఎంపీఓ వినోద, ఏఈ లు అభిషేక్, శాలిని తదితరులు పాల్గొన్నారు. పశుసంవర్ధక శాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ సుభాశ్ మొయినాబాద్: ప్రతీ పశువుకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా తప్పక వేయాలని పశుసంవర్ధక శాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ సుభాశ్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని హిమాయత్నగర్లో బుధవారం చేపట్టిన గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని ఆయన ఆకస్మి కంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల వద్ద ఉన్న ప్రతీ పశువును గుర్తించి వాటికి ముందు జాగ్రత్త చర్యగా టీకా వేయాలన్నారు. రైతులకు అవగాహన కల్పించాలని పశువైద్య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి అహ్మద్, సిబ్బంది ప్రసన్నకుమార్, భీంరావ్, గోరేమియా తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం రూరల్: తన కూతురు వివాహ వేడుకకు హాజరైన బంధువులు, అతిథులకు రాజ్యాంగం పుస్తకాలను రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారు ఓ న్యాయవాది. వివరాలు ఇలా ఉన్నాయి.. నల్గొండ జిల్లా సూర్యపేట ప్రాంతం, పణిగిరికి చెందిన విశాఖ మాధవ కృష్ణారెడ్డి హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తూ హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. బుధవారం తన కూతురు ఆశృతరెడ్డి వివాహాన్ని కొంగరకలాన్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. న్యాయవాద వృత్తిపై ఉన్న మమకారంతో పాటు భారత రాజ్యాంగంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వెయ్యిమందికిపైగా.. 408 పేజీలతో ఉన్న పుస్తకాలను అందజేశారు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కంచె అయిలయ్య తదితరులు రిటర్న్ గిఫ్ట్లు తీసుకుని, వకీల్సాబ్ ఆలోచనను అభినందించారు. -
మోంథా.. మోత
ఏకధాటి వర్షానికి అంతా అతలాకుతలం సాక్షి, రంగారెడ్డిజిల్లా: అకాల వర్షం అన్నదాతను అతలాకుతలం చేసింది. రోజంతా ఏకధాటిగా కురిసిన మోంథా తుఫాన్ ఉమ్మడి జిల్లా రైతులకు తీరని నష్టాలను మిగిల్చింది. చేతికి అందివస్తుందనుకున్న పత్తి చేనులోనే తడిసి ముద్దయింది. వ్యవసాయ మార్కెట్లు, ఐకేపీ కేంద్రాల్లో ఇప్పటికే రాశులుగా పోసిన ధాన్యంపై టార్పలిన్లు లేక వర్షానికి తడిసిపోయాయి. పలు చోట్ల వరదకు ధాన్యం కొట్టుకుపోయింది. టమోటా, ఆకు కూరలు సహా ఇతర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నల్లరేగడి, ఎర్ర నేలల్లోనూ భారీగా వర్షపు నీరు నిల్వ ఉండడం, మోకాల్లోతు దిగబడుతుండడం వల్ల రైతులు, కూలీలు పంట పొలాల్లో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి తలెత్తింది. ఫలితంగా బంతి, చామంతి, గులాబీ పూలు సహా బెండ, దొండ, కాకర, బీర, దోస ఇతర తీగజాతి పంటలను కోసి మార్కెట్కు తరలించలేని దుస్థితి. కొందుర్గు, ఫరూఖ్నగర్, కేశంపేట, ఆమనగల్లు, కడ్తాల్, యాచారం, మంచాల, చేవెళ్ల, షాబాద్, మెయినాబాద్ మండలాల్లోని రైతులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. మూసీ, ఈసీ వాగులు సహా పలు చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి. ఉస్మాన్సాగర్కు ఎగువ నుంచి 2,500 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా 1,867 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. హిమాయత్సాగర్కు ఎగువ నుంచి 2,500 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా 3,963 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. దెబ్బతిన్న రోడ్లు.. ఎక్కడిక్కడే ట్రాఫిక్ జాం ఏళ్లుగా రోడ్లకు మరమ్మతులు నిర్వహించకపోవడంలోతట్టు ప్రాంతాల్లోని రోడ్లపైకి భారీగా వరద వచ్చి చేరడం, భారీ వాహనాల రాకపోకల సమయంలో ఆయా రోడ్లు దెబ్బతిన్నాయి. అబ్దుల్లాపూర్మెట్ వద్ద విజయవాడ జాతీయ రహదారిపై భారీ గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఔటరు నుంచి ఇబ్రహీపట్నం మీదుగా నాగార్జునసాగర్కు వెళ్లే రోడ్డుపై అడుగుకో గుంత తేలికన్పిస్తోంది. శ్రీశైలం జాతీయ రహదారిపై సైతం ఇదే పరిస్థితి. శంషాబాద్ నుంచి షాద్నగర్ మీదుగా వెళ్లే బెంగళూరు జాతీయ రహదారి సహా అప్పా జంక్షన్ నుంచి బీజాపూర్ వెళ్లే జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. గ్రామీణ రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. గుంతల్లో వర్షపునీరు నిల్వ ఉండడం, వేగంగా వచ్చి ఆ గుంతల్లో గుద్దుకోవడంతో వాహనాల డిస్కులతో పాటు ఆయా వాహనాలపై ప్రయాణిస్తున్న వాళ్ల వెన్ను పూసలు కదిలిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండడం, రోడ్లపై వరదనీరు ప్రవహిస్తుండటంతో ఎల్బీనగర్–వనస్థలిపురం, చాంద్రాయణగుట్ట మీదుగా మెహిదీపట్నం వెళ్లే మార్గం సహా సైబరాబాద్ పరిధిలోని శేరిలింగంపల్లి, నానక్రాంగూడ, గండిపేట, మాదాపూర్, హైటెక్ సిటీ నుంచి జేఎన్టీయూ మార్గాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ద్విచక్ర వాహనదారులు గంటల తరబడి వర్షంలోనే తడిసి ముద్దవ్వాల్సి వచ్చింది. రోజూవారీ కూలీలు, తోపుడు బండ్ల వ్యాపారులు వర్షానికి ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. ఏకధాటి వర్షాలకు రైతులు, సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు మాత్రం ఇంటి గడపదాటి బయటికి రాకపోవడం గమనార్హం. అటు మబ్బులు.. ఇటు జబ్బులు ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకుని రోజంతా ధారలుగా వర్షం కురుస్తూనే ఉంది. ఇందుకు చలిగాలులు తోడయ్యాయి. వాతావరణంలో చోటు చేసుకున్న ఈ మార్పులను శరీరం అంత త్వరగా ఇముడ్చుకోలేక పోతోంది. దీనికి తోడు ఇళ్ల మధ్య రోజుల తరబడి మురుగు నిల్వ ఉండడం, వీధుల్లో ఎక్కడ చూసినా భారీగా చెత్త పేరుకుపోవడం, ఈగలు, దోమలు వ్యాప్తి చెందడం, పల్లెలతోపాటు శివారు మున్సిపాలిటీల్లోనూ పారిశుద్ధ్య లోపం తలెత్తి ఆయా ప్రాంతాల్లోని ప్రజలు త్వరగా అస్వస్థతకు గురవుతున్నారు. పేదలు, నిరక్ష్యరాస్యులు ఎక్కువగా నివసించే నందనవనం, ఎరుకల నాంచారమ్మ బస్తీ, తట్టి అన్నారం, కుంట్లూరు, బంజారాకాలనీ, నాదర్గుల్, కుర్మల్గూడ, లెనిన్నగర్, మిథానిబస్తీ, ఆర్సీఐ రోడ్కు అటు ఇటుగా వెలసిన పేదల బస్తీలు సహా, మల్లాపూర్, కాటేదాన్, జల్పల్లి, పహాడీషరీఫ్ తదితర ప్రాంతాల్లోని రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న నిరుపేదలు ఎక్కువగా అనారోగ్యాల పాలవుతున్నారు. ఇప్పటికే అనేక మంది దగ్గు, జలుబు, జ్వరంఒంటి నొప్పులతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. పల్లె దవాఖానాల్లో వైద్యులు లేక పోవడం, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో రోగుల నిష్పత్తి మేరకు మందులు, ఇతర మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇష్టం లేకపోయినా మెజార్టీ బాధితులు ప్రైవేట్ క్లినిక్లను ఆశ్రయిస్తున్నారు. రోగుల్లోని బలహీనతను ఆయా ఆస్పత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. సాధారణ జ్వరాలను సైతం డెంగీ జ్వరాల జాబితాలో చేర్చి, అత్యవసర సేవలు, ప్లేట్లెట్ చికిత్సల పేరుతో నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. తలకొండపల్లిలో 11.72 సెంటీమీటర్ల వర్షపాతం దెబ్బతిన్న పంటలు.. తడిసిన ధాన్యం వాతావరణ మార్పులతోమంచం పట్టిన పల్లెలు దగ్గు, జలుబు, జ్వరం, ఒల్లు నొప్పులతో ఆస్పత్రులకు క్యూ..మండలం వర్షపాతం (సెం.మీ.లలో) తలకొండపల్లి 11.72 ఆమనగల్లు 8.16 కేశంపేట 6.29 కొందుర్గు 5.71 మాడ్గుల 5.60 మహేశ్వరం 4.74 నందిగామ 4.62 కడ్తాల్ 4.41 -
యాచన వీడేలా.. యాతన తీరేలా!
షాద్నగర్: యాచకుల జీవనస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఖాళీ కడుపులతో వీధుల్లో తిరుగుతూ ఆకలి పోరాటం చేస్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించి, యాచకత్వాన్ని నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని తదనుగుణంగా సౌకర్యాలు కల్పించి అండగా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా యాచకుల వివరాలను మెప్మా సిబ్బంది సేకరిస్తున్నారు. ఎన్హెచ్ఆర్సీ ఆదేశల మేరకు.. జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చాలా మంది నిరుపేదలు భిక్షాటన చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వారు నిత్యం రోడ్లపై కనిపిస్తున్నారు. వారిని గుర్తించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నుంచి ఆదేశాలు జారీ కావడంలో మున్సిపల్ అధికారులు స్పందించారు. మెప్మా సిబ్బంది పట్టణాల్లో తిరుగుతూ యాచకులు ఉండే ప్రాంతాలను గుర్తించి వారి వివరాలు సేకరిస్తున్నారు. పేరు, ఊరు, కులం, గుర్తింపు కార్డు ఉందా, కుటుంబ సభ్యులు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఎక్కడ నివాసం ఉంటున్నారు, ఎంత కాలంగా భిక్షాటన చేస్తున్నారు, కారణాలు, కుటుంబంలో ఎంత మంది భిక్షాటన చేస్తున్నారు, ఎంత వస్తుంది. వచ్చిన డబ్బులు ఏం చేస్తారు, బ్యాంకు ఖాతా ఉందా, లేకపోతే డబ్బులు ఎక్కడ ఆదా చేస్తారు అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. ఏమైనా చదువుకున్నారా, ఏదైనా సమస్య వస్తే సాయం కోసం ఎవరిని ఆశ్రయిస్తున్నారు, చదువుపై ఆసక్తి ఉందా, నైపుణ్య శిక్ష ణ పొందేందుకు సిద్ధంగా ఉన్నారా, ప్రభుత్వం నుంచి ఏమి ఆశిస్తున్నారువివరాలు సేకరిస్తున్నారు. ఆరోగ్య సంరక్షణకు చర్యలు యాచకుల ఆకలి తీర్చేలా ప్రభుత్వం వారికి భరోసా కల్పించనుంది. కొందరు అనారోగ్యంతో ఏ ఆదరణ లేక అనాథలుగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో విగత జీవులుగా మారుతున్నారు. ఇలాంటి వారిని గుర్తించి ఆరోగ్య సంరక్షణకు చర్యలు చేపట్టనుంది. పిల్లలకు చదువు నేర్పించేందుకు.. భిక్షాటన చేసి జీవనం సాగించే వారి పిల్లల పరిస్థితి దయనీయంగా మారుతోంది. విద్యకు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల వెంట రోడ్లపై తిరుగుతున్నారు. ఇలాంటి చిన్నారులకు బంగారు భవిష్యత్ను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. చిన్నారులను గుర్తించి వారికి చదువు చెప్పించనున్నారు. ఇళ్లు లేని వారెందరు ఉన్నారో గుర్తిస్తున్నారు. అవసరమైతే వీరికి పట్టణాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. పునరావాస సౌకర్యాలు ● సర్వేలో గుర్తించిన యాచకుల వివరాలతో పాటు వారిని మ్యాపింగ్ చేయడం. ● భిక్షాటన చేసే వారికి భవిష్యత్లో పునరావాస సౌకర్యాలు కల్పించడం. ● ఆరోగ్య సమస్యలు గుర్తించి చికిత్స అందేలా వివరాలు సేకరించడం. ● 6–14 ఏళ్లలోపు బాలలు భిక్షాటన చేస్తున్నట్లు తేలితే తప్పనిసరిగా విద్యను అందించడం. ● రోడ్ల మీద యాచించకుండా స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు, ప్రైవేటు సెక్టార్లో నడిచే సంస్థల్లో చేర్పించడం. ● యాచకులకు అవగాహన కల్పిస్తూ భిక్షాటన చేయకుండా ఉపాధి, ఆర్థిక అవసరాలు కల్పించేలా చర్యలు తీసుకోవడం. యాచకత్వ నిర్మూలనకు ప్రభుత్వాల చర్యలు మున్సిపాలిటీల్లో యాచకుల గుర్తింపు వివరాలు సేకరిస్తున్న మెప్మా సిబ్బంది భరోసా కల్పించేలా ప్రణాళికలు -
ప్రజలు యూనిఫాం లేని పోలీసులు
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో రాచకొండ సీపీ సుధీర్బాబు హుడాకాంప్లెక్స్: విధుల్లో ఉన్న పోలీసులకు ప్రజలు సహకారం అందించాలని రాచకొండ సీపీ సుధీర్బాబు అన్నారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో బుధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 2వేల మంది విద్యార్థులు, కాలనీవాసులతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వారోత్సవాలకు సుద్దాల అశోక్తేజ, సీపీ సుధీర్బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సమాజంలో ప్రజలకు సేవలందించి అమరులైన పోలీసుల సేవలను గుర్తు చేసుకునేందుకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవవలు అందించడంలో రాచకొండ పోలీసుల సేవలు అభినందనీయమని అన్నారు. కమిషనరేట్ పరిధిలో డయల్ 100కు నిమిషానికి రెండు ఫోన్ కాల్స్ వస్తుంటాయని, ఏకకాలంలో పనిచేసి ప్రజలకు ఆరు విభాగాలుగా ఏర్పడి విజబుల్ పోలీసింగ్లో భాగంగా సేవలు అందిస్తూ ప్రజలకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. పిల్లలకు దూరంగా ఉండే సీనియర్ సిటిజన్స్కు వారి ఇంటింటికి వెళ్లి సహాయ సహకారం అందిస్తున్నామని, ఆపరేషన్ స్మైలీతో ప్రజలకు దగ్గర కావడం, మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. దేశంలో ఎన్బీడబ్ల్యూ ఫ్రీ కమిషనరేట్గా రాచకొండ కమిషనరేట్ నిలిచిందని సీపీ గుర్తుచేశారు. కార్యక్రమంలో డీసీపీలు పద్మజ, అనురాధ, ఆకాంక్షయాదవ్, డీసీపీ క్రైమ్స్ అరవింద్బాబు, డీసీపీ అడ్మిన్ ఇందిర, డీసీపీ ఉమెన్ సేఫ్టీ ఉషారాణి, సునీతారెడ్డి, రమణారెడ్డి, శ్రీనివాస్, శ్రీనివాసులు, నాగలక్ష్మి, మనోహర్, శ్యాంసుందర్, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ను బలోపేతం చేయాలి
చేవెళ్ల: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల వరకు బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని ఆమె నివాసంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పి.కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పి.ప్రభాకర్ ఆధ్వర్యంలో రావుపల్లికి చెందిన పీఏసీఎస్ ముడిమ్యాల డైరెక్టర్ కేసారం నరేందర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కటికె నర్సింగ్ రావు, మధు, లక్ష్మణ్కుమార్, బుర్ల మల్లేశ్ తదితరులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా సబితారెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్ధంగా ఉండాలని గ్రామాల్లో పార్టీ సత్తాను చాటేందుకు కృషి చేయాలని తెలిపారు. కొత్తగా పార్టీలోకి వస్తున్న వారిని ఆహ్వానించి కలిసిమెలిసి పార్టీకోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో విసుగొంది బీఆర్ఎస్లోకి వలస వస్తున్నారన్నారు. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ కారు దూసుకెళ్తుందన్నా రు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, సీనియర్ నాయకులు కరుణాకర్రెడ్డి, రాజు, పీఏసీఎస్ డైరెక్టర్ మాధవరెడ్డి, ముడిమ్యాల మాజీ సర్పంచ్ స్వర్ణలతదర్శన్, మాజీ ఉప సర్పంచ్లు శ్రీనివాస్, మాధవరెడ్డి, నాయకులు శ్రీనివాస్, మధుసుధన్గౌడ్, రాము, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి -
సీజనల్పై అప్రమత్తత అవసరం
షాద్నగర్ రూరల్: సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యులు, విద్యాశాఖ, ఐసీడీఎస్ అధికారులు విధిగా గ్రామాల్లో పాఠశాలలకు వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వసతి గృహాల్లో మరుగుదొడ్లు, కిటికీలు, డోర్లు లేకుంటే వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు. అధికారులు హాస్టళ్లు, పాఠశాలలకు తూతూ మంత్రంగా వెళ్లి రాకుండా సమస్యలను పూర్తి స్ధాయిలో గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించాలని అన్నారు. ప్రతీ నెల వైద్య పరీక్షలు నిర్వహించి అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులకు చికిత్సలు నిర్వహించాలని అన్నారు. మిషన్ భగీరథ నీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగిరం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వనమహోత్సం కార్యక్రమంలో ప్రతీ గ్రామంలో పదివేల మొక్కలు నాటాలని సూచించారు. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు, అంగన్వాడీ కేంద్రాల ద్వార పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. వ్యవసాయ పొలాల్లో నీటి నిల్వ గుంతలను ఏర్పాటు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఇళ్లలో ఇంకుగుంతలు ఏర్పాటు చేస్తే భూగర్భ జలాలు పెరిగి నీటి సమస్య తీరుతుందని అన్నారు. ఈ సమావేశంలో ప్రత్యేకాధికారి రామారావు, ఎంపీడీఓ బన్సీలాల్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, ఎంపీఓ జయంత్రెడ్డి, అధికారులు గోపాల్, నిషాంత్కుమార్, ఉదయ, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ -
విద్యాభివృద్ధిలో ప్రభుత్వం విఫలం
బీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్కుమార్ ఇబ్రహీంపట్నం రూరల్: విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.రాజ్కుమార్, కొనుకటి ప్రశాంత్ మండిపడ్డారు. హలో విద్యార్థి, చలో కలెక్టరేట్ కార్యక్రమంలో భాగంగా బుధవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. గేటు ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజ్కుమార్, ప్రశాంత్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు గడుస్తున్నా విద్యాశాఖకు మంత్రి లేకపోవడం సిగ్గు చేటన్నారు. విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించకుండా.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించకుండా ప్రజాపాలన ప్రభుత్వమని గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. విద్యా భరోసా కార్డు, నిరుద్యోగులకు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి, సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు హామీలు అమలయ్యే వరకు పోరాటం ఆపమన్నారు. జిల్లా కోఆర్డినేటర్లు పాండుగౌడ్, జగన్గౌడ్ పాల్గొన్నారు. -
క్రాప్లోన్ ఇప్పిస్తానని.. భూమి కాజేశాడు
ఆందోళన వ్యక్తం చేసిన బాధితులు పూడూరు: పంట రుణం ఇప్పిస్తానని చెప్పిన ఓ వ్యక్తి.. భూమినే కాజేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి కెరవెళ్లి గ్రామానికి చెందిన ఓ పార్టీ నాయకుడు, మాజీ సర్పంచ్ కరీం.. అదే గ్రామానికి చెందిన దంపతులు అనీస్ పాషా, మౌలానాబేగంలకు చెందిన సర్వే నంబర్ 116లోని ఎకరా 18 గుంటల భూమికి పంట రుణం ఇప్పిస్తానని నమ్మించాడు. ఆయనను నమ్మిన బాధితులు.. అతనితో పాటు ఈ నెల 25న పూడూరు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లారు. వారికి తెలియకుండా కరీం.. స్లాట్ బుక్ చేసి, భూమిని తన పేరిట మార్చుకున్నాడు. విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన బాధితులు.. గ్రామస్తులకు వివరించారు. అనంతరం వారందరూ.. కరీంను నిలదీశారు. రిజిస్ట్రేషన్ను రద్దు చేసి, బాధిత రైతు పేరిట మార్చాలని కోరుతూ.. తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. చన్గోముల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యప్తు చేస్తున్నామని ఎస్ఐ భరత్రెడ్డి తెలిపారు. భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి ● శిథిల నివాసాల్లో ఉండరాదు ● వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి ● పోలీసు అధికారులకు దిశానిర్దేశం అనంతగిరి: కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నారాయణ రెడ్డి అన్నారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో బుధవారం ఆయన మాట్లాడారు. తమ తమ పోలీస్ స్టేషన్ల పరిధి వాగులు, కుంటలు, చెరువుల నీటి ప్రవాహంపై నిరంతరం దృష్టి పెట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా.. రాకపోకలకు ఆటంకం కలిగించేలా పొంగిపొర్లుతున్న వాగులు, నాలాల ప్రాంతాల్లో రహదారులను మూసివేయాలని పేర్కొన్నారు. నీటి ప్రవాహం వద్దకు ప్ర జలు ఎవరూ వెళ్లకుండా తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. శిథిలావస్థ ఇళ్లల్లో నివాసం ఉండొద్దని, తక్షణమే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని కోరారు. ఎవరికై నా ఏదైనా అత్యవసరం ఉండి, పోలీస్ సహాయం అవసరమైతే, వెంటనే ఆయా ఠాణా అధికారులకు కానీ.. డయల్ 100 లేదా లేదా పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 8712670056కు ఫోన్ చేయాలని వివరించారు. ప్రజలందరూ సహకరించి, సురక్షితంగా ఉండాలని ఎస్పీ కోరారు. రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య తాండూరు రూరల్: రైలుకింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పెద్దేముల్ మండలం రుక్మాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. రుక్మాపూర్ గ్రామానికి చెందిన కొత్తింటి అనంతయ్య, భారతమ్మ దంపతుల కుమారుడు లక్ష్మణ్(28), తాండూరు పట్టణంలోని ఓ కంపెనీలో డెలివరి బాయ్గా పనిచేస్తూనే.. ఊర్లో వ్యవసాయం చేసేవాడు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు తాండూరు– రుక్మాపూర్ రైల్వే పట్టాలపై బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రేమ విఫలంకారణంగానే యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. -
సొంత ఆదాయ వనరులతోనే గ్రామాభివృద్ధి
సర్పంచ్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కడ్తాల్: పంచాయతీల అభివృద్ధి సొంత ఆదాయ వనరులపైనే ఆధారపడి ఉంటుందని సర్పంచ్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు. జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్శాఖ ఆధ్వర్యంలో బుధవారం రాజేంద్రనగర్లోని వికాస్ ఆడిటోరియంలో హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన ఆ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ రాజ్ చట్టం– 2018 ప్రకారం గ్రామాలకు సంబంధించిన అధికారాలు, వినియోగాల గురించి వివరించారు. పంచాయతీలు సొంత ఆదాయ వనరులు పెంపొందించుకునేందుకు ఇంటి, వినోదపు పన్ను, వారాంతపుసంత, వృత్తి వ్యాపార లైసెన్స్ మంజూరు ద్వారా వచ్చే ఆదాయం, పన్ను వసూలు, వివిధ ఆదాయ వనరుల గురించి పేర్కొన్నారు. తెలంగాణలో సర్పంచ్ల హయాంలో జరిగిన అభివృద్ధి పనులకు దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని, దానికి అనుగుణంగానే రాష్ట్రానికి జాతీయ స్థాయిలో అవార్డులు అందాయని గుర్తు చేశారు. గ్రామాల అభివృద్ధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పాటు, గ్రామపంచాయతీ పాలక వర్గం సమష్టికృషి, సొంత ఆదాయ వనరుల కూర్పు కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ దిలీప్ కుమార్పాల్, అంజన్కుమార్ బాంజియా, అన్నాదొరై, అజిత్ కుమార్, ఆశాలత, ఉపేందర్, రాజేందర్, విద్యులత తదితరులు పాల్గొన్నారు. -
ఆశలు ఆవిరి..
యాచారం: కురుస్తున్న వర్షాలతో తెల్లబంగారం నల్లబడుతోంది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో పత్తి ఏరలేని దుస్థితి నెలకొంది. దీంతో చేతికందొచ్చిన పంట నేలపాలవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట బాగా వచ్చిందని, మద్దతు ధర కూడా ఆశించిన మేర ఉందన్న ఆనందం కాస్త ఆవిరైందని వాపోతున్నారు. 1.40 లక్షల ఎకరాల్లో సాగు జిల్లాలో ఈ ఏడాది 60 వేలకు పైగా రైతులు.. 1.40 లక్షల ఎకరాలకు పైగా పత్తిని సాగు చేశారు. అత్యధికంగా మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్, యాచారం, కందుకూరు, మంచాల తదితర మండలాల్లో పండించారు. ఈ ఏడాది అదునులో వర్షాలు కురవక పోయినా.. పత్తి సాగుపై మక్కువ చూపారు. ఒక్కో రైతు 5 నుంచి 50 ఎకరాల్లో రూ. లక్షలు పెట్టుబడి పెట్టి బంగారం పండించారు.పంట బాగా పండిందని, మంచి లాభాలు పొందుదామనే సమయంలో అధిక వానలు పడి.. వారి పాలిట శాపంగా మారాయి. వేలాది ఎకరాల్లోపంట తీవ్రంగా దెబ్బతిన్నది. నష్టాన్ని మిగిల్చింది ఈ ఏడాది పత్తి ధర ఆకాశాన్నంటింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా క్వింటా ధర రూ.8 వేలకు పైగానే డిమాండ్ ఉంది. పంటకు పెద్దగా తెగుళ్లు సోకక పోవడం, పూత, కాత బాగా పండటంతో ఈ ఏడు బాగా కలిసి వచ్చిందని రైతులు మురిసిపోయారు. సిరుల పంట పండినట్లేనని భావించారు. కానీ.. వరుణుడు వారి ఆశలపై నీళ్లు చల్లాడు. పంట ఇంటికి వచ్చే సమయంలో కుండపోత వర్షాలు నేలపాలు చేశాయి. పత్తి చెట్లపైనే తడిసి, రంగుమారింది. మొలకెత్తడం తదితర కారణాలతో ధరలో భారీగా వ్యత్యాసం నెలకొందని ఆందోళన చెందుతున్నారు. లాభాలు వస్తాయని ఆశిస్తే.. నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. అడియాశ.. ఈ ఏడాది సీసీఐ కేంద్రాల్లోనే మద్దతు ధర బాగానే ఉంది. మరింత పెరుగుతుందనే ఆశతో చాలా మంది రైతులు.. చేను నుంచి తెచ్చిన దిగుబడిని ఇళ్లల్లోనే పెట్టుకుంటున్నారు. కానీ.. వారి ఆశలను కుండపోత వర్షాలు అడియాశలు చేశాయి. దిగుబడిని అమ్ముకోలేక, మిగతాపంటను ఏరలేక ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజులుగా మాడ్గుల, యాచారం, తలకొండపల్లి, మంచాల, ఆమనగల్లు మండలాల్లోని గ్రామాల్లో ఇదే దుస్థితి నెలకొంది. చేనులోనే తడిసిపోతోంది తీత సమయంలో వర్షాలు కురిశాయి. దీంతో పత్తి మొత్తం చెట్లపైనే ఉండిపోయింది. తడిసిపోతోంది. రూ.10 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టి, 38 ఎకరాల్లో సాగు చేశాను. కానీ.. ఎడతెరిపి లేని వానలు తీవ్ర నష్టం కలిగించాయి. పత్తి తడిస్తే బరువు, రంగులో తేడా వస్తుంది. తీసిన పత్తిని అమ్ముకోలేని దుస్థితి నెలకొంది. –నూనే మహేశ్, రైతు మాడ్గుల ఆదుకోవాలి ఎకరాకు పది క్వింటాళ్ల దిగుబడి వస్తే పెట్టుబడి దక్కుతుంది. ప్రస్తుత వానల కారణంగా ఎకరాకు 5 క్వింటాళ్లు వచ్చేలా లేదు. విత్తనం మొదలు.. పంట చేతికి వచ్చే వరకు ఎకరాకు రూ.25 వేలనుంచి 30 వరకు పెట్టుబడి అవుతుంది. ప్రస్తుత వర్షాలతో పత్తి తడిసిపోయింది. పెట్టుబడి వచ్చేలా లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి. – రమేష్కుమార్, రైతు, పూడూరు, వికారాబాద్ నల్లబడుతున్న తెల్ల బంగారం ఆందోళన చెందుతున్న రైతులు ధర ఉన్నా.. చేతికందని పంట -
కారును ఢీకొన్న డీసీఎం
ముగ్గురికి గాయాలు చేవెళ్ల: కారును డీసీఎం ఢీకొట్టిన ప్రమాదంలో.. ముగ్గురు త్రీవంగా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మున్సిపాలిటీ పరిధి ఊరేళ్లకు చెందిన బండ్ల శేఖర్.. తన స్విప్ట్ కారులో తల్లి చంద్రమ్మ, చెల్లెలు స్వప్న తో కలిసి వెళ్తున్నాడు. ఈ క్రమంలో చేవెళ్ల నుంచి శంకర్పల్లి వైపు వెళ్తున్న డీసీఎం.. దేవునిఎర్రవల్లి గేట్ వద్ద కారును ఢీకొంది. ఈ ఘటనలో కారు వెనకకు వెళ్లి గేట్ వద్ద ఉన్న కమాన్ పిల్లర్ను ఢీకొని ఆగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు గమనించి క్షతగాత్రులను చేవెళ్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితుడు శేఖర్ ఫిర్యాదుతోకేసు నమోదు చేసి, ఫిర్యాదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. తప్పిన ప్రమాదం బొంరాస్పేట: మండల పరిధి రేగడిమైలారం జాతీయ రహదారి 163పై హైదరాబాద్నుంచి కర్నాటక వైపు వెళ్తున్న ఓ లారీ బుధవారం ప్రమాదానికి గురైంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా.. రోడ్డు పక్కకు జారి లోయలో పడే క్రమంలో.. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. రహదారికి అడ్డంగా తిరిగి ఆగిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. చోరీ కేసులో బాలుడుజువైనల్కు తరలింపు.. దోమ: చోరీ కేసులో ఓ బాలుడిని జువైనల్ హోంకు తరలించారు. ఎస్ఐ వసంత్ జాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. బాస్పల్లి గ్రామానికి చెందిన మైనర్(17).. ఈ నెల 24న గ్రామంలోని మంత్రి శ్రీశైలం ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువా తాళాలు పగుళగొట్టి, రూ.1.80 లక్షలు అపహరించాడు. ఇంట్లో సామగ్రిచిందరవందరగా ఉండటాన్ని గమనించిన బాధితులు.. నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. అనంతరం బాలుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ.. ఈ నెల 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలున్ని అదుపులోకి తీసుకొని విచారించారు. నేరం అంగీకరించడంతో.. అతడి నుంచి రూ.98 వేలు రికవరీ చేశారు. అనంతరం బుధవారం జువైనల్ హోంకు తరలించారు. నిందితుడు గతంలో పలు ఇళ్లల్లో చోరీకి పాల్పడినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. -
కర్మాగారంలో కార్మికుడి మృతి
తాండూరు రూరల్: పనిచేస్తున్న సంస్థలో ఓ కార్మికుడి గుండెపోటుతో కుప్పకూలాడు. ఈ సంఘటన మండల పరిధి మల్కాపూర్లోని ఐసీఎల్ సిమెంట్ కర్మాగారంలో బుధవారం చోటుచేసుకుంది. కరన్కోట్ ఎస్ఐ రాథోడ్ వినోద్ కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం కలుబుర్గి జిల్లా షాహబాద్ తాలుకా బాలునాయక్ తండాకు చెందిన రాథోడ్ జైరాం(55), 18 ఏళ్లుగా సిమెంట్ కంపెనీలో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తూ.. అందులోనే నివాసం ఉంటున్నాడు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల తరువాత రాథోడ్ మూత్ర విసర్జనకు వెళ్లి, అక్కడే స్పృహతప్పి కింద పడిపోయాడు. గమనించిన షిఫ్ట్ ఇన్చార్జి, తోటి కార్మికులు జైరాంను పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి వైద్యులు పరీక్షించి, అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు.మృతుడి కుమారుడు ఆకాష్ ఫిర్యాదు మేరకు..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. కాగా.. కార్మికుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. -
ఏసీబీ వలలో లైన్ ఇన్స్పెక్టర్
● రూ.6 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన విద్యుత్ శాఖ అధికారి ● గతంలో జైలుకెళ్లినా మారనితీరుసాక్షి, రంగారెడ్డిజిల్లా: విద్యుత్ శాఖ లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి రెండోసారి ఏసీబీకి చిక్కాడు. ప్రస్తుతం సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆయన ఓ ఇంటి మీటర్కు డబ్బులు డిమాండ్ చేసి, రూ.6 వేలు తీసుకుంటూ పట్టుబడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. పెద్దఅంబర్పేట మున్సిపల్ పరిధి తట్టిఅన్నారంలో ఇల్లు నిర్మించుకున్న ఓ వ్యక్తి కరెంటు మీటర్ కోసం దరఖాస్తు చేసుకోగా లైన్ ఇన్స్పెక్టర్ ప్రభులాల్ డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. మధ్యాహ్నం తట్టిఅన్నారంలోని తాజా టిఫిన్ సెంటర్ వద్ద బాధితుడి నుంచి రూ.6 వేల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం అతన్ని కోర్టులో హాజరు పర్చి, రిమాండ్కు తరలించారు. ఇదిలా ఉండగా ఇదే సర్కిల్లో పదేళ్ల క్రితం లైన్మన్గా పనిచేస్తున్న సమయంలో ఓ వ్యక్తి నుంచి రూ.5 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి జైలుకెళ్లాడు. అయినా బుద్ధి మారలేదు. రూ.2 లక్షలకు పైగా జీతం వస్తున్నా అడ్డదారులు తొక్కడం ఆపలేదని సమాచారం. ఈక్రమంలో సదరు అధికారి పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ శాఖల అధికారులు ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064ను లేదా 9440446106లకు సమాచారం ఇవ్వాలని, బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు సూచించారు. -
మొన్న ప్రేయసి.. నిన్న ప్రియుడు
● ప్రేమికుల బలవన్మరణం ● ఆరుట్లలో విషాద ఛాయలు మంచాల: వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో.. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో మనస్తాపం చెందిన యువతి ఇంట్లోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడగా.. ఆమె లేని జీవితం వ్యర్థమని భావించిన యువకుడు.. ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. పెళ్లికి ఒత్తిడి తేవడంతో.. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి ఆరుట్ల గ్రామానికిచెందిన పంబాల నందిని(21), అదే గ్రామానికిచెందిన మంకు నాగరాజు రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాలం గడుస్తున్న కొద్దీ.. ఇదే విషయమై ఆమె అతడిపై ఒత్తిడి తేగా.. అతను నిరాకరిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం మరోసారి ఇద్దరు ఫోన్లో గొడవ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన యువతి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నందిని మృతితో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. తమ కూతురు మృతికి నాగరాజే కారణమని పేర్కొంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు అయింది. ఆందోళన చెంది.. నందిని చనిపోవడం, ఠాణాలో కేసు నమోదు కావడంతో ఆందోళన చెందిన మహేశ్(26).. అదే రోజు సాయంత్రం ఆగాపల్లిలోని బంధువులఇంటికి వెళ్లి, అక్కడే తల దాచుకున్నాడు. మానసికంగా కృంగిపోయి, భయాందోళనకు గురైనఅతను.. బుధవారం ఆ గ్రామ శివారులోని చింత చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమించిన యువతి మృతితో మానసిక వేధనకు గురై మహేశ్ బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఇబ్రహీంపట్నం ప్రభుత్వఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. -
భారతి అల్ట్రాఫాస్ట్తో నిర్మాణం వేగవంతం
మీర్పేట: భారతి అల్ట్రాఫాస్ట్తో నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుందని సంస్థ టెక్నికల్ ఇంజినీర్ సామ్రాట్ తెలిపారు. మంగళవారం రాత్రి మీర్పేట నందిహిల్స్ శివపార్వతి స్టీల్ ట్రేడర్స్ డీలర్ దుకాణంలో తాపీ మేసీ్త్రలు, కాంట్రాక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సిమెంట్ వ్యాపారంలో తిరుగులేని సంస్థగా ఎదుగుతున్న సంస్థ.. అల్ట్రాఫాస్ట్ పేరుతో ఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్ 5స్టార్ గ్రేడ్ తెలంగాణలో ప్రవేశ పెట్టిందని తెలిపారు. స్లాబులు, పిల్లర్లు, వంతెనలు, రహదారులకు ఇది సరైన ఎంపికన్నారు. అల్ట్రాఫాస్ట్ వినియోగదారులకు ఉచిత సాంకేతిక సహాయం అందజేయడంతో పాటు స్లాబ్ కాంక్రీట్ సమయంలో నిపుణులైన సంస్థ ఇంజినీర్లు.. సైట్ వద్దకే వచ్చి సహాయపడతారని చెప్పారు. ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్కు రూ.20 అదనంగా ఉంటుందని పేర్కొన్నారు. డీలర్ రాజశేఖర్ మాట్లాడుతూ.. సంస్థ సర్వీస్ చాలా ఫాస్ట్గా ఉంటుందన్నారు. అనంతరం బిల్డర్లకు రూ.1 లక్ష ప్రమాద బీమా బాండ్లను అందజేశారు. -
దిగుబడి రాక, మద్దతు లేక
పూడూరు: ప్రకృతి కన్నెర్ర చేయడంతో పత్తి రైతు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాడు. పంట పూత, కాత దశలో వాతావరణం అనుకూలించక మొదట్లో పంట దెబ్బతింది. ఆటుపోట్లు ఎదుర్కొని, పంట చేతికొచ్చే సమయంలో కురిసిన వర్షాలకు పత్తి తడిసి ముద్దయింది. తడిసి నల్లబడటంతో వ్యాపారులు ఽతక్కువ ధరకు కొనుగోలు చేస్తారని రైతులు పేర్కొంటున్నారు. అటు సరిగా దిగుబడి రాక, వచ్చినా తడిసి నాణ్యత కోల్పోయిన దానికి మద్దతు లేక తీవ్రంగా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరుమండలంలో మొక్కజొన్నతో పాటు అధిక శాతం రైతులు పత్తిని సాగుచేశారు. -
మొన్న ప్రేయసి.. నిన్న ప్రియుడు
రంగారెడ్డి జిల్లా: వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో.. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో మనస్తాపం చెందిన యువతి ఇంటోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడగా.. ఆమె లేని జీవితం వ్యర్థమని భావించిన యువకుడు.. ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. పెళ్లికి ఒత్తిడి తేవడంతో.. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి ఆరుట్ల గ్రామానికి చెందిన పంబాల నందిని(21), అదే గ్రామానికి చెందిన మంకు నాగరాజు రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాలం గడుస్తున్న కొద్దీ.. ఇదే విషయమై ఆమె అతడిపై ఒత్తిడి తేగా.. అతను నిరాకరిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం మరోసారి ఇద్దరు ఫోన్లో గొడవ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన యువతి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నందిని మృతితో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. తమ కూతురు మృతికి నాగరాజే కారణమని పేర్కొంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు అయింది. ఆందోళన చెంది.. నందిని చనిపోవడం, ఠాణాలో కేసు నమోదు కావడంతో ఆందోళన చెందిన మహేశ్(26).. అదే రోజు సాయంత్రం ఆగాపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లి, అక్కడే తల దాచుకున్నాడు. మానసికంగా కృంగిపోయి, భయాందోళనకు గురైన అతను.. బుధవారం ఆ గ్రామ శివారులోని చింత చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమించిన యువతి మృతితో మానసిక వేధనకు గురై మహేశ్ బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. -
చెరువులు చెర!
మంచాల: గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు అన్యాక్రాంతానికి గురవుతున్నాయి. వీటిని కాపాడాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన కొంతమంది నాయకులు సైతం అక్రమార్కులకే వంతపాడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మంచాల మండలంలో మొత్తం 126 చెరువులు, కుంటలు, 38 చెక్డ్యాంలు ఉన్నాయి. వీటిలో వంద ఎకరాలకుపైగా ఆయకట్టు ఉన్న నాలుగు చెరువులున్నాయి. అగమ్యగోచరంగా.. పలు గ్రామాల్లోని చెరువుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చాలా వరకు చెరువులు ఊళ్లకు సమీపంలో, ప్రధాన రహదారులకు దగ్గరగా ఉన్నాయి. వీటి సమీపంలోని పట్టా భూములు, ఎఫ్టీఎల్ పరిధిలోని భూములను కొనుగోలు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆతర్వాత చెరువు భూములను చెరబడుతున్నారు. బఫర్ జోన్లలో మట్టి నింపి విక్రయిస్తున్నారు. మచ్చుకుకొన్ని.. అల్లిచెరువు:ఆగాపల్లి– కాగజ్ఘట్ గ్రామాల మధ్య అల్లిచెరువు ఉంది. దీనికి 40 ఎకరాల ఆయకట్టు భూమి ఉంది, ఇది నిండితే 25 నుంచి 30 ఎకరాలు వరకు ఎఫ్టీఎల్ పరిధిలో నీళ్లు ఉంటాయి. దీని చుట్టూ భూమి కొనుగోలు చేసిన కొంతమంది వ్యాపారులు ఎఫ్టీఎల్ను మాయం చేశారు. పట్టా భూమి పేరుతో హద్దు రాళ్లు తొలగించి, మట్టిపోసి ప్లాట్లుగా మార్చారు. బఫర్ జోన్లో ఏకంగా నిర్మాణాలే చేపట్టారు. ఈ విషయమై ఫిర్యాదులు వెళ్లడంతో సర్వే చేసిన అధికారులు ఆక్రమణ వాస్తవమేనని తేల్చారు. వ్యాపారిపై కేసు నమోదు చేసినా, స్థలం మాత్రం కబ్జాచెరలో ఉంది. ఉషమ్మ చెరువు ఆగాపల్లి, కాగజ్ఘట్ నోముల గ్రామాల సరిహద్దు మధ్య ఉంటుంది. దీని ఆయకట్టు 40.01 ఎకరాలు, కెపాసీటి ఆరున్నర ఎకరాలకు పైగా ఉంటుంది. చెరువు నిండితే ఎఫ్టీఎల్ పరిధిలోని యాభై ఎకరాల మేర నీళ్లు వస్తాయి. దీని చుట్టూ భూములు కొనుగోలు చేసిన వ్యాపారులు చెరువులోకి నీళ్లు వచ్చే కాల్వను మాయం చేశారు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ హద్దులు చెరిపేశారు. ఎల్సోనికుంట ఆరుట్లలోని ఈ చెరువు 69 ఎకరాల ఆయకట్టు ఉంది. నీటినిల్వ సామర్థ్యం 9ఎకరాలు. పైన ఉన్న గొలుసు కట్టు చెరువుల ద్వారా ఇందులోకి వరద వచ్చేది. కాల్వలు కబ్జాకు గురికావడంతో నీటి ఆధారం లేకుండా పోయింది. ఆరుట్లలోని పడమటి చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కూడా నిబంధనలకు విరుద్ధంగా రియల్ వ్యాపారులు కొనుగోలు చేశారు. రామసముద్రం చెన్నారెడ్డిగూడలో సుమారు నాలుగు ఎకరాల మేర విస్తరించి ఉన్న ఈ చెరువు ప్రస్తుతం దాదాపు కనుమరుగైంది. చుట్టు పక్కల భూములు కొనుగోలు చేసిన వ్యాపారులు మట్టినింపి చెరువును కబ్జా చేశారు. దీంతో వీరికి 4 ఎకరాల భూమి అదనంగా కలిసి వచ్చింది. ఇలా మంచాల మండలంలో చాలా చెరువులు కబ్జాకు గురవుతున్నాయి. మాయమవుతున్న ఎఫ్టీఎల్, వరద నీటి కాల్వలు పట్టించుకోని అధికారులు, పాలకులు -
కళాశాలలు తరలించొద్దు
కొడంగల్ రూరల్: మెడికల్, వెటర్నరీ, నర్సింగ్ కళాశాలలు తరలించొద్దని పట్టణంలోని కడా కార్యాలయ ఆవరణలో మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రతీక్జైన్, ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డిలకు వేరువేరుగా కేడీపీ జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కేడీపీ జేఏసీ కో కన్వీనర్లు సురేష్కుమార్, శ్రీనివాస్, రమేష్బాబు, భీమరాజు, సూర్యానాయక్ మాట్లాడారు. మెడికల్ కళాశాలలు, సమీకృత గురుకులాలను ఇతర ప్రాంతాలకు ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నించారు. కొడంగల్లోనే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, విద్య, వైద్యం అందక ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఇంతకు మించిన కళాశాలలు ఇక్కడికి వస్తాయని చెప్పడంతో కేడీపీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. నిర్ణయించిన స్థలంలో కేవలం మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో చంద్రయ్య, రమేష్బాబు, డాక్టర్ నవాజ్, పవన్, పకిరప్ప, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు
మాడ్గుల: మండలంలోని వాగుల నుంచి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని సీఐ వేణుగోపాల్రావు హెచ్చరించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న అందుగుల, ఇర్విన్ గ్రామాలకు చెందిన 24 మంది నిందితులను గుర్తించి మంగళవారం తహసీల్దార్ వినయ్సాగర్ ఎదుట బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. శాంతిభద్రతలకు భంగం కలిగించవద్దని, ప్రజలు చట్టాన్ని గౌరవించి అక్రమాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోమన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ రాఘవేందర్, సిబ్బంది పాల్గొన్నారు. పని ఒత్తిడితో సంతకం చేయలేదు షాబాద్: తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్టార్లో పని ఒత్తిడితోనే సంతకాలు పెట్టలేదని తహసీల్దార్ అన్వర్ తెలిపారు. కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 27న చేవెళ్లే ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డిలు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారన్నారు. ఆ సమయంలో పరిపాలన విభాగం ఆదేశాలనుసారం హైకోర్టుకు వెళ్లినట్లు చెప్పారు. పని ఒత్తిడి వల్లే రిజిస్టార్లో సంతకం చేయలేదన్నారు. 15 రోజులుగా అత్యవసరంగా 22ఏ తయారు చేసే క్రమంలో మొత్తం రెవెన్యూ సిబ్బంది పని చేస్తుందన్నారు. బస్సు డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ముప్పు ఇబ్రహీంపట్నం: కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో సోమవారం ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకట నర్సప్ప తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెరువు కట్టపై బైక్ను ఓవర్ టెక్ చేసే క్రమంలో కారు డ్రైవర్ ఎడమ వైపు నుంచి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కుడి వైపు ఉన్న బస్సు ముందుకు ఆకస్మాత్తుగా రావడంతో ప్రమాదం జరిగిందన్నారు. బస్సు ముందు కారు బోల్తా పడితే.. దానిపైకి వెళ్లకుండా తమ డ్రైవర్ రాజశేఖర్రెడ్డి చాకచక్యంతో పక్కకు తప్పించారన్నారు. బస్సులో 30 మంది ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా నివారించాడన్నారు. ఉగాండా జాతీయురాలి డిపోర్టేషన్శంషాబాద్: కాలపరిమితి ముగిసినా నగరంలో అక్రమంగా నివాసం ఉంటున్న ఓ ఉగాండా జాతీయురాలుతో పాటు ఆమె కుమార్తెను తెలంగాణ పోలీసులు మంగళవారం రాత్రి ఆమె స్వదేశానికి తిరిగి పంపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఉగాండాకు చెందిన ఎంజెలా నైరుస్థి (36)తో పాటు ఆమె కుమార్తె బ్లెసింగ్ కాలపరిమితి ముగిసినా నగరంలోనే ఉంటున్నారు. అంతేకాకుండా ఎంజెలా నైరుస్థికి ఆగస్టు 15 మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎకై ్సజ్ కేసులో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎయిర్ అరేబియాకు చెందిన జీ9468 విమానంలో షార్జాకు అక్కడి నుంచి కనెక్టివిటీ విమానం జీ9–691లో షార్జా నుంచి ఎంటీబీకి వెళ్లేళలా ఏర్పాట్లు చేసి ఎయిర్పోర్టు డిపార్చుర్లో వారిని వదిలేశారు. అక్కడి నుంచి ఎయిర్పోర్టు భద్రతాధికారులు వారిని ఫ్లైట్ ఎక్కించినట్లు సమాచారం. ఎయిర్ హోస్టెస్ బలవన్మరణం రాజేంద్రనగర్: ఓ ఎయిర్ హోస్టెస్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్కు చెందిన జాహ్నవి గుప్తా (28) ఎయిర్ హోస్టెస్గా పని చేస్తూ రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని శివరాంపల్లి కెన్ఫుడ్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటోంది. శనివారం సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చిన ఆమె రాత్రి తన గదిలో ఉరి వేసుకుపి ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం ఉదయం ఆమె సెల్ఫోన్ తీయకపోవడంతో అనుమానం వచ్చిన అపార్ట్మెంట్ వాసులు జమ్ముకాశ్మీర్లో ఉంటున్న ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అపార్ట్మెంట్వాసుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా జాహ్నవి గుప్తా ఉరికి వేలాడుతూ కనిపించింది. పంచనామా నిర్వహించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం సోమవారం సాయంత్రం జమ్మూకాశ్మీర్ నుండి వచ్చిన తల్లిదండ్రులకు మృతదేహాన్ని అప్పగించారు. కాగా ఈ ఘటనపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. -
రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
తుక్కుగూడ: రాష్ట్ర స్థా యి ఖోఖో అండర్–19 విభాగంలో తుక్కుగూడ పురపాలిక పరిధిలోని మంఖాల్ గ్రామానికి చెందిన ప్రణయ్ ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా స్థానికులు అతడిని సన్మానించి అభినందించారు. కోచ్లు మహేందర్, శ్రీధర్రెడ్డిలు మాట్లాడారు. వచ్చే నెలలో నగరంలోని సరూర్నగర్లో జరిగే రాష్ట్ర స్థాయిలో ఖోఖో పోటీల్లో పాల్గొంటాడని చెప్పారు. మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం చేవెళ్ల: స్థానిక ఎకై ్సజ్ కార్యాలయం పరిధిలోని మూడు మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించేందుకు గెజిట్ను విడుదల చేసినట్లు చేవెళ్ల ఎకై ్సజ్ సీఐ శ్రీలత ఓ ప్రకటనలో తెలిపారు. షాబాద్ మండలంలోని నాగరగూడలోని షాపు నం.110ను గౌడ సామాజిక వర్గానికి రిజర్వ్ చేశారు. సర్దార్నగర్లోని షాపు నంబర్ 111కు, చేవెళ్ల మండలంలోని ఖానాపూర్ షాపు నంబర్ 107లకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. 28వ తేదీ నుంచి నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అర్జీలు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. రైలు ఢీకొని యువకుడి దుర్మరణం అడ్డగుట్ట: పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జీఆర్పీ కానిస్టేబుల్ పండరి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ముషీరాబాద్కు చెందిన అబ్దుల్ ముజీబ్(28) మంగళవారం ఉదయం తన స్నేహితులతో కలిసి సంజీవయ్య పార్క్ – జేమ్స్స్ట్రీట్ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతున్నాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. -
అంగన్వాడీ కేంద్రంలో చోరీ
మొయినాబాద్రూరల్: అంగన్వాడీ కేంద్రంలో చోరీ జరిగిన సంఘటన స్థానిక పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగిరెడ్డిగూడ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దుండగులు అంగన్వాడీ కేంద్రం కిటికీలను ధ్వంసం చేసి దూరారు. వంట సామగ్రి, సిలిండర్ తదితర వాటిని అపహరించుకుపోయారు. దీనిపై అంగన్వాడీ టీచర్ అమరజ్యోతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హుండీ పగలగొట్టి.. మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని మేడిపల్లి గ్రామంలో గల ఉమామహేశ్వర దేవాలయంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హుండీని పగలగొట్టి నగదు దొంగలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవాలయంలో దొంగలు హుండీ తాళం పగులగొట్టి అందులో ఉన్న రూ.15 వేలు దొంగిలించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. -
ఆత్మహత్య కారకులను శిక్షించాలి
మంచాల: తమ కూతురి ఆత్మహత్యకు గల కారకులను కఠినంగా శిక్షించాలని మంచాల పోలీస్స్టేషన్ ఎదుట ఆరుట్ల గ్రామానికి చెందిన పంబాల నందిని తల్లిదండ్రులు, బంధువులు మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నందిని(21) ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందన్నారు. దీనికి అదే గ్రామానికి చెందిన మంకు నాగరాజుపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అయినా పోలీసులు పట్టించుకోక పోవడంతో స్టేషన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తున్నామన్నారు. పోలీసుల నుంచి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు భీష్మించుకున్నారు. సీఐ మధు స్పందించి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుంటామని, సమాచారం సేకరించి నిందితుడిని చట్టపరంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. దీంతో ధర్నా విరమించారు. -
ప్రైవేట్ స్కూల్పై చర్యలు తీసుకోవాలి
ఇబ్రహీంపట్నం: విద్యార్థుల జీవితాలతో శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం చెలగాటమాడుతుందని ఇబ్రహీంపట్నం డివిజన్ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి ఏర్పుల తరంగ్ ఆరోపించారు. పెట్రోల్ బంక్ పక్కనే స్కూల్ ఉందన కారణంగా విద్యాఽశాఖ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నర్సరి నుంచి 7వ తరగతి విద్యార్థుల తరగతులు నిర్వహించకుండా సెలవు ఇచ్చారు. వెనుకవైపు ఉన్న మరో బిల్డింగ్లో 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలను సందర్శించేందుకు వెళ్లిన ఎస్ఎఫ్ఐ నేతలతో సిబ్బంది వాదోపవాదాలకు దిగారు. సీజ్ చేసిన పాఠశాల భవనాన్ని ఎలా తెరుస్తారని ఆందోళనకు దిగారు. గేట్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఎంఈఓ హీర్యానాయక్ను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు ఎస్ఎఫ్ఐ నేతలు తెలిపారు. చైతన్య స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు బోడ వంశీ, అజయ్, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు. -
పనికి వెళ్తున్నానని చెప్పి..
మహిళ అదృశ్యం ● కొందుర్గు పీఎస్లో కేసు నమోదు కొందుర్గు: మహిళ అదృశ్యంపై మంగళవారం కేసు నమోదైంది. కొందుర్గు పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని మహదేవ్పూర్కు చెందిన ఎరుకలి మౌనికకు ఆరేళ్ల క్రితం ఫరూఖ్నగర్ మండలం చెల్కచిల్కమర్రి గ్రామానికి చెందిన ఎరుకలి యాదగిరితో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు, కుమారుడు సంతానం. ఇదిలా ఉండగా ఎనిమిది క్రితం యాదగిరి మరణించాడు. అప్పటినుంచి మౌనిక తన తల్లిగారి ఊరైన మహదేవ్పూర్లో నివసిస్తోంది. కొద్ది రోజుల క్రితం పిల్లలు, తన తల్లి సువర్ణతో కలిసి అమ్మమ్మగారి గ్రామమైన మండల పరిధిలోని బైరంపల్లికి వెళ్లారు. ఈనెల 27న కూలీ పనికి వెళుతున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మౌనిక రాత్రయినా తిరిగిరాలేదు. చుట్టుపక్కల వాళ్లు, బంధువులను ఆరా తీసినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫరూఖ్నగర్ మండలం కందివనం గ్రామానికి చెందిన ఎరుకలి అశోక్పై అనుమానం ఉందని మౌనిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిగారింటికి బయర్దేరి..మొయినాబాద్రూరల్: వృద్ధురాలు అదృశ్యమైన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మేడిపల్లి గ్రామానికి చెందిన కొడగండ్ల మంగమ్మ(71) ఈ నెల 24వ తేదీన ఉదయం బస్సులో ఆమె తల్లిగారింటికి బయలుదేరింది. కానీ ఇప్పటివరకు తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుడే అడ్మిషన్ల వేట!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: వార్షిక పరీక్షలు ఇంకా మొదలే కాలేదు. పలు ఇంటర్మీడియట్ కార్పొరేట్ కాలేజీలు అప్పుడే అడ్మిషన్ల వేట మొదలు పెట్టాయి. స్కాలర్షిప్ టెస్టుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులకు వల విసురుతున్నాయి. పదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి పిల్లలతో కలిసి తమ క్యాంపస్ను సందర్శించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాయి. తీరా వచ్చి స్కాలర్షిప్ టెస్టు రా సిన తర్వాత అడ్మిషన్ల ప్రస్తావన తెరపైకి తెస్తు న్నాయి. వార్షిక పరీక్షలు ముగిసి, ఫలితాలు వెల్లడించిన తర్వాత నిర్దేశిత మొత్తం ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, ముందస్తుగా పేర్లు నమోదు చేసుకున్న వాళ్లకు రాయితీ ఇస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. ఆఫర్ చేస్తున్న కోర్సులు, మౌలిక సదుపాయాలను బట్టి వసూలు చేస్తున్నాయి. డే స్కాలర్కు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు, రెసిడెన్షియల్కు రూ.1.50 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు చెబుతున్నాయి. పోటీతో కోరుకున్న క్యాంపస్లో ఎక్కడ సీటు దక్కకుండా పోతుందోననే భయంతో మెజార్టీ తల్లిదండ్రులు తమకు ఇష్టం లేకపోయినా రూ.10 వేలు చెల్లించి సీటును ఖరారు చేసుకుంటున్నారు. ఏజెంట్ల నియామకాలు.. కమీషన్లు జిల్లాలో 18 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, రెండు ఎయిడెడ్ కాలేజీలు ఉండగా, మరో 221 ప్రైవేటు, రెసిడెన్షియల్ కార్పొరేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి. మెజార్టీ రెసిడెన్షియల్ కాలేజీలు తట్టిఅన్నారం, కొత్తపేట్, ఎల్బీనగర్, హయత్నగర్, మన్సూరాబాద్, వనస్థలిపురం, కోహెడ, ఆదిబట్ల, కొంగరకుర్దు, రావిర్యాల, మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోనే ఉన్నాయి. ఆయా కాలేజీలన్నీ ఇరుకై న అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇంటర్మీడియెట్ బోర్డు నిబంధనకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల్లో పని చేస్తున్న ఫ్యాకల్టీని మార్కెటింగ్ ఏజెంట్లుగా నియమించుకుంటున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను ఆయా పాఠశాలల యాజమాన్యాల నుంచి సేకరించి, ఐఐటీ, జేఈఈ, నీట్ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో గత విద్యార్థులు సాధించిన ర్యాంకులను సాకుగా చూపిస్తున్నాయి. ఫీజులో రాయితీ పేరుతో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మభ్యపెడుతూ ముందస్తు అడ్మిషన్లకు తెరతీశాయి. ఇందుకు ప్రతిఫలంగా ఆయా కాలేజీల యాజమాన్యాలు ఒక్కో విద్యార్థిపై సదరు ఏజెంట్కు రూ.25వేల వరకు కమీషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు తెలిసీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చర్యలు తీసుకుంటాం జిల్లాలోని పలు ప్రైవేటు జూనియర్ కాలేజీలు అకడమిక్ ఇయర్కు ముందే అడ్మిషన్లు చేపడుతున్న విషయం ఇప్పటి వరకు నా దృష్టికి రాలేదు. ఎవరైనా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే యాజమన్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం. వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత అనుమతి పొందిన కాలేజీల్లోనే అడ్మిషన్లు తీసుకోవాలి. తల్లిదండ్రులు మార్కెట్ ఏజెంట్ల వలలో చిక్కుకోవద్దు. – వెంక్యానాయక్, ఇంటర్బోర్డు జిల్లా అధికారి -
ఆయిల్పాం సాగు లాభదాయకం
ఇబ్రహీంపట్నం రూరల్: ఆయిల్పాం సాగు ఎంతో లాభదాయకమని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సురేష్ అన్నారు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఉప్పరిగూడ రైతు వేదికలో మంగళవారం సహకార సంఘాల సెక్రెట్రీలు, చైర్మన్లు, డైరెక్టర్లకు ఆయిల్పాం సాగుపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సురేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం 12 ఎకరాల వరకు మొక్కలు అందిస్తుందని, సబ్సిడీపై డ్రిప్పు, నాలుగేళ్లపాటు ఎకరానికి రూ.4,200 చొప్పున మెయింటనెన్స్ ఇస్తుందన్నారు. పండిన పంటను తిరిగి కొనుగోలు చేస్తుందని చెప్పారు. సంవత్సరానికి ఎకరాకు రూ.లక్ష వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డీసీఓ సుధాకర్, ఇన్చార్జి డీఏఓ శోభ, వ్యవసాయ శాఖ ఏడీఏ సుజాత, ఎంపీడీఓ వెంకటమ్మ, ఏపీఓ తిరుపతచారి, ఉప్పరిగూడ పీఏసీఎస్ చైర్మన్ పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఔషధ, కూరగాయల తోట పరిశీలన
కందుకూరు: కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ, పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రాంలో భాగంగా మండల పరిధిలోని నేదునూరు మోడల్ స్కూల్లో నిర్వహిస్తున్న పనులను మంగళవారం నాబార్డ్ అధికారులు పరిశీలించారు. సంస్థ జిల్లా డీడీఎం హరీష్, సీజీఆర్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ జేఎస్ఆర్ అన్నమయ్య, సలహాదారు మహ్మద్ రఫీయొద్దీన్ పాఠ శాల ఆవరణలో చేపట్టిన ఔషధ మొక్కలు, కూరగాయల తోట, ఇంకుడు గుంత, కంపోస్ట్ పిట్ వంటి వాటిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విష్ణుప్రియ, ఉపాధ్యాయులు పుష్పలత, గురురాజారెడ్డి, ఎర్త్ లీడర్లు హానిప్రియ, మధిహ, తరుణి, తేజస్విని, రకిత, లతశ్రీ, మాధవి, హాసిని, యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రాం జిల్లా కోఆర్డినేటర్ రజనీకాంత్ పాల్గొన్నారు. సీజీఆర్ సేవలు ప్రశంసనీయం కడ్తాల్: కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ విద్యార్థుల సమగ్రాభివృద్ధికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని నాబార్డ్ డిస్ట్రిక్ డెవలప్మెంట్ మెనేజర్ హరీశ్ రఘురాం అన్నారు. యంగ్ ఎర్త్ లీడర్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని పీఎంశ్రీ బాలుర ఉన్నత పాఠశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, సీజీఆర్ పర్యావరణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఔషధమొక్కల తోట, కూరగాయల తోట, కంపోస్ట్పిట్, ఇంకుడుగుంతను సీజీఆర్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ జేఎస్ఆర్ అన్నమయ్య, ఔషధతోటల సలహాదారు మహ్మద్ రఫియొద్దీన్, మండల విద్యాధికారి నిర్మలతో కలిసి సందర్శించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం జంగయ్య, సీజీఆర్ కోఆర్డినేటర్ రజనీకాంత్, ఎర్త్లీడర్స్, ఉపాధ్యాయులు ఉన్నారు. తారామతిపేట జెడ్పీ స్కూల్లో.. అబ్దుల్లాపూర్మెట్: మండలంలోని తారామతిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఔషధ మొక్కల తోట, కూరగాయల తోట, ఇంకుడు గుంత, కంపోస్ట్ పిట్లను మంగళవారం నాబార్డ్ సంస్థ జిల్లా డీడీఎం హరీష్ రఘురాం, సీజీర్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ జేఎస్ఆర్ అన్నమయ్య, ఔషధ తోట సలహాదారు మహ్మద్ రఫీయొద్దీన్ సందర్శించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.ఎర్రయ్య, మెంటర్ టీచర్ రమేష్ రావు, ఎర్త్ లీడర్స్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో పది కొనుగోలు కేంద్రాలు
ఇబ్రహీంపట్నం: గ్రామీణాభావృద్ధి సంస్థ, ఐకేపీ ఆధ్వర్యంలో జిల్లాలో పది వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు డీఆర్డీఓ శ్రీలత తెలిపారు. మండలంలోని దండుమైలారంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని, దళారీలను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఏ గ్రేడ్ వరి ఽక్వింటాలుకు మద్దతు ధర రూ.2,389, కామన్ గ్రేడ్కు రూ.2,369, సన్నరకానికి రూ.500 అదనంగా బోనస్ ఇవ్వనున్నట్లు చెప్పారు. 17 శాతం లోపు తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తామనివెల్లడించారు. పట్టాదారు పాస్బుక్స్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఫోన్ నంబర్ను సంబంధి త అధికారులకు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ బోజప్ప, ఏపీఎంలు సత్యనారాయణ, సాంబశివుడు, సీసీలు సత్తయ్య, మల్లేష్, జంగమ్మ, హరిలాల్ పాల్గొన్నారు. అక్కడే రైతులు ధాన్యంవిక్రయించాలి -
జూబ్లీహిల్స్ ఎన్నికతో ఒరిగేదేం లేదు
షాద్నగర్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏపార్టీ గెలిచినా ప్రజలకు ఒరిగేదేం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవి అన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో మంగళవారం నిర్వహించిన జాగృతి జనం బాట కార్యక్రమాన్ని వెళ్తున్న ఆమెకు షాద్నగర్ బైపాస్లో జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలకు మాయమాటలు చెప్పి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. గ్రామ స్థాయిలో జనం ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకే జాగృతి జనం బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ముస్తాఫా, నియోజకవర్గ ఇన్చార్జి చీమల రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీని సందర్శించిన రాష్ట్ర బృందం
కొత్తూరు: మండలకేంద్రంలోని కేజీబీవీ హాస్టల్ను మంగళవారం రాష్ట్ర శిశుహక్కుల పరిరక్షక్షణ కమిషన్ బృందం సభ్యులు సందర్శించారు. హాస్టల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, వసతులను పరిశీలించారు. విద్యార్థులకు శిశు హక్కులు, బాలికా విద్య–ప్రాధాన్యం, ఆరోగ్యం, పరిశుభ్రత, బాల్య వివాహాలతో అనర్థాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బృందం సభ్యులు వందనగౌడ్, చందన, సరిత, ప్రేమలత అగర్వాల్, వచన్కుమార్, ఎంఈవో అంగూర్నాయక్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. నందిగామను సందర్శించిన జిల్లా అధికారులు నందిగామ: మండల కేంద్రమైన నందిగామను మంగళవారం జిల్లా స్థాయి అధికారులు సందర్శించారు. సోలార్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద ఇటీవల పైలెట్ గ్రామంగా ఎంపిక చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో జిల్లా రెడ్కో మేనేజర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో పలువురు బృంద సభ్యులు గ్రామంలోని పలు ప్రభుత్వ భవనాలను పరిశీలించారు. సోలార్ కిట్ల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న భవనాలు, అంగన్వాడీ కేంద్రం, పీహెచ్సీ, ప్రభుత్వ పాఠశాలలు, పీఏసీఎస్, పోలీస్ స్టేషన్, పంచాయతీ కార్యాలయం, రైతు వేదిక తదితర భవనాలను సందర్శించారు. వీలైనంత త్వరలో సోలార్ పరికరాలను అమర్చేందుకు కృషి చేస్తామని వేణుగోపాల్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సుమతి, గ్రామ కార్యదర్శి మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పశువులకు గాలికుంటు టీకాలు తప్పనిసరి కడ్తాల్: రైతులు తప్పనిసరిగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి మధుసూదన్ అన్నారు. మండల కేంద్రంలోని పశువైద్య కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని సౌకర్యాలు, కార్యకలాపాలను అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలో కొనసాగుతున్న గాలికుంటు నివారణ టీకా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. పశువులకు సోకే గాలికుంటు వ్యాధి తో అప్రమత్తంగా ఉండాలని, పాడి రైతులు ఏ మ్రాతం అలసత్వం వహించినా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంటుందన్నారు. మండల పరిధిలోని కొండ్రిగానిబోడ్తండా పంచాయతీలో పశువైద్య ఉప కేంద్రం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీచ్యానాయక్ పాడి రైతులతో కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి భానునాయక్, నాయకులు రమేశ్, రంగనాయక్, వైద్య సిబ్బంది ఉన్నారు. అర్హులైన ప్రతిరైతుకు పరిహారం కందుకూరు: అర్హులైన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామని ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని తిమ్మాయిపల్లి సర్వే నంబర్ 9లోని భూమి అప్పగించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన రైతులకు ఆయన మంగళవారం చెక్కులు పంపిణీ చేశారు. ఏడుగురు రైతులకు సంబంధించి 27 ఎకరాలకు ఎకరాకు రూ.51,51,906 చొప్పున రూ.14 కోట్ల మేర పరిహారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక, ఇతర అభివృద్ధి పనుల అవసరాలకు టీజీఐఐసీ ద్వారా ప్రభుత్వం భూములను సేకరిస్తోందని, 2013 చట్టం కంటే అదనంగా పరిహారం అందిస్తోందని తెలిపారు. అందరూ భూములు ఇచ్చి పరిహారం పొందాలని సూచించారు. -
ఇందిరమ్మ ఇళ్లు వేగవంతం చేయాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, డబుల్బెడ్రూంల పంపిణీ ప్రక్రియ, వన మహోత్సవం, ఎన్ఆర్ఈజీఎస్, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ఆర్డీఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, హౌసింగ్ ఏఈలు, మున్సిపల్ కమిషనర్లు, ఎపీఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మండలాల వారీగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు.. ఏ దశలో నిర్మాణంలో ఉన్నాయి.. గ్రౌండింగ్ అయినవి ఎన్ని అని అడిగి తెలుసుకున్నారు. మంజూరు అయిన వారంతా తక్షణమే నిర్మాణాలు చేపట్టే విధంగా ప్రోత్సహిస్తూ క్షేత్రస్థాయిలో పక్కాగా పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఇందుకు ఇందిరమ్మ కమిటీల సహకరం తీసుకోవాలని సూచించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియను వేగిరం చేయాలని చెప్పారు. ప్రతి గ్రామ, మున్సిపాలిటీ పరిధిలో అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రగతి పార్కుల్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు 100 శాతం మొక్కలు నాటాలని ఆదేశించారు. బృందాలను ఏర్పాటు చేసి నవంబర్ 1 నుంచి నాటిన మొక్కలను పరిశీలించడం జరుగుతుందన్నారు. పాఠశాలలు, గురుకులాలు, అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలని, ప్రతి రోజు పారిశుద్ధ్యం చేపట్టాలని అన్నారు. అనంతరం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా చేపట్టిన ఇళ్ల నిర్మాణాలపై సమీక్షించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత, డీపీఓ సురేష్ మోహన్, సివిల్ సప్లై అధికారి వనజాత, విద్యాశాఖ అధికారి సుశీందర్రావు, ఉద్యాన శాఖ అధికారి సురేష్ తదితరులు పాల్గొన్నారు. పారదర్శకంగా సేవలందించాలి ప్రతి ఉద్యోగి నిజాయతీగా, పారదర్శకంగా ప్రజలకు సేవలందించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం రీజినల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజిలెన్స్ అవేర్నెస్ వీక్ సందర్భంగా సిబ్బందితో సమగ్రత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా విజిలెన్స్ వారోత్సవం చేపట్టినట్టు చెప్పారు. ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు అవినీతి లేకుండా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సుపరిపాలన అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, సివిల్ సప్లయ్ అధికారులు వనజాత, హరీష్, పంచాయతీ అధికారి సురేష్ మోహన్, ఆడిట్ అధికారి వెంకట్రెడ్డి, విద్యాశాఖ అధికారి సుశీందర్రావు తదితరులు పాల్గొన్నారు. యాచారం: మండలంలోని మొండిగౌరెల్లి అసైన్డ్ రైతులు మంగళవారం ఆర్డీఓ అనంత్రెడ్డితో వెళ్లి కలెక్టరేట్లో కలెక్టర్ నారాయణరెడ్డిని కలిశారు. ఎకరాకు రూ.70 లక్షల పరిహారంతో పాటు 121 గజాల చొప్పున ప్లాటు ఇచ్చే విధంగా చూడాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్కెట్ విలువ ప్రకారం మూడు రెట్లు ఇవ్వాల్సి వస్తే ఎకరాకు రూ.18 లక్షలే పరిహారం వస్తుందని అన్నారు. రైతుల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని తనకున్న అధికారాన్ని ఉపయోగించి ఎకరాకు రూ.22 లక్షల పరిహారంతో పాటు 121 గజాల చొప్పున ప్లాటు ఇస్తామని తెలిపారు. అసైన్డ్ సర్వే నంబర్లు 19, 68, 127లలో నకిలీ సర్టిఫికెట్లను తీసేయాలని రైతులు కోరగా నకిలీ పేర్లను రికార్డుల్లోంచి తొలగిస్తామని, పరిహారం పెంపు విషయంలో సర్కార్ దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. పరిహారంలో న్యాయం చేయండి -
ఉచ్చుబిగించి.. ఊపిరాడకుండా చేసి
● భర్తను చంపిన భార్య ● నిందితురాలికి రిమాండ్ మీర్పేట: తరచూ అనుమానిస్తూ.. వేధిస్తున్నాడని భర్త మెడకు ఉచ్చుబిగించి ఊపిరి తీసింది ఓ భార్య. మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన.. ఆలస్యంగా వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ శంకర్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లెలగూడ ప్రగతినగర్కు చెందిన ఆలంపల్లి విజయ్కుమార్ (42), సంధ్యలు దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. విజయ్ ఆటో డ్రైవర్గా.. సంధ్య మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. సహోద్యోగితో అక్రమసంబంధం కలిగి ఉన్నావంటూ భర్త.. కొంత కాలంగా ఆమెను వేధింపులకు గరిచేసేవాడు. అనుమానిస్తున్నాడని.. ఈ క్రమంలో ఈ నెల 20న రాత్రి ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న విజయ్.. ఆలిని కొట్టి, తాను ఆత్మహత్య చేసుకుంటానని బెధిరించాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె.. మొదట చున్నీతో అతని మెడకు ఉచ్చుబిగించి, ఆ తరువాత తాడుతో ఊపిరిరాడకుండా చేసిచంపేసింది. అనంతరం నిందితురాలు భర్త మృతదేహాన్ని బాత్రూమ్ వద్ద పడేసి, ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేయగా.. గొంతుపై గాయాలనుగుర్తించిన మృతుడి తల్లి సత్తెమ్మ, అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం నివేదికలో విజయ్ను గొంతు నులిమిచంపినట్లు వెళ్లడయింది. ఈ నెల 26న నిందితురాలు సంధ్య.. అనుమానం, వేధింపులు తట్టుకోలేకే భర్త గొంతు నులిమి హత్య చేశానని మృతుడి సోదరుడు ఆలంపల్లి విజయ్భాస్కర్కు తెలిపింది. ఈ మేరకు పోలీసులు.. ఆమెను అదుపులోకితీసుకోగా.. తానే హత్య చేసినట్లు ఒపుకుంది.నిందితురాలిని సోమవారం రిమాండ్కు తరలించామని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
ప్రజావాణి అర్జీలను పెండింగ్లో పెట్టొద్దు
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణికి వచ్చే అర్జీలను పెండింగ్లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన డీఆర్ఓ సంగీతతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు సంబంధిత శాఖల అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఈవారం మొత్తం 56 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. చేవెళ్ల: ఆధ్యాత్మిక మార్గదర్శకులతో సమాజంలో నైతిక విలువలు, సత్యం, ధర్మం, సేవాభావాలు నెలకొంటున్నాయని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. నగరంలోని శంకర్మఠంలో సోమవారం శృంగేరి పీఠాధిపతి విధిశేఖర భారతీ స్వామిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మన దేశ సంస్కృతి, సనాతన సంప్రదాయాల పరిరక్షణలో శృంగేరి పీఠం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. అలాంటి మహనీయుల ఆశీర్వాదంతో ప్రజా సేవాలో మరింత నిబద్ధతతో పనిచేస్తానని పేర్కొన్నారు. ఆయన వెంట నియోజకవర్గ నాయకులు ఉన్నారు. ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నంలోని శ్రీ చైతన్య స్కూల్ను విద్యాశాఖాధికారులు సోమవారం సాయంత్రం సీజ్ చేశారు. ఈ స్కూల్లో పదోతరగతి వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. స్కూల్ పక్కనే పెట్రోల్ బంక్ ఉండటం, ఫైర్ సేఫ్టీ అధికారులు ఎన్ఓసీ జారీ చేయకపోవడం తదితర కారణాలతో సీజ్ చేయాలని జిల్లా విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మండల విద్యాధికారి హీర్యానాయక్ పాఠశాలను సీజ్ చేశారు. కాగా విద్యార్థుల పరిస్థితి ఏమిటో తెలియాల్సి ఉంది. సాక్షి, సిటీబ్యూరో: కొత్త సిటీతో పోటీ పడుతూ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న ఓల్డ్సిటీలో మరో రోడ్డుకు మహర్దశ పట్టనుంది. శాస్త్రిపురం నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ వరకు (మెహఫిల్ హోటల్ దగ్గర) రహదారి విస్తరణ పనులు త్వరలో చేపట్టనున్నారు. ఇప్పటికే ఓల్డ్సిటీలోని బహదూర్పురా, జూపార్క్, ఒవైసీ హాస్పిటల్, తదితర ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు రావడం తెలిసిందే. నల్లగొండ చౌరస్తా నుంచి ఒవైసీ హాస్పిటల్ వరకు మరో ఫ్లై ఓవర్పనులు కూడా జరుగుతున్నాయి. వివిధ ఆటంకాలతో కుంటుతున్న సదరు ఫ్లై ఓవర్ పనులు పూర్తి కానప్పటికీ, త్వరలోనే మరికొన్ని అభివృద్ధి పనులు కూడా ఓల్డ్సిటీలో జరగనున్నట్లు సంబంధిత ఇంజినీర్లు తెలిపారు. శాస్త్రిపురం నుంచి ఇన్నర్రింగ్రోడ్ వరకు వంద అడుగుల వెడల్పుతో రహదారి విస్తరణ, అభివృద్ధి పనులు త్వరలో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పనుల అంచనా వ్యయం రూ. 4.95 కోట్లు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు టెండర్ల దశలో ఉన్నాయని, టెండర్లు పూర్తయ్యాక పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. తొమ్మిది నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. డిఫెక్ట్ లయబిలిటీ కింద పనులు పూర్తయ్యాక ఎలాంటి లోపాలు తలెత్తినా రెండు సంవత్సరాల వరకు పనులు పూర్తిచేసే కాంట్రాక్టు ఏజెన్సీయే బాధ్యతవహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
తీరుమార్చుకోండి
అధికారులపై చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆగ్రహం షాబాద్: నెలరోజులుగా రిజిస్టర్లో సంతకాలు లేకపోవడం ఏమిటి.. అసలు అధికారులు వస్తున్నారా లేదా అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవారం మధ్యాహ్నం గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మధుసూదన్రెడ్డితో కలిసి తనిఖీ చేశారు. వారు వెళ్లిన సమయంలో తహసీల్దార్ అన్వర్, డిప్యూటీ తహసీల్దార్ మధు లేకపోవడంతో అక్కడే ఉన్న జూనియర్ అసిస్టెంట్ను ప్రశ్నించారు. ఎక్కడికి వెళ్లారు.. రోజూ ఇలాగే ఉంటుందా అని ప్రశ్నిస్తూ హాజరు రిజిస్టర్ తెప్పించి పరిశీలించారు. నెలరోజులుగా సంతకాలు లేవని, ఉద్యోగం అంటే అలుసుగా ఉందా అంటూ మండిపడ్డారు. సంతకాలు లేని చోట ఆబ్సెంట్ అని రాశారు. పది నిమిషాల తరువాత డిప్యూటీ తహసీల్దార్ రావటంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా పనిచేస్తే ప్రజలకు మీపై ఎలా నమ్మకం ఉంటుందని నిలదీశారు. తీరు మార్చుకోవాలని, సమయపాలన పాటించాలని హితవు పలికారు. వెంటనే ఆర్డీఓ చంద్రకళకు ఫోన్ చేసి అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. -
కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలి
సీఐటీయూ నాయకుల డిమాండ్ ఇబ్రహీంపట్నం: ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం శేరిగూడలోని ఇందు కళాశాల ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మున్సిపల్ కన్వీనర్ ఎల్లేష్ మాట్లాడుతూ.. సెంట్రింగ్ పనులు చేస్తూ భవనంపై నుంచి పడి ఒరిస్సా కార్మికుడు దివాకర్ బత్ర మృతి చెందాడని తెలిపారు. దీనిని కళాశాల యాజమాన్యం గోప్యంగా ఉంచి, మృతదేహాన్ని ఆ రాష్ట్రానికి తరలించేందుకు యత్నించిందని ఆరోపించారు. పోలీసులు స్పందించి మృతదేహాన్ని తిరిగి రప్పించి పోస్టుమార్టం చేయించి, కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇలా మోసం చేసిన యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనుమతిలేకుండా చేపట్టిన నిర్మాణ పనులను ఆపాలన్నారు. అదే విధంగా మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వలస కార్మికులతో కలిసి ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళన కారులకు పోలీసులు నచ్చజెప్పే యత్నం చేశారు. ససేమిరా అనడంతో అరెస్టు చేసి వదిలిపెట్టారు. కార్యక్రమంలో సీఐటీయూ, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు యాదగిరి, మల్లికార్జున్, రాజు, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి
శంకర్పల్లి: దేశంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని కేంద్ర ఎన్నికల సంఘం మాజీ అధికారి జేఎం లింగ్డో అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని మోకిల గ్రామంలో పర్యటించారు. గ్రామంలో అమలవుతున్న ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, గ్రామస్తులకు సిబ్బంది కల్పిస్తున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. ముఖ్యంగా గ్రామంలో తడి, పొడి చెత్త సేకరణ ద్వారా ఎరువు తయారీ గురించి తెలుసుకొని అధికారులను అభినందించారు. అనంతరం నర్సరీ, పల్లె ప్రకృతి వనం, తెలంగాణ క్రీడా ప్రాంగణం, పంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్ రోజురోజుకూ పెనుభూతంలా వ్యాపిస్తోందని, దీంతో పర్యావరణం విషతుల్యం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ నిషేధంపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ చక్కగా ఉందని, ఇదే స్ఫూర్తిని మిగతా గ్రామాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకయ్య, ఎంపీఓ గిరి రాజు, ఏపీఓ నాగభూషణం, పంచాయతీ సెక్రెటరీ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ అధికారి లింగ్డో -
కనక వర్షం కురుస్తుందని..
దుండిగల్: పూజలు చేస్తే రెట్టింపు ఆదాయం వస్తుందని, కనక వర్షం కురుస్తుందని నమ్మించి మోసం చేసిన ముఠా సభ్యులను దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సోమవారం దుండిగల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మేడ్చల్ జోన్ డీసీపీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. గండిమైసమ్మ ప్రాంతానికి చెందిన బస్వరాజు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు పశువుల దాణా దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అతడికి ఫిలింనగర్కు చెందిన మేకప్ ఆర్టిస్ట్ గుగులోత్ రవీందర్, కొరియర్ బాయ్గా పని చేస్తున్న సూరారం ప్రాంతవాసి కవిర సాయి బాబాతో పరిచయం ఏర్పడింది. కాగా బస్వరాజు వద్ద పెద్దమొత్తంలో డబ్బు ఉందన్న విషయాన్ని గుర్తించిన వారు డబ్బు కాజేయాలని పథకం రచించారు. బారీష్ పూజ పేరుతో స్కెచ్.. తమకు తెలిసిన గురూజీ ఉన్నాడని, అతనితో బారీష్ పూజ చేయించుకుంటే కనక వర్షం కురుస్తుందని నమ్మించారు. ఈ క్రమంలో ఉత్తర్ప్రదేశ్కు చెందిన అబ్దుల్ ఖయ్యూంను గురూజీగా నమ్మించి బస్వరాజుకు పరిచయం చేశారు. బహదూరపూరకు చెందిన మహ్మద్ ఇర్ఫాన్, ఖైరతాబాద్కు చెందిన ఠాకూర్ మనోహర్ సింగ్లను అతడి అనుచరులుగా రంగంలోకి దింపారు. బస్వరాజును పూర్తిగా నమ్మించిన రవీందర్, సాయిబాబా ఈ నెల 18న ముఠా సభ్యులతో కలిసి గండిమైసమ్మలోని అతని ఇంటికి వచ్చారు. పూజ చేస్తున్నట్లు నటించి పూజలో రూ.25 లక్షలు పెట్టించారు. పూజ పూర్తయిన అనంతరం ప్రసాదంలో మత్తు మందు కలిపి అతడి ఇచ్చారు. బస్వరాజు సృహ కోల్పోవడంతో ముఠా సభ్యులు డబ్బుతో ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు ఇర్ఫాన్, రవీందర్, సాయిబాబా, మనోహర్ సింగ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.8.5 లక్షల నగదు, ఎయిర్ గన్, కత్తిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ప్రధాన నిందితుడు అబ్దుల్ ఖయ్యూం పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇర్ఫాన్, ఖయ్యూంలపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయన్నారు. అధిక డబ్బులకు ఆశ పడి నకిలీ బాబాలను ఆశ్రయించి మోసపోవద్దని డీసీపీ సూచించారు. సమావేశంలో ఏసీపీ శంకర్రెడ్డి, సీసీఎస్ ఏసీపీ నాగేశ్వర రావు, దుండిగల్ సీఐ సతీష్, డీఐ బాల్రెడ్డి, మేడ్చల్ డీఐ కిరణ్ తదితరులు ఉన్నారు.రూ.25 లక్షలు దోపిడీ బాబా అవతారంలో టోకరా నలుగురు నిందితుల అరెస్ట్ పరారీలో ప్రధాన నిందితుడు -
కారును ఢీకొన్న బస్సు
ఇబ్రహీంపట్నం: చెరువు కట్టపై ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టింది. ఈ సంఘటన సోమవారం ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై జరిగింది. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరా బాద్ వైపు నుంచి ఇబ్రహీంపట్నం వస్తున్న ఓ బైక్ను ఓవర్ టెక్ చేసే క్రమంలో ఆర్టీసీ బస్సు వెనుక భాగం.. కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు అదుపుతప్పి.. డివైడర్ పైకి ఎక్కి బోల్తా పడింది. దీంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్.. కారుపైకి బస్సు వెళ్లకుండా.. డివైడర్పైకి తోలడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కారులో ఉన్న మాడ్గుల ఎంపీఓ బండారు రవికుమార్ సురక్షితంగా బయటపడ్డారు. డివైడర్పైకి బస్సు ఎక్కడంతో అందులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తప్పిన పెను ప్రమాదం -
లక్కీ చాన్స్
మద్యం దుకాణాలకు డ్రా ● అదృష్టాన్ని పరీక్షించుకున్న వ్యాపారులు ● వరించిన వారి ముఖాల్లో సంతోషం ● దక్కని వాళ్లు నిరాశతో వెనక్కి సాక్షి, రంగారెడ్డి జిల్లా: మద్యం షాపులకు లక్కీ డ్రా కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. షాపులు దక్కించుకున్న అదృష్టవంతుల ముఖాల్లో సంతోషం వెల్లివిరియగా.. దక్కని వారు ఒకింత నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. హైదరాబాద్, సికింద్రాబాద్, సరూర్నగర్, శంషాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ ఎకై ్సజ్ డివిజన్ల పరిధిలో మొత్తం 693 మద్యం షాపులకు టెండర్లు పిలవగా.. 36,266 దరఖాస్తులు అందాయి. ఆయా షాపులకు సోమవారం లక్కీ డ్రా నిర్వహించారు. సరూర్నగర్ డివిజన్లోని 138 మద్యం షాపులకు శంషాబాద్ మల్లిక కన్వెన్షన్లో నిర్వహించిన లక్కీ డ్రాలో కలెక్టర్ సి.నారాయణరెడ్డి పాల్గొనగా, శంషాబాద్ డివిజన్ పరిధిలోని 111 షాపులకు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సమక్షంలో డ్రా నిర్వహించారు. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని 97 షాపులకు బంజారాహిల్స్లోని బీజేఆర్ భవన్లో నిర్వహించిన లక్కీడ్రా కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని 82 షాపులకు అదనపు కలెక్టర్ ముకుందరెడ్డి డ్రా నిర్వహించారు. షాపులు దక్కించుకున్న మహిళలు ఇక మేడ్చల్ జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి, అదనపు కలెక్టర్ రాధిక గుప్తా ఆయా డివిజన్ల పరిధిలోని మద్యం షాపులకు నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమంలో పాల్గొన్నారు. మద్యం షాపులకు నిర్వహించిన ఈ టెండర్ల ద్వారా ప్రభుత్వానికి రూ.1,087.98 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఎకై ్సజ్శాఖ అధికారులు ప్రకటించారు. షాపులు దక్కించుకున్న వ్యాపారులు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు చెల్లించి షాపులను సొంతం చేసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. డిప్యూటీ కమిషనర్లు అనిల్ కుమార్రెడ్డి, పి.దశరథ్, డిప్యూటీ సూపరింటెండెంట్లు నవీన్, కృష్ణప్రియ, ఉజ్వలారెడ్డి, పంచాక్షరి, ఏఈఎస్లు శ్రీనివాసరావు, స్మితా సౌజన్యతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ధూల్పేటలోని షాపు నంబర్ 72, 75లు భార్యాభర్తలిద్దరూ చెరొకటి చొప్పున దక్కించుకోవడం గమనార్హం. సరూర్నగర్కు చెందిన ఓ మద్యం వ్యాపారి 32 షాపులకు టెండరు వేయగా, ఒక్కటి మాత్రమే దక్కడం విశేషం. మద్యం షాపులు దక్కించుకున్న వారిలో మహిళలు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే 36,266 మందిలో 693 మందే అదృష్టవంతులుగా నిలిచారు. మొత్తం మద్యం షాపులు 693అందిన దరఖాస్తులు 36,266 అదృష్టం వరించిన వారు 693సమకూరిన ఆదాయం(రూ. కోట్లలో) 1,087.98 -
రిజర్వేషన్ల సాధనే లక్ష్యం
షాబాద్: బీసీల రిజర్వేషన్లు సాధించేవరకు ఉద్యమిస్తామని మన ఆలోచన సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కటకం నర్సింగరావు, గౌరవ అధ్యక్షుడు నరసింహగౌడ్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. మండల కేంద్రంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష సోమవారానికి 16వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రిజర్వేషన్ల విషయంలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. న్యాయం జరిగే వరకు పార్టీలకు అతీతంగా బీసీలు సమష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ సాధన సమితి సభ్యులు రాజేందర్గౌడ్, రవీందర్, నర్సింహులు, రమేష్ యాదవ్, రాము, కుమ్మరి దర్శన్, సురేష్, నారాయణ, క్మురి శ్రీనివాస్, సురేందర్, తదితరులున్నారు. -
ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ‘సత్తు’
యాచారం: రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా సత్తు పాండురంగారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పరిధి కుర్మిద్ద ఉన్నత పాఠశాల హెచ్ఎంగా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో కార్యదర్శిగా నియమించినందుకు సంఘం పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తి అదృశ్యం శంకర్పల్లి: కూలీ పనుల కోసం వెళ్లి, ఓ వ్యక్తి అదృశ్యం అయ్యాడు. శంకర్పల్లి ఎస్ఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్కు చెందిన విఠల్(35), సునీతలు దంపతులు. వీరికి కొడుకు, కుమార్తె ఉన్నారు. బతుకుదెరువు కోసం మండల పరిధి మహాలింగాపురం గ్రామంలో నివాసం ఉంటూ.. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజు మాదిరిగానే ఆదివారం కూలీ పనులకు వెళ్లిన విఠల్.. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఆచూకీ తెలియరాలేదు. సోమవారం విఠల్ భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. యువతి ఆత్మహత్య మంచాల: యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధి ఆరుట్ల గ్రామంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పంబాల నందిని(21), ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. సోమవారం విధులకు వెళ్లలేదు. తండ్రి దుర్గేష్, తల్లి సంతోష కూలి పనికి వెళ్లగా.. ఇంట్లో చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. సాయంత్రం పని ముగించుకొని తండ్రి ఇంటికి వచ్చి చూడగా.. కూతురు విగత జీవిగా వేళాడుతూ కనిపించింది. ఆమె ఆత్మ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. -
పెన్షనరీ డబ్బులు చెల్లించండి
ఇబ్రహీంపట్నం రూరల్: రిటైరైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెన్షనరీ డబ్బులు వెంటనే చెల్లించాలని పెన్షనర్ల అసోసియేషన్ (ఎస్జీపీఏటీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉ.నరేందర్రెడ్డి, సలహాదారు మల్లయ్య డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట సోమవారం అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్చి 2024 నుంచి ఇప్పటి వరకు సుమారు 9వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్ అయ్యారని తెలిపారు. ఒక్కో పెన్షనర్కు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు బకాయి చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. ఎంతో మంది ఇబ్బందులతో అప్పుల పాలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం జీవో విడుదల చేసినా విధివిధానాలు రూపొందించలేదని విమర్శించారు. కార్యక్రమంలో ఎస్జీపీఏటీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపీకృష్ణ, కోశాధికారి తుమ్మల రాంరెడ్డి, కార్యవర్గ సభ్యులు మోహన్రెడ్డి, జనార్దన్ రెడ్డి, అనంతరెడ్డి, సత్యనారాయణరెడ్డి, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట ఆందోళన -
మార్పు రావడం లేదు
షాబాద్: ‘ట్రిపుల్ రైడింగ్ ప్రాణాలకు ముప్పు. వారితో పాటు.. ఎదుటి వారిని ప్రమాదంలో పడేస్తుంది. అది నేరం. బాలబాలికలకు ద్విక్రవాహనాలు ఇవ్వవద్దు. ఇస్తే తల్లిదండ్రులదే బాధ్యత. లైసెన్స్ తప్పనిసరి’ అని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా ప్రజల్లో మార్పు రావడం లేదు. నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. బైకిస్టుల దూకుడు పెరుగుతూనే ఉంది. మైనర్లు, మేజర్లు ముగ్గురు లేదా నలుగురు సైతం ఒకే బండిపై దూసుకుపోతూ.. ప్రమాదంలో పడుతున్నారు. ఇతరులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దీనికి నిదర్శనం ఇక్కడ కనిపిస్తున్న చిత్రాలే. ప్రమాదంలో పడేస్తున్న సరదా షాబాద్ మండలంలో ద్విచక్ర వాహనదారుల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఒక మండలమే కాదు.. ప్రాంతం ఏదైనా ఇదే పరిస్థితి. డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా రయ్.. రయ్ మంటూ దూసుకుపోతున్నారు. ఒకే బైక్పై మైనర్లు, యువతీ యువకులు ముగ్గురికి మించి ప్రయాణిస్తున్నారు. ఇద్దరే వెళ్లాలన్న నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణిస్తే ప్రమాదంలో పడతారని పోలీసులు హెచ్చరిస్తున్నా.. సరదా అంటూ ప్రమాదాన్ని కొనితెచ్చుకొంటున్నారు. పిల్లల సరదా తీర్చడానికి బైక్లు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు సూచిస్తున్నటికీ.. వాటిని చాలామంది పట్టించుకోవడం లేదు.కొందరు పెద్దవారికి తెలియకుండా డ్రైవింగ్ చేస్తున్నారు. ఇలాంటి వారిపై నిఘా పెట్టాల్సినఅవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కఠిన చర్యలు ముఖ్యం ద్విచక్ర వాహనదారులు బాధ్యతగా వ్యవహరించాలని టీఎల్ఏఫ్ జిల్లా లీగల్ అడ్వయిజర్ పీసరి సతీష్రెడ్డి సూచిస్తున్నారు. ట్రిపుల్, ఫోన్లో మాట్లాడుతూ రైడింగ్ చేయడం వలన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొంటున్నారు. ఇలాంటి వారిపై నిఘాపెంచి, తగిన చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. లైసెన్స్ లేని వారిపై చట్టప్రకారం చర్యలు చేపడితే.. త్రిపుల్రైడింగ్, మైనర్లు బైక్ నడపడం వంటివి నివారించవచ్చునని అభిప్రాయం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వీడటం లేదు ట్రిపుల్ రైడింగ్ డేంజర్ దూకుడుగా వ్యవహరిస్తున్న బైకిస్టులు ట్రాఫిక్ నిబంధనలు బేఖాతరు అవగాహన కార్యక్రమాలు పట్టించుకోని వైనంపట్టుబడితే కేసు ట్రిపుల్ రైడింగ్లో ఎవరూ దొరికినా కేసులు పెట్టి, భారీగా జరిమానా విధిస్తున్నాం. తల్లిదండ్రులు.. తమ పిల్లలతో కలిసి కౌన్సెలింగ్కు వస్తే అవగాహన కల్పిస్తాం. ఇలా చేయడం వలన పిల్లల్లో మార్పు వస్తుంది. ట్రిపుల్ రైడింగ్ జోలికి వెళ్లరు. రెండుసార్లు ట్రిబుల్ రైడింగ్లో పట్టుబడితే లైసెన్స్ రద్దుకు సిఫారస్ చేయడంతో పాటు జరిమానాలు విధిస్తాం. కఠిన చర్యలు తీసుకుంటాం. – కాంతారెడ్డి, సీఐ షాబాద్ -
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం
● పోలీసు అమరులను స్మరించుకోవాలి ● ఏసీపీ జానకీ రెడ్డి పహాడీషరీఫ్: శాంతిభద్రతల పరిరక్షణే తమ లక్ష్యమని మహేశ్వరం డివిజన్ ఏసీపీ జానకీ రెడ్డి అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులను నిరంతరం స్మరించుకోవాలని సూచించారు. బాలాపూర్, పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ల ఆధ్వర్యంలో వేర్వేరుగా సోమవారం పోలీస్ సిబ్బంది, విద్యార్థులతో కలిసి ఇన్స్పెక్టర్లు ఎం.సుధాకర్, ఎస్.రాఘవేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో బైక్, సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు. భారత్ చైనా యుద్ధంలో అక్టోబర్ 21న ప్రాణాలు కోల్పోయిన సైనికులు, దేశంలోని అంతర్గత భద్రత కల్పించే విషయంలో అసువులు బాసిన పోలీసులను గుర్తుకు చేసుకునేందుకు ఏటా అక్టోబర్ 21న సంస్మరణ దినోత్సవం జరుపుకొంటున్నామని తెలిపారు. ఈ క్రమంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 21 నుంచి 31 వరకు రోజుకో రీతిలో సంస్మరణోత్సవాలను నిర్వహించనున్నామని పేర్కొన్నారు. రక్తదాన శిబిరాలు, ఓపెన్ హౌజ్, విద్యార్థులకు వ్యాస రచన పోటీలు, బైక్, సైకిల్ ర్యాలీలు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో పహాడీషరీఫ్ ఎస్ఐలు బి.దయాకర్ రెడ్డి, వి.లక్ష్మయ్య, ఎల్.వెంకటేశ్వర్లు, ఫైజల్ అహ్మద్, బాలాపూర్ ఎస్ఐలు కె.సుధాకర్, ఎం.నవీన్ కుమార్, ఎంఎస్ఆర్వీ ప్రసాద్, మహ్మద్ సొహేల్, ఎస్.కోటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. -
పెద్ద చెరువు సుందరీకరణ
ఇబ్రహీంపట్నం: పెద్ద చెరువు కట్టను రూ.18 కోట్లతో సుందరీకరించనున్నట్టు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. హెచ్ఎండీఏ, ఇరిగేషన్, హెచ్ఆర్డీసీఎల్, పంచాయతీరాజ్, మన్సిపల్, రెవెన్యూ అధికారులతో కలిసి ఇబ్రహీంపట్నం చెరువు కట్టను సోమవారం పరిశీలించారు. సుందరీకరణ కోసం చేపట్టాల్సిన పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని.. అందులో భాగంగా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజల ఆకాంక్షను నెరవేర్చబోతున్నట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం చెరువు కట్టను సుందరీకరించి, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. ఈ పనులు చేపట్టేందుకు అవసరమైన రూ.18 కోట్ల నిధులను హెచ్ఎండీఏ మంజూరు చేసినట్లు చెప్పారు. చెరువు కట్టకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సుందరీకరణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. కట్టపై ఉన్న రక్తమైసమ్మ, కట్ట మైసమ్మ దేవాలయాలు, చిన్న, పెద్ద తూములు, చిన్న చెరువును అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఎస్ఈ రవిశంకర్, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాస్, హెచ్ఎండీఏ ఈఈ రజిత, హెచ్ఆర్డీసీఎల్ ఈఈ మహబూబ్ మియా, పంచాయతీరాజ్ ఈఈ సుందర్శన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, తహసీల్దార్ సునీతారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
‘పటేల్’ జయంతిని ఘనంగా నిర్వహిద్దాం
ఇబ్రహీంపట్నం రూరల్: సర్ధార్ వల్లబాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, జిల్లా యువజన అధికారి ఐసయ్య అన్నారు. కలెక్టరేట్లో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కలెక్టర్, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, అందరి భాగస్వామ్యంతో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఐక్యత పాదయాత్ర ఉంటుందని తెలిపారు. ప్రతి పాదయాత్ర 8 నుంచి 10 కిలోమీటర్లు సాగేలా ప్రణాళిక రూపొందించి అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 మధ్య నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాలో రెండు విడుతల్లో పాదయాత్రలు ఉంటాయన్నారు. కలెక్టర్, అధికారులు, క్రీడకారులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల, కళాశాల విద్యార్థులు, పౌరులు పాల్గొంటారని తెలిపారు. నవంబర్ 2 వరకు జాతీయ స్థాయిలో వ్యాసరచన, లఘుచిత్ర పోటీలు, క్విజ్ పోటీలు వెబ్సైట్ ద్వారా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 1 అక్టోబర్ 2025 నాటికి 15 ఏళ్లు పైబడి 29 సంవత్సరాల లోపు వయస్సు గల యువతీయువకులు అర్హులని చెప్పారు. నవంబర్ 3 నుంచి 20 వరకు రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసి, 21 నుంచి 24 వరకు అధికారికంగా ప్రకటిస్తారన్నారు. 26న జాతీయ స్థాయి విజేతలను ప్రకటిస్తారని వెల్లడించారు. పోటీల ద్వారా జాతీయ స్థాయిలో ఎంపికై న 150 మందికి కేంద్ర యువజన వ్యవహరాలు, క్రీడామంత్రితో కలిసి జాతీయ ఐక్యత పాదయాత్రలో పాల్గొనే అవకాశం కల్పించనున్నట్లు వివరించారు. సమావేశంలో జిల్లా పౌర సంబంధాల అధికారి వెంకటేశం, జిల్లాస్థాయి కమిటీ సభ్యులు మణిభూషణ్, ఎల్లారెడ్డి, నరేష్, అవినాష్రెడ్డి, ఆర్కేపురం సంతోష్, తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి -
ఆర్టీసీ ప్రయాణం సురక్షితం
షాద్నగర్రూరల్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఎంతో సురక్షితమని అగ్నిమాపక కేంద్రం అధికారి జగన్ అన్నారు. పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో సోమవారం డీఎం ఉష ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలు, బస్సుల్లో అగ్నిప్రమాదాలపై ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది, ప్రయాణికులకు అగ్నిమాపక కేంద్రం సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ప్రతి బస్సులో అగ్నిప్రమాదాలను నివారించే సిలిండర్లు ఉంటాయని తెలిపారు. ప్రమాదాలు జరిగిన సమయంలో బయటకు వెళ్లేందుకు అత్యవసర ద్వారం ఉంటుందని, దాని ద్వారా బయటి వ్యక్తులు లోపలికి వెళ్లి ప్రయాణికులను రక్షించొచ్చని, ప్రమాదంలో ఉన్న ప్రయాణికులు బయటకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. ప్రమాదం జరిగినప్పుడు మన చేతుల్లో ఉన్న వస్తువులతో అద్దాలను పగులగొట్టి బయటకు వెళ్లొచ్చని తెలిపారు. ప్రైవేట్ బస్సుల్లో ఇలాంటి అవకాశం ఉండదని చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ నాగులు, అసిస్టెంట్ మేనేజర్ సుధాకర్, సేఫ్టీ వార్డెన్ వెంకటయ్య, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ అర్జున్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
వెంగళరావునగర్: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై మధురానగర్ పీఎస్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఈనెల 26న లక్ష్మీనరసింహనగర్లో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు తమ ప్రచార వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపిరు. ఇదే సమయంలో పాదయాత్ర చేస్తున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి అక్కడికి వచ్చాడు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రచార వాహనం డ్రైవర్ రమేష్ను హెచ్చరిస్తూ, సంజ్ఞలు చేస్తూ వెళ్లాడు. ఈ సంఘటన వీడియో తీసిన కాంగ్రెస్ నేతలు మధురానగర్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శివప్రసాద్ వీడియోను పోలీసులకు అందజేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు నర్సంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డితో పాటు, బీఆర్ఎస్ నేతలు భాస్కర్, ఫయీమ్, నాగరాజు, స్క్రాబ్ రవి, సంతోష్ తదితరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రియాజ్ కుటుంబ సభ్యులను వేధించొద్దు పోలీసులకు హెచ్ఆర్సీ ఆదేశం సిటీ కోర్టులు: పోలీస్ ఎన్కౌంటర్లో మృతి చెందిన రియాజ్ కుటుంబ సభ్యులను వేధించొద్దని పోలీసులను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్ఆర్సీ) ఆదేశించింది. రియాజ్, ప్రమోద్కుమార్ మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబందించి వివరణాత్మక నివేదిక సమర్పించాలని డీజీపీకి స్పష్టం చేసింది. రియాజ్ తల్లి, భార్య, పిల్లలు సోమవారం హెచ్ఆర్సీ ఎదుట హాజరై పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. తమను ఇంట్లోకి అనుమతించడం లేదని, తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. రియాజ్ను ప్రమోద్ రూ.3 లక్షలు డిమాండ్ చేశారని, రూ.30 వేలు చెల్లించగా.. మిగతా మొత్తం ఇవ్వాలని వేధించారన్నారు. ఎన్కౌంటర్ ఘటనపై విచారణ చేస్తున్న కమిషన్ వచ్చే నెల 24న నివేదిక సమర్పించాలని డీజీపీని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, తాజా ఫిర్యాదుతో తదుపరి విచారణను నవంబర్ 3కు వాయిదా వేసింది. ఆలోగా వివరణాత్మక నివేదిక సమర్పించాలని ఆదేశించింది. రియాజ్ కుటుంబ సభ్యులపై ఎటువంటి బలవంతపు చర్యలు, వేధింపులు చేపట్టవద్దని స్పష్టం చేసింది. వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య చందానగర్: ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఒకరు, మానసిక సమస్యలతో బాధపడుతూ మరొకరు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ ఆంజనేయులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చందానగర్ హుడా కాలనీకి చెందిన కాశీ రెడ్డి పురుషోత్తం రెడ్డి (48) ఏడేళ్ల క్రితం కేరళకు చెందిన జైకుమార్ సంతమ్మ రాజన్ బాబుకు రూ.13 లక్షలు అప్పుగా ఇచ్చాడు. పలు మార్లు అడిగినా అతను డబ్బులు తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నాడు. దీంతో మనస్తాపానికి లోనైన పురుషోత్తం రెడ్డి ఈ నెల 27న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భవనంపై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి.. భవనం 14వ అంతస్తు నుంచి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఆంజనేయులు కథనం మేరకు.. సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్కు చెందిన శ్రీనివాసరావు (46) నల్లగండ్లలోని రాంకీ వన్ గెలాక్సీలో భార్య జ్యోతి, ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసముంటున్నాడు. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతను భవనం 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు అతడిని సమీపంలోని సిటిజన్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్ట్మార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
Rangareddy: సెల్ టవర్ ఎక్కి.. కిందకు దూకి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్లో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. అబ్దుల్లాపూర్మెట్లో ఉన్న సెల్ టవర్ ఎక్కి గంటకు పైగా కలకలం సృష్టించాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. అతన్ని కిందకు దింపే యత్నం చేసినప్పటికీ అతను కిందకు దూకేశాడు. అయితే టవర్పై నుంచి దూకే క్రమంలో టవర్కు ఉన్న కడ్డీలు తగిలి కింద బురదలో పడ్డాడు. దాంతో అతనికి తీవ్ర గాయాలవ్వగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతను బిహార్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.అతన్ని కిందకు దింపే ప్రయత్నంలో భాగంగా పోలీసులు.. 108 అంబులెన్స్ సర్వీస్ను, డాక్టర్లను అక్కడ అందుబాటులో ఉంచారు. అయితే పోలీసు సిబ్బందిలో ఒకరు మెల్లగా పైకి ఎక్కి ఆ వ్యక్తిని కిందకు దింపే యత్నం చేశారు. అతన్ని పట్టుకుని పైకి లాగుదామనుకునేలోపే చేయి విదిల్చుకుని కిందకు దూకేశాడు ఆ బిహార్ వ్యక్తి. అసలు టవర్ ఎక్కి ఎందుకు దూకాలనుకున్నాడనే విషయం తెలియాల్సి ఉంది. అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఫలించిన పోరాటం
షాద్నగర్: పౌల్ట్రీ పరిశ్రమను వ్యవసాయ అనుబంధ రంగంగా పరిగణించి ఆస్తి పన్ను రద్దు చేయాలని పౌల్ట్రీ రైతులు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేశారు. పలుమార్లు మంత్రులను, అధికారులను కలిసి మొరపెట్టుకున్నా ఫలితం లేదు. ఎట్టకేలకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా షాద్నగర్లో 118 మంది పౌల్ట్రీ రైతులకు రూ.5 కోట్లకు పైగా ఆస్తి పన్ను బకాయి రద్దు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఆంధ్రా నుంచి వలస వచ్చి.. 40 ఏళ్ల క్రితం ఆంధ్రా ప్రాంతం నుంచి సుమారు 150 మంది రైతులు షాద్నగర్కు వలస వచ్చారు. ఫరూఖ్నగర్ మండలం చటాన్పల్లి శివారులో ఎంపీ శేషయ్యనగర్తోపాటు సోలీపూర్, రాయికల్, చిల్కమర్రి, బూర్గుల తదితర గ్రామాల్లో పౌల్ట్రీలను ఏర్పాటు చేసుకున్నారు. లేయర్ కోళ్ల ఫారాలు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. కోట్ల విజయ భాస్కర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పౌల్ట్రీని వ్యవసాయ అనుబంధరంగ సంస్థగా గుర్తించి ఆస్తి పన్ను రద్దు చేశారు. అప్పటి నుంచి రైతులు తమ ఇళ్లకు తప్ప పౌల్ట్రీ ఫారాలకు పన్నులు చెల్లించలేదు. విలీనంతో ఇబ్బందులు 2011 ఆగస్టు 24న ప్రభుత్వం మేజర్ పంచాయతీగా ఉన్న షాద్నగర్ను మున్సిపాలిటీగా మార్చారు. శివారులో ఉన్న చటాన్పల్లి, సోలీపూర్ పంచాయతీలను సైతం మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఈ రెండు గ్రామాల పరిధిలో ఏర్పాటు చేసిన పౌల్ట్రీలకు ఆస్తి పన్ను చెల్లించాలని మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రూ.5కోట్లకు పైగా పన్నులు చెల్లించాల్సిందేనని రైతులపై కోర్టులో కేసులు వేశారు. ఎమ్మెల్యే కృషితో రద్దు బకాయిలు రద్దు చేయాలని కోరుతూ కొన్నేళ్లుగా పౌల్ట్రీ రైతులు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. షాద్నగర్ ప్రాంతానికి విచ్చేసిన మంత్రులు, అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నారు. విషయాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సీఎం రేవంత్రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి 118 మంది రైతులకు సంబంధించి రూ.5.50 కోట్ల పన్నుల బకాయిలు రద్దు చేశారు. ఈమేరకు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టీకే శ్రీదేవి ఈనెల 24న జీఓ 213 జారీ చేశారు. పౌల్ట్రీ రైతుల సంబురాలు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న సమస్య పరిష్కారం కావడంతో పౌల్ట్రీ రైతులు సంబురాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ను ఆదివారం కలిసి కృతజ్ఞతలు తెలిపి సత్కరించారు. పౌల్ట్రీ రైతులకు ఆస్తి పన్ను బకాయిలు రద్దు జీఓ జారీ చేసిన ప్రభుత్వం షాద్నగర్లో 118 మందికి రూ.5 కోట్లకు పైగా లబ్ధి -
లక్కెవరికో!
సోమవారం శ్రీ 27 శ్రీ అక్టోబర్ శ్రీ 2025నేడు కలెక్టర్ల సమక్షంలో మద్యం షాపు దరఖాస్తులకు డ్రా సాక్షి, రంగారెడ్డి జిల్లా: మద్యం షాపుల టెండర్ దరఖాస్తులకు సోమవారం ఉదయం లక్కీడ్రా నిర్వహించనున్నారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్ల సమక్షంలో ఎంపిక చేసిన ఆయా కేంద్రాల్లో ఉదయం 11 గంటలకు ఈ లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సరూర్నగర్, శంషాబాద్ డివిజన్లలోని మద్యం దుకాణాలకు శంషాబాద్ మల్లిక కన్వెన్షన్ సెంటర్లో డ్రా నిర్వహించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలోని షాపులకు జూబ్లీహిల్స్ జేఎస్ఆర్ కన్వెన్షన్లో నిర్వహించనున్నారు. ఇక మేడ్చల్, మల్కాజ్గిరి డివిజన్లలోని షాపులకు పీర్జాదిగూడలోని శ్రీ పల్లవి కన్వెన్షన్లో, వికారాబాద్ డివిజన్లోని షాపులకు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్లో నిర్వహించనున్నారు. దరఖాస్తుదారులు ఉదయం తొమ్మిది గంటలకే ఆయా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంది. తమ వెంట ఎకై ్స జ్శాఖ ఇచ్చిన రసీదులను తీసుకురావాల్సి ఉంది. ఒకవేళ దరఖాస్తుదారు లేనిపక్షంలో ఆథరైజేషన్ లెటర్ తీసుకొచ్చిన వాళ్లను మాత్రమే లోనికి అనుమతించనున్నారు. ఇదిలా ఉంటే దరఖాస్తుదారుల్లో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఉండటం గమనార్హం. సరూర్నగర్ డివిజన్లో 1,732 మంది, శంషాబాద్లో 1,351 మంది మహిళలు ఉన్నారు. లక్కీ డ్రాలో షాపులను గెలుచుకున్న వాళ్లకు డిసెంబర్ నుంచి మద్యం సరఫరా చేయనున్నారు. ఎకై ్సజ్ డివిజన్ మద్యం షాపులు దరఖాస్తులు సరూర్నగర్ 138 7,845 శంషాబాద్ 111 8,536 మేడ్చల్ 118 5,791 మల్కాజ్గిరి 88 6,063 హైదరాబాద్ 80 3,201 సికింద్రాబాద్ 99 3,022 వికారాబాద్ 59 1,808 మల్లికగార్డెన్లో శంషాబాద్, సరూర్నగర్ డివిజన్లకు.. దరఖాస్తుదారుల్లో పెద్ద సంఖ్యలో మహిళలు షాపులను గెలుచుకున్న వారికి డిసెంబర్ నుంచి మద్యం సరఫరా -
ప్రాణాలు పోయినా భూములిచ్చేది లేదు
యాచారం: ప్రాణాలు పోయినా భూములిచ్చేది లేదని మొండిగౌరెల్లి రైతులు స్పష్టం చేశారు. పంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం సమావేశమై తీర్మానించారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములను ఎలా ఇస్తామని ప్రశ్నించారు. భూసేకరణను వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు గ్రామంలోకి వచ్చి సర్వే చేసినా, భూముల్లోకి వచ్చినా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. గ్రామంలోని భూములను ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని తెల్చి చెప్పారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, పలు రాజకీయ పక్షాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. తుర్కయంజాల్: కామ్రేడ్ మహబూబ్ పాషా, నరహరి 36వ వర్ధంతిని పురస్కరించుకుని సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం తుర్కయంజాల్లో వారి చిత్రపటాలకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు డి.కిషన్ మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో దున్నె వాడికే భూమి దక్కాలని అనేక పోరాటాలు చేశారని గుర్తుచేశారు. పాషా, నరహరి స్ఫూర్తితో పాలకవర్గాలు అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎం. సత్యనారాయణ, ఆశీర్వాదం, భాస్కర్, అరుణ్కుమార్, భాస్కర్ రెడ్డి, మాధవ రెడ్డి పాల్గొన్నారు. యాచారం: ఫార్మాసిటీని రద్దు చేస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేసిందని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ నేతలు పేర్కొన్నారు. నక్కర్తమేడిపల్లిలోని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ స్తూపం వద్ద ఆదివారం వారు సమావేశమయ్యారు. సర్కార్కు వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామనే భయంతోనే రైతులు వేసిన నామినేషన్లను తిరస్కరించారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం నామినేషన్లు వేసినా తిరస్కరించడంతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహిస్తామని వెల్లడించారు. ఫార్మాసిటీకి వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మంచాల: మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ మత్స్యకారుల కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చెన్నమోని శంకర్ డిమాండ్ చేశారు. మత్స్యకారుల కార్మిక సంఘం సిల్వర్జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మండలంలోని ఆగాపల్లి, కాగజ్ఘట్ గ్రామాల్లో సంఘం జెండాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేయాలని, మత్స్యకారుల సొసైటీ అభివృద్ధికి రూ.5వేల కోట్లు విడుదల చేయాలని, ఉచితంగా చేప పిల్లలు అందించాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. కబ్జాదారుల నుంచి చెరువులు, కుంటలకు విముక్తి కల్పించాలన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బోధ్రమోని నర్సింహ, పసుల రవీందర్, నాగరాజ్, యాట రమేష్, యాదయ్య, దుర్గయ్య, ధనంజయ్య, అశోక్, వెంకటేశ్, శ్రీశైలం పాల్గొన్నారు. -
ఎవరికి సినిమా చూపిస్తారో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు సినీ కార్మికుల ఓట్లను పొందేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
● వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్ ● సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంతగిరి గుట్టల్లో ట్రయల్ రన్ ఆరోగ్యంతోనే మెరుగైన జీవనంఅనంతగిరి: ఆరోగ్యంతోనే జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణ సమీపంలోని అనంతగిరిగుట్టలో సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో ట్రయల్ రన్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ ప్రతీక్జైన్ జెండా ఊపి రన్ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మానవ జీవితంలో ఆరోగ్యమే ప్రధానమని.. దేశ శ్రేయస్సు ఆరోగ్య వంతమైన జనాభాపై ఆధారపడి ఉంటుందని అన్నారు. అనంతగిరి అటవీ ప్రాంతం ఔషధ మొక్కలకు నిలయమని ఇక్కడి గాలి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు. ఈ ప్రాంతంలో తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ట్రయల్ రన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ అధ్యక్షుడు డాక్టర్ సోమా జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. అనంతగిరి అందాలపై అవగాహన కలిగించడం, ఫిట్నెస్ ప్రమోట్ చేయడం అసోసియేషన్ లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ రన్లో 1,500 మంది వరకు సభ్యులు పాల్గొన్నారని చెప్పారు. కాగా నిర్వాహకులు 5కే, 10కే, 20కే, 32కే రన్ విభాగాల్లో ఉత్తమ ప్రతిభకనబరిచిన వారికి పతకాలు అందించి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్, అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, కోశాధికారి పన్నాల హరిశ్చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మగ్గారి, రేస్ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి, ప్రతినిధులు ప్రీతంరెడ్డి, సునీల్ చెన్నోజు, డాక్టర్ మహేశ్పటేల్, రవి సంబారి, సతీశ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పనుల పరిశీలన అనంతగిరిగుట్టలోని అనంతగిరి ఎకో అర్బన్ పార్క్ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ ప్రతీక్జైన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పార్కు ఎంట్రీ గేట్ పరిశీలించి బాగుందని కితాబిచ్చారు. పనుల్లో వేగం పెంచాలని అధికారు లను ఆదేశించారు. -
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి
బీజేపీ జిల్లా కన్వీనర్ ప్రహ్లదరావు కుల్కచర్ల: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు అన్నారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మన్కీబాత్ కార్యక్రమ వీక్షణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మన్కీబాత్ మండల కన్వీనర్గా పార్టీ మండల అధ్యక్షుడు కొండ ఆంజనేయులును నియమించారు. ఈ సందర్భంగా ప్రహ్లాదరావు మాట్లాడుతూ.. బీజేపీ విధానాలు, మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతికి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించాలన్నారు. మన్కీబాత్ కార్యక్రమంలో ప్రధాని సందేశాన్ని ఎక్కువ మంది వీక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దిశ జిల్లా కమిటీ సభ్యుడు జానకిరాం, నాయకులు పాల్గొన్నారు. -
డక్కలి కులస్తులను ఆదుకోవాలి
షాద్నగర్రూరల్: గుడిసెలు వేసుకొని కాలం వెల్లదీస్తున్న డక్కలి కులస్తులకు వెంటనే డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తిరుమలయ్య డిమాండ్ చేశారు. పట్టణంలోని న్యూసిటీ కాలనీలో డక్కలి కులస్తులు వేసుకున్న గుడిసెలను ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డక్కలి కులానికి చెందిన దాదాపు 60 కుటుంబాలు గుడిసెలు వేసుకొని దుర్భరమైన పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 35 ఏళ్లుగా ఎన్నో రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని హామీలిచ్చి ఓట్లు దండుకుంటున్నాయని విమర్శించారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పక్కా ఇల్లు ఇప్పిస్తానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. గుడిసెల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయాలని భూ యజమానులు ఒత్తిడి చేస్తుండటంతో వారు ఎక్కడికి వెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందని అన్నారు. వారికి మెరుగైన జీవితాన్ని అందించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ శ్రీదేవి, రాంచంద్రయ్య, జంగమ్మ, యాదయ్య, రాములు, వెన్నెల, రేణుక, చంద్రకళ, కవిత, కళమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఎవరికి సినిమా చూపిస్తారో..?
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ నియోజక వర్గం ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. ప్రధాన పార్టీల అభ్యర్ధులు సినీ కార్మికుల ఓట్లను పొందేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. సినీ కార్మికుల మద్దతు కూడగట్టేందుకు మూడు పార్టీల అభ్యర్థులు అందుకు తగిన ప్రచారంతో, హామీలతో ముందుకు వస్తున్నారు. పదుల సంఖ్యలో ఉండే సినీ తారలు, దర్శక నిర్మాతలు, సినీ రచయితలు, కొరియోగ్రాఫర్లు, ఫైట్ మాస్టర్లు, ప్రముఖ నటీ నటులు ఈ నియోజక వర్గంలో లేకపోయినా తెర వెనుక పనిచేసే 24 వేల మంది సినీ కార్మికులు ఈ నియోజక వర్గ పరిధిలోనే ఉంటూ ఓటు హక్కు కూడా కలిగి ఉన్నారు. ఇప్పుడు వీరిని ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. నియోజక వర్గ పరిధిలోని శ్రీకృష్ణానగర్, వెంకటగిరి, రహ్మత్నగర్, యూసుఫ్గూడ, శ్రీనగర్ కాలనీ, బోరబండ, ఎర్రగడ్డ, షేక్పేట తదితర డివిజన్ల పరిధిలో లైట్బాయ్లు, జూనియర్ ఆర్టిస్ట్లు, టెక్నీషియన్లు, ప్రొడక్షన్ సభ్యులు, డ్రైవర్లు ఇలా సినీ షూటింగ్లకు పనిచేసే కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వీరందరికీ చిత్రపురి కాలనీలో ఇళ్ల స్థలాలు కేటాయించినా అక్కడున్న రాజకీయాలు, అవినీతి అక్రమాలు స్వార్థపూరిత నాయకత్వంతో వేలాది మంది కార్మికులకు ఇళ్లు దక్కలేదు. అంతేకాదు వీరికి ఆరోగ్య బీమా సౌకర్యం కూడా లేకుండా పోయింది. ప్రభుత్వాలు మారినా సినీ కార్మికుల తలరాతలు మాత్రం మారడం లేదు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి జీవితాలు మారుస్తామని నేతలు హామీ ఇవ్వడమే తప్ప ఏ ఒక్కరు చొరవ చూపింది లేదు. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నిక నేపథ్యంలో మరోసారి ఆయా పార్టీల అభ్యర్ధులకు సినీ కార్మికులు గుర్తుకు వస్తున్నారు. పరిశ్రమతో ముగ్గురికీ అనుబంధం సినీ పరిశ్రమతో బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీత భర్త మాగంటి గోపీనాథ్కు మంచి సంబంధాలు ఉండేవి. ఆయన రవన్న, పాతబస్తీ అనే రెండు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. మొదటి నుంచి సినీ వర్గాలతో మంచి సంబంధాలు నెలకొల్పారు. కార్మిక సంఘాలతోనూ అనుబంధం ఉంది. అంతే కాకుండా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా సినీ కార్మికులతో సంబంధాలు ఎక్కువగానే ఉన్నాయి. దీంతో కార్మికుల మద్దతు పొందేందుకు బీఆర్ఎస్ తగిన వ్యూహాలు రచిస్తోంది. ● కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్కు గత నాలుగు దశాబ్ధాలుగా సినీ కార్మిక సంఘాలతోనూ, వర్కర్స్తోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్కు పలుమార్లు సార్లు సలహాదారుగా పని చేశారు. ఆయన తనయుడు వెంకట్ హీరోగా సినిమాలు కూడా నిర్మించారు. సినీ హీరో సుమన్, ఆయనకు మద్దతుగా ప్రచారం కూడా చేస్తున్నారు. దీంతో సినీ కార్మికుల మద్దతు ఎక్కువగా తమకే ఉంటుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ● బీజేపీ అభ్యర్ధి లంకల్ దీపక్రెడ్డి గతంలో టీడీపీలో ఉండేవారు. అప్పటి నుంచే సినీ పరిశ్రమతో ఆయనకు మంచి సంబంధాలు ఉండటమే కాకుండా కార్మిక నాయకులతోనూ సంబంధాలు కొనసాగిస్తున్నారు. సినీ కార్మికుల మద్దతును కూడగట్టేందుకు ఆయన తన పాత పరిచయాలను వినియోగించుకుంటున్నారు. ● గత మూడు నాలుగు రోజులుగా ఆయా పార్టీల అభ్యర్ధులు సినీ కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో తమకు ఓట్లు వేయాలంటూ సినీ కార్మికులతో పాటు వారి నాయకులను కూడా అభ్యర్ధిస్తున్నారు. సినీ తారలతో సినీ కార్మికులు ఉండే ప్రాంతాల్లో రోడ్షోలు నిర్వహించాలని కూడా యోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో పరిశ్రమకు చెందిన ప్రముఖులను తమ పార్టీలో చేర్చుకోవడమే కాకుండా వారితో ప్రచారం నిర్వహించాలని కూడా భావిస్తున్నారు.. మొత్తానికి మొట్ట మొదటిసారిగా సినీ కార్మికుల మద్దతు కూడగట్టేందుకు వారిని ఆకట్టుకునేందుకు , బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఆ దిశగా ప్రచారం కూడా చేయాలని వారి సమస్యలను పరిష్కరిస్తామని, హామీ ఇవ్వాలని కూడా వీరు పేర్కొంటున్నారు. నియోజక వర్గం పరిధిలో పెద్ద సంఖ్యలో సినీ కార్మికులు ఉంండే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించిన అభ్యర్థులు, ఆ ఆప్రాంతాల్లో తమకు స్నేహితులైన హీరోలతో ప్రచారం చేయించనున్నారు. సుమారుగా 24 వేల మంది సినీ కార్మికులు ఉన్న ఈ నియోజక వర్గంలో నవంబర్ 11న మెజార్టీ కార్మికులు ఎవరి వైపు మొగ్గుతారో వేచి చూడాల్సి ఉంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీరికి ఇళ్లు దక్కకపోగా భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన వారికి ఇళ్లు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం, ప్రత్యేక తెలంగాణ రావడం జరిగిపోయింది. ఇప్పుడు కార్మికులంతా ఎవరివైపు మొగ్గుచూపుతారో చూడాల్సి ఉంది. 24 వేల మంది సినీ కార్మికుల మద్దతు కూడగట్టేందుకు యత్నాలు సినీ తారలతో ప్రచారం చేయాలని ప్రణాళికలు జూబ్లీహిల్స్లో కార్మికుల చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు -
భవనం పైనుంచి పడి కార్మికుడి మృతి
● గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం తరలింపు ● అడ్డుకొని కేసు నమోదు చేసిన పోలీసులు ఇబ్రహీంపట్నం: నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి ప్రమాదవశాత్తు ఓ వలస కార్మికుడు కింద పడి మృతి చెందాడు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఒడిశా రాష్ట్రానికి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో కేసు నమోదు చేసిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేందర్రెడ్డి, సీఐటీయూ యూనియన్ నాయకుడు ఎల్లేశ్ తెలిపిన వివరాల ప్రకారం... ఒడిశాలోని నబ్బరంగాపూర్ జిల్లా దమ్మన్నగూడ గ్రామానికి చెందిన దివాకర్ బత్ర(26) రెండు నెలలుగా శేరిగూడ సమీపంలోని శ్రీ ఇందు ఇంజనీరింగ్ కాలేజ్లో నిర్మాణంలో ఉన్న భవనానికి సెంట్రింగ్ పని చేస్తున్నాడు. శనివారం అతడు ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కిందపడి ప్రాణాలు కోల్పొయాడు. పోస్టుమార్టం చేయకుండా, ఆ కుటుంబానికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని ఆ కళాశాల యాజమాన్యం మృతదేహాన్ని ఒడిశాకు తరలిస్తున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో శవాన్ని ఇబ్రహీంపట్నంకు రప్పించి కేసు నమోదు చేసి ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ మహేందర్రెడ్డి తెలిపారు. రూ.20 లక్షలు ఇవ్వాలి మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సీఐటీయూ మున్సిపల్ కార్యదర్శి ఎల్లేశ్ డిమాండ్ చేశారు. కార్మికుడి మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు యత్నించిన కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. -
సాహిత్యం సమాజ శ్రేయస్సును కాంక్షించాలి
అఖిల భారత జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు వెంకట్రెడ్డిఅనంతగిరి: సాహిత్యం సమాజ శ్రేయస్సును ఆకాక్షించాలని అఖిల భారత జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు, ఓయూ విశ్రాంత తెలుగు శాఖా ధిపతి ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్లోని సంకల్ప విద్యాపీఠం పాఠశాల ఆడిటోరియంలో పద్యపద భారతి సాహిత్య సంస్కృతిక కళా వేదిక ఆధ్వర్యంలో రిటైర్డ్ డైట్ ప్రిన్సిపాల్ బందెప్పగౌడ్ రచించిన సాయి శతకం ప్రకృతి వైద్య శతకాలను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కసిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. శతకం పాల్కురికి సోమన కాలం నుంచి నేటి వరకు సమాజ హితాన్ని ఆవిష్కరించిందన్నారు. కవి తన చుట్టూ సమస్యలు, జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించి పద్య, గేయ, వచన రూపంలో కవిత్వాన్ని వెలువరిస్తారని చెప్పారు. కవులు తమ శతకాలు, రచనల ద్వారా సమాజానికి జ్ఞానాన్ని అందించి మానవీయ విలువలను పెంపొందించాల న్నారు. రిటైర్డ్ డైట్ ప్రిన్సిపాల్ చంద్రప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. మానవులు ప్రపంచీకరణ నేపథ్యంలో పూర్వ భారతీయులు చెప్పిన ఆహార నియమాలు విడిచిపెట్టి పాశ్చాత్య పోకడలకు పోవడంతోనే రోగాల బారిన పడుతున్నారని చెప్పారు. భారతీయ వైద్య ఆయుర్వేద విధానానికి పూర్వ వైభవం తీసుకొచ్చి ఆధునీకరించి ప్రజలకు దగ్గర చేయాలని సూచించారు. కార్యక్రమంలో కవులు, రచయితలు డాక్టర్ తూర్పు మల్లారెడ్డి, గంటా మనోహర్రెడ్డి, డాక్టర్ బాగయ్య, శతవ ధాని మలుగ అంజయ్య, ధన్శెట్టి, రాఘవేంద్రాచార్యులు, లాల్రెడ్డి, విశ్వనాథం, సుధాకర్గౌడ్, డాక్టర్ రాజు, రెడ్యా రాథోడ్, శ్రీనివాస చారి, దివాకర్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
మూన్వాకర్పై స్పెషల్ డాక్యుమెంటరీ
తాండూరు వాసి వంశీకృష్ణకు దక్కిన అరుదైన అవకాశం తాండూరు టౌన్: పట్టణంలోని వాల్మీకినగర్లో మూన్వాకర్గా పేరొందిన వంశీకృష్ణపై ప్రముఖ జాతీయ మీడి యా ఇండియా టీవీలో నవంబర్ 1న డాక్యుమెంటరీ ప్రసారం కానుంది. డ్యాన్సర్ మైఖేల్ జాక్సన్ను అనుసరిస్తూ పెరిగిన వంశీకృష్ణ మూన్వాక్తో పాటు పలు రకాల నృత్యాలు, యోగ, సింగర్, కరాటే సాధన వంటివి అలవర్చుకున్నాడు. గతంలో 2015లో మైఖేల్ జాక్సన్ పుట్టిన రోజైన ఆగస్టు 29న గంటలో 4.238 కిలోమీటర్లు మూన్వాక్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించాడు. 2016లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించిన దేశ ప్రముఖులతో పాటు వంశీకృష్ణ వివరాలు ప్రస్తావించారు. 2017 నవంబర్ 12న న్యూఢిల్లీలో సిరిఫోర్ట్ ఆడిటోరియంలో వివిధ దేశాల రికార్డు ప్రతినిధులచే అంతర్జాతీయ వీఐపీ హోదాని, 2019లో 315 పదాలతో ఏకధాటిగా ఫాస్టెస్ట్ ర్యాప్ సింగింగ్ చేసి రికార్డు సాధించాడు. 2021లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 5 నిమిషాల 19 సెకండ్ల పాటు గరుడాసనం వేసి రికార్డు సొంతం చేసుకున్నాడు. -
పత్తి రైతు దిగాలు
● కురుస్తున్న వర్షాలకు తడుస్తున్న పంట ● పొలాల్లోనే రాలిపోతున్న తెల్ల బంగారం ● దిగుబడిపై తీవ్ర ప్రభావం షాబాద్: ఇటీవల కురుస్తున్న వర్షాలకు పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చేనుపైనే పత్తి తడిసి ముద్దయింది. పగలు కాస్తున్న ఎండలకు ఆరిపోవడంతో పత్తిలో నాణ్యత దెబ్బ తింటుంది. తెల్ల బంగారంగా పిలువబడే ఈ పంటను చేవెళ్ల డివిజన్లో అత్యధికంగా రైతులు సాగు చేస్తుంటారు. కొన్నేళ్లుగా సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. అయితే ఈసారి పత్తికి కాలం కలిసి రాలేదనే చెప్పాలి. వానాకాలం సీజన్ ప్రారంభంలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. తీరా పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న వానలతో కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 31,220 ఎకరాల్లో సాగు ఈ సీజన్లో చేవెళ్ల డివిజన్లో 31,220 ఎకరాలకు పైగా పత్తి సాగు చేసిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అయితే విత్తనాలు వేసిన సమయంలో సరైన వర్షాలు కురవక పోవడంతో పంట ఎదుగుదల లోపించింది. కాయలు కాసిన తర్వాత కురిసిన భారీ వర్షాలకు పంట పొలాల్లో నీరు నిలిచి రంగుమారి దెబ్బతిన్నాయి. ప్రస్తుతం పత్తి పంట ఏరేందుకు సిద్ధంగా ఉంది. పత్తితీత సమయంలో గత ఐదు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో వర్షానికి పత్తి నేల రాలుతోంది. పంట దెబ్బతినడంతో పాటు నాణ్యత లోపిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట బరువు కూడా తగ్గి పోతుందని వాపోతున్నారు. ఎకరా విస్తీర్ణంలో పత్తి పంట వేసిన నాటి నుంచి పంట తీసి మిల్లుకు తరలించే వరకు రూ.40వేల నుంచి రూ.50వేల వరకు పెట్టుబడి అవుతోంది. ఎకరాకు పంట బాగా పండితే 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడివచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులతో అందుకు భిన్నంగా కేవలం 5 క్వింటాళ్లలోపే వచ్చే అవకాశాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. తేమ ఆధారంగా మద్దతు ధర పత్తి పంటను కొనుగోలు చేసేందుకు సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. క్వింటాల్కు రూ.8,110 చొప్పన మద్దతు ధరను నిర్ణయించారు. సీసీఐలో అమ్ముకునేందుకు తప్పనిసరిగా 8 నుంచి 12 తేమ శాతం లోపు ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉంటే అమ్ముకునేందుకు వీలు ఉండదు. తేమ శాతాన్ని బట్టి మద్దతు ధరను నిర్ణయించనున్నారు.దెబ్బతింటోంది జూన్ మొదటి వారంలో పత్తిని సాగు చేశా. పత్తి మొదటి తీత సమయంలోనూ వర్షంతో చేనుపైనే తడిసింది. ప్రస్తుతం రెండోతీత తీద్దామని అనుకుంటుండగానే వర్షం కురుస్తోంది. వర్షాలతో పత్తి నాణ్యత దెబ్బతినడంతో పాటు, మొలకెత్తే ప్రమాదం పొంచి ఉంది. – నర్సింహారెడ్డి, రైతు, మన్మర్రి, షాబాద్ పరిహారం ఇవ్వాలి అధిక వర్షాలతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. ప్రభుత్వం క్వింటాల్కు కనీసం రూ.12 వేలు నిర్ణయించాలి. ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడే వస్తోంది. దీంతో వెచ్చించిన పెట్టుబడులు వస్తే చాలని భావిస్తున్నాం. దెబ్బతిన్న పంటలపై సర్వే నిర్వహించి నష్టపరిహారం అందించాలి. – శేఖర్, రైతు, తిమ్మారెడ్డిగూడ, షాబాద్ -
ముగిసిన రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీ
భువనగిరి: భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో శనివారం ప్రారంభమైన 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఆఖరి రోజు నాకౌట్ మ్యాచ్లతో పాటు సెమీఫైనల్, ఫైనల్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. పోటీల్లో ప్రథమ స్థానంలో ఉమ్మడి వరంగల్ జిల్లా, ద్వితీయ స్థానంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, తృతీయ స్థానంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్లు నిలిచాయి. విజేతలకు కళాశాల ప్రిన్సిపాల్ కరుణాకర్రెడ్డి ట్రోఫీలు అందజేశారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన 15 మంది క్రీడాకారులను మధ్యప్రదేశ్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో వాలీబాల్ పోటీల రాష్ట్ర పరిశీలకుడు ప్రసాద్, కళాశాల పరిశీలకుడు శ్రీనివాస్రెడ్డి, అధ్యాపకులు, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు. ద్వితీయ స్థానంలో జిల్లా జట్టు -
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
బండ్లగూడ: ప్రజలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. ద్వారా ఫౌండేషన్ అధ్యక్షులు నీరుడు పవన్సాయి ఆధ్వర్యంలో ఆదివారం కిస్మత్పూర్ హనుమాన్ దేవాలయం వద్ద నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని కొండా విశ్వేశ్వర్రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి తోకల శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. శిబిరంలో పాల్గొన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశామన్నారు. ఈ కార్యక్రమలో భీమార్జున్రెడ్డి, తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ కార్పొరేటర్ ప్రశాంత్నాయక్, బీజేపీ సీనియర్ నాయకులు లింగంగౌడ్, సురేష్ముదిరాజ్ పాల్గొన్నారు. మైలార్దేవ్పల్లి: ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై కిషోర్ వివరాల ప్రకారం..హైదర్గూడ ఎర్రబోడ ప్రాంతానికి చెందిన హరిణి(20) రెండ్రోజుల క్రితం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఎంతకీ రాలేదు. బంధువులు, స్నేహితులతో ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రమాదాల నివారణకు చర్యలు
యాచారం: నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలు వాహనాల రాకపోకలు కనిపించకుండా ప్రమాదకరంగా మారాయి. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి నివారణ చర్యల కోసం నడుం బిగించారు. సాగర్రోడ్డుపై తక్కళ్లపల్లి గేట్ నుంచి తమ్మలోనిగూడ గేట్ వరకు రోడ్డుకిరువైపులా పెరిగిన చెట్ల కొమ్మలను పోలీస్ సిబ్బందిచే తొలగించేశారు. జేసీబీతో చదును చేయించారు. వాహనాల తనిఖీలు సాగర్రోడ్డుపై మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం సీఐ నందీశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. అదే విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మధు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.రోడ్డుకిరువైపులా చెట్ల కొమ్మల తొలగింపు -
బీఆర్ఎస్ నాయకుడిపై కేసు నమోదు
ఆమనగల్లు: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిపై అభ్యంతరకరమైన వీడియో వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసిన బీఆర్ఎస్ నాయకుడిపై కేసు నమోదు చేసినట్లు ఆమనగల్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. మా బాకీ ఎప్పుడు తీరుస్తారు అంటూ ఎమ్మెల్యేపై అభ్యంతరకరమైన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన మండలంలోని శెట్టిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కోట్ల సాయిబాబాపై మేడిగడ్డ తండాకుచెందిన హరిలాల్నాయక్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ చెప్పా రు. సోషల్మీడియాలో అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే వీడియోలు పోస్టుచేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంట్లో నుంచి వెళ్లి అదృశ్యం మీర్పేట: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి కనిపించకుండా పోయిన సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. నందనవనం హనుమాన్నగర్ వనజ ఉషోదయ అపార్ట్మెంట్లో నివసించే నాగేశ్వర్రావు (70)కు మానసిక స్థితి సరిగా లేదు. మూడు రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం బంధువులు వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులపై దాడికి యత్నం ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు అంబర్పేట: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వ హిస్తున్న ట్రాఫిక్ పోలీసులపై దాడికి యత్నించిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన అంబర్పేట పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం రాత్రి అంబర్పేట, రామంతాపూర్ రోడ్డులోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వద్ద కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అంబర్పేట వైపు నుంచి బైక్పై వెళుతున్న మీసాల శ్రీనివాస్, సురేపల్లి కోటేశ్వర్రావు అనే వ్యక్తులను తనిఖీ చేయగా 100 ఎంఎల్ వచ్చింది. దీంతో వారిని వాహనం పక్కకు తీయాలని ట్రాఫిక్ ఎస్ఐ రాకేష్, కానిస్టేబుల్ పాండు సూచించారు. దీంతో ఆగ్రహానికి లోనైన వారు పోలీసులతో వాగ్వాదానికి దిగడమేగాక దాడికి యత్నించారు. వివరాలు కూడా చెప్పకుండా మీ అంతు చూస్తామంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై శనివారం ఉదయం ట్రాఫిక్ పోలీసులు అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్వాధీనం చేసుకున్న వాహనాన్ని స్టేషన్లో అప్పగించారు. ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సౌండ్ పొల్యూషన్ చేసిన ఇద్దరిపై కేసు రాజేంద్రనగర్: అర్ధరాత్రి వేళ బ్యాండ్ భాజాలు, డీజేలతో హోరెత్తిస్తున్న ఇద్దరిపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై మామిడి కిశోర్ తెలిపిన వివరాల ప్రకారం..బుద్వేల్తో పాటు రాజేంద్రనగర్ ప్రధాన రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి 11 గంటల సమయంలో పెళ్లి బరాత్ ఊరేగింపును నిర్వహించారు. ఈ ఊరేగింపులో డీజే లతో పాటు పెద్ద ఎత్తున బ్యాండ్ భాజాలను ఉపయోగించారు. రాత్రి 11 గంటలు దాటినా బరాత్ ముగియకపోవడంతో స్థానికులు 100 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డీజేలను స్వాధీనం చేసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. ఇద్దరిపై సౌండ్ పొల్యూషన్ కేసు నమోదు చేశారు. -
భారతి సిమెంట్కు తిరుగులేదు
ఇబ్రహీంపట్నం: సిమెంట్ రంగంలో తిరుగులేని ‘రారాజు భారతి సిమెంట్’ అని ఆ సంస్థ టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్ అన్నారు. వెంకటేశ్వర ట్రెడర్ డీలర్ శేఖర్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఇబ్రహీంపట్నంలో తాపీ మేసీ్త్రల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణ రంగంలో ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో వినియోగదారులకు నాణ్యమైన, దృఢమైన సిమెంట్ను అందజేస్తోందని తెలిపారు. అల్ట్రాఫాస్ట్ పేరుతో ఫాస్ట్ సెట్టింగ్ ఫైవ్ స్టార్ గ్రేడింగ్ సిమెంట్ను మార్కెట్లోకి విడుదల చేసిందన్నారు. ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్తో నిర్మాణ ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని వివరించారు. స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలు, రహదారులకు ఇది సరైన ఎంపిక అని స్పష్టంచేశారు. తమ కంపెనీ సిమెంట్ను వాడే వినియోగదారులకు ఉచిత సాంకేతిక సహాయం అందజేస్తామని, స్లాబ్ కాంక్రీట్ వేసే సమయంలో నిపుణులైన సంస్థ ఇంజనీర్లు సైట్ వద్దకు వచ్చి సాయపడుతారని చెప్పారు. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్ ధరలతో పొలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్ బ్యాగ్కు రూ.20 ఎక్కువగా ఉంటుందన్నారు. డీలర్ శేఖర్రెడ్డి మాట్లాడుతూ.. భారతి సిమెంట్ సర్వీస్ చాలా ఫాస్ట్గా ఉంటుందని తెలిపారు. అనంతరం 30 మంది తాపీ మేసీ్త్రలకు రూ.లక్ష ప్రమాద బీమా బాండ్లు, గిఫ్ట్లు అందజేశారు. అల్ట్రాఫాస్ట్తో ఫాస్ట్ సెట్టింగ్, ఫైవ్ స్టార్ గ్రేడింగ్ వినియోగదారులకు ఉచిత సాంకేతిక సాయం సంస్థ టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్ తాపీ మేసీ్త్రలకు ప్రమాద బీమా బాండ్లు, గిఫ్ట్ల అందజేత -
హైదర్షాకోట్లో హిట్ అండ్ రన్
మణికొండ: రోడ్డు పక్కన నడిచి వెళుతున్న వ్యక్తిని ఓ కారు వెనకనుంచి వచ్చి ఢీ కొట్టి పరారైన సంఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. హైదర్షాకోట్ సెక్టార్ ఎస్సై మల్లేష్యాదవ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హైదర్షాకోట్ గ్రామానికి చెందిన ఎడ్ల కృష్ణ(45) కూలీ పనిచేసేవాడు. శనివారం ఉదయం అతను గ్రామంలోని బొడ్రాయి వద్ద రోడ్డుపై నడిచి వెళుతుండగా వెనక నుంచి వచ్చిన కియా కారు అతడిని ఢీ కొట్టింది. దీంతో అతను కింద పడిపోగా కారు చక్రాలు అతడి తలపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కారు ఆపకుండా పారిపోయాడు. మృతుని సోదరుడు రఘు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన కారును గుర్తించారు. కారుతో కర్నూల్ వైపు పరారైనట్లు గుర్తించి ఓబృందాన్నిపంపామని, త్వరలోనే నిందితుడిని అరెస్టు చేస్తామని ఎస్సై తెలిపారు. ● వ్యక్తిని కారుతో ఢీ కొట్టి పరార్ ● వాహనాన్ని గుర్తించిన పోలీసులు ● పరారీలో నిందితుడు -
ఐసీడీ గోదాములో భారీ అగ్ని ప్రమాదం
మూసాపేట: మూసాపేట గూడ్స్షెడ్ రోడ్డులోని కంటైనర్ కార్పొరేషన్ డిపోలో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపు రూ.కోటి ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. డిజాస్టర్ ఫోర్స్, ఐసీడీ అధికారుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్డులో ఇండియన్ కంటైనర్ కార్పొరేషన్ డిపో కొనసాగుతోంది. వివిధ దేశాల నుంచి వచ్చే దిగుమతయ్యే దినుసులు, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ పరికరాలు, గృహోపకరణాలు, యూరియా, గోధుమలు తదితరాలను గోదాముల్లో భద్రపరచి కస్టమ్స్ క్లియరైన తర్వాత ఆయా వ్యాపారస్తులు వచ్చి తీసుకెళతారు. ఈ నేపథ్యంలో కస్టమ్స్ క్లియర్ కాని విదేశీ మద్యం బాటిళ్లు, మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలను గోదాములో నిల్వ చేశారు. శనివారం ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి గోదాములోని విలువైన వస్తువులు ఆహుతయ్యాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో రాత్రి సిబ్బంది సెక్యూరిటీ ఉన్నతాధికారులతో పాటు ఫైర్ స్టేషన్కు, పోలీసులకు, డీఆర్యఫ్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గత కొన్నేళ్లుగా కస్టమ్స్ క్లియర్ కాని, కాలం చెల్లిన మొబైల్స్ బ్యాటరీలు పేలి మంటలు చెలరేగినట్లు సమాచారం. కూకట్పల్లి, సనత్నగర్, జీడిమెట్ల, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్ ఫైర్ స్టేషన్ల నుంచి 8 అగ్నిమాపక శకటాల ద్వారా 40 మంది సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. -
కరువైన బీమా ధీమా
షాబాద్: రైతుల సంక్షేమమే ధ్యేయమని ప్రభుత్వం ఇస్తున్న హామీలు ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. పాడి పశువులు అనారోగ్యం, ఇతర కారణాలతో మత్యువాతపడితే బీమా సౌకర్యం లేక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. బీమా ఉంటే ఆయా సంస్థల నుంచి గతంలో పశువు రకాన్ని బట్టి రూ.50 వేల వరకు పరిహారం అందేది. ప్రస్తుతం పథకాన్ని నిలిపివేయడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాడి పరిశ్రమే జీవనాధారం జిల్లాలోని అనేక గ్రామాల్లో రైతులకు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ జీవనాధారంగా మారింది. పెద్ద ఎత్తున వ్యవసాయంతో పాటు పశువుల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. పాల ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. డెయిరీలు ఏర్పాటు చేసుకొని పాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ముగిసిన సబ్సిడీ గొర్రెల బీమా నాలుగేళ్ల క్రితం కొత్తగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకానికి గత ప్రభుత్వం మొదటిసారి బీమా సౌకర్యం కల్పించింది. గొర్రెలు పంపిణీ చేసిన ఏడాది తర్వాత బీమా ముగిసింది. తరువాత రెన్యూవల్ చేయకపోవడంతో ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలకు ప్రస్తుతం రెండో విడతలో ఇస్తున్న గొర్రెలకు ఏడాది పాటు బీమా సౌకర్యం కల్పించింది. ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలతో పాటు, రైతుల వద్ద ఉన్న గేదెలు, ఎద్దులు, ఆవులకు సైతం ఎప్పటిలా 50 శాతం నిధులు కేటాయించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పశుబీమా పథకాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అటకెక్కిన పశువుల బీమా పథకం ఆర్థికంగా నష్టపోతున్న రైతులు పట్టించుకోని పాలకులు -
పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత
కుషాయిగూడ: పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతని తెలంగాణ జైళ్లశాఖ డీజీ డాక్టర్ సౌమ్యమిశ్రా అన్నారు. శనివారం చర్లపల్లి ఖైదీల వ్యవసాయక్షేత్రంలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విధిగా ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. అనంతరం ఖైదీల వ్యవసాయక్షేత్రంలోని చెరువులో చేప పిల్లలను వదిలారు. తేనెటీగలు, చేపల పెంపకం, సీడ్ బాల్ పంపిణి పర్యావరణాన్ని సమతుల్యాన్ని పెంచడానికి దోహదపడతాయన్నారు. మొక్కల పెంపకంతో పాటు పర్యావరణ సమతుల్యతను పెంచేందుకు సిబ్బంది చేస్తున్న కృషిని డీజీ అభినందించారు. కార్యక్రమంలో అర్బన్ ఫారెస్ట్ డిప్యూటీ డైరక్టర్ జి. అన్నపూర్ణ, జిల్లా అటవీశాఖ అధికారి ఎం. వేణుమాధవరావు, ఉద్యానశాఖ జాయింట్ డైరక్టర్ బాబు, కాప్రా సర్కిల్ డీసీ జగన్, సుకీర్తి, విష్ణువర్థన్రావుతో పాటుగా జైళ్లశాఖ ఐజీ ఎన్. మురళీబాబు, డీఐజీలు డాక్టర్ డి. శ్రీనివాస్, సంపత్, చర్లపల్లి జైల్, ఓపెన్ జైల్ పర్యవేక్షణాధికారులు ఎన్. శివకుమార్గౌడ్, డి. కాళిదాసు, సీకా ప్రిన్సిపల్ శ్రీనివాస్రెడ్డి, శ్రీమాన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జైళ్లశాఖ డీజీ డాక్టర్ సౌమ్యమిశ్రా -
స్కూల్ బస్సు ఢీకొని యువకుడు మృతి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రైవేట్ స్కూల్ బస్సు బైక్ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. హన్మకొండ జిల్లా ధర్మసాగరం మండలం, నర్సింగ్రావుపల్లికి చెందిన బండారి వినోద్ (22) ఫొటోగ్రాఫర్గా పనిచేస్తుండేవాడు. ఓ హల్దీ ఫంక్షన్కు సంబంధించిన ఫోటోలు తీసేందుకు టీఎస్27ఎఫ్ 3270 స్కూటీపై బొంగ్లూర్ నుంచి ఔటర్ సర్వీస్ రోడ్డు మీదుగా తుక్కుగూడకు వెళ్తున్నాడు. రావిర్యాల శివారులోని కళాంజలి సమీపంలో ఇండస్వాలీ స్కూల్ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. బైక్ పైనుంచి కింద పడిన వినోద్ను రోడ్డుపై కొద్దిదూరం లాక్కెళ్లింది. దీంతో తీవ్రగాయాలైన బాధితుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈసమయంలో బస్సులో విద్యార్థులెవరూ లేరు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వేగంతో ఆగమే!
● నియంత్రణ కొరవడిన వాహన చోదకులు ● లోపించిన స్పీడ్ గవర్నర్ డివైజ్లు ● హైవేలపై దూసుకెళ్తున్న వాహనాలుసాక్షి, సిటీబ్యూరో: జాతీయ రహదారులపై బస్సులు, లారీలు, కార్లు వంటి వాహనాలు రయ్మంటూ దూసుకెళ్తున్నాయి. నిర్దేశిత వేగానికి మించి వెళ్తున్నాయి. ప్రయాణికులను సాధ్యమైనంత త్వరగా గమ్యస్థానానికి చేర్చాలనే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు పోటీపడుతున్నాయి. దీంతో డ్రైవ ర్లు ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోవడంలేదు. రాత్రి వేళ, వర్షం కురుస్తున్న సమయంలో అతివేగంతో వాహనాలు నడుపుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసులు జరిమానాలు విధిస్తున్నా.. ఏమాత్రం చలనం లేనట్టుగా ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. వాహన వేగంపై నియంత్రణ లేక ప్రయాణికుల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. స్పీడ్ గవర్నర్ డివైజ్లు ఎక్కడ? రవాణా, ప్రయాణికుల వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ గవర్నర్ డివైజ్లను ఉపయోగి స్తుంటారు. మన రాష్ట్రంలో వీటి వినియోగం లేదు. మహారాష్ట్ర, ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాల్లో ప్రైవేట్ బస్సుల స్పీడ్కు కళ్లెం వేసేందుకు స్పీడ్ గవర్నర్ డివైజ్లను ఉపయోగిస్తున్నారు. మన దగ్గర కూడా ఉమ్మడి రాష్ట్రంలో బస్సులు తయారు చేసే కొన్ని సంస్థలు స్పీడ్ కంట్రోల్ డివైజ్లను అమర్చేవి. కొన్నేళ్ల పాటు ఇది కొనసాగినా తర్వాత పూర్తిగా వదిలేశారు. దీంతో రాష్ట్రంలో వాహన వేగంపై నియంత్రణ లేకుండా పోయింది. ఏపీలోని కర్నూలులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదం నేపథ్యంలో తెలంగాణలోనూ స్పీడ్ గవర్నర్ డివైజ్ల వినియోగంపై పునరాలోచించాల్సిన ఆవశ్యకత ఉందని వాహన రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కడ.. ఎంత వేగమంటే.. తెలంగాణలో బస్సులు ఎక్స్ప్రెస్ వేలపై గంటకు 100 కిలోమీటర్లు, నాలుగు లైన్ల జాతీయ రహదారులపై గంటకు 90 కిలో మీటర్లు, మున్సిపల్ పరిధిలోకి వచ్చే రోడ్లపై గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలి. ట్రావెల్స్ డ్రైవర్లు ఎక్కడా నిర్దేశిత వేగం నిబంధనలను పాటించడం లేదు. రాత్రి వేళ హైవేలపై అతివేగంగా వాహనాలను నడిపి ప్రయాణికులు, తోటి వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అతివేగంతో నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూ అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. డ్రైవర్లు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని భావించినప్పుడు డయల్ 100కు లేదా సదరు ట్రావెల్స్ హెల్ప్లైన్ నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసర కిట్లు తప్పనిసరి బస్సు ఆపరేటర్లు తరచూ వాహన ఫిట్నెస్ను చెక్ చేయాలి. ప్రయాణికుల కోసం ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిపేలా సూచిక బోర్డులు పెట్టాలి. ప్రమాదాలు జరిగితే వాటిని బద్ధలు కొట్టేందుకు సుత్తి అందుబాటులో ఉంచాలి. ఫస్ట్ ఎయిడ్ చేసే సదుపాయం ఉండాలి. ప్రమాదం జరిగే సమయంలో ప్రయాణికులను అప్రమత్తం చేసే ఎమర్జెన్సీ అలారం కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఓవర్ లోడ్తో బస్సులు నడపొద్దు. 10–12 గంటలపాటు ఏకధాటిగా ఏసీ బస్సులను నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. కంప్రెషర్, కూలింగ్ ఫ్యాన్లు, ఆల్టర్నేటర్ వంటి భాగాలు ఓవర్ లోడ్తో విద్యుత్ కనెక్షన్లు బలహీనపడతాయి. దీంతో మంటలు వ్యాపి స్తుంటాయి. దూర ప్రాంతాలకు వెళ్లేవారు భద్రత విషయంలో రాజీ పడొద్దని ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నారు. -
వణికించిన వరుణుడు
లక్డీకాపూల్: నగరంలో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ కారణంగా నగరంలో శనివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మబ్బులు కమ్ముకున్నాయి. చలిగాలులతో పాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మలక్పేట్, కోఠి, మోజంజాహీ మార్కెట్, అబిడ్స్, హిమాయత్నగర్, ట్యాంక్బండ్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, సికింద్రాబాద్, బేగంపేట్, కూకట్పల్లి, అమీర్పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, ఆరాంఘర్, చాంద్రాయణగుట్ట సహా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్జాం ఏర్పడింది. శేరిలింగంపల్లి చందానగర్లో అత్యధికంగా 5.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈదురుగాలుల తీవ్రతకు పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. వరద నీటితో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ఒకవైపు గుంతలు తేలిన రోడ్లు.. మరోవైపు వరద నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. రోజంతా చినుకులు కురుస్తూనే ఉండటంతో వీధి వ్యాపారులు, సహా అత్యవసర పనులపై బయటికి వెళ్లిన వారు, ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందుల పాలయ్యారు. -
సైబర్ మోసాలతో జాగ్రత్త
● డ్రగ్స్పై ఉక్కుపాదం ● శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం ● సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతిచేవెళ్ల: సైబర్ మోసాలతో అప్రమత్తంగా ఉండాలని సైబారాబాద్ సీపీ అవినాష్ మహంతి అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా శనివారం చేవెళ్ల పోలీస్స్టేషన్ను సందర్శించారు. రికార్డులు, పోలీస్స్టేషన్ పనితీరును పరిశీలించారు. 551 సీసీ కెమెరాలతో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్ నగరాలకే కాదు గ్రామీణ స్థాయికి సైతం విస్తరించిందని, దీనిపై పోలీస్శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని అన్నారు. ప్రజల్లో ఇంకా అవగాహన అవసరమని, సైబర్మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు రక్షణతోపాటు క్రైమ్ రేట్ను తగ్గించేందుకు, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేందుకు, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు చెప్పారు. సైబరాబాద్ పరిధిలో దాదాపు వెయ్యికిపైగా ఫాంహౌస్లు ఉన్నాయని, వీటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఇటీవల పలు కేసులు నమోదు చేసి 90 శాతం ఛేదించినట్టు తెలిపారు. డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు వివరించారు. చేవెళ్లలో కమాండ్కంట్రోల్ రూమ్ తరహాలో మండల కేంద్రంతోపాటు మండలంలోని 21 గ్రామాల్లో కలిపి 551 సీసీ కెమెరాలను, 12 ఎల్ఈడీ స్క్రీన్లను స్థానికుల సహకారంతో ఏర్పాటుచేయడం హర్షణీయమని అన్నారు. ఇన్స్పెక్టర్ భూపాల్ శ్రీధర్, సిబ్బందిని అభినందించారు. ఆయన వెంట రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్, అదనపు డీసీపీ కె.శ్రీనివాస్రావు, చేవెళ్ల ఏసీపీ కిషన్, డీఐ జె.ఉపేందర్, ఎస్ఐలు సంతోష్రెడ్డి, వనం శిరీష, తేజశ్రీ, బి.శీరీష తదితరులు ఉన్నారు. -
ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు
షాద్నగర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమై ప్రయాణికులు సజీవ దహనమైన నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు శనివారం తెల్లవారు జాము నుంచి షాద్నగర్ శివారులోని 44వ జాతీయ రహదారిపై రాయికల్ టోల్ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించారు. బెంగుళూరు నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సులను షాద్నగర్ అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ మహ్మద్ ఫరహాన్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. రవాణా అనుమతి పత్రాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఫైర్ సేఫ్టీ, ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన సీటింగ్, ప్రథమ చికిత్స కిట్స్, అత్యవసర ద్వారాలను పరిశీలించారు. నిబంధనలు పాటించని రెండు బస్సులపై కేసులు నమోదు చేశారు. -
దుకాణ కేటాయింపులకు దరఖాస్తుల ఆహ్వానం
తుక్కుగూడ: ఖాళీగా ఉన్న దుకాణా సముదాయాలను అద్దెకు ఇవ్వడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార సంఘం అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని మహేశ్వరం 01, యాచారం 05, శంషాబాద్ 05, సాహెబ్నగర్ 03 ప్రభుత్వం నిర్మించిన దుకాణ సముదాయలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వీటిని షెడ్యూల్ కులాల వారికి నెలవారీ అద్దెకివ్వనున్నట్టు చెప్పారు. స్థానికతతో పాటు 18 నుంచి 35 ఏళ్ల వయస్సు లోపు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు వచ్చేనెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. చేవెళ్ల: వైద్యవృత్తి ఎంతో పవిత్రమైందని మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. చేవెళ్లలోని డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి జనరల్ ఆస్పత్రి, మెడికల్ కళాశాలలో శనివారం ‘అధ్యాయ 2025’ పేరుతో కళాశాల ఫెస్ట్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పట్నం మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థులు ప్రజలకు మెరుగైన సేవలు అందించి మంచి వైద్యులుగా గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. మెరుగైన వైద్యం అందించే వైద్యులను ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు. అనంతరం క్రీడల్లో, విద్యలో రాణించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జోయారాణి, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వర్రావు, అధ్యాపక బృందం, సిబ్బంది పాల్గొన్నారు. నందిగామ: మండల పరిధిలోని కన్హా శాంతి వనంలో బీజేపీ సీనియర్ నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి నివాసానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ శనివారం వచ్చారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొని కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దత్తాత్రేయను విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి, నర్సింహయాదవ్, మోహన్ సింగ్, సుధాకర్ అప్ప, బల్వంత్ రెడ్డి, మహేందర్ రెడ్డి, రాజు, బోయ అశోక్, అనిల్ కుమార్ గౌడ్, రాజు నాయక్, కుమ్మరి మహేశ్, ప్రతాప్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నవాబుపేట: అనారోగ్యంతో ఓ యువ సైనికుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని వట్టిమీనపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మోముల వెంకట్రాంరెడ్డి(30) ఎనిమిదేళ్ల క్రితం ఆర్మీలో చేరాడు. రెండేళ్ల క్రితం మనీషాను వివాహం చేసుకొని ఢిల్లీలో ఉంటున్నాడు. ఉన్నట్లుండి అనారోగ్యానికి గురికావడంతో ఆర్మీ ఆస్పత్రిలో చేరాడు. అతనికి బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతదేహాన్ని శనివారం నగరంలోని శంషాబాద్లో కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం గ్రామానికి తరలించి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య గ్రామానికి చేరుకొని పాడె మోసారు. మృతుడికి తండ్రి మోహన్రెడ్డి, తల్లి సావిత్రమ్మ, భార్య మనీషా, సోదరుడు శశివర్ధన్రెడ్డి ఉన్నారు. -
రుధిర దారులు
యాచారం: జిల్లాలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిత్యం ఏదో ఓ చోట జరుగుతున్న యాక్సిడెంట్లతో ప్రయాణికులు, వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. అజాగ్రత్త, అతివేగం, నిద్ర, మద్యం మత్తు, ఓవర్ లోడ్ వీటికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా శుభకార్యాలు, పర్యాటక ప్రాంతాలు, స్వగ్రామాలకు వెళ్తున్న వారు ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయంభయంగా ప్రయాణం సాగిస్తున్నారు. ప్రమాదాల బారిన పడిన వారిలో కొంతమంది ప్రాణాలు కోల్పోతుండగా మరికొందరు క్షతగాత్రులుగా మిగిలి, బతకలేక, చావలేక అన్నట్లు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. తనిఖీలు చేపడుతున్నా.. రాచకొండ సీపీ సుధీర్బాబు ఆదేశాల మేరకు గతంలో ఎన్నడు లేని విధంగా ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో నిత్యం ఉదయం, సాయంత్రం వేళ తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీఐల పర్యవేక్షణలో డ్రైవింగ్ లైసెన్స్లు, ఆర్సీలు, వాహనాల నంబరు ప్లేట్లు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ ఓవర్లోడ్ తదితర అంశాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. పలు సందర్భాల్లో సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేయడంతో పాటు, జరిమానా విధిస్తున్నారు. దీంతో పరిస్థితిలో కొంత మార్పు వచ్చినా పూర్తిస్థాయిలో బ్రేక్ పడటం లేదు. దీంతో ఇంటింటికీ తిరిగి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలనే దిశగా పోలీసులు ఆలోచన చేస్తున్నారు. తొమ్మిది నెలల్లో 68 మంది మృతి ఇబ్రహీంపట్నం డివిజన్లో గత తొమ్మిది నెలలుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 68 మంది మృతి చెందినట్లు రికార్డులు చెబుతున్నాయి. డివిజన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, ఆదిబట్ల, మాడ్గుల, హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ల పరిధిలో జరిగిన ప్రమాదాలకు సంబంధించి 206 కేసులు నమోదయ్యాయి. ఇందులో 68 మంది మృతి చెందగా, 138 మంది క్షతగాత్రులుగా మారి కాళ్లు, చేతులు కోల్పోయారు. కుటుంబాన్ని పోషించే వీరు వైకల్యంతో దిక్కుతోచని స్థితికి చేరుతున్నారు. ఫలితంగా బాధిత ఫ్యామిలీలు రోడ్డున పడుతున్నాయి. ఇబ్రహీంపట్నం డివిజన్(ఏసీపీ) పరిధి నాగార్జునసాగర్– హైదరాబాద్ రహదారిపై దాదాపు 50 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సాగర్ హైవే ఇబ్రహీంపట్నం మండల కేంద్రం సమీపంలో ఖానాపూర్ గేట్ నుంచి మాల్ వరకు సింగల్ రోడ్డే ఉండడంతో అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రాణాలు హరిస్తున్న రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారిన వైనం అతివేగం, అజాగ్రత్త, మద్యం, నిద్ర మత్తు, ఓవర్ లోడింగే ప్రధాన కారణం పోలీసులు తనిఖీలు చేస్తున్నా పూర్తి స్థాయిలో మారని పరిస్థితిపీఎస్ కేసులు మృతులు క్షతగాత్రులు ఇబ్రహీంపట్నం 59 14 45 మంచాల 23 4 19 యాచారం 40 15 25 ఆదిబట్ల 63 28 35 మాడ్గుల 11 5 6 గ్రీన్ ఫార్మాసిటీ 10 2 8వ్యక్తిగత నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలు డ్రైవింగ్ చేసే వారు జాగ్రత్తగా నడపాలి. అతి వేగం, పరిమితికి మించి ప్రయాణికులకు ఎక్కించుకోవడంతో వాహనాలు అదుపు తప్పుతున్నాయి. బైక్ నడిపేవారు కచ్చితంగా హెల్మెట్లు ధరించాలి. ప్రజల్లో మార్పు కోసం విసృత్తంగా తనిఖీలు చేపట్టి అవగాహన కల్పిస్తున్నాం. నింబంధనలు ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. – కేపీవీ రాజు, ఏసీపీ, ఇబ్రహీంపట్నం -
లెక్క తప్పింది.. తెలంగాణ ఎక్సైజ్కు చుక్కెదురు!
సాక్షి, రంగారెడ్డి: ఆబ్కారీ శాఖ అంచనా తప్పింది. ఇబ్బడిముబ్బడిగా వచ్చే దరఖాస్తులతో దండిగా రాబడి ఉంటుందని భావించిన ఎక్సైజ్ శాఖకు చుక్కెదురైంది. ఆదాయంలో తేడా రాకున్నా.. దరఖాస్తుల నమోదులో మాత్రం భారీ వ్యత్యాసం కనిపించింది. గతంతో పోలిస్తే ఏకంగా పదివేల దరఖాస్తులు తక్కువ రావడంతో అధికారులను నివ్వెరపోయేలా చేసింది.అయితే, దరఖాస్తు ధర రూ.3 లక్షలు నిర్దేశించడంతో ఇది ఆదాయాన్ని గణనీయంగా పెంచింది. మద్యం షాపులకు దరఖాస్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనా వేసింది. కానీ ఇందుకు భిన్నంగా 10,673 దరఖాస్తులు తక్కువ వచ్చాయి. కాగా, దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచడంతో ఆదాయం కొంత పెరిగినట్లు కన్పించినా.. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయ కిక్కు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం సహా దేశీయంగా రియల్ ఎస్టేట్, ఐటీ రంగాలు దెబ్బతినడం, అప్పటి వరకు ఆయా రంగాలపై ఆధారపడిన వాళ్లు ఉపాధిని కోల్పోయి రోడ్డున పడడం, ఇదే సమయంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడం, ఎన్నికల్లో ఖర్చుల కోసం అభ్యర్థులు తమ వద్ద ఉన్న కొద్ది మొత్తాన్ని భవిష్యత్ అవసరాల కోసం నిల్వ చేసి పెట్టుకోవడంతో ఔత్సాహిక వ్యాపారులకు మార్కెట్లో అప్పు దొరకని పరిస్థితి.అంతేకాదు షాపుల నిర్వహణ ఖర్చులు పెరగడం, ఎక్సైజ్ అధికారులకు ప్రతి నెలా గుడ్విల్ పేరుతో అదనపు చెల్లింపులు సైతం దరఖాస్తుల సంఖ్య తగ్గడానికి మరో కారణం. ప్రభుత్వం దరఖాస్తు ఫీజును పెంచడంతో మెజార్టీ వ్యాపారులు వైన్స్ టెండర్లను భారంగా భావించారు. అప్పటి వరకు పదుల సంఖ్యలో దరఖాస్తు చేసినవారు.. ప్రస్తుతం ఒకటి రెండు షాపులకే పరిమితమయ్యారు. ఫలితంగా ప్రభుత్వం మద్యం షాపుల టెండర్ల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. 2023–25లో గ్రేటర్ జిల్లాల్లోని ఏడు డివిజన్ల పరిధిలో మొత్తం 45,631 దరఖాస్తులు రాగా, రూ.906.62 కోట్ల ఆదాయం సమకూరింది. 2025–27 ఆర్థిక సంవత్సరంలో 639 మద్యం షాపులకు నిర్వహించిన టెండర్లలో 34,958 దరఖాస్తులే వచ్చాయి. ఫీజు పెంపు కారణంగా రూ.1,048.74 కోట్ల ఆదాయం సమకూరింది. ఇదిలా ఉంటే ఆయా మద్యం దుకాణాలకు ఈ నెల 27న ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ల సమక్షంలో లక్కీడ్రా నిర్వహించనున్నారు. -
ఏదీ ఆసరా?
గురువారం శ్రీ 23 శ్రీ అక్టోబర్ శ్రీ 2025షాబాద్: కొత్త పింఛన్ల కోసం లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ‘ఆసరా’ అందక వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఇబ్బంది పడుతున్నారు. అన్ని అర్హతలున్నా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం పాత లబ్ధిదారులకు ఆసరా పింఛన్ అందజేసినా కొత్తవారికి అమలు చేయలేదు. దీంతో ఐదేళ్లుగా కొత్తవారు పింఛన్ మంజూరు కోసం నిరీక్షిస్తున్నారు. కొత్త ప్రభుత్వంలో అయినా అవకాశం వస్తుందని భావించినా ఎదురు తెన్నులు తప్పడం లేదు. దరఖాస్తులు స్వీకరించినా.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనా కార్యక్రమంలో భాగంగా పథకాల అమలుకు దరఖాస్తులు స్వీకరించింది. ఆసరా పథకం ద్వారా పింఛన్ పొందేందుకు వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్త వారికి పింఛన్లు మంజూరు చేయలేదు. రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులకు ఆశలు రేకెత్తాయి. కొత్త వారికి ఆసరా పింఛన్లు మంజూరు చేస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. -
బయటకు రాని
బతుకమ్మ వేడుకల సందర్భంగా మహిళలకు పంపిణీ చేయాల్సిన ఇందిరమ్మ చీరలు జీహెచ్ఎంసీ మలక్పేట పరిధిలో గోదాములకే పరిమితమయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళలందరికీ రేషన్ కార్డుల ప్రాతిపదికన బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం ఇందిరా మహిళా శక్తి పొదుపు సంఘాల సభ్యులకు మాత్రమే ఒక్కొక్కరికి రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేసేందుకు గత నెల 25 వేల చీరలు మలక్పేటకు చేరాయి. మిగతా చీరలు వచ్చాక పంపిణీ చేసేందుకు అధికారులు పండగకు ముందే అన్ని ఏర్పాట్లు చేసినా మిగతావి దిగుమతి జరగలేదు. ఈ కారణంతో బతుకమ్మ వేడుక సందర్భంగా పంపిణీ చేపట్టలేదు. – చాదర్ఘాట్గోదాంలకే పరిమితం బతుకమ్మ చీరలు! నవంబర్ 19న పంపిణీ? పొదుపు సంఘాల మహిళలకు బతుకమ్మ వేడుక కోసం చీరలు పంపిణీ కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. అన్ని సర్కిళ్ల పరిధిలోని వార్డు కార్యాయాల్లో పొదుపు సంఘం ఖాతా బుక్కును చూపించి పేర్లు నమోదు చేసుకొని మహిళలకు చీరల పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ వాయిదా పడింది. పండుగ సందర్భంగా కొందరు మహిళలకు మాత్రమే చీరలు పంపిణీ చేస్తే విమర్శలు వస్తాయని భావించిన అధికారులు పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. నవంబర్ 19న మాజీ ప్రధాని ఇంధీరాగాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీ చేస్తారని చర్చించుకుంటున్నారు. మలక్పేటలో 50 వేల చీరలు జీహెచ్ఎంసీ మలక్పేట పరిధిలో సర్కిల్ కార్యాయాల పరిధిలోని పొదుపు సంఘాల మహిళలకు వార్డు కార్యాలయంలో అధికారులు పంపిణీ వ్యవహారాలు చూస్తున్నారు. ఆరు డివిజన్లలో 25 వేల మంది మహిళ పొదుపు సంఘాల సభ్యులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో పొదుపు మహిళకు 2 చీరల చొప్పున మొత్తం 50 వేల చీరలు పంపిణీ చేయనున్నారు. అర్బన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో.. ఆయా డివిజన్ పరిధి వార్డు కార్యాలయాల్లో ఇందిరమ్మ చీరల పంపిణి చేయనున్నారు. పొదపు సంఘాల మహిళల రుణాలు తదితర వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (యూసీడీ) అధికారుల పర్యవేక్షణలో చీరల పంపిణి చేయనున్నారు. ఒక్కో మహిళా సంఘం పరిధిలో 8 నుంచి 13 వరకు సభ్యులు ఉన్నారు. ఒక్కో మహిళకు రెండు ఇందిరమ్మ చీరలు అందించే వ్యవహారాలను ఆయా డివిజన్ అర్బన్ కమ్యూనిటి ఆఫీసర్ నేతృత్వంలో రీసోర్స్ పర్సన్లకు అప్పగించారు. ఇందిరాగాంధీ జయంతికి పంపిణీ చేయనున్నట్లు సమాచారం ఒక్కో పొదుపు మహిళకు రెండేసి అందజేత -
సమన్వయంతో పని చేయాలి
ఇబ్రహీంపట్నం: అధికారులు సమన్వయంతో అభివృద్ధి పనులు చేపట్టాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీనివాస్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయం, అంతకు ముందు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బుధవారం వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై వేర్వేరుగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ పథకం, అంగన్వాడీ, వ్యవసాయ తదితర శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పాఠశాలలు, హాస్టళ్లలో మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా గమనించాలని, లోపాలుంటే పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పెరుగుదల లోపం ఉన్న చిన్నారులను అంగన్వాడీ, మెడికల్ సిబ్బంది గుర్తించి వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేసేందుకు లబ్ధిదారులను ఎప్పటికప్పుడు చైతన్యం చేయాలన్నారు. వీధిలైట్లు, తాగునీరు, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల స్పెషలాఫీసర్ నవీన్కుమార్రెడ్డి, ఎంపీడీఓ వెంకటమ్మ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
భూములిచ్చేది లేదు
యాచారం: ప్రాణాలైనా అర్పిస్తాం కాని.. ఎట్టి పరిస్థితుల్లో భూములిచ్చేది లేదని మొండిగౌరెల్లి రైతులు తెగేసి చెప్పారు. పారిశ్రామిక పార్క్ల కోసం భూసేకరణకు సంబంధించి బుధవారం పంచాయతీ కార్యాలయం వద్ద తహసీల్దార్ అయ్యప్ప ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డి మాట్లాడుతూ.. నోటిఫికేషన్లో ప్రకటించినట్టు గ్రామంలోని పలు సర్వేనంబర్లలో 821.11 ఎకరాలను ప్రభుత్వ అవసరాల కోసం సేకరిస్తున్నట్టు చెప్పారు. దీంతో రైతులు ఆ భూములనే నమ్ముకుని బతుకుతున్నాం, మీరు తీసుకుంటే ఎట్లా బతకాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సీఐ నందీశ్వర్రెడ్డి జోక్యం చేసుకుని సామరస్యపూర్వకంగా సభ జరగని వ్వాలని రైతులకు నచ్చజెప్పారు. 19, 68, 127 అసైన్డ్ సర్వేనంబర్లలో రెవెన్యూ అధికారుల సహకారంతో ఎంతో మంది నకిలీలు సర్టిఫికెట్లు పొంది, పట్టాదారు, పాసుపుస్తకాలు తీసుకున్నారని.. నిజమైన అసైన్డ్ రైతులకు నేటికీ పట్టాదారు, పాసుపుస్తకాలు రాలేదని బాధిత రైతులు దృష్టికి తెచ్చారు. భూసేకరణలో సమగ్ర విచారణ చేసి, నకిలీలను తీసేస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చారు. అనంతరం ఆయన యాచారంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మెజార్టీ రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించారని, అంగీకార పత్రాలు కూడా ఇచ్చారని వెల్లడించారు. వారం రోజుల్లో అసైన్డ్, పట్టా భూములకు ఏ విధంగా పరిహారం చెల్లించాలనే విషయమై తెలియజేస్తామని చెప్పారు. తిమ్మాయిపల్లి రైతులతో సమావేశం కందుకూరు: ఫ్యూచర్సిటీలో భాగంగా ప్రభుత్వం తిమ్మాయిపల్లి రెవెన్యూ సర్వే నంబర్ 9లోని ప్రభుత్వ, అసైన్డ్ భూములను టీజీఐఐసీ ద్వారా సేకరించే పనులు చేపట్టింది. ఇందులో భాగంగా గతంలో రెండు, మూడు పర్యాయాలు రైతులతో సమావేశమైన అధికారులు తాజాగా కందుకూరు మండల పరిషత్ సమావేశ హాల్లో బుధవారం మరోసారి సమావేశమయ్యారు. ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. ఎకరాకు భూసేకరణ చట్టం కంటే అదనంగా రూ.51,51,906 చొప్పున పరిహారం చెల్లించడంతో పాటు అదనంగా 121 గజాల ప్లాటును కేటాయిస్తామని చెప్పారు. రైతులు సహకరించాలని కోరారు. ఆయన వెంట తహసీల్దార్ గోపాల్ ఉన్నారు. తేల్చి చెప్పిన మొండిగౌరెల్లి రైతులు -
మొగులయ్యకు న్యాయం చేస్తాం
ఇబ్రహీంపట్నం రూరల్: పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర కళాకారుడు పద్మశ్రీ దర్శనం మొగులయ్యకు తగిన న్యాయం చేస్తామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన స్థలంలో కొంత మంది ఇబ్బందులకు గురి చేస్తున్నారని మొగులయ్యకు ఇటీవల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి విన్నవించడంతో ఆయన కలెక్టర్కు ఫోన్ చేసి న్యాయం చేయాలని సూచించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డితో కలిసి మొగులయ్య కలెక్టర్ను కలిశారు. స్థలం కేటాయింపునకు ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. స్థలం విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను న్యాయపరంగా ముందుండి పరిష్కరిస్తామని తెలిపారు. ప్రైవేటు వ్యక్తులు వేసిన కోర్టు కేసు విషయంలో ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డిని ఆదేశించారు. ఎలాంటి ఆందోళన చెందొద్దని మొగులయ్యకు సూచించారు. కలెక్టర్ నారాయణరెడ్డి


