Rangareddy
-
రైతును రాజును చేస్తా!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘వడ్లు ఒక్కటే కాదు.. కొత్తిమీర, పాలకూర, కూరగాయలు, పండ్లు పండించండి. కొనుగోలు చేయిస్తా. దండగ అనుకున్న వ్యవసాయాన్ని పండుగ చేస్తా.. రైతును రాజు చేస్తా’అని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కోహెడలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ సహా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ భవనాల సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. వచ్చే డిసెంబర్ నుంచే ఈ మార్కెట్లో క్రయవిక్రయాలు మొదలు పెడతామని, రెండేళ్లలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. గ్రీన్ చానల్ ద్వారా నిధులు మంజూరు చేయించుకోవాల్సిన బాధ్యత సంబంధిత మంత్రి, స్థానిక శాసన సభ్యుడిదేనని చెప్పారు. రేవంత్ ఇంకా ఏమన్నారంటే.. పండుగ అని నిరూపిస్తా.. ‘గతంలో నగరానికి ఎవరొచ్చినా.. వారికి అవసరమైన పాలు, పండ్లు, కూరగాయలు రంగారెడ్డి జిల్లా రైతాంగమే అందించేది. ఎటు చూసినా ద్రాక్ష తోటలే దర్శనమిచ్చేవి. ప్రస్తుతం పరిస్థితి మారింది. ఓఆర్ఆర్, ఎయిర్పోర్టు వచ్చింది. భూముల విలువ పెరిగింది. ఎకరాలు, గజాల్లోకి మారాయి. కాయగూరలు, పండ్ల తోటలు కనుమరుగయ్యాయి. మోదీ ప్రభుత్వంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. గ్రేటర్ జిల్లాల్లో 1.30 కోట్ల మంది జనాభా నివసిస్తోంది. నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో.. అంతే వేగంగా పండ్లు, కూరగాయల పంటలు తగ్గిపోయాయి. రైతాంగం మళ్లీ పంటలు పండించాలి. పాలు, పండ్లు అందించాలి. వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని నిరూపించాల్సిన అవసరం వచ్చింది. పంట ఉత్పత్తులు మార్కెట్కు తీసుకొచ్చి విదేశాలకు అమ్ముకోవాలి. అక్కడికి వెళ్తే శ్మశానానికి వెళ్లినట్లే ఉంటుంది రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందితే.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వానికి 60 శాతం ఆదాయం ఈ జిల్లా నుంచే సమకూరుతోంది. నిత్యం రూ.కోట్ల విలువ చేసే ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవు. అక్కడికి వెళ్తే.. శ్మశానానికి పోయినట్లుగా ఉంటుంది. ప్రభుత్వానికి ఏటా రూ.17 వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఆఫీసుల్లో కనీసం కూర్చోడానికి కుర్చీ, తాగేందుకు నీళ్లు లేవు. ‘కస్టమర్ ఈజ్ అవర్ గాడ్’అన్నారు.. అలాంటి వారిని ఇలా నిలబెట్టడం ఎంతవరకు సమంజసం. ఓఆర్ఆర్కు ఆనుకుని 12 క్లస్టర్లుగా విభజించి, అత్యాధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ సబ్రిజిస్ట్రార్ ఆఫీసులను నిర్మించుకుంటున్నాం. ఎవరి మెడలైనా వంచుతా... ‘కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి తమాషాలు చేస్తున్నారు. చేతకాకపోతే దిగిపో అంటున్నరు. నేను అల్లాటప్పాగా రాలేదు. కష్టపడి, తొక్కుకుంటూ వచ్చా. కార్యకర్తలు కష్టపడితే వచ్చా. అవసరమైతే ఫాంహౌస్లో కేడీతోనైనా..ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడతా. ఎవరి మెడలైనా వంచుతా. 12 ఏళ్లు అయింది. ముందు మోదీని గద్దె దిగమనండి. రాహుల్గాం«దీతో ధాన్యం కొనుగోలు చేయిస్తా. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేయిస్తా, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్రోడ్డుకు నిధులు తెస్తా. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను అభివృద్ధి చేస్తా. మాటలతోపాటు చేతలు కూడా వచ్చు. ఈ నెల 15తో 75 లక్షల మెట్రిక్ ధాన్యం సేకరణ పూర్తవుతుంది. ఆ తర్వాత కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ సంగతి చెబుతా. మక్కలు ఎలా కొనుగోలు చేయరో తేలుస్తా. పొలిమేర్లు కూడా దాటలేరు. కేంద్రంలో మీ ప్రభుత్వం ఉందని, భయపెడితే.. భయపడే వాడిని కాదు. గుండు, అరగుండు మాట్లాడే మాటలన్నీ చూస్తున్నా. కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకొని, మన అవసరాలు వారికి వివరించి అవసరమైన నిధులు తెస్తా. దిక్కుమాలిన సలహాలు మాకొద్దు ప్రాజెక్టులు ఎలా కట్టాలో, లిఫ్ట్లో ఎలా కట్టాలో? మాకు హరీశ్రావు సలహా ఇస్తున్నాడు. తాటి చెట్టులా పెరిగాడు. మీ వద్ద నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దిక్కుమాలిన సలహాలు మాకొద్దు. కేసీఆర్ కుర్చీ వేసుకుని పాలమూరు ఎత్తిపోతల కడతానని చెప్పి.. మందేసుకుని ఫాం హౌసులో కూర్చున్నాడు. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. అభివృద్ధే కాదు.. సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ఇప్పటికే నాలుగున్నర లక్షల ఇళ్లు ఇచ్చాం. కొత్తగా గ్రామీణ ప్రాంతాల్లో మరో రెండున్నర లక్షల ఇళ్లు, హైదరాబాద్లో లక్ష ఇళ్లు నిర్మించుకోబోతున్నాం. ఆడబిడ్డలకు రూ.60 వేల కోట్లు బ్యాంకు రుణాలు ఇచ్చాం. త్వరలోనే ఖాళీలను భర్తీ చేసుకోబోతున్నాం. ఆనాడు మీరు వి«ధ్వంసం చేస్తే.. మేను వికాసం వైపు నడిపిస్తున్నాం. మీ అసూయ, పగ, ద్వేషం మాపై చూపండి కానీ తెలంగాణ ప్రజలపై కాదు. కష్టాలు, నిధుల కొరత ఉంది. రూ. 8.11 లక్షల కోట్ల అప్పు ఉంది. అయినా ధైర్యం కోల్పోలేదు. వయసు చిన్నదైనా బాధ్యత పెద్దది. రోజుకు 18 గం టలు కష్టపడి ఈ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా. సమస్యలను చూసి పారిపోయే వాడిని కాదు. వాళ్లను పట్టించుకోవాల్సి అవసరం లేదు.. అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసుకున్నప్పుడే గుర్తింపు వస్తుంది. అడ్డం పడినా.. ఏడుపు వినేది లేదు. చేపట్టిన ఫ్యూచర్సిటీ, గ్రీన్ఫీల్డ్ రోడ్డు, మార్కెట్ను నిర్మించుకునేదే. కడుపులో మంట ఉన్నవాళ్లకు అజీర్తి ఉంటుంది. వాళ్లను పట్టించుకోవాల్సి అవసరం లేదు. వరి వేస్తే ఉరి అని చెప్పిన వాళ్లకు 1.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి రైతుల సత్తా చూపాం. ఏ ఊరిలో వడ్లు పండించినా కాళేశ్వరం నీళ్లే అని చెప్పారు. కానీ ఇప్పుడు లేదు. రూ.లక్ష కోట్లు కోట్లు గోదావరిలో కలిపినోళ్లను..అదే గోదావరిలో కలపాల్సిన అవసరం ఉంది. అడ్డుకుంటే..అడ్రస్ లేకుండా చేస్తా.. అంతర్జాతీయ విమానాశ్రయం లాగే.. పండ్ల మార్కెట్ కూడా జిల్లాకు గుర్తింపు తెస్తుంది. కందుకూరులో పండే టమాటా ఎంతో రుచిగా ఉంటుంది. రైతుల పంటకు గిట్టుబాటు కోసం అక్కడ ఓ సాస్ కంపెనీ పెట్టబోతున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో కాలుష్య కారక ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని భావిస్తే.. మేము దాన్ని గ్రీన్ ఫార్మా ఫ్యూచర్సిటీగా మార్చుతున్నాం. మేము రైతు సంక్షేమం కోసం మార్కెట్లు, అనేక పరిశ్రమలు, ప్రాజెక్టులు, తెస్తుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ అడ్డుకుంటోంది. ఇలాగే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేస్తాం. షెడ్డుకు పోయిన కారును అడ్రస్ లేకుండా చేస్తాం’అని సీఎం హెచ్చరించారు. చివరగా ‘ఔర్ ఏక్ బార్.. కాంగ్రెస్ సర్కార్’నినాదంతో సీఎం తన ప్రసంగాన్ని ముగించారు. కాగా, రైతులు, వారికి మద్దతుగా నిలిచిన స్థానిక బీజేæపీ, బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్రెడ్డి పర్యటనలో అలజడి సృష్టించే ప్రమాదం ఉందని అనుమానించిన పోలీసులు వారిని ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి సాయంత్రం 5 గంటలకే శంకుస్థాపనకు హాజరు కావాల్సి ఉండగా, స్థానికంగా ఉన్న ఉద్రిక్తపరిస్థితులు, అకస్మాత్తు వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. -
ఉపాధిని నీరుగారుస్తున్న కేంద్రం
● వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య ● మాడ్గులలో ఉపాధి కూలీల కమిటీ ధర్నా మాడ్గుల: గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు వరంగా మారిన ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య ఆరోపించారు. మాడ్గుల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట శుక్రవారం ఉపాధి కూలీల కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు అనేక మార్పులు, చేర్పులు చేస్తుందన్నారు. హామీ పథకానికి బడ్జెట్ను పూర్తిగా తగ్గించిందని ఆరోపించారు. మహాత్మాగాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని మతపరమైన విధంగా వీబీజీ–రామ్జీ పేరుతో అమలు చేస్తుందని చెప్పారు. పనులకు వచ్చిన కూలీలను రెండుసార్లు ఫొటో తీయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విధానం వల్ల కూలీలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉపాధి కూలీలకు కనీస వేతనం రూ.800 అందించాలని, సంవత్సరంలో 200 రోజుల పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీఓ విజయలక్ష్మికి అందించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మికసంఘం మండల శాఖ అధ్యక్షుడు పాషా, నాయకులు సైదమ్మ, శ్రీను, అంజయ్య, నర్సింహ, మైసయ్య, సైదయ్య, కృష్ణయ్య, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. -
రూ.8 లక్షల విద్యుత్ పరికరాల చోరీ
షాద్నగర్: నందిగామ మండల పరిధిలోని చేగూరు గ్రామ శివారులో ఉన్న విద్యుత్ ఉప కేంద్రంలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ పరికరాలను చోరీ చేశారు. ఉప కేంద్రంలో ఉన్న ఐదు కాపర్ రాడ్లు దొంగిలించినట్లు, వీటి విలువ సుమారు రూ.8 లక్షల వరకు ఉంటుంది. ఉప కేంద్రం సబ్ ఇంజనీర్ సందీప్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ ప్రసాద్ తెలిపారు. మొయినాబాద్ రూరల్: ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి శుక్రవారం మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. బాకారానికి చెందిన ఈర్లపల్లి లక్ష్మణ్రావు(55) కూలీ పనులు చేస్తుంటాడు. గురువారం పనికి వెళ్లిన లక్ష్మణ్రావు పొలంలోని ట్రాక్టర్ను నడిపేందుకు ప్రయత్నించగా, అదుపుతప్పి కిందపడిపోయాడు. పైనుంచి ట్రాక్టర్ వెళ్లడంతో తీవ్ర గాయాలైన అతన్ని భాస్కర ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి భార్య సీతామహాలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ మల్లికార్జున్ తెలిపారు. మొయినాబాద్రూరల్: డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన మండలంలోని తోల్కట్ట గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉండే సాంఘిక సంక్షేమ కళాశాల(వికారాబాద్)లో కుందేటి కల్పన(20) డిగ్రీ చివరి సంవత్సరం చదువుతుంది. గురువారం ఆమె తన అక్కను ఫోన్ చేసి ఇంటికి వస్తున్నట్లు చెప్పి బయలు దేరింది. శుక్రవారం అయినా సోదరి ఇంటికి రాకపోవడంతో సాధ్యమైన అన్ని చోట్ల వెతికారు. కానీ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసినట్లు సీఐ మల్లికార్జున్రెడ్డి తెలిపారు. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
కొడంగల్: అభివృద్ధి పనుల్లో వేగం పెంచి సకాలంలో నిర్మాణాలు పూర్తయ్యేలా చొరవ చూపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని బీసీ గురుకుల పాఠశాల, డిగ్రీ కళాశాల నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించాలన్నారు. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పారదర్శకంగా, నాణ్యతగా పనులు చేయించాలన్నారు. అనంతరం పట్టణంలోని శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. రూ.110 కోట్ల వ్య యంతో చేపట్టిన ఆలయ పునర్నవీకరణ పనులను పరిశీలించారు. ముందుగా బాలాలయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ధర్మకర్తలు స్వాగతం పలికారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. సంప్రదాయ నిర్మాణ శైలిని కాపాడుతూ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో పాటు వాస్తు నిపుణులతో కలిసి సమన్వయంతో పని చేయాలన్నారు. ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. తిరుమల తరహాలో ప్రధాన ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, మాఢ వీధులు, క్యూలైన్, కల్యాణ మంటపం, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు, పార్కింగ్, పుష్కరిణి, ప్రసాదం కౌంటర్లు తదితర వాటికి నూతన భవనాలు నిర్మించనున్నట్లు చెప్పారు. పనుల్లో జాప్యం జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ గుప్తా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి -
ప్రైవేట్ బడుల్లో ఫీజు రాయితీ
జర్నలిస్టుల పిల్లలకు వర్తింపజేస్తూ డీఈఓ ఉత్తర్వులు ఇబ్రహీంపట్నం రూరల్: జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజులో 50 శాతం రాయితీ కల్పిస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. టీయూడబ్ల్యూజే(ఐజేయూ) యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ సలీంపాషా ఆధ్వర్యంలో నాయకులు డీఈఓను కలవగా ఉత్తర్వు కాపీని అందజేశారు. ఈ సందర్భంగా సలీం పాషా మాట్లాడుతూ.. జిల్లాలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టుల పిల్లల చదువులకు ఉచిత విద్యనందించాలని కోరగా.. విద్యాధికారులు 50 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేయడం సంతోషమన్నారు. మండలాల్లో పని చేస్తున్న వారికి స్థానిక విద్యాధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, డీఈఓ వెంకటేశ్వర్లుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రవి, కరుణాకర్, భాస్కర్, శ్రీనివాస్, భార్గవ్, శివ తదితరులు పాల్గొన్నారు. -
నాన్నా.. అదిగో దొంగలు!
కుల్కచర్ల: తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్గా దొంగలు రెచ్చిపోతున్నారు. కుల్కచర్ల మండలంలో గురువారం చోటుచేసుకున్న ఓ దోపిడీ ఘటన సినిమా దృశ్యాలను తలపించింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. పుట్టపహాడ్ గ్రామానికి చెందిన బేతి మొగులయ్య ఉదయాన్నే తన భార్యతో కలిసి ఉపాధిహామీ పనులకు వెళ్లారు. సుమారు 11:30 గంటలకు వీరి ఇంటి తాళం పగులగొట్టిన ఇద్దరు దొంగలు లోపలికి ప్రవేశించారు. ఎదురుగా ఉన్న ఆలయ పరిసరాల్లో ఆడుకుంటున్న మొగులయ్య కొడుకు రాహుల్(చింటు) ఇంటి తలుపులు తీసి ఉండటాన్ని గమనించి అమ్మానాన్నా వచ్చారని లోపలికి వెళ్లాడు. అప్పటికే స్టీల్ గల్లా పెట్టెను ధ్వంసం చేసిన దుండగులు అందులోని రూ.60 వేలు, 16 తులాల వెండిని తీసుకున్నారు. లోపలికి వెళ్లిన పన్నెండేళ్ల చింటును కత్తితో బెదిరించడంతో భయపడిన బాలుడు బయటకు పరుగుతీశాడు. హైస్కూల్ వద్ద ఆడుకుంటున్న యువకుల ఫోన్తో తండ్రికి ఫోన్ చేయగా హుటాహుటిన ఇంటికి వచ్చారు. అప్పటికే దుండగులిద్దరూ బైక్పై పారిపోయారు. చోరీ జరిగిందని గుర్తించిన మొగులయ్య, స్థానికులు విషయాన్ని సర్పంచ్, ఉపసర్పంచ్తో పాటు గ్రామ నాయకులకు తెలియజేశారు. అంతా కలిసి సమీపంలోని పలు సీసీ పుటేజీలను సేకరించి, పెన్డ్రైవ్ తీసుకుని కుల్కచర్లలోని పీఎస్కు చేరుకున్నారు. పోలీసులు, గ్రామస్తులు ఈ పుటేజీలను పరిశీలిస్తుండగా.. స్టేషన్ మెట్లపై కూర్చున్న చింటు.. రోడ్డు మీద బైక్పై వెళ్తున్న ఇద్దరిని గమనించి ‘నాన్నా.. అదిగో దొంగలు.. మనింటికి వచ్చింది వాళ్లే’ అంటూ అరిచాడు. ఈ మాటలు విన్న పోలీస్ వెహికిల్ డ్రైవర్ అంజిరెడ్డి పోలీసులను అప్రమత్తం చేసి బైక్ను వెంటాడారు. ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత, బైక్ను దాటేసి కారును రోడ్డుకు అడ్డంగా నిలిపాడు. అతివేగంగా వచ్చిన దొంగలకు బైక్ కంట్రోల్ కాకపోవడంతో కారును ఢీకొట్టి కిందపడిపోయారు. వీరిలో ఒకరిని అంజిరెడ్డి పట్టుకోగా, మరో దొంగ పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి పారిపోయాడు. పది నిమిషాలలోపు బైక్లపై అక్కడికి చేరుకున్న పోలీసులు మరో దొంగ కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో బైక్ను, దొంగను తీసుకుని పీఎస్కు తరలించారు. పట్టుబడిన వ్యక్తి జడ్చర్లకు చెందినవాడిగా గుర్తించారు. వీరు ప్రయాణించిన బైక్ను కర్నూలులో చోరీ చేసినట్లు తెలిసింది. పారిపోయిన దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనింటికి వచ్చింది వాళ్లే.. చోరీకి పాల్పడిన దుండగులను గుర్తించిన బాలుడు బైక్పై పారిపోతుండగావెంటాడిన పోలీసులు ఒకరు చిక్కగా మరొకరు పరారీ -
ఆడుకునేందుకు వెళ్లిన బాలుడి అదృశ్యం
పహాడీషరీఫ్: ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై లక్ష్మయ్య శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి శ్రీరామ కాలనీకి చెందిన గడుగు వీరమణి, మహదేవ్ దంపతులకు నలుగురు పిల్లలు సంతానం. ఈ నెల 3వ తేదీన ఉదయం వీరమణి పిల్లలను ఇంట్లో వదిలి స్థానికంగానే ఉన్న సింఘానియా కంపెనీలో పనికి వెళ్లింది. రాత్రి 8 గంటలకు వచ్చి చూడగా ఆమె చిన్న కుమారుడు దీపక్(13) కనిపించలేదు. బయటి ఆడుకునేందుకు వెళ్లాడని పిల్లల ద్వారా తెలుసుకున్న ఆమె స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ విషయమై పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిస్తే పోలీస్స్టేషన్లో గాని 87126 62367 నంబర్లోనైనా సమాచారం ఇవ్వాలని తెలిపారు. చైతన్యపురి: వేగంగా వెళుతున్న ఆటో డివైడర్ను ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. చైతన్యపురి ఎస్ఐ ప్రభాకర్ తెలిపిన మేరకు.. బహదూర్పుర మురళినగర్కు చెందిన జయరాజ్యాదవ్(64) కుమారుడు కేశవ్యాదవ్ కలిసి పోచయ్య ఆటోలో చింతల్కుంటకు శుక్రవారం బయలుదేరారు. చైతన్యపురి చౌరస్తా వద్ద ఆటో డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ జయరాజ్యాదవ్ అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మన్సూరాబాద్: తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపాడో ఓ రైతు. జీవన్దాన్ ప్రతినిధులు తెలిపిన మేరకు.. నల్లగొండ జిల్లా గానుగబండ గ్రామానికి చెందిన షేక్ పల్సోనా (45) గత నెల 31న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కుటుంబసభ్యులు ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్కు తరలించారు. ఈ నెల 4న బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. విషయం తెలుసుకున్న జీవన్దాన్ ప్రతినిధులు మృతుడి భార్య షేక్ సైదాబీతో పాటు కుటుంబసభ్యులకు అవయవదానంపై అవగహన కల్పించారు. దీంతో రెండు కిడ్నిలు, గుండె, రెండు కార్నియాలను జీవన్ధాన్ ప్రతినిధులు సేకరించారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు.. నిమ్స్కు గుండె తరలింపు ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ నుంచి పంజగుట్ట నిమ్స్ హాస్పిటల్ వరకు 16 కిలోమిటర్ల దూరాన్ని గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి కేవలం 20 నిమిషాల్లో గుండెను పంజగుట్టలోని నిమ్స్ హాస్పిటల్కు చేర్చారు. హయత్నగర్: కొహెడ శ్రీచైతన్య రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కోమటిరెడ్డి దేవేందర్రెడ్డి(17) గురువారం రాత్రి హాస్టల్ గదిలో బెడ్షీట్తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. హన్మకొండకు చెందిన దేవేందర్ రెడ్డి ఇంటర్ మొదటి సంవత్సరంలో 466 మార్కులు సాధించాడు. అయితే, తనకు ఈ కళాశాలలో చదవడం ఇష్టం లేదని గతంలోనే కుటుంబ సభ్యులకు తెలిపినట్లు సమాచారం. అయితే తమకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించడంపై కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కళాశాల యాజమాన్య వేధింపులే కారణమంటూ ఆందోళనకు దిగాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చోరీ చేసి.. నంబర్ మార్చి
● ద్విచక్ర వాహనాల దొంగల అరెస్ట్ ● ఎనిమిది బైక్లు స్వాధీనం కడ్తాల్: ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరి కేటుగాళ్లను కడ్తాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఎనిమిది బైకులను స్వాధీనం చేసుకున్నారు. సీఐ సైదిరెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల మేరకు.. గురువారం రాత్రి మండల కేంద్రం సమీపంలోని తలకొండపల్లి కూడలిలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా, స్కూటీపై అనుమానాస్పదంగా వెళుతున్న ఇద్దరు యువకులను ఆపారు. సరైన ఆధారాలు చూయించలేకపోవడంతో అదుపులోకి తీసుకుని విచారించగా స్కూటీని దొంగతనం చేసినట్లు అంగీకరించారు. ఇందులో భాగంగా వివిధ ఠాణాల పరిధిలో చోరీకి గురైన ఎనిమిది ద్విచక్రవాహనాల కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి. నిందితులు ఆమనగల్లు మండలం చంద్రయాన్పల్లి తండాకు చెందిన చరణ్, తలకొండపల్లి మండలం బోడియాతండాకు చెందిన అనిల్, ఖమ్మం జిల్లాకు చెందిన కిల్లంపల్లి రాజశేఖర్ అలియాస్ శేఖర్ అని తేలింది. సులభంగా డబ్బులు సంపాందించాలనే ఉద్దేశంతో వీరు ముఠాగా ఏర్పడి బైకుల చోరీలకు పాల్పడుతున్నారు. వీరంతా వివిధ ప్రాంతాల్లో పార్క్ చేసి ఉంచిన వాహనాలను చోరీ చేసి, వాటి నంబర్ ప్లేట్లు మార్చి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో సూత్రధారి అయిన రాజశేఖర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. చాకచక్యంగా వ్యవహరించి, వాహనాల రికవరీలో కీలకంగా వ్యవహరించిన క్రైమ్ టీం ఎస్ఐ చంద్రశేఖర్, కానిస్టేబుల్ మహేశ్, రాంకోఠి, రఘునాయక్లను సీఐ సైదిరెడ్డి అభినందించారు. -
సంతోషంగా ఉంది
మా గ్రామాన్ని కూడా ఎఫ్సీడీఏలో కలపాలని పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు విజ్ఞప్తి చేశాం. అధికారులు తీర్మాన పత్రం అడగడంతో వెంటనే ఏకగ్రీవ తీర్మానం చేసి అందజేశాం. ఫ్యూచర్సిటీలో కలపాలని చూడడం సంతోషంగా ఉంది. – కొర్ర అరవింద్నాయక్, సర్పంచ్, మంతన్గౌరెల్లి మొండిగౌరెల్లి, మంతన్గౌరెల్లి, కేసీతండాలను ఫ్యూచర్సిటీలో కలపాలని పంచాయతీ పాలకవర్గాల నుంచి ఏకగ్రీవ తీర్మానాలు అడిగింది వాస్తవమే. కలెక్టర్ ఆదేశాల మేరకు తీర్మాన పత్రాలను సేకరించి ఉన్నతాధికారులకు పంపించాం. – రాధారాణి, ఎంపీడీఓ, యాచారం -
‘సమగ్ర సవరణ’ పక్కాగా నిర్వహించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం అదనపు కలెక్టర్ చంద్రారెడ్డితో కలిసి ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి గణన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. బూత్ స్థాయి అధికారులు వివరాలను పరిశీలించి, అర్హులైన ఓటర్ల ముసాయిదా జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. హేతుబద్ధీకరించిన ముసాయిదా ఓటరు జాబితాను జూలై 31న ప్రచురించనున్నట్లు చెప్పారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించి, సెప్టెంబర్ 28లోపు వాటిని ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పరిష్కరించాలని అన్నారు. అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు సాధ్యమైనంత వరకు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీలు, బూత్స్థాయి ఏజెంట్ల సహకారం తీసుకోవాలన్నారు. ఒక వ్యక్తికి ఒకే ఓటరు గుర్తింపు కార్డు ఉండాలని, ఒకటి కంటే ఎక్కువ కలిగి ఉన్నవారు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. మరణించిన వ్యక్తుల పేర్లు తుది జాబితాలో ఉండకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యం వహించిన బీఎల్ఓలపై చర్యలు తప్పవన్నారు. చిరునామా మార్పుల వివరాల సవరణలు, కొత్త ఓటర్ల నమోదు తదితర అంశాలను సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అక్టోబర్ 1, 2026 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఇంటింటి గణన సందర్భంగా ఫారం –6 డిక్లరేషన్ ఫారం ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్ 1950, ఓటరు పోర్టల్, ఈసీఐనెట్ యాప్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓలు సరిత, జగదీశ్వర్రెడ్డి, తహసీల్దార్లు, ఎన్నికల విభాగం అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి -
ప్రైవేట్ బడుల్లో ఫీజు రాయితీ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజులో రాయితీ కల్పిస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదేశాలు జారీ చేశారు.
ఇబ్రహీంపట్నం: భవిష్యత్ తరాలు బాగుండాలంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా విద్యాధికారి ఎస్.వెంకటేశ్వర్లు, ప్రకృతి వైద్య నిపుణుడు కేవై రాంచందర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ విజ్ఞాన్ ప్రతిష్టాన్ చైర్మన్ డా.గున్న రాజేందర్రెడ్డి, కార్యదర్శి ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలోని గోపాల గోశాలలో మొక్కలు నాటారు. మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాలుష్యం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కమిషన్ సభ్యుడు సునీల్, మండల విద్యాధికారి హీర్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల: ప్రపంచ పర్యావరణ దినత్సోవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ప్రకటించిన పర్యావరణ అవార్డుకు చేవెళ్ల మోడల్ స్కూల్ ఎంపికై ంది. నగరంలో శుక్రవారం నిర్వహించిన వేడుకల్లో స్కూల్ ఉపాధ్యాయుడు దండ బాణీ మంత్రి కొండా సురేఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు సత్యనారాయణరెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 194 మోడల్ స్కూల్స్లో మూడు అవార్డులకు ఎంపిక కాగా అందులో చేవెళ్ల మోడల్ స్కూల్ ఒకటి కావడం విశేషం. అవార్డు వచ్చిన సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ చిన్నపు రెడ్డి మాట్లాడుతూ.. గ్రౌండ్ చుట్టూ నాటిన మొక్కలతో పరుచుకున్న పచ్చదనం, ప్రశాంతవాతవరణం అవార్డుకు ఎంపికయ్యేలా చేశాయన్నారు. అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. -
ఎఫ్సీడీఏ భవనం పరిశీలన
కందుకూరు: ఫ్యూచర్ సిటీలో నిర్మించిన ఎఫ్సీ డీఏ భవనాన్ని శుక్రవారం మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ జానకీరెడ్డి పరిశీలించారు. త్వరలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా భవనం ప్రారంభోత్సవం కానుంది. అందులో భాగంగా వారు ఆ భవనంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీఎం ప్రారంభోత్సవ కార్యక్రమానికి అవసరమైన బందోబస్తు తదితరాల గురించి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. వారి వెంట గ్రీన్ ఫార్మా సీఐ సత్యనారాయణ, కందుకూరు సీఐ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. షాద్నగర్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అదనపు జిల్లా జడ్జి స్వాతిరెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం షాద్నగర్ కోర్టు ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తు తరాలకు పరిశుభ్రమైన, హరిత వాతావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అందరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ రోజువారీ జీవితంలో అంతర్భాగం కావాలన్నారు. గాలి, నీరు, నేల కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా మానవ ఆరోగ్యాన్ని, వన్యప్రాణులను కాపాడవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కొత్త రవి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి సాహితి, జడ్జి ప్రవీణ్కుమార్, ఫారెస్టు అధికారి మహ్మద్ అజీజ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, న్యాయవాదులు సబియా సుల్తానా, తదితరులు పాల్గొన్నారు. షాద్నగర్రూరల్: గురుకుల విద్యాసంస్థల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ఆహార పదార్థాల సరఫరాకోసం టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని గిరిజన గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కూరగాయలు, చికెట్, మటన్, కోడిగుడ్లు, కిరాణా సామగ్రి సరఫరాదారుల నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. టెండర్ ఫాం ధర రూ.20వేలు ఉంటుందని, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) రూ.30వేలు నిర్ణయించడం జరిగిందన్నారు. ఈఎండీలో ఎస్సీ, ఎస్టీలకు రాయితీ ఉంటుందని తెలిపారు. దరఖాస్తుల సమర్పణకు ఈనెల 13 చివరి తేదీ కాగా, 15న మధ్యాహ్నం 2.30 గంటలకు టెండర్లు తెరవనున్నట్టు చెప్పారు. టెండర్ పరిధిలో టీజీటీడబ్ల్యూఆర్ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల షాద్నగర్, టీజీటీడబ్ల్యూఆర్జే బాలుర కళాశాల ఇబ్రహీంపట్నం, టీజీటీడబ్ల్యూఆర్జే బాలుర కళాశాల కొత్తూరు, ఐఐటీ స్టడీ సెంటర్ మహేశ్వరం, టీజీటీడబ్ల్యూఆర్ సీఓఈ (పీవీటీజీ–జీ) హయత్నగర్, మినీ గురుకులం రంగాపూర్ విద్యాసంస్థలు వస్తాయని తెలిపారు. పహాడీషరీఫ్: పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి ఎల్బీ నగర్ న్యాయస్థానం శుక్రవారం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇన్స్పెక్టర్ బి.లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి శ్రీరామ కాలనీకి చెందిన బాలికపై కర్నాటక రాష్ట్రానికి చెందిన రాజేంద్ర (35) 2023 ఫిబ్రవరి 13న లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారించిన ఎల్బీ నగర్ ఫాస్ట్ట్రాక్ కోర్టు న్యాయమూర్తి నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. -
‘ఫ్యూచర్’లోకి ఆ మూడు గ్రామాలు!
యాచారం: ఫ్యూచర్సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ)లోకి యాచారం మండలంలోని మరో మూడు గ్రామాలను సైతం విలీనం చేసేందుకు సర్కార్ దృష్టి సారించింది. జిల్లాలోని ఏడు మండలాలు, 56 రెవెన్యూ గ్రామాలు, 765 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఫ్యూచర్సిటీ నిర్మించడానికి నిర్ణయించడం తెలిసిందే. అత్యధికంగా యాచారం మండలంలోని 17 రెవెన్యూ గ్రామాలను ఎఫ్సీడీఏలోకి తీసుకున్న సర్కార్ రంగారెడ్డి–నల్లగొండ జిల్లాల సరిహద్దులో ఉన్న మంతన్గౌరెల్లి, కేసీతండా జీపీతో పాటు యాచారం–మంచాల మండలాల సరిహద్దులోని మొండిగౌరెల్లి గ్రామాన్ని విస్మరించింది. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలు తమ గ్రామాలను కూడా ఫ్యూచర్సిటీలో విలీనం చేయాలని అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. ఏకగ్రీవ తీర్మానాలు ఇవ్వాలని ఆదేశాలు యాచారం మండలంలో మొత్తం 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. గతంలోనే 17 గ్రామాలను ఎఫ్సీడీఏలోకి తీసుకున్నారు. ఆయా గ్రామాల్లో టీజీఐఐసీ ద్వారా రూ.50 కోట్లకుపైగా నిధులు మంజూరు చేసి సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వలు, కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తున్నారు. ఎఫ్సీడీఏలోకి తీసుకోని మొండిగౌరెల్లి, మంతన్గౌరెల్లి, కేసీతండాల్లో అభివృద్ధి అంతంత మాత్రంగా ఉంది. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు సర్కార్ తాజాగా ఆ మూడు గ్రామాలను కూడా ఎఫ్సీడీఏలో విలీనం చేయాలని నిర్ణయించింది. కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు ఆయా పంచాయతీలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి ఎంపీడీఓకు అందజేశారు. మండలమంతా ఎఫ్సీడీఏలోకి.. మూడు గ్రామాలతో యాచారం మండలంలోని 20 రెవెన్యూ గ్రామాలతో పాటు మరో 20 అనుబంధ గ్రామాలు ఎఫ్సీడీఏలో చేరినట్లు అయింది. ఎఫ్సీడీఏ పరిధిలోకి ఆమనగల్లు మండలం నుంచి రెండు గ్రామాలు, ఇబ్రహీంపట్నం మండలం నుంచి 8, కడ్తాల్ మండలం నుంచి 8, కందుకూరు మండలం నుంచి 18, మహేశ్వరం మండలం నుంచి రెండు, మంచాల మండలం నుంచి మూడు, యాచారం మండలం నుంచి 17 గ్రామాలను తీసుకున్నారు. తాజాగా మూడు గ్రామాలను ఎఫ్సీడీఏలో విలీనం చేయడానికి సర్కార్ నిర్ణయించడంతో మొత్తం గ్రామాల సంఖ్య 59కి చేరనుంది. ఎఫ్సీడీఏలోకి యాచారం మండలం మొండిగౌరెల్లి, మంతన్గౌరెల్లి, కేసీతండా విలీనానికి ఏకగ్రీవ తీర్మానాలు ఇవ్వాలని కలెక్టర్ నుంచి జీపీలకు ఆదేశాలు తీర్మానాలు చేసి ఎంపీడీఓకు అందజేసిన పాలకవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్న ఆయా గ్రామాల ప్రజలు -
నేడే ‘కొహెడ’ మార్కెట్కు సీఎం శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్/సాక్షి, రంగారెడ్డి జిల్లా: కోహెడ అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. ఈ మార్కెట్ నిర్మాణ పనులకు శనివారం సాయంత్రం సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత జరిగే భారీ బహిరంగ సభకు హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, రంగారెడ్డి సహా నల్లగొండ, మహబూబ్నగర్ వంటి సరిహద్దు జిల్లాల నుంచి 50 వేల మందిని తరలించనున్నారు. మార్కెట్ ప్రత్యేకతలివే.... ⇒ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.3,367.35 కోట్లు కాగా, ఇందులో ప్రభుత్వం రూ.2,284.32 కోట్ల పెట్టుబడి పెడుతుండగా, మిగతాది ప్రైవేట్ భాగస్వామ్యం.ఈ మార్కెట్ ద్వారా ప్రత్యక్షంగా 14,000 మందికి, పరోక్షంగా 20,000 మందికి ఉపాధి లభిస్తుంది. ⇒ ప్రస్తుతం 5.30 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న విక్రయాలు.. 2047 నాటికి 15.53 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగే అవకాశముంది. తద్వారా మార్కెట్ వార్షిక ఆదాయం రూ.1,277 కోట్ల నుంచి రూ.7,765 కోట్లకు పెరగనుంది. ⇒ వ్యాపారుల సంఖ్య 341 నుంచి 967కు, వినియోగదారుల సంఖ్య 16,450 నుంచి 53 వేల మందికి పెరుగుతుంది. ⇒ వాహనాల రాకపోకలకు 10 వరుసల ఎంట్రీ టోల్ప్లాజా, తిరిగి వెళ్లేందుకు ఆరు వరుసల ఎగ్జిట్ టోల్ ప్లాజా సహా క చ్చితమైన తూకానికి అత్యాధునిక డిజిటల్ వెయింగ్ బ్రిడ్జి. ⇒ పూల వ్యాపారానికి సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ కలిగిన 40 షాపులతో పూల మార్కెట్. దీని ద్వారా 3,600 మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. ⇒ వంద మందికి సరిపడా రైతు మార్కెట్. రిటైల్ వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు 210 షాపులతో కూడిన వ్యాపార ప్రాంగణం. ⇒ రైతులు, హమాలీలు, వ్యాపారులు, సందర్శకులకు విశ్రాంతి భవనాలు, సమావేశ మందిరాలు. క్యాంటీన్, హెల్త్సెంటర్, పోలీసు ఔట్లెట్, ఫైర్ స్టేషన్ ఉంటుంది. ⇒ మార్కెట్ మొత్తానికి కమాండ్ కంట్రోల్ సెంటర్గా నిలిచే టవర్ ఆఫ్ ఎక్స్లెన్స్ నిర్మించనున్నారు. ⇒ ఇందులో బహుళజాతి వ్యాపారులు, సీసీ టీవీ వ్యవస్థ, హెలికాప్టర్ ల్యాండింగ్కు హెలిపాడ్ ఏర్పాటు చేయనున్నారు. ⇒ వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు సహా ఇతర వ్యాపార కార్యకలాపాల కోసం 210 షాపులతో రిటైల్ వ్యాపార ప్రాంగణాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ⇒ అంతర్జాతీయ ప్రమాణాలతో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులకు 30 షాపులతో ప్రత్యేక వేదిక అందుబాటులోకి ఉంటుంది. ⇒ మామిడి, బత్తాయి, సపోటా, డ్రాగన్ ఫ్రూట్స్ వంటి పండ్ల వేలానికి ఆరు ప్రత్యేక ఆక్షన్ హాళ్లు సహా 250 మేజనైన్ షాపులను వ్యాపారులకు కేటాయించనున్నారు. ⇒ పండ్లు పాడవకుండా కాపాడేందుకు 335 షాపులతో కూడి న విశాలమైన నాలుగు శీతలీకరణ షెడ్లు నిర్మించనున్నారు. ⇒ పుచ్చకాయ, కర్బూజ, బొప్పాయి, పైనాపిల్ మార్కెటింగ్కు దేశంలోనే తొలి ‘డ్రైవ్–త్రూ మెలన్ మార్కెట్’ను నిర్మించబోతున్నారు. ⇒ వ్యాపారస్తుల కోసం 52 ప్లాట్ ఫామ్స్ నిర్మిస్తారు. ⇒ డైరీ, ఫ్రోజన్ ఫుడ్స్, డ్రైఫ్రూట్స్ కోసం 40 ఏసీ షాపులు సహా నానో క్లోరినేషన్, ఇన్–హౌస్ ఐస్ ఫ్లేక్ ఉత్పత్తి వ్యవస్థలతో కూడిన ఫిష్ అండ్ సీ ఫుడ్స్ మార్కెట్ ⇒ ఫౌల్ట్రీ, మాంస ఉత్పత్తుల విక్రయాలకు 24 ఏసీ షాపులను అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే ఇది అత్యాధునిక మార్కెట్: తుమ్మలతుర్కయాంజల్: సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కోహెడ అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ దేశంలోనే అత్యాధునిక వ్యవసాయ మార్కెట్గా రూపుదిద్దుకోనుందని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ వృద్ధి, ఆధునిక మార్కెటింగ్ సదుపాయాల కల్పన లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు పేర్కొన్నారు.భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరో రెండు దశాబ్దాల వరకు మార్కెట్ అవసరాలను తీర్చగలిగే విధంగా దీనిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 206 వ్యవసాయ మార్కెట్ కమిటీలు, 79 ఉప మార్కెట్ యార్డులు పనిచేస్తున్నాయని మంత్రి తుమ్మల తెలిపారు. వీటి ద్వారా ఏటా సుమారు రూ.80 వేల కోట్ల విలువైన వ్యవసాయ వాణిజ్య కార్యకలాపాలు జరుగుతున్నాయని వెల్లడించారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణ, మార్కెట్ అభివృద్ధి, ధరల సమాచారం, రైతు బజార్ల నిర్వహణ, కనీస మద్దతు ధర కొనుగోళ్లకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో మార్కెట్ కమిటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
● 61 కేసుల్లో నిందితుడు ● వికారాబాద్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు ● తుపాకీ, బంగారం స్వాధీనం అనంతగిరి: కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగ, 61 కేసుల్లో నిందితుడైన వికాస్సింగ్ను వికారాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పీఎస్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ స్నేహమెహ్ర వివరాలు వెల్లడించారు. వికారా బాద్ మున్సిపల్ పరిధిలోని మణికంఠనగర్ కాలనీలో మే1 న రాత్రి సమయంలో తాళం వేసిన ఇంట్లో దూరిన ఓ దొంగ తులంన్నర బంగారు ఆభరణాలు, రూ.2.10లక్షలు దోచుకెళ్లాడు. కేసు నమో దు చేసిన పోలీసులు డీఎస్పీ అంజయ్య ఆధ్వర్యంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ బల్వంత్రాయ్, వికారాబాద్ సీఐ రఘుకుమార్ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. సీసీ కెమెరాలు, ఘటనాస్థలంలో సేకరించిన ఆధారాలను పరిశీలించి నిందితుడు వికాస్సింగ్ అలియాస్ తేజాసింగ్గా గుర్తించారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో నివాసం ఉంటున్న వికాస్సింగ్ పైకి కూలీ పనులు చేస్తున్నట్లు నటిస్తూ తాళాలు వేసి ఉన్న ఇళ్లలో రాత్రి వేళ దొంగ తనాలకు పాల్పడేవాడు. ఇతనిపై నిఘా పెట్టిన పోలీసులు వికారాబాద్ రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకుని విచారించగా నేరాల చిట్టా విప్పాడు. బాల్యంలోనే చోరీల బాట పదహారేళ్ల వయసులో నేర జీవితాన్ని ప్రారంభించిన ఇతనిపై సంగారెడ్డి, బొల్లారం పరిసరాల పరిధిలో 34 కేసులున్నాయి. జైలు శిక్ష అనుభవించిన వికాస్సింగ్ 2024 జూన్ 26న విడుదలయ్యాడు. ప్రవర్తణలో మార్పు రాకపోవడంతో వికారాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పరిధిలో 27 సార్లు చోరీ లకు పాల్పడి 157 తులాల బంగారం, 256 తులాల వెండి, రూ.8,22,500 నగదును దోచుకెళ్లాడు. ఈ సొమ్ముతో జల్సాలు చేయడమే కాకుండా హెల్పింగ్ హ్యాండ్ అనే ఎన్జీఓ పేరుతో తన స్వగ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. తన స్నేహితులను చైన్నె, గోవా, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూర్, రాజస్థాన్, డెహ్రాడూన్ల విహార యాత్రలకు పంపిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా సామాజిక రక్షణ వలయం ఏర్పరచుకున్నాడు. వారి ప్రోద్బలంతోనే.. చోరీ చేసిన ఆభరణాలను తన స్వగ్రామ పరిసరా ల్లోని కుర్వర్, గంజేరికి చెందిన శ్యామ్ మోహన్, సూరజ్ మోహన్, అశోక్ సోని, వికాస్ అగ్రహారి అనే బంగారం వ్యాపారులకు అమ్మేవాడు. ఇతనితో మంచి సంపాదన ఉందని భావించిన సదరు వ్యాపారులు బాల్యంలోనే వికాస్సింగ్కు డబ్బులిచ్చి దొంగతనాలకు ప్రోత్సహించారు. స్థానికంగా చోరీలు చేస్తే పోలీసులతో ఇబ్బంది తలెత్తుతోందని చెప్పి ఇతర రాష్ట్రాలకు వెళ్లమని ఉసిగొల్పారు. తలా రూ.10 వేలు ఇచ్చి ఓ తుపాకీ (2ఎంఎం పిస్టల్) కొనుగోలు చేయమని సూచించారు. ఇప్పటి వరకు ఇతనిపై 61 కేసులు నమోదయ్యాయి. నిందితుడి నుంచి తులంనర బంగారం, తుపాకీ స్వాధీ నం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. ఇతన్ని పట్టుకున్న పోలీసు బృందాన్ని అభినందించారు. -
ఫార్మర్ రిజిస్ట్రీ ఉంటేనే పథకాలు
మొయినాబాద్రూరల్: ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. మండలంలోని చిన్నమంగళారంలో గురువారం నిర్వహించిన గ్రామ సభలో ఆయన రైతు రిజిస్ట్రీపై అవగాహన కల్పించారు. రైతులకు ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలు, సబ్సిడీలు, పెట్టుబడి సహాయం రిజిస్ట్రీ ఉంటేనే అందుతాయని తెలిపారు. వ్యవసాయ సంబంధిత ప్రయోజనాలు సకాలంలో అందాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నమోదై ఉండాలన్నారు. గ్రామాల్లో ఇంకా నమోదు చేసుకోని రైతులను గుర్తించి ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి కిషన్రావు, తహసీల్దార్ గౌతమ్కుమార్, ఎంపీడీవో హిమబిందు, మండల వ్యవసాయాధికారి అనురాధారెడ్డి, ఎంపీవో వెంకటేశ్వర్రెడ్డి, సర్పంచ్ తలారి లక్ష్మిబాలయ్య, ఉపసర్పంచ్ అంజనేయులుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి -
వాగులైనా వదలం!
మొయినాబాద్: ప్రభుత్వ భూములు, కాల్వలు, చెరువులు ఎక్కడుంటే అక్రమార్కుల చూపు అక్కడ వాలిపోతోంది. కొంతమంది పాలకులు, అధికారులతో కుమ్మకై ్క దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని సురంగల్ శివారు నుంచి ఎర్రకుంట వాగు ఉంది. కనకమామిడి, సురంగల్, అమ్డాపూర్, నజీబ్నగర్ రెవెన్యూల్లోని వర్షం నీరంతా ఎర్రకుంట వాగు ద్వారా ప్రవహించి ఈసీ వాగులో కలుస్తుంది. సురంగల్ రెవెన్యూలోని సర్వేనంబర్ 332, 282లో ఉన్న పలువురు ప్రైవేటు వ్యక్తుల భూమి ఎర్రకుంట వాగు సమీపం వరకు ఉంటుంది. వీటిని కొనుగోలు చేసిన కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాగును సైతం ఆక్రమిస్తున్నారు. వాగు మధ్య నుంచి పునాది తీసి గోడ నిర్మిస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధి, మరో నాయకుడి అండదండలతోనే వీరు వాగును కబ్జా చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. తోలుకట్టలో.. మండల పరిధిలోని తోలుకట్ట రెవెన్యూలో గుండ్లవాగు కాల్వ ఉంది. దీనికి ఆనుకుని సర్వేనంబర్ 191లో ప్రైవేటు భూమి ఉంది. నగరానికి చెందిన ఓ వ్యాపారి దీన్ని కొనుగోలు చేసి వాగు కాల్వను పూర్తిగా ఆక్రమించాడు. ఎవరి అనుమతి లేకుండానే కాలువలో నుంచి పైపులు వేసి పైనుంచి మట్టితో పూడ్చివేసి ప్రహరీ నిర్మించాడు. ఈతతంగం జరిగి ఆరు నెలలు గడుస్తున్నా సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. వర్షాకాలం మొదలైతే కాల్వలోకి వెళ్లాల్సిన వరదనీరు పంట పొలాల్లోకి చేరుతుందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నీటిపారుదల, రెవెన్యూ అధికారులు స్పందించి కాల్వలను కబ్జా చెర నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు. తోలుకట్టలో గుండ్లవాగును పూడ్చి ప్రహరీ నిర్మాణం పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటాం సురంగల్ ఎర్రకుంట వాగులో ప్రహరీ గోడ నిర్మిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. తోలుకట్ట గుండ్లవాగు కాల్వను పూడ్చినట్లు తెలిసింది. రెవెన్యూ ఇన్స్పెక్టర్ను పంపించి పరిశీలించాం. కాల్వలో వేసిన పైపులను తొలగించి పూడ్చినవారిపై చర్యలు తీసుకుంటాం. – గౌతమ్కుమార్, తహసీల్దార్, మొయినాబాద్ -
చివరి రోజు జోరు
శుక్రవారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 2026తుర్కయంజాల్: కొహెడ సర్వే నంబర్ 167 బై 1లో శనివారం నిర్వహించనున్న సీఎం రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లను శుక్రవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పరిశీలించనున్నట్లు గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి తెలిపారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కలెక్టర్ నారాయణ రెడ్డి తదితరులు హాజరుకానున్నట్టు తెలిపారు. మొయినాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు ఈసారి ముందుగానే వచ్చాయి. పాఠశాలలు పునఃప్రారంభం కాకముందే స్కూళ్లకు చేరుతున్నాయి. మండలంలోని సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకోసం ఇప్పటికే మండల వనరుల కేంద్రానికి చేరాయి. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకోసం మొత్తం 21,497 పాఠ్యపుస్తకాలు, 31,165 నోట్ పుస్తకాలు వచ్చినట్టు మండల విద్యాధికారి మల్లయ్య తెలిపారు. మరో ఏడు టైటిల్స్ రావాల్సి ఉందన్నారు. గురువారం మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు వాటిని పంపిణీ చేశారు. అనంతగిరి: క్రీడలతో శారీరక దృఢత్వం తోపాటు స్నేహభావం పెరుగుతుందని స్పీకర్ ప్రసాద్కుమార్ అన్నారు. గురువారం వికారాబాద్లోని బ్లాక్ గ్రౌండ్లో వీడీఎఫ్ఏ ఆధ్వర్యంలో స్పీకర్ కప్ పోటీలు నిర్వహించారు. విజేత జట్లకు బహమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటమలు సహజమన్నారు. ఓటమి గెలుపుకు నాంది అన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ సంతోష్కుమార్, పట్టణ పార్టీ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, మండల అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, కౌన్సిలర్ చిగుళ్లపల్లి రమేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మలక్పేట: మూసారంబాగ్ డౌన్ స్ట్రీమ్ బ్రిడ్జి, సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తనిఖీ చేశారు. అధికారులతో పనుల పురోగతిని సమీక్షించారు. మిగిలిన పనులు వేగిరం చేసి, సకాలంలో పూర్తి చేసి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ఆదేశించారు. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జికి మొత్తం 85 స్పాన్లు ఉండగా వాటికి గర్డర్లు నిర్మించామని, 79 స్పాన్లకు డెక్స్లాబ్ పూర్తయిందని, అప్ ర్యాంప్, డౌన్ర్యాంప్ పనులు ఏక కాలంలో జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. సాక్షి, రంగారెడ్డిజిల్లా: సాధారణంగా ఇబ్రహీంపట్నం సబ్రిజిస్ట్రార్ ఆఫీసులో రోజుకు సగటున 60 నుంచి 80 ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటా యి. గురువారం ఏకంగా 130 ఆస్తులు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇక ఎల్బీనగర్ ఎస్ఆర్ఓలో రోజుకు 40 నుంచి 50 ఆస్తులు రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. తాజాగా 80కిపైగా స్లాట్లు బుక్కయ్యాయి. ఇక మూసాపేటలోని జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసు సహా హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్, చంపాపేట్, మహేశ్వరం, శంషాబాద్, గండిపేట్ సబ్రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వం సవరించిన భూముల మార్కెట్ విలువ శుక్రవారం నుంచి అమ ల్లోకి తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ఔటర్ అవతల ఉన్న మండల కేంద్రాల్లో 50 శాతం, లోపల ఉన్న మున్సిపల్ కేంద్రాలు సహా శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట్, నార్సింగి, కొండాపూర్, మదాపూర్, సహా ఔటర్కు అటు ఇటుగా ఉన్న వాణిజ్య స్థలాలు, కొత్తగా అందుబా టులోకి రాబోతున్న గ్రీన్ఫీల్డ్ రోడ్ల వెంట వంద శాతం పెరిగే అవకాశం ఉంది. పొద్దుపోయే వరకు రిజిస్ట్రేషన్లు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతర్వాత 2021లో భూముల మార్కెట్ విలువను 20 శాతం పెంచుతూ అప్పటి ప్రభుత్వం తొలిసారిగా నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత 2022లో 33 శాతం పెంచింది. తాజాగా స్థానికంగా ఉన్న మౌలిక సదుపాయాలు, వాణిజ్యపరమైన డిమాండ్ను బట్టి 40 నుంచి 50 శాతం పెంచింది. మరికొన్ని చోట్ల ఏకంగా వందశాతం పెరిగే అవకాశం ఉంది. నిజానికి ఓఆర్ఆర్ లోపల 39 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉండగా జిల్లాలో నెలకు సగటున 21 నుంచి 22 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి నెలకు రూ.360 కోట్ల ఆదాయం సమకూరుతుంది. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, స్టాంప్డ్యూటీ చార్జీలు రెట్టింపు కానుండడంతో ఇప్పటికే భూ విక్రయదారులు, బిల్డర్లతో ఆస్తుల అగ్రిమెంట్ చేసుకున్న కొనుగోలుదారులు ఆఖరి రోజైన గురువారం రిజిస్ట్రేషన్లకు క్యూ కట్టారు. దీంతో ఆయా ఆఫీసులు ఉద్యోగులు, డాక్యుమెంట్ రైటర్లు, క్రయవిక్రయదారులతో కిక్కిరిసిపోయాయి. పరిమితికి మించి స్లాట్లు బుక్ కావడంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు సిబ్బంది రాత్రి పొద్దు పోయే వరకు ఆఫీసుల్లోనే ఉండి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. ఎక్కడ ఎంతంటే.. ● తుక్కుగూడ, మంకాల్లో 70 శాతం పెంచినట్లు తెలిసింది. ఇక్కడ ఎకరం విలువ రూ.78,40,000 ఉండగా, తాజాగా రూ.1,33,28,000 పెంచినట్లు సమాచారం. వాణిజ్యస్థలం గజం ధర రూ.10,500 నుంచి 18,400 పెరిగే అవకాశం ఉంది. ● కోకాపేటలో ప్రస్తుతం ఎకరం ధర రూ.7 కోట్లు ఉండగా, దాన్ని రూ.10 కోట్లకు పెంచినట్లు తెలిసింది. ● కందుకూరులో ఎకరం ధర రూ.50 లక్షలు ఉండగా, ప్రస్తుతం రూ.3 కోట్లకు పెంచినట్లు సమాచారం. ● యాచారంలో ఎకరం ధర రూ.50 లక్షలలోపు ఉండేలా నిర్ణయం తీసుకుంది. ● ఇబ్రహీంపట్నం గ్రామీణ ప్రాంతంలో ఎకరం ధర రూ.15 లక్షలు ఉండగా, దాన్ని రూ.60 లక్షలకు పెంచినట్లు తెలిసింది. ● మొయినాబాద్ మున్సిపాలిటీ హిమాయత్సాగర్లో ఎకరం రూ.82.50 లక్షలు ఉండగా, దీన్ని డబుల్ చేసినట్లు సమాచారం. ● ఓఆర్ఆర్కు అవతల ఎకరం రూ.10 లక్షలుగా నిర్ణయించారు. ● ఓఆర్ఆర్కు లోపల అపార్ట్మెంట్లలో చదరపు అడుగు కనిష్టంగా రూ.3,600 చేశారు. ● శంకర్పల్లిలో రూ.2,500 నుంచి రూ.5,500 వరకు పెంచినట్లు తెలిసింది. ● చేవెళ్ల ప్రాంతంలో భూముల విలువ ప్రస్తుతం రూ.7.5లక్షలు, రూ.16.50 లక్షలు, రూ.42 లక్షలుగా ఉంది. ఇది ఆయా ప్రాంతాల వారీగా దాదాపు రెట్టింపు కానుంది. ప్లాట్ల విలువ రూ.2,100 ఉన్నది రూ.4వేల నుంచి రూ.5వేల మధ్యలో పెరగనుంది. పట్టణ కేంద్రాల్లో రూ.7,100 ఉన్నది రూ.10 వేల నుంచి రూ.11వేల మధ్య పెరగనుంది.నూతన ఆర్డీవోగా శ్రీనివాస్రెడ్డి ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి బదిలీ అయ్యారు. ఆయనను జిల్లా రెవెన్యూ అధికారిగా నియమిస్తూ గురువారం కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో కలెక్టరేట్లోని ఎస్డీసీ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్రెడ్డి బదిలీపై ఇక్కడికి వస్తున్నారు. మూడేళ్లపాటు అనంతరెడ్డి ఆర్డీవోగా విధులు నిర్వర్తించారు. భూముల మార్కెట్ విలువ సవరణ ప్రభావం రిజిస్ట్రేషన్ ఆఫీసులకు క్యూకట్టిన క్రయవిక్రయదారులు అంచనాలకు మించి రిజిస్ట్రేషన్లు కిక్కిరిసిపోయిన ఎస్ఆర్ఓ కేంద్రాలు పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి.. -
గ్రామాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దుకుందాం
కందుకూరు: పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ గ్రామాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దుకుందామని జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా గురువారం స్థానిక సర్పంచ్ సరికొండ పాండు, ఎంపీడీఓ సరిత ఆధ్వర్యంలో కందుకూరులో నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. చెత్తను వేరు చేసి అందించే బాధ్యతను మహిళలు తీసుకోవాలని అన్నారు. ఆ విషయంలో అందరినీ చైతన్యం చేసేలా మహిళా సంఘాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. రాబోయే వర్షాకాలంలో నీరు నిల్వకుండా చూసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సౌడపు మమతవెంకటేశ్గౌడ్, ఎస్ఐ పరమేష్, పంచాయతీ కార్యదర్శి సురేందర్, మండల వైద్యాధికారి డాక్టర్ హుమేరా సుల్తానా తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి -
అన్నదాత ఆగం!
బషీరాబాద్: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మద్దతు ధరకు అమ్ముకోవడానికి వెళ్లిన రైతులు దోపిడీకి గురవుతున్నారు. ఓ వైపు తూకాల్లో, మరో వైపు తాలు, తేమ పేరిట బస్తాకు మూడు కిలోల తరుగు తీస్తుండగా మరో వైపు హమాలీ ఛార్జీల పేరుతో పెనుభారం మోపుతున్నారు. బషీరాబాద్ మండలంలో ఐకేపీ, సొసైటీ కింద కాశీంపూర్, దామర్చెడ్, నవల్గా, నావంద్గీ, మైల్వార్ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి 51,154 బస్తాల ధాన్యం సేకరించారు. ఈ బస్తాకు తరుగు పేరిట అదనంగా మూడు కిలోలు తూకం వేయడంతో మరో 1,534 క్వింటాళ్ల ధాన్యాన్ని రైతులు నష్టపోయారు. బస్తాకు 40 కిలోల లెక్కన 2,046 టన్నుల వరి ధాన్యం ఐదు కేంద్రాల నుంచి ఇప్పటికే మిల్లులకు తరలించారు. ఈ ధాన్యం తూకం వేయడానికి హమాలీ ఖర్చుల కింద క్వింటాలుకు రూ.35 చొప్పున రూ.7.17లక్షలు వసూలు చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఇలా.. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తెచ్చిన తర్వాత అన్ని పనులను హమాలీలే చూసుకుంటారు. లోడింగ్ మొదలు కొని తూకాలు వేమడం, బస్తాలు కుట్టి లారీల్లో తరలించడం వీరి బాధ్యత. ఇందుకు ప్రభుత్వం రూ.క్వింటాలుకు రూ.20 చెల్లిస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.5 చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.15 చెల్లించాల్సి ఉంటుంది. కానీ కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతుల లోడింగ్, అన్లోడింగ్, తూకాలు వేయడం వంటి పనులకు క్వింటాలుకు రూ.32 నుంచి 35 వరకు వసూలు చేస్తున్నారు. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. క్వింటాలుకు రూ.35 చొప్పున వడ్డన రైతుల నుంచి ఇప్పటికే రూ.7.17 లక్షలు వసూలు చార్జీలకు రశీదులు ఇవ్వని నిర్వాహకులు పట్టించుకోని అధికార యంత్రాంగం -
క్యారెట్ సాగుపై రైతులకు అవగాహన
షాబాద్: క్యారెట్ సాగులో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు హార్టికల్చర్ శాస్త్రవేత శ్రీకృష్ణ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని లక్ష్మరావుగూడలో సేవా స్ఫూర్తి ఫౌండేషన్, ఉద్యాన శాఖ క్రిడా కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో క్యారెట్ సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యారెట్ పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే సరైన భూసిద్ధం, అనువైన రకాల ఎంపిక, సమతుల్య ఎరువుల వినియోగం, నీటి పారుదల నిర్వహణ, కలుపు నియంత్రణ శాసీ్త్రయ యాజమాన్య పద్ధతులను పాటించాలని రైతులకు సూచించారు. వర్షాధార పరిస్థితుల్లో నల్లరేగడి నేలల్లో క్యారెట్ సాగు చేసే రైతులు నీటి నిల్వ లేకుండా డ్రైనేజీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. హార్టికల్చర్ అధికారి కీర్తి కృష్ణ మాట్లాడుతూ.. ఉద్యానశాఖ ద్వారా రైతులకు అందుతున్న సేవలు, పథకాలు, సాంకేతిక సూచనలు చేశారు. సరైన మొక్కల మధ్య దూరం, సమగ్ర చీడపీడల నివారణ చర్యలను రైతులకు వివరించారు. సేవా స్ఫూర్తి పౌండేషన్ ప్రాజెక్డ్ మేనేజర్ రత్నాకర్ మాట్లాడుతూ.. నేల ఆరోగ్య పరిరక్షణ, సేంద్రియ ఎరువుల వినియోగం, శాసీ్త్రయ సాగు పద్ధతుల ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. -
మాట నిలబెట్టుకున్న.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఉదారత చాటారు.
ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి ఇబ్రహీంపట్నం: ఫార్మర్ రిజిస్ట్రీని రైతులు తప్పక చేసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం కర్ణంగూడలో నిర్వహించిన గ్రామసభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫార్మర్ రిజిస్ట్రేషన్కు యాప్ అనుసంధానం చేసినందున రైతులు తప్పనిసరిగా భూమి విస్తీర్ణం, సాగు చేస్తున్న పంటల వివరాలను కచ్చితంగా నమోదు చేసుకోవాలని తెలిపారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను పునఃప్రారంభించేందుకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా ప్రారంభమయ్యే పరిస్థితులు ఉన్నాయని, వ్యవసాయ శాఖ సూచనల మేరకు రైతులు పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. వర్షాకాలంలో నీటి కాలుష్యం, దోమల వ్యాప్తి, అంటువ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా కార్యక్రమంలో ప్రతి అర్హుడి పేరు నమోదయ్యేలా సహకరించాలన్నారు. మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రమాదాలు అరికట్టేందుకు రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం గమనిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఏసీపీ కేపీవీ రాజు, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్మోహన్, సర్పంచ్ తిరుమలరెడ్డి, జిల్లా ఉద్యానవనశాఖాధికారి సురేష్ పాల్గొన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి -
కుర్మిద్దలో గ్రామసభ బహిష్కరణ
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభలు గురువారం యాచారం, ఇబ్రహీంపట్నం మండలాల్లో జరిగాయి. యాచారం మండలంలోని కుర్మిద్ద గ్రామంలో సర్పంచ్ శ్రీవిద్య ఆధ్వర్యంలో జరిగిన సభలో ఫార్మా రైతులు ఆందోళన చేపట్టారు. వ్యవసాయం చేసుకుంటుంటే అధికారులు విద్యుత్ ఎందుకు నిలిపేశారని ప్రశ్నించారు. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. ట్రాన్స్కో, రెవెన్యూ అధికారులు స్పందించాలని పట్టుబట్టారు. రైతులను ఇబ్బందులకు గురి చేసే ప్రభుత్వం నిర్వహించే సభలు తమకు అవసరం లేదని, సమస్య తీర్చే వరకు సభ వాయిదా వేయాలని సర్పంచ్ సైతం భీష్మించారు. గ్రీన్ఫార్మా సీఐ సత్యనారాయణ జోక్యం చేసుకున్నా రైతులు వినలేదు. దీంతో చేసేదేమి లేక వాయిదా వేశారు. గున్గల్ గ్రామంలో ప్రత్యేకాధికారి మాధవరావు, సర్పంచ్ బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఇబ్రహీంపట్నంలో ప్రశాంతం ఇబ్రహీంపట్నం మండలంలోని పోల్కంపల్లి, నాగన్పల్లి, ఉప్పరిగూడ, పోచారం, కప్పపహాడ్, ఎల్మినేడు, తులేకలాన్ గ్రామాల్లో సభలు ప్రశాంతంగా జరిగాయి. అధికారులు, సర్పంచ్లు పాల్గొని గ్రామ అభివృద్ధిపై మాట్లాడారు. పొలాలకు విద్యుత్ కట్ చేశారని నిలదీత -
ఆకు కూరలు.. అధిక లాభాలు
● సేంద్రియ విధానంలో పంటల సాగు ఆరోగ్యకరం ● కృషి విజ్ఞాన కేంద్రం క్రిడా నిపుణుడు జి.శ్రీకృష్ణ కందుకూరు: సేంద్రియ పంటల కొనుగోలుకు వినియోగదారులు అధికంగా ఆసక్తి చూపుతుంటారు. ఖర్చు ఎక్కువైనా అందుబాటులో ఉంటే కొనేందుకు ఆసక్తి చూపుతారు. ఆర్గానిక్ విధానంలో పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, కొత్తిమీర సాగు చేసి మంచి లాభాలు ఆర్జించవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం క్రిడా నిపుణుడు జి.శ్రీకృష్ణ సూచిస్తున్నారు. ఇందులో సస్యరక్షణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన రైతులకు పలు సలహాలు, సూచనలు అందించారు. నేలలు.. చౌడు నేలలు మినహా అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. ఇసుకతో కూడిన ఎర్ర నేలలు అధిక దిగుబడినిస్తాయి. అధిక దిగుబడులకు ఉదజని సూచిక 7.0 ఉన్న నేలలు అనుకూలం. బీజామృతంతో విత్తనశుద్ధి చేయాలి. విత్తన మోతాదు ● పాలకూర ఎకరాకు 10– 12 కిలోలు ● గోంగూర 6 కిలోలు ● మెంతికూర 8– 10 కిలోలు సాగు విధానం.. ● చిన్నచిన్న మడులు కట్టి విత్తనాలను నేరుగా వెదజల్లి విత్తుకోవాలి. ● ఏడాది పొడవునా ఎప్పుడైనా వీటిని సాగు చేయొచ్చు. ● నవంబర్– డిసెంబర్ నెలల్లో విత్తుకుంటే ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు. నీటి యాజమాన్యం... ● విత్తిన వెంటనే ఒక తడి ఇవ్వాలి. ● విత్తిన 3 రోజులకు రెండో తడి అందించాలి. ● ఆతర్వాత భూమిలో తేమశాతాన్ని బట్టి వారం నుంచి పదిరోజులకు ఒక తడి పెట్టాలి. ఎరువుల యాజమాన్యం ● ఎకరాకు 2,500 కిలోల నాడెప్ కంపోస్టు వేయాలి. ● 125 కిలోల ఘన జీవామృతం వేస్తూ విత్తనాన్ని నాటాలి. సస్యరక్షణ.. ● రసం పీల్చే పురుగులు ఆకుల నుంచి మరియు లేత కాండం నుంచి రసం పీల్చడం వలన ఆకులు ముడుచుకునిపోయి పసుపు రంగుకు మారతాయి. ఆకులు నాణ్యత కోల్పోతాయి. ● ఒక్కోసారి ఆకులపై నల్లటి మసి ఏర్పడుతుంది. ● నివారణకు తప్పనిసరి పరిస్థితుల్లో వేప సంబంధిత మందులు (వేప కషాయం, నీమాస్త్రం, వేప నూనె మొదలైనవి) మాత్రమే పంటకాలంలో 1– 2 సార్లు పది రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. ఆతర్వాత 3, 4 రోజలలో ఆకులను కోసుకోవచ్చు. ● గొంగళి పురుగులను చేతితో ఏరివేసి నాశనం చేయడం చాలా మంచిది. తెగుళ్లు ● తెగులు సమస్య ఎక్కువగా ఉన్న భూముల్లో పంట మార్పిడి పద్ధతిని పాటించాలి. ● బీజామృతంతో తప్పనిసరిగా విత్తనశుద్ధి చేసుకోవాలి. ● 2 కిలోల ట్రైకోడెర్మావిరిడి, మాగిన పశువుల ఎరువు 90 కిలోలు, 10 కిలోల వేపపిండి కలిపి నీళ్లు చల్లి వారం రోజులు మగ్గిన తర్వాత ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. ● ఇలా చేయడంతో నేల ద్వారా ఆశించే తెగుళ్లను అరికట్టవచ్చును. ● పుల్లటి మజ్జిగ మరియు ఇంగువ ద్రావణం 10 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పంటపై పిచికారీ చేసి ఆకుమచ్చ తెగులు, బూడిద తెగులు నివారించవచ్చు. ● పదిహేరు రోజులకు ఒకసారి పంటపై జీవామృతం పిచికారీ చేసి, నాణ్యమైన ఉత్పత్తులు పొందవచ్చు. -
మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే
బేడ బుడగ జంగం సంఘానికి స్థలం విరాళం షాద్నగర్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సొంత ప్లాటును ఓ సంఘానికి రిజిస్ట్రేషన్ చేసి షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఉదారతను చాటారు. గురువారం పట్టణంలోని ఎస్సీ బేడ బుడగ జంగం సంఘానికి ఎమ్మెల్యే చేగూరు రోడ్డులోని విశ్వసాయి వెంచర్లో తనకున్న 120 చదరపు గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి దస్తావేజు పత్రాలను సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రూ.లక్షలు విలువ చేసే సొంత ప్లాటును సంఘానికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం అభినందనీయమన్నారు. ఉదారతను చాటిన ఎమ్మెల్యేకు సంఘం నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు తూర్పాటి వెంకటేష్, సభ్యులు ముత్యాలు, ఊషయ్య, యాదయ్య, పెంటయ్య, నర్సింలు, జంగయ్య, బాలకృష్ణ, అంజయ్య, పెంటయ్య, యాదయ్య, రామస్వామి, స్వామి, మేగలయ్య, దశరథ్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. -
నర్సింగ్ స్కూల్ హాస్టల్లో అగ్నిప్రమాదం
మొయినాబాద్: షార్ట్ సర్క్యూట్తో నర్సింగ్ స్కూల్ హాస్టల్లో మంటలు అంటుకుని ఫర్నిచర్ కాలిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది. మున్సిపల్ కేంద్రంలోని కరున నర్సింగ్ స్కూల్ హాస్టల్ భవనంలో గురువారం ప్యానల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్తో మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో హాస్టల్ భవనంలో ఇద్దరే విద్యార్థులు ఉన్నారు. మంటలు ఎగిసి పడుతుండడంతో భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే స్థానికులు పైపులతో నీళ్లు పట్టి మంటలు ఆర్పారు. అప్పటికే ప్యానల్ బోర్డు గదిలో ఉన్న ఫర్నిచర్తోపాటు ఇతర సామాగ్రి కాలిపోయాయి. ఎవరికీ ఎలాంటి అపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం యాలాల: ఈతకు వెళ్లి గల్లంతు అయిన వ్యక్తి మృతదేహం లభ్యం అయింది. వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం బస్తాపూర్కు చెందిన రహమత్(28)తో పాటు పాత తాండూరు వాసి మోయిజొద్దీన్లు బుధవారం సాయంత్రం కోకట్ కాగ్నా నదిలో ఈతకు వెళ్లి, మునిగిన సంగతి విధితమే. అందులో మోయిజోద్దిన్ మృతదేహం అదే రోజు లభ్యం కాగా.. రహమత్ ఆచూకీ లేకుండా పోయింది. ఎస్ఐ విఠల్రెడ్డి, తాండూరు అగ్ని మాపక సిబ్బంది బుధవారం చీకటి పడేంతవరకు నదిలో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. కాగా.. గురువారం తెల్లవారుజాము నుంచి మరలా గాలింపు చేపట్టగా.. రహమత్ మృతదేహం లభ్యమైంది. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. శిక్షణ, ఉపాధిని వినియోగించుకోండి కుల్కచర్ల: నిరుద్యోగ గిరిజన యువతకు ప్రభుత్వం ఇచ్చే శిక్షణ, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కమలాకర్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో యువతకు వివిధ సంస్థల ఆధ్వర్యంలో ఇచ్చే శిక్షణ, ఉద్యోగాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్, గిరిజన వసతిగృహ ప్రత్యేకాధికారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ‘సర్’పై ప్రత్యేక దృష్టి తాండూరు: ఓటరు జాబితా ముమ్మర సవరణ(సర్) కార్యక్రమం ముగిసే వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఎల్ఏలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆ పార్టీ తాండూరు నియోజకవర్గ సర్ కమిటీ కన్వీనర్ కరణం పురుషోత్తంరావు అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లడారు. ఓటరు జాబితా సవరణలో అర్హులైన ఓటర్లు, పార్టీ మద్దతు దారుల ఓట్లకు సంబంధించి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా పట్టణంలోని తులసీ గార్డెన్లో ఈ నెల 7న ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అధ్యక్షతన 269 మంది బీఎల్ఏలతో సమావేశం జరగనుందని పేర్కొన్నారు. సవరణలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా.. పార్టీ నేతల దృష్టికి తేవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింహులు, పార్టీ నాయకులు, ఆత్మ కమిటీ చైర్మన్లు ఉన్నారు. -
తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులను గుర్తించండి
జర్నలిస్ట్ ఫోరం జిల్లా సహాయ కార్యదర్శి వెంకన్న అబ్దుల్లాపూర్మెట్: తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులను ప్రభు త్వం గుర్తించాలని తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం(టీజేఎఫ్) రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి పల్లె వెంకన్న కోరారు. గురువారం అబ్దుల్లాపూర్మెట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2009–2014 జూన్ 2 వరకు ఎల్బీనగర్లో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో సమష్టి పోరాటలు చేశామన్నారు. ఓ పక్కన జేఏసీ కింద ఉద్యోగులు, న్యాయవాదులు, ఆర్టీసీ, ప్రజాసంఘలతో కలిసి పెద్ద ఎత్తున తెలంగాణ పోరు సాగించామన్నారు. రాష్ట్రం వచ్చే వరకు జరిగిన పోరాటాల్లో జర్నలిస్టులు కీలక భూమిక పోషించారన్నారు. ప్రస్తుతం సర్కారు అర్హులైన ఉద్యమ జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డు లు జారీ చేయాలని కోరారు. ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్వరలో ఉద్యమ జర్నలిస్టులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. మద్యం దుకాణంలో చోరీ కొడంగల్ రూరల్: వైన్షాపులో దొంగతనం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని నాగ ఎల్లమ్మ వైన్ షాపును నిర్వాహకులు బుధవారం రాత్రి ఎప్పటిలాగే మూసివేశారు. అర్ధరాత్రి సమయంలో దుండగులు దుకాణం వెనుకభాగం నుంచి చొరబడి అందిన కాడికి అపహరించారు. గురువారం ఉదయం దుకాణం తెరచిన నిర్వాహకులు.. సామగ్రి చిందరవందరగా పడుండటాన్ని గమనించి చోరీ జరిగిందని, రూ.50 వేల నగదుతో పాటు, రూ.10 వేల విలువ చేసే మద్యం సీసాలను అపహరించినట్లు గుర్తించారు. అనంతరం పోలీసులు సమాచారం ఇవ్వగా.. క్లూస్ టీం వచ్చి పరిసరాలను పరిశీలించింది. వివరాలు సేకరించారు. నిర్వాహకుడు రఘు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ యాదయ్య తెలిపారు. -
నేటినుంచి పెరిగిన ధరల ప్రకారమే..
హుడాకాంప్లెక్స్: సరూర్నగర్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో తక్కువలో తక్కువ 20 శాతం, ఎక్కువలో ఎక్కువ 50 నుంచి 70 శాతం పెరిగినట్టు సబ్ రిజిస్ట్రార్ రాంభూపాల్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత మార్కెట్ విలువలు, అక్కడి వాస్తవ పరిస్థితులు, మౌలిక సదుపాయాలు పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం మార్కెట్ విలువ సవరించిందన్నారు. సరూర్నగర్ పరిధిలో గతంలో కొన్ని ప్రాంతాల్లో గజం రూ.21,000 ఉండేదని సవరించిన తర్వాత రూ.31,500 నుంచి రూ.40,100 పెరిగిందని తెలిపారు. కమర్షియల్ ధరలో కూడా మార్పులు జరిగాయన్నారు. గతంలో రూ.50,100 ఉన్న గజనం ధర సవరించిన తర్వాత రూ.56,100 నుంచి రూ. 75,200కు పెరిగిందన్నారు. అపార్ట్మెంట్లోని ఫ్లాట్ ఫీటు విలువ రూ.4వేల నుంచి రూ.4,500కు, రూ.5వేలు ఉన్న ప్రాంతాల్లో రూ.5,500కు పెరిగిందని వివరించారు. శుక్రవారం నుంచి పెరిగిన ధరల ప్రకారమే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని, కొనుగోలుదారులు సహకరించాలని ఆయన సూచించారు. -
ఇంకుడుగుంతలతో భూగర్భ జలాల పెంపు
అబ్దుల్లాపూర్మెట్: వచ్చే వర్షాకాలంలో వర్షపు నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని డీఆర్డీఓ శ్రీలత సూచించారు. మండలంలోని కవాడిపల్లిలో గురువారం సర్పంచ్ కొలన్ ప్రసన్నరవీందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన గ్రామసభకు ఎంపీడీఓ శ్రీవాణితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీలత మాట్లాడుతూ.. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. గ్రామాల్లో తడి,పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి ఘన వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వర్షాకాలంలో తాగునీటి పరిశుభ్రత, నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. మొక్కల పెంపకం, వాటి సంరక్షణ, పచ్చదనాన్ని పెంపొందించడంలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డుసభ్యులు, పంచాయతీ కార్యదర్శి, జీపీఓ, గ్రామస్తులు పాల్గొన్నారు. డీఆర్డీఓ శ్రీలత -
లారీని ఢీ కొన్న బైక్
ఒకరి మృతి, మరొకరికి గాయాలు షాద్నగర్రూరల్: ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఫరూఖ్నగర్ మండల పరిధిలోని లింగారెడ్డిగూడ గ్రామ శివారులో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నందిగామ మండలం అప్పారెడ్డిగూడ గ్రామానికి చెందిన కార్తీక్(19) తన స్నేహితుడు శ్రీనాథ్ను షాద్నగర్లో వదిలిపెట్టేందుకు బైక్పై వెళుతున్నారు. లింగారెడ్డిగూడ శివారులో ఎలాంటి జాగ్రత్తలను తీసుకోకుండా లారీని రోడ్డుపై నిలిపారు. రాత్రి సమయం కావడంతో ముందు లారీ నిలిపిన విషయాన్ని గమనించకపోవడంతో బైక్ వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న కార్తీక్కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీనాథ్కు తీవ్ర గాయాలయ్యాయి. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సుశీల తెలిపారు. ఏఎంసీ సూపర్వైజర్గా నవనీత బషీరాబాద్: మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) సూపర్వైజర్గా నవనీత గురువారం బాధ్యతలు స్వీకరించారు. వికారాబాద్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో పనిచేస్తున్న ఆమెను.. అధికారులు బషీరాబాద్కు బదిలీ చేశారు. ఈ సందర్భంగా నవనీత మాట్లాడుతూ.. అక్రమ మార్కెటింగ్ను అరికట్టేందుకు కాశీంపూర్ సమీపంలో చెక్పోస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మార్కెట్ కార్యదర్శి సిద్దమ్మ, సిబ్బంది శివ తదితరులు పాల్గొన్నారు. -
శివ.. ది ‘గాంజా’ ట్రాన్స్పోర్టర్! నా దారిలో నో టోల్గేట్!
సాక్షి, రంగారెడ్డి: అంతరాష్ట్ర గంజాయి ట్రాన్స్పోర్టర్గా మారిన ఓ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కానిస్టేబుల్ సరుకు సరఫరాలో తనదైన పంథాను అనుసరిస్తున్నాడు. ఎక్కడా టోల్గేట్ దాటకుండా నాలుగు రాష్ట్రాల్లోని గమ్యాలకు చేరుతున్నాడు. అక్కడ ఉన్న డ్రగ్ పెడ్లర్స్కు సరుకు అప్పగిస్తున్నాడు. ఈ పంథాలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితుడిని జూబ్లీహిల్స్ టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఇతడి నుంచి రూ.79 లక్షల విలువైన 158 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ వెల్లడించారు.ఇల్లు కట్టి ఇరుక్కుపోయిన వైనం...ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడానికి చెందిన పనగూడు శివకృష్ణ 2009లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్లో (ఎన్డీఆర్ఎఫ్) డిప్యుటేషన్పై ఉన్న శివ కేరళంలో పని చేసేవాడు. అక్కడి ఉట్టూరులో విలాసవంతమైన ఇల్లు కట్టిన శివ అప్పుల్లో మునిగిపోయాడు. ఇదిలా ఉండగా... మోతుగూడానికి చెందిన కొందరి ద్వారా ఇతడికి సీలేరు కేంద్రంగా గంజాయి పండించే వారితో పరిచయం ఏర్పడింది. అప్పులు తీర్చుకోవడంతో పాటు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం గంజాయి ట్రాన్స్పోర్టర్గా మారాడు. సరుకు తీసుకువెళ్లడానికి డిక్కీ పెద్దగా ఉంటుందనే ఉద్దేశంతో కేరళంలో చేవ్రొలెట్ కంపెనీ కారు ఖరీదు చేశాడు. దాని డిక్కీలో సరుకు సర్దుకుని సీలేరు నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఉన్న పెడ్లర్స్కు సరఫరా చేస్తున్నాడు.దూరమైనా టోల్గేట్లు దాటడు...ఏదైనా ఓ ప్రాంతానికి గంజాయి తీసుకువెళ్లాలంటే ఆ గమ్యస్థానానికి దారితీసే మార్గాలను గూగుల్ మ్యాప్స్ ద్వారా అధ్యయనం చేస్తాడు. కాస్త దూరం ఎక్కువైనప్పటికీ ఎక్కడా టోల్గేట్ దాటకుండా జాగ్రత్తపడతాడు. తన కదలికలు బయటపడకూడదనే ఉద్దేశంతో ఇలా చేస్తుంటాడు. ఒక్కో ట్రిప్కు రూ.5 నుంచి రూ.6 లక్షలు ఆర్జిస్తున్నాడు. 2023లో ఇతడిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాపేట ఠాణాలో కేసు నమోదైంది. ఆ కేసులో జైలుకు వెళ్లి వచ్చినా తన పంథా మార్చుకోని శివ నెట్వర్క్ మరింత విస్తరించుకుని దందా కొనసాగిస్తున్నాడు. రెండు నెలల క్రితం టాస్క్ఫోర్స్ పోలీసులు అంబర్పేటలో ఓ డ్రగ్ పెడ్లర్ని పట్టుకున్నారు. ఇతడి విచారణలో శివ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సీహెచ యదేందర్, ఎస్సై డి.రవి రాజ్ నేతృత్వంలోని బృందం బుధవారం ఎస్సార్నగర్ పరిధిలో అతడి పట్టుకుంది. ఈసారి ఇతడు షోలాపూర్ వెళ్తున్నాడని అధికారులు చెప్తున్నారు.ప్రతి నెలా కనీసం మూడు ట్రిప్పులు..తనకు వచ్చే ఆర్డర్స్ ఆధారంగా శివ ప్రతి నెలా కనీసం మూడు ట్రిప్పులు వేసి సరుకు సరఫరా చేస్తుంటాడు. సీలేరుతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి సరుకు తీసుకునే ఇతగాడు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ప్రయాణం ప్రారంభిస్తాడు. మరుసటి రోజు అదే సమయానికి గమ్యానికి చేరుకుంటాడు. ఆయా రహదారుల్లోని టోల్గేట్స్ను తప్పించుకు తిరిగే ఇతగాడు మిగిలిన చోట్ల పోలీసులు ఆపితే తన సీఐఎస్ఎఫ్ గుర్తింపు కార్డు చూపించి బయటపడతాడు. 2023లో కేసు నమోదైన నాటి నుంచి ఇతడు సస్పెన్షన్లో ఉన్నట్లు డీసీపీ రఘునాథ్ చెప్పారు. -
పీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా విజయ్కుమార్
ఇబ్రహీంపట్నం: పీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా కొంకణి విజయ్కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం శాఖ రాష్ట్ర చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మంచాల మండలం బండలేమూర్ గ్రామానికి చెందిన విజయ్కుమార్కు నియామకపత్రం అందజేశారు. ఈ సందర్బంగా విజయ్కుమార్ మాట్లాడుతూ.. తనకు పదవి వచ్చేందుకు సహకరించిన పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్ గౌడ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషిచేస్తానన్నారు. పీసీసీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్గా జగన్ మొయినాబాద్: టీపీసీసీ ఎస్సీసెల్ రాష్ట్ర వైస్ చైర్మన్గా రంగారెడ్డి జిల్లాకు చెందిన రాచమల్ల జగన్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్ సమక్షంలో టీపీసీసీ ఎస్సీసెల్ రాష్ట్ర చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేతులమీదుగా నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. తనకు అప్పగించిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తానని.. రాష్ట్రంలో పార్టీ విస్తరకు కృషి చేస్తానన్నారు. -
రైతులకు పశుగ్రాస విత్తనాల పంపిణీ
షాబాద్: రైతులకు పశుగ్రాస విత్తనాల పంపిణీ చేసినట్లు శాస్త్రవేత్త, క్రీడా కేవీకే డాక్టర్ సుధీర్, బసేరా డైరెక్టర్ డాక్టర్ అంజు తెలిపారు. బుధవారం మండల పరిధిలోని మల్లారెడ్డిగూడలో పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ప్రాంతీయ పశుగ్రాస క్షేత్రము(ఆర్ఎఫ్ఎస్)హైదరాబాద్ క్రీడా కేవీకే, సేవాస్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పశుగ్రాస విత్తనాల ఎంపిక, పాల పశువుల నిర్వహణలో ఉత్తమ పద్ధతులు అనే అంశంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధిక పాల ఉత్తత్తి, మాంస ఉత్పత్తి పెరుగుదలకు నాణ్యమైన పశుగ్రాసం ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. పాల పశు సంరక్షణ విధానాలు, శాసీ్త్రయ డెయిరీ నిర్వహణ, గొర్రెల పెంపకంలో పాటించాల్సిన ఉత్తమ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. 40 మంది రైతులకు ముల్గి పశుగ్రాస కట్టింగ్స్, అధిక దిగుబడి ఇచ్చే సీఓఓఫ్ఎస్–29 మల్టీకట్, మల్టీ ఇయన్ జొన్న పశుగ్రాస విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో సేవాస్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ గొల్లపల్లి రత్నాకర్, సర్పంచ్ సబితాగోవర్ధన్రెడ్డి, ఉపసర్పంచ్ మాణిక్యం, కేవీకే శాస్త్రవేత్తలు దిలీప్ రామకృష్ణ, గొర్రెల కాపరులు, రైతులు తదితరులు ఉన్నారు. -
వినతిపత్రం అందించాం
కొనుగోలు చేసిన పంటలను తరలించేందుకు వాహనాలను కేటాయించాలని అదనపు కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చాం. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఒకే ట్రాన్స్పోర్టును కేటాయించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేర్వేరు ట్రాన్స్పోర్టులకు కేటయించాలి. – శ్రీధర్రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేశంపేట కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర లభిస్తుందని మక్కలను విక్రయించేందుకు వచ్చాం. నాలుగు రోజులుగా కొనుగోలు చేపట్టక ఇబ్బంది పడుతున్నాం. అధికారులు స్పందించి కొనుగోళ్లకు చర్యలు తీసుకోవాలి. – యుగంధర్, కేశంపేట -
బది‘లీల’పై కలెక్టర్ సీరియస్!
వైద్యారోగ్యశాఖలో బదిలీలపై సమగ్ర విచారణకు ఆదేశం సాక్షి, రంగారెడ్డిజిల్లా: వైద్యారోగ్యశాఖలో ఇటీవల చేపట్టిన సాధారణ బదిలీల్లో చోటు చేసుకున్న అక్రమాలపై జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) కిరణ్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టి తుది నివేదికను అందజేయాల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. ఏళ్లుగా పాతుకుపోయిన ఉద్యోగులపై రెండు రోజుల క్రితం ‘సాక్షి’జిల్లా ఎడిషన్లో ‘స్థాన చలనం లేదు’శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ కథనంపై జిల్లా అదనపు కలెక్టర్ దృష్టి సారించారు. నర్సింగ్ కాలేజీ విద్యార్థుల అడ్మిషన్ల ఫైళ్లు తొక్కి పెట్టడంపై సీరియస్ అయ్యారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో జరుగుతున్న అక్రమాలపై విచారణకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కూడా ఆదేశించినట్లు తెలిసింది. ఇబ్రహీంపట్నం రూరల్: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 92 మంది ఖైదీలకు క్షమాభిక్షపై విడుదల చేసింది. ఇందులో చింతపట్లకు చెందిన ఇద్దరు ఖైదీలు ఇంటికి చేరుకున్నారు. యాచారం మండలం చింతపట్లకు చెందిన కొండ మహిపాల్రెడ్డిని హత్య చేసిన కేసులు అదే గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి, శేఖర్ రెడ్డి చర్లపల్లి జైలులో జీవిత ఖైదు అనుభవించి ప్రభుత్వం పెట్టిన క్షమాభిక్షలో విడుదలై స్వగ్రామానికి చేరుకున్నారు. బుధవారం వారు యాచారం పోలీసులను కలవడంతో ప్రశాంతంగా జీవితాలను గడపాలని సూచించారు. ● అధికారుల పనితీరు మార్చుకోవాలి ● అదనపు కలెక్టర్ కిరణ్మయి చేవెళ్ల: ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు చేరవేసేందుకు అధికారులు అందుబాటు లో ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్మయి అన్నారు. మండల పరిధిలోని ముడిమ్యాలలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామ సభకు అదనపు కలెక్టర్ కిరణ్మయి, డీపీఓ సురేశ్మోహన్, డీఆర్డీఏ అదన పు పీడీ సుభాషిణి, చేవెళ్ల ఆర్డీఓ పార్థసింహరెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామంలో చేపట్టిన పనుల ప్రగతిపై సమీక్షించారు. అనంతరం పల్లె ప్రకృతివనం, ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీలను సందర్శించారు. అనంతరం నిర్వహించిన గ్రామసభలో మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పై అధికారులు స్పందించాలన్నారు. పలుశాఖ ల అధికారుల తీరుపై ఫిర్యాదులు ఉన్నాయని వాటిని సరిచేసుకోవాలన్నారు. అధికారులు, సి బ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఇళ్లు లేని పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించాలన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల తహసీల్దార్ బి.కృష్ణయ్య, ఎంపీడీఓ బన్సీలాల్, సర్పంచ్ శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ ప్రతాప్రెడ్డి, ఉప సర్పంచ్ జంగారెడ్డి, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
తిమ్మాపూర్కు ట్రైనీ ఐఈఎస్ అధికారులు
కందుకూరు: ఎన్ఐఆర్డీలో శిక్షణ పొందుతున్న 2025 సంవత్సరానికి చెందిన ఇండియన్ ఎకనామిక్ సర్వీస్(ఐఈఎస్) బ్యాచ్ ట్రైనీలు బుధవారం మండల పరిధిలోని తిమ్మాపూర్లో పర్యటించారు. గ్రామ పంచాయతీని సందర్శించి పంచాయతీ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ రకాల కార్యక్రమాలను గురించి పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, సర్పంచ్ అంజమ్మను అడిగితెలుసుకున్నారు. అనంతరం పల్లె ప్రకృతి వనం, నర్సరీ, ఉపాధిహామీలో నిర్మించిన పాంపండ్స్తో పాటు మహిళా సంఘాలు నిర్వహిస్తున్న యూనిట్లను పరిశీలించారు. సంఘంలో మహిళలు చేరి ఎలా లబ్ధిపొందుతున్నారో అడిగితెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సరిత, ఎంపీఓ గీత, ఉప సర్పంచ్ సన్నిళ్ల సంధ్య, ఏపీఓ రవీందర్రెడ్డి, ఏపీఎం సత్యనారాయణ, ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీలత, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజీ
తరలింపు సరికాదు● కళాశాలతో పాటు 400 పడకల ఆస్పత్రి కందుకూరు మండలంలోనే నిర్మించాలి ● మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి కందుకూరు: రద్దు చేసిన మెడికల్ కళాశాల, ఆస్పత్రి నిర్మాణాలను కందుకూరు మండలంలోనే ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆమె మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. మీర్ఖాన్పేట రెవెన్యూ పరిధిలో బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో మెడికల్ కళాశాల, 400 పడకల ఆస్పత్రిని కేటాయించి శంకుస్థాపన చేశారని.. ప్రజా ప్రభుత్వమని చెప్పుకొనే కాంగ్రెస్ మెడికల్ కళాశాలను రద్దు చేసి ఎల్బీనగర్కు తరలించడం సరికాదన్నారు. ఫ్యూచర్సిటీ అని చెప్పుకుంటూ పబ్బంగడుపుతున్న ప్రభుత్వం 400 పడకల ఆస్ప త్రి నిర్మాణం ఎందుకు చేపట్టడంలేదని సమాధానం చెప్పాలన్నారు. పేదలు అనారోగ్యం బారిన పడితే ఎంతో దూరం వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగితే హైదరాబాద్ తరలించే లోపు క్షతగాత్రుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రభుత్వ ఆస్పత్రి నిర్మిస్తే శ్రీశైలం రహదారి, సాగర్ రహదారి మధ్య ప్రాంతంతో పాటు మహేశ్వరం, కడ్తాల్, ఆమనగల్లు, కల్వకుర్తి ప్రాంతాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. రద్దు చేసిన మెడికల్ కళాశాల, ఆస్పత్రి నిర్మాణాలను వెంటనే కందుకూరు మండలంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశా రు. లేదంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ముదిరాజ్, జి.లక్ష్మీనర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బైక్ను ఢీకొట్టిన కారు
ఇద్దరు వలస కార్మికుల దుర్మరణం షాద్నగర్: పరిశ్రమలో విధులు ముగించుకొని ఇంటికి వెలుతున్న ఇద్దరు వలస కార్మికులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన నందిగామ మండల శివారులో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన రోషన్ కుమార్ (24) కొత్తూరులో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పంకజ్ (19) నందిగామలో నివాసం ఉంటూ నందిగామ శివారులోని ఎస్ఎన్ పాలీప్యాక్ పరిశ్రమలో కార్మికులుగా పని చేస్తుఉన్నారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో గాయత్రీ మిల్స్ ప్లాంట్ వద్ద బైపాస్ సర్వీస్ రోడ్డులో ఎదురుగా వేగంగా వస్తున్న కారు బైక్ను ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు కార్మికులు ఎగిరి చెట్లపొదల్లో పడిపోయారు. బలమైన గాయాలవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పరిశ్రమ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను షాద్నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి కారును ఘటనా స్థలిలోనే వదిలి డ్రైవర్ పరారయ్యాడు. -
స్కూటీ అపహరణ
ఇబ్రహీంపట్నం: స్కూటీ అపహరణకు గురైన ఘటన ఇబ్రహీంపట్నం ఠాణా పరిఽధిలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. శ్రీరాంనగర్ కాలనీలో నివాసముండే గగనమోని సత్యనారాయణ తన ఇంటి ఎదుట స్కూటీని మంగళవారం రాత్రి పార్కు చేశాడు. బుధవారం ఉదయం చూసేవరకు వాహనం కలినిపించలేదు. దీంతో బాధితుడు ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మరో బైక్ స్థానిక బస్టాండ్ వద్ద అపహరణకు గురైనట్లు సమాచారం. ఆటోలు దొంగకు రిమాండ్ మొయినాబాద్: ఆటోలు చోరీ చేస్తున్న పాత నేరస్తుడిని పోలీసులు రిమాండ్కు తరలించారు. వివరాలు.. నగరంలోని చందానగర్ పాపిరెడ్డినగర్ కాలనీకి చెందిన వడ్డె వెంకటేశ్ ఆటో డ్రైవర్. గత నెల 27న మొయినాబాద్లోని ప్రభుత్వాస్పత్రి సమీపంలో ఓ ఆటో, అజీజ్నగర్ సమీపంలో మరో ఆటోను చోరీ చేశాడు. పోలీసులు బుధవారం సురంగల్ బైపాస్లో వాహనాల తనిఖీలు చేస్తుండగా వెంకటేశ్ ఆటోలో ప్రయాణిస్తున్నాడు. అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా రెండు ఆటోలతో పాటు సదాశివపేటలో ఓ బైక్ సైతం చోరీ చేసినట్లు ఒప్పుకొన్నాడు. నిందితుడు గతంలో ఆటో, ఇంటి దొంగతనం, పొక్సో కేసుల్లో జైలుకు వెళ్లివచ్చినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. షాద్నగర్: గ్రేడ్–1 శాఖా గ్రంథాలయ నూతన లైబ్రేరియన్గా వెంకటయ్య బదిలీపై షాద్నగర్కు వచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వెంకటయ్యను గ్రంథాలయ కమిటీ అధ్యక్షుడు మదన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కమిటీ వైస్ చైర్మన్ నక్కబాల్రాజ్, వీరేశ్, ప్రధాన కార్యదర్శి క్యూసెట్ శ్రీనివాస్, జూపల్లి చంద్రశేఖర్, కత్తి చంద్రశేఖరప్ప తదితరులు పాల్గొన్నారు. -
గుట్కాల విక్రేతపై కేసు
చేవెళ్ల: నిషేధిత గుట్కాలు, పాన్మసాలా, టొబాకో ఉత్పత్తులు నిల్వ చేసిన దుకాణంపై పోలీసులు దాడి చేసి యజమానిపై కేసు నమోదు చేశారు. అక్రమ నిల్వలను సీజ్ చేశారు. ఈ ఘటన చేవెళ్ల ఠాణా పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. చేవెళ్ల సీఐ భూపాల్శ్రీధర్ తెలిపిన ప్రకారం.. మండలకేంద్రంలోని బాలాజీ జనరల్ స్టోర్లో గుజరాతి ఎల్లప్ప నిషేధిత గుట్కా, పాన్మసాల, టొబాకో ఉత్పత్తులు నిల్వచేసి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు ఎస్ఐ సంతోష్రెడ్డి సిబ్బందితో కలిసి బాలాజీ జనరల్ స్టోర్పై దాడులు చేశారు. ఈదాడుల్లో స్టోర్లో పెద్ద మొత్తంలో నిషేధిత పాన్మసాలాలు, గుట్కాలు, పొగాకు ఉత్పత్తులు లభ్యమయ్యాయి. వాటిని సీజ్చేసి ఎల్లప్పపై కేసు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో పాల్గొన్న ఎస్ఐ సంతోష్రెడ్డి, సిబ్బంది వెంకటయ్య, ఆనంద్ను ప్రత్యేకంగా అభినందించారు. -
అదనపు కోర్టు భవనానికి వినతి
ఆమనగల్లు: పట్టణంలో నూతనంగా అదనపు కోర్టు భవనం నిర్మించాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కరుణకుమార్ను ఆమనగల్లు బార్ అసోసి యేషన్ సభ్యులు కోరారు. బుధవారం హైదరాబాద్ లోని జిల్లా కోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి కరుణకుమార్ను ఆమనగల్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదీలాల్ ఆధ్వర్యంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను సన్మానించారు. ఆమనగల్లులో కోర్టు భవనం నిర్మించాలని, సీనియర్ కోర్టు ను షాద్నగర్ నుంచి మహేశ్వరం మండల కేంద్రానికి తరలించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. ఆమనగల్లు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శేఖర్, గ్రంథాలయ కార్యదర్శి గణేశ్గౌడ్, క్రీడా కార్యదర్శి సంతోశ్కుమార్ పాల్గొన్నారు. -
లారీల కొరత.. రైతన్న వెత
● మొక్కజొన్న విక్రయాలకు ఇబ్బందులు ● కొనుగోలు కేంద్రాల వద్ద నిలిచిన ట్రాక్టర్లు కేశంపేట: రైతులు పండించిన పంటలకు మద్దతు ధర అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్లలో ప్రభుత్వ మద్దతు ధరతో పంటలను కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన పంటలను గోదాంలకు తరలించేందుకు జిల్లా స్థాయిలో ట్రాన్స్పోర్టును ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. లారీలు రాక ఇబ్బందులు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం (మొక్కజొన్న) గోదాంకు తరలించేందుకు లారీలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కోనుగోలు చేసిన ధాన్యం కేంద్రాల్లోనే నిల్వ ఉండటంతో కొత్తగా రైతులు తెచ్చిన పంటలను అధికారులు కోనుగోలు చేయడం లేదు. కురుస్తున్న వర్షాలకు బహిరంగ ప్రదేశాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి ట్రాన్స్పోర్టు సౌకర్యం కల్పించాల్సి ఉంది. నాలుగు రోజులు క్రితం ధాన్యం విక్రయించేందుకు రైతులు ట్రాక్టర్లలో తీసుకువచ్చారు. నాటి నుంచి కొనుగోళ్లు చేపట్టక వాహనం టైర్లలో గాలి దిగిపోయింది. మరో 50 ట్రాక్టర్ల మక్కలు 29 గ్రామాల పరిధిలో ఇప్పటివరకు 645 మంది రైతుల నుంచి 80,557 బ్యాగుల(50కేజీలు) ధాన్యం కొనుగోలు చేశారు. వీటిలో 64,616 బ్యాగుల మక్కలను ట్రాన్స్పోర్టు ద్వారా తరలించారు. ఇంకా 15,941 బ్యాగుల ధాన్యం నిల్వలు రోడ్డుపైన ఉన్నాయి. వీటికి అదనంగా కొత్తపేట గ్రామంలోని కొనుగోలు కేంద్రం వద్ద సుమారుగా పది ట్రాక్టర్లు, కేశంపేటలో 40 ట్రాక్టర్ల వరకు మక్కలను అమ్మేందుకు రైతులు వచ్చారు. పంట నిల్వ చేసేందుకు అవసరమైన గోదాంలు లేక కోనుగోలు చేసిన ధాన్యం భద్రపరిచేందుకు అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. -
నీట్ లీక్ బాధ్యత కేంద్రానిదే
కడ్తాల్: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయభాను చిబ్ డిమాండ్ చేశారు. బుధవారం నాగర్కర్నూల్ జిల్లా పర్యటనకు వెళ్తున్న యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయభాను చిబ్, రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్రెడ్డి, రాష్ట్ర ఇన్చార్జి ఖాలేధ్, రోషిణి జైస్వాల్కు కడ్తాల్ మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగ లక్ష్మీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండేళ్ల పాటు కష్టపడి చదివిన విద్యార్థులు పేపర్ లీకేజీ ఘటనతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో నీట్ పరీక్ష గుణపాఠంతోనూ కేంద్ర ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. నీట్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశ యువత, విద్యార్థులకు అన్యాయం జరిగితే యూత్ కాంగ్రెస్ సహించదని హెచ్చరించారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి ప్రజల నుంచి దోచుకుని అదానీ, అంబానీలకు కట్టపెడుతున్నారని ఆరోపించారు. పెంచిన ధరలను తగ్గించకపోతే యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఉద్యమాన్ని నిర్మిస్తామన్నారు. అనంతరం మైసిగండి మైస మ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యే క పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్, నాయకులు షాబుద్దీన్, బోసు రవి, భానుకిరణ్, శ్రీకాంత్, ప్రవీణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయభాను చిబ్ -
అనుమానాస్పద స్థితిలో యువకుడి ఆత్మహత్య
కందుకూరు: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. లేమూరుకు చెందిన పల్లె బాబయ్య, రజిత దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు భానుతేజ ఇంటర్ పూర్తి చేసి ప్రస్తుతం వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఈనెల 26న వ్యవసాయ పొలంలో ఉన్న భానుతేజను ఏదో విషయంలో అతని పెద్దనాన్న మందలించడంతో పాటు చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన భానుతేజ ఈనెల 29న ఎవరికీ చెప్పకుండా ఇంటినుంచి వెళ్లిపోయాడు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. మంగళవారం రాత్రి సమయంలో లేమూరు గ్రామానికి చెందిన బండి యాదయ్యకు చెందిన వ్యవసాయ భూమిలోని చెట్టుకు కుళ్లిన స్థితిలో గుర్తు తెలియని మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా మృతుడు భానుతేజగా గుర్తించారు. బుధవారం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
నా పుట్టిన రోజున.. 3 మొక్కలు
● ఆస్తుల కంటే స్వచ్ఛమైన గాలి, నీరే నిజమైన వారసత్వం ● ప్రకృతి.. భగవంతుడి గొప్ప వరం: స్పీకర్ ప్రసాద్కుమార్ సనత్నగర్: ఆస్తుల కంటే స్వచ్ఛమైన గాలి, పచ్చటి వాతావరణం, పరిశుభ్రమైన నీరే నిజమైన వారసత్వమని, భావితరాలకు రూ.కోట్ల ఆస్తులను కాకుండా వీటిని అందిద్దామని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ (సీజీఆర్), సెస్ సంయుక్తంగా ‘సుస్థిర పర్యావరణం’ అనే అంశంపై బేగంపేట సెస్ ఆడిటోరియంలో నిర్వహించిన సదస్సుకు స్పీకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘‘జూన్ 4 నా పుట్టిన రోజు. నేను మూడు మొక్కలు నాటుతా. భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం ప్రకృతి. మనం దానిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. కాలుష్యం, అడవుల నరికివేత, నీటి వనరుల క్షీణతతో భావి తరాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అందుకే ప్రకృతి సంపదను రక్షించడం, మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడం, నీటి వనరులను కాపాడడాన్ని ప్రతి పౌరుడు బాధ్యతగా భావించాలి. ఇంటి వద్ద, గ్రామంలో, పట్టణంలో మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతను అందరూ స్వీకరించాలి. ప్రకృతి సమతుల్యత దెబ్బతింటే మానవాళి మనుగడకే ముప్పు. పచ్చదనం పెంపొందించడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, నీటి వృథాను అరికట్టడం ద్వారా ప్రకృతి సంరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి’’ అని స్పీకర్ అన్నారు. -
జాబ్ మేళా విజయవంతం
షాద్నగర్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం నిర్వహించిన జాబ్ మేళా విజయవంతమైంది. ఈ మేళాలో ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన 165 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు జాబ్ మేళాలో పాల్గొని వంద మంది విద్యార్థులను శిక్షణ కోసం ఎంపిక చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్ తెలిపారు. మూన్రే కళాశాలలో.. రాయికల్ శివారులోని మూన్ రే కళాశాలలో క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించారు. దేశంలోని ప్రముఖ ఔషధ తయారీ సంస్ధ దివీస్ ల్యాబొరెటరీస్ నిర్వహించిన నియామక ప్రక్రియలో కళాశాలకు చెందిన 23 మంది బిఫార్మసీ విద్యార్థులు ఎంపికై నట్లు వారికి రూ.3.20లక్షల వార్షిక వేతనంతో కూడిన ప్యాకేజీతో ఉద్యోగాలు పొందినట్లు కళాశాల చైర్మన్ పర్వత్రెడ్డి తెలిపారు. శిక్షణకు వంద మంది విద్యార్థులు -
మహనీయుల ఆశయ సాధనకు బస్సుయాత్ర
నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి ఆమనగల్లు: మహానీయుల చరి త్ర, త్యాగాలు ప్రతీ ఒక్కరికి ఆదర్శనీయమని నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. మైసిగండిలో ప్రారంభించిన మహనీయుల జ్ఞాన చైతన్య బస్సు యా త్ర బుధవారం ఆమనగల్లుకు చే రుకుంది. ఈ యాత్రకు స్వాగతం పలికిన ఆయన మాట్లాడుతూ.. మహానీయుల జీవితగాధలు ప్రతీ ఒక్కరు తెలుసుకుని వారి ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. దేశంలో అనగారిన వర్గాల అభివృద్ధి కోసం, సమాజంలో మార్పుకోసం కృషి చేసిన మహానీయులు ఎందరో ఉన్నారని గుర్తుచేశారు. మహానీయుల జీవిత చరిత్ర, రాజ్యాంగ పరిరక్షణ ఆవశ్యకత, ఓటు విలువ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ బస్సు యాత్ర చేపట్టినట్లు వివరించారు. నాగర్కర్నూల్ పార్లమెంటు నియోజక వర్గంలోని 46 మండలాలు, వెయ్యి గ్రామాల్లో యాత్ర కొనసాగుతుందన్నారు. మహిళల అభివృద్ధికి పెద్దపీట మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్ననే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. బుధవారం ఎంపీ రవి కడ్తాలలో ఆర్టీసీ బస్సులో ఎక్కి ఆమనగల్లు వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడి ఉచిత బస్సు పథకం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం మహిళల ప్రాధాన్యతకు పెద్దపీట వేస్తోందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం లక్ష్యంగా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు పూర్తి వ్యతిరేకమని ఆయన ఆరోపించారు. ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, మండల అధ్యక్షుడు జగన్, మండ్లి రాములు, నాయకులు మల్లయ్య, ఫరీద్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సదానందంగౌడ్కు జాజుల సన్మనం
కడ్తాల్: తలకొండపల్లి మండలం చెన్నంపల్లికి చెందిన సామాజిక విద్యావేత్త అయిల్ సదానందంగౌడ్కు యునైటైడ్ అమెరికన్ వర్సిటీ నిర్వాహకులు ఇటీవల చైన్నెలోని భారతీయ విద్యాభవన్లో గౌరవ డాక్టరేట్ పురస్కారం అందజేశారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన సదానందంగౌడ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని, ఉస్మానియా వర్సిటీలో ఎంఏ, ఎంఫిల్, బీఈడీ, సెట్ ప్రథమ శ్రేణి పట్టాను పొందారు. విద్యారంగంలో 26 ఏళ్లుగా అధ్యాపకుడిగా పనిచేయడంతో పాటు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవలకు గుర్తింపుగా యునైటైడ్ అమెరికన్ వర్సిటీ నిర్వాహకులు సదానందంగౌడ్కు డాక్టరేట్ పురస్కారం అందజేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ అవార్డు గ్రహీత సదానందంగౌడ్ను అభినందించి సన్మానించారు. భవిష్యత్లో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఆయన వెంట బాలరాజు, వెంకటేశ్ పాల్గొన్నారు. శంకర్పల్లి: మిల్క్ బ్రెడ్ ప్యాకెట్లో చనిపోయిన బల్లి కనిపించడంతో బాధితులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మోకిల పీఎస్ పరిధిలోని జన్వాడలో చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా కొడంగల్కు చెందిన కుమ్మరి అశోక్, అంబిక దంపతులు కొన్నేళ్ల క్రితం జన్వాడకు వచ్చి నివాసం ఉంటున్నారు. వీరి మూడేళ్ల కుమారుడు పవన్ కోసం గ్రామంలోని ఓ కిరాణ దుకాణంలో గోల్డెన్ బైట్ కంపెనీ పేరుతో ఉన్న బ్రెడ్ ప్యాకెట్ను తీసుకెళ్లారు. బుధవారం ఉదయం పాలలో బ్రెడ్ వేసి బాబుకు తీనిపించాలని చూస్తుండగా, చనిపోయిన బల్లి కనిపించడంతో తల్లి ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. ఈ విషయమై దుకాణ యజమానిని నిలదీయడంతో ఆయన కంపెనీ డిస్ట్రిబ్యూటర్కు సమాచారం అందించారు. బల్లిని గమనించకపోతే పరిస్థితి ఎలా ఉండేదోనని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి కంపెనీలపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. 13 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం మొయినాబాద్: జేబీఐటీ కళాశాల సమీపంలో నిషేధిత మాదకద్రవ్యాలు(డ్రగ్స్) విక్రయిస్తున్న ఇద్దరు యువకులను బుధవారం మొయినాబాద్ పోలీసులు రిమాండ్కు తరలించారు. వివరాలు.. నగరంలోని బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన బీచ్మోర్ దల్బీర్ సింగ్, సయ్యాద్ ఖాదర్బాషా మంగళవారం రాత్రి మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనికేపల్లి రెవెన్యూలో ఉన్న జేబీఐటీ కళాశాల వద్ద ఉన్న టీ టైమ్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో మొయినాబాద్ పోలీసులు దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1.50 లక్షల విలవ చేసే 13 గ్రామాల ఎండీఎంఏ నిషేధిత మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. రాజేంద్రనగర్ : పావురాన్ని కాపాడబోయిన ఎన్ఐఆర్డీ రీసెర్చ్ అధికారి రెండో అంతస్తునుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. రాజేంద్రనగర్ పోలీసులు తెలిపిన మేరకు.. ఎన్ఐఆర్డీలో రీసెర్చ్ అధికారిగా పనిచేస్తున్న బాలరాజ్ (54) నివాసముంటున్న భవనం రెండో అంతస్తులో ఈ నెల 1న ఓ పావురం చిక్కుకుంది. దానిని కాపాడేందుకు బాలరాజ్ పైకి ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతనిని వెంటనే హైదర్గూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. -
ఉద్యోగరీత్యా బదిలీలు సహజం
మొయినాబాద్రూరల్: ఉద్యోగరీత్యా అధికారులకు బదిలీలు సహజమని ఫిషర్మెన్ జిల్లా చైర్మన్ మహేందర్ముదిరాజ్ అన్నారు. కేతిరెడ్డిపల్లి క్టస్టర్ విస్తీర్ణ అధికారి ఎ.కుమార్ స్థానంలో శ్రీనివాస్, మొయినాబాద్ క్లస్టర్ ఎన్.సునీల్ కుమార్ స్థానంలో ఇ.వీణ బుధవారం మొయినాబాద్ రైతు వేదికలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్లిన, కొత్తగా వచ్చిన అధికారులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మ హేందర్ముదిరాజ్ మాట్లాడుతూ.. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారులు రైతులకు వ్యవసాయ సంబంధిత సలహాలు, ప్రభుత్వ పథకాలు, విత్తనాలు, ఎరువులు, పంటలన నిర్వహణ తదితర విషయాల్లో సహకరించాలని సూచించారు. రైతుల సౌకర్యార్ధం గతంలో ఉపయోగించిన మొబైల్ ఫోన్ నంబర్లు యధావిధిగా ఉంటాయని మండల వ్యవసాయ అధికారి అనురాధారెడ్డి తెలిపారు. రైతులకు అవసరమైన సేవలు, సాంకేతిక సూచనలు అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అనురాధారెడ్డి, నా యకులు, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఫిషర్మెన్ జిల్లా చైర్మన్ మహేందర్ముదిరాజ్ -
కరెంట్ పోనీయం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘నిరంతరాయ విద్యుత్ సరఫరా లక్ష్యంగా 33కేవీ, 11 కేవీ లైన్లపై ప్రత్యేక దృష్టి సారించాం. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలను సైతం తట్టుకుని నిలబడే విధంగా లైన్లను తీర్చిదిద్దుతున్నాం. లైన్లకు అడ్డుగా ఉన్న చెట్లకొమ్మ ల తొలగింపు ప్రక్రియను ఇప్పటికే చేపట్టాం. అధిక లోడు సమస్యతో ఇబ్బంది పడుతున్న సబ్స్టేషన్లు, ఫీడర్లు, డీటీఆర్లను గుర్తించి, వాటి స్థానంలో అదనపు సామర్థ్యంతో కూడిన పీటీఆర్లు, డీటీఆర్లను ఏర్పాటు చేస్తున్నాం. కొత్తగా మరో 75 సబ్స్టేషన్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. రాబోయే రోజుల్లో రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం’అని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి పాటిల్ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన పలువురు మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్చాట్లో మాట్లాడారు. మంగళవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి దెబ్బతిన్న ఫీడర్లు, సరఫరాలో తలెత్తిన సాంకేతిక సమస్యలు, వాటి పరిష్కారానికి క్షేత్ర స్థాయి సిబ్బంది చేసిన కృషిని ఆయన వివరించారు. మెటీరియల్ కొరత లేకుండా చూస్తాం కొత్తలైన్లు, కనెక్షన్ల జారీకి అవసరమైన మెటీరియల్ను డిస్కం సమకూర్చుతుంది. మెజార్టీ ఇంజనీర్లు అవసరం లేకపోయినా..ముందస్తు జాగ్రత్తల పేరుతో డిపార్ట్మెంట్ పనుల పేరుతో స్టోర్స్ నుంచి మెటీరియల్ డ్రా చేసి, ఆ తర్వాత దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. విద్యుత్ స్టోర్స్ నుంచి డ్రా చేసిన మెటీరియల్కు, క్షేత్రస్థాయిలో వినియోగిస్తున్న మెటీరియల్కు పొంతన ఉండటం లేదు. ఇకపై విద్యుత్ స్టోర్స్పై పక్కా నిఘా పెట్టనున్నాం. అంచనాలు రూపొందించిన తర్వాతే సెక్షన్ల వారీగా మెటీరియల్ మంజూరు చేయాలని నిర్ణయించాం. పక్కాగా ఆడిట్ నిర్వహించబోతున్నాం. తద్వారా మెటీరియల్ కొరత లేకుండా చూడబోతున్నాం. అండర్గ్రౌండ్ కేబుళ్ల కొరత ను నివారించేందుకు ఇప్పటికే ఆయా వెండర్ కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానించాం. త్వరలోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపబోతున్నాంస్టోర్స్లో మీటర్లు లేవనే సమస్యే లేదు. బర్ట్న్, స్ట్రకప్ మీటర్ల స్థానంలో కొత్త మీటర్లు ఏర్పాటు చేస్తున్నాంఎవరైనా మీటర్లు లేవని చెప్పితే.. వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి. పదిమీటర్ల ఎత్తు దాటితే ఓసీ చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లో చేపట్టే నిర్మాణాలకు విద్యుత్ కనెక్షన్ల జారీ విషయంలో ఆంక్షలు విధించాం. ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. అయితే ఈఆర్సీ నిబంధనల మేరకు ఎలాంటి వివాదం లేని గ్రామకంఠం భూముల్లోని నిర్మాణాలు సహా నోటరీ డాక్యుమెంట్ దరఖాస్తులకు సైతం కనెక్షన్లు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశాం. పది మీటర్ల ఎత్తు దాటిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ మస్ట్ చేశాం. అంతకు లోపు ఉన్న భవనాలకు ఎలాంటి ఓసీలు అవసరం లేదు. ఎస్టిమేషన్ల విధానంలోనూ మార్పులు తీసుకొచ్చాం. వినియోగదారుడు ఎంపిక చేసుకున్న లోడు ఆధారంగా ఫిక్స్డ్ ఛార్జీలు నిర్ణయించాం. అంచనాల రూపకల్పనలో ఎలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. టర్న్కీ విధానంలోనూ పలు మార్పులు తీసుకొచ్చాం. కేటాయించిన పనులు పూర్తి చేసిన తర్వాత సదరు కాంట్రాక్టర్కు మరో పని అప్పగించాలని నిర్ణయించాం. అర్ధరాత్రి కూడా అప్రమత్తంగా ఉంటున్నాం. మంగళవారం అర్ధరాత్రి తర్వాత అకస్మాత్తుగా కురిసిన వర్షానికి మేడ్చల్ జోన్లో 91 ఫీడర్లు, రంగారెడ్డి జోన్లో 47 ఫీడర్లు, మెట్రోజోన్ పరిధిలో 14 ఫీడర్ల పరిధిలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. కేవలం అరగంట వ్యవధిలోనే మెజార్టీ ఫీడర్ల పరిధిలో సరఫరాను పునరుద్ధరించాం. ఈ సమయంలో వాట్సాప్, ట్విట్టర్, యాప్, వెబ్సైట్, ఫేస్బుక్, 1912 కాల్ సెంటర్, వాట్సాప్ చాట్బోట్ల నుంచి ఎలక్ట్రిసిటీ కమాండ్ కంట్రోల్ సెంటర్కు బంజారాహిల్స్ సర్కిల్ నుంచి 448, హైదరాబాద్ సెంట్రల్ జోన్ నుంచి 1,055, హైదరాబాద్ సౌత్ సర్కిల్ నుంచి 846, సికింద్రాబాద్ సర్కిల్ నుంచి 1,107, సైబర్సిటీ సర్కిల్ నుంచి 1,233, రాజేంద్రనగర్ సర్కిల్ నుంచి 1,275, సరూర్నగర్ సర్కిల్ నుంచి 235, హబ్సీగూడ సర్కిల్ నుంచి 525, మేడ్చల్ సర్కిల్ నుంచి 1370 ఫిర్యాదులు అందాయి. సెంట్రల్ బ్రేక్డౌన్ విభాగంలోని క్షేత్రస్థాయి సిబ్బంది వెంటనే అప్రమత్తమై.. ఐదు నిమిషాల నుంచి అరగంట వ్యవధిలోనే మెజార్టీ ఫీడర్ల పరిధిలోని సరఫరాను పునరుద్ధరించింది. దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసింది. రాబోయే వర్షాకాలంలో ఎంతటి విపత్తులు తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ ఇంజనీర్లు సిద్ధంగా ఉన్నారు. 33 కేవీ, 11 కేవీ లైన్స్పై ప్రత్యేక దృష్టి కొత్తగా 75 సబ్స్టేషన్లు స్టోర్ నుంచి డ్రా చేసిన విద్యుత్ పరికరాలపై పక్కా ఆడిట్ నిబంధనల మేరకే నోటరీ దరఖాస్తులకు విద్యుత్ కనెక్షన్లు డిస్కం సీఎండీ జితేష్ వి పాటిల్ -
భారతి సిమెంట్తో నిర్మాణం వేగం
మీర్పేట: భారతి అల్ట్రాఫాస్ట్ సిమెంట్తో నిర్మాణ ప్రక్రియ చాలా వేగవంతంగా పూర్తవుతుందని సంస్థ టెక్నికల్ ఇంజినీర్ మహ్మద్ సాహెర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం మీర్పేట ఆర్ఎన్రెడ్డినగర్లోని శ్రీ లక్ష్మీ స్టీల్ ట్రేడర్స్ డీలర్స్ షాపులో తాపీ మేసీ్త్రలతో జరిగిన సమావేశానికి సాహెర్ హాజరై మాట్లాడారు. సిమెంటు వ్యాపారంలో తిరుగులేని సంస్థగా ఎదుగుతున్న భారతి సిమెంట్ అల్ట్రాఫాస్ట్ పేరుతో ఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్ 5స్టార్ గ్రేడ్ తెలంగాణలో అందిస్తుందని వివరించారు. అల్ట్రాఫాస్ట్తో ముఖ్యంగా స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జీలు, రహదారులకు సరైన ఎంపికని అన్నారు. అల్ట్రాఫాస్ట్ వినియోగదారులకు స్లాబ్ కాంక్రీట్ సమయంలో నిపుణులైన భారతి సిమెంట్ ఇంజినీర్లు సైట్ వద్దకే వచ్చి ఉచిత సాంకేతిక సహాయం అందజేస్తారన్నారు. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్ రూ.20 అదనంగా ఉంటుందన్నారు. డీలర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ భారతి సిమెంట్ నాణ్యతతో పాటు నిర్మాణ సమయంలో సర్వీస్ చాలా ఫాస్ట్గా ఉంటుందని తెలిపారు. అనంతరం తాపీ మేసీ్త్రలకు రూ.లక్ష ప్రమాద బీమా బాండ్లను పంపిణీ చేశారు. సంస్థ టెక్నికల్ ఇంజినీర్ మహ్మద్ సాహెర్ -
అభివృద్ధిని అడ్డుకుంటున్న సీఎం
● మహేశ్వరానికి రూపాయి ఇవ్వడం లేదు ● ఎమ్మెల్యే సబితారెడ్డి మహేశ్వరం: సీఎం రేవంత్రెడ్డి మహేశ్వరం నియోజకవర్గంపై కక్ష గట్టి ఒక్క రూపాయి ఇవ్వకుండా అభివృద్ధికి అడ్డు తగులుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితారెడ్డి తీవ్రంగా ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ మంజురు చేసిన మెడికల్ కాలేజ్, 400 పడకల ఆస్పత్రి, మెట్రోలైన్లను సీఎం రేవంత్రెడ్డి రద్దు చేశారన్నారు. పేదల భూములను లాక్కోని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ అర్హులకు సంక్షేమ పథకాలు రైతు బీమా, రైతు బంధు, డబుల్ బెడ్ రూమ్స్, దళిత బంధు, కేసీఆర్ కిట్స్ పలు సంక్షేమ పథకాలు అందించారని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కండువా కప్పుకొన్న వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నారన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ఉత్త మాటలు చెప్పి మభ్యపెడుతున్నారన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా రైతులను గోస పెడుతున్నారన్నారు. ఉద్యమకారుల ఆవేదన సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులు చిలకమర్రి నర్సింహ, దిద్దెల అశోక్లు సభావేధికపైన సబితారెడ్డి ముందే ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యమకారులను పట్టించుకున్న పాపన పోలేదన్నారు. తమకు పదవులు ఇవ్వకుండా, వారి సంక్షేమానికి ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా అవమానపరిచారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు నర్సింహ, పీఏసీఎఎస్ చైర్మన్ పాండుయాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజునాయక్, సర్పంచ్ మునగపాటి నవీన్, నాయకులు అంబయ్యయాదవ్, చంద్రయ్య, సుధాకర్రెడ్డి, సమీర్, రాఘవేందర్రెడ్డి, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కూరగాయల ధరలు
హుడాకాంప్లెక్స్: సరూర్నగర్లోని రైతు బజార్లో కూరగాయల ధరలు (కిలో.. రూపాయల్లో).. టమాట 35, వంకాయ 23, బెండకాయ 35, పచ్చిమిర్చి 40, కాకర 45, బీర 35, కాలిఫ్లవర్ 18, క్యాబేజీ 18, క్యారెట్ 39, దొండ 23, ఆలు 17, ఉల్లిగడ్డ 20, గోకర 28, దోసకాయ 18, సోరకాయ 13, పొట్లకాయ 18, చిక్కుడు 55, చామ 28, బీట్రూట్ 25, కీర 40, ఫ్రెంచ్బీన్స్ 65, క్యాప్సికం 55. తుక్కుగూడ: రావిర్యాల శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ దర్శనానికి మంగళవారం ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేశారు. ఆలయం ప్రాంగణంలో సామూహిక శ్రీ సత్యానారాయణ స్వామి వత్రాలు చేశారు. నాగ దేవతకు పుట్టలో పాలు పోశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రెడ్డిగళ్ల రత్నం, ఈఓ మోహన్రావు, పాలక మండలి సభ్యులు, పూజారులు తదితరులు పాల్గొన్నారు. కందుకూరు: ఐకేపీ వీఓఏల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 16 రోజులుగా చేపట్టిన సమ్మెను విరమిస్తున్నట్లు వీఓఏలు ప్రకటించారు. ఈమేరకు వీఓఏల సంఘం మండల అధ్యక్షురాలు ఎం.సరస్వతి ఆధ్వర్యంలో మంగళవారం ఏపీఎం సత్యనారాయణకు సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు పత్రం అందించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మంత్రి సీతక్క ఇచ్చిన హామీ మేరకు సమ్మెను తాత్కాలికంగా విరమించామన్నారు. ప్రభుత్వం తమకు అనుకూలంగా పని చేసే వరకు ఆన్లైన్ పనులు, పుస్తకాల ఆడిట్ చేయించమన్నారు. కార్యక్రమంలో వీఓఏలు పాల్గొన్నారు. కందుకూరు: విద్యార్థుల కోసం ఉత్తమ వేసవి శిబిరం నిర్వహించినందుకుగాను మండలంలోని నేదునూరు పరిధిలోని మోడల్ స్కూల్కు ప్రశంసాపత్రం లభించింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్బాబు, కలెక్టర్ నారాయణరెడ్డి చేతుల మీదుగా ప్రిన్సిపాల్ విష్ణుప్రియకు ప్రశంసా పత్రాన్ని అందించి అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. వేసవి శిబిరం విజయవంతంగా నిర్వహించేలా మమ్మల్ని ప్రోత్సహించిన అప్పటి డీఈఓ సుశీంధర్రావు, ఎంఈఓ నర్సింహ, జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం శ్రీనివాస్శర్మ, సర్పంచ్ స్వాతిరామకృష్ణారెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అమరుల కుటుంబ సభ్యులకు సన్మానం మొయినాబాద్రూరల్: తెలంగాణ ఏర్పాటులో ప్రాణ త్యాగాలు చేసిన అమరుల కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నటికీ మరచిపోదని జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చాకలిగూడలో ఉద్యమంలో మహేశ్ తెలంగాణ ఏర్పడదని ఆలోచనతో ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఆయన భార్య రజితకు 2014లోనే ప్రభుత్వం అటెండర్ ఉద్యోగం కల్పించిదన్నారు. అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో రజితను మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మల్రెడ్డి రంగారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్రెడ్డి సన్మానించారు. -
పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రం ప్రారంభం
కందుకూరు: కొనుగోలు కేంద్రంలోనే తమ పంటను విక్రయించి రైతులు లబ్ధి పొందాలని పీఏసీఎస్ చైర్మన్ డి.చంద్రశేఖర్ కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం ఆధ్వర్యంలో పొద్దుతిరుగుడు పంట కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అంతకుముందు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా కొనుగోలు కేంద్రంలోనే తమ పంటలను విక్రయించుకునేలా సౌకర్యాలు కల్పించామన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర క్వింటాళ్లకు రూ.7,721 చొప్పున కొనుగోలు చేస్తున్నామన్నారు. అందరి సహకారంతో పొద్దుతిరుగుడు కొనుగోలు చేయడానికి అనుమతులు వచ్చాయని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డైరెక్టర్లు ఎస్.శేఖర్రెడ్డి, ఎన్.నర్సింహ, జి.పర్వతాలు, కె.యశోధ, టి.జగదీశ్వర్రెడ్డి, ఎస్.పాండురంగారెడ్డి, పి.ఆనంద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్.సురేందర్రెడ్డి, సీనియర్ నాయకులు జి.లక్ష్మీనర్సింహారెడ్డి, మన్నే జయేందర్ముదిరాజ్, కె.రామకృష్ణారెడ్డి, జి.ప్రభాకర్రెడ్డి, టి.ఇందిరదేవేందర్, దామోదర్గౌడ్, శేఖర్గుప్తా, పరంజ్యోతి, జయమ్మరాజు, డి.జంగయ్య, డి.గణేష్, ఎన్.అంజిరెడ్డి, రామకృష్ణ, సంజీవరెడ్డి, వెంకటేష్, ప్రతాప్రెడ్డి, వెంకట్రెడ్డి, సీఈఓ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
లైబ్రరీలో సమస్యలు పరిష్కరించండి
బడంగ్పేట్: జిల్లా గ్రంథాలయంలో విద్యార్థులకు సరిపడా వసతులు కల్పించాలని మంగళవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అలుగంటి మధుసూదన్రెడ్డిని కలిసి విద్యార్థి సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గ్రంథాలయ ప్రాంగణంలో డ్రైనేజీకి శాశ్వత పరిష్కారం కల్పించాలని కోరారు. వాటర్ ఫిల్టర్లను ఏర్పాటు చేయాలని, అభ్యర్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇందిరమ్మ క్యాంటీన్ను ఏర్పాటు చేయాలన్నారు. చైర్మన్ మధుసూధన్రెడ్డి స్పందిస్తూ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వినతిపత్రం అందచేసిన వారిలో నవతెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్ణగంటి రంజిత్కుమార్, ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ హైదరాబాద్ నగర కార్యదర్శి కొల్లూరు భీమేష్, విద్యార్థులు కృష్ణ, నరేష్ తదితరులున్నారు. సీసీ రోడ్డు పనులు ప్రారంభం షాబాద్: గ్రామంలోని సమస్యలకు ఒక్కొక్కటిగా గుర్తించి వాటికి చర్యలు తీసుకుంటానని మండలంలోని కుమ్మరిగూడ గ్రామ సర్పంచ్ శ్రీశైలం యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం గ్రామంలో రూ.రెండు లక్షల పంచాయతీ నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ భరత్, వార్డు సభ్యులు మహేందర్, నవీన్, యాదయ్య,శేఖర్, గ్రామస్తులున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం చేవెళ్ల: మండలంలోని ఆలూరు సబ్స్టేషన్ పరిధిలోని అన్ని ఫీడర్ల పరిధిలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ రాజేందర్ ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మతులు చేపడుతున్న కారణంగా ఈ అంతరాయం ఉంటుందని చెప్పారు. ఆలూరు, మీర్జాగూడ, ఖానాపూర్, అర్గానో ఆలూరు, అర్బన్ ఫీడర్ల పరిధిలో ఉన్న రైతులు, ప్రజలు విద్యుత్ అధికారులకు సహకరించాలని కోరారు. కార్మికులకు సన్మానం మొయినాబాద్రూరల్: గ్రామాలు అభివృద్ధి చెందితేనే సమ్మిళిత ప్రగతి సాధ్యమని మండలంలోని కేతిరెడ్డిపల్లి సర్పంచ్ గోడుగు యాదయ్య అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం పంచాయతీ కార్మికులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మికులను సన్మానించి వారికి నెల రోజుల సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. -
నూతన కార్యవర్గం ఎన్నిక
మహేశ్వరం: మండల సర్పంచ్ల సంఘం నూతన అధ్యక్షుడిగా ఉప్పుగడ్డ తండా గ్రామ సర్పంచ్ నేనావత్ రాజు నాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం మండల పరిధిలోని ఘట్టుపల్లి గ్రామంలో ఓ రిసార్ట్లో పలు గ్రామాల సర్పంచ్లతో కలిసి సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడిగా రాజునాయక్, ఉపాధ్యక్షుడిగా వినోద్నాయక్, ప్రధాన కార్యదర్శులుగా మల్లేష్ ముదిరాజ్, దార నర్సింహలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాజునాయక్ మాట్లాడుతూ.. సర్పంచ్ల సమస్యల పరిష్కారం కోసం తాను రాజకీయాలకు అతీతంగా పని చేస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా తాను సర్పంచ్ల సంక్షేమం కోసం పని చేస్తామన్నారు. తనను అన్ని రాజకీయ పార్టీలకు చెందిన 16 మంది గ్రామ సర్పంచ్లు ఎన్నుకున్నారన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని సన్మానించారు. సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడిగా రాజునాయక్ -
ప్రొటోకాల్ పాటించలేదంటూ ధర్నా
కొందుర్గు: ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి సర్పంచ్కు సమాచారం ఇవ్వలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు మంగళవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. రేగడిచిల్కమర్రి గ్రామంలో సోమవారం సాయంత్రం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమానికి సర్పంచ్ శ్వేతకు సమాచారం ఇవ్వకుండా గ్రామ ప్రథమ పౌరురాలిని అవమానించారన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్వేత, మాజీ వైస్ ఎంపీపీ రాజేష్పటేల్, నాయకులు రామకృష్ణ, రవీందర్ రెడ్డి, శ్రీనివాసురెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేక.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకనే బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ మండలశాఖ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి విమర్శించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ గృహాల ప్రవేశం అధికారికంగా చేపట్టిందేమి కాదని, ఇంటి యజమాని తమపై అభిమానంతో పిలిస్తే వెళ్లామని అన్నారు. అయినప్పటికీ సర్పంచ్ను పిలిచారని.. ఆమె గ్రామంలో లేరని తెలియడంతో ఉప సర్పంచ్ నరేందర్తో ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం చేశామన్నారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డి, నాయకులు కృష్ణారెడ్డి, జితేందర్ రెడ్డి, జహంగీర్, కృష్ణయ్య, శ్రీనివాస్ రెడ్డి, రామయ్యగౌడ్ పాల్గొన్నారు. -
ప్రజల సహకారం బాగుంది
శంకర్పల్లి: మండల ఎంపీడీఓగా పని చేసిన తనకు శంకర్పల్లి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంతో సహకరించారని ఇటీవల ఉద్యోగోన్నతిపై బదిలీ అయినా జనగామ జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకయ్య అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేశానని, దానికి తోడ్పాటునందించిన ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ కార్యదర్శులతో పాటు ఇతర సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్యకు శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో శంకర్పల్లి తహసీల్దార్ సురేందర్, మున్సిపల్ కమిషనర్ యోగేశ్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఎంపీఓ గిరిరాజు, పలు గ్రామాల సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
వేసవి శిబిరం ముగింపు సంబరాలు
షాద్నగర్రూరల్: ఫరూఖ్నగర్ మండల పరిలోధిని కాశిరెడ్డిగూడ గ్రామంలో ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నెల రోజులుగా నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు సంబరాలను మంగళవారం నిర్వహించారు. విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్, గణితం, వ్యక్తిత్వవికాసం, క్రీడలు, సృజనాత్మకత తదితర అంశాలతో పాటు కరాటేలో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధి డ్యాగశంకర్ హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంతో పాటు వారికి కావాల్సిన వివిధ అంశాలలో శిక్షణ ఇచ్చేందుకు వేసవి శిబిరాన్ని నిర్వహించామన్నారు. విద్యార్థికి పుస్తకం చదవడం, రాయడం రావాలన్నారు. ప్రతిభ కనబరిచి విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రామలింగంగౌడ్, మాజీ సర్పంచ్ దీనాశంకర్యాదవ్, ఉపసర్పంచ్ శ్రీశైలంయాదవ్, పంచాయతీ క్యాదర్శి రాఘవేంద్ర, వార్డు సభ్యులు ప్రగతి వెల్ఫేర్ సొసైటీ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు. -
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
షాబాద్: గ్రామంలోని సమస్యలకు ఒక్కొక్కటిగా గుర్తించి వాటికి చర్యలు తీసుకుంటానని మండలంలోని కుమ్మరిగూడ గ్రామ సర్పంచ్ శ్రీశైలం యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం గ్రామంలో రూ.రెండు లక్షల పంచాయతీ నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ భరత్, వార్డు సభ్యులు మహేందర్, నవీన్, యాదయ్య,శేఖర్, గ్రామస్తులున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం చేవెళ్ల: మండలంలోని ఆలూరు సబ్స్టేషన్ పరిధిలోని అన్ని ఫీడర్ల పరిధిలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ రాజేందర్ ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మతులు చేపడుతున్న కారణంగా ఈ అంతరాయం ఉంటుందని చెప్పారు. ఆలూరు, మీర్జాగూడ, ఖానాపూర్, అర్గానో ఆలూరు, అర్బన్ ఫీడర్ల పరిధిలో ఉన్న రైతులు, ప్రజలు విద్యుత్ అధికారులకు సహకరించాలని కోరారు. మహనీయుల సేవలు చిరస్మరణీయం షాబాద్: ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని, వారు చేసిన సేవలు చిరస్మరణీయమని మండలంలోని సంకెపల్లిగూడ సర్పంచ్ కుమ్మరి లావణ్య చెన్నయ్య పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ వద్ద జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం మేరా గావ్, మేరీ జిమ్మేదారి స్వచ్ఛగామ్, సురక్షిత్ జలవాయి–2026 కార్యక్రమంలో భాగంగా తడి చెత్త ద్వారా ఎరువు తయారీ కేంద్రం వద్ద సర్పంచ్ కుమ్మరి లావణ్యతో పాటు ఎంపీటీసీ మాజీ సభ్యుడు కుమ్మరి చెన్నయ్య గ్రామస్తులు సెల్ఫీలు దిగారు. అమరుల కుటుంబ సభ్యులకు సన్మానం మొయినాబాద్రూరల్: తెలంగాణ ఏర్పాటులో ప్రాణ త్యాగాలు చేసిన అమరుల కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నటికీ మరచిపోదని జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చాకలిగూడలో ఉద్యమంలో మహేశ్ తెలంగాణ ఏర్పడదని ఆలోచనతో ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఆయన భార్య రజితకు 2014లోనే ప్రభుత్వం అటెండర్ ఉద్యోగం కల్పించిదన్నారు. అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో రజితను మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మల్రెడ్డి రంగారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్రెడ్డి సన్మానించారు. పంచాయతీ కార్మికులకు సన్మానం మొయినాబాద్రూరల్: గ్రామాలు అభివృద్ధి చెందితేనే సమ్మిళిత ప్రగతి సాధ్యమని మండలంలోని కేతిరెడ్డిపల్లి సర్పంచ్ గోడుగు యాదయ్య అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం పంచాయతీ కార్మికులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మికులను సన్మానించి వారికి నెల రోజుల సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల ఉపసర్పంచ్ల సంఘం అధ్యక్షురాలు అనితరెడ్డి, కార్యదర్శి తారాబాయి, వార్డు సభ్యుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శుల బదిలీలు మొయినాబాద్రూరల్: మండలంలో బదిలీ అయిన పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది స్థానంలో ఇతరులు బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఎంపీడీఓ హిమబిందు ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఎనిమిది మంది పంచాయతీ కార్యదర్శులు బదిలీ అయ్యారని అందులో ఐదుగురు మొయినాబాద్ మండలానికి వెళ్లారన్నారు. కాశీంబౌలిలో పని చేసిన శివకుమార్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో శంషాబాద్ మండలం మదనపల్లి తండా నుంచి శ్రీకాంత్, నాగిరెడ్డిగూడ యాదయ్య స్థానంలో ప్రవీణ్కల్యాణ్, కుతుబుద్దీన్గూడ స్వప్న స్థానంలో ఎల్లయ్య వచ్చారన్నారు. -
చిన్నారులకు పలకల పంపిణీ
చేవెళ్ల: అంగన్వాడీ ద్వారా ప్రభుత్వాలు పేదలకు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల మున్సిపల్ చైర్పర్సన్ దేవర సమతారెడ్డి, కౌన్సిలర్ మనీషాఅనంత్రెడ్డి అన్నారు. అంగన్వాడీ–4లో మంగళవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిల్లలకు బట్టలు, పలకలు, సర్టిఫికెట్లను అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు, గర్భిణులు, చిన్నారులు తీసుకోవాల్సిన పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ భారతి, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. పరేడ్లో చేవెళ్ల ఫైర్ పైటర్ చేవెళ్ల: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన పరేడ్లో చేవెళ్ల అగ్నిమాపక కేంద్రం ఫైర్ పైటర్ ఉప్పరి గోపాల్కు అవకాశం లభించింది. మంగళవారం సిక్రింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో ఆర్ముడ్ ఫోర్స్ నిర్వహించిన పరేడ్లో గోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేవెళ్ల అగ్నిమాపక కేంద్రం అధికారి రవీందర్రెడ్డి ఆయన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి అవకాశాలు రావడం సంతోషకరమన్నారు. -
సమ్మర్ క్యాంపు నిర్వహణకు పురస్కారం
కొత్తూరు: ఇటీవల పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ జిల్లాలోనే ఆదర్శవంతమైందిగా అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం పాఠశాల హెచ్ఎం అంగూర్నాయక్కు కలెక్టర్ నారాయణరెడ్డి, ఐటీ శాఖమంత్రి శ్రీధర్బాబు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. క్యాంపులో భాగంగా పర్యావరణ పరిరక్షణ–ప్రజల బాధ్యతపై చేపట్టిన అంశాన్ని అధికారులు గుర్తించినట్లు హెచ్ఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు భగవంతు, రవికుమార్, రాజు, నవనీత, తదితరులు పాల్గొన్నారు. -
పేదల సొంతింటి కల సాకారం
షాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేదల సొంతింటి కల సాకారమవుతుందని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పామెన భీంభరత్ పేర్కొన్నారు. మంగళవారం మండల మండల పరిధిలోని పోతుగల్ గ్రామంలో కుమ్మరి శోభ, కేశపల్లి చంద్రకళ, అమృత, జంగయ్య, సయ్యద్ ఇక్రం నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదోడి సొంత ఇంటి కల సాకారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేస్తోందని చెప్పారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎన్.రాంరెడ్డి, సర్పంచ్ పామెన నర్సింలు, ఉపసర్పంచ్ నేరట్ల సావిత్రి, నాయకులు శ్రీను, రవీందర్నాయక్, భార్గవరామ్, రాజుగౌడ్, యాదయ్య, రాజు, మహేందర్, వార్డు సభ్యులు తదితరులున్నారు. -
అక్రమ మైనింగ్ను ఆపాలని ఫిర్యాదు
మొయినాబాద్: నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న అక్రమ మైనింగ్ను ఆపాలని మండల పరిధిలోని కనకమామిడి గ్రామస్తులు చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సోమవారం చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వారు ఏఓ ప్రభుదాస్కు ఫిర్యాదు అందజేశారు. కనకమామిడి రెవెన్యూలోని సర్వే నంబర్ 51/1, 510లో అక్రమంగా మైనింగ్ జరుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయా సర్వే నంబర్లలోని గుట్టలను రాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా తవ్వి మట్టిని తరలిస్తున్నారని వివరించారు. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు చేపడుతున్న మెగా సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా మైనింగ్ చేస్తోందని తెలిపారు. వెంటనే అడ్డుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఫిర్యాదు చేసిన వారిలో రైతు కూలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఉన్నారు. -
నిరుపేదల సంక్షేమమే ధ్యేయం
షాద్నగర్రూరల్: నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సోమవారం ఫరూఖ్నగర్ మండల పరిధిలోని హజిపల్లి, మొండోనిరాయితండా, చించోడ్ గ్రామాలతో పాటుగా పట్టణంలోని 12, 15 వార్డులలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరమ్మ ఇళ్లను ప్రాంభించి, అబ్ధిదారులకు వస్త్రాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఇల్లులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తోందని, దీంతో పేదల కుటుంబాల్లో ఆనందం కనిపిస్తోందన్నారు. అర్హులైన ప్రతీ పేద కుటుంబానికి ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్లు నిర్మించి వారికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. అనంతరం లబ్ధిదారులు ఎమ్మెల్యేను సన్మానించి, స్వీట్లు తినిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బస్వం, వైస్ చైర్మన్ అందె మోహన్, కమిషనర్ సునీత, కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ -
డంప్యార్డుకు వ్యతిరేకంగా చైతన్యయాత్ర
కొత్తూరు: డంప్యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా జేఏసీ సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం ప్రజా చైతన్యయాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా మండలంలోని వైఎంతండా, చింతగట్టు, పులిచర్లకుంటతండాల్లో జానపద కళాకారులు డంప్యార్డు ఏర్పాటు చేస్తే కలిగే అనర్థాలపై పాటలు, నృత్యాల ద్వారా ప్రజలకు చైతన్యం కల్పించారు. ఒక్కసారి బీజం పడితే చెట్టు వృక్షమైన మాదిరిగా డంపింగ్యార్డులో చెత్త కొండలుగా పేరుకుపోతుందన్నారు. చెత్త నిల్వ కారణంగా పరిసర ప్రాంతాలు వాతావరణ, పొగ, నీటి కాలుష్యంతో ప్రజలు, జీవరాశులు అనేక రోగాల బారిన పడతాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డంప్యార్డు ఏర్పాటును అడ్డుకుంటామని జేఏసీ సభ్యులు స్పస్టం చేశారు. కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు అంబటి ప్రభాకర్, ఎల్లారం శేఖర్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ముందస్తు అరెస్టులు సరికాదు
మొయినాబాద్రూరల్: రాష్ట్రంలో సర్పంచ్ల పెండింగ్ బిల్లుల కోసం నగరంలో చేపట్టిన ధర్నాకు వెళ్లనీయకుండా ముందస్తుగా అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని మాజీ సర్పంచ్ స్వప్నఅంజయ్యగౌడ్ అన్నా రు. సోమవారం మండల పరిధిలోని నక్కలపల్లిలో ఆయనను మొయినాబాద్ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీ ద్వారా అభివృద్ధి పనులు చేసినా.. వాటికి ఈ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. బిల్లుల కోసం నగరంలో నిర్వహించే ధర్నాలో పాల్గొనేందుకు వెళ్తున్నందుకు పోలీసులు హౌస్ అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని పేర్కొన్నారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారుషాద్నగర్ ఎంవీఐగా స్వప్న షాద్నగర్: మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వాసును సంగారెడ్డి కార్యాలయానికి బదిలీ చేస్తూ సోమవారం ఉన్నతాధికారులు ఉత్వర్తులు జారీ చేశారు. ఆయన స్థానంలో నల్గొండ ఎంవీఐగా పనిచేసిన స్వప్న ఇక్కడికి రానున్నారు. రెండేళ్ల కాలం పాటు షాద్నగర్ ఎంవీఐగా బాధ్యతలు నిర్వహించిన వాసు అందరి మన్ననలు పొందారు. శంకర్పల్లి ఎంపీడీఓగా ప్రవీణ్కుమార్ శంకర్పల్లి: శంకర్పల్లి మండల ఎంపీడీఓగా ప్రవీణ్కుమార్ సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన జిల్లేడు చౌదరిగూడెం నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. అయితే ఇక్కడ పనిచేసిన వెంకయ్య పదోన్నతిపై వేరే జిల్లాకి బదిలీపై వెళ్లారు. ప్రజాప్రతినిధులు, ప్రజలను సమన్వయం చేసుకుంటూ మండలాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎంపీడీఓ స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాలను గ్రామ కంఠంలో కలపాలని వినతి కేశంపేట: మండల పరిధిలోని ఇప్పలపల్లి గ్రామంలో ఇళ్ల స్థలాలను గ్రామ కంఠంలో కలపాలని కోరుతూ సర్పంచ్ మంజుల సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. గ్రామంలోని సర్వే నంబర్ 83, 96లలో 1983లో ఇందిరమ్మ ఇళ్ల కోసం డాక్యుమెంట్ 8/1983 ద్వారా 3.46 గుంటల భూమిని రైతులు వెంకట్రెడ్డి, సీతారాంరెడ్డి విక్రయించారని సర్పంచ్ తెలిపారు. అప్పటి నుంచి అక్కడ ఇళ్లు నిర్మించుకున్నా నేటికీ భూ భారతిలో రైతుల పేర్లు వస్తున్నాయని ఆమె తెలిపారు. భూభారతిలో రైతుల పేర్లను తొలగించి, గ్రామకంఠంగా మార్చాలని ఆమె వినతిపత్రంలో కోరారు. -
పుష్కరిణిలో జారిపడి మహిళ మృతి
షాద్నగర్రూరల్: దైవ దర్శనానికి వెళ్లిన ఓ మహిళ పుష్కరిణిలో కాలు జారి కింద పడి మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని రామేశ్వరంలో ఉన్న రామలింగేశ్వరస్వామి దేవాలయం వద్ద చోటు చేసుకుంది. వివరాలివీ.. నందిగామ మండలం శ్రీనివాసులగూడ గ్రామానికి చెందిన జన్ముల సువర్ణ (45) ఆదివారం పౌర్ణమి సందర్భంగా రామేశ్వరంలోని దేవాలయానికి దర్శనం నిమిత్తం వచ్చి రాత్రి అక్కడే నిద్రించింది. సోమవారం ఉదయం పుష్కరిణిలో స్నానం చేసేందుకు వెళ్లిన ఆమె కాలుజారి పడి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడు అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో సత్తా
షాద్నగర్/కొత్తూరు: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితా ల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. కొత్తూరు పట్టణానికి చెందిన పాత్లావత్ గౌతమ్ ఎస్టీ కేటగిరీరిలో 73వ ర్యాంకు సాధించాడు. ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా పరీక్షకు సిద్ధమైనట్లు విద్యార్థి తెలిపాడు. షాద్నగర్ పరిధిలోని మొగిలిగిద్ద కేజీబీవీకి చెందిన బడావత్ అఖిల 831వ ర్యాంకు సాధించినట్లు ప్రిన్సిపాల్ అరుణ తెలిపారు. కమ్మదనం గురుకుల కళాశాల విద్యార్థులు సభావత్ పూజ 2197వ ర్యాంకు, మేక పోతుల ఆదిలక్ష్మి 4388వ ర్యాంకు, కల్లా దీపిక 4657వ ర్యాంకు సాధించినట్లు ప్రిన్సిపాల్ శారద చెప్పా రు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను అధ్యాపకులు, తల్లిదండ్రులు అభినందించారు. -
కాంగ్రెస్తోనే సొంతింటి కల సాకారం
మొయినాబాద్రూరల్: పేదల సొంతింటి కల కాంగ్రెస్తోనే సాకారమవుతోందనిఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం మండల పరిధిలోని అమ్డాపూర్లో సర్పంచ్ మద్యపాగ కృష్ణ ఆధ్వర్యంలో మొదటి విడతలో లబ్ధిదారులు నిర్మించుకున్న నాలుగు ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే, నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్లలో భోజనం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చేవందుకు సీఎం రేవంత్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఏ గ్రామానికి వెళ్లిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జోరుగా సాగుతోందని తెలిపారు. అదేవిధంగా లబ్ధిదారులను అభినందిస్తూ సన్మానించారు. గ్రామంలో సమస్యలు ఉంటే సర్పంచ్కు తెలిపి పరిష్కరించుకోవాలని సూచించారు. దివ్యాంగుడు రత్నయ్య ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవడంతో ఆయన కుటుంబ సభ్యులను అభినందించారు. ప్రభుత్వం ద్వారా ఆయనకు వీల్చైర్ ఇప్పించేందుకు కృషి చేయాలని ఎంపీడీఓ హిమబిందుకు సూచించారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యవర్గ సభ్యుడు షాబాద్ దర్శన్, కాశీంబౌలి సర్పంచ్ మాడి రాజేందర్రెడ్డి, ఉపసర్పంచ్ జితేందర్రెడ్డి, ఎంపీఓ వెంకటేశ్వర్రెడ్డి, నాయకులు మన్నె ప్రభాకర్రెడ్డి, గుంటం సైపాల్రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యులు బాత్కు అంతయ్య, పట్నం రాంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రారెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందుతోందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం మండల పరిధిలోని అమ్డాపూర్ అంగన్వాడీలో టీచర్ సరస్వతి, సర్పంచ్ మద్యపాగ కృష్ణ ఆధ్వర్యంలో చిన్నారులకు ప్రభుత్వం ద్వారా సరఫరా అయిన యూనిఫాంను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. బడీడు పిల్లలను బడిలో చేర్పించి విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లల చదువపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి మాడి రాజేందర్రెడ్డి, టీపీసీసీ కార్యవర్గ సభ్యుడు షాబాద్ దర్శన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య అమ్డాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం -
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
చేవెళ్ల: పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబాకర్ పథకాలు కొనసాగిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం మండలంలోని 38 మంది లబ్ధిదారులకు వచ్చిన కల్యాణలక్ష్మి చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ఆడబిడ్డల పెళ్లిలకు ఆర్థిక సహకారం అందిస్తూ ప్రభుత్వం వారికి భరోసా కల్పిస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ, మండలంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రేపు రైతులకు గ్రామసభ షాద్నగర్: మున్సిపాలిటీ పరిధిలోని చటాన్పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన భూసేకరణకు ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ప్లాట్లు, ఇళ్లు కోల్పోయే వారికి నష్టపరిహారంపై చర్చించేందుకు ఈ నెల 3న మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 11.30లకు గ్రామసభ ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్డీఓ సరిత సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. చటాన్పల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 180 నుంచి 183 వరకు, అదేవిధంగా 674, 675, 695, 696, 697లలో 15,653 చదరపు గజాలు ఎల్సీ నంబర్ 27 వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి భూసేకరణ చేయనున్నట్లు తెలిపారు. ప్లాట్లు, ఇళ్లు కోల్పోయే వారు హాజరై సభను విజయవంతం చేయాలని ఆమె కోరారు. ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రజావాణి ఏఓ ప్రభుదాస్ చేవెళ్ల: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయం ఏఓ ప్రభుదాస్ తెలిపారు. ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 14 ఫిర్యాదులు వచ్చాయని ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 7, పెన్షన్లపై 5, డబుల్ బెడ్రూం కోసం ఒకటి, సివిల్ సప్లైపై ఒక ఫిర్యాదు వచ్చినట్లు తెలిపారు. ప్రజలు అందించిన ఫిర్యాదులను వెంటనే సంబంధిత శాఖలతో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. విద్యార్థికి సన్మానం షాద్నగర్రూరల్: ఫరూఖ్నగర్ మండల పరిధిలోని దేవునిబండతండాకు చెందిన బాదావత్ అఖిత ఐఐటీ ఆలిండియా స్థాయిలో 831 ర్యాంకు సాధించి సత్తాచాటింది. ఈ మేరకు సోమవారం గ్రామ సర్పంచ్ శ్రీను విద్యార్థిని అభినందిస్తూ.. పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని గంట్లవెళ్లి ప్రభుత్వ పాఠశాల, మొగిలిగిద్ద కస్తూర్బా గాంధీ విద్యాలయం(కేజీబీవీ)లో చదువుకున్న అఖిల ఐఐటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచడం అభినందనీయమన్నారు. -
ఫరూఖ్నగర్ ఎంపీడీఓగా శ్రీకాంత్
షాద్నగర్: ఫరూఖ్నగర్ మండల పరిషత్ అధికారిగా పని చేస్తున్న బన్సీలాల్ను చేవెళ్లకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్వర్తులు జారీ చేశారు. ఆయన స్థానంలో తలకొండపల్లి ఎంపీడీఓ శ్రీకాంత్ ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. కొత్తగా వచ్చిన ఎంపీడీఓకు కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు. చేవెళ్ల ఎంపీడీఓగా బన్సీలాల్ చేవెళ్ల: చేవెళ్ల ఎంపీడీఓగా పనిచేసిన హిమబిందును మొయినాబాద్కు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానంలో ఫరూఖ్నగర్ మండల ఎంపీడీఓ బన్సీలాల్ ఇక్కడికి బదిలీపై వచ్చారు. సోమవారం ఆయన ఎంపీడీఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పామెన సర్పంచ్ పామెన రాములు, గ్రామస్తులతో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మొయినాబాద్ ఎంపీడీఓగా హిమబిందు మొయినాబాద్రూరల్: మొయినాబాద్ మండల ఎంపీడీఓగా బిరుదు హిమబిందు సోమవారం బాధ్యతలు చేపట్టారు. చేవెళ్ల మండల ఎంపీడీఓగా పనిచేసిన ఆమె ప్రభుత్వం నిర్వహించిన బదిలీలలో ఇక్కడికి రాగా.. ఇక్కడ ఎంపీడీఓగా 15 రోజులుగా పనిచేసిన వెంకటేశ్వర్రెడ్డి యథావిధిగా ఎంపీఓగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా హిమబిందు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా తనవంతు కృషి చేస్తానని తెలిపారు. -
నూతన ఎంపీడీఓ శ్రీరామ్కు సన్మానం
కొందుర్గు: కొందుర్గు మండల ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించిన శ్రీరామ్ను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి సోమవారం ఘనంగా సన్మానించారు. ఇదివరకు ఇక్కడ ఎంపీడీఓగా పనిచేసిన లక్ష్మిఅనురాధ డిప్యూటీ సీఈఓగా పదోన్నతి పొంది రాజేంద్రనగర్ టీజీఐఆర్డీకి బదిలీపై వెళ్లారు. ప్రస్తుత సాధారణ బదిలీల్లో భాగంగా ఆమె స్థానంలో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ఎంపీడీఓగా పనిచేస్తున్న శ్రీరామ్ ఇక్కడికి వచ్చి బాధ్యతలు తీసుకున్నారు. అదేవిధంగా కొందుర్గు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న సురేఖ ఫరూఖ్నగర్ మండలం రాయికల్కు బదిలీపై వెళ్లారు. షాబాద్ మండలం కేశవగూడ నుంచి రమేశ్ కార్యదర్శిగా బదిలీపై ఇక్కడికివచ్చారు. అదేవిధంగా అలాగే చిన్నఎల్కిచర్ల కార్యదర్శిగా రాకేశ్, ఉమ్మెంత్యాల యాదయ్య, టేకులపల్లి మల్లేశ్, తంగెళ్లపల్లి పర్వీన్ బేగమ్, గంగన్నగూడ సయ్యద్ పాషా, ఉత్తరాసిపల్లి విజయభాస్కర్రెడ్డి, పర్వతాపూర్ అరుణ పంచాయతీ కార్యదర్శులుగా విధుల్లో చేరారు. -
పలువురు అధికారుల బదిలీ
ఇబ్రహీంపట్నం రూరల్: యాచారం మండలంలో పలువురు అధికారులు బదిలీకాగా.. వారి స్థానంలో కొందరు కొత్తవారు వచ్చారు. ఎంపీడీఓ కార్యాలయం సూపరింటెండెంట్ శైలజ కడ్తాల్ మండలానికి వెళ్లగా.. అమె స్థానంలో కడ్తాల్ నుంచి మహాలక్ష్మి వచ్చారు. సీనియర్ అసిస్టెంట్ కృష్ణ జెడ్పీకి, జూనియర్ అసిస్టెంట్ మహేందర్రెడ్డి అబ్దుల్లాపూర్మెట్ మండలానికి, మేడిపల్లి పంచాయతీ కార్యదర్శి తిరుపతి అబ్దుల్లాపూర్మెట్ మండలం కవాడీపల్లికి బదిలీ అయ్యారు. మాల్ పంచాయతీ కార్యదర్శి రాజు నందిగామకు, యాచారం పంచాయతీ కార్యదర్శి కిషన్ అబ్దుల్లాపూర్మెట్ మండలం బలిజగూడకు, చౌదర్పల్లి పంచాయతీ కార్యదర్శి జ్యోత్స్న పిగిలిపూర్నకు, తమ్మలోనిగూడ పంచాయతీ కార్యదర్శి అశోక్.. కడ్తాల్ గోవిందపల్లికి వెళ్లారు. త్వరలో మరికొందరు బదిలీ కానున్నట్లు సమచారం. శంకర్కు దివ్యాంగుల సన్మానం ఆమనగల్లు: యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందిన మాడ్గుల మండలం ఇర్విన్ గ్రామానికి చెందిన దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు బొడ్డు శంకర్ను ఆ సంఘం నాయకులు సన్మానించారు. పట్టణంలోని ఫంక్షన్హాలులో సోమవారం జరిగిన శంకర్ అభినందన సభలో సత్కరించి అభినందించారు. తెలంగాణ ఉద్యమకారుడిగా దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన శంకర్కు డాక్టరేట్ వరించడం హర్షణీయమన్నారు. సంఘం నాయకులు వెంకటేశ్, మల్లికార్జున, వెంకటయ్య, సత్యనారాయణగౌడ్, కృష్ణ, చెన్నకేశవులు, కొండల్, ఆనంద్, రజియ, అలివేలు, అమృత, కలమ్మ పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత కడ్తాల్: బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయరాదని సర్పంచ్ రాయికంటి భిక్షపతి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కాలనీల్లో పర్యటించారు. బీసీ కాలనీలో రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో కూరగాయల వ్యాపారులు చెత్త, వ్యర్థాలు వేయడం గమనించి, వాటిని పారిశుద్ధ్య కార్మికులతో తొలగింపచేశారు. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యతని, క్రయవిక్రయాల అనంతరం చెత్తాచెదారాన్ని పంచాయతీ ట్రాక్టర్లో వేయాలని వ్యాపారులకు సూచించారు. మాస్కుల పంపిణీ ఇబ్రహీంపట్నం రూరల్: పంచాయతీ సిబ్బందికి తగిన మౌలిక సౌకర్యాలు కల్పిస్తానని మల్కీజ్గూడ సర్పంచ్ డేరంగుల శంకర్ అన్నారు. సోమవారం గ్రామంలో కార్మికులకు మాస్కులు, గ్లౌజులు అందజేశారు. బీజేపీ నాయకు లు నగేష్, రవీందర్, శ్రీకాంత్లు పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం కడ్తాల్: సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని, ఆపదలో ఉన్న వారికి కార్పొరేట్ వైద్యం అందేందుకు సహాయపడుతుందని డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్రెడ్డి అన్నారు. మండల కేంద్రానికి చెందిన జూలూరి వీరమణికి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో రూ.42 వేల సీఎం సహాయనిధి చెక్కు మంజూరు అయింది. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధితురాలికి చెక్కు అందజేశారు. కోఆప్షన్ మాజీ సభ్యుడు జహంగీర్బాబా, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మల్లేశ్గౌడ్, సోషల్మీడియా కన్వీనర్ రమేశ్, శరథ్ ఉన్నారు. -
సర్వేను పారదర్శకంగా రూపొందించాలి
తుర్కయంజాల్: ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించాలని, దీనికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆదిబట్ల సర్కిల్ డిప్యూటీకమిషనర్ సత్యనారాయణ రెడ్డి అన్నారు. సోమవారం ఇంజాపూర్లో బీఎల్ఓలు, పలుపార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలో మట్లాడారు. అర్హులు ఓటరు జాబితాలో తమ పేరు ఉందో, లేదో పరిశీలించుకోవాలని, లేకపోతే నమోదు చేయించుకోవాలని సూచించారు. తప్పులు ఉంటే సరిచేయించుకోవాలన్నారు. మరణించిన, వలస వెళ్లిన వారి పేర్లను తొలగింపునకు వారి బంధువులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. బీఎల్ఓలకు సహకరించాలన్నారు. -
ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
అబ్దుల్లాపూర్మెట్: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చూస్తున్న ప్రభుత్వ ఆలోచన మంచి పరిణామని, జిల్లాలో పనిచేస్తున్న వారికి అక్కడే స్థలం ఇవ్వాలని టీడబ్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవ పున్నయ్య కోరారు. సోమవారం మండల కేంద్రంలోని వి.వి.ఎంబ్యాంకెట్హాలో ఫెడరేషన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించగా.. జిల్లా అధ్యక్షుడు గణేశ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అర్హులందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలన్నారు. హెల్త్ కార్డుల విషయంలో ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులో రాయితీ ఇచ్చేలా కలెక్టర్లు, డీఈఓలు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి, పలు అంశాలపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. కార్యక్రమంలో టీడబ్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు శేరిబాయి గణేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సైదులు, కోశాధికారి శ్రీనివాస్ చారి, నేషనల్ కమిటీ సభ్యుడు దేవేందర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.వెంకటేశ్, మణికుమార్, రఘునంద గౌడ్, శ్రీనివాస్, నర్సింహ్మ, రాజశేఖర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు యాదగిరి, జిల్లా ప్రచార కార్యదర్శి నర్సింహ్మారెడ్డి, సోషల్ మీడియా కమిటీ కన్వీనర్ శివ కుమార్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీశైలం, అంజి, నియోజకవర్గాల అధ్యక్ష, కార్యదర్శులు యాదగిరి, రఘవేందర్ గౌడ్, రాజు, జైచందర్, శంకర్, బుచ్చయ్య, జర్నలిస్టులు మల్లేశ్, యాకుబ్ పాష పాల్గొన్నారు.టీడబ్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య -
పరిహారం చెల్లించాకే.. అభివృద్ధి పనులు
తుర్కయంజాల్: పండ్ల మార్కెట్ నిర్మాణం పేరుతో ఎస్సీ, ఎస్టీల భూములను లాక్కోవడం దారుణమని బీజేపీ జిల్లా నాయకుడు కందాల బల్దేవ్ రెడ్డి, కొత్త అశోక్ గౌడ్లు అన్నారు. సోమవారం కొహెడలో భూబాధితుల నిరసనకు మద్దతుగా మాట్లాడారు. సర్వే నంబర్ 167 బై 1లో భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం ఇవ్వకుండా, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకుండా పనులకు శంకుస్థాపన చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి, విధివిధానాలు ప్రకటించడంతో పాటు, నష్ట పరిహారం, అభివృద్ధి చేసిన లే అవుట్లో 600 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి, అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కాగా.. నిరసన, ర్యాలీ నేపథ్యంలో పోలీసులు మోహరించారు. బీజేపీ సీనియర్ నాయకులుపాపయ్యగౌడ్, సహకార సంఘం మాజీ వైస్ చైర్మన్ రాంరెడ్డి, నాయకులు నర్సింహా రెడ్డి, పురుషోత్తం, అనిల్, రైతులు కృష్ణ, రంగయ్య, మహేశ్,శివ ప్రసాద్ పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ఇబ్రహీంపట్నం రూరల్: అర్హులందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తుందని నాగన్పల్లి సర్పంచ్ యాదగిరి అన్నారు. సోమవారం గ్రామంలో లబ్ధిదారు ఇంటిని ప్రారంభించి మాట్లాడారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, రెండో విడతలో లబ్ధిచేకూరుతుందని పేర్కొన్నారు. బీసీలకు రూ.5లక్షలు, ఎస్సీలకు రూ.6 లక్షలు ఇందిరమ్మ రుణ సాయం అందిస్తామని చెప్పారు. మలి విడతలో గ్రామానికి 50 ఇండ్లు కావాలని ఎమ్మెల్యేను కోరామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జగన్, సింగిల్విండో మాజీ చైర్మన్ లక్ష్మణరావు, ఉప సర్పంచ్ జంగయ్య, వార్డు సభ్యులు దారుశరత్రాయుడు, కాటం రాజు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు నారగారి నర్సింహ, పెద్ద నర్సింహ, కట్ట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలకు వరం అబ్దుల్లాపూర్మెట్: నిరుపేదలకు వరం ఇందిరమ్మ ఇళ్లు అని సర్పంచ్ కోటా ప్రభాకర్రెడ్డి అన్నారు. మండల పరిధి పిగ్లీపూర్ గ్రామంలో లబ్ధిదారులు పంది మంజుల రాము, పోలే రజిత దర్శన్ల ఇళ్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇందిరమ్మ ఇంటికి అవసరమైన బండలు సొంత ఖర్చుతో వేయించానని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ దుర్గం నరసింహ, వార్డు సభ్యులు జక్కుల శివకుమార్, ఝాన్సీ ఆంజనేయులు, లావణ్య హనుమంతు, పరమేష్, మురళీకృష్ణ, రమేష్, హరిణి మహేందర్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు హుస్సేన్, ఎర్రయ్య, అమరావతి, శ్వేత, హారిక, దేవాదాయ కమిటీ చైర్మన్ ఐలయ్య పాల్గొన్నారు. -
తలకొండపల్లి ఎంపీడీఓగా సీతారావమ్మ
ఆమనగల్లు: తలకొండపల్లి ఎంపీడీఓగా సీతారావమ్మ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన శ్రీకాంత్.. జిల్లాలోని ఫరూక్ మండలానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మెదక్జిల్లా టేక్మాల్లో పనిచేస్తున్న సీతారావమ్మ బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆమెను కార్యాలయ సిబ్బంది సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఆలయానికిమకరతోరణం బహూకరణ ఆమనగల్లు: తలకొండపల్లి మండల కేంద్రంలోని లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయానికి మండలానికి చెందిన అమృతం భాగ్యలక్ష్మి ప్రకాశం స్వామివారికి మకరతోరణం, నాగాభరణం బహూకరించారు. సోమవారం ఆలయ నిర్వాహకుల సమక్షంలో స్వామివారికి మకరతోరణం అలంకరించి, పూజలు చేశారు. ఈ సందర్భంగా దాత దంపతులను స్థానికులు అభినందించి సత్కరించారు. సర్పంచ్ కటికల శేఖర్యాదవ్, నాయకులు పాండుయాదవ్, రవినాయక్, రవి పాల్గొన్నారు. ఎంపీడీఓగా జయరాం విజయ్ ఆమనగల్లు: ఆమనగల్లు ఎంపీడీఓగా జయరాం విజయ్ నియమితులయ్యారు. ఇక్కడ పనిచేసిన కుసుమమాధురి.. కొంత కాలం క్రితం వికారాబాద్ జిల్లా డీఆర్డీఓ విజిలెన్స్ అధికారిగా పదోన్నతిపై వెళ్లారు. దీంతో నాటి నుంచి తలకొండపల్లి ఎంపీడీఓ శ్రీకాంత్ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం నల్గొండ జిల్లా నేరెడుగొమ్ము మండల ఎంపీడీఓగా పనిచేస్తున్న జయరాం విజయ్.. ఇక్కడికి బదిలీపై వచ్చారు. పూర్తి స్థాయిలో మంగళవారం బాధ్యతలు చేపట్టనున్నారు. -
ప్రమాదకరంగా మారింది
మన్సాన్పల్లి చౌరస్తా నుంచి నాగారం వరకు గల బీటీరోడ్డు ఇటీవల నిర్మించినా కాంట్రాక్టర్ నాసిరకం పనులుచేయడంతో కొద్ది రోజులకే గుంతలుగా మారి ప్రమాదకరంగా తయారైంది. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే వాహనదారులు భయపడుతున్నారు. మరమ్మతులు చేపట్టాలని పలుమార్లు అధికారులను కోరినా ఎవరూ పట్టించుకోవడం లేదు. వెంటనే రోడ్డుపై గుంతలను పూడ్చి మరమ్మతులు చేయాలి. –మర్యాద రాఘవేందర్రెడ్డి, ఉపసర్పంచ్, మన్సాన్పల్లి ● -
పాలమూరు.. సాగునీరు
ఆమనగల్లు: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కాంగ్రెస్తోనే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. పట్టణంలో సోమవారం పలువురి లబ్ధిదారుల ఇళ్లను ప్రారంభించగా.. వారు ఆయనను సన్మానించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్రెడ్డిలతో కలిసి మాట్లాడారు. నీటి వనరులు సరిగ్గా లేని నియోజకవర్గానికి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు తెస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు వట్టెం నుంచి నీరు అందించేందుకు డీపీఆర్ రూపొందించినట్లు పేర్కొన్నారు. ఎత్తిపోతలకు ఇటీవల రూ.వెయ్యి కోట్లు మంజూరు అయ్యాయని, ఈ నెల 4,5 తేదీలలో సీఎం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించి, పెండింగ్ ప్రాజెక్టులను పరిశీలించి, వాటిని పూర్తి చేయడానికి ప్రాధాన్యత చూపుతున్నారని వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా.. టీఆర్ఎస్ పాలనలో ఎత్తిపోతల పథకం పనులు 30 శాతం మాత్రమే జరిగాయని, పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ప్రజాపాలన సాగుతోందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని, నియోజకవర్గానికి రెండో విడతలో రెండు వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. పెండింగ్లో పనులకు ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జగన్, మాజీ అధ్యక్షుడు మండ్లి రాములు, పట్టణ అధ్యక్షుడు మానయ్య, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యదర్శి ఫరీద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవీందర్, సంపత్కుమార్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, మల్లయ్య, ప్రసాద్, బాబా, కృష్ణనాయక్, రాఘవేందర్, విజయ్ రాథోడ్ పాల్గొన్నారు. లక్ష ఎకరాలకు ప్రణాళిక కాంగ్రెస్తోనే ప్రజలకు సమన్యాయం కల్వకుర్తికి 2 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి -
వాహనాల గంతులు
● గుంతలమయంగా గ్రామాల రహదారులు ● వాహనదారులకు తప్పని నరకయాతన ● పట్టించుకోని అధికారులురోడ్లన్నీ గుంతలు.. మహేశ్వరం: ఆడుగుకో గుంత.. వాహనదారులకు తప్పని తంటా అన్నట్లుగా ఉంది గ్రామాలు, తండాల్లో రోడ్ల దుస్థితి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు నరకప్రాయంగా మారుతున్నాయి. కాంట్రాక్టర్ నాసిరకం పనులు, అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. గుంతలు పడి.. కంకర తేలి మండలంలోని మన్సాన్పల్లి చౌరస్తా నుంచి నాగారం, మన్సాన్పల్లి చౌరస్తా నుంచి అమీర్పేట్, రామారావు చౌరస్తా నుంచి నాగిరెడ్డిపల్లి, నాగిరెడ్డిపల్లి నుంచి హబిబుల్లాగూడ(గొల్లూరు రోడ్డు), హబిబుల్లాగూడ నుంచి సంఘీగూడ, మెహబ్బత్నగర్ గేటు(శ్రీశైలం జాతీయ రహదారి) మెహబ్బత్నగర్, తుమ్మలూరు రోడ్డు గుంతలమయంగా మారాయి. దీంతో ఆయా రోడ్లపై ప్రయాణించాలంటే వాహనదారులు నరకయాతన పడుతున్నారు. చాలా చోట్ల నిత్యం ప్రమాణాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్లపైన ఎటు చూసినా గుంత పడి, రాళ్లు తేలి ప్రమాదకరంగా మారడంలో అవస్థలు పడుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. నరకానికి నకళ్లులా మారిన గ్రామ రహదారుల అభివృద్ధిని పాలకులు, అధికారులు పట్టించుకోవాలని కోరుతున్నారు. నిత్యం వందలాది వాహనాలు ప్రధానంగా మన్సాన్పల్లి చౌరస్తా నుంచి నాగారం, మన్సాన్పల్లి చౌరస్తా నుంచి అమీర్పేట్ వరకు గల రోడ్డు గుంతల మయంగా మారి వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. ఈ రోడ్డుపై నిత్యం వందలాది వాహనాలు ఔటర్ రింగ్ ఎగ్జిట్ 15 వరకు, శంషాబాద్, అదే విధంగా అమీర్పేట్ గ్రామం నుంచి బెంగుళూరు రహదారి, కొత్తూరు, మహేశ్వరం మండల కేంద్రానికి వెళ్తుంటారు. రాత్రి వేళల్లో నిత్యం ఈ రోడ్డుపై ఎదో ఒకచోట ప్రమాదం జరుగుతూనే ఉంది. తప్పని అవస్థలు మండల పరిధిలోని మన్సాన్పల్లి చౌరస్తా నుంచి నాగారం వరకు గల బీటీరోడ్డు గుంతలుగా మారి వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. మహేశ్వరం, మన్సాన్పల్లి, కోళ్లపడకల్, దుబ్బచర్ల, కల్వకోల్, పెండ్యాల, సుభాన్పూర్ గ్రామాలతో పాటు కొత్తురు మండలం, కేశంపేట్ మండలాలకు చెందిన గ్రామాల ప్రజలు ఈ రోడ్డుపై నుంచి నిత్యం ప్రయాణిస్తూ ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్, హైదరాబాద్ వెళ్తుంటారు. రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో నరయాతన పడుతున్నామని, వాహనాలు పాడవుతున్నాయని వాహనదారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళలలో ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుతున్నా, అధికారులు స్పందించడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. -
పేద గూటికి పండగ
● స్థానికంగానే లబ్ధిదారులకు ఇళ్ల వసతి ● క్యూర్ పరిధిలో నేటి నుంచి పంపిణీ ● జీ+5, జీ+9 పద్ధతిలో నిర్మాణాలు సాక్షి, సిటీబ్యూరో: క్యూర్ పరిధిలో పేదల గృహ నిర్మాణ పథకాల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. సోమవారం నుంచి హైదరాబాద్ మినహా రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లతో పాటు, నూతన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ పర్వం సాగనుంది. మొత్తం 25,619 డబుల్ బెడ్రూం ఇళ్లకు గాను సుమారు 4,296 ఇళ్లు సిద్దంగా ఉన్నాయి. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తి కావడంతో అర్హులకు ఇళ్ల పట్టాలు, తాళాలు అందజేసేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. స్థానికంగానే లబ్ధిదారులకు ఇళ్ల వసతి కల్పించే విధంగా హౌసింగ్ శాఖ చర్యలు చేపట్టింది. ● హైదరాబాద్ జిల్లా పరిధిలోని నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను విడతల వారీగా పంపిణీ చేయనున్నారు. అయితే.. ఇంకా ముహుర్తం ఖరారు కాలేదు. నగరంలో స్థలాభావం ఉన్నప్పటికీ గతంలో జీ+5, జీ+9 పద్ధతుల్లో నిర్మించిన గృహ సముదాయాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి ● రంగారెడ్డి జిల్లాలో అటు డబుల్ బెడ్రూం ఇళ్లతో పాటు, సొంత స్థలం కలిగిన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ నిధుల మంజూరు పత్రాల పంపిణీ కూడా వేగవంతం కానుంది. పారదర్శకమైన క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం లబ్ధిదారుల తుది జాబితాను అధికారులు ప్రకటించారు. ● కార్మికులు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఇళ్ల పంపిణీకి రంగం సిద్దమైంది. మౌలిక వసతులైన తాగునీరు, విద్యుత్, రోడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న గృహ సముదాయాలను లబ్ధిదారులకు అప్పగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ● సంగారెడ్డి జిల్లా పరిధిలోని పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదలకు చారిత్రాత్మక రోజు కానుంది. ఇటు పక్కా ఇళ్ల పంపిణీ, అటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక సహాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసే ప్రక్రియను మంత్రుల సమక్షంలో ప్రారంభించనున్నారు. దళారుల బెడద లేకుండా నేరుగా లబ్ధి ఇళ్ల పంపిణీలో ప్రభుత్వం పూర్తి పారదర్శకతను పాటించింది. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా, క్షేత్రస్థాయిలో రెవెన్యూ మున్సిపల్ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి నిజమైన అర్హులను మాత్రమే ఎంపిక చేశారు. ఎలాంటి రాజకీయ జోక్యం, దళారుల ప్రమేయం లేకుండా కంప్యూటరైజ్డ్ డ్రా (లాటరీ) పద్ధతిలో ఇళ్ల కేటాయింపు ప్రక్రియ కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగనుంది. జిల్లా నిర్మాణంలో ఉన్నవి పూర్తయినవి మొత్తం హైదరాబాద్ 1,689 1,077 2,766 రంగారెడ్డి 7,606 1,057 8,663 మేడ్చల్–మల్కాజిగిరి 6,448 1,365 7,813 సంగారెడ్డి 5,580 797 6,377 -
ఫామ్హౌస్పై దాడి: ఇద్దరి అరెస్టు
షాబాద్: ఫామ్హౌస్పై పోలీసులు దాడి చేసి హుక్కా తాగుతున్న ఇద్దరిని అరెస్టు చేసిన సంఘటన షాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో సోలిపేట్ గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. సోలిపేట్ గ్రామం శివారులోని ఓ ఫామ్హౌస్లో హుక్కా పార్టీ కొనసాగుతున్నట్లు సమాచారం అందింది. పోలీసులు దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మొయినాబాద్రూరల్: విద్యుదాఘాతంతో మూడు దూడలు, ట్రాక్టర్, పశువుల మేత దగ్ధమైన సంఘటన మండలంలోని చందానగర్లో ఆదివారం చోటు చేసుకుంది. చందానగర్ గ్రామానికి చెందిన రాజేష్ పశువుల పాకలో మధ్యాహ్నం ట్రాక్టర్, పశువులకు వేసే సొప్ప కరెంటు షాక్తో దగ్ధమైంది. ఎండలు జోరుగా ఉండడంతో మూడు దూడలు సజీవంగా దహనం అయ్యాయి. అదే విధంగా పాలిచ్చే గేదెలు, ఆవులకు సైతం తీవ్రంగా గాయపడ్డాయి. దాదాపు రూ.20–22 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులతో పాటు గ్రామస్తులు పేర్కొంటున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. చేవెళ్ల: పేకాట స్థావరంపై ఓఎస్ఓటీ పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన శనివారం రాత్రి చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలోని కందవాడ సమీపంలోని లొద్దిశివారులో చోటు చేసుకుంది. సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. కందవాడ అనుబంధంగా ఉన్న లొద్ది శివారులో ఉన్న ఓ ఫాంహౌస్లో పేకాట ఆడుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఇందులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.2,020 నగదు, ఓ కారు, రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
అగ్నివీర్లుగా అదరగొట్టేశారు
త్రివిధ దళాలకు వికారాబాద్ జిల్లావాసుల ఎంపిక నాలుగేళ్లపాటు దేశ సేవ చేసేందుకు భారత సైన్యంలో ప్రభుత్వం అగ్నివీర్ యోజన ప్రారంభించింది. ప్రవేశాలకు గతేడాది రాతపరీక్ష ఫలితాలను ఆదివారం ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది.హస్నాబాద్ నుంచి ఐదుగురు దుద్యాల్: మండల పరిధిలోని హస్నాబాద్, పోలేపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు అగ్నీవీర్(ఇండియన్ ఆర్మీ)కి ఎంపికయ్యారు హస్నాబాద్ నుంచి కక్కునూరి సాయితేజ, కొత్త అశోక్, బొంగు రాకేశ్, నాయుకోటి నవీన్, తూర్పు హన్మంతు, పోలేపల్లికి చెందిన పుర్ర హరికృష్ణ దేశసేవకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు యువకులు శుభాకాంక్షలు తెలిపారు. ఐనాపూర్ నుంచి ఏడుగురుదోమ: కేంద్రం ప్రభుత్వం విడుదల చేసిన అగ్నీవీర్కు ఆయా గ్రామాల యువకులు సత్తచాటారు. ఐనాపూర్ గ్రామం నుంచి ఏడుగురు అర్హత సాధించడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. పి.శ్రీనివాస్, పవన్కుమార్, దేవ, భరత్యాదవ్, మునీ, పి.నరేశ్, భాను ప్రకాశ్ అగ్నీవీర్కు ఎంపికయ్యారు. బొంపల్లి గ్రామం నుంచి బోయిని వంశీముదిరాజ్ అగ్నీవీర్కు ఎంపికయ్యారు. కుల్కచర్ల నుంచి 14 మంది ఎంపిక కుల్కచర్ల: అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ప్రవేశాల్లో 14 మంది యువత అర్హత సాధించారు. బండవెల్కిచర్ల నుంచి మొగులయ్య, కాశమోని నవీన్, మడుగు రామకృష్ణ, చిగుర్లపల్లి అనిల్, కోట్ల సాయి, పిల్లి శ్రీకాంత్ సాల్వీడు నుంచి జోగు శేఖర్, దీప్లానాయక్ తండా నుంచి కుమార్, ఘణపూర్ గ్రామానికి చెందిన బిజ్జారం శివకుమార్, కొండ శివకుమార్ బిందెంగడ్డ తండా నుంచి సునీల్, కుల్కచర్లకు చెందిన గుడాల అఖిల్, చెరువుముందలి తండా(ఎ) నుంచి రాహుల్, పుట్టపహాడ్ గ్రామానికి చెందిన ప్రకాశ్, చౌడాపూర్ మండలం రాంసింగ్ నాయక్ తండాకు చెందిన విస్లావత్ మేఘనాథ్ అగ్నివీర్కు ఎంపికయ్యారు. -
లారీ ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి
లంగర్హౌస్/షాద్నగర్రూరల్: స్నేహితుడితో సరాదాగా బయటకు వెళ్లిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి వచ్చిన లారీ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన లంగర్హౌస్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై రాంబాబు తెలిపిన మేరకు.. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని ఎల్లికట్ట గ్రామానికి చెందిన బెంది శ్రీనివాస్ రెడ్డి ఏకై క కుమారుడు సృజన్ రెడ్డి(21) ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుకుంటూ బీఎన్ రెడ్డి నగర్లోని వసతి గృహంలో ఉంటున్నాడు. ఆదివారం ద్విచక్ర వాహనంపై మిత్రుడితో కలిసి హైటెక్ సిటీకి బయల్దేరాడు. టోలీచౌకి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. కింద పడ్డ సృజన్ పై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున్న వంశీ రెడ్డికి సైతం తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని లారీని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎలికట్టలో విషాదఛాయలు రైతు కుటుంబానికి చెందిన శ్రీనివాస్రెడ్డి పాడి ఆవులను పోషిస్తూ ఇద్దరు పిల్లలను చదివిస్తున్నారు. మరో రెండు నెలల్లో కోచింగ్ పూర్తి చేసుకొని ఉద్యోగం సాధిస్తాడని ఆ తల్లిదండ్రులు కలలు కన్నారు. కానీ విధి మృత్యురూపంలో కొడుకును కబళించింది. సృజన్రెడ్డి మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. -
దైవ దర్శనానికి వెళ్తూ.. అనంత లోకాలకు
● రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి ● మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కడ్తాల్: దైవ దర్శనానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన షాద్నగర్–కడ్తాల్ ప్రధాన రహదారిపై మక్తమాధారం సమీపంలో చోటు చేసుకుంది. సీఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేట గ్రామానికి చెందిన బోడనంపల్లి శివ(23), తన స్నేహితులైన పాపిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన సురమోని పవన్కుమార్, అనిల్, పవన్ కలిసి ఆదివారం సాయంత్రం మైసిగండి మైసమ్మను దర్శించుకునేందుకు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో మక్తమాధారం గ్రామ శివారులోకి చేరుకోగానే కారు నడుపుతున్న అనిల్ అజాగ్రత్తగా నడిపి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న శివకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా.. పవన్కుమార్, పవన్లకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు సేకరించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శంషాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. శివ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ మేరకు మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. -
కిరాణ షాపుల్లో పోలీసుల సోదాలు
మొయినాబాద్: మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్నగర్, జీవన్గూడలో శనివారం రాత్రి డాగ్స్క్వాడ్ బృందంతో కలిసి మొయినాబాద్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని కిరాణ, పాన్ షాపుల్లో సోదాలు చేశారు. నేర నియంత్రణ, మాదక ద్రవ్యాల నిర్మూలనతోపాటు ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ మల్లికార్జున్రెడ్డి తెలిపారు. అనుమానాస్పద ప్రాంతాల్లో విసృతంగా తనిఖీలు చేసి మాదక ద్రవ్యాలు, గంజాయి, నిషేధిత పొగాకు ఉత్పత్తులు, చట్ట విరుద్ధ వస్తువుల విక్రయం, నిల్వ, రవాణాపై ప్రజలు, దుకాణదారులకు అవగాహన కల్పించామన్నారు. తనిఖీల్లో ఎస్సై కిషన్ సింగ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
జోక్యం వద్దన్నా.. ఎలా కూల్చివేస్తారు?
కూకట్పల్లి భూముల్లో హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి పరిధిలోని 13.17 ఎకరాల భూమి విషయంలో హైడ్రా చర్యలపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు పరిధిలోని అంశంలో జోక్యం చేసుకోవద్దని ఆదేశాలున్నా.. ఎలా కూల్చివేతలు చేపడతారని ప్రశ్నించింది. ఈ నెల 25న హైడ్రా చర్యలకు ముందు ఎలా ఉందో అదే స్థితికి తీసుకుని రావాలని అధికారులను ఆదేశించింది. రెవెన్యూ, హైడ్రా కంచెలు, బోర్డులు ఏర్పాటు చేస్తే వెంటనే తొలగించాలని తేల్చిచెప్పింది. గతంలోలాగ 24 గంటల్లో ప్రహరీ కంచెను, రేకుల షెడ్లను, ప్రవేశ ద్వారాన్ని పునర్నిర్మించాలని, విద్యుత్ సర్వీస్ లైన్లు, లైటింగ్ మౌలిక సదుపాయాలు, అనుబంధ విద్యుత్ పరికరాలను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని పనులు సకాలంలో పూర్తి చేసి పిటిషనర్కు భూమిని అప్పగించాలంది. ఒకవేళ అధికారులు అలా చేయని పక్షంలో పిటిషనర్.. సదరు పనులన్నీ పూర్తి చేసి అయిన ఖర్చును కోర్టుకు సమర్పించాలని పేర్కొంది. ఆ మొత్తాన్ని ధిక్కారానికి పాల్పడిన వారి వ్యక్తిగత నిధుల నుంచి వసూలు చేస్తామంది. సదరు భూమికి సంబంధించి కోర్టు కేసు ముగిసే వరకు హైడ్రా, రెవెన్యూ సహా ఇతర అధికారులెవరూ పిటిషనర్కు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని చెప్పింది. తదుపరి విచారణ వచ్చే నెల 4కు వాయిదా వేసింది. ● కూకట్పల్లిలోని 13.17 ఎకరాలకు సంబంధించి గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు ఉద్దేశపూర్వకంగా ధిక్కరించారంటూ ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2022, 2024, 2025 సంవత్సరాల్లో భూమిలో అధికారులు జోక్యం చేసుకోకూడదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిందన్నారు. మే 25, 26 తేదీల్లో ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా భూమిలోకి ప్రవేశించి కాంపౌండ్ ఫెన్సింగ్, భద్రతా గదులు, ప్రవేశ ద్వారాన్ని కూల్చివేసి, విద్యుత్ సరఫరా నిలిపివేసి, భూమిని స్వాధీనం చేసుకున్నారన్నారు. ప్రభుత్వమే జీఓ ఇచ్చి..డబ్బు కట్టించుకుని..పంచనామా చేసి ప్రభుత్వమే స్వాధీనం చేసిన భూమిలోకి మళ్లీ హైడ్రా ప్రవేశించడం దారుణమన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రాథమికంగా హైడ్రా కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తెలుస్తోందన్నారు. న్యాయస్థానం అనుమతి పొందకుండా కూల్చివేతలు, ఫెన్సింగ్ ఏర్పాటు, బోర్డులు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమన్నారు. ముందు కూల్చివేయడం, తరువాత ఫెన్సింగ్ వేసి బోర్డులు పెట్టడం, ఆ తర్వాత చర్యలను సమర్థించుకోవడం హైడ్రా అనుసరిస్తున్న పద్ధతిగా కనిపిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మే 25కు ముందు భూమి స్థితి ఎలా ఉందో అలా 24 గంటల్లో పునరుద్ధరించాలని హైడ్రా, సంబంధిత అధికారులను ఆదేశిస్తూ విచారణ వాయిదా వేశారు. కూల్చివేయడం, సమర్థ్ధించుకోవడం పరిపాటిగా మారింది 24 గంటల్లో భూమి గత స్థితిని పునరుద్ధరించాలి విచారణ వచ్చే నెల 4కు వాయిదా -
సీఎం సభ విజయవంతానికి ప్రత్యేక పూజలు
తుర్కయంజాల్: సమీకృత మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమం విజయవంతానికి గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్రెడ్డి కొహెడ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. జూన్ 3వ తేదీన కొహెడ సర్వేనంబర్ 167/1లో ఈ మార్కెట్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం సభ విజయవంతం చేయాలని ప్రసన్నాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సీహెచ్.భాస్కర్ చారి, మార్కెటింగ్ శాఖ సెక్రటరీ శ్రీనివాస్, సభ్యులు రఘుపతి రెడ్డి, అంజయ్య, నవరాజ్, గోవర్ధన్ రెడ్డి, నర్సింహ, బండి మధుసూధన్ రావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి విక్రేతకు రిమాండ్
షాద్నగర్రూరల్: గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ ఘటన శనివారం ఫరూఖ్నగర్మండల పరిధిలోని ఎలికట్ట చౌరస్తాలో శనివారం చోటు చేసుకుంది. పట్టణ సీఐ సీతారాం తెలిపిన ప్రకారం.. బీహార్ రాష్ట్రం, పూర్ణియా జిల్లా కేంద్రానికి చెందిన చోటుకుమార్ రెండు నెలల క్రితం షాద్నగర్ ప్రాంతానికి వలస వచ్చాడు. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని ఎలికట్టలో నివాసం ఉంటూ సమీపంలోని పరిశ్రమలలో కూలీ పని చేస్తున్నాడు. ఎలికట్టలో నివసిస్తున్న బీహార్ ప్రాంతానికి చెందిన నీరజ్కుమార్ వద్ద తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసిన చోటుకుమార్ పరిసర ప్రాంతాల్లోని కూలీలకు, వ్యసనపరులకు విక్రయిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 29న ఎలికట్ట చౌరస్తాలో ఎస్ఐ ప్రణయ్కుమార్ పోలీసు సిబ్బందితో వాహనాలను తనిఖీ చేస్తుండగా చోటుకుమార్ పారిపోయేందుకు యత్నించాడు. గమనించిన పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని పరిశీలించగా నీలి కలర్ ప్లాస్టిక్ కవర్లో దాదాపు కిలో గంజాయి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విచారించగా గంజాయిని విక్రయిస్తున్నట్లు అంగీకరించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. -
అధికారంలోకి వస్తే 111 జీవో ఎత్తివేస్తాం
మొయినాబాద్: ‘111 జీవో ఎత్తివేసే అంశంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈప్రాంత ప్రజలను మోసం చేశాయని, మేము అధికారంలోకి వస్తే వెంటనే ఆజీవోను తొలగిస్తాం’ అని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం ఆమె చిలుకూరు బాలాజీని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మొయినాబాద్లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆడబిడ్డల జీవితాల్లో మార్పు రాలేదన్నారు. మీకేం కావాలో ఆడబిడ్డగా, ఓ సోదరిగా తనకు తెలుసని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఎలాంటి గ్యారంటీ లేకుండా బ్యాంకుల ద్వారా రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు మంజూరు చేయిస్తామన్నారు. ఆయా లక్ష్యాలను సాధించేందుకే తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా పుట్టుకొచ్చామన్నారు. చుట్టుపక్కల భూములు ఎకరాకు రూ.వంద కోట్లకు పైగా పలుకుతుంటే 111 జీవో పరిధిలోని ప్రజలు మాత్రం తమ భూములను ఎక్కువ ధరకు అమ్ముకోలేని పరిస్థితి ఉందన్నారు. పిల్లల పెళ్లిళ్లకోసం పావు ఎకరం భూమి అమ్మాలన్నా ఈ జీవో అడ్డంకి వల్ల రేటు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుంపు మేసీ్త్ర(సీఎం రేవంత్రెడ్డిని ఉద్దేశించి) తనకు రియల్ ఎస్టేట్ వ్యాపారమే బాగా తెలుసని చెప్పాడు.. కానీ ఆ వ్యాపారాన్ని ఊడగొట్టిండని విమర్శించారు. చేవెళ్ల, మొయినాబాద్లో ఎక్కువగా రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారని.. అందరికీ మేలు చేసేలా ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని మండిపడ్డారు. అందుకే గుంపుమేసీ్త్రపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన తన పార్టీకి స్వామి వారి ఆశీస్సులకోసం వచ్చామని.. చిలుకూరు బాలాజీ దయతో రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం కోసం పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. రాష్ట్రంలో తీవ్ర ఇబ్బంది పడుతున్న రైతులకు మంచి చేసే బుద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవ్వమని కోరుకున్నట్లు చెప్పారు. అనంతరం సురంగల్లో సంతోష్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బస్ షెల్టర్కు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కుమ్మరి శివకుమార్, అన్వర్ఖాన్, నూర్బాయ్, నాగేష్, భిక్షపతి, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఈవిషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజలను మోసం చేశాయి టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మొయినాబాద్లో పార్టీ జెండా ఆవిష్కరణ -
శరవేగంగా శంకుస్థాపన పనులు
అబ్దుల్లాపూర్మెట్: మండల పరిధిలోని కోహెడలో అత్యాధునిక వసతులతో కూడిన అంతర్జాతీయ స్థాయి సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కోహెడలోని సర్వేనంబర్ 167/1లో సుమారు 179 ఎకరాల్లో విడతల వారీగా రూ.2 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మార్కెట్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. జూన్ 3వ తేదీన మొదటి విడతగా రూ.558 కోట్లతో పనులు ప్రారంభించనుండగా.. వారం రోజులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ స్థలంలో శరవేగంగా పనులను కొనసాగిస్తున్నారు. శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేయనున్న బహిరంగ సభకు కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కార్యక్రమానికి వచ్చే రైతులు, సామాన్య ప్రజల నుంచి వీఐపీల వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చిన్నాభిన్నమైన గడ్డిఅన్నారం మార్కెట్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్న చిరకాల కోరిక నెరవేర్చుతున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు. భూములు కోల్పోతున్న వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తా. మొత్తం మూడు విడతలుగా మార్కెట్ నిర్మాణం చేపట్టనున్నాం. జూన్ 3వ తేదీన సాయంత్రం 5గంటలకు జరిగే సీఎం సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. – చిలుక మధుసూదన్రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్, గడ్డిఅన్నారం అంతర్జాతీయ పండ్ల మార్కెట్ నిర్మాణానికి తొలివిడతగా రూ.558 కోట్లు జూన్ 3న పనులు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి -
ఎకోటౌన్ ఏర్పాటు చేయొద్దు
షాద్నగర్రూరల్: సిద్దాపూర్లో ఎకోటౌన్ను ఏర్పాటు చేయొద్దని కోరుతూ ఎమ్మెల్యే వీర్లపల్లిశంకర్ శనివారం టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలజగ్గారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సమస్యను ఎమ్మెల్యే సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షినటరాజన్కు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దాపూర్ ప్రజల మనోభావాలకు భిన్నంగా డంప్యార్డును ఏర్పాటు చేయవద్దని కోరారు. గతంలో ఈ భూములు ఇండస్ట్రియల్ పార్కుకు ఏర్పాటుకు కేటాయించామని చెప్పారని.. అదే ప్రకారం పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగావకాశాలను కల్పించాలన్నారు. సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ప్రకటన జారీ చేయాలని కోరారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ -
ఎవరికో?
ఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2026అమాత్యయోగంవికారాబాద్: మంత్రివర్గ విస్తరణ జూన్ మొదటి లేదా రెండో వారంలో ఉండొచ్చనే సంకేతాల నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ముఖ్యనేతలు హస్తిన బాట పట్టారు. ఇప్పటికే పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వేర్వేరుగా ఢిల్లీకి వెళ్లి వచ్చారు. రెండు రోజులుగా స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అక్కడే మకాం వేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరందరూ మంత్రి పదవి ఆశిస్తూ వచ్చారు. మొదట ప్రసాద్కుమార్ పేరు ఎక్కువగా వినిపించినా అనూహ్య రీతిలో స్పీకర్ పదవిని కట్టబెట్టారు. అప్పట్లో ఆయన అయిష్టంగానే బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం. ఇక సీనియర్ ఎమ్మెల్యేలు టీఆర్ఆర్, మల్రెడ్డి రంగారెడ్డికి పూర్తి నిరాశే మిగిలింది. మరోసారి మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న వార్తల నేపథ్యంలో టీఆర్ఆర్ ఢిల్లీకి వెళ్లి రాహుల్గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి ముఖ్య నేతలను కలిశారు. మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఇదే బాటలో నడిచారు. వీరు అనేక సార్లు హస్తినలో పర్యటించారు. తాజాగా స్పీకర్ సైతం అక్కడే ఉండటంతో ఆయనను సభాపతి నుంచి తప్పించి, పోర్టుపోలియో ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే హస్తినకు పిలుపు వచ్చినట్లు ఆ పార్టీ ముఖ్యులు చర్చించుకుంటున్నారు. స్పీకర్ పదవి కారణంగా తాను పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొన లేకపోతున్నానని ప్రసాద్కుమార్ తన సన్నిహితులు వద్ద అంటున్నట్లు సమాచారం. మంత్రి పదవికే మొగ్గు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక ప్రసాద్కుమార్కు మంత్రి పదవి దక్కింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టింది. పార్టీ సీనియర్ నేత కావడంతో ప్రసాద్కుమార్కు కూడా కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. మొదటి విడత విస్తరణలో మంత్రి పదవి ఇస్తారనే చర్చ జరిగినా అవకాశం దక్కలేదు. ప్రస్తుత విస్తరణలోనైనా తనకు చాన్స్ వస్తుందని భావిస్తున్నట్లు సమాచారం రేసులో టీఆర్ఆర్ రెండు దశాబ్దాలుగా పార్టీనే అంటిపెట్టుకొని ఉన్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో ఓటమిపాలయ్యారు. జిల్లాలో పలువురు నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీ వీడినా తాను మాత్రం కాంగ్రెస్లోనే ఉండిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. వికారాబాద్ కొత్త జిల్లాగా ఏర్పాటైన తర్వాత డీసీసీ అధ్యక్షుడిగా సేవలందించారు. మంత్రి పదవి కోసం తన వంతుగా గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లు తెలిసింది.రామ్మోహన్రెడ్డి హస్తిన బాటలో ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలు రెండు రోజులుగా ఢిల్లీలోనే స్పీకర్ ప్రసాద్కుమార్ ఇప్పటికే వెళ్లివచ్చినరామ్మోహన్రెడ్డి, రంగారెడ్డి -
బాధితులకు న్యాయం చేయడమే విధి
● ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ● మహేశ్వరం ఠాణా ఆకస్మిక తనిఖీ మహేశ్వరం: పోలీసులు విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. శనివారం ఆయన మండల కేంద్రంలోని మహేశ్వరం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్లతో మాట్లాడుతూ.. పోలీసులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఠాణాకు న్యాయం కోసం బాధితులతో మర్యాదగా మెదులుతూ వారి ఫిర్యాదులు స్వీకరించాలని చెప్పారు. బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల ప్రాథమిక విధి అన్నారు. నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడికి గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పలు స్టేషన్ రికార్డులను పరిశీలించారు. పీఎస్ పరిధిలో లా అండ్ ఆర్డర్, నేర నివారణ వ్యూహాలపై తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి ఆరా తీసారు. పోలీసు అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం జోన్ డీసీపీ నారాయణరెడ్డి, సీఐ రాఘవేందర్రెడ్డి, ఎస్ఐలు ప్రసాద్, రాఘవేందర్, ధనుంజయ్, సిబ్బంది పాల్గొన్నారు. -
నక్ష బాట కబ్జా!
● చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్ ● ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు ఇబ్రహీంపట్నం రూరల్: ఉప్పరిగూడ–మంగళ్పల్లి నక్షా రోడ్డుకు అడ్డంగా కందకాలు తవ్వి రాకపోకలు నిలిపివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. మండల పరిధిలోని ఉప్పరిగూడ, మంగళ్పల్లి గ్రామాలకు 1999లో మెటల్ రోడ్డును వేశారు. నాటి నుంచి ఈ మార్గంలో రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో రాత్రికి రాత్రే ఉప్పరిగూడకు చెందిన రైతులు ఆ రోడ్డును ధ్వంసం చేసి రెండు చోట్ల కందకాలు తవ్వి పాడు చేశారని, నక్ష బాట వదిలేసి వారి పొలం నుంచి రోడ్డు వేసుకున్నారని శనివారం ఉప్పరిగూడ, మంగళపల్లి రెవెన్యూ ప్రాంతాలకు చెందిన రైతులు ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్రెడ్డి, తహసీల్దార్ సునీత, ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి న్యాయం చేస్తామని రైతులకు సర్ధిచెప్పారు. అనంతరం రైతులు సురేందర్రెడ్డి , మోహన్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. 33 ఫీట్లతో ఉన్న నక్ష బాటను ఉప్పరిగూడకు చెందిన జమ్మిడి బాల్రెడ్డి, మడుపు సుమన్, సురేశ్, శివ, వెంకటేశ్ వారి పొలం నుంచి రోడ్డు వేసుకున్నారని ఆరోపించారు. రెండు చోట్ల నాలుగు పీట్ల లోతు జేసీబీతో కందకాలు తవ్వి రాకపోకలకు ఇబ్బందులు కల్పించారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో బీటీ రోడ్డు, మెటల్ రోడ్డు వేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రోడ్డును కబ్జా చేసి పట్టా భూమిగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రోడ్డును కాపాడి గుంతలు తవ్విన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఉపాధి పథకాన్ని నీరుగార్చే కుట్ర
ఆమనగల్లు: ఉపాధి హామీ పథకం కూలీలకు కనీస వేతనం రూ.800 అందించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య డిమాండ్ చేశారు. మండలంలోని చింతలపల్లి, మంగళపల్లి గ్రామాలో శనివారం ఉపాధి హామీ కూలీలతో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు ఉపాధి కల్పించేందుకు గతంలో యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం తీసుకువచ్చిందని చెప్పారు. దీంతో ఎంతో మందికి ఉపాధి లభించిందన్నారు. నిరుపేదలకు అండగా నిలిచిన ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. మహాత్మాగాంధీ పేరిట ఉన్న ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం వీబీజీరామ్జీ అంటూ పేరుమార్చడం తగదన్నారు. గతంలో లేని చట్టాలను తీసుకువస్తూ కూలీల పొట్ట గొట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు. పాత పద్ధతిలో కూలీలకు పని కల్పించాలని, ఫొటో విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రమేశ్, మల్లేశ్, రామచంద్రయ్య, నర్సింహ, మల్లయ్య, పృథ్వీ, లక్ష్మయ్య, జంగయ్య, మల్లయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య -
గంటన్నర ఆలస్యంగా సీయూఈటీ పరీక్ష
ఇబ్రహీంపట్నం రూరల్: దేశ వ్యాప్తంగా నిర్వహించే సీయూఈటీ(కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్) పరీక్ష నిబంధనలకు విరుద్ధంగా గంటన్నరకు పైగా ఆలస్యంగా ప్రారంభమైన సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని శేరిగూడలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న అయాన్ డిజిటల్లో శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన సీయూఈటీ పరీక్ష ఆలస్యంగా 10:45కి మొదలు పెట్టారు. ఎందుకు ఆలస్యమైందని అభ్యర్థులు ప్రశ్నించగా నిర్వాహకులు సరైన సమాధానం చెప్పలేదు. దీంతో బయట ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున అయాన్ డిజిటల్ గేటు ఎదుట ఆందోళన చేపట్టడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. సాంకేతిక కారణాలతో పరీక్ష ఆలస్యమైందని చివరికి నిర్వాహకులు సెలవిచ్చారు. దీంతో మధ్యాహ్నం ప్రారంభమయ్యే పరీక్ష సైతం ఆలస్యం అయినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించే పరీక్ష కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయాన్ డిజిటల్ ఎదుట విద్యార్థుల ఆందోళన -
చెరువులో దూకబోయిన మహిళను కాపాడిన పోలీసులు
ఇబ్రహీంపట్నం రూరల్: భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాలతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ వివాహిత శనివారం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రక్షించారు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వివాహిత శ్రావణి ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటుంది. కొంత కాలంగా భర్తతో విభేదాల కారణంగా మానసికంగా ఆందోళనకు గురైన ఆమె శనివారం స్థానిక పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అంతలోనే స్థానిక పోలీసులకు సమాచారం రావడంతో చెరువు సమీపంలో పరిశీలించారు. వెంటనే ఆమెను రక్షించి పోలీస్స్టేషన్కు తరలించారు. కౌన్సెలింగ్ ఇచ్చి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. సకాలంలో స్పందించి మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసులను సీఐ మహేందర్రెడ్డి అభినందించారు. పోలీసులు మానవత్వం చాటుకోవడంతో పట్నం ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. యాచారం: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన యువకుడు అదృశ్యమయ్యాడు. సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపిన ప్రకారం.. యాచారం అనుబంధ గ్రామమైన గాండ్లగూడెంకు చెందిన గంగల శివకుమార్ శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. 24 గంటల గడిచిన శివకుమార్ ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు సాధ్యమైన అన్ని ప్రదేశాల్లో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో శనివారం తండ్రి అబ్బయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
హెచ్ఆర్ఏ పెంపు నోటిఫికేషన్ హర్షణీయం
పీఆర్టీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు గోవర్ధన్ ఇబ్రహీంపట్నం రూరల్: జీహెచ్ఎంసీ పరిధి నుంచి ఎనిమిది కిలో మీటర్ల ఫెరిఫెరల్ పరిధిలోకి వచ్చే గ్రామాలకు సంబంధించి హెచ్ఆర్ఏ పెంచడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం హర్షణీయమని పీఆర్టీయూ నాయకులు అన్నారు. ఈ మేరకు శనివారం వారు కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయంలో డీఆర్ఓ శారదాదేవిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నోటిఫికేషన్లో 15 రోజులు అభ్యంతరాల సేకరణకు గడువులో భాగంగా ఎనిమిది కిలో మీటర్ల ఫెరిఫెరల్ పరిధిలో ఉండి నోటిఫికేషన్లో పేర్కొనబడిన గ్రామాల జాబితాను అందించామన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని పోచారం, మల్సెట్టిగూడ, రాంరెడ్డి గూడ, కప్పపహాడ్, మహేశ్వరంలోని రామచంద్రగూడ, గట్టుపల్లి, కల్వకోల్, పెద్దమ్మతండా, చిన్నతుప్రా, నల్లచెరువు తండా గ్రామాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు గోవర్ధన్, ఇబ్రహీంపట్నం మండల శాఖ అధ్యక్షుడు పరమేశ్ ,జానకీరామ్, చంద్రశేఖర్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
చేవెళ్ల: బైకు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో త్రీవంగా గాయపడిప వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన చేవెళ్ల ఠాణా పరిధిలోని అంతారం సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. అంతారం గ్రామానికి చెందిన బేగరి వెంకటయ్య(32) షాబాద్ మండలం హైతాబాద్ సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల కొన్ని రోజులుగా పనికి వెళ్లడం లేదు. శుక్రవారం ఇంటి వద్దనే ఉన్న అతడు పనినిమిత్తం తన బైక్పై చేవెళ్ల మండలకేంద్రానికి వచ్చి తిరుగుప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో గ్రామ సమీపంలోకి రాగానే బైక్ అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలవడంతో స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో చేవెళ్లలోని పట్నం మహేందర్రెడ్డి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యుల సలహా మేరకు గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న వెంకటయ్య శనివారం మధ్యాహ్నం పరిస్థిని విషమించి మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మీ, కొడుకు, కూతురు ఉన్నారు. లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రోహింగ్యాల దొంగ ఓట్లను తొలగించాలి
కలెక్టర్కు అందెల వినతి బడంగ్పేట్: నియోజకవర్గంలో రోహింగ్యాల కు దొంగ ఓట్లు ఉన్నాయని వాటిని తొలగించా లని బీజేపీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్ కోరారు. ఈ మేరకు శనివారం ఆయన కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని పహాడీషరీఫ్, షాహీన్నగర్, జల్పల్లి డివిజన్ లలో రోహింగ్యాలకు దొంగ ఓట్లు ఉన్నాయ న్నారు. 26 బూత్లలో 9,960 ఓట్లు గుర్తించామని చెప్పారు. 392, 393 బూత్లలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలకు సైతం ఓట్లు ఉన్నాయన్నారు. ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో గుర్తించిన దొంగ ఓట్లను పూర్తి విచారణ జరిపించి తొలగించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్రెడ్డి, నాయకులు అంబోజీ శ్రీనివాస్, పోరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మాజీ కౌన్సిలర్ రాజమోని రాజుముదిరాజ్ తదితరులు ఉన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలకు వినతి ఇబ్రహీంపట్నం రూరల్: ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం వారు కలెక్టరేట్లోని విద్యాశాఖ అధికారి కార్యాలయంలో డీఈఓ సుశీంధర్రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా పలు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని చెప్పారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించాల్సి ఉండగా అందుకు భిన్నంగా తల్లిదండ్రులను ఆకర్శించేందుకు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు అక్షయ్, శివ, త్రినయ్, కార్తీక్ పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం రూరల్: తల్లీబిడ్డలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించి అరుదైన ఘనత సాధించారు. మండల పరిధిలోని ఎల్మినేడు అనుబంధ గ్రామం మెటిల్లాకు చెందిన గుంటి అరుణ ఆమె కూతుళ్లు అభిజ్ఞ రోజ్ (10), శ్రీవిజ్ఞ (8) శుక్రవారం నగరంలోని గచ్చిబౌలి ఆడిటోరియంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కీ బోర్డు ప్లే పోటీల్లో సత్తాచాటారు. 22 దేశాల నుంచి 2వేల మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో కీబోర్డు వాయిద్యకారులు గంట పాటు నిర్విరామంగా కీబోర్డు ప్లే చేశారు. ఇందులో 777 మంది ప్రతిభ చాటారు. వీరికి వ్యవస్థాపకుడు అగస్టిన్ దండింగిచేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. గుంటి అరుణ స్వగ్రామంలో అంగన్వాటీ టీచర్గా పని చేస్తూ ఈ ఘనత సాధించడం తమకు గర్వకారణమని గ్రామస్తులు, తల్లి ప్రోత్సాహంతో పిల్లలు సైతం రాణించి తమ పాఠశాలకు మంచి పేరుతీసుకువచ్చారని టీఆర్ఆర్ పాఠశాల యాజమాన్యం అభినందనలు తెలిపారు. శంషాబాద్: బెంగళూరు నుంచి నాగ్పూర్ బయలుదేరిన విమానం శంషాబాద్ ఎయిర్పోర్టులో అత్యవసరంగా ల్యాండయ్యింది. శనివారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి 126 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో 6ఈ–6003 విమానం మార్గంమధ్యలో ఉండగా సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్టు ఏటీసీ అధికారులను సంప్రదించారు. ఏటీసీ అనుమతి మేరకు శంషాబాద్ ఎయిర్పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఎయిర్లైన్స్ ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు నాగ్పూర్కు బయలుదేరారు. -
విద్యతోనే భవిష్యత్
గంటన్నర ఆలస్యంగా.. సీయూఈటీ పరీక్ష గంటన్నరకు పైగా ఆలస్యంగా ప్రారంభమైన ఘటన శేరిగూడలో చోటు చేసుకుంది.● మంత్రి సీతక్క ● కలెక్టరేట్లో ఘనంగా మహిళా వారోత్సవాలుఇబ్రహీంపట్నం రూరల్: జీవితాలను మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య మాత్రమేనని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మహిళా వార్సోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క అంగన్వాడీ చిన్నారులకు యునిఫాంలు, విద్యారంబ సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం సెర్ప్ ఆధ్వర్యంలో బాలల మాక్ పార్లమెంట్–స్నేహ కౌమార బాలికలతో బాలల హక్కుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కిశోర బాలికల సాధికారత, విద్యా ప్రగతి, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు పెంపు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల బాలికలను గుర్తించి వారికి సరైన దిశానిర్ధేశం చేయడం ద్వారా భవిష్యత్లో వారు ఉన్నతంగా ఎదుగుతారని చెప్పారు. నెల్సన్ మండేలా చెప్పినట్లు విద్యే ఆయుధమన్నారు. పెద్దలపై గౌరవం, సమాజంపై బాధ్యతలను అలవర్చుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, గురువులను గౌరవించడం, ఇంటి పనుల్లో భాగస్వాములు కావడం, శ్రమకు విలువ ఇవ్వడం తదితర అంశాలు వ్యక్తిత్వ వికాసానికి అవసరమన్నారు. మహిళలను కోటీశ్వరులను చేసేందుకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు. స్నేహ కార్యక్రమంలో భాగస్వాములైన వారికి సైకిల్ శిక్షణ, నాయకత్వ వికాసం, వ్యక్తిత్వాభివృద్ధి , ఆరోగ్యం, విద్య తదితర అంశాల్లో శిక్షణలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్స్పల్ సెక్రటరీ అనితారామచంద్రన్, సెర్ప్ సీఈ ఓ దివ్య దేవరాజన్, మహిళా,శిశు సంక్షేమ శాఖ డైకెక్టర్ శృతి ఓజా, అదనపు కలెక్టర్ కిరణ్మయి, మహిళా కమిషన్ మెంబర్ సదాలక్ష్మి, పీడీ డీఆర్డీఏ శ్రీలత, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీపీఓ సురేశ్ మోహన్, మెప్మా పీడీ వెంకట నారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు . -
నవ వధువు అపహరణ
తన భార్యను అప్పగించాలని పీఎస్ ఎదుట భర్త ఆందోళన యాచారం: ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యను ఆమె తల్లిదండ్రులు కిడ్నాప్ చేశారని ఓ వ్యక్తి ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మదనాపురం గ్రామానికి చెందిన పి.వంశీ, రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగాపల్లి గ్రామానికి చెందిన తేజస్విని కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వేర్వేరు కులాలకు చెందిన వీరు(ఇద్దరు మేజర్లు) కొద్ది రోజుల కింద ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. రక్షణ కోసం నగరంలోని మీర్పేట పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి రక్షణ కోరారు. పోలీసులు ఇరు కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. నూతన దంపతులు మండల పరిధిలోని మొండిగౌరెల్లి గ్రామంలో వంశీ బంధువుల ఇంటి వద్ద ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న తేజస్విని కుటుంబ సభ్యులు బుధవారం సాయంత్రం ఎవరూ లేనిది చూసి నవ వధువుని తీసుకెళ్లారు. దీంతో వంశీ యాచారం పోలీసులను ఆశ్రయించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య తేజస్విని ఆమె కుటుంబ సభ్యులకు కావాలనే తనకు దూరం చేస్తున్నారని ఆరోపించారు. కుటుంబ సభ్యులు, బంధువులతో శుక్రవారం పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసిన యాచారం పోలీసులు తేజస్విని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు. ఇబ్రహీంపట్నం రూరల్: కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రికి జీవిత ఖైదుతో పాటు, రూ.12వేలు జరిమానా వేధిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఆదిబట్ల సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని మణిపూర్ ప్రాంతానికి చెందిన అవినాష్ సాహ్ని (42) ఆదిబట్లలో ఉంటూ కూలీ పనులు చేసేవాడు. 7నవంబర్ 2023న కూతురు(14)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయాన్ని ఆమె తల్లికి చెప్పడంతో స్థానిక పీఎస్లో కేసు నమోదు చేయించారు. పూర్వాపరాలను పరిశీలించిన స్పెషల్ సెషన్స్ కోర్టు ఫర్ ట్రయల్ అండ్ డిస్పోజల్ ఆఫ్ పోక్సో కేసుల న్యాయమూర్తి శుక్రవారం తీర్పు వెల్లడించారు. బాధితురాలికి ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం మంజూరు చేశారు. మహిళా న్యాయవాదిపై దాడి.. బెదిరింపులు.. బంజారాహిల్స్: మహిళా న్యాయవాదిపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడిన ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్గూడ కృష్ణకాంత్ పార్కు సమీపంలో నివాసం ఉండే న్యాయవాది సాయిరమ్య ప్రణీత (30) ఈ నెల 17న రాత్రి తన భర్త, అత్తతో కలిసి జూబ్లీహిల్స్ క్రీమ్స్టోన్ సమీపంలో ఉండగా అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి ఆమె వాహనాన్ని ఫోటోలు తీస్తున్నాడు. ఆమె ప్రశ్నించగా సైబరాబాద్ పోలీసు కమిషనర్కు పంపేందుకు ఫోటోలు తీస్తున్నట్లు సమాధానమిచ్చాడు. వారి మధ్య వాగ్వివాదం జరుగుతుండగానే హుమేరా వార్సీ అనే మహితో పాటు మరో ఇద్దరు అక్కడికి వచ్చి సాయిరమ్య ప్రణీతను దుర్బాషలాడుతూ అసభ్య పదజాలంతో బెదిరింపులకు దిగారు. ఆమెతో పాటు భర్త, అత్తను చుట్టుముట్టి భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు సిగరెట్ పొగను ఉద్దేశపూర్వకంగా వారి వైపు ఊదారు. అంతటితో ఆగకుండా మహిళా న్యాయవాదిని హుమేరా వార్సీ చెంపదెబ్బ కొట్టంది. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతిని వేధించిన నేపాలీలకు 7 రోజుల జైలు అబిడ్స్: ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఐదుగురు నేపాలీలకు వారం రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అబిడ్స్ ఇన్స్పెక్టర్ పరశురామ్ తెలిపిన మేరకు..బషీర్బాగ్ చౌరస్తా సమీపంలో సీసీఎస్ ఎదురుగా ఓ యువతి వెళ్తుండగా నేపాల్కు చెందిన సునీల్, ఉమేష్, లక్ష్మణ్, పురుషోత్తమ్, రామ్లు అసభ్యంగా ప్రవర్తించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిని అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో హాజరుపరుచగా న్యాయస్థానం ఏడు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. బాలానగర్: టీజీ పాలిసెట్ పరీక్షలోఉత్తీర్ణులైన అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలన జేఎన్టియుహెచ్లో శుక్రవారం ప్రారంభమైంది. జూన్ 1 వరకు సర్టిఫికెట్లు పరిశీలిస్తామని అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ బాలు నాయక్ తెలిపారు. 380 మంది సర్టిఫికెట్స్ పరిశీలనకు హాజరు కావాల్సి ఉండగా 228 మంది మాత్రమే వచ్చారన్నారు. -
మాదకద్రవ్యాలు వాడితే కఠిన చర్యలు
శంకర్పల్లి: మాదకద్రవ్యాలు వాడితే చట్టపరమైన చర్యలుంటాయని మోకిల ఎస్ఐ సాయికృష్ణ స్పష్టం చేశారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. చిరు వ్యాపారుల దుకాణాల్లో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఇటీవల మాదకద్రవ్యాలను యువత పెద్ద మొత్తంలో ఉపయోగిస్తుందని, దీంతో తమ ఆరోగ్యంతో పాటు జీవితం ప్రమాదంలో పడుతుందని చెప్పారు. మాదకద్రవ్యాలు కొనే, అమ్మేవారిపై పటిష్ట నిఘా ఉంటుందని, తనిఖీల్లో పట్టుబడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. -
అసంపూర్తి వంతెన!
అక్కడే ప్రమాద ఘంటికలు అబ్దుల్లాపూర్మెట్లో నిలిచిన హైవే విస్తరణ పనులు పూర్తికాని ఫ్లై ఓవర్ల నిర్మాణం తీవ్ర అవస్థలు పడుతున్న వాహనదారులు పెరుగుతున్న వాహన రద్దీకి అనుగుణంగా రహదారులను అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో చేపట్టిన విజయవాడ హైవే విస్తరణ పనులు గతేడాదిగా అబ్దుల్లాపూర్మెట్లో నిలిచిపోయాయి. వాహనదారులు అటు హైదరాబాద్ రావడానికి, ఇటు విజయవాడ వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సీపీఆర్ చేసినా దక్కని ప్రాణాలు
సనత్నగర్: గుండెపోటుతో కుప్పకూలిన ఓ మహిళకు సీపీఆర్ చేసినా ప్రయోజనం లేకపోయింది. పంజగుట్ట ద్వారకాపురికాలనీకి చెందిన పొట్ల లావణ్య (45) శుక్రవారం బేగంపేట భారత్ పెట్రోల్ బంకు వద్ద రోడ్డు దాటుతోంది. దాటుతుండగా అకస్మాత్తుగా గుండెపోటుతో కిందపడిపోయింది. అక్కడే ఉన్న సిద్దిపేటకు చెందిన గంగాధర్, బేగంపేటకు చెందిన ఆసిఫ్ వెంటనే స్పందించి సాయమందించారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లు, సిబ్బంది భరత్, మన్మథరావు, మునీందర్ సచిన్, సోహైల్లు సైతం అక్కడికి చేరుకుని సీపీఆర్ నిర్వహించారు. ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు కిమ్స్ సన్షైన్ ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మానవత్వంతో స్పందించి సహాయం అందించిన పౌరులను గుడ్ సమారిటన్ అవార్డు కోసం సిఫారసు చేయనున్నట్లు ట్రాఫిక్ ఏసీపీ తెలిపారు. -
పిల్లి పిల్లపై వానర వాత్సల్యం!
ఇక్కడందరూ మనల్ని ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు.. పదా అటువైపు వెళ్లిపోదాం అరవకురా కన్నా.. నీకు నేనున్నా.. నీకేం భయం లేదు.. జాగ్రత్తగా రోడ్డు దాటిస్తా.. వామ్మో ఎన్ని పేలో.. నేను తీసేస్తాలే ఆర్థిక వ్యవహారాలు, ఆస్తుల గొడవల్లో రక్త బంధాలను సైతం లెక్కచేయని ప్రస్తుత కాలంలో.. నోరు లేని మూగజీవాలు ఇతర ప్రాణులపై వాత్సల్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. తల్లి కనిపించక మ్యావ్.. మ్యావ్.. అని అరుస్తూ ఓ పిల్లి పిల్ల శుక్రవారం ధారూరు బస్టాండ్లో తిరుగుతోంది. ఇది గమనించిన ఓ వానరం దాని వద్దకు చేరుకుని కొద్దిసేపు లాలించింది. నోటితో ఒడిసి పట్టుకుని ఠాణా ఎదురుగా ఉన్న భవనంపైకి చేరింది. తలపై పేలు చూస్తూ.. సరదగా ఆడిస్తూ, ముద్దు చేసింది. పిల్లి పిల్లను కోతి లాలించడం తామెప్పుడూ చూడలేదని స్థానికులు ఫొటోలు, వీడియోలు తీశారు. – ధారూరు -
బహుజన రాజ్య నిర్మాణమే లక్ష్యం
● సిద్దాపూర్లో డంపింగ్ యార్డు నిర్మిస్తే ఊరుకోం ● ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ షాద్నగర్రూరల్: సామాజిక న్యాయమే పునాదిగా శ్రమజీవుల హక్కులను కాపాడే బహుజన రాజ్యాన్ని నిర్మించడమే లక్ష్యమని ధర్మసమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ అన్నారు. గురువారం రాత్రి పట్టణంలోని ఏబీ కాంప్లెక్స్ సమీపంలో ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ‘మేమెంతో–మాకంత వాటా’అనే నినాదంతో నిర్వహించిన బీసీ, ఎస్టీ, ఎస్సీ జేఏసీ బహిరంగ సభకు హాజరైన విశారదన్మహరాజ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దాదాపు 70 ఏళ్లుగా దోపిడి, అణిచివేత ధోరణి కొనసాగుతోందన్నారు. అగ్రకులాల దోపిడి, దౌర్జన్యాన్ని అణిచివేసి పేదలు, కూలీలు బీసీ, ఎస్టీ, ఎస్సీలకు సామాజిక న్యాయాన్ని అందించమే లక్ష్యమన్నారు. సిద్దాపూర్లో డంపింగ్యార్డు నిర్మాణం విషయం ప్రజలను తీవ్ర భయాందోళనకు, ఆవేదనకు గురిచేస్తోందన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే కాలుష్య రహిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు కలిగించే కాలుష్య కారక పరిశ్రమల ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేదిలేదని అన్నారు. ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడితే సహించేదిలేదని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే డంపింగ్ యార్డును నిర్మిస్తే చూస్తూ ఊరుకో అన్నారు. డంపింగ్యార్డు నిర్మాణ విషయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు. -
హిందువులు ఏకం కావాలి
షాబాద్: హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతిఒక్కరిపై ఉందని ప్రముఖ వక్త డాక్టర్ భాస్కర యోగి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరూ వేదాలు, పురాణాలు తెలుసుకోవాలన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలు మన పురాణాలు చదివి వాటిని అవలంబిస్తున్నాయన్నారు. మనం వాటిని మరువకూడదని, ఎన్ని ఆచారాలు ఉన్నా మనం ఒక్కటిగా అది మన ఐక్యతకు నిదర్శనమన్నారు. ధర్మాన్ని రక్షిస్తూ ప్రతిఒక్కరూ దేశ సేవకు ముందుండాలన్నారు. మన పిల్లలకు మన సంస్కృత్తి నేర్పించాని సూచించారు. రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలని, మన విధులను మనం పాటించాలన్నారు. ఇతరులకు సేవచేయాలనే గుణం నేర్పించాలని, స్వదేశి భావన ప్రతిఒక్కరిలో పెంచాలన్నారు. కార్యక్రమంలో చిలుకూరి శివాలయం ఆలయ ప్రధాన పూజారి సురేష్, నిర్వాహకులు కృష్ణారెడ్డి, సురేష్, ఆత్మారామ్, ఆర్ఎస్ఎస్ నాయకులు, భజరంగ్ దళ్ కార్యరక్తలు, వివిధ గ్రామాల సర్పంచ్లు, తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ వక్త డాక్టర్ భాస్కర యోగి -
హోంగార్డు విధులకు ఆటంకం
నిందితుడికి రిమాండ్ శంకర్పల్లి: విచారణ నిమిత్తం వెళ్లిన ఓ హోంగార్డుని అడ్డుకొని, అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తిని గురువారం మోకిల పోలీసులు కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు. సీఐ శ్రీనివాస్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల ఠాణాలో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు నాగమల్లేశ్వర్రెడ్డి బుధవారం రాత్రి ఓ హత్య కేసు విచారణ నిమిత్తం శంకర్పల్లి మండలం గోపులారం గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో మహారాజ్పేట్ గ్రామానికి చెందిన సందెంపేట రామకృష్ణను విచారిస్తుండగా మద్యం మత్తులో వచ్చిన సందెంపేట హరి హోంగార్డు అడ్డుకొని అసభ్య పదజాలంతో దూషించారు. దీనిపై హోంగార్డు ఉన్నతాఽధికారులు దృష్టికి తీసుకొని వెళ్లగా.. సందెంపేట హరిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. చేవెళ్ల కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి సూచన మేరకు హరిని రిమాండ్కి తరలించారు. పోలీసు అధికారులు తమ విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో ఎవరైనా ఆటంకం కల్గించడం, దాడి, దూషించడం, అసభ్యపదజాలం వాడడం చట్టరీత్యా నేరమని సీఐ చెప్పారు. ఈ మేరకు ప్రజలు సహకరించాలని సూచించారు. నిందితుల అరెస్టుకు రంగం సిద్ధం ! ● న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు ● నేడు వివరాలు వెల్లడించనున్న పోలీసులు నాంపల్లి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ (63) హత్య కేసులో నిందితులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించనున్నారు. ఈనెల 23న తెల్లవారుజామున నాంపల్లి పోలీస్ స్టేషన్పరిధిలో మాసబ్ ట్యాంక్ శాంతినగర్ లో వక్ఫ్ బోర్డ్ ప్యానల్ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ను గుర్తుతెలియని వ్యక్తులు నంబర్ ప్లేట్ లేని కారుతో ఢీ కొట్టి పరారైన విషయం తెలిసిందే. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా పరారైన నిందితులను పట్టుకున్నారు. సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. శుక్రవారం హత్య కేసు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారాలు సూచించండి సాక్షి, సిటీబ్యూరో: నగరాల్లోని ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పరిష్కారాలు సూచించాలని ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారు ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లోని బిట్స్ పిలానీ క్యాంపస్లో నిర్వహించిన జాతీయ సదస్సులో ప్రసంగించారు. భారతదేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కఠిన చర్యలకు అవకాశం ఉండదని చెప్పారు. ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్, డిజిటల్ పరిష్కారాలు, ఫస్ట్,లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం యాప్స్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. సదస్సులో బిట్స్ పిలానీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ ధర్మరాజన్ శ్రీరామ్, డీన్ ప్రొఫెసర్ వి. అరుణాచలం పాల్గొన్నారు. నరెడ్కో తెలంగాణ, అస్కీ మధ్య ఒప్పందం సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ స్థాయి అర్బన్ హబ్గా ఎదుగుతున్న హైదరాబాద్ నిర్మాణ రంగంలో సరికొత్త నైపుణ్యాలను పెంపొందించేందుకు ఒక కీలక అడుగు పడింది. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ (నరెడ్కో తెలంగాణ), ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (అస్కీ)తోఅవగాహన ఒప్పందం జరిగింది. మౌలిక వసతులు, నిర్మాణ రంగాలలో భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా అంతర్జాతీయ స్థాయి నిపుణులను తయారు చేయడమే ఈ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశ్యమని నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు కొప్పుల శ్రీధర్ రెడ్డి అన్నారు. -
నగదు కావాలంటే.. వికారాబాద్కు వెళ్లాలి
ఖాతాదారులకు ఏటీఎం కష్టాలు ధారూరు: ఆన్లైన్ లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లోని ఏటీఎం కేంద్రాల వినియోగం తగ్గుముఖం పట్టింది. దీంతో బ్యాంకర్లు ఏటీఎం సెంటర్లను క్రమంగా తగ్గిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. స్మార్ట్ఫోన్ల ఆపరేటింగ్, ఆన్లైన్ గురించి తెలియనివారు ఏటీఎంలను ఆశ్రయించడం పరిపాటి. అయితే ఏటీఎంలు తగ్గిపోవడం, ఉన్నవి సక్రమంగా పనిచేయకపోవడం లేదా.. సాంకేతిక లోపంతో తాత్కాళికంగా మూతపడుతుండటంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ధారూరులో 1978లో స్టేట్బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖ ప్రారంభమైన సుదీర్ఘకాలం అనంతరం రోడ్డు పక్కనే ఇటీవల ఓ ఏటీఎం కేంద్రం ప్రారంభించారు. కానీ అది ఎప్పుడూ సరిగా పనిచేయక పోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పిన్మార్పిడి చేసుకోవాలన్నా, మినీ స్టేట్మెంట్ తీసుకోవాలన్నా, ఇతరత్రా సేవలు, అత్యవసరంగా డబ్బులు కావాలంటే తాండూరు, వికారాబాద్లకు వెళ్లాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ఏటీఎం యంత్రాన్ని వినియోగంలోకి తేవాలని బ్యాంకు అధికారులను కోరుతున్నారు. -
భగీరథ.. లీకేజీల వ్యథ
● నీటి సరఫరాలో అంతరాయం ● తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు ● పంచాయతీలపై మరమ్మతుల భారం యాచారం: మిషన్ భగీరథ నీటి సరఫరాలో తరచూ అంతరాయంతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఎప్పుడు సరఫరా అవుతాయో.. ఎప్పుడు నిలిచిపోతాయో తెలియక గ్రామ పంచాయతీలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇబ్రహీంపట్నం డివిజన్లోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్ మండలాల్లోని 75 గ్రామ పంచాయతీలతో పాటు 125 అనుబంధ గ్రామాలున్నాయి. అదే విధంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఉంది. ఈ ప్రజల దాహార్తి కోసం నిత్యం రెండు కోట్ల(20 ఎంఎల్డీ) లీటర్లకు పైగా మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతోంది. కర్కలపహాడ్ నుంచి ముచ్చర్ల సంపుహౌజ్ల నుంచి ఇబ్రహీంపట్నం డివిజన్ ప్రజలకు నిత్యం నీరొస్తోంది. మిషన్ భగీరథ నీటిని గ్రామ పంచాయతీల్లో ఉన్న ట్యాంకుల్లోకి నింపి, ఆ తర్వాత నల్లాల ద్వారా ఇంటింటికి సరఫరా చేస్తారు. రెండుమూడు రోజులకు ఇబ్బంది మిషన్ భగీరథ నీటి సరఫరాలో తరచూ అంతరాయంతో గ్రామీణ ప్రజలకు శాపంగా మారింది. పక్షం రోజులకోసారి కోల్లాపూర్, గుడిపల్లి గుట్ట, కర్కల్పహాడ్, ముచ్చర్ల సంపుల వద్ద పైపుల లీకేజీలు, మరమ్మతులతో ఇబ్రహీంపట్నం డివిజన్ ప్రజలకు నీటి సరఫరా నిలిచిపోతుంది. మిషన్ భగీరథ నీరు ఉందనే భరోసాతో గ్రామ పంచాయతీలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టడం లేదు. దీంతో పక్షం రోజుల్లో రెండు, మూడుసార్లు ఇబ్బంది ఏర్పడుతోంది. ముఖ్యంగా అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో నీటి ఎద్దడి నెలకొంటుంది. మిషన్ భగీరథ అధికారులు సడన్గా నీటి సరఫరా బంద్ అయిందని సమాచారం ఇవ్వడంతో గ్రామ పంచాయతీలు కూడా ఏం చేయలేని పరిస్థితి దాపురించింది. యాచారం, మంచాల మండలాల్లో సైతం రెండు రోజులుగా నీటి సరఫరా బంద్ కావడంతో ప్రజల తిప్పలు అధికమయ్యాయి. ఫ్లోరైడ్ నీళ్లే దిక్కు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామ పంచాయతీలపై మరమ్మతుల భారం పడుతోంది. డివిజన్లో 289 సింగల్ ఫేజ్, 249 త్రీఫేజ్ బోరుమోటార్లు ఉన్నాయి. రెండేళ్లుగా సమృద్ధిగా వర్షాలు లేకపోవడంతో సగానికి పైగా మోటార్లు ఎండిపోయాయి. పంచాయతీల్లో ఉన్న మోటార్లు కాలిపోవడంతో తక్షణ మరమ్మతుల కోసం సర్పంచులు అప్పులు చేయాల్సి వస్తుంది. యాచారం, మంచాల మండలాల్లోని పలు గ్రామ పంచాయతీల్లో బోరుబావుల్లో ఫ్లోరైడ్ నీళ్లే ఉన్నాయి. మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో మళ్లీ ప్రజలకు ఫ్లోరైడ్ నీరే దిక్కు అవుతోంది. లేదంటే నిత్యం రూ.30 ఖర్చు చేసి 20 లీటర్ల శుద్ధి చేసిన నీటిని వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి దాహార్తి తీర్చుకుంటున్నారు. రోజూ రూ.30 ఖర్చు గ్రామంలోని బోరు మోటార్లల్లో నేటికి ఫ్లోరైడ్ నీరుంది. మిషన్ భగీరథ నీటిని తాగుతున్న ప్రజలు, సరఫరా నిలిచిపోయినప్పుడు ప్రైవేట్ వ్యాపారుల వద్ద నిత్యం రూ.30 ఖర్చు చేసి 20 లీటర్ల శుద్ధి చేసిన నీటిని కొనుగోలు చేసి దాహార్తి తీర్చుకుంటున్నారు. గ్రామంలో నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు అధికారులు కృషి చేయాలి. – అరవింద్నాయక్, సర్పంచ్, మంతన్గౌరెల్లి ఇబ్బందేమీ లేదు మిషన్ భగీరథ నీటి సరఫరాలో తరచూ అంత రాయం జరుగుతుంది వాస్తవమే. కానీ ప్రజలకు ఇబ్బందేమి లేదు. గ్రామా ల్లో బోరుబావుల్లో ఇప్పటికై తే పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. వాటితో దాహార్తి తీర్చుతున్నాం. డివిజన్లో 538 బోరుబావుల్లో 80 శాతానికి పైగానే పనిచేస్తున్నాయి. నీటి సరఫరా నిలిచిపోతే ప్రత్నామ్యాయ ఏర్పాట్లు చేస్తున్నాం. – రాజు, డీఈఈ, ఆర్డబ్ల్యూఎస్, ఇబ్రహీంపట్నం -
డంప్యార్డు ఆలోచన విరమించుకోవాలి
● 1న సిద్ధాపూర్ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర ● మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కొత్తూరు: సిద్ధాపూర్లో డంప్యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ జూన్ 1న సిద్ధాపూర్ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టనున్నట్టు మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తెలిపారు. డంప్యార్డు వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు ఎమ్మె సత్యనారాయణ ఆధ్వర్యంలో గురువారం పలువురు నాయకులతో కలిసి డంప్యార్డుకు కేటాయించినట్లు ప్రచారం జరుగుతున్న స్థలాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. గత ప్రభుత్వం హయాంలో ఐటీ, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పొలాలను సేకరించినట్లు తెలిపారు.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం స్థానికుల ఇష్టానికి వ్యతిరేకంగా డంప్యార్డును ప్రతిపాదించిందన్నారు. స్థానికుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఫ్యూచర్సిటీతో పాటు జేపీదర్గా, ఎంఎన్సీ పరిశ్రమలు, గురుకుల పాఠశాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం డంప్యార్డు ఆలోచన విరమించుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కె.శ్రీనివాస్గౌడ్, దేవేందర్యాదవ్, యాదగిరి, గోపాల్నాయక్, బాలయ్య, రెఢ్యానాయక్, బీమయ్య తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో పాడి ఆవు మృతి
బొంరాస్పేట: మండలంలోని ఊరెనికి తండాలో కరెంట్ షాక్కు గురై పాడి ఆవు మృతి చెందింది. తండాకు చెందిన హన్మ్యానాయక్ పాడి ఆవులతో జీవనం సాగిస్తున్నాడు. గురువారం రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మన్ను తాకడంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. ప్రభుత్వం బాధిత రైతును ఆదుకోవాలని సర్పంచ్ చప్లీబాయి కోరారు. కుళ్లిపోయిన ఆలుగడ్డలతో చిప్స్ తయారీ నాగోలు: నాగోలు మూసీ పరిసర ప్రాంతాల్లోని లక్ష్మీనర్సింహకాలనీలో చిప్స్ తయారీదారులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కుళ్లిపోయిన ఆలుగడ్డలను ఉపయోగిస్తూ, చిప్స్ తయారు చేస్తున్నారు. వీటిని నాగోలు, ఎల్బీనగర్, మాన్సూరాబాద్, కొత్తపేట, సరూర్నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో దుకాణాలకు విక్రయిస్తున్నారు. ఈ విషయంపై స్థానికులు ఫిర్యాదు చేసినా, సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాలనీవాసులు పేర్కొంటున్నారు. మూసీ ప్రాంతంలో జన సంచారం లేకపోవడంతో పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది. -
నెట్వర్క్ లేక.. హాజరుకాక
● ఇబ్బంది పడుతున్న ఉపాధి కూలీలు ● మధ్యాహ్నం వరకు పడిగాపులు ● ఫొటో క్యాప్చర్ తీసేయాలని విన్నపం బొంరాస్పేట: ఉపాధిహామీ కూలీలకు ఫొటో క్యాప్చరింగ్ అవస్థలు తెచ్చిపెడుతోంది. రోజుకు రెండుసార్లు ఫొటో దిగాల్సి ఉండటంతో ఇబ్బంది పడుతున్నారు. నెట్వర్క్ సిగ్నల్ లేకపోవడం, యాప్ ఓపెన్ కాకపోవడం వంటి సమస్యలతో కూలీలతో పాటు ఈజీఎస్ సిబ్బంది అవస్థ పడుతున్నారు. వారంలో సోమవారం నుంచి శనివారం వరకు కొనసాగే ఉపాధి పనుల్లో.. ఈసారి ఉపాధి పనులకు వెళ్లే కూలీలు పని ప్రారంభంలో ఫొటో దిగాలి. కానీ సాంకేతిక సమస్యలతో సతమతమవుతున్నారు. నిత్యం సమస్యే ఫొటో క్యాప్చరింగ్లో నెట్వర్క్ సమస్యలు నిత్యం ఏదో ఒక ఊరిలో తలెత్తుతోంది. గురువారం నెట్ వర్క్ సమస్యలు మరింత ఎక్కువ కావడంతో ఉపాధి కూలీలకు హాజరు అవస్థ తప్పలేదు. మధ్యాహ్నం వరకు పడిగాపులు కాశారు. ఎందుకిలా జరుగుతోందో తెలియడం లేదని క్షేత్ర సహాయకులు, మేటీలు చెబుతున్నారు. దీనిపై ఈజీఎస్ సిబ్బంది, అధికారులు దృష్టిసారించి సమస్యలు తీర్చాలని కోరుతున్నారు. -
అమ్మవారి సొమ్ముకు.. ఈఓ ఎసరు!
● గుట్టుచప్పుడు కాకుండా హుండీ లెక్కింపు ● రూ.41,500 నగదు దారి మళ్లింపు ● ఈఓపై ఫిర్యాదు చేసిన కమిటీ సభ్యులుదుద్యాల్: కంచె చేను మేసినట్లుగా అమ్మవారి ఆదాయాన్ని ఆలయ అధికారి కొల్లగొట్టాడు. గుట్టుచప్పుడు కాకుండా మీడియా, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా హుండీ ఆదాయం లెక్కించి అక్రమాలకు పాల్పడిన.. వ్యవహారం ఆలస్యంగా గురువారం వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఫిబ్రవరిలో జరిగిన పోలేపల్లి ఎల్లమ్మ బ్రహ్మోత్సవాల అనంతరం ఈ నెల 26న ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఈఓ రాజేందర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు కలిసి హుండిని లెక్కించారు. తొలుత రూ.6,55,934ల ఆదాయం సమకూరిందని, ఆలయానికి సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో మొత్తాన్ని డిపాజిట్ చేసేందుకు ఈఓతో పాటు ఈఓ స్నేహితుడు విజయ్ కుమార్, ఎండోమెంట్ అధికారులు సిద్ధమయ్యారు. అదనంగా రూ.41,500 లెక్కింపుపై అనుమానం ఉందని, మరోసారి లెక్కించాలని కమిటీ సభ్యులు కోరారు. దీంతో మరోసారి కౌంటింగ్ చేయగా.. రూ.41,500లు అదనంగా ఉండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో గుర్తించేందుకు సీసీ కెమెరాలను పరీక్షించగా.. వాటిని బంద్ చేసినట్లు తెలిసింది. కుట్ర పూరితంగా లెక్కలు తప్పుగా చూపారని మండిపడుతూ.. కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శ్రీశైలం తెలిపారు. ముందస్తు ప్రణాళికలో భాగమే హుండీ లెక్కింపు సమయంలో కెమెరాలు ఆన్లో ఉండాలి. కానీ ముందస్తు ప్రణాళికతో వాటిని ఈఓ రాజేందర్ రెడ్డి ఆఫ్ చేసినట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే గతంలో ఇలాంటి సంఘటనలు జరిగి ఉండవచ్చని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కమిటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈఓపై చర్యలకు డిమాండ్ అక్రమాలకు పాల్పడిన ఆలయ ఈఓ రాజేందర్ రెడ్డిపై విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు బ్యాగరి నర్సిములు, కోడిగంటి వెంకటయ్య, దోరమోని మల్లేశ్, ఏదుల నర్సిములు, కొత్తూర్ రాములు, సున్నాల లక్ష్మీ రాములు డిమాండ్ చేస్తున్నారు. గతంలో రెండు మార్లు హుండీ చోరీ కాగా.. దానిపై ఈఓ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. భక్తులు హుండీలో అమ్మవారికి సమర్పించిన వెండి, బంగారు ఆభరణాల వివరాలను ఈఓ ఇవ్వలేదని కమిటీ సభ్యులు ఆరోపించారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకేగూటి పక్షులు
శంకర్పల్లి: కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే గూటి పక్షులని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు వ్యాఖ్యానించారు. శంకర్పల్లి మండలం ప్రొద్దటూరులోని ప్రగతి రిసార్ట్స్లో రెండురోజుల పాటు నిర్వహించే పండిత్ దీన్ దయాల్ జిల్లా ప్రశిక్షణ తరగతులను గురువారం ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలని ఓర్వలేకే కాంగ్రెస్, బీఆర్ఎస్ జట్టు కట్టాయని విమర్శించారు. దీన్ని ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరన్నారు. ఈ రెండు పార్టీలు విచ్ఛిన్నశక్తులుగా మారుతున్నాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేసి డబుల్ సర్కార్ ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీని కోసం రానున్న రెండున్నరేళ్లు నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి గత 12 ఏళ్లలో ప్రధాని మోదీ సుమారు రూ.13లక్షల కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. వివక్ష చూపుతున్నారని కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉత్తరాఖండ్, గోవా, అస్సాం రాష్ట్రాల్లో ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్)ని అమలు చేసినట్లే మన రాష్ట్రంలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. రైతులకు న్యాయం చేసే వరకు బీజేపీ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రాంభూపాల్ గౌడ్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతంరాజ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, జిల్లా ఉపాధ్యక్షుడు ఇంద్రారెడ్డి, నాయకులు తూళ్ల వీరేందర్ గౌడ్, అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు -
గజం రూ.83,500
● రావిర్యాలలోని హౌసింగ్ బోర్డు స్థలాలకు భారీ డిమాండ్ ● కొనుగోలుకు వేలంలో పోటీపడ్డ బిల్డర్లు సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాజధాని క్యూర్ పరిధిలో పెద్దపెద్ద వెంచర్లు చేపట్టడానికి అనువుగా ఉన్న భూములకు డిమాండ్ పెరుగుతోంది. అందులోనూ ఎలాంటి వివాదాలు లేకుండా క్లియర్ టైటిల్స్తో ప్రభుత్వానికి చెందిన హౌసింగ్ బోర్డ్ స్థలాలకు మరింత భారీగా ఉంటోంది. మహేశ్వరం మండలం, ఫ్యూచర్ సిటీ ఎంట్రన్స్లో ఎయిర్పోర్టుకు సమీపంలోని రావిర్యాలలో భూములు కొనుగోలు చేయడానికి అనేక మంది పోటీపడ్డారు. ఈ ప్రాంతలో ఉన్న హౌసింగ్ బోర్డు భూములకు గురువారం ఈ–ఆక్షన్ ద్వారా వేలం నిర్వహించారు. మొత్తం నాలుగు భూములకు నిర్వహించిన వేలం పాటలో చదరపు గజం గరిష్టంగా రూ.83,500కు అమ్ముడు పోయినట్టు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి.గౌతం తెలిపారు. వెయ్యి నుంచి 13,500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న నాలుగు లాండ్ పార్సిళ్లకు నిర్వహించిన వేలం పాట ద్వారా సుమారు రూ.140 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. ఈ భూములను ఈ–ఆక్షన్లో వేలం పాట ద్వారా విక్రయిస్తున్నట్లు గత నెలలో హోసింగ్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ భూములను కొనుగోలు చేయడానికి సుమారు 17 సంస్థలు పోటీ పడ్డాయి. ఇందులో 1,113 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న భూమిని కొనుగోలు చేయడానికి బిల్డర్లు పోటీ పడ్డారు. రూ.26 వేల కనీసధరను నిర్ణయించగా, దీనిని దక్కించుకోడానికి పోటీ పడుతూ చదరపు గజం రూ.83,500కు ఒక డెవలపర్ సంస్థ దక్కించుకుంది. ఇదే ప్రాంతంలోని సుమారు 6 వేల చదరపు గజాల విస్తీర్ణంలోని భూమి వేలం పాటలో చదరపు గజం రూ.62,500కు అమ్ముడుపోయింది. సుమారు 13,500 చదరపు గజాల విస్తీర్ణంలోని భూమిని కొనుగోలు చేయడానికి సైతం బిల్డర్లు పోటీ పడ్డారు. -
ప్రైవేట్ భూమి ఆక్రమణకు యత్నం
పలువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు హయత్నగర్: ప్రైవేట్ భూమిలోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు ఆక్రమించుకోవడానికి యత్నించిన పలువురిపై అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని అబిడ్స్కు చెందిన రాజవరపు రవి అనే వ్యక్తి అబ్దుల్లాపూర్మెట్ మండలం ఇనాంగూడ గ్రామం సర్వేనంబర్ 100లో 14 గుంటల భూమిని 2003లో కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ భూమి ఆయన ఆధీనంలోనే ఉంది. ఈ నెల 26వ తేదీన ఇనాంగూడ గ్రామానికి చెందిన బబ్బూరి శ్రీనివాస్గౌడ్, బబ్బూరి నవ్యకాంత్గౌడ్, బబ్బూరి మహేందర్గౌడ్లతో పాటు మరో 10 మంది రవికి చెందిన భూమిలోకి అక్రమంగా ప్రవేశించి, జేసీబీలతో భూమిని చదును చేయించి ఆక్రమించుకునేందుకు యత్నించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాధితుడు గురువారం అబ్దుల్లాపూర్మెట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పైన పేర్కొన్న 13 మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కారు ఒకరిది.. నంబర్ మరొకరిది వాహనదారుడిపై కేసు నమోదు.. బంజారాహిల్స్: తన కారుకు మరో కారు నెంబర్ అమర్చిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ ఎస్ఐ ప్రభాకర్రెడ్డి ఈ నెల 26న జహీరానగర్లోని ఓపెన్గ్రౌండ్లో పార్కు చేసిన వాహనాలను తొలగింపు చేపట్టారు. అక్కడ పార్కు చేసి ఉన్న ఏపీ 37 ఏఆర్ 9099 నెంబర్ గల మారుతి స్విఫ్ట్ కారు యజమాని జశ్వంత్కు ఫోన్ చేశారు. తాను ఖమ్మం వాసినని, తన కారు తన వద్దే ఉందని..ఆ వాహనం గురించి తనకు తెలియదని చెప్పాడు. ఎవరో తన కారు నెంబర్ను ఉపయోగిస్తున్నారని చెప్పాడు. స్థానికంగా ఉండే ఇమ్రాన్గౌరీ అనే వ్యక్తి స్విఫ్ట్ కారును ఇక్కడ పార్కు చేసినట్లు తెలుసుకున్నారు. విచారణలో ఇమ్రాన్గౌరీ అనే వ్యక్తి తన కారు నెంబర్ (పీబీ 03ఎన్–4993) స్థానంలో వేరొకరి నెంబర్ (ఏపీ 37 ఏఆర్ 9099)ను అమర్చినట్లు స్పష్టమైంది. దీంతో ఇమ్రాన్గౌరీపై చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రైతులకు ఇబ్బందులు రానీయొద్దు
● ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి ● అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి షాద్నగర్రూరల్: పట్టణ సమీపంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేశారు. తడిసిన ధాన్యం విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సివిల్ సప్లై కార్పొరేషన్, జిల్లా పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు. సన్నరకం ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేలా రైతుకు అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లిస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ మహ్మద్అలీఖాన్బాబర్, డైరెక్టర్ కరుణాకర్, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు. -
ఈ– సేవ భవనానికి తాళం
చైతన్యపురి: నిత్యం రద్దీగా ఉండే ఈ– సేవ భవనాన్ని పోలీస్ స్టేషన్కు కేటాయిస్తే ఊరుకోబోమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. గురువారం కాలనీ వాసులతో కలిసి వికాస్నగర్లోని ఈ– సేవ భవనానికి ఆయన తాళం వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చైతన్యపురి పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం మూడువేల గజాలు స్థలం కేటాయించిందని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ స్థలాన్ని ఇవ్వకుండా పోలీస్ స్టేషన్కు అడ్డా లేకుండా చేసిందని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రస్తుత పోలీస్ స్టేషన్ను ఖాళీ చేయాల్సి ఉండగా ఏడాది కాలంగా ప్రభుత్వ చోద్యం చూస్తోందని దుయ్యబట్టారు. న్యూదిల్సుఖ్నగర్ కమ్యూనిటీ హాల్లోకి ఈ– సేవ కేంద్రాన్ని మార్చాలని చూస్తున్నారని అన్నారు. కాలనీలలోని కమ్యూనిటీ హాళ్లను ఇతరులకు కేటాయించే అధికారం జీహెచ్ఎంసీకి లేదన్నారు. -
వడివడిగా ఫ్యూచర్ వైపు
శుక్రవారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2026సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్సిటీ వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఒకవైపు ఫ్యూచర్సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ), యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ పనులు, రేడియల్ రోడ్డు నిర్మాణ పనులు ఊపందుకోగా.. మరోవైపు అమెజాన్ డేటాసెంటర్ విస్తరణ, కంట్రోల్ డేటా సెంటర్ పనులు మొదలయ్యాయి. ఎత్తయిన కొండలు, గుట్టలను చదును చేసే పనిలో పదుల సంఖ్యలో ఇటాచీలు, జేసీబీలు నిమగ్నమయ్యాయి. భవనాలు, రోడ్ల నిర్మాణ పనుల్లో పలు రాష్ట్రాలకు చెందిన వందలాదిమంది కార్మికులు రాత్రిపగలు తేడా లేకుండా పని చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తై తుదిమెరుగులు అద్దుకుంటున్న ఎఫ్సీడీఏ భవనాన్ని సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా జూన్ 2 లేదా 3 తేదీల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబు, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం మీర్ఖాన్ పేటలోని స్కిల్ వర్సిటీ, ఎఫ్సీడీఏ పనులను పరిశీలించారు. ఊపందుకున్న స్కిల్ వర్సిటీ పనులు మీర్ఖాన్పేట రెవెన్యూ పరిధిలో స్కిల్ వర్సిటీకి ప్రభుత్వం 57.85 ఎకరాలు కేటాయించింది. ఇక్కడ మొత్తం 4,03,693 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపడుతున్నారు. మూడు జీ+2 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే స్లాబ్ వర్క్ పూర్తై బ్రిక్స్ వర్క్స్ కొనసాగుతున్నాయి. 89,373 చదరపు అడుగుల విస్తీర్ణంలో అకడమిక్ బ్లాక్, 2,080 సీట్ల సామర్థ్యంతో 42 క్లాస్ రూమ్లు, 200 సీటింగ్ సామర్థ్యంతో సెకండ్ ఫ్లోర్లో రెండు సెమినార్ హాల్స్ నిర్మిస్తున్నారు. బాలబాలికలకు ప్రత్యేకంగా 97 గదుల చొప్పున 300 బెడ్స్ సామర్థ్యంతో రెండు మూడంతస్తుల వసతి గృహ భవనాలను నిర్మిస్తున్నారు. రెండు స్టాఫ్ క్వార్టర్స్, గెస్ట్హాస్, బాలబాలికల కోసం ప్రత్యేకంగా కిచెన్, డైనింగ్, హెల్త్సెంటర్, షాపింగ్ సెంటర్, వీసీ గెస్ట్హౌస్, డార్మెంటరీ నిర్మిస్తున్నారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తుది మెరుగుల్లో ఎఫ్సీడీఏ భవనం ఎఫ్సీడీఏ భవనానికి ప్రభుత్వం 7.06 ఎకరాలు కేటాయించింది. 16,393 చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపట్టిన జీ+1 అంతస్తుల భవనం ఇప్పటికే పూర్తయింది. స్టెచర్స్పై గ్లాస్ ఫిటింగ్ వర్క్స్, రూఫ్ టాప్పై సోలార్ ప్యానల్స్ బిగింపు, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు, మీటింగ్ హాల్స్, ఇంటర్నల్ వుడ్ పార్టిషన్ వర్క్, లైటింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఫర్నిచర్, లిఫ్ట్, క్లీనింగ్, గార్డెనింగ్, టైల్స్ వర్క్స్ కొనసాగుతున్నాయి. అమెజాన్ డేటా సెంటర్ పనుల్లో వేగం గ్లోబల్ డేటా సెంటర్లు, ఐటీ కంపెనీల (డేటాసిటీ)కోసం భారీగా భూములు కేటాయించారు. రూ.5,800 కోట్ల పెట్టుబడితో పనులు ప్రారంభించిన అమేజాన్ వెబ్ సర్వీస్ (ఏడబ్ల్యూస్) డేటా సెంటర్కు తొలిదశలో 48 ఎకరాలు కేటాయించగా ఇప్పటికే నిర్మాణాలు చేపట్టి, ఆపరేషన్ కూడా ప్రారంభించింది. తాజాగా మరో 202.26 ఎకరాల్లో విస్తరణ పనులు చేపట్టింది. దీనికి సమీపంలోనే 35 ఎకరాల్లో కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ పనులు ప్రారంభమయ్యాయి. శంకుస్థాపనలకు యాక్షన్ప్లాన్ పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలకు భద్రతకల్పించేందుకు మీర్ఖాన్పేటలో 24 ఎకరాల విస్తీర్ణంలో రూ.25 కోట్ల అంచనా వ్యయంతో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవనం నిర్మిస్తున్నారు. ఇటీవల శంకుస్థాపన కూడా చేశారు. తాజాగా మరికొన్ని భవనాలకు శంకుస్థాపన చేసేందుకు యాక్షన్ప్లాన్ సిద్ధం చేశారు. ఎన్ఐయూఎం, సింగరేణి భవనాలు సహా మరో 14 ఫార్మ కంపెనీలకు సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డీ) కేంద్రాలకు సైతం శంకుస్థాపనలు చేయనున్నారు. వేగంగా రేడియల్ రోడ్డు పనులు పరిశ్రమలకు భూముల కేటాయింపులు.. నిర్మాణాలు ప్రారంభానికి సిద్ధంగా ఎఫ్సీడీఏ భవనం త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సన్నాహాలు మారుతున్న మీర్ఖాన్పేట్ ముఖచిత్రం -
లాక్రోస్లో విద్యార్థిని ప్రతిభ
ఇబ్రహీంపట్నం రూరల్: డేవిడ్రెడ్డి సినిమా టైటిల్, ట్రైలర్ ద్వారా రెడ్డి సమాజాన్ని అవమానించే విధంగా ప్రచారం జరుగుతున్నందున సినిమాపై చర్యలు తీసుకోవాలని హైందవ రెడ్డి సేనా రాష్ట్ర అధ్యక్షుడు అందెం నర్సిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డేవిడ్రెడ్డి పేరుతో సినిమా రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని, ఈ టైటిల్ ప్రచార విధానం రెడ్డి వర్గంపై తప్పుడు అభిప్రాయాలు కలిగించే విధంగా ఉందన్నారు. సినిమా నిర్మాతలు, దర్శకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పేర్లు మార్పు చేయకుండా విడుదల చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు . మేక పిల్లపై కొండచిలువ దాడి కొట్టి చంపేసిన గ్రామస్తులు తాండూరు రూరల్: మేక పిల్లపై కొండచిలువ దాడి చేసి చంపేసింది. ఈ ఘటన మండలంలోని సంగెంకలాన్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మేకలను మేపేందుకు సమీపంలోని పొలాల వద్దకు తోలుకెళ్లాడు. అక్కడ కొండచిలువ మేక పిల్లను చుట్టుముట్టి చంపేసింది. మేకల కాపరి గుర్తించి వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చాడు. గ్రామస్తులు వచ్చి కొండచిలువను కర్రలతో కొట్టి చంపేశారు. ఆలయాల అభివృద్ధికి కృషి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి దోమ: ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. గురువారం దోమ మండలం ఐనాపూర్లోని ఐదు వందల ఏళ్లనాటి రామలింగేశ్వరుడి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పంచ్ రజిత భాస్కర్గౌడ్ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఆలయం పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే ఈ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయాలని కోరగా.. త్వరలో నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శాంతుకుమార్, గ్రామస్తులు వెంకటేశ్, జాఫర్, ఉద్యమకారుడు మల్లన్న తదితరులు పాల్గొన్నారు. -
Hyd: టీజీఐఐసీ భూముల వేలానికి రికార్డు ధర
హైదరాబాద్: టీజీఐఐసీ(Telangana Industrial Infrastructure Corporation) తాజాగా నిర్వహించిన భూముల వేలంలో రికార్డు ధర పలికింది. రంగారెడ్డి శేరిలింగపల్లి మండలంలోని రాయదుర్గంలో టీజీఐఐసీ భూముల వేలం నిర్వహించగా, వాటికి రికార్డు ధర పలికింది. సర్వే నంబర్ 83/1 లోని 6 ఎకరాల 29 గుంటల భూమికి ఈ-వేల నిర్వహించింది టీజీఐఐసీ. ఈ-వేలంలో ఎకరం భూమి ధర రూ. 237 కోట్లు పలికింది. గతేడాది ఇక్కడ ఎకరం భూమి ధర రూ.177 కోట్లు పలకగా, ఈ ఏడాది మరింత పెరిగి ఎకరం రూ. 237 కోట్లు పలకడం విశేషం. మొత్తం 6 ఎకరాల 9 గుంటలు రూ. 1490.73 కోట్లు పలికింది. దీన్ని గౌర వెంచర్స్ దక్కించుకుంది.గతేడాది ఎకరం రూ. 177 కోట్లకు ఎంఎస్ఎన్ రియాల్టీ దక్కించుకోగా, ఈసారి గౌర వెంచర్స్ ఎకరం భూమిని రూ. 237 కోట్లకు దక్కించుకుంది. జూన్ 1వ తేదీన మరో 5.09 ఎకరాలకు టీజీఐఐసీ వేలం వేయనుంది. -
కాళ్లు నరికి.. కడియాలు దోచి
చేవెళ్ల: ఆభరణాల కోసం ఓ మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటన మండలంలోని ఈర్లపల్లి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గొల్లపల్లి అనుబంధ గ్రామమైన ధర్మసాగర్కు చెందిన ఎరుకుల మైసమ్మ(48)కు ముప్పై ఏళ్ల కిందట వివాహమైంది. అనంతరం కొన్నేళ్లకు ఆమె భర్త చనిపోయాడు. దీంతో కొడుకు సురేశ్తో కలిసి ఆమె ధర్మసాగర్లోనే ఉంటుంది. కొడుకుకి వివాహం కావటంతో వేర్వేరుగా ఉంటున్నారు. మైసమ్మ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తుంది. మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. బుధవారం మధ్యాహ్నం ఈర్లపల్లి సమీపంలో ఓ మహిళ మృతదేçహాన్ని గుర్తించినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించి మైసమ్మగా నిర్ధారించారు. దుండగులు ఆమెను నిర్మానుష్య ప్రదేశంలోని తీసుకెళ్లి గొంతు కోసి రెండు కాళ్లను నరికి 50 తులాల కడియాలు, చెవి కమ్మలు దోచుకెళ్లారు. తాగిన మైకంలో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ భూపాల్శ్రీధర్ తెలిపారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. -
రూ.1.22 కోట్ల హవాలా డబ్బు పట్టివేత
సికింద్రాబాద్: ముంబై నుండి సికింద్రాబాద్కు హవాలా సొమ్ము తరలిస్తున్న ఒక వ్యక్తిని జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.1.22 కోట్ల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. రైలు ప్రయాణంలో పట్టుబడిన హవాలా డబ్బు వివరాలను బుధవారం జీఆర్పీ డీఎస్పీ ఎస్ఎన్ జావెద్ వెల్లడించారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ సాయీశ్వర్గౌడ్, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్లు నరసింహారావు, సంజీవరావుల నేతృత్వంలో బొల్లారం–మల్కాజిగిరి స్టేషన్ల మధ్య తనిఖీలు నిర్వహిస్తుండగా దేవగిరి ఎక్స్ప్రెస్ రైలులో అనుమానాస్పదంగా లగేజ్ బ్యాగ్తో ఉన్న వ్యక్తి పట్టుబడ్డాడు. మహారాష్ట్ర అమరావతి జిల్లాకు చెందిన విజయ్ అంబదాస్ గుప్తా (40) గా గుర్తించిన అతని నుంచి పెద్దమొత్తంలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబైలోని కాంతా జ్యువెలరీ యజమాని సంతోష్ సేథ్ నుంచి రూ.1.22 కోట్ల డబ్బు తీసుకొని సికింద్రాబాద్కు వస్తున్నట్టు అంబదాస్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. మోండా మార్కెట్లోని బంటీ అనే వ్యాపారికి ఈ డబ్బు బ్యాగును అప్పగించేందుకు వస్తున్నట్టు పేర్కొన్నాడు. ఇందుకు ప్రతిఫలంగా తనకు రూ. 5,000 కమీషన్న్ ఇచ్చినట్టు చెప్పాడు. పట్టుబడిన డబ్బు హవాలాకు చెందినదిగా గుర్తించిన రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం ఇన్కంటాక్స్ అధికారులకు బదిలీ చేశారు. -
మత్తు పదార్థాలతో..మత్తు పదార్థాల వినియోగంతో జీవితాలు చిత్తు అవుతున్నాయని షాబాద్ సీఐ కాంతారెడ్డి అన్నారు.
మంచాల: ఓ వైపు వర్షాలకు ధాన్యం తడుస్తుంటే.. నిర్వహకుల చేయి తడిపితే తప్ప కొనుగోలు చేసే పరిస్థితి లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచాల కొనుగోలు కేంద్రంలో 140 మంది రైతుల నుంచి 11,919 సంచుల, 4,767.20 క్వింటాళ్ల ధాన్యం సేకరించారు. మిల్లులకు తరలిచేందుకు లారీలు రాక 2,786 సంచుల్లో 1,114.40 క్వింటాళ్ల ధాన్యం సెంటర్లోనే డంప్ అయింది. మరో 45 శాతం కొనుగోలు చేయాల్సి ఉంది. లోయపల్లి సెంటర్లో 294 మంది రైతుల నుంచి 762 క్వింటాళ్ల ధాన్యం తరలించగా 60 శాతం ధాన్యం తూకం వేయాల్సి ఉంది. నోములలో 119 మంది రైతుల నుంచి 2,400 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. 40 శాతానికి పైగా ధాన్యం ఎత్తాల్సి ఉంది. నిర్వహణ లోపం తమ పాలిట శాపంగా మారిందని రైతులు వాపోతున్నారు. ఇదే విషయమై డీసీఎంస్ అధికారి రాజును వివరణ కోరగా తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేస్తామని బదులిచ్చారు. వారం క్రితం ధాన్యం బస్తాలు తీసుకొచ్చాం. సకాలంలో కాంటా వేయకపోవడంతో మంగళవారం కురిసిన వర్షానికి ధాన్యం బస్తాలు తడిసాయి. టార్పాలిన్లు కూడా ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. – ఈరటి కృష్ణ, రైతు, లోయపల్లి లోయపల్లి కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు అన్యాయం జరుగుతోంది. తూకంలో కోతలు విధిస్తున్నారు. అక్కడ పనిచేసే లచ్చిరాం అనే వ్యక్తికి డబ్బు ఇస్తేనే తూకం వేసి తరలిస్తున్నాడు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. బోడకొండలో మరింత అధ్వాన్నంగా మారింది. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. – కొర్ర లింగ నాయక్, వార్డుసభ్యుడు, లోయపల్లి -
ఢిల్లీలో చిక్కిన కిషన్ సింగ్
న్యాయవాది హత్యకేసులో కీలక నిందితుడు సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని రెడ్హిల్స్ శాంతినగర్లో హత్యకు గురైన వక్ఫ్ బోర్డు ప్యానల్ న్యాయవాది ఖాజా మొహిజుద్దీన్ కేసులో కీలక నిందితుడు కిషన్ సింగ్ అలియాప్ పప్పు చిక్కాడు. ఇతడితో పాటు హత్యకు సుపారీ ఇచ్చిన ఇద్దరిలో ఒకరిని టాస్క్ఫోర్స్ పోలీసులు నగరంలో అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో చిక్కిన వారి సంఖ్య ఆరుకు చేరింది. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ హత్యకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బర్కత్పురకు చెందిన కాంగ్రెస్ నేత, బడాబాబుతో పాటు ఆయన కుమారుడినీ టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ బడాబాబు మొహిజుద్దీన్ను హత్య చేసే బాధ్యతల్ని తన అనుచరులైన తావూస్, మునీర్లకు అప్పగించారు. వీళ్లిద్దరూ సుపారీ గ్యాంగ్తో పని పూర్తి చేయిస్తేనే ఉత్తమమని భావించి కిషనన్ సింగ్ అలియాస్ పప్పుకు రూ.15 లక్షలు చెల్లించారు. ఇతడు కవాడీగూడకు చెందిన సింగూరి అభిజీత్ అలియాస్ నానీ, వినయ్, మణిదీప్ ద్వారా పని పూర్తి చేయించాడు. మంగళవారం రాత్రికే బడా బాబుతో పాటు నాని, వినయ్, మణిదీప్లను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిచ్చిన సమాచారంతో కిషన్ సింగ్ కదలికలపై సాంకేతిక నిఘా ఉంచారు. అతడు ఓ రైలులో పారిపోతున్నట్లు గుర్తించారు. ఈ సమాచారాన్ని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కు (ఆర్పీఎఫ్) అందించి, అతడి ఫొటో పంపారు. ఆ అధికారులు రైలులో ఉన్న కిషన్సింగ్ను గుర్తించి ఢిల్లీలో పట్టుకున్నారు. నగరం నుంచి బయలుదేరి వెళ్లిన ప్రత్యేక బృందం అతడిని అదుపులోకి తీసుకుని బుధవారం రాత్రి తీసుకువచ్చింది. మరోపక్క తావూస్ను సైతం పట్టుకున్న టాస్క్ఫోర్స్ పరారీలో ఉన్న మునీర్ కోసం గాలిస్తోంది. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి టాస్క్ఫోర్స్ కార్యాలయానికి వెళ్లిన నగర సౌత్ రేంజ్ ఐజీ ఎన్.శ్వేత అదుపులో ఉన్న బడా బాబును సుదీర్ఘంగా విచారించారు. హత్యకు దారి తీసిన కారణాలు, పూర్వాపరాలు తదితరాలపై ఆరా తీశారు. ఆ తర్వాతే ఆయన కుమారుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి ఒకటిరెండు రోజుల్లో నిందితుల అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది. ఇబ్రహీంపట్నంలో కారు లభ్యం ఇబ్రహీంపట్నం: న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్యకు ఉపయోగించిన స్కార్పియో కారు ఇబ్రహీంపట్నం సమీపంలో లభ్యమైంది. నిందితులు ఉపయోగించిన నంబర్ ప్లేట్ లేని స్కార్పియోను బైపాస్ రోడ్డులోని రుచి బార్ వదిలి వెళ్లారు. హత్య జరిగిన రోజే వాహనాన్ని ఇక్కడ వదిలేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆర్పీఎఫ్ సహకారంతో పట్టివేత సిటీలో దొరికిన ఇంకో నిందితుడు పరారీలో ఉన్న మరొకరి కోసం వేట -
కాళ్లు నరికి.. కడియాలు దోచి
ఆభరణాల కోసం మహిళ దారుణహత్య చేవెళ్ల: ఆభరణాల కోసం ఓ మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటన మండలంలోని ఈర్లపల్లి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గొల్లపల్లి అనుబంధ గ్రామమైన ధర్మసాగర్కు చెందిన ఎరుకుల మైసమ్మ(48)కు ముప్పై ఏళ్ల కిందట వివాహమైంది. అనంతరం కొన్నేళ్లకు ఆమె భర్త చనిపోయాడు. దీంతో కొడుకు సురేశ్తో కలిసి ఆమె ధర్మసాగర్లోనే ఉంటుంది. కొడుకుకి వివాహం కావటంతో వేర్వేరుగా ఉంటున్నారు. మైసమ్మ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తుంది. మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. బుధవారం మధ్యాహ్నం ఈర్లపల్లి సమీపంలో ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించి మైసమ్మగా నిర్ధారించారు. దుండగులు ఆమెను నిర్మానుష్య ప్రదేశంలోని తీసుకెళ్లి గొంతు కోసి రెండు కాళ్లను నరికి 50 తులాల కడియాలు, చెవి కమ్మలు దోచుకెళ్లారు. తాగిన మైకంలో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ భూపాల్శ్రీధర్ తెలిపారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు రాజేంద్రనగర్ : పోక్సో కేసులో రాజేంద్రనగర్ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ న్యాయమూర్తి నిందితునికి 20 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పునిచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపిన మేరకు.. 2020 అక్టోబరు 23న ఉప్పరపల్లి సన్ రైస్ కాలనీకి చెందిన నాలుగేళ్ల బాలిక ఇంటిముందు ఆడుకుంటూ ఉంది. బండ్లగూడ గౌస్ నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ యూసుఫ్ (46)తన ఆటోను ఆ ప్రాంతంలో పార్కు చేశాడు. చిన్నారికి మాయమాటలు చెప్పి ఆటోలో లైంగికదాడికి పాల్పడ్డాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు. నేరం రుజువుకావడంతో బుధవారం న్యాయమూర్తి శ్రీనివాస్ నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించారు. బాధితురాలికి రూ.మూడు లక్షలు చెల్లించాలని ఆదేశించారు. -
చివరి గోస
పంట విక్రయానికి రైతుల ఇబ్బందులు ● వర్షానికి తడిసిన ధాన్యపు రాశులు ● తరలింపులో ఎడతెగని జాప్యం ● రోజుల తరబడి సెంటర్ల వద్ద కర్షకుల పడిగాపులు మంగళవారం వీచిన ఈదురు గాలులకు ఆందోళన చెందా. ధాన్యంపై కప్పిన టార్పాలిన్లు గాలికి పోకుండా కాపలాకాసా. అయినప్పటికి కొద్దిపాటి వడ్లు తడిసాయి. – హనుమంతురెడ్డి, రైతు, చర్లపటేల్గూడ సెంటర్లకు వచ్చిన ధాన్యం వెంటనే సేకరించి తరలించేలా ఏర్పాట్లు చేయాలి. వర్షం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ధాన్యం తరలింపులో ఇబ్బందులు పరిష్కరించాలి. – అంజిరెడ్డి, ఉత్తమ రైతు, శేరిగూడ సేకరించిన ధాన్యం తరలిచేందుకు తగిన ఏర్పాట్లు చేశాం. ధాన్యం తడవకుండా టార్పాలిన్లు ఇచ్చాం. ఇప్పటికే 12 లారీల వడ్లను మిల్లులకు తరలించాం. తరలించిన మూడురోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. – సత్తయ్య, ఐకేపీ సీసీ, ఇబ్రహీంపట్నం -
సేఫ్టీ కాలనీ.. క్లస్టర్ వ్యూహం!
నేర నియంత్రణకు ప్రతీ ఠాణాలో 2–3 ప్రాంతాలుగా విభజన నేర నియంత్రణే లక్ష్యంగా మల్కాజ్గిరి పోలీసులు సరికొత్తగా క్లస్టర్ వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. సేఫ్టీ కాలనీ పేరుతో ప్రతి ఠాణాలో 2–3 ప్రాంతాలను క్లస్టర్లుగా విభజించనున్నారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద త్వరలోనే ఉప్పల్ భగాయత్ క్లస్టర్లో ఈ వ్యూహాన్ని అమలు చేయనున్నారు. ఈ క్లస్టర్లోని నివాసితులకు సైబర్ నేరాలు, మహిళా భద్రత, మాదక ద్రవ్యాల కట్టడి, మానవ అక్రమ రవాణా.. ఇలా అన్ని రకాల నేరాల నియంత్రణపై అవగాహన కల్పిస్తారు. కమ్యూనిటీ సహాయంతో క్లస్టర్లలోని అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద సీసీటీవీ కెమెరాలతో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. క్లస్టర్లోని ప్రతీ ఒక్కరి కదలికలపై నిఘా ఉంటుంది. అనుమానిత వ్యక్తులు, అపరిచితుల రాకపోకలపై ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే స్థానిక పోలీసులు రంగంలోకి దిగుతారని మల్కాజిగిరి పోలీసు కమిషనర్ బడుగుల సుమతి అన్నారు. తొలి మహిళా కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ‘సాక్షి’ఇంటర్వ్యూకు ఇచ్చారు. పూర్తి వివరాలు ఆమె మాటల్లోనే.. 23,861 మంది గృహ కార్మికుల రిజిస్ట్రేషన్ ఇటీవలి నేరాల్లో ఇంటి పనివారి ప్రమేయం వెలుగు చూడటంతో గృహిణులు, వృద్ధులు, పిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. నివాస భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడానికి ‘మీ సురక్ష’పేరుతో గృహ కార్మికుల నమోదు ప్రక్రియ మొదలు పెట్టాం. ఇళ్లలో పనిమనుషులు, సంరక్షకులు, సహాయక సిబ్బంది, డ్రైవర్లు, క్లీనర్లు.. ఇలా అందరి వివరాలు నమోదు చేస్తున్నాం. ఇప్పటివరకు 23,861 మంది గృహకార్మికుల వివరాలు నమోదయ్యాయి. 44 లక్షల జనాభా ఉన్న మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్లో 4.21 లక్షల కాలనీలు, అపార్ట్మెంట్లున్నాయి. కనిష్టంగా 2 లక్షల మంది రిజిస్ట్రేషన్లు అయితేనే 60 శాతం భద్రతకు గ్యారంటీ ఉంటుంది. సైబర్ క్రైమ్ ఇంటలిజెన్స్ యూనిట్.. సైబర్ నేరాల నియంత్రణ, నేరస్తుల భరతం పట్టేందుకు సైబర్ క్రైమ్ ఇంటెలిజెన్న్స్ యూనిట్ (సీసీఐయూ)ను ఏర్పాటు చేయనున్నాం. సైబర్ నేరాలు చేసి తప్పించుకోలేమని భయం నేరస్తుల్లో కలిగించడమే లక్ష్యంగా ఈ సీసీఐయూ కార్యకలాపాలు సాగిస్తుంది. సైబర్ నేరస్తుల కదలికలు, నెట్వర్క్పై నిఘా పెట్టడంతోపాటు ఆన్లైన్లో వారి మూలాలను ట్రాక్ చేయడం, ఆర్థిక లావాదేవీలను ఛేదించడం వంటి అంశాలపై కన్నేసి ఉంచుతారు. కేసుల నమోదు నుంచి విచారణ, దర్యాప్తు విశ్లేషణ, అభియోగ పత్రాల దాఖలు వరకూ ప్రతీ అంశంలోనూ స మర్ధవంతంగా వ్యవహరించడం సాధ్యమవుతుంది. భూవివాదాల్లో ఎస్ఓపీ పాటించాల్సిందే.. భూ వివాద కేసుల్లో ప్రతి పోలీసు ప్రామాణిక నిర్వహణ విధానం(ఎస్ఓపీ)ను తూ.చ. తప్పకుండా పాటించాలని ఆదేశాలు జారీ చేశాం. కీసర, అబ్దుల్లాపూర్మెట్, జవహర్నగర్, శామీర్పేట, ఘట్కేసర్ వంటి పలు ప్రాంతాల్లో భూ తగాదాలు అధికంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణలతోపాటు ఖరీదైన స్థలాల కోసం హత్యలకు సైతం నేరస్తులు వెనుకాడటంలేదు. అన్ని కోణాల్లో పక్కాగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. ఏదో ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి 20 ఏళ్లుగా పొజిషనల్లో ఉన్న యజమానులను బెదిరించేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ఎస్హెచ్ఓలుగా మహిళలకు అవకాశం బస్టాప్లు, రైల్వే, మెట్రోస్టేషన్లు, విద్యా ప్రాంగణాలు, వసతిగృహాల వద్ద మహిళలను వేధించే ఆకతాయిలపై షీ టీమ్స్ ఎళ్లవేళలా నిఘా పెడుతుంది. ఇక నుంచి పదే పదే మహిళలను వేధించే పోకిరీలపై ప్రొఫైల్ షీట్స్ తెరుస్తాం. ప్రతినెలా తల్లిదండ్రుల సమక్షంలో మాస్ కౌన్సెలింగ్ ఇస్తాం. మూడు నెలల్లో మేడిపల్లిలోని నూతన పోలీసు కమిషనరేట్ నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తాం. సరూర్నగర్, బేగంపేటలో భరోసా కేంద్రాలు ఉన్నాయి. కమిషనరేట్లోనూ భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. త్వరలో జరగనున్న బదిలీల్లో తొలిసారిగా పలు శాంతిభద్రతల పోలీసుస్టేషన్లకు స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్హెచ్ఓ)గా మహిళలకు అవకాశం ఇవ్వనున్నాం. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లలో సీసీ కెమెరాలతో నిఘా పోకిరీలపై ప్రొఫైల్ షీట్స్.. ప్రతినెలా మాస్ కౌన్సెలింగ్ ‘సాక్షి’తో మల్కాజిగిరి తొలి మహిళా కమిషనర్ సుమతి -
గుప్త నిధుల కలకలం!
బషీరాబాద్: మండలంలోని జీవన్గీ గ్రామంలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. జీవన్గీ– కర్ణాటక మధ్యలోని సంగమేశ్వరాలయంలో గుర్తు తెలియని దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసినట్లు పశువుల కాపరులు గుర్తించారు. నాలుగు దశాబ్దాల క్రితం గ్రామపెద్ద ఒకరు ఈ ఆలయాన్ని నిర్మించి, కాశీనుంచి పంచలింగాలను తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. ప్రస్తుతం ఇక్కడ జనసంచారం పెద్దగా లేకపోవడంతో దుండగులు మంగళవారం రాత్రి లింగం ముందు భారీ గోతి తవ్వారు. ఈ క్రమంలో పలు విగ్రహాలు ధ్వంసమయ్యాయి. గుంతను పూడ్చిన అనంతరం రాళ్లతో కప్పారు. ఈ విషయమై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామంలోని 25 పురాతన ఇళ్లలోనూ మెటల్ డిటెక్టర్ సాయంతో శోధించి, తవ్వకాలు చేపట్టారు. కొంతమంది ముఠాగా ఏర్పడి నిధుల వేట సాగిస్తున్నారనే ప్రచారం ఉంది. గతేడాది బషీరాబాద్లోని ఓ పాడుబడిన ఇంట్లో పౌర్ణమి రోజున గుప్త నిధుల తవ్వకాలు చేపట్టడంపై కేసు నమోదైన ఘటన ఇందుకు బలం చేకూర్చింది. అయినప్పటికీ రెవెన్యూ, పురావస్తు, మైనింగ్ శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
సిద్ధాపూర్లో ఖరారేనా!
● ఎకో టౌన్షిప్ ఏర్పాటుకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన ● క్షేత్రస్థాయిలో గోప్యత కొత్తూరు: సిద్ధాపూర్లో డంప్యార్డు ఏర్పాటు దాదాపు ఖరారైనట్లేనని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 20న ఢిల్లీలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.0 జాతీయ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క పాల్గొనడం ప్రచారానికి బలం చేకూర్చుతోంది. వ్యర్థాల నిర్వాహణను శాసీ్త్రయంగా చేపట్టి విద్యుత్ ఉత్పత్తి, రీసైక్లింగ్, సర్క్యులర్ ఎకానమీ ప్రాజెక్టులకు కేంద్రం ఆర్థిక సహకారం అందించాలని కోరారు. ఇప్పటికే హైదరాబాద్లోని జవహర్నగర్, ఆటోనగర్ డంప్సైట్లలో లక్షల టన్నుల వ్యర్థాలను బయోమైనింగ్ ద్వార శుద్ధి చేస్తున్నట్లు సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో ఉన్న డంప్యార్డులను అభివృద్ధి కేంద్రాలుగా మార్చడానికి జపాన్లోని కిటక్యుషు నగర అభివృద్ధిని నమూనాగా తీసుకొని కొత్తగా బండరావిర్యాల, సిద్ధాపూర్ గ్రామాల్లో ఎకో టౌన్షిప్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలిపారు. కేంద్రాన్ని నిధులు కోరిన ప్రభుత్వం సిద్ధాపూర్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చెత్తను నిర్వీర్యం చేసే ప్రాజెక్టు ఎకో టౌన్షిప్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదన పంపింది. సిద్ధాపూర్లో టీజీఐఐసీ సేకరించిన పొలాల్లో నెలకొల్పనున్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని కోరింది. ఈ ప్లాంటులో పొడిచెత్త, ఇతర వ్యర్థాలను శాసీ్త్రయంగా వేరుచేయనున్నట్లు తెలిపారు. స్పష్టత కరువు సిద్ధాపూర్లో డంప్యార్డు ఏర్పాటు చేస్తున్న విషయం ఇప్పటికీ మండల, జిల్లాస్థాయి అధికారులకు తెలియదంటున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాత్రం జాతీయ సమీక్షలో సిద్ధాపూర్లో ఎకోటౌన్షిప్ ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు ప్రసంగించారు. ఈ విషయం నిజంగానే మండల, జిల్లా అధికారులకు తెలియదా..? డంప్యార్డు ఏర్పాటు చేస్తున్నట్లు చెబితే స్థానికులు అడ్డుకుంటారని గోప్యత వహిస్తున్నారేమోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
పోష్ యాక్ట్తో సత్వర న్యాయం
అదనపు కలెక్టర్ కిరణ్మయి ఇబ్రహీంపట్నం రూరల్: మహిళల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అదనపు కలెక్టర్ కిరణ్మయి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో మహిళా చట్టాలపై అవగహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించేది లేదన్నారు. పోష్ యాక్ట్ ద్వారా సత్వర న్యాయం పొందవచ్చన్నారు. మహిళలపై లైంగిక వేధింపులు జరిగినప్పుడు ధైర్యంగా ఐసీలో ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ప్రైవే ట్, ప్రభుత్వ కంపెనీల్లో ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు తప్పనిసరి అన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కంపెనీల్లో ఉద్యోగులు, యాజ మాన్యాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా పోష్ చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి శ్రీలత, డీఆర్ఓ శారదాదేవి, లోక్ అదాలత్ పర్మినెంట్ మెంబర్ అమితారాణి, హైకోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ యాదగిరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు . సివిల్ సప్లై జిల్లా అధికారి హరీశ్ మంచాల: రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని సివిల్ సప్లై జిల్లా అధికారి హరీశ్ అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. లారీలు రాక రోజుల తరబడి ఇక్కడే నిరీక్షిస్తున్నామని రైతులు ఆయనకు వివరించారు. వర్షాలకు ధాన్యం తడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన ఆయన సమస్యలు తలెత్తకుండా సమన్వయంతో సమస్యలు పరిష్కరిస్తామన్నారు. క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాల ని అధికారులకు సూచించారు. ఆయన వెంట డీఎస్ఓ వనజాత, సీసీ చంద్రిక, వీఓఏ స్వరూప తదితరులు ఉన్నారు. కొనసాగుతున్న పోలీసుల ఆంక్షలు తుర్కయంజాల్: కొహెడలో మార్కెట్ నిర్మాణానికి రైతులు వ్యతిరేకిస్తుండటంతో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. రైతుల నిరసనలతో పోలీసులు ఔటర్ సర్వీస్ రోడ్డును ఓ వైపు పూర్తిగా మూసివేసి వారి ఆధీనంలోకి తీసుకున్నారు. రెండు వైపులా బారికేడ్లు, బందోబస్తు ఏర్పాటు చేసి ఏ ఒక్కరిని లోపలికి అనుమతించడం లేదు. దీంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మీడియాను సైతం అనుమతించక.. ఇంత నిర్బంధం విధించి పనులు చేపట్టాల్సిన అవసరం ఏం వచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. మహేశ్వరం: మహేశ్వరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని 108 వాహనాన్ని జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ జాన్ సాహెబ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. రికార్డులు, ఫోన్ కాల్స్ డాటాను పరిశీలించి 108 సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో 108 అంబులెన్స్ జిల్లా కార్యనిర్వాహణ అధికారి రాజబాబు, సిబ్బంది ఈఎంటీ కుమార్, పైలట్ రామకృష్ణ పాల్గొన్నారు. కానిస్టేబుల్పై సస్సెన్షన్ వేటు తాండూరు టౌన్: బాలిక కిడ్నాప్ కేసులో అరెస్టయిన నిందితుడు ఠాణా నుంచి పారిపోయిన ఘటనలో బుధవారం ఓ కానిస్టేబుల్పై వేటు పడింది. ఈ నెల 10న ఢిల్లీకి చెందిన ఆదిమ్ అనే వ్యక్తి తాండూరు పట్టణానికి చెందిన ఓ బాలికను కిడ్నాప్ చేశాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అదే రోజు నిందితుడు పోలీసుల కళ్లు గప్పి ఠాణా నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ నరేందర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పట్టణ సీఐ పరమేశ్వర్ తెలిపారు. -
సీఎం సభను అడ్డుకుంటాం
తుర్కయంజాల్: పండ్ల మార్కెట్ నిర్మాణం పేరిట ప్రభుత్వం అన్యాయంగా తమ భూములు లాక్కోటోందని కొహెడ భూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వారు హైకోర్టు న్యాయవాదులతో కలిసి కొహెడలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అబ్దుల్లాపూర్మెట్ మండలం కొహెడ సర్వే నంబర్167/1లో ఎస్సీ, బీసీలకు చెందిన సుమారు 260 ఎకరాల భూమిని అన్యాయంగా లాక్కునేందుకు ప్రభుత్వం యత్నిస్తుందన్నారు. 1955, 1958 సంవత్సరాల నుంచి కొహెడకు చెందిన సాదు రంగయ్య, సాదు ఈదయ్య తదితరుల పేర్లు రికార్డుల్లో ఉన్నాయని, 1992 వరకు ప్రభుత్వానికి ప్రతి ఏటా పన్నులు చెల్లించామన్నారు. అధికారులు కొత్తగా ఈ పాసు పుస్తకాలను ఇవ్వకపోవడంతో 2025లో కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లపై హైకోర్టులో కంటెంట్ కేసు వేశామన్నారు. అధికారులు కోర్టుకు జవాబు చెప్పకుండా, పోలీసుల సహకారంతో రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ పనులను చేపడుతున్నారని ఆరోపించారు. జూన్ 3వ తేదీన నిర్వహించనున్న మార్కెట్ ప్రారంభోత్సవ పనులు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం మా భూములను లాక్కుంటున్నారని, ప్రభుత్వం, అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు సాదు రాములు, యాదగిరి, కృష్ణ, మహేశ్, దానయ్య, బుడ్డ జంగయ్య, ఆగమయ్య, పంది సతీశ్, శీలం అంగత్ తదితరులు పాల్గొన్నారు. కొహెడ భూ బాధితులు -
మత్తు పదార్థాలతో జీవితాలు చిత్తు
షాబాద్: మత్తు పదార్థాల వినియోగంతో జీవితాలు చిత్తు అవుతున్నాయని షాబాద్ సీఐ కాంతారెడ్డి అన్నారు. బుధవారం ఫ్యూచర్ సిటీ కమిషనర్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని అంతారం, సంకెపల్లిగూడ గ్రామాల్లో డాగ్స్క్వాడ్, ఈగల్ టీంలతో దుకాణాలను పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యువత పోరాటం చేయాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. కొత్త వ్యక్తులు గ్రామాల్లోకి వచ్చి ఏదైనా విక్రయించిన్నట్లు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఏమాత్రం అనుమానం వచ్చినా వాడినట్లు గుర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమలో ఎస్ఐ సతీష్కుమార్, ఏఎస్ఐ రామ్లాల్, సర్పంచులు కుమ్మరి లావణ్య చెన్నయ్య, ప్రభాకర్రెడ్డి, గ్రామస్తులు తదితరులున్నారు. -
సెంటర్లలో మగ్గుతోన్న ధాన్యం
ఇబ్రహీంపట్నం: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మగ్గుతోంది. ఒక్కసారిగా రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావడం.. లారీల కొరత, మిల్లర్ల నిర్లక్ష్యం కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో వర్షం కురిస్తే ఎలా అని రైతులు దిగాలు చెందుతున్నారు. ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డు, రాయపోల్, దండుమైలారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడకు ధాన్యం తీసుకువచ్చిన రైతులు రోజుల తరబడి పడిగాపులుకాస్తున్నారు. మంగళవారం ఒక్కసారిగా బలమైన ఈదురు గాలులు వీచి ఓ మోస్తారు వర్షం కురియడంతో ఒక్కసారిగా కర్షకులు ఆందోళన చెందారు. టార్పాలిన్లు కప్పి ధాన్యం తడవకుండా చూశారు. భారీ వర్షం కురిస్తే తమ పరిస్థితి ఏమిటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 28న మార్కెట్యార్డులో కొనుగోలు కేంద్రం ప్రారంభించగా దొడ్డు రకం 7,001(2,800 క్వింటాళ్లు)బస్తాలు, సన్నాలు 1,533(613 క్వింటాళ్లు) బస్తాలు సేకరించారు. ఇప్పటికి పది లారీల దొడ్డు, రెండు లారీల్లో సన్నాలు (ఒక్కో లోడ్లో 290 క్వింటాళ్లు) మాత్రమే తరలించారు. రాయపోల్ సెంటర్లో 16,011 బస్తాల ధాన్యం సేకరించారు. ఇప్పటికై నా అధికారులు త్వరితగతిన ధాన్యం తరలించాలని రైతులు కోరుతున్నారు. -
నా పేరు మునీరా.. నౌహీరా కాదు.!
సాక్షి, సిటీబ్యూరో: హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ముసుగులో వివిధ రకాలైన స్కీముల పేరుతో రూ. మూడు వేల కోట్లకు పైగా స్కామ్కు పాల్పడిన నౌహీరా షేక్ వ్యవహారాలు అన్నీఇన్నీ కావు. స్కామ్లు వెలుగులోకి వచ్చిన తర్వాత అరెస్టులు... బెయిల్ పొందటం, అది రద్దైన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. తాజాగా ఈడీ అధికారులు అరెస్టు చేయడానికి ప్రయత్నించగా తన పేరు మునీరా అని..నౌహీరా కాదని తప్పు పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అప్పట్లో హీరా గ్రూప్ అధికారిక వెబ్సైట్లోని అచీవ్మెంట్స్ లింకులో నౌహీరా సాధించిన విజయాలుగా చెప్తూ చాంతాడంత జాబితా ఉండేది. ఇందులో అనేక అవార్డుల పేర్లు, వాటి వివరాలను సైతం పొందుపరిచారు. దీని ప్రకారం నౌహీరాకు 2012 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంఽధీ ప్రియదర్శిని అవార్డు ప్రదానం చేసినట్లు ఉంది. దీంతో పాటు మొత్తం 11 రకాలైన జాతీయ, అంతర్జాతీయ అవార్డులను తమ జాబితాలో చేర్చుకున్నారు. వీటిని సంబంధించిన కొన్ని ఫొటోలనూ నౌహీరా సోషల్ మీడియాతో పాటు తన కార్యాలయం, ఇళ్ళల్లో ప్రదర్శించేశారు. వీటిని విశ్లేషించిన దర్యాప్తు అధికారులు అవన్నీ నకిలీవిగా తేల్చారు. అనేక ఫొటోలను ఫొటోషాప్ ద్వారా మార్చేసి తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. బెయిల్ రద్దు అయితే పరారే... నౌహీరా షేక్ను తొలిసారిగా హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు 2018 అక్టోబర్లో అరెస్టు చేశారు. ఆపై ఈడీ అధికారులు కటకటాల్లోకి పంపారు. సీసీఎస్లో నమోదైన కేసుల్లో నాంపల్లి కోర్టు బెయిల్ తిరస్కరించింది. దీంతో హైకోర్టును ఆశ్రయించిన నౌహీరా బెయిల్ పొందారు. ఇదే తరహా కేసులో 2021లో ముంబై పోలీసులు అరెస్టు చేయగా... డిపాజట్లు తిరిగి చెల్లిస్తానంటూ హామీ ఇచ్చి బెయిల్పై బయటకు వచ్చారు. సీసీఎస్లో నమోదైన కేసులకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన బెయిల్ను పోలీసులు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. నేరం తీవ్రత, కేసుల పూర్వాపరాలు పరిశీలించిన సుప్రీం కోర్టు హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేస్తూ 2024 అక్టోబర్లో తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన నౌహీరా 2025 మేలో హర్యానాలో చిక్కింది. ఐయామ్ మునీరా అంటూ తప్పించుకునే యత్నంతాజాగా ఈడీ కేసులోనూ సుప్రీం కోర్టు బెయిల్ రద్దు చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఎట్టకేలకు గత వారం గురుగ్రామ్లో ఆచూకీ కనిపెట్టిన ఈడీ అధికారులు నౌహీరాను అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చి జైలుకు పంపారు. నకిలీ పత్రాలు సృష్టించి గురుగ్రామ్లో తలదాచుకున్న నౌహీరా.. తనను అరెస్టు చేయడానికి వచ్చిన ఈడీ అధికారులనూ తప్పుదోవపట్టించే ప్రయత్నం చేశారు. అక్కడి ఓ అద్దె ఇంట్లో ఆమెను గుర్తించగా.. దాదాపు గంటసేపు తాను నౌహీరాను కాదంటూ వాదించింది. తన పేరు మునీరా అంటూ ఆమె పదేపదే చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే అధికారులు కొన్ని ఆధారాలు చూపడంతో మిన్నకుండిపోయింది. తొలినాళ్లల్లో ప్రముఖులతో ఫొటోలు క్రియేట్ ఆపై బెయిల్ రద్దు అయినప్పుడల్లా ఎస్కేప్ తాజాగా ఈడీ అధికారులను మోసం చేసే యత్నం -
నోముల పంచాయతీకి నోటీస్
మంచాల: అక్రమ నిర్మాణాలను నిరోధించడంలో విఫలమైన పంచాయతీ అధికారులు, ప్రజా ప్రతినిధులకు జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా స్థానిక పంచాయతీ కార్యదర్శిని బదిలీ చేశారు. వివరాలివీ.. నోముల పంచాయతీ పరిధి శ్రీ మల్లికార్జునగూడ రెవెన్యూ పరిధిలోని 33 సర్వే నంబర్లో అక్రమంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు చేస్తున్నారు. వీటిని అడ్డుకోవడంలో అటు అధికారులు, ఇటు ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారు. దీంతో కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు డీపీఓ సురేష్ మోహన్ చర్యలకు ఉపక్రమించారు. పంచాయతీ కార్యదర్శి సుభద్రదేవిని మహేశ్వరం మండలం పడమటి తండాకు బదిలీ చేశారు. అక్రమ నిర్మాణాల విషయంలో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ కోరుతూ పంచాయతీ కార్యదర్శితోపాటు సర్పంచ్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ఇబ్రహీంపట్నం: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన శనివారం ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ సూర్యతేజ తెలిపిన వివరాల ప్రకారం.. మంగల్పల్లి నుంచి కొహెడ వెళ్లే రోడ్డులో దర్గా వద్ద ఓ వ్యక్తి మృతదేహం పడి ఉందని డయల్ 100కు కాల్ వచ్చింది. వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పల్సర్ బైక్, పర్సు, ఫోన్ అక్కడ లభించాయి. మొబైల్ నంబర్ ఆధారంగా మృతుడి బంధువులకు సమాచారం చేర వేశారు. మృతుడిని హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన మహమ్మద్ అలీ(40)గా గుర్తించారు. కొహెడ వద్ద దర్గాలో ప్రార్థన చేసి వస్తానని శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన అలీ రాత్రి 8 గంటలకు ఫోన్లో కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మృతుడి ముక్కు నుంచి రక్తం కారుతూ, శరీరం బిగిసుకుపోయి ఉందని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. కాగా అలీకి ఆరోగ్య సమస్యలున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. -
బీజేపీ ఓటు చోరీ కుట్రలను అడ్డుకుందాం
షాద్నగర్: బీజేపీ ఓటు చోరీ కుట్రలను పార్టీ నాయకులు, కార్యకర్తలు సమర్థవంతంగా అడ్డుకోవాలని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికై న మండలాలు, మున్సిపాలిటీల పార్టీ అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నర్సింహారెడ్డి మాట్లాడారు. బీజేపీ సర్ పేరుతో తమ వ్యతిరేక ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దీనిని అడ్డుకునేందుకు గాను పార్టీ బీఎల్ఓలను నియమించిందని, వీరు ప్రతి అంశాన్ని నిషితంగా పరిశీలించి ఓటు చోరీని అడ్డుకోవాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. కొత్తగా ఎన్నికై న వారు పార్టీని గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేయాలని సూచించారు. షాద్నగర్ మున్సిపాలిటీ అధ్యక్షుడిగా నలమోని శ్రీధర్, కొత్తూరు మున్సిపాలిటీ అధ్యక్షుడిగా సుదర్శన్, ఫరూఖ్నగర్ మండల అధ్యక్షుడిగా రాయికల్ శ్రీనివాస్, కొందుర్గు అధ్యక్షుడిగా పురుషోత్తంరెడ్డి, నందిగామ అధ్యక్షుడిగా కుమారస్వామి, కొత్తూరు అధ్యక్షుడిగా శేఖర్రెడ్డి, కేశంపేట అధ్యక్షుడిగా రమేష్, చౌదరిగూడ అధ్యక్షుడిగా చంద్రశేఖర్కు నియామక పత్రాలు అందజేసి సత్కరించారు. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి -
బహుజనులంతా ఏకం కావాలి
షాబాద్: బహుజనులందరూ ఏకం కాకుంటే, తమకు న్యాయం జరగదని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ యాదవ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని చందనవెళ్లి గ్రామంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఉపాధ్యక్షుడు చేవెళ్ల స్వామి ఆధ్వర్యంలో ఈ నెల 28న షాద్నగర్లో నిర్వహించే భారీ బహిరంగ సభ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బహుజనులు ఉద్యమం ఉధృతం చేసిన రోజునే ఏ ప్రభుత్వమైనా దిగి వస్తుందని చెప్పారు. 90 శాతం ఉన్న బహుజనులకు రిజర్వేషన్లు ఎంత మొత్తంలో ఉన్నాయో మనం గమనించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు రమేష్యాదవ్, లాలయ్య, మల్లేష్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
వడివడిగా భూ అభివృద్ధి
యాచారం: ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో భూ అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. వారం రోజులుగా యాచారం మండలంలోని నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో పరిహారం అందజేసి ఫార్మాసిటీకి సేకరించిన అసైన్డ్, పట్టా భూముల్లో భూ చదును పనులు, కంపచెట్లు, రాళ్లు, రప్పల తొలగింపు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నాలుగు గ్రామాల్లోనే గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అత్యధికంగా పది వేల ఎకరాలకు పైగా అసైన్డ్, పట్టా భూమిని ఫార్మాసిటీకి సేకరించారు. అసైన్డ్ భూములు గుట్టలు, రాళ్లు, రప్పలతో కూడి ఉన్నాయి. ఆయా భూముల్లో వారం రోజులుగా వందకుపైగా జేసీబీలు, ఇటాచీలు, ట్రాక్టర్లు ఇతర యంత్రాలతో టీజీఐఐసీ అధికారులు అభివృద్ధి పనులు చేపట్టారు. రెవెన్యూ, పోలీస్ సిబ్బంది అభివృద్ధి పనులు చేపడుతున్న భూముల వైపు ఆయా గ్రామస్తులను, రైతులను వెళ్లనివ్వడం లేదు. విధుల్లో డివిజన్ తహసీల్దార్లు ఫార్మాసిటీ భూ అభివృద్ధి పనుల్లో ఇబ్రహీంపట్నం డివిజన్ తహసీల్దార్లు విధులు నిర్వర్తిస్తున్నారు. డివిజన్లోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్, మాడ్గుల తదితర మండలాల తహసీల్దార్లు నిత్యం ఉదయం పనులు ప్రారంభించే సమయం నుంచి సాయంత్రం ముగిసే వరకు అక్కడే ఉంటున్నారు. ఫార్మా భూ అభివృద్ధి పనుల్లో తహసీల్దార్లు ఉండగా, తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల విషయంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా భూముల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు చేసే బాధ్యతలను కలెక్టర్ నారాయణరెడ్డి ఆయ మండలాల ఉప తహసీల్దార్లకు అప్పగించారు. శంకుస్థాపనలకు రెడీ ఫార్మాసిటీ భూముల్లో వివిధ కంపెనీలకు భూములు అప్పగించడానికి సర్కార్ సిద్ధమైంది. ఆయా కంపెనీల ప్రతినిధులతో ఒప్పందాలు చేసుకుని వారికి భూముల అప్పగింతకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో సేకరించిన భూముల్లో 500, వెయ్యి, రెండు వేలు, 2,500 ఎకరాలను బ్లాకులుగా చేసి ప్రముఖ సంస్థలకు అప్పగించేందుకు రెడీ చేస్తున్నారు. నాలుగు గ్రామాల్లో భూమి చదునుగా ఉన్న నక్కర్తమేడిపల్లి రెవెన్యూ పరిధిలోని ఐదు వేల ఎకరాల భూమిని అధికారులు శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారు. ఎఫ్సీడీఏ కమిషనర్ శశాంక నాలుగు రోజుల క్రితం నక్కర్తమేడిపల్లిలోని భూ అభివృద్ధి పనులను పరిశీలించి, వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జూన్లో సీఎం రేవంత్రెడ్డి నక్కర్తమేడిపల్లి, కుర్మిద్ద రెవెన్యూ పరిధిలోని భూముల్లో పలు కంపెనీల ఏర్పాటు శంకుస్థాపనలు చేస్తారన్న సమాచారం మేరకు ఉన్నతాధికారులు హడావుడి చేస్తున్నారు. ఈ నాలుగు గ్రామాల్లోని భూ అభివృద్ధి పనుల పర్యవేక్షణ అంతా సీఎంఓ కార్యాలయం నుంచి సాగుతోందని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఫార్మాసిటీ భూముల్లో శరవేగంగా చదును పనులు జేసీబీలు, ఇటాచీలతో నిరంతరం కంపచెట్లు, రాళ్లు, రప్పల తొలగింపు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న టీజీఐఐసీ అధికారులు, తహసీల్దార్లు జూన్లో వివిధ సంస్థలకు అప్పగించేలా సర్కార్ సన్నద్ధం ఫార్మా భూముల్లో భూ అభివృద్ధి పనులు సాఫీగా జరగడం కోసం తహసీల్దార్లను నియమించాం. రైతులు వెంటనే తమ భూ సమస్యలను స్థానికంగా ఉండే తహసీల్దార్లకు తెలియజేస్తే పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. రైతులకు ఇబ్బంది కలగకుండా డివిజన్లోని ఆయా మండలాల ఉప తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ల బాధ్యతలు అప్పగించాం. – అనంత్రెడ్డి, ఆర్డీఓ, ఇబ్రహీంపట్నం -
వారి బంధం ఫెవికాల్ కంటే బలం
● కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూదొందే ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతుర్కయంజాల్: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల బంధం ఫెవికాల్ కంటే బలమైనది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అన్నారు. ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నా అది మాటలకే పరిమితం అని, దొందూ దొందే అని పేర్కొన్నారు. ఆదిబట్ల సర్కిల్ పరిధి మన్నెగూడలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన పార్టీలో చేరిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ అమెరికా, ఇరాన్ యుద్ధంతో తలెత్తనున్న పరిణామాల దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేసేందుకే పొదుపు మంత్రం పాటించాలని చెబితే దానిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. రైతుల విషయంలో మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. చివరిగింజ వరకు కొంటామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, అలాంటిది ప్రస్తుతం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు కల్లాల్లో నిరీక్షిస్తున్నారని చెప్పారు. ప్రజలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో పెద్ద ఎత్తున దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ఆపలేరని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. అవినీతి రహిత పాలన అందించాలంటే బీజేపీకే సాధ్యం అని, యువత పార్టీలోకి చేరాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీలో చేరిన స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ బాసరాజు సురేష్కు కండువా కప్పి ఆహ్వానించారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, రాష్ట్ర కార్యదర్శి కొప్పు భాషా, బోసుపల్లి ప్రతాప్, దయానంద్ గౌడ్, బచ్చిగళ్ల రమేష్, ఎలిమినేటి నర్సింహా రెడ్డి, కొత్త రాంరెడ్డి, నోముల కార్తీక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
చెరువులో పడి మహిళ దుర్మరణం
షాబాద్: చెరువులో పడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన శనివారం షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సతీష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన కావలి సుజాత(45) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమెకు మతిస్థిమితం సరిగ్గా లేదు. ఈ నెల 21వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. భర్త వెంకటేష్, పిల్లలు బంధువుల వద్ద, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. శనివారం షాబాద్ పహిల్వాన్ చెరువులో తేలియాడుతున్న శవం ఉందని పోలీసులకు స్థానికులు సమాచారమిచ్చారు. దీంతో వారొచ్చి పరిశీలించి సుజాతగా గుర్తించారు. మతిస్థిమితంతో చెరువులో పడి మృతి చెంది ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. మృతురాలి అన్న సుధాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పాలమూరు!
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మళ్లీ కదలిక ● ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా అడుగులు ● కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి భూసేకరణపదమూడేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు సర్వే కోసం రూ.6.91 కోట్లు కేటాయించింది. నిపుణులు సర్వే చేసి డిజైన్లు రూపొందించారు. ఈ ప్రాజెక్టుకు 115 టీఎంసీల నీరు కేటాయించారు. పరిగి నియోజకవర్గంలో 45 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వార్లు కట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. గండేడ్, కుల్కచర్ల మండలాల పరిఽధిలో 35 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ అలాగే మహబూబ్నగర్ జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి, పరిగి మండలం రావులపల్లి శివారులో 10 టీఎంసీల సామర్థ్యంతో జాయింట్గా రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మన జిల్లాలోని 2,46,154 ఎకరాల ఆయకట్టుకు నీరందేలా డిజైన్ చేశారు. తదనంతర కాలంలో రాష్ట్రం విడిపోవడం టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అనేక సార్లు డిజైన్లు మారుస్తూ వచ్చారు. చివరకు జిల్లాకు గ్రావిటీ ద్వారానే నీళ్లిస్తామని ప్రకటించి అది కూడా పూర్తి చేయలేదు. పాలమూరు జిల్లా పరిధిలో రెండు రిజర్వాయర్ల నిర్మాణ పనులు ప్రారంభించినా మన జిల్లాలో గంపెడు మట్టికూడా తీయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు మళ్లీ తెరపైకి వచ్చింది. రీ డిజైన్ చేసి జిల్లాకు నీరందిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం భూ సేకరణకు అధికారులు సిద్ధమవుతున్నారు. వికారాబాద్: పాలమూరు ఎత్తిపోతల పథకం పనుల్లో మళ్లీ కదలిక వచ్చింది. నెల రోజుల క్రితం పరిగి బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. జిల్లాలో భూ సేకరణ చేపడతామని చెప్పారు. ఆ వెంటనే సీఎంఓ నుంచి కలెక్టర్కు ఆదేశాలు కూడా అందాయి. మూడు రోజుల క్రితం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో సీఎం సమావేశమై భూ సేకరణ ప్రక్రియను సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. ఇదే విషయమై పరిగి ఎమ్మెల్యే టీఆర్ఆర్ కూడా రెండు రోజల క్రితం ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని కలిశారు. భూ సేకరణ ప్రక్రియను వెంటనే చేపట్టాలని విన్నవించారు. జిల్లాకు ఎంతో మేలు నగరానికి మన జిల్లా సమీపంలో ఉన్నా వ్యవసాయ పరంగా ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నేతల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చిన్న చిన్న చెరువులు మినహా చెప్పుకోదగ్గ సాగునీటి ప్రాజెక్టులు ఒక్కటి కూడా లేవు. నదుల ద్వారా సెంటు భూమి కూడా తడవదు. పరిశ్రమలు లేని జిల్లా ఏదైనా ఉందంటే అది వికారాబాదే అని చెప్పవచ్చు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ప్రాజెక్టులను తెరపైకి తేవడం.. ఆ తర్వాత మిన్నకుండి పోవడం నేతలకు పరిపాటిగా మారింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపైనే ప్రధానంగా చర్చ జరిగింది. పాలమూరు ఎత్తిపోతల పథకం, మూసీ నదిపైనే మాటల యుద్ధం జరిగింది. ఇదిలా ఉండగా పరిగి మండలం సయ్యద్పల్లి శివారులో 10 టీఎంసీల సామర్థ్యంతో కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబందించి భూసేకరణకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఏడాదిన్నర లోపు పనులు పూర్తి చేస్తామని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రిజర్వాయర్ అందుబాటులోకి వస్తే జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు నీరందనుంది. ఈ సారైనా పూర్తయ్యేనా? దశాబ్దాలుగా ప్రధాన ప్రాజెక్టు పనులన్నింటినీ ఏదో ఒక కొర్రీ పెట్టి కొండెక్కస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సర్వేలు.. రీ డిజైన్లకే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పరిమితం చేశారు. ఉమ్మడి జిల్లాకు 50 టీఎంసీల కేటాయింపులున్న ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును గత ప్రభుత్వం రీడిజైన్ పేరుతో అటకెక్కించింది. ప్రస్తుతం జిల్లా నుంచి సీఎం ప్రాతినిథ్యం వహిస్తుండటంతో ప్రాజెక్టులు పూర్తవుతాయని జిల్లా వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
భానుడి సెగలు.. జనం బెంబేలు
మొయినాబాద్రూరల్: భానుడి భగభగలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ప్రజలే కాకుండా మూగ జీవాలు సైతం గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్నాయి. శనివారం మొయినాబాద్ మండలంతో పాటు చేవెళ్ల నియోజకవర్గంలో ఉష్ణోగ్రతలు మరింత పెరగడంతో ప్రజలు ఉదయం పది గంటలకే ఇళ్లలోంచి బయటకు రాలేకపోయారు. ఉక్కపోత, వేడికి మధ్యాహ్నం రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉపశమనా నికి ప్రజలు శీతల పానీయాలు, కొబ్బరిబొండా లు, పండ్ల రసాల విక్రయాలు అధికమయ్యాయి. -
ఏటీఎంలో చోరీకి యత్నం
షాద్నగర్రూరల్: తెల్లవారుజామున ఏటీఎంలో దుండగులు దోపిడీకి యత్నించిన ఘటన షాద్నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని మహబూబ్నగర్ రోడ్డులో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఏటీఎంలో శనివారం తెల్లవారుజామున దొంగలు చోరీకి యత్నించారు. ఏటీఎం కేంద్రానికి ఉన్న షెటర్ను, అద్దాలను ధ్వంసం చేశారు. విషయాన్ని గుర్తించిన ఓ యువకుడు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేలోపే దొంగలు పరారయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ సీతారాం తెలిపారు. అబ్దుల్లాపూర్మెట్: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాం లభ్యమైన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఔటర్ రింగ్రోడ్డు సమీపంలోని బలిజగూడకు వెళ్లే దారిలో ఓ వ్యక్తి మృతిచెంది ఉన్నాడన్న సమాచారం మేరకు పోలీసులు శఽనివారం ఉదయం సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలియలేదు. మృతుడికి సుమారు 40–45 ఏళ్ల వయసు ఉంటుందని, యాచకుడై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఈ నెల 28న జరిగే పరీక్షలు వాయిదా వేసినట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.శశికాంత్ శనివారం తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా 28న ప్రభుత్వం సెలవు ప్రకటించినందున ఆ రోజు జరిగే పరీక్షలను వాయిదా వేశామన్నారు. పరీక్షలు నిర్వహించే తేదీలు త్వరలో ప్రకటిస్తామన్నారు.


