breaking news
Rangareddy
-
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం
గచ్చిబౌలి: అదుపు తప్పి కారు పల్టీ కొట్టడంతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలైన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన మేరకు.. చత్తీస్ఘడ్ రాయపూర్కు చెందిన రూపక్ త్రిపాఠి(30) మాదాపూర్లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. కేపీహెచ్బీలో తమ్ముడు శాశ్వత్ త్రిపాఠితో కలిసి నివాసం ఉంటున్నారు. స్నేహితులతో కలిసి ఎర్టిగా కారులో కేపీహెచ్బీ నుంచి నాలెడ్జీ సిటీకి వెళుతుండా టీ హబ్ రోడ్డులో శనివారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. నాలుగు పల్టీలు కొట్టడంతో బెలూన్ తెరుచుకున్నప్పటికీ డ్రైవింగ్ చేస్తున్న రూపక్ త్రిపాఠి తలకు తీవ్ర గాయాలయ్యాయి. మాదాపూర్లోని మెడికొవర్ హస్పిటల్లో చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందాడు. కారులో ఉన్న సోదరునితో పాటు స్నేహితులు వైభవ్ పాటిల్, ఇషాన్ త్రిపాఠి, ఎస్ రాజ్ సింగ్లు క్షేమంగా బయటపడ్డారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే ఇటీవల రూపక్ త్రిపాఠి మొబైల్ యాప్ను డెవలప్ చేశాడు. యాప్ను లాంచ్ చేయాల్సి ఉందని చెప్పి చత్తీస్ఘడ్ నుంచి వారం రోజుల క్రితం ముగ్గురు స్నేహితులను పిలిపించుకున్నాడు. తెల్లవారు జామున ఐటీ కారిడార్ చూసేందుకు వెళుతూ కారు అదుపుతప్పడంతో రూపక్ త్రిపాఠి తిరిగి రాని లోకాలు వెళ్లాడు.కారు ముందు చక్రం ఊడిపోయి నుజ్జునుజ్జు అయ్యింది. పోలీసులు మృత దేహనికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చెల్లెలిని చూసేందుకు వెళ్తూ..
కడ్తాల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన కడ్తాల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గంగాధర్ తెలిపిన వివరాలివీ.. నాగర్కర్నూల్ జిల్లా కోడేరు గ్రామానికి చెందిన కొమ్మరి శివకృష్ణ (24) కొంత కాలంగా హైదరాబాద్లో టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామంలో ఉండే చెల్లెలు స్వప్న క్రిమిసంహారక మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతుందనే సమాచారం మేరకు శుక్రవారం తెల్లవారుజామున నగరం నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో మండల కేంద్రం సమీపానికి చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శివకృష్ణను చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికత్స పొందుతూ అతను మృతి చెందాడు. శనివారం మృతుడి తల్లి సైదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చికిత్స పొందుతూ జీపీ కార్మికుడి మృతి
కేశంపేట: చికిత్స పొందుతూ జీపీ కార్మికుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని భైర్కాన్పల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గాదెకాడి శ్రీనయ్య (42) పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్య, ముగ్గురు ఆడపిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన శ్రీనయ్య తాగేందుకు డబ్బులు కావాలని తరచూ భార్య తో గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఈ నెల 7న రాత్రి తాగి ఇంటికి వచ్చాడు. ఇంకా మద్య ం తాగేందుకు డబ్బులు కావాలని భార్యను అడగడంతో ఆమె లేవని తెలిపింది. దీంతో అదే రాత్రి ఇంట్లో ఉన్న కలుపుమందు తాగా డు. గమనించిన కుటుంబ సభ్యులు షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్, స్కూటీ ఢీ..వ్యక్తికి తీవ్ర గాయాలు దుద్యాల్: టిప్పర్ – స్కూటీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని రోటిబండ తండా సమీపంలో లగచర్ల గేటు వద్ద శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట జిల్లా గుండుమల్ మండలం గండిహనుమాన్(దామ్లా) తండాకు చెందిన హన్మంతు హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి స్కూటీపై వస్తున్న క్రమంలో లగచర్ల గేటు వద్ద హకీంపేట్ నుంచి ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీ కొట్టింది. దీంతో హన్మంతు తలకు తీవ్ర గాయమైంది. మహబూబ్నగర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
మందుల్లేవ్!
కడ్తాల్: కడ్తాల్తో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో వ్యవసాయానికి అనుబంధంగా రైతులు పశు పోషణ చేపడుతున్నారు. ముప్పై, నలభై ఏళ్లుగా పాడి పరిశ్రమతో ఉపాధి పొందుతున్నారు. పశు సంపద అదనపు ఆదాయ వనరు కావడంతో, సాగు భూమిలోని కొంత విస్తీర్ణంలో గడ్డి పెంచడం వీరికి అలవాటుగా మారింది. సొంత భూమి లేనివారు సైతం ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా వీటికి ఏవైనా వ్యాధులు సోకితే సరైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ పశు వైద్యశాలల్లో మందులు లేకపోవడం చికిత్సలకు ఇబ్బందిగా మారుతోంది. వర్షాకాలంలో పశువులకు వ్యాధులు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో పశు సంపద భారీగా ఉండటంతో వెటర్నరీ హాస్పిటాళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో మందుల కొరత పెద్ద సమస్యగా మారింది. తప్పని పరిస్థితుల్లో గత్యంతరం లేక, ఆర్థికంగా భారమైన ప్రైవేటుగా మందులు కొనుగోలు చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పశువులకు సోకే వ్యాధులు పశువులకు కాలన్ని బట్టి వచ్చే వ్యాధులతో పాటు, సాధారణ వ్యాధులు సోకుతాయి. ప్రస్తుతం వర్షకాలం కావడంతో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సాధారణ జ్వరం, పారుడు రోగం, చర్మవ్యాధులు, గొంతు వాపు, జబ్బవాపు, గాలికుంటు, గురక, మసూచి, జీర్ణ సంబంధ వ్యాధులు, నోట్లో పుండ్లు పడుతుంటాయి. నిలిచిన మందుల సరఫరా పశు సంవర్ధక శాఖ అధికారులు ఏడాదికి నాలుగు విడతల్లో వెటర్నరీ ఆస్పత్రులకు మందులు సరఫరా చేస్తుంది. మండల పరిధిలోని పశు సంపద ఆధారంగా వీటిని పంపిణీ ఉంటుంది. కానీ గతేడాది అక్టోబర్ నుంచి మందుల సరఫరా పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. దీంతో మూగజీవాలకు రోగా లొస్తే మందులు అందుబాటులో ఉండటం లేదు. అవగాహన అంతంతే.. పశువులకు వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించేందుకు అవసరమైన కార్యక్రమాలు నిర్వహించడం లేదు. సీజనల్ వ్యాక్సిన్లు వేసే సమయంలో రైతులకు ఒకటి, రెండు మాటలు చెప్పి మమ అనిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా వ్యాధులపై సరైన అవగాహన లేక మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. సబ్ సెంటర్లు తక్కువే.. మండలంలో 24 జీపీలు ఉండగా, కడ్తాల్లో పశువైద్య కేంద్రం ఉంది. మండల పరిధిలోని 5 గ్రామాల్లో సబ్ సెంటర్లు ఉన్నాయి. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్తో పాటు, ఎల్ఎస్ఏ, జేవీఓలు ముగ్గురు, అఫీస్ సబార్డినేట్లు నలుగురు విధులు నిర్వర్తిస్తున్నారు. వెటర్నరీ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ముద్వీన్, చల్లంపల్లి గ్రామాల్లో సరిపడా సిబ్బంది ఉండగా, రావిచేడ్లో సబార్డినేట్ పోస్ట్ ఖాళీగానే ఉంది. అన్మాస్పల్లిలో పశువైద్య ఉప కేంద్ర భవనం శిథిలావస్థకు చేరుకుని, సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. ముద్వీన్, కర్కల్పహాడ్ గ్రామాల్లో భవనాలు లేవు. పూర్తి స్థాయి సేవలు అందాలంటే పంచాయతీకి ఒకటి చొప్పున సబ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వ పశువైద్యశాలల్లో మందులు అందుబాటులో ఉండటం లేదు. ఇదే అదనుగా భావిస్తున్న ప్రైవేటు మెడికల్ షాపుల యజమానులు వారికి నచ్చిన ధరలకు విక్రయిస్తున్నారు. వెటర్నరీ ఆస్పత్రుల్లో మెడిసిన్ సమస్య పది నెలలుగా ప్రభుత్వం నుంచి నిలిచిపోయిన సరఫరా గత్యంతరం లేక ప్రైవేటులో తేవాలంటున్న వైద్యులు, సిబ్బంది సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్న మూగజీవాలు ఆందోళనలో రైతులు, పశుపోషకులు మండలంలో పశు సంపద ఆవులు 17,314 గేదెలు 2,017 గొర్రెలు 16,643 మేకలు 7,868 కోళ్లు 7,98,491 కుక్కలు 1.561 పందులు 1,127 -
గిరిజన తెగల్లో నేటికీ ఆకలి చావులు
● రాజ్యాంగ ఫలాలు వారికి దక్కడం లేదు ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది నిర్లక్ష్య వైఖరి ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ యాచారం: గిరిజన, ఆదివాసీ తెగల్లో నేటికీ ఆకలి చావులు తప్పడం లేదని.. స్వయంగా ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మార్పు రావడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ, గిరిజన హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మండల పరిధిలోని మంతన్గౌరెల్లి నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఆదివాసీ, గిరిజన తెగల్లో ఏ విధమైన మార్పు రావడం లేదని, రాజ్యాంగ ఫలాలు వారికి దక్కడం లేదని అన్నారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. హక్కులు, చట్టాలు, రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఘోరంగా విఫలమవుతున్నాయని దుయ్యబట్టారు. నేటికీ అటవీ భూములను నమ్ముకుని జీవనోపాధి పొందుతుంటే వాటని ఆక్రమిస్తూ మనోవేదనకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతంలో ప్రాజెక్టులు, ఖనిజం తవ్వకాల పేరుతో బలవంత తరలింపు జరుగుతోందన్నారు. ఇప్పటికీ తండాల్లో రోడ్డు మార్గం, విద్యుత్, తాగునీటి సౌకర్యాం లేక దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలసమయంలో అనేక హామీలు గుప్పిస్తూ గెలుపొందిన తర్వాత విస్మరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ, గిరిజన తండాల్లో పర్యటించి వారి సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ కంట్రోల్ కమిటీ చైర్మన్ డీజీ నర్సింహరావు, జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
దోమలు కుట్టి.. జబ్బు పట్టి
విష జ్వరాల బారినపడుతున్న జనం ఏకధాటి వర్షాలకు పారిశుద్ధ్యలోపం తోడవడంతో వ్యాధులు పంజా విసురుతున్నాయి. అనేక మంది కీళ్ల నొప్పులు, వాంతులు, విరేచనాలతోబాధపడుతున్నారు. ఏ ఇంట్లోకి తొంగి చూసినా జ్వర పీడితులే దర్శనమిస్తున్నారు. సర్కారు దవాఖానాలు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లాలోని 56 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోని ఓపీకి మే నెలలో 1,32,442 మంది బాధితులు రాగా, జూన్లో 1,34,725 మంది వచ్చారు. జూలైలో ఏకంగా 1,43,962మందికి చేరుకున్నారు. ప్రతి నెలా పది వేల మందికిపైగా విషజ్వరాల బారినపడుతున్నట్లు అంచనా. తాజాగా డెంగీ దోమలు సైతం పంజా విసురుతుండటంతో పల్లె వాసులే కాదు.. పట్టణ ప్రాంత ప్రజలు సైతం ఆందోళన చెందుతున్నారు. కొంత మంది వైద్యులు డెంగీ జ్వరాలను బూచీగా చూపి సాధారణ జ్వరపీడితులను ప్లేట్లెట్స్ కౌంట్స్, ఇతర చికిత్సల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 142 డెంగీ కేసులు నమోదు కాగా, హెచ్1ఎన్1(స్వైన్ఫ్లూ) కేసులు 14 నమోదు కావడం ఆందోళన కగిలిస్తోంది. కలుషిత నీరు, ఆహారంతో అనేక మంది వాంతులు, విరేచనాలు, విష జ్వరాల బారినపడుతున్నారు. కునుకు లేకుండా చేస్తున్న దోమలు తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, వాంతులు, చర్మంపై దద్దుర్ల వంటి లక్షణాలతో బాధపడుతూ ఆస్పత్రులకు చేరుతున్న వారిసంఖ్య క్రమంగా పెరుగుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు 142 డెంగీ కేసులు నమోదు కాగా, వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 77, శివారు మున్సిపాలిటీల్లో 53 ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 12 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గేటెడ్ కమ్యూనిటీలు, హైరైజ్ భవనాలు, ధనవంతులు ఎక్కువగా నివసించే శేరిలింగంపల్లి పీహెచ్సీలో 41, నార్సింగి పీహెచ్సీలో 29, సరూర్నగర్లో16, బాలాపూర్లో 11, అబ్దుల్లాపూర్మెట్లో 11, మైలార్దేవ్పల్లిలో 8, చించోడులో ఏడు చొప్పున కేసులు నమోదవడం విశేషం. ఆకర్షణ, ఆహ్లాదం కోసం ఇంటి ముందు కుండీల్లో మనీప్లాంట్స్, ఖాళీ ప్రదేశంలో రకరకాల పూలు, పండ్ల మొక్కలుపెంచుతున్నారు. ఏకధాటి వర్షాలకు ఆయా కుండీలు, ఇంటిపై ఖాళీ డబ్బాలు, ఇంటి పక్క ఖాళీ స్థలాల్లో పడేస్తున్న కొబ్బరి బొండాలు, టైర్లలో నీరు చేరి దోమలకు నిలయంగా మారుతున్నాయి. ఇంటిపై ఉన్న నీటి ట్యాంకులపైనే కాదు సెల్లార్లో ఉన్న సంపులపై కూడా మూతలు లేకపోవడం, నిర్మాణాల కోసం తవ్విని సెల్లార్ గుంతల్లో నీరు చేరడం, స్లాబులు, గోడల క్యూరింగ్ కోసం వాడిన నీరు రోజుల తరబడి నిల్వ ఉంటూ దోమల వ్యాప్తికి కారణమవుతున్నాయి. ఎప్పటికప్పుడు ఫాగింగ్ చేయకపోవడంతో ఇవి మరింత వృద్ధి చెంది కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చాపకింద నీరులా విస్తరిస్తున్న డెంగీ ఏకధాటి వర్షాలతో డయేరియా ముప్పు ఆస్పత్రులకు క్యూకడుతున్న జ్వరపీడితులు అప్రమత్తంగా ఉండాలంటున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ జిల్లాలో నమోదైన సీజనల్ వ్యాధులుమాసం ఫీవర్ డయేరియా రక్తవిరేచనాలు స్వైన్ఫ్లూ డెంగీ జనవరి 11,215 98 119 03 09 ఫిబ్రవరి 10,891 111 114 03 02 మార్చి 11,511 117 143 01 02 ఏప్రిల్ 11,025 79 86 01 04 మే 10,718 58 138 – 18 జూన్ 10,202 77 119 – 45 జూలై 10,778 78 109 05 53 ఆగస్టు (7వరకు) 1,752 08 19 01 09 అప్రమత్తం చేశాం కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఏఎన్ఎంలు, ఆశాలు ఆయా పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పర్యటించారు. ప్రజారోగ్యానికి హానికరంగా మారిన హైరిస్క్జోన్లను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య మెరుగు కోసం చర్యలకు సిఫార్సు చేశాం. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నాం. అన్ని ఆస్పత్రుల్లో అవసరమైన మందులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచుతున్నాం. అన్నిరకాల పరీక్షలతో పాటు మందులను ఉచితంగా అందజేస్తున్నాం. రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. – డాక్టర్ వెంకటేశ్వర్రావు, జిల్లా వైద్యాధికారి -
పూల ధరలకు రెక్కలు
శ్రావణమాసం,పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. ● రకాలను బట్టి రూ.200 నుంచి రూ.2,500 వరకు.. నవాబుపేట: ఓవైపు శ్రావణమాసం పూజలు.. మరో వైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో పూల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ నెల పవిత్ర మాసం కావడంతో పూల వినియోగం భారీగా ఉంది. మహిళలు అమ్మవారిని వివిధ రకాల పూలతో కొలుస్తుంటారు. గత శుక్రవారం వరలక్ష్మీ వ్రతం నాటి నుంచి పూల రేట్లు మరింత పెరిగాయి. పెళ్లి వేదికను పూలతో అలంకరించడానికి సుమారు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఆర్థికంగా ఉన్నవారు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. వధూవరులు మెడలో ధరించే పూలమాల ధర రూ.2 వేలకు పైగా ధర పలుకుతోంది. సాధారణ రోజులు ఒక మాల రూ.200 నుంచి రూ.500 వరకే ఉంటుంది. ఇక బంతి, చామంతి, మల్లె పూల దండలైతే రూ.1000 పైనే. లిల్లీ పూలదండకూడా భారీ ధర పలుకుతోంది. వారం రోజుల క్రితం మూర పూలు రూ.20కు ఇచ్చే వారు.. ప్రస్తుతం రూ.50 తీసుకుంటున్నారు. కిలో బంతి పూలు రూ.120 నుంచి రూ.150 పలుకుతున్నాయి. చామంతి కిలోకి రూ.300 నుంచి రూ.500 వరకు.. లిల్లీ పూలు కిలోకి రూ.600 నుంచి రూ.800 వరకు, కనకాంబరాలు కిలోకి రూ.2వేల నుంచి రూ.2,500 వరకు, గులాబీ కిలో రూ. 250 నుంచి రూ.400 వరకు ధర పలుకుతున్నాయి. ధరలు విపరీతంగా పెరగడంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. -
ఫ్లోరిడా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్
చేవెళ్ల: అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ నుంచి వ్యవసాయ శాస్త్రంలో డాక్టరేట్ సాధించింది చేవెళ్ల మండలం జాలగూడ గ్రామానికి చెందిన అత్తెల్లి అక్షర. గ్రామానికి చెందిన అత్తెల్లి రవీందర్రెడ్డి, అనిత దంపతులు కుమార్తె అక్షర చేవెళ్లలోనే పదో తరగతి వరకు చదువుకుంది. ఇంటర్ హైదరాబాద్లో పూర్తి చేసి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న పాలెం వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ చేసింది. మాస్టర్ చదివేందుకు అమెరికాలోని లూథియానా యూనివర్సిటీలో చేరింది. అక్కడ అగ్రికల్చర్ ఎమ్మెస్సీ పూర్తి చేసుకొని ఫ్లోరిడా యూనివర్సటీలో పీహెచ్డీలో చేరింది. వ్యవసాయ శాస్త్రంలో డాక్టరేట్ సాధించడంపై ఆమె కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఆదివాసీల సంక్షేమానికి కృషి డీటీడీఓ రామేశ్వరి దేవి కడ్తాల్: ఆదివాసీ గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి (డీటీడీఓ) రామేశ్వరి దేవి అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శనివారం మండల పరిధిలోని మైసిగండి గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల ప్రాంగణంలో పోరాట యోధుడు కొమురంభీం చిత్రపటానికి అధికారులు, ఉపాధ్యాయులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గిరిజనుల జీవన విధానం ప్రత్యేకమైనదని, అడవి తల్లిని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. అడవిబిడ్డల హక్కుల కోసం కొము రం భీం అహర్నిశలు పాటుపడ్డారని, వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహానుభావుడని కొనియాడారు. గిరిజనులకే కాదు.. అన్ని జాతులకు ఆయన పోరాటం స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో హెచ్ఎం పాపయ్య, హెచ్డబ్ల్యూఓ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. కొనాలంటే ‘చింత’ తుక్కుగూడ: చింత చిగురును ఇష్టపడని వారుండరు. ఏడాది కాలంలో జూలై నుంచి ఆగస్టు మాసం వరకు అధికంగా లభిస్తుంది. కొమ్మల చివరి ఉన్న చింత చిగురును కొయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎంతో రుచికరమైన చింత చిగురులో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కిలో ధర రూ.1000 నుంచి రూ.1,200 వరకు విక్రయిస్తున్నారు. నానాటికి చింత చెట్ల సంఖ్య తగ్గిపోవడం, చిగురు కోసే వారు లేకపోవడంతో ధర పెరిగిపోతోంది. అబుదాబిలో రోడ్డు ప్రమాదం: దంపతుల మృతి శంషాబాద్: శంషాబాద్ పట్టణంలోని సూరజ్గార్డెన్ బస్తీకి చెందిన ఓ కుటుంబం అబుదాబిలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో దంపతులు మరణించగా వారి కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పట్టణంలోని సూరజ్గార్డెన్ బస్తీకి చెందిన సయ్యద్ వాహిద్ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 7న ఉదయం కారులో ప్రయాణిస్తుండగా కారు అదుపు తప్పి ప్రమాదం చోటు చేసుకుంది. సయ్యద్ వాహిద్ సంఘటన స్థలంలోనే మృతిచెందగా అతడి భార్య ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. నాలుగు నెలల బాలుడికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 6, 8 సంవత్సరాల ఇద్దరు కుమార్తెలకు స్వల్పగాయాలయ్యాయి. దీంతో సూరజ్గార్డెలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం సాయంత్రం మృతదేహాలు రాగా ఖననం పూర్తి చేశారు. -
● పెళ్లిలో తమ్ముడికి రాఖీ కట్టిన అక్క
● ఎల్లలు దాటి వచ్చి..మొయినాబాద్: అన్నా చెల్లెలు, అక్కా తమ్ముల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. సోదరులు ఎక్కడు న్నా అక్కాచెల్లెళ్లు అక్కడికి వెళ్లి రాఖీ కట్టి తమ అనుబంధాన్ని చాటుకుంటారు. పెళ్లి వేడుకలోనే వరుడు (తమ్ముడు)కి రాఖీ కట్టి రక్షాబంధన్ విశిష్టతను చాటిచెప్పింది ఓ సోదరి. గతంలో మొయినాబాద్ ఇన్స్పెక్టర్గా పనిచేసి ప్రస్తుతం ఏసీబీ నిజామాబాద్ డీఎస్పీగా పనిచేస్తున్న శేఖర్గౌడ్ కూతురు నిషిత, కేశంపేటకు చెందిన అన్వేష్రెడ్డి వివాహ వేడుక శనివారం మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంలోని స్టార్ కన్వెన్షన్లో జరిగింది. పెళ్లి వేడుకలోనే అన్వేష్రెడ్డికి అక్క మౌనిక రాఖీ కట్టి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఏసీపీ డీజీ విజయ్కుమార్, ఐపీఎస్ అధికారి కోటిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. -
● హెల్మెట్ ధరించని వాహనదారులకు..
● పోలీసుల ప్రత్యేక కౌన్సెలింగ్ ● ఆర్టీసీ.. ఫుల్ గి‘రాఖీ’పహాడీషరీఫ్: రాఖీ పౌర్ణమి సందర్భంగా సొంతూళ్లకు వెళ్తున్న వాహనదారులకు బాలాపూర్ పోలీసులు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి రాఖీలు కట్టారు. హెల్మెట్ ధరించకుండా పుట్టింటికి భర్తలతో వెళ్తున్న వాహనాలను గుర్తించి హెల్మెట్ ధరించాలని, ఏదైనా ప్రమాదం జరిగితే వచ్చే ఏడాది రాఖీలు కట్టలేకపోతారని అవగాహన కల్పించారు. ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్ ఆధ్వర్యంలో రాఖీ శుభాకాంక్షలు తెలిపి మరీ మహిళా పోలీస్ అధికారులతో రాఖీలు కట్టించారు. -
విద్యుదాఘాతంతో యువరైతు మృతి
● బోరుమోటారు సర్వీస్ వైర్ సరిచేసే క్రమంలో షాక్ ● ముద్దాయిపేటలో విషాదం యాలాల: వ్యవసాయ పొలం వద్ద విద్యుదాఘాతానికి గురై ఓ యువ రైతు మృత్యువాత పడ్డాడు. యాలాల మండలం ముద్దాయిపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పాలేపల్లి రమేశ్గౌడ్(38) వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వరి సాగుకు కరిగేట్లు సిద్ధం చేసుకుని శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లాడు. ఈ సమయంలో బోరుకు కరెంటు సరఫరా చేసే సర్వీస్ వైర్ తెగిపడి ఉండటాన్ని గమనించాడు. దీన్ని అతికించే క్రమంలో షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అటుగా వెళ్తున్న రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించగా రమేశ్ అప్పటికే చనిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. మృతుడికి భార్య గౌరమ్మ, కొడుకు ప్రదీప్, కూతురు శ్రీజ ఉన్నారు. అందరితో కలివిడిగా ఉండే రమేశ్ మృతిని గ్రామస్తులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. పలు పార్టీల నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రమేశ్ అకాల మరణంతో ముద్దాయిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. వాగును విడిపించకుండా తవ్వకాలు ఏమిటి ? చిలుకవాగు పనులను అడ్డుకున్న స్థానిక రైతులు తాండూరు: రియల్ వ్యాపారులు కబ్జా చేసిన చిలుక వాగును విడిపించకుండా, తమ పొలాల నుంచి వాగును తరలించడంపై స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్ మార్గం సాయిపూర్ ప్రాంతంలో శుక్రవారం చేపట్టిన వాగు తవ్వకం పనులను అడ్డుకున్నారు. మున్సిపల్ కమిషనర్ విక్రంసింహారెడ్డి వెళ్లి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. చిలుక వాగు పరివాహక ప్రాంతం తమ పొలాల మధ్య నుంచి వెళ్లదని తెలిపారు. ఆక్రమణలను తొలగించకుండా తమ భూముల పైనుంచి తవ్వకాలు చేపట్టడం ఏమిటని ఆవేదన వ్యక్తంచేశారు. -
విన్యాసాలు అదుర్స్
ఇబ్రహీంపట్నం: గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో దేశ రక్షణ, వాయుసేన దళాలు శుక్రవారం ప్రత్యేక విన్యాసాలు నిర్వహించాయి. హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రానికి చెందిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ), భారత రక్షణ వాయుసేన (ఐఏఎఫ్) సంయుక్తంగా హెలికాప్టర్ల సాయంతో ‘హై–ఇంటెన్సిటీ రూఫ్ టాప్ స్లిదరింగ్’ పేరిట విన్యాసాలు ప్రదర్శించాయి. ఉగ్రమూకల దాడులు, యుద్ధ పరిస్థితులు, ప్రమాద సంఘటనలు చోటుచేసుకుంటే .. అలాంటి విపత్కర, అత్యవసర సమయాల్లో ప్రజలను ఏ విధంగా కమాండోలు కాపాడతారో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల వైస్ చైర్మన్ గగన్దీప్ సింగ్ కోహ్లి, ఎండీ హెచ్ఎస్ సైనీ, ఎన్ఎస్జీ దళాల కమాండోలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
సెల్ఫీ విత్ రాఖీ
అక్కాచెల్లెళ్ల ఆత్మీయ వేడుక రక్షాబంధన్. ఈ పర్వదినాన సోదరులకు కట్టే రాఖీ.. ప్రేమానురాగాలకు ప్రతిరూపంగా నిలుస్తుంది. ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా చూపించాలనే ఉద్దేశంతో ‘సెల్ఫీ విత్ రాఖీ’ ఫొటోలను ఆహ్వానిస్తోంది ‘సాక్షి’. మీ కుటుంబం, సమూహంలో శనివారం నిర్వహించిన రాఖీ సంబరాలను సెల్ఫీ తీసుకుని పంపిస్తే బాగున్నవాటిని ఎంపిక చేసి ప్రచురిస్తాం. ఫొటోతో పాటు మీ పట్టణం లేదా గ్రామం పేరు రాసి పంపండి. పర్యావరణ హిత రాఖీలకు ప్రాధాన్యం ఉంటుంది. మీరు వాట్సప్ చేయాల్సిన నంబర్లు 92906 11217, 98669 34975 -
స్వచ్ఛ శంకర్పల్లిలో భాగస్వాములుకండి
శంకర్పల్లి: మున్సిపల్ ప్రజలంతా స్వచ్ఛ శంకర్పల్లిలో భాగస్వాములు కావాలని సినీ నటుడు సునీల్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 100 రోజుల పట్టణ ప్రణాళికలో భాగంగా ఆయన సందేశాన్ని ఇచ్చారు. తెలంగాణ మున్సిపల్ శాఖ ‘మా ర్పు– అభివృద్ధికి మలుపు’ నినాదంతో ముందుకు వెళ్తూ.. 100 రోజుల ప్రణాళిక చేపట్టిందని తెలిపారు. ప్రజలు తమ ఇళ్లలో తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ ఆటోల్లో వేయాలని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, అవకాశం ఉన్నచోట విరివిగా మొక్కలు నాటాలని కోరారు. ‘స్వచ్ఛ తెలంగాణ– స్వచ్ఛ శంకర్పల్లి’ కోసం ప్రతి ఒక్కరం కృషి చెద్దామన్నారు. -
న్యాయవాది బలవన్మరణం
ఇబ్రహీంపట్నం: ఆర్థిక ఇబ్బందులతో ఓ న్యాయవాది బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఇబ్ర హీంపట్నం పీఎస్ పరిధిలో గురవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. చర్లపటేల్గూడకు చెందిన న్యాయవాది పి.నరేందర్గౌడ్(34)కు ఇదే వృత్తిలో ఉన్న చంద్రికతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. ఇరువురూ ఇబ్రహీంపట్నం న్యాయస్థానంలో కేసులు వాదిస్తున్నారు. ఇటీవల ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న నరేందర్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. గురువారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో కోర్టుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. అతన్ని వెతుకుతున్న క్రమంలో తమ వ్యవసాయ క్షేత్రంలోని పశువుల కొట్టంలో ఉరేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాడీని ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
కూరగాయలకు వెళ్లి.. వరదనీటిలో మునిగి..
మొయినాబాద్: కూరగాయలు తెచ్చేందుకు ఇంటి నుంచి వెళ్లిన ఓ వలస కూలీ వరద నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మొయినాబాద్ ఠాణా పరిధిలోని హిమాయత్నగర్ చౌరస్తాలో శుక్రవారం వెలుగుజూసింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. నారాయణఖేడ్ జిల్లా దామరగిద్దకు చెందిన వంశిరాజు ఇంద్రప్ప(50), భార్య అంజమ్మతో కలిసి రెండు నెలల క్రితం బతుకుదెరువుకోసం హిమాయత్నగర్కు వలస వచ్చారు. కూలిపనిచేస్తూ అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. కాగా గురువారం రాత్రి 7 గంటల సమయంలో ఇంద్రప్ప కూరగాయలు తేవడానికి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో హిమాయత్నగర్ చౌరస్తాలో రోడ్డుపై వరదనీరు పెద్ద ఎత్తున చేరింది. రోడ్డుపైన నిలిచిన వరదనీటిలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఇంద్రప్ప కల్వర్టు వద్ద గుంతలో పడి నీటిలో మునిగిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో నీటిలోనే మునిగి మృతి చెందాడు. తన భర్త తిరిగి రాలేదని అంజమ్మ రాత్రి సమయంలో పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం తిరిగి వెతుకుతుండగా హిమాయత్నగర్ చౌరస్తాలో ఉడిపి హోటల్ దగ్గర ఉన్న కల్వర్టు గుంతలో మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. వలస కూలీ మృతి -
దారి తప్పిన ప్లానింగ్
అన్నీ ఉన్నా అధ్యయనమేది? రోడ్ల నిర్మాణంలో సరైన ప్రణాళిక అవలంబించకపోవడంతోనే అసలు సమస్య వస్తోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైనా ఒక ప్రదేశంలో రోడ్డు నిర్మించాల్సి వస్తే దాని వల్ల ఎక్కువగా ఎవరి ప్రయోజనం... అంటే స్కూల్ జోనా? వాణిజ్య ప్రాంతమా? తదితర విషయాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం జరగాలి. దానికి తగ్గట్టు మార్పుచేర్పులతో రహదారి నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సిటీలో మాత్రం ఆర్టీరియల్ రోడ్లు, ఇన్నర్ రోడ్లు, ఇంటర్మీడియట్ రోడ్లు దేనికీ సరైన ప్రణాళిక, అధ్యయనం లేకుండానే నిర్మితమవుతాయి. అందుకే ట్రాఫిక్ అస్తవ్యస్తంగా కొనసాగుతోంది. సాక్షి, సిటీబ్యూరో: చిన్న వర్షం కురిస్తే రోడ్లన్నీ జలమయం... ఎక్కడి వాహనాలక్కడే నిలిచిపోవాల్సిందే.. ఇక ఎక్కడై ప్రమాదం జరిగినా.. రోడ్డు గుంత పడినా.. వాహనం బ్రేక్డౌన్ అయినా గంటల తరబడి ట్రాఫిక్ జామే.. వీటన్నింటికీ ప్రధాన కారణం ఇంజినీరింగ్ లోపాలే. రహదారులు, కూడళ్లను శాసీ్త్రయంగా అధ్యయనం చేసి నిర్మించకపోవడం. ట్రాఫిక్ కానీ, నాలాల విషయంలో కానీ మన అధికారులు, పాలకులు ఇంజినీర్ల పాత్ర విస్మరించడంతోనే ఈ పరిస్థితులు దాపురించాయి. నాటి నివేదికలే ఇప్పటికీ దిక్కు నిజానికి ట్రాఫిక్ నియంత్రణ బాధ్యత పూర్తిగా పోలీసులదే అనుకుంటే పొరపాటే. వాస్తవానికి ప్రధాన కూడళ్లలో సిగ్నళ్ల వద్ద నిలబడి ట్రాఫిక్ క్రమబద్ధంగా వెళ్లేందుకు మాత్రమే వారు దోహదపడతారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు విధించడం వంటివి అదనంగా చేస్తారు. ట్రాఫిక్ సజావుగా, సాఫీగా సాగిపోయేందుకు రోడ్లు, కూడళ్లలోని జంక్షన్లు, ఫ్లైఓవర్లు, ప్రధాన రోడ్లను కలిపే యాక్సెస్ రోడ్లు వంటివి ప్రణాళికాబద్ధంగా రూపొందించకపోవడంతోనే నగరంలో ఈ సమస్యలంటున్నారు ట్రాఫిక్ నిపుణులు. నాలాల విషయంలో ఇంజినీరింగ్ ప్రముఖుడు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1920లో రూపొందించిన నివేదికలే ఇప్పటికీ పనికి వస్తున్నట్లే.. రోడ్ల విషయంలో అలాంటి ప్రణాళికలు లేకపోవడమే ఈ సమస్యకు మూలకారణమని స్పష్టం చేస్తున్నారు. లోపాలతోనే వేగానికి తూట్లు నగరంలో వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వేల కిలోమీటర్ల పొడవున రోడ్లు ఉన్నాయి. విపరీతంగా విస్తరిస్తున్న ప్రధాన రోడ్లు, వాటిని కలిపే యాక్సెస్ రోడ్లు, చిన్నా చితకా రోడ్లతో పాటు చిన్నచిన్న గల్లీలనూ లెక్కేస్తే ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. వీటి నిర్మాణంలో ఎలాంటి ప్రణాళిక లేదన్నది నిపుణులు చెబుతున్న వాస్తవం. అత్యంత ప్రధానమైన రోడ్లలోనూ నానాటికీ రద్దీ పెరిగిపోతోంది. వాటికి సమాంతర రోడ్ల అభివృద్ధి అనే ఊసే లేకపోవడంతో ట్రాఫిక్ అనేక పద్మవ్యూహంలా మారిపోతోంది. వాస్తవానికి నగరంలోని ప్రధాన ఆర్టీరియల్ రోడ్లు (ప్రధాన రహదారులు) అయిన పంజగుట్ట, అమీర్పేట్, బేగంపేట్, సికింద్రాబాద్, తార్నాక తదితర రోడ్లన్నీ వాహనాలు కనీసం గరిష్టంగా 60 కి.మీ. వేగంతో వెళ్లగలిగే సామర్థ్యం ఉన్న పెద్దరోడ్లే. కానీ కేవలం ఇంజినీరింగ్ ప్రమాణాల లోపాలతోనే ఇప్పుడీ రోడ్లన్నీ ట్రాఫిక్ వలయంలో చిక్కిపోతూ సరాసరిన గంటకు కనీసం 30 కిమీ వేగంతోనూ వాహనాలు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నాయి. కిర్లోస్కర్ కమిటీ నివేదికా బుట్టదాఖలే.. నగరంలో 2000వ సంవత్సరం ఆగస్టులో కురిసిన భారీ వర్షం–వరద తీవ్రత ప్రజలతో పాటు ప్రభుత్వానికీ ముచ్చెమటలు పట్టించింది. దీంతో వరద నివారణ చర్యలు సిఫార్సు చేయడానికి 2003లో కిర్లోస్కర్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ అప్పట్లో ఉన్న ఎంసీహెచ్ పరిధిలో వరద నీరు సాఫీగా వెళ్లేందుకు నాలాలను 170 కిలోమిటర్ల మేర విస్తరణ తక్షణం చేపట్టాలని, అందుకు రూ.264 కోట్లు వ్యయం అవుతుందని తేల్చింది. 2007లో నగర శివార్లలోని పన్నెండు మున్సిపాలిటీలలో మున్సిపల్ కార్పోరేషన్లో విలీనమై జీహెచ్ఎంసీ ఏర్పడింది. ఇలా 625 చ.కి.మీల్లో విస్తరించిన గ్రేటర్కు సమగ్ర మాస్టర్ ప్లాన్, సూక్ష్మస్థాయి వరదనీటి పారుదల, మేజర్, మైనర్ వరద నీటి కాలువ ఆధునీకరణ కోసం సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) బాధ్యతను ఓయంట్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించారు. దాని ప్రాథమిక అంచనా మేరకు గ్రేటర్లో వరద నీటి సమస్య పరిష్కారానికి అప్పట్లోనే రూ. 6247 కోట్లు అవసరం అవుతాయని తేల్చింది. ఈ నివేదికలు ప్రాథమిక స్థాయిలోనూ అమలు చేయకపోవడంతో ఇబ్బందులు తప్పట్లేదు. ఆ ‘భుజం’కు ఊతమేది? నగరంలో ఎక్కడైనా ప్రమాదం జరిగినా, బస్సు వంటివి బ్రేక్ డౌన్ అయినా గంటల తరబడి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవాల్సిందే. నిజానికి ప్రధాన ఆర్టీరియల్ రోడ్లు ఒక్కోటి 2.5 మీటర్ల వెడల్పుతో కనీసం నాలుగు లైన్లుగా ఉండాలి. దీనితో పాటు ఆ రోడ్డుకు సాంకేతికంగా ‘షోల్డర్స్’ అని పిలిచే ఖాళీ ప్రదేశం ఉండాలి. ఎందుకంటే ఆ మార్గంలో ఏదైనా వాహనం పాడయితే అది మిగతా వాహనాలకు అవాంతరం కాకుండా ఉండేందుకు దాన్ని షోల్డర్స్లో నిలిపి వేస్తారు. కానీ మనదగ్గర ఇవి ఏ ప్రాంతంలోనూ మచ్చుకు కూడా కనిపించవు. ఫుట్పాత్లుగా పిలిచే కాలిబాటలపై ఉన్న ఆక్రమణలను తొలగించి వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలంటూ అనేకసార్లు హైకోర్టు, లోకాయుక్త వంటి వ్యవస్థలు హెచ్చరించాయి. రహదారికి పక్కన తప్పనిసరిగా కాలిబాటలు ఉండాలి. ఫలితంగా పాదచారులు వీటిని ఆశ్రయిస్తే ట్రాఫిక్ జామ్స్ తగ్గడంతో పాటు ప్రమాదాలు అదుపులోకి వస్తాయి. సిటీలో ప్రధాన రోడ్లతో పాటు యాక్సెస్ రోడ్లకూ ఉన్న ఫుట్పాత్లు ఆక్రమణలో ఉన్నాయి. ఇలా జరగడానికి ఇంజినీరింగ్ లోపమే ప్రధాన కారణం. ట్రాఫిక్ టెర్రర్తో నగరంలో నరకం నాలాల సమస్యకు పరిష్కారం శూన్యం ఇంజినీరింగ్ లోపాలే ప్రధాన కారణం ప్రణాళికలు లేని అధికారులు, పాలకులు బుట్టదాఖలైన కిర్లోస్కర్ కమిటీ నివేదిక -
అయ్యవారిపల్లి వాగులో వరద ఉధృతి
షాద్నగర్రూరల్: భారీ వర్షాలకు వాగులు, వంకలు పారుతున్నాయి. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఫరూఖ్నగర్ మండల పరిధిలోని అయ్యవారిపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. చించోడ్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రదంలోకి వర్షపు నీరు చేరింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎంపీడీఓ బన్సీలాల్ శుక్రవారం అంగన్వాడీ కేంద్రం, వాగు పరిసరాలను పరిశీలించారు. వాగు సమీపంలోకి ప్రజలు వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. ప్రజలు వాగు సమీపంలోకి రావద్దని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయ్యవారిపల్లికి ప్రయాణించేవారు మరో మార్గం ఎంచుకోవాలని చెప్పారు. వాగును పరిశీలించిన వారిలో ఎంపీఓ జయంత్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి భూపాల్రెడ్డి తదితరులు ఉన్నారు.రాకపోకలు నిలిపివేసిన అధికారులు -
వరద సమస్యకు మూసీ పునరుజ్జీవమే పరిష్కారం
భారీ వర్షాలు కురిసినా తట్టుకొనేలా వ్యవస్థల ప్రక్షాళన ● నీటి ప్రవాహానికి వీలుగా డ్రైనేజీలు, ట్రాఫిక్ చిక్కుల్లేకుండా చర్యలు ● చెరువులు, కుంటలు, నాలాలు ఎస్టీపీల ద్వారా మూసీకి అనుసంధానం ● అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరంలో భారీ వర్షాలు కురిసినా తట్టుకునేందుకు వీలుగా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ నది పునరుజ్జీవం ద్వారానే వరద నీటిని సమర్థంగా నిర్వహించవచ్చని ఆయన పేర్కొన్నారు. వర్షాలతో నగర జనజీవనం అస్తవ్యస్తం కాకుండా ఉండాలంటే శాశ్వత ప్రాతిపదికన అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వరద నీరు, డ్రైనేజీలు, ట్రాఫిక్ వ్యవస్థలను మరో వందేళ్ల భవిష్యత్ అవసరాలను అంచనా వేసుకొని కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఢిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం నగరానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. గురువారం రాత్రి హైదరాబాద్లో కురిసిన భారీ వర్షంతో తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్లో మరోసారి పునరావృతం కాకుండా అనుసరించాల్సిన తక్షణ, శాశ్వత చర్యలపై అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని విభాగాల అధికారుల అభిప్రాయాలను తీసుకున్నారు. వాతావరణ మార్పులతోనే.. నగరంలో గురువారం రాత్రి కుండపోత వర్షానికి వాతావరణ మార్పులే ప్రధాన కారణమని, అందు కు తగినట్లుగా నగరంలో అన్ని వ్యవస్థలను ఆధునికీకరించాల్సిన అవసరముందని ఈ సందర్భంగా సీఎం అభిప్రాయపడ్డారు. భారీ వర్షాలతో తలెత్తే ఈ విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు విపత్తుల నివారణ నిర్వహణ ప్రణాళిక సమ ర్థంగా అనుసరించాలని ఆదేశించారు. ఎలాంటి భారీ వర్షాన్నైనా తట్టుకొనేలా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును వెంటనే చేపట్టాలన్నారు. నగరంలో 55 కిలోమీటర్ల పొడవునా మూసీని పునరుద్ధరించటం ద్వారా పరీ వాహక ప్రాంతంతో పాటు అన్ని ప్రాంతాలు, కాలనీలకు వరద ముప్పును నివారించవచ్చన్నారు. మూసీలో వరద నీరు చేరేలా.. ఓఆర్ఆర్ లోపల ఉన్న కోర్ అర్బన్ ప్రాంతంలో వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అన్ని వైపుల నుంచి వరద నీరు మూసీకి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు, మీరాలం చెరువులతో పాటు అన్ని చెరువులు, కుంటలను నాలాల ద్వారా మూసీకి అనుసంధానం చేయాలన్నారు. డ్రైనేజీల ద్వారా వచ్చే నీటిని ఎస్టీపీ (సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల) ద్వారా శుద్ధి చేసి మూసీలోకి వదలాలని చెప్పారు. నగరంలో ఎక్కడ వర్షం పడినా మూసీలోకి చేరేలా అనుసంధానం జరగాలన్నారు. ప్రాజెక్టును వరద నీటి నిర్వహణకు వీలుగా డిజైన్ చేయాలని చెప్పారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పాత నగరంలో పెడిస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేసి పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టాలని సూచించారు. చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి ప్రాంతాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ జోన్లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, హెచ్ఎండీఏ పరిధిలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ ఇలంబర్తి, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, జేఎండీ గౌతమి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
బీసీల్లో ఐక్యత అవసరం
షాబాద్: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిధిలోని బోడంపహాడ్లో బీసీ సేన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎనుకున్నారు. అధ్యక్షుడిగా వెంకటేశ్, ఉపాధ్యాక్షులుగా లింగం, ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా చాకలి శ్రీనివాస్, కార్యదర్శులుగా మహేష్, లక్ష్మణ్, కోశాధికారిగా హరీశ్గౌడ్, కార్యదర్శిగా లక్ష్మణ్కు నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. బీసీలు అన్ని రంగాల్లో రాణించాలంటే గ్రామస్థాయి నుంచే ఐక్యంగా ఉండాలన్నారు. ప్రపంచ జనాభాలో 70శాతం ఉన్న బీసీలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారన్నారు. ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బర్క కృష్ణ నేతృత్వంలో గ్రామస్థాయి నుంచి బీసీలను బలోపేతం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీసేన మండల మండల అధ్యక్షుడు కమ్మరి దయాకర్చారి, యూత్ అధ్యక్షుడు అజయ్కుమార్, నాయకులు బాల్రాజ్, ఇనాయత్, అబ్బాస్ తదితరులున్నారు. బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ -
ఉత్సవాలకు ఆహ్వానం
తుక్కుగూడ: రావిర్యాల శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ ఆలయ వార్షిక వేడుకలు ఈనెల 11 నుంచి నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్సవాలకు రావాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డితో కలిసి బీఆర్ఎస్ నాయకులు ఆహ్వానించారు. ఈ మేరకు శుక్రవారం నగరంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రెడ్డిగళ్ల రత్నం, నాయకులు జెల్లాల లక్ష్మయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. స్వయం ఉపాధిలో ఉచిత శిక్షణ మొయినాబాద్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రంగాల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్బీఐ ఆర్సెటీ డైరెక్టర్ మహ్మద్ అలీఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని చిలుకూరు మహిళా ప్రాంగణం ఆవరణలో ఉన్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం(ఆర్సెటీ)లో కార్ డ్రైవింగ్, మొబైల్ రిపేరింగ్, బైక్ మెకానిక్, సీసీటీవీ కోర్సుల్లో నెల రోజుల పాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ నెల 11న శిక్షణ మొదలవుతుందని.. 18–45 సంవత్సరాల మధ్య వయసు ఉండి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎస్ఎస్సీ మె మో, రేషన్ కార్డు, ఆధార్కార్డు, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ కాపీలతోపాటు నాలుగు పాస్పోర్ట్సైజు ఫొటోలతో ఈ నెల 9న ఆర్సెటీ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. శిక్షణా కాలంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యంతోపాటు ట్రైనింగ్ మెటీరియల్, టూల్ కిట్స్ ఉచితంగా అందజేయనున్నట్టు చెప్పారు. వివరాలకు 95506 06019, 85001 65190 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. పాల ఉత్పత్తులపై అవగాహన యాచారం: పీవీ నర్సింహరావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం గునుగల్, గడ్డమల్లయ్యగూడ గ్రామాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ డాక్టర్ కొండల్రెడ్డి, ఫార్మర్ డీన్ డాక్టర్ రఘునందన్ తదితరులు శాసీ్త్రయ పద్ధతిలో పాడిపశువుల పెంపకం, పాల పదార్థాల తయారీపై మహిళా రైతులకు అవగాహన కల్పించారు. పశుపోషణ, తక్కువ ఖర్చుతో షెడ్ల నిర్మాణం, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వంటి అంశాలను వివరించారు. కలాకండ్, పన్నీరు, చన్నారసగుల్లా, రసమలై, మజ్జిగ, లస్సీ తదితర పదార్థాల తయారీపై అవగాహన కల్పించి, శిక్షణ ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అధికారులు రత్నాకర్, శశికుమార్, సాహిత్యరాణి, మండల వ్యవసాయాధికారి రవినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు పనులు అడ్డుకుంటున్న వ్యక్తిపై ఫిర్యాదు
కేశంపేట: రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకుంటున్న రైతుపై చర్యలు తీసుకోవాలని గోప్లాయకుంటతండా వాసులు శుక్రవారం తహసీల్దార్ అజాంఅలీకి వినతిపత్రం అందజేశారు. వివరాలు.. బైర్కాన్పల్లి శివారు గోప్లాయకుంట తండాకు 20 ఏళ్ల క్రితం కంకర రోడ్డును వేశారు. ప్రస్తుతం బీటీ రోడ్డు మంజూరు కావడంతో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న రైతు తన పొలం పక్క నుంచి రోడ్డు వేయాలంటూ నిత్యం కాంట్రాక్టర్ను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపించారు. రోడ్డు నిర్మాణ మార్గం మార్చితే మిగిలిన రైతుల పొలాలు నీటమునుగుతాయని.. అధికారులు స్పందించి పాతరోడ్డు మాదిరిగానే బీటీ రోడ్డు వేసేలా తగు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ను కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో రాయికంటి రాంచంద్రయ్య, కరుణాకర్, నర్సింహ తదితరులు ఉన్నారు. -
రైస్మిల్ నుంచి రసాయన వ్యర్థాలు
ఇబ్రహీంపట్నం రూరల్: రైస్మిల్ మూసి వేయాలని ఉప్పరిగూడ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మండల పరిధిలోని ఉప్పరిగూడలో గురువారం శ్రీనివాస రైస్ మిల్ నుంచి నాలుగు ట్యాంకర్లకు పైగా రసాయన వ్యర్థాలను రోడ్డుపైకి వదిలారు. పోచారం వరకు ఈ వ్యర్థాలు పారుతుండడంతో రాకపోకలు సాగించిన వారు దుర్గంధంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు రైస్మిల్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టి అనుమతులు లేకుండా పరిశ్రమ నెలకొల్పారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిల్లు యజమానికి సమాధానం ఇవ్వకుండానే అక్కడ నుంచి వెనుదిరిగారు. ఈ ఆందోళనలో ప్రభాకర్రెడ్డి, జితేందర్రెడ్డి, రాజేందర్రెడ్డి, శివకుమార్, మంత్రి శ్రావణ్, మోహన్రెడ్డి, కృష్ణ, మహేందర్, సుక్రు, గ్రామస్తులు పాల్గొన్నారు . దుర్గంధంతో ఇబ్బంది పడిన స్థానికులు ఆందోళన చేపట్టిన ఉప్పరిగూడ గ్రామస్తులు -
రియల్ మాయ!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: అది పూర్తిగా 111 జీఓ పరిధిలో ఉన్న భూమి. డీటీసీపీ, హెచ్ఎండీఏలు సైతం వెంచర్ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయవు. కానీ కొంత మంది రియల్టర్లు ఏకంగా అనధికార వెంచర్ చేశారు. గుంటల్లో ఉన్న వ్యవసాయ భూమిని గజాల్లోకి మార్చి గుట్టుగా ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్లు చేశారు. ఇంతటితో ఆగకుండా నక్షబాటను కబ్జా చేసి పక్కనే ఉన్న పట్టా భూముల్లో కలిపేశారు. చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసి సరిహద్దు భూముల్లోకి ఇతరుల రాకపోకలను నిలిపివేశారు. కబ్జాకు గురైన నక్షబాటకు విముక్తి కల్పించాలని కోరుతూ ఓ బాధితుడు ఇటీవల కలెక్టర్కు విన్నవించారు. రెవెన్యూ అధికారులు సర్వే చేసి, నక్షబాట ఉన్నట్లు ఇప్పటికే నిర్ధారించినప్పటికీ.. దారి వదిలేందుకు రియల్టర్లు మాత్రం అంగీకరించడం లేదు. విధిలేని పరిస్థితుల్లో సదరు బాధితుడు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.అనధికారిక వెంచర్.. అడ్డగోలు అమ్మకాలు2018లో మెయినాబాద్ మండలం ముర్తుజగూడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 251, 252(ఓల్డ్ సర్వే నంబర్లు 88,146)లోని 11.24 ఎకరాల్లో కొంతమంది రియల్టర్లు 165 ప్లాట్లతో అనధికారిక వెంచర్ చేశారు. పద్మావతి కాలనీగా నామకరణం చేశారు. గుంటల్లో ఉన్న భూమిని గజాల్లోకి మార్చి, గుట్టుగా రిజిస్ట్రేషన్లు చేయించారు. ఈ క్రమంలో భూములకు ఆనుకుని ఉన్న 253 సర్వే నంబర్లోని నక్షబాటను సైతం కబ్జాచేసి పద్మావతి కాలనీలో కలిపేశారు. 111 జీఓ పరిధిలో వెంచర్ చేయడంతో పాటు 120 నుంచి 350 గజాల చొప్పున ప్లాట్లు చేసి విక్రయించారు. ఆ వెంచర్ నుంచి పై భాగంలో ఉన్న వ్యవసాయ భూముల్లోకి వెళ్లే వారికి దారి లేకుండా చేసి రాకపోకలను నిషేధించారు.ప్రజావసరాల కోసం వదిలిన ఖాళీ స్థలాలను(1,866 గజాలతో ఒకటి, 216 గజాలతో మరొక పార్కును) ముర్తుజగూడ గ్రామ పంచాయతీ పేరున గిఫ్ట్ డీడ్ చేయడం కొసమెరుపు. నాలా కన్వర్షన్ కూడా కానీ ఈ భూములను రిజిస్ట్రేషేన్లు ఎలా చేస్తున్నారో అంతు చిక్కడం ప్రశ్న. వాస్తవ విస్తీర్ణానికి మించి వెంచర్లో భూములున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పక్క సర్వే నంబర్లలో ఉన్న మూడు ఎకరాల ఇనాం భూములను ఈ అనధికారిక వెంచర్లోనే కలిపేసినట్లు సమాచారం. స్థానికంగా రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు రియల్టర్లతో కుమ్మకై ్క.. కళ్లముందే అక్రమంగా వెలుస్తున్న వెంచర్లను చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా రియల్టర్లకు అడ్డూఅదుపు లేకుండా పోయింది.అవన్నీ అక్రమ వెంచర్లే..అనధికారిక వెంచర్లో నక్షబాట ఉన్నట్లు గుర్తించాం. మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటించి ఇతర రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా ఏర్పాటు చేసిన ప్రహరీ తొలగిస్తాం. 111 జీఓ పరిధిలోని వెంచర్లకు ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేవు. జీఓ పరిధిలో ఉన్న వెంచర్లన్నీ..అక్రమమైనవే. – గౌతంకుమార్, తహసీల్దార్, మొయినాబాద్దారి చూపండిముర్తుజగూడ సర్వే నంబర్ 254లో 1.16 ఎకరాల పట్టా భూమి ఉంది. సరిహద్దులోని సర్వే నంబర్లు 251, 252లో నక్షబాట ఉండేది. పట్టా దారులు ఆ నక్షబాటను కబ్జా చేశారు. రెండు సర్వే నంబర్లలోని మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం ఆక్రమించి అనధికారిక వెంచర్ చేశారు. వెంచర్ చుట్టూ ప్రీకాస్ట్ వాల్స్ను ఏర్పాటు చేశారు. నక్షబాటను కబ్జా చేసి ప్లాట్లు చేయడంతో పాటు ఇతర రైతులు తమ భూముల్లోకి వెళ్లకుండా దారి మూసివేశారు. అధికారులు వెంటనే స్పందించి నక్షబాటను పునరుద్ధరించాలి. – ఆర్.మల్లికార్జున్, బండ్లగూడ -
సీసీ కెమెరాలతో నిఘా పటిష్టం
ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు యాచారం: సీసీ కెమెరాలుంటే పోలీస్ నిఘా ఉన్నట్లేనని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు పేర్కొన్నారు. మండల పరిధిలోని తక్కళ్లపల్లిలో గురువారం సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ప్రతి ఇంటి వద్ద సీసీ కెమెరాలు బిగించుకోవాలని సూచించారు. రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, యువకులు సమష్టిగా డబ్బులు జమ చేసి గ్రామాల్లోని ప్రధాన కూడళ్లల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాలు జరిగిప్పుడు సులభంగా నేరస్తులను గుర్తించే అవకాశం ఉందన్నారు. సీసీ కెమెరాలుంటే నేరాలు, చోరీలు తగ్గుముఖం పడుతాయన్నారు. యాచారం మండలంలోని 24 గ్రామ పంచాయతీలు, మరో 20కి పైగా అనుబంధ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతల సహకారం కోరనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి, ఎస్ఐ మధు, గ్రామస్తులు శ్రీశైలం, సంతోష, మల్లేష్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. అప్పు ఇచ్చిన మహిళ కిడ్నాప్ ● కారులో తీసుకెళ్తుండగా.. మరో కారును ఢీకొన్న వైనం ● మహిళతో పాటు ఇద్దరికి గాయాలు శంషాబాద్ రూరల్: రెండు రోజుల క్రితం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం ఘటన మహిళ కిడ్నాప్ కథగా మారింది. శంషాబాద్ ఇన్స్పెక్టర్ నరేందర్రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చేవెళ్ల మండలం, ఆలూరు వాసి కొండకల్ల పద్మజ అదే గ్రామానికి చెందిన కమ్మెట విజయ్గౌడ్కు రూ.నాలుగు లక్షలు అప్పుగా ఇచ్చింది. డబ్బులు తిరిగి ఇచ్చే విషయమై వారి మధ్య గొడవ జరిగింది. దీంతో విజయ్గౌడ్ ఆమైపె కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో పద్మజ భర్త బుచ్చయ్యను చికిత్స నిమిత్తం మల్కారంలోని ఆశాజ్యోతి ఆస్పత్రిలో చేర్పించారు. ఈ నెల 5న భర్తకు దుస్తులు ఇచ్చేందుకు వచ్చిన పద్మజను గుర్తించిన విజయ్గౌడ్, వెంకటేష్, సాయితో కలిసి ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. కారు కొత్వాల్గూడ శివారులో ఔటర్ సర్వీసు రోడ్డులో వెళ్తుండగా.. అదుపుతప్పి ఎదురుగా వచ్చిన బీఎండబ్ల్యూ కారును ఢీకొంది. ఈ ఘటనలో పద్మజ, విజయ్గౌడ్, సాయికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రెండు కార్లు ధ్వంసమయ్యాయి. బీఎండబ్ల్యూ కారులో ఉన్న వారు ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఎర్టిగా కారులో ఉన్న పద్మజను విచారించగా.. తనను కిడ్నాప్ చేసినట్లు తెలిపింది. దీంతో శంషాబాద్ పోలీసులు గురువారం ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని.. యువకుడిపై హత్యాయత్నం బంజారాహిల్స్: తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి దారికాచి ఆమె ప్రియుడిపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆసిఫ్నగర్కు చెందిన షేక్ ఆదిల్ టెంట్హౌస్లో పని చేసేవాడు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–10సీ లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో ఓ ఇంట్లో వంట మనిషిగా పని చేస్తున్న బోయిన్పల్లికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ప్రతిరోజూ ఆదిల్ ఆమెను ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో బైక్పై ఎక్కించుకుని బోయిన్పల్లిలో ఇంటి సమీపంలో వదిలేసేవాడు. బుధవారం రాత్రి ఆదిల్ ఆమెను బైక్ ఎక్కించుకుని జూబ్లీహిల్స్ చెక్పోస్టు మీదుగా వెళ్తుండగా అప్పటికే పథకం ప్రకారం చెక్పోస్టు సమీపంలో దారికాచిన ఆమె భర్త అంజద్ వీరిని అడ్డగించాడు. అందరూ చూస్తుండగానే ఆదిల్ తలపై బండరాయితో మోది అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆదిల్ను స్థానికులు చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలి జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ సూచించారు. గురువారం వికారాబాద్లోని సంగం లక్ష్మీబాయి రెసిడెన్షియల్ పాఠశాలను ఆయన ట్రైనీ కలెక్టర్ హర్షచౌదరితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు విద్యా బోధన ఎలా చెబుతున్నారని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు సకాలంలో పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. పరిశుభ్రమైన తాగునీటిని వాడాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
హామీల అమలుకు పోరాటం
మాడ్గుల: కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని గురువారం మండల కేంద్రంలో బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు భారీ ర్యాలీతో తహసీల్దార్ కార్యాలయానికి తరలివెళ్లి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి మాట్లాడుతూ.. వృద్ధులు, దివ్యాంగుల పెన్షన్లు పెంచాలని, రైతులందరికీ రుణమాఫీ చేయాల ని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రభు త్వం నిధు లు మంజూరు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్లు చెప్పుకొంటుందన్నారు. హామీల అమలుకు ఈ నెల 30 న చలో కొండారెడ్డిపల్లి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కండె హరిప్రసాద్, మండల అధ్యక్షుడు పెద్ద య్య యాదవ్, నాయకులు రామకిషన్, వెంకటేశ్, నర్సింహ, శ్రీను, వెంకన్న, అశోక్, సునీల్, రాజు, భూపేశ్ తదితరులు పాల్గొన్నారు. 30న ‘చలో కొండారెడ్డిపల్లి’ జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి -
ఆప్యాయతల ‘రక్షాబంధన్’
అక్కాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా రాఖీ పండుగసోదరి కష్టసుఖాల్లో అనుక్షణం తోడుగా ఉండేందుకు సోదరులకు కట్టే రక్షాబంధన్ పర్వదినం రానే వచ్చేసింది. అనురాగం, ఆప్యాయతల మేళవింపులో జరుపుకొనే అపూర్వ వేదికకు ప్రతి తోబుట్టువు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పర్యావరణహితంగా పండుగను నిర్వహించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. షాబాద్: అక్కాచెల్లెళ్లు.. అన్నాదమ్ములకు రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకుంటారు.. ఏటా రాఖీ పండుగను ఘనంగా జరుపుకొంటారు.. విదేశాల్లో ఉన్న వారు కూడా రక్షాబంధన్కు ఇక్కడికి వచ్చి అన్నాదమ్ములకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపిస్తారు. శనివారం జరుపుకొనే రాఖీ పండుగకు ఆడపడుచులు పుట్టింటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తల్లిదండ్రుల తర్వాత అనుబంధం, అనురాగం, ఆప్యాయత తోబుట్టువుల మధ్య ఉంటుంది. ఇంటి ఆడపడుచుల సుఖాసంతోషాలే తమ సంతోషంగా భావిస్తారు. సోదరులు ఇంతటి విశిష్టమైన అనుబంధానికి ప్రతీకగా, సోదరుల క్షేమం కోరుతూ ఏటా శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున రక్షాబంధన్ నిర్వహిస్తారు. మొదలైన సందడి అనుబంధాలకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చే హిందూ సంస్కృతిలో రక్షాబంధన్కు విశిష్టమైన స్థానం ఉంది. సోదరి, సోదరుల అనురాగానికి చిహ్నంగా ఈ వేడుక జరుపుకొంటారు. ఇళ్లల్లోనే కాకుండా ఆలయాల్లో, సామూహిక వేదికల వద్ద ఈ పర్వదినాన్ని ఆనందోత్సహాల నడుమ నిర్వహించుకోనున్నారు. బాలికలు, యువతులు, మహిళలు అంతా రాఖీ బంధన్ వేడుకను నిర్వహించేందుకు నాలుగు రోజుల ముందు నుంచే ఆడపడుచులు ఉత్సాహంగా రాఖీలు కోనుగోలు చేయడం మొదలుపెట్టారు. దీక్ష సంకల్పమే రక్ష ఏదైనా కార్యక్రమం నిర్వహించ తలపెట్టినప్పుడు రక్షను ధరించడం హైందవ ఆచారం. ఆ కార్యక్రమం ఏ విఘ్నాలు లేకుండా సజావుగా సాగాలని, అనుక్షణం లక్ష్యాన్ని గుర్తు చేసేందుకు ఈ రక్షను ధరిస్తారు. వివాహం, యజ్ఞయాగాదులు, వ్రతాలు, నోములు తదితర కార్యక్రమాల్లో ఈ రక్షాధారణ తప్పనిసరి. పూర్వకాలంలో యుద్ధానికి వెళ్లే భర్తలకు భార్యలు, సోదరుల క్షేమాన్ని కాంక్షిస్తూ సోదరీమణులు రక్షలు కట్టేవారు. ఆనాటి నుంచి ఆనవాయితీగా ఈ ఆచారం వస్తోంది. జోరుగా రాఖీల విక్రయాలు అన్నాచెల్లెల్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ దగ్గర పడుతుండడంతో మండలంలో రాఖీల క్రయ విక్రయాలు జోరందుకున్నాయి. మారుతున్న కాలానికి, అభిరుచులకు అనుగుణంగా, దుకాణదారులు పలు డిజైన్లల్లో రాఖీలు అందుబాటులో ఉంచారు. ప్రకృతి మెచ్చిన ‘వృక్షాబంధన్’ కడ్తాల్: ప్రకృతికి మానవాళి రక్షణగా ఉండాలనే గొప్ప సంకల్పంతో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ వినూత్నంగా గత 12 ఏళ్లుగా విద్యార్థులతో కలిసి చెట్లకు రాఖీలు కట్టి వృక్షాబంధన్ నిర్వహిస్తోంది. ప్రకృతికి మానవాళికి మధ్య సైతం అనుబంధం పెంపొందాలనే సదుద్దేశంతో వృక్షాబంధన్ కార్యక్రమం ఏటా దిగ్విజయంగా కొనసాగుతుంది. పిల్లలు, యువకులు, గ్రామస్తులు, విద్యార్థులు అందరి ఆధ్వర్యంలో పర్యావరణ హితంగా ‘నేను నీకు రక్ష.. నువ్వు నాకు రక్ష... మనమంతా భూమాతకు రక్ష’ అనే గొప్ప సంకల్పంతో వృక్షాబంధన్ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆవు పేడతో రాఖీలు తాండూరు టౌన్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలాంటి హాని కలుగచేయని వస్తువులను వినియోగించాలని ప్రకృతి ప్రేమికులు పదే పదే చెబుతుంటారు. ఈ క్రమంలోనే మరో ముందడుగు వేసి ఆవు పేడ, మూత్రంతో ఏకంగా రాఖీలను తయారు చేశారు. పర్యావరణాన్ని రక్షించుటతో హిందూ సంప్రదాయ పండగలు సైతం తమ వంతు పాత్ర పోషిస్తాయనేది సహజసిద్ధంగా తయారు చేసిన రాఖీలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాండూరు పట్టణ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కొట్రిక విజయలక్ష్మి ఏటా పర్యావరణ ప్రేమికురాలిగా తన వంతు బాధ్యతగా ఆవు పేడ, మూత్రంతో తయారు చేసిన రాఖీలను సోదరులకు కట్టాలని ఆమె చెబుతున్నారు. ఈ రాఖీలు తిరిగి భూమిలోకి చేరి మట్టి సారవంతాన్ని పెంపొందిస్తాయంటున్నారు. పరిగి ప్రాంతానికి చెందిన శివరామకృష్ణా చారి అనే వ్యవసాయ విద్య అభ్యసించిన ఓ యువకుడు దీర్ఘాయుష్షు అనే సంస్థను నెలకొల్పి ఆవుపేడ, మూత్రంతో రాఖీలను తయారు చేసి, పర్యావరణ పరిరక్షణపై తన వంతు బాధ్యతను బహిర్గతం చేస్తున్నారు. ఇలాంటి రాఖీలు మార్కెట్లో విక్రయానికి సైతం పెట్టడం విశేషం. -
మూడు రోజులైనా దొరకని ఆచూకీ
నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు చూసేందుకు వచ్చి కృష్ణా నదిపై నిర్మించిన కొత్త వంతెన పైనుంచి దూకిన యువకుడి ఆచూకీ మూడు రోజులైనా లభించలేదు. మంచాల మండలం జాపాల గ్రామానికి చెందిన మంథని శివ(23) తన స్నేహితులైన దుసరి ప్రసాద్(గణేశ్), సొప్పరి శివ, పండుగ నర్సింహతో కలిసి ఈ నెల 4న నాగార్జునసాగర్ పర్యటనకు వెళ్లారు. నందికొండ మున్సిపల్ పరిధిలోని పైలాన్ కాలనీలో కృష్ణా నదిపై ఉన్న కొత్త వంతెన మీద నిలబడి ఫొటోలు దిగే క్రమంలో శివ వంతెన పైనుంచి కృష్ణా నదిలోకి దూకి గల్లంతయ్యాడు. శివ తండ్రి కొమురయ్య ఫిర్యాదు మేర కు పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు సాగర్ సీఐ శ్రీనునాయక్, విజయపురి టౌన్ ఎస్ఐ ముత్తయ్య ఆధ్వర్యంలో కృష్ణా నదిలో గాలింపు చర్యలు చేపడుతున్నా ఇప్పటివరకు ఆచూకీ లభించలేదు. కృష్ణానదిలో కొనసాగుతున్న గాలింపు చర్యలు -
ఆటో లాక్కెళ్లారని మనస్తాపం
మొయినాబాద్: కిస్తులు (ఈఎంఐ) చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సంస్థ వారు ఆటో లాక్కెళ్లారని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నక్కలపల్లిలో గురువారం వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లికి చెందిన అనిమోని బాలకిష్టయ్య దంపతులకు పిల్లలు లేకపోవడంతో చిన్నతనంలోనే శ్రీకాంత్(26)ను దత్తత తీసుకు న్నారు. కొంతకాలానికి బాలకిష్టయ్య దంపతులు చనిపోయారు. దీంతో ఆయన మేనఅల్లుడు, నక్కలపల్లికి చెందిన బంటు కృష్ణ.. శ్రీకాంత్ బాగోగులు చూస్తున్నాడు. కృష్ణకు చెందిన పాత ఇంట్లో ఒంటరిగా ఉంటున్న శ్రీకాంత్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆటో కిస్తు లు కట్టకపోవడంతో ఐదురోజుల క్రితం ఫైనాన్స్ సంస్థ వారు వాహనాన్ని తీసుకెళ్లారు. దీంతో మనస్తాపం చెందిన అతను ఇంట్లోని దూలానికి టవల్తో ఉరేసుకున్నాడు. గురువారం ఉదయం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో కృష్ణ వెళ్లి చూశారు. శ్రీకాంత్ ఉరేసుకుని వేలాడుతూ కుళ్లిపోయిన స్థితిలో కనిపించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆటో తీసుకెళ్లిన రోజే ఉరేసుకుని ఉంటాడని స్థానికులు పేర్కొన్నారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య నక్కలపల్లిలో విషాదం -
మనువాదాన్ని వ్యతిరేకించాలి
కందుకూరు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితులపై దాడులు జరుగుతున్నాయని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా మైనార్టీ వర్గాలపై దాడులకు తెగబడుతుందని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ప్రకాశ్ ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో కందుకూరు, మహేశ్వరం, తలకొండపల్లి మండలాలకు సంబంధించిన ప్రజాసంఘాలతో కేవీపీఎస్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దళిత టీచర్లతో అయ్యప్ప మాల వేసిన విద్యార్థి కాళ్లు మొక్కించి మనువాద సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. గుడుల్లో దళితులకు ప్రవేశం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ ప్రవేశిస్తే ఆలయాలను శుద్ధి చేస్తున్నారన్నారు. ఇదంతా కేంద్రంలో మోదీ, అమిత్షా పాలనతోనే జరుగుతుందని విమర్శించారు. మతోన్మాదానికి, మనువాదానికి వ్యతిరేకంగా ప్రజలందరిని చైతన్య పరచడానికి ఈ నెల 13న ఇబ్రహీంపట్నంలోని పాషా నరహరి స్మారక కేంద్రంలో జిల్లా సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సుకు కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్వెస్లీ హాజరవుతున్నారన్నారు. సదస్సును విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ బుట్టి బాల్రాజ్, కేవీపీఎస్ మండలాల కన్వీనర్లు ఏర్పుల శేఖర్, కురుమయ్య తదితరులు పాల్గొన్నారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ప్రకాశ్ -
బీసీలు అన్ని రంగాల్లో రాణించాలి
షాబాద్: బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అభివృద్ధి సాధించాలని బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామంలో బీసీసేన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం బీసీసేన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎనుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా కడుమూరు విఠలయ్య, ఉపాధ్యక్షుడిగా కడుమూరి అశోక్, ప్రధాన కార్యదర్శిగా కావలి రాములు, కోశాధికారిగా కావలి సత్తయ్యలను ఎనుకున్నారు. యువజన కమిటీ అధ్యక్షుడిగా కావలి సందీప్, ప్రధాన కార్యదర్శిగా కడుమూరి ఆనంద్, ఉపాధ్యక్షుడిగా మహేందర్, కార్యదర్శిగా బుగ్గరాములు, కోశాధికారిగా ఉండాల మల్లేష్లకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు కృష్ణ మాట్లాడుతూ.. ఆధిపత్య పోరుతోనే బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడుతున్నారని చెప్పారు. అందుకే బీసీలకు అండగా ఆర్.కష్ణయ్య ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుంచి బీసీలను బలోపేతం చేస్తున్నామన్నారు. బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, మండల అధ్యక్షులు దయాకర్చారి, యూత్ అధ్యక్షుడు అజయ్కుమార్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ -
చంద్రమౌలికి కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు
ఆమనగల్లు: నగరంలోని పీపుల్స్ ప్లాజాలో గురువారం జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాడ్గుల మండలం కొల్కుపల్లి గ్రామానికి చెందిన చేనేత కళాకారుడు గుర్రం చంద్రమౌలికి కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డును ప్రదానం చేశారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో సహజ రంగులతో నూతన డిజైన్లో ఇక్కత్ పట్టుచీర నేసిన చేనేత జిల్లా కళాకారుడు చంద్రమౌలిని అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రశంసాపత్రం, రూ.25వేల విలువైన చెక్కు, మెమొంటో అందజేశారు. అనంతరం చంద్రమౌళిని పద్మశాలీ సంఘం మండల అధ్యక్షుడు అశోక్, నాయకులు కృష్ణయ్య, ప్రవీణ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆనంద్కుమార్, రాజేశ్, భాస్కర్, వెంకన్న, సాయి, శశికళ తదితరులు పాల్గొన్నారు. -
పట్టణాలను హరిత వనాలుగా మార్చాలి
సీడీఎంఏ డైరెక్టర్ జోత్స్న షాద్నగర్ రూరల్: ప్రభుత్వం చేపడుతున్న వన మహోత్సవంతో పట్టణాలు పచ్చని వనాలుగా మారాలని సీడీఎంఏ డైరెక్టర్ జోత్స్న అన్నారు. గురువారం మున్సిపల్ పరిధి 10వ వార్డులోని ప్యారడైజ్ కాలనీలో మున్సిపల్ కమిషనర్ సునీత ఆధ్వర్యంలో వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆమె మొక్క నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆకుపచ్చ తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పచ్చదనం పెంపొందించాలని కోరారు. సకాలంలో వర్షా లు కురవాలన్నా.. వాతావరణ సమతుల్యత కాపాడాలన్నా.. మొక్కల పెంపకం అవసరమన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వనమహోత్సవంలో భాగస్వాములై ప్రతి ఇంటికి మొక్క నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రావణి, కాలనీవాసులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ బోధనతో విద్యార్థుల విజయం రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ డాక్టర్ వెంకటేశ్ మాడ్గుల: ఉత్తమ బోధనతో విద్యార్థుల విజ యం సాధ్యమవుతుందని రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ డాక్టర్ చారకొండ వెంకటేశ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని ఇర్విన్ జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థుల అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వెంకటేశ్ త్రిబుల్ ఐటీ, ఎన్ఎమ్ఎస్కు ఎంపికై న విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల్లో ఇర్విన్ విద్యార్థుల సత్తా అభినందనీయమన్నారు. ఉపాధ్యాయుల ప్ర ణాళికాయుత బోధనతోనే విజయాలు సాధ్యమవుతున్నాయని కితాబిచ్చారు. సమాజంతో పాటు వ్యక్తిగతంగానూ గుర్తింపు పొందాలంటే విద్యతోనే సాధ్యమన్నారు. విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. అనంతరం హెచ్ఎం పర్వతాలును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సుశీంధర్ రావు, ఏంఈఓ సర్ధార్ నాయక్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సినీ హీరో గోపీచంద్శంకర్పల్లి: సినీ హీరో గోపీచంద్ గురువారం శంకర్పల్లి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి విచ్చేశారు. మండల పరిధిలోని బ్లూమ్స్ వెంచర్లో ఉన్న 400 గజాల విల్లా విక్రయానికి గాను ఆ యన కార్యాలయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున కార్యాలయానికి చేరుకుని సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు. దీంతో ఒకింత ఇబ్బంది పడిన గోపీచంద్ పని పూర్తయిన వెంటనే పట్టణ శివారులోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. గంజాయి పట్టివేత సాక్షి, సిటీబ్యూరో: దాదాపు రూ.6 లక్షల విలువైన 11.5 కిలోల గంజాయిని ఎకై ్సజ్ పోలీసు లు గురువారం స్వాధీనం చేసుకున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లుగా సరూర్నగర్ చైతన్యపురికి చెందిన భూక్య శ్రీకాంత్ వద్ద 340 గ్రాముల గంజాయిని మొదట పట్టుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు అబ్బాస్ అనే వ్యక్తి వద్ద నుంచి 850 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నా రు. అబ్బాస్ ఇచ్చిన సమాచారం మేరకు నడిమింటి మమత అనే మహిళ ఇంట్లో 10.693 కిలోల గంజాయిని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి మొత్తం 11.5 కిలోలు పట్టుకున్నట్లు రంగారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ఆర్.కిషన్ తెలిపారు. ఈ మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. -
మరణంలోనూ జంటగా..
షాబాద్: ఆ అన్యోన్య దంపతుల బంధాన్ని మృత్యువు సైతం వేరు చేయలేకపోయింది. భర్త మరణాన్ని తట్టుకోలేని భార్య గంటల వ్యవధిలోనే ప్రాణాలు వదిలేసింది. ఈ ఘటన హైతాబాద్లో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. నగరానికి చెందిన అన్నె ప్రసాద్రావు(83), పార్వతి (72) దంపతులు హైతాబాద్లో ఉంటున్నారు. బుధవారం రాత్రి ప్రసాద్రావు అస్వస్థతకు గురికావడంతో శంషాబాద్లోని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ విషయం తెలియగానే తీవ్ర మానసిక క్షోభకు గురైన పార్వతి గుండెపోటుతో మరణించింది. స్థానిక శ్మశానవాటికలో గురువారం ఇద్దరి అంత్యక్రియలను ఒకేసారి నిర్వహించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
తవ్విపోదురు గాక..!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వానలొస్తే జనం చస్తున్నారు. ఉప్పొంగే నాలాలు.. చెరువులయ్యే రోడ్లతో ముందుకు సాగలేక అల్లాడుతున్నారు. ఎప్పుడో వేసవిలోనే పూర్తి చేయాల్సిన పనుల్ని సైతం పెండింగ్లో పెట్టి.. జలమండలి, టెలికాం, తదితర సంస్థలు అడ్డంగా తవ్విపారేసిన రోడ్లతో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ఏ పనులు ఏ సంస్థవో తెలియని సామాన్య ప్రజలు అన్నీ జీహెచ్ఎంసీవేనని భావించి దుమ్మెత్తిపోస్తున్నారు. జీహెచ్ఎంసీ చేయాల్సిన పనులకూ ట్రాఫిక్ విభాగం నుంచి సకాలంలో అనుమతులు లభించడం లేవని సమాచారం. ఇవి సమస్యలకు కారణాలు కాగా.. వర్షాకాల సమస్యల పరిష్కార బాధ్యతలు హైడ్రాకు అప్పగించాక వాటిలోనూ సమన్వయం కుదరడం లేదు. ప్రకటనల్లో మాత్రం సమన్వయంతో పని చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలోని హైడ్రా సిబ్బంది జీహెచ్ఎంసీని ఖాతరు చేయడం లేదని తెలుస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగా మ్యాన్హోళ్ల మూత లు, డివైడర్ల చివరన పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించకపోవడంతో వరదనీరు నిలిచిపోతోంది.అనుమతుల్లేకుండా అడ్డగోలు తవ్వకాలుహైదరాబాద్ మెట్రో వాటర్ సప్లైఅండ్ సివరేజి బోర్డు (జలమండలి) నిర్వాకాలు శాపంగా మారాయి. తాగునీరు, మురుగునీటి పైపులైన్ల కోసం ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా జరిపిన తవ్వకాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడో చేయాల్సిన మ్యాన్హోళ్ల పనులు ఇప్పుడు చేస్తున్నారు. పనులు చేశాక సరిగా చదును చేయడం లేదు. సివర్ లైన్ల కోసం తవ్వకాలు జరిపీ, మట్టికుప్పలు అడ్డగోలుగా వదిలేస్తున్నారు. దాంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.ఉదాహరణకు ఎన్ఎండీసీ– విజయనగర్ కాలనీరోడ్ మార్గంలో తవ్వకాలు జరిపి రోడ్డు మూసేశారు. దాంతో ఇతర దారుల్లో తీవ్రట్రాఫిక్ జాంలు ఏర్పడుతున్నాయి. ఇక్కడే కాదు, ప్రధాన రహదారులు, కాలనీ రోడ్లు అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ రోడ్లను తవ్వి పారేశారు. ఇవన్నీ ఎలాంటి అనుమతుల్లేకుండా తవ్వినవే. మురుగునీటిని వరద కాల్వల్లో కలపడంతో వాటిలో మురుగు పొంగుతోంది. వర్షాల వేళ రోడ్లపై పెద్ద ప్రవాహాలు ఏర్పడుతున్నాయి. చాదర్ఘాట్, మలక్పేట తదితర ప్రాంతాల్లో తరచూ కనిపించే దృశ్యాలే ఇందుకు నిదర్శనం. ఇక వర్షాల వేళ ట్రాఫిక్ విభాగం పనితీరు సోమ వారం నాటి వర్షంతో బట్టబయలైంది. సాధారణంగా పది నిమిషాల్లో వెళ్లాల్సిన దూరానికి రెండు గంటలకు పైగా పట్టింది. చలానాల విధింపుపై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలపై కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఎందుకిలా?వర్షాకాలానికి ముందే వివిధ ప్రభుత్వ విభాగాలు ప్రజల సదుపాయార్థం తాము చేయాల్సిన పనులుంటే పరస్పర సమన్వయం, సహకారంతో పూర్తిచేయాలి. కానీ అది జరగడం లేదు. ఉదాహరణకు ఒక రోడ్డు వేయాలంటే ఆ మార్గంలో ఏర్పాటు చేయాల్సిన ఇతర విభాగాల పనులుంటే పూర్తయ్యాక వేయాలి. కానీ అది జరగడం లేదు. జీహెచ్ఎంసీ రోడ్లు వేయడం.. ఇతర విభాగాలు తవ్వడం.. మళ్లీ రోడ్లు వేయడం పరిపాటిగా మారింది. సకాలంలో ట్రాఫిక్ అనుమతులు లభించకపోవడం కూడా పనుల జాప్యానికి కారణమవుతోంది. బంజారాహిల్స్లో నాలాలో కుంగిన వాటర్ట్యాంకర్ను బయటకు తీసేందుకు కూడా ఎంతో సమయం పట్టడాన్ని ప్రజలు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తినప్పుడు ఆ తప్పు ఎదుటివారి మీదకు నెట్టడం.. ప్రశంసలైతే తామే అని చెప్పుకోవడం అన్ని విభాగాలకూ అలవాటుగా మారింది. -
భార్యాభర్తలపై కత్తితో దాడి
రంగారెడ్డి జిల్లా: పశువుల మేత విషయంలో చోటుచేసుకున్న దాడిలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మొయినాబాద్కు చెందిన మహ్మద్ హఫీజ్, మహ్మద్ వాజిద్ ఖురేషీ ముర్తూజగూడ రెవెన్యూలోని షమ్స్ కాలనీలో ఇళ్లు కట్టుకుని, కుటుంబాలతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇరువురి వద్దా మేకలు, గేదెలు, ఆవులు ఉన్నాయి. కాలనీలోని ఖాళీ ప్లాట్లలో వీటిని మేపుతుంటారు. బుధవారం ఉదయం వాజిద్ తన మేకలు, గేదెలను ఓ ప్రాంతంలోని ఖాళీ ప్లాట్లలో కట్టేశాడు. ఇది గమనించిన హఫీజ్, అతని కొడుకు అఫ్రోజ్ ముందు నుంచీ తమ పశువులను ఇక్కడే మేపుతున్నామని, నీవెందుకు కట్టేశావని వాజిద్తో గొడవ పడ్డారు. మాటామాటా పెరగడంతో అఫ్రోజ్ తమ ఇంట్లో నుంచి కొమ్మలు కొట్టే కత్తి తీసుకొచ్చి తండ్రికి ఇచ్చాడు. ఇద్దరూ కలిసి పక్కింట్లో ఉండే వాజిద్పై దాడి చేశారు. అడ్డుకోబోయిన అతని భార్య రఫియాను సైతం కత్తితో గాయపర్చారు. దీంతో వాజిద్ తల, మెడ, ఛాతితో పాటు శరీరంపై గాట్లు పడ్డాయి. రఫియా తలకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఇరువురిపైనా హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
దొరకని ఆచూకీ
● నాగార్జునసాగర్ అందాలు చూడ్డానికి వెళ్లి.. ● ప్రమాదవశాత్తు నదిలో పడిపోయిన యువకుడు ● గల్లంతై మూడు రోజులైనా లభించని జాడ మంచాల: నాగార్జునసాగర్ అందాలు చూడడానికి స్నేహితులతో కలిసి వెళ్లిన యువకుడి ఆచూకీ మూడు రోజులైనా దొరకలేదు. మండలంలోని జాపాల గ్రామానికి చెందిన మంతని శివ (24), సోప్పరి శివ, కాగజ్ఘట్ గ్రామానికి చెందిన దూసరి గణేశ్, ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామానికి చెందిన పండుగ నర్సింహ స్నేహితులు. సోమవారం సాయంత్రం సరదాగా చూసొద్దామని నాగార్జునసాగర్ వెళ్లారు. కొద్ది సేపు బ్రిడ్జిపై కేరింతలు కొడుతూ ఆనందంగా గడిపారు. అంతలోనే శివ బ్రిడ్జిపై నుంచి నదిలో పడిపోయాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మూడు రోజులైనా జాడ కనిపించలేదు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో తల్లిదండ్రులు గారాబంగా పెంచారు. ఆచూకీ దొరకకపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
నేడు డయల్ యువర్ డీఎం
షాద్నగర్రూరల్: ఆర్టీసీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు గురువారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు షాద్నగర్ డిపో మేనేజర్ ఉష బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రయాణికులు తమ సమస్యలు, సూచనలు, సలహాలను తెలియజేయాలని తెలిపారు. 99592 26287 నంబర్లో సంప్రదించాలని సూచించారు. సమాచార హక్కుచట్టం సరిగ్గా అమలు చేయాలి కొందుర్గు: ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం సరిగ్గా అమలు కావడం లేదని రాష్ట్ర సమాచార కమిషనర్ దేశాల భూపాల్ అన్నారు. కొందుర్గు తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. సమాచార హక్కు చట్టం అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ .. కొందుర్గు తహసీల్దార్ కార్యాలయంలో సిటిజన్చార్ట్ సరిగ్గా లేదని, 1, 2 రిజిస్టర్లు నిర్వహించడం లేదన్నారు. అప్పిలేట్ అధికారి బదిలీ అయి నెలలు గడస్తున్నా ఆమె పేరే చార్ట్పై ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మూడు నెలలుగా రాష్ట్రంలోని మెదక్, భ్రదాద్రి కొత్తగూడెం, ఖమ్మం తదితర జిల్లాల్లో పర్యటించినట్టు తెలిపారు. సమాచార హక్కు చట్టంపై సరైన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆమనగల్లు ఠాణాలో రికార్డుల తనిఖీ ఆమనగల్లు: పట్టణంలోని పోలీస్ స్టేషన్ను బుధవారం షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ ఆవరణను పరిశీలించిన అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. సీఐ జానకీరామ్రెడ్డి, ఎస్ఐ వెంకటేశ్తో సమావేశమై పలు సూచనలు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్ధంగా ఉండాలని సూచించారు. ఐదు క్లినిక్లకు షోకాజ్ నోటీసులు శంకర్పల్లి: ఆర్ఎంపీ వైద్యులు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని, ఆపై ఎలాంటి వైద్య సేవలందించినా కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ డీఎంహెచ్వో నాగేంద్రబాబు హెచ్చరించారు. పట్టణంలోని ఎనిమిది ఆర్ఎంపీ క్లినిక్స్ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని ఐదింటికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఆర్ఎంపీలు పూర్తి స్థాయి డాక్టర్లు కాదని, దీనిని రోగులు గమనించాలని సూచించారు. ఆస్పత్రికి వెళ్లే ముందు ఆ డాక్డర్కి ఉన్న అర్హతలపై ఆరా తీయాలన్నారు. తనిఖీల్లో శంకర్పల్లి పీహెచ్సీ వైద్యురాలు రేవతిరెడ్డి, సిబ్బంది మన్సూర్ తదితరులు పాల్గొన్నారు. రక్తదానంతో ప్రాణం నిలుస్తుంది: చిరంజీవి రాయదుర్గం: రక్తదానంతో ఒక ప్రాణం నిలుస్తుందని, నేటి యువతకు మళ్లీ మళ్లీ చెబుతున్నా.. రక్తదాతలు కావాలని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో నాలెడ్జి సిటీలోని ఫినిక్స్ సంస్థలో మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ను బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ.. ఒక జర్నలిస్ట్ రాసిన కథనం చదివిన తర్వాత బ్లడ్బ్యాంక్ పెట్టాలనే ఆలోచన తనకు వచ్చిందని గుర్తు చేశారు. సినీనటులు తేజ సజ్జా, సంయుక్త, ఫినిక్స్ గ్రూప్ చైర్మన్ సురేష్ చుక్కపల్లి తదితరులు పాల్గొన్నారు. -
విధుల్లో ఉన్న కండక్టర్ గుండెపోటుతో మృతి
అబ్దుల్లాపూర్మెట్: విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ కండక్టర్కు గుండెపోటు రావడంతో మృతిచెందిన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిఽధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామానికి చెందిన నిమ్మల బాలరాజ్గౌడ్ (54) హయత్నగర్– 2 డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరిగానే బుధవారం మధ్యాహ్నం విధుల్లో చేరిన బాల్రాజ్ రాత్రి 8.45గంటల సమయంలో అబ్దుల్లాపూర్మెట్లోని జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీకి బస్లో వచ్చాడు. రాత్రి బస్సును కాలనీలో పార్క్ చేసి(నైట్ హాల్ట్), బ్లాక్ నం.62/1లో విశ్రాంతి తీసుకుంటుండగా రాత్రి 11.20 గంటలకు ఛాతిలో నొప్పి వస్తోందని డ్రైవర్ ఉపేందర్కు చెప్పాడు. దీంతో ఆయన 108కు సమాచారం ఇవ్వగా అతన్ని పరీక్షించిన సిబ్బంది అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువతి మాట్లాడటం లేదని.. సుభాష్నగర్: ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ యువతి గత కొన్ని రోజులుగా మాట్లాడకపోవడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరివేసుకుని చనిపోయిన ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెల్పిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన సందీప్ (20) రాజీవ్ గాంధీనగర్లో నివాసం ఉంటున్నాడు. సందీప్కు విజయవాడకు చెందిన ఓ యువతి ఇన్స్ట్రాగామ్ ద్వారా పరిచయమైంది. తరచూ చాటింగ్ చేసుకుంటున్నారు. గత కొన్ని రోజుల నుండి సదరు యువతి నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో మనస్తాపానికి గురైన సందీప్ మంగళవారం రాత్రి ఇంట్లో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
అబ్దుల్లాపూర్మెట్: జనగాంలోని ఇండోర్ స్టేడియంలో ఈ నెల 7 నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి 4వ జాతీయ జావెలిన్ డే వేడుకలు, కిడ్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్నకు మండల విద్యార్థులు ఎంపికయ్యారు. బాటసింగారం జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు మల్యాల యాదగిరి తెలిపారు. ఈ నెల 5న సరూర్నగర్లో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో పాఠశాల తరఫున పాల్గొన్న కొడిశెల విలాస్, గాండ్ల ఈశ్వరిలు ప్రతిభ చాటారు. దీంతో రాష్ట్ర స్థాయి పోటీలకు వారు ఎంపిక కావడంతో బుధవారం ఇద్దరికి క్రీడా దుస్తులను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు వాణిశ్రీ, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో కాడెద్దు మృతి కేశంపేట: విద్యుదాఘాతంలో కాడెద్దు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని బొదునంపల్లి గ్రామశివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి ఎదిరె ఆంజనేయులు తన వ్యవసాయ పొలంలోని పశువుల పాకలో రోజు మాదిరిగా తన పశువులను కట్టేశాడు. రాత్రి సమయంలో కాడెద్దు తాడును తెంపుకొని బయటకు వచ్చింది. సమీపంలో ఉన్న 11 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ భూమికి తక్కువ ఎత్తులో ఉండటంతో ప్రమాదవశాత్తు వైర్లు తగిలి విద్యుత్ షాక్తో ఎద్దు మృతి చెందింది. కాడెద్దు విలువ సుమారు రూ.1.10 లక్షలు ఉంటుందని, తమని ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. ఖాతా డబ్బులు అడిగినందుకు కత్తితో దాడి కేపీహెచ్బీకాలనీ: కిరాణా షాపు ఖాతా డబ్బులు ఇవ్వకపోగా..నిర్వాహకురాలిపై దాడి చేసి కత్తితో దాడి చేసిన సంఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం కేపీహెచ్బీ కాలనీ 7వ ఫేజ్లోని ఎల్ఐజి 143లో మణిమాల కుటుంబం నివాసం ఉంటుంది. ఈమె స్ధానికంగా కిరాణా షాపు నిర్వహిస్తుంది. ఇదే కాలనీలోని ఎల్ఐజి 183లో నివాసం ఉండే రాజేష్రెడ్డి కిరాణా షాపులో కిరాణా సామాగ్రి కొనుగోలు చేస్తుంటాడు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం పెరగడంతో రాజేష్ రెడ్డి డబ్బులు ఖాతా పెట్టి కిరాణా సామాగ్రి తీసుకునేవాడు. అయితే నాలుగు నెలలు గడుస్తున్నా ఖాతా డబ్బులు ఇవ్వలేదు. దీంతో డబ్బులు ఇవ్వాలని ఆమె ఒత్తిడి చేయగా..బుధవారం మధ్యాహ్నం మణిమాల ఇంటికి వెళ్లిన రాజేష్రెడ్డి ఆమైపె అకస్మాత్తుగా దాడి చేశాడు. గొంతు నులిమి పక్కనే ఉన్న కత్తితో గొంతు కోసేందుకు యత్నించాడు. తీవ్రమైన పెనుగులాటలో మణిమాల గొంతుపై కత్తి కోసుకుపోగా, రాజేష్ రెడ్డి చేతికి కూడా గాయాలయ్యాయి. మణిమాల గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి రక్షించి 108 అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. కింద పడిపోయిన రాజేష్రెడ్డిని కూడా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మణిమాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా రాజేష్రెడ్డి ప్రవర్తన ఇటీవల కాలంలో విచిత్రంగా ఉందని, ఎక్కడ కూడా సరిగ్గా పనిచేయకపోవడంతో పాటు మద్యానికి అలవాటు పడినట్లు స్థానికులు చెబుతున్నారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
చేవెళ్ల: ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కె.హన్మంత్రావు అన్నారు. మండలంలోని పలు పాఠశాలల్లో బుధవారం సంఘం నాయకులతో కలిసి సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెల్త్కార్డులు వెంటనే అమలు చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని, కామన్ సర్వీస్ రూల్స్ అమలుకు ప్రయత్నం చేయాలని, కేజీబీవీ, ఎస్ఎస్ఏ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, నూతన పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించి విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యల సాధనకోసం టీపీయూఎస్ ముందుంటుందని తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కోట్ల కాశీరావు, గౌరవ అధ్యక్షుడు గణపురం సురధీర్, మండల కోశాధికారి దూత కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
డాక్టర్ నమ్రతపై మరో కేసు
సాక్షి,సిటీబ్యూరో/రామ్గోపాల్పేట: సరోగసి పేరు తో శిశువుల అక్రమ రవాణాకు పాల్పడిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతపై బుధవారం మరో కేసు నమోదైంది. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దీన్ని రిజిస్టర్ చేసిన గోపాలపురం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీంతో కలిపి ఇప్పటి వరకు నమ్రత, ఆమె ముఠాపై నమోదైన కేసుల సంఖ్య ఆరుకు చేరింది. తాజాగా ఈ కేసులో మరో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. వీరితో కలిపి ఇప్పటి వరకు అరెస్టు అయిన వారి సంఖ్య 22కు చేరింది. నమ్రతపై 2020లో విశాఖపట్నంలో కేసులు నమోదయ్యాయి. వీటి ప్రభావంతో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లైసెన్సులు అధికారులు పొడిగించలేదు. ఆ సమయంలో తాను ఆస్పత్రి మూసేస్తున్నట్లు సమాచారం ఇచ్చిన నమ్రత అక్రమంగా కొనసాగించారు. తన పేరు బయటకు రాకుండా ఉండటానికి చికిత్స కోసం సంప్రదించిన వారికి మరో డాక్టర్ పేరుతో ఉన్న లెటర్ హెడ్పై మందులు, పరీక్షల వివరాలు రాసి ఇచ్చారు. రాజస్థాన్ దంపతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గోపాలపురం పోలీసులు సృష్టి సెంటర్పై దాడి చేసినప్పుడు ఈ లెటర్హెడ్స్ పోలీసులకు లభించలేదు. అయితే వరుసగా ఠాణా మెట్లు ఎక్కుతున్న బాధితుల్లో కొందరు తమ ఫిర్యాదులతో పాటు నమ్రత రాసి ఇచ్చిన మందుల చీటీలు తదితరాలను జత చేశారు. వీటిలో కొన్ని సదరు డాక్టర్ పేరుతో ఉండటాన్ని గమనించిన పోలీసులు దీనిపై ఆరా తీశారు. సికింద్రాబాద్కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ అయిన ఆమె ఓ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. పోలీసులు ఆమెను సంప్రదించినప్పుడే తన పేరుతో ఉన్న లెటర్ హెడ్స్ దుర్వినియోగం అవుతున్నట్లు గుర్తించారు. దీంతో ఆమె స్వయంగా గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నమ్రతపై బుధవారం మరో కేసు నమోదైంది. రాజస్థాన్ దంపతుల ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో పోలీసులు నమ్రత ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఇది మంగళవారంతో పూర్తి అయింది. తాజాగా మరో కేసులో కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ బుధవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోపక్క సహ నిందితులుగా ఉన్న సంతోషి, కళ్యాణిల పోలీసు కస్టడీ పూర్తి కావడంతో కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. 86 మందికి సరోగసి ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన వివరాలు, దర్యాప్తు, ఫిర్యాదుల ఆధారంగా నమ్రత తనకు ఉన్న వివిధ సెంటర్ల ద్వారా 86 మంది దంపతులకు సరోగసి చేసినట్లు గుర్తించారు. వీటిలో సక్రమం ఎన్ని? అక్రమం ఎన్ని? చైల్డ్ ట్రాఫికింగ్ ఎన్ని? అనే అంశాలు ఆరా తీస్తున్నారు. దీనికోసం ఆ ప్రక్రియలు చేయించుకున్న దంపతుల కోసం గాలిస్తున్నారు. రాజస్థాన్ దంపతులతో పాటు మరో మూడు జంటలకు శిశువుల్ని విక్రయించినట్లు బయటపడింది. దీంతో ఈ శిశువులను రెస్క్యూ చేసిన పోలీసులు శిశువిహార్కు తరలించారు. ఈ వ్యవహారాల్లో దళారులుగా వ్యవహరించిన వారితో పాటు శిశువుల్ని ఉద్దేశపూర్వకంగా విక్రయించిన ముగ్గురు తల్లుల్ని కటకటాల్లోకి పంపారు. బుధవారం గోపాలపురం పోలీసులు నమ్రతతో సంబంధాలు కలిగి ఉండి, శిశు విక్రయాల దందా నడిపిన విశాఖపట్నం వైద్యులు రవి, రమ్యలతో పాటు ఏజెంట్లు విజయ్, సరోజ, రత్న, శిశువుల్ని విక్రయించిన ముగ్గురు తల్లుల్ని అరెస్టు చేశారు. ఈ ఎనిమిది మంది అరెస్టులతో కలిపి ఇప్పటి వరకు ‘సృష్టి’ సంబంధిత కేసుల్లో కటకటాల్లోకి చేరిన వారి సంఖ్య 22కు పెరిగింది. ఫిర్యాదు చేసిన నగరానికి చెందిన గైనకాలజిస్ట్ తాజాగా మరో ఎనిమిది మంది నిందితుల అరెస్టు లోతుగా దర్యాప్తు చేస్తున్న గోపాలపురం పోలీసులు -
జయశంకర్కు ఘన నివాళి
చిన్నారుల ఆరోగ్యానికి.. చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయలక్ష్మి అన్నారు. 8లోuఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై పోరాడి, ఉద్యమానికి ఊపిరి పోసింది ప్రొఫెసర్ జయశంకర్ అని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 91వ జయంతి ఉత్సవాలను బుధవారం కలెక్టరేట్లోని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆచార్య జయశంకర్పాత్ర మరువలేనిదని తెలిపారు. ఉద్యమానికి వెన్నెముకగా నిలిచారని, స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన అడుగు జాడల్లో నడవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, కలెక్టరేట్ ఏఓ సునీల్ కుమార్, బీసీ వెల్ఫేర్ అధికారి కేశురాం, వెనుకబడిన సంఘాల నాయకుడు మల్లేష్ యాదవ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. నిర్లక్ష్యాన్ని సహించేది లేదు డబుల్ బెడ్రూం ఇళ్ల పెండింగ్ పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. సంబంధిత అధికారులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు, పెండింగ్ పనులపై సమీక్షలు నిర్వహించాలని సూచించారు. లబ్ధిదారులకు కేటాయింపు విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. విద్యుత్ సరఫరా, నీటి సరఫరా సంపుల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేసి 15 రోజుల్లో లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని, లేని పక్షంలో బాధ్యులైన వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్లో హౌసింగ్, విద్యుత్, అర్డబ్ల్యూఎస్, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
మోసం!
గురువారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2025తూకం..‘సొమ్ము’ చేసుకుంటున్న వ్యాపారులు● ఫిర్యాదు చేసినా స్పందన శూన్యం ● పట్టించుకోని తూనికలు, కొలతల అధికారులు ● జిల్లాలో గత ఏడాది 275 కేసులు ● ఈ ఏడాది ఇప్పటి వరకు 98 నమోదు ఇదింతే.. అడగొద్దు..8లోuసాక్షి, రంగారెడ్డిజిల్లా: వినియోగదారులు అవసరాన్ని, అమాయకత్వాన్ని కొంత మంది వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో 349 పెట్రోల్ బంకులు ఉండగా, వందకుపైగా వేబ్రిడ్జ్లు ఉన్నాయి. నిత్యావసరాలు విక్రయించే కిరాణాలు, సూపర్ మార్కెట్లు మొదలు.. చికెన్, మటన్ దుకాణాలు, రైతుబజార్లు, ప్రధాన రోడ్లకు ఇరువైపులా తోపుడు బండ్లపై విక్రయించే కూరగాయలు, పండ్ల తూకాల్లోనూ భారీ మోసాలకు పాల్పడుతున్నారు. కొనుగోలుదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయా షాపుల్లో తనిఖీలు నిర్వహించి తక్కెడ, బాట్ల తూకాలను పరిశీలించాల్సిన తూనికలు కొలతలశాఖ పరోక్షంగా వారికి సహకరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. 2024లో జిల్లా వ్యాప్తంగా 275 కేసులు నమోదు చేయగా, 2025లో ఇప్పటి వరకు 98 కేసులను మాత్రమే నమోదు చేయడం ఈ శాఖ అధికారుల అలసత్వానికి అద్దం పడుతోంది. తూకాల్లో మోసాలపై ఎవరైనా వినియోగదారులు ఫిర్యాదు చేసినా సకాలంలో స్పందించడం లేదు. 27 మండలాలు, 526 రెవెన్యూ గ్రామాలు, 15 మున్సిపాలిటీలు, మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్న జిల్లాకు కేవలం ముగ్గురే అధికారులు ఉండటం కూడా తక్కువ కేసులు నమోదు కావడానికి మరో కారణమనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. న్యూస్రీల్ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి 200 గజాల ఖాళీ స్థలంలో ఇల్లు నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. తెల్లవారు జామునే చంపాపేట ఇసుక లారీల అడ్డాకు చేరుకున్నాడు. నచ్చిన ఇసుకను మాట్లాడుకుని ఆ పక్కనే ఉన్న ఓ వే బ్రిడ్జ్లో తూకం వేయించాడు. ఇసుక బరువు 32 టన్నులు ఉన్నట్లు బిల్లు జారీ చేశారు. అనుమానం వచ్చి మార్గమధ్యలో ఉన్న మరో వేబ్రిడ్జ్లో తూకం వేయించగా 28 టన్నులే వచ్చింది. ఓ ద్విచక్రవాహనదారుడు జెడ్పీరోడ్డులోని ఓ పెట్రోల్బంకులో పెట్రోలు కొట్టించాడు. ట్యాంక్ నిండా పెట్రోలు పోయించినప్పటికీ.. ఎంతకీ ఇంజన్ స్టార్ట్ కాకపోవడంతో అనుమానం వచ్చి చెక్ చేయగా బైక్లో పోసింది పెట్రోల్ కాదని, నీళ్లు అని తేలింది. ఎల్బీనగర్కు చెందిన ఓ గృహిణి నిత్యావసరాల కొనుగోలు కోసం సమీపంలోని ఓ మార్ట్కు వెళ్లింది. ర్యాక్లో ఓ వరుసలో సర్దిపెట్టిన పప్పులు, ఉప్మారవ్వ, చక్కర, గోధుమపిండి (ప్యాకెట్లు కేజీల్లో) సహా ఇతర వస్తువులు బిల్లింగ్ చేయించింది. ఇంటికి వెళ్లిన తర్వాత అనుమానం వచ్చి తూకం వేయగా ఒక్కో ప్యాకెట్లో 100 గ్రాములు తక్కువ ఉండటాన్ని చూసి విస్తుపోయింది. ప్రశ్నిస్తే వాగ్వాదం ఇంటి నిర్మాణం కోసం రెండు రోజుల క్రితం బాలాపూర్లోని ఓ ప్రైవేటు డంప్ నుంచి ఇసుక కొనుగోలు చేశాను. వాహనం ట్రక్కు నిండా ఇసుక నింపి స్థానికంగా ఉన్న ఓ వేబ్రిడ్జిలో తూకం వేయగా 12 టన్నులు ఉన్నట్లు చూపించింది. అనుమానం వచ్చి మరోచోట తూకం వేయగా రెండు టన్నుల వ్యత్యాసం చూపించింది. అదేమని ప్రశ్నిస్తే వాగ్వాదానికి దిగుతున్నారు. – రవీంద్రాచారి, రియల్టర్ ఫిర్యాదు చేసినా పట్టింపు లేదు మార్గమధ్యలో పెట్రోల్ ఖాళీ కావడంతో పక్కనే ఉన్న ఓ బంక్కు వెళ్లి కొట్టించాను. బైక్ స్టార్ట్ చేసి తీరా అర కిలోమీటర్కు వెళ్లిన తర్వాత ఆగిపోయింది. అనుమానం వచ్చి చూడగా పెట్రోల్ నీళ్లలా ఉంది. బంక్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే తమ తప్పేమీ లేదని, కంపెనీ నుంచే ఇలా వచ్చిందని బుకాయించారు. విజిలెన్స్, తూనికలు కొలతలశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. – తిరుమలేష్, ద్విచక్రవాహనదారుడు -
చిన్నారుల ఆరోగ్యానికి చర్యలు
షాద్నగర్: చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని కమ్యూనిటీ ఆస్పత్రి ఆవరణలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల హెచ్ఎంలు, అంగన్వాడీ సూపర్వైజర్లకు నులి పురుగుల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతీయ నులి పురుగుల నివారణ కార్యక్రమాన్ని ఈనెల 11న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నులి పురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రలను సరఫరా చేస్తుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఈ మాత్రలను పంపిణీ చేసి చిన్నారులతో మింగించాలని సూచించారు. ఒకటి నుంచి రెండేళ్ల వయసుఉన్న పిల్లలకు సగం మాత్రను నీటిలో కలిపి వేయాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, అపరిశుభ్రంగా ఉండే ప్రాంతాల్లో నివసించడం, చేతులు సరిగా కడుక్కోకపోవడం ద్వారా నులి పురుగులు సంక్రమించే అవకాశం ఉందన్నారు. సమావేశంలో హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, వైద్యులు స్రవంతి, రాఘవేందర్, ఎంపీహెచ్ఈఓ శ్రావణ్కుమార్, హెల్త్ సూపర్వైజర్లు శ్రీరామ, అమృత, హెల్త్ అసిస్టెంట్ రెడ్యానాయక్, లింగం, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయలక్ష్మి -
మా సమస్యలు పరిష్కరించండి
హయత్నగర్: అబ్దుల్లాపూర్మెట్టు మండలం తొర్రూర్లో హెచ్ఎండీఏ ద్వారా రూపొందించిన లే అవుట్లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ చేపట్టిన ప్లాట్ల వేలాన్ని భూములు ఇచ్చిన రైతులు అడ్డుకున్నారు. తమకు పరిహారంగా ఇచ్చిన ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేయకుండా వేలం వేయడంపై అభ్యంతరం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. తొర్రూర్లోని సర్వే నంబర్ 383/1లో సుమారు 117 ఎకరాల ప్రభుత్వ భూమిని లే అవుట్ చేసి ప్లాట్లుగా విభజించి అమ్మేందుకు గత ప్రభుత్వ హయాంలో రైతుల నుంచి హెచ్ఎండీఏ అధికారులు సేకరించారు. పొజీషన్లో ఉన్న రైతులకు పరిహారం కింద ఒక్కొక్కరికి 300 గజాల ఇంటి స్థలాన్ని అదే లే అవుట్లో ఇచ్చేందుకు ఒప్పించారు. ఈ మేరకు అలాట్మెంట్ పత్రాలు జారీ చేశారు. అనంతరం కొన్ని ప్లాట్లను వేలం వేశారు. తమకు ఇచ్చిన పత్రాల ఆధారంగా ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని, ఆ స్థలాలపై పూర్తి హక్కుల కల్పించాలని రైతులు కొంత కాలంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో హెచ్ఎండీఏ నుంచి అధికారం పొందిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ 510 ప్లాట్లలో 100 ప్లాట్లను వేలం వేసేందుకు సిద్ధమైంది. గ్రామంలోని ఓ కన్వెన్షన్ హాలులో వేలం వేసేందుకు బుధవారం ఆర్డీఓ అనంతరెడ్డి, తహసీల్దార్ సుదర్శన్రెడ్డి, రాజీవ్ స్వగృహ సీఈ భాస్కర్రెడ్డి, ఈఈ నరేందర్రెడ్డి వచ్చారు. బహిరంగ వేలం మొదలు పెట్టగానే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న రైతులు వేలం పాటకు అడ్డు తగాలారు. పోలీసులు కలుగ జేసుకోవడంతో తోపులాట జరిగింది. అనంతరం వేలం వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించి వెనుదిరిగారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డిని అక్కడికి పంపించారు. రైతులు ప్రభుత్వానికి సహకరించాలని, 10–15 రోజుల్లో ప్లాట్లు రిజిస్ట్రేషన్ జరిగే విధంగా చూస్తామని ఆయన హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలాన్ని అడ్డుకున్న రైతులు అడిషనల్ కలెక్టర్ హామీతో శాంతించిన వైనం -
చోరీ కేసులో దంపతుల అరెస్టు
ఆమనగల్లు: వృద్ధురాలి మెడలోని బంగారు ఆభరణాన్ని అపహరించిన ఓ జంటని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ మేరకు తలకొండపల్లి ఎస్ఐ శ్రీకాంత్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తలకొండపల్లి మండలం వెల్జాల గ్రామ సమీపంలో గత నెల 30న సాయిబాబ గుడి దగ్గర బెంచిపై అదే గ్రామానికి చెందిన వృద్ధురాలు మల్లమ్మ కూర్చుని ఉంది. ఇద్దరు ఆమె వద్దకు వచ్చి మాటలు కలిపారు. ఈ క్రమంలో మెడలో ఉన్న బంగారు గుండ్లహారం తీసుకొని నకిలీ ఆభరణం తిరిగి ఇచ్చారు. ఇంటికి వెళ్లిన వృద్ధురాలు అనుమానంతో తన మనవడికి చూపించగా ఆభరణం నకిలీదని గుర్తించి వెంటనే తలకొండపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి వెల్జాలలో ఆభరణం దొంగిలించి మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో బంగారు షాపులో వాటిని విక్రయించినట్లు గుర్తించారు. అనంతరం నిందితులను శంషాబాద్ సీసీఎస్ పోలీసుల సహాయంతో జడ్చర్లలో నవాబ్పేట మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలైన ఎరుకలి శ్రీను, అరుణలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ఎస్ఐ వివరించారు. కేసును త్వరితగతిన ఛేదించిన క్రైం కానిస్టేబుల్ జాషువాను అభినందించారు. -
వక్ఫ్ భూములు పరాధీనం
వికారాబాద్: వక్ఫ్ బోర్డు భూములు రోజురోజుకూ అన్యాక్రాంతం అవుతూనే ఉన్నాయి. మెజార్టీ భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల పరిగి మండలం సుల్తాన్పూర్ రెవెన్యూ పరిధిలో వక్ఫ్ భూములను పక్క పొలం రైతులు ఆక్రమించారని ఎర్రగడ్డపల్లికి చెందిన కొందరు కలెక్టర్, ఎస్పీ, డీఆర్ఓ, తహసీల్దార్లకు ఫిర్యాదు చేశారు. సమాధులను సైతం కూల్చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆ భూములను గతంలో వక్ఫ్ బోర్డు అధికారులు పలుమార్లు సందర్శించారు. కబ్జాకు గురయ్యాయని తేల్చారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆరోపణలు వచ్చిన ప్రతి సారీ వక్ఫ్ బోర్డు అధికారులు, రెవెన్యూ అధికారులు ఒకరిపై ఒకరు నెపం మోపి కాలం వెల్లదీస్తున్నారు. జిల్లాలో 2,170 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయని ఆ శాఖ అధికారులు చెబుతుండగా అవి చాలా వరకు కాగితాలకే పరిమితమయ్యాయి. పొజిషన్లో మాత్రం వేరేవారు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా గ్రామాల్లో పలుకుబడి ఉన్న వ్యక్తుల చేతుల్లోకి ఎప్పుడో వెళ్లి పోయాయి. కొన్ని చోట్ల సంరక్షకులుగా ఉన్న వారే యజమానులుగా మారిపోయారు. మరి కొన్ని చోట్ల కాగితాల్లో భూములు కనిపిస్తున్నాయి. పరాధీనం అయిన భూములపై ఫిర్యాదులు వచ్చినా విచారణ జరిపిన దాఖలాలు కనిపించడం లేదు. ఒక వేళ విచారణ జరిపినా నేతల ఒత్తిడి.. కాసులకు కక్కుర్తి పడుతున్న అధికారులు కారణంగా నివేదికలు బుట్టదాఖలు అవుతున్నాయి. సర్వే చేయడంలో విఫలం వక్ఫ్ భూములు ఉన్నదెంత.. ? అవి ఎక్కడెక్కడ ఉన్నాయి..? ఎవరి ఆధీనంలో ఉన్నాయి..? అనే దానిపై ఆ శాఖ అధికారులకే స్పష్టత లేదు. రెవెన్యూ అధికారులకు అవగాహన ఉన్నా వారు పట్టించుకోవడం లేదు. ఇటు రెవెన్యూ.. అటూ వక్ఫ్ బోర్డు అధికారుల కనుసన్నల్లోనే భూములు అన్యాక్రాంతం అవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో వక్ఫ్ భూములపై 1958 – 64 ప్రాంతంలో సర్వే నిర్వహించారు. 2006లో మరోసారి సర్వే చేసినా ఆ వివరాలను ప్రభుత్వం ప్రకటించలేదు. ఈ సర్వే ప్రకారం వక్ఫ్ భూముల విస్తీర్ణం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రెండో విడత సర్వే చేసి ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం 2017 ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భూ ప్రక్షాళన సర్వేలో అన్యాక్రాంతమైన భూముల వివరాలు వెల్లడవుతాయని అందరూ భావించారు. కానీ మొదటి విడతలో కేవలం లిటిగేషన్ లేని భూములను మాత్రమే సర్వే చేశారు. రెండో విడత సర్వే చేసి ఉంటే వక్ఫ్ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయో తెలిసేదని రెవెన్యూ అధికారులు అంటున్నారు. అనేక చోట్ల కబ్జా ● పరిగి మండలం సుల్తాన్పూర్ శివారులో ఓ దర్గా సమీపంలో ఉన్న వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. ఇందులో సుమారు ఐదెకరాల భూమి పరాదీనం అయ్యింది. గార్డియన్గా ఉన్న ఓ వ్యక్తి ఏకంగా వాటిని తన పేరున రాయించుకున్నాడు. ఈ విషయంలో స్థానకంగా నివాసముండే ఓ వ్యక్తి రెవెన్యూతో పాటు వక్ఫ్బోర్డు అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారు విచారణ జరిపి నివేఽధిక కూడా ఉన్నతాధికారులకు అందజేశారు. కాని ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదు. తాజాగా రెండు రోజుల క్రితం కూడా అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గతేడాది అధికారులు ఆ భూములను పరిశీలించి కబ్జాకు గురైనట్టు తేల్చారు, కాని ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదు. వీటితో పాటు పరిగి మున్సిపల్ పరిధిలోని 568 సర్వే నెంబర్లో సుమారు 205 ఎకరాల భూమి ఉండగా అందులో చాలా వరకు అన్యాక్రాంతం అయ్యింది. పరిగి మండలం రాపోల్ గ్రామంలో వక్ఫ్ భూములు పరాధీనమయ్యాయి. ఇదే మండలం నారాయణ్పూర్లో 24 ఎకరాలు ఉండగా 22 ఎకరాలు కబ్జాకు గురైనట్లు స్థానికులు తెలిపారు. వికారాబాద్, ధారూరు, తాండూరు మండలాల్లో సైతం అన్యాక్రాంతం అయ్యాయి. వికారాబాద్ జిల్లాలో 2,170 ఎకరాలు ఆక్రమణలపై తరచూ కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ, వక్ఫ్ బోర్డ్ అధికారులు 2006 సంవత్సరంలో సర్వే.. నేటికీ వెల్లడి కాని భూముల వివరాలు -
టీసీ ఇచ్చి.. ఇంటికి పంపి!
కేశంపేట: ప్రవర్తన సరిగా లేదనే కారణంతో ఓ పదో తరగతి విద్యార్థికి టీసీ ఇచ్చి పంపించారు. విద్యా సంవత్సరం మధ్యలో హాస్టల్ నుంచి పంపిస్తే తన కొడుకు చదువు పాడవుతుందని తండ్రి ఎంత వేడుకున్నా ప్రిన్సిపాల్ కనికరించలేదని బాధితుడు వాపోయాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. చింతగట్టుతండాకు చెందిన పదో తరగతి విద్యార్థి సబావట్ రాహుల్ ఐదో తరగతి నుంచి కేశంపేట జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. ఇటీవల అతని ప్రవర్తన బాగోలేదంటూ ప్రిన్సిపాల్ ప్రీతి బుధవారం విద్యార్థి తండ్రి రాజును హాస్టల్కు పిలిపించారు. మీ కొడుకు వ్యవహారం రోజురోజుకూ శ్రుతిమించుతోందని, అతన్ని భరించలేమని చెప్పారు. విద్యార్థి తండ్రి ఎంతగా వేడుకున్నా ప్రిన్సిపాల్ ససేమిరా అన్నారు. టీసీ తీసుకోకుండా వెళ్లేది లేదంటూ తలుపులు మూసి, తాళం వేశారు. దీంతో రాజు 100కు డయల్ చేసి తనను హాస్టల్లో బంధించారని ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ విద్యార్థితో పాటు అతని తండ్రితో సంతకాలు చేయించుకుని టీసీ చేతిలో పెట్టారు. ఇదిలా ఉండగా టీసీలో రాహుల్ ప్రవర్తన బాగుందని రాయడం గమనార్హం విద్యార్థి ప్రవర్తన బాగో లేదంటూ ప్రిన్సిపాల్ నిర్ణయం కేశంపేట జ్యోతిబాపూలే గురుకులంలో ఘటన -
ప్రైవేటుకు దీటుగా గురుకులాలు
తాండూరు టౌన్: ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ గురుకులాల్లో బోధన సాగుతోందని తెలంగాణ గురుకుల విద్యా సంస్థల (ట్రైస్) కార్యదర్శి సీహెచ్ రమణకుమార్ అన్నారు. బుధవారం తాండూరులోని తెలంగాణ గురుకుల బాలికల పాఠ శాల, కళాశాలను తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, వంటగది, లైబ్రరీ, ల్యాబొరేటరీ, కంప్యూటర్ ల్యాబ్, ఆన్లైన్ బోధనను పరిశీలించారు. మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సిలబస్తో పాటు ఆన్లైన్ తరగతులపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ గురుకులాల్లో అత్యుత్తమ బోధన అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం అనేక వసతులను కల్పిస్తోందన్నారు. ప్రతి ఏటా ప్రైవేటుకు దీటుగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని పేర్కొన్నారు. తాండూరు గురుకులంలో బోధన, ఫలితాలు, వసతులు భేషుగ్గా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బోధన, వసతుల కల్పనలో మేటి ట్రైస్ సెక్రటరీ రమణకుమార్ తాండూరులోని గురుకుల బాలికల పాఠశాల సందర్శన -
బాలుడు అదృశ్యం
కొందుర్గు: బాలుడు అదృశ్యమైన ఘటన కొందర్గు ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవీందర్నాయక్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని పర్వతాపూర్ గ్రామానికి చెందిన దర్గ చందు(15) స్థానిక బీసీ హాస్టల్లో ఉంటూ కొందుర్గు జెడ్పీహెచ్ఎస్లో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో జూలై 31న పాఠశాలకు మూడు రోజులు సెలవులున్నాయని కుటుంబ సభ్యులకు అబద్దపు సమాచారం ఇచ్చి స్వగ్రామానికి వచ్చాడు. అనుమానం వచ్చిన బాలుడి తండ్రి నర్సింలు ఈ నెల 2న పాఠశాల ఉన్నప్పటకీ ఇంటికి ఎందుకు వచ్చావని మందలించాడు. ఈ నెల 3న హాస్టల్కు వెళ్తున్నాని చెప్పి బయలుదేరాడు. తండ్రి మంగళవారం హాస్టల్కు వెళ్లగా సిబ్బంది రాలేదని చెప్పా రు. నర్సింలు బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసినా ఎటువంటి ఆచూకీ లభించక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొండాపూర్లో అక్రమ బ్లాస్టింగ్ పాఠశాలలో పడ్డ బండరాళ్లు గచ్చిబౌలి: కొండాపూర్లో నిబంధనలకు వి రుద్ధంగా చేపట్టిన బ్లాస్టింగ్తో పక్కన్నే ఉన్న చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్లో బండ రాళ్లు పడటంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రాళ్లు పడ్డ ప్రాంతంలో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కొండాపూర్లో ఓ రియల్ఎస్టేట్ సంస్థ సైట్లో మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బండ రాళ్లు పగులగొట్టేందుకు బ్లాస్టింగ్ చేపట్టారు. కాంట్రాక్టర్ కంట్రోల్ బ్లాస్టింగ్ చేయకపోవడంతో సైట్ను ఆనుకొని ఉన్న చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో ఎగిరి బండ రాళ్లు పడ్డాయి. ఆ సమయంలో కొంత మంది విద్యార్థులు ఆటలు ఆడుకుంటుండగా మరికొంత మంది లంచ్ బ్రేక్ కావడంతో ఆవరణలో ఉన్నారు. బండరాళ్లు ఉవ్వెత్తున దూసుకురావడంతో విద్యార్థులు ఆందోళనతో తరగతి గదుల్లోకి పరుగులు తీశారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా బ్లాస్టింగ్ చేయడంతో బండరాళ్లు స్కూల్లో పడ్డాయని వైస్ ప్రిన్సిపాల్ రంజిత్ గచ్చిబౌలి పీఎస్లో ఫిర్యాదు చేశారు. బ్లాస్టింగ్ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
దళితవాడకు అడ్డు కంచె తొలగింపు
షాద్నగర్రూరల్: ఫరూఖ్నగర్ మండలం బూర్గుల గ్రామంలో నెలకొన్న దళితవాడకు అడ్డంగా కంచె వివాదం సద్దుమణిగింది. రాకపోకలకు ఇబ్బందులు రాకుండా దారిని ఏర్పాటు చేశారు. కంచె ఏర్పాటుపై మంగళవారం దళిత సంఘాలు, కమ్యూనిస్టు పార్టీ, టీఎమ్మార్పీఎస్, ధర్మసమాజ్పార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, కేవీపీఎస్, ప్రజా సంఘాల నాయకులు గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అడ్డుగా వేసిన కంచెను తొలగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ అవసరాలకోసం ఇచ్చిన స్థలంలో కంచె వేయడం ఏమిటని ప్రశ్నించారు. దళితులకు దారి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోనే కంచె ఏర్పాటు చేశారని ఆరోపించారు. కంచె ఏర్పాటుతో దళితులు తమ ఇళ్లకు రాకపోకలు కొనసాగించలేని పరిస్థితి నెలకొందన్నారు. కంచె ఏర్పాటుతో ఇబ్బంది కలుగుతుందంటే తొలగిస్తామని బూర్గుల నర్సింగ్రావు సోదరి సుమన చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు, వివిధ సంఘాల నాయకులు సామేల్, జంగయ్య, చెన్నయ్య, శ్రీశైలం, శ్రీనునాయక్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. స్మృతివనం ఏర్పాటు చేస్తాం స్వాతంత్య్ర సమరయోధుడు బూర్గుల నర్సింగ్రావు గ్రామ అవసరాలకు ఇచ్చిన స్థలంలో ఆయన స్మృతివనం ఏర్పాటు చేస్తామని ఆయన సోదరి, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు బూర్గుల సుమన వెల్లడించారు. మంగళవారం గ్రామాన్ని సందర్శించిన ఆమె గ్రామస్తులు, దళితులతో మాట్లాడారు. దళితులు వెళ్లడానికి దారి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గ్రామానికి ఇచ్చిన స్థలంలో కొందరు ఇళ్లు నిర్మించుకున్నారని, ఆ స్థలంలో బోర్లు వేసి గ్రామానికి నీటి సరఫరా చేస్తున్నారని అన్నారు. ఆ స్థలంలో బూర్గుల నర్సింగ్రావు ఉద్యానవనం ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారని, ఆ కోరిక తీరకుండానే ఆయన మృతి చెందారని చెప్పారు. ఏ రోజూ తాము ఆ స్థలాన్ని తిరిగి తీసుకోవాలనే ఆలోచన చేయలేదన్నారు. స్మృతివనం ఏర్పాటుచేస్తే మొక్కలను పశువులు మేస్తాయనే ఆలోచతో కంచె వేశామే తప్ప ఆక్రమించుకునేందుకు కాదని స్పష్టం చేశారు. సద్దుమణిగిన వివాదం -
ద్విచక్ర వాహనాల దొంగకు రిమాండ్
షాద్నగర్రూరల్: బైక్ చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని రిమాండ్కు తరలించామని ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఠాణాలో సీఐ విజయ్కుమార్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ లక్ష్మీనారాయణ కేసు వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని చెరుకుపల్లికి చెందిన నర్సింలు జూన్ 19న ద్విచక్రవాహనంపై షాద్నగర్కు వచ్చాడు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న కొరియర్ కార్యాలయం పక్కన తన బైక్ పార్క్ చేసి వెళ్లాడు. మరునాడు వచ్చి చూడగా కనిపించలేదు. దీంతో ఆయన షాద్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా సాంకేతిక నైపుణ్యంతో కొత్తూరు మండలం ఇన్ముల్నర్వకు చెందిన కొర్రా వినోద్ను అదుపులోకి తీసుకుని విచారించగా బైక్ చోరీ చేసినట్లు అంగీకరించాడని తెలిపారు. నాలుగు బైక్లు స్వాధీనం నిందితుడిపై ఇప్పటికే షాద్నగర్ ఠాణా పరిధిలో నాలుగు, ఆర్జీఐ పీఎస్ పరిధిలో ఒకటి, కొత్తూరు పరిధిలో నాలుగు, అప్జల్గంజ్ పీఎస్ పరిధిలో రెండు కేసులు నమోదై జైలు వెళ్లి వచ్చినట్లు వెల్లడించారు. నిందితుడి నుండి రూ.2 లక్షల విలువ చేసే బైక్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామన్నారు. కేసును ఛేదించిన పట్టణ సీఐ విజయ్కుమార్, డీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శివారెడ్డి, సిబ్బంది రవీందర్, సంతోశ్, కర్ణాకర్, జాకీర్, రాజు చాకచక్యంగా వ్యవహరించినట్లు తెలిపారు. ఇద్దరు చైన్ స్నాచర్లకు.. ఇబ్రహీంపట్నం: ఇద్దరు చైన్ స్నాచర్లను ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. సీఐ మహేందర్రెడ్డి తెలిపిన ప్రకారం.. తలకొండపల్లికి చెందిన సంఘీ నాగరాజు(25) అల్మాస్గూడలో నివసిస్తూ ఆమెజాన్ కంపెనీలో ప్యాకింగ్ బాయ్గా పనిచేస్తున్నాడు. 2023లో ఓ రేప్ కేసులో జైల్కు వెళ్లి వచ్చాడు. షార్ట్ ఫిల్మ్లు తీస్తున్న నాగరాజుకు నెల రోజుల క్రితం జడ్చర్లకు చెందిన వేదవ్యాస్ (24)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి ఒకే రూంలో ఉంటున్నారు. వ్యసనాలకు బానిసలైన వీరు ఇరువురూ సులువుగా డబ్బు సంపాదించేందుకు చైన్ స్నాచింగ్ బాటపట్టారు. ఈ నెల 1వ తేదీన పోల్కంపల్లి పంచాయతీ పరిధిలోని జాజోనిబావికి చెందిన లావణ్య(33) తమ పొలంలో పశువులను మేపుతుండగా నాగరాజు, వేదవ్యాస్ బైక్పై వచ్చి ఆమె మెడలోంచి పుస్తెల తాడును అపహరించేందుకు యత్నించారు. సదరు మహిళ అప్రమత్తమై గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల రైతులు వచ్చారు. అప్రమత్తమైన దుండగులు వెంటనే పుస్తెలతాడును వదిలి పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ పుటేజీలను పరిశీలిస్తున్న క్రమంలో మంగళవారం మంగళ్పల్లి వద్ద చైన్ స్నాచింగ్ కోసం యత్నిస్తూ పోలీసులకు చిక్కారు. చైన్స్నాచింగ్కు వాడిన వేదవ్యాస్ ఆర్15 బైక్ను సీజ్ చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.నాలుగు బైక్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఏసీపీ లక్ష్మీనారాయణ -
రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం
తుర్కయంజాల్: రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసమే సహకార సంఘాలు పనిచేస్తున్నాయని డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. మంగళవారం డీసీసీబీ చైర్మన్ అధ్యక్షతన తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం కార్యాలయంలో పాలకవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 23 మంది సభ్యులను సంఘంలో నూతనంగా చేర్చుకున్నామని, 24 మంది రైతులకు రూ. 2.65 కోట్లు రుణాలను మంజూరు చేశామన్నారు. 2024–25 ఆర్ధిక సంవత్సరం ఆడిట్ సర్టిఫికెట్ను ఆమోదించడంతో పాటు, 2025–26 మే 1వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు మూడు నెలల జమా ఖర్చులను ఆమోదించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం వైస్ చైర్మన్ కొత్త రాంరెడ్డి, డైరెక్టర్లు లక్ష్మారెడ్డి, లక్ష్మమ్మ, సంజీవ రెడ్డి, యాదగిరి, ఎస్.లక్ష్మమ్మ, కృష్ణారెడ్డి, సత్యనారాయణరెడ్డి, సీఈఓ వై.రాందాసు తదితరులు పాల్గొన్నారు.డీసీసీబీ చైర్మన్ సత్తయ్య -
రూ.13 కోట్లు ఫట్!
సాక్షి, సిటీబ్యూరో: ఒకటి కాదు.. వంద కాదు.. ఏకంగా 72,549 వీధిదీపాలు లేకుండానే వాటి ఏర్పాటు, నిర్వహణ పేరిట కాంట్రాక్టు ఏజెన్సీకి నిధులు చెల్లించారు. ఈ అవినీతి తంతు ఏకంగా ఏడేళ్లు సాగింది. ఇవి ఎల్ఈడీ వీధిదీపాల నిర్వహణకు గాను జీహెచ్ఎంసీ ఈఈఎస్ఎల్ (ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్)కు గత ఏప్రిల్ నెలాఖరు వరకు ముగిసిన ఏడేళ్ల కాంట్రాక్టు కాలంలో చెల్లించిన నిధులు. ఒక్కో వీధిదీపం నిర్వహణకు నెలకు రూ.22 వంతున ఏడేళ్ల కాలానికి దాదాపు రూ.13,40,70,552 చెల్లించారు. ఇవి కేవలం నిర్వహణ పేరిట. ఇక వీధిదీపాల ఏర్పాటు ఖర్చు మరింత అ‘ధనం’. ఎంతో కాలంగా నగరంలో కారుచీకట్లు అలుముకున్నా, ఒప్పందం మేరకు 98 శాతం వీధిదీపాలు వెలగకున్నా, ఈఈఎస్ఎల్పై జీహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోలేదు. మరోవైపు జీహెచ్ఎంసీ తమకు కోట్ల నిధులు చెల్లించాల్సి ఉందంటూ ఈఈఎస్ఎల్ ప్రచారం చేసుకుంది. కాంట్రాక్టు ఒప్పందం మేరకు డ్యాష్బోర్డు పని చేయకున్నా, సీసీఎంఎస్ (సెంట్రల్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్) బాక్స్లు పని చేయకున్నా జీహెచ్ఎంసీ పట్టించుకున్న పాపాన పోలేదు. తప్పుడు లెక్కలు ఈఈఎస్ఎల్ ఒప్పందం ముగియడానికి ముందు.. తిరిగి వీధిదీపాల నిర్వహణ బాధ్యతలు కొత్తగా ఎవరికివ్వాలన్న అంశం చర్చకు రాగా, అప్పటి కమిషనర్ ఇలంబర్తి, అడిషనల్ కమిషనర్ శివకుమార్ నాయుడు అసలు నగరంలో వాస్తవంగా ఉన్న వీధిదీపాలెన్నో లెక్క తీయాలని భావించి క్షేత్రస్థాయి సర్వే నిర్వహించగా, 4,77,539 వీధిదీపాలు మాత్రమే లెక్క తేలాయి. ఒప్పందం ప్రకారం 5,50,088 వీధిదీపాలు ఏడేళ్లపాటు వెలుగులు విరజిమ్మాలి. అగ్రిమెంట్ కాలపరిమితి ముగిసేంత వరకు కూడా అసలెన్ని వీధిదీపాలున్నాయో, ఎన్ని వెలిగాయో కూడా చూడకుండానే చెల్లింపులు చేశారంటే నిజంగా నిద్రపోయారా, లేక నిద్ర నటించి అవినీతిని ప్రోత్సహించారా? అన్నది జీహెచ్ఎంసీకే తెలియాలి. పర్యవేక్షణ లేమి.. ● జీహెచ్ఎంసీ విద్యుత్ విభాగాన్ని చాలా కాలంగా నిర్లక్ష్యం చేశారు. ప్రజల నుంచి జీహెచ్ఎంసీకి అందుతున్న ఫిర్యాదుల్లో సింహభాగం వీధిదీపాలవే అయినా సమస్యను పరిష్కరించలేకపోయారు. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, సికింద్రాబాద్ జోన్లలో ఇప్పటికీ 50 శాతం వీధిదీపాలు వెలగడం లేవు. పేరెన్నికగన్న దుర్గంచెరువు బ్రిడ్జిమీద సైతం నెలలో సగం రోజులు చీకట్లే అలుముకుంటున్నాయి. ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కారమైనట్లు మెసేజ్ తప్ప నిజంగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఫిర్యాదు చేసేందుకు ప్రజలు కార్యాలయాలకు వెళ్లినా అక్కడ కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు తప్ప సంబంధిత ఇంజినీర్లు కనిపించరు. అదేమంటే క్షేత్రస్థాయి విధులకు వెళ్లారని చెబుతారు. కానీ, వారు క్షేత్రస్థాయిలోనూ కనిపించరు. ● పనులకు సంబంధించిన ఎస్టిమేట్స్ సైతం ఫోన్లు చేసి చెప్పి ఆపరేటర్ల ద్వారానే వేయిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాత్రి 9 గంటల వరకు క్షేత్రస్థాయి విధులు నిర్వహించాల్సిన ఇంజినీర్లు దాదాపు 7 గంటల సమయంలో క్షేత్రస్థాయిలో ఉన్నట్లు సంబంధిత వాట్సాప్ గ్రూపు లో ఒక ఫొటో పెడుతూ ఉన్నతాధికారులను మభ్యపెడుతున్నట్లు సమాచారం. జెన్కో నుంచి వచ్చిన డీఈఈ స్థాయి వారికే సదుపాయాలతో కలిపి ఏటా దాదాపు రూ. 50 లక్షల జీతం చెల్లిస్తున్నారు. అయినప్పటికీ క్షేత్రస్థాయి పర్యవేక్షణ లేదు. ఏడేళ్లు దాటినా వీధిదీపాల లెక్కలే సరిగ్గా లేవంటే పనితనం అంచనా వేసుకోవచ్చు. తాత్కాలికం పేరుతో.. పండుగలు, ప్రత్యేక దినోత్సవాల పేరిట ఆయా సందర్భాల్లో తాత్కాలిక వీధిదీపాల పేరుతో ఏటా దాదాపు రూ.30 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వాస్తవానికి నగరమంతా ఎల్ఈడీ వీధిదీపాల నిర్వహణ అన్నప్పుడు విడిగా మళ్లీ తాత్కాలికం పేరిట నిధుల ఖర్చెందుకో అర్థం కాదు. ప్రత్యేక సందర్భాల్లో రంగుల కాంతుల వంటివి తాత్కాలికంగా ఏర్పాటు చేయవచ్చు కానీ.. వీధిదీపాలు తాత్కాలికం ఏమిటో అంతుపట్టదు. వివిధ పనుల్లోనూ అవినీతి చేతివాటం ఎంతో జరుగుతున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ పోల్స్ మార్చడం తదితర పనులకు కాంట్రాక్టర్లు 60 శాతం లెస్కు టెండర్లు వేస్తున్నారంటే, వాటి వెనుక అవినీతి ఎంతో అంచనా వేసుకోవచ్చు. దారి మళ్లుతున్న కేబుల్? శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఎల్బీనగర్ జోన్లలో అవసరం లేకున్నా కేబుల్ తదితర సామగ్రి భారీగా కొనుగోళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాటిని ఎక్కడ వినియోగించారో, ఏంచేశారోలెక్కాపత్రం ఉండదు. వక్రమార్గంలో అవి ప్రైవేట్ కాంట్రాక్టర్ల పరం అవుతాయనే ఆరోపణలున్నాయి. అయినప్పటికీ, ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని సమాచారం. వెలుతురు వెనుక అవినీతి చీకటి? ఎల్ఈడీ వీధిదీపాల పేరిట లూటీ ఏడేళ్లు సాగిన అక్రమాల తంతు కళ్లు మూసుకున్న బల్దియా వస్తే .. కదలరు ఇతర విభాగాల నుంచి జీహెచ్ఎంసీకి వచ్చే అధికారులు గరిష్టంగా ఐదేళ్ల వరకు డిప్యుటేషన్లో కొనసాగవచ్చు. విద్యుత్ విభాగంలో పని చేస్తున్న ఇంజినీర్లు మాత్రం ఆ కాలపరిమితి దాటినా కొనసాగుతున్నారు. బాధ్యతల అప్పగింతలోనూ వివక్ష కొనసాగుతోందనే ఆరోపణలున్నాయి. కొందరు ఈఈలకు ఒక్క సర్కిల్ పర్యవేక్షణ మాత్రమే ఉండగా, కొందరికి ఆరేడు సర్కిళ్లు కూడా ఉండటం వెనుక మతలబు ఏమిటో సంబంధీకులకే తెలియాలి మరి. -
కుర్మిద్దలో ‘మార్బని’
యాచారం: కుర్మిద్దలో జపాన్కు చెందిన మార్బని అనే కంపెనీకి ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీకి యాచారం మండల పరిధిలోని కుర్మిద్దలో 426.32 ఎకరాలు, కందుకూరు మండలం మీరాఖాన్పేటలో 546.10 ఎకరాలు కేటాయిస్తున్నారు. కుర్మిద్ద గ్రామంలోని సర్వేనంబర్ 311, 312తో పాటు 290, 291, 294, 295, 296, 297, మీరాఖాన్పేట పరిధిలోని సర్వే నంబర్ 113, 114, 118లో దాదాపు వెయ్యి ఎకరాల అసైన్డ్, పట్టా భూమిని సర్కార్ సదరు కంపెనీకి ఇచ్చి ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. మొదట్లో ససేమిరా.. తర్వాత అంగీకారం మార్బని కంపెనీకి కుర్మిద్దలోని సర్వేనంబర్ 290 నుంచి 297 వరకున్న పట్టా భూములు ఇవ్వడానికి రైతులు ససేమిరా అన్నారు. సర్కార్ నిర్మించడానికి నిర్ణయించిన గ్రీన్ ఫీల్డ్ రోడ్డు పక్కనే ఈ భూ ములు ఉండడంతో మొదట్లో ఆగ్రహం వ్యక్తమైంది. మెరుగైన పరిహారంతోపాటు 121 గజాల ప్లాటు ఆఫర్తో మెత్తబడ్డారు. పట్టా భూములు ఇవ్వడానికి ముందుకు రావడంతో రెవెన్యూ అధికారులు దాదాపు 50 ఎకరాలకు పైగా సేకరించారు. టీజీఐఐసీ ద్వారా రూ.30 లక్షలు, మార్బని కంపెనీ నుంచి రూ.15 లక్షల చొప్పున పరిహారం ఇప్పించారు. కంపెనీకి కేటాయించడానికి ఇంకా పట్టా భూమిని సేకరించాల్సి ఉంది. ఇందుకోసం అధికారులు రైతులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. మొండిగౌరెల్లిలో అభిప్రాయసేకరణ మొండిగౌరెల్లిలోని 820 ఎకరాల అసైన్డ్, పట్టా భూమి సేకరణకు మూడు నెలల క్రితం సర్కార్ నోటిఫికేషన్ ప్రకటించింది. గ్రామంలోని సర్వేనంబర్ 19, 68, 127 అసైన్డ్ నంబర్లతో పాటు పలు పట్టా సర్వేనంబర్లలో ఉన్న భూములను కూడా నోటిఫికేషన్లో పొందుపర్చింది. పారిశ్రామిక పార్క్ కోసమంటూ ప్రకటించింది. ఏ కంపెనీలకు ఆ భూములను కేటాయిస్తుందో మాత్రం నేటికీ ప్రకటించలేదు. ఆ తర్వాత ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డి గ్రామంలోని అసైన్డ్, పట్టా భూములను పరిశీలించి భూసేకరణపై రైతుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. భూములిచ్చే విషయంలో మిశ్రమ స్పందన రావడంతో ఏ నిర్ణయం తీసుకోలేదు. ఢిపెన్స్కు అసైన్డ్ భూములు! మొండిగౌరెల్లిలో అత్యధికంగా రైతులు పుదీన, ఆకుకూరలు పండిస్తూ జీవనం సాగిస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఈ గ్రామాన్ని కూరగాయలు, ఆకుకూరల పెంపు కోసం దత్తత తీసుకుంది. గ్రామ రైతులు కూడా రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. పట్టా భూములతో పాటు, వెంచర్ ద్వారా ప్లాట్లు చేసిన భూమిని మినహాయించాలని కలెక్టర్, ఇబ్రహీంపట్నం ఆర్డీఓకు రైతు కమిషన్ చైర్మన్ సూచించారు. తాజాగా ఆ గ్రామ భూములు డిఫెన్స్కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డిని సంప్రదించగా కుర్మిద్దలోని వెయ్యి ఎకరాలను మార్బని కంపెనీకి సర్కార్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం ఉందని తెలిపారు. జపాన్కు చెందిన కంపెనీ ఏర్పాటుకు వెయ్యి ఎకరాలు కేటాయింపు ఎకారకు రూ.45 లక్షల చొప్పున పట్టా రైతులకు పరిహారం మీరాఖాన్పేట టీజీఐఐసీ వెంచర్లో 121 గజాల ప్లాటు మొండిగౌరెల్లి అసైన్డ్ భూములు ఢిపెన్స్కు ఇచ్చే ఆలోచన -
ఆహార విక్రయంలో ప్రమాణాలు పాటించాలి
షాద్నగర్రూరల్: వీధి ఆహార విక్రేతలు పరిశుభ్రతను పాటించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని నెస్ట్లే ఇండియా కార్పొరేట్ అఫైర్స్ మేనేజర్ ఎం.డి.వసీం అన్నారు. పట్టణంలోని పద్మశాలి సంఘం భవనంలో మంగళవారం నేషనల్ అసోసియేషన్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా, నెస్లే ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో వీధి ఆహార విక్రేతలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వసీం మాట్లాడుతూ.. వీధి ఆహార విక్రేతలు ఆహార భద్రతా ప్రమాణాలు పాటించాలని అన్నారు. ఆహార నిల్వ, ప్లాస్టిక్ వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. 26 ఏళ్లుగా వీధి ఆహార విక్రేతల హక్కులకోసం పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 1,700 మంది వీధి ఆహార విక్రేతలకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. నేషనల్ అసోసియేషన్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు రంగాశాలివాహన్ మాట్లాడుతూ.. నాణ్యాతా ప్రమాణాలు పాటిస్తే వినియోగదారుల్లో వీధి ఆహారంపై విశ్వాసం పెరుగుతుందని అన్నారు. అనంతరం ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ప్రమాణాల ప్రకారం శిక్షణ తీసుకున్న వీధి ఆహార విక్రేతలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ డిప్యూటీ ఫుడ్ కంట్రోలర్ విజయ్కుమార్, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఖలీల్, సాయి తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
చేవెళ్ల: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మణ్ అన్నారు. చేవెళ్లలోని ఆదర్శ పాఠశాలలో మంగళవారం పాఠశాల విద్యాశాఖ, కౌన్సిల్ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ సంయుక్తంగా యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణంపై విద్యార్థి దశనుంచే అవగాహన కల్పించాలని అన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మోహిదీన్, ప్రిన్సిపాల్ చిన్నపురెడ్డి, యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాం జిల్లా కో ఆర్డినేటర్ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆడిట్లో తప్పుల గుర్తింపు సామాజిక తనిఖీలో వెల్లడి కందుకూరు: మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో గ్రామీణ ఉపాధిహామీ పథకం 2024–25 సంవత్సరానికి సంబంధించి 12వ విడత సామాజిక తనిఖీని డీఆర్డీఓ శ్రీలత ఆధ్వర్యంలో మంగళవారం అధికారులు నిర్వహించారు. మొత్తం మండలంలో ఈజీఎస్ కింద కూలీలు, మెటీరియల్ ఖర్చులకు రూ.6.28 కోట్లు, పీర్ పనులకు గాను రూ.1.34 కోట్లు, ఫారెస్ట్ కింద రూ.35.18 లక్షలు ఖర్చు చేసినట్లు గుర్తించారు. అనంతరం పంచాయతీల వారీగా నిర్వహించిన ఆడిట్లో గుర్తించిన తప్పులకు సంబంధించి సిబ్బంది నుంచి వివరణ తీసుకున్నారు. కొన్ని గ్రామాల్లో మస్టర్లలో కొట్టివేతలు, రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం తదితర కారణాలతో సంబంధిత సిబ్బందికి జరిమానా కింద రూ.16వేలు విధించారు. మళ్లీ పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని డీఆర్డీఓ శ్రీలత ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు డీఆర్డీఓ సుభాషిణి, ఎంపీడీఓ సరిత, అంబుడ్స్మన్ సునీత, ఏపీడీ చరణ్, విజిలెన్స్ అధికారి కొండయ్య, ఎస్ఆర్పీ కాశయ్య, పంచాయతీ కార్యదర్శులు, ఈసీలు, టీఏలు, ఎఫ్ఏలు పాల్గొన్నారు. స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం షాద్నగర్రూరల్: పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2025–26 విద్యాసంవత్సరానికి డిప్లమా, ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ పరమేశ్వర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో ఉన్న కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కోర్సులకు ఈనెల 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సిర్టిఫికెట్లతో పాటు వాటి జిరాక్స్ కాపీలను నిర్ధారిత ఫీజుతో ఈనెల 8న ఉదయం 9.30 గంటలకు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పారు. మరిన్ని వివరాలకు పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సంప్రదించాలని సూచించారు. మహేశ్వరం పాలిటెక్నిక్ కళాశాలలో.. మహేశ్వరం: మహేశ్వరం ప్రభుత్వ పాలిటెక్నినిక్ కళాశాలలో ఈ నెల 7వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ నాగరాజు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ కోర్సుల్లో 45 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ నెల 8న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామన్నారు. వివరాలకు 94901 20175, 72076 83644 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. వాహనాల వేలం: రూ.3.11 లక్షల ఆదాయం ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ఎకై ్సజ్ పోలీస్స్టేషన్లో నిర్వహించిన మూడు వాహనాల వేలం పాటలో రూ.3,11,800 ఆదాయం వచ్చినట్లు ఎకై ్సజ్ సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. ఒక బజాజ్ ఆటో, రెండు టీవీఎస్ ఎక్సెల్ వాహనాలకు వేలం వేశారు. 38మంది రూ.5వేల చొప్పున డిపాజిట్ చేసి వేలంలో పాల్గొన్నారు. మొక్కలు నాటుతున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మణ్ తదితరులు -
గుడిమల్కాపూర్@అజీజ్నగర్!
సమీకృత మార్కెట్ను తరలించే యోచన మొయినాబాద్: మెహిదీపట్నం సమీపంలో ఉన్న గుడిమల్కాపూర్లో 1992లో అప్పటి అవసరాలకు అనుగుణంగా కూరగాయలు, పూల మార్కెట్ నిర్మించారు. ఆరు ఎకరాల విస్తీర్ణంలో కూరగాయల మార్కెట్, 11 ఎకరాల విస్తీర్ణంలో పూలమార్కెట్ కొనసాగుతున్నాయి. నిత్యం వేల మంది రైతులు కూరగాయలు, పూలు తీసుకుని మార్కెట్కు వెళ్తున్నారు. ప్రతిరోజు 20–25 టన్నుల కూరగాయలు, 30–40 టన్నుల పూలు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ట్రాఫిక్ తిప్పలు తప్పేలా.. రైతులతోపాటు, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అయ్యే కూరగాయలు, పూలను లారీలు, డీసీఎంలలో తీసుకొస్తుంటారు. కొనడానికి వచ్చేవారు సైతం వాహనాలను తెస్తుంటారు. మార్కెట్ స్థాయికి మించి వాహనాలు వస్తుండడంతో నిత్యం ట్రాఫిక్ జాం అవుతోంది. పండుగల సమయంలో సమస్య మరింత జఠిలంగా మారి గంటల తరబడి వాహనాలు నిలిచిపోతుంటాయి. దూర ప్రాంతాల నుంచి మార్కెట్కు వచ్చే రైతులు ట్రాఫిక్ సమస్యతో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు మార్కెట్లో దళారులు ఎక్కువై రైతులు నష్టపోతున్నారు. మార్కెట్లో మౌలిక సదుపాయాలు సైతం కరువయ్యాయి. ఈ పరిస్థితులను అధిగమించడానికి మార్కెట్ను నగర శివారుకు తరలించే ప్రక్రియను మొదలు పెట్టారు. ఓఆర్ఆర్ పక్కనే స్థల పరిశీలన ఔటర్ రింగ్రోడ్డు పక్కనే అజీజ్నగర్ రెవెన్యూలోని సర్వేనంబర్ 176లో 150 ఎకరాలను మార్కెట్ ఏర్పాటుకు పరిశీలించారు. ఓఆర్ఆర్ సమీపంలో మార్కెట్ ఏర్పాటు చేస్తే దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి, స్థానిక రైతులకు అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల రైతులకు సైతం అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు 150 ఎకరాల భూమిని సర్వే చేసి కలెక్టర్కు నివేదిక పంపారు. మార్కెట్ తరలింపునకు సంబంధించిన ప్రతిపాదనలను గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీతోపాటు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రభుత్వానికి పంపారు. భూ కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే స్థల సేకరణ చేపట్టి పనులు మొదలు పెట్టనున్నారు. రైతుల సౌలభ్యం కోసం గుడిమల్కాపూర్లో స్థలం సరిపోక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ను ఓఆర్ఆర్ సమీపంలోకి తరలించాల ని ప్రతిపాదించాం. రైతుల సౌలభ్యంకోసం, మెరుగైన వసతులు కల్పించేందుకు మార్కెట్ కమిటీలో చర్చించి 150 ఎకరాల్లో మార్కెట్ ఏర్పాటుకోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. – కావలి చంద్రశేఖర్, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఓఆర్ఆర్ పక్కనే అజీజ్నగర్ రెవెన్యూలో భూ పరిశీలన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించిన అధికారులు మార్కెట్ ఏర్పాటైతే రైతులకు సౌలభ్యం ఇబ్బందులు తీరతాయి గుడిమల్కాపూర్ మార్కెట్లో ప్రస్తుతం చాలా ఇబ్బందులు ఉన్నాయి. మార్కెట్లో వాహనాల పార్కింగ్కు స్థలం లేదు. ట్రాఫిక్ జామ్తో తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోంది. మార్కెట్ను అజీజ్నగర్కు తరలిస్తే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉండటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. – గడ్డం వెంకట్రెడ్డి, సురంగల్, మొయినాబాద్ -
మొయినాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం
మొయినాబాద్: మున్సిపల్ పరిధిలోని మృగవని పార్కు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి కథనం ప్రకారం.. నార్సింగి మున్సిపాలిటీకి చెందిన సిద్ధార్థ (27) మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తన కారులో నార్సింగి నుంచి మొయినాబాద్ వైపు వెళ్తున్నాడు. మృగవని జాతీయ పార్కు వద్ద వెనకనుంచి అతివేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన సిద్ధార్థ కారు డివైడర్ పైనుంచి అవతలివైపునకు దూసుకెళ్లింది. ఈ సమయంలో మొయినాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న సిద్ధార్థ అక్కడికక్కడే చనిపోయాడు. కారు బెలూన్లు తెరుచుకున్నప్పటికీ అతని ప్రాణాలు దక్కలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, లారీ కింది భాగంలోకి దూసుకెళ్లిన కారును బయటకు తీశారు. కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసం కావడంతో సిద్ధార్థ అప్పటికే మృతిచెందాడు. సినిమా స్టంట్స్ తరహాలో జరిగిన ప్రమాదం కారణంగా అజీజ్నగర్ చౌరస్తా వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇదిలా ఉండగా సిద్ధార్థ కారును ఢీకొట్టిన కారు ఆపకుండా వెళ్లిపోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు. సినిమా స్టంట్స్ తరహాలో ఘటన సాఫ్ట్వేర్ ఉద్యోగి అక్కడికక్కడే దుర్మరణం -
పేదల అభ్యున్నతే లక్ష్యం
బడంగ్పేట్: పేదల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. బాలాపూర్ మండలం మల్లాపూర్లోని వైఏఆర్ గార్డెన్లో మంగళవారం చేపట్టిన రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో 12 వేల కొత్త రేషన్కార్డుల జారీతో సగటున 50 వేల మందికి సన్నరకం బియ్యం అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాంతానికి కొత్త పరిశ్రమలు తీసుకువస్తున్నామని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయమని పేర్కొన్నారు. రాష్ట్ర వాప్తంగా ఇప్పటి వరకు 65 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు రేషన్కార్డులు అందించడం నిరంతర ప్రక్రియ అని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ఎమ్మెల్యే సబితారెడ్డి, టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య, కందుకూరు ఆర్డీవో రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెనగారి లక్ష్మారెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ మేయర్ చిగురింత పారిజాత తదితరులు పాల్గొన్నారు. పోటాపోటీగా నినాదాలు రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. మధ్యాహ్నం 1.30 గంటలకు ఎమ్మెల్యే సబితారెడ్డి తన అనుచరులతో కలిసి వచ్చారు. 2 గంటల సమయంలో మంత్రి అక్కడికి చేరుకోగానే బీఆర్ఎస్ నాయకులు ఒక్కసారిగా సబితమ్మ జిందాబాద్, జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు మొదలుపెట్టారు. అంతే రెట్టింపుతో కాంగ్రెస్ నాయకులు సైతం నినాదాలు చేశారు. ఎమ్మెల్యే సబితారెడ్డి మైక్ తీసుకుని ప్రొటోకాల్ పాటించకుండా ఎందుకు పిలిచారని ప్రశ్నించారు. మీరుమీరే పంపిణీ చేసుకుంటే మేమెందుకు ఇక్కడ అంటూ బహిష్కరించి వెళ్లబోయారు. మీరు వెళ్లొద్దంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆమెను కోరారు. అదేసమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. రెండు గంటల పాటు హైడ్రామా చోటు చేసుకుంది. ఏసీపీ జానకిరాం ఆధ్వర్యంలో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం సబితారెడ్డి అనుచరులతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించారు. రేషన్కార్డులు అందుకోవాలని చంటి బిడ్డలతో వచ్చి న తల్లులు ఏంజరుగుతుందో అర్థంకాక విస్తుపోయి చూశారు.మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు -
డ్రగ్స్కు బానిసలు కావొద్దు
ఇబ్రహీంపట్నం: విద్యార్థులు, యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ అన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం గంజాయి, డ్రగ్స్ను నిర్మూలించాలని, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ను నిషేధించాలని ఇబ్రహీంపట్నంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత డ్రగ్స్, గంజాయికు బానిసై జ్ఞానాన్ని, విచక్షణను, శక్తిసామర్థ్యాలను కోల్పోయి జీవితాలను నిస్తేజంగా మార్చుకుంటున్నారని పేర్కొన్నారు. చదువులు, ఉద్యోగాలకు దూరమై కుటుంబాలకు భారమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువతను పెడదారి పట్టిస్తున్న డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వం ఈ మహమ్మారిని ప్రారద్రోలేందుకు కలిసికట్టుగా పోరు సాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి పి.జగన్, జిల్లా ఉపాధ్యక్షుడు అలంపల్లి జంగయ్య, నాయకులు పి.శివశంకర్, ఆర్.స్వామి, రాఘవేందర్, శివ, చైతన్య, మహేశ్, ప్రభాకర్, లెనిన్, వినోద్, యాదగిరి పాల్గొన్నారు. -
ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి
జిల్లా వ్యవసాయాధికారి ఉష కడ్తాల్: ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి టి.ఉష అన్నారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో జరుగుతున్న ఫార్మర్ రిజిస్ట్రీని ఆమె పరిశీలించారు. మండల పరిధిలో ఎంత వరకు ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తయిందో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడకుండా చూడాలని, తగినంత నిల్వలు ఉండేలా ఎప్పటికప్పుడు ఎరువుల దుకాణాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. అనంతరం మైసిగండి గ్రామంలో పర్యటించారు. క్వాలిటీ సీడ్ ఫర్ ఎవ్రీ విలేజ్ (క్యూఎస్ఈవీ) పథకంలో లబ్ధిదారుడైన గ్రామానికి చెందిన రామవత్ లక్ష్మణ్నాయక్ సాగు చేసిన వరి పంటను పరిశీలించారు. మండల కేంద్రంతో పాటు, రావిచేడ్ గ్రామాల్లో విత్తన, ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏడీఏ శోభారాణి, ఏఓ కవిత, ఏఈఓ కశ్యప్ తదితరులు పాల్గొన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలి షాబాద్: పేద ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల సభ్యుడు డాక్టర్ సుశీల్ హరిపాండ్ దేశ్ముఖ్, డాక్టర్ కవాస్ ఆనంద్ కృష్ణరాజ్ పేర్కొన్నారు. మండల పరిధిలోని చందనవెల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మంగళవారం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో డిప్యూటీ ఉప వైద్యధికారి డాక్టర్ నాగేంద్రబాబుతో కలిసి వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవల నాణ్యతను మెరుగుపర్చాలని, రోగుల్లో నమ్మకం, ప్రజారోగ్య వ్యవస్థలో జవాబుదారీతనం పెంచాలన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ధిష్ట ప్రమాణాలు పాటించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రణీత్, డిస్టిక్ట్ క్వాలిటీ మేనేజర్ రాము, సీహెచ్ఓ సురేందర్నాయక్, వైద్య సిబ్బంది కవిత, నీలవేణి, నవీన్, కమార్, నవీన్, గోపాల్, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు. -
మహాసభలను జయప్రదం చేయాలి
తుర్కయంజాల్: సెప్టెంబర్ 19, 20 తేదీల్లో తుర్కయంజాల్లో నిర్వహించనున్న మున్సిపల్ కార్మికుల రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయా లని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ కోరారు. రాగన్నగూడలోని ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన మహాసభల ఆహ్వాన సంఘం ఏర్పాటు సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల శ్రమను ప్రభుత్వం గుర్తించడం లేదని, పని భద్రత లేదని, ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నా పర్మినెంట్కు నోచుకోవడం లేదన్నారు. ప్రభుత్వం 2వ పీఆర్సీలో కనీస వేతనం రూ.26వేలు ఇవ్వడంతో పాటు, 60 ఏళ్లు పైబడిన, మరణించిన కార్మికుల స్థానంలో కుటుంబ సభ్యులకు పనికల్పించాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రమాద బీమా కల్పించాలని, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె సెగ తప్పదని హెచ్చరించారు. అనంతరం ఆహ్వాన సంఘం చైర్మన్గా జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య, ప్రధాన కార్యదర్శిగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.కిషన్, కోశాధికారిగా సీహెచ్ ఎల్లయ్య, పాలడుగు భాస్కర్, ఎం.చంద్రమోహన్తో పాటు పలువురిని ఎన్నుకున్నారు. సమావేశంలో 14 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్ల నుంచి కార్మికులు పాల్గొన్నారు. -
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
కుల్కచర్ల: విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లోనూ రాణించాలని ముజాహిద్పూర్ ప్రభుత్వ మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతిహెప్సిబా అన్నారు. మండల పరిధిలోని ముజాహిద్పూర్ మాడల్స్కూల్లో 10వ తరగతి చదువుతున్న నరేశ్ ఈ నెల 2, 3 తేదీల్లో చైన్నైలోని రామకృష్ణ పాలిటెక్నిక్ కాలేజ్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి టెన్నిస్బాల్ క్రికెట్ పోటీలలో ప్రతిభను కనబరిచాడు. ఈ మేరకు ఆయన్ను జాతీయస్థాయి పోటీలకు ఎంపికచేశారు. ఈ సందర్భంగా సోమవారం పాఠశాల ఉపాధ్యాయ బృందం నరేశ్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఈటీ కృష్ణారెడ్డి, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీ విద్యార్థి అదృశ్యం
శంకర్పల్లి: డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థి అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శంకర్పల్లి సీఐ శ్రీనివాస్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని హనుమాన్నగర్ కాలనీకి చెందిన వసంత్కుమార్(18) డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. గత నెల 29న ఇంట్లో ఎవరికి చెప్పకుండా, బయటకు వెళ్లి, తిరిగిరాలేదు. బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా సమాచారం లభించలేదు. దీంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బైక్ అదుపుతప్పి వ్యక్తికి గాయాలు దుద్యాల్: బైక్ అదుపుతప్పడంతో ఓ ద్విచక్రవాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఆలేడ్ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు.. మండల పరిధిలోని కుదురుమల్లకు చెందిన శివగల్ల కృష్ణ దుద్యాల్ గేట్ నుంచి కుదురుమల్లకు తన బైక్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో రామలింగేశ్వర స్వామి దేవాలయం సమీపంలో బైక్ అదుపుతప్పడంతో కృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన గ్రామస్తులు ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. వైద్య శిబిరానికి స్పందన 380 మందికి ఉచిత పరీక్షలు తాండూరు టౌన్: పట్టణంలోని ఇందిరానగర్ అర్బన్ పీహెచ్సీలో సోమవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. 380 మంది పేషంట్లు ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈసందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్ఓ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. డీఎంహెచ్ఓ లలితాదేవి ఆదేశానుసారం ఏర్పాటు చేసిన ఈ శిబిరం విజయవంతమైంది అన్నారు. 62 మందికి ఆపరేషన్ల నిమిత్తం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశామన్నారు. వీరికి వారం రోజుల్లో ఆపరేషన్లు పూర్తి చేస్తామన్నారు. అనంతరం పేషెంట్లకు ఉచితంగా మందులు పంపిణీ చేశామన్నారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు గిరిధర్, అక్షయ్, అఖీల్ ఖాన్, రాధ, రాజేశ్వరి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
సన్నాలకు బోనస్ సున్నా
● సన్నవడ్లకు జమ కానిప్రోత్సాహకం డబ్బులు ● నెలల తరబడి ఎదురుచూస్తున్న అన్నదాతలు ● నిత్యం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు ● జిల్లాలో పండించిన రైతులు : 2,744 మంది ● విక్రయించిన ధాన్యం : 13,700 మెట్రిక్ టన్నులు ● రైతులకు అందాల్సిన మొత్తం: రూ.6.85 కోట్లు ఇబ్రహీంపట్నం రూరల్: రైతులను ప్రోత్సహించడం కోసం సన్నాలకు బోనస్ అని ప్రకటించిన ప్రభుత్వం ఈ మేరకు అందించడంలో తాత్సారం చేస్తోంది. ధాన్యం విక్రయించిన రైతులు డబ్బుల కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో రబీ సీజన్ వరి కొనుగోలు చేయడం కోసం ఏప్రిల్ 20 నుంచి జూన్ 31 వరకు 30 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకొని 5,074 మంది రైతుల నుంచి 25 వేల మెట్రిక్ టన్నులు మార్కెటింగ్ శాఖ పీఏసీఎస్లు, డీసీఎంఎస్ల ద్వారా సేకరించారు. సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాలుకు అదనంగా రూ.500 చెల్లించనున్నట్టు కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది. దీంతో రైతులు విరివిగా పండించారు.క్వింటాలుకు రూ.2,320 మద్దతు ధర ప్రకటించగా మొత్తం రూ.58 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశారు. బోనస్ చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతల ఆందోళన ధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ డబ్బుల కోసం అన్నదాతలు వ్యవసాయ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. అధికారుల వద్ద స్పష్టత లేకపోవడంతో బోనస్ ఇస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 2,744 మంది రైతులు 13,700 మెట్రిక్ టన్నుల సన్నవడ్లు పండించారు. ఈ ధాన్యం మొత్తం ప్రభుత్వమే సేకరించింది. ఈ మేరకు రైతులకు బోనస్గా రూ.6.85 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం, అధికారులు స్పందించి వెంటనే డబ్బులు చెల్లించాలని కోరుతున్నారు. ఎదురుచూపులే.. సన్నాలకు ప్రోత్సాహ కం ఇస్తామని ప్రభు త్వం ప్రకటించడంతో చాలామంది రైతులు పుష్కలంగా పండించారు. ఇస్తామన్న బో నస్ నేటికీ ఇవ్వలేదు. ఎదురుచూపులు తప్ప డం లేదు. వెంటనే రైతుల గోడు పట్టించుకొని రావాల్సిన మొత్తం ఇవ్వాలని కోరుతున్నాం. – మొద్దు అంజిరెడ్డి, రాష్ట్ర ఉత్తమరైతు అవార్డు గ్రహీత త్వరలో జమ అవుతాయి మా శాఖ నుంచి చేయాల్సిన పనులు పూర్తి చేశాం. ఆన్లైన్లో రైతుల వివరాలు నమోదు చేశాం. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. త్వరలో రైతులకు డబ్బులు అందుతాయి. – వనజాత, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
రిజర్వేషన్లు ఆమోదించకుంటే ఉద్యమం
కడ్తాల్:42 శాతం బీసీ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, కార్యవర్గ సభ్యుడు కందుకూరి జగన్ డిమాండ్ చేశారు.మండల కేంద్రంలోని ఎంబీ ఏ గార్డెన్లో సోమవారం ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. తక్షణమే బీసీ రిజర్వేషన్లను ఆమోదించి అమలు చేయాలని లేని పక్షంలో బీసీ సామాజికవర్గాన్ని ఐకమత్యం చేసి, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకోసం మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. బీసీ సామాజికవర్గ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ ఆమనగల్లు ఏరియా కమిటీ కన్వీనర్ శివశంకర్, నాయకులు శివగల రమేశ్, గుమ్మడి కరుమయ్య, పెంటయ్య, పోచయ్య పాల్గొన్నారు. -
మాత్రలు వేద్దాం.. ‘నులి’మేద్దాం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఒకటి నుండి 19 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలందరికీ విధిగా అల్బెండజోల్ మాత్రలు వేయించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 11న అల్బెండజోల్ మాత్రలు అందజేయాలని సూచించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఈ మాత్రలపై అవగాహన కల్పించి, వందశాతం లక్ష్యం పూర్తయ్యేలా చూడాలన్నా రు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆ ర్ఓ సంగీత, డీఆర్డీఏ పీడీ శ్రీలత, డీపీఓ సురేష్మోహన్, డీఈఓ సుశీందర్రావు పాల్గొన్నారు. ప్రజావాణికి 82 ఫిర్యాదులు ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమవేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్ఓ సంగీతతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ వారం మొత్తం 82 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి కోసం డీఈఈటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ)ను ప్రారంభించిందని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఈఈటీ పోస్టర్ ను ఆవిష్కరించారు. ప్రైవేట్ సంస్థల్లో నిరుద్యోగ యువతకు నిరంతర ఉపాధి కల్పించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ఆధారితమైన డీఈఈటీ వెబ్సైట్ను గత సంవత్సరం డిసెంబర్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని తెలిపారు. నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో ఉచితంగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు వారి నైపుణ్యం, విద్యార్హత, నివాసం మొదలైన వాటి ఆధారంగా ఉద్యోగ సమాచారం అందించబడుతుందన్నారు.సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్ఓ సంగీత పాల్గొన్నారు. -
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
తాండూరు రూరల్: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ నాయక్ అన్నారు. సోమవారం పెద్దేముల్ మండల కేంద్రంలో గ్రామానికి చెందిన 151 మందికి నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ధారాసింగ్ నాయక్ మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రేషన్కార్డు ఇచ్చిన దాఖాలలు లేవన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోపాల్, పీసీసీ మైనార్టీ రాష్ట్ర కన్వీనర్ రియాజ్, డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లారెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శోభారాణి, నాయకులు ప్రవీణ్ కుమార్, జితేందర్రెడ్డి, విద్యాసాగర్, ఆనంద్చారి, షబ్బీర్, నర్సింలు, ఫయాజ్, మల్లేశం, ఇక్బాల్, మినహాజ్, బుజ్జమ్మ, ఎర్రబాలప్ప, శంకర్నాయక్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలుబొంరాస్పేట: ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన రేషన్కార్డులను సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. బురాన్పూర్, తుంకిమెట్ల తదితర గ్రామాల్లో లబ్ధిదారులు కార్డులు అందుకుని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నర్సింలుగౌడ్, కోస్గి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రాములుగౌడ్, నాయకులు రాంచంద్రారెడ్డి, గౌడ సంఘం మండల నాయకులు ప్రకాశ్గౌడ్, భీమయ్యగౌడ్, బాల్రాజ్గౌడ్ తదితరులున్నారు.పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ -
దళితవాడకు అడ్డంగా కంచె
షాద్నగర్ రూరల్: తమ కాలనీకి వెళ్లే రోడ్డుకు అడ్డంగా కొందరు వ్యక్తులు కంచె వేశారని ఫరూఖ్నగర్ మండలం బూర్గుల దళితవాడకు చెందిన బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామస్తులు, దళితుల కథనం ప్రకారం.. బూర్గుల గ్రామంలోని సర్వేనంబర్ 130లో స్వాతంత్య్ర సమరయోధుడు బూర్గుల నర్సింగ్రావు స్థానిక అవసరాల నిమిత్తం యాభై ఏళ్ల క్రితం ఎకరా పది గుంటల భూమిని కేటాయించారు. ప్రస్తుతం ఇది పశువుల మంద స్థలంగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. గ్రామం కోసం కేటాయించిన ఈ భూమిలో కొంతమంది నిరుపేద దళితులు పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు. మిగిలిన స్థలంలో పంచాయతీ తరఫున బోర్లు వేసి గ్రామానికి నీటి సరఫరా అందించడంతో పాటు పశువుల కోసం నీళ్ల తొట్టి నిర్మించారు. ఇళ్లు కట్టుకున్న దళితులు ఈ భూమిలో నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా సర్వే నంబర్ 130లోని 20 గంటల భూమి మాదేనంటూ బూర్గుల నర్సింగ్రావు బంధువు ఆ స్థలం చుట్టూ ఇనుప కంచె వేశారు. దీంతో ఇళ్లకు వెళ్లే దారి లేక ఇబ్బంది పడుతున్నామని దళితులు తెలిపారు. ఇటీవల ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణానికి సంబంధించిన సామాగ్రిని తరలించేందుకు కొంత కంచెను తొలగించాడు. ఈ విషయం తెలుసుకున్న సదరు వ్యక్తులు తనకు ఫోన్ చేసి బెదించారని తెలిపాడు. బూర్గుల నర్సింగ్రావు ఆశయ సాధనకు కృషి చేయాల్సిన వారి కుటుంబ సభ్యులే ఇలా దళితులను చిన్నచూపు చూస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న దారిని మూసేసి కంచె నిర్మించడంపై ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై బాధితులు పోలీసులు, పంచాయతీ అధికారులను ఆశ్రయించినట్లు సమాచారం. రాకపోకలకు అవస్థలు పడుతున్నామని బాధితుల ఆందోళన -
బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా కె.చంద్రారెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు కొంగర సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్కు చేరుకున్న ఆయనకు ఏఓ సునిల్కుమార్ స్వాగతం పలికి పరిచయం చేసుకున్నారు. గతంలో ఇక్కడ అదనపు కలెక్టర్గా పని చేసిన ఎంవీ భూపాల్ రెడ్డి ఏసీబీ కేసులో అరెస్ట్ కావడం తెలిసిందే. అప్పటి నుంచి ఆ స్థానంలో అదనపు (స్థానిక సంస్థలు) కలెక్టర్ ప్రతిమా సింగ్ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం విధితమే. ప్రస్తుతం ప్రతిమా సింగ్ మెటర్నిటీ సెలవులో వెళ్లడంతో ప్రభుత్వం హెచ్ఎండీఎ బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఓఎస్డీగా పని చేస్తున్న కె.చంద్రా రెడ్డిని అదనపు కలెక్టర్గా బదిలీ చేసింది. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. నేటినుంచి పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు మహేశ్వరం: మహేశ్వరం ప్రభుత్వ పాలిటెక్నినిక్ కళాశాలలో ఈ నెల 5 నుంచి 10వ తేది వరకు స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ కోర్సుల్లో మొత్తం 45 సీట్లు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. పదో తరగతి పాసైన వారు, పాలిటెక్నినిక్ అర్హత పరీక్ష రాసిన వారు సర్టిఫికెట్లతో కళాశాలలో ఉదయం 9.45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సంప్రదించాలన్నారు. ఈ నెల 11న మూడు కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు చెప్పారు. వివరాలకు 94901 20175 నంబర్లో సంప్రదించాలని సూచించారు. మహిళా శక్తి భవనాలు మంజూరు చేయండి షాద్నగర్: నియోజకవర్గంలో మహిళా శక్తి భవనాలను మంజూరు చేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కోరారు. ఈ మేరకు సోమవారంహైదరాబాద్లోని సెర్ప్ కార్యాలయానికి వెళ్లిన ఆయన సీఈఓ దివ్యను కలిసి వినతిపత్రం అందజేశారు.ఫరూఖ్నగర్, చౌదరిగూడ, నందిగామ మండలాల్లో మహిళా శక్తి భవనాలు నిర్మించేందుకు ఒక్కో భవనానికి కోటి రూపాయల చొప్పున మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయండి విద్యుత్ సమస్యల పరిష్కారానికి ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, వైర్లు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే మంత్రి భట్టి విక్రమార్కకు వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గానికి మొత్తం 79 ట్రాన్స్ఫార్మర్లు, 32,300 మీటర్ల కండక్టర్, 74వేల మీటర్ల కేబుల్, విద్యుత్ స్తంభాలు 798 మంజూరు చేయాలని కోరారు. ఫార్మా భూ సర్వేకు సహకరించాలి యాచారం: ఫార్మాసిటీకి పరిహారం అందజేసి సేకరించిన భూముల సర్వేకు రైతులు సహకరించాలని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి అన్నారు. మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లిలో అధికారులు చేపట్టిన రైతుల కబ్జా భూముల సర్వేను సోమవారం ఆమె పరిశీలించారు. సర్వేలో ఏమైనా అభ్యంతరాలుంటే అధికారులకు వినతిపత్రాలు అందజేయాలని సూచించారు. డీసీపీ వెంట ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ ఉన్నారు. కాగా, తాడిపర్తిలో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డి పర్యటించారు. గ్రామంలోని కొందరు రైతులు పట్టా భూములు ఇవ్వడానికి ముందుకు రాగా వాటిని పరిశీలించారు. ఫార్మా భూముల సర్వే లో అభ్యంతరాలుంటే యాచారం తహసీల్దార్ అయ్యప్పకు ఫిర్యాదు చేయాలని సూచించారు. -
పరిసరాల పరిశుభ్రతపై అవగాహన తప్పనిసరి
తాండూరు టౌన్: పరిసరాల పరిశుభ్రతపై వి ద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని పట్టణ మున్సిపల్ డీఈ, ఇంచార్జి కమిషనర్ మణిపాల్ సూచించారు. వంద రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం పాత తాండూరులోని ప్రభుత్వ నెంబర్–2 పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ.. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత ముఖ్యమన్నారు. ఇళ్లు, పాఠశాల, మైదానం వంటి ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇళ్లల్లోని పూల కుండీల్లో, టైర్లలో నీరు నిలవకుండా చూసుకోవాలన్నారు. ఇంటిలోని చెత్తను తడి, పొడి చెత్తగా వేరుచేసి, మున్సిపల్ వాహనానికి అందించాలన్నారు. పరిసరాలు శుభ్రంగా లేకపోతే ఈగలు, దోమలు విపరీతంగా పెరిగి పోయి ప్రజలు అనారోగ్యం పాలవుతారన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలగుతూ వ్యక్తిగత, పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవడంతో పాటు ఇంట్లో వారికి, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ప్రవీణ్ గౌడ్, పాఠశాల హెచ్ఎం ప్రతిభా భారతి, వార్డు ఆఫీసర్లు కార్తీక్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. తడి, పొడి చెత్త వేరుచేయాలి పరిగి: పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటేనే రోగాలు దరిచేరవని మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలోని గంగపుత్ర కాలనీలో వందరోజుల ప్రణాళికలో భాగంగా ప్రజలకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతీఒక్కరు రోజు తడి చెత్తను పొడి చెత్తను వేరు వేరుగా వేయాలని సూచించారు. చెత్త సేకరణకు ప్రతి రోజు వాహనాలు వస్తున్నాయని వాటిలోనే చెత్తను వేయాలని సూచించారు. ప్రతీ ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ దశరథ్ పాల్గొన్నారు. తాండూరు మున్సిపల్ డీఈ మణిపాల్ -
సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
నందిగామ: విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి, పర్యాటక సాంస్కృతిక క్రీడల ప్రత్యేక ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. మండల పరిధిలోని మొదుళ్లగూడ శివారులోని సింబయాసిస్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించి దీక్షారంబ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహిస్తోందని తెలిపారు. టెక్నాలజీ రంగంలో శరవేగంగా మార్పులు వస్తున్నాయని, వాటికి అనుకూలంగా విద్యార్థుల్లో సైతం మార్పురావాలని సూచించారు. టెక్నాలజీలో ప్రపంచంతో పోటీ పడేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.సైబర్ క్రైం డీసీపీ సాయి శ్రీ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రతి విషయంపై ప్ర త్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ చాన్స్లర్లు విద్యా యోరవడేకర్, శంతరాం బలవంత్ ముజుందార్, వైస్ చాన్సలర్ రా మ కృష్ణన్ రామన్, కుమార్ విజయ్ మిశ్రా, వేణుగోపా ల్ రెడ్డి, పలువురు డైరెక్టర్లు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. -
రైలు కింద పడి వృద్ధుడి ఆత్మహత్య
వ్యాధి తగ్గడం లేదని మనస్తాపం షాద్నగర్ రూరల్: వ్యాధి తగ్గడం లేదని మనస్తాపానికి గురైన ఓ వృద్ధుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని కేశంపేట రైల్వేగేట్ సమీపంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ బల్లేశ్వర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా, పూడూరు మండలం కంకల్కు చెందిన పిచ్చకుంట్ల కిష్టయ్య(80) కుటుంబంతో కలిసి కొన్నేళ్లుగా పట్టణంలోని రతన్కాలనీలో అద్దెకు ఉంటున్నారు. కిష్టయ్య చాన్నాళ్లుగా మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. వ్యాధి తగ్గకపోవడం, వృద్ధాప్య సమస్యలు చుట్టముట్టడంతో చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఉదయాన్నే గూడ్సు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన రైల్వే పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం బాడీని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడికి ముగ్గురు కూతుళ్లు, ముగ్గురు కుమారులు ఉన్నారు. స్టేషన్ మాస్టర్ రాహుల్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నేడే ఆఖరు షాద్నగర్ రూరల్: మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయ దుకాణాల సముదాయంలోని షాపుల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు మంగళవారం ముగియనుందని ఎంపీ డీఓ బన్సీలాల్ అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 1–ఏ, 13–ఏ, 16– ఏ, 17–ఏ నంబర్ దుకాణాలను అద్దెకు ఇచ్చేందుకు సీల్డ్ టెండర్ల ద్వారా వేలం నిర్వహించి, షాపులను కేటాయిస్తామన్నారు. ఇందులో పాల్గొనే వారు ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి ఎంపీడీఓ, ఎంపీపీ ఫరూఖ్నగర్ పేరుపై డిమాండ్ డ్రాఫ్ట్ చెల్లించి దరఖాస్తు ఫారాన్ని ఎంపీడీఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. బుధవారం ఆఫీసులో సీల్డ్ టెండర్లను తెరిచి, దుకాణాలను కేటాయించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వేధింపుల భర్తపై కేసు నమోదు మొయినాబాద్: అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న భర్తపై మొయినాబాద్ పీఎస్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎనికేపల్లి గ్రామానికి చెందిన చీపిరి రాజుకు 2012లో నాగిరెడ్డిగూడకు చెందిన సరితతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సరితకు మరో ముగ్గురు అక్కాచెళ్లెల్లు ఉన్నారు. సోదరులు లేకపోవడంతో పుట్టింటి నుంచి భూమి, ఇల్లు ఇప్పించాలని రాజు కొన్నేళ్లుగా భార్యను వేధిస్తున్నాడు. అతని బాధ భరించలేక కొంత కాలం క్రితం 6 గంటల భూమి ఇచ్చారు. అయినా ఇల్లు కావాలంటూ ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో గత ఆదివారం సరిత పుట్టింటికి వెళ్లిపోయింది. రాత్రి అక్కడికి చేరుకున్న రాజు భార్యపై దాడిచేశాడు. దీంతో సోమవారం ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భవిత సెంటర్లో ఫిజియోథెరపీ ఎంఈఓ చంద్రప్ప బంట్వారం: వారానికోసారి నిర్వహించే ఫిజి యోథెరపీకి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను తల్లిదండ్రులు తప్పక తీసుకురావాలని కోట్పల్లి ఎంఈఓ చంద్రప్ప అన్నారు. సోమవారం భవిత సెంటర్లో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు డాక్టర్ శ్రీకాంత్ ఫిజియోథెరపీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. సుమారు 20 మందికి పైగా పిల్లలకు ఫిజియోథెరపీ చేయించామన్నారు. వీరికి ప్రతిరోజు తరగతులు ఉంటాయన్నారు. వారానికోసారి ఫిజియోథెరపీ ఉంటుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రమం తప్పకుండా భవిత కేంద్రానికి తీసుకురావాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపీ స్పెషల్ ఎడ్యుకేటర్ శ్రీదేవి, డాక్టర్ శ్రీకాంత్, ఐఈఆర్పీ దిలీప్కుమార్, సీఆర్పీ నర్సింలు పాల్గొన్నారు. -
నేడు రేషన్ కార్డుల పంపిణీ
బడంగ్పేట్: మహేశ్వరం నియోజకవర్గంలోని లబ్ధిదారులకు మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరు కానున్నారని కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం ఇన్చార్జ్ కేఎల్లార్ తెలిపారు. మల్లాపూర్లోని యెల్మేటి అమరేందర్రెడ్డి ఫంక్షన్ హాలులో కొనసాగుతున్న ఏర్పాట్లను సోమవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గానికి 12 వేల కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని స్పష్టంచేశారు. లబ్ధిదారులు విధిగా హాజరై కార్డులు అందుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు అమరేందర్రెడ్డి, సీనియర్ నాయకులు దేప భాస్కర్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోవర్ధన్రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, నవారు మల్లారెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ‘డబుల్ ఇళ్లు’ స్థానికులకే ఇవ్వాలి తుక్కుగూడ: గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను స్థానికులకే కేటాయించాలని నియోజకవర్గంలోని ఆయా గ్రామాల ప్రజలు కోరారు. ఈ మేరకు తుక్కుగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఆయన అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్ బెడ్రూంల పనులను పూర్తి చేయాలని హౌసింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. వీటి పంపిణీలో స్థానికులకే మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు. హాజరుకానున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఏర్పాట్లను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ -
ప్రశాంతంగా నీట్ పీజీ పరీక్ష
ఇబ్రహీంపట్నం రూరల్: కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన పీజీ నీట్ ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగిన పరీక్షకు ఇబ్రహీంపట్నంలోని సిద్ధార్థ, శ్రీఇందు, ఏవీఎన్, శ్రీఇందు, గురునానక్ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి లోటు పాట్లు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని రాందాస్పల్లి సమీపంలో ఉన్న ఏవీఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష కోసం 110 మందిని కేటాయించారు. పరీక్ష సమయానికి ముందుగానే చేరుకున్న గాంధీ మెడికల్ కళాశాల నుంచి వచ్చిన డాక్టర్ నితిన్ పొరపాటున ప్రొవిజనల్ సర్టిఫికెట్ మర్చిపోయాడు. పరీక్ష సమ యం దగ్గరపడుతుండడం.. సమీపంలో ఎక్కడా జి రాక్స్ కేంద్రాలు లేకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్రెడ్డి తనకారు ఇచ్చి ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్కు పంపించి ప్రొవిజనల్ సర్టిఫికెట్ జిరాక్స్ తీసుకొచ్చి ఇచ్చారు. దీంతో నితిన్, ఆయన తల్లిదండ్రులు సీఐకి కృతజ్ఞతలు తెలిపారు. -
బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి
చేవెళ్ల: బీసీల హక్కులు, 42శాతం రిజర్వేషన్ సాధనకోసం బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి పనిచేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆదివారం నగరంలోని ఆయన నివాసంలో చేవెళ్ల మండల బీసీ సంక్షేమ సంఘం మండల కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులను నియమించి నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి స్థానంలో బీసీలకు ప్రాధాన్యత ఉండాలన్నారు. బీసీల హక్కుల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, బీసీ సంక్షేమ సంఘాన్ని గ్రామస్థాయి వరకు బలోపేతం చేయాలని సూచించారు. చేవెళ్ల మండల బీసీ సంక్షేమ శాఖ నూతన అధ్యక్షుడిగా కమ్మెట గ్రామానికి చెందిన శేఖర్గౌడ్, ఉపాధ్యాక్షుడిగా మల్కాపూర్ గ్రామానికి చెందిన చాకలి వెంకటేశ్ను నియమించి నియామకపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బండమీది వెంకటయ్య, శంకర్పల్లి మండల అద్యక్షుడు వెంకటేశ్ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి అండగా నిలబడాలి షాద్నగర్రూరల్: బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి అండగా నిలబడాలని తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి అధికారి ప్రతినిధి శ్రీధర్ వర్మ అన్నారు. హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన ముదిరాజ్ పోరాట సమితి సమావేశానికి షాద్నగర్ నుంచి పెద్ద ఎత్తున నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న ముదిరాజ్ కులస్తులను ప్రభుత్వం బీసీ–డి నుండి బీసీ – ఏలోకి మార్చాలని డిమాండ్ చేశారు. ముదిరాజ్లు అన్ని రంగాల్లో పూర్తిగా వెనకబడి ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యా రంగాల్లో ముదిరాజ్లు రాణించాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 12న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కొండె యాదయ్య, అంజయ్య, మానపాటి ప్రదీప్, వేణుగోపాల్, శ్రీనివాస్, మహేష్, రంజిత్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి మరో నలుగురికి తీవ్ర గాయాలు నందిగామ: శుభకార్యానికి బైక్పై వెళ్తున్న దంపతులను కారు ఢీకొట్టిన ఘటనలో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నందిగామ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ప్రసాద్ కథనం ప్రకారం.. శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామానికి చెందిన విజయ్ కుమార్ (30), శిరీష దంపతులు. ఆదివారం రాత్రి బైక్పై మండల పరిధిలోని నర్సప్పగూడలో జరిగే ఓ శుభకార్యానికి బయలు దేరారు. నందిగామలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న చౌరస్తా వద్ద నర్సప్పగూడకు మళ్లేందుకు ప్రయత్నిస్తుండగా సింబయాసిస్ అంతర్జాతీయ యూనివర్సిటీ వైపు నుంచి వస్తు న్న కారు ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా రహదారి పక్కన ఆగిఉన్న డీసీఎం వాహనాన్ని సైతం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తు న్న విజయ్ కుమార్ మృతి చెందగా, శిరీష తీ వ్రంగా గాయపడింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి సైతం తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శంషాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చంద్రకల్ వాసికి డాక్టరేట్ దౌల్తాబాద్: మండల పరిధిలోని చంద్రకల్ గ్రా మానికి చెందిన దేవయ్య, శకుంతల కుమార్తె సరిత ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీలో ఆదివారం డాక్టరేట్ పట్టా పొందారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయంలో నేల నాణ్యత పెరుగుదలపై అసిస్టెంట్ ప్రొఫెసర్ జయశ్రీ పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేసినట్లు వివరించారు. డాక్టరేట్ పొందిన సందర్భంగా సరితను కుటుంబసభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు అభినందించారు. -
అక్కడోటి.. ఇక్కడోటి!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మేడ్చల్ జిల్లా బాలానగర్లో రంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు.. కూకట్పల్లిలో విద్యుత్ ఆర్ఆర్జోన్ సీజీఎం ఆఫీసు.. పద్మారావునగర్లో తూనికలు కొలతల శాఖ.. బేగంపేటలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు.. సనత్నగర్లో రోడ్లు భవనాలు.. ఖైరతాబాద్లో జెడ్పీ, పంచాయతీరాజ్.. రెడ్హిల్స్లో నీటిపారుదలశాఖ.. మాసబ్ట్యాంక్లో పశుసంవర్థకశాఖ సహా జిల్లా ఉపాధి కల్పనశాఖ.. నాంపల్లిలో ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్స్.. అబిడ్స్లో జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు.. జిల్లా సహకారశాఖ.. రాజేంద్రనగర్ శివరాంపల్లిలో వైద్య ఆరోగ్య శాఖ.. కొంగరలో కలెక్టరేట్.. ఇలా ఒక్కో ప్రభుత్వ కార్యాలయం ఒక్కోచోట ఉండిపోయింది. జిల్లాల పునర్విభజన తర్వాత అప్పటి ప్రభుత్వం ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్లో రెవెన్యూ పరిధిలో సమీకృత జిల్లా భవన సముదాయం నిర్మించినప్పటికీ ఇప్పటి వరకు చెట్టుకొకటి.. పుట్టకొకటి అన్నట్లుగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు ఒకే గొడుగు కిందికి రావడం లేదు. 44 ఎకరాలు.. రూ.58 కోట్లతో భారీ భవనం జిల్లాల పునర్విభజనలో భాగంగా పరిపాలన సౌలభ్యం పేరుతో ఉమ్మడి రంగారెడ్డిజిల్లాను అప్పటి ప్రభుత్వం మూడు జిల్లాలుగా విభజించింది. ఆయా జిల్లాల్లో కొత్తగా సమీకృత జిల్లా సముదాయాలను నిర్మించింది. కొంగరకలాన్లో 44 ఎకరాల విస్తీర్ణంలో రూ.58 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక భవన సముదాయాన్ని నిర్మించింది. వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లోని ప్రభుత్వ శాఖలన్నీ ఇప్పటికే ఆయా జిల్లాల్లోని కలెక్టరేట్కు చేరుకున్నాయి. కానీ రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం ఇప్పటికీ హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే కొనసాగుతున్నాయి. కొత్తగా ఏర్పడిన జిల్లాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతుండటం, జిల్లా కేంద్రానికి వాటిని తరలించే ఆలోచన అధికారులకు లేకపోవడంపై గందరగోళం తలెత్తుతోంది. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కలెక్టరేట్లోని అందుబాటులో ఉంటారని భావించి చాలామంది ఇప్పటికీ కొంగరకు చేరుకుంటున్నారు. తీరా ఆయా శాఖల అధికారులు అక్కడ లేరనే విషయం తెలిసి ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. ఫీల్డ్ విజిట్ పేరుతో డుమ్మా కొత్తగా నిర్మించిన కలెక్టరేట్లో రెవెన్యూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖలతో పాటు సివిల్ సప్లయ్, విద్య, వ్యవసాయ శాఖలు మినహా కీలకమైన ఇంజనీరింగ్ విభాగాలన్నీ ఇప్పటికీ నగరంలోని ఇరుకై న అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రభుత్వం వాటికి సొంత భవనాలు నిర్మించినప్పటికీ ఇంటికి దూరమవుతుందని, హెచ్ఆర్ఏలో కోత పడుతుందనే ఆలోచనతో మెజార్టీ ఉద్యోగులు అక్కడికి వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. తూనికలు కొలతలు, ఉపాధి కల్పన, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల అధికారులు ఫీల్డ్ విజిట్ పేరుతో రోజుల తరబడి ఆఫీసుకే రావడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతూ.. అడ్డంగా ఏసీబీకి పట్టుబడుతున్నారు. జిల్లాలో ఏ ప్రభుత్వ కార్యాలయం ఎక్కడ ఉందో తెలియక కొంతమంది సతమతమవుతుంటే.. మరికొంత మంది చిన్నచిన్న పనులకు 50 నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. అనేక వ్యయ ప్రయాసలకోర్చి ఆయా ప్రాంతాల్లోని ఆఫీసులకు చేరుకుంటే తీరా సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. అస్తవ్యస్తంగా జిల్లా పరిపాలనా వ్యవస్థ ఒక్కో చోట.. ఒక్కో ప్రభుత్వ కార్యాలయం ఏ ఆఫీసు ఎక్కడుందో అంతా అయోమయం చిన్నచిన్న పనులకు కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం తిరిగి వేసారి ఉసూరుమంటున్న బాధితులు -
ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి
శంకర్పల్లి: హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ఛత్రపతి శివాజీ చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. మండలంలోని గోపులారంలో ఆదివారం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్ గౌడ్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ఛత్రపతి శివాజీ వ్యక్తిత్వాన్ని, ఆయన పోరాటాలకు సంబంధించిన చరిత్రను చదివి స్ఫూర్తి పొందాలన్నారు. రాజ్భూపాల్గౌడ్ మాట్లాడుతూ.. యువత అన్ని మతాల వారిని గౌరవిస్తూనే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో సిద్దిపేట వీరధర్మాజ స్వామి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, పార్టీ మండలాధ్యక్షురాలు లీలావతి, మున్సిపల్ అధ్యక్షుడు దయాకర్రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, నాయకులు ప్రభాకర్రెడ్డి, రాములు, వాసుదేవ్ కన్నా, బయానంద్ తదితరులు పాల్గొన్నారు. గెలుపుకోసం కృషి చేయాలి మొయినాబాద్రూరల్: ఎన్నికలు ఎప్పుడు వచ్చిన పార్టీ గెలుపుకోసమే అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. మండలపరిధిలోని అమ్డాపూర్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కట్టమైసమ్మ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్గౌడ్, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు గొల్లపల్లి రవీందర్రెడ్డి, నోముల అంజిరెడ్డి, మధుసూధన్రెడ్డి, మహేందర్ ముదిరాజ్, నారంరెడ్డి, బాత్కు శేఖర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు -
ఫోన్ కాల్తో స్పందించారు..బాలికను కాపాడారు..
నిజాంపేట్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సతీష్కుమార్కు శనివారం ఒడిశాలోని కటక్ నుంచి ఓ ఫోన్ వచ్చింది. దక్షిణాసియా మహిళా ఫౌండేషన్లో ప్రోగ్రాం ఆఫీసర్గా పని చేస్తున్న తాన్వి సింగ్ అనే వ్యక్తి ఫోన్ చేసి ఒడిశా రాష్ట్రం, కేంద్రపాడా జిల్లా, ఔల్ మండలం, సహిరా గ్రామానికి చెందిన బాలిక(16) అపహరణకు గురైందని, ఆమెను బాచుపల్లిలోని ఓ ఇంట్లో నిర్భందించినట్లు సమాచారం అందించాడు. దీంతో తక్షణమే స్పందించిన ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికుల సహకారంతో కొద్ది గంటల్లోనే బాలికను ఇందిరానగర్లోని ఓ ఇంట్లో బంధించినట్లు గుర్తించి రక్షించారు. అనంతరం ఆమెను సూరారంలోని సఖి సెంటర్కు తరలించారు. ఆమె తలిదండ్రులు లేదా ఒడిశా పోలీసులకు అప్పగించే వరకూ తాత్కాలిక రక్షణలో ఉంచనున్నట్లు ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. ఒడిశా నుంచి సమాచారం అప్రమత్తమై బాలికనుకాపాడిన బాచుపల్లి పోలీసులు -
నకిలీ సర్టిఫికేటుగాళ్లు..!
గుర్తింపు లేని సంస్థల్లో గుట్టుగా సౌందర్య కోర్సులుసాక్షి, సిటీబ్యూరో: వైద్యారోగ్య శాఖలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో రోజుకో కోణం వెలుగులోకి వస్తోంది. నగరంలో ఎలాంటి అర్హత లేని సంస్థలు విచ్చలవిడిగా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాయి. అక్రమార్జనే ధ్యేయంగా గత కొన్నేళ్లుగా ఈ అక్రమ దందా నడిపిస్తున్నాయి. ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్కు ఫిర్యాదులు అందడం, తనిఖీల్లో నకిలీ సర్టిఫికెట్లు లభించడంతో కథ అడ్డం తిరిగింది. నగరంలో మూడు సంస్థలు ఎలాంటి అర్హత లేకుండా సర్టిఫికెట్లను జారీ చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో సదరు సంస్థలపై చర్యలకు రంగం సిద్ధమవుతున్నారు. ● జాతీయ మెడికల్ కౌన్సిల్లో గుర్తింపు లేని యూనివర్సిటీలు సంస్థలు సర్టిఫికెట్లు జారీ చేయరాదని, అలా చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని కౌన్సిల్ చెబుతోంది. నగరంలో మాత్రం ఈ నిబంధనలు తమకు వర్తించవన్నట్లు ప్రభుత్వ పరంగా ఎలాంటి అనుమతులు లేని సంస్థలు ఏస్తటిక్స్, బ్యూటీ, కాస్మొటాలజీ రంగంలో విచ్చలవిడిగా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాయి. దీంతో కాస్మొటాలజీ కేంద్రాల్లో వైద్యులుగా చెలామణీ అవుతున్నారు. గత కొన్ని రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డెంటల్ వైద్యులు, ఇతరులు సైతం స్కిన్ కేర్, హెయిర్, ఇతర సౌందర్య చికిత్సలు అందిస్తున్నట్లు గుర్తించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని నిలదీసినపుడు మేం బ్యూటీ కోర్సులు పూర్తి చేశామని పలువురు సర్టిఫికెట్లు చూపించినట్లు తెలుస్తోంది. సర్టిఫికెట్లు చెల్లవనే విషయమై ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీంతో ఆయా సర్టిఫికెట్లు జారీ చేసిన సంస్థలకు ఎన్ఎంసీ గుర్తింపు ఉందా? లేదా? అని ఆరా తీశారు. అసలు సర్టిఫికెట్లు నకిలీవా, ఒరిజినలా అనే కోణంలోనూ విచారణ చేపట్టగా గుర్తింపు లేని సంస్థలు అక్రమార్జనే ధ్యేయంగా సాగిస్తున్న అక్రమ దందాగా గుర్తించారు. దీంతో నగరంలోని మూడు సంస్థలపై కేసులు నమోదు చేశారు. అక్రమ పద్దతుల్లో కాస్మొటాలజీ చికిత్సలు అందిస్తున్న సుమారు 30 మందిపై కేసులు నమోదు చేశారు. ఆ సర్టిఫికెట్లు చెల్లుబాటు కావు జాతీయ మెడికల్ కౌన్సిల్లో గుర్తింపు పొందిన సంస్థల్లో మాత్రమే కోర్సులు పూర్తి చేయాలి. గుర్తింపు లేని సంస్థలు జారీ చేసిన సర్టిఫికెట్లు చెల్లుబాటు కా వు. ఇలాంటి సర్టిఫికెట్లతో ప్రాక్టీస్ చేసే వారిపై ఎన్ఎంసీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తాం. ఎంబీబీఎస్, ఫాం డీ, బీడీఎస్, బీఎస్సీ, హోమియో చేసిన వారు సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కాస్మొటాలజీ సేవలందిస్తున్న 30 మందిపై కేసులు నమోదయ్యాయి. అనధికారిక స ంస్థల నుంచి పొందిన సర్టిఫికెట్లతో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, పీలింగ్, ఏస్తటిక్ సర్జరీలు చేస్తున్నారు. ఇటువంటి వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. – శ్రీనివాస్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు నగరంలో వందలాది మందికి సర్టిఫికెట్ల జారీ మూడు సంస్థలకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నోటీసులు 30 మందికి పైగా కేసులు నమోదు -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
కొత్తూరు: రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కొత్తూరు పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ మల్లేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్కు దూబే.. పదేళ్గుగా కొత్తూరులో నివాసం ఉంటున్నాడు. ఏ పని చేయకుండా తిరుగుతున్నాడు. తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంటినుంచి వెళ్లిపోయిన సదరు వ్యక్తి.. గుర్తు తెలియన రైలు ఢీకొట్టడంతో మృతి చెందాడు. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ మాస్టర్ రేమత్ ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నందిగామలో.. మరొకరు నందిగామ: బహిర్భూమికి వెళ్లిన వ్యక్తిని రైలు ఢీ కొట్టగా.. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన నందిగామ శివారు హెచ్బీఎల్ పరిశ్రమ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఐజాక్ తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలం కడ్లాపూర్ గ్రామానికి చెందిన దాడువై అంజయ్య(57) కాలకృత్యాలు తీర్చుకునేందుకు రైలు పట్టాల పక్కకు వెళ్లి తిరిగి వస్తుండగా.. గుర్తు తెలియని రైలు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. తిమ్మాపూర్ రైల్వేస్టేషన్ మాస్టర్ ఎండీ ఉబెద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఫోన్ అప్పగింత మహేశ్వరం: 108లో మరిచిపోయిన మొబైల్ ఫోన్ను.. అంబులెన్స్ సిబ్బంది రోగి బంధువుకి అప్పగించి నిజాయతీని చాటు కున్నారు. కందుకూరు మండలం మీర్కాన్పేట్ గ్రామానికి చెందిన నందిగామ లక్ష్మమ్మ(75) అనారోగ్యానికి గురి కావడంతో బంధువులు అంబులెన్స్లో చికిత్స కోసం తరలించారు. ఆస్పత్రికి తరలించే క్రమంలో రోగి బంధువులు.. తమ ఫోన్ను వాహనంలో వదిలి వెళ్లిపోయారు. మండల కేంద్రం చేరుకున్న వాహన సిబ్బంది.. సెల్ను గమనించి రోగి బంధువులకు సమాచారం అందించి అప్పగించారు. దీంతో ఈఎంటీ కుమార్, ఫైలట్ యాదయ్యను వారు అభినందించారు. పోగొట్టుకున్న డబ్బును కెమెరా పట్టించింది ఆమనగల్లు: ఓ వ్యక్తి పోగొట్టుకున్న పర్సును సీసీ కెమెరా పట్టించగా.. ఆ పర్సును పోలీసులు ఆదివారం బాధిత వ్యక్తికి అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. తలకొండపల్లికి చెందిన లక్ష్మయ్య తన పర్స్లో రూ.16 వేలు పెట్టుకుని, గ్రామీణ వికాస్బ్యాంక్లో డిపాజిట్ చేసేందుకు వెళ్తుండగా.. మార్గమధ్యలో పడిపోయింది. బ్యాంక్కు వచ్చి చూసుకోగా.. కనిపించలేదు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. సదరు వ్యక్తి ఫిర్యాదుతో ఎస్ఐ శ్రీకాంత్ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ శ్రీనివాస్, శివుడులు ఆయా మార్గంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. రోడ్డుపై పడిపోయిన పర్స్ను బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తీసుకున్నట్లుగా గుర్తించారు. బైక్ నంబర్ ఆధారంగా వారిని గుర్తించి, పర్సు, అందులోని డబ్బును రికవరీ చేశారు. అనంతరం బాధితుడు లక్ష్మయ్యకు అందజేశారు. రిజర్వేషన్లు ప్రకటించకపోతే ఎన్నికల బహిష్కరణ బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్కకృష్ణ యాదవ్ షాద్నగర్రూరల్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించకపోతే సర్పంచ్ ఎన్నికలను బహిష్కరిస్తామని బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్కకృష్ణ యాదవ్ అన్నారు. ఆదివారం సేన ఫరూఖ్నగర్ మండల అధ్యక్షుడు షాబాద్రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో లింగారెడ్డిగూడ గ్రామ సేన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. జనాభాలో బీసీలుఅధిక శాతం ఉన్నారని, రిజర్వేషన్లలో సముచిత స్థానం కల్పించి, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని పేర్కొన్నారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా శంకరయ్య యాదవ్, ఉపాధ్యక్షులుగా అశోక్, మల్లేశ్, వంశరాజ్, ప్రధాన కార్యదర్శులుగా వీరేష్గౌడ్, పోచయ్య, శ్రీకాంత్తో పాటు పలువురు సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం నూతన సభ్యులకు నియామకపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ యాదవ్, వెంకటేశ్, చంద్రశేఖరప్ప, పాలాది శ్రీనివాస్, జయమ్మ, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ఢీ కొరియో గ్రాఫర్ కృష్ణ అరెస్ట్ గచ్చిబౌలి: పోక్సో కేసులో ఢీ షోలో కొరియో గ్రాఫర్గా వ్యవహరించిన కృష్ణను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నమ్మకంగా ఉంటూ స్నేహితుడి కూతురిపై లైంగిక దాడికి యత్నించినట్లు ఫిర్యాదు అందడంతో గచ్చిబౌలి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు కృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
రన్.. రంజితం
ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్కు ముందు డ్రైరన్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు, ఎన్ఎండీసీ సంయుక్తంగా ఈ మారథాన్ను నిర్వహించాయి. నగరంలోని పీపుల్స్ప్లాజా, మాదాపూర్లో ప్రారంభమైన డ్రై రన్ గచ్చిబౌలి స్టేడియంలో ముగించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ దేశంలోనే రెండో అతిపెద్దదిగా గుర్తింపు పొందిందన్నారు. ప్రతిష్టాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ లేబుట్ రేస్ ఈ నెల 23, 24 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. – గచ్చిబౌలి -
మరో మహిళ మోజులో పడి..
రామంతాపూర్: మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్ భార్యా పిల్లలను ఇంటి నుంచి గెంటేయడంతో ఆమె ఇద్దరు పిల్లలతో సహా భర్త ఇంటి ఎదుట ఆందోళన చేపట్టిన సంఘటన ఉప్పల్ పీఎస్ పరిధిలోని రామంతాపూర్ వెంకటరెడ్డినగర్లో ఆదివారం చోటు చేసుకుంది. బాధితురాలు లావణ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కటకం లావణ్యకు స్పెషల్ పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న కటకం నాగరాజుతో 2009తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. గత కొన్నాళ్లుగా నాగరాజు మరో మహిళతో వివాహేత సంబంధం కొనసాగిస్తూ ఆమెతో కలిసి వెంకటరెడ్డినగర్లో ఉంటున్నాడు. ఈ విషయం తెలియడంతో లావణ్య ఇద్దరు పిల్లలతో కలిసి శనివారం రాత్రి భర్త ఉంటున్న ఇంటికి వెళ్లి అతడిని నిలదీయగా నాగరాజు ఆమెను బయటికి గెంటేసి తాళం వేసుకున్నాడు. దీంతో ఆమె శనివారం రాత్రి నుంచి అదే ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. దీనిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా గతంలో ఇదే విషయమై మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని చెప్పిన పోలీసులు తనను తిరిగి పంపారని తెలిపింది. తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను డిమాండ్ చేసింది. భార్యా పిల్లలనుఇంటి నుంచి గెంటేసిన భర్త ఇద్దరు పిల్లలతో సహా భర్త ఇంటి ఎదుట బాధితురాలి ఆందోళన -
పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి
షాబాద్: పరిశ్రమల ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభు త్వం కృషి చేస్తుందని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. షాబాద్ మండలం చందనవెళ్లి పారిశ్రామిక వాడలో నీలోఫర్ బాబురావు ఏర్పాటు చేసిన నీలోఫర్ టీ ఫౌడర్ ప్యాకింగ్ కర్మాగారాన్ని ఆదివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్ది, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అనేక ప్రోత్సాహాకాలను అందజేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అశోక్, మాజీ సర్పంచ్లు జనార్దన్రెడ్డి, లింగం, నాయకులు అశోక్, రాఘవేందర్, నర్సింహారెడ్డి, సూర్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి -
ఫాంహౌస్లో డ్రగ్స్ కలకలం
మొయినాబాద్: డ్రగ్స్ వినియోగిస్తూ బర్త్ డే పార్టీ నిర్వహిస్తున్న ఫాంహౌస్పై ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ అధికారులు దాడి చేశారు. ఆరుగురు ఐటీ ఉద్యోగులను పట్టుకుని వారు వినియోగిస్తున్న డ్రగ్స్, విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మేడిపల్లి ఫాంహౌస్లో శనివారం అర్థరాత్రి జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. చేవెళ్ల ఎకై ్సజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో ఉండే ఐటీ ఉద్యోగి అభిజిత్ తన బర్త్ డే పార్టీ నిర్వహించేందుకు మొయినాబాద్ మండల పరిధిలోని మేడిపల్లి రెవెన్యూలో ఉన్న సీరినే ఓర్చర్డ్స్ ఫాంహౌస్ను అద్దెకు తీసుకున్నాడు. శనివారం రాత్రి అభిజిత్తోపాటు మరో ఏడుగురు ఐటీ ఉద్యోగులు ఫాంహౌస్కు వచ్చారు. బర్త్డే పార్టీలో భాగంగా డ్రగ్స్, విదేశీ మద్యం వినియోగిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ అధికారులు ఫాంహౌస్పై దాడి చేశారు. అభిజిత్తోపాటు సింప్సన్, పార్తు, గోయల్, యశ్వంత్, సేవియో డెన్నిస్ను పట్టుకున్నారు. వారి నుంచి రూ.2 లక్షల విలువ చేసే ఎల్ఎస్డీ బ్లాట్స్, హష్ ఆయిల్ డ్రగ్స్, ఐదు విదేశీ మద్యం బాటిళ్లు, మూడు లగ్జరీ కార్లు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు ఐటీ ఉద్యోగులు పరారయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బర్త్ డే పార్టీలో వినియోగించిన ఐటీ ఉద్యోగులు దాడి చేసిన ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుబడిన ఆరుగురు.. పరారీలో మరో ఇద్దరు డ్రగ్స్, విదేశీ మద్యం స్వాధీనం -
పెళ్లికి వెళ్లి వచ్చేసరికి ఇళ్లు గుల్ల
16 తులాల బంగారు నగల అపహరణ మొయినాబాద్: వివాహ వేడుకలో పాల్గొని వచ్చేసరికి గుర్తుతెలియని దుండగులు ఇంటిని గుల్ల చేశారు. ఇంటి తాళాలు, బీరువా తాళం పగులగొట్టి 16 తులాల బంగారు నగలు దోచుకెళ్లారు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం అర్ధర్రాతి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధి పెద్దమంగళారంకు చెందిన సీహెచ్ అనిత, శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి వనస్తలిపురంలోని బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు ఇంటికి వచ్చి చూడగా.. తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లోని సామగ్రి చిందరవందరగా పడుంది. బీరువాలోని బంగారు నగలు కనిపించలేదు. చోరీ జరిగిందని భావించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. క్లూస్టీమ్తో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వేలిముద్రలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. గృహిణి అదృశ్యం పహాడీషరీఫ్: కుమారుడితో గృహిణి అదృశ్యం అయింది. ఈ సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ ఇస్తియాక్ అన్సారీ, నజీరా కాతూన్(25) దంపతులు ముగ్గురు పిల్లలతో కలిసి జీవనోపాధి నిమిత్తం జల్పల్లి వాదే ముస్తాఫా బస్తీకి వలస వచ్చారు. ఈ నెల 2న అందరితో కలిసి నిద్రపోయిన నజీరా.. ఉదయం లేచి చూసే సరికి నాలుగు నెలల కుమారుడు జీషాన్తో కలిసి కనిపించకుండా పోయింది. అదే రోజున భర్త అన్సారీ.. ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో కానీ, 87126 62367 నంబర్కు కానీ సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. -
పనిచేసుకోనివ్వడం లేదు.. వీఆర్ఎస్ ఇవ్వండి
హుడాకాంప్లెక్స్: ‘ఉన్నతాధికారులు నన్ను పనిచేసుకోనివ్వడం లేదు. నాకు వీఆర్ఎస్ ఇవ్వండి’ అని బిల్ కలెక్టర్ శ్రీశైలం జీహెచ్ఎంసీ కమిషనర్కు విన్నవించారు. వివరాలు ఇలా ఉన్నాయి. జీహెచ్ఎంసీ సర్కిల్ నం.5లో బిల్ కలెక్టర్గా శ్రీశైలం బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇతనికి రెండేళ్లలో నాలుగు డాకెట్లు అప్పగించారు. ప్రస్తుతం 321 డాకెట్ ఇచ్చారు. ఇంకా అతను తీసుకోలేదు. శ్రీశైలం.. కమిషనర్ కర్ణన్కు అందజేసిన ఫిర్యాదులో ఉన్నతాధికారులు నెలనెలా హాస్టల్స్, విద్యాసంస్థల ఇనిస్టిట్యూషన్లు, ప్రైవేటు కార్యాలయాలు, కమర్షియల్ కాంప్లెక్సులు తదితరుల వద్ద నెలనెలా మామూళ్లు తీసుకుంటున్నారని, తనను తనిఖీలకు వెళ్లవద్దని బెదిరిస్తున్నారని ఆరోపించారు. పన్నులు వసూలు చేయనియ్యడం లేదని, లైసెన్సు నోటీసు బుక్కు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారికి నోటీసులు ఇవ్వబోతే.. డిప్యూటీ కమిషనర్,ఏఎంసీ, ట్యాక్స్ ఇన్స్పెక్టర్, కంప్యూటర్ ఆపరేటర్లకు నచ్చడం లేదని పేర్కొంటూ.. శనివారంకమిషనర్ వినతిపత్రంఅందజేశాడు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, అవన్నీ చూపిస్తానని చెప్పారు. ఒకవేళ తాను తప్పు చేస్తే తనపై ఎలాంటి చర్యలైనా తీసుకోవాలని, ఈ టార్చర్ భరించడం తన వల్ల కాదని వాపోయారు. సంబంధిత కాపీని ఎల్బీనగర్ జోనల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ అడ్మినిస్ట్రేషన్, విజిలెన్స్ సెల్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం, అన్ని వర్కింగ్ యూనియన్లకు, విలేకర్లకు పంపానని, బిల్డింగ్ ఫొటోస్, నోటీసు అక్నాలెడ్జ్మెంట్ కాపీలు కూడా జతచేశానని వెల్లడించారు. ఇదే విషయమై డిప్యూటీ కమిషనర్ను వివరణ కోరగా.. అతని వలన కార్యాలయానికి అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ట్రేడర్స్, విద్యాసంస్థల యజమానులను దూషిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో వేరే చోట పని చేసినప్పుడు కూడా శ్రీశైలం పనితీరు సరిగ్గా లేదని, ఇక్కడ అలాగే ప్రవర్తిస్తున్నందుకు మార్చాల్సి వచ్చిందని, మరే ఇతర కారణాలు లేవని వెల్లడించారు. కమిషనర్కు.. బిల్ కలెక్టర్ విన్నపం -
సినారె సేవలు మరువలేనివి
తుర్కయంజాల్: తెలుగు సాహిత్యానికి డా.సి.నారాయణ రెడ్డి ఎనలేని సేవలు చేశారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మహాకవి సినారె కళాపీఠం హైదరాబాద్ అధ్యక్షుడు మల్లికేడి రాములు నిర్వహణలో సి.నారాయణ రెడ్డి 94వ జయంతి వేడుకలను ఆదివారం పురపాలక సంఘం పరిధిలోని రాగన్నగూడలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. తెలుగు చలన చిత్ర రంగంలో ఆయన రాసిన ఎన్నో పాటలు అన్ని వర్గాల ప్రజలను అలరించాయని అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు డా. నందిని సిధారెడ్డి మాట్లాడుతూ.. నారాయణ రెడ్డి గేయ నాటికలు, పద్య గేయ సంపుటి, దీర్ఘగీతం, గేయ నాటికలు, గేయ కావ్యం, కవితా సంపుటి, వచన కవితా సంపుటి, వ్యాఖ్యానం, నృత్య గేయరూపకం, సినీగీతాల సంకలనం వంటి ఎన్నో రచనలను చేశారని గుర్తుచేశారు. అనంతరం సినారె జీవన సాఫల్య పురస్కారాన్ని డా. లింగంపల్లి రామచంద్రకు అందజేశారు. సాహిత్య పురస్కారాలను తెలంగాణలోని పది జిల్లాలకు చెందిన డా. నాళేశ్వరం శంకరం, డా. రాధశ్రీ, డా. ఆచార్యా ఫణీంద్ర, కాసుల ప్రతాప్ రెడ్డి, దోరవేటి చెన్నయ్య, మౌన శ్రీ మల్లిక్, జువ్వాడి దేవి ప్రసాద్, తత్వాతి ప్రమోద్ కుమార్, మంథని శంకర్, అగ్రహారం ఛందోజీ రావు, అరుణ నారదభట్ల, పెద్దూరి వెంకటదాసు, పొన్నాల బాలయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నేటి నిజం దినపత్రిక సంపాదకుడు బైస దేవదాసు, మాజీ కౌన్సిలర్ కాకుమాను సునీల్, ప్రముఖ సంఘ సేవకులు దాసరి దయానంద్ రెడ్డి, తేజ సాహిత్య సేవా సంస్థ అధ్యక్షుడు డా. పోరెడ్డి రంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
చేవెళ్లలో కలకలం.. ఫాంహౌస్లో ఐటీ ఉద్యోగుల డ్రగ్స్ పార్టీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్లలో డ్రగ్స్ కలకలం రేగింది. సెరీన్ ఆచార్జ్ ఫాంహౌస్లో బర్త్డే వేడుకలు పేరుతో డ్రగ్స్, విదేశీ మద్యంతో హంగామా చేస్తుండగా.. ఎస్టీఎఫ్ బీ టీమ్, ఎక్సైజ్ పోలీసులు దాడులు జరిపారు. బర్త్డే సందర్భంగా ఐటీ ఉద్యోగి అభిజిత్ బెనర్జీ ఈ ఫాంహౌస్ను బుక్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఫాంహౌస్ నిర్వాహకుడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.పక్కా సమాచారంతో ఫాంహౌస్లో పోలీసులు సోదాలు నిర్వహించగా.. ఐటీ ఉద్యోగుల నుంచి రూ.రెండు లక్షల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. మూడు లగ్జరీ కార్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. డ్రగ్స్ను హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బర్త్డే వేడుకల్లో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. ఆరుగురు ఐటీ ఉద్యోగులకు పాజిటివ్ రావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. -
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
చేవెళ్ల: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యారోగ్య శాఖ డీఎంఈ డాక్టర్ నరేందర్కుమార్ అన్నారు. శనివారం ఆయన జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లుతో కలిసి చేవెళ్ల ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిని పరిశీలించారు. వార్డుల్లో ఉన్న రోగుల వద్దకు వెళ్లి వైద్యసేవలపై ఆరాతీశారు. అనంతరం ఆయన వైద్యులతో మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఓపీ, స్టాఫ్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం సమస్యలను తెలుసుకున్నారు. విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని ఆయనకు వివరించారు. సమస్యలపై రిపోర్టు పంపిస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది ఉన్నారు. వైద్యారోగ్యశాఖ డీఎంఈ డాక్టర్ నరేందర్కుమార్ -
గుర్తొస్తే ఒల్లు పులకరించి పోతుంది
కాలంతో పాటు మనం ప్రయాణిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఎంతో మంది పరిచయం అవుతారు.. అందులో కొందరిని కాలక్రమేణా మరిచిపోతాం.. కొందరు మాత్రం కాలాన్నే మరిపిస్తారు.. వారే మనకు ఇష్టమైన స్నేహితులుగా గుర్తుండిపోతారు.. వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తారు.. స్కూల్, కాలేజీ లైఫ్లో ఏర్పడిన స్నేహబంధాలు ఎంతో బలపడతాయి.. మా స్వగ్రామం బాన్స్వాడ స్కూల్ డేస్లో ఇద్దరు మిత్రులు ఉండేవారు.. వారిద్దరూ పదో తరగతిలోనే చదువు మానేశారు. నేను 6 నుంచి ఇంటర్ వరకు నవోదయ స్టూడెంట్ని.. పీజీ వరకు హాస్టల్లో ఉండి చదువుకున్నా. నా లైఫ్లో ఎక్కువ కాలం స్నేహితులతోనే గడిపా. నా ఎదుగుదలకు కూడా వారు ఎంతో దోహదపడ్డారు. ఏటా వారితో మీట్ అవుతా. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాను.. ఆ సమయంలో ఎంతో ఆనందం కలుగుతుంది. ఏదో తెలియని అనుభూతి చెందుతా. కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడు నవ్వు ఆపుకోలేను. – జయసుధ, డీపీఓ -
బాత్రూంలో జారిపడి వలస కూలీ మృతి
మొయినాబాద్: బతుకు దెరువు కోసం వలస వచ్చిన ఓ కూలీ బాత్రూంలో జారిపడి మృతి చెందాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్కు చెందిన బంటి(27) అదే ప్రాంతానికి చెందిన పుష్పేందర్, గుజార్తో కలిసి మూడు నెలల క్రితం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్నగర్కు వలస వచ్చారు. గ్రామ సమీపంలోని పైప్లైన్ రోడ్డులో ఉన్న ఆవాసా విల్లాలో టైల్స్, మార్బుల్స్ పనిచేస్తూ అక్కడే ఓ గదిలో ఉంటున్నారు. కాగా శుక్రవారం రాత్రి 8 గంటలకు భోజనం చేసి నిద్రపోయారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో బంటి బాత్రూంకు వెళ్లి అందులో జారి పడ్డాడు. అతని తలకు గాయమైంది. అతనితో ఉన్నవారు నీళ్లు తాగించి పడుకోబెట్టారు. ఉదయం 6 గంటలకు బంటిని నిద్రలేపినా లేవలేదు. వెంటనే స్థానిక భాస్కర ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో చెరువులో పడి మేస్త్రీ..కేశంపేట: చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని సంతాపూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యాలాల రాకేష్(40) మేసీ్త్ర పనులు చేస్తూ తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు. ఆయన గ్రామానికి చెందిన లేగలకాడి శ్రీనుతో కలిసి శివారులోని నాగుల చెరువులో చేపల వేటకు వెళ్లారు. రాకేష్ మద్యం మత్తులో ఉండటంతో చెరువులో పడిపోయాడు. ఆయన్ని రక్షించేందుకు గ్రామస్తులు ప్రయత్నించినా విఫలమయ్యాయి. అనంతరం మృతదేహాన్ని వెలికి తీసి పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి రాంచంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు. -
స్నేహం గొప్పవరం
ఎవరికై నా స్నేహం అనేది గొప్ప వరం లాంటిది. మంచి స్నేహితులు దొరకడం మరింత అదృష్టమే.. ఈ ప్రపంచంలో ధనిక, పేద అనే తేడా చూడనది స్నేహం ఒక్కటే. దాన్ని దేనితో పోల్చలేము. వెలకట్టలేము.. ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. స్నేహం చేయడం ముఖ్యం కాదు.. దాన్ని కాపాడుకోవడమే ముఖ్యం.. ఆ ధ్యాస, తపన ఇద్దరిలోనూ ఉండాలి.. అప్పుడే అది కలకాలం పదిలంగా ఉంటుంది. ఏ ఒక్కరు నిర్లక్ష్యం చేసినా అది నిలబడదు.. సమయం దొరికినప్పుడల్లా చిన్ననాటి మిత్రులతో మాట్లాడతా. వారిని మీట్ అవుతా. – నారాయణరెడ్డి, ఎస్పీ -
పాతికేళ్ల బంధం మాది
షాబాద్: కష్ట సుఖాల్లో తోడుగా నిలిచే వాడే నిజమైన స్నేహితుడు. అలాంటి మిత్రుడే ఓంకార్. పాతిక సంవత్సరాలుగా ఎంతో అన్యోన్యంగా ఉంటుంన్నాం. సమయం దొరికినప్పుడల్లా కలుస్తాం. ఇటీవల మరో స్నేహితుడు శ్రీనివాస్రెడ్డి రెండు కిడ్నీలు చెడిపోయి మృతి చెందాడు. ఆ కుటుంబానికి స్నేహితలందరూ అండగా నిలిచారు. రూ.7 లక్షలు సేకరించి శ్రీనివాస్రెడ్డి పిల్లల పేరిట బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాం. మా వాడి పిల్లలు అనాథలు కారాదనే ఈ నిర్ణయం తీసుకున్నాం. స్నేహానికి కు ల, మత తారతమ్యాలు ఉండవు. అమ్మ నాన్న తర్వాత దేవుడిచ్చిన బహుమతే స్నేహితుడు. – బి.కాంతారెడ్డి, సీఐ, షాబాద్ ప్రతిఫలం ఆశించనిదే.. స్నేహబంధం ఎంతో విలువైంది. ఇంట్లో వారితో చెప్పుకోలేని విషయాలు కూడా స్నేహితులతో పంచుకోవచ్చు. స్నేహంతో బంధాలు ఎంతో బలపతాయి. ఫ్రెండ్స్తో ఉండే ఆనందం వెలకట్టలేనిధి. – సంగమేశ్వర్రెడ్డి, టీచర్, తాళ్లపల్లి పాఠశాల, షాబాద్ మండలం ఒకే గిన్నెలో తిన్నాం నేను నా స్నేహితురాలు స్వాతి ఇద్దరం కే దగ్గర చదువుకున్నాం. నేను ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్నాను. స్వాతి వరంగల్లో టీచర్గా పని చేస్తోంది. మా స్నేహం విడదీయరానిది. మేము చదువుకునే రోజుల్లో ఇద్దరం ఒకే గదిలో ఉండి వాళ్లం. ఒకే గిన్నెలో తిన్నాం. ఇప్పటికీ అదే ఆప్యాయతతో కలిసి ఉన్నాం. – అపర్ణ, ఎంపీడీఓ, షాబాద్ -
అదనపు కలెక్టర్గా చంద్రారెడ్డి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లా అదనపు(రెవెన్యూ) కలెక్టర్గా కె.చంద్రారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం జీఓ జారీ చేసింది. ప్రస్తుతం హెచ్ఎండీఏ బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ ఓఎస్డీగా పని చేస్తున్న చంద్రారెడ్డిని ప్రభుత్వం జిల్లా అదనపు కలెక్టర్గా నియమించింది. గతంలో ఇక్కడ అదనపు కలెక్టర్గాపని చేసిన ఎంవీ భూపాల్రెడ్డి ఏసీబీ కేసులో అరెస్ట్ కావడం, ఆ తర్వాత అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) ప్రతిమా సింగ్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడం, తాజాగా ఆమె మెటర్నిటీ లీవ్లో వెళ్లడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్కు మూడు ఎకరాలు కేటాయింపు సాక్షి, రంగారెడ్డిజిల్లా: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ జిల్లా కొత్త భవన నిర్మాణం కోసం ప్రభుత్వం శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 91/2లో మూడు ఎకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసుతో పాటు శేరిలింగంపల్లి, గండిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఇక్కడ సొంత భవనాలను నిర్మించనున్నారు. జులై 31న ‘సాక్షి’దినపత్రికలో ‘గూడు కట్టని నిర్లక్ష్యం..అద్దె భవనాల్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు’శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం విదితమే. సొంత భవనాలు లేకపోవడం, ఇరుకై న అద్దె భవనాల్లో ఉద్యోగులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు శేరిలింగంపల్లి మండల పరిధిలోని గచ్చిబౌలిలో మూడు ఎకరాల భూమిని కేటాయించింది. తక్షణమే ఈ భూమిని స్వాధీనం చేసుకుని, నిర్మాణ పనులు ప్రారంభించవచ్చునని ప్రకటించింది. ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు జిల్లా వ్యవసాయాధికారి ఉష యాచారం: జిల్లాలో ఎరువుల కొరత లేదని, డిమాండ్ను బట్టి ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి ఉష హెచ్చరించారు. శనివారం ఆమె మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోదాంలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి ఎరువుల నిల్వలను, రికార్డులను పరిశీలించారు. ఇంత వరకు విక్రయించిన యూరియా, గ్రోమోర్ వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉష మాట్లాడుతూ.. పత్తి, వరి పంటకు సరిపడా యూరియా, గ్రోమోర్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రైతులు వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు తీసుకుని ఎరువులు వాడాలని సూచించారు. మోతాదుకు మించితే పంటకు నష్టం వాటిల్లుతుందన్నారు. ఆమె వెంట ఇబ్రహీంపట్నం డివిజన్ ఏడీఏ సుజాత, యాచారం మండల వ్యవసాయాధికారి రవినాథ్ తదితరులు పాల్గొన్నారు. పశువుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం జిల్లా పశువైద్యాధికారి మధుసూదన్ షాబాద్: పశువుల ఆరోగ్యంపై రైతులు అప్రమత్తంగా ఉంటూ సకాలంలో వైద్యం అందించాలని జిల్లా పశువైద్యాధికారి మధుసూదన్ అన్నారు. శనివారం ఆయన మండల పరిధిలోని ఆస్పల్లిగూడ గ్రామంలోని విజయ్రెడ్డి డెయిరీని సందర్శించి, పాడి పరిశ్రమపై అవగాహన కల్పించారు. అనంతరం షాబాద్ పశువైద్యశాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ.. పాడి రైతులు పశువులకు సకాలంలో వైద్యం అందిస్తేనే అధిక పాల దిగుబడి వస్తుందని చెప్పారు. మేలు రకం పశువుల ఎంపిక ద్వారా అధిక ఆదాయం పొందవచ్చునని తెలిపారు. పశుపోషణపై దృష్టి సారించి మేలురకం పశువులకు ఎంపిక చేసుకుని వాటికి నాణ్యమైన గడ్డి జాతులు, దాణా అందించడంతో మరింత లాభం పొందచవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో షాబాద్ పశువైద్యాధికారి స్రవంతి, రైతులు తదితరులున్నారు. -
బాల్య మిత్రులు.. ‘బాధ్యత’గా..
కొడంగల్: కొడంగల్ ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1990 బ్యాచ్కు చెందిన కొందరు విద్యార్థులు 16 ఏళ్ల క్రితం బాధ్యత అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. వారు సంపాదించిన డబ్బులో కొంత సమాజసేవకు వినియోగిస్తున్నారు. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు ఏటా ఉచితంగా నోటు పుస్తకాలు, పలకలు, పెన్నులు, పెన్సిల్స్ పంపిణీ చేస్తున్నారు. కటుకం వెంకటేశ్, మురహరి వశిష్ట, శివకుమార్ గుప్తా, లక్ష్మీనారాయణ జోషి, కిట్టుస్వామి, కృష్ణారావు, కొంతం సతీష్, నగేశ్, ఆనంద్ కుమార్ లాహోటీ, కానుకుర్తి రమేష్, వేణు, బాలరంగాచారి మంచి స్నేహితులు. ఫ్రెండ్షిప్కు ఆదర్శంగా నిలుస్తున్నారు. గతంలో పాలమూరు జిల్లాను వరదలు ముంచెత్తి నప్పుడు ప్రజల సహకారంతో రూ.2.5 లక్షల విలువ చేసే సరుకులు, మందులు, దుస్తులను మాగనూరు మండలంలోని కృష్ణా నది పరీవాహాక ప్రాంతంలో పంపిణీ చేశారు. -
40 ఏళ్ల బంధం
తాండూరు రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాకు చెందిన శ్రీదేవి, లలిత మంచి స్నేహితులు. బాల్యమంతా కడపలోనే చదువుకున్నారు. 6వ తరగతి నుంచే మంచి ఫ్రెండ్స్. వివాహ అనంతరం శ్రీదేవి తెలంగాణాలో.. లలిత కర్ణాటకలో స్థిరపడ్డారు. ప్రస్తుతం శ్రీదేవి తాండూరు మండలం జినుగుర్తి తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్గా విధులు నిర్వహిస్తున్నారు. లలిత బెంగళూరులోని నారాయణ స్కూల్లో ప్రిన్సిపాల్గా ఉన్నారు. 40 ఏళ్లుగా వీరి స్నేహం కొనసాగుతూనే ఉంది. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఏదైనా శుభకార్యం జరిగినా, పండుగలు, వేసవి సెలవులు వచ్చినా కలుస్తారు. కుటుంబ సభ్యులతో సరదగా గడుపుతుంటారు. ప్రపంచంలో వెల కట్టలేనిది స్నేహం మాత్రమే అని శ్రీదేవి తెలిపారు. -
సమాజహితం కోరి..
ఆమనగల్లు: ఆమనగల్లు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల 1994 – 95 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులందరూ ‘స్నేహ హస్తం’ పేరిట సమాజ సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది ఉద్యోగ, వ్యాపార రంగాల్లో స్థిరపడ్డారు. సమాజానికి ఏదైనా చేయాలనే సంకల్పంతో స్నేహ హస్తం ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లా హుజూర్నగర్ సీఐగా పనిచేస్తున్న గజ్జె చరమందరాజు, ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ ఫౌండేషన్ కొనసాగుతోంది. అనారోగ్యానికి గురైన బాల్య మిత్రులకు అండగా నిలుస్తున్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నారు. -
ఇప్పటికీ టచ్లో ఉన్నారు
మాది నల్లగొండ జిల్లా మారుమూల కుగ్రామం.. మా గ్రామంలో 3వ తరగతి వరకే ఉండేది.. పదో తరగతి వరకు పక్క గ్రామంలో చదివా.. నాలుగు కిలోమీటర్లు నడిచి స్కూల్కు వెళ్లేవాళ్లం. వర్షం పడితే స్కూల్ మార్గంలోని వాగు పారేది.. దీంతో డుమ్మా కొట్టేవా ళ్లం. ఆ సమయంలో స్నేహితులతో కలిసి ఆడుకునే వాళ్లం.. కలిసి చదువుకునే వాళ్లం.. రోజూ ఆడుతూ పాడుతూ స్కూల్కి నడుచుకుంటూ వెళ్లే స్నేహితులను ఇప్పటికీ మరచిపోలేను.. చాలా మంది మిత్రులు ఉన్నారు.. ఒకరిద్దరి పేర్లు చెబతే మిగతా వాళ్లను తక్కువ చేసినట్లవుతుంది. ఏది ఏమైనా చిన్ననాడు ఫ్రెండ్స్తో గడిపిన జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేను.. – లింగ్యానాయక్, అడిషనల్ కలెక్టర్ -
స్వార్థం లేనిది స్నేహం
ముందుగా రాష్ట్ర, జిల్లా ప్రజలకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.. దేనిలోనైనా స్వార్థం ఉంటుందేమోకానీ స్నేహం విషయంలో ఉండదు. స్వార్థం ఉంటే స్నేహం అనిపించుకోదు.. నిజమైన స్నేహం ఏమీ ఆశించదు. అలాంటి వారు ఉంటే ఎలాంటి కష్టాలనైనా ధైర్యంగా ఎదుర్కోగలం.. అంతటి గొప్ప మిత్రులు నాకు ఉన్నారు. మా స్వగ్రామం తాండూరు.. చదువుకునే రోజుల్లో స్నేహితులతో కలిసి వాలీబాల్, బ్యాడ్మింటన్ ఆడేవాళ్లం. సుదర్శన్గౌడ్, ప్రకాష్గౌడ్, రాములు యాదవ్, రమేశ్కుమార్, జగన్మోహన్, మధుకర్, వెంకటయ్య నా చిన్ననాటి స్నేహితులు.. బాల్యం మొత్తం వీరితోనే గడిపా. సమయం చిక్కినప్పుడల్లా వీరందిరితో మాట్లాడుతుంటా. చిన్నతనంలో చేసిన అల్లరి, సరదాగా గడిపిన రోజులు గుర్తుకు వస్తే మనస్సంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆ అనుభూతే వేరు.. – గడ్డం ప్రసాద్కుమార్, శాసన సభ స్పీకర్ -
వారు దేవుడిచ్చిన వరం
చేవెళ్ల: స్నేహం అనేది నాకు దేవుడిచ్చిన వరం. తల్లిదండ్రుల తర్వాత స్నేహితులే ముఖ్యం అని చేవెళ్ల తహసీల్దార్ బి.కృష్ణయ్య అన్నారు. చిన్ననాటి స్నేహితులు పి.శ్రీనివాస్, ఐ.కృష్ణయ్య, కె.నర్సింలు జ్ఞాపకాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. పరిగి మండలం రూప్ఖాన్ేపేటకు చెందిన మేమందరం పాఠశాల స్థాయి నుంచే స్నేహితులం. అంతేకాకుండా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా కొనసాగుతున్నాం. ముగ్గురూ నాకంటే ఒక్క క్లాస్ సీనియర్లు.. మా మైత్రి పదో తరగతి వరకు సాగింది. ఇంటర్, డిగ్రీ వేర్వేరు కళాశాలల్లో చదువుకున్నా రోజూ కలిసేవాళ్లం. వృత్తి రీత్యా వివిధ రంగాల్లో రాణిస్తున్నాం. నేను తహసీల్దార్గా, నర్సింలు హెడ్కానిస్టేబుల్గా. కృష్ణయ్య వ్యవసాయం, శ్రీనివాస్ వ్యాపారం చూస్తూ స్థిరపడ్డాం. ఆదివారం, సెలవు రోజుల్లో కలుసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఎవరి కుటుంబంలో సమస్య వచ్చినా కలిసి పరిష్కరించుకుంటాం. మిత్రులందరికీ స్నేహితుల రోజు శుభాకాంక్షలు. – బి.కృష్ణయ్య, తహసీల్దార్, చేవెళ్ల -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
చేవెళ్ల: రాష్ట్రంలోని పెన్షన్దారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తోందని పద్మశ్రీ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. శనివారం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఓ ఫంక్షన్ హాల్లో దివ్యాంగుల మహాగర్జన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంద కృష్ణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో సామాజిక పెన్షన్ను రూ.4వేలకు, దివ్యాంగులకు రూ.6వేలు పెంచి ఇస్తామని హామీ ఇచ్చి అమలులో విఫలమైందన్నారు. హామీలు అమలు చేయలేని ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేశారు. కొత్త పింఛన్ల కోసం అర్హులు పదేళ్లుగా ఎదురుచూస్తున్నారన్నారు. ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితంగా గత ప్రభుత్వాలు పెన్షన్లు పెంచాయని, ఆరోగ్య శ్రీ పథకం అమలు చేశాయని గుర్తు చేశారు. పెన్షన్దారుల కోసం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 13న మహాగర్జన నిర్వహించేందుకు నిర్ణయించిందన్నారు. అప్పటి వరకు ప్రభుత్వం దిగిరావాలని.. లేదంటే మహాగర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపేందర్ మాదిగ, రాష్ట్ర, జిల్లా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు ఎం.యాదగిరి, ప్రవీణ్కుమార్, శంకర్రావు, పెంటయ్య, నర్సింలు, వెంకటయ్య, డీఎం.చందు, భాను ప్రసాద్, మహేందర్, నర్సింహ, బాబు, నాయకులు, పెన్షన్దారులు పాల్గొన్నారు. మహాగర్జన సన్నాహక సమావేశంలోఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కృష్ణమాదిగ -
లక్ష్యాన్ని చేరుకోకుంటే చర్యలు
షాద్నగర్రూరల్: వన మహోత్సవంలో అధికారులు ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవాల్సిందేనని.. లేదంటే చర్యలు తప్పవని జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి హెచ్చరించారు. శనివారం ఫరూఖ్నగర్ మండల పరిధిలలోని హాజిపల్లి భాస్కర గార్డెన్లో డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు వన మహోత్సవం, పారిశుద్ధ్యం, పోలింగ్ బూత్లలో కనీస సౌకర్యాల ఏర్పాట్లు తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులుతో సమీక్ష నిర్వహించారు. జిల్లా అధికారులు అడిగిన ప్రశ్నలకు మండల అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో వారిపై జిల్లా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వనమహోత్సవంలో భాగంగా మొక్కలను నాటేందుకు కావాల్సిన గుంతలను తీయలేదని, కనీసం ఎన్ని మొక్కలు నాటాలి, ఎక్కడెక్కడ నాటాలి అనే విషయాలు తెలియకుండా ఏ విధంగా పని చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం తాము పని చేస్తున్న గ్రామానికి సంబంధించిన వైశాల్యం, పాపులేషన్ పంచాయతీ కార్యదర్శులకు తెలియడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల చివరి వరకు ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేందుకు పంచాయతీ కార్యదర్శులు, ఏపీఓలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు కృషి చేయాలని, లేని యెడల ఉన్నతాధికారుల ఆదేశాలతో సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృషిలో పెట్టుకుని పోలింగ్ బూత్లలో అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం డీపీఓ సురేష్మోహన్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య నిర్వహనలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని అన్నారు. తాగునీటి ట్యాంకులు, రోడ్లు, మురుగు కాలువలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గుంతల్లో నీటి నిల్వ, పెంట కుప్పలు, మట్టి దిబ్బలు, పిచ్చి మొక్కలు, మురుగునీరు ఉండకుండా చూడాలని అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇంకుడుగుంతల నిర్మాణం పనులను త్వరలోనే పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీల ఆడిట్ తప్పనిసరిగా మండల పరిషత్ కార్యాలయాలలోనే నిర్వహించాలని అన్నారు. సెక్రటరీలు తమ రోజువారి హాజరును నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇప్పటికే జిల్లాలో ఇద్దరు కార్యదర్శులను సస్పెండ్ చేశామన్నారు. 15 మంది సెక్రటరీలకు షోకాజ్లు వన మహోత్సవంలో భాగంగా పది శాతం కన్నా తక్కువ పనులను చేపట్టిన 15 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీలను జారీ చేయాలని ఆదేశించారు. కొత్తూరు మండలం సిద్దాపూర్, మల్లాపూర్, శేరిగూడ భద్రాయపల్లి, కేశంపేట మండలం సుందరాపూర్, దత్తాయపల్లి, చింతకుంటపల్లి, కొందుర్గు మండలం తంగళ్లపల్లి, బైరంపల్లి, మహదేవ్పూర్, జిల్లేడ్చౌదరిగూడ మండలం చింతకుంటతండా, జాకారం, ఇంద్రానగర్, వనంపల్లి, మల్కాపూర్, పద్మారం పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీలు జారీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు. జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి మీరు పనిచేసే గ్రామ వైశాల్యం, జనాభా తెలియదా? పంచాయతీ కార్యదర్శులపై అధికారుల ఆగ్రహం -
ప్రమాదంలో దేశ సార్వభౌమత్వం
మొయినాబాద్: ఆపరేషన్ సిందూర్కు సిద్ధమైన ఇండియాను యుద్ధం చేయకుండా నిలిపివేశానని అమెరికాలో ట్రంప్ ప్రకటిస్తే.. ఇక్కడ మోదీ విజయం సాధించడానికి తానే పాకిస్తాన్ను లొంగ తీసుకున్నానని ప్రకటన చేశారు.. ట్రంప్, మోదీల విరుద్ధ ప్రకటనలతో దేశ సార్వభౌమత్వం ప్రమాదంలో పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్లో సీపీఐ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా 17వ మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. భారతదేశ ఎగుమతులపై అమెరికా 25 శాతం సుంకం విధించినా ప్రధాని మోదీ నోరువిప్పడంలేదన్నారు. దేశ విదేశాంగ విధానం ప్రపంచంలోని ఏ దేశాల మీద ఆధారపడి ఉండదని.. కేంద్ర ప్రభుత్వం మాత్రం విదేశాంగ విధానానికి భంగం కలిగే విధానాలను అమలు చేస్తోందన్నారు. అమెరికా ప్రభుత్వం భారత దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి కుట్రలు చేస్తుంటే ప్రధాని మోదీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపి.. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారనే సాకుతో బీసీ బిల్లుపై కేంద్రం నాన్చుడు ధోరణి అవలంబిస్తోందన్నారు. బీసీలపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను ఏరివేసే లక్ష్యంతో ఎన్కౌంటర్లు చేస్తుందని. 2026 మార్చి వరకు మావోయిస్టులు లేని భారతదేశాన్ని నిర్మిస్తామని ప్రకటించడం బాధాకరమన్నారు. కమ్యూనిస్టులు లేకపోతే బూర్జువా వర్గాలు ప్రజల ఆస్తిని, ప్రాణాలను పూర్తిగా హరిస్తాయన్నారు. కమ్యూనిజాన్ని, మార్క్సిజాన్ని అంతం చేయడం ఎవరి తరం కాదన్నారు. కమ్యూనిస్టుల విలువ ప్రజలకు తెలుసన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నరసింహ, జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, మండల కార్యదర్శి కె.శ్రీనివాస్, నాయకులు నర్సింగ్రావు, రామస్వామి, నరసింహ, యాదయ్య, జంగయ్య పాల్గొన్నారు ట్రంప్, మోదీ విరుద్ధ ప్రకటనలతో గందరగోళం బీసీ బిల్లుపై కేంద్రం నాన్చుడు ధోరణి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మొయినాబాద్లో సీపీఐ జిల్లా 17వ మహాసభలు -
చికిత్స పొందుతూ మహిళా కానిస్టేబుల్ మృతి
మీర్పేట: కుటుంబ, ఆర్థిక సమస్యలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళా కానిస్టేబుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. వివరాలు ఇలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నాగిళ్లకు చెందిన మనీష (28)కు కడ్తాల్ మండలం పల్లె చెల్కతండాకు చెందిన సుధాకర్తో 2017లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే భర్త, పిల్లలతో కలిసి ప్రశాంతిహిల్స్లో ఉంటున్న మనీష నాలుగేళ్లుగా మీర్పేట పీఎస్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో గత నెల 25న ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. చికిత్స నిమిత్తం డీఆర్డీఓ అపోలో ఆస్పత్రికి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కేర్ ఆస్పత్రికి తరలించగా ఆరోగ్యం క్షీనించడంతో శనివారం మృతిచెందింది. తన కూతురి మృతిపై ఎలాంటి అనుమానం లేదని, ఆర్థిక ఇబ్బందులే కారణమని, మృతురాలి తండ్రి కాట్రావత్ కిష్ట ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ శంకర్నాయక్ తెలిపారు. బంగారం అపహరణలో కేసు నమోదు నందిగామ: మండల పరిధిలోని మామిడిపల్లిలో జరిగిన భారీ దొంగతనం కేసులో పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన చాకలి కృష్ణయ్య ఇంట్లో రూ.15 లక్షల నగదు, 16 తులాల బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన విషయం విధితమే. బాధితుడు కృష్ణయ్య గత నెల 27న ఇంట్లో దాచిన బంగారం, నగదు కనబడక పోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపి కేసు నమోదు చేశారు. బైక్ దొంగకు రిమాండ్ శంకర్పల్లి: బైక్ దొంగతనం చేసిన వ్యక్తిని శనివారం శంకర్పల్లి పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కి తరలించారు. శంకర్పల్లి సీఐ శ్రీనివాస్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ బోరబండకి చెందిన పట్లోళ్ల రాజేశ్వర్రెడ్డి(42) సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీలకు అలవాటు పడ్డాడు. కొన్నేళ్లుగా 20పైగా దొంగతనాలు చేస్తూ, జైలుకి సైతం వెళ్లి వచ్చాడు. అయితే గత నెల 26న శంకర్పల్లి పట్టణంలోని సమ్మయ్య అనే వ్యక్తి తన ఇంటి ముందు తాళం వేసి బైక్ని నిలపగా.. రాజేశ్వర్రెడ్డి దాన్ని చోరీ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా రాజేశ్వర్రెడ్డిని సనత్నగర్ వద్ద పట్టుకున్నారు. అనంతరం చేవెళ్ల కోర్టులో హాజరు పరిచి, రిమాండ్కి తరలించినట్లు సీఐ తెలిపారు. డివైడర్ను ఢీకొని కూలీ దుర్మరణం మహేశ్వరం: బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని మహేశ్వరం గేటు సిరిగిరిపురం అర్బన్ ఫారెస్టు వద్ద చోటు చేసుకుంది. మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిగిరిపురం గ్రామానికి చెందిన తడకల బాలకృష్ణ(40) కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆయన శనివారం సాయంత్రం మహేశ్వరం గేటు నుంచి స్వగ్రామానికి బైక్పై వస్తుండగా అర్బన్ ఫారెస్టు వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమవ్వడంతో బాలకృష్ణ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
మేమున్నామని..
ఇబ్రహీంపట్నం: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 1983– 84 పదో తరగతి పూర్వ విద్యార్థులు 50 ఏళ్లుగా చెక్కు చెదరని స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఆపదలో ఉన్న స్నేహితులను ఆదుకుంటూ మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు. తాము చదువుకున్న పాఠశాలకు ఇటీవల రూ.1.50 లక్షల విలువైన బెంచీలు, బీరువా తదితర సామగ్రిని అందజేశారు. మహిళా దినోత్సవం, ఫ్రెండ్షిప్ రోజున ఒక్కచోటకు చేరి పాత జ్ఞాపకాలను నెరమువేసుకుంటున్నారు. వృద్ధాప్యం ముంచుకువస్తున్నా తరచూ కలుస్తూ స్నేహనికి కన్న మిన్న లోకాన లేదురా అని చాటిచెబుతున్నారు. -
దోస్త్
మేరాదోస్త్ పాతికేళ్ల ప్రయాణం శంకర్పల్లి: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఎస్.ఇటిక్యాలకు చెందిన శ్రీనివాస్ గౌడ్, వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం పులుమామిడికి చెందిన రవి కుమార్ శెట్టి బెస్ట్ ఫ్రెండ్స్. వీరిద్దరిదీ వేర్వేరు జిల్లాలైనా 2001లో సంగారెడ్డిలో డిగ్రీ చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్ గౌడ్ శంకర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు. రవికుమార్ మర్పల్లి మండలం కొత్లాపూర్ గ్రామ సెక్రెటరీగా పని చేస్తున్నారు. వీరి పాతికేళ్ల ప్రయాణంలో నిత్యం మాట్లాడుకోని రోజంటూ ఉండదు. మా స్నేహానికి హద్దులు ఉండవని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. కష్టసుఖాల్లో కలిసే సాగుతామని పేర్కొన్నారు. సృష్టిలో వెలకట్టలేనిది స్నేహం చెప్పలేనంత ప్రేమ దుద్యాల్: మండలంలోని హస్నాబాద్కు చెందిన ప్రభాకర్(బాహుబలి చిత్రంలో కాళకేయ పాత్రలో నటించిన వ్యక్తి) సినీ రంగంలో స్థిరపడ్డారు. వినోద్ కుమార్(నాంపల్లి క్రిమినల్ కోర్టు జడ్జి). ఇద్దరికీ చిన్ననాటి స్నేహితులంటే చెప్పలేనంత ప్రేమ. వారితోపాటు పాఠశాలలో చదువుకున్న మిత్రులను ఆప్యాయంగా పలకరిస్తారు. ఉన్నత స్థానంలో ఉన్నా ఎక్కడా వారి గొప్పతనాన్ని ప్రదర్శించరు. ఎప్పటిలాగే బాల్య మిత్రులతో సరదాగా గడుపుతారు. వీరు గ్రామానికి వచ్చిన ప్రతి సారీ స్థానికులు, స్నేహితులతో కలిసిమెలిసి ఉంటారు. ఫ్రెండ్షిప్కు వీరిచ్చే నిర్వచనమే వేరు.. -
విద్యారంగ బలోపేతం ఎస్టీఎఫ్ఐ లక్ష్యం
షాద్నగర్: ప్రభుత్వ విద్యారంగం బలోపేతమే స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్టీఎఫ్ఐ) లక్ష్యమని టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి నర్సింహులు అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మార్సీ కార్యాలయం ఆవరణలో ఫెడరేషన్ సీనియర్ నాయకుడు కృష్ణయ్య ఆధ్వర్యంలో ఎస్టీఎఫ్ఐ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నర్సింహులు మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో భావసారూప్యత కలిగిన 25 సంఘాల టీచర్స్ యూనియన్లతో 2000 సంవత్సరంలో ఎస్టీఎఫ్ఐ ఏర్పడిందని తెలిపారు. విద్యారంగంలో శాసీ్త్రయ విధానాలను అనుసరించడం, సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా ప్రస్తుతం ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వాటిని తగ్గించి రాజ్యాంగ, ప్రజాస్వామిక విలువలను కాపాడాలని సూచించారు. దేశవ్యాప్తంగా పాఠశాల విద్యకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. కేంద్రం తెచ్చిన ఎన్పీఎస్, సీపీఎస్, యూపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్,ఎన్ఈపీ 2020 విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వ విద్యారంగం, ఉపాధ్యాయుల హక్కులను కాపాడాలనే లక్ష్యంతో ఈ నెల 8న కలకత్తాలో రజతోత్సవ సభలను నిర్వహించనున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు సత్యం, లక్ష్మీ దేవమ్మ, రామకృష్ణ, వినీత్గౌడ్, శివ, రాజు, జేవీవీ నాయకులు కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్ల నిర్మాణానికిపర్మిషన్ ఇవ్వండి
షాద్నగర్రూరల్: కష్టపడి కొనుక్కున్న ప్లాట్లపై విధించిన స్టేటస్కోను తొలగించి, ఇల్లు కట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని రెడ్హిల్స్ వెంచర్ బాధితులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లేడ్ చౌదరిగూడ మండలం వెంచర్ ఎదుట ధర్నాచేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కొందరు వ్యక్తులు ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తమ ప్లాట్లను యంత్రాల సహాయంతో చదును చేశారని, ఈ ఘటనపై పోలీస్స్టేషన్ను ఆశ్రయించగా అప్పట్లో కొందరిపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. గతంలో ప్రతివాదులు కోర్టులో వేసిన కేసులు వీగిపోయాయని, మరో కేసువేసి కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. వీటిని అడ్డుగా పెట్టుకొని జిల్లాపంచాయతీ అధికారి(డీపీఓ) ఏకపక్షంగా వ్యవహరించి, నిర్మాణాలు చేపట్టకుండా స్టేటస్కో విధించారని పేర్కొన్నారు. దానిని తొలగించి, ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో బాధితులు బాలరాజ్, వీరయ్య, రమేష్,జంగమ్మ, మల్లమ్మ, కృష్ణయ్య, నర్సింహులు, పుష్పమ్మ, గోపాల్, చంద్రశేఖర్, మహేందర్,వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమార్కులపై కొరడా
తాండూరు రూరల్: ఎర్రరాయి తరలిస్తున్న అక్రమార్కులపై అధికారులు కొరడా ఝళిపించారు. పెద్దేముల్ మండలం తట్టెపల్లి, పాషాపూర్ తండా పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్న వాహనాలపై శుక్రవారం తెల్లవారుజామున టాస్క్ఫోర్స్ సీఐ అన్వర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఇద్దరు జేసీబీ డ్రైవర్లు, ఐదుగురు ట్రాక్టర్ డ్రైవర్లపై కేసు నమోదు చేశారు. సీఐ కథనం ప్రకారం.. పెద్దేముల్ మండలం అడికిచెర్ల, పాషాపూర్ తండా సమీపంలోని ప్రభుత్వ భూముల్లో కొందరు ఎర్రమట్టిరాయిని తయారు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి ఆదేశాలతో టాస్క్ఫోర్స్ దాడులు నిర్వహించింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమాతులు లేకుండా ఎర్రమట్టి రాయిని ట్రాక్టర్ల ద్వారా కర్ణాటకకు తరలిస్తున్నారు. ఇందులో జేసీబీ డ్రైవర్లు మన్నె ప్రవీణ్, రాథోడ్, ట్రాక్టర్ డ్రైవర్లు రాథోడ్ మోహన్, పెద్దేముల్ రవి, తల్వార్ శరణ్, చించోళి సుభాష్, మూర్తిలపై పెద్దేముల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. రెండు జేసీబీ, ఐదు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. మాజీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ భూముల్లో ఎర్రమట్టిరాయి అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్నారు. చుట్టు పక్కల తండాకు చెందిన ఓ గ్రామస్థాయి మాజీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. ట్రాక్టర్ల సహాయంతో కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎర్రరాయి తవ్వకాల అక్రమార్కులపై టాస్క్ఫోర్స్ దాడులు నిర్వహించడంతో తట్టెపల్లి, పాషాపూర్తండాలో కలకలం రేగింది. పెద్దేముల్లో టాస్క్ఫోర్స్ దాడులు ఎర్రరాయి తరలిస్తున్న వాహనాల పట్టివేత ఏడుగురిపై కేసు నమోదు -
చదువుకోమన్నందుకు.. తనువు చాలించాడు
చేవెళ్ల: మంచిగా చదువుకోవాలని మందలించినందుకు డిగ్రీ విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్లో పరిధి ఆలూరులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూ రు మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన ఎరుకల మహిపాల్ కుటు ంబ సభ్యులతో కలిసి ఆలూరులో నివసిస్తున్నాడు. టైలర్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చిన్న కుమారుడు విజయ్కుమార్(20)ను డిగ్రీ విద్యనభ్యసించేందుకు వికారాబాద్ లోని ఎస్ఏపీ కళాశాలలో చేర్పించారు. చదువుపై ఇష్టంలేని యువకుడు.. కళాశాలకు వెళ్లక పోవటంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన విజయ్.. ఇంట్లో ఎవ రూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడి, తనువు చాలించాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి చేవెళ్ల ప్ర భుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వ హించి బంధువులకు అప్పగించారు. రోడ్డు ప్రమాదంలో ఫీల్డ్ అసిస్టెంట్ మృతి షాబాద్: రోడ్డు ప్రమాదంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మృతి చెందాడు. షాబాద్ సీఐ కాతాంరెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మాచన్పల్లికి చెందిన ఎఫ్ఏ కోళ్ల నర్సింహులు (45) షాబాద్లోని ఉపాధి హామీ కార్యాలయంలో విధులు ముగించుకొని శుక్రవారం రాత్రి స్వగ్రామానికి బైక్పై బయల్దేరాడు. తెలంగాణ మోడల్ స్కూల్ సమీపంలో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేరళ నర్సుల అరెస్టు అనైతికం సాక్షి, సిటీ బ్యూరో: మతమార్పిడి, మ నుషుల అక్రమ రవాణా పేరుతో కేరళకు చెందిన ఇద్దరు నర్సులను అరెస్టు చేయడం దారుణమని అఖిల భారత బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త పూర్ణచందర్రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ దళిత, ఆదివాసీ, మైనార్టీ, అణగారిన వర్గాలకు తోడుగా నిలుస్తున్న వారిని లక్ష్యంగా చేసుకోవడం దారుణమన్నారు. బహుజన సమాజ్ శాంతి, సేవ, సమానత్వం కోసం పోరాడిందని తెలిపారు. మతం పేరుతో చీలికలు తేవడం కాదని, న్యాయం కోసం నిలబడాలని ఆయన కోరారు. -
నూనె గింజల సాగుతో రాబడి
షాబాద్: నూనె గింజల సాగుతో అధిక దిగుబడి సాధించడంతో పాటు.. లాభాలు అదే విధంగా పొందవచ్చని నూనె గింజల పరిశోధన సంస్థ డైరెక్టర్ ఆర్.కె.మాథుర్, కావేరి అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రవీణ్రావు అన్నారు. శుక్రవారం భారతీయ నూనే గింజల పరిశోధన సంస్థ రాజేంద్రనగర్లో 49వ ఫౌండేషన్ దినోత్సవం సందర్భంగా సాగుపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గింజల సాగుతో అధిక దిగుబడి సాధించిన తిర్మలాపూర్, మల్లారెడ్డిగూడ రైతులు సుగుణమ్మ, నర్సమ్మ, మాణిక్యంలను సన్మానించారు. అనంతరం సంస్థ నుంచి అధిక దిగుబడి ఇచ్చే కుసుమ రకాలు, ఆదాయ మార్గాల గురించి వివరించారు. కార్యక్రమంలో సేవాస్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ రత్నాకర్, తిర్మలాపూర్, మల్లారెడ్డిగూడ, మిట్టకంకల్ రైతులు శ్రీనివాస్, మాణిక్యం, సుగుణమ్మ, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు. -
గోల్కొండ రోప్వే పై సాంకేతిక అధ్యయనం
సాక్షి, సిటీబ్యూరో: గోల్కొండ టూంబ్స్ నుంచి కోట వరకు ప్రతిపాదించిన రోప్వేపై గురువారం హెచ్ఎండీఏలో ప్రీబిడ్డింగ్ సమావేశం జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురయ్యే సాంకేతిక సవాళ్లపై హెచ్ఎండీఏ దృష్టి సారించింది. సుమారు 1.5 కి.మీ మార్గంలో నిర్మించనున్న రోప్వే కోసం ఇప్పటికే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్ఎఫ్పీ) టెండర్లను ఆహ్వానించారు. ఆసక్తిగల కన్సల్టెన్సీ సంస్థలు ఈ నెల 6 వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే గురువారం ప్రీబిడ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆర్ఎఫ్పీ బిడ్డింగ్ కోసం కోసం దరఖాస్తు చేసుకున్న పలు సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిడ్డింగ్ గడువును పెంచాలని పలువురు ప్రతినిధులు హెచ్ఎండీఏ అధికారులను కోరారు. సాంకేతికంగా ఈ ప్రాజెక్టుపై మరింత అవగాహన అవసరమని, అందుకోసం బిడ్డింగ్ గడువును పెంచాలని అధికారుల దృష్టికి తెచ్చినట్లు సమాచారం. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు.. నిత్యం వేలాది మంది జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు సందర్శించే చారిత్రక గోల్కొండ కోటను, టూంబ్స్ను కలిపేలా నిర్మించనున్న రోప్వే ప్రాజెక్టును హెచ్ఎండీఏ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. రూ.100 కోట్ల అంచనాలతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో నిర్మించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోప్వేలు, స్కైవేలపై విస్తృత అధ్యయనం చేస్తున్న హెచ్ఎండీఏ అనుబంధ సంస్థ హుమ్టా గోల్కొండ కోట నుంచి 1.5 కి.మీ దూరంలోని కుతుబ్షాహీల సమాధుల వరకు రోప్వే కోసం ఇప్పటికే ప్రణాళికలను రూపొందించింది. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం సైతం పచ్చజెండా ఊపింది. దీంతో ఆర్ఎఫ్పీ బిడ్డింగ్కు అధికారులు చర్యలు చేపట్టారు. రోప్వేకు అనుకూలమైన మార్గాన్ని నిర్ధారించడంతో పాటు, రక్షణశాఖ నుంచి ఏ రకమైన సహాయ సహకారాలు అవసరమనే అంశంపైనా ఎంపికై న కన్సల్టెన్సీ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. వివిధ దేశాల్లో రోప్వేలు, కేబుల్ కార్ల నిర్వహణపైనా అధ్యయనం చేసి హెచ్ఎండీఏకు నివేదికను అందజేయాల్సి ఉంటుంది. కేబుల్ కారులో సందర్శన.. గోల్కొండ కోట నుంచి పర్యాటకులు రోడ్డు మార్గంలో టూంబ్స్ వరకు వెళ్లడం ఇబ్బందిగా మారింది. ఇరుకై న రోడ్డు, వాహనాల రద్దీ దృష్ట్యా చాలామంది గోల్కొండ కోట నుంచి టూంబ్స్ వరకు వెళ్లకుండానే వెనుదిరుగుతున్నట్లు అంచనా. ఈ క్రమంలో పర్యాటకుల రాకపోకలను సులభతరం చేయడంతో పాటు రోప్వే ద్వారా కేబుల్ కార్లలో ప్రయాణం చేయడం ఒక ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 10 వేల మందికిపైగా ఈ రెండు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. వీరిలో 3000 మంది వరకు విదేశీ టూరిస్టులు ఉంటారని అంచనా. రోప్వేను ఏర్పాటు చేయడం వల్ల పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో నిర్మించడం వల్ల ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా పర్యాటకులకు మెరుగైన సదుపాయం కల్పించినట్లవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆర్ఎఫ్పీ కోసం ఈ నెల 6 వరకు బిడ్డింగ్ ప్రీ బిడ్డింగ్ సమావేశంలో పాల్గొన్న పలు సంస్థలు రూ.100 కోట్లతో హెచ్ఎండీఏ ప్రతిపాదనలు -
పెండింగ్ దరఖాస్తులు పరిశీలించండి
● ఇందిరమ్మ ఇళ్ల పరిష్కారానికి ప్రత్యేక బృందాలను నియమించాలి ● వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి ● వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ నారాయణరెడ్డి సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం మండల స్థాయి లో ప్రత్యేక బృందాలను నియమించాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు గురు వారం క్యాంప్ కార్యాలయం నుంచి ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, పారిశుద్ధ్యం, వనమహోత్సవం వంటి కార్యక్రమాలపై జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఖాళీ స్థలం ఉండి, ఇళ్లు లేని అర్హులైన నిరుపేదలకు మంజూరు ఇవ్వాలని, గతంలో రుణాలు తీసుకుని, ప్రస్తుతం అర్హులుగా ఉన్న వారికి అవగాహన కల్పించాలని, పీఎం ఆవాస్ యోజన కింద అర్హులైన వారందరి పేర్లను వెంటనే నమోదు చేయాలని సూచించారు. ఎరువుల కొరత రానివ్వొద్దు వర్షాకాలం నేపథ్యంలో ఆయా మండల కేంద్రాల్లోని గోదాముల్లో అవసరమైన యూరియా ఎరువులు వంద శాతం అందుబాటులో నిల్వ ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఎక్కడా కొరత లేకుండా, రైతులు రోడ్లపైకి వచ్చే పరిస్థితి రావొద్దని వ్యవసాయ శాఖ అధికారికి సూచించారు. జిల్లాలోని పాఠశాలలు, హాస్టళ్లు, సంక్షేమ వసతి గృహాల్లో ఎలాంటి సమస్య వచ్చినా సహించేది లేదని హెచ్చరించారు. నాణ్యమైన ఆహారం, తాగునీటి సమస్య రాకుండా ఎప్పటికప్పుడు చూడాలని, తాగునీటి సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని, అందుకు సంబంధించి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమ హాస్టళ్లలో కూరగాయలు నిల్వ చేయకుండా రెండ్రోజులకు ఒకసారి తెచ్చుకోవాలని, వంట గదిని పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతను ఆయా ఎంఈఓలు పర్యవేక్షించాలన్నారు. లక్ష్యం మేర మొక్కలు నాటాలి వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని, జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలని, ప్రత్యేకించి ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యం మేరకు నాటాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, పల్లె ప్రకృతి వనాల్లో వంద శాతం నాటాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున సరైన సమయంలో మొక్కలు నాటేలా చూడాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు. -
పన్నెండేళ్లకు పచ్చజెండా!
సాక్షి, సిటీబ్యూరో: పుష్కరకాలం నాటి ప్రతిపాదనలు తిరిగి పట్టాలకెక్కనున్నాయి. హైదరాబాద్– సికింద్రాబాద్లను కలిపే బేగంపేట్ రోడ్– రాణిగంజ్ క్రాస్రోడ్స్ మార్గానికి ప్రత్యామ్నాయంగా ఎస్పీ రోడ్ –నెక్లెస్ రోడ్ను కలుపుతూ పాటిగడ్డ మీదుగా ఆర్ఓబీ (ఫ్లై ఓవర్) ప్రాధాన్యతతో నిర్మించేందుకు జీహెచ్ఎంసీ, దక్షిణమధ్య రైల్వే అంగీకారానికి వచ్చాయి. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 80 కోట్లు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. సమన్వయం, సహకారం లోపంతో.. ● ఇక్కడి ఆర్ఓబీ ప్రతిపాదన ఈనాటిది కాదు. నగరంలో మెట్రో రైలు పనులు ప్రారంభం కావడాని కంటే ఎంతోకాలం ముందే ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ, ఆయా ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం, సహకార లోపంతో కాగితాలు దాటి పనులు మొదలు కాలేదు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే బేగంపేట వైపు నుంచి ఖైరతాబాద్, సెక్రటేరియట్ల వైపు వచ్చే వారికి ఎంతో సమయం ఆదా అవుతుంది. సెక్రటేరియట్– ట్యాంక్బండ్– ప్యారడైజ్కు ప్రత్యామ్నాయ మార్గంగా ఉంటుంది. అప్పటి అంచనా వ్యయం రూ.25 కోట్లు ప్రస్తుతం రూ. 80 కోట్లయింది. ● ఈ ఫ్లైఓవర్ పనులు పూర్తయితే అటు ఎస్పీ రోడ్, ఇటు ఎంజీ రోడ్లోనూ ట్రాఫిక్కు ఎంతో ఉపశమనం కలుగుతుంది. అప్పట్లోనే రైల్వే శాఖ నుంచి అనుమతులున్నా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. దాదాపు 7.5 మీటర్లుండే ఫ్లై ఓవర్పై రెండు వైపులా క్యారేజ్వేలతోపాటు ఫుట్పాత్లు, సెంట్రల్ మీడియన్లు గత ప్రతిపాదనల్లో ఉన్నాయి. అవసరమైతే మార్పుచేర్పులు చేయనున్నారు. ఫ్లైఓవర్ ఫ్లాష్బ్యాక్ ఇలా.. 2009లో ఉమ్టా సమావేశంలో ఈ ప్రాజెక్టు కయ్యే వ్యయాన్ని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ చెరిసగం భరించాలని, పనులు హెచ్ఎండీఏ చేయాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ ఇవ్వాల్సిన నిధులు జీహెచ్ఎంసీ ఇవ్వలేదు. హెచ్ఎండీఏ సైతం నిధులివ్వలేమని, ప్రాజెక్టు పని చేయలేమని, పనుల్ని జీహెచ్ఎంసీకి బదలాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. అనంతరం మెగాసిటీ ప్రాజెక్ట్ కింద చేపట్టాలనుకున్నారు. ఏదీ కాలేదు. బేగంపేట, ఎంజీరోడ్ మార్గాల్లో ట్రాఫిక్ ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలని జీహెచ్ఎంసీ, రైల్వే అధికారుల సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఫ్లై ఓవర్ పనులు పూర్తయితే అటు బేగంపేట, ఇటుఎంజీ రోడ్లలో రద్దీ తగ్గనున్నందున మెహిదీపట్నం– సికింద్రాబాద్ రాకపోకల సమయం సైతం తగ్గనుందని అధికారులు పేర్కొన్నారు. బేగంపేట్లో తప్పనున్న ట్రాఫిక్ చిక్కులు త్వరలో పాటిగడ్డ– నెక్లెస్ రోడ్డు ఆర్ఓబీ పనులు పుష్కర కాలం నాటి ప్రతిపాదనలకు మోక్షం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80 కోట్లు -
డీ అడిక్షన్ సెంటర్ సిబ్బందికి శిక్షణ
చంచల్గూడ: మత్తు మందులు లేని సమాజాన్ని నిర్మించే దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖకు నషాముక్త భారత్ అభియాన్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ శాఖ నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. జైళ్ల శాఖ నిర్వహిస్తున్న డీ అడిక్షన్ సెంటర్లలో విధులు నిర్వహించేందుకు గత నెలలో కాంట్రాక్ట్ పద్దతిన 28 మందిని ఎంపిక చేశారు. ఎంపికై న వారికి గురువారం చంచల్గూడలోని సీకా సంస్థలో శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం జైళ్ల శాఖ డీజీ డా. సౌమ్య మిశ్రా మాట్లాడుతూ డీ అడిక్షన్ కేంద్రాల ద్వారా మత్తు పదార్థాలకు బానిసలైన ఖైదీలకు వైద్య చికిత్స, కౌన్సెలింగ్, పునరావాసం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. డీ అడిక్షన్ కేంద్రాల్లో ఉండే వారితో ఎలా మెలగాలో, వారిలో పరివర్తన ఏ విధంగా తీసుకురావాలి అనే అంశంపై సిబ్బంది అంటీ డ్రగ్స్, నార్కోటిక్, మానసిక వైద్య కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకుంటారన్నారు. కార్యక్రమంలో ఐజీ మురళీబాబు, సీకా ప్రిన్సిపల్ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫార్మాసిటీలో మరోసారి సర్వే
యాచారం: ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో అధికారులు మరోసారి సర్వేకు సిద్ధం కావడం ఉద్రిక్తతకు దారితీసింది. రెండు నెలల క్రితం ఫార్మాసిటీ బౌండరీని సర్వే చేసి, ఫెన్సింగ్ పనులు పూర్తి చేశారు. తాజాగా గురువారం బౌండరీ లోపల హద్దులను గుర్తించే ప్రక్రియను ప్రారంభించారు. మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లిలో సర్వే నంబర్ల వారీగా గుర్తించే పనులను మొదలుపెట్టారు. గ్రామంలోని పలు అసైన్డ్, పట్టా భూముల సర్వేనంబర్ల వారీగా ఎంత మంది రైతులకు, ఎన్ని ఎకరాలకు పరిహారం అందజేశామనే వివరాలతో కూడిన రికార్డుల ప్రకారం హద్దులు గుర్తిస్తున్నారు. విషయం తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. తమ భూముల వద్దకు రావద్దని అడ్డుకున్నారు. అభ్యంతరం చెప్పడం సరికాదు నిర్వాసితులకు పరిహారంతో పాటు తాజాగా మీరాఖాన్పేటలోని టీజీఐఐసీ వెంచర్లో లాటరీ తీసి ప్లాట్ల కబ్జాలు ఇచ్చామని ఆర్డీఓ అనంత్రెడ్డి తెలిపారు. అయినా రైతులు అభ్యంతరం తెలపడం సరికాదని అన్నారు. పరిహారం అందజేసిన, రికార్డులు మారిన భూములన్నీ సర్కార్వేనని, ఆ భూముల్లోకి ఎవరూ రావొద్దని సూచించారు. కోర్టు కేసులున్న భూముల్లోకి వెళ్లమని హామీ ఇచ్చారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్వే చేస్తున్న భూముల వద్దకు రైతులెవరినీ వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. సర్వేనంబర్ల వారీగా భూమి గుర్తింపు అడ్డుకున్న నక్కర్తమేడిపల్లి రైతులు ఉద్రిక్త వాతావరణం భారీ పోలీసు బందోబస్తు బందోబస్తు మధ్య ఫార్మా ఫెన్సింగ్ కందుకూరు: ఫార్మాసిటీ కోసం మండలంలోని ముచ్చర్ల రెవెన్యూ సర్వే నంబర్ 123కు సంబంధించి గురువారం అధికారులు పోలీసు బందోబస్తు మధ్య ఫెన్సింగ్ పనులు చేపట్టారు. దీంతో సర్వే నంబర్ను ఆనుకుని ఉన్న దెబ్బడగూడ రెవెన్యూ సర్వే నంబర్ 31లోని గిరిజన రైతులు పనులను అడ్డుకున్నారు. తమ భూమిలోకి జరిపి ఫెన్సింగ్ ఎలా వేస్తారంటూ నిలదీశారు. సర్వే చేసిన తర్వాతే ఫెన్సింగ్ వేసుకోవాలని పట్టుబట్టారు. ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, తహసీల్దార్ గోపాల్, అదనపు డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ జానకీరెడ్డి, సీఐ సీతారాం రైతులతో మాట్లాడారు. పది రోజుల్లో దెబ్బడగూడ సర్వే నంబర్ 31ని సర్వే చేయిస్తామని, అప్పటి వరకు ఫెన్సింగ్ పనులు ఆపొద్దని అన్నారు. భూమి మీకు వస్తే తిరిగి ఇచ్చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. -
జనహితయాత్రకు ఘన స్వాగతం
చేవెళ్ల/మొయినాబాద్: వికారాబాద్ జిల్లా పరిగి నుంచి ప్రారంభించే జనహిత పాదయాత్రకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకు పార్టీ శ్రేణులు మొయినాబాద్లో ఘన స్వాగతం పలికాయి. హిమాయత్నగర్ చౌరస్తాకు చేరుకోగానే పెద్ద ఎత్తున టపాసులు పేల్చారు. అక్కడే ఉన్న అంబేడ్కర్, బాబు జగ్జీవన్రామ్, మాజీ ప్రధాని రాజీవ్గాంధీ విగ్రహాలకు మీనాక్షి నటరాజన్, మహేశ్కుమార్గౌడ్, శ్రీధర్బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు వారికి భారీ గజమాలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి, టీపీసీసీ సభ్యు డు షాబాద్ దర్శన్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీకాంత్, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీ మాజీ సభ్యులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. చిలుకూరులో పూజలు చిలుకూరు బాలాజీ దేవాలయంలో మీనాక్షి నటరాజన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, మంత్రి శ్రీధర్బాబు, మాజీ ఎంపీలు హన్మంతరావు, రాజయ్య తదితరులతో కలిసి ఆమె ఆలయానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించు కున్న అనంతరం ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణస్వామి, అర్చకుడు సురేష్స్వామి ఆమెకు స్వామివారి పూలమాలలు అందజేసి ఆశీర్వదించారు. చేవెళ్లలో పామెన బీంభరత్ ఆధ్వర్యంలో.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కు చేవెళ్లలో పామెన భీంభరత్ ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా షాబాద్ చౌరస్తాలోని ఇందిరాగాంధీ, వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణరెడ్డి, జిల్లా నాయకుడు గౌరీ సతీష్, మహిళా నాయకురాలు జ్యోతిభీంభరత్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జూకన్నగారి శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వర్గపోరు మరోసారి బట్టబయలు పార్టీలో వర్గపోరు కొనసాగుతుందని మరోసారి బట్టబయలైంది. ఎమ్మెల్యే కాలె యాదయ్య, నియోజకవర్గం ఇన్చార్జి పామెన భీంభరత్ మద్య సయోధ్య లేకపోవటంతో ఇరు వర్గీయులు వేర్వేరుగా స్వాగత కార్యక్రమాలు నిర్వహించారు. మొయినాబాద్లో ఆహ్వానం పలికిన పార్టీ శ్రేణులు చిలుకూరు బాలాజీ దేవాలయంలో పూజలు చేసి పాదయాత్రకు బయలుదేరిన నేతలు -
చిరుత చిక్కింది
మణికొండ: కొద్దిరోజులుగా భయభ్రాంతులకు గురిచేసిన చిరుత పులి ఎట్టకేలకు మంచిరేవుల ట్రెక్పార్కులోనే బోన్లో చిక్కింది. జూలై 7వ తేదీన మొయినాబాద్ మండల పరిధిలోని అజీజ్నగర్ వనమూళిక వనం నుంచి మొదలైన దాని ప్రస్థానం పోలీస్ గ్రేహౌండ్స్, ట్రెక్ పార్కు, రాందేవ్గూడ మిలిటరీ ఏరియా, తిరిగి ట్రెక్ పార్కుకు వచ్చిన విషయం తెలిసిందే. బుధవారం అర్ధరాత్రి దాటాక ఆకలితో మేకను తినేందుకు బోనులోకి దూరి బందీ అయ్యింది. ప్రతి రోజూ మాదిరిగానే ఉదయం సిబ్బంది బోనులను తనిఖీ చేస్తున్న క్రమంలో ఒకదాంట్లో చిరుత గాండ్రింపులు విని భయాందోళన చెందారు. అంతలోనే తేరుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించి బోను చుట్టూరా పరదాలను కట్టి నగరంలోని జూపార్కుకు తరలించారు. అక్కడ దాని గాయా లకు చికిత్సతో పాటు పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేసిన తర్వాత నల్లమల అటవీ ప్రాంతంలో వదిలి పెట్టినట్టు జిల్లా అటవీశాఖ అధికారి సుధాకర్రెడ్డి, చిలుకూరు రేంజ్ అధికారి లక్ష్మణ్ తెలిపారు. చిరుత మూతికి గాయం బోనులో చిక్కుకున్న చిరుత అందులోనుంచి బయటికి వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో దాని మూతి బోను ఇనుప చువ్వలకు తాకడంతో గాయమైంది. బోనులో చిక్కుకున్న భయంలో అది అందులో ఏర్పాటు చేసిన మేకను సైతం తినకుండా ఉండిపోయింది. చిరుత వయసు సుమారు 5 ఏళ్లు ఉంటాయని, యుక్త వయసులో ఉండటంతో పెద్దగా గాండ్రించటం, బెదిరించటం చేసిందని అటవీ అధికారులు తెలిపారు. చిరుతపులి ఎట్టకేలకు అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కిందనే విషయాన్ని తెలుసుకున్న మంచిరేవుల, గంధంగూడ, బైరాగిగూడ, నార్సింగి, కోకాపేట, రాందేవ్గూడ, ఇబ్రహీంబాగ్ తదితర గ్రామాల ప్రజలు దాన్ని చూసేందుకు ట్రెక్ పార్కు వద్దకు పెద్ద సంఖ్యలో వచ్చారు. శుక్రవారం నుంచి యథావిధిగా ట్రెక్ పార్కును తెరుస్తామని, వాకింగ్ చేసేవారు రావచ్చని అధికారులు తెలిపారు. ట్రెక్ పార్కులోనే బోన్లోకి వచ్చి.. ఉదయం గమనించిన సిబ్బంది తొలుత జూపార్క్కు తరలింపు అక్కడి నుంచి నల్లమల అడవుల్లోకి.. నేటి నుంచి తెరుచుకోనున్న ట్రెక్ పార్కు -
పారిశుద్ధ్య కార్యక్రమం విజయవంతం చేయాలి
గచ్చిబౌలి: వర్షాకాల పారిశుద్ధ్య ప్రత్యేక కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. గురువారం శేరిలింగంపల్లి జోన్ పరిధిలో ఉదయం వర్షాకాలం పారిశుద్ధ్య ప్రత్యేక కార్యక్రమాన్ని జోనల్ కమిషనర్ బోర్కడే హేమంత్ సహదేవ్రావుతో కలిసి తనిఖీ చేశారు. మొదట మాదాపూర్లోని కావూరి హిల్స్లో తనిఖీలు చేశారు. తర్వాత పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. కాలనీల్లో పరిశుభ్రతా చర్యలు ప్రభావవంతంగా చేపట్టాలన్నారు. డిప్యూటీ కమిషనర్, స్థానిక అధికారులతో కలిసి పారిశుద్ధ్య పనులను సమీక్షించాలన్నారు. క్షేత్ర స్థాయిలో అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ పారిశుద్ధ్య పనులను వేగంగా చేపట్టాలన్నారు. -
పారిపోయిన విద్యార్థిని తల్లిదండ్రులకు అప్పగింత
కుల్కచర్ల: చదవడం ఇష్టం లేక పాఠశాల నుంచి పారిపోయిన విద్యార్థిని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కుల్కచర్ల గ్రామానికి చెందిన గుడిసె అఖిల్ ముజాహిద్పూర్ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతూ స్థానికంగా బీసీ వసతిగృహంలో ఉంటున్నాడు. బుధవారం అతడు పాఠశాల సమయంలో బయటకు వచ్చి కుల్కచర్లకు వచ్చి బస్సులో షాద్నగర్ వెళ్లాడు. అక్కడ పోలీసులు బాలుడిని గమనించి వివరాలు అడిగారు. పొంతనలేని సమాధానం చెప్పడంతో అతడి చిరునామా తెలుసుకుని స్థానికుల ద్వారా కుల్కచర్ల పోలీస్స్టేషన్కు పంపించారు. గురువారం ఉదయం ఎంఈఓ హబీబ్ అహ్మద్ సమక్షంలో అఖిల్ను కుటుంబీకులకు అప్పజెప్పారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సతీష్, వసతిగృహ ప్రత్యేకాధికారి విజయ్కుమార్, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
జాతీయ స్థాయిలో బతుకమ్మ కుంట ఓ నమూనా
హైడ్రా కృషిని అభినందించిన కేంద్ర బృందం సాక్షి,సిటీబ్యూరో: కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్యూఏ) అధికారుల బృందం గురువారం అంబర్పేటలోని బతుకమ్మ కుంటను సందర్శించింది. ఒకప్పుడు చెత్త, నిర్మాణ వ్యర్థాలతో నిండిన ఈ ప్రాంతం చెరువులా రూపాంతరం చెందిన పాత చిత్రాలను చూసి అధికారులు ఆశ్చర్యచకితులయ్యారు. చెరువుల పరిరక్షణకు జాతీయ స్థాయిలో బతుకమ్మ కుంట ఒక నమూనా అవుతుందని బృందానికి నాయకత్వం వహించిన కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అడిషనల్ చీఫ్ టౌన్ ప్లానర్ మోనీస్ ఖాన్ పేర్కొన్నారు. కబ్జాల చెర నుంచి విముక్తి కల్పించి, మండు వేసవిలో రెండు మీటర్ల లోతు నీరు ఉబికి వచ్చే వీడియోలను చూసిన ఆయన ఆశ్చర్యపోయారు. హైడ్రా కృషిని అభినందించారు. చెరువు చుట్టూ ఇంకా అభివృద్ధి చేయాల్సిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. చెరువుకు ఆనుకుని సాగే మురుగు కాల్వలోంచి వరద నీరు మాత్రమే వచ్చేలా ఇన్లెట్ను నిర్మించడంపై హర్షం వెలిబుచ్చారు. ఇటీవల కురిసిన వర్షాల సమయంలో వరద నీరు ఎలా వచ్చి చేరిందో వీడియాల ద్వారా హైడ్రా అధికారులు కేంద్ర బృందానికి చూపించారు. చెరువు ఔట్లెట్ను సైతం పరిశీలించారు. కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ అసోసియేట్ టౌన్ ప్లానర్ సందీప్ రావుతో పాటు.. హైడ్రా అధికారులు మోహనరావు, బాలగోపాల్, విమోస్ టెక్నో క్రాట్ ఎండీ పి.యూనస్, జీహెచ్ఎంసీ అడిషనల్ చీఫ్ సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, సిటీ ప్లానర్ ఉమాదేవి తదితరులు కేంద్ర బృందంతో ఉన్నారు. -
పాలమూరు పూర్తి చేస్తాం
పరిగి: ప్రజల ఆకాంక్ష మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ పనిచేస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ చేపట్టిన జనహిత పాదయత్ర గురువారం పరిగి మండలం రంగాపూర్ నుంచి పరిగి పట్టణం వరకు సాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేసిందన్నారు. రైతు భరోసా పథకం కింద 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు అన్నదాతల ఖాతాల్లో జమ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ బిల్లును కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపించారు. దీనిపై కేంద్రంతో కొట్లాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. కేంద్రం మెడలు వంచి బీసీ రిజర్వేషన్లు సాధిస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి పరిగి ప్రాంతం రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమంలో మనమే ఆదర్శం సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని పరిగి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని పేర్కొన్నారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకునేందుకే జనహిత పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు. ప్రతి పేదవాడికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. సీఎం రేవంత్రెడ్డి విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు. పట్టణంలో జనహిత పాదయాత్ర అట్టహాసంగా సాగింది. కిలోమీటర్ల మేర ప్రజలు బారులు తీరారు. పాదయాత్రలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు మనోహర్రెడ్డి, కాలె యాదయ్య, మల్రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, పార్టీ జిల్లా, మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి, మండల నాయ కులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకే ప్రభుత్వం పనిచేస్తుంది పాదయాత్రతో ప్రజా సమస్యలు తెలుసుకుంటాం గత ప్రభుత్వమే ‘ప్రాణహిత– చేవెళ్ల’ను రద్దు చేసింది జనహిత పాదయాత్రలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు -
‘జనహిత’లో నేతల సందడి
మహేశ్వరం: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనహిత పాదయాత్రలో భాగంగా పరిగిలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ను మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్, పీసీసీ సభ్యుడు దేప భాస్కర్రెడ్డి గురువారం కలిసి స్వాగతం పలికారు. మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పీసీసీ చీఫ్ నేతలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి ప్రతి కార్యకర్త తీసుకెళ్లాలని మహేశ్కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేశారు. తరలిన కాంగ్రెస్ నాయకులు కందుకూరు: టీపీసీసీ ఆధ్వర్యంలో ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో చేపట్టిన పాదయాత్రలో గురువారం సాయంత్రం మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి కేఎల్ఆర్ ఆధ్వర్యంలో నాయకులు తరలి వెళ్లారు. కందుకూరు నుంచి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు ఏనుగు జంగారెడ్డి, బొక్క జంగారెడ్డి, సీనియర్ నాయకులు సత్యనారాయణ, గణేష్నాయక్, మదన్పాల్రెడ్డి, బాబురావు, కృష్ణ, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
కూతురి పెళ్లికి దాచితే.. దోచేశారు!
నందిగామ: కూతురి పెళ్లి కోసం దాచిన నగదు, బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని మండలంలోని మామిడిపల్లికి చెందిన వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై పోలీసులను ఆశ్రయించినా స్పందన కరువైందని లబోదిబోమన్నాడు. బాధితుడి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి కృష్ణయ్య కొందుర్గు మండలంలోని మహదేవ్పూర్లో ఉన్న భూమిని గతంలో విక్రయించాడు. వచ్చిన డబ్బులతో కొంత అవసరాల కోసం వాడుకున్నాడు. కూతురుకు పెళ్లి చేయాలనే ఉద్దేశంతో 16 తులాల బంగారాన్ని కొనుగోలు చేసి, రూ.15 లక్షల నగదును ఇంట్లో భద్రపరిచాడు. ఇటీవల రుణం చెల్లించాలని బ్యాంకు నుంచి ఫోన్ రావడంతో ఇంట్లో చూడగా నగదు, బంగారం కనబడకపోవడంతో లబోదిబోమన్నాడు. డబ్బులు, పసిడి దోచుకుపోయిన విషయమై కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో చర్చించాడు. ఎక్కడ నుంచి కనీస సమాచారం లేక పోవడంతో బుధవారం పోలీసులను ఆశ్రయించారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు విచారణ చేశారు. గురువారం తిరిగి బాధితులు పోలీస్ స్టేషన్కు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో సజ్జపై దాచిన డబ్బులను తెలిసిన వారే దోచుకుపోవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసు నమోదు చేయని పోలీసులు మామిడిపల్లిలో ఇంత పెద్ద చోరీ జరిగినా కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. ఇన్స్పెక్టర్ ప్రసాద్ను వివరణ కోరగా.. బాధితులను విచారించామని, ఏసీపీ శుక్రవారం వస్తారని, మరోసారి విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని చెప్పారు. మామిడిపల్లిలో భారీ చోరీ రూ.15 లక్షల నగదు, 16 తులాల బంగారం అపహరణ -
స్థానిక పోరులో సత్తా చాటుతాం
మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్, తుమ్మలూరు మాజీ సర్పంచ్ మద్ది కరుణాకర్రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఆయన గృహానికి చేరుకొని కేక్ను కట్ చేయించారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కేఎల్ఆర్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిలతో పాటు పలువురు నేతలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుమ్మలూరు గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తామన్నారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేసి కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మద్ది సురేఖారెడ్డి, నాయకులు రాఘవేందర్రెడ్డి, జైపాల్రెడ్డి, యాదగిరిగౌడ్, చంద్రశేఖర్రెడ్డి, శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
13 ఏళ్ల బాలికకు వివాహం
● నలుగురిపై కేసు నమోదు ● చిన్నారిని సఖి సెంటర్కు తరలింపు నందిగామ: అభం శుభం తెలియని 13 ఏళ్ల బాలికకు వివాహం చేసిన ఘటనలో పెళ్లి కొడుకు, బాలిక తల్లితో పాటు మరో ఇద్దరు వ్యక్తులపై నందిగామ పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ ప్రసాద్ కథనం ప్రకారం.. నందిగామకు చెందిన 13 ఏళ్ల బాలిక స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఆమెకు చేవెళ్ల మండలం కందవాడకు చెందిన శ్రీనివాస్గౌడ్(40)తో గత మే నెల 28న నందిగామ శివారులోని ఓ ఆలయంలో పెళ్లి చేశారు. అప్పటి నుంచి బాలిక నందిగామలో తల్లి వద్దే ఉంటోంది. పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేని బాలిక ఇటీవల పాఠశాలకు వెళ్లి జరిగిన విషయాన్ని ఉపాధ్యాయులకు తెలిపింది. దీనిపై స్పందించిన హెచ్ఎం సుధాకర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన తహసీల్దార్ రాజేశ్వర్, ఇన్స్పెక్టర్ ప్రసాద్ బాలిక కుటుంబ సభ్యులను పీఎస్కు పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలికకు పెళ్లి చేయడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. పెళ్లి కొడుకు శ్రీనివాస్గౌడ్, బాలిక తల్లి స్రవంతి, మధ్యవర్తి పెంటయ్య, పురోహితుడు ఆంజనేయులుపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు. అనంతరం ఐసీడీఎస్ అధికారుల సహకారంతో బాలికను సఖి కేంద్రానికి తరలించినట్లు పోలీసులు వివరించారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోండి మంచాల: తమ భూమిలోకి అక్రమంగా చొరబడి కడీలు విరగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని మండలంలోని తాళ్లపల్లిగూడ రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పోలమోని ఆశయ్య, పోలమోని భిక్షపతి, పొలమోని ప్రభు, కోయిగూర సుధాకర్, కోయిగూర భాస్కర్, కోయిగూర కరుణాకర్లకు సంబంధించి సర్వే నంబర్ 79లో 0–25 గుంటల భూమి ఉంది. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమిని చిత్తాపూర్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆక్రమిస్తున్నారని సదరు రైతులు ఆరోపించారు. మంగళవారం రాత్రి పొలంలో నాటిన కడీలను విరగొట్టారని, అక్కడే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై సీఐ మధును వివరణ కోరగా.. పూర్తి స్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
కటకటాలకు పాత నేరస్తుడు
మూడు నెలల క్రితం చోరీకి పాల్పడిన దొంగను పట్టుకున్న పోలీసులు మొయినాబాద్: పలు ప్రాంతాల్లో వరుసగా చోరీలు చేస్తూ మూడు నెలల కిత్రం మండలంలోని పెద్దమంగళారంలో తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగను మొయినాబాద్ పోలీసులు పట్టుకున్నారు. దోచుకున్న సొత్తును స్వాధీనం చేసుకుని కటకటాల్లోకి పంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సురంగల్ గ్రామానికి చెందిన తిమ్మగళ్ల మురళి అలియాస్ ముత్యాలు అత్తాపూర్లో ఓ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు. మే నెల 5న రాత్రి 10 గంటల సమయంలో బస్సులో మొయినాబాద్కు వచ్చాడు. క్వాటర్ బాటిల్ మద్యం కొనుక్కుని ఒక్కడే కూర్చొని తాగాడు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో పెద్దమంగళారం గ్రామానికి వెళ్లి తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్ చేశాడు. తనతో తెచ్చుకున్న ఇనుపరాడ్డుతో తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డాడు. బీరువాలోని 26 తులాల బంగారం, రూ.2.50 లక్షల నగదు దోచుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు సుమారు మూడు నెలలకు బుధవారం దొంగను పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా గత మార్చి నుంచి మైలార్దేవ్పల్లి, చేవెళ్ల, మొయినాబాద్ పోలీస్స్టేషన్ల పరిధిలో మరో ఆరు దొంగతనాలు చేసినట్లు అంగీకరించాడు. దొంగిలించిన సొత్తును అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 27 దొంగతనం కేసులు పెద్దమంగళారంలో దొంగతనం చేసి పట్టుపడిన మురళి పాత నేరస్తుడు. అతనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 27 దొంగతనం కేసులున్నాయి. మురళి ఖర్చుల కోసం దొంగతనాలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. దొంగతనానికి వెళ్లే ముందు ఒక్కడే మద్యం తాగి వెళ్తాడు. తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్గా చేసుకుని తన వెంట తెచ్చుకునే ఇనుపరాడ్డుతో తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతారు. దొంగిలించిన ఆభరణాలను విక్రయించి డబ్బులను ఖర్చులకు వాడుకుంటాడు. ఇలా సైబరాబాద్, వరంగల్, సంగారెడ్డి, కడప, కర్నూలు జిల్లాలో దొంగతనాలు చేసి చాలాసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. -
శాసీ్త్రయ విధానమే మేలు
షాబాద్: గొర్రెల పెంపకం లాభాదాయకంగా ఉండాలంటే పిల్లలు పుట్టిన వెంటనే శాసీ్త్రయ పద్ధతిలో యాజమాన్య పోషణ, ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాలి. సమగ్ర విధానాలతో జీవాలను కాపాడుకోవచ్చని రేగడిదోస్వాడ పశువైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి గొర్రెల కాపరులకు సూచించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు గొర్రె పిల్ల పుట్టిన వెంటనే ముక్కు, నోరు మీద ఉండే పొర తొలగించి పొడి గుడ్డతో తుడవాలి. బొడ్డుదానంతట అదే విడిపోకపోతే రెండు అంగుళాలు కత్తిరించి అయోడిన్తో శుభ్ర పరచాలి. పుట్టిన గంటసేపు ముర్రుపాలు తాగించాలి. ముర్రుపాలలో ఏ, డీ, ఈ విటమిన్లు వ్యాధి నిరోధక శక్తినిచ్చే యాంటీబాడీలు అధికంగా ఉంటాయి. పిల్లలను పొడిగా ఉంచి వెలుతురు, గాలి బాగా ప్రసరించే ప్రాంతాల్లో కట్టి వేయాలి. గొర్రె పిల్లలను చలి నుంచి కాపాడాలి. పాటించాల్సిన పద్ధతి పాలు మరిచే వరకు(దాదాపు 3 నెలలు) గొర్రె పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలను తల్లితోపాటు మందకు పంపకుండా కొట్టంలోనే ఉంచి పెంచాలి. తల్లితోపాటు పంపితే శక్తి వృథా అయి పెరుగుదల తగ్గుతుంది. ఇంటి దగ్గర పెట్టిన పిల్లలను గాలి, వెలుతురు బాగా ఉండే కొట్టంలో తడకలు కట్టి అందులో వదలాలి. వరిగడ్డి పక్కలో వేసితే వెచ్చగా ఉండి పిల్లలు మట్టి తినకుండా చూడవచ్చు. గొర్రె పిల్లల పోషణ గొర్రె పిల్లల్లో పెరుగుదల మొదటి మూడు నెలల్లో ఎక్కువ ఉంటుంది. ఇలా అధిక పెరుగుదలున్నా గొర్రె పిల్లలే ముందు ఆరోగ్యంగా ఉండి ఎక్కువ బరువు తూగి లాభాలు చేకూర్చుతాయి. పాలు మరిచే వయసు వరకు తల్లిపాలకు అదనంగా పోషనివ్వాలి. చిన్న గొర్రెలను నిదానంగా ఆకు తింటూ అవి జీర్ణించుకోవడానికి అలవాటు పడతాయి. ఆరోగ్య పరిరక్షణ తల్లి గొర్రెలను మేతకు పంపిన తర్వాత వేపాకు లేదా దాణా వేసి అన్ని పిల్లల ఆరోగ్యంగా ఉన్నదీ లేనిది చూడాలి. మూడు నెలల వయసు దాటిన తర్వాత మొదటిసారి నట్టల నివారణ మందు తాపాలి. ఇది ఊపిరితిత్తుల్లోకి పోకుండా జాగ్రత్తగా తాపాలి. దీని తర్వాత 10–15 రోజుల వ్యవధిలో చిటుకువ్యాధి టీకా మందు ఇవ్వాలి. మరో 15 రోజులకు రెండో డోసు టీకా ఇవ్వాల్సి ఉంటుంది. గొర్రెల సంరక్షణ అవసరం రేగడిదోస్వాడ పశువైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి -
కుళ్లిన కూరగాయలతో భోజనమా?
శంకర్పల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కుళ్లిన కూరగాయలతో వంట చేసి, భోజనం పెట్టడం ఏంటని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య శంకర్పల్లి కేజీబీవీ పాఠశాల సిబ్బందిని ప్రశ్నించారు. బుధవారం శంకర్పల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే మొదట మున్సిపాలిటీలో కొత్త ట్రాక్టర్, పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్కోర్టులు, గ్లౌజ్ల పంపిణీ చేశారు. పట్టణ శివారులో నిర్వహించిన వన మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. లోపలికి వెళ్లి వంట గదిని ఆయన పరిశీలించారు. అక్కడ కూరగాయలు పాడైపోవడం, సాంబారులో పప్పు లేకపోవడం, పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా సిబ్బంది నిర్లక్ష్యంతో ఆ ఫలాలు విద్యార్థులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా ఉపాధ్యాయుల హాజరు పట్టిక పరిశీలించారు. ప్రిన్సిపాల్, మరో ఉపాధ్యాయుడు ఎందుకు రాలేదని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. హాజరు పట్టికలో ఖాళీ స్థలం ఎందుకు వదిలేశారంటూ, ఆ ఖాళీ స్థలాన్ని ఆయన పూరించారు. ఈ కార్యక్రమంలో శంకర్పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాశెట్టి చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ యోగేశ్, నాయకులు ప్రవీణ్, వెంకట్రాంరెడ్డి, ప్రకాశ్ గుప్తా, పాండు రంగారెడ్డి, చంద్రమౌళి, ప్రశాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 10 నిమిషాలు గేటు బయటే.. కేజీబీవీ పాఠశాలను ఎమ్మెల్యే యాదయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. అయితే రోజూ మాదిరి సిబ్బంది గేటుకు తాళం వేసుకొని లోపల ఉన్నారు. ఎమ్మెల్యే వచ్చినట్లు సమాచారం ఇచ్చినప్పటికీ దాదాపు 10నిమిషాల వరకు వారు గేటు తాళం తీయకపోవడం గమనార్హం. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ కమిషనర్, నాయకులు గేటు బయటే వేచి ఉన్నారు. పద్ధతి మార్చుకోవాలని ఎమ్మెల్యే యాదయ్య ఆగ్రహం మున్సిపాలిటీలో సిబ్బందికి దుస్తుల పంపిణీ -
ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ దుర్మరణం
ఆమనగల్లు: తలకొండపల్లి మండలం జూలపల్లి గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడటంతో డ్రైవర్ దుర్మరణం చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బైరపాట ఆంజనేయులు(30) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కాగా బుధవారం లింగధన గ్రామం నుంచి ట్రాక్టర్తో జూలపల్లి వస్తుండగా గ్రామ శివారులో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు దర్యాప్తు జరుపుతున్నారు. వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు పహాడీషరీఫ్: వ్యక్తి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి శ్రీరామ కాలనీకి చెందిన వెంకటేష్ కుమారుడు శివకుమార్(30) భార్య మాధవి ఈ నెల 7న ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి శివకుమార్ మనోవేదనతో ఉన్నాడు. ఈ నెల 29న డ్యూటీకి వెళ్లిన అతడు మధ్యాహ్నం బంధువుకు ఫోన్ చేసి ‘అమ్మ, నాన్న జాగ్రత్త.. తమ్ముడికి గైడెన్స్ ఇవ్వు’ అంటూ కాల్ చేసి అనంతరం ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. అతని ఆచూకీ కోసం స్థానికంగా గాలించినా ఫలితం లేకపోవడంతో మంగళవారం వెంకటేష్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇతని ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో గాని 87126 62367 నంబర్లో గాని సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు. -
రుణ వితరణ లక్ష్యం చేరాలి
బ్యాంకర్ల సమీక్షలో కలెక్టర్ నారాయణరెడ్డి సాక్షి, రంగారెడ్డి జిల్లా: రుణ పంపిణీలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి అంకితభావంతో పని చేయాలని, తద్వారా ఆయా వర్గాల అభ్యున్నతికి దోహదపడాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి బ్యాంకు నియంత్రణ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంట రుణ లక్ష్యాన్ని పూర్తి చేయడం, రుణ వితరణ లక్ష్యాన్ని అధిగమించడంలో కొన్ని బ్యాంకులు లక్ష్యాలను ఎందుకు చేరుకోవడం లేదో తెలియజేయాలని కోరారు. ఆయా రంగాలలోని అనేక బ్యాంకులు లక్ష్యాల ప్రకారం రుణాలు అందిస్తున్నప్పటికీ, కొన్ని బ్యాంకులు వెనుకబడ్డాయని తెలిపారు. క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించి టార్గెట్ సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల ఉన్నత విద్య, గృహ నిర్మాణాల కోసం అందుబాటులో ఉన్న రుణ సౌకర్యాల గురించి అవగాహన కల్పించాలన్నారు. పలు వర్గాల ఆర్థిక పురోగతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల కింద అర్హులైన వారికి లోన్లు మంజూరు చేసి మద్దతు అందించాలని తెలిపారు. వీధి వ్యాపారులకు సూక్ష్మ రుణాలు త్వరగా మంజూరు చేయాలని, తద్వారా వారు వ్యాపార లావాదేవీలు నిర్వహించడానికి ఆర్థిక సాయం అందించవచ్చని వివరించారు. ఇందిరా మహిళా శక్తి సంఘాలకు అవసరమైన రుణాలు అందించాలని, ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది వికలాంగులు ఉన్న గ్రూపులకు బ్యాంకు ఖాతాలు తెరిచి రుణ సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల కింద ఎంపికై న లబ్ధిదారులకు వ్యవసాయ, పశుసంవర్ధక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు ఇతర శాఖల సమన్వయంతో స్వయం ఉపాధికి ఆర్థిక మద్దతు ఇవ్వాలన్నారు. రుణగ్రహీతలు యూనిట్లు స్థాపించారా.. లేదా..? నిశితంగా పరిశీలించాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలను పూర్తిగా పంపిణీ చేయాలని మరియు సబ్సిడీ రుణాల పంపిణీలో జాప్యం తగదని సూచించారు. ఎల్డీఎం సుశీల్ కుమార్, ఆర్బీఐ రెహమాన్, నాబార్డ్ ఏజీఎం అఖిల్, వ్యవసాయ శాఖ అధికారి ఉష, ఉద్యాన శాఖ అధికారి సురేశ్, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నవీన్రెడ్డి, వివిధ శాఖల జిల్లా స్థాయి, బ్యాంకు నియంత్రణ అధికారులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
శంకర్పల్లి: రాష్ట్రంలో నెలకొన్న ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) జిల్లా అధ్యక్షుడు కోట్ల కాశీరావు అన్నారు. బుధవారం మండలంలోని పలు పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించగా.. ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వం కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి, పాత పెన్షన్ విధానం తీసుకొని రావాలని, జీవో 317లో స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలన్నారు. పెండింగ్ బిల్లులు, డీఏల పెంపు, కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయలుకు పే స్కేల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపా ధ్యక్షుడు కృష్ణయ్య, నాయకులు జంగయ్య, శ్రీను, బస్వరాజ్, శ్రీనివాస్, జంగయ్య పాల్గొన్నారు.తపస్ జిల్లా అధ్యక్షుడు కాశీరావు -
బాధ్యతల స్వీకరణ
ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల పోలీస్స్టేషన్ నూతన సీఐగా రవికుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నిన్నటి వరకు ఇక్కడ సీఐగా పని చేసిన రాఘవేందర్రెడ్డి బదిలీపై పహాడీషరీఫ్ ఠాణాకు వెళ్లారు. సీఐగా రవికుమార్కు రాఘవేందర్రెడ్డి బాధ్యతలు అప్పగించారు. అనంతరం సీఐ రాఘవేందర్రెడ్డికి ఆదిబట్ల పోలీసులు గజమాలతో సత్కరించారు. నూతనంగా విచ్చేసిన సీఐ రవికుమార్ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతిఒక్కరూ తోడ్పాటునందించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐలు వెంకటేష్, సైదులు, నోయల్రాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు సహకరించాలి యాచారం: హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ సీఐగా సత్యనారాయణ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. పీఎస్ పరిధిలో శాంతి భద్రతల కోసం కృషి చేస్తానని, ప్రజలు కూడా సహకరించాలని నూతనంగా బాధ్యతల చేపట్టిన సీఐ అన్నారు. -
మాకు న్యాయం చేయండి
శంకర్పల్లి: ప్రభుత్వం తమకి వ్యవసాయం చేసుకోడానికి ఇచ్చిన భూమిని ఓ వ్యక్తి ఆక్రమిస్తున్నారని బాధితులు బుధవారం శంకర్పల్లి తహసీల్దార్ సురేందర్ని కలిసి వినతిపత్రం అందించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పొన్నగుట్టతండాలో సర్వే నంబరు 96/130లో 4ఎకరాల భూమిని వ్యవసాయం చేసుకునేందుకు గాను అప్పటి ప్రభుత్వం 1967లో వాల్య అనే వ్యక్తికి ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన వ్యవసాయం చేసుకుంటూ ఉండగా, కొన్నేళ్ల క్రితం వాల్య మృతి చెందాడు. అప్పటి నుంచి ఆయన నలుగురు కుమారులు కిషన్, శంకర్, రాంసింగ్, అమ్రియాలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే కొన్ని నెలల క్రితం మోకిల తండాకు చెందిన ఓ వ్యక్తి వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ భూమిని ఆక్రమించాడు. దీంతో అప్పటి నుంచి బాధితులు న్యాయం చేయాలంటూ తహసీల్దార్, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. సమస్యపై తహసీల్దార్ సురేందర్ వివరణ కోరగా.. సంబంధిత అధికారులను వెళ్లి పరిశీలించాలని సూచించినట్లు స్పష్టం చేశారు.అంత్యక్రియలకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంభార్యాభర్తలకు తీవ్ర గాయాలుకొత్తూరు: బంధువుల అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తూ ఓ దంపతులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంఘటన కొత్తూరు పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెంజర్ల గ్రామానికి చెందిన శేఖర్రెడ్డి, తన భార్య పద్మతో కలిసి బైక్పై కాటేదాన్లో తమ బంధువుల అంత్యక్రియలకు ఉదయం బయలుదేరారు. కాగా పెంజర్ల కూడలిలో రోడ్డును దాటే క్రమంలో ప్యాసింజర్ జీపు ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. విష యం తెలుసుకున్న కుంటుంబ సభ్యులు చికిత్స నిమ్తితం శంషాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.జిల్లా మహాసభలకు తరలిరండిసీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రామస్వామిశంకర్పల్లి: మొయినాబాద్లో ఆగస్టు 2న నిర్వహించే సీపీఐ 17వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రామస్వామి పిలుపునిచ్చారు. బుధవారం శంకర్పల్లిలో సీపీఐ మండలాధ్యక్షుడు సుధీర్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయగా.. ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మహాసభలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. రామస్వామి మాట్లాడుతూ.. 17వ జిల్లా మహాసభలకు రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హాజరు అవుతున్నారని, గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని కోరారు. అదే విధంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధం కావాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్లాలని సూచించారు. సమావేశంలో నాయకులు గోపాల్రెడ్డి, అహ్మద్, రవీందర్, మల్లయ్య, సువర్ణ, యాదయ్య, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.ఠాణా నిర్మాణ పనుల పరిశీలనదుద్యాల్: దుద్యాల్ గేట్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ పనులను పరిగి డీఎస్సీ శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. పనులు వేగంగా సాగించాలని, త్వరగా పోలీస్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్కు సూచించారు. అక్కడి నుంచి నేరుగా దుద్యాల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసుల పని తీరును పరిశీలించారు. కేసుల వివరాలు, రికార్డులను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యవేక్షణ చేస్తుండాలని ఎస్ఐ యాదగిరికి సూచనలు చేశారు. -
నేడు గురుకులంలో ఇంటర్ స్పాట్ అడ్మిషన్లు
బడంగ్పేట్: నాదర్గుల్లో కొనసాగుతున్న తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయంలో ఇంటర్ ఫస్టియర్కు సంబంధించి గురువారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఉదయం 9నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కాలేజీలో సంప్రదించాలని సూచించారు. టెన్త్ మెమో, టీసీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, నాలుగు పాస్ పోర్టుసైజు ఫొటోలతో రావాలని సూచించారు. వన మహోత్సవంలో మంత్రి కొండా సురేఖ కందుకూరు: ఫ్యూచర్సిటీ పరిధిలోని గుమ్మడవెల్లి ఫారెస్ట్ భూముల్లో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం సీడ్ బాల్స్ విసిరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులతో కలిసి వన మహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆమె వెంట మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, స్థానిక నాయకులు ఉన్నారు. మైనార్టీ యువతకు ఉచిత కోచింగ్ కందుకూరు: మైనార్టీస్ స్టడీ సర్కిల్, కౌన్సెలింగ్ సెంటర్ హైదరాబాద్ తరఫున చదువుకున్న మైనార్టీ (ముస్లిం, క్రైస్తవ, సిక్కు, పార్సీ, జైన, బౌద్ధ) యువతకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కె.నవీన్కుమార్రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రూప్ 1,2,3,4 ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్, ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆగస్టు 21లోపు కలెక్టరేట్లోని మైనార్టీ శాఖ కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలని తెలిపారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు బడంగ్పేట్: పొదుపు సంఘాలకు అండగా ఉంటామని మున్సిపల్ కమిషనర్ పి.సరస్వతి అన్నారు. వంద రోజుల యాక్షన్ ప్లాన్లో బుధవారం మహిళా సమాఖ్య సభ్యులతో సమావేశం నిర్వహించారు. బ్యాంక్ లింకేజీ కింద మంజూరైన రూ.2 కోట్ల రుణాలను అందజేశారు. అనంతరం గాంధీనగర్ చౌరస్తాలో మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ కృపాకర్, ఆర్ఓ వేణుగోపాల్రెడ్డి, టీపీఓ కిరణ్, డీఈఈ వెంకన్న, సిబ్బంది పాల్గొన్నారు. అర్హులందరికీ ప్లాట్లు ఇవ్వండి మొయినాబాద్: అర్హులైన రైతులందరికీ ప్లాట్లు కేటాయించాలని ఎనికేపల్లి గోశాల భూ బాధితులు కోరారు. ఈ మేరకు బుధవారం తహసీల్దార్ గౌతమ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఎనికేపల్లి సర్వేనంబర్ 180లో గోశాలకు కేటాయించిన 99.14 ఎకరాల భూమిని సాగుచేసుకుంటున్న రైతులకు పరిహారంగా ఒక్కొక్కరికి 300 గజాల స్థలం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. సమగ్ర విచారణ జరిపించి, అర్హులైనవారందరికీ ప్లాట్లు ఇవ్వాలని కోరారు. దీనిపై తహసీల్దార్ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి, రైతులు మహిపాల్, రాము, శ్రీనివాస్, సికిందర్ తదితరులు ఉన్నారు. -
ఫ్యూచర్ జీపీల్లో.. అభివృద్ధి మంత్రం!
యాచారం: మండలానికి టీజీఐఐసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. గతంలో ఫార్మాసిటీ కోసం అత్యధికంగా భూములిచ్చిన నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను రూ.19 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది. దీంతో పాటు మండలంలోని మిగిలిన 20 గ్రామాల్లోనూ అవసరమైన అభివృద్ధి పనులకు ఫండ్స్ ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పైన పేర్కొన్న నాలుగు గ్రామాల్లోని తొమ్మిది వేల ఎకరాల అసైన్డ్, పట్టా భూములను ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సేకరించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేస్తూ దీని స్థానంలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని వెల్లడించిన విషయం తెలిసిందే. ఇది నమ్మని స్థానిక రైతులు పట్టా భూములను ఇచ్చేది లేదని ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనంలో విశ్వాసం కలిగేలా గ్రామాల్లో అభివృద్ధి పనులకు టీజీఐఐసీ సిద్ధమైంది. ప్రతిపాదనల తయారీ యాచారం మండలంలోని 20 గ్రామాల్లో అన్ని రకాల అభివృద్ధి పనులకు కావాల్సిన నిధులను టీజీఐఐసీ నుంచి మంజూరు చేయించే విషయంలో స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి విజయం సాధించారు. ఆయా జీపీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వలు, పంచాయతీ, కమ్యూనిటీ భవనాలు, అసంపూర్తిగా అంగన్వాడీ, పాఠశాల, మండల, జిల్లా పరిషత్, ఆస్పత్రి తదితర భవనాలను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. పంచాయతీరాజ్ శాఖ డీఈఈ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇందుకోసం ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లో ఏ పనులు పెండింగ్ ఉన్నాయో చెప్పాలంటూ ఆ శాఖ అధికారులు నాయకులకు ఫోన్లు చేస్తున్నారు. నమ్మకం కలిగేలా.. ఫార్మాసిటీ ఏర్పాటు కోసం 19,333 ఎకరాలు కావాలని భావించిన గత ప్రభుత్వం తొమ్మిది వేల ఎకరాలకు పైగా సేకరించింది. ఇందులో యాచారం మండలంలోని నాలుగు గ్రామాల నుంచే ఎక్కువ భూమిని తీసుకున్నారు. నష్టపోయింది కూడా ఇక్కడి రైతులే. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని సింహభాగం ఆ నాలుగు గ్రామాల్లోనే నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో మండలంలోని అన్ని గ్రామాలనూ అభివృద్ధి చేస్తే బాగుంటుందని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. ఇదిలా ఉండగా కొద్ది నెలల క్రితం మొండిగౌరెల్లిలోని 820 ఎకరాల అసైన్డ్, పట్టా భూమి సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. బాధిత రైతులకు న్యాయబద్ధమైన పరిహారం అందించడంతో పాటు అభివృద్ధి కనిపించేలా చేస్తే వ్యతిరేకత ఉండదనేది టీజీఐఐసీ యోచనగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మేజర్ గ్రామాలైన యాచారం, చింతపట్ల, గునుగల్, మాల్, నందివనపర్తి, చింతుల్ల, మంతన్గౌరెల్లి, కొత్తపల్లి తదితర జీపీల్లోనూ పలు అభివృద్ధి పనులకు బీజం పడనుంది. ఫోన్లు చేసి అడుగుతున్నాం యాచారం మండలంలోని 20 గ్రామాల్లో ఏయే అభివృద్ధి పనులు కావాలో గుర్తించి వివరాలు పంపాలని మాజీ ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలకు సూచిస్తున్నాం. సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వలు, భవనాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. నాలుగు రోజులుగా ఇదే పనిలో బిజీగా ఉన్నాం. – శ్రీనివాస్, పీఆర్ డీఈఈ రూ.30 కోట్లకు పైగా నిధులు మండలంలోని 20 గ్రామాల్లో అవసరమై న అభివృద్ధి పనులకు రూ. 30 కోట్లకు పైగా టీజీఐఐసీ నిధులు ఖర్చు చేయనున్నాం. ప్రపోజల్స్ పంపిన వెంటనే ఫండ్స్ రిలీజ్ చేస్తామని టీజీఐఐసీ ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. యాచారంతో పాటు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం. – మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం యాచారం మండంలోని అన్ని గ్రామాలపైనా టీజీఐఐసీ నజర్ రూ.30 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం అవసరమైన పనులకు ప్రతిపాదనలు పంపాలని సూచన వెంటనే నిధులు మంజూరు చేస్తామని హామీ ప్రపోజల్స్ రూపకల్పనలో అధికారులు బిజీ -
గూడు కట్టని నిర్లక్ష్యం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి ప్రతినెలా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు ఇప్పటికీ సొంత భవనాలు లేవు. సరూర్నగర్, కొడంగల్ మినహా మిగిలిన ఎస్ఆర్ఓ ఆఫీసులన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం ముందే స్లాట్ బుక్ చేసుకుని ఆఫీసుకు చేరుకున్న విక్రయ, కొనుగోలుదారులతో పాటు సాక్ష్యులుగా వచ్చిన వారికి కనీస సదుపాయాలు కల్పించలేని దుస్థితి నెలకొంది. ఆన్లైన్లో సాంకేతిక సమస్యలతో పాటు కంప్యూటర్లు తరచూ మొరాయిస్తుండటంతో ఒక్కో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్కు కనీసం 20 నిమిషాల సమయం పడుతోంది. ఇంతసేపు కూర్చునేందుకు కనీసం కుర్చీలు కూడా లేవు. గాలి, వెలుతురు లేని గదుల్లో కనీసం తాగునీరు సైతం లేకపోవడంతో సమీపంలోని హోటళ్లు, కిరాణా దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. మరుగుదొడ్లు, మూత్రశాలలు కూడా లేకపోవడంతో మహిళలు, యువతులు అవస్థలు పడుతున్నారు. కనీస వసతులు లేని ఇరుకై న భవనాలకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.10 లక్షల వరకు అద్దె చెల్లిస్తుండటం గమనార్హం. ఇరుకై న జిల్లా భవనానికి ప్రతి నెలా రూ.1.30 లక్షల చొప్పున, ఇతర ప్రాంతాల్లోని ఒక్కో భవనానికి నెలకు రూ.25 వేల నుంచి రూ.50 వేల చొప్పున అద్దె సమర్పించుకుంటున్నారు. నిజానికి జిల్లాలో ప్రభుత్వ భూములు పెద్ద మొత్తంలోనే ఉన్నాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద నిధులకూ కొరత లేదు. కానీ అధికారులు, పాలకుల కారణంగా వీటికి సొంత భవనాల కల నెరవేరడం లేదు. నిత్యం వందలాది రిజిస్ట్రేషన్లు జిల్లాలో మొత్తం 22 సబ్ రిజిస్ట్రార్ కేంద్రాలున్నాయి. వీటిలో నిత్యం వాణిజ్య, గృహ, వ్యవసాయేతర ఖాళీ భూముల, మ్యారేజీ, సొసైటీలు, చిట్ఫండ్స్ రిజిస్ట్రేషన్లు, జీపీఏ, రెక్టిఫికేషన్, లీజుకు సంబంధించి వందలాది అగ్రిమెంట్లు చేస్తారు. ఒక్కో ఎస్ఆర్ఓలో రోజుకు సగటున 50 నుంచి 60 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ రూపంలో ప్రభుత్వానికి ఒక్కో డాక్యుమెంట్పై రూ.వేలల్లో సమకూరుతోంది. ఆంతర్యం ఏమిటో..? జిల్లాల పునర్విభజనలో భాగంగా గత ప్రభుత్వం ఉమ్మడి జిల్లాను రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలుగా విభజించింది. పరిపాలన సౌలభ్యం కోసం ఆ తర్వాత జిల్లాల వారీగా సమీకృత కలెక్టరేట్ భవనాలను నిర్మించింది. రెవెన్యూ సహా ఇతర శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చింది. కానీ కీలకమైన రంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఇప్పటికీ మేడ్చల్ జిల్లా(బాలానగర్) పరిధిలోనే కొనసాగిస్తుండటం వెనక ఆంతర్యం ఏమిటో అంతుచిక్కడం లేదు. చేవెళ్ల, షాద్నగర్, ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం ప్రజలు నగరంలోని ట్రాఫిక్ వలయాన్ని దాటుకుని ఇక్కడికి చేరేందుకు అనేక వ్యయప్రయాసలకు గురవుతున్నారు. అద్దె భవనాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు జిల్లాలోని 22 ఎస్ఆర్ఓలలో రెండింటికే సొంత ఆఫీసులు గాలి, వెలుతురు లేని ఇరుకై న భవనాల్లోనే రిజిస్ట్రేషన్లు అధికారుల క్యాబిన్ల నిండా గుట్టలుగా పేరుకుపోయిన దస్త్రాలు రూ.లక్షల్లో అద్దె చెల్లిస్తున్నా కనీస సదుపాయాలు కరువేఎక్కడ చూసినా ఫైళ్ల గుట్టలు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎటూ చూసినా దుమ్ముధూళి పేరుకుపోయిన ఫైళ్ల గుట్టలే కనిపిస్తున్నాయి. ఉద్యోగులు కూర్చునే క్యాబిన్లతో పాటు కారిడార్లలోనూ రికార్డుల మూటలే దర్శనమిస్తున్నాయి. ఎవరైనా బాధితులు సంబంధిత అధికారి టేబుల్ వద్దకు చేరుకోవాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. వచ్చిన వ్యక్తి కనీసం నిలబడేందుకు కూడా ఆయా క్యాబిన్లలో చోటు లేదు. విద్యుత్ షార్ట్సర్క్యూట్ లేదా ఏదైనా ఇతర కారణాలతో అగ్గి రాజుకుంటే.. దస్త్రాల్లోని ప్రజల ఆస్తులన్నీ బుగ్గిపాలు కావాల్సిందే. -
సన్నాహాల దారిలో..
త్వరలో గ్రీన్ఫీల్డ్ రోడ్డు పనులు సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్రోడ్డు వరకు ఫ్యూచర్సిటీ మీదుగా నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రోడ్డు పనులకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సన్నాహాలు చేపట్టింది. రెండు దశల్లో పూర్తిచేయనున్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి బీజేపీ ఎంపీ సీఎం రమేష్కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్అండ్టీ సంస్థ టెండర్లను దక్కించుకున్న సంగతి తెలిసిందే. మొదటి దశలో రావిర్యాల నుంచి మీర్ఖాన్పేట్ వరకు రూ.1665 కోట్లతో చేపట్టనున్న 19.20 కి.మీ. రోడ్డును రిత్విక్ సంస్థకు అప్పగించారు. మొదటి దశలో రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణకు ప్రభుత్వం రూ.246 కోట్లు కేటాయించింది. రెండో దశలో మీర్ఖాన్పేట్ నుంచి ఆమన్గల్ వరకు 22.3 కి.మీ మేర నిర్మించనున్నారు. రూ.2,365 కోట్లతో చేపట్టనున్న రెండో దశ పనులను ఎల్అండ్టీ సంస్థ దక్కించుకుంది. రెండో దశ గ్రీన్ఫీల్డ్ రోడ్డు భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.345 కోట్లు కేటాయించింది. మొత్తం రూ.4030 కోట్లతో 41 కిలోమీటర్లకు పైగా గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం హెచ్ఎండీఏ రూ.591 కోట్లతో మొత్తం 1003.61 ఎకరాల భూములను సేకరించనుంది. ఇందులో సుమారు 202 ఎకరాలు టీజీఐఐసీకి చెందినవి కాగా, మరో 231.72 ఎకరాల అటవీ భూములు కూడా ఉన్నాయి. భూముల సేకరణ కోసం ప్రభుత్వం పరిపాలన అనుమతులను గతంలోనే ఇచ్చింది. హైదరాబాద్ ‘ఫ్యూచర్’కు మణిహారం.. హైదరాబాద్ మహా నగర విస్తరణలో భాగంగా ఫ్యూచర్సిటీ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రోడ్డుతో ఆర్ధికాభివృద్ధి పరుగులు పెట్టనుందని ప్రభుత్వం భావిస్తోంది. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రధాన రహదారుల మధ్య నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఎంతో కీలకం కానుంది. టౌన్షిప్లు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన, లాజిస్టిక్ హబ్స్ తదితర అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ఔటర్రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్రోడ్డు వరకు సీమ్లెస్ జర్నీ సదుపాయాన్ని అందజేయనుంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్సిటీ వరకు కొత్తగా నిర్మించనున్న మెట్రో రైల్ కారిడార్ను గ్రీన్ఫీల్డ్ మార్గంలోనే చేపట్టనున్నారు. ఇతర రూట్లలో ఎలివేటెడ్ కారిడార్లుగా నిర్మించనుండగా. గ్రీన్ఫీల్డ్ రోడ్డులో మెట్రోరైల్ కారిడార్ భూమిపైనే నిర్మించనున్నారు. పర్యావరణహితమైన ఫ్యూచర్సిటీ విస్తరణకు ఈ మార్గం దోహదం చేయనుంది. టెండర్లను దక్కించుకున్న సంస్థలకు త్వరలో వర్క్ ఆర్డర్లు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. రెండు దశల్లో నిర్మించనున్న హెచ్ఎండీఏ మొదటి దశలో రావిర్యాల– మీర్ఖాన్పేట్ రెండో దశలో మీర్ఖాన్పేట్– ఆమన్గల్ వరకు మహా నగరాభివృద్ధిలో ఎంతో కీలకం -
ఐదో అంతస్తు నుంచి జారిపడి..
శంకర్పల్లి: మనం ఒకటి తలిస్తే.. విధి మరొకటి తలచిందంటారు. అచ్చం అలాంటి సంఘటనే మంగళవారం శంకర్పల్లిలో చోటు చేసుకుంది. తన ఒక్కగానొక్క అల్లుడిని మంచి స్థాయిలో చూద్దామని కలలుగన్న మామకు దుఃఖమే మిగిలింది. శంకర్పల్లి సీఐ శ్రీనివాస్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం తిరుమలపూర్కి చెందిన రాజు భవన నిర్మాణ కాంట్రాక్టర్. ఆయనకి ఒక్కగానొక్క కుమార్తె సంగీత ఉంది. ఆమెని 2021లో చౌడపూర్ మండలం లింగంపల్లి తండాకి చెందిన నేనావత్ సంతోష్(33)కి ఇచ్చి వివాహం చేయగా.. వారికి రెండేళ్ల పాప ఉంది. మొదటి నుంచి సంతోష్ ఫార్మసీ దుకాణంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తక్కువ జీతానికి పని చేస్తున్నాడని, తనని మంచి స్థాయిలో నిలపెడుదామని సంతోష్ మామ నిర్ణయించుకున్నాడు. తన కన్స్ట్రక్షన్ విభాగంలోకి రెండు నెలల క్రితమే తీసుకొచ్చి సూపర్వైజర్గా చేశాడు. మంగళవారం సంతోష్ భవనం 5వ అంతస్తులో విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడి నుంచి మెటీరియల్ తీసుకొచ్చే యంత్రాన్ని గమనిస్తూ కిందికి చూశాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జారి పడి కింద పడ్డాడు. స్థానికులు వెంటనే పక్కనే ఉన్న ఓ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంతోష్ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అల్లుడిని ఉన్నత స్థాయిలో చూద్దామని ఆశపడిన మామకు చివరికి కన్నీళ్లే మిగిలాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, కార్మికుల సంక్షేమానికి తీసుకున్న చర్యలు తదితర అంశాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు సీఐ స్పష్టం చేశారు. వ్యక్తి దుర్మరణం మెటీరియల్ యంత్రాన్ని గమనిస్తుండగా ప్రమాదం -
మిగులు భూములు పేదలకు పంచాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రభుత్వం మిగులు భూములను పేదలకు పంచాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పేర్కొన్నారు. మండలంలోని కప్పపహాడ్లో పార్టీ ఆధ్వర్యంలో ఓ భూస్వామి చేతిలో ఉన్న 98 ఎకరాల సీలింగ్ భూమిని స్వాధీనం చేసుకున్నారు. 35 ఏళ్లుగా ఆ భూమిని సాగు చేసుకుంటున్న రైతులకు హక్కులు కల్పించాలని కోరుతూ మంగళవారం కదంతోక్కారు. పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్యతో కలిసి ట్రాక్టర్తో దుక్కిదున్ని, విత్తనాలు వేశారు. పొలం మొత్తం ఎర్రజెండాలు పాతారు. అనంతరం జాన్వెస్లీ మాట్లాడుతూ.. భూ చట్టాలను అతిక్రమించి వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారని మండిపడ్డారు. కప్పపహాడ్లో ఓ భూస్వామి 98 ఎకరాలు కాజేయాలని చూశారన్నారు. కలెక్టర్, కోర్టులు ఆ భూమిని సీలింగ్గా ప్రకటించారని, ఈ భూమిని అక్కడన్న ఎస్సీ, ఎస్టీ, బీసీకులాల వారు 1989 నుంచి సాగు చేసుకుంటున్నారని చెప్పారు. రైతులు కాస్తులో ఉన్నప్పటికీ రికార్డుల్లో నమోదు చేయాలని, పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కప్పపహాడ్లో భూ సమస్యను పరిష్కరించాలని, లేదంటే కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు. పగడాల యాదయ్య మాట్లాడుతూ.. విలువైన భూములను కాజేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాడిగళ్ల భాస్కర్, డి.జగదీష్, బి.సామేలు, రాంచందర్, జగన్, సీహెచ్ జంగయ్య, బుగ్గరాములు, జగన్, ఎల్లేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
కుల్కచర్ల: కుటుంబ ఉన్నతికి గృహ నిర్మాణ రంగంలో పనిచేసేందుకు వెళ్లిన వ్యక్తి విగతజీవిగా మారాడు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరా లు.. మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన బోయిన ప్రభాకర్(35) గృహనిర్మాణ రంగంలో పనిచేస్తున్నాడు. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఓ భవన నిర్మాణంలో పనిచేస్తుండగా విద్యుత్వైర్లు తగడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సంతోష, కూతురు సహస్ర(7), కుమారుడు రిత్విక్(5) ఉన్నారు. రిజ్వాన్కు గోల్డ్ మెడల్ సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్ వేదికగా జరుగుతున్న ఐదో టిస్కాన్ యూత్ ఓపెన్ రెగట్టా పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. మూడో రోజు పోటీల్లో యు వ సెయిలర్ మహ్మద్ రిజ్వాన్ సత్తా చాటాడు. ఆప్టిమిస్ట్ మెయిన్ ఫ్లీట్ బాలుర విభాగంలో రిజ్వాన్ గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. రిజ్వాన్ ఈ కేటగిరీలో మరో రేస్ మిగిలుండగానే అగ్రస్థానం సాధించాడు. ఇదే కేటగిరీ బాలికల విభా గంలో తెలంగాణ సెయిలింగ్ అకాడమీకి చెందిన షేక్ రమీజ్ భాను, సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్కు చెందిన శ్రింగేరి రాయ్పై ఒక్క పాయింట్ ఆధిక్యంలో నిలిచి ఫైనల్ పోరుకు సిద్ధమైంది. ఐఎల్సీఏ 4 కేటగిరీ బాలుర విభాగంలో నేవీ యాచ్ సెయిలింగ్ క్లబ్ కు చెందిన రమాకాంత్ ఆరు పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. ఇదే కేటగిరీ లో బాలికల విభాగంలో ఆస్థా పాండే అగ్రస్థానంలో నిలిచింది. 420 మి క్సిడ్ కేటగిరీలో తెలంగాణ సెయిలింగ్ అకాడమీకి చెందిన తనూజా కా మేశ్వర్, శ్రవణ్ కత్రావత్ 10 పా యింట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. -
నటి కల్పిక హంగామా
● బ్రౌన్టౌన్ రిసార్ట్స్లో హల్చల్ ● సిబ్బందిపై దుర్భాషలు ● ఎలాంటి ఫిర్యాదు అందలేదన్న పోలీసులు మొయినాబాద్: సినీ నటి కల్పిక హంగామా సృష్టించారు. రిసార్ట్స్ మేనేజర్పై మెనూ కార్డు, రూం కీస్ విసిరేసి దురుసుగా ప్రవర్తించా రు. ఈ సంఘటన మండల పరిధిలోని కనకమామిడిలో ఉన్న బ్రౌన్టౌన్ రిసార్ట్స్లో చోటుచేసుకుంది. ఆమె సోమవారం సాయంత్రం క్యాబ్లో రిసార్ట్స్కు వచ్చింది. రూంలో దిగిన వెంటనే సిగరెట్లు కావాలంటూ సిబ్బందిని దుర్భాషలాడారు. రిసెప్షన్లో ఉన్న మేనేజర్ కృష్ణ వద్దకు వెళ్లి మెనూ కార్డు, రూంకీస్ మొహంపై విసిరేసి బూతు పురాణంతో రెచ్చిపోయారు. 40 నిమిషాలపాటు హల్చల్ చేశారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికే.. ఇటీవల నగరంలోని ఓ పబ్లో గొడవ చేసిన ఆమైపె కేసు నమోదైంది. పోలీసులు ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసి తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. క్యాబ్, వైఫై ఫెసిలిటీ లేదు బ్రౌన్టౌన్ రిసార్ట్స్లో జరిగిన హంగామాపై సినీనటి కల్పిక వివరణ ఇచ్చారు. రిసార్ట్స్లో జరిగిన విషయాలను వీడియో ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వివిధ కేసుల్లో పోలీసులు తన వెంట పడుతున్నారని రిసార్ట్స్కు వెళ్లానని.. అక్కడ సిగరెట్ తేవాలని సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా స్పందించలేదని వీడియోలో పేర్కొన్నారు. తన ఫోన్లో సిగ్నల్ లేదని క్యాబ్ బుక్చేయడానికి వైఫై ఫెసిలిటీ లేదని.. క్యాబ్ ఫెసిలిటీ లేదా అని అడిగానని.. అందుకే తిట్టాల్సి వచ్చిందని వెల్లడించారు. రిసార్ట్స్ సిబ్బంది తన పట్ల దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని మొయినాబాద్ ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి తెలిపారు. -
మోడల్ స్కూల్లో పీఎంశ్రీ సంబరాలు
కందుకూరు: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ– 2020 ఐదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని మోడల్ స్కూల్ పీఎంశ్రీ విభాగంలో ఉత్తమ పాఠశాలగా ఎంపికై ంది. ఈ సందర్భంగా మంగళవారం ప్రిన్సిపాల్ విష్ణుప్రియ ఆధ్వర్యంలో స్కూల్లో సంబరాలు నిర్వహించారు. ఢిల్లీలో నిర్వహించిన వేడుకలను స్క్రీన్ ద్వారా విద్యార్థులకు చూపించారు. అనంతరం ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి పీఎంశ్రీ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందించడంలో మోడల్ స్కూళ్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఉత్తమ ఫలితాను అందిస్తున్న మోడల్ స్కూల్ ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. అనంతరం పక్కనే ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్స్ ఏడీ శ్రీనివాసాచార్యులు, డీడీ దుర్గాప్రసాద్, జిల్లా ఏఎంఓ జయచంద్ర, ఎంఈఓ నర్సింహ, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ శివలీల, ఎస్ఎల్టీఏ జిల్లా అధ్యక్షుడు ఎండీ బషీర్, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసశర్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నాగపంచమి వైభవం
పేరుకే పైలెట్ ప్రాజెక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూ భారతి చట్టంతోనైనా సమస్యలు తీరుతాయని ఆశించిన రైతుల కలలు కల్లలయ్యాయి. బుధవారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 20258లోuసీత్లా సంబురాలు అంబరాన్నంటాయి. ఆమనగల్లు మండలం మేడిగడ్డతండాలో మంగళవారం గిరిజన మహిళలు భక్తిశ్రద్ధలతో నైవేద్యాన్ని తలపై ఎత్తుకుని ఊరేగింపుగా వెళ్లారు. సీత్లా భవానికి మొక్కులు తీర్చుకున్నారు. ఊరేగింపు సందర్భంగా డీజే హోరు మధ్య యువతీ యువకుల నృత్యాలు అలరించాయి. – ఆమనగల్లు తుక్కుగూడ: రావిర్యాలలో..నాగుల పంచమి సందర్భంగా మంగళవారం నాగదేవత ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టల వద్ద పాలు పోసి ఇంటిల్లిపాదిని చల్లగా చూడాలని మొక్కుకున్నారు.న్యూస్రీల్ -
వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి
ఇబ్రహీంపట్నం రూరల్: వర్షాకాలం దృష్ట్యా జిల్లాలో ఎలాంటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా దృష్టి సారించాలని జిల్లా ప్రత్యేకాధికారి, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ ఆదేశించారు. సెర్ప్ సీఈఓ కార్యాలయం నుంచి మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్తో కలిసి భారీ వర్షాలు, సీజనల్ వ్యాధులు, యూరియా, ఎరువుల నిల్వలు, సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. హిమయత్సాగర్ పరిసర ప్రాంతాలు, శిథిలావస్థలో ఉన్న వంతెనలు, ఫుల్ ట్యాంక్ లెవల్ ఉన్న చెరువులను తనిఖీ చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆయా శాఖల టీంలు సన్నద్ధంగా ఉండలని సూచించారు. గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఇళ్లను గుర్తించి కూల్చివేయాలన్నారు. చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా పరిస్థితులను పర్యవేక్షించాలని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల తెలిపారు. సమావేశంలో డీఆర్ఓ సంగీత, వైధ్యాధికారి వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీపీఓ సురేష్ మోహన్, డీఆర్డీఏ పీడీ శ్రీలత, డీఈఓ సుశీందర్రావు, పౌరసరఫరాల శాఖ అధికారి పారిజాత తదితరులు పాల్గొన్నారు. -
‘రిజిస్ట్రీ’తోనే పథకాలు
కందుకూరు: కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలతో లబ్ధిపొందడానికి తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాల్సిందే. ఈ మేరకు ఆన్లైన్లో వ్యవసాయాధికారులు నమోదు చేపట్టారు. పీఎం కిసాన్ పథకం, సబ్సిడీపై ఫర్టిలైజర్, యంత్ర పరికరాల సరఫరా తదితర క్రేందం అమలు చేయనున్న ప్రయోజనాలు పొందడానికి ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకున్న రైతులకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ నమోదు ప్రక్రియ రాష్ట్రంలో మూడు నెలలుగా జరుగుతుండగా జిల్లాలో నెలన్నర నుంచి కొనసాగుతోంది. పట్టాదారు పాస్పుస్తం, ఆధార్కార్డుతో.. గత డిసెంబర్ 31లోపు భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతుల వివరాలు మాత్రమే ప్రస్తుతం అధికారుల వద్ద ఉన్నాయి. వాటికే ఆన్లైన్లో నమోదు జరగనుంది. రైతులు ఏఈఓల వద్దకు తమ పట్టాదారు పాస్పుస్తం, ఆధార్తో లింకై న సెల్ఫోన్, ఆధార్కార్డుతో వెళ్లి వివరాలు నమోదు చేయించుకోవాలి. ఫోన్ నంబర్కు మూడు సార్లు ఓటీపీలు వస్తాయి. వాటిని చెబితే ఆన్లైన్లో నమోదు ప్రక్రియ పూర్తి చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భూములు ఉన్నా సరే ఎక్కడైనా ఒక దగ్గర ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకుంటే సరిపోతుంది. హైదరాబాద్లోని అడ్రస్ ఉన్న ఆధార్ అయినా సరే రిజిస్ట్రీ చేయించుకోవచ్చు. రైతులు సత్వరమే ఏఈఓల వద్దకు వెళ్లి రిజిస్ట్రీ చేయించుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి జిల్లాలో కొనసాగుతున్న ప్రక్రియ రైతులంతా నమోదు చేసుకోవాలంటున్న అధికారులు పథకాలు పొందాలంటే.. కేంద్ర సంక్షేమ పథకాలు పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇప్పటి వరకు మండలంలో 7,800 మంది రైతులు వివరాలు నమోదు చేయించుకున్నారు. చేయించుకోని రైతులు త్వరగా నమోదు చేయించుకోవాలి. – లావణ్య, ఏఓ, కందుకూరు -
గురుకులాల్లో ఇంటర్ స్పాట్ అడ్మిషన్స్ రేపు
మొయినాబాద్: సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఈ నెల 31న ఇంటర్ స్పాట్ అడ్మిషన్స్ జరుగుతాయని చేవెళ్ల గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ మాలతి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండల పరిధిలోని తోలుకట్ట సమీపంలో ఉన్న చేవెళ్ల గురుకులంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. 2025లో 10వ తరగతి పాసైన విద్యార్థులు హాజరుకావచ్చన్నారు. విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్తోపాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, 4 పాస్పోర్ట్సైజ్ ఫొటోలతో ఉదయం 9 నుంచి ఒంటిగంట లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. మధ్యాహ్నం 2నుంచి కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఖాళీలు పూర్తి చేస్తామని తెలిపారు. ఎంపీసీలో అడ్మిషన్ తీసుకునే విద్యార్థులకు సమాన మార్కులు ఉంటే గణితం, సైన్స్లో వచ్చిన మార్కుల ఆధారంగా, బైపీసీలో అడ్మిషన్ తీసుకునే వారికి సమాన మార్కులు ఉంటే సైన్స్, గణితంలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. సద్వినియోగం చేసుకోండి షాద్నగర్రూరల్: ఫరూఖ్నగర్ మండలం కమ్మదనం సమీపంలోని రాష్ట్ర సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల (సీఓఈ)లో ఇంటర్లో పరిమిత ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నెల 31నస్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ విద్యుల్లత తెలిపారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొందుర్గు గురుకుల కళాశాలలో.. కొందుర్గు: గురుకుల జూనియర్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎండీ కుర్షీద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై జూనియర్ కళాశాల ఎంపీసీ, బైపీసీలో చేరాలనే ఆసక్తి గల బాలురు ఈ నెల 31న ఉదయం 9 గంటల వరకు దరఖాస్తులు తీసుకొని కళాశాలలో హాజరుకావాలని సూచించారు. టీసీ, మెమో, బోనఫైడ్, కులం, ఆదాయం ఒర్జినల్ సర్టిఫికెట్లతో పాటు మూడు సెట్ల జిరాక్స్లను తీసుకురావాలన్నారు. పీఆర్సీని వెంటనే అమలు చేయాలి కందుకూరు: ప్రభుత్వం వెంటనే పీఆర్సీ నివేదికను తెప్పించుకుని అమలు చేయాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా అధ్యక్షుడు పుట్టపాక ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం మండల పరిధిలోని పలు గ్రామాల్లోని పాఠశాలల్లో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా నూతన పీఆర్సీ, పెండింగ్ డీఏలను, నూతన ఆర్యోగ కార్డులను వెంటనే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సెక్షన్లను పరిగణలోకి తీసుకోకుండా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అదనపు ప్రధానకార్యదర్శి ఏవీ సుధాకర్, జిల్లా ప్రధానకార్యదర్శి సత్తు పాండురంగారెడ్డి, ఏఐఎస్టీఎఫ్ ఉపాధ్యక్షుడు పరమేష్ తదితరులు పాల్గొన్నారు. ‘స్థానిక’ ఎన్నికలకు సమాయత్తం అవుదాం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజభూపాల్గౌడ్ ఇబ్రహీంపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజభూపాల్గౌడ్ పిలుపునిచ్చారు. పార్టీ మండల సమావేశం మంగళవారం స్థానిక వైష్ణవి గార్డెన్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. అత్యధిక జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను గెలిచి జిల్లా పరిషత్, మండల పరిషత్ పీఠాలను వసం చేసుకోవాలని అన్నారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, నాయకులు, ముఖ్యకార్యకర్తలు పాల్గొన్నారు. రేపు బుద్ధుడిపై నాటిక ప్రదర్శన చేవెళ్ల: మొయినాబాద్ మండలం అజీజ్నగర్లోని పీవీ కన్వెన్షన్లో ఈనెల 31న ‘బుద్ధుడితో నా ప్రయాణం’ నాటికను ప్రదర్శిస్తున్నట్లు సమతా సైనిక్దళ్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ బౌధ్ నాగ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.