Rangareddy
-
సుర్రుమంటున్న సూరీడు
ఆమనగల్లు: ఎండలు రోజురోజుకూ మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడి భగభగలు సుర్రుమంటున్నాయి. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండలు ఎక్కువ కావడంతో సీజనల్ వ్యాపారాలు మొదలయ్యాయి. వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి శీతల పానీయాలు, కొబ్బరిబొండాలు సేవిస్తున్నారు. ఈ ఏడాది ఎండలు అధికంగానే ఉంటాయని వస్తున్న వార్తల నేపథ్యంలో భయపడుతున్నారు. ఆమనగల్లు పట్టణంలో ఉదయం, రాత్రి వేళల్లో కొద్దిగా చల్లగా ఉంటున్నా మధ్యాహ్నం మాత్రం ఎండలు సుర్రుమంటున్నాయి. ప్రస్తుతం ఎండలు 34 డిగ్రీలు దాటిపోయాయి. ఉదయం 10 గంటలు దాటితే చాలు ఎండవేడిని తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం సమయంలో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. కొబ్బరిబొండాలను రూ.40 నుంచి 60 వరకు విక్రయిస్తుండగా పండ్ల రసాలను గ్లాస్కు రూ.20 నుంచి 40 వరకు అమ్ముతున్నారు. అలాగే పండ్లు, పుచ్చకాయలు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మట్టికుండలకు భలే గిరాకీ పట్టణంలో మట్టికుండల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని నీరు సేవిస్తున్నారు. ఇందుకోసం చాలామంది మట్టి కుండలను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల ఫ్రిడ్జ్ నీరు తాగడం మానేసి మట్టికుండ నీరుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వారం రోజులుగా అధికమవుతున్న ఉష్ణోగ్రతలు నిర్మానుష్యంగా మారుతున్న రహదారులు ఊపందుకున్న శీతల పానీయాల విక్రయాలు భానుడి భగభగలు మొయినాబాద్రూరల్: సూర్యుడి భగభగలకు ప్రజలు ఇళ్ల నుంచి రోడ్లపైకి రాలేక పోతున్నారు. ఆదివారం మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు మండుతున్న ఎండకు ప్రజలు ఇళ్లల్లోనే ఉండడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. మరింత ఎండలు ముదిరే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. -
మృత్యువులోనూవీడని బంధం
అనారోగ్యంతో భార్య, గుండెపోటుతో భర్త మృతి మోమిన్పేట: మృత్యువులోనూ దంపతులు అనుంబంధం వీడలేదు. ఈ ఘటన మండల పరిధిలోని ఏన్కతల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన ప్యాట లక్ష్మయ్య, భాగ్యమ్మ దంపతులు. భాగ్యమ్మ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు మృతి చెందింది. సాయంత్రం అంత్యక్రియలు పూర్తయ్యాయి. భార్య మృతిని తట్టుకోలేక బాధపడుతున్న లక్ష్మయ్య రాత్రి 11గంటల సమయంలో గుండెపోటుతో మత్యువాత పడ్డాడు. వారికి ఒక కూతురు, కుమారుడు సంతానం. బైక్ అదుపు తప్పి యువకుడికి గాయాలు యాచారం: నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లి గ్రామానికి చెందిన బి.అరుణ్కుమార్ ఆదివారం మధ్యాహ్నం ఇబ్రహీంపట్నం నుంచి యాచారం వైపు బైక్పై వస్తున్నాడు. మార్గమధ్యలో తహసీల్దార్ కార్యాలయంలో బైక్పై అదుపు తప్పి కిందపడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో 108లో ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసి యాచారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధురాలు అదృశ్యం కుల్కచర్ల: ఇంటి నుండి బయటకు వెళ్లిన వృద్ధురాలు అదృశ్యమయింది. ఈ సంఘటన కుల్కచర్ల ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రమేశ్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని బండవెల్కిచర్లకు చెందిన కొత్తబాయి వెంకటమ్మ(63) ఒంటరిగా ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. శనివారం ఉదయం ఆమె కుమార్తె లక్ష్మి ఫోన్ చేయగా బ్యాంకుకు వెళ్తున్నాని చెప్పింది. మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. రాత్రైనా ఇంటికి రాలేదు. దీంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది. -
ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు
మార్కెట్లో క్రయవిక్రయాలు సాఫీగా కొనసాగేలా, ఎలాంటి ఇబ్బందులకు తావులేకుండా ఏర్పాట్లు చేశాం. ప్రత్యేకంగా 12 ఎకరాల ప్రాంగణంలో భారీ షెడ్లు, మరో 7 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశాం. మార్కెట్ ప్రాంగణంలో మామిడి పండ్లతో వచ్చే వాహనాలు సాఫీగా రాకపోకలు సాగించేలా అంతర్గత రోడ్లు నిర్మించాం. మార్కెట్లో రైతులు, వ్యాపారులు దప్పిక తీర్చుకునేందుకు చల్లటి తాగునీటి యంత్రాలు, మామిడి బిడ్డింగ్, నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. – చిలుక మధుసూదన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ● -
మామిడి మార్కెట్ ‘బాట’
● బాటసింగారంలో జోరు ● నిండిపోయిన పండ్ల రాశులు ● హుషారుగా క్రయవిక్రయాలు అబ్దుల్లాపూర్మెట్: పండ్ల మార్కెట్కు మామిడి కళ వచ్చింది. పండ్ల సీజన్ ప్రారంభంతో విక్రయాలు జోరందుకున్నాయి. అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారంలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ యార్డులో మామిడి క్రయవిక్రయాలతో కొన్ని రోజులుగా సందడి నెలకొంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మార్కెట్లో మామిడి క్రయ విక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. గతేడాది రూ. 300 కోట్ల వ్యాపారం జరిగిన విషయం తెలిసిందే. క్యూ కట్టిన వాహనాలు బాటసింగారం మార్కెట్లో మామిడి రాశులు నిండిపోయాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి మామిడి లోడ్లతో లారీలు, ట్రాలీలు పండ్ల మార్కెట్ బాట పట్టాయి. ఇప్పటివరకు సుమారు 9 వేల మెట్రిక్ టన్నుల దిగుమతి కాగా, నాణ్యతనుబట్టి టన్నుకు సగటున రూ.35 వేల నుంచి రూ.40 వేల ధర పలుకుతోంది. ఈ సంవత్సరం సీజన్ ముగిసే సరికి సుమారు లక్షన్నర మెట్రిక్ టన్నులు మార్కెట్కు రానుందని అధికారులు తెలిపారు. గతేడాది ఇదే సమయానికి 20.90 వేల మెట్రిక్ టన్నుల విక్రయాలు జరినట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి బాటసింగారంలోని గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్కు ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 11 రకాల మామిడి పండ్లు దిగుమతి అవుతున్నాయని అధికారులు వెల్లడించారు. వీటిల్లో అత్యధిక ధర హిమాయత్ రకం కిలో రూ.200 ధర పలుకుతుండగా, అత్యల్పంగా నాటి రకం కిలో రూ.8–14 ధర పలుకుతోంది. వీటిలో చెట్టుపైనే కవర్ కట్టిన పండ్లకు అధిక డిమాండ్ ఉండడంతో పాటు ధర కూడా టన్నుకు రూ.లక్ష వరకు పలుకుతోందని అధికారులు పేర్కొంటున్నారు. 90 శాతం వరకు బెనిషన్ రకం పండ్లే ఎక్కువగా మార్కెట్కు వస్తోంది. కాగా ఇక్కడి మామిడి దేశంలోని రాజస్థాన్, పంజాబ్, కర్ణాటక, హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్తో పాటు పరిసర ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది. మూడేళ్లుగా మార్కెట్కు వచ్చిన వివరాలు 2023–24లో 1.18 లక్షల టన్నులు 2024–25లో 1.11 లక్షల టన్నులు 2025–26లో 1.49 లక్షల టన్నులు -
ఎరువు కొరత.. తీరని వ్యథ
కుల్కచర్ల: రైతు సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయం. వ్యవసాయ రంగాన్ని పండగ చేస్తాం అని ప్రభుత్వాలు, పాలకులు పదేపదే చెబుతున్నా.. అన్నదాతల యూరియా కష్టాలు తీరడం లేదు. డిమాండ్ను బట్టి సరిపడా ఎరువు అందుబాటులో ఉందంటూ అధికారులు పేర్కొంటున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. యూరియా పక్కదారి పట్టకుండా, కర్షకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆన్లైన్ బుకింగ్ విధానం తెచ్చినా.. ఒక్క సంచి దొరకని పరిస్థితి. ఒక్క సంచి లేదాయె చౌడాపూర్ మండలంలో 24 గ్రామ పంచాయతీలు, వాటికి అనుబంధంగా సూమారు 40 గిరిజన ఆవాసాలు ఉన్నాయి. వీరిలో ఎక్కువశాతం మందిది వ్యవసాయ ఆధారిత జీవనమే. గత ఏడాది యూరియా కొరత అధికంగా ఉండటంతో ప్రభుత్వం ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే మండలంలో రెండు ప్రభుత్వ అనుబంధ ఎరువుల దుకాణాలు ఉన్నాయి. శనివారం వరకు ఆయా షాపుల్లో ఒక్క యూరియా సంచి కూడా అందుబాటులో లేని దుస్థితి. ఆన్లైన్లో మండలంలోని దుకాణం చూపించకుండా.. కుల్కచర్ల మండలంలోని దుకాణాలను చూపించండం గమనార్హం. విధిలేక మండల పరిధి మరికల్, కల్మన్కాల్వ, చాకల్పల్లి, కొత్తపల్లి గ్రామాల రైతులు.. సూమారు 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న కుల్కచర్లకు మండల కేంద్రానికి వెళ్లి ఎరువులు కొనుగోలు చేసుకుంటున్నారు. ఒక్కటి కావాలన్నా అక్కడికి వెళ్లాల్సి వస్తోందని కర్షకులు తెలిపారు. గంటల కొద్ది వేచి చూడాల్సి వస్తుందంటున్నారు. దీంతో దూరభారంతో పాటు సమయం వృథా.. రవాణా ఖర్చు తడిసి మోపవుతోందని కర్షకులు పేర్కొంటున్నారు. రైతులకు యూరియా కష్టాలు ఆన్లైన్ విధానంతో తప్పని తిప్పలు చౌడాపూర్లో దుకాణాలు ఉన్నా.. కుల్కచర్లకు పరుగు ఇతరులకు ఇవ్వమంటున్న అక్కడి వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో కర్షకులు పొరుగు వారికి ఇవ్వం మరికల్, చౌడాపూర్ ఎరువుల దుకాణంలో యూరియా లభించడం లేదు. దీంతో కుల్కచర్లకు వెళ్లాల్సి వస్తోంది. ఒక సంచి అయినా రానుపోను రవాణా ఖర్చులే అధికమవుతున్నాయి. ఆన్లైన్ బుకింగ్ చేసినా.. ఇతర ప్రాంతాల వారికి ఇవ్వమంటూ పొరుగు మండల వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. స్థానికంగా ఎరువు లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – శివకుమార్, యువరైతు, కల్మన్కాల్వ ఇండెంట్ పంపించాం చౌడాపూర్ మండలంలో రెండు ఎరువుల దుకాణాలు ఉన్నాయి. ఆ షాపుల్లో ఎరువు విక్రయించేందుకు ఇండెంట్ పంపించాం. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు. సరిపడా యూరియా అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తున్నాం. త్వరలో వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – పరిమళ, వ్యవసాయాధికారి, చౌడపూర్ మండలం -
సూపర్ సండే
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ఆదివారం ఐపీఎల్ మ్యాచ్ ఆహ్లాదకరంగా ముగిసింది. సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన తొలి పోరును ఎంజాయ్ చేసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సన్రైజర్స్ జట్టు మ్యాచ్లో ఓడిపోయినా.. సెలవు రోజున మైదానానికి తరలి వచ్చిన 34,670 మందికి తగినంత వినోదం లభించింది. ఆరంభంలో సన్రైజర్స్ ఆటతో కాస్త నిరాశ కనిపించినా... నితీశ్ కుమార్ రెడ్డి, క్లాసెన్ బౌండరీల వర్షంతో వారికి ఊరట లభించింది. అవతలి జట్టు కెప్టెన్ అయిన సరే... భారత ఆటగాడు కావడంతో రిషభ్ పంత్కు కూడా మైదానంలో భారీ మద్దతు లభించింది. శుభ్రంగా లేని సీట్లు మరోవైపు స్టేడియంలోని కొన్ని గ్యాలరీల్లో సీట్ల విషయంలో కాస్త అసంతృప్తి కనిపించింది. సీట్లు శుభ్రంగా లేకపోవడంతో ప్రేక్షకులే కర్చీఫ్లతో క్లీన్ చేసుకొని కూర్చున్నారు. సన్ గ్లాసెస్లను గ్రౌండ్లోకి అనుమతించే విషయంలో కూడా ఫ్యాన్స్, సెక్యూరిటీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. లోపలికి వెళ్లే వేర్వేరు గేట్ల నుంచి కొన్ని చోట్ల సన్ గ్లాసెస్ను అనుమతించగా, మరి కొన్ని గేట్ల వద్ద అడ్డుకోవడంతో వాటికి అక్కడే పడేసి లోపలికి వెళ్లాల్సి వచ్చింది. -
నేడు కొహెడకు హరీశ్రావు రాక
తుర్కయంజాల్: మాజీ మంత్రి టి.హరీశ్రావు సోమవారం ఆదిబట్ల సర్కిల్ పరిధి కొహెడలోని పండ్ల మార్కెట్ భూములను పరిశీలించనున్నట్లు జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణా రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సర్వే నంబర్ 167 బై 1లో భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడనున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారని చెప్పారు. పార్టీశ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మంచాల: గ్రామాల్లో బీజేపీని బలమైన శక్తిగా తయారు చేయాలని పార్టీ రాష్ట్ర నాయకులు బూర నర్సయ్య గౌడ్, శ్రీవర్ధన్రెడ్డి, కొప్పు భాష, బొక్క నర్సింహా రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాబియన్ 2026 కార్యక్రమానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ప్రజలను చైతన్యపర్చి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గోగిరెడ్డి లచ్చిరెడ్డి, వింజమూరి వెంకట్రెడ్డి, దన్నె భాషయ్య, శ్రీశైలం, జంగయ్య గౌడ్, గోవర్ధన్చారి, పాండు, మండల అధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్రెడ్డి, యాట రమేష్ ముదిరాజ్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. 176 బ్యాగులు స్వాధీనం అబిడ్స్: నాణ్యత లేని వివిధ రకాల పిండిని తయారు చేసి విక్రయిస్తున్న గోదాముపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి 176 బ్యాగుల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మంగళ్హాట్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. కోల్సీవాడి ప్రాంతానికి చెందిన శుభం సాంట్ల (30) లోయర్ ధూల్పేట్లోని జుంగూర్ బస్తీలో మారుతి ట్రేడింగ్ కంపెనీ గోదాము పెట్టాడు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి నాణ్యత లేని మొక్కజొన్న, బియ్యం, జొన్నలు తీసుకువచ్చి పిండి తయారు చేసి శివం సాంట్ల శుభం ఎంపీపీ బ్రాండ్తో విక్రయిస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆదివారం గోదాముపై దాడి చేసి 108 బస్తాల మొక్కజొన్న పిండి, 60 బస్తాల బియ్యం పిండి, 8 బస్తాల జొన్న పిండి, 50 ఖాళీ రోల్స్ బెండల్స్, మూడు వేయింగ్ మిషన్లు, ఒక ఫ్లోర్ ప్యాకింగ్ మిషిన్ను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. సీపీఐ జాతీయ నాయకుడు నారాయణకవాడిగూడ: నగరంలోని ఇందిరా పార్కులో ఆక్రమణలను వెంటనే అడ్డుకోవాలని సీపీఐ జాతీయ నాయకుడు డాక్టర్ కె.నారాయణ డిమాండ్ చేశారు. ‘సేవ్ ఇందిపార్కు’ పేరిట ఆదివారం వాకర్స్ నిర్వహించిన నిరసనలో నారాయణతో పాటు సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. ఎమరాల్డ్ స్వీట్ హౌస్, డంపింగ్ యార్డు, స్నో వరల్డ్, షటిల్ కోర్టు పేర్లతో ఇందిరాపార్కు చుట్టూ ఉన్న స్థలం కబ్జాకు గురవుతుందని ఆరోపించారు. స్థలాన్ని రక్షించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి స్టాలిన్, ఇందిరాపార్కు వాకర్స్ ప్రతినిధులు రవీందర్ రెడ్డి, నర్సింగ్రావు పాల్గొన్నారు. -
వైన్స్ షాప్నకు కన్నం
యాలాల: మండల కేంద్రంలోని ఓ వైన్స్లో ఇద్దరు దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఎస్ఎల్వీ వైన్స్ పేరిట మద్యం దుకాణం ఉంది. శనివారం రాత్రి రోజు మాదిరిగానే వైన్స్ మూసేసిన నిర్వాహకులు ఆదివారం తెల్లవారుజామున దుకాణం తెరిచారు. షాపులోకి వెళ్లిన నిర్వాహకులకు పైకప్పు రేకుకు భారీ రంధ్రం ఉండడం చూసి చోరి జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో నగదు, వస్తువులను పరిశీలించగా సుమారు రూ.5వేల నగదుతో పాటు రెండు క్వార్టర్లు, ఒక వాటర్ బాటిల్ చోరీ అయినట్లు గుర్తించారు. కాగా షాపులో పెద్ద మొత్తంలో నగదు ఉంటుందనే ఆశతో చొరబడిన దొంగలకు రూ.10 నోట్ల కట్ట మాత్రమే లభించింది. దీంతో విసుగు చెందిన దొంగలు రూ.5వేల వరకు ఉన్న రూ.10 రూపాయల నోట్ల కట్టతో పాటు రెండు క్వార్టర్ బాటిళ్లు, ఒక వాటర్ బాటిల్ను తీసుకొని వెళ్లిపోయారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. వైన్స్ షాపు నిర్వాహకులు ఈ విషయాన్ని యాలాల పోలీసులకు తెలపడంతో వారు ఘటన స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజీని పరిశీలించారు. సీసీ ఫుటేజీలో ఇద్దరు దొంగలు పైకప్పు రేకుకు రంద్రం వేసి లోపలికి వస్తున్నట్లు గుర్తించారు. గతేడాది జూలై 24న ఇక్కడ ఉన్న వైన్స్ షాపులో గోడకు రంద్రం వేసిన దొంగలు..రూ 40వేల నగదుతో పాటు నాలుగు ఫుల్ బాటిళ్లను ఎత్తుకెళ్లారు. కేసు దర్యాప్తులో ఉంది. రూ.5వేల నగదు, రెండు క్వార్టర్ బాటిళ్లు అపహరణ -
సనాతన ధర్మం ప్రపంచానికి దిక్సూచి
కొత్తూరు: సనాతన ధర్మం ఒక మతం మాత్రమే కాదని ప్రపంచంలో శాంతిని నెలకొల్పేందుకు దిక్సూచిలా దిశానిర్దేశం చేస్తుందని పూరి పీఠాధిపతి దుర్గానందస్వామి అన్నారు. మండలంలోని సిద్ధాపూర్లో ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నేత ఎల్లారం శేఖర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హిందువులందరినీ ఏకతాటి పైకి తీసుకురావడంతో పాటు సమాజ శ్రేయస్సు, వారిలో దేశభక్తి నింపడమే లక్ష్యంగా హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మన పూర్వీకుల నుంచి మనం ఆచరిస్తున్న సనాతన, హిందూ ధర్మాలు, ఆచారాలను భావితరాలకు అందించడం మన బాధ్యత అని వివరించారు. కులాల మధ్యన వైషమ్యాలను వీడి హిందువులందతా ఐక్యంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. హిందూ సంఘం ప్రతినిధి పెండం శోభ మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజంలో హిందువులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచారాలు, వారిపైన జరుగుతున్న దాడులను ఖండించారు. ఆయా ప్రభుత్వాలు హిందువుల విషయంలో అనుసరిస్తున్న తీరును ఆమె వ్యతిరేకించారు. ప్రేమ పేరుతో కుట్ర పూరితంగా జరుగుతున్న మత మార్పిడులు, సాంప్రదాయాల విచ్ఛిన్నంపై హిందువులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా హిందూ సంఘాల నేతలు పాల్గొన్నారు. పూరి పీఠాధిపతి దుర్గానందస్వామి -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
అనంతగిరి: యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం మన సొంతం అవుతుందని మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య అన్నారు. ఆదివారం వికారాబాద్ ఆర్యవైశ్య భవనంలో అనంత పద్మనాభ స్వామి యోగా కేంద్రం ఆధ్వర్యంలో యోగా తరగతులు నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్రెడ్డి, కమిషనర్ విక్రంసింహారెడ్డి, కౌన్సిలర్లు రమేష్కుమార్, రాఘవేందర్, అనిల్, యోగా గురువులు అశోక్, నారాయణ రాథోడ్, అనంతయ్య, వీరేశం తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులకు అండంగా ఉంటాం పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి దోమ: మండల పరిధిలోని ఐనాపూర్లో జోగు చిన్న భీమయ్య శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఆదివారం మృతదేహాన్ని నివాళి అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా కల్పించారు. అదుపుతప్పి కారు బోల్తా దోమ: అడవి పంది అడ్డురావడంతో అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ సంఘటన దోమ మండలం మోత్కూర్ గేట్ సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నంచర్ల గ్రామం నుంచి స్విఫ్ట్ డిజైర్ వాహనం కుల్కచర్ల మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తోంది. అందులో డ్రైవర్తో పాటు ఓనర్ ఉన్నారు. ఈ క్రమంలో గేట్ సమీపంలోకి రాగానే వరాహం అడ్డువచ్చింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ దానిని తప్పించే యత్నంలో కారు.. రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఎయిర్ బెలూన్స్ తెరచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. అ‘పూర్వ’ సమ్మేళనం దుద్యాల్: మండల పరిధిలోని హస్నాబాద్ జెడ్పీహెచ్ఎస్లో 1991–92 బ్యాచ్ పదో తరగతి విద్యార్ధులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. చాలా ఏళ్లకు అందరం కలుసుకోవడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వారికి విద్యాబుద్దులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
మార్కెట్కు మామిడి పండ్లు తీసుకువచ్చే రైతుల నుంచి 4 శాతం మాత్రమే ఏజెంట్లు కమీషన్ తీసుకోవాలి. నిర్ణయించిన దానికంటే ఎక్కువగా వసూలు చేస్తే మా దృష్టికి తేవాలని సూచిస్తూ యార్డులో బోర్డులు ఏర్పాటు చేశారు. మామిడిని ప్యాకింగ్ చేసే క్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అనుమతులు ఇచ్చిన ప్రకారమే ఇథలిన్ ప్యాకెట్లను మోతాదులో వాడే విధంగా వ్యాపారులకు సూచనలు చేశాం. నిబంధనలను అతిక్రమిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేసే వారితో కఠినంగా వ్యవహరిస్తాం. – శ్రీనివాస్, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి -
ఆపరేషన్ చబుత్రా మిషన్
పహాడీషరీఫ్: బాలాపూర్ పోలీసులు ఆపరేషన్ చబుత్రా మిషన్ చేపట్టి శనివారం అర్ధరాత్రి వేళ బస్తీలలో తిష్టవేసి న్యూసెన్స్ పాల్పడుతున్న యువకుల భరతం పట్టారు. స్టేషన్ పరిధిలోని ఎర్రకుంట, షాహిన్నగర్లో అకస్మాత్తుగా సోదాలు జరిపి పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లేట్ నైట్ నడుపుతున్న మండీ హోటళ్లలోనూ సోదాలు జరిపారు. ఇన్స్పెక్టర్ సుధాకర్ పర్యవేక్షణలో కొనసాగిన ఈ సోదాలలో యువకులతో పాటు హోటళ్ల యజమానులకు ఆఖరి సారిగా హెచ్చరించారు. ఈ సోదాలు క్రమం తప్పకుండా కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. -
ఏడేళ్లుగా తిరుగుతున్నా..
కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ రెవెన్యూ సర్వే నంబర్ 44లో ఎకరం పట్టా భూమి ఉంది. 2018 వరకు నా పేరునే పట్టా ఉంది. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత నా భూమిని వేరే వారి పేరున నమోదు చేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా. వేరేవాళ్లు తమ భూమి కాదని స్వయంగా అఫిడవిట్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ భూమి నాపేరున నమోదు కాలేదు. వేరే వారి మధ్య భూ వివాదం ఉండటం, వారు కోర్టును ఆశ్రయించడంతో సర్వే నంబర్ మొత్తాన్ని నిషేధిత జాబితాలో చేర్చారు. ఇందులో నా పట్టా భూమి కూడా ఉంది. దీన్ని తొలగించాల్సిందిగా కోరుతూ ఏడేళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా. అయినా సమస్య పరి ష్కరించలేదు. ఆన్లైన్ దరఖాస్తులు, రవాణా ఖర్చులు, ఇతర చెల్లింపుల కోసం ఇప్పటికే రూ.2 లక్షలపైనే ఖర్చు చేయాల్సి వచ్చింది. – అబ్బి రామచంద్రయ్య, పాపిరెడ్డిగూడ -
ఇస్తే సరి..
సోమవారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026లేదంటే కొర్రీ! సాక్షి, రంగారెడ్డిజిల్లా: భూ బాధితులకు క్షేత్రస్థాయిలోని పలువురు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. నివేదికలు సిద్ధం చేసేందుకు చేయి చాస్తున్నారు. పట్టా భూములను అసైన్డ్గా నమోదు చేయడం, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, సరిహద్దు, సర్వే నంబర్లలో దొర్లిన తప్పుల సవరణ, భూస్వభావం, కేటగిరీ, యజమానుల పేర్లలో దొర్లిన తప్పులను సరి చేయాలంటే ఎంతో కొంత ముట్టజెప్పాల్సి వస్తోంది. ఇచ్చేందుకు నిరాకరించిన వారి ఫైళ్లకు అనేక కొర్రీలు పెట్టి.. సమస్యను మరింత జఠిలం చేస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి నివేదికలు అందిన వాటిని కూడా పెండింగ్లో పెట్టి బేరసారాలకు దిగుతున్నారు. ప్రస్తుతం తహసీల్దార్ల వద్ద 7,480 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, 2,508 ఆర్డీఓల వద్ద ఉన్నాయి. ఇక అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వద్ద ఏకంగా 6,825 దరఖాస్తులు పెండింగ్లో ఉంటే కలెక్టర్ వద్ద 2,659 దరఖాస్తులు పెండింగ్లో ఉండటం విశేషం. ఒక్కో దశలో ఒక్కో రేటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సుల్లో భాగంగా 17 వేలకుపైగా దరఖాస్తులు అందాయి. వీటిలో ఇప్పటి వరకు మెజార్టీ పెండింగ్లోనే ఉన్నాయి. ఇక ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’కి సగటున 60 నుంచి 100 వరకు అర్జీలు వస్తుంటాయి. అధికారులు ఆయా వినతులను క్షేత్రస్థాయికి పంపుతుంటారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) క్షేత్ర స్థాయిలో పర్యటించి, నిజనిర్ధారణ చేసి తహసీల్దార్కు నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఆయన తన ఆఫీసులో ఉన్న భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, అన్నీ సవ్యంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత నివేదికను ఆర్డీఓకు పంపుతుంటారు. ఆయన తన వద్ద ఉన్న రికార్డులను పరిశీలించి, తుది నివేదికను అదనపు కలెక్టర్/ కలెక్టర్కు పంపిస్తారు. అధికారుల తీరుతో అగ్గువకే అమ్మకం క్షేత్రస్థాయి నుంచి అందిన నివేదికల ఆధారంగానే కలెక్టర్లు వాటిని ఆమోదించడమో లేక తిరస్కరించడమో చేస్తుంటారు. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ప్రభుత్వ పెద్దలు రంగప్రవేశం చేసి, అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అధికారులు దీన్ని అవకాశంగా తీసుకుని అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అడిగినంత ముట్టజెప్పిన వాళ్లకు వారు ఆశించిన విధంగా నివేదికలు సిద్ధం చేస్తున్నారు. నిరాకరించిన వారి ఫైళ్లను కనీసం పరిశీలించకుండానే రిజెక్ట్ చేస్తున్నారు. అధికారుల తీరుతో ఎక్కడ భూమి తమకు కాకుండా పోతుందో అనే భయంతో బాధితులు కూడా మధ్యవర్తులను ఆశ్రయించి వారు అడిగినంత ముట్టజెప్పుతున్నారు. ఇలా ఆర్ఐ నుంచి అదనపు కలెక్టర్ వరకు ప్రతి దశలోనూ భారీ మొత్తం చేతులు మారుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. ఇప్పటికే ఓ అదనపు కలెక్టర్ సహా పలువురు తహసీల్దార్లు, ఆర్ఐలు ఏసీబీకి పట్టుబడటం తెలిసిందే. ఇక ఆర్థిక స్థోమత లేని పేద రైతులు తమ భూములను తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది.పెండింగ్లో ఉన్న దరఖాస్తులు డివిజన్ తహసీల్దార్లు ఆర్డీఓ అదనపు కలెక్టర్ కలెక్టర్ చేవెళ్ల 1,957 491 1,373 830 ఇబ్రహీంపట్నం 1,866 820 1,979 439 కందుకూరు 1,643 644 1,799 634 రాజేంద్రనగర్ 834 123 674 358 షాద్నగర్ 1,180 430 1,000 398 -
ఐకమత్యంతోనే రాజకీయ లబ్ధి
షాబాద్: కురుమలు ఐకమత్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాపోల్ నర్సింలు పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని మల్లారెడ్డిగూడ గ్రామ కమిటీ ఏర్పాటు కార్యక్రమంలో ఆయన కురుమ సంఘం మండల అధ్యక్షుడు మద్దూరు పాండుతో కలిసి పాల్గొన్నారు. కొత్తగా ఎంపికై న కమిటీ సభ్యులకు శాలువాలతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనాభాపరంగా కురుమలకు రాజకీయ లబ్ధి రావడం లేదన్నారు. ఐకమత్యంగా ఉండి ఎలాంటి ఎన్నికలు వచ్చినా ఒకరికొకరు సహాయం చేసుకోవాలన్నారు. సంఘం మల్లారెడ్డిగూడ గ్రామ అధ్యక్షుడిగా రంగం ఆంజనేయులు, ఉపాధ్యక్షులు సంజీవ, రాజేందర్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, సలహాదారులు భీమయ్య, కార్యదర్శి కుమార్, కోశాధికారి రాజేందర్, కార్యదర్శి రాఘవేందర్లను ఎనుకున్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మాణిక్యం, మాజీ ఉపసర్పంచ్ రంగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.కురుమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింలు -
రూ.63 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం
జీడిమెట్ల: గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత డ్రగ్ మెథాంఫేటమిన్ విక్రయిస్తున్న వ్యక్తితో పాటు కొనుగోలు చేస్తున్న వ్యక్తిని జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా పట్టుకుని రిమాండుకు తరలించారు. శనివారం పేట్బషీరాబాద్లో డీసీపీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం చింతల్ గణేష్నగర్ కమాన్ ప్రాంతంలో ఓ వ్యక్తి నిషేధిత మెథాంఫేటమిన్ డ్రగ్ విక్రయిస్తున్నట్లు కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో దాడి చేశారు. డ్రగ్ను విక్రయిస్తున్న జీడిమెట్లకు చెందిన వేముల సాయికుమార్(25)తో పాటు డ్రగ్ కొనుగోలు చేస్తున్న తిరుమల అరవింద్ను పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ.63.20 లక్షల విలువైన 316 గ్రాముల మెథాంఫేటమిన్ డ్రగ్ పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో డ్రగ్ సరఫరా చేసే కుత్బుల్లాపూర్కు చెందిన ప్రధాన నిందితుడు పూజిత్ పరారీలో ఉన్నాడు. శనివారం సాయికుమార్, అరవింద్లను రిమాండుకు తరలించారు. ఎయిర్పోర్టులో 950 గ్రాముల గంజాయి పట్టివేత శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడు అక్రమంగా తీసుకొచ్చిన గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం థాయ్ విమానాంలో వచ్చిన కజాస్ అస్లం అనే ప్రయాణికుడి కదలికల్లో అనమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు అతడిని క్షుణ్ణంగా పరిశీలించారు. అతడి లగేజీలో హైడ్రోపోనిక్ విధానంలో పండించిన 950 గ్రాముల గంజాయి పట్టుబడింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు కేసు దర్యాప్తు చేపడుతున్నారు. విదేశీ కరెన్సీతో.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ ప్రయాణికుడి వద్ద నిబంధనలకు విరుద్దంగా తీసుకెళుతున్న విదేశీ కరెన్సీపట్టుబడింది. ఆస్ట్రేలియాకు చెందిన సుగోవ్ అబ్సేమ్ అడెన్ అనే వ్యక్తి థాయ్ ఎయిర్వేస్ విమానంలో శుక్రవారం అర్థరాత్రి శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బ్యాంకాక్ వెళ్లేందుకు వచ్చాడు. తనిఖీల సమయంలో అతడి బ్యాగులో భారత కరెన్సీలో 23 లక్షల విలువ చేసే వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఉండడంతో అతడిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరికి రిమాండ్ -
రెండు బైకులు చోరీ
మొయినాబాద్: ఇంటి ఎదుట పార్కుచేసిన రెండు బైకులను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మొయినాబాద్లో చోటుచేసుకుంది. ఎస్ఐ నర్సింహారావు తెలిపిన ప్రకారం.. మొయినాబాద్కు చెందిన మహమ్మద్ యూసుఫ్ టీఎస్ 11 ఈఎక్స్ 5870 నెంబరు గల యమహా బైక్ను ఈ నెల 1న రాత్రి తన ఇంటి ఎదుట పార్కు చేశాడు. మొయినాబాద్కు చెందిన మెరుగు రమేశ్ టీఎస్ 06 ఈఎం 5046 నెంబరు గల స్ప్లెడర్ ప్లస్ బైకును ఈ నెల 1న రాత్రి తన ఇంటి ముందు పార్కుచేసి పడుకున్నాడు. గుర్తుతెలియని దుండగులు అర్థరాత్రి సమయంలో రెండు బైకులను ఎత్తుకెళ్లారు. ఈ విషయమై బాధితులు శనివారం మొయినాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. యుద్ధ వ్యతిరేక సదస్సును విజయవంతం చేయండి షాద్నగర్: సామ్రాజ్యవాద యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ శాంతికోసం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నేడు(ఆదివారం)నిర్వహించనున్న సదస్సును విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు కోరారు. శనివారం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో యుద్ధ వ్యతిరేక సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సదస్సుకు ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ విజయ్, రాఘవాచారి హాజరవుతారన్నారు. అన్నివర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యకరమంలో ప్రజా సంఘాల నాయకులు శ్రీనివాస్, రవీంద్రనాథ్, నర్సింలు, నర్సింలు, సత్యం, కృష్ణ, తిరుమలయ్య, ఈశ్వర్నాయక్, కృష్ణయ్య, సత్యనారాయణ, కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
హనుమాన్ ఆలయంలో చోరీ
శంకర్పల్లి: పట్టణంలోని వీర హనుమాన్ ఆలయంలో చోరీ జరిగిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. శంకర్పల్లి సీఐ ముదస్సర్ అలీ తెలిపిన ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని హనుమాన్నగర్ కాలనీలోని వీర హనుమాన్ ఆలయాన్ని శనివారం ఉదయం పూజారి హరిహరన్ తెరిచాడు. లోపల ఉన్న బీరువా తాళం పగిలిపోయి ఉండడంతో పాటు మిగతా సామగ్రి చిందరవందరగా పడిఉంది. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆలయంలోని మూడు గంటలు, ఒక శఠగోపురం, పంచలోహా దుర్గమాత విగ్రహం, కొంత నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. దుండగుడు చోరీ చేస్తున్న దృశ్యాలు ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పూజారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణరక్షణలో ట్రామా మెడిసిన్ కీలకం
మణికొండ: పెరుగుతున్న ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ట్రామా మెడిసిన్కు అత్యంత ప్రాధాన్యం ఉందని..అది క్లిష్ట పరిస్థితుల్లోను ప్రాణాలను రక్షిస్తుందని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. శనివారం ఫైనాన్షియల్ జిల్లాలోని మెడికవర్ ఆసుపత్రిలో నిర్వహించిన ట్రామా, కాన్ల్ఫిక్ట్ మెడిసిన్పై జరిగిన జాతీయ సదస్సులో గవర్నర్ ముఖ్యఅథితిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాణాపాయ పరిస్థితుల్లో వైద్యుల సత్వర నిర్ణయాలు, సాంకేతిక నైపుణ్యాలు ప్రాణాలను రక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. అలాంటి సందర్భాల్లో వైద్యుల అంకితభావమే అత్యంత శక్తివంతమైన సాధనమన్నారు. మన దేశంతో పాటు విదేశాల నుంచి నిపుణులు హాజరుకావటం సంతోషకరమని, ఈ జ్ఞాన మార్పిడి దేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో కొత్త ఆవిష్కరణలకు దారి తీస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ఎం. దానకిషోర్, మెడికవర్ చైర్మెన్, ఎండీ జి.అనిల్కృష్ణ, ఎగ్గిక్యూటీవ్ డైరెక్టర్ ఎ.శరత్రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా -
‘పైసా బారిష్’ పేరిట మోసం
షాద్నగర్రూరల్: తాంత్రిక పూజలతో డబ్బుల వర్షం(పైసా బారిష్) కురిపిస్తామంటూ ఓ వ్యక్తిని బురిడీ కొట్టించారు గుర్తు తెలియని దుండుగులు. ఈ ఘటన షాద్నగర్ పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లకు చెందిన భాషాకు కొద్ది రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేస్తూ మీరు కొంత డబ్బులను తీసుకువస్తే గురుస్వాములతో తాంత్రిక పూజలు చేయించి పైసా బారిష్ కురిపిస్తామంటూ నమ్మించారు. దీంతో ఆయన తన దగ్గర ఉన్న డబ్బుతో పాటు షాద్నగర్లో ప్లాట్ కొన్నానని ఇద్దరు మిత్రుల నుంచి రూ.పది లక్షలు అప్పుగా తీసుకుని రెండు రోజుల క్రితం పట్టణానికి చేరుకున్నాడు. తనకు పంపిన లొకేషన్తో పరిగి రోడ్డులోని పారడైజ్ కాలనీకి చేరుకుని సదరు వ్యక్తులకు ఫోన్ చేశాడు. దీంతో ఆయన్ను అక్కడే ఉండాలని సూచించారు. కాసేపటికి బైక్పై వచ్చిన వ్యక్తి ముందు వెళుతూ భాషాను కారులో అతనితో పాటు సీఎస్కే విల్లాస్లోకి తీసుకెళ్లాడు.దీంతో భాషా తన స్నేహితులను కారులో ఉండమని చెప్పి తన వద్ద నున్న రూ.9 లక్షలను తీసుకుని గుర్తు తెలియని వ్యక్తితో విల్లాస్లోకి వెళ్లాడు. సదరు వ్యక్తి గురుస్వామికి ఫోన్ చేస్తానని చెప్పాడు. వెంటనే నలుగురు వ్యక్తులు మాస్కులు ధరించి అక్కడకి వచ్చి రెండు డబ్బు సంచులను లాక్కొని రెండు బైక్లపై పారిపోయారు. దీంతో షాక్కు గురైన భాషా కాసేపటికి వారు ఎవరని ప్రశ్నించగా తెలియదని సమాధానం ఇచ్చాడు. దీంతో మోసపోయానని తెలుసుకున్న భాషా పోలీసులను ఆశ్రయించాడు. రూ.9 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు -
ప్రేయసి పెళ్లికి నిరాకరించిందని..
యువకుడి బలవన్మరణం శంకర్పల్లి: ప్రాణంగా ప్రేమించిన ప్రేయసి పెళ్లికి నిరాకరించిందనే మనస్తాపంతో ఓ యువకుడు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని చెందిప్ప గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ ముదస్సర్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొండా నర్సింలుకి ముగ్గురు కుమారులు ఉన్నారు. చిన్నవాడైన ప్రశాంత్ (24) నగరంలోని ఎంజీబీఎస్ బస్టాండ్లో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. మూడేళ్లుగా మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో ఉన్నాడు. ఇటీవల ఆ యువతిని పెళ్లి చేసుకుందాం అని అడిగే సరికి ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురైన అతను శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లాడు. రాత్రి 10గంటలు దాటినా ఇంటికి రాకపోయే సరికి కుటుంబసభ్యులు చుట్టు పక్కల, బంధువుల వద్ద వెతికారు. చివరికి పొలంలోని మామిడి చెట్టుకి ఉరివేసుకొని కనిపించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శనివారం పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి ఆత్మహత్యశంకర్పల్లి: ఒంటరితనం భరించలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం రావులపల్లి కలాన్లో చోటు చేసుకుంది. సీఐ ముదస్సర్ అలీ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన ఇంద్రేశం బుచ్చయ్యకి ఇద్దరు కుమారులు. వారిలో చిన్నవాడు మల్లేశం(34) పూల డెకరేషన్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకి ఎనిమిదేళ్ల క్రితం తాండూరుకి చెందిన నవనీతతో వివాహమైంది. వీరికి ఒక కొడుకు, కుమార్తె సంతానం. ఏడాది క్రితం భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో నవనీత పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో మల్లేశంకి ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. తర్వాత కోలుకున్నప్పటికీ ఒంటరితనంతో జీవితంపై విరక్తి చెందిన ఆయన శుక్రవారం రాత్రి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శనివారం మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అనంతరం బాడీని కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది. గుర్తు తెలియని వాహనం ఢీ యువకుడు మృతి కొత్తూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కొత్తూరు పట్టణంలోని పెంజర్ల కూడలి జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. పెంజర్ల కూడలిలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన చందన్కుమార్(25) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. ఉరేసుకుని వ్యక్తి బలవన్మరణంమణికొండ: ఉరేసుకొని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని శనివారం వెలుగుచూసింది. ఎస్సై మురళీధర్ తెలిపిన వివరాల ప్రకారం..ఖానాపూర్ సర్వేనెంబర్ 65లోని చెట్ల పొదలలో 30–35 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి మృతదేహం కుళ్లిన స్థితిలో స్థానికులకు కనిపించిందన్నారు. వారి సమాచారంతో వెళ్లి చూడగా అతను 10 రోజుల క్రితమే మృతి చెంది ఉంటాడని, ప్రహరీ, ఫెన్సింగ్కి ఉన్న ఖాళీ స్థలంలో తన షర్ట్తో ఉరేసుకుని ఉన్నట్టు తెలుసుకున్నామన్నారు. మృతదేహాన్ని ఉస్మాని యా ఆసుపత్రికి తరలించామని, కేసు దర్యాప్తులో ఉందన్నారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన టిప్పర్
కరెంటు సరఫరాకు అంతరాయం తాండూరు రూరల్: ఎర్రమట్టి టిప్పర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటన పెద్దేముల్ మండలం రాంసింగ్ తండా వద్ద శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తండా సమీపంలో ఎర్రమట్టి క్వారీలు ఉన్నాయి. క్వారీ నుంచి ఓ టిప్పర్ రోడ్డుపైకి వచ్చే క్రమంలో అతివేగంగా విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. వాహనం బోల్తా పడి స్తంభం విరిగి విద్యుత్ తీగలు రోడ్డుపై పడ్డాయి. దీంతో అడికిచెర్ల, పాషాపూర్, రాంసింగ్ తండా, ఊరేంటి తండా, బాయిమీదితండాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. లారీ డ్రైవర్ పరారయ్యాడు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని ఆ శాఖ అధికారులు తెలిపారు. -
ఫీజుల పెంపు విరమించుకోవాలి
మొయినాబాద్రూరల్: ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ శనివారం సుజాత ఇంటర్నేషనల్ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేపట్టారు. నాగిరెడ్డిగూడ రెవెన్యూ పరిధిలోని సుజాత ఇంటర్నేషనల్ పాఠశాల యాజమాన్యం గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఫీజులు పెంచిందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి బ్యాగరి అరుణ్కుమార్ మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలలు, యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను ఫీజుల పేరిట వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని అధికారులను కోరుతామని హెచ్చరించారు. విద్యాధికారి పాఠశాలను సందర్శించి ఫీజులను పరిశీలించి వారికి నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పాఠశాల యాజమాన్యం ముందుకు వచ్చి పదిరోజుల్లో తల్లిదండ్రులతో కలిసి సమావేశమవుదామని చెప్పడంతో ధర్నా విరమించారు. పాఠశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు, ఎస్ఎఫ్ఐ నాయకుల ధర్నా -
అదుపు తప్పి.. కారు పల్టీ
తుర్కయంజాల్: మితిమీరిన వేగంతో వస్తున్న ఓ కారు అదుపు తప్పి పల్టీ కొట్టిన సంఘటన శుక్రవారం సాయంత్రం ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధి రాగన్నగూడ సాగర్ హైవేపై చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో కారును సైతం ఢీకొట్టడంతో రహదారిపై ట్రాఫిక్ జాం ఏర్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓఆర్ఆర్ నుంచి తుర్కయంజాల్ వైపునకు ఓ కారు వస్తుంది. మార్గమధ్యలో సబ్స్టేషన్ సమీపంలోకి వచ్చాక యూటర్న్ వద్ద వేగాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా అకస్మాత్తుగా హ్యాండ్ బ్రేక్ వేయడంతో పల్టీ కొట్టడంతో పాటు ముందుగా వెళ్తున్న మరో కారును ఢీ కొట్టింది. ఈ క్రమంలో డివైడర్ పైన ఉన్న మొక్కలు, ప్రకటన బోర్డును సైతం ధ్వంసం చేసి అవతలి వైపునకు దూసుకెళ్లింది. ఇదిలా ఉండగా రెండు కార్లలో చిన్న పిల్లలతో కలిసి మొత్తం 10 మంది ప్రయాణిస్తున్నారు. అదృష్టవశాత్తు చిన్న గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భారీగా ట్రాఫిక్ జాం ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించినప్పటికీ సీఎం రేవంత్రెడ్డి పర్యటన బందోబస్తు ఉండడంతో ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో సాగర్ రహదారిపై రెండు వైపులా భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు కారును పక్కకు జరిపించి, వాహనాల రద్దీని క్లియర్ చేశారు. దీంతో గంట పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. -
10న వాణిజ్య దుకాణాల వేలం
కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి మహేశ్వరం: మండలంలోని మన్సాన్పల్లి, మంఖాల్ గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం కాలనీలలో ఖాళీగా ఉన్న వాణిజ్య దుకాణాలను విక్రయించడానికి జిల్లా కలెక్టర్, హౌసింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 10న బహిరంగ వేలం నిర్వహిస్తున్నామని కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలోని మంఖాల్ ఫేజ్–2(తుక్కుగూడ దగ్గరలో) 35 దుకాణాలు వాటి విస్తీర్ణం 189 చ. అడుగుల నుంచి 231 చ.అడుగుల వరకు ఉంటుంది. ప్రతి చదరపు అడుగు రూ.2,500గా నిర్ణయించారు. మన్సాన్పల్లి ఫేజ్–1, 2(మహేశ్వరం దగ్గరలో) మొత్తం దుకాణాలు 57 వాటి విస్తీర్ణం 130 చదరపు అడుగుల నుంచి 266 చదరపు అడుగుల వరకు, ప్రతి చదరపు అడుగు రూ.2000 నుంచి 2200 వరకు ఉంటుందన్నారు. ఈఎండీ మొత్తం రూ.36 వేలు ఏదైన జాతీయ బ్యాంకు నుంచి జిల్లా కలెక్టర్ రంగారెడ్డి జిల్లా పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్(డీడీ) తీసీ వేలం పాల్గొనాలని సూచించారు. పూర్తి వివరాలకు పీడీ హౌసింగ్ మేనేజర్ 9063191168, పీడీ హౌసింగ్ 8712032727, ఆర్డీఓ కార్యాలయం డీటీ 7601055677 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని కోరారు. తెలంగాణపై సన్రైజర్స్ చిన్న చూపు ఎస్ఆర్హెచ్ కార్యాలయం ఎదుట ధర్నా సాక్షి, సిటీబ్యూరో: దేశవాళీ క్రికెట్ పోటీల్లో సత్తా చాటుతున్న తెలంగాణ ప్లేయర్లను సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఎందుకు చిన్న చూపు చూస్తోందో ఆ జట్టు యజమాని కావ్య మారాన్ సమాధానం చెప్పాలని తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (టీడీసీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు, శాట్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బంజారాహిల్స్లోని ఎస్ఆర్హెచ్ కార్యాలయం ముందు విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ధర్నా చేశారు. అనంతరం ఎస్ఆర్హెచ్ ప్రతినిధి నగేష్కు వినతిపత్రం సమర్పించారు. ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి సుమారు 100 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా ఒక్కరిని కూడా కొనుగోలు చేయకపోవడం అన్యాయమని విమర్శించారు. ఆరోన్ జార్జ్, అమన్రావు వంటి తెలంగాణ యువ ప్లేయర్లను ఎందుకు వేలంలో ఎస్ఆర్హెచ కొనుగోలు చేయలేదని నిలదీశారు. ఎస్ఆర్హెచ్కు తెలంగాణ డబ్బులు, మౌలిక వసుతులు కావాలి కానీ, ఇక్కడి స్థానిక ప్లేయర్లకు కనీస అవకాశాలు ఇవ్వరా? అని ప్రశ్నించారు. తెలంగాణపై ఎస్ఆర్హెచ్ సవతి తల్లి ప్రేమను కట్టిపెట్టాలని అన్నారు. ధర్నాలో విద్యార్థి సంఘాల నాయకులు రాజేష్, ప్రశాంత్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
అణగారిన వర్గాల సమస్యలపై పోరు
చేవెళ్ల: అణగారిన వర్గాల సమస్యలపై ఎమ్మార్పీఎస్ పోరాటాలు చేసేందుకు సిద్ధమవుతుందని సంఘం జిల్లా కార్యదర్శి బ్యాతల శివశంకర్మాదిగ అన్నారు. మండలంలోని దేవరంపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి సమావేశం నిర్వహించి నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి శివశంకర్మాదిగ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో 31 ఏళ్లుగా సజీవంగా నిలబడి లక్ష్యాన్ని సాధించిన ఏకై క సామాజిక ఉద్యమం ఎమ్మార్పీఎస్దే అన్నారు. అయితే సంఘం కేవలం మాదిగలకే పరమితం కాకుండా సమస్త పీడిత అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని తెలిపారు. అనంతరం దేవరంపల్లి నూతన అధ్యక్షుడిగా ఎర్రవల్లి భిక్షపతి, ఉపాధ్యక్షుడిగా ఎర్రవల్లి రమేశ్, కార్యదర్శిగా గడ్డమీది శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా నర్సింలు, కోశాధికారిగా శివయ్య, అధికార ప్రతినిధిగా నవీన్ ఎన్నుకున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో నాయకులు నరేందర్, బాలు, యాదయ్య, ప్రవీణ్, జంగయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి శివశంకర్మాదిగ -
కానిస్టేబుల్ ఇంట్లో చోరీ
యాచారం: పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో చోరీ జరిగిన సంఘటన మండల పరిధిలోని నందివనపర్తిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం సాయంత్రం నగరంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చి చూసే సరికి తాళం పగులగొట్టి ఉంది. వెళ్లి చూడగా అల్మారాలో ఉన్న రూ.65 వేల నగదు, రెండున్నర తులాల బంగారం, 25 తులాల వెండి చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు. -
మతిమరుపుతో పట్టాలు దాటుతూ..
షాద్నగర్రూరల్: మతిమరుపు వ్యాధితో బాధపడుతున్న ఓ వృద్ధురాలు రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని చిల్కమర్రి రైల్వేగేట్ సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే హెడ్కానిస్టేబుల్ మల్లేశ్వర్ కథనం ప్రకారం.. కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన పోలెమోని పద్మమ్మ (66) మూడేళ్లుగా మతిమరుపుతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున చిల్కమర్రి గ్రామసమీపంలోని రైల్వేగేట్ను దాటుతుండగా అదే సమయంలో వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ పద్మమ్మను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పద్మమ్మ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. లోకో పైలెట్ సహకారంతో విషయం తెలుసుకున్న షాద్నగర్ స్టేషన్ మాస్టర్ అభిషేక్కుమార్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రైల్వే హెడ్కానిస్టేబుల్ మల్లేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.రైలు ఢీకొని వృద్ధురాలి మృతి -
విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా బోధించాలి
పంజగుట్ట: విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా భాషా బోధన అందించాలి తప్ప బలవంతంగా పరభాషను రుద్దాలనే ప్రయత్నాన్ని చేయరాదని రౌండ్ టేబుల్ సమావేశంలోని వక్తలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్ ప్రెస్క్లబ్ లో ‘నూతన విద్యా పాలసీ– పర్యవసానాలు’ అనే అంశంపై రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రొఫెసర్ లక్ష్మణ్ , ప్రొఫెసర్ వినాయక రెడ్డిల అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు మాట్లాడుతూ.. గత కొంతకాలం క్రితం విద్యా కమిషన్ ఇచ్చిన ఎడ్యుకేషన్ పాలసీ కేవలం నివేదిక మాత్రమే అని, దీనిపై ఇంకా కసరత్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. 20 రోజులలో వెబ్సైట్ లో ఉంచుతామని, తదనంతరం వచ్చే సలహాలు సూచనలు స్వీకరించి మార్పులు చేర్పులు చేసిన తర్వాత తుది రూపు ఇచ్చి ప్రభుత్వానికి అందిస్తామన్నారు. దీనిపై ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జీతాల పెరుగుదల ఉంటుంది తప్ప తగ్గించే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. ముగ్గురు వైస్ చాన్సలర్లతో పాటు, ఉపాధ్యాయ సంఘాలు, ఎన్జీవోలు, విద్యార్థి సంఘాలతో త్వరలో సమావేశం నిర్వహిస్తామన్నారు. మాజీ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. విద్య వైద్యం విషయంలో ప్రభుత్వాలు బడ్జెట్లో పెద్దపీట వేసినప్పుడే సామాన్య ప్రజలకు అవి అందుబాటులోకి వస్తాయన్నారు. నీటిపారుదల శాఖ మాజీ చైర్మన్ వి ప్రకాష్ మాట్లాడుతూ ప్రభుత్వం వేసిన విద్యా కమిషన్ కి ప్రత్యామ్నాయంగా పీపుల్స్ కమిషన్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందరన్నారు. కార్యక్రమంలో లెక్చరర్ల సంఘం నాయకులు మధుసూదన్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సలహాదారులు ఉపేందర్ రెడ్డి, జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, పాల్గొన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● ఈ నెలాఖరులో రెండో విడత మంజూరు ● మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆమనగల్లు: రాష్ట్రంలో ఈనెలాఖరులోగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని విఠాయిపల్లిలో గురువారం ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం సమీకృత భూ భారతి పోర్టల్ను ప్రారంభించారు. కల్వకుర్తి నియోజకవర్గానికి అదనంగా 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, వెల్దండ మండలంలోని చెదురుపల్లి, కుప్పగండ్ల గ్రామాల్లో రైతుల భూ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు. ఆమనగల్లులో ప్రభుత్వ డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. ఇందిరమ్మ ఇళ్లు ఈనెలాఖరులో మంజూరు చేస్తామని తరువాత మూడో విడత, నాలుగో విడత మంజూరు చేసి అర్హులైన వారందరికీ అందిస్తామని మంత్రి చెప్పారు. ఆమనగల్లులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని, కార్యాలయాన్ని తానే వచ్చి ప్రారంభిస్తానని అన్నారు. నివాస గృహాల మధ్య ఉన్న డంపిగ్యార్డును మరోచోటకు తరలించడానికి స్థలాన్ని ఎంపిక చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వెల్దండ మండలం చెదురుపల్లి, కుప్పగండ్ల రైతుల సమస్యలకు సంబంధించిన ఫైల్ తనవద్దే ఉందని, త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కల్వకుర్తిలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి సంబందిత మంత్రితో మాట్లాడతానని చెప్పారు. మాడ్గులలో రెవెన్యూ కార్యాలయ భవనానికి నిధులు మంజూరు చేయాలని మార్కెట్ మాజీ చైర్మన్ బట్టు కిషన్రెడ్డి, ఆమనగల్లులో డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని జర్నలిస్టు సంఘం నాయకులు మంత్రికి వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో సీసీఎల్ఏ లోకేశ్కుమార్, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, మార్కెట్ చైర్మన్ యాట గీత, కౌన్సిలర్ అనిత, పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు ఎంపిక
కేశంపేట: మండల ప రిధిలోని కొండారెడ్డిపల్లికి చెందిన కర్నెకోట అరుణ్తేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున అండర్–19 విభాగంలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. నేపాల్లో మే 27 నుంచి జూన్ 3 వరకు జరిగే పోటీల్లో అల్రౌండర్గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం బెంగళూర్లో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ చదువుతున్నాడు. ఒంగోలుకు చెందిన రంజీ ప్లేయర్ హఫీజ్ సహకారంతో క్రికెట్లో శిక్షణ పొందుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు ఎంపికై న అరుణ్తేజ్ను పలువురు అభినందించారు. అశ్వ వాహనంపై ఊరేగిన బాలాజీ మొయినాబాద్: బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం చిలుకూరు బాలాజీ అశ్వ వాహనంపై ఊరేగారు. స్వామివారిని అశ్వ వాహనంపై ఆసీనులను చేసి చిలుకూరు గ్రామంలో ఊరేగింపు చేపట్టారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి మహాభిషేకం, ఆస్థాన సేవ, దోప్సేవ, పుష్పాంజలి సేవలు అందించారు. ఉత్సవాల్లో కన్వీనర్ గోపాలకృష్ణస్వామి, అర్చకులు రంగరాజన్, తిరుమల కిరణాచారి, పరావస్తు రామాచారి, నరసింహన్ కన్నయ్య, కిట్టు, మురళి, సురేష్, నాగరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ గరుగు రాజు, కౌన్సిలర్లు శ్రీలత రాంచందర్, జగపతి, అనసూయ, శిరీష తదితరులు పాల్గొన్నారు. అవినీతి అధికారులపై సస్పెన్షన్ వేటు బండగ్పేట సర్కిల్లో ఒకేసారి పదిమందిపై చర్యలు బడంగ్పేట్: ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో రంగంలోకి దిగిన విజిలెన్స్, ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. బడంగ్పేట సర్కిల్ అధికారుల వ్యవహారానికి సంబంధించిన నివేదికను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్కు అందించారు. ఈ మేరకు ఆయన సదరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెండ్ అయినవారిలో సర్కిల్–16 డీసీ పి.సరస్వతి, ఏఎంసీ జి.శ్రీధర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జి.రఘు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎ.యాదయ్య, వెంకన్న, జ్యోతిరెడ్డి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.వినీల్ కుమార్గౌడ్, ఏఎంసీ డి.నాగేశ్వర్ రావు, శానిటరీ ఇన్స్పెక్టర్ వై.యాదగిరి, ప్రీ ఆడిట్ ఆఫీసర్ ఎన్.వెంకట్ ఉన్నారు. పనులు చేయకుండానే చేసినట్లు చూపి, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందుకు చర్యలు తీసుకున్నారు. డీసీ సరస్వతి స్థానంలో అత్తాపూర్ సర్కిల్–20లో డీసీగా పనిచేస్తున్న సమ్మయ్యను నియమిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇళ్ల మధ్యే కల్తీ నెయ్యి కుత్బుల్లాపూర్: జనవాసాల మధ్య నడుపుతున్న కల్తీ నెయ్యి తయారీ పరిశ్రమలను తరలించాలని కోరుతూ సుభాష్నగర్ ఫేజ్–1 వాసులు గురువారం కొంపల్లి సర్కిల్ ఉప కమిషనర్ కృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. సుభాష్నగర్లోని ఓ ఇంట్లో అనధికారికంగా కొందరు వ్యక్తులు కల్తీ నెయ్యి తయారీ యూనిట్ను నడుపుతున్నారని, నాణ్యత లేని పదార్థాలు, వ్యర్ధాలను వినియోగిస్తున్నారన్నారు. తీవ్ర దుర్వాసనలతో ఇబ్బందులు పడుతున్నామని, సదరు పరిశ్రమలో తనిఖీలు నిర్వహించి ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించాలని వినతిలో కోరారు. కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. -
రేవంత్రెడ్డి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం
మొయినాబాద్: కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అక్కడి సీఎం విజయన్పై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ అన్నారు. గురువారం మొయినాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, కేరళం సీఎం విజయన్ ఒక్కటే అని రేవంత్రెడ్డి మాట్లాడటం ఆయన రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. కేరళంలో విద్యా రంగానికి 24 శాతం నిధులు కేటాయిస్తున్నారని, తెలంగాణలో రేవంత్రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కేవలం 8 శాతం నిధులు మాత్రమే కేటాయించారన్నారు. కేరళం ప్రజలకు నాణ్యమైన ప్రభుత్వ వైద్యం అందుతుందని, కానీ తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగాన్ని గాలికొదిలేసిందని, ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని అరికట్టడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి కేవలం ఉచిత బస్సు తప్పా మిగతా పథకాలను అమలు చేయడంలేదన్నారు. సీపీఎం దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్, బీజేపీపై అలుపెరుగని పోరాటం చేస్తుందని సీఎం రేవంత్రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. కేరళం సీఎం విజయన్కు రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం డివిజన్ కమిటీ సభ్యులు ప్రభుదాస్, మల్లారెడ్డి, శ్రీనివాస్, సాయిబాబా, నర్సింహ, లక్ష్మయ్య ఉన్నారు.సీపీఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి దేవేందర్ -
యువకుడి అదృశ్యంపై కేసు నమోదు
పహాడీషరీఫ్: ఫోన్ చూ డొద్దంటూ సోదరుడు మందలించడంతో యువకుడు ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలం బాలన్పల్లి గ్రామానికి చెందిన బారు బుచ్చయ్య కుటుంబం బతుకుదెరువు నిమిత్తం మామిడిపల్లి గ్రామానికి వలస వచ్చి మెగా వైడ్ కంపెనీలో పనిచేస్తూ, లేబర్ క్యాంప్లో నివాసం ఉంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ చూడొద్దంటూ అతని పెద్ద కుమారుడు అరుణ్ గత నెల 20వ తేదీన చిన్న కుమారుడు మధు(17)ను మందలించాడు. మరుసటి రోజు ఉదయం లేచిచూడగా, మధు కనిపించలేదు. అతని ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో తండ్రి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ -
ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కృషి
● ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ● తుమ్మలూరులో ప్రజా పాలన గ్రామ సభ మహేశ్వరం: ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ్ణారావు అన్నారు. తుమ్మలూరు పంచాయతీ కార్యాలయంలో గురువారం ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. 2047 విజన్తో తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలన్నది సీఎం రేవంత్రెడ్డి ఉద్దేశమని తెలిపారు. ఆరు గ్యారంటీలతో పాటు కొత్త రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. హాస్టళ్లు, స్కూళ్లలో డైట్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలను పెంచడం ద్వారా పేద విద్యార్థులకు మెరుగైన ఆహారం, వసతి కల్పిస్తున్నట్లు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు, స్కూల్ యూనిఫామ్స్ కుట్టే పనులు, ఆర్టీసీ డ్రైవింగ్ శిక్షణ వంటి కార్యక్రమాల ద్వారా ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. గ్రామ స్థాయిలోనే సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తుమ్మటి అండాలు కృష్ణ యాదవ్, ఉప సర్పంచ్ సంగారెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీపీఓ సురేష్ మోహన్, డీఈఓ సుశీందర్రావు, జిల్లా అధికారులు శ్రీలత, సురేష్, వనజాత, శ్రీలక్ష్మి, లలితాదేవి, తహసీల్దార్ చిన్న అప్పల నాయుడు, ఎంపీడీఓ శైలజ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు నిబద్ధత కలిగి ఉండాలి
శంకర్పల్లి: విద్యార్థులు చిన్నప్పటి నుంచే తమ అభిరుచులపై కచ్చితమైన నిబద్ధతతో ఉండి, వాటిని సాకారం చేసుకోవాలని ప్రముఖ సినీ నటి అమల అన్నారు. దొంతాన్పల్లిలోని ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న త్రిథి–2026 కార్యక్రమానికి గురువారం ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని ప్రతిభ, సృజనాత్మకతను ఇలాంటి కార్యక్రమాల ద్వారా బయటకు తీయొచ్చని అన్నారు. బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ సంస్థతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ జంతు సంక్షేమం, పరిరక్షణ, స్టెరిలైజేషన్ గురించి మాట్లాడారు. వీధి కుక్కలపై మనుషులు క్రూరంగా కాకుండా మానవత్వంతో వ్యవహరించాలని, వాటిని చంపకుండా సంరక్షణ కేంద్రాలకు తరలించే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో ఇక్ఫాయ్ వీసీ ప్రొ. డా. కోటిరెడ్డి, రిజిస్ట్రార్ విజయలక్ష్మి, లా స్కూల్ అసిస్టెంట్ డీన్ డా.అరుణ్ కుమార్, ఇక్ఫాయ్ సొసైటీ చైర్పర్సన్ శోభారాణి, లా స్కూల్ డైరెక్టర్ ప్రొ. డా.రవిశేఖర రాజు, కో–ఆర్డినేటర్ డా.గౌరీ బి. చనాల్ తదితరులు పాల్గొన్నారు. -
వారికి పరీక్ష.. వీరికి ప్రయాస
మంచాల: పదో తరగతి పరీక్షలు మంచాల కేజీబీవీ(కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ) విద్యార్థినులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. కేజీబీవీ భవనాన్ని ఎస్ఎస్సీ పరీక్ష కేంద్రంగా ఎంపిక చేయడంతో పరీక్షలున్న రోజు ఆ విద్యార్థినులను బయటకు పంపించేస్తున్నారు. సమీపంలోని మహిళా సమాఖ్య పాత భవనంలో ఈ చిన్నారులకు తరగతులు నిర్వహిస్తున్నారు. మహిళా సమాఖ్య భవనంలో ఒకే హాల్ ఉండడం.. ఒక్క హాల్లోనే 200 మంది విద్యార్థినులకు తరగతులు నిర్వహిస్తుండడం అసౌకర్యంగా మారింది. గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి పునరావృతమవుతోంది. మండల పరిధిలో పెద్ద భవనాలున్న పాఠశాలలున్నప్పటికీ.. ఇక్కడే పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసి విద్యార్థినులను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ విద్యార్థి సంఘాల నేతలు మండి పడుతున్నా రు. మహిళా సమాఖ్య భవనంలో కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పరీక్ష కేంద్రాన్ని తరలించడమో.. లేక పరీక్షలున్న రోజు ప్రత్యామ్నాయంగా వసతులున్న భవనంలో తరగతులు నిర్వహించాలని సూచిస్తున్నారు. ఇబ్బందులు కలిగించొద్దు పదో తరగతి పరీక్షల పేరిట విద్యార్థినులను ఇబ్బంది పెట్టడం సరికాదు. వారికి అన్ని రకాల వసతులున్న చోట తరగతులు నిర్వహించాలి. లేకుంటే పరీక్ష కేంద్రాన్ని మరో చోటుకు మార్చాలి. పరీక్షలున్న రోజుల్లో ఒకే గదిలోనే నిర్వహించడం సరికాదు. – ప్రశాంత్యాదవ్, బీఆర్ఎస్వీ మండల ప్రధాన కార్యదర్శి పది సెంటర్ ఏర్పాటుతో కేజీబీవీ విద్యార్థినులకు తిప్పలు -
ఎన్నికకు అడ్డొస్తే ప్రజలు క్షమించరు
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇబ్రహీంపట్నం: స్థానికంగా ఈ నెల 4వ తేదీన జరిగే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు అధికార కాంగ్రెస్ అడ్డుపడితే ప్రజలే తగినవిధంగా బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి హెచ్చరించారు. ఇబ్రహీంపట్నంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. న్యాయస్థానాన్ని అడ్డు పెట్టుకొని ఎన్నికలను ఆపాలేరన్నారు. మున్సిపాలిటీలో మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ గెలిచిన అప్రజాస్వామ్యంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వ్యవహారిస్తున్నారని.. ఈ తీరును మార్చుకోవాలన్నారు. ఎన్నికలు జరిగి 50 రోజులు దాటినా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను జరగకుండా ఎమ్మెల్యే అడ్డుపడుతుండటంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనపై, తన కుమారుడు ప్రశాంత్రెడ్డిపై కిడ్నాప్ కేసు వేయడం దారుణమన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై ఒక్క కేసులేదన్నారు. ఇప్పటికి రెండుసార్లు జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను బెదిరించి వాయిదా వేయించారన్నారు. 4వ తేదీన జరిగే ఈ ఎన్నికను మళ్లీ గొడవలు సృష్టించి వాయిదా వేయిస్తే ఇక ప్రజలు క్షమించరని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రమణారెడ్డి, మాజీ డైరెక్టర్ కిరణప్ప, విద్యార్థి విభాగం నాయకులు జగదీశ్, అరవింద్, శివసాయి తదితరులు పాల్గొన్నారు. మదర్ డెయిరీకి పూర్వ వైభవం తెస్తాం చైర్మన్ గుడిపాటి మధుసూదన్రెడ్డి హయత్నగర్: ప్రభుత్వ చొరవతో ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు)తో ఒప్పందం చేసుకుంటున్నామని, దీంతో డెయిరీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించి పూర్వ వైభవం తీసుకొస్తామని నార్ముల్ మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్రెడ్డి అన్నారు. హయత్నగర్లోని పాలనా భవనంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పదేళ్లలో జరిగిన అవకతవకల కారణంగా డెయిరీ నష్టాల్లోకి వెళ్లిందన్నారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో సీబీఐ విచారణ చేపట్టిందని, విచారణలో భాగంగా అప్పటి నుంచి ఇప్పటివరకు పనిచేసిన డైరెక్టర్లు, సిబ్బందికి నోటీసులు ఇచ్చిందని తెలిపారు. దీనిని ఆసరాగా చేసుకుని కొంతమంది తమపై మాత్రమే విచారణ జరుగుతన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అసత్య ప్రచారాలను రైతులు, ఉద్యోగులు నమ్మొద్దన్నారు. డెయిరీలో జరిగిన అవినీతిపై రాష్ట్ర కో ఆపరేటివ్ విభాగం విచారణ చేపట్టిందని అందుకు డీసీఓతో కమిటీ వేసినట్లు వెల్లడించారు. ఎన్డీడీబీతో ఒప్పందంతో అవినీతికి చెక్ పెడతామని, పాల సేకరణ, మార్కెట్ను పెంచుతామని, రైతులకు సకాలంలో బిల్లులు చెల్లిస్తామని వివరించారు. వారం రోజుల్లో ఒప్పంద ప్రక్రియ పూర్తవుతుందని, ఇందుకు సీఎం రేవంత్రెడ్డి పూర్తి సానుకూలంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎండీ కాటెపల్లి లింగారెడ్డి, ఏఓ అబ్దుల్ గఫార్ తదితరులు పాల్గొన్నారు. ఫ్యూచర్సిటీలో సీఎంతో భేటీ మహేశ్వరం: ఫ్యూచర్సిటీ పరిశీలనకు విచ్చేసిన సీఎం రేవంత్రెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ సుధీర్బాబు, మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డిలతో పాటు మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ఏసీపీలు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ఏసీపీలు జానకిరెడ్డి, రాజు, సీఐలు రాఘవేందర్రెడ్డి, వెంకటేశ్వర్లు ఉన్నారు. -
అక్రమ భూ కేటాయింపులపై పోరాటం
మాజీ మంత్రి హరీశ్రావుకందుకూరు: ఫార్మాసిటీ భూములను ఫ్యూచర్సిటీ పేరుతో పప్పు బెల్లాలు పంచినట్లు సీఎం తన అనుయాయులకు పంచి పెడుతున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. గురువారం మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డితో కలిసి కందుకూరు మండలం సార్లరావులపల్లిలోని పెద్దమ్మతల్లి దేవాలయం వార్షికోత్సవ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వస్తే ఫార్మా భూములను తిరిగి రైతులకు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. అన్యాయంగా, అక్రమంగా చేస్తున్న భూ కేటాయింపులపై పోరాటం చేస్తామన్నారు. ఫార్మాసిటీ పెడతారా లేక రైతులకు భూములు తిరిగిస్తారా అని నిలదీశారు. కేసీఆర్ హయాంలో మహేశ్వరం నియోజకవర్గానికి రూ.100 కోట్లతో మెడికల్ కళాశాల, రూ.150 కోట్లతో 250 పడకల ఆస్పత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి భూమిని కేటాయించి శంకుస్థాపన చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసి ఎల్బీనగర్కు తరలిస్తోందని విమర్శించారు. ఎల్బీనగర్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాల్సిన స్థలంలో మెడికల్ కళాశాల నిర్మిస్తున్నారన్నారు. ఇక్కడే మెడికల్ కళాశాలతో పాటు 250 పడకల ఆస్పత్రి నిర్మించాలని డిమాండ్ చేశారు. అవగాహన లేకుండా కిషన్రెడ్డి వ్యాఖ్యలు పార్లమెంట్లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఏడు మండలాలను బీజేపీ పాలనలోనే ఏపీకి ఇచ్చారన్నారు. లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును తెలంగాణకు లేకుండా చేసింది బీజేపీనే అన్నారు. అవగాహన లేకుండా కిషన్రెడ్డి విభజన చట్టంలోనే ఉందనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాళేశ్వరంపై కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కేంద్ర మంత్రి, సీఎం ఇద్దరూ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందంటున్నారని, మరి లక్ష ఎకరాలు ఎలా సాగవుతున్నాయని ప్రశ్నించారు. కాళేశ్వరంతో తెలంగాణలో ఆయకట్టు పెరిగిందని సోషల్ ఎకనామిక్ సర్వేలో కేంద్ర ప్రభుత్వమే తెలిపిందని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి గడ్కరీ కూడా కాళేశ్వరంతోతెలంగాణ స్వరూపమే మారిపోయిందని మెచ్చుకున్నారనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. బీఆర్ఎస్ కట్టిందని రేవంత్రెడ్డి, కిషన్రెడ్డి ఇద్దరూ కూడబలుక్కుని బురద జల్లడం మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్, జి.లక్ష్మీనర్సింహారెడ్డి, ప్రవీణ్నాయక్, మేఘనాథ్రెడ్డి, గోపాల్రెడ్డి, కాకి రాములు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా సాంప్రదాయ దినోత్సవం
మొయినాబాద్: భిన్న సంస్కృతులు.. సాంప్రదాయ వస్త్రధారణ.. సంగీతం, నృత్య ప్రదర్శనలతో చైనత్య డీమ్డ్ టూబీ విశ్వవిద్యాలయ ప్రాంగణం కళకళలాడింది. మొయినాబాద్ మున్సిపాలిటీ హిమాయత్నగర్లోని చైతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీలో గురువారం సాంప్రదాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు సాంప్రదాయ వస్త్రధారణతో నృత్య ప్రదర్శనలు చేసి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఫౌండర్, ఛాన్స్లర్ డాక్టర్ సీహెచ్ పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో మన సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందించేందుకు, సాంప్రదాయ విలువలను కాపాడుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. శనివారం జరిగే యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవం వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో డైరెక్టర్ సాత్వికరెడ్డి, వైస్ ఛాన్స్లర్ జి.శంకర్లింగం, రిజిస్ట్రార్ ఎం.రవీంద్ర, అసిస్టెంట్ రిజిస్ట్రార్ రాంబాబురెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
చెరువులో దూకి యువకుడి ఆత్మహత్య
● బైక్, సెల్ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులతో గొడవ ● డబ్బులు లేవని చెప్పడంతో అఘాయిత్యం షాద్నగర్ రూరల్: బైక్, సెల్ఫోన్ కొనివ్వడంలేదని తల్లితండ్రులతో గొడవ పడిన ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఫరూఖ్నగర్ మండలం కిషన్నగర్ శివారులో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ఎల్లంపల్లి నర్సమ్మ, జంగయ్య దంపతుల కుమారుడు, అవివాహితుడు ఎల్లంపల్లి పవన్కుమార్(27) ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నాడు. పవన్కుమార్ తన ఖర్చులకోసం డబ్బులు కావాలని తరచూ తల్లితండ్రులతో గొడ వ పడేవాడు. ఈ నేపథ్యంలో బైక్, సెల్ఫోన్ కొనివ్వాలని మంగళవారం రాత్రి గొడవ చేశాడు. కూలీ నాలీ చేసి కుటుంబాన్ని నడుపుతున్నామని, మా దగ్గర డబ్బులు లేవని తల్లితండ్రులు చెప్పడంతో పవన్కుమార్ ఇంట్లోనుంచి వెళ్లిపోయాడు. అదేరోజు రాత్రి గ్రామ సమీపంలోని బండ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం సాయంత్రం పవన్కుమార్ మృతదేహం చెరువులో తేలిందని సమాచారం అందడంతో ఎస్ఐ రాంచందర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్టుమార్టం నిమి త్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి జంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్ఐ గోపాల్ తెలిపారు. తల్లడిల్లిన తల్లి హృదయం.. కూతురు పెళ్లి చేయగా ఉన్న ఒక్కగానొక్క కుమారుడిపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమతో గొడవ పడిన కొడుకు బయటకు వెళ్లిపోవడంతో తల్లి నర్సమ్మ రాత్రంతా గ్రామంలో వెతికింది. చీకటి పడినా కొడుకు రాకపోవడంతో బుధ వారం ఉదయం బావులు, చెరువుల వద్ద రోదిస్తూ వెతకసాగింది. గ్రామ సమీపంలోని బండ చెరువు కట్టపై వెళ్తున్న ఆమెకు నీటిలో తేలిన కొడుకు మృతదేహం కనిపించడంతో గుండెలు బాదుకుంది. ఆమె రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. -
క్రీడలతో మానసికోల్లాసం
కేశంపేట: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండల పరిధిలోని నిర్దవెళ్లిలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాస్కర్గౌడ్, లింగంధన సర్పంచ్ వెంకటయ్య, తాండ్ర విష్ణువర్ధన్రెడ్డి, శేఖర్రెడ్డి, తౌర్యానాయక్, భూపాల్రెడ్డి, ఆంజనేయులు, జంగయ్య, రాంరెడ్డి, పల్లాటి కృష్ణయ్య, మురళీమోహన్, పాండు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ నవీన్కుమార్ రెడ్డి -
భార్యాకొడుకును చంపిన నిందితుడికి రిమాండ్
వివరాలు వెల్లడించిన ఆమనగల్లు ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లు ఆమనగల్లు: ఆమనగల్లు మండలం సీతారాంనగర్తండా గ్రామ పరిధిలోని పులుగోనిపల్లితండాలో మంగళవారం భార్య, కొడుకును హత్య చేసిన నిందితుడు పులుగోనిపల్లితండాకు చెందిన బానావత్ రాందాస్ను బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. పట్టణంలోని పోలీసు స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కుటుంబ కలహాలు, మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన రాందాసు మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో భార్య కవిత, కుమారుడు హర్షరోహిత్, కుమార్తె ప్రణీతపై రోకలితో దాడి చేశాడని ఆయన వివరించారు. ఈ ఘటనలో కవిత, హర్షరోహిత్ అక్కడికక్కడే మృతిచెందగా ప్రణీత తీవ్ర గాయాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోందన్నారు. అనంతరం ఆమనగల్లు ఎస్ఐ సీతారాంరెడ్డి, ఏఎస్ఐ రాంరెడ్డి, పోలీసులు రజనీకాంత్, టైటస్ లక్ష్మణ్ నిందితుడు రాందాస్ను బుధవారం పట్టుకున్నారని ఆయన చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి
పరిగి: అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని రంగంపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పద్మమ్మ(65) భర్త ఏఎస్సైగా రిటైరై, అనారోగ్యంతో మృతిచెందారు. ఉన్న ఒక్క కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఇంట్లో పద్మమ్మ ఒంటరిగా ఉంటోంది. ఇదిలా ఉండగా బుధవారం చుట్టుపక్కల ఇళ్లకు దుర్వాసన రావడంతో పద్మమ్మ ఇంటి వద్దకు వెళ్లి చూడగా మృతిచెంది కనిపించింది. మృతురాలి ఒంటిపై రక్తపు మరకలు, ఛాతిపై గాయాలు ఉండటంతో హత్య జరిగి ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తంచేశారు. ఈ విషయంపై ఎస్ఐ మోహనక్రిష్ణను వివరణ కోరగా హత్య కాదని, మృతి చెంది చాలా రోజులు కావడంతో రక్తం బయటకి వచ్చిందని తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం వద్దు
● నాణ్యమైన ఆహార పదార్థాలే విక్రయించాలి ● టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వర్పాషా పరిగి: ప్రజల ఆరోగ్యంతో వ్యాపారులు చెలగాటం ఆడితే సహించేది లేదని టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వర్పాషా హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని పలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యానగర్ కాలనీలో మటన్ షాపులో నిర్వహిస్తున్న యజమాని ఇంట్లో 35 కిలోల కుళ్లిన మాంసాన్ని సీజ్ చేశారు. కృష్ణ అనే వ్యక్తి వద్ద సిలిండర్లు ఉన్నట్లు సమాచారం రావడంతో తనిఖీ చేసి 12 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఐస్క్రీం దుకాణాలపై దాడులు చేసి కల్తీ సామగ్రిని సీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అక్రమ వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
పైరవీలకే హారతి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా గత ప్రభుత్వం ‘ధరణి’పోర్టల్ను తీసుకొస్తే.. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పోర్టల్ను రద్దు చేసి, దాని స్థానంలో ‘భూభారతి’ పోర్టల్ను తీసుకొచ్చింది. పేరు మారిందే కానీ.. భూ బాధితుల సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు. ప్రభుత్వ ‘పెద్ద’ల సిఫార్సులు, పైరవీకారులు తీసుకొచ్చిన వివాదాస్పద భూముల ఫైళ్లు మాత్రం చకచక కదులుతున్నాయి. సామాన్యుల అర్జీలు మాత్రం ఏళ్ల తరబడి అపరిష్కృతంగానే మిగిలిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. తమ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతూ బాధితులు ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. తాము పెట్టుకున్న అర్జీ ఏ దశలో ఉందో..? చెప్పే నాథుడు కూడా లేడని అసహనం వ్యక్తం చేస్తున్నారు ఫైళ్లు తొక్కిపెట్టి.. అక్రమ వసూళ్లు భూ భారతి పోర్టల్కు ఇప్పటి వరకు 3,84,474 దరఖాస్తులు అందగా, వీటిలో 1,70,052 దరఖాస్తులు మాత్రమే ఆమోదానికి నోచుకోగా.. 1,51,26 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. కొంత మంది అధికారులు ఏళ్ల నుంచి ఫైళ్లు తొక్కిపెట్టి భూముల ధలను బట్టి.. కమీషన్లు దండుకుంటున్నారనే అపవాదు ఉంది. వారి షరతులకు అంగీకరించిన వాళ్ల ఫైళ్లను క్లియర్ చేస్తూ.. నిరాకరించిన వారివి తిరస్కరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ఇదే తంతు కొనసాగుతోందనే చర్చలు వినిపిస్తున్నారు. ఇప్పటికే ఇదే కేసులో ఓ అదనపు కలెక్టర్ సహా పలువురు తహసీల్దార్లు, ఆర్ఐలు ఏసీబీ వలకు చిక్కిన విషయం విదితమే. అక్రమార్కులపై ఏసీబీ వల విసురుతున్నా.. అధికారుల వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. ఆ అర్టీలే అధికం భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం 14 మాడ్యుల్స్ను తీసుకొచ్చింది. గతంలో ప్రతీ చిన్నపనికి కలెక్టర్ను ఆశ్రయించాల్సి వచ్చేది. చిన్న చిన్న సమస్యలను కిందిస్థాయిలోనే పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. పోర్టల్లో ఆ అవకాశం కల్పించలేదు. దీంతో సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం చోటు చేసుకునేది. సత్వర పరిష్కారం కోసం తహసీల్దార్లు, ఆర్డీఓలు, అదనపు కలెక్టర్లకు లాగిన్లు ఇచ్చింది. అయితే ఆయా అధికారులు సైతం సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా నిషేధిత జాబితా, డేటా కరెక్షన్కు వచ్చిన దరఖాస్తులు ఏళ్ల నుంచి పెండింగ్లో ఉంటున్నాయి. పోర్టల్లోని పెండింగ్ జాబితాలో మెజార్టీ దరఖాస్తులు ఇవే ఉండడం గమనార్హం. భూభారతిలో 19 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్ పోర్టల్ పేరు మారినా తీరని సమస్యలు కలెక్టరేట్ చుట్టూ బాధితుల ప్రదక్షిణలు మాడ్యుల్ అప్లికేషన్లు ఆమోదం తిరస్కరణ పెండింగ్ ఎన్ఆర్ఐ పీపీబీ 1,084 597 413 33 కోర్టు కేస్ ఇంటిమేషన్ 60,344 31,845 23,332 495 కోర్టు కేస్ పీపీబీ 8,809 2,106 4,916 763 డేటా కరెక్షన్ 66,255 7,197 22,119 9,565 జీపీఏ 15,883 9,429 4,046 99 గ్రీవెన్స్ ప్రొహిబిటెడ్ 74,678 26,499 41,593 6,586 ఖాతా మెర్జింగ్ 1,036 567 345 17 లాండ్ మేటర్ గ్రీవెన్స్ 49,445 26,308 23,109 28 నాలా పీపీబీ 3,770 1,677 1,339 180 ఆర్గనైజేషన్ పీపీబీ 1,089 1,079 05 01 పెండింగ్ మ్యూటేషన్ 61,892 37,993 18,991 981 సక్సేషన్ 34,654 22,858 8,111 544 అర్బన్ ల్యాండ్ 3,168 1,183 1,622 125 నాలా హౌస్సైట్స్ 2,367 714 1,305 55డివిజన్ అర్జీలు ఆమోదించినవి తిరస్కరించినవి చేవెళ్ల 1,06,973 50,572 40,334 ఇబ్రహీంపట్నం 87,949 36,012 35,811 కందుకూరు 92,409 39,732 37,406 రాజేంద్రనగర్ 39,408 17,076 15,491 షాద్నగర్ 57,735 26,660 22,204 -
నేడు తుమ్మలూరుకు సీఎస్, కలెక్టర్
మహేశ్వరం: ప్రజా పాలనలో భాగంగా తుమ్మలూరులో నిర్వహించనున్న గ్రామ సభకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) రామకృష్ణారావు, కలెక్టర్ నారాయణరెడ్డి హాజరవనున్నట్లు ఎంపీడీఓ శైలజ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం 10.30 గంటలకు నిర్వహించే ఈ సభకు గ్రామస్తులంతా హాజరై విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు ఇబ్రహీంపట్నం రూరల్: హనుమాన్ జయంతి సందర్భంగా ఫ్యూచర్సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని ఫ్యూచర్సిటీ సీపీ జి.సుఽధీర్బాబు బుధవారం ఆదేశాలిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ స్టేట్ ఎకై ్సజ్ యాక్ట్ 1968లోని సెక్షన్ 20 ప్రకారం ఈ నెల 2వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 3వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు కమిషనరేట్పరిధిలోని అన్ని వైన్స్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లలోని బార్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. స్టార్ హోటళ్లు, రిజిస్ట్రర్ క్లబ్లకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు పండగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ సుధీర్బాబు తెలిపారు కొత్తూరు: ఎస్సీ నిరుద్యోగులకు కార్పొరేషన్ నుంచి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఆటోలు, సోలార్ పంప్సెట్లు, పాడి పశువులను పంపిణీ చేయనున్నట్లు ఎంపీడీఓ అరుంధతి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 8లోపు ఓబీఎంఎంఎస్ తెలంగాణ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుదారులు రేషన్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ, లైసెన్స్, దివ్యాంగులు సదరం సర్టిఫికెట్, ఫొటో, పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ జతచేయాలని సూచించారు. యూనిట్కు తొంభైశాతం సబ్సిడీ లభిస్తుందన్నారు. బడంగ్పేట్: త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి బుధవారం నాదర్గుల్లోని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి అందెల శ్రీరాములుయాదవ్ నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు. అనంతరం బీజేపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు నాదర్గుల్కు చేరుకుని ఇంద్రసేనారెడ్డిని సన్మానించారు. డీపీఓ సురేశ్ మోహన్ ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్ ఆదేశించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. గ్రామసభ గురించి పంచాయతీలో విరివిగా ప్రచారం చేయాలన్నారు. ఎక్కువ మంది ప్రజలు పాల్గోనే విధంగా అధికారుల, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు. గ్రామసభ నివేదికను ముందస్తుగా నిర్ణయించుకుని, గ్రామసభ పది గంటలకు ప్రారంభమయ్యేటట్లు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీసు వారికి సమాచారం ఇచ్చి భద్రత ఏర్పాటు చేయించుకోవాలన్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి సంబంధిత శాఖల అధికారులు, గ్రామస్తులు, ఎస్జీహెచ్ సభ్యులు, యువత, రైతులు, మహిళ సంఘాలు, ఎన్జీఓలు, పథక లబ్ధిదారులు అభిప్రాయ సేకరణ, గ్రామ సమస్యలపై చర్చించాలని వివరించారు. గ్రామసభలో మాట్లాడే వ్యక్తల, లబ్ధిదారుల జాబితాను ముందస్తుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో ఇప్పటి వరకు చేపట్టిన చర్యల నివేదిక, 15వ ఆర్థిక సంఘం నిధుల వివరాలు, ఖర్చులు చదివి వినిపించాలి. డీసీబీ 2026–27 గ్రామ సభలో ప్రవేశపెట్టి ఆమోదం తీసుకోవాలి. ఫిర్యాదుల కోసం పెట్టెను సిద్ధం చేసుకోవాలని సూచించారు. మండల పంచాయతీ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, డివిజన్ పంచాయతీ అధికారులు, గ్రామసభల నిర్వహణపై పర్యవేక్షించాలని ఆదేశించారు. -
పార్టీబలోపేతానికి కృషి చేయండి
మొయినాబాద్: బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులైన సన్వెల్లి ప్రభాకర్రెడ్డి బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావును మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్న తనను గుర్తించిన నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానన్నారు. అనంతరం రాంచందర్రావు మాట్లాడుతూ.. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహిపాల్, సుధాకర్రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రభాకర్రెడ్డికి సన్మానం.. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికై న సన్వెల్లి ప్రభాకర్రెడ్డిని పలువురు నాయకులు సన్మానించారు. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుండి గణేశ్, కౌన్సిలర్ కళ్లెంల జగపతి, మాజీ సర్పంచ్ గొర్కంటి రాజు, నాయకులు మాధవరెడ్డి తదితరులు ఆయన్ను సన్మానించి అభినందనలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు -
చిలుకూరులో రథోత్సవం
మొయినాబాద్: చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం బుధవారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. చిలుకూరు వేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా రథంపై ఆసీనులై ఆలయం చుట్టూ ఊరేగారు. శ్రీదేవి, భూదేవిలను వివాహం చేసుకున్న స్వామివారు వారిని గ్రామస్తులకు చూపేందుకు రథోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు రంగరాజన్ భక్తులకు వివరించారు. ఉత్సవంలో భాగంగా స్వామివారు, అమ్మవార్లకు అద్దాల మహల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా తీసుకొచ్చారు. రథం చుట్టూ ప్రదక్షిణలు చేయించి మొదటి అంతస్థులో ఆసీనులను చేశారు. రథం ముందు అర్చకులు హోమం నిర్వహించారు. అనంతరం భక్తుల గోవింద నామస్మరణ నడుమ రథం ముందుకు కదిలింది. రథోత్సవంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ గోపాలకృష్ణస్వామి, అర్చకులు రంగరాజన్, తిరుమల కిరణాచారి, పరావస్తు రామాచారి, నరసింహన్కన్నయ్య, కిట్టు, మురళీ, సురేశ్, నాగరాజు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. ఆలయ పురవీధుల్లో ఊరేగిన శ్రీదేవి, భూదేవి సమేత బాలాజీ -
ఆకులమైలారం మాజీ సర్పంచ్ మృతి
కందుకూరు: మండల పరిధిలోని ఆకులమైలారం మాజీ సర్పంచ్ దేవరశెట్టి నందీశ్వర్(60) అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన 1995 నుంచి 2001 వరకు, 2006 నుంచి 2011 వరకు రెండు పర్యాయాలు సర్పంచ్గా సేవలందించారు. ఆయనకు భార్యతో పాటు కుమారై ఉన్నారు. కొంత కాలంగా చిక్సిత పొందుతున్న ఆయన బుధవారం ఉదయం మరణించారు. స్థానిక ఎమ్మెల్యే సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్తో పాటు వివిధ పార్టీల నాయకులు ఎస్.సురేందర్రెడ్డి, ఏనుగు జంగారెడ్డి, బొక్క జంగారెడ్డి, ఎస్.కృష్ణనాయక్, ఈశ్వర్గౌడ్, గోపాల్రెడ్డి, చిర్ర సాయిలు, మంద సాయిలు, ఆనంద్ తదితరులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబీకులకు సానూభూతి తెలిపారు. కుంటలో పడి మానసిక దివ్యాంగుడి మృతి శంకర్పల్లి: ప్రమాదవశాత్తు కుంటలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం శంకర్పల్లి ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ముదస్సర్ అలీ తెలిపిన ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని బుల్కాపూర్కి చెందిన లింగంపల్లి రవీందర్(40) మానసిక దివ్యాంగుడు. ఆయన చిన్ననాటి నుంచి తన సోదరుడు ఈశ్వర్ వద్ద ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రవీందర్.. బుల్కాపూర్ శివారులోని ఓ కుంటలో ప్రమాదవశాత్తు పడిపోయి మృతి చెందాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఇంటింటికీ సీపీఐ ● ప్రభుత్వాల తీరును ఎండ గడతాం ● జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిట్ తాండూరు టౌన్: ఇంటింటికీ సీపీఐ అనే నినాదంతో ఏప్రిల్ ఒకటి నుంచి 10వ తేదీ వరకు ప్రజల ముందుకు వెళ్లనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిట్ తెలిపారు. బుధవారం తాండూరులో పార్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్యాస్ కష్టాలు రోజు రోజుకూ పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్పై చేస్తున్న యుద్ధాన్ని సీపీఐ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. యుద్ధోన్మాదులు చేస్తున్న పైశాచిక చర్యల వల్ల అమాయకులు బలవుతున్నారన్నారు. అన్ని దేశాల ప్రజల యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారని, మన దేశ ప్రజలు సైతం వ్యతిరేకించాలని పిలుపు నిచ్చారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనకపడ్డాయని, ఇలాంటి విషయాలన్నింటి గురించి ఇంటింటికీ సిపిఐ కార్యక్రమంలో ప్రజలకు వివరిస్తామన్నారు. సమావేశంలో నాయకులు అనంతయ్య, పీర్మహ్మద్, రవీందర్, వెంకటేష్, మునీర్ అహ్మద్, సురేష్, పుష్ప, రాజరేఖర్ బాబు, సుదర్శన్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
పన్నుల వసూళ్లలో టాప్
● జిల్లాలో తొలి స్థానం, రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచిన చేవెళ్ల మున్సిపాలిటీ ● మార్చి 31 నాటికి 92. 20శాతం వసూళ్లు చేవెళ్ల: పన్నుల వసూళ్లలో చేవెళ్ల మున్సిపాలిటీ జిల్లాలో మొదటి స్థానంలో నిలువగా రాష్ట్ర స్థాయిలో 5వ స్థానంలో నిలిచింది. పన్నుళ్ల వసూళ్లు వంద శాతం పూర్తి చేయాలనే లక్ష్యంతో మున్సిపాలిటీలు ప్రత్యేక డ్రైవ్లు చేపట్టగా 92.20శాతంతో జిల్లాలో ముందు వరసలో నిలిచింది. 2025 జనవరిలో చేవెళ్ల మున్సిపాలిటీ ఏర్పడింది. పంచాయతీ లెక్కల ప్రకారం అసెస్మెంట్ సంఖ్య 5,892 కాగా రూ.1.07 కోట్లు పన్ను రాబడి ఉండేది. మున్సిపల్ అసెస్మెంట్ ప్రకారం 2025–26 నాటికి రెసిడెన్షియల్, ఎన్ఓఎస్ రెసిడెన్షియల్ కలుపుకొని అసెస్మెంట్లు 6,050గా తేలింది. వీటి ప్రకారం ఆస్తి పన్ను రూ.229 లక్షలుగా ఉండింది. గత ఆర్థిక సంవత్సరం 2024–25 ఏరియర్స్ డిమాండ్ కలుపుకొని 2025–26 ఆర్థిక సంవత్సరానికి డిమాండ్ రూ.307 లక్షలుగా మారింది. మున్సిపల్ అధికారులు, సిబ్బంది సవాల్గా స్వీకరించి వందశాతం సాధించే లక్ష్యంతో వార్డుల వారీగా ఇంటింటికీ తిరిగి పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. ప్రజలు స్వచ్ఛందంగా ఇంటి పన్నులు సకాలంలో చెల్లించారు. దీంతో మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 92.20శాతం వసూళ్లు సాధించింది. ప్రజలు, సిబ్బంది సహకారంతో 92.20శాతం పన్నుల వసూలుతో జిల్లాలో తొలి స్థానం, రాష్ట్రంలో 5వ స్థానంలో నిలవడం సంతోషంగా ఉంది. గత అనుభవంతో చేవెళ్ల మున్సిపాలిటీ అభివృద్ధికి, నిధుల పెరుగుదలకు అసెస్మెంట్ల డిమాండ్ పెరగాలనే ఆలోచనతో పన్నుల వసూళ్లతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధుల రాబడికి కృషి చేశా. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు వచ్చాయి. పురపాలకంలో పన్నుల చెల్లింపులే సగం అభివృద్ధికి ఉపయోగపడుతాయి. ప్రతి ఒక్కరు సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలి. – వెంకటేశం, మున్సిపల్ కమిషనర్, చేవెళ్ల -
చికెన్ దుకాణలు బంద్!
షాద్నగర్: రిటైల్ చికెన్ సెంటర్లకు ఇచ్చే మార్జిన్ను వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం దుకాణాల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పౌల్ట్రీ పరిశ్రమల వారు చికెన్ సెంటర్లుకు ఇచ్చే మార్జిన్ను తగ్గించాయని, దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం షాపుల నిర్వహణ కూడా భారంగా మారిందని తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు దుకాణాలను తెరిచేదిలేదని స్పష్టంచేశారు. -
ఏజెంట్ల నియామకంపై శ్రద్ధ తీసుకోండి
వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారి అనంతగిరి: బూత్స్థాయి ఏజెంట్ల నియామకానికి రాజకీయ పార్టీలు సహకరించాలని వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. బుధవారం ప్రత్యేక ఇంటెన్సివ్ పునఃపరిశీలన(ఎస్ఆర్ఐ)లో భాగంగా బూత్స్థాయి ఏజెంట్ల నియామకం, మ్యాపింగ్ ప్రక్రియ, ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు, మసక బారిన ఫొటోలు తదితర వాటిపై కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు ఉండొద్దన్నారు. జిల్లాలో 1,133 వార్డులు ఉన్నాయని, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఏప్రిల్ 3వ తేదీ నాటికి ఏజెంట్ల జాబితాను సమర్పించాలని సూచించారు. గ్రామాల్లో బూత్స్థాయి అధికారులను సంప్రదించి బోగస్, డబుల్, మరణించిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు సహకరించాలన్నారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేశ్వరి, డీఆర్ఓ మంగీలాల్, ఆర్డీఓలు వాసుచంద్ర, కె.అనిత, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నైమత్ అలీ, తహసీల్దార్లు లక్ష్మీనారాయణ, వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మెరుగైన ఫలితాలు సాధించాలి కుల్కచర్ల: పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ దీపక్ తివారీ సూచించారు. బుధవారం చౌడాపూర్ ప్రాథమిక, జెడ్పీ పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలన్నారు. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. అంతకుముందు ఫర్టిలైజర్ దుకాణాన్ని సందర్శించి ఎరువుల అమ్మకాల్లో నిబద్ధత పాటించాలని ఆదేశించారు. రేషన్ దుకాణంలో బియ్యం ఎందుకు తక్కువగా ఉన్నాయని కలెక్టర్ ఆరా తీయగా ఇంకా రావాల్సి ఉందని డీలర్ సమాధనం చెప్పారు. జెడ్పీ పాఠశాలలో కట్టెల పొయ్యిపై వంట తయారీని పరిశీలించి ఇలా చేయడం సరికాదని సూచించారు. కిచెన్షెడ్ మంజూరైనా ఎందుకు కట్టలేదని అధికారులను ప్రశ్నించారు. వెంటనే పనులు ప్రారంభించాలని సర్పంచ్ నవీన్కు సూచించారు. గ్రామంలోనే ప్రాథమిక పాఠశాల నిర్వహించాలి కొత్తగా ఏర్పాటైన చౌడాపూర్ మండల కేంద్రానికి ప్రాథమిక పాఠశాల మంజూరు కాగా గ్రామం బయట ఉన్న జెడ్పీ పాఠశాలలోకి మార్చారు. పిల్లలను అంత దూరం పంపడం కష్టాంగా ఉందని తల్లిదండ్రులు కలెక్టర్కు విన్నవించారు. కార్యక్రమంలో డీఈఓ రేణుకాదేవి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ సోమలింగం, ఎంఈఓ రాంచందర్, ఇన్చార్జ్ ఎంపీఓ రాజిరెడ్డి పాల్గొన్నారు. -
వికారాబాద్ బీజేపీ ఫ్లోర్ లీడర్గా అనిల్యాదవ్
అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ బీజేపీ ఫ్లోర్లీడర్గా 33వ వార్డు కౌన్సిలర్ అనిల్ యాదవ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై మున్సిపల్లో ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికై పాటు పడుతానన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు, ముఖ్య నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వికారాబాద్ డీసీసీ కార్యవర్గం ఏర్పాటు అనంతగిరి: కాంగ్రెస్ వికారాబాద్ జిల్లా కార్యవర్గాన్ని గురువారం పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు విడుదల చేసినట్లు డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షులుగా అనంత్రెడ్డి, కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, ఆనందం, అంజయ్యగౌడ్, శోభారాణి, నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా శ్రీనివాస్, సిరాజుద్దీన్, అశోక్, రాంచంద్రారెడ్డి, వెంకటయ్య, అశోక్, సత్యమ్మ, మధుసూదన్రెడ్డి, సంతోష్, హరీశ్వర్రెడ్డి, బాబుసింగ్, వెంకటయ్య, కోశాధికారిగా విశ్వనాథం రాఘవేందర్, అధికార ప్రతినిధులుగా ఆనంద్గౌడ్, అడ్వకేట్ గోపాల్, కార్యదర్శులుగా చంద్రశేఖర్, రాజవర్ధన్రెడ్డి, ఎండీ నసీరుద్దీన్, శ్రీనివాస్గౌడ్, మొగులప్ప, నర్సింలు గౌడ్, వెంకటేశం నర్సింగ్ నాయక్, బాబాఖాన్, ప్రభాకర్, బాల్రెడ్డి, వీరన్న, అనంత్రెడ్డి, మాసయ్య, రవినాయక్, నరేందర్రెడ్డి, రహీం పటేల్, రజితారెడ్డి, మాణిక్యం గౌడ్, కార్యవర్గ సభ్యులుగా గోపా ల్, మహ్మద్ యాసిన్, అమృతప్ప, నయీంఅక్తర్, శ్రీనివాస్, రాములు, జంగయ్య, కోడ య్య, యాదయ్య, అక్బర్ హుస్సేన్, శశిధర్రెడ్డి, శ్రీధర్, విష్ణువర్ధన్రెడ్డి సిద్ధార్థ నియమితులైనట్లు తెలిపారు. డివైడర్ పైకి దూసుకెళ్లిన లారీ తాండూరు టౌన్: పట్టణంలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన లారీ డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బుధవారం తెల్లవారుజామున పట్టణంలో చోటుచేసుకుంది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. నాపరాయి లోడ్తో కొడంగల్ మార్గం నుంచి పట్టణంలోకి ఫ్లై ఓవర్ మీదుగా వచ్చిన లారీ, అతి వేగంగా బస్టాండు ఎదురుగా ఉన్న డివైడర్ను ఢీకొట్టింది. నిద్రమత్తులో ప్రమాదం జరిగిందా లేదా అతి వేగం వల్ల జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారుజామున కావడంతో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. -
జాతీయ అవార్డుకు మోత్కుపల్లి జీపీ
బంట్వారం: గ్రామీణాభివృద్ధి, సుస్థిర పరిపాలనలో విశిష్ట ప్రతిభ కనబర్చిన కోట్పల్లి మండలంలోని మోత్కుపల్లి గ్రామ పంచాయతీ జాతీయ అవార్డుకు ఎంపికై ంది. ఇందుకు సంబంధించి కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు ప్రకటించింది. గుడ్ గవర్నెన్స్ విభాగంలో మెత్కుపల్లి జీపీ తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ అవార్డుకు ఎంపిక కావడం విశేషం. గ్రామ స్థాయిలో పారదర్శక పరిపాలన, ప్రజల భాగస్వామ్యం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో చూపిన ప్రతిభకు గుర్తింపు లభించింది. దేశ వ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి సుస్థిర పరిపాలన లక్ష్య సాధనలో ముందంజలో నిలిచిన మోత్కుపల్లి జీపీ కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ అవార్డు అందుకోనుంది. ఈ నెల 24న కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ఢిల్లీలో అవార్డు ప్రదానం చేయనుంది. జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక కావడం పట్ల మోత్కుపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి
సమయపాలన పాటించాలి పూడూరు: ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా చూడాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని డీఎంహెచ్ఓ స్వర్ణకుమారి అన్నారు. బుధవారం మండలంలోని చన్గోముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. సమయపాలన పాటించాలని సూచించారు. పాము, తెలు, కుక్క కాటు మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా అవగాహన కల్పించాలని ఏఎన్ఎంకు సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ మహమూద్ ఫారూకీ, ఆస్పత్రి సిబ్బంది రవికుమార్, దాసు తదితరులు పాల్గొన్నారు. -
రైతుల భూములు పోనివ్వం
రేవంత్రెడ్డి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా వ్యవహరిస్తోందని కాళ్లాపూర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహరాజ్ ఆరోపించారు. బుధవారం మండలంలోని రాపోల్, కాళ్లాపూర్ గ్రామాల్లో రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. రైతులు కోల్పోయే భూములను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భూ సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. రైతులకు న్యాయం చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. -
విచారించలేదు.. సమస్య తీరలేదు
కొందుర్గు రెవెన్యూ సర్వేనంబర్ 75, 76, 80లో నాతో పాటు మరో 34 మందికి 12.15 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. రెవెన్యూ రికార్డుల్లో ఏళ్లుగా పట్టా భూమిగా రికార్డు ఉంది. ధరణి పోర్టల్లో వక్ఫ్ భూమిగా రికార్డు చేశారు. క్షేత్రస్థాయిలో విచారించి, రికార్డులను సరి చేయాల్సిందిగా కోరుతూ కలెక్టర్కు అర్జీ పెట్టుకున్నా. ఆయన వక్ఫ్బోర్డుకు రాశారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి విచారణ చేపట్టలేదు. సమస్య తీరలేదు. – పి.చంద్రశేఖర్, కొందుర్గు ఇబ్రహీంపట్నం మండలం రాందాసుపల్లి సర్వే నంబర్ 41లో 3.20 ఎకరాల భూమి ఉంది. 1944 నుంచి చివరి పహాణి వరకు చెక్ చేసి, అన్ని సవ్యంగా ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాతే 2017లో ఈ భూమి కొనుగోలు చేశా. రిజిస్ట్రేషన్ తర్వాత నిషేధిత జాబితాలో చేర్చారు. ఆ జాబితా నుంచి విముక్తి కల్పించాల్సిందిగా కోరుతూ మూడేళ్ల నుంచి తహసీల్దార్ మొదలు.. కలెక్టర్ కార్యాలయం వరకు దరఖాస్తులు ఇచ్చా. ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు. అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయా. – పాతూరి ప్రకాశ్, ఇబ్రహీంపట్నం -
రోడ్డుపాలు చేయొద్దు
● ఇండస్ట్రియల్ పార్క్కు భూములివ్వం ● తేల్చి చెప్పిన రాపోల్ రైతులు ● రోడ్డుపై బైఠాయించి నిరసన పరిగి: ఇండస్ట్రియల్ కారిడార్కు భూములు ఇచ్చేది లేదని రాపోల్ గ్రామ రైతులు తేల్చి చెప్పారు. బుధవారం గ్రామపరిధిలోని పరిగి–షాద్నగర్ ప్రధాన రహదారిపై కట్టెలు వేసి నిప్పంటించి నిరసన తెలిపారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిగి మండలం రాపో ల్, కాళ్లాపూర్ గ్రామాల పరిధిలో 1,197 ఎకరాల భూ సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో రెండు గ్రామాల రైతులు ఆందోళన బాట పట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కొని రోడ్డున పడేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మా బాధలు స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డికి పట్టడం లేదన్నారు. రెండు గ్రామాల ప్రజలు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ వస్తే కష్టాలు తీరుతాయని భావించామని.. కానీ ప్రభుత్వ చర్యలు రైతులను భూస్థాపితం చేసేలా ఉన్నాయన్నారు. ధర్నా కారణంగా పరిగి – షాద్నగర్ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తేనే ఆందోళన విరమిస్తామని రైతులు చెప్పారు. దీంతో పోలీసులు రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తహసీల్దార్ వెంకటేశ్వరి రైతులతో చర్చలు జరిపారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. -
ఎమ్మెల్యే ఎదుటే కల్లు పంచాయితీ
● చెన్గేస్పూర్ సొసైటీ సభ్యుల పరస్పర వాగ్వాదం ● రెండువర్గాలుగా విడిపోయిన సంఘం సభ్యులుతాండూరు రూరల్: కల్లు విక్రయం విషయంలో ఇరువర్గాల వారు ఎమ్మెల్యే ఎదుటే పరస్పరం దూషించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని కొత్లాపూర్ ఎల్లమ్మ ఆలయ నూతన కమిటీ సభ్యులు బుధవారం ఎమ్మెల్యే మనోహర్రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చెన్గేస్పూర్ గ్రామానికి సంబంధించిన కల్లు సొసైటీ సభ్యులు కొత్లాపూర్కు చేరుకున్నారు. ఈసారి గ్రామంలోనే కల్లు తయారు చేసుకుని విక్రయిస్తామని, రెండేళ్లుగా బయటి వ్యక్తులే కల్లు అమ్ముకుంటున్నారని సొసైటీ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అయితే సొసైటీ సభ్యుల కోరిక మేరకే రవిగౌడ్ అనే వ్యక్తికి అవకాశం ఇచ్చామని, ఇప్పుడు కాదంటే అంగీకరించేది లేదని అక్కడే ఉన్న మరికొందరు సభ్యులు తెలిపారు. ఈక్రమంలో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరగడంతో తర్వాత మాట్లాడుకుందామని చెప్పిన ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈవిషయమై చెన్గేస్పూర్ సర్పంచ్ ప్రవీణ్గౌడ్ మాట్లాడుతూ.. డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ రవిగౌడ్ రెండేళ్లుగా తమ గ్రామంలో కల్లు విక్రయిస్తున్నారని తెలిపారు. ఈసారి సొసైటీ మెజార్టీ సభ్యుల అంగీకారంతో తామే కల్లు అమ్ముకుంటామని ఎమ్మెల్యేను కోరామన్నారు. ఈవిషయమై రవిగౌడ్ తనను ఎమ్మెల్యే ఎదుటే బెదిరించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే కల్పించుకుని సొసైటీకి న్యాయం చేయాలన్నారు. మెజార్టీ సభ్యుల అంగీకారం, సొసైటీ చైర్మన్ అనుమతితోనే తాను కల్లు విక్రయిస్తున్నానని రవిగౌడ్ తెలిపారు. -
తైబజార్@రూ.19.87 లక్షలు
ఆమనగల్లు: ఆమనగల్లు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం 2026–27 ఆర్థిక సంవత్సరానికి తై బజార్ వేలం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శంకర్ నాయక్, మేనేజర్ ఆంజనేయులు సమక్షంలో నిర్వహించిన ఈ వేలంలో 18 మంది డిపాజిట్దారులు పాల్గొన్నారు. పోటాపోటీగా జరిగిన వేలంలో జనిగల గిరియాదవ్ రూ.19.87 లక్షలకు తై బజారును దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాగిళ్ల జగన్, వెంకటయ్య, ఎర్రవోలు మహేశ్ పాల్గొన్నారు. కుల్కచర్ల: వానాకాలం సాగును దృష్టిలో ఉంచుకొని రైతులకు అవసరమై న విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సన్నాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వా లని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి వీర స్వామి, ఏఈఓ బాబు పాల్గొన్నారు. -
ఖైదీలకు వైద్యం అభినందనీయం
జైలు సూపరింటెండెంట్ రాజ్కుమార్ పరిగి: ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం ముద్దాయిలు, ఖైదీలు, సిబ్బందికి ఉచిత వైద్యం అందించడం అభినందనీయమని జైలు సూపరింటెండెంట్ రాజ్కుమార్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం పరిగి సబ్జైలులో శ్రీ సాయి డెంటల్ ఆస్పత్రి, కళాశాల వికారాబాద్ వారి సహకారంతో ఖైదీలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖైదీల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హాస్పిటల్ పీఆర్ఓ రవీందర్గౌడ్, వైద్యులు వివేక్, విశ్వప్రియ, కేజీయా, గాయత్రిదేవి తదితరులు పాల్గొన్నారు. -
అధికారం కాదు.. కమ్యూనిస్టులే శాశ్వతం
● ప్రజా సమస్యలు ఉన్నన్ని రోజులు ఎర్రజెండా ఉంటుంది ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ● దివంగత ఎమ్మెల్యే కొండిగారి రాములుకు ఘన నివాళి ఇబ్రహీంపట్నం: ప్రజా సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. స్థానిక భారత్ గార్డెన్లో మంగళవారం ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు సంతాపసభ నిర్వహించారు. నివాళులర్పించిన అనంతరం కూనంనేని మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రశ్నించే గొంతులను నొక్కేసే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. పేద ప్రజల కోసం తీసుకొచ్చిన ప్రతీ చట్టం వెనక కమ్యూనిస్టుల పాత్రం ఉందన్నారు. మే డే రోజు పీఎం అయినా సీఎం అయినా ఎర్రజెండానే ఎగురవేయాన్నారు. కమ్యూనిస్టులను అణిచివేయాలని ఆనాడు హిట్లర్ చూస్తే.. నేడు కేంద్రంలోని అమితాషా చూస్తున్నాడని ఆరోపించారు. మావోయిస్టులను తాత్కాలికంగా అమితాషా అణిచివేయవచ్చు.. కానీ కమ్యూనిస్టులను అణిచివేయలేడన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటేనే కమ్యూనిస్టులు ఉన్నట్లు కాదని.. ప్రజా సమస్యలు ఉన్నన్ని రోజులు వాటి పరిష్కారానికి పోరాడేందుకు కామ్రేడ్లు ఉంటారని స్పష్టంచేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, కమ్యూనిజమే శాశ్వతమని, కమ్యూనిస్టులు లేని సమాజామాన్ని ఊహించలేమని తెలిపారు. పేదరిక నిర్మూలనే అసలైన ప్రజాపాలన అన్నారు. పేదవారిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వాలకు సూచించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కమ్యూనిస్టులు పోటీ చేయాలని పిలుపునిచ్చారు. ఇంటింటికి సీపీఐ చేరాలన్నారు. నిస్వార్థ ప్రజా సేవకుడు మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాములు సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.హేమంతరావు, రవీంద్రచారి, జిల్లా కార్యదర్శి జంగయ్య, కావలి నర్సింహ్మ, ముత్యాల యాదగిరిరెడ్డి, ప్రభులింగం, ఓరుగంటి యాదయ్య, రామస్వామి, సురేష్, శివరాల లక్ష్మయ్య, నీలమ్మ, సీపీఎం జిల్లా కార్యదర్శి పి.యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
చోరీ కేసులో నిందితులకు రిమాండ్
మొయినాబాద్రూరల్: ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం, వెండి వస్తువులను దొంగలించిన నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. మార్చి 26న రాత్రి బి.శ్రీనివాస్ అలియాస్ శ్రీను, మేకల శివకుమార్ కలిసి కాశీంబౌలిలోని ఓ ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి బంగారం, వెండి వస్తువులను అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం మొయినాబాద్ చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. నిందితుల నుంచి బంగారం, వెండి ఆభరణాలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
షాబాద్: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన షాబాద్ పోలీస్ సేష్టన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మల్లారెడ్డిగూడ సమీపంలోని రోడ్డు పక్కన బ్రిడ్జి వద్ద మంగళవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తు పడితే షాబాద్ పోలీస్ స్టేషన్ 87126 63450, 87125 68402 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
వీధి కుక్కల దాడిలో మేకలు మృత్యువాత
చేవెళ్ల: మేకల మందపై వీధి కుక్కలు దాడి చేయడంతో 18 మేకలు మృతి చెందాయి. మరో నాలుగు త్రీవంగా గాయపడ్డాయి. ఈ సంఘటన మున్సిపల్ పరిధిలోని దేవునిఎర్రవల్లిలో చోటు చేసుకుంది. బాధితుడు కకంటి శ్రీశైలం, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవునిఎర్రవల్లికి చెందిన కంకంటి శ్రీశైలం తనకున్న 23 మేకలను మేపుకొంటూ జీవిస్తున్నాడు. గ్రామ సమీపంలోని పొలం వద్ద షెడ్లో ప్రతిరోజు రాత్రి వాటికి కాపలాగా పడుకునేవాడు. సోమవారం రాత్రి 10 గంటల వరకు అక్కడే ఉన్న అతడు వర్షం పడే సూచన ఉండటంతో షెడ్కు తాళం వేసి ఇంటికి వెళ్లాడు. మంగళవారం ఉదయం వచ్చి చూసే సరికి 18 మృతి చెంది, మరో నాలుగు గాయాలతో కనిపించాయి. వీధి కుక్కలు దాడి చేసి మేకలను ఇష్టానుసరంగా కొరికి చంపేశాయి. బాధితుడు లబోదిబోమంటూ వెట ర్నరీ వైద్యులకు సమాచారం అందించాడు. చేవెళ్ల వెటరర్నీ వైద్యుడు డాక్టర్ తిరుపతిరెడ్డి వచ్చి పరిశీలించాడు. గాయపడ్డ వాటికి వైద్యం చేశారు. వాటి పరిస్థితి కూడా విషమంగానే ఉందని తెలిపారు. రూ.2లక్షల వరకు నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. -
కనుల పండువగా కల్యాణం
మొయినాబాద్: పచ్చని తోరణాలు.. పూల పందిరి.. మంగళవాయిద్యాలు.. వేద పండితుల మంత్రోశ్చరణల మధ్య వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. చిలుకూరు బాలా జీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అర్థరాత్రి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ సోనియా దర్శన్, వైస్చైర్మన్ గరుగు రాజు, కౌన్సిలర్లు శ్రీలత రాంచందర్, జగపతి, శిరీష కిరణ్, అనసూయ నర్సింహ దంపతులు స్వామివారు, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లి దేవాలయం సమీపంలోని మండపంలో వేంచేయించారు. అనంతరం అమ్మవార్లను సైతం ఊరేగింపుగా స్వామివారి చెంతకు తీసుకెళ్లి ఎదురుకోళ్ల కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు నృత్యాలు చేస్తూ కార్యక్రమాన్ని రక్తికట్టించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను ఆలయ గర్భగుడి వెనకభాగంలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపంలో ఆసీనులను చేశారు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ముందుగా విశ్వక్సేనుని ఆరాధించి శుద్ధివచనం, పుణ్యహవచనాలు నిర్వహించారు. మంగళవారం స్వామివారికి వసంతోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారిని అమ్మవార్లను జగవాహనంపై గ్రామంలో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణస్వామి, అర్చకులు రంగరాజన్, తిరుమల కిరణాచారి, పరవాస్తు రామాచారి, నరసింహన్, కన్నయ్య, కిట్టు, మురళి, సురేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో యువకుడి మృతి
షాబాద్: విద్యుత్ షాక్తో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్లోని ఎయిర్పోర్టు కాలనీకి చెందిన సాయికుమార్గౌడ్ (35) మంగళవారం నాగరకుంట సమీపంలో మామిడి తోటలో మామిడికాయలు తెంపుతున్నాడు. చెట్టు మధ్యలో విద్యుత్ వైర్లు ఉండడంతో ప్రమాదవశాత్తు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సాయికుమార్గౌడ్ రెండేళ్లుగా మండల పరిధిలోని హైతాబాద్ వెల్స్పన్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థుల చేతుల్లో దేశ భవిష్యత్తు
ఇబ్రహీంపట్నం: దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని.. అలాంటి విద్యార్థులు ట్రాఫిక్ నియమాలు తప్పక పాటించాలని ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ డీసీపీ శివమ్ ఉపాధ్యాయ అన్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం రోడ్డు భద్రతపై అరైవ్, అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా మెలగాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్తోపాటు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీటు బెల్ట్ తప్పక ధరించాలన్నారు. యువత, ప్రజలు రోడ్డు భద్రతను పాటించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ జితేందర్రెడ్డి, స్థానిక ఎస్హెచ్ఓ మహేందర్రెడ్డి, ఆటో డ్రైవర్లు, విద్యార్థులు తదితరుకపాల్గొన్నారు. -
‘ప్రగతి ప్రణాళిక’ను పక్కాగా చేపట్టాలి
కందుకూరు: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పనులను పకడ్బందీగా చేపట్టాలని డీఆర్డీఓ శ్రీలత ఆదేశించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో మంగళవారం ఆమె పర్యటించారు. ముందుగా కొత్తూర్లోని నర్సరీ, ఈజీఎస్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మీర్ఖాన్పేటలో ప్రభుత్వ భవనాలను సందర్శించి పలు సూచనలు చేశారు. నర్సరీ, పల్లె ప్రకృతి వనం, కంపోస్టు యాడ్, కమ్యూనిటీ ప్లాంటేషన్, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ముచ్చర్లలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందించే ఆహారాన్ని పరిశీలించారు. వెటర్నరీ, వైద్య ఆరోగ్యశాఖ సబ్ సెంటర్ భవనాలను సందర్శించి పనుల ప్రగతిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రగతి ప్రణాళికలో భాగంగా పూర్తి చేయాల్సిన పనులను వేగవంతం చేయాలన్నారు. ఎలాంటి నిర్లక్ష్యం తగదన్నారు. ఆమె వెంట ఎంపీడీఓ సరిత, ఎంపీఓ గీత, ఏపీఓ రవీందర్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
రోడ్డు కోసం రోడ్డున పడేయొద్దు
కొందుర్గు: ‘రోడ్డు వేయడానికి మేము అడ్డు చెప్ప డం లేదని.. కానీ మా భూములు లాక్కొని మా కు టుంబాలను రోడ్డున పడేయకండి సారూ’ అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రేడియల్ రోడ్డు–2 నిర్మాణంలో భాగంగా మంగళవారం మండలంలోని ముట్పూర్, ఉమ్మెంత్యాల, జిల్లేడ్ చౌదరిగూడ మండలంలోని లచ్చంపేటలో గ్రామసభలు ఏర్పా టు చేశారు. ఆయా సభలకు అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతు లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పచ్చని పంట పొలాల్లో నుంచి రోడ్లు వేస్తే తమ బతుకులు సాగేదె లా అని ప్రశ్నించారు. భూములకు బదులు భూము లు ఇవ్వాలని లేదంటే తాము ఎక్కడైనా భూములు కొనేందుకు వీలుగా బహిరంగ మార్కెట్లో పలుకుతున్న ధరలకు అనుగుణంగా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల అభిప్రాయాలు రికార్డు చేసుకున్నామని, వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి తెలిపారు. రైతులకు న్యాయం జరిగేలా కృషిచేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో షాద్నగర్ ఆర్డీఓ సరిత, తహసీల్దార్లు అజాం అలీ, జగదీశ్వర్, డిప్యూటీ తహసీల్దార్ నివేదిత రెడ్డి, సర్వేయర్ ఆంజనేయులు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ దామోదర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు అంజయ్య, జ్యోతి పాల్గొన్నారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు షాద్నగర్: పట్టణంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం నిర్వహించిన శివపార్వతుల కల్యాణోత్సవానికి అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు, మున్సిపల్ చైర్మన్ బస్వం, నాయకులు కృష్ణ, పెంటయ్య, దామోదర్రెడ్డి, సత్యనారాయణరెడ్డి, ఒగ్గు కిషోర్, పెద్ది రామ్మోహన్, కానుగు భూపాల్ తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రజా పాలన’ను జయప్రదం చేయాలి
చేవెళ్ల: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యాచరణ పనులు పక్కాగా జరగాలని మున్సిపల్ ప్రజాపాలన ప్రత్యేకాధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పద్మావతి అన్నారు. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మంగళవారం ఆమె మున్సిపల్ కమిషనర్ వెంకటేశంతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో ఉన్న యాక్షన్ ప్లాన్, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పల్లె ప్రకృతి వనాలు, శ్మశానవాటికలు, డంపింగ్ యార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని అన్నిశాఖల అధికారుల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆయా వార్డు అధికారులు పాల్గొన్నారు. -
108 అంబులెన్స్ తనిఖీ
కందుకూరు: మండల కేంద్రంలో 108 అంబులెన్స్ వాహనాన్ని మంగళవారం జిల్లా అంబులెన్స్ నిర్వహణాధికారి రాజాబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరుతో పాటు వారి పని తీరును పరిశీలించారు. ఆక్సిజన్ సరఫరా సక్రమంగా ఉందా లేదా అని పర్యవేక్షించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటు లో ఉంటూ అత్యవసర సమయంలో ఫోన్ వచ్చిన వెంటనే స్పందించి వారి వద్దకు చేరు కోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో 108 సిబ్బంది సురేందర్, షఫీ పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి మంచాల: అభివృద్ధి పనుల నిర్వహణలో నాణ్యత పాటించాలని ఈఈ (పీఆర్) సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని ఆరుట్ల, మంచాల గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ పనులు, మంచాలలో స్కూల్ భవన నిర్మాణ పనులు, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. అనంతరం మంచాల పంచాయతీ కార్యాలయం, ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం పనులు చేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎంవీ ప్రసాద్, ఎంపీడీఓ బాలశంకర్, ఎంపీఓ ఉమారాణి, ఆయా పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూమిలో బోర్డు ఏర్పాటు హయత్నగర్: అబ్దుల్లాపూర్మెట్టు మండలం మునుగనూరు సర్వే నంబర్ 44లోని ప్రభుత్వ భూమిలో మంగళవారం రెవెన్యూ అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు. ఓ వ్యక్తి ప్రభుత్వ భూమిని ఆక్రమించి బోరు వేసి నిర్మాణం చేసేందుకు ప్రయత్నించడంతో సమాచారం అందుకున్న జీపీఓ సుప్రియ ఆక్రమణదారులను హెచ్చరించారు. అయినా వారు పనులను కొనసాగిస్తుండంతో బోర్డు ఏర్పాటు చేశారు. గ్రామంలో ప్రభుత్వ భూములను రక్షించేందుకు కట్టుబడి ఉన్నామని, ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. షాద్నగర్ చౌరస్తా పరిశీలన షాద్నగర్: పట్టణ చౌరస్తాను మంగళవారం హెచ్ఎండీఏ అధికారులు మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బస్వంతో కలిసి పరిశీలించారు. ఎక్కడి వరకు విస్తరించవచ్చు అన్న విషయంపై ఆరా తీశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ఖాన్, కౌన్సిలర్లు అప్పి, పెంటయ్య, దిలీప్, నాయకులు ముబారక్, సాధిక్, మహబూబ్ తదితరులు ఉన్నారు. -
ఆదర్శ వివాహాలను ప్రోత్సహించాలి
ఇబ్రహీంపట్నం: కులాంతర వివాహాలు చట్ట విరుద్ధం కాదని, ఆదర్శ వివాహాలను పౌర సమాజం ప్రోత్సహించాలని కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్బాబు అన్నారు. ఇబ్రహీంపట్నంలోని పాషనరహరి స్మారక కేంద్రంలో మంగళవారం చిట్టంపల్లి ప్రసాద్, ఆకుల జయశ్రీల కులాంతర వివాహాన్ని కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఆయన కులాంతర వివాహం చేసుకుంటున్న జంటకు పూలదండలు మార్పించి, ప్రమాణ ప్రతాలు చదివించారు. ఈ సందర్భంగా స్కైలాబ్ బాబు మాట్లాడుతూ.. వివాహానికి కులం, మతం అడ్డుగోడలుగా నిలువద్దన్నారు. కుల, మతాంతర వివాహాలు చేసుకున్న వారిపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హత్యలను అరికట్టడానికి ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. కులం కంటే గుణం, మతం కంటే మానవత్వం గొప్పగా ఉండాలన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు సామేల్, కార్యదర్శి ప్రకాశ్ కారత్, ఉపాధ్యక్షుడు అరుణ్కుమార్, ప్రముఖ కవి బండి సత్తన్న, ముసలయ్య, పురుషోత్తం, ఆనంద్, స్వప్న, యాదయ్య, కిరణ్, అశోక్ పాల్గొన్నారు. -
ఎవరి వాటా వారికే!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఆస్తుల అసెస్మెంట్లో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అడిగినంత ముట్టజెప్పిన వారికి ఒకలా.. లేని వారికి మరోలా పన్నులు వేస్తున్నారు. ఒకే తరహా ఆస్తికి రెండు రకాలు వసూలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయా పట్టణ, గ్రామాల్లో పర్యటించి, క్షేత్రస్థాయి అధికారుల పనితీరును పర్యవేక్షించాల్సిన జిల్లా అధికారులు ఆఫీసు గేటు దాటి బయటికి తొంగి చూడటం లేదు. ఏదైనా ఫిర్యాదు అందితే మినహా అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా 111 జీఓ పరిధిలోని మున్సిపాలిటీలు సహా పంచాయతీల్లో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. కళ్లముందే అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా కళ్లప్పగించి చూడటం, తర్వాత ఇంటి నంబర్ల కేటాయింపు, ఆస్తుల అసెస్మెంట్ పేరుతో ఒక్కో నిర్మాణం నుంచి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా వసూలైన మొత్తంలో సంబంధిత జిల్లా స్థాయి అధికారులకు సైతం వాటాలు అందుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోకపోగా..పరోక్షంగా సహకరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. నిర్మాణాలు పూర్తయిన తర్వాత వాటికి పాత తేదీల్లో కొత్తగా ఇంటినంబర్లు జారీ చేస్తున్నారు. ఆస్తుల అసెస్మెంట్ పేరుతో స్థానికంగా ఉన్న ఫంక్షన్ హాల్స్, వ్యాపార, వాణిజ్య సముదాయాల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్లను సైతం డొమెస్టిక్ విభాగంలో నమోదు చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో వసూళ్లు అంతంతే.. ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం, కొత్తూరు, షాద్నగర్, శంకర్పల్లి, చేవెళ్ల, మొయినాబాద్ మున్సిపాలిటీల పరిధిలో 50 వేలకుపైగా గృహాలు, ఐదు వేలకుపైగా వాణిజ్య, వ్యాపార సముదాయాలు ఉన్నాయి. వీటి నుంచి ఆశించి నస్థాయిలో పన్నులు వసూలు కావడం లేదు. ఇక్కడ ఆస్తిపన్ను వసూళ్లు ఇప్పటి వరకు 75 శాతం కూడా మించలేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఆస్తుల అసెస్మెంట్స్, హోర్డింగులు, ట్రేడ్ లైసెన్సులు, భవన నిర్మాణాలకు అనుమతుల జారీ రూపంలో వచ్చే నిధులు సిబ్బంది జీతభత్యాలకే సరిపోతుంది. డ్రైనేజీలు, అంతర్గత రోడ్లు, మంచినీటి పైపు లైన్లు, పార్కుల వంటి చిన్నచిన్న అవసరాలకు ప్రభుత్వం వద్ద చేయి చాచాల్సి వస్తోంది. షాద్నగర్, ఆమనగల్లు, కొత్తూరు మున్సిపాలిటీలకు అతి తక్కువ ఆదాయం సమకూరుతోంది. వచ్చిన ఆదాయం సిబ్బంది వేతనాలకు కూడా సరిపోవడం లేదు. అభివృద్ధి పథకాలపై ప్రభుత్వంపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించకపోవడంతో మున్సిపాలిటీల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. ఇక శంషాబాద్ మున్సిపాలిటీలో పన్నులను రెట్టింపు వడ్డిస్తున్నారు. ఇది పూర్తిగా 111 జీవో పరిధిలో ఉండడం, నిర్మాణాలకు అనుమతులు లేకపోవడమే కారణం. ఇల్లీగల్ భవనాలకు అపరాధ రుసుంతో వడ్డిస్తున్నారు. ఫలితంగా ఇతర మున్సిపాలిటీలతో పోలిస్తే ఇక్కడ ఆస్తిపన్ను డబుల్ అవుతోంది. అయినా నిధుల కొరత తప్పడం లేదు. ఇటీవల కొత్తగా ఏర్పడిన మొయినాబాద్, చేవెళ్లలో నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆస్తుల అసెస్మెంట్లో చేతివాటం 141 పంచాయతీల్లో వందశాతం వసూళ్లు జిల్లాలో 526 పంచాయతీలు ఉండగా, వీటిలో 2,70,708 ఆస్తులు ఉన్నాయి. అసెస్మెంట్, ఆస్తి పన్ను వసూళ్ల ద్వారా ఆయా పంచాయతీల ఖాతాల్లోకి మొత్తం రూ.78,06,021 నగదు వచ్చి చేరింది. ఇదిలా ఉంటే ఆస్తిపన్ను వసూళ్లు 141 గ్రామ పంచాయతీల్లో వందశాతం దాటడం విశేషం. 15వ ఆర్థిక సంఘం నుంచి మూడు విడతల్లో ఆయా పంచాయతీల ఖాతాల్లో నిధులను జమ చేసింది. ఒక్కో పంచాయతీలో రూ.35 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నిధులు ఉన్నాయి. ఆస్తిపన్ను వసూళ్ల ద్వారా ఖాతాలో నిల్వలు మరింత పెరిగిపోయాయి. ఇతర పంచాయతీలతో పోలిస్తే అబ్దుల్లాపూర్మెట్ మండలం పిగ్లీపూర్లో 57 శాతం, చేవెళ్ల మండలం రేగడిఘనపూర్ 55 శాతం, కేశంపేట మండలంలోని వేములనర్వ్లో 47 శాతం ఆస్తిపన్ను వసూళ్లతో వెనుకబడి ఉండటం కొసమెరుపు. పంచాయతీ ఖాతాల్లో పుష్కలంగా నిధులు ఉండటంతో వీటిని కొల్లగొట్టేందుకు పలువురు కార్యదర్శులు అడ్డ దారులు తొక్కుతున్నారు. గతంలో చేయని పనులకు చేసినట్లు నకిలీ బిల్లులు పెడుతున్నట్లు ఫిర్యాదులు లేకపోలేదు. -
యువత దేశానికి వెన్నెముక
● డ్రగ్స్కు బానిసలు కావొద్దు ● ఎస్పీ స్నేహ మెహ్ర కొడంగల్: నేటి యువత దేశానికి వెన్నెముకలా వ్యవహరించాలని, యువశక్తిని నిర్వీర్యం చేసేందుకు డ్రగ్స్ మాఫియా పన్నుతున్న కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అరైవ్ –అలైన్, డ్రగ్స్ నివారణ అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రైవర్ల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆమె పరిశీలించారు. పలువురికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డ్రగ్స్ ఊబిలో చిక్కుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల సరఫరా గురించి ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. వివరాలు తెలిపిన వారి పేర్లు అత్యంత గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ప్రతిరోజూ ఉపాధి కోసం బయటకు వెళ్లే వ్యక్తులు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకోవడమే అర్రైవ్–అలైన్ ప్రాజక్టు ప్రధాన లక్ష్యమని అన్నారు. వాహనదారులు, డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు భద్రపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. డ్రైవింగ్ చేసే సమయంలో కంటి చూపు స్పష్టంగా ఉండడం అత్యంత కీలకమన్నారు. డ్రైవర్లు క్రమం తప్పకుండా కంటి, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. తద్వారా ప్రమాదాలు నివారించేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి.రాములునాయక్, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కొడంగల్ సీఐ శ్రీధర్రెడ్డి, ఎస్ఐ సత్యనారాయణ, ఎంవీఐ వసంత్, మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పట్టా భూములు ఇచ్చేది లేదు
కందుకూరు: పట్టా భూములు ప్రభుత్వానికి ఇచ్చేది లేదని తిమ్మాయిపల్లి రైతులు తేల్చి చెప్పారు. ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మండల పరిధిలోని అన్నోజిగూడలో తిమ్మాయిపల్లి రెవెన్యూ సర్వే నంబర్లు 1 నుంచి 13 వరకు ఉన్న పట్టా భూములు 63 ఎకరాలతో పాటు సర్వే నంబర్లు 14, 15లో ఉన్న ప్రభుత్వ భూమిని సేకరించడానికి గ్రామసభ నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు భూములు ఇచ్చి సహకరించాలని ఈ సందర్భంగా ఆర్డీఓ వారికి సూచించారు. న్యాయమైన పరిహారం అందుతుందని తెలిపారు. కొద్ది విస్తీర్ణంలో ఉన్న పట్టా భూములను తీసుకుంటే తాము ఏవిధంగా జీవించాలో చెప్పాలని రైతులు వాపోయారు. అసైన్డ్ భూములు ఇవ్వడానికి అభ్యంతరం లేదని పట్టా భూములు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోమని స్పష్టం చేశారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆర్డీఓ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోపాల్, డీఏ శంషొద్దీన్, సీఐ వెంకటేశ్వర్లు, సర్పంచ్ సురేష్, ఉప సర్పంచ్ ఢిల్లీ పద్మకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తేల్చి చెప్పిన రైతులు -
మెట్రో టేకోవర్పై సీఎం సమీక్ష
● త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం ● ఇక ఏప్రిల్లోనే మెట్రో స్వాధీనం సాక్షి, సిటీబ్యూరో: మెట్రో టేకోవర్పై మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉన్న తాధికారులతో సమీక్షించారు. టేకోవర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మార్చి 31వ తేదీ లోపు మెట్రో మొదటి దశ టేకోవర్కు ప్రభుత్వం గడువు విధించిన సంగతి తెలిసిందే. కానీ, ఈ గడువులోగా స్వాధీన ప్రక్రియ పూర్తి కాకపోవడం రుణాల చెల్లింపులపైనా స్పష్టత లేకపోవడంతో జాప్యం నెలకొంది. ఈ క్రమంలో సీఎం మెట్రో టేకోవర్పైన సమీక్షించారు. మార్చి 31వ తేదీ గడువు ముగిసినందున ఇక ఏప్రిల్లో అది పూర్తయ్యే అవకాశముంది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో నిర్మించిన మెట్రో మొదటి దశ నిర్వహణ భారం దృష్ట్యా ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా కొనసాగలేమంటూ గతేడాది సెప్టెంబర్లో ఎల్అండ్టీ సంస్థ చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును స్వాధీనం చేసుకొనేందుకు ముందుకు వచ్చింది. మెట్రో రెండోదశ నిర్మాణానికి ఎదురైన సాంకేతిక ఆటంకాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొంది. అప్పటి నుంచి వివిధ దశల్లో చర్చలు, సమీక్షలు జరిగాయి. ఆర్థిక అంచనాలపై ఐడీబీఐ, సాంకేతిక అంశాలపై ఢిల్లీ మెట్రోరైల్ సంస్థలు సమగ్రమైన అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికలు అందజేశాయి. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సిన రూ.13 వేల కోట్లను తక్కువ వడ్డీతో రీఫైనాన్స్ చేసేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఆర్ఎఫ్సీ) సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఎల్అండ్ టీకి అందజేయాల్సిన రూ.2 వేల కోట్ల పెండింగ్ బకాయిలను ప్రభుత్వమే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ ఆమోదం కూడా లభించింది. రుణాల చెల్లింపుతోపాటు ఎల్అండ్ టీ ఈక్విటీ చెల్లింపు వంటి ప్రక్రియలను త్వరలో పూర్తి చేసి ప్రాజెక్టును స్వాధీనం చేసుకోనున్నారు. దాచిన 13 ఎల్పీజీ సిలిండర్ల పట్టివేత శంషాబాద్: వంటగ్యాస్ కొరతే అక్రమార్కులకు వరమైంది. శంషాబాద్ సర్కిల్లో మంగళవారంరాత్రి టాస్క్ఫోర్స్ దాడుల్లో పక్కదారి పట్టిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు, పెట్రోలు పట్టుబడింది. వివరాలు ఇలా ఉన్నాయి. శంషాబాద్ పాత పోలీస్స్టేషన్ సమీపంలో రవి అనే కిరాణా వ్యాపారి ఇంట్లో దాచిన 13 ఎల్పీజీ సిలిండర్లు, సుమారు ఎనభై లీటర్ల పెట్రోలును టాస్క్ ఫోర్సు అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. అతడిపై గతంలో ప్రజాపంపిణీ బియ్యం విక్రయానికి సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. అగ్ని ప్రమాదం రెండు ద్విచక్ర వాహనాలు, ఆటో దగ్ధం చందానగర్: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో విద్యుదాఘాతం ఏర్పడటంతో కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండనగర్లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ట్రాన్స్ఫార్మర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న ఆటో, రెండు ద్విచక్రవాహనాలకు మంటలంటుకుని దగ్ధమయ్యాయి. పక్కన ఉన్న రెండు భవనాలు మంటలకు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వెంటనే బస్తీ ప్రజలు స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ సంఘటనాస్థలానికి చేరుకొని అధికారులతో మాట్లాడి త్వరతగతిన విద్యుత్ను పునరుద్ధరించాలని కోరారు. -
రంజిత్రెడ్డికి సీఎం పరామర్శ
చేవెళ్ల: ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి మంగళవారం మాజీ ఎంపీ గడ్డం రంజిత్రెడ్డిని పరామర్శించారు. రంజిత్రెడ్డి తల్లి చంద్రకళ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో నగరంలోని వారి ఇంటికి వెళ్లి సంతాపం తెలిపారు. చంద్రకళ చిత్రపటం వద్ద నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. డాక్టరేట్ ప్రదానం షాద్నగర్ రూరల్: దేశ రాజధాని న్యూఢిల్లీలో వరల్డ్ ఉమెన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రొటెక్షన్ కమిషన్ సభ్యుడిగా మ్యాగ్నెట్ విద్యాసంస్థల అధినేత ఎండీ వాజీద్ పాషాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయనకు గౌరవ డాక్టరేట్ అందజేసి సత్కరించారు. యువతి అదృశ్యం షాబాద్: ఓ యువతి అదృశ్యమైన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రమే ష్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామానికి చెందిన మేకల వెంకటయ్య కూతురు భావన (20) ఈ నెల 30న ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసింది. అర్ధరాత్రి తండ్రికి మెలకువ వచ్చి చూడగా కూతురు కనిపించలేదు. చుట్టు పక్కల, బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లో నుంచి వెళ్లినప్పుడు ఆమె ఒంటిపై పింక్ కలర్ టాప్, వైట్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు తెలిపాడు. అదే గ్రామానికి చెందిన పసుల శ్రీకాంత్ అనే యువకుడిపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో .. మొయినాబాద్రూరల్: యువతి అదృశ్యమైన సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్కు చెందిన తోక భార్గవి (19) ఈ నెల 30న ఇంటి నుంచి బయటకు వెళ్లింది. పనికి వెళ్లిన తల్లి వచ్చి చూడగా కూతురు కనిపించకపోవడంతో బంధువులు, స్నేహితులు, చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
HYD: భారీగా హైడ్రా కూల్చివేతలు
సాక్షి, రంగారెడ్డి: తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా బుధవారం తెల్లవారుజాము నుంచే మైలార్దేవుపల్లి సర్కిల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సుమారు 30 కోట్ల రూపాయల విలువచేసే స్థలాన్ని హైడ్రా కాపాడినట్టు తెలుస్తోంది.వివరాల మేరకు.. మైలార్దేవుపల్లిలో సర్వే నంబరు 134/20 శాస్త్రిపురానికి చెందిన 6500 గజాల పార్కు స్థలం కబ్జాకు గురైనట్టు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో స్థానికుల ఫిర్యాదుతోరంగంలోకి దిగిన హైడ్రా.. నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లుగా చేసి అమ్మి సొమ్ముచేసుకున్నట్టు గుర్తించింది. దీంతో, బుధవారం తెల్లవారుజాము నుంచే భారీ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలను చేపట్టింది. పార్క్ స్థలంలో నిర్మాణాలను నేలమట్టం చేసింది. అలాగే, మూడు, నాలుగు అంతస్తులున్న భవనాలను సైతం హైడ్రా సిబ్బంది నేలమట్టం చేసింది. సుమారు 30 కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని హైడ్రా కాపాడినట్టు తెలిసింది.అంతకుముందు మంగళవారం కూడా హైడ్రా ఆక్రమణల కూల్చివేత చేపట్టింది. మంచిరేవుల గ్రామంలోని నాగిరెడ్డికుంటలో 7 ఎకరాల స్థలాన్ని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కబ్జాలో ఉంచుకున్నట్లు తేలింది. సర్వే చేయగా.. సదరు సంస్థ కబ్జాచేయగా మిగిలిన భూమిని, స్థానిక నేత విక్రయించినట్లు స్పష్టమైంది. ఆ మేరకు మొత్తం ఆక్రమణలను నేలమట్టం చేశామని హైడ్రా వెల్లడించింది. బహిరంగ మార్కెట్లో వాటి విలువ రూ.934 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అలాగే, బౌరంపేట్లోని గండిమైసమ్మ-మియాపూర్ రహదారికి ఇరువైపులా ఎకరా విస్తీర్ణంలో నిర్మించిన రేకుల షెడ్లను హైడ్రా నేలమట్టం చేసింది. ఘట్కేసర్ వద్దనున్న అవుషాపూర్లో.. ఇళ్ల స్థలాలుగా మారిన 1,440 గజాల పార్కు భూమికి, జూబ్లిహిల్స్లో ఆక్రమణకు గురైన 300గజాల వరద నాలాకు హైడ్రా విముక్తి కల్పించింది. -
డ్రగ్స్ సరఫరా ముఠా అరెస్ట్
శంకర్పల్లి: డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎస్ఓటీ, స్థానిక పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్కు చెందిన పొన్నాల సిద్దార్థ్(27) సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్లో సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొన్నేళ్లుగా డ్రగ్స్కు అలవాటు పడిన సిద్దార్థ్ గోవా నుంచి మాదకద్రవ్యాలను తీసుకొచ్చి పబ్లు, క్లబ్లతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అమ్ముతున్నాడు. ఈ క్రమంలో విజయవాడకు చెందిన సాఫ్ట్వేర్ చలవాడి హిమంత్ కృష్ణవంశీ(30) హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుండగా.. సిద్దార్థ్కు పరిచయమయ్యాడు. వీరికి నాచారానికి చెందిన రొయ్యల వ్యాపారి అవదూత విష్ణుతేజ(36) జతయ్యాడు. ముగ్గురూ ముఠాగా ఏర్పడి గోవా నుంచి 39.72 గ్రాముల కొకై న్, 3గ్రాముల గంజాయి తీసుకుని మోకిల పీఎస్ పరిధిలోని ఇంద్రారెడ్డినగర్ మీదుగా వెళ్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఆదివారం వాహన తనిఖీలు చేస్తుండగా, ముగ్గురూ డ్రగ్స్తో పట్టుబడ్డారు. వీరి నుంచి మాదకద్రవ్యాలతో పాటు కారు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, సోమవారం చేవెళ్ల కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం రిమాండ్ నిమిత్తం సంగారెడ్డి జైలుకు తరలించారు. -
న్యాయవ్యవస్థపై నమ్మకం పెంచాలి
చేవెళ్ల: న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెంచేలా పనిచేయాలని చేవెళ్ల ఏడీజే కోర్టు జిల్లా అదనపు న్యాయమూర్తి బృంగి శ్రీనివాసులు, సీనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి దశరథ రామయ్య, జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి వియకుమర్ ఉపాధ్యాయ బార్ అసోసియేషన్ నూతన పాలకవర్గానికి సూచించారు. స్థానిక కోర్టు ఆవరణలో సోమవారం బార్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన న్యాయమూర్తులు మాట్లాడుతూ.. కక్షిదారులకు స్వతర, ఖచ్చితమైన న్యాయ సేవలు అందించడానికి కృషిచేయాలన్నారు. సీనియర్ న్యాయవాది రాంరెడ్డి మాట్లాడుతూ.. చేవెళ్ల కోర్టుకు జిల్లాలో ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. బార్ అధ్యక్షుడు పాటి మధుసూదన్రెడ్డితో పాటు పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎన్.చంద్రశేఖర్, ఎన్,మాధురి, ప్రధాన కార్యదర్శి పి.మల్లేశ్యాదవ్, జాయింట్ సెక్రటరీ ఈ.రవీందర్రెడ్డి, ట్రెజరర్ జనార్దన్, స్పోర్ట్స్ అండ్ కల్చరర్ సెక్రటరీ ఎ.ప్రభాకర్రెడ్డి, లైబ్రేరియన్ టి.మహేశ్, ఇ.కవిత, ఎగ్టిక్యూటివ్ కమిటీ సభ్యులు మహేశ్, సుదర్శన్, ఆనంద్, ప్రవీణ్రెడ్డి, మనీషారెడ్డి, కె. ప్రవీణ, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
రూ.కోటి విలువైన హష్ ఆయిల్ స్వాధీనం
ఇద్దరు నిందితుల అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి మహేశ్వరం: ఒడిశా నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న రూ.కోటి విలువ చేసే సుమారు 9.4 కిలోల హష్ ఆయిల్(గంజాయి నుంచి తయారు చేసే నూనె)ను స్థానిక, ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరం పోలీస్ స్టేషన్లో డీసీపీ నారాయణరెడ్డి సోమవారం విలేకరులకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా జీడిమడుగుల మండలం సంకులమిడ్డె గ్రామానికి చెందిన కొరాబు చంటిబాబు, ఒడిశాకు చెందిన రాజారావు నుంచి హష్ ఆయిల్ సేకరించి(డ్రగ్) సేకరించి, నగరంలోని గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా సరఫరా చేయడానికి ప్రయత్నించారు. మార్చి 29న ఆదివారం సాయంత్రం 6 గంటలకు మహేశ్వరం గేటు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న సమయంలో పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో చంటిబాబు వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా పది పాలిథిన్ కవర్లలో ఉన్న హష్ ఆయిల్తో పాటు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి పరారీలో ఉన్నారు. పట్టుబడిన హష్ ఆయిల్ విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని తెలిపారు. నిందితుడు చంటిబాబుపై ఏపీలోని కంచరపాలెం, అనాకపల్లి, విశాఖపట్నం ప్రాంతాల్లో నాలుగు ఎన్డీఎఫ్ కేసులు నమోదయ్యాయి. యువత, విద్యార్థులు డ్రగ్స్, గంజాయి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని డీసీపీ సూచించారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలన్నారు. డ్రగ్స్, గంజాయికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే మహేశ్వరం జోనల్ కంట్రోల్ 8712662664 నంబర్కు లేదా 100 నంబర్కు ఫోన్ చేయాలన్నారు. ఆపరేషన్లో ప్రతిభకనబర్చిన అధికారులు, పోలీసులను ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషర్ సుధీర్బాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం సీఐ రాఘవేందర్రెడ్డి, ఎస్ఐలు ప్రసాద్, రాఘవేందర్, ధనుంజయ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
యువకుడి అదృశ్యం
షాబాద్: పెట్రోల్ పంపులో పనిచేయడానికి అని చెప్పి ఈనెల 26న ఇంటి నుంచి వెళ్లిన యువకుడు అదృశ్యమయ్యాడు. ఎస్ఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. సర్ధార్నగర్కు చెందిన కొమ్ము అక్షయ్ కుమార్ (18) నాలుగు నెలలుగా షాద్నగర్లోని ఓ పెట్రోల్ బంకులో కూలీగా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే ఈ నెల 26న పంపులోకి వెళ్తున్నానని చెప్పి, తిరిగి రాలేదు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం షాద్నగర్ రూరల్: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన సోమవారం షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చటాన్పల్లి శివారులో చోటు చేసుకుంది. ఎస్ఐ సుశీల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామ శివారులో గుర్తు తెలియని సుమారు (55) ఏళ్ల వయస్సు ఉన్న మృతదేహాన్ని గమనించిన గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు భిక్షాటన చేస్తూ పరిసర ప్రాంతాల్లో నివసించే వ్యక్తి అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి ఒంటిపై బూడిద రంగు చొక్కా, ఎర్ర రంగు అండర్వేర్ ఉన్నాయన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. ఆచూకీ తెలిస్తే షాద్నగర్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ తెలిపారు. నీటి గుంతలో మృతదేహం చేవెళ్ల: హస్తేపూర్ సమీపంలోని ఓ నీటి గుంతలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి.. నీటి గుంతలో శవాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని బయటకు తీయగా 30– 40 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తిగా గుర్తించారు. కుడి చేతిపై చిన్న పచ్చబొట్టు, చేతికి ఎరుపు రంగు దారం, మెడలో ఎరుపు దారంతో కూడిన రుద్రాక్ష, కుడి కాలిపై, నడుముపై నలుపు రంగు దారం కలిగి ఉన్నాయని తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే సమాచారం అందించాలని సూచించారు. బాలిక ఆత్మహత్య బంజారాహిల్స్: తల్లి మందలించిందని ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన మేరకు.. బీహార్కు చెందిన ఉద్గర్ మండల్ కుటుంబం బంజారాహిల్స్ సయ్యద్నగర్లో నివాసముంటోంది. కూతురు దీపాకుమారి (14) ఎన్బీటీనగర్లోని శ్రీసాయిరాం హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుకుంటోంది. కొంతకాలంగా చుట్టుపక్కల ఇళ్లకు తరచూ వెళుతుండటంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలిక సోమవారం తెల్లవారుజామున తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దివ్యాంగ యువతిపై లైంగికదాడి అత్తాపూర్: ఇంట్లో ఎ వ్వరూ లేనిసమయంలో ఓ వ్యక్తి సమీప బంధువైన దివ్యాంగ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. బార్కస్ చంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన మహమ్మద్ అఖీల్(35) మద్యానికి బానిస కావడంతో భార్య, ముగ్గురు పిల్లలు ఇతనికి దూరంగా ఉంటున్నారు. హసన్నగర్లో అఖీల్ సోదరి కుంటుంబం నివాసం ఉంటోంది. వారితోపాటు ఆడపడుచు (మూగ యువతి, దివ్యాంగురాలు) కూడా ఉంటోంది. ఇదిలా ఉండగా అఖీల్ తరచూ సోదరి ఇంటికి వచ్చేవాడు. ఈ నెల 28న ఉదయం 9 గంటల సమయంలో సోదరి కుటుంబసభ్యులందరూ బయటకువెళ్లగా యువతి మాత్రమే ఇంట్లోనే ఉంది. ఇది గమనించిన మహమ్మద్ అఖీల్ లోపలికి వెళ్లి ఆమైపె లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత కుటుంబసభ్యులు రావడంతో క్షమించమని ప్రాధేయపడి పరారయ్యాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు రంగంలోకి దిగి 48 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
అతివేగం ప్రాణాంతకం
అబ్దుల్లాపూర్మెట్: అతివేగంగా వాహనాలు నడుపుతున్న యువత ప్రమాదాల్లో ప్రాణా లు కోల్పోతున్నారని డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. గుంతపల్లిలోని అవంతి విద్యాసంస్థల ఆవరణలో సోమవారం ‘యుఫోరియా 2026’ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కళాశాల చైర్మన్ శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ నందీష్, జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎం.ప్రియాంక, ఎండీ శ్రవణ్ కుమార్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. జేఎన్టీయూ డైరెక్టర్ డాక్టర్ ఆర్.శ్రీదేవి, విర్చుసా క్యాంపస్ లీడ్ అభిషేక్ దోయిజోడే, ప్రొఫెసర్ టీవీ నారాయణ, కళాశాల డైరెక్టర్ జయప్రద, శేషతల్పసాయి, ఉమాపతిరెడ్డి, రాజ్కమల్, షేక్ అజ్మల్ హుస్సేన్ పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి చర్యలు
షాద్నగర్: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బస్వం అన్నారు. సోమవారం పట్టణంలోని 27వ వార్డు న్యూసిటీ కాలనీలో మున్సిపల్ చైర్మన్ బస్వం, కౌన్సిలర్ మురళీమోహన్ పర్యటించి కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను శుభ్రం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. అన్ని వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రజలకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసినట్లు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బస్వం -
మీటర్ సేల్స్ పెంపే లక్ష్యం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘డిస్కంలో మీటర్ల కొరత ఉన్నమాట వాస్తవమే. కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని, స్టకప్, బర్డ్డన్ మీటర్లను మార్చాల్సిందిగా కోరుతూ వినియోగదారుల నుంచి అనేక విజ్ఞప్తులు వస్తున్నాయి. కొత్త కనెక్షన్ల జారీ సహా పాడైన మీటర్లను మార్చేందు ప్రత్యేక చర్యలు చేపట్టాం. విద్యుత్ పరికరాల కొనుగోళ్లలో భాగంగా మీటర్ల సమీకరణకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. పారదర్శకతకు పెద్దపీటవేస్తున్నాం. ఇందుకు సీనియర్ సీఈలతో ఓ కమిటీని ఏర్పాటు చేశాం’ అని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ జితేష్ వి.పాటిల్ అన్నారు. ఈ మేరకు సోమవారం టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఇప్పటికే 58 కొత్త సబ్స్టేషన్లు(33/11 కేవీ) సహా 57 ఫీడర్లు (33 కేవీ) ఏర్పాటు చేశాం. 119 పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచాం. అదనంగా మరో 442 ఫీడర్లు(11కేవీ) సహా మరో 3,262 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసుకున్నాం. లైన్లకు అడ్డుగా ఉన్న చెట్లకొమ్మలను తొలగించాం. ఏదైనా సాంకేతిక సమస్యతో కరెంట్ సరఫరా నిలిచిపోతే.. వెంటనే సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రత్యేక బృందాలను కూడా సిద్ధం చేసుకున్నాం. సేవలన్నీ ఆన్లైన్లోనే.. కొత్త కనెక్షన్ల జారీ, ప్యానల్బోర్డు, డీటీఆర్ల మంజూరు, వర్క్ ఎస్టిమేషన్లలో అక్రమ వసూళ్లకు పూర్తిగా చెక్పెట్టబోతున్నాం. వర్క్ ఎస్టిమేషన్ మొదలు.. కొత్త కనెక్షన్ల జారీ వరకు ఇలా అన్ని దరఖాస్తులను ఆన్లైన్లోనే స్వీకరిస్తాం. వర్క్ ఎస్టిమేషన్లలో ఒక యూనిఫాం విధానాన్ని తీసుకురాబోతున్నాం. ఏఐతో నష్టాలకు చెక్.. అన్ని విభాగాల్లోనూ ఏఐ ఆధారిత సేవలను వినియోగించుకోబోతున్నాం. సబ్ స్టేషన్ల వారీగా గత మూడేళ్ల డేటాను విశ్లేషించబోతున్నాం. ప్రతీ డీటీఆర్ను ఏఐ తో అనుసంధానం చేయబోతున్నాం. విద్యుత్ నష్టాలకు కారణాలను గుర్తించడంతో పాటు భవిష్యత్తు డిమాండ్ను అంచనా వేసి, సబ్స్టేషన్లు, ఫీడర్లు, డీటీఆర్లను ఏర్పాటు చేయనున్నాం. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవల కోసం మరో 260 ఆస్పత్రులతో అవగాహన ఒప్పందంకుదుర్చుకున్నాం. డిస్కం తాజా నిర్ణయంతో 8,229 మంది రిటైర్డ్, 20,261 సర్వీసు ఇంజనీర్లు లబ్ధిపొందే అవకాశం ఉంది. ప్రై వేటు మీటర్ రీడర్ల సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని నిర్ణయించాం.పారదర్శకంగా విద్యుత్పరికరాల కొనుగోలు పెరిగిన విద్యుత్ డిమాండ్ విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. ఎంత డిమాండ్ వచ్చినా.. తట్టుకుని సరఫరా చేసే సామర్థ్యం డిస్కంకు ఉంది. గతేడాది టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 11,017 మెగావాట్ల డిమాండ్ నమో దు కాగా, ఈ ఏడాది మార్చి 13న రికార్డు స్థాయిలో 11,318 మెగావాట్లు నమోదైంది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో గతేడా ది 4,352 మెగావాట్లు నమోదు కాగా, ఈ ఏ డాది మార్చి 3న 4,421 మెగావాట్లు రికార్డైంది. వచ్చే రోజుల్లో రోజు గరిష్ట విద్యుత్ డిమాండ్ ఐ దు వేల మెగావాట్లు దాటుతుందని అంచనా వే శాం. ఆ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశాం. -
రైతులకు రుణాలు ఇచ్చి సహకరించండి
● రికవరీ చేసి సహకార సంఘానికి న్యాయం చేయండి ● జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ఎలుగంటి మధుసూదన్రెడ్డి షాబాద్: రైతులకు వ్యవసాయ సీజన్ల్లో రుణాలు ఇచ్చి వారి పెట్టుబడికి చేదోడు వాదోడుగా ఉండాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని సహకార సంఘం సర్వసభ్య సమావేశానికి సంఘం ప్రత్యేక అధికారి ప్రవీణ్కుమార్తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన రుణాలను సకాలంలో రికవరీ చేసి సంఘం అభివృద్ధికి సహకరించాలన్నారు. సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి వడ్డీ రాయితీ పొందాలని సూచించారు. సంఘం ప్రత్యేక అధికారి మాట్లాడుతూ.. మండల రైతులు అన్ని రకాలుగా సంఘానికి ఉపయోగపడుతున్నారని, రుణాల రికవరీ విషయంలో కొంత నిదానంగా ఉన్నారన్నారు. సహకార సంఘం సీఈఓ శివకుమార్రెడ్డి మాట్లాడుతూ.. ఈ సంవత్సరం 1400 మంది రైతులకు అధిక రుణాలు అందించిన్నట్లు చెప్పారు. 828 మంది రైతులకు స్వల్పకాలిక రుణాలు ఇచ్చామన్నారు. మొత్తం 51 శాతం వరకు రుణాలు ఇచ్చామని, 45 శాతానికిౖ పెగా రికవరీ చేశామన్నారు. మరో నెల రోజుల్లో మరికొంత రికవరీ జరుగుతుందని హామీనిచ్చారు. కార్యక్రమంలో సీఈఓ శివకుమార్రెడ్డి, సర్ధార్నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంజీవరెడ్డి, సర్పంచులు అశోక్, ప్రభాకర్రెడ్డి, చెన్నయ్య, మహేందర్గౌడ్, తదితరులు ఉన్నారు. -
కస్టమర్లపై అదనపు వడ్డింపులు
టిఫిన్లపై రూ.10, టీపై రూ.5 ● గ్యాస్ కొరతే కారణమంటున్న హోటళ్ల నిర్వాహకులు సాక్షి, రంగారెడ్డి జిల్లా: పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు.. జిల్లాలోని టీ, టిఫిన్ సెంటర్లపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మార్కెట్లో వాణిజ్య సిలిండర్ల కొరత ఏర్పడటం, వంటగ్యాసుకు అదనపు చెల్లింపులు చేయాల్సి వస్తుండటంతో వ్యాపారులు ఆ భారాన్ని వినియోగదారులపై రుద్దుతున్నారు. నిన్న మొన్నటి వరకు రూ.10 ఉన్న టీ ధర.. తాజాగా రూ.15 పెంచేశారు. ప్లేటు ఇడ్లీ, వడ, దోశకు సైతం అదనపు చెల్లింపులు తప్పడం లేదు. ఒక్కో ప్లేటుకు రూ.పది అదనంగా చెల్లించాల్సి వస్తోంది. అదేమంటే బహిరంగ మార్కెట్లో వంట గ్యాస్ దొరకడం లేదని, బ్లాక్మార్కెట్లో ఒక్కో సిలిండర్కు రూ.3 నుంచి రూ.5 వేల వరకు చెల్లించాల్సి వస్తోందని నిర్వహకులు చెబుతున్నారు. గ్యాస్ కొరత వల్ల ఇప్పటికే మెజార్టీ టీస్టాళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మూతపడ్డాయి. ఉన్నవాటిలోనూ ధరలను అమాంతం పెంచడం గమనార్హం. ఇంట్లో వంట చేసుకునే తీరిక లేక హోటల్లో కడుపునింపుకుందామని భావించే వారు పెరిగిన ఈ ధరలను చూసి ఆందోళన చెందుతున్నారు. కొరత పేరుతో కొట్టేస్తున్నారు.. జిల్లాలో 14 లక్షలకుపైగా గ్యాస్ కనెక్షన్లు ఉండగా, వీటిలో మూడు వేలకుపైగా వాణిజ్య సిలిండర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు మెజార్టీ టీ స్టాల్స్, చైనీస్ పాస్ట్ ఫుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్ల నిర్వహకులు వాణిజ్య అవసరాలకు కూడా డొమెస్టిక్ గ్యాసునే ఉపయోగించే వారు. ఇరుగు పొరుగు వారి సిలిండర్లను రీఫిల్ చేసి.. తమ అవసరాలు తీర్చుకునే వారు. అమెరికా, ఇజ్రాయిల్ కూటమి– ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఆయిల్ దిగుమతులు తగ్గిపోయాయి. ప్రభుత్వం వాణిజ్య సిలిండర్లపై ఆంక్షలు విధించింది. కొన్ని గ్యాస్ ఏజెన్సీల డీలర్లు, డెలివరీ బోయ్స్ దీన్ని అవకాశంగా తీసుకున్నారు. వినియోగదారుల పేరున రీఫిల్ బుక్ చేసి, వాటిని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. ఒక్కో సిలిండర్ను రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఆయా హోటళ్లు, టిస్టాల్ నిర్వాహకులు వీటిని అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఆ భారాన్ని కస్టమర్లపై రుద్దుతున్నారు. ఎప్పటికప్పుడు ఆయా ఏజెన్సీలు/డెలీవరీ సర్వీసులపై నిఘా ఉంచాల్సిన విజిలెన్స్ అధికారులు సైతం వారిచ్చే అమ్యామ్యాలకు అలవాటుపడి అటు వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు లేకపోలేదు. -
‘పీఠం’ ముడి వీడేనా..?
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ సోమవారం విడుదల చేసింది. గత నెల 11న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించగా 13న ఫలితాలు వచ్చాయి. 16న సమావేశం నిర్వహించి కౌన్సిలర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ వెంటనే జరగాల్సిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు.. బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి తిరుగుబాటుతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య వివాదాలు రాజుకోవడంతో ఫిబ్రవరి 17న ఏర్పాటు చేసిన ఎన్నిక సైతం పడింది. ఈ వివాదాలు న్యాయస్థానాలకు చేరాయి. ఈ దశలో నాలుగువారాలలోపు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని గత మార్చి 3న కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాజాగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది. ముందుగా కౌన్సిలర్లుకు నోటీసులు ఇచ్చి ఏప్రిల్ 4న మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. ఏదైనా కారణంతో ఆ రోజు వాయిదా పడితే మరుసటి రోజు(5వ తేదీ) నిర్వహించాల్సి ఉంటుంది. ఈసారైన పీఠముడి వీడేనా.... ఽఅధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్లు మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు ఎత్తులు జిత్తులు వేస్తుండటంతో ఈ వివాదం రోజురోజుకు ముదురింది. బీఆర్ఎస్కు మెజార్టీ కౌన్సిలర్లు ఉన్నా వివిధ వివాదాలతో ఈ ఎన్నికలు వాయిదా పడ్డాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి బీఆర్ఎస్ కౌన్సిలర్లు క్యాంపు బాట పట్టారు. ఈసారైన పీఠం ముడి విడుతుందా లేక మళ్లీ వివాదాల్లో చిక్కుకొని వాయిదా పడుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం తేలాలంటే వచ్చే 4వ తేదీ వరకు వేచిచూడాల్సిందే. -
ముగిసిన వార్డుసభ్యుల శిక్షణ
మొయినాబాద్రూరల్: గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యులందరూ సర్పంచ్, ఉపసర్పంచ్తో పాటు అధికారులతో కలిసి కృషి చేయాలని ఎంపీడీఓ సంధ్య, ఎంపీఓ వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం మొయినాబాద్ రైతు వేదికలో వార్డుసభ్యుల శిక్షణ ముగింపు సమావేశంలో ఆమె వారు పాల్గొని వార్డుసభ్యులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఐదు రోజులుగా మండలంలోని తొమ్మిది గ్రామాలకు చెందిన 80 మంది వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధిపై వారికి క్షుణ్ణంగా అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యదర్శులు, వార్డుసభ్యులు, ఉపసర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. -
షూటింగ్ పోటీలో మెరిసిన సీఐ
కాంస్య పతకం కై వసం.. అభినందించిన సీపీ ఇబ్రహీంపట్నం రూరల్: షూటింగ్ పోటీల్లో ఫ్యూచర్సిటీ సీఐ జేమ్స్బాబు అరుదైన ఘనత సాధించారు. జాతీయ స్థాయి పోటీల్లో కాంస్య పతకం కై వసం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ బోపాల్లో నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన 0755 ఇండియా ఓపెన్ కాంపిటిషన్ (ఎయిర్ రైఫిల్, పిస్టల్) మార్చి 11 నుంచి 17 వరకు జరిగాయి. ఈ టోర్నీలో ఫ్యూచర్సిటీ కమిషనరేట్ ఐటీసెల్ ఇన్చార్జిగా పని చేస్తున్న సీఐ జేమ్స్బాబు రాణించారు. ఈ సందర్భంగా కమిషనర్ సుధీర్బాబు సీఐని అభినందించారు. విధుల్లో బిజీగా ఉన్నప్పటికీ క్రీడల్లో ప్రతిభ చూపి, పోలీసుశాఖకు వన్నె తెచ్చా వని ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యుత్ ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలి టీవీఏఈ జేఏసీ రాష్ట్ర నాయకుడు కావలి వెంకటేశ్ షాద్నగర్: విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ రాష్ట్ర నాయకుడు కావలి వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం పట్టణంలోని విద్యుత్ సబ్స్టేషన్ ఆవరణలో ఆర్టిజన్లు సమ్మె చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఆర్టిజన్లు ఎంతో ఎదురు చూస్తున్నారన్నారు. ప్రభుత్వం ఆర్టిజన్ల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయకుండా సమస్యలను గాలికి వదిలేసిందని ఆరోపించారు. విద్యుత్ సంస్థలో పని చేస్తున్న ఆర్టిజన్ కార్మికులందరినీ విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయాలని, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఆంజనేయులు, ప్రభాకర్రెడ్డి, శేఖర్, యాదగిరి, రఘుపతి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణికి 33 అర్జీలు
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మరింత శ్రద్ధ వహించి, ఫిర్యాదులను వెంటనే క్లియర్ చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. అదనపు కలెక్టర్ చంద్రారెడ్డితో కలిసి సోమవారం ప్రజావాణి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన 33 ఫిర్యాదులను ఆయా శాఖలకు పంపించారు. భూ సేకరణపై ఫిర్యాదు యాచారం: ఫార్మాసిటీ, ఫ్యూచర్సిటీ, గ్రీన్ ఫీల్డ్ రోడ్ల నిర్మాణం పేరుతో వ్యవసాయ భూములను లాక్కుంటున్నారని కుర్మిద్ద గ్రామ గిరిజన రైతులు సోమవారం నేషనల్ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. కుర్మిద్ద గ్రామ పంచాయతీ పరిధిలోని మంగలిగడ్డ, మర్లకుంట తండాలకు చెందిన గిరిజన రైతులు మైదాన ప్రాంత సేవాలాల్ సేన అధ్యక్షుడు రఘురామ్ రాథోడ్ ఆధ్వర్యంలో నేషనల్ ఎస్టీ కమిషన్ బానోత్ హుస్సేన్ నాయక్ను కలిసి ఫిర్యాదు చేశారు. కాలనీ రహదారుల కబ్జా హైడ్రా ప్రజావాణిలో 58 ఫిర్యాదులు సాక్షి, సిటీబ్యూరో : కాలనీల్లో రహదారులను కబ్జా చేసేస్తున్నారు. డెడ్ ఎండ్ కాలనీ రోడ్డుంటే.. ఇరువైపులా ప్లాట్లున్న వారు ఆ దారినే మూసేస్తున్నారు. కొత్తగా పక్కన లే ఔట్లు వేసిన వారు.. ఇప్పటికే ఉన్న వరద, మురుగు కాలువలకు ఆటంకాలు సష్టిస్తున్నారు. కుంట్లూరు సర్వే నం. 204లో దాదాపు 15 ఎకరాల మేర 800 ప్లాట్లతో అంజానాద్రినగర్ పేరిట లే ఔట్ వేశారు. పక్కనే లే ఔట్ వేసిన వారు తమ లే ఔట్లోకి జరిగి రహదారితో పాటు కొన్ని ప్లాట్లు మాయం చేశారంటూ అంజనాద్రి ప్లాట్ యజమానులు ఫిర్యాదు చేశారు. తుర్కయాంజల్ నాగార్జున సాగర్ రోడ్డుకు ఆనుకుని ఉన్న మన్నెగూడ విలేజ్లో రహదారిని ఆక్రమించారని.. రోడ్డు మీద ట్రాన్స్ఫార్మర్, గుడికి చెందిన ప్రహరీ నిర్మించారని ప్రజావాణి ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ప్లాట్లకు ఎల్ ఆర్ ఎస్ కూడా వచ్చిందని.. అందులో రోడ్డు కూడా ఉందని.. ఇప్పుడు కావాలంటే రోడ్డును కొనుక్కోవాలని అక్కడివారు చెబుతున్నారని ఫిర్యాదులో తెలిపారు. సాహేబ్నగర్లో మహలక్ష్మీనగర్ కాలనీ పక్కన కమర్షియల్ లేఔట్ వేసిన వారు మురుగుతో పాటు వరద కాలువను మూసేయడంతో తమ ప్రాంతం నీట మునుగుతోందని ఫిర్యాదు చేశారు. నాచారం – మల్లాపూర్ ప్రధాన రహదారిలో ఆక్రమణలు జరుగుతున్నాయని.. రోడ్డు మీదకు వచ్చి నిర్మాణాలు చేపడుతున్నారని మైలార్దేవుపల్లిలోని టీఎన్జీవో కాలనీలో 1200ల గజాల పార్కును కబ్జా చేశారని ఫిర్యాదులందాయి. ఇదే కాలనీలో 40 ఫీట్ల రహదారిని కూడా కబ్జా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బుద్వేల్ పత్తికుంటకు వెళ్లే వరద కాలువను కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు అందింది. ఇలా హైడ్రా ప్రజావాణికి మొత్తం 58 ఫిర్యాదులందగా.. వాటిని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించి పరిష్కార బాధ్యతలను అధికారులకు అప్పగించారు. -
తాగిన మైకంలో కత్తి పట్టుకుని భార్యాపిల్లలపై..
రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాగిన మైకంలో భార్యాపిల్లలపై కత్తితో దాడి చేశాడు ఓ కసాయి. ఆమనగల్ మండలం పులిగోని పల్లి తండాలో ఈ దారుణం జరిగింది. తాగిన మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ప్రవర్తించాడు ఆ వ్యక్తి.బాణావత్ రాందాస్ నాయక్ తన భార్య, కుమారుడు, కూతుర్ని కత్తితో పొడిచాడు. దీంతో అతడి భార్య, కుమారుడు మృతి చెందగా, కూతురికి తీవ్రగాయాలయ్యాయి. ఆ బాలికకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఈ బాణావత్ పాల్పడ్డ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. బాణావత్ రాందాస్ నాయక్ తన భార్య పేరు కవిత, కుమారుడి పేరు హర్ష, కూతురి పేరు ప్రణితగా గుర్తించారు. -
సోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026
మొయినాబాద్: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం బాలాజీ స్వామి గోప వాహన, హనుమంత వాహన సేవలు అందుకున్నారు. చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు మూడు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారిని మొదటగా గోపవాహనంపై, తరువాత హనుమంత వాహనంపై ఆసీనులను చేసి ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా వేదపారాయణం, పూజలు, మంగళహారతి సేవలు అందించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాల కృష్ణస్వామి, అర్చకులు రంగరాజన్, తిరుమల కిరణాచారి, నరసింహన్, కిట్టు, కృష్ణమూర్తి, మురళి, కన్నయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారిని సూర్యప్రభ వాహనం, గరుడ వాహనంపై ఊరేగించి సేవలు అందించనున్నారు. రాత్రి 11 గంటలకు స్వామివారి కల్యాణోత్సవాన్ని ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తారు. ఇబ్రహీంపట్నం రూరల్: ఇల్లాలి చదువు ఇంటికి వెలుగని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని సెర్ప్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ లీలాకుమారి అన్నారు. సెర్ప్ జిల్లా ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వయోజన విద్యను ప్రోత్సహించడానికి ఉల్లాస్ అమ్మకు అక్షరమాల పేరుతో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని పంచాయతీల పరిధిలో మహిళలకు అక్షరాభ్యాసం చేయించి అక్షరాలు నేర్పించారు. అనంతరం సర్టిఫికెట్లు అందజేశారు. మండలంలోని నాగన్పల్లిలో కార్యక్రమాన్ని సెర్ప్ ప్రాజెక్టు మేనేజర్ లీలాకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అక్షరాస్యత పెంపొందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో అందరికీ చదువు తప్పనిసరి అని పేర్కొన్నారు. వేలి ముద్రలు వేయకుండా సంతకాలు చేయాలని సూచించారు. చదువే జ్ఞానం చదువే వెలుగని, గ్రామాల్లో ఎక్కడ చూసినా చదువుకున్న వారే కనిపించాలన్నారు. కనీసం అక్షర అవగాహన ఉంటే మంచిదన్నారు. కార్యక్రమంలో ఏపీఎం సాంబశివుడు, సీసీలు సత్తయ్య, మల్లేష్, అశోక్, ఆనంద్, జంగమ్మ, హరిలాల్, వీఓఏలు, గ్రామ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు. మొయినాబాద్: ఎల్పీజీ గ్యాస్ కొరతకు ప్రత్యా మ్నాయంగా బయో మాస్ పెల్లెట్స్ తయారు చేస్తున్నట్టు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బయో మాస్ పెల్లెట్ వుడ్ గ్యాసిఫియర్ను మున్సిపల్ పరిధిలోని హిమాయత్నగర్లో ఆదివారం ప్రారంభించారు. స్థానిక హోటల్ నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా తయారు చేసిన బయో మాస్ పెల్లెట్ వుడ్ గ్యాసిఫియర్ బాగా పనిచేస్తుందని.. చాలా మందికి నచ్చి ప్రొడక్షన్ పెంచాలని అడుగుతున్నారన్నారు. ఈ గ్యాసిఫియర్ ప్రైమరీ ఫైర్, సెకండరీ ఫైర్ రెండు రకాలుగా పనిచేస్తుందన్నారు. వ్యవసాయ వ్యర్థాలు బయో వుడ్ గ్యాసిఫియర్ ఇందనంగా వాడుకోవచ్చన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రత్నం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాష్, కౌన్సిల్ సభ్యుడు సన్వెల్లి ప్రభాకర్రెడ్డి, కౌన్సిలర్ షాబాద్ కిషన్, బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, సర్పంచ్ వెంకటేశ్గౌడ్, మాజీ సర్పంచ్ రత్నం, నాయకులు మోర నర్సింహారెడ్డి, రవీందర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తుర్కయంజాల్: యువ క్రికెటర్లు క్రమశిక్షణ, కఠినశ్రమ, సరైన మార్గదర్శకత్వంతో ముందుకు సాగితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అండర్ –19 భారత జట్టు ఆటగాడు అక్షత్ రెడ్డి అన్నారు. ఆదిబట్ల సర్కిల్ పరిధి బ్రాహ్మణపల్లి, జేబీ బృందావన్ కాలనీలోని స్మార్టీ క్రికెట్ అకాడమీలో ఆదివారం నూతన క్యాంప్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ అకాడమీ ద్వారా భవిష్యత్తులో మంచి క్రికెటర్లు తయారు కావాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో అకాడమీ చైర్మన్ కొంతం మధుసూదన్ రెడ్డి, ప్రొఫెషనల్ సీనియర్ కోచ్లు ఎస్.మల్లేశ్ యాదవ్, రమేష్ గౌడ్, అజయ్ రైనా, దయానంద్ పటేల్, పలువురు అండర్–19, హెచ్సీఏకి ప్రాతనిధ్యం వహించిన క్రికెటర్లు పాల్గొన్నారు. -
బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రైవేటు భూమిలోకి అక్రమంగా చొరబడి భయబ్రాంతులకు గురి చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆదిబట్ల ఎస్ఐ వెంకటేశ్ కథనం ప్రకారం.. నాదర్గుల్ సర్వే నంబర్ 613లో కోహినూర్ వెంచర్లోకి అదే ప్రాంతానికి చెందిన మహేశ్, రాజు, భాస్కర్, ప్రభాకర్, తిరుపతి భాస్కర్, శివప్రసాద్తో పాటు మరి కొందరు ఆదివారం మధ్యాహ్నం చొరబడి సెక్యూరిటీ వారిని బెదిరింపులకు గురి చేశారు. మహ్మద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రశాంతంగా ఉల్లాస్ పరీక్షలు కేశంపేట: వయోజన వి ద్యాశాఖ ఆధ్వర్యంలో ని ర్వహిస్తున్న అక్షరమాల కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగులకు విద్య నేర్పి ంచారు. వీరికి ఆదివారం వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. మండలంలో 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 1600 మంది మహిళలు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా.. 1260 మంది హాజరయ్యారు. మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ, వేములనర్వ గ్రామాల్లో ఉన్న పరీక్ష కేంద్రాలను వయోజన విద్యా కేంద్రం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ అనిత పరిశీలించారు. -
వైభవంగా ఉత్సవాలు ప్రారంభం
కడ్తాల్: మండల కేంద్రంలోని శ్రీ సీతారామాలయంలో విజయ గణపతి, జ్ఞాన సరస్వతి, సీతారామచంద్ర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తొలిరోజు ఆదివారం శ్రీశైలం చంద్రశేఖర శివాచార్య మహాస్వామి శిష్య బృందంతో పాటు, అంగడి మఠం భువనేశ్వర్స్వామి, శివశ్రీ జ్ఞానేశ్వర శాస్త్రి, శ్రీమాన్ శ్రీరంగం అరేష చార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకం, ఆలయ ప్రవేశం, మహాగణపతి విశ్వక్సేన ఆరాధన, గౌరిపూజ, పుణ్యాహవాచనం, శివుడి రుద్రాభిషేకం, అఖండ దీపారాధన మహా మంగళహారతి, మంత్రపుష్ప, తీర్థ ప్రసాద వితరణ తదితర పూజలు జరిపించారు. కార్యక్రమంలో ఆలయ నిర్మాణదాతలు బస్వారాజ్ రాజమణి దంపతులు, అర్చకులు రామశర్మ, నాయకులు సంతోష్, మల్లేశ్, భక్తులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు ఇస్తాం
ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంచాల: గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ గుండెమోని మల్లేశ్ ఆధ్వర్యంలో ఎల్లమ్మతండా గ్రామస్తులు ఆయనను కలిశారు. గ్రామంలో గాడివంపు ప్రాజెక్ట్ నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్లు, అర్హులైన వారిందరికి పింఛన్లు మంజూరు చేయాలని, సీసీరోడ్లు, అండర్ డ్రైనేజీ నిర్మాణాలను నిధులు ఇవ్వాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఇప్పటికే తండాకు రూ.35 లక్షలకు పైగా నిధులు ఇచ్చామని, మరిన్ని ఇస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీధర్నాయక్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అమర్ నాథ్, వార్డు సభ్యులు నరేష్ నాయక్, బాలు నాయక్, నాయకులు హరికిషన్ నాయక్, వసురాం, హీరలాల్, సీతారాం నాయక్ పాల్గొన్నారు. -
మీ ఆరోగ్యం.. మీ చేతుల్లోనే
మున్సిపాలిటీ మాజీ చైర్మన్ నిరంజన్రెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: ‘మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. నాణ్యమైన ఆహారం తీసుకుంటూ.. నిత్యం వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు’ అని ఆదిబట్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మర్రి నిరంజన్రెడ్డి అన్నారు. డివిజన్లో ఆదివారం మర్రి ఆధ్వర్యంలో శ్యామ్ ఆస్పత్రి సౌజన్యంతో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా 240 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసీజీ, 2డీఎకో, రక్త పరీక్షలు చేశారు. అనంతరం మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడారు. ఉచిత మెగా ఆరోగ్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆహార నాణ్యతలేమితో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని చెప్పారు. దీంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగి మరింత ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కలమ్మ జంగయ్య, మాజీ కో ఆప్షన్ సభ్యుడు పల్లె గోపాల్గౌడ్, ఇబ్రహీంపట్నం జెట్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్, కౌన్సిలర్ లావణ్య పాండురంగారెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ శ్రీశైలం, వైద్యులు రంగరాజ్, శ్రీనివాస్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఆమె చదువు.. ఇంటికి వెలుగు
● మహిళలు వందశాతం అక్షరాస్యత సాధించాలి ● అక్షరమాల కార్యక్రమంలో వక్తలు ఆమనగల్లు: మహిళలు వందశాతం అక్షరాస్యత సాధించాలని, అప్పుడే వారి ఇంటితో పాటు సమాజం అభివృద్ధి చెందుతుందని వక్తలు అన్నారు. అక్షరాస్యత పెంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ‘ఉల్లాస్– అమ్మకు అక్షరమాల’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆదివారం గ్రామీణ ప్రాంతాల నిరక్షరాస్యుల్లో అక్షర వెలుగులు నింపడానికి అక్షరాస్యత శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు తలకొండపల్లి మండలం లింగరావ్పల్లి, చీపునుంతల గ్రామాల్లో నవభారత సాక్షరత పరీక్షలు నిర్వహించారు. లింగరావ్పల్లి సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, చీపునుంతల సర్పంచ్ లక్ష్మమ్మ, నాయకులు వెంకట్రెడ్డి, జంగయ్య, భాగ్య, శ్రీజ, సాత్విక, రబ్బాని, రాజు, లావణ్య, అశ్వని, నర్సింహ, కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు మహేశ్ తదితరులు పాల్గొన్నారు. నిరక్షరాస్యత నిర్మూలనకు.. మంచాల: ప్రతి ఒక్కరూ అక్షరాస్యులుగా మారాలని సర్పంచ్ ఏర్పుల మానస వినయ్ అన్నారు. ఆదివారం గ్రామంలో ఉల్లాస్– నవ భారత్ సాక్షరత కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా అక్షరమాల నేర్చుకున్న పొదుపు సంఘం సభ్యులకు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరక్షరాస్యత నిర్మూలన కోసం ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. వయోజన విద్య కేంద్రాలు, రాత్రి బడులు చేపడుతోందని చెప్పారు. వయసుతో సంబంధం లేకుండా సీ్త్ర, పురుషులు చదువు నేర్చుకోవాలని సూచించారు. ఎంఈఓ రాందాస్, ఏపీఎం శేఖర్, సీసీలు కృష్ణ, చంద్రిక, వీఓఏలు పాల్గొన్నారు. -
అక్షరాస్యతతోనే హక్కుల సాధన
యాచారం: సంపూర్ణ అక్షరాస్యతతోనే రాజ్యాంగం కల్పించిన హక్కులను సాధించుకునే అవకాశం ఉంటుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. మండల పరిధిలోని చౌదర్పల్లిలో ఆదివారం అంబేడ్కర్, జగ్జీవన్రామ్ విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం పేదలకు ఎన్నో అవకాశాలను కల్పించిందని, కానీ అక్షరాస్యత లేకపోవడంతో అన్యాయాలపై ప్రశ్నించే అవకాశం లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. పేద విద్యార్థుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా విద్యనందించే ఎన్నో విద్యాలయాలు ఏర్పాటు చేసిందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని ప్రయోజనం పొందాలని సూచించారు. అంబేడ్కర్ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు జేబీ రాజు మాట్లాడుతూ.. రాజ్యాంగ ఫలాలు దక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అంతకు ముందు మాల్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన ఎమ్మార్పీఎస్ నాయకుడు మంద లింగం కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో అంబేడ్కర్, జగ్జీవన్రామ్ విగ్రహాల దాత జుట్టు శ్రీశైలం, చౌదర్పల్లి సర్పంచ్ రాజుగౌడ్, వివిధ పార్టీల నాయకులు బిలకంటి చంద్రశేఖర్రెడ్డి, నవీన్రెడ్డి, నడుకుడి కృష్ణ, ఎమ్మార్పీఎస్ నాయకులు శ్రీకాంత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కొండ్రు యాదగిరి మృతి తీరని లోటు ఇబ్రహీంపట్నం రూరల్: మాదిగ ఉద్యమానికి కొండ్రు యాదగిరి లేని లోటు తీరనిదని మందకృష్ణ మాదిగ అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి చెందిన కొండ్రు యాదగిరి మూడు రోజుల క్రితం మృతి చెందాడు. మరణవార్త తెలుసుకున్న మంద కృష్ణమాదిగ ఆదివారం ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి వెళ్లారు. యాదగిరి చిత్రపటానికి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట నాయకులు జుట్టు సతీష్, మంద సుధాకర్, రమేష్, గణేశ్, అయోధ్య, అంజయ్య తదితరులు ఉన్నారు. మహనీయుల విగ్రహాలు ఆవిష్కరణ కొందుర్గు: మండలంలోని పర్వతాపూర్లో మహా త్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను ఆదివారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ఆవిష్కరించారు. విగ్రహాల దాతలు ప్రభావతి, భీమయ్య దంపతులను సన్మానించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహోన్నత వ్యక్తులను గౌరవించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బోయ అశోక్, అంబేడ్కర్ యువజన సంఘం సభ్యుడు రాధాకృష్ణ, నాయకులు అందె బాబయ్య, కృష్ణారెడ్డి, కృష్ణ, సుందర్, జగన్, మంగులాల్నాయక్, బల్వంత్ రెడ్డి, మల్లేష్ గౌడ్, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ -
నేడు డయల్ యువర్ డీఎం
ఇబ్రహీంపట్నం రూరల్: ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో సోమవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నామని మేనేజర్ సూజాత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12గంటల నుంచి 1 వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. డిపో పరిసర ప్రాంతాల ప్రజలు తమ సలహాలు, సూచనలు ఇచ్చి డిపో అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. రక్షణ చట్టం ఆమోదం హర్షణీయం కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గణేశ్గౌడ్ కడ్తాల్: తెలంగాణ శాసనసభలో న్యాయవాదుల రక్షణ చట్టం ఆమోదం పొందడం చారిత్రాత్మకమని కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ కానం గణేశ్గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగితే.. ప్రశ్నించే గొంతుకలైన న్యాయవాదుల రక్షణకోసం పీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పొన్నం అశోక్గౌడ్ చేసిన కృషి అభినందనీయమన్నారు. ప్రజాపాలనలో న్యాయవాదులకు గౌరవం, భద్రత, స్వాతంత్య్రం పరిరక్షించే దిశగా అడుగులు పడ్డాయని, దీనికి ఈ చట్టమే నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు.. చట్టం అమలుకు మద్దతు పలికిన వారందిరికీ కృతజ్ఞతలు తెలిపారు. జీపీ భవనం మంజూరు చేయాలని వినతి ఆమనగల్లు: తలకొండపల్లి మండలం వీరన్నపల్లి గ్రామ పంచాయతీ భవనం కోసం నిధులు మంజూరు చేయాలని నాగర్కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మల్లురవిని సర్పంచ్ రామకృష్ణయాదవ్ కోరారు. ఆదివారం నగరంలోని ఆయన నివాసంలో పలువురు నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. నాయకులు మిన్నాల డేవిడ్, రాఘవేందర్, లక్ష్మణ్యాదవ్ ఉన్నారు. -
హష్ ఆయిల్ పట్టివేత
మహేశ్వరం: హష్ ఆయిల్ తరలిస్తున్న వ్యక్తిని మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు 9.402 కిలోల ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీశైలం జాతీయ రహదారి మహేశ్వరం గేటు వద్ద చోటుచేసుకుంది. సీఐ రాఘవేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా జీడిమడుగుల మండలం సంకులమిద్దె గ్రామానికి చెందిన కొరాబు చంటి హష్ ఆయిల్ను బ్యాగులో పెట్టుకొని హైదరాబాద్కు తరలిస్తూ ఆదివారం రాత్రి మహేశ్వరం గేటు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఎస్ఓటీ పోలీసులు విచారించి బ్యాగును తనిఖీ చేశారు. బ్యాగులో సుమారు 9.402 కిలోల ఆయిల్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఓటీ, మహేశ్వరం పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి నిర్మాణానికి చేయూత ఆమనగల్లు: మున్సిపాలిటీ పరిధి విఠాయిపల్లి గ్రామానికి చెందిన సబావత్ పంతునాయక్ ఇంటి నిర్మాణానికి బీఆర్ఎస్ నాయకుడు జగదీశ్ చేయూతనందించారు. నిర్మాణానికి కావాల్సిన సిమెంట్ బస్తాలను అందజేశారు. మాజీ సర్పంచ్ సాలయ్య, నాయకులు శంకర్నాయక్, వెంకట్రెడ్డి, చంద్రునాయక్, జంగాచారి, మల్లయ్య, కిశోర్, మల్లేశ్, వీరేశం, శ్రీను, గోపి, అనిల్ ఉన్నారు. ఆ ఆలయాలను సంరక్షించండి ఇబ్రహీంపట్నం రూరల్: జేబీ వెంచర్లోని పురాతన దేవాలయాలను కాపాడాలని హిందు వాహిని నాయకులు కోరారు. ఆదివారం వెంచర్లోని సోమనగుట్ట దేవస్థానాన్ని సందర్శించి మాట్లాడారు. ఆలయంతో పాటు గుట్టను ధ్వంసం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. చౌడమ్మ తల్లి, మల్లికార్జున స్వామి విగ్రహాలను తొలగించాలని చూస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పట్నం ఠాణాలో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపించి ఆలయాన్ని సంరక్షించడంతో పాటు.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తాగు నీటి సమస్యను అధిగమిస్తాం మంచాల: గ్రామంలో తాగు నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆరుట్ల సర్పంచ్ మానుపాటి శోభ కుమార్ అన్నారు. ఆదివారం గ్రామంలో పర్యటించారు. 40 బోరు బావులను గుర్తించారు. నీటి సమస్య తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. వేసవిని దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికారులు, ప్రజల సహకారంతో నీటి వనరులు ఉన్న చోట బోరు బావులకు మోటార్లు బిగిస్తున్నామని తెలిపారు. నీటిని పొందుపుగా వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నూకం రాజు ముదిరాజ్, వార్డు సభ్యులు పున్నం రాము, బాలమణి, పద్మ, జంగయ్య, మౌనిక, మమత, నాయకులు జానీ పాష, చిందం రఘుపతి, జంగయ్య, పాండు పాల్గొన్నారు. -
భూ కబ్జా.. పొంగులేటి శ్రీనివాస్, హర్షా రెడ్డిపై గవర్నర్కు ఫిర్యాదు: కేటీఆర్
సాక్షి, రంగారెడ్డి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం వట్టివాగులపల్లిలో పర్యటిస్తోంది. భూ బాధితులతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ క్రమంలో బాధితులు.. మంత్రి పొంగులేటి కుమారుడిపై భూ కబ్జా ఆరోపణలు చేశారు. దీంతో, కబ్జాకు గురైన భూములను బీఆర్ఎస్ బృందం పరిశీలించింది. కాగా, రాఘవా కన్స్ట్రక్షన్స్ కబ్జాకు ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..‘మంత్రి పొంగులేటి కుమారుడే కబ్జాలకు పాల్పడ్డాడు. రాఘన కనస్ట్రక్షన్ భూ కబ్జాలపై చర్యలు తీసుకోవాలి. బాధితులను బెదిరించి 27 ఎకరాల భూమిని లాక్కోవాలని చూస్తున్నారు. 1960 నుంచే ఇక్కడ సతీష్ షా కుటుంబానికి భూమి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారి పేరుమీదనే భూమి ఉంది. గత 60 సంవత్సరాలుగా ఈ భూమిలో వారు నివసిస్తున్నారు. వట్టినాగులపల్లి గ్రామం అభివృద్ధి చెందిన తర్వాత ఇక్కడ భూముల విలువలు భారీగా పెరిగాయి. సతీష్ షా కుటుంబానికి చెందిన ఈ భూమి సుమారు 1400 కోట్ల విలువ కలిగి ఉండగా, దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్నుపడింది. మంత్రి పొంగులేటి, ఆయన కుమారుడు హర్షా రెడ్డి కలిసి స్వయంగా సతీష్ షా ఇంటికి వెళ్లి, భూమిని డెవలప్మెంట్కు ఇవ్వకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని బెదిరించారు. అయితే సతీష్ షా కుటుంబం భూమిని డెవలప్మెంట్కు ఇవ్వడానికి గానీ, అమ్మడానికి గానీ సిద్ధంగా లేమని స్పష్టంగా తెలిపింది.సర్వే పేరుతో 27 ఎకరాల భూమి స్వాధీనం..దీనికి తరువాత మంత్రి పొంగులేటి అరాచకాలకు తెరలేపారు. తన రెవెన్యూ శాఖలోని శ్రీనివాసులు అనే అధికారి ద్వారా, 100 కోట్ల లంచం కేసులో పట్టుబడిన ఏడీ (AD)తో దొంగ సర్వే చేయించి బాధితులను తీవ్రంగా వేధింపులకు గురిచేశారు. భూమిని ఇవ్వకపోతే, రెవెన్యూ సర్వే పేరుతో 27 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటామని బెదిరించారు. దీనికీ లొంగకపోవడంతో హర్షా రెడ్డి, ఆయనకు చెందిన రాఘవ కనస్ట్రక్షన్స్ గుండాలతో కలిసి, నంబర్ ప్లేట్లు లేని జేసీబీలతో వచ్చి బాధితులు నిర్మించుకున్న గోశాలను కూల్చివేశారు. దాదాపు కిలోమీటర్ మేర ఉన్న కాంపౌండ్ వాల్ను కూడా ధ్వంసం చేసి, బాధితులను భయభ్రాంతులకు గురిచేశారు.ఈ ఘటన విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన సతీష్ షా, పల్లవి షా కుటుంబ సభ్యులను అక్కడే సజీవంగా పాతిపెడతామని బెదిరించి, రాత్రంతా నిలబెట్టారు. ఈ ఘటనపై పోలీసుల వద్ద ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాష్ట్రపతి పతకం అందుకున్న నిజాయితీ గల పోలీస్ అధికారి హబీబుల్లాను బదిలీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి మధ్య ఉన్న వ్యాపార అనుబంధాన్ని అడ్డుపెట్టుకుని ఈ దురాగతాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్లో ఉన్న 20 లక్షల ఎకరాల భూమిని కోటి ఎకరాలకు పెంచి, నిషిద్ధ జాబితా పేరుతో ప్రజలను బెదిరిస్తూ 50 శాతం భూమి వాటా డిమాండ్ చేస్తోంది. ఇలాంటి అన్యాయాలకు గురైన బాధితులు ఎవరైనా ఉంటే తెలంగాణ భవన్కు వచ్చి వివరాలు ఇవ్వాలని, వారికి పార్టీ పరంగా మరియు న్యాయపరంగా అండగా ఉంటామని తెలిపారు. ఈ క్రమంలోనే అక్రమంగా క్రషర్లు ఏర్పాటు చేసి మైనింగ్ చేస్తున్న మంత్రి పొంగులేటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ను ప్రశ్నించిన మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర గవర్నర్ను కలుస్తున్నామని, త్వరలో మరిన్ని కుంభకోణాలను బయటపెడతామని తెలిపారు. గవర్నర్కు ఫిర్యాదు.. అనంతరం.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో లోక్భవన్కు ఎమ్మెల్యేల బృందం వెళ్లింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై గవర్నర్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న పొంగులేటిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ ఫిర్యాదులో పేర్కొంది. అలాగే, అక్రమ మైనింగ్, భూ కబ్జాలకు పాల్పడుతున్న రాఘవ కనస్ట్రక్షన్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని గవర్నర్కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలన పై గవర్నర్కు ఫిర్యాదు చేశాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజా సంపదను కొల్లగొడుతున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి రాఘవ కన్స్ట్రక్షన్పై గవర్నర్ కు పిర్యాదు చేశాము. హిమాయత్ సాగర్ పరిధిలో నిబంధనలు , ORR పరిధిలో నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ మైనింగ్ చేస్తున్నారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా వందల కోట్ల ప్రజా సంపద కొల్లగొడుతున్న వివరాలు గవర్నర్ కు ఫిర్యాదు చేశాము.తెలంగాణలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ..ఇదే విషయంపై మా పార్టీ నాయకుడు హరీష్ రావు అసెంబ్లీలో లేవనెత్తితే ఎదురుదాడి చేశారు. అక్రమ మైనింగ్ పై CB CID విచారణ చేయిస్తాం అని సీఎం అంటున్నారు. మేము హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశాము. హౌస్ కమిటీలకు విలువ లేదని మంత్రి శ్రీధర్ బాబు అనడం విడ్డూరం. ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారితే, రక్షకులే భక్షకులు అయితే ఎలా ప్రజలకు ఎవరు దిక్కు?. ఎమర్జెన్సీ ఇందిరమ్మ పాలన తెలంగాణలో కనిపిస్తుంది. తెలంగాణలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన నడుస్తుంది. ప్రజా దోపిడిని ప్రజా క్షేత్రంలోనే ఎండగడుతాం. రాష్ట్రంలో ఇలాంటి అక్రమాలు అనేకం జరుగుతున్నాయి. బ్లాక్ మెయిల్ బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి. బ్లాక్ మెయిల్ రాజకీయాలు రేవంత్ రెడ్డికి తెలిసినంతగా ఈ దేశంలో ఎవరికి తెలియదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
గాలివాన.. హైరానా
మహేశ్వరం: మండల పరిధిలోని నందుపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను డివిజన్ హౌసింగ్ డీఈ భిక్షు, ఏఈ చైతన్య శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిర్మాణాలను వేగిరం చేయాలని అన్నారు. పనుల ఫొటోలను అప్లోడ్ చేస్తే బిల్లులు దశలవారీగా లబ్ధిదారుల అకౌంట్లో జమ అవుతాయన్నారు. త్వరితగతిన పూర్తి చేసి బిల్లులు పొందాలని సూచించారు. ప్రభుత్వ నియమాల ప్రకారం నిర్మాణం చేపట్టాలని, నిబంధనలు అతిక్రమించి చేస్తే బిల్లులు రావని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ దేశపాగ నర్సింహలు, ఉప సర్పంచ్ షేక్ ఎజాస్, పంచాయతీ కార్యదర్శి జానయ్య తదితరులు పాల్గొన్నారు. -
వంట గ్యాస్, పెట్రోల్ కొరత లేదు
ఇబ్రహీంపట్నం రూరల్: జిల్లాలో వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్కు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో శనివారం సివిల్ సప్లై అధికారులు, గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకుల నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్యాస్ సరఫరాకు ఎలాంటి కొరత లేదని, తగినన్ని నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వినియోగదారులు ఆందోళనకు గురికాకుండా అవసరం మేరకు సమయానికి గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. అవసరం లేకుండా బుకింగ్ చేయడం ద్వారా సరఫరా వ్యవస్థపై ఒత్తిడి ఏర్పడుతుందన్నారు. బుకింగ్ చేసిన తర్వాత సంబంధిత ఏజెన్సీలు వినియోగదారుల ఇళ్ల వద్దకే సిలిండర్ సరఫరా చేస్తాయని తెలిపారు. ఎవరూ కూడా ఏజెన్సీలు, గోదాముల వద్దకు వెళ్లొద్దన్నారు. బంకుల వద్ద బారులు తీరి కొరత ఉందని సమస్యలు సృష్టించొద్దని, అధిక మోతాదులో తీసుకొని ఇళ్లలో నిల్వ చేసుకోవద్దని తెలిపారు. సరఫరాపై ఏజెన్సీలు, బంకుల యజమానులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, సివిల్ సప్లై శాఖ అధికారి వనజాత, సంక్షేమ శాఖ అధికారులు రామేశ్వరిదేవి, కేశురాం, వ్యవసాయ శాఖ అధికారి ఉష తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి -
యువత క్రీడల్లో రాణించాలి
చేవెళ్ల: యువత క్రీడల్లో రాణించాలని చేవెళ్ల ఎ మ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని దామరగిద్ద వార్డులో శనివారం 7వ జిల్లాస్థాయి, ఓపెన్ టు ఆల్ వాలీబాల్ టోర్నమెంట్–2026 పోటీలను ఆయన మున్సిపల్ చైర్పర్సన్ దేవరి సమతావెంకట్రెడ్డి, కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడాకారులను తగిన విధంగా పోత్రహిస్తుందన్నారు. గ్రామీణ స్థాయిలో ఉండే యువత మంచి క్రీడాకారులుగా తల్లిదండ్రులు, దేశానికి పేరు తీసుకువచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. టోర్నమెంట్ నిర్వహిస్తున్న యూత్ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రాములుగౌడ్, కౌన్సిలర్లు తాల్లపల్లి నర్సింలు, పైండ్ల మధుసూదన్రెడ్డి, బండారి శైలజఆగిరెడ్డి, మాజీ సర్పంచులు మధుసూదన్గుప్తా, వెంకటేశంగుప్తా తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య -
నేడు రెండు వేల మందికి పరీక్ష
యాచారం: డ్వాక్రా సంఘాల్లోని ఐదో తరగతిలోపు చదువు రాని మహిళలు నేడు ఆయా గ్రామాల్లో పరీక్ష రాయనున్నారు. మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో అక్షరాస్యత లేని 4,500 మంది మహిళలను గుర్తించారు. రాత్రిపూట అడల్ట్ ఎడ్యుకేషన్ ద్వారా మహిళలకు చదువు నేర్పించారు. అందులో రెండు వేల మందిని మొదటి దఫా కింద ఆదివారం రోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష రాయిస్తారు. అందుకు గాను శనివారం మండల ఐకేపీ కార్యాలయంలో మండల విద్యాధికారి వెంకట్రెడ్డి, ఎంపీడీఓ రాధారాణిలు పరీక్ష నిర్వహణపై సిబ్బందికి అవగాహన కల్పించారు. పరీక్షలో పాసైన మహిళలకు సర్టిఫికెట్లు అందజేస్తారు. ప్రతి డ్వాక్రా మహిళ అక్షరాస్యత సాధించడం కోసం కృషి చేస్తున్నామని ఎంపీడీఓ తెలిపారు. -
లక్ష్యాన్ని అధిగమిద్దాం
అనంతగిరి: రబీ సీజన్కు సంబంధించి వరి ధాన్యం సేకరణ లక్ష్యాన్ని అధిగమించాలని అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరి అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు రావొద్దన్నారు. జిల్లాలో 129 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నందున కాంటాలు, గన్నీ బ్యాగులు, ఎప్పటికప్పుడు ధాన్యం రవాణాకు లారీలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా చూడాన్నారు. వివిధ ఏజెన్సీల ద్వారా లక్ష మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, పది వేల మెట్రిక్ టన్నుల సన్న రకం వడ్ల సేకరించాలని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ రాములు నాయక్, పౌరసరఫరాల శాఖ అధికారి సుదర్శన్, జిల్లా మేనేజర్ మోహన్కృష్ణ, జిల్లా రవాణా అధికారి వెంకట్రెడ్డి, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ వెంకటరమణారెడ్డి, డిప్యూటీ డీఆర్డీఓ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. -
169 కేసులు పరిష్కారం
ఇబ్రహీంపట్నం: స్థానిక న్యాయస్థానంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 169 కేసులు పరిష్కారమయ్యాయి. ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో 77, మంచాల పరిధిలో 23, యాచారం పరిధిలో 27, ఫార్మాసిటీ పరిధిలో 8, మాడ్గుల పరిధిలో 34 కేసులు పరిష్కారం అయినట్లు 15వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి. ప్రవీణ్కుమార్ తెలిపారు. ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ యువకుడి మృతి ఆమనగల్లు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి మృతి చెందిన సంఘటన పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం.. మారుతి షోరూం ఎదురుగా హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, బైక్ ఎదురెదురుగా ఢీకొనడంతో పల్లపు చరణ్(20) అక్కడికక్కడే మృతిచెందాడు. మండలంలోని మంగళపల్లి చెన్నకేశవ కాలనీకి చెందిన చరణ్ స్థానిక పట్టణంలో ట్రాక్టర్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. కాగా ఆయన బైక్పై వెళుతుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చరణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనా స్థలాన్ని ఆమనగల్లు సీఐ వెంకటేశ్వర్లు సందర్శించి వివరాలు సేకరించారు. కాగా హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారి మరమ్మతులు చేస్తుండటంతో ఒకవైపు రోడ్డును మూసి ఉంచి రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. టాస్క్ఫోర్స్ మెరుపు దాడులు డీజిల్ వాహనం, గ్యాస్ సిలిండర్లు, ఎర్రమట్టి సీజ్ అనంతగిరి: అక్రమ రవాణా, వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ స్నేహ మెహ్ర హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా శనివారం టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్కే అన్వర్ పాషా ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్ను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. నగరంలోని మియాపూర్కు చెందిన గో ల్కొండ రాజు ట్యాంకర్ను, డ్రైవర్లు గొనెళ్ల కిరణ్, అనిగెల అనిల్ అదుపులోకి తీసుకున్నట్లు చెప్పా రు. వీరిపై చెన్గోముల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మన్నెగూడ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ఎర్రమట్టిని తరలిస్తున్న టిప్పర్ను టాస్క్ ఫోర్స్ బృందం పట్టుకున్నట్లు వివరించారు. వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో దా డి చేసి 4 డొమెస్టిక్ ఫుల్ సిలిండర్లు, 14 ఖాళీ సిలిండర్లు, 6 కమర్షియల్ సిలిండర్లను సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్ప వని ఎస్పీ హెచ్చరించారు. చిరువ్యాపారులను ఆదుకోండి ఎంఐఎం నియోజకవర్గ అధ్యక్షుడు గుల్షన్ కొడంగల్ రూరల్: రోడ్డు విస్తరణలో డబ్బాలు తొలగించడంతో జీవనోపాధి కోల్పోయిన చిరువారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎంఐఎం నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్బీ గుల్షన్ కోరారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ నందారం ప్రశాంత్కుమార్ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. చిరు వ్యాపారుల సమస్యలను చైర్మన్కు వివరించారు. స్పందించిన చైర్మన్ బాధితులకు అండగా ఉంటానని, వారం రోజుల్లో కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం చైర్మన్ను చిరువ్యాపారులు, గుల్షన్ సన్మానించారు. కార్యక్రమంలో ఎండీ సర్తాజ్ హుస్సేన్, సయ్యద్ మహమూద్, ఎండీ జహంగీర్, ఎండీ అక్తర్, ఎండీ కబీర్, నారాయణ, సుందర్, సయ్యద్ అర్షద్ అలీ ఖాద్రి పాల్గొన్నారు. రేపు జిల్లా స్థాయి సెలక్షన్స్ అనంతగిరి: క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం మండల స్థాయిలో ఎంపికై న విద్యార్థులకు రేపు(సోమవారం) వికారాబాద్లో జిల్లాస్థాయి సెలక్షన్స్ ఉంటాయని క్రీడల విభాగం జిల్లా అధికారి ఎంఏ సత్తార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద యం 9.30 గంటలలోపు పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్కు హాజరుకావాలని సూచించారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫాం, ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, 3వ తరగతి బోనాఫైడ్, ప్రొగ్రెస్ కార్డు, కులం సర్టిఫికె ట్, సైజ్ ఫొటోలతో రావాలని సూచించారు. తైబజారు వేలం.. బొంరాస్పేట: మండలంలోని తుంకిమెట్ల ఆదివారపు సంతకు ఈ నెల 30న వేలం నిర్వహించనున్న ట్లు సర్పంచ్ ఎల్లమ్మ శనివారం తెలిపారు. ఉద యం 11గంటలకు గ్రామ రైతు వేదికలో వేలం ఉంటుందన్నారు. పాట దక్కించుకున్న వారు ఏప్రిల్ ఒకటి నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు తైబజారు నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఆసక్తి గలవారు వేలంలో పాల్గొనాలని ఆమె కోరారు. -
గౌరవం ఇవ్వలేదని నిరసన
యాచారం: పరిపాలన వ్యవహరాల్లో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కనీస సమాచారంతో పాటు, ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదని మాల్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలు దొంతగోని స్వాతి నిరసన వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నల్ల గుడ్డతో కళ్లకు గంతలు కట్టుకొని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఒకటో వార్డు సభ్యురాలిగా గెలిచినప్పటికీ తన వార్డు పరిధిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ఏ పనులకు కనీస సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. తనను అవమానపర్చుతున్న సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిగా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి విజ్ఞప్తి చేశారు. -
మూసీ ప్రాజెక్ట్.. సబితపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, రంగారెడ్డి: మూసీ నది పునర్జీవన ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. మంచిరేవుల వద్ద భారీ ఎత్తున ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నేడు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఆధునిక గోశాల నిర్మాణానికి కూడా సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇప్పటికే డిజైన్లను ఖరారు చేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.శంకుస్థాపన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్లో ముందడుగు ఇది. నదులు కాలుష్యం అవుతున్నాయి. నదులను ప్రక్షాళన చేయాలని చాలా మంది సీఎంలు ఆలోచించారు. ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన దైవకార్యంగా భావిస్తున్నా. 80 ఏళ్ల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయం. మూసీ దుస్థితి ప్రకృతి తప్పిదం కాదు. మానవ తప్పిదం. మూసీ ప్రక్షాళన అత్యవసరం. హైదరాబాద్ నుంచి కాలుష్యం మూసీ నదిలో కలుస్తుంది. ఈ ప్రాంతాల్లో పంటను కొనే పరిస్థితి లేదు. ఇక్కడున్న ప్రజాప్రతినిధులందరూ మూసీ ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు. కొద్ది మంది రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుపడుతున్నారు. ఎవరైనా దీనికి పెడార్థాలు తీసినా, రాజకీయం చేసినా ప్రభుత్వం శివతాండవం చేస్తుంది.బీఆర్ఎస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ కామెంట్స్ చేశారు. ఇదే ప్రాంతంలో ఉండే అక్క అనేక రకాలుగా రాజకీయ లబ్ది పొందారు. అక్క కొడుకే ఎన్జీటీలో కేసు వేశాడు. మూసీ పునరుద్దీకరణ ఆపాలని కేసు పెట్టాడు. కేసు వేయడానికి వారికి మనసు ఎలా వచ్చింది?. ప్రజాప్రతినిధిగా వారికి అర్హత ఉందా?. ఎవరు అడ్డం వచ్చినా మూసీ నదిని పునరుద్ధరిస్తాం. ఈ అవకాశం చరిత్రలో ఎవరికో ఒకరికి వస్తుంది. దైవ నిర్ణయంతో ఈ గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. ఈ ప్రాంతానికి గొప్ప చరిత్ర ఉంది. ఈ చరిత్ర కనుమరుగు అవ్వకుండా కార్యక్రమాలు చేస్తున్నాం. విమర్శలు, అడ్డంకులు వచ్చినా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. నదీ పరివాహక ప్రాంతంలోనే అభివృద్ధి ఉంటుంది. సముద్రం ఉన్న ప్రాంతంలోనే వ్యాపారాలు ఎక్కువగా ఉంటాయి. సముద్రపు ఒడ్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. మానవ తప్పిదం వల్లే మూసీకి ఇలాంటి పరిస్థితి. దీంతో హైదరాబాద్ నగరమే కనుమరుగయ్యే పరిస్థితులు వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో వస్తున్న పొల్యూషన్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఢిల్లీని చూసి అయినా మనం నేర్చుకోవాలి’ అని అన్నారు.ఇక, ఇక్కడ.. చారిత్రక వీరభద్రస్వామి ఆలయం సమీయంలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం జరగనుంది. సుమారు రూ.700 కోట్లతో 8 ఎకరాల్లో ఈ నిర్మాణం జరగనుండగా 100 అడుగుల గాలి గోపురం నిర్మాణం చేస్తారు. గాలి గోపురం నుంచి లోపలికి ప్రవేశించాక వేర్వేరు మండపాలు ఉంటాయి. మూసీ నది మధ్యలో 100 అడుగుల శివని విగ్రహం ఏర్పాటు చేస్తారు. 207 అడుగుల పొడవైన ప్రధాన మండపం, గర్భాలయ గోపురాన్ని 14 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు, 64 అడుగుల ఎత్తుతో నిర్మించనున్నారు. ఈ దేవాలయానికి ఓఆర్ఆర్ నుంచి విశాలమైన రోడ్డు మార్గాలను నిర్మిస్తారు. ఆలయం వద్ద 199 కోట్లతో వెయ్యి నుంచి 2 వేల వాహనాలు పార్కింగ్ చేసుకునే విధంగా మూడంతస్తుల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు. -
పక్కాగా.. పారదర్శకంగా..
సాక్షి, రంగారెడ్డిజిల్లా: రైతులకు అత్యంత పారదర్శకమైన, సులభమైన సేవలు అందించేందుకు ప్రభు త్వం సమీకృత భూ భారతి పోర్టల్ (ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ల్యాండ్స్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టం)ను ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి తీసుకురాబోతోంది. ఇందుకు ప్రయోగాత్మకంగా జిల్లాలోని ఆమనగల్లు మండలాన్ని ఎంపిక చేసింది. ఇప్పటి వరకు వేర్వేరుగా ఉన్న రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎన్ఐసీ, సర్వే విభాగాలను ఇకపై ఒకే గొడుగు కిందికి తేనుంది. ఈ పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే.. తర్వాత జిల్లాలోని మిగిలిన మండలాల్లోనూ దీన్ని అమలు చేయబోతోంది. దీనిలో భాగంగా ప్రతి సర్వే నంబర్కు ఆధార్ నంబర్ తరహాలోనే భూధార్ నంబర్ జారీ చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఐదు గ్రామాల్లో సర్వే చేయించి, భూధార్ను కేటాయించారు. ఆధార్తో అనుసంధానమైన మొబైల్ నంబర్తో లాగిన్ అయిన వెంటనే సంబంధిత సమాచారమంతా లభిస్తోంది. ఈ పోర్టల్లో ప్రధానంగా సమాచార, సర్వే, కరెక్షన్, అప్పీల్, రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు సిటిజన్ డ్యాష్బోర్డు సేవలు పొందొచ్చు. భూ భారతిలో 36 మాడ్యూల్స్ ఉండగా, భూ భారతిలో ఒకే గొడుగు కిందికి తెచ్చిన విషయం తెలిసిందే. ఒక్కో కమతానికి ఒక్కో నంబర్ కందుకూరు డివిజన్ పరిధిలోని ఆమనగల్లు మండలంలో 13 గ్రామ పంచాయతీలు, ఒక మున్సిపాలిటీ ఉంది. భూ సమస్యలకు సంబంధించి భూ భారతి పోర్టల్కు ఇప్పటి వరకు 6,595 దరఖాస్తులు అందాయి. వీటిలో 3,089 సమస్యలకు పరిష్కార మార్గం చూపించారు. 2,536 అభ్యర్థనలను అధికారులు తిరస్కరించారు. ప్రస్తుతం పోర్టల్లో 275 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో తహసీల్దార్ వద్ద 149 పెండింగ్లో ఉండగా, ఆర్డీఓ వద్ద 25, అదనపు కలెక్టర్ వద్ద 71, కలెక్టర్ వద్ద 30 దరఖాస్తులు ఉన్నాయి. క్షేత్రస్థాయి నుంచి రిపోర్టులు రాక కొన్ని నిలిచిపోతే..అధికారుల అలసత్వంతో మరికొన్ని ఆగిపోయాయి. త మ సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుతూ బాధితులు కలెక్టరేట్ చుట్టూ తిరిగినా ఫలితం ఉండటం లేదు. పెద్దల సిఫార్సులు, అడిగినంత ముట్టజెప్పిన వాళ్లకు పెద్దపీట వేస్తూ సాధారణ, మధ్య తరగతి భూ బాధితులను ఏళ్ల తరబడి ఆఫీసు చుట్టూ తిప్పుకొంటుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమీకృత భూభారతి పోర్టల్లో భాగంగా ప్రభుత్వం ఈ మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసింది. ప్రభుత్వ, అటవీ, అసైన్డ్, లావణి, భూదాన్, వక్ఫ్ భూములతో పాటు పట్టా భూములకు సర్వే నంబర్ల వారీగా పక్కాగా హద్దులు నిర్ధారించి, ఆ వివరాలను భూభారతి పోర్టల్ సహా సబ్రిజిస్ట్రార్ పోర్టల్, సర్వే లాండ్స్ పోర్టల్లో నమోదు చేయనున్నారు. హద్దుల నిర్ధారణతో పాటు విస్తీర్ణంలో హెచ్చు తగ్గుల సమస్య కూడా పరిష్కారం కాబోతోంది. ప్రతి కమతానికి ఒక ప్రత్యేక నంబర్ను కేటాయించడం ద్వారా భూ యజమాని పేరు సహా విస్తీర్ణం, పక్కాగా నిర్ధారించిన హద్దులు, మ్యాప్, భూ స్వ రూపం తెలిసిపోతోంది. సర్వే నుంచి రిజిస్ట్రేషన్ వరకు.. ఇక అన్నీ ఒకే గొడుగు కిందకు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి భూ భారతి పైలెట్ ప్రాజెక్టుగా ఆమనగల్లు మండలం ఎంపిక ప్రతి సర్వే నంబర్కు ఆధార్ తరహా భూధార్ నంబర్ కేటాయింపు -
ఎస్ఓటీ పోలీసుల దాడులు: మద్యం బాటిళ్ల స్వాధీనం
యాచారం: మండల పరిధిలోని నస్దిక్సింగారంలో శుక్రవారం ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. శ్రీరామనవమి రోజు మద్యం విక్రయించరాదని నింబంధనలు ఉన్నప్పటికీ గ్రామంలో రాజు అనే వ్యక్తి మద్యం విక్రయిస్తున్నాడని సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. అతని ఇంట్లో 50 మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. యాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యతగా విధులు నిర్వర్తించాలి శంషాబాద్ డీసీపీ రమేష్ ఇబ్రహీంపట్నం రూరల్: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని, బాధ్యతగా విధులు నిర్వర్తించాలని శంషాబాద్ డీసీపీ రమేష్ పేర్కొన్నారు. ఆదిబట్ల పోలీస్స్టేషన్ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరుపై సీఐ రవికుమార్ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆదిబట్ల ఏసీపీ ప్రదీప్కుమార్రెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి కృషి కందుకూరు: గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానని మండలంలోని గుమ్మడవెల్లి సర్పంచ్ పల్స మహేశ్గౌడ్ అన్నారు. శుక్రవారం గ్రామంలో హెచ్ఎండీఏ నిధులు రూ.10 లక్షలతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామంలో ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్కు ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మౌనికసంతోష్, వార్డు సభ్యులు ప్రమీల మహేందర్గౌడ్, తిరుమలేష్, అనసూయయాదయ్య, నాయకులు మహేందర్, శ్రీనివాస్గౌడ్, బాబురావు, నరసింహగౌడ్, యాదయ్య, అరవింద్, శ్రీశైలంగౌడ్, అల్లె యాదయ్య, సంజీవ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రం ప్రారంభం కందుకూరు: మండల పరిధిలోని తిమ్మాపూర్లో అమేజాన్ సంస్థ పునరుద్ధరించిన అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు యూనిఫాంలు పంపిణీ చేశారు. అక్కడ చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ శాంతిశ్రీ, సర్పంచ్ అంజమ్మ, ఉప సర్పంచ్ సంధ్య, అమేజాన్ మేనేజర్ తాతాజీ, రిషిక, పార్థసారథి, సురేష్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు శ్రీలత, శోభ, సువర్ణ, స్థానిక నాయకులు అమరేందర్రెడ్డి, భిక్షపతి పాల్గొన్నారు. -
వెల్లివిరిసిన మతసామరస్యం
● శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న ముస్లింలు ● నిర్దవెళ్లిలో కులమతాలకు అతీతంగా ఉత్సవాలు కేశంపేట: మండల పరిధిలోని నిర్దవెళ్లిలో ముస్లింలు మతసామరస్యం చాటారు. శుక్రవారం మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించిన అనంతరం సీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామంలోని హనుమాన్ మందిరంలో నిర్వహించిన ఉత్సవాల్లో అందరితో కలిసిపోయారు. స్వామివారి కల్యాణం అనంతరం అన్నప్రసాద వితరణ సేవా కార్యక్రమంలో పాల్గొని హిందువులకు శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్ చెదురువెళ్లి భాస్కర్గౌడ్ మాట్లాడుతూ.. పల్లెల్లోని ప్రజలందరూ కులమతాలకు అతీతంగా సోదరభావంతో కలిసిమెలిసి జీవిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఉమాపతి, పల్లాటి కృష్ణయ్య, మైనార్టీ నాయకులు మక్బూల్, జబ్బార్ఖాన్, జాహేద్, పాష, బదృద్దీన్, అమేర్, మెహిజ్, అజహర్, గ్రామస్తులు సురేందర్, రంగయ్య, వెంకటయ్య, నారాయణరెడ్డి, మల్లేశ్ పాల్గొన్నారు. -
అంతా.. రామమయం
ముత్యాల తలంబ్రాలు.. బాజాభజంత్రీలు.. అశేషభక్త జనవాహిని నడుమ లోక కల్యాణ కారకుడు, జగదబి శ్రీరాముడి కల్యాణోత్సవాన్ని శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహేశ్వరం నియోజకవర్గం వ్యాప్తంగా పలు ఆలయాలు, కూడళ్లలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిపించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్ నినాదంతో ఆ పరిసరాలన్నీ మార్మోగాయి. రామనామంతో భక్తులు తన్మయంలో మునిగిపోయారు. పలుచోట్ల అన్నప్రసాద వితరణ నిర్వహించి, శోభాయాత్ర చేపట్టారు. – సాక్షి, నెట్వర్క్ -
పుస్తకావిష్కరణ
మహేశ్వరం: శ్రీవత్స వనమాలి సేవా ఫౌండేషన్ తరఫున ప్రచురించిన శ్రీనివాస అను ‘గ్రహ’ నవరత్నాలు పుస్తకాన్ని త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆవిష్కరించారు. ముచింతల్లోని ఆశ్రమంలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న అనంతరం జీయర్ స్వామిని ఎస్వీఎస్ఎఫ్ నిర్వాహకులు కలిసి ఆశీస్సులు తీసుకుని స్వామీజీ చేతికి ఈ పుస్తకాన్ని అందజేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ విభీషణశర్మ రచించిన ఈ పుస్తకంలో వేంకటేశ్వర సుప్రభాతంలోని తొమ్మిది శ్లోకాలను నవగ్రహాలతో అన్వయించి, సుప్రభాత శ్లోకాలను చదవడం ద్వారా శ్రీనివాసుని అనుగ్రహంతో గ్రహ దోషాలు తొలగిపోతాయని ఈ పుస్తకంలో రచయిత భాష్యం చెప్పారు. వేంకటేశ్వరస్వామి ఆధీనంలోనే నవగ్రహాలు ఉంటాయన్నది ఈ పుస్తకంలోని సారాంశం. చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన తర్వాత అక్కడకు వచ్చిన భక్తులకు ఉచితంగా వితరణ చేశారు. -
బైక్పై వెంబడించి.. గోవులను కాపాడి
● మూగజీవాలను తరలిస్తున్న కంటైనర్ల పట్టివేత ● పోలీసులకు అప్పగించిన హిందూవాహిని, బజరంగ్దళ్ సభ్యులు షాద్నగర్రూరల్: అక్రమంగా గోవులను తరలిస్తు న్న కంటైనర్లను హిందూవాహిని, బజరంగ్దళ్ సభ్యులు పట్టుకున్నారు. బైక్పై వెంబడించి గోవు లను అక్రమంగా తరలిస్తున్న మూడు కంటైనర్లను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి.. శ్రీరామనవమి సందర్భంగా హిందూవాహిని సభ్యులు గురువారం అర్థరాత్రి పట్టణంలోని ముఖ్యకూడలిలో తోరణాలు కడుతున్నారు. అదే సమయంలో మూడు కంటైనర్లు వెళ్తున్నాయి. అనుమానం వచ్చిన వారు కంటైనర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించగా డ్రైవర్లు వాహనాలను ఆప కుండా అతివేగంగా వెళ్లారు. దీంతో అనుమానం వచ్చిన హిందూవాహిని, బజరంగ్దళ్ సభ్యులు ద్విచక్రవాహనాలతో వెంబడించి రెండు కంటైనర్లను పట్టుకోగా ఒక కంటైనర్ ఆపకుండా వెళ్లిపోయింది. పట్టుకున్న రెండు కంటైనర్లలో చూడగా అందులో 48 గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. గోవులను వెంటనే చౌడమ్మగుట్ట ఆంజనేయస్వామి దేవాలయం ఆవరణలోని శ్రీకృష్ణ గోశాలకు తరలించారు. విషయం తెలియడంతో మరో వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు గోశాల వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య మాటామాటా పెరగడంతో తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ సీతారాం తెలిపారు. -
శనివారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2026
షాబాద్: సీతారాంపూర్లో కల్యాణోత్సవానికి హాజరైన భక్తులుతుర్కయంజాల్: అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉత్సవ విగ్రహాలు కల్యాణం.. రామణీయంమామిడి తోరణాలు.. పూల పందిళ్లు.. ముత్యాల తలంబ్రాలు.. బాజాభజంత్రీలు.. వేదపండితుల మంత్రోచ్చరణలు.. అషేశభక్తజన సందోహం మధ్య రాములోరి కల్యాణోత్సవాన్ని శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రామనామస్మరణతో ఊరూవాడా మార్మోగాయి. ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఎక్కడ చూసినా కోలాహలం నెలకొంది. ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. -
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
అంగన్వాడీ కేంద్రం ప్రారంభం కందుకూరు మండలం తిమ్మాపూర్లో పునరుద్ధరించిన అంగన్వాడీ కేంద్రాన్ని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రారంభించారు. ● చిలుకూరు బాలాజీ దేవాలయంలో ప్రత్యేక పూజలు ● విశ్వక్సేనుడి ఆరాధనతో ప్రారంభించిన అర్చకులు మొయినాబాద్: చిలుకూరు బాలాజీ స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వారం రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు శుక్రవారం రాత్రి అంకురార్పణ చేశారు. ఆలయ ప్రధాన మండపంలో స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొదట సెల్వర్ కూత్తు.. వేద మంత్రోశ్చరణతో ఆల యాన్ని శుద్ధి చేశారు. అనంతరం పుట్ట బంగారం (పుట్టమన్ను) తెచ్చి హోమగుండాలు ఏర్పాటు చేశారు. అందులో నవధాన్యాలు, పాలికలు కలిపి హోమాలు వెలిగించారు. అనంతరం విశ్వక్సేనుడి ఆరాధన, పుణ్యహవచన కార్యక్రమాలు చేపట్టారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో ఊరేగించిన అనంతరం యజ్ఞం చేపట్టారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన కార్యక్రమాలు అర్థరాత్రి వరకు కొనసాగాయి. పూజా కార్యక్రమాలు తిరుమల కిరణాచారి, రామస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాల కృష్ణస్వామి, అర్చకులు రంగరాజన్, నరసింహన్, కన్నయ్య, కిట్టు, మురళి పాల్గొన్నారు. నేడు ధ్వజారోహణం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ధ్వజారోహణం, శేషవాహనం నిర్వహించనున్నారు. ధ్వజారోహణం సందర్భంగా గరుత్మంతునికి ప్రత్యేక పూజలు నిర్వహిచి ధ్వజస్తంభానికి గరుడ పఠాన్ని ఆరోహణం చేస్తారు. గరుడ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తులకు ప్రసాదం పంపిణీ ఉండ దని ఆలయ అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఇంగ్లిష్పై అవగాహన అవసరం
పీఆర్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: ప్రాథమిక దశ నుంచే విద్యార్థులకు ఇంగ్లిష్పై అవగాహన అవసరమని తెలంగాణ పంచాయతీరాజ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు గుర్రం ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఆదిబట్ల ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఇంగ్లిష్ లర్నింగ్ ఎగ్జిబిషన్ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లలు పుస్తకాల ద్వారా మాత్రమే కాకుండా ప్రాక్టికల్గా కూడా ఆంగ్లం నేర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. హెచ్ఎం పరమేశ్, కాంప్లెక్స్ హెచ్ఎం కళా శ్రీనివాస్తో పాటు తదితరులు పాల్గొన్నారు. -
స్టీల్ కంపెనీలో భారీ పేలుడు
● ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు ● కార్మికులకు స్వల్ప గాయాలు ● తప్పిన పెను ముప్పు పరిగి: మండలంలోని లక్ష్మీదేవిపల్లి సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. మంటలు ఎగసిపడి దట్టమైన పొగ అలముకుంది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో సమీప పొలాల్లోని రైతులు, పరిశ్రమలోని కార్మికులు భయాందోళనకు గురయ్యారు. బట్టీ వద్ద పని చేస్తున్న కొంత మంది కార్మికులకు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. ప్రమాద స్థలం వద్దకు ఎవ్వరినీ అనుమతించలేదు. తొలుత లారీ టైరు పేలిందని యాజమాన్యం చెప్పుకొచ్చింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వెంకటేశ్వరి, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పేలుడుకు గల కారణాలు తెలుసుకొని ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని కార్మికులు వాపోయారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. కార్మికులు మృత్యువాత పడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించని పరిశ్రమను మూసి వేయాలని డిమాండ్ చేశారు. -
కోనేటిలో పడి గుర్తు తెలియని వృద్ధురాలి మృతి
మహేశ్వరం: కొనేరులో పడి గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందింది. ఈ సంఘటన బుధవారం మండల కేంద్రంలో శివగంగ ఆలయ కొనేరులో చోటు చేసుకుంది. సీఐ రాఘవేందర్రెడ్డి తెలిపిన ప్రకారం.. మండల కేంద్రంలో కొలువుదీరిన శివగంగ రాజరాజేశ్వర ఆలయానికి ఉదయం భక్తులు వచ్చారు. ఈ సమయంలో గుర్తు తెలియని వృద్ధ మహిళ కొనేరులో పడినట్లు గుర్తించిన భక్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధురాలి మృతదేహాన్ని బయటకు వెలికితీసి కేసు నమోదు చేసుకొని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వృద్ధురాలు ఎరుపు చీర, చేతికి పచ్చబొట్లు, బంగారు రంగు గాజులు, మెడలో ఎరుపు రంగు పూసల గొలుసు ధరించి ఉంది. మృతురాలి వయస్సు 55–65 సంవత్సరాల మధ్యన ఉంటుందని.. సంబంధీకులు ఎవరైనా ఉంటే మహేశ్వరం పోలీసులకు సమాచారం అందించాలని సీఐ కోరారు. వివరాలకు ఎస్హెచ్ఓ 87126 62368, 87126 62404 నంబర్లలో సంప్రదించాలన్నారు. ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు అనంతగిరి: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఇందులో భాగంగా బ్లాక్ స్పాట్లను గుర్తించాలని ఎస్పీ స్నేహమెహ్ర ఆదేశించారు. బుధవారం వికారాబాద్లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శాంతిభద్రతలు, పెండింగ్ కేసులు, నేరాల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసులపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దొంగతనాల నియంత్రణకు, కేసుల ఛేదనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. చోరీ సొత్తు రికవరీ చేసి బాధితులకు అందేలా చూడాలన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని తెలిపారు. మహిళలు, బాలల భద్రతకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజాపాలనా – ప్రగతి ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బీ రాములు నాయక్, డీఎస్పీలు జానయ్య, శ్రీనివాసులు, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. రూ.10 లక్షలతో గ్రామైక్య భవనం సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం -
మహిళ అదృశ్యం
కొత్తూరు: ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మండల పరిధిలోని తీగాపూర్ గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ నర్సయ్య తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన హంసమ్మ(49) ఈ నెల 24న ఉదయం కోడలితో పడింది. విషయం తెలుసుకున్న ఆమె కొడుకు తల్లి, భార్యకు సర్ధిచెప్పి పని నిమ్తితం బయటకు వెళ్లాడు. కొడుకు వెళ్లిన కాసేపటికి తల్లి హంసమ్మ ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. గతంలోనూ గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయి పది రోజుల తర్వాత ఇంటికి చేరుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనిగ పంటకు నిప్పంటించిన దుండగులు కొందుర్గు: పండించిన పంటకు గుర్తు తెలియన వ్యక్తులు నిప్పంటించిన ఘటన చౌదరిగూడ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ విజయ్కుమార్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు అబ్దుల్ ఖదీర్ శనిగ పంట సాగు చేశాడు. ఇటీవల పంటను కోసి కుప్పగా ఉంచాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించడంతో పంట పూర్తిగా దగ్ధమైంది. బుధవారం రైతు అబ్దుల్ ఖదీర్ ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. మజ్జిగ పంపిణీ ట్యాంకర్ బీభత్సం– ఒకరి మృతి మణికొండ: వాటర్ ట్యాంకర్ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన నిలుచున్న కార్లతోపాటు పలువురిని ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... టీ గ్రిల్ జంక్షన్ వైపు నుంచి కోకాపేట వైపు వేగంగా వస్తున్న నీటి ట్యాంకర్ అదుపు తప్పి రోడ్డు పక్కన తన కారులో ఎక్కుతున్న భద్ర(30) అనే వ్యక్తిని ఢీ కొట్టింది. అతని తల, కాళ్లకు తీవ్ర గాయాలు కావటంతో రక్తస్రావం కావటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత మరో కారును ట్యాంకర్ ఢీ కొట్టింది. అందులో ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి తరలించారు. ట్యాంకర్ డ్రైవర్ ఎం.శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు. మండీ బిర్యానీ తిని ఆస్పత్రి పాలు కాప్రా: ఏఎస్రావునగర్లోని ఓ మండీ హోటల్లో బిర్యానీ తిన్న నలుగురు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నాలుగు రోజుల క్రితం హోటల్కు వెళ్లి మండీ బిర్యానీ తిని ఇంటికి వెళ్లారు. కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలు మొదలవ్వడంతో జమ్మిగడ్డలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. మండీ బిర్యానీ తినడం వల్లే ఆస్పత్రి పాలయ్యామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, విషయం తెలుసుకున్న ఫుడ్ సెక్యూరిటీ అధికారులు సదరు హోటల్ను పరిశీలించేందుకు వెళ్లగా, అది మూసి ఉంది. హోటల్ మూసి ఉండటంతో ఏమీ తెలుసుకోలేకపోయామని, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని కాప్రా సర్కిల్ ఇన్చార్జ్ ఫుడ్ సెక్యూరిటీ అధికారిణి మిలీషా తెలిపారు. -
ఎండల్లో.. వానొచ్చే..
హయత్నగర్/చంపాపేట: ఎల్బీనగర్ పరిధిలో బుధవారం వర్షం దంచికొట్టింది. పలు చోట్ల వరద నీరు ఏరులై పారింది. మధ్యాహ్నం వరకు ఉక్కపోత ఉక్కిబిక్కిరి చేయగా సుమారు గంట పాటు గాలి, వడగళ్లతో కూడిన వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. అక్కడక్కడా గాలికి చెట్లు నేలకొరిగాయి. రహదారి పక్కన పార్కింగ్ చేసిన కారుపై భారీ వృక్షం కూలిన ఘటన చంపాపేట డివిజన్ కర్మన్ఘాట్ సింధూర హోటల్ సమీపంలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కారును పార్కింగ్ చేసి షాపింగ్కు వెళ్లాక ఈ ఘటన జరిగింది. స్థానికులు ఆందోళనతో పరుగులు తీశారు. కారులో ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది. పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది భారీ వృక్షాన్ని తొలగించారు. -
కొర్రీలు లేకుండా రుణమాఫీ చేయాలి
రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి మాడ్గుల: రైతులకు కొర్రీలు లేకుండా రుణమాఫీ చేసి రైతు భరోసా పూర్తిగా అందజేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కాంతం మాధవరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యూరియాను యాప్ ద్వారా అందించే విధానంలో లోపాలను సరిదిద్ది, సమయానికి సులభతరంగా పంటకు సరిపడా యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. పాలక వర్గాలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కుంటాన్నారని.. తక్షణమే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కోరారు. రాష్ట్ర స్థాయిలో పంట బీమా పథకాన్ని రూపొందించి అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సూదిని రంగారెడ్డి, రైతు సంఘం నాయకులు బిచ్చయ్య, విజయ్, నరేందర్, నర్సింహ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
చిరుత సంచారం ఆనవాళ్లు లేవు
ఫారెస్ట్ రేంజ్ అధికారి రవిప్రకాశ్ మొయినాబాద్రూరల్: నక్కలపల్లిలో చిరుత సంచరించిన ఆనవాళ్లు కనిపించలేవని మృగవని నేషనల్ పార్క్ ఫారెస్ట్ రేంజ్ అధికారి రవిప్రకాశ్ అన్నారు. మంగళవారం సాయంత్రం నక్కలపల్లిలో చిరుత సంచరిస్తుందని పలువురు చూసినట్లు పత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన ఆయన బుధవారం గ్రామాన్ని సందర్శించారు. సర్పంచ్ యాదయ్య, ఉపసర్పంచ్ నిరంజన్గౌడ్, గ్రామస్తులతో కలిసి చిరుత పులి కనిపించినట్లు చెప్పిన స్థలాన్ని పరిశీలించారు. పాదల ముద్రల ఆనవాళ్లు కనిపించలేదని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు
బోయినిపల్లి కూరగాయల మార్కెట్ వద్ద నిరసన చేపట్టిన రైతులు చేవెళ్ల: కూరగాయల మార్కెట్లలో ఎదరవుతున్న సమస్యలపై ప్రశ్నించిన రైతులు, రైతు నాయకులపై కేసులు పెట్టడం సరకాదని రైతు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం చేవెళ్ల ప్రాంతానికి చెందిన పలువురు రైతులు సికింద్రాబాద్లోని బోయినిపల్లి కూరగాయల మార్కెట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్కెట్లో రైతుల వద్ద నుంచి రూ.వందకు కమీషన్ రూ.4 తీసుకోవాలని ఇతర రాష్ట్రాల కూరగాయలు సీజన్లో తీసుకురావద్దని, సంచుల బరువు తగ్గించవద్దని, అమవాస్యకు, కమీషన్ ఏజెంట్లు మరణించినచో వారి సంతాపంగా మార్కెట్ మొత్తం మూసివేయవద్దనే అంశాలపై రైతుల పక్షాన నిలబడి 2019 అక్టోబర్లో నిరసన తెలిపితే అప్పట్లో కమీషన్ ఏజెంట్లు, అప్పటి మార్కెట్ కార్యదర్శి పద్మహర్షలు రైతులపై కక్షపూర్తిగా కేసులు పెట్టించి ఏడేళ్లుగా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారన్నారు. కమీషన్ ఏజెంట్ల అక్రమాలపై ప్రభుత్వం, అధికారులు స్పందించాలన్నారు. లేదంటే రైతు నాయకులమంతా కలిసి కార్యచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో రైతులు చింపుల సత్యనారాయణరెడ్డి, యాలాల కరుణాకర్రెడ్డి, సి.మల్లేశ్, కె.రాజిరెడ్డి, శ్రీరాంరెడ్డి తదితరులు ఉన్నారు. -
మరింత జఠిలం
స్టీల్ కంపెనీలో పేలుడు పరిగి మండలం లక్ష్మీదేవిపల్లి సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ● రాక్షీట్ జోన్లో ఆశించిన స్థాయిలో ఇంకని వర్షపు నీరు ● సరూర్నగర్, ఇబ్రహీంపట్నం, హయత్నగర్లలో 12 మీటర్ల లోతుకు పడిపోయిన భూగర్భ జలాలు ● ‘సాక్షి’తో భూగర్భ జలవనరులశాఖ అధికారి మాధవరావు సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘నెత్తిన నిండు కుండలా తొనికిసలాడే జంట జలాశయాలు ఉన్నా.. వాటి కింది భాగంలోని గండిపేట, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి మండలాల్లోని భూగర్భ జలాలు వేగంగా పాతాళానికి పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. కురిసిన ప్రతీ వర్షపు నీటిబొట్టును ఒడిసి పట్టినప్పుడే.. భూగర్భ జలాల మనుగడ కొనసాగుతుంది. లేదంటే భవిష్యత్ తరాలకు మరిన్ని ఇబ్బందులు తప్పవు’అని భూగర్భ జల వనరులశాఖ జిల్లా అధికారి మాధవరావు అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే.. ఈ ఏడాది భూగర్భజల మట్టం కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ.. అధిక వినియోగం ఆ నీటి మట్టాన్ని మరింత లోతుకు దిగజార్చుతోంది. ప్రధానంగా గండిపేట పరిసర ప్రాంతాల్లోని కోకాపేట్, నియోపోలీస్, శేరిలింగంపల్లి ఏరియాల్లో నీటి నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక్కడ 70 మీటర్ల లోతుకు వెళ్తే కానీ.. ఆనవాళ్లు కన్పించడం లేదు. 24 బేసిన్లు.. 90 ఫీజో మీటర్లు భూగర్భ జలాల అధ్యయనం కోసం జిల్లాను 24 బేసిన్లుగా విభజించాం. ఒక్కో మండలంలో మూడు చొప్పున జిల్లా వ్యాప్తంగా 90 ఫీజో మీటర్లను ఏర్పాటు చేశాం. ఆయా ఫీజో మీటర్లను సెన్సార్ టెలిమెట్రీ సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేశాం. ఆయా బోరుబావుల్లో ఉన్న నీటిమట్టాన్ని ప్రతీనెలా రికార్డు చేస్తున్నాం. జిల్లాలో పట్టణీకరణ, నిర్మాణాలు ఎక్కువగా ఉన్న గండిపేట, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మణికొండ, నియోపోలీస్, కోకాపేట వంటి ప్రాంతాలన్నీ పూర్తిగా రాతిపొరలతో కూడి ఉన్నాయి. వీటి నెత్తిన జంట జలాశయాలున్నా.. రాక్షీట్, కాంక్రీట్ జంగిల్ వల్ల ఆశించిన స్థాయిలో నీరు ఇంకని పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ 250 అడుగులు దాటితే కానీ నీటి ఆనవాళ్లు కన్పించడం లేదు. కాంక్రీట్ జంగల్గా మారడంతో.. వ్యవసాయ భూములన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారాయి. సీసీ రోడ్లు, భారీ నిర్మాణాలతో పూర్తిగా కాంక్రీట్ జంగల్గా మారింది. సెప్టెంబర్/అక్టోబర్ మాసాల్లో భారీ వర్షాలు కురిసినప్పటికీ.. భూమి పొరల్లోకి ఆశించిన స్థాయిలో నీరు ఇంకకపోవడం.. చెరువులు, కుంటల్లో ఉన్న కొద్దిపాటి నీరు కూడా కన్పించకుండా పోతోంది. డిసెంబర్ చివరిలో కొంత ఆశాజనకంగా కన్పించిన భూగర్భ జలాలు.. మార్చి చివరి నాటికి మరింత లోతుకు పడిపోయాయి. శేరిలింగంపల్లిలో డిసెంబర్లో 11.93 మీటర్ల లోతులో కన్పించిన నీటి ఆనవాళ్లు.. ఫిబ్రవరి చివరి నాటికి మరింత లోతుకు పడిపోయాయి. నెల రోజుల వ్యవధిలోనే మూడు మీటర్ల లోతుకు పడిపోయింది. ఇక సరూర్నగర్, ఇబ్రహీంపట్నం, హయత్నగర్లలో 9 మీటర్ల నుంచి 12 మీటర్ల లోతుకు పడిపోవడం గమనార్హం. సాధారణంగా వ్యవసాయ మోటార్లు ఎక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే.. పట్టణ ప్రాంతాల్లోనే వేగంగా పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రతీ ఇంటికి విధిగా ఒక రీచార్జి గుంతను తవ్వాలి. ఇంటిలోని బోరుబావిలో నీరు పుష్కలంగా ఉండాలంటే వాన నీటి ఇంకుడు గుంతలే ఏకై క మార్గం. నాలుగు నుంచి ఆరు అడుగుల విస్తీర్ణం, ఎనిమిది అడుగుల లోతులో గుంతను తవ్వుకోవాలి. గుంత కింది నుంచి 4 అడుగుల వరకు 40 ఎంఎం కంకర వేసుకోవాలి. ఆ తర్వాత రెండు అడుగులు 20 ఎంఎం కంకర, ఆపైన దొడ్డు ఇసుక వేసుకోవాలి. గుంట చుట్టూ గోడకట్టాలి. ఇంటిపై కురిసిన వర్షపు నీరు పైపుల ద్వారా నేరుగా గుంతలో పడేలా చేసుకోవడం ద్వారా భూగర్భజలాలను పెంచుకోవచ్చు. పాడైన బోరు బావుల చుట్టూ తవ్వుకుని, కేసింగ్పైపు చుట్టూ కంకర, ఇసుకను అమర్చి, పైపు చుట్టూ చిన్న చిన్న రంద్రాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా భూగర్భజలాలను పెంచుకోవచ్చు. వరదనీటిని ఊరి చివరలో వట్టిపోయి వృథాగా ఉన్న పాడుబడ్డ బావిలోకి మళ్లించడం ద్వారా కూడా భూగర్భ జలాలను పెంచుకోవచ్చు. -
ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం
కార్పొరేషన్ ఈడీ పద్మావతి ఇబ్రహీంపట్నం రూరల్: ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎస్సీ కార్యచరణ ప్రణాళిక 2025–26 గాను రవాణా రంగం కింద ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతో పాటు రైతులకు సబ్సిడీ రుణాలు అందించనున్నట్లు కార్పొరేషన్ ఈడీ పద్మావతి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి వచ్చే నెల 2 వరకు ఎస్సీ నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోవాలని ఆమె కోరారు. వ్యవసాయ పథకంలో వ్యవసాయ డ్రోన్, వ్యవసాయ యంత్రములు, పశుపోషణ పాడి పరిశ్రమ, పట్టు పరిశ్రమ, తోటల పెంపకం, కిసాన్ నర్సరీ, అయిల్పామ్ సాగు, బోర్ బావితో సబ్ మెర్సిబుల్ పంపు సెట్, సర్వీస్ కనెక్షన్ కోసం రూ.70 వేల–రూ.5 లక్షల వరకు సబ్సిడీ అందజేస్తున్నట్లు తెలిపారు. ఆహార భద్రత కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రము, లైసెన్స్ ఉండాలి. ఎలక్రిక్ట్ ద్విచక్ర వాహనాలను గిగ్ కార్మికులకు ప్రాధాన్యత, దివ్యాంగులు సదరమ్ సర్టిఫికెట్, పాస్పోర్టు సైజ్ ఫొటోలు, భూమి ధ్రువీకరణ పత్రాలను ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. షాద్నగర్రూరల్: ఫీ ఫర్ స్టెమ్ తెలంగాణ, స్టెల్లార్ స్కాలర్షిప్ అవార్డులను షాద్నగర్ ప్రభుత్వ గురుకుల డిగ్రీ, పీజీ మహిళా కళాశాల నుంచి ఇద్దరు అందుకున్నారు. హైదరాబాద్లోని విజ్ఞాన్ కళాశాల, ఇంటర్నేషనల్ సంస్థ సహకారంతో బుధవారం నిర్వహించిన కల్పన ఫీ ఫర్ స్టెమ్ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వారికి అవార్డులు అందజేశారు. ఈ అవార్డు కింద ఒక్కొక్కరికి రూ.5 వేల నగదు, ల్యాప్టాప్ అందజేశారు. అవార్డులు అందుకున్న పూజ, మానసను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతా పోలే, కోఆర్డినేటర్ అఫ్రోజ్ జహాన్, పరమేశ్వరి తదితరులు అభినందించారు. శాసన సభ సమావేశాల్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆమనగల్లు: కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ రైతులకు అదనంగా స్ప్రింక్లర్లు మంజూరు చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. నియోజకవర్గ పరిధిలోని వెల్దండ, కడ్తాల మండలాలకు గోదాములు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని.. అవసరమైన టార్పాలిన్ కవర్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికే తమ నియోజకవర్గానికి 1,500 స్ప్రింక్లర్లు మంజూరు చేసిందని, అదనంగా మరో 2,000 యూనిట్లు మంజూరు చేయాలని కోరారు. 28 మంది బృందంలో ఎస్జీటీ బాలాజీ చేవెళ్ల: ప్రభుత్వ పాఠశాలలో విద్యాభివృద్ధి పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయి విద్యావిధానాలపై అవగాహన కల్పించేందుకు 28 మంది ఉపాధ్యాయుల బృందాన్ని ఫిన్లాండ్ పర్యటనకు ఎంపిక చేసింది. ఈ జాబితాను మంగళవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇ.నవీన్ నికోలస్ విడుదల చేశారు. హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు ఉన్న ఈ బృందంలో దామరగిద్ద ప్రాథమికోన్నత పాఠశాల ఎస్జీటీ కొయిలకొండ బాలాజీ ఎంపికయ్యారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ టీచర్స్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యూకేషనల్ ఎక్చేంజి ప్రోగ్రాంలో భాగంగా తనకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం నూతన విద్యావిధానం అమలుచేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో విద్యావిధానాలను పరిశీలించి, ఉత్తమ బోధనా పద్ధతులను అధ్యయనం చేసి ఇక్కడ అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. తనపై నమ్మకంతో ఎంపిక చేసిన విద్యాశాఖ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
ఘనంగా వృక్ష కల్యాణం
కడ్తాల్: మానవాళికి ప్రాణ వాయువు అందిస్తున్న వృక్షాలపై ప్రతి ఒక్కరూ ప్రేమాభిమానం, గౌరవభావం కలిగి ఉండాలని సీజీఆర్ చైర్పర్సన్ లీలా లక్ష్మారెడ్డి, సీజీఆర్ వ్యవస్థాపకులు లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని అన్మాస్పల్లి సమీపంలోని శ్రీరామేశ్వర వీరాంజనేయ జ్ఞాన సరస్వతి ఆలయ ఆవరణలో, సీజీఆర్ చైర్ పర్సన్ లీలాలక్ష్మారెడ్డి దంపతులు ‘రావిచెట్టు–వేప చెట్టు’కు వృక్ష కల్యాణం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వృక్షాలు భగవంతుడి ప్రతి రూపాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనునాయక్, ఉప సర్పంచ్ మహేశ్యాదవ్, పంచాయతీ కార్యదర్శి ఇందిరా, మాజీ సర్పంచ్ శంకర్, వేద పండితులు వెంకటేశ్వర శర్మ, నాయకులు జగన్గౌడ్, వెంకటయ్యగౌడ్, పాపిరెడ్డి, భజ్యా శ్రీనునాయక్, తదితరులు పాల్గొన్నారు. -
యాక్షన్ ప్లాన్తో గ్రామాల అభివృద్ధి
చేవెళ్ల: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్తో గ్రామాల అభివృద్ధి చెందుతాయని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) సురేశ్మోహన్ అన్నారు. బుధవారం ఆయన మండల పరిధిలోని రేగడిఘనాపూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని డంపింగ్యార్డు, పల్లె ప్రకృతి వనం, నర్సరీ, క్రీడా ప్రాంగణాలను సందర్శించి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిప్పని మాధవిరాంరెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఈదులపల్లి మహేశ్వరిరాములు, వార్డు సభ్యులు, నాయకులు తదితరులు ఉన్నారు. డీపీఓ సురేశ్మోహన్ -
సెంట్రల్ సివిల్ పెన్షనరీ రూల్స్ అమలు చేయండి
రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యానారాయణ ఇబ్రహీంపట్నం రూరల్: రిటైర్డ్ ఉద్యోగులకు సెంట్రల్ సివిల్ పెన్షనరీ రూల్స్ అమలు చేయాలని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం డీఆర్ఓ సంగీతకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం చైర్మన్ శర్మ, జనరల్ సెక్రెటరీ సుధాకర్, ప్రధాన కార్యదర్శి రాజేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. తైబజార్ వేలం వాయిదా యాచారం: మాల్ పశువుల సంత నిర్వహణ వేలం బుధవారం పంచాయతీ కార్యాలయం వద్ద పోటాపోటీగా జరిగింది. పలువురు వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. సర్పంచ్ అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేలంలో మండల పంచాయతీ అధికారి శ్రీలత తదితరులు పాల్గొన్నారు. పలువురు పోటీపడగా అందులో మాల్ గ్రామానికి చెందిన నిమ్మరాజు జంగయ్య రూ.1.05 లక్షలకు దక్కించుకున్నాడు. కాగా తైబజార్ వేలం వాయిదా పడింది. -
చమురు కొరత.. బంకుల మూత
బంకుల వద్ద భారీ ‘క్యూ’ శంకర్పల్లి: యుద్ధం కారణంగా పెట్రోల్, గ్యాస్ కొరత ఉంటుందని వదంతులు పెద్దఎత్తున వ్యాప్తి చెందడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పగలు, రాత్రి అని తేడా లేకుండా అవకాశం ఉన్న బంకుల్లో పెట్రోల్, డీజిల్ కోసం కిలోమీటర్ల కొద్ది క్యూలు కడుతున్నారు. దీనికి తోడు కొంతమంది డబ్బాలను తీసుకొచ్చి, పెట్రోల్, డీజిల్లను తీసుకొని వెళ్తుండడం గమనార్హం. అయితే నిబంధనల ప్రకారం డబ్బాలలో ఇంధనం పోయకూడదని ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. పలుచోట్ల రోజు కంటే ఎక్కువ మొత్తంలో పెట్రోల్, డీజిల్ కొనుగోలు అవుతుండడంతో నిర్వాహకులు నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. అదేవిధంగా గ్యాస్ ఏజెన్సీ గోదాం వద్ద వందల కొద్దీ జనాలు తమ ఖాళీ సిలిండర్లతో క్యూలు కట్టి, తీసుకెళ్తున్నారు. కొరత వదంతులపై బంకు యజమానులతో మాట్లాడగా.. గతంలో మాదిరే ఇంధనం వస్తుందని, జనాలు అవసరం లేకున్నా ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లడంతో ఇబ్బంది తలెత్తుందన్నారు. మొయినాబాద్: రెండు రోజులుగా పెట్రోల్, డీజీల్ కోసం బంకుల్లో వాహనదారులు బారులు తీరుతున్నారు. వినియోగదారులు వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేసుకోవడంతోపాటు డబ్బాల్లో నింపుకొంటున్నారు. బుధవారం సాయంత్రం వరకు భారీగా వాహనాలు క్యూకట్టాయి. సాయంత్రం 5 గంటల తరువాత స్టాక్ అయిపోవడంతో ఒక్కొక్కటిగా బంకులన్నీ మూసివేసి నో స్టాక్ బోర్డులు పెట్టారు. ఇబ్బంది పడుతున్న వాహనదారులు -
5
కొత్తగా మరో..సాక్షి, రంగారెడ్డి జిల్లా: నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జిల్లాలో కొత్తగా మరో ఐదు అసెంబ్లీ స్థానాలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 24,46,265 మంది ఉండగా, 2024 డిసెంబర్ నాటికి కేవలం 18 ఏళ్లు నిండిన ఓటర్ల సంఖ్యే 35,91,987కు చేరడం గమనార్హం. వీరిలో 526 గ్రామ పంచాయతీల పరిధిలో 7,94,653 మంది ఓటర్లు ఉండగా, ఆరు మున్సిపాలిటీల పరిధిలో 1,75,974 మంది ఉన్నారు. మిగిలిన 25,51,793 మంది పూర్తిగా నగరంలోనే ఉన్నారు. శేరిలింగంపల్లిలో రెండు అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాల జాబితాలో శేరిలింగంపల్లి మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ఉన్నాయి. చేవెళ్ల, కల్వకుర్తి, షాద్నగర్లలో రెండున్నర లక్షల లోపు ఓటర్లు మాత్రమే ఉన్నారు. అత్యధిక ఓటర్లు ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి గచ్చిబౌలి, మియాపూర్ కేంద్రాలుగా మరో రెండు నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆ నాలుగింట్లో మరో మూడు రాజేంద్రనగర్లో కొత్తగా శంషాబాద్ ఏర్పడనుంది. మహేశ్వరం నుంచి కొత్తగా సరూర్నగర్ పేరుతో మరో నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది. ఎల్బీనగర్ నుంచి కొత్తగా హయత్నగర్ పేరుతో మరో నియోజకవర్గం పుట్టుకొచ్చే అవకాశం ఉంది. ఇబ్రహీంపట్నంలో కొంత భాగాన్ని కూడా దీనిలో కలిపే చాన్స్ లేకపోలేదు. ఫలితంగా ప్రస్తుతం ఉన్న ఎనిమిది నియోజకవర్గాల సంఖ్య 13కు చేరే అవకాశం ఉంది. ఈ మేరకు కొత్త నేతలకు అవకాశాలు లభించనున్నాయి.2024 డిసెంబర్ నాటికి ఓటర్లు ఇలా.. నియోజకవర్గం ఓటర్లు చేవెళ్ల 2,02,005 కల్వకుర్తి 2,41,762 షాద్నగర్ 2,36,338 ఇబ్రహీంపట్నం 3,27,589 మహేశ్వరం 5,46,577 రాజేంద్రనగర్ 5,81,937 ఎల్బీనగర్ 5,93,712 శేరిలింగంపల్లి 7,32,506జిల్లా పరిధిలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు త్వరలో నియోజకవర్గాల పునర్విభజన! 8 నుంచి 13కు చేరే అవకాశం మారనున్న రాజకీయ ముఖచిత్రం -
ప్రగతి ప్రణాళిక పక్కాగా ఉండాలి
సాక్షి రంగారెడ్డి జిల్లా: ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, శ్రీనివాస్తో కలిసి జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. మున్సిపాలిటీలు, పంచాయతీల వారీగా పారిశుద్ధ్య పనులు, విద్యుత్కు సంబంధించిన మరమ్మతులు, భవనాల మరమ్మతులు, పెయింటింగ్ వంటి పనులు పూర్తి చేయాలన్నారు. కార్యాలయాల పరిశుభ్రత, ఫైళ్ల క్లియరెన్స్ పూర్తి చేయాలని, ఏ ఒక్క శాఖలో ఒక్క ఫైల్ కూడా పెండింగ్లో ఉండకూడదన్నారు. మంజూరైన పనులను వెంటనే గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలతోపాటు వాటి పరిసరాలు సైతం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని తెలిపారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఫైళ్లు క్లియర్ చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో తమకు నిర్దేశించిన పనులు పూర్తి చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం వేసవి కాలం అయినందున ఏ ఒక్కచోట కూడా తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలని, అవసరమైన మరమ్మతులు చేపట్టాలని, పైపు లీకేజులు లేకుండా చూడాలని, ఎక్కడా నీటి సరఫరాకు ఆటంకాలు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. అవసరమైన చోట బోరు మోటార్లు, హ్యాండ్ పంపులు, ఇతర తాగునీటి వనరులకు మరమ్మతు పనులు జరిపించాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఎంపీడీఓలు సమన్వయంతో, సమష్టిగా పని చేయాలని కోరారు. సమావేశంలో డీఆర్ఓ సంగీత, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీపీఓ సురేశ్ మోహన్, సీపీఓ సౌమ్య, డీఆర్డీఏ పీడీ శ్రీలత, వ్యవసాయాధికారి ఉష, పౌరసరఫరాల అధికారి వనజాత, మేనేజర్ హరీష్, మిషన్ భగీరథ, ఆర్అండ్ బీ, సంక్షేమ శాఖ అధికారులు రామరావు, నవీన్ కుమార్ రెడ్డి, కేశురాం, కె.రామేశ్వరి దేవి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ నారాయణరెడ్డి -
గంజాయి, డ్రగ్స్ కదలికలపై నిఘా పెట్టండి
కడ్తాల్: జిల్లాలోని కడ్తాల్, ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి మండలాల్లో గంజాయి, డ్రగ్స్ మాదకద్రవ్యాల వినియోగం కదలికలపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని సర్పంచ్ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లోని ఎకై ్సజ్ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ ప్రణవిని కలిసి వినతిపత్రం అందజేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణ, వినియోగం, గ్రామీణ ప్రాంతాల్లోని యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందని.. ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, నేరాల పెరుగుదల, రోడ్డు ప్రమాదాల వంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆమె దృష్టికి తెచ్చారు. ఆయా మండలాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి డ్రగ్స్, గంజాయి కదలికలను అరికట్టాలని కోరారు. ఈ మేరకు అసిస్టెంట్ కమిషనర్ సానుకూలంగా స్పందించారని, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ధర నిమ్మదిరిగేలా.. సాక్షి, సిటీబ్యూరో: మార్కెట్లో నిమ్మకాయల ధరలు దిమ్మతిరిగిపోతున్నాయి. అకాల వర్షాలు, ఉత్పత్తులు పడిపోవడంతో వంటి కారణాలతో ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. రిటైల్ మార్కెట్లో ఒక నిమ్మకాయ రూ.10 పలుతోంది. దారుషిఫా హోల్సేల్ మార్కెట్లో 25 కిలోల నిమ్మకాయల బస్తా ప్రస్తుతం రూ.2,000 నుంచి రూ.3,500 చొప్పున విక్రయిస్తున్నారు. తక్కువ నాణ్యత నిమ్మకాయలు టోకు మార్కెట్లో బస్తాకు రూ.1,500 నుంచి రూ.1,800కు అమ్ముడవుతున్నాయి. స్థానిక మధ్యవర్తులు రైతుల నుంచి నిమ్మకాయలను కొనుగోలు చేసి ఢిల్లీ వ్యాపారులకు అమ్ముతున్నారు. అక్కడ వారికి మంచి ధర లభిస్తోంది. దీని కారణంగా స్థానికంగా సరఫరా కూడా తగ్గిపోయాయి అని చాదర్ఘాట్లోని నిమ్మ వ్యాపారి సయ్యద్ రఫీ చెప్పారు. -
నష్టపోయిన రైతులను ఆదుకోండి
యాచారం: ఫార్మాసిటీ భూసేకరణలో నష్టపోయిన రైతులకు మెరుగైన పరిహారం అందజేసి, ఆదుకోవాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం కలెక్టర్ నారాయణరెడ్డిని కోరారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఫార్మాసిటీ భూ బాధిత గ్రామాలైన నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, కుర్మిద్ద, తాడిపర్తి గ్రామాల రైతులతో కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బలవంతపు భూసేకరణతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. వివాదాల్లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించి తగిన పరిహారం అందజేయాలని అన్నారు. స్పందించిన కలెక్టర్ త్వరలో రైతులతో సమావేశం ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు తాడిపర్తి సర్పంచ్ నీలం ఝాన్సీ రైతు భరోసా నిధులు మంజూరయ్యేలా కృషి చేయాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పల్లె వినయ్, దార సత్యం, కొత్త రవి, సామ నిరంజన్, నాగని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బంకుల్లో బారులు
మొయినాబాద్: ఇరాన్, అమెరికా యుద్ధం కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తిగా అయిపోయాయనే వదంతులతో వినియోగదారులు పెట్రోల్, డీజిల్ కోసం పరుగులు తీశారు. బంకుల్లో భారీగా వాహనాలు క్యూకట్టాయి. మంగళవారం మొయినాబాద్లోని పెట్రోల్ బంకుల్లో భారీగా వాహనాలు క్యూకట్టాయి. దేశంలో పెట్రో నిల్వలు తగ్గాయని.. యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ రావడంలేదని రెండు రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో బంకులకు పరుగెత్తి డబ్బాలు, బబుల్స్లో పోయించుకుంటున్నారు. వాహనా ల్లోనూ ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం పరుగులు -
నిర్మాణ పనులు వేగిరం చేయాలి
● రాష్ట్ర విద్యా శాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ● ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ పరిశీలన మంచాల: వచ్చే నెల 11న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్న నేపథ్యంలో ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర విద్యా శాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. మండలంలోని ఆరుట్లలో కొనసాగుతున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే ఆరుట్ల మాదిరిగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. నిరుపేదలకు నాణ్యమైన విద్య అందించడమే గాకుండా కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా పాఠశాలలను నిర్వహించి మార్పు తేవాలని ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్వహణ కోసం సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఎఫ్ ఫోరం సభ్యులు పద్మషా, ప్రధానోపాధ్యాయుడు గిరధర్గౌడ్, ఉప సర్పంచ్ నూకం రాజు ముదిరాజ్, పేరెంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
బీజేపీతోనే దేశాభివృద్ధి
శంకర్పల్లి: దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ అన్నారు. మండలంలోని ప్రొద్దటూరులో మంగళవారం నిర్వహించిన పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్–2026 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మోదీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలోని కార్యకర్తలు ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మండల, మున్సిపల్ అధ్యక్షులు లీలావతి, దయాకర్రెడ్డి, నాయకులు ప్రభాకర్రెడ్డి, రాములు, పరమేశ్వర్రెడ్డి, సురేశ్, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. రూ.1.81 కోట్లు పలికిన తైబజార్ వేలంతుక్కుగూడ: తైబజార్ (వారపు పశువుల సంత) బహిరంగ వేలం 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను మంగళవారం తుక్కుగూడ వార్డు కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులు నిర్వహించారు. ఈ వేలంలో రూ.కోటి 81 లక్షల 71 వేలకు రావిర్యాల గ్రామానికి చెందిన బోధ పాండురంగారెడ్డి దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా శంషాబాద్ సర్కిల్ డీసీ సుమన్రావు పాండురంగారెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో శంషాబాద్ సర్కిల్ ఎస్టేట్ అధికారి టి.పర్వతాలు, టీఐ మల్లేష్, వ్యాపారులు, జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. ఆ రహదారిని ఆరు లేన్లుగా విస్తరించండి ఆమనగల్లు: హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వరకు రోడ్డును ఆరులేన్లుగా విస్తరించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో మంగళవారం హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణపై మాట్లాడారు. రోడ్డు రెండు లేన్లుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి విస్తరణకు నిధులు మంజూరయ్యాయా.. అయితే పనులు ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. అలాగే హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై ఫిల్మ్సిటీ దాటిన తరువాత కిలోమీటర్ దూరంలో విద్యాసంస్థలు అధికంగా ఉన్నాయన్నారు. విద్యార్థులు రోడ్డు దాటడానికి ఇబ్బందులు పడుతున్నందున ఫుట్ ఓవర్బ్రిడ్జి నిర్మించాలని కోరారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. -
డయాలసిస్ సేవలను పునరుద్ధరిస్తాం
డీసీహెచ్ఎస్ అనురాగిణి చేవెళ్ల: చేవెళ్ల ఆస్పత్రిలో నిలిచిపోయిన డయాలసిస్ సేవలను పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని డీసీహె చ్ఎస్ అనురాగిణి అన్నారు. డయాల సిస్ సేవలు నిలిచిపోయినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు సోమవారం ఆమె ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఆస్పత్రిని సందర్శించారు. డయాలసి స్ రోగులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయంగా పాలియేటివ్ కేర్ కేంద్రంలో సేవలను కొనసాగించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆమె సిబ్బందికి సూచించారు. వారంరోజుల్లో యథావిధిగా సేవలు కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారి వెంట మున్సిపల్ చైర్పర్సన్ దేవర సమతావెంకట్రెడ్డి, వైస్ చైర్మన్ కాసుల రాములుగౌడ్, కౌన్సిలర్లు బండారి శైలజఆగిరెడ్డి, ఎం.శ్రీనివాస్, తాళ్లపల్లి, నర్సింలు, కృష్ణానాయక్ తదితరులు ఉన్నారు. పంటలు ఎండిపోకుండా చూడండి అసెంబ్లీలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి ఆమనగల్లు: కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించి పంటలు ఎండిపోకుండా చూడాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. శాసనసభలో సోమవారం ఆయన మాట్లాడారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు వనపర్తి నియోజకవర్గంలోని బుద్ధారం వరకు వస్తున్నాయని, ఇక్కడ ఐదు మోటార్లకు గాను 3 మాత్రమే పనిచేస్తున్నాయని అన్నారు. వేరుశనగ పంట తీయడానికి ఇబ్బందులు కలుగుతున్నాయని, 15 రోజులుగా నీరు రావడం లేదన్నారు. కల్వకుర్తి రైతులకు వెంటనే సాగునీరు అందించి పంటలను కాపాడాలని కోరారు. -
అంతా పథకం ప్రకారమే..
షాద్నగర్రూరల్: బండరాయితో మోది మహిళను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. ఏసీపీ లక్ష్మీనారాయణ వివరాలు వెల్లడించారు. ఫరూఖ్నగర్ మండలం దేవునిపల్లి పంచాయతీ పరిధిలోని రంగారెడ్డిగూడకు చెందిన శోభ (33) కొన్నేళ్ల క్రితం మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండకు చెందిన రాజును కులాంతర వివాహం చేసుకుంది. వారికి బాబు మహేందర్ ఉన్నాడు. కొంత కాలం తరువాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అనంతరం నాలుగేళ్ల క్రితం శోభ మహబూబ్నగర్లోని వీరన్నపేటకు చెందిన నర్సింలును రెండో వివాహం చేసుకుంది. వారికి పాప మమత ఉంది. కొంత కాలం సాఫీగా సాగిన వారి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. దీంతో శోభ ఆరు నెలల క్రితం కూతురిని తీసుకొని పుట్టింటికి వచ్చి అక్కడే ఉంటుంది. తిరిగి తన వద్దకు రావాలని భర్త పలుమార్లు కోరినా శోభ వినిపించుకోలేదు. ఈ క్రమంలో శోభ ఇతరులతో చనువుగా ఉంటోందని, ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతోందని నర్సింలు అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఎలాగైనా ఆమెను అంతమొందించాలని అనుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 21న కొడుకు మహేందర్కు సైకిల్ ఇప్పిస్తా, పాపను తీసుకొని మహబూబ్నగర్కు రావాలని శోభకు ఫోన్ చేశాడు. మహబూబ్నగర్కు వచ్చిన వారిని తీసుకొని మార్గమధ్యలో మద్యం కొనుగోలుచేసి తన గదికి తీసుకెళ్లాడు. గది బయట వరండాలో భార్యభర్తలు మద్యం తాగే సమయంలో మరోసారి గొడవ జరిగింది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం నర్సింలు భార్య తలపై రాయితో బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం ఎవరికీ తెలియకుండా అర్థరాత్రి వరకు భార్య మృతదేహాన్ని గదిలో దాచిపెట్టాడు. తరువాత శవాన్ని మూటకట్టి బైక్ ట్యాంక్పై పెట్టుకొని, కూతురును కూర్చోపెట్టుకొని రంగారెడ్డిగూడ సమీపంలోని వ్వయసాయ పొలంలో పడేసి వెళ్లాడు విచారణ ప్రారంభించిన పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించి నిందితుడిని పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారించగా నర్సింలు నేరాన్ని అంగీకరించాడు. నిందితుడి నుంచి సెల్ఫోన్, హత్యకు ఉపయోగించిన గ్రానైట్రాయి, ధరించిన చొక్కాను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. హత్య కేసును ఛేదించడంలో కీలకంగా వ్యహరించిన పట్టణ సీఐ సీతారాం, ఎస్ఐ సుశీల, పోలీసు సిబ్బందిని ఏసీపీ అభినందించారు. భార్యను హత్య చేసిన భర్త కేసును ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన ఏసీపీ లక్ష్మీనారాయణ నిందితుడికి రిమాండ్ -
స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత ఇవ్వండి
మండలిలో ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్కుమార్రెడ్డి షాద్నగర్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ప్రభుత్వం ఎప్పుడు నిర్వహిస్తుందని ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్కుమార్రెడ్డి ప్రశ్నించారు. శాసనమండలిలో సోమవారం ఆయన మాట్లాడారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేస్తుందేమోనని తాము భావిస్తున్నామని అన్నారు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఎప్పటిలోపు పూర్తి చేస్తారో స్పష్టం చేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం పేరుతో మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలను అమలు చేయాలని కోరారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం, పెన్షన్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు పెన్షన్లు అందిస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేశారు. పంచాయతీ కారోబార్లను జూనియర్ సెక్రటరీలుగా గుర్తించి వారికి గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించినా నేటికీ ఇవ్వడం లేదన్నారు. పంచాయతీ కార్మికులకు రూ.15వేలు వేతనం చెల్లించాలని, ఆరోగ్య భద్రత కార్డులు ఇవ్వాలని, పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. -
ప్రజావాణి అర్జీలను నిర్లక్ష్యం చేయొద్దు
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణిలో వచ్చే అర్జీలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను హెచ్చరించారు. సమీకృత కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమంలో శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సత్వరమే స్పందించి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ వారం మొత్తం 53 ఫిర్యాదులు అందాయన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, మున్సిపాలిటీ, మండల అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. న్యాయబద్ధంగా భూసేకరణ చేపట్టాలి టీజీఐఐసీకి తిమ్మాపూర్లో చేపడుతున్న భూ సేకరణ చట్టబద్ధంగా నిర్వహించాలని రైతులు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 38,162లో ఒరిజినల్ రైతులకు అన్యాయం చేయొద్దన్నారు. ఎంజాయ్మెంట్ సర్వేకు పూర్తి భిన్నంగా చేపడుతున్నారని, క్షేత్ర స్థాయిలో వచ్చి చాలామంది రైతులకు గుంట నుంచి రెండు ఎకరాల వరకు తగ్గించారన్నారు. ఇలా చేయడంతో పరిహారం తక్కువగా వస్తోందని వాపోయారు. రైతులకు పాసుపుస్తకాల్లో ఉన్నట్లు పరిహారం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో రైతులు రామచంద్రయ్య, యాదయ్య, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. -
నేవీ రాడార్ స్టేషన్తో దేశ భద్రత
పనులను పరిశీలించిన నౌకాదళ అధికారులు పూడూరు: మండలంలోని దామగుండం అటవీ ప్రాంతంలో నిర్మిస్తున్న నేవీ రాడార్ స్టేషన్ పనులను సోమవారం భారత నౌకాదళ వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్, స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాడార్ స్టేషన్ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకున్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డిని సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ ప్రాజెక్టు దేశ భద్రతకు ఎంతో ఉపయోగకరమన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి కూడా దోహదం చేస్తుందని పేర్కొన్నారు. -
‘ఆశ’లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సాయిబాబా కొత్తూరు: ఆశవర్కర్లకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి బీస సాయిబాబా డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఆధ్వర్యంలో మండల మెడికల్ ఆఫీసర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశవర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 28 చలో కమిషనరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. కరోనా మొదలుకొని ప్రభుత్వం అమలుచేసే ప్రతీ పథకం విజయవంతం కావడంలో ఆశల పాత్ర ఎంతగానో ఉందన్నారు. అలాంటి వారికి నేటికి కనీస వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం శ్రమ దోపిడికి పాల్పడుతుందన్నారు. వెంటనే వారికి నెలకు రూ.18 వేల వేతనం, ఈఎస్ఐ, పీఎఫ్తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు. సమస్యలు పరిష్కరించాలని పక్షంలో విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆశలు మంజుల, కమల, అనిత, చైతన్య, శశిరేఖ, శ్రీవాణి, నవనీత, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్ల వేతనాలు పెంచాలి ఇబ్రహీంపట్నం రూరల్: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతనాలు పెంచాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్, అధ్యక్షుడు రుద్రకుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కనీస వేతనం రూ.18వేలకు పెంచాలని, ఐసీడీఎస్లకు సరిపడా నిధులు కేటాయించాలని, ఎన్ఐసీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అంసెబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. 2026 ఎడ్యుకేషన్ పాలసీని సవరించాలని, ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని, ఒంటిపూట బడిని నిర్ణయించి, టీచర్స్, హెల్పర్స్ ఇద్దరికీ ఒకేసారి మే నెలంతా సెలవులు ఎలాంటి ఆటంకాలు లేకుండా అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్, స్వప్న, జిల్లా నాయకులు చుక్క మోహన్, రాజ్యలక్ష్మి, నాగమణి, అనిత, రమణమ్మ, సౌభాగ్య, శశికళ, సంతోష, మమత, ప్రేమలత, భాగ్యలక్ష్మి, పాపమ్మ, జ్యోతి, శివలీల తదితరులు పాల్గొన్నారు. అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన స్కూటీ వ్యక్తికి గాయాలుమొయినాబాద్: స్కూటీ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి కాలు విరిగింది. ఈ సంఘటన హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై మున్సిపల్ పరిధిలోని హిమాయత్నగర్ చౌరస్తాలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన అఫ్సర్ స్కూటీపై నగరం నుంచి మొయినాబాద్కు వస్తుండగా హిమాయత్నగర్ చౌరస్తా వద్దకు చేరుకోగానే స్కూటీ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో అతని కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని చికిత్సకోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
వాహనం బోల్తా పడి వ్యక్తి మృతి
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు మోమిన్పేట: బోలెరో వాహనం బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మోమిన్పేటలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ భరత్ భూషణ్ కథనం మేరకు.. నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన అజీం(30) తనతో పాటు అదే గ్రామానికి చెందిన గొర్రెల కాపరి గుండోల్ల మల్లప్పతో కలిసి బోలెరో వాహనంలో జీవాలు వేసుకొని మోమిన్పేట మండలం సయ్యద్ అల్లీపూర్కు బయలుదేరాడు. మొరంగపల్లి మలుపు వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ ముస్తాఫా అతి వేగంగా, అజాగ్రత్తగా వాహనం నడపడంతోనే చెట్టును ఢీ కొట్టినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో అజీం అక్కడికక్కడే మృతి చెందాడు. గొర్రెల కాపరి మల్లప్ప, డ్రైవర్ ముస్తాఫాకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. మృతుడి బావ ఫకృద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. సీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన ప్రారంభం తాండూరు టౌన్: పట్టణంలోని ఇందిరానగర్లో పునర్మించిన సీతారామచంద్ర స్వామి ఆలయంలో దేవతల విగ్రహాల పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. స్థానిక భద్రేశ్వర్ చౌక్లోని హనుమాన్ మందిరం నుంచి సీతారాముల విగ్రహాలను బాజాభజంత్రీలతో, భక్తుల కోలాహలం నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లారు. అనంతరం నవగ్రహ పూజ, వాస్తు పూజ, అగ్ని ప్రతిష్ఠాపన, హోమ కార్యక్రమాల అనంతరం మూలవిరాట్లకు జలాధివాసం గావించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. -
ఉంటే సరి.. లేదంటే రద్దే మరి!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూం ఇళ్లు పొంది, వాటిలో నివసించని లబ్ధిదారులపై చర్యలకు రంగం సిద్ధమైంది. అధికారులు ఇప్పటికే ఆయా నిర్మాణాల్లోని లబ్ధిదారులపై సర్వే చేశారు. అర్హులతో పాటు నకిలీలకు నోటీసులు జారీ చేశారు. అర్హులంతా ఈనెల 31లోగా ఆయా ఇళ్లలోకి వచ్చి చేరాలని, లేదంటే ఏప్రిల్ మొదటి వారం తర్వాత కేటాయింపులు రద్దు చేయాలని నిర్ణయించింది. వారి స్థానంలో కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసి, ఆయా నివాసాలను కేటాయించాలని భావిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ ఖాళీ స్థలాలు లేకపోవడంతో వారి కోసం జిల్లాలోని శంకర్పల్లి, తట్టి అన్నారం, బండరావిర్యాల, తిమ్మాయిగూడ, హత్తిగూడ, మన్సాన్పల్లి, నార్సింగి సహా మొత్తం పది ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించారు. మూడేళ్ల క్రితమే జీహెచ్ఎంసీ అధికారుల సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేసి, ఆయా ఇళ్లను కేటాయించారు. ఇళ్లు పొందిన మెజార్టీ లబ్ధిదారులు ఇప్పటికీ గృహ ప్రవేశాలు చేయలేదు. గత నవంబర్లో 3,098 మంది లబ్ధిదారులకు నోటీసులు జారీ చేశారు. పట్టణానికి, పని ప్రదేశానికి ఈ నిర్మాణాలు దూరంగా ఉండటం, సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో మెజార్టీ లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. చేతిలో పట్టా ఉన్నా.. అర్బన్ ప్రాంతాల్లోని నిర్మాణాల పరిస్థితి భిన్నంగా ఉంది. ముఖ్యంగా ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని నందనవనం, మీర్పేట, కుర్మల్గూడ, వనస్థలిపురం, నాగోలు వంటి ప్రాంతాల్లోని ఇళ్లను అనర్హులు ఆక్రమించేశారు. వీరికి స్థానిక రాజకీయ నాయకుల అండదండలు ఉండటంతో ఇతర ప్రాంతాల్లోని అర్హులను అడ్డుకుంటున్నారు. అనర్హులను ఖాళీ చేయించకపోవడంతో అర్హులైన లబ్ధిదారులు సొంతింటికి దూరమయ్యారు. గత నవంబర్లో హౌసింగ్, రెవెన్యూ అధికారులు ఆయా ఇళ్లను తనిఖీ చేసి నోటీసులు కూడా జారీ చేశారు. కానీ ఇప్పటికీ ఖాళీ చేయలేదు. కరెంట్ సరఫరా, మంచినీటి కనెక్షన్లు అధికారికంగా ఇవ్వకపోయినప్పటికీ .. సమీపంలోని విద్యుత్ వైర్ల నుంచి దొంగతనంగా విద్యుత్ను వాడుతున్నారు. మంచినీటి పైపులైన్లకు మోటార్లు బిగించి నీటి చౌర్యానికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా నందనవనంలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కళ్లముందే కరెంట్ చౌర్యం జరుగుతున్నా పట్టించుకున్న నాథుడు లేడు. చేతిలో ప్రభుత్వం జారీ చేసిన ఇళ్ల మంజూరు పత్రం ఉన్నా ఇంట్లోకి అడుగు పెట్టలేని పరిస్థితి. ఖాళీగా ఉన్నవి కొత్తవాళ్లకు.. ‘ఇళ్లు పొందిన లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్లలో తప్పకుండా నివసించాలి. లేదంటే ఏప్రిల్ మొదటి వారం తర్వాత రద్దు చేస్తాం. అంతేకాదు నిర్మాణం పూర్తై..ఖాళీగా ఉన్న ఇళ్లను అర్హులకు మార్చి 31లోగా కేటాయించాలి’ అని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ‘అధికారులు ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎల్–2 జాబితాలోని పేదలను గుర్తించి, వారికి ఆయా ఖాళీ ఇళ్లను కేటాయించాలి. ఇందిరమ్మ కమిటీల సహాయంతో ఎంపిక చేసిన లిస్టును జిల్లా మంత్రి ఆమోదంతో గజిటెడ్ ఆఫీసర్ ద్వారా ధ్రువీకరణ చేసి మంజూరు చేయాలి. ఇప్పటికే డబుల్ బెడ్రూం ఇళ్లు పొంది, గృహ ప్రవేశం చేయని వారిని గుర్తించి, వారికి మరోసారి నోటీసులు జారీ చేయాలి. అయినా ముందుకు రాని వారి పేర్లను ఏప్రిల్ మొదటి వారం తర్వాత రద్దు చేసి, వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయాలి’ అని ఆదేశించారు. గృహ ప్రవేశం చేయని డబుల్ బెడ్రూం లబ్ధిదారులు -
మెగా వైద్య శిబిరానికి స్పందన
మొయినాబాద్: మున్సిపల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మొయినాబాద్ పీహెచ్సీలో సోమవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సోనియాదర్శన్ పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మున్సిపాలిటీతో పాటు వివిధ గ్రామాల నుంచి 368 మంది ప్రజలు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గైనకాలజీ, డెంటల్, జనరల్ మెడిసిన్, ఆర్థోపె డిక్, చిన్నపిల్లల స్పెషలిస్టు వైద్యులు వచ్చినవారికి వైద్య పరీక్షలు చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ లలితాదేవి, ప్రోగ్రాం అధికారి పూనం, డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీనివాస్, మండల వైద్యాధికారి అన్నపూర్ణ, ఎంపీడీఓ సంధ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గరుగు రాజు, కౌన్సిలర్లు గీతావనజాక్షి, జగపతి, సీహెచ్ఓ వెంకట్రెడ్డి, సర్పంచ్ యాదయ్య, నాయకులు షాబాద్ దర్శన్, రాంచందర్, సూరి, యాదగిరి, కిరణ్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వీరుల ఆశయ సాధనకు కృషి చేయాలి
షాద్నగర్రూరల్: దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన విప్లవవీరుల ఆశయ సాధనకు యువత ముందుకు సాగాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆమంచి నాగేశ్వర్ పిలుపునిచ్చారు. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన భగత్సింగ్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ 95వ వర్థంతిని పురస్కరించుకొని చేపట్టిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ ఆమంచినాగేశ్వర్ హాజరై భగత్సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రంకోసం ఎందరో వీరులు అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా సమాజంలో సమానత్వం, శోషణరహిత వ్యవస్థకోసం పోరాడిన గొప్ప విప్లవకారులని కొనియాడారు. భగత్సింగ్ తన రచనలు, ప్రసంగాలతో సామాజిక అసమానతలు, కుల వివక్ష, ఆర్థిక దోపిడీపై తీవ్రంగా స్పందించారని గుర్తు చేశారు. భగత్సింగ్ కలలు కన్న సమాజ నిర్మాణంకోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. విద్యారంగాన్ని రక్షించుకోవడానికి విద్యార్థి ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఈనగంటి వెంకటేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో ఎంఈఓ మనోహర్, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటప్ప, ప్రజా సంఘాల నాయకులు కుర్మయ్య, వెంకటరమణ, రాజు, నర్సింలు, జనార్దన్, శ్రీనునాయక్, ఈశ్వర్నాయక్, శ్రీకాంత్, పవన్చౌహాన్, ఆకాష్నాయక్, లక్ష్మణ్కుమార్, చంద్రమౌళి, లక్ష్మి, మహ్మద్బాబు, రాజు, చరణ్, బబ్లూ, అజయ్రెడ్డి, యశ్వంత్, ఆదిల్ పాల్గొన్నారు.


