Movies
-
నేను గర్భవతిని కాదు.. సీరియస్గా తీసుకోవద్దు: హీరోయిన్
నెటిజన్స్ ఊహించే నిజమైంది. నటి పూనమ్ పాండే గర్భవతి కాదు.. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని ముందే ఊహించారు. తాజాగా అదే నిజమని సదరు నటి ఒపుకుంది. అంతేకాదు బేబీ బంప్ ఫోటో పెట్టి.. ప్రెగ్నెంట్ అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో కూడా వివరించింది.అసలేం జరిగింది?మోడల్, నటి పూనమ్ పాండే పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో తనకు తానే సాటి. గతంలో సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ క్యాన్సర్) పై అవగాహన కోసమని.. తాను మరణించినట్లుగా తప్పుడు వార్తలను ప్రచారం చేయించుకుంది. తాజాగా 'ప్రెగ్నెన్సీ' పేరుతో కొత్త డ్రామాకు తెరలేపింది. నిన్న ఉదయం(మార్చి 31) తన ఎక్స్ ఖాతాలో బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. అది చూసి చాలా మంది షాకయ్యారు. భర్తతో విడిపోయిన తర్వాత ప్రెగ్నెంట్ ఎలా అయిందని కొంతమంది కామెంట్ చేశారు. మరికొంతమంది అయితే ఇది కూడా పబ్లిసిటీ స్టంటేనని అభిప్రాయపడ్డారు.అవును..నేను ప్రెగ్నెంట్ కాదునెటిజన్స్ ఊహించనట్లే..తాను ప్రెగ్నెంట్ కాదని ప్రకటించింది పూనమ్. ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ కోసమే ఇలా చేశానంటూ మరో వీడియోని రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అందరినీ కాసేపు అలరించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశానని ఆమె తెలిపారు. ‘నన్ను సీరియస్గా తీసుకోవద్దు.. లైఫ్ ని చిల్ చేయండి’అంటూ అభిమానులకు సూచించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పూనమ్ పాండే సినీ కెరీర్ విషయాలకొస్తే.. హిందీలో నషా, జీఎస్టీ, ద జర్నీ ఆఫ్ కర్మ, టచ్ ద ఫైర్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో మాలిని అండ్ కో చిత్రంలో హీరోయిన్గా నటించింది. 2020 సెప్టెంబర్ 1న ప్రియుడు సామ్ అహ్మద్ బాంబేని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన పదిరోజులకే అతడు తనపై అత్యాచారం చేశాడని, వేధింపులకు పాల్పడుతున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది. అలా కొంతకాలానికే దంపతులిద్దరూ విడిపోయారు. -
థియేటర్లలోకి ఏడున్నర గంటల 'ధురంధర్'
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 'ధురంధర్' హవా నడుస్తోంది. దక్షిణాదిలోని తెలుగు, తమిళంలోనూ ఈ చిత్రానికి మంచి వసూళ్లు దక్కుతున్నాయి. ఇదలా ఉండగానే మూవీ టీమ్ మరో సరికొత్త ప్రయోగం చేసేందుకు సిద్ధమైంది. రెండు భాగాలని కలిపి ఒక్కటిగా చేసి ఆ సినిమాని థియేటర్లలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. ఈ మేరకు ఆ విషయం వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: దురంధర్-2 కలెక్షన్స్.. తెలుగులోనే ఎందుకిలా?)దాదాపు మూడున్నర గంటల నిడివితో 'ధురంధర్' తొలి భాగం గతేడాది డిసెంబరులో రిలీజైంది. రూ.1300 కోట్ల మేర కలెక్షన్ సొంతం చేసుకుంది. అప్పుడే సీక్వెల్ ఎప్పుడొస్తుందో వెల్లడించారు. చెప్పినట్లుగానే రెండు వారాల క్రితం ధురంధర్ 2ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఇది 3 గంటల 50 నిమిషాల నిడివితో రిలీజ్ చేశారు. దీనికి బీభత్సమైన హైప్ ఉన్నప్పటికీ వాటిని అందుకుని, సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. చూస్తుంటే బాహుబలి 2, పుష్ప 2 నెలకొల్పిన ఘనతలు గల్లంతు అయిపోయేలానే ఉన్నాయి.(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)ఇదలా ఉండగానే ఇప్పుడు డైరెక్టర్స్ కట్ పేరిట 'ధురంధర్' చిత్రాన్ని ఏడున్నర గంటల నిడివితో థియేటర్లలోకి తీసుకురాబోతున్నారనే న్యూస్ బయటకొచ్చింది. మంగళవారం(మార్చి 31)న ఈ మేరకు సదరు భారీ నిడివి మూవీకి సెన్సార్ జరిగినట్లు ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 5 నుంచి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే ఈ సినిమా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఐమాక్స్, DC, HDR, EPIQ వంటి ప్రీమియం స్క్రీన్లలో మాత్రమే ప్రదర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది.సుధీర్ఘ నిడివితో రాబోతున్న ఈ సినిమాలో దర్శకుడు తీసిన ప్రతి సీన్ ఉండనుందని, సెన్సార్లో తొలగించిన కొన్ని అదనపు సన్నివేశాలు కూడా ఉండనున్నట్లు సమాచారం. నేడో రేపో నిర్మాణ సంస్థ నుంచి ఈ మేరకు ప్రకటన వచ్చే అవకాశముందని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఏడున్నర గంటల నిడివితో రిలీజైనా కనీసం మూడు ఇంటర్వెల్స్ అయినా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రేక్షకులు కూడా అంత ఓపికతో చూస్తారా అనేది అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. ఒకవేళ ఇది నిజమై, థియేటర్లలోకి వస్తే మాత్రం అత్యంత సుధీర్ఘ నిడివితో వచ్చే చిత్రంగా రికార్డ్ సృష్టించడం గ్యారంటీ.(ఇదీ చదవండి: 9 ఏళ్ల ‘బాహుబలి’ రికార్డు బ్రేక్ చేసిన ‘ధురంధర్’) -
కీర్తి ‘శాశ్వత్’ o చేసిన ధురంధర్!
నటీనటులైనా, దర్శకుడైనా, సాంకేతిక నిపుణులైనా... చిత్ర పరిశ్రమలో ఏ కళాకారుడికైనా ఒక పెద్ద విజయం కుదుపుని ఇస్తుంది కెరీర్కు మలుపును అందిస్తుంది. రాత్రికి రాత్రే తలరాతలను మార్చేయగల శక్తి ఒక్క సినిమా విజయానికి ఉంది. అదీ బాలీవుడ్ రికార్డులను బద్దలుకొట్టిన స్వదేశీ స్పై థ్రిల్లర్ ’ధురందర్’ లాంటి సినిమా అయితే ఇక చెప్పేదేముంది? సంచలన విజయం సాధించిన ఈ సినిమా దానితో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరి కెరీర్ను అనూహ్యమైన కుదుపుని అందించింది.వీరందరిలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రెండు భాగాలలకూ మ్యూజిక్ని ఇచ్చిన సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్దేవ్ ముందున్నారు. దర్శకుడి తర్వాత ఆయన పేరే ఇప్పుడు భారతీయ సినిమా రంగంలో అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. ధురందర్ ఇటీవల విడుదలైన దాని సీక్వెల్ విజయాలకు ఎన్నో ముఖ్య కారణాలు ఉన్నప్పటికీ, ఈ వర్ధమాన సంగీతకారుడు అందించిన అద్భుతమైన నేపథ్య సంగీతం రెండు భాగాలకూ ప్రధాన ఆకర్షణగా నిలిచి, వాటిని బ్లాక్బస్టర్లుగా మార్చడంలో కీలక పాత్ర పోషించింది.గతంలో ఆదిత్య ధర్తో కలిసి ’ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ చిత్రానికి కూడా శాశ్వత్ పనిచేశారు తన అద్భుతమైన స్వరకల్పనకు ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఆయన జాతీయ ఫిల్మ్ఫేర్ అవార్డులు రెండింటినీ గెలుచుకుని బాలీవుడ్కు ఒక బలమైన సందేశాన్ని ఇచ్చారు. ధురందర్ చిత్రంతో, తాను రాబోయే సంవత్సరాల్లో మరిన్ని సంచలనాలు సృష్టిస్తానని ఆయన మరోసారి చాటి చెప్పారు. «అత్యంత ఉత్కంఠ భరిత సన్నివేశాల్లో అనూహ్యంగా పాత బాలీవుడ్ పాటల్ని జోడిస్తూ దురందర్ చిత్రాల్లో.. శాశ్వత్ చేసిన కొత్త ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. సినిమా కథనంతో సజావుగా కలిసిపోయిన ఒకనాటి మ్యూజికల్ హిట్స్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. ఆయన వ్యూహం అద్భుతంగా ఫలించింది.కేవలం నేపథ్య సంగీతంలోనే కాకుండా, ప్రేక్షకులకు పాత జ్ఞాపకాలను గుర్తుచేసే ఐదు రెట్రో పాటలతో కథనాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చినప్పుడు, క్లాసిక్ పాటలపై ఆయనకున్న అభిరుచి మరోసారి స్పష్టమైంది. దివంగత నుస్రత్ ఫతే అలీ ఖాన్ పాట దిల్ పే జఖ్మ్ ఖతే హై (1977), దిల్ (1990) నుంచి హమ్ ప్యార్ కర్నే వాలే (1990), తానేదార్ నుంచి తమ్మా తమ్మా (1990), త్రిదేవ్ నుంచి తిర్చీ టోపీవాలే (1989), అంగారే నుంచి ముజే జిందగీ నే మారా (1986) అలాగే బాజీగర్ (1993) నుంచి...పాటల్ని అద్భుతంగా కలగలిపారు.రణ్వీర్ సింగ్ తన అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మె న్స్ కి మెజారిటీ అవార్డులతో దూరంగా ఉండగా, ఆదిత్య ధర్ ఇప్పుడు కేవలం మూడు నెలల్లో రెండు అద్భుతమైన సినిమాలను అందించినందుకు పాన్–ఇండియా సంచలనంగా మారాడు. అదే విధంగా ప్రస్తుతం శాశ్వత్ అందించిన అద్భుతమైన సంగీతంతో చార్ట్స్లో టాప్లో నిలిచాడు. ఉత్సాహపరిచే డ్యాన్స్ నంబర్లు, స్టైలిష్ ఇంట్రో పాటలపై ఆధారపడే ఆధునిక సంగీత దర్శకుల్లా కాకుండా ఆయన సంగీతంలో తనదైన ప్రత్యేక శైలితో భిన్నంగా వెళ్లడం, తన సొంత నియమాల ప్రకారం పనిచేయడం ఆయన్ను బాలీవుడ్లో తదుపరి పెద్ద స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా మార్చింది. ఈ నేపధ్యంలో త్వరలోనే దక్షిణాది చిత్రసీమలో అడుగుపెట్టే అవకాశం కూడా ఆయనకు రానున్నట్టు సమాచారం. -
పెళ్లి చేసుకున్న బిగ్బాస్ ఫేమ్ ట్రాన్స్జెండర్ తమన్నా
తెలుగు బిగ్బాస్ 3వ సీజన్లో పాల్గొన్న ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి పెళ్లి చేసుకుంది. ఏడాది క్రితమే ఇది జరిగినప్పటికీ.. తొలి వార్షికోత్సవం సందర్భంగా ఇప్పుడు భర్త ఫొటోని బయటపెట్టింది. సొంతూరికి వెళ్లినట్లు, భర్తతో సెలబ్రేట్ చేసుకున్నట్లు ఇన్ స్టాలో పోస్టులు పెట్టింది. ఈ క్రమంలోనే బిగ్బాస్ ఫ్రెండ్స్తో పాటు పలువురు నెటిజన్లు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన పొలిటికల్ సెటైరికల్ సినిమా)విజయవాడకు చెందిన తమన్నా సింహాద్రి.. బిగ్బాస్ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇందులో రెండు వారాలు మాత్రమే ఉన్నప్పటికీ.. తోటి కంటెస్టెంట్ అయిన యాంకర్ శ్రీముఖికి ఫ్రెండ్ అయిపోయింది. షో అయిపోయినా సరే దాదాపు ఆరేళ్లుగా ఇప్పటికీ వీరిద్దరి మధ్య ఆ స్నేహం కొనసాగుతూనే ఉంది. శ్రీముఖి ఫ్రెండ్స్ గ్యాంగ్లో తమన్నా కూడా ఒకరు.గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు శ్రీముఖితో స్నేహం గురించి చెప్పిన తమన్నా.. నా నిజాయితికి శ్రీముఖి ఫిదా అయిందని, నా జీవితంలో శ్రీముఖి లాంటి స్నేహితురాలని చూడలేదని, ఆమెలో నా కూతురిని చూసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. నా బంధువులు, రక్త సంబంధీకులు నన్ను దూరం పెడితే.. శ్రీముఖి మాత్రం నన్ను తన కుటుంబ సభ్యురాలిలా చూసుకుందని చెప్పింది. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తమన్నా.. భర్త ఎవరు? అతడి పేరు ఏంటి? తదితర విషయాలు మాత్రం బయటపెట్టలేదు.పుట్టడమే అబ్బాయిగా పుట్టిన తమన్నా అసలు పేరు మస్తాన్. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన గతం గురించి చెప్పిన ఈమె.. గుంటూరులో మస్తాన్ బాబా దర్గా ఉంది. నాన్నకు అబ్బాయి కావాలని, అమ్మకు అమ్మాయి పుట్టాలని ఉండేది. ఇద్దరూ దర్గా వద్ద మొక్కుకున్నారు. దేవుడు కన్ఫ్యూజ్ అయ్యాడో ఏమో నేను పుట్టాను. నాకు తెలిసి నేను మా అమ్మ కోరిక తీర్చాను.ముంబై వెళ్లి లింగ మార్పిడి చేయించుకున్నాను. హీరోయిన్ తమన్నా ఇండస్ట్రీకి రాక ముందే నేను ఆ పేరు పెట్టుకున్నాను. ఆమెని చూసి పెట్టుకున్నా పేరు కాదు, ఆపరేషన్ తర్వాత నా పేరు మస్తాన్ నుంచి తమన్నాగా మార్చుకుని ఇంటి పేరు సింహాద్రిని కలుపుకున్నానని చెప్పుకొచ్చింది.ఈమె పెదనాన్న సింహాద్రి సత్యనారాయణ గతంలో టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖమంత్రిగా పనిచేశారు. తమన్నాకి కూడా రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. దీంతో 2019లో లోకేశ్పై మంగళగిరిలో పోటీ చేసింది. 2024లో పిఠాపురంలో పవన్ కల్యాణ్పై పోటీగా నిలబడింది. కానీ కనీస ఓట్లు కూడా ఈమెకు పడలేదు.(ఇదీ చదవండి: ధురంధర్ 2 కథ నాది.. కాపీ కొట్టారు: కన్నడ దర్శకుడు) View this post on Instagram A post shared by Tamanna Simhadri official (@tamannasimhadri) -
ధురంధర్ 2 కథ నాది.. కాపీ కొట్టారు: కన్నడ దర్శకుడు
పాన్ ఇండియా స్థాయిలో మార్మోగిపోతున్న పేరు ధురంధర్ 2. ఆదిత్య ధర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ధురంధర్ లైఫ్టైమ్ కలెక్షన్స్ను రెండో భాగం ఈపాటికే దాటేసింది. ఒకటీరెండు రోజుల్లో రూ.1500 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ధురంధర్ 2 కథ తనదంటూ మీడియా ముందుకు వచ్చాడు కన్నడ దర్శకుడు సంతోష్ కుమార్ ఆర్ఎస్.కష్టపడి కథ రాసుకున్నా..ఆయన మాట్లాడుతూ.. ధురంధర్ 2 మీరంతా చూసే ఉంటారు. ఈ సినిమాకు అంతటా మంచి స్పందన లభిస్తోంది. అయితే ఆ కథ నాది. సినిమా చూసిన తర్వాత నా కథ కాపీ కొట్టారన్న విషయం అర్థమైంది. 2023లోనే ఎంతో కష్టపడి ఈ కథ రాసుకున్నాను. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాను. పెద్ద నటీనటులు ఈ మూవీలో భాగం కావాలంటే బడా సంస్థ అండగా ఉండాలన్నారు. 2023లోనే రిజిస్టర్ చేయించా..అందుకే జీ స్టూడియోస్, టీ సిరీస్, ధర్మ ప్రొడక్షన్స్, సోనీ పిక్చర్స్.. ఇలా అనేక పెద్ద నిర్మాణ సంస్థలను సంప్రదించాను. చాలామందికి నా కథ పంపాను. ఆదిత్య రాయ్ కపూర్ని హీరోగా పెట్టి మూవీ తీయాలనుకున్నాను. 2023 నవంబర్లోనే ఈ కథ రిజిస్టర్ కూడా చేయించాను. అందుకు సంబంధించిన సాక్ష్యాలు నా దగ్గరున్నాయి. వీటి ఆధారంగా ధురంధర్ 2 మూవీ యూనిట్పై కేసు వేయాలనుకుంటున్నాను.అదే బాధగా ఉందివాళ్లు నా కథను చెడగొట్టారు. నేను వినోదం కోసం కథ రాస్తే దాన్ని రాజకీయ దుర్వినియోగం చేశారు. అదే నాకు మరింత బాధ కలిగిస్తోంది. నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదు అని ఆవేదన వ్యక్తం చేశాడు. సంతోష్ కుమార్.. క్యాంపస్ క్రాంతి అనే కన్నడ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం యువన్ రాబిన్హుడ్ మూవీ చేస్తున్నాడు.చదవండి: నీ ముఖానికి గోల్డ్ చైన్ వేసుకునేంత సీన్ ఉందా? నటి ఆవేదన -
HPV వ్యాక్సిన్ డ్రైవ్కి మద్ధతుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్
హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA).. హెచ్ పీవీ(HPV Vaccine) వ్యాక్సిన్ డ్రైవ్కు మద్ధతుగా నిలిచేందుకు ముందుకొచ్చింది. ఈ అసోసియేషన్.. ఏడాది మొత్తం హెచ్ పీవీ వ్యాక్సిన్పై అవగాహన కార్యక్రమాలు చేయనుంది. ఏడాదికో మంచి పని చేయాలని అల్లు అర్జున్ చెప్పిన మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని, ఇతడి అభిమాన సంఘం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మన ఆడ బిడ్డలు.. గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్-అట్లీ.. ప్లాన్ క్యాన్సిల్!)9 నుంచి 26 ఏళ్ల వయసున్న బాలికలు, మహిళలు ఈ వ్యాక్సిన్ని ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ఉచితంగా తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం.. స్వస్తి నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా బాలికలకు, మహిళలకు ఉచితంగా హెచ్పీవీ వ్యాక్సిన్ అందిస్తోంది. ఈనెల 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి మంచి సామాజిక కార్యక్రమంతో ఫ్యాన్స్ అసోసియేషన్ ముందుకురావడం మంచి విషయం అని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: 10 రోజుల్లో రూ.2800 కోట్ల కలెక్షన్స్.. ఏముంది సినిమాలో?) -
జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్.. ఎంత బొద్దుగా ఉందో చూశారా?
చిన్నప్పటి జ్ఞాపకాలు ఎవరి జీవితంలో అత్యంత విలువైనవే. అలా ఒకసారి మన చిన్ననాటి ఫోటోలు దొరికితే తెగ సంబరపడిపోతాం. ఎవరికైనా ఆ బాల్యంలోని ఫోటోలను చూసినప్పుడల్లా వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. తాజాగా తెలుగులో కొద్ది సినిమాలే చేసిన ముద్దుగుమ్మ తన చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గుండుతో ఉన్న క్యూట్ పిక్స్ చూసి తెగ సంబరపడిపోతూ పోస్ట్ చేసింది. తాను మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ నరసింహుడు మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సమీరా రెడ్డి.ముంబయికి చెందిన బాలీవుడ్ భామ సమీరా రెడ్డి తెలుగు సినిమాల్లోనూ అలరించింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన నరహింహుడు, అశోక్ చిత్రాలు.. చిరంజీవితో జై చిరంజీవ మూవీలో మెప్పించింది. ఆ తర్వాత 2014లో ఎంటర్ప్రెన్యూర్ అక్షయ్ వార్డేను పెళ్లి చేసుకుంది. సమీరాకు 2015లో కుమారుడు హన్స్, 2019లో కూతురు నైరా జన్మించారు. అయితే పెళ్లి తర్వాత సమీరా రెడ్డి సినీ ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ. అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లో ఉంటోంది. తాజాగా తన చైల్డ్హుడ్ పిక్స్ను ఇన్స్టాలో షేర్ చేసింది. కాగా.. సమీరా రెడ్డి 13 ఏళ్ల తర్వాత చిమ్ని అనే హర్రర్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) -
'నీ ముఖానికి గోల్డ్ చైన్ ఉందా'.. తట్టుకోలేకపోయా: నటి
రంగుల ప్రపంచంలో రాణించాలని ఎంతోమందికి ఉంటుంది. కానీ, కొందరే ఎన్నో కష్టాలను అధిగమించి, ముళ్లదారిపై నడిచి చివరకు అవకాశాలు సాధిస్తారు. నువ్వు యాక్టరేంటి? నీకంత సీన్ లేదు? అని హేళన చేసేవారికి సీరియల్, సినిమా ఛాన్సులతోనే తగిన బుద్ధి చెప్తారు. అలా తాను కూడా కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు పడ్డానంటోంది కన్నడ నటి, బిగ్బాస్ బ్యూటీ రాశిక శెట్టి.సూటిపోటి మాటలురాశిక మాట్లాడుతూ.. నా జర్నీ ప్రారంభంలో ఆడిషన్స్ చాలా కష్టంగా ఉండేవి. ప్రోత్సహించడం పక్కనపెట్టి సూటిపోటి మాటలతో విమర్శలు ఎక్కుపెట్టేవారు. చాలామాటలనేవారు. అవకాశాలిచ్చేవారు కాదు. ఒకసారైతే.. నీ ముఖానికి నిజమైన బంగారు గొలుసు వేసుకునేంత సీన్ ఉందా? అని ముఖం మీదే అన్నారు. చాలా బాధపడ్డాను, ఆత్మస్థైర్యాన్ని కోల్పోయాను.ఆ నమ్మకంతోనే..నావల్ల అవుతుందా? అని నాలో నేనే మథనపడ్డాను. అవకాశాలు రాకపోయేవి, వచ్చిన ఒకటీరెండు కూడా చివరి నిమిషంలో చేజారేవి. అప్పుడు మరింత కుంగిపోయాను. అయినా సరే వెనకడుగు వేయాలనుకోలేదు. నాకంటూ ఓ రోజు వస్తుందని ఎదురు చూశాను. ఆ నమ్మకం, ఆశతోనే ఇండస్ట్రీలో అడుగులు వేశాను అని చెప్పుకొచ్చింది. రాశిక శెట్టి.. కన్నడ బిగ్బాస్ 12వ సీజన్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. కన్నడలో రెండు సినిమాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులో సందేహం చిత్రంలో యాక్ట్ చేసింది.చదవండి: రామాయణ సినిమా రిజెక్ట్ చేశా: రణ్బీర్ కపూర్ -
బంధువుల పెళ్లిలో విరోష్ జోడీ.. భర్త ఒడిలో కూర్చున్న రష్మిక
విరోష్ జంట ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు. విజయ్- రష్మికతో పాటు ఆనంద్ దేవరకొండ కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. తమ బంధువుల పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఆనంద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోల్లో విజయ్ తల్లి కూడా ఉన్నారు. ఇక రష్మిక.. విజయ్ ఒడిలో కూర్చుంది. వీరిద్దరి పెళ్లి తర్వాత తొలిసారి జంటగా వివాహ వేడుకలో కనిపించారు. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా.. విజయ్- రష్మిక పెళ్లి వేడుక చాలా గ్రాండ్గా జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఈ జంట పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరిద్దరు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇటీవలే పెళ్లై నెల రోజులు గడిచిపోయాయంటే నమ్మలేకపోతున్నానంటూ రష్మిక తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇక సినిమాల విషయానికొస్తే ఈ టాలీవుడ్ కపుల్ రణబలి చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. View this post on Instagram A post shared by Anand Deverakonda (@ananddeverakonda) -
దుల్కర్తో విభేదాలు? అందుకే దూరం పెట్టారా? హీరో ఆన్సరిదే!
గతేడాది విడుదలైన మలయాళ మూవీ 'లోక' (తెలుగులో కొత్త లోక చాప్టర్:1 పేరిట రిలీజైంది) బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసింది. కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మలయాళ హీరోలు దుల్కర్ సల్మాన్, టొవినో థామస్ అతిథి పాత్రల్లో మెరిశారు. దీనికి త్వరలోనే సీక్వెల్ కూడా రాబోతోంది.దుల్కర్తో విభేదాలు?అయితే ఫస్ట్ పార్ట్ ప్రమోషన్స్లో టొవినో థామస్ గురించి ఎవరూ పెద్దగా మాట్లాడలేదు. దాంతో అతడికి, దుల్కర్కు మధ్య ఏమైనా విభేదాలు తలెత్తాయా? అని ప్రేక్షకుల్లో సందేహం తలెత్తింది. తాజాగా ఈ అనుమానాన్ని టొవినో నివృత్తి చేశాడు. టొవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం పళ్లిచట్టంబి. ఈ చిత్రం ఏప్రిల్ 10న తెలుగు, మలయాళ, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఫోన్ చేయమంటారా?సినిమా ప్రమోషన్స్లో భాగంగా చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అతడికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. లోక ఈవెంట్స్లో ఎవరూ మీ గురించి మాట్లాడలేదు. మీకు, దుల్కర్కు మధ్య ఏదైనా సమస్య ఉందా? అని ఓ విలేకరి ప్రశ్నించాడు. అందుకు టొవినో థామస్ స్పందిస్తూ.. నేనిప్పుడు అతడికి ఫోన్ చేసి అడగనా? (నవ్వుతూ) మామధ్య అలాంటి గొడవలేం లేవు. మేము ఒకరికొకరం చాలాకాలంగా తెలుసు. నేను అతడి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాను. అప్పుడు అడగండి!తర్వాత తన సినిమాలో విలన్గా నటించాను. అప్పటి నుంచి ఇప్పటివరకు మేమిద్దరం చాలా బాగున్నాం. కావాలంటే నేను మీకు మా వాట్సాప్ చాట్స్ కూడా చూపిస్తాను. మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడీ వీడియో క్లిప్పింగ్ తనకు చూపించి ఇద్దరం నవ్వుకుంటాం. ఈ రూమర్స్ సృష్టించడం చాలా ఈజీ. లోక 2 వచ్చినప్పుడు మేమందరం కలిసొస్తాం. అప్పుడు ఈ ప్రశ్న అడగండి, నా గురించి వాళ్లే మాట్లాడతారు అని టొవినో థామస్ చెప్పుకొచ్చాడు.చదవండి: రామాయణ సినిమా ఫస్ట్ రిజెక్ట్ చేశా: రణ్బీర్ కపూర్ -
ఉప్పెన బ్యూటీ ఎల్ఐకే.. తెలుగు టీజర్ రిలీజ్
ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి, ప్రదీప్ రంగనాథన్ జంటగా వస్తోన్న లేటేస్ట్ మూవీ ఎల్ఐకే((లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ). ఈ సినిమాకు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. గతేడాదిలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఈ మూవీని సెవెన్ స్క్రీన్స్ స్టూడియో, రౌడీ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మించారు. తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి చేతుల మీదుగా విడుదల చేశారు.ఈ టీజర్ చూస్తుంటే ప్రేమకథగానే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'ప్రపంచం ఎక్కడికో వెళ్లిపోయింది.. మనం ఇప్పుడు 2040లో ఉన్నాం.. కానీ ఒకడు లేని విషయాన్ని ఉందనే అంటున్నాడు' అనే డైలాగ్ మరింత ఆసక్తిని పెంచుతోంది. రాబోయే రోజుల్లో ప్రేమ, ప్రపోజల్స్ ఎలా ఉంటాయనే కాన్పెప్ట్తో రూపొందించినట్లు టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో ఎస్జే సూర్య, యోగి బాబు, సీమాన్, గౌరీ కిషన్, షా రహ్, మాళవిక ముఖ్యపాత్రలు పోషించారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు.Best wishes to @pradeeponelife #VigneshShivan @anirudhofficial and the entire team for the Telugu release ♥️#LIK teaser out now:https://t.co/iluBWidtN1#LIKFromApril10 #LoveInsuranceKompanyAn @anirudhofficial musical 🎵 A #Wikki original @7screenstudio @IamKrithiShetty… pic.twitter.com/4I0OkfgFof— Rana Daggubati (@RanaDaggubati) April 1, 2026 -
సమంత మెచ్చిన ఇన్స్టా రీల్.. ఆమె టాలెంట్కు ఫిదా..!
ఇప్పుడంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది. మనం ఏదైనా ప్రత్యేకంగా చేస్తే చాలు.. అది క్షణాల్లోనే వైరలైపోతుంది. ఇప్పుడున్న జమానాలో ఇన్స్టా రీల్స్లో మునిగిపోతున్నారు జనాలు. కొంచెం గ్యాప్ దొరికితే ఇన్స్టా ఓపెన్ చేసిన రీల్స్ తెగ చూసేస్తున్నారు. కేవలం చూడడమే కాదు.. తమ క్రియేటివిటీని అంతా బయటికి తీస్తున్నారు. ఇప్పుడు ఇన్స్టా ప్రపంచం పచ్చని పల్లె ప్రజల టాలెంట్ను కూడా అందరికీ పరిచయం చేస్తోంది.తాజాగా ఓ మహిళ టైలర్ చేసిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. అచ్చం హీరోయిన్ సమంతతో మాట్లాడుతున్నట్లుగా చేసిన ఈ రీల్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల సమంత-యాంకర్ సుమ ఉగాది సందర్భంగా చేసిన వీడియోను సింక్ చేస్తూ ఆ మహిళ టైలర్ చేసిన ప్రమోషన్ నెట్టింట వైరల్గా మారింది. ఆమె హీరోయిన్తో నేరుగా మాట్లాడుతున్నట్లుగా అద్భుతంగా ఎడిట్ చేసి ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఆ మహిళ క్రియేటివిటీని మెచ్చుకుంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఆమె ప్రతిభను మెచ్చుకుంటూ సమంత సైతం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. అదేంటో మీరు కూడా చూసేయండి. సమంతను మెప్పించిన రీల్సోషల్ మీడియాలో నెటిజన్ల క్రియేటివిటీకి అద్దం పట్టేలా ఓ మహిళా టైలర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గతంలో యాంకర్ సుమతో సమంత మాట్లాడిన వీడియో కాల్ క్లిప్ను వాడుకుని, హీరోయిన్ నేరుగా తనతోనే మాట్లాడుతున్నట్లుగా ఆమె అద్భుతంగా ఎడిట్ చేశారు. ఈ వీడియో చూసి… pic.twitter.com/xMtp5jsGXs— ChotaNews App (@ChotaNewsApp) April 1, 2026 -
రామాయణలో శ్రీరాముడి పాత్ర చేయనన్నా..: రణ్బీర్ కపూర్
దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ కోసం దాదాపు రూ.4 వేల కోట్లు కేటాయించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ రాముడిగా, సౌత్ సెన్సేషన్ హీరోయిన్ సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. రాఖీభాయ్ యష్ రావణుడిగా కనిపించనున్నాడు.రిజెక్ట్ చేశా..అయితే ఈ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు ఎగిరి గంతేయడానికి బదులుగా రిజెక్ట్ చేసేందుకే మొగ్గు చూపానంటున్నాడు రణ్బీర్ కపూర్. న్యూయార్క్లో రామాయణ దర్శకుడు నితీశ్ తివారి, నిర్మాత నమిత్ మల్హోత్రాతో కలిసి ఓ ఈవెంట్కు హాజరయ్యాడు రణ్బీర్. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితమే నితేశ్ తివారి నాకు రామాయణ సినిమా గురించి చెప్పాడు. ప్రధాన పాత్రలో నటించమని కోరగా నేను క్షణం ఆలోచించకుండా నో చెప్పాను.కీలకమైన మలుపునేను ఆ పాత్రకు సెట్ అవనేమో, బాగోనేమో అని నాపై నాకే అనుమానం వేసింది. రాముడి పాత్రకు నేను పూర్తి న్యాయం చేయలేనని తిరస్కరించాను. కానీ, ఆ భయం చాలా త్వరగానే కనుమరుగవగా అంత మంచి ఛాన్స్ వచ్చినందుకు సంతోషించాను. ఎందుకంటే ఇటువంటి అవకాశాలు నా జీవితానికి చాలా అవసరమయ్యాయి. ఆ సమయంలో నేను తండ్రినయ్యాను. నా పద్ధతుల్ని, జీవితాన్ని మార్చుకోవాల్సిన దశలో ఉన్నాను. శ్రీరాముడి పాత్ర పోషించడం, తొలిసారి తండ్రి కావడం యాదృచ్ఛికమే అయినప్పటికీ నా జీవితాన్ని కీలక మలుపు తిప్పిన అందమైన అనుభూతి అని చెప్పుకొచ్చాడు.సినిమాకాగా రణ్బీర్ కపూర్, ఆలియా భట్ కొంతకాలం పాటు ప్రేమలో మునిగి తేలారు. 2022లో పెళ్లి చేసుకున్నారు. వీరికి అదే ఏడాది నవంబర్లో కూతురు రాహా జన్మించింది. రామాయణ విషయానికి వస్తే.. ఏర్ రెహ్మాన్, హన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు. మొదటి భాగం ఈ ఏడాది అక్టోబర్లో దీపావళికి విడుదలవుతుండగా రెండో భాగం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 2న రామాయణ సినిమా గ్లింప్స్ విడుదల కానుంది.చదవండి: గుడిలో గిన్నెలు కడిగిన ప్రియాంక చోప్రా -
పూనమ్ పాండే ప్రెగ్నెంట్? నిజమా.. లేక?
పబ్లిసిటీ స్టంట్స్ చేయడంలో నటి పూనమ్ పాండేను మించినవారు లేరు. 2019లో టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే మైదానంలో దుస్తుల్లేకుండా తిరుగుతానని ప్రకటించింది. తీరా భారత్ కప్పు గెలవగా.. ఆమె అన్నంత పని చేయకుండా బీసీసీఐ పూనమ్ను అడ్డుకుంది. రెండేళ్ల క్రితం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో మరణించినట్లు తనపై తనే రూమర్ సృష్టించింది. అది నిజమేనని నమ్మిన జనం తీవ్ర విచారం వ్యక్తం చేయడంతో క్షమించండి, కేవలం అవగాహన కోసమే ఇలా చనిపోయినట్లు నాటకమాడానంది. మరో డ్రామా?ఇప్పుడు మరో స్టంట్ చేసినట్లు కనిపిస్తోంది. అదేంటంటే.. తను గర్భవతిని అని ప్రకటించింది. బేబీ బంప్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు.. అదేంటి, భర్తతో విడిపోయిన పూనమ్ ప్రెగ్నెంట్ ఎలా అయింది? అని డౌట్ పడుతున్నారు. అంతలోనే అది ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయంతో సృష్టించిన ఫోటోలని తేల్చేశారు. ఎక్స్లో షేర్ చేసిన పోస్ట్ కింద ఇది ఏఐతో చేసిన ఫోటో అని స్పష్టంగా రాసుంది. అంటే అందర్నీ ఏప్రిల్ ఫూల్ చేసేందుకు ఇలా తాను ప్రెగ్నెంట్ అని డ్రామా ఆడినట్లు తెలుస్తోంది.సినిమాకాగా పూనమ్ పాండే బాలీవుడ్లో నషా, జీఎస్టీ, ద జర్నీ ఆఫ్ కర్మ, టచ్ ద ఫైర్ వంటి సినిమాలు చేసింది. తెలుగులో మాలిని అండ్ కో చిత్రంలో కథానాయికగా నటించింది. వ్యక్తిగత విషయానికి వస్తే.. 2020 సెప్టెంబర్ 1న ప్రియుడు సామ్ అహ్మద్ బాంబేని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన పదిరోజులకే అతడు తనపై అత్యాచారం చేశాడని, వేధింపులకు పాల్పడుతున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది. అలా కొంతకాలానికే దంపతులిద్దరూ విడిపోయారు.🤰🍼👶👼 pic.twitter.com/6UUAAc9rKj— Poonam Pandey (@iPoonampandey) March 31, 2026 చదవండి: గుడిలో గిన్నెలు కడిగిన స్టార్ హీరోయిన్ -
యువ నటికి ప్రముఖ డైరెక్టర్ లైంగిక వేధింపులు..!
ప్రముఖ మలయాళ దర్శకుడు, నిర్మాత రంజిత్ బాలకృష్ణన్ అరెస్టు అయ్యారు. ఒక యువ నటి ఇచ్చిన ఫిర్యాదుతో కొచ్చి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇడుక్కిలో రంజిత్ బాలకృష్ణన్ను అదుపులోకి తీసుకుని.. అనంతరం కొచ్చి పోలీసులకు అప్పగించారు. ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆయనను అరెస్ట్ చేశారు.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఒక సినిమా సెట్లో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు యువ నటి ఫిర్యాదులో పేర్కొంది. సినిమా చిత్రీకరణ సమయంలో రంజిత్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని నటి తన ఫిర్యాదులో ఆరోపించింది. అయితే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లడానికి ముందే.. బాధితురాలు సినిమా నిర్మాణ సంస్థలోని అంతర్గత ఫిర్యాదుల కమిటీ(ICC)కి అధికారికంగా కంప్లైంట్ చేశారు. కమిటీ విచారణ అనంతరం ఈ కేసును కేరళ పోలీసులకు అప్పగించింది. అయితే నటి వివరాలు గోప్యంగా ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.గతంలోనూ రంజిత్పై ఆరోపణలు..కాగా.. గతంలో బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర చేసిన వేధింపుల ఆరోపణల నేపథ్యంలో.. 2024లో రంజిత్ కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత ఆయన తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తనపై కావాలనే కొందరు టార్గెట్గా ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. తాజాగా మరో నటి ఫిర్యాదుతో ఆయనను అరెస్ట్ చేయడంతో ఈ టాపిక్ మలయాళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. -
గుడిలో గిన్నెలు శుభ్రం చేసిన 'వారణాసి' హీరోయిన్.. వీడియో వైరల్
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్కు వెళ్లిపోయినా తన మూలాలను మాత్రం అస్సలు మర్చిపోలేదు. అందుకు నెట్టింట వైరల్గా మారిన వీడియోనే ప్రత్యక్ష ఉదాహరణ. మంగళవారం నాడు ఆమె అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ను సందర్శించింది. సాంప్రదాయ దుస్తుల్లో గుడికి వెళ్లిన ఆమె అక్కడున్నవారిని నవ్వుతూ పలకరించింది. ఆలయ సిబ్బంది సెల్ఫీ అడిగితే కాదనుకుండా ఓపికగా ఫోటోలు దిగింది. అనంతరం ఆలయసేవలో పాల్గొంది.వీడియో వైరల్గుడిలో వాడిన పాత్రలను కొందరు మహిళలు శుభ్రం చేస్తుంటే తను కూడా వారికి సాయం చేసింది. తలపై దుపట్టా కప్పుకుని గిన్నెలు కడిగింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు ప్రియాంక అమెరికాలో సెటిలైనప్పటికీ తనలో భారతీయత ఉట్టిపడుతోందని కామెంట్లు చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ అయినప్పటికినీ.. ఇలా సేవ చేయడాన్ని తను ఏమాత్రం చిన్నతనంగా భావించడం లేదు, నిజంగా గ్రేట్ అని పొగుడుతున్నారు.సినిమాఇకపోతే ప్రియాంక చోప్రా చివరగా 'ద బ్లఫ్' అనే హాలీవుడ్ మూవీ చేసింది. ప్రస్తుతం తెలుగు చిత్రం 'వారణాసి'లో యాక్ట్ చేస్తోంది. మహేశ్బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ మూవీకి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Uptodate ਪੰਜਾਬੀ (@uptodatepunjabi) View this post on Instagram A post shared by Amritsar Paparazzi 📸 (@amritsar.paparazzi)చదవండి: అప్పుడే చనిపోవాలనుకున్నా: కోన వెంకట్ -
సూరి సినిమాలో హీరోయిన్గా 'డ్యూడ్' బ్యూటీ!
సినిమా ఎవరిని ఎప్పుడు? ఏ స్థాయిలో నిలబెడుతుందో చెప్పలేం. అప్పటివరకు ప్రయత్నలోపం లేకుండా శ్రమిస్తూనే ఉండాలి. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సహాయనటుడి నుంచి హాస్యనటుడిగా ఎదిగి ఇప్పుడు సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్నాడు నటుడు సూరి. విడుదలై మూవీతో హీరోగా ట్రాక్ ఎక్కిన ఈయన ఇటీవల విడుదలైన మామన్ మూవీ వరకు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.కమెడియన్ నుంచి హీరోగా..ప్రస్తుతం ఇతడు మండాడి సినిమా చేస్తున్నాడు. సముద్రతీరంలో జాలర్ల పడవల పోటీ నేపథ్యంలో రూపొందుతున్న కథా చిత్రమిది. మదిమారన్ పుహళేంది కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ఈ మూవీ తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతోంది. ఇది నిర్మాణంలో ఉండగా మరో సినిమాకు కమిటయ్యాడు సూరి.రియల్ స్టోరీ ఆధారంగా మూవీరవికుమార్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్ నిర్మించనుంది. 2015లో చెన్నైలో బీభత్సం సృష్టించిన వరదల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని సమాచారం. ఈ మూవీ త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుంది. ఇందులో సూరికి జంటగా మమిత బైజు హీరోయిన్గా నటించనున్నట్లు వినికిడి. ప్రేమలు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ డ్యూడ్ సినిమాతో మరో హిట్ అందుకుంది. హీరోయిన్ ఎవరంటే?విజయ్ హీరోగా నటించిన జననాయకన్లోనూ కీలక పాత్ర పోషించింది. సూర్యకు జంటగా విశ్వనాథ్ అండ్ సన్స్, ధనుష్తో కర సినిమాలు చేసింది. ఇవన్నీ త్వరలోనే రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం సూరితో మమిత బైజు జోడీ కట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే! -
దురంధర్-2 కలెక్షన్స్.. తెలుగులోనే ఎందుకిలా?
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈనెల 19న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పటికే దురంధర్ వసూళ్లను క్రాస్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా రూ.1400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ సీక్వెల్ హిందీతో పాటు దక్షిణాది భాషల్లో రిలీజ్ కావడంతో రెండు వేల కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాకిస్తాన్కు వెళ్లిన ఇండియన్ స్పై జీవితం ఆధారంగా తెరకెక్కించారు.ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల పరంగా దూసుకెళ్తోన్న దురంధర్-2.. తెలుగులో మాత్రం డీలా పడిపోతోంది. తెలుగు డబ్బింగ్ వర్షన్ కేవలం రూ.25 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించింది. అదే సమయంలో గతేడాది రిలీజైన కాంతార-2 తెలుగు వర్షన్లో ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. కానీ దురంధర్-2 విషయానికొస్తే తెలుగు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ అంతగా రావట్లేదని తెలుస్తోంది.తెలుగులో కలెక్షన్స్ డీలా..తెలుగులో కలెక్షన్స్ తగ్గడానికి కారణాలున్నాయి. ఇక్కడ తక్కువ స్క్రీన్స్ కేటాయించడం.. అంతేకాకుండా తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయకపోవడం ప్రధానంగా వసూళ్లపై ప్రభావంపై కనిపిస్తోంది. వీటితో పాటు లాంగ్ రన్టైమ్ 4 గంటల నిడివి వల్ల కొంతమంది ఆడియన్స్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ వయొలెన్స్ ఎక్కువగా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ దురంధర్-2ను థియేటర్లో చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపట్లేదు. ఈ కారణాల వల్లే తెలుగులో తక్కువ కలెక్షన్స్ వస్తున్నట్లు అర్థమవుతోంది. కాగా.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. -
'ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్'
శర్వానంద్ హీరోగా వస్తోన్న పాన్ ఇండియా మూవీ బైకర్. ఇండియాలోనే తొలి మోటోక్రాస్ చిత్రంగా బైకర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ శుక్రవారమే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్లలో దూసుకెళ్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.ఈ మూవీ ప్రమోషన్స్తో ఫుల్ బిజీ అయిపోయారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో రెబల్ స్టార్ ప్రభాస్ సైతం సందడి చేశారు. బైకర్ మూవీకి తన బైక్పై స్టైలిష్గా కనిపించారు. ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అంటూ డైలాగ్ చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇది చూసిన శర్వానంద్ ఫుల్ ఖుషీ అయిపోయారు. థ్యాంక్ యూ ప్రభాస్ అన్న.. లవ్ యూ.. నువ్వు ఎప్పుడు నాకు అండగా ఉంటావ్.. మన బంధం ఎప్పటికీ ఇలానే పదిలంగా ఉండాలని కోరుకుంటున్నాని పోస్ట్ చేశారు. అవును... ట్రైలర్ చూసి కొన్ని నమ్మాల్సిందే అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ మూవీ ఏప్రిల్ 3న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. Thank you, Prabhas Anna. Love you 🫂You’ve always been there for me. Our bond is something I’ll always cherish.Yes… trailer chusi konni nammeyali 😉Experience 𝐈𝐍𝐃𝐈𝐀’𝐒 𝐅𝐈𝐑𝐒𝐓 𝐌𝐎𝐓𝐎𝐂𝐑𝐎𝐒𝐒 𝐅𝐈𝐋𝐌 in Dolby Cinema, EPIQ, 4DX and PCX.#Biker Grand release on… pic.twitter.com/R4efg8BUi7— Sharwanand (@ImSharwanand) March 31, 2026 -
అప్పుడే చనిపోయేవాడిని.. తన వల్లే ఇప్పటికీ బతికున్నా..: నిర్మాత కోన వెంకట్
టాలీవుడ్ నిర్మాత కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్ చేశారు. చెన్నైల్లో ఉన్నప్పుడు సూసైడ్ చేసుకుందామని బీచ్కు వెళ్లానని తెలిపారు. కానీ అక్కడ ఓ అమ్మాయి తన జీవితాన్ని కాపాడిందని అన్నారు. రెండు కాళ్లు, చేతులు లేని అమ్మాయిని చూసి నా నిర్ణయం మార్చుకున్నాని వెల్లడించారు. రేపు అనేది తెలియని ఆ అమ్మాయి.. వాళ్ల తమ్ముడు బండి తోస్తుంటే బెలూన్స్ అమ్ముతూ బతికినప్పుడు.. నేను ఎందుకు బతకలేనని అనుకున్నానని కోన వెంకట్ తెలిపారు. నా కోసం ఆ దేవుడే ఆ అమ్మాయిని పంపించాడని అనుకుంటానని ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.ఈ సంఘటన 1997లో జరిగిందని కోన వెంకట్ చెప్పారు. ఒక 50 నిద్రమాత్రలు తీసుకుని.. నా దగ్గర ఉన్న చివరి డబ్బులతో వాటర్ బాటిల్ తీసుకున్నానని తెలిపారు. ఆ అమ్మాయి నాకు కనిపించి ఉండకపోతే ఈ రోజు కోన వెంకట్ అనేవాడు లేడన్నారు. ఆ తర్వాత నేను చాలా సినిమాలకు కథలు రాశానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత చాలాసార్లు అమ్మాయి కనిపిస్తుందేమోనని బీచ్లో వెతుక్కుంటూ వెళ్లానని అన్నారు. కానీ ఎక్కడా కూడా మళ్లీ ఆ అమ్మాయి కనిపించలేదన్నారు. బ్యాండ్మేళం థ్యాంక్ యూ మీట్కు హాజరైన కోన వెంకట్ తన చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు. కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం బ్యాండు మేళం. ఈ మూవీకి సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై కావ్య, శ్రావ్య నిర్మించారు. ఈ సినిమాను మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. -
దసరాకి వృషకర్మ?
హీరో నాగచైతన్య జైపూర్ వెళ్లారట. నాగచైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వృషకర్మ’. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు స్పర్‡్ష శ్రీవాస్తవ విలన్ రోల్ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ రాజస్తాన్లో ప్రారంభం కానుందని తెలిసింది. ఈ షెడ్యూల్ కోసం నాగచైతన్య అండ్ టీమ్ హైదరాబాద్ నుంచి జైపూర్కు ప్రయాణం అయ్యారని సమాచారం.రాజస్తాన్లో జరిగే ఈ షెడ్యూల్తో ఈ సినిమా చిత్రీకరణ ఓ కొలిక్కి వస్తుందట. మే కల్లా మొత్తం షూటింగ్ పూర్తి చేసి, త్వరితగతిన పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ కూడా పూర్తి చేసి, ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ .బి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: అజనీష్ బి. లోక్నాథ్. -
సినిమాల కంటే పుస్తకాలకే ప్రాధాన్యం: ఆమిర్ ఖాన్
సాధారణంగా నటీనటులు, దర్శక–నిర్మాతలు, సాంకేతిక నిపుణులు... ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవారు ఎవరైనా సినిమాలకే మా తొలి ప్రాధాన్యం అంటుంటారు. అయితే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మాత్రం ‘నేను సినిమాల కంటే పుస్తకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను’ అంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన గురించి ఎవరికీ పెద్దగా తెలియని ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించి, అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు. ‘‘నేను చాలా సంప్రదాయ కుటుంబంలో పెరిగాను. మా అమ్మానాన్న ఎంతో క్రమశిక్షణతో పెంచారు.సినిమాలు చూసే విషయంలో కఠినంగా ఉండేవారు. కేవలం దూరదర్శన్ లో వచ్చే పాత బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు మాత్రమే చూశాను. ఎప్పుడైనా వారాంతంలో సినిమా చూడాలనుకుంటే మా అమ్మను అనుమతి అడిగేవాడిని. తను సరే అంటే ఓకే... లేదంటే లేదు. అయితే రొమాంటిక్ లేదా కమర్షియల్ సినిమాలు చూడటానికి అనుమతించేవారు కాదు. దీంతో పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేసేవాడిని. ఈ కారణంగా చిన్నతనం నుంచే పుస్తకాలతో విడదీయలేని అనుబంధం ఏర్పడింది. అయితే 18 ఏళ్లకే నేను అసిస్టెంట్గా ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించాను. ఆ తర్వాత హీరోగా మారాను. కానీ నేను ఇప్పటికీ పెద్దగా సినిమాలు చూడను. కొందరికి ఫుట్బాల్ ఆడటం ఇష్టం.. మరికొందరికి చూడటం ఇష్టం. నేను ఆడే రకం. సినిమాలు చేస్తాను కానీ చూడను’’ అని చెప్పా రు ఆమిర్ ఖాన్. ఇదిలా ఉంటే ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్న ‘ఏక్ దిన్’ మే 1న, ‘లాహోర్ 1947’ ఆగస్టు 13న విడుదల కానున్నాయి. -
డబుల్ ట్రీట్
అభిమాన హీరోలు స్క్రీన్పై ఒక గెటప్లో కనిపిస్తేనే వారి ఫ్యాన్స్ కేరింతలతో థియేటర్స్ మారు మోగిపోతాయి. అలాంటిది ఒకే టికెట్పై ఒక బొమ్మలో తమ అభిమాన హీరోను రెండు గెటప్స్, రెండు క్యారెక్టరైజేషన్స్తో చూసినప్పుడు అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు. ఇలా ప్రేక్షకులను అలరించేందుకు కొందరు తెలుగు హీరోలు ద్విపాత్రాభినయంతో కూడిన సినిమాలు చేస్తున్నారు. వెండితెరపై డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న హీరోలపై ఓ లుక్ వేయండి.. మరోసారి డబుల్ ధమాకా ‘విక్రమార్కుడు, దరువు, పవర్’ వంటి చిత్రాల్లో రవితేజ ద్విపాత్రాభినయం చేసి ఆడియన్స్ని మెప్పించారు. కొంత గ్యాప్ తర్వాత రవితేజ మళ్లీ ‘ఇరుముడి’ సినిమాలో డబుల్ రోల్లో కనిపించనున్నట్లుగా తెలిసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ఈ థ్రిల్లర్ సినిమాలో ఒక పాత్రలో తండ్రిగా, మరో పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న వ్యక్తిగా రవితేజ కనిపిస్తారట. ఈ సినిమాలో రవితేజ భార్యగా ప్రియ భవానీశంకర్, కుమార్తెగా బేబీ నక్షత్ర నటిస్తున్నారు. అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్స్లో రిలీజ్ కానుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.రుద్ర... రాముడు మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ టైమ్ ట్రావెల్ అండ్ మైథలాజికల్ అడ్వెంచరస్ యాక్షన్ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రుద్ర పాత్రలో మహేశ్బాబు నటిస్తున్నారు. అలాగే రాముడి పాత్రలోనూ కనిపించనున్నారు. ‘వారణాసి’ సినిమాలో రుద్ర, రాముడిగా... ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా ఇటీవల మహేశ్బాబు ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ప్రధాన తారాగణం పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే... సమ్మర్ సమయం కనుక వేసవి తాకిడికి కాస్త దూరంగా ఉండాలని మహేశ్బాబు అండ్ టీమ్ భావిస్తున్నారట.ఇందులో భాగంలో ఈ వేసవి సమయంలో మహేశ్బాబు ఓ వెకేషన్ను ప్లాన్ చేసుకున్నారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో తెరపైకి వచ్చింది. మేలో మళ్లీ షూటింగ్ను స్టార్ట్ చేస్తారు. జూన్లో ‘వారణాసి’ సినిమా యూనిట్ అంటార్కిటికా లొకేషన్స్లో చిత్రీకరకణను ప్లాన్ చేసినట్లుగా తెలిసింది. ఈ ప్రదేశంలో చిత్రీకరణ జరుపుకోబోయే తొలి తెలుగు చిత్రంగా ‘వారణాసి’ చరిత్రలో నిలిచిపోనుంది. ఈ షెడ్యూల్లో మహేశ్బాబు, ప్రియాంకా చోప్రాతో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటారని తెలిసింది. ఓ పాట చిత్రీ కరణ కూడా ఉంటుందట. అలాగే రాముడి పాత్రలో మహేశ్బాబు కనిపించే సీక్వెన్స్ దాదాపు అరగంట పాటు ఉంటుందని తెలిసింది.ఇంకా ‘వారణాసి’ సినిమాను తొలుత రెండు భాగాలుగా రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ ఆ తర్వాత ఒక భాగంగానే రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినట్లుగా రాజమౌళి ఇటీవల ఓ సందర్భంగా చెప్పా రు. కానీ ఇటీవల వచ్చిన హిందీ చిత్రం ‘ధురంధర్’ రెండు భాగాలుగా విడుదలై, బంపర్ బ్లాక్బస్టర్హిట్గా నిలిచింది. ఈ నేపథ్యంలో రాజమౌళి కూడా ‘వారణాసి’ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేసే అవకాశం ఉందనే టాక్ తెరపైకి వచ్చింది. పైగా ‘బాహుబలి’ సినిమాను రెండు భాగాలుగా తీసిన అనుభవం రాజమౌళికి ఉంది. మరి... ‘వారణాసి’ సినిమా రెండు భాగాలుగా వస్తుందా? లేదా అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.ఈ చిత్రంలో రుద్ర పాత్రలో మహేశ్బాబు, మందాకిని పాత్రలో ప్రియాంకా చోప్రా, కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్, శివభక్తుడిగా ప్రకాశ్రాజ్ నటిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ‘వారణాసి’ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రంలో మహేశ్బాబు చైల్డ్ ఆర్టిస్టుగా ద్విపాత్రాభినయం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో సూపర్స్టార్ కృష్ణ హీరోగా నటించగా, విజయశాంతి హీరోయిన్గా నటించారు.డ్రాగన్లో డ్యూయల్ రోల్? ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న తాజా సినిమా ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ పీరియాడికల్ గ్యాంగ్స్టర్ డ్రామాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇందుకు కారణం లేకపోలేదు. ఈ సినిమా చిత్రీకరణ స్టార్టింగ్లో ఎన్టీఆర్ కాస్త బొద్దుగా కనిపించారు. కొంత షూటింగ్ పూర్తయిన తర్వాత లీన్ లుక్లోకి వచ్చేశారు. దీంతో ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఏమైనా ద్విపాత్రాభినయం చేస్తున్నారా? అనే టాక్ తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు.అనిల్ కపూర్, కాజోల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని భోగట్టా. నందమూరి కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. త్వరలోనే విడుదల తేదీపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దేవర’. ఈ చిత్రంలో తండ్రీకొడుకు దేవ, వర పాత్రల్లో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా తొలి భాగం 2024లో విడుదలైంది. మలి భాగం చిత్రీకరణ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నందమూరి కల్యాణ్రామ్, కొసరాజు హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ ‘దేవర’ సినిమాను నిర్మిస్తున్నారు.పెద్ది ఆట రామ్ చరణ్ టైటిల్ రోల్ చేస్తున్న తాజా సినిమా ‘పెద్ది’. ఈ రూరల్ బ్యాక్డ్రాప్ మల్టీస్పోర్ట్స్ పీరియాడికల్ యాక్షన్ సినిమాకు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రకారం రామ్ చరణ్ క్రికెటర్గా, కుస్తీ క్రీడాకారుడిగా కనిపించారు. ఇటీవల ‘పెద్ది పహిల్వాన్’ అంటూ ‘పెద్ది’ సినిమా నుంచి ఓ వీడియో విడుదలైంది. ఈ సినిమాలో క్రికెటర్గా ఉన్న రామ్చరణ్, కుస్తీ చాలెంజ్ను స్వీకరించినట్లుగా కనిపిస్తోంది.కానీ క్రికెటర్ నుంచి రామ్ చరణ్ కుస్తీ వైపు అడుగులు వేయడానికి బలమైన కారణం ఉందని, తన తండ్రి కోసమే రామ్ చరణ్ అలా మారతారని ఫిల్మ్నగర్ భోగట్టా. అయితే ఈ తండ్రి పాత్రలోనూ రామ్ చరణే కనిపిస్తారట. అలా తండ్రీకొడుకులుగా ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఇటీవల ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది.కాకపోతే... ఈ సినిమా రిలీజ్ డేట్లో మార్పు ఉండొచ్చని, ‘పెద్ది’ సినిమా ఈ వేసవిలో రిలీజ్ కావడం లేదని, జూన్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలిసింది. రెండు పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉండటం, పోస్ట్ ప్రోడక్షన్స్ వర్క్స్ విషయంలో టీమ్ హడావిడి చేయకుండా క్వాలిటీ కోసం టైమ్ కేటాయించాల్సి రావడం, ఇటీవల రామ్ చరణ్ కంటికి చిన్న గాయం కావడం వంటి అంశాలు ‘పెద్ది’ సినిమా రిలీజ్ వాయిదా పడటానికి కారణమై ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.బ్రదర్స్గా... కెరీర్లో ఇప్పటి వరకు 21 సినిమాలను పూర్తి చేశారు అల్లు అర్జున్. కానీ వెండితెరపై అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని తెలిసింది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ తొలిసారి బ్రదర్స్గా ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఆయన డిఫరెంట్ లుక్స్లో కనిపిస్తారని ఫిల్మ్నగర్ సమాచారం. ఇందుకు తగ్గట్లుగానే ఇటీవలి కాలంలో రెండు డిఫరెంట్ లుక్స్లో అల్లు అర్జున్ కనిపించారు.దీంతో అల్లు అర్జున్లోని ఈ డిఫరెంట్ మేకోవర్ అట్లీ సినిమా కోసమే అనే ప్రచారానికి బలం చేకూరి నట్లయింది. ఈ నెల ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో దీపికా పదుకోన్ నటిస్తున్నారు. అలాగే జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, భాగ్యశ్రీ భోర్సే... వంటి హీరోయిన్స్ కూడా భాగం కానున్నారని, త్వరలోనే ఈ అంశాలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలిసింది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.అయితే తన వంతు షూటింగ్ను మాత్రం అల్లు అర్జున్ త్వరితగతిన పూర్తి చేసి, లోకేశ్ కనగరాజ్తో చేయాల్సిన సినిమా షూటింగ్లో పాల్గొంటారు. అట్లీతో అల్లు అర్జున్ చేస్తున్న చిత్రానికి భారీ వీఎఫ్ఎక్స్ వర్క్స్ చేయాల్సి ఉంది. దీంతో పోస్ట్ ప్రోడక్షన్స్ కోసం ఈ మూవీ టీమ్ ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంది. అందుకే ఈ చిత్రాన్ని ఈ ఏడాది రిలీజ్ చేయడం సాధ్యపడదట.తొలిసారిగా..! ఈ మధ్య ‘ఎక్స్ట్రా, రాబిన్హుడ్’ వంటి మాస్ కమర్షియల్ సినిమాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్తో కూడిన ‘తమ్ముడు’ వంటి యాక్షన్ డ్రామా చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు నితిన్. తాజాగా ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ సైన్ చేశారని సమాచారం. ‘ఎక్కడికి పోతావు చిన్న వాడా, ఒక్క క్షణం, ఊరు పేరు భైరవకోన’ వంటి చిత్రాలను తెరకెక్కించిన వీఐ ఆనంద్ దర్శకత్వంలో హీరోగా నటించేందుకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనింగ్ మూవీలో నితిన్ ద్విపాత్రాభినయం చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. పవన్కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. 30 సినిమాలకుపైగా చేసిన నితిన్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయనున్న చిత్రం ఇది. కామ్రేడ్ కల్యాణ్ ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన విశాఖ జిల్లా మాడుగుల గ్రామం నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ‘కామ్రేడ్ కల్యాణ్’. 1992 నేపథ్యంలో సాగే ఈ సినిమాకు జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. గత ఏడాది దసరా సందర్భంగా ఈ సినిమా ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమోను బట్టి ఈ చిత్రంలో శ్రీ విష్ణు ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో కామ్రేడ్ కల్యాణ్గా, గ్రామంలోని ఓ చురుకైన వ్యక్తిగా శ్రీ విష్ణు నటిస్తున్నట్లు సమాచారం. వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.నాగబంధం విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నాగబంధం’. ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్స్లో విరాట్ కర్ణ కనిపించనున్నట్లుగా ఇటీవల ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ వచ్చింది. ఇందులో లార్డ్ శివగా, ఓ మాములు మోడ్రన్ అబ్బాయిగా విరాట్ కర్ణ కనిపిస్తున్నారు. సో... ‘నాగబంధం’లో విరాట్కర్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారని ఊహించవచ్చు మరి... ఈ సినిమాలో విరాట్ కర్ణ రోల్ ఎలా ఉండబోతుంది అనేది జూన్ 3న తెలిసిపోతుంది. ఎందుకంటే.. ఈ సినిమాను ఆ రోజే రిలీజ్ చేస్తున్నారు. ‘‘భారతదేశంలోని ప్రాచీన విష్ణు ఆలయాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది.శతాబ్దాలుగా రహస్యంగా కొనసాగుతున్న నాగబంధం అనే ఆధ్యాత్మిక సంప్రదాయం చుట్టూ ‘నాగబంధం’ సినిమా కథనం సాగుతుంది. పద్మనాభస్వామి, పూరి జగన్నాథ్ ఆలయాల ధన నిధుల మిస్టరీల స్ఫూర్తితో ఈ సినిమా స్టోరీ సాగుతుంది’’ అని మేకర్స్ తెలిపారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్స్గా నటిస్తున్న ఈ సినిమాలో రిషబ్ సాహ్ని, జగపతిబాబు, గరుడ రామ్, మహేశ్ మంజ్రేకర్, జయప్రకాశ్, మురళీ శర్మ, అనసూయ భరద్వాజ్, బీఎస్ అవినాష్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అభిషేక్ నామా దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగి రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇలా ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించనున్న హీరోలు మరికొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది హీరోలు ఈ తరహా కథలను చేసేందుకు చర్చలు జరుపుతున్నారని ఫిల్మ్నగర్ సమాచారం.– ముసిమి శివాంజనేయులు -
నయనతార.. ఒరిజినల్ పాన్ ఇండియా స్టార్
పాన్ ఇండియా హీరోయిన్ అనే ట్యాగ్కి నిజమైన అర్హత సాధించిన నటి నయనతార. ఒక్కో భాషలో ఒక్కో సినిమా చేస్తూ, ఐదు భాషల్లో ఒకేసారి సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం నయనతార తెలుగులో ఒక సినిమా షూటింగ్ దశలో ఉంది. మలయాళంలో రెండు సినిమాలు సెట్స్పై కొనసాగుతున్నాయి. తమిళంలో రెండు సినిమాలు రెడీ అయ్యాయి. మరో సినిమా షూటింగ్లో ఉంది. కన్నడలో ఆమె నటించిన టాక్సిక్ సినిమా రిలీజ్కు సిద్ధంగా ఉంది. ఇక హిందీ బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సరసన నటించేందుకు సైన్ చేసింది. ఇంతకుముందు షారూక్ ఖాన్తో కలిసి జవాన్ చిత్రంలో నయనతార నటించింది. ఇప్పుడు సల్మాన్తో కలిసి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్లో కీలక పాత్ర పోషించనుంది. ఇందులో కూడా ఆమె పాత్రకు యాక్షన్ టచ్ ఉండనుందని సమాచారం. ఇలా ఒకేసారి ఐదు భాషల్లో సినిమాలు చేస్తూ నిజమైన పాన్ ఇండియా హీరోయిన్గా నిలుస్తోంది నయనతార. నయనతార ఈ స్థాయికి రావడానికి గల కారణాల్లో ఆమె సినిమాల ఎంపికలో చూపే వైవిధ్యం ఒకటి. తన నటనతో ఇప్పటికే దక్షిణాది భాషల్లో బలమైన స్థానం సంపాదించుకున్న ఈ నటి ఇప్పుడు బాలీవుడ్లో కూడా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకునే ప్రయత్నంలో ఉంది. -
10 రోజుల్లో రూ.2800 కోట్ల కలెక్షన్స్.. ఏముంది సినిమాలో?
హాలీవుడ్ సినిమాలు సరైన కంటెంట్తో రావాలే గానీ మన దేశంలోనూ మంచి కలెక్షన్స్ వస్తాయి. అలా లేటెస్ట్గా 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' అనే మూవీ నిలకడగా వసూళ్లు సాధిస్తోంది. విదేశాల్లో వారం క్రితమే థియేటర్లలో రిలీజై అద్భుతమైన టాక్ సొంతం చేసుకుంది. గత వీకెండ్ మన దేశంలోని విడుదలై ఇక్కడ కూడా మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? వసూళ్లు ఎంతొచ్చాయి?(ఇదీ చదవండి: ఎన్టీఆర్-నీల్ సినిమాలో నేను చేయట్లేదు.. షాకిచ్చిన మలయాళ హీరో)మన దగ్గర ప్రస్తుతం 'ధురంధర్ 2' హవా నడుస్తున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' గురించి సినీ ప్రేమికులు తెగ మాట్లాడుకుంటున్నారు. హాలీవుడ్ స్టార్ ర్యాన్ గాస్లింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ స్పేస్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియెన్స్ ఇస్తూ వేల కోట్ల కలెక్షన్స్ సాధిస్తోంది. అమెరికాలో పదిరోజుల క్రితం రిలీజ్ కాగా.. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.2800 కోట్ల మేర వసూళ్లు ఈ చిత్రానికి వచ్చాయి. మరింతగా పెరుగుతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు.భారత్లో చాలావరకు ఈ సినిమాని మల్టీప్లెక్స్ల్లో మాత్రమే స్క్రీనింగ్ చేస్తున్నారు. అయినా సరే నాలురు రోజుల్లో రూ.18 కోట్ల వరకు వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఎర్లీ మార్నింగ్ షోలకు కూడా కొన్నిచోట్ల హౌస్పుల్స్ పడుతున్నాయని తెలుస్తోంది. తొలి వీకెండ్ అయ్యేసరికి గతంలో వచ్చిన ఇంగ్లీష్ చిత్రాలతో పోలిస్తే దీనికి బాగానే వసూళ్లు దక్కినట్లు తెలుస్తోంది.'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' విషయానికొస్తే.. రేల్యాండ్ గ్రేస్ అనే ఓ వ్యోమగామి గతాన్ని మర్చిపోతాడు. ఊహించని విధంగా అంతరిక్ష నౌకలో మేల్కొంటాడు. అలాంటి ఇతడు తన తెలివితేటలు ఉపయోగించి, ముంచుకొస్తున్న ప్రమాదం నుంచి మానవాళిని ఎలా రక్షించాడు? అనేది మిగతా స్టోరీ. కంటెంట్ పరంగా ఓకే అని టాక్ వస్తున్నప్పటికీ విజువల్స్ అదిరిపోయాయని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్-అట్లీ.. ప్లాన్ క్యాన్సిల్!) -
అల్లు అర్జున్-అట్లీ.. ప్లాన్ క్యాన్సిల్!
అల్లు అర్జున్ పుట్టినరోజు దగ్గరకొచ్చేసింది. దీంతో అట్లీతో చేస్తున్న మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందా అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లే స్పెషల్ పోస్టర్తో పాటు టైటిల్ ప్రకటన ఉంటుందని టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు బయటపెట్టారు. ఇదొచ్చిందని ఆనందించేలోపు మూవీ టీమ్కి ఓ బ్యాడ్ న్యూస్ కూడా ఎదురైనట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: OTTలోకి వచ్చేసిన పొలిటికల్ సెటైరికల్ సినిమా.. తెలుగులోనూ)ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుని.. తర్వాత దుబాయిలో కొత్త షెడ్యూల్ని ప్లాన్ చేసుకున్నారు. ఇందులో కొన్ని కీలక సన్నివేశాలని తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ యుద్ధ ప్రభావం ప్రస్తుతం పశ్చిమాసియా దేశాలపై బలంగా ఉంది. మరీ ముఖ్యంగా దుబాయిలో ఎప్పటికప్పుడు ఏదో బాంబు పేలుతూనే ఉన్నట్లు ఎప్పటికప్పుడు వార్తలొస్తున్నాయి. దీంతో దుబాయి షెడ్యూల్ని రద్దు చేశారట. మరి వేరే దేశానికి ఏమైనా దీన్ని షిఫ్ట్ చేస్తారా? లేదంటే పరిస్థితులు సద్దుమణిగాక దుబాయిలోనే చిత్రీకరిస్తారా అనేది తెలియాల్సి ఉంది.ఇప్పటివరకు అయితే ముంబైలోనే వేసిన సెట్స్లో అల్లు అర్జున్, దీపికా పదుకొణెలపై చాలావరకు సీన్స్ పూర్తి చేశారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా, థియేటర్లలోకి రావొచ్చని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు షూటింగ్ రద్దవడం లాంటి వార్తలు చూస్తుంటే.. థియేటర్లలోకి రావడం మరింత ఆలస్యమవుతుందా అనిపిస్తుంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా తమిళ యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతమందిస్తున్నాడు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్-నీల్ సినిమాలో నేను చేయట్లేదు.. షాకిచ్చిన మలయాళ హీరో) -
హీరో విషాద మరణం : అసలు ట్విస్ట్ ఇదే!
ఒడిశాలోని తల్సారీ బీచ్లో ఒక టీవీ షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో నటుడు రాహుల్ అరుణోదయ బెనర్జీ కన్నుమూయడం అత్యంత విషాదకరం. ఈ ఘటనకు సంబంధించి షాకింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.షూటింగ్ సమయంలో తన సహ నటి నీటిలో ఉన్న ఒక లోతైన గుంతలో పడిపోవడాన్ని గమనించిన రాహుల్, ఆమెను రక్షించే ప్రయత్నంలో స్వయంగా నీటిలో మునిగిపోయారు. మోకాలి లోతు నీటిలో షూటింగ్ జరుగుతున్న సమయంలో, సముద్రపు అలల తాకిడికి మలయాళ నటి (సహ నటి) అదుపు తప్పి పడిపోయారు. ఆమె చీరలో ఉండటంతో నీటిలో చిక్కుకుపోయారు. ఆమెను కాపాడే ప్రయత్నంలో ఆయన లోపలికి వెళ్లి మునిగిపోయారని ప్రత్యక్ష సాక్షి తపన్ చెప్పారుస్థానిక పడవ నడిపే వ్యక్తులు తెలిపిన వివరాల ప్రకారం, రాహుల్ సాహసంగా ముందుకు అడుగు వేసినప్పటికీ, సముద్రపు అడుగుభాగం సమానంగా లేకపోవడం ఇసుక మూలంగా బయటకు రాలేకపోయారు. అంతేకాదు రాహుల్ను బయటకు తీసినప్పుడు ఆయన ప్రాణాలతోనే ఉన్నారని, కానీ శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. తక్షణమేఅతన్ని బ్రతికించడానికి ప్రయత్నించినప్పటికీ, రాహుల్ను కాపాడలేకపోయారు. తల్సరి నుండి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిఘా స్టేట్ జనరల్ ఆసుపత్రికి అతన్ని తరలించే సమయానికే మరణించినట్లు ప్రకటించారు.ఇదీ చదవండి: గ్యాస్ కొరత : ఐఐటీ బాంబే అద్భుత ఆవిష్కారంఅనుమతి లేదుఈ ప్రమాదం విషయంలో భద్రతా పరమైన లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇక్కడ షూటింగ్ జరుగుతున్న విషయంపై అనుమతి తీసుకోలేదని, ఈ విషయం గురించి స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని అధికారులంటున్నారు. స్పీడ్బోట్లో చిత్రీకరణ జరుపుతుండగా, బలమైన అలల కారణంగా వారు సముద్రంలో పడిపోయారని పోలీసులు తెలిపారు. తోటి మహిళా నటిని త్వరగా రక్షించినప్పటికీ, రాహుల్ను గుర్తించి నీటిలోంచి బయటకు తీయడానికి దాదాపు గంట సమయం పట్టిందని సమాచారం. పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే, అక్కడ లైఫ్ గార్డులు, వైద్య బృందం ,రెస్క్యూ బోట్లు అందుబాటులో ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేసి ఉండేవాళ్ళమని స్థానిక అధికారి చెప్పారు.పోస్టుమార్టం నివేదికరాహుల్ ఊపిరితిత్తుల్లోకి ఉప్పు నీరు, ఇసుక వెళ్లడం వల్లే ఆయన మరణించినట్లు ప్రాథమిక నివేదికలో తేలింది.42 ఏళ్ల రాహుల్ అరుణోదయ బెనర్జీ కేవలం నటుడిగానే కాకుండా, రచయితగా, పాడ్కాస్ట్ హోస్ట్గా కూడా సుపరిచితులు. ఆయన మరణం చిత్ర పరిశ్రమలో పెద్ద లోటును మిగిల్చింది. ఇదీ చదవండి: తండ్రితో గొడవ, నాలుగేళ్ల బాలుడిపై ఇంత ప్రతీకారమా? -
ఇష్టపడి కొన్న బైక్ని జీవిత అమ్మేసింది : రాజశేఖర్
శర్వానంద్ హీరోగా నటింటిన తాజా చిత్రం ‘బైకర్’. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్ 3న ఈ సినిమా థియేటర్స్లో విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా తాజాగా రాజశేఖర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ చాలా రోజుల తర్వాత నేను చేసిన సినిమా రిలీజ్ అవుతోంది. నేను బాగా ఇష్టపడి చేసిన సినిమా బైకర్. ఎప్పుడు ఏప్రిల్ 3 వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది చాలా ఆనందంగా ఉంది. నేను నటించిన సినిమా ఇది. నా సినిమాలానే ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఆడియన్స్ ఎంతలా మెచ్చుకుంటారు? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.→ నేను ఏ క్యారెక్టర్ చేసిన అది బాగుండాలి, నాకు నచ్చాలి. అప్పుడే నేను చేయగలుగుతాను. అలాగే క్యారెక్టర్ బాగుంటే సరిపోదు. సినిమా కూడా అద్భుతంగా ఆడాలి. కథ బాగుండాలి. నేను బైకర్ కథ విన్నప్పుడు నా క్యారెక్టర్, కథ రెండు నచ్చే ఈ సినిమా చేశాను. బైకర్ కథ పరంగా సూపర్ గా హిట్ అవుతుంది. అలాగే నా క్యారెక్టర్ కూడా అద్భుతంగా వచ్చింది. సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.→ నాకు చిన్నప్పటినుంచి బైక్స్ అంటే చాలా ఇష్టం. మా అమ్మమ్మగారింట్లో ఒక బుల్లెట్ బండి ఉండేది. నేను సెలవుల్లో అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఆ ఊరు మొత్తం బుల్లెట్లో తిరిగేవాడిని. ఆ తర్వాత బైక్స్ మీద ఆసక్తి పెరుగుతూ వచ్చింది. శేషు సినిమా సమయంలో స్వయంగా నేనే యమహా సిక్స్ ఫిఫ్టీ సిసి బండి కొనుక్కొని ఆ షూటింగ్ కి వాడడం జరిగింది. ఆ తర్వాత అదే బైక్ ని రోజు నడుపుకునేవాడిని. నేను నడిపే విధానం చూసి 'మీరు చాలా రిస్క్ తో నడుపుతున్నారని నాకు తెలియకుండానే జీవిత ఆ బైక్ అమ్మేశారు (నవ్వుతూ).→ అభిలాష్ గారు చాలా మంచి డైరెక్టర్. ఒక యాక్టర్ నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ కావాలో ఆయనకి చాలా క్లారిటీ ఉంటుంది. ఆయన కథ మీద క్యారెక్టర్ మీద చాలా గ్రిప్ ఉన్నా దర్శకుడు . ఆయన అనుకునది వచ్చేంతవరకు ఎక్కడ కూడా రాజీపడరు. చాలా ఇన్వాల్వ్మెంట్ ఉన్న డైరెక్టర్.→ ఇందులో బైక్ రేసింగ్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ఒక హాలీవుడ్ రేంజ్ సినిమాలా ఉంటుంది. అలాగే ఫాదర్ సన్ ఎమోషన్ కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి.→ నా కుటుంబమే నా బలం. ఈ సినిమా, నా క్యారెక్టర్ ఇంత అద్భుతంగా రావడానికి ఒక కారణం జీవిత, మా పిల్లలు. వాళ్ల సపోర్టు చాలా గొప్పది. ఈ సినిమా నేను చేసినప్పుడు నన్ను స్కూల్ కి డ్రాప్ చేసి మళ్లీ అక్కడి నుంచి తీసుకొచ్చే ఒక మదర్ లాగా చూసుకున్నారు.→ కొత్త సినిమాల విషయాలకొస్తే..పవన్ సాదినేనితో 'మగాడు' అనే సినిమా చేస్తున్నాను. అది ఇంకా 20% మిగిలింది. నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ అనుకుంటున్నారు. అలాగే నేను రమ్య విశ్వదేవ్ శివాని కలిసి ఒక సినిమా చేస్తున్నాం. అది షూటింగ్ జరుగుతుంది త్వరలోనే టైటిల్ రిలీజ్ చేస్తాం. బైకర్ తో పాటు ఈ రెండు సినిమాలు కూడా కచ్చితంగా నా కెరీర్లో చాలా మంచి సినిమాలు అవుతాయని నమ్మకం ఉంది. -
సొట్టబుగ్గతో లావణ్య త్రిపాఠి.. ప్రకృతిలో అనన్య యోగా
సొట్టబుగ్గలతో క్యూట్గా లావణ్య త్రిపాఠినారింజ రంగు చీరలో అను ఇమ్మాన్యుయేల్అందంతో చంపేస్తున్న దివ్య భారతిమెడలో పచ్చని హారంతో పాయల్ రాజ్పుత్ప్రకృతిలో యోగా చేస్తున్న అనన్య నాగళ్లచూపు తిప్పుకోలేని గ్లామర్తో నిధి అగర్వాల్ View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Lavanya konidela Tripathi (@itsmelavanya) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) -
ఆ సినిమా నేను చేయట్లేదు.. షాకిచ్చిన మలయాళ హీరో
తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. ఇందులో మలయాళ హీరో టొవినో థామస్.. విలన్గా నటిస్తున్నాడనే రూమర్స్ చాన్నాళ్ల క్రితమే వచ్చాయి. ఇప్పుడు టొవినో హీరోగా నటించిన 'పల్లి చట్టంబి' మూవీ తెలుగులోనూ విడుదల కానున్న సందర్భంగా హైదరాబాద్ వచ్చాడు. మీడియాతో మాట్లాడుతూ తారక్-నీల్ సినిమాలో తాను నటించట్లేదని క్లారిటీ ఇచ్చేశాడు. అందుకు గల కారణాన్ని కూడా బయటపెట్టాడు.(ఇదీ చదవండి: మార్చి రౌండప్: ముంచిన 'ఉస్తాద్'.. ఆదుకున్న 'ధురంధర్ 2')'తెలుగ చిత్రాల్లో నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. కానీ మలయాళ వర్కింగ్ కల్చర్తో పోలిస్తే టాలీవుడ్లో భిన్నంగా ఉంటుంది. మేం తక్కువ టైంలోనే షూటింగ్ పూర్తిచేసేస్తాం. తెలుగులో షూటింగ్ షెడ్యూల్స్ ఎక్కువ. పైగా ఒకేసారి రెండు మూడు చిత్రాల్లో నటించడం నాకు ఇష్టముండదు. ఒకటి పూర్తయ్యాకే మరొకటి చేస్తుంటా. ఒకవేళ తెలుగులో పెద్ద సినిమాలో నటిస్తే.. నేను ఒప్పుకొన్నా మూడు-నాలుగు మలయాళ చిత్రాలపై దాని ప్రభావం పడుతుంది. అందుకే తెలుగులో నటించలేకపోతున్నా. డేట్స్ సర్దుబాటు చేయలేక ఆ మూవీ(ఎన్టీఆర్-నీల్) చేయట్లేదు' అని టొవినో థామస్ చెప్పుకొచ్చాడు.కెరీర్ ప్రారంభంలో సహాయ నటుడిగా చాలా సినిమాలు చేసిన టొవినో థామస్.. గత పదేళ్లుగా మాత్రం హీరోగా మూవీస్ చేస్తున్నాడు. మిన్నల్ మురళి, 2018 తదితర డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఇతడు పరిచితమే. అలాంటిది ఇప్పుడు ఇతడు, ఎన్టీఆర్-నీల్ మూవీలో లేడని తెలిసింది. మరి ఇతడి బదులు వేరే ఎవరిని తీసుకున్నారో చూడాలి?(ఇదీ చదవండి: OTTలోకి వచ్చేసిన పొలిటికల్ సెటైరికల్ సినిమా.. తెలుగులోనూ) -
బన్నీ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్పిన బన్నీవాసు
అల్లు అర్జున్ అభిమానులకు నిర్మాత బన్నీ వాసు గుడ్ న్యూస్ చెప్పాడు. బన్నీ బర్త్డే రోజు ఫ్యాన్స్కి అందించబోతున్న ప్రత్యేక కానుక ఏంటో రివీల్ చేశారు. పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్.. తమిళ దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నాడు . అయితే ఇప్పటి వరకు ఈ సినిమా టైటిల్ని అనౌన్స్ చేయలేదు. సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వినిపిస్తున్నా..అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. బన్నీ బర్త్డే (ఏప్రిల్ 8) రోజు ఈ సినిమా టైటిల్ని ప్రకటించబోతున్నారట. ఈ విషయాన్ని నిర్మాత బన్నీ వాసు వెల్లడించారు. తాజాగా ఆయన పళ్లి చట్టంబి మూవీ టీమ్ ఏర్పాటు చేసిన గ్రాండ్ రిలీజ్ ప్రెస్ మీట్కి హాజరయ్యారు. ఈ సందర్భంగా బన్నీ బర్త్డే కానుకగా కొత్త సినిమా అప్డేట్ ఏమైనా ఉంటుందా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నలకు ఆయన పై విధంగా సమాధానం చెప్పాడు. టైటిల్ అనౌన్స్మెంట్తో పాటు స్పెషల్ పోస్టర్ని కూడా రిలీజ్ చేస్తారట. ‘AA 22’ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా దీపికా పదుకొణె నటిస్తోంది. దీపికతో పాటు జాన్వీకపూర్, మృణాల్ ఠాకూర్, రష్మికా మందన్నా, భాగ్యశ్రీ బోర్సే వంటి హీరోయిన్లు కూడా నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాలపై బన్ని బర్త్డే రోజు స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. -
ఓటీటీలోకి వచ్చేసిన పొలిటికల్ సెటైరికల్ సినిమా
తెలుగులో దాదాపుగా కమర్షియల్ సినిమాలే ఎక్కువగా వస్తుంటాయి. కాస్త డిఫరెంట్ చిత్రాలు చూద్దామనుకుంటే మన ప్రేక్షకులు చాలామంది తమిళ, మలయాళం వైపు చూస్తుంటారు. అందుకు తగ్గట్లే ఆయా ఇండస్ట్రీల నుంచి ఎప్పటికప్పుడు భిన్నమైన మూవీస్ వస్తుంటాయి. ఇవి ఓటీటీలోకి వచ్చిన తర్వాత మన దగ్గర ఆదరణ బాగుంటుంది. ఇప్పుడు కూడా అలా ఓ తమిళ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి సైలెంట్గా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: మార్చి రౌండప్: ముంచిన 'ఉస్తాద్'.. ఆదుకున్న 'ధురంధర్ 2')గతేడాది 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమాతో హిట్ కొట్టిన తమిళ నటుడు శశికుమార్ లేటెస్ట్ తమిళ మూవీ 'మై లార్డ్'. పొలిటికల్ సెటైరికల్ కాన్సెప్ట్తో తీసిన సోషల్ డ్రామా చిత్రమిది. చైత్ర ఆచార్ హీరోయిన్ కాగా రాజు మురుగన్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 13న థియేటర్లలో రిలీజైంది. మార్చి 20 నుంచి తమిళ వెర్షన్ మాత్రమే ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు తెలుగు, హిందీ కూడా అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి వచ్చాయి. కాస్త డిఫరెంట్ మూవీ చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు.'మై లార్డ్' విషయానికొస్తే.. అనాథలైన ముత్తుసిరిపి(శశికుమార్), సుశీల (చైత్ర ఆచార్) అగ్గిపెట్టెల కంపెనీలో పనిచేస్తుంటారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఓరోజు గుడికి వెళ్లిన సుశీల కళ్లుతిరిగి పడిపోతుంది. ఆస్పత్రికి తీసుకెళ్తే ఏకంగా రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెబుతారు. అలానే తమకు తెలియకుండానే తమ శరీరంలోని కిడ్నీలు దొంగిలించారని వీళ్లకు తెలుస్తుంది. వీళ్లిద్దరూ చనిపోయారని ఏకంగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదవుతుంది. సరిగ్గా ఇదే సమయంలో ఓ కేంద్రమంత్రికి కిడ్నీ దానం చేయాలని కొందరు వీళ్లని బలవంతపెడుతూ ఉంటారు. దీంతో ఓ చిన్న జర్నలిస్టు సాయంతో ముత్తుసిరిపి, సుశీల.. తమకు జరిగిన అన్యాయంపై ఎలా పోరాడారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.థియేటర్లలో రిలీజైనప్పుడు మిశ్రమ స్పందన అందుకున్న ఈ చిత్రం.. ఓటీటీలో తెలుగు ప్రేక్షకులకు నచ్చే అవకాశముంది. హీరో సూర్య.. తన బ్యానర్పై 'మై లార్డ్'ని సమర్పించడం విశేషం. సెకండాఫ్లో కొన్ని అనవసర సీన్స్ ఉన్నప్పటికీ ఓవరాల్గా బాగుందనే టాక్ వినిపిస్తోంది. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
మార్చి రౌండప్: ముంచిన 'ఉస్తాద్'.. ఆదుకున్న 'ధురంధర్ 2'
సాధారణంగా మార్చి నెల అనగానే పరీక్షల సీజన్, సినిమాలు పెద్దగా చూడరు అనే అపవాదు ఉంటుంది. కానీ ఇదే నెలలో గతంలో 'ఆర్ఆర్ఆర్' లాంటి పాన్ ఇండియా మూవీ వచ్చి బ్లాక్బస్టర్ అయింది. బలగం, కోర్ట్, జాతిరత్నాలు తదితర చిన్న చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఈసారి మాత్రం అలాంటి మ్యాజిక్ జరగలేదు. ఆదుకుంటాడనుకున్న 'ఉస్తాద్'.. బయ్యర్లని నిండా ముంచాడు. ఇంతకీ ఈ నెల బాక్సాఫీస్ రిజల్ట్ ఏంటి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)మార్చి తొలివారం ఏకంగా 10 వరకు చిన్న సినిమాలు వచ్చాయి. వీటిలో శ్రీ విష్ణు 'మృత్యుంజయ్' ఉన్నంతలో ఆసక్తి కలిగించింది. కానీ ఉసూరుమనిపించింది. నటి వరలక్ష్మీ శరత్ కుమార్.. తొలిసారి దర్శకురాలు, నిర్మాతగా తీసిన 'ఎస్.సరస్వతి' ఇదే వారం వచ్చింది. ఫ్లాప్ అయింది. శివాజీ 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ఘోరమైన డిజాస్టర్గా నిలిచింది. 'మెన్షన్ హౌస్ మల్లేష్' కూడా నిలబడలేదు.మూడోవారం ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 సినిమాలు ఉన్నాయని.. రెండోవారం వచ్చే ధైర్యం ఎవరూ చేయలేదు. హెబ్బా పటేల్ నటించిన 'రేపు ఉదయం 10 గంటలకు' చిత్రం 14వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. అసలు ఇదొకటి రిలీజైన సంగతి కూడా జనాలకు తెలియనంతగా వచ్చి వెళ్లిపోయింది.మూడోవారం ఉగాది కానుకగా పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' వచ్చింది. రిలీజ్ నాడు పండగ సెలవు కావడంతో ఉన్నంతలో థియేటర్లు నిండాయి కానీ టాక్ నెగిటివ్ వచ్చింది. రెండోరోజుకల్లా ఆ ప్రభావం గట్టిగానే పడింది. వీకెండ్ అయ్యేసరికి ఈ చిత్రం పవన్ కెరీర్లో డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. విడుదలకు ముందు దర్శకుడు హరీశ్ శంకర్ చాలాచెప్పాడు. అభిమానులని కూడా సరిగా ఆకట్టుకోలేకపోయిందీ చిత్రం. ఇదే తేదీన వచ్చిన డబ్బింగ్ బొమ్మ 'ధురంధర్ 2'.. తెలుగు రాష్ట్రాల్లోని బాక్సాఫీస్ని ఆదుకుంది. రెండు రోజుల ఆలస్యంగా తెలుగు వెర్షన్ వచ్చినప్పటికీ మన ప్రేక్షకులు దీన్ని ఆదరించారు. 'ఉస్తాద్..'ని లైట్ తీసుకున్నారు.చివరిదైన నాలుగోవారంలో బ్యాండుమేళం, లేచింది మహిళా లోకం, సుయోధన తదితర స్ట్రెయిట్ మూవీస్తో పాటు యూత్, హ్యాపీరాజ్ లాంటి డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ కాలేదు. దీంతో ఈ నెలలో ఏ తెలుగు మూవీ కూడా ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. 'ధురంధర్ 2' మాత్రమే టాలీవుడ్ బాక్సాఫీస్ అంతో ఇంతో కళకళలాడేలా చేసింది. ఇది కూడా లేకపోయింటే అంతే సంగతులు.(ఇదీ చదవండి: అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్) -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్
బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న అనుష్క శెట్టి.. బరువు సమస్యల కారణంగా తర్వాత మూవీస్ చేయడం చాలా తగ్గించేసింది. అప్పుడో ఇప్పుడో అన్నట్లు చేస్తూ వస్తోంది. 2023లో 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో హిట్ అందుకున్న ఈ హీరోయిన్.. గతేడాది 'ఘాటీ'తో ఘోరమైన డిజాస్టర్ చవిచూసింది. ఇప్పుడు 'కథనార్' అనే మలయాళ చిత్రంతో వచ్చేందుకు సిద్ధమైంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)ఫాంటసీ థ్రిల్లర్ స్టోరీతో తీసిన ఈ సినిమాని తెలుగు, తమిళంలోనూ రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో అనుష్కకి రెండు మూడు షాట్స్కి మాత్రమే పరిమితం చేశారు. విజువల్స్ బాగున్నాయి గానీ కాన్సెప్ట్ అర్థమై అర్థం కానట్లు అనిపించింది. డబ్బింగ్లో ఉపయోగించిన తెలుగు పదాలు కూడా సగటు ప్రేక్షకుడికి అర్థం కాని విధంగా ఉన్నాయి.జయసూర్య హీరోగా నటించిన ఈ చిత్రంలో అనుష్క శెట్టి హీరోయిన్. ప్రభుదేవా, శాండీ మాస్టర్, వినీత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది జూలై ఆగస్టులో థియేటర్లలోకి మూవీ రానుందని తెలుస్తోంది. రోజిన్ థామస్ దర్శకుడు. అనుష్కకి ఇది 50వ మూవీ కావడం విశేషం.(ఇదీ చదవండి: పెద్ది రిలీజ్ డేట్.. నన్ను క్షమించండి: నిర్మాత ఎస్కేఎన్) -
హీరో విజయ్కి వేల కోట్ల ఆస్తులు.. అప్పులు ఎంతంటే?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు రాజకీయాలలో ఫుల్ బిజీ అయిపోయాడు. సొంతంగా టీవీకే పార్టీని స్థాపించి.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నాడు. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాల్లో టీవీకే పోటీ చేస్తోంది. ఇందులో విజయ్ చెన్నైలోని పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నాడు. ఆదివారం అభ్యర్థులను ప్రకటించిన విజయ్.. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేశాడు.రూ.600 కోట్లు..ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ లో పొందుపరిచిన విషయం తెలిసిందే . అయితే ఇక్కడ తన భార్య సంగీత ఆస్తులను కూడా ఆయన జమ చేయడం గమనార్హం. విజయ్ తన స్థిర, చరాస్తుల విలువలను దాదాపు రూ.600 కోట్లుగా అఫిడవిట్లో వెల్లడించాడు. అందులో నగదు రూపంలో తన వద్ద రూ.2 లక్షలు, తన భార్య సంగీత వద్ద లక్ష రూపాయలు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నాడు. విధ బ్యాంకుల్లో సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో రూ.388 కోట్లు ఉన్నట్లు తెలిపారు. ఆయన పేరుమీద రూపాయి అప్పు కూడా లేదని అఫిడవిట్లో వెల్లడించాడు.లగ్జరీ కార్లు.. ఫ్యామిలీకి అప్పుఇక తన వాహనాల వివరాలను కూడా అఫిడవిట్లో పొందుపరిచాడు. తన వద్ద బిఎండబ్ల్యూ 530, బీఎండబ్ల్యూ ఐ7, టయోటా లెక్సస్ 350, టయోటా వెల్ఫేర్ వంటి ఖరీదైన కార్లతో పాటు మారుతి సుజుకి స్విఫ్ట్, టీవీఎస్ ఎక్సెల్ సూపర్ వంటి వాహనాలు కూడా ఉన్నట్లు తెలిపారు. ఇక వాహనాల మొత్తం విలువ రూ.14.35 కోట్లు అని వెల్లడించారు. అలాగే తన వద్ద 883 గ్రాముల బంగారం, 15 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు. అంతేకాదు తన కుటుంబ సభ్యులకు కొంత డబ్బును అప్పుగా ఇచ్చాడట. తన సతీమణి సంగీతకు రూ. 12.60 కోట్లు, తండ్రి చంద్రశేఖర్కి రూ.3.02 కోట్లు, తల్లికి రూ. 87.12 లక్షలు, కొడుకుకి రూ. 8.78 లక్షలు, కూతురు దివ్యకి రూ. 4.6 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు తెలిపాడు.దీంతో పాటు తన టీవీకే పార్టీలో కీలక నేత అయిన ఎన్ ఆనంద్కి రూ. 3 కోట్లు ఇచ్చినట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నాడు. సంగీత పేరుపై కూడా భారీ ఆస్తులువిజయ్ అఫిడవిట్లో తన భార్య సంగీత ఆస్తుల వివరాలను కూడా వెల్లడించాడు. తన భార్య వద్ద రూ. 4.07 కోట్ల విలువైన బంగారం, రెండు కేజీల వెండితో పాటు కోటి రూపాయల విలువైన వజ్రాలు ఉన్నాయి. సంగీత మొత్తం చరాస్తుల విలువ రూ.15.51 కోట్లు , స్థిరాస్తుల విలువ 25 లక్షలుగా వెల్లడించారు . తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. -
దురంధర్-2ను వదలని పైరసీ.. యూట్యూబ్లో ప్రింట్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈనెల 19న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పటికే దురంధర్ వసూళ్లను క్రాస్ చేసింది. కేవలం 11 రోజుల్లోనే రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ సీక్వెల్ హిందీతో పాటు దక్షిణాది భాషల్లో రిలీజ్ కావడంతో రెండు వేల కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాకిస్తాన్కు వెళ్లిన ఇండియన్ స్పై జీవితం ఆధారంగా తెరకెక్కించారు.బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్గా దూసుకెళ్తోన్న ఈ చిత్రానికి పైరసీ గండం తప్పింది. అయితే పైరసీ కేటుగాళ్లు ఈ మూవీని యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఇది గమనించిన దురంధర్ అభిమానులు వెంటనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై వెంటనే అప్రమత్తమై దురంధర్ టీమ్ పైరసీ కంటెంట్ను తొలగించాలని యూట్యూబ్ను కోరింది. దీంతో వెంటనే స్పందించిన యూట్యూబ్ ఆ వీడియోను తొలగించింది. త్వరగా రెస్పాండ్ కావడంతో పైరసీ గండం నుంచి తప్పించుకున్నారు మేకర్స్. లేకపోతే దురంధర్ వసూళ్లపై తీవ్ర ప్రభావం పడేదని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పైరసీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు సోషల్ మీడియాలో ఆదిత్య ధర్ను ట్యాగ్ చేశారు.కాగా.. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో సారా అర్జున్ హీరోయిన్గా కనిపించింది. ఈ మూవీలో అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, రాకేష్ బేడీ కీలక పాత్రల్లో నటించారు. -
కొత్త కంటెంట్తో ‘ఏంటో అంతా సరికొత్తగా’
శ్రీరామ్ నిమ్మల, హర్షిత జోడీగా రూపొందిన చిత్రం ‘ఏంటో అంతా సరికొత్తగా’. రాజ్ బోను దర్శకత్వంలో రాము ప్రొడక్షన్స్ బ్యానర్పై రాము.ఎం నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులముందుకు రానుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను ‘హిట్’ చిత్రాల ఫేమ్, డైరెక్టర్ శైలేష్ కొలను ఆవిష్కరించి, మాట్లాడుతూ–‘‘ఏంటో అంతా సరికొత్తగా’ టైటిల్ చాలా కొత్తగా, ఆకర్షణీయంగా ఉంది. పోస్టర్ చూడగానే ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. ప్రస్తుతం ప్రేక్షకులు కొత్త కంటెంట్, కొత్త కథలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ సినిమా కూడా అదే దిశలో మంచి ప్రయత్నంగా కనిపిస్తోంది. రాజ్ బోనుగారు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించడం చాలా ఆసక్తికరంగా ఉంది. రాముగారు ఈ సినిమా నిర్మించడం అభినందనీయం. మంచి కంటెంట్తో వస్తున్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధించాలి’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం రిషి.ఎం, కెమెరా: వేణు కొత్తకోట. -
రిషబ్ శెట్టి అన్ ఫాలో వివాదం.. మంచిపని చేశాడు..!
కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి ప్రస్తుతం జై హనుమాన్ మూవీలో నటిస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో అలరించనున్నారు. ప్రస్తుతం ఈ మూ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా షూట్ లాంఛనంగా ప్రారంభమైంది. ఇప్పటికే రిలీజైన హనుమాన్ పోస్టర్ చూస్తే రిషబ్ శెట్టి లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే తాజాగా రిషబ్ శెట్టి చేసిన ఓ పని వివాదానికి దారి తీసింది. ఆయన పని చేసిన కాంతార టీమ్ నటీనటులను ఇన్స్టాలో అన్ ఫాలో చేయడం కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. రెండు రోజుల క్రితం హోంబలే ఫిల్మ్స్ ఖాతాను అన్ ఫాలో చేసిన రిషబ్.. హీరోయిన్ రుక్మిణి వసంత్తో పాటు రాజ్ .బి.శెట్టిని కూడా అన్ ఫాలో చేశాడు. దీంతో రిషబ్కు.. నిర్మాణ సంస్థతో ఏమైనా విభేదాలు వచ్చాయా అని డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవలం హోంబలే ఫిల్మ్స్ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్ను మాత్రం రిషబ్ ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు.ఈ వివాదం నేపథ్యంలో రిషబ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హోంబలే ఫిల్మ్స్ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్ను కూడా అన్ ఫాలో చేసేశారు. తాను ఫోలో అవుతున్న ఇన్స్టా లిస్ట్లో ఉన్న అందరినీ అన్ ఫాలో చేసి క్లియర్ చేశారు. రిషబ్ ఇప్పుడు కేవలం మూడు ఖాతాలను మాత్రమే ఫాలో అవుతున్నారు.. అందులో ఒకటి తన భార్య ప్రగతి శెట్టి.. మరొకటి తన ప్రొడక్షన్ హౌస్తో పాటు రిషబ్ శెట్టి ఫౌండేషన్ను ఫాలో చేస్తున్నారు. ఈ చర్యతో రిషబ్ శెట్టి వ్యవహారం శాండల్వుడ్లో మరోసారి చర్చకు దారితీసింది. అయితే దీనిపై రిషబ్ శెట్టి గానీ.. హోంబలే ఫిల్మ్స్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అసలేం జరిగిందన్ననది తెలియాలంటే నిర్మాణ సంస్థ కానీ.. రిషబ్ శెట్టినో క్లారిటీ ఇవ్వాల్సిందే. కాగా.. కాంతార సినిమాతో కన్నడ హీరో రిషబ్ శెట్టికి గుర్తింపు దక్కిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్ను అన్ఫాలో చేసిన రిషబ్ శెట్టి) View this post on Instagram A post shared by PragathiRishabShetty (@pragathirishabshetty) -
బిర్యానీ వండిన స్టార్ హీరో.. వీడియో వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. కాస్తా గ్యాప్ దొరికితే కార్ రేసింగ్లో దిగిపోతుంటారు. తాజాగా అజిత్ కుమార్ చెన్నైలోని ఓ ఈవెంట్కు హాజరయ్యారు. తన భార్య షాలినితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెన్నైకి చెందిన ఫుట్బాల్ క్లబ్ ఎఫ్సీ మద్రాస్ నిర్వహించిన ఈవెంట్లో అజిత్, షాలిని సందడి చేశారు. ఈ సందర్భంగా అజిత్ బిర్యానీ వండుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.ఈ వీడియోలో షాలిని.. తన భర్తను ఆటపట్టించారు. నేను చెప్పినట్లుగా చేసావా? అంటూ అజిత్ను సరదాగా అడిగింది. ఆ తర్వాత అజిత్ దంపతులకు తాము అతిథ్యమివ్వడం అదృష్టంగా భావిస్తున్నామని ఎఫ్సీ మద్రాస్ పేర్కొంది. మనదేశానికి మోటార్స్పోర్ట్స్.. అలాగే దేశాన్ని ప్రపంచ రేసింగ్ పటంలో నిలపాలన్న అజిత్ కుమార్ దార్శనికత నిజంగా స్ఫూర్తిదాయకమని కొనియాడారు. క్రీడలకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ ఛాంపియన్లను తయారు చేయడంలో.. భారతదేశంలో క్రీడాకారులను తీర్చిదిద్దడంలో అజిత్తో కలిసి పనిచేస్తామని ఎఫ్సీ మద్రాస్ ప్రకటించింది.ఇక అజిత్ సినిమాల విషయానికొస్తే దర్శకుడు అధిక్ రవిచంద్రన్తో మరోసారి జత కట్టనున్నారు. ఇంకా ఈ మూవీ పనులు ప్రారంభించలేదు. ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రారంభం కావాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ గ్యాప్లోనే అజిత్ కుమార్ మోటార్ రేసింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటున్నారు. Shalini mam - naa sona Mari paniyacha 😁Ajith enga paru 🤩 Pookie couples 😁#AjithKumar #ShaliniAjithKumar #AK pic.twitter.com/G95wNgI9tS— AJITH FANS COMMUNITY (@TFC_mass) March 30, 2026 -
మీది చిన్న సినిమా.. ఇబ్బంది పడతారని చెప్పారు: నిహారిక
మెగా డాటర్ నిహారిక నటిగా రాణిస్తూనే నిర్మాతగా కూడా దూసుకెళ్తున్నారు. కమిటీ కుర్రోళ్లు మూవీ తర్వాత నిర్మాతగా బిజీ అయిపోయారు. ప్రస్తుతం తన సొంతం బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్పై రాకాస అనే మూవీని నిర్మించారు. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా వస్తోన్న ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 03న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన నిహారిక నిర్మాతగా తన అనుభవాలను పంచుకుంది. ఇలాంటి సినిమా తీస్తున్నామనగానే చాలామంది సలహాలు ఇచ్చారని తెలిపింది. వీఎఫ్ఎక్స్ విషయంలో పెద్ద పెద్ద సినిమాలే కష్టపడాల్సి వస్తోంది.. మీది చిన్న బడ్జెట్ సినిమా.. చాలా ఇబ్బంది పెడతారు చూసుకోండని నాతో చెప్పారని గుర్తు చేసుకుంది.ఏం చేసినా మాటలు అనే వాళ్లు అంటూనే ఉన్నారు. అందుకే నేను చేయాలనుకున్నది చేస్తూనే ఉంటానని తెలిపింది. ఓ మంచి సినిమా తీశాం.. జనాల్లోకి తీసుకెళ్లడానికి బాగా ప్రమోట్ చేస్తున్నామని నిహారిక వెల్లడించింది. ఇంటింటికి వెళ్లి సినిమా చూపించడానికి కూడా రెడీగా ఉన్నామని నిహారిక పేర్కొంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో భాగమైన ప్రతి ఒక్కరికీ సొంతిల్లు, కారు ఉండాలని ఆశిస్తున్నట్లు నిహారిక తన డ్రీమ్ను బయటపెట్టింది. కమిటీ కుర్రోళ్లు మూవీతో 11 మంది కొత్త వాళ్లను పరిచయం చేశానని నిహారిక తెలిపింది. -
ఓటీటీకి వచ్చేసిన తెలుగు హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
సుహాస్, శివాని నాగారం హీరో హీరోయిన్లుగా నటించిన కామెడీ సినిమా 'హే బల్వంత్'. తొలుత ఈ చిత్రానికి 'హే భగవాన్' అని టైటిల్ పెట్టారు. కానీ కంటెంట్ చూసిన సెన్సార్ టీమ్.. టైటిల్ మార్చేసి రిలీజ్ చేశారు. సీనియర్ నటుడు నరేశ్, సుదర్శన్ కీలక పాత్రలు చేశారు. ఫిబ్రవరి 20న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ మూవీ ఈ రోజు నుంచే ఓటీటీ వేదికగా అందుబాటులోకి వచ్చేసింది. జీ5లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో చూడడం మిస్సయివారు ఎంచక్కా ఈ మూవీని ఓటీటీలో చూసేయండి.ఈ మూవీ కథేంటంటే...తల్లిలేని కృష్ణ(సుహాస్)కి చిన్నప్పటి నుంచి ఓ కోరిక ఉంటుంది. పెద్దయ్యాక తండ్రి రావు బల్వంత్(నరేశ్) చేసే బిజినెస్ టేకోవర్ చేసి.. మంచి పేరు సంపాదించాలనుకుంటాడు. అయితే నాన్న చేసే బిజినెస్ ఏంటి అనేది మాత్రం అతనికి తెలియదు. నాన్నను, నాన్నమ్మ(అన్నపూర్ణమ్మ)ను అడిగినా.. చెప్పరు. చదువు పూర్తయిన తర్వాత బిజినెస్ చూసుకుంటానంటే తొలుత నాన్న ఒప్పుకోడు. కానీ ఓ కారణంగా రావు బల్వంత్ వ్యాపారం కృష్ణ చేతుల్లోకి వెళ్తుంది.చిన్నప్పటి నుంచి ఏవోవో కలలు కన్న కృష్ణకి ఆ వ్యాపారం ఏంటనేది తెలిశాక..షాక్కి గురవుతాడు. తాను ఊహించినదానికి భిన్నంగా నాన్న వ్యాపారం ఉంటుంది. ప్రేమించిన అమ్మాయి మిత్ర(శివానీ నాగారం)కి కూడా ఆ వ్యాపారం గురించి చెప్పుకోలేని పరిస్థితి. అసలు బల్వంత్ రావు చేసే వ్యాపారం ఏంటి? దాని వల్ల కృష్ణకు ఎదురైన సమస్యలు ఏంటి? కృష్ణ చేసే వ్యాపారం గురించి ప్రియురాలు మిత్రకు తెలిసిన తర్వాత ఏం జరిగింది? మిత్ర తాత(బాబు మోహన్)కి కృష్ణ బిజినెస్కి ఉన్న సంబంధం ఏంటి? ఈ బిజినెస్ వల్ల ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న పీవీబీ (హర్ష వర్ధన్)కి వచ్చిన సమస్య ఏంటి? చంప(స్రవంతి) ఎవరు? ఈ కథలో బెజ్జం దుర్గారావు (అజయ్ ఘోష్), యువన్ (వెన్నెల కిశోర్) పాత్రలకి ఉన్న ప్రాధాన్యత ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.The business begins!#HeyBalwanthSTREAMING NOW #TeluguZee5 #Suhas #HeyBalwanthOnZee5 pic.twitter.com/34BOOlrBJR— ZEE5 Telugu (@ZEE5Telugu) March 30, 2026 -
ఆ క్షణం చనిపోవాలని అనిపించింది: హేమ
టాలీవుడ్ నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అభిమానుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే గతేడాది ఓ డ్రగ్స్ కేసులో ఆమె పేరు బయటికి రావడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ తర్వాత ఆమెను కోర్ట్ నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి హాజరయ్యారు. నిర్వహించా ఈ సందర్భంగా ఆ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను పంచుకున్నారు. డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా మానసికంగా కలచివేశాయని తెలిపింది. ఆ సమయంలో నాకు చచ్చిపోవాలని అనిపించిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసు అంతలా నన్ను మానసికంగా కుంగిదీసిందని వెల్లడించింది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని.. అందుకే చివరకు నిర్దోషిగా బయటకు వచ్చానని హేమ స్పష్టం చేసింది. నాపై వచ్చిన తప్పుడు వార్తల వల్ల తన కుటుంబం చాలా బాధపడిందన్నారు.మీట్ ది ప్రెస్లో హేమ మాట్లాడుతూ....'డ్రగ్స్ కేసులో కొందరు తనపై నిరాధార ఆరోపణలు చేశారు. వాటితో తన వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారు. ఆ సమయంలో చాలా సఫర్ అయ్యా. అది నాకు చాలా కఠినమైన కాలం. ఆ సమయంలో తాను మానసికంగా కుంగిపోయా. ఒక దశలో చనిపోవాలనిపించింది' అంటూ ఎమోషనల్గా మాట్లాడారు. -
పెద్ది రిలీజ్ డేట్.. నన్ను క్షమించండి: నిర్మాత ఎస్కేఎన్
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న పెద్ది మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే చెర్రీ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేయగా.. రెజ్లర్ లుక్లో కనిపించిన ఆకట్టుకున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్పై టాలీవుడ్లో మాత్రం పెద్ద సస్పెన్స్ కొనసాగుతోంది. మరోసారి వాయిదా పడనుందని టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిర్మాత ఎస్కేఎన్ చేసిన కామెంట్స్ పెద్ది రిలీజ్ డేట్పై గందరగోళం క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆయన క్లారిటీ ఇచ్చారు.చెన్నై లవ్ స్టోరీ సాంగ్ ఈవెంట్లో మా సినిమా రిలీజ్ డేట్ గురించి చర్చించుకున్నామని ఎస్కేఎన్ తెలిపారు. అదే సందర్భంలో జూన్ 25న పెద్ది రిలీజ్ అవుతుందేమోనని సాయి రాజేశ్ అన్నారు. కానీ అక్కడ గందరగోళంలో పెద్ది రిలీజ్ అనౌన్స్ చేశారమో అనుకున్నానని వెల్లడించారు. నేను తప్పుగా అర్థం చేసుకుని అలా చెప్పా.. అంతేకానీ పెద్ది మూవీ రిలీజ్ వాయిదా అనేది అఫీషియల్గా రాలేదని చెప్పారు. నా కామెంట్స్ వల్ల చిన్న పొరపాటు జరిగిందని.. ఇలా అయినందుకు మీ అందరికీ సారీ అంటూ నిర్మాత ఎస్కేఎన్ క్లారిటీ ఇచ్చారు.కాగా.. రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో పెద్ది మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఓ సారి వాయిదా పడిన ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. Producer @SKNonline clarification regarding #Peddi release date which he announced at #ChennaiLoveStory song launch Event #KiranAbbavaram #SKN #Ramcharan pic.twitter.com/uDCbkinMbJ— Milagro Movies (@MilagroMovies) March 30, 2026 -
నా జీతం రూ.2700.. ఆల్టో కారు మాత్రమే తెలుసు: టాలీవుడ్ నిర్మాత
టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. లైఫ్ నా ఎదుగుదలకు సహకరించిన వారిని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. నాకు వెంటవెంటనే సినిమాలు చేయడం అలవాటు లేదన్నారు. 2012లో ఈ రోజుల్లో మూవీ, 2018లో టాక్సీవాలా, 2023లో బేబీ చేశానని తెలిపారు. నిర్మాత ఎక్కువ సినిమాలు చేయాలంటే నాకు భయమని వెల్లడించారు.నా కెరీర్ ప్రారంభంలో కేవలం రూ.2700 జీతానికి పని చేశానని ఎస్కేఎన్ తెలిపారు. నన్ను నిర్మాతగా తీర్చిదిద్దింది డైరెక్టర్ మారుతీ అని వెల్లడించారు. మారుతీ, స్వివ్ట్, ఆల్టో వంటి కార్లు తప్ప వేరే కార్ తెలీని నాకు బెంజ్ కార్ కొనుక్కునేలా చేసిన డైరెక్టర్ సాయి రాజేశ్ అని అన్నారు. వాడు లేకుండా నేను ఏది చేయను అని చెప్పే వాళ్లలో నా తమ్ముడు లాంటి వ్యక్తి రవి నంబూరి అని తెలిపారు. వీళ్లందరి సహకారం వల్లే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానని.. లేదంటే ఇలాంటి సినిమా థియేటర్లో టికెట్ కొనాలంటే కూడా ఆలోచించే కుటుంబం మాది అని అన్నారు. బేబీ సూపర్ హిట్ తర్వాత మరో సినిమాతో మీ ముందుకొస్తున్నామన్నారు. తాజాగా నిర్మించిన చెన్నై లవ్ స్టోరీ మూవీ ఈవెంట్లో ఎస్కేఎన్ మాట్లాడారు.కాగా.. కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటించిన లవ్స్టోరీ సినిమా చెన్నై లవ్ స్టోరీ. రవి నంబూరి దర్శకత్వంలో ఎస్కేఎన్ , సాయిరాజేశ్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలోని గుర్తుందా...అనే సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ సినిమాను డాల్బీ ఫార్మాట్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. -
ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది: కిరణ్
కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటించిన లవ్స్టోరీ సినిమా ‘చెన్నై లవ్ స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వంలో ఎస్కేఎన్ , సాయిరాజేశ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘గుర్తుందా...’ సాంగ్ లాంచ్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ–‘‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను డాల్బీ ఫార్మాట్లో చేస్తుండటం సంతోషంగా ఉంది. మణిశర్మగారు ఈ సినిమా కోసం ఏడు పాటలను కంపోజ్ చేశారు. ఈ సినిమా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అన్నారు.‘‘ఈ మూవీ డిస్కషన్స్ లో బ్రహ్మాండమైన ట్యూన్స్ కుదిరాయి’’ అని చెప్పారు సంగీత దర్శకుడు మణిశర్మ.‘‘ఈ సినిమా కోసం వంద రోజులు షూటింగ్ చేస్తున్నాం. మణిశర్మగారితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పారు రవి నంబూరి. ‘‘బేబీ’ సినిమాను ఐదు గంటలు తీశాను. కానీ, ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా నిడివిని కుదించడంలో రవి నంబూరి నాకు హెల్ప్ చేశాడు. సినిమాలో కొంత భాగం చూసి, కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. నేను ప్రోడ్యూసర్గా మణిశర్మగారితో సినిమా చేయడం కంటే ఇంకేం కోరుకోను’’ అన్నారు సాయిరాజేష్.‘‘ఖర్చు ఎక్కువైనా మంచి క్వాలిటీ కోసం డాల్బీలో ఈ సినిమాను చేస్తున్నాం అని చెప్పినప్పుడు అల్లుఅర్జున్ గారు కూడా ప్రోత్సహించారు’’ అన్నారు ఎస్కేఎన్ . ‘‘బేబి’ సినిమా కంటే పదిరెట్ల విజయాన్ని ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా సాధిస్తుంది. ఈ చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’’ అని చెప్పారు ఈ చిత్ర సహ–నిర్మాత ధీరజ్ మొగిలినేని. హీరోయిన్ శ్రీగౌరి ప్రియ, కెమెరామేన్ విశ్వాస్ డేనియల్, ఎడిటర్స్ సంతోష్ నాయుడు, విప్లవ్, నటుడు మహేందర్, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్, కొరియోగ్రాఫర్ విజయ్ పొలాకీ మాట్లాడారు. -
ప్రస్తుతం కోలీవుడ్.. ఊహించని డైరెక్టర్తో ఐకాన్ స్టార్..!
అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్ . ఈ చిత్రం తర్వాత మరో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించనున్న సినిమాలో నటిస్తారాయన. ఈ సినిమా షూటింగ్ను ఈ ఏడాదే ప్రారంభించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే మలయాళ దర్శకుడు, నటుడు బసిల్ జోసెఫ్ డైరెక్ట్ చేయనున్న సినిమాలో అల్లు అర్జున్ నటిస్తారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది.ఇటీవల జరిగిన అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ వివాహంలో బాసిల్ జోసెఫ్ కనిపించారు. దీంతో అల్లు అర్జున్ –బాసిల్ జోసెఫ్ కాంబినేషన్ లో మూవీ ఉంటుందన్న ఊహాగానాలకు బలం చేకూరినట్లు అయింది. బాసిల్తో అల్లు అర్జున్ చేయబోయేది ఓ సూపర్ హీరో మూవీ అని, అల్లు అర్జున్ కెరీర్లో ఇది 25వ సినిమాగా ఉంటుందని టాక్. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ మూవీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి: సోనమ్కపూర్
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఇంట సంతోషాలు రెట్టింపు అయ్యాయి. ఈ నెల 29న సోనమ్ కపూర్ పండంటి మగ శిశువుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించి, తన ఆనందాన్ని వ్యక్తం చేశారు సోనమ్. ‘‘ప్రేమతో నిండిన మా హృదయాలతో మా బాబు రాకను మేం ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నాం. మరో బిడ్డ రాకతో మా ఇంట ఆనందం వెల్లివిరిసింది. మా హృదయాలు మరింత సంతోషంతో నిండిపోయాయి.వాయు(పెద్ద కుమారుడు) తన తమ్ముడిని స్వాగతించడానికి ఆసక్తిగా ఉన్నాడు. నలుగురు ఉన్న కుటుంబంగా మా జీవితాల్లో మేం ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాం. అందరికీ కృతజ్ఞతలు.. ప్రేమతో సోనమ్, ఆనంద్, వాయు’’ అన్న నోట్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు సోనమ్ కపూర్. సోనమ్కపూర్ (నటుడు– నిర్మాత అనిల్ కపూర్ కుమార్తె) వివాహం వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజ తో 2018లో జరిగింది. ఈ దంపతులకు 2022లో కుమారుడు ‘వాయు’ జన్మించిన సంగతి తెలిసిందే. -
అక్కతో లావణ్య త్రిపాఠి.. ఎర్రచీరలో ఈషా రెబ్బా
అక్కకి బర్త్ డే విషెస్ చెప్పిన లావణ్యఎండలో చిల్ అయిపోతున్న పూజా హెగ్డేసెలయేరు దగ్గర ప్రియా వారియర్ హోయలుఅందంతో రచ్చ లేపుతున్న జోనితా గాంధీఎర్రచీరలో మెరిసిపోతున్న ఈషా రెబ్బాపింక్ డ్రస్లో క్యూట్గా రెబా మోనికా జాన్ View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Eeshaa Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Lavanya konidela Tripathi (@itsmelavanya) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by JONITA (@jonitamusic) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) -
'పెద్ది' మళ్లీ వాయిదా నిజమే.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా మరోసారి వాయిదా పడింది. మీరు విన్నది నిజమే. గత కొన్నిరోజుల నుంచి ఈ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. టీమ్ మౌనవ్రతం పాటిస్తుండగా.. అభిమానుల మాత్రం అలాంటిదేం ఉండదని అనుకున్నారు. కానీ ఇప్పుడు చిత్రబృందం ఏం చెప్పనప్పటికీ.. టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్, సోమవారం సాయంత్రం జరిగిన ఓ మూవీ ఈవెంట్లో మాట్లాడుతూ 'పెద్ది' కొత్త విడుదల తేదీని బయటపెట్టేశాడు.(ఇదీ చదవండి: తెలుగు సినిమా 'చైనా పీస్'పై కేంద్రం నిఘా?)మార్చి 27న చరణ్ పుట్టినరోజున 'పెద్ది' రిలీజ్ చేస్తామని తొలుత అనౌన్స్ చేశారు. తీరా డేట్ దగ్గరపడేసరికి ఏప్రిల్ 30న వస్తామని అన్నారు. కానీ ఐటమ్ సాంగ్తో పాటు మరో పాట షూటింగ్ పెండింగ్లో ఉండటం, ఈ మధ్యే చరణ్ కంటికి గాయం కావడం తదితర అంశాలతో చెప్పిన తేదీకి రావడం కష్టమే అని అంతా భావించారు. ఇప్పుడు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించడానికి ముందే లీకులు వచ్చేస్తున్నాయి.జూన్ 25న 'పెద్ది' సినిమా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఇది రిలీజ్ అవుతుందని అఖిల్ 'లెనిన్'ని జూన్ 26కి వాయిదా వేశారు. మరి 'పెద్ది' తప్పుకొంది కాబట్టి 'లెనిన్'.. ముందే చెప్పినట్లు మే 1న థియేటర్లలోకి వస్తాడా లేదంటే మరో తేదీ చూసుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.'పెద్ది' తప్పుకొంటే అదే తేదీకి వచ్చేయాలని నిఖిల్ 'స్వయంభు' సినిమాతో సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు అదే టైంలో తరుణ్ భాస్కర్ 'గాయపడ్డ సింహం', ధనుష్ 'కర'తో పాటు పలు చిత్రాలు లైనులో ఉన్నాయి. ఇప్పుడు ఇంకెన్ని అదే తేదీని టార్గెట్ చేసుకుంటాయో చూడాలి? ఈ వేసవిలో స్టార్ హీరోల సినిమాలేం లేవు. ఇప్పుడు 'పెద్ది' కూడా తప్పుకొంది. దీంతో ఈసారి కూడా స్టార్స్ లేకుండానే సమ్మర్ ఉండబోతుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
తెలుగు సినిమా 'చైనా పీస్'పై కేంద్రం నిఘా?
ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలతో వార్తల్లో నిలుస్తూ వచ్చిన టాలీవుడ్.. ఇప్పుడు అనుకోని విధంగా ఓ జియో పొలిటికల్ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీనికి 'చైనా పీస్' అనే తెలుగు మూవీ కారణం. ఈ చిత్రాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపినట్లు వార్తలొస్తున్నాయి. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో సాగే కథాంశం ఇందులో ఉండటమే ఇంత రచ్చ జరగడానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. బాలీవుడ్లో రీసెంట్గా వచ్చిన 'ధురంధర్', త్వరలో రాబోతున్న సల్మాన్ ఖాన్ 'మాతృభూమి' కూడా ఈ తరహా కాన్సెప్ట్లతోనే తీశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)యుద్ధ నేపథ్యంలో ఉండే భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే సాధారణంగా విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి వెళ్తుంటాయి కానీ పెద్దగా ప్రచారం లేని ఓ తెలుగు మూవీ ఈ రేంజ్లో హైలైట్ కావడంతో.. అందులో కంటెంట్ ఏంటనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. సరిహద్దు వివాదాలు లేదా అంతర్జాతీయ సంబంధాలకు భంగం కలిగించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్లో ఇలా ఓ సినిమా.. జియో పొలిటకల్ వివాదంలో ఇరుక్కోవడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు.ఈ సినిమా కేవలం యాక్షన్ డ్రామానా? లేక భారతదేశం- ఇతర దేశాల మధ్య ఉన్న రహస్య దౌత్య సంబంధాలను ఏమైనా టచ్ చేసిందా? అనేది తెలియాల్సి ఉంది. ఇదంతా చూస్తుంటే దీని వెనుక ఏదో పెద్ద కథే ఉందని ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది.కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నుంచి వచ్చే క్లియరెన్స్పై ఈ చిత్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.(ఇదీ చదవండి: సైలెంట్గా పెళ్లి చేసుకున్న హీరోయిన్) -
ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
హీరోయిన్లు వయసు అయిపోయిన తర్వాత సహాయ పాత్రలు చేస్తూ కాలం గడిపేస్తుంటారు. ఒకప్పటి హీరోయిన్ రాధిక కూడా అలానే తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తోంది. ఈమెని ప్రధాన పాత్రలో పెట్టి, తమిళ హీరో శివకార్తికేయన్ ఓ చిత్రాన్ని నిర్మించాడు. ఊహించని విధంగా బ్లాక్బస్టర్ అయింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి శివాజీ-లయ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)రాధిక.. వృద్ధురాలిగా నటించిన సినిమా 'తాయ్ కిళవి'. ఫిబ్రవరి 27న తమిళంలో మాత్రమే థియేటర్లలో రిలీజైంది. మంచి టాక్తో పాటు అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకుంది. లాంగ్ రన్లో రూ.80 కోట్ల వరకు వసూళ్లు దక్కించుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 10 నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.'తాయ్ కిళవి' విషయానికొస్తే.. కోపం ఎక్కువగా ఉండే ఓ బామ్మ(రాధిక), ఊరిలో అందరికీ డబ్బులు వడ్డీలకు ఇస్తూ కాలం వెల్లదీస్తుంటుంది. ముక్కుసూటిగా మాట్లాడటం, తేడా వస్తే చితక్కొట్టేయడం ఈమెకు అలవాటు. తన ముగ్గురు కొడుకులకు బాధ్యత లేకపోవడంతో వాళ్లని ఇంటి నుంచి గెంటేస్తుంది. అయితే ఈమె దగ్గర బంగారు నిధి ఉందనే ప్రచారం ఒకటి మొదలవుతుంది. మరోవైపు హఠాత్తుగా పక్షవాతం వచ్చేసరికి ఈమెకు మాట పడిపోతుంది. దీంతో కొడుకులు తిరిగి ఈమె దగ్గరకొస్తారు. వాళ్లకు సైగ ద్వారా ఏదో చెప్పాలనే ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతకీ అదేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: సైలెంట్గా పెళ్లి చేసుకున్న హీరోయిన్) View this post on Instagram A post shared by JioHotstar Tamil (@jiohotstartamil) -
హీరో వెంకట్ 'హరుడు' రిలీజ్ ఎప్పుడంటే?
శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు తదితర సినిమాలతో అప్పట్లో సక్సెస్ అందుకున్న హీరో వెంకట్.. తర్వాత అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉన్నాడు. గతేడాది రిలీజైన 'ఓజీ'లోనూ పవన్ కల్యాణ్కి అన్నగా నటించాడు. ఇతడు హీరోగా చేసిన 'హరుడు' సినిమా విడుదలకు సిద్ధమైంది.(ఇదీ చదవండి: సైలెంట్గా పెళ్లి చేసుకున్న హీరోయిన్)రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు డాక్టర్.దిక్కల లక్ష్మణ్ రావు, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేశారు. తాజాగా మే 8న చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. హెబ్బా పటేల్ , సలోని , నటషా , అలీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.(ఇదీ చదవండి: తెలుగు వాళ్లకు ఈ సినిమా నచ్చితే రూ.1000 కోట్లు) -
సంగీత రంగంలో కొత్త ప్రభంజనం 'కార్మేని సెల్వం'
అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వం వహించిన ద్విభాషా సినిమా 'కార్మేని సెల్వం'. సముద్రఖని, గౌతమ్ మేనన్ ప్రధాన పాత్రలు చేసిన ఈ చిత్రం.. ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. మ్యూజిక్ యాజ్ ఏ సర్వీస్ అంటూ మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ పేరుతో రామానుజన్ ఎంకే ఈ మూవీకి సంగీతమందించారు. ఇప్పటికే విడుదలైన 'అరెరె' పాట ఆకట్టుకుంటోంది. త్వరలో సినిమా థియేటర్లలోకి రానున్న సందర్భంగా సంగీతం దర్శకుడు రామానుజన్ ఎంకే చిత్ర విశేషాలని పంచుకున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి శివాజీ-లయ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)సినిమాకు సంగీతమందించిన ఘనత ఒక్క వ్యక్తికి కాకుండా, ఓ సంస్థకు దక్కాలని కోరుకున్నాం. అందుకే 2017లో బెంగళూరులో 'Musicloud Studio & Technology'ని ప్రారంభించాను. ప్రస్తుతం 'కార్మేని సెల్వం' ప్రాజెక్టు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సినిమాకు సంగీతం దర్శకుడి పేరు కాకుండా (మ్యూజిక్ యాజ్ ఏ సర్వీస్) మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ పేరును ప్రకటించాం. ప్రస్తుతం సినిమా నిర్మాణ వ్యయం రోజురోజుకూ పెరిగిపోతోంది. మంచి కథాంశాలను ప్రోత్సహించాలంటే, నిర్మాణ వ్యయాన్ని తప్పనిసరిగా తగ్గించాల్సి ఉంది. ఆ దిశగా అడుగులు వేయడానికి ఉన్న మార్గాలలో ఒకటి సంగీత నిర్మాణానికి అయ్యే ఖర్చును తగ్గించాలనుకుని ఈ చిత్రం విషయంలో ఇలా ప్లాన్ చేశాం.ఇందులో భాగంగా సౌండ్ ఇంజనీర్లు, వాయిద్య కారులు, ప్రోగ్రామర్లు సహా ఈ ప్రక్రియలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ రాయల్టీలో వాటా లభిస్తుంది. మేం సంగీత నిర్మాణానికి ఒక కార్పొరేట్ నిర్మాణాన్ని తీసుకు వస్తున్నాం. సినీ సంగీత రంగంలో ఇదొక కొత్త ప్రభంజనం అనుకోవచ్చు. తెలుగులో హ్యాపీ డేస్, ఆనంద్, గోదావరి లాంటి ఫీల్ గుడ్ సినిమాలకు మ్యూజిక్ చేయాలని ఉంది. కార్మేని సెల్వం.. హృదయానికి హత్తుకునే సినిమా. మన జీవితంలో ఎదురయ్యే భావోద్వేగాలను ప్రతిబింబిస్తుంది అని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: సైలెంట్గా పెళ్లి చేసుకున్న హీరోయిన్) -
సైలెంట్గా పెళ్లి చేసుకున్న హీరోయిన్
హీరోయిన్గా తమిళంలో సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ జనని అయ్యర్ (Janani Iyer) ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. గతేడాది ఏప్రిల్లో నిశ్చితార్థం చేసుకోగా.. దాదాపు పదకొండు నెలల తర్వాత ఇప్పుడు పైలట్ సాయి రోషన్తో ఏడడుగులు వేసింది. తమిళ సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని జనని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి శివాజీ-లయ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)2011లో వచ్చిన విశాల్-ఆర్య 'వాడు-వీడు' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన జనని.. తర్వాత మలయాళ, తమిళంలో వరస మూవీస్ చేస్తూనే ఉంది. చివరగా 2024లో 'హాట్ స్పాట్'లో ఓ కథానాయికగా నటించింది. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు చిత్రాలున్నాయి. అలానే తమిళ బిగ్బాస్ రెండో సీజన్లోనూ పార్టిసిపేట్ చేసింది గానీ 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇప్పుడు పెళ్లి చేసుకుంది. తర్వాత కూడా నటిగా కొనసాగుతుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: తెలుగు వాళ్లకు నచ్చితే ఈ సినిమాకు రూ.1000 కోట్లు) -
తెలుగు వాళ్లకు ఈ సినిమా నచ్చితే రూ.1000 కోట్లు
సినిమా నటీనటులు కొన్నిసార్లు మాట్లాడే మాటలు అతిశయోక్తిలా అనిపిస్తుంటాయి. ఆ విషయం వాళ్లకు కూడా తెలుసు. అయినా సరే హీరోలని పొగిడే క్రమంలో ఇలాంటి చిత్రవిచిత్రమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పుడు ఫేమస్ కమెడియన్ ఇలాంటి కామెంట్స్ చేశాడు. ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి శివాజీ-లయ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)తమిళనాడులో వస్త్రదుకాణాలతో గుర్తింపు తెచ్చుకున్న శరవణనన్.. నాలుగేళ్ల క్రితం 'లెజెండ్' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సదరు హీరో యాక్టింగ్పై అప్పట్లో విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. ఇప్పుడు 'లీడర్' అనే మూవీతో వస్తున్నాడు. ఏప్రిల్ 3న తెలుగు, తమిళంలో థియేటర్లలో రిలీజ్ కానుంది. దీని ఆడియో-ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం చెన్నైలో జరిగింది. ఇందులోనే కమెడియన్ వీటీవీ గణేశ్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా గనక నచ్చితే సులభంగా రూ.1000 కోట్లు వచ్చేస్తాయని అనడం చిత్రంగా అనిపించింది.రజనీకాంత్, విజయ్ లాంటి స్టార్ హీరోలే ఇప్పటివరకు రూ.1000 కోట్ల మార్క్ని అందుకోలేకపోయారు. అలాంటిది లెజెండ్ శరవణనన్ సినిమాకు ఇన్ని కోట్ల వసూళ్లు వస్తాయని కమెడియన్ పొగడటం కాస్త అతిలా ఉంది. దీని గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వస్తున్నాయి. తొలి చిత్రంతో తీవ్రంగా నష్టపోయిన శరవణనన్.. ఈసారి 'లీడర్'తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. ఇందులో పాయర్ రాజ్పుత్ హీరోయిన్ కాగా ఆండ్రియా, శ్యామ్, లాల్ తదితర స్టార్స్ ఉన్నారు. (ఇదీ చదవండి: రూమర్స్ నిజమయ్యాయి.. తెలుగు దర్శకుడితోనే సల్మాన్) -
ప్రభాస్, మహేశ్, తారక్ సినిమాలు చూస్తా.. అవన్నీ కూడా!
స్టార్ హీరోయిన్ రవీనా టండన్ కూతురు రాషా తడానీ అప్పుడే పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. చేసింది ఒక్క సినిమా (ఆజాద్)నే అయినా ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఆజాద్ మూవీలో ఉయి అమ్మా పాటలో డ్యాన్స్తో ఇరగదీసి సెన్సేషన్ అయింది. ఈ బ్యూటీ శ్రీనివాస మంగాపురం మూవీతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. సూపర్స్టార్ కృష్ణ నటవారసత్వాన్ని కొనసాగిస్తూ ఘట్టమనేని జయకృష్ణ (రమేశ్బాబు తనయుడు) వెండితెరకు హీరోగా పరిచయం కాబోతున్నాడు.సౌత్ సినిమాలంటే ఇష్టంఈ మూవీలో రాషా తడానీ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. నాకు దక్షిణాది సినిమాలు చూడటమంటే చాలా ఇష్టం. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్బాబు.. ఇలా అందరి సినిమాలు చూస్తుంటాను. వాళ్ల సినిమాలన్నీ కొత్త అనుభూతినిస్తాయి. ఇప్పుడదే ఇండస్ట్రీలో భాగం కావడం సంతోషంగా ఉంది. దీన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను.హీరోయిన్స్ కూడా..హీరోలే కాదు, అక్కడ హీరోయిన్స్ రష్మిక మందన్నా, శ్రీలీల.. ఇలా అందరూ స్ఫూర్తిదాయకంగా ఉంటారు. అలాంటి సినీ ప్రపంచంలో భాగమయ్యే అవకాశం లభించినందుకు గర్వంగా ఉంది. నా జర్నీ చక్కగా ముందుకు సాగుతుందనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. శ్రీనివాస మంగాపురం విషయానికి వస్తే.. ఆర్ఎక్స్ 100, మంగళవారం ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది. మరోవైపు రాషా.. లైకే లైకా అని ఓ హిందీ మూవీ కూడా చేస్తోంది.చదవండి: బాలీవుడ్ అంటే భయపడుతున్న నాగచైతన్య? నిజమిదే! -
రూమర్స్ నిజమయ్యాయి.. తెలుగు దర్శకుడితోనే సల్మాన్
స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హవా బాలీవుడ్లో చాన్నాళ్ల నుంచి తగ్గుతూ వస్తోంది. దాదాపు సరైన హిట్ కొట్టి పదేళ్లవుతోంది. గతేడాది 'సికందర్' అనే మూవీతో వచ్చాడు. ఘోరమైన డిజాస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం 'మాతృభూమి' అనే దేశభక్తి సినిమా చేస్తున్నాడు. దీనిపైనే ఎవరికి పెద్దగా నమ్మకాల్లేవు. అలాంటిది ఇప్పుడు తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో జట్టుకట్టాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.(ఇదీ చదవండి: విషాదం.. సముద్రంలో పడిపోయి హీరో కన్నుమూత)మున్నా, బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి, వారిసు (వారసుడు) సినిమాలతో ఓ మాదిరి హిట్స్ కొట్టిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి.. మూడేళ్ల తర్వాత ఇప్పుడు కొత్త సినిమాని ప్రకటించాడు. సల్మాన్ ఖాన్తో కలిసి పనిచేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఏప్రిల్ రెండో వారం నుంచి షూటింగ్ కూడా మొదలు కానుంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇందులోనే నయనతార హీరోయిన్ అని అంటున్నారు కానీ క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి శివాజీ-లయ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన) View this post on Instagram A post shared by Vamshi Paidpally (@directorvamshi) -
ఓటీటీలోకి శివాజీ-లయ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
నోరు జారిన కారణంగా రీసెంట్ టైంలో పలు వివాదాల్లో ఇరుక్కున్న నటుడు శివాజీ.. గతేడాది 'కోర్ట్' మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ కాస్త బిజీగానే ఉన్నాడు. లేటెస్ట్గా ఈయన ఓ చిత్రాన్ని నిర్మించి అందులో లీడ్ రోల్ చేశారు. లయ జంటగా నటించింది. ఈ సినిమా ఇప్పుడు నెల తిరిగేసరికల్లా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఎందులో రానుంది?(ఇదీ చదవండి: విషాదం.. సముద్రంలో పడిపోయి హీరో కన్నుమూత)సుధీర్ శ్రీరామ్ దర్శకుడిగా శివాజీ-లయ జంటగా నటించిన 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' సినిమాని తొలుత ఓటీటీ కోసమే తీశారు. కానీ ఏమైందో ఏమో ఈ నెల 6న థియేటర్లలో రిలీజ్ చేశారు. తొలి ఆట నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది. అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ శుక్రవారం(ఏప్రిల్ 03) నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' విషయానికొస్తే.. శ్రీరామ్ (శివాజీ) పంచాయతీ కార్యదర్శి. హర్స్లీ హిల్స్లో భార్య ఉత్తర(లయ), కొడుకు బిట్టు(రోహన్)తో కలిసి జీవిస్తుంటాడు. దీపావళి నాడు వీళ్ల ఇంటికి ఎస్సై విక్రమ్ వాసుదేవ్(ప్రిన్స్) వస్తాడు. ఇతడికి ఆడవాళ్ల పిచ్చి. శ్రీరామ్ ఇంట్లో లేడని తెలిసి ఉత్తరపై బలత్కారం చేయబోతాడు. అనుకోని విధంగా బిట్టు చేతిలో ఎస్సై హత్యకు గురవుతాడు. తర్వాత ఏమైంది? హత్య కేసు నుంచి శ్రీరామ్ తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'ప్రేమిస్తే' ఆడిషన్కు గ్రీజు పూసుకుని వెళ్లా..) -
ఫస్ట్ది అట్టర్ ఫ్లాప్.. అందుకే హిందీలో సినిమా చేయట్లేదా? చై ఆన్సరిదే!
టాలీవుడ్ హీరో నాగచైతన్య చివరగా తండేల్ సినిమాతో భారీ హిట్ కొట్టాడు. ప్రస్తుతం వృషకర్మ మూవీతో బిజీగా ఉన్నాడు. అయితే టాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన లాల్ సింగ్ చద్దా (2022) మూవీతో బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఆమిర్ ఖాన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత మళ్లీ హిందీ సినిమా ట్రై చేయలేదు చై.కారణమంటూ ఏం లేదుబాక్సాఫీస్ వైఫల్యం వల్లే అతడు మళ్లీ హిందీ సినిమా చేయడానికి భయపడుతున్నాడని ప్రచారం జరిగింది. దానిపై నాగచైతన్య తాజాగా స్పందించాడు. అతడు మాట్లాడుతూ.. నేను హిందీలో మళ్లీ మూవీ చేయకపోవడానికి ప్రత్యేక కారణమంటూ ఏదీ లేదు. తెలుగులో బిజీ అయిపోయానంతే! మళ్లీ మంచి అవకాశం వస్తే తప్పకుండా బాలీవుడ్లో యాక్ట్ చేస్తాను. లాల్ సింగ్ చద్దా వైఫల్యం వల్ల మాత్రం నేను వెనకడుగు వేయలేదు. చాలా ఎంజాయ్ చేశాఆ మూవీ షూటింగ్ నేను చాలా ఎంజాయ్ చేశాను. అక్కడి జనం దగ్గరినుంచి ఎంతో నేర్చుకున్నాను, వాళ్లు నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఆ అనుభవం మాటల్లో చెప్పలేను. ఇక సినిమా రిజల్ట్ అంటారా? బాక్సాఫీస్ వద్ద ఒడిదుడుకులు సహజం అని అర్థం చేసుకునేంత పరిణతి మాకుందని భావిస్తున్నాను. ఈ ఫలితాలు మా లక్ష్యసాధనను ఏమాత్రం అడ్డుకోలేవు. సక్సెస్, ఫెయిల్యూర్ నా మైండ్సెట్ను మార్చలేవు అని నాగచైతన్య పేర్కొన్నాడు.చదవండి: అది నిజం కాదు, ఎవరూ నమ్మకండి: ఖుష్బూ -
ఇండస్ట్రీలో ఆయన లేని లోటు కనిపిస్తోంది.. హేమ ఆవేదన
టాలీవుడ్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో తన గురించి తెలిసి కూడా అలా రాశారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసులో తనకు పాజిటివ్ అని రాకుండానే.. వచ్చిందని ప్రచారం చేశారని ఆరోపించింది. ఇదంతూ చూస్తుంటే ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు గారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది. చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెరిగానని.. నేను మీ అందరికీ తెలుసు కదా అని ప్రశ్నించింది. నాకు కూడా ఫ్యామిలీ ఉందని.. మా బాధలు అర్థం చేసుకోవాలని మీడియాకు విజ్ఞప్తి చేసింది. ఏదైనా నిర్ధారణ అయ్యాకే రాయాలని హేమ సూచించింది. నా బాధను ఎందుకు అర్థం చేసుకోరని అన్నారు. సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమపై గతేడాది డ్రగ్స్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో హేమ జైలుకు కూడా వెళ్లి వచ్చింది. కానీ ఆ తర్వాత ఈ కేసును కర్ణాటక హైకోర్టు పూర్తిగా కొట్టివేసింది. అయితే తనపై కేసు నమోదైనప్పుడు మీడియాలో చాలా వార్తలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది. మరి అదే కేసును కోర్టు కొట్టివేసినప్పుడు మాత్రం తక్కువమంది మాత్రమే రాశారని తెలిపింది. -
అది నిజం కాదు, ఎవరూ నమ్మకండి: ఖుష్బూ
చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా అంటే తమను జనాలతో కలిపే వారధిగా భావిస్తారు. వ్యక్తిగత, వృత్తిపర విషయాలను పంచుకుంటూ ఉంటారు. మరికొందరు ఎప్పుడో ఒకసారి కానీ పోస్టులు పెట్టరు. అయితే సెలబ్రిటీల పేరుతో కొందరు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తుంటారు. ఇప్పుడదే జరిగింది. ఎక్స్ (ట్విటర్)లో ఖుష్బూ భర్త, దర్శకుడు సుందర్ సి పేరిట ఓ అకౌంట్ ఉంది. త్వరలోనే కొత్తది..దానికి సంబంధించిన స్క్రీన్షాట్ను ఖుష్బూ షేర్ చేస్తూ.. అది ఫేక్ అకౌంట్ అని స్పష్టం చేసింది. తన భర్త ఎటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో లేడని వెల్లడించింది. కాబట్టి సుందర్.సి పేరుపై కనిపించే ఖాతాలను నమ్మవద్దని కోరింది. త్వరలోనే అతడికి ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేయనున్నట్లు తెలిపింది. ఇకపోతే ఒకప్పుడు హీరోయిన్గా అలరించిన ఖుష్బూ.. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంది. మొదట్లో డీఎంకేలో చేరింది. నాలుగేళ్లకే ఆ పార్టీని వదిలి కాంగ్రెస్లో అడుగుపెట్టింది. రాజకీయ ప్రవేశంఆరేళ్లకే కాంగ్రెస్ను సైతం వీడి బీజేపీలో చేరింది. 2025లో ఆమె తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితురాలైంది. ఇదిలా ఉంటే త్వరలో ఎన్నికలు రానున్న తరుణంలో ఖుష్బూ భర్త సుందర్. సి రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది. ఎన్డీయే కూటమి మిత్రపక్షమైన పుతియ నీది కట్చి (Puthiya Neethi Katchi (PNK) పార్టీ నుంచి అసెంబ్లీ బరిలో దిగుతున్నాడు. మధురై నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నాడు. This is a fake account of Director #SundarC . He is not not any social media platform as on date. Pls do not follow this or interact on this or any other similar account on any social platform. . Shall be creating a new and verified account for him soon. 🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/9P1VYV67U7— KhushbuSundar (@khushsundar) March 30, 2026 చదవండి: ప్రేమిస్తే ఛాన్స్ మిస్ అయ్యేది.. ముఖానికి గ్రీజు పూసుకోవడంతో..: హీరో -
హనీ రోజ్కు చేదు అనుభవం.. అసభ్యంగా తాకుతూ..!
మలయాళ బ్యూటీ హనీ రోజ్కు చేదు అనుభవం ఎదురైంది. కేరళలోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్కు వెళ్లిన ఆమెతో కొందరు అసభ్యంగా ప్రవర్తించారు. షాపింగ్ మాల్ దగ్గర హీరోయిన్తో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. వారితో సెల్ఫీ దిగే సమయంలో ఒకరు ఆమె నడుముపై చేతులు వేస్తూ కనిపించారు. దీంతో అసౌర్యానికి గురైన హనీ రోజ్ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారి తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. సెలబ్రిటీలను అలా వేధించడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హనీ రోజ్ సినిమా కెరీర్..ఈ మలయాళ బ్యూటీ 2008లో ఆలయం సినిమాతో తెలుగువారికి పరిచయమైంది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా (2014) చిత్రంలో నటించింది. దాదాపు దశాబ్దకాలం గ్యాప్ ఇచ్చాక వీరసింహారెడ్డితో మెరిసింది. ఈ చిత్రంతోనే హనీరోజ్ టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. నటి హాని రోజ్ కు చేదు అనుభవం..నడుమును తాకుతూ..కేరళంలో నిన్న జరిగిన ఓ షాపింగ్మాల్ ఓపెనింగ్ వేడుకలో నటి హనీరోజ్కు చేదు అనుభవం ఎదురైంది. ఆమెతో సెల్ఫీ దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. కొందరు అత్యుత్సాహంతో సెల్ఫీ తీసుకుంటుండగా ఆమె నడుమును తాకుతూ ఇబ్బంది పెట్టారు. దీంతో హనీరోజ్… pic.twitter.com/MlL4PriZHo— Sakshi (@SakshiNews) March 30, 2026 -
'ప్రేమిస్తే' ఆడిషన్కు గ్రీజు పూసుకుని వెళ్లా.. అప్పుడుకానీ..!
తమిళ హీరో భరత్.. బాయ్స్, ప్రేమిస్తే, స్పైడర్, హంట్ సినిమాలతో తెలుగువారికి సుపరిచితుడు. ప్రస్తుతం ఇతడు 'కాళిదాస్ 2' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన అతడు కెరీర్ తొలినాళ్లలో ఎదురైన ఓ అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు. భరత్ మాట్లాడుతూ... దర్శకుడు బాలాజీ శక్తివేల్ నాకు కాదల్ (తెలుగులో ప్రేమిస్తే పేరిట డబ్ అయింది) కథ చెప్పాడు. హీరో ఎంపిక కరెక్టేనా?చిన్న టౌన్లో మెకానిక్ పనిచేసుకునే అబ్బాయిగా నటించాల్సి ఉంటుందని పాత్ర పరిచయం చేశాడు. నేను కూడా ఒప్పుకున్నాను. తీరా దర్శకుడు హీరోగా నేను కరెక్టేనా? అన్న డైలమాలో పడ్డాడు. నా రంగు, మాటతీరు.. అన్నీ సిటీ అబ్బాయి లక్షణాలే ఉన్నాయి.. పక్కా పల్లెటూరి భాష మాట్లాడే మెకానిక్ రోల్కు సెట్ అవుతానా? లేదా? అన్న అనుమానం ఆయన మెదడును తొలిచేసింది.అదే వీధిలో ఇల్లు కొన్నా..నేనేమో ఎలాగైనా ఈ సినిమా చేయాలనుకున్నాను. ముఖానికి గ్రీజు పూసుకుని ఆడిషన్కు వెళ్లాను. పైగా దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. వారిలాగే మాట్లాడాను. నా తాపత్రయం నిర్మాత ఎస్.శంకర్కు అర్థమైంది. ఆయన ఆఫీసులోనే స్క్రీన్ టెస్ట్ చేసి ఫైనల్ చేశారు. అలా కాదల్ మూవీ చేయగా, మంచి గుర్తింపు లభించింది. తర్వాత ఆ ఆఫీస్ ఉన్న వీధిలోనే నేను ఇల్లు కొనుక్కున్నాను. అదెంతో గర్వకారణంగా అనిపించింది అని భరత్ చెప్పుకొచ్చాడు.చదవండి: నేను సినిమాలు చూడను: ఆమిర్ ఖాన్ -
విజయ్ దేవరకొండ మూవీలో సారా అర్జున్ తండ్రి.. ఏ సినిమానో తెలుసా?
'నాన్న', 'పొన్నియన్ సెల్వన్' సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన సారా అర్జున్. 'ధురంధర్' సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. తన తొలి సినిమాకే ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇందులో 40 ఏళ్ల హీరో రణ్వీర్ సింగ్కు జంటగా నటించింది. కేవలం 20 ఏళ్ల సారా అర్జున్ తన గ్లామర్తో అభిమానులను మెప్పించింది. ఆ తర్వాత తెలుగులోనూ యూఫోరియా మూవీతో అలరించింది.ప్రస్తుతం సారా నటించిన దురంధర్-2 థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో సారా అర్జున్ గురించి తెగ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సారా అర్జున్కు సంబంధించిన ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆమె తండ్రి రాజ్ అర్జున్ సైతం తెలుగు సినిమాల్లో నటించడం విశేషం.విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన డియర్ కామ్రేడ్ మూవీలో క్రికెట్ సెలక్టర్ రమేశ్ రావు పాత్రలో మెప్పించారు. అంతేకాకుండా గతేడాది రిలీజైన రజాకార్ చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆయన కుమార్తె సారా అర్జున్ సైతం తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. 2002లో కంపెనీ అనే మూవీతో అరంగేట్రం రాజ్ అర్జున్ దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించారు. సీక్రెట్ సూపర్స్టార్ అనే చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనే ఫేవరేట్ హీరో..గతంలో యూఫోరియా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్కు హాజరైన సారా అర్జున్ తెలుగులో నటించడం చాలా గర్వంగా ఉందని చెప్పింది. టాలీవుడ్లో మీ ఫేవరేట్ హీరో ఎవరని యాంకర్ ప్రశ్నించింది. దీనికి బదులిస్తూ తెలుగులో చాలామంది హీరోలు ఉన్నారని.. కానీ నాకు మాత్రం విజయ్ దేవరకొండ ఫేవరేట్ అని బాలీవుడ్ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ఆమె తండ్రి రాజ్ అర్జున్ డియర్ కామ్రేడ్లో నటించడం వల్లే సారా అర్జున్ తన ఫేవరేట్ హీరో అని చెప్పుకొచ్చింది. -
సినిమాలు చూసే అలవాటు లేదు.. ఇంట్లో ఒప్పుకోరు!: ఆమిర్ ఖాన్
తాను పెద్దగా సినిమాలు చూడనంటున్నాడు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్. చిన్నప్పుడు చేతికి పుస్తకాలిచ్చేవారే తప్ప సినిమాలు చూసేందుకు అనుమతిచ్చేవారు కాదని, దాంతో అదే అలవాటైపోయిందని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. నేను చాలా సాంప్రదాయ కుటుంబంలో పెరిగాను. మా అమ్మానాన్న చాలా స్ట్రిక్ట్.. సినిమాలు చూసేందుకు అంతగా అనుమతిచ్చేవారు కాదు. అమ్మ అనుమతితోనే..దాంతో పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేసేవాడిని. కేవలం దూరదర్శన్లో వచ్చిన బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, మరీ పాత సినిమాలు మాత్రమే చూశాను. ఎప్పుడైనా సినిమా చూడాలనుకుంటే మా అమ్మను అనుమతి అడిగేవాడిని. తను ఓకే చెప్తేనే చూసేదాన్ని, లేదంటే లేదు. అయితే రొమాంటిక్ సినిమాలు చూడటం మాత్రం నిషిద్ధం. కేవలం వారాంతాల్లో మూవీస్ చూసేవాడిని.సినిమాలు చూడనుఅయితే విచిత్రంగా 18 ఏళ్లకే నేను సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. అసిస్టెంట్గా కెరీర్ ప్రారంభించి తర్వాత హీరోగా మారాను. అయితే ఇప్పటికీ నేను పెద్దగా సినిమాలు చూడను. ఫన్నీగా చెప్పాలంటే.. కొందరికి ఫుట్బాల్ ఆడటం ఇష్టం, మరికొందరికి చూడటం ఇష్టం. అలా నేను సినిమాలు చేస్తాను, కానీ చూడను. ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన సినిమాలేవీ చూడలేదు. నా ప్రపంచంలో నేను బతికేస్తుంటాను అని చెప్పుకొచ్చాడు.సినిమాఇకపోతే ఆమిర్ చివరగా సితారే జమీన్ పర్ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం నిర్మాతగా ఏక్ దిన్, లాహోర్ 1947 అని రెండు సినిమాలు చేస్తున్నాడు. ఏక్ దిన్లో.. ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటించగా సాయిపల్లవి కథానాయికగా కనిపించనుంది. ఇది వన్ డే అనే థాయ్ చిత్రానికి రీమేక్గా తెరకెక్కింది. ఏక్ దిన్ మే 1న విడుదల కానుంది.చదవండి: ధురంధర్ రికార్డు బ్రేక్ చేసిన ధురంధర్ 2 -
నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం
నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి సువర్ణలత (86) తుదిశ్వాస విడిచారు. ఈరోజు సాయంత్రం బెంగుళూరులో ఆమె అంత్య క్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలంగా వయోభార సమస్యలతో బాధపడుతోన్న ఆమె ఇవాళ ఉదయం బెంగళూరులోని స్వగృహంలో కన్నుమూశారు.ప్రకాశ్ రాజ్ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడకు చెందిన ప్రకాశ్ రాజ్ తెలుగులోనే ఎక్కువ సినిమాల్లో నటించారు. విలక్షణమైన పాత్రలతో ఆడియన్స్ను ఆకట్టుకున్నారు. ప్రకాశ్ రాజ్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తోన్న స్పిరిట్ మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. -
విషాదం.. సముద్రంలో పడిపోయి హీరో కన్నుమూత
బెంగాలీ చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. హీరో రాహుల్ అరుణోదయ్ బెనర్జీ (42) ప్రమాదవశాత్తూ మరణించారు. సీరియల్ షూటింగ్ కోసం ఆదివారం (మార్చి 29) నాడు పశ్చిమ బెంగాల్లోని డిఘ ప్రాంతానికి వెళ్లిన ఆయన చిత్రీకరణ ముగిశాక కాలక్షేపం కోసం ఒంటరిగా సముద్రంలో విహారానికి వెళ్లారు. అయితే పడవలో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయారు. బీచ్లో విషాదంఅది గమనించిన రక్షణా సిబ్బంది వెంటనే ఆయన్ను బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఒడిశా- పశ్చిమ బెంగాల్ సరిహద్దుకు సమీపంలోని తల్సారి బీచ్లో ఈ విషాద ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. కాగా రాహుల్ బెనర్జీకి భార్య ప్రియాంక సర్కార్, ఒక కుమారుడు ఉన్నారు.ఇండస్ట్రీకి తీరని లోటుహీరో మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాకు ఇష్టమైన నటుల్లో రాహుల్ ఒకరు.. ఆయన ఇక లేరనే వార్త నన్ను షాక్కు గురి చేసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. తన మరణం బెంగాలీ చిత్రపరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు.సినిమారాహుల్ అరుణోదయ్ బెనర్జీ (Rahul Arunoday Banerjee) 1983 అక్టోబర్ 16న జన్మించారు. చిరోదిని తుమీ జే అమర్ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. లవ్ సర్కస్, షోనో మోన్ బోలీ తోమయ్, నా హణ్యతే, కగోజెర్ బో వంటి పలు సినిమాలు చేశారు. సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకూ దగ్గరయ్యారు.చదవండి: ఓపక్క షూటింగ్.. మరోపక్క భార్య కోసం ఆరాటం -
దురంధర్-2 మరో రికార్డ్.. కేవలం 11 రోజుల్లోనే బ్రేక్..!
బాలీవుడ్ మూవీ దురంధర్-2 బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఇప్పటికే పలు చిత్రాల రికార్డులు బద్దలు కొట్టిన ఈ మూవీ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం 11 రోజుల్లోనే మరో రికార్డ్ క్రియేట్ చేసింది. గతేడాది రిలీజైన దురంధర్ ఆల్ టైమ్ వసూళ్లను అధిగమించింది.ఇప్పటి వరకు దురంధర్-2 ప్రపంచవ్యాప్తంగా రూ. 1,363.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇండియావ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.1013.15 కోట్లు రాగా.. ఓవర్సీస్లో రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓవరాల్గా నెట్ వసూళ్ల పరంగా చూస్తే రూ. 847.87 కోట్లు వసూలు చేసింది. గతేడాది డిసెంబర్ 5, 2025న విడుదలైన 'ధురందర్' ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 1,307.35 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మనదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో భారతీయ చిత్రంగా 'ధురందర్: ది రివెంజ్' నిలిచింది. దీనికంటే ముందు ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ (2016) రూ. 2,070 కోట్లతో జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత ప్రభాస్ బాహుబలి- 2 (2017) రూ. 1,788 కోట్లతో ఉంది. అల్లు అర్జున్ పుష్ప- 2 (2024) రూ. 1,742 కోట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.కాగా.. రణవీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్స్ దురంధర్ చిత్రాలకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీస్లో సారా అర్జున్ హీరోయిన్గా మెప్పించారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, రాకేష్ బేడీ, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. -
నాలుగు పదుల వయస్సులో తల్లైన హీరోయిన్
బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ రెండోసారి తల్లిగా ప్రమోషన్ కొట్టేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ రోజు మార్చి 29, 2026న మాకు బాబు పుట్టాడని తెలిపింది. ఈ విషయాన్ని ప్రకటించేందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామని రాసుకొచ్చింది. ఇప్పటికే ఆమెకు వాయు అనే కుమారుడు ఉన్నారు. తాజాగా రెండోసారి కూడా సోనమ్ కపూర్కు మగబిడ్డ జన్మించారు. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోనమ్ తన ఇన్స్టాలో రాస్తూ..' అపారమైన కృతజ్ఞతతో.. ప్రేమ నిండిన హృదయాలతో మార్చి 29న మా బాబు రాకను ప్రకటించడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఇప్పుడు మా కుటుంబం మరింత పెద్దదైంది. బాబు రాకతో మా హృదయాలు మరింత సంతోషంతో నిండిపోయాయి. వాయు తన తమ్ముడిని స్వాగతించడానికి ఆసక్తిగా ఉన్నాడు. మరో బిడ్డ రాకతో మా ఇంట ఆనందం వెల్లి విరిసింది. ఇప్పుడు నలుగురితో ఈ అందమైన కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినందుకు మేము కృతజ్ఞతతో ఉన్నాం. ఇట్లు ప్రేమతో సోనమ్, ఆనంద్ అండ్ వాయు' అంటూ పోస్ట్ చేసింది.వ్యాపారవేత్తతో పెళ్లి..ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహూజా 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2022లో వాయు అనే కుమారుడు జన్మించాడు. సినిమాల విషయానికి వస్తే.. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో 'సావరియా' మూవీతో సోనమ్ వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాంబే టాకీస్, బ్లైండ్, ప్రేమ రతన్ ధన్పాయో, నీర్జా, సంజు, థాంక్యూ, రాంఝన, ఖుబ్సూరత్ వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) -
ఓపక్క షూటింగ్స్.. మరోపక్క భార్య కోసం హీరో ఆరాటం!
ఒక సినిమా హిట్టయిందంటే.. దానికి సీక్వెల్గా వచ్చేదానిపై భారీ అంచనాలుంటాయి. ప్రేక్షకుల అంచనాలను అందుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. అయితే ఈ పరీక్షను ఈజీగా నెగ్గేసింది ధురంధర్ టీమ్. రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ విజయం సాధించింది. ఈ మూవీ వచ్చిన మూడు నెలల్లోపే సీక్వెల్ కూడా రెడీ చేసి వదిలాడు దర్శకుడు ఆదిత్య ధర్.గర్భిణి అయిన భార్య కోసం..రెండో భాగం కూడా ప్రేక్షకుల మనసు గెల్చుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రికార్డు తిరగరాస్తోంది. రణ్వీర్ సింగ్ యాక్టింగ్, డెడికేషన్కు సినీప్రియులు ఫిదా అవుతున్నారు. ధురంధర్ మొదటి భాగం చిత్రీకరణ సమయంలో అతడి భార్య, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గర్భిణీ అన్న విషయం తెలిసిందే! ఓపక్క బిజీ షెడ్యూల్లో పని చేస్తూనే మరోపక్క భార్య కోసం సమయం కేటాయించాడట! ఈ విషయాన్ని ధురంధర్ మూవీ నటుడు అభయ్ అరోరా వెల్లడించాడు.నిజంగా అద్భుతంరణ్వీర్ షూటింగ్ మధ్యలో మూడు, నాలుగు రోజులు గ్యాప్ దొరికినా సరే.. వెంటనే విమానం ఎక్కి ఇంట్లో వాలిపోయేవాడు. భార్యను, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకునేవాడు. కాస్తంత సమయం దొరికినా కుటుంబం కోసం సమయం కేటాయించేవాడు. అతడు ఫ్యామిలీని చూసుకునే విధానం నిజంగా అద్భుతం అని పేర్కొన్నాడు. రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె.. రామ్లీలా సినిమా (2013) సెట్లో ప్రేమలో పడ్డారు. 2015లో ఎంగేజ్మెంట్ చేసుకోగా 2018లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2024 సెప్టెంబర్ 8న కూతురు దువా జన్మించింది.చదవండి: ఈవారం ఓటీటీల్లో బోలెడన్ని సినిమాలు.. ఏమేం ఉన్నాయంటే? -
తమిళనాట ఎన్నికల హీట్.. విజయ్కే నా ఓటు అంటోన్న హీరోయిన్..!
ఈ మండు వేసవిలో తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల హీట్ నడుస్తోంది. సినిమా రంగంలోనూ ఆ ప్రభావం కనిపిస్తోంది. సినీ తారలు తమకు నచ్చిన వారికి సపోర్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి వాణిభోజన్ తన మద్దతు టీవీకే ఛీఫ్ విజయ్కే అని ప్రకటించారు. బుల్లితెర నుంచి వెండి తెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ.. ఓమై కడవుల్ చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత మహాన్, మిరన్ వంటి పలు చిత్రాల్లో వాణి భోజన్ నటించారు. కొన్ని వెబ్ సిరీస్ల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ హీరోయిన్గా ఆశించిన స్థాయికి చేరుకోలేదనే చెప్పాలి. కాగా ఇటీవల తమిళనాడులోని కుంభకోణంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న వాణి భోజన్ పలు విషయాలను పంచుకున్నారు.ఈ సందర్భంగా ఏ హీరోతో నటించాలని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు తాను నటుడు విజయ్కు వీరాభిమానినని.. ఆయనకు జంటగా నటించాలన్న కోరిక ఉందని తెలిపింది. అయితే విజయ్ నటనకు స్వస్తి చెప్పి రాజకీయ రంగప్రవేశం చేయడంతో ఆ కోరిక నెరవేరే అవకాశం లేదని పేర్కొంది. అయితే విజయ్ రాజకీయ రంగప్రవేశం చేయడాన్ని తాను స్వాగతిస్తున్నాని వెల్లడించింది.విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీని ప్రారంభించడం సంతోషమని అన్నారు. మీకు ఆ పార్టీలో చేరే ఆలోచన ఉందా ? అన్న ప్రశ్నకు కచ్చితంగా ఉందన్నారు. ఈ విషయం గురించి చాలా మంది అడుగుతున్నారని, అయితే దాని గురించి తరువాత చెబుతానని అన్నారు. ఈ ఎన్నికల్లో తన మద్దతు మాత్రం విజయ్కే నని తెలిపింది. కాగా ప్రస్తుతం తాను ఈ భామ ప్రస్తుతం వలై అనే చిత్రంలో అధర్వకు జంటగా నటిస్తున్నట్లు వెల్లడించారు. -
ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు.. ఆ రెండు మాత్రమే స్పెషల్
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఈ ఉరుకుల, పరుగుల జీవితంలో మనకు కాస్తా రిలీఫ్ ఇచ్చేది ఎంటర్టైన్మెంట్ మాత్రమే. అలా మిమ్మల్ని అలరించేందుకు ఈ వారం కూడా బోలెడ్ సినిమాలు రెడీ అయిపోయాయి. ఈ శుక్రవారం ఎంటర్టైన్ చేసేందుకు శర్వానంద్ బైకర్, సంగీత్ శోభన్ రాకాస, సముద్రఖని కార్మేని సెల్వంతో పాటు లెజెండ్ శరవణన్ హీరోగా వస్తోన్న లీడర్ కూడా గ్రాండ్ రిలీజ్ కానుంది. వీటిలో బైకర్, రాకాస, కార్మేని సెల్వం చిత్రాలపై బజ్ ఉంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ వారంలో పలు సినిమాలు సందడి చేయనున్నాయి. టాలీవుడ్ నుంచి సుహాస్ మూవీ హే బల్వంంత్, శ్రీ విష్ణు థ్రిల్లర్ మృత్యుంజయ్ స్ట్రీమింగ్కు సిద్ధమైపోయాయి. అంతేకాకుండా బాలీవుడ్ నుంచి సితారే జమీన్ పర్, హ్యాపీ పటేల్, వధ్-2 లాంటి మూవీస్ ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు, హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు ఓటీటీల్లోకి రానున్నాయి. ఓవరాల్గా చూస్తే దాదాపు 16 మూవీస్, సిరీస్లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్..రిపుల్(హాలీవుడ్ సిరీస్)- మార్చి 31హ్యాపీ పటేల్(హిందీ మూవీ)- ఏప్రిల్ 01జో కిట్టీ- సీజన్-3(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 02మృత్యుంజయ్(తెలుగు సినిమా)-ఏప్రిల్ 03మామ్లా లీగల్ హై- సీజన్-2(బాలీవుడ్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03వధ్-2(హిందీ సినిమా)-ఏప్రిల్ 03బ్లడ్హౌండ్స్ సీజన్-2(హాలీవుడ్ సిరీస్)-ఏప్రిల్ 03హై టైడ్స్- సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03అమెజాన్ ప్రైమ్..మా కా సమ్- సీజన్-1(హిందీ సిరీస్)- ఏప్రిల్ 04జియో హాట్స్టార్..సెండ్ హెల్ప్(హాలీవుడ్ హారర్ మూవీ)- మార్చి 31ఫైవ్ నైట్స్ ఏట్ ఫ్రెడ్డీస్-2(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 03జీ5..హే బల్వంత్(తెలుగు సినిమా)- మార్చి 31బాబ్జీ ఘర్ పర్ హై-ఫన్ ఆన్ ది రన్(హిందీ మూవీ)- ఏప్రిల్ 03ఆపీల్ టీవీ ప్లస్..యువర్ ఫ్రెండ్స్ అండ్ నెబర్స్(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03సన్ నెక్ట్స్..వడం(తమిళ సినిమా)- ఏప్రిల్ 03సోనీ లివ్సితారే జమీన్ పర్(బాలీవుజ్ మూవీ)-ఏప్రిల్ 03 -
సూపర్ హిట్ కాంబో రిపీట్.. ఆ మూవీకి సీక్వెల్ రానుందా?
మంగాత్తా చిత్ర కాంబో రిపీట్ కానుందా? అంటే కోలీవుడ్లో అవుననే టాక్ వినిపిస్తోంది. స్టార్ హీరో అజిత్, దర్శకుడు వెంకట్ ప్రభులది హిట్ కాంబినేషన్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబోలో 2010లో తెరకెక్కిన మంగాత్తా చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఆ చిత్రంలో నటుడు అజిత్ను విలనిజంతో కూడిన స్టైలిష్ పాత్రలో చూపించి సక్సెస్ అయ్యారు డైరెక్టర్.దీంతో వీరి కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సమయం ఇప్పుడు రానుంది. దర్శకుడు వెంకట్ ప్రభు.. శివకార్తికేయన్ హీరోగా చిత్రం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని నటుడు శివకార్తికేయన్ కూడా తెలిపారు. అయితే ఈ చిత్రం ప్రారంభంలో ఆలస్యం జరగనున్నట్లు తెలిసింది. దీంతో దర్శకుడు వెంకట్ ప్రభు ఇటీవల నటుడు అజిత్ను కలిసి కథ వినిపించినట్లు సమాచారం.అది ఆయనకు నచ్చడంలో అందులో నటించడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. కాగా అజిత్ 2027 జనవరి వరకు చిత్రాల్లో నటించనని ఇంతకు ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఆయన 64వ చిత్రాన్ని గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారంలో ఉంది. దీంతో వెంకట్ ప్రభు దర్శకత్వంలో అజిత్ నటించే చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? దానికి సంబంధించిన వివరాలు ఏమిటి? అన్నది తెలియాలంటే మరికొద్ది కాలం ఆగాల్సిందే. ఇకపోతే ఇది మాంగాత్తాకు సీక్వెల్గా ఉంటుందా? లేక కొత్త కథా చిత్రంగా ఉంటుందా? అనే ఆసక్తి నెలకొంది. -
మిరాకిల్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది
‘‘కుమారి 21ఎఫ్, ఈడో రకం–ఆడో రకం, ఓదెల రైల్వే స్టేషన్’ వంటి బ్లాక్ బస్టర్స్ నా కెరీర్లో ఉన్నప్పటికీ ‘మిరాకిల్’ నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది’’ అని హెబ్బా పటేల్ అన్నారు. రమేష్ ఎగ్గిడి, శ్రీకాంత్ మొగదాసు, చందర్ గౌడ్ నిర్మిస్తున్న చిత్రం ‘మిరాకిల్’. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రణధీర్ బీసు హీరోగా, హెబ్బా పటేల్ హీరోయిన్గా నటిస్తుండగా, సురేష్, శ్రీరామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రం మూడో షెడ్యూల్ హైదరాబాద్ పరిసర గ్రామమైన కొండమడుగులో పూర్తయింది. ‘‘ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై రాని కథ, కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. కొండమడుగు గ్రామ ప్రజల సహకారాన్ని మా యూనిట్ మర్చిపోదు’’ అన్నారు. ‘‘90 శాతం షూట్ పూర్తయింది. త్వరలో చివరి షెడ్యూల్ ఆరంభిస్తాం’’ అని ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ శ్రీకాంత్ తెలిపారు. -
జోడీ కుదిరింది
సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా రానుందని, ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్నారనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సల్మాన్ ఖాన్ సరసన నయనతార నటించడం దాదాపు ఖరారైయిందని, కథ నచ్చి ఆమె ఒప్పుకున్నారని సమాచారం.ఈ జోడీ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. ఇక ఈ సినిమా చిత్రీకరణను ఏప్రిల్ చివర్లో ప్రారంభించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని భోగట్టా. మరోవైపు ప్రస్తుతం సల్మాన్ ‘మాతృభూమి’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. -
సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న బెస్ట్ ఫ్రెండ్స్
ఇప్పటి హీరోలు క్యారెక్టర్ కోసం ఎంత కష్టపడ్డానికైనా సిద్దంగా ఉంటారు. తమ మేకోవర్ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. రీసెంట్గా వచ్చిన ఇద్దరు హీరోల లుక్స్ చూస్తే ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తుంది. ఆ ఇద్దరు హీరోల్లో ఒకరు మెగా పవర్స్టార్ రామ్ చరణ్, మరొకరు అతడి బెస్ట్ ఫ్రెండ్ శర్వానంద్.వీరిద్దరూ తమ మేకోవర్స్తో టోటల్ ఇండస్ట్రీని ఆకర్షిస్తున్నారు. ముందుగా రామ్ చరణ్ విషయానికొస్తే, తాజాగా తన పుట్టినరోజు నాడు రిలీజైన 'పెద్ది' సినిమా రెండో గ్లింప్స్ లో అందర్నీ ఆకట్టుకున్న అంశం చరణ్ బాడీ. ఆ పహిల్వాన్ లుక్ కోసం చరణ్ ఎంత కష్టపడ్డాడో ఆ లుక్ చూస్తుంటే ఇట్టే అర్థమైపోతుంది.చరణ్ ఈ లుక్ కోసం కొన్ని నెలల పాటు మాంసాహారం మానేశాడని సమాచారం. ఓవైపు అయ్యప్ప దీక్షలో ఉంటూనే, మరోవైపు పహిల్వాన్ లుక్ కోసం కసరత్తులు చేశాడు. పహిల్వాన్ లుక్ కోసం నిజమైన పహిల్వాన్లు చేసే కసరత్తులనే చరణ్ చేశాడు. అలా దాదాపు 8 నెలల పాటు ఎంతో కష్టపడి మరీ ఈ కండలు తిరిగే దేహాన్ని చరణ్ సొంతం చేసుకున్నాడు.అయితే శర్వానంద్ బైకర్ రోల్ కోసం మరింత స్ఫూర్తిదాయకమైన ప్రయాణం చేశాడు. ఆ రోల్ కోసం ఇతడు పడిన కష్టం అంతా ఇంతా కాదనే చెప్పాలి. బైకర్ చిత్ర దర్శకుడు శర్వాను 6-8 కిలోలు తగ్గితే చాలన్నాడట. కానీ శర్వానంద్ మాత్రం అంతకుమించి కష్టపడ్డాడు. అక్షరాలా రోజుకు 32 కిలోమీటర్లు పరుగెత్తేవాడని సమాచారం.42 సంవత్సరాల శర్వానంద్ 18 ఏళ్ల బైక్ రేసర్గా కనిపించేందుకు తన శరీరంలోని ప్రతి అణువునూ కరిగించేలా కసరత్తు చేశాడట. ప్రస్తుతం తన ఒంట్లో ఏమాత్రం కొవ్వు లేనంత బక్కపల్చగా తయారయ్యాడు. ఇలా టీనేజర్ గా కనిపించడం కోసం శర్వానంద్ ఏకంగా రెండేళ్లు కష్టపడ్డాడు. ఇక బైకర్ ట్రయిలర్ ఎంత క్లిక్ అయిందో, అందులో శర్వా లుక్ అంతకంటే ఎక్కువగా అందరి ప్రశంసలు పొందింది. -
నాగార్జున కోసం ముగ్గురు హీరోయిన్లు?
తెలుగు సీనియర్ హీరోల్లో నాగార్జున సరైన సక్సెస్ చూసి చాలాకాలమైంది. గతేడాది కుబేర్, కూలీ సినిమాల్లో కాస్త డిఫరెంట్ పాత్రలు చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం హీరోగా 100వ మూవీ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో తప్పితే అధికారికంగా ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ల గురించి డిస్కషన్ నడుస్తోంది. ఏకంగా ముగ్గురు బ్యూటీస్ నాగ్ సరసన నటించబోతున్నారట.(ఇదీ చదవండి: వివాదంలో మురుగ.. రూ.10 కోట్ల డిమాండ్.. చివరకు ఫ్రీగా)గతంలో నిన్నే పెళ్లాడతా లాంటి సినిమాలో కెమిస్ట్రీతో అదరగొట్టిన నాగ్-టబు.. ఈ సినిమా కోసం మళ్లీ కలుస్తున్నారట. చాన్నాళ్ల క్రితమే ఈ రూమర్ బయటకొచ్చింది. కానీ నిజమా కాదా అనేది మాత్రం క్లారిటీ రాలేదు. తాజాగా 'సంక్రాంతికి వస్తున్నాం' ఫేమ్ ఐశ్వర్య రాజేశ్ కూడా మరో కథానాయికగా ఎంపికైందని అంటున్నారు. వీళ్లిద్దరితో పాటు సుస్మితా భట్ అనే తమిళ బ్యూటీ కూడా ఇందులో ఉందని టాక్ వినిపిస్తోంది.తమిళ దర్శకుడు ఆర్.కార్తిక్ తీస్తున్న ఈ సినిమా లాటరీ బ్యాక్డ్రాప్లో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్లా తీస్తున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్గా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ అనుకుంటున్నారట. ఈ స్టోరీని గట్టిగా నమ్మిన నాగ్.. తనే స్వయంగా నిర్మిస్తున్నారు కూడా. ఏదేమైనా నాగ్ సరసన ముగ్గురు హీరోయిన్లు అనే రూమర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: చిరంజీవి-ప్రభాస్ సినిమాలు.. అదొక్కటే సమస్య?) -
వివాదంలో మురుగ.. రూ.10 కోట్ల డిమాండ్.. చివరకు ఫ్రీగా
ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా వెలుగువెలిగిన ఏఆర్ మురుగదాస్.. ఇప్పుడు కెరీర్ పరంగా పూర్తిగా డౌన్ అయిపోయాడు. చేసిన సినిమాలు చేసినట్లు అట్టర్ ఫ్లాప్ అయ్యేసరికి ఒక్కరూ కూడా ఇతడిని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఇది చాలదన్నట్లు ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. టాలీవుడ్ నిర్మాత.. తాజాగా ఫిర్యాదు చేయడంతో ఇది కాస్త వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలు ఏమైంది?(ఇదీ చదవండి: చిరంజీవి-ప్రభాస్ సినిమాలు.. అదొక్కటే సమస్య?)గతేడాది మురుగదాస్ నుంచి రెండు మూవీస్ వచ్చాయి. వాటిలో సల్మాన్ ఖాన్తో చేసిన 'సికందర్' ఒకటి కాగా శివకార్తికేయన్తో చేసిన 'మదరాశి' ఒకటి. ఇవి రెండు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. 'మదరాశి' చిత్ర నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఇప్పుడు తమిళ దర్శకులు, నిర్మాతల కౌన్సిల్లో ఏఆర్ మురుగదాస్పై ఫిర్యాదు చేశారు. తొలుత రూ.115 కోట్ల బడ్జెట్ అని చెప్పి షూటింగ్ పూర్తయ్యేసరికి రూ.170 కోట్ల మేర ఖర్చు చేశాడని తన కంప్లైంట్లో పేర్కొన్నారు.అయితే బడ్జెట్ పెరగడానికి మురుగదాస్కి సరైన ప్లానింగ్ లేకపోవడం, దీనితో పాటు 'సికందర్' సమాంతరంగా చేయడమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. తమకు జరిగిన నష్టానికిగానూ రూ.10 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఇరువర్గాల మధ్య చర్చ జరగ్గా.. అంతిమంగా కౌన్సిల్ ఓ నిర్ణయం తీసుకుంది.దీని ప్రకారం.. ఏఆర్ మురుగదాస్, తన రమణ 2(ఠాగుర్ సీక్వెల్) స్టోరీని సదరు నిర్మాణ సంస్థకు ఉచితంగా ఇచ్చేందుకు అంగీకారం తెలిపాడట. అలా ఈ వివాదానికి ఓ పరిష్కారం దొరికిందని కోలీవుడ్లో మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతానికైతే మురుగదాస్ చేతిలో కొత్త ప్రాజెక్ట్ ఏం లేదు. ఈ వివాదం జరిగిన తర్వాత వస్తుందా అనే నమ్మకం కూడా కలగట్లేదు!(ఇదీ చదవండి: అందాల 'చిచ్చుబుడ్డి'.. ఎవరీ జోనితా గాంధీ?) -
హెబ్బాపటేల్ గ్లామరస్ లుక్.. వేకేషన్లో ధనశ్రీ వర్మ చిల్..!
బాలీవుడ్ బ్యూటీ సురభి జ్యోతి బేబీ బంప్ లుక్..పెళ్లి ఫోటోలు షేర్ చేసిన బిగ్బాస్ పునర్నవి..హీరోయిన్ హెబ్బా పటేల్ గ్లామరస్ పిక్స్..వేకేషన్లో చిల్ అవుతోన్న కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ..హీరోయిన్ సమంత స్మైలీ లుక్స్.. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) -
ప్రియురాలిని పెళ్లాడిన బిగ్బాస్ కంటెస్టెంట్
ఇప్పుడంతా ఎక్కడ చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్లో విరోష్ జంటతో అల్లు శిరీష్ కూడా ఓ ఇంటివాడయ్యారు. మరో టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్బాస్ కంటెస్టెంట్ రజత్ దలాల్ ఓ ఇంటివాడయ్యారు. తన ప్రియురాలిని ఆయన పెళ్లాడారు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్గా పేరు తెచ్చుకున్న రజత్ దలాల్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. అత్యంత సన్నిహితులు, మిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. తన వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభం అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. మీ అందరి ఆశీస్సులు కావాలంటూ కోరారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు అభిమానులు నూతన జంటకు అభినందనలు చెబుతున్నారు.రజత్ దలాల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే కాదు..పలు రియాలిటీ షోల్లో పాల్గొన్నారు. బిగ్బాస్-18 సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. ది 50 అనే రియాలిటీ షోతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. -
అందాల 'చిచ్చుబుడ్డి'.. ఎవరీ జోనితా గాంధీ?
పాటలు పాడే సింగర్స్ మహా అయితే మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతారు. కొన్నిసార్లు మాత్రం ఊహంచని సర్ప్రైజ్ ఇస్తుంటారు. లేటెస్ట్గా ఓ తెలుగు గాయని.. ఐటమ్ సాంగ్లో గ్లామరస్ డ్యాన్స్ చేసి అదరగొట్టింది. ఆమెనే జోనితా గాంధీ. తెలుగు ప్రేక్షకుల్లో కొందరికి ఈమె గురించి తెలుసు. అయితే ఈమె నుంచి అదిరిపోయే డ్యాన్స్ చూసి మాత్రం ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఈమె ఎవరు? డీటైల్స్ ఏంటి?(ఇదీ చదవండి: ఓటీటీలో 'మట్కా కింగ్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)జోనితా గాంధీ ఢిల్లీలో పుట్టింది. ఈమెకు 9 నెలల వయసున్నప్పుడే కుటుంబమంతా కెనడా వెళ్లిపోయింది. తర్వాత అక్కడే సెటిలైపోయారు. దీంతో చదువంతా అక్కడే పూర్తి చేసింది. ఏడేళ్లు ఉన్నప్పుడే పాటలు పాడటం లాంటివి చేసింది. తర్వాత కొన్నేళ్లకు తన పాడిన పాటల్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసేది. వాటికి మంచి రెస్పాన్స్ వస్తుండేసరికి పాడటాన్ని కెరీర్గా ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. కొన్నాళ్లకు భారత్కి తిరిగొచ్చింది.జోనితాలోని ప్రతిభని గుర్తించిన బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్-శేఖర్.. షారూఖ్ ఖాన్ 'చెన్నై ఎక్స్ప్రెస్' టైటిల్ సాంగ్ పాడే అవకాశం కల్పించారు. తొలి పాటే ఎస్పీ బాలసుబ్రమణ్యం లాంటి ప్రసిద్ధ గాయకుడితో కలిసి పాడేసరికి జోనితాకు ఫేమ్ వచ్చింది. తర్వాత ఏఆర్ రెహమాన్, ప్రీతమ్, అమిత్ త్రివేది తదితర సంగీత దర్శకులు కంపోజ్ చేసిన సాంగ్స్ పాడింది.అనిరుధ్తో కలిసి ఈమె పాడిన కావాలయ్యా, అరబిక్ కుతు లాంటి పాటలు సెన్సేషన్ సృష్టించాయి. 'కిక్ 2' మూవీలోని నువ్వే నువ్వే ప్రాణం పాటతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. లవ్ స్టోరి, సర్కారు వారి పాట తదితర చిత్రాల్లో సాంగ్స్ పాడింది. ఓవరాల్గా చూస్తే తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, ఉర్దూ, ఇంగ్లీష్లో పాటలు పాడి మెప్పించింది. ఇన్ స్టాలో 28 లక్షల ఫాలోవర్స్ ఉన్న ఈమె.. లైవ్ కన్సర్ట్స్తోనూ సంగీత ప్రియుల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది.ఇన్నాళ్లు సింగర్గా అందరికీ తెలిసిన జోనితా గాంధీ.. అడివి శేష్ 'డకాయిట్' కోసం తొలిసారి ఐటమ్ సాంగ్లో డ్యాన్స్ చేసింది. అందచందాలతో ఆశ్చర్యపరిచింది. చూస్తుంటే సింగర్గా ఏమో గానీ డ్యాన్సర్గా మాత్రం మరింత బిజీ అవుతుందేమో అనిపిస్తుంది. ఈమె నటించిన తమిళ సినిమా 'వాకింగ్ టాకింగ్ స్ట్రాబెర్రీ ఐస్క్రీమ్' విడుదల కావాల్సి ఉంది.(ఇదీ చదవండి: చిరంజీవి-ప్రభాస్ సినిమాలు.. అదొక్కటే సమస్య?) -
మొన్న అనుష్క.. నిన్న సాయి పల్లవి.. ఇబ్బంది పెడుతున్న రూమర్స్!
సినీ హీరోయిన్ల పర్సనల్ లైఫ్పై నిత్యం ఏదో ఒక పుకారు వస్తూనే ఉంటుంది. పలానా హీరోతో ప్రేమలో పడిందని, త్వరలోనే పెళ్లి అని.. ఇలా రకరకాల రూమర్స్ పుట్టుకొస్తుంటాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకముందే నెటిజన్లు పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేస్తుంటారు. నిజానిజాలతో సంబంధం లేకుండా, సోషల్ మీడియా వేదికగా సాగే ఈ గాసిప్స్ కొన్నిసార్లు హీరోయిన్లకు తలనొప్పిగా మారుతున్నాయి. సినిమాల వరకు పుకార్లు వస్తే పెద్దగా పట్టించుకోరు. కానీ పర్సనల్ లైఫ్..ముఖ్యంగా పెళ్లి గురించి కూడా అసత్యాలను ప్రచారం చేస్తే కొంతమంది తారలు తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ సాయి పల్లవి, అనుష్కలు కూడా తమ పెళ్లిపై వచ్చిన గాసిప్స్ని కొట్టిపారేస్తూనే.. వదంతువులు పుట్టించినవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అనుష్కపై ఆగని ట్రోలింగ్నటి అనుష్క పెళ్లిపై వదంతులు వస్తూనే ఉన్నాయి. ఆమె కెరీర్లో బిజీగా ఉన్న సమయం నుంచే పెళ్లి పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే అనుష్క మాత్రం వాటిపై స్పందించలేదు. కానీ, ఈ మధ్య కొంతమంది అనుష్కకు ఏకంగా ఎంగేజ్మెంట్ అయిపోయిందన్నట్లుగా ప్రచారం చేశారు. గతంలో ఓ ప్యాషన్ షోలో ఓ వ్యక్తి చేతిని పట్టుకొని నడుస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చూస్తూ.. అనుష్క ఎంగేజ్మెంట్ అయింది..త్వరలోనే పెళ్లి అని ప్రచారం చేశారు. అయితే ఆ ఫోటోని కొంతమంది గుర్తించడంతో.. అది ఫేక్ అని తెలిసిపోయింది. అనుష్క కూడా స్పందించకపోవడంతో అది పుకారేనని క్లారిటీ వచ్చింది.సాయి పల్లవికి పెళ్లి ఆలోచననే లేదుఇక సాయి పల్లవి పరిస్థితి కూడా అంతే. ఆమెకు తెలియకుండానే పెళ్లి చేసేస్తున్నారు. అల్రేడీ ప్రేమలో ఉందని..త్వరలోనే పెళ్లి చేసుకుంటుందని నెట్టింట పోస్టులు పెట్టారు. దీనిపై సాయి పల్లవి స్పందించారు. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచననే లేదని స్పష్టం చేసింది. అంతేకాదు ప్రస్తుతానికి తాను సింగిల్ అని కూడా చెప్పింది. కెరీర్ పరంగా సాయి పల్లవి ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. హిందీలో ఆమె నటించిన చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అదేవిధంగా రామాయణం ఇతిహాసం ఇతివృత్తంతో రూపొందుతున్న రామాయణ 1,2 భాగాల్లో సీతగా నటిస్తున్నారు. దీంతో పాటు ధనుష్ సినిమాలోనూ ఆమె నటిస్తోంది. ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలో ఆమె పెళ్లిపై పుకార్లు రావడంతో వెంటనే క్లారిటీ ఇచ్చేసింది. -
పెద్ది పహిల్వాన్ లుక్.. రామ్ చరణ్ అంతలా కష్టపడ్డారా?
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం పెద్ది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్కు మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చారు.ఈ గ్లింప్స్లో రామ్ చరణ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. పహిల్వాన్గా చెర్రీ లుక్ అదిరిపోయింది. ఈ లుక్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయ్యారు. అయితే ఇలా రెజ్లర్గా కనిపించేందుకు గ్లోబల్ స్టార్ కఠినంగా డైట్ తీసుకున్నారు. పహిల్వాన్లా కనిపించేందుకు దాదాపు 8 నెలల పాటు కేవలం కఠోర నియమాలు పాటించారు. అయ్యప్ప దీక్షలో ఉన్న రామ్ చరణ్ ఈ లుక్ కోసం తీవ్రంగా శ్రమించారని ఇటీవల డైరెక్టర్ బుచ్చిబాబు రివీల్ చేశారు.కఠినమైన డైట్..పహిల్వాన్ ఫిజిక్ రావాలంటే ప్రత్యేక డైట్ పాటించాల్సి ఉంటుంది. కేవలం జిమ్లో వర్కౌట్స్ చేయడం మాత్రమే కాదు..కఠిన ఆహార నియమాలు కూడా ఫాలో కావాల్సిందే. ఈ ట్రైనింగ్ జరుగుతున్న సమయంలో రామ్ చరణ్ అయ్యప్ప దీక్షలో ఉంటూ కఠిన నియమాలు పాటించారు. ఎక్కడా కూడా తన ఫిట్నెస్ రూల్స్ బ్రేక్ చేయలేదని బుచ్చిబాబు సనా తెలిపారు. కాగా.. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. -
చిరంజీవి-ప్రభాస్ సినిమాలు.. అదొక్కటే సమస్య?
స్టార్ హీరో అనే ట్యాగ్ లైన్.. సొంత ఇండస్ట్రీ, అభిమానుల వరకు పనికొస్తుందేమో గానీ మార్కెట్ లెక్కలు వచ్చేసరికి అవన్నీ మారిపోతుంటాయి. సక్సెస్ ట్రాక్ ఎలా ఉంది? ఏయే దర్శకులతో పనిచేస్తున్నారు? లాంటి లెక్కలు చాలా ఉంటాయి. ఇప్పుడు అలానే చిరంజీవి, ప్రభాస్ కొత్త చిత్రాలకు ఓటీటీ డీల్స్ విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయట. అందుకే రిలీజ్ డేట్స్పై మేకర్స్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. ఇంతకీ ఏం జరుగుతోంది?(ఇదీ చదవండి: రాజమౌళి మనసు మార్చిన 'ధురంధర్ 2'?)చిరంజీవి హీరోగా నటించిన సినిమా 'విశ్వంభర'. సోషియో ఫాంటసీ స్టోరీతో తీసిన ఈ సినిమాకు 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకుడు. రెండేళ్ల క్రితమే దీన్ని థియేటర్లలోకి తీసుకొద్దామని అనుకున్నారు. అందుకు తగ్గట్లే అన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడైతే టీజర్ వచ్చిందో లెక్కలన్నీ మారిపోయాయి. గ్రాఫిక్స్పై దారుణమైన విమర్శలు, ట్రోల్స్ వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు అదలా సాగుతూనే ఉంది. ఈ మూవీకి ఇప్పటివరకు ఓటీటీ డీల్ జరగలేదు. అందుకే విడుదల తేదీపై నిర్మాతలు తేల్చకోలేకపోతున్నారు.దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ పెట్టారని ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు ఓ ఈవెంట్లో చెప్పారు. ఈ సినిమాకు ఓటీటీ రేట్ విషయంలో ఇంకా తర్జనభర్జనలు సాగుతూనే ఉన్నాయి. దీంతో ఈసారి వేసవిలోనూ థియేటర్లలోకి రావడం కష్టమే అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే జూన్ 4 టాక్సిక్ ఉంది. 26వ తేదీన అఖిల్ 'లెనిన్' రిలీజ్ కానున్నాయి. ఆపై నెలల్లోనూ 'ప్యారడైజ్' లాంటి పెద్ద మూవీస్ లైన్లో ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే చిరు చిత్రం.. ఓటీటీ డీల్ పూర్తి చేసుకుని ఈ ఏడాదైనా వస్తుందా అనే సందేహం కలుగుతోంది. ఇప్పటికే దీనిపై ఏ మాత్రం బజ్ లేదు. కొత్త టీజరో ట్రైలరో వచ్చి ఆకట్టుకుంటే తప్ప 'విశ్వంభర'పై ప్రేక్షకులు దృష్టిపడే అవకాశం లేదు.ప్రభాస్ 'ఫౌజీ' చిత్రానికి కూడా ఇంకా ఓటీటీ డీల్ జరగలేదు. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీకి 'సీతారామం' ఫేమ్ హను రాఘవపూడి దర్శకుడు. ప్రభాస్ గత చిత్రం 'రాజాసాబ్' ఓటీటీలో అంతంత మాత్రంగానే ఫెర్ఫార్మ్ చేసింది. అందుకే 'ఫౌజీ' విషయంలో ఓటీటీ సంస్థలు కాస్త తక్కువ మొత్తం రేటు ఆఫర్ చేస్తున్నాయట. లెక్క ప్రకారం ఈ ఏడాది దసరాకు థియేటర్లలోకి రావాలని అనుకుంటున్నారు. కానీ డిజిటల్ డీల్ సెట్ అవ్వకపోతే విడుదల కచ్చితంగా వాయిదా పడుతుంది. మరి చిరు, ప్రభాస్ మూవీస్ సమస్య పరిష్కారమైతే సరేసరి. లేదంటే మాత్రం ఈ రెండింటిని వచ్చే ఏడాది చూస్తాస్తేమో?(ఇదీ చదవండి: ఐటమ్ డ్యాన్సర్గా ప్రముఖ గాయని.. వీడియో రిలీజ్) -
ఇకపై తెలుగులో వరుస సినిమాలు చేస్తా : గోవింద్ వరాహ
ప్రణవ్ రావ్ రాణి, ప్రజక్త గైక్వాడ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా గూగుల్ మై ఫ్రెండ్. ఈ చిత్రాన్ని డాలర్స్ మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై దివాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బహు భాషల్లో పలు హిట్ చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గోవింద్ వరాహ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘గూగుల్ మై ఫ్రెండ్’ సినిమాకు టి. వెంకటేష్ రెడ్డి, బి.ప్రసన్నాంజనేయులు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగు, మరాఠీ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, సాయి రాజేశ్, వి సముద్ర, శైలేష్ కొలను, కొండా విజయ్ కుమార్ చేతుల మీదుగా ఈ చిత్ర సాంగ్స్ లాంఛ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డైరెక్టర్ సాయిరాజేశ్ మాట్లాడుతూ - ‘మా దర్శకుల సంఘం సభ్యులు, మా ఆత్మీయులు గోవింద్ డైరెక్ట్ చేస్తున్న గూగుల్ మై ఫ్రెండ్ మూవీ సాంగ్స్, టీజర్ ఇతర కంటెంట్ చూశాం. ఈ కంటెంట్ అంతా ప్రామిసింగ్ గా ఉంది. ఒకేసారి తెలుగు, మరాఠీ భాషల్లో ఆయన ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు మంచి రిలీజ్ కుదిరి ప్రొడ్యూసర్ కు డబ్బులు, గోవింద్కి పేరు రావాలని కోరుకుంటున్నా’అన్నారు.డైరెక్టర్ గోవింద్ వరాహ మాట్లాడుతూ - నేను తెలుగులో బాల, నేను నాన్న అబద్ధం, మనుషులతో జాగ్రత్త వంటి చిత్రాలు రూపొందించాను. మలయాళంలో కొన్ని చిత్రాలు రూపొందించాను. మరాఠీలో ఓ సినిమా తెరకెక్కించాను. తెలుగుతో పాటు ఇతర భాషల్లో గూగుల్ మై ఫ్రెండ్ చిత్రాన్ని రూపొందిస్తున్నాను. తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ కు ఎన్నికైన నా కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ రోజు మా మూవీ సాంగ్స్ రిలీజ్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ తెలుగు ఇండస్ట్రీకి దూరమవుతున్నానేమో అనిపించిన టైమ్ లో గూగుల్ మై ఫ్రెండ్ అనే సినిమాను రూపొందిస్తున్నాను. ఇకపైనా తెలుగులో వరుసగా చిత్రాలు చేస్తాను. మా నిర్మాతలు ఇస్తున్న సపోర్ట్ వల్లే వరుసగా సినిమాలు చేయగలుగుతున్నాను. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేస్తున్న నిర్మాతలు ఏఎం రత్నం, కెకె రాధమోహన్, చిట్టూరి శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా’అన్నారు. -
అప్పుడు 'లెజెండ్' ఇప్పుడు 'లీడర్'.. యాక్షన్ ట్రైలర్ రిలీజ్
తమిళనాడులో శరవణనన్ స్టోర్స్ అనే వస్త్రదుకాణ యజమానిగా గుర్తింపు తెచ్చుకున్న లెజెండ్ శరవణనన్.. నాలుగేళ్ల క్రితం తన పేరుతోనే తీసిన 'లెజెండ్' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ప్రమోషన్ల టైంలోనే విపరీతంగా ట్రోలింగ్కి గురైన ఈ చిత్రం.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత అంతకు మించిన విమర్శలు ఎదుర్కొంది. దీంతో ఈ హీరో ఇప్పుడు నాలుగేళ్ల గ్యాప్ తీసుకుని ఈసారి కొత్తగా 'లీడర్' మూవీతో వస్తున్నాడు.(ఇదీ చదవండి: ఐటమ్ డ్యాన్సర్గా ప్రముఖ గాయని.. వీడియో రిలీజ్)ఈ మూవీకి ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించగా.. పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా చేసింది. ఆండ్రియా, శ్యామ్, లాల్ లాంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతమందించాడు. ఏప్రిల్ 3న తెలుగు, తమిళంలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో యాక్షన్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రతి ఫ్రేమ్లోనూ భారీతనం కనిపిస్తున్న ఈ మూవీ అయినా శరవణనన్కి హిట్ ఇస్తుందేమో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో 'మట్కా కింగ్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
వెంకీ మామ స్టైలే వేరు.. సింపుల్గా హోటల్కు వెళ్లి..!
వెంకీమామ ఈ ఏడాది సంక్రాంతి పండుగకు అలరించారు. మెగాస్టార్ హీరోగా వచ్చిన మనశంకర వరప్రసాద్గారు మూవీతో అభిమానులను మెప్పించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి సూపర్హిట్గా నిలిచింది. ఈ మూవీలో నయనతార హీరోయిన్గా కనిపించింది. గతేడాది అనిల్ రావిపూడి- వెంకీ కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సైతం బ్లాక్బస్టర్ హిట్ కొట్టేసింది.తాజాగా వీరిద్దరు మరోసారి కలిసి పనిచేయనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ కాంబో రిపీట్ కానుంది. అయితే ఈసారి తన తొలి సినిమా హీరో కల్యాణ్రామ్ కూడా తీసుకొస్తున్నారు. ఈ ముగ్గురి క్రేజీ కాంబోలో రానున్న చిత్రాన్ని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇటీవలే శ్రీరామనవమి సందర్భంగా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇక హీరోయిన్స్ ఎవరనేది త్వరలోనే క్లారిటీ రానుంది.ఇక సినిమా సంగతి పక్కనపెడితే విక్టరీ వెంకటేశ్ తాజాగా ఓ హోటల్లో సందడి చేశారు. సామాన్యుడిలాగే హోటల్కు వెళ్లి టిఫిన్ చేశారు. బెంగళూరులోని విద్యార్థి భవన్ అనే హోటల్కు వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వెంకీమామ సింప్లీసిటీని తెగ మెచ్చుకుంటున్నారు. Honoured to host the ever-charming Mr. Venkatesh Daggubati @VenkyMama along with Mr. Rezwan Razack @indianbanknotes at Vidyarthi Bhavan for breakfast today!It was truly our pleasure to serve one of Tollywood’s finest!❤️ pic.twitter.com/zKQqJIcTrB— Vidyarthi Bhavan (@VidyarthiBhavan) March 29, 2026 -
నేనేదో అనుకున్నా.. పెళ్లి అంత ఈజీగా జరగలేదు: పునర్నవి
జీవితంలో 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' అని చెప్పుకునేవి కొన్ని ఉంటాయి. అలాంటి జాబితాలో పెళ్లి మొదటి స్థానంలో ఉంటుంది. ఈ పెళ్లిని తాను సింపుల్గా చేసుకోవాలనుకున్నానని, కానీ రెండు కుటుంబాల కలయికతో ఎంతో ప్రత్యేకంగా జరిగిందంటోంది బిగ్బాస్ బ్యూటీ, నటి పునర్నవి భూపాలం. మార్చి 21న ప్రియుడు, ఫోటోగ్రాఫర్ హేమంత్ వర్మను పెళ్లాడింది పునర్నవి. తాజాగా ఆ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.నేనేదో అనుకున్నా..వివాహం అంటే సింపుల్గా, సైలెంట్గా అయిపోవాలి.. అత్యంత ఆత్మీయుల మధ్యలో ఈ తంతు పూర్తయిపోవాలని ఒకప్పుడు అనుకునేదాన్ని. కానీ, ఇక్కడ మా ప్రేమ మా మనసుల్ని మాత్రమే కాదు, రెండు కుటుంబాల్ని కలిపింది. వారి ఆచారాలు, సాంప్రదాయాలు, ప్రేమానురాగాల మధ్య సాదాసీదాగా కంటే భిన్నంగా, ప్రత్యేకంగా వివాహం జరిగింది.పెళ్లంటే ఏంటి?అయినా కూడా నావరకు ఈ పెళ్లంటే ఏంటి? అని పదేపదే ఆలోచిస్తూనే ఉన్నాను. ఇది కేవలం ఒక ఆర్భాటం కాదు, ప్రపంచమంతా చూసేలా జీవితంలో ఒకసారి చేసుకునే వేడుక మాత్రమే కాదు, ఇది మన అంతర్గతంగా జరిగే ఒక అద్భుత అనుభవం. స్త్రీ, పురుష శక్తుల కలయిక.. శివుడు, శక్తి (అమ్మవారు) మనలోనూ, మన మధ్యలోనూ ఉన్న అనుభూతి. కొన్నిసార్లు బయట శబ్ధాలు నా గొంతుకంటే పెద్దగా అనిపించాయి. తెలియని ప్రశాంతతకానీ, అతడిని చూసిన ప్రతిసారి ఏదో తెలియని ప్రశాంతత. సడన్గా ఆ శబ్ధం వినిపించకపోయేది. నేను చేయగలను అనుకున్నాను. అతడిని నా భాగస్వామిగా ఎంచుకుంటున్నాను అని నాకు నేను మరోసారి చెప్పుకున్నప్పుడు మనసు శాంతించింది. ఇద్దరం కలిసి నడుద్దాం.. అలాగే ఒకరికొకరం ఎదగడానికి అవకాశం ఇద్దాం. మన మధ్యలోని అనుబంధాన్ని కొనసాగిద్దాం.. ఇదే నాకు అన్నింటికన్నా ఎంతో ముఖ్యమైనది.పెళ్లి సులభంగా జరగలేదుసమయం వచ్చింది కాబట్టి మా పెళ్లి జరగలేదు, నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టే ఈ వేడుక జరిగింది. నేను ఊహించినంత సులభంగా ఈ పెళ్లి జరగలేదు. కానీ, ఎంతో నిజాయితీగా, అందంగా, అర్థవంతంగా వివాహం జరిగింది అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలుగు బిగ్బాస్ మూడో సీజన్లో పాల్గొన్న పునర్నవి.. ఉయ్యాల జంపాల, పిట్టగోడ, సైకిల్ వంటి పలు చిత్రాల్లో నటించింది.చదవండి: డోర్ తీసి చీర మార్చుకో.. స్టార్ నిర్మాత చెంప చెళ్లుమనిపించా: నటి -
ఓటీటీలో 'మట్కా కింగ్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసిన విజయ్ వర్మ.. కొన్నాళ్ల క్రితం తమన్నాతో డేటింగ్ చేసి వార్తల్లో నిలిచాడు. తర్వాత వీళ్లిద్దరూ విడిపోయారు కూడా. ఇప్పుడు ఎవరికి వాళ్లు కెరీర్ పరంగా బిజీ అయిపోయాడు. విజయ్ వర్మ నటించిన క్రైమ్ డ్రామా సిరీస్ ఇప్పుడు స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు రిలీజ్ డేట్ ప్రకటించడంతో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి? ఎందులోకి రాబోతుంది?(ఇదీ చదవండి: ఓటీటీలో ఉస్తాద్ భగత్సింగ్..!)మట్కా పేరుతో గతంలో బెట్టింగ్ తరహా గేమ్ ఉండేది. ఇప్పుడు దీన్ని బ్యాక్డ్రాప్ స్టోరీగా తీసుకుని తెరకెక్కించిన సిరీస్ 'మట్కా కింగ్'. విజయ్ వర్మ, కృతిక కమ్రా, గుల్షన్ గ్రోవర్ తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. 'సైరత్' లాంటి బ్లాక్బస్టర్ మూవీ తీసిన నాగరాజ్ ముంజలే ఈ సిరీస్కి దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుందని తాజాగా రిలీజ్ చేసిన టీజర్తో ప్రకటించారు.టీజర్ బట్టి చూస్తే.. ముంబైకి చెందిన రతన్ ఖత్రీ జీవితం ఆధారంగా ఈ సిరీస్ తీసినట్లు తెలుస్తోంది. 1960ల్లో ఓ సాధారణ పత్తి వ్యాపారి (విజయ్ వర్మ), తన తెలివితేటలతో మట్కా అనే జూద సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు? ఈ క్రమంలోనే అండర్ వరల్డ్, పోలీసులని ఎలా ఎదుర్కొన్నాడు? తదితర అంశాలే స్టోరీ అని తెలుస్తోంది. గతంలో తెలుగులో 'మట్కా' పేరుతో వరుణ్ తేజ్ హీరోగా సినిమా వచ్చింది గానీ అది ఘోరమైన డిజాస్టర్ అయింది. కానీ ఇప్పుడొస్తున్నది సిరీస్ కాబట్టి ఇందులో స్టోరీ మరింత రియలస్టిక్గా చూపించే అవకాశముంది.(ఇదీ చదవండి: ఓటీటీలో శ్రీవిష్ణు థ్రిల్లింగ్ సినిమా.. ప్రకటన వచ్చేసింది) -
దురంధర్-2పై విమర్శలు.. దెబ్బకు సోషల్ మీడియా ఖాతా డిలీట్...!
మార్చి నెల అంతా దురంధర్ పేరే వినిపిస్తోంది. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లు దాటేసింది. వసూళ్ల పరంగా ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. పార్ట్-1 రిలీజైన మూడు నెలల్లోనే సీక్వెల్ కూడా రావడంతో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. మొదటి నుంచే భారీ అంచనాలు ఉండడంతో ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఇప్పటికే సౌత్ స్టార్స్ సైతం ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురందర్: ది రివెంజ్' మార్చి 19న థియేటర్లలో రిలీజైంది.అయితే ఈ మూవీ ఒకవైపు ప్రశంసలు వస్తుంటే.. విమర్శలు సైతం అదేస్థాయిలో చేస్తున్నారు. ప్రాపగండ అనే ముద్ర వేస్తున్నారు. బాలీవుడ్ నటి అని అనీల్ పడ్డా సోదరి రీత్ పడ్డా దురంధర్ సీక్వెల్పై విమర్శలు చేసింది. ఈ సినిమా 'ది కేరళ స్టోరీ', 'ది కాశ్మీర్ ఫైల్స్' లాంటి చిత్రాల్లాగే ప్రాపగండగా చిత్రీకరించారని కామెంట్స్ చేశారు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఈ వివాదంతో ఊహించని విధంగా ఆమె ఇన్స్టా ఖాతా డిలీట్ చేసేసింది. మొదట ప్రైవేట్గా ఉంచిన రీత్ పడ్డా.. ఆ తర్వాత ఏకంగా ఖాతానే తొలగించింది. ప్రస్తుతం ఇన్స్టాలో ఆమె ప్రొఫైల్ అందుబాటులో లేదు. ఈ వివాదం తర్వాత ఆమె లింక్డ్ఇన్ ఖాతాను కూడా తొలగించినట్లు తెలుస్తోంది. ధురందర్తో సహా ది కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ చిత్రాలను రీత్ విమర్శించడంతో ఈ వివాదం మొదలైంది. దీనిపై నెట్టింట పెద్దఎత్తున ట్రోల్స్ రావడంతో ఏకంగా సోషల్ మీడియా ఖాతానే మూసేయాల్సి వచ్చింది.అంతేకాకుండా రీత్ వ్యక్తిగత జీవితంపై కూడా ఆన్లైన్లో ట్రోల్స్ వచ్చాయి. ఫాజిల్ అహ్మద్ అనే వ్యక్తితో ఆమెకు రిలేషన్ ఉందంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అయితే తమపై వస్తున్న ట్రోల్స్పై రీత్ గానీ, అనీత్ పడ్డా గానీ వాటిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు నటి అనీత్ పడ్డా మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న 'శక్తి శాలిని' చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. -
కొత్త నిర్మాతలకు ఇదే నా సలహా : ‘సుయోధన’ నిర్మాత
ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సుయోధన’. డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. బోసుబాబు నిడుమోలు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ శుక్రవారం(మార్చి 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ - సుయోధన చిత్రంతో మొదటి ప్రయత్నంలోనే మా చిత్రానికి మంచి విజయాన్ని అందించారు. మా నెక్ట్స్ మూవీకి ఇంతకంటే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం అన్ని ఏరియాల నుంచి రెస్పాన్స్ బాగుంది. ఈ సినిమా చేసిన అనుభవంతో నెక్ట్స్ మరో మంచి చిత్రంతో మీ ముందుకు వస్తాం. అయితే ఈ సారి ఏదైనా పేరున్న సంస్థతో భాగస్వామ్యం అయి సినిమా నిర్మించాలని అనుకుంటున్నాం. ఎంతో కొంత అనుభవం, అవగాహన తెచ్చుకున్న తర్వాత చిత్ర పరిశ్రమలోకి రావాలని కొత్త నిర్మాతలకు నా సలహా. త్వరలోనే మంచి సబ్జెక్ట్ చూసుకుని కొత్త మూవీ అనౌన్స్ చేస్తాం. ఈ సారి మా సంస్థలో రాబోయే సినిమా పక్కా ప్లానింగ్ తో ఉంటుంది. అన్నారు.డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ - సుయోధన మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రతి షో కు స్క్రీన్స్ పెరుగుతున్నాయి. ఓవర్సీస్ లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. అక్కడి నుంచి మిత్రులు మూవీ చాలా బాగుందంటూ ఫోన్స్ చేస్తున్నారు. ప్రియదర్శి, సాయికుమార్ నటన ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తోంది. మా సినిమాను మరింతగా ప్రేక్షకుల దగ్గరకు మీరు రీచ్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు. -
'డోర్ తీసి చీర మార్చుకో'.. ఆ స్టార్ నిర్మాతను కాలితో తన్నా: నటి
భయం తన బ్లడ్డులోనే లేదంటోంది నటి రాధా ప్రశాంతి. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే ఆమెను టైగర్, ఫైర్ బ్రాండ్ అని పిలుస్తుంటారు. హీరోయిన్గా, సెకండ్ హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 125 సినిమాలు చేసిన ఆమె చాలాకాలంగా వెండితెరకు దూరంగా ఉంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యను ఏకరువు పెట్టింది.అర్ధరాత్రి రాద్ధాంతంరాధా ప్రశాంతి మాట్లాడుతూ.. 'నేనుంటున్న ఫ్లాట్ 2005లో బిల్డర్ దగ్గర కొనుక్కున్నాను. మొదట్లో దాన్ని అద్దెకిచ్చాము. అక్కడేం జరుగుతుందో నాకు తెలిసేది కాదు. 2012లో మేము ఆ ఫ్లాట్కు షిఫ్ట్ అయ్యాం. ఆ అపార్ట్మెంట్లో అక్రమ కార్యకలాపాల ఆఫీసులు నడిపిస్తున్నారని తెలిసింది. వాళ్లు తాగి వచ్చి అర్ధరాత్రి మా ఇంటి తలుపు తట్టేవారు. ముఖ్యంగా వాచ్మెన్ కుటుంబంతోనే నాకు ప్రాణభయం ఉంది.నా ఇంటిని తగలపెట్టారునా ఇంటి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో వ్యభిచారం జరుగుతోంది. 2014లో పోలీసులు రైడ్ చేసి ఆ బిల్డింగ్ను సీజ్ చేశారు. కొంతకాలానికి మళ్లీ ఆ దందా మొదలుపెట్టారు. వీడియో ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదు. డ్రగ్స్ బిజినెస్ కూడా చేస్తున్నారు. వాళ్ల దందాకు అడ్డొస్తున్నాననే కరోనా సమయంలో ఓ నిర్మాత నా ఇంటిని కావాలని తగలపెట్టాడు. నన్ను అక్కడినుంచి వెళ్లగొట్టాలని దాడులు చేయించారు.నిజాలు మాట్లాడితే నిందలా?నాకు మానసిక పరిస్థితి సరిగా లేదు, పిచ్చి అని ప్రచారం చేసి నన్ను పంపించేయాలని చూశారు. నిజాలు మాట్లాడేవారిపై ఇలాంటి నిందలేస్తారా? కొన్నేళ్లుగా నా ఇంటి విషయంలో నరకం అనుభవిస్తున్నాను. గతంలో కూడా నాపై ఇలాంటి దుష్ప్రచారమే జరిగింది. ఓసారి టచప్ బాయ్ నా ఇంట్లో నుంచి 15 తులాల బంగారం దొంగతనం చేశాడు. కానీ రివర్స్లో నేను అతడిని చిత్రహింసలు పెట్టినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది పేపర్లో వచ్చింది. నేను అతడిపై చేయి చేసుకోలేదు. దీంతో ఆ వార్త రాసిన వ్యక్తిని అమీర్పేట చౌరస్తాలో కాలర్ పట్టుకుని కొట్టాను. నాపై ఇలాంటి మచ్చ వేస్తే మా జీవితం ఏం కావాలి?కాలర్ పట్టుకుని..షూటింగ్స్లో కూడా ఒకటీరెండుసార్లు చేయి చేసుకున్నాను. ఒక ప్రొడక్షన్ మేనేజర్.. ఇప్పుడు ఆయన పెద్ద నిర్మాతయ్యాడనుకోండి.. నేను గదిలో దుస్తులు మార్చుకుంటుంటే డోర్ తీశాడు. నేను వెంటనే వెళ్లి డోర్ లాక్ చేశాను. క్షణం ఆగకుండా తలుపు తడుతూనే ఉన్నాడు. ఏంటని డోర్ తీశాను. అతడు నవ్వుతూ.. ఔట్ డోర్ షూటింగ్లో చెట్టు పక్కనే చీర మార్చుకుంటారు.. నేనిక్కడే ఉంటా.. చీర మార్చుకో అన్నాడు. కోపంతో తన్నాను. కాలర్ పట్టుకుని కొడుతూ నిర్మాత దగ్గరకు తీసుకెళ్లాను' అని గుర్తు చేసుకుంది.ఏఎన్నార్ సలహా'సినిమాలో అన్నిరకాల మనుషులుంటారు. ఎవరేమన్నా సరే సెట్లో యాక్ట్ చేయడం నేర్చుకో.. కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకో.. సర్దుకుని వెళ్లు, అలాగని తప్పు చేయమని చెప్పడం లేదు, సున్నితంగా తప్పించుకుని వెళ్లు అని ఏఎన్నార్ సలహా ఇచ్చారు. కానీ నాకు నిజ జీవితంలో యాక్టింగ్ చేయడం రాలేదు' అని రాధా ప్రశాంతి చెప్పుకొచ్చింది. కాగా ఈమె.. పరువు ప్రతిష్ట, శ్రీదేవి నర్సింగ్హోం, పెళ్లి పందిరి, గోకులంలో సీత, పెళ్లి చేసుకుందాం రా, మధ్యతరగతి మహాభారతం.. ఇలా ఎన్నో సినిమాలు చేసింది. బుల్లితెరపై సీరియల్స్ కూడా చేసింది.చదవండి: పెళ్లయితే సినిమాలు మానేయాలని కండీషన్.. అందుకే రిజెక్ట్ చేశా: హీరోయిన్ -
9 ఏళ్ల ‘బాహుబలి’ రికార్డు బ్రేక్ చేసిన ‘ధురంధర్’.. నిర్మాత ట్వీట్ వైరల్
ధురంధర్ 2 చిత్రం ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేస్తోంది. బాలీవుడ్,టాలీవుడ్ అని మాత్రమే కాదు ఎక్కడ చూసినా.. ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. విడుదలై 10 రోజులు గడుస్తున్నా.. థియేటర్స్కి జనం పోటెత్తుతున్నారు. కలెక్షన్ల పరంగా ఈ చిత్రం రికార్డులను బద్దలు కొడుతుంది. 10 రోజుల్లో రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దాంతో పాటు బాహుబలి రికార్డుని కూడా బద్దలు కొట్టింది. ఉత్తర అమెరికా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఇండియన్ సినిమాగా బాహుబలి 2 ఉంది. గత 9 ఏళ్లుగా ఉన్న ఈ రికార్డును తాజాగా ధురంధర్ 2 బద్దలు కొట్టింది. కేవలం 10 రోజుల్లోనే 20+ మిలియన్ల డాలర్లను కలెక్ట్ చేసింది.ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ‘బాహుబలి 2 రికార్డుని ధురంధర్ 2 అధిగమించింది’ అని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టారు. దీనిపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. ‘నేను కూడా ఇటీవల ధురంధర్ 2 చూశా. ఆద్యంతం ఆస్వాదించా. ఈ చిత్రం అన్ని రికార్డులు బద్దలుకొడుతూ.. కొత్త బెంచ్మార్క్ను నెలకొల్పడం ఆనందంగా ఉంది. చిత్ర బృందానికి అభినందనలు’ అని పేర్కొన్నారు.రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆదిత్యధర్ దర్శకత్వం వహించారు. రణ్వీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రలు పోషించారు. Yesterday I watched #Dhurandhar2TheRevenge and needless to say I loved it and thoroughly enjoyed the film! Happy to see it breaking all the records and setting new box office benchmarks in India and worldwide! Congratulations to the entire team! 👏🏼👏🏼 https://t.co/ATl3o3bNTu— Shobu Yarlagadda (@Shobu_) March 28, 2026 -
ఓటీటీలో ఉస్తాద్ భగత్సింగ్..!
పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్సింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి నెట్టింట వైరల్ అవుతుంది. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 19న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. ఇప్పటి వరకు సుమారు రూ. 70 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ సంస్థ సాక్నిల్క్ పేర్కొంది. ఓవర్సీస్లో ఉస్తాద్ కనీసం 1మిలియన్ మార్క్ కూడా దాటలేదు. ధురంధర్-2 హిట్ కావడంతో చాలా స్క్రీన్స్ నుంచి ఉస్తాద్ భగత్సింగ్ చిత్రాన్ని తొలగించారు.‘ఉస్తాద్ భగత్సింగ్’ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాకపోవడంతో పాటుగా ధురంధర్-2 దెబ్బ కూడా గట్టిగానే ప్రభావం చూపింది. దీంతో థియేట్రికల్ రన్లో బోల్తా పడింది. ఈ క్రమంలో వీలైనంత త్వరగా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. ఏప్రిల్ 17న నెట్ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్కు తీసుకురావాలనే ప్లాన్లో ఉన్నట్లు సమాచారం. ఈ తేదీలో కుదరకపోతే ఏప్రిల్ 24న తప్పకుండా ఉస్తాద్ ఓటీటీ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. థియేటర్స్లో మెప్పించలేని ఈ మూవీ కనీసం ఓటీటీ ప్లాట్ఫామ్లో అయినా మంచి రెస్పాన్స్ సాధిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. -
ఎమోషనల్ లవ్ స్టోరీ.. అనకాపల్లి టీజర్ చూశారా?
విక్రమ్ సాహిదేవ్, సంధ్యా వశిష్ఠ, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం అనకాపల్లి. ఈ సినిమాకు తమ్మినేని ఖగేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ నక్కిన త్రినాథరావు కథ అందించారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన అనకాపల్లి టీజర్ చూస్తుంటే ప్రేమకథా చిత్రంగా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని భవ్యశ్రీ మూవీ మేకర్స్, నక్కిన నారేటివ్స్ బ్యానర్లపై కండ్రేగుల నాయుడు, నక్కిన త్రినాథరావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవ్జాండ్ సంగీతమందిస్తున్నారు. -
హవ్వ, పెళ్లి కాలేదా? ప్రియురాలి కోసం అబద్ధమాడిన హీరో!
తమిళ హీరో రవి మోహన్ ఓపక్క విడాకుల వ్యవహారం, మరోపక్క సింగర్ కెనీషా ఫ్రాన్సిస్తో డేటింగ్ రూమర్స్తో వార్తల్లో ఉంటున్నాడు. విడాకులు మంజూరవకముందే సింగర్తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ చాలాసార్లు విమర్శలపాలయ్యాడు. అయితే ఏకంగా అతడికి అసలు పెళ్లే కాలేదని చెప్తూ ప్రియురాలి కోసం ల్యాండ్ కొన్నట్లు ఓ వార్త కోలీవుడ్ టౌన్లో వైరల్గా మారింది.ఇంకా పెళ్లవలేదు!రవి మోహన్, కెనీషా ప్రాన్సిస్ గోవాలో భూమి కొనుగోలు చేశారట. ఈ ప్రాపర్టీ ఖరీదు రూ.40-42 లక్షలని తెలుస్తోంది. అయితే రిజిస్ట్రేషన్ సంబంధిత పత్రాల్లో రవి మోహన్.. అన్ మ్యారీడ్ అంటూ తనకింకా పెళ్లవలేదని పేర్కొన్నాడట! విడాకులు మంజూరు కాకముందే సింగిల్ అని ఎలా పేర్కొంటారని పలువురు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరేమో.. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సిబ్బంది పొరపాటున అన్మ్యారీడ్ సెలక్ట్ చేసి ఉంటారని భావిస్తున్నారు.పేరు మార్పుకాగా రవి మోహన్.. ప్రముఖ నిర్మాత సుజాత విజయ్కుమార్ కూతురు ఆర్తిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఆరవ్, అయాన్ సంతానం. 2024లో రవి మోహన్, ఆర్తి విడిపోయారు. అయితే చట్టపరంగా ఇంకా విడాకులు మంజూరు కాలేదు. ఇకపోతే జయం మూవీతో బ్రేక్ అందుకుని జయం రవిగా కొనసాగుతున్న ఆయన.. గతేడాది జనవరిలో తన పేరు మార్చుకున్నాడు. ఇకపై జయం రవి కాకుండా రవి మోహన్ అనే పిలవాలని కోరాడు. చివరగా పరాశక్తి సినిమాలో విలన్గా నటించాడు.చదవండి: నిన్ను నా అంతగా ఇంకెవరూ ప్రేమించలేరు: విజయ్ ఆంటోని -
ఆ హీరో నన్ను మోసం చేశాడు.. యువకుడి ఆత్మహత్యాయత్నం
భారీ మొత్తంలో నగదు తీసుకొని, తిరిగి ఇవ్వకుండా ఓ హీరో వేధిస్తున్నాడంటూ చిత్తూరు జిల్లాకు చెందిన లోకేష్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన చావుకు కారణం హీరో మాన్యం మురళీ కృష్ణనే అంటూ రాసిన సూసైడ్ లెటర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.‘జెట్టి’ సినిమా హీరో మాన్యం మురళీ కృష్ణకి తన బంధువుల ద్వారా రూ.3.15 కోట్లు ఇప్పించానని, తిరిగి ఇవ్వమని అడిగితే.. ఇవ్వకుండా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ.. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు లోకేశ్ను బంగారుపాళ్యం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం చిత్తూరు తీసుకెళ్లారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. వాస్తవాలు తెలియాల్సి ఉంది.సూసైడ్ లెటర్లో ఏముంది?సూసైడ్ నోట్ లో తనకు జరిగిన అన్యాయం గురించి లోకేష్ రాసుకొచ్చాడు. ‘నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. మా అమ్మనాన్నలను, భార్యబిడ్డలను ఈ స్తాయికి తీసుకోస్తానని అనుకోలేదు. నా కుటుంబాన్ని ఈ రోజు నేను రోడ్డుపైకి తీసుకొచ్చాను. అంతా అప్పుల పాలు అయిపోయాను. నన్ను క్షమించండి. ఈ రోజు నేను తల ఎత్తుకొని బతకలేకపోతున్నాను. నా చావుకు కారణం హీరో మాన్యం మురళీ కృష్ణ. ఇతను రైల్వే కాంటాక్ట్ పేరుతో మోసం చేశాడు. మొత్తం మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఇందులో నా బంధువులతో పాటు సోదరులు కూడా డబ్బులు పెట్టారు. ఇతని వల్ల అందరూ ఇప్పుడు రోడ్డుపైకి వచ్చారు. ఇన్నిరోజుల నా కష్టం మొత్తం వృధా అయింది. అతన్ని(మురళీ కృష్ణ) మాత్రం వదలకండి. ఇతనితో పాటు వాళ్ల తమ్ముడు కూడా ఇందులో ఉన్నాడు. ఇద్దరు కలిసి మోసం చేశారు. డబ్బులు అడుగుతుంటే ఇవ్వడం లేదు. ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకుంటున్నాను. నన్ను క్షమించండి’ అని సూసైడ్ లెటర్లో రాసుకొచ్చాడు.బ్రేకింగ్ న్యూస్అమ్మానాన్న క్షమించండి..జెట్టి సినిమా హీరో తనను మోసం చేశాడంటూ చిత్తూరు జిల్లాకు చెందిన యువకుడు లోకేష్ ఆత్మహత్యాయత్నంహీరో మాన్యం మురళీకృష్ణకు రూ.3.15 కోట్లు బంధువుల ద్వారా ఇప్పించానని రైల్వే కాంట్రాక్ట్ పేరుతో మోసం చేశాడంటూ సూసైడ్ నోట్ రాసి… pic.twitter.com/mYGIpHyMEz— Telugu Feed (@Telugufeedsite) March 28, 2026గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
బాలకృష్ణతో డింపుల్.. మీకెవరు చెప్పారంటూ గోపీచంద్ కౌంటర్
బాలకృష్ణ- దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో చిత్రం రానున్న సంగతి తెలిసిందే. గతంలో ‘వీర సింహారెడ్డి’తో విజయం అందుకున్న తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న రెండో సినిమా ఇది. అయితే, ఇందులో హీరోయిన్గా డింపుల్ హయాతిని తీసుకున్నారని సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఎంపిక అనేది దర్శకుడి బ్లండర్ మిస్టేక్ అని.. ఆమెకు బదులుగా రవీనా టండన్ని తీసుకుంటే బాగుండేదని నెటిజన్ పోస్ట్ చేశారు. అయితే, దర్శకుడు గోపీచంద్ మలినేని ఫన్నీగా మహేష్బాబు వీడియోతో సమాధానం ఇచ్చారు.హీరోయిన్ ఎంపిక గురించి ప్రస్తావిస్తూ.. మంచి హైప్ ఉన్న సినిమాను(NBK111) ఎలా చెడగొట్టాలో మేకర్స్ ని చూసి బాగా నేర్చుకోవచ్చని నెటిజన్ పోస్ట్ చేయడంతో దర్శకుడు గోపీచంద్ మలినేని కౌంటర్ ఇచ్చారు. సింపుల్గా మహేష్ బాబు మాట్లాడుతున్న ఒక మీమ్ వీడియోను పంచుకుంటూ, ఆ వార్తలలో ఏమాత్రం నిజం లేదని తేల్చిచెప్పారు. 'మీకేమన్నా చెప్పారా ఎవరైనా.. నేను అయితే ఎవరికీ చెప్పలేదండి' అనే మహేష్ డైలాగ్ను షేర్ చేశారు.ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ చిత్రంలో హీరోయిన్గా నయనతారను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇందులో ఒక కీలక పాత్రలో సముద్రఖని నటిస్తున్నట్లు సమాచారం. వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి, తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో ప్రత్యేక సెట్లో జరుగుతున్న షూటింగ్లో బాలయ్య పాల్గొంటున్నట్లు టాక్. ఇది ముంబయి నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండనుంది. https://t.co/qSP7PTXug8 pic.twitter.com/rqmOPRCgJ3— Gopichandh Malineni (@megopichand) March 29, 2026 -
‘బైకర్’ శర్వానంద్ 23 కిలోలు తగ్గాడు: అభిలాష్ రెడ్డి
శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బైకర్’. ఈ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటించగా, రాజశేఖర్, అతుల్ కులకర్ణి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్పై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో అభిలాష్ రెడ్డి కంకర మాట్లాడుతూ– ‘‘బైకర్’లో రేసింగ్తో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన కల్పిత కథ ఇది. తండ్రీ–కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. శర్వానంద్గారి నటన అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రం కోసం ఆయన ఆరు నెలలు ఫిజికల్గా, మెంటల్గా ప్రిపేర్ అయ్యారు. 23 కేజీల బరువు తగ్గారు. ‘బైకర్’ను శర్వాగారు తన కెరీర్లోనే బెస్ట్ ఫిల్మ్గా చెప్పారు. ఇందులో శర్వాగారి తండ్రి, కోచ్ పాత్రలో రాజశేఖర్గారు నటించారు. ఆయన చుట్టూ ఈ కథ తిరుగుతుంది. శర్వానంద్, రాజశేఖర్గార్లు, మాళవిక ... ఇలా అందరూ ‘బైకర్’ సినిమా ఫస్ట్ నరేషన్లోనే ఓకే చెప్పారు. ఈ కథకు అంతలా కనెక్ట్ అయ్యారు. కథ 1990, 2000.. ఇలా రెండు డిఫరెంట్ టైమ్లైన్స్లో జరుగుతుంది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడానికే దాదాపు 60 రోజులు పట్టింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల నుంచి రేసర్స్ను తీసుకువచ్చి చిత్రీకరించాం. అలాగే 90స్లోని రెండు స్పోర్ట్స్ బైక్స్ ఉండేవి, అవి ఇప్పుడు లేవు. వాటిని డిజైన్ చేయడానికి చాలా టైమ్ పట్టింది. ఇండియాలో శ్యామ్ కొఠారి అనే రేసర్ ఉన్నారు. క్రికెటర్గా కపిల్ దేవ్కి వచ్చినంత గుర్తింపు, రేసింగ్లో శ్యామ్ కొఠారీకి రాలేదు. మా సినిమా మోటివ్ కూడా ఇలాంటి గుర్తింపులు దక్కాలనే. మా నిర్మాతలు ఫస్ట్ కాపీ చూసి, హ్యాపీగా ఉన్నారు. త్రీడీలో చేద్దామని నిర్మాతలు అడిగితే నేనే వద్దన్నాను. సౌండ్, ఆర్ఆర్ విషయంలో జిబ్రాన్ సరికొత్త మ్యూజిక్ అందించారు. ఈ సినిమా చూసిన ఆడియన్స్ ఓ మంచి ఫీలింగ్తో బయటకు వస్తారు. నా తర్వాతి సినిమా ‘దిల్’ రాజుగారితో ఉంటుంది’’ అన్నారు. -
మహాకాళిలో ప్రభాస్..!
టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ)లో భాగంగా తెరకెక్కుతున్న చిత్రం మహాకాళి.. ఇదే సినిమాటిక్లో వచ్చిన హనుమాన్ భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఫీమేల్ సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్కు ప్రశాంత్ వర్మ కథ అందిస్తుండగా.. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహాకాళిగా కన్నడ నటి భూమి శెట్టి నటింస్తుండగా.. బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా (Akshaye Khanna) శుక్రాచార్యుడిగా నటిస్తున్నారు. అయితే, ప్రభాస్ కూడా ఈ మూవీలో భాగం కానున్నారని ప్రచారం జరుగుతుంది.మహాకాళి చిత్రంలో ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారని సోషల్మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ.. ఆయన తన పాత్ర చిత్రీకరణను కూడా ఇప్పటికే పూర్తి చేశారని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో ఆయన పోషించబోయే పాత్ర ఎలా ఉండనుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కన్నప్పలో కూడా ప్రభాస్ అతిథి పాత్రలో మెప్పించిన విషయం తెలిసిందే.ఇప్పటివరకు మహాకాళి సినిమా 100 రోజుల షూటింగ్ను పూర్తి చేసుకున్నట్లు సమాచారం. అక్షయ్ ఖన్నా పాత్రకు సంబంధించి కూడా చిత్రీకరణ కూడా పూర్తయిందట. పశ్చిమ బెంగాల్ నేపథ్యంలో సాగుతున్న ఈ చిత్రాన్ని ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్పై రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మించారు. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందించారు. ఇదే యూనివర్స్ (PVCU)లో భాగంగా ‘అధీర’ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఎస్జే సూర్య , కల్యాణ్ దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సూపర్ హీరో చిత్రాన్ని శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించనున్నారు. -
నా అంతగా ఎవరూ ప్రేమించలేరు, అదే నీకిచ్చే గిఫ్ట్: విజయ్ ఆంటోని
విజయ్ ఆంటోనీ సంగీత దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. మ్యూజిక్ డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత అతడు హీరోగా మారాడు. కొన్ని సినిమాలకు తనే ఎడిటర్గానూ వ్యవహరించాడు. లిరిసిస్ట్గా, సింగర్గానూ టాలెంట్ చూపించాడు. అయితే విజయ్ ఆంటోని వైవాహిక జీవితం మొదలుపెట్టాకే హీరోగా ప్రస్థానం ప్రారంభించాడు. 2006లో ఫాతిమాను పెళ్లి చేసుకున్నాడు.నువ్వే నా ప్రపంచంఅన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ఎంతో అందంగా ఉంటుందీ జంట. నేడు (మార్చి 29న) ఫాతిమా పుట్టిన రోజు. ఈ సందర్భంగా భార్య కోసం స్పెషల్ పోస్ట్ పెట్టాడు విజయ్. మిసెస్ విజయ్ ఆంటోని.. మై డియర్ లవ్, నువ్వే నా ప్రపంచం, నువ్వే నా యజమానివి. మై డియర్ పట్టు.. ఈరోజు నేను చేస్తున్న వాగ్ధానమే నీకిచ్చే బహుమతి. నీ జీవితంలో నేను నిన్ను ప్రేమించినంతగా ఇంకెవరూ ప్రేమించలేరు. ఆఖరికి భగవంతుడు కూడా నీ జీవితంలో నా అంత ప్రేమను పంచలేడు.సినిమానువ్వు నా సహచరివి, సర్వస్వానివి, నా జీవితానికే పరమార్థానివి.. ఐ లవ్యూ అని రాసుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం విజయ్ ఆంటోని నూరు సామి సినిమా చేస్తున్నాడు. ఇది తెలుగులో వంద దేవుళ్లు పేరిట రిలీజ్ కానుంది. బిచ్చగాడు డైరెక్టర్ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.చదవండి: సినిమాలు మానేయాలని కండీషన్.. హీరోతో పెళ్లి రిజెక్ట్ చేశా: హీరోయిన్ -
సినిమాలు మానేయాలని కండీషన్.. అందుకే ఆ హీరోతో పెళ్లి క్యాన్సిల్
ఒకప్పుడు సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణించింది ముంతాజ్. ఖిలోనా, దో రాస్తే, తేరే మేరే సాప్నే, రోటి వంటి పలు చిత్రాలతో మెప్పించింది. కానీ పెళ్లయిన వెంటనే సినిమాలకు దూరమైంది. అందుకు గల కారణాన్ని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ముంతాజ్ మాట్లాడుతూ.. నేను సాంప్రయదాయక ఇరానీ కుటుంబం నుంచి వచ్చాను. ఫలానా వయసు రాగానే పెళ్లి చేసేయాలని మా నాన్న ఆలోచన. అలాగే 40, 50 ఏళ్లుచ్చేవరకు మహిళలు పని చేయకూడదని అనుకుంటాడు. పెళ్లయ్యాక సినిమాలు చేయకూడదని..మా ఇంట్లో అందరూ నాకు త్వరగా పెళ్లి చేయాలనే అనుకున్నారు. నాకు ఏడెనిమిదేళ్ల వయసున్నప్పుడే నా భర్త కుటుంబం గురించి తెలుసు. వాళ్లు మా పొరిగింట్లోనే ఉండేవారు. అలా వాళ్ల గురించి పూర్తిగా తెలుసు గనకే నన్ను ఆ ఇంటికి పంపించారు. పెళ్లయ్యాక సినిమాలు చేయకూడదని అమ్మ మరీమరీ చెప్పింది. అత్తింట్లో బాగా చూసుకుంటారని ధైర్యం ఇచ్చింది. నేనెప్పుడూ ఇంట్లో వాళ్ల మాట కాదనలేదు. నాకు ఇంకొంతకాలం సినిమాలు చేయాలన్న ఆశయితే ఉండేది. నా భర్త ఓపికగా ఎదురుచూశాడుకానీ, ఇంట్లో వాళ్లను నొప్పించలేక మయూర్ను పెళ్లి చేసుకున్నాను. అతడు భారత్లో ఉండేవాడు కాదు, ఇంగ్లాండ్లో చదువుకునేవాడు. అతడి కుటుంబం ఉగాండాలో బిజినెస్ చేస్తుండేది. వారిది మంచి ఉన్నత కుటుంబం. అయితే పెళ్లయ్యాక వెంటనే సినిమాలు మానేయలేదు. అప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టుల షూటింగ్స్లో పాల్గొన్నాను. దాదాపు రెండేళ్లలో షూటింగ్స్ అన్నీ పూర్తి చేసుకున్నాను. అప్పటివరకు నా భర్త ఎంతో ఓపికగా ఎదురుచూశాడు అంది.చాలా చిన్నదాన్నినటుడు షమ్మీ కపూర్తో పెళ్లి ఎందుకు ఆగిపోయిందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని. నా మనసులో పెళ్లి ఆలోచనే లేదు. పైగా షమ్మీ తండ్రి పృథ్వీరాజ్ కపూర్.. తనకు కాబోయే కోడలు పని చేయకూడదని కండీషన్ పెట్టాడు. నాకంటూ అప్పుడు చాలా కలలు, కోరికలున్నాయి. అందుకే పెళ్లి కన్నా పని ముఖ్యమనుకున్నాను. పర్సనల్ లైఫ్ఆయన పెట్టిన కండీషన్ వల్లే షమ్మీ భార్య గీతా బాలాజీ కూడా పెళ్లవగానే సినిమాలు మానేసింది అని చెప్పుకొచ్చింది. కాగా ముంతాజ్.. షమ్మీ కపూర్ను పెళ్లాడేందుకు రెడీ అయింది. వీరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. అనంతరం ఉంగాడాలో బిజినెస్ చేసే మయూర్ మాధ్వానిని 1974లో పెళ్లాడింది. వీరికి ఇద్దరు కూతుర్లు సంతానం.చదవండి: నా బిడ్డను ముద్దు పెట్టుకోకూడదు: మెరీనా వార్నింగ్ -
ఓటీటీలో శ్రీవిష్ణు థ్రిల్లింగ్ సినిమా.. ప్రకటన వచ్చేసింది
టాలీవుడ్లో హీరో శ్రీవిష్ణు నటించిన కొత్త చిత్రం 'మృత్యుంజయ్' ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. తన కామెడీ జానర్ని వదిలి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా ఈ మూవీతో థియేటర్లోకి వచ్చాడు. దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 6న విడుదలైంది. ఇందులో రెబా మోనికా జాన్, వీర్ ఆర్యన్, చిన్నా, సుదర్శన్, రచ్చ రవి, బాలాదిత్య తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని సందీప్ గున్నం మరియు వినయ్ చిలకపాటి నిర్మించగా, కాల భైరవ సంగీతం అందించారు.'మృత్యుంజయ్' సినిమా ఏప్రిల్ 3న ఓటీటీలోకి రానుంది. నెట్ఫ్లిక్స్(Netflix) అప్కమింగ్ చిత్రాల జాబితాలో అధికారికంగా ప్రకటించింది. క్రైం థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ చిత్రం థియేటర్స్లో ప్రేక్షకులను మెప్పించంది. అయితే, ఓటీటీలో ఏమేరకు రాణిస్తుందో చూడాలి. ఈ వీకెండ్లో థ్రిల్ తెప్పించే సినిమాగా 'మృత్యుంజయ్' ఉంటుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.కథేంటంటే.. జయ్ (శ్రీవిష్ణు)..ఓ ప్రముఖ దినపత్రికలో యాడ్ డిపార్ట్మెంట్లో పని చేస్తుంటాడు. ఎప్పటికైనా క్రైమ్ రిపోర్టర్గా మారాలనేది తన కల. ‘శ్రద్ధాంజలి’ యాడ్స్ కోసం చనిపోయిన వారి ఇంటికి వెళ్లి.. వాళ్ల గురించి గొప్పలు చెబుతూ కుటుంబ సభ్యుల నుంచి ప్రకటనల్ని తీసుకోస్తుంటాడు. అలా ఓ సారి అచ్యుత్రావు (బాలాదిత్య) అనే వ్యక్తి చనిపోయాడని తెలుసుకొని.. వాళ్ల ఇంటికి వెళ్తాడు. అక్కడ సైలెంట్గా ఉన్న అచ్యుత్రావు కూతురు అంజలిని చూడగానే అతని బ్యాల్యం గుర్తొస్తుంది. ఆమె అమాయకంగా ‘మా నాన్నకు అలా ఎందుకైంది’ అని ప్రశ్నించడం చూసి చలించిపోతాడు.చిన్నారి ప్రశ్నకు సమాధానం చెప్పాలకుంటాడు. మూడు రోజుల తర్వాత అచ్యుత్ తరహాలోనే విక్రాంత్ అనే వ్యక్తి కూడా మరణిస్తాడు. అయితే ఇవన్నీ ప్రమాదవశాత్తు జరిగిన మరణాలే అని పోలీసులు నిర్ధారణకు వస్తారు. కానీ ఏసీపీ సీత(రెబా మోనికా జాన్) మాత్రం ఈ మరణాల వెనుక ఏవైనా రహస్యాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ మొదలుపెడుతుంది. అవి ప్రమాదాలు కావని హత్యలని జయ్ తెలుసుకుంటాడు. ఈ విషయాన్ని ఏసీపీ సీతతోనూ చెబుతాడు. కానీ ఆధారాలు లేకపోవడంతో ఆమె పట్టించుకోదు. జయ్ మాత్రం ఈ హత్యల వెనుక ఉన్నదెవరో కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు.నిజంగానే జయ్ చెప్పినట్టుగా అవి హత్యలేనా? ఎవరు చేసారు? ఎందుకు చేశారు? హంతకుడిని కనిపెట్టే క్రమలో జయ్కి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. -
స్టార్ దర్శకులను మెప్పించిన సినిమా.. ట్రైలర్ చూశారా?
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'నీలిర'.. తమిళ్ వర్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు వర్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. శ్రీలంకకు చెందిన తమిళ దర్శకుడు సోమిధరన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో నవీన్ చంద్ర, విదూ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. 1988నాటి శ్రీలంక అంతర్యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం ఉండనుంది. అప్పటి భయానక పరిస్థితుల మధ్య సామాన్యుల ఇబ్బందులు కళ్లకు కట్టేలా ఈ మూవీలో చూపించనున్నారు.నీలిర చిత్రాన్ని ఇప్పటికే వెట్రిమారన్, లోకేష్ కనగరాజ్, ఏఆర్ మురుగదాస్ వంటి క్రియేటివ్ దర్శకులు చూశారు. ఈ మూవీ కథ, తెరకెక్కించిన తీరుపై వారు ప్రశంసలు కురిపించారు. యుద్ధం వెనుక దాగి ఉన్న సామాన్యుల కన్నీటి గాథలను ఈ సినిమా ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. తాజాగా ట్రైలర్ను చూస్తే దర్శకుడు సోమీధరన్ ఈ సున్నితమైన అంశాన్ని అత్యంత సహజంగా, డాక్యుమెంటరీ స్టైల్ తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.శ్రీలంకలో అంతర్యుద్ధం1988లో శ్రీలంకలో జరిగిన కొన్ని సంఘటనలు రాజకీయ మార్పులకు దారితీశాయి. ప్రేమదాసా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో శ్రీలంకలో సివిల్ వార్ మరింత తీవ్రతరం కావడానికి కారణమైంది. శ్రీలంకలో మార్క్సిస్ట్-లెనినిస్ట్ పార్టీ అయిన జనతా విముక్తి పెరమున (JVP) తిరుగుబాటు వల్ల దక్షిణ ప్రాంతంలో అలజడి రేగింది. దీంతో ప్రజలపై హింసాత్మక దాడులు జరిగాయి. ఇది దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు పెద్ద సవాలు అయింది. ఆపై ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో LTTE (Liberation Tigers of Tamil Eelam) తిరుగుబాటు కొనసాగింది. ఈ రెండు తిరుగుబాట్ల కారణంగా వేలాది మంది అమాయక ప్రజలు మరణించారు. ఎంతోమందిపై హింసాత్మక దాడులు జరిగాయి. దీంతో అక్కడ రాజకీయ అస్థిరత చోటుచేసుకుంది. తర్వాత దేశంలో పరిపాలన మార్పులు జరిగాయి. -
నా బిడ్డను ఎవరూ ముద్దుపెట్టుకోవద్దు.. ఇది నా రూల్: మెరీనా
నటి, బిగ్బాస్ ఫేం మెరీనా అబ్రహం గతేడాది తల్లిగా ప్రమోషన్ పొందింది. పెళ్లయిన 8 ఏళ్లకు పేరెంట్స్ కావడంతో మెరీనా- రోహిత్ జంట ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ ఏడాది జనవరిలో పాపకు మొదటి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరిపారు. అయితే తన బిడ్డపై ప్రేమను కురిపించడం వరకు ఓకే కానీ అతిగా ముద్దు చేయడం నచ్చడం లేదంటోంది మెరీనా. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్లో ఓ స్టోరీ షేర్ చేసింది.ఇదంతా డ్రామా కాదునా పాప కోసం నేను కొన్ని హద్దులు గీసుకున్నాను, దయచేసి వాటిని గౌరవిస్తారనుకుంటున్నాను. తనకు చాక్లెట్లు ఇవ్వొద్దని చెప్పానంటే ఎవరూ ఇవ్వడానికి వీల్లేదు. నా పాపను ముద్దు పెట్టుకోకండి అని చెప్పినప్పుడు ఆ మాటకు కట్టుబడి ఉండండి. ఇదంతా డ్రామా కాదు, యాటిట్యూడ్ అంతకన్నా కాదు.. ఇది పిల్లల్ని పెంచే పద్ధతి. ఏదో ఒకసారి అలా చేస్తే ఏమవుతుంది? అందులో అంత ప్రమాదకరం ఏముందని మీరు అనుకోవచ్చు. .నేనొకటే చెప్తున్నా..మీరంతవరకే ఆలోచించారు. కానీ నేను దాని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. తను అనారోగ్యానికి గురైతే బెంగపడేది నేను.. జాగ్రత్తగా చూసుకునేది నేను. కాబట్టి నేనొకటే చెప్తున్నా.. నా బిడ్డను మీరంతగా ఇష్టపడితే, నా మాటల్ని గౌరవించండి, నాకు సహకరించండి, నేను పెట్టిన రూల్స్ను అతిక్రమించకండి. నా బిడ్డ రక్షణే నాకు అన్నింటికన్నా ముఖ్యం అని రాసుకొచ్చింది.ఎందుకు భయం?పెద్దలు చిన్నపిల్లలకు ప్రేమతో ముద్దుపెడతారు. కొన్నిసార్లు అది ఇన్ఫెక్షన్కు దారి తీసే ప్రమాదం ఉంది. అలాగే పిల్లలు తినే చిరుతిండి వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే మెరీనా.. తన కూతురికి అటువంటివి అలవాటు చేయొద్దని కోరుతోంది. మెరీనా- రోహిత్ ఇద్దరూ తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్లో జంటగా పాల్గొన్నారు.చదవండి: చిరంజీవి కొత్త సినిమా ప్రారంభమయ్యేది అప్పుడే.. -
అజయ్ దేవగన్పై ఫిర్యాదు.. కోర్టుకెక్కిన కార్తీ 'ఖైదీ' నిర్మాతలు
అజయ్ దేవగన్ స్వీయ దర్శకత్వంలో, నటించి నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'భోలా' (2023).. తమిళ హిట్ చిత్రం 'ఖైదీ'కి రీమేక్గా ఈ మూవీని తెరకెక్కించారు. అయితే, భోలా చిత్ర నిర్మాతలు రీమేక్ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ముంబై హైకోర్టును ఆశ్రయించింది. ఒప్పందం ప్రకారం ఖైదీ సినిమా హక్కులకు సంబంధించిన పూర్తి డబ్బు చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొంది.ఖైదీ సినిమా పూర్తి హక్కులు తమకే ఉన్నాయని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పేర్కొంది. హిందీ రీమేక్ కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నామని ఆ నిర్మాణ సంస్థ పేర్కొంది. అయితే, కొంత మొత్తంలో మాత్రమే డబ్బు చెల్లించారని తమకు ఇంకా రూ. 4కోట్లు బకాయి పడ్డారని భోలా చిత్ర నిర్మాతలపై ఆరోపణలు చేశారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం, కోర్టుకు అధికార పరిధి ఉందా లేదా అనే విషయంపై తీర్పును రిజర్వ్ చేసింది.ఖైదీ సినిమా నచ్చడంతో హిందీలో భోలా పేరుతో రీమేక్ చేశారు. ఈ మూవీని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, అజయ్ దేవగన్ చిత్ర నిర్మాణ సంస్థ, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మించాయి. అయితే, ఖైదీ నిర్మాతలతో రీమేక్ హక్కులకు సంబంధించి కుదుర్చుకున్న ఢీల్ ప్రకారం పూర్తిగా డబ్బు చెల్లించలేదని తెలుస్తోంది. 2023లో విడుదలైన ఈ చిత్రం ఆశించినంత రేంజ్లో ప్రేక్షకులను మెప్పించలేదు. -
చిరంజీవి కొత్త సినిమా ప్రారంభం ఎప్పుడంటే..?
‘మన శంకర వరప్రసాద్గారు’ సినిమా భారీ విజయంతో ఈ ఏడాదిని చిరంజీవి ప్రారంభించారు. అయితే, కాస్త విరామం తర్వాత ఆయన మళ్లీ కొత్త సినిమా సెట్లోకి అడుగుపెట్టనున్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేందుకు ప్లాన్ రెడీ చేశారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్బస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే.చిరంజీవి- బాబీ సినిమా షూటింగ్ ఏప్రిల్ మూడో వారంలో మొదలు కానుందని తెలుస్తోంది. భారీ యాక్షన్ కాన్సెప్ట్ కథతో బాబీ సిద్ధం అయ్యారట. ఈ చిత్రంలో ఫుల్ మాస్ రోల్లో చిరంజీవి కనిపించనున్నారని టాక్. అయితే, ఈ మూవీలో నటించనున్న ఇతర నటీనటులను త్వరలో ప్రకటించనున్నారు. చిరు సరసన భార్యగా ప్రియమణి, కూతురి పాత్రలో ఛాంపియన్ ఫేమ్ అనస్వర రాజన్ దాదాపుగా ఫిక్స్ అయినట్లు టాక్ ఉంది. ఇంకా అఫీషియల్గా ప్రకటించలేదు.వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ‘విశ్వంభర’ విడుదల గురించి ప్రకటన రాలేదు. 2025 సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమా ఎప్పుడు థియేటర్లోకి వస్తుందో అనే అంశంపై క్లారిటీ లేదు. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. వీఎఫ్ఎక్స్ పనుల వల్ల ఆలస్యమవుతూ వచ్చిన ఈ చిత్రం ఈ ఏడాది దసరాకు విడుదల కావచ్చని అంచనా వేస్తున్నారు. -
ఎదురు చూపుల్లో కృతిశెట్టి..!
అవకాశాలను అందిపుచ్చుకుని నటిస్తున్నప్పటికీ నటి కృతిశెట్టిని విజయాలు మాత్రం వరించడం లేదు. అసలు ఈ మంగుళూరు భామ తెలుగులో నటించిన ఉప్పెన చిత్రం సంచలన విజయం సాధిస్తుందని, ఎవరు ఊహించలేదు. తొలి చిత్రమే మంచి పేరు తెచ్చిపెట్టడంతో తన కెరీర్ వెలిగిపోతుందని కృతిశెట్టి(Krithi Shetty) తెగ సంబరపడింది. అనుకున్నట్లుగానే వరుసగా అవకాశాలు వచ్చి పడ్డాయి. వాటిలో ఒకటి రెండు హిట్లు కూడా ఉన్నాయి. దీనికి తోడు మలయాళం, తమిళం భాషల్లోనూ అవకాశాలు వచ్చాయి. ఇంకేముంది దక్షిణాదిలో టాప్ రేంజ్లో దూసుకుపోవచ్చని కలలు కని ఉండవచ్చు.తమిళంలోనూ కార్తీ, రవి మోహన్, ప్రదీప్ రంగనాథన్ వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వరించాయి. అయితే రవి మోహన్ సరసన నటించిన జీనీ చిత్రం ఏళ్ల తరబడి నిర్మాణంలోనే ఉంది. ఇక కార్తీతో జత కట్టిన వా వాథ్దియార్ చిత్రం ఈ మధ్యనే విడుదలై పూర్తిగా నిరాశ పరిచింది. ఇక మిగిలింది ప్రదీప్ రంగనాథన్కు జంటగా నటించిన ఎల్ఐకే (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) వరుసగా విజయాలను అందుకుంటున్న ప్రదీప్ రంగనాథన్ హిరోగా నటించిన చిత్రం కాబట్టి సక్సెస్ గ్యారెంటీ అని అందరూ అనుకుంటున్నారు. అయితే నటి నయనతార రౌడీ పిక్చర్స్ సంస్థ, సెవెన్ స్క్రీన్ స్టూడియో సంస్థ కలిసి నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది అక్టోబర్లోనే విడుదల కావలసింది. అదే సమయంలో ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించిన డ్యూడ్ చిత్రం విడుదల కావడంతో ఎల్ఐకే చిత్రం విడుదలను వాయిదా వేయాల్సిన పరిస్థితి. ఆ తరువాత పలుమార్లు ఈ చిత్రం విడుదల వాయిదా పడుతూనే వస్తోంది. ఎట్టకేలకు ఏప్రిల్ 3వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రం మరోసారి వాయిదా పడుతున్నట్లు తాజా సమాచారం. ఎల్ఐకే చిత్రాన్ని ఏప్రిల్ 2వ వారంలో తెరపైకి తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా కృతిశెట్టి చేతిలో ఉన్న ఒకే ఒక్క చిత్రం వాయిదా మీద వాయిదా పాడటం ఆమెకు నిరాశ పరిచే విషయమేమీ అవుతుంది. ఇలా ఎదురు చూపులతో ఉన్న కతి శెట్టికి గుడ్డిలో మెల్ల అన్నట్లుగా త్వరలో తెలుగులో ఒక క్రేజీ చిత్రంలో నటించే అవకాశం వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. -
మరోసారి...
తెలుగు పరిశ్రమలో ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ సాగుతోంది. గతంలో సూపర్ హిట్గా నిలిచిన చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ అమితాసక్తి చూపిస్తున్నారు. ఆయా హీరోల అభిమానులు, ప్రేక్షకులు కూడా వన్స్ మోర్ అంటూ ఆ సినిమాలను మరోసారి బిగ్ స్క్రీన్పై చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే గత చిత్రాలను 4కె క్వాలిటీతో సరికొత్తగా అందిస్తుండటంతో ప్రేక్షకులు కూడా సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’, మహేశ్బాబు ‘అతిథి’, ఎన్టీఆర్ ‘ఆంధ్రావాలా, ఊసరవెల్లి’, రవితేజ ‘కృష్ణ’, సిద్ధార్థ్ ‘ఓయ్’, శింబు ‘వల్లభ’ వంటి అరడజను పైగా సినిమాలు రీ రిలీజ్కి రెడీ అవుతున్నాయి. ఆయా చిత్రాల వివరాలేంటో ఓ లుక్ వేద్దాం... పద్దెనిమిదేళ్ల తర్వాత... హీరో రవితేజ ఈ వేసవిలో థియేటర్లలో ప్రేక్షకులకు నవ్వులు పంచనున్నారు. ఆయన హీరోగా నటించిన ‘కృష్ణ’ చిత్రం మే నెలలో రీ రిలీజ్ కానుంది. రవితేజ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన సినిమా ‘కృష్ణ’. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా నటించారు. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ముకుల్ దేవ్, గిరిబాబు, చంద్రమోహన్, సుధ, వేణు మాధవ్, సునీల్, జయప్రకాశ్ రెడ్డి, షాయాజీ శిండే, సత్యం రాజేశ్ ఇతర పాత్రలు పోషించారు. నిర్మాత డీవీవీ దానయ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ విజువల్స్పై బి. కాశీ విశ్వనాథం నిర్మించారు.రవితేజ మాస్ ఇమేజ్, వినాయక్ మాస్ క్రేజ్ ఈ మూవీకి ప్లస్ అయింది. రవితేజ, త్రిష, బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ని కడుపుబ్బా నవ్వించాయి. 2008 సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. చక్రి అందించిన సంగీతం ఈ మూవీ విజయంలో తన వంతు పాత్ర పోషించింది అనడం అతిశయోక్తి కాదు. మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా రవితేజ కెరీర్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. పద్దెనిమిదేళ్ల తర్వాత మే 8న ‘కృష్ణ’ మూవీ రీ రిలీజ్ అవుతోంది.ఇదిలా ఉంటే... రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రను బేబీ నక్షత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం అందిస్తున్నారు. దేవుడా... ‘రేసు గుర్రం’ సినిమాలో దేవుడా అంటూ ఓ మేనరిజమ్తో హీరో అల్లు అర్జున్ పలికిన డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. మరోసారి ఆ మేనరిజాన్ని ప్రేక్షకులు చూడనున్నారు. అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘రేసు గుర్రం’. ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. బ్రహ్మానందం, ప్రకాశ్రాజ్, అలీ, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, రవి కిషన్, శ్యామ్, పవిత్రా లోకేష్, ప్రగతి ఇతర పాత్రలు పోషించారు. బేబి భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ్రపొడక్షన్స్పై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వెంకటేశ్వ రావు నిర్మించారు.మాస్, యాక్షన్ , కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా 2014 ఏప్రిల్ 11న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ప్రత్యేకించి అల్లు అర్జున్–శ్రుతీహాసన్ ఎనర్జిటిక్ డ్యాన్సులు ప్రేక్షకులకు కనువిందు కలిగించాయి. అల్లు అర్జున్ ఎనర్జిటిక్ యాక్టింగ్, శ్రుతీహాసన్ అమాయకత్వం ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. తమన్ అందించిన సంగీతం ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఇన్స్పెక్టర్ కిల్బిల్ పాండేగా బ్రహ్మానందం ఏ స్థాయిలో ఆడియన్స్కి నవ్వులు పంచారో తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన ‘రేసు గుర్రం’ మూవీని ఆయన పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 8న రీ రిలీజ్ చేస్తున్నారు. క్రౌన్ మూవీస్ ద్వారా ఈ సినిమా గ్రాండ్గా విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్ని కూడా విడుదల చేశారు.తమ అభిమాన హీరో (అల్లు అర్జున్) పుట్టినరోజు అయిన ఏప్రిల్ 8న ‘రేసు గుర్రం’ రీ రిలీజ్ అవుతుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే... ‘పుష్ప: ది రైజ్’ (2021), ‘పుష్ప 2: ది రూల్’ (2024) సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏఏ 22’ (వర్కింగ్ టైటిల్). తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్నారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అతిథి వస్తున్నాడు ఈ వేసవికి మహేశ్ బాబు ‘అతిథి’ గా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తున్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘అతిథి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమృతా రావ్ హీరోయిన్గా నటించారు. కోట శ్రీనివాసరావు, నాజర్, మురళీ శర్మ, ఆశిష్ విద్యార్థి, అజయ్, వేణుమాధవ్, రాజీవ్ కనకాల, ప్రగతి ఇతర పాత్రలు పోషించారు. ఘట్టమనేని రమేశ్ బాబు, రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 2007 అక్టోబరు 18న విడుదలైంది. మహేశ్ బాబు మేకోవర్, స్టైలిష్ లుక్స్, యాక్షన్... వంటివన్నీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహేశ్ బాబును దర్శకుడు సురేందర్ రెడ్డి అల్ట్రా మోడ్రన్ లుక్లో ప్రజెంట్ చేశారు. లాంగ్ హెయిర్, ట్రెండీ కాస్ట్యూమ్స్, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీతో మహేశ్ బాబు ప్రేక్షకులను కట్టిపడేశారు.ముఖ్యంగా ఈ సినిమాలోని యాక్షన్ ఘట్టాలు, సురేందర్ రెడ్డి మార్క్ టేకింగ్ చాలా కొత్తగా అనిపించాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతం ‘అతిథి’ సినిమాకు అతి పెద్ద బలం అని చెపొ్పచ్చు. అదే విధంగా మహేశ్ బాబు–అమృతా రావ్ మధ్య సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఈ సినిమాను 4కె వెర్షన్న్లో రీ రిలీజ్ చేస్తుండటంతో అటు అభిమానుల్లో ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ ఫుల్ క్రేజ్ నెలకొంది. మే 31 సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని మే 29న ‘అతిథి’ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో, మెరుగైన సౌండ్ క్వాలిటీతో వస్తున్న ‘అతిథి’ని చూసేందుకు ఘట్టమనేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కాగా మహేశ్ బాబు హీరోగా నటించిన ‘పోకిరి’, ‘ఒక్కడు’, ‘బిజినెస్ మేన్’, ‘మురారి’ వంటి చిత్రాలు ఇప్పటికే రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ మూవీ నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ‘వారణాసి’ తాజా షెడ్యూల్ హైదరాబాద్లో వేసిన ప్రత్యేకమైన వారణాసి సెట్లో జరుగుతోంది. 2027 ఏప్రిల్ 9న విడుదల కానున్న ‘వారణాసి’పై అంతర్జాతీయ స్థాయిలో ఫుల్ బజ్ నెలకొంది. డబుల్ ధమాకా హీరో ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా తన అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన హీరోగా నటించిన ‘ఆంధ్రావాలా’, ‘ఊసరవెల్లి’ సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం ‘ఆంధ్రావాలా’. ఈ మూవీలో రక్షిత హీరోయిన్గా నటించారు. రమాప్రభ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, వేణుమాధవ్, షాయాజీ శిండే, రాహుల్ దేవ్, బెనర్జీ, నాజర్, సంఘవి ఇతర పాత్రలు పోషించారు.భారతి సమర్పణలో గిరి నిర్మించిన ఈ సినిమా 2004 జనవరి 1న విడుదలైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తొలిసారి తండ్రీకొడుకుగా ద్విపాత్రాభినయం చేశారు. చక్రి అందించిన సంగీతం ఈ మూవీకి ప్లస్ అయింది. ఎన్టీఆర్, రక్షిత డ్యాన్స్లు ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రం విడుదలై 22 ఏళ్లు దాటిపోయింది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ‘ఆంధ్రావాలా’ని రీ రిలీజ్ చేస్తున్నారు నిర్మాత గిరి. ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఊసరవెల్లి’. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించారు. ప్రకాశ్రాజ్, తనికెళ్ల భరణి, విద్యుత్ జమాల్, షాయాజీ శిండే, మురళీ శర్మ, ప్రభాస్ శ్రీను, జీవీ సుధాకర్ నాయుడు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా 2011 అక్టోబరు 6న రిలీజ్ అయింది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ తనదైన శైలిలో సంగీతం అందించారు. సుమారు పదిహేనేళ్ల తర్వాత ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధం అవుతోంది.మే 20న ఎన్టీఆర్ బర్త్ డేని పురస్కరించుకుని ఈ సినిమా రీ రిలీజ్కి ముస్తాబవుతోంది. ఇదిలా ఉంటే... ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ . మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు మేకర్స్. ఈ సినిమా జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. వేసవిలో ఓయ్ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ (2005) సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు హీరో సిద్ధార్థ్. తొలి సినిమాతోనే హిట్ అందుకున్నారాయన. ఆ తర్వాత ‘బొమ్మరిల్లు’ (2006) మూవీతో సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన తెలుగు చిత్రాల్లో ‘ఓయ్’ ఒకటి. ఆనంద్రంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షామిలి హీరోయిన్గా నటించారు.సునీల్, అలీ, కృష్ణుడు, ఎమ్మెస్ నారాయణ, తనికెళ్ల భరణి, ప్రదీప్ రావత్, నెపోలియన్ తదితరులు నటించారు. డీవీవీ దానయ్య ఈ సినిమా నిర్మించారు. 2009 జూలై 3న విడుదలైన ఈ సినిమా యూత్ని బాగా ఆకట్టుకుంది. ప్రత్యేకించి యువన్ శంకర్ రాజా సంగీతం ఈ చిత్రానికి ప్లస్ అయింది. మ్యూజిక్ పరంగా ఈ మూవీ హిట్ అయ్యింది. మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ‘ఓయ్’ ఏప్రిల్ 17న రీ రిలీజ్ అవుతోంది. తెలుగులో ఆ మధ్య వరుస సినిమాలు చేసిన సిద్ధార్థ్ ప్రస్తుతం తమిళంలో బిజీ బిజీగా సినిమాలు చేస్తున్నారు. వల్లభ సిద్ధం శింబు హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘వల్లవన్’. ఈ మూవీలో నయనతార హీరోయిన్గా నటించగా, రీమా సేన్, సంధ్య, సంతానం, ప్రేమ్జీ, సత్యన్ ప్రధాన పాత్రలు పోషించారు. పీఎల్ తేనప్పన్ నిర్మించిన ఈ మూవీ తమిళంలో 2026 అక్టోబరు 21న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘వల్లభ’ పేరుతో అనువదించి, రిలీజ్ చేశారు. 2006 నంబరు 11న తెలుగులో విడుదలైన ఈ చిత్రం ఇక్కడ కూడా అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో నయనతార టీచర్గా, శింబు స్టూడెంట్గా నటించారు. టీచర్–స్టూడెంట్ మధ్య ప్రేమ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ప్రత్యేకించి యువతని భారీగా ఈ మూవీ థియేటర్లకు రప్పించింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఇళయరాజా కుమారుడు యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ప్రత్యేకంగా నిలిచింది. కళాశాల ప్రేమకథ నేపథ్యంలో రూపొందిన ‘వల్లభ’ సినిమా మే 9న విడుదలవుతోంది. పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాలు కూడా రీ రిలీజ్కి ముస్తాబవుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
అమ్మ ప్రేమ దూరం కాదు
జ్యోతి పూర్వాజ్ లీడ్ రోల్లో రవి, శ్రేయ తివారీ జోడీగా నటించిన చిత్రం ‘విచిత్ర’. సైఫుద్దీన్ మాలిక్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. సిస్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం మే 22న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ– ‘‘ప్రపంచం మొత్తం దూరమైనా మనకు దగ్గరగా ఉండేది అమ్మ ప్రేమే.ప్రతి మహిళ గుండె బరువెక్కే సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందిన సినిమా ‘విచిత్ర’. నిజానీ అందించిన సంగీతంలోని అన్ని పాటలు బాగా వచ్చాయి. చిత్రగారు పాడిన తల్లి సెంటిమెంట్ సాంగ్ హైలెట్గా నిలుస్తుంది’’ అన్నారు. ‘బేబీ’ శ్రీ హర్షిణి, రవిప్రకాశ్, సూర్య, ఛత్రపతి శేఖర్, మీనా వాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. -
ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని తీయాలి: శర్వానంద్
కెన్ కరునాస్, అనిష్క అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షీ యాదవ్, మీనాక్షీ దినేష్ ప్రధాన నటించిన తమిళ సినిమా ‘యూత్’. కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళనాడులో ఈ నెల 19న విడుదలైంది. ఈ చిత్రాన్ని ఈ2సీ పతాకంపై హౌస్ఫుల్ వినీత్, సందీప్ ఈ నెల 27న తెలుగులో రిలీజ్ చేశారు. తెలుగులో ‘యూత్’ చిత్రానికి మంచి స్పందన లభిస్తోందని యూనిట్ పేర్కొంది.శనివారం జరిగిన ఈ సినిమా సక్సెస్మీట్కు ముఖ్య అతిథిగా హాజరైన శర్వానంద్ మాట్లాడుతూ–‘‘యూత్’ సినిమాలో ఒక 23 ఏళ్ల అబ్బాయి హీరోగా నటించడంతోపాటు దర్శకత్వం వహించి సూపర్ హిట్ కొట్టాడంటే నమ్మలేకపోయాను. ఇలాంటి మంచి మూవీస్ మరిన్ని చేయాలి’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాలో నేను ప్రభాస్గారి ఫ్యాన్గా నటించాను. ఆయన ఫ్యాన్స్ మా సినిమాను సపోర్ట్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు కంటెంట్ ముఖ్యమని మరోసారి నిరూపించారు. మీ ఫ్యామిలీతో ఈ సినిమా చూడండి’’ అన్నారు కెన్ కరునాస్.‘‘మా మార్కెటింగ్ సంస్థ పేరు హౌస్ఫుల్. ఇప్పుడు మా సినిమాకు హౌస్ఫుల్ బోర్డులు చూస్తుండటం సంతోషంగా ఉంది. పిల్లలు తమ తల్లిదండ్రుల్ని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని అర్థం చేసుకోవాలనే కాన్సెప్ట్తో తీసిని సినిమా ఇది’’ అన్నారు సందీప్. ‘‘మా సినిమాను సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు’’ అని తెలిపారు వినీత్. ఎగ్జిక్యూటివ్ ్రపొడ్యూసర్ సతీష్, దర్శకుడు వశిష్ట, నిర్మాత – డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడారు. -
రాజమౌళి మనసు మార్చిన 'ధురంధర్ 2'?
ఈ సీక్వెల్, పాన్ ఇండియా మూవీస్ ట్రెండ్కి రాజమౌళి ఓ రకంగా ఆద్యుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే 'బాహుబలి'తో భారతీయ దర్శకుల్ని ఆశ్చర్యపరిచాడు. భారీ బడ్జెట్ పెట్టి సరైన కంటెంట్ వదిలితే.. వందల వేల కోట్ల వసూళ్లు సాధించొచ్చని చూపించాడు. ఇప్పుడు సీక్వెల్ ట్రెండ్ పాతబడిపోయింది. పుష్ప 2, ధురంధర్ 2 లాంటివి ఒకటో రెండో మాత్రమే బ్లాక్బస్టర్ అయ్యాయి. ఈ ట్రెండ్ షురూ చేసిన రాజమౌళి కూడా దీని నుంచి దూరంగా జరగాలనే చూస్తున్నాడు. కానీ ఇప్పుడు మనసు మారిపోయినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్కి డ్యాన్స్ నేర్పింది నేనే)రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబు హీరోగా 'వారణాసి' చేస్తున్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు కూడా. సాధారణంగా రిలీజ్ టైంలో ప్రమోషన్స్ చేస్తారు. రాజమౌళి మాత్రం తన సంప్రదాయానికి భిన్నంగా హాలీవుడ్కి చెందిన పలు మీడియా సంస్థలకు తన టీమ్తో కలిసి ఈ పాటికే ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇందులోనే 'వారణాసి' ఒకే సినిమాగా రాబోతుందని రాజమౌళి బల్లగుద్ది చెప్పాడు. కానీ ఇప్పుడు మనసు మారినట్లు అనిపిస్తుంది.దాదాపు ఏడున్నర గంటల నిడివి ఉన్నా సరే 'ధురంధర్' రెండు భాగాల్ని ప్రేక్షకులు ఆదరించారు. రీసెంట్గా రిలీజైన సీక్వెల్కి వందల కోట్ల వసూళ్లు వస్తున్నాయి. ఇదంతా చూసిన రాజమౌళి.. 'వారణాసి'ని కూడా రెండు భాగాలుగా తీసుకొస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నాడట. ఎందుకంటే త్రేతా యుగంలోని రాముడు నుంచి వర్తమాన,భవిష్యత్ కాలాల వరకు ఈ సినిమా కాన్సెప్ట్ ఉంది. ఇదివరకే రిలీజ్ చేసిన వీడియోతో ఆ క్లారిటీ ఇచ్చారు. దీన్నంతటినీ ఒకే భాగంలో చూపించే బదులు రెండు భాగాల్లో చూపిస్తే ఎలా ఉంటుందా అని జక్కన్న ఆలోచిస్తున్నాడట. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం మూవీ లవర్స్కి పండగే.'ధురంధర్' రెండు భాగాల్ని కేవలం మూడు నెలల వ్యవధిలో రిలీజ్ చేసి సక్సెస్ అయ్యారు. రాజమౌళి కూడా 'వారణాసి'ని రెండు భాగాలుగా రిలీజ్ చేద్దామనుకుంటే ఇలా మూడు నాలుగు నెలల గ్యాప్లో థియేటర్లలోకి తీసుకొచ్చే ప్లాన్ చేస్తే బెటర్. లేదంటే ఆడియెన్స్ డిసప్పాయింట్ అయ్యే అవకాశముంది. చూడాలి మరి ఏం చేస్తారో?(ఇదీ చదవండి: ఐటమ్ డ్యాన్సర్గా ప్రముఖ గాయని.. వీడియో రిలీజ్) -
ఐటమ్ డ్యాన్సర్గా ప్రముఖ గాయని.. వీడియో రిలీజ్
అనిరుధ్తో పలు పాటలు పాడిన గ్లామరస్ సింగర్ జోనితా గాంధీ.. ఇప్పుడు ఐటమ్ సాంగ్లో నటించింది. అడివి శేష్ హీరోగా నటిస్తున్న 'డకాయిట్' కోసం తొలిసారి కాలు కదిపింది. చిచ్చుబుడ్డి అంటూ సాగే ఈ పాటని లెక్క ప్రకారం ఈ సాయంత్రమే రిలీజ్ చేయాలి. కానీ కాస్త ఆలస్యంగా ఇప్పుడు విడుదల చేశారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్కి డ్యాన్స్ నేర్పింది నేనే)ఇప్పటివరకు సింగర్గానే అందరికీ తెలిసిన జోనితా.. ఇప్పుడు అందంతో ఐటమ్ సాంగ్లోనూ ఆకట్టుకోవడం విశేషం. ఇకపోతే ఏప్రిల్ 10న 'డకాయిట్'.. తెలుగు, హిందీలో థియేటర్లలోకి రాబోతుంది. మృణాల్ ఠాకుర్ హీరోయిన్. దాదాపు నాలుగేళ్ల తర్వాత శేష్ నుంచి వస్తున్న మూవీ ఇది. చూడాలి మరి ఈసారి ఎలాంటి ఫలితం అందుకుంటాడో?(ఇదీ చదవండి: 'పెద్ది'కి దారి ఇచ్చేసిన 'లెనిన్'.. కొత్త రిలీజ్ డేట్) -
కొడుకు పేరు రివీల్ చేసిన ఆది సాయికుమార్.. అర్థం ఏంటంటే?
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్-అరుణ దంపతులకు ఈ ఏడాది జనవరిలో కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా తమ కుమారుడికి నామకరణం చేసినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. చిన్నారి ఫోటోని రివీల్ చేయలేదు కానీ.. పేరుని మాత్రం వెల్లడించారు. అతనికి ‘ఇషాన్ కార్తీక్’ అనే పేరు పెట్టారు. ఈషాన్ అంటే శివుడు, కార్తీక్ అంటే.. కార్తీకేయ స్వామి. ఇలా ఇద్దరి దేవుళ్ల పేర్లు కలిసేలా తమ కొడుకు పేరును పెట్టుకున్నారు. శివుడితో పాటు కార్తికేయ స్వామి ఆశీస్సులతో తన కొడుకుకు ఇషాన్ కార్తీక్ అని పేరు పెట్టామని ఆది సాయికుమార్ ట్వీట్ చేశారు. కాగా, ఆది సాయికుమార్, అరుణల పెళ్లి 2014లో జరిగింది. అరుణ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పటికే ఈ జంటకు ఓ కూతురు ఉంది. అయితే కుమార్తె పుట్టిన చాలా సంవత్సరాల తర్వాత, ఈ ఏడాది జనవరి 2న పండంటి బాబుకు జన్మనిచ్చారు.ఇక ఆది సాయికుమార్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ‘శంబాల’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ఈగో రాజా అనే సినిమా చేస్తున్నాడు. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ పోస్టర్లో ఆది సాయికుమార్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమా పట్ల అంచనాలను పెంచేసింది. ఈ చిత్రానికి గురు శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. Today, we named our son Ishan Karthik, with the blessings of Lord Shiva and Lord Karthikeya. 🙏✨ pic.twitter.com/CPOHY7DfEA— Aadi Saikumar (@iamaadisaikumar) March 28, 2026 -
నీలి రంగు చీరలో నిధి.. పాన్ నములుతూ రష్మి
నీలి రంగు చీరలో మెరిసిపోతున్న నిధి కాశీలో పాన్ తింటూ ఎంజాయ్ చేస్తున్న రష్మితల్లి అయినా సరే కియారా అడ్వాణీ తగ్గేదే లేయువరాణిలా ఆకట్టుకునేలా నభా నటేశ్క్యూట్గా కవ్విస్తున్న హాట్ బ్యూటీ సుప్రీతసిల్క్ చీరలో మాయ చేస్తున్న శ్రుతి హాసన్ View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Kunal Mundhe (@kmundhe4442) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by GRAZIA India (@graziaindia) View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) -
అది సినిమానే కాదు.. 'ధురంధర్ 2'పై వెట్రిమారన్ షాకింగ్ కామెంట్స్!
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేస్తుంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, రికార్డును సృష్టించింది. ప్రతి ఒక్కరు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. అయితే తాజాగా ప్రముఖ దర్శకుడు, నిర్మాత వెట్రిమారన్ మాత్రం ఈ మూవీపై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశాడు. హింసను ప్రేరేపించేలా సినిమాను తీసి వందల కోట్లు సంపాదిస్తున్నారంటూ మండిపడ్డారు. అంతేకాదు చరిత్రను వక్రీకరించడానికి, ప్రజల ఆలోచనలను ప్రభావితం చేయడానికి సినిమాలను వాడుకుంటున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.శ్రీలంక సివిల్ వార్ నేపథ్యంలో తెరకెక్కుతున్న'నీలిర' సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో వెట్రిమారన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘మనం మన కథలను చెప్పుకునేంత వరకు, మన శత్రువులు చెప్పిందే మన జీవితం. మన సొంత కథలను చెప్పుకోవడానికి మనకు ప్రజాస్వామ్యం లేదు. ఈ చిత్రం ద్వేషాన్ని ప్రొత్సహించదు. హింసను సమర్థించదు. వందల కోట్లు సంపాదించాలనే ఆశతో కొంతమంది హింసను ప్రేరేపించేలా సినిమాలను నిర్మిస్తున్నారు. కానీ ఈ చిత్రం ఒక జాతిని, ఒక మతాన్ని కానీ అపహాస్యం చేసేలా తెరకెక్కలేదు’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ..‘ఈ రోజుల్లో ప్రతీది ఒక ప్రచారంగా మారిపోయింది. మన జ్ఞాపకాలను, ఆలోచనలను ప్రభావితం చేసే శక్తి ఈ ప్రచారానికి ఉంది. నోట్ల రద్దు వల్ల ఎవరు నష్టపోయారో, క్యూ లైన్లలో నిలబడి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వాటన్నింటినీ మరుగున పడేసి, ద్వేషాన్ని పెంచేలా ప్రచారం చేస్తున్నారు. అది సినిమానే కాదు. చరిత్రను లేదా వాస్తవాలను వక్రీకరించి చూపడం ‘హేట్ ప్రొపగండా’కిందకే వస్తుంది’అని వెంట్రిమారన్ విమర్శించాడు.కాగా, ధురంధర్ 2 చిత్రంలో 2016లో మోదీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించారు. పాకిస్తాన్ నుంచి వచ్చే దొంగ నోట్లను అరికట్టడానికే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చూపించారు. వాస్తవం ఏంటో తెలియదు కానీ.. నోట్ల రద్దు కారణంగా దేశంలో చిన్న వ్యాపారాలు అన్ని మూతబడ్డాయి. కొంతమంది డబ్బుల కోసం బ్యాంకు వద్ద క్యూ లైన్లో నిలబడి ప్రాణాలను పోగొట్టుకున్నారు. రైతులు తమ పంటను అమ్ముకోలేక, విత్తనాలు కొనలేక తీవ్రంగా నష్టపోయారు. అయితే ఇదే విషయాన్ని వెట్రిమారన్ ప్రస్తావిస్తూ.. సినిమాల్లో నోట్ల రద్దును ఒక గొప్ప విజయంగా చూపిస్తున్నప్పుడు, పైన పేర్కొన్న సామాన్యుల కష్టాలను ఆ సమయంలో జరిగిన ప్రాణనష్టాన్ని విస్మరించడం ‘ప్రొపగండా’ అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వెంట్రిమారన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ధురంధర్ 2 గురించే ఆయన మాట్లాడారంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. #Vetrimaaran indirectly attacks #Dhurandhar2:"Today everything becomes propoganda. Propoganda has power to influence memory. We all know who has impacted with demonetization & how many Lost lives in standing the queue. It's hate propoganda"pic.twitter.com/kdQgYobUCN— AmuthaBharathi (@CinemaWithAB) March 28, 2026 -
'పెద్ది'కి దారి ఇచ్చేసిన 'లెనిన్'.. కొత్త రిలీజ్ డేట్
అక్కినేని హీరో అఖిల్.. ఎలాగైనా సరే ఈసారి హిట్ కొట్టాలని అనుకుంటూ చేసిన సినిమా 'లెనిన్'. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఇది. లెక్క ప్రకారం మే 01న థియేటర్లలోకి వస్తామని ప్రకటించారు. కానీ వాయిదా పడిన 'పెద్ది'.. ఏప్రిల్ 30న థియేటర్లలోకి వస్తుందని కొన్నాళ్ల క్రితం క్లారిటీ ఇచ్చారు. దీంతో 'లెనిన్' వాయిదా పక్కా అని అంతా అనుకున్నారు. ఇప్పుడు అదే జరిగింది. అధికారికంగా కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేశారు.(ఇదీ చదవండి: రెండు వారాలుగా బెడ్పైనే స్టార్ హీరో ప్రియురాలు.. అదే కారణం?)'లెనిన్'లో అఖిల్, భాగ్యశ్రీ హీరోహీరోయిన్లుగా నటించారు. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకుడు. నాగార్జున, నాగవంశీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 30న వస్తున్న 'పెద్ది'కి అండగా నిలబడదాం అని చెప్పిన 'లెనిన్' మేకర్స్.. రామ్ చరణ్, అఖిల్ మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని గుర్తుచేసుకున్నారు. అందుకే తమ చిత్రాన్ని జూన్ 26కు వాయిదా వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.జూన్ నెల ప్రారంభంలో అంటే 4వ తేదీన యష్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' రిలీజ్ కానుంది. ఇదొచ్చిన మూడు వారాలకు అఖిల్ 'లెనిన్' థియేటర్లలోకి రాబోతుంది. ప్రస్తుతానికైతే ఈ నెలలో చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. కాబట్టి కంటెంట్, టైమ్ కలిసొచ్చి అఖిల్ ఈసారైనా హిట్ కొడతాడేమో చూడాలి? ఇదివరకే ఓ పాట రిలీజ్ చేయగా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్కి డ్యాన్స్ నేర్పింది నేనే) View this post on Instagram A post shared by Annapurna Studios (@annapurnastudios) -
అల్లు అర్జున్కి డ్యాన్స్ నేర్పింది నేనే
హీరోయిన్గా అప్పట్లో తెలుగు, తమిళ సినిమాలు చేసిన రాధిక.. ప్రస్తుతం టీవీ షోలు, అడపాదడపా మూవీస్ చేస్తూ బిజీగా ఉంటోంది. తెలుగులోనూ ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉన్న ఈమె.. రీసెంట్గా అల్లు అర్జున్ గురించి చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా అనిపించాయి. బన్నీకి డ్యాన్స్ నేర్పింది నేనే అని అనేసరికి అతడి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఓ తెలుగు ఛానెల్లో ప్రసారమవుతున్న డ్యాన్స్ షోలో రాధిక ఈ వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: 'ధురంధర్' విలన్ తెలుగు సినిమా.. క్రేజీ అప్డేట్)ఆట డ్యాన్స్ షోలో ప్రీతి అనే కంటెస్టెంట్.. 'పుష్ప 2'లోని జాతర పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. ఈ క్రమంలోనే సదరు కంటెస్టెంట్ని పొగిడిన జడ్జి రాధిక.. అల్లు అర్జున్ ఇంత గొప్ప డ్యాన్సర్ కావడానికి నేనే కారణం అని చమత్కరించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో గతంలో తాను ఓ సినిమా చేశానని, అప్పుడు షూటింగ్ సందర్భంగా బన్నీకి డ్యాన్స్ నేర్పించానని గుర్తుచేసుకుంది. అలానే సమయానికి చిన్న పిల్లాడు ఎవరూ లేకపోవడంతో బన్నీ తనతో పాటు ఓ సీన్లో కలిసి నటించాడని, ఇందులో భాగంగా అల్లు అర్జున్ని ఎత్తుకుని రైల్వే ట్రాక్పై పరుగెత్తిన విషయాన్ని రాధిక గుర్తుచేసుకుంది. ఈ విషయాలన్నీ రాధిక చెబుతున్న ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.రాధిక ఈ కామెంట్స్ ఫన్నీగానే చేశారు. నెటిజన్లు కూడా అంతే సరదాగా రియాక్ట్ అవుతున్నారు. బన్నీకి మీరు డ్యాన్స్ నేర్పించారా అని మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్ విషయానికొస్తే.. టాలీవుడ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డ్యాన్సర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. పుష్ప, పుష్ప 2 చిత్రాలు ఇతడి స్థాయిని పెంచేశాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు అట్లీ, లోకేశ్ కనగరాజ్లతో మూవీస్ చేస్తున్నాడు. వీటిపై బోలెడంత బజ్ ఉంది. (ఇదీ చదవండి: రెండు వారాలుగా బెడ్పైనే స్టార్ హీరో ప్రియురాలు.. అదే కారణం?) -
రెండు వారాలుగా బెడ్పైనే స్టార్ హీరో ప్రియురాలు.. అదే కారణం?
క్రిష్, వార్ 2 తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. గత నాలుగేళ్లుగా షబా ఆజాద్ అనే నటి, సింగర్తో రిలేషన్లో ఉన్నాడు. గతంలో సుస్సానే ఖాన్ని పెళ్లి చేసుకున్నప్పటికీ.. ఆమెకు విడాకులు ఇచ్చేసి షబాతో కలిసి ఉంటున్నాడు. ఇప్పుడు ఈమెకు భయంకరమైన అనారోగ్య సమస్య వచ్చింది. స్వయంగా దాని గురించి ఈమె ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: చిరంజీవి చనిపోయారని పోస్ట్.. వ్యక్తిపై కేసు)'సైక్లోస్పోరా కయోటానెన్సిస్' అనే పారాసైట్(పరాన్నజీవి) వల్ల కలిగే వ్యాధిని 'సైక్లోస్పోరియాసిస్' అంటారు. ఇది శరీరంలోకి ప్రవేశిస్తే.. జీర్ణవ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం అవుతుంది. షబా అజాద్ ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. గడిచిన 14 రోజులు తన జీవితంలో అత్యంత దారుణంగా గడిచాయని చెప్పుకొచ్చింది. రోజుకు రెండుసార్లు జిమ్లో వర్కౌట్లు చేసే తాను.. ఇప్పుడు కనీసం టూత్ పిక్ ఎత్తలేకపోతున్నానని రాసుకొచ్చింది. కేవలం రెండు వారాల్లోనే 4 కిలోల బరువు తగ్గిపోయానని, దీన్నిబట్టి ఇన్ఫెక్షన్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొంది.ఈ ఇన్ఫెక్షన్ సోకడం వెనకున్న కారణం తెలిసి షబా షాకయ్యింది. ఎప్పుడూ ఇంటిలో వండిందే తింటానని, బయటకెళ్లినా నీళ్ల బాటిల్ వెంట తీసుకెళ్తానని, ఇంత శుభ్రత పాటించినా ఈ పరాన్నజీవి తన శరీరంలోకి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదని చెప్పింది. మనం తినే ఆకుకూరలు, సలాడ్స్, కూరగాయలు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కూరగాయలు కేవలం నీటితో కడిగితే సరిపోదని, బేకింగ్ సోడాతో శుభ్రం చేయాలని చెప్పుకొచ్చింది. పచ్చిగా తినే ఆహార పదార్థాల ద్వారానే ఇలాంటి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదముందని హెచ్చరించింది. ఈ కష్టకాలంలో హృతిక్ రోషన్(ప్రియుడు) తనకు కొండంత అండగా ఉన్నాడని చెప్పుకొచ్చింది. నా మూడ్ ఎంత బాగోలేకపోయినా పక్కనే ఉండి నవ్విస్తున్నాడని, ఆస్పత్రి బెడ్పై ఉన్న ఫొటోని షబా షేర్ చేసింది.(ఇదీ చదవండి: 'ధురంధర్' విలన్ తెలుగు సినిమా.. క్రేజీ అప్డేట్) View this post on Instagram A post shared by Saba Azad (@sabazad) -
'ధురంధర్' విలన్ తెలుగు సినిమా.. క్రేజీ అప్డేట్
'ధురంధర్' సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఎంత సెన్సేషన్ సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది డిసెంబరులో వచ్చిన తొలి భాగంలో హీరోని డామినేట్ చేసిన విలన్గా అక్షయ్ ఖన్నా అదరగొట్టేశాడు. రహమాన్ డకాయిట్ అనే పాత్రలో జీవించేశాడు. పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇతడు నెక్స్ట్ ఓ తెలుగు సినిమాలో కీలక పాత్ర చేస్తున్నాడు. అందుకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని స్వయంగా ఇతడి పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ వెల్లడించాడు.(ఇదీ చదవండి: మారుతికి అర్థమైంది.. హరీశ్ శంకర్కి అర్థం కావట్లేదు!)హిందీలో గతంలోనే హీరోగా పలు సినిమాలు చేసినప్పటికీ అక్షయ్ ఖన్నాకు పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. తర్వాత చాన్నాళ్ల పాటు సైలెంట్ అయిపోయాడు. మళ్లీ 'ఛావా', 'ధురంధర్' చిత్రాలు ఇతడికి ఓవర్నైట్ స్టార్డమ్ తీసుకొచ్చాయి. ఇవి చేస్తున్నప్పుడే తెలుగులో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లోని 'మహాకాళి' మూవీలో శుక్రచార్య పాత్రలో నటించేందుకు ఒప్పుకొన్నాడు. పూజా కొల్లూరు ఈ చిత్రానికి దర్శకురాలు కాగా.. ప్రశాంత్ వర్మ షో రన్నర్గా వ్యవహరిస్తున్నాడు. గతంలోనే ఈ పాత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు.ఇప్పుడు అక్షయ్ ఖన్నా పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ విషెస్ చెప్పిన ప్రశాంత్ వర్మ.. ప్రతిభకు సౌండ్ అక్కర్లేదు. మీతో పనిచేయడం నాకు దక్కిన గౌరవం. మనం ఏం సృష్టించామో ప్రపంచానికి చూపించాలని నా మనసు ఉవ్విళ్లూరుతోంది అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్, అలానే టాక్ బట్టి తెలుస్తోంది ఏంటంటే అక్షయ్ ఖన్నా షూటింగ్ పూర్తయింది. మరో 40 రోజులు చిత్రీకరణ చేస్తే మిగతా కూడా అయిపోతుందని అంటున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కన్నడ నటి భూమి శెట్టి.. 'మహాకాళి'లో లీడ్ రోల్ చేస్తోంది.(ఇదీ చదవండి: చిరంజీవి చనిపోయారని పోస్ట్.. వ్యక్తిపై కేసు)Happy Birthday #AkshayeKhanna sir, a true actor who proves that real talent doesn't need noise. Effortless screen presence, powerful performances, and unmatched class always stand out 🎭🎬Its an absolute honour working with you. Can’t wait to show the world what we’ve created… pic.twitter.com/xiblaH8voc— Prasanth Varma (@PrasanthVarma) March 28, 2026 -
చిరంజీవి ఫొటోను ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన వ్యక్తిపై కేసు
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి ఫొటోను ఓ వ్యక్తి ‘ఎక్స్’లో చిరంజీవి అభిమానులు ఆందోళన చెందేవిధంగా పెట్టడమే కాకుండా దానిని తొలగించాలని విజ్ఞప్తి చేసినా నిర్లక్ష్యం వహించిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే... గచ్చిబౌలిలో నివసించే గూడెపు భాస్కర్సాయి (22) ఇంటీరియర్ డిజైనర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 9న సూరిబాబు అనే వ్యక్తి ‘ఎక్స్’లో చిరంజీవి ఫొటోను ఆయన మరణించినట్లు భావించే విధంగా పోస్ట్ చేశాడు. ఈ విషయం గమనించిన భాస్కర్ సదరు సూరిబాబుకు ఫోన్ చేసి ఆ ఫొటోను, పోస్ట్ను తొలగించాల్సిందిగా కోరాడు. ఇందుకు సూరిబాబు నిరాకరించడమే కాకుండా తాను పెట్టిన పోస్ట్ను అలాగే కొనసాగించాడు. ఈ ఫొటోను చూసిన వారు తీవ్ర ఆందోళనకు గురికావడమే కాకుండా చిరు అభిమానుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. చిరంజీవి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఈ పోస్ట్ ఉందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ మేరకు సూరిబాబుపై బీఎన్ఎస్ సెక్షన్ 352 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విలన్ పాత్ర.. రూ. 20 కోట్లు డిమాండ్ చేస్తున్న స్టార్ హీరో!
విభిన్నమైన పాత్రలు, విలక్షణమైన నటనతో ఆకట్టుకునే నటుడు ఫహద్ ఫాజిల్. ఈ మలయాళ నటుడికి తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. ‘పుష్ప’ చిత్రం తర్వాత ఆయనకు టాలీవుడ్లో విపరీతమైన క్రేజీ ఏర్పడింది. వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ ఆయన ‘డోన్ట్ ట్రబుల్ ద ట్రబుల్’ మినహా..తెలుగులో ఇంకో చిత్రమేది చేయడం లేదు. తెలుగులోని బడా నిర్మాతలంతా ఆయన కోసం క్యూ కడుతున్నా.. ఒక్క ప్రాజెక్ట్కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. దానికి కారణం రెమ్యునరేషన్.తెలుగు సినిమాలో విలన్గా నటించడానికి భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. హీరోగా కాకుండా విలన్గా నటించాలంటే.. రూ. 15-20 కోట్లు ఇవ్వాల్సిందేనని కండీషన్ పెడుతున్నారట. అంత మొత్తంలో ఇచ్చుకోలేక.. నిర్మాతలకు వెనుకంజ వేస్తున్నట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. అందుకే ఫహద్కు టాలీవుడ్లో అవకాశాలు రావడం లేదు.అనిల్ రావిపూడి తెరకెక్కించే కొత్త సినిమాలో వెంకటేశ్తో పాటు ఫహద్ని కూడా అనుకున్నాడట. అయితే పారితోషికం ఎక్కువగా డిమాండ్ చేయడంతో.. ఆ స్థానంలో కల్యాణ్ రామ్ని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే రామ్ సినిమాలోనూ విలన్గా ఫహద్నే తీసుకోవాలనుకున్నారట. అక్కడ కూడా పారితోషికం విషయంలోనే ఇబ్బందులు ఎదురై.. చివరకు వదిలేశారట. ఫహద్ని తీసుకుంటే మలయాళంతో పాటు పాన్ ఇండియా మార్కెట్కి కూడా ప్లస్ అవుతుందని దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నారు. అయితే భారీ పారితోషికం డిమాండ్ చేయడంతో.. అంత ఇచ్చుకోలేక ఇతర నటులవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో పాటు ఫహద్ కూడా రొటీన్ విలన్ పాత్రలు చేయడానికి ఇష్టపడడం లేదట. తనకు గుర్తింపు తెచ్చేలా ఉంటేనే ఆ పాత్రలో నటించేందుకు ముందుకు వస్తున్నాడట. లేదంటే హీరోగా సినిమాలు చేసుకుందామనే ఆలోచనలోనే ఉన్నారట. విలన్ కంటే హీరో పాత్రలకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. -
‘మన్యం ధీరుడు’కి ఉత్తమ చిత్ర అవార్డు
మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డు 2026 గాను ఆర్ వి వి సత్యనారాయణ నటించి నిర్మించిన చిత్రం మన్యం ధీరుడు కు ఉత్తమ చిత్రం అవార్డు అందుకుంది. మలేషియా తెలుగు సంఘం క్లాంగ్ శాఖ ఆధ్వర్యంలో సుందర్ పెరుమాళ్ ఆలయం ఆడిటోరియంలో అత్యంత వైభవంగా జరిగిన ఉగాది వేడుకలలో ఉగాది పురస్కార్ 2026 ఉత్తమ చిత్ర అవార్డును మన్యం ధీరుడు చిత్రానికి ఇవ్వడం జరిగింది. మలేషియా తెలుగు సంఘం చైర్మన్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉగాది వేడుకల్లో ముఖ్య అతిథిగా కాంగ్ ఉత్తర జిల్లా పోలీస్ కమిషనర్ విజయరావు చేతుల మీదుగా ఆర్ వి వి సత్యనారాయణ మరియు శ్రీమతి ఆర్ పార్వతి దేవి దంపతులను ఘనంగా సత్కరించి పురస్కార ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిధులు సుబ్రమణ్యం రామానాయుడు కమిటీ మెంబర్స్ 600 మంది తెలుగు సంఘం సభ్యులు పాల్గొన్నారు.ముఖ్యఅతిథి పోలీస్ కమిషనర్ విజయరావు మాట్లాడుతూ మన తెలుగు వారికి ఆత్మగౌరవాన్ని విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు గాధను మన్యం ధీరుడు పేరును తరికెక్కిచ్చిన భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన ఆర్ వి వి సత్యనారాయణకు ధన్యవాదాలు అని తెలియజేశారు. ఈ సినిమాలో దేశభక్తిని చాటుతూ ఒక దేశభక్తి గీతాన్ని ఆలపించి ఆ గీతం భారతదేశంలో ప్రతి పౌరుడు ఆలపించే విధంగా ఆ పాటను తీర్చిదిద్దారు ఆర్ వి సత్యనారాయణ గారు అని కొనియాడారు. -
బరిలో వరుణ్ తేజ్.. ఫస్ట్ వీడియో చూశారా?
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా బరి నుంచి పోస్టర్ వీడియోను విడుదల చేశారు. దర్శకుడు యదు వంశీ తెరకెక్కిస్తున్న ఈ మూవీని నిహారిక కొణిదెల తన బ్యానర్ 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్'పై నిర్మిస్తున్నారు. నేడు పూజా కార్యక్రమంతో మొదలైన ఈ మూవీ నుంచి తాజాగా ‘ది వరల్డ్ ఆఫ్ బరి’ (The World Of Bhari) పేరుతో పవర్ఫుల్ వీడియోను పంచుకున్నారు. 2027 సంక్రాంతికి పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదల కానుంది. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. -
నాగార్జున 100వ సినిమాలో హీరోయిన్ ఎవరంటే..!
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున వందో చిత్రం షూటింగ్ పనులు మొదలయ్యాయి. తమిళ దర్శకుడు రా.కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్కు ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. త్వరలో సినిమా టైటిల్ను ప్రకటిస్తారు. అయితే, ఈ మూవీలో నాగార్జున సరసన నటించబోయే హీరోయిన్ ఛాన్స్ ఎవరికి దక్కుతుందోనని అభిమానులు ఎదురుచూస్తుండగా ఒక నటి పేరు వైరల్ అవుతుంది.నాగార్జున 100వ సినిమాలో నటి ఐశ్వర్య రాజేష్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపినట్లు సమాచారం. త్వరలో మూవీ సెట్స్లో కూడా ఆమె పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇందులో సీనియర్ నటి టబు కూడా నటిస్తున్నట్టు సమాచారం. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన తన వందో చిత్రాన్నీ తనదైన శైలిలో రా.కార్తీక్ ప్లాన్ చేసినట్లు టాక్. యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, భావోద్వేగ అంశాలతో ఈ మూవీ ఉండనుందట. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ మూవీని నిర్మిస్తుంది.తెలుగు మూలాలు ఉన్న నటి ఐశ్వర్య రాజేష్.. తమిళం, తెలుగు చిత్రాల్లో మెప్పిస్తూ.. తన అద్భుతమైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. చెన్నైలో జన్మించిన ఈమె, యాంకర్గా కెరీర్ ప్రారంభించి, రియాలిటీ షో విజేతగా నిలిచి, ఆపై సినిమాల్లోకి ప్రవేశించారు. గ్లామర్ పాత్రల కంటే అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. గతేడాది వెంకటేష్ సరసన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో అలరించారు. -
అమెరికాలో ఉస్తాద్ కలెక్షన్స్.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్లో విడుదలైన కొత్త మూవీ ‘ఉస్తాద్ భగత్సింగ్’. మార్చి 19న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఉగాది, రంజాన్ సెలవులు ఉన్నప్పటికీ కలెక్షన్స్ పరంగా నిరాశపరిచింది. తొమ్మిదిరోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 68.06 కోట్ల నెట్ రాబట్టినట్లు సాక్నిల్క్ ట్రేడ్ సంస్థ ప్రకటించింది. అయితే, ఓవర్సీస్లో ఉస్తాద్ కనీసం 1మిలియన్ మార్క్ కూడా దాటలేదు. ఆపై శుక్రవారం నాడు నార్త్ అమెరికాలో ఈ మూవీకి వచ్చిన కలెక్షన్స్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.నార్త్ అమెరికాలో ఉస్తాద్ భగత్సింగ్ ఇప్పటి వరకు రూ. 6 కోట్లు మాత్రమే రాబట్టింది. అక్కడ లాభాల్లోకి ఈ చిత్రం రావాలంటే కనీసం మరో రూ. 7 కోట్లు రాబట్టాలి. లేదంటే భారీ నష్టాలు తప్పవు. ఇప్పటి వరకు ఈ సినిమా కనీసం 1 మిలియన్ డాలర్ల మార్కును కూడా అక్కడ అందుకోకపోవడంతో ట్రేడ్ నిపుణులు నివ్వెరపోయారు. శుక్రవారం నాడు అయితే అమెరికాలో కేవలం 4వేల డాలర్లు రూ. 3.79 లక్షలు మాత్రమే రాబట్టింది. సినిమా డిజాస్టర్ కావడంతో చాలాచోట్ల ఉస్తాద్ను తొలగించేశరాఉ. ఇది డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను మిగిల్చే అవకాశం ఉందని అంటున్నారు. బాక్సాఫీస్ వద్ద తమ అంచనాలను నిరాశపరిచినందుకు దర్శకుడు హరీష్ శంకర్ను చాలామంది ఫ్యాన్స్ నిందిస్తున్నారు. దీంతో ఆయన సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ను ఎదుర్కొంటున్నారు. అయితే, అమెరికాలో ధురంధర్-2 దుమ్మురేపుతుంది. ప్రస్తుతం రూ. 275 కోట్లు సాధించి రికార్డ్ నెలకొల్పింది. North America Thursday Gross | Totals: #DhurandharTheRevenge - $643K | $18.06M#Aadu3 - $8K | $465K#BandMelam - $6K | $8K#Youth - $4K | $98K#UstaadBhagatSingh - $4K | $780K— Venky Box Office (@Venky_BO) March 27, 2026 -
స్టార్ హీరోయిన్ను అన్ఫాలో చేసిన రిషబ్ శెట్టి
కాంతార సినిమాతో కన్నడ హీరో రిషబ్ శెట్టికి గుర్తింపు దక్కింది. అయితే, ఈ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిలిమ్స్తో బంధం తెంచుకున్నారని వార్తలు వచ్చాయి. సోషల్మీడియా చిత్ర నిర్మాణ సంస్థ అధికార ఖాతాను అన్ఫాలో చేయడంతో ఈ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే, తాజాగా తనతో పాటు నటించిన వారిని కూడా తన ఇన్స్టాలో అన్ఫాలో చేయడం కన్నడ పరిశ్రమలో వైరల్ అవుతుంది.కాంతార మూవీలో తనతో పాటు నటించిన రుక్మిణి వసంత్ను కూడా రిషబ్ శెట్టి అన్ఫాలో చేశారు. ఆపై తన ఆప్త మిత్రుడైన రాజ్.బి.శెట్టిలను కూడా సోషల్ మీడియాలో ఫాల్ కావడం ఆపేశాడు. రెండురోజుల క్రితం హోంబలే ఫిల్మ్స్ ఖాతాను అన్ ఫాలో చేసిన రిషబ్.. తాజాగా మరోసారి ఇలాంటి పనే చేయడంతో కాంతార టీమ్తో ఏమైనా గొడవలు ఉన్నాయా అనే అనుమానం మొదలైంది. అయితే, హోంబలే ఫిల్మ్స్ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్ను మాత్రం రిషబ్ ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు. అయితే, రోజుల వ్యవధిలోనే ఇలా మూడు ముఖ్యమైన అకౌంట్లను రిషబ్ అన్ ఫాలో చేయడం హాట్ టాపిక్గా మారింది. ఈ అంశం గురించి రిషబ్ శెట్టితో పాటు నిర్మాణసంస్థ నుంచి ఎలాంటి వివరణ రాలేదు. ప్రస్తుతం రిషబ్ తన తదుపరి మూవీ జై హనుమాన్ పనిలో ఉన్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో హనుమంతుడి పాత్రలో రిషబ్ కనిపించనున్నారు. -
అన్నయ్య కోసం 'బరి'లోకి దిగిన చెల్లెలు
టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ కొత్త సినిమా ప్రకటించారు. అయితే, ఈ ప్రాజెక్ట్ను నిహారిక కొణిదెల తన బ్యానర్ 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్'పై ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఈ చిత్రానికి బరి అనే టైటిల్ను ప్రకటించారు. తాజాగా ఈ చిత్రం పూజా కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆపై ‘బరి’ మూవీకి క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.‘కమిటీ కుర్రోళ్లు’ మూవీతో భారీ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ యదు వంశీ ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని నిహారిక అధికారికంగా ప్రకటించారు. నేడు పూజా కార్యక్రమం జరిగింది. కుటుంబ బ్యానర్లో వరుణ్ తేజ్ నటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగనుందని సమాచారం. గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది. వరుణ్ తేజ్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్-కామెడీ ఎంటర్టైనర్ 'కొరియన్ కనకరాజు' షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇదే ఏడాదిలో ఈ చిత్రం విడుదల కానుంది.Power Star #PawanKalyan garu at our Mega Prince @IAmVarunTej 's New movie #Bhari Opening ceremony#VarunTej #NiharikaKonidela pic.twitter.com/fXPOmdT3SS— Milagro Movies (@MilagroMovies) March 28, 2026 -
ధురంధర్- 2లో దర్శకుడి సతీమణి.. అండర్ కవర్ ఏజెంట్గా ఎంట్రీ
రణవీర్ సింగ్- దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ధురంధర్-2.. గతేడాది విడుదలైన పార్ట్-1కు సీక్వెల్గా తాజాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. అయితే, దర్శకుడు ఆదిత్య ధర్ సతీమణి యామీ గౌతమ్ తాజాగా ఈ మూవీని చూశారు. ఇందులో ఆమె అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. తన సోదరితో రహస్యంగా ప్రేక్షకులతో పాటుగా మూవీని చూశారు.గౌరవం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన యామీ గౌతమ్.. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్తో భారీగా పాపులర్ అయింది. దర్శకుడు ఆదిత్య ధర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె వరుసగా సినిమాలు చేస్తుంది. 'ఉరి' మూవీ తర్వాత వారిద్దరి కాంబినేషన్లో ఇది రెండో చిత్రం కావడం విశేషం.ధురంధర్-2లో యామీ గౌతమ్ నర్స్ కమ్ అండర్ కవర్ ఏజెంట్ 'షాజియా బానో'గా నటించారు. తెరపై ఆమె కనిపించగానే కాస్త సిగ్గుగా చూస్తూ, చిరునవ్వుతో నిశ్శబ్దంగా ఉండమని తన సోదరి సురిలీ గౌతమ్ని సైగ చేసింది. ఈ ముచ్చటైన క్షణాన్ని సురిలీ కెమెరాతో వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్లో "మూవీ టైమ్" అనే క్యాప్షన్తో అప్లోడ్ చేసింది. ఆ క్లిప్లో 'ధురందర్ 2'లో నర్సుగా యామీ చేసిన అతిథి పాత్రను చూపిస్తుంది. ఆ తర్వాత ఆమె కెమెరాను ఆ నటి వైపు తిప్పుతుంది. థియేటర్లో ఆ సన్నివేశాన్ని చూస్తున్నప్పుడు యామీ నవ్వుతూ, సిగ్గుపడుతూ కనిపించింది. ఆ తర్వాత ఆమె తన సోదరిని నిశ్శబ్దంగా ఉండమని సైగ చేసింది. Yami Gautam blushing watching herself on *Dhurandhar* screen , how cute!❤️❤️❤️Yami Gautam Dhar ☆ Aditya Dhar #Dhurandhar2TheRevenge https://t.co/L0Zoy6GQ9K pic.twitter.com/mEh2vvlgtl— JyotiKarma🚩🇮🇳 (@JyotiKarma7) March 27, 2026Spotted! ❤️ Yami Gautam enjoying #Dhurandhar2 like a true fan in a packed theatre—supporting hubby Aditya Dhar & even cheering her own cameo! 🔥 #DhurandharTheRevenge pic.twitter.com/2b0sXIGRnk— Smita Patil (@patil45802) March 27, 2026 -
అనుష్కపై ఆగని ట్రోలింగ్స్
సెలబ్రిటీలకు రాజభోగం ఆరు, వదంతుల తలనొప్పి 12 అన్నంతగా పరిస్థితులు మారుతున్నాయని చెప్పవచ్చు. మొదట్లో ఎన్నో అవమానాలు, అవరోధాలను ఎదుర్కొని, ఎంతో శ్రమించి ఉన్నత స్థాయికి చేరుకున్న వారికి వివిధ రూపాల్లో వచ్చే వదంతులు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయా అంటే కచ్చితంగా అవుననే బదులే వస్తోంది. ముఖ్యంగా సినీ నటీమణులను ఇలాంటి వదంతులు చుట్టుముట్టి అశాంతికి గురిచేస్తున్నాయని చెప్పవచ్చు. వాస్తవానికి వదంతులను చాలా మంది ఎంజాయ్ చేస్తారు. అయితే ఒక్కోసారి వ్యక్తి గత విషయాలపై అవాస్తవాలు ప్రచారం అయినప్పుడు అలాంటి వాటిని ఖండించాల్సి వస్తుంది. అనుష్క పరిస్థితి ఇలాంటిదే. ఈ బెంగళూరు భామ నటనలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారనే చెప్పాలి. మొదట్లో అందాలారబోతతో యువతను అలరించినా, సరైన పాత్ర వేస్తే తన తడాఖా చూపిస్తానని అరుంధతి చిత్రంతో నిరూపించుకున్నారు. ఆ మధ్య సైజ్ జీరో అనే చిత్రంలోని పాత్ర కోసం బరువు భారీగా పెరిగిన అనుష్క ఆ తరువాత బరువు తగ్గడానికి చేసిన ఏ ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. దీంతో అవకాశాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఇదిలా ఉంటే ఈమె వ్యక్తి గత జీవితంపై ట్రోలింగ్స్ వైరల్ అవడం, ముఖ్యంగా అనుష్క పెళ్లి వదంతులు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. తన పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారాన్ని ఈమె చాలా సార్లు ఖండించారు. వయసును ప్రస్తావించడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ అనుష్క గురించి ఏదో ఒక ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా అనుష్కకు పెళ్లి నిశ్చితార్థం జరిగిందని, ఆమె ఒక వ్యక్తి చెయ్యి పట్టుకుని నడుస్తున్న ఫొటోను పోస్ట్ చేసి ట్రోలింగ్ చేస్తున్నారన్నారు. వాస్తవానికి ఆ ఫొటో 2016లో జరిగిన ఒక ఫ్యాషన్ కార్యక్రమానికి చెందింది. ఇలా వాస్తవాలను తెలుసుకోకుండా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఏది నిజమో ? ఏది అవాస్తవమో తెలియని పరిస్థితి నెలకొంటోంది. -
హనుమాన్ జయంతికి రామ గ్లింప్స్
భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా రూపొందుతున్న హిందీ చిత్రం ‘రామాయణ’. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ సంస్థ, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై భారీ బడ్జెట్తో నమిత్ మల్హోత్రా ఈ సినిమాను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు.తొలి భాగాన్ని ఈ ఏడాది దీపావళికి, రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. కాగా శుక్రవారం (మార్చి 27) శ్రీరామ నవమి పండగ సందర్భంగా ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రం నుంచి ‘రామ’ గ్లింప్స్ను హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్లుగా నమిత్ మల్హోత్రా తెలిపారు. ‘‘రామాయణం మన అందరికీ చెందిన కథ.‘రామాయణ’ చిత్రాన్ని నిజమైన స్ఫూర్తితో, అత్యంత చిత్తశుద్ధితో తెరపైకి తీసుకురావడానికి మేము వేసే ప్రతి అడుగుకూ అపారమైన బాధ్యత, భక్తి శ్రద్ధలే మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. కొన్నేళ్లుగా మేం చేసిన కృషిని ఫ్యాన్స్తో కలిసి ప్రపంచవ్యాప్తంగా ఒక గ్రాండ్ ఈవెంట్ ద్వారా ప్రదర్శించనున్నాం. ఆ క్షణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుందాం’’ అని నమిత్ మల్హోత్రా ‘ఎక్స్’లో షేర్ చేశారు. అయితే ‘రామ’ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ అమెరికాలో జరగనుందని బాలీవుడ్ టాక్. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్. -
బిగ్బాస్ బ్యూటీ దివి శ్రీరామనవమి లుక్.. పట్టు పరికిణిలో అరియానా గ్లోరీ..!
బిగ్బాస్ బ్యూటీ దివి శ్రీరామనవమి లుక్..పట్టు పరికిణిలో అరియానా గ్లోరీ అందాలు..గ్రీన్ డ్రెస్లో హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ గ్లామర్..వైట్ డ్రెస్లో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హోయలు.. బాలిలో చిల్ అవుతోన్న హీరోయిన్ లక్ష్మీ రాయ్ View this post on Instagram A post shared by Lakshmi raai (@iamraailaxmi) View this post on Instagram A post shared by GRAZIA India (@graziaindia) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
ప్రియదర్శి సస్పెన్స్ థ్రిల్లర్ సుయోధన.. ఆడియన్స్ను మెప్పించిందా?
టాలీవుడ్ హీరో ప్రియదర్శి విభిన్న సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా 'సుయోధన' అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకొచ్చారు. ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్గా నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 27న థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయి కుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రల్లో నటించారు. వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్పై బోసుబాబు నిడుమోలు నిర్మించారు. ఈ మూవీతో ప్రియదర్శి మరో హిట్ కొట్టాడా? లేదా అన్నది రివ్యూలో చూద్దాం.ఈ మూవీ కథేంటంటే..వరుణ్ (ప్రియదర్శి) ఒక 'ఫోలే' (సౌండ్ డిజైనర్) ఆర్టిస్ట్. వరుణ్కి చిన్నప్పటి నుంచి 'సుయోధన' అనే ఒక శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో దుర్యోధనుడి ఆకారం కళ్ల ముందే ఉన్నట్లు అనిపిస్తుంది. అది విన్నప్పుడల్లా, చూసినప్పుడల్లా భయపడుతుంటాడు. వరుణ్ తండ్రి మద్దులూరి ప్రకాష్ (సాయి కుమార్) నాటకాలు వేస్తుంటారు. ఆయనకు దుర్యోధనుడి పాత్రంటే చాలా ఇష్టం. ఇది చూసే వరుణ్ భయపడుతున్నాడని అతని తల్లి రాధమ్మ, డాక్టర్లు చెప్పడంతో.. ప్రకాష్ నాటకాలు ఆపేస్తారు. ఇక వరుణ్ ఫోలీ స్టూడియో పెట్టుకొని జీవితం సాగిస్తుంటాడు. అప్పుడే సమిత (ద్రిషిక చందర్) ఒక డెమో ఫిల్మ్ షూటింగ్ చేయడానికి రాగా.. వరుణ్కు పరిచయం అవుతుంది. సమిత షూట్ చేసిన ఓ పాత్ర అతనికి దుర్యోధనుడిలా కనిపిస్తుంది. తనకు ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడే ఇలా జరుగుతుందని తెలుసుకుంటాడు. ఒకానొక సందర్భంలో అతని తండ్రి ప్రకాశే వరుణ్కు దుర్యోధనుడిగా కనిపిస్తాడు. ఆ తర్వాత వరుణ్ తండ్రి హత్యకు గురవుతాడు. అసలు వరుణ్ తండ్రిని చంపింది ఎవరు? హత్యలో ఏదైనా రాజకీయ కోణం ఏంటి? సుయోధన అనే శబ్దం వరుణ్కే ఎందుకు వినిపిస్తోంది? అసలు ఈ సినిమాలో సుయోధన ఎవరు? అనేది తెలియాలంటే థియేటర్లో చూడాల్సిందే.ఎలా ఉందంటే..హీరో ప్రియదర్శికి ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ పాత్ర కొత్తే అయినప్పటికీ.. గతంలో ఇలాంటి సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు చాలానే వచ్చాయి. కానీ ఇక్కడ టాలీవుడ్ ప్రేక్షకులకు 'ఫోలే' ఆర్టిస్ట్ అనేది కొత్త యాంగిల్ నచ్చిందనే చెప్పాలి. సినిమాలో వచ్చే శబ్దాలను ఇలా రికార్డ్ చేస్తారా? అనే విషయం సుయోధన ద్వారా ప్రేక్షకులకు అర్థమైంది. స్క్రీన్ ప్లేతో పాటు సినిమాలోని కొన్ని ట్విస్టులు ఆడియన్స్ను మెప్పిస్తాయి.సినిమా ప్రారంభం నుంచే డైరక్టర్ సస్పెన్స్ క్రియేట్ చేయడంలోచాలా వరకు సక్సెస్ అయ్యాడు. ప్రేక్షకుల్లో వాట్ నెక్ట్స్ అనే క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు. ముఖ్యంగా ఈ కథలో 'సౌండ్' కీ రోల్ ప్లే చేసింది. దర్శకుడు మాధవ్ రెడ్డి ఎంచుకున్న పాయింట్ బాగుంది. అయితే అక్కడక్కడ కొంత ల్యాగ్ అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ మాత్రం కాస్తా ఎంగేజింగ్గా ఉంటుంది. కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ మరింత ఆసక్తిగా ఉంటే బాగుండేది. దర్శకుడికి తొలి సినిమా అయినా తడబడకుండానే తెరకెక్కించాడు. ఈ కథ సైకలాజికల్ థ్రిల్లర్ అయినప్పటికీ.. పొలిటికల్ డ్రామా, మదర్ సెంటిమెంట్ కూడా బాగానే వర్కవుట్ అయింది. ఓవరాల్గా ఆడియన్స్కు ఓ కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది సుయోధన. రొటీన్కు భిన్నంగా.. వినూత్నమైన మిస్టరీ థ్రిల్లర్ను చూడాలనుకుంటే 'సుయోధన' ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారంటే..ప్రియదర్శి మరోసారి తన పాత్రలో అదరగొట్టేశాడు. సాయికుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దుర్యోధనుడి పాత్రతో మెప్పించారు. ఆయన డైలాగ్స్, నటనతో ఈ సినిమాకు ప్లస్. సీనియర్ హీరోయిన్ ప్రేమ తల్లి పాత్రలో ఆకట్టుకున్నారు. హీరోయిన్ ద్రిశికా చందర్ తన గ్లామర్తో అలరించింది. విష్ణు ఓయ్, దేవి ప్రసాద్ తమ పాత్రల పరిధిలో ఫర్వాలేదనిపించారు. సినిమాలో హీరో సత్యదేవ్, బిత్తిరి సత్తి కూడా అలా వచ్చి ఇలా వెళ్లారు. సాంకేతికపరంగా చూస్తే సౌండ్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్రాణం పోశాయి. జై క్రిష్ అందించిన సంగీతం ఫర్వాలేదు. ముఖ్యంగా కథకు తగ్గట్టుగా నిర్మాణ విలువలు ఉన్నతంగా బాగున్నాయి. -
మెగాస్టార్ విషెస్.. మెగా కోడలు ఉపాసన రియాక్షన్
గ్లోబల్ స్టార్ రామ్చరణ్కు పుట్టినరోజు వేడుకను మెగాస్టార్ ఫ్యామిలీ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఇవాళ తనయుడి బర్త్ డే కావడంతో వృద్ధులకు భోజనాలు వడ్డించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఈ వేడుక నిర్వహించారు. అంతకుముందు తనయుడు రామ్ చరణ్పై తన ప్రేమను చాటుకున్నారు. చరణ్ బాల్యంలో జరుపుకున్న పుట్టినరోజు ఫోటోను అభిమానులతో మెగాస్టార్ పంచుకున్నారు.తాజాగా మెగాస్టార్ చేసిన పోస్ట్కు మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల స్పందించింది. మా చిన్న కూతురు అన్వీరా దేవి.. అచ్చం నాన్న రామ్ చరణ్ లాగే ఉంటుందని కామెంట్ చేసింది. కాగా.. ఈ ఏడాది జనవరి 31 ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. వీరికి అన్వీరా దేవి, శివరామ్ అనే పేర్లు పెట్టారు. అంతకుముందు ఈ జంటకు ఓ పాప పుట్టగా.. క్లీంకార అని నామకరణం చేశారు. Charan Babu…❤️❤️❤️From holding my hand as a child to becoming an inspiration to many today… You make me truly proud.The way you balance cinema and personal life, your sense of responsibility towards family, your faith in God, discipline, and values… every time I see it, my… pic.twitter.com/MMg5fYYo3k— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2026 -
శ్రీరామనవమి స్పెషల్.. ఆయనకు అల్లు అర్జున్ స్పెషల్ గిఫ్ట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శ్రీరామనవమి పండుగను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీరాములవారి విశిష్టతను జపాన్కు చెందిన ప్రముఖ గీక్ పిక్చర్స్ సీఈవో టోమట్సు కోసానోకు వివరించారు. శ్రీరామనవమి పురస్కరించుకుని సీతారామ కళ్యాణం' చిత్రపటాన్ని ఆయనకు బహుకరించారు. ఈ వీడియోను అల్లు అర్జున్ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఇక ఐకాన్ స్టార్ బన్నీ విషయానికొస్తే ప్రస్తుతం అట్లీ డైరక్షన్లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో తొలిపారి వస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో దీపికా పదుకొనె హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాకుండా జాన్వీకపూర్, మృణాల్ ఠాకూర్, రష్మికా మందన్నా, భాగ్యశ్రీ బోర్సే వంటి హీరోయిన్లు కూడా నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టీజర్ రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. A reflection of his love for Indian culture and traditions. 🤍Icon Star @AlluArjun presented a Sita Rama Kalyanam painting to Geek Pictures CEO Mr. Tomatsu Kosano, explaining the historical and spiritual essence of the Ramayana.🙏A beautiful moment of cultural exchange… pic.twitter.com/T4dOeoBqxc— Team Allu Arjun (@TeamAAOfficial) March 27, 2026 -
రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. ఇంట్లోనే ప్రత్యేక హోమం
మెగా హీరో రామ్ చరణ్ బర్త్ డే వేడుకను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మెగా ఫ్యాన్స్ సంతోషంతో అభిమాన హీరో జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు తమ హీరోకు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. తన కుమారుడి బర్త్ డేను పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నిన్ను చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉందని ట్వీట్ చేశారు.చెర్రీ బర్త్ డేను మెగా కుటుంబం ఓ పండుగలా నిర్వహిస్తున్నారు. తాజాగా ఇవాళ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఇంట్లోనే ప్రత్యేకంగా హోమం నిర్వహించారు. అనంతరం తల్లిదండ్రులు కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు గ్లోబల్ స్టార్. శ్రీరామనవమి రోజే రామ్ చరణ్ బర్త్ డే రావడంతో మెగా కుటుంబంలో ఆనందం మరింత రెట్టింపైంది. రామ్ చరణ్ హోమం నిర్వహించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇక సినిమాల విషయానికొస్తే రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఇవాళ చెర్రీ బర్త్ డే సందర్భంగా పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో పహిల్వాన్గా రామ్ చరణ్ సరికొత్త లుక్లో కనిపించారు. ఈ రోజు రిలీజైన గ్లింప్స్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. On the auspicious occasion of #SriRamaNavami and Mega Powerstar #RamCharan’s birthday, Megastar #Chiranjeevi performed a special homam at his residence, seeking divine blessings. ✨ pic.twitter.com/6G0baHvhXo— Filmy Focus (@FilmyFocus) March 27, 2026 -
మెగాస్టార్ గొప్పమనసు.. రామ్ చరణ్ తరఫున బర్త్ డే గిఫ్ట్
మెగా తనయుడు రామ్ చరణ్ బర్త్ డే వేళ మెగాస్టార్ తన గొప్ప మనసును చాటుకున్నారు. కుమారుడి పుట్టినరోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అందించిన ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ జాతీయ బహుమతి పురస్కారం రూ.10 లక్షల నగదు మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళమిచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలువురు అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న సర్వ్ ఫౌండేషన్, అంధుల కోసం పని చేస్తున్న దేవనార్ ఫౌండేషన్, చిన్నారులను సంరక్షిస్తున్న వాల్మీకి, నయశ్రీ ఫౌండేషన్లతోపాటు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి కూడా మెగాస్టార్ విరాళంగా ఇచ్చారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్లో రామ్ చరణ్ను కలిసిన వృద్ధులను మెగాస్టార్ తన బ్లడ్ బ్యాంక్కు ఆహ్వానించారు. వారందరికీ బర్త్ డే గిఫ్ట్గా కొత్త దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం తానే స్వయంగా వారందరికీ భోజనాలు పెట్టించారు. -
వెంకటేశ్-అనిల్ రావిపూడి.. మళ్లీ ఆయనతోనే
ఈ ఏడాది సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్' సినిమాతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి.. కొన్నాళ్ల క్రితమే వెంకటేశ్-కల్యాణ్ రామ్ కాంబోలో ఓ మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం త్వరలో లాంఛనంగా మొదలు కాబోతుంది. ఇంతలోనే ఒక్కో అప్డేట్ రివీల్ చేస్తున్నారు. తాజాగా నిర్మాతలు ఎవరనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా.. అధికారిక ప్రకటన)అనిల్ రావిపూడితో 'భగవంత్ కేసరి', 'మన శంకరవరప్రసాద్' తీసిన సాహు గారపాటి.. మూడోసారి ఈ మూవీ కోసం కలిసి పనిచేయబోతున్నారు. అలానే సురేశ్ బాబు, జీ స్టూడియోస్ కూడా నిర్మాణంలో పాలుపంచుకోనున్నాయి. ఈ మేరకు శ్రీరామనవమి సందర్భంగా పోస్టర్స్ రిలీజ్ చేసి అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు.ఇందులో వెంకటేశ్, కల్యాణ్ రామ్కి జంటగా కీర్తి సురేశ్, కృతిశెట్టిలని అనుకుంటున్నారని గత కొన్నిరోజుల నుంచి రూమర్స్ వస్తున్నాయి. త్వరలో హీరోయిన్లపై క్లారిటీ ఇవ్వడంతో పాటు లాంఛనంగా ఈ ప్రాజెక్టుని మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అలానే సంగీత దర్శకుడిగా భీమ్స్నే అనిల్ తీసుకుంటాడా? లేదా వేరే వాళ్లకు అవకాశమిస్తాడా అనేది చూడాలి. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.(ఇదీ చదవండి: హరీశ్ శంకర్కి ఇంకా అర్థం కావట్లేదు!) View this post on Instagram A post shared by Shine Screens (@shinescreenscinema) -
మోనాలిసా సంచలన ఆరోపణలు.. షాకిచ్చిన దర్శకుడు..!
ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాతో పాపులర్ అయిన మోనాలిసా భోంస్లే ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్ను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. తనకు మొదటిసారిగా సినిమా ఛాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించిన బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రాపై సంచలన ఆరోపణలు చేసింది. షూటింగ్ సెట్లో సనోజ్ మిశ్రా తన పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించారని మోనాలిసా వాపోయింది. షూటింగ్ పేరుతో తన శరీరాన్ని పలుమార్లు తాకుతూ చాలా ఇబ్బందిపెట్టేవాడిని చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పినా పట్టించుకోలేదని పేర్కొంది. దీంతో ఈ టాపిక్ బాలీవుడ్ చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలోనే తనపై వస్తున్న ఆరోపణలపై డైరెక్టర్ సనోజ్ మిశ్రా స్పందించారు. దర్శకుడు మోనాలిసా చేసిన ఆరోపణలను ఖండించారు. నేను ఎవరికైతే అండగా నిలబడ్డానో.. ఆమె నన్ను ఇబ్బందుల్లో పడేసిందని అన్నారు. కేవలం నేను ఆమె ఫర్మాన్ ఖాన్తో వెళ్లిపోవడాన్ని వ్యతిరేకించినందుకే మోనాలిసా నాపై ఆరోపణలు చేసిందని అన్నారు. తనకు నటించడం కూడా నేనే నేర్పించా.. తన కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఉజ్జయినిలోని నా ఇంట్లోనే నివసిస్తున్నారని సనోజ్ మిశ్రా తెలిపారు. ఆమె పెళ్లిని తాను వద్దన్నందుకే ఇలా చేసిందని వెల్లడించారు. ఆమె తల్లిదండ్రులు కూడా పెళ్లిని వ్యతిరేకించారని.. ఈ వివాహం చెల్లదని ప్రకటించారని పేర్కొన్నారు. పరువు నష్టం దావా వేస్తా..మోనాలిసాపై త్వరలోనే పరువు నష్టం దావా వేస్తానని సనోజ్ మిశ్రా వెల్లడించారు. ఒకటి రెండు రోజుల్లో పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. ఒకవేళ తాను చెప్పేది నిజమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని తెలిపారు. అలాగే ఈ సినిమా నిర్మాణం ఇక జరగదు.. ఎందుకంటే ఆమె దాని గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఇక సినిమా అనేది పూర్తిగా వేరే అంశమని సనోజ్ మిశ్రా అన్నారు. మోనాలిసా లైంగిక ఆరోపణలు చేసిన తర్వాత సనోజ్ మిశ్రా స్పందించారు. ప్రస్తుతం సనోజ్ మిశ్రా దర్శకత్వంలో 'ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మోనాలిసా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.(ఇది చదవండి: నన్ను తాకేవాడు.. ఇంట్లో వాళ్లకు చెబితే సర్దుకుపొమ్మన్నారు: మోనాలిసా) -
మారుతికి అర్థమైంది.. హరీశ్ శంకర్కి అర్థం కావట్లేదు!
ఏ సినిమా గానీ హిట్ అయిందా? ఫ్లాప్ అయిందా? అని రిలీజైన రోజే అందరికీ అర్థమైపోతుంది. కాకపోతే ఫ్లాప్ అనే నిజాన్ని ఒప్పుకొనే ధైర్యం అందరికీ ఉండదు. కొందరికి మొదట్లోనే సీన్ అర్థమైపోతే మరికొందరికి మాత్రం ఎప్పటికి అర్థం అవుతుందో అని సందేహం కలుగుతుంది. ఎందుకంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంతో గతవారం పలకరించిన దర్శకుడు హరీశ్ శంకర్.. మూవీ ఫ్లాప్ అయినా సరే విడిచిపెట్టట్లేదు. తాను తీసింది సూపర్ హిట్ అనే రేంజులో ప్రమోట్ చేసుకుంటున్నారు. తాజాగా తనపై వస్తున్న ట్రోల్స్కి ఇచ్చిన సమాధానమైతే మరీ విచిత్రంగా అనిపిస్తుంది. సోషల్ మీడియాలోనూ మొత్తం డిస్కషన్ ఈయన గురించే.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా.. అధికారిక ప్రకటన)గతంలో పవన్తో 'గబ్బర్ సింగ్' అనే రీమేక్ తీసి హిట్ కొట్టిన హరీశ్ శంకర్.. దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్'తో వచ్చాడు. దాదాపు అప్పటి తరహా టెంప్లేట్ స్టోరీ కావడం, మూసగా ఉందనే నెగిటివ్ టాక్ రావడంతో తొలిరోజు నుంచి నిర్మాతలు సైలెంట్ అయిపోయారు. ప్రతి మూవీకి కలెక్షన్స్ ప్రకటించే వీళ్లు.. 'ఉస్తాద్' విషయంలో మౌనం పాటించారు. అందరికీ అప్పుడే ఫలితం అర్థమైపోయింది. దర్శకుడు హరీశ్ శంకర్ మాత్రం తాను తీసింది హిట్ అనే రేంజులో ఇంటర్వ్యూలు, మీటప్స్ పెడుతూ బిజీ అయిపోయాడు. అందులో ఈయన, హీరోయిన్లు తప్పితే మరో టెక్నీషియన్ కనిపించలేదు.రెండు నెలల క్రితం అంటే సంక్రాంతికి వచ్చిన 'రాజాసాబ్' రిలీజ్కి ముందు దర్శకుడు మారుతి కూడా ఇలానే చాలా కాన్ఫిడెంట్గా కనిపించాడు. తీరా థియేటర్లలోకి మూవీ వచ్చిన తర్వాత విషయం అర్థమైపోయి సైలెంట్ అయిపోయాడు. అభిమానులు ఎంతలా ట్రోల్ చేసినా సరే అవన్నీ భరిస్తూ వచ్చాడు తప్పితే ఏది పడితే అది మాట్లాడలేదు. హరీశ్ శంకర్ మాత్రం సినిమాలో తప్పుల్ని కూడా సమర్థించుకుంటున్నాడు. పవన్ ఎంట్రీ సీన్పై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ.. మాస్టర్ తీసింది, తాను తీసింది నచ్చడంతోనే రెండుషాట్స్ పెట్టానని చెప్పేసరికి నెటిజన్ల మతిపోతోంది. హిట్ అయిన సినిమా గురించి ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది గానీ ఫ్లాప్ అయిన మూవీ గురించి పదేపదే మాట్లాడినంత మాత్రాన అది హిట్ అయిపోదు. ఈ విషయం హరీశ్ శంకర్ ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో?(ఇదీ చదవండి: 'రాజాసాబ్' ఫ్లాప్ నుంచి కోలుకున్న మారుతి.. పోస్ట్ వైరల్) -
నాపై డేటింగ్ రూమర్స్.. చివరికీ వాడు కూడా నవ్వుతున్నాడు..!
బాలీవుడ్లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్ట్గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చకుంది. షారుఖ్ ఖాన్ సరసన ఛల్ ఛయ్య ఛయ్య ఛయ్య అనే పాటతో దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపిసిన ముద్దుగుమ్మ.. తెలుగులో 2007లో మహేశ్ బాబు హీరోగా నటించిన అతిథి మూవీలో ప్రత్యేక గీతంతో టాలీవుడ్ను పలకరించింది. అలాగే గబ్బర్ సింగ్లో కెవ్వు కేక పాటకు స్టెప్పులేని కుర్రకారుని ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్గా రాణిస్తోంది.అయితే మలైకా పర్సనల్ లైప్ ఎప్పుడు ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. 1998లో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ని పెళ్లి చేసుకొని.. 20 ఏళ్ల పాటు కలిసి కాపురం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 2017లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తనకంటే 12 ఏళ్ల చిన్నవాడైన యంగ్ హీరో అర్జున్ కపూర్తో ప్రేమాయణం కొనసాగించింది. కొన్నాళ్ల పాటు కలిసి సహజీవనం చేసిన ఈ జంట.. కొన్నేళ్ల క్రితమే విడిపోయింది. గత కొన్నేళ్లుగా ఒంటరిగానే ఉంటున్న మలైకా..ఇటీవల మరో వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్లో వార్తలొచ్చాయి.తాజాగా తనపై వస్తున్న రూమర్స్పై మలైకా అరోరా స్పందించింది. తనపై వస్తున్న డేటింగ్ రూమర్స్పై తనకు ఎలాంటి ఆందోళన లేదని తెలిపింది. వాటిని చూసి నా కుమారుడు అర్హాన్ ఖాన్, నేను జోకులు వేసుకుంటున్నామని పేర్కొంది. ఓ ఇంటర్వ్యూకు హాజరైన మలైకా.. తన పర్సనల్ లైఫ్పై వస్తున్న వాటిని చూసి నా ఫ్యామిలీ కూడా నవ్వుతూ సరదాగా తీసుకుంటుందని వెల్లడించింది. ప్రస్తుతం తాను ప్రేమ విషయంలో తొందరపడటం లేదని.. నా జీవితాన్ని నాకు నచ్చినట్లుగా జీవించాలని కోరుకుంటున్నట్లు మలైకా చెప్పింది.స్వయంకృషితో ఎదిగా..మలైకా మాట్లాడుతూ.. ' సింగిల్గా ఉండడమే నాకు ప్రేరణ. మొదటి నుంచి అదే నన్ను ముందుకు నడిపిస్తోంది. సహవాసం, భాగస్వామి, అవన్నీ అందమైనవే. కానీ నాకు ఒక భాగస్వామి కావాలి అన్నట్టుగా నేను వాటి కోసం వెతకడం లేదు. నేను స్వయంకృషితో ఎదిగినందుకు ఎంతో గర్వంగా ఉంది. నా వ్యక్తిత్వాన్ని పరిపూర్ణం చేయడానికి నాకు ఏ పురుషుడి అవసరమూ లేదు. ఒకవేళ నేను ఎవరితోనైనా కలిసి ఉండాల్సి వస్తే.. అది నా సొంత రూల్స్ ప్రకారమే ఉంటుంది." తెలిపింది. -
మహేశ్ బాబు పోలికలతో రాముడి విగ్రహం.. ఫోటో వైరల్
శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఓ గుడిలో ఉన్న శ్రీరాముడి విగ్రహం ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ప్రత్యేకత ఏంటంటే.. ఆ విగ్రహం అచ్చం మహేశ్ బాబులాగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని ఓ దేవాలయంలో ఆ రాముడి విగ్రహం ఉందని ఓ నెటిజన్ పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది.ఏఐ ఫోటో?అయితే సదరు నెటిజన్ ఆ విగ్రహం ఉన్న గుడి పేరు చెప్పకుండా ‘15 ఏళ్ల క్రితం ఆంధ్రాలో ఎక్కడో గుడిలోని రాముడు.. అచ్చం మహేశ్ బాబులాగే కనిపిస్తున్నాడు’ కదా అని పోస్ట్ పెట్టడంతో.. అది నిజమైన విగ్రహం కాదేమో అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ నిజంగానే ఉంటే.. ఈ పాటికే అందరికి తెలిసిపోయేది కదా? అని కామెంట్ చేస్తున్నారు. కేవలం వ్యూస్, రీచ్ కోసమే ఇలాంటి ఏఐ ఫోటోలను షేర్ చేస్తున్నారంటూ కొంతమంది నెటిజన్స్ మండిపడుతున్నారు. మహేశ్ అభిమానులు అయితే.. శ్రీరాముడిగా కనిపిస్తున్న తమ హీరోని చూసుకొని మురిసిపోతున్నారు.రాముడిగా మహేశ్?మహేశ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వారణాసి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రూ. 1000 కోట్ల బడ్జెట్ లో హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహేశ్..రాముడిగా కనిపిస్తాడని రాజమౌళి చెప్పాడు. మహేశ్ బాబును పోలిన రాముడి విగ్రహం వైరల్ కావడానికి అది కూడా ఒక కారణం. 15 years back andhra lo ekkado gudilo Ramudu Mahesh lage kanipisthunadu kada pic.twitter.com/zI3KXBExN0— 000009 (@ui000009) March 27, 2026 -
దురంధర్-2 కలెక్షన్స్.. తొలి వారం ఎన్ని కోట్లంటే?
రణ్వీర్ సింగ్- ఆదిత్యధర్ కాంబోలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ధురంధర్ ది రివెంజ్. గతేడాది రిలీజై బ్లాక్బస్టర్గా నిలిచిన దురంధర్కు సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల గ్యాప్లోనే సీక్వెల్ను రిలీజ్ చేయడం విశేషం. తొలి రోజు నుంచే కాసుల వర్షం కురిపిస్తోన్న ఈ చిత్రం వారం రోజుల్లోనే రికార్డ్ సృష్టించింది.తాజాగా ఈ మూవీ మొదటి వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1006 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. తొలి వారంలోనే వెయ్యి కోట్లు సాధించిన తొలి హిందీ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ స్వయంగా వెల్లడించింది. ఓవరాల్గా చూస్తే ఎనిమిది రోజుల్లో రూ.1088 కోట్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దేశవ్యాప్తంగా రూ.814 కోట్ల గ్రాస్ రాబట్టగా.. ఓవర్సీస్లో రూ.274 కోట్లు వచ్చినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా నెట్ పరంగా చూస్తే రూ.690 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీలో సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ బ్యూటీ సారా అర్జున్ హీరోయిన్గా మెప్పించింది. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఈ మూవీపై దక్షిణాది స్టార్స్ ప్రశంసలు కురిపించారు. Yeh dahaad hai naye Hindustan ki.🔥Day-wise break-up | India NBOCWeekend 1: 466 Cr* DAY 5: ₹64 Cr* DAY 6: ₹58 Cr* DAY 7: ₹49 Cr* DAY 8: ₹53 Cr* India: ₹690 Cr* Week 1 | Worldwide GBOC (8 Days)India: ₹814 Cr* Overseas: ₹274 Cr*Book Your Tickets Now.🔗-… pic.twitter.com/x2iLMxfX6K— B62 Studios (@B62Studios) March 27, 2026 -
'రాజాసాబ్' ఫ్లాప్ నుంచి కోలుకున్న మారుతి.. పోస్ట్ వైరల్
ఈ సంక్రాంతికి వచ్చి ప్రేక్షకుల్ని దారుణంగా నిరాశపరిచిన సినిమా 'రాజాసాబ్'. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్ర ట్రైలర్స్ చూసి, దర్శకుడు మారుతి మాటల్ని నమ్మి.. అభిమానులు హైప్ పెంచేసుకున్నారు. తీరా చూస్తే వాళ్లని దారుణంగా మోసం చేశారు! కంటెంట్ ఓ మాదిరిగా ఉండగా.. విజువల్ ఎఫెక్ట్స్, హెడ్ మార్పింగ్ లాంటివి మరీ ఎక్కువగా ఉండేసరికి చాలామంది ఇప్పటికీ మారుతిని విమర్శిస్తూనే ఉన్నారు. అలా గత కొన్నేళ్లుగా బయట కనిపించని మారుతి.. చాన్నాళ్లకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. తన కొత్త మూవీ గురించి అప్డేట్ ఇచ్చాడు.(ఇదీ చదవండి: తిరుపతిలో సింపుల్గా పెళ్లి చేసుకోనున్న తెలుగు హీరో)శ్రీరామ నవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్పిన దర్శకుడు మారుతి.. ప్రతి ప్రయాణం ఓ అనుభవమే అని 'రాజాసాబ్' ఫెయిల్యూర్ని గుర్తుచేసుకున్నాడు. తన కొత్త మూవీ స్క్రిప్ట్ చివరి దశలో ఉందని, దీనిపై రాముడి ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. తనకు అండగా నిలబడిన మీడియా, సన్నిహితులు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు.చూస్తుంటే 'రాజాసాబ్' ఫ్లాప్ నుంచి మారుతి కోలుకున్నట్లే కనిపిస్తున్నాడు. అయితే ఇతడి తర్వాతి సినిమాకు 'హ్యాపీ పొంగళ్' అనే టైటిల్ అనుకుంటున్నట్లు, మెగా హీరో అయిన వైష్ణవ్ తేజ్తో మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడనే రూమర్స్ వస్తున్నాయి. మరి ఇవి నిజమా కాదా అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఈ చిత్రంతో మారుతి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలి. లేదంటే మాత్రం కష్టమే!(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా.. అధికారిక ప్రకటన)Every journey is a learning experience. On this auspicious occasion of #SriRamaNavami, I’m grateful to be giving final touches to my next script with His blessings 🙏A heartfelt thank you to all my audience, well-wishers and the media for constantly supporting me and sharing… pic.twitter.com/TXGf0rpGSk— Director Maruthi (@DirectorMaruthi) March 27, 2026 -
ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా.. అధికారిక ప్రకటన
టాలీవుడ్లో అడపాదడపా కామెడీ సినిమాలు వస్తూనే ఉంటాయి. అలా గత నెలలో సుహాస్ హీరోగా చేసిన ఓ మూవీ థియేటర్లలోకి వచ్చింది. కాస్త అడల్ట్ టచ్ ఉన్న కాన్సెప్ట్ కావడంతో కొందరికి నచ్చగా.. మరికొందరికి ఎబ్బెట్టుగా అనిపించింది. ఏమైనా సరే యావరేజ్ టాక్ అందుకుంది. ఇప్పుడు ఈ చిత్ర ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: తిరుపతిలో సింపుల్గా పెళ్లి చేసుకోనున్న తెలుగు హీరో)సుహాస్, శివాని నాగారం హీరోహీరోయిన్లుగా నటించిన కామెడీ సినిమా 'హే బల్వంత్'. తొలుత ఈ చిత్రానికి 'హే భగవాన్' అని టైటిల్ పెట్టారు. కానీ కంటెంట్ చూసిన సెన్సార్ టీమ్.. టైటిల్ మార్చమని చెప్పేసరికి ఇలా రిలీజ్ చేశారు. సీనియర్ నటుడు నరేశ్, సుదర్శన్ కీలక పాత్రలు చేశారు. ఫిబ్రవరి 20న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. ఈ నెల 31 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.'హే బల్వంత్' విషయానికొస్తే.. కృష్ణ(సుహాస్)కి చిన్నప్పటి నుంచి తన తండ్రిలా బిజినెస్మ్యాన్ అవ్వాలనేది కోరిక. కానీ నాన్న ఏం పనిచేస్తుంటాడనేది మాత్రం తెలీదు. ఇతడి నాన్నమ్మ(అన్నపూర్ణమ్మ) కూడా ఎందరో ఆడవాళ్లకి బతుకునిస్తున్నాడని చెబుతుంది. మొత్తానికి పెద్దయ్యాక కృష్ణకు తండ్రి బిజినెస్ ఏంటో తెలుస్తుంది. అయితే ఆ విషయాన్ని అంగీకరించాడనికే కృష్ణ చాలా ఇబ్బంది పడతాడు. అప్పటికే తాను ప్రేమిస్తున్న మిత్ర(శివాని)కి ఆ బిజినెస్ గురించి తెలియకుండా దాస్తాడు. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి? చివరకు కృష్ణ-మిత్ర ఒక్కటయ్యారా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఎట్టకేలకు కొత్త సినిమా రిలీజ్ డేట్.. ఈ హీరో గుర్తున్నాడా?) -
ఆదిత్య ధర్కు పాకిస్తాన్ ప్రజల వింత డిమాండ్
రణ్వీర్ సింగ్- ఆదిత్యధర్ కాంబినేషన్ సినిమా ‘ధురంధర్2’ హిట్ టాక్తో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. గతేడాది విడుదలైన ‘ధురంధర్-1’ సీక్వెల్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ. 1000 కోట్ల మార్క్ను దాటేసింది. అయితే, ఈ కలెక్షన్స్ గురించి పాక్స్తాన్లోని ల్యారీ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారనే అంశంపై ఒక వీడియో వైరల్ అవుతుంది.ధురంధర్-2 కలెక్షన్స్పై నెటిజన్లకు నవ్వు పుట్టించేలా ఈ వీడియో ఆసక్తిగా ఉంది. ఈ మూవీలో ఎక్కువగా కరాచీలోని ల్యారీ ప్రాంత నివాసుల జీవితం గురించి చూపించారు. ఇప్పుడు ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో అక్కడి ప్రజలు సరదాగా మాట్లాడుకుంటూ కనిపిస్తున్నారు. ధురంధర్-2 రూ. 1000 కోట్లు వసూలు చేసింది కాబట్టి, దర్శకుడు ఆదిత్య ధర్ అందులో నుంచి రూ. 500 కోట్లు తిరిగి తమకు ఇచ్చేయాలని, ఆ డబ్బుతో తమ ల్యారీ ప్రాంతంలో మంచి రోడ్లు నిర్మించుకుంటామని వారు కోరడం విశేషం.ఎంతో చమత్కారంగా ఉన్న ఈ వ్యాఖ్యలు నెటిజన్ల మనసులను తాకింది. దీంతో వారు ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ల్యారీ ప్రజల నిజ జీవిత సమస్యలను సినిమాలో చాలా చక్కగా చూపించారని కూడా వారు అంటున్నారు. తమ జీవితాలు ఎలా ఉంటాయో ఈ మూవీ ద్వారా ప్రపంచానికి చూపించారని దర్శకుడిపై వారు ప్రశంసలు కూడా కురిపించడం విశేషం.Pakistani delulu aawam is saying that Aditya Dhar will earn 1000 Crore from #Dhurandhar2TheRevenge , he should return back 500 crore to Lyari because we don't have good roads here 😭😭😭😂😂😂😂 pic.twitter.com/kBdtGYvPla— Chota Don (@choga_don) March 27, 2026 -
క్షమాపణలు చెప్పనక్కర్లేదు.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమా ఇండస్ట్రీలోనే కాదు అన్ని చోట్ల మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వృత్తి జీవితంలో సర్దుకొని పోవాల్సి వస్తుంది. చాలా సందర్భాలలో తమ అభిప్రాయాలు, లక్ష్యాలు, ప్లాన్లు అన్నీ ఇతరులకు అనుకూలంగా మార్చుకుంటారని, అది త్యాగమని కూడా భావించకుండా..ముందుకు సాగుతున్నారు’ అని స్టార్ హీరోయిన్ సమంత ఆవేదన వ్యక్తం చేసింది. సమాజంలో గుర్తింపు పొందేందుకు పురుషులతో పోలిస్తే మహిళలలు మరింత కష్టపడాల్సి వస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. తాజాగా హాలీవుడ్ రిపోర్టర్ సంస్థ నిర్వహించిన ఉమెన్ ఇన్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో సమంత పాల్గొన్నారు.ఆ అలవాటుని మార్చుకోవాలిఈ సందర్భంగా మహిళల స్థితిగతులపై సమంత మాట్లాడుతూ.. ‘సమాజంలో ఇతరులు సౌకర్యంగా ఉండటానికి మహిళలు తమ అభిప్రాయాలు, షెడ్యూళ్లను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. తమ ఆశయాలను వదులుకుంటూ , ఇతరుల కోసం బతకడం మహిళలకు అలవాటైపోయింది. ఇకనైనా మహిళలు ఈ అలవాటును మార్చుకోవాలి. తమకు తాము విలువ ఇచ్చుకోవడం చాలా అవసరం. సాధించిన విజయాలను గర్వంగా స్వీకరించాలి’ అని అన్నారు.ఆ రోజులు రావాలిసినిమా ఇండస్ట్రీలో మహిళలు..తగిన గుర్తింపు సంపాదించుకోవడానికి రెట్టింపు కష్టం చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలను ఒక రిస్క్ లాగా లేదా ఒక ప్రత్యేక కేటగిరి లాగా చూస్తున్నారు. ఆ రోజులు పోవాలి. వాటిని కూడా డిఫరెంట్ కథలు అని చెప్పుకునే రోజులు రావాలి.తెరపై మహిళలు కేవలం హీరోకి భార్యగానో .. హీరోకి ధైర్యం చెప్పడానికో పరిమితం కాకుండా నిజజీవితంలో ఉండే మహిళల లాగానే క్లిష్టమైన మనస్తత్వంతో ఉండాలి’అని సమంత తెలిపింది.సారీ..అక్కర్లేదుపురుషులతో పోలిస్తే.. మహిళలే ఎక్కువ సార్లు క్షమాపణలు కోరుతున్నారు. ఒకే పరిస్థితిలో పురుషుల కంటే మహిళలు దాదాపు పది రెట్లు ఎక్కువ సారీ అంటారని మీకు తెలుసా?, ఇది వారి ఆత్మవిశ్వాసం తగ్గిపోవడానికి ఒక సూచనగా పరిగణించవచ్చు. ప్రతి చిన్న విషయానికి క్షమాపణలు కోరాల్సిన అవసరం లేదు. ఇక చాలు.. మహిళలు ఇలా తమని తాము తగ్గించుకోవడం ఆపాలి.క్రెడిట్ తీసుకోవడం తప్పు కాదు. అంబిషన్ ఉండటం తప్పు కాదు. ఎవరో పొగిడితే సింపుల్గా థాంక్యూ అనడం అహంకారం కాదు. మీరు కష్టపడి సంపాదించుకున్న గౌరవాన్ని అనుభవించే హక్కు పూర్తిగా మీకు ఉంది’ అని సమంత చెప్పుకొచ్చింది. -
ఎట్టకేలకు కొత్త సినిమా రిలీజ్ డేట్.. ఈ హీరో గుర్తున్నాడా?
తెలుగులోని ప్రామిసింగ్ హీరోల్లో నాగశౌర్య ఒకడు. ఊహలు గుసగుసలాడే, ఛలో లాంటి సినిమాలతో సక్సెస్ అందుకున్న ఇతడు.. తర్వాత మూవీస్ అయితే చేశాడు గానీ ఎనిమిదేళ్లుగా హిట్ అనేది అందుకోలేకపోయాడు. చివరగా 2023లో' రంగబలి' చిత్రంతో వస్తే ఘోరమైన డిజాస్టర్ అయింది. తర్వాత నుంచి ఎక్కుడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియనంతగా మాయమైపోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ హీరో నుంచి కొత్త సినిమా రాబోతుంది. ఈ మేరకు విడుదల తేదీ ప్రకటించారు.(ఇదీ చదవండి: తిరుపతిలో సింపుల్గా పెళ్లి చేసుకోనున్న తెలుగు హీరో)నాగశౌర్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'బ్యాడ్ బాయ్ కార్తిక్'. విధి యాదవ్ హీరోయిన్. రామ్ దేశిన దర్శకుడు. గతేడాది ఇదే టైంకి షూటింగ్ పూర్తయినప్పటికీ ఎందుకనో రిలీజ్ చేయకుండా నాన్చుతూ వచ్చారు. మధ్యలో ఒకటి రెండు పాటలు వదిలినప్పటికీ అవేం ఇంప్రెస్ చేయలేదు. ఇప్పుడు సడన్గా శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెబుతూ ఏప్రిల్ 17న తమ చిత్రం థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు.హరీశ్ జయరాజ్ సంగీతమందించిన ఈ సినిమాలో సాయికుమార్, సముద్రఖని లాంటి సీనియర్స్ నటించారు. ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ చూస్తే ఇదేదో రొటీన్ కమర్షియల్ మూవీలానే అనిపిస్తుంది. ఇలాంటి వాటికి ఇప్పుడు ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ దక్కట్లేదు. మరి మూడేళ్ల తర్వాత వస్తున్న నాగశౌర్య.. ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి? హిట్, ఫ్లాప్ సంగతి పక్కనబెడితే రెగ్యులర్గా సినిమాలు చేస్తున్నప్పటికే హీరోలకు సరైన మార్కెట్ ఉండట్లేదు. అలాంటి మూడేళ్లుగా కనిపించని నాగశౌర్య ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: పదిరోజుల్లోనే ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా) -
తిరుపతిలో సింపుల్గా పెళ్లి చేసుకోనున్న తెలుగు హీరో
ఇప్పుడంతా డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ నడుస్తోంది. అంటే వేరే ఊరికి వెళ్లిపోయి అక్కడ పెళ్లి చేసుకోవడం అనమాట. గత నెలలో ఇలానే హీరో విజయ్ దేవరకొండ-రష్మిక.. రాజస్థాన్లోని ఉదయ్పుర్ వెళ్లి అక్కడ గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. అయితే ఇలాంటి హడావుడి ఏం లేకుండా సింపుల్గా పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.(ఇదీ చదవండి: ‘యూత్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)ఈ నెల ప్రారంభంలో కావ్య అనే అమ్మాయి తన జీవితంలో ఉందని చెప్పి హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పరిచయం చేశాడు. ఈ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యేసరికి ఇదేదో ఎంగేజ్మెంట్ అని అంతా అనుకున్నారు. కానీ ఇది కేవలం కుటుంబాల కలిసిన సందర్భం అని సదరు హీరో చెప్పుకొచ్చాడు. త్వరలో శుభవార్త గురించి, పెళ్లి డేట్ బయటపెడతానని అన్నాడు. ఇప్పుడు ఆ తేదీల గురించి ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.వచ్చే నెల 5వ తేదీన బెల్లంకొండ శ్రీనివాస్-కావ్య.. హైదరాబాద్లో నిశ్చితార్థం చేసుకోనున్నారు. వచ్చే నెల 29న తిరుపతిలో ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సింపుల్గా పెళ్లి చేసుకోనున్నారు. మే 01న హైదరాబాద్లో టాలీవుడ్ ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.(ఇదీ చదవండి: పదిరోజుల్లోనే ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా) -
నటుడు రాహుల్ రామకృష్ణ సోదరుడు మృతి
టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు రాహుల్ రామకృష్ణ సోదరుడు మరణించారు. పారాక్వాట్ (Paraquat) అనే రసాయన గడ్డిమందు కారణంగా తన సోదరుడు ప్రాణాలు కోల్పోయాడని సోషల్ మీడియా ద్వారా అయన తెలిపారు. అత్యంత విషపూరితమైన ఈ రసాయనం తెలంగాణలో చాలా సులభంగా అందుబాటులో ఉండటం తెలిసి తనను ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన అన్నారు. ఈ రసాయనం వల్ల సంభవిస్తున్న మరణాల సంఖ్యను చూసి డాక్టర్లు కూడా షాకవుతున్నారని రాహుల్ పేర్కొన్నారు. ఆత్మహత్యల కోసం విచ్చలవిడిగా దుర్వినియోగం చేయబడుతోందని ఆవేదన చెందారు. ఇది ప్రతిచోటా ఎంత సులభంగా లభిస్తుందో చూసి దిగ్భ్రాంతి చెందానని ఆయన అన్నారు. దయచేసి వీలైనంత త్వరగా దీనిని నిషేధించండి - ప్రాణాలను కాపాడండి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి (CMO), భారత ప్రధానమంత్రి కార్యాలయానికి (PMO) ఆయన విజ్ఞప్తి చేశారు.భారతదేశంలో పారాక్వాట్ వినియోగం ఇప్పటికీ కొనసాగుతుంది. దీని విషపూరితత కారణంగా కొన్ని రాష్ట్రాలు (ఉదా: తెలంగాణ) అమ్మకాలపై పరిమితులు విధించాయి. ప్రపంచంలోని చాలా దేశాలు దీన్ని పూర్తిగా నిషేధించాయి. వైద్య నిపుణులు చిన్న పరిమాణం కూడా ప్రాణాంతకమని హెచ్చరించడంతో తెలంగాణ ప్రభుత్వం (2026) పారాక్వాట్ అమ్మకాలపై పరిమితులు విధించింది. భారతదేశంలో చాలా రాష్ట్రాలు కొన్ని కఠిన మార్గదర్శకాలతో మాత్రమే అనుమతిస్తున్నాయి. పొలాల్లో పనిచేసే రైతులు ఎక్కువగా ఈ రసాయనం వల్ల ప్రభావితమవుతున్నారు. Honourable Sirs @TelanganaCMO @PMOIndia,Lost my brother today to Paraquat poisoning. It’s terrifyingly lethal and widely misused for self-destruction. Shocked by how easily it is available everywhere. Doctors are overwhelmed by the amount of cases.Please ban it ASAP-save lives🙏🏽— Rahul Ramakrishna (@eyrahul) March 26, 2026


