breaking news
Movies
-
శారీలో మెరిసిపోతున్న మలయాళ బ్యూటీ.. వేకేషన్లో హంసానందిని చిల్!
వైట్ డ్రెస్లో బాలీవుడ్ బ్యూటీ సిమ్రత్ కౌర్.. 8 హీరోయిన్ అనంతిక సనీల్కుమార్ స్మైలీ లుక్స్... బ్లాక్ బ్యూటీ శృతిహాసన్ హోయలు.. వేకేషన్లో ఫుల్గా చిల్ అవుతోన్న హంసానందిని.. శారీలో మెరిసిపోతున్న మలయాళ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్.. View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Simratt Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Surveen Chawla (@surveenchawla) -
30 ఏళ్లకే తల్లి పాత్రలా?.. ఛావా నటి ఆవేదన
ఈ ఏడాది ఛావా, ఆజాద్ చిత్రాలతో మెప్పించిన బాలీవుడ్ డయానా పెంటీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినీ ఇండస్ట్రీలో మహిళలను ట్రీట్ చేసే విధానంపై స్పందించారు. ఇండస్ట్రీలో మహిళలను సామర్థ్యం కంటే.. కేవలం బాహ్య రూపానికే ప్రాధాన్యత ఇస్తారని తెలిపింది. కేవలం 30 ఏళ్ల వయసులేనే ఎంతోమంది పిల్లలకు తల్లిగా నటించే పాత్రలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన డయానా మహిళా నటుల పట్ల చిత్ర పరిశ్రమ వైఖరిని ప్రశ్నించింది.డయానా మాట్లాడుతూ.. 'ఉదాహరణకు ఒక వేదికపై మిమ్మల్ని పరిచయం చేసినప్పుడు.. మీ అందం మీరు అద్భుతం ప్రశంసిస్తారు. ప్రజలు మర్యాదగా ప్రవర్తిస్తూ మీ రూపాన్ని ప్రశంసించడం చాలా బాగుంది. కానీ ఒక మహిళగా అది అంతకు మించి ఉంటుందని ఆశిస్తారు. ఒక నటిగా కేవలం అందం మాత్రమే కాకుండా.. నైపుణ్యం, నటనతో ప్రసిద్ధి చెందగలమని ఆశిస్తాం. అది మాకు చాలా అవసరం కూడా. మహిళ నటులను కేవలం బ్యూటీఫుల్, అద్భుతం అని పిలవడం మంచిదే.. కానీ అది సరిపోదు. ఇది ఒక పోరాటం కాదు. కొంతకాలంగా ఒక ఈ పద్ధతిని అంగీకరించడం ప్రారంభించారు. నేను అలాంటి దానిలో భాగం కావాలా వద్దా అనేది నా సొంత నిర్ణయం. దీన్ని ఎదుర్కోవడానికి అదే ఉత్తమ మార్గం. ఇది నాకు మాత్రమే కాదు.. అందరికీ వర్తిస్తుంది' అని పంచుకున్నారు.కాగా.. డయానా ప్రస్తుతం 'డు యు వాన్నా పార్టనర్' అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సిరీస్లో తమన్నా భాటియా, జావేద్ జాఫెరి, నకుల్ మెహతా, శ్వేతా తివారీ, నీరజ్ కబీ కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్కు కోలిన్ డి'కున్హా, అర్చిత్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ను కరణ్ జోహార్, అదార్ పూనవల్లా, అపూర్వ మెహతా సహ నిర్మాతలుగా ఉన్నారు. ప్రస్తుతం డు యు వన్నా పార్టనర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. -
'పవన్ కల్యాణ్ అభిమాని చీప్ కామెంట్స్'.. గట్టిగా ఇచ్చిపడేసిన రేణు దేశాయ్!
టాలీవుడ్ నటి రేణు దేశాయ్ ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. ఆమె చివరిసారిగా మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో కనిపించింది. అయితే సినిమాల్లో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటోంది. సమాజంలో జరుగుతున్న విషయాలపై కూడా రియాక్ట్ అవుతూ ఉంటోంది. ముఖ్యంగా వన్యప్రాణుల విషయంలో పోరాటం చేస్తోంది. అలాగే మూగజీవాలను ఎవరైనా హింసించినా వెంటనే సోషల్ మీడియా రియాక్ట్ అవుతుంది రేణు దేశాయ్.ఇదిలా ఉంచితే తాజాగా ఆమె చేసిన పోస్ట్ తెగ వైరల్గా మారింది. పవన్ కల్యాణ్ అభిమాని కామెంట్ చూసిన రేణు దేశాయ్.. తనదైన స్టైల్లో ఇచ్చిపడేసింది. మీ పక్కన పవన్ కల్యాణ్ కాకుండా మరొకరిని ఊహించుకోలేమని అభిమాని ఇన్స్టాలో కామెంట్ చేశాడు. ఇది చూసిన రేణు దేశాయ్ సుదీర్ఘమైన పోస్ట్తో దిమ్మదిరిగేలా రిప్లై ఇచ్చింది. రేణు దేశాయ్ తన ఇన్స్టాలో రాస్తూ..'ఈ అబ్బాయి/అమ్మాయి కొంతవరకు చదువుకున్న వారిలా ఉన్నారు. అందుకే స్మార్ట్ఫోన్లో సొంత ఇమెయిల్ ఐడీ క్రియేట్ చేసుకుని.. తన పోస్ట్పై కామెంట్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించినట్లున్నాడు. మనమందరం ఇప్పుడు 2025లో ఉన్నాం. కానీ పితృస్వామ్యం ఎంతగా పాతుకుపోయిందంటే.. నేటికీ చాలా మంది ప్రజలు ఆమెకు స్వంత స్వేచ్ఛా సంకల్పం లేకుండా స్త్రీ కేవలం తండ్రి లేదా భర్త ఆస్తి అని నమ్ముతారు. . నేటికీ మహిళలకు చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి అనుమతి అవసరం. ఈ రోజుల్లో చాలా మంది పురుషులు స్త్రీ స్థానం వంట చేయడం, పిల్లలకు జన్మనివ్వడం వంటగదికే పరిమితమని భావిస్తారని' కౌంటరిచ్చింది.రేణు దేశాయ్ ఇంకా రాస్తూ.. 'నేను ఇలాంటి మనస్తత్వానికి వ్యతిరేకంగా.. నా స్వరం వినిపించడానికి.. నా స్నేహితులు, అనుచరులు నా గురించి ఏమనుకుంటారో అని భయపడకుండా ఉండటానికి ఇష్టపడతాను. భవిష్యత్ తరాల మహిళల కోసం మార్పులకు మార్గం సుగమం చేయడానికి ఒక స్త్రీగా, ఒక ఆడపిల్ల తల్లిగా నా వంతు కృషి చేస్తున్నా. స్త్రీవాదం అంటే వారాంతాల్లో తాగి తిరగడం కాదు.. మహిళలను పశువులు, ఫర్నిచర్లా చూసే ప్రాథమిక మనస్తత్వం ఉన్న మూలాలను ప్రశ్నించడం! రాబోయే కొద్ది తరాల్లోనే స్త్రీలు విశ్వంలో తమదైన ఉన్నత స్థానాన్ని కనుగొంటారని.. తల్లి గర్భంలో స్త్రీగా పుట్టినందుకు, పరువు హత్యలు, వరకట్న మరణాల కోసం చంపబడరని ఆశిస్తున్నా' అని తనపై కామెంట్ చేసిన పవన్ కల్యాణ్ అభిమానికి ఘాటుగానే ఇచ్చిపడేసింది.కాగా.. రేణు దేశాయ్, పవన్ కల్యాణ్ బద్రి, జానీ చిత్రాల్లో జంటగా నటించారు. 2009లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఈ జంటకు అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే ఇద్దరి మధ్య రిలేషన్లో మనస్పర్థలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు.. ఆత్మకథ ఆవిష్కరణలో బ్రహ్మనందం
టాలీవుడ్ హాస్యబ్రహ్మ బ్రహ్మనందం ఆత్మకథ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఈ బయోగ్రఫీని బుక్ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు. మీ అండ్ మై పేరుతో ఈ పుస్తకాన్ని రాశారు. ఈ బుక్ను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మనందం పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ పుస్తకం రాసేందుకు ఎందరో నాకు స్పూర్తినిచ్చారని అన్నారు. నేను పేద కుటుంబం నుంచి వచ్చానని.. లెక్చరర్గా పనిచేశాకే.. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చానని తెలిపారు. నటరాజ ఆశీర్వాదంతో 1200 సినిమాల్లో నటించానని వెల్లడించారు.బ్రహ్మనందం మాట్లాడుతూ..' నేనెందుకు ఆత్మకథ రాశాను అనేది పెద్ద ప్రశ్న. నాకు ఎటువంటి పొలిటికల్, ఫైనాన్షియల్ బ్యాక్ గ్రౌండ్ లేదు. నా జీవితం గురించి మాత్రమే పుస్తకంలో రాశా. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు. బురద నుంచి కమలం పుడుతుంది. కష్టపడి పనిచేస్తే విజయం వరిస్తుంది. నాకు వెంకయ్య నాయుడు ఎంతో స్పూర్తి. ఈ మధ్య గ్లోబల్ కమెడియన్ అవార్డ్ ఇచ్చారు. మీమ్స్ బాయ్గా కూడా మార్చారని' అన్నారు.మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..' యువకుడిగా ఉన్నపుడు రాజకీయాల్లోకి వచ్చా. నాకు మీడియాతో ప్రత్యేక అనుబంధం ఉంది. బ్రహ్మానందం జీవిత చరిత్ర పుస్తకం హిందీ, ఇంగ్లీష్లో విడుదలైంది. భారత దేశ చలనచిత్రలో ప్రత్యేకతను సంపాదించుకున్న నటుడు బ్రహ్మానందం. స్క్రీన్పై ఆయన కనిపిస్తే అందరూ ఆనంద పడేస్తారు. ఎప్పటికీ అందరికీ బ్రహ్మానందం ఫేవరేట్. ఆయన సినిమాలు చూస్తే జనం ఎంజాయ్ చేస్తారు. ఇండియన్ స్క్రీన్ ప్రతిఒక్కరూ మాతృ భాషను నేర్చుకోవాలి, ఆదరించాలి, దాంతో పాటూ ఇతర భాషలు నేర్చుకోవాలి. దేశంలో ఎక్కువ మందికి చేరువ కావాలంటే హిందీ భాష అవసరం. ప్రపంచవ్యాప్తంగా చేరువ కావాలంటే ఇంగ్లీష్ అవసరం. భారత అభివృద్ధిని చూసి కొన్ని దేశాలు తట్టుకోలేక పోతున్నాయి. ప్రపంచంలో రెండో ఆర్థిక దేశంగా 2035 నాటికి ఇండియా ఎదగటం ఖాయం' అని అన్నారు. Pleased to launch the autobiography of renowned film comedian & Padmashri awardee, Shri Brahmanandam Me and मैं in English & Hindi at the Foreign Correspondents Club of South Asia in New Delhi this evening. Shri Brahmanandam’s long career in movies spanning more than 3 decades… pic.twitter.com/xrf1y7mqpn— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) September 12, 2025 -
పొంగల్కు పెరుగుతోన్న పోటీ.. రేసులో శ్రీలీల చిత్రం!
టాలీవుడ్ సంక్రాంతి సినిమాలకు ఉండే క్రేజే వేరు. అంతేకాదు ఈ పండుగకు రిలీజ్కు పెద్దఎత్తున పోటీ ఉంటుంది. దాదాపు ఏడాది ముందు నుంచే ప్లాన్ చేస్తారు మేకర్స్. సినీ ఇండస్ట్రీలో అంతలా డిమాండ్ ఉన్న ఫెస్టివల్ ఇదొక్కటే. ఇప్పటికే టాలీవుడ్ నుంచి నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు, మెగాస్టార్ చిరంజీవి మనశివశంకర వరప్రసాద్ గారు చిత్రాలు పోటీలో నిలిచాయి. వీటితో పాటు ప్రభాస్ ది రాజాసాబ్, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమాలు సైతం పొంగల్ పోటీకి సై అంటున్నాయి. వీటితో పాటు కోలీవుడ్ నుంచి విజయ్ మూవీ జన నాయగన్ సైతం వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 9న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.ఇంతలా పోటీ ఉన్న పొంగల్కు మరో చిత్రం రిలీజ్ కానుంది. ఇటీవలే మదరాసితో ఆకట్టుకున్న శివ కార్తికేయన్ మూవీ పరాశక్తి సైతం సంక్రాంతి పోటీకి సై అంటోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ మేకర్స్ రివీల్ చేశారు. వచ్చే ఏడాది పొంగల్ కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ రెడ్ జైయింట్ మూవీస్ ఓ వీడియోను పోస్ట్ చేసింది. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ చిత్రాలకు సైతం పోటీ తప్పేలా కనిపించడం లేదు. ఇంకా సమయం ఉండడంతో మరిన్ని సినిమాలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది.కాగా.. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘పరాశక్తి’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రవి మోహన్, అథర్వ, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో శివ కార్తికేయన్ విద్యార్థి సంఘం నాయకుడుగా కనిపించనున్నారని తెలుస్తోంది. பராசக்(தீ) பரவட்டும்🔥🔥 A stunning ride through history awaits#Parasakthi in Theatres from 14th January 2026@siva_kartikeyan @Sudha_Kongara @iam_ravimohan @Atharvaamurali @gvprakash @redgiantmovies_ @Aakashbaskaran @sreeleela14 @dop007 @editorsuriya @supremesundar… pic.twitter.com/SdgUEdwQCK— Red Giant Movies (@RedGiantMovies_) September 12, 2025 -
దృశ్యం-3 మూవీ.. ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు: డైరెక్టర్
మలయాళంలో తెరకెక్కించిన దృశ్యం.. అన్ని భాషల్లోనూ సత్తా చాటింది. మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్గా వచ్చిన దృశ్యం-2 సైతం అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో దృశ్యం-3 కూడా తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ మూవీని ప్రకటించిన దర్శకుడు జీతూ జోసెఫ్ స్క్రిప్ట్ పూర్తయిందని తెలిపారు.అయితే దృశ్యం-3 మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ నెలలోనే చిత్రీకరణ ప్రారంభం కానుందని జీతూ జోసెఫ్ తెలిపారు. అయితే ఆడియన్స్కు మాత్రం గట్టి ఝలక్ ఇచ్చారు. ఈ మూవీపై మొదటి రెండు పార్ట్స్లా ఎక్కువగా అంచనాలు పెట్టుకోవద్దని సూచించారు. ఈ సినిమా నుంచి ఎక్కువగా ఆశించవద్దని కోరారు.జీతూ జోసెఫ్ మాట్లాడూతూ.. 'రెండవ భాగం దృశ్యం-2లా ఈ సినిమాను ఆశించవద్దు. అలా ఎక్కువగా ఆశలు పెట్టుకుంటే నిరాశ చెందుతారు. ఇప్పుడు రాబోయే భాగం 'దృశ్యం' చిత్రాల మైండ్ గేమ్కు భిన్నంగా ఉండనుంది. దృశ్యం 3 కథాంశాలపై తక్కువ దృష్టి సారించి.. కథలోని మెయిన్ పాత్రపై ఎక్కువ దృష్టి పెట్టాం. దృశ్యం 1, 2 సినిమాలతో నేను సంతోషంగా ఉన్నా. 'దృశ్యం 3' కూడా మంచి సినిమా అవుతుంది. బాక్సాఫీస్ గురించి నాకు తెలియదు'అని వివరించారు. ఈ మూవీతో పాటు జీతూ జోసెఫ్ మరో రెండు ప్రాజెక్టులను తెరెకెక్కిస్తున్నారు. ఆయన డైరెక్షన్లో వస్తోన్న మిరాజ్ ఈనెల 19న విడుదల కానుంది. అంతేకాకుండా జోజు జార్జ్తో 'వలతు వశతే కల్లన్' ప్రాజెక్ట్ను రూపొందిస్తున్నారు.కాగా.. ఈ చిత్రాన్ని మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత సీక్వెల్గా వచ్చిన దృశ్యం-2 కూడా సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వెంకటేశ్ నటించగా.. భారీ హిట్ను సొంతం చేసుకుంది. హిందీలో అజయ్ దేవ్గణ్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో కమల్ హాసన్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించారు. -
'పరదా' పవర్ఫుల్ వీడియో సాంగ్ చూశారా?
అనుపమ పరమేశ్వరన్ చాలారోజులు తర్వాత తెలుగులో చేసిన సినిమా 'పరదా'. ఆగస్టు 22న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమక్ష ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అయితే, ఈ మూవీలో ప్రేక్షకులను మెప్పించిన ఒక వీడియో సాంగ్ను యూట్యూబ్లో విడుదల చేశారు. 'యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః' అంటూ సాగే ఈ పాట ఆందరినీ ఆలోచింపజేస్తుంది. వనమాలి రిచించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా, సంగీత, దర్శనా రాజేంద్రన్ కీలక పాత్రల్లో నటించారు. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మించారు. -
'మిరాయ్' స్టార్స్ తీసుకున్న రెమ్యునరేషన్.. చాలా తక్కువే
తేజ సజ్జా (Teja Sajja), మంచు మనోజ్ (Manchu Manoj) కాంబినేషన్లో తాజాగా విడుదలైన చిత్రం మిరాయ్... కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రియ కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా మిరాయ్లో ఈ మూడు పాత్రలే చాలా కీలకంగా ఉంటాయి. ఆ తర్వాత హీరోయిన్ రితికా నాయర్ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. సినిమా బాగుందని ఇప్పటికే సోషల్మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇందులోని విజువల్స్ ప్రతి ఒక్కరినీ అలరిస్తున్నాయి. అయితే, మిరాయ్ కోసం తేజ సజ్జా తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది..? అనే చర్చ జరుగుతుంది.సినిమా హిట్ అయితే.. రెమ్యునరేషన్పై తేజమిరాయ్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ కోసం రూ. 60 కోట్ల మేరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ మూవీ ఔట్ పుట్ చూస్తే మాత్రం సుమారు. 200 కోట్లకు పైగానే ఖర్చు చేసి ఉంటారనిపించేలా ఉంటుంది. అందరూ మిరాయ్ కోసం తేజ సజ్జా భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారని భావించినా, వాస్తవం కొంచెం భిన్నంగా ఉన్నట్లు సమాచారం. తేజా స్వయంగా చెప్పిన ప్రకారం, హనుమాన్ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్నే మిరాయ్కు కూడా తీసుకున్నానని ఒక వేదికపై చెప్పారు. అయితే, ప్రొడ్యూసర్ మీద తనకున్న నమ్మకం వల్ల, సినిమా హిట్ అయితే మంచి అమౌంట్ ఇస్తారని ఆశిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. అది కేవలం నిర్మాత ఇష్ట ప్రకారంగా తీసుకునే నిర్ణయం మాత్రమేనని అన్నారు. హనుమాన్ హిట్ అయిన తర్వాత కూడా తాను ఎక్స్ట్రా రెమ్యునరేషన్ అడగలేదన్నారు. ఆ సినిమా నిర్మాతల నుంచి కూడా తనకు రెమ్యునరేషన్ మించి ఒక్క రూపాయి కూడా అదనంగా అందలేదని సమాచారం. మనోజ్కే ఎక్కువ రెమ్యునరేషన్హనుమాన్ కోసం తేజ సజ్జా రూ. 2 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ ఉంది. గతంలో తేజ చెప్పిన ప్రకారం మిరాయ్ సినిమాకు కూడా రూ. 2 కోట్లు మాత్రమే తీసుకున్నట్లు అర్థం అవుతుంది. అయితే, ఇకనుంచి ఆయన నటించనున్న కొత్త సినిమాలకు సుమారు రూ. 15 కోట్ల మేరకు రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు టాక్.. హనుమాన్ సినిమా కంటే ముందే మిరాయ్తో తేజ సజ్జా ఒప్పందం చేసుకున్నారు. కానీ, తనకు కథ నచ్చితే రెమ్యునరేషన్ పెంచబోనని కూడా తేజ చెప్పడం విశేషం. మంచు మనోజ్ కూడా మిరాయ్ సినిమా కోసం సుమారు రూ. 3 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రియ మాత్రం రూ. 2 కోట్ల వరకు అందుకున్నారని టాక్.. అయితే, ఇందులో హీరోయిన్గా అద్భుతంగా మెప్పించిన రితిక నాయక్ మాత్రం రూ. 50 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని ప్రచారం ఉంది. -
బాహుబలి తర్వాత ఈ సినిమానే: రాం గోపాల్ వర్మ ట్వీట్
తేజ సజ్జా హీరోగా వచ్చిన లేటేస్ట్ పాన్ ఇండియా చిత్రం మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇవాళే థియేటర్లలో విడుదలైంది. మంచు మనోజ్ విలన్ పాత్రలో కనిపించిన ఈ చిత్రంపై రిలీజ్కు ముందే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఫ్యాన్స్ ఊహించినట్లుగానే మొదటి షో నుంచే మిరాయ్కు పాజిటివ్ టాక్ వస్తోంది. తేజ సజ్జా ఖాతాలో హనుమాన్ లాంటి సూపర్ హిట్ ఖాయమని అంటున్నారు.ఈ నేపథ్యంలో టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. మిరాయ్ లాంటి బిగ్ హిట్ అందించిన తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని, టీజీ విశ్వప్రసాద్కు కంగ్రాట్స్ తెలిపారు. బాహుబలి తర్వాత ఏ సినిమాకు ఇంత ఏకపక్షంగా ప్రశంసలు రాలేదని పోస్ట్ చేశారు. వీఎఫ్ఎక్స్తో పాటు కథనం కూడా.. రెండు హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయని ఆర్జీవీ కొనియాడారు. ఇది చూసిన టాలీవుడ్ సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. A BIG SHOUT OUT to @tejasajja123 @Karthik_gatta and @vishwaprasadtg for delivering a iNDUSTRY HIT ..Not since BAHUBALI did I hear such UNANIMOUS PRAISE for any other film #Mirai .. Both the VFX and the Narrative GRIP are of HOLLYWOOD STANDARD 👍🙏💪🔥💐— Ram Gopal Varma (@RGVzoomin) September 12, 2025 -
విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్.. స్పందించిన రష్మిక!
టాలీవుడ్లో కొన్నేళ్లుగా ఈ జంటపై రూమర్స్ ఏదో ఒక సందర్భంలో వినిపిస్తూనే ఉన్నాయి. వీళ్లిద్దరు ఎక్కడా కనిపించినా సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ జంట డేటింగ్లో ఉన్నారంటూ ఇప్పటికే పలుసార్లు కథనాలొచ్చాయి. ఇంతకీ ఆ జంట ఎవరని అనుకుంటున్నారా? టాలీవుడ్ ఇండస్ట్రీలో రొమాంటిక్ లవ్ బర్డ్స్గా పేరున్న రష్మిక, విజయ్ దేవరకొండ. ఇప్పటి వరకు ఈ జంటపై డేటింగ్ రూమర్స్ మాత్రమే వచ్చాయి. వీటిపై ఇద్దరిలో ఏ ఒక్కరూ కూడా స్పందించలేదు.అయితే ఈ సారి ఏకంగా వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయిందని కథనాలొచ్చాయి. ఇటీవల సైమా అవార్డుల వేడుకలకు హాజరైన రష్మిక చేతికి ఉంగరం కనిపించడంతో రూమర్స్ మొదలయ్యాయి. దీంతో హీరోయిన్ రష్మిక తన చేతి వేలి ఉంగరంపై క్లారిటీ ఇచ్చింది. అది కేవలం నా సెంటిమెంట్ ఉంగరమని.. తాను నిశ్చితార్థం చేసుకుంటే అందరికీ చెప్తానని తెలిపింది. కాగా.. ఈ ఏడాది ఛావా, కుబేర సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన రష్మిక మందన్నా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. -
విరాట్- అనుష్క.. మమ్మల్ని కూడా బయటకు పొమ్మన్నారు!
భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)కి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన ఆట తీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ రన్మెషీన్.. వర్ధమాన క్రికెటర్లకు ఆదర్శప్రాయం. ఎంతో మంది యువ ఆటగాళ్లకు అతడొక రోల్మోడల్.కోహ్లిని నేరుగా కలిసి బ్యాటింగ్ మెళకువలు నేర్చుకోవాలని తహతహలాడే వారెందరో!.. తాము కూడా ఆ కోవకే చెందుతామని చెబుతోంది భారత మహిళా జట్టు స్టార్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues). అయితే, తాను, స్మృతి మంధాన (Smriti Mandhana) చేసిన పని వల్ల విరాట్ కోహ్లి, అతడి భార్య అనుష్క శర్మ కాస్త అసౌకర్యానికి గురికావాల్సి వచ్చిందని తాజాగా వెల్లడించింది.ఒకే హోటల్లో బస.. అనుష్క కూడా అక్కడే‘‘అప్పుడు భారత పురుష, మహిళా క్రికెట్ జట్లు న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నాయి. ఇరుజట్లకు ఒకే హోటల్లో బస ఏర్పాటు చేశారు. అప్పుడు స్మృతి, నేను కలిసి విరాట్ను కలవాలి అనుకున్నాం.మీతో మాట్లాడాలనుకుంటున్నాము అనగానే.. ‘ఓహ్.. ప్లీజ్.. మేము ఇక్కడే కేఫ్లో ఉన్నాము వచ్చేయండి’ అని కోహ్లి చెప్పాడు. అప్పుడు అనుష్క శర్మ కూడా అక్కడే ఉంది.మొదటి అర్ధగంట సేపు క్రికెట్ గురించి మాట్లాడాము. ఈ క్రమంలో .. నేను, స్మృతి భారత మహిళా క్రికెట్లో కీలక ప్లేయర్లుగా ఉండిపోతామని కోహ్లి అన్నాడు. మేమిద్దరం గొప్ప పేరు తెచ్చుకుంటామని అన్నాడు.ఇక చాలు.. బయటకు వెళ్లండిఆ తర్వాత బ్యాటింగ్ గురించి మాకు కొన్ని టిప్స్ ఇచ్చాడు. మా మాటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత వ్యక్తిగత జీవితాల గురించి కూడా మాట్లాడుకున్నాము. ఏదో.. పాత స్నేహితులు చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్నట్లుగా మా సంభాషణలు కొనసాగాయి.అప్పటికి నాలుగు గంటలు గడిచిపోయింది. అప్పుడు కేఫ్ నిర్వాహకులు వచ్చి.. ‘సమయం దాటిపోయింది.. ఇక వెళ్లండి’ అని చెప్పేంత వరకు అక్కడే కూర్చున్నాము. సుమారుగా రాత్రి 11.30 గంటల ప్రాంతంలో మేము అక్కడి నుంచి వెళ్లిపోయాము’’ అని జెమీమా రోడ్రిగ్స్ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది.లండన్లోనే నివాసంకాగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించిన విరాట్ కోహ్లి.. 2017లో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. లండన్లో అకాయ్కు జన్మనిచ్చిన తర్వాత అనుష్క కోహ్లితో కలిసి అక్కడే ఎక్కువగా ఉంటోంది. మ్యాచ్లు ఉన్నపుడు మాత్రమే కోహ్లి భారత్కు వస్తున్నాడు. ఇక పెళ్లికి ముందు నుంచే కోహ్లితో పాటు అనుష్క కూడా టీమిండియా వెళ్లే పర్యటనల్లో భాగమయ్యేదన్న విషయం తెలిసిందే.చదవండి: 21 సార్లు డకౌట్ అయినా సరే.. జట్టులోనే.. అతడికి గంభీర్ చెప్పిందిదే.. -
సొంత ఇళ్లు వాళ్లకు ఇచ్చేసి అద్దె ఇంట్లోకి రాఘవ లారెన్స్
రాఘవ లారెన్స్ తన సినీ జీవితం కంటే ఎక్కువగా సేవా కార్యక్రమాలకు సమయం కేటాయించడం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఆయన ట్రస్ట్ ద్వారా వేలాది మంది జీవితాల్లో వెలుగు నింపారు. ఈ ట్రస్ట్ ప్రధానంగా సామాజిక సేవా కార్యక్రమాలు, ఆరోగ్య సహాయం, విద్యా సహాయం వంటి రంగాల్లో సేవలు అందిస్తోంది. అనాథ పిల్లలకు ఆశ్రయ, ఆహారం, విద్య, సంరక్షణ వంటి విషయంలో ఆయన అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే తన సొంత ఇంటిని కూడా సేవా కార్యక్రమం కోసం ఉపయోగిస్తున్నట్లు ప్రకటించారు.తాజాగా రాఘవ లారెన్స్ సోషల్మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు. 'మీ అందరితో కొన్ని సంతోషకరమైన విషయాలను పంచుకోవాలనుకుంటున్నాను. నా సినిమా కాంచన- 4 అధికారికంగా ప్రారంభమైంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమా పనులు వేగంగా జరుగుతున్నాయి. మీలో చాలా మందికి తెలిసినట్లుగా.., నా సినిమాలకు అడ్వాన్స్ తీసుకున్న ప్రతిసారీ నేను ఒక కొత్త సామాజిక కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని తెలిసిందే. ఈ క్రమంలోనే నా మొదటి ఇంటిని పిల్లల కోసం ఉచిత విద్య పాఠశాలగా మారుస్తున్నాను. ఈ విషయం ప్రకటించడానికి నేను నిజంగా సంతోషస్తున్నాను.ఈ ఇల్లు నాకు చాలా ప్రత్యేకమైనది. నేను డ్యాన్స్ మాస్టర్గా సంపాదించిన డబ్బుతో కొన్న మొదటి ఇల్లు ఇది. తరువాత, నేను దానిని అనాథాశ్రమ పిల్లల కోసం గృహంగా మార్చాను. ఆ సమయంలో కుటుంబంతో నేను అద్దె ఇంటిలోకి మారాను. ప్రస్తుతం నా పిల్లలు పెద్దవారై ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ఇంటిని మరోసారి ఒక లక్ష్యానికి అంకితం చేయడం నాకు గర్వంగా ఉంది. నేను ప్రారంభిస్తున్న ఉచిత పాఠశాలలో మొదటి ఉపాధ్యాయులు కూడా నా ఇంట్లో పెరిగిన బిడ్డే కావడం విశేషం. నేను చేరదీసిన బిడ్డ ఇప్పుడు చదువుకుని తిరిగి ఇవ్వడానికి వచ్చింది. ఈ విషయం నాకు మరింత సంతోషంగా, గర్వంగా ఉంది. మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ నా మీద ఉంటాయని ఆశిస్తున్నాను.' అని ఆయన అన్నారు.Kanchana 4 is rolling and halfway through — I’m Happy to Announce That I’m Transforming My First Home into a Free School for Children with my Kanchana 4 Advance - with the First Teacher Being a Child Who Grew Up in my home 🙏 I’m so delighted to share some exciting news with… pic.twitter.com/qvcCYQruGE— Raghava Lawrence (@offl_Lawrence) September 11, 2025 -
నాభర్తకు డిగ్రీలేదు, నేనే పోషిస్తున్నా.. నా తల్లి బంగారం కూడా తాకట్టు పెట్టా!
కన్నడ దర్శకనటుడు ఎస్ నారాయణ్ (S Narayan)పై వరకట్నం వేధింపుల కేసు నమోదైంది. నారాయణ్ కుటుంబం వరకట్నం కోసం వేధిస్తోందంటూ ఆయన కోడలు పవిత్ర బెంగళూరు పోలీసులను ఆశ్రయించింది. తనకేదైనా జరిగితే భర్త, అత్తమామలదే పూర్తి బాధ్యత అని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణకు రమ్మని నారాయణ్, అతడి భార్య భాగ్యవతి, కుమారుడు పవన్కు నోటీసులు పంపారు.ఫిర్యాదులో ఏముందంటే?'నా భర్త పవన్ డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. అతడికి ఎటువంటి ఉద్యోగం లేదు. దీంతో నేనే కుటుంబాన్ని చూసుకుంటున్నాను. ఓసారి అతడు కారు కొనాలంటూ నా దగ్గర రూ.1 లక్ష, నా తల్లి దగ్గరి నుంచి రూ.75 వేలు తీసుకున్నాడు. నా భర్త కుటుంబం కళా సామ్రాట్ ఫిలిం అకాడమీ స్థాపించినప్పుడు నేను నా తల్లి బంగారం కూడా తాకట్టు పెట్టి వారికి ఆర్థిక సాయం చేశాను. కానీ, ఆ అకాడమీ ఎంతోకాలం నడపలేదు, కొంతకాలానికి మూసివేశారు. నేను సంపాదించి పోషించా..తర్వాత మళ్లీ నన్ను డబ్బు అడగడం ప్రారంభించారు. రూ.10 లక్షలు లోన్ తీసుకునిచ్చాను. కొన్నినెలలు సరిగానే చెల్లించి తర్వాత ఆపేశారు. నా పెళ్లి సమయంలో నాన్న పవన్కు రూ.1 లక్ష విలువైన బంగారు ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చాడు. మా పెళ్లి విషయంలో నారాయణ్ దంపతులు గొడవపడ్డారు. పెళ్లయిన కొన్ని నెలలకే ఇంట్లోంచి బయటకు వచ్చి ఓ అద్దెగదిలో ఉన్నాం. ఓ సంవత్సరం తర్వాత తిరిగి మళ్లీ అత్తింట్లో అడుగుపెట్టాం' అని పవిత్ర పేర్కొంది.సినిమాచైత్రద ప్రేమాంజలి (1992) కన్నడ సినిమాతో నారాయణ్ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. అనురాగద అలెగలు, మేఘ మాలె, తవరిన తొట్టిలు, బేవు బెల్ల, సూర్యవంశం, సింహాద్రియా సింహ, దక్ష, చంద్ర చకోరి, మనసు మల్లిగె.. ఇలా ఎన్నో సినిమాలు డైరెక్ట్ చేశాడు. తమిళంలో జై సినిమా తీశాడు. చైత్రద ప్రేమాంజలి, కురిగలు సార్ కురిగలు, హనీమూన్ ఎక్స్ప్రెస్, తిప్పరల్లి తర్లెగలు, ఓల్డ్ మాంక్ వంటి పలు చిత్రాల్లో నటించాడు.చదవండి: మద్యానికి, సిగరెట్కు గుడ్బై.. శాకాహారిగా మారిపోయిన రణ్బీర్! -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్
ఓటీటీలోకి మరో తెలుగు సినిమా ఎలాంటి ప్రకటన లేకుండా వచ్చేసింది. రొమాంటిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తీసిన ఈ చిత్రంలో బిగ్బాస్ 8 తెలుగు ఫేమ్ సోనియా ఆకుల కీలక పాత్రలో నటించింది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.సంతోష్ కల్వచెర్ల, క్రిషికా పటేల్ జంటగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ 'కిల్లర్ ఆర్టిస్ట్'. సోనియా ఆకుల కీలకపాత్రలో నటించింది. రతన్ రిషి దర్శకుడు. మార్చి 21న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. స్టార్స్ లేకపోవడం, మూవీ కూడా అంతంత మాత్రంగానే ఉండేసరికి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం సైలెంట్గా అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది. కాకపోతే అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వారం దీనితోపాటు పరదా, కూలీ, సయారా, సు ఫ్రమ్ సో లాంటి సినిమాలు కూడా ఓటీటీల్లోకి వచ్చాయి.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ 'పరదా' సినిమా)'కిల్లర్ ఆర్టిస్ట్' విషయానికొస్తే.. విక్కీ (సంతోష్), స్వాతి (స్నేహ మాధురి) అన్నాచెల్లెలు. ఇంట్లో ఉన్నప్పుడు గుర్తుతెలియని కొందరు వీరిపై దాడి చేస్తారు. స్వాతిని చంపేస్తారు. ఈ ఘటన విక్కీ జీవితాన్ని మార్చేస్తుంది. తన కళ్ల ముందే చెల్లెలు మరణించడం తట్టుకోలేడు. ఆమె గుర్తులు తనను వెంటాడుతూనే ఉంటాయి. జాను (క్రిషేక్ పటేల్) ఇతడి జీవితంలోకి వస్తుంది. మామూలు మనిషిగా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. మరోవైపు ఓ హీరోయిన్ మాస్క్ ధరించి 'పిచ్చి రవి' అనే సైకో నగరంలోని అమ్మాయిలను టార్గెట్ చేస్తూ చంపేస్తుంటాడు.ఈ కేసును పోలీసులు ఛేదించి అతన్ని అరెస్ట్ చేస్తారు. టీవీలో వార్తలు చూసిన విక్కీకి ఆ సైకో ధరించిన మాస్క్ తన ఇంట్లో కూడా కనిపిస్తుంది. దీంతో తన చెల్లిని చంపింది ఈ సైకోనే అయ్యుంటాడని విక్కీ అనుకుంటాడు. ఇంతలో పోలీసుల నుంచి ఆ సైకో తప్పించుకుంటాడు. విక్కీ ప్రియిరాలు జాను పుట్టినరోజు వేడుకలో అతడు ప్రత్యక్షమవుతాడు. అయితే తన చెల్లిని చంపింది ఈ సైకో కాదని విక్కీకి తెలుస్తుంది. అసలు స్వాతిని చంపింది ఎవరు? సిటీలోని హత్యలు చేస్తున్నది ఒకరా? లేదా ఇద్దరా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'కిష్కింధపురి' సినిమా రివ్యూ) -
తమన్నా లాంటి భార్య దొరికిందని అతడు ఆనందపడాలి
దాదాపు 20 ఏళ్లుగా సినిమాలు చేస్తున్న తమన్నా.. ఇప్పటికీ అదే ఊపు, జోష్ చూపిస్తూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. కొత్త చిత్రాలు, వెబ్ సిరీసులు అంతే ఉత్సాహంతో ప్రమోషన్లలో పాల్గొంటూ ఆకట్టుకుంటోంది. నటన పరంగా ఈమె దూసుకుపోతున్నప్పటికీ.. ప్రేమ పరంగా ఈమె జీవితంలో ఓ బ్రేకప్ ఉంది. హిందీ నటుడు విజయ్ వర్మతో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన ఈమె.. కొన్నాళ్ల క్రితం బ్రేకప్ చెప్పేసుకుంది. ప్రస్తుతానికైతే సింగిల్గానే ఉంటోంది.అయితే త్వరలోనే తనకు కాబోయే అదృష్టవంతుడిని చూస్తారని తమన్నా ఇప్పుడు చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే విజయ్ వర్మతో బ్రేకప్ అయి ఎన్నాళ్లు కాలేదు ఇప్పుడు తమన్నా ఈ తరహా కామెంట్స్ చేయడం కొత్త సందేహాలు రేకెత్తిస్తోంది. ఈమె నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'డూ యూ వాన్నా పార్ట్నర్' ఈరోజు(సెప్టెంబరు 12) నుంచే స్ట్రీమింగ్ కానుంది. దీని ప్రమోషన్లలోనే మాట్లాడుతూ తన కాబోయే భాగస్వామి గురించి చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ‘మిరాయ్’ మూవీ రివ్యూ)'మంచి జీవిత భాగస్వామిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం నా ఆలోచన అదే. గత జన్మలో ఎంత పుణ్యం చేసుంటే నాకు తమన్నా లాంటి భార్య దొరికిందని నా భర్త ఆనందపడాలి. దానికోసమే నా ప్రయత్నం. అయితే ఆ లక్కీ పర్సన్ ఎవరనేది నాకు తెలియదు. త్వరలోనే మీరు అతడిని చూస్తారేమో?' అని తమన్నా చెప్పింది. ఈమె మాట్లాడిన దానిబట్టి చూస్తుంటే మళ్లీ ప్రేమలో పడిందా అనే డౌట్ వస్తోంది. ఒకవేళ రిలేషన్లో ఉంటే అతడెవరా అనేది తెలియాల్సి ఉంది.2005 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తున్న తమన్నా ఇప్పటివరకు దాదాపు 90 సినిమాలు చేసింది. అలానే పలు వెబ్ సిరీసులు కూడా చేసింది. వయసు పెరుగుతున్నా సరే అదే అందాన్ని మెంటైన్ చేస్తూ అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తూ యూత్ని అలరిస్తోంది. మరి పెళ్లెప్పుడు చేసుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఏడాదిన్నర గ్యాప్.. హీరోయిన్ చేతిలో ఇప్పుడు 8 సినిమాలు) -
మద్యానికి, సిగరెట్కు గుడ్బై.. శాకాహారిగా మారిపోయిన రణ్బీర్!
ఉన్నది ఒక్కటే జిందగీ.. నాకు నచ్చినట్లు బతికేస్తా అని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కుదరదు. ఆరోగ్యాన్ని లెక్క చేయకపోతే వెంటనే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వయసుపైబడే కొద్దీ మరింత జాగ్రత్తగా ఉండాలి. సెలబ్రిటీలైతే నోరు చంపుకుని, వ్యసనాలు వదిలించుకుని ఫిట్నెస్పై మరింత ఫోకస్ పెంచాల్సి ఉంటుంది. అందులోనూ ఆధ్యాత్మిక సినిమాలు చేస్తున్నప్పుడు కొందరు చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా నిష్టగా ఉంటారు. బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) కూడా అదే చేశాడు.శాఖాహారిగా మారిపోయాప్రస్తుతం ఇతడు దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణలో శ్రీరాముడిగా నటిస్తున్నాడు. సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా కనిపించనున్నారు. రామాయణ (Ramayana Movie) ప్రారంభానికి ముందు రణ్బీర్ తన లైఫ్స్టైల్లో చాలా మార్పులుచేర్పులు చేసుకున్నాడు. సిగరెట్ తాగడం మానేశాడు, మద్యపానానికి గుడ్బై చెప్పాడు. పూర్తిగా శాకాహారిగా మారినట్లు తెలిపాడు. యోగా, ధ్యానం కూడా చేస్తున్నానని పేర్కొన్నాడు. రామాయణ మూవీ ప్రారంభానికల్లా చెడు అలవాట్లు శాశ్వతంగా మానేస్తానని తెలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. రణ్బీర్ తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.సినిమారామాయణ సినిమాను నితీశ్ తివారి డైరెక్ట్ చేస్తున్నాడు. దాదాపు రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్తో రామాయణ రెండు భాగాలుగా తెరకెక్కించనున్నామని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించారు. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం అందించనున్నారు. ఈ మూవీలో లక్ష్మణుడిగా రవిదూబే, హనుమంతుడిగా సన్నీడియోల్ నటిస్తున్నారు. రామాయణ పార్ట్ 1.. 2026 దీపావళికి, రామాయణ పార్ట్ 2.. 2027 దీపావళికి రిలీజ్ కానున్నాయి. రామాయణ్తో పాటు రణ్బీర్ మరో సినిమా చేస్తున్నాడు. భార్య, హీరోయిన్ ఆలియా భట్తో కలిసి లవ్ అండ్ వార్ మూవీ చేస్తున్నాడు. సంజయ్లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2026 మార్చి 20న విడుదల కానుంది. 🚨 Ranbir Kapoor has given up smoking, drinking, and has even turned vegetarian — all in preparation for his role as Lord Ram in #Ramayana. A true embodiment of discipline and devotion. ✨🔥 pic.twitter.com/W5F3akrREK— Ramayana: The Epic (@RamayanaMovieHQ) September 7, 2025 చదవండి: నా కడుపులో తన్నాడు, ముఖంపై పిడిగుద్దులు..: బుల్లితెర నటి -
విరామం ఇస్తున్నాను.. అనుష్క ట్వీట్ వైరల్
హీరోయిన్ ప్రాధాన్య చిత్రాల విషయంలో అనుష్క శెట్టి (Anushka Shetty) ట్రెండ్ సెట్ చేశారు. అరుంధతి, భాగమతి వంటి చిత్రాలతో టాలీవుడ్లో హీరోయిన్ ఓరియెంటేడ్ కథలకు ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలోనే ఆమె మరోసారి ఘాటీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, సినిమా అనుకున్నంత రేంజ్లో మెప్పించలేదు. క్రిష్ (Krish Jagarlamudi) దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా స్టోరీ ప్రేక్షకులను థియేటర్కు రప్పించలేకపోయింది. అయితే, తాజాగా ఆమె ఒక నోట్ రాసి ట్వీట్ చేశారు.కొవ్వొత్తి వెలుగులో నీలిరంగు కాంతి దూరంగా కనిపించినట్లు.. సోషల్ మీడియా నుంచి కొంచెం దూరంగా ఉండబోతున్నాను. సరైన జీవితాన్ని గుర్తుచేసుకోవడానికి, ప్రపంచంతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నాను. త్వరలోనే మరిన్న కథలతో ప్రేమతో మీ ముందుకొస్తాను. ఎప్పటికీ అందరూ చిరునవ్వుతోనే ఉండండి. ప్రేమతో మీ అనుష్క శెట్టి.' అంటూ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేశారు.క్రిష్ దర్శకత్వం వహించిన ఘాటీ చిత్రం సెప్టెంబర్ 5న విడుదలైంది. మూవీ బాగాలేదని విమర్శలు వచ్చినప్పటికీ అనుష్క శెట్టి నటనను మాత్రం అందరూ ప్రశంసించారు. ఈ సినిమా ప్రమోషన్ల సమయంలో అనుష్క మాట్లాడుతూ తనకు ఇష్టమైన పాత్ర గురించి కూడా చెప్పారు. చిత్ర పరిశ్రమలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అనుష్క శెట్టిని, మీరు ఇంకా ఏదైనా పాత్ర చేయాలనుకుంటున్నారా అని మీడియా వారు అడిగారు. దీనికి నటి, "నేను పూర్తిగా ప్రతికూల పాత్రను చేయాలనుకుంటున్నాను. బలమైన పాత్ర వస్తే, నేను ఖచ్చితంగా ప్రతికూల పాత్రను చేస్తాను" అని చెప్పారు.Love.... always forever ❤️ pic.twitter.com/ALRfMrvpK0— Anushka Shetty (@MsAnushkaShetty) September 12, 2025 -
ఏడాదిన్నర గ్యాప్.. ఇప్పుడేమో చేతిలో 8 సినిమాలు
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. హీరోలతో పాటు హీరోయిన్లు కూడా చాలా తక్కువగానే సినిమాలు చేస్తున్నారు. ఉన్నంతలో రష్మిక పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈమె కంటే బిజీగా ఉన్న మరో బ్యూటీ ఉంది. ఆమెనే మలయాళ బ్యూటీ సంయుక్త. దాదాపు ఏడాదిన్నరగా ఈమె నుంచి కొత్త మూవీ అప్డేట్ అనేదే లేదు. అలాంటిది ఇప్పుడు ఈమె చేతిలో ఏకంగా 8 మూవీస్ ఉండటం విశేషం. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి?2016 నుంచి మలయాళంలో సినిమాలు చేస్తున్న సంయుక్త.. 'భీమ్లా నాయక్'తో టాలీవుడ్లోకి వచ్చింది. దీని తర్వాత బింబిసార, సర్, విరూపాక్ష.. ఇలా వరస హిట్స్ అందుకుని గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. అయితే 2023లో ఈమె హీరోయిన్గా చేసిన 'డెవిల్' ఫ్లాప్ అయింది. గతేడాది ఓ తెలుగు మూవీలో అతిథి పాత్రలో కనిపించింది. అప్పటినుంచి ఈమె నుంచి రిలీజులు ఏం లేవు. తీరా ఇప్పుడు చూస్తే ఎనిమిది చిత్రాలు లైన్లో ఉన్నాయి.(ఇదీ చదవండి: 'మిరాయ్'లో రాముడిగా ప్రభాస్? ఇది అసలు నిజం)సంయుక్త చేస్తున్న వాటిలో బాలకృష్ణ 'అఖండ 2', పూరీ-విజయ్ సేతుపతి సినిమా, శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారీ', బెల్లంకొండ శ్రీనివాస్ 'హైందవ', నిఖిల్ 'స్వయంభు', లారెన్స్ 'బెంజ్', మహారాణి అనే హిందీ చిత్రం, తెలుగులో ఓ ఫిమేల్ సెంట్రిక్ చిత్రం ఈమె చేతిలో ప్రస్తుతం ఉన్నాయి. వీటిలో 'అఖండ 2'.. ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ కానుంది. మిగిలినవన్నీ కూడా దాదాపు వచ్చే ఏడాది, ఆపై ఏడాది థియేటర్లలోకి రానున్నాయి.సంయుక్త ప్రస్తుతం చేస్తున్న వాటిలో పూరీ-విజయ్ సేతుపతి, అఖండ 2, స్వయంభు.. పాన్ ఇండియా టార్గెట్గా తీస్తున్న మిగిలినవన్నీ కూడా ఆయా భాషల్లో తీస్తున్నారు. మరి వీటి వల్ల సంయుక్త కెరీర్ మళ్లీ గాడిన పడుతుందా? హీరోయిన్గా నిలదొక్కుకుంటుందా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'కిష్కింధపురి' సినిమా రివ్యూ) -
‘మిరాయ్’ మూవీ రివ్యూ
హను-మాన్ తర్వాత తేజ సజ్జా గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ ఒక్క సినిమాతోనే ఈ కుర్ర హీరో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయితే ఆ స్టార్డమ్ని నిలబెట్టుకోవాలంటే.. తేజకి ఇంకో హిట్ కచ్చితంగా కావాలి. అందుకే వెంటనే సినిమా చేయకుండా.. కాస్త సమయం తీసుకొని డిఫరెంట్ కాన్సెప్ట్తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై తొలి నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘మిరాయ్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? తేజా సజ్జ ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ కథ అశోకుడి పాలన(క్రీ.పూ.232)లో ప్రారంభమై.. ప్రస్తుత కాలంలో సాగుతుంది. కళింగ యుద్ధం తర్వాత సామ్రాట్ ఆశోకుడు పశ్చాత్తాపానికి లోనై.. తనలో దాగి ఉన్న దివ్య శక్తిని 9 గ్రంథాలలోకి ఇముడింపజేస్తాడు. ఒక్కో గ్రంథంలో ఒక్కో శక్తి ఉంటుంది. వాటికి తరతరాలుగా 9 మంది యోధులు రక్షకుల ఉంటారు. మహావీర్ లామా(మంచు మనోజ్) వాటిని చేజిక్కుంచుకుని దివ్య శక్తిలను పొంది.. ప్రపంచాన్ని శాసించాలని చూస్తాడు. తనకున్న తాంత్రిక శక్తుల బలంతో 8 గ్రంథాలను సొంతం చేసుకుంటాడు. తొమ్మిదో గ్రంథం అంభిక(శ్రియా శరన్) రక్షణలో ఉంటుంది. మహావీర్ కుట్రను ముందే పసిగట్టిన అంభిక.. తొమ్మిదో గ్రంథం రక్షణ కోసం తన కొడుకు వేద(తేజ సజ్జా)ను తయారు చేస్తుంది. అనాథగా పెరిగిన వేదకు విభా(రితిక నాయక్) దిశానిర్దేశం చేస్తుంది. మహావీర్ని ఆడ్డుకునే శక్తి ‘మిరాయ్’ ఆయుధంలో ఉందని వేదకు తెలిసేలా చేస్తుంది. మరి మిరాయ్ ఆయుధం కోసం వేద ఏం చేశాడు? ఆ ఆయుధాన్ని కనిపెట్టే క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏంటి? హిమాలయాల్లో ఉన్న ఆగస్త్య(జయరాం) అతనికి ఎలాంటి సహాయం చేశాడు. చివరకు ఆ తొమ్మిదో గ్రంథం మహావీర్ చేతికి వెళ్లిందా లేదా? మహావీర్ నేపథ్యం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్లో సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. పురాణాలు, ఇతీహాసాల్లోని కథలను తీసుకొని, దానికి కాస్త ఫిక్షన్ జోడించి సినిమా చేయడం..ఈ మధ్య టాలీవుడ్లోనూ ట్రెండింగ్గా మారింది. ఆ సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు కూడా. ఆ కోవలోకి చెందిన చిత్రమే ‘మిరాయ్’. అశోకుని దగ్గర తొమ్మిది దైవ గ్రంథాలు ఉన్నాయనే మిత్ని తీసుకొని.. ఒకవేళ ఆ గ్రంథాల కోసం దుష్టులు ప్రయత్నిస్తే.. మన ఇతిహాసాల ఆధారంగా ఎలా కాపాడవచ్చు అనేది ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు. కథగా చూస్తే.. ఇది మరీ అంత కొత్తదేమి కాదు. హను-మాన్, కార్తీకేయ 2 తో పాటు హాలీవుడ్లోనూ ఈ తరహా సినిమాలు వచ్చాయి. అయితే దర్శకుడు ఆ కథకు ఇచ్చిన ట్రీట్మెంట్, విజువల్ ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉన్నాయి. కార్తీకేయ 2లో కృష్ణుడి కంకణం కోసం హీరో బయలుదేరితే.. మిరాయ్లో శ్రీరాముడి కోదండం కోసం వెతుకుతాడు. ఈ నేపథ్యంలో వచ్చే సన్నిశాలు స్క్రీన్పై చూస్తుంటే గూస్బంప్స్ గ్యారెంటీ. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సంపాతి పక్షి ఎపిసోడ్ నెక్ట్స్ లెవల్. అలాగే సెకండాఫ్లో కూడా ఒకటి, రెండు సీన్లు అదిరిపోయాయి. రాముడి ఎపిసోడ్ కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే ఫస్టాఫ్తో పోలిస్తే... సెకండాఫ్ కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. అయితే ట్రైన్ ఎపిసోడ్, శ్రీరాముడి ఎపిసోడ్ .. ఆ సాగదీతను మరిపిస్తుంది. క్లైమాక్స్ కూడా బాగున్నా.. వావ్ ఫ్యాక్టర్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఓవరాల్గా ‘మిరాయ్’ మాత్రం థియేటర్స్లో చూడాల్సిన విజువల్ వండర్. ఎవరెలా చేశారంటే.. వేద పాత్రలో తేజ సజ్జా ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్లలో అదరగొట్టేశాడు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ బాగా నటించాడు. ఇదే తరహాలో డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ పోతే మాత్రం..తేజ రేంజ్ ఊహించని స్థాయికి వెళ్తుంది. ఇక మంచు మనోజ్ విలనిజం అద్భుతంగా పండించాడు. తేజ సజ్జ కంటే మనోజ్ పాత్రకే ఎక్కువ ఎలివేషన్స్ ఉన్నాయి. మహావీర్ పాత్రలో ఆయన అద్భుతంగా నటించాడు. శ్రీయకు చాలా కాలం తర్వాత మంచి పాత్ర లభించింది. వేద తల్లి అంభిక పాత్రకి ఆమె పూర్తి న్యాయం చేసింది. ఆమె తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా.. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. ఆగస్త్య పాత్రలో జయరాం చక్కగా నటించాడు. రితికా నాయక్, జగపతి బాబు, వెంకటేశ్ మహా, తిరుమల కిశోర్, గెటప్ శ్రీనుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సినిమా అద్భుతంగా ఉంది. ఈ సినిమాకు మరో ప్రధాన బలం గౌర హరి నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. ముఖ్యంగా సంపాతి పక్షి ఎపిసోడ్, రాముడి ఎపిసోడ్కి ఇచ్చిన బీజీఎం గూస్బంప్స్ తెప్పిస్తాయి. దర్శకుడిగానే కాకుంగా సినిమాటోగ్రాఫర్గాను కార్తీక్ వందశాతం సక్సెస్ అయ్యాడు. ప్రతీ సీన్ తెరపై చాలా రిచ్గా ఉంది. ఇక వీఎఫెక్స్ పని తీరు గురించి ముఖ్యంగా చెప్పుకొవాలి. వందల కోట్ల పెట్టి తీసిన సినిమాల్లోనూ గ్రాఫిక్స్ పేలవంగా ఉంటుంది. కానీ రూ. 60 కోట్ల బడ్జెట్లో ఈ స్థాయి ఔట్ పుల్ తీసుకురావడం నిజంగా మెచ్చుకోవాల్సిందే. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
నా కడుపులో తన్నాడు, ముఖంపై పిడిగుద్దులు..: బుల్లితెర నటి
ప్రేమించిన ప్రియుడు తనను అష్టకష్టాలు పెట్టాడని వాపోయింది మలయాళ బుల్లితెర నటి జసీలా ప్రవీణ్ (Jaseela Parveen). మాటలతోనే కాకుండా చేతలతో నరకం చూపించాడని పేర్కొంది. ఈ మేరకు సాక్ష్యాలను సోతం సోషల్ మీడియాలో బయటపెట్టింది. అందులో ఓ ఫోటోలో జసీలా తలపై గాయాలున్నాయి, పెదవి చిట్లిపోయి ఉంది. డిసెంబర్ 31న కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఈ దాడి జరిగిందని నటి తెలిపింది.చర్మం ఊడివచ్చేలా..జసీలా మాట్లాడుతూ.. 'నా కడుపులో రెండుసార్లు తన్నాడు. తన చేతి కడియంతో నా ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. దానివల్ల నా చర్మం ఊడివచ్చింది. అతడు నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కూడా ఇష్టపడలేదు. నేను కాలు జారి కిందపడిపోవడం వల్లే ఈ గాయాలయ్యాయని చెప్తేనే ఆస్పత్రికి తీసుకెళ్తానన్నాడు. హాస్పిటల్ వెళ్లాక అదే అబద్ధం చెప్పాడు. డాక్టర్ నా ముఖంపై చీలిన చర్మాన్ని చూసి ప్లాస్టిక్ సర్జరీ చేయాలన్నారు. కొన్ని రోజుల తర్వాత ధైర్యం కూడదీసుకుని జరిగిందంతా పోలీసులకు చెప్పాను. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.అందవిహీనంగా మారిపోయాశారీరక హింస, మానసిక వేదన అనుభవించాక నన్ను నేనే కోల్పోయినట్లుగా అనిపించింది. అందవిహీనంగా మారిపోయాను. అద్దంలో చూసుకోవడం కూడా మానేశాను. సరిగా తినలేకపోయాను, కంటినిండా నిద్రపోలేకపోయాను. దాదాపు పది కిలోలు తగ్గాను. అతడు మాత్రం హాయిగా నార్మల్ లైప్ గడుపుతున్నాడు. అసలేదీ జరగనట్లే ఉన్నాడు. కొంచెం కూడా బాధపడలేదు, నా గురించి ఆలోచించనేలేదు. కనీసం జరిగినదానికి క్షమాపణలు కూడా చెప్పలేదు.సారీ చెప్తే వదిలేస్తానన్నా కూడా..అతడికి చిట్టచివరగా ఓ ఛాన్స్ ఇచ్చి చూశాను. నాకు సారీ చెప్తే ఇంతటితో దీన్ని వదిలేస్తానన్నాను. కానీ అతడు క్షమాపణలు చెప్పడానికి బదులుగా కోర్టుకెళ్లి బెయిల్ తీసుకోవడానికే సుముఖత చూపించాడు. తనే ఏదీ జరగనట్లు ఉంటే నేను మాత్రం ఎందుకు కుమిలిపోతూ ఉండాలి. బాధపడుతూ కూర్చుంటే ఏదీ మారదు.. అందుకే ఇప్పుడిప్పుడే గతాన్ని మర్చిపోయి మళ్లీ మామూలు మనిషినయ్యేందుకు ప్రయత్నిస్తున్నాను. అతడితో తెగదెంపులు చేసుకున్నాను అని చెప్పుకొచ్చింది. జసీలా పర్వీన్.. మలయాళ సీరియల్స్లో నెగెటివ్ పాత్రలు పోషించింది.చదవండి: రైలు నుంచి దూకేసిన బాలీవుడ్ హీరోయిన్ -
ఇన్నాళ్లూ భరణి, ఇమ్మాన్యుయేల్ మగాళ్లనుకున్నా.. అంతమాటన్నాడేంటి?
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) అన్నాక గొడవలుంటాయి. అవి లేకపోతే షో పసే ఉండదు. కానీ కొందరు మరీ హద్దులు మీరి మాట్లాడుతుంటారు. మాస్క్ మ్యాన్ హరీశ్ ఇప్పుడదే చేశాడు. హౌస్లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. సంచాలక్ మర్యాద మనీష్ వల్ల ఈ టాస్క్ గందరగోళంగా మారింది. ఫైనల్గా ఈ గేమ్లో శ్రీజ గెలిచి సంజనాను కెప్టెన్ చేసిందన్న విషయం ఇదివరకే లీకైంది.భరణి, ఇమ్మాన్యుయేల్.. ఆడవాళ్లు!అయితే తాజా ప్రోమోలో హరీశ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తనూజ, భరణి, ఇమ్మాన్యుయేల్.. ఇన్నాళ్లూ వీళ్లు ఒకమ్మాయి, ఇద్దరబ్బాయిలనుకున్నాను. ముగ్గురు ఆడవాళ్లతో ఫైట్ చేశానని ఇప్పుడర్థమైంది అని కామెంట్స్ చేశాడు. మరోవైపు పవన్ కల్యాణ్ తనను బాడీ షేమింగ్ చేశాడని ఇమ్మాన్యుయేల్ బాధపడ్డాడు. బాడీ షేమింగ్ చేసినట్లు ఎపిసోడ్లో క్లిప్ వస్తే మాత్రం కచ్చితంగా నాగ్ చేతిలో పవన్ కల్యాణ్కు తిట్లు ఖాయం! అలాగే హరీశ్, మనీష్లకు కూడా క్లాస్ పడేట్లు కనిపిస్తోంది. చదవండి: మర్యాద మర్చిపోయిన మనీష్.. ఎందుకు పట్టుకొచ్చావ్ శ్రీముఖి? -
'మిరాయ్'లో రాముడిగా ప్రభాస్? ఇది అసలు నిజం
రీసెంట్ టైంలో పాన్ ఇండియా సినిమాల్లో కచ్చితంగా డివోషనల్ ఎలిమెంట్స్ లేదా క్లైమాక్స్లో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే రిలీజ్ వరకు కొన్నింటిని దాస్తుంటే మరికొన్నింటిని మాత్రం ముందే రివీల్ చేస్తున్నారు. కానీ తాజాగా థియేటర్లలో రిలీజైన 'మిరాయ్'లో మాత్రం ప్రభాస్ నటించాడనే రూమర్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఏకంగా ఓ ఫొటో కూడా సర్కూలేట్ చేస్తున్నారు. ఇంతకీ ఏంటి విషయం?'హనుమాన్' తర్వాత తేజ సజ్జా చేసిన సినిమా 'మిరాయ్'. ఇది కూడా సూపర్ హీరో కాన్సెప్ట్తోనే తీశారు. మంచు మనోజ్ విలన్ కాగా.. ఇందులో రాముడి రిఫరెన్స్ కూడా ఉన్నట్లు ట్రైలర్లో చూపించారు. దీంతో ఆ పాత్ర ఎవరు చేసుంటారా అని అందరూ మాట్లాడుకున్నారు. అలానే నిన్న రాత్రి తేజ్ సజ్జా.. సినిమాలో ప్రభాస్ సర్ప్రైజ్ కూడా ఉందని ట్వీట్ చేశాడు. దీంతో ఏంటా సంగతి అనుకున్నారు.(ఇదీ చదవండి: 'కిష్కింధపురి' సినిమా రివ్యూ)అయితే సినిమా ప్రారంభంలో వచ్చే వాయిస్ ఓవర్.. ప్రభాస్తో చెప్పించారు. కానీ కొందరు నెటిజన్లు మాత్రం ప్రభాస్ని రాముడిగా ఎడిట్ చేసి థియేటర్ స్క్రీన్పై ఆ బొమ్మని పెట్టేశారు. దీంతో చాలామంది ఇది నిజమని అనుకుంటున్నారు. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ఇదో ఎడిటెడ్ ఫొటో. 'మిరాయ్' చిత్రం కోసం ప్రభాస్.. తన గొంతు మాత్రమే ఇచ్చాడు. ఇదే నిర్మాణ సంస్థ 'రాజాసాబ్' తీస్తుంది.ప్రస్తుతం 'మిరాయ్'కి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. కానీ తొలిరోజు వచ్చే టాక్ కాదు, ఒకటి రెండు రోజుల తర్వాత అసలు టాక్ వస్తుంది. అప్పుడు సినిమా రిజల్ట్ ఏంటనేది తేలుతుంది.(ఇదీ చదవండి: మిరాయ్ ట్విటర్ రివ్యూ) -
రైల్లో నుంచి దూకేసిన బాలీవుడ్ హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా శర్మ (Actress Karishma Sharma) కదులుతున్న రైలు నుంచి దూకేసింది. ముంబైలో బుధవారం నాడు లోకల్ ట్రైన్ ఎక్కిన ఆమె సడన్గా కిందకు దూకేయడంతో వెన్నెముకకు, తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె సోషల్ మీడియా వేదికగా అప్డేట్ ఇచ్చింది.కదులుతున్న రైలు నుంచి దూకేశా'షూటింగ్ కోసం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రైలులో చర్చ్గేట్కు వెళ్దామనుకున్నాను. స్టేషన్కు వెళ్లి ట్రైన్ ఎక్కాను. కాస్త వేగం పుంజుకున్నాక నా ఫ్రెండ్స్ ఇంకా ఎక్కలేదన్న విషయం గమనించాను. అప్పుడు నేను చీర కట్టుకుని ఉన్నాను. అయినా ధైర్యం చేసి దూకేయగా తలకు, వెన్నెముకకు దెబ్బ తగిలింది. MRI స్కాన్ చేశారు. కొద్దిరోజులు అబ్జర్వేషన్లో ఉంచాలన్నారు. సినిమాఈ ప్రమాదం జరిగినప్పటినుంచి నొప్పితో విలవిల్లాడుతున్నాను. మీ ప్రేమాభిమానాలే నన్ను కోలుకునేలా చేస్తాయి. దయచేసి నా కోసం ప్రార్థించండి' అని కోరింది. కాగా కరిష్మా శర్మ.. ప్యార్ కా పంచనామా 2, ఉజ్దా చమాన్, హోటల్ మిలన్, ఏక్ విలన్ రిటర్న్స్ మూవీస్లో నటించింది. రాగిణి ఎమ్ఎమ్ఎస్: రిటర్న్స్ వెబ్ సిరీస్లో ప్రధాన పాత్ర పోషించింది. బుల్లితెరపై పవిత్ర రిష్తా, కామెడీ సర్కస్, సిల్సిలా ప్యార్ కా వంటి సీరియల్స్లోనూ యాక్ట్ చేసింది.చదవండి: మర్యాద మర్చిపోయిన మనీష్.. ఎందుకు పట్టుకొచ్చావ్ శ్రీముఖి? -
ఆ హీరోతో కలిసి పనిచేసినందుకు హ్యాపీ: లావణ్య త్రిపాఠి
హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) రెండు రోజుల క్రితమే తల్లిగా ప్రమోషన్ పొందారు. ఉత్రరప్రదేశ్లోని అయోధ్యకు చెందిన ఈ బ్యూటీ ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. అలాగే ఈమె కథానాయికగా నటించిన తమిళ చిత్రం టన్నెల్ నేడు (సెప్టెంబర్ 12) ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ వారం వాయిదా పడింది. ఈ నెల 19న విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ.. టన్నెల్ చిత్రం చూసినవారందరూ నా నటనను ప్రశంసిస్తుంటే సంతోషంగా ఉందన్నారు. సంతోషంగా ఉందిచిత్ర ప్రథమార్థం రొమాంటిక్ సంఘటనలతోనూ, రెండవ భాగం ఎమోషనన్స్ అంశాలతో ఉంటుందని చెప్పారు. సినిమాలో తన పాత్ర సాధారణంగా కాకుండా కథకు కీలకంగా ఉంటుందన్నారు. నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించే అవకాశం కల్పించిన దర్శకుడు రవీంద్ర మాధవకు ధన్యవాదాలు తెలిపారు. ఎంతో అంకిత భావంతో పని చేసే హీరో అధర్వతో కలిసి నటించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.కెరీర్లావణ్య త్రిపాఠి 2012లో అందాల రాక్షసి చిత్రంతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత బ్రహ్మ చిత్రంతో కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. అయితే తెలుగులోనే వరుస చిత్రాలు చేస్తూ టాలీవుడ్లో బిజీ అయ్యారు. కాగా 2017లో మాయాన్ అనే తమిళ మూవీలో నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు టన్నెల్ అనే తమిళ చిత్రంలో నటించారు. తమిళ హీరో అధర్వ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అన్నై ఫిలిమ్ ప్రొడక్షనన్స్ పతాకంపై ఎం.జాన్ పీటర్ నిర్మించారు. రవీంద్ర మాదవ దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by Annai Film Production (@annaifilmproductionofficial)చదవండి: మర్యాద మర్చిపోయిన మనీష్.. ఎందుకు పట్టుకొచ్చావ్ శ్రీముఖి? -
'కిష్కింధపురి' సినిమా రివ్యూ
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హారర్ సినిమా 'కిష్కింధపురి'. ఇది ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. గత కొన్నిరోజులుగా ప్రమోషన్స్ చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అందుకు తగ్గట్లే ట్రైలర్, పోస్టర్స్ లాంటివి కాస్త ఆసక్తికరంగా అనిపించాయి. మరి మూవీ టీమ్ చెప్పినట్లు ఈ చిత్రం భయపెడుతూ థ్రిల్ చేసిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ కొత్త సినిమా)కథేంటి?రాఘవ్ (బెల్లంకొండ శ్రీనివాస్), మైథిలి (అనుపమ పరమేశ్వరన్) ప్రేమికులు. మరో స్నేహితుడితో కలిసి ఘోస్ట్ వాకింగ్ టూర్స్ చేస్తుంటారు. దీనికి బయట నుంచి కొందరు వ్యక్తులు వస్తుంటారు. వీళ్లందరూ కలిసి జన సంచారం లేని కొన్ని ప్రదేశాలకు వెళ్తుంటారు. ఓ సందర్భంలో 'సువర్ణమాయ' అనే పాడుబడ్డ రేడియో స్టేషన్కి 11 మంది వెళ్తారు. కానీ అక్కడికి వెళ్లొచ్చిన తర్వాత ఊహించని రీతిలో ముగ్గురు చనిపోతారు. అనంతరం ఈ బృందంలోని ఓ చిన్నారి.. దెయ్యానికి టార్గెట్ అవుతుంది. ఇంతకీ వీళ్లని చంపుతున్న దెయ్యం ఎవరు? రాఘవ ఏం చేశాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఈ సినిమా ప్రమోషన్స్లో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మూవీ మొదలైన 10 నిమిషాల తర్వాత ఎవరూ ఫోన్ కూడా పట్టుకోరు, ఒకవేళ అలా ఎవరైనా చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తానని ఛాలెంజ్ చేశాడు. తర్వాత దీన్ని కవర్ చేసుకున్నాడు అదే వేరే సంగతి. మరి హీరో చెప్పినట్లు సినిమాలో అంత సీన్ ఉందా అంటే ఓ మాదిరిగా ఉంది అంతే!హారర్ సినిమా అనగానే స్టోరీలో ఓ స్టైల్ ఉంటుంది. దాదాపు దాన్ని ఫాలో అవుతూనే 'కిష్కింధపురి' కూడా తీశారు. ఫస్టాఫ్ అంతా దెయ్యం ఎలిమెంట్స్ చూపిస్తూ భయపెట్టేందుకు ప్రయత్నించారు. కానీ అది పార్ట్స్ పార్ట్స్గానే వర్కౌట్ అయింది. దెయ్యం వెనకున్న ఫ్లాష్ బ్యాక్ చెబుతూ థ్రిల్ పంచే ఎలిమెంట్స్ అన్నీ సెకండాఫ్లోనే ఉంటాయి. సౌండ్స్తో భయపెట్టడం వరకు సరే గానీ థ్రిల్లింగ్ అంశాలు మాత్రం సెకండాఫ్లో తగ్గిపోయాయి. సాధారణంగా హారర్ మూవీస్ అనగానే చిల్ మూమెంట్స్ కీలకం. అంటే ప్రేక్షకుల్ని సడన్గా భయపెట్టాలి. ఇందులో ఒకటి రెండు చోట్ల తప్పితే అలాంటి సన్నివేశాలు పెద్దగా లేవు.ప్రారంభంలో సగటు తెలుగు సినిమాల్లో ఉన్నట్లే హీరో ఇంట్రడక్షన్, లవ్ సాంగ్.. ఇలా సాగుతుంది. ఎప్పుడైతే 'సూవర్ణమాయ' రేడియో స్టేషన్లో హీరోహీరోయిన్తో అడుగుపెడతారో అసలు కథ మొదలవుతుంది. ఇందులోకి వచ్చి వెళ్లిన ఇద్దరు లోకో పైలెట్స్ని, అలానే ఓ నిర్మాణ కూలీని చంపడం లాంటి సీన్స్ రెగ్యులర్గానే అనిపించాయి. ఓవైపు సూవర్ణమాయ గురించి తెలుసుకునేందుకు హీరో ప్రయత్నిస్తూనే, మరోవైపు మిగతా వాళ్లు చనిపోకుండా ఆపడం లాంటి అంశాలతో సెకండాఫ్ అంతా ఉంటుంది. ఫ్లాష్బ్యాక్లో వచ్చే స్టోరీ, ట్విస్టులు బాగున్నాయి. కానీ ఇదంతా ఎక్కడో తెలుగు సినిమాలో చూసేశామే అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎవరెలా చేశారు?బెల్లంకొండ శ్రీనివాస్ హారర్ సినిమాలో నటించడం ఇదే తొలిసారి. రాఘవ్ పాత్రలో పర్లేదనిపించాడు. హీరోయిన్ అనుపమకి మాత్రం మంచి స్కోప్ దొరికింది. మొదట్లో రెగ్యులర్ కమర్షియల్ పాత్రలానే అనిపిస్తుంది గానీ సెకండాఫ్లో ఈమె దెయ్యంగా మారే సీన్స్లో ఆకట్టుకుంది. విశ్రవ పుత్రగా శాండీ మాస్టర్ మెప్పించాడు. ప్రారంభంలో హైపర్ ఆది, సుదర్శన్ కాస్త నవ్వించేందుకు ప్రయత్నించారు కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. తనికెళ్ల భరణి, మకరంద్ దేశ్ పాండే తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన వాళ్లంతా ఓకే ఓకే.టెక్నికల్ అంశాలకొస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాల్లో మాత్రమే ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కొన్నిచోట్ల స్టోరీలో లాజిక్స్ మిస్ కావడం డిసప్పాయింట్ చేస్తుంది. గ్రాఫిక్స్ కూడా ఇది గ్రాఫిక్స్ అని తెలిసిపోయేలా ఉంది. దాన్ని కాస్త నేచురల్గా చేసుండాల్సింది. దర్శకుడు భయపెడదామని బాగానే ప్రయత్నించాడు కాకపోతే పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. స్టోరీ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది!అలానే 'కిష్కింధపురి' అనే టైటిల్ పెట్టారు. ప్రారంభంలో కోతులతో ఓ సీన్ చూపించడం, సినిమాలో ఊరి పేరు తప్పితే ఎక్కడా టైటిల్కి స్టోరీకి కనెక్షన్ అనిపించలేదు. దీని బదులు 'సూవర్ణమాయ రేడియో స్టేషన్' అని పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది.- చందు డొంకాన(ఇదీ చదవండి: మిరాయ్ ట్విటర్ రివ్యూ) -
మర్యాద మర్చిపోయిన మనీష్.. ఎందుకు పట్టుకొచ్చావ్ శ్రీముఖి?
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) ఏ ముహూర్తాన కామనర్స్ను ఓనర్లు చేశారో కానీ వాళ్లు తెగ రెచ్చిపోతున్నారు. బిగ్బాస్ హౌస్ అంతా మాదే అన్నట్లుగా జులుం చూపిస్తున్నారు. టెనెంట్లు.. అదేనండి సెలబ్రిటీలను పనివాళ్లుగా హీనంగా చూస్తున్నారు. మర్యాద మనీష్ అయితే తనో పెద్ద తోపుగా ఫీలవుతున్నాడు. మొన్న రాము రాథోడ్ ఏదో చెప్పడానికి వస్తుంటే కూడా నేను నిన్ను నమ్మను, సింపథీ ఆడతావ్.. అదీ,ఇదీ అంటూ తనను చీదరించుకున్నాడు. నిన్నటి ఎపిసోడ్లో అయితే సంచాలక్గా ఫెయిలవడమే కాకుండా ఇమ్మాన్యుయేల్ను నానామాటలన్నాడు. అసలేం జరిగిందో చూద్దాం..ఐదుగురు కెప్టెన్సీ కంటెండర్లుబిగ్బాస్ సంజన (Sanjana Galrani)ను కన్ఫెషన్ రూమ్కు పిలిచి ఐదుగురిని కెప్టెన్సీ కంటెండర్లుగా ఎంపిక చేసుకోమన్నాడు. ఆమె తన పేరుతో పాటు హరీశ్, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, శ్రష్టిలను సెలక్ట్ చేసింది. అయితే ఇక్కడే బిగ్బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. కెప్టెన్ అవ్వాలంటే గేమ్ ఆడాల్సింది కంటెండర్లు కాదు, వారికి సపోర్ట్గా నిలబడేవారని బిగ్బాస్ చెప్పాడు. అలా శ్రష్టి కోసం రాము, ఇమ్మాన్యుయేల్కు భరణి, సంజనకు శ్రీజ, పవన్కు ప్రియ, హరీశ్కు పవన్ కల్యాణ్ సపోర్ట్గా వచ్చారు.సంచాలక్గా మర్యాద మనీష్వీళ్లకు వదలకు బెదరకు టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉంచిన గోడకు రాడ్స్ ఉంటాయి. నేలకు ఆనకుండా వాటిని పట్టుకుని ఉండాలి. కంటెండర్స్ను సంచాలక్ ఇష్టానుసారంగా పిలుస్తూ ఉంటాడు. గ్రీన్ లైట్ పడ్డప్పుడు వారు ఒక రాడ్ తీసేయాల్సి ఉంటుంది. ఈ గేమ్కు మనీష్ సంచాలకుడు. మొదట రాడ్ తీసే ఛాన్స్ డీమాన్ పవన్కు ఇచ్చాడు. అయితే రెడ్ సిగ్నల్ ఉండటంతో అతడిని ఆపి గ్రీన్ లైట్ పడ్డాక తీయమన్నాడు. ఇమ్మాన్యుయేల్ను ఎలిమినేట్ చేసిన సంచాలక్శ్రష్టికి కూడా అలాగే చెప్పాడు. తర్వాత ఇమ్మాన్యుయేల్ వెళ్లినప్పుడు మాత్రం ఏమీ చెప్పకుండా నిల్చుండిపోయాడు. అతడు కూడా రెడ్ సిగ్నల్ చూసుకోకుండా రాడ్ తీసేశారు. దాంతో సంచాలక్ మనీష్.. ఇమ్మాన్యుయేల్ టీమ్ను ఎలిమినేట్ చేశాడు. నేను వెళ్లినప్పుడు మీరు ఆపాలి కదా.. కనీసం నేను రాడ్ పట్టుకున్నప్పుడైనా చెప్పాలిగా అని నిలదీశాడు. నేను చెప్పేవరకు ఆగలేదంటూ మనీష్ నసిగాడు. సంచాలక్గా ఫెయిల్ఇమ్మూ ఆవేశంతో సంచాలక్గా ఫెయిల్, మీరు వాళ్లకు సపోర్ట్ చేశారు, అన్ఫెయిర్ అంటూ అని మనీష్ను తిట్టిపోశాడు. అందుకు మనీష్.. నువ్వు కంటెస్టెంట్గా ఫెయిల్, వచ్చాడు పెద్ద ప్లేయర్.. వైల్డ్ కార్డులను తీసుకోండి అని బిగ్బాస్కే సలహాలు ఇచ్చాడు. అతడి ప్రవర్తన చూస్తుంటే శ్రీముఖి ఎందుకితడిని హౌస్లోకి పంపించిందిరా బాబూ అని ప్రేక్షకులు తల పట్టుకుంటున్నారు. ఇలా గొడవలు జరుగుతుండగానే ఎపిసోడ్ పూర్తయింది. అయితే ఇప్పటికే అందుతున్న లీకుల ప్రకారం సంజన ఫస్ట్ కెప్టెన్ అయింది. మరోవైపు సంజనా.. సుమన్ సిగరెట్స్ దాచేసింది. అతడు ఎంత బతిమాలుతున్నా తాను దాచిపెట్టలేదంటూ అబద్ధమాడి ఏడిపిస్తోంది. చదవండి: ఎంతమంది వద్దన్నా లక్ష్మణ రేఖ నాకే వచ్చింది: నటి జయసుధ -
సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా చేసిన హారర్ మూవీ 'కిష్కింధపురి' ఈ రోజే థియేటర్లలోకి వచ్చింది. మరోవైపు ఈమె నటించిన లేటెస్ట్ మూవీ ఒకటి ఓటీటీలోకి ఎలాంటి ప్రకటన లేకుండా అందుబాటులోకి వచ్చింది. కేవలం మూడు వారాల్లోనే స్ట్రీమింగ్ అవుతోంది. లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో తీసిన ఈ చిత్రం సంగతేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తరచుగా తెలుగు సినిమాలు చేస్తూనే ఉంది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటూనే ఉంది. అలా ఈమె చేసిన ఫిమేల్ సెంట్రిక్ మూవీ 'పరదా'. తన కెరీర్లోనే బెస్ట్ మూవీని అనుపమ కూడా చెప్పింది. అలా ఆగస్టు 22న థియేటర్లలోకి వచ్చింది. అయితే ప్రేక్షకుల నుంచి భిన్నమైన రెస్పాన్స్ అందుకుంది. ఫలితంగా యావరేజ్గా మిగిలింది.(ఇదీ చదవండి: మిరాయ్ ట్విటర్ రివ్యూ)ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో తెలుగు, మలయాళ వెర్షన్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఒకవేళ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ మూవీస్ అంటే ఇష్టముంటే దీనిపై ఓ లుక్కేయండి. కచ్చితంగా నచ్చేస్తుంది.'పరదా' విషయానికొస్తే.. పడతి అనే ఊరిలో మహిళలంతా పరదాలేసుకుని తిరుగుతుంటారు. ఇంట్లో తండ్రికి తప్పితే పరాయి పురుషుడు వాళ్ల ముఖాలు చూడకూడదు. చూస్తే ఊరికి అరిష్టం దాపురించి, ఇక్కడ పిల్లలు పుట్టకుండా పురిటిలోనే చనిపోతారని ఈ ఊరి ప్రజల నమ్మకం. దానికి జ్వాలమ్మ అనే ఓ కథ ఉంటుంది. ఇదే ఊరిలో పుట్టి పెరిగిన సుబ్బలక్ష్మి (అనుపమ) అదే ఊళ్లోని రాజేష్(రాగ్ మయూర్)ని ఇష్టపడుతుంది. నిశ్చితార్ధం టైంకి ఓ షాకింగ్ సంఘటన జరుగుతుంది. దాంతో గొడవ జరిగి ఆ శుభకార్యం ఆగిపోతుంది. సుబ్బు ఆత్మాహుతి చేసుకోవాలని ఊరంతా నిర్ణయిస్తారు. అసలేమైంది? సుబ్బు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అనేది మిగతా సినిమా.(ఇదీ చదవండి: అమ్మవారికి రూ.4 కోట్ల కిరీటం సమర్పించిన ఇళయరాజా) -
మిరాయ్ ట్విటర్ రివ్యూ
హను-మాన్ తర్వాత తేజ సజ్జ నటించిన మరో పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు(సెప్టెంబర్ 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. సిసిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘మిరాయ్’ ఎలా ఉంది? తేజ సజ్జ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదతర అంశాలను ఎక్స్లో చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు.ఎక్స్లో మిరాయ్ చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. గ్రాఫిక్స్ అద్భుతంగా ఉందంటూ చాలా మంది ట్వీట్స్ పెడుతున్నారు. అలాగే ఇందులో ప్రభాస్ కనిపించడం పెద్ద సర్ప్రైజింగ్ అంశం. ఎక్స్లో ప్రభాస్ పాత్రలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభాస్ గెస్ట్ రోల్ సినిమాకు ప్లస్ అయిందని చెబుతున్నారు.#Mirai A Worthy Action Adventure Infused with Devotional Elements! Mirai delivers an engaging first half, with a few dips in the middle, but a good pre-interval to interval block. The second half slows down in places, but a few strong sequences and a superb climax hold it…— Venky Reviews (@venkyreviews) September 11, 2025‘చిన్న చిన్న మలుపులతో ఫస్టాఫ్ ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయింది. సెకండాఫ్ కొన్ని చోట్ల కథ సాగదీసినట్లుగా అనిపించినా..కొన్ని బలమైన సన్నివేశాలు, క్లైమాక్స్ అద్భుతంగా ఉండడంతో ఎక్కడా బోర్ కొట్టినట్లు అనిపించదు. టెక్నికల్గా సినిమా చాలా బాగుంది అంటూ ఓ నెటిజన్ 3 రేటింగ్ ఇచ్చాడు. #MiraiReview Positives@shriya1109#Jayaram@tejasajja123@HeroManoj1 (Mohan babu)#RitikaAnd everyone gave their best -VFX 👌👏-Second half BGM-Mirai daggariki vellaka vache sequence -Second half till climaxNegatives:Time ayipothundhani fast fast ga end chesinattundhi— ZoomOnZindagi (@ZoomOnZindagi) September 12, 2025 ‘తేజ సజ్జ, శ్రియ, మనోజ్, జయరామ్, రితికా..ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. వీఎఫెక్స్ అదిరిపోయింది. సెకండాఫ్ బీజీఎం బాగుంది. మిరాయ్ దగ్గరకు వెళ్లిన తర్వాత వచ్చే సన్నివేశం సినిమాకే హైలెట్. క్లైమాక్స్ బాగుంది. సినిమాలో నెగెటివ్ పాయింట్ ఏంటంటే.. టైమ్ అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్గా ఎండ్ చేసినట్లు ఉంటుంది’ అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.Just a voice over turned the entire film reception into rebel vibe 🔥🔥🔥Just his name is enough 💥💥💥 #Prabhas #Mirai pic.twitter.com/rhvvntcNGO— Prabhas RULES (@PrabhasRules) September 11, 2025#Mirai 1st half is a banger 💥💥 with usual teja and Srinu comedy , interval is very good .. 2nd is bit lengthy with same template as #HanuMan Overall it's a good movie 🎉🎉 Congrats team 3.5/5— N@|○ N£nu (@Karthik_nyl) September 12, 2025#Mirai – A Divine Action Adventure! 🔥✨High moments, solid interval, superb climax.Tech brilliance + Gowra Hari BGM elevate big time.@tejasajja123 shines bright.@HeroManoj1 👌💥Unique, engaging & worth a big-screen watch!Rating: ⭐⭐⭐⭐/5— 𝐕𝐢𝐡𝐚𝐚𝐧 (@TheRealPKFan) September 12, 2025#Mirai 1st half is a banger 💥💥 with usual teja and Srinu comedy , interval is very good .. 2nd is bit lengthy with same template as #HanuMan Overall it's a good movie 🎉🎉 Congrats team 3.5/5— N@|○ N£nu (@Karthik_nyl) September 12, 2025#Mirai 12 सितम्बर को रिलीज़ हो रही है ये फ़िल्म सनातन धर्म के आदर्श और राम जी की ताक़त से प्रेरित है 🚩दक्षिण भारत हमें सुपरहीरो देता है, बॉलीवुड बस स्टारकिड्स 😏आधुनिक युग में एक बेहतरीन फिल्मइस बार सिनेमा हॉल भरकर दिखाओ कि असली कंटेंट ही जीतेगा 💪#Mirai— ठाकुर राजन तोमर (@rajanbhajpa) September 12, 2025#Mirai - 🆗Teja Sajja delivers a gud Perf. Graceful Shreya. Superb Visuals & BGM. Promising start, middle portions r draggy. Post Interval Transformation fight gud. Lord Rama saved d climax. Though not extra ordinary, it Deserves a One Time Watch for its Cinematic Experience!— Christopher Kanagaraj (@Chrissuccess) September 12, 2025#Mirai Baane undi, Parledu!A decent fantasy action adventure film which has similar tones of #Karthikeya2 & #HanumanFew sequences are fantastic but few are subpar.Loved #ShriyaSaran role👍🏻#TejaSajja is brilliant and he killed it👌#ManchuManoj role is underwhelming🥲 pic.twitter.com/r7gHrlhsph— Sanjeev (@edokatile) September 12, 2025 -
ఎంతమంది వద్దన్నా లక్ష్మణ రేఖ నాకే వచ్చింది: నటి జయసుధ
సహజ నటి జయసుధ హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘లక్ష్మణ రేఖ’కు 50 ఏళ్లు. ఈ సినిమాకి ముందు ఓ నాలుగైదు సినిమాల్లో ఆమె కీలక పాత్రలు చేశారు. ఎన్. గో పాలకృష్ణ దర్శకత్వంలో షణ్ముగం చెట్టియార్, ఏవీ కృష్ణారావు నిర్మించిన ‘లక్ష్మణ రేఖ’లో చేసిన సీరియస్ క్యారెక్టర్ జయసధకు మంచి పేరు తెచ్చిపెడితే, దర్శకుడు ఎన్. గో పాలకృష్ణకి ‘లక్ష్మణ రేఖ’ ఇంటి పేరుగా మారి పోయింది. ఈ చిత్రంలో మురళీమోహన్ – జయసుధ జంటగా నటించగా, చంద్రమోహన్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్, గుమ్మడి, అల్లు రామలింగయ్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 1975 సెప్టెంబర్ 12న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా విడుదలై 50 ఏళ్లయిన సందర్భంగా ‘సాక్షి’తో జయసుధ ప్రత్యేకంగా పంచుకున్న విషయాలు. ‘లక్షణ రేఖ’ ఓ మరాఠీ చిత్రానికి మూలం. తండ్రి చెప్పిన మాట వినకుండా ప్రేమికుడి కోసం ఇంటి నుంచి వెళ్లిన ఒక అమ్మాయి మోస పోతుంది. ఆ ప్రేమికుడిపై పగ తీర్చుకోవాలనుకుంటుంది. ఆ మోసగాడు ఆమె చెల్లెలి భర్తతో పరిచయం పెంచుకుని, వారి కాపురంలో చిచ్చుపెడతాడు. భర్త వదిలేస్తాడు. నేను చెల్లెలి పాత్ర చేశాను. ఇది బరువైన పాత్ర కాబట్టి నా వయసు సరి పోదని, నన్ను వద్దని డైరెక్టర్, ప్రొడ్యూసర్స్తో పెద్దలు చె΄్పారు. అయితే ఆ సినిమా నాకే వచ్చింది. ‘లక్ష్మణ రేఖ’ తర్వాత ‘జ్యోతి, ఆమె కథ, ప్రేమలేఖలు’ వంటి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నావి టఫ్ రోల్స్. అన్నిటికంటే కష్టమైనది ‘ఆమె కథ’. ఆ సినిమా ఇప్పుడు తీసినా ట్రెండ్కి తగ్గట్టుగా ఉంటుంది. ఏ భాషలో అయినా పనికొస్తుంది. ఇంగ్లిష్లో కూడా తీయొచ్చు. అప్పటి ఆ టైమ్, ఆ సీజన్లో అన్నీ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలే. ఆ సినిమాలకు ఒక అమ్మాయి దొరికింది... ఆమె జయసుధ (నవ్వుతూ). ఆ రోజుల్లో హీరోయిన్లను బాలీవుడ్ నుంచో వేరే ఉడ్ నుంచో తీసుకురావడం తక్కువ. తెలుగు లేదంటే తమిళ పరిశ్రమ నుంచే ఆర్టిస్టులు ఉండేవారు. దాంతో మాకు ఎక్కువ పాత్రలు వచ్చేవి. సీరియస్గా, మేకప్ లేకుండా, టైట్గా జెడ వేసుకుని, కాటన్ చీరలు కట్టుకుని... ఇలా పాత్రలకు తగ్గట్టుగా మౌల్డ్ అయ్యాను. ఫిజిక్కి తగ్గ డ్రెస్ వేసుకునేవాళ్లంఅప్పట్లో మా ఫిజిక్కి తగ్గట్టు డ్రెస్ వేసుకునేవాళ్లం. ఆ రోజుల్లో 90 శాతం మంది డైరెక్టర్స్ మా డ్రెస్లు అభ్యంతరకరంగా ఉండకుండా జాగ్రత్త పడేవారు. నేను ట్రెడిషనల్ క్యారెక్టర్స్తో పాటు మోడ్రన్ క్యారెక్టర్స్ చేశాను. ‘నోము’ సినిమాలో అంత వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకున్నా అసభ్యంగా అనిపించలేదు. ‘యుగంధర్’ సినిమాలో అయితే స్విమ్ డ్రెస్ వేసుకున్నాను. అయితే అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. అయినా ఇండస్ట్రీ నన్ను దూరం పెట్టలేదు కథ చెప్పేటప్పుడు నా పాత్ర ఒకలా చెప్పి, షూటింగ్కి వచ్చాక మారిస్తే ఒప్పుకునేదాన్ని కాదు. అప్పటికి నేను అప్కమింగ్ ఆర్టిస్ట్ అయినప్పటికీ ‘ఎందుకు ఇలా చేశారు?’ అని ప్రశ్నించేదాన్ని. నేను అడిగిన దాంట్లో న్యాయం ఉండేది కాబట్టి ఇండస్ట్రీ నన్ను దూరం పెట్టలేదు. మా నాన్న చాలా స్ట్రిక్ట్గా, అమ్మ కామ్గా ఉండేవారు. అయితే నచ్చక పోతే వీళ్లు సినిమా వదులుకుంటారని అందరికీ తెలుసు. ఆ రోజుల్లో ఒక పద్ధతి ఉండేది... విలువలు ఉండేవి. మహా నటి ఆమె ఒక్కరే... ‘సహజ నటి’ అనే టైటిల్ సూపర్ స్టార్ అని ఒక కార్యక్రమంలో నాకు మీడియా ఇచ్చింది. ఇప్పుడు పది లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేసి ఉండరు, అప్పుడే ‘మహా నటి’ అనేస్తారు. మహా నటి అనే బిరుదుకి అర్హత ఉన్న ఏకైక నటి సావిత్రిగారే. ఎన్నో గొప్ప పాత్రల్లో అద్భుతమైన నటన కనబరిస్తే, ఆమెకు దక్కిన బిరుదు అది. ఇప్పుడున్నవారిని తక్కువ చేయడం లేదు. కానీ, కనీసం ఓ పాతిక లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేశాక అలాంటి బిరుదులిస్తే బాగుంటుంది. నా బయోపిక్కి ఓకే నా బయోపిక్ ఎవరైనా తీస్తానంటే అభ్యంతరం లేదు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ విషయం గురించి నాతో చె΄్పారు. అయితే ముందుగా ఒక బుక్గా వస్తే బాగుంటుంది. నేనో 350 సినిమాలు చేశానంటే... వదులుకున్నవి ఓ 200 వరకూ ఉంటాయి. ఆ 350 సినిమాల్లో నా పాత్రల్లో నేను ఒదిగి పోవడానికి చేసిన కృషి గురించి తెలియాలి. అప్పటి స్టార్స్ గురించి ఈ జనరేషన్కి తెలియాలి. అది వారికి స్ఫూర్తిగా ఉంటుంది. ఒక చిన్న అమ్మాయిగా సినిమాల్లో మొదలైన నా ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆ జర్నీ తెలియాలి. వెబ్ సిరీస్గా అయితే బాగుంటుందనుకుంటున్నాను.నా పరిచయ చిత్రం ఓ సంచలనంహీరోయిన్ ఓరియంటెడ్ సినిమా... అందులోనూ కొత్త డైరెక్టర్తో... లేని పోని రిస్క్ చేస్తున్నారని నిర్మాతల్ని భయపెట్టారు. జయసుధను ఎంపిక చేయడాన్ని పలు వురు పెద్దలు విమర్శించారు. కానీ నా మీద, నా సబ్జెక్ట్ మీద నమ్మకంతో నిర్మాతలు వెనకడుగు వేయలేదు. వాళ్లు చేసిన రిస్క్ ఫలించి, టేబుల్ ప్రాఫిట్గా ‘లక్ష్మణ రేఖ’ నిలిచి... నా ఇంటిపేరుగా మారింది. ఏరియాల వారిగా బిజినెస్ జరుపుకున్న తొలి చిత్రంగానూ దర్శకుడిగా నా పరిచయ చిత్రం చరిత్ర సృష్టించడం పట్ల ఇప్పటికీ గర్వపడుతుంటాను. – ఎన్. గో పాలకృష్ణ -
ఆయన కోసం కిష్కింధపురి చూస్తాను: అనిల్ రావిపూడి
‘‘నాకు హారర్ సినిమాలంటే భయం. కానీ, మా నిర్మాత సాహుగారి కోసం ‘కిష్కింధపురి’ చూస్తా’’ అని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలి పారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్ల పాటి దర్శకత్వంలో సాహు గార పాటి నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, బుచ్చిబాబు సానా, నిర్మాత సుస్మిత కొణిదెల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘సాయి శ్రీనివాస్ చాలా కష్టపడతాడు.తను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బిగ్ సక్సెస్ ఈ సినిమాతో రావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్కి ఆల్ ది వెరీ బెస్ట్. నిర్మాత సాహుగారితో ‘భగవంత్ కేసరి’ చేశాను. ఇప్పుడు ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం చేస్తున్నాను’’ అన్నారు. ‘‘రాక్షసుడు’లానే ‘కిష్కింధపురి’ కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు బుచ్చిబాబు. ‘‘కిష్కింధపురి’ ట్రైలర్ అదిరి పోయింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అని సుస్మిత కొణిదల. చెప్పారు. -
నా చిన్నప్పుడే పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు: హీరో తేజ సజ్జా
‘‘మనం ఎంత ఖర్చుపెట్టినా ప్రేక్షకుల నమ్మకాన్ని కొనలేం. సినిమాలు స్పీడ్గా చేయాలని, రెండు మూడు సినిమాలు వరుసగా చేసేసి, ప్రేక్షకులను ఒక్కసారి నిరుత్సాహపరిచినా నాకు బాధగా ఉంటుంది. నేను దక్కించుకున్న క్రెడిబిలిటీ, నా కష్టం తాలూకు విలువ పోతుంది. నా సినిమా వస్తోంది... థియేటర్స్కు రండి అని ఆడియన్స్ని నేను కాన్ఫిడెంట్గా, ధైర్యంగా పిలిచేలా నా సినిమాలు ఉండాలనుకుంటాను. ‘మిరాయ్’ ఇలాంటి చిత్రమే’’ అని తేజ సజ్జా అన్నారు. తేజ సజ్జా హీరోగా నటించిన చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం తేజ సజ్జా చెప్పిన సంగతులు. ⇒ ఫుల్ ఫ్యామిలీ అండ్ క్లీన్ ఫిల్మ్ ‘మిరాయ్’. యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్, డివోషన్, ఎలివేషన్... ఇలా అన్ని అంశాలు ఉన్న చిత్రం ఇది. చార్మినార్లోని కుర్రాడు వాడి ధర్మం ఏంటో వాడు గ్రహించి, తనకి, యోధ ప్రపంచానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుని, ఓ పెద్ద ఆపదను ఆపడానికి ఎంత దూరం వెళ్లాడు? తల్లి ఆశయం కోసం ఏం చేశాడు? ప్రపంచం అంతరించబోతున్నటువంటి ఓ పెద్ద ఆపద రాబోతున్నప్పుడు మన ఇతిహాసాల్లో వేల సంవత్సరాల క్రితం పెట్టి ఉంచిన సమాధానాన్ని ఈ కుర్రాడు ఎలా కనుక్కుంటాడు? అన్నది ఈ సినిమా కథాంశం. ⇒ ఈ చిత్రంలో తొమ్మిది యాక్షన్ సీక్వెన్స్లు వరకు ఉన్నాయి. వయసులో ఉన్నాను కాబట్టి ఫిజికల్ చాలెంజ్లు ఏం అనిపించలేదు. ఈ సీక్వెన్స్లు చూసి, ఆడియన్స్ ఎంత థ్రిల్ అవుతారో చూడాలనుకుంటున్నాను. టీజీ విశ్వప్రసాద్గారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఆడియన్స్కు నచ్చే మంచి సినిమా తీద్దామనుకునే నిర్మాత. ఆయనలాంటి నిర్మాతలు అరుదు. అందుకే ఆయనతో మరో సినిమా చేస్తున్నాను. ⇒ నా చిత్రాలతో ఆడియన్స్ని సర్ప్రైజ్ చేయాలని తపన పడుతుంటాను. కొత్తదనంతో కూడిన సినిమాలు చేయాలనుకుంటాను. ఆ ప్రెజర్ ఉంది. కానీ ‘హను–మాన్’ సినిమా సక్సెస్తో నాపై కొత్తగా పెరిగిన ఒత్తిడి ఏం లేదు. చె΄్పాలంటే ఒక రకంగా ‘హను–మాన్’ సినిమా విషయంలోనే ఒత్తిడి ఫీలయ్యాను. కొన్ని ఇబ్బందికర పరిస్థితుల మధ్య ఆ సినిమా విడుదలైంది. ఈ సినిమా విజయం సాధించింది కదా అని ‘మిరాయ్’ సినిమాలో మార్పులు చేర్పులు చేయలేదు. ⇒ మా నాన్నగారు హార్డ్వర్కింగ్ పర్సన్. ఆయన వయసు 65. ఈ రోజుకీ ఆయన ఉదయం 6.30కి ఉద్యోగానికి వెళ్తారు. సాయంత్రం 8 గంటలకు వస్తారు. పనిని ఫస్ట్ ప్లేస్లో పెట్టేవారిలో మా ఫాదర్ ఒకరు. అలాంటి ఇంటి నుంచి వస్తున్నాను కాబట్టే పనికి నేను ఇంత ప్రాధాన్యత ఇస్తున్నానేమో అనిపిస్తోంది. పనే దైవం అని భావిస్తాను. ⇒ కథ కుదరితే పాన్ ఇండియా స్థాయిలో నా సినిమా రిలీజ్ చేస్తాం. నిజానికి పాన్ ఇండియా సూపర్ స్టార్లు నా చిన్నప్పట్నుంచి ఉన్నారు. రామారావు, నాగేశ్వరరావుగార్ల సినిమాలు చెన్నైలో చూసేశారు. చిరంజీవిగారు స్ట్రయిట్గా హిందీలో సినిమాలు చేశారు. రజనీకాంత్, కమల్హాసన్గార్ల సినిమాలు నేను నా చిన్నప్పట్నుంచి చూస్తున్నాను. అలాంటి వారికి జోడించాల్సిన పాన్ ఇండియా స్టార్ ట్యాగ్ని నాలాంటి యంగ్ హీరోస్కి పెట్టడం ఏ మాత్రం కరెక్ట్ కాదని నమ్మేవారిలో నేనొకడిని. తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు మేం సినిమాలు చేస్తున్నాం. ఒకవేళ మేం చేసే చిత్రం ఇతర భాషల ఆడియన్స్కు కూడా నచ్చితే, అది మాకు బోనస్. దీని కోసం రిలీజ్ చేయడమే. అంతేకానీ... అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలన్న ప్రయత్నం ఏమీ లేదు. ⇒ ‘జై హనుమాన్’ చిత్రంలో నటిస్తున్నానా? లేదా అనేది ప్రశాంత్ వర్మగారు చెబుతారు. ‘జాంబిరెడ్డి 2’ సినిమాకు ఇంకా దర్శకుడు ఫిక్స్ కాలేదు. ప్రశాంత్గారు కథ అందిస్తున్నారు. విశ్వప్రసాద్గారు నిర్మిస్తారు. ‘మిరాయ్’ సినిమా విజయం సాధిస్తే, రెండో భాగం కూడా ఉంటుంది. -
కాంత వాయిదా
‘కాంత’ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. దుల్కర్ సల్మాన్, భాగ్య శ్రీ భోర్సే హీరో హీరోయిన్లుగా సముద్ర ఖని ఓ కీలక పాత్రలో నటించిన పీరియాడికల్ చిత్రం ‘కాంత’. 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ సినిమాను ఈ నెల 12న విడుదల చేయనున్నట్లుగా గతంలో చిత్రయూనిట్ పేర్కొంది. కానీ ఆ తేదీకి విడుదల చేయడం లేదని, త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని గురువారం చిత్రయూనిట్ ఓ నోట్ను విడుదల చేసింది. ‘‘కాంత’ సినిమా టీజర్ విడుదలైనప్పట్నుంచి మీరు చూపించిన ప్రేమ, ఆ ప్యాయత, మద్దతు మా హృదయాలను హత్తుకుంది. ఈ చిత్రానికి సంబంధించి మీకు మరింత మెరుగైన అనుభూతిని ఇవ్వాలనుకుంటున్నాం. ఆ దృష్ట్యా విడుదలను వాయిదా వేశామని తెలియజేస్తున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం’’ అని ‘కాంత’ చిత్రం యూనిట్ పేర్కొంది. -
కొత్త విలన్ గురూ
తెలుగు తెరపై కొత్త విలన్లు కనిపించనున్నారు. ఈ విలన్లకు తెలుగు తెలియదు. అయినా ఫైట్ చేయడానికి భాషతో పనేం ఉంది? ఇప్పుడు తెలుగులో సినిమాలు చేస్తున్న ఈ పరభాష విలన్లు తమ నటనతో ప్రేక్షకులకు కొత్త విలనిజమ్ని పరిచయం చేయనున్నారు. ఇక తెలుగులో చేస్తున్న ఈ కొత్త విలన్స్ గురించి తెలుసుకుందాం. ఓజీ వర్సెస్ ఓమి బాలీవుడ్ పాపులర్ యాక్టర్ ఇమ్రాన్ హష్మి తెలుగు ఎంట్రీ ‘ఓజీ’ సినిమాతో ఖరారైంది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన గ్యాంగ్స్టర్ ఫిల్మ్ ఇది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ ఓజాస్ గంభీర (ఓజీ)గా నటించగా, విలన్ ఓమీ పాత్రలో ఇమ్రాన్ హష్మి నటించారు. డివీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటించగా, అర్జున్ దాస్, ప్రకాశ్రాజ్, శ్రియా రెడ్డి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే అడివి శేష్ హీరోగా నటిస్తున్న ‘జీ2’ (గూఢచారి 2) చిత్రంలోనూ ఇమ్రాన్ హష్మి నటిస్తున్నారు. ఈ చిత్రంలోనూ ఇమ్రాన్ విలన్గా నటిస్తున్నారని తెలిసింది. రామ్ బుజ్జిగా వస్తున్నాడు హిట్ వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’లో మున్నాగా మంచి నటన కనబరిచారు దివ్యేందు శర్మ. ఈ పాపులర్ సిరీస్ను తెలుగు ప్రేక్షకులూ వీక్షించారు. ఈ ‘మిర్జాపూర్’ మున్నా ఇప్పుడు టాలీవుడ్కు వచ్చారు. రామ్చరణ్ హీరోగా నటిస్తున్న మల్టీ స్పోర్ట్స్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో దివ్యేందు శర్మ ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. రామ్బుజ్జిగా దివ్యేందు కనిపిస్తారు. రామ్చరణ్ క్రికెట్ బ్యాటింగ్ – దివ్యేందు బౌలింగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయట.అలాగే దివ్యేందు పాత్రలో కొంత నెగటివ్ షేడ్స్ ఉంటాయని టాక్. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, శివ రాజ్కుమార్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాల సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 27న విడుదల కానుంది. ఇక ‘మిర్జాపూర్’ సిరీస్తో పాటు ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్కథ, 2016: ది ఎండ్, అగ్ని’ వంటి చిత్రాల్లో నటించారు దివ్యేందు. ఈ బాలీవుడ్ నటుడికి తెలుగులో ‘పెద్ది’ తొలి చిత్రం. వృషకర్మలో.. సూపర్ హిట్ హిందీ చిత్రం ‘లాపతా లేడీస్’లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు స్పర్ష్ శ్రీవాత్సవ్. ఈ బాలీవుడ్ యువ నటుడిని నాగచైతన్య తెలుగులోకి ఆహ్వానించారు. నాగచైతన్య హీరోగా నటిస్తున్న అడ్వెంచరస్ అండ్ మిథికల్ మూవీ ‘వృషకర్మ’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో స్పర్‡్ష శ్రీవాత్సవ్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. అయితే ‘లాపతా లేడీస్’లో పాజిటివ్ రోల్ చేసిన స్పర్‡్ష శ్రీవాత్సవ్ ‘వృషకర్మ’ చిత్రంలో మాత్రం నెగటివ్ రోల్ చేస్తున్నారట. ‘విరూ పాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఈ సినిమాను బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్. బి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది. పోటా పోటీ బాలీవుడ్ యాక్షన్ హిట్ ఫిల్మ్ ‘కిల్’ (2023)లో విలన్గా నటించి, ఆడియన్స్ను మెప్పించారు రాఘవ్ జూయల్. లక్ష్య హీరోగా నటించిన ఈ చిత్రంలో రాఘవ్ విలనిజం యాక్షన్ ప్రియులకు కూడా కొత్తగా అనిపించింది. దీంతో రాఘవ్ జూయల్ పేరు బాలీవుడ్తో పాటు ఇతర ఇండస్ట్రీలోనూ కాస్త గట్టిగానే వినిపించింది. అలా పాన్ ఇండియన్ మూవీ ‘ది ప్యారడైజ్’లో నటించే అవకాశం రాఘవ్కు లభించింది. ‘దసరా’ వంటి హిట్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ సినిమా ‘ది ప్యారడైజ్’.ఈ చిత్రంలో రాఘవ్ జూయల్ నటిస్తున్నట్లుగా ఆల్రెడీ చిత్రయూనిట్ స్పష్టం చేసింది. ఓ మెయిన్ విలన్ రోల్ని రాఘవ్ చేస్తున్నారని, నానీతో రాఘవ్కు పోటా పోటీ సన్నివేశాలు ఉంటాయని టాక్. ‘ది ప్యారడైజ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 మార్చి 26న విడుదల కానుంది. ఇక బాలీవుడ్లో ‘కిల్’తో పాటు ప్రభుదేవా ‘ఏబీసీడీ 2, సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’, సిద్ధాంత్ చతుర్వేది ‘యుద్ర’ వంటి చిత్రాల్లో మంచి నటన కనబరిచి, నార్త్ ఆడియన్స్ను అలరించారు రాఘవ్. మరి... టాలీవుడ్లోనూ రాణిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇన్స్పెక్టర్ స్వామి అడివి శేష్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ‘డెకాయిట్’. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. కెమెరామేన్ షానియల్ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా ఈ చిత్రంలో ప్రకాశ్రాజ్, సునీల్తో పాటు బాలీవుడ్ దర్శక–నిర్మాత–నటుడు అనురాగ్ కశ్యప్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ఇన్స్పెక్టర్ స్వామి అనే పాత్రలో కనిపిస్తారు. అయితే కథ రీత్యా ఇన్స్పెక్టర్ స్వామి క్యారెక్టరైజేషన్లో కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని ఫిల్మ్నగర్ సమచారం. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. కాగా దొంగతనాన్ని వృత్తిగా స్వీకరించిన ఓ అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకుంటారు. కానీ ఊహించని పరిస్థితుల కారణంగా ఈ ఇద్దరూ కలిసి ఓ క్రైమ్ చేయాల్సి వస్తుంది? అప్పుడు ఏం జరుగుతుంది? అన్నదే క్లుప్తంగా ‘డెకాయిట్’ సినిమా కథాంశం.డ్రాగన్తో పోటీ! ‘మిన్నల్ మురళి, 2018, ఏఆర్ఎమ్’ వంటి మలయాళ చిత్రాల్లో హీరోగా నటించి, తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు టొవినో థామస్. కాగా, ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డ్రాగన్’ సినిమాలో టొవినో థామస్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారని సమాచారం. అయితే ఈ చిత్రంలో టొవినో థామస్ చేస్తున్నది విలన్ రోల్ అని, ఆల్రెడీ ‘డ్రాగన్’ షూటింగ్లో ఆయన పాల్గొంటున్నారనే ప్రచారం జరుగుతోంది.త్వరలోనే ఈ సినిమా విదేశీ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్తో పాటు ఈ చిత్రం కీలక తారాగణం అంతా షూటింగ్లో పాల్గొంటారని తెలిసింది. రుక్మీణీ వసంత్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిల్మ్స్, మైత్రీ మూవీ మేకర్స్ల సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జూన్ 25న విడుదల కానుంది.తెలుగులో విలన్స్గా చేస్తున్న నటీమణులూ ఉన్నారు..బాలీవుడ్ నటి సోనాక్షీ సిన్హా నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ‘జటాధర’. సుధీర్బాబు హీరోగా నటిస్తున్న ఈ ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రంలో సోనాక్షీ సిన్హాతో పాటు దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో సోనాక్షీ సిన్హా, శిల్పా శిరోద్కర్ పాత్రల్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని సమాచారం. దాదాపు పదిహేనేళ్ల తర్వాత శిల్పా శిరోద్కర్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్న చిత్రం ఇది. జీ స్టూడియోస్, ప్రేరణా అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, నిఖిల్ నందా, అరుణ అగర్వాల్, శిల్ప సింగాల్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ⇒ హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్ ఉంటారనే ప్రచారం జరుగుతోంది. దీపికా పదుకోన్ ఆల్రెడీ కన్ఫార్మ్ అయ్యారు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారని తెలిసింది. అయితే మృణాల్ గురించిన అధికారక ప్రకటన లేదు. అలాగే ఈ చిత్రంలో రష్మికా మందన్నా కూడా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది.అయితే ఈ సినిమాలో రష్మికా మందన్నా పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయని, ఆమె విలన్ రోల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఆగస్టులో విడుదలవుతుందనే ప్రచారం సాగుతోంది. ఈ సంగతి ఇలా ఉంచితే... అల్లు అర్జున్, రష్మికా మందన్నాలు ‘పుష్ప’ ఫ్రాంచైజీలోని ‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్’ చిత్రాల్లో హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇటీవల ‘పుష్ప 3’ కూడా ఉంటుందని సుకుమార్ ఓ సందర్భంలో కన్ఫార్మ్ చేశారు. ఈ నేపథ్యంలో అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రంలో రష్మికా మందన్నా విలన్గా నటిస్తే, ఆమె పాత్ర ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సినిమా లవర్స్లో ఉండటం సహజం.నెగటివ్ క్యారెక్టర్స్ చేయడానికి సీనియర్ హీరోలు సైతం చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ చిత్రంలో నాగార్జున విలన్గా చేశారు. షారుక్ ఖాన్, ఆయన తనయ సుహానా ఖాన్ లీడ్ రోల్స్లో నటిస్తున్న ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రంలో అభిషేక్ బచ్చన్ విలన్ రోల్ చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి2898 ఏడీ’ చిత్రంలో కమల్హాసన్ విలన్ రోల్ చేస్తున్నారు.‘దోశె కింగ్’ అనే కొత్త చిత్రం కోసం మోహన్ లాల్ కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ‘భ్రమయుగం’ చిత్రంలో మమ్ముట్టి విలన్ రోల్ చేశారు. అలాగే జితిన్ కే జోస్ డైరెక్షన్లోని మరో సినిమాలో మమ్ముట్టి విలన్ రోల్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇలా... మరికొందరు సీనియర్ యాక్టర్స్ విలన్ రోల్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.కెరీర్లో హీరోగా మంచి పీక్ స్టేజ్లో ఉన్న యంగ్ యాక్టర్స్ కూడా విభిన్నమైన విలన్ రోల్ వస్తే చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘వార్ 2’లో ఎన్టీఆర్ విలన్గా నటించారు. హిందీలో ఎన్టీఆర్కు ఇది తొలి చిత్రం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘భైరవం’ చిత్రంలో విలన్గా నటించారు మంచు మనోజ్. తేజ సజ్జా హీరోగా నటించిన ‘మిరాయ్’లోనూ మనోజ్ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. మలయాళ దర్శక–నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ (బడే మియా చోటే మియా), ఫాహద్ ఫాజిల్ (పుష్ప 3), అర్జున్ కపూర్ (సింగమ్ ఎగైన్) వంటి చిత్రాల్లో విలన్ రోల్ చేశారు. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోనూ పృధ్వీరాజ్ విలన్గా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ‘పరాశక్తి’ చిత్రంలో తొలిసారిగా పూర్తి స్థాయి విలన్గా నటిస్తున్నారు జయం రవి. తెలుగు నటుడు సుహాస్ తమిళ చిత్రం ‘మండాడి’లో విలన్ రోల్ చేస్తున్నారు. ఈ కోవలో మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
టోరంటోలో జాన్వీ కపూర్ హోయలు.. ఊహల్లో తెలిపోతున్న బిగ్బాస్ దివి!
గుజరాత్లో శ్వేతా బసు ప్రసాద్ టూర్..డిజైనర్ డ్రెస్లో రష్మిక మందన్నా సూపర్బ్ లుక్..టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్..అంతా నీ ఆలోచనలే అంటూ బిగ్బాస్ దివి ప్రేమ కావ్యం..బ్లాక్ బ్యూటీలా జ్యోతి పూర్వాజ్ హోయలు.. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
థియేటర్లలో మిరాయ్, కిష్కింధపురి... ఓటీటీల్లో ఏకంగా 17 సినిమాలు!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక ఈ శుక్రవారం థియేటర్లలో రెండు సినిమాలు రిలీజ్ రెడీ అయిపోయాయి. బాక్సాఫీస్ వద్ద మిరాయ్, కిష్కింధపురి సందడి చేయనున్నాయి. ఈ చిత్రాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే ఫ్రైడే వచ్చిందంటే స్ట్రీమింగ్కు రెడీ అయిపోతున్నాయి. ఈ వారం హిందీలో బిగ్ హిట్ కొట్టిన సయారా, తెలుగులో బకాసుర రెస్టారెంట్, రాంబో ఇన్ లవ్ లాంటి వెబ్ సిరీస్లు ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో పాటు తెలుగు డబ్బింగ్ సినిమాలు, పలు హాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్లు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్సయారా (హిందీ సినిమా) - సెప్టెంబరు 12యూ అండ్ ఎవరిథింగ్ ఎల్స్(కొరియన్ సిరీస్)- సెప్టెంబర్ 12మాలెడిక్షన్స్-(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 12రటు రటు క్వీన్స్-(ఇండోనేషియా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12ది రాంగ్ పారిస్(హాలీవుడ్ సినిమా)- సెప్టెంబర్ 12మెటిరియలిస్ట్స్(హాలీవుడ్ చిత్రం)- సెప్టెంబర్ 14అమెజాన్ ప్రైమ్డూ యూ వాన్నా పార్టనర్ (హిందీ వెబ్ సిరీస్) - సెప్టెంబరు 12ఎవ్రీ మినిట్ కౌంట్స్ - సీజన్ 2 (స్పానిష్ వెబ్ సిరీస్) - సెప్టెంబరు 12ల్యారీ ద కేబుల్ గాయ్- (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 12జెన్ వీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 12స్క్రీమ్ బోట్- (ఇంగ్లీష్ మూవీ)-సెప్టెంబరు 12జియో హాట్ స్టార్రాంబో ఇన్ లవ్ (తెలుగు వెబ్ సిరీస్) - సెప్టెంబరు 12సన్ నెక్ట్స్మీషా (మలయాళ సినిమా) - సెప్టెంబరు 12బకాసుర రెస్టారెంట్ (తెలుగు మూవీ) - సెప్టెంబరు 12లయన్స్ గేట్ ప్లేడిటెక్టివ్ ఉజ్వలన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 12ద రిట్యూవల్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 12హులు అండ్ డిస్నీ ప్లస్లాస్ట్ ఇన్ ది జంగిల్- (డాక్యుమెంటరీ ఫిల్మ్)- సెప్టెంబర్ 12హెచ్బీవో మ్యాక్స్వార్ఫేర్-(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 12 -
పవన్ కల్యాణ్ ఓజీ.. ఆ సాంగ్ రిలీజ్
పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే పవన్ కల్యాణ్ పుట్టినరోజున కారుపై ఓజీ కూర్చున్న ఓ కొత్త లుక్ రిలీజ్ చేశారు. దీంతో పాటు గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి ఓమి అనే సాంగ్ను విడుదల చేశారు. ఈ సాంగ్లో ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మీ కనిపించారు. ఈ పాటకు అద్వితీయ లిరిక్స్ అందిచంగా.. శ్రుతి రంజని, ప్రణతి, శ్రుతిక, అద్వితీయ ఆలపించారు. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. -
'మీ ఇద్దరే గొడవ పెట్టుకుంటున్నారు'.. మర్యాద మనీశ్ ఫైర్!
తెలుగువారి రియాలిటీ షో బిగ్బాస్ బుల్లితెర ప్రియులను అలరిస్తోంది. మొదటి వారం నుంచే హౌస్ హాట్హాట్గా సాగుతోంది. నామినేషన్స్ తంతు ముగియగానే ఒకరిపై ఒకరు తమ ఆగ్రహాన్ని ప్రదరిస్తునే ఉన్నారు. ఇవాళ కెప్టెన్సీ టాస్క్ కావడంతో ఎపిసోడ్ ఫుల్ సీరియస్గా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.తాజాగా ఇవాల్టి బిగ్బాస్ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో మర్యాద మనీశ్, ప్రియా శెట్టి, శ్రీజ దమ్ముల మధ్య పెద్ద వార్ నడిచింది. మీ ఇద్దరు ప్రతి విషయంలో గొడవ పెట్టుకుంటున్నారని ప్రియా, శ్రీజపై మర్యాద మనీశ్ మండిపడ్డారు.నేను కామ్గా ఉన్నానని నన్ను సెపరేట్ చేయడానికి ట్రై చేయకండి అన్నాడు. ఆ తర్వాత ప్రియాశెట్టి.. మర్యాద మనీశ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ ప్రోమో చూస్తుంటే హౌస్లో కంటెస్టెంట్స్ మధ్య ఫుల్ ఫైటింగ్ నడిచినట్లు తెలుస్తోంది.Fights heating up! 🔥 #PriyaShetty & #SrijaDammu Vs #ManishMaryada🤯Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat–Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow pic.twitter.com/EUTUXSKlR4— JioHotstar Telugu (@JioHotstarTel_) September 11, 2025 -
ఈ లవ్ స్టోరీ చూసి ఫుల్ ఎంటర్టైన్ అయ్యా: అల్లు అర్జున్ ప్రశంసలు
టాలీవుడ్లో ఇటీవలే విడుదలైన చిన్న సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. లిటిల్ హార్ట్స్ తన మనసును దోచుకుందని ట్వీట్ చేశారు. చాలా సరదాగా నవ్వులు పూయించారని అల్లు అర్జున్ కొనియాడారు. ఈ యంగ్ లవ్ స్టోరీ చాలా కొత్తగా, వినోదంగా అనిపించిందని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా లిటిల్ హార్ట్స్ చిత్ర బృందానికి తన అభినందనలు తెలియజేశారు ఐకాన్ స్టార్. డైరెక్టర్ సాయి మార్తాండ్ పనితీరు తనకు నచ్చిందని.. మ్యూజిక్ రిఫ్రెసింగ్గా అనిపించిందని పోస్ట్ చేశారు. ఈ ప్రత్యేక చిత్రాన్ని థియేటర్లకు తీసుకువచ్చినందుకు నిర్మాత బన్నీ వాసుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.Watched #LittleHearts yesterday… What a funnn & laughter ride! No melodrama, no gyan… just full entertainment. A very fresh, young love story. A blast by the lead @mouli_talks, a sweet presence by @shivani_nagaram, and candid performances by friends & other artists. Loved the… pic.twitter.com/0ycrtuD4tg— Allu Arjun (@alluarjun) September 11, 2025 -
రజినీకాంత్ కూలీ.. పూజా హెగ్డే మోనికా వచ్చేసింది!
రజినీకాంత్ హీరోగా వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం కూలీ. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ పాత్రలో మెప్పించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజాగా ఈ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది. పూజాహెగ్డే తన డ్యాన్స్తో మెప్పించిన మోనికా ఫుల్ వీడియో సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటలో సౌబిన్ షాహిర్ ఆడియన్స్ను మెప్పించారు.కాగా.. పాటను తమిళంతో పాటు మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ వర్షన్స్ కూడా విడుదల చేశారు. గతంలో కుర్రకారును ఓ రేంజ్లో ఊపేసిన మోనికా ఫుల్ సాంగ్ చూసి ఎంజాయ్ చేయండి. మరోవైపు ఈ సూపర్ హిట్ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, అమీర్ ఖాన్ వంటి స్టార్స్ నటించారు. ఈ సినిమా హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ -2తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన సంగతి తెలిసిందే. Finally, Our Monica Bellucci erangi vandhachi 💃🏻 #Monica video song is out now! 💘Tamil ▶️ https://t.co/HqBfqY7AdbTelugu ▶️ https://t.co/tnMJvrUCZBHindi ▶️ https://t.co/SDtC7RjCdyKannada ▶️ https://t.co/BrwN1rAbV7Malayalam ▶️ https://t.co/viT48NIpOR@rajinikanth… pic.twitter.com/Qoy1Y3rhdc— Sun Pictures (@sunpictures) September 11, 2025 -
అమ్మవారికి రూ.4 కోట్ల విలువైన కిరీటం సమర్పించిన ఇళయరాజా
కర్ణాటకలోని కొల్లూరు మూకాంబిక అమ్మవారికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా రూ. 4 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన వెండి కిరీటాన్ని బహుకరించారు. తాజాగా అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన ఆయన.. స్వయంగా ఈ కిరీటంతో పాటు వీరభద్ర స్వామికి వెండి ఆయుధాన్ని అందజేశారు. గుడి అర్చకులు దగ్గర ఉండి ఇళయరాజాతో పూజలు చేయించారు. అనంతరం తీర్థ ప్రసాదాలతోపాటు అమ్మవారి ఫొటో అందజేశారు. ఇళయరాజా వెంట ఆయన తనయుడు కార్తిక్, మనవడు యతీశ్ తదితరులు ఉన్నారు. ఇళయరాజాకు దైవభక్తి ఎక్కువే. తరచు ఆయన మూకాంబిక అమ్మవారి దర్శనానికి వెళ్తుంటారు. 2006లో కూడా ఆయన అమ్మవారికి ఓ కిరీటం బహుమతిగా ఇచ్చారు.కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో... దట్టమైన అడవుల మధ్యన నెలకొని ఉంది మూకాంబికాలయం. ఆ రాష్ట్రంలోని ఏడు మోక్షపురాల్లో కొల్లూరు మూకాంబిక గుడి ఒకటి. ఆలయం ఉన్నది కర్ణాటక రాష్ట్రంలో అయినా, ఆమెను ఎక్కువగా సందర్శించుకునేది కేరళీయులే కావడం విశేషం. -
ఐసీయూలో ఉన్నాడు.. సాయానికి ముందుకు రండి: మంచు మనోజ్ విజ్ఞప్తి
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. మన రామచంద్రకు సాయం చేయాలంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రామచంద్ర ఐసీయూలో ఉన్నారని.. ఈ సమయంలో మనమంతా అతనికి అండగా నిలవాలని కోరారు. ఆ కుటుంబానికి సాయం చేసి మీ ప్రేమ, మద్దతు తెలపాలని మనోజ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. రామచంద్ర ఫ్యామిలీకి సంబంధించిన బ్యాంక్ ఖాతా వివరాలు పొందుపరిచారు.ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం అతను మంచం పైనుంచి కదల్లేని స్థితిలో ఉన్నాడు. పెరాలసిస్ సోకడంతో పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. తన తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారని, తన తమ్ముడే బాగోగులు చూసుకుంటున్నాడని గతంలో రామచంద్ర వెల్లడించారు.కాగా.. 'వెంకీ' సినిమాలో హీరో రవితేజ ఫ్రెండ్గా నటించి ఆకట్టుకున్న కమెడియన్ రామచంద్ర. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'నిన్ను చూడాలని' సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఆనందం, సొంతం, వెంకీ, కింగ్, దుబాయి శీను, లౌక్యం తదితర చిత్రాల్లో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓవరాల్ కెరీర్లో 100కి పైగా చిత్రాల్లో నటించారు.Urgent 🚨 Namasthe All🙏🏻 Our dearest Rama Chandra garu is fighting for his life in the ICU. Now is the time for us to come together. Please show your love and support by contributing whatever you can even if it’s just 1 rupee.Details: Kalaga NarayanaGPay & PhonePe:…— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 11, 2025 -
లావణ్య త్రిపాఠికి ‘టన్నెల్’ విషెస్.. రిలీజ్ వాయిదా!
మెగా జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి బుధవారం (సెప్టెంబర్ 10) పండంటి బిడ్డకు జన్మను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ అంతా కూడా సంతోషంలో మునిగి తేలుతున్నారు. అభిమానులు, శ్రేయోభిలాషుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ‘టన్నెల్’ చిత్రబృందం కూడా లావణ్యకు విషెస్ తెలియజేసింది. ఈ చిత్రంలో అథర్వ మురళి, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు.రవీంద్ర మాధవ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 12న విడుదల విడుదల కావాల్సి ఉండగా.. ప్రస్తుతం ఓ వారం వాయిదా వేశారు. అలా ఈ మూవీని సెప్టెంబర్ 19న గ్రాండ్గా థియేటర్లోకి తీసుకు వచ్చేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.‘టన్నెల్’ ఓ యాక్షన్-థ్రిల్లర్ మూవీ అని టీజర్, ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. అడ్రినల్ రష్ ఇచ్చేలా, ఉత్కంఠ రేకెత్తించేలా సస్పెన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లు అందరినీ సర్ ప్రైజ్ చేసేలా ఉన్నాయి. క్రైమ్లు చేస్తున్న సైకోని పోలీస్ ఆఫీసర్ ఎలా పట్టుకున్నాడు? అనే పాయింట్తో ‘టన్నెల్’ రాబోతోంది. -
ఆ కేసులో హీరోయిన్ హన్సికకు షాక్..!
హీరోయిన్ హన్సిక సినిమాల కంటే వ్యక్తిగత వివాదాలతోనే వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే ఆమె తన భర్తతో విడిపోతోందంటూ రూమర్స్ గట్టిగానే వినిపించాయి. తన ఇన్స్టా అకౌంట్ నుంచి హన్సిక పెళ్లి ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయడంతో రూమర్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా సోహెల్కు రెండో పెళ్లి కావడంతోనే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని మరో టాక్ వినిపించింది. అయితే ఇవన్నీ చూస్తుంటే తనకు నవ్వొస్తుందని హన్సిక కొట్టిపారేసింది.ఈ సంగతి అటుంచితే గతంలో హన్సికతో ఆమె తల్లి జ్యోతిలపై సోదరుడి భార్య ముస్కాన్ గృహ హింస కేసు పెట్టారు. తనను వేధింపులకు గురి చేశారని బుల్లితెర నటి ముస్కాన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో ఇప్పటికే హన్సిక, ఆమె తల్లికి ముంబయి సెషన్స్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. కానీ ఈ కేసును క్వాష్ చేయాలంటూ హన్సిక బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.తాజాగా హన్సిక పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆమె విజ్ఞప్తిని తిరస్కరించింది. హన్సిక దాఖలు చేసిన పిటిషన్ బాంబే హైకోర్టు కొట్టిపారేసింది. దీంతో ఈ కేసులో నిరాశే ఎదురైంది. కాగా.. హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ.. టీవీ నటి ముస్కాన్ జేమ్స్ను 2020లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2022లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో హన్సికతో పాటు సోదరుడు ప్రశాంత్, తల్లి జ్యోతిలపై ముస్కాన్ ఫిర్యాదు చేసింది. -
వరుణ్ తేజ్కు పోలాండ్ యువకుడు అభినందనలు.. సోషల్ మీడియాలో వైరల్!
మెగా హీరో వరుణ్ తేజ్ తండ్రయ్యారు. ఆయన సతీమణి, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వరుణ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్తో పాటు అభిమానులంతా ఈ జంటకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత రామ్ చరణ్ సైతం వరుణ్ తేజ్కు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు.తాజాగా వరుణ్ తేజ్కు పోలాండ్కు చెందిన జాక్ అభినందనలు తెలిపారు. వరుణ్ తేజ్తో కలిసి మిస్టర్ చిత్రంలో నటించానని జాక్ వెల్లడించారు. నా సహనటుడు మిస్టర్ వరుణ్ తేజ్ తండ్రి కావడం గర్వంగా ఉందని పోస్ట్ చేశారు. మెగా కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పోస్ట్ చేశాడు. మిస్టర్ షూటింగ్లో వరుణ్ తేజ్తో ఉన్న ఫోటోలను ట్విటర్లో పంచుకున్నారు. పోలాండ్ యువకుడు చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.కాగా.. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ మూవీలో వరుణ్ తేజ్ హీరోగా నటించారు. ఈ సినిమాలో హీరోయిన్గా లావణ్య త్రిపాఠి కనిపించింది. ఈ చిత్రం 2017లో థియేటర్లలో విడుదలైంది.Congrats to my costar of the Film #Mister @IAmVarunTej on being a proud Father to a baby Boy.May the new Born follow the Legacy and be a product of the iconic Mega family and follow the foot steps of @KChiruTweets, @NagaBabuOffl and #powerstar @pawankalyan and be successful in… pic.twitter.com/eG1KK9VeXl— Zbigniew A C (@ZbigsZach) September 10, 2025 -
తెలుగు సీరియల్.. నా కూతురికి నరకం చూపించారు: చైల్డ్ ఆర్టిస్ట్ తల్లి
ఓ తెలుగు సీరియల్ వల్ల తన కూతురు నరకం చూసిందంటోంది చైల్డ్ ఆర్టిస్ట్ నిషిత (Nishita) తల్లి ప్రియ. అందుకు సంబంధించిన సాక్ష్యాలను సైతం బయటపెట్టింది. సెట్లో చిన్నారికి కరెంట్ షాక్ కొట్టిందని, ఆరోగ్యం బాగోలేకపోయినా షూటింగ్ చేయించారని వాపోయింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో రిలీజ్ చేసింది.చిన్నారికి కరెంట్ షాక్'అందులో నిషితను గార్డెన్ ఏరియాలో లైట్స్ ఉన్న దగ్గర పడుకోబెట్టారు. అక్కడున్న లైట్స్ ద్వారా కరెంట్ షాక్ రావడంతో ఆ పాప నిస్సహాయ స్థితిలో కేకలేసింది. మరో సీన్లో తను భయపడుతున్నా సరే బలవంతంగా స్విమ్మింగ్ పూల్లోకి లాగారు. అక్కడ తనకోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? కొన్నిసార్లు ఆరోగ్యం బాగోలేక బెడ్పై ఉన్నా సరే.. తనకు విశ్రాంతి ఇవ్వకుండా షూటింగ్కు రమ్మని ఒత్తిడి తెచ్చారు. అనారోగ్యంతోనే తను సెట్కు వచ్చి షూట్ చేయాల్సి వచ్చింది. రెమ్యునరేషన్ ఆపేశారుచిన్నపాప అని ఆలోచించకుండా రాత్రిపూట షూటింగ్స్కు రమ్మనేవారు. సీరియల్ నిర్మాతలు చైల్డ్ ఆర్టిస్టుల పట్ల ఇలాగే ప్రవర్తిస్తారా? అలాగే వీరు ఏప్రిల్ నుంచి రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఆపేశారు. పని చేయించుకున్నారు, కానీ డబ్బులివ్వలేదు. దాదాపు 150 ఎపిసోడ్ల తర్వాత సడన్గా నా కూతురిని తొలగించి మరొకరిని తీసుకున్నారు. తనకు ఒంట్లో బాగోలేకపోయినా, ఎంత ఇబ్బందిపడ్డా సరే అవన్నీ ఓర్చుకుని పని చేసింది. చివరకు ఇదా మీరు తనకిచ్చే బహుమతి?టీఆర్పీ కోసం వాడుకున్నారుమీరు నా కూతురిని రీప్లేస్ చేయగలరేమో కానీ తన టాలెంట్ను కాదు. టీఆర్పీ కోసం నెలల తరబడి తనను వాడుకున్నారు. ఇప్పుడేమో ఎక్స్పెన్సివ్ కిడ్ అని పక్కన పెట్టేశారు. ఈ సీరియల్ కోసమే ఎన్నో ప్రాజెక్టులను కాదనుకున్నాం. ఇప్పుడు ఒక్క మాటైనా చెప్పకుండా తీసేశారు' అని నిషిత తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. కాగా నిషిత.. కన్నడంలో లక్ష్మీ నివాస సీరియల్లో నటించింది. ఇందులో పోషించిన ఖుషి పాత్రతో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. View this post on Instagram A post shared by Priya v (@priyaseervi321) View this post on Instagram A post shared by Priya v (@priyaseervi321) చదవండి: హౌస్ మొత్తాన్ని అల్లాడించేసిన సంజనా, ఇప్పుడేకంగా కెప్టెన్! -
ఫ్లాష్ బ్యాక్...అన్నయ్యతో ఆన్ స్క్రీన్ రొమాన్స్!
నటనే అయినప్పటికీ కూడా నిజ జీవితంలో అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు... తెరపై జంటగా కనిపించడాన్ని భారతీయ ప్రేక్షకులు ఏ మాత్రం ఒప్పుకోరు. అందుకే నటనను ఎంత ప్రొఫెషనల్గా తీసుకున్నప్పటికీ అలాంటి సాహసం మన దేశంలోని ఏ నటిగానీ ఏ నటుడుగానీ చేయరు. కానీ చాలా కాలం క్రితమే అలాంటి ధైర్యం చేసింది ఓ అందాల బాలీవుడ్ నటి. తన స్వంత అన్నయ్యతో రొమాంటిక్ జోడిగా నటించి, నర్తించి ఆ తర్వాత జనాగ్రహానికి గురైంది. ఆమె పేరు మిను ముంతాజ్.భారతీయ సినిమాలో ప్రతిభావంతులైన నృత్యకారిణి, క్యారెక్టర్ నటిగా ప్రసిద్ధి చెందిన మిను ముంతాజ్, ముంబైలో జన్మించిన ఆమె తండ్రి ముంతాజ్ అలీ కూడా ప్రముఖ నటుడు నృత్యకారుడు కూడా. ఆమె అతని నుంచి నృత్య కళను నేర్చుకోవడం దగ్గర నుంచి అతని అడుగుజాడల్లోనే నడిచింది, కాలక్రమంలో ఆమె తండ్రి మద్యానికి బానిసగా మారాడు. దాంతో టీనేజ్లోనే మిను కుటుంబ ఆర్థిక భారాన్ని మోయవలసి వచ్చింది.నటనపై ఇష్టం అనే కన్నా సంపాదన కోసమే మిను 1955లో 13 సంవత్సరాల వయసులో నానాభాయ్ భట్ చిత్రం హకీమ్ ద్వారా తెరంగేట్రం చేసింది. ఆమె తల్లికి ఇష్టం లేకున్నా, సినిమా కెరీర్ను తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, మిను ముంతాజ్ తన కుటుంబాన్ని పోషించడానికి తప్పనిసరై నటనను కొనసాగించింది. 14 సంవత్సరాల వయస్సులోనే పలు విజయవంతమైన చిత్రాలలో నటించి ప్రజాదరణ పొందింది. హిందీ చిత్ర పరిశ్రమలో 1950లు 60లలో, ఆమె ప్రముఖ సెలబ్రిటీగా మారింది. అప్పటి చాలా మంది తారల్లాగే మిను ముంతాజ్ది కూడా ఒక పెద్ద కుటుంబం ఆమెకు నలుగురు సోదరులు నలుగురు సోదరీమణులు ఉండేవారు. ఆమె అన్నయ్య మెహమూద్ సైతం అప్పటికే బాలీవుడ్లో స్థిరపడిన హాస్య నటుడు. అతను నటించిన హౌరా బ్రిడ్జి సినిమా 1958 లో విడుదలైంది. అయితే ఈ సినిమాలో ‘‘కోరా రంగ్ సునారియా కలి’’ అనే రొమాంటిక్ పాటలో మెహమూద్ సరసన మిను ముంతాజ్ ప్రియురాలిగా హొయలొలికిస్తూ నటించారు. సినిమా విడుదలైన తర్వాత, ఆ రొమాంటిక్ పాత్రలో నటించిన నటులు నిజ జీవితంలో తోబుట్టువులని తెలుసుకుని ప్రేక్షకులు షాక్కి గురయ్యారు. ఈ తారల నైతికత కుటుంబ సంబంధాల సున్నితత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజలు వీధుల్లో కి వెళ్లి మరీ నిరసన తెలిపారు. దీనికి స్పందించిన నటులు క్షమాపణ చెప్పడమే కాక మిను ముంతాజ్ తాను కుటుంబ ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా మాత్రమే ఆ పనిచేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో కొంత కాలానికి ఆ వివాదం సద్దుమణిగింది. ఆ తర్వాత ఆ వివాదం ప్రభావమో మరొకటో గానీ మిను ముంతాజ్ స్వల్ప కాలంలోనే అవకాశాలు లేక పరిశ్రమకు దూరమై, ఒక దర్శకుడిని వివాహం చేసుకుని ు కెనడాలో స్థిరపడింది, అక్కడ నివసిస్తూ 2003లో, మిను ముంతాజ్ ఆరోగ్యం క్షీణించడం జ్ఞాపకశక్తి కోల్పోవడం ప్రారంభమైంది వైద్య పరీక్షల్లో ఆమెకు 15 సంవత్సరాలుగా గుర్తించబడని మెదడు కణితి ఉందని తేలింది. అనారోగ్యంతో చాలా కాలం పోరాడిన మిను ముంతాజ్ 2021లో మరణించారు, -
'అతని వివరాలు తెలిస్తే చెప్పండి.. లక్ష రూపాయలు ఇస్తా'
కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ సినిమాలు మాత్రమే కాదు.. సమాజ సేవలో దూసుకెళ్తున్నారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తనకు తెలిసిన మరుక్షణమే వెళ్లి దేవుడిలా సాయం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది పేద రైతులకు, విద్యార్థులకు తనవంతుగా ఆర్థికంగా అండగా నిలిచారు. ఇటీవలే పూరి గుడిసెలో జీవిస్తున్న ఓ దివ్యాంగురాలు శ్వేత కుటుంబానికి స్కూటీ బహుమతిగా ఇచ్చాడు.ఇది జరిగిన మూడు రోజుల్లోనే మరో వృద్ధ దంపతులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు రాఘవ లారెన్స్. చెన్నైలో లోకల్ ట్రైన్స్లో దాదాపు 80 ఏళ్ల వృద్ధుడు స్వీట్స్ విక్రయించడం సోషల్ మీడియాలో వైరలైంది. ఆ వయసులో తన భార్య చేసిన స్వీట్లను విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ వార్త పలు మీడియా ఛానెల్స్లో ఈ న్యూస్ రావడంతో ఇది చూసిన రాఘవ లారెన్స్ చలించిపోయారు.వెంటనే వారి వివరాలు కనుక్కుని రూ.లక్ష సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఎవరికైనా వారి వివరాలు తెలిస్తే తనకు తెలియజేయాలని ట్విటర్ వేదికగా కోరారు. వారి కోసం వివరాల కోసం ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదన్నారు. మీరు వారిని రైలులో చూసినట్లు అయితే అతని స్వీట్లు కొని వీలైన విధంగా వారికి మద్దతు నిలవండి అని లారెన్స్ విజ్ఞప్తి చేశారు. కాగా.. లారెన్స్ ప్రస్తుతం బుల్లెట్టు బండి సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత కాంచన 4 స్టార్ట్ చేయనున్నాడు.Today, A post reached me through social media about an 80 year old man and his wife in Chennai who make sweets and polis, selling them on trains to survive. Their resilience moved me deeply. 🙏I am ready to contribute ₹1,00,000 to support their journey, hoping it brings them… pic.twitter.com/yRYZj677Ze— Raghava Lawrence (@offl_Lawrence) September 10, 2025 -
ఆడియన్స్ పిచ్చోళ్లా.. ఇంత సపోర్ట్ చేస్తారా?: యంగ్ హీరో
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. భారీ అంచనాలతో వచ్చిన స్టార్ హీరోల సినిమాలు సైతం సరిగ్గా ఆడడం లేదు. ఇలాంటి సమయంలో తక్కువ బడ్జెట్ వచ్చిన చిన్న సినిమా ‘లిటిల్ హార్ట్స్’ భారీ విజయం సాధించింది. మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన ఈ చిత్రం రిలీజైన తొలిరోజే(సెప్టెంబర్ 5) హిట్ టాక్ తెచ్చుకొని.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం సక్సెస్ మీట్ని ఏర్పాటు చేసింది.ఈ సందర్భంగా హీరో మౌళి మాట్లాడుతూ ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించలేదని అన్నారు. ‘ఆడియన్స్.. పిచ్చోళ్లా మీరు. ఒక మంచి సినిమా వస్తే ఇంత సపోర్ట్ చేస్తారా. మేము అస్సలు ఊహించలేదు. మంచి సినిమా చేశామని తెలుసు. తొలి వారం కొంతమంది చూస్తారు. మౌత్ టాక్తో రెండో వారం నడుస్తుందేమో అనుకున్నాం. అలా అనుకొనే గట్టిగా ప్రమోషన్స్ చేశాం. అయినా కూడా ప్రేక్షకులు థియేటర్స్కి వస్తారా రారా అనుకున్నాం. కానీ ప్రీమియర్స్, ఫస్ట్ రోజు..థియేటర్స్ అన్ని నిండిపోయాయి. ఫస్ట్డే రూ.2.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇది మా సినిమా బడ్జెట్ కంటే చాలా ఎక్కువ. పిచ్చోళ్లం అయిపోయాం. మమ్మల్ని నమ్మి సినిమాకు వచ్చిన ఆడియన్స్కి థ్యాంక్స్. ఈ వారం ఎన్నిసార్లు ఏడ్చానో నాకే తెలియదు. ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తునారనో నాకే అర్థం కాలేదు. ఎవరైనా సినిమా బాగోలేదని కామెంట్ పెడితే.. వాళ్లను తిడుతూ రిప్లై ఇస్తున్నారు. రవితేజ, నాని మొదలు ఇండస్ట్రీ పెద్దలంతా మా సినిమాను మొచ్చుకుంటూ ట్వీట్స్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇలానే కష్టపడి మంచి సినిమాలు తీస్తానని అందరికి మాట ఇస్తున్నా’ అన్నారు.సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సింజిత్ యెర్రమల్లి సంగీతం అందించారు. 2009-2020 మధ్యకాలంలో జరిగే టీనేజ్ లవ్స్టోరీ ఇది. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. యువత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. -
ఐస్క్రీమ్ తిన్నందుకే నా భార్య చనిపోయింది: ప్రముఖ విలన్
మలయాళ నటుడు దేవన్ (Devan Sreenivasan ) భార్యను కోల్పోయి ఆరేళ్లపైనే అవుతోంది. దేవా సతీమణి సుమ 2019లో అలర్జీతో మరణించింది. తాజాగా భార్యను గుర్తు చేసుకున్న నటుడు ఆమె మరణానికి గల కారణాన్ని వెల్లడించాడు. దేవన్ మాట్లాడుతూ.. తను బాగానే ఉండేది. ఏమైందో ఏమో కానీ ఐస్క్రీమ్ తింటే మాత్రం పడేది కాదు. అదెలా తెలిసిందంటే.. చెన్నైలో ఉన్నప్పుడు ఓసారి ఐస్క్రీమ్ తిన్నాం. కాసేపటికే తనకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది. డాక్టర్ వార్నింగ్వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తను ఎప్పటికీ ఐస్క్రీమ్ తినకూడదని డాక్టర్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. మేము కూడా దాన్ని ఫాలో అయ్యాం. ఒకరోజు నా కూతురు లక్ష్మి దాని బిడ్డను తీసుకుని మా ఇంటికి వచ్చింది. అప్పుడు నేను ఇంట్లో లేను. షూటింగ్ కోసం వేరే లొకేషన్లో ఉన్నాను. పిల్లల కోసమని ఐస్క్రీమ్ కొన్న ఆమె కాస్త మిగిలితే దాన్నలాగే వదిలేసి తిరిగెళ్లిపోయింది. ఇంట్లో ఉన్న సుమ.. డాక్టర్ వార్నింగ్ మర్చిపోయి కాస్తం ఐస్ క్రీమ్ తింది. అంతే.. మళ్లీ తనకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది.వెళ్లేసరికే..నేలపై పడి గిలగిల కొట్టుకుంటోందని పనివాళ్లు ఫోన్ చేసి చెప్పారు. నేను ఇంటికెళ్లేసరికి తన పరిస్థితి మరింత దిగజారింది. హాస్పిటల్కు తీసుకెళ్లాం, కానీ తనను కాపాడుకోలేకపోయాం. ఐస్క్రీమ్ అలర్జీ వల్ల ఊపిరితిత్తుల్లో రంధ్రాలు ఏర్పడ్డాయి. అలా నా భార్య కన్నుమూసింది అని చెప్పుకొచ్చాడు. దక్షిణాదిన వందలాది చిత్రాల్లో నటించిన దేవన్ తెలుగులో ఆశయం, పెళ్లి చేసుకుందాం, మా అన్నయ్య, దేశముదురు, ఏమాయ చేసావె, హార్ట్ ఎటాక్, సాహొ వంటి పలు చిత్రాల్లో నటించాడు. ఎక్కువగా విలన్ పాత్రలతోనే మెప్పించాడు.చదవండి: 'లోక' @ రూ.200 కోట్లు.. గర్వాన్ని తలకెక్కించుకోవద్దన్న తండ్రి -
'సిద్ధు జొన్నలగడ్డ' కొత్త సినిమా.. రొమాంటిక్ టీజర్ చూశారా?
'తెలుసు కదా' సినిమా నుంచి క్లాసిక్ టీజర్ విడుదలైంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా చిత్రంలో హీరోయిన్గా రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 17న విడుదల కానుంది. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ వంటి హిట్ చిత్రాల తర్వాత ఆయన నటించిన మూవీ జాక్ నిరుత్సాహపరిచింది. దీంతో ‘తెలుసు కదా’ మూవీపైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఇందులో వైవా హర్ష కీలక పాత్రలో నటించారు. తమన్ సంగీతం అందించారు. -
హౌస్ మొత్తాన్ని అల్లాడించేసిన సంజనా, ఇప్పుడేకంగా కెప్టెన్!
బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9) అన్నాక గొడవలు సహజం. గొడవ మొదలుపెట్టేవారు, సాగదీసేవారు, ఏదో ఒక రకంగా ముగింపు పలికేవాళ్లుంటారు. ఈ సీజన్లో కూడా మూడు రోజుల్లోనే కావాల్సినదానికంటే ఎక్కువ రభసే జరుగుతోంది. దానికి మూల కారణం సంజనా (Sanjana Galrani)! ఈమె సరదాసరదాగా చేసే పనులకే హౌస్ తగలబడిపోతోంది. నిజంగా గొడవపడితే హౌస్ ఏమైపోతుందో మరి!అందరికీ పూనకాలు తెప్పిస్తున్న సంజనాతను కోడిగుడ్డు దొంగిలించి తిన్నందుకు హౌస్లో ఉన్న 14 మంది ఒకచోట చేరి కొట్టుకున్నంత పని చేశారు. కానీ సంజనా మాత్రం తాపీగా సోఫాలో కూర్చుని ఆ లొల్లిని సరదాగా చూస్తూ టైంపాస్ చేసింది. ఆ ఒక్క సీన్ చాలు.. నువ్వుండాలమ్మా.. కచ్చితంగా ఉండాల్సినదానివే! అని ప్రేక్షకులు ఓట్లు గుద్దుతున్నారు. అవసరమైన చోట కౌంటర్స్ ఇస్తూ తాపీగా ఉంటోంది. అనవసర ఆవేశానికి పోవట్లేదు. కానీ, అందరికీ బీపీలు తెప్పిస్తోంది. ప్రస్తుతానికి హౌస్లో ఈమెనే అందరికంటే హైలైట్గా నిలుస్తోంది.కెప్టెన్గా..ఇకపోతే నేడు కెప్టెన్సీ టాస్క్ జరగనుంది. ఇందుకోసం కంటెండర్లను సెలక్ట్ చేయమని బిగ్బాస్ సంజనాకు బాధ్యత అప్పగించాడట! దాంతో ఆమె హరీశ్, శ్రష్టి, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్లను ఎంపిక చేసింది. మరి వీరి మధ్య ఎలాంటి పోటీలు పెట్టాడో కానీ.. అటు తిరిగి, ఇటు తిరిగి కెప్టెన్సీ సంజనా చేతికి చిక్కిందట! గుడ్డు దొంగిలించిన పాపానికి ఇంట్లోకే రావద్దంటూ కేకలేశారు కామనర్స్. ఇప్పుడదే ఇంట్లో కెప్టెన్ బెడ్రూమ్లో దర్జాగా సేద తీరనుంది సంజనా. కెప్టెన్గా అందరినీ ఎలా ఆటాడిస్తుందో చూడాలి!చదవండి: 5 నెలల పాప.. గుడ్డు దొంగిలించడానికి సిగ్గు లేదా?: సంజనా ఫైర్ -
సీనియర్ సిటిజన్కు సినీ నిర్మాత టోకరా.. కేసు నమోదు
బంజారాహిల్స్: పదేళ్ల పాటు లీజుకు తీసుకుని భవనాన్ని 99 ఏళ్ల లీజు అంటూ ఫోర్జరీ పత్రాలను సృష్టించి మోసం చేయడంతో పాటు వృద్ధురాలిని బెదిరింపులకు గురిచేస్తున్న వ్యవహారంలో సినీ నిర్మాత, రౌడీషీటర్ షేక్ బషీద్తో పాటు అతని భార్యపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లో నివాసం ఉంటున్న లక్ష్మీశ్వరి (85) కుమారుడు తిరుమల వెంకటేష్ అమెరికాలో ఉంటారు. అతడికి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–25లో భవనం ఉంది. దానికి జీపీఏ హోల్డర్గా ఉన్న తల్లి లక్ష్మీశ్వరి వద్ద నుంచి 2013లో సినీ నిర్మాత షేక్ బషీద్, అతని భార్య షేక్ కరీమున్నీసా లీజుకు తీసుకున్నారు.పదేళ్ల పాటు లీజుకు ఇచ్చినట్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. 2023లో లీజు గడువు ముగియడంతో ఖాళీ చేయాలంటూ యజమానులు చెప్పగా, తమకు 99 ఏళ్ల పాటు లీజు ఉందంటూ పత్రాలు చూపించారు. 2012 నుంచి 2112 దాకా ఇంటిని ఖాళీ చేసే ప్రసక్తే లేదంటూ షేక్బషీద్ చెప్పడంతో లక్ష్మీశ్వరి షాక్కు గురయ్యారు. అప్పటి నుంచి అద్దె చెల్లించకపోవడంతో పాటు బెదిరింపులకు దిగుతున్నారు. ప్రభుత్వాలు తప్ప ప్రైవేటు వ్యక్తులు ఎవరూ 99 ఏళ్లకు ఇంటిని లీజు ఇవ్వరని, తప్పుడు పత్రాలతో తన ఇంటిని కాజేసే కుట్ర చేస్తున్నారంటూ బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు షేక్బషీద్తో పాటు అతని భార్య కరీమున్నీసాలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'కిష్కింధపురి' ట్విస్ట్.. సినిమా చూసిన వారి టాక్ ఇదే
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన చిత్రం 'కిష్కింధపురి'.. కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ జానర్లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్కు మంచి స్పందన లభించింది. భైరవం తర్వాత వస్తున్న ఈ సినిమాపై బెల్లంకొండ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఈ నెల 12న ఈ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు బెల్లం బాబు.'కిష్కింధపురి' ప్రీమియర్ షోలు సెప్టెంబర్ 10న హైదరాబాద్లోని AAA ముల్టీప్లెక్స్లో ప్రదర్శించారు. సినిమా చూసిన ఆడియెన్స్ టాక్ ఎలా ఉందంటే.. మొదటి 10 నిమిషాలు కథలోకి వెళ్లేందుకు టైమ్ తీసుకున్న దర్శకుడు ఎప్పుడైతే కిష్కింధపురిలోని సువర్ణ మాయలోకి అడుగుపెడతారో అక్కడ నుండి సినిమాను పరిగెత్తిస్తూ, భయపెట్టేసాడిని చెబుతున్నారు. ఫస్టాఫ్ను ఎటువంటి అదనపు హంగులకు వెళ్లకుండా అనుకున్న పాయింట్ను తెరపై అంతే చక్కగా చూపించారు. ఇక సెకెండ్ హాఫ్ కూడా అంతే గ్రిప్పింగ్గా హారర్ ఎలిమెంట్స్ ని ఎక్కడ తక్కువ చేయకుండా అదరగొట్టాడు డైరెక్టర్. తమిళ నటుడు శాండ నటన గూస్ బమ్స్ తెప్పిస్తాయి. బెల్లంకొండ శ్రీనివాస్కు ఈ జానర్ బాగా సెట్ అయిందనే చెప్పాలి. సూపర్గా నటించి మెప్పించాడు. అనుపమ పరమేశ్వరన్ క్లైమాక్స్ లో చేసిన పర్ఫామెన్స్ సూపర్ అనే చెప్పాలి. థ్రిల్లర్ ఎపిసోడ్స్ స్టోరీ నేరేషన్ చాలా బాగుందని చెప్తున్నారు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సౌండ్. ఎం.ఆర్. రాజా కృష్ణన్ ఇచ్చిన సౌండింగ్. హారర్ సినిమాను సౌండ్ తో ఎంత మ్యాజిక్ చేయచ్చో అంత చేసాడు. ఓవరాల్ గా చెప్పాలంటే కిష్కింధపూరి మిమ్మల్ని భయపెడుతూ సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టి మరి అలరిస్తుంది. పార్ట్ 2 కోసం ఇచ్చిన లాస్ట్ మినిట్ ట్విస్ట్ చాలా బాగుంది. -
నేషనల్ అవార్డ్ విన్నర్ కొత్త సినిమా.. రేపే రిలీజ్
తొలి సినిమా 'తిథి' (కన్నడ మూవీ)తోనే జాతీయ అవార్డు అందుకున్న రామ్ రెడ్డి మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ జుగ్నుమా (Jugnuma - The Fable film). ఈ మూవీ ద ఫేబుల్ పేరిట అంతర్జాతీయ స్థాయిలో విడుదలైంది. ఇప్పుడు దేశీయ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 12న ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అలరించనుంది. జుగ్నుమా కథ ఇప్పటిది కాదు! తొమ్మిదేళ్ల క్రితం హిమాలయాల్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక దళాలకు తనవంతు సాయం చేశాడు రామ్ రెడ్డి. ఆ సమయంలో ఈ కథ పురుడు పోసుకుంది. భారత్- నేపాల్ సరిహద్దులోని హిమాలయ ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ చేశారు. ఇందులో అడవిలో చెట్లను పరిరక్షించాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. మనోజ్ బాజ్పాయ్, ప్రియాంక బోస్ ప్రధాన పాత్రలు పోషించారు. బెర్లిన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకలో జుగ్నుమా ప్రదర్శితమైంది. లీడ్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ చిత్రం అవార్డు దక్కించుకుంది. సినిమా ప్రదర్శితమైన ప్రతి చోటా దర్శకుడి ప్రతిభకు ప్రశంసలు దక్కాయి. దర్శకనటుడు అనురాగ్ కశ్యప్, నిర్మాత గునీత్ మోంగా సైతం సినిమా చూసి అభినందించారు. -
ఓటీటీలో సెన్సేషనల్ హిట్ సినిమా 'సైయారా'
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'సైయారా'(Saiyaara) ఓటీటీ ప్రకటన వచ్చేసింది. మోహిత్ సూరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.580 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. అహాన్ పాండే (Ahaan Panday), అనీత్ పడ్డా (Aneet Padda) జంటగా 'సైయారా'తో బాలీవుడ్కు పరిచయమ్యారు. వీరిద్దరూ క్రిష్, వాణి పాత్రలతో యూత్ను మెప్పించారు. ఎలాంటి అంచనాలు లేకుండా జులై 18న విడుదలైన ఈ సినిమా సంచనాలు క్రియేట్ చేసింది. కేవలం మౌత్ టాక్ పవర్తో బాక్సాఫీస్ రికార్డ్లను తిరగరాసింది.యూత్ఫుల్ ఎంటర్టైనర్గా విడుదలైన 'సైయారా' నెట్ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 12న ఓటీటీలోకి రానుందని ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు. కేవలం రూ. 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్లో అనేక చిత్రాల కలెక్షన్స్ను దాటి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఓవర్సీస్లో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సొంతం చేసుకున్న బాలీవుడ్ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది బాలీవుడ్ హిట్ సినిమా ఛావా రికార్డ్ను కూడా దాటేసింది. అందుకే ఈ చిత్రం ఓటీటీ విడుదల గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కథేంటి?వాణి బత్రా(అనీత్ పడ్డా) ఓ రైటర్. తన కాలేజీ సీనియర్ మహేశ్ అయ్యర్ని ప్రేమించి, ఇంట్లో వాళ్లని ఒప్పించి పెళ్లికి రెడీ అవుతుంది. కానీ చివరి నిమిషంలో అతడు తన స్వార్థం చూసుకుని ఈమెకు హ్యాండ్ ఇస్తాడు. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ బాధ నుంచి కోలుకున్న వాణి.. ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరుతుంది. అదేరోజు అనుకోకుండా క్రిష్ కపూర్(అహన్ పాండే)ని కలుస్తుంది. ఇతడో యువ సింగర్. గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంటాడు. ఊహించని పరిస్థితుల్లో క్రిష్-వాణి కలిసి ఓ పాట కోసం పనిచేయాల్సి వస్తుంది. అలా కొన్నాళ్లకు వీళ్లిద్దరూ ప్రేమలో పడతారు. కానీ వాణి జీవితంలోకి ఆమె పాత ప్రేమికుడు మహేశ్ వస్తాడు. మరి ఇద్దరిలో వాణికి ఎవరు దగ్గరయ్యారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇందులో భారీ ఫైట్స్ లేవు. పవర్ఫుల్ డైలాగ్స్ లేవు. కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ కూడా లేవు. కేవలం ఎమోషన్ మాత్రమే ఈ చిత్రాన్ని నిలబెట్టింది. -
షారుక్ ఖాన్, దీపికా పదుకొణెకు ముందస్తు బెయిల్
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్(Shah Rukh Khan), దీపికా పదుకొణెలకు రాజస్థాన్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హ్యుందాయ్ కార్ల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న షారుక్, దీపికాలపై రాజస్థాన్కు చెందిన కీర్తిసింగ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వారిద్దరూ కార్ల కంపెనీ ప్రచారం చేయడం వల్ల తాను ఒక కారు కొనుగోలు చేసి నష్టపోయానని, వారిద్దరూ కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన కేసు వేశారు. అయితే, ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని రాజస్థాన్ హైకోర్టును నటీనటులు కూడా ఆశ్రయించారు. కేసును పరిశీలించిన న్యాయస్థానం వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 25న ఉంటుందని పేర్కొంది.గతంలో కీర్తి సింగ్ చేసిన ఫిర్యాదు ఇలా ఉంది. 2022 జూన్ నెలలో హ్యుందాయ్ కంపెనీ అల్కాజార్ కారును సుమారు రూ. 24 లక్షలకు కొనుగోలు చేస్తే.. కేవలం ఆరు నెలల్లోనే కారు ఇంజన్లో పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయని పేర్కొన్నాడు. అధిక వేగంతో వెళ్తున్నప్పుడు ఇంజన్ నుంచి తీవ్రమైన శబ్ధం వస్తుందని ఒక్కోసారి దారి మధ్యలోనే ఆగిపోతుందని తెలిపాడు. కారు సమస్య గురించి కంపెనీ ఏజెన్సీని సంప్రదించినప్పుడు, ఇది ఈ కారు మోడల్ తయారీ లోపమంటూ దాన్ని పరిష్కరించలేమని అక్కడి సిబ్బంది చెప్పినట్లు ఆయన పేర్కొన్నాడు. నిర్లక్ష్యంతో సమాధానం చెప్పడంతో తాను కోర్టును ఆశ్రయించానని తెలిపాడు. హ్యూందాయ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్స్గా పనిచేస్తున్న షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె( Deepika Padukone) ఈ ఘటనలో బాధ్యత వహించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. -
'లోక' @ రూ.200 కోట్లు.. గర్వాన్ని తలకెక్కించుకోవద్దన్న తండ్రి
లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కలెక్షన్స్ పెద్దగా రావంటుంటారు! కానీ కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) ప్రధాన పాత్రలో నటించిన 'కొత్త లోక మూవీ' ఆ వాదనను కొట్టిపారేసింది. సెంచరీలు కొడుతోంది. బాక్సాఫీస్ వద్ద రిలీజైన 13 రోజుల్లోనే రూ.202 కోట్లు రాబట్టింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఇంతటి ఘన విజయం సాధించినందుకు అందరూ సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఇదే నా సలహా: తండ్రి మెసేజ్ఇలాంటి సమయంలో కల్యాణికి తండ్రి, దర్శకుడు ప్రియదర్శన్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. అదేంటనేది ఇన్స్టాగ్రామ్ పేజ్లో షేర్ చేసింది. 'ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో.. విజయ గర్వాన్ని తలకెక్కించుకోకు, ఫ్లాప్ వచ్చినప్పుడు ఆ బాధను మనసులో మోయకు.. నేను నీకు ఇచ్చే మంచి సలహా ఇదే! లవ్యూ..' అని కూతురికి మెసేజ్ పెట్టాడు. అందుకు కల్యాణి.. తప్పకుండా మీరు చెప్పింది పాటిస్తాను నాన్నా, లవ్యూ అని రిప్లై ఇచ్చింది.సినిమాతన సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు సైతం అభినందనలు తెలిపింది. 'మీ వల్లే సినిమాకు ఈ రేంజ్లో కలెక్షన్స్ వస్తున్నాయి. మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నాకు మాటలు రావడం లేదు. మన ఇండస్ట్రీలో కంటెంటే కింగ్. కథలో దమ్ముంటే మీరు దాన్ని అందలం ఎక్కిస్తారని మరోసారి రుజువు చేశారు' అని రాసుకొచ్చింది. సూపర్ హీరో కాన్సెప్ట్తో వచ్చిన మూవీ 'కొత్త లోక: చాప్టర్ 1 చంద్ర'. కల్యాణి ప్రియదర్శన్, నస్లీన్ ప్రధాన పాత్రలు పోషించారు. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. దుల్కర్ సల్మాన్ నిర్మించాడు. ఈ మూవీ ఆగస్టు 28న మలయాళంలో రిలీజైంది. ఒకరోజు ఆలస్యంగా ఆగస్టు 29న సాయంత్రం తెలుగులో విడుదలైంది. View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) చదవండి: అంత వైరల్ చేశారేంటి? నేనేదో సరదాగా అన్నా!: హీరో -
మల్లెపూల ఎఫెక్ట్.. అస్ట్రేలియా అధికారులకు నటి లేఖ
మలయాళ నటి నవ్య నాయర్ (Navya Nair) ఆస్ట్రేలియాకు వెళ్లి చిక్కుల్లో పడ్డారు. ఓ ఈవెంట్కు హాజరయ్యేందుకు ఆమె మెల్బోర్న్ ఎయిర్పోర్టులో దిగారు. అయితే, తన బ్యాగులో మల్లెపూలను తీసుకెళ్లడంతో అక్కడి ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. అత్యంత కఠినమైన బయోసెక్యూరిటీ చట్టాలు ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ప్రయాణికులు పండ్లు, విత్తనాలు, పూలను తీసుకువెళ్లడం అక్కడ నిషిద్ధం. ఈ క్రమంలోనే నవ్య నాయర్ బ్యాగులో పూలు లభించడంతో ఆమెకు రూ. 1.14లక్షల జరిమానా విధించారు. ఈ అంశంపై తాజాగా ఆమె రియాక్ట్ అయ్యారు.తాను ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదని, జరిమానాను రద్దు చేయాలని కోరుతూ ఆస్ట్రేలియన్ వ్యవసాయ శాఖకు నవ్య నాయర్ లేఖ రాశారు. ఆపై ఆస్ట్రేలియన్ కస్టమ్స్ అధికారులకు కూడా ఆమె లేఖను పంపారు. "జరిమానా విధించిన తర్వాత నేను ఒక విధంగా షాక్ అయ్యాను. ఈ చట్టాల గురించి అందరూ తెలుసుకోవాలి. వాస్తవంగా ఆరోజు నా బ్యాగ్లో పువ్వులు తీసుకెళ్లనే లేదు. పువ్వులు నా జుట్టుమీద మాత్రమే ఉన్నాయి. అది అందరికీ బహిరంగంగానే కనిపిస్తుంది. దానిని నేను ఏమీ దాచలేదు. కానీ, నా బ్యాగులో మొదట పువ్వులు ఉంచడం వల్ల ఎయిర్పోర్ట్లోని స్నిఫర్ డాగ్స్ పసిగట్టాయి. బ్యాగులో ఒకటి లేదా రెండు ఫ్లవర్ బాగాలు ఉండిపోయాయి. దీంతో అక్కడి అధికారులు ఫైన్ వేశారు. 28రోజుల్లో చెల్లించాలని కోరారు' అని ఆమె చెప్పారు.ఆస్ట్రేలియన్ వ్యవసాయ శాఖను మెయిల్ ద్వారా నవ్య నాయర్ సంప్రదించారు. 'జరిగిన విషయాన్ని అక్కడి అధికారులకు చెప్పాను. జరిమానా మొత్తాన్ని మాఫీ చేయమని కోరాను. వారు మాఫీ చేయకపోతే రూ. 26వేలు వసూలు చేస్తారని ఒక ఆర్టికల్లో చదివాను. ప్రస్తుతానికి వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మానవతా కోణంలో వారు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. జరిమానా చెల్లించాల్సిందే అని కోరితే నాకు వేరే మార్గం లేదు. ఒక దేశ చట్టాన్ని ఎవరైనా సరే పాటించాలి. ' అని ఆమె అన్నారు.ఆస్ట్రేలియాలో ఎందుకు నిషేదం..?బయోసెక్యూరిటీ నియమాల ప్రకారం మల్లెపూలతో పాటు ఇతర మొక్కలు, పూలు, గింజలు, కాయగూరలు, మట్టి, జంతు సంబంధిత ఉత్పత్తులు తీసుకెళ్లినా కూడా శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. వాటి ద్వారా ఆయా క్రిమికీటకాలు తమ దేశంలోకి వ్యాప్తి చెందుతాయని, ఆపై అక్కడి పంటలకు నష్టం కలిగిస్తాయని వారు కనుగొన్నారు. -
కన్నడ స్టార్ రాజ్కుమార్ కిడ్నాప్పై సినిమా
కన్నడ కంఠీరవ రాజ్కుమార్ (Dr. Rajkumar) జీవితంలోని కీలక అంశమైన కిడ్నాప్ నేపథ్యంలో ఓ సినిమా రానుంది. రాజ్కుమార్ని వీరప్పన్ (Veerappan) కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే! అశోక్, ముని, నాగేశ్ ప్రధాన పాత్రధారులుగా కట్టా శ్రీకర్ ప్రసాద్ దర్శకత్వంలో వి.లీలా మనోహర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అక్టోబరులో షూటింగ్ ప్రారంభం కానుంది. శ్రీకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘రాజ్కుమార్గారిని వీరప్పన్ కిడ్నాప్ చేయడం అందర్నీ షాక్కి గురి చేసింది. అప్పటి కిడ్నాప్ కోణంలో పలు అంశాలను ఈ చిత్రంలో చర్చించబోతున్నాం. ఈ చిత్రానికి ప్రతిభగల టెక్నీషియన్లు పని చేయనున్నారు. పూర్తి వివరాలు దసరా తర్వాత వెల్లడిస్తాం’’ అని చెప్పారు. అసలేం జరిగింది?కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ తండ్రి రాజ్కుమార్ను 2000వ సంవత్సరం జూలై 30న వీరప్పన్ కిడ్నాప్ చేశాడు. రాజ్కుమార్తో పాటు ఆయన అల్లుడు గోవింద్రాజ్, బంధువు నగేష్, అసిస్టెంట్ దర్శకుడు నాగప్పను కూడా కిడ్నాప్ చేశాడు. ఆ సమయంలో తమిళనాడులో కరుణానిధి అధికారంలో ఉన్నారు. వీరప్పన్.. రాజ్కుమార్ను టార్గెట్ చేశాడని 1999లోనే సిట్ (వీరప్పన్ను పట్టుకోవడం కోసం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం) ప్రభుత్వాన్ని హెచ్చరిచింది.అయినా నటుడికి భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం వీరప్పన్తో పలుమార్లు చర్చలు జరిపింది. అలా 108 రోజులపాటు రాజ్కుమార్ను బంధించిన వీరప్పన్ 2000 సంవత్సరం నవంబర్ 15న ఆయన్ను వదిలేశాడు. చర్చలు జరిపినా వినని వీరప్పన్.. సడన్గా రాజ్కుమార్ను విడుదల చేయడం మిస్టరీగానే మిగిలిపోయింది. 2004లో సిట్ బృందం చేతిలో వీరప్పన్ మృతి చెందగా, 2006 ఏప్రిల్ 12న రాజ్కుమార్ తుదిశ్వాస వదిలారు.చదవండి: బిగ్బాస్: 5 నెలల పాప.. అయితే గుడ్డు దొంగిలించడానికి సిగ్గు లేదా? -
అంత వైరల్ చేశారేంటి? నేనేదో సరదాగా అన్నా!: హీరో
హారర్, మిస్టరీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించారు. సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పంచుకున్న విశేషాలు. నాకు ఇష్టమైన జానర్👻 టీనేజ్లో ఉన్నప్పట్నుంచి నాకు హారర్ సినిమాలంటే ఇష్టం. మా శ్రీ సాయి గణేశ్ ప్రొడక్షన్లో నిర్మించిన ‘కాంచన’ సినిమాని చాలా ఎంజాయ్ చేశాను. డైరెక్టర్ కౌశిక్ ‘కిష్కింధపురి’ కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. నాకు బాగా ఇష్టమైన జానర్ ఇది. హారర్ కారణంగా మా సినిమాకి ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇంత సీరియస్ హారర్ సినిమా చూసి చాలా కాలమైందని సెన్సార్ సభ్యులు అభినందించడం ఆనందాన్నిచ్చింది.👻 ఈ సినిమా కోసం సువర్ణమాయ అనే రేడియో స్టేషన్ని సెట్గా వేశాం. అలాగే ఓ పాడుబడ్డ గృహంలో షూట్ చేశాం. మంగళవారం ఈ సినిమాని మా స్నేహితులతో కలిసి థియేటర్స్లో చూశాం... సినిమా అదిరిపోయింది. సౌండ్ డిజైనర్ రాధాకృష్ణగారు సౌండ్ని అద్భుతంగా డిజైన్ చేశారు. కౌశిక్ మంచి కథ రెడీ చేసుకున్నాడు. అయితే ఇలాంటి జోనర్స్ సినిమాలకి బడ్జెట్ పరిమితులుంటాయి. కానీ, సాహు గారపాటిగారు ఆడియన్స్కి ద బెస్ట్ ఇవ్వాలని రాజీ పడకుండా నిర్మించారు. చేతన్ భరద్వాజ్ అద్భుతమైన మ్యూజిక్, నేపథ్య సంగీతం అందించారు. 👻 ‘మా సినిమాకి వచ్చిన ప్రేక్షకుల్లో మొదటి పది నిమిషాల తర్వాత ఎవరైనా ఫోన్ పట్టుకుంటే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతాను’ అని సరదాగా అన్నాను... దాన్ని వైరల్ చేశారు. మా చిత్ర కథ అంత ఆసక్తిగా ఉంటుందని చెప్పడమే నా ఉద్దేశం. నాకు సినిమా తప్ప వేరే ప్రపంచం లేదు... ఇండస్ట్రీలోనే ఉంటాను... భవిష్యత్లో దర్శకత్వం కూడా చేస్తాను. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి కథ ఉంటే నేను, నా తమ్ముడు సాయి గణేశ్ కలిసి సినిమా చేస్తాం.చదవండి: బిగ్బాస్: 5 నెలల బాబు.. అయితే గుడ్డు దొంగిలించడానికి సిగ్గు లేదా? -
బిగ్బాస్: 5 నెలల పాప.. అయితే గుడ్డు దొంగిలించడానికి సిగ్గు లేదా?
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్లో మొదటివారం నామినేషన్స్ పూర్తయ్యాయి. కామనర్స్ నుంచి డిమాన్ పవన్, సెలబ్రిటీలలో భరణి మినహా మిగతా అందరూ నామినేషన్స్లో ఉన్నారు. ఇక ఈ షోకి కావాల్సిన కంటెంట్ నేనిస్తానంటూ ఫుల్ జోష్ మీదుంది సంజనా. మొన్న షాంపూ కోసం పంచాయితీ పెట్టిన ఆమె నిన్న గుడ్డు దొంగిలించి అందరికీ బీపీలు వచ్చేలా చేసింది. గుడ్డు ఎవరు కొట్టేశారో అర్థం కాక ఓనర్స్ (కామనర్స్) తల పట్టుకున్నారు. టెనెంట్స్లోనే అసలైన దొంగ ఉన్నాడని తెలిసి వాళ్లందరిపైనా ఒంటికాలిపై లేచారు.అందరి అనుమానం తనపైనేమీరు ఇంట్లో అడుగుపెట్టేదే లేదని టెనెంట్స్పై ఆంక్షలు విధించారు. అయితే అందరి అనుమానం సంజనా (Sanjana Galrani)పైనే.. కానీ ఆమె మాత్రం ఓపక్క నవ్వుతూ, మరోపక్క అమయాకంగా ముఖం పెడుతూ అందరినీ కన్ఫ్యూజ్ చేసేసింది. ఈ క్రమంలో భరణి, హరీశ్ మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇలా అందరూ అరుచుకుంటూ ఉంటుంటే అప్పుడు సంజనా సైలెంట్గా వచ్చి.. ఆకలేసి నేనే గుడ్డు తిన్నా.. అడిగితే ఇవ్వరనే అలా చేశాను అని తాపీగా చెప్పింది. ఇరికించేసిందిగా!దీంతో ఓనర్లు.. అప్పటినుంచి అడుగుతుంటే సమాధానం చెప్పొచ్చు కదా? అని ఫైర్ అయ్యారు. ఇక సంజనా తాను తినేటప్పుడు కిచెన్లో ఉన్న భరణి, తనూజ కూడా చూశారని, రాముకు కూడా తెలుసని ఇరికించేసింది. దాంతో అందరూ షాకయ్యారు. శ్రష్టి అయితే సంజనా దగ్గరకు వెళ్లి.. గుడ్డు తినడానికి సిగ్గు లేదా? అని తిట్టేసింది. అటు రీతూ చౌదరి.. మీ ముగ్గురూ కలిసి గేమ్ ఆడారు అని భరణిపై ఫైర్ అయింది. అప్పుడు భరణి నోరు విప్పి జరిగిందంతా చెప్పాడు. ఏడ్చేసిన సంజనామేము కిచెన్లో ఉన్నప్పుడు సంజనా అక్కడికి వచ్చి ఎగ్ తీసుకుంటున్నానని తనూజకి చెప్పిందట. 5 నెలల బేబీని వదిలేసి వచ్చాను.. ఏదో ప్రాబ్లమ్ ఉందంది. అందుకే నేను సైలెంట్గా ఉన్నా అన్నాడు. అప్పుడు సంజనా ఎంటరై.. నా ఫ్యామిలీ గురించి మాట్లాడొద్దు, నా గురించి మీకు తెలీదు. నేను బాధితురాలిని. నేను ప్రతిరోజు ఏడుస్తూనే పడుకుంటాను అని ఏడ్చేసింది. అలా ఒక్క గుడ్డు దొంగతనంతో హౌస్ మొత్తాన్ని తగలబెట్టేసింది.చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'కూలీ' సినిమా -
బయ్యర్లకు రూ. 4 కోట్లు రిటర్న్ చేసిన నిర్మాత?
యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన మజాకా (Mazaka) సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది. అయితే, ప్రేక్షకులకు ఈ చిత్రం పెద్దగా కనెక్ట్ కాలేదు. దర్శకుడు త్రినాథరావు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రాజేశ్ దండ నిర్మించారు. రావు రమేశ్, రీతూవర్మ, అన్షు, మురళీ శర్మ తదితరులు కీలకపాత్రలలో నటించారు. అయితే, ఈ సినిమా చాలామంది బయ్యర్లకు నష్టాలనే మిగిల్చింది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే బయ్యర్లు మాత్రం చాలా జాగ్రత్తగా నిర్మాతలతో ఢీల్ సెట్ చేసుకుంటున్నారు. సినిమాకు భారీ నష్టాలు వస్తే కొంత నిర్మాతల నుంచి రిటర్న్ ఉండేలా ముందస్తుగా ఒప్పందం చేసుకుంటున్నారు.మజాకా మూవీని కొనుగోలు చేసిన బయ్యర్స్ను నిర్మాత రాజేశ్ దండ ఆదుకున్నారంటూ ఒక వార్త సోషల్మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మజాకా ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దీంతో నిర్మాతలు చెప్పిన ధరకు బయ్యర్స్ కొనుగోలు చేశారు. విడుదల తర్వాత కూడా సినిమా బాగుందని టాక్ వచ్చింది. కానీ, కమర్షియల్గా అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ సాధించలేకపోయింది. దీంతో బయ్యర్లు సుమారు రూ. 4 కోట్ల వరకు నష్టపోయారట. ఆ డబ్బు తిరిగివ్వాలని నిర్మాతను చాలారోజులుగా బయ్యర్తు అడుగుతూ వచ్చారట. అయితే, తాజాగా ఆ మొత్తాన్ని వారికి చెల్లించారని తెలుస్తోంది.ప్రస్తుతం నిర్మాత రాజేశ్ దండ మరో సినిమాతో రానున్నారు. కిరణ్ అబ్బవరంతో కే రాంప్ (K-Ramp) మూవీ చేస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 18న విడుదల కానుంది. ఈ మూవీకి లైన్ క్లియర్ కావాలంటే బయ్యర్లతో ఉన్న వివాదం సెటిల్ చేసుకోవాలి. ఈ క్రమంలోనే ఆయన వారికి చెల్లించాల్సిన బకాయిలు ఇచ్చేశారని టాక్. -
ఓటీటీలోకి వచ్చేసిన 'కూలీ' సినిమా
రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటించిన చిత్రం 'కూలీ' ఓటీటీలోకి వచ్చేసింది. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీలో నాగార్జున, ఆమిర్ ఖాన్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించారు.నేడు అర్ధరాత్రి ( సెప్టెంబర్ 11) నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూలీ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. విడుదలైన నెలరోజుల్లోపే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడం విశేషం. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూలీ అందుబాటులోకి వచ్చేసింది. థియేటర్లో చూడని వారు ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేయడంతో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అయితే హిందీ రిలీజ్ గురించి మాత్రం ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. అంటే కూలీ హిందీ వర్షన్ మరో ఓటీటీ ప్లాట్ఫామ్లోకి రానుందని తెలుస్తోంది.కథేంటి..?వైజాగ్ పోర్ట్లో కింగ్పిన్ లాజిస్టిక్స్ పేరుతో సైమన్ (నాగార్జున) పెద్ద డాన్గా చెలామణీ అవుతుంటాడు. ఖరీదైన వాచీలు, ఎలక్ట్రానిక్స్ లాంటివి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే ఎక్స్పోర్ట్స్ ముసుగులో చేయకూడని పనేదో చేస్తుంటారు. సైమన్ అండర్లో దయాల్ (సౌబిన్ షాహిర్) ఇదంతా చూసుకుంటూ ఉంటాడు. వీళ్ల దగ్గర పనిచేసే రాజశేఖర్ (సత్యరాజ్) ఓ రోజు చనిపోతాడు. ఇతడికి దేవా (రజినీకాంత్) అనే ఫ్రెండ్ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల దేవా-రాజశేఖర్.. 30 ఏళ్ల పాటు దూరంగా ఉంటారు. తన ప్రాణ స్నేహితుడు ఇక లేడనే విషయం తెలుసుకుని దేవా.. వైజాగ్ వస్తాడు. తర్వాత ఏమైంది? సైమన్-దేవాకి కనెక్షన్ ఏంటి? ఇంతకీ కలీషా (ఉపేంద్ర), ప్రీతి(శ్రుతి హాసన్), దాహా(ఆమిర్ ఖాన్) ఎవరు? అనేది మిగతా స్టోరీ. -
ప్రేమకథ షురూ
దుల్కర్ సల్మాన్ని ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టుకుని రయ్ రయ్మంటూ పూజా హెగ్డే బండి నడిపారు. ఇద్దరూ ఎలా చిరునవ్వులు చిందించారో ఇక్కడున్న ఫొటోలో చూడొచ్చు. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే హీరో హీరోయిన్గా ఓ ప్రేమకథా చిత్రం షురూ అయింది. రవి నెలకుదిటి దర్శకునిగా పరిచయం చేస్తూ సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డేని కథానాయికగా ప్రకటించి, బుధవారం ఆమె షూట్లో పాల్గొన్న విషయాన్ని చిత్రబృందం తెలియ జేసింది. ‘‘రవి నెలకుదిటి చక్కని ప్రేమకథ రాశారు. ఈ కథలో మంచి హ్యూమన్ డ్రామా, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు ఉన్నాయి’’ అని కూడా యూనిట్ పేర్కొంది. పాన్–ఇండియా మూవీగా ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్, కెమెరా: అనయ్ ఓం గోస్వామి. -
సందడే సందడి
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ స్టూడియోలో జరుగుతోంది. చిరంజీవి, నయనతారలపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. ఇదే స్టూడియోలో మరో కాంప్లెక్స్లో విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో సంయుక్త, టబు, విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూట్లో భాగంగా విజయ్ సేతుపతి, టబుతో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు పూరి. రెండు సినిమాల షూటింగ్స్ ఒకే స్టూడియోలో జరుగుతుండటంతో షాట్ గ్యాప్లో ‘మన శంకరవరప్రసాద్ గారు’ యూనిట్ని కలిసి, సందడి చేసింది పూరి అండ్ టీమ్. ఇక ‘మన శంకరవర ప్రసాద్ గారు’ 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే విజయ్ సేతుపతి– పూరి జగన్నాథ్ చిత్రం కూడా 2026 ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
వెనిస్లో గెలిచింది
వెనిస్ నగరంలో ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు జరిగిన వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో మన యువ దర్శకురాలు అనుపర్ణా రాయ్ అవార్డు గెలుచుకుంది. మొదటి, రెండవ దర్శకత్వ సినిమాల కేటగిరి ‘ఒరిజోంటి’ కేటగిరిలో తన మొదటి సినిమా ‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్’కు ఆమె అవార్డు గెలుచుకుంది. అనురాగ్ కశ్యప్ సమర్పించిన సినిమా ఇది. అనుపర్ణ పరిచయం.‘స్త్రీల లోపల ఉండే ఖాళీలు స్త్రీలకే తెలియవు. ఆ ఖాళీలు ఏ విధాన పూరింపబడతాయో కూడా తెలియదు. స్త్రీలు తమలో తాము చేసే అంతర్గత ప్రయాణానికి వీలు ఉండదు. అలాంటి ఇద్దరు స్త్రీలు తమను తాము తెలుసుకోవడమే కాక ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నమే నేను తీసిన సాంగ్స్ ఆఫ్ ఫర్గాటోన్ ట్రీస్ సినిమా’ అంది అనుపర్ణా రాయ్.29 ఏళ్ల అనుపర్ణా రాయ్ ఇటీవల వెనిస్లో జరిగిన వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అందరి దృష్టి ఆకర్షించింది. ఆమె దర్శకత్వం వహించిన 77 నిమిషాల ‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్’ హిందీ సినిమా మూడు షోస్ వేస్తే హౌస్ఫుల్గా నడిచాయి. అందరూ ఆమెను ప్రశంసించారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో మొదటిసారి దర్శకత్వం వహించే సినిమాల విభాగం ‘ఒరిజోంటి’లో ఈ సినిమా సెలక్ట్ కావడమే గొప్ప అనుకుంటే అవార్డు గెలవడం మరింత గొప్ప. ఆ విధంగా అనుపర్ణా రాయ్ చరిత్ర సృష్టించింది. వివిధ దేశాల నుంచి 19 సినిమాలు ఎంట్రీ పొందిన ఈ విభాగంలో మన భారతీయ చిత్రం ‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్’కు అవార్డు దక్కడం దేశంలో యువ ప్రతిభకు లోటు లేదనే విషయాన్ని నిరూపిస్తోంది. సినీ రంగంలో మహిళల సృజనకు తార్కాణంగా నిలుస్తోంది.కథ ఏమిటి?‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్’ కథ ముంబైలో జరుగుతుంది. ముంబైకి వలస వచ్చిన ఔత్సాహిక నటి తోయ, సేల్స్ రంగంలో పని చేసే శ్వేత ఒక అపార్ట్మెంట్లో రూమ్మేట్స్గా కలిసి జీవిస్తూ ఉంటారు. తోయకు నటిగా అవకాశాలు రావు. అందువల్ల తప్పనిసరై సెక్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే శ్వేతకు ఎదురు పడుతున్న పురుషులు ఆమెను అర్థం చేసుకోవడంలో విఫలమవుతుంటారు. ఈ క్రమంలో తోయ, శ్వేత ఒకరికొకరు తోడవుతారు. ఉద్వేగాలను అర్థం చేసుకొని ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చుకుంటారు. వారి మధ్య ప్రేమ ఏర్పడుతుంది. అయితే తోయ చేసే సెక్స్వర్క్ ఇరుగు పొరుగుకు తెలిసి చివరకు ఫ్లాట్ ఖాళీ చేయాల్సి వస్తుంది. ఆమెతో పాటు శ్వేత కూడా బయటకు నడవడంతో సినిమా ముగుస్తుంది. అయితే ఇప్పుడు వారు ఒంటరి కాదు. ఒకరికి ఒకరు ఉన్నారు. అదీ తేడా. ఈ కథంతా అపార్ట్మెంట్లోని వంట గదిలో, డ్రాయింగ్ రూమ్లో, కిటికీ దగ్గర, కారిడార్లలో జరుగుతుంది. స్త్రీలకు దొరికే ఈ మాత్రపు స్థలంలోనే వారు ఏ విధంగా జీవితాలను నిభాయించుకుంటారో దర్శకురాలు చూపుతుంది.బెంగాల్ అమ్మాయిఅనుపర్ణా రాయ్ పశ్చిమ బెంగాల్లోని పురూలియా జిల్లాలో పుట్టి పెరిగింది. మాస్ కమ్యూనికేషన్ చదివి ఢిల్లీలో కాల్ సెంటర్లో పని చేసింది. 2022లో ముంబైకి వలస వచ్చింది. దర్శకురాలిగా ఆమెకు ఎటువంటి శిక్షణ లేదు. చిన్నప్పుడు సినిమా హాలుకు వెళ్లడం కూడా కష్టమయ్యేది. కాలేజీ వయసులోనే సినిమా అంటే ఏమిటో పైరెటెడ్ సినిమాలను తన లాప్టాప్లో చూసి తెలుసుకుంది. ‘రన్ టు ది రివర్’ అనే షార్ట్ఫిల్మ్ తర్వాత ‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్’ తీయాలనుకుంది. అయితే ఇందుకు ఆమె దగ్గర డబ్బు లేదు. కొద్దిపాటి ఫండ్ దొరికితే తన అద్దె ఫ్లాట్లోనే ఇద్దరు ముఖ్యపాత్రధారులను తనతోపాటు ఉంచుకుని సినిమా తీసింది. తర్వాత అనురాగ్ కశ్యప్ ఈ సినిమాను మెచ్చి సమర్పకుడిగా వచ్చాడు. దాంతో సినిమా వెనిస్కు చేరింది. అవార్డు కూడా సాధించింది.అంతా రాజకీయమే‘చిన్నప్పుడు నాకో స్నేహితురాలు ఉండేది. దళితురాలు. ఆమె పేరు ఝూమా దాస్. ఆమెతో మాట్లాడవద్దని మా నాన్న చె΄్పాడు. అలా ఆ స్నేహం వదులుకున్నాను. కాని ఆ పని చేసినందుకు మా నాన్నను ఇప్పటికీ క్షమించలేకపోతున్నాను. ఝూమా దాస్కు చిన్న వయసులోనే పెళ్లయ్యింది. దానికి కారణం పెళ్లి ఖర్చు భరించే ప్రభుత్వ పథకమే. ప్రభుత్వాలు ఆడపిల్లల పెళ్ళిళ్లకు డబ్బు ఇవ్వడం కన్నా వారి చదువుకు డబ్బు ఇవ్వాలి. తక్కువ కులాల ఆడపిల్లల ఎదుగుదలను పట్టించుకోక వారిని త్వరగా వదిలించుకోవడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నమే పెళ్లి ఖర్చు భరించడం. స్త్రీలు ఎన్నో సంఘర్ఘణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. వారి కథలు నాలో నిండిపోయి ఈ సినిమాగా బయటకు వచ్చాయి’ అని తెలిపింది అనుపర్ణ రాయ్.∙ -
అమ్మ అడుగుపెట్టగానే నాన్న స్టెప్పులు తడబడ్డాయి: చిరంజీవి కూతురు
మెగాస్టార్ కూతురు సుస్మిత కొణిదెల ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన కిష్కింధపురి ఈవెంట్కు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అమ్మను చూస్తే మీ నాన్నగారికి చిన్నపాటి భయం ఏదైనా ఉందా? అని సుస్మితను అడిగారు. దీనికి సుస్మిత స్పందిస్తూ ఇవాళ జరిగిన విషయాన్ని పంచుకున్నారు.సుస్మిత మాట్లాడుతూ..'ఇవాళే మన శంకర వరప్రసాద్గారు మూవీ సాంగ్ షూట్ చేశాం.. అక్కడికి అమ్మ కూడా రావడంతో నాన్న స్టెప్ అటు ఇటు అయింది. నాన్న సరిగ్గా డాన్స్ చేయలేకపోయారు. అమ్మ సెట్లో అడుగుపెట్టడంతో ఆ ఎఫెక్ట్ నాన్నపై పడిందని' పంచుకుంది. మీకు ఏదంటే భయమని సుస్మితను అడగ్గా.. మనకి భయపెట్టడం తప్ప.. భయపడటం ఏమీ ఉండదని సమాధానమిచ్చింది. కాగా.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ నటించిన కిష్కింధపురి చిత్రం ఈనెల 12న థియేటర్లలో సందడి చేయనుంది. -
వీడు మంచి స్టూడెంట్.. ఎగ్జామ్ పాసవుతాడు: కిష్కింధపురి డైరెక్టర్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన తాజా హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా సెప్టెంబర్ 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన డైరెక్టర్ కౌశిక్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.కౌశిక్ పెగళ్లపాటి మాట్లాడుతూ..' మొదటి 10 నిమిషాల తర్వాత ఆడియన్స్ ఫోన్ పట్టుకుంటే ఇండస్ట్రీ వదిలేస్తాను. అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెబితే నాకు భయం వేసింది. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారని రాత్రంతా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలని సినిమా చూశాం. అస్సలు కంగారు లేదు.. మూవీ చాలా బాగా వచ్చింది. ఎవరికైనా సినిమా తీయడం అనేది ఎగ్జామ్ రాయడం లాంటిది. నేను ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ ఇచ్చింది బెల్లంకొండ సాయి శ్రీనివాస్కు.. నన్ను నమ్మి నా ఎగ్జామ్ ఫీజ్ కట్టింది నిర్మాత సాహుకు.. వీడు గుడ్ స్టూడెంట్ ఎగ్జామ్లో పాసవుడుతాడని నమ్మడం వల్లే జరిగింది. కచ్చితంగా డిస్టింక్షన్లో పాసవుతామనే నమ్మకం ఉంది' అని అన్నారు. -
అల్లుడిని చూసి మురిసిపోతున్న నిహారిక.. బ్లాక్ శారీలో బిగ్బాస్ బ్యూటీ దివి!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ స్టన్నింగ్ పిక్స్..విదేశాల్లో చిల్ అవుతోన్న నటి మంజు వారియర్..వరుణ్ తేజ్ కుమారుడితో నిహారిక కొణిదెల పిక్..బ్లాక్ శారీలో మెరిసిపోతున్న బిగ్బాస్ దివి..హాలీవుడ్ పాపలా పోజులిచ్చిన మంచు లక్ష్మీ View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
బిగ్బాస్ హౌస్లో గుడ్డు గోల.. భరణిపై రెచ్చిపోయిన మాస్క్ మ్యాన్!
తెలుగు బుల్లితెర ప్రియుల్లో అత్యంత క్రేజ్ ఉన్న రియాలిటీ షో బిగ్బాస్ సీజన్-9 గ్రాండ్గా ప్రారంభమైంది. ఈనెల 7న 15 మంది కంటెస్టెంట్స్ హౌస్లో అడుగుపెట్టారు. ఈ సారి భిన్నంగా కామన్ కేటగిరీ నుంచి ఏకంగా ఆరుగురిని పంపించారు. ఈ సీజన్లో బిగ్బాస్లో తొమ్మిది మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్స్గా అడుగుపెట్టారు. అయితే ప్రారంభమైన మూడు రోజులకే నామినేషన్స్తో హౌస్ను హీటెక్కించారు బిగ్బాస్. తొలివారంలో ఏకంగా తొమ్మిదిమంది నామినేట్ అయ్యారు. ఈసారి నామినేషన్లలో రీతూ చౌదరి, సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ, సంజన గల్రానీ, శ్రష్ఠి వర్మ, రాము రాథోడ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్ ఉన్నారు.అయితే తాజాగా ఇవాల్టి ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను బిగ్బాస్ మేకర్స్ విడుదల చేశారు. అయితే ఈరోజు జరిగే ఎపిసోడ్లో కేవలం గుడ్డు కోసం హౌస్ సభ్యులంతా గొడవకు దిగారు. ఎవరు గుడ్డు తిన్నారు అంటూ హౌస్మేట్స్ను ప్రశ్నించగా.. నేనైతే తినలేదండి.. ప్రామిస్ అంటూ సంజనా గల్రానీ అన్నారు. నీవల్లే అందరికీ ప్రాబ్లం అంటూ సంజనాతో భరణి వాదించారు. దీంతో భరణిపై మాస్క్ మ్యాన్ హరీశ్ ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. మీరు టాపిక్ను డైవర్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. నేను మీకంటే బాగా చేస్తానని మాస్క్ మ్యాన్ అన్నారు. దీంతో భరణికి, హరీశ్కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. హౌస్మేట్స్ అంతా వీరిద్దరికీ నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన ప్రోమో ఎపిసోడ్పై మరింత ఆసక్తిని పెంచేసింది. ఇంకెందుకు ఆలస్యం బిగ్బాస్ ప్రోమో చూసేయండి.Guddu Poyindhi!🥚😬Tenants are banned from the House🚫🏠Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow pic.twitter.com/9FdoevSKDG— JioHotstar Telugu (@JioHotstarTel_) September 10, 2025 -
‘కానిస్టేబుల్’కి 30 లక్షలు!
"హ్యాపీడేస్, కొత్త బంగారులోకం" వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో కెరీర్ ను మొదలు పెట్టిన వరుణ్ సందేశ్ ఇప్పటివరకు అనేక చిత్రాలు చేసినప్పటికీ లవర్ బాయ్ ఇమేజ్ తో కొనసాగుతూ వచ్చారు. అయితే ఇప్పుడు తాను నటిస్తున్న తాజా చిత్రం ‘కానిస్టేబుల్’ తో మాస్ కమర్షియల్ హీరోగా కొత్త ఇమేజ్ ను సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు.జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై బలగం జగదీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మధులిక వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్కి భారీ స్పందన లభించింది. ఈ సందర్భంగా నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ..‘ఈ సినిమాట్రైలర్ ను ఆగస్టు 31 వ తారీఖున రిలీజ్ చేశాం. ,నాటి నుంచి ఇప్పటివరకు జనాల్లో విశేష స్పందన వస్తోంది. 30 లక్షల మందికి పైగా ఈ ట్రైలర్ ని ఆదరించారు. మా అంచనాలు అందుకునేలా సినిమా ఉంటుంది. త్వరలో భారీగా ప్రపంచవ్యాప్తంగా చిత్రం రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాం’ అని అన్నారు. హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, ‘టైలర్ కి అద్భుత స్పందన రావడం ఆనందదాయకం. సినిమా సస్పెన్స్ తో పాటు ప్రతి సీన్ థ్రిల్లింగ్ గా ప్రతి ఒక్కరికి నచ్చే విదంగా ఉంటుంది, అలాగే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు ఇందులో ఒక మంచి మెసేజ్ ఉంటుంది’అని అన్నారు. -
‘మిరాయ్’ షూటింగ్లో తేజకు గాయాలు, అనారోగ్యం.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
‘నా తొలి చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం తర్వాత ఒక మంచి క్యారెక్టర్ కోసం చూస్తున్నప్పుడు ‘మిరాయ్’ అవకాశం వచ్చింది. అద్భుతంమైన కథ. నా క్యారెక్టర్ చాలా నచ్చింది. వెంటనే ఓకే చెప్పేశాను. ఈ చిత్రంలోని యాక్షన్ అడ్వంచర్ ఆడియన్స్ గొప్ప అనుభూతిని ఇస్తుంది’ అని అన్నారు హీరోయిన్ రితీకా నాయక్. హనుమాన్ తర్వాత తేజ సజ్జ నటించిన తాజా మూవీ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్గా నటించారు. సెప్టెంబర్ 12న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్గా రితీకా నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం చాలా ఎక్సయిటెడ్ గా ఉన్నాను. చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా చేశాం. ముఖ్యంగా తేజ చాలా కష్టపడ్డాడు. షూటింగ్ సమయంలో ఆయనకు చాలా గాయాలు అయ్యాయి. కొన్నిసార్లు అనారోగ్యం కూడా చేసింది. అయినప్పటికీ ఆయన కరెక్ట్ టైం కి సెట్ లో ఉండేవారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.మనోజ్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఆఫ్ స్క్రీన్ ఆయన చాలా ఫన్ ఫుల్ గా ఉంటారు. చాలా స్వీట్ పర్సన్. ఈ సినిమాలో దాదాపు 80% లైవ్ లొకేషన్స్ లో షూట్ చేశాం. ప్రతి రియల్ టైమ్ లొకేషన్స్ లోకి వెళ్లడం వెరీ చాలెంజింగ్. అయితే మా టీమ్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. వారి సపోర్ట్ తో జర్నీ చాలా అద్భుతంగా జరిగింది.కార్తీక్ సినిమాని చాలా అద్భుతంగా తీశారు. ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. కథలో ప్రాధాన్యత ఉన్న అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండే అన్ని రకాల పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే ఇంకొన్ని ప్రాజెక్ట్స్ కూడా రెడీగా ఉన్నాయి. -
జూనియర్ ఎన్టీఆర్తో సినిమా.. మంచు మనోజ్ ఆసక్తికర సమాధానం!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరో విలక్షణ పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ ఏడాది భైరవం మూవీతో మెప్పించిన మనోజ్ మిరాయ్తో అలరించనున్నారు. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వస్తోన్న ఈ చిత్రంలో విలన్గా అభిమానులను మెప్పించనున్నారు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో తెరకెక్కించిన మిరాయ్ ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ తన అభిమానులతో ఎక్స్ వేదికగా ఇంటరాక్షన్ నిర్వహించారు. ఆస్క్ బ్లాక్స్వార్డ్ పేరుతో నిర్వహించిన ఇంటరాక్షన్లో ఫ్యాన్స్ పలు రకాల ప్రశ్నలు అడిగారు. ఓ అభిమాని నిన్ను, జూనియర్ ఎన్టీఆర్ను తెరపై చూడాలన్న కోరిక ఉందని అడిగాడు. దీనికి మంచు మనోజ్ స్పందిస్తూ..నాది కూడా అదే కోరిక అంటూ రిప్లై ఇచ్చారు.మరో అభిమాని మీరు నంద్యాలకు ఎప్పుడు వస్తారు అన్న అని అడిగాడు. దీనికి మనోజ్ స్పందిస్తూ.. మిరాయ్ సెలబ్రేట్ చేసుకునేందుకు వస్తా.. నంద్యాల వైబ్ యే వేరు.. అది మిస్సయితే నా ఇంట్లో నాకు ఫుడ్ కూడా ఉండదు అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత అభిమానులు అడిగిన ప్రశ్నలన్నింటికీ ట్విటర్లో సమాధానాలిచ్చాడు మంచు మనోజ్. కాగా.. మిరాయ్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. Nakkuddaaa…♥️♥️♥️ #Tfi 🙏🏼❤️#AskBlackSword #Mirai https://t.co/P3PF1GwCat— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 10, 2025 Joining in to celebrate #Mirai big time!!! 🙌🏼Nandyal vibe ye veru :) ♥️♥️ Miss ayithe, na intilo naku food vundadhu… #AskBlackSword https://t.co/jw2isqn1LC— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 10, 2025 -
176 సినిమాలు చేశా కానీ, తిరుపతికి వెళ్తే ఓ పెద్దావిడ అలా అనేసింది: తమన్
తెలుగు ఇండియన్ ఐడల్ షో నాలో కొత్త మార్పుని తీసుకొచ్చింది. నేను సంగీతం అందించిన సినిమాలు నన్ను ప్రేక్షకుల ఇంటిదాక తీసుకెళ్తే.. ఈ షో ఇంటిలోపలికి తీసుకెళ్లేలా చేసింది. తెలుగు ఇండియన్ ఐడల్ కు పనిచేయడం ఒక బాధ్యతగా, గౌరవంగా భావిస్తున్నాం’ అన్నారు సంగీత దర్శకుడు తమన్. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ సంగీత కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకులు తమన్, గాయకులు కార్తీక్, గీతా మాధురి జడ్జెస్ గా, శ్రీరామచంద్ర హోస్ట్ గా, సమీరా భరద్వాజ్ కో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ లో టాప్ 12 కంటెస్టెంట్స్ గాన ప్రతిభను ఈ నెల 12వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం, శనివారం సాయంత్రం 7 గంటల నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ రోజు హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 స్పెషల్ స్క్రీనింగ్ చేశారు. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ - ఈ షో తర్వాత మేము మ్యూజిక్ కన్సర్ట్స్ కు వెళ్తే ఇండియన్ ఐడల్ లో బాగా మాట్లాడుతున్నారు అని అంటున్నారు. మా కన్సర్ట్స్ కు హాజరయ్యే ప్రేక్షకుల సంఖ్య రెట్టింపు అవుతోంది. తిరుపతి దర్శనానికి వెళితే.. ఓ పెద్దావిడ క్యూలో నుంచి అందరిని పక్కకి నెట్టి నా దగ్గరకు వచ్చి ‘ఇండియన్ ఐడల్లో బాగా చేస్తున్నావు’ అని చెప్పి వెళ్లిపోయింది. ఇప్పటి వరకు నేను 176 సినిమాలకు సంగీతం అందించా.. వాటి గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా.. షో గురించి చెప్పి వెళ్లింది(నవ్వుతూ..). అలాంటి గుర్తింపు మాకు తెలుగు ఇండియన్ ఐడల్ తీసుకొచ్చింది. ఈ షోలో డల్లాస్ నుంచి కూడా కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఈ షోను ఆర్గనైజ్ చేయబోతున్నాం. అందుకే గల్లీ టు గ్లోబల్ అనే క్యాప్షన్ పెట్టాం. కంటెస్టెంట్స్ పాడటం ఒక్కటే కాదు వారి కుటుంబ సభ్యుల భావోద్వేగాలు, ఇక్కడ గెలుపు కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేవి అన్నీ క్యాప్చర్ చేస్తున్నాం. ఈ షోకు వస్తే మాకు హాలీడేకు వచ్చిన ఫీల్ కలుగుతుంటుంది. తెలుగు ఇండియన్ ఐడల్ ను ఒక ఆస్తిలా భావిస్తున్నాం. అన్నారు.నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ - తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 అద్భుతంగా వచ్చింది. అంత బాగా మీరు చేస్తానంటేనే సీజన్ 4కు ఇన్వెస్ట్ మెంట్ పెడదాం అని అన్నాను. ఇండియన్ ఐడల్ వారికి ప్రతి సీజన్ కు డబ్బు ఇచ్చి రైట్స్ తీసుకోవాల్సిఉంటుంది. గత సీజన్ కంటే ఈ సీజన్ 4 బాగా చేస్తున్నారు. ఇందుకు తమన్ కు థ్యాంక్స్ చెప్పాలి. ఈ షోకు తమన్ లైఫ్ తీసుకొచ్చాడు. స్కూల్ లో చదువుతున్న పిల్లలు కూడా వచ్చి బాగా పాడుతున్నారు. ఇతర రాష్ట్రాల పిల్లలు తెలుగు నేర్చుకుని పాడుతున్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ క్రేజ్ ఎంతలా ఉందంటే అమెరికాలో ఈ కార్యక్రమాన్ని చూస్తూ అక్కడి నుంచి కంటెస్ట్ చేసేందుకు వచ్చారు. మనం గల్లీ టు ఢిల్లీ అంటాం, కానీ ఇది గల్లీ టు గ్లోబల్ అయ్యింది. ఆహా నుంచి తెలుగు ఇండియన్ ఐడల్ షో చేస్తున్నందుకు గర్వంగా ఉంది’అన్నారు. ఈ కార్యక్రమంలో సింగర్ సమీరా భరద్వాజ్, గీతా మాధురి పాల్గొని మాట్లాడారు. -
సతీమణి బాటలో అభిషేక్ బచ్చన్.. 24 గంటల్లోనే కోర్టుకు!
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) గురించి ప్రస్తుతం పెద్దగా సినిమాలేవీ చేయట్లేదు. ఒకట్రెండు చిత్రాల్లో కనిపించినా అవీ కూడా ఓటీటీల్లోనే నేరుగా రిలీజయ్యాయి. ఈ ఏడాది హౌస్ఫుల్ -5, కాళీధర్ లపత్తా లాంటి చిత్రాలతో అభిమానులను మెప్పించారు.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. ఇటీవలే అభిషేక్ సతీమణి ఐశ్వర్య రాయ్ తన అనుమతి లేకుండా ఫోటోలు, పేరును వినియోగించకుండా చూడాలని కోర్టును ఆశ్రయించారు. తన ఫోటోలను పలు వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగిస్తున్న వాటిని తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎలాంటి ముందస్తు పర్మిషన్ లేకుండానే అనేక వెబ్సైట్లు తన పేరును ఉపయోగించి పలు వస్తువులను విక్రయిస్తున్నాయని ఆమె పేర్కొంది. ఏఐ- జనరేటెడ్ ద్వారా తన పోటోలను మార్ఫింగ్ చేసి వీడియోలను కూడా ప్రసారం చేస్తున్నారని ఐశ్వర్య ప్రస్తావించారు.అదే బాటలో అభిషేక్ బచ్చన్..అయితే తన భార్య పిటిషన్ వేసిన 24 గంటల్లోనే అభిషేక్ బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పబ్లిసిటీ, వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పించాలని న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. కొన్ని వెబ్సైట్లు తన అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు వాడుకుంటున్నాయని పిటిషన్లో ప్రస్తావించారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని కోర్టును కోరారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానెల్స్ అనధికారికంగా ఫోటోలను ఉపయోగించడంపై నిషేధం విధించాలని ఆయన అభ్యర్థించారు.దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. దయచేసి ఆ వెబ్సైట్ల వివరాలు సమర్పిస్తే చర్యలకు ఆదేశాలు జారీ చేస్తామని అభిషేక్ తరఫు న్యాయవాదికి సూచించారు. ఒక రోజు సమయం ఇస్తే పూర్తి వివరాలు అందజేస్తామని న్యాయవాది ప్రవీణ్ ఆనంద్ కోర్టుకు తెలిపారు. కొందరు వ్యక్తులు ఏఐతో అభిషేక్ ఫొటోలు క్రియేట్ చేసి అశ్లీల కంటెంట్కు ఉపయోగించుకుంటున్నట్లు కోర్టుకు వివరించారు. -
ఇంత కథ ఉన్న సినిమా నేను ఎప్పుడు చూడలేదు : హీరో బెల్లంకొండ
నేను ఆడియన్స్ కి నచ్చే సినిమాలు చేయడానికి ఇష్టపడతాను. ఆ క్రమంలో చాలా వరకూ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ వచ్చాయి. అయితే నాకు పర్సనల్ గా హారర్ సినిమాలంటే ఇష్టం. మా ప్రొడక్షన్ లో చేసిన కాంచన లాంటి సినిమాలు చాలా ఎంజాయ్ చేశాను.చాలా రోజుల తర్వాత నాకు నచ్చే జానర్లో కిష్కింధపురి అనే ఒక స్ట్రైట్ ఫిల్మ్ చేసే అవకాశం దొరికింది. ఖచ్చితంగా ఈ చిత్రం డియన్స్ కి ఒక డిఫరెంట్ థ్రిల్, సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది’అన్నారు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆయన హీరోగా నటించిన తాజా హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించారు. సెప్టెంబర్ 12న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో సాయి శ్రీనివాస్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు...→ దర్శకుడు కౌశిక్ కు మంచి కథ రెడీ చేసుకున్నాడు. అయితే ఇలాంటి జోనర్స్ సినిమాలకి బడ్జెట్ లిమిటేషన్స్ ఉంటాయి. కానీ సాహు ఆడియన్స్ కి ద బెస్ట్ ఇవ్వాలని టెక్నికల్ గా గ్రాఫిక్స్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మించారు. సినిమాకి కావాల్సిన ప్రతిదీ ఇచ్చారు.ఈ సినిమా చేయడం చాలా ప్రౌడ్ గా ఉంది. సినిమాని ఇలా కూడా తీయొచ్చా అనిపించేలా చేసిన సినిమా ఇది.→ నిన్న ఫస్ట్ టైం థియేటర్స్ లో ఈ సినిమా చూసాం. అదిరిపోయింది. ముఖ్యంగా సౌండ్. సలార్ యానిమల్ కాంతారా సినిమాలకు పనిచేసిన సౌండ్ డిజైనర్ రాధాకృష్ణ సౌండ్ ని అద్భుతంగా డిజైన్ చేశారు. మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఈ సినిమాకి అద్భుతమైన సౌండ్ డిజైన్ చేసే స్పేస్ ఉంది. హారర్ మిస్టరీ ఉన్న ఒక కొత్త జానర్ ఇది. టెక్నికల్ అద్భుతంగా ప్రజెంట్ చేశాం.→ ఈ సినిమా కథలోనే యాక్షన్ ఉంది. మొత్తం ఆర్గానిక్ గా చేసిన సినిమా ఇది. విజువల్ ఎఫెక్ట్స్ సౌండ్ పరంగా ఆడియన్స్ చాలా థ్రిల్ అవుతారు. హారర్ సినిమాలో ఇంత కథ ఉన్న సినిమా నేను ఎప్పుడు చూడలేదు. హారర్ మిస్టరీ రెండు బ్లెండ్ అయిన సినిమా ఇది. ఆడియన్స్ కి సీట్ ఎడ్జ్ ఎక్స్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.→ ఈ సినిమా కోసం సువర్ణమాయ రేడియో స్టేషన్ ని సెట్ గా వేశాం. అలాగే రియల్ వాంటెడ్ హౌస్ లో షూట్ చేశాం. అది రియల్ గా పాతబడిపోయిన బిల్డింగ్. తర్వాత వాళ్లకి కొత్త బిల్డింగ్ వేసి ఇవ్వడం జరిగింది.→ ఈ సినిమాని టీనేజ్ ఆడియన్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. హారర్ కారణంగా సినిమాకి ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఇంత సీరియస్ హారర్ సినిమా చూసి చాలా కాలం అయిందని సెన్సార్ సభ్యులు చెప్పడం ఆనందాన్నిచ్చింది.→ ఈ మధ్య ఏదైనా ఒక కొత్తగా చేయాలి, యాక్టర్ గా ఇంకా ప్రూవ్ చేసుకోవాలి అనే కసి పెరిగింది. ఒక కొత్త క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు సెట్లో లొకేషన్ లో ఆ ఎనర్జీ వేరుగా ఉంటుంది. ఈ మధ్య ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను.→ కొత్త సినిమాల విషయానికొస్తే.. టైసన్ నాయుడు షూటింగ్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. హైందవ షూటింగ్ చివరి దశకు వచ్చింది. సమ్మె కారణంగా బ్రేక్ పడింది కానీ ఈపాటికి షూటింగ్ అయిపోయేది. ఈ రెండు కూడా డిఫరెంట్ సినిమాలు. అలాగే పొలిమేర డైరెక్టర్ అనిల్ తో ఒక సినిమా ఉండబోతుంది. అది న్యూ ఏజ్ థ్రిల్లర్. -
ప్రభాస్ సినిమా చూసి భారతీయ సినిమాలను నిషేధించాడు!
భారత్కు చిరకాల మిత్ర దేశం, పొరుగు దేశమైన నేపాల్ అల్లర్లతో అట్టుడికిపోతోంది. అవినీతితో పాటు సోషల్ మీడియాపై నిషేధాలతో మొదలైన ప్రజాగ్రహానికి ప్రధాని సహా ప్రభుత్వం మొత్తం దాసోహమైపోయింది. అల్లర్లకు బాధ్యత వహిస్తూ ప్రధాని , దేశాధ్యక్షుడు సహా రాజీనామా చేసేశారు. ఈ నేపధ్యంలో ఆ దేశ ప్రధానిగా బాలేంద్ర షా పగ్గాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఖాట్మాండు మేయర్గా ఉన్న బాలేంద్ర కు యువతలో ఉన్న ఆదరణ, ఆయనను ప్రధానిగా కోరుకుంటున్న వారు పెద్ద సంఖ్యలో ఉండడంతో తదుపరి ప్రధాని ఆయనే అనే ఆలోచన బలపడుతోంది.ఈ నేపధ్యంలో కాబోయే ప్రధానిగా పేర్కొంటున్న బాలేంద్ర షా కు భారత్ తో ఉన్న వైరుధ్యాలు ప్రస్తావనకు వస్తున్నాయి. అందులో మరీ ముఖ్యంగా ఆయన రెండేళ్ల క్రితం భారత సినిమాలపై చూపించిన అవసరానికి మించిన ఆగ్రహం ప్రస్తావనార్హంగా మారింది. రెండేళ్ల క్రితం ఖాట్మండు మేయర్ హోదాలో ఆయన ఖాట్మాండు నగరంలో భారతీయ సినిమాల ప్రదర్శనలను నిలిపేయాలని ఆదేశించారు. దాంతో ఖాట్మాండు మెట్రోపాలిస్తో పాటు, పోఖారా మెట్రోపాలిటన్ నగరం కూడా భారతీయ చిత్రాల ప్రదర్శనపై నిషేధం విధించింది. ఈ విషయంలో పోఖారా మేయర్ ధనరాజ్ ఆచార్య కూడా బాలేంద్ర షా మార్గాన్నే అనుసరిస్తూ బాలీవుడ్ చిత్రాల ప్రదర్శనను నిలిపివేయాలని మధ్య నేపాల్లోని మెట్రోపాలిటన్ నగరంలోని సినిమా హాళ్లను ఆదేశించారు. రెండు మెట్రోపాలిటన్ నగరాల మేయర్ల ఆదేశాల తర్వాత, అక్కడ సినిమా హాళ్లు హిందీ లేదా బాలీవుడ్ చిత్రాల ప్రదర్శనను రద్దు చేసి, వాటి స్థానంలో హాలీవుడ్ నేపాలీ సినిమాలను అప్పటికప్పుడు ప్రవేశపెట్టాయి. ఇంతకీ ఇలా బాలీవుడ్ చిత్రాలపై నేపాల్ మేయర్ల ఆగ్రహానికి కారణమైంది టాలీవుడ్ రెబల్ స్టార్ నటించిన ఆదిపురుష్ సినిమా కావడం విశేషం. దీనికి కారణాలను బాలేంద్ర షా సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ‘భారతీయ చిత్రం ఆదిపురుష్ చూశాను. ఆ సినిమాలో రాముని సతీమణి జానకి జన్మ స్థలంపై తప్పు సమాచారం ఉంది . అందులో ఆమెను భారతదేశపు కుమార్తె అని చెప్పే సంభాషణ ఉంది (నేపాలీయులు సీతమ్మ తమ నేలపైనే జన్మించినట్టు విశ్వసిస్తారు), ఇది సరికాదని, అభ్యంతరకరమైనదని మేం వారి దృష్టికి తీసుకెళ్లాం. తప్పును సరిదిద్దడానికి 3 రోజుల సమయంతో అల్టిమేటం ఇచ్చాము. అయినా వారు పట్టించుకోలేదు. నేపాల్ స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఆత్మగౌరవాన్ని చెక్కుచెదరకుండా ఉంచడం ద్వారా జాతీయ ప్రయోజనాలను కాపాడటం ప్రతి ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వేతర రంగం నేపాలీ పౌరుడి ప్రథమ కర్తవ్యం అనడంలో ఎటువంటి సందేహం లేదు‘ అని ఖాట్మండు మేయర్ అప్పట్లో తన ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నారు.అయితే ఆ తర్వాత నేపాలీ రాజధానిలో ప్రదర్శనపై నిషేధం నేపధ్యంలో, ’ఆదిపురుష్’ నిర్మాణ సంస్థ ’టి–సిరీస్’ నేపాలీ మేయర్కు లేఖ రాసింది. అనంతరం సినిమాల నిషేధాన్ని ఎత్తివేయాలని ఆదేశాలిస్తూ న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం సద్ధుమణిగింది. -
విషమివ్వాలని దర్శన్ విజ్ఞప్తి.. బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు!
కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. రేణుకాస్వామి అనే అభిమాని హత్యకేసులో నిందితుడైన ఆయనను బెయిల్ రద్దు కావడంతో అరెస్టై జైలుకు వెళ్లారు. ఈ కేసులో దర్శన్తో పాటు అతని ప్రియురాలు పవిత్ర గౌడను కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో విచారణకు వర్చువల్గా హాజరైన దర్శన్.. న్యాయమూర్తికి తన బాధలను చెప్పుకొచ్చారు. జైల్లో ఉండలేకపోతున్నానని.. తన పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిందని అన్నారు. దయచేసి తనకు ఇంత విషమివ్వాలని జడ్జిని అభ్యర్థించాడు. నా జీవితం దారుణంగా తయారైందని జడ్జి ముందు ఆవేదన వ్యక్తం చేశారు.అయితే దర్శన్ పరిస్థితిని అర్థం చేసుకున్న బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అతనికి జైలులో ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని జైలు అధికారులను ఆదేశించింది. అదే సమయంలో దర్శన్ను బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి బళ్లారి జైలుకు బదిలీ చేయాలన్న అధికారుల విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. దర్శన్ను బళ్లారి జైలుకు మార్చడానికి ఎటువంటి బలమైన కారణం లేదని పేర్కొంది. కాగా.. రేణుకాస్వామి హత్య కేసులో 7 మంది నిందితులు వర్చువల్గా విచారణకు హాజరయ్యారు. దర్శన్ తరపు న్యాయవాదులు కనీసం ఒక మంచం, దిండును అందించాలని జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.అంతకుముందు దర్శన్ జడ్జితో మాట్లాడుతూ.. 'నెల రోజులకు పైనే అవుతుంది ఎండ అన్నది చూడలేదు. దీంతో నా చేతులకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేశాయి. బట్టలు కంపు కొడుతున్నాయి. ఇలా నేను బతకలేను. ఒక్క చుక్క విషం ఇవ్వండి నేను చనిపోతా. నా జీవితం దారుణంగా తయారైంది' అని దర్శన్ ముందు విలపించాడు. దీనిపై స్పందించిన జడ్జి.. అలాంటివి మీరు అడగకూడదు. ఇది జరగదు' అని సమాధానమిచ్చారు. -
కాంతార ప్రీక్వెల్.. ఆ రాష్ట్రంలో విడుదలకు నో!
కాంతార మూవీతో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీక్వెల్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కాంతార చాప్టర్-1 పేరుతో ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 2న థియేటర్లో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది.అయితే రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఈ మూవీకి అడ్డంకులు ఎదురువుతున్నాయి. కేరళలో ఈ చిత్రాన్ని విడుదల చేయనివ్వమని ఎగ్జిబిటర్స్ యూనియన్ ప్రకటించింది. ఈ సినిమాను కేరళలో రిలీజ్ చేస్తున్న సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్తో లాభాల వాటాపై డీల కుదరకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా రిలీజైన మొదటి రెండు వారాలు లాభాల్లో 55 శాతం వాటా ఇవ్వాలని ఎగ్జిబిటర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. అయితే ఇందుకు పృథ్వీరాజ్ సుకుమారన్కు చెందిన పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ నిరాకరించింది. దీంతో కేరళలో సినిమా ప్రదర్శనను నిలిపిస్తున్నట్లు యూనియన్ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకటనతో కాంతార ప్రీక్వెల్ వీక్షించాలనుకున్న మలయాళీలకు నిరాశే తప్పేలా లేదు.మలయాళ సినిమాలు ఇతర రాష్ట్రాల్లో రిలీజైనప్పుడు కేవలం 40 శాతం లాభాల వాటా మాత్రమే పొందుతున్నామని ఎగ్జిబిటర్ల యూనియన్ అధ్యక్షుడు విజయకుమార్ అన్నారు. మలయాళ చిత్ర నిర్మాతలకు అంత వాటా రానప్పుడు.. ఈ పంపిణీదారులు ఎందుకు అంత మొండిగా వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. వారి నుంచి ఈ విషయంలో చొరవ తీసుకోకపోతే తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోబోమని ఎగ్జిబిటర్ల యూనియన్ పేర్కొంది. కాగా.. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, రాకేష్ పూజారి, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. -
‘లిటిల్ మ్యాన్’ అంటూ కొడుకు ఫోటో షేర్ చేసిన వరుణ్.. చిరంజీవి పోస్ట్ వైరల్
మెగా ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంట తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. ఈ రోజు ఉదయం (సెప్టెంబర్ 10) హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో లావణ్య త్రిపాఠి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా ఈ విషయాన్ని వరుణ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. ‘మా లిటిల్ మ్యాన్’ అంటూ ఒళ్లో బిడ్డను ఎత్తుకొని ఉన్న లావణ్య నుదిటిపై ముద్దు పెడుతున్న ఆయన ఫోటోని షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7)మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. వరుణ్ జంటకు కంగ్రాట్స్ చెప్పారు. ‘కొణిదెల ఫ్యామిలీలోకి మరోవ్యక్తి వచ్చాడు. వరుణ్, లావణ్యకు శుభాకాంక్షలు. నాగబాబు, పద్మజ గ్రాండ్ పెరెంట్స్గా ప్రమోట్ అయినందుకు ఆనందంగా ఉంది’అంటూ బాబుని తన చేత్తుల్లో ఎత్తుకొని ఉన్న ఫోటోని షేర్ చేశాడు. చిన్నారికి అభిమానుల ఆశీస్సులు ఉండాలి అని చిరంజీవి కోరారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela)కాగా, లావణ్య, వరుణ్లది ప్రేమ వివాహం. మిస్టర్ (2017) సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. కొంతకాలం డేటింగ్ చేసి, 2023 నవంబర్లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. గర్భం దాల్చిన విషయాన్ని ఈ ఏడాది మేలో సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు మెగా ఫ్యామిలీ చెబుతోంది. -
నయనతార డాక్యుమెంటరీ.. ఎప్పుడు వివాదాలే.. రూ.5 కోట్లు డిమాండ్!
లేడీ సూపర్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం మెగాస్టార్ సరసన నటిస్తోంది. అనిల్ రావిపూడి- చిరంజీవి కాంబోలో వస్తోన్న ఈ చిత్రం టైటిల్ను ఇటీవలే మేకర్స్ రివీల్ చేశారు. చిరు బర్త్ డే సందర్భంగా మెగా టైటిల్ను పరిచయం చేశారు. ఈ సినిమాకు మనశంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.అయితే కోలీవుడ్ భామ నయనతారం ఎప్పుడు ఏదో ఓ వివాదంలో చిక్కుకుంటూనే ఉంటోంది. గతంలో చాలాసార్లు వివాదాలకు కేరాఫ్గా అడ్రస్గా మారిన ముద్దుగుమ్మను మరోసారి ఇబ్బందుల్లో పడింది. గతేడాది నవంబర్లో రిలీజైన డాక్యామెంటరీ నయనతార-బియాండ్ ది ఫెయిరీ టేయిల్లో అనుమతి లేకుండా తమ సినిమా క్లిప్స్ వాడారని నిర్మాణ సంస్థ ఏబీ ఇంటర్నేషనల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. క్లిప్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ.. రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని లీగల్ నోటీసు అందజేసినప్పటికీ.. అదే కంటెంట్తో డాక్యుమెంటరీ ప్రసారం అవుతోందని ఎబి ఇంటర్నేషనల్ వాదించింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలంటూ డాక్యుమెంటరీ నిర్మాణ సంస్థ టార్క్ స్టూడియోస్ను ఆదేశించింది. ఇందుకోసం అక్టోబర్ 6 వరకు గడువు ఇచ్చింది. టార్క్ స్టూడియోస్ నిర్మించిన నయనతార-బియాండ్ ది ఫెయిరీ టేల్ నవంబర్ 2024లో నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. కాగా.. గతంలో ఈ డాక్యుమెంటరీ విడుదలైన ధనుశ్కు చెందిన వుండర్బార్ ఫిల్మ్స్ తమ సినిమా నానుమ్ రౌడీ దాన్ నుంచి సన్నివేశాలను అనుమతి లేకుండా ఉపయోగించారని ఆరోపిస్తూ కోటి రూపాయల నష్టపరిహారం కోరింది. ఆ కేసు ఇప్పటికీ పెండింగ్లో ఉంది. తాజాగా ఈ డాక్యుమెంటరీపై మరో వివాదం మొదలైంది. కాగా.. 2005లో వచ్చిన చంద్రముఖి సినిమాలో రజినీకాంత్, జ్యోతిక, నయనతార కీలక పాత్రల్లో నటించారు. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి
టాలీవుడ్ స్టార్ దంపతులు వరుణ్ తేజ్ (Varun Tej)- లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) పేరెంట్స్గా ప్రమోషన్ పొందారు. లావణ్య బుధవారం ఉదయం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీ ఇంట ఆనందాలు వెల్లివిరిశాయి. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. మరోవైపు చిరంజీవి కూడా 'మన శంకరవరప్రసాద్గారు' మూవీ సెట్స్ నుంచి నేరుగా ఆస్పత్రికి వెళ్లి వరుణ్- లావణ్యకు శుభాకాంక్షలు తెలిపారు. అటు అభిమానులు, సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా వరుణ్ జంటకు విషెస్ చెప్తున్నారు.లవ్ మ్యారేజ్వరుణ్-లావణ్యలది ప్రేమ వివాహం. 2017లో మిస్టర్ సినిమాలో తొలిసారి జంటగా నటించారు. తర్వాత అంతరిక్షంలోనూ యాక్ట్ చేశారు. ఈ సినిమాల సమయంలోనే వీరి మధ్య స్నేహం బలపడింది. అది ప్రేమగా మారడంతో కొంతకాలం డేటింగ్లో ఉన్నారు. తర్వాత పెద్దలనొప్పించి 2023 నవంబర్ 1న పెళ్లి చేసుకున్నారు. సినిమాల విషయానికి వస్తే.. వరుణ్ తేజ్ చివరగా గతేడాది మట్కా సినిమాలో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ప్రస్తుతం #VT15 అనే వర్కింగ్ టైటిల్తో ఓ సినిమా చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. Our little man 🩵🩵🩵10.09.2025 pic.twitter.com/dFTCFFPl9o— Varun Tej Konidela (@IAmVarunTej) September 10, 2025 View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) -
'96' సీక్వెల్ డ్రాప్.. ఫహాద్తో డిఫరెంట్ సినిమా
'96'.. ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే ప్రేమకథలు ఇప్పటివరకు చాలా వచ్చాయి గానీ ఈ చిత్రంలో ఎమోషన్స్, స్టోరీ.. అద్భుతమైన ఎక్స్పీరియెన్స్ ఇచ్చాయి. ఓ రకంగా చెప్పాలంటే విజయ్ సేతుపతి, త్రిషకు ఓ రేంజు గుర్తింపు తీసుకొచ్చాయి. అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉందని కొన్నాళ్ల క్రితం చెప్పిన దర్శకుడు ప్రేమ్ కుమార్.. ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు అనిపిస్తుంది. డిఫరెంట్ చిత్రాలతో రాబోతున్నట్లు ప్రకటించాడు.(ఇదీ చదవండి: కొత్త ట్రెండ్.. ఓటీటీలో యానిమేషన్ 'కురుక్షేత్రం')చివరగా ప్రేమ్ కుమార్.. 'సత్యం సుందరం' సినిమాతో వచ్చాడు. గతేడాది ఇది రిలీజైంది. దీని తర్వాత తమిళ హీరో విక్రమ్తో ఓ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. అయితే ఇది ఇంకా ఆలస్యం కానుంది. ఇంతలో ఫహాద్ ఫాజిల్తో ప్రేమ్ కుమార్ ఓ ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు. 45 నిమిషాల స్క్రిప్ట్ చెప్పానని, అది ఫహాద్కి చాలా నచ్చేసిందని చెప్పాడు. ఇదో యాక్షన్ థ్రిల్లర్ అని పేర్కొన్నాడు. అయితే 96, సత్యం సుందరం చిత్రాలతో పోలిస్తే ఇందులో చాలా తక్కువ క్యారెక్టర్స్ ఉంటాయని క్లారిటీ ఇచ్చాడు.ఫహాద్ ఫాజిల్కి హీరోగా ఇది తొలి తమిళ సినిమా కానుంది. జనవరి నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఇదివరకే తమిళంలో ఫహాద్ పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. వాటిలో సహాయ పాత్రలు చేశాడు. ఇప్పుడు ప్రేమ్ కుమార్తో మూవీ అనగానే కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత విక్రమ్తో ప్రేమ్ కుమార్ మూవీ చేస్తారు. అయితే ఈ విషయాన్ని చెప్పిన ఈ దర్శకుడు.. 96 సీక్వెల్ గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. అంటే ఇది లేనట్లే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: నాతో బలవంతంగా ఆ సీన్స్ చేయించారు: 'ఆదిత్య 369' హీరోయిన్)"My Next film is with #FahadhFaasil😲, It'll be a thriller with Action, but my core emotion touch will be there♥️🔥. Narrated 45 mins to Fafa & he liked a lot👌. It's direct Tamil film & shoot from Jan🎬. #ChiyaanVikram film will be delayed👀"- #Premkumar pic.twitter.com/YL1IVVYMrm— AmuthaBharathi (@CinemaWithAB) September 9, 2025 -
ఏడుస్తున్నా వినకుండా ఆ సీన్స్ చేయించారు.. నాపై చేతబడి చేశారు!
చిరంజీవి, మోహన్బాబు, బాలకృష్ణ.. ఇలా స్టార్ హీరోలందరితోనూ నటించింది హీరోయిన్ మోహిని. ఆదిత్య 369 సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. దక్షిణాదిన అన్ని భాషల్లో కలుపుకుని దాదాపు 100కి పైగా సినిమాలు చేసింది. తమిళ, మలయాళంలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. పిల్లలు పుట్టాక సినీ ఇండస్ట్రీకి దూరమైంది.వద్దని ఏడ్చా..చాలాకాలం తర్వాత ఆమె ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా సినీజ్ఞాపకాలను పంచుకుంది. మోహిని (Tamil Actress Mohini) మాట్లాడుతూ.. ఓ సినిమాలో దర్శకుడు రొమాంటిక్ సాంగ్ను స్విమ్మింగ్ పూల్లో ప్లాన్ చేశాడు. నాకసలే ఈత రాదు, అందులోనూ స్విమ్ సూట్ వేసుకోవడం చాలా అసౌకర్యంగా అనిపించింది. అదే మాట చెప్పి ఏడ్చాను. నావల్ల కాదన్నాను.ఇష్టం లేకుండా నటించాఅప్పట్లో ఈత నేర్పించడానికి ఆడవాళ్లు లేరు, మగవాళ్లే ఉన్నారు. వాళ్ల ముందు సగం బట్టలే వేసుకుని ఈత నేర్చుకోవడానికి ఎంతో ఇబ్బందిగా అనిపించింది. అయినా సరే ఆ పాటలో నాతో బలవంతంగా సగం దుస్తులు వేయించి స్విమ్మింగ్ పూల్లో షూట్ పూర్తి చేశారు. తర్వాత ఊటీలో మళ్లీ అలాంటి సీన్ చేయాలన్నారు. అప్పుడు నేనసలు ఒప్పుకోలేదు. ఆల్రెడీ సీన్ అయిపోయాక మళ్లీ ఇదేంటి? నేను చేయనని తెగేసి చెప్పాను. నాకు ఇష్టం లేకపోయినా మరీ గ్లామరస్గా కనిపించేలా చేశారు.చేజారిన సినిమాలు'సూర్య సన్నాఫ్ కృష్ణన్' మూవీలో సిమ్రాన్కు బదులుగా నేనే నటించాల్సింది. ముందు నన్నే అడిగారు. కానీ నేను సినిమాలు మానేశానని ఎవరో డైరెక్టర్కు చెప్పారట! దీంతో నా స్థానంలో సిమ్రాన్ను తీసుకున్నారు. ఈ విషయం దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ స్వయంగా నాతో చెప్పాడు. రజనీకాంత్ 'ముత్తు' సినిమాలో హీరోయిన్గా నన్ను తీసుకోవాలా? మీనాను సెలక్ట్ చేసుకోవాలా? అని దర్శకనిర్మాతలు సందిగ్ధంలో పడ్డారు. నన్నోసారి వచ్చి కలవమన్నారు. పనికోసం వెతుక్కుంటూ వెళ్లడం నాకిష్టం లేదు. నాపై చేతబడిమనకని రాసిపెట్టుంటే అది మనకే వస్తుందని ఊరుకున్నాను. వాళ్లు ఫైనల్గా మీనాను సెలక్ట్ చేశారు. ఇది పోతే నాకు ఎక్కడో మంచి అవకాశం ఉండే ఉంటుందనుకున్నాను. డేట్స్ కుదరకపోవడంతో చిన్న తంబి చేజారింది అని చెప్పుకొచ్చింది. పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. నా భర్త కజిన్ నాపై చేతబడి చేయించింది. అప్పుడు నన్ను ఆ భగవంతుడే కాపాడాడు అని పేర్కొంది. మోహిని చివరగా కలెక్టర్ (2011) అనే మలయాళ మూవీలో మెరిసింది.చదవండి: IVF ద్వారా గర్భం.. బొడ్డుతాడులో రివర్స్లో రక్తం.. ప్రాణం లేని బిడ్డకు జన్మనిచ్చిన నటి -
కొత్త ట్రెండ్.. ఓటీటీలో యానిమేషన్ 'కురుక్షేత్రం'
ఇప్పటి జనరేషన్కి పురాణాలు, ఇతిహాసాల గురించి కాస్త తక్కువగానే తెలుసు. అలానే రీసెంట్ టైంలో ఈ జానర్లో సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. నెలన్నర క్రితం థియేటర్లలో రిలీజైన 'మహావతార్ నరసింహ' అనే యానిమేటెడ్ మూవీ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని దారిలోనే తెలుగులోనూ 'వాయుపుత్ర' అనే సినిమా రాబోతుంది. ఈ ట్రెండ్ ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసినట్లు కనిపిస్తుంది.(ఇదీ చదవండి: 'మహావతార్ నరసింహా' స్పూర్తి.. తెలుగులోనూ యానిమేషన్ సినిమా)మహాభారతంలోని కురుక్షేత్రం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ ఘట్టాన్ని యానిమేషన్ రూపంలో ఓటీటీ సిరీస్గా తీసుకొచ్చేందుకు సిద్ధమైపోయారు. తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. అక్టోబరు 10 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓ వీడియో ఇప్పుడు రిలీజ్ చేశారు. అను సిక్కా ఈ సిరీస్ క్రియేటర్ కాగా.. ఉజాన్ గంగూలీ దర్శకత్వం వహించారు. మరి ఈ 'కురుక్షేత్ర' సిరీస్.. ప్రేక్షకుల్ని ఎంతలా అలరిస్తుందో చూడాలి?Shankhnaad ke sath arambh hoga dharm aur adharm ka mahayudh ⚔🔥Watch Kurukshetra, out 10 October, only on Netflix.#KurukshetraOnNetflix pic.twitter.com/z4shkPyu1g— Netflix India (@NetflixIndia) September 10, 2025 -
చిన్నారికి అరుదైన వ్యాధి.. హీరోయిన్ ఆపన్నహస్తం
అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చింది బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez). బాబు ఇంటికి వెళ్లి తనతో కబుర్లు చెప్పి, ఆడించి నవ్వించే ప్రయత్నం చేసింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులోని బాబు తల బెలూన్లా ఉబ్బిపోయి ఉంది. తలపై నరాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని హైడ్రోసెఫాలస్ (Hydrocephalus) అని పిలుస్తారు. అరుదైన వ్యాధిఈ వ్యాధి వచ్చిన శిశువుల తల అసాధారణంగా పెద్దగా ఉంటుంది. ఈ వ్యాధితో ఓ బాలుడు బాధపడుతున్నాడని తెలిసి జాక్వెలిన్ చలించిపోయింది. వెంటనే అతడి కుటుంబాన్ని కలిసి సర్జరీ చేయిస్తానని హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హుస్సేన్ మన్సూరి వెల్లడిస్తూ జాక్వెలిన్కు అభినందనలు తెలిపాడు. పిల్లవాడు మళ్లీ మామూలు స్థితికి వస్తాడని ఆశిద్దామని పోస్ట్ పెట్టాడు. మంచి మనసుకాగా జాక్వెలిన్ పలు స్వచ్ఛంద సంస్థలకు సాయం చేస్తూ ఉంటుంది. మూగ జీవాల సంరక్షణ, పిల్లల చదువులు.. ఇలా అన్నింటికోసం పాటుపడుతూ ఉంటుంది. అలాగే శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని జనాల్లో అవగాహన కల్పించేందుకు క్యాంపెయిన్స్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం జాక్వెలిన్.. వెల్కమ్ టు ద జంగిల్ సినిమా చేస్తోంది. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Hussain Mansuri (@iamhussainmansuri) చదవండి: నీ దయాదాక్షిణ్యాలతో బతుకుతున్నామా? రెచ్చిపోయిన మాస్క్మ్యాన్ -
'మహావతార్ నరసింహా' స్పూర్తి.. తెలుగులోనూ యానిమేషన్ సినిమా
కొన్నాళ్ల క్రితం థియేటర్లలో రిలీజైన 'మహావతార్ నరసింహా' అనే యానిమేషన్ సినిమా సంచలనం సృష్టించింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ పెడితే ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతోంది. రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి రికార్డ్స్ కొల్లగొడుతోంది. ఇప్పుడు దీన్ని స్పూర్తిగా తీసుకున్నారో ఏమో గానీ తెలుగులోనూ ఓ మూవీ తీసేందుకు సిద్ధమైపోయారు. తాజాగా ఆ వివరాల్ని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: హిజ్రాగా నటించాలి.. ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ ఆశ)ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ తన కొత్త మూవీని ప్రకటించింది. హనుమంతుడి జీవితం ఆధారంగా 'వాయుపుత్ర' పేరుతో ఈ త్రీడీ యానిమేషన్ సినిమాని తీస్తున్నారు. 'కార్తికేయ', 'కార్తికేయ 2', 'తండేల్' లాంటి హిట్ చిత్రాలు తీసిన చందు మొండేటి.. ఈ యానిమేషన్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది దసరాకు థియేటర్లలోకి తీసుకురానున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు చెప్పుకొచ్చారు.నరసింహా అవతారం ఆధారంగా 'మహావతార్' మూవీ తీశారు. జనాల్ని భక్తి పారవశ్యం చెందేలా చేశారు. ఇప్పుడు 'వాయుపుత్ర' పోస్టర్ చూస్తుంటే హనుమంతుడి జీవితంలోని ముఖ్య ఘట్టాల్ని యానిమేషన్ రూపంలో చూపించబోతున్నారని అనిపిస్తుంది. ఈ ట్రెండ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో నటీనటుల్ని పక్కనబెట్టి ఇలా పురాణాల్లోని క్యారెక్టర్స్ ఆధారంగా యానిమేషన్ మూవీస్ మరిన్ని వస్తాయేమో అనే సందేహం కలుగుతోంది.(ఇదీ చదవండి: నా సినిమా.. అలా చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తా: బెల్లంకొండ)మన చరిత్ర, ఇతిహాసాలలో వాయుపుత్రుడు హనుమంతుడిది ప్రత్యేక స్థానం. సప్త చిరంజీవులలో ఒకరైన హనుమంతుడు.. తన బలం, భక్తితో కాలాన్ని అధిగమించిన శాశ్వత యోధుడు. అలాంటి గొప్ప యోధుడి కథతో 'వాయుపుత్ర' చిత్రం రూపొందుతోంది. ఇది పర్వతాలను కదిలించిన భక్తి కథ కూడా. ఇది తరాలను తీర్చిదిద్దిన, ప్రేరేపించిన హనుమంతుడి అచంచల విశ్వాసాన్ని సంగ్రహిస్తుంది. చందూ మొండేటి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం.. భారీస్థాయిలో త్రీడీ యానిమేషన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. 2026 దసరాకు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రకటన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. హనుమంతుడు కొండపై నిలబడి, దహనమవుతున్న లంకను చూస్తున్న శక్తివంతమైన పోస్టర్ ఆకట్టుకుంటోంది. -
నీ దయాదాక్షిణ్యాలతో బతుకుతున్నామా? రెచ్చిపోయిన మాస్క్ మ్యాన్
కామనర్స్ అంటే బెరుకుగా, భయంభయంగా ఉంటారనుకున్నారేమో! కానీ, సెలబ్రిటీలనే బెదరగొడుతున్నారు. అందులోనూ బిగ్బాస్ వారికి సూపర్ పవర్స్ ఇచ్చాడు. ఇంటిని కామనర్ల చేతిలో పెట్టాడు. వాళ్ల అనుమతితోనే టెనెంట్లు (సెలబ్రిటీలు) లోపల అడుగుపెట్టాల్సి ఉంటుంది. ఇంటి పని, వంటపని, అందరి బట్టలు ఉతికే పని కూడా సెలబ్రిటీలే చేస్తున్నారు.షేడ్స్ చూపిస్తున్న కామనర్స్ఒక్కోసారి సెలబ్రిటీల పరిస్థితి చూసి జాలిపడతారు, బిగ్బాస్ (Bigg Boss Telugu 9) వద్దన్నా సరే మానవత్వం అంటూ అరటిపండ్లు ఇచ్చేందుకు ముందుకొస్తారు. అదే సమయంలో వాళ్లు ఆకలిగా ఉందని ఏదైనా తింటే మాత్రం బిగ్బాస్ రూల్ మర్చిపోయారా? అని లాక్కుంటారు. వాళ్ల విధానాలు వారికే అర్థం కావాలి! ప్రస్తుతానికి హౌస్లో నామినేషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ కూడా పక్షపాతం చూపించాడు బిగ్బాస్. కామనర్స్ను పక్కనపెట్టేసి టెనంట్స్ మాత్రమే ఒకరినొకరు నామినేట్ చేసుకోవాలన్నాడు.చేతులెత్తి దండం పెట్టిన తనూజఅంతటితో ఆగలేదు.. వారి నామినేషన్ కరెక్ట్గా ఉందా? లేదా? అన్నది చూడాల్సిన బాధ్యతను కామనర్స్కు అప్పగించాడు. ఇప్పటికే సంజనా, సుమన్ నామినేట్ అయ్యారు. తాజాగా ఈ నామినేషన్కు సంబంధించి ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో శ్రీజ మాట్లాడుతూ.. వచ్చినప్పటి నుంచి కొన్ని రకాల కామెంట్స్ చేస్తూ ఉన్నారని తనూజ (Thanuja Puttaswamy)తో అంది. దానికామె చేతులెత్తి దండం పెట్టింది. పని కూడా చిరాకుపడుతూ చేస్తున్నారంది.అర్హత లేదని హెచ్చరికఒకరు ఒకసారి ఓ పని చెప్తారు. ఇంకొకరు వచ్చి ఇంకోపని చెప్తారు, నేనూ మనిషినే.. అంటూ తనూజ వివరణ ఇచ్చుకునేందుకు ప్రయత్నించగా మధ్యలో మాస్క్ మ్యాన్ దూరాడు. నీ దయదాక్షిణ్యాలతో బతుకుతున్నామా? మీ మాట, బాడీ లాంగ్వేజ్ బాగోలేదు అని తిట్టాడు. నా బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదని వార్నింగ్ ఇచ్చింది. కానీ తర్వాత మాత్రం కన్నీళ్లు పెట్టుకుంది. భరణి మినహా మిగతా అందరు సెలబ్రిటీలు రీతూ, తనూజ, ఇమ్మాన్యుయేల్, సుమన్, సంజన, ఫ్లోరా, రాము రాథోడ్, శ్రష్టి వర్మ నామినేషన్స్లో ఉన్నారు. వీరితో పాటు కామనర్ డిమాన్ పవన్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. చదవండి: రీతూ తలకు గాయం.. అదో పెద్ద సైకో! దాన్ని చూస్తేనే చిరాకు! -
ఆసక్తికరంగా విజయ్ ఆంటోని 'భద్రకాళి' ట్రైలర్
తమిళ సంగీత దర్శకుడు కమ్ హీరో విజయ్ ఆంటోని వరసపెట్టి సినిమాలు తీస్తూనే ఉంటాడు. ఈ ఏడాది ఇప్పటికే 'మార్గన్' అనే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్తో వచ్చాడు. ఇప్పడు పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జానర్లో ఓ మూవీ చేశాడు. అదే 'భద్రకాళి'. లెక్క ప్రకారం సెప్టెంబరు 5నే థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ 19వ తేదీకి వాయిదా పడింది. తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ సాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: హిజ్రాగా నటించాలి.. ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ ఆశ)ట్రైలర్ బట్టి చూస్తుంటే థ్రిల్లింగ్, పొలిటికల్ అంశాలు కనిపిస్తున్నాయి. సమాజంలోని దుష్టశక్తుల ఆటకట్టించే శక్తివంతమైన వ్యక్తిగా విజయ్ ఆంటోని పాత్ర ఉండనుందని అర్థమవుతోంది. ఈవారం 'మిరాయ్', 'కిష్కంధపురి' లాంటి తెలుగు చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి. వచ్చే వారం రాబోతున్న 'భద్రకాళి'కి పెద్దగా పోటీ లేదు. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: నా సినిమా.. అలా చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తా: బెల్లంకొండ) -
IVF ద్వారా గర్భం.. బొడ్డుతాడులో రివర్స్లో రక్తం.. ప్రాణం లేని పాప!
తల్లవాలంటే ముందు పెళ్లవాలా? అక్కర్లేదు, ఏ తోడూ లేకుండానే అమ్మనవుతాను అని నిర్ణయించుకుంది కన్నడ నటి భావన రామన్న. అందుకే 40 ఏళ్లొచ్చినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయిన ఆమె ఐవీఎఫ్ ఎంచుకుంది. కడుపులో కవలలను మోసింది. సీమంతం కూడా బాగా జరిగింది. కానీ డెలివరీ రోజు ఒక శిశువు మాత్రమే ప్రాణంతో దక్కింది. ఓ శిశువును కోల్పోయింది.టైం బాంబ్పై కూర్చున్నావ్ఈ విషాదం గురించి భావన (Bhavana Ramanna) మాట్లాడుతూ.. సీమంతం తర్వాత నేను ఎక్కువసేపు కూర్చోలేకపోయాను. కొన్నిసార్లు స్పాటింగ్ (రక్తస్రావం) కనిపించేది. నేను వెళ్లే హాస్పిటల్ చాలా దూరంలో ఉండటంతో దగ్గర్లోనే మంచి డాక్టర్ను చూసుకుంటే అయిపోతుందన్నారు. మా బంధువులు ఎక్కువగా డెలివరీ అయిన డాక్టర్ దగ్గరకు వెళ్లి కలిశాను. ఆమె నన్ను చూడగానే.. భావన, నువ్వో టైం బాంబ్ మీద కూర్చున్నావ్.. తెలుసా? అంది. పాప చనిపోయిందివెంటనే నాకు అన్ని పరీక్షలు చేసింది. సాధారణంగా బొడ్డుతాడు ద్వారా శిశువుకు రక్తం అందుతుంది. కానీ టెస్ట్లో అది రివర్స్లో జరుగుతుందని తేలింది. అలాగే ఓ శిశువు గుండె కొట్టుకునే వేగం సగానికి సగం తగ్గిపోయిందని తెలిసింది. పైగా సరైన బరువు కూడా లేదని డాక్టర్ చెప్పింది. అప్పటికప్పుడు నాకు ఆపరేషన్ చేశారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఒక బిడ్డ చనిపోయిందని చెప్పగానే నాకు మాటలు రాలేదు. అమ్మమ్మ పేరే పెట్టా..పుట్టిన బిడ్డ కోసం సంతోషపడాలా? చనిపోయిన పాప కోసం ఏడవాలా? ఏదీ అర్థం కాని స్థితిలో ఉండిపోయాను. నా కూతురికి రుక్మిణి అని మా అమ్మమ్మ పేరు పెట్టాను. తను ఆగస్టు 20న జన్మించింది అని చెప్పుకొచ్చింది. కన్నడలో అనేక సినిమాలు చేసిన భావన రామన్న తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. చివరగా మలయాళంలో ఒట్ట మూవీ చేసింది. తెలుగులో అమ్మాయి నవ్వితే (2001) అనే ఏకైక మూవీలో కనిపించింది.చదవండి: రీతూ తలకు గాయం.. అదో పెద్ద సైకో! దాన్ని చూస్తేనే చిరాకు! -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న బిగ్బాస్ రన్నరప్
బిగ్బాస్ రియాల్టీ గేమ్ షో (Bigg Boss Reality Show) నుంచి బయటికి వచ్చిన పలువురు సినిమాల్లో హీరోగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ విక్రమన్ కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈయన హీరోగా నటిస్తున్న చిత్రాన్ని గోల్డెన్ గెట్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ప్రీతి కరికాలన్ కథ, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఇటీవల చైన్నెలో నిరాడంబరంగా నిర్వహించారు. బుధవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. దర్శకురాలు మాట్లాడుతూ.. బిగ్బాస్ ఫేమ్ విక్రమన్ను హీరోగా ఎంపిక చేయడానికి కారణం అతని పర్సనాలిటీ అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉండడమేనన్నారు. ఈ చిత్రంలోని కథానాయకుడి పాత్రకు తను పర్ఫెక్ట్గా ఉంటారన్నారు. చిత్ర కథ వాస్తవానికి దగ్గరగా, చాలా ఫ్రెష్గా కలర్ ఫుల్ ఎంటర్టైనర్గా ఉంటుందని చెప్పారు. సంగీతం, విజువల్స్ అదనపు ఆకర్షణగా నిలుస్తాయన్నారు. టోటల్గా ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాకు శ్రీధర్ ఛాయాగ్రహణం, అజేష్ అశోకన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా విక్రమన్.. తమిళ బిగ్బాస్ ఆరో సీజన్లో ఫస్ట్ రన్నరప్గా నిలిచాడు. -
రీతూ తలకు గాయం.. అదో పెద్ద సైకో! దాన్ని చూస్తేనే చిరాకు!
బిగ్బాస్ షో (Bigg Boss 9 Telugu)లో మొదటివారం నామినేషన్స్ సిల్లీగా ఉంటాయి. ఆమె నాతో మాట్లాడలేదు, తన దగ్గర పాజిటివ్ వైబ్స్ రావడం లేదు, ఆయన సరిగా ఇల్లు తుడవలేదు, నాకింకో ఆప్షన్ లేదు అంటూ నామినేట్ చేస్తూ ఉంటారు. ఈసారి మాత్రం మీ అందరికీ బలమైన పాయింట్ అందించేందుకు నేనున్నానంటూ సంజనా గల్రానీ అభయమిచ్చింది. చీటికిమాటికి చిరాకు పడుతూ, గొడవలతో విసుగు తెప్పిస్తూ అందరికంట్లో పడింది. నీ పనిమనిషినా?ఇంకేముంది ఓనర్స్ అందరూ కలిసి సంజనాను ఏకాభిప్రాయంతో నామినేట్ చేశారు. తర్వాత వాష్రూమ్ దగ్గర రచ్చ మొదలైంది. కండీషనర్, షాంపూ బాత్రూంలో పెట్టకండి, బయటపెట్టుకోండి అని ఫ్లోరా చెప్తుంటే సంజనా అడ్డంగా వాదించింది. విసుగెత్తిన ఫ్లోరా.. నేనేమైనా నీ పనిమనిషినా? బాత్రూమ్ క్లీన్ చేసే బాధ్యత నాకు అప్పగించారు. క్లీన్ చేయడానికి వెళ్లిన ప్రతిసారి అవి తీసి బయటపెట్టాలా? అని నిలదీసేసరికి సంజనా కోపం నషాళానికంటింది. మ్యానర్స్ లేదు, అదీ ఇదీ అని చెడామడా తిట్టేసరికి ఫ్లోరా ఏడ్చేసింది.ఫుటేజ్ కోసమా?అదంతా చూసిన శ్రీజ.. ఫుటేజ్ కోసమే సంజనా ఇంత సీన్ చేస్తుందని కామెంట్ చేసింది. ఆ మాటతో అగ్గిమీద గుగ్గిలమైన సంజనా.. ఏమన్నావ్? ఫుటేజ్ కోసమా? నా ముందు వేలు చూపించి మాట్లాడకు అని వార్నింగ్ ఇస్తూనే చీప్ అని తిట్టింది. తర్వాత కూడా ఇమ్మాన్యుయేల్తో శ్రీజను చూపిస్తూ అది సైకో, దాన్ని చూస్తేనే చిరాకు అని చీదరించుకుంది తర్వాత టెనెంట్స్లో మీలో ఒకర్ని మీరే నామినేట్ చేసుకోవాలన్నాడు బిగ్బాస్. పోటీదారులు ఇద్దరు టన్నెల్స్లో పాకుతూ వెళ్లి అక్కడున్న సుత్తిని అందుకోవాలి. రీతూ తలకు గాయంసుత్తిని అందుకున్నవారు నామినేషన్స్ చేస్తారు. ఈ ప్రక్రియలో రీతూ పాకుతూ ఉండగా పక్కనే ఉన్న పోల్ తగలడంతో దెబ్బ తగిలింది. దాంతో ఆమెను మెడికల్ రూమ్కు పిలిచి తలకు కట్టు కట్టారు. తనూజ.. సంజనాను, రాము.. సుమన్ శెట్టిని నామినేట్ చేశారు. ఎక్కువగా మౌన వ్రతంలోనే ఉంటున్న సుమన్.. ఎట్టకేలకు నిన్న నోరు విప్పాడు. కానీ సరిగా డిఫెండ్ చేసుకోలేకపోయాడు. మిగతా నామినేషన్స్ నేటి ఎపిసోడ్లో కొనసాగనున్నాయి.చదవండి: నా సినిమా.. అలా చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తా: బెల్లంకొండ -
హిజ్రాగా నటించాలి.. ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ ఆశ
ఎన్ని సినిమాలు చేసినా సరే నటీనటులకు ఏదో ఒక డ్రీమ్ పాత్ర మిగిలే ఉంటుంది. అలా ప్రముఖ నటి శోభన కూడా ఓ పాత్ర పోషించేందుకు ఎదురుచూస్తున్నానని చెప్పింది. తెలుగు, తమిళం, మలయాళం ఇలా పలు భాషల్లో హీరోయిన్గా చేసిన ఈమె.. గొప్ప నాట్య కళాకారిణి కూడా. నటించడం తగ్గించి భరతనాట్యం పైనే ఎక్కువ మక్కువ చూపిస్తోంది. అలా చైన్నెలో డ్యాన్స్ స్కూలు నిర్వహిస్తోంది. మరోవైపు అడపా దడపా చిత్రాల్లో నటిస్తున్నారు. అదీ తనకు నచ్చిన పాత్రలు అయితేనే.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9 తొలివారం నామినేషన్స్.. మొత్తం 9 మంది!)ఇటీవల మలయాళంలో మోహన్ లాల్కు జంటగా 'తుడరుమ్' మూవీలో శోభన లీడ్ రోల్ చేశారు. ఈ చిత్రం అద్భుతమైన హిట్ అయింది. శోభన నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓనం సందర్భంగా ఓ న్యూస్ ఛానెల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో మాట్లాడుతూ.. తాను ఓ హిజ్రా పాత్రని పోషించాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ విషయమై దర్శకులతోనూ మాట్లాడానని అన్నారు. కానీ వారు మాత్రం.. ప్రేక్షకులు మిమ్మల్ని ఆ పాత్రలో అంగీకరించరని తనతో చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు.మమ్ముట్టి నటిస్తే స్వాగతించలేదా? అని సదరు దర్శకుల్ని తాను ప్రశ్నించినట్లు శోభన చెప్పారు. మలయాళ మెగాస్టార్ అయిన మమ్ముట్టి.. రీసెంట్గా 'కాదల్ ది కోర్' అనే సినిమా చేశారు. ఇందులో స్వలింగ సంపర్కుడిగా (హిజ్రా) నటించడం విశేషం. దీంతో హిజ్రా పాత్రలో నటించడానికి తాను ఎదురుచూస్తున్నట్లు శోభన పేర్కొన్నారు. ఆ తరహా పాత్రలో నటించడం చాలా కష్టమని చెప్పిన ఈమె.. అందుకు రూపురేఖలు, మాట్లాడే తీరు, గొంతు లాంటివి చాలా ముఖ్యమని అన్నారు అందువల్ల అలాంటి పాత్రలో నటించడం తనకు చాలా ఛాలెంజ్గా ఉంటుందని పేర్కొన్నారు. కాగా శోభనని హిజ్రాగా నటింపజేయడానికి ఏ దర్శకుడు ముందుకు వస్తారో చూడాలి?(ఇదీ చదవండి: నా సినిమా.. అలా చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తా: బెల్లంకొండ) -
మా తండ్రి ఆస్తుల్లో వాటా ఇవ్వాలి.. కోర్టుకెక్కిన కరిష్మా కపూర్ పిల్లలు
న్యూఢిల్లీ: తమ తండ్రి దివంగత సంజయ్ కపూర్ ఆస్తుల్లో వాటా కోసం బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ కుమార్తె, కుమారుడు న్యాయ పోరాటం ప్రారంభించారు. తండ్రి ఆస్తుల్లో తమకు రావాల్సిన వాటా దక్కేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మంగళవారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై బుధవారం విచారణ జరిగే అవకాశం ఉంది. సంజయ్ కపూర్కు రూ.30,000 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు సమాచారం. మరణానికి ముందు ఈ ఏడాది మార్చి 21వ తేదీన ఆయన రాసినట్లు చెబుతున్న విల్లు నకిలీదని కరిష్మా కపూర్ కుమార్తె, కుమారుడు ఆరో పించారు.ఆస్తులు మొత్తం కొట్టేయడానికి తమ సవతి తల్లి ప్రియా కపూర్(ప్రియా సచ్దేవ్) కుట్ర చేస్తోందని పేర్కొన్నారు. తన వ్యక్తిగత ఎస్టేట్ మొత్తం ప్రియా కపూర్ కు దక్కేలా సంజయ్ కపూర్ విల్లు రాసినట్లు సమాచారం. అయితే, ఆ విల్లును కుట్ర పూరితంగా సృష్టించారని, అది నిజమైన విల్లు కాదని కరిష్మా కపూర్ కుమార్తె, కుమారుడు తేల్చిచెప్పారు. దాని గురించి తమ తండ్రి సంజయ్ కపూర్ కానీ, సవతి తల్లి ప్రియా కపూర్ కానీ గతంలో ఎన్నడూ చెప్పలేదని వెల్లడించారు. ఇప్పుడు ప్రియా కపూర్ దురుద్దేశంతోనే హఠాత్తుగా నకిలీ విల్లును తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. సంజయ్ కపూర్కు సంబంధించిన ఆస్తుల వివరాలన్నీ బయటపెట్టేలా ప్రియా కపూర్ను ఆదేశించాలని హైకోర్టును కోరారు.ఏమిటీ వివాదం? ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ తొలుత నందితాను వివాహం చేసుకున్నారు. 1996 నుంచి 2000 సంవత్సరం దాకా వారు కలిసున్నారు. విడాకుల తర్వాత సంజయ్ కపూర్ 2003లో కరిష్మా కపూర్తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వారికి ఇద్దరు పిల్లలు సమైరా, కియాన్ ఉన్నారు. 2016లో అభిప్రాయభేదాల వల్ల సంజయ్ కపూర్, కరిష్మా విడిపోయారు. అనంతరం 2017 ప్రియా సచ్దేవ్ను సంజయ్ పెళ్లాడారు. సంజయ్ కపూర్ ఈ ఏడాది జూన్ 12న హఠాత్తుగా మృతిచెందిన సంగతి తెలిసిందే.లండన్లో పోలో ఆడుతుండగా గొంతులోకి తేనెటీగ దూసుకెళ్లింది. దాంతో ఆయన గుండెపోటుకు గురై కన్నుమూశారు. తన కుమారుడి మరణంపై అనుమానాలున్నాయని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని సంజయ్ తల్లి రాణి కపూర్ యూకే ప్రభుత్వాన్ని కోరారు. సంజయ్ మరణం తర్వాత ఆయన ఆస్తులపై వివాదం మొదలైంది. రెండో భార్య సంతానం, మూడో భార్య మధ్య పోరాటం సాగుతోంది. మరోవైపు ఇన్నాళ్లూ ప్రియా సచ్దేవ్గానే ఉన్న మూడో భార్య ఇటీవలే తన పేరును ప్రియా కపూర్గా మార్చుకోవడం గమనార్హం. అంతేకాకుండా తన అత్త రాణి కపూర్పై ఒత్తిడి తెచ్చి కొన్ని రకాల పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నట్లు ప్రియా కపూర్పై ఆరోపణలు వస్తున్నాయి. -
నా సినిమా.. అలా చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తా: బెల్లంకొండ
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఎందుకంటే టాలీవుడ్లో సినిమాలు వస్తున్నాయి గానీ బాక్సాఫీస్ దగ్గర నిలబడట్లేదు. అయితే హిట్ లేదంటే డిజాస్టర్ అవుతున్నాయి. మరోవైపు మూవీ టీమ్ నుంచి ఎవరో ఒకరు షాకింగ్ ఛాలెంజులు చేయడం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రీసెంట్గా నిర్మాత నాగవంశీ ఇలానే ఛాలెంజ్ చేసి ఎంత ట్రోలింగ్కి గురయ్యారో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా అలాంటి ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు.కొన్ని నెలల క్రితం 'భైరవం'తో వచ్చిన బెల్లంకొండ.. ఫ్లాప్ చవిచూశాడు. ఇప్పుడు హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. సెప్టెంబరు 12న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ జరుగుతున్నాయి. టీమ్ అంతా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉంది. అయితే హీరో చేసిన కామెంట్స్ మాత్రం కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9 తొలివారం నామినేషన్స్.. మొత్తం 9 మంది!)'రెండున్నర గంటలపాటు ప్రేక్షకులు అన్నీ మరిచిపోయి సినిమాలో లీనమయ్యే సత్తా ఈ 'కిష్కింధపురి'కి ఉంది. మూవీ చూస్తున్నప్పుడు ప్రేక్షకులు తమ మొబైల్ పట్టుకోకపోతే చాలు మనం సక్సెస్ అయినట్లే. ఈ చిత్రం కూడా అలాంటిదే. సినిమా మొదలైన 10 నిమిషాల తర్వాత ఎవరైనా ప్రేక్షకులు తమ మొబైల్ బయటకు తీశారంటే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతా' అని బెల్లంకొండ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనిపై సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు. మరి ఈ హీరో ఏం చేస్తాడో చూడాలి?బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ జంటగా నటించిన ఈ హారర్ సినిమాకు కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడు. రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ చేయగా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ బట్టి చూస్తే.. ఓ పాడుబడిన రేడియో స్టేషన్, అక్కడికి వెళ్లిన కొందరు ఔత్సాహికులు, కాసేపటికి దెయ్యం ఎంటర్, తర్వాత ఏమైంది? అనే కాన్సెప్ట్తో తీసిన మూవీలానే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: జైల్లో ఉండలేకపోతున్నా.. ఇంత విషం ఇవ్వండి: హీరో దర్శన్) -
సస్పెన్స్... థ్రిల్
సన్నీ కునాల్ హీరోగా, దేవిక సాహూ, ఆశ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రోహిణి’. సంగ కుమార్ దర్శకత్వంలో కేవీ నరసింహ రాజు సమర్పణలో కుశాల్ రాజు నిర్మించారు. ఆనంద్ సంగీతం అందించిన ఈ మూవీ ఆడియో లాంచ్, ట్రైలర్ విడుదల వేడుకని హైదరాబాద్లో నిర్వహించారు. సంగ కుమార్ మాట్లాడుతూ–‘‘యూనిట్లోని ప్రతి ఒక్కరి కృషి వల్లే మా సినిమా త్వరగా పూర్తయింది.రాజేంద్ర రాజు కాంచనపల్లి అందించిన సహకారం మా సినిమాకు బలం’’ అని తెలి పారు. ‘‘త్వరలోనే విడుదల కానున్న మా సినిమాని ఆదరించాలి’’ అన్నారు కుశాల్ రాజు. ‘‘ప్రేక్షకులకు నచ్చే సస్పెన్స్, థ్రిల్, రొమాన్స్ వంటి అంశాలు మా చిత్రంలో చాలా ఉన్నాయి’’ అన్నారు సన్నీ కునాల్. ‘‘దాసరి వెంకటరమణగారి పాటలు వినసొంపుగా, కనువిందుగా ఉంటాయి’’ అని సమర్పకుడు కేవీ నరసింహ రాజు తెలి పారు. -
ఏటిగట్టుపై యాక్షన్
సాయి దుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు (ఎస్వైజీ). రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ‘హనుమాన్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్లో యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ ఆధ్వర్యంలో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ‘‘రూ. 125 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం రూపొందుతోంది.పవర్ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్న ఓ బాలీవుడ్ సూపర్ స్టార్తో ఈ షెడ్యూల్లో తేజ్ తలపడతారు. మా చిత్రాన్ని దసరాకి విడుదల చేయాలనుకున్నాం... సమ్మె కారణంగా వాయిదా పడింది. త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మా సినిమా విడుదల కానుంది’’ అని యూనిట్ తెలిపింది. -
స్పై మ్యూజియంలో...
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ హీరో, హీరోయిన్లుగా నటించిన స్పై యాక్షన్ డ్రామా ‘ఏక్ థా టైగర్’. ఈ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. వాషింగ్టన్ డీసీలోని ఇంటర్నేషనల్ స్పై మ్యూజియంలో ఈ సినిమా పోస్టర్ను ప్రదర్శించారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రం ‘ఏక్ థా టైగర్’ కావడం విశేషం. ఈ విషయంపై ‘ఏక్ థా టైగర్’ దర్శకుడు కబీర్ ఖాన్ మాట్లాడుతూ– ‘‘అప్పట్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రానికి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం సంతోషంగా ఉంది. ఓ సినిమా సక్సెస్ను బాక్సాఫీస్ వసూళ్లు మాత్రమే నిర్ణయించలేవు.ఆ సినిమా ప్రేక్షకులకు ఎంతకాలం గుర్తుంటుందన్నది కూడా ముఖ్యమే’’ అని పేర్కొన్నారు. ఇక వాషింగ్టన్ డీసీలోని ఇంటర్నేషనల్ స్పై మ్యూజియంలో ‘జేమ్స్బాండ్, మిషన్ ఇంపాజిబుల్’ తదితర స్పై చిత్రాల పోస్టర్స్ను ప్రదర్శించారు. ఈ హాలీవుడ్ చిత్రాల చెంత హిందీ మూవీ చేరడం ఓ విశేషం. రూ. 75 కోట్ల బడ్జెట్తో ఆదిత్య చోప్రా నిర్మించిన ‘ఏక్ థా టైగర్’ (2012) దాదాపు రూ. 300 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్స్గా వచ్చిన ‘టైగర్ జిందా హై, టైగర్ 3’ చిత్రాలు కూడా సక్సెస్ అయ్యాయి. ఇక ప్రస్తుతం ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ చిత్రం షూట్తో హీరోగా బిజీగా ఉన్నారు సల్మాన్. -
ప్రభాస్ ది రాజాసాబ్.. ట్రైలర్ రిలీజ్పై బిగ్ అప్డేట్!
తేజ సజ్జా హీరోగా వస్తోన్న సూపర్ యాక్షన్ అడ్వెంచరస్ చిత్రం మిరాయ్. ఈ మూవీకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 12 ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత విశ్వప్రసాద్ మిరాయ్ గురించి మాట్లాడారు. టికెట్ ధరలు పెంచబోమని క్లారిటీ ఇచ్చారు. ఎక్కువ మంది సినిమా చూడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.ది రాజాసాబ్ అప్డేట్ ఇదే..మిరాయ్ ప్రెస్మీట్లో ప్రభాస్ ది రాజాసాబ్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు నిర్మాత. వచ్చే ఏడాది జనవరి 9న సినిమా విడుదల కానుందని తెలిపారు. రిషబ్ శెట్టి కాంతార-2 ప్రదర్శించే థియేటర్లలో ది రాజాసాబ్ ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. అంటే ఈ లెక్కన అక్టోబర్ 2న ది రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ కానుంది. అంతేకాకుండా ప్రభాస్ పుట్టినరోజున తొలి పాటను విడుదల చేసే ఆలోచన ఉందని అన్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ది రాజాసాబ్ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్ విడుదల చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.#TheRajaSaab trailer1 will be attached with #KantaraChapter1 🔥 - #TGVishwaPrasad, Producer. Be ready for mass trailer in just one month. #KantaraChapter1onOct2 #TheRajaSaabTeaser #Prabhas #RishabhShetty #Bijuria pic.twitter.com/pmV250U6Q6— Subha The Luck (@Subha_The_Luck) September 3, 2025 -
కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభించిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ హీరో శర్వానంద్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టారు. ఇప్పటి వరకు హీరోగా అభిమానులను మెప్పించిన ఆయన.. నిర్మాణరంగంలో అడుగుపెట్టారు. తన డ్రీమ్ను ఇవాళ నేరవేర్చుకున్నారు. సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఓఎంఐ అనే సంస్థను లాంఛ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.శర్వానంద్ ఈ విషయాన్ని తెలియజేస్తూ..' ఈరోజు నా హృదయానికి దగ్గరైన కల.. ఓఎంఐకి నాంది పలికింది. ఈ దార్శనికతను ప్రారంభించినందుకు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి కృతజ్ఞతలు. ఓఎంఐ అనేది సృజనాత్మకత, స్థిరత్వం, మానవ సంబంధాన్ని పెంపొందించడానికి మొదలెట్టిన ఒక వాగ్దానం' అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారుఇక సినిమాల విషయానికొస్తే శర్వానంద్ భోగి చిత్రంలో నటిస్తున్నారు. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ రూరల్ బ్యాక్డ్రాప్ పీరియాడికల్ యాక్షన్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుండగా.. మరో హీరోయిన్ డింపుల్ హయతి లీడ్ రోల్ చేస్తున్నారు.Today marks the beginning of a dream close to my heart, #OMI 🤍I feel truly honored and grateful to the Former Vice President of India, Shri @MVenkaiahNaidu Garu, for launching this vision.OMI is a promise to nurture creativity, sustainability, and human connection. pic.twitter.com/aoRjamGuMz— Sharwanand (@ImSharwanand) September 9, 2025 -
నా మిత్రురాలికి ఆల్ ది బెస్ట్.. ఐకాన్ స్టార్ ప్రశంసలు
మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం దక్ష(Daksha – The Deadly Conspiracy). తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ట్రైలర్పై బన్నీ ప్రశంసలు కురిపించారు. నా మిత్రురాలు మంచు లక్ష్మీ ప్రసన్నకు నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. మీరు, మోహన్ బాబు కలిసి తెరపై కనిపించడం చాలా అద్భుతంగా ఉందని పోస్ట్ చేశారు. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నానని చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.ఈ చిత్రానికి వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఈ మూవీలో మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తండ్రీ కూతుళ్లు కలిసి మొదటి సారిగా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కాగా.. ఇప్పటికే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.అల్లు అర్జున్ రియాక్షన్పై దర్శకుడు వంశీ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సార్కు థ్యాంక్స్. ఆయనకు ట్రైలర్ నచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్యూ సో మచ్ సార్. దుబాయ్లో జరిగిన ‘సైమా-2025’ వేడుకల్లోనూ ట్రైలర్ను ప్రదర్శించగా, అక్కడ కూడా అందరికీ నచ్చింది. ఈ సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నాం. మా సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్కు చాలా మంచి స్పందన వచ్చింది. మంచు లక్ష్మి ఇప్పటి వరకు చేయని అద్భుతమైన పాత్ర చేశారు. అలాగే మోహన్ బాబు, మంచు లక్ష్మిగారిని ఏకకాలంలో డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీ. సినిమా చాలా బాగా వచ్చింది. సెప్టెంబర్ 19న గ్రాండ్గా విడుదల కాబోతుంది. అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో సముద్రఖని, మలయాళ నటుడు సిద్దిక్, విశ్వంత్, చిత్రా శుక్లా, రంగస్థలం మహేష్, జెమినీ సురేష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అచు రాజమణి సంగీతమందిస్తున్నారు. Best wishes to my dearest friend @LakshmiManchu on her upcoming film #Daksha. Lots of Love & Warm hug. It’s wonderful to see you and @themohanbabu garu together on screen.#DakshaTrailer – https://t.co/PSsbRCP2FFWishing the film immense success. Best wishes to director…— Allu Arjun (@alluarjun) September 9, 2025 -
కిరణ్ అబ్బవరం కె ర్యాంప్.. రొమాంటిక్ లవ్ సాంగ్ వచ్చేసింది!
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న తాజా చిత్రం కె-ర్యాంప్. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటిస్తోంది. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేశ్ దండా, శివ బొమ్మ నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 18న విడుదల కానుంది.తాజాగా ఈ మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవాళ విడుదలైన కలలే కలలే.. అంటూ సాగే పాట ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించగా.. చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్ను కపిల్ కపిలన్ ఆలపించారు. -
చీరలో భాగ్యశ్రీ.. కెమెరా పచ్చబొట్టుతో త్రిష
చీరలో ఎల్లోరా శిల్పంలా అనిపిస్తున్న భాగ్యశ్రీ బోర్సేవీపుపై మూవీ కెమెరా పచ్చబొట్టుతో త్రిషసింపుల్ లుక్స్లో కీర్తి సురేశ్ ఎంజాయ్ మెంట్ఓనం ఫుడ్ తింటూ ఆస్వాదిస్తున్న రష్మీ గౌతమ్కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్న రకుల్ ప్రీత్డిజైనర్ డ్రస్సులో మీనాక్షి చౌదరి గ్లామర్ చూశారా? View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) -
బిగ్బాస్ 9 తొలివారం నామినేషన్స్.. మొత్తం 9 మంది!
బిగ్బాస్ షో లాంచ్ అయి రెండు రోజులు అయింది. ఇంకా నామినేషన్స్ మొదలు కాలేదేంటా అని అనుకుంటుండగానే ఆ ప్రోమో రిలీజైంది. నిన్నటివరకు అంతా ఒక్కటి అనుకున్నోళ్లు కాస్త ఇప్పుడు వేరు అయిపోయారు. ఒక్కొక్కరు కారణాలు చెబుతూ తోటి కంటెస్టెంట్స్ని నామినేట్ చేశారు. ఈ వారం లిస్టులో ఎవరెవరు ఉన్నారు? అనేది ఇప్పుడు చూద్దాం.అగ్నిపరీక్షలో గెలిచి వచ్చిన సామాన్యులు ప్రస్తుతం హౌసులో ఓనర్స్గా చెలామణి అవుతున్నారు. సెలబ్రిటీలు టెనెంట్స్గా ఉన్నారు. ప్రతిసారిలా ఈసారి ఒక్కొక్కరు ఇద్దరిద్దరు చొప్పున చేయడం లాంటివి ఈసారి లేవు. బిగ్బాస్ చెప్పిన ప్రతిసారి సామాన్యులంతా కలిసి ఒకరిని నామినేట్ చేయాలని చెప్పారు. అలానే సెలబ్రిటీలు కూడా తమలో ఒకరిని నామినేట్ చేయాల్సి ఉంటుందని బిగ్బాస్ క్లారిటీ ఇచ్చాడు. దీంతో తొలుత హౌసులో అందరికీ ఎదురు సమాధానం చెబుతున్న సంజనని నామినేట్ చేశారు.(ఇదీ చదవండి: రూ.30 వేల కోట్లు కొట్టేసే ప్లాన్.. సవతి తల్లిపై హీరోయిన్ పిల్లలు ఆరోపణ)అలానే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో రాము రాథోడ్.. శ్రష్ఠి వర్మని, భరణి.. సంజనని, హరీశ్.. సుమన్ శెట్టిని ఇలా మొత్తంగా సెలబ్రిటీలంతా నామినేషన్లలో నిలిచారు. అయితే లిస్టులో ఒక్కరిని సేవ్ చేసే అవకాశం ఇవ్వడంతో భరణి సేవ్ అయ్యారు. ఈయన ప్లేసులో సామాన్యుల నుంచి డీమన్ పవన్.. నామినేషన్లలో నిలిచాడు.ఈసారి నామినేషన్లలో రీతూ చౌదరి, సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ, సంజన గల్రానీ, శ్రష్ఠి వర్మ, రాము రాథోడ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్ ఉన్నారు. మరి వీళ్లలో తొలివారం ఎవరు బయటకెళ్లిపోతారనేది చూడాలి?(ఇదీ చదవండి: జైల్లో ఉండలేకపోతున్నా.. ఇంత విషం ఇవ్వండి: హీరో దర్శన్) -
నాపై అలాంటి కేసు.. చాలా బాధాకరం: శ్వేతా మీనన్
ప్రముఖ మలయాళ నటి శ్వేతా మీనన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇటీవలే మలయాళ సినీ నటుల సంఘం (AMMA) అధ్యక్షురాలిగా ఎన్నికైన శ్వేత మీనన్ తనపై నమోదైన కేసుపై స్పందించింది. ఓ ఈవెంట్కు హాజరైన ఆమె.. 12 ఏళ్ల క్రితం తాను నటించిన చిత్రంపై కేసు నమోదు చేయడం బాధాకరమైన సంఘటన అని తెలిపింది. కేవలం డబ్బు సంపాదించే ఉద్దేశ్యంతో తాను సినిమాలు చేయడం లేదన్నారు. తనకు శత్రువులు ఎక్కువయ్యే కొద్ది.. మరింత రాణిస్తానని శ్వేతా మీనన్ అన్నారు.శ్వేతా మీనన్ మాట్లాడుతూ.. "శత్రువులు ఎక్కువైతే నేను మరింత ఎక్కువగా రాణిస్తా. ఒక వ్యక్తిగా నాపై కేసు పెట్టడం చాలా బాధాకరం. 12 సంవత్సరాల క్రితం వచ్చిన నా చిత్రాల గురించి ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఆ సినిమాలు నాకు రాష్ట్ర అవార్డును తెచ్చిపెట్టాయి. ఇలాంటి కేసును ఎవరూ ఎదుర్కోలేదు. ఆ సమయంలో అమ్మా ఎన్నికల నుంచి వెనక్కి తగ్గాలా అనే అయోమయంలో పడ్డా. కానీ నా కుటుంబం మద్దతు నన్ను ముందుకు తీసుకెళ్లింది. ఇప్పుడు మీ ముందు దెబ్బతిన్న ఆడపులిగా నిలబడ్డా' అని పంచుకుంది.కాగా.. అధికంగా డబ్బు సంపాదించే ఉద్దేశ్యంతో అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్తో కూడిన సినిమాల్లో నటించారని ఆరోపిస్తూ శ్వేతా మీనన్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మలయాళ మూవీ ఆర్టిస్టుల సంఘం (AMMA) ఎన్నికలకు పోటీ చేస్తున్న సమయంలో ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ప్రముఖ సామాజిక కార్యకర్త మార్టిన్ మెనాచేరి మీనన్పై కంప్లైంట్ చేశారు. అయినప్పటీకీ అమ్మా మొదటి మహిళా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అంతేకాకుడా శ్వేతా మీనన్కు గతంలో కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో రెండుసార్లు ఉత్తమ నటిగా గెలుచుకున్నారు. ఫెమినా మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ 1994 కిరీటాన్ని కూడా సొంతం చేసుకున్నారు. -
రూ.80 కోట్ల మోసం.. ఆ డెరెక్టర్ పెద్ద మోసగాడు: ప్రముఖ నిర్మాత
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత వాసు భగ్నానీ సంచలన ఆరోపణలు చేశారు. ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన అలీ అబ్బాస్ జాఫర్ తనను మోసం చేశారంటూ కామెంట్స్ చేశారు. సినిమా నిర్మాణంలో దాదాపు రూ.80 కోట్ల వరకు అవతవకలకు పాల్పడారంటూ ఆరోపించారు. అక్షయ్ కుమార్ నటించిన ‘బడే మియాన్ చోటే మియాన్’ సినిమా నిర్మించే సమయంలో తన ఫేక్ కంపెనీతో మనీ లాండరింగ్కు పాల్పడ్డాడని వాసు భగ్నానీ వెల్లడించారు.తన ఫేక్ కంపెనీ పేరుతో ఆర్థిక నిర్వహణలో తీవ్రమైన అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. అబుదాబిలో రిజిస్టర్ చేసిన కంపెనీ పేరుతో.. ముంబయిలో జాలీ జంపర్ ఫిల్మ్స్ ఎల్ఎల్సీ పేరుతో మనీలాండరింగ్ చేశాడని అన్నారు. సినిమా బడ్జెట్ను దాదాపు రూ. 80 కోట్లు పెంచారని భగ్నాని వెల్లడించారు. ఆఖరికి నటీనటుల పారితోషికం తగ్గించినా భారీ మోసం కావడంతో ఇబ్బందులు పడ్డానని తెలిపారు. దీనిపై బాంద్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కేవలం నా డబ్బును తిరిగి పొందడం మాత్రమే కాదు. మరే ఇతర నిర్మాత ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సిన అవసరం రాకూడదని నిజం బయటకు రావాలని పోరాడుతున్నట్లు వాసు భగ్నానీ అన్నారు.నిర్మాత వాసు భగ్నానీ మాట్లాడుతూ.. 'అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు మెహ్రా.. ఏఏజెడ్ ఫిల్మ్స్ అనే బ్యానర్ కింద పనిచేస్తున్నారు. మేము బడే మియాన్ చోటే మియాన్ మూవీ కోసం వారితో జతకట్టా. నేను ఈ ప్రాజెక్ట్ కోసం ఆర్థిక సహాయం కూడా చేశా. వారికి దర్శకత్వాన్ని బాధ్యతలు అప్పగించా. సృజనాత్మక నిర్ణయాలలో తాను పెద్దగా జోక్యం చేసుకోలేదని.. లండన్తో పాటు ఇండియాలో జాఫర్ సూచించిన షూటింగ్ ప్రదేశాలను ఆమోదించా. అయితే రెండు నెలల క్రితమే జాలీ జంపర్ ఫిల్మ్స్ ఎల్ఎల్సీ సంస్థ గురించి తెలుసుకున్నా. అది జాఫర్ సహాయకుడి పేరుతో రిజిస్టర్ చేశారు. ఇదంతా బయటికి రాకుండా రహస్యంగా నిర్వహించారు. సినిమా ఖర్చులను పెంచడం, నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు" అని అన్నారు. కాగా.. గతంలో బాలీవుడ్ నిర్మాత, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ కూడా ఈ సినిమా కోసం ఆస్తులు తాకట్టు పెట్టామని ఆవేదన చెందారు. -
రూ.30 వేల కోట్లు కొట్టేసే ప్లాన్.. సవతి తల్లిపై హీరోయిన్ పిల్లలు ఆరోపణ
బాలీవుడ్లో మరో ఆస్తి వివాదం హాట్ టాపిక్ అయింది. ప్రముఖ హీరోయిన్ కరిష్మా కపూర్ పిల్లలు ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడంతో ఈ విషయం కొత్త మలుపు తిరిగింది. తమకు సవతి తల్లి ఫేక్ వీలునామా ఇచ్చిందని ఈ పిల్లలిద్దరూ ఆరోపణ చేస్తున్నారు. తండ్రి ఆస్తిలో తమ వాటా కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంతకీ ఏంటి విషయం? అసలేం జరుగుతోంది?బాలీవుడ్ నటి కరిష్మా కపూర్.. 2003లో సంజయ్ కపూర్ అనే బిజినెస్మ్యాన్ని పెళ్లి చేసుకుంది. అప్పటికే అతడికి ఓసారి పెళ్లయి విడాకులు తీసుకున్నాడు. అంటే కరిష్మా రెండో భార్య. దాదాపు 13 ఏళ్ల పాటు ఈమెతో కలిసున్న సంజయ్.. 2016లో విడాకులు ఇచ్చేశాడు. వీళ్లకు సమైరా, కియాన్ అని ఇద్దరు పిల్లలు. కరిష్మాకు విడాకులు ఇచ్చిన తర్వాత సంజయ్.. ప్రియ సచ్దేవ్ని వివాహమాడాడు.(ఇదీ చదవండి: జైల్లో ఉండలేకపోతున్నా.. ఇంత విషం ఇవ్వండి: హీరో దర్శన్)ఈ ఏడాది జూన్లో సంజయ్ కపూర్.. గుండెపోటుతో చనిపోయాడు. అప్పటినుంచి తమ తండ్రి ఆస్తిలో తమకు వాటా దక్కకుండా సవతి తల్లి ప్రియ మోసం చేస్తోందని కరిష్మా కపూర్ పిల్లలు అంటున్నారు. ఇటీవల జరిగిన ఫ్యామిలీ మీటింగ్లోనూ నకిలీ వీలునామా చూపించిందని, తండ్రి మరణానంతరం ఆస్తి వివరాలు చెప్పేందుకు గానీ సంబంధిత డాక్యుమెంట్స్ చూపించేందుకు గానీ ఆమె నిరాకరిస్తోందని పేర్కొన్నారు. చట్టపరంగా ఆస్తిలో తమకు రావాల్సిన వాటాని ఇప్పించాలని కోర్టుని ఆశ్రయించారు.సంజయ్ కపూర్ రాసిచ్చిన అసలు వీలునామా దాచిపెట్టి నకిలీది సవతి తల్లి ప్రియ తమకు చూపించిందనేది కరిష్మా కపూర్ పిల్లల ఆరోపణ. మరోవైపు ప్రియ సచ్దేవ్తో పాటు పలువురు వ్యక్తులు బలవంతంగా తమ తల్లి నుంచి సంతకాలు తీసుకున్నారని సంజయ్ సోదరి మందిర కపూర్ మీడియాకు చెప్పింది. దీంతో ఇది కాస్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సంజయ్ మరణించే నాటికి అతడి ఆస్తి విలువ దాదాపు రూ.30 వేల కోట్లు అని సమాచారం.(ఇదీ చదవండి: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న యువ హీరోయిన్) -
ఒక ప్రాణం పోయాక నువ్వు పుట్టావ్.. హీరోయిన్ తల్లి
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినవాళ్లు మనల్ని వదిలేసి ఎక్కడికీ వెళ్లరు. ఒకవేళ తనువు చాలించి వెళ్లిపోయినా మళ్లీ ఏదో ఒక రూపంలో మనముందుకు వస్తారని చాలామంది బలంగా నమ్ముతారు. హీరోయిన్ అనస్వర రాజన్ (Anaswara Rajan) ఇంట అదే నిజమైంది. సూపర్ శరణ్య, నెరు, రేఖా చిత్రం వంటి పలు హిట్ సినిమాల్లో నటించింది అనస్వర.నా పాపాయికి హ్యాపీ బర్త్డేనేడు (సెప్టెంబర్ 8) ఆమె బర్త్డే. ఈ సందర్భంగా హీరోయిన్ తల్లి ఉషా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. ఆరోజు నేనెంతో ప్రేమించిన వ్యక్తిని కోల్పోయాను.. అదే రోజు నువ్వు జన్మించావు. 23 ఏళ్ల ఈ పాపాయి ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను. అమ్మ నీకోసం వేవేల బర్త్డే విషెస్ తెలియజేస్తోంది అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్కు అనస్వర ఫోటోను జత చేసింది. దీంతో అభిమానులు హీరోయిన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సినిమాకాగా ఉషా- రాజన్ దంపతులకు 2002 సెప్టెంబర్ 8న అనస్వర జన్మించింది. ఈమె పుట్టడానికి ముందు ఉషా తల్లి మరణించింది. తల్లిని కోల్పోయి పుట్టెడు శోకంలో మునిగిన ఉషాకు కూతురే ప్రపంచంగా మారింది. అనస్వరలోనే తల్లిని చూసుకుని సంతోషపడిపోయింది. అనస్వర రాజన్ సినిమాల విషయానికి వస్తే.. 7/G రెయిన్బో కాలనీ 2 సినిమా చేస్తోంది. ఇది తెలుగులో7/G బృందావన కాలనీ 2గా విడుదల కానుంది. దీనితో పాటు మరో రెండు మూవీస్ చేస్తోంది. View this post on Instagram A post shared by Usha Rajan (@usharajan_) చదవండి: 15 మంది పనోళ్లు.. కూతుళ్లు లేరు, కొడుకూ లేడు, అందుకే.. -
తెలుగు సినిమా టైటిల్ చెప్పండి చాలు.. లక్ష రూపాయలు మీకే!
సినిమా పేరు చెప్పండి.. లక్ష రూపాయలు మీకే. ఏంటి మూవీ పేరు లక్ష రూపాయలిస్తారా?అని అనుకుంటున్నారా? అవునండి మీరు విన్నది నిజమే.. మీ మెదడుకు పదునుపెట్టి టైటిల్ ఏంటో పట్టేయండి.. లక్ష రూపాయలు మీ సొంతం చేసుకోండి. ఇంతకీ ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.త్రినాధ్ కటారి స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి ఐఎంవై అనే టైటిల్తో రూపొందిస్తున్నారు.ఇటీవల వినాయక చవితి సందర్భంగా ఓం గమ్ గణపతయే నమహా అంటూ సాగే భక్తి పాటను కూడా విడుదల చేశారు. ఈ పాట ఆడియన్స్కు విపరీతంగా కనెక్ట్ అయింది. ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడగా.. ఆర్.పి. పట్నాయక్ సంగీతం అందించారు.అయితే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ క్యాష్ ప్రైజ్ కాంటెస్ట్ను మేకర్స్ ప్రారంభించారు. ఐఎంవై మూవీకి తెలుగులో టైటిల్ పేరు కరెక్ట్గా చెప్పినవాళ్లకు లక్ష రూపాయల బహుమతి అందించనున్నారు. అంతేకాకుండా టాప్-10 క్రియేటివ్ టైటిల్స్ పంపినవారికి సైతం రూ.5 వేల రూపాయలు అందిస్తామని ప్రకటించారు. ఈ లక్ష రూపాయలు నగదు గెలుచుకోవాలనుకుంటే ఈనెల 13వ తేదీలోగా మీ సమాధానాన్ని 7569933855 నంబర్కు వాట్సాప్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం.. మీ క్రియేటివిటీతో లక్ష రూపాయలు సొంతం చేసుకోండి.కాగా.. ఈ చిత్రాన్ని సంజీవని ప్రొడక్షన్ బ్యానర్లో కె శంకర్ నిర్మించారు. ఈ చిత్రంలో సాహితీ అవంచ, దేవి శ్రీప్రసాద్, గోపరాజు రమణ, తనికెళ్ల భరణి, మధుమణి, సురభి ప్రభావతి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతమందిస్తున్నారు. View this post on Instagram A post shared by K Shankar (@sanjeevaniproductionss) -
సీక్రెట్గా పెళ్లి చేసుకున్న యువ హీరోయిన్
మరో హీరోయిన్ పెళ్లి చేసుకుంది. కానీ ఎలాంటి ప్రకటన లాంటివి లేకుండా సీక్రెట్గా వివాహం చేసుకుని అందరికీ షాకిచ్చింది. 'జనాల్లేరు.. లైట్స్ లేవు.. సౌండ్ లేదు. ఫైనల్లీ మా పెళ్లి అయిపోయింది' అని మలయాళ నటి గ్రేస్ ఆంటోని పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలోనే తోటి హీరోహీరోయిన్లు అందరూ కొత్త పెళ్లికూతురికి శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: జైల్లో ఉండలేకపోతున్నా.. ఇంత విషం ఇవ్వండి: హీరో దర్శన్)2016 నుంచి ఇండస్ట్రీలో ఉన్న గ్రేస్ ఆంటోని.. కుంబళంగి నైట్స్, నునక్కుళి, పరంతు పో, రోర్చా తదితరులు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్గా వచ్చిన తమిళ చిత్రం 'పరంతు పో'లో ఈమెనే హీరోయిన్. అయితే మలయాళ మూవీస్ ఓటీటీల్లో చూసే తెలుగు ప్రేక్షకులకు ఈమె కాస్త పరిచయమే.ఇప్పుడు సడన్గా తను పెళ్లి చేసుకున్నానని చెప్పి గ్రేస్ బయటపెట్టింది. కానీ భర్త ఎవరు? ఇండస్ట్రీకి వ్యక్తి అనే విషయాల్ని మాత్రం రివీల్ చేయలేదు. ప్రస్తుతానికైతే రెండు ఫొటోలు అవి కూడా ఇద్దరి ముఖాలు కూడా కనిపించకుండా తీసుకున్న వాటిని మాత్రమే సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరికొన్ని రోజుల్లో భర్త ఎవరు ఏంటి అనేది చెబుతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: అందుకే తమిళ సినిమాలకు రూ.1000 కోట్లు రావట్లేదు: హీరో శివకార్తికేయన్) View this post on Instagram A post shared by Grace (@grace_antonyy) -
ఎన్నో అవమానాలు.. ఈ స్థాయికి వస్తాననుకోలేదు: నిర్మాత ఎమోషనల్
అత్యధిక భాషల్లో సినిమాలు నిర్మించిన వ్యక్తిగా డి.రామానాయుడు చరిత్రకెక్కితే... ఒకేరోజు 15 చిత్రాలు ప్రారంభించిన నిర్మాతగా ప్రపంచ రికార్డు సాధించారు భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ (Tummalapalli Rama Satyanarayana). అంతేకాదు ఈ 15 సినిమాలు ఏడాది వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే స్థిర సంకల్పంతో ముందుకు సాగుతున్న ఈ శతాధిక చిత్ర నిర్మాత తన పుట్టిన రోజు (సెప్టెంబర్ 10) సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు.15 సినిమాలుతన వల్ల తెలుగు సినిమాకి ఓ గొప్ప గౌరవం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అయితే ఈ ఘనత తన ఒక్కడిదే కాదని, తన వెన్నంటి ఉన్న ప్రతి ఒక్కరికీ చెందుతుందని తెలిపారు. 15 సినిమాల్లో "యండమూరి కధలు, కె.పి.హెచ్.బి. కాలనీలో, మా నాన్న హీరో, మహానాగ" చిత్రాల రెగ్యులర్ షూటింగ్ మొదలైందని, మిగతా చిత్రాలు ప్రీ-ప్రొడక్షన్ జరుపుకుంటున్నాయని వివరించారు. ఇదే ఏడాదిలో ఒక ప్రముఖ దర్శకుడితో భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. ఈ బర్త్డే ఎంతో స్పెషల్ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జరుపుకుంటున్న ఈ పుట్టినరోజు తనకు చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు!! తొలినాళ్లలో పలు చేదు అనుభవాలు ఎదుర్కొన్న తనకు... ఇండస్ట్రీ ఇంత మంచి స్థానాన్ని, స్థాయిని ఇస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. ఇందుకు తన కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉందని వెల్లడిస్తూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. నిర్మాతగా 200 చిత్రాలు పూర్తి చేయాలన్నదే తన జీవితాశయమని తుమ్మలపల్లి రామసత్యనారాయణ ప్రకటించారు. -
జైల్లో ఉండలేకపోతున్నా.. ఒక చుక్క విషమివ్వండి: స్టార్ హీరో
కన్నడ స్టార్ హీరో దర్శన్.. జడ్జి ముందు బోరున విలపించాడు. తన అభిమాని రేణుకస్వామి అనే వ్యక్తిని హతమార్చిన కేసులో జైల్లో ఉన్న దర్శన్.. నెలవారీ హియరింగ్లో భాగంగా మంగళవారం జైలు నుంచే వీడియో కాల్ ద్వారా కోర్ట్ హియరింగ్లో పాల్గొన్నాడు. జైల్లో అస్సలు ఉండలేకపోతున్నానని, తన జీవితం దుర్భరంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు విషమివ్వాలని జడ్జిని అభ్యర్థించాడు.'నెల రోజులకు పైనే అవుతుంది. ఎండ అన్నది చూడలేదు. దీంతో నా చేతులకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేశాయి. బట్టలు కంపు కొడుతున్నాయి. ఇలా నేను బతకలేను. ఒక్క చుక్క విషం ఇవ్వండి నేను చనిపోతా. నా జీవితం దారుణంగా తయారైంది' అని దర్శన్ ముందు విలపించాడు. దీనిపై స్పందించిన జడ్జి.. 'అలాంటివి మీరు అడగకూడదు. ఇది జరగదు' అని సమాధానమిచ్చారు.(ఇదీ చదవండి: మంచు ఫ్యామిలీ నుంచి కొత్త సినిమా.. ట్రైలర్ రిలీజ్)గతేడాది తన అభిమాని రేణుకస్వామిని.. హీరో దర్శన్ హత్య చేశాడు. తన రూమర్ గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడకు సదరు రేణుకస్వామి అసభ్యకర మెసేజులు పంపుతుండటమే దీనికి కారణం. తొలుత అతడిని కిడ్నాప్ చేసిన దర్శన్.. బెంగళూరులోని ఓ షెడ్లో పెట్టి చిత్రహింసలు చేశాడు. తర్వాత రేణుకస్వామి బాడీ.. దగ్గరలోని ఓ నాళాలో దొరికింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్శన్తో పాటు పవిత్ర గౌడ తదితరుల్ని గతేడాది జూన్లో అరెస్ట్ చేశారు.అయితే కొన్ని నెలల పాటు దర్శన్ జైల్లో ఉన్నాడు. గతేడాది డిసెంబరులో కర్ణాటక హైకోర్ట్ బెయిల్ మంజూరు చేయడంతో బయటకొచ్చాడు. కానీ సుప్రీం కోర్ట్ ఆ బెయిల్ని రద్దు చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శన్.. బయట ఉంటే సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని, అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో మళ్లీ దర్శన్ అరెస్ట్ అయ్యాడు. తాజాగా తనకు జైలులో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని బోరున ఏడ్చేశాడు. కనీసం తలగడ, బెడ్ షీట్స్, ఇంటిలో తయారు చేసిన ఆహారం లాంటివి అయినా సరే అనుమతించాలని దర్శన్.. జడ్జిని కోరాడు.(ఇదీ చదవండి: అందుకే తమిళ సినిమాలకు రూ.1000 కోట్లు రావట్లేదు: హీరో శివకార్తికేయన్) -
ఎనిమిది భాషల్లో మిరాయ్ రిలీజ్.. సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చిందంటే?
హనుమాన్ మూవీతో పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న హీరో తేజ సజ్జా. ప్రస్తుతం యాక్షన్-ఫాంటసీ చిత్రం 'మిరాయ్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీలో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ విలన్ రోల్లో కనిపించనున్నారు.తాజాగా మిరాయ్ సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేషన్ వచ్చినట్లు హీరో తేజ సజ్జా ట్వీట్ చేశారు. పిల్లలతో కలిసి ఫ్యామిలీ ఈ మూవీని ఎంజాయ్ చేయండని పోస్ట్ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా యాక్షన్, ఎమోషన్, భక్తి ఉండే చిత్రమని రాసుకొచ్చారు. కాగా.. ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా మెప్పించనుంది. అంతేకాకుండా శ్రియా శరణ్, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో విడుదల చేయనున్నారు. 2డీతో పాటు 3డీ ఫార్మాట్లో రిలీజవుతోంది.#MIRAI Censored with 𝐔/𝐀 ❤️🔥A CLEAN FILM for KIDS, FAMILIES and ALL SECTIONS OF AUDIENCE to experience Action, Emotion & Devotion on the big screens💥💥💥GRAND RELEASE WORLDWIDE ON 12th SEPTEMBER 🥷Rocking Star @HeroManoj1@Karthik_gatta @RitikaNayak_ @vishwaprasadtg… pic.twitter.com/p3zCOrTWK9— Teja Sajja (@tejasajja123) September 8, 2025 -
15 మంది పనోళ్లు.. కూతుళ్లు లేరు, కొడుకూ లేడు, అందుకే..
కోలీవుడ్ స్టార్ దంపతులు శరత్కుమార్- రాధిక (Radhika Sarathkumar) తమ లగ్జరీ బంగ్లా నుంచి బయటకు వచ్చేశారు. చెన్నైలోని ఈసీఆర్లో ఉన్న విలాసవంతమైన భవనంలో కొన్నేళ్లుగా నివసిస్తున్న వీరు మరో ఇంటికి షిఫ్ట్ అయ్యారు. అందుకు గల కారణాన్ని శరత్కుమార్ వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. మేము ఉన్న ఇల్లు 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మా ఇంటికి ఏడు ద్వారాలున్నాయి. అందుకే ఇల్లు మారాంప్రతిరోజు రాత్రి ఆ తలుపులకు గడియపెట్టడం కూడా ఇబ్బందవుతోంది. కొడుకు విదేశాల్లో చదువుకుంటున్నాడు. కూతుళ్లకు పెళ్లిళ్లయిపోయి ఎవరి జీవితంలో వారు బిజీగా ఉన్నారు. మా ఇంట్లో 15 మంది పనివాళ్లున్నా సరే.. రాధిక ఒక్కరే ఆ పెద్ద ఇంటిని చూసుకోవడం కష్టమవుతోంది. అందుకే ఇల్లు మారాం. ప్రస్తుతం ఆ ఇంటిని ఓ ఐటీ కంపెనీకి అద్దెకిచ్చాం అని చెప్పుకొచ్చాడు. శరత్కుమార్ చివరగా 3BHK సినిమాలో కనిపించాడు. గణేశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మంచికు పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ సైతం 3BHK మూవీపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. పర్సనల్ లైఫ్రాధిక.. 1985లో నటుడు ప్రతాప్ పోతన్ను పెళ్లాడింది. ఏడాదికే అతడికి విడాకులిచ్చేసి బ్రిటీష్ వ్యక్తి రిచర్డ్ హార్డీని పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు రయానే జన్మించింది. రెండేళ్లకే ఈ దంపతులు కూడా విడిపోయారు. 2001లో నటుడు శరత్కుమార్ను మూడో పెళ్లి చేసుకుంది. శరత్కుమార్కు ఇది రెండో పెళ్లి! ఈయన మొదటగా 1984లో చాయాదేవిని పెళ్లి చేసుకోగా వీరికి వరలక్ష్మి, పూజ అని ఇద్దరు కూతుర్లు జన్మించారు. 2000వ సంవత్సరంలో చాయాతో విడాకులు తీసుకున్న శరత్కుమార్ మరుసటి ఏడాది రాధికను పెళ్లాడాడు. రాధిక- శరత్ జంటకు రాహుల్ జన్మించాడు.చదవండి: మిరాయ్.. టికెట్ రేట్లు పెంచడం లేదు: తేజ సజ్జా -
సినిమాలు ప్రేక్షకులకోసం.. అవార్డులిచ్చేవారికోసం కాదు: హీరో
కేంద్ర ప్రభుత్వం రెండు నెలల క్రితం జాతీయ చలన చిత్ర అవార్డులు ప్రకటించింది. జవాన్, 12th ఫెయిల్, సామ్ బహదూర్, పార్కింగ్, బేబి, బలగం, హనుమాన్.. ఇలా పలు సినిమాలకు వివిధ కేటగిరీల్లో పురస్కారాలు వరించాయి. అయితే రూ.150 కోట్లకిపైగా కొల్లగొట్టిన 'ఆడుజీవితం సినిమా' (Aadujeevitham: The Goat Life Movie)కు మాత్రం ఎటువంటి అవార్డు రాలేదు. ఆడుజీవితం నవల ఆధారంగా దర్శకుడు బ్లెస్సీ ఈ సినిమా తెరకెక్కించాడు. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ అద్భుతంగా నటించాడు. ప్రేక్షకుల కోసమే మా సినిమాహృదయాలను కదిలించిన ఈ సినిమాకు జాతీయ అవార్డు రాకపోవడంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తాజాగా ఈ వ్యవహారంపై హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తొలిసారిగా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. సినిమా అనేది ప్రేక్షకుల కోసం తీస్తాం. అంతేకానీ జ్యూరీ కోసమో, మార్కులిచ్చే పదిమంది కోసమో కాదు. కేవలం అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల్లో ప్రదర్శితమయ్యేందుకే సినిమాలు తీయము. అవార్డులకు.. వాటి విలువ వాటికి ఉండొచ్చు. కానీ అంతిమంగా ప్రేక్షకుల మనసు గెలుచుకోవడం ముఖ్యం.అదే పెద్ద అవార్డుటికెట్ కొని థియేటర్కు వచ్చిన ప్రేక్షకులు సినిమాను ఆస్వాదించగలగాలి. వాళ్లంతా ఆడుజీవితాన్ని ఆస్వాదించారు, ఆదరించారు. అదే మాకు గొప్ప అవార్డు. అందుకు నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. కాగా ఆడు జీవితం 6 'కేరళ స్టేట్ ఫిలిం అవార్డులు' సాధించింది. జాతీయ అవార్డు కోసం 14 కేటగిరీల్లో పోటీపడినప్పటికీ ఒక్క పురస్కారం కూడా గెలుచుకోలేకపోయింది.చదవండి: నోరు తెరిస్తే అబద్ధాలు, నీవల్లే గొడవలు.. నామినేషన్స్లో హీరోయిన్ -
మంచు ఫ్యామిలీ నుంచి కొత్త సినిమా.. ట్రైలర్ రిలీజ్
మంచు ఫ్యామిలీ నుంచి రీసెంట్గా వచ్చిన సినిమా 'కన్నప్ప'. చాలా గ్యాప్ తీసుకుని ఈ మూవీ చేసినా సరే మంచు విష్ణుకి పెద్దగా కలిసిరాలేదు. పాన్ ఇండియా కాన్సెప్ట్ కావడంతో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తదితరుల్ని ఒప్పించిన విష్ణు.. ఈ చిత్రంలో వీళ్లతో అతిథి పాత్రలు చేయించాడు. కానీ బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఫెయిలైంది. ఇప్పుడు మంచు కుటుంబం నుంచి మరో చిత్రం విడుదలకు సిద్ధమైంది.(ఇదీ చదవండి: అందుకే తమిళ సినిమాలకు రూ.1000 కోట్లు రావట్లేదు: హీరో శివకార్తికేయన్)మంచు లక్ష్మీ లేటెస్ట్ మూవీ 'దక్ష'. మోహన్ బాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. పోలీస్ పాత్రలో మంచు లక్ష్మీ కనిపించనుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ని అల్లు అర్జున్ లాంచ్ చేశాడు. ట్రైలర్ చూస్తుంటే చాన్నాళ్ల క్రితం తీసిన మూవీలా అనిపిస్తుంది. అలానే మర్డర్ మిస్టరీ కాన్సెప్ట్ తో తీసినట్లు అర్థమవుతోంది. ప్రస్తుతానికి ట్రైలర్ రిలీజ్ చేశారు కానీ థియేటర్లలో విడుదల ఎప్పుడు ఏంటనేది మాత్రం వెల్లడించలేదు.మరోవైపు మంచు మనోజ్.. కొన్నాళ్ల క్రితం 'భైరవం'తో చాన్నాళ్ల తర్వాత నటుడిగా రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఇతడు విలన్గా చేసిన 'మిరాయ్' అనే సూపర్ హీరో మూవీ రిలీజ్కి సిద్ధమైంది. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రం.. సెప్టెంబరు 12న థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
టాలీవుడ్ రేంజ్ పెంచే సినిమా 'ఏ మాస్టర్ పీస్': మూవీ టీమ్
శుక్ర, మాటరాని మౌనమిది తదితర సినిమాలు తీసిన దర్శకుడు పూర్వాజ్ లేటెస్ట్ మూవీ 'ఏ మాస్టర్ పీస్'. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వజ్, అషు రెడ్డి లీడ్ రోల్స్ చేస్తున్నారు. శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ, ప్రజయ్ కామత్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. క్లైమాక్స్ సీన్స్ తీస్తున్నారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ఈ సినిమాని మన పురాణ ఇతిహాసాల నుంచి స్ఫూర్తి పొంది తయారుచేశా. దశరథ మహారాజు మంత్రుల్లో ఒకరైన సుమంత్రుడికి శ్రీరాముడు వనవాసం వెళ్తున్న సమయంలో ఒక వరం లభిస్తుంది. ఆ వరం నేపథ్యంగా సూపర్ హీరో క్యారెక్టర్ని, హిరణ్యకశ్యపుడి ద్వాపర యుగానికి చెందిన ఓ అంశంతో సూపర్ విలన్ పాత్రను క్రియేట్ చేశాం. శ్రీరాముడి త్రేతాయుగానికి, హిరణ్యకశ్యపుడి ద్వాపర యుగానికి, ఇప్పటి కలియుగానికి అనుసంధానిస్తూ సాగే ఒక కొత్త తరహా స్క్రిప్ట్ని ఈ చిత్రంలో చూస్తారు. అన్ని అనుకున్నట్లు జరిగితే మహాశివరాత్రికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని డైరెక్టర్ పూర్వాజ్ చెప్పుకొచ్చారు. -
వీడియోలు తొలగించండి.. ఢిల్లీ హైకోర్టుకు ఐశ్వర్య రాయ్
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ఫోటోలను అనుమతి లేకుండా పలు వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగిస్తున్నారని వెంటనే వాటిని నిర్మూలించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దావా వేశారు. అనుమతి లేకుండానే అనేక వెబ్సైట్లు తన పేరును ఉపయోగించి పలు వస్తువులను విక్రయిస్తున్నాయని ఆమె పేర్కొంది. AI- జనరేటెడ్ ద్వారా తన పోటోలను మార్ఫింగ్ చేసి వీడియోలను కూడా ప్రసారం చేస్తున్నారని ఐశ్వర్య అన్నారు.ఐశ్వర్య రాయ్ పిటిషన్ను జస్టిస్ తేజస్ కరియా నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. ఐశ్వర్య తరపున హాజరైన సీనియర్ న్యాయవాది సందీప్ సేథి కోర్టులో బలంగానే వాదించారు. ఎటువంటి అనుమతి లేకుండానే ఐశ్వర్య పేరును ఉపయోగించి పలు వస్తువులను అమ్ముతున్న అనేక వెబ్సైట్ల వివరాలను కోర్టుకు అందించారు. aishwaryaworld.com అనే ఒక వెబ్సైట్ను సూచిస్తూ.. ఆమె నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే అది "ఐశ్వర్య రాయ్కు సంబంధించిన అధికారిక వెబ్సైట్" అని చెప్పుకుంటున్నారని సేథి అన్నారు.ఒకరి లైంగిక కోరికలను తీర్చుకోవడానికి ఆమె పేరు, ఫోటోలు ఉపయోగించబడుతున్నాయని న్యాయవాది సందీప్ సేథి కోర్టులో లేవనెత్తారు. ఒక పెద్దమనిషి ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇది చాలా నీచమైన పని అంటూ న్యాయవాది ఫైర్ అయ్యారు. దీంతో న్యాయస్థానం కూడా ఐశ్వర్యకు అనుకూలంగానే స్పందించింది. వివిధ ప్రయోజనాల కోసం ఆమె చిత్రాలను అనధికారికంగా ఉపయోగిస్తున్న వెబ్సైట్లపై ఇంజక్షన్ ఆర్డర్లు జారీ చేస్తామని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఐశ్వర్య రాయ్ బచ్చన్ వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించే URL లింక్లను పూర్తిగా తొలగించడానికి తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని జస్టిస్ తేజస్ కరియాతో కూడిన ధర్మాసనం తెలిపింది. -
మిరాయ్.. టికెట్ రేట్లు పెంచడం లేదు: తేజ సజ్జా
'హనుమాన్' మూవీతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించాడు హీరో తేజ సజ్జా (Teja Sajja). ఇతడు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మిరాయ్ (Mirai Movie). మంచు మనోజ్, శ్రియ, జగపతిబాబు, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 12న విడుదల కానుంది. వారికోసమే ఈ నిర్ణయంతెలుగుతో పాటు హిందీ, మలయాళ, కన్నడ, తమిళ, మరాఠి, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో విశాఖపట్నంలో సోమవారం నాడు మిరాయ్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేదికపై టికెట్ రేట్ల పెంపు గురించి హీరో క్లారిటీ ఇచ్చాడు. తేజ సజ్జా మాట్లాడుతూ.. టికెట్ రేట్ల పెంపు లేదు. తక్కువ ధరకే ఈ సినిమాను చూడబోతున్నారు. మా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ను ఇబ్బంది పెట్టి మరీ ఈ నిర్ణయం తీసుకున్నాం. కుటుంబమంతా వచ్చి చూడాలనే టికెట్ రేట్లు పెంచడం లేదు అని తేజ సజ్జ పేర్కొన్నాడు.టికెట్ రేట్లు యథాతథంఅయితే ఓ రెండు సర్ప్రైజ్లు దాచుంచామని, అది ఎవరికీ తెలియదని, తెలుసుకోవాలంటే థియేటర్కు రమ్మని పిలుపునిచ్చాడు. ఈరోజుల్లో మధ్య తరహా, భారీ బడ్జెట్ సినిమాలన్నీ కూడా ఇష్టారీతిన టికెట్ రేట్లు పెంచేస్తున్నాయి. అలాంటి తరుణంలో టికెట్ రేట్లు పెంచకుండా సినిమా తీసుకొస్తుండటంతో పలువురూ మిరాయ్ టీమ్ను అభినందిస్తున్నారు.కథేంటంటే?మహాజ్ఞాన సంపన్నుడు అశోక చక్రవర్తి తాను పొందిన జ్ఞానాన్ని గ్రంథంలో పొందుపరిచారు. అది ఒకే చోట ఉంటే ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుందని భావించి దాన్ని 9 గ్రంథాలుగా విభజించి 9 మంది యోధులకు ఇస్తారు. ఆ గ్రంథాలను పరిరక్షించే బాధ్యతను అప్పజెప్పుతారు. అయితే, 2025లో ఒక ఈవిల్ ఫోర్స్ వాటిని ఒక్కొక్కటిగా తస్కరించేందుకు ప్రయత్నిస్తుంది. మరి వాటిని హీరో కాపాడాడా? లేదా? అన్నదే సినిమా కథ! ఈ మూవీని చైనా, జపాన్లోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
అందుకే తమిళ సినిమాలకు రూ.1000 కోట్లు రావట్లేదు
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీశామా? దక్షిణాదితో పాటు హిందీలోనే రిలీజ్ చేద్దామా అని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. రూ.1000 కోట్ల కలెక్షన్ అందుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఈ మార్క్ని తెలుగు చిత్రాలు ఇదివరకే అందుకోగా, 'కేజీఎఫ్'తో కన్నడ ఇండస్ట్రీ కూడా ఈ ఫీట్ సాధించేసింది. కానీ తమిళ పరిశ్రమకు మాత్రం అది అందని ద్రాక్షలానే మిగిలిపోయింది.గత నెలలో వచ్చిన 'కూలీ' కూడా ఈ మార్క్ అందుకుంటుందేమో అని అందరూ అనుకున్నారు. రిలీజ్కి ముందు ఆ రేంజ్ హైప్ ఏర్పడింది. కానీ కంటెంట్ అంతంత మాత్రమే ఉండేసరికి రూ.400-500 కోట్ల వసూళ్ల వరకు వచ్చి ఆగిపోయింది. అయితే తమిళ మూవీస్ అసలు రూ.1000 కోట్ల మార్క్ ఎందుకు చేరుకోలేకపోతున్నాయ్ అనే విషయమై హీరో శివకార్తికేయన్ ఇప్పుడు మాట్లాడాడు. తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: అల్లు కుటుంబానికి GHMC షాక్)'తమిళ సినిమా ఆ నంబర్కి చేరువలో ఉంది. మరికొన్నేళ్లలో రూ.1000 కోట్ల కలెక్షన్ ఫీట్ సాధిస్తుందని నమ్మతున్నాను. చాలా తమిళ సినిమాలు ఈ మార్క్ని అందుకోలేకపోతున్నాయి. స్టోరీలో సత్తా లేకపోవడమో లేదా పాన్ ఇండియా సబ్జెక్ట్ కాకపోవడం వల్లనే దీనికి కారణం. మూవీ క్వాలిటీ సంగతి పక్కనబెడితే టికెట్ రేట్లు కూడా తమిళనాడులో చాలా తక్కువ. బెంగళూరు, ముంబైలో ఉన్నట్లు ఇక్కడా ఉంటే 'జైలర్'కి రూ.800-1000 కోట్లు వచ్చి ఉండేవి. అలా అని టికెట్ రేట్లు పెంచమని నా ఉద్దేశం కాదు. మా సినిమాలు.. ఉత్తరాది ప్రేక్షకుల మనసులు గెలుచుకోవాల్సిన అవసరముంది' అని శివకార్తికేయన్ అన్నాడు.ఇతడు చెప్పిన దానిలో కొంత నిజముంది. బెంగళూరు, ముంబై సంగతి పక్కనబెడితే హైదరాబాద్లో ఓ మల్టీప్లెక్స్లో టికెట్ రేటు రూ.250-300 ఉంటే.. అదే సంస్థకు చెందిన చెన్నై మల్టీప్లెక్స్లో టికెట్ ధర రూ.180 మాత్రమే. అలానే తమిళ సినిమాల్లో ఎక్కువగా ప్రాంతీయత అనే అంశం కనిపిస్తుంది. అందుకే కొన్ని చిత్రాలు తమిళనాడులో తప్పితే మరో చోట ఆడవు. ఓవరాల్ అప్పీల్ ఉన్న మూవీస్ వచ్చినప్పుడు బహుశా తమిళ చిత్రం రూ.1000 కోట్ల మార్క్ అందుకోవచ్చేమో?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
నోరు తెరిస్తే అబద్ధాలు, నీవల్లే గొడవలు.. నామినేషన్స్లో హీరోయిన్
బిగ్బాస్ షోలో అందరికీ నచ్చేది నామినేషన్స్. ఈ సీజన్లో మొదటి నామినేషన్స్ నేడు జరగనున్నాయి. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో అందరి టార్గెట్ హీరోయిన్ సంజన అనే కనిపిస్తోంది. బిగ్బాస్.. కామనర్లను ఓనర్లుగా ప్రధాన హౌస్లోకి పంపించి, సెలబ్రిటీలను టెనంట్లు(అద్దెకుండేవారు)గా గార్డెన్ ఏరియాలో ఉన్న బెడ్రూమ్కు పంపాడు. ఈరోజు నామినేషన్స్ ఓనర్స్ వర్సెస్ టెనంట్స్ అన్నట్లుగా జరగనుంది. టెనంట్స్లో నుంచి ఒకరిని ఓనర్స్ నేరుగా నామినేట్ చేయొచ్చన్నాడు బిగ్బాస్.అబద్ధాలుదాంతో అందరూ కలిసి సంజన గల్రానీని సెలక్ట్ చేశారు. నీ వల్లే గొడవలు జరుగుతున్నాయి. అబద్ధాలాడుతున్నావ్, వెనకాల మాట్లాడుతున్నావ్ అంటూ కారణాలు చెప్పారు. ప్రియ బ్యాక్ బిచింగ్ అనగానే సంజనాకు మండిపోయింది. అలాంటి పదాలు వాడొద్దని హెచ్చరించింది. తర్వాత సంజనా- ఆశా గొడవపడ్డారు. నా పర్సనల్ రిలేషన్షిప్ గురించి పదేపదే మాట్లాడాల్సిన అవసరం మీకేంటి? అని సంజనాను నిలదీసింది. (Bigg Boss 9 Telugu First Week Nominations)ఎలిమినేషన్ గండంఆమె నామినేషన్స్లోకి వస్తే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే బిగ్బాస్ హౌస్లో ఎవరైతే కిచెన్లో అడుగుపెడతారో వారు ఎప్పుడూ ఎలిమినేషన్కు దగ్గరగా ఉంటారు. అందులోనూ మొదటివారం కిచెన్లో దూరినవారు మరోవారం కనిపించకుండా పోతారు, అదే ఎలిమినేట్ అవుతారు. మరి సంజనా ఈ గండం గట్టెక్కుతుందో, లేదో చూడాలి! -
దోశ 'కింగ్' బయోపిక్లో మోహన్లాల్!
పీ రాజగోపాల్.. ఈ పేరు దేశవ్యాప్తంగా పరిచయమే.. తమిళనాడులో శరవణ భవన్ చెయిన్ రెస్టారెంట్ల వ్యవస్థాపకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఓ మారుమూల పల్లెలో రైతు కుటుంబంలో పుట్టి.. పెద్దగా చదువుకోకుండానే హోటల్ రంగంలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగాడు. కోట్ల రూపాయలు సంపాధించాడు. అయితే, తన జాతకాల పిచ్చి వల్ల ఒక మహిళ జీవితం నాశనం కావడం ఆపై అతని జీవితం కూడా అగ్గిలో కాలిపోయింది. ఇప్పుడు అతని బయోపిక్ వెండితెరపైకి రానుంది. ఇప్పటికే ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, తాజాగా ఈ చిత్రంలో నటించేందుకు స్టార్ హీరో అంగీకరించినట్లు తెలుస్తుంది.జై భీమ్, వేట్టాయాన్ వంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు టీజే జ్ఞానవేల్.. తాజాగా ఈ దర్శకుడు తన మూడవ చిత్రానికి సిద్ధమయ్యాడు. సరవణ భవన్ హోటల్ యజమాని రాజగోపాల్ జీవిత ఇతివత్తంతో చిత్రాన్ని చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. ఇందులో రాజగోపాల్, జీవజ్యోతి అనే మహిళ మధ్య జరిగిన ప్రేమ పోరాటం, రాజగోపాల్ జైలు పాలైన సంఘటనలు ప్రధానాంశంగా ఉంటాయని దర్శకుడు పేర్కొన్నారు. దీనికి దోసెకింగ్ అనే టైటిల్ కూడా నిర్ణయించారు. ఇందులో మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ను నటింపజేసేందుకు మరోసారి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జంగ్లి పిక్చర్స్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా కోసం మోహన్లాల్ చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దోసెకింగ్ చిత్రంలో నటించడానికి మోహన్ లాల్ ఓకే చెబుతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.జ్యోతిష్యం పిచ్చి.. దహించేసిన 'కామాగ్ని'‘శరవణ భవన్’ పి.రాజగోపాల్ను చెన్నై వచ్చిన కొత్తల్లో ఒక జ్యోతిష్యుడు ఏదైనా ‘అగ్ని’తో ముడిపడిన వ్యాపారం పెట్టు అన్నాడు. రాజగోపాల్ ‘శరవణ భవన్’ రెస్టరెంట్ పెట్టి, సక్సెస్ అయ్యి, 22 దేశాల్లో తన హోటల్ సామ్రాజ్యాన్ని విస్తరించి 30 వేల కోట్ల సంపదకు ఎగబాకాడు. జ్యోతిష్యుడు చెప్పింది నిజమైంది. అయితే అగ్నితో పోల్చే ‘కామాగ్ని’తో అదే రాజగోపాల్ అంత పేరూ దహించుకుపోవడమూ ఈ జోస్యంలో ఉంది.జీవజ్యోతితో పెళ్లి కోసం..జీవజ్యోతి ఎంతో చలాకీ అమ్మాయి. చదువుకుంటున్న అమ్మాయి. శరవణ భవన్లో పని చేసే అసిస్టెంట్ మేనేజర్ కూతురిగా పి.రాజగోపాల్కు 1996లో పరిచయం అయ్యింది. అప్పటికే రాజగోపాల్ ‘దోసె కింగ్’ గా చెన్నైలో పేరు గడించాడు. అతనికి 1972లో ఒక వివాహం (ఇద్దరు కొడుకులు), 1994లో మరో వివాహం చేసుకున్న రాజగోపాల్ జీవజ్యోతిని మూడో వివాహం చేసుకోవాలనుకున్నాడు. దానికి కారణం కూడా జోతిష్యమే.‘మీ ఇద్దరి జాతకాలు కలిశాయి. ఆమెను చేసుకుంటే నువ్వు మరిన్ని ఘనవిజయాలు సాధిస్తావు’ అని ఒక జ్యోతిష్యుడు చెప్పిన మాటలతో ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే జాతకం ఒకటి తలిస్తే జీవజ్యోతి మరొకటి తలిచింది.ట్యూషన్ మాస్టర్తో ప్రేమజీవజ్యోతి పి.రాజగోపాల్ను తన గార్డియన్గా భావించింది. పెద్దాయన అభిమానం ప్రదర్శిస్తున్నాడనుకుంది తప్ప అతని మనసులో ఏముందో ఊహించలేకపోయింది. ఈలోపు ఆమె శాంతకుమార్ అనే లెక్కల ట్యూషన్ మాస్టర్ ప్రేమలో పడి 1999లో పెళ్లి చేసుకోవడానికి పారిపోయింది. ఆమె మీద అప్పటికే కన్ను వేసి ఉన్న రాజగోపాల్ ఆ జంటను చెన్నై రప్పించి కాపురం పెట్టించాడు. కాని 2000 సంవత్సరంలో శాంతకుమార్ను బెదిరించి జీవజ్యోతితో తెగదెంపులు చేసుకోమన్నాడు. దీనికి జీవజ్యోతి,శాంతకుమార్ ఒప్పుకోలేదు.జీవజ్యోతి భర్త హత్యజీవజ్యోతిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్న రాజగోపాల్ తన దగ్గర పని చేసే డేనియల్తో 5 లక్షలకు డీల్ మాట్లాడుకుని శాంతకుమార్ను చంపించే పథకం పన్నాడు. అయితే డేనియల్ శాంతకుమార్ను కనికరించి ఐదువేలు ఇచ్చి ముంబై పారిపోమని చెప్పాడు. రాజగోపాల్తో శాంతకుమార్ను హత్య చేశానని చెప్పేశాడు. అయితే శాంతకుమార్ జీవజ్యోతికి ఫోన్ చేసి జరిగింది చెప్పడంతో ‘నువ్వు వచ్చేసెయ్. రాజగోపాల్ కాళ్లమీద పడి వదిలేయ్మని అడుగుదాం’ అనేసరికి అతను వచ్చాడు. ఇద్దరూ రాజగోపాల్ దగ్గరకు వెళ్లారు. దీంతో కోపం పట్టలేకపోయిన రాజగోపాల్ అక్టోబర్ 28న వాళ్లను తన మనుషులతో తీసుకెళ్లాడు. అక్టోబర్ 31న శాంతకుమార్ శవం అడవిలో దొరికింది. జీవజ్యోతి ఈ దెబ్బతో పూర్తిగా దారికొస్తుందని భావించిన రాజగోపాల్ ఆమెను ఇంటికి వెళ్లనిచ్చాడు. అయితే ఆమె నేరుగా చెన్నై పోలీస్ కమిషనర్ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేయడంతో దోసె కింగ్ సామ్రాజ్యం ఉలిక్కిపడింది.ఒంటరి పోరాటంరాజగోపాల్కు ఉన్న పలుకుబడి ముందు జీవజ్యోతి ఎటువంటి ప్రలోభాలకు, వొత్తిళ్లకూ లొంగలేదు. తనకు అన్యాయం జరిగిందని గట్టిగా నిలబడి న్యాయం కోసం పోరాడింది. అయితే రాజగోపాల్ కేవలం 9 నెలలు మాత్రం జైలులో ఉండి తర్వాత బెయిలుపై విడుదలయ్యాడు. అతను జైలులో ఉన్న కాలంలో మంచి భోజనం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. 2004లో సెషన్స్ కోర్టు రాజగోపాల్కు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.దాని మీద రాజగోపాల్ హైకోర్టుకు అప్పీలు చేయగా 2010లో చెన్నై హైకోర్టు మరింత శిక్ష పెంచుతూ యావజ్జీవం చేసింది. దీనిపై సుప్రీం కోర్టులో పోరాడాడు రాజగోపాల్. ఇంత జరుగుతున్నా జీవజ్యోతి ప్రతి చోటా తన న్యాయపోరాటం కొనసాగించింది. 2019 మార్చిలో సుప్రీం కోర్టు హైకోర్టు శిక్షనే బలపరిచి జూలై 7, 2019న లొంగిపోవాలని రాజగోపాల్ను ఆదేశించగా అప్పటికే జబ్బుపడ్డ రాజగోపాల్ జూలై 9న అంబులెన్స్లో వచ్చి కోర్టులో లొంగిపోయాడు. కాని ఆ వెంటనే విజయ హాస్పిటల్ ప్రిజనర్స్ వార్డ్కు తరలించాల్సి వచ్చింది. గుండెపోటుతో అతడు జూలై 18న మరణించాడు. -
గుండంకుల్.. ఎంతమాటన్నాడ్ సార్? అపరిచితుడు బయటకొచ్చేశాడు!
బిగ్బాస్ 9 (Bigg Boss 9 Telugu) మొదలైంది. ఈసారి చదరంగం కాదు రణరంగమే అని నాగార్జున అన్నది కంటెస్టెంట్లు బాగా వంటపట్టించుకున్నట్లున్నారు. మొదటి రోజే గొడవపడ్డారు. మాస్క్ మ్యాన్ హరీశ్, కమెడియన్ ఇమ్మాన్యుయేట్ మధ్యే ఈ గొడవ జరిగింది. ఈ గొడవకు కారణం కూడా ఓ రకంగా బిగ్బాస్ అనే చెప్పాలి! సెలబ్రిటీలను కామనర్స్గా, కామనర్స్ను సెలబ్రిటీలుగా మార్చేశాడు బిగ్బాస్. సెలబ్రిటీలతో పనులు చేయించడమే కాక, ప్రధాన హౌస్లోకి వెళ్లకూడదని ఆజ్ఞాపించాడు. నోటి కాడ కూడును లాక్కున్నాడు కూడా!ఒక్క పూట అన్నం కోసం..వాళ్లకు వండిపెట్టాలని చెప్పానే తప్ప తినమని ఎవరు చెప్పారన్నట్లుగా సరిగ్గా ప్లేటు ముందు పెట్టుకున్న సమయంలో ఆ ఫుడ్ను లోపల పెట్టేయమన్నారు. దీంతో తొమ్మిది మంది సెలబ్రిటీలు చేసేదేం లేక కళ్లతోనే భోజనాన్ని ఆస్వాదించి తిండి మాని పస్తులున్నారు. ఇది హరీశ్ తట్టుకోలేకపోయాడు. తిండి లాక్కోవడం తప్పంటూ బిగ్బాస్కే క్లాస్ పీకాడు. వాళ్లు తినేవరకు తానూ తినేది లేదని భోజనం ప్లేటు మీద నుంచి లేచాడు. అంతేకాదు, బ్రదర్ నేనున్నా అంటూ సెలబ్రిటీలకు అరటిపండ్లు పట్టుకెళ్లాడు. దాంతో బిగ్బాస్ మరోసారి వారించాడు. గుండు అంకుల్.. బెడిసికొట్టిన కామెడీవారిని పస్తులుంచడం తట్టుకోలేని హరీశ్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. అయినా బిగ్బాస్ మరీ అంత చెడ్డోడు కాదులే.. ఏదో కాసేపు అలా తినొద్దని భయపెట్టినా తనే స్వయంగా ఫుడ్ పంపించాడు. అంటే కామనర్లకు సెలబ్రిటీలు వండిపెడ్తే.. సెలబ్రిటీలకు బిగ్బాస్ ఆహారం పంపిస్తాడన్నమాట! ఇకపోతే ఇమ్మాన్యుయేల్ ఏదో కామెడీ చేద్దామని ప్రయత్నించాడు. హరీశ్ను గుండు అంకుల్ అన్నాడు. మొదట ఆయన పట్టించుకోలేదు, కానీ రెండుమూడు సార్లు అనేసరికి చూసుకుని మాట్లాడాలి బ్రదర్.. ఎవరు గుండు? ఎవరు అంకుల్? అని ఫైరయ్యాడు.బాడీ షేమింగ్అప్పటికే హర్ట్ అయ్యాడని గమనించిన ఇమ్ము.. అన్నా సారీ చెప్పా కదా అని సముదాయించాడు. అయినా తగ్గని హరీశ్.. లిమిట్లో ఉండు, బాడీ షేమింగ్ చేయొద్దని హెచ్చరించాడు. నచ్చితే గుండెల్లో పెట్టుకుంటా, నెత్తిమీద ఎక్కాలని చూస్తే తొక్కిపడేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. ఇలా చాలాసేపు వీరిమధ్య ఫైట్ నడిచింది. ఆయన గుండు చేయించుకుందే బిగ్బాస్ కోసం! అగ్నిపరీక్ష షోలో అరగుండు చేయించుకోమనగానే క్షణం ఆలోచించకుండా సగభాగం షేవ్ చేసుకున్నాడు. అతడిని ధైర్యాన్ని మెచ్చిన బిందుమాధవి.. మరీ అరగుండుతో ఎంతకాలం ఉంటావని పూర్తిగా క్లీన్ షేవ్ చేసింది. అపరిచితుడు బయటకొచ్చేశాడుఇక బిగ్బాస్ షో అంతా అరగుండుతోనే ఉండాలని హరీశ్కు కండీషన్ కూడా పెట్టారు. ఈయన ఒక్కరోజులోనే తినమని ప్రేమ, తిననందుకు కన్నీళ్లు, తనపై కామెడీ చేసినందుకు కోపం.. ఇలా అన్నీ చూపించాడు. లైవ్లో అయితే వయసెంత అని అడిగితే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సరదాగా ఉన్నాడట! మొత్తానికి మొదటిరోజే అపరిచితుడిని చూసేశామన్నమాట! చదవండి: రోడ్డు ప్రమాదంలో కాజల్ అగర్వాల్.. తాను క్షేమం అంటూ పోస్ట్ -
అల్లు కుటుంబానికి జీహెచ్ఎంసీ షాక్
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్కు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 45లోని అల్లు బిజినెస్ పార్క్ పేరుతో ఒక భవనం నిర్మించారు. నాలుగు అంతస్థుల వరకు జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకున్నారు. అయితే, కొద్దిరోజుల క్రితం అదనంగా పెంట్హౌస్ నిర్మించడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. అక్రమంగా నిర్మించిన ఆ పెంట్హౌస్ను ఎందుకు కూల్చవద్దో తెలపాలంటూ జీహెచ్ఎంసీ సర్కిల్-18 అధికారులు షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. అల్లు బిజినెస్ పార్క్ నవంబర్ 2023లో నటుడు అల్లు అర్జున్ కుటుంబం పనులు మొదలుపెట్టింది. అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా ఈ నిర్మాణం ప్రారంభించబడింది. ఈ పార్క్ జూబ్లీహిల్స్లో ఉంది. ఇది గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ వంటి కుటుంబ వ్యాపారాల కార్యకలాపాలకు కేంద్రంగా ఈ భవనం పనిచేస్తుంది. అయితే, అనుమతులు లేకుండా పెంట్హౌస్ నిర్మించడంతో దానిని కూల్చేస్తామంటూ జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. -
రోడ్డు ప్రమాదంలో కాజల్ అగర్వాల్.. తాను క్షేమం అంటూ పోస్ట్
వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన కాజల్ అగర్వాల్కు టాలీవుడ్లో భారీగానే అభిమానులు ఉన్నారు. కన్నప్పలో చివరిసారిగా కనిపించిన ఆమె బాలీవుడ్ రామాయణలో నటించనుంది. అయితే, ఆమె రోడ్డు ప్రమాదానికి గురైనట్లు సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఆమె తన ఎక్స్ పేజీలో రియాక్ట్ అయింది.'నేను ప్రమాదానికి గురైనట్లు కొన్ని నిరాధారమైన వార్తలను చూశాను. ఇక లేనని కూడా! కూడా ప్రచారం చేశారు. అందులో వాస్తవం లేదు. వాటిని చూసిన తర్వాత నేను ఎంతో నవ్వుకున్నాను. అంతకు మించిన ఫన్నీ న్యూస్ ఏమీ ఉండదు. పూర్తిగా అవాస్తవం ఉన్న వార్తలను వైరల్ చేయాల్సిన పనిలేదు. దేవుని దయవల్ల నేను క్షేమంగా, సురక్షితంగా ఉన్నాను. అంతేకాకుండా మరింత బాగానే ఉన్నానని మీ అందరికీ తెలుపుతున్నాను. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని లేదా ప్రచారం చేయవద్దని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ప్రేమ, కృతజ్ఞతతో మీ కాజల్' అంటూ ఆమె పోస్ట్ చేసింది.కాజల్ ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలతో పోరాడుతోందని సోషల్మీడియాలో ప్రచారం జరిగింది. ఇలాంటి పుకార్లు ఎక్కడి నుండి వచ్చాయో , అవి ఎలా వ్యాప్తి చెందుతున్నాయో తెలియాల్సి ఉంది. కానీ, కాజల్ స్వయంగా సకాలంలో వివరణ ఇవ్వడం ఆమె అభిమానులకు పెద్ద ఉపశమనం కలిగించింది.I’ve come across some baseless news claiming I was in an accident (and no longer around!) and honestly, it’s quite amusing because it’s absolutely untrue. 😄By the grace of god, I want to assure you all that I am perfectly fine, safe, and doing very well ❤️I kindly request…— Kajal Aggarwal (@MsKajalAggarwal) September 8, 2025 -
'మిరాయ్' కోసం శంకర్ మహదేవన్.. పవర్ ప్యాక్డ్ సాంగ్ వచ్చేసింది
మిరాయ్ సినిమా నుంచి అదిరిపోయే సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. తేజ సజ్జా ప్రధాన కథానాయుకుడిగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్స్లోకి రానుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మూవీని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించారు. ఇందులో రితికానాయక్ హీరోయిన్గా నటించగా.. మంచు మనోజ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి 'జైత్రయా' సాంగ్ను విడుదల చేశారు. చంద్రబోస్ లిరిక్స్ అందించగా ప్రముఖ సింగర్ శంకర్ మహదేవన్ ఆలపించారు. -
ఆకతాయిల నుంచి హీరోయిన్ను కాపాడిన స్టార్ హీరో ఫ్యాన్స్
ఒక్కో సారి చిత్ర యూనిట్కు కష్టాలు ఎదురవుతుంటాయి. అలాంటి కష్టాన్నే కన్నడ నటి 'నీమా రే' ఎదుర్కున్నారు. తమిళ్లో మహేంద్ర ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై మహేంద్రన్ నిర్మిస్తున్న కొత్త చిత్రం ఇరవిన్ విళిగళ్.. ఈ చిత్రాన్ని సిక్కల్ రాజేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహేంద్ర కథానాయకుడిగా నటిస్తుండగా.. 'నీమా రే' హరోయిన్గా నటిస్తుంది. ఈమె కన్నడ చిత్రం బింగారాలో నటనకు జాతీయ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. తమిళ్, కన్నడ చిత్ర పరిశ్రమలో ఆమెకు మంచి పాపులారిటీనే ఉంది. దీంతో ఆమె ఎక్కడికి వెళ్లిన అభిమానులు భారీగానే చేరిపోతారు.అయితే, తను నటిస్టున్న కొత్త చిత్రం సామాజిక మాధ్యమాల నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్గా రానుంది. ఈ మూవీ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుందని దర్శకుడు తెలిపారు. చిత్ర షూటింగ్ను తమిళనాడులోని వెళ్లిమలై ప్రాంతంలో నిర్వహిస్తుండగా అక్కడకు వచ్చిన కొందరు యువకులు హద్దు మీరి హీరోయిన్ 'నీమా రే' చేయి పట్టుకుని లాగుతూ గొడవ చేశారన్నారు. తాము ఎంత అడ్డుకునే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదన్నారు. అప్పుడు అక్కడకు వచ్చిన నటుడు విజయ్ దళపతి అభిమానులు కొందరు కల్పించుకుని షూటింగ్కు కోసం తెచ్చిన కొరడాతో వారిని తరిమి తరిమి కొట్టారని దర్శకుడు చెప్పారు. ఈ సంఘటనతో నటి 'నిమా రే' చాలా భయపడిపోయారని చెప్పారు. ఇరవిన్ విళిగల్ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందనీ,త్వరలోనే చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. నటి నీమా రే.. వైద్య విద్యను పూర్తి చేశారు. ఆపై ఎయిర్ హోస్టెస్ కోర్స్ కూడా పూర్తి చేశారు. ఆమె తమిళం, కన్నడ, తులు భాషల చిత్రాలలో నటించారు. -
ఆ నమ్మకంతోనే ఉన్నాం: కౌశిక్ పెగల్లపాటి
‘‘సాయి శ్రీనివాస్, అనుపమ కాంబినేషన్లో వచ్చిన ‘రాక్షసుడు’(2019) సినిమా మంచి విజయం సాధించింది. వారి కలయికలో వస్తున్న రెండో చిత్రం ‘కిష్కింధపురి’పై ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో మంచి అంచనాలున్నాయి. మా సినిమా ఫైనల్ ఔట్పుట్ చూశాక ఆ అంచనాలను అందుకుంటుందనే నమ్మకంతో ఉన్నాం. ఒక సున్నితమైన కథతో, మంచి సినిమా చేశామనే సంతోషం ఉంది’’ అని డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి చెప్పారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించిన చిత్రం ‘కిష్కింధపురి’.షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కౌశిక్ పెగల్లపాటి మాట్లాడుతూ–‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఆ తర్వాత కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే మరో సినిమా చేయాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయింది. ఓ సందర్భంలో నిర్మాత సాహుగారికి ‘కిష్కింధపురి’ కథ చెప్పాను.. ఆయనకి చాలా నచ్చింది. ఆ తర్వాత శ్రీనివాస్గారు విని, బాగా ఎగై్జట్ అయ్యారు. ఈ సినిమా చేయడానికి అల్లు అరవింద్, బన్నీవాస్గార్లు కూడా ఒప్పుకున్నారు.హారర్, మిస్టరీ నేపథ్యంలో రూపొందిన ‘కిష్కింధపురి’ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించబోతోంది. ఈ కథకి స్ఫూర్తి రామాయణం. 1989లో కథ మొదలవుతుంది. కథ, విజువల్, టెక్నికల్గా ఆడియన్స్ కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని శ్రీనివాస్గారు నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఇప్పటి వరకు చేయని పాత్రలో అనుపమ కనిపిస్తారు. సాహు గారపాటిగారు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు.చేతన్ భరద్వాజ్ సంగీతం, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటాయి. మా చిత్రంలో స్మోకింగ్, డ్రింకింగ్ సన్నివేశాలు ఉండవు. కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా ఇది. నా తొలి సినిమాకి ద్వితీయ చిత్రానికి ఎక్కువ గ్యాప్ వచ్చింది.. అయితే ఇకపై ఆ గ్యాప్ రాకూడదని కోరుకుంటున్నా. నా తర్వాతి సినిమాకి రెండు మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి’’ అని చెప్పారు. -
భద్రకాళి కొత్త అనుభూతినిస్తుంది: తృప్తి రవీంద్ర, రియా జిత్తు
‘‘తెలుగు ప్రేక్షకులు సినిమాలను గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. అన్ని రకాల చిత్రాలను గొప్పగా ఆదరిస్తారు. వైవిధ్యమైన కథతో రూపొందిన మా ‘భద్రకాళి’ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిఇస్తుంది’’ అని హీరోయిన్లు తృప్తీ రవీంద్ర, రియా జిత్తు పేర్కొన్నారు. విజయ్ ఆంటోని నటించిన 25వ చిత్రం ‘భద్రకాళి’. అరుణ్ ప్రభు దర్శకత్వం వహించారు. మీరా విజయ్ ఆంటోని సమర్పణలో విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా తృప్తి రవీంద్ర మాట్లాడుతూ–‘‘మాది మహారాష్ట్ర. సినిమాలపై ఆసక్తితో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేశాను. నా తొలి ఫీచర్ ఫిలిం ‘భద్రకాళి’. విజయ్గారితో నటించడం మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మీరా, రామాంజనేయులుగార్లు చాలా సపోర్ట్ చేశారు’’ అన్నారు. రియా జిత్తు మాట్లాడుతూ– ‘‘మలయాళి అయిన నేను మలయాళ, తమిళ సినిమాలు చూస్తూ పెరిగాను. దాదాపు 15 సినిమాల్లో బాలనటిగా చేశాను. కొంచెం బ్రేక్ తీసుకుని, చదువు పూర్తయిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. ‘భద్రకాళి’ లాంటి కథ సమాజానికి చాలా అవసరం. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది’’ అన్నారు. -
మూరెడు పూల మూల్యం లక్షకు పైగానే!
మీరు ఆస్ట్రేలియా వెళుతున్నారా? అయితే అక్కడి చట్టాలు, నియమ నిబంధనల గురించి కాస్తంత తెలుసుకుని ఆ తర్వాతే వెళ్లండి. ఎందుకంటే అక్కడ బ్యాగులో పూలు పెట్టుకోవడం కూడా తప్పే! మరీ ముఖ్యంగా బయటి నుంచి పూలు తీసుకువెళ్లామా... భారీ జరిమానా చెల్లించేందుకు సిద్ధపడాల్సిందే. ఇదెక్కడి చోద్యం... అంటారా? చోద్యం కాదు.. నిజం. ఎందుకంటే మలయాళ నటి నవ్యా నాయర్ విషయంలో అదే జరిగింది. ఓనమ్ పండుగ వేడుకలలో పాల్గొనేందుకు ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లిన నవ్య నాయర్, తండ్రి ప్రేమతో ఇచ్చిన మల్లెచెండులో కొంత తలలో పెట్టుకుని మిగిలింది తర్వాత పెట్టుకుందాం లే అని బ్యాగ్లో పెట్టుకుందట. మెల్బోర్న్ విమానాశ్రయంలో ‘కష్టమ్స్’ అధికారులు ఆమె బ్యాగ్ను చెక్ చేసేటప్పుడు ఈ పూలమాల బయట పడిందట. అంతే! వారు ఆమె ఏదో ఘోర నేరం చేసినట్లు చూసింది చాలక, 1980 ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా విధించారట. (మన రూపాయలలో అది దాదాపు లక్షా పద్నాలుగు వేలు) ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం బయటి నుంచి పూలు, మొక్కలు, విత్తనాల వంటివి తీసుకు రావడం నేరమట. ఎందుకంటే బయటినుంచి వచ్చే ఇటువంటి వాటివల్ల అంటువ్యాధులు, వాతావరణ కాలుష్యం ప్రబలే ప్రమాదం ఉందట. అందుకే అలాంటి వాటి విషయంలో చాలా కఠినంగా ఉంటారట. ఈ విషయాన్ని నటి నవ్య సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ‘‘మా నాన్న ఇచ్చిన మూరెడు పూల చెండు మూల్యం అక్షరాలా లక్షా పద్నాలుగు వేల పైమాటే’’ అని కామెంట్ చేసింది. ఆమె పోస్ట్ చేయడం మంచిదే అయింది.. లేకపోతే అది తెలియని మన వాళ్లు తలనిండా పూలు తురుముకుని బ్యాగులో మరికాసిని పెట్టుకుని ఆస్ట్రేలియా వెళితే మన కరెన్సీలో సంచెడు రూపాయలు చలానాగా కట్టాల్సి వస్తుంది! -
'అందుకే చాహల్ను అగౌరవపరచలేదు'.. మాజీ భార్య ధనశ్రీ వర్మ
కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ గురించి పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే క్రికెటర్ చాహల్ పెళ్లాడిన ఆమె.. కొన్నేళ్లకే వివాహ బంధానికి ఎండ్ కార్డ్ పడేసింది. 2020లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట.. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత చాహల్, ఆర్జే మహ్వశ్తో డేటింగ్లో ఉన్నట్లు కథనాలొచ్చాయి. వీరిద్దరు తమ వస్తున్న రూమర్స్పై ఇప్పటి వరకు స్పందించలేదు.అయితే చాహల్తో విడాకుల తర్వాత మాజీ భార్య ధనశ్రీ వర్మ ఈ విషయంపై మాట్లాడింది. రియాలిటీ షో రైజ్ అండ్ ఫాల్లో పాల్గొన్న ధనశ్రీ వర్మ విడాకుల తర్వాత తనను చాలా అగౌవరంగా మాట్లాడారని గుర్తు చేసుకుంది. అయితే తాను తిరిగి చాహల్ పట్ల అగౌరవపరిచేలా వ్యవహరించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఎందుకంటే ఒకప్పుడు అతను నా భర్త కావడం వల్లే తనకు గౌరవం ఉందని పేర్కొంది.మీరు బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు.. ఇతరులను గౌరవించడం కూడా మీ చేతుల్లో ఉంటుందని ధనశ్రీ వర్మ అన్నారు. ఒక మహిళగా నాకు ఈ విషయాలు చెప్పే హక్కు లేదా? అని ప్రశ్నించారు. అతను నా భర్త.. నేను వివాహం చేసుకున్నప్పుడు కూడా చాహల్ను గౌరవించానని తెలిపింది. మన ఇమేజ్ కోసం ఇతరులను తక్కువ చేయాల్సిన అవసరం లేదన్నారు. నాపై ఎంత నెగెటివ్ ప్రచారం చేసినా.. ఎంత బ్యాడ్గా చెప్పినా.. మీ టైమ్ వేస్ట్ తప్ప ఎలాంటి ఫలితం ఉండదని ధనశ్రీ వర్మ పేర్కొన్నారు. -
డిజే టిల్లు దర్శకుడి కొత్త సినిమా.. హీరోగా ఎవరంటే?
టాలీవుడ్ హీరో రాగ్ మయూర్ మరో సినిమాకు రెడీ అయిపోయారు. డిజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ డైరెక్షన్లో పని చేయనున్నారు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్లో వస్తోన్న ఈ సినిమా అధికారికంగా ప్రారంభమైంది. ఈ బ్యానర్లో వస్తోన్న నాలుగో చిత్రం కావడం విశేషం. ఇవాళ నిర్వహించిన పూజా వేడుకలో హీరో రాగ్ మయూర్ పాల్గొన్నారు.మేఘ చిలక స్నేహ, జగ్తియాని క్లాప్ కొట్టగా.. సునీల్ నామా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. విమల్ కృష్ణ స్క్రిప్ట్ అందజేశారు. ఈ పూజా కార్యక్రమానికి నటీనటులంతా హాజరయ్యారు. ఈ చిత్రానికి సునీల్ కుమార్ నామా సినిమాటోగ్రఫీని అందిస్తుంఽగా.. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్, నవీన్ చంద్ర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. -
పెళ్లి కూతురిలా జాన్వీ కపూర్.. నివేదా చబ్బీ లుక్
పెళ్లి కూతురిలా ముస్తాబైన జాన్వీ కపూర్జిగేలు మనే డ్రస్సులో మెరిసిపోతున్న తమన్నాతెల్లని చీరలో ఓనం జరుపుకొన్న నివేదా థామస్చీరలో మరింత అందంగా అనన్య నాగళ్లఇళయరాజా పాట పాడి ఆకట్టుకున్న మడోన్నారెడ్ డ్రస్సులో 'లిటిల్ హార్ట్స్' శివానీ నాగారం View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Bhavani Sre (@bhavanisre) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) -
అతని కోసం రూ.70 లక్షలు వదులుకున్న శ్రీదేవి: బోనీ కపూర్
దివంగత నటి శ్రీదేవి చివరి రోజుల కొన్ని దశాబ్దాల పాటు సినీ ప్రియులను అలరించింది. వెండితెరపై తనదైన అందం, నటనతో ఆకట్టుకుంది. కానీ ఊహించని విధంగా 2018లోనే ఓ హోటల్లో మరణించింది. ఆమె చివరిసారిగా నటించిన చిత్రం మామ్. ఆమె భర్త బోనీ కపూర్ నిర్మాతగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన బోనీ కపూర్ ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మామ్ కోసం శ్రీదేవి చాలా కష్టపడిందని అన్నారు. ఈ సినిమాకు తెలుగు, తమిళ, హిందీ వర్షన్స్కు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుందని తెలిపారు. ఈ మూవీ కోసం తన రెమ్యునరేషన్ సైతం వదులుకుందని వెల్లడించారు.బోనీ మాట్లాడుతూ.. "మామ్ షూటింగ్ సమయంలో మేము ఏఆర్ రెహమాన్ను తీసుకోవాలనుకున్నాం. కానీ అతనికి భారీగా పారితోషికం ఇవ్వాల్సి వస్తుంది. అంత ఖర్చు మేం భరించలేకపోయా. శ్రీదేవి రెమ్యునరేషన్ కోసం కొంత మొత్తాన్ని పక్కనపెట్టాం. కానీ ఆమె నాకు బ్యాలెన్స్ డబ్బులేవీ వద్దు. ఆ మిగిలిన మొత్తం రూ.70 లక్షలు రెహమాన్కు ఇచ్చిన తీసుకురావాలని చెప్పిందని' గుర్తు చేసుకున్నారు.అంతేకాకుండా మామ్ షూటింగ్ సమయంలో తనతో గది పంచుకోవడానికి కూడా శ్రీదేవి నిరాకరించిందని బోనీ కపూర్ వెల్లడించారు. సినిమా పట్ల అంత నిబద్ధతగా పనిచేసిందని తెలిపారు. ఈ సినిమా ఎక్కువ భాగం ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో.. ఆ తర్వాత జార్జియాలో చిత్రీకరించామన్నారు. సినిమా షూటింగ్ మొత్తం కాలంలో శ్రీదేవి ఎప్పుడూ గది పంచుకోలేదని వివరించారు. తన మైండ్సెట్ డైవర్ట్ కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఆమె ఆ పాత్ర పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేసిందని పంచుకున్నారు.కాగా.. ఇటీవల ఐఫా రజతోత్సవ వేడుకల సందర్భంగా బోనీ కపూర్.. మామ్ మూవీకి సీక్వెల్ను ప్రకటించారు. ఈ చిత్రం శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్ ప్రధాన పాత్రలో నటించే అవకాశముందని బోనీ అన్నారు. కాగా.. 2017లో విడుదలైన మామ్ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, అక్షయ్ ఖన్నా కూడా నటించారు. రూ.30 కోట్లతో రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.175 కోట్లు వసూలుచేసింది. -
హీరో కుటుంబంతో కలిసి శ్రీలీల పండగ సెలబ్రేషన్స్
శ్రీలీల ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీలో సినిమాలు చేస్తోంది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈమెపై రూమర్స్ వస్తున్నాయి. బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్తో ఈమె డేటింగ్లో ఉందని అంటున్నారు. అందుకు తగ్గట్లు పలుమార్లు కలిసి కనిపించడం పుకార్లకు ఊతమిస్తోంది. తాజాగా వీళ్లిద్దరూ కలిసి వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవడం కొత్త సందేహాలు రేకెత్తిస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?శ్రీలీల ఇప్పటివరకు పలువురు హీరోలతో కలిసి పనిచేసింది. కానీ కార్తిక్ ఆర్యన్తో కాస్త చనువుగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే కొన్నిరోజుల క్రితం సోదరి డాక్టర్ పట్టా అందుకున్న సందర్భంగా కార్తిక్ ఆర్యన్ ఇంట్లో చిన్న పార్టీ చేసుకున్నారు. ఇందులో కార్తిక్ ఫ్యామిలీతో పాటు శ్రీలీల కనిపించారు. అలానే కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కార్తిక్ తల్లి.. తమకు డాక్టర్ చదువుకొన్న కోడలు రావాలనుకుంటున్నానని చెప్పింది. శ్రీలీల డాక్టర్ కోర్స్ పూర్తి చేసింది. కార్తిక్ తల్లి ఈమె గురించి మాట్లాడిందా అనేది క్వశ్చన్ మార్క్.(ఇదీ చదవండి: 'లిటిల్ హార్ట్స్'.. ఇది ఒరిజినల్ సాంగ్)ఇకపోతే ఇప్పుడు ముంబైలోని కార్తిక్ ఆర్యన్ ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ జరగ్గా.. శ్రీలీలతో పాటు ఆమె తల్లి కూడా హాజరైంది. అయితే ఇది పార్టీ గెదరింగ్ లేదంటే తమ రిలేషన్ని కార్తిక్-శ్రీలీల పరోక్షంగా బయటపెడుతున్నారా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం వీళ్లిద్దరూ అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీతో తీస్తున్నారు. వచ్చే ఏడాది ఇది రిలీజ్ కానుంది. మరి కార్తిక్ ఆర్యన్-శ్రీలీలది ఫ్యామిలీ బాండింగా లేదంటే డేటింగ్ అనేది తెలియాలంటే వీళ్లలో ఎవరో ఒకరు నోరు విప్పాలి.(ఇదీ చదవండి: మల్లెపూలు ఎంత పనిచేశాయ్.. నటికి రూ.1.14 లక్షల జరిమానా) -
సింగర్గా రామ్ పోతినేని.. ఆంధ్ర కింగ్ తాలూకా సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూకా'(Andhra King Taluka). ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే.. రామ్కు జంటగా నటిస్తోంది. ఈ మూవీకి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ పి. మహేశ్బాబు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 28న విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలోని పప్పీ షేమ్ అనే పాటను విడుదల చేశారు. అయితే ఈ సాంగ్ను రామ్నే ఆలపించడం విశేషం. ఆ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించహా.. వివేక్, మెర్విన్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ సినిమాలో ఉపేంద్ర, రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ కీలక పాత్రలు పోషించారు. -
జపనీస్ అమ్మాయిలా రష్మిక.. ముంబై స్క్రీనింగ్లో
యనిమే అభిమానుల కోసం క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా సంయుక్తంగా 'డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా ఇన్ఫినిటీ క్యాసిల్' సినిమాని రిలీజ్ చేస్తున్నాయి. సెప్టెంబరు 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా ముంబైలో యనిమే అభిమానుల కోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. హీరోయిన్ రష్మిక, హీరో టైగర్ ష్రాఫ్ కూడా సందడి చేశారు.(ఇదీ చదవండి: నేను వెళ్లిపోవడానికి కూడా రెడీ.. బిగ్బాస్ 9 Day 1 ప్రోమోస్ రిలీజ్)రష్మిక.. టాంజిరో, నెజుకో సోదర సోదరీమణులకి ప్రేరణగా ఉండే ప్రత్యేక జపనీస్ డ్రస్సులో కనిపించింది. రష్మిక కూడా అభిమానులను వారి ఫేవరెట్ సీన్ గురించి అడిగింది. దీనికి పెద్ద ఎత్తున స్పందన రావడంతో 'అకాజా vs గియు మరియు టాంజిరో' ఫైట్ సీక్వెన్స్కు మంచి రెస్పాన్స్ లభించింది. మన దేశంలో దాదాపు 750కి పైగా స్క్రీన్స్లో ఈ సినిమా విడుదలవుతోంది. ఓ యనిమే మూవీకి ఇంతలా రిలీజ్ దక్కుతుండటం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. తెలుగు డబ్బింగ్తోనూ ఈ మూవీ ఉండనుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
'లిటిల్ హార్ట్స్'.. ఇది ఒరిజినల్ సాంగ్
గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో 'లిటిల్ హార్ట్స్' హిట్ టాక్ తెచ్చుకుంది. పెట్టుబడితో పోలిస్తే ఇప్పటికే లాభాల్లోకి వెళ్లిపోయింది. ప్రేక్షకుల్ని అలరిస్తుంది. అయితే ఈ మూవీలో మిగతా పాటలేమో గానీ సెకండాఫ్లో వచ్చే 'కాత్యాయని' పాట అయితే వేరే లెవల్ ఉంటుంది. సంగీతంలో ఉండే రూల్స్ లాంటివి ఏం అందులో పాటించరు కానీ చూస్తుంటే చాలా ఫన్నీగా ఉంటుంది. అయిదే ఇది రీమేక్. దీనికి ఒరిజినల్ ఇప్పటికే ఉంది.(ఇదీ చదవండి: మల్లెపూలు ఎంత పనిచేశాయ్.. నటికి రూ.1.14 లక్షల జరిమానా)'కాత్యాయని' అంటూ సినిమాలో ఉన్న పాటకు ఎనిమిదేళ్ల క్రితం యూట్యూబ్లో రిలీజైన ఓ సాంగ్ మూలం. శరత్ గౌడ్ అనే కుర్రాడు 'కమాన్ బేబీ' పేరుతో ఓ గీతాన్ని పాడుతూ డ్యాన్స్ చేశాడు. అప్పట్లో పెద్ద వ్యూస్ రాలేదు కానీ ఇప్పుడు 'లిటిల్ హార్ట్స్' రిలీజైన తర్వాత దీని గురించి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. పాటని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఈ సాంగ్ ఓసారి వినేయండి.'లిటిల్ హార్ట్స్' విషయానికొస్తే.. మౌళి, శివాని నాగరం హీరోహీరోయిన్లుగా నటించారు. సాయి మార్తాండ్ దర్శకుడు. టీనేజ్ లవ్ స్టోరీతో తీసిన ఈ చిత్రంలో పెద్ద కథేం ఉండదు. ఫన్నీ మూమెంట్స్ మాత్రమే ఉంటాయి. అవే ఇప్పుడు ప్రేక్షకుల్ని ఫుల్గా నవ్విస్తున్నాయి. నాలుగు రోజుల్లో కలెక్షన్ కూడా చాలానే వచ్చాయి.(ఇదీ చదవండి: హిందీ వెబ్ సిరీస్లో రాజమౌళి.. ట్రైలర్ రిలీజ్) -
'ఓరేయ్.. నా ముందుకొచ్చి మాట్లాడరా?'.. మంచు లక్ష్మీ ఆగ్రహం!
టాలీవుడ్ నటి మంచు లక్ష్మి దాదాపు ఐదేళ్ల తర్వాత వెండితెరపై కనిపించనుంది. ప్రస్తుతం ఆమె దక్ష (ది డెడ్లీ కాన్సిఫరిసీ) అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ చిత్రం టీజర్ విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని తన సొంత బ్యానర్ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్లో తెరకెక్కించారు. ఈ సినిమాకు మోహన్ బాబు, లక్ష్మీ ప్రసన్న నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి వంశీకృష్ణ మల్ల దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది.అయితే ఇటీవల దుబాయ్లో జరిగిన సైమా అవార్డ్స్-2025 వేడులకు హాజరైంది. మంచు లక్ష్మీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అక్కడే మంచు లక్ష్మీ వేదిక వద్దకు వెళ్తుండగా ఆమెతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. అదే సమయంలో ఓ అభిమాని అసభ్యకరంగా కామెంట్ చేయడంతో మంచు లక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడరా? మీకసలు సెన్స్ లేదు రాస్కెల్స్.. అంటూ మండిపడింది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ సైతం కామెంట్ చేస్తున్నారు. ఆ తర్వాత చాలామంది అభిమానులతో సెల్ఫీలకు పోజులిచ్చింది మంచు లక్ష్మీ.కాగా.. మంచు లక్ష్మీ నటించిన యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్లో సముద్రఖని, మలయాళ నటుడు సిద్దిక్, చైత్ర శుక్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మోహన్ బాబు కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మంచు లక్ష్మీ పవర్పుల్ పాత్రలో కనిపించారు. లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ నుంచి పదేళ్ల తర్వాత దక్ష రూపంలో మరో చిత్రం విడుదల కానుంది. 2015లో మామ మంచు అల్లుడు కంచు మూవీ ఆ బ్యానర్ నుంచి చివరిగా విడుదలైంది. View this post on Instagram A post shared by KIO TV (@kiotv27) -
హిందీ వెబ్ సిరీస్లో రాజమౌళి.. ట్రైలర్ రిలీజ్
రాజమౌళి పేరు చెప్పగానే బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు గుర్తొస్తాయి. ప్రస్తుతం మహేశ్ బాబుతో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అదే టైంలో ఈ మధ్య కాలంలో యాడ్స్, ఈవెంట్స్లో తరుచుగా కనిపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా ఓ హిందీ వెబ్ సిరీస్లోనూ జక్కన్న నటించడం విశేషం. తాజాగా రిలీజైన ట్రైలర్తో ఈ విషయం బయటపడింది.(ఇదీ చదవండి: మల్లెపూలు ఎంత పనిచేశాయ్.. నటికి రూ.1.14 లక్షల జరిమానా)షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్.. దర్శకుడిగా మారి తీసిన సిరీస్ 'ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్'. హిందీ చిత్రసీమలో తెరవెనక జరిగే సంగతుల్ని ఆధారంగా చేసుకుని కామెడీ ఎంటర్టైనర్గా దీన్ని తీశాడు. సెప్టెంబరు 18 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులోనే ఓ సీన్లో ఆమిర్ ఖాన్, రాజమౌళి కనిపించారు. వీళ్లతో పాటు దర్శకనిర్మాత కరణ్ జోహార్, దిశా పటానీ, షారుఖ్ ఖాన్, ర్యాపర్ బాద్ షా కూడా అతిథి పాత్రల్లో కనిపించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
పిల్ల తెమ్మెర... హోరు గాలి ఆశా భోస్లే స్వరం!
'ఓ హసీన్దర్ద్దేదో జిసే మై గలే లగా లూ' అంటారు ఆశా భోస్లే ఓ పాటలో. ఆ పాట సందర్భం ఏదైనా ‘హసీన్ దర్ద్’ అనే మాట ఎంత బావుందో కదా. అది ఆశాజీ స్వరానికి చక్కగా సరిపోతుంది. ఆవిడ తన పాటతో మనందరికి అలాంటి అందమైన బాధనే కదా పుట్టిస్తారు. ఇంకో పాటలో 'దిల్చీజ్క్యా హై ఆప్మేరీ జాన్లీజియే' అంటారు. నిజమే ఆవిడ గొంతుక అంటే పడి చచ్చేవాళ్లంతా ముక్త కంఠంతో చెప్పే మాట ఇది మీ కోసం మా గుండెలే కాదు ప్రాణాలు కూడా ఇచ్చేస్తామని! ఈ పాట ఆశ పాడిన గొప్ప పాటల్లో ఒకటి. షహరయార్ రచన, ఖయ్యాం సంగీతం, రేఖ అభినయం ఒక ఎత్తు అయితే ఆశా భోంస్లే స్వరం ఒక్కటే ఒక ఎత్తు. అందుకే ఈ పాట ఆశాజీకి జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. దీంతో పాటు ఆవిడ మరో పాటకు కూడా జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ పాట చాలా విలక్షణమైనది సాహిత్యపరంగా, సంగీతపరంగాను!అదే 'మేరా కుఛ్ సామాన్... తుమ్హారే పాస్ పడా హై' సాంగ్ గుల్జార్ దర్శకత్వం వహించిన ఇజాజత్ సినిమాలోనిది. ఈ పాట లిరిక్స్ కూడా ఆయనే రాశారని వేరే చెప్పాలా? ఇజాజత్ 1987లో రిలీజైంది. ఆర్డీ బర్మన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. ఓరోజు గుల్జార్ ఒక పాటకి లిరిక్స్ రాసి రికార్డింగ్కి పట్టుకెళ్లారు. ఆ లిరిక్స్ చూసి బర్మన్ దా ఇది పాట సాహిత్యమా లేక న్యూస్ పేపరా అని అడిగారు. గుల్జార్ మౌనంగా ఉండిపోయారు. ఆ పాట పాడాల్సిన ఆశా భోస్లే లిరిక్స్ చేతికి తీసుకుని మెల్లగా హమ్ చేస్తూపోయారు. అది వింటున్న బర్మన్ దాకి ఏదో స్ఫురించింది. అంతే! పదిహేను నిముషాల్లో బాణీ కట్టేశారు. అలా పుట్టిందే మేరా కుఛ్ సామాన్ అనే పాట!ఈ పాట లిరిక్స్నిజంగానే పైకి ప్లెయిన్గా కనిపిస్తాయి. కానీ తరచి చూస్తే ఆ పదాల్లో ఎంతటి అర్థం దాగుందో తెలుస్తుంది. సుతిమెత్తగా ఉన్నట్లు కనిపించినా ఈ పాట బాణీ చాలా కష్టమైంది. ఆలాపన మొదలుకొని చివరి దాకా ఒక ప్రవాహంలాగా సాగిపోతుంది. పల్లవి, చరణం లాంటి సంప్రదాయ పద్ధతులు కనిపించవు. ఈ పాట పాడ్డం అప్పట్లో ఆశా భోస్లేకి పెద్ద సవాలుగా తోచింది. మాధుర్యం చెడకుండా మంద్రస్థాయి నుంచి తారస్థాయికి.. అక్కడి నుంచి మళ్లీ మధ్యమస్థాయి, మంద్రస్థాయులకు ప్రయాణిస్తూ ఆశా ఈ పాటకు పూర్తి న్యాయం చేశారు. మధ్యమధ్యలో మాటలు, విరక్తి నవ్వులు కూడా వినిపించారు. ఇంత బాగా పాడినందుకు ఆవిడకు, అంత విభిన్నంగా రాసినందుకు గుల్జార్కి 1988 సంవత్సరానికిగాను జాతీయ అవార్డులు దక్కాయి. ఈ పాట విన్నప్పుడల్లా ఆర్డీ బర్మన్తో గడిపిన రోజులే గుర్తొస్తాయని ఆశా భోస్లే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అందుకే ఈ పాటంటే ఆవిడకి ప్రాణమట!1933లో సెప్టెంబర్ 8న పుట్టిన ఆశా భోస్లే అక్క లతా మంగేష్కర్సాయంతో సినిమాల్లో పాడడం మొదలుపెట్టినా తొందరలోనే తనకంటూ ఒక స్టైల్ క్రియేట్చేసుకున్నారు. మత్తుగా, గమ్మత్తుగా పలికే ఆమె స్వరానికి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ఉంది. ‘ఆయియే మెహర్బాన్’ అంటూ ఒక పాటలో కవ్విస్తే ‘ఓ మేరే సోనారే’ అంటూ మరో పాటలో మురిపిస్తారు. ‘హరే రామ హరే కృష్ణ’లోని ‘దమ్మారో దమ్’ అనే రాక్ నంబర్ పాడినా ‘ఉమ్రావ్జాన్లోని ‘ఇన్ఆంఖోంకీ మస్తీ కే’ అనే ఘజల్ ఆలపించినా ఆశా స్టైల్ దేనికదే ప్రత్యేకం. హెలెన్కోసం ‘పియా తూ అబ్తో ఆజా’ మొదలుకొని చాలా పాటలే పాడారూ ఆశాజీ. ఆ పాటలన్నీ ఎవర్గ్రీన్హిట్సే! ఏ మేరా దిల్ యార్కా దివానా, ఓ హసీనా జుల్ఫోవాలీ లాంటి డాన్స్నంబర్స్ని ఎవరు మాత్రం మర్చిపోగలరు? 90స్ తర్వాత ఎ. ఆర్. రహమాన్ ఆశా భోస్లేకి మంచి హిట్స్ ఇచ్చారు. రంగీలా టైటిల్ సాంగ్, ‘తన్హా తన్హా’ పాటలు ఆవిడ వర్సటాలిటీకి అద్దం పడతాయి. ఇక 2001లో విడుదలైన ‘లగాన్’లోని ‘రాధ కైసే న జలే’ అనే పాటయితే జనం గుండెల్లో అలా నిలిచిపోయింది.అన్నట్లూ ఆశాజీ మన తెలుగులో కూడా కొన్ని పాటలు పాడారు. 1988లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘చిన్ని కృష్ణుడు’ సినిమాలోని ‘జీవితం సప్త సాగర గీతం’ అన్న ఆర్డీ బర్మన్ కంపోజిషన్ ఇప్పటి తరానికి కూడా బాగా తెలుసు. ఇక ‘చందమామ’ సినిమా కోసం కె.ఎం. రాధాకృష్ణన్పాడించిన ‘నాలో ఊహలకు’ అనే పాట ఎంత హాయిగా, లయబద్ధంగా సాగిపోతుందో వేరే చెప్పాలా? ఆశా భోస్లే స్వరం మెత్తగా లాలించే పిల్ల తెమ్మెరే కాదు గుండెను పట్టి కుదిపేసే హోరుగాలి కూడా, మెల్లగా సాగే సెలయేరే కాదు, ఉవ్వెత్తున దూకే జలపాతం కూడా. ఆ స్వర ప్రవాహంలో తడిసి ముద్దవడం తప్ప సామాన్య శ్రోతలుగా మనమింకేం చేయగలం?-శాంతి ఇశాన్ -(సెప్టెంబర్ 8 ఆశా భోస్లే పుట్టినరోజు సందర్భంగా) -
మల్లెపూలు ఎంత పనిచేశాయ్.. నటికి రూ.1.14 లక్షల జరిమానా
జడకు పెట్టుకున్న మల్లెపూలు.. ప్రముఖ నటిని చిక్కుల్లో పడేశాయి. ఏకంగా రూ.లక్ష ఫైన్ కట్టించేలా చేశాయి. ఈ విషయాన్ని సదరు నటి బయటపెట్టింది. దీంతో ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలేం జరిగింది?మలయాళ నటి నవ్య నాయర్.. రీసెంట్గా ఓనం సెలబ్రేషన్స్ కోసం ఓ ఈవెంట్కి హాజరయ్యేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది. అయితే మెల్బోర్న్ విమానాశ్రయంలో దిగేటప్పుడు మల్లెపూలని తన బ్యాగులో పెట్టుకుంది. వీటిని చూసి ఎయిర్పోర్ట్ అధికారులు.. ఈమెకు 1980 ఆస్ట్రేలియన్ డాలర్స్ జరిమానా విధించారు. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.1.14 లక్షలు.(ఇదీ చదవండి: నేను వెళ్లిపోవడానికి కూడా రెడీ.. బిగ్బాస్ 9 Day 1 ప్రోమోస్ రిలీజ్)కఠినమైన బయోసెక్యూరిటీ ఉన్న విమానాశ్రయాల్లో మెల్బోర్న్ ఒకటి. పండ్లు, విత్తనాలు, పూలు తీసుకెళ్లడం ఇక్కడ నిషిద్ధం. వీటి వల్ల వివిధ రకాల వ్యాధులు, తెగుళ్లు వచ్చే ప్రమాదం ఉండటంతోనే అధికారులు ఈ నిబంధన పెట్టారు. ఇది తెలియని నటి నవ్య నాయర్.. తన బ్యాగులో మల్లెపూలు పెట్టేసింది. దాన్ని గుర్తించిన సిబ్బంది.. జరిమానా విధించారు. 28 రోజుల్లోపు ఈ మొత్తం కట్టాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఈమెకు చెప్పారు.విమానాశ్రయంలో ఈ తతంగమంతా జరిగిన తర్వాత మెల్బోర్న్లో ఓనం ఈవెంట్ లో పాల్గొన్న నవ్య నాయర్.. అక్కడ మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టింది. తాను తీసుకువచ్చిన పూలు.. లక్ష రూపాయలు ఖరీదైనవనని ఫైన్ వేసేవరకు తనకు తెలియదని తనపై తానే కౌంటర్ వేసుకుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) View this post on Instagram A post shared by Navya Nair (@navyanair143) -
నేను వెళ్లిపోవడానికి కూడా రెడీ.. బిగ్బాస్ 9 ప్రోమోస్ రిలీజ్
బిగ్బాస్ షో ఏ సీజన్ తీసుకున్నా సరే కాస్త కుదురుకోవడానికి కాస్త సమయం పట్టేది. తర్వాత నామినేషన్స, గొడవలు లాంటివి ఉండేవి. ఈసారి మాత్రం వచ్చీ రాగానే మొదలుపెట్టారు. అగ్నిపరీక్ష పోటీలో గెలిచిన సామాన్యులు హరీశ్, మనీష్. తొలిరోజే గొడవ పెట్టేసుకున్నారు. ఇందుకు సంబంధించిన తొలిరోజు ప్రోమోని రిలీజ్ చేశారు.షో ప్రారంభమైన ఆదివారం నాడే ఇల్లు క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్, బట్టలు ఉతకడం లాంటి బాధ్యతలు కొందరికి అప్పగించారు. అలానే అగ్నిపరీక్షలో నెగ్గి వచ్చిన ఆరుగురు లోపల హౌస్ ఓనర్స్ అని, మిగిలిన తొమ్మిది టెనెంట్స్ అని నాగార్జున చెప్పారు. ఇప్పుడు తొలిరోజు బాధ్యతల గురించి 15 మంది మధ్య డిస్కషన్ జరిగింది. ఈ క్రమంలోనే మాస్క్ మ్యాన్ హరీశ్, మర్యాద మనీష్ మధ్య మాటల యుద్ధం జరిగినట్లు అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)ఎవరెవరు ఏయే పనులు చేయాలనే చర్చ నడించింది. ఈ క్రమంలోనే ఒకరికొకరు అందుకు సంబంధించిన బ్యాడ్జిలు కేటాయించుకున్నారు. తినేసిన గిన్నెల్ని రీతూ చౌదరి శుభ్రం చేయాలని పవన్ బ్యాడ్జ్ ఇచ్చాడు. అలానే వంట చేసే వాళ్లు క్లీన్ చేయరు, వంట మాత్రమే చేస్తారు అని ప్రియ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. దాంతో హరీష్.. ఖాళీగా ఉన్న సంజన క్లీనింగ్ చేస్తే బాగుంటుంది అని తన అభిప్రాయాన్ని చెప్పాడు. దీంతో మర్యాద మనీష్ కల్పించుకున్నాడు. అది కరెక్ట్ కాదు అని అనేసరికి హరీష్ ఫైర్ అయ్యాడు.'మనీష్.. నీకు బ్యాడ్జ్ రాలేదు కదా.. మీరు మాట్లాడొద్దు' అని హరీశ్.. మనీష్తో అన్నాడు. ఎందుకు మాట్లాడకూడదు అని మనీష్ అడిగేసరికి ఇద్దరి మధ్య మాటల వార్ నడిచింది. మధ్యలో భరణి వచ్చి కూల్ చేసే ప్రయత్నం చేశాడు కానీ హరీష్ తగ్గినట్లు కనిపించలేదు. 'ఏదైనా అయితే నేను చూసుకుంటా.. అవసరం అయితే ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికైనా రెడీ' అని హరీష్ అన్నాడు. అలా ప్రోమో ఎండ్ చేశారు.(ఇదీ చదవండి: సల్మాన్ ఖాన్ ఓ గూండా.. 'దబంగ్' దర్శకుడు సంచలన కామెంట్స్) -
సల్మాన్ ఖాన్ ఓ గూండా.. బాలీవుడ్ దర్శకుడు సంచలన కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకడు. దాదాపు 7-8 ఏళ్ల నుంచి ఇతడు సినిమాలైతే చేస్తున్నాడు గానీ హిట్ పడట్లేదు. అలాంటిది ఇతడిపై ఓ బాలీవుడ్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సల్మాన్ ఓ గుండా, అతడికి నటన అంటే అసలు ఆసక్తి లేదు. సెలబ్రిటీ హోదా కోసమే మూవీస్ చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశాడు. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)తెలుగులో 'గబ్బర్ సింగ్' మూవీ పెద్ద హిట్. దాని ఒరిజినల్ చిత్రం 'దబంగ్'. 2010లో రిలీజైన ఈ హిందీ సినిమాకు అభినవ్ కశ్యప్ దర్శకుడు. ఇతడు అనురాగ్ కశ్యప్కి అన్నయ్య. అయితే సల్మాన్తో ఈ మూవీ చేసిన తర్వాత అభినవ్.. ఇండస్ట్రీలో అడ్రస్ లేకుండా పోయాడు. అయితే దీనికి సల్మాన్, అతడి కుటుంబమే కారణమని గతంలోనే అభినవ్ ఆరోపించాడు. ఇప్పుడు మరోసారి సంచలన కామెంట్స్ చేశాడు.'2010లో 'దబంగ్' సీక్వెల్ చేయమని సల్మాన్ కుటుంబం నన్ను అడిగింది. దానికి నేను నో చెప్పాను. అప్పటినుంచి నాపై పగ పెంచుకున్నారు. సల్మాన్కి నటనపై ఆసక్తి లేదు. 25 ఏళ్లుగా అతడు నటించడం లేదు. సెలబ్రిటీగా ఉండటానికే సెట్కి వస్తాడు. అతడొక గూండా. పగ-ప్రతీకారంతో రగిలిపోయే ఓ అసభ్యకరమైన వ్యక్తి. వారు చెప్పిన మాట కాదంటే వెంటాడి మరీ వేధిస్తాడు. వారందరూ రాబందులు. సల్మాన్ మాత్రమే కాదు బోనీ కపూర్ కూడా అలాంటోడే. నా తమ్ముడు అనురాగ్తో బోనీ అసభ్యంగా ప్రవర్తించాడు. అందుకే అతడి సినిమా నుంచి అనురాగ్ బయటకొచ్చేశాడు. ఈ రాబందుల గురించి ముందే నా తమ్ముడు చెప్పాడు' అని అభినవ్ తాజాగా ఇంటర్వ్యూలో చెప్పాడు.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ తెలుగు సినిమా) -
సడన్గా ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ తెలుగు సినిమా
సాధారణంగా వీకెండ్లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో గురువారం అందుబాటులోకి వస్తుంటాయి. కానీ కొన్నిసార్లు వారం మధ్యలోనే ఎలాంటి ప్రకటన లేకుండా వచ్చేస్తుంటాయి. ఇప్పుడు కూడా ఓ తెలుగు హారర్ కామెడీ మూవీ సడన్గా డిజిటల్ స్ట్రీమింగ్ అయిపోతోంది. లెక్క ప్రకారం ఈ వారాంతంలోనే డిజిటల్ రిలీజ్ ఉంది. కానీ ఇప్పుడు మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో చూడొచ్చు?పలు సినిమాల్లో కమెడియన్గా నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ లీడ్ రోల్ చేసిన మూవీ 'బకాసుర రెస్టారెంట్'. గత నెల 8న థియేటర్లలో రిలీజైంది. ఓ మాదిరి రెస్పాన్స్ మాత్రమే వచ్చింది. దీన్ని సెప్టెంబరు 12న సన్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది. ప్రస్తుతం తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. క్షుద్ర పూజలతో నిద్రలేచే ఆత్మ వల్ల ఇబ్బందులు, దాంతో వచ్చే భయం తదితర అంశాలతో ఈ సినిమాని తెరకెక్కించారు.(ఇదీ చదవండి: నటి సుధ ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు లీక్.. పోలీసులకు ఫిర్యాదు!)'బకాసుర రెస్టారెంట్' విషయానికొస్తే.. పరమేశ్వర్ (ప్రవీణ్) సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఉద్యోగం కంటే వ్యాపారం చేయడంపై ఆసక్తి. రెస్టారెంట్ పెట్టాలనుకుంటాడు. దాని కోసం డబ్బులు సంపాదించేందుకు యూట్యూబ్ ఛానెల్ పెడతాడు. దెయ్యంపై చేసిన తొలి వీడియో వైరల్ కావడంతో రెండో వీడియో కోసం పాత బంగ్లాకు స్నేహితులతో కలిసి వెళ్తాడు. అక్కడ కనిపించిన పుస్తకంతో క్షుద్రపూజ చేస్తారు. దీంతో బక్క సూరి (వైవా హర్ష) అనే ఆత్మ బయటకొస్తుంది.బక్క సూరి ఆత్మతో వాళ్లంతా ఆడే ప్రయత్నం చేయగా.. పరమేశ్వర్ స్నేహితుడి శరీరంలోకి ఈ ఆత్మ ప్రవేశిస్తుంది. దాని ఆకలికి హద్దుండదు. ఆ ఆత్మని బయటకు పంపేందుకు పరమేశ్వర్ గ్యాంగ్ ఎలాంటి ప్రయత్నాలు చేసింది? అసలు ఆత్మ నేపథ్యమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)