breaking news
Movies
-
క్రేజీ ప్రాజెక్ట్
ఆది సాయికుమార్ హీరోగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది. హాస్య మూవీస్ అధినేత, రైజింగ్ ప్రోడ్యూసర్ రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆది హీరోగా నటించిన ‘శంబాల’ చిత్రం ఈ నెల 25న విడుదలైంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆదిని కలిసి, శుభాకాంక్షలు తెలిపారు రాజేష్ దండా.ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ–‘‘మా హాస్య మూవీస్పై ‘ఊరిపేరు భైరవకోన, సామజవరగమన, మజాకా, కె–ర్యాంప్’ వంటి పలు హిట్ సినిమాలు నిర్మించాను. అలాగే మా బ్యానర్లో మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ నిర్మాణంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నెక్ట్స్ మూవీ ఆదితో ఉంటుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నాం’’ అని తెలిపారు. -
చలో కేరళ
కేరళ కాలింగ్ అంటున్నారట హీరో నాగార్జున. ఆయన కెరీర్లోని వందో సినిమా ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆర్.ఏ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆల్రెడీ చిత్రీకరణ మొదలైంది.కాగా ఈ సినిమా కోసం ఓ షెడ్యూల్ని కేరళలో ప్లాన్ చేశారట మేకర్స్. ఇందుకోసం నాగార్జున త్వరలోనే కేరళ వెళ్తారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. జనవరి మొదటివారంలో కేరళ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందట. నాగార్జునపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని టాక్. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా 2026లో విడుదల అవుతుందని తెలిసింది. -
ఓటీటీలోకి మలయాళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి మరో క్రేజీ సినిమా రానుంది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి, సైకో పాత్రలో నటించిన ఈ మూవీ.. థియేటర్లలో అదరగొట్టేసింది. ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇప్పుడు ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమే. లేటు వయసులో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్న ఈయన.. గతేడాది ఓ మూవీలో స్వలింగ సంపర్కుడి పాత్రలో కనిపించారు. ఇప్పుడు 'కలం కవల్' చిత్రంలో సైకో తరహా పాత్రలో కనిపించి అందరికీ షాకిచ్చారు. డిసెంబరు 5న ఈ చిత్రం థియేటర్లలో రిలీజై హిట్ అయింది. ఇప్పుడీ చిత్రం సోనీ లివ్ ఓటీటీలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. జనవరి అని చెప్పారు గానీ ప్రస్తుతానికి తేదీ ఏం వెల్లడించలేదు.(ఇదీ చదవండి: ప్రాణాలు తీసుకున్న ప్రముఖ సీరియల్ హీరోయిన్)ఈ వీకెండ్ అంటే జనవరి 2న లేదంటే జనవరి 9న స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ 'కలం కవల్' చిత్రం అందుబాటులోకి వస్తుంది. ఈ మేరకు పోస్టర్, ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో మమ్ముట్టితో పాటు 'జైలర్' ఫేమ్ వినాయకన్ కీలక పాత్ర చేశాడు.'కలం కవల్' విషయానికొస్తే.. పైకి సౌమ్యుడిగా కనిపించే స్త్రీ లోలుడు.. సైకో కిల్లర్గా మారి అమ్మాయిల్ని, మహిళల్ని చంపేస్తుంటాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ కనుక్కొనే విస్తుపోయే నిజాలు ఏంటనేది మెయిన్ స్టోరీ. సైకోగా మమ్ముట్టి కనిపించగా.. పోలీస్గా వినాయకన్ చేశాడు. ఒకప్పుడు దేశంలో సంచలనం సృష్టించిన సైనేడ్ మోహన్ స్టోరీని ఈ సినిమా కోసం కొంచెం స్ఫూర్తిగా తీసుకున్నారు.(ఇదీ చదవండి: కొత్త ఏడాది స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే)The legend returns, darker and deadlier. Mammootty in a performance that will leave you breathless. Biggest blockbuster of the season, #Kalamkaval streaming this January only on Sony LIV!#Mammootty @mammukka #Vinayakan #MammoottyKampany #JithinKJose @rajisha_vijayan pic.twitter.com/3ggagRwcAe— Sony LIV (@SonyLIV) December 29, 2025 -
ఐ బొమ్మ నాదే అనడానికి ప్రూఫ్స్ ఏవి?.. ఇమంది రవి
సినిమాలని పైరసీ చేసి ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టిన రవి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇతడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. దాదాపు 12 రోజుల పాటు విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. పలు కీలక వివరాలు సేకరించారు. ప్రహ్లాద్ అనే వ్యక్తి డాక్యుమెంట్స్ దొంగిలించి వాడుకున్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా కస్టడీ పూర్తవడంతో హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, అనంతరం నాంపల్లి కోర్టులో హజరుపరిచారు. తర్వాత మీడియాతో మాట్లాడిన రవి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'బెట్టింగ్ యాప్స్తో నాకు సంబంధాలు ఉన్నాయని, వాటిని ప్రమోట్ చేస్తున్నానని అంటున్నారు. కానీ ఆ ఆరోపణల్లో నిజం లేదు. నా పేరు ఐ బొమ్మ రవి కాదు ఇమంది రవి. ఐబొమ్మ నాదే అనడానికి ఆధారాలు ఏవి? నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశానని మీకు ఎవరు చెప్పారు? పోలీసులు చెబితే నేను నేరం చేసినట్లేనా? నేను ఎక్కడికీ పారిపోలేదు. వేరే దేశంలో పౌరసత్వం మాత్రమే తీసుకున్నాను. నేను కూకట్పల్లిలో ఉంటున్నాను. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటాను. నాపై ఆరోపణలన్నీ నిరాధారమైనవి. సరైన టైంలో నిజాలు బయటపెడతా' అని మీడియాతో రవి అన్నాడు.మరోవైపు సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు మాట్లాడుతూ.. ఐ బొమ్మ రవి కస్టడీ విచారణలో ఫేక్ ఐడీల సమాచారం సేకరించాం. ముగ్గురు స్నేహితుల ఐడీల ద్వారానే రవి ఫేక్ ఐడీలు సృష్టించాడు. ఇతడికి చెందిన రూ.3 కోట్లు ఫ్రీజ్ చేశాం. బెట్టింగ్ యాప్స్తో రవికి ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీల గురించి దర్యాప్తు కొనసాగుతోంది. ఇతర పైరసీ వెబ్సైట్స్తో ఉన్న సంబంధాల గురించి కూడా ఆరా తీస్తున్నాం. కరేబియన్ దేశంలో ఉన్న రవి డేటాపై ఆరా తీస్తున్నాం. విచారణలో రవితో సంబంధాలు లేవని ప్రహ్లాద్ చెప్పాడు. త్వరలోనే మిగతా ఇద్దరి స్నేహితులను విచారిస్తాం. ఇకపై పైరసీ చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పారు. -
నాజూగ్గా కల్యాణి ప్రియదర్శన్.. లంగా ఓణీలో శ్రీదేవి!
లంగా ఓణీలో మరింత అందంగా 'కోర్ట్' శ్రీదేవినాజూగ్గా మెరిసిపోతున్న కల్యాణి ప్రియదర్శన్మోడ్రన్ డ్రస్లో నభా నటేశ్ హొయలుకొంటె చూపులతో మాయ చేస్తున్న అనసూయఏడాది జ్ఞాపకాల్ని వీడియోగా పోస్ట్ చేసిన కాయదు View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Jabili 🌝 (@srideviactor) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) -
ప్రాణాలు తీసుకున్న ప్రముఖ సీరియల్ హీరోయిన్
ప్రముఖ సీరియల్ నటి నందిని ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులోని తన ఇంట్లోనే ప్రాణాలు తీసుకుంది. దీంతో ఒక్కసారిగా తమిళ, కన్నడ సీరియల్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రస్తుతం ఈ విషయమై బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్కి చెందిన నందిని.. సొంత భాషలో కాకుండా కన్నడ, తమిళంలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే తమిళంలో ద్విపాత్రాభినయం చేసిన 'గౌరి' సీరియల్ ఈమెకు బోలెడంత పేరు తీసుకొచ్చింది. దీని షూటింగ్ కొన్నాళ్ల ముందు వరకు బెంగళూరులోనే జరిగింది. రీసెంట్గానే చెన్నైకి షిఫ్ట్ చేశారు. మొన్నటివరకు చిత్రీకరణలో పాల్గొన్న నందిని.. కాస్త బ్రేక్ తీసుకునేందుకు బెంగళూరులోని ఇంటికి వచ్చింది.అలాంటిది సడన్గా ఇంట్లోనే ప్రాణాలు తీసుకుంది. దీంతో తోటీనటీనటులు షాక్కి గురయ్యారు. 'గౌరి' సీరియల్ ప్రసారమవుతున్న కలైంజర్ టీవీ ఛానెల్.. నందిని మృతి విషయాన్ని సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసి సంతాపం తెలియజేసింది. తోటినటుడు సతీష్ మాట్లాడుతూ.. నందినికి ఇంకా పెళ్లి కాలేదు. అసలు ఇలా ఎందుకు చేసిందో అర్థం కావట్లేదు అని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా సీరియల్ నటి చనిపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.🕊️ Rest in Peace, Actress Nandini🙏😢Your performance as Durga in Gauri serial will always be remembered Gone too soon. 💔#KalaignarTV #Nandini #Gauri #Durga #RestInPeace pic.twitter.com/UZR3P9Rf6x— Kalaignar TV (@kalaignartv_off) December 29, 2025 -
దళపతి విజయ్ 'వీడ్కోలు'.. ఆ హీరోల్లా చేయడుగా?
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్.. నటనకు వీడ్కోలు పలికేశాడు. ఇతడి చివరి సినిమా 'జన నాయగణ్'.. జనవరి 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా మలేసియాలో ఈవెంట్ నిర్వహించారు. ఇందులోనే విజయ్ మాట్లాడుతూ తన యాక్టింగ్ రిటైర్మెంట్ గురించి క్లారిటీ ఇచ్చేశాడు. మరి మాటపై కచ్చితంగా నిలబడతాడా? అసలు విజయ్ ప్లాన్ ఏంటి?నటీనటులకు రాజకీయాలు కొత్తేం కాదు. టాలీవుడ్లో సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కల్యాణ్.. ఇలా చాలామంది ఉన్నారు. ఎన్టీఆర్ అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సినిమాలు చేశారు. చిరంజీవి పూర్తిగా రాజకీయాలు అని అన్నారు గానీ వర్కౌట్ కాకపోవడంతో తిరిగి మేకప్ వేసుకున్నారు. పవన్ కూడా మధ్యలో పాలిటిక్స్ అని కొన్నాళ్లు నటనకు గ్యాప్ ఇచ్చారు. మళ్లీ సినిమాలు చేశారు. పూర్తిగా రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచన అయితే ఈయనకు లేదు. పలు సందర్భాల్లో ఆయన మాటలతోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది.తమిళంలోనూ రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోలు రాజకీయాలు అన్నారు గానీ తర్వాత వచ్చి మళ్లీ సినిమాలు చేసుకున్నారు. అయితే తమిళంలో ఎమ్జీఆర్, జయలలిత మాత్రం యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసి మరీ రాజకీయాల్లోకి వెళ్లారు. సక్సెస్ అయ్యారు కూడా. మరి దళపతి విజయ్ తన మాట మీద నిలబడి పూర్తిగా సినిమాలకు దూరమైపోతాడా లేదా అనేది చూడాలి?ఎందుకంటే వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. విజయ్ 'టీవీకే' పార్టీ కూడా బరిలో ఉంది. ఇందులో గెలిచేసి విజయ్ ముఖ్యమంత్రి అయిపోతాడా అంటే చెప్పలేం. ఎందుకంటే ఈ హీరోకి కూడా అంత పెద్ద కోరికలేం లేవు. ఒకవేళ సీఎం అయితే సినిమాల్ని పూర్తిగా పక్కనబెట్టేయొచ్చు. కొన్ని స్థానాలు గెలుచుకుంటే మాత్రం అప్పటి పరిస్థితులు బట్టి విజయ్ ఆలోచన మారే అవకాశముంటుంది.విజయ్ ఫ్యాన్స్ అయితే తమ హీరో కచ్చితంగా మాటమీద నిలబడతానని బల్లగుద్ది చెబుతున్నారు. యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే కచ్చితంగా తిరిగి సినిమాలు చేస్తాడని కామెంట్స్ చేస్తున్నారు. ఒకటి రెండేళ్లు ఆగితే ఈ విషయంపై కచ్చితంగా క్లారిటీ వచ్చేస్తుంది. ప్రస్తుతం తమిళంలో స్టార్ హీరోల్లో విజయ్ టాప్లో ఉంటాడు. రజనీ, కమల్ దాదాపు రిటైర్మెంట్ దశకు వచ్చేశారు. అజిత్ కూడా చాలా ఆలస్యంగా సినిమాలు చేస్తున్నాడు. సూర్య, విక్రమ్ లాంటి హీరోలున్నా వాళ్లు హిట్స్ అందుకోలేకపోతున్నారు. శివకార్తికేయన్, కార్తీ లాంటి హీరోలు స్టార్ రేంజ్కి చేరుకోవడానికి ఇంకా టైముంది. మరి విజయ్ స్థానాన్ని భర్తీ చేసే ఆ తమిళ హీరో ఎవరో? -
ప్రేమలేఖలన్నీ చిత్తు కాగితాలు! 38 ఏళ్లుగా అతడే ఊపిరిగా..
కేరళ నటి అభిరామి ఇండస్ట్రీలో అడుగుపెట్టి 30 ఏళ్లవుతోంది. చైల్డ్ ఆర్టిస్ట్గా, హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అనేక సినిమాలు చేసింది. తెలుగులో థాంక్యూ సుబ్బారావు, చార్మినార్, చెప్పవే చిరుగాలి, లెవన్, 12ఎ రైల్వే కాలనీ, సరిపోదా శనివారం వంటి పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. ఇటీవలే ఈ నటి పెళ్లిరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా భర్తతో దిగిన ఫోటోలు షేర్ చేసింది.ఇప్పటికీ.. ఎప్పటికీ..'హ్యాపీ యానివర్సరీ మై లవ్.. 14వ ఏట నుంచి ఇప్పటి (42వ ఏట) వరకు నా సుఖదుఃఖాల్ని, జయాపజయాలను, భయాలను, ఆశనిరాశలను అన్నింటినీ నీతోనే పంచుకున్నాను, ఇకమీదట కూడా పంచుకుంటూనే ఉంటాను. ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఆప్తమిత్రుడిగా నిలబడ్డందుకు థాంక్యూ.. నీ ఊహకందనంతగా నిన్ను ప్రేమిస్తున్నాను' అని నటి రాసుకొచ్చింది.ప్రేమ ఎలా మొదలైందంటే?కేరళ తిరువనంతపురానికి చెందిన అభిరామి తల్లిదండ్రులు బ్యాంకు ఉద్యోగులు. వారికి అభిరామి ఒక్కరే సంతానం. స్కూల్ పక్కనే వీరి ఇల్లు ఉండేది. పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే చాలామంది అభిరామికి ప్రేమలేఖలు రాసి పంపేవారు. కొందరైతే నేరుగా ఇంటికొచ్చేవారు. కానీ ఎవరి ప్రేమను యాక్సెప్ట్ చేయలేదు నటి. అయితే తనకు స్కూల్లో ఓ స్నేహితుడు ఉండేవాడు. అతడే రాహుల్. ప్రముఖ రచయిత పవన్ మనవడే రాహుల్.అలా మళ్లీ కలిశారువీరిద్దరూ స్కూల్ డేస్ నుంచే మంచి మిత్రులు. తర్వాత పై చదువుల కోసం అభిరామి అమెరికా వెళ్లిపోయింది. కొంతకాలానికి రాహుల్ కూడా యూఎస్ వెళ్లాడు. అలా మళ్లీ ఇద్దరూ కలిశారు. ఈసారి స్నేహం మరింత బలపడి ప్రేమగా మారింది. ఆ ప్రేమను జీవితాంతం పదిలంగా కాపాడుకునేందుకు పంచభూతాల సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. 2023లో ఈ జంట ఓ పాపను దత్తత తీసుకుంది. తనకు కల్కి అని నామకరణం చేసి పెంచుకుంటున్నారు.చదవండి: అల్లు శిరీష్ పెళ్లి.. సరిగ్గా ఆ హీరోకి ప్రత్యేకమైన రోజే.. -
దేవుడిపై తప్పుడు ప్రచారం.. నటి మాధవీలతపై కేసు
నచ్చావులే, స్నేహితుడా తదితర సినిమాల్లో హీరోయిన్గా చేసిన తెలుగమ్మాయి మాధవీలత ప్రస్తుతం యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈమెకు ఇప్పుడు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దేవుడిపై తప్పుడు ప్రచారం చేయడమే ఇందుకు కారణం.(ఇదీ చదవండి: కొత్త ఏడాది స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే)సోషల్ మీడియాలో సాయిబాబా అసలు దేవుడే కాదని తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేసినందుకుగానూ మాధవీలతపై కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని ఈమెతో పాటు పలువురు యూట్యాబర్లని ఆదేశించారు.నటి మాధవీలతతో పాటు పలువురు యూట్యూబర్స్ పెట్టిన పోస్టుల వల్ల ప్రజల భావోద్వేగాలకు నష్టం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ క్రమంలోనే వీళ్లందరి సోషల్ మీడియా అకౌంట్స్పై పోలీసులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.(ఇదీ చదవండి: ఏపీలో పర్మినెంట్గా పెరగనున్న సినిమా టికెట్ ధరలు) -
ఏపీలో పెరగనున్న సినిమా టికెట్ ధరలు.. అది కూడా పర్మినెంట్గా!
మరో పదిరోజుల్లో సంక్రాంతి సినిమాల సందడి మొదలు కానుంది. దీంతో నిర్మాతల కోరికమేరకు ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచడం చూస్తూనే ఉన్నాం. అయితే, ఏపీలో సింగిల్ థియేటర్లో ఇకనుంచి రూ. 50 టికెట్ ధర పెరగనుంది. ఇదే అంశం గురించి ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నట్లు నిర్మాత నాగవంశీ పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టికెట్ ధరల గురించి క్లారిటీ ఇచ్చారు.పవన్ కల్యాణ్తో చర్చలుసినిమా విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచాలని ప్రతిసారి ఏపీలో జీఓ తీసుకొస్తున్నాం అంటూ నిర్మాత నాగ వంశీ ఇలా అన్నారు. 'ఏపీలో ప్రతిసారి గరిష్టంగా టికెట్ ధర రూ. 50 మాత్రమే పెంచుకునేందుకు అనుమతి తెచ్చుకుంటున్నాం. కానీ, అఖండ-2, హరిహర వీరమల్లు వంటి సినిమాలకు మాత్రం రూ. 100 పెంచాం. తెలంగాణలో ఇప్పటికే మల్టీఫ్లెక్స్లలో రూ. 295 టికెట్ ధర ఉంది. సింగిల్ స్క్రీన్లలో రూ. 175 వరకు ఉంది. ఏపీలో కూడా ఇదే విధానం ఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కోరాం. ఆయన ఈ అంశంపై పరిశీలిస్తున్నారు. తెలంగాణ మాదిరే ఏపీలో పర్మినెంట్ జీఓ వస్తే ప్రతిసారి రూ. 50 పెంచాలంటూ ప్రభుత్వాన్ని కోరే అవసరం ఉండదు. ఏపీలో కొన్ని సింగిల్ థియేటర్స్లలో టికెట్ ధర ఇప్పటికీ రూ. 100 ఉంది మాత్రమే. అదే విధంగా కొన్ని మల్టీఫ్లెక్స్లలో కూడా రూ. 150 ఉంది. ఇలాంటి వాటికి మాత్రమే రూ. 50 పెంచేందుకు జీఓ తెచ్చుకుంటున్నాం. మా ప్రతిపాదన ప్రకారం ఏపీలో కొత్త జీఓ తెస్తే.. ప్రతిసారి టికెట్ల రేట్లు పెంచాలంటూ ఎవరూ కూడా ప్రభుత్వాలను కోరరు.' అని చెప్పాడు.సింగిల్ థియేటర్ టికెట్ ధర రూ. 150కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఇదే అంశం గురించి మాట్లాడారు. సినిమా విడుదలైన ప్రతిసారి బడ్జెట్ ప్రకారం టికెట్ రేట్లు పెంచుతున్నామని.., ఇకపై ఈ అంశంలో ఒక కొత్త విధానాన్ని రూపొందిస్తామని ఆయన అన్నారు. పాత జీఓ ప్రకారం.. సినిమా బడ్జెట్ ఆధారంగా టికెట్ రేట్లు పెంచుతూ వచ్చామన్నారు. ఇక నుంచి అలా కాకుండా సరికొత్త విధానాన్ని ప్లాన్ చేస్తున్నామన్నారు. అంటే రాబోయే రోజుల్లో ఏపీలో ప్రతి సింగిల్ థియేటర్లో టికెట్ ధర రూ. 150 ఉంటుంది. చిన్న సినిమాకైనా సరే ఇదే రేటు ఉంటుంది. సినిమా బడ్జెట్ పెరిగింది అంటూ మళ్లీ ప్రభుత్వాన్ని కోరితే ఆ ధర కాస్త ఆకాశాన్ని అంటనుంది.చిన్న సినిమాలకి AP లో 50 పెంచుతున్నాం GO ద్వారా. దానికి కారణాలు ఇవి.అందుకే పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేసి, ఒక కమిటీ ఫార్మ్ చేసి పర్మినెంట్ GO వచ్చేలా జరుగుతుంది.- Naga Vamsi#AnaganagaOkaRaju Full interview youtube link : https://t.co/2RuecuqHJp@vamsi84 https://t.co/u8yhybkIxm pic.twitter.com/I2hwiXQWO8— idlebrain.com (@idlebraindotcom) December 29, 2025 -
'పెద్ది'లో మరో స్టార్.. ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా?
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ చివరి దశ చిత్రీకరణలో బిజీగా ఉంది. ఈ మధ్య ఢిల్లీ పలు సీన్స్ తీశారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. చెప్పినట్లుగానే మార్చి 27న థియేటర్లలో రిలీజ్ చేయడమే లక్ష్యంగా మూవీని సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ఇందులో నటిస్తున్న ఓ స్టార్ నటుడి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. చూసిన వెంటనే ఆయనెవరో గుర్తుపట్టడం కష్టమే.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' కొత్త ట్రైలర్ రిలీజ్)పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి జగపతిబాబు. అప్పట్లో హీరోగా చేశాడు. గత కొన్నాళ్లుగా మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈయన్ని మాస్ లేదా క్లాస్ పాత్రలు చేస్తూ వచ్చారు. కాకపోతే లుక్ మాత్రం దాదాపు ఒకేలా ఉండేది. 'పెద్ది' కోసం మాత్రం గుర్తుపట్టలేనంతగా మార్చేశారని చెప్పొచ్చు. అప్పలసూరి అనే పాత్రలో జగపతిబాబు కనిపించబోతున్నాడని మూవీ టీమ్ ప్రకటించింది. మరి ఈయనది పాజిటివ్ క్యారెక్టరా నెగిటివ్ క్యారెక్టరా అనేది సినిమా రిలీజ్ అయితే తప్ప తెలియదు.'పెద్ది' చిత్రాన్ని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. బుచ్చిబాబు దర్శకుడు. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం 'చికిరి చికిరి' అనే సాగే పాట రిలీజ్ చేస్తే ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఫస్ట్ లుక్స్తోనూ మూవీ టీమ్ ఆశ్చర్యపరుస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: కొత్త ఏడాది స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే)Honoured and super glad to be 'APPALASOORI' in #Peddi ❤🔥Thoroughly enjoyed playing this role. #PEDDI WORLDWIDE RELEASE ON 27th MARCH, 2026. pic.twitter.com/fYmuVeeTxc— Jaggu Bhai (@IamJagguBhai) December 29, 2025 -
'రాజాసాబ్' కొత్త ట్రైలర్ రిలీజ్
ప్రభాస్ 'రాజాసాబ్' నుంచి మరో ట్రైలర్ వచ్చేసింది. రెండు రోజుల క్రితం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తారేమోనని అభిమానులు ఆశపడ్డారు కానీ ఆదికాస్త ఆలస్యమైంది. ఇప్పుడు దాన్ని విడుదల చేశారు. గతంలో తీసుకొచ్చిన ట్రైలర్కి ఏ మాత్రం తగ్గకుండా ఇది ఉంది. ఇందులో కామెడీ, హారర్ లాంటి ఎమోషన్స్ బాగానే చూపించారు.(ఇదీ చదవండి: కొత్త ఏడాది స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే)ఈ సినిమా.. జనవరి 9న థియేటర్లలోకి రానుంది. 8వ తేదీన రాత్రి ప్రీమియర్లు కూడా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే ప్రీమియర్లు, టికెట్ రేట్ల గురించి క్లారిటీ రావొచ్చు. లేదంటే మాత్రం 8వ తేదీ సెకండ్ షోల నుంచి సినిమా రిలీజ్ అవుతుంది. ఇందులో ప్రభాస్ సరసన మాళవిక, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా చేశారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. మారుతి దర్శకుడు. తమన్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: 'పెద్ది'లో మరో స్టార్.. ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా?) -
కొత్త ఏడాది స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే
మరోవారం వచ్చేసింది. ఈ వీకెండ్లోనే కొత్త ఏడాది రాబోతుంది. అందుకు తగ్గట్లే న్యూఇయర్ సందర్భంగా థియేటర్లలోకి పలు సినిమాలు రిలీజ్ కానున్నాయి. సైక్ సిద్ధార్థ్, వనవీర, త్రిముఖ, సకుటుంబానాం, నీలకంఠ, వినరా ఓ వేమ, ఘంటసాల, 45, గత వైభవం తదితర స్ట్రెయిట్-డబ్బింగ్ మూవీస్ లిస్టులో ఉన్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ చాలా తక్కువ చిత్రాలు మాత్రమే స్ట్రీమింగ్ కానున్నాయి.(ఇదీ చదవండి: అల్లు శిరీష్ పెళ్లి ప్రకటన.. అన్నయ్య, వదినపై ప్రేమ)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే ఎకో అనే మలయాళ డబ్బింగ్ చిత్రం చాలా ఆసక్తి కలిగిస్తోంది. ఒరిజినల్ వెర్షన్ అద్భుతమైన హిట్ కావడంతో కొందరు తెలుగు ఆడియెన్స్ దీనికోసం ఎదురుచూస్తున్నారు. హక్ అనే హిందీ మూవీతో పాటు స్ట్రేంజర్ థింగ్స్ ఫైనల్ ఎపిసోడ్, ఎల్బీడబ్ల్యూ అనే తెలుగు డబ్బింగ్ సిరీస్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (డిసెంబరు 29 నుంచి జనవరి 4 వరకు)నెట్ఫ్లిక్స్మెంబర్స్ ఓన్లీ (ఇంగ్లీష్ రియాలిటీ సిరీస్) - జనవరి 29ఎకో (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 31స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 01ల్యూపిన్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 01హక్ (హిందీ మూవీ) - జనవరి 02అమెజాన్ ప్రైమ్సూపర్ నోవా (నైజీరియన్ సినిమా) - డిసెంబరు 29సీగే మీ వోస్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 02హాట్స్టార్ఎల్బీడబ్ల్యూ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 01సన్ నెక్స్ట్ఇతిరి నేరమ్ (మలయాళ సినిమా) - జనవరి 01(ఇదీ చదవండి: ప్రభాస్-పవన్ మల్టీస్టారర్.. హీరోయిన్ నిధి అగర్వాల్ ట్వీట్) -
రోజుల తరబడి నటించే మహానటులు ఇంకా పుట్టలేదు: ఇమ్మాన్యుల్
బిగ్ బాస్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నాడు ప్రముఖ నటుడు ఇమ్మాన్యుల్. 'జబర్దస్త్'తో కోట్లాదిమంది అభిమానాన్ని దండిగా గెలుచుకున్న ఇమ్మాన్యుల్.... బిగ్ బాస్లోనూ తనదైన శైలిలో అలరించి టాప్ 4 ఫైనలిస్ట్ గా నిలిచాడు. ఈ సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించాడు. బిగ్ బాస్ అనుభవాన్ని తాను ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటానని పేర్కొన్న ఇమ్మాన్యుల్... అందులో తనతో పాల్గొన్న సహ పార్టిసిపెంట్స్ తో తన అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ముఖ్యంగా సంజనాతో తనకు ఏర్పడిన ప్రత్యేక అనుబంధం జీవితాంతం ఉంటుందని తెలిపాడు!!బిగ్ బాస్లో ప్రతి ఒక్కరూ నటిస్తారని అందరూ అనుకుంటారని, కానీ గంటల తరబడి, వారాల తరబడి, రోజుల తరబడి నటించగలిగే మహానటులు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరని వివరించాడు. బిగ్ బాస్ జర్నీలో తనకు బాసటగా నిలిచిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా "విజనరీ వౌస్" కి కృతజ్ఞతలు తెలిపాడు. బిగ్ బాస్ నుంచి నేర్చుకున్న ఎన్నో విలువైన విషయాలను తన కెరీర్ లో, జీవితంలో అనుసరించే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నాడు. బిగ్ బాస్ విజేతగా నిలిచిన కల్యాణ్ కు కంగ్రాట్స్ చెప్పిన ఇమ్మాన్యూల్... తనకు మొదటి స్థానం దక్కలేదనే అసంతృప్తి ఏ కోశానా లేదని అన్నాడు!! -
అల్లు శిరీష్ పెళ్లి ప్రకటన.. అన్నయ్య, వదినపై ప్రేమ
నటుడు అల్లు శిరీష్ కొత్త ఏడాదిలో తను ప్రేమించిన ప్రియురాలు నయనికతో ఏడడుగులు వేయబోతున్నాడు. అక్టోబర్లో వారిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా తన పెళ్లి తేదీని శిరీష్ ప్రకటించాడు. 2026 మార్చి 6న తన పెళ్లి జరుగుతుందని ఒక పాటతో చెప్పాడు. అల్లు అయాన్, ఆర్హలతో కలిసి చేసిన ఒక రీల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు.సరదాగా ఉన్న ఆ వీడియోలో బాబాయ్ సంగీత్ ఎప్పుడు అంటూ అని వారు అడగ్గా.. మనం దక్షిణాది వాళ్లం కాబట్టి అలాంటి వేడుక ఉండదని శిరీష్ చెప్తాడు. కానీ, పెళ్లి ఎక్కడ జరుగుతుంది అనేది మాత్రం చెప్పలేదు. అల్లు అర్జున్- స్నేహారెడ్డిల వివాహం కూడా 2011 మార్చి 6నే జరిగింది. సెంటిమెంట్తో అదే తేదీని శిరీష్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.అల్లు శిరీష్- నయనిక స్నేహం మొదలైన కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారింది. 2023లో వరుణ్తేజ్- లావణ్యల పెళ్లి సందర్భంగా హీరో నితిన్- షాలిని దంపతులు ఓ పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడికి షాలిని బెస్ట్ ఫ్రెండ్ నయనిక కూడా వచ్చింది. ఇటు వరుణ్ తరపున శిరీష్ పార్టీకి హాజరయ్యాడు. అక్కడే శిరీష్- నయనిక చూపులు కలిశాయి, మనసులు కూడా కలుసుకున్నాయి. పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రెండేళ్ల ప్రేమ ఇప్పుడు మూడుముళ్ల బంధంగా మారనుంది. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
నా పేరు, మనీ ఉపయోగించుకుని వదిలేశాడు.. బిగ్బాస్ 'ఇనయా' కన్నీళ్లు
కొన్ని కథలను వెండితెరపై చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెడుతారు. ఒక్కోసారి అలాంటి జీవితాలే మన చుట్టూ కనిపిస్తూ ఉంటాయి. ఇదే కోవలో నటి, బిగ్బాస్ ఫేమ్ ఇనయా సుల్తానా లైఫ్ ఉంది. సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి వార్తల్లోకెక్కింది ఇనయ. తర్వాత బిగ్బాస్ షోలోనూ అడుగుపెట్టింది. తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్లో పాల్గొని బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న ఇనయ సుల్తానా.. ఆ తర్వాత ఒక వ్యక్తితో ప్రేమలో పడింది. అయితే, తనతో బ్రేకప్ అయిందని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ క్రమంలో ప్రియుడు చేసిన మోసాన్ని బయటపెట్టింది.సినిమాల మీద పిచ్చితో కన్నవారిని, ఇంటిని వదిలేసి సింగిల్గా తన జీవితాన్ని కొనసాగిస్తున్న ఇనయా.. గౌతమ్ కొప్పిశెట్టి అనే యువకుడితో ప్రేమలో పడింది. అతను యోగా ట్రైనర్, జిమ్ కోచ్ అని సమాచారం. తనతో కొద్దిరోజులు ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ బ్రేకప్ చెప్పినట్లు పేర్కొంది. అయితే, తనను ప్రియుడు మోసం చేశాడని ఆమె పేర్కొన్నారు. ఫిజికల్గా కూడా కలిశాం..'స్నేహంతో మొదలైన మా పరిచయం ప్రేమగా మారింది. కొంత కాలం పాటు నాతో బాగానే ఉన్నాడు. మా ప్రేమ విషయం రెండు కుటుంబాలకు తెలుసు.. అందుకే సోషల్మీడియా ద్వారా అందరికీ తనను పరిచయం చేశాను. నాకు ఎవరూ లేరనుకున్న సమయంలో అతను పరిచయం అయ్యాడు. ఆపై ప్రేమలో పడ్డాం. కానీ, అతను కేవలం నా మనీ, పేరును మాత్రమే ఉపయోగించుకోవాలనుకున్నాడు. తనతోనే జీవితం అనకున్నాను కాబట్టి ఫిజికల్గా కూడా కలిశాం. అతని కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టాను. తను వ్యాపారం చేస్తానంటే భారీగా డబ్బు సాయం చేశాను. చివరకు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న గొల్డ్ గాజులు కూడా తనకోసం అమ్మేశాను. దేవుడా.. ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు (కన్నీళ్లు)..ఇప్పటికే ఎన్నో లక్షల రూపాయాలు ఇచ్చాను. నా బ్యాంక్ అకౌంట్ జీరో అయ్యాక వదిలేశాడు. ప్రస్తుతం రూ. 5 లక్షలకు పైగానే అప్పులో ఉన్నాను. ఎలాంటి పనిచేయకుండా ఇంట్లోనే ఉంటాడు. నేను షూటింగ్ వెళ్తున్నా సరే ఒకటే గొడవలు. నాపై అనుమానం పెంచుకున్నాడు. ప్రతిరోజు నరకంగా నా జీవితం మారింది. కేవలం మనీ కోసం మాత్రమే నన్ను ఉపయోగించుకున్నాడు. నేను ఏం చేసినా సరే తప్పుగానే చూస్తాడు. ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితాంతం ఎలా ఉండాలి అనిపించింది. విడిపోయాక రెండు నెలలు చాలా బాధపడ్డాను. ఇప్పుడు అలవాటు అయిపోయింది.మదం సినిమాలో అతనితోనే ఇంటిమేట్ సీన్.. ఆరోజే చచ్చిపోయానుమదం సినిమాలో ఇనయా కీలకమైన పాత్రలో నటించింది. జనవరి 1న ఈ మూవీ విడుదల కానుంది. ఇందులోఆమె చాలా బోల్డ్గా కనిపించనుంది. అయితే, ఇదే మూవీలో తనను మోసం చేసిన ప్రియుడు కూడా నటించాడని ఆమె తెలిపింది. తనతో బ్రేకప్ అయిన తర్వాత ఒక ఇంటిమేట్ సీన్లో ఇద్దరం కలిసి నటించామని ఆమె ఇలా చెప్పింది. మదం సినిమాలో మూడు ఇంటిమేట్ సీన్లు నాతోనే ఉన్నాయి. ఒక సీన్లో నా పర్సనే ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని మొదట ఓకే చెప్పాను. తర్వాత మేము బ్రేకప్ అయ్యాం. అయితే, సినిమా కోసం అతనితోనే ఇంటిమేట్ సీన్లో నటించాను. ఆరోజు ఒక మనిషిగా చచ్చపోయాను. ఆరోజు నిద్ర కూడా పట్టలేదు. ఎందుకు బతుకుతున్నానా అనే ప్రశ్న కూడా వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు. అని ఇనయా చెప్పింది. -
స్టార్ హీరో కూతురిపై ట్రోలింగ్.. 'నా బాడీ గురించి మీకెందుకు?'
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కూతురు శాన్వి సుదీప్ సింగర్గా ఆకట్టుకుంటోంది. ఈమె తెలుగులో హిట్ 3 మూవీలో పోరాటమే 3.0 సాంగ్ పాడింది. ఇటీవల తన తండ్రి హీరోగా నటించిన మార్క్ మూవీలోనూ మస్త్ మలైకా సాంగ్ ఆలపించింది. ఈ పాటతోనే కన్నడ చిత్రపరిశ్రమలో అడుగుపెట్టింది. ఇకపోతే మస్త్ మలైకా సాంగ్ వైరల్గా మారగా కొందరు నెటిజన్లు శాన్వీపై విమర్శలు గుప్పిస్తున్నారు. హీరో కూతురిపై ట్రోలింగ్కొన్ని పదాలు తను సరిగా పలకలేదంటున్నారు. అక్కడితో ఆగకుండా ఆమెను బాడీ షేమింగ్ చేస్తూ తిడుతున్నారు. ఈ ట్రోలింగ్పై శాన్వి సుదీప్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. నేను మీ అభిప్రాయాలు అడిగానా? లేదు కదా.. నేను అడిగినప్పుడు మీ అభిప్రాయాలు చెప్పండి.. అంతే కానీ ఇక్కడ నా శరీరం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అని మండిపడింది.ప్రేమ వివాహంమార్క్ సక్సెస్ ఈవెంట్లోనూ కిచ్చా సుదీప్ మాట్లాడుతూ.. శాన్వి చాలా స్ట్రాంగ్. ఎలాంటి పరిస్థితులనైనా హ్యాండిల్ చేయగలదు. ఇండస్ట్రీలో విమర్శలనేవి సాధారణం. వాటిని తను ఆత్మస్థైర్యంతో ఎదుర్కోగలదు. ఆ నెగెటివిటీకి పదిరెట్లు ఎక్కువ ధృడంగా నిలబడగలదు అని చెప్పుకొచ్చాడు. కిచ్చా సుదీప్.. కేరళకు చెందిన ప్రియను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి 2004లో కూతురు శాన్వి జన్మించింది. 2015లో దంపతులు విడిపోగా.. తర్వాత కొంతకాలానికి విడాకుల ఆలోచన మానుకుని మళ్లీ జంటగా కలిసిపోయారు.చదవండి: ఎన్నాళ్లయిందో.. నా లైఫ్లో మర్చిపోలేని జ్ఞాపకం: తనూజ -
చీరకట్టుకున్నా భద్రత లేదు.. వీడియో షేర్ చేసిన 'చిన్మయి'
మహిళల దుస్తుల గురించి నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల తర్వాత కొద్దిరోజులుగా సోషల్మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. దుస్తుల అంశం ఏకంగా వర్గాల వారిగా దూషించుకునే స్థాయికి చేరుకుంది. మహిళల అందం చీరలోనూ, నిండుగా కట్టుకునే బట్టల్లోనే ఉంటుందంటూ.. ‘సామాను’ కనబడే వాటిలో ఏమీ ఉండదని అసభ్యకరమైన భాషలో శివాజీ చెప్పాడు. దీంతో చిన్మయి, అనసూయ, నిధి అగర్వాల్, పాయల్ రాజ్పుత్ లాంటి సెలబ్రిటీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.తాజాగా చిన్మయి ఒక వీడియోను షేర్ చేశారు. మహిళల వస్త్రధారణ చక్కగా ఉన్నప్పటికీ కూడా భద్రత లేదంటూ సింగర్ చిన్మయి మరోసారి కౌంటర్ ఇచ్చింది. చీరకట్టులోనే గౌరవం ఉంటుందని చెబుతున్న వారి వ్యాఖ్యలకు వీడియోతో తనదైనశైలిలో పేర్కొన్నారు. కేరళకు చెందిన మహిళలు నిండుగా చీర కట్టుకుంటారని, దీంతో వారిని ఎవరూ ముట్టుకోరు, ఇబ్బంది పెట్టరు అని వచ్చిన కామెంట్కు చిన్మయి సమాధానం చెప్పింది. కేరళలోనే ఒక మహిళ పరిస్థితి ఇదీ అంటూ వీడియో పోస్ట్ చేసింది.“Women in Kerala never get abused nobody touches them because they wear Sari”Meanwhile. pic.twitter.com/mBPsrukScd— Chinmayi Sripaada (@Chinmayi) December 28, 2025 -
మళ్లీ మాతృగడ్డపై ప్రియాంక మోహన్
బహుభాషా నటీనటులకు అడ్వాంటేజ్ ఏమిటంటే ఏదో ఓ భాషలో అవకాశాలు వస్తూనే ఉండటం. అలా 2016లో వంద కథే హెల్లా అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయిన శాండిల్ వుడ్ బ్యూటీ ప్రియాంక మోహన్. ఆ తరువాత తెలుగులో శ్రీకారం, నాని 'గ్యాంగ్ లీడర్' వంటి చిత్రాల్లో నటించే అవకాశాలను పొందారు.ఆ తరువాత వెంటనే కోలీవుడ్ ఆహ్వానించింది. ఇక్కడ డాక్టర్, డాన్ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. సూర్య సరసన ఎదర్కుమ్ తుణిందవన్, ధనుష్తో కలిసి కెప్టెన్ మిల్లర్ చిత్రాల్లో నటించారు.అలా ఈమె చివరిగా ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'జాబిలమ్మ నీకు అంత కోపమా' చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్లో నటించారు. అదేవిధంగా తెలుగులో ఓజీ చిత్రంలో నటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంక మోహన్ను మళ్లీ మాతృభాష ఆహ్వానించింది. ఈమె చాలా గ్యాప్ తరువాత కన్నడంలో భారీ చిత్రంలో నటిస్తున్నారు. శివరాజ్ కుమార్, యువ నటుడు డాలీ ధనుంజయ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్..ఇందులో నటి ప్రియాంక మోహన్ కథానాయకిగా నటిస్తున్నారు. వైశాక్ జే.ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హేమంత్ ఎం.రావ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో నటి ప్రియాంక మోహన్ ఫస్ట్లుక్ పోస్టర్ విడుదల చేశారు. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తాను ఇంతకుముందు నటించిన చిత్రాలకు పూర్తి భిన్నంగా నటనకు అవకాశం ఉన్న పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నట్లు ప్రియాంక మోహన్ పేర్కొన్నారు. -
ఎన్నాళ్లయిందో.. ఇది నా లైఫ్లో మధుర జ్ఞాపకం: తనూజ
సీరియల్ నటి తనూజ పుట్టస్వామి బిగ్బాస్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ రన్నరప్గా నిలిచిన ఆమె తాజాగా తన మంచి మనసు చాటుకుంది. షో అయిపోగానే తన ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన చిన్నపాటి పార్టీలో సందడి చేసిన ఆమె తాజాగా అనాథాశ్రమానికి వెళ్లింది. ఈ మేరకు ఒ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది.చిన్నారులతో సరదాగాఅందులో చిన్నారులతో కలిసి ముచ్చటించింది. వారు డ్యాన్స్ చేస్తుంటే చప్పట్లు కొట్టింది. తర్వాత పిల్లలందరికోసం పాట పాడింది. కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించింది. అనంతరం వారికి భోజనం వడ్డించింది. ఓ చిన్నారికి గోరుముద్దలు పెడుతూ తనూ వారితో కలిసి భోజనం చేసింది.మధురమైన జ్ఞాపకంవాళ్లందరినీ తన ఫ్యామిలీగా అభివర్ణించింది. 'నా కుటుంబాన్ని చూసి ఎన్నాళ్లయిందో! వాళ్ల ప్రేమలు, చిరునవ్వులు, జ్ఞాపకాలు.. మమ్మల్ని మళ్లీ ఒక్కటి చేశాయి. చాలాకాలం తర్వాత వారితో మళ్లీ కాలక్షేపం చేశాను. నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఇది నా జీవితంలో మర్చిపోలేని మధురమైన జ్ఞాపకాల్లో ఒకటిగా నిలిచిపోతుంది' అని తనూజ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Thanuja Puttaswamy (@thanuja_puttaswamy_) చదవండి: అభిమానుల అత్యుత్సాహం.. కిందపడ్డ విజయ్ -
‘సినిమా టికెట్ ధరలు భారం కావు’ సగటు ధర ఎంతంటే..
మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమా చూడటం సామాన్యులకు భారంగా మారుతోందన్న విమర్శలపై పీవీఆర్ ఇనాక్స్ (PVR INOX) మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ బిజ్లీ వివరణ ఇచ్చారు. పీవీఆర్ సినిమాస్ టికెట్ ధరలు, స్నాక్స్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయనే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కంపెనీ అధికారిక గణాంకాలతో కూడిన వివరాలను వెల్లడించారు. 2025 డిసెంబర్ నాటి ఆర్థిక నివేదికల ప్రకారం, పీవీఆర్ నెట్వర్క్లో సగటు టికెట్ ధర రూ.259 మాత్రమే ఉందని పేర్కొన్నారు.విమర్శలపై వివరణచాలామంది ప్రేక్షకులు లగ్జరీ స్క్రీన్లు లేదా ప్రీమియం థియేటర్ల ధరలను చూసి మొత్తం చైన్(పీవీఆర్ ఐనాక్స్లోని అన్ని థియేటర్లు) అంతా అలాగే ఉంటుందని అపోహ పడుతున్నారని ఆయన అన్నారు. ‘లగ్జరీ స్క్రీన్లలో ధరలు రూ.600-700 ఉండొచ్చు. కానీ అది అందరికీ కాదు. హెడ్లైన్స్ చూసి ప్రజలు నిర్ణయానికి వస్తున్నారు తప్ప, పూర్తి వివరాలు చూడటం లేదు’ అని అసహనం వ్యక్తం చేశారు. పాప్కార్న్ ధరలపై వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. సాధారణ పాప్కార్న్ ధర కేవలం రూ.159 నుంచే మొదలవుతుందని, రూ.400 వరకు ఉండే పాప్కార్న్ బకెట్లపై ‘అన్లిమిటెడ్ రిఫిల్స్’ సౌకర్యం ఉంటుందని ఆయన వివరించారు.ప్రేక్షకులకు ఆఫర్లుసామాన్య ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు పీవీఆర్ ఇనాక్స్ పలు రకాల స్కీమ్స్ను అమలు చేస్తున్నట్లు చెప్పారు. కొన్ని స్క్రీన్లల్లో మంగళవారాల్లో టికెట్ ధరలను రూ.95 - రూ.100 వరకు తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. వారాంతాల్లో ఫుడ్ ఐటమ్స్ మీద ప్రత్యేక రాయితీలు, అన్లిమిటెడ్ రిఫిల్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘పీవీఆర్ పాస్’ వంటి మంత్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ద్వారా తక్కువ ధరకే ఎక్కువ సినిమాలు చూసే వీలుందని చెప్పారు.బిగ్ స్క్రీన్ అనుభవంఓటీటీ ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వచ్చినా బిగ్ స్క్రీన్ ఇచ్చే అనుభవం ఎప్పటికీ ప్రత్యేకమేనని బిజ్లీ అభిప్రాయపడ్డారు. అత్యాధునిక సౌండ్ సిస్టమ్స్, కంఫర్టబుల్ సీటింగ్, హై-క్వాలిటీ విజువల్స్ అందించడానికి రూ.259 సగటు ధర అనేది అత్యంత సమంజసమైనదని సమర్థించుకున్నారు.ఇదీ చదవండి: గ్రామీణ క్రెడిట్ స్కోర్తో అప్పు!? -
హీరోగా శంకర్ కుమారుడి ఎంట్రీ.. హీరోయిన్గా బేబమ్మ!
సాధారణంగా ఏ హీరోకైనా, హీరోయిన్కైనా ఓ మంచి హిట్ పడితే వరుసగా అవకాశాలు వరిస్తాయి అంటారు. కానీ హీరోయిన్ కృతీశెట్టి విషయంలో ఇది తారుమారు అవుతుండటం విశేషం. తెలుగులో ఉప్పెన చిత్రంతో రంగ ప్రవేశం చేసిన ఈ కన్నడ బ్యూటీకి ఆ చిత్రం సక్సెస్తో మరిన్ని అవకాశాలు వచ్చాయి. అదేవిధంగా ఆ తరువాత నటించిన ఒకటి రెండు చిత్రాలు విజయాలను అందించాయి. ఆ తర్వాత నటించిన చిత్రాలు వరుసగా ప్లాప్ కావడంతో టాలీవుడ్లో మార్కెట్ తగ్గిపోయింది.కోలీవుడ్లో వరుస సినిమాలుకృతిశెట్టి నటించిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రాలు ది వారియర్, కస్టడీ ఆశించిన విజయాలను సాధించలేదు. అయినప్పటికీ ఈ బ్యూటీకి తమిళంలో వరుసగా మూడు చిత్రాల్లో నటించే ఛాన్స్ దక్కింది. అనివార్య కారణాల వల్ల నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఆ మూడు చిత్రాల విడుదలలో జాప్యం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కృతిశెట్టికి కోలీవుడ్లో మరో క్రేజీ ఆఫర్ వరించినట్లు తాజా సమాచారం.శంకర్ కుమారుడు హీరోగా..ప్రముఖ దర్శకుడు శంకర్ వారసుడు అర్జిత్ శంకర్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఏఆర్ మురుగదాస్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఈయన తాజాగా హీరోగా పరిచయం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో అర్జిత్కు జంటగా మమిత బైజును నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. అర్జిత్కు జోడీగా?మళ్లీ ఏమైందో కానీ తాజాగా అర్జిత్ శంకర్కు జంటగా కృతీశెట్టిని ఎంపిక చేసినట్లు టాక్! అదేవిధంగా బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ను ప్రతినాయకుడి పాత్రలో నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ అట్లీ శిష్యుడొకరు దర్శకుడుగా పరిచయం కానున్నాడు. ఈమేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.చదవండి: అభిమానుల అత్సుత్సాహం.. కిందపడ్డ హీరో విజయ్ -
ఫ్యాన్స్ అత్యుత్సాహం.. కిందపడ్డ హీరో విజయ్
తమిళ స్టార్ హీరో విజయ్కు చేదు అనుభవం ఎదురైంది. తన చివరి సినిమా "జన నాయగణ్" మూవీ ఆడియోలాంచ్ ఈవెంట్ మలేషియాలో ఘనంగా నిర్వహించారు. భారీ స్టేజ్ సెటప్, లైటింగ్, సౌండ్ డిజైన్ ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్కు లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు. వారి కోసం విజయ్ స్టేజీపై స్టెప్పులేశాడు.కిందపడ్డ విజయ్మలేషియాలో అంతా అనుకున్నట్లుగానే ఈవెంట్ విజయవంతంగా జరిగింది. అయితే భారత్కు తిరిగొచ్చిన విజయ్కు చెన్నైలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. చెన్నై ఎయిర్పోర్టులో హీరోను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. అత్సుత్సాహంతో ఎగబడ్డారు. దీంతో తోపులాట కారణంగా విజయ్ కారు ఎక్కే సమయంలో తడబడి కిందపడిపోయాడు. వెంటనే సిబ్బంది ఆయన్ను పైకి లేపి క్షేమంగా కారు ఎక్కించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.సినిమావిజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి చిత్రం జననాయగణ్. ఇదే విషయాన్ని ఆయన తాజాగా మలేషియాలో జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్లోనూ స్పష్టం చేశాడు. ఈ మూవీ విషయానికి వస్తే.. హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా పూజా హెగ్డే కథానాయికగా నటించింది. మమితా బైజు కీలక పాత్ర పోషించింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్గా కనిపించనున్నాడు. తెలుగులో వచ్చిన నేలకొండ భగవంత్ కేసరి సినిమానే కొన్ని మార్పులు చేర్పులు చేసి జననాయగణ్గా తెరకెక్కించారని తెలుస్తోంది. ఇక తమిళగ వెట్రి కళగం పార్టీ స్థాపించిన విజయ్.. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. రాజకీయాల కోసం ఆయన సినిమాలకు గుడ్బై చెప్పాడు.மலேசியாவில் இருந்து சென்னை திரும்பிய விஜய்க்கு உற்சாக வரவேற்பு அளித்த ரசிகர்கள்..! #Vijay #JanaNayaganAudioLaunch #PoojaHegde #Rollsroyce #NAnand #ThalapathyThiruvizha #ThalapathyKacheri #JanaNayagan #AudioLaunch #Malaysia #TamilNews #NewsTamil #NewsTamil24x7 pic.twitter.com/F1TIpaGjXR— KAVI (@tamiltechstar) December 29, 2025చదవండి: ఆస్పత్రిలో దర్శకుడు భారతీరాజా -
ఆస్పత్రిలో దర్శకుడు భారతీరాజా
ప్రఖ్యాత సినీ దర్శకుడు, నటుడు భారతీరాజా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఈ ఏడాది మార్చిలోనే ఆయన కుమారుడు, దర్శకనటుడు మనోజ్ కన్నుమూశారు. దీంతో మనోవేదనకు గురైన భారతీరాజా అనారోగ్యంపాలయ్యారు. వైద్య చికిత్స అనంతరం కోలుకున్న ఈయన మలేషియాలో ఉన్న తన కూతురి వద్దకు వెళ్లి విశ్రాంతి తీసుకుని ఇటీవలే చెన్నైకి తిరిగి వచ్చారు.కాగా 80 ఏళ్ల వయసు పైబడ్డ భారతీరాజా మారోసారి అనారోగ్యానికి గురి కావడంతో గత మూడు రోజుల క్రితం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందని భారతీరాజా బంధువులు తెలిపారు.సినిమాభారతీరాజా విషయానికి వస్తే.. ఈయన 16 వయదినిలే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంలోనే కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవిని డైరెక్ట్ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కళక్కే పోగులు రైల్, ముదల్ మరియాదై, అలైగల్ ఓయ్వదిలై వంటి పలు విజయవంతమైన చిత్రాలు రూపొందించారు. రాధిక, రాధ, కార్తీక్ వంటి పలువురు నటీనటులను సినిమాకు పరిచయం చేశారు. తెలుగులో సీతాకోక చిలుక, ఎర్ర గులాబీలు, ఆరాధన, ఈతరం ఇల్లాలు వంటి పలు సినిమాలు చేశారు. -
హారర్... థ్రిల్
శివ కంఠంనేని, ధన్యా బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రిత, హరీష్ నటించిన చిత్రం ‘అమరావతికి ఆహ్వానం’. జీవీకే దర్శకత్వం వహించారు. నిర్మాత ముప్పా వెంకయ్య చౌదరి నిర్మాణ సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో కేఎస్ శంకర్ రావు, ఆర్. వెంకటేశ్వర రావు నిర్మించారు.ఈ సినిమా కొత్తపోస్టర్, గ్లింప్స్ని రిలీజ్ చేశారు. జీవీకే మాట్లాడుతూ– ‘‘హారర్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ఇది. ఉత్కంఠభరితమైన కథ, కథనంతో తెరకెక్కించిన మా మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. శివ కంఠంనేని మాట్లాడుతూ–‘‘ప్రస్తుతంపోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అని పేర్కొన్నారు. -
ఎలిజబెత్
‘‘నాకు ఎలిజబెత్ లాంటి మంచి బహుమతి ఇచ్చినందుకు నీకు (గీతు మోహన్దాస్ని ఉద్దేశించి) ధన్యవాదాలు. ‘టాక్సిక్’లో ఎవరూ ఊహించని అంశాన్ని వెండితెరపై చూపించాలన్న నీ ఆలోచనకు ఆశ్చర్యపోయాను’’ అని హూమా ఖురేషి పేర్కొన్నారు. యశ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్’. గీతు మోహన్దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎలిజబెత్పాత్రలో నటిస్తున్నారు హూమా ఖురేషి.ఆమె ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా గీతు మోహన్దాస్ మాట్లాడుతూ – ‘‘ఎలిజబెత్పాత్రకు ఓ డిఫరెంట్ లుక్, బలమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి. అలాగే నటనా సామర్థ్యం కూడా మెండుగా ఉండాలి. హూమా ఖురేషి అయితే కరెక్ట్ అనిపించి, ఆమెను తీసుకున్నాం. హూమా ఓ టాలెంటెడ్ పవర్ హౌస్’’ అని పేర్కొన్నారు. యశ్, గీతు మోహన్ దాస్ కలిసి ఈ ‘టాక్సిక్’ కథ రాశారు. వెంకట్ కె. నారాయణ, యశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 19న విడుదల కానుంది. కన్నడంతోపాటు ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సహా మరికొన్ని భాషల్లో అనువదించి, రిలీజ్ చేయనున్నారు. -
ప్రభాస్-పవన్ మల్టీస్టారర్.. నిధి అగర్వాల్ ట్వీట్
ప్రభాస్ హీరోగా నటించిన 'రాజాసాబ్' విడుదలకు సిద్ధమైంది. జనవరి 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో శనివారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి ప్రభాస్ వచ్చాడు. ఎంతో ఉత్సాహంగా మాట్లాడి ఫ్యాన్స్కి మంచి జోష్ ఇచ్చాడు. ఇప్పుడు వాళ్లు మరింత సంతోషపడిపోయేలా నిధి అగర్వాల్ ఓ ట్వీట్ చేసింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.'రాజాసాబ్'లో నిధి అగర్వాల్ కూడా ఓ హీరోయిన్. చిత్ర ప్రమోషన్లో భాగంగా '#ఆస్క్ నిధి' పేరుతో ట్విటర్లో అభిమానులతో ముచ్చటించింది. మిగతా ప్రశ్నలు, సమాధానాలు ఏమో గానీ ఓ ఆన్సర్ మాత్రం ఆసక్తికరంగా అనిపించింది. తెలుగులో మీ డ్రీమ్ మల్టీస్టారర్ ఏంటి? అని అడగ్గా.. హీరోలుగా ప్రభాస్-పవన్ కల్యాణ్ ఉంటారని, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాగా.. హీరోయిన్గా తాను ఉంటే బాగుంటుందని ట్వీట్ చేసింది.అయితే ఈ ట్వీట్ చేసిన ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. నిధి అగర్వాల్కి చాలా పెద్ద కోరికలు ఉన్నాయిగా అని మాట్లాడుకుంటున్నారు. నిజ జీవితంలో ఈ మల్టీస్టారర్ సెట్ అవుతుందా అంటే సందేహమే. ప్రభాస్ ఓవైపు పాన్ ఇండియా చిత్రాలతో బిజీ. పవన్ మరోవైపు రాజకీయాలతో బిజీ. కాబట్టి నిధి కల కలాలానే ఉండిపోతుంది. ఈ విషయంలో ఎలాంటి డౌట్స్ లేవు.'రాజాసాబ్' సినిమాలో నిధి అగర్వాల్ బెస్సీ అనే పాత్ర చేసింది. ఇందులో ఈమెతో పాటు మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ ఏడాది వచ్చిన పవన్ 'హరిహర వీరమల్లు' హిట్ అయితే తన దశ తిరిగిపోతుందని నిధి చాలా ఆశలు పెట్టుకుంది. కానీ అది ఘోరమైన ఫ్లాప్ కావడంతో ఇప్పుడు ఆశలన్నీ 'రాజాసాబ్'పై పెట్టుకుంది. ఇది వర్కౌట్ అయితే సరేసరి. లేదంటే మాత్రం నిధికి రాబోయే రోజుల్లో తెలుగులో అవకాశాలు కష్టమే?PK sir PRABHAS sir NIDHHI me SRV #AskNidhhi #TheRajaSaab https://t.co/CG1GzbHyEV— Nidhhi Agerwal (@AgerwalNidhhi) December 28, 2025 -
కొత్త సినిమాలు.. కొత్తరకం ప్రమోషన్స్
ఒకప్పుడు సినిమా గురించి ఓ మాదిరిగా ప్రచారం చేసినా సరే థియేటర్లకు ప్రేక్షకుడు వచ్చేవాడు. యావరేజ్గా ఉన్నా గానీ చూసి ఎంజాయ్ చేసేవాడు. ఇప్పుడు అలా కాదు రకరకాలుగా ప్రమోషన్స్ చేసినా సరే థియేటర్కి వచ్చేందుకు ప్రేక్షకుడు చాలా ఆలోచిస్తున్నాడు. ఇలాంటి టైంలో ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ ఒకటి కనిపిస్తుంది. కన్నడలో ఇది ఎక్కువగా ఉండగా.. తెలుగులోనూ కొన్ని మూవీస్ ఈ తరహా ప్రయత్నాలు చేసి హిట్ కొట్టాయనే చెప్పొచ్చు. ఇంతకీ ఏంటి విషయం?చిన్న సినిమాని ప్రేక్షకుడికి చేరువ చేయడం చాలా కష్టం. తమ సినిమాలో కంటెంట్ ఉందని, కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తామని చెబితే సరిపోదు. ఆ విషయాన్ని తాము చెప్పకుండా.. వేరే ప్రేక్షకులతోనే చెప్పిస్తున్నారు. అదే 'ఫ్రీ' పబ్లిసిటీ. అంటే రిలీజ్కి కొన్నిరోజుల ముందే కొందరు ఆడియెన్స్ కోసం ఉచితంగా షోలు వేస్తున్నారు. అలా సినిమా చూసిన వాళ్లు ఏదైతే చెబుతారో ఆ విషయాలతో మూవీ టీమ్ ప్రమోషన్ చేసుకుంటోంది. రీసెంట్ టైంలో కన్నడ చిత్రం '45'కి ఇలాంటి ప్రయత్నమే చేశారు. గతంలో 'చార్లీ 777'కి కూడా ఇలానే చేసి హిట్ కొట్టారనే విషయం మర్చిపోవద్దు.ఈ ఏడాది తెలుగులోనూ రిలీజైన లిటిల్ హార్ట్స్, కోర్ట్, రాజు వెడ్స్ రాంబాయి చిత్రాలకు కూడా ఉచితంగా షోలు వేయలేదు గానీ విడుదలకు ముందే ప్రీమియర్స్ వేశారు. వాటిలో అద్భుతమైన కంటెంట్ ఉండేసరికి రిలీజ్ రోజు ఉదయానికి మౌత్ టాక్ బలంగా వినిపించింది. దీంతో చాలామంది ప్రేక్షకులు.. చిన్న సినిమాలు అయినా సరే వీటిని థియేటర్లకు వెళ్లి చూశారు. ఆదరించారు. వీటికి మంచి లాభాలు కూడా వచ్చాయి.అయితే ప్రీమియర్లు అన్ని సినిమాలకు వర్కౌట్ కావు. ఎందుకంటే 'హరిహర వీరమల్లు' లాంటి మూవీకి ప్రీమియర్స్ అనేవి నెగిటివ్ కావడానికి చాలా కారణమయ్యాయి. ఎందుకంటే కంటెంట్పై చాలా నమ్మకం ఉండి ప్రీమియర్స్ వేస్తే.. తెల్లారేసరికి అది మౌత్ టాక్ రూపంలో ప్లస్ అవుతుంది. లేదంటే మాత్రం మొత్తానికే నెగిటివ్ కావడం గ్యారంటీ. దీనికి ఫెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పవన్ 'హరిహర వీరమల్లు'.రీసెంట్గా క్రిస్మస్కి రిలీజైన 'ఛాంపియన్'కి తప్పితే దాదాపు మిగతా తెలుగు సినిమాలకు ప్రీమియర్స్ వేశారు. ఉచితంగా టికెట్ గివ్ అవేలు కూడా ఇచ్చారు. అయినా సరే కంటెంట్ ఉన్న 'శంబాల' మాత్రమే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇన్నాళ్లు చిన్న సినిమాలకు సరైన ఆదరణ దక్కేది కాదు. రీసెంట్ టైంలో మాత్రం ఫ్రీగా స్క్రీనింగ్, ప్రీమియర్స్తో వస్తున్న మౌత్ టాక్ కలిసొస్తోంది. కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. -
అనసూయ ఫన్నీ ఫేస్.. మాళవిక ఇంత అందంగా
ఫన్నీగా ఫేస్ పెట్టి పోజులిచ్చిన అనసూయ'రాజాసాబ్' ఈవెంట్లో అందంగా మాళవికచీరలో కుందనపు బొమ్మలా అనుపమ పరమేశ్వరన్2025 జ్ఞాపకాల్ని వీడియోగా షేర్ చేసిన నిహారిక'జన నాయగణ్' కోసం పూజా హెగ్డే రెడీ అయిందిలాపలుచని చీరలో అందాల ఆరబోస్తున్న కావ్య View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006)What a NIGHT 🔥🔥🔥Did you guys like my look? ☺️#TheRajaSaab ❤️🔥❤️🔥❤️🔥 pic.twitter.com/bxVqL28wpZ— Malavika Mohanan (@MalavikaM_) December 28, 2025 View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో గెలిచింది వీళ్లే.. అధ్యక్షుడిగా సురేశ్ బాబు
హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్ ఆఫీస్లో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఆదివారం జరిగాయి. ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియోలు.. ఈ నాలుగు విభాగాల కౌన్సిల్తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు. ఇప్పుడు దీని ఫలితాలు బయటకు వచ్చేశాయి.ఛాంబర్ ఎన్నికల్లో రెండు ప్యానెల్స్ పోటీపడ్డాయి. నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, సురేశ్ బాబు బలపరుస్తున్న 'ప్రోగ్రెసివ్ ప్యానల్' ఒకవైపు.. సి. కల్యాణ్, ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు బలపరుస్తున్న 'మన ప్యానెల్' మరోవైపు రేసులో నిలిచాయి. చివరకు ప్రొగ్రెసివ్ ప్యానెల్ అభ్యర్థులే ఎక్కువగా విజయం సాధించారు.నిర్మాతల సెక్టార్లో ప్రొగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఐదుగురు, మన ప్యానెల్ నుంచి ఏడుగురు గెలుపొందారు. స్టూడియో సెక్టార్లో ప్రొగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఒకరు, మన ప్యానెల్ నుంచి ముగ్గురు విజయం సాధించారు. ఎగ్జిబిటర్స్ సెక్టార్లో ప్రొగ్రెసివ్ ప్యానెల్ నుంచి 14 మంది, మన ప్యానెల్ నుంచి ఇద్దరు గెలిచారు. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లో ప్రొగ్రెసివ్ ప్యానెల్ నుంచి 8 మంది, మన ప్యానెల్ నుంచి ముగ్గురు విజయం సాధించగా ఒకటి టై అయింది. ఓవరాల్గా 48 మంది కార్యవర్గానికి ప్రోగ్రెసివ్ ప్యానెల్ లో 31 మంది, మన ప్యానెల్ లో 17 మంది గెలిచారు. తద్వారా ఫిలిం ఛాంబర్ ఎలక్షన్లో ప్రొగ్రెసివ్ ప్యానెల్ ఘనవిజయం సాధించింది.ఫిలిం ఛాంబర్ ఎన్నికలు.. ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. కార్యవర్గ పదవీకాలం ఈ ఏడాది జూలైలోనే ముగిసింది. కానీ కొన్ని కారణాల వల్ల ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇప్పుడు కొత్తవాళ్లు ఎన్నికయ్యారు. వీళ్లంతా 2027 జూలై వరకు పదవుల్లో కొనసాగనున్నారు. ఇప్పుడు ఎవరికి ఏ పదవి అనేది నిర్ణయించారు. ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా సురేశ్ బాబు ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్గా నాగవంశీ, సెక్రటరీగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. ఫిలిం ఛాంబర్ ట్రెజరర్గా ముత్యాల రాందాస్ ఎన్నికవగా.. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి వైస్ ప్రెసిడెంట్గా భరత్ చౌదరి, స్టూడియో సెక్టార్ నుంచి వైస్ ప్రెసిడెంట్గా కిరణ్ ఎన్నికయ్యారు. -
అద్భుతమైన కంటెంట్తో 'ఓ అందాల రాక్షసి' స్టోరీ
దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, షెరాజ్ మెహదీ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ‘ఓ అందాల రాక్షసి’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ మీద సురీందర్ కౌర్ నిర్మాతగా తెరకెక్కించిన ఈ మూవీ జనవరి 2న రాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.షెరాజ్ మెహదీ మాట్లాడుతూ .. ‘‘ఓ అందాల రాక్షసి’ మూవీని జనవరి 2న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాను. కొత్త ఏడాదిలో ఓ మంచి సినిమా వస్తుంది. ఈ మూవీలో కృతి వర్మ, విహాన్షి హెగ్డే, నేహా దేశ్ పాండే, అఖిల, గీతా రెడ్డి, స్నేహా, ప్రియా దేశ్ పాల్, సుమన్ గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ ఇలా చాలా మంది అద్భుతమైన పాత్రల్ని పోషించారు. మంచి కంటెంట్తో రాబోతోన్న ఈ సినిమా ఆడియెన్స్కి ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. సందేశాత్మక కథతో ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇందులోని ట్విస్ట్లు అద్భుతంగా ఉంటాయి. అమ్మాయిలకు నచ్చే చిత్రం అవుతుంది’ అని అన్నారు.కథ, మాటల రచయిత భాష్య శ్రీ మాట్లాడుతూ .. ‘‘ఓ అందాల రాక్షసి’ సినిమాకు కథను, మాటల్ని రాశాను. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఓ మంచి ఫీల్తో బయటకు వస్తారు. నేటి తరం ఆడపిల్లలు ఎలా ఉండాలనే కాన్సెప్ట్తో ఈ మూవీని చేశాం. మా హీరో షెరాజ్ అద్భుతంగా నటించారు. డైరెక్టర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, హీరోగా ఇందులో మ్యాజిక్ చేశారు. కృతి వర్మ హిందీలో చాలా ఫేమస్. విహాన్షి చాలా అద్భుతంగా నటించారు. ఈ చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. జనవరి 2న ఈ మూవీని అందరూ చూడండి’ అని అన్నారు. -
వివాదంలో 'అక్షయ్ ఖన్నా'.. నిర్మాత నోటీసులు జారీ
బాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్షయ్ ఖన్నా వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఏడాదిలో ఛావా, ధురందర్ చిత్రాలతో ఆయనకు పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు దక్కింది. అయితే, బాలీవుడ్ సినిమా ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న మూడవ భాగం ‘దృశ్యం -3’ నుంచి ఆయన ఆకస్మికంగా తప్పుకోవడంతో అక్షయ్ ఖన్నాకు నిర్మాత మంగత్ పాఠక్ నోటిసులు పంపినట్లు తెలుస్తుంది. ఈ మూవీ వచ్చే ఏడాది అక్టోబర్లో విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.హిందీ ‘దృశ్యం -2’లో అక్షయ్ ఖన్నా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అందుకే పార్ట్-3లో కూడా ఆయనే నటించాలని ముందుగానే ఢీల్ సెట్ చేసుకున్నామని పాఠక్ చెప్పారు. ఆ మేరకు అక్షయ్ ఖన్నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చామన్నారు. అయితే, షూటింగ్ ప్రారంభం కావాల్సిన టైమ్లో అక్షయ్ ఖన్నా తమకు షాకింగ్ మెసేజ్ చేశాడని నిర్మాత పేర్కొన్నారు. ఈ సినిమాలో తాను నటించడం లేదంటూ ఒక టెక్స్ట్ మెసేజ్ పంపినట్లు చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తనను సంప్రదించాలని ప్రయత్నం చేసినప్పటికీ అక్షయ్ అందుబాటులోకి రాకపోవడంతో చేసేదేమీ లేక చట్టపరమైన చర్యలకు దిగాల్సి వచ్చిందని నిర్మాత చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మూవీ కోసం అక్షయ్ ఖన్నా రూ. 22 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.అక్షయ్ ఖన్నాకి సినిమా అవకాశాలు రానప్పుడు ‘సెక్షన్ 375’ మూవీతో మంగత్ పాఠక్ లైఫ్ ఇచ్చాడు. ఆ తర్వాతే అతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ‘దృశ్యం 2’ భారీ విజయం అందుకోవడంతో ఛావా, ధురంధర్ వంటి సినిమాలు దక్కాయి. ఇదే విషయాలను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. -
చరణ్-ధోనీ-సల్మాన్ ఒకేచోట... ఫొటో వైరల్
మెగా హీరో రామ్ చరణ్.. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్తో కనిపించాడు. వీళ్లకు తోడుగా 'యానిమల్' ఫేమ్ బాబీ డియోల్ కూడా సందడి చేశాడు. వీళ్లంతా కలిసి చిల్ అవుతున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ వీళ్లు ఎక్కడ ఎప్పుడు కలిశారు?(ఇదీ చదవండి: ఫ్రీగా సినిమాలు చేశా.. అడిగితే ఒక్కరు సపోర్ట్ చేయట్లేదు: సుదీప్)బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్.. 60వ పుట్టినరోజు వేడుకలు శనివారం జరిగాయి. పన్వేల్లోని తన ఫామ్హౌస్లో ఈ సెలబ్రేషన్స్ జరగ్గా.. సల్మాన్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఇందులో సందడి చేశారు. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ కనిపించాడు. క్రికెటర్ ధోనీ, నటుడు బాబీ డియోల్ కూడా వీళ్లతో పాటు కనిపించారు.మెగా ఫ్యామిలీతో సల్మాన్ ఖాన్కి మంచి అనుబంధం ఉంది. కొన్నేళ్ల క్రితం చిరంజీవి 'గాడ్ ఫాదర్'లో సల్మాన్ అతిథి పాత్రలో కనిపించాడు. సల్మాన్ మూవీ 'కిసీ కా బాయ్ కిసీ కా జాన్'లో చరణ్ అతిథి పాత్ర పోషించాడు. ఇప్పుడు కూడా ఆ అనుబంధం దృష్ట్యా సల్మాన్ బర్త్ డే పార్టీలో చరణ్ సందడి చేశాడు. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) -
సైలెంట్గా ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
ఈ వారం ఓటీటీల్లోకి చాలానే తెలుగు సినిమాలు వచ్చాయి. వాటిలో ఆంధ్ర కింగ్ తాలూకా, బాహుబలి ద ఎపిక్, అష్టదిగ్బంధనం, రివాల్వర్ రీటా తదితర స్ట్రెయిట్ చిత్రాలతో పాటు వృత్త అనే డబ్బింగ్ బొమ్మ, ఏక్ దివానే కీ దివానియత్ అనే హిందీ మూవీ, స్ట్రేంజర్ థింగ్స్ ఐదో సీజన్ రెండో వాల్యూమ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా మరో రెండు తెలుగు సినిమాలు సడన్గా స్ట్రీమింగ్లోకి వచ్చేశాయి.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)అమ్మరాజశేఖర్, ధనరాజ్, చమ్మక్ చంద్ర, సుమన్ శెట్టి తదితరులు నటించిన హారర్ కామెడీ మూవీ 'సుగుణ'. 2024లో రిలీజైంది. కాకపోతే ఎప్పుడు థియేటర్లలోకి వచ్చి వెళ్లిందనే సరైన సమాచారం లేదు. ఇప్పుడీ మూవీ సైలెంట్గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది.గతేడాది రిలీజైన 'బాగుంది' అనే సినిమా కూడా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతోంది. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. రామ్ కుమార్ దర్శకుడు కాగా కిశోర్ తేజ, భవ్యశ్రీ, పద్మిని, పద్మజయంతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వీటి ట్రైలర్స్ చూస్తే ఏమంత పెద్ద గొప్పగా లేవు. మరి ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటాయో చూడాలి?(ఇదీ చదవండి: ఫ్రీగా సినిమాలు చేశా.. అడిగితే ఒక్కరు సపోర్ట్ చేయట్లేదు: సుదీప్) -
నా కులం చూసి హీరోగా తీసేశారు : రవికృష్ణ
సీరియల్ నుంచి సినిమాల్లోకి వచ్చిన నటుడు రవికృష్ణ. మొగలిరేకులు సీరియల్తో బుల్లితెరకు పరిచమైన రవికి బిగ్బాస్ షోతో మరింత గుర్తింపు వచ్చింది. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమా చాన్స్లు వచ్చాయి. విరూపాక్ష సినిమా రవి కెరీర్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత రవి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల విడుదలైన దండోరాలో కీలక పాత్ర పోషించాడు. కులం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవి..తక్కువ కులానికి చెందిన యువకుడిగా నటించాడు. అగ్ర కులానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడి.. ఆమె కులం వాళ్ల చేతిలో హత్యకు గురవుతాడు. సినిమా చూసిన ప్రేక్షకులు రవి నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇలాంటి పాత్రల్లో నటించే అవకాశం కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందంటున్నారు రవి. దండోరా సినిమాలో మాదిరే ఆయన కూడా కుల వివక్షకు గురయ్యాడట. తన కులం చూసి సినిమా చాన్స్లు ఇవ్వలేదట. తాజాగా ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఇబ్బందుల గురించి వివరించాడు. ‘మాది విజయవాడ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నా కంటే ముందు మా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా ఇండస్ట్రీలోకి రాలేదు. నాకు సినిమాలంటే పిచ్చి. కానీ ఇండస్ట్రీ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. ఇంటర్ పూర్తయ్యాక సినిమాల్లోకి వెళతా అంటే..ఇంట్లో తిట్టారు. దీంతో డిగ్రీ చేసి.. సినిమాల్లోకి వచ్చాడు. సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉంటుందని తెలియక..చెన్నై వెళ్లాను. అక్కడ ఓ సీరియల్కి అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశా. కొన్నాళ్ల తర్వాత వాళ్లే ఓ తెలుగు సీరియల్ చేస్తే..అందులో నటించాడు. అది మూడు నెలలకే ఆగిపోయింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉంటుందని తెలుసుకొని.. ఇక్కడకు వచ్చాడు. మా మేనత్త వాళ్ల ఇంట్లో ఉంటూ.. అవకాశాల కోసం తిరిగాను. మొగలి రేకులు సీరియల్కి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్తే.. అప్పటికే పూర్తయిపోయాయని చెప్పారు. వాళ్లను రిక్వెస్ట్ చేసి ఆడిషన్స్ ఇచ్చాను. అలా ఆ సీరియల్తో నా కెరీర్ ప్రారంభం అయింది. ఆ ఫేమ్తో సినిమాల్లోకి వచ్చాయి. ఇక్కడ నాకు కుల వివక్ష ఎదురైంది. కొంతమంది నన్ను హీరోగా సెలెక్ట్ చేసి.. చివరిలో నా కులం చూసి పక్కకు తప్పించారు. ఓ సినిమాకి హీరోగా సెలెక్ట్ అయ్యాను. అగ్రిమెంట్ సమయంలో నా ఆధార్ కార్డు పంపించా. అక్కడ నా కులం (ఇంటి పేరు చూసి) చూసి.. తప్పించారు. కారణం ఏంటని అడిగితే.. ఈ కథ మీకు సెట్ కాదు.. ఇంకో ప్రాజెక్ట్కి చూద్దాం అని చెప్పేవాళ్లు. అలా మూడు సినిమాలు అగ్రిమెంట్ వరకు వచ్చి..కులం చూసి ఆగిపోయాయి’ అని రవి చెప్పుకొచ్చాడు. -
ఫ్రీగా సినిమాలు చేశా.. అడిగితే ఒక్కరు సపోర్ట్ చేయట్లేదు: సుదీప్
కన్నడ హీరో సుదీప్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా కాస్త పరిచయమే. ఎందుకంటే సొంత భాషలో స్టార్ అయినప్పటికీ మన దగ్గర 'ఈగ'లో ప్రతినాయకుడిగా అదరగొట్టేశాడు. తర్వాత కూడా బాహుబలి, సైరా నరసింహారెడ్డి లాంటి సినిమాల్లో అతిథి పాత్రలు పోషించాడు. టాలీవుడ్లోనూ కాసోకూస్తో ఫేమ్ సొంతం చేసుకున్నాడు. అయితే తను ఇలా చేస్తున్నప్పటికీ మిగతా ఇండస్ట్రీలకు చెందిన హీరోలు.. తమని సపోర్ట్ చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: 'ఇదే నా చివరి సినిమా'.. అఫీషియల్గా ప్రకటించిన విజయ్)'మిగతా ఇండస్ట్రీల నుంచి కన్నడ సినిమాలకు పెద్దగా సపోర్ట్ దొరకట్లేదు. నేను, శివరాజ్ కుమార్, ఉపేంద్ర.. మిగతా భాషల్లో అతిథి పాత్రలు చేశాం. కాకపోతే ఆయా భాషల స్టార్స్ మాత్రం కన్నడలో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. నేను అయితే ఇతర భాషల్లో చేసిన అతిథి పాత్రలకుగానూ డబ్బులే తీసుకోలేదు. వ్యక్తిగతంగా మిగతా ఇండస్ట్రీలోని పలువురు హీరోలని నా మూవీలో అతిథి పాత్రలు చేయమని అడిగా. కానీ వాళ్లు ఆసక్తి చూపించలేదు' అని సుదీప్ చెప్పుకొచ్చాడు.సుదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మార్క్'. క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజైంది. కాకపోతే డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర నిలబడటం కష్టమే అనిపిస్తుంది. తెలుగులోనూ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేస్తామని తొలుత ప్రకటించారు కానీ తర్వాత ఎందుకో వెనక్కి తగ్గారు.(ఇదీ చదవండి: రాసిపెట్టుకోండి.. 'రాజాసాబ్'కి రూ.2000 కోట్లు వస్తాయి: సప్తగిరి) -
'ఛాంపియన్' కలెక్షన్స్.. జోష్ పెంచిన రోషన్
క్రిస్మస్ కానుకగా విడుదలైన ఛాంపియన్ సక్సెస్బాటలో నడుస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీకాంత్ తనయుడు రోషన్.. ఈ మూవీతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఛాంపియన్లో తన నటనతో రోషన్ మంచి మార్కులు అందుకున్నారు. దర్శకుడు ప్రదీప్ అద్వైతం తెరకెక్కించిన ఈ మూవీని భారీ బడ్జెట్తో ప్రియాంక దత్, జీకే మోహన్, జెమిని కిరణ్ నిర్మించారు. ఇందులో రోషన్ సరసన అనస్వర రాజన్, సంతోష్ ప్రతాప్, అవంతిక, కృతి కంజ్ సింగ్ రాథోడ్, హైపర్ ఆది తదితరులు నటించారు.కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ‘ఛాంపియన్’’ అంటూ రివ్యూలు రావడంతో కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మొదటిరోజు రూ. 4.50 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ మూవీ.. మూడురోజుల్లో రూ. 8.89 కోట్లు రాబట్టి క్రిస్మస్ విజేతగా దూసుకుపోతుంది. ఈమేరకు తాజాగా అధికారికంగా ప్రకటించారు.మహానటి, సీతారామం వంటి భారీ విజయాల తర్వాత స్వప్న దత్ నిర్మించిన ఛాంపియన్పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, వారు అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ పరంగా రాబట్టడం లేదు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఈ మూవీలో చూపించారు. హైదరాబాద్ సంస్థానం నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల దౌర్జన్యాలకు తెలంగాణలోని గ్రామాలు ఏ విధంగా వణికిపోయాయో ఇందులో చూపించారు. -
మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన'ఈషా'
త్రిగుణ్, అఖిల్రాజ్ హీరోలుగా, హెబ్బా పటేల్, సిరి హనుమంతు హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాని వంశీ నందిపాటి, బన్నీ వాసు గురువారం(డిసెంబర్ 25) విడుదల చేశారు. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం భారీగా వచ్చాయి. విడుదలైన మూడు రోజుల్లో 4 కోట్ల 80 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టి, బ్రేక్ ఈవెన్ సాధించింది. రానున్న రోజుల్లో ఈషా బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందని ట్రెడ్ వర్గాలు అంటున్నాయి. సినిమా కథ విషయానికొస్తే.. చిన్నప్పటి నుంచి దెయ్యాలు ఉన్నాయంటే నమ్మని నలుగురు స్నేహితులు(త్రిగుణ్, హెబ్పాపటేల్, సిని హనుమంతు, అఖిల్ రాజు)..పెద్దయ్యాక టీమ్గా ఏర్పడి దొంగ బాబాలు, స్వామిజీల బండారాల్ని బయటపెడుతుంటారు. అలా ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉంటున్న ఆదిదేవ్ (బబ్లూ పృథ్వీరాజ్) బాబా గురించి వీళ్లకు తెలుస్తుంది. అతడి బాగోతం కూడా బయటపెట్టాలని ఫిక్స్ అవుతారు. వెళ్లి ఆదిదేవ్ బాబాని కలుస్తారు. ఆత్మల విషయంలో ఈ నలుగురికి బాబా ఓ ఛాలెంజ్ చేస్తాడు. ఇంతకీ ఆ సవాలు ఏంటి? చివరకు వీళ్లు ఏం తెలుసుకున్నారు? ఈ నలుగురిని చంపాలనుకుంటున్న పుణ్యవతి ఎవరు అనేదే మిగతా స్టోరీ. -
కన్నీళ్లు ఆపుకోలేకపోయిన ది రాజా సాబ్ డైెరెక్టర్ కూతురు.. వీడియో వైరల్!
ప్రభాస్ -మారుతి డైరెక్షన్లో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో హైదరాబాద్లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన డైరెక్టర్ మారుతి ఫుల్ ఎమోషనల్ అయ్యారు. ప్రభాస్ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. మూడేళ్లుగా ది రాజాసాబ్ కోసం పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. రెబల్ స్టార్ను తీసుకొచ్చిన ఆయన రేంజ్కు తగినట్లుగానే ఈ సినిమాను తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ సినిమా కోసం ప్రభాస్ తన లైఫ్ పెట్టేశారని కొనియాడారు. సినిమాతోనే ఏకమైపోయిన తీరును మాటల్లో చెప్పలేనన్నారు. ఆ ప్రతి రూపమే ఈ రోజు మన ఎదురుగా కూర్చుందని డైరెక్టర్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టిన ప్రభాస్ను చూస్తుంటే నా కన్నీళ్లు ఆగడం లేదంటూ వేదికపైనే ఏడ్చేశారు. ఈ సందర్భంగా వేదికపైనే చిన్నపిల్లాడిలా దర్శకుడు మారుతి ఏడ్చిన తీరు ఆడియన్స్ను సైతం కన్నీళ్లు పెట్టించింది.మారుతి కూతురు ఎమోషనల్ఈ వీడియో చూసిన ఆయన కూతురు ఈవెంట్లోనే కన్నీళ్లు పెట్టుకుంది. తండ్రి కష్టాన్ని చూసిన కూతురు కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తండ్రి కంటే ఎక్కువగా ఎమోషనలైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఒక తండ్రి కష్టం విలువ.. కుమార్తెకే తెలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు..@DirectorMaruthi Emotional avvadam tho valla Daughter of kuda challa Emotional ayindhi 🥲❤️#TheRajaSaab pic.twitter.com/ZkGVGBp4bU— Rebel Star (@Pranay___Varma) December 28, 2025 -
'శంబాల' బిగ్ప్లాన్.. వర్కౌట్ అయితే 'ఆది'కి ఫుల్ డిమాండ్
నటుడు ఆది సాయికుమార్ ఖాతాలో 'శంబాల' సినిమాతో హిట్ పడింది. సరైన విజయం కోసం ఆయన చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే శంబాల సినిమాతో ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. బక్సాఫీస్ వద్ద సుమారు రూ. 10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ మూవీ హిందీలో కూడా విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది.తెలుగులో క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న విడుదలైన శంబాల చిత్రాన్ని దర్శకుడు యుగంధర్ ముని తెరకెక్కించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ చిత్రాలకు బాలీవుడ్లో మంచి డిమాండ్ ఉండటంతో జనవరి 1న హిందీ వర్షన్ విడుదల చేస్తున్నారు. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. సరైన ప్రచార వ్యూహంతో చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తే హిందీ బెల్ట్లో ఇలాంటి కంటెంట్కు మంచి డిమాండ్ ఉంది. అయితే, నిర్మాతలు ఈ చిత్రాన్ని ఎంత దూకుడుగా ప్రమోట్ చేస్తారో చూడాలి. శంబాల పార్ట్ -2 ప్లాన్ చేసే అవకాశం కూడా ఉంది.శంబాల చిత్రాన్ని మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించారు. ఇందులో అర్చన అయ్యర్, స్వసిక, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కథంతా 1980 నేపథ్యంలో సాగుతుంది. అయితే, దర్శకుడు చాలా అద్భుతంగా సినిమాను ప్లాన్ చేసుకున్నాడు. సినిమా బాగుందని రివ్యూలు వచ్చినప్పటికీ కలెక్షన్స్ విషయంలో దూకుడు చూపించడం లేదు. -
మ్యూజిక్ డైరెక్టర్కు జోడీగా నటి 'కయదు లోహర్'
ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ఇమ్మోర్టల్ చిత్రం ఒకటి. ఇందులో ఆయనకు జంటగా కయదు లోహర్ నటిస్తున్నారు. కింగ్స్టన్ చిత్రం తరువాత జీవీ ప్రకాష్ కుమార్ నటిస్తున్న చిత్రం ఇది. అదేవిధంగా డ్రాగన్ చిత్రం తరువాత కయదులోహర్ నటిస్తున్న తమిళ చిత్రం కూడా ఇదే.. మారియప్పన్ చిన్నా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అరుణ్కుమార్ ధనశేఖరన్ నిర్మిస్తున్నారు. శ్యామ్.సీఎస్ సంగీతాన్ని, అరుణ్ రాధాకష్ణన్ చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ చిత్ర టీజర్ను ఇటీవల విడుదల చేశారు.టీజర్ను చూస్తుంటే ఇది సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ కథా చిత్రం అనిపిస్తోంది. ప్రేమతో పాటు అనూహ్య సంఘటనలు టీజర్లో కనిపిస్తాయి. ఏలియన్ లాంటి ఒక వింత మనిషి కూడా కనిపించడంతో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంటోంది. ఇమ్మోర్టల్ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. జీవీ కథానాయకుడిగా మంచి హిట్ చూసి చాలా కాలమైంది. మరి ఈ చిత్రం ఏ మాత్రం సక్సెస్ అవుతుందో చూడాలి. -
'ఇదే నా చివరి సినిమా'.. అఫీషియల్గా ప్రకటించిన విజయ్
కోలీవుడ్ స్టార్ దళపతి తన కెరీర్లో నటిస్తోన్న చివరి సినిమా జన నాయగణ్. రాజకీయాల్లోకి ఎంట్రీకి ముందు ఈ విషయాన్ని ప్రకటించారు. తన కెరీర్లో ఇదే చివరి సినిమా కానుందని వెల్లడించారు. ఈ భారీ యాక్షన్ సినిమాను హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డే కనిపించనుంది. ఈ సినిమా పొంగల్ బరిలో నిలిచింది.తాజాగా మలేసియా నిర్వహించిన ఆడియో లాంఛ్ ఈవెంట్లో విజయ్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చారు. ముందుగా ప్రకటించినట్లుగానే తనకిదే చివరి సినిమా మరోసారి స్పష్టం చేశారు. కౌలాలంపూర్లో జరిగిన ఈవెంట్లో అఫీషియల్గా ప్రకటించారు. వేలాదిమంది అభిమానుల మధ్య తన నిర్ణయాన్ని వెల్లడించారు. విజయ్ మాట్లాడుతూ..'నా ఫ్యాన్స్, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి నేను నటించిన సినిమాలు చూసేవారు. ఎన్నో ఏళ్లుగా నన్ను సపోర్ట్ చేశారు. నా కెరీర్లో ఇంత మద్దతుగా నిలిచిన వారి కోసం నేను 30 ఏళ్లు నిలబడతా. నా అభిమానులకు సేవ చేయడం కోసమే సినిమాలకు గుడ్ బై చెబుతున్నా' అని అన్నారు. -
భయపెడితే భళా.. బాక్సాఫీస్ గలగలా
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఏ వుడ్ చూసినా హారరే గుడ్ అంటున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఈ ట్రెండ్ మనకు మాత్రమే ప్రత్యేకం కాదు. విశ్వవ్యాప్తంగా కూడా సినిమా రూపకర్తలంతా దయ్యాలకు, భయాలకు జై కొడుతున్నారు. మొత్తంగా హాలీవుడ్ హారర్ చిత్రాలతో హాహా కారాలు చేయిస్తోంది.ఈ ఏడాది ఉత్తర అమెరికా టిక్కెట్ల అమ్మకాలలో 17% హర్రర్ చిత్రాలే దక్కించుకున్నాయి ఇది దశాబ్దం క్రితం 4% గా మాత్రమే ఉండడం గమనార్హం. అదేవిధంగా, రెండేళ్ల నుంచి నిర్మాణంలో ఉన్న వాటిలో హర్రర్ చిత్రాల సంఖ్య 21% గా ఉంది. అంటే దాని అర్ధం రానున్న ఏడాది కూడా థియేటర్లలో మరిన్ని హర్రర్ సినిమాలను ప్రేక్షకులు చూడబోతున్నారుకళ్లకు భయం... కనకవర్షంఈ ఏడాది అమెరికా బాక్సాఫీస్ దగ్గర 100 మిలియన్లకు పైగా సంపాదించిన వాటిలో ఒకటి ‘‘ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్లైన్స్’’కాగా, మరొకటి ‘‘ది కంజురింగ్: లాస్ట్ రైట్స్’’ ర్యాన్ కూగ్లర్ పీరియాడికల్ వాంపైర్ చిత్రం ‘‘సిన్నర్స్’’ కూడా 2025లో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది, గిల్లెర్మో డెల్ టోరో తీసిన 120 మిలియన్ డాలర్ల ‘ ఫ్రాంకెన్స్టైన్‘, ఆస్ట్రేలియన్ దర్శకురాలు ఆలిస్ మైయో మాకే కొత్త చిత్రం ‘‘ది సర్పెంట్స్ స్కిన్’’.. కూడా హారర్ చిత్రాలే. ది కాంజురింగ్: లాస్ట్ రైట్స్: ప్రపంచవ్యాప్తంగా సుమారు 494 మిలియన్ల డాలర్లు అందుకుందని అంచనా. ర్యాన్ కూగ్లర్ దర్శకత్వం వహించిన భారీ హిట్ సిన్నర్స్ 367మిలియన్ డాలర్లకు పైగా కొల్లగొట్టింది.కధలెన్నో..కాన్సెప్ట్ ఒక్కటే...ప్రేమలో ఉన్న ఇద్దరు యువతుల గురించి వారి ప్రేమకు అడ్డుగా ఉండే శాపగ్రస్తమైన టాటూ గురించిన కథ ‘‘బఫీ ది వాంపైర్ స్లేయర్’’ టోబీ పోజర్, జాన్ ఆడమ్స్ వారి కుమార్తెలు జేల్డా ల రూపకల్పనలో.. క్యాన్సర్తో బాధపడుతున్న టీనేజ్ అమ్మాయి, తన అనారోగ్యాన్ని నయం చేయాలనే ఆశతో ఒక నెక్రోమాన్సర్ను సందర్శించడం తదనంతర పరిణామాలతో ‘‘మదర్ ఆఫ్ ఫ్లైస్’’, రూపొందింది. ఈ సంవత్సరంలో, వచ్చిన ఉత్తమ హారర్ చిత్రంగా ఇది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే డానియెల్ డెడ్వైలర్ రూపొందించిన నెమ్మదిగా సాగే హారర్–డ్రామా 40 ఏకర్స్... నల్లజాతి ప్రజల నిర్దిష్ట చారిత్రక గాయాలను ఆధారంగా చేసుకుని రూపొందింది. విచిత్రమైన మలుపులకు పేరొందిన జపనీస్ దర్శకుడు యుటా షిమోట్సు అందించిన బెస్ట్ విషెస్ టూ ఆల్... కూడా హారర్ హిట్స్ జాబితాలో చేరింది. అరుదుగా సినిమాలు తీసే సీన్ బైర్న్ ‘‘డేంజరస్ యానిమల్స్’’మరో సక్సెస్. ఈ సంవత్సరపు ఉత్తమ హారర్ నటనలలో ఒకటిగా కుక్క నటనకు విమర్శకుల ప్రశంసలు పొందిన ‘‘గుడ్ బాయ్’’ ఒక సాధారణ దెయ్యాల ఇంటి కథాంశానికి సరికొత్త రూపం. ‘‘‘సిన్నర్స్‘ తో, దర్శకుడు ర్యాన్ కూగ్లర్ రూపొందించిన చిత్రం ఓ వాంపైర్ కథాంశం. దర్శకుడు ఎమిలీ బ్లిచ్ఫెల్ట్æ అందించిన ‘‘ది అగ్లీ స్టెప్సిస్టర్‘ కూడా సౌందర్య చికిత్సల నేపధ్యంలో నడిచే హారర్ చిత్రం. అలాగే వెపన్స్ కూడా. అటు విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో పాటు, ది ఉమెన్ ఇన్ ది యార్డ్ డెత్ ఆఫ్ ఎ యునికార్న్ వంటి ప్రత్యేకమైన స్వతంత్ర చిత్రాల వరకు విడుదలయ్యాయి, ప్రత్యేకమైన కాన్సెప్ట్ ది మంకీ ఆకట్టుకుంది. బ్లాక్ ఫోన్ 2: బ్రింగ్ హర్ బ్యాక్ వంటివీ ఇదే కోవలోకి వస్తాయి. -
'మీకు నచ్చిన డ్రెస్ వేసుకోండి.. అంతే కానీ'.. శివాజీకి టాలీవుడ్ నిర్మాత కౌంటర్
టాలీవుడ్ నటుడు శివాజీ వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. హీరోయిన్ల డ్రెస్సులను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ యావత్ మహిళా లోకం ఒక్కసారిగా విరుచుకుపడింది. సినీతారలతో పాటు సామాన్యులు సైతం శివాజీపై విమర్శలు చేశారు. ఇటీవల దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల దుస్తులపై వల్గర్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత తాను ఆ రెండు పదాలు మాత్రమే వాడకుండా ఉండాల్సిందని సారీ చెబుతూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఇటీవల శివాజీ కామెంట్స్పై కేవలం మహిళలు మాత్రమే కాదు.. నటులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ రాం గోపాల్ వర్మ, నటుడు ప్రకాశ్ రాజ్ శివాజీ కామెంట్స్పై స్పందించారు. అలా మాట్లాడటం కరెక్ట్ కాదంటూ మండిపడ్డారు.తాజాగా శివాజీ కామెంట్స్పై నిర్మాత ఎస్కేఎన్ తనదైన స్టైల్లో పంచ్లు వేశారు. పతంగ్ మూవీ సక్సెస్ మీట్కు హాజరైన ఎస్కేఎన్ హీరోయిన్ను ఉద్దేశించి మాట్లాడారు. అక్కడే హీరోయిన్ను చూసి మామూలు డ్రెస్ వేసుకొచ్చారేంటి?..మన తెలుగు అమ్మాయి కాస్తా గ్లామర్గా రావాల్సిందన్నారు. మన తెలుగు హీరోయిన్స్, తెలుగమ్మాయిలు మీకు ఏ డ్రెస్ కంఫర్ట్గా ఉంటే అదే వేసుకోండి.. ఏది కాన్ఫిడెంట్గా అదే వేసుకోండని అన్నారు. ఏ బట్టల సత్తిగాడి మాటలు వినాల్సిన పని లేదన్నారు. ఏం జరిగినా మన మనసు మంచిదైతే బాగుంటామని.. మన ఇంటెన్షన్ బాగుంటే అంతా మంచే జరుగుతుంది.. అంతే తప్ప మన డ్రెస్సుల్లో ఉండదని పరోక్షంగా శివాజీకి కౌంటరిచ్చారు ఎస్కేఎన్. #Counterఎ డ్రెస్ కంఫర్ట్ గా ఉంటె వేసుకోండి ఎ డ్రెస్ కాన్ఫిడెంట్ గా ఉంటే వేసుకోండి. ఎ బట్టల సతి గాడి మాట వినకండి!!- #SKN @ #Patang Event pic.twitter.com/ye0Knl85uQ— Telugu Bit (@Telugubit) December 27, 2025 -
చిన్న సినిమాకు టాలీవుడ్ హీరో సపోర్ట్.. ఉచితంగా టికెట్స్..!
ఇటీవల క్రిస్మస్ సందర్భంగా చిన్న సినిమాలన్నీ సందడి చేశాయి. శ్రీకాంత్ తనయుడి ఛాంపియన్, ఆది సాయికుమార్ శంబాల చిత్రాలపై కాస్తా బజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. వీటితో బ్యాడ్ గాళ్స్, ఈషా, దండోరా లాంటి చిత్రాలొచ్చాయి. వీటి గురించి ప్రమోషన్స్ చేయడంఅయితే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మరో మూవీ పతంగ్. ఎలాంటి ప్రచారం చేయకపోయినా బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. కేవలం మౌత్ టాక్తోనే పతంగ్ దూసుకెళ్తోంది. ఈ సినిమాకు టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ మద్దతుగా నిలిచారు. ఈ మూవీ చూసే వారికోసం బంపర్ ఆఫర్ ప్రకటించారు. పతంగ్ చూసేందుకు తానే స్వయంగా 500 టిక్కెట్లను ఉచితంగా ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఈ ఆఫర్తో పతంగ్ చూసే అభిమానుల సంఖ్య మరింత పెరగనుంది. చిన్న సినిమా కోసం సందీప్ కిషన్ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. Giving away 500 tickets for #Patang the film,with love for this Adorable/Passionate Team 🧿@PranavKaushikk @VPujit @Preethipagadal @praneethdirects Hearing Fab Things about the film..Please go check it out in Theatres now ♥️For tickets : pls contact @adithyamerugu pic.twitter.com/EbmBbRbAtI— Sundeep Kishan (@sundeepkishan) December 27, 2025 -
మారిపోయిన ప్రభాస్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
ప్రభాస్.. పాన్ ఇండియా నెంబర్ వన్ స్టార్. కోట్లాది మంది అభిమానులు ఆయన సొంతం. ఆయన ఫ్లాపు సినిమాలకు కూడా వందల కోట్ల కలెక్షన్స్ వచ్చేస్తాయి. అలాంటి హీరో బయటకు వస్తే ఎంత హడావుడి చేయాలి? కానీ ప్రభాస్ చాలా సింపుల్గా ఉంటాడు. స్టార్ హీరో అనే బిల్డప్ ఆయన ముఖంలో ఎప్పుడూ కనిపించదు. తన సినిమాల గురించి కూడా పెద్దగా గొప్పలు చెప్పుకోడు. సినిమా ఈవెంట్లో ఇచ్చే స్పీచులు కూడా ఒకటి, రెండు నిమిషాలకు మించి ఉండదు. కానీ ‘ది రాజాసాబ్’ ప్రీరిలీజ్ ఈవెంట్లో కొత్త ప్రభాస్ కనిపించాడు. ఎప్పుడూ లేనంతగా చాలా ఎక్కువ సేపు స్పీచ్ ఇచ్చాడు.అందుకే పిలకరాజాసాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ దాదాపు 10 నిమిషాల వరకు మాట్లాడితే..అందులో ఎక్కువసేపు ఫ్యాన్స్ ప్రస్తావనే తెచ్చాడు. అభిమానుల కోసమే ది రాజాసాబ్ సినిమా చేశామని చెప్పాడు. అంతేకాదు ‘మీ కోసమే పిలక వేసుకొని వచ్చా’ అంటూ తన పిలక చూపించి..నవ్వించాడు. ఇక ఆయన స్పీచ్ మధ్యలో ఫ్యాన్స్ అంతా ‘బాహుబలి జయహో’ అంటుంటే.. ‘నా స్పీచ్ బోరింగ్గా ఉంటుందని మీరు అలా అంటున్నారు కదా.. ఏదో ఒకరోజు స్టేజ్పై ఎంటర్టైన్ చేస్తా..మీరంతా షాకైపోతారు’ అంటూ చిన్నపిల్లాడిలా ప్రభాస్ మాట్లాడిన తీరు అందరిని ఆకట్టుకుంది. ఇక తన పెళ్లిపై కూడా ఆయన ఫన్నీగా స్పందించారు. ‘ప్రభాస్ని పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి?’ అని సుమ ప్రశ్నించగా.. ‘అది తెలియకనే ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు’ అంటూ నవ్వేశాడు. ఫ్యాన్స్: ప్రభాస్ పెళ్లి చేసుకునే అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి..?హీరో ప్రభాస్: అది తెలియకే ఇంతవరకూ పెళ్లి చేసుకోలేదు pic.twitter.com/VI5FzMAvFc— PulseNewsBreaking (@pulsenewsbreak) December 27, 2025ఇక సూట్లో వచ్చిన తమన్పై కూడా ప్రభాస్ పంచులు వేశాడు. ‘అంత ధైర్యం ఏంటి డార్లింగ్. సీరియస్గా చెబుతున్నా.. నేను కూడా ఇలా సూట్ వేసుకోని రావాలని అన్నీ రెడీ చేసుకుంటా. కబోర్డులో దాదాపు 200 వరకు డ్రెస్సులు ఉంటాయి. బాగా రెడీ అయి రావాలనుకుంటాను. కానీ ఓవర్గా ఉంటుందిలే అనుకొని సింపుల్గా వచ్చేస్తా. తమన్ లాంటి ధైర్యం నాకెప్పుడు వస్తుందో’ అని చెప్పడంతో అక్కడ ఉన్న ఫ్యాన్స్ అంతా ఫుల్గా నవ్వేశారు. ఆ ఒక్క మాటతో..ప్రభాస్ ఎప్పుడూ తన సినిమాల గురించి డబ్బా కొట్టుకోరు. ‘మా సినిమా అదిరిపోయింది..బ్లాక్ బస్టర్ హిట్ పక్కా’ అని ఎక్కడా చెప్పలేడు. కామ్గా సినిమా చేసుకొని పోతాడు.హిట్ అయినా, ఫ్లాప్ అయినా పెద్దగా మాట్లాడడు. ఈ సారి కూడా అలానే మాట్లాడారు. ‘ఈ పండక్కి అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లు అవ్వాలి. అందులో మాది కూడా ఉంటే బాగుంటుంది’ అని మాత్రమే అన్నాడు. ఈ ఒక్క మాట చాలు.. మిగిలిన సినిమాలకు ప్రభాస్ ఎంత గౌరవం ఇస్తున్నాడో చెప్పడానికి. అంతేకాదు సీనియర్ హీరోలను కూడా ఆయన ఎంతో గౌరవిస్తాడు. ‘సీనియర్లు సీనియర్లే. వాళ్ల నుంచి మేమంతా నేర్చుకొన్నాం. వాళ్ల సినిమాలు బాగా ఆడాలి’ అంటూ సంక్రాంతి పోటీలో ఉన్న చిరంజీవి, రవితేజ లాంటి సీనియర్ హీరోలకు తన తరపున ఆల్ ది బెస్ట్ చెప్పాడంతే.. ఆయన సీనియర్లకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇక మారుతి ఎమోషల్ అయితే..దగ్గరకు వచ్చి ఓదార్చడమే కాదు.. `మూడేళ్ల కష్టం కన్నీళ్ల రూపంలో వచ్చింది` అంటూ తనదైన శైలీలో కవర్ చేశాడు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడుతూ.. ‘డార్లింగ్ పెన్నుతో రాశావా… మిషన్ గన్నుతో రాశావా’ అంటూ మారుతిపై ప్రశంసలు కురిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ అవుతున్నారు. They Call him 'Lottery Star' 💔#prabhas #RajaSaab pic.twitter.com/hS3uvAO2ao— Naa_istam 🚩 (@Grookk12) December 28, 2025మొత్తంగా ప్రభాస్ ఎప్పుడూ లేని విధంగా చాలా హుషారుగా, సరదాగా ఎక్కువ స్పీచ్ ఇచ్చాడు. తమ అభిమాన హీరో ఇలా ఓపెన్గా మాట్లాడడం చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. -
స్పిరిట్ డైరెక్టర్కు క్రేజీ ట్యాగ్ ఇచ్చిన రెబల్ స్టార్.. రాజమౌళికి కూడా!
రెబల్ స్టార్ ప్రభాస్ వచ్చే ఏడాది సంక్రాంతికి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ది రాజాసాబ్తో రెడీ అయిపోయారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ఈ హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్పై అంచనాలు పెంచేశాయి. ఈ సందర్భంగా ది రాజాసాబ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హైదరాబాద్లోని కైతలాపూర్ గ్రౌండ్స్లో ఈ గ్రాండ్ ఈవెంట్ జరిగింది.ఈవెంట్లో రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ స్టైలిష్గా కనిపించారు. ఈ సందర్భంగా ది రాజాసాబ్ టాలీవుడ్ డైరెక్టర్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన పనిచేసిన వారిపై అభిప్రాయాన్ని పంచుకున్నారు. యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు ప్రభాస్ సమాధానమిచ్చారు. మీతో పని చేసిన దర్శకుల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏమంటారు? అని సుమ ప్రశ్నించింది.దీనిపై ప్రభాస్ స్పందిస్తూ.. నాగ్ అశ్విన్కు స్ట్రాంగ్ అని.. ప్రశాంత్ నీల్కు బ్యూటీఫుల్ పర్సన్గా.. ఎస్ఎస్ రాజమౌళిని జీనియర్ గారు..మారుతి అయితే క్యూట్ అని అన్నారు. అలాగే హనురాఘవపూడి వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ అని.. సుజీత్ ఫుల్ స్మార్ట్ అని.. పూరి జగన్నాధ్ను జీనియస్గా అభివర్ణించారు. ఇక యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను కల్ట్ అంటూ తన మనసులోని మాటను చెప్పేశారు. కాగా.. ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డివంగాతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి స్పిరిట్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో ప్రభాస్కి జోడీగా యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రీ కనిపించనుంది. ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
‘45’ చూశాక ప్రతి ప్రాణిని ప్రేమిస్తారు : శివరాజ్ కుమార్
‘‘అర్జున్ జన్య చెప్పిన ‘45’ కథ నచ్చడంతో ‘మీరే డైరెక్ట్ చేయండి’ అని చెప్పాను. తనకు ఇచ్చిన అవకాశానికి పూర్తిగా న్యాయం చేశారు అర్జున్. ఈ మూవీ చూశాక ప్రతి ప్రాణిని ప్రేమిస్తారు... గౌరవిస్తారు. బతికినన్ని రోజులు హ్యాపీగా జీవించాలని మా చిత్రం చెబుతుంది’’ అని శివ రాజ్కుమార్ తెలిపారు. సంగీత దర్శకుడు అర్జున్ జన్య దర్శకత్వంలో శివ రాజ్కుమార్, ఉపేంద్ర, రాజ్ బి. శెట్టి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘45’. ఉమా రమేశ్ రెడ్డి, ఎం. రమేశ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జనవరి 1న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఉపేంద్ర మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకూ ఎవ్వరూ ఇవ్వని పాత్రను నాకు ఈ సినిమాలో అర్జున్ ఇచ్చారు. స్క్రీన్ప్లేని చాలా గ్రిప్పింగ్గా రాశారు అర్జున్. మంచి చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా ‘45’ని కూడా సపోర్ట్ చేయాలి’’ అని చెప్పారు. ‘‘45’లో ఓ కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నారు’’ అన్నారు అర్జున్ జన్య ‘‘గరుడ పురాణం గురించి చాలా గొప్పగా చెప్పే చిత్రమిది’’ అని రమేశ్ రెడ్డి తెలిపారు. ‘‘మంచి సందేశాన్ని ఇచ్చేలా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు మైత్రీ శశి. -
ప్రభాస్ను చూసి చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన డైరెక్టర్.. వీడియో వైరల్
ది రాజాసాబ్ డైరెక్టర్ మారుతి ఆసక్తికర కామెంట్స్ చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన మారుతి దర్శకధీరుడిపై ప్రశంసలు కురిపించారు. రాజమౌళికి ప్రతి డైరెక్టర్ రుణపడి ఉన్నామని తెలిపారు. ఇవాళ చాలామంది పాన్ ఇండియా అని కాల్ ఎగరేసుకుని తిరుగుతున్నామంటే కారణం ఆయనే అన్నారు. నిజంగా టాలీవుడ్కు ఇది స్వర్ణయుగమని తెలిపారు.నా లాంటి మిడ్ రేంజ్ సినిమాలు తీసే నన్ను ఈ రోజు ఇక్కడ నిలబెట్టారని మారుతి తెలిపారు. ఒక మిడ్ రేంజ్ హీరోని పాన్ ఇండియా హీరోగా చేసి ఒక పెద్ద కటౌట్ అందించారని అన్నారు. ఒక సుకుమార్, సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా ఎంతోమంది స్టార్స్ను తయారు చేసిన ఘనత ఆయనదేనన్నారు. అంతేకాకుండా హీరో ప్రభాస్పై ప్రశంసలు కురిపించారు డైరెక్టర్ మారుతి. ఆయన ఒక శక్తి అని కొనియాడారు. నా వెనకాల ఉన్నది మామూలు శక్తి కాదు.. ఆయన కేవలం యాక్టింగ్ చేసి వెళ్లిపోవడం కాదు.. తన లైఫ్ పెట్టేశారని అన్నారు. సినిమాతో ఏకమైపోయిన తీరును మాటల్లో చెప్పలేమన్నారు. ఆ ప్రతి రూపమే ఇవాళ మన ఎదురుగా కూర్చుందని ఎమోషనల్ అయ్యారు. ప్రభాస్ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రభాస్ హీరోగా వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది.ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ సంక్రాంతి పోటీలో నిలిచింది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. Emotional Moment ♥️😭#Prabhas𓃵 #Maruthi pic.twitter.com/HcS6TB1Gmc— Addicted To Memes (@Addictedtomemez) December 27, 2025 టాలీవుడ్కు ఇది స్వర్ణయుగం.టాలీవుడ్ డైరెక్టర్లంతా @ssrajamouli కి రుణపడి ఉన్నాము.. ఒక మిడ్ రేంజ్ హీరోని పాన్ ఇండియా హీరోగా చేసి మాకు ఇచ్చినందుకు – డైరెక్టర్ #Maruthi #Prabhas𓃵 #RajaSaab pic.twitter.com/0HPAVKG6CZ— greatandhra (@greatandhranews) December 27, 2025 -
ది రాజాసాబ్ హీరోయిన్కు ప్రభాస్ గిఫ్ట్.. అంతా నీవల్లే అంటూ ఎమోషనల్..!
ప్రభాస్ హీరోగా వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది.ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ సంక్రాంతి పోటీలో నిలిచింది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో హైదరాబాద్లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్కు హాజరైన హీరోయిన్ రిద్ది కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. హీరో ప్రభాస్పై ప్రశంసల వర్షం కురిపించింది. నీ వల్లే నేను ది రాజాసాబ్లో మూవీ నటిస్తున్నానని తెలిపింది. నాకు ఈ అద్భుతమైన అవకాశమిచ్చిన ప్రభాస్కు రుణపడి ఉంటానని తెలిపింది. ఈ రోజు ఈవెంట్కు మీరు నాకిచ్చిన శారీనే ధరించానని సంతోషం వ్యక్తం చేసింది. ఈ రోజు కోసం మూడేళ్లుగా ఈ శారీని కట్టుకోలేదని భావోద్వేగానికి గురైంది. నా లైఫ్లో నీలాంటి పర్సన్ పరిచయం కావడం నా అదృష్టమని రిద్ధికుమార్ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. కాగా.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో సందడి చేయనుంది. Riddhi కి Saree ఇచ్చిన ప్రభాస్.. She reveals it on stage! I'm wearing the saree that you gave me I saved it for 3 years Just to wear it tonightGrateful to have you in my life.#Prabhas #RiddhiKumar pic.twitter.com/8BXLXdj16Z— M9 NEWS (@M9News_) December 27, 2025 Thank you #riddhikumar gaaru 3 years wait chesi Ee day kosam ah saree wear chesaru 🫡🫡🫡🫡🫡🫡#TheRajaSaab pic.twitter.com/QSIQiF510G— PrabhasPandu (@Dreamer_998) December 27, 2025 -
ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు.. రెండు ప్యానెళ్ల ఆసక్తికర పోటీ
ఇవాళ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరగనున్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరగనుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో అధ్యక్ష కార్యదర్శిలతో పాటు 32 మంది కార్యవర్గ సభ్యులు పోటీలో ఉన్నారు. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్స్ కలిపి మొత్తం 3,355 మంది సభ్యులు ఓటు వేయనున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఛాంబర్ ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రస్తుత ఛాంబర్ కార్యవర్గ పదవి కాలం జూలై లోనే ముగిసిన పలు కారణాల వల్ల ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇప్పుడు ఎన్నికయ్యే నూతన కార్యవర్గం జూలై 2027 పదవుల్లో వరకు కొనసాగుతారు. అధ్యక్ష పదవికి ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి దగ్గుబాటి సురేష్ బాబు.. మన ప్యానెల్ నుంచి నట్టి కుమార్ పోటీ పడుతున్నారు. ఈ సారి ఎగ్జిబిటర్స్ సెక్టార్ నుంచి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. చిన్న నిర్మాతలు అంతా మన ప్యానల్గా.. అగ్ర నిర్మాతలు, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అంతా ప్రోగ్రెసివ్ ప్యానల్గా పోటీ చేస్తున్నారు. మన ప్యానల్ను సి కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్నకుమార్ బలపరుస్తున్నారు. ప్రోగ్రెసివ్ ప్యానల్ను అల్లు అరవింద్, దిల్ రాజు , సురేష్ బాబు బలపరుస్తున్నారు.గిల్డ్ పేరుతో కోట్లాది రూపాయల చిత్ర పరిశ్రమ సొమ్మును దోచుకుంటున్నారని చిన్న నిర్మాతల మన ప్యానెల్ సభ్యులు ఆరోపిస్తున్నారు. పదవుల కోసం కాదు అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఈ ఎన్నికలని బడా నిర్మాతల ప్రోగ్రెసివ్ ప్యానెల్ సభ్యుల వాదిస్తున్నారు. -
సైకలాజికల్ థ్రిల్లర్ 'షట్టర్ ఐలాండ్' మూవీ రివ్యూ
ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలకు క్రేజెక్కువ. అలాంటి ఓ థ్రిల్లర్ సినిమా గురించి ఇప్పుడు చెప్పుకుందాం. హాలీవుడ్ స్టార్ లినార్డో డికాప్రియో ప్రధాన పాత్ర పోషించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ షట్టర్ ఐల్యాండ్. మార్టిన్ స్కోర్సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు,మూడు ఓటీటీ ప్లాట్ఫామ్స్లోనూ అందుబాటులో ఉంది.. ఆ సినిమా రివ్యూ చూసేద్దాం..కథషట్టర్ ఐలాండ్ ద్వీపంలో ఓ పిచ్చి ఆసుపత్రి ఉంటుంది. క్రూరమైన హింసలు చేసిన ఖైదీలకు ఆ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుంటారు. అక్కడ ఓ ఖైదీ/రోగి తప్పించుకుందన్న విషయం తెలిసి హీరో టెడ్డీ ఒక మార్షల్గా (పోలీస్గా) తన పార్ట్నర్తో కలిసి ఆ హాస్పిటల్కు వెళ్తాడు. ఆమె ఆచూకీ కనిపెట్టేందుకు విచారణ మొదలు పెడతారు. అయితే అక్కడ అందరి ప్రవర్తన కాస్త వింతగా ఉంటుంది. హీరో కేవలం ఖైదీని కనిపెట్టడం కోసమే రాడు.. ఆస్పత్రిలో కొన్ని అసాధారణమైనవి జరుగుతున్నాయని అతడి అనుమానం. మానసికంగా జబ్బుపడినవారి మెదడుపై అక్కడ ప్రయోగాలను చేస్తున్నారని దాన్ని ప్రపంచానికి తెలియజేయాలని అనుకుంటాడు. తుపానును సైతం లెక్క చేయకుండా విచారణ కొనసాగిస్తాడు. ఈ క్రమంలో తన పార్ట్నర్ను కోల్పోతాడు. అక్కడి నుంచి కథ వేగం పుంజుకుంటుంది. అసలు ఆస్పత్రిలో ఏం జరుగుతోంది? ఆ మిస్టరీని హీరో చేధించాడా? లేదా? అతడి సహచరుడు ఏమయ్యాడు? అన్నదే మిగతా కథ.ఎలా ఉందంటే?సినిమా ప్రారంభంలో మనం కూడా మిస్టరీ కోసం కళ్లు పెద్దవి చేసుకుని చూస్తాం. కానీ మూవీ ఎంత ముందుకు కదిలినా ఒక్క మిస్టరీ కూడా బయటపడదు. మరోవైపు హీరో అనారోగ్యానికి గురవుతుంటాడు. అతడి గతం తాలూకు ఊహలు, పీడకలలు ఆయన్ని వెంబడిస్తుంటాయి. దీనికి తోడు మైగ్రేన్.. ఈ నొప్పి నుంచి ఉపశమనం కలిగేందుకు వైద్యుడు టెడ్డీకి మందులిస్తాడు. ఈ మందులవల్ల తనను మానసిక రోగిని చేస్తున్నారేమోనన్న భయంతో హీరో వాటిని వేసుకునేందుకు నిరాకరిస్తాడు. ఇదంతా బాగానే ఉంటుంది.. కానీ అసలు ట్విస్ట్ క్లైమాక్స్లో రివీల్ చేస్తారు. అప్పుడు హీరోలాగే మనక్కూడా ఏది నిజం? ఏది అబద్ధం? అని కొంతసేపు అయోమయానికి గురవుతాం. చివరకు హీరో పరిస్థితి చూసి జాలిపడకుండా ఉండలేం. క్లైమాక్స్ కాస్త నిరుత్సాహానికి గురిచేసినా సినిమా మాత్రం ఆసక్తికరంగా కొనసాగుతుంది. హీరో యాక్టింగ్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వర్కవుట్ అయింది. వీలున్నప్పుడు కచ్చితంగా ఓసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు సబ్టైటిల్స్తో అందుబాటులో ఉంది. హాట్స్టార్, నెట్ఫ్లిక్స్లోనూ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. -
సంక్రాంతి సినిమాలన్నీ బ్లాక్బస్టర్ అవ్వాలి: ప్రభాస్
‘‘ది రాజా సాబ్’ సినిమాలో మా నానమ్మగా జరీనా వాహబ్గారు నటించారు. ఆమె డబ్బింగ్ చెబుతుంటే నా సీన్స్ మర్చిపోయి నానమ్మ సీన్స్ చూస్తుండిపోయా. ఈ సినిమాలో నాతోపాటు మా నానమ్మ కూడా ఒక హీరో. ఇది నానమ్మ–మనవడి కథ’’ అని ప్రభాస్ తెలిపారు. ఆయన హీరోగా రూ పొందిన చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 9న రిలీజ్ కానుంది. శనివారం నిర్వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘నేను, మారుతి కలిసినప్పుడు అన్నీ యాక్షన్ సినిమాలు అయిపోతున్నాయి... ఫ్యాన్ ్సని ఎంటర్టైన్ చేయాలన్నాను. ఫైనల్గా ఈ హారర్ కామెడీ సెట్ అయింది. నేనైతే మారుతిగారి రైటింగ్కి ఫ్యాన్ అయిపోయాను. క్లైమాక్స్ని పెన్ తో రాశావా? గన్ తో రాశావా? నిజం చెప్పు డార్లింగ్ (మారుతి). కొత్తపాయింట్ ఇది. ఈ సినిమాకి విశ్వప్రసాద్గారు హీరో. మూడేళ్లపాటు ఈ మూవీ తీసినప్పుడు.. అనుకున్న బడ్జెట్కంటే ఎక్కువ అవుతున్నా మేమైనా భయపడ్డాం కానీ ఆయన భయపడలేదు.. ఏంటి సార్ మీ ధైర్యం (నవ్వుతూ).ఈ మూవీ అనుకున్నప్పుడు తమన్ ఒక్కడే చేయగలడు... ఈ లెవల్ ఆర్ఆర్ చేయగలిగేవారు ఎవరున్నారు మనకి ఇండియాలో అనుకున్నాం. కెమెరామేన్ కార్తీక్గారు అద్భుతమైన వర్క్ చేశారు. రామ్–లక్ష్మణ్, సాల్మోన్ మాస్టర్స్ ఫైట్స్ ఇరగదీశారు. మనకి పదిహేనేళ్ల తర్వాత వినోదం అందిస్తున్నారు మారుతిగారు. మరి... చూసుకోండి. అందులోనూ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి సినిమాలన్నీ బ్లాక్బస్టర్ అవ్వాలి... మా ‘ది రాజా సాబ్’ కూడా అయిపోతే ఇంకా హ్యాపీ. ఇక వెరీ ఇంపార్టెంట్. సీనియర్ సీనియరే (సంక్రాంతి పోటీలో ఉన్న సీనియర్స్).సీనియర్ దగ్గర నుంచి నేర్చుకున్నదే మేం... సీనియర్స్ తర్వాతే మేం’’ అని చెప్పారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ– ‘‘రాజా సాబ్’ వెనక బలంగా నిలబడింది ఇద్దరు. ఒకరు ప్రభాస్గారు, మరొకరు విశ్వప్రసాద్గారు. ఈ సినిమా ఎవర్నీ నిరాశపరచదు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్గారు ప్రపంచమంతా గుర్తింపు తెచ్చుకున్నారు. మేము సౌతాఫ్రికాలో చిన్న ఊరిలో షూటింగ్ చేస్తుంటే, అక్కడి వారికి కూడా ప్రభాస్గారు తెలియడం మమ్మల్ని సర్ప్రైజ్ చేసింది. రాజమౌళిగారు కష్టపడి చేసినపాన్ ఇండియా ప్రయత్నం మా అందరికీ ఉపయోగపడుతోంది’’ అని చెప్పారు. టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో బిగ్గెస్ట్ స్టార్తో చేసిన బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇది. మూడేళ్లు కష్టపడి నిర్మించాం’’ అని పేర్కొన్నారు. క్రియేటివ్ ప్రోడ్యూసర్ ఎస్కేఎన్, నిర్మాత వై. రవిశంకర్, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్, నార్త్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని తదితరులుపాల్గొన్నారు. -
అంత భారమా?
హీరోయిన్లు ఏ కాస్త బరువు పెరిగినా... ట్రోలింగ్ మొదలవుతుంది. మీమ్స్ చుట్టుముట్టి వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. మరోవైపు ‘బరువు పెరగడం’ అనేది నటీమణుల కెరీర్కు కూడా బ్రేక్లు వేస్తుంది. ‘ఇంత బరువు మాత్రమే ఉండాలి... ఈ రంగులో ఉంటేనే అందంగా ఉన్నట్లు... ఇలా నడిస్తేనే నడక... ఇలా నవ్వితేనే నవ్వు’ ఇలాంటి కృత్రిమ కొలమానాలు చిత్రపరిశ్రమలో బలంగా ఉన్నాయి. ఇలాంటి కొలమానాలు వినడానికి ఇబ్బందిగా ఉండడం మాత్రమే కాదు కెరీర్ పరంగా ఆర్టిస్టు లకు నష్టం కలిగిస్తాయి. ఇందుకు తాజా ఉదాహరణ నటి రాధికా ఆప్టే. ‘అద్భుత నటి’గా పేరు తెచ్చుకున్న రాధిక ఒక మెగా హిట్ సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోయింది. ఇంతకీ ఏం జరిగింది? ఆమె మాటల్లోనే తెలుసుకుందాం...‘ఒక పెద్దప్రాజెక్ట్లో భాగమయ్యే అవకాశం వచ్చింది. నన్ను దృష్టిలో పెట్టుకునే స్క్రిప్ట్లో నా పాత్రను తీర్చిదిద్దారు. ఒక టూర్కు వెళ్లి వచ్చిన తరువాత నేను కాస్త బరువు పెరిగాను. అయితే అది నాకు ఇబ్బందికరమైన, అనారోగ్యకరమైన బరువేమీ కాదు. ఫొటోషూట్ తరువాత నా ఫొటోగ్రాఫ్స్ చూస్తూ.... దిస్ ఈజ్ సో ఫ్యాట్ అన్నారు. ఆప్రాజెక్ట్ నుంచి నన్ను తప్పించారు. ఆ సినిమా భారీ విజయాన్ని సాధించింది. మూడు, నాలుగు కిలోల బరువు మంచి అవకాశాన్ని కోల్పోయేలా చేసింది.లొంగిపోను.. బరువు పెరిగినప్పుడు బాధ పడతాను. బరువు తగ్గించుకోవాలనుకుంటాను.బరువు గురించి అతిగా ఆలోచించడం కూడా ఒక సమస్యే. ఈ సమస్య నాకు గతంలో లేదు. ఎందుకంటే నేను సహజ సౌందర్యాన్ని నమ్ముతాను. సహజ సౌందర్యం అనే భావనకు ఎప్పుడూ కట్టుబడి ఉంటాను. ఈ సంఘటన నన్ను మరింత దృఢంగా మార్చింది’. ఒక వైపు కెరీర్, మరోవైపు తాను నమ్ముకున్న విలువలు... ఈ అంతర్గత సంఘర్షణ చివరికి ఆప్టేను థెరపీ వరకు తీసుకువెళ్లింది.‘నేను నమ్ముకున్న విలువలకు కట్టుబడి ఉంటాను. అందానికి సంబంధించి మీ ఆలోచనలు, అభి్రపాయాలకు నేను లొంగిపోను’ అంటున్న రాధికా ఆప్టే వయసుకు సంబంధించి స్త్రీ, పురుషుల విషయంలో అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను ప్రశ్నించింది. మొత్తానికైతే... ‘ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్’ అనే భావన, హానికరమైన సౌందర్య ప్రమాణాలు నటీమణులపై ఎంత మానసిక ఒత్తిడి పెంచుతాయో చెప్పడానికి రాధికా ఆప్టే మాటలే సాక్ష్యం. -
డ్రీమ్ థియేటర్లో...
ప్రముఖ నటుడు శివ రాజ్కుమార్, ధనంజయ, ప్రియాంకా మోహన్ లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’. హేమంత్ ఎం. రావు దర్శకత్వంలో వైశాక్ జె. గౌడ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో ప్రియాంకా మోహన్ పాల్గొంటున్నారు.ఈ సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్స్ని విడుదల చేశారు. ‘‘వైవిధ్యమైన, ప్రత్యేకమైన కథా ప్రపంచం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేస్తాం’’ అని మేకర్స్ తెలిపారు. -
కొత్త సంవత్సరం... జోరుగా హుషారుగా...
క్యాలెండర్లో కొత్త సంవత్సరం కనిపించే సమయం ఆసన్నమైంది. అలాగే టాలీవుడ్ వెండితెర కూడా ప్రేక్షకులకు జోరుగా హుషారుగా సినిమాలు అందించేందుకు సిద్ధమైంది. ఆడియన్స్కు మస్త్ మజానిచ్చే సినిమాలు రిలీజ్కు రెడీ అయ్యాయి. సో... జనవరిలో సినిమాల జాతర అనొచ్చు. మరి... న్యూ ఇయర్ రోజు ఏయే సినిమాలు రెడీ అవుతున్నాయి... సంక్రాంతి బరిలో నిలిచిన స్టార్స్ సినిమాలు, వాటి ఫైనల్ రిలీజ్ డేట్లపై ఓ లుక్ వేయండి.మీలాంటి యువకుడి కథ శ్రీనందు, యామినీ భాస్కర్ లీడ్ రోల్స్లో నటించిన తాజా చిత్రం ‘సైక్ సిద్ధార్థ్’. ‘మీలాంటి యువకుడి కథ’ అనేది ఈ సినిమా ట్యాగ్లైన్. శ్రీనందు, శ్యామ్ సుందర్ రెడ్డిలతో కలిసి సురేష్ప్రోడక్షన్స్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సంస్థలు నిర్మించిన ఈ చిత్రాన్ని తొలుత డిసెంబరు 12న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ డిసెంబరు 12న ‘అఖండ 2’ వంటి భారీ బడ్జెట్ సినిమా విడుదల కావడంతో ‘సైక్ సిద్ధార్థ్’ను జనవరి 1కి వాయిదా వేశారు. ఓ కుర్రాడి ప్రేమ, వ్యాపారం, వ్యాపారంలో అతని ఫెయిల్యూర్, అతని కెరీర్ వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. నరసింహా, ప్రియాంకా, రెబెకా శ్రీనివాస్, సుకేష్, వాడేకర్ నర్సింగ్, బాబీ, సాక్షి ఆత్రీ చతుర్వేది ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.వన వీర అవినాష్ తిరువీధుల హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘వన వీర’. శంతను పత్తి సమర్పణలో అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి. అంకిత్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను తొలుత డిసెంబరు 26న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ క్రిస్మస్ ఫెస్టివల్కు ఆరేడు సినిమాలు విడుదలైన నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ను జనవరి 1కి వాయిదా వేశారు.అలాగే ఈ సినిమాకు తొలుత ‘వానర’ అనే టైటిల్ను అనుకున్నారు. కానీ సెన్సార్ ఇబ్బందులు తలెత్తడం వల్ల ‘వన వీర’ అనే టైటిల్తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సిమ్రాన్ చౌదరి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో నందు విలన్ రోల్ చేశారు. కోన వెంకట్, సత్య, ఆమని, ‘ఖడ్గం’ పృథ్వీ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ ఇచ్చారు. ఓ కుర్రాడి ప్రేమ, ఆ కుర్రాడి బైక్ దొంగతనం జరగడం వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని తెలిసింది.సీఐడీ ఆఫీసర్ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘త్రిముఖ’. ఈ సినిమాకు రాజేశ్ నాయుడు దర్శకత్వం వహించారు. శ్రీదేవి మద్దాలి, రమేశ్ మద్దాలి నిర్మించిన ఈ సినిమా జనవరి 2న రిలీజ్ కానుంది. యోగేష్ కల్లె, అకృతి అగర్వాల్, సీఐడీ ఆదిత్య శ్రీనివాస్, రాజేంద్రన్, అషు రెడ్డి ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. వరుస మిస్సింగ్ కేసులను సీఐడీ శివానీ రాథోడ్ ఎలా సాల్వ్ చేసింది? అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం అని తెలుస్తోంది. ఈ చిత్రంలో శివానీగా సన్నీ లియోన్ నటించారు.చేయని తప్పుకు నిందిస్తే... బాలనటుడిగా మెప్పించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నీలకంఠ’. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ ఈ సినిమాలో హీరోయిన్స్గా నటించారు. తాను తప్పు చేయకపోయినా ఊరు ఊరంతా హీరోని నిందిస్తే, ఆ హీరో తనపై పడిన నిందను ఎలా తుడిపేసుకున్నాడు? అనే కోణంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఎమ్. మమత, ఎమ్. రాజరాజేశ్వరిల సమర్పణలో మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి ఈ సినిమాను నిర్మించారు. రాకేశ్ మాధవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ది రాజా సాబ్ రెడీ జనవరి నెల అంటే సంక్రాంతి సీజన్. సంక్రాంతి సీజన్ అంటే తెలుగు సినిమా పండగ. వెండితెరపై ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ అనే చెప్పవచ్చు. ఈ సంక్రాంతి ఫెస్టివల్ సమయంలో ముందుగా రాజా సాబ్గా ప్రభాస్ థియేటర్స్లోకి వస్తున్నారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపోందిన ఫ్యాంటసీ హారర్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ఈ చిత్రం జనవరి 9న విడుదల కానుంది. ఇందులో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించగా, సంజయ్ దత్, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు.టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ నిర్మించారు. ఈ హారర్ కామెడీ సినిమా ప్రధానంగా తాతా–మనవడి ఎమోషన్ నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. ఇందులో తాతగా సంజయ్ దత్, మనవడిగా ప్రభాస్ నటించారని తెలిసింది. అలాగే వారసత్వపు ఆస్తి అనేది కూడా ఈ సినిమాలోని ప్రధాన కథాంశమని సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ద్వారా స్పష్టమౌతోంది. మన శంకర వరప్రసాద్గారు వస్తున్నారు చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ట్యాగ్లైన్. ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ చిత్రంలో శంకర వరప్రసాద్గా చిరంజీవి టైటిల్ రోల్ చేయగా, శశిరేఖ పాత్రలో నయనతార నటించారు. ఈ సినిమాలో చిరంజీవి, నయనతారలు భార్యాభర్తలుగా కనిపిస్తారు. హీరో వెంకటేశ్ కీలక పాత్రలో నటించగా, క్యాథరీన్, వీటీవీ గణేశ్ ఇతర పాత్రల్లో నటించారు.ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, ఇన్వెస్టిగేషన్ డ్రామా ప్రధానాంశాలుగా ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ చిత్రంలో చిరంజీవి, వెంకటేశ్ తొలిసారిగా సిల్వర్స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వీరి కాంబినేషన్లో ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ కూడా ఉంది. ఈ పాట అభిమానులకు వెండితెరపై ఓ ఫీస్ట్ అనే చెప్పవచ్చు. అలాగే చిరంజీవి, వెంకటేశ్ కలిసి ఈ సినిమాలో విలన్స్పై చేసే ఫైట్ కూడా హైలైట్గా ఉండనుందని సమాచారం. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించారు.భర్త మహాశయులకు విజ్ఞప్తి ఈ సంక్రాంతి పండక్కి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చేస్తున్నారు రవితేజ. ఆ విజ్ఞప్తి ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్కు వెళ్లాల్సిందే. రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘భర్తమహాశయులకు విజ్ఞప్తి’. ఈ చిత్రంలో డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. హాస్యనటుడు సత్య, వెన్నెల కిశోర్, సునీల్ ఇతర కీలక పాత్రలో నటించారు. కిశోర్ తిరుమల డైరెక్షన్లో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో రామసత్య నారాయణ అనే పాత్రలో రవితేజ కనిపిస్తారు. రవితేజ, డింపుల్ హయతి భార్యా భర్తలుగా కనిపిస్తారు. ఆల్రెడీ వివాహం చేసుకున్న రామసత్యానారాయణ స్పెయిన్ వెళ్లడం, అక్కడ ఓ అమ్మాయి పరిచయం కావడం, అలా పరిచయమైన అమ్మాయి రామసత్యనారాయణ వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేయడం వంటి ఆసక్తికర, వినోదాత్మక సన్నివేశాలతో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. నారీ నారీ నడుమ మురారి! ఒకే ఆఫీసులో మాజీ ప్రేమికురాలు, ప్రజెంట్ లవర్ ఉంటే ఆ అబ్బాయి పరిస్థితి ఏంటో ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాలో చూడొచ్చంటున్నారు శర్వానంద్. ఆయన హీరోగా నటించిన ఈ వినోదాత్మక చిత్రం జనవరి 14 సాయంత్రం నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.రాజుగారి కథ ఏంటో! ‘అనగనగా ఒక రాజు’ అంటూ ఆడియన్స్కు థియేటర్స్లో వినోదాల విందు పంచబోతున్నాం అంటున్నారు నవీన్ పోలిశెట్టి. ఈ హీరో నటించిన ఈ యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనవరి 14న రిలీజ్ కానుంది. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ప్రేమ, పెళ్లి, హాస్యం, కుటుంబ భావోద్వేగాల మేళవింపుతో ఈ సినిమా తెరకెక్కింది. పెళ్లి నేపథ్యంలో వచ్చే సీన్స్, సాంగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుసాయని తెలిసింది. ఓం శాంతి శాంతి శాంతిః భార్యాభర్తల అనుబంధం, కుటుంబ విలువలు... వంటి అంశాలతో రూపోందిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతి:’ ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్లుగా నటించారు. ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించారు. సృజన్ ఎర్రబోలు, వివేక్ కృష్ణని, అనూప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్, కిశోర్, బాల సౌమిత్రి నిర్మించిన ఈ చిత్రం జనవరి 23న విడుదల కానుంది.ఇలా జనవరి నెలలో రిలీజ్ కానున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి.⇒ 2025లో రీ రిలీజ్ల హవా జోరుగా సాగింది. చిరంజీవి ‘జగదేకవీరుడు అతిలోకసుందరి, కొదమసింహం’, నాగార్జున ‘శివ’, మహేశ్బాబు ‘ఖలేజా’, ప్రభాస్ ‘వర్షం’ వంటి టాప్ హీరోల సినిమాల రీ–రిలీజ్లు బాగానే జరిగాయి. ఇక 2026 ఏడాది ప్రారంభంలోనే రీ–రిలీజ్ల హవా మొదలైపోయింది. వెంకటేశ్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన బ్లాక్బస్టర్ సినిమా ‘నువ్వు నాకు నచ్చావ్’. కె. విజయభాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ నిర్మించారు. ఈ సినిమా 2026 జనవరి 1న రీ రిలీజ్ కానుంది.అలాగే మహేశ్బాబు హీరోగా నటించిన బ్లాక్బస్టర్ మూవీ ‘మురారి’ 4కే వెర్షన్ను న్యూ ఇయర్ కానుకగా ఒక రోజు ముందుగానే... అంటే ఈ డిసెంబరు 31న రీ రిలీజ్ కానుంది. అంటే... జనవరి 1న కూడా ‘మురారి’ సినిమా థియేటర్స్లో ఉంటుంది. కృష్ణవంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, సోనాలీ బ్రిందే హీరోయిన్గా నటించారు. ఎన్. దేవీ ప్రసాద్, రామలింగేశ్వరరావు, గోపీ నందిగం ఈ సినిమాను నిర్మించారు.ఆల్కహాల్ వాయిదా?‘అల్లరి’ నరేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆల్కహాల్’. ఈ కామెడీ సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ సినిమాకు మెహర్ తేజ్ దర్శకుడు. ఓ వ్యక్తి జీవితం ఆల్కహాల్ వల్ల ఏ విధంగా ప్రభావితమైంది? అతను ఆల్కహాల్ తీసుకోవడానికి ముందు ఎలా ఉండేవాడు? ఆ తర్వాత అతని ప్రవర్తన ఏ విధంగా మారింది? అన్న అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని సమాచారం. రుహానీ శర్మ, నిహరిక ఎన్.ఎమ్, సత్య, గిరీష్ కులకర్ణి ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాను జనవరి 1న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మార్పు ఉండొచ్చని తెలుస్తోంది. మరి... జనవరి 1న ఈ సినిమా రిలీజ్ కాకపోతే అదే నెలలోనే మరో రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటిస్తారా? లేక వేరే నెలలో డేట్ ఫిక్స్ అవుతుందా? అనే విషయంపై మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.అనువాదాలూ రెడీఅనువాద సినిమాలు కూడా ఈ జనవరి నెలలో బాగానే ఉన్నాయి. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా తెలుగులో ‘జన నాయకుడు’ పేరుతో విడుదల కానుంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, మమితా బైజు, బాబీ డియోల్, ప్రకాశ్రాజ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. కేవీఎన్ప్రోడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 9న రిలీజ్ కానుంది. అలాగే శివ కార్తీకేయన్ హీరోగా సుధ కొంగర దర్శకత్వం వహించిన ‘పరాశక్తి’ సినిమా జనవరి 10న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో శ్రీలీల, అధర్వ, ‘జయం’ రవి ప్రధాన పాత్రల్లో నటించారు.సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ లీడ్ ల్స్లో నటించిన ‘గత వైభవం’ సినిమా కన్నడ, తెలుగు భాషల్లో రూపోందింది. ఈ సినిమా కన్నడ వెర్షన్ ఆల్రెడీ రిలీజ్ కాగా, తెలుగు వెర్షన్ను జనవరి 1న రిలీజ్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ప్రేమ, పునర్జన్మ వంటి అంశాల నేపథ్యంలో పోందిన ఈ సినిమాకు సునీ దర్శకత్వం వహించారు. నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్యా రెడ్డి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. మరికొన్ని అనువాద చిత్రాలు కూడా ఈ జనవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. – ముసిమి శివాంజనేయులు -
రాసిపెట్టుకోండి.. 'రాజాసాబ్'కి రూ.2000 కోట్లు వస్తాయి: సప్తగిరి
సెలబ్రిటీలు స్టేజీ ఎక్కితే చాలా మాట్లాడేస్తుంటారు. కొన్నిసార్లు రాబోయే సినిమాల గురించి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చేస్తుంటారు. మూవీ హిట్ అయిందా సరేసరి లేదంటే మాత్రం ఈ వ్యాఖ్యలు రివర్స్ కొడుతుంటాయి. రీసెంట్ టైంలో శివాజీ, స్టేజీపై మాట్లాడుతూ మహిళలపై ఎలాంటి కామెంట్స్ చేశాడో చూశాం. ఇప్పుడు కమెడియన్ సప్తగిరి మాట్లాడుతూ 'రాజాసాబ్' గురించి ఆశ్చర్యపోయే వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి.'మంచి మనసున్న మారాజు మారుతి. మకుటం లేని మహారాజు ప్రభాస్ అన్నతో కలిసి తీసిన ఈ 'రాజాసాబ్' సినిమా.. ఈ సంక్రాంతికి గులాబ్ జామ్లు గలగలాడించకపోతే.. అలాగే కోడి గుడ్లు కూడా డబుల్ ఆమ్లెట్లు అవుతాయి జాగ్రత్త. రాసిపెట్టుకోండి. 'ద రాజాసాబ్'.. రూ.2000 కోట్లు కొల్లగొట్టకపోతే నేను ఇస్తా నా డబ్బులు, ఆ డబ్బులు మనందరం కలిసి ఇద్దాం' అని సప్తగిరి కామెంట్స్ చేశాడు. కచ్చితంగా వీటిపై మీమ్స్ గానీ ట్రోల్స్ గానీ రావడం గ్యారంటీ.'రాజాసాబ్' సినిమాని హారర్ ఫాంటసీ స్టోరీతో తీశారు. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ నటించారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. తమన్ సంగీతమందించాడు. మారుతి దర్శకుడు. పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ప్రభాస్ చేసిన పూర్తిస్థాయి కమర్షియల్ మూవీ ఇది. జనవరి 9న థియేటర్లలోకి వస్తోంది. చూడాలి మరి ఈ మూవీ సప్తగిరి చెప్పినట్లు రూ.2 వేల కోట్లు సాధిస్తుందో లేదో?#TheRajaSaab రెండు వేల రూపాయలు కొల్ల కొట్టే సినిమాఅలా అవ్వకపోతే నేను మీరు కలిపి ఇద్దాం..!#Prabhas pic.twitter.com/UlRXWfji7f— Telugu70mm (@Telugu70mmweb) December 27, 2025 -
ఆషికా అందాల జాతర.. దుబాయి ట్రిప్లో హెబ్బా
రెడ్ డ్రస్లో అందాల ఆరబోస్తున్న ఆషికాదుబాయి ట్రిప్ జ్ఞాపకాల్లో హెబ్బా పటేల్ఈ ఏడాది మెమొరీస్ షేర్ చేసిన పూజా కన్నన్చీరలో రాశీ సింగ్ నాభి గ్లామర్ డోస్పొట్టి స్కర్ట్తో స్టెప్పులేస్తున్న దివ్యభారతి View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Pooja Kannan (@poojakannan_97) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) -
'బ్యాడ్ గాళ్స్' షోలు పెంచుతున్నాం: దర్శకనిర్మాతలు
రేణు దేశాయ్, అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బ్యాడ్ గాళ్స్'. ఫణి ప్రదీప్ దర్శకత్వం వహించాడు. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. క్రిస్మస్ పండగకు థియేటర్లలోకి వచ్చింది. తాజాగా చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసింది.దర్శకుడు ఫణి ప్రదీప్(మున్నా) మాట్లాడుతూ .. 'బ్యాడ్ గాళ్స్' నిడివి విషయంలో చిన్నది కానీ కంటెంట్ విషయంలో చాలా పెద్దది. ఆడియెన్స్ మా మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత పోటీలో వచ్చినా హిట్ కొడతామని మా నిర్మాతలు నమ్మారు. ఇప్పుడే అదే నిజమైంది. ప్రస్తుతం థియేటర్లు పెంచే పనుల్లో వాళ్లు ఉన్నారు. ఇది అమ్మాయిల కోసం తీసిన చిత్రం. జాతిరత్నాలు మూవీని అమ్మాయిలతో తీస్తే ఎలా ఉంటుందో ఇది అలా ఉంటుంది అని చెప్పాడు. -
టికెట్ రేట్లు ఎక్కువ ఉంటే సినిమాలు చూడకండి: ప్రకాశ్ రాజ్
టాలీవుడ్లో ఈ ఏడాది ఏదైనా ఓ విషయం గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారంటే అది టికెట్ రేట్ల గురించే. పెద్ద సినిమాల రిలీజయ్యే ప్రతిసారి ఈ అంశం పెద్ద చర్చకు దారితీసింది. కొన్నిసార్లు అయితే ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం లాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిపై ఇప్పటికే చాలా అభిప్రాయాలు వినిపించాయి. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ మాత్రం టికెట్ ధరలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: చరణ్కి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో సల్మాన్ సినిమా.. టీజర్ రిలీజ్)సీఐటీయూ మహాసభల కోసం వైజాగ్ వచ్చిన ఈ నటుడు.. మీడియాతో మాట్లాడారు. మహిళలపై శివాజీ చేసిన చిల్లర వ్యాఖ్యల గురించి ఘాటుగా స్పందించారు. పురుషుల వల్ల మహిళలకు తరతరాలుగా అన్యాయం జరుగుతోంది, ఓ వేదికపై అభిప్రాయాలు వ్యక్తపరిచేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ విషయంలో అనసూయకే సపోర్ట్ చేస్తానని చెప్పారు. ఐబొమ్మ రవి దొంగతనం చేశాడని, అది ముమ్మాటికీ తప్పే అని చెప్పుకొచ్చాడు.ఇలా మాట్లాడుతున్న టైంలోనే.. సినిమా టికెట్ ధరలు ప్రేక్షకులకు భారంగా మారుతున్నాయి? దీనిపై మీ స్పందన ఏంటని ప్రకాశ్ రాజ్ని అడగ్గా.. అయితే సినిమాలు చూడకండి. ఎవరి వ్యాపారం వాళ్లది అని కుండబద్దలు కొట్టేశాడు. చూస్తుంటే ఈ వ్యాఖ్యలు కచ్చితంగా వివాదానికి దారితీసేలా ఉన్నాయి. ఎందుకంటే ప్రేక్షకుడిని థియేటర్కి ఎలా తీసుకురావాలా అని నిర్మాతలు ఆలోచిస్తుంటే.. ఈ నటుడు మాత్రం ఇలా ఆశ్చర్యకర కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: ఐసీయూలో టాలీవుడ్ 'చిన్న' సినిమా)"Don't watch Films if you think they're Expensive. Cinema is a Business."- #PrakashRaj pic.twitter.com/zYYgejLF96— Movies4u Official (@Movies4u_Officl) December 27, 2025 -
మోహన్లాల్కు కలిసిరాని డిసెంబర్.. డిజాస్టర్ తప్పదా!
యంగ్ హీరోలను సైతం అబ్బురపరిచేలా వరుస విజయాలు అందుకున్నాడు సీనియర్ హీరో మోహన్లాల్. ఒకటా రెండా.. ఈ ఏడాది ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ హిట్లే! కానీ చివరగా ఓ డిజాస్టర్ సినిమాతో 2025కి ముగింపు పలుకుతున్నాడు. అదే విషాదకరం! మరో విషయమేంటంటే.. డిసెంబర్లో రిలీజైన సినిమాలు ఆయనకు అస్సలు అచ్చిరావడం లేదు! అదెలాగో ఓసారి చూసేద్దాం...అన్నీ హిట్లే..తెలుగులో హీరోలు ఏడాదికో, రెండేళ్లకోసారో సినిమా చేస్తారు. కానీ, మలయాళంలో అలా కాదు.. వాళ్లు ఏడాదికి నాలుగైదు సినిమాలైనా ఫటాఫట్ షూట్ చేస్తుంటారు, ఆ వెంటనే రిలీజ్ చేస్తారు. అలా 2025లో మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఎల్ 2: ఎంపురాన్, తుడరుమ్, హృదయపూర్వం.. బాక్సాపీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి హిట్లుగా నిలిచాయి. కానీ రూ.70 కోట్లు పెట్టి తీసిన వృషభ మూవీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర దారుణంగా చతికిలపడింది. మొదటిరోజు కనీసం కోటి రూపాయలు కూడా రాబట్టలేకపోయింది.లుక్పై విమర్శలుఅదేంటో కానీ డిసెంబర్ నెల మోహన్లాల్కు ఇటీవలి కాలంలో పెద్దగా కలిసిరావడం లేదు. 2018 డిసెంబర్ ఓడియన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మోహన్లాల్. కలెక్షన్స్పరంగా సినిమా మంచి హిట్టయినప్పటికీ మోహన్లాల్ లుక్పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. 2021 డిసెంబర్లో రూ.100 కోట్ల బడ్జెట్ మూవీ మరక్కర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మోహన్లాల్. సగం కూడా రాలే!ఈ సినిమా రిలీజ్కు ముందే మూడు జాతీయ అవార్డులు అందుకుంది. భారీ ఓటీటీ డీల్స్ వచ్చినా కూడా థియేటర్లోనే ముందుగా రిలీజ్ చేయాలని సినిమాటీమ్ పట్టుబట్టింది. వారి అంచనాలను తలకిందులు చేస్తూ మరక్కర్ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.45 కోట్లు మాత్రమే రాబట్టింది. అంటే బడ్జెట్లో సగం కూడా తిరిగి రాలేదు.దర్శకుడిగా డిజాస్టర్వందలాది సినిమాల్లో తన సత్తా ఏంటో చూపించిన మోహన్లాల్ బరోజ్ చిత్రంతో దర్శకుడిగా మారాడు. 2024 డిసెంబర్ 25న విడుదలైన ఈ మూవీ ఘోరంగా చతికిలపడింది. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం రూ.15 కోట్లు మాత్రమే కలెక్షన్స్ రాబట్టింది.ఈసారి కూడా పరాజయమే!సరిగ్గా ఏడాది తర్వాత అదే తేదీ (డిసెంబర్ 25న) వృషభతో పలకరించాడు ఈ స్టార్ హీరో. కలెక్షన్స్ అంతంతమాత్రంగానే ఉన్నాయి. బుకింగ్స్ పేలవంగా ఉన్నాయి. దీంతో ఈసారి కూడా మళ్లీ ఘోర పరాజయం తప్పేలా కనిపించడం లేదు. మరి మోహన్లాల్ ఈ డిసెంబర్ సెంటిమెంట్ ఎప్పుడు బ్రేక్ చేస్తాడో చూడాలి! -
ఐసీయూలో టాలీవుడ్ 'చిన్న' సినిమా
ఓ రాజ్యం ఉంది. అందులో రాజు, రాణి, మంత్రి, సైనికులు, ప్రజలు.. ఇలా అందరూ ఉన్నారు. రాజుకి అందరూ జేజేలు పలుకుతారు. కానీ సైనికులు లేకపోతే ఆయనకు విలువ ఎక్కడిది? ఇలా ఆలోచించేవాళ్లు ఎంతమంది? టాలీవుడ్ పరిస్థితి కూడా ఇలానే తయారైనట్లు కనిపిస్తోంది! రాజు లాంటి స్టార్ హీరోల మూవీస్ని పట్టించుకుంటున్న ప్రేక్షకుడు.. సైనికుడు లాంటి చిన్న సినిమాని లైట్ తీసుకుంటున్నాడు. ఇంతకీ దీనికి కారణమేంటి? ఇండస్ట్రీలో అసలేం జరుగుతోంది?ఒకప్పుడు కూడా తెలుగులో స్టార్ హీరోలు ఉన్నారు. వాళ్లు సినిమాలు చేసేవారు. కానీ ఎప్పుడూ పెద్దా చిన్నా అని తేడా ఉండేది కాదు. తెలుగు మూవీ అని మాత్రమే అని మాట్లాడుకునేవారు. ఎప్పుడైతే పాన్ ఇండియా ట్రెండ్ మొదలైందో అప్పటినుంచి రోజురోజుకీ టాలీవుడ్లో చిన్న చిత్రాల పరిస్థితి అంతకంతకు దిగజారుతూ వచ్చింది. చూసే ప్రేక్షకుల ఆలోచన విధానంలోనూ చాలా మార్పులొచ్చాయి.ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా మాత్రమే. దీంతో వీకెండ్ వస్తే చాలు థియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపించేవారు. చిన్నపెద్దా మూవీస్ అన్నీ చూసేవారు. ఇప్పుడు మీడియం బడ్జెట్ సినిమాలు అనగానే ఎలానూ నెలరోజులకు ఓటీటీల్లోకి వచ్చేస్తాయిగా, ఇంట్లో చూసుకోవచ్చులే అని చాలామంది.. ముందే ఫిక్స్ అయిపోతున్నారు. అందుకే మీడియం బడ్జెట్ చిత్రాల్ని థియేటర్లలో రిలీజ్ చేసినా సరే వాటికి పెద్దగా ఆదరణ ఉండట్లేదు.గీతా ఆర్ట్స్, సితార, మైత్రీ, ఎస్వీసీ లాంటి పెద్ద సంస్థలు నిర్మించే మీడియం బడ్జెట్ సినిమాలకు కాస్తోకూస్తో హైప్ ఉంటుంది. అందుకు తగ్గట్లే వాళ్లు ప్రమోషన్ చేస్తుంటారు. ఖర్చు విషయంలో అస్సలు వెనకాడరు. స్టార్స్తోనూ ప్రమోషన్స్ చేయిస్తారు. దీంతో ఆయా పెద్ద నిర్మాణ సంస్థల నుంచి వచ్చే చిత్రాలకు మాత్రం అంతో ఇంతో ఆదరణ దక్కుతోంది. మిగిలిన వాటి వైపు ఆడియెన్స్ చూడటమే గగనమైపోతోంది.మూవీ టీమ్ చేసే కొన్ని పనులు కూడా చిన్న సినిమాలని ప్రేక్షకులు లైట్ తీసుకునేలా చేస్తున్నాయి. సినిమా రిలీజ్ కావడమే లేటు.. మా మూవీ తోపు, బంపర్ హిట్ అని సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకుంటున్నారు. కంటెంట్ ఉంటే పర్లేదు లేదంటే మాత్రం.. వీటిని చూసి నమ్మి, థియేటర్కి వెళ్లిన చాలామంది.. పలుమార్లు మోసపోయారు. ఇలా జరిగిన తర్వాత చిన్న సినిమా అంటే ఇంతే అని ఓ అభిప్రాయం వాళ్లకు కచ్చితంగా ఏర్పడుతుంది.చిన్న చిత్రాలంటే బడ్జెట్ తక్కువే. అందుకు తగ్గట్లే క్వాలిటీ, కంటెంట్ ఉంటుంది. ప్రస్తుతం ఓటీటీల్లో ఇంటర్నేషనల్ క్వాలిటీ కంటెంట్ చూస్తున్న ప్రేక్షకుడు.. మన నిర్మాతలు తీసే రొటీన్ రొట్టకొట్టుడు చిత్రాలకు ఎందుకు వెళ్తాడు? ఈ విషయంపై దర్శకనిర్మాతలు కచ్చితంగా దృష్టిపెట్టాలి. రెగ్యులర్ కమర్షియల్, థ్రిల్లర్, హారర్ చిత్రాలు తీస్తే.. పరుగెత్తుకుని వచ్చి చూసేసే రోజులు కావివి. కామెడీ కావొచ్చు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కావొచ్చు సమ్థింగ్ డిఫరెంట్ ఉంటేనే ఆడియెన్స్, థియేటర్కి వచ్చి చూస్తారు. లేదంటే కనీసం ఆ వైపు కూడా చూడరు.చిన్న సినిమాల్లో స్టార్స్ పెద్దగా ఉండరు. సదరు హీరో లేదా హీరోయిన్ కోసం థియేటర్కి వెళ్లి చూడాలా? అని సగటు ప్రేక్షకుడు కచ్చితంగా అనుకుంటాడు. స్టార్ హీరోల సినిమాలు రిలీజైనప్పుడు ఇంతింత టికెట్ రేట్లు పెట్టి చూస్తారు. వాటికే మొత్తం ఖర్చు పెట్టేస్తే చిన్న చిత్రాలు వచ్చినప్పుడు చూసేందుకు డబ్బులు ఎక్కడుంటాయి?ఈ వీకెండే తీసుకుందాం. ఒకటి రెండు కాదు అరడజనుకు పైగా చిన్న సినిమాలు ఒకేసారి రిలీజయ్యాయి. వీటిలో ఒక్కదానికి మాత్రమే పాజిటివ్ టాక్ వచ్చింది. మిగిలిన వాటికి మిక్స్డ్, నెగటివ్ టాక్ వచ్చింది. ఇలా ముకుమ్మడి విడుదల కూడా మీడియం బడ్జెట్ చిత్రాల్ని చంపేస్తోందని చెప్పొచ్చు. ఇలా చాలా చాలా అంశాలు టాలీవుడ్లో చిన్న సినిమాలకు రోజురోజుకీ శాపంగా మారుతున్నాయా అనిపిస్తోంది! -
‘బిగ్ బాస్’కి రుణపడి ఉంటా : సంజన
"ఓ ఐదేళ్ళ క్రితం నా ప్రమేయం లేకుండా జరిగిన ఓ సంఘటన నా జీవితాన్ని,కెరీర్ ని ఒక కుదుపు కుదిపేసింది. అయితే స్వతహా నేను ఫైటర్ ని. అందుకే ప్రతికూల పరిస్థితులతో నేను పెద్ద పోరాటమే చేశాను. చివరికి విజేతగా నిలిచాను" అంటూ భావోద్వేగానికి లోనయ్యారు బిగ్ బాస్ సీజన్-9లో టాప్ 5 ఫైనలిస్ట్ గా నిలిచిన ప్రముఖ హీరోయిన్ సంజనా గర్లాని. ఒడిదుడుకుల్లో తన వెన్నంటి నిలిచిన తన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు, అభిమానులకు ఆమె ఈసందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు. బిగ్ బాస్ సీజన్ -9లో టాప్ 5 ఫైనలిస్ట్ గా నిలిచిన సంజన మీడియాతో ప్రత్యేకంగా సమావేశమై, బిగ్ బాస్ అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు.బిగ్ బాస్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, ఈ అనుభవంతో తన కెరీర్ లో ఫ్రెష్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్నానని ఆమె తెలిపారు. ముఖ్యంగా జీవితంలో తాను మళ్ళీ గర్వంగా తలెత్తుకుని తిరిగేందుకు కారణంగా నిలిచిన బిగ్ బాస్ కి ఎప్పటికీ ఋణపడి ఉంటానని సంజనా ప్రకటించారు. బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జునకు ఈ షోలో పాల్గొన్నాక మరింత పెద్ద ఫ్యాన్ అయిపోయానని ఆమె పేర్కొన్నారు. ఇకపై తెలుగు సినిమాలపై మరింత దృష్టి సారిస్తానని, ఇప్పటికే కొన్ని ఎంక్వైరీస్ వచ్చాయని అన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ "బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై"లో త్రిష చెల్లెలిగా నటించిన సంజనా.... ఆ చిత్రంలోని ఓ పాపులర్ డైలాగ్ చెప్పి, అభిమానులను అలరించారు. తనను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ గర్వపడేలా ఇకపై నడుచుకుంటానని సంజనా అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన 'విజనరీ వౌస్' కి సంజనా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు -
2025లో 'వైరల్' వయ్యారి వీళ్లే..
ఈ ఏడాది బాగా క్లిక్కయిన సాంగ్స్లో వైరల్ వయ్యారి ఒకటి. యంగ్ హీరోయిన్ శ్రీలీల స్టెప్పులు.. పాట రిథమ్.. అన్నీ సరిగ్గా సెట్టయ్యాయి. అందుకే ఆ పాట అంత వైరల్ అయింది. ఈ సాంగ్లో.. ఇన్స్టాగ్రామ్లో నా ఫాలోయింగు చూశావంటే మైండ్ బ్లోయింగు.. ఫాలోవర్స్ అందరికీ నేనే డార్లింగు నేనేమీ చేసినా ఫుల్లు ట్రెండింగు అన్న లిరిక్స్ ఉంటాయి. అన్నట్లుగానే కొందరు పూసలమ్ముకుని ఫేమస్ అయితే మరికొందరు సెలబ్రిటీలతో లవ్లో పడి వైరల్ అయ్యారు. అలా ఈ ఏడాది సోషల్ మీడియాలో వైరల్ అయిన మహిళలెవరో చూసేద్దాం..మోనాలిసామోనాలిసా.. మొన్నటివరకు పూసలమ్ముకునే అమ్మాయి. కానీ ఇప్పుడు సినిమా హీరోయిన్. మధ్యప్రదేశ్కు చెందిన మోనాలిసా.. ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో పూసల దండలు అమ్ముకునేందుకు వెళ్లింది. కానీ తన తేనెకళ్లతో అందరి దృష్టిలో పడింది. ముఖ్యంగా సోషల్ మీడియాలోకి ఎక్కింది. ఇంకేముంది రాత్రికిరాత్రే స్టార్ అయిపోయింది. ఒక సాంగ్లో నటించడంతో పాటు హిందీ, తెలుగు భాషల్లో హీరోయిన్గా సినిమాలు చేస్తోంది.ఆర్యప్రియ భుయన్కేవలం ఒకే ఒక్క ఎక్స్ప్రెషన్తో వైరల్ అయిపోయింది ఆర్యప్రియ భుయన్. ఈ ఏడాది ఏప్రిల్లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన ఓ మ్యాచ్కు అందరిలాగే ఆర్యప్రియ కూడా హాజరైంది. మహేంద్ర సింగ్ ధోనీ అవుట్ అయినప్పుడు ఆమె కోపంతో ఓ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. కెమెరామన్ దాన్ని క్యాప్చర్ చేయడం.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవడం ఇట్టే జరిగిపోయింది. అలా ఒక్క వీడియోతో ఓవర్నైట్ స్టార్ అయింది.గౌరీ స్ప్రాట్బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్కు ఇదివరకే రెండు పెళ్లిళ్లవగా.. ఇద్దరు భార్యలకు విడాకులిచ్చేశాడు. మూడో పెళ్లి ఆలోచన లేదంటూనే ఓ మహిళతో ప్రేమలో పడ్డాడు. ఆవిడే గౌరీ స్ప్రాట్. ముంబైలో ఓ సెలూన్ నడుపుతూ ప్రైవేట్ లైఫ్ గడుపుతున్న గౌరీ.. ఆమిర్తో ప్రేమ వ్యవహారం వల్ల సెన్సేషన్గా మారింది.అలీషా ఓరీఈమె కూడా ఐపీఎల్ మ్యాచ్ ద్వారా క్లిక్ అయిన బ్యూటీనే! అలీషా కేకేఆర్ (కోల్కతా నైట్ రైడర్స్) అభిమాని. వెస్ట్ ఇండీస్ క్రికెట్ దిగ్గజం డ్వేన్ బ్రావోతో కలిసి అలీషా స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దీంతో ఎవరీ మిస్టరీ గర్ల్ అని నెటిజన్లు తెగ వెతికేసి తనను వైరల్ చేశారు. అలీషా మోడల్, మేకప్ ఆర్టిస్ట్. తను 2021లో మిసెస్ ఇండియా లీగసీ టైటిల్ గెల్చుకుంది. 2023లో జరిగిన మిసెస్ యూనివర్స్ 2022 పోటీల్లో మిసెస్ పాపులర్ 2022 టైటిల్ అందుకుంది. Alisshaa Ohri 'Eid ka Chand' girl with DJ Bravo was unexpected but exciting to see pic.twitter.com/QN98UJMURO— Kashish (@kaha_jaa_rhe) April 9, 2025 మహికా శర్మక్రికెటర్ హార్దిక్ పాండ్యా 2024లో భార్య నటాషాతో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత మహికా శర్మ అనే మోడల్తో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బోలెడున్నాయి. అలా క్రికెటర్తో ప్రేమ కారణంగా మహికా ఒక్కసారిగా వైరల్ అయింది.చదవండి: 'విగ్ కావాలా? ధురంధర్ నటుడికి పొగరు తలకెక్కింది' -
‘నీలకంఠ’.. చివరి 20 నిమిషాలు చూపు తిప్పుకోలేరు
పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాల నటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా మారి చేస్తున్న సినిమా "నీలకంఠ". ఈ చిత్రాన్ని శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. "నీలకంఠ" సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ మర్లపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ - నాకు సినిమా అంటే ఇష్టం. ఆ ప్యాషన్ తో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టాను. నా స్నేహితుడు శశిధర్ చెప్పిన ఒక లైన్ నచ్చి ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించాం. డైరెక్టర్ రాకేష్ మాధవన్ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఆ స్క్రిప్ట్ చదివిన తర్వాత ఈ కథతో తప్పకుండా మూవీ చేయాలని "నీలకంఠ" ప్రాజెక్ట్ ప్రారంభించాం. షూటింగ్ టైమ్ లో ప్రకృతి సహకరించక, కొన్నిసార్లు తుఫాన్ లు ఎదుర్కొన్నాం. షూటింగ్ కొద్ది రోజుల పాటు ఆపేశాం. ఇలాంటి కొన్ని అవాంతరాలు దాటుకుని మీ ముందుకు మా చిత్రాన్ని జనవరి 2న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం. మా సినిమా టీమ్ సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైంది. మీరంతా "నీలకంఠ" చిత్రాన్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అన్నారు.డైరెక్టర్ రాకేష్ మాధవన్ మాట్లాడుతూ - నేను చాలా షార్ట్ ఫిలింస్ చేశాను. ఫీచర్ ఫిలిం చేయాలనే కోరిక ఉండేది. ఆ కోరిక మా డైరెక్టర్ శ్రీనివాస్, వేణుగోపాల్ వారి వల్ల నిజమవుతోంది. ఇది దర్శకుడిగా నా మొదటి సినిమా. ట్రైలర్ చూసిన వాళ్లు కొత్త దర్శకుడు చేసినట్లు లేదు అంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి ఔట్ పుట్ వచ్చేందుకు మా టీమ్ అందరు కృషి చేశారు. మా సినిమాలో మంచి ఎమోషన్స్ ఉన్నాయి, ఫైట్స్, సాంగ్స్ ఆకట్టుకుంటాయి. సినిమా చివరి 20 నిమిషాలు చూపు తిప్పుకోకుండా ఉంటుంది. జనవరి 2న "నీలకంఠ" అనే మంచి చిత్రంతో మీ ముందుకు వస్తున్నాం. మన దగ్గర ఇతర భాషల చిత్రాలు ఆదరణ పొందుతున్నాయి. అందుకే మనం చేసిన మంచి చిత్రాన్ని కూడా ఇతర భాషలకు చూపించాలనే పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాం. అన్నారు.హీరో మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ - నేను తెలుగువాడినే. తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో నటించాను. తెలుగు ఆడియెన్స్, తెలుగు మేకర్స్ సినిమాను ఎంత ప్రేమిస్తారో నాకు తెలుసు. అందుకే తెలుగు ఫిలింమేకర్స్ ఎవరైనా స్క్రిప్ట్ పంపిస్తే ఆత్రుతగా చదివేస్తుంటా. నాకు కంటెంట్ ఉన్న మూవీస్ చేయడం ఇష్టం. కథలో మంచి ఎమోషన్ ఉండాలని కోరుకుంటా. అలాంటి కంటెంట్, ఎమోషన్ ఈ చిత్రంలో ఉన్నాయి. చేయని తప్పుకు ఊరు ఊరంతా తన మీద నింద మోపితే హీరో ఎలా ఎదుర్కొన్నాడు, తప్పు చేయలేదని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు అనే కథాంశంతో ఆద్యంతం ఆసక్తికరంగా మా డైరెక్టర్ రూపొందించాడు. ఇందులో మంచి ఫైట్స్, సాంగ్స్ ఎంజాయ్ చేస్తారు. మనం కష్టపడుతుంటే సక్సెస్ తప్పకుండా వస్తుందని నమ్ముతాను. ఆ సక్సెస్ "నీలకంఠ" సినిమాతో నాకు ప్రేక్షకులు ఇస్తారని ఆశిస్తున్నా. అన్నారు. -
చరణ్కి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో సల్మాన్ సినిమా.. టీజర్ రిలీజ్
గత కొన్నేళ్ల నుంచి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కి అస్సలు కలిసి రావట్లేదు. చేసిన సినిమా చేసినట్లే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేస్తూ వచ్చాయి. ఈ క్రమంలోనే ట్రెండ్కి తగ్గట్లు దేశభక్తి బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన 'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' అనే మూవీలో నటిస్తున్నాడు. సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు చిత్ర టీజర్ రిలీజ్ చేయడంతో పాటు విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: గర్ల్ఫ్రెండ్ని పరిచయం చేసిన 'బిగ్బాస్' ఇమ్మాన్యుయేల్)టీజర్లో గాల్వాన్ లోయని.. యుద్ధభూమిలో సల్మాన్ని మాత్రమే చూపించారు. ఈ సినిమాకు అపూర్వ లఖియా దర్శకుడు. ఇతడు గతంలో రామ్ చరణ్తో 'తుఫాన్' అనే మూవీ తీశాడు. ఇది ఎంత ఘోరంగా ఫ్లాప్ అయిందో తెలిసిందే. దీని తర్వాత హసీనా పార్కర్ అనే చిత్రం, క్రాక్ డౌన్, ముమ్ బాయ్ అనే వెబ్ సిరీస్లు చేశాడు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ మూవీతో మళ్లీ దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. ఈ సినిమాకు సల్మాన్ ఖానే నిర్మాత కూడా. వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 17న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.అయితే 'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' సినిమా.. కల్నల్ సంతోష్ బాబు బయోపిక్ అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే తెలంగాణ సూర్యాపేటకు చెందిన ఈయన.. పదిహేనేళ్లుగా సైన్యంలో పనిచేశారు. భారత్-చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో ఏడాదిన్నరగా విధులు నిర్వర్తించారు. భారత్-చైనా సైనిక బలగాల ఘర్షణ సందర్భంగా 2020లో అమరులయ్యారు. మూవీ రిలీజైతే ఈయన జీవితం ఆధారంగా సినిమా తీశారా లేదా అనేది క్లారిటీ వస్తుంది.(ఇదీ చదవండి: అతడికి 45.. ఆమెకు 20 ఏళ్లు.. సూర్య కొత్త సినిమా స్టోరీ ఇదే) -
నీలాంటి స్నేహితుడు దొరకడం అదృష్టం: చిరంజీవి
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నేడు (డిసెంబర్ 27న) 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడికి పలువురు ప్రముఖులు పర్సనల్గా, సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన స్నేహితుడికి ఎక్స్ (ట్విటర్) వేదికగా విషెస్ తెలియజేశారు.హ్యాపీ బర్త్డేనా ప్రియమైన సోదరుడికి 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకున్న సల్లూభాయ్కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ఏడాది ఆయురారోగ్యాలతో పాటు అపారమైన సంతోషం, ప్రేమ పొందాలని మనసారా కోరుకుంటున్నాను. నువ్వు లక్షలాదిమందికి ఒక ఇన్స్పిరేషన్.. నిన్ను స్నేహితుడని పిలవడం మాలాంటివారికి దక్కిన అదృష్టం.ఎంజాయ్ చెయ్నువ్వు మరెన్నో విజయాలు అందుకోవాలి, సుఖసంతోషాలతో గడపాలి. ఈ ప్రత్యేకమైన రోజును హ్యాపీగా ఎంజాయ్ చెయ్ అంటూ సల్లూ భాయ్తో దిగిన ఫోటో షేర్ చేశారు. కాగా చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' మూవీలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించాడు. సినిమాల విషయానికి వస్తే చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర', 'మన శంకర వరప్రసాద్గారు' మూవీస్ చేస్తున్నారు. సల్మాన్.. 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' మూవీ చేస్తున్నాడు. Happy 60th birthday to my beloved brother @BeingSalmanKhan 🌟Sallu bhai, on this special milestone, I want to share my heartfelt wishes with you. May this year bring you endless joy, good health, and all the love you truly deserve. You have always been an inspiration, not just… pic.twitter.com/4ESoduO2yA— Chiranjeevi Konidela (@KChiruTweets) December 27, 2025 చదవండి: బట్టతలపై జుట్టు.. అడ్వాన్స్ తీసుకుని డ్రామాలు -
అతడికి 45.. ఆమెకు 20 ఏళ్లు.. ఇద్దరి మధ్య ప్రేమ
పేరుకే తమిళ హీరో అయినప్పటికీ తెలుగులోనూ సూర్యకు కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉన్నారు. మరీ ముఖ్యంగా అమ్మాయిల్లో ఇతడికి చాలా ఫాలోయింగ్ ఉంది. గతంలో 'రక్తచరిత్ర 2' అనే తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంలో నటించాడు గానీ పూర్తిస్థాయిలో తెలుగు మూవీ చేయలేదు. అలాంటిది ఇప్పుడు 'సార్', 'లక్కీ భాస్కర్' దర్శకుడు తీస్తున్న సినిమా చేస్తున్నాడు. షూటింగ్ జరుగుతుందని తెలుసు గానీ కాన్సెప్ట్ ఏంటనేది బయటకు రాలేదు. ఇప్పుడు స్వయానా నిర్మాత నాగవంశీ.. స్టోరీ కాస్త రివీల్ చేశారు.(ఇదీ చదవండి: గర్ల్ఫ్రెండ్ని పరిచయం చేసిన 'బిగ్బాస్' ఇమ్మాన్యుయేల్)ఈ మూవీలో హీరో సూర్య.. 'గజిని'లో సంజయ్ రామస్వామిలా ఓ ధనవంతుడు. అతడి వయసు 45 ఏళ్లు. అలాంటి ఇతడు 20 ఏళ్ల అమ్మాయి(మమిత)తో ప్రేమలో పడతాడు. వీళ్ల మధ్య స్నేహం, ప్రేమ, కోపం.. ఇలా చాలా ఎమోషన్స్ ఉంటాయి. వాళ్ల మధ్య ఉన్నది ప్రేమా కాదా అనేది స్టోరీ పాయింట్ అని నాగవంశీ చెప్పుకొచ్చారు. చూస్తుంటే సూర్య.. ఈసారి ఏదో కొత్తగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నాడు.సూర్య గత కొన్నేళ్లుగా చేస్తున్న సినిమాల చూస్తే చాలావరకు యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ ఉన్నాయి. చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఓ లవ్ స్టోరీ అని తెలిసి తెలుగు ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. వెంకీ అట్లూరి తీస్తున్న ఈ సినిమాలో సూర్య, మమిత బైజుతో పాటు రవీనా టండన్ కూడా కీలక పాత్ర చేస్తోంది. మరో రెండు మూడు రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. వచ్చే వేసవిలో లేదంటే వేసవి చివరలో థియేటర్లలో రిలీజయ్యే అవకాశాలైతే ఉన్నాయి.(ఇదీ చదవండి: 'పుష్ప-2' తొక్కిసలాట కేసు: ఏ-11గా అల్లు అర్జున్) -
బట్టతలపై జుట్టుండాలట.. అడ్వాన్స్ తీసుకుని డ్రామాలా!
దృశ్యం ఫ్రాంచైజీలో తెరకెక్కుతున్న మూడో భాగం "దృశ్యం 3". మలయాళంలో మోహన్లాల్ హీరోగా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తవగా త్వరలోనే హిందీలో షూటింగ్ మొదలుకానుంది. అజయ్ దేవ్గణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా తప్పుకున్నట్లు రూమర్స్ వచ్చాయి.సడన్గా విగ్ కావాలట!పారితోషికం పెంపుతోపాటు, విగ్ కావాలని కోరాడని.. ఈ విషయంలో నిర్మాతతో భేదాభిప్రాయాలు రావడంతో ఆయన సినిమా నుంచి వైదొలగాడని వార్తలు వచ్చాయి. తాజాగా ఇవే నిజమంటున్నాడు నిర్మాత కుమార్ మంగట్ పాఠక్. ఆయన మాట్లాడుతూ.. దృశ్యం 3 కోసం అక్షయ్ ఖన్నా అగ్రిమెంట్పై సంతకం పెట్టాడు. ఆయన అడిగినంత డబ్బు ఇస్తామన్నాం. కానీ ఆయన విగ్ కావాలని డిమాండ్ చేశాడు. పక్కనున్న చెంచాల వల్లే..దృశ్యం 2లో అక్షయ్ విగ్ లేకుండా బట్టతలతోనే కనిపించాడు. అలాంటిదిప్పుడు విగ్ పెడితే బాగోదని దర్శకుడు అభిషేక్ పాఠక్ నచ్చజెప్పాడు. దాంతో ఆయన సరేనన్నాడు. అయితే ఆయన పక్కనున్న చెంచాలు విగ్ పెట్టుకుంటే స్మార్ట్గా కనిపిస్తావని లేనిపోనివి ఎక్కించారు. దాంతో ఆయన మళ్లీ విగ్ కావాలని అడిగాడు. దర్శకుడు ఆయన్ను సముదాయించాలని చూశాడు. అప్పుడేమో ఎగిరి గంతేసి..కానీ ఈసారి అతడు ఏకంగా సినిమా నుంచే తప్పుకున్నాడు. దృశ్యం 3 కథ చెప్పినప్పుడు.. ఇది రూ.500 కోట్ల సినిమా.. జీవితంలో ఇలాంటి కథ వినలేదంటూ టీమ్ను హత్తుకున్నాడు. రెమ్యునరేషన్ ఫైనల్ అయ్యాక అడ్వాన్స్ కూడా ఇచ్చాం. పదిరోజుల్లో షూట్ ఉందనగా సినిమా నుంచి తప్పుకున్నాడు. ఈ విషయంలో తనకు నోటీసులు పంపించాం.గుర్తింపు లేని సమయంలో ఛాన్స్అక్షయ్కు పేరు, గుర్తింపు లేని సమయంలో తనతో సెక్షన్ 375 మూవీ చేశాను. ఆయన గురించి చాలామంది ఎన్నో చెప్పారు. సెట్లో కూడా ఓవర్గా ప్రవర్తించేవాడు. సెక్షన్ 375 వల్ల అతడికి మంచి పేరు వచ్చింది. అలా అతడిని దృశ్యం 2కి తీసుకున్నాను. ఈ మూవీ తర్వాతే అతడికి పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇప్పుడేమో గర్వం తలకెక్కింది.అక్షయ్ కంటే మంచి నటుడుదృశ్యం.. అజయ్ దేవ్గణ్ మూవీ, ఛావా.. విక్కీ కౌశల్ మూవీ, అలాగే ధుంధర్ రణ్వీర్ సింగ్ సినిమా! ఒకవేళ అక్షయ్ ఖన్నా సోలోగా సినిమా చేస్తే దానికి రూ.50 కోట్లు కూడా రావు. తనవల్లే ధురంధర్ బాగా ఆడుతోందని మాతో అన్నాడు. ధురంధర్ విజయానికి అనేక కారణాలున్నాయి. దృశ్యం 3లో అక్షయ్ స్థానంలో జైదీప్ అహ్లావత్ను తీసుకున్నాం. అక్షయ్ కంటే ఇతడు మంచి నటుడు అని చెప్పుకొచ్చాడు.చదవండి: నా భర్తను ఎందుకు లాగుతున్నారు?: అనసూయ -
'పుష్ప-2' తొక్కిసలాట కేసు: ఏ-11గా అల్లు అర్జున్
'పుష్ప 2: ది రూల్' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతి చెందిన మహిళ రేవతి మరణానికి సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు చిక్కడపల్లి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఏ-1గా సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ను, ఏ-11గా అల్లు అర్జున్(Allu Arjun)ని చేర్చుతూ.. ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో సహా మొత్తం 23 మందిపై ఛార్జిషీట్ ఫైల్ చేశారు. గత డిసెంబర్ 4న హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న సంధ్య థియేటర్లో 'పుష్ప 2' బెనిఫిట్ షో జరిగింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్కు వచ్చారు. అక్కడ ఉన్న ఫ్యాన్స్ అంతా ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 35 ఏళ్ల రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.దర్యాప్తులో భాగంగా పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని నిర్ధారణకు వచ్చారు. థియేటర్లో తగిన భద్రతా చర్యలు, ప్రత్యేక ఎంట్రీ-ఎగ్జిట్ ఏర్పాట్లు లేకపోవడం, అధిక సంఖ్యలో ప్రేక్షకులను ఒకేసారి అనుమతించడం వంటి లోపాలు గుర్తించారు. అయితే, అల్లు అర్జున్ రాకను ముందుగా సమాచారం ఇవ్వకపోవడం, ఆయన బౌన్సర్లు ప్రేక్షకులను నెట్టడం వంటి కారణాలతో ఆయనపై కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్ను అరెస్టు చేయగా.. బెయిల్పై బయటకు వచ్చారు. -
డబ్బుల కోసం అలాంటి పని చేశా.. పేరు మార్చుకున్నా : అరియానా
అరియానా గ్లోరీ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఆర్జీవీని ఇంటర్వ్యూలో చేసి బోల్డ్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అరియానా, ఆ క్రేజ్తోనే బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్గా ఎంపికైంది. బిగ్బాస్ నాలుగో సీజన్లో పాల్గొని..తనదైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంది. ఈ షో నుంచి బయటకు వచ్చన తర్వాత పలు వెబ్ సిరీస్లు, సినిమాలతో పాటు టీవీ షోలు కూడా చేస్తూ బీజీ అయిపోయింది. తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ ఓ టీవీ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్తో పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది.అందుకే పేరు మార్చుకున్నానా అసలు పేరు అరియానా(Ariyana Glory) కాదు. మా అమ్మనాన్నలు నాకు అర్చన అని పేరు పెట్టారు. అయితే కష్టాలు ఎక్కువ అవ్వడంతో నేనే పేరు మార్చుకున్నా. అరియానా పేరుతో ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను.అనుకోకుండా అవకాశం.. మన జీవితంలో ఏం జరగాలో ముందే రాసిపెట్టి ఉంటుంది. నేను అనుకోకుండా యాంకర్ అయ్యాను. ఒక రోజు నేను, మా చెల్లి టీవీ చూస్తుంటే.. యాంకర్స్ కావలెనన్న ప్రకటన వచ్చింది. అది చూసి నేను ఆడిషన్స్కి వెళ్లాను. అదృష్టం కొద్ది సెలెక్ట్ అయ్యాను. అక్కడ నుంచి చిన్న చిన్న అవకాశాలతో ఈ స్థాయికి చేరుకున్నాను.ఒకేసారి ఐదారు జాబులు చేశాడబ్బుల కోసం నేను రకరకాల జాబులు చేశా. లైన్లో నిలబడి పన్నీరు చల్లేందుకు కూడా వెళ్లాను. అప్పుడు నాకొచ్చే జీతం రూ. 1800 మాత్రమే. రూమ్ రెంట్ రూ. 3000. ఒకసారి అద్దె కట్టేందుకు డబ్బులు జమ చేయగా.. ఓ అమ్మాయి దొంగతనం చేసింది. దీంతో చాలా ఇబ్బంది పడ్డా. డబ్బులు సరిపోకపోవడంతో ఒకేసారి ఐదారు జాబులు చేశా. ఇప్పుడు నేను బెటర్ పొషిషన్లో ఉన్నాను.ఈ క్షణమైనా చనిపోవడానికి రెడీఇక నీకు ఏ దేవుడు అంటే ఇష్టం అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ‘మా అమ్మ నన్ను క్రిస్టియన్లా పెంచింది. కానీ ఈ మధ్య నాకు సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా ఇష్టం పెరిగింది. ఆయన ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే.. నన్ను తీసుకెళ్లిపో అని చెబుతా. దేవుడే వచ్చి అడిగాక ఇంకేముంది?. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పటికిప్పుడు చనిపోయినా నాకు ఓకే’ అని అరియానా ఎమోషనల్గా చెప్పుకొచ్చింది. -
నా భర్తను ఎందుకు లాగుతున్నారు?: అనసూయ ఫైర్
'ఎలుక తోకను తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు' ఈ సామెత శివాజీకి సరిగ్గా సెట్టవుతుంది. పురుషాహంకారంతో విర్రవీగే శివాజీ బిగ్బాస్ హౌస్లోనూ లేడీ కంటెస్టెంట్లపై చవకబారు వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి ఆడపిల్ల మా ఇంట్లో ఉంటే పీక మీద కాలేసి తొక్కుతా.. అంటూ దారుణంగా మాట్లాడాడు. ఇప్పుడు దండోరా ఈవెంట్లోనూ హీరోయిన్లు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో చెబుతూ రాయడానికి వీల్లేని బూతు పదాలు ఉపయోగించాడు.ఎండగట్టిన అనసూయఆయన వైఖరిని ఎంతోమంది హీరోయిన్లు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఎండగట్టారు. యాంకర్ అనసూయ అయితే.. ఎలాంటి బట్టలు వేసుకోవాలో మా ఇష్టం.. మీరెవరు చెప్పడానికి అని తిరిగి ప్రశ్నించింది. అసలే మదమెక్కిన ఏనుగులా ప్రవర్తిస్తున్న శివాజీ అందరినీ వదిలేసి అనసూయను మాత్రం టార్గెట్ చేశాడు. కొందరు ఈ విషయంలో శివాజీకి వకాల్తా పుచ్చుకుని అనసూయపై మండిపడుతున్నారు.ట్రోలర్స్పై ఫైర్అలాంటివారికోసం తాజాగా అనసూయ ఓ పోస్ట్ పెట్టింది. కొందరు పనిగట్టుకుని నా మాటలను కావాలనే వక్రీకరించి, సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారు. నేను ఎవరికీ వెస్ట్రన్ దుస్తులు వేసుకోమని సూచించలేదు. నేను వేసుకునేలాంటి దుస్తులే ధరించాలని చెప్పలేదు. నా ఇష్టాయిష్టాలను ఎవరిపైనా రుద్దలేదు. నేను చెప్పిందల్లా ఒక్కటే.. ప్రతి మహిళకు తనకు నచ్చిన డ్రెస్లు వేసుకునే స్వేచ్ఛ ఉందన్నాను. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉంటాను.నా భర్తను ఎందుకు లాగుతున్నారు?నా మాటల్ని వక్రీకరించి నాపై విషప్రచారం చేస్తున్నారు. నా భర్తను, పిల్లల్ని ఇందులోకి లాగుతున్నారు. మగవాళ్లే కాదు, కొందరు ఆడవాళ్లు కూడా ఒక మహిళగా, తల్లిగా నా క్యారెక్టర్ను ప్రశ్నిస్తున్నారు. కేవలం నేను వేసుకునే బట్టల్ని బట్టి నన్ను తప్పుపడుతున్నారు. మీరెంత విమర్శించినా నేను మరింత బలంగా నిలబడతాను. ఇప్పటికైనా మేల్కొనండి.. ఇకనైనా మీ చుట్టూ ఏం జరుగుతుందో ఒక్కసారి గమనించండి. హేటర్స్.. మీరు కూడా నా ఫ్యాన్సే!ఎవరి చేతిలోనో కీలుబొమ్మగా మారకుండా సొంతంగా ఆలోచించడం నేర్చుకోండి. మీ మైండ్లోకి ఎలాంటివి ఎక్కిస్తున్నారో చెక్ చేసుకోండి. ఇది కేవలం బట్టలకు సంబంధించిన విషయం కాదు. స్వతంత్రంగా ఆలోచించే మహిళలను కంట్రోల్ చేయాలనుకుంటున్న పితృస్వామ్య భావజాలం గురించి! చివరగా.. నేను నచ్చకపోయినా నిరంతరం నన్ను గమనిస్తూ ఉన్నారంటే మీరు నా అభిమానుల కిందే లెక్క అని ట్రోలర్స్కు చురకలంటించింది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) చదవండి: కూలీ మూవీపై విమర్శలు.. మళ్లీ అలా జరగనివ్వను: దర్శకుడు -
అనసూయకు 'ప్రకాష్ రాజ్' ట్వీట్.. శివాజీకి 'వర్మ' కౌంటర్
మహిళల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తప్పని ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు పేర్కొన్నారు. ఈ అంశంలో శివాజీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన నటి అనసూయ, సింగర్ చన్మయిలను నెట్టంట ట్రోలింగ్కు దిగారు. దీంతో వారు కూడా గట్టిగానే తిరిగి కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. అయితే, తాజాగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అనసూయకు మద్ధతుగా తన ఎక్స్ పేజీలో ఒక ట్వీట్ చేశారు.శివాజీ, అనసూయల మధ్య మొదలైన వివాదం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సందర్భంలో ప్రకాష్ రాజ్ ఇలా అన్నారు. సంస్కారి అని పిలవబడే వారిని మొరుగుతూనే ఉండనివ్వండి అంటూ అనసూయకు మద్ధతుగా పోస్ట్ చేశారు. అలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారి నీచమైన మనస్తత్వం ఇలా బయటపడుతుంది. ఇలాంటి అంశంలో ఇంకా బలంగా నిలబడాలని, అందుకోసం ఎప్పుడూ కూడా అండగా ఉంటామని అనసూయను ట్యాగ్ చేస్తూ పేర్కొన్నారు. శివాజీని రేపిస్ట్తో పోల్చిన ఆర్జీవీనటుడు శివాజీ వ్యాఖ్యలపై మరోసారి దర్శకుడు ఆర్జీవీ భగ్గుమన్నారు. ఏకంగా నిర్భయ కేసు రేపిస్టుతో శివాజీని పోల్చడమే కాకుండా మహిళలపై అతను చేసిన వ్యాఖ్యలను వర్మ షేర్ చేశారు. మహిళలపై నిర్భయ రేపిస్ట్ చేసిన వ్యాఖ్యలు ఇలా ఇలా ఉన్నాయి. ' రాత్రి 9గంటల తర్వాత పద్ధతిగల అమ్మాయి రోడ్ల మీద తిరగదు. అత్యాచారా కేసుల్లో ఆడవాళ్లదే ఎక్కువ తప్పుంది. ఇందులో మగవారి తప్పు ఎక్కడుంది..?' అని నిర్భయ రేపిస్ట్ పేర్కొన్నాడు.PR Sir ❤️💪🏻🙏🏻 https://t.co/2J11PKzqI5— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 27, 2025This says it all 👍💪 https://t.co/NK7i8ipiHb— Ram Gopal Varma (@RGVzoomin) December 27, 2025 -
'కూలీ'పై విమర్శలు.. మళ్లీ అలా జరగనివ్వను: లోకేశ్
లోకేశ్ కనగరాజ్ నుంచి సినిమా వస్తుందంటే హిట్టు గ్యారెంటీ! ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో, కూలీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వరద పారించాడు. రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన 'కూలీ' సినిమా మిక్స్డ్ టాక్తోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం.వేలల్లో విమర్శలుఈ విమర్శలు, కలెక్షన్స్పై లోకేశ్ తాజాగా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. కూలీ సినిమాకు వేలకొద్దీ విమర్శలు వచ్చాయి. ఎక్కడ తప్పు చేశానో గుర్తించి దాన్ని నెక్స్ట్ సినిమాలో పునరావృతం కాకుండా చూసుకుంటాను. అయితే ఓపక్క విమర్శిస్తూనే రజనీకాంత్ సర్ కోసం మా సినిమా ఆదరించారు. ఈ చిత్రానికి రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయని మా నిర్మాత చెప్పారు.గతంలో ఏమన్నాడంటే?అంతటి విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అన్నారు. గతంలోనూ కూలీ మూవీకి వచ్చిన మిశ్రమ స్పందన గురించి మాట్లాడుతూ.. జనాల అంచనాలకు తగ్గట్లుగా తాను కథలు రాయలేనన్నాడు. తాను రాసిన కథ వారి అంచనాలను అందుకుంటే మంచిది. లేదంటే వాళ్లు సంతోషపడేవరకు మళ్లీమళ్లీ ప్రయత్నిస్తూనే ఉంటాను అని చెప్పుకొచ్చాడు.వార్ 2పై కూలీ విజయంకూలీ విషయానికి వస్తే.. ఇందులో రజనీకాంత్, నాగార్జున, సౌబిన్ షాహిర్, శృతి హాసన్, సత్యరాజ్ రచిత రామ్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ కీలక పాత్రలు పోషించారు. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల వార్ 2 సినిమాతో పోటీగా బాక్సాఫీస్ బరిలోకి దిగింది. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కలెక్షన్స్లో వార్ 2ని దాటేయడం విశేషం!చదవండి: మొన్న ఆమిర్.. ఇప్పుడు షారూఖ్ -
‘ఛాంపియన్’ మూవీ కలెక్షన్స్.. రెండో రోజు ఎంతంటే?
టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఛాంపియన్’. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 25న ఆడియెన్స్ ముందుకు వచ్చింది.తొలి షోకి మిశ్రమ స్పందన లభించినప్పటికీ..మొదటి రోజు అత్యధికంగా రూ. 4.5 కోట్లు రాబట్టింది. అయితే రెండో రోజు మాత్రం కలెక్షన్స్ తగ్గిపోయాయి. శుక్రవారం ఈ సినిమాకు రూ. 2.4 కోట్ల కలెక్షన్స్ లభించాయి. మొత్తంగా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.90 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోషన్ ఫుట్బాల్ ఆటగాడిగా నటించి, మెప్పించాడు. అనస్వర రాజన్ హీరోయిన్గా నటించగా.. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గెస్ట్ రోల్ చేసి అలరించాడు. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. (ఛాంపియన్ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మొన్న ఆమిర్... ఇప్పుడు షారూఖ్!
రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలకు ఇతర ప్రముఖ నటుల సపోర్టింగ్ తప్పనిసరిగా మారిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఈయన ఇంతకు ముందు నటించిన జైలర్, వేట్టయయాన్, కూలీ చిత్రాల్లో ఇతర భాషలకు చెందిన ప్రముఖ నటులు ముఖ్య భూమిక పోషించిన విషయం తెలిసిందే! వీటిలో జైలర్ చిత్రం మినహా ఇతర చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. రజనీకాంత్ సినిమాలో గెస్టులుజైలర్ చిత్రంలో రజనీకాంత్తో పాటు బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, కన్నడ సూపర్స్టార్ శివ రాజ్కుమార్, మలయాళ సూపర్స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలు పోషించారు. అదేవిధంగా హీరోయిన్ తమన్నా ప్రత్యేక పాట సినిమాకు మరింత బలంగా మారింది. ఇక వేట్టయాన్ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్ర పోషించారు. అయినప్పటికీ ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. మిక్స్డ్ టాక్అదేవిధంగా రజనీకాంత్ ఇటీవల నటించిన కూలీ చిత్రంలోనూ బాలీవుడ్ స్టార్ నటుడు ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. టాలీవుడ్ స్టార్ నాగార్జున, శాండిల్వుడ్ స్టార్ ఉపేంద్ర ముఖ్యపాత్రలను పోషించారు. ఈ సినిమా రూ.500 కోట్లు రాబట్టినప్పటికీ మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న చిత్రం జైలర్–2. ఇది జైలర్ చిత్రానికి సీక్వెల్. జైలర్ 2లో సూపర్ స్టార్ఇందులోనూ మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్, శాండిల్ వుడ్ సూపర్ స్టార్ శివరాజ్కుమార్, బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, బాలీవుడ్ భామ విద్యాబాలన్తోపాటు నటి రమ్యకష్ణ తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఇందులో అతిథి పాత్రలో బాలీవుడ్ సూపర్స్టార్ షారూఖ్ ఖాన్ నటిస్తున్నట్లు సమాచారం. సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి.. జైలర్ 2లో షారూఖ్ ఉన్నట్లు పేర్కొన్నాడు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. -
ఓటీటీలో వివాదస్పద సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ- యామీ గౌతమ్ జంటగా నటించిన చిత్రం 'హక్'. ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. దర్శకుడు సుపర్ణ్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ నవంబర్ 7న విడుదలైంది. ఈ చిత్రం మహిళల హక్కులకు మద్దతు ఇచ్చిన షా బానో వర్సెస్ అహ్మద్ ఖాన్ కేసు ఆధారంగా కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కించారు. అయితే, ‘హక్’ సినిమాలో ఇస్లాం విడాకుల పద్ధతిని ప్రశ్నిస్తూ సాగే ఒక సీన్పై వివాదం మొదలైంది. దీంతో బ్యాన్ చేయాలని ఆ సమయంలో డిమాండ్ కూడా చేశారు.హక్ సినిమా జనవరి 2, 2026 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ కోర్ట్ డ్రామా మూవీ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందింది. విమర్శకుల నుంచి కూడా అభినందనలు వచ్చాయి. షా బానో నిజజీవిత కథ మళ్లీ ఒకసారి దేశవ్యాప్తంగా చర్చల్లోకొచ్చింది. హక్ సినిమాకు షా బానో త్రిబుల్ తలాక్ కేసే ప్రేరణగా తీశారు. మహిళల హక్కులు, లౌకికవాదం, మతం వంటి అంశాలపై ఈ మూవీ ఉంటుంది. పెళ్లైన 40 ఏళ్ల తర్వాత త్రిబుల్ తలాక్ ద్వారా విడాకులు ఇస్తే పరిస్థితి ఏంటి..? న్యాయం కోసం ఆమె చేసిన పోరాటం ఏంటి అనేది హక్ మూవీలో చూడొచ్చు. -
మూడేళ్ల తర్వాత ఫ్యాన్స్ కోసం ప్రభాస్.. 'రాజా సాబ్' ప్రీ రిలీజ్ వేడుక ఎక్కడంటే..
ప్రభాస్-దర్శకుడు మారుతి కాంబినేషన్ సినిమా ‘ది రాజా సాబ్’.. సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమెరికాలో టికెట్ బుకింగ్స్ కూడా ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్లో నేడు (డిసెంబర్ 27)న సాయంత్రం 5 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. కూకట్పల్లిలోని కైత్లాపూర్ గ్రౌండ్లో జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీగా ఫ్యాన్స్ రానున్నారు. ప్రభాస్ బర్త్డే సందర్బంగా ఇదే గ్రౌండ్లో 220 ఫీట్ల భారీ కటౌట్ను ఏర్పాటు చేసి రికార్డ్ క్రియేట్ చేశారు.మీడియాకు పూర్తిగా దూరంగా ఉండే ప్రభాస్.. ఫ్యాన్స్ కోసం చాలా కాలం తర్వాత వేదికపైకి రానున్నారు. 'సలార్' సినిమాకు ఎలాంటి ఈవెంట్ లేకుండానే రిలీజ్ అయింది. ఆ తర్వాత ‘కల్కి’ సినిమాకు మాత్రం బుజ్జిని పరిచయం చేస్తూ సందడిగా డార్లింగ్ కనిపించారు. కానీ, మరే ఈవెంట్లో ప్రభాస్ కనిపించలేదు. బహిరంగ వేదికలపై కనిపించడం తనకు పెద్దగా ఇష్టం ఉండదు. తమ హీరోను చూసి చాలా ఏళ్లు అవుతుందని అభిమానులు కోరుతూ ఉండటంతో రాజా సాబ్ ఈవెంట్లో ఆయన పాల్గొనున్నారు. ఇదే విషయాన్ని నిర్మాత ఎస్కేఎన్ కూడా తెలిపారు. ఈ లెక్కన సుమారు 3ఏళ్ల తర్వాత ప్రభాస్ పబ్లిక్ వేదికపైకి రానున్నారు. -
'సల్మాన్ ఖాన్' బర్త్డే వేడుకలో ధోనీ.. వీడియో వైరల్
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ నేడు 60వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ వేడుకలు పాన్వెల్లోని తన ఫామ్హౌస్లో కుటుంబ సభ్యుల మధ్య జరిగాయి. ఎంతో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కూడా పాల్గొన్నారు. వారిద్దరూ చాలాకాలంగా మంచి స్నేహితులు కావడంతో తన భార్య సాక్షి, కుమార్తె జివాతో కలిసి ధోనీ వెళ్లారు. ఈ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఫోటోగ్రాఫర్స్ ధోని కారును చుట్టుముట్టారు.సల్మాన్ఖాన్ పుట్టినరోజు వేడుకలో కేవలం తన కుటుంబ సభ్యులతో పాటు హైప్రొఫైల్ ఉన్న స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. భారత మాజీ కెప్టెన్ ధోనీ ఉదయం తన వాహనంలో వెళ్తుండగా ఫోటోగ్రాఫర్స్ వెంబడించారు. దీంతో ధోనీ కూడా సున్నితంగా తమ కారుకు దారి ఇవ్వాలని కోరారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.#WATCH | Maharashtra | Former Captain of the Indian Cricket Team Mahendra Singh Dhoni leaves after attending actor Salman Khan's 60th birthday party at Panvel. pic.twitter.com/Sb7XA186Eo— ANI (@ANI) December 26, 2025 -
శివాజీకి మహిళా కమిషన్ సూటి ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మహిళా కమిషన్లో నటుడు శివాజీ విచారణ కొనసాగుతోంది. దండోరా సినిమా ప్రమోషన్లో భాగంగా వేదికపై శివాజీ అనుచిత వాఖ్యలు(misogynistic remark) చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. మహిళల వస్త్రధారణపై ఆయన అలా ఎందుకు మాట్లాడారో తెలుసుకునేందుకు కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ళ శారద విచారణ జరిపారు.శివాజీకి మహిళా కమిషన్ సంధించిన ప్రశ్నలు.. 1.మహిళల పై మీరు చేసిన వాఖ్యలు మహిళల గౌరవం, వ్యక్తిగత జీవితం ప్రభావితం చూపుతుందని కమిషన్ భావిస్తోంది.. మీరేమంటారు?2. ఒక నటుడిగా మీ వాఖ్యలు సమాజం పై ప్రభావం చూపుతాయి.. ఇది మీకు తెలిసే ఇలాంటి వాఖ్యలు చేశారని కమిషన్ భావిస్తోంది..3. మహిళల వస్త్రాధారణ ఆధారంగా వాళ్ల వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం.. చదువుకున్న వ్యక్తిగా ఇది మీకు తెలియదా?4. మీ వాఖ్యలు మహిళలను కించపరిచినట్లు కానట్లయితే వాటికి సంబంధించిన ఆధారాలు ఇవ్వండి!5. మీ వాఖ్యలు మహిళలపై దాడులు పెంచే విధంగా ఉన్నాయని ఫిర్యాదులొచ్చాయి.. వీటికి మీ సమాధానం?.. పై పశ్నలకు శివాజీ ఇచ్చిన వివరణలను తెలంగాణ మహిళా కమిషన్ రికార్డు చేసింది. దండోరా సినిమా ఈవెంట్లో శివాజీ చేసిన ఆ అసంబద్ధ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. చిన్మయి, అనసూయ, నిధి అగర్వాల్, పాయల్ రాజ్పుత్ లాంటి సెలబ్రిటీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మరోవైపు.. ఆ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా స్వీకరించి.. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ శివాజీకి నోటీసులు జారీ చేసింది. అంతకు ముంద.. తాను చేసిన వ్యాఖ్యలకు శివాజీ షరతులతో కూడిన క్షమాపణలు చెప్పారు. తన కెరీర్లో ఎప్పుడూ ఇలా జరగలేదన్న ఈ సీనియర్ నటుడు.. తన వ్యాఖ్యలను గానూ మహిళా లోకానికి మనస్ఫూర్తిగా క్షమాపణలంటూ మాట్లాడారు. అయితే తన వ్యాఖ్యల్లో దొర్లిన రెండు అసభ్య పదాలకు మాత్రమే సారీ చెబుతూనే.. తన స్టేట్మెంట్కు మాత్రం కట్టుబడి ఉన్నానంటూ చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ ఘటనలో శివాజీ మీద తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఫిర్యాదులు, కేసులు నమోదు కాకపోవడం మరో కొసమెరుపు. -
పరారీలో 'రకుల్ ప్రీత్ సింగ్' సోదరుడు
హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నరంలో రోజు రోజుకు డ్రగ్స్ వినియోగం పెరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (HNEW), మాసబ్ ట్యాంక్ పోలీసులు కలిసి చేసిన ఆపరేషన్లో డ్రగ్స్ సబ్-పేడ్లర్లను అరెస్ట్ చేశారు. అయితే, తాజాగా మాసబ్ట్యాంక్ పోలీసులు మరోసారి తెలంగాణ ‘ఈగల్ టీం’తో నిర్వహించిన దాడుల్లో భారీగా కొకైన్తో పాటు ప్రమాదకరమైన 43గ్రాముల ఎండిఎంఏ (MDMA) డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు జరిపిన ఈ ఆపరేషన్లో ట్రూప్ బజార్కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ పేడ్లర్లను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారికి రెగ్యులర్ కస్టమర్ల లిస్ట్లో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నాడని తేలింది. వీరి నుంచి అతను రెగ్యులరర్గా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, విషయం తెలుసుకున్న అమన్ ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో కూడా అతను సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారని తెలుస్తోంది. -
'దండోరా'కు నష్టం.. వేడుకున్న శివాజీ
నటుడు శివాజీ, నవదీప్, రవికృష్ణ, బిందు మాధవి తదితరులు నటించిన దండోరా సినిమా బాగుందని చాలామంది అంటున్నారు. కులవివక్ష గురించి దర్శకుడు మురళీకాంత్ చక్కగా చూపారని రివ్యూవర్లు కూడా చెబుతున్నారు. కానీ, థియేటర్లో మాత్రం పెద్దగా ప్రేక్షకులు కనిపించడం లేదు. అందుకు ప్రధాన కారణం హీరోయిన్ల దుస్తుల గురించి ఆయన చేసిన డర్టీ కామెంట్సే.. సోషల్మీడియాలో ఆయన్ను సమర్థించిన వారందరూ వెళ్లి సినిమా చూసినా భారీ కలెక్షన్స్ వచ్చేవని కొందరు సెటైర్స్ కూడా వేస్తున్నారు. అయితే, తాజాగా దండోరా సినిమా చూడాలని ప్రేక్షకులను శివాజీ వేడుకున్నాడు.దండోరా సినిమా కోసం ప్రతి ఆర్టిస్టు ప్రాణం పెట్టి చేశారని శివాజీ చెప్పుకొచ్చాడు. అయితే, తన వ్యక్తిగత విషయాల వైపు వెళ్లకుండా ఈ చిత్రాన్ని అందరూ ప్రమోట్ చేయాలని కోరాడు. ప్రతి ఒక్కరూ చూడండి. లేదంటే ఆ నింద తాను మోయాల్సి వస్తుందని తెలిపాడు. తనతో ఏదైన సమస్య ఉంటే మిగిలిన విషయాల గురించి మరోచోట మాట్లుడుకుందామని చెప్పాడు. కావాలంటే తాను కూడా థియేటర్కు వస్తానన్నాడు. ఏం మాట్లాడాలన్నా అందరం థియేటర్లోనే మాట్లాడుకుందామన్నాడు.అయితే, దండోరా చిత్ర దర్శకుడు మురళీకాంత్ ఇలా అన్నాడు. 'కొద్దిరోజుల క్రితం జరిగిన వేడుకలో దొర్లిన రెండు మూడు మాటల ఆధారంగా ఈ చిత్రాన్ని ఎవరూ జడ్జ్ చేయకండి. ఈ సినిమా కోసం నేను సుమారు మూడేళ్లు పైగానే కష్టపడ్డాను. నటీనటులు కూడా చాలా కష్టపడ్డారు. మా అందరి శ్రమకు ఫలితం తెరపై కనిపించింది. ఇప్పుడు చాలా సినిమాలు పోటీలో ఉన్నా సరే మా కథపై నమ్మకంతోనే భయపడకుండా సినిమా విడుదల చేశాం' అని దర్శకుడు అన్నారు.Worst fellow still living in 16th century, who thinks Women are subservient to Men I never saw any women advising how Men should dress publicly, why the fuck he can advise If he says similar thing is US, he would be thrown out of movies & public lifepic.twitter.com/cSIhwmo7vt— Ravi @ Prabhas Army (@RaviPrabhas333) December 26, 2025 -
విడాకుల రూమర్స్.. సతీమణితో వేదికపై రానున్న విజయ్!
నటుడు విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం జననాయకన్. నటి పూజా హెగ్డే నాయకిగా నటించిన ఇందులో మమితా బైజు ముఖ్యభూమికలు పోషించారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతి నాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని కేవీఎన్ పిక్చర్స్ భారీ బడ్జెట్లో నిర్మించింది. హెచ్.వినోద్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2026 జనవరి 9వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇది నటుడు విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ప్రస్తుతం ఆయన తమిళగ వెట్రికళగం పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీంతో జననాయకన్ చిత్రాన్ని తన రాజకీయ జీవితానికి తోడ్పడేలా రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది సమకాలీన రాజకీయాలను ఆవిష్కరించే కథాచిత్రంగా ఉంటుందని సమాచారం. దీంతో జననాయకన్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలోని మూడు పాటలు ఇప్పటికే విడుదలై విజయ్ అభిమానుల్లో జోష్ను నింపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 27న చెన్నైలో కాకుండా మలేషియాలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. విజయ్ సతీమణి పాల్గొంటారా? జననాయకన్ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నై నుంచి పలువురు సినీ ప్రముఖులు మలేషియాకు వరుస కట్టారు. ముఖ్యంగా దర్శకుడు అట్లి, నెల్సన్ తదితరులు మలేషియాకు మలేషియాకు వెళ్లారు. నటుడు విజయ్ కూడా తన తల్లి శోభ చంద్రశేఖర్, బంధువు, గాయని పల్లవి వినోద్ తదితరులు ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి మలేషియాకు చేరుకున్నారు. అదేవిధంగా విజయ్ భార్య సంగీత, కొడుకు జెసన్ సంజయ్ కూడా మలేషియాకు వెళ్లారు. అయితే వీరు జననాయకన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే నటుడు విజయ్ ఆయన భార్య సంగీత మధ్య సఖ్యత లేదంటూ చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అలాంటిది సంగీత ఆమె కొడుకు, కూతురు దివ్య సాషా జననాయక్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటే ఇప్పటివరకు జరిగిన ప్రచారానికి తెరదించినట్లు అవుతుంది. -
హత్యలు చేస్తున్నదెవరు?
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ఆర్యన్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.మన జీవితంలో ఎన్నో నేరాలను విని ఉంటాం, చూసి ఉంటాం. వాటిలో కొన్ని నేరాలు మాత్రం విస్మయానికి గురి చేస్తాయి. కానీ నేరం చేయడం అనేది ఓ ఆర్ట్. ఆ నేరం చేసేవాడు ఓ ఆర్టిస్ట్ అన్న స్టేట్మెంట్ ఓ సినిమా రూపంలో చెప్పాలంటే మాత్రం దర్శకుడికి బాగా ధైర్యం కావాలి. ఆ ధైర్యంతోనే తమిళ దర్శకుడు ప్రవీణ్ ఇటీవల ఓ సినిమా తీశారు. అదే ‘ఆర్యన్’. విష్ణు విశాల్ లీడ్ రోల్లో నటించి, నిర్మించిన చిత్రం ఇది. దర్శకుడు తాను చెప్పాలనుకున్నపాయింట్ని సినిమా మొదట్లోనే చెప్పి, ప్రేక్షకుడిని కదలకుండా చేస్తాడు.అంతలా ఏముందో ఈ సినిమాలో ఓసారి చూద్దాం. కైలాష్ అనే సినిమా హీరోని లైవ్లో జనాల మధ్య నయన అనే ఫేమస్ జర్నలిస్ట్ తన ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తుంటుంది. ఈ ప్రోగ్రాం మొదలవగానే ఆర్యన్ అనే వ్యక్తి ప్రేక్షకుల నుండి లేచి ఓ తుపాకీ చూపించి, తాను ఈ షోను హైజాక్ చేస్తున్నానని బెదిరించి కైలాష్ కాలి మీద కాలుస్తాడు. అంతేకాదు... వచ్చే ఐదు రోజులలో ఐదు మందిని తాను ప్రపంచానికి పేర్లు చెప్పి మరీ చంపుతానని చెప్పి లైవ్లోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఇక అక్కడి నుండి ప్రధానపాత్రలో ఉన్న నంబి దగ్గరకు ఈ కేసు విచారణకు వస్తుంది.ఆర్యన్ చెప్పినట్టే వివిధ మాధ్యమాలలో చనిపోయే వారి పేర్లు ముందు తెలియపరుస్తూ రోజుకొకరు హత్య చేయబడుతుంటారు. ఓ దశలో చనిపోయిన శవం ఐదు హత్యలు చేస్తోందా? అన్న సందిగ్ధంలో పడేస్తుంది ఈ సినిమా స్క్రీన్ప్లే. ఈ మిస్టరీని నంబి ఎలా ఛేదిస్తాడో నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘ఆర్యన్’ సినిమాలోనే చూడాలి. పైన చెప్పుకున్నట్టు ఈ సినిమాకి స్క్రీన్ప్లే ఆయువుపట్టు. తాను చెప్పాలనుకున్నపాయింట్ని మొదటే తనపాత్ర ద్వారా చెప్పించి ప్రేక్షకులను లాక్ చేస్తాడు దర్శకుడు. సినిమా ఆద్యంతం థ్రిల్లింగ్గా ఉంటుంది. ఓ దశలో కొన్ని సీన్లు సాగదీతలా అనిపించినా థ్రిల్లింగ్ జోనర్ ఇష్టపడేవాళ్ళకు ఈ సినిమా మంచి కాలక్షేపం. పిల్లలతో కాకుండా పెద్దవాళ్లు వీకెండ్లో చూడదగ్గ సినిమా ఇది. – హరికృష్ణ ఇంటూరు -
మాస్ సాంగ్ కమింగ్
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలైన చిరంజీవి, వెంకటేశ్ కలిసి ఓ మాస్ సాంగ్లో చిందేశారు. మరి... వారి డ్యాన్స్లు ఏ రేంజ్లో ఉన్నాయో తెలియాలంటే ఈ నెల 30 వరకూ వేచి చూడాల్సిందే. చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్గారు’. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ట్యాగ్లైన్. ఈ ఏడాది సంక్రాంతికి వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బ్లాక్బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో హీరో వెంకటేశ్ ముఖ్యపాత్ర పోషించారు.అర్చన సమర్పణలో సాహు గార΄ాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా ‘మన శంకరవరప్రసాద్గారు’ 2026 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే ‘మీసాల పిల్ల...’, ‘శశిరేఖ..’పాటలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం చిరంజీవి, వెంకటేశ్ ఓ మాస్ నంబర్కి డ్యాన్స్ చేశారు. ఈపాట ప్రోమోని నేడు రిలీజ్ చేసి, పూర్తిపాటని ఈ నెల 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ కమింగ్ అంటూ చిరంజీవి, వెంకటేశ్ డ్యాన్స్ చేస్తున్న పోస్టర్ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి. -
రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా
చిన్న సినిమాలు థియేటర్లలోకి ఎప్పుడొచ్చి వెళ్తాయో కూడా తెలీదు. ఒకవేళ కంటెంట్ బాగున్నా సరే స్టార్స్ లేకపోవడం ప్రేక్షకులు కూడా చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించారు. వీటిలో కొన్ని తర్వాత ఎప్పుడో ఓటీటీలోకి వస్తుంటాయి. ఇప్పుడు అలానే ఓ తెలుగు మూవీ కూడా దాదాపు రెండేళ్ల తర్వాత స్ట్రీమింగ్లోకి వచ్చింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులు చూడొచ్చు?సూర్య భరత్ చంద్ర, విషిక హీరోహీరోయిన్లుగా నటించిన థ్రిల్లర్ మూవీ 'అష్టదిగ్బంధనం'. 2023 సెప్టెంబరులో థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే దీని గురించి ప్రేక్షకులు పెద్దగా తెలియలేదు. ఇన్నాళ్లకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో ఉచితంగా చూసే అవకాశం రావొచ్చు.(ఇదీ చదవండి: కాబోయే భర్తతో సెలబ్రేషన్.. పెళ్లిపై హీరోయిన్ క్లారిటీ)'అష్టదిగ్బంధనం' విషయానికొస్తే.. ప్రజా సంక్షేమ పార్టీ పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు అలియాస్ రాములన్న దగ్గర శంకర్, నర్సింగ్ అనే రౌడీషీటర్స్ పనిచేస్తుంటారు. వచ్చే ఎన్నికల్లో నర్సింగ్, ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని రాములన్న ప్రకటిస్తాడు. దీంతో శంకర్కి అసూయ ఏర్పడుతుంది. తాను కూడా ఎమ్మెల్యే కావాలనుకుంటున్నానని రాములన్నతో చెప్పగా.. రూ.50 కోట్లు ఇస్తే సీటు ఇస్తానని అంటాడు. దీంతో శంకర్.. బ్యాంకు దోపిడీ చేయాలనుకుంటాడు. తన మనుషులతో కలిసి పక్కా ప్లాన్ వేస్తాడు.మరి శంకర్ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఇతడి స్కెచ్లో హీరో హీరోయిన్లు ఎలా ఇరుక్కున్నారు? గౌతమ్(సూర్య భరత్ చంద్ర) గతమేంటి? ఎలక్షన్ ఫండ్ అని రాములన్న ఇచ్చిన రూ.100 కోట్లని శంకర్ ఎక్కడ దాచాడు? ఆ డబ్బు ఎవరు ఎలా కొట్టేశారు? అసలు 'అష్టదిగ్భంధనం' ప్లాన్ వేసిందెవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు) -
శ్రీలీల గ్లామర్ టచ్.. కాజల్ కిస్సీ ఫేస్
గ్లామరస్ టచ్ ఇచ్చేస్తున్న శ్రీలీలముద్దు ఇచ్చేలా ఫేస్ పెట్టిన కాజల్క్రిస్మస్ సెలబ్రేషన్స్లో కీర్తి సురేశ్మత్తెక్కేలా చూస్తూ నేహాశెట్టి పోజులువైట్ డ్రస్లో అందాల బొమ్మలా రెజీనాషూటింగ్ జ్ఞాపకాలతో అనన్య పాండే View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Surbhi Puranik (@surofficial) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Navya & Divya Niranjan (@styledbynavyadivya) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) -
రిలీజ్కి ముందు టైటిల్ మార్పు.. ట్రైలర్ రిలీజ్
అవినాష్ హీరోగా పరిచయమవుతూ దర్శకత్వం వహించిన సినిమా 'వానర'. నిన్నటివరకు ఈ పేరుతోనే ప్రచారం చేశారు. ఇప్పుడు టైటిల్ మార్చినట్లు ప్రకటించారు. 'వనవీర' అనే పేరుని ఫిక్స్ చేశారు. జనవరి 1న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్ర ట్రైలర్ ఇప్పుడు విడుదల చేశారు.కులం, రాజకీయ అంశాలతో తీసిన ఈ సినిమాలో డివోషనల్ టచ్ కూడా ఉంది. ఈ మేరకు ట్రైలర్లో రాముడు, వానర సైన్యం, లంకకు వారధి కట్టడం లాంటి గ్రాఫిక్ విజువల్స్ చూపించారు. అయితే స్టోరీకి రాముడు, వానర సైన్యానికి లింక్ చేసి ఎలా చూపిస్తారో? ఇందులో సిమ్రన్ చౌదరి హీరోయిన్గా చేయగా.. వివేక్ సాగర్ సంగీతమందించాడు. -
కాబోయే భర్తతో సెలబ్రేషన్.. పెళ్లిపై హీరోయిన్ క్లారిటీ
మరో హీరోయిన్ పెళ్లికి రెడీ అయిపోయింది. కొన్నిరోజుల క్రితం రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ కాబోయే వధూవరులు ఇద్దరూ జంటగా కనిపించారు. కలిసి క్రిస్మస్ పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మహేశ్ బాబు 'వన్-నేనొక్కడినే' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్.. తర్వాత తెలుగులో మరో మూవీ చేసింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో హిందీ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోయింది. అడపాదడపా హిట్స్ అందుకుని గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈమె కంటే ముందు చెల్లి నుపుర్ సనన్కి పెళ్లి కానుంది. కొన్నిరోజుల క్రితం రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చింది.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)కృతిసనన్ ఫ్యామిలీ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంది. ఈ వేడుకలో సింగర్ స్టెబిన్ బిన్ కూడా కనిపించాడు. కృతి చెల్లి నుపుర్కి కాబోయే భర్త ఇతడే. గాయకుడిగా స్టెబిన్ బాగానే ఫేమ్ ఉంది. నుపుర్ కూడా హీరోయిన్గా తెలుగులోనే 'టైగర్ నాగేశ్వరరావు' అనే మూవీతో పరిచయమైంది. ఇది ఘోరమైన ఫ్లాప్ కావడంతో యాక్టింగ్ పక్కనబెట్టేసింది. ఇప్పుడు ఓ ఇంటిది కాబోతుంది.కొత్త ఏడాదిలో జరిగే సెలబ్రిటీ పెళ్లిలో నుపుర్దే మొదటిది అని చెప్పొచ్చు. రాజస్థాన్లోని ఉదయ్పుర్ వేదికగా జనవరి 11న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేవలం కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరు కానున్నారు.(ఇదీ చదవండి: ఇక నీకు సైడ్ క్యారెక్టర్లే గతి అన్నారు: రాజాసాబ్ హీరోయిన్) -
హారర్ మూవీ 'అమరావతికి ఆహ్వానం' గ్లింప్స్ చూశారా?
ప్రస్తుతం హారర్ సినిమాల హవా నడుస్తోంది. ఈ ఏడాది విడుదలైన అన్ని హారర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించాయి. ప్రస్తుతం అదే తరహాలో ఉత్కంఠభరితమైన కథ, కథనంతో రూపొందిన చిత్రం అమరావతికి ఆహ్వానం. శివ కంఠంనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తర్, సుప్రిత, హరీష్ ప్రధాన పాత్రల్లో నటించారు. సీనియర్ నటులు అశోక్ కుమార్, భద్రమ్, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ కీలకపాత్రలు పోషించారు. డైరెక్టర్ జివికె ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి గారి నిర్మాణ సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేనర్పై కేఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వర రావు నిర్మించారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మధ్య ప్రదేశ్లోని పలు లొకేషన్స్లో షూటింగ్స్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా క్రిస్మస్ శుభాకాంక్షలతో పోస్టర్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ.. మా సినిమా టైటిల్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని పాత్రలకి ప్రాధాన్యత ఉండేలా దర్శకుడు మంచి కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతున్నాయి అన్నారు.దర్శకుడు జివికె మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో రిలీజైన అన్ని హారర్ సినిమాలు మంచి విజయం సాధించాయి. అదే తరహాలో మరో డిఫరెంట్ కథాశంతో వస్తోన్న చిత్రం అమరావతికి ఆహ్వానం. సీనియర్ సినిమాటోగ్రాఫర్ జె ప్రభాకర్ రెడ్డి గారి విజువల్స్, హనుమాన్ ఫేమ్ సాయిబాబు తలారి ఎడిటింగ్ ఈ సినిమాకు ప్లస్ అవుతాయి. పద్మనాబ్ బరద్వాజ్ గారి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్స్లో ఆడియన్స్ని హారర్ మూడ్ క్యారీ చేసే విధంగా చేస్తుంది అన్నారు. -
కెమికల్ వాటర్లో పడ్డా.. అప్పటినుంచే..: కమెడియన్
కమెడియన్గా, విలన్గా వెండితెరపై రాణిస్తున్నాడు తమిళ నటుడు మొట్ట రాజేంద్రన్. ఈయన మొదట్లో స్టంట్మెన్గా పనిచేశాడు. నాన్ కడవులే సినిమాకుగానూ రాష్ట్రస్థాయిలో అవార్డులు గెల్చుకున్నాడు. అయితే మొదట్లో రాజేంద్రన్ పలువురు నటుల స్థానంలో యాక్షన్ సీన్లు (స్టంట్ డబుల్) చేసేవాడు. ఇప్పుడు మాత్రం నటుడిగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సత్తా చాటుతున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.15 అడుగుల ఎత్తులో నుంఒక మలయాళ సినిమా షూటింగ్లో 15 అడుగుల ఎత్తులో నుంచి కింద నీళ్లలో పడాల్సి ఉంటుంది. నేను ఆలోచించకుండా దూకేశాను. తీరా ఆ ఊరివాళ్లు చూసి.. ఇదంతా ఫ్యాక్టరీల నుంచి వచ్చే కెమికల్ వాటర్.. ఈ నీళ్లలో ఎందుకు దూకారు? అన్నారు. అలా అప్పుడే జుట్టురాలడం మొదలైంది. కొంతకాలానికే మొత్తం గుండు అయిపోయింది. కనుబొమ్మలు కూడా పోయాయి. మొదట్లో కొంత బాధపడ్డాను.అదే ప్లస్ అయిందిఅప్పటినుంచే విలన్గా కాకుండా కామెడీ రోల్స్ వచ్చాయి. విగ్ కూడా పెట్టుకోకుండా అలాగే ఉండమంటున్నారు. ఏదైతే మైనస్ అనుకున్నానో అదే నాకు ప్లస్ అయిపోయింది. తెలుగు ప్రేక్షకులు నన్ను థియేటర్లలో చూసి విజిల్స్ వేస్తుంటే ఒక్కోసారి ఆనందంతో కన్నీళ్లు వస్తాయి అన్నాడు. రాజేంద్రన్ తెలుగులో చలో, ఎఫ్ 3, వాల్తేర్ వీరయ్య, సర్, విమానం, దే కాల్ హిమ్ ఓజీ, త్రిబాణధారి బార్బరిక్, త్రిముఖ వంటి పలు చిత్రాల్లో నటించాడు. -
'జన నాయగణ్'.. విజయ్ పాడిన మరో పాట రిలీజ్
తమిళ హీరో దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగణ్'. సంక్రాంతి కానుకగా జనవరి 9న తెలుగు, తమిళంలో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే రెండు పాటలు రాగా తాజాగా మూడో పాటని విడుదల చేశారు. 'చెల్ల మగళే' అంటూ సాగే ఈ క్యూట్ గీతాన్ని విజయ్ పాడటం విశేషం. 'దళపతి కచేరీ' అంటూ సాగిన తొలి పాటలోని ఓ పోర్షన్ని విజయ్ గాత్రమందించాడు. ఈ పాట మాత్రం మొత్తంగా విజయ్ ఆలపించాడు.(ఇదీ చదవండి: గర్ల్ఫ్రెండ్ని పరిచయం చేసిన 'బిగ్బాస్' ఇమ్మాన్యుయేల్)ఈ సినిమా.. తెలుగులో హిట్ అయిన 'భగవంత్ కేసరి'కి రీమేక్ అని చాన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. ఈ పాట చూస్తే అదే అనిపించింది. ఒరిజినల్ మూవీలోనూ హీరో బాలకృష్ణ-పాప శ్రీలీల మధ్య ఓ సాంగ్ ఉంటుంది. అది ఇది ఒకటేలా అనిపిస్తున్నాయి. తెలుగులోనూ ఈ మూవీ 'జన నాయకుడు' పేరుతో విడుదల చేస్తున్నారు.విజయ్.. తనకు ఇది చివరి సినిమా అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించాడు. వచ్చే ఏడాది వేసవిలో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో ఇతడి పార్టీ పోటీపడనుంది. అందులో విజయ్ ఏ మేరకు విజయాన్ని అందుకుంటాడో చూడాలి? ఈ మూవీలో విజయ్ సరసన పూజా హెగ్డే నటించింది. మమిత బైజు కూడా కీలక పాత్ర చేసింది. హెచ్.వినోద్ దర్శకుడు. అనిరుధ్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు) -
మరో అమ్మాయితో నా భర్త డేటింగ్.. వదిలిపెట్టను : స్టార్ హీరో భార్య
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో గోవిందా, ఆయన భార్య సునీత ఆహుజా విడాకులు తీసుకోబోతున్నారనే వార్త గత కొంతకాలంగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం వీరిద్దరు సపరేట్గా ఉంటున్నారు. కానీ అధికారికంగా విడాకులు అయితే తీసుకోలేదు. కోర్టు ద్వారా గోవిందాకు నోటీసులు అందించారని..త్వరలోనే విడాకులు తీసుకునే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా భర్త గోవిందాపై సునీత(Sunita Ahuja) సంచలన ఆరోపణలు చేసింది. తన భర్తకు మరొక అమ్మాయితో వివాహేతర సంబంధం ఉందని.. డబ్బుల కోసమే ఆమె ఆయనకు దగ్గరైందని ఆరోపించారు.తాజాగా ఆమె ఓ మీడియా చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల రూమర్స్పై స్పందించారు. ‘మేమిద్దరం సపరేట్గా ఉంటున్న విషయం నిజమే. గోవిందా(Govinda) మరోక అమ్మాయితో డేటింగ్లో ఉన్నాడు. ఆ అమ్మాయి అతన్ని ప్రేమించడం లేదు.. డబ్బుల కోసమై దగ్గరైంది. ఆమె హీరోయిన్ అయితే కాదు. హీరోయిన్లు ఇతరుల కాపురాల్లో చిచ్చు పెట్టేంత చెడ్డవాళ్లు కాదు’ అని సునీత చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడుతూ..గోవింద జీవితంలో ముగ్గురే మహిళలు కీలకంగా ఉండాలని కోరుకున్నాం. ఆమె తల్లి, భార్య, కూతురు.. ఈ ముగ్గురు మహిళలే ఆయన జీవితంలో ఉండాలకున్నాం. కానీ నాలుగో మహిళ రావడం జీర్ణించుకోలేకపోయామని సునీత ఎమోషనల్ అయ్యారు. ఇప్పటికైనా గోవింద తన చుట్టు ఉన్న చెంచాలను వదిలేసి.. వర్క్పై ఫోకస్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. కాగా.. సునీతా అహుజా, గోవిందల పెళ్లి 1987లో జరిగింది వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు యశ్, కూతురు పేరు టీనా. గత ఏడాదిగా వీరిద్దరు వేరు వేరుగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. విడాకుల రూమర్స్ వినిపిస్తున్నా.సునిత మాత్రం గోవిందా ఎప్పటికీ తనవాడే అని.. వదిలేసే ప్రసక్తే లేదన్నారు. -
ఇక నీకు సైడ్ క్యారెక్టర్లే గతి అన్నారు: రాజాసాబ్ హీరోయిన్
మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ 'ది రాజాసాబ్' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. చిరంజీవి సినిమాలోనూ యాక్ట్ చేస్తున్నట్లు రూమర్స్ రాగా.. అందులో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేసింది. అయితే 'పేట' సినిమా తర్వాత తనకు సైడ్ రోల్స్ మాత్రమే సెట్ అవుతాయని కొందరు అన్నారంటోంది.అదేం అక్కర్లేదుఈ విషయం గురించి తాజాగా మాళవిక మోహనన్ మాట్లాడుతూ.. నటీనటులకు పర్ఫెక్ట్ లాంచ్ అవసరం అని నేను అనుకునేదాన్ని. ఉదాహరణకు దీపికా పదుకొణె ఓం శాంతి ఓంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. నేను కూడా అలాగే ఓ పెద్ద సినిమాతో గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వాలనుకున్నాను. నేనే కాదు, చాలామంది యంగ్ యాక్టర్స్ ఇలాగే ఫీల్ అవుతారు.ఏదైనా ప్రేక్షకుల చేతిలోనే..కానీ పర్ఫెక్ట్ సినిమా అంటూ ఏదీ ఉండదని అర్థమైంది. స్టార్ హీరోల సినిమా అయినా, గొప్ప దర్శకుల మూవీ అయినా రిజల్ట్ ప్రేక్షకుల చేతిలో ఉంటుందని తెలుసుకున్నాను. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోతే ఎవరైనా బోల్తా కొట్టక తప్పదని అర్థమైంది. బియాండ్ ద క్లౌడ్స్ మూవీ చూసి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నాకు రజనీకాంత్ పేట మూవీలో ఆఫర్ ఇచ్చాడు.ఆ తర్వాత మొదలైందిఅది హీరోయిన్ అవకాశం కానప్పటికీ రజనీకాంత్తో నటించే అదృష్టాన్ని వదిలేసుకోవాలనుకోలేదు. కానీ ఆ సినిమా చేశాక నాకు అన్నీ అలాంటి రోల్సే రావడం మొదలైంది. ఇకమీదట సైడ్ రోల్స్ మాత్రమే వస్తాయని కొందరు నిర్మాతలు అన్నారు. యాక్టర్స్ను ఇంత త్వరగా జడ్జ్ చేస్తారని అప్పుడే అర్థమైంది. ఒక పెద్ద సినిమా ఆఫర్ వచ్చినప్పటికీ కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశాను. ధైర్యంగా ముందుకు సాగాలిఅంటే నేను మంచి రోల్స్ మాత్రమే చేస్తానని చెప్పకనే చెప్పాను. ఇక్కడ జనాలు మన మైండ్లో ఏవేవో ఎక్కించడానికి ప్రయత్నిస్తారు. కానీ, మనం ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అని మాళవిక చెప్పుకొచ్చింది. 'మాస్టర్' సినిమాతో హీరోయిన్గా మాళవిక మళ్లీ ఫేమ్లోకి వచ్చింది. తంగలాన్, హృదయపూర్వం సినిమాల్లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన 'ది రాజాసాబ్'తో పాటు తమిళంలో కార్తీతో 'సర్దార్ 2' చేస్తోంది.చదవండి: మందు మానేశా.. ఇండస్ట్రీలో తాగుబోతులు లేరిక -
'అనగనగా ఒక రాజు' నుంచి పెళ్లి సాంగ్ రిలీజ్
ఈ సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల్లో 'అనగనగా ఒక రాజు' ఒకటి. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించారు. మారి అనే దర్శకుడు.. ఈ చిత్రంతో పరిచయమవుతున్నాడు. జనవరి 14న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే గ్లింప్స్, ఓ పాట రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరో సాంగ్ విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)పెళ్లి నేపథ్యంగా తీసిన ఈ పాట కూడా ట్రెండింగ్ పదాలతో ఉంది. బీట్ కూడా బాగుంది. నవీన్-మీనాక్షి డ్యాన్స్ కూడా కలర్ఫుల్గా కనిపించింది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్లు కాస్త నెమ్మదించడంతో.. మూవీ వాయిదా పడే అవకాశముందని మాట్లాడుకున్నారు. ఇప్పుడు పాట రిలీజ్ చేసి అలాంటివే లేవని క్లారిటీ ఇచ్చినట్లయింది. నిర్మాత నాగవంశీ కూడా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈసారి వాయిదా ఉండదని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: గర్ల్ఫ్రెండ్ని పరిచయం చేసిన 'బిగ్బాస్' ఇమ్మాన్యుయేల్) -
గర్ల్ఫ్రెండ్ని పరిచయం చేసిన 'బిగ్బాస్' ఇమ్మాన్యుయేల్
రీసెంట్గా ముగిసిన బిగ్బాస్ 9వ సీజన్లో టాప్-5లో నిలిచిన వాళ్లలో ఇమ్మాన్యుయేల్ ఒకడు. కామెడీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. బిగ్బాస్ హౌస్లో ఉన్నప్పుడు తన లవ్ స్టోరీ చెప్పాడు. బయటకు రాగానే ఆమెని పెళ్లి చేసుకుంటానని కూడా అన్నాడు. ఇప్పుడు అదే నిజం చేసేలా తన గర్ల్ఫ్రెండ్ని పరిచయం చేశాడు! ఈ మేరకు తన ఇన్ స్టా స్టోరీలో పెట్టిన ఫొటో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఆకాశానికెత్తి నట్టేట ముంచారు.. ఇమ్మూ కన్నీళ్లకు కారణమెవరు?)ఇమ్మూ పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తుంటే ఇతడితో పాటు ఉన్నది ప్రియురాలేనా అనిపిస్తుంది. త్వరలో గుడ్ న్యూస్ చెబుతాడా అనిపిస్తుంది. ఆమె ఎవరు ఏంటనేది, ఫొటో లాంటి బయటపెట్టలేదు కానీ ఇన్ స్టా ఖాతా పేరు మాత్రం రుచి అని ఉంది. ఎవరో ఏంటనేది త్వరలో ఇమ్మాన్యుయేల్ బయటపెడతాడేమో చూడాలి?షోలో ఇమ్మూ చెప్పిన లవ్స్టోరీ'స్టాండప్ కమెడియన్గా చాలా షోలు చేశా కానీ ఎవరూ గుర్తుపట్టలేదు. ఓరోజు నా ఇన్ స్టాలో పెద్ద మెసేజ్ వచ్చింది. మీ స్టాండప్ కామెడీ నాకు బాగా నచ్చింది. ఓ వ్యక్తి ఇంతమందిని నవ్వించగలడా అనిపించింది అని ఓ అమ్మాయి మెసేజ్ చేసింది. థ్యాంక్యూ చెబితే.. మీకు ఓకే అయితే నెంబర్ ఇస్తారా? అని అడిగింది. నేను ఫోన్ నంబర్ ఇచ్చాను. తర్వాత ఇద్దరం మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. కొన్నాళ్ల తర్వాత తను డాక్టర్ కోర్స్ చేస్తున్నా అని చెప్పింది. ఏంటీ నేను డాక్టర్ని నవ్వించగలిగానా అనిపించింది. నా ఫేమ్ చూసి ఇష్టపడిందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అప్పటికి నాకంతా గుర్తింపు రాలేదు. పోనీ అందం చూసి ప్రేమించింది అనుకోవడానికి కూడా లేదు. నేను ఎలా ఉంటానో నాకు తెలుసు''ఆమెతో మాట్లాడిన తర్వాత.. ఈ అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నాకు ఫస్ట్ అనిపించింది. ప్రపోజ్ కూడా కాదు నేరుగా పెళ్లి చేసుకోవాలనిపించింది. అంతా ఫోన్లోనే. నేను కనీసం ఆమె ఫొటో కూడా చూడలేదు. ఎలా ఉంటుందో తెలీదు. తన ముఖం కూడా చూడకుండానే ప్రపోజ్ చేశా. నీకు ఇష్టమైతే చెప్పు.. మా అమ్మవాళ్లకు చెప్పి నిన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాను. దీంతో నాకు కాస్త టైమ్ కావాలి అని చెప్పింది. తర్వాత ఆమెని ఇంట్లో వాళ్లకు కూడా పరిచయం చేశాను. ఇదంతా ఓ వారంలోనే జరిగిపోయింది. కలుద్దాం అడిగితే అంత సీన్ లేదు గానీ.. మా ఊరు వెళ్తున్నా కారు ఉంటే తీసుకుని రా, కలిసి వెళ్దాం అని చెప్పింది'(ఇదీ చదవండి: ఓడినా.. రెమ్యునరేషన్లో 'ఇమ్మాన్యుయేల్' అదుర్స్)'నాకు అప్పటికి కారు లేదు. మా ఫ్రెండ్ని కారు అడిగి, పెట్రోలుకి డబ్బులు సెట్ చేసుకుని ఆమెని కలిశాను. నాలుగు గంటల పాటు వాళ్ల ఊరివరకు జర్నీ చేశాం. ఆ ప్రయాణంలో.. చచ్చినా బతికినా దీనితోనే బతకాలనుకున్నాను. తనని నేను వేస్ట్ ఫెలో అని పిలుచుకుంటా. ఏ రోజు తను, నా అందం చూడలేదు. ఆస్తి చూడలేదు. డబ్బు చూడలేదు. ఈ రోజుకి కూడా తనకి నేను ఒక్క రూపాయి పెట్టింది లేదు. కనీసం ఒక్క డ్రస్ కొనివ్వలేదు. ప్రతిసారి బర్త్ డేకి బట్టలు కొంటాం గానీ పెళ్లియ్యాకే కట్టుకుంటాం అని అంది. వాటిని నా బీరువాలోనే దాచుకున్నా. అంత మంచి వ్యక్తి ఆమె. షూటింగ్స్ బిజీలో పడి తనని సరిగా పట్టించుకునేవాడిని కాదు, చిరాకుపడేవాడిని, తిట్టేవాడిని. చాలా బాధపెట్టాను. కానీ ఇక్కడి వచ్చాక రియలైజ్ అయ్యాను. మనిషిని దూరం పెట్టి ఇంత బాధపెట్టానా అనిపిస్తుంది''ఈ నవంబరులో తను పీజీ చేయడం కోసం ఫారిన్ వెళ్లాలి. కానీ నేను బిగ్బాస్కి వెళ్తున్నానని ఆగిపోయింది. జీవితాన్ని త్యాగం చేసింది. తనకేం కర్మ.. నాకోసం ఎందుకింత చేస్తుందని చాలా బాధగా ఉంది. తనకోసమే ఆడుతున్నా.. గెలవాలనే ఆడుతున్నా. ఈ షో అవ్వగానే పెళ్లి చేసుకుంటాం. ఫారిన్ వద్దూ ఏమి వద్దూ. తనని జీవితాంతం హ్యాపీగా చూసుకుంటాం. తన విలువ ఏంటో ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది' అని ఇమ్మూ అప్పుడు చెప్పాడు. ఇప్పుడు పరోక్షంగా తన ప్రేయసిని పరిచయం చేశాడు. చూస్తుంటే కొత్త ఏడాదిలో పెళ్లి శుభవార్త చెప్పడం గ్యారంటీ అనిపిస్తుంది.(ఇదీ చదవండి: కష్టానికి విలువ లేదు.. ఇమ్మూ గురించి కమెడియన్ రోహిణి ఆవేదన) -
మందు మానేశా.. ఇండస్ట్రీలో తాగుబోతులు లేరిక!
ప్రముఖ నటుడు శక్తి కపూర్, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కలిసి ఎన్నో సినిమాలు చేశారు. జుడ్వా, చల్ మేరే భాయ్, హమ్ సాత్ సాత్ హే, హలో బ్రదర్, కహీ ప్యార్ నా హోజాయే.. ఇలా అనేక చిత్రాల్లో నటించారు. అయితే 2005లో శక్తి కపూర్ ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు ప్రలోభాలకు గురి చేశాడంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో సల్మాన్.. శక్తి కపూర్తో కలిసి నటించడం ఆపేశాడు.అవమానభారం2011లో శక్తికపూర్ హిందీ బిగ్బాస్ ఐదో సీజన్లో అడుగుపెట్టాడు. ఈ షోకి సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. రియాలిటీ షో సమయంలో సల్లూ భాయ్.. శక్తిని పెద్దగా పట్టించుకోలేదు. అతడిని కావాలనే పక్కనపెట్టేశాడు. దీంతో శక్తికి అవమానంతో తలకొట్టేసినట్లయింది. బిగ్బాస్ నుంచి బయటకు వచ్చాక ఆయన సల్మాన్పై ఎదురుదాడికి దిగాడు. ఆడవాళ్లను కొడతాడని నింద వేశాడు. అలా ఇద్దరి మధ్య అగాథం ఏర్పడింది.ఎవరితోనూ గొడవల్లేవ్దాదాపు 15 ఏళ్ల తర్వాత తమ మధ్య పరిస్థితులు చక్కబడ్డాయంటున్నాడు శక్తికపూర్. ఇప్పుడు తనకెవరితోనూ గొడవలు లేవు అని చెప్తున్నాడు. మద్యపానానికి కూడా దూరంగా ఉంటున్నానన్నాడు. మందు మానేసి ఐదేళ్లవుతోందని చెప్పాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మందుబాబులకన్నా ఆరోగ్యంపై ఫోకస్ చేసేవాళ్లే ఎక్కువున్నారు. గతంలో అయితే చాలామంది స్టార్స్ తాగి మరీ సెట్స్కు వచ్చేవాళ్లని గుర్తు చేసుకున్నాడు. శక్తి కపూర్ వందలాది సినిమాల్లో నటించగా ఆయన కుమారుడు సిద్దాంత్ నటుడిగా, శ్రద్దా కపూర్ స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది.చదవండి: రెండో బిడ్డకు జన్మనిచ్చిన దేవర నటి -
మీనా కూతురు ఇప్పుడెలా ఉందంటే? ఫొటో వైరల్
హీరోయిన్ మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ తదితర హీరోలతో వరస సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ లీడ్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉంది. ఈమె కూతురు కూడా ఐదేళ్లకే బాలనటిగా చేసింది. ప్రస్తుతం చదువుకుంటోంది. అయితే మీనా కూతురి లేటేస్ట్ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.క్రిస్మస్ సందర్భంగా సెలబ్రిటీలు చాలామంది తమ ఇంట్లో సెలబ్రేషన్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేశారు. మీనా కూతురు నైనిక కూడా తల్లితో కలిసి దిగిన ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన చాలామంది అప్పుడే ఇంత పెద్దది అయిపోయిందా అని అనుకుంటున్నారు. ప్రస్తుతం నైనిక వయసు 14 ఏళ్లు. ఐదేళ్ల వయసున్నప్పుడు దళపతి విజయ్ 'తెరి' (తెలుగులో పోలీసోడు) మూవీలో బాలనటిగా చేసింది. తర్వాత మరేం మూవీస్ చేయలేదు. ఇప్పుడు మాత్రం హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత అందంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.మీనా విషయానికొస్తే.. 1982లో 'నెంజంగళ్' సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టింది. తమిళ దిగ్గజ హీరో శివాజీ గణేశన్ చిత్రాల్లో ఎక్కువగా కనిపించేది. 1990లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో అప్పటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. చంటి, అల్లరిపిల్ల, అల్లరి మొగుడు, సుందరకాండ, ప్రెసిడెంట్ గారి పెళ్లాం తదితర మూవీస్తో ఫేమ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా వెంకటేశ్తో చాలా సినిమాలు చేసింది. View this post on Instagram A post shared by Nainika Pilla (@nainika_ted) -
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి క్రిస్మస్ కలిసి రావడంతో అందరికీ సెలవులు వచ్చాయి. దీంతో చాలామంది ఇళ్లలోనే ఉన్నారు. వాళ్లకోసమా అన్నట్లు థియేటర్లలో చాలా సినిమాలు రిలీజయ్యాయి కానీ వాటిలో 'శంబాల' మాత్రమే బాగుందనే టాక్ తెచ్చుకుంది. మరోవైపు ఓటీటీల్లోనూ బోలెడన్ని మూవీస్ స్ట్రీమింగ్లోకి వచ్చేశాయి.గురు, శుక్రవారాల్లో కలిపి 22 వరకు సినిమాలు, వెబ్ సిరీస్లు పలు ఓటీటీల్లోకి వచ్చాయి. వీటిలో ఆంధ్ర కింగ్ తాలూకా, రివాల్వర్ రీటా, బాహుబలి ద ఎపిక్, అష్టదిగ్బంధనం, ఏక్ దివానే కీ దివానియత్, వ్రిట్టా మూవీస్ ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 కూడా అందుబాటులోకి వచ్చింది. మొత్తం లిస్టు ఇదిగోనెట్ఫ్లిక్స్స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 - తెలుగు డబ్బింగ్ సిరీస్బాహుబలి ద ఎపిక్ - తెలుగు సినిమారివాల్వర్ రీటా - తెలుగు డబ్బింగ్ మూవీఆంధ్ర కింగ్ తాలూకా - తెలుగు సినిమాఉళ్లోరుక్కు - మలయాళ మూవీసింగిల్ సాల్మా - హిందీ సినిమాక్యాష్ హీరో సీజన్ 1 - తెలుగు డబ్బింగ్ సిరీస్అమెజాన్ ప్రైమ్అష్టదిగ్బంధనం - తెలుగు మూవీలవ్ యూ ముద్దు - కన్నడ సినిమాఐ యామ్ స్టిల్ హియర్ - బ్రెజిలియన్ మూవీడోగులు - టర్కిష్ సినిమామనుషన్గడ - తమిళ మూవీవాట్ వుయ్ వాంటెడ్ టూబీ - స్పానిష్ సినిమాహాట్స్టార్గ్రాండ్ కేమన్ - ఇంగ్లీష్ సిరీస్హియర్ నౌ - హిందీ డబ్బింగ్ మూవీఒక్లామా సిటీ బాంబింగ్ - ఇంగ్లీష్ సిరీస్శ్రీ స్వప్న కుమార్ - బెంగాలీ మూవీజీ5ఏక్ దివానే కీ దివానియత్ - హిందీ సినిమారోంకిణి భవన్ - బెంగాలీ సిరీస్వ్రిట్టా - తెలుగు డబ్బింగ్ సినిమాక్రిస్మస్ అన్ టోల్డ్ స్టోరీస్ - హిందీ డాక్యుమెంటరీమనోరమఅపూర్వ పుత్రన్మర్ - మలయాళ మూవీ -
స్విమ్ సూట్లో అనసూయ వీడియో.. శివాజీపై కోపమా?
నటి, యాంకర్ అనసూయ పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. హీరోయిన్ల డ్రెస్పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై అనసూయ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో శివాజీతో చెప్పించుకోవాల్సిన అవసరం తమకు లేదంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. అనంతరం శివాజీ కూడా అనసూయకు కౌంటర్ ఇచ్చాడు. ‘త్వరలోనే మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు రావాలని కోరుకుంటున్నాను’ అని శివాజీ వ్యంగ్యంగా మాట్లాడారు. దీంతో అనసూయ మరోసారి శివాజీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘చాలా సందర్భాల్లో చాలా దాటుకుని వచ్చాను. మీ సపోర్ట్ నాకు అక్కర్లేదు. నన్ను నేను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు’ అంటూ శివాజీకి చివాట్లు పెట్టింది. దీంతో అటు శివాజీ, ఇటు అనసూయ..ఇద్దరు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నారు.ఇలాంటి నేపథ్యంలో అనసూయ తాజాగా ఓ వీడియోని తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేసింది. గతంలో స్నేహితులతో కలిసి యూరప్ ట్రిప్ వేసిన అనసూయ. ఐస్ల్యాండ్లో స్వీమ్ సూట్లో ఫోటోషూట్ చేసింది. దానికి సంబంధించిన ఫోటోలను కూడా అప్పట్లో సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా దానికి సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ.. నీళ్ల దగ్గర ఉన్నప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటాను. ట్రావెల్ డేస్ మిస్ అవుతున్నాను. త్వరలోనే మరో ట్రిప్కి ప్లాన్ చేయాలి’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. శివాజీపై కోపంతోనే ఆ వీడియో షేర్ చేశారంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
ఓటీటీలో మలయాళ హిట్ థ్రిల్లర్.. ఎక్కడంటే?
మలయాళంలో ఈ ఏడాది (క్రిస్మస్ ముందువరకు) 184 సినిమాలు రిలీజైతే వాటిలో కేవలం 15 మాత్రమే లాభాల బాట పట్టాయని అక్కడి నిర్మాతల మండలి అధికారికంగా వెల్లడించింది. వాటిలో పెద్ద హీరోల సినిమాలతో పాటు ఎకో అనే చిన్న చిత్రం కూడా చోటు దక్కించుకుంది. చిన్న సినిమా ఘన విజయంసందీప్ ప్రదీప్ హీరోగా నటించిన ఈ థ్రిల్లర్ సినిమా నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.50 కోట్ల వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో డిసెంబర్ 31న అందుబాటులోకి రానుంది. సినిమాఎకో.. మలయాళంతోపాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ ప్రసారం కానుంది. ఈ సినిమాకు బహుల్ రమేశ్ కథ అందించగా దిన్జిత్ అయ్యతన్ దర్శకత్వం వహించాడు. మార్క్ జయరామ్ నిర్మించాడు. వినీత్ నరైన్, సౌరభ్ సచ్దేవ, బిను పప్పు కీలక పాత్రలు పోషించారు. ముజీబ్ మజీద్ సంగీతం అందించాడు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: మలయాళ బాక్సాఫీస్ రిపోర్టు- 2025పై హీరో ఆగ్రహం -
రెండో బిడ్డకు జన్మనిచ్చిన 'దేవర' నటి
బుల్లితెర నటి చైత్రరాయ్ గుడ్న్యూస్ చెప్పింది. రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించింది. తొమ్మిదో పెళ్లిరోజు సందర్భంగా ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. మా జీవితాల్లో ఓ అద్భుతం జరిగింది. మాకు రెండోసారి దేవుడి ఆశీస్సులు లభిచాయి. మా కుటుంబంలోకి మరో చిన్ని యువరాణి అడుగుపెట్టింది.9వ పెళ్లిరోజు.. పరిపూర్ణంమా పెళ్లయి తొమ్మిదేళ్లవుతోంది. మా ఆయన ఉత్తమ భర్త మాత్రమే కాదు గొప్ప తండ్రి కూడా! మేమిద్దరం ఇప్పుడు నలుగురమయ్యాం. ఈ పెళ్లిరోజుతో మా కుటుంబం పరిపూర్ణమైంది అని రాసుకొచ్చింది. ఈ మేరకు చిన్న బుజ్జాయి రాకను తెలియజేస్తూ తన చిట్టి చేతి ఫోటో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు చైత్ర దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సీరియల్స్.. సినిమాకాగా చైత్ర రాయ్.. కన్నడతో పాటు తెలుగులోనూ పలు సీరియల్స్ చేసింది. అష్టాచమ్మా సీరియల్తో తెలుగులో పేరు తెచ్చుకుంది. అత్తో అత్తమ్మ కూతురో, దట్ ఈజ్ మహాలక్ష్మి, ఒకరికి ఒకరు, మనసున మనసై, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు వంటి పలు సీరియల్స్లో నటించింది. జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీలోనూ యాక్ట్ చేసింది. ఈ నటి 2016లో ఇంజనీర్ ప్రసన్న శెట్టిని పెళ్లి చేసుకుంది. వీరికి 2021లో కూతురు నిష్క శెట్టి పుట్టింది. ఇప్పుడు ఆ చిన్నారితో ఆడుకునేందుకు మరో బుజ్జి పాప వచ్చేసింది. View this post on Instagram A post shared by Chaithra Rai (@chaithrarai17)చదవండి: సంజనాను ఆంటీ అనేసిన శివాజీ -
మెగా ఫోన్ పట్టిన హీరోయిన్.. వరుణ్తో సినిమా!
టాలీవుడ్ హీరోయిన్లలో మల్టీపుల్ టాలెంట్ ఉన్నవారు కుడా ఉన్నారు. నటించడమే కాదు సినిమాను తెరకెక్కించే ప్రతిభావంతులు కూడా తెలుగు పరిశ్రమలో ఉన్నారు. ఇప్పటికే విజయ నిర్మల, జీవితతో సహా పలువురు హీరోయిన్లు దర్శకులుగా మారి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు. తాజాగా మరో హీరోయిన్ మెగా ఫోన్ పట్టింది. ఆమే షగ్న శ్రీ వేణున్. ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమాతో హీరోయిన్ మెప్పించిన షగ్న.. తాజాగా ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తోంది. ఇందులో వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్నాడు. ఎస్ 2ఎస్ సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 2గా తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్ని తాజాగా రిలీజ్ చేశారు. పోస్టర్లో ఒక బ్లాక్ డ్రెస్ ధరించిన యువ జంట చేతిలో రోజా పూలతో ఉండటం, మరో యువకుడు ఈ జంటలోని యువతి చేయి పట్టుకుని కనిపిస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మార్చిలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో షగ్న శ్రీ వేణున్ హీరోయిన్గా కూడా నటిస్తుంది. -
ఎన్నికల కోసం 'దిల్ రాజు' మాయ మాటలు: నట్టి కుమార్
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. డిసెంబర్ 28న హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్ ఆఫీస్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోని ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియోలు ఈ నాలుగు సెక్టార్ల కౌన్సిల్తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను ఈ ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు. ఎన్నికల నిర్వహణాధికారిగా దుర్గాప్రసాద్ వ్యవహరిస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులలో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. అయితే, ఛాంబర్ ఎన్నికల్లో రెండు ప్యానెల్స్ మధ్యే వార్ ఉండనుంది. నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, సురేశ్ బాబు బలపరుస్తున్న 'ప్రోగ్రెసివ్ ప్యానల్' ఒకవైపు ఉంటే.. సి. కళ్యాణ్, ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు బలపరుస్తున్న 'మన ప్యానెల్' మరోవైపు రేసులో వుంది. ఈ క్రమంలో తాజాగా మన ప్యానెల్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు.మన ప్యానెల్ నుంచి చదలవాడ శ్రీనివాసరావు ఇలా అన్నారు. ఆదివారం ఛాంబర్ ఎన్నికలు జరగనున్నాయి. చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఛాంబర్లో నాలుగు విభాగాలు ఉంటాయి. ఒకరికొకరు సహకరించుకుని ముందుకు వెళ్లాలి. గత పదేళ్లుగా చిత్ర పరిశ్రమ అదుపు తప్పింది. గిల్డ్ అని పెట్టి ఇష్టారీతిన కొందరు వ్యవహరిస్తున్నారు. 20 రోజుల పాటు కార్మికులకు పనిలేకుండా చేశారు. నిజానికి గిల్డ్ సభ్యులే సినిమా చిత్రీకరణలు ఆపారు. వారు తమ స్వార్దంగా వ్యవహరించడంతోనే ఇబ్బందులు వచ్చాయి. ఛాంబర్ సభ్యుల పేరుతో ముఖ్యమంత్రులతో ఫోటోలు దిగాలనే ఆలోచనతో మాత్రమే వారు ఉన్నారు. చిత్ర పరిశ్రమ బాగు అనేది వారికి పట్టలేదు. సీఎం రేవంత్రెడ్డి యోగ్యులు కాబట్టి కార్మికుల సమస్యను పరిష్కరించారు. వాస్తవానికి ఫిల్మ్ ఛాంబర్ చేయాల్సిన పనిని సీఎం పూర్తి చేశారు. చిన్న హీరోలను బతకనివ్వడం లేదు. క్యూబ్, యుఎఫ్ఓ వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. వాటిని ఎవరూ పట్టించుకోలేదు. చిత్రపురికి సమస్య వస్తే చిన్న నిర్మాతలమే సపోర్ట్గా నిలిచాం. వారందరే మన ప్యానెల్ తరపున పోటీ చేస్తున్నాం. అందరికీ అర్ధరాత్రి కూడా అందుబాటులో ఉంటాం.' అని ఆయన అన్నారు.రామానాయుడు ఇంటిని పబ్కి ఇచ్చారు: సి కల్యాణ్ కామెంట్స్ప్రోగ్రెసివ్ ప్యానల్ (దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు) పేరుతో మన వారసత్వం మన స్వాభిమానం అంటూ ఏదో ప్రకటనలు వేశారు. నిజానికి వారికి ఎలాంటి స్వాభిమానం లేదు. వారు వ్యక్తిగత లాభం కోసం ఏదైనా చేస్తారు. మేము మొదటి నుంచి చిన్న నిర్మాతలకు అందుబాటులో ఉన్నాం. వాస్తవానికి వారిని రెండేళ్ల క్రితం మేము సపోర్ట్ చేసి గెలిపించాము. చదలవాడ నాడు అందరం కలిసి వెళదామని చెప్పటంతోనే సపోర్ట్ చేశాం. కానీ, పదవుల్లోకి వచ్చి కూర్చొన్నారు తప్ప పరిశ్రమ కోసం ఏమీ చేయలేదు. వారి నుంచి చిన్న సినిమాలకు ఎలాంటి సపోర్ట్ లేదు. గిల్డ్ సభ్యులు చెప్పెవన్నీ అబద్దాలే. దామోదర్ ప్రసాద్ కార్మికులకు ఏమి చెయలేకపొయాడు. గిల్డ్ ప్రొడ్యూసర్స్ కోసం మాత్రం చాలా చేశాడు. కామెడీగా లేబర్ కమీషనర్ వద్దకు నిర్మాతలు వెళ్లటం వీరి హయాంలోనే జరిగింది. విభజించు పాలించు అన్నట్టుగా గిల్డ్ సభ్యులు వ్యవహారశైలి ఉంది. ఛాంబర్ బిల్డింగ్ గురించి ఐకానిక్ టవర్ అంటూ కామన్సెన్స్ లేకుండా గిల్డ్ సభ్యులు మాట్లాడుతున్నారు. అది ఏ ఒక్కరిది కాదు. దాంట్లో మనం అద్దెకు ఉంటున్నాం. అది సినిమా ఇండస్ట్రీది కానేకాదు. సెకెండ్ ఫ్లోర్లో కొందరికి ఆఫీస్లు ఉన్నాయి కాబట్టి స్వార్దం కోసం ఎదెదో మాట్లాడుతున్నారు. ఫిలిం నగర్ సోసైటీ ఆస్తి అది. రామానాయుడు నివశించిన ఇంటిని పబ్కి ఇచ్చారు. బాధగా ఉంది. చిన్న నిర్మాతలందరు మన ప్యానెల్ వైపే ఉన్నారు. సినీ కార్మికులు, కృష్ణానగర్ ఆర్టిస్ట్లు బతకాలంటే చిన్న సినిమాలే ముఖ్యం. ఓటిటి విషయంలోనూ గిల్డ్ వారు మాయామాటలు చెప్పారు. టిక్కెట్ రేట్లు అడిగేది వారే.. వాటికి వ్యతిరేకం అనేది కూడా వారే కావడం విశేషం. నాలుగు సెక్టార్స్లలో మన ప్యానెల్ ఉంది. ఓట్లేసి గెలిపించండి' అని కల్యాణ్ అన్నారుదిల్ రాజు చెప్పేవి అన్నీ మాయ మాటలే: నిర్మాత నట్టికుమార్'గిల్డ్ నుంచి చిత్ర పరిశ్రమలోని వారికి ఎలాంటి సపోర్ట్ లేదు. గెలిచినవారు మీటింగ్లకు కూడా రాలేదు. పదిమంది స్వార్దం కోసం గిల్డ్ డబ్బు వాడారు. మేము 1600 మంది సభ్యుల మెడిక్లెయిమ్ కోసం కృషి చేశాం. దిల్ రాజు ఎన్నికలు కోసం మాయ మాటలు చెప్పారు. అతనికి చేతకాక ఏడాది తరువాత దిగిపోయారు. నాగవంశీ మాత్రం సినిమాలు తీయని వారికి ఎందుకు మెడిక్లెయిమ్ ఇవ్వాలని అంటాడు. సీనియర్లపై గౌరవం ఉండాలి. చిన్న సినిమాలకు థియేటర్స్ కావాలని ఎప్పటినుంచో అడుగుతున్నాం. ఛాంబర్ పదవుల్లో ఉండి.. వారి స్వార్దం కోసమే దామోదర్ ప్రసాద్ పని చేశారు. మన ప్యానెల్ తరపున మెడిక్లెయిమ్తో పాటు చిన్న సినిమాకు ఐదో షో ఉండేలా కృషి చేస్తాం. చిత్రపరిశ్రమలో దిల్ రాజు, వంశీ, సుప్రియ ఎవరికైనా సాయపడ్డారా..?' అంటూ నట్టి కుమార్ ప్రశ్నించారు. -
ఆది సాయికుమార్ శంబాల.. తొలి రోజే ఊహించని వసూళ్లు
ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జోడీగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ శంబాల. యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్లో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా అభిమానుల అంచనాల మధ్య క్రిస్మస్ కానుకగా 25న థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ల పరంగా అదరగొట్టింది. బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే రూ.3.3 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో ఆది సాయికుమార్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు మరిన్ని థియేటర్స్ యాడ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో రవి వర్మ, మీసాల లక్ష్మణ్, స్వాసిక విజయ్, షీజు మీనన్, శివకార్తిక్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతమందించారు. Thanks for your love and support plz do watch #Shambhala in Theatres 🙏❤️ pic.twitter.com/NPe07O79Us— Aadi Saikumar (@iamaadisaikumar) December 26, 2025 -
బిగ్బాస్ బజ్: సంజనాను ఆంటీ అన్న శివాజీ
బిగ్బాస్ ట్రోఫీ గెలుస్తానని తనూజ కాన్ఫిడెంట్గా ఉండేది. కానీ అది నిజం కాలేదు. టికెట్ టు ఫినాలే నాదే అని శపథం చేసిన పవన్.. మాట నిలబెట్టుకోలేకపోయాడు. అయితే సంజనా మాత్రం ఆత్మధైర్యంతో అనుకున్నది సాధించింది. బిగ్బాస్లో అడుగుపెట్టడానికి ముందే టాప్ 5 అని ఫిక్సయిపోయింది. అందుకోసం 100 రోజులకు సరిపడా బట్టలు రెడీ చేసుకుంది.గుడ్డు దొంగతనంతప్పోఒప్పో ఏదైనా ముఖం మీదే మాట్లాడేది. తను మాట్లాడింది తప్పని తెలుసుకున్నప్పుడు బేషరతుగా క్షమాపణలు చెప్పేది. ఒక్క గుడ్డు దొంగతనంతో సీజన్ 9పై బజ్ క్రియేట్ చేసింది. ఎన్నో అవమానాలు, గొడవల తర్వాత వెరీ గుడ్డు కంటెస్టెంట్గా ఫైనల్స్లో ఐదో స్థానంలో బయటకు వచ్చింది. ఫినాలే అయిపోయినవెంటనే బిగ్బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఏ ఆంటీ కూడా టాప్5కి రాలేదుఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. తెలుగు బిగ్బాస్ చరిత్రలో ఏ ఆంటీ కూడా టాప్5కి రాలేదు. ఫైనల్స్కు వరకు ఉంటాననుకున్నారా? అని అడిగాడు. అందుకామె ఉంటాననుకున్నాను.. అందుకే కదా 15 వారాలకు సరిపడా డ్రెస్సులు బెంగళూరు నుంచి ప్యాకింగ్ చేసుకుని వచ్చాను అని బదులిచ్చింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. మన అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉన్నా.. చిన్న ఇంట్లో అయినా.. ఎక్కడైనా సంతోషంగా బతకొచ్చు. కానీ, మర్యాదకు భంగం కలిగితే ఎలా బతకగలం? నన్ను ఇలా గుర్తుపెట్టుకోవాలి2020లో నాపై పడ్డ నింద కారణంగా అందరూ నన్ను గుర్తు పెట్టుకోవద్దు.. బిగ్బాస్ 9లో టాప్ 5కి వెళ్లింది.. ఆవిడ సంజనా.. అని నన్ను గుర్తించాలి. నా పిల్లలు నన్ను అలాగే గుర్తుపెట్టుకోవాలి అని చెప్పింది. ఇక ప్రోమోలో శివాజీ ఆమెను ఆంటీ అనడంపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అతడికంటే సంజనా వయసులో చిన్నదని, ఆమెను పట్టుకుని ఆంటీ అంటాడేంటని ఆగ్రహిస్తున్నారు. -
జేమ్స్ కామెరూన్ అవతార్-3.. ఇండియాలో క్రేజీ రికార్డ్..!
హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ చిత్రం అవతార్: ఫైర్ అండ్ యాష్. ఈ సిరీస్లో వచ్చిన పార్ట్-3 ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. డిసెంబర్ 19న ఇండియా వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డ్ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది మనదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రంగా అవతరించింది. కేవలం ఏడు రోజుల్లోనే ఈ ఘనత సాధించింది.ఈ క్రమంలోనే అవతార్ -3.. హాలీవుడ్ మూవీ ఎఫ్1 ఇండియా ఆల్టైమ్ వసూళ్లను అధిగమించింది. దీంతో ఈ ఏడాది హాలీవుడ్ చిత్రాల లిస్ట్లో టాప్ ప్లేస్ కైవసం చేసుకుంది. అవతార్-3 ఇప్పటివరకు ఇండియావ్యాప్తంగా రూ. రూ. 131 కోట్లు వసూలు చేసింది. ఈ క్రమంలోనే 2025లో విడుదలైన బ్రాడ్ పిట్ మూవీ ఎఫ్1 రూ. 129 కోట్ల వసూళ్లను అధిగమించింది. ఇప్పటివరకు భారతదేశంలో 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన విదేశీ చిత్రంగా అవతార్-3 నిలిచింది.అవతార్ ఫ్రాంచైజీలో వచ్చిన ఈ చిత్రానికి ఇండియాలో అంతగా ఆదరణ దక్కించుకోలేకపోయింది. తొలి రోజు కేవలం రూ. 23 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో వసూళ్లపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ మూవీ దురంధర్ బాక్సాఫీస్ బరిలో ఉండడం అవతార్-3కి కలిసి రాలేదని చెప్పాలి. కాగా.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చూస్తే 400 మిలియన్ డాలర్ల మార్క్కు దగ్గర్లో ఉంది. -
‘పతంగ్’మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: పతంగ్నటీనటులు: వంశీ పూజిత్, ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ఎస్పీబీ చరణ్, వడ్లమాని శ్రీనివాస్,విష్ణు ఓఐ, అను హసన్ తదితరులురచన, దర్శకత్వం: ప్రణీత్ ప్రత్తిపాటినిర్మాతలు: విజయ్ శేఖర్ అన్నె, సంపత్ మాకా, సురేష్ రెడ్డి కొత్తింటి, నాని బండ్రెడ్డిసంగీతం: జోస్ జిమ్మిసినిమాటోగ్రఫి: శక్తి అరవింద్ఎడిటర్: చాణక్య రెడ్డి తూర్పువిడుదల తేది: డిసెంబర్ 25, 2025ఈ ఏడాది చివరి వారంలో తెలుగులో ఛాంపియన్, శంబాల, దండోరాతో పాటు మొత్తం ఎనిమిది సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే వాటిల్లో ఒకటి పతంగ్. ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ బాగున్నప్పటికీ నటీనటులంతా కొత్తవారే కావడం.. ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయకపోవడంతో సినిమాపై బజ్ క్రియేట్ చేయలేకపోయాయి. దీంతో ఎలాంటి అంచనాలు లేకుండానే డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘పతంగ్’ కథేంటంటే.. హైదరాబాద్లోని ఓ బస్తీకి చెందిన విజయ్ కృష్ణ అలియాస్ విస్కీ(వంశీ పూజిత్), అదే ప్రాంతంలో ఉండే రిచ్ కిడ్ అరుణ్(ప్రణవ్ కౌశిక్) చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఒక్క రోజు కూడా కలుసుకోకుండా ఉండలేరు. అలాంటి ప్రాణ స్నేహితుల జీవితంలోకి ఐశ్వర్య (ప్రీతి పగడాల) ప్రవేశిస్తుంది. ఆమెది కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్. ఏ విషయంలో అయినా సొంతంగా, త్వరగా నిర్ణయం తీసుకోలేదు. అలాంటి అమ్మాయి మొదట విస్కీతో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత అరుణ్ని ఇష్టపడుతుంది. ఆమె వల్ల ప్రాణ స్నేహితులైన విస్కీ, అరుణ్ల మధ్య విబేధాలు వస్తాయి. ఐశ్వర్యను దక్కించుకునేందుకు ఇద్దరి మధ్య పతంగ్ల పోటీ పెడతారు. ఇద్దరి మధ్య పతంగ్ల పోటీనే ఎందుకు పెట్టారు? ఈ పోటీలో ఎవరు గెలిచారు? చివరకు ఐశ్వర్య ఎవరికి దక్కింది? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. కొన్ని సినిమా కథలలో కొత్తదనం ఉండదు. అలాంటి కథతో ఇప్పటికే చాలా సినిమాలే వచ్చి ఉంటాయి. అయినా కూడా తెరపై చూస్తుంటే ఎంజాయ్ చేస్తాం. అలాంటి సినిమానే పతంగ్. ఈ సినిమాలో చెప్పుకోవడానికి కథే ఉండదు. దర్శకుడు ప్రణీత్ ప్రత్తిపాటి ఎంచుకున్న ట్రయాంగిల్ లవ్స్టోరీ పాయింట్ కూడా చాలా రొటీన్. అయితే దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ చాలా ఫ్రెష్గా, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఆర్య, ప్రేమదేశం లాంటి ట్రైయాంగిల్ లవ్స్టోరీని హైదరాబాద్ స్టైల్లో చెబుతూ.. తనదైన స్క్రీన్ప్లేతో మ్యాజిక్ చేశాడు దర్శకుడు ప్రణీత్. సన్నివేశాలు పాతవే అయితే.. డైలాగ్స్ ఫ్రెష్గా, యూత్ని ఆకట్టుకునేలా ఉంటాయి. అలా అని బూతు సంభాషణలు, సన్నివేశాలేవి ఇందులో ఉండవు. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా సినిమాను తెరకెక్కించారు.ఫస్టాఫ్ మొత్తం ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఐశ్వర్య-విస్కీల లవ్స్టోరీతో పాటు అరుణ్తో ఐశ్వర్య క్లోజ్ అయ్యేలా సాగే సన్నివేశాలన్నీ థియేటర్స్లో నవ్వులు పూయిస్తాయి. అలా చూస్తుండగానే ఇంటర్వెల్ అవుతుంది. ఇక సెకండాఫ్ ప్రారంభంలో కాస్త సాగదీతగా అనిపించినప్పటికీ.. పతంగ్ల పోటీ మొదలైన తర్వాత పరుగులు పెడుతుంది. సెకండాఫ్ కథ మొత్తం పతంగ్ల పోటీ చుట్టూనే తిరుగుతుంది. అయినా కూడా ఒక్క చోట బోర్ కొట్టదు. విష్ణు ఇచ్చే కామెంటరీ నవ్వుల డోస్ని మరింత పెంచేస్తుంది. ఇక ముగింపులో దర్శకుడు ఇచ్చిన సందేశం కూడా యువతను ఆలోచింపజేస్తుంది. మొత్తంగా కొత్త కథను ఆశించకుండా పతంగ్ సినిమాకు వెళ్తే మాత్రం రెండున్నర గంటల పాటు హాయిగా ఎంటర్టైన్ అవ్వొచ్చు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన నటీనటులంతా కొత్తవారే.అయినా కూడా చక్కగా నటించారు. హైదరాబాద్లోని బస్తీ యువకుడు విస్కీగా వంశీ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రణవ్ స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రీతి పగడాల ఇందులో హీరోయిన్గా నటించింది.కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్ ఉన్న ఐశ్వర్య పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేసింది. అరుణ్ చెల్లిగా నటించిన విజ్ఞాని తెరపై క్యూట్గా కనిపించింది. అరుణ్ తండ్రిగా నటించిన ఎస్పీ చరణ్.. ఎమోషనల్ సీన్లని బాగా పండించాడు. అరుణ్ని ఇష్టపడే లక్ష్మీ పాత్ర పోషించిన నటి కూడా బాగా చేసింది. ముఖ్యంగా పతంగ్లో పోటీలో ఆమె చేసిన డ్యాన్స్ నవ్వులు పూయిస్తుంది. అరుణ్-విస్కీల ఫ్రెండ్స్ గ్యాంగ్తో పాటు మిగిలిన నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. జోస్ జిమ్మీ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు వెరైటీగా, ఆకట్టుకునేలా ఉంటాయి. బీజీఎం అదిరిపోయింది. శక్తి అరవింద్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ షార్ప్గా ఉంది. చిన్న సినిమానే అయినా నిర్మాణ విలువలు బాగున్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
బాక్సాఫీస్ రిపోర్టు బయటపెట్టడం అవసరమా?: హీరో
కేరళ చిత్ర నిర్మాతల మండలి ఇటీవలే మలయాళ సినిమా 2025 బాక్సాఫీస్ రిపోర్టును విడుదల చేసింది. ఈ ఏడాది ఇప్పటివరకు 184 చిత్రాలు రిలీజైతే వాటిలో కేవలం 15 మాత్రమే హిట్టయ్యాయని తెలిపింది. లోక, ఎల్2: ఎంపురాన్, తుడరుమ్, కలంకావల్, డియస్ ఈరే, హృదయపూర్వం, అలప్పుజ జింఖానా, రేఖాచిత్రం, ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమాలను సూపర్హిట్గా అభివర్ణించారు. అవి మాత్రమే హిట్ఎకో, పెట్ డిటెక్టివ్, ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ, పోన్మాన్, పడక్కాలం, బ్రొమాన్స్ సినిమాలను హిట్లుగా పేర్కొన్నారు. 2024లో 10.633% సక్సెస్ రేషియో ఉంటే ఈసారి అది 8.15%కే పరిమితమైందని వెల్లడించారు. అయితే ఈ నివేదికపై పలువురు దర్శకనిర్మాతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సుమతి వలవు, నరివెట్ట వంటి సినిమాలు ఈ జాబితాలో ఎందుకు లేవని నిలదీస్తున్నారు. అవెందుకు లేవు?నరివెట్ట దర్శకుడు అనురాజ్ మనోహర్ మాట్లాడుతూ.. మా సినిమా విజయం సాధించింది.. కానీ దాన్ని ఎందుకు లిస్టులో చేర్చలేదు? ఏ ప్రాతిపదికన ఈ జాబితా తయారు చేశారు? అని మండిపడ్డాడు. తాజాగా హీరో నివీన్ పౌలీ సైతం ఈ రిపోర్టుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈయన హీరోగా నటించిన సర్వం మాయ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. అవసరమా?ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ భేటీకి హాజరయ్యాడు నివిన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి బిజినెస్లో ఒడిదుడుకులు సహజం. లాభనష్టాలు వస్తుంటాయి. అంతమాత్రానికి (Kerala Film Producer Association) ఇలా బాక్సాఫీస్ రిపోర్టును బయటపెట్టాల్సిన అవసరం ఏముంది? దీనివల్ల సినిమాను నమ్ముకునేవాళ్లను నిరాశపర్చినట్లు అవుతుంది. గతంలో ఈ ధోరణి లేదు అని అసహనం వ్యక్తం చేశాడు. -
దురంధర్ బాక్సాఫీస్.. యానిమల్ రికార్డ్ బ్రేక్..!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. పెద్దగా బజ్ లేకుండానే వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ను శాసిస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలై ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. తాజాగా మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది.ఈ సినిమా విడుదలైన 21 రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్ దాటేసింది. క్రిస్మస్ రోజున రూ. 26 కోట్లతో కలెక్షన్స్ పరంగా అదరగొట్టింది. దేశవ్యాప్తంగా రూ. 668.80 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ. 1006.7 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఏ రేటింగ్ చిత్రంగా ఘనత సాధించింది. అంతకుముందు ఈ రికార్డ్ రణబీర్ కపూర్ యానిమల్ పేరిట ఉంది.కాగా.. ఈ సినిమాకు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. పాకిస్తాన్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించారు. ధురంధర్లో సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడి, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. వచ్చే ఏడాది మార్చి 19న దురంధర్ పార్ట్-2 విడుదల కానుంది. Entering the 1000 CR club, loud and proud.Book your tickets. (Link in bio)🔗 - https://t.co/cXj3M5DFbc#Dhurandhar Frenzy Continues Worldwide.@RanveerOfficial #AkshayeKhanna @duttsanjay @ActorMadhavan @rampalarjun #SaraArjun @bolbedibol @AdityaDharFilms #JyotiDeshpande… pic.twitter.com/wAk2IklWT5— Jio Studios (@jiostudios) December 26, 2025 -
శివాజీ డర్టీ 'సామాను' గోల 'పెద్ది'పై పడిందా..?
'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ మాట్లాడుతూ.. హీరోయిన్లు కొంచెం డ్రెస్ సెన్స్ పాటించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రామ్చరణ్ పెద్ది సినిమాను కూడా తాకుతున్నాయి. ఇంతకీ శివాజీ ఏమన్నాడంటే.. 'హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకునిపోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుందంటూ.. మీ అందం చీరలోనూ, నిండుగా కట్టుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే ‘సామాను’ కనబడే వాటిలో ఏమీ ఉండదమ్మా అని సూక్తులు చెప్పాడు. అయితే, సామాజిక కార్యకర్తలతో పాటు సినీ రంగం నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో తనతప్పు తెలుసుకుని సారీ చెప్పాడు.అయితే, శివాజీ చేసిన డర్టీ సామాను వ్యాఖ్యలు అటు తిరిగి ఇటు తిరిగి పెద్ది సినిమాపై పడ్డాయి. రీసెంట్గా భారీ హిట్ అయిన చికిరి పాట తెరపైకి వచ్చింది. ఈ సాంగ్లో కూడా 'సరుకు సామాను' అనే పదాలను రచయిత వాడారు. పనిలో పనిగా ఇందులో ఉన్న మరికొన్ని ఇలాంటి పదాలే బయటకు తవ్వారు. ఈ పాటలో ఒకచోట 'ఆ చంద్రుల్లో ముక్క.. జారిందే 'దీనక్క'.. నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా' అంటూ రాసుకుంటూ పోయాడు. సరుకు సామాను అనే పదాన్ని వాడుకలో ఉపయోగిస్తాం కదా అని కొందరు పక్కన పెడితే.. దీనక్క అనేది అభ్యంతరంగానే ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీంతో శివాజీతో పాటు పెద్ది సాంగ్ రచయితను కూడా ఏకిపారేస్తున్నారు.రవితేజ నటించిన మాస్ జాతరలో కూడా ఇలాంటి పదాలే కనిపించాయి. శ్రీలీలతో 'ఓలే ఓలే' సాంగ్ కోసం స్టెప్పులేసిన రవితేజ కూడా ఆ పాటకు అభ్యంతరం చెప్పలేదు. చెప్పలేని పదాలతో ఎక్కడపడితే అక్కడ బూతులతో రెచ్చిపోయారు. ఓ ఇంటర్వ్యూలో కూడా మేకర్స్ ఆ పాటను సమర్థించుకోవడం మరింత నీచం. శివాజీ వ్యాఖ్యల తర్వాత ఇలాంటి డర్జీ చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి సాంగ్స్, డైలాగ్స్ వచ్చినప్పుడు శివాజీ అడ్డుచెప్పలేదు ఎందుకు.. అతని వ్యాఖ్యలను సమర్థించే వారు ఈ డర్టీ సంప్రదాయాన్ని కూడా మెచ్చుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.“సరుకు సామాను”………ఈ సాంగ్లో వాడారు కదా, అప్పుడు కూడా అందరూ రియాక్ట్ అయ్యారా?జస్ట్ అనిపించింది… ఎవరు అయినా రియాక్ట్ అయితే మంచిదే……#justasking pic.twitter.com/dQJJu6pcvF— 9iMedia (@9iMediaNews) December 23, 2025 -
శ్రీకాంత్ తనయుడి ఛాంపియన్.. తొలి రోజే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఛాంపియన్'. ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో రోషన్ సరసన మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా నటించింది. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.(Champion Movie Box Office Collections)తొలిరోజే ఛాంపియన్ మూవీ అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.4.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అఫీషియల్గా ప్రకటించింది. ఈ మేరకు ఛాంపియన్ మూవీ పోస్టర్ను పంచుకుంది. కాగా.. బ్రిటీష్ కాలంలో జరిగిన బైరాన్పల్లి గ్రామంలో జరిగిన ఘటన నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. ఈ మూవీని వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నిర్మించారు.A HOUSEFULL festive day at the cinemas ❤️🔥People’s #CHAMPION opens big with 4.5 CRORE+ worldwide GROSS on Day 1 💥Experience the historic journey on the big screen now.@IamRoshanMeka @PradeepAdvaitam #AnaswaraRajan @ActorSanthosh @madhie1 @MickeyJMeyer @AshwiniDuttCh… pic.twitter.com/jL0uSEGcjm— Vyjayanthi Movies (@VyjayanthiFilms) December 26, 2025 -
స్టార్ హీరో సినిమా వేడుక.. మలేషియాకు ఫ్యాన్స్ క్యూ
చెన్నై ఎయిర్పోర్ట్ కిటకటిలాడుతుంది. మలేషియాకు వెళ్లే విమానాలు ఫుల్ అయిపోయాయి. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా..? విజయ్ 'జన నాయగన్' కోసం. తమిళ టాప్ హీరో విజయ్ నటించిన ఈ మూవీ 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కౌలాలంపూర్లోని బుకిట్ జలీల్ స్టేడియం (Bukit Jalil Stadium)లో డిసెంబరు 27న జన నాయగన్ మూవీ వేడుక నిర్వహించనున్నారు. దీంతో తమిళనాడు నుంచి ఆయన ఫ్యాన్స్ భారీగా మలేషియాకు ప్రయాణం అయ్యారు. దీంతో చెన్నై ఎయిర్పోర్ట్లో ఇమ్మిగ్రేషన్ కోసం భారీగా క్యూ కట్టేశారు.మలేషియాలో తమిళ సినిమాలకు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా విజయ్కు, విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఆడియో వేడుకను అక్కడ నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను ఆకర్షించవచ్చని మేకర్స్ ప్లాన్ చేశారు. బుకిట్ జలీల్ స్టేడియం దక్షిణాసియాలోని అతిపెద్ద స్టేడియంలలో ఒకటి. ఇందులో 90వేల మందికి పైగా సీటింగ్ సామర్థ్యం ఉంది. ఈ కార్యక్రమంలో విజయ్తో పాటు చిత్ర యూనిట్, సంగీత దర్శకుడు అనిరుధ్ పాల్గొననున్నారు. దీంతో ఇప్పటికే టికెట్లు పూర్తిగా అమ్ముడైపోయాయి. ఈ వేడుకను పూర్తిగా సినిమా, సంగీతానికే పరిమితం చేయాలని మలేషియా పోలీసులు ఇప్పటికే స్పష్టమైన నియమాలు పెట్టారు. రాజకీయ ప్రసంగాలు, చిహ్నాలు అక్కడ కనిపించకూడదని నిషేధించారు. Crowd at Chennai Airport Immigration 🤯 — Only for #JanaNayagan Audio Launch 🔥 pic.twitter.com/dtW5hlsvgO— VCD (@VCDtweets) December 26, 2025 -
టాలీవుడ్ లవ్ బర్డ్స్.. న్యూ ఇయర్ పార్టీకి రెడీ..!
టాలీవుడ్ ప్రేమ జంటల్లో విజయ్- రష్మిక జోడీ గురించి మనందరికీ సుపరిచితమే. చాలా ఏళ్లుగా డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఈ ఏడాదిలోనే నిశ్చితార్థం చేసుకున్నారని వార్తలొచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ.. పరోక్షంగానైతే హింట్ ఇచ్చారు. వచ్చే ఏడాదిలో వీరిద్దరు పెళ్లి పీటలెక్కబోతున్నారని టాక్ కూడా వినిపిస్తోంది. వచ్చే ఫిబ్రవరిలో గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వైరలైంది.ప్రస్తుతం తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన, రష్మిక మందన్నా మైసా చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చేశాయి. అయితే ప్రస్తుతం షూటింగ్కు కాస్తా గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. వరుసగా క్రిస్మస్, న్యూ ఇయర్ ఉండడంతో ఈ జంట వేకేషన్ ప్లాన్ చేశారు. నూతన ఏడాది వేడుకల కోసం ఫారిన్ ట్రిప్కు బయల్దేరారు. దీనికి సంబంధించిన ఫోటోలను రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. వెకేషన్ ట్రిప్ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. అయితే విజయ్, రష్మిక హైదరాబాద్ విమానాశ్రయంలో విడివిడిగా కనిపించారు. దీంతో వీరిద్దరు కలిసే వేకేషన్కు ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది.పెళ్లి గురించి ఇటీవల రష్మికతో ప్రస్తావించగా.. సమయం వచ్చినప్పుడు తానే అందరికీ చెప్తానని తెలిపింది. నిశ్చితార్థ వార్తలను కొట్టిపారేయలేదు.. అలాగని డైరెక్ట్గా చెప్పలేదు నేషనల్ క్రష్. ఇటీవలే ది గర్ల్ఫ్రెండ్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన రష్మిక.. ప్రస్తుతం మైసా చిత్రంలో నటిస్తోంది. గతంలో విజయ్, రష్మిక గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలలో నటించారు. -
'అమ్మ' పేరుతో మోసం.. జీవీ ప్రకాష్కు నెటిజన్ల మెసేజ్లు
దక్షిణాదిలో ప్రముఖ సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న జీవీ ప్రకాష్ సోషల్మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఎవరైనా సాయం చేయమని తనని కోరితే వెంటనే స్పందిస్తారు కూడా.. గతంలో విపత్కర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు ఆర్థిక సాయం చేయమని కోరితే ఆయన దాతృత్వ వైఖరి చాలాసార్లు చూపించారు. దురదృష్టవశాత్తు, ఆయన చేస్తున్న సాయం ఆన్లైన్ మోసానికి గురి చేసింది. దీంతో ప్రకాష్ రూ. 20 వేలు పోగొట్టుకున్నారు.ఎం జరిగిందంటే..?ఎక్స్ పేజీలో @prasannasathis అనే ప్రొఫైల్ పేరుతో గుర్తు తెలియని వ్యక్తి జీవీ ప్రకాష్ను మోసం చేశాడు. చాలా కాలం క్రితం మరణించిన ఒక వృద్ధ మహిళ ఫోటోను షోషల్మీడియాలో పోస్ట్ చేసి, ఆమె తన తల్లి అని పేర్కొన్నాడు. ఆపై తన తండ్రి కూడా చాలా ఏళ్ల క్రితమే బాధ్యత లేకుండా కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తల్లి మాత్రమే కుటుంబాన్ని చూసుకుంటుందని కట్టుకథ అల్లాడు. అయితే, ఆమె కూడా మరణించారని తన అంత్యక్రియలను పూర్తి చేయడానికి తన వద్ద ఒక్క రూపాయి కూడా లేదంటూ ఆర్థిక సహాయం చేయాలని జీవీ ప్రకాష్ను కోరాడు.ఆ వ్యక్తి చెప్పిన స్టోరీకి చలించిపోయిన జీవీ ప్రకాష్ వెంటనే రూ. 20 వేలు గూగుల్ పే చేశారు. అయితే, కొందరు నెటిజన్లు ఆ ఫోటోను డీకోడ్ చేశారు. గూగుల్ ద్వారా ఆ ఫోటో చాలా ఏళ్ల క్రితం నాటిదని పేర్కొన్నారు. ఒక ఫేక్ స్టోరీ చెప్పి మోసం చేశాడని జీవీ ప్రకాష్కు మెసేజ్లు పంపారు. దీంతో వెంటనే అతని నెంబర్కు కాల్ చేసినప్పటికీ రెస్పాండ్ కాలేదని ప్రకాష్ చెప్పుకొచ్చారు. అమ్మ పేరు చెప్పుకొని సాయం కోరి ఇలా మోసం చేయడం ఏంటి అంటూ నెటిజన్లు భగ్గుమన్నారు. అడిగిన వెంటనే సాయం చేసిన ప్రకాష్ను మెచ్చుకుంటున్నారు. ఇలాంటి మోసాలు చూసిన తర్వాత సాయం చేసే వ్యక్తులు కూడా మరోసారి ముందుకు రారని గుర్తుచేస్తున్నారు.நானும் தங்கச்சியும் என்ன பண்ணுவது தெரியமால் உல்லோம் எங்களுக்கு இறுதி சடங்கு பண்ணுவதாருக்கு உதவி பண்ணுங்க அண்ணா @gvprakash 🙏🏻🥲 https://t.co/iXJWnwQpR6— Mom Little King.♥️ (@prasannasathis) December 25, 2025pic.twitter.com/TRfgsdw6wA— G.V.Prakash Kumar (@gvprakash) December 25, 2025 -
టాలీవుడ్ హీరో శాండల్వుడ్ ఎంట్రీ.. పునీత్ రాజ్కుమార్కు నివాళులు..!
టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీరంగంలో సత్తా చాటుతున్నారు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. టాలీవుడ్లో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ ఏడాదిలో పలు సినిమాలతో మెప్పించిన నవీన్ చంద్ర.. శాండల్వుడ్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు.ఈ సందర్భంగా దివంగత కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సమాధిని సందర్శించారు. ఆయనకు మొకాళ్లపై కూర్చుని నివాళులర్పించారు. కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాకు మీ ఆశీర్వాదాలు కావాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. కాగా.. కన్నడ సినీ ఇండస్ట్రీలో నవీనచంద్ర నటించిన తొలి సినిమా మార్క్. కిచ్చా సుదీప్ హీరోగా వచ్చిన ఈ యాక్షన్ మూవీ క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర కీలక పాత్రలో నటించారు. రిలీజ్కు ముందు వచ్చిన పోస్టర్స్ చూస్తే పవర్ఫుల్ రోల్ చేసినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Naveen Chandra (@naveenchandra212) -
'వార్-2' నష్టం ఎంతో ఫైనల్గా చెప్పిన నాగ వంశీ
ఈ ఏడాదిలో బాలీవుడ్తో పాటు తెలుగు ప్రేక్షకులు భారీగా ఎదురుచూసిన చిత్రం వార్-2.. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ మూవీని యశ్రాజ్ ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దీని తెలుగు రైట్స్ను రూ. 80 కోట్లకు నిర్మాత నాగవంశీ దక్కించుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. సినిమా డిజాస్టర్గా మిగిలిపోవడంతో సుమారు రూ. 50 కోట్లు నష్టపోయాడని వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తను క్లారిటీ ఇచ్చాడు. అసలు వార్-2 ఎంత మొత్తానికి కొన్నాడో చెప్పుకొచ్చాడు.'వార్-2 సినిమాలో నేను భారీగా నష్టపోయానని చాలామంది అంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. తెలుగు రైట్స్ రూ. 68 కోట్లకు దక్కించుకున్నాను. మూవీ క్లోజింగ్ అయ్యేసరికి రూ. 40 కోట్ల వరకు షేర్ వచ్చింది. అయితే, యశ్రాజ్ ఫిల్మ్స్ సంస్థ నాకు రూ. 18 కోట్లు రిటర్న్ ఇచ్చింది. బాంబే కంపెనీ అయినప్పటికీ వారు నిజాయితీగానే తిరిగి డబ్బులు ఇచ్చేశారు. వార్-2 వల్ల నేను నష్టపోలేదు.' అని మొదటిసారి లెక్కలతో సహా వంశీ చెప్పారు. ఈ లెక్కన తను రూ. 10 కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది.జూనియర్ ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం కావడంతో టాలీవుడ్లో కూడా ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇందులో హృతిక్ రోషన్, అనిల్ కపూర్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా తదితరులు నటించారు. ఈ చిత్రం విడుదలైన మొదటిరోజు నుంచే కొందరు కావాలనే ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా ఏపీలో తెలుగు దేశం పార్టీ క్యాడర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు మద్దతు ఇవ్వడం మానేసింది. వారు కూలీ సినిమా చూడాలని పెద్ద ఎత్తున సోషల్మీడియాలో సూచించారు. అదే సమయంలో వార్2 చిత్రంపై తీవ్రమైన ట్రోలింగ్కు దిగారు. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్పై ప్రభావం పడింది.I Bought Jr Ntr @tarak9999 Garu's & HRX @iHrithik Garu's #War2 Film For 68 Crores + Gst & It Got Theatrical Revenue Nearly For 40 Crores Share & I Met The Team Of @yrf & Spoke With Them & They Returned The Amount Of 18 Cr - @vamsi84 Garu#ManOfMassesNTR @tarak9999 pic.twitter.com/bWL5lkwid1— 𝐓𝐞𝐚𝐦 𝐅𝐨𝐫 𝐓𝐚𝐫𝐚𝐤 (@TeamForTarak) December 25, 2025 -
రాజ్తో పెళ్లి తర్వాత తొలి క్రిస్మస్.. ఫోటోలు పంచుకున్న సమంత..!
టాలీవుడ్ హీరోయిన్ సమంత క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరుపుకుంది. రెండో పెళ్లి తర్వాత చేసుకున్న మొదటి క్రిస్మస్ ఇదే కావడంతో సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో పాటు ఈ ఏడాది తన ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చిందని సంతోషం వ్యక్తం చేసింది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో పెళ్లి జరిగిన ఫోటోను కూడా షేర్ చేసింది. ఈ ఏడాదిలో తన మధుర జ్ఞాపకాలను సైతం పోస్ట్ చేసింది. ఇటీవలే సామ్ రెండో సారి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.రాజ్ నిడిమోరుతో ఏడడుగులు..సమంత ఇటీవలే రెండో పెళ్లి చేసుకుంది. రూమర్స్ని నిజం చేస్తూ 'ద ఫ్యామిలీ మ్యాన్' దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించింది. కోయంబత్తూర్లోని ఈశా ఫౌండేషన్లోని లింగ భైరవి దేవి సన్నిధిలో ఈ శుభాకార్యం జరిగింది. అయితే 'భూత శుద్ధి ఆచారం' పద్దతిలో ఈ పెళ్లి వేడుక జరిగింది. డిసెంబర్ 1న, కేవలం30 మంది అతిథులతో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
75 ఏళ్ల బామ్మగా ఒకప్పటి స్టార్ హీరోయిన్
వైవిధ్య భరిత కథ చిత్రాలను నిర్మించడంలోనూ, టాలెంటెడ్ కళాకారులను ప్రోత్సహించడంలోనూ ముందుండే నటుడు శివ కార్తికేయన్.. తన ఫ్యాషన్ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న కొత్త చిత్రం తాయ్ కిళవి. ఈ చిత్రం ద్వారా శివ కుమార్ మురుగేశన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో నటి రాధిక శరత్ కుమార్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ను విడుదల చేశారు. తెలుగు, తమిళ చిత్రాల్లో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించిన రాధికా శరత్కుమార్.. ఈ మూవీలో ఉసిలంపట్టి గ్రామం కట్టుబాటులో నివసించే 75 ఏళ్ల బామ్మగా ఆమె కనిపించనున్నారు. ఆమె కుటుంబం, ఆ ఊరి ప్రజల జీవన విధానం, కట్టుబాట్లు, సమస్యలు తదితర అంశాలకు వినోదాన్ని జోడించి తెరకెక్కించినట్లు దర్శకుడు చెప్పారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ 2026 ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఈషా విజయాన్ని అడ్డుకోలేరు: వంశీ నందిపాటి
‘‘ఈషా’ చిత్రానికి హైదరాబాద్లో 26 ప్రీమియర్స్ వేస్తే హౌస్ఫుల్ అయ్యాయి. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మౌత్ టాక్ బాగుంది. వసూళ్లు బాగున్నాయి. అయితే మా సినిమాని కొందరు టార్గెట్ చేసి, పెయిడ్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఒక మంచి సినిమా మీద ఇలా జరగడం దారుణం. ఎవరు ఎన్ని చేసినా మా సినిమా విజయాన్ని అడ్డుకోలేరు’’ అని వంశీ నందిపాటి పేర్కొన్నారు.త్రిగుణ్, అఖిల్రాజ్ హీరోలుగా, హెబ్బా పటేల్, సిరి హనుమంతు హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాని వంశీ నందిపాటి, బన్నీ వాసు గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దామోదర ప్రసాద్ మాట్లాడుతూ–‘‘పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న మా సినిమాని కావాలని బ్యాడ్ చేయడం మంచిది కాదు. నా మూవీని డ్యామేజ్ చేసిన ఎవర్నీ వదలను’’ అన్నారు. ‘‘మా చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే సోషల్ మీడియాలో టార్గెట్ చేసి సినిమాను బ్యాడ్ చేస్తున్నారు’’ అన్నారు బన్నీ వాసు. నిర్మాత హేమ వెంకటేశ్వరరావు మాట్లాడారు. -
లైఫ్ ఎప్పుడూ కొత్త ట్యూన్లోనే
‘కొత్త వ్యక్తులతో కలిసి పని చేయడం, మనల్ని మనం కొత్తగా పరిచయం చేసుకోవడం ఎప్పుడూ ఉత్సాహాన్ని ఇస్తుంది. ఒక మహిళగా నన్ను ఒక మూసలోనే ఉండమని చెప్పడానికి ఎవరికేం హక్కుంది? మీకు ఇబ్బందిగా ఉంటే దూరంగా ఉండండి..’ అని ఘాటుగా చెబుతూనే ఈ యేడాది తన జీవితంలో చోటు చేసుకున్న మార్పులు, హెల్తీగా, ఫిట్గా ఉండటానికి చేసిన ప్రయత్నాలు, రాబోయే కొత్త సంవత్సరంలో చేసుకోదగిన ప్లాన్స్ గురించి సింగర్ శ్రావణ భార్గవి ‘సాక్షి’తో పంచుకున్నారు.కొలంబియన్ యాసలో హిప్ హాప్ రాక్ మ్యూజిక్తో సింగర్ శ్రావణ భార్గవి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘‘కొలంబియన్ యాసలో ఉన్న ఒక పూర్తి ఆంగ్ల హిప్ హాప్ ర్యాప్ ట్రాక్ని సోషల్మీడియా ద్వారా తీసుకురావడానికి చాలా ఉత్సాహంగా పనిచేశాను. రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు దగ్గరగా ఉన్న ఊరిలో ఈ పాటను రెండు రోజుల పాటు షూట్ చేశాం. పాట మొత్తం ఇంగ్లిష్లో ఉంటుంది కాబట్టి బ్యాక్ డ్రాప్లో మన సంస్కృతి ఉండాలనుకున్నాం.భయాన్ని వదిలేయాల్సిందే! ఈ సాంగ్ థీమ్లో టాక్సిక్ ఫెమినిజం గురించి ఉంటుంది. ఇదో తరహా విషపూరిత సంస్కృతి. అంటే, ఆడవాళ్లు తోటి ఆడవారి గురించి నెగిటివ్గా మాట్లాడటం. దీనిని వ్యంగ్య ధోరణిలో పాట ద్వారా చూపాను. ఉదాహరణకు.. ఒక లైంగిక దోపిడికి గురైన బాధితురాలు ఉంటే సానుభూతి చూపించకుండా ఆ అమ్మాయి గురించే తొందరపడి ఏదో ఒక మాట అనేస్తారు. ఇటీవల అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి మాట్లాడేవాళ్లను ఎక్కువగా చూస్తున్నాం. ఆడవాళ్లు డ్రెస్సింగ్ మార్చుకోవాలి సరే.. ముందు మగవాళ్లు తమ సెన్స్ మార్చుకోవాలి కదా! .. ఇలాంటి ఒక కాన్సెప్ట్లో రాసిన పాట ఇది. ఎవరైనా ఒక మహిళ ఇండిపెండెంట్గా ఎదగడానికి ప్రయత్నం చేస్తుంటే ఆమె కుటుంబ జీవితం, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేవారు అధికంగా ఉంటుంటారు. నా విషయంలోనూ అలాగే జరుగుతుంటుంది. ‘వాళ్ల మాటలు వాళ్లను మాట్లాడుకోనిద్దాం. నేను ఎందుకు వాటిని పట్టించుకోవాలి’ అనే ఆలోచనకు వచ్చాను. దీనివల్ల మరింత బాగా వర్క్ చేయగలుగుతున్నాను.నేను అనుకున్న థీమ్లో పాట రాయడం, కంపోజ్ చేయడం, పాడటం నా మెయిన్ వర్క్ అయితే నాతో పాటు కొత్త గ్రూప్ కలిశారు. దీంతో మరింత ఉత్సాహంగా పనిచేశాను. మన ఎదుగుదలకు దోహదం చేసే స్నేహితులను పెంచుకోవడం చాలా అవసరం. అది నేను ఈ యేడాది నేర్చుకున్నాను. అంతేకాదు, ఈ పాట ద్వారా నాలో ఉన్న అన్ని భయాలు పోయాయి. నా మ్యూజిక్, వర్క్ ద్వారా ఈ యేడాది ఒక కొత్త లోకాన్ని పరిచయం చేసుకున్నాను.వారి నుంచి అది నేర్చుకున్నానుసోషల్ మీడియాను సరిగ్గా వినియోగించుకుంటే మనకు చాలా హెల్ప్ అవుతుంది. లేదంటే అదే మనకు థ్రెట్ అవుతుంది. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నాను. ఆఫ్లైన్లో ఎలా హద్దుల్లో ఉంటామో ఆన్లైన్లో కూడా అలాగే ఉండాలి. నేటి యువత ముఖ్యంగా జెన్జి గురించి మనం ఏదో అనుకొని ఆందోళన చెందుతుంటాం. కానీ, వాళ్లు చాలా క్లియర్గా ఉంటున్నారు. ‘నాకు నచ్చింది చేస్తున్నాను’ అనే క్లారిటీ వారికి ఉంది. ‘నో అంటే నో’ అనే చెబుతున్నారు. ఇది వారి నుంచి నేర్చుకున్నాను. ఇన్నాళ్లూ ఇలాంటి ఆలోచనను మిస్ అయ్యానే అనిపించింది.బలంగా ఎదగాలని...నా కూతురు పెద్దయ్యాక నన్ను చూసి గర్వంగా ఫీలయ్యేలా నా ఎదుగుదల ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మాయిల్లో స్ట్రాంగ్ పర్సనాలిటీని పెంచడం అనేది చాలా ముఖ్యం. అది చెబితే రాదు. నన్ను చూసే నా కూతురు నేర్చుకుంటుంది కాబట్టి, నేను స్ట్రాంగ్గా ఉండాలనుకుంటాను. మేమిద్దరమే సినిమాలకు వెళతాం, ఇద్దరం ఒకేసారి బుక్స్ చదువుకుంటాం, పాటలు పాడుతుంటాం. ఒక నెల రోజులపాటు ఇద్దరం కలిసి యూరప్ దేశాలు తిరిగి వచ్చాం. మా ఇద్దరి ఆసక్తులు ఒకేలా అనిపిస్తాయి. మా అమ్మ నాన్నలు కూడా ‘నచ్చిన పని చేయ్’ అని ప్రోత్సాహాన్నిస్తారు. అదే పెద్ద బలం. అలాగే, అమ్మానాన్నలు మనల్ని చూసి ధైర్యం తెచ్చుకునేలా అమ్మాయిలు స్ట్రాంగ్గా ఎదగాలి.ఈ ఏడాది చాలా హెల్దీగా...నాకు నచ్చిన డ్రెస్సులతో రెడీ అవడం చాలా ఇష్టం. అలా ఉండటంలో నేను సంతోషంగా, కాన్ఫిడెంట్గా, మరింత క్రియేటివ్గా ఉంటాను. ఎవరో మాట్లాడుకుంటారు అని నాకు అసౌకర్యంగా ఉన్న డ్రెస్సులో ఉండలేను. ఫిట్గా ఉండటానికి వారంలో నాలుగు రోజులైనా జిమ్కు వెళతాను. స్ట్రెంత్ ట్రెయినింగ్ వర్కౌట్స్ చేస్తాను. పోషకాహారం పట్ల జాగ్రత్త తీసుకుంటాను. దీనివల్ల కిందటేడాదితో పోల్చితే ఈ యేడాది చాలా హెల్దీగా ఉన్నాను. ఆర్థిక విషయాల్లో నేనెప్పుడూ జాగ్రత్తగా ఉంటాను. అమ్మాయిలు డబ్బు సంపాదించడంలోనే కాదు పొదుపు చేయడంలోనూ శ్రద్ధ తీసుకోవాలి. అలాగని, డబ్బు వెంట కాకుండా నచ్చిన పని చేయడంలో ముందుండాలన్నది నా ఒపీనియన్. రాబోయే కొత్త సంవత్సరంలో మరింత క్రియేటివ్గా, మరింత ఉత్సాహంగా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను’’ అని నవ్వుతూ వివరించారు ఈ న్యూ హిప్ హాప్ ర్యాపర్.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటో: గడిగె బాలస్వామి -
రాజే యువరాజే...
క్రిస్మస్ పండగని పురస్కరించుకుని ‘ది రాజా సాబ్’ మూవీ నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘రాజే యువరాజే...’ అంటూ సాగే పాట ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ పాటకు తమన్ సంగీతం అందించారు. ప్రభాస్ క్రిస్మస్ పండగ సెలబ్రేషన్స్ కోసం ఏర్పాట్లు చేయడం, చర్చికి వెళ్లి నిధీ అగర్వాల్తో ప్రేయర్ చేయించుకోవడం వంటివి ఈ ప్రోమోలో చూపించారు.త్వరలోనే పూర్తి పాటని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ప్రభాస్ హీరోగా నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే జనవరి 9న విడుదల కానుంది. -
హిట్ స్టెప్
ఫస్ట్ స్టెప్ హిట్ స్టెప్ అయితే ఆ ఆనందమే వేరు. 2025లో అలా తొలి అడుగులోనే విజయం సాధించిన దర్శకులు అరడజనుకు పైనే ఉన్నారు. హారర్, కామెడీ, థ్రిల్, ఫ్యామిలీ, లవ్... ఇలా ఒక్కో దర్శకుడు ఒక్కో జానర్ని ఎంచుకుని, హిట్ అయ్యారు. 2025లో ‘హిట్ డైరెక్షన్’లో కెరీర్ ఆరంభించిన ఆ దర్శకుల గురించి తెలుసుకుందాం.⇒ మన చట్టాల గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని, లేకపోతే ఆ చట్టాలను ఆయుధాలుగా చేసుకుని బలహీనులను కొందరు బలవంతులు ఏ విధంగా ఇబ్బందిపెడతారనే అంశంతో రూపొందిన చిత్రం ‘కోర్ట్’.పోక్సో చట్టం నేపథ్యంలో దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం ద్వారా పరిచయమైన హీరో, హీరోయిన్ హర్‡్ష రోషన్, శ్రీదేవికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. లాయర్గా ప్రియదర్శి మంచి మార్కులు కొట్టేశారు. హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మార్చి 14న విడుదలైంది. ⇒ యూత్ఫుల్ మూవీస్ ఆడియన్స్కు నచ్చాయంటే, కలెక్షన్స్కు కొదవే ఉండదు. అందుకు తాజా ఉదాహరణ ‘లిటిల్ హార్ట్స్’. ఈ రొమాంటిక్ కామెడీ మూవీతో దర్శకుడు సాయి మార్తాండ్ బ్లాక్బస్టర్ హిట్ సాధించారు. చదువు పెద్దగా అబ్బని ఓ అబ్బాయి, అమ్మాయి లాంగ్టర్మ్ కోచింగ్లో చేరి, ప్రేమలో పడితే ఏం జరుగుతుంది? అన్న పాయింట్తో ‘లిటిల్ హార్ట్స్’ సినిమా తీశారు సాయి మార్తాండ్. ఈ చిత్రంలో మౌళి తనుజ్ హీరోగా, శివానీ నాగారం హీరోయిన్గా నటించారు. ‘90స్’ బయోపిక్ వెబ్సిరీస్తో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ సినిమాకు ఓ నిర్మాత. సెప్టెంబరు 5న ఈ చిత్రం విడుదలైంది. ⇒ కాస్ట్యూమ్ డిజైనర్గా, స్టైలిస్ట్గా నీరజ కోన పాపులర్ అని తెలిసిందే. ఆమె దర్శకురాలిగా పరి చయం అయిన చిత్రం ‘తెలుసు కదా’. ఈ చిత్రంలో సరోగసీ అనే సెన్సిబుల్ పాయింట్ను, ముగ్గురు వ్యక్తుల మధ్య నడిచే ట్రయాంగిల్ లవ్స్టోరీని, వారి మానసిక సంఘర్షణను వెండితెరపై బాగా చూపించారు నీరజ. సిద్ధు జొన్నగలడ్డ హీరోగా, రాశీ ఖన్నా, శ్రీ నిధిశెట్టి హీరోయిన్లుగా టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 17న విడుదలైంది. మహిళా దర్శకుల సంఖ్య తక్కువ ఉన్న నేపథ్యంలో నీరజ కోన పరిచయమై, హిట్ సాధించడం హర్షించదగ్గ విషయం. ⇒ పెద్ద వ్యాపారవేత్త అయిన కృష్ణకి (సాయికుమార్) అల్లర చిల్లరగా తిరిగే మాస్ కొడుకు కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం) ఎంసెట్లో ర్యాంక్ సాధించకపోగా, అల్లరి చిల్లరగా ప్రవర్తిస్తుంటాడు. డొనేషన్ చెల్లించి మరీ కేరళలోని ఓ కాలేజ్లో మెడిసిన్ చదివించేందుకు కొడుకుని చేర్పిస్తాడు తండ్రి. అక్కడ కుమార్, మెర్సీ జాన్ (యుక్తి తరేజా) ప్రేమలో పడతారు. పెద్దలు వీరి పెళ్లికి పచ్చజెండా ఊపుతారు. అదే సమయంలో మెర్సీకి ఉన్నపోస్ట్ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీఎస్టీడీ) వ్యాధి గురించి కుమార్కి తెలుస్తుంది. ఆ వ్యాధి పరిష్కారం కోసం కుమార్ ఏం చేశాడు? అనే అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు జైన్స్ నాని. రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మించిన ఈ మూవీ అక్టోబరు 18న విడుదలైంది. ఈ కథను నేర్పుగా డీల్ చేసి,ప్రేక్షకులతో చేత శెభాష్ అనిపించుకున్నారు జైన్స్ నాని. ⇒ 2004లో తెలంగాణలో జరిగిన ఓ వాస్తవ ఘటన నేపథ్యంలో దర్శకుడు సాయిలు కంపాటి తెరకెక్కించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. డప్పు మేస్త్రీగా పని చేసే రాజు (అఖిల్ రాజ్), అదే ఊరికి చెందిన ప్రభుత్వ ఆస్పత్రి కాంపౌండర్ వెంకన్న (చైతన్య జొన్నలగడ్డ) కూతురు రాంబాయి (తేజస్విని) ప్రేమలో పడతారు. అయితే ప్రభుత్వ ఉద్యోగస్తుడితోనే తన కూతురి పెళ్లి చేస్తానని తేల్చి చెబుతాడు వెంకన్న. రాజు, రాంబాయిల కథ చివరికి ఏమైంది? అనేది ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రకథ. సాయిలు కంపాటి దర్శకత్వంలో డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, బన్నీ వాసు నవంబరు 21న విడుదల చేయగా, సూపర్ హిట్గా నిలవడంతో పాటు భారీ వసూళ్లను సాధించింది. సున్నితమైన కథని తన టేకింగ్, మేకింగ్ స్టైల్తో సాయిలు కంపాటి అందరి దృష్టినీ ఆకర్షించారు. ⇒ బైరాన్పల్లి సంఘటన ఆధారంగా కాల్పనిక కథతో దర్శకుడు ప్రదీప్ అద్వైతం తెరకెక్కించిన చిత్రం ‘చాంపియన్’. ఈ కథ గురించి చె΄్పాలంటే... రజాకార్ల దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు బైరాన్పల్లి ప్రజలుపోరాటం చేస్తుంటారు. మరోవైపు సికింద్రాబాద్లో పుట్టి, పెరిగిన మైఖేల్ సి. విలియమ్స్ (రోషన్) ఫుట్బాల్ ప్లేయర్. ఇంగ్లాండ్ వెళ్లి, ఆడాలనేది అతని కల. అనుకోని పరిస్థితుల్లో బైరాన్పల్లి గ్రామం చేస్తున్నపోరాటంలోకి అడుగుపెడతాడు మైఖేల్. ఇంగ్లాండ్ వెళ్లాలనుకున్న అతని కల నెరవేరిందా? అనేది కథ. మూడేళ్ల గ్యాప్ తర్వాత హీరోగా రోషన్ రీ – ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా అతనికి ప్లస్ అయింది. ఈ కథని ప్రదీప్ అద్వైతం భావోద్వేగంగా తెరకెక్కించడంతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. సి. అశ్వినీదత్, జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ బ్యానర్స్పై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 25న విడుదలైంది. ⇒ వెయ్యేళ్ల చరిత్ర ఉన్న శంబాల ఊరి నేపథ్యంలో 1980 దశకంలో సాగే కథతో ‘శంబాల’ చిత్రాన్ని తెరకెక్కించారు యుగంధర్ ముని. శంబాల ఊరిలో జరిగే అనూహ్యమైన సంఘటనల తాలూకు మిస్టరీని ఛేదించడానికి యువ శాస్త్రవేత్త విక్రమ్ (ఆది) ఆ ఊరికి వెళతాడు. విజ్ఞానం వర్సెస్ శాస్త్రం, దైవ శక్తులు వర్సెస్ మూఢనమ్మకాలు.... వంటి రిస్కీ కథాంశాన్ని ఎన్నుకున్న యుగంధర్ ముని కన్విన్సింగ్గా చెప్పడం అభినందనీయం. రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, బన్నీ వాసు విడుదల చేశారు. డిసెంబర్ 25న ఈ చిత్రం విడుదలైంది. ⇒ ‘పెద్దజాతి, చిన్న జాతి అన్న తేడాల్లేవ్... మనందరం ఒక్కటే’ అన్న సందేశాన్ని నినదిస్తూ థియేటర్స్లో ‘దండోరా’ వేశారు దర్శకుడు మురళీకాంత్. జీవితంలో తనకు ఎదురైన అనుభవానికి అక్షరరూపం ఇచ్చి.. అగ్రవర్ణాలు, అణగారిన వర్గాల మధ్య నేటికీ ఉన్న తారతమ్యాలు, కుల వివక్ష, ప్రేమ, పరువు హత్యలు..వంటి అంశాలను మేళవించి ‘దండోరా’ సినిమా తీశారు మురళీకాంత్.అగ్రవర్ణానికి చెందిన ఓ వ్యక్తి, తను చేసిన తప్పును తాను తెలుసుకుని, పశ్చాత్తాప పడితే, ఆ ఆగ్రవర్ణ కులపెద్దలు అతని మరణం పట్ల ఎలాంటి వివక్ష చూపించారు? అనే పాయింట్ను ‘దండోరా’ సినిమాలో చూపించారు. ఇలా తన ప్రతిభను తానే దండోరా వేసుకున్నారు. శివాజీ, నందు, మౌనికా రెడ్డి, నవదీప్, రవికృష్ణ, రాధ్య, బింధు మాధవి ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నటించారు. ము΄్పానేని రవీంద్ర బెనర్జీ ఈ సినిమాను నిర్మించారు. డిసెంబరు 25న ఈ చిత్రం విడుదలైంది. ⇒ పంతంగులపోటీ నేపథ్యంతో రూపొందిన తాజా సినిమా ‘పంతగ్’. ఈ యూత్ఫుల్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రంతో ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ఈ సినిమాలోని లీడ్ రోల్స్లో నటించారు. యూత్పుల్ ఎంటర్టైనర్ మూవీగా ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ సినిమాను విజయ్కుమార్ అన్నే, సంపత్, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 25న థియేటర్స్లో విడుదలైంది.⇒ తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ‘రామం రాఘవం’తో ధన్రాజ్, రవితేజ నటించిన ‘మాస్ జాతర’ చిత్రంతో భాను భోగవరపు,‘అల్లరి’ నరేశ్ ‘12ఏ రైల్వేకాలనీ’తో నాని కాసరగడ్డ, రాజ్ తరుణ్ క్రైమ్ కామెడీ ‘పాంచ్ మినార్’తో రామ్ కడుమల, కిరణ్ అబ్బవరం ఇంటెన్స్ లవ్స్టోరీ ‘దిల్ రుబా’తో విశ్వకరుణ్, ప్రియదర్శి ‘ప్రేమంటే..?’తో నవనీత్ శ్రీరామ్ వంటి నూతన దర్శకులు ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. -
ఆలస్యమైందని నటుడిపై దాడి.. 70% వినికిడి శక్తి కోల్పోయి!
కూటికోసం కోటి తిప్పలు. కొందరు సెలబ్రిటీలు కూడా ఇండస్ట్రీలోకి రాకముందు ఇతరత్రా పనులు చేసినవారే! మలయాళ నటుడు అజీస్ నెదుమంగడ్ కూడా ఒకప్పుడు డ్రైఫ్రూట్ షాప్లో సేల్స్మెన్గా పనిచేశాడు. అది కూడా భారత్లో కాదు, బహ్రెయిన్లో! ఇటీవల బహ్రెయిన్ వెళ్లిన అజీస్ తను పనిచేసిన షాపును గుర్తుపెట్టుకుని మరీ అక్కడకు వెళ్లాడు. 18 ఏళ్ల కిందట..తనతో పాటు పనిచేసిన స్నేహితుడిని అదే షాపులో కలుసుకుని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. ఇద్దరూ ఒకరి బాగోగులను మరొకరు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాదాపు 18 ఏళ్ల కిందట అదే షాపులో పనిచేసిన అజీస్ ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు.కెరీర్అజీస్ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే! దీంతో అతడు ఇంజనీరింగ్ పట్టా చేతికి రాగానే గల్ఫ్ దేశానికి వలస వెళ్లి షాపులో పనిచేశాడు. కానీ, అక్కడ ఎక్కువకాలం ఉండలేక మళ్లీ స్వదేశానికి తిరిగొచ్చాడు. మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించాడు. పలు స్టేజీలపై మిమిక్రీ చేస్తూ కామెడీ పండించేవాడు. తర్వాత టీవీ షోలలోనూ పాల్గొనడంతో కమెడియన్గా మంచి గుర్తింపు లభించింది. ప్రాధాన్యమున్న పాత్రలుఅలా 'కుంజలియన్' సినిమాలో నటించే ఆఫర్ వచ్చింది. అది చిన్న అవకాశం. తర్వాత కూడా కొన్ని సినిమాలు చేశాడు, కానీ పెద్దగా చెప్పుకునే పాత్రలైతే కాదు. చేస్తే మంచి క్యారెక్టర్సే చేయాలి... జూనియర్ ఆర్టిస్ట్గా కాదని తీర్మానించుకున్నాడు. అలా యాక్షన్ హీరో బిజు మూవీతో క్లిక్ అయ్యాడు. వాళా, మిన్నాల్ మురళి, కన్నూర్ స్క్వాడ్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, జయజయజయహే వంటి సినిమాలతో మరింత పాపులర్ అయ్యాడు. దాదాపు 30కి పైగా సినిమాలు చేశాడు.దాడిలో తీవ్రగాయాలుఅయితే అజీస్ (Azees Nedumangad) జీవితంలో ఓ చేదు ఘటన జరిగింది. 2017 ఏప్రిల్లో ఓ స్టేజీ షోకు ఆలస్యంగా వెళ్లాడు అజీస్. అంతే.. అక్కడున్న కొంతమంది ఆగ్రహంతో నటుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో అజీస్కు తీవ్రగాయాలయ్యాయి. ఏకంగా 70% వినికిడి శక్తిని కోల్పోవడం బాధాకరం! అవమానాలను సైతం దాటుకుని నేడు మలయాళ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు అజీస్. ఏడాదికి ఐదారు సినిమాలు చేసుకుంటూ సక్సెస్ఫుల్ నటుడిగా కొనసాగుతున్నాడు. -
గ్లామర్కు నో.. ఆ ఇద్దరు హీరోయిన్స్లా చేయాలనుంది!
సొంతం సినిమాతో గుజరాతీ బ్యూటీ నమిత కెరీర్ ప్రారంభమైంది. జెమిని, ఐతే ఏంటి!, నాయకుడు, బిల్లా, సింహా సినిమాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది. 2010 తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించనేలేదు. మిగతా భాషల్లోనూ ఐదారు సినిమాలు చేసి వదిలేసింది.గతంలో తప్పులుతాజాగా ఓ ఈవెంట్కు హాజరైన నమిత.. సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపింది. గతంలో చేసిన తప్పులను మళ్లీ రిపీట్ చేయనని చెప్తోంది. అందుకోసమే కొన్ని కథలు నచ్చకపోతే ఎటువంటి మొహమాటం లేకుండా తిరస్కరిస్తున్నానంది. గ్లామరస్ పాత్రల్ని చేయాలనుకోవడం లేదని, పవర్ఫుల్ పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది.అలాంటి పాత్రలు చేయాలనుందిఉదాహరణకు రజనీకాంత్ పడయప్ప (తెలుగులో నరసింహ) సినిమాలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి వంటి పాత్రలు చేయాలనుందని మనసులో మాట బయటపెట్టింది. సినిమా వచ్చి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నీలాంబరి పాత్ర కోసం మాట్లాడుకుంటున్నారని.. అలా ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు చేయాలనుందని చెప్పింది. విద్యాబాలన్, రాధికా ఆప్టే.. కథకు బలం చేకూర్చే పాత్రల్లో కనిపిస్తారని.. వాళ్లలాగే ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. మరి నమిత ఎలాంటి సినిమాతో రీఎంట్రీ ఇస్తుందో చూడాలి! -
బిగ్బాస్ ప్లాన్ సక్సెస్.. అగ్నిపరీక్ష 2కి భారీ హైప్!
బిగ్బాస్ షోను ఇష్టపడేవాళ్లు, తిట్టేవాళ్లు.. ఇద్దరూ ఉన్నారు. తిడుతూనే చూసేవాళ్లు మూడోరకం! అయితే ఈ రియాలిటీ షోలో సెలబ్రిటీలకు పెద్దపీట వేస్తారు. ఎప్పుడో ఒకసారి మాత్రం ఒకరిద్దరు కామనర్లను దింపుతుంటారు. కొన్నిసార్లు వాళ్లు కూడా సోషల్ మీడియాలో సుపరిచితులైనవారే ఉంటారు! అయితే ఈసారి ఏకంగా ఏడుగురు మంది సామాన్యులు హౌస్లో అడుగుపెట్టారు. కాకపోతే అంత ఈజీగా కాదు, అగ్నిపరీక్షను దాటుకుని వచ్చారు.అగ్నిపరీక్షఎన్నడూ లేనిది ఈసారి షో ప్రారంభమవడానికి ముందు బిగ్బాస్ అగ్నిపరీక్ష అనే కార్యక్రమాన్ని కొత్తగా ప్రారంభించారు. దీనికోసం పెద్ద ప్రక్రియే జరిగింది. ముందుగా షోకి రావాలనుకునేవారు ఒక నిమిషం వీడియో షూట్ చేసి బిగ్బాస్ టీమ్కు పంపారు. వేలల్లో వచ్చినవాటిని ఫిల్టర్ చేసి వందల్లో ఎంపిక చేస్తారు. వారికి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, ఎగ్జామ్ ఇలా అన్నీ పెట్టి చివరకు 40 మందిని ఎంపిక చేశారు.అలాంటివారికి నో ఛాన్స్వారిలో నుంచి మంచి కంటెస్టెంట్లను జల్లెడ పట్టాల్సిన బాధ్యతను నవదీప్, బిందుమాధవి, అభిజిత్కు అప్పజెప్పారు. ఈ షోకి శ్రీముఖి యాంకరింగ్ చేసింది. బిగ్బాస్కు రావాలన్న పిచ్చితో కొందరు పాదయాత్రలు చేస్తారు, నిరాహార దీక్షలు, ధర్నాలు చేస్తారు. అలాంటివారికి షోలో చోటు లేదని అగ్నిపరీక్ష షోలో కరాఖండిగా చెప్పేశారు. ఆ కేటగిరీలో వచ్చిన అందర్నీ నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేశారు.తొలిసారి ఏడుగురు కామనర్స్మిగతావారి టాలెంట్, ఎక్స్ప్రెషన్స్, నాలెడ్జ్.. ఇలా అన్నింటినీ పరిశీలించి ఓ లిస్ట్ ఫైనల్ చేస్తారు. అలా కొందరు జడ్జిలను మెప్పించి, మరికందరు ప్రేక్షకుల ఓట్ల ద్వారా తెలుగు బిగ్బాస్ 9వ సీజన్లో అడుగుపెట్టారు. వాళ్లే ప్రియ, శ్రీజ, దివ్య, కల్యాణ్, పవన్, మనీష్, హరీశ్. వీరిలో కల్యాణ్ ఏకంగా టైటిల్ విన్నర్ కాగా పవన్ సెకండ్ రన్నరప్గా నిలిచాడు. సామాన్యుడి చేతికి ట్రోఫీసామాన్యుడు బిగ్బాస్కు వెళ్లడం కాదు, ఏకంగా ట్రోఫీ ఎత్తగలడని కల్యాణ్ నిరూపించాడు. అయితే అగ్నీపరీక్ష రెండో సీజన్ కోసమే అతడికి కప్పు కట్టబెట్టారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అగ్నిపరీక్ష ఫస్ట్ సీజన్పై పెద్దగా బజ్ లేదు. ఇప్పుడు కల్యాణ్ గెలుపు వల్ల అగ్నీపరీక్ష రెండో సీజన్పై భారీ హైప్ క్రియేట్ అయింది. బిగ్బాస్ ప్లాన్ సక్సెస్ఈసారి ఎవరు వస్తారు? ఎవర్ని తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది. కామనర్స్ను ఏదో కొన్నాళ్లపాటు హౌస్లో ఉంచి పంపించేయకుండా.. వారికి టాలెంట్ ఉంటే చివరి వరకు ఉంచుతారన్న నమ్మకం కుదిరింది. ఈ లెక్కన ఈసారి అగ్నిపరీక్షకు అప్లికేషన్లు భారీగా పోటెత్తే అవకాశముంది. అదే గనక నిజమైతే బిగ్బాస్ ప్లాన్ వర్కవుట్ అయినట్లే! ఈ అగ్నిపరీక్ష రెండో సీజన్ 2026 సెకండాఫ్లో ప్రారంభం కానుంది.చదవండి: వినాయకన్కు తీవ్ర గాయం.. కాస్త లేట్ అయ్యుంటే పక్షవాతం! -
ప్రియా ప్రకాశ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్.. మీరా జాస్మీన్ ఫెస్టివ్ వైబ్స్..!
క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ప్రియా ప్రకాశ్..ఉదయ్పూర్ కోటలో బాలీవుడ్ భామ మౌనీ రాయ్..హీరోయిన్ మెహరీన్ క్రిస్మస్ లుక్స్..క్రిస్మస్ సెలబ్రేషన్స్లో బాలీవుడ్ నటి రవీనా టాండన్..ఫెస్టివల్ వైబ్స్లో హీరోయిన్ మీరా జాస్మిన్.. View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Mahe Ayyappan (@maheswari_actress) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) -
బిగ్బాస్ ఇనయా సుల్తానా థ్రిల్లర్ మూవీ.. సెన్సార్ పూర్తి..!
హర్ష గంగవరపు, ఇనయ సుల్తానా, అనురూప్, లతా రెడ్డి నటించిన థ్రిల్లర్ మూవీ మదం. ఈ చిత్రానికి వంశీ మల్లా దర్శకత్వం వహించారు. ఏకైవా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సూర్య దేవర రవీంద్ర నాథ్, రమేష్ బాబు కోయ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జనవరి 1న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ ఏ సర్టిఫికేట్ మంజూరు చేసింది సెన్సార్ బోర్డ్. కాగా.. ఈ సినిమాకు కథ, సంభాషణలను రమేష్ బాబు కోయ అందించారు. ఈగల్ ఫేమ్ డేవ్జాండ్ (DavZand) సంగీతం అందించారు. ఈ న్యూ ఇయర్కు ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు థియేటర్లకు రానుంది. -
వెంకటేశ్- ఆర్తి ఎవర్గ్రీన్ క్లాసిక్.. రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
వెంకటేశ్, ఆర్తి అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా బ్లాక్ బస్టర్ మూవీ నువ్వు నాకు నచ్చావ్. ఈ చిత్రానికి కె విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ, డైలాగ్స్ అందించగా.. స్రవంతి రవికిశోర్ నిర్మించారు. ఈ మూవీ 2001 సెప్టెంబర్ 6న విడుదలై సూపర్ హిట్గా నిలిచింది.దాదాపు 25 ఏళ్ల తర్వాత ఈ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 1న 4కే వెర్షన్తో ప్రపంచవ్యాప్తగా రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా రీ రిలీజ్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. 4కె వర్షన్లో రిలీజైన ట్రైలర్ వెంకీ మామ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఈ తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన చిత్రమని నిర్మాత రవికిశోర్ అన్నారు. నువ్వు నాకు నచ్చావ్. ఇది కేవలం రీ రిలీజ్ మాత్రమే కాదని.. నూతన సంవత్సరాన్ని కుటుంబంతో కలిసి నవ్వులు పూయిస్తూ ప్రారంభించడానికి ఇదే సరైన సమయమని అన్నారు. -
'కాస్త లేట్ అయ్యుంటే నా శరీరం చచ్చుబడిపోయేది'
మలయాళ నటుడు, జైలర్ విలన్ వినాయకన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యాడు. ఆడు 3 సినిమా కోసం కేరళలోని తిరువనంతపురంలో యాక్షన్ సన్నివేశాల షూటింగ్ చేస్తుండగా వినాయకన్ ప్రమాదవశాత్తూ గాయపడ్డాడు. నొప్పి తీవ్రంగా ఉండటంతో ఆయన శనివారంనాడు కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన తాజాగా డిశ్చార్జ్ అయ్యాడు. తప్పిన ప్రమాదంఈ సందర్భంగా వినాయకన్ మాట్లాడుతూ.. నా మెడ నరానికి దెబ్బ తగిలింది. సమయానికి ఆస్పత్రికి చేరుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నరాల డ్యామేజ్ను ముందుగానే గుర్తించకపోయుంటే నా శరీరం చచ్చుబడిపోయేది అన్నాడు. డాక్టర్లు ఆయన్ను కనీసం ఆరువారాలపాటు పూర్తిస్థాయి విశ్రాంతి తీసుకోమని సూచించారు. దీంతో ఆడు 3 సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది.ఆడు 3 మూవీఆడు సినిమా ఫ్రాంచైజీలో వస్తున్న మూడో భాగమే ఆడు 3. జయసూర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో వినాయకన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మిధున్ మాన్యుల్ థామస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2026లో మార్చి 19న రిలీజ్ చేయనున్నారు. వినాయకన్ విషయానికి వస్తే.. ఇతడు 1995లో వచ్చిన మాంత్రికం చిత్రంతో తన యాక్టింగ్ జర్నీ ప్రారంభించాడు. సినిమా'కమ్మట్టి పాదం' మూవీలో నటనకుగానూ ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర అవార్డును గెల్చుకున్నారు. మలయాళంతోపాటు తమిళంలోనూ పలు సినిమాలు చేసిన ఆయనకు రజనీకాంత్ జైలర్ ఊహించని స్థాయి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. కేరళ పోలీస్స్టేషన్లో, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో జరిగిన గొడవతో.. అలాగే ఓ హోటల్లో మద్యం మత్తులో వీరంగం సృష్టించి వార్తల్లోకెక్కాడు.చదవండి: అమ్మ బిల్డింగ్పై నుంచి దూకుతానంది: ఏడ్చేసిన నందు -
సంతలో పశువులు అనుకున్నారా?.. ఇండిగో తీరుపై వీకే నరేశ్ ఆగ్రహం..!
హైదరాబాద్ విమానాశ్రయంలో సినీనటుడు చేదు అనుభవం ఎదురైంది. ఇండిగో విమానయాన సంస్థ సిబ్బందితో గొడవకు దిగారు. విమానం వద్దకు తీసుకెళ్లే బస్సులో ప్రయాణికులను పశువుల్లా తీసుకెళ్లడంపై ఆయన మండిపడ్డారు. తమ ఇబ్బందులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో సంస్థ నిర్లక్ష్యపూరిత తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విటర్లో ఫోటోలు పంచుకున్నారు.నరేశ్ తన ట్వీట్లో రాస్తూ..'ఇండిగో ఎయిర్లైన్స్ బస్సు ప్రయాణం చిత్ర హింసకు గురిచేసింది. విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి సాక్ష్యమిదే. మమ్మల్ని పశువుల్లా ఒక లారీలో ఎక్కించినట్లు విమానం వద్దకు తీసుకెళ్లారు. అందులో వృద్ధులు, చక్రాల కుర్చీలలో ఉన్న కొందరు నిలబడటానికి ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఎక్కువ మందిని ఎక్కించవద్దని నేనే గట్టిగా అరిచా. బస్సులకు ఒక నిర్దిష్ట పరిమితి ఉండాలి. వృద్ధుల కోసం ప్రత్యేక స్థలం కేటాయించాలి. చట్టపరంగా ముందుకు వెళ్లడానికి నా న్యాయ బృందంతో మాట్లాడుతున్నా.' అంటూ పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్ కావడంతో నరేశ్ మద్దతుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.The bus torture chambers of INDIGO airlines are excruciating reminders of the airline monopoly. Thy had loaded us like cattle in a lorry (twice the capacity )with senior citizens , some in wheel chairs struggling to stand ( seen in the back ground ) . I had screamed at the top of… pic.twitter.com/JzcOvsLlul— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) December 23, 2025 -
మార్క్ క్వీన్.. ఎంట్రీయే స్టార్ హీరోతో..
నటి దీప్శిఖ 'మార్క్ మూవీ'తో కన్నడ సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ నేడు (డిసెంబర్ 25న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో కన్నడ సూపర్స్టార్ కిచ్చా సుదీప్తో కలిసి స్క్రీన్ను పంచుకుంది. ఇది దీప్శిఖ సినీ ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. అరంగేట్రానికి ముందే సోషల్ మీడియాలో తన పేరు మారుమోగిపోతోంది. సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్లో దీప్శిఖ తన శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్తో, ఆత్మవిశ్వాసంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా..దీంతో అభిమానులు ఆమెకు “మార్క్ క్వీన్” అనే బిరుదును ఇచ్చారు. ఇక దీప్శిఖ మాట్లాడుతూ.. కిచ్చా సుదీప్తో కలిసి పనిచేయడం వల్ల నా కల నెరవేరింది. ఆయన దగ్గరి నుంచి క్రమశిక్షణ, ప్రొఫెషనలిజం నేర్చుకున్నాను. ఇవి నా నటనను మరింత మెరుగుపర్చేందుకు ప్రోత్సహించాయి. అలాగే ప్రతిష్టాత్మక సత్యజ్యోతి ఫిలింస్ బ్యానర్లో పనిచేసినందుకు సంతోషంగా ఉంది. ఎంతో ప్రేమ ఇలాంటి గొప్ప నిర్మాణ సంస్థతోనే నా కన్నడ ప్రయాణం ప్రారంభం కావడం నా కెరీర్కు మరింత విలువ, ధైర్యాన్ని ఇచ్చింది. ఈ అవకాశం లభించడం నా అదృష్టం. సినిమా విడుదలకంటే ముందే నాపై ఎంతో ప్రేమ చూపించారు. మీ ప్రేమే నన్ను మరింత ముందుకు వెళ్లేలా చేస్తుంది అని పేర్కొంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, సిబ్బంది, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. -
దేశం విడిచి వెళ్లాలనుకున్నాం.. ఏడ్చేసిన నందు
తెలుగు నటుడు, యాంకర్ నందు ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లవుతోంది. అయినా ఇప్పటికీ తనకు సరైన సక్సెస్ లేదు. ఆ ఒక్క విజయం కోసం ఏళ్లకొద్దీ పరితపిస్తున్నాడు. పెళ్లి చూపులు సినిమాలో సెకండ్ హీరోగా చేసిన నందు తర్వాత హీరోగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ మంచి విజయం మాత్రం అందుకోలేకపోయాడు. ఇప్పుడితడు సైక్ సిద్దార్థ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఉన్నచోటే ఆగిపోయా..ఈ చిత్రం 2026 జనవరి 1న విడుదల కానుంది.ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నందు తన కష్టాల్ని తల్చుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. నందు మాట్లాడుతూ.. నాతో కలిసి నటించిన సిద్ధు జొన్నలగడ్డ, ప్రియదర్శి, విజయ్ దేవరకొండ.. వీళ్లంతా ఎక్కడికో వెళ్లిపోయారు. నేను మాత్రం ఉన్నచోటే ఉండిపోయాను. లోపం నాలోనే ఉంది. అది ఈ మధ్యే తెలుసుకున్నాను.లోపం నాలోనే..కథలో లోపాలున్నాయని తెలిసినా సరే.. డబ్బు వస్తుందన్న ఆశతో సినిమాలు ఒప్పేసుకునేవాడిని. అలా నన్ను నేనే మోసం చేసుకున్నాను. దానివల్ల వీడి సినిమాలన్నీ ఇంతేరా.. అన్న మార్క్ పడిపోయింది. దాన్నుంచి బయటకు రావడానికే మూడునాలుగేళ్లు సమయం తీసుకుని మంచి సినిమా చేశాను.చేదు సంఘటనలుసవారి మూవీ తర్వాత పెద్ద బ్యానర్లో హీరోగా సినిమా ఆఫర్ చేశారు. అనుపమ హీరోయిన్ అన్నారు. అంతా ఓకే అనుకున్నాక సడన్గా నా స్థానంలో మరొకర్ని తీసుకున్నారు. కానీ, ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. మరో సంఘటనలో ఏం జరిగిందంటే.. ఒక పెద్ద నిర్మాత తన కొడుకును హీరోగా పెట్టి మూవీ తీశారు. హీరోతోపాటు సమాన ప్రాధాన్యత ఉన్న పాత్ర నాకిచ్చారు. పైసా తీసుకోకుండా రెండున్నర నెలలు షూటింగ్ చేేశాను. ఘోర అవమానంతీరా ఓ డిస్ట్రిబ్యూటర్ మూవీ చూసి నాకెందుకు అంత ప్రాధాన్యతనిచ్చారని అడిగారట! దాంతో నాకు ఒక్కమాటైనా చెప్పకుండా నా సీన్స్ అన్నీ ఎత్తేశారు. అది తెలియక ఆడియో లాంచ్కు పిలవకపోయినా వెళ్లాను. అక్కడికి వెళ్లాక కనీసం నేను ముందు వరుసలో కూర్చునేందుకు కూడా ఒప్పుకోలేదు. అప్పుడు చాలా బాధపడ్డాను.తల్లితోడుగా చెప్తున్నా..అనవసరమైన విషయాల్లో నా పేరు ఇరికించినప్పుడైతే కుమిలిపోయాను. తల్లితోడుగా చెప్తున్నా.. అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోదామా? అని గీత, నేను అనుకున్నాము. వేరే దేశం వెళ్లి ఏదైనా హోటల్లో పని చేసుకుందాం అని గీతయే ముందుగా అడిగింది. తను సక్సెస్ఫుల్ స్టార్ సింగర్.. అయినా సరే నాకోసం తన కెరీర్ వదిలేసి, వేరే దేశం వెళ్లి హోటల్లో పనిచేసుకుందామంది. అది ఇప్పుడు తల్చుకున్నా ఏడుపొస్తుంది. ఏడ్చేసిన నందునేను ఈ ఫీల్డ్లో లేకపోతే నాపై అలాంటి రూమర్సే రావు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినవారిని బలిపశువును చేస్తారు. ఈ విషయం జనాలకు తెలియదు. లేనిపోనివాటిలో నన్ను ఇరికిస్తే బిల్డింగ్ పై నుంచి దూకేస్తానంది అమ్మ. అలా నేను చేయని తప్పుకు వార్తల్లో నా పేరు రావడం చూసి ఇంట్లో అందరూ నలిగిపోయారు అని చెప్తూ నందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. -
మోహన్ లాల్ వృషభ మూవీ రివ్యూ.. ఆడియన్స్ను మెప్పించిందా?
టైటిల్: వృషభనటీనటులు: మోహన్ లాల్, సమర్జీత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా సక్సేనా, అజయ్ తదితరులుదర్శకత్వం: నందకిశోర్విడుదల తేదీ..డిసెంబర్ 25, 2025మలయాళ స్టార్ మోహన్ లాల్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. జనతా గ్యారేజ్ మూవీతో టాలీవుడ్ ప్రియుల గుండెల్లో నిలిచిపోయారు. ఈ ఏడాది తుడురమ్, ఎంపురాన్-2, హృదయపూర్వం చిత్రాలతో అలరించారు. తాజాగా మోహన్ లాల్ హిస్టారికల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఓకేసారి తెలుగు, మలయాళ భాషల్లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.వృషభ కథేంటంటే..గత జన్మలు కూడా ఉన్నాయని మనందరం వింటుంటాం. అయితే ఆ జన్మలో మనం ఎలా పుట్టాం.. అసలేం జరిగింది కేవలం ఊహాజనితమే. అసలు గత జన్మలు ఉన్నాయో లేదో కూడా మనకు తెలియదు. అయితే ఆ రెండు జన్మలను ఓకేసారి చూపిస్తూ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అందించే చిత్రమే మోహన్ లాల్ వృషభ.ఈ కథ రాజా విజయేంద్ర వృషభ(మోహన్ లాల్)కు ఓ మహిళ పెట్టే శాపంతో మొదలవుతుంది. గత జన్మలో జరిగిన సంఘటనలతో ఈ కథను ప్రారంభించాడు. బిజినెస్లో ఆదిదేవ వర్మ(మోహన్ లాల్) కింగ్. ప్రతి ఏడాది ఉత్తమ బిజినెస్మెన్గా అవార్డ్ ఆయనకు రావాల్సిందే. అలా ఇది నచ్చని మరో వ్యాపారవేత్త అవార్డ్ బహుకరించే రోజే ఆదిదేవ వర్మపై దాడికి ప్లాన్ చేస్తాడు. కానీ ఆది దేవ వర్మ కుమారుడు తేజ్(సమర్జీత్ లంకేశ్) ఎంట్రీతో ఆ ప్లాన్ తిప్పికొడతాడు. అలా వర్తమానంలో తండ్రీ, తనయులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. తేజ్ పెళ్లి చేసుకోవాలనేది తండ్రి బలమైన కోరిక. ఈ విషయాన్ని పదే పదే తన కొడుకుతో చెబుతుంటాడు.అదే సమయంలో గత జన్మ అనుభవాలతో ఆది దేవ వర్మ సతమతమవుతుంటాడు. ఈ విషయం తెలుసుకున్న తేజ్ తండ్రి కోసం మంచి సైక్రియాటిస్ట్ను కలవాలనుకుంటాడు. ఇదే క్రమంలో దామిని(నయన్ సారిక) అతనికి పరిచయం అవుతుంది. పరిచయమైన కొద్ది రోజుల్లోనే వీరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అలా ఇద్దరు కలిసి ఆదిదేవ వర్మ సమస్యకు పరిష్కారం కోసం బయలుదేరతారు. నాన్నకు ఉన్న ప్రాబ్లమ్ గురించి ఇంట్లో పనిచేసే వంటమనిషి పప్పు.. తేజ్తో ఓ ఆసక్తికర విషయం చెబుతాడు. ఇది విన్న తేజ్ తండ్రికి చెప్పకుండానే వెంటనే సొంత గ్రామమైన దేవనగరికి బయల్దేరతాడు. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. అసలు తేజ్ ఆ ఊరికి ఎందుకు వెళ్లారు? తండ్రి కోసం వెళ్లిన తేజ్ ఎందుకలా మారిపోయాడు. అసలు తండ్రీ, కొడుకుల మధ్య ప్రతీకారానికి కారణమేంటి? ఆది దేవ వర్మకు గత జన్మలో అసలేం జరిగింది? ఆ జ్ఞాపకాలు ఇంకా ఎందుకు వెంటాడుతున్నాయి? అసలు ఆ మహిళ పెట్టిన శాపం ఏంటి? అనేది తెలియాలంటే వృషభ చూడాల్సిందే.ఎలా ఉందంటే..మామూలుగా గత జన్మలో ఏం జరిగింది అనేది మొదట చూపించి కథను మొదలెడతాం. అలానే గత జన్మలో రాజా విజయేంద్ర వృషభ(మోహన్ లాల్)కు జరిగిన సంఘటనలను పరిచయం చేస్తూ కథలోకి తీసుకెళ్లాడు. గత జన్మలో రాజా విజయేంద్ర వృషభ అసమాన యోధుడిగా తన రాజ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు. తన సామ్రాజ్యాన్ని, ప్రజల్ని కాపాడుకుంటూ ఉంటాడు అయితే వృషభ చేసిన పొరపాటు వల్ల ఓ మహిళ ఆయనకు శాపం పెడుతుంది. అదే శాపం వర్తమానంలోనూ ఆదిదేవ వర్మ(మోహన్ లాల్)ను వెంటాడుతుంది. అయితే కుమారుడి కోసం తాపత్రయ పడుతున్న ఆదిదేవకు..దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ పాతదే కావొచ్చు. కానీ స్క్రీన్ ప్రజెంట్ చేసిన విధానం మాత్రం ఆకట్టుకుంది. తాను అనుకున్నట్లుగానే కథను ప్రేక్షకులను పరిచయం చేశాడు. ప్రారంభంలోనే రాజుకు పెట్టే శాపం రివీల్ చేసి ఆసక్తి క్రియేట్ చేశాడు. ఆ తర్వాత వర్తమానంలోకి తీసుకెళ్లాడు. తండ్రి, కుమారుల మధ్య బాండింగ్.. కొడుకు కోసం తండ్రి.. తండ్రి కోసం కుమారుడు పడే తపన చూపించాడు. అమ్మాయితో పరిచయం కావడం.. వెంటనే ఇద్దరి మధ్య లవ్.. చకాచకా ఓకే చెప్పడం.. అలా కథను చాలా వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. ఫస్ట్ హాప్ మొత్తం ఆదిదేవ వర్మ(మోహన్ లాల్), సమర్జీత్ లంకేశ్(తేజ్)ల బాండింగ్.. దామినితో లవ్లో పడడం అంతా రోటీన్గా సాగుతుంది. తేజ్ ఎప్పుడైతే తండ్రి సొంత గ్రామమైన దేవనగరి గ్రామానికి వెళ్లాడో అక్కడి నుంచే కథలో వేగం పుంజుకుంది. ఫస్ట్ హాఫ్లో కథ ప్రేక్షకుడి ఊహకందేలానే సాగుతుంది. కానీ అలా ప్రేక్షకుడు కథలో లీనమవ్వగానే.. ఇంటర్వెల్కు ముందు ఇచ్చే ట్విస్ట్ అస్సలు ఊహించలేరు. ఆ బిగ్ ట్విస్ట్ థియేటర్లో చూసి సగటు ప్రేక్షకుడు షాకవ్వాల్సిందే. అలా ప్రథమార్థాన్ని వర్తమానంతోనే ముగించాడు. సెకండాఫ్లో గత జన్మలో జరిగిన పరిణామాలు.. రాజా విజయేంద్ర వృషభ(మోహన్ లాల్) త్రిలింగ రాజ్యం గురించే ఉంటుంది. ఆ రాజ్యంలో జరిగే సంఘటనలు చుట్టే తిరుగుతుంది. కానీ త్రిలింగ రాజ్యంలోని స్ఫటిక లింగం దొంగతనం చేసేందుకు వచ్చిన హయగ్రీవా(సమర్జీత్ లంకేశ్) వస్తాడు. ఆ తర్వాత వృషభ రాజుకు.. హయగ్రీవాకు మధ్య జరిగే పోరాటం సెకండాఫ్లో హైలెట్. ఆ యుద్ధ ఫైట్ సీన్లో జరిగిన సంఘటన తర్వాతే ఈ కథ ఏంటనేది ప్రేక్షకుడికి అర్థమవుతుంది. అప్పటిదాకా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే. సెకండాఫ్లో అలీ కామెడీ కొద్దిసేపే అయినా నవ్వులు తెప్పించింది. ఇందులో గత జన్మకు.. వర్తమానానికి ముడిపెట్టడం వల్ల ప్రేక్షకుడిని కాస్తా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. గత జన్మ కాన్సెప్ట్తో వచ్చిన ఈ కథలో క్లైమాక్స్లో ఫుల్ ఎమోషన్ క్రియేట్ చేశాడు. తండ్రీ, తనయుల మధ్య పోరాటాన్ని భావోద్వేగానికి ముడిపెడుతూ మలిచిన తీరు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. ఈ కథలో ప్రేక్షకుడి ఊహకందని బిగ్ ట్విస్ట్లు ఇచ్చాడు డైరెక్టర్. కథలో కొత్తదనం లేకపోయినా విజువల్స్, స్క్రీన్ ప్లేతో సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకున్నారు. ఆడియన్స్కు ఎక్కడా బోరింగ్ అనిపించకుండా కథను ముందుకు తీసుకెళ్లడం ప్లస్. భారీ ఫైట్స్ లేకున్నా..కథకు తగినట్లుగా ప్లాన్ చేశాడు.ఎవరెలా చేశారంటే..మోహన్ లాల్ ఆదిదేవ వర్మగా, రాజా విజయేంద్ర వృషభగా రెండు పాత్రల్లో తనలోని టాలెంట్తో ఆకట్టుకున్నారు. సమర్జీత్ లంకేశ్ యంగ్ హీరోగా అదరగొట్టేశాడు. గత జన్మ హయగ్రీవా పాత్రలో డిఫరెంట్గా కనిపించాడు. నయన సారిక తన గ్లామర్తో ఆకట్టుకుంది. రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా సక్సేనా, గరుడ రామ్, వినయ్ వర్మ, అలీ, అయప్ప పి.శర్మ, కిషోర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. బీజీఎం అంత కాకపోయినా ఫర్వాలేదనిపించింది. సామ్ సీఎస్ నేపథ్యం సంగీతం బాగుంది. కృతి మహేశ్ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా గ్రాండ్గా ఉన్నాయి. ఓవరాల్గా ఈ వీకెండ్లో ఓ డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే వృషభ చూడాల్సిందే. -
‘బ్యాడ్ గాళ్స్ ’ మూవీ రివ్యూ
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ఫేం ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘బ్యాడ్ గాళ్స్ (కానీ చాలా మంచోళ్లు)’.రేణు దేశాయ్, అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం నేడు(డిసెంబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.ఈ సినిమా కథంతా హైదరాబాద్లోని హాస్టల్లో ఉంటున్న నలుగురు అమ్మాయిలు రోజీ రెడ్డి, మల్లీశ్వరి, మెర్సీ, వెంకట్ లక్ష్మిల చుట్టూ తిరుగుతుంది. అందులో ఇద్దరికీ జాన్, నాయుడు అనే వ్యక్తులలతో ఎంగేజ్మెంట్ అవుతుంది. పెళ్లికి ముందు ఒక ఫారిన్ ట్రిప్ వేయాలని స్నేహితులంతా అనుకుంటారు. క్క స్రవంతి సహాయంతో మలేషియా ట్రిప్కి ప్లాన్ వేస్తారు. అదే సమయంలో అనకొండ అనే పేరుమోసిన టెర్రరిస్ట్ మలేషియాలో బాంబు దాడిని ప్లాన్ చేస్తాడు. అంతే కాకుండా ఈ నలుగుర్ని కిడ్నాప్ చేయాలని ఉమెన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ కూడా రెడీ అవుతుంది. మరి వారి సరదా ప్రయాణం చివరకు ఎలా ముగిసింది? ఈ క్రమంలో ఆ అమ్మాయి ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి? ఆ ప్రమాదం నుండి ఎలా బయటపడతారు? అన్నదే అనేది మిగిలిన కథ.ఎలా ఉందంటే.. సరదాగా సాగిపోయే ఓ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఇది. ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్లడం.. అనుకోని సమస్యలు రావడం..చివరకు ఓ సందేశం ఇవ్వడం.. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. బ్యాడ్ గాళ్స్ స్టోరీ కూడా అలానే సాగుతుంది. నలుగురు స్నేహితులు బయటకు వెళ్లాలని అనుకోవడం, అమ్మాయిలు ఇలా బయటకు వస్తే ఎదురయ్యే పరిస్థితులు వంటి వాటితో ప్రథమార్దాన్ని సరదా సరదాగా సాగించారు. నలుగురు స్నేహితులు ఉన్నప్పుడు పుట్టే హాస్యం, వచ్చే సంఘటనల్ని చక్కగా చూపించాడు. అవన్నీ కూడా నేటి ట్రెండ్కు తగ్గట్టే ఉంటాయి.అయితే కథనం నెమ్మదిగా సాగడం.. పలు సినిమాల్లో చూసిన సన్నివేశాలే ఇందులో రిపీట్ కావడంతో ఫస్టాఫ్ సాగదీతగా అనిపిస్తుంది. ఇంటర్వెల్కు మాత్రం మంచి ట్విస్ట్ ఇచ్చి ముగించేస్తాడు.ఇక సెకండాఫ్లో కథ రకరకాల జానర్లోకి వెళ్తుంది. అప్పటి వరకు కామెడీ జానర్ అని అనుకుంటారు. కానీ థ్రిల్లింగ్, క్రైమ్ అని తరువాత తెలుస్తుంది. కామెడీ, థ్రిల్లర్ అంశాల కలయికతో దర్శకుడు సెకండాఫ్ను బాగానే లాగాడు. మలేషియా గ్యాంగ్, ఉమెన్ ట్రాఫిక్ గ్యాంగ్, ఈ నలుగురు స్నేహితుల చుట్టూనే ఈ కథను ప్రీ క్లైమాక్స్ వరకు తిప్పాడు. ఇక చివర్లో దర్శకుడు తన సందేశాన్ని ఇచ్చాడు. క్లైమాక్స్ కాస్త ఎమోషనల్గానే టచ్ చేసినట్టు అనిపిస్తుంది. దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి స్క్రీన్ప్లే, కామెడీ పంచ్లు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.ఎవరెలా చేశారంటే.. నలుగురు ప్రధాన పాత్రలు - అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్న ఎంతో ఎనర్జీగా కనిపించారు. వారి వారి పాత్రల తీరుకు తగ్గట్టుగా తెరపై చక్కగా నటించారు. నలుగురి మధ్య మంచి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని చూపెట్టారు. మోయిన్, రోహన్ సూర్య పాత్రలు కూడా బాగుంటాయి. ఈ రెండు పాత్రలతో కావాల్సినంత వినోదాన్ని ప్రేక్షకులకు అందించారు. అలా మిగిలిన వారిలో రేణు దేశాయ్ బలమైన పాత్రలో, మలేషియా పోలీసుగా రాజా రవీంద్ర, రెండు సన్నివేశాలలో తాగుబోతు రమేష్, బిగ్ బాస్ ఫేమ్ స్రవంతి కీలక పాత్రలో కనిపించి మెప్పించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. అనూప్ రూబెన్స్ సంగీతం , నేపథ్య సంగీతం బాగుంటుంది. ఆస్కార్ చంద్ర బోస్ రాసిన సాహిత్యం ఆలోచింపజేసేలా ఉంటుంది. అర్లి గణేష్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే.నిర్మాణ విలువలు బాగున్నాయి.రేటింగ్ : 2.5/5 -
కళ్లకు కాటుక పెట్టుకున్నా బాధనే!: బుల్లితెర నటి
సెలబ్రిటీల ముఖంలో కాస్త తేడా కనిపించినా నెటిజన్లు ఇట్టే పసిగడతారు. అది మేకప్ మహిమో? లేక డైట్ వల్ల అలా అయిందో అనడానికి బదులుగా ఏకంగా సర్జరీ చేయించుకుందని ఈజీగా అనేస్తారు. మరింత అందంగా కనిపించడం కోసం ముక్కుకు, ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని కామెంట్లు చేస్తారు. బుల్లితెర నటి ప్రియాంక చాహర్ చౌదరిపై కూడా కొంతకాలంగా ఇలాంటి రూమర్లే వస్తున్నాయి.ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్తాజాగా వీటిపై ప్రియాంక స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. చాలారోజులుగా నాపై ఎన్నో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. గతేడాది నా ఆరోగ్యం బాగోలేక ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఎక్కువ డోస్ ఉన్న యాంటిబయాటిక్స్ వాడాను. చాలామంది జనాలకు ఈ విషయం తెలియనే తెలియదు. ఆ సమయంలో బరువు తగ్గిపోయాను కానీ ముఖం మాత్రం కాస్త ఉబ్బింది. కళ్లకు కాటుక రుద్దినా..అంతదానికే జనాలు ఏదేదో ఊహించుకున్నారు. అయినా అందాన్ని మెరుగుపర్చుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. నేనేం చేయాలనుకున్నా, చేసినా అది నా ఇష్టం. ఇప్పుడు నేను కళ్లకు కాటుక రుద్దినా, లెన్స్ పెట్టుకున్నా సరే.. ముఖానికి ఏదో చేయించుకున్నానని మాత్రమే అంటారు. అందుకే నేను చెప్పేదేంటంటే.. నా ముఖం.. నా ఇష్టం! సీరియల్అయినా నా ఫేస్కు మేకప్ వేయడం తప్ప ఏదీ చేయలేదు. అయినప్పటికీ జనాలు అది మేకప్ అని నమ్మరు.. ఇంకా ఏదో ఉందని మాట్లాడుతూనే ఉంటారు. అది కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చింది. ప్రియాంక చౌదరి.. 'ఉడారియాన్' సీరియల్తో బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం 'నాగిని 7' సీరియల్ చేస్తోంది. ఏక్తా కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సీరియల్ డిసెంబర్ 27న ప్రారంభం కానుంది. -
‘ఛాంపియన్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నిర్మాలా కాన్వెంట్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా..పెళ్లి సందడి మూవీతో హీరోగా మారాడు. తొలి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నా.. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని పీరియాడికల్ ఫిల్మ్ ‘ఛాంపియన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలకు, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘ఛాంపియన్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రోషన్ ఖాతాలో హిట్ పడిందా? లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా కథంతా 1747-48 ప్రాంతంలో జరుగుతుంది. సికింద్రాబాద్లోని ఒక బేకరీలో పని చేసే మైఖేల్(రోషన్)కి ఫుట్బాల్ ఆట అంటే చాలా ఇష్టం. ఈ ఆటతోనే ఎప్పటికైనా ఇంగ్లాండ్ వెళ్లి..అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటాడు. ఓసారి ఇంగ్లాండ్ వెళ్లే అవకాశం వస్తుంది. కానీ అతని తండ్రి చేసిన ఓ పని వల్ల వెళ్లలేకపోతాడు. దొంగమార్గాన ఇంగ్లాండ్ వెళ్లాలనుకుంటాడు. దాని కోసం కొన్ని తుపాకులను ఒక చోటుకి తరలించాల్సి వస్తుంది. ఆ పని చేసే క్రమంలో పోలీసుల కంటపడతారు. వారి నుంచి తప్పించుకొని అనుకోకుండా బైరాన్పల్లి అనే గ్రామానికి వస్తాడు. అదే ఊరికి చెందిన చంద్రకళ(అనస్వర రాజన్)తో పరిచయం.. నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఆ ఊరి ప్రజలు చేసిన తిరుగుబాటు రోషన్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? పోలీసు అధికారి బాబు దేశ్ముఖ్ (సంతోష్ ప్రతాప్)తో మైఖేల్ గొడవ ఏంటి? బైరాన్పల్లి ప్రజల కోసం మైఖేల్ చేసిన త్యాగమేంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..ప్రపంచంలోని పోరాటాల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి చాలా ప్రత్యేకత ఉంది. అందులో బైరాన్పల్లి గ్రామస్తులు చేసిన పోరాటం మరింత ప్రత్యేకం. ప్రాణాలు పోతాయని తెలిసినా.. నిజాం పాలకులపై ఎదురుదాడి దిగారు. ఒకనొక దశలో రజాకార్లకే ముచ్చమటలు పట్టించారు. ఆ ఊరి ప్రజలు సాగించిన వీరోచిత పోరాటాన్నే ‘చాంపియన్’లో మరోసారి చూపించారు దర్శకుడు ప్రదీప్ అద్వైతం. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చినప్పటికీ.. ఓ ఆటగాడి కోణంలో సాయుధ పోరాటాన్ని చూపించడం.. అందులోనూ ఓ స్వచ్ఛమైన ప్రేమ కథను చెప్పడం ‘ఛాంపియన్’ స్పెషల్. అది తప్పితే ఈ సినిమా కథంతా రొటీన్గానే సాగుతుంది. పైగా చాలా చోట్ల సాగదీతగా అనిపిస్తుంది. ఆపరేషన్ పోలోకి దారి తీసిన సన్నివేశాలతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత రజాకార్ల అరచకాలు.. బైరాన్పల్లి ప్రజల పోరాటాన్ని చూపించి.. కథను సికింద్రాబాద్కి మార్చాడు. అక్కడ ఆంగ్లో ఇండియన్ కుర్రాడిగా హీరో పరిచయం.. ఫుట్బాల్ టోర్నమెంట్, కోవై సరళ, వెన్నెల కిశోర్ సన్నివేశాలన్నీ కాస్త ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. కథ అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. హీరో ఎప్పుడైతే బైరాన్ పల్లి గ్రామానికి వస్తాడో.. అప్పటి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. హీరోయిన్తో పరిచయం.. నాటక ప్రదర్శన.. 'గిర్రా గిర్రా.. పాట ఇవన్నీ ఎంటర్టైనింగ్గా సాగుతాయి. బైరాన్పల్లిపై రజాకార్ల దాడి జరగడం.. హీరో ఊరి పోరాటంలో భాగమవ్వడం.. అవ్వడంతో సెకండాఫ్పై మరింత ఆసక్తి పెరుగుతుంది. అయితే ద్వితియార్థంలోనూ డ్రామాపైనే దర్శకుడు ఎక్కువ ఫోకస్ చేశాడు. కథనాన్ని పరుగులు పెట్టించే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఆ దిశగా ఆలోచన చేయలేదు. ఎమోషనల్ సన్నివేశాలనే హైలెట్ చేశాడు. కానీ అవి పూర్తిగా వర్కౌట్ కాలేదు. ప్రేమ కథ ఒకవైపు.. సాయుధ పోరాటం మరోవైపు.. ఈ రెండిటిలో దేనికి ప్రేక్షకుడు పూర్తిగా కనెక్ట్ కాలేదు. రజాకార్లలో అసలు పోరాటం మొదలైనప్పటి నుంచి క్లైమాక్స్ వరకు కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా హీరో తండ్రి నేపథ్యం.. ఆయన చెప్పే మాటలు ఆలోచింపజేస్తాయి. హీరో తండ్రి పాత్రలో ఓ స్టార్ హీరో కనిపించడం ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుంది. భావేద్వేగానికి గురి చేసేలా క్లైమాక్స్ ఉంటుంది. ఎవరెలా చేశారంటే..మైఖేల్ సి విలియమ్స్ పాత్రలో రోషన్ ఒదిగిపోయాడు. తెలంగాణ యాసలో డైలాగ్స్ని అదరగొట్టేశాడు. డ్యాన్స్ కూడా ఇరగదీవాడు. యాక్షన్ సన్నివేశాల కోసం ఆయన పడిన కష్టం తెరపై కనిపించింది. తాళ్లపూడి చంద్రకళగా అనస్వర తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించింది. రాజిరెడ్డి పాత్రకు నందమూరి కల్యాణ్ చక్రవర్తి అంతగా సెట్ అవ్వలేదు. తెలంగాణ యాసను పలకడంలో ఆయన తడబడ్డాడు. పాత్ర సుందరయ్యగా మురళీశర్మ ఆకట్టుకుంటారు. రచ్చరవి, మురళీధర్ గౌడ్, బలగం సంజయ్, అర్చనతో పాటు మిగిలిన నటీనటులంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా బాగుంది. మిక్కీ జే మేయర్ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. తోటతరణి ఆర్ట్ వర్క్ బాగుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేసి నిడివి తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
మరో ఓటీటీలోకి క్రేజీ హారర్ సినిమా.. ఉచితంగా స్ట్రీమింగ్
హారర్ సినిమాలు తీయాలంటే హాలీవుడ్ దర్శకుల తర్వాత ఎవరైనా. ఎందుకంటే చాలా రియలస్టిక్గా ఉంటాయి. చూస్తున్నప్పుడు భయపెడతాయి. ఈ ఏడాది అలా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని భయపెట్టిన ఓ సినిమా ఓటీటీలో ఉచితంగా అందుబాటులోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ మేరకు స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్, ఎన్టీఆర్.. మధ్యలో త్రివిక్రమ్?)ఈ ఏడాది ఆగస్టులో రిలీజైన హాలీవుడ్ మూవీ 'వెపన్స్'. రూ.335 కోట్ల బడ్జెట్తో తీస్తే రూ.2400 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. విడుదల తర్వాత కొన్ని వారాలకే అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్, వుడు గూగుల్ వీడియోప్లేలోకి వచ్చింది. కాకపోతే అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఎక్కువమంది చూడలేకపోయారు. ఇప్పుడు కొత్తగా హాట్స్టార్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. జనవరి 8 నుంచి ఉచితంగా స్ట్రీమింగ్ కానుందని క్లారిటీ ఇచ్చారు. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?'వెపన్స్' విషయానికొస్తే.. మేబ్రూక్ అనే ఊరిలో ఓ రోజు రాత్రి 2:17 గంటలకు 17 మంది చిన్నారులు వాళ్ల ఇంట్లో నుంచి బయటకెళ్లిపోతారు. ఎంత వెతికినా కనిపించరు. వీళ్లంతా ఒకే స్కూల్ ఒకే క్లాస్లో చదువుతుంటారు. ఇదే క్లాస్కి చెందిన ఓ పిల్లాడు మాత్రం బాగానే ఉంటాడు. దీంతో ఊరందరి అనుమానం క్లాస్ టీచర్ జస్టిన్(జూలియా గార్నర్)పై పడుతుంది. అసలు ఆ 17 మంది పిల్లలు ఏమయ్యారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 17 ఏళ్లకే తల్లి పాత్ర.. 'ఛాంపియన్'తో ఇప్పుడు తెలుగులోకి.. ఎవరీ అనస్వర)At 2:17 a.m., seventeen children disappeared from their homes and never came back. Where did they go?#Weapons, streaming January 8 onwards on JioHotstar. pic.twitter.com/46m9ewEc06— JioHotstar (@JioHotstar) December 23, 2025 -
అల్లు అర్జున్, ఎన్టీఆర్.. మధ్యలో త్రివిక్రమ్?
ఒకరు చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం ఇండస్ట్రీలో కొత్తేం కాదు. ఒకసారి వేరే హీరో అనుకున్న తర్వాత లేదు లేదు మళ్లీ పాత హీరోతోనే మూవీ చేయడం లాంటివి మాత్రం అరుదుగా జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్లో అదే జరగనుందని రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. తద్వారా అల్లు అర్జున్, ఎన్టీఆర్, త్రివిక్రమ్ మరోసారి హాట్ టాపిక్ అయిపోయారు. ఇంతకీ ఏంటి విషయం?అల్లు అర్జున్ దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో లాంటి హిట్స్ పడ్డాయి. అలా వీళ్లిద్దరూ కలిసి మరో ప్రాజెక్ట్ చేయబోతున్నారని ఏడాది-ఏడాదిన్నర క్రితం తెగ మాట్లాడుకున్నారు. అదో భారీ మైథలాజికల్ సబ్జెక్ట్ అనే టాక్ బయటకొచ్చింది. లెక్క ప్రకారం 'పుష్ప 2' తర్వాత బన్నీ, త్రివిక్రమ్తో ఈ మూవీ చేస్తారని అంతా అనుకున్నారు. కట్ చేస్తే తమిళ దర్శకుడు అట్లీతో బన్నీ తన కొత్త మూవీ అనౌన్స్ చేశాడు. మరోవైపు త్రివిక్రమ్ కూడా తారక్తో ఈ ప్రాజెక్ట్ చేస్తారని న్యూస్ బయటకొచ్చింది.(ఇదీ చదవండి: 'దండోరా' సినిమా రివ్యూ)ఇందుకు తగ్గట్లే ఎన్టీఆర్ కూడా 'ద గాడ్ ఆఫ్ వార్' పుస్తకం పట్టుకుని ఒకటి రెండుసార్లు కనిపించాడు. నిర్మాత నాగవంశీ కూడా ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో భారీ ఎత్తున ఈ సినిమా ఉండబోతుందన్నట్లు పరోక్షంగా ట్వీట్స్ చేశాడు. తాజాగా ఓ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా మాట్లాడిన నిర్మాత బన్నీ వాసు.. కొన్ని సందర్భాల్లో సినిమాలు చేతులు మారుతుంటాయని అన్నాడు. ఇది బన్నీ-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కోసమేనని నెటిజన్ల అంటున్నారు.ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో కొత్త మూవీస్ ఏం లేవు. అట్లీది వేసవికల్లా పూర్తవుతుంది. మరోవైపు లోకేశ్ కనగరాజ్తోనూ బన్నీ డిస్కషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు త్రివిక్రమ్ పేరు కూడా వినిపిస్తోంది. మరి ఈ ఇద్దరు దర్శకుల్లో బన్నీతో చేసేవారిలో ఎవరు ముందు ఎవరు వెనక అనేది చూడాలి? పరిస్థితులు చూస్తుంటే త్రివిక్రమ్.. మరోసారి తారక్కి హ్యాండ్ ఇచ్చాడా అనిపిస్తుంది. గతంలో 'ఆర్ఆర్ఆర్' తర్వాత కూడా ఎన్టీఆర్తో త్రివిక్రమ్ మూవీ ప్రకటించారు. కానీ దాన్ని పట్టాలెక్కించలేకపోయారు.(ఇదీ చదవండి: 17 ఏళ్లకే తల్లి పాత్ర.. 'ఛాంపియన్'తో ఇప్పుడు తెలుగులోకి.. ఎవరీ అనస్వర) -
'అందరికీ ఇదే నా విజ్ఞప్తి'.. అనసూయ ఆసక్తికర ట్వీట్
టాలీవుడ్ నటి అనసూయ మరో పోస్ట్ చేసింది. ఇప్పటికే శివాజీ కామెంట్స్కు కౌంటరిచ్చిన అనసూయ తాజాగా ట్వీట్ చేసింది. ఇది కేవలం మహిళల గురించి మాత్రమే కాదని తెలిపింది. పాత తరాలు నేర్చుకున్నవి, అలవాటుపడ్డ ఆలోచనలు మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొంది. కొంతమంది పురుషులు, మహిళలు కూడా నా వయసును ఉపయోగించి నన్ను తక్కువగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది.అనసూయ తన ట్వీట్లో రాస్తూ..' కొంతమంది పురుషులు, మహిళలు కూడా.. నా వయసును ఉపయోగించి నన్ను తక్కువగా చూపించడానికి.. నన్ను చిన్నగా భావింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు.. ఈ విధమైన ఆలోచన కలిగిన వారు ఎక్కువగా ప్రగతిశీల మహిళలను లక్ష్యంగా చేసుకుంటారు.. ఇది మహిళలపై నియంత్రణ కోల్పోతామన్న భయం వల్ల.. అలాగే బలహీనమైన పితృస్వామ్య అహంకారాన్ని పోషించుకోవాలనే ఉద్దేశంతో జరుగుతుంది. ఇది అందరి పురుషుల గురించీ లేదా అందరి మహిళల గురించీ కాదు.. కానీ నేను పురుషులు.. మహిళలు.. అందరికీ విన్నపం చేస్తున్నాను.. దయచేసి విస్తృతంగా ఆలోచించండి.. పాత తరాలు నేర్చుకున్నవి లేదా అలవాటుపడ్డ ఆలోచనలు మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని' తెలిపింది.ఇప్పుడున్న సమాజంలో మనం మార్పును ఎంచుకోవచ్చు.. మన గౌరవాన్ని.. మన స్వేచ్ఛను కాపాడుకోవచ్చని తెలిపింది. ఒకరికొకరం శక్తినివ్వాలి.. మద్దతుగా నిలవాలి.. మన విలువ మన ఎంపికల నుంచే వస్తుంది.. మరే దానితో కాదని హితవు పలికింది. అంతేకాకుండా కొంతమంది మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.. మీ పని బాధ్యతతో చేయాలి.. ఈ విధమైన మహిమాపరచడం (గ్లోరిఫికేషన్) సమంజసం కాదని ట్వీట్లో రాసుకొచ్చింది.I need to say this..కొంతమంది పురుషులు.. ఇంకా కొంతమంది మహిళలు కూడా.. నా వయసును ఉపయోగించి నన్ను తక్కువగా చూపించడానికి.. నన్ను చిన్నగా భావింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు.. ఈ విధమైన ఆలోచన కలిగిన వారు ఎక్కువగా ప్రగతిశీల మహిళలను లక్ష్యంగా చేసుకుంటారు.. ఇది మహిళలపై నియంత్రణ…— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 25, 2025 -
17 ఏళ్లకే తల్లి పాత్ర.. 'ఛాంపియన్'తో ఇప్పుడు తెలుగులోకి
పట్టుమని పాతికేళ్లు లేవు. అయితేనేం సొంత భాషలో హీరోయిన్గా స్టార్డమ్ సొంతం చేసుకుంది. ఆపై బాలీవుడ్లోనూ ఓ మూవీ చేసింది. ఇప్పుడు 'ఛాంపియన్' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇంతకీ ఈ మలయాళ బ్యూటీ ఎవరు? ఈమె బ్యాక్ గ్రౌండ్ డీటైల్స్ ఏంటి?పైన చెప్పిందంతా కూడా మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ గురించే. కేరళలోని కరివెల్లూరులో పుట్టిన ఈమెకు ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు. కానీ 15 ఏళ్ల వయసులో 'ఉదాహరణం సుజాత' అనే మూవీలో మంజు వారియర్ కూతురిగా నటించింది. 2019లో వచ్చిన 'తన్నీర్ మథన్ దినంగళ్' చిత్రం అనస్వరకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. ఇదే ఏడాది వచ్చిన 'అధ్యరాత్రి'లో ఈమె తల్లి, కూతురిగా ద్విపాత్రాభినయం చేసింది. ఈ రోల్స్ చేసేనాటికి ఈమె వయసు 17 ఏళ్లే కావడం విశేషం.(ఇదీ చదవండి: హారర్ సినిమా 'ఈషా' రివ్యూ)2022లో వచ్చిన 'సూపర్ శరణ్య' సినిమా అనస్వరకు చాలా పేరు తీసుకొచ్చింది. ఇందులోనే మమిత బైజు కూడా యాక్ట్ చేసింది. ఇదే ఏడాది తమిళంలోకి 'రాంగీ'తో ఎంట్రీ ఇచ్చింది. కాకపోతే వర్కౌట్ కాలేదు. 2023లో 'యారియన్ 2'తో బాలీవుడ్కి కూడా పరిచయమైంది. ఇది కూడా కలిసి రాలేదు. దీంతో తమిళ, హిందీలో మరో చిత్రంలో నటించలేదు. కేవలం మలయాళానికి మాత్రమే పరిమితమైపోయింది.2023లో వచ్చిన 'నెరు' సినిమాతో అనస్వర ఎంత మంచి నటి అనేది అందరికీ తెలిసింది. కళ్లు లేని అమ్మాయిగా, తనపై అత్యాచారం చేసివాడిని పట్టించే పాత్రలో అదరగొట్టేసింది. ఈ మూవీకిగానూ ఫిల్మ్ ఫేర్, సైమా అవార్డ్స్ ఈమెని వరించాయి. గతేడాది వచ్చిన 'గురువాయూర్ అంబలనడయిల్', ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన 'రేఖాచిత్రం' ఈమెలోని ప్రతిభని మరింత బయటపెట్టాయి.శ్రీకాంత్ కొడుకు హీరోగా చేసిన 'ఛాంపియన్'తో అనస్వర.. తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. కానీ అంతకంటే ముందే తెలుగు ప్రేక్షకులకు ఈమె పరిచయం. నెరు, రేఖాచిత్రం, సూపర్ శరణ్య తదితర చిత్రాల్ని ఓటీటీల్లో మనోళ్లు ఇప్పటికే చూశారు. వాళ్లందరికీ ఈ బ్యూటీ టాలెంట్ ఏంటనేది తెలుసు. అందం, అమాయకత్వం, డ్యాన్స్.. ఇలా అన్నీ అదరగొట్టే ఈమెకు 'ఛాంపియన్' ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'దండోరా' సినిమా రివ్యూ) -
కొడుకులతో కలిసి హృతిక్ అదిరిపోయే డ్యాన్స్
దేశంలో బెస్ట్ డ్యాన్సర్ల లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ఉండే పేరు హృతిక్ రోషన్. ఇతడి స్టెప్పులకు సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఈ ఏడాది 'వార్ 2'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన హృతిక్.. ఇందులోనూ ఓ పాటలో డ్యాన్స్ అదరగొట్టేశాడు. ఇప్పుడు బయట ఓ పెళ్లిలోనూ స్టేజీపై స్టెప్పులు ఇరగదీశాడు. అయితే ఇద్దరు కొడుకులతో కలిసి ఇది చేయడం ఇక్కడ విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'దండోరా' సినిమా రివ్యూ)హృతిక్ రోషన్ మామ కొడుకు ఈషాన్ రోషన్ పెళ్లి రెండు రోజుల క్రితం ముంబైలో గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ సినీ తారలు హాజరయ్యారు. హృతిక్ తన ప్రేయసి షబా ఆజాద్తో కలిసి సందడి చేశాడు. ఇతడి మాజీ భార్య సుస్సానే ఖాన్ కూడా తన కొడుకులతో కలిసి పెళ్లిలో కనిపించింది.సంగీత్ సందర్భంగా హృతిక్.. తన ఇద్దరు కొడుకులు హ్రేహాన్, హృదాన్తో కలిసి హిందీ పాటకు స్టెప్పులేశాడు. హృతిక్ అనుకుంటే కుమారులు కూడా తండ్రితో పోటీపడి డ్యాన్స్ చేయడం విశేషం. చూస్తుంటే వీళ్లకు కూడా యాక్టింగ్, డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్లే కనిపిస్తుంది. మరి త్వరలో నటులుగా ఎంట్రీ ఇస్తారేమో?(ఇదీ చదవండి: హారర్ సినిమా 'ఈషా' రివ్యూ)Damn 😱 Gotta get lighter on my feet to keep up 🕺🏻 pic.twitter.com/UFnHNEIR7p— Hrithik Roshan (@iHrithik) December 25, 2025 -
హారర్ సినిమా 'ఈషా' రివ్యూ
ప్రమోషనల్ కంటెంట్తో కొంతలో కొంత ఆకట్టుకున్న హారర్ సినిమా 'ఈషా'. త్రిగుణ్, హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, సిరి హనుమంతు, బబ్లూ పృథ్వీరాజ్ లీడ్ రోల్స్ చేశారు. సున్నిత మనస్కులు ఈ మూవీకి రావొద్దని నిర్మాతలు స్టేట్మెంట్ ఇవ్వడం లాంటివి ఆసక్తి కలిగించాయి. తాజాగా(డిసెంబరు 25) థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? చెప్పినంతలా భయపెట్టిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?కల్యాణ్(త్రిగుణ్), నయన (హెబ్బా పటేల్), అపర్ణ (సిరి హనుమంతు), వినయ్ (అఖిల్ రాజ్) చిన్నప్పటి నుంచి స్నేహితులు. దెయ్యాలు, ఆత్మలు లేవు అని నమ్ముతుంటారు. పెద్దయ్యాక టీమ్గా ఏర్పడి దొంగ బాబాలు, స్వామిజీల బండారాల్ని బయటపెడుతుంటారు. అలా ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉంటున్న ఆదిదేవ్ (బబ్లూ పృథ్వీరాజ్) బాబా గురించి వీళ్లకు తెలుస్తుంది. అతడి బాగోతం కూడా బయటపెట్టాలని ఫిక్స్ అవుతారు. వెళ్లి ఆదిదేవ్ బాబాని కలుస్తారు. ఆత్మల విషయంలో ఈ నలుగురికి బాబా ఓ ఛాలెంజ్ చేస్తాడు. ఇంతకీ ఆ సవాలు ఏంటి? చివరకు వీళ్లు ఏం తెలుసుకున్నారు? ఈ నలుగురిని చంపాలనుకుంటున్న పుణ్యవతి ఎవరు అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఈ కాలంలోనూ దెయ్యాలు, భూతాలు ఉన్నాయా? అంటే చాలామంది అలాంటివేం లేవని అంటారు. మరికొందరు మాత్రం అవును అలాంటివి ఉన్నాయని నమ్ముతుంటారు. అలా వ్యతిరేక భావాలున్న ఇద్దరూ ఎదురెదురు పడి సవాళ్లు విసురుకుంటే ఏమైందనేదే 'ఈషా' సినిమా.హారర్ సినిమాలు అనగానే కొన్ని అంశాలు పక్కాగా ఉంటాయి. హీరో లేదా హీరోయిన్ పాత్రధారులు దెయ్యాల్ని నమ్మకపోవడం.. అనుకోని పరిస్థితుల్లో పాడుబడిన బంగ్లాలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడటం.. దెయ్యాల్ని వదిలించే ఓ శక్తివంతైన బాబా.. ఇలాంటివి దాదాపుగా కనిపిస్తాయి. అయితే ఎన్ని ఉన్నా సరే ప్రేక్షకుడు భయపడ్డాడా లేదా అనేది కీలకం. ఈ విషయంలో 'ఈషా'కు పాస్ మార్కులే పడతాయి. ఎందుకంటే నాలుగైదు చోట్ల భయపెట్టడం తప్పితే గొప్పగా ఏం లేదు.నలుగురు ఫ్రెండ్స్ దెయ్యాలు లేవని నిరూపించడం.. ఈ క్రమంలోనే ఆదిదేవ్ బాబాని వెతుక్కుంటూ అతడి దగ్గరకు వెళ్లడం.. మార్గం మధ్యలో ఓ ప్రమాదం.. ఓ సవాలు.. అనుకోని పరిస్థితుల్లో వీళ్లంతా పాడుబడిన బంగ్లాలో ఉండాల్సి రావడం.. ఇలా దాదాపు స్టోరీ అంతా ఫ్లాట్గానే వెళ్తూ ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ భయపెడుతూ ఉంటుంది తప్పితే తెరపై సీన్స్ ఆ ఫీల్ కలిగించవు.ఇందులో పుణ్యవతి ఎపిసోడ్ భయపెడుతుంది. కాకపోతే అదంతా చాలా సింపుల్గా తేల్చేయడం ఏంటో అర్థం కాదు. అసలు ఆ పాత్రని ఇంకాస్త పొడిగించి ఉంటే భయపెట్టే స్కోప్ చాలా ఉండేది. ఆమె ఆత్మకు.. కొడుకు, భర్తతోనూ ఎమోషనల్ సీన్స్ పెట్టొచ్చు. కానీ దర్శకుడు అలా ఎందుకు ఆలోచించలేకపోయాడా అనిపిస్తుంది. పుణ్యవతి పాత్రని ఎందుకో మధ్యలోనే వదిలేశారో ఏంటో? అలానే అమెరికాలో టాప్ న్యూరో సర్జర్ అయిన ఆదిదేవ్.. మన దేశానికి వచ్చి దెయ్యాల్ని వదిలిస్తూ బాబాగా ఎందుకు మారాడో అర్థం కాదు. అతడి బ్యాక్ స్టోరీ చెప్పలేదు.ఈ సినిమాకు క్లైమాక్సే కీలకం. దర్శకుడు కూడా దాన్నే నమ్ముకుని తీశాడు. క్లైమాక్స్ ఒక్కటే సర్ప్రైజ్ చేస్తే సరిపోదుగా.. మిగతా సీన్స్ కూడా ఎంగేజ్ చేయాలి. అప్పుడే మూవీ బాగుంటుంది. ఇక్కడా ఆ పొరపాటే జరిగింది. క్లైమాక్స్ తప్పితే మిగతా అంతా రొటీన్. అకస్మాత్తుగా చనిపోయిన వాళ్లు ఆత్మలుగా ఎందుకు మారతారు? అనే పాయింట్ని చివరలో చూపిస్తూ.. సీక్వెల్ కూడా ఉంటుందని హింట్ ఇచ్చి ముగించారు.ఎవరెలా చేశారు?ఫ్రెండ్స్ గ్యాంగ్ త్రిగుణ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు, అఖిల్ రాజ్ బాగానే చేశారు. బాబా ఆదిదేవ్గా బబ్లూ పృథ్వీరాజ్ ఓకే. వేషధారణ కాస్త విచిత్రంగా ఉన్నా ఎందుకో పవర్ఫుల్గా చూపించలేకపోయారు. పుణ్యవతి ఆత్మ ఆవహించిన వ్యక్తిగా మైమ్ మధు అదరగొట్టేశాడు. గెటప్ చూస్తేనే భయపడతాం. ఆ రేంజ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. టెక్నికల్ విషయాలకొస్తే.. ధ్రువన్ సంగీతం బాగుంది. సీన్లో దమ్ములేకపోయినా సౌండ్తో భయపెట్టే ప్రయత్నం బాగా చేశారు. విజువల్స్ కూడా హారర్ ఫీల్ కలిగించాయి. దర్శకుడు శ్రీనివాస్ మన్నె ఎంచుకున్న పాయింట్లో కొత్తదనం లేదు. సినిమాని కూడా ఇంపాక్ట్ఫుల్గా తీయలేకపోయాడు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లున్నాయి. ఓవరాల్గా చెప్పుకొంటే 'ఈషా' ఓకే.- చందు డొంకాన -
'దండోరా' సినిమా రివ్యూ
గత రెండు మూడు రోజుల నుంచి వార్తల్లో నిలిచిన నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'దండోరా'. కుల వివక్ష, పరువు హత్య లాంటి సబ్జెక్ట్ ఈ మూవీ కాన్సెప్ట్. ప్రమోషనల్ కంటెంట్తో ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు(డిసెంబరు 25) థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?అది 2004. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మెదక్ దగ్గర తుళ్లూరు అనే గ్రామం. ఇక్కడ అణచివేయబడిన కులానికి చెందిన వ్యక్తులు చనిపోతే ఎక్కడో ఊరి చివరకు తీసుకెళ్లి దహనం చేస్తుంటారు. ఇదే గ్రామంలో శివాజీ (శివాజీ) ఓ అగ్రకులానికి చెందిన వ్యక్తి. కొన్ని కారణాల వల్ల ఇతడు చనిపోతాడు. కుల పెద్దలు మాత్రం ఇతడి శవాన్ని ఊరి శ్మశానంలో తగలబెట్టడానికి వీల్లేదని తీర్మానిస్తారు. అసలు శివాజీని వాళ్ల కులమే ఎందుకు బషిష్కరించింది? ఇతడి గతమేంటి? శివాజీతో కన్న కొడుకు విష్ణు(నందు) ఎందుకు ఏళ్లుగా మాట్లాడటం మానేశాడు? ఇతడితో వేశ్య శ్రీలత (బిందుమాధవి)కి సంబంధమేంటి అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?టాలీవుడ్లో కుల వివక్షపై వచ్చిన సినిమాలు తక్కువే. వివాదాలు ఏర్పడతాయని భయమో? కమర్షియల్గా ఆడవనే ఉద్దేశమో గానీ ఇలాంటి మూవీస్ అప్పుడప్పుడే వస్తుంటాయి. 'దండోరా' కూడా అలాంటి ఓ సినిమానే. మరి ఇది ఎలా ఉంది అంటే ఓకే ఓకే. ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ దాన్ని డీల్ చేయడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. లాజిక్స్ మర్చిపోయాడు!అణచివేయబడిన కులానికి చెందిన ఓ వృద్ధురాలి శవాన్ని ఊరి చివరకు తీసుకెళ్లే సీన్తో సినిమా మొదలవుతుంది. 2004 నుంచి 2019 మధ్య కాలంలో ఈ కథంతా సాగుతుంది. ఫస్టాఫ్ అంతా కులం గొడవలు, రవి-సుజాతల లవ్ స్టోరీతో టైమ్ పాస్ అయిపోతుంది. కులాన్ని ఎక్కువగా చూసే ఓ గ్రామంలో ఓ మనిషి చచ్చిపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా సాదాసీదాగానే ఉంటుంది తప్పితే ఇందులో కొత్తగా ఏముందా అనిపిస్తుంది. కులం గొడవలు అంటే కచ్చితంగా హత్య, చావు ఉంటాయిగా.. అలా ఓ హత్యతో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది.ఫస్టాప్ ఓకే ఓకే అనిపించినప్పటికీ సెకండాఫ్ కాస్త ఎంగేజింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు కులం కాన్సెప్ట్పై తీసిన సినిమాల్లో బాధితులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి మనోవేదన అనుభవిస్తారనే విషయాన్ని చూపించారు. ఇందులో మాత్రం హత్యకు కారణమైన వ్యక్తి, అతడి కుటుంబం ఎలాంటి మానసిక వేదన అనుభవిస్తుంది అనే అంశాన్ని చూపించారు. క్లైమాక్స్ని కూడా ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్తో ముగించారు.సినిమా అంతా చూసిన తర్వాత ఇలాంటివి వార్తల్లో చాలా చూశాం. క్లైమాక్స్ తప్పితే ఇందులో కొత్తగా ఏముందా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే మూవీలో ఓ కులం వాళ్లు.. ఊరిలో స్మశానం మెంటైన్ చేస్తుంటారు. వేరే కులం వాళ్లు ఎక్కడో ఊరి అవతల శవాల్ని దహనం చేస్తుంటారు. అయితే అణచివేయబడిన కులానికి చెందిన వ్యక్తులు.. ఏళ్లు గడుస్తున్నా ఈ సమస్యని ఎందుకు పరిష్కరించుకోలేకపోయారు? అసలు వీళ్లలో కనీసం ఒక్కరికి కూడా ఆలోచన రాదా? ఎవరో దానం చేస్తే తప్ప వీళ్లకు వేరే గత్యంతరం లేదా? ఇలా చాలా సందేహలు వస్తాయి. దర్శకుడు ఈ లాజిక్స్ అన్ని ఎలా మిస్ అయ్యాడా అనిపిస్తుంది.సర్పంచ్ క్యారెక్టర్ అయితే మరీ విచిత్రంగా ఉంటుంది. చిన్నప్పుడు ఓ సంఘటన చూసి ఊరికి ఏదో చేసేద్దామని డిసైడ్ అయిన వ్యక్తి.. అధికారం వచ్చినా సరే ఏం చేయకపోవడం, వేరే వాళ్లు దానం చేస్తే దాన్ని పండగలా సెలబ్రేట్ చేసుకోవడం కన్విన్సింగ్గా అనిపించదు. స్టోరీకి అవసరం లేని సీన్స్ కూడా చాలానే ఉంటాయి. చాలా సీరియస్ కాన్సెప్ట్ చెబుతున్నప్పుడు సీన్స్ ఎంత ఎంగేజింగ్గా ఉంటే అంత బెటర్. కానీ ఇందులో కొన్ని మెరుపులు మాత్రమే ఉంటాయి. కొన్ని డైలాగ్స్ ఆలోచింపజేస్తాయంతే.ఎవరెలా చేశారు?శివాజీ బాగానే చేశాడు. కానీ ఆ పాత్ర 'కోర్ట్'లో మంగపతి క్యారెక్టర్కి కొనసాగింపులా ఉంటుంది తప్పితే కొత్తగా ఏముందా అనిపిస్తుంది. రవికృష్ణది రొటీన్ పాత్రే అయినప్పటికీ ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. నవదీప్ 2.0 అని ఈ మూవీ టైటిల్స్లో వేశారు కానీ ఇందులో అతడి పాత్రకు పెద్దగా స్కోప్ దొరకలేదు. చాలా సాధారణంగా ఉంటుంది. వేశ్యగా బిందుమాధవి పాత్ర బాగుంది కానీ ఆమె డైలాగ్స్ చెబుతున్నప్పుడు ఎందుకో సెట్ కాలేదనిపిస్తుంది. శివాజీ కొడుకు విష్ణుగా చేసిన శ్రీ నందుకు మంచి స్కోప్ దొరికింది. డిఫరెంట్ వేరియేషన్స్ బాగా చూపించాడు. శివాజీ కూతురు సుజాతగా చేసిన మనిక చూడటానికి బాగుంది. మిగతా పాత్రధారులు కూడా తమ ఫరిది మేరకు అలరించారు.టెక్నికల్ విషయాలకొస్తే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినసొంపుగా ఉంది. 'దం.. దండోరా' అని సాగే పాట బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్. దర్శకుడు మురళీకాంత్ తీసుకున్న పాయింట్ బాగున్నప్పటికీ దాన్ని చూపించిన విధానం ఓకే ఓకే అనిపిస్తుంది. కాకపోతే డైరెక్టర్లో విషయముందనిపిస్తుంది. నిర్మాణ విలువలు స్టోరీకి తగ్గట్లు ఉన్నాయి. ఓవరాల్గా చెప్పుకొంటే కుల వివక్షకు కాస్త కమర్షియల్ టచ్ ఇచ్చి తీసిన సినిమా 'దండోరా'. స్టోరీ కంటే పాత్రలు, కొన్ని డైలాగ్స్ గుర్తుంటాయి.- చందు డొంకాన -
‘శంబాల’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: శంబాలనటీనటులు: ఆది సాయికుమార్, అర్చన అయ్యర్, రవి వర్మ, మీసాల లక్ష్మణ్, స్వాసిక విజయ్, షీజు మీనన్, శివకార్తిక్ తదితరులునిర్మాతలు : మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజుదర్శకత్వం: యుగంధర్ మునిసంగీతం:శ్రీచరణ్ పాకాలవిడుదల తేది: డిసెంబర్ 25, 2025ఆది సాయికుమార్ ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. ఈ మధ్య ఆయన నటించిన చిత్రాలన్నీ డిజాస్టర్స్గా నిలిచాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని సస్పెన్స్ థ్రిల్లర్ ‘శంబాల’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇటీవల ఆది ఏ సినిమాకు రానంత హైప్ శంబాలకు వచ్చింది. సినిమా ఫస్ట్ లుక్ నుంచి మొదలు ట్రైలర్ వరకు ప్రతీది ఆసక్తిని పెంచేసింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉది? ఆది(aadi saikumar) ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాంకథేంటంటే...ఈ సినిమా కథంతా 1980 నేపథ్యంలో సాగుతుంది. శంబాల అనే గ్రామంలో ఆకాశం నుంచి ఒక ఉల్క పడుతుంది. అదే రోజు ఆ ఊరికి చెందిన రైతు రాములు(రవి వర్మ) ఆవు నుంచి పాలుకు బదులుగా రక్తం వస్తుంది. దీంతో ఆ ఉల్కని ఊరి ప్రజలంతా బండ భూతం అని బయపడారు. ఆ రాయిని పరీక్షించేందుకు డిల్లీ నుంచి ఖగోళ శాస్త్రవేత్త విక్రమ్(ఆది సాయికుమార్) వస్తాడు. చావులోనూ సైన్స్ ఉందనే నమ్మే వ్యక్తి విక్రమ్. అలాంటి వ్యక్తి శంబాలకు వచ్చిన తర్వాత వరుస హత్యలు జరుగుతుంటాయి. రాములుతో సహా పలువురు గ్రామస్తులు వింతగా ప్రవర్తిస్తూ కొంతమందిని చంపి..వాళ్లు చనిపోతుంటారు. ఇదంతా బండ భూతం వల్లే జరుగుందని సర్పంచ్తో సమా ఊరంతా నమ్ముతుంది. విక్రమ్ మాత్రం ఆ చావులకు, ఉల్కకు సంబంధం లేదంటాడు. ఆ రాయిని పరీక్షించే క్రమంలో ఓ రహస్యం తెలుస్తుంది. అదేంటి? అసలు శంబాల గ్రామ చరిత్ర ఏంటి? ఆ గ్రామదేవత కథేంటి? ఊర్లో విక్రమ్కి తోడుగా నిలిచిన దేవి(అర్చన ఐయ్యర్) ఎవరు? వింత చావుల వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్లో శంబాల(Shambhala Review) చూడాల్సిందే.ఎలా ఉందంటే..సైన్స్ గొప్పదా? శాస్త్రం గొప్పదా అంటే సరైన సమాధానం చెప్పలేం. కొంతమంది సైన్స్ని మాత్రమే నమ్ముతారు. మరికొంత మంది శాస్త్రాలనే నమ్ముతారు. అయితే సైన్స్లోనూ శాస్త్రం ఉంది..శాస్త్రంలోనూ సైన్స్ ఉంది అని చాటి చెప్పే చిత్రం శంబాల. దర్శకుడు యుగంధర్ ముని ట్రెండింగ్ సబ్జెక్ట్ని ఎంచుకొని.. దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. అసలు కథ ఏంటో చెప్పకుండా టీజర్, ట్రైలర్ వదిలి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాడు. అదే ఆసక్తితో థియేటర్స్కి వెళ్లిన ప్రేక్షకుడి అంతకు మించిన కొత్త విషయాలను పరిచయం చేసి అబ్బురపరిచాడు. సైన్స్, శాస్త్రాల నేపథ్యంలో ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చినా.. ఈ సినిమా కథనం కొత్త అనుభూతిని కలిగిస్తుంది. రొటీన్ కథే అయినా స్క్రీన్ప్లే కొత్తగా ఉంటుంది. ప్రతి ఐదారు నిమిషాలకు ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని పరిచయం చేస్తూ.. ఆసక్తికరంగా కథనాన్ని నడిపించారు.పురాణాల్లోని కథని సాయి కుమార్తో వాయిస్ ఓవర్ చెప్పించి.. శంబాల కథను ప్రారంభించారు దర్శకుడు. ఫస్టాఫ్ మొత్తం శంబాల గ్రామం పరిచయం..అక్కడి ప్రజలకు ఎదురయ్యే వింత ఘటనల చుట్టూనే కథనం సాగుతుంది. శంబాల ఊరిలో ఉల్క పడడం..ఆవు నుంచి పాలుకు బదులు రక్తం రావడం.. రైతు రాములు వింతగా ప్రవర్తించడం..ఇలా సినిమా ఆరంభంలోనే ప్రేక్షకుడిని శంబాల ప్రపంచంలోకి తీసుకెళ్లాడు.ఫస్ట్ సీన్ నుంచే ప్రేక్షకులను భయపెట్టడం స్టార్ట్ చేశాడు. రవివర్మ పాత్ర సన్నివేశాలే భయపెట్టేలా ఉంటే..అంతకు రెండింతలు అన్నట్లుగా మీసాల లక్ష్మణ్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఉంటాయి. కల్లు దుకాణంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతుంది. ఇక లక్ష్మణ్ పాత్రకు సంబంధించిన కొన్ని సీన్లు అయితే ప్రేక్షకుడి వెన్నులో వణుకు పుట్టిస్తాయి.ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ఊరి సమస్యను తీర్చేందుకు విక్రమ్ చేసే ప్రయత్నాలు మెప్పిస్తాయి. సినిమా ప్రారంభంలో వచ్చే ఒక పాటలోని లిరిక్స్కి ఈ కథను ముడిపెట్టిన విధానం బాగుంది. ప్రతీ సీన్ కన్విన్సింగ్ ఉంటుంది. కానీ చాలా చోట్ల రిపీటెడ్గా అనిపిస్తాయి. శంబాల గ్రామ చరిత్ర తెలిసిన తర్వాత కథనం ఊహకందేలా సాగుతుంది. ఇంద్రనీల్ పాత్రకు సంబంధించిన ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ రొటీన్గానే ఉన్నా..అక్కడ వచ్చే ఓ ట్విస్ట్ మాత్రం ఆకట్టుకుంటుంది. సైన్స్కి, శాస్త్రాలకు మధ్య సంబంధం ఉందని చెప్పేలా ఆ ట్విస్ట్ ఉంటుంది. ఓవరాల్గా రైటింగ్ పరంగా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ.. శంబాల మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఆది సినీ కెరీర్లో ఇదొక డిఫరెంట్ చిత్రంగా నిలుస్తుంది.ఎవరెలా చేశారంటే..సైంటిస్ట్ విక్రమ్ పాత్రలో ఆది ఒదిగిపోయాడు. యాక్షన్తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. దేవి పాత్రకు అర్చన అయ్యర్ న్యాయం చేసింది. అయితే ఆమె పాత్రను ఇంకాస్త బలంగా తీర్చిదిద్దితే బాగుండేదేమో. ముఖ్యంగా సెకండాఫ్లో ఆమెకు బలమైన సన్నివేశాలేవి ఉండవు. రైతు రాములుగా రవివర్మ తనదైన నటనతో భయపెట్టేశాడు. ఇక మీసాల లక్ష్మణ్కి కూడా ఈ సినిమాలో ఓ బలమైన పాత్ర లభించింది. దివ్యాంగుడు కృష్ణగా ఆయన నటన అదిరిపోయింది. కొన్ని చోట్ల కేవలం చూపులతోనే భయపెట్టేశాడు. కానిస్టేబుల్ హనుమంతుగా మధునందన్ బాగా చేశాడు. అతని కూతురిగా చేసిన అమ్మాయి కూడా చక్కగా నటించింది. స్వాసిక విజయ్, శివకార్తిక్, ఇంద్రనీల్, షిజు మీనన్, శైలజ ప్రియలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. ప్రవీన్ కె బంగారి సినిమాటోగ్రఫీ బాగుంది. వీఎఫెక్స్ వర్క్ ఈ సినిమాలో తక్కువే ఉన్నా.. చక్కగా కుదిరింది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె , సాక్షి డెస్క్ -
ఈషా ప్రేక్షకులను వెంటాడుతుంది
‘‘హారర్ సినిమాలంటే నాకు ఇష్టం. ఇలాంటి సినిమాలు మిగిల్చే అనుభూతి చాలా రోజులు గుర్తుండిపోతుంది. ‘ఈషా’ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా రోజులు ప్రేక్షకులను వెంటాడుతుంది. మంచి ట్విస్టులతో రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని హీరో శ్రీవిష్ణు తెలిపారు. త్రిగుణ్, అఖిల్రాజ్ హీరోలుగా, హెబ్బా పటేల్, సిరి హనుమంతు హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. ఈ సినిమాని వంశీ నందిపాటి, బన్నీ వాసు నేడు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అతిథిగా హాజరైన శ్రీవిష్ణు బిగ్ టికెట్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా కేఎల్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా ‘ఈషా’ టిక్కెట్ ధరలు అందరికీ అందు బాటులో (రూ. 99) ఉంటాయి’’ అని చెప్పారు. ‘‘ప్రేక్షకులు అంగీకార పత్రంపై సైన్ చేశాకే ‘ఈషా’ చూడాల్సి ఉంటుంది’’ అన్నారు వంశీ నందిపాటి. ‘‘హారర్ సినిమా లవర్స్ మా ‘ఈషా’ని ఎంజాయ్ చేస్తారు’’ అని బన్నీ వాసు చెప్పారు. ‘‘ఈషా’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని శ్రీనివాస్ మన్నె, అఖిల్ రాజ్, త్రిగుణ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు, నిర్మాత వెంకట్ పేర్కొన్నారు. -
దేవిలాంటి పాత్రలు ఒక్కసారే వస్తాయి
‘‘శంబాల’ ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే ప్రేక్షకులు ఆ ప్రపంచంలోకి వెళ్తారు. ఇలాంటి చిత్రాన్ని థియేటర్లో చూస్తేనే ఆ వైబ్ వస్తుంది. అన్ని రకాల భావోద్వేగాలను టచ్ చేస్తూ తీసిన ‘శంబాల’ ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని హీరోయిన్ అర్చనా అయ్యర్ చెప్పారు. ఆది సాయికుమార్ హీరోగా యుగంధర్ ముని దర్శకత్వం వహించిన చిత్రం ‘శంబాల’. రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో అర్చనా అయ్యర్ మాట్లాడుతూ– ‘‘నేను తెలుగమ్మాయినే. మాది చిత్తూరు జిల్లా. అయితే ఎడ్యుకేషన్ మొత్తం బెంగళూరులోనే జరిగింది. ‘శంబాల’లో నాది కేవలం స్టెప్పులు వేసే పాత్ర కాదని ముందే చెప్పారు. నా కెరీర్ ఆరంభంలోనే ‘శంబాల’ లాంటి చిత్రం, ఈ చిత్రంలో దేవిలాంటి పాత్ర చేయడం నా లక్గా భావిస్తున్నాను. ఇలాంటి పాత్రలు కెరీర్లో మళ్లీ మళ్లీ రావు. ఒక్కసారే వస్తాయి. ‘శంబాల’ ప్రీమియర్లకు మంచి స్పందన వచ్చింది. చాలా మంది దర్శకులు ఫోన్ చేసి, నన్ను అభినందిస్తున్నారు. ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఓ మూవీ చేస్తున్నాను. పాత్ర డిమాండ్ చేస్తే రొమాంటిక్ సీన్లు చేస్తాను. అలాగే ఛాలెంజింగ్ రోల్స్ చేయాలని ఉంది’’ అని చెప్పారు. -
యాక్షన్... థ్రిల్ షురూ
రవిబాబు హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రేజర్’. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ని విడుదల చేశారు మేకర్స్. ‘‘డార్క్ అండ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోన్న చిత్రం ‘రేజర్’. పాత్ర ఇంటెన్సిటీకి తగ్గట్టుగా పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో అలరించబోతున్నారు రవిబాబు. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ‘రేజర్’ మూవీ రవిబాబు కెరీర్లో మరో వైవిధ్యమైన ప్రయత్నంగా నిలుస్తుంది. ఈ చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం. 2026 వేసవిలో మా సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ధీరే... ధీరే
ధీరే... ధీరే అంటూ పాట అందుకున్నారు విశ్వక్ సేన్, కయాదు లోహర్. ఈ ఇద్దరూ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ‘ఫంకీ’ చిత్రంలోని పాట ఇది. సినిమాలో వచ్చే ఈ తొలి పాటను బుధవారం విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ పాటకు దర్శకుడు కేవీ అనుదీప్ సాహిత్యం అందించగా సంజిత్ హెగ్డే, రోహిణి సోరట్ ఆలపించారు. ‘జాతి రత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ‘ఫంకీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘ఈ పాటలో విశ్వక్–కయాదుల జోడీ, పాటలోని కొత్తదనం యువతకు చేరువయ్యేలా ఉంటుంది’’ అని తాజాగా విడుదల చేసిన ‘ధీరే... ధీరే’ పాట గురించి యూనిట్ పేర్కొంది. విభిన్నమైన కథాంశంతో, ఆద్యంతం అలరించే హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఈ సినిమా ఉంటుందని, ‘ఫంకీ’ అనేది ప్రేక్షకులకు ఓ మంచి వినోదాల విందు అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
పట్టు శారీలో ఉప్పెన బ్యూటీ.. బ్లాక్ డ్రెస్లో మెరిసిపోతున్న నివేదా థామస్..!
పట్టు శారీలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి..వైట్ డ్రెస్లో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ హోయలు..డిసెంబర్ మూడ్లో కోలీవుడ్ భామ ఆదితి గౌతమ్..బ్లాక్ బ్యూటీలా మెరిసిపోతున్న నివేదా థామస్..లిటిల్ హార్ట్స్ జ్ఞాపకాలను షేర్ చేసిన శివాని నాగారం.. View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Sai Kamakshi Bhaskarla (@saikamakshibhaskarla) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official)


