Movies
-
అనుమానం అక్కర్లేదు... బ్లాక్బస్టర్ ఖాయం: వెంకటేశ్
‘‘కొన్ని సినిమాలు ఆరంభించినప్పుడే ఒక మంచి అనుభూతి ఉంటుంది. ‘డెకాయిట్’ ఆరంభమైనప్పుడే సుప్రియ ఓ మంచి సినిమా తీస్తోందనే ఫీల్ ఇండస్ట్రీలో ఉంది. ఎందుకంటే తను చాలా ప్యాషనేట్. క్రమశిక్షణ ఉన్న టీమ్ని ఎంచుకుంది. అడివి శేష్ వరుస హిట్స్ కొడుతున్నాడు. మరిన్ని బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నాను. ‘డెకాయిట్’ కూడా బ్లాక్బస్టర్ అవుతుంది... ఎలాంటి అనుమానం అక్కర్లేదు’’ అని హీరో వెంకటేశ్ చెప్పారు. అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వం వహించారు.అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్పై సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మించారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘సుప్రియ కోసం ఇక్కడికి వచ్చాననుకుంటున్నారు.నిజాయతీగా చెప్పాలంటే నాకు ఇష్టమైన మా సురేంద్ర మామ (సుప్రియ తండ్రి)కోసం వచ్చాను. ఎస్ఎస్ క్రియేషన్స్పై సుప్రియ ఇలాంటి అద్భుతమైన సినిమా తీసినందుకు సంతోషంగా ఉంది. మృణాళ్ మంచి నటి. ఈ మూవీ ట్రైలర్ చూడగానే లవ్స్టోరీలోనే యాక్షన్, ఎమోష న్ అన్నీ ఉన్నాయని తెలిసిపోయింది. ఇలాంటి మంచి కథ ఎంచుకున్నందుకు గౌరవంగా ఉంది. యూనిట్కి ఆల్ ది వెరీ బెస్ట్’’ అని పేర్కొన్నారు. సుప్రియ మాట్లాడుతూ– ‘‘నాన్నగారి ఎస్ఎస్ క్రియేష న్్స బ్యానర్లో మంచి సినిమా తీయాలని ఎక్కడో మనసులో ఉంది. అందువల్లే ‘డెకాయిట్’ ఆరంభించాను. ఈ లోగోలో మా తాతగారి (ఏఎ న్ ఆర్) పంచె, మా నానమ్మ (అన్నపూర్ణ) కుంకుమ, పరిగెత్తే పాప, ముందు నడిపించే తాత... దాని వెనుక మా నాన్నగారు చేయించుకున్న మ్యూజిక్. ఇవన్నీ కూడగట్టి ఓ పదిహేను సెకన్లలో మా ఫ్యామిలీ కథ ఎలా చూపించుకోవాలా అనుకున్నాను. ‘డెకాయిట్’కి సైలెంట్గా ప్రోడ్యూస్ చేసి బ్యాక్బో న్ గా నిలిచిన మా అన్నయ్య సుమంత్కి థ్యాంక్స్’’ అని తెలిపారు. -
వెండితెరపై ఆధ్యాత్మిక శోభ
సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ప్రేమకథలు, యాక్షన్, థ్రిల్, పొలిటికల్, హారర్... ఇలా అన్నమాట. అయితే ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఆధ్యాత్మిక ట్రెండ్ బాగా నడుస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ మరీ ఎక్కువగా నడుస్తోందని చెప్పవచ్చు. భక్తి, హిందుత్వం, మైథలాజీ, ధర్మం ఆధారంగా రూపొందుతోన్న చిత్రాలకు ప్రేక్షకాదరణ కూడా బాగా ఉంటోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కూడా అద్భుతంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వెండితెరపై ప్రేక్షకులకు ఆధ్యాత్మిక శోభ చూపించేందుకు మేకర్స్ అమితాసక్తి చూపిస్తున్నారు.భక్తి నేపథ్యంలో రూపొందే సినిమాల్లో నటించేందుకు స్టార్ హీరోల నుంచి యువ హీరోల వరకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా ‘విశ్వంభర’, రవితేజ ‘ఇరుముడి’, మహేశ్బాబు ‘వారణాసి’, రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’, రణ్బీర్ కపూర్ ‘రామాయణ’, నిఖిల్ ‘స్వయంభు’, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘హైందవ’ సినిమాలతో పాటు ‘మహావతార్ నరసింహా, వాయుపుత్ర’ వంటి యానిమేషన్ మూవీస్ కూడా రూపొందుతున్నాయి. ఆయా సినిమాల వివరాలేంటో ఓ లుక్కేద్దాం.హనుమంతుడు తోడుగా... ఆంజనేయస్వామికి హీరో చిరంజీవి ఎంత పెద్ద భక్తుడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెరపైనా హనుమంతుడి పట్ల తన భక్తి భావాన్ని ప్రదర్శిస్తుంటారాయన. ఈ నేపథ్యంలోనే ఆయన నటించిన తాజా చిత్రం ‘విశ్వంభర’లోనూ మరోసారి హనుమంతుడి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఉండనున్నాయి. తొలి చిత్రం ‘బింబిసార’తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహించిన చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. సోషియో ఫ్యాంటసీ, పురాణాల నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది.చిరంజీవి హీరోగా నటించిన బ్లాక్బస్టర్ మూవీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ లాంటి ఒక అద్భుతమైన సోషియో ఫ్యాంటసీ కథతో రూపొందిన ‘విశ్వంభర’ మూవీపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కీలకమైన ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ వద్ద 54 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని నెలకొల్పారు మేకర్స్. అక్కడ ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ ఆధ్వర్యంలో చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి ఓ హైలెట్గా నిలుస్తాయని టాక్. ఆ మధ్య విడుదలైన టీజర్ చూస్తే విలన్లను రఫ్ఫాడిస్తున్న చిరంజీవి వెనక నిలువెత్తు హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది. వాస్తవానికి ‘విశ్వంభర’ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడిన సంగతి తెలిసిందే.ఈ మూవీని విజువల్ వండర్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గ్రాఫిక్స్, సీజీ వర్క్ కోసం భారీ సమయాన్ని వెచ్చిస్తున్నారు మేకర్స్. గత ఏడాది తన పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా చిరంజీవి స్వయంగా ఓ వీడియో విడుదల చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ‘‘చందమామ కథలా ‘విశ్వంభర’ ఉంటుంది. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ వండర్ని అందించేందుకు సమయం పడుతోంది. 2026 వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది’’ అంటూ చిరంజీవి ఆ వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి.అయితే గ్రాఫిక్స్కి అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతోందట. ఈ కారణంగా ఈ మూవీ గురించి ఎలాంటి కొత్త అప్డేట్ ఇవ్వడం లేదట చిత్రయూనిట్. ముందుగా అనుకున్నట్లు ‘విశ్వంభర’ ఈ వేసవి ముగిసేలోపు ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేకుంటే మరోసారి వాయిదా పడుతుందా? అనే చర్చ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో జరుగుతోంది. ఏది ఏమైనా ఈ సినిమా రిలీజ్ గురించి చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు.అయ్యప్ప మాలధారిగా... వరుస కమర్షియల్ సినిమాలతో దూసుకెళుతుంటారు రవితేజ. అయితే ఈసారి ఆయన రూట్ మార్చి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టారు. రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. ఆయన కెరీర్లో 77వ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రను బేబీ నక్షత్ర చేస్తోంది. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అయ్యప్ప మాలధారిగా కనిపించనున్నారు రవితేజ.‘‘ఇరుముడి’ చిత్రంలో యాక్షన్ ప్రధాన ఆకర్షణగా ఉన్నప్పటికీ అద్భుతమైన కథ, కాన్సెప్ట్ ఉంటాయి. అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయి. రవితేజ ఇంతకు ముందెన్నడూ పోషించని విభిన్నమైన పాత్రను ‘ఇరుముడి’లో పోషిస్తున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్కు అవసరమైన అన్ని అంశాలను, బలమైన భావోద్వేగాలను సమతుల్యం చేస్తూ అద్భుతంగా రూపొందిస్తున్నారు శివ నిర్వాణ. ఈ సినిమా కోసం రవితేజ కంప్లీట్గా మేకోవర్ అయ్యారు. ఇందులో తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే బలమైన భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ‘ఇరుముడి’ షూటింగ్ ఇప్పటికే 50 శాతానికి పైగా పూర్తయింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. జై హనుమాన్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన బ్లాక్బస్టర్ మూవీ ‘హనుమాన్’. తేజ సజ్జ, అమృతా అయ్యర్ జోడీగా నటించారు. కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ‘హనుమాన్’ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజై, పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ సాధించి, అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. ‘హనుమాన్’కి కొనసాగింపుగా ‘జై హనుమా న్ ’ మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (‘కాంతారా’ మూవీ ఫేమ్) నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి రాముడి విగ్రహాన్ని హత్తుకుని ఉన్న హనుమంతుడిగా విడుదలైన ఆయన ఫస్ట్ లుక్కి అద్భుతమైన స్పందన వచ్చింది.ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘హనుమాన్’ మూవీ బ్లాక్బస్టర్గా నిలవడంతో ఆ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న ‘జై హనుమాన్’పై భారీ అంచనాలున్నాయి. పైగా ‘కాంతారా, కాంతారా చాప్టర్ 2’ మూవీస్తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో టైటిల్ రోల్లో నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్పై ట్రేడ్ వర్గాల్లోనూ మరింత క్రేజ్ నెలకొంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో ఈ చిత్రం రూపొందుతోంది. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన వాగ్దానం చుట్టూ తిరిగే ఈ కథాంశం ప్రేక్షకులను సరికొత్త ఆధ్యాత్మిక, సాహసోపేత ప్రపంచంలోకి తీసుకెళ్లనుందట. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ సైలెంట్గా, పక్కా ప్రణాళికతో కొనసాగుతోంది. ‘హనుమాన్’ మూవీలో తనదైన నటనతో మెప్పించిన తేజ సజ్జా ఈ సీక్వెల్లోనూ నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుందని ఫిల్మ్నగర్ టాక్. శ్రీరాముడు–రుద్ర ‘బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో తెలుగు సినిమా సత్తాని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాలో మహేశ్బాబు హీరోగా నటిస్తున్నారు. ప్రియాంకా చొప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ మూవీని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు మహేశ్బాబు. వారణాసి నేపథ్యంలో భక్తి బ్యాక్డ్రాప్లో రూపొందుతోన్న ఈ సినిమాలో మహేశ్బాబు మునుపెన్నడూ చూడని విధంగా శ్రీరాముడు, రుద్ర అనే రెండు విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు.ఈ సినిమా చిత్రీకరణని జార్జియాతో పాటు పలు అంతర్జాతీయ ప్రదేశాల్లో చిత్రీకరిస్తున్నారు రాజమౌళి. అంతేకాదు... ఈ మూవీ కోసం హైదరాబాద్ శివారులో వారణాసిని సృష్టించారు. అచ్చం వారణాసిలా తీర్చిదిద్దిన సెట్లో సినిమాలోని కీలకమైన సన్నివేశాలను రూపొందిస్తున్నారు. బిగ్ స్క్రీన్ మీద ఒక గొప్ప అనుభూతినిచ్చేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారు మేకర్స్. ఈ విజువల్ వండర్ను చూడటానికి తెలుగు సినిమా ప్రేక్షకులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘‘వారణాసి’ నా కలల ప్రాజెక్ట్. ఈ చిత్రం అందర్నీ గర్వపడేలా చేస్తుంది’ అని మహేశ్బాబు చెప్పడంతో ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్నంటాయి.ఈ మూవీ భారతదేశంలోనే కాకుండా ‘గ్లోబ్ట్రోటర్, టైమ్ట్రోటర్’ అనే ట్యాగ్లై న్ లతో అంతర్జాతీయ వేదికపై కూడా సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. మహేశ్బాబు, ప్రియాంకా చొప్రా, పృథ్వీరాజ్లపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయిందని సమాచారం. జూన్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని రాజమౌళి ΄్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2027 ఏప్రిల్ 7న గ్లోబల్ స్థాయిలో ‘వారణాసి’ విడుదల కానుంది. మహేశ్బాబు– రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న ఈ మూవీపై గ్లోబల్ స్థాయిలో ఫుల్ బజ్ నెలకొంది. స్వయంభు కోసం... ‘కార్తికేయ 2’ వంటి పాన్ ఇండియన్ హిట్ మూవీ తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో విడుదల కానుంది. నిఖిల్ నటిస్తున్న 20వ చిత్రం ‘స్వయంభు’. ఇది పూర్తిగా పురాణ, భారతీయ యోధుల చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. దర్శకుడు భరత్ కృష్ణమాచారి ఈ చిత్రాన్ని స్టైలిష్, హిస్టారికల్ యాక్షన్ మైథలాజికల్గా రూపొందిస్తున్నారు. నిఖిల్ వేషధారణ, యాక్షన్ లుక్ ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి రేపాయి.తన పాత్ర కోసం నిఖిల్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అవడంతో పాటు ఇంటె న్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా వీఎఫ్ఎక్స్ పనుల వల్ల ఆలస్యం అవుతోందట. ఇండియాలోని టాప్ వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నాయని తెలిసింది. ఈ విజువల్ వండర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం కావాల్సినంత సమయం తీసుకొని, వరల్డ్ క్లాస్ ఔట్పుట్ అందించేందుకు మేకర్స్ పూర్తి కమిట్మెంట్తో పని చేస్తున్నారు. నిఖిల్ కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీగా ‘స్వయంభు’ రూపొందుతోంది.‘‘కార్తికేయ 2’ వంటి పాన్ ఇండియా విజయం తర్వాత అంతకంటే అద్భుతమైన ప్రాజెక్ట్తో రావాలని ఇన్ని రోజులు ఆగాను. చాలా శ్రద్ధతో, భయంతో అన్ని జాగ్రత్తలతో చేసిన సినిమా ‘స్వయంభు’. ఈ చిత్రం చూసిన తర్వాత నిఖిల్ మావాడు అని చెప్పడానికి మీరంతా చాలా సంతోషపడతారు’’ అని ఇటీవల జరిగిన ప్రెస్మీట్లో నిఖిల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దశావతార ఆలయం నేపథ్యంలో... హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హైందవ’. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో సంయుక్త హీరోయిన్గా నటిస్తున్నారు. శివన్ రామకృష్ణ సమర్పణలో మూన్షైన్ పిక్చర్స్పై మహేశ్ చందు నిర్మిస్తున్న ఈ సినిమా కూడా భక్తి నేపథ్యంలో రూపొందుతోంది. జనవరి 3న సాయి శ్రీనివాస్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిత్రయూనిట్ విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ‘అతను ఒంటరివాడు కాదు... అతనికి అండగా ఆ దశావతారాలే ఉన్నాయి’ అంటూ ఈ పోస్టర్లో ఇచ్చిన క్యాప్షన్ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.అలాగే టైటిల్ టీజర్కి కూడా మంచి స్పందన వచ్చింది. శతాబ్దాల నాటి దశావతార ఆలయం నేపథ్యంలో ఈ కథాంశం యాక్షన్, ఆధ్యాత్మికతలను మేళవిస్తుంది. సర్పదేవత పచ్చబొట్టుతో పాటు పవిత్రమైన విష్ణు నామాలు వంటి చిహ్నాలు కూడా టీజర్లో కనిపిస్తాయి. దుండగుల బారి నుంచి దశావతార ఆలయాన్ని హీరో ఎలా కాపాడాడు? అన్నది ఆసక్తిగా ఉంటుంది. పురాణాలకు, ప్రస్తుత కాలానికి ముడిపడి ఉన్న సాలిడ్ థ్రిల్లర్గా, భారతీయ ధర్మం, ఆచారాలపై ఆధారపడిన పౌరాణిక యాక్షన్ డ్రామాగా ‘హైందవ’ చిత్ర కథాంశం ఉండనుందట. ఈ మూవీలో ఓ ధార్మిక యోధుడి పాత్రలో కనిపించనున్నారట సాయి శ్రీనివాస్.నాగబంధం ‘పెద కాపు’ మూవీ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటించిన చిత్రం ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లు. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. అహ్మద్ షా అబ్దాలి భారతదేశంపై జరిపిన చారిత్రక దాడుల నేపథ్యంలో భారతీయ ఆధ్యాత్మిక మూలాలను మేళవిస్తూ అభిషేక్ నామా తెరకెక్కించారు.మహా శివరాత్రి సందర్భంగా హీరో మహేశ్బాబు ‘నాగబంధం’ టీజర్ని విడుదల చేసి, ‘‘టీజర్ అద్భుతంగా ఉంది, సినిమా కోసం ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు. హిమాలయ శిఖరాల్లో దాగి ఉన్న ఒక అంతు చిక్కని రహస్యం, కాలానికే అందని ఒక పురాతన శక్తి నేపథ్యంలో అల్లుకున్న సస్పె న్స్ బ్యాక్డ్రాప్లో ‘నాగబంధం’ని రూపొందించారని సమాచారం. ఇందులో విరాట్ కర్ణ శక్తిమంతమైన యోధుడిగా నటించారు. ఈ చిత్రంలో నాగబంధం, శివ తంత్ర విద్య, నాగబంధం ఆలయం వెనక ఉన్న గుప్తనిధులు వంటి అంశాలు కథలో హైలెట్ కానున్నాయట. ఈ సినిమా ఈ వేసవిలోనే విడుదలయ్యే అవకాశాలున్నాయనే చర్చ నడుస్తోంది. గదాధారి హనుమాన్... రవి కిరణ్ హీరోగా నటించిన చిత్రం ‘గదాధారి హనుమాన్’. రోహిత్ కొల్లి దర్శకత్వం వహించారు. విరభ్ స్టూడియో బ్యానర్పై రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇటీవల ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ని హైదరాబాద్లో నిర్వహించారు. ‘‘మైథలాజికల్ జానర్లో భారీ బడ్జెట్తో రూపొందిన చిత్రం ‘గదాధారి హనుమాన్’.ఈ సినిమా కథ చాలా బలమైనది. అందుకే ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు మా సినిమా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోష న్స్ను అద్భుతంగా పండించాం. ఈ మూవీ గ్లింప్స్, టీజర్లోనూ గదనే ఎక్కువగా చూపించాం. గద ఎంత పవర్ఫుల్ అన్న దానిపై ఓ సీక్వె న్స్ కూడా మా చిత్రంలో అద్భుతంగా ఉంటుంది. మా సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని రవికిరణ్ తెలిపారు.యానిమేషన్ కూడా... ఇదిలా ఉంటే... రెగ్యులర్ ఫీచర్ ఫిల్మ్స్తో పాటు ‘మహావతార్ నరసింహా’, ‘వాయుపుత్ర’ వంటి యానిమేటెడ్ సినిమాలు కూడా రానున్నాయి. అశ్విన్కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ‘మహావతార్ నరసింహా’ యానిమేటెడ్ చిత్రం సూపర్ హిట్గా నిలవడంతో పాటు భారీ వసూళ్లు రాబట్టింది. 2037 వరకు ఏడు భాగాలుగా ఈ సినిమాను తీసుకురానున్నట్లు హోంబలే ఫిల్మ్స్ ఇప్పటికే ప్రకటించింది. ఇక చందు మొండేటి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్న యానిమేటెడ్ ఫిల్మ్ ‘వాయుపుత్ర’ పైనా మంచి అంచనాలున్నాయి.రామాయణం హిందీ చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం ‘రామాయణ’. ఈ మూవీలో శ్రీరాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్షణుడిగా రవీ దూబే నటిస్తున్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ, యశ్ మాన్స్టర్మైండ్ క్రియేష న్న్స్ సహకారంతో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, పరశురాముడిగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై పాన్ ఇండియా స్థాయిలో ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ‘రామాయణ’ చిత్రం తొలి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి.– డేరంగుల జగన్ మోహన్ -
బంపర్ ఆఫర్ కొట్టిన 'లిటిల్ హార్ట్స్' కుర్రోడు
ఆచితూచి సినిమాలు చేసే యంగ్ హీరో అడివి శేష్.. 'డెకాయిట్'ని విడుదలకు సిద్ధం చేశాడు. ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానుంది. మరోవైపు 'గూఢచారి 2' కూడా షూటింగ్ దశలో ఉంది. ఈ ఏడాదిలోనే ఈ మూవీ కూడా రిలీజ్ కానుంది. వీటి తర్వాత ఎవరితో చేస్తాడనే దానిపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. స్వయంగా సదరు దర్శకుడు ఈ విషయాన్ని బయటపెట్టాడు.మంగళవారం రాత్రి హైదరాబాద్లో 'డెకాయిట్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. దీనికి 'లిటిల్ హార్ట్స్' దర్శకుడు సాయి మార్తాండ్ కూడా వచ్చాడు. మూవీ గురించి మాట్లాడాడు. ఈ క్రమంలోనే శేష్తో తన తర్వాతి సినిమా ఉంటుందని ప్రకటించేశాడు. లవ్ స్టోరీతో దీన్ని తెరకెక్కించనున్నారు. 'గూఢచారి 2' పూర్తయిన వెంటనే ఇది సెట్స్పైకి వెళ్లనుంది.శేష్ విషయానికొస్తే చివరగా 2022లో 'హిట్ 2'తో థియేటర్లలోకి వచ్చాడు. మళ్లీ దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు 'డెకాయిట్'గా వస్తున్నాడు. ట్రయిలర్ చూస్తే ఇది రివేంజ్ ప్రేమకథలా అనిపిస్తుంది. మరోవైపు 'లిటిల్ హార్ట్స్' మూవీతో దర్శకుడిగా పరిచయమైన సాయి మార్తాండ్.. తొలి చిత్రంతో అద్భుతమైన హిట్ కొట్టాడు. ఇప్పుడు శేష్తో చేయబోయే సినిమాతోనూ హిట్ కొడితే రేంజ్ పెరిగిపోవడం గ్యారంటీ. -
సుప్రియను వెక్కిరించడానికే వచ్చా.. నాగవంశీ ర్యాగింగ్
‘డెకాయిట్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో నిర్మాత నాగవంశీ, సహ నిర్మాత సుప్రియపై సరదాగా ర్యాగింగ్ చేశారు. సినిమాలు ఎక్కువ రోజులు తీస్తున్నామని ఎప్పుడూ తమకు క్లాస్ పీకే సుప్రియ ఇప్పుడు రెండు సంవత్సరాలు కష్టపడి ‘డెకాయిట్’ పూర్తి చేసిందనిక వెక్కిరిస్తూ మాట్లాడారు. మమ్మల్ని సినిమాలు ఎందుకు ఇన్ని రోజులు తీస్తున్నారంటూ సుప్రియ ఎప్పుడూ తిట్టేవారు. కానీ ఇప్పుడు ఆమె రెండు సంవత్సరాలు కష్టపడి 147 వర్కింగ్ డేస్లో సినిమా తీశారు. ఇకపై మమ్మల్ని తిట్టే హక్కు ఆమెకు లేదని ఆటపట్టించారు. నిర్మాత కష్టాలు ఎలా ఉంటాయో సుప్రియకు చూపించినందుకు అడివి శేష్కు థ్యాంక్స్ చెప్పారు. అలాగే, “హీరోల్ని నెత్తిన ఎక్కించుకున్నామని ఎప్పుడూ క్లాస్ పీకే సుప్రియ, ఇప్పుడు తొలిసారి బయట హీరోతో సినిమా తీస్తే ఎలా ఉంటుందో అనుభవించారు. ఇంతకు ముందు తన ఫ్యామిలీ హీరోలతోనే సినిమాలు తీసిన సుప్రియకు ఈ అనుభవం చాలా ఉపయోగపడుతుంది. డెకాయిట్ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. మరింత మంది హీరోలతో సుప్రియ సినిమాలు చేసి తమలాగే కష్టపడాలని చమత్కరించారు. ఓ వైపు నాగవంశీ సరదాగా ర్యాగింగ్ చేస్తుంటే, పక్కనే ఉన్న సురేశ్ బాబు నవ్వుతూ ఎంజాయ్ చేయడం వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
'అలా జరిగినందుకు క్షమించు'.. మృణాల్కు సారీ చెప్పిన సుమంత్
టాలీవుడ్ హీరో సుమంత్ సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్కు క్షమాపణలు చెప్పారు. సీతారామం మూవీలో ఓ సీన్లో ఉందని అన్నారు. 'క్షమించు.. నీ రాముని నీ దగ్గరి నుంచి తీసుకెళ్లినందుకు' ఓ సీన్లో ఉందని అన్నారు. కానీ ఈ సీన్ తప్పనిసరి పరిస్థితుల్లో ఎడిటింగ్లో తీసేయాల్సి వచ్చిందని సుమంత్ తెలిపారు. అందుకే నేను 'డెకాయిట్లో మృణాల్ కి ఛాన్స్ ఇప్పించానని సుమంత్ వెల్లడించారు. డకాయిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన సుమంత్ ఈ కామెంట్స్ చేశారు.కాగా.. అడివి శేష్, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా వస్తోన్న చిత్రం డకాయిట్. ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీని లవ్స్టోరీతో కూడిన యాక్షన్ సినిమాగా తెరకెక్కించారు. ఈ మూవీలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో నటించారు. మృణాల్ ఠాకూర్ ని క్షమాపణలు కోరిన సుమంత్ 'సీతారామం' లో నేను మృణాల్ కి క్షమాపణలు చెప్పిన సీన్ ఒకటి ఉంది అది ఎడిటింగ్ లో డిలీట్ చేశారు అందుకే నేను 'డెకాయిట్' లో మృణాల్ కి ఛాన్స్ ఇప్పించాను : సుమంత్#AdiviSesh #MrunalThakur #Dacoit #Sumanth pic.twitter.com/5a1tUXY1lh— Filmy Focus (@FilmyFocus) April 7, 2026 -
అడివి శేష్ అంటే చాలా క్రష్ : టాలీవుడ్ నటి
టాలీవుడ్ హీరో అడివి శేష్, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా వస్తోన్న చిత్రం డకాయిట్. ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. లవ్స్టోరీతో కూడిన యాక్షన్ సినిమాగా తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన టాలీవుడ్ నటి కామాక్షి భాస్కర్ల ఆసక్తికర కామెంట్స్ చేశారు.తాను అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పుడు అడివి శేష్ అంటే నాకు క్రష్ ఉండేదని కామాక్షి భాస్కర్ల తన మనసులో మాటను బయటపెట్టింది. అయితే ఇప్పుడు మాత్రం అలాంటిదేమీ లేదని తెలిపింది. ఇప్పుడు ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టమని వెల్లడించింది. కామాక్షి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. కాగా.. ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమాను ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. నాకు శేష్ అంటే చాలా క్రష్ ఉండేది : కామాక్షి భాస్కర్ల#AdiviSesh #MrunalThakur #Dacoit #KamakshiBhaskarla pic.twitter.com/wFNG7XC1Z3— Filmy Focus (@FilmyFocus) April 7, 2026 -
'ఇది కేవలం నిశ్చితార్థం కాదు'.. టాలీవుడ్ హీరో ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. ఇటీవలే కావ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నాడు. హైదరాబాద్లోని ఓ రిసార్ట్లో ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ పెద్ద కొడుకైన శ్రీనివాస్ తెలుగులో హీరోగా రాణిస్తున్నారు. ఈ ఏడాది పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. మార్చి 29న తిరుపతిలో సింపుల్గా పెళ్లి చేసుకోబోతున్నారు.తాజాగా తన ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ క్షణం నుంచి అంతా మారిపోతుందంటూ రాసుకొచ్చారు. నిండు మనసులతో.. ఒకరి కళ్లలో ఒకరు కనిపిస్తుండగా.. మేము ఎప్పటినుంచో నమ్ముతూ వచ్చిన ఆ శాశ్వత బంధంలోకి అడుగుపెట్టాం అంటూ పోస్ట్ చేశారు. ఎలాంటి హడావిడి లేదు.. తొందర లేదు... కేవలం ప్రేమ మాత్రమే ఉందంటూ ట్వీట్ చేశారు. ఇది కేవలం ఒక నిశ్చితార్థం మాత్రమే కాదు..ఇది ఒక శాశ్వత బంధానికి ఆరంభం అంటూ నిశ్చితార్థం ఫోటోలను పంచుకున్నారు. ఇది చూసిన అభిమానులు బెల్లంకొండ శ్రీనివాస్కు అభినందనలు చెబుతున్నారు.కాగా.. అల్లుడు శ్రీను మూవీతో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్.. గతేడాది 'కిష్కింధపురి' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ప్రస్తుతం మూడు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక శ్రీనివాస్కి కాబోయే సతీమణి కావ్య రెడ్డి విషయానికొస్తే హైదరాబాద్ అమ్మాయి. తాత జడ్జి కాగా తండ్రి లాయర్. ఇది పెద్దల కుదిర్చిన ప్రేమ వివాహం అని తెలుస్తోంది. మార్చిలో తనకు కాబోయే భార్య అని కావ్య రెడ్డిని పరిచయం చేశాడు. From this moment… everything changes.With hearts full and eyes only for each other,we stepped into a forever we’ve always believed in.No noise, no rush… just love, beautifully ours. 🖤This isn’t just an engagement,it’s the start of something timeless. ✨Location… pic.twitter.com/ufYAsHcYwK— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) April 7, 2026 -
ఓ సారి బ్రేకప్.. అమ్మకు కూడా తెలుసు: ఉప్పెన బ్యూటీ
ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా వస్తోన్న ఈ ప్రేమకథా చిత్రంలో హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేయనుంది.ఎల్ఐకే రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. హీరోయిన్ కృతిశెట్టి సైతం ప్రమోషన్స్లో పాల్గొన్నారు. ప్రేమకథా చిత్రం కావడంతో కృతి శెట్టి కూడా ప్రేమ, బ్రేకప్ గురించి మాట్లాడారు. తాను ప్రస్తుతం సింగిల్గానే ఉన్నానని తెలిపింది. అయితే ఓసారి బ్రేకప్ అయిందన్న విషయాన్ని రివీల్ చేసింది. ఈ విషయం మా అమ్మకు కూడా తెలుసని కృతి శెట్టి చెప్పుకొచ్చింది. నా గురించి సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం చేస్తే అలాంటి వారిని మాత్రమే బ్లాక్ చేస్తానని వెల్లడించింది ఉప్పెన బ్యూటీ. #PradeepRanganathan - I prefer to say I’m single. I’ve gone through many break-ups💔. I have not blocked anyone, but people have blocked me, and I used to reply faster than even ChatGPT during my college days itself😂#KrithiShetty - I’m single & I’ve gone through 1 break-up. My… pic.twitter.com/IUiPpHhx8A— AmuthaBharathi (@CinemaWithAB) April 7, 2026 -
దురంధర్ కలెక్షన్స్.. బాహుబలి-2 రికార్డ్పై గురి..!
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్-2 ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. దురంధర్ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. మార్చి 19న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 1,622.72 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే హిందీలో పలు రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం తెలుగు సినిమా రికార్డ్పై కన్నేసింది. తాజా వసూళ్లు చూస్తుంటే రాజమౌళి చిత్రం బాహుబలి-2 వసూళ్ల రికార్డ్ను బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది.దురంధర్-2 రిలీజైన 18 రోజుల్లోనే కన్నడలో రూ. 120 కోట్లకు పైగా వసూలు చేసింది. గతంలో రిలీజైన టాలీవుడ్ మూవీ బాహుబలి-2 కన్నడలో రూ. 129 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దురంధర్-2 ఈ రికార్డ్కు కేవలం రూ.9 కోట్ల దూరంలోనే నిలిచింది. ఇదే జోరు కొనసాగితే కన్నడలో అత్యధిక వసూళ్లు సాధించిన బాహుబలి-2ను దాటేయనుంది. ఇదే జరిగితే కన్నడలో అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడేతర చిత్రంగా దురంధర్-2 నిలవనుంది.ఇక కర్ణాటక బాక్సాఫీస్ను పరిశీలిస్తే కన్నడ చిత్రాల ఆధిపత్యమే కొనసాగుతోంది. అయినప్పటికీ తెలుగు చిత్రాలు కూడా కన్నడలో సత్తా చాటుతున్నాయి. శాండల్వుడ్ హీరో రిషబ్ శెట్టి మూవీ 'కాంతార చాప్టర్ 1' రూ. 247.50 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో యశ్ నటించిన 'కేజీఎఫ్ 2' కొనసాగుతోంది. కన్నడలో టాప్-5 చిత్రాలలో 'బాహుబలి 2' మాత్రమే కన్నడేతర చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ రికార్డ్ను దురంధర్-2 అధిగమించే ఛాన్స్ ఉంది. కాగా.. 'ధురందర్ 2' ఇప్పటికే కర్ణాటకలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా అవతరించింది. కర్ణాటకలో 'బాహుబలి 2' తర్వాత రూ. 100 కోట్ల మార్కును దాటిన రెండో కన్నడేతర చిత్రంగా 'ధురందర్ 2' నిలిచింది.కాగా.. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించారు. దురంధర్కు సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రంలో సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడి, డానిష్ పండోర్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటించారు. -
అట్లీ-అల్లు అర్జున్ మూవీ టైటిల్ ఇదేనా!
పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. #AA22XA6 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పటివరకు టైటిల్ని కానీ, హీరో లుక్ కానీ రిలీజ్ చేయలేదు. బన్నీ బర్త్డే సందర్భంగా రేపు(ఏప్రిల్ 8) ఈ సినిమా టైటిల్ని ప్రకటించబోతున్నారు. ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాల టైటిల్స్ కానీ, లుక్ కానీ ముందుగానే లీకవుతుంటాయి. కానీ ఈ సినిమా విషయంలో అది జరగలేదు. ఇప్పటి వరకు షూటింగ్కు సంబంధించిన చిన్న ఫుటేజీ కూడా బయటకు రాకుండా టీమ్ జాగ్రత్త పడింది. ఇక టైటిల్ గురించి సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రానికి వైల్డ్ ఫైర్ అనే పేరు ఖారారు చేశారని ప్రచారం జరుగుతుంది. అంతకు ముందు ‘లెగసీ’ అనే టైటిల్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఇవి మాత్రమే కాకుండా ‘అయాన్’, ‘స్పార్క్’ అనే పేర్లు కూడా బయటకు వచ్చాయి. అసలు ఈ సినిమా టైటిల్ ఏంటి అనేది మాత్రం రేపే తెలుస్తోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా టైటిల్ గురించి అట్లీ, బన్నీకి తప్ప మిగతావారెవరికి సమాచారమే లేదట. అందరితో పాటు చిత్రబృందం కూడా రేపే టైటిల్ ఏంటనేది తెలుసుకోబోతుంది.పునర్జన్మల కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ సైన్స్ఫిక్షన్ చిత్రంలో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రలు పోషించబోతున్నట్లు సమాచారం. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటించబోన్నట్లు తెలుస్తోంది. ఇప్టపికే దీపికా పదుకొణె పేరును అధికారికంగా ప్రకటించారు. జాన్వీకపూర్, మృణాల్ ఠాకూర్, రష్మికా మందన్నా, భాగ్యశ్రీ బోర్సే వంటి హీరోయిన్లు కూడా నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది. -
విజయ్-రష్మిక గ్రాండ్ రిసెప్షన్... కొడగు స్టైల్లో మెరిసిన జంట..!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ- రష్మిక ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు సీక్రెట్ రిలేషన్లో ఉన్న వీరిద్దరు ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకున్నారు. ఉదయ్పూర్ వేదికగా వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఈ పెళ్లి వేడుకలోఅత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆ తర్వాత హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు.ఇటీవలే రష్మిక తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది. విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత తన తొలి బర్త్ డేను ఇరు కుటుంబాల సమక్షంలో జరుపుకుంది. రష్మిక పుట్టినరోజు సందర్భంగా కర్ణాటకలోని ఇగ్గుతప్ప ఆలయాన్ని కూడా సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.అయితే తాజాగా ఈ జంట మరోసారి రిసెప్షన్ వేడుక నిర్వహించారు. రష్మిక సొంత గ్రామం కూర్గ్లో కొడగు సంప్రదాయంలో రిసెప్షన్ జరుపుకున్నారు. ఈ ఫంక్షన్లో రష్మిక కొడగు సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. ఈ రిసెప్షన్లో కూర్గి స్టైల్లో చీరను ధరించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వేడుకలో విజయ్ దేవరకొండ- రష్మిక జంట స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను కొడగు రావడం ఇది మూడోసారని తెలిపారు. మొదటిసారి రష్మికను కలవక ముందే ఇక్కడకు వచ్చానని ఆయన గుర్తుచేసుకున్నారు. గతంలో ఒకసారి వచ్చినప్పుడు తన ఫ్రెండ్ ఇంట్లో ఉన్నానని విజయ్ దేవరకొండ వెల్లడించారు. అయితే తన ఫ్రెండ్ ఈ రిసెప్షన్కు హాజరు కాలేదని తెలిపారు. నా స్కూల్ టైమ్లో స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చానని పంచుకున్నారు.చాలా అందంగా ఉంటారు..తనకు కొడగు అందాలు అంటే చాలా ఇష్టమని.. ఇక్కడి మహిళలు కూడా అంతే అందంగా ఉంటారని కొనియాడారు. కూర్గ్ మహిళలు చాలా అందంగా ఉంటారని.. నేను కూర్గ్ అమ్మాయినే వివాహం చేసుకున్నానని విజయ్ దేవరకొండ కామెంట్స్ చేశారు. మిమ్మల్నందరినీ ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కొడగు రిసెప్షన్కు ఇరువురి కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. ఇక సినిమాల విషయానికొస్తే రష్మిక- విజయ్ జంటహా 'రణబాలి' సినిమాలో నటిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది. -
ఓటీటీకి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్
తమన్నా మాజీ బాయ్ఫ్రెండ్ విజయ్ వర్మ నటించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మట్కా కింగ్. ఈ వెబ్ సిరీస్కు సైరత్' లాంటి బ్లాక్బస్టర్ మూవీ తీసిన నాగరాజ్ ముంజలే దర్శకత్వం వహించారు. ఈ సిరీస్లో కృతిక కమ్రా, గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. ముంబయికి చెందిన రతన్ ఖత్రీ జీవితం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే. తాజాగా మట్కా కింగ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే మట్కా నేపథ్యంలో సాగే క్రైమ్ కథగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 1960ల్లో ఓ సాధారణ పత్తి వ్యాపారి (విజయ్ వర్మ), తన తెలివితేటలతో మట్కా అనే జూద సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడనే స్టోరీగా ఈ సిరీస్ తీసినట్లు అర్థమవుతోంది. ఈ క్రైమ్ సిరీస్ ఏప్రిల్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది. -
' నా చావుకు మరో ఏడాది దగ్గరయ్యా'.. ఆర్జీవీ ఆసక్తికర పోస్ట్
టాలీవుడ్ డైరెక్టర్ రాం గోపాల్ వర్మ స్టైలే వేరు. తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న కొద్దిమంది డైరెక్టర్లలో ఆర్జీవీ ఒకరు. ఆయన ఏం మాట్లాడినా సరే అందులో ఓ ప్రత్యేకమైన శైలి ఉంటుంది. రోటీన్కు భిన్నంగా తన పంచ్లతో ఆకట్టుకుంటారు. అలా టాలీవుడ్లో విలక్షణ దర్శకుడిగా రాం గోపాల్ వర్మ అభిమానుల గుండెల్లో స్థానం దక్కించుకున్నారు.ఇవాళ ఆర్జీవీ మరో వసంతంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 7న రాం గోపాల్ వర్మ బర్త్ డే కావడంతో తనదైన స్టైల్లో మరో ట్వీట్ చేశారు. ఈ రోజు నేను నా చావుకు మరో ఏడాది దగ్గరయ్యానంటూ సెటైరికల్ పోస్ట్ చేశారు. అందువల్ల మీకు సంతోషం కలిగించే మరే ఇతర కారణాల కోసమైతే తప్ప.. ఈ రోజును వేడుకలా జరుపుకోవద్దు! ధన్యవాదాలు.. అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన కొందరు అభిమానులు ఆర్జీవీకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. Today i reached 1 more year closer to my death and so let’s not celebrate unless for whatever reasons that makes you happy ! Thanks 💐💐💐 pic.twitter.com/mkKLW9G32t— Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2026 -
వారణాసి కౌంట్డౌన్ ప్రారంభం.. కీరవాణి పోస్ట్
మహేశ్బాబు- దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో ప్రతిష్ఠాత్మకంగా రానున్న చిత్రం ‘వారణాసి’. భారీ బడ్జెట్తో కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమా కౌంట్డౌన్ ప్రారంభమైంది అని సంగీత దర్శకుడు కీరవాణి '365' నంబర్తో మెసేజ్ ద్వారా తెలిపారు. అంటే ఈ మూవీ వచ్చే ఏడాది సరిగ్గా ఇదే రోజు ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వారణాసిలో రుద్ర, శ్రీరాముడిగా మహేశ్ ద్విపాత్రాభినయం చేస్తున్నటం విశేషం.2027 ఏప్రిల్ 7న వారణాసి విడుదల కానుందని చిత్ర యూనిట్ చాలా రోజుల క్రితమే ప్రకటించింది. అయితే, 'ధురందర్' ఫ్రాంచైజీ భారీ విజయం సాధించిన తర్వాత, రాజమౌళి కూడా 'వారణాసి'ని రెండు భాగాలుగా విభజించి, విడుదల ప్రణాళికను సవరించవచ్చని ఇటీవల వదంతులు వచ్చాయి. అయితే, ఇప్పుడు కీరవాణి చేసిన కౌంట్డౌన్ కామెంట్తో అనుకున్న సమయానికే వారణాసి విడుదల కానుందని క్లారిటీ వచ్చేసింది. ఆ పోస్ట్, వారణాసి చిత్రం కనీసం ప్రస్తుతానికి ఒకే భాగం (సింగిల్-పార్ట్)గా రాబోతోందని కూడా ధృవీకరిస్తున్నట్లు కనిపిస్తోంది. విడుదలకు సరిగ్గా 365 రోజులు మిగిలి ఉండటంతో, ఇటీవలి కాలంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో ఒకటైన ఈ ప్రాజెక్ట్కు కౌంట్డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. -
అతన్ని పెళ్లి చేసుకున్నా.. పిల్లల్ని కూడా కన్నాను : త్రిష పోస్ట్ వైరల్
స్టార్ హీరోయిన్ త్రిష పేరు ఇప్పుడు నెట్టింట ఎక్కువగా వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్, టీవీకే అధినేత విజయ్ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో అనూహ్యంగా త్రిష పేరు తెరమీదకొచ్చింది. విజయ్తో త్రిష రిలేషన్తో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరు కలిసి ఓ ఫంక్షన్కి హాజరవ్వడంతో.. ఈ పుకార్లు ఇంకా ఎక్కువైయ్యాయి. త్వరలో పెళ్లి చేసుకుంటారని..ఆమె సినిమాలకు గుడ్బై చెప్పి..రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారంటూ రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల నటుడు, దర్శకుడు చిత్రా లక్ష్మణన్ కూడా త్రిష ఇకపై నటించబోదని చెప్పడంతో మరోసారి త్రిషపై నెట్టింట చర్చ జరిగింది. దీనిపై త్రిష తనదైన శైలీలో స్పందించింది. చిత్రా లక్ష్మణ్ వాఖ్యలకు కౌంటర్గా ‘అవును నేను సినిమాలు మానేసి, ఒక ధనవంతుడైన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని, నిన్నటికి రెండేళ్లు నిండిన నలుగురు కవలలను పెంచుతున్నాను. మీ ఊహాగానాలకు ఇది సరిపోతుందా? ఈ రోజు వార్తలు రాసుకోవడానికి ఇది సరిపోతుందా లేదా ఇంకా ఏదైనా జోడించమంటారా?’ అని త్రిష ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఈ పోస్ట్తో ఆమె సినిమాలు మానేసిందనేది పుకారు మాత్రమేనని తేలిపోయింది. త్రిష సినీ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం అమె ‘కరుప్పు’(తెలుగులో ‘వీరభద్రుడు’) చిత్రంలో సూర్యకు జంటగా నటిస్తోంది. తెలుగులో చిరంజీవి సరసన నటించిన విశ్వంభర రిలీజ్కు రెడీ అవుతుంది. దేవిధంగా మలయాళంలో మోహన్లాల్ కు జంటగా రామ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇవన్నీ గత ఏడాది, అంతకు ముందు ఏడాది అంగీకరించిన చిత్రాలు అన్నది గమనార్హం. -
అల్లు అర్జున్- అట్లీ సినిమా పోస్టర్ విడుదల
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబినేషన్ సినిమా (AA22xA6) నుంచి అప్ డేట్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ఒక పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా టైటిల్ పోస్టర్ను విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో ఆసక్తికరమైన ఒక పోస్టర్ను విడుదల చేశారు. పోస్టర్లో ఒక క్రూర మృగం పంజా (చెయ్యి) మాత్రమే కనిపిస్తోంది.ఈ సినిమాలో తోడేలు చేయి ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లుంది. హాలీవుడ్ ప్రమాణాలతో అల్లు అర్జున్ నుంచి ఒక భారీ ప్రయోగాన్ని అట్లీ చేస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో అల్లు అర్జున్ ఒక వింత శక్తి ఉన్న పాత్రలో లేదా ఇలాంటి వింత జీవులతో పోరాడే పాత్రలో కనిపిస్తారని అంచనా వేస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్పై సోషల్ మీడియాలో భారీగా చర్చ జరుగుతోంది. ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా గురించి పలు వివరాలు ప్రకటిస్తారని సమాచారం. Brace for the BlAAst💥Title Poster - Tomorrow @ 11 AM@alluarjun @Atlee_dir @deepikapadukone#AA22xA6 pic.twitter.com/pPHn70C77o— Sun Pictures (@sunpictures) April 7, 2026 -
ధురంధర్-2పై విరాట్ కోహ్లి రివ్యూ.. ఆశ్చర్యమంటూ దర్శకుడు పోస్ట్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ధరంధర్-2 చిత్రంపై టీమిండియా క్రికెటర్ కోహ్లీ, అనుష్క శర్మ స్పందించారు. ఈ క్రమంలో డైరెక్టర్ ఆదిత్య ధర్పై ప్రశంసలు కురిపించారు. తాజాగా సినిమా చూసిన వారిద్దరూ రివ్యూ ఇచ్చారు. దీంతో వారు చేసిన పోస్ట్ను ఆదిత్య ధర్ షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.1600 కోట్లకు పైగానే వసూళ్లు చేసింది.ధురంధర్ 2 మూవీ తనకు మంచి అనుభూతిని ఇచ్చిందని విరాట్ దంపతులు తెలిపారు. ఈ మూవీ ఒక అద్భుతం అంటూ రివ్యూ ఇచ్చారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఇలాంటి అనుభవం తనకు ఎప్పుడూ కలగలేదని వారు అన్నారు. సినిమా దాదాపు 4 గంటల నిడివి ఉన్నప్పటికీ ఒక్క క్షణం కూడా కనురెప్ప వేయలేకపోయానన్నారు. ప్రతి సన్నివేశం ఎంతో భావోద్వేగంతో ఉందని తెలిపారు. ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్కరు బాగా నటించారని తెలిపిన విరాట్.. ప్రత్యేకంగా రణ్వీర్ను అభినందించారు. అతనొక శిఖరాన్ని చేరుకున్నారని కొనియాడారు. ఆపై మూవీ దర్శకుడు ఆదిత్య ధర్ ఒక జీనియస్ అంటూ మెచ్చుకున్నారు. అనుష్క శర్మ కూడా ధురంధర్పై అభినందనలు కురిపించారు. సినిమా అదిరిపోయిందని పోస్ట్ చేశారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే పాత్రను దక్కించుకుని, అద్భుతమైన నటనతో ప్రతిభ కనబరిచారని రణ్వీర్ను ప్రశంసించారు.అయితే, విరాట్ దంపతులు చేసిన పోస్ట్లపై ఆదిత్య ధర్ ధన్యవాదాలు చెబుతూ స్పందించారు. విరాట్ సినిమా చూసి అభినందించారని తెలిసి నమ్మలేకపోతున్నానంటూ తన సంతోషాన్ని వ్యక్తంచేశారు. విరాట్ మాటలు ఎంతో విలువైనవి అని ఆయన అన్నారు. తాను విరాట్కు వీరాభిమానిని ఆదిత్య ధర్ తెలిపారు. దేశం గర్వించేలా గ్రౌండ్లో ఆయన చేసే పోరాటం తమకు ఎంతో స్ఫూర్తి అని కొనియాడారు. అనుష్క ప్రశంసలు తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
'మిస్ ఇండియా ఎర్త్' కిడ్నాప్.. భర్తపై ఫిర్యాదు
మిస్ ఇండియా ఎర్త్ -2019 విజేతగా చెప్పుకుంటున్న సయాలీ సుర్వే, ఆమె నలుగురు పిల్లలు అదృశ్యమయ్యారు. పూణేకు చెందిన ఈమె, 2019లో వివాహం చేసుకున్న తర్వాత ఇస్లాంలోకి మారి ‘అలీజా’గా పేరు మార్చుకున్నారు. అయితే, పూణేలోని చించ్వాడ్లో ఉంటున్న ఆమె కనిపించడం లేదు. తన భర్త ఆతీఫ్ వేధించాడని, బలవంతంగా మతం మార్చాడని ఆరోపిస్తూ ఇటీవల హిందూ మతంలోకి తిరిగి మారారు. ఈ సంఘటన జరిగిన కొద్దిరోజుల్లోనే ఆమె కనిపించకుండా పోవడంతో చర్చనీయాంశంగా మారింది. పూణే పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. భర్త, అత్తింటివారే సయాలీ సర్వేని కిడ్నాప్ చేశారని ఆరోపిస్తున్నారు.2019లో మీరా-భయందర్కు చెందిన వ్యాపారవేత్త ఆతీఫ్ టాసేను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత, ఆమె ఇస్లాం మతంలోకి మారి, తన పేరును అతీజా టాసేగా మార్చుకుంది. గొడవల కారణంగా వారి వివాహ బంధం చాలా త్వరగా ముగిసిపోయింది. ఆతీఫ్ టాసేను పెళ్లి చేసుకోవడం తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని ఆమె గతంలో ఆరోపించారు. అతను పెట్టిన శారీరక హింసను కేవలం తన పిల్లల కోసం భరించానని పేర్కొంది. తనతో దూరం అయిన తర్వాత ఆమె తిరిగి హిందూ మతంలోకి చేరి తన పేరును ఆద్య సుర్వేగా మార్చుకుంది. ఈ సంఘటన జరిగిన కొద్దిరోజుల్లోనే ఆమె కిడ్నాప్ కావడం చర్చనీయాంశంగా మారింది.(గమనిక: కొందరు నివేదికల ప్రకారం, 2019లో అధికారిక 'మిస్ ఎర్త్ ఇండియా' విజేతగా డాక్టర్ తేజస్విని మనోజ్ఞ ఉన్నారు. ) -
రూ. 29 కోట్లతో లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసిన టాప్ సింగర్
నేపథ్య గాయని శ్రేయా ఘోషల్ ముంబైలో ఒక కొత్త విలాసవంతమైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. బాలీవుడ్ నివేదికల ప్రకారం, శ్రేయా ఘోషల్ తన తల్లి షమిష్ఠ ఘోషల్, తండ్రి బిశ్వజిత్ ఘోషల్లతో కలిసి వర్లీలో రూ.29.70 కోట్లకు ఒక అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. ఆస్తి రిజిస్ట్రేషన్ వివరాల ప్రకారం, ఈ అపార్ట్మెంట్ ముంబైలోని అత్యంత ప్రీమియం నివాస ప్రాంతాలలో ఒకటైన వర్లీలోని గోద్రెజ్ ట్రైలజీలో ఉంది.రిజిస్టర్ పత్రాల ప్రకారం ఈ ఫ్లాట్ మొత్తం వైశాల్యం 2,750.28 చదరపు అడుగులు ఉంది. దీనితో పాటు మూడు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 1, 2026న అధికారికంగా రిజిస్టర్ చేయబడింది. ఈ లావాదేవీలో రూ. 1.78 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లింపుతో పాటు రూ. 30వేల రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా ఉన్నాయని సమాచారం.‘సరిగమ’ విజేతగా కెరీర్ను ప్రారంభించిన శ్రేయాఘోషల్ బాలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా ఎన్నో చిత్రాల్లో తన పాటలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. మొదట దేవదాస్ చిత్రంతో హిందీలో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత గజని, 3 ఇడియట్స్, దబాంగ్, ఢిల్లీ 6, ఆషికీ-2, క్రిష్, పద్మావత్ వంటి చిత్రాల్లో ఆమె పాడిన పాటలకు మంచి క్రేజ్ దక్కింది. తెలుగులో ఒక్కడు, సింహాద్రి, ఠాగూర్, సీతయ్య, వర్షం, మల్లీశ్వరి, నేనున్నాను, అతడు, అదుర్స్, రేసుగుర్రం, మనం, ఖైదీ నం. 150,గేమ్ ఛేంజర్ వంటి సినిమాలతో పాటు సుమారు 200కు పైగానే సాంగ్స్ పాడింది. ప్రస్తుతం ఆమె ఒక్కో సాంగ్ కోసం సుమారు రూ. 25 లక్షలకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటుంది. -
ధురంధర్పై కామెంట్.. ఆ బడ్జెట్లో మనోళ్లు నిర్మించడం కష్టం
టాలీవుడ్ ప్రముఖ రచయిత బివిఎస్ రవి అరుదుగా మీడియాతో మాట్లాడుతారు. కానీ, ఇండస్ట్రీలో ఉన్నది ఉన్నట్టు కుండబద్దలుకొడతారని ఆయనకు గుర్తింపు ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ధురంధర్ సినిమా బడ్జెట్ గురించి మాట్లాడారు. ధురంధర్ సినిమా టాలీవుడ్లో అంత తక్కువ బడ్జెట్లో నిర్మించడం చాలా కష్టమని చెప్పారు. టాలీవుడ్లో సినిమా ప్రారంభించాక ప్రణాళికా లోపం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకొచ్చారు.బాలీవుడ్లో ధురంధర్ రెండు భాగాల కోసం సుమారు రూ. 260 కోట్లు పెట్టారు. ఇప్పుడు ఇదే బడ్జెట్ గురించి రచయిత బివిఎస్ రవి ఇలా అన్నారు. అదే బడ్జెట్లో తెలుగులో నిర్మించడం సాధ్యం కాదని ఆయన గట్టిగా పేర్కొన్నారు. టాలీవుడ్లో కనక ధురంధర్ మూవీ నిర్మించి వుంటే.. కనీసం రూ. 500 కోట్లు ఖర్చు పెట్టించేవారని చెప్పారు. ఆపై క్వాలిటీ తక్కువగా ఉన్న ప్రోడక్ట్ చేతిలో పెడతారని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ పరిస్థితులు అలా తయారయ్యాయని ఓపెన్గానే రవి అన్నారు.'దర్శకుడు ఆదిత్య ధర్ సుమారు ఎనిమిది గంటలకు పైగానే ఫుటేజ్ చిత్రీకరించాడు. దాని కోసం అతను ఎంత కష్టపడి ఉంటాడో, ఎంత పరిశోధన చేసి ఉంటాడో ఒక్కసారి ఊహించండి. అంత ఖర్చు పెట్టడానికి అతను తన నిర్మాతలను ఎలా ఒప్పించగలిగాడు..? పొరపాటు జరిగితే సాధారణ నిర్మాతల పతనానికి 'ధురంధర్' ఆరంభం అయ్యేది. ఈ మూవీ నిర్మాతలు రూ.260 కోట్లలోపే బలమైన నటులను ఎంపిక చేసుకుని అమోఘమైన ఫైట్లు, సినిమాలో రణవీర్ సింగ్ విలాసవంతమైన ఇల్లు, ఇతర అద్భుతమైన లొకేషన్లతో రెండు సినిమాలు తీశారు.' అని బివిఎస్ రవి చెప్పుకొచ్చారు.రచయిత బివిఎస్ రవి చేసిన వ్యాఖ్యలను చాలామంది సమర్ధిస్తున్నారు. కాస్త చేదుగా ఉన్నప్పటికీ ఆయన చెప్పింది నిజమేనని అంటున్నారు. మనోళ్ల దృష్టి సినిమా కంటెంట్ మీద కాకుండా గ్రాండ్ ఎంట్రీ పేరుతో అనోసరమైన ఖర్చులు పెడుతారనే టాక్ ఉంది. ధురంధర్ రెండు భాగాలు కూడా 20నెలల్లోనే నిర్మించారు. కానీ తెలుగులో మాత్రం పాన్ ఇండియా పేరుతో ఏకంగా ఐదు సంవత్సరాల పాటు తీస్తారు. తీరా థియేటర్స్లో బొమ్మ పడితే కనీసం మూడోరోజు కూడా ప్రేక్షకులు కనిపించరు. ఆపై పార్ట్-2 అంటూ ఎండ్ కార్డ్తో ఒక ట్విస్ట్ ఇచ్చి బయటకు పంపుతారు.(వీడియో క్రెడిట్ గుల్ట్) #BVSRavi :“#Dhurandhar IS THE BEGINNING OF THE END FOR REGULAR PRODUCERS.They shot 8 HOURS of footage with ₹260 CRORES, while our producers need ₹500 CRORES to make a SINGLE FILM.”Full Interview: https://t.co/BsWnOkoFMA pic.twitter.com/gRGViC7ZHi— Gulte (@GulteOfficial) April 6, 2026 -
ఇకపై నేను సింగిలే: హీరోయిన్
సంచలన పాన్ ఇండియా కథానాయికల్లో నటి శ్రుతి హాసన్ ఒకరు. నటిగానే కాకుండా గాయనిగా కూడా అలరిస్తూన్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ భామ. తరచూ తన ఫొటోలు, సంచలన విషయాలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ వార్తల్లో ఉండే శ్రుతి హాసన్ ప్రేమ వ్యవహారంలోనూ నెటిజన్లకు గట్టిగానే పని చెబుతుంటారు. ముఖ్యంగా తనకు సంబంధంచిన ప్రేమ వ్యవహారాలను చాలా బహిరంగంగా వెల్లడిస్తుంటారు. అలా ప్రేమ ,పెళ్లిపై అభిప్రాయాలను కూడా నిర్భయంగా వ్యక్తం చేస్తారు. గత కొన్నేళ్ల క్రితం ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికా అనే వ్యక్తిని ప్రేమించి, అతనితో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి వైరల్గా మారారు. అయితే ఆ తరువాత వీరిద్దరూ విడిపోయారు. దీంతో అతని ఫొటోలను ఇన్ స్ట్రాగామ్ నుంచి తొలగించేశారు. కాగా ప్రస్తుతం పూర్తిగా నటనపైనే దష్టి సారిస్తున్న శ్రుతి హాసన్ తన బ్రేకప్ లో గురించి ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తాను ఇప్పటివరకు ఆరు సార్లు ప్రేమించానని చెప్పారు. అయితే అవన్నీ గాయాలతోనే ముగిశాయి అన్నారు.దాంతో ప్రశాంతత బాట పట్టినట్లు చెప్పారు. ఇలా ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఇకపై తాను సింగిలే అని నటి శ్రుతి హాసన్ చెప్పిన విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. -
'పెద్ది'.. అనుకున్నదే జరగనుంది!
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ఇప్పటికే రెండోసారి వాయిదా పడింది. ఈ నెల 30న థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే చెప్పినట్లు వస్తుందా రాదా అనేది ఇప్పటికీ సస్పెన్సే. రీసెంట్గానే ఓ మూవీ ప్రమోషన్లలో భాగంగానే 'పెద్ది' కూడా టైంకి వస్తుందని చెప్పండ్రా అంటూ స్వయంగానే చరణే అన్నాడు. కానీ తర్వాత హనుమాన్ జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో తేదీ ఏం వేయలేదు. దీంతో కొత్త అనుమానాలు పుట్టుకొచ్చాయి.(ఇదీ చదవండి: 'అశ్వత్థామ'గా రామ్చరణ్.. ఆదిత్య ధర్తో చర్చలు?)ప్రస్తుతం చాలామంది అభిప్రాయపడుతున్నట్లే 'పెద్ది' మరోసారి వాయిదా పడటం దాదాపు కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది. జూన్ నెలలోనే తొలివారం లేదా చివరి వారాన్ని పరిశీలిస్తున్నారట. రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ విషయాన్ని టీమ్ అధికారికంగా ప్రకటించబోతుందని టాక్. ఇది జరగడానికి చాలానే కారణాలున్నాయి. అందులో మొదటిది షూటింగ్ సమయానికి పూర్తి కాకపోవడం. ఇప్పటికీ ఓ పాట షూటింగ్తో పాటు రీ రికార్డింగ్ పనులు పెండింగ్లో ఉన్నాయి.పాన్ ఇండియా మూవీ కాబట్టి అందుకు తగ్గట్లే దేశమంతా తిరిగి ప్రమోషన్లు చేయాల్సి ఉంది. చేతిలో మరో 20 రోజులు కూడా లేవు. ఇన్ని పనులు పూర్తి చేసి సినిమాని 30వ తేదీన తీసుకురావడం కష్టమే అనిపిస్తుంది. అందుకు జూన్ 4 లేదా 25వ తేదీకి వాయిదా పడనుందనే రూమర్స్ మళ్లీ వస్తున్నాయి. ఇకపోతే స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన 'పెద్ది'లో జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రలు చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. బుచ్చిబాబు దర్శకుడు.(ఇదీ చదవండి: అక్షయ్ కుమార్ 'భూత్ బంగ్లా' ట్రైలర్ రిలీజ్) -
అక్షయ్ కుమార్ 'భూత్ బంగ్లా' ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గతంలో అద్భుతమైన హిట్స్ అందుకున్నప్పటికీ.. గత కొన్నాళ్లుగా చాలా వెనకబడిపోయాడు. వరస సినిమాలైతే చేస్తున్నాడు గానీ సక్సెస్ అనేది పెద్దగా దక్కట్లేదు. దీంతో తనకు గతంలో 'హేరా ఫేరీ' లాంటి బ్లాక్బస్టర్ ఇచ్చిన మలయాళ దర్శకుడు ప్రియదర్శన్తో కలిసి తీసిన మూవీ 'భూత్ బంగ్లా'. వచ్చే శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.ట్రైలర్ బట్టి చూస్తే ఓ బంగ్లా, అందులో వధాసుర్ అనే రాక్షసుడు, సిట్చూయేషనల్ కామెడీ ఇలా బాగానే ఉందనిపించింది. కాకపోతే ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర 'ధురంధర్ 2' హవా నడుస్తోంది. లెక్క ప్రకారం ఈ శుక్రవారమే 'భూత్ బంగ్లా' థియేటర్లలోకి రావాలి. కానీ ధురంధర్ వల్లే వారం ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారు. కానీ అప్పుడైనా హిట్ అవుతుందా అనేది ఇక్కడ సందేహంగా మారింది. హారర్ మూవీ జనాలని ఏ మేరకు మెప్పిస్తుందనేది చూడాలి? -
మదనపల్లి యాస మాట్లాడా: అడివి శేష్
‘‘నా గత సినిమాల్లో కథలో ఒక చిన్న భాగంగా ప్రేమకథ ఉంటుంది. కానీ, ‘డెకాయిట్’లో మాత్రం ప్రేమకథే మెయిన్ ప్లాట్ ఫామ్. ఒక ప్రేమకథలో యాక్షన్ చూసేందుకు వెళ్లే ప్రేక్షకులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే ఒక యాక్షన్ సినిమాలో లవ్ స్టోరీ చూసేందుకు వెళ్తే నిరుత్సాహపడరు. ఇందులోని భావోద్వేగాలన్నీ కూడా సహజంగా ఉంటాయి’’ అని హీరో అడివి శేష్ తెలిపారు. షానియల్ డియో దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా, అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించిన చిత్రం ‘డెకాయిట్’.అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మించారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్లో అడివి శేష్ విలేకరులతో పంచుకున్న విశేషాలు... ⇒ ఒక ఇంటెన్స్ యాంగర్ యాక్షన్ మధ్యలో లవ్ స్టోరీ తయారు చేశాం. ‘డెకాయిట్’ తెలుగు ట్రైలర్కి అద్భుతమైన స్పందన వచ్చింది. హిందీలో మేము ఊహించిన దానికంటే చాలా ఎక్కువ రీచ్ ఉంది. పవన్ సింగ్గారు ‘డెకాయిట్’లో చేయడం భోజ్ పురికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భోజ్పురిలో కూడా ప్రీమియర్ వేస్తారా? అని ఫస్ట్ టైమ్ అడిగినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఈ మూవీ చేస్తున్నప్పుడు నా మోకాలికి గాయం కావడంతో షూటింగ్ రెండు మూడు నెలలు ఆలస్యం అయింది. ఆ ఎఫెక్ట్ ‘గూఢచారి 2’ మూవీపైన కూడా పడింది. ‘డెకాయిట్’ కోసం 45 డిగ్రీల వేడిలో క్లైమాక్స్ చిత్రీకరించాం.⇒ డైరెక్టర్ షానియల్ డియో, నేను బెస్ట్ ఫ్రెండ్స్. అయితే సినిమా విషయంలో మాత్రం రాజీపడం. మృణాల్ ఠాకూర్ అద్భుతమైన నటి. నాగచైతన్య–శోభితగార్ల పెళ్లికి హైదరాబాద్ వచ్చిన సమయంలో అనురాగ్ కశ్యప్గారికి ఈ కథ చె ప్పాం. ఆయనకి నచ్చడంతో వెంటనే చేస్తానన్నారు. ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ సుప్రియగారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్గారికి కూడా ఇది చాలా ఫ్రెష్ ప్రాజెక్టు అయింది. ‘డెకాయిట్’ తెలుగు వెర్షన్లో ‘కన్నెపెట్టరో కన్నుకొట్టరో...’ సాంగ్ని, హిందీలో ‘చీజ్ బడీ õß మస్త్..’ పాటని పెట్టాం. పోలాకి విజయ్గారు చాలా స్వీట్ కొరియోగ్రాఫర్. ⇒ ఈ సినిమాలో నేను చేసిన హరి పాత్ర క్యారెక్టర్ని బట్టి ‘డెకాయిట్’ టైటిల్ ఫిక్స్ చేశాం. ఈ పాత్ర కోసం మదనపల్లి యాస ప్రాక్టీస్ చేశాను. నా నుంచి వరుసగా సినిమాలు రావాలంటే నేను రచయితగా ఉండకూడదనుకున్నాను. ‘గూఢచారి 2’ తర్వాత ఎమోషనల్గా రీఛార్జ్ అవ్వాలి అనుకుంటున్నా. ‘డెకాయిట్’ ని డాల్బీలో రిలీజ్ చేయాలని మొదటి నుంచి అనుకున్నాం. అల్లు అరవింద్గారు ఫోన్ చేసి, సినిమా చాలా ప్రామిసింగ్గా ఉంది.. కలిసి పనిచేద్దామనడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. నాకు ఫస్ట్ బ్రేకప్ అయినప్పుడు 19 ఏళ్లు. దాన్నుంచి బయటపడడానికి పదేళ్లు పట్టింది. నేను సిగరెట్స్, మందు తాగను, నాన్ వెజ్ కూడా తినను. అందుకే ఇప్పటికీ ఒకేలా ఉన్నాను. నా ‘గూఢచారి 2’ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల అవుతుంది. -
ధురంధర్: ది రివెంజ్ @ 1622 కోట్లు
‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ చిత్రంగా ‘ధురంధర్: ది రివెంజ్’ నిలిచింది. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘ధురంధర్’. ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ పతాకాలపై ఆదిత్యధర్, జ్యోతిదేశ్ పాండే, లోకేష్ థర్ నిర్మించిన ఈ సినిమా రెండు భాగాలుగా (ధురంధర్, ధురంధర్: ది రివెంజ్) విడుదలైంది.గత ఏడాది డిసెంబరు 5న విడుదలైన ‘ధురంధర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ను సాధించింది. ఈ ఏడాది మార్చి 19న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా 18 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1622 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను కొల్లగొట్టిందని యూనిట్ పేర్కొంది. ఇండియాలో రూ.1228 కోట్లు, ఓవర్సీలో రూ.394 కోట్లు తమ సినిమాకు వచ్చాయని ‘ఎక్స్’ వేదికగా జియో స్టూడియోస్ సంస్థ తెలిపింది.ఇండియాలో రూ.1041 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయని, ఇక్కడ వెయ్యికోట్ల రూపాయల నెట్ వసూళ్లు సాధించిన రికార్డును ‘ధురంధర్: ది రివెంజ్’ క్రియేట్ చేసిందని మేకర్స్ చెబుతున్నారు. ఇటీవలే నార్త్ అమెరికాలో ‘బాహుబలి: ది కన్క్లూజన్’ వసూళ్ల రికార్డును అధిగమించిన ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా తాజాగా నార్త్ అమెరికాలో పాతిక మిలియన్ డాలర్లు(దాదాపు 232 కోట్లు) సాధించి, అక్కడ అత్యధిక కలెక్షన్స్ను సాధించిన తొలి ఇండియన్ సినిమాగా నిలిచిందని మేకర్స్ పేర్కొన్నారు. అలాగే జర్మనీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వన్ మిలియన్ యూరోలు సాధించి సత్తా చాటింది. -
సస్పెన్స్ థ్రిల్లర్గా ‘ఎమ్4 ఎమ్’
అమెరికన్ నటి జో శర్మ, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో మోహన్ వడ్లపట్ల దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఎమ్4 ఎమ్: మోటివ్ ఫర్ మర్డర్’. మోహన్ మీడియా క్రియేషన్స్ పతాకంపై ఎమ్సీ విన్ గ్రూప్ యూఎస్ఏ సహకారంతో మోహన్ వడ్లపట్ల నిర్మించిన ఈ సినిమా మే 8న రిలీజ్ కానుంది. ‘‘మా సినిమాను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించడాన్ని మేం గర్వంగా ఫీలవుతున్నాం.అలాగే ముంబైలో ప్రీమియర్ షో ప్రదర్శించగా మంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ మా చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. అదేవిధంగా అమెరికాలో టెక్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ మా మూవీని విడుదల చేస్తోంది. మర్డర్ మిస్టరీగా రూపొందిన మా సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని మేకర్స్ తెలిపారు. -
ఆ అదృష్టం నాకు దక్కింది: జేడీ చక్రవర్తి
‘‘యాక్టర్స్ అందరికీ కమల్ హాసన్గారు ఒక కొలమానం. ఆయన చేసినన్ని క్యారెక్టర్లు ప్రపంచ సినిమా చరిత్రలో ఎవరూ చేయలేదు, చేయబోరు. అయితే ‘గాయపడ్డ సింహం’ మూవీలో నేను పోషించిన ధర్మ పాత్ర నా కెరీర్లో గుర్తుండి పోతుంది. నటుడిగా కాదు కానీ, క్యారెక్టర్ పరంగా చూస్తే ధర్మలాంటి పాత్ర చేసే అదృష్టం కమల్ హాసన్గారికి దక్కలేదు.. ఆ అదృష్టం నాకు దక్కిందని భావిస్తున్నాను’’ అని నటుడు జేడీ చక్రవర్తి తెలిపారు. తరుణ్ భాస్కర్ హీరోగా, మానసా చౌదరి, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘గాయపడ్డ సింహం’.డైరెక్టర్ పవన్ సాధినేని సమర్పణలో స΄్తాశ్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై కల్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ నిర్మించిన ఈ మూవీ మే 1న విడుదలవుతోంది. ఈ మూవీలో సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి పోషించిన బ్రూటల్ ధర్మ పాత్రని పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ–‘‘నా కెరీర్లో ‘మనీ, సత్య, అనగనగా ఒక రోజు’ లాంటి చిత్రాలు ట్రెండ్ సెట్టర్స్గా నిలిచాయి. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత అలాంటి క్యారెక్టర్ చేసే అవకాశం ‘గాయపడ్డ సింహం’లో దొరికింది. మా సినిమా ‘దిల్’ రాజు గారికి నచ్చడం సంతోషం. మా మూవీని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు’’ అని పేర్కొన్నారు.‘‘మా సినిమాని మేము ఎంత ఎంజాయ్ చేశామో, ప్రేక్షకులు కూడా అంతే ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు పవన్ సాధినేని. ‘‘జేడీగారి బెస్ట్ సినిమాల్లో మనకు నచ్చిన అన్ని ఎలిమెంట్స్ ధర్మ పాత్రలో కనిపిస్తాయి’’ అన్నారు కశ్యప్ శ్రీనివాస్. ‘‘జేడీ చక్రవర్తిగారు సత్య పాత్రతో ఎంత పాపులర్ అయ్యారో ధర్మ క్యారెక్టర్లోనూ అంతే పాపులర్ అవుతారని నమ్ముతున్నాను’’ అని భాను కిరణ్ ప్రతాప చె ప్పారు. -
ఊరు మాత్రమే కదా మారుతోంది!
‘తను భూమిపై తిరిగి హక్కును దక్కించుకోవడానికి వస్తాడు సార్.. ఈ గడ్డ నరనరాన్ని అతడు తెంచేస్తాడు..ఆ నేల అసలైన యజమాని’ అనే డైలాగులతో ‘పళ్లిచట్టంబి’ ట్రైలర్ ఆరంభం అయింది. టొవినో థామస్ హీరోగా, కయాదు లోహర్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘పళ్లి చట్టంబి’. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వంలో వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మించారు.ఈ సినిమా ఏప్రిల్ 10న తెలుగు, మలయాళ, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్ని రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఏంటి మై డియర్ రౌడీగారు కొంచెం నవ్వొచ్చుగా’, ‘నువ్వు భలేరౌడీవే.. మా ఊరి వాళ్లందర్నీ బాగానే మాయ చేసేశావ్(కయాదు లోహర్)’, ‘ఊరు మాత్రమే కదా మారుతోంది.. మట్టి, మనుషులు అందరికీ ఒక్కటే కదా’ అంటూ టొవినో థామస్ చెప్పే డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: టిజో టోమీ, సంగీతం: జేక్స్ బిజోయ్. -
ఆగస్టులో వేగ లీలా
ఘంటసాల నాగ విశ్వనాథ్ దర్శకత్వంలో సాయి కుమార్ మేడి, జయ వేణుబాబు నిర్మిస్తున్న చిత్రం ‘వేగ లీలా’. ఈ సినిమా ఫస్ట్ లుక్ని విడుదల చేశారు మేకర్స్. అయితే నటీనటుల పేర్లు, వారి ముఖాలను ఇప్పుడు రివీల్ చేయడంలేదని, సస్పెన్స్ అని చిత్రబృందం పేర్కొంది.ఆగస్టులో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ‘‘వేగ లీలా’లోని నటీనటుల వివరాలను త్వరలో తెలియజేస్తాం. జీవీ, పవన్ చరణ్ ఈ సినిమాకి మంచి సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రాహకుడు దిలీప్ కుమార్ చిన్నయ్య విజువల్స్ క్యాచీగా ఉంటాయి’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. -
'అశ్వత్థామ'గా రామ్చరణ్.. ఆదిత్య ధర్తో చర్చలు?
బాలీవుడ్లో రాబోయే భారీ ప్రాజెక్టులపై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ‘యూరి: ది సర్జికల్ స్ట్రైక్’తో బిగ్ హిట్ అందుకున్నాడు దర్శకుడు ఆదిత్య ధర్. కొంతకాలం క్రితం ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ అనే కథను తెరపైకి తీసుకురావాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో జియో స్టూడియోస్తో ఒప్పందం కుదుర్చుకుని, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. అయితే ఆ సమయంలో కొన్ని అనివార్య కారణాలతో ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. ఆ ప్రాజెక్టుకు రామ్చరణ్ పేరు బలంగా వినిపించింది. అప్పుడే ‘ఆర్ఆర్ఆర్’ విజయంతో ఆయనపై బాలీవుడ్ దృష్టి పడింది. అశ్వత్థామ పాత్రకు చరణ్ సరైన ఎంపిక అవుతాడని అంతా అనుకున్నారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ ఈ కథపై చర్చలు మొదలయ్యాయి. దానికి కారణం.. ఆదిత్య ధర్ రూపొందించిన ‘ధురంధర్’ ఫ్రాంచైజీ. ధురంధర్ చిత్రం రెండు భాగాలతో భారీ విజయాన్ని సాధించిన ఆదిత్య ధర్పై నిర్మాణ సంస్థలు నమ్మకం పెంచుకున్నాయి. కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ‘ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మెగా ఫ్యాన్స్ మాత్రం అప్పటి పుకారు ఇప్పుడు నిజమవ్వాలని కోరుకుంటున్నారు. రామ్చరణ్ ఈ ప్రాజెక్టులో భాగమైతే, బాలీవుడ్లో మరో భారీ అడుగు వేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. -
అమెరికన్ నటి.. తెలుగు దర్శకుడు.. పాన్ ఇండియా సినిమా
ఉత్కంఠభరిత హత్యా కథాంశంతో తీసిన సస్పెన్స్ థ్రిల్లర్ 'ఎం4ఎం' (M4M – Motive for Murder) సినిమా మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు కాబోతోంది. అమెరికన్ నటి జో శర్మా, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. పాన్ ఇండియా వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. దర్శకుడు మోహన్ వడ్లపట్ల స్వీయ నిర్మాణంలో మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్పై, McWin Group USA సహకారంతో రూపొందించారు.(ఇదీ చదవండి: హీరోయిన్కు బలవంతంగా ముద్దు పెట్టిన అభిమాని)భారతదేశంలో ఈ చిత్రాన్ని పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ సంస్థ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తోంది. అమెరికాలో విడుదల బాధ్యతలను TekFlix Entertainment, ఉత్తర భారత విడుదలను JVEL Entertainment సంస్థలు తీసుకున్నాను. విడుదలకు ముందే ఈ మూవీ.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా పలాసిస్ సీ థియేటర్లో ప్రైవేట్ స్క్రీనింగ్ నిర్వహించగా, ముంబైలోని IMPPA ప్రివ్యూ థియేటర్లో ప్రత్యేక ప్రదర్శన జరిగింది. దీనికి మంచి స్పందన లభించింది.ఇక హీరోయిన్ జో శర్మా అమెరికా, భారత్లో విస్తృతంగా నిర్వహించిన ప్రమోషన్ టూర్.. సినిమాకు మరింత ప్రచారం తీసుకువచ్చింది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ..ప్రీమియర్కు అద్భుతమైన స్పందన వచ్చిందని, థ్రిల్లింగ్ స్టోరీ, సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: ఆరు రోజుల్లో బర్త్ డే.. బుల్లితెర నటి బలవన్మరణం) -
వైట్ డ్రెస్లో చిన్నపిల్లలా బిగ్బాస్ దివి.. పింక్ శారీలో మెగా కోడలు..!
రిసార్ట్లో చిల్ అవుతోన్న శాన్వీ మేఘన..పింక్ శారీలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి..వైట్ డ్రెస్లో చిన్నపిల్లలా బిగ్బాస్ దివి పోజులు..నయనతార బ్లాక్ అండ్ వైట్ లుక్స్..పల్లిచట్టంబి ప్రమోషన్స్లో బిజీగా కయాదు లోహర్.. View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Lavanya konidela Tripathi (@itsmelavanya) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
'నేనేం పాపం చేశా.. ఇలా తిట్టడం మంచిది కాదు..'రేణు దేశాయ్
సినీ నటి రేణు దేశాయ్ మరో వీడియో రిలీజ్ చేసింది. తమపై అసభ్యంగా కామెంట్స్ ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించింది. మేము ఆర్టిస్టులమని..మా మనసు చాలా సున్నితంగా ఉంటుందని రేణు దేశాయ్ తెలిపింది. మేము టెర్రరిస్టులం కాదు కదా అని ప్రశ్నించింది. ఎవరైనా క్రైమ్ చేస్తుంటే వాళ్లను తిట్టండి.. కానీ మాలాంటి ఆర్టిస్టులను తిట్టొద్దండి.. ప్లీజ్ అని వేడుకుంది. మేమేమీ నేరాలు చేయట్లేదు కదా అని రేణు దేశాయ్ వెల్లడించింది. మీకు నా పని నచ్చకపోతే.. నన్ను ఫాలో చేయడం ఆపేయండి అని సూచించింది. నేనేం పాపం చేశా.. ఇంత అసభ్యంగా తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. రేణు దేశాయ్ను అసభ్యకర పదజాలంతో దూషించిన ఆరుగురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆమె ఒక వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఒక మీడియా సమావేశంలో వీధి శునకాల రక్షణ గురించి ఆమె మాట్లాడిన విషయం తెలిసిందే. వంద కుక్కల్లో 10 పిచ్చివి ఉంటాయని, వాటితో జాగ్రత్తగా ఉండాలని ఆమె చెప్పారు. ఆ పదింటి కోసం మిగిలిన 90 కుక్కల్ని చంపకూడదని ఆమె అన్నారు. ఆ తర్వాత ఆమెపై కొందరు నెటిజన్లు బూతులతో రెచ్చిపోయారు.సోషల్మీడియా వేదికగా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని నిత్యం అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని రేణూ దేశాయ్(Renu Desai) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెడు కామెంట్లు చేసే వారిని వాళ్ల అమ్మానాన్నల ముందు నిలబెడతానని హెచ్చరించారు. ఆమె చెప్పినట్లుగానే ఫిర్యాదు చేయడంతో తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
ఓటీటీకి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీ చిత్రాలకు ఫుల్ డిమాంట్ ఉంటోంది. ఆడియన్స్ అభిరుచులకు తగ్గట్టుగానే ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా మరో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. గతంలో 2023లో మామి ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ మూవీని ప్రదర్శించారు.తాజాగా ఎవరీబడీ లవ్స్ సోహ్రబ్ హండా అనే మర్డర్ మిస్టరీ మూవీ ఓటీటీలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటింంచింది. ఈనెల 10 నుంచి జీ5 వేదికగా అందుబాటులోకి రానుంది. '15 మంది స్నేహితులు.. ఒక పార్టీ.. ఒకరి మిస్టరీ హత్య' అంటూ పోస్టర్ను పంచుకున్నారు.ఈ చిత్రంలో వినయ్ పాఠక్, నీల్ భూపాలం ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రజత్ కపూర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సమీర్ నాయర్, దీపక్ సెగల్ నిర్మించారు. ఈ సినిమాలో రణవీర్ షోరే, సౌరభ్ శుక్లా, కోయెల్ పూరీ, ఎంకే రైనా, పలోమి ఘోష్, చంద్రచూర్ రాయ్, సాదియా సిద్దిఖీ కీలక పాత్రల్లో నటించారు.ఈ చిత్రానికి సాగర్ దేశాయ్ సంగీతం సమకూర్చారు. కాగా.. రజత్కపూర్ అంతకుముందు క్రౌడ్ఫండింగ్ ద్వారా ఆర్కే అనే మూవీని తెరకెక్కించారు. 15 Friends. 1 Party. 1 Mysterious Murder.But the real question is - who wanted him dead?Watch #EverybodyLovesSohrabHanda premieres 10th April, on #ZEE5#EverybodyLovesSohrabHandaonZEE5@ApplauseSocial @nairsameer @deepaksegal #MithyaTalkies #RajatKapoor @pathakvinay… pic.twitter.com/CUha1btJlU— ZEE5Official (@ZEE5India) April 6, 2026 -
కోర్ట్ రీమేక్.. స్టార్ నటి వారసురాలి ఎంట్రీ..!
తెలుగులో సూపర్ హిట్గా నిలిచిన మూవీ కోర్ట్. రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ కీలక పాత్రలో మెప్పించారు. ఇక్కడ సూపర్ హిట్ అయిన మూవీని కోలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. త్యాగరాజన్ డైరెక్షన్లో రంజన్ పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ మూవీతో సీనియర్ హీరోయిన్, నటి దేవయాని వారసురాలు ఎంట్రీ ఇస్తోంది. దేవయాని కుమార్తె ప్రియాంక ఈ సినిమాతో కోలీవుడ్లో అరంగేట్రం చేస్తోంది. ఈ సందర్భంగా మూవీ లాంఛ్కు హాజరైన దేవయాన్ని ఈ విషయాన్ని ప్రకటించింది. తన కూతురికి అవకాశమిచ్చిన త్యాగరాజన్కు ధన్యవాదాలు తెలిపింది. తన కూతురు సినీ ఇండస్ట్రీలో రాణిస్తుందని దేవయాని ధీమా వ్యక్తం చేసింది.కాగా.. నటి దేవయాని గురించి పరిచయం అవసరం లేదు. తమిళంలోనే కాకుండా తెలుగు తదితర భాషల్లోనూ హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత దర్శకుడు రాజకుమార్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు పేరు ఇనియ, చిన్న కూతురు పేరు ప్రియాంక. ప్రస్తుతం తన చిన్న కుమార్తెను ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది. కాగా.. గతేడాది విడుదలైన 3 బీహెచ్కే సినిమాలో సిద్ధార్థ్ తల్లిగా దేవయాని కనిపించిన విషయం తెలిసిందే. #Devayani தியாகராஜன் சார் வந்து இந்தப் படத்துல என்னோட மகள் பிரியங்கா ராஜ்குமார், அதுக்கப்புறம் ஹரி கதிரேசன், இரண்டு பேரையும் லான்ச் பண்றாங்க.கண்டிப்பா இவங்க உங்க பேரை காப்பாத்துவாங்க, நல்லா நடிப்பாங்க, சினிமால ரொம்ப நாளா இருப்பாங்க. pic.twitter.com/8U6AeTw7aT— KUDALINGAM MUTHU (@KUDALINGAM49671) April 6, 2026 -
సినిమాలకు పూర్తిగా గుడ్ బై.. నటుడి కామెంట్స్ వైరల్..!
ఇటీవల స్టార్ హీరోయిన్ త్రిష పేరు ఎక్కువగా వినిపిస్తోంది. విజయ్ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో అనూహ్యంగా త్రిష పేరు తెరమీదకొచ్చింది. విజయ్తో ఆమెకు రిలేషన్ ఉందని రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత వీరిద్దరు ఓ పెళ్లికి హాజరు కావడంతో వాటి మరింత బలం చేకూరింది. ఆ తర్వాత కోలీవుడ్లో ఈ టాపిక్ మరింత చర్చనీయాంశంగా మారింది.ఈ సంగతి పక్కన పెడితే తాజాగా కోలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు చిత్రా లక్ష్మణన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. త్రిష త్వరలోనే సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పనున్నారని మాట్లాడారు. యూట్యూబ్ వేదికగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం చిత్రా లక్ష్మణన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు త్రిష టీమ్ నుంచి ఎలాంటి స్పందనైతే రాలేదు. ఇదే నిజమైతే వెండితెరపై త్రిషను చూడాలనుకున్న ఫ్యాన్స్కు నిరాశ తప్పేలా లేదు. చిత్ర లక్ష్మణన్ చేసిన కామెంట్స్ నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
రిలీజ్కు సిద్ధమైన తెరచాప.. ఎప్పుడంటే?
నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం తెరచాప. ఈ సినిమాకు జోయల్ జార్జ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అనన్య క్రియేషన్స్ బ్యానర్లో కైలాష్ దుర్గం నిర్మించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది.ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17న విడుదల చేస్తామని మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్, ట్రైలర్కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, ఫిష్ వెంకట్, జబర్దస్త్ అశోక్, నాగి, అప్పారావు, రైసింగ్ రాజు, రాజేష్ భూపతి, నాగ వంశీ, శ్రీనివాస్ నేస, చంద్ర కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రజల్ క్రిష్, ఎం.ఎల్ రాజా సంగీతాన్ని అందించారు. -
నాగ శౌర్య యాక్షన్ మూవీ.. ట్రైలర్ చూశారా?
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటించిన లేటేస్ట్ యాక్షన్ మూవీ బ్యాడ్బాయ్ కార్తీక్. ఈ చిత్రంలో విధి యాదవ్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో నాగ శౌర్య ఫుల్ యాక్షన్ మోడ్లో కనిపించనున్నారు. ట్రైలర్లో ఫైట్ సీన్స్ చూస్తుంటే ఫుల్ యాక్షన్ మూవీగానే రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో సముద్రఖని, సాయికుమార్, నరేష్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 17, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతమందించారు. -
దేవరకొండతో పెళ్లి తర్వాత తొలి బర్త్ డే.. సెలబ్రేషన్స్ చూశారా?
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా తన పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత మొదటి పుట్టిన రోజును మరింత స్పెషల్గా జరుపుకుంది. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో తన బర్త్ డే రోజు మరింత ఆనందంగా గడిపింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఏప్రిల్ 5న రష్మిక పుట్టిన రోజు సందర్భంగా పలు చిత్రాల మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. విజయ్తో పెళ్లి తర్వాత జరిగిన పుట్టినరోజు కావడంతో మరింత ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం రష్మిక- విజయ్ దేవరకొండ జంటగా రణబాలి చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీకి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే రాయలసీమలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. రష్మిక పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. జయమ్మ పాత్రలో రష్మిక వీడియోలో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని 1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. రష్మిక బర్త్ డే రోజు మైసా టీమ్ సైతం ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది. Surrounded by love & powered by happiness!🫶#RashmikaMandanna celebrates her birthday the sweetest way!❤️#VijayDeverakonda #VIROSH #TeluguFilmNagar pic.twitter.com/MA5BseCsce— Telugu FilmNagar (@telugufilmnagar) April 6, 2026 -
ఆరు రోజుల్లో బర్త్ డే.. బుల్లితెర నటి బలవన్మరణం
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ కోలీవుడ్ బుల్లితెర నటి సుభాషిణి బాలసుబ్రమణ్యం బలవన్మరణానికి పాల్పడింది. తన భర్తతో వీడియో కాల్ మాట్లాడిన నటి అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనతో కోలీవుడ్ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైంది. కుటుంబ కలహాల కారణంగానే సూసైడ్ చేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ సంఘటనపైగు సమాచారం అందుకున్న వెంటనే, పోలీసులు ఆమె మృతదేహాన్ని వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సహనటులు సోషల్ మీడియా ద్వారా తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.తమిళంలో ప్రముఖ సీరియల్ కాయల్లో తన పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది. 2012లో 'ఇని అవన్' అనే చిత్రంతో ఆమె సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. అంతేకాకుండా షార్ట్ ఫిల్మ్స్లో కూడా నటించారు. శ్రీలంక మూలాలు కలిగిన నటి చెన్నైలోని అయ్యప్పంతంగల్లో ఉన్న ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. తన పుట్టినరోజుకు కేవలం కొన్ని రోజుల ముందుగానే ఆమె మరణించడంతో అభిమానులు షాకవుతున్నారు. ఏప్రిల్ 12న ఆమె తన పుట్టినరోజును జరుపుకోవాల్సి ఉంది. ఇదే నెలలో ఏప్రిల్ 21న ఆమె వివాహ రెండవ వార్షికోత్సవం కూడా రాబోతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సుభాషిణికి ఇన్స్టాగ్రామ్లో 4 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. -
ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య, షాక్లో ఇండస్ట్రీ
సాక్షి, చెన్నై: ప్రముఖ తమిళ టీవీ నటి సుభాషిణి బాలసుబ్రహ్మణ్యం (Subashini Balasubramaniyam) చెన్నైలో ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని అయ్యప్పంతంగళ్లో గల తన నివాసంలో సుభాషిణి మృతదేహం లభ్యమైంది. సుభాషిణి ఆకస్మిక మరణం అటు టెలివిజన్ పరిశ్రమను, అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పుడిప్పుడే కెరీర్లో ఎదుగుతున్న నటి ఆకస్మిక మరణం తోటి నటీ నటుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ప్రాథమిక పోలీసు విచారణలో ఇది ఆత్మహత్యగా తేలింది. వీడియో కాల్లో తన భర్తతో జరిగిన వ్యక్తిగత వాగ్వాదం తర్వాత ఆమె తీవ్రమైన మానసిక క్షోభకు గురైనట్టు తెలుస్తోంది. ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు విచారణను కొన సాగిస్తున్నారు. ఆమె మరణం సోషల్ మీడియాలో తీవ్ర విషాదాన్ని రేకెత్తించింది. అభిమానులు, తోటి నటీనటులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఆమె నటనకు సంబంధించిన క్లిప్లు, జ్ఞాపకాలను పంచుకుంటూ, ఆమెను కేవలం ఒక నటిగానే కాకుండా, ఆయా పాత్రలకు సహజత్వాన్ని తీసుకువచ్చిన గొప్ప నటిగా గుర్తు చేసుకుంటున్నారు. శ్రీలంక నుండి తమిళ టెలివిజన్ వరకు సుభాషిణి ప్రయాణం ఆశయం, పట్టుదలకు నిదర్శనంగా నిలిచిపోతుందంటూ సంతాపం వెలిబుచ్చారు. ఆమె జీవితం విషాదాంతమైనప్పటికీ, మంచి నటిగా ఆమెను ఎప్పటికీ గుర్తుంచుకుంటారంటున్నారు. View this post on Instagram A post shared by Subashini balasubramaniyam (@subashini_balasubramaniyam)ఎవరీ సుభాషిణి సుభాషిణి స్వస్థలం శ్రీలంక. తమిళ వినోద పరిశ్రమలో తనకంటూ ఒక పేరు సంపాదించుకోవాలనే ఆశయంతో ఆమె చెన్నైకి వలస వచ్చింది. ఎంతోమంది వర్ధమాన నటుల మాదిరిగానే, ఎన్నోకష్టనష్టాలకోర్చి అవకాశాలను దక్కించుకుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పర్చుకుంటూ, ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుని సక్సెస్ఫుల్ కరియర్కు బాటలు వేసుకుంది. నటనపై ఆమెకున్న పట్టుదల, అభిరుచి, ఆమెలోని భావోద్వేగాలను, తెరపై అద్భుతంగా ప్రదర్శించే పాత్రలను సంపాదించడంలో సహాయ పడ్డాయి. ముఖ్యంగా 'కాయల్' సీరియల్తో ఆమెకు మంచి బ్రేక్త్రూ లభించింది, ఇందులో ఆమె నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సన్ టీవీలో స్థిరమైన ఫాలోయింగ్ను కలిగి ఉన్న ఈ షో, ఆమెను వెలుగులోకి తీసుకువచ్చి, అనేక తమిళ కుటుంబాలలో సుపరిచితమైన నటి నిలిపింది. ఈ సీరియల్లో సుభాషిణి పాత్ర చిత్రణ ద్వారా అనేక ప్రశంసలను అందుకుంది. -
హీరోయిన్కు బలవంతంగా ముద్దు పెట్టిన అభిమాని.. వీడియో వైరల్
మలయాళ హీరోయిన్ మంజు వారియర్కు చేదు అనుభవం ఎదురైంది. కేరళలోని పాలక్కాడ్లో ఓ ఈవెంట్కు హాజరైన మంజు వారియర్ను ఓ మహిళా అభిమాని బలవంతంగా ముద్దు పెట్టుకుంది. అది చూసిన అక్కడి యాంకర్ ఇలా ప్రవర్తించడం సరికాదని విమర్శించింది. అయితే సదరు మహిళ మాత్రం.. నాకు మంజు అక్క అంటే చాలా ఇష్టం.. అందుకే ముద్దు పెట్టుకున్నా అని బదులిచ్చింది.ఓపికగా సెల్ఫీలుఇంత జరిగినప్పటికీ మంజు వారియర్ కోపగించుకోలేదు. ఎంతో సహనంతో మిగతా అభిమానులతో సరదాగా మాట్లాడుతూ వారితో సెల్ఫీలు దిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంజు వారియర్ విషయానికి వస్తే.. ఈమె నటి మాత్రమే కాదు. డ్యాన్సర్, రైటర్, ప్రొడ్యూసర్, సోషల్ యాక్టివిస్ట్ కూడా! సాక్ష్యం అనే మలయాళ చిత్రంతో కథానాయికగా వెండితెరపై అరంగేట్రం చేసింది. సినిమాఈ పుళయం కాదన్ను, అసురన్, పాత్రం, కలియట్టం ఇలా అనేక సినిమాలు చేసింది. కన్నెళుతి పొట్టుం తొట్టు (1999) చిత్రానికిగానూ జాతీయ అవార్డు పొందింది. అయితే ఈ సినిమా తర్వాత బ్రేక్ తీసుకుంది. హౌ ఓల్డ్ ఆర్ యూ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. చివరగా ఎల్ 2: ఎంపురాన్ చిత్రంలో కనిపించింది. చతుర్ముఖం చిత్రంతో నిర్మాతగా మారింది. సల్లాపం అనే పుస్తకం రాసి తనలో రచయిత్రి కూడా దాగి ఉందని నిరూపించింది. అలాగే ఈమెకు వీణ వాయించడం కూడా వచ్చు. A lady fan kissed Malayalam Actress #ManjuWarrier in a public function 🤯 pic.twitter.com/y1PAFXZUju— 000009 (@ui000009) April 6, 2026 చదవండి: పెద్దిలో ఐటం సాంగ్.. భలే తప్పించుకుందే! -
ప్రియదర్శన్ విడాకులకు, భార్యతో కలిసిపోవడానికి ఒక్కటే కారణం!
కొన్ని బంధాలు ఎప్పుడు జతకలుస్తాయో, ఎప్పుడు విడిపోతాయో అర్థం కాదు. మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ కెరీర్ ప్రారంభించిన కొంతకాలానికే హీరోయిన్ లిస్సీతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ ప్రేమను పెళ్లి బంధంగా మార్చాలనుకున్నారు. 1990 డిసెంబర్ 13న వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత లిస్సీ తన పేరును లక్ష్మిగా మార్చుకుంది. అలాగే సినిమాలకు సైతం గుడ్బై చెప్పేసి ఇంటికే పరిమితమైపోయింది. 2016లో విడాకులుఈ దంపతులకు కుమారుడు సిద్దార్థ్, కూతురు కల్యాణి సంతానం. ప్రియదర్శన్- లిస్సీ దంపతులు ఎంతో అన్యోన్యంగానే ఉండేవారు. దాదాపు రెండు దశాబ్దాలపాటు బాగానే ఉన్న ఈ జంట తర్వాత సడన్గా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అలా అని వీరిమధ్య పెద్ద గొడవలు కూడా జరిగన దాఖలాలు లేవు. 2014లో లిస్సీ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. 2016 సెప్టెంబర్లో వీరికి అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. ఇటీవలే కలిసిపోయిన జంటఅప్పటినుంచి వీరు విడివిడిగానే జీవిస్తున్నారు. అయితే విచిత్రంగా పదేళ్ల తర్వాత ఇద్దరూ మళ్లీ కలిసిపోయారు. ఈ విషయాన్ని ప్రియదర్శనే స్వయంగా వెల్లడించాడు. ప్రస్తుతం కలిసే ఉంటున్నామని, కాకపోతే మళ్లీ పెళ్లి చేసుకోలేదన్నాడు. మరి అసలు ఈ జంట అప్పట్లో ఎందుకు విడిపోయింది? అన్నది చాలామంది అర్థం కాని ప్రశ్న!ఆ విషయం గురించి ప్రియదర్శన్ మాట్లాడుతూ.. పెళ్లయిన కొన్నేళ్లకు జీవితం బోరింగ్గా అనిపించింది. మా ఇద్దరి మధ్య ఇగో కూడా పెరిగింది. అసలు కారణమిదే!దానివల్లే పరిస్థితులు కొంత క్లిష్టంగా మారాయి. దాన్ని మరీ తెగేవరకు లాగకుండా విడిపోవడమే మంచిదని ఓ నిర్ణయానికి వచ్చాం, విడిపోయాం. కానీ కొన్నేళ్ల తర్వాత మేము ఒకరినొకరం మిస్ అయ్యాం, భాగస్వామి లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపించింది. తోడు కావాలనిపించింది. అందుకే కలిసిపోయాం. అంతే..! అని సింపుల్గా బదులిచ్చాడు. అంటే అప్పుడు బోర్ కొట్టిందని విడిపోయారు.. ఇప్పుడు సింగిల్గా ఉంటే బోర్ కొడుతోందని మళ్లీ కలిసిపోయారన్నమాట!చదవండి: ఆ సమస్య వల్ల పాటలకు దూరమైన స్టార్ సింగర్ -
స్పీడ్ పెంచిన 'బైకర్'.. మూడు రోజుల కలెక్షన్స్
శర్వానంద్ తాజా చిత్రం 'బైకర్' భారీ స్పందనతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. భారతీయ తొలి మోటోక్రాస్ రేసింగ్ సినిమాగా ఏప్రిల్ 3న విడుదలైన ఈ చిత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ మూవీలో రేసర్గా శర్వానంద్, ఆయనకు తండ్రిగా సీనియర్ హీరో రాజశేఖర్ నటించడంతో బజ్ క్రియేట్ అయింది. యువి క్రియేషన్స్ బ్యానర్పై దర్శకుడు అభిలాష్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో మాళవిక నాయర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి తదితరులు నటించారు. అయితే, తాజాగా మూడు రోజుల కలెక్షన్స్ను మేకర్స్ ప్రకటించారు.స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం బైకర్ మొదటి వారాంతాన్ని ఘనంగా పూర్తి చేసుకుంది. చిత్ర నిర్మాతల ప్రకారం, ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 18.09 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. శర్వా కెరీర్లో ఉత్తమ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా బైకర్ నిలిచింది. బైక్ రేసర్గా కనిపించేందుకు శర్వానంద్ చాలా కష్టపడ్డారని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఈ మూవీ కోసం ఏకంగా తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు. దాదాపు 23 కేజీల బరువు తగ్గడంతోపాటు రేసింగ్లో కొన్ని నెలలపాటు శిక్షణ తీసుకున్నారని మేకర్స్ చెప్పుకొచ్చారు. -
పెద్దిలో ఐటం సాంగ్? భలే తప్పించుకుందే!
సీతారామం చిత్రంతో సెన్సేషన్ అయింది మృణాల్ ఠాకూర్. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ మూవీస్తో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా తను ప్రధాన పాత్రలో నటించిన మూవీ డెకాయిట్. ఇందులో సరస్వతిగా యాక్ట్ చేసింది. మరోవైపు రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న పెద్దిలోనూ ఐటం సాంగ్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.పెద్దిలో ఐటం సాంగ్?తాజాగా డెకాయిట్ ప్రమోషన్స్లో పాల్గొన్న మృణాల్కు పెద్దిలో ఐటం సాంగ్ గురించి ప్రశ్న ఎదురైంది. కానీ మృణాల్ సమాధానం చెప్పకుండా చాలా తెలివిగా తప్పించుకుంది. ఆమె మాట్లాడుతూ.. డెకాయిట్ కోసం ఏమైనా అడుగుతారని చూస్తున్నాను. సరే కానీ మీకో ఆసక్తికర విషయం చెప్పాలి. నా మాతృభాష మరాఠి. మరాఠి సినిమా కోసం పుణెలో షూటింగ్ చేస్తున్నాను. అదే సంతోషంఅక్కడున్న జనం మరాఠి చాలా చక్కగా మాట్లాడుతున్నానని ఆశ్చర్యపోయారు. నేను మరాఠీ అమ్మాయినే అని చెప్పినా సరే, కాదు.. తెలుగమ్మాయినే అనుకుంటున్నారు. ఒకరకంగా అది నాకు సంతోషంగానే ఉంది. సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలు చాలామంది హిందీ ప్రేక్షకులు ఎటువంటి సబ్టైటిల్స్ లేకుండా తెలుగులోనే చూశారు. ఒక మహిళ అయితే ఎయిర్పోర్టులో నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకుంది.అదే నాకు దక్కిన గౌరవంతెలుగు సినిమాల్ని హిందీలో రిలీజ్ చేసినందుకు థాంక్యూ అని తెగ సంతోషపడిపోయింది. ఆమె ఆనందం చూస్తుంటే ముచ్చటేసింది. అదే నాకు దక్కిన గౌరవంగా భావించాను అంటూ అసలు సమాధానానికి బదులుగా ఏదేదో చెప్పింది. కానీ పెద్ది గురించి మాత్రం పెదవి విప్పలేదు. ఇకపోతే సీతారామం, హాయ్ నాన్నలు తనకు ఒక బెంచ్మార్క్ సెట్ చేశాయని, దానివల్ల పలు భారీ బడ్జెట్ సినిమాలను తిరస్కరించక తప్పలేదని మృణాల్ తెలిపింది.చదవండి: ఐదేళ్లుగా పాటలకు దూరం.. ఆ కారణం వల్లే: సింగర్ -
ఆ సమస్య వల్ల 5 ఏళ్లుగా పాడటమే మానేశా: స్టార్ సింగర్
సుజాత మోహన్.. సౌత్ ఇండస్ట్రీలో పేరుమోసిన గాయని. మలయాళ, తెలుగు, తమిళ, కన్నడతో పాటు హిందీ, మరాఠి భాషల్లోనూ అనేక పాటలు పాడింది. దాదాపు 20 వేల పాటలు ఆలపించింది. టాలీవుడ్కు అనేక హిట్స్ ఇచ్చింది. అయితే కొంతకాలంగా ఆమె పాటలు పాడటమే మానేసింది. అందుకు గల కారణాన్ని తాజాగా ఓ వేదికపై బయటపెట్టింది.ఐదేళ్లుగా పాటల్లేవ్సుజాత మోహన్ మాట్లాడుతూ.. నేను గొంతు సమస్యతో బాధపడుతున్నాను. దానివల్ల మునుపటిలా పాడలేకపోతున్నాను. అందుకే ఐదేళ్లుగా ఎక్కడా ఒక్క పాట కూడా పాడలేదు అని తెలిపింది. ఇది విని ఆమె అభిమానులు షాకవుతున్నారు. తను త్వరగా కోలుకుని మళ్లీ తన గాత్రంతో అలరించాలని ఆకాంక్షిస్తున్నారు. దీనిపై సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సోదరి ఏఆర్ రెహానా స్పందిస్తూ.. గతంలో సుజాతకు కోరస్గా పాడాను. గొంతు సమస్యఅప్పుడు ఆమె దగ్గరినుంచి చాలా నేర్చుకున్నాను. తన గొంతు తనకు తిరిగి రావాలని కోరుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న డాక్టర్స్ ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేయండి అని కోరింది. కాగా గతంలోనూ సుజాత గొంతు సమస్యతో బాధపడింది. 2010వ దశకంలో మాట్లాడేందుకు సైతం ఇబ్బందిపడింది. మూడేళ్లపాటు తన గొంతును తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. చివరకు మంచి చికిత్స ద్వారా కోలుకుని మళ్లీ పాటలు పాడింది.పాటలుసుజాత మోహన్ తెలుగులో అనేక హిట్ సాంగ్స్ పాడింది. తెలుగులో పరువం వానగా, నా చెలి రోజావే.. (రోజా మూవీ), ఓ చెలియా.. (ప్రేమికుడు), రూప్ తేరా మస్తానా (రిక్షావోడు), మూసిన ముత్యాలకే.., ఏలే ఏలే మరదలా (అన్నమయ్య).. ఓ వానా పడితే (మెరుపు కలలు), సారీ సారీ (బావగారు బాగున్నారా), పూవుల్లో దాగున్న (జీన్స్), అందాల ఆడబొమ్మ (సమరసింహారెడ్డి), చెప్పవే చిరుగాలి (ఒక్కడు) ఇలా అనేకానేక పాటలతో తెలుగు సంగీత ప్రియులను అలరించింది.చదవండి: మంచివాళ్లకే మంచివాడిని.. నావాళ్ల జోలికొచ్చారంటే: పవన్ -
ఏడేళ్లుగా ప్రేమలో.. పెళ్లి చేసుకున్న కన్నడ హీరో
కన్నడ హీరో సుముఖ బ్యాచిలర్ లైఫ్కు గుడ్బై చెప్పేశాడు. ప్రియురాలు మైత్రీ ఉకతో ఏడడుగులు వేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. దాదాపు ఏడేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ లవ్బర్డ్స్ రిషికేశ్లో గంగానదీ తీరంలో పెళ్లి చేసుకున్నారు. ఇరుకుటుంబాలు సహా అతి దగ్గరి బంధువుల సమక్షంలోనే ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. వీరి పెళ్లి ఫోటోలు చూసిన అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సినిమాకాగా సుముఖ.. కన్నడ ఇండస్ట్రీలో నటుడిగా రాణిస్తున్నాడు. యానా మూవీలో ముఖ్య పాత్ర పోషించిన ఇతడు ఫిజిక్స్ టీచర్, మానాడ కథలు చిత్రాల్లో కథానాయకుడిగా యాక్ట్ చేశాడు. ప్రస్తుతం రాజస్థాన్ డైరీస్ సహా మరో సినిమా చేస్తున్నాడు. ఇకపోతే ఫిజిక్స్ టీచర్లో మూవీలో నటించడంతో పాటు ఈ చిత్రంతో దర్శకుడిగానూ మారాడు. సుముఖ తల్లి నందిత యాదవ్ కూడా దర్శకురాలే కావడం విశేషం. సుముఖ భార్య మైత్రీ ఇంటీరియర్ డిజైనర్గా రాణిస్తోంది. View this post on Instagram A post shared by Ivory Films | Wedding Photography (@ivoryfilms.in) చదవండి: 10 ఏళ్లుగా ట్రోలింగ్.. నయన్ను కాదు, నన్ను ఆడేసుకుంటున్నారు -
డెకాయిట్లో అందాల చిచ్చుబుడ్డి ఫోటోలు వైరల్.. ఎవరో తెలుసా?
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం ‘డెకాయిట్’.. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటి జైన్ మేరీ ఖాన్(31) ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె గురించి నెట్టింట ఆరా తీస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని షానిల్ డియోల్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ప్రకాష్ రాజ్ , అతుల్ కులకర్ణి , సునీల్, కామాక్షి భాస్కర్ల, అనురాగ్ కశ్యప్ నటిస్తున్నారు. ఈ నెల 10న ఈ చిత్రం విడుదల కానుంది.బాలీవుడ్ దర్శక–నిర్మాత మన్సూర్ ఖాన్ కుమార్తె, నటుడు–దర్శక–నిర్మాత ఆమిర్ ఖాన్ మేనకోడలు జైన్ మేరీ ఖాన్(Zayn Marie Khan) . డెకాయిట్ చిత్రంతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఒక్క ఈవెంట్తోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పటికే బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించారు. కపూర్ అండ్ సన్స్ (2016), సీక్రెట్ సూపర్ స్టార్ (2017) వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా జైన్ పని చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ నిర్మించిన మిసెస్ సీరియల్ కిల్లర్ సినిమాతో జైన్ మేరీ ఖాన్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మోనికా ఓ మై డార్లింగ్(2022) మూవీలో ఛాన్స్ దక్కించుకుని మెప్పించారు. ఆకాష్ మొహిమెన్ను ప్రేమించి 2021లో ఆమె పెళ్లి చేసుకుంది. View this post on Instagram A post shared by Zayn Khan (@zaynmarie) -
10 ఏళ్లుగా ట్రోలింగ్.. ధోనికే తప్పలేదు, ఇంకేం చేస్తాం!: విఘ్నేశ్
చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో అభిమానులతో నిత్యం టచ్లో ఉంటారు. కానీ కొందరు మాత్రం తమ పనేదో తాము చేసుకుని పోతారు, సామాజిక మాధ్యమాలకు వీలైనంత దూరంగా ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో ఆన్లైన్లో తాము పెట్టే ఫోటోలు చూసి సంతోషపడేవారి కన్నా తిట్టుకునేవారే ఎక్కువయ్యారంటున్నాడు దర్శకుడు విఘ్నేశ్ శివన్.నా ఆన్సరేంటంటే..ఇతడు దర్శకత్వం వహించిన తాజా చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ప్రదీప్ రంగనాథన్, కృతీ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా విఘ్నేశ్ శివన్ ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడాడు. మన పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడితే ఏం వస్తుందని కొందరు ప్రశ్నిస్తుంటారు. దానికి నా సమాధానమేంటంటే.. ఇప్పుడు నేను, నయనతార, మా పిల్లలతో కలిసి ఓ ప్రదేశంలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేశామనుకోండి. అంతా మారిపోయింది!కాస్త దిగులుగా, డల్గా ఉన్నవాళ్లు ఆ పిక్స్ చూసినప్పుడు కాస్త ప్రశాంతంగా ఫీల్ అవొచ్చు. కానీ ఇప్పుడంతా మారిపోయిందిలెండి. ప్రతీదాన్ని ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ అనేది సర్వసాధారణమైపోయింది. నన్నయితే 10 ఏళ్లుగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయినా ఎంఎస్ ధోనిలాంటివారికే ఈ విమర్శలు తప్పలేవు. గతంలో ఐపీఎల్లో సరిగా ఆడనప్పుడు ఆయన్ని ఎంత విమర్శించారో! ఇది చాలా బాధాకరం.. కానీ మనమేం చేయగలం?నన్ను ఆడేసుకుంటున్నారుఇలాంటి కామెంట్లను లైట్ తీసుకోవడం తప్ప ఇంకేం చేయలేం. అప్పుడప్పుడూ ఈ ట్రోల్స్ గురించి నయన్, నేను సరదాగా మాట్లాడుకుంటాం. నిన్ను పెద్దగా ఏమీ అనట్లేదు కానీ నన్నయితే ఆడేసుకుంటున్నారు అని చెప్తుంటాను. ఇలా ట్రోల్స్ చేసేవారు ఎలాగో మారరు, కాబట్టి మనమే వాటిని తేలికగా తీసుకుని ముందుకు సాగాలి అని చెప్పుకొచ్చాడు.ప్రేమ- పెళ్లికాగా విఘ్నేశ్ శివన్ నానుమ్ రౌడీ ధాన్ (నేనూ రౌడీనే) సినిమాతో దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఈ మూవీలో నయనతార కథానాయికగా నటించింది. ఈ సినిమా సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. 2022 జూన్లో వీరు పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది సెప్టెంబర్లో సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారు.చదవండి: నేను మంచివాళ్లకే మంచివాడిని.. అనవసరంగా నాలో రాక్షసుడిని నిద్రలేపొద్దు: బిగ్బాస్ పవన్ -
నేను మంచివాళ్లకే మంచివాడిని, నాలోని రాక్షసుడు బయటకు వస్తే..!
డిమాన్ పవన్.. బిగ్బాస్ షోలో ఆటతో, మాట తీరుతో ఆకట్టుకున్నాడు. రీతూతో లవ్ ట్రాక్ ఒక్కటే అతడికి మైనస్ అయింది తప్ప టాస్కుల్లో విశ్వరూపం చూపించేవాడు. కానీ, ఎంత చేసినా అండర్రేటెడ్ కంటెస్టెంట్గానే మిగిలిపోయాడు. తన తండ్రికి క్యాన్సర్ ఉన్నప్పటికీ ఎప్పుడూ దాని గురించి చెప్పి సింపతీ పొందాలని ప్రయత్నించలేదు. కానీ ఫ్యామిలీ ఎపిసోడ్లో కన్నతండ్రిని స్టేజీపై చూసి మాత్రం కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు.ఇటీవలే తండ్రి మరణంబిగ్బాస్ 9 ఫైనల్స్లోనూ తండ్రి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం రూ.15 లక్షల సూట్కేస్ తీసుకుని సెకండ్ రన్నరప్ స్థానంలో ఉండగా బయటకు వచ్చేశాడు. అతడొకటి తలిస్తే విధి మరొకటి తలిచింది. కొద్దిరోజుల క్రితమే పవన్ తండ్రి క్యాన్సర్తో పోరాడుతూ కన్నుమూశారు. ఈ బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న పవన్.. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. టీవీ షోలలో పాల్గొంటున్నాడు. ట్రోలింగ్కు కౌంటర్అయితే కన్నతండ్రిని కోల్పోయిన బాధే కనిపించడం లేదు, సంతోషంగా నవ్వుతూ పోస్టులు పెడుతున్నాడంటూ పవన్ను ట్రోల్ చేశారు. ఈ ట్రోలింగ్పై పవన్ స్పందించాడు. చాలామంది నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అయినా నేను మౌనంగానే ఉన్నాను. నా తప్పు లేకపోయినా సరే కొంతవరకు నెగిటివిటీని, ద్వేషాన్ని నేను భరించగలను. కానీ నావాళ్లను ఇబ్బందిపెడితే మాత్రం నాలోని డిమాన్ (రాక్షసుడు)ని చూస్తారు. వాడిని మీరు తట్టుకోలేరు.మంచివాళ్లకే మంచివాడినిచాలామంది తెలియకుండానే ఏదో ఒక పొరపాటు చేస్తారు. కానీ, తర్వాతైనా తమ తెప్పు తెలుసుకుని మారతారని భావిస్తున్నాను. అందుకే చాలామటుకు అన్నింటినీ క్షమించేసి, నేను ప్రశాంతంగా ఉంటాను. నేను మంచివాళ్లకే మంచివాడిని.. ఇప్పటికైనా ఈ ట్రోలింగ్ను ఆపేస్తారని భావిస్తున్నాను అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. ఇది చూసిన అభిమానులు.. మీరేంటో మాకు తెలుసు.. ట్రోలర్స్ను పట్టించుకోవద్దని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Uppala Pavan Kumar (@demon_pavan) చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వస్తున్న సినిమాలివే! -
చరణ్, నాని.. షేర్ ఎవరు..?
ది ప్యారడైజ్ సినిమాలోని ఆయా షేర్ పాట ప్రేక్షకులను మెప్పించింది. యూట్యూబ్ లైక్ల విషయంలో రామ్ చరణ్ ‘పెద్ది’లోని ‘చికిరి చికిరి’ పాటను చాలా తక్కువ సమయంలోనే అధిగమించింది. డిజిటల్ వ్యూస్ పరంగా అరుదైన మైలురాయిని చేరుకుంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పెద్ది’. ఇందులోని ‘చికిరి చికిరి’ (Chikiri Chikiri) అంటూ సాగే ఈ పాట 24గంటల్లోనే 46 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక్కరోజులో ఇన్ని వ్యూస్ సాధించిన తొలిసాంగ్గా రికార్డు నెలకొల్పింది.ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘పెద్ది’ పాట (తెలుగు) నాలుగు నెలల్లో 13,32,838 లైక్లను సాధించింది. దీనితో పోలిస్తే, అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ‘ఆయా షేర్ (తెలుగు)’ పాట విడుదలైన కేవలం ఒక నెలలోనే 13,35,424 లైక్లను దాటింది. సంఖ్యాపరంగా ఈ వ్యత్యాసం స్వల్పంగా ఉన్నప్పటికీ లాంగ్ రన్లో మరింత ఈ నంబర్ పెరగవచ్చు. అయితే, వ్యూస్ పరంగా చికిరి పాట 197 మిలియన్లు సాధించి టాప్లో ఉంది... ఆయా షేర్ పాట 91 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. ‘చికిరి చికిరి’ పాటకు స్థిరమైన, దీర్ఘకాలిక ఆదరణ లభించగా, ‘ఆయా షేర్’ ప్రారంభంలో మాత్రమే జోరు చూపింది. అయితే, ఇప్పటికీ రామ్ చరణ్ చికిరి పాటనే టాప్లో కొనసాగుతుంది. పెద్ది సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుండగా.. ది ప్యారడైజ్ చిత్రం ఆగస్టు 21న రిలీజ్ కానుంది. -
ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అది డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి అడివి శేష్ 'డెకాయిట్'గా వస్తున్నాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఓ సినిమా చేశారు. అదే ఇది. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మూవీ ఫలితం ఏంటనేది చూడాలి. దీనితో పాటు ప్రదీప్ రంగనాథన్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ', టొవినో థామస్ 'పల్లి చట్టంబి' అనే డబ్బింగ్ మూవీస్ కూడా ఇదే వీకెండ్ బిగ్ స్క్రీన్స్పైకి రాబోతున్నాయి.(ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ సినిమా)మరోవైపు ఓటీటీల్లోనూ 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో రాధిక శరత్ కుమార్ 'తాయ్ కిళవి' అనే డబ్బింగ్ మూవీ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. తు యా మై, హాళ్ అనే పరభాషా చిత్రాలు కూడా పర్లేదనిపించేలా అనిపిస్తున్నాయి. ఇవి కాకుండా వీకెండ్ టైంలో సడన్ స్ట్రీమింగ్లు ఏమైనా ఉండొచ్చనిపిస్తోంది. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీలో రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఏప్రిల్ 6 నుంచి 12 వరకు)నెట్ఫ్లిక్స్బీఫ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 0818th రోజ్ (ఫిలిప్పినో మూవీ) - ఏప్రిల్ 09బిగ్ మిస్టేక్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 9త్రాష్ (ఇంగ్లీష్ చిత్రం) - ఏప్రిల్ 10తు యా మై (హిందీ సినిమా) - ఏప్రిల్ 10అమెజాన్ ప్రైమ్ద బాయ్స్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఏప్రిల్ 08క్యాండీ అండ్ ద పిజ్జా గర్ల్ (హిందీ మూవీ) - ఏప్రిల్ 10హాట్స్టార్తాయ్ కిళవి (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 10సోనీ లివ్తో తీ అని ఫుజీ (మరాఠీ మూవీ) - ఏప్రిల్ 10జీ5ఖాకీ సర్కస్ (తమిళ సిరీస్) - ఏప్రిల్ 10సన్ నెక్స్ట్హాళ్(మలయాళ సినిమా) - ఏప్రిల్ 10కనిమంగళం కొవిలకమ్ (మలయాళ చిత్రం) - ఏప్రిల్ 10ఆపిల్ టీవీ ప్లస్ఔట్కమ్ (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 10లయన్స్ గేట్ ప్లేవైల్డ్ క్యాట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 10(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా) -
రూమర్స్ వేళ ప్రేమ గురించి త్రిష కొటేషన్
కొద్దిరోజులుగా నటి త్రిష పేరు నెట్టింట వైరల్ అవుతుంది. టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్తో ఆమె సన్నిహితంగా ఉన్నారంటూ కోలీవుడ్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. ఆపై తమిళనాడు బీజేపీ నేత నాగేంద్రన్ త్రిషపై నోరుపారేసుకుని ఆ తర్వాత క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఒక నటితో విజయ్ సహజీవనం చేస్తున్నాడని ఆయన సతీమణి సంగీత సంచలన ఆరోపణలు చేయడంతో త్రిష పేరును కొందరు తెరపైకి తీసుకొచ్చారు. అలా తన ప్రేమేయం లేకుండానే త్రిషకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఆమె చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.త్రిష పట్ల ఇప్పటికీ రూమర్స్ వస్తున్న సమయంలో ప్రేమకు సంబంధించిన ఓ కోటేషన్ను సోషల్మీడియాలో త్రిష పోస్టు చేశారు. 'ప్రతిదీ ప్రేమ కాదు. కానీ, ప్రేమ లేకపోతే దేనికీ అర్థం లేదు' అని చెబుతూనే ‘ఫ్యాక్ట్’ (వాస్తవం) అని పేర్కొన్నారు. దీంతో నెట్టింట ఆ పోస్ట్ వైరల్ అవుతుంది. తనపై రూమర్స్ వస్తున్న సమయంలో ఇలాంటి కొటేషన్ను ఆమె ఎందుకు షేర్ చేశారని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) -
హగ్ చేసుకున్న యంగ్ హీరోపై నయన్ కామెంట్
నయనతార హీరోయిన్గా.. కవిన్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త మూవీ 'హాయ్'.. డాడా సినిమాతో కవిన్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పుడు ఏకంగా నయన్తో సినిమా ఛాన్స్ కొట్టేశాడు. ఈ కొత్త చిత్రాన్ని జి.స్టూడియోస్, ది రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి విష్ణుఎడవన్ కథ, దర్శకత్వం నిర్వహిస్తున్నారు. ఈయన దర్శకుడు లోకేష్ కనకరాజ్ వద్ద ఖైదీ, మాస్టర్, విక్రమ్ చిత్రాలకు అసోసియేట్గా పనిచేశారన్నది గమనార్హం. ఇందులో దర్శకుడు కె.భాగ్యరాజ్, ప్రభు, రాధిక, సత్యన్, ఆదిత్య కదిర్, ఖురేషి ఇతర సినీ ప్రముఖులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.దర్శకుడు లోకేశ్ కనకరాజ్ శిష్యుడిగా విష్ణు ఎడవన్ చాలా సినిమాలకు పనిచేశారు. అయితే, తొలిసారి దర్శకుడిగా హాయ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. కాగా ఈ చిత్రంలో జరిగిన ఒక సంఘటన గురించి దర్శకుడు విష్ణు ఎడవన్ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ ఇంతకు ముందు నయనతార నిర్మాతగా కవిన్ హీరోగా ఊర్కురువి అనే చిత్రం నిర్మించాల్సి ఉందన్నారు. అప్పుడే నయనతారకు కవిన్ తెలుసన్నారు. ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల ప్రారంభం కాలేదనీ, ఇప్పుడు నయనతార,కవిన్ నటిస్తున్న హాయ్ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు.ఈ చిత్రం తొలి రోజు షూటింగ్లో నయనతారను కవిన్ కౌగిలించుకునే సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు చెప్పారు. అయితే నయనతారను కౌగిలించుకోవడానికి కవిన్ సంకోశించారన్నారు. దీంతో ఇంతకు ముందు ఎవరినీ కౌగిలించుకోలేదా? అని ఆమె కవిన్ను సరదాగా ఆట పట్టించారన్నారు. ఇలా నయనతార సెట్లో ఉంటే జాలీగా ఉంటారని చెప్పారు. కాగా హాయ్ చిత్రం నిర్మాణ దశలో ఉంది. నయనతార నటించిన చిత్రాలు ఇటీవల తెరపైకి రాకున్నా, త్వరలో మలయాళంలో ముమ్ముట్టి, మోహన్లాల్లతో కలిసి నటించిన పెట్రియట్ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. తెలుగులో చిరంజీవికి జంటగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కాగా ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణ సరసన ఒక చిత్రం చేస్తున్న నయనతార హిందీలో సల్మాన్ఖాన్కు జంటగా ఒక చిత్రాన్ని కమిట్ అయ్యారు. ఇకపోతే తమిళంలో మన్నాంగట్టి, రాకాయి చిత్రాలు చేతిలో ఉన్నాయి. మలయాళంలో యశ్తో కలిసి నటించిన టాక్సిక్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది.ఇలా పలు భాషల్లో నటిస్తూ నయనతార బిజీగా ఉన్నారు. ఇక ఈమె తన భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో నిర్మించిన ఎల్ఐకే చిత్రం ఈ నెల 10న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. -
నిద్రపోవద్దు!
‘నిద్రపోవద్దు. ఎంత ఎక్కువ సేపు నిద్రపోతే అతను అంత దగ్గరవుతాడు అంటోంది’ వి డ్రీమ్ ఫిల్మ్స్ సంస్థ. మమ్ముట్టి లీడ్ రోల్లో మలయాళ–తమిళ ద్విభాషా థ్రిల్లర్ ‘స్ట్రీట్ లైట్స్’కి దర్శకత్వం వహించిన సినిమాటోగ్రాఫర్ షామ్దత్ దర్శకత్వంలో ఈ సంస్థ ‘డోంట్ స్లీప్’ టైటిల్తో ఓ సినిమా నిర్మిస్తోంది.ఈ తెలుగు చిత్రానికి ‘ది లాంగర్ యు స్లీప్, ది క్లోజర్ హీ గెట్స్’ (ఎంత ఎక్కువసేపు నిద్రపోతే అతను అంత దగ్గరవుతాడు) అనేది ట్యాగ్లైన్. ‘చౌర్య పాఠం’ ఫేమ్ ఇంద్ర రామ్ హీరోగా రూపొందుతున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ని విజయ్ సేతుపతి ఆవిష్కరించారు. ‘‘ఎమోషనల్గా సాగే ఈ చిత్రం టెక్నికల్గానూ గొప్పగా ఉంటుంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
వినోదాల సత్తిబాబు
‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో ఇటీవలే సూపర్ హిట్ అందుకున్న హీరో సంతోష్ శోభన్ కొత్త సినిమాకు ‘సత్తిబాబు పరలోక యాత్ర’ అనే టైటిల్ ఖరారైంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘స్వాతిముత్యం’ ఫేమ్ లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకత్వం వహించనున్నారు.యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఏఆర్ ఫిలింస్ ఈ సినిమాను నిర్మించనుంది. కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను జూన్ మొదటివారంలో ప్రారంభిస్తామని, త్వరలోనే ఇతర వివరాలను వెల్లడిస్తామని యూనిట్ పేర్కొంది. -
అంబులెన్స్ నడపడం సవాల్ అనిపించింది: మృణాల్ ఠాకూర్
‘‘సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులు నన్ను తెలుగు అమ్మాయిగా అంగీకరించారు. నేను మంచి పాత్రలు చేస్తాననే నమ్మకం వారిలో ఏర్పడింది. ‘డెకాయిట్’లో చేసిన సరస్వతి పాత్ర కూడా అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అన్నారు మృణాల్ ఠాకూర్. అడివి శేష్, మృణాల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా, సునీల్ నారంగ్ సహ–నిర్మాతగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం విలేకరుల సమావేశంలో మృణాల్ ఠాకూర్ చెప్పిన విశేషాలు. ⇒ ‘డెకాయిట్’ ఓ డిఫరెంట్ లవ్స్టోరీ మూవీ. ఈ చిత్రంలో నేను సరస్వతి పాత్రలో, హరి పాత్రలో శేష్ నటించాం. హరి, సరస్వతి ఎందుకు డెకాయిట్స్గా మారారనేది సినిమాలో చూడాలి. సరస్వతి క్యారెక్టర్ నాకో సవాల్. ఈ సినిమా కోసం కొన్ని స్టంట్, చేజింగ్, డ్రైవింగ్ సన్నివేశాలు చేశాను. అంబులెన్స్ కూడా నడిపాను. చాలా స్పీడ్గా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఈ వెహికల్కు హ్యాండ్ బ్రేక్ లేదు. ఇలాంటి రిస్కీ సీన్స్ కూడా చేశాను. ⇒ ‘సీతారామం, హాయ్.. నాన్న, ఫ్యామిలీ స్టార్’లను తెలుగులోనే తీశాం. కానీ ‘డెకాయిట్’ను తెలుగు, హిందీ భాషల్లో చేశాం. నాకైతే తక్కువ రెమ్యునరేషన్తో రెండు సినిమాలు చేసిన ఫీలింగ్ కలిగింది (సరదాగా). ఈ సినిమాలో ఓ సీన్లో బురదలో నటించాల్సి వచ్చింది. కానీ మేకర్స్ నా ఫేస్ గురించి ఆలోచించి బురద బదులు చాక్లెట్ను ప్లాన్ చేశారు. ఇలా చాలా కేరింగ్గా చూసుకున్నారు. షానియల్గారు అద్భుతమైన డైరెక్టర్. ఓ మంచి సినిమా చేసిన ఫీలింగ్ నాకు ఉంది. -
ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది: ‘దిల్’ రాజు
‘‘ఒక అప్లికేషన్ (యాప్) బ్యాక్డ్రాప్తో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా తీశారు. కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ప్రదీప్ హీరోగా, దర్శకుడిగా వరుస విజయాలు సాధిస్తున్నాడు. విఘ్నేష్ శివన్ డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తారు. ఈ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ని ప్రేక్షకులు ఆదరించి, సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని ‘దిల్’ రాజు చెప్పారు. ప్రదీప్ రంగనాథన్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో నయనతార నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది.శ్రీ పద్మినీ సినిమాస్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు నిర్మాత ‘దిల్’ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ తెలుగు వెర్షన్ చూశాను... చాలా ఎంజాయ్ చేశాను. 2040లో మనం టెక్నాలజీపై ఎంత ఆధారపడతామో ఈ సినిమాలో చాలా కొత్తగా చూపించారు’’ అని చెప్పారు. ‘‘మన రిలేషన్షిప్స్, ఎమోషన్స్, ఆరోగ్యం... ఇలా అన్నింటికీ ఫోన్ పైనే ఆధారపడుతున్నాం.మనుషుల కంటే మిషన్స్పైనే నమ్మకం పెరుగుతోంది. మిషనే పెళ్లి ఎవరితో అవ్వాలో కూడా చెప్పే స్థితి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఒక అప్లికేషన్ మనకి సరైన పార్ట్నర్ ఎవరో చెబితే? దాన్ని నమ్మగలమా? ఇదే ఈ సినిమా ప్రధాన కథాంశం’’ అని చెప్పారు ప్రదీప్ రంగనాథన్. ‘‘ఈ చిత్రంలో నటనకు అవకాశం ఉన్న ధీమా పాత్ర చేశాను’’ అన్నారు కృతీ శెట్టి. ‘‘మంచి కాన్సెప్ట్తో తీసిన ప్రయోగాత్మక చిత్రం ఇది’’ అన్నారు విఘ్నేష్ శివన్. డిస్ట్రిబ్యూటర్ శివప్రసాద్, నిర్మాత హరిప్రసాద్ పాల్గొన్నారు. -
కియారా మదర్ గ్లో.. శర్మ సిస్టర్ గ్లామర్!
బిడ్డ పుట్టినా సరే అందంలో కియారా తగ్గదే లేతమ్ముడి గురించి ప్రియా వారియర్ క్యూట్ పోస్ట్'డెకాయిట్' షూటింగ్ జ్ఞాపకాలతో మృణాల్మత్తెక్కించే చూపులతో అనికా సురేంద్రన్అందచందాలతో మాయ చేస్తున్న ఐషా శర్మచీరలో అందంగా ముస్తాబైన సప్తమి గౌడ View this post on Instagram A post shared by Lakshmi Lehr (@lakshmilehr) View this post on Instagram A post shared by Sapthaami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Aisha (@aishasharma25) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) -
నిశ్చితార్థం చేసుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. కావ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నాడు. హైదరాబాద్లోని ఓ రిసార్ట్లో ఈ శుభకార్యం జరిగింది. కాబోయే వధూవరులిద్దరూ కలర్ఫుల్ దుస్తుల్లో మెరిసిపోయారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ సినిమా)ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ పెద్ద కొడుకు శ్రీనివాస్.. హీరోగా పలు సినిమాలు చేస్తున్నాడు. అల్లుడు శ్రీను మొదటి మూవీ కాగా.. గతేడాది 'కిష్కింధపురి' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ప్రస్తుతం మూడు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు.శ్రీనివాస్కి కాబోయే సతీమణి కావ్య రెడ్డి విషయానికొస్తే హైదరాబాద్ అమ్మాయి. తాత జడ్జి కాగా తండ్రి లాయర్. ఇది పెద్దల కుదిర్చిన ప్రేమ వివాహం అని తెలుస్తోంది. మార్చిలో తనకు కాబోయే భార్య అని కావ్య రెడ్డిని పరిచయం చేశాడు. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకోగా.. 29వ తేదీన తిరుపతిలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సింపుల్గా పెళ్లి జరగనుంది.(ఇదీ చదవండి: కాలి నడకనే తిరుమలకు ఎందుకు వెళ్తానంటే?: జాన్వీ కపూర్) -
హీరోయిన్ శ్రీజ ఆల్బమ్ సాంగ్ లాంచ్
యంగ్ హీరోయిన్ శ్రీజ నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఆల్బమ్ సాంగ్ 'కొత్త కొత్తగా'. తాజాగా ఇది రిలీజైంది. ఇందులో 'దేవగుడి' మూవీ ఫేమ్ హీరో అభినవ్ శౌర్య కూడా నటించారు. రఘురామ్ ఈ పాటకు లిరిక్స్ రాసి సంగీతమందించారు. లిప్సిక పాడారు. ఈ సాంగ్ ఆల్బమ్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో తాజాగా జరిగింది.(ఇదీ చదవండి: తక్కువ టైంలో చాలామందిని కోల్పోయా.. భరించడం నా వల్ల కాలేదు: యాంకర్ రష్మి)మా 'కొత్త కొత్తగా' సాంగ్ లాంచ్ చేసిన ప్రొడ్యూసర్ డీవై చౌదరికి థ్యాంక్స్ చెబుతున్నా. 'రంగస్థలం'లో సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. తర్వాత మరికొన్ని మూవీస్ చేశారు. టీవీ ఛానెల్స్లో షోలు కూడా చేశాను. శ్రీజ మ్యూజిక్ ఛానెల్లో మేం చేసిన సాంగ్స్ అన్నీ మంచి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఇది చేశాం అని శ్రీజ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: జరిగిన దానికి సిగ్గుపడుతున్నా.. కూర్చుని మాట్లాడుకోవాల్సింది: విఘ్నేశ్ శివన్) -
జరిగిన దానికి సిగ్గుపడుతున్నా.. కూర్చుని మాట్లాడుకోవాల్సింది
తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్, హీరో ధనుష్ ఒకప్పుడు కలిసి సినిమాలు తీశారు. కానీ ఇప్పుడు వీళ్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత కోపం మాత్రమే ఉంది. దానికి కారణం నయనతార పెళ్లి డాక్యుమెంటరీ. ఇది రిలీజైన టైంలో జరిగిన హంగామా ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నయన్తో పాటు ఈమె భర్త విఘ్నేశ్ శివన్.. ధనుష్ని టార్గెట్ చేస్తూ చాలా విమర్శలు చేశారు. ఇప్పుడు చాన్నాళ్లకు వాటిపై విఘ్నేశ్ శివన్ స్పందించాడు. ధనుష్తో స్నేహం చెడిపోవడం తన జీవితంలోనే అతిపెద్ద పశ్చాత్తాపం అని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: యాప్ చెప్పిందని బ్రేకప్.. ఫన్నీగా LIK ట్రైలర్)'ధనుష్ అంటే చాలా ఇష్టం. జూలై 28న ఆయన పుట్టినరోజు. అదేరోజు మా నాన్న చనిపోయారు. దీంతో ధనుష్లో నాన్నని చూసుకున్నాను. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే, ఇలాంటి జీవితం గడుపుతున్నానంటే దానికి ముఖ్య కారణం ఆయనే. వీఐపీ (రఘువరన్ బీటెక్) సినిమా షూటింగ్ టైంలో రెండేళ్లు ఆయనతోనే ఉన్నాను. ఆయన తిన్న తర్వాతే తినేవాడిని. ఒకప్పుడు మా మధ్య అంత అనుబంధం ఉండేది. కాకపోతే ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ లేదు. జరిగిన దానికి చాలా సిగ్గుపడుతున్నాను. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా సమస్య ఉంటే కూర్చుని మాట్లాడుకుంటే సరిపోయేది. కానీ అలాంటిదేం జరగలేదు. దూరం ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. ధనుష్తో స్నేహం కోల్పోవడం నా జీవితంలో పెద్ద పశ్చాత్తాపం' అని తాజా ఓ ఇంటర్వ్యూలో విఘ్నేశ్ శివన్ తన మనసులోని బాధని బయటపెట్టాడు.అసలేంటి వివాదం?విఘ్నేశ్ శివన్ తీసిన రెండో సినిమా 'నానుమ్ రౌడీ దాన్'కి ధనుష్ నిర్మాత. విజయ్ సేతుపతి, నయనతార ఇందులో హీరోహీరోయిన్లుగా నటించారు. తెలుగులోనూ నేను రౌడీనే' పేరుతో దీన్ని రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ షూటింగ్ టైంలో విఘ్నేశ్, నయనతార ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని 2022లో పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ, పెళ్లిని చూపిస్తూ 'నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్' పేరుతో ఓ డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు. అయితే ఈ డాక్యుమెంటరీ.. తన నిర్మించిన 'నానుమ్ రౌడీ దాన్' సీన్స్ ఉండటంపై ధనుష్ టీమ్ అభ్యంతరం వ్యక్తం చేసింది.నిర్మాత అనుమతి లేకుండా సీన్స్ ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నిస్తూ పిటిషన్ వేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నయనతార ఓ లెటర్ రిలీజ్ చేసింది. డాక్యుమెంటరీలో కేవలం మూడు సెకన్ల ఫుటేజీ ఉపయోగించినందుకు ధనుష్ ఏకంగా రూ.10 కోట్ల పరిహారం డిమాండ్ చేశాడని చెప్పుకొచ్చింది. ఇది ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించింది. ఇది జరుగుతున్న టైంలో విఘ్నేష్ శివన్ కూడా ధనుష్ని విమర్శిస్తూ ఇన్ స్టాలో పలు పోస్టులు పెట్టాడు. తర్వాత వాటిని డిలీట్ చేశాడు. ఇది జరిగిన తర్వాత విఘ్నేశ్-ధనుష్ స్నేహం బ్రేక్ అయింది. ఇప్పుడు ఇన్నాళ్లకు అప్పటి సంగతులని గుర్తుచేసుకున్న విఘ్నేశ్.. పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'.. ఈ శుక్రవారమే(ఏప్రిల్ 10) థియేటర్లలోకి రానుంది. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. నయనతార ఓ నిర్మాతగా వ్యవహరించింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగానే ధనుష్తో వివాదం గురించి స్పందించాడు.(ఇదీ చదవండి: తక్కువ టైంలో చాలామందిని కోల్పోయా.. భరించడం నా వల్ల కాలేదు: యాంకర్ రష్మి) -
'విచిత్ర' ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన విఎన్.ఆదిత్య
సిస్ ఫిలిమ్స్ బ్యానర్పై సైఫైద్దీన్ మాలిక్ దర్శకుడిగా నిర్మాతగా రూపొందించిన సినిమా 'విచిత్ర'. దీని ఫస్ట్ లుక్ని దర్శకుల సంఘం అధ్యక్షుడు విఎన్ ఆదిత్య చేతుల మీదుగా ఆదివారం రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ సినిమా)ఈ సినిమాలో జ్యోతి పూర్వజ్, రవి , శ్రేయ తివారి, బేబీ శ్రీ హర్షిణి, రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతికి శేఖర్, జబర్దస్త్ అప్పారావు, త్రినాథ్, సత్తిపండు, బాబీ తదితరులు నటించారు. నిజాని అంజన్ సంగీతమందించారు. వచ్చే నెల 22వ తేదీన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: రొమాన్స్ కష్టంగా అనిపించింది: మృణాల్) -
‘డెకాయిట్’లో రొమాన్స్ కష్టంగా అనిపించింది: మృణాల్
అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 10న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ బట్టి చూస్తే..ఇది లవ్స్టోరీతో కూడిన యాక్షన్ సినిమా అని అర్థమవుతుంది. ఇందులో హరి పాత్రలో హీరో అడివి శేష్, సరస్వతి పాత్రలో మృణాల్ ఠాకూర్ కనిపించనున్నారు. అయితే మృణాల్ తొలిసారి ఇందులో యాక్షన్ సీన్స్ కూడా చేసింది. అంతేకాదు ఓ పాపకు తల్లిగానూ నటించింది. అయితే ఈ సన్నివేశాలన్నీ ఈజీగానే చేసింది కానీ.. రొమాన్స్ సీన్సే కాస్త ఛాలెంజింగ్గా అనిపించాయట. ఈ విషయాన్ని స్వయంగా మృణాలే చెప్పింది. డెకాయిట్ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఆదివారం మృణాల్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో ఛాలెంజింగ్గా అనిపించిన సన్నివేశాలేంటని ఓ విలేకరి అడగ్గా.. ఈ విధంగా సమాధానం ఇచ్చింది. ‘యాక్షన్ సీన్లు నాకు ఇబ్బంది కాలేదు కానీ.. రొమాన్స్ సన్నివేశాలే ఛాలెంజింగ్గా అనిపించాయి. ఇదొక డిఫరెంట్ లవ్స్టోరీ సినిమా. ఇందులో హీరోపై కోపం ఉన్నప్పటికీ.. పాస్ట్లో ప్రేమగా ఉండాలి. రొమాన్స్ చేయాలి. అలా నటించడం నాకు సవాల్గా అనిపించింది. సరస్వతి పాత్ర నా కెరీర్లో గుర్తుండిపోతుంది’ అన్నారు. ఇక స్టోరీ నచ్చడంతో ఈ సినిమాకు పారితోషికం కూడా తగ్గించుకున్నట్లు మృణాల్ చెప్పుకొచ్చింది. -
వామ్మో జ్యోతిక.. ఆ జిమ్ వర్కవుట్స్ ఏంటి?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సతీమణి జ్యోతిక గురించి పరిచయం అక్కర్లేదు. 1997లో హిందీ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అజిత్ హీరోగా నటించిన వాలి చిత్రంతో కోలీవుడ్లో అడుగుపెట్టింది. తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత వరుస సినిమాలతో మెప్పించింది. తమిళంతో పాటు తెలుగు,హిందీ సినిమాల్లో స్టార్ హీరోయిన్గా రాణించింది. రెండు దశాబ్దాలకు పైగా నటిస్తూ ఎవర్ గ్రీన్ హీరోయిన్గా తన కెరీర్లో దూసుకెళ్లింది. ఆ తర్వాత 2006లో సూర్యను పెళ్లాడింది ఈ ముద్దుగుమ్మ. సూర్య, జ్యోతిక దంపతులకు దేవ్ అనే కొడుకు, దియా అనే కూతురు ఉన్నారు. ప్రస్తుతం వీరి పిల్లలు ముంబయిలో చదువుతున్నారు.ప్రస్తుతం సినిమాలేవీ చేయకపోయినా.. జ్యోతిక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది. తాజాగా తన జిమ్ వర్కవుట్ వీడియోను ఇన్స్టాలో వీడియో షేర్ చేసింది. ఇందులో పలు రకాల కసరత్తులు చేస్తూ జ్యోతిక కనిపించింది. ఈ స్టన్నింగ్ వర్కవుట్స్ చూస్తుంటే జ్యోతిక ఫిట్నెస్పై ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన అభిమానులు వావ్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం జ్యోతిక రెండు వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
కొత్త అనుభూతిని పంచేలా ‘డైమండ్ డెకాయిట్’
పార్థ గోపాల్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘డైమండ్ డెకాయిట్’. సూర్య జి. యాదవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మేఘన హీరోయిన్. ఈ నెల 10న ఈ చిత్రం విడుదల కానుంది.. ఈ చిత్రం టైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వాకాడ అప్పారావు, నిర్మాత శిరీష్ రెడ్డి, నటుడు శివాజీ రాజా పాల్గొని, ‘డైమండ్ డెకాయిట్’ విజయం సాధించాలని ఆకాంక్షించారు. పార్ధ గోపాల్ మాట్లాడుతూ–‘‘సస్పెన్స్, ఎమోషన్స్, థ్రిల్... ఇలా అన్నీ కలిసిన పూర్తి ఎంటర్టైనర్ ‘డైమండ్ డెకాయిట్’. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’’ అని తెలిపారు. ‘‘వైవిధ్యమైన కథాంశంతో మా సినిమా తీశాం. థియేటర్లో వీక్షించి, యూనిట్ని సపోర్ట్ చేయాలి’’ అని సూర్య జి. యాదవ్ పేర్కొన్నారు. -
డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ సినిమా
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి చాలానే సినిమాలొచ్చాయి. మృత్యుంజమ్, సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని, ఎస్.సరస్వతి అనే తెలుగు చిత్రాలతో పాటు ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్', 4వ అధ్యాయం లాంటి డబ్బింగ్ మూవీస్ కూడా ఓటీటీల్లోకి వచ్చేశాయి. ఇప్పుడు వీటితోపాటు ఓ తెలుగు హారర్ సినిమా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్.. ప్రేమజంటని వెంటాడే మొసలి)మదనపల్లెలో తీసిన ఈ సినిమాలో సంతోశ్, సయ్యద్ ఆజం, గౌష్ బాషా, మళ్లీశ్వరమ్మ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. శివాజీ, సురేశ్ దర్శకత్వం వహించారు. ఇప్పుడీ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్లోకి వచ్చేసింది. కాకపోతే ప్రస్తుతం అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా) -
కాలి నడకన తిరుమలకు.. ఎందుకు వెళ్తానంటే?
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్గా అభిమానులను మెప్పించనుంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేయగా.. రామ్ చరణ్ రెజ్లర్ లుక్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జాన్వీకపూర్కు తిరుమలను తరచుగా సందర్శిస్తూ ఉంటారు. అమ్మ శ్రీదేవి బాటలోనే ప్రతి ఏటా తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఎప్పుడు తిరుమలకు వెళ్లినా కాలి నడకనే కొండపైకి చేరుకుంటుంది జాన్వీ. సెలబ్రిటీ అయినప్పటికీ కాలి నడకన వెళ్లేందుకే ప్రాధాన్యత ఇస్తుంది. దీని వెనుక గల ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది బాలీవుడ్ బ్యూటీ.తాను తిరుమలకు కాలి నడకన వెళ్లేందుకు గల కారణాలను వివరించింది జాన్వీ కపూర్. తాజాగా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకుంది. కాలినడకన ప్రయాణించడం వల్ల కలియుగ దైవం బాలాజీకి మరింత దగ్గరైనట్లు అనిపిస్తుందని తెలిపింది. ఇలాంటి ఆధ్యాత్మిక అనుభవమని తనకు చాలా ఇష్టమని పేర్కొంది. భక్తితో మెట్లు ఎక్కి ఇష్టదైవమైన శ్రీవారి చెంతకు చేరడాన్ని ఒక గొప్ప సౌభాగ్యంగా భావిస్తానని జాన్వీ కపూర్ వెల్లడించింది. -
సంతోశ్ శోభన్ రాకాస.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
మ్యాడ్ హీరో సంతోష్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన మరో సినిమా 'రాకాస'. ఈ సినిమాను నిహారిక తన సొంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ మూవీతో మానస శర్మ అనే అమ్మాయి దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చింది. హారర్ కామెడీ కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 3న థియేటర్లలోకి రిలీజైంది.ఈ చిత్రానికి తొలి రోజు పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపించింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.5.6 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. రెండో రోజు కూడా ఈ సినిమా అదే జోరు కొనసాగించింది. వీకెండ్ కలిసి రావడంతో రెండు రోజుల్లో రూ.10.30 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. This isn’t just a run… it’s a full-blown festival in theatres. 🎬✨#Rākāsā crosses a solid 10.30 CR worldwide in just 2 days — powered by packed houses, whistles, and non-stop laughs. 😎❤️🔥Lights on, confetti up… and the box office joins the celebration. 🎉🔥Don't miss out… pic.twitter.com/w4R7Z6OS3a— Pink Elephant Pictures (@PinkElephant_P) April 5, 2026 -
ఈ సినిమాలో విజయ్ను ఢీ ఫేమ్ చేయలేదు!
ఇటీవల టీఎన్ 2026 చిత్రం గురించి చాలా వివాదాస్పద చర్చ జరుగుతున్న విషయం తెలిసింది. కారణం ఈ చిత్రంలో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ను వ్యంగ్యాస్త్రాలతో విమర్శించే సన్నివేశాలు చోటుచేసుకున్నాయని ఆరోపణల వచ్చాయి. ఇటీవల ఈ చిత్ర టీజర్ను విడుదల చేశారు. అందులో హీరోగా నటించిన నట్టి గెటప్ విజయ్ను పోలి ఉంది. దీంతో టీవీకే పార్టీ చెన్నై విల్లివాక్కం నియోజకవర్గంలో ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అధవ్అర్జున్ టీఎన్–2026 చిత్రంపై విమర్శలు చేశారు. విజయ్ను పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగించడానికి ఈ చిత్రాన్ని ఎన్నికలకు కొద్ది వారాల ముందే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని అయితే ఈ చిత్రాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కన్నన్ గ్రూప్ పతాకంపై కన్నన్రవి, కందన్రవి, దీపక్ రవి నిర్మించిన చిత్రం టీఎన్ 2026. తంబిరామయ్య కథను సమకూర్చిన ఈ చిత్రానికి ఆయన వారసుడు, అర్జున్ సర్జా అల్లుడు ఉమాపతి రామయ్య దర్శకత్వం వహించారు. నట్టి కథానాయకుడిగా నటించిన ఇందులో శ్రితరావు నాయకిగా నటించారు తంబిరామయ్య, ఎంఎస్ భాస్కర్, ఇళవరసు, చాందిని తమిళరసన్, యాషిక ఆనంద్, విజీ చంద్రశేఖర్ ముఖ్యపాత్రలు పోషించారు. తర్బకా శివ సంగీతాన్ని, ముత్తయ్య చాయాగ్రహణం అందించారు. ఈనెల 10న తెరపైకి రానుంది. శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ఏఆర్ఎస్ గార్డెన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తంబిరామయ్య మాట్లాడుతూ టీఎన్ 2026 చిత్రం ఏ రాజకీయ పార్టీని విమర్శించే విధంగా ఉండదని పేర్కొన్నారు. అధవ్ అర్జున తమ చిత్రం గురించి తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆయన చిత్రం చూడాలని అన్నారు. విజయ్ సింహం అని, ఆయన్ని ఎవరూ విమర్శించలేరని తంబిరామయ్య పేర్కొన్నారు. ఈ చిత్రంలో విజయ్ను ఢీ ఫేమ్ చేయలేదని నట్టి పేర్కొన్నారు. -
'అశ్లీల సైట్లో నా ఫోటోలు.. బాయ్స్ చూసేవారు'
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్గా అభిమానులను మెప్పించనుంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేయగా.. రామ్ చరణ్ రెజ్లర్ లుక్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన టీనేజ్లో జరిగిన చేదు అనుభవాన్ని పంచుకుంది. తనకు 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ అశ్లీల సైట్లో తన మార్ఫింగ్ చిత్రాన్ని చూశానని షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. తాను పాఠశాలలో ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగిందని జాన్వీ కపూర్ గుర్తుచేసుకున్నారు. మా క్లాస్లో కొందరు అబ్బాయిలు సరదా కోసం అలాంటి సైట్స్ చూసేవారని.. ఆ సమయంలో నా ఫోటోలు చూశానని తెలిపింది. నేను చదివే పాఠశాలలోనే ఇలా జరగడంతో చాలా వింత అనుభవాన్ని ఎదురైందని జాన్వీ కపూర్ వివరించింది.ఆ సమయంలో తాను ఆ పరిస్థితిని సర్దుకుపోవడానికి ప్రయత్నించానని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. అలా నా ఫోటోలు చూశాక సోషల్ మీడియాకు సంబంధించి ఇలాంటి చాలా విషయాలలో నైతికత లేదని అనిపించిందని జాన్వీ తెలిపింది. అయితే ఇప్పుడు వాటిపై తన దృక్పథం మారిందని.. ఏఐ (AI) రూపొందించిన ఈ చిత్రాలు ఈ రోజుకు తనను ప్రభావితం చేస్తున్నాయని జాన్వీ కపూర్ తన బాధను పంచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో తనకు సంతోషం అనేది లేదని జాన్వీ వెల్లడించింది. ఏఐ రూపొందించిన తన ఫోటోలు ఆన్లైన్లో ప్రచారంలో ఉన్నాయని.. కొన్నిసార్లు అధికారిక వార్తా పేజీలు కూడా వాటిని షేర్ చేస్తున్నాయని వివరించింది. ఇలాంటి మార్ఫింగ్, ఏఐ ఫోటోల్లో తాను ఎప్పుడూ ధరించని దుస్తులు, పోజులు ఉన్నాయని జాన్వీ కపూర్ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఇలా సినీతారల ఫోటోలను మార్ఫింగ్ చేసేవారిపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని సినీ ప్రియులు కోరుతున్నారు. -
వేణు ఊడుగుల కొత్త సినిమా.. ఈ సారి బ్రదర్ ఎమోషన్!
ఒకవైపు దర్శకుడిగా వైవిధ్యమైన సినిమాలు చేస్తూనే.. నిర్మాతగానూ దూసుకెళ్తున్నాడు వేణు ఊడుగుల. ఆయన నిర్మించిన రాజు వెడ్స్ రాంబాయి చిత్రం భారీ కలెక్షన్స్తో బోలెడు అవార్డులను సొంతం చేసుకుంది. ఆయన సమర్పణలో మరో వైవిధ్యమైన చిత్రం రాబోతుంది. ప్రముఖ అడ్వకేట్ , రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించిన డా.నాగేశ్వరరావు పూజారి తన ‘సైన్మా స్టూడియోస్’ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.పీవీఎన్ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు నిర్మాత డా.నాగేశ్వరరావు పూజారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ఈ మూవీ అనౌన్స్ మెంట్ తో పాటు పోస్టర్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.ఈ పోస్టర్ లో ఒక అమ్మాయి కంటిని, ఆ కంటిలో ఇద్దరు బ్రదర్స్ సైకిల్ పై వెళ్తుండటం చూపించారు.‘గుణం, గణం, నీతో రణం - ఇది తథ్యం’.. ఇద్దరు సోదరుల భావోద్వేగభరితమైన కథ ’ అంటూ వేణు ఊడుగుల ఈ పోస్టర్ని ట్వీట్ చేశాడు. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ వెల్లడించనున్నారు. -
‘గేదెల రాజు’లో హీరోలు.. విలన్లు లేరు
‘‘మేం ఎన్ని చెప్పినా ప్రేక్షకుల్ని థియేటర్స్కి రప్పించేది కంటెంట్ మాత్రమే. మూవీలో కంటెంట్ ఉందని ఆడియన్స్ అనుకుంటే తప్పకుండా ఆదరిస్తారు. మా ‘గేదెల రాజు’లో మంచి కంటెంట్ ఉందని మేము నమ్ముతున్నాం... మా సినిమాని సక్సెస్ చేయండి’’ అని సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె చెప్పారు. చైతన్య మోటూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘గేదెల రాజు’. రవి ఆనంద్ చిన్నిబిల్లి, రామచంద్రం, శ్రావ్య, వికాశ్, మౌనిక కీలక పాత్రల్లో నటించారు. రఘు కుంచె నటించి, సమర్పించిన చిత్రమిది. వాణి రవికుమార్ మోటూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్లో చైతన్య మోటూరి మాట్లాడుతూ–‘‘మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్గా ఈ సినిమా ఉంటుంది. మా మూవీలో హీరోలు, విలన్స్ ఉండరు... పాత్రలు మాత్రమే ఉంటాయి’’ అని తెలిపారు. ‘‘మా అబ్బాయి చైతన్య మోటూరికి సినిమా మీద ఉన్న ప్యాషన్ను ఎంకరేజ్ చేయాలని ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు వాణి రవికుమార్ మోటూరి. -
థియేటర్లో శర్వానంద్ సాష్టాంగ నమస్కారం
టాలీవుడ్ హీరో శర్వానంద్ - రాజశేఖర్ కలిసి నటించిన కొత్త సినిమా ‘బైకర్’. ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. దీంతో చిత్ర యూనిట్తో పాటు శర్వానంద్ కూడా థియేటర్స్లోని తమ ఫ్యాన్స్ను కలుసుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని శ్రీరాములు థియేటర్లో అభిమానులను చూసిన శర్వానంద్ భావోద్వేగానికి గురైయాడు.ఆదివారం కావడంతో శ్రీరాములు థియేటర్ ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. శర్వానంద్ సినిమా మధ్యలో థియేటర్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ హర్షధ్వానాలు పలికారు. అయితే, వేదికపై వచ్చిన శర్వానంద్ మైక్ పట్టుకుని మాట్లాడకుండానే తనను ఈ రేంజ్కు తెచ్చిన వెండితెరకు సాష్టాంగ నమస్కారం చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. తనకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు శర్వానంద్ ధన్యవాదాలు తెలిపారు.భారతీయ తొలి మోటోక్రాస్ రేసింగ్ సినిమాగా ‘బైకర్’ చిత్రాన్ని దర్శకుడు అభిలాష్ రెడ్డి తెరకెక్కించారు. ఇందులో శర్వానంద్కు జంటగా మాళవిక నాయర్ నటించారు. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. Hero Sharwanand @ImSharwanand bows to the big screen at a housefull Sreeramulu theatre after the blockbuster success of #Biker pic.twitter.com/P1AfshkOhH— The Cine Gossips (@TheCineGossips) April 5, 2026 -
టోవినో థామస్ కొత్త సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్
మలయాళ స్టార్ టోవినో థామస్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ పల్లి చట్టంబి. ఈ సినిమాకు డీజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా పల్లి చట్టంబి ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రాన్ని పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 1950 దశకంలో కేరళలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. -
జయమ్మ కోసం రణబాలి శుభాకాంక్షలు
నటి రష్మిక మందన్న పుట్టినరోజు సందర్బంగా రణబాలి మూవీ టీమ్ ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. ఆమెకు శుభాకాంక్షలు చెబుతు మేకింగ్ వీడియోను షేర్ చేసింది. ఈ క్రమంలో రష్మిక భర్త విజయ్ దేవరకొండ కూడా ఆ వీడియోను షేర్ చేస్తూ ఐ లవ్ యూ జయమ్మ అని క్యాప్షన్ ఇచ్చారు. వీరిద్దరి పెళ్లి తర్వాత ఈ చిత్రం రానున్నడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.టాక్సీవాలా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ మరోసారి హిట్ కొట్టేందుకు బలమైన కథన రెడీ చేసుకున్నాడు. టీ సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్తో ఈ మూవీని నిర్మిస్తోంది. 1854 - 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనలను ఆధారం చేసుకుని ఈ మూవీ రానుంది. మాతృభూమి కోసం తెల్లదొరలపై తిరుగుబాటు చేసే యోధుడిగా విజయ్ కనిపించనున్నారు. -
'అది కూడా మీరే చెప్పండి'.. జీవిత రాజశేఖర్ ఆగ్రహం
హీరో రాజశేఖర్ తాజాగా బైకర్ మూవీతో టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చారు. శర్వానంద్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇండియాలోనే తొలి స్పోర్ట్స్ మోటోక్రాస్ రేసింగ్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు తొలిరోజే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో మేకర్స్ బైకర్ సినిమా సక్సెస్ను సెలబ్రేట్ చేసుకున్నారు.హైదరాబాద్లో జరిగిన సక్సెస్ మీట్కు రాజశేఖర్ సతీమణి జీవిత కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జీవిత ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా మూవీ రివ్యూవర్లపై మాట్లాడారు. సినిమా ఎంత బాగా తీసినా కూడా విమర్శలు చేస్తూనే ఉంటారన్నారు. రివ్యూలు చదువుతుంటే.. సినిమా ఎలా తీయాలో రివ్యూయర్లనే అడుగుదామా అనిపిస్తోందని తెలిపారు. సినిమాలో సెంటిమెంట్ ఎక్కువగా ఉంటే మెలోడ్రామా అని తీసి పారేస్తారు.. అదే స్టైలిష్గా తీస్తే డెప్త్ లేదని విమర్శిస్తారు. ఏది నమ్మాలో మాకు అర్థం కావడం లేదన్నారు. ఒక సినిమా వెనుక ఎంతో మంది కష్టం, కోట్లాది రూపాయల ఖర్చు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రేక్షకులు రివ్యూలు చూసి కాకుండా.. స్వయంగా థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని జీవిత పిలుపునిచ్చారు. ఎందుకంటే ప్రేక్షకుడి రివ్యూనే మాకు ముఖ్యమని అన్నారు. ఏవైనా గొడవలున్నా, మనస్పర్థలున్నా మనసు విప్పి మాట్లాడుకోండి.. ఎవరినీ దూరం పెట్టకండి.. సంతోషంగా ఉండటమే జీవితం అంటూ ఆమె ప్రేక్షకులకు సందేశమిచ్చారు జీవిత రాజశేఖర్. ఈ కామెంట్స్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. -
రేణు దేశాయ్పై ట్రోల్స్.. ఆరుగురు అరెస్ట్
సినీ నటి రేణు దేశాయ్పై అసభ్యకర పదజాలంతో దూషించిన ఆరుగురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె ఒక వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఒక మీడియా సమావేశంలో వీధి శునకాల రక్షణ గురించి ఆమె మాట్లాడిన విషయం తెలిసిందే. వంద కుక్కల్లో 10 పిచ్చివి ఉంటాయని, వాటితో జాగ్రత్తగా ఉండాలని ఆమె చెప్పారు. ఆ పదింటి కోసం మిగిలిన 90 కుక్కల్ని చంపకూడదని ఆమె అన్నారు. దీంతో ఆమెపై కొందరు నెటిజన్లు బూతులతో రెచ్చిపోయారు.సోషల్మీడియా వేదికగా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని నిత్యం అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని రేణూ దేశాయ్(Renu Desai) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెడు కామెంట్లు చేసే వారిని వాళ్ల అమ్మానాన్నల ముందు నిలబెడతానని హెచ్చరించారు. ఆమె చెప్పినట్లుగానే ఫిర్యాదు చేయడంతో తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు.ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె ఒక వీడియో చేశారు. 'పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. త్వరలో మరికొందరిని అరెస్ట్ చేస్తారు. ఎవరూ తప్పించుకోలేరు. మీ తల్లిదండ్రులకు సమాచారం ఇస్తారు. మీరు ఉద్యోగం చేస్తుంటూ ఆఫీస్లో తెలుపుతారు. ఎవరినీ బూతులతో తిట్టకండి.' అంటూ కోరారు. రేణు దేశాయ్ని ఎందుకు తిట్టారని వారిని పోలీసులు ప్రశ్నాంచారు. ఆమె వల్ల మీకేమి కష్టం జరగలేదు కదా అని అడిగితే.. ఆమె ఒక సెలబ్రిటీ కాబట్టి తాము తిట్టామని అలా కాస్త ఫేమస్ కావచ్చని అనుకున్నట్లు వివరణ ఇచ్చారు. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
శ్రీహరి కొడుకు హీరోగా కొత్త సినిమా, టైటిల్ ఇదే
దివంగత ప్రముఖ నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటించనున్న కొత్త సినిమాకు ‘ఆస్మాన్’ అనే టైటిల్ ఖరారైంది. రామ్ నందన్ దర్శకత్వంలో కొండారు వెంకటేశ్, శ్రీకాంత్ మన్నెం ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శనివారం జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవంలో ముహూర్తపు సన్నివేశానికి సాయి దుర్గ తేజ్ క్లాప్ ఇవ్వగా, సందీష్ కిషన్ స్విచ్చాన్ చేశారు. నిహారిక కొణిదెల స్క్రిప్ట్ను మేకర్స్కు అందించగా, తొలి సన్నివేశానికి రామ్ నందన్ దర్శకత్వం వహించారు. విశ్వక్ సేన్, రోషన్ కనకాల, తిరువీర్, నార్నే నితిన్, రామ్ తాళ్లూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ–‘‘రామ్ నందన్ అద్భుతమైన కథను చెప్పారు. మేం బ్లాక్బస్టర్ కొట్టబోతున్నాం’’ అని చెప్పారు. ‘‘తెలుగులో నాకు ‘ఆస్మాన్’ తొలి చాన్స్. ఈ సినిమా కొత్తగా ఉంటుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్తో రాబోతున్నాం. మూడు షెడ్యూల్స్లోనే ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేస్తాం’’ అని తెలిపరు రామ్ నందన్.‘‘మేఘాంశ్ శ్రీహరితో మా శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్స్ ప్రొడక్షన్స్లో తొలి సినిమా చేస్తుండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు శ్రీకాంత్ మన్నెం. ‘‘మూడేళ్ల క్రితం మా నిర్మాణ సంస్థను స్టార్ట్ చేశాం. అప్పట్నుంచి కథలు వింటూనే ఉన్నాం. కోడి రామకృష్ణగారి స్టూడెంట్ అయిన రామ్నందన్ మాకు ఈ కథను ఏడాది క్రితం చెప్పారు. ఆయన ఇది వరకే అరబిక్లో సినిమా చేశారు. ‘ఆస్మాన్’ సస్పెన్స్–థ్రిల్లర్గా ఉంటుంది’’ అని చెప్పారు వెంకటేశ్ కొండారు. కెమెరామెన్ షోయబ్ మాట్లాడారు. ఈ సినిమాకు సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి. -
ప్రభాస్ ఫౌజీ.. వారికి సీరియస్ వార్నింగ్..!
రెబల్ స్టార్ పాన్ ఇండియా రేంజ్లో వస్తోన్న చిత్రం ‘ఫౌజీ’. ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది దసరాకి విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.పీరియాడికల్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఫౌజీ టీమ్ కొందరికి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఫౌజీ సెట్స్ నుంచి లీకైన చిత్రాలను కొన్ని ఖాతాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయని మా దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇలా కంటెంట్ను లీక్ చేసేవారికి మా హెచ్చరిక.. ఎవరైనా సరే చర్యలు తప్పవని ఫౌజీ టీమ్ హెచ్చరించింది. మేము ఎంతో జాగ్రత్తగా నిర్మిస్తున్న సినిమాకు ఈ లీకులు దెబ్బతీస్తున్నాయని ట్వీట్ చేశారు. లీక్ కంటెంట్ను షేర్ చేయకుండా దూరంగా ఉండాలని మేము ప్రతి ఒక్కరినీ కోరుతున్నామంటూ పోస్ట్ చేసింది.దీనిపై దర్శకుడు హను రాఘవపూడి సైతం స్పందించారు. మీకు ప్రత్యేకమైన అనుభూతిని అందించడానికి మేము శాయశక్తులా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇలాంటి లీకులతో మా కష్టాన్ని వృథా చేయొద్దని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. దయచేసి సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేద్దామని హను రాఘవపూడి విజ్ఞప్తి చేశారు. కాగా.. ప్రభాస్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పవర్ఫుల్ పాత్రలో చూపించబోతున్నారు. ఈ చిత్రంలో జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భానుచందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. We’ve poured our hearts into #Fauzi to give you something truly special.Humbly requesting everyone, please don’t spoil the magic with leaks.Let’s experience it the way it’s meant to be… together in theatres. 🙏🏻🙏🏻🙏🏻 https://t.co/n4w3xDi8Fm— Hanu Raghavapudi (@hanurpudi) April 4, 2026 -
ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇది.. థ్రిల్ అవుతారు: అడివి శేష్
‘‘ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు.. ఎన్ని మంచి చిత్రాలు చేశామన్నదే నా లైఫ్ ఫిలాసఫీ. ప్రాణం పెట్టి చేసిన సినిమా ‘డెకాయిట్’. ఇందులో ముఖ్యమైన విషయాలున్నాయి. కానీ, వాటిని ట్రైలర్లో చూపించలేదు. మా సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ థ్రిల్ అవుతారు’’ అని హీరో అడివి శేష్ తెలిపారు. షానియల్ డియో దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘డెకాయిట్’. ఈ మూవీలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మించారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అడివి శేష్ మాట్లాడుతూ–‘‘మనసు బద్దలైనప్పుడు మనిషి ఏమి దోచుకుంటాడు? అనే అంశమే ‘డెకాయిట్’లో ప్రధానంగా ఉంటుంది. ఇది యూనివర్సల్ కథ’’ అని పేర్కొన్నారు. ‘‘డెకాయిట్’లో నేను చేసిన సరస్వతి పాత్ర నా కెరీర్లో గుర్తుండిపోతుంది’’ అని మృణాల్ ఠాకూర్ చెప్పారు. ‘‘ఈ చిత్రంలో నేను పోషించిన పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. ఈ తరహా పాత్రలో నేను ఇంతవరకు నటించలేదు’’ అని చెప్పారు అనురాగ్ కశ్యప్. ‘‘మంచి లవ్స్టోరీతో కూడిన యాక్షన్ ఫిల్మ్ ఇది’’అని చె΄్పారు షానియల్ డియో. ‘‘మహేశ్ బాబు, ఎన్టీఆర్గార్లు మా సినిమా ట్రైలర్ని లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మంచి సినిమా ఎప్పుడూ విజయం సాధిస్తుంది’’ అని పేర్కొన్నారు నిర్మాత సుప్రియ. -
‘వారణాసి’ క్రేజీ అప్డేట్.. ‘మందాకిని’తో పాట స్టార్ట్!
హైదరాబాద్లో మళ్లీ అడుగుపెట్టారు మందాకిని. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘వారణాసి’లో ప్రియాంకా చోప్రా పోషిస్తున్న పాత్ర పేరు మందాకిని అని తెలిసిందే. ఈ టైమ్ ట్రావెల్ అండ్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాలో రుద్ర, శ్రీరాముడుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు మహేశ్బాబు. మందాకినిగా ప్రియాంకా చోప్రా, కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ షూట్లో పాల్గొనడానికి హైదరాబాద్ చేరుకున్నారు ప్రియాంకా చోప్రా. ఈ షూటింగ్ ప్రిపరేషన్ వీడియోను ఆమె తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేశారు. తన స్కిన్ మరింత గ్లోతో కనిపించేందుకు ఆమె తన ముఖానికి షీట్ మాస్క్ను ధరించినట్లుగా ఆ వీడియోతో స్పష్టం చేశారు ప్రియాంక. ‘వారణాసి’ సినిమా చిత్రీకరణ కోసం ఇప్పటికే పలుమార్లు ప్రియాంకా చోప్రా హైదరాబాద్కు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్లో మొదలైన ఈ షూట్ షెడ్యూల్లో మహేశ్బాబు కూడా పాల్గొంటారని, కొంత టాకీ పార్టుతో పాటు ఓ పాట చిత్రీకరణను కూడా మేకర్స్ ప్లాన్ చేశారని సమాచారం. ఆ తర్వాతి షెడ్యూల్ కోసం ‘వారణాసి’ యూనిట్ అంటార్కిటికా వెళుతుందని తెలిసింది. అంటార్కిటికా లొకేషన్స్లో ఈ సినిమా షూట్ జరగనున్నట్లుగా ఇటీవల ప్రియాంకా చోప్రా ‘ఎక్స్’ వేదికగా కన్ఫార్మ్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. On the move 🙌✨Priyanka Chopra heading for Varanasi work 👀Style on point. Focus locked.Another big moment loading ⚡From global icon to grounded roots…she does it all effortlessly 💛#PriyankaChopra #Varanasi pic.twitter.com/XHituw8UAL— Viral Celeb X (@ViralCelebX) April 4, 2026 -
రష్మిక బర్త్ డే.. మైసా టీమ్ స్పెషల్ పోస్టర్
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా లీడ్ రోల్లో వస్తోన్న లేడీ ఓరియంటెడ్ మూవీ మైసా. ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్లో రవీంద్ర పూలే దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్లో రష్మిక లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీని అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.తాజాగా ఇవాళ రష్మిక బర్త్ డే కావడంతో మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. రష్మిక జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్ను పంచుకున్నారు. పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ కలర్లో రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే ఫుల్ మాస్ యాక్షన్ మోడ్లో రష్మిక కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫిమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్టైనర్లో ఇప్పటివరకూ చేయని సరికొత్త పాత్రలో రష్మిక కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని 2026లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అంతేకాకుండా రష్మిక- విజయ్ దేవరకొండ జంటగా వస్తోన్న రణబలిలోనూ నటిస్తున్నారు.She ruled with charm…She conquered with grace…Now she’s coming with pure RAGE🔥Team #Mysaa wishes the ever-stunning @iamRashmika a blazing Happy Birthday ❤️🔥Get ready for her most explosive performance yet In cinemas 2026.💥#HappyBirthdayRashmika pic.twitter.com/0XXdcpBhPf— MYSAA (@MysaaTheFilm) April 5, 2026 -
'రామాయణ' టీజర్పై విమర్శలు.. హృతిక్ రోషన్ కౌంటర్
రణ్బీర్ కపూర్ నటించిన ‘రామాయణ’ టీజర్పై షోషల్మీడియాలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా విడుదలైన టీజర్లో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ఆశించినంత రేంజ్లో లేవని చిత్ర దర్శకుడు నితీశ్ తివారీపై కామెంట్లు చేస్తున్నారు. ఆన్లైన్లో మిశ్రమ స్పందనలను ఎదుర్కొంటున్న తరుణంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ స్పందించారు. విజువల్ ఎఫెక్ట్స్పై తన ఇన్స్టాగ్రామ్లో ఒక వివరణాత్మక నోట్ను పంచుకున్నారు. ఆయన ఏ సినిమా పేరు ప్రస్తావించనప్పటికీ, ఆయన వ్యాఖ్యలు చేసిన సమయం మాత్రం ప్రస్తుతం జరుగుతున్న చర్చలో భాగంగానే నిలుస్తోంది.నాసిరకం విఎఫ్ఎక్స్ (VFX) ఉన్నాయని హృతిక్ అంగీకరించినప్పటికీ, విజువల్స్ను కేవలం వాస్తవికత ఆధారంగానే అంచనా వేయకూడదని స్పష్టం చేశారు. సినిమాలు, ముఖ్యంగా ఫాంటసీ, పౌరాణిక చిత్రాలు, వాస్తవికతను ప్రతిబింబించేలా మాత్రమే విజువల్స్ ఉంటాయని పేర్కొన్నారు. వీఎఫ్ఎక్స్ అంటే కేవలం వాస్తవానికి దగ్గరగా ఉండటమే కాదంటూనే.. ఒక్కో దర్శకుడు ఒక్కో శైలిని ఎంచుకుంటారని క్లారిటీ ఇచ్చారు. కొన్నిసార్లు అది ‘స్టోరీ బుక్’ తరహాలో కూడా ఉండవచ్చిని పేర్కొన్నారు.ఇలాంటి ప్రాజెక్టుల వెనుక ఉండే కృషి స్థాయిని కూడా హృతిక్ రోషన్ నొక్కిచెప్పారు. విఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉండే చిత్రాల కోసం సంవత్సరాల తరబడి మేకర్స్ పనిచేస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ప్రేక్షకుల అభిప్రాయాన్ని కొట్టిపారేయకుండా వారి అంచనాలకు మించి విఎఫ్ఎక్స్ ఉండాలని సూచించారు.కల్కి 2898 AD, బాహుబలి, రామాయణ వంటి భారీ సినిమాలు నిర్మించిన వారు అసలైన హీరోలని ప్రశంసించారు. గతంలో ఎవరూ చేయలేని సాహసాన్ని చేస్తున్నారని గుర్తుచేశారు. రామాయణ సినిమాలోని వీఎఫ్ఎక్స్ వీడియో గేమ్ లాగా ఉన్నాయన్న విమర్శలపై హృతిక్ టెక్నికల్గా సమాధానమిచ్చారు. -
స్టార్ హీరోయిన్ రెస్టారెంట్లో న్యూడిల్స్ ధర ఎంతో తెలిస్తే..
ముంబైలో అత్యంత ఖరీదైన రెస్టారెంట్ల జాబితాలో శిల్పాశెట్టి ‘బాస్టియన్’ ఒకటనే విషయం తెలిసిందే. అక్కడి ఫుడ్ మెనూ ధరల గురించి తరుచుగా నెట్టింట చర్చ జరుగుతూనే ఉంటుంది. బాస్టియన్లో ఫుడ్ తిన్న కొందరు తమ బిల్లును గత ఏడాది నుంచి సోషల్మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు. అందులోని ధరలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. తరుచుగా ఈ బిల్లు సోషల్మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.ముంబైలోని ఒక ప్రీమియం ఫైన్-డైనింగ్ రెస్టారెంట్గా బాస్టియన్కు గుర్తింపు ఉంది. ఇక్కడ విలాసవంతమైన సౌకర్యాలతో పాటు రుచికరమైన సీఫుడ్ కూడా దొరుకుతుంది. ఎంతో ఆకర్షణీయమైన వాతావరణం ఉండటం వల్ల చాలామంది సెలబ్రిటీలు, వ్యాపారావేత్తలు అక్కడికి వెళ్తుంటారు. విలాసవంతమైన ప్రదేశం కాబట్టి అక్కడి ఫుడ్ ధరలు కూడా ప్రీమియంగానే ఉంటాయి. బాస్టియన్లో ఫుడ్ తిన్న కొందరు తమ బిల్లును షేర్ చేశారు. నలుగురికి కలిపి రూ. 21,731 అయినట్లు తెలిపారు. చికెన్ న్యూడిల్స్ ధర రూ. 950 ఉండటం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఫ్రెంచ్ ఫ్రైస్ ధర ఏకంగా రూ. 1450 ఉండటంతో మాటలు రావడం లేదంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే, ఈ ధరలు అన్నీ కూడా ఏడాది క్రితం నాటివి కావడం విశేషం. ప్రస్తుతం ఇంకాస్త ఎక్కువే ఉండొచ్చని అంటున్నారు.బాస్టియన్ రెస్టరంట్ ఒక్కరోజులో రూ.2-3 కోట్ల టర్నోవర్ చేస్తుందని అంచనా ఉంది. సాధారణ రోజుల్లో రూ.2 కోట్లు, వీకెండ్లో రూ.3 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా ఉంది. సుమారు 1400 మందికి పైగానే అతిథులు అక్కడ స్టే చేయొచ్చట. ఒకేసారి 700 మంది భోజనం చేసేలా వీలు ఉందని చెబుతారు. View this post on Instagram A post shared by Cute Relationship Memes | Abhishek Watts (@cuterelationship.in) -
శూద్రులు కాదు దళితులు.. ఆసక్తిగా 'ఫూలే' తెలుగు ట్రైలర్
మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే మీద మొదటిసారి ఒక హిందీ సినిమా తెరపైకి వచ్చింది. డైరెక్టర్ అనంత్ మహాదేవన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రతీక్ గాంధీ, పత్రలేఖా పాల్ అనే ఇద్దరు యాక్టర్లు ఫూలే, సావిత్రిగా నటించారు. గతేడాదిలో అనేక వివాదాల మధ్య ఈ చిత్రం విడుదలైంది. అయితే, ఇప్పుడు తెలుగు వర్షన్ కూడా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తెలుగు ట్రైలర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ సినిమా బ్రాహ్మణ సమాజాన్ని తప్పుగా చూపిస్తుందనీ... కులవాదాన్ని ప్రోత్సహిస్తుందనీ బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్య క్షుడు ఆనంద్ దవేతో పాటు పలు బ్రాహ్మణ సంఘాలు ఆరోపించడంతో సినిమా విడుదల సమయంలో అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే, అయితే స్వయంగా బ్రాహ్మ ణుడైన ఈ చిత్ర దర్శకుడు అనంత్ మహాదేవన్ ఈ ఆరోపణలను ఖండిస్తూ, సినిమా చారిత్రక వాస్తవాల ఆధారంగా రూపొందిందనీ, ఎటు వంటి అజెండా లేదనీ చెప్పారు. దీంతో ఎట్టకేలకు గతేడారి ఏప్రిల్ 25న విడుదలైంది. సుమారు ఏడాది తర్వాత ఇప్పుడు తెలుగు వర్షన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫూలే 199వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 11న తెలుగులో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.ఫూలే స్వయంగా చదువు చెప్పి సావిత్రీబాయిని దేశంలోనే మొదటి మహిళా టీచర్ని చేశాక, పుణె పట్టణ సమీపంలోని దళితవాడలో ఆడపిల్లలకు స్కూలు పెట్టారు. ఏ కులానికి చెందిన అమ్మాయిలైనా వచ్చి చదువుకోవచ్చని ప్రకటించారు. సావిత్రీబాయితోపాటు చదువుకున్న ముస్లిం స్త్రీ ఫాతిమా షేక్ ఆమెకు అండగా ఉండేది. సావిత్రీబాయి ఈ దేశం మొత్తం చరిత్రలో భర్త సహాయంతో చదువుకొని టీచరై, ఆడపిల్లలకు బడి పెట్టిన మొదటి మహిళగా ఆమె గుర్తింపు పొందారు. -
సీక్వెల్కు నో.. ఆయనతో నటించడం కష్టం: హీరోయిన్
దక్షిణాది చిత్ర పరిశ్రమలోని చాలా బోల్డ్ నటీమణల్లో ఆండ్రియా ఒకరు. కథానాయకిగా పలు చిత్రాల్లో నటించినా, ఇప్పుడు ఎలాంటి చాలెంజింగ్ పాత్రలు అయినా చేయడానికి రెడీ అనే నటి. ఇటీవల నిర్మాతగా కూడా మారి తాజాగా లెజెండ్ శరవణన్ కథానాయకుడిగా నటించిన లీడర్ చిత్రంలో పోలీస్ అధికారి పాత్రలో నటించారు. ఇకపోతే చాలాకాలం క్రితం సెల్వరాఘవన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన చిత్రం ఆయిరత్తిల్ ఒరువన్(యుగానికి ఒక్కడు). ఇందులో ఆండ్రియా, రీమాసేన్ హీరోయిన్గా నటించారు. యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో ధనుష్ హీరోగా ఆయిరత్తిల్ ఒరువన్ చిత్రానికి సీక్వెల్ చేస్తానని దర్శకుడు సెల్వరాఘవన్( Selvaraghavan) ఆ మధ్య ప్రకటించారు. అయితే ఆ తర్వాత దానికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదు. ఆ చిత్ర తొలి భాగంలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా నటించిన ఆండ్రియా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయిరత్తిల్ ఒరువన్–2 చిత్రం గురించి మాట్లాడింది. పార్ట్-1లో నటించిన అనుభవంతో ఆ తర్వాత తను చేసిన ప్రతి ప్రాజెక్ట్ చాలా సులువుగా అనిపించిందని తెలిపింది. సినిమా షూటింగ్ సమయంలో సెల్వరాఘవన్ చెప్పిన టైమింగ్ ప్రకారం ఏదీ జరగదని చెప్పింది. ఈ మూవీ షూటింగ్ సమయంలో తాను పడ్డ ఇబ్బందులు వర్ణనాతీతమంటూ పేర్కొంది. కాబట్టి మళ్లీ ఆయనతో సినిమా చేయడం తన వల్ల కాదని పేర్కొంది. షూటింగ్ సమయంలో తాను అనుభవించిన మానసిక, శారీరక ఒత్తిడిని ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె గుర్తుచేసుకుంది. తర్వాత ఎలాంటి పాత్ర వచ్చినా సరే చాలా ఈజీగా నటించగలిగానని పేర్కొంది. ఆ చిత్రానికి సీక్వెల్ రూపొందవచ్చు, లేకపోవచ్చు కానీ, సీక్వెల్ తాను నటిస్తానని మాత్రం ఆశించవద్దని క్లారిటీ ఇచ్చింది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించడం చాలా కష్టమని ఆండ్రియా పేర్కొంది. -
నిలవాలి కలకాలమే...
‘‘రా నాతో... ఆ ఆకాశంలో మేఘాలవుదాం... ఓ వర్షం కురిపించేద్దామ్..’ అంటూ మొదలవుతుంది ‘కామాఖ్య’ సినిమాలోని ‘సఖీ’పాట. సమైరా, సముద్ర ఖని, అభిరామి ప్రధానపాత్రధారులుగా, అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన థ్రిల్లర్ సినిమా ‘కామాఖ్య’. వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి స్నేహం నేపథ్యంలో సాగే మెలోడీ సాంగ్ ‘సఖీ’ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.‘‘సఖీ... గులాబీ మన స్నేహమే... సరదాల దీవి మన స్నేహమే... సఖీ’, ఇలాంటి మన స్నేహమే... నిలవాలి ఇంక కలకాలమే..’ అంటూ ఈపాట సాగుతుంది. సంగీత దర్శకుడు గ్యాని స్వర కల్పనలో అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈపాటను లక్ష్మీ మేఘన ఆలపించారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. -
లైట్స్... కెమెరా... క్రికెట్
బ్యాట్ పట్టుకుని క్రికెట్ గ్రౌండ్లోకి దిగారు బాలీవుడ్ నటుడు రాజ్కుమార్ రావు. గంగూలీలా మారిపోయారు. ప్రముఖ క్రికెటర్, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ జీవితం ఆధారంగా హిందీలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘దాదా: ది సౌరభ్ గంగూలీ స్టోరీ’ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ అధికారికంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో సౌరభ్ గంగూలీపాత్రలో రాజ్కుమార్ రావు నటిస్తున్నారు.విక్రమాదిత్య మోత్వానీ దర్శకత్వంలో లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మిస్తున్నారు. ‘‘లైట్స్... కెమెరా... క్రికెట్... ‘దాదా’ చిత్రీకరణ మొదలైపోయింది’’ అంటూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా యూనిట్ తెలియజేసింది. షూటింగ్ను వీలైనంత త్వరగా పూర్తి చేసి, ఈ ఏడాది డిసెంబరులోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది.గంగూలీ క్రికెట్ లైఫ్నే కాకుండా, ఆయన వ్యక్తిగత జీవితంలోని అంశాలను కూడా ఈ సినిమాలో ప్రస్తావించనున్నారట. ఇక దాదాపు రెండు దశాబ్దాలపాటు క్రికెట్లో ఓ వెలుగు వెలిగిన గంగూలీ, 2008లో క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, బిసీసీఐ ప్రెసిడెంట్గా సౌరభ్ గంగూలీ బాధ్యతలను నిర్వర్తించిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
ట్రెండింగ్లో గాడ్ మోడ్ సాంగ్
‘గాడ్ మోడ్...’ అంటూ హుషారుగా చిందేస్తున్నారు హీరో సూర్య. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వీరభద్రుడు’. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ప్రకాశ్బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు. మే 14న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సాయి అభ్యంకర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘గాడ్ మోడ్...’ అంటూ సాగేపాటని శనివారం విడుదల చేశారు మేకర్స్. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈపాటని కాల భైరవపాడారు.‘‘తమిళ, తెలుగు, హిందీ పరిశ్రమల్లోపాపులర్ కంటెంట్ను అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ‘వీరభద్రుడు’ చిత్రాన్ని స్కేల్, కంటెంట్ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ అంచనాలని పెంచింది. ‘గాడ్ మోడ్...’ అంటూ సాయి అభ్యంకర్ కంపోజ్ చేసిన ఈ ట్రాక్ పక్కా మాస్ ఎనర్జీతో ఊపేస్తూ, థియేటర్లలో విజిల్స్ పండించే డ్యా న్స్ నంబర్గా నిలుస్తుంది.కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ పవర్ఫుల్గా, క్యాచీగా ఉండి ఒక్కసారి వినగానే గుర్తుండిపోయేలా ఉన్నాయి. కాల భైరవ వాయిస్ ఈపాటకు అదనపు పవర్ ఇచ్చి, ప్రతి బీట్ను మరింత ఎలివేట్ చేసింది. ఈ సాంగ్లో సూర్య చేసిన డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. స్టైల్, ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ ... అన్నీ కలిపి ఆయన్ను మరింత స్పెషల్గా చూపిస్తున్నాయి. ఇప్పటికే ఈపాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ, సినిమా హైప్ను నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్లింది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: జీకే విష్ణు. -
పాటల ప్రపంచంలోకి...
ఆనందానికిపాట... ఆరోగ్యానికిపాట... కల్యాణానికిపాట... కలలకుపాట... విషాదానికిపాట... వినోదానికిపాట... స్ఫూర్తికిపాట... సందేశానికిపాట... ఇలా మనిషి జీవితంలో ప్రతి సందర్భానికీపాట ఉంటుంది. అందుకేపాట సృష్టించేవాళ్లన్నా, సాహిత్యం అందించేవాళ్లన్నా, ఆపాటకు తమ గాత్రంతో ప్రాణం పోసేవాళ్లన్నా ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అలా వెండితెర కోసం పసందైనపాటలతో ప్రేక్షకులను అలరించిన మ్యూజికల్ స్టార్స్ ఎందరో ఉన్నారు. హాలీవుడ్లో ఇలాంటి స్టార్స్ జీవితాలపై ‘బయోపిక్స్’ రూపొందుతున్నాయి. బయోపిక్స్ రూపొందడం కామన్. అయితే ఒకేసారి అరడజనుకి పైగా మ్యూజికల్ బేస్డ్ బయోపిక్స్కి శ్రీకారం జరగడం విశేషం. ఆ మ్యూజికల్ స్టార్స్ వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని ఈ చిత్రాలు ఆవిష్కరించనున్నాయి. ఇక థియేటర్స్లో కూర్చున్న ప్రేక్షకులనుపాటల ప్రపంచంలోకి తీసుకెళ్లే ఆ ‘మ్యూజికల్ బయోపిక్స్’ విశేషాలు తెలుసుకుందాం.ఏప్రిల్ 24న మైఖేల్ పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ ప్రపంచం కోసం వదిలి వెళ్లినపాటల రూపంలో జీవించే ఉన్నారు. ఆయన జీవితంలోని కీలక విషయాలను వెండితెరపై చూసే సమయం ఆసన్నమైంది. ‘మైఖేల్’ టైటిల్తో రూపొందిన ఈ బయోగ్రఫీలో మైఖేల్ జాక్సన్ సోదరుడు జెర్మైన్ జాక్సన్ తనయుడు జాఫర్ జాక్సన్ టైటిల్ రోల్ చేశారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ చూసినవాళ్లు జాఫర్ అచ్చం తన బాబాయిలానే ఉన్నాడని పేర్కొనడంతో లుక్ పరంగా మార్కులు కొట్టేశారు జాఫర్. ఆంటోయిన్ ఫుక్వా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘గ్లాడియేటర్, ది ఏవియేటర్’ వంటి చిత్రాలకు స్క్రిప్ట్ అందించిన జాన్ లోగన్ ‘మైఖేల్’ స్క్రిప్ట్ రాశారు.గ్రాహం కింగ్ ఈ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరించారు. ‘‘మైఖేల్ జీవితాన్ని నిజాయతీగా చూపించాలన్నది మా లక్ష్యం. అలానే ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం’’ అని గ్రాహం పేర్కొన్నారు. ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా ‘మైఖేల్’ విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ‘ది జాక్సన్: యాన్ అమెరికన్ డ్రీమ్’ పేరిట ఐదు గంటల మినీ సిరీస్ రెండు భాగాలుగా ఏబీసీ టెలివిజన్లో ప్రసారమైంది.మైఖేల్ జాక్సన్ బతికి ఉన్నప్పుడే 1992లో ఈ సిరీస్ రూపొందింది. జాక్సన్, అతని కుటుంబం, అతని సోదరులు మ్యూజికల్ ఫీల్డ్లో ఎలా ఎదిగారు వంటి విశేషాలతో ప్రధానంగా ఈ సిరీస్ రూపొందింది. సో... హాలీవుడ్ చెబుతున్న ప్రకారం మైఖేల్ జాక్సన్ జీవితంపై రానున్న సమగ్ర చిత్రం ‘మైఖేల్’ అని తెలుస్తోంది. ఇక 50 ఏళ్ల వయసులో 2009 జూన్ 25న మైఖేల్ మరణించిన విషయం తెలిసిందే. ఈ పాప్ కింగ్పాటలు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.హూ ఈజ్ దట్ గర్ల్‘‘నా కంటే నా కథను ఎవరు బాగా రాయగలరు... చూపించగలరు’’ అంటున్నారు మడోన్నా. ‘క్వీన్ ఆఫ్పాప్’గా పేరు తెచ్చుకున్న మడోన్నా తన జీవితంతో ‘హూ ఈజ్ దట్ గర్ల్’ టైటిల్తో సినిమా నిర్మించాలని ఐదేళ్ల క్రితమే అనుకున్నారు. 2020లోనే ఈ చిత్రానికి సంబంధించిన పనులు మొదలుపెట్టారామె. తానే దర్శకత్వం వహించాలనుకున్నారు కూడా. అయితే 2020 నుంచి 2023 వరకూ ఎలాంటి అప్డేట్ రాలేదు. 2024లో తాను ఈ సినిమాకి స్క్రిప్ట్ తయారు చేస్తున్నట్లు పేర్కొని, కొన్ని ఫొటోలను, వీడియోలను కూడా షేర్ చేశారు మడోన్నా.సంగీతమే తనను నడిపించింది కాబట్టి ఈ సినిమా ఫోకస్ మొత్తం మ్యూజిక్ పైనే ఉంటుందని కూడా పేర్కొన్నా రామె. అయితే గడచిన ఐదేళ్లల్లో ఆమె ప్లాన్ చేసుకున్న మ్యూజికల్ ట్యూర్స్, ఇతర కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఈ ఏడాది ఈ సినిమాని సెట్స్కి తీసుకెళ్లాలని మడోన్నా అనుకుంటున్నారట. మడోన్నాపాత్రను జూలియా గార్నర్ చేయనున్నారు. ‘‘నేను ట్రైన్డ్ డ్యాన్సర్ని, సింగర్ని కాదు. అందుకని ఈ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోనున్నాను. నా నటనతో మడోన్నాని మెప్పించాలనుకుంటున్నాను’’ అని గార్నర్ పేర్కొన్నారు. వన్ డైరెక్టర్... ఫోర్ బయోపిక్స్ఒక డైరెక్టర్ ఒక బయోపిక్ చేయడం అంటే అది పెద్ద విషయమేం కాదు. కానీ ఒక దర్శకుడు నాలుగు బయోపిక్స్ చేయడం మాత్రం విశేషం అనే చె΄్పాలి. ఆ దర్శకుడు ఎవరంటే ‘సామ్ మెండిస్’. ‘ద బీటిల్స్’ అనే రాక్ బ్యాండ్ పై నాలుగు చిత్రాలు రూపొందించడానికి సామ్ సన్నాహాలు చేస్తున్నారు. 1960లో ఈ రాక్ బ్యాండ్ ఫామ్ అయింది. అప్పట్లో ఈ బ్యాండ్ చాలాపాపులర్. ‘ద బీటిల్స్’పై సినిమా అనేది తన కలల ప్రాజెక్ట్గా చెబుతున్నారు దర్శకుడు సామ్ మెండిస్. ఈ రాక్ బ్యాండ్లోని సభ్యుల (పాల్ మెక్కార్ట్నీ, జాన్ లెన్నాన్, జార్జ్ హారిసన్, రింగో స్టార్) జీవితాలపై ఈ నాలుగు చిత్రాలు ఉంటాయి.ఒక్కో స్టార్ జీవితంతో ఒక్కో సినిమా ఉంటుంది. ఈ చిత్రాల్లోపాల్ మెక్కార్ట్నీగాపాల్ మెస్కల్, జాన్ లెన్నాన్ క్యారెక్టర్ను హ్యారిస్ డికిన్సన్, రింగో స్టార్పాత్రను బ్యారీ కియోగన్, జార్జ్ హారిసన్ క్యారెక్టర్ను జోసెఫ్ క్విన్ చేయనున్నారు. ‘ద బీటిల్స్ – ఎ ఫోర్ – ఫిల్మ్ సినిమాటిక్ ఈవెంట్’ టైటిల్తో ఈ నాలుగు చిత్రాలు రూపొందనున్నాయి. ఇక సాదా సీదా స్థాయి నుంచి స్టార్డమ్ వరకూ సంగీత ప్రపంచంలో ఎదగడానికి ‘ద బీటిల్స్’ రాక్ బ్యాండ్ చేసిన కృషి నేపథ్యంలో ఈ చిత్రాలు ఉంటాయి. ఈ నాలుగు చిత్రాలనూ 2028లోనే విడుదల చేయాలనుకుంటున్నారు. గాడ్ మదర్ ఆఫ్ రాక్ అండ్ రోల్ అమెరికన్ సంగీత చరిత్రలో సింగర్గా, రైటర్గా, గిటారిస్ట్గా అత్యంత ప్రభావం చూపినవారిలో సిస్టర్ రోసెట్టా థార్పే ఒకరు. 1915లో పుట్టారు రోసెట్టా. అయితే 1921లోనే తన తల్లితో కలిసి మ్యూజికల్ ట్రూప్లో సింగింగ్ టాలెంట్ని చూపించడంతోపాటు గిటారిస్ట్గానూ భేష్ అనిపించుకుంది చిన్నారి రోసెట్టా. పెద్దయ్యాక సంగీత ప్రపంచంలో దూసుకెళ్లారామె. ముఖ్యంగా 1930–1940 మధ్యకాలంలో అప్పటి తరం శ్రోతలను తనపాటలతో అలరించారు. అంతటి ప్రతిభాశాలి అయిన సిస్టర్ రోసెట్టా థార్పే జీవితం ఆధారంగా ‘ఎ రోసెట్టా’ చిత్రం రూపొందనుంది. ‘గాడ్ మదర్ ఆఫ్ రాక్ అండ్ రోల్’గా పేరు పొందిన రోసెట్టా క్యారెక్టర్ను ఆమె బయోపిక్లో సింగర్, ర్యాపర్, నటి‡లిజ్జో పోషించనున్నారు. అలాగే ఈ చిత్రానికి ఓ నిర్మాతగానూ వ్యవహరించనున్నారామె. అయితే ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయం తెలియాల్సి ఉంది.బీ మై బేబీఅమెరికన్ మ్యూజికల్ డ్రామా ‘ది గ్రెటెస్ట్ షో మేన్’లో నటించడంతోపాటు తన గాత్రాన్ని వినిపించి, మరింతగా ఆకట్టుకున్నారు జెండయా. మంచి నటిగా, గాయనిగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఓ మ్యూజికల్ ఫిల్మ్లో నటించనున్నారు. ‘బీ మై బేబీ’ టైటిల్తో దివంగత ప్రముఖ గాయని రోనీ స్పెక్టర్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో రోనీ స్పెక్టర్పాత్రను జెండయా చేయనున్నారు. బ్యారీ జెంకిన్స్ దర్శకత్వం వహించనున్నారు. కాగా... రోనీ స్పెక్టర్ అంటే తనకెంతో అభిమానం అని పలు సందర్భాల్లో పేర్కొన్నారు జెండయా. 2022లో రోనీ మరణించినప్పుడు నివాళి అర్పిస్తూ, ఎంతో భావోద్వేగానికి గురయ్యారు జెండయా. కెమెరా ముందు రోనీగా ఒదిగిపోవడానికి ఎంత కృషి చేయాలో అంతా చేస్తానంటున్నారామె.బాయ్ జార్జ్ జీవితంతో... 1980లలో తమ గాత్రంతో శ్రోతలను ముగ్ధులను చేసిన గాయకుల్లో బాయ్ జార్జ్ ఒకరు. వేరే రచయితలతో కలిసి బాయ్ జార్జ్ రాసిన ‘టేక్ ఇట్ లైక్ ఎ మ్యాన్’, ‘స్ట్రైట్’, బాయ్ జార్జ్ మాత్రమే రాసిన ‘ఎ కర్మ’ ఆటోబయోగ్రఫీల ఆధారంగా బాయ్ జార్జ్ బయోపిక్ రూపొందనుంది. బాయ్ జార్జ్పాత్రను సోఫీ టర్నర్ చేసే అవకాశం ఉందట. దర్శకుడు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే... బాయ్ జార్జ్ అబ్బాయి కాబట్టి... ఆపాత్రను అబ్బాయే చేయాలని, నటి సోఫీ టర్నర్తో ఎందుకు చేయించాలనుకుంటున్నారనే చర్చ హాలీవుడ్లో జరుగుతోంది. అయితే తనపాత్రకు సోఫీ టర్నర్ పూర్తి న్యాయం చేస్తుందని నమ్ముతున్నానని బాయ్ జార్జ్ అంటున్నారు. ‘‘నాపాత్రను సోఫీ చేయడం నాకు చాలా ఇష్టం. కానీ... ‘ఆమె మీపాత్ర చేయలేదు... ఆమె ఒక మహిళ...’ అని అందరూ అంటున్నారు. అయితే నాకు 17 ఏళ్లు ఉన్నప్పుడు నేను ఆమెపాత్ర చేయాలనుకున్నాను. నాకు ఆ అవకాశం రాలేదు. ఇప్పుడు నా బయోపిక్లో ఆమె నాపాత్ర చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది’’ అని బాయ్ జార్జ్ అంటున్నారు.ఈ చిత్రాలు మాత్రమే కాదు... దివంగత డ్రమ్మర్ కీత్ మూన్ బయోపిక్, అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్, పియానిస్ట్ బిల్లీ జోయెల్ జీవితం ఆధారంగా... ఇలా పలు బయోపిక్స్ రానున్నాయి. – డి.జి. భవాని -
సోషల్ మీడియాలో ధురంధర్-3.. కథ-స్క్రీన్ ప్లే రెడీ
గత నెల రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్-2 దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్టయిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెండో భాగం (ధురంధర్-2) ఎలా ముగిసిందో సినిమా చూసిన వాళ్లందరికీ తెలిసే ఉంటుంది. భార్య, కొడుకును వదిలి ఇండియా వచ్చేస్తాడు హీరో. ఆ తర్వాత ‘RAW’ కనుసన్నల నుంచి తప్పించుకొని నేరుగా తన ఇంటికి వెళ్తాడు. అయితే దూరం నుంచే తన తల్లిని, చెల్లిని చూసి తిరిగి వెనుదిరుగుతాడు. ఇలా సాగిన ధురంధర్-2 క్లయిమాక్స్ నుంచి ధురంధర్-3 కథను అల్లేస్తున్నారు సోషల్ మీడియాలోని కొంతమంది జనం. అయితే హీరో మరోసారి రా ఏజెంట్గా పాకిస్థాన్లో అడుగుపెడతాడని, కొత్త గెటప్లో పాకిస్టాన్లో మరోసారి అడుగుపెట్టి తన భార్య, కొడుకును కలుస్తాడంటూ ఎవరికివారు కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా అల్లేస్తున్నారు. ఇలా ధురంధర్ ఫ్రాంచైజీపై ఓ కొత్త చర్చ జరుగుతోంది. అయితే నిజానికి ధురంధర్-3పై దర్శకుడు ఆదిత్య ధర్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఇటీవల ఇదే ప్రశ్న ఆదిత్య ధర్కి ఎదురైంది. దానికి 'ఏమో చెప్పలేం' అన్నట్టు మాత్రమే ఆయన స్పందించాడు. అంతేకానీ ధురంధర్-3 తప్పకుండా తీస్తానని ఆదిత్య ధర్ అనలేదు.కానీ సోషల్ మీడియాలో వస్తున్న కథలని నిజానికి ఓసారి పరిశీలిస్తే ఈ దర్శకుడికి కచ్చితంగా పార్ట్-3కి ఓ లైన్ దొరికే అవకాశం ఉందనే అంటున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు. -
అమెరికా నుంచి వచ్చి దర్శకురాలిగా తెలుగు సినిమా
రేసన్ ప్రొడక్షన్స్ తమ తొలి సినిమా 'రాయవలస' ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ఊరి జీవితం, నిజ సంఘటనల ఆధారంగా మనసును తాకే కథతో దీన్ని తీస్తున్నారు.గోపీ కృష్ణ జె నిర్మించగా.. అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ మహిళా దర్శకురాలు రాధిక తెరకెక్కిస్తున్నారు.ఒకే షెడ్యూల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఈ క్రమంలోనే కార్తిక్ని హీరోగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అమెరికాలో పెరిగిన కార్తిక్, సింగర్గా ప్రదర్శనలు ఇచ్చాడు. వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్లోనూ నటించాడు. ఇతడు ఇప్పుడు 'రాయవలస' మూవీతో హీరోగా పరిచయమవుతున్నాడు.ఓ రైస్ మిల్ యజమాని రాజు జీవితం చుట్టూ కథ తిరుగుతుంది. కుటుంబం, స్నేహితులు, పిల్లలతో సాగుతున్న అతని జీవితంలో హీరోయిన్ ప్రవేశం అనూహ్య మలుపులు తీసుకువస్తుంది. భావోద్వేగం, యాక్షన్, సంగీతం కలగలిపిన కంప్లీట్ ఎంటర్టైనర్గా 'రాయవలస'ని ప్రేక్షకులను అలరించనుంది. హీరోయిన్గా శ్రీషా నూలు చేసింది. -
సడన్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి మృత్యుంజయ్, సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని, ఎస్.సరస్వతి, సితారే జమీన్ పర్ తదితర తెలుగు సినిమాలు స్ట్రీమింగ్లోకి వచ్చాయి. ఇవి కాకుండా పలు హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు, సిరీస్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు వీటితో పాటు తమిళ డబ్బింగ్ మూవీ ఎలాంటి హడావుడి లేకుండా తెలుగులో స్ట్రీమింగ్ అయిపోతోంది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్.. ప్రేమజంటని వెంటాడే మొసలి)2024లో తమిళ వచ్చిన ఆంథాలజీ థ్రిల్లర్ మూవీ 'అధర్మ కదైగల్'. వెట్రి, అమ్ము అభిరామి, సాక్షి అగర్వాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కామరాజ్ వెల్ దర్శకుడు. ఇప్పుడీ ఈ సినిమానే '4వ అధ్యాయం' పేరిట తెలుగులో ఆహా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. తాజాగానే స్ట్రీమింగ్ అవుతోంది.'4వ అధ్యాయం' విషయానికొస్తే.. మొదటి కథలో నందిని అనే నర్స్, గాయపడిన ఓ రౌడీ విషయంలో సమస్యలు ఎదుర్కొంటుంది. రెండో కథలో ఆన్లైన్ జూదానికి బానిసైన ఓ యువకుడు.. డబ్బుల కోసం చిన్నపిల్లని కిడ్నాప్ చేస్తాడు. మూడో స్టోరీలో బీచ్ దగ్గర తిరిగే రౌడీలు వరసగా హత్యకు గురవుతుంటారు. నాలుగో కథలో దివ్య అనే అమ్మాయి, తన తండ్రి ఆపరేషన్ డబ్బులు చెల్లించేందుకు అద్దె గర్భానికి రెడీ అవుతుంది. ఈ నాలుగు చివరకు ఎలా ముగిశాయనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: తక్కువ టైంలో చాలామందిని కోల్పోయా.. భరించడం నా వల్ల కాలేదు) -
తక్కువ టైంలో చాలామందిని కోల్పోయా.. భరించడం నా వల్ల కాలేదు
యాంకర్ రష్మి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే 'జబర్దస్త్' కామెడీ షోకు హోస్ట్గా చాన్నాళ్ల నుంచి చేస్తూనే ఉంది. కానీ రీసెంట్ టైంలో ఈమెకు పలు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందులతో పాటు ఆత్మీయులని కోల్పోవడం తదితర కారణాల వల్ల సోషల్ మీడియాలోనూ పెద్దగా కనిపించలేదు. వారం పదిరోజుల క్రితం కాశీ వెళ్లొచ్చిన ఈమె.. ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: సైలెంట్గా వైష్ణవిని పెళ్లి చేసుకున్న షన్ను.. ఫొటోలు వైరల్)'నా నవ్వు చూసి చాలామంది ప్రశ్నించొచ్చు. వారణాసి పర్యటనలో ఇది నా చివరిరోజు. కాశీకి రావడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. గతంలో కాశీ వెళ్లినప్పుడు నా మనసు చాలా భారంగా ఉంది. ఏం చేయాలో తోచని దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. చాలా తక్కువ సమయంలో చాలామందిని కోల్పోయాను. ఆ బాధ భరించడం నా వల్ల కాలేదు. ఆ జ్ఞాపకాలని వదిలిపెట్టలేకపోతున్నాను. దేవుడి సంకల్పం లేనిదే ఏ ఆధ్మాత్మిక యాత్ర సాధ్యపడదు. ఏదీ మన చేతుల్లో లేదు. నిజమే నా మొదటి పర్యటనకు ఇప్పటికే చాలా మార్పు కనిపిస్తోంది. మనషులని కోల్పోవడమనేది మనిషి అనుభవంలో, పరిణామ క్రమంలో ఓ భాగమని అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు నేనే చాలా మెరుగ్గా అనిపిస్తున్నాను' అని రష్మి రాసుకొచ్చింది.2023లో నానమ్మని కోల్పోయిన రష్మి.. తర్వాత ఏడాది తాతని కోల్పోయింది. అలానే భుజానికి సర్జరీ జరగడం లాంటివి ఈమెలో దైవచింతనని పెంచాయి. అలా కాశీ వెళ్లివస్తోంది. ఈ క్రమంలోనే పలు ఫొటోలని షేర్ చేసి, తన మనసులోని బాధని కాస్తంత బయటపెట్టింది. అలానే మనుషులని కోల్పోవడం జీవితంలోని ఓ భాగమని అర్థం చేసుకుంది. (ఇదీ చదవండి: యాప్ చెప్పిందని బ్రేకప్.. ఫన్నీగా LIK ట్రైలర్) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
యాప్ చెప్పిందని బ్రేకప్.. ఫన్నీగా LIK ట్రైలర్
డ్యూడ్, డ్రాగన్, లవ్ టుడే సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్లు అందుకున్న తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్.. తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడు నటించిన లేటెస్ట్ మూవీ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'(Lik). కృతి శెట్టి హీరోయిన్ కాగా విఘ్నేశ్ శివన్ దర్శకుడు. నయనతార ఓ నిర్మాత. రాబోయే శుక్రవారం(ఏప్రిల్ 10) మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: సైలెంట్గా వైష్ణవిని పెళ్లి చేసుకున్న షన్ను.. ఫొటోలు వైరల్)ట్రైలర్ బట్టి చూస్తే సమ్థింగ్ ఇంట్రెస్టింగ్ అనేలా ఉంది. అది 2040. ప్రేమకు కూడా ఇన్సూరెన్స్ ఉండాలన, Lik అనే యాప్ని సృష్టిస్తారు. ఈ కంపెనీకి ఓనర్ (ఎస్జే సూర్య). ఈ యాప్లో వాయిస్ ఆర్టిస్టుగా పనిచేసే వైబ్ వాసు (ప్రదీప్ రంగనాథన్).. దీన్ని అసలు నమ్మడు. ప్రేమంటే మనసులో నుంచి పుట్టాలని అనుకుంటాడు. అందుకు తగ్గట్లే ధీమా(కృతిశెట్టి) అనే అమ్మాయిని కలుస్తాడు. కానీ ఆమె ఏమో చిన్నప్పటి నుంచి ఫోన్ని చూస్తూ పెరుగుతుంది. ఏ పనైనా ఫోన్తోనే చేస్తుంది. చివరకు ప్రేమని కూడా ఫోన్లోని Lik యాప్ ద్వారానే వెతుక్కుంటుంది. అయితే ఈ యాప్ చెప్పిందని హీరోకి బ్రేకప్ చెప్పేస్తుంది. మరి చివరకు హీరోహీరోయిన్ ఎలా కలిశారు అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఇండస్ట్రీ టాప్ స్టార్స్ నటించిన సినిమా.. ట్రైలర్ రిలీజ్) -
గ్లామరస్ రుక్మిణి వసంత్.. చీరలో చబ్బీగా అంజలి!
గ్లామరస్గా రుక్మిణి వసంత్ లేటెస్ట్ లుక్చుడీదార్లో డింపుల్ హయాతి అందాలురెడ్ డ్రస్లో రచ్చ లేపేలా శ్రద్ధా శ్రీనాథ్చీరలో రెజీనా కసాండ్రా ట్రెడిషనల్ లుక్మిల్కీ బ్యూటీలా మెరిసిపోతున్న హన్సికచీరలో ముద్దుగా బొద్దుగా అంజలి పోజులు View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Riddhi Kumaar (@riddhikumar_) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi) View this post on Instagram A post shared by Hansika Motwanni (@ihansika) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Sayali Babar (@sayali_vidya) View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Sapthaami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Nikhila Vimal (@nikhilavimalofficial) -
రాముడిగా రణ్బీర్ సెట్ కాలేదు.. బాలీవుడ్ నటుడు కీలక వ్యాఖ్యలు!
దర్శకుడు నితీశ్ కుమార్ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ సినిమాపై నటుడు సునీల్ లహ్రీ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాముడిగా పాత్రకి రణ్బీర్ కపూర్ అంతగా సెట్ అవ్వలేదన్నాడు. రాముడి పాత్రకు ఉండాల్సిన మృదు స్వభావం రణ్బీర్లో కనిపించలేదన్నాడు.తాజాగా ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘రామాయణ’టీజర్ చూశాను. అందులో నేను ఆశించిన స్థాయిలో భావోద్వేగాలు కనిపంచలేదు. రాముడిగా రణ్బీర్ చూడడానికి బాగానే ఉన్నాడు. కానీ అతనిలో సున్నితం, అమాయకత్వం కనిపించడం లేదు. ఆయన కాస్త కఠినంగా కనిపిస్తున్నారు. తన నటనతో అయినా ఈ పాత్రకు న్యాయం చేస్తాడని నమ్ముతున్నాను’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ..‘రణ్బీర్ రాముడి పాత్ర కాకుండా లక్ష్మణుడు లేదా భరతుడి పాత్రలు పోషిస్తే బాగా సెట్ అయ్యేదని అభిప్రాయపడ్డారు. కోట్లాది మంది మనసులను గెలుచుకున్న ‘రామాయణం’ సీరియల్లో లక్ష్మణుడు పాత్రని సునీల్ లహ్రీ పోషించాడు. ‘రామాయణ’ సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రంలో సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ సంస్థ, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై రూ. 4000 భారీ బడ్జెట్తో నమిత్ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ దీపావళికి విడుదల కానుంది. -
ఇండస్ట్రీ టాప్ స్టార్స్ నటించిన సినిమా.. ట్రైలర్ రిలీజ్
మలయాళ సినీ ఇండస్ట్రీ అనగానే చాలామంది మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్ తదితరుల పేర్లు గుర్తొస్తాయి. వీళ్ల మూవీస్ ఎప్పటికప్పుడు డబ్బింగ్ల రూపంలో పలకరిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ల ముగ్గురితోపాటు నయనతార, రేవతి, కుంచకో బోబన్, దర్శన రాజేంద్రన్ లాంటి స్టార్స్ అంతా కలిసి నటించిన మూవీ 'పేట్రియాట్' మరో నెల రోజుల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: బైకర్, రాకాస.. తొలిరోజు వసూళ్లు ఎవరికెన్ని కోట్లు?)స్పై థ్రిల్లర్ స్టోరీతో తీసిన ఈ సినిమాకు మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహించాడు. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది. సరికొత్త థ్రిల్లర్ చూడబోతున్నామనేలా అనిపించింది. యాక్టింగ్ గానీ సీన్స్ గానీ సమ్థింగ్ డిఫరెంట్ అనేలా ఉన్నాయి. మే 01న పాన్ ఇండియా రేంజులో ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతానికి మలయాళ ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేశారు. త్వరలో తెలుగు వెర్షన్ కూడా తీసుకురానున్నారు.(ఇదీ చదవండి: సైలెంట్గా వైష్ణవిని పెళ్లి చేసుకున్న షన్ను.. ఫొటోలు వైరల్) -
‘లీడర్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : లీడర్నటీనటులు:శరవణన్, పాయల్ రాజ్ పుత్, శ్యామ్, ఆండ్రియా, సంతోష్ ప్రతాప్, లాల్, బాహుబలి ప్రభాకర్, అమృత అయ్యర్, వీటీవీ గణేష్, ఐశ్వర్య తదితరులునిర్మాణ సంస్థ: లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్దర్శకుడు: ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్సంగీతం: జిబ్రాన్సినిమాటోగ్రఫీ: ఎస్. వెంకటేష్ఎడిటర్ : ప్రదీప్ ఇ.రాఘవ్విడుదల తేది: ఏప్రిల్ 3‘ది లెజెండ్’(2022) తో ప్రముఖ వ్యాపారవేత్త అరుళ్ శరవణన్ హీరోగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు ‘లీడర్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? శరవణన్ ఖాతాలో హిట్ పడిందా లేదా రివ్యూలో చూద్దాం.కథేంటంటే..శక్తివేల్ (శరవణన్) కారు మెకానిక్. భార్య చనిపోతుంది. కూతురు అయిరేని(ఇయల్) అంటే అతనికి ప్రాణం. ఆమెకు వినికిడి లోపం ఉంటుంది. ఆమెకు ఆపరేషన్ చేయించే ప్రయత్నాల్లో ఉంటాడు శక్తివేల్ ఉండగా.. ఓ రోజు ఎస్సై ఇంద్రా సత్యమూర్తి (ఆండ్రియా) వచ్చి.. తన షెడ్డులోకి రిపేర్కి వచ్చే సాల్ట్(బాహుబలి ప్రభాకర్)కు చెందిన కారులో ఓ ఆడియో బగ్ పెట్టమని కోరుతుంది. దానికి శక్తివేల్ నిరాకరిస్తాడు. అయితే తన కూతురిని సాల్ట్ గ్యాంగ్ కిడ్నాప్ చేసిందని నమ్మించి..పోర్టులో ఉన్న పేలుడు పదార్థాల కంటెయినర్ని బయటకు తీసుకొచ్చేలా చేస్తుంది. పోలీసుల ఆధీనంలో ఉన్న ఆ కంటెయినర్ తిరిగి తీసుకురాకపోతే..నిజంగానే కూతురుని చంపేస్తామని సాల్ట్ హెచ్చరిస్తాడు. మరి కూతురుని కాపాడుకునేందుకు శక్తివేల్ ఏం చేశాడు? పోలీసుల ఆధీనంలో ఉన్న కంటెయినర్కు విదేశాల్లో ఉన్న టెర్రరిస్ట్ డెవిల్(సంతోష్ ప్రతాప్)కు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఎస్సై ఇంద్రా సత్యమూర్తి వేసిన ప్లాన్ ఏంటి? ఆమె అలా ప్లాన్ వేసేలా చెసిందెవరు? అసలు శక్తివేల్ గతం ఏంటి? అతని భార్య మీరా(పాయల్ రాజ్పుత్)ని తన చేతులతోనే ఎందుకు చంపాడు? ట్వల్వ్ మెన్ స్క్వాడ్ అనే సీక్రెట్ రా ఏజెంట్కి శక్తివేల్తో ఉన్న సంబంధం ఏంటి? శక్తివేల్కి, డెవిల్కి మధ్య ఉన్న వైరం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. తండ్రి-కూతురు ఎమోషనల్తో కూడిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ తరహా చిత్రాల్లో యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ట్విస్టులు కూడా ఊహించని విధంగా ఉంటే.. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. లీడర్లో ఆ రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి. భారీ యాక్షన్స్తో పాటు చిన్న చిన్న ట్విస్టులతో ఆద్యంతం ఆసక్తికరంగా కథనం సాగుతుంది. రొటీన్ కథే అయినా.. స్క్రీన్ప్లే మాత్రం అదిరిపోయింది. ఫస్టాఫ్ అంతా తండ్రి కూతురు బాండింగ్తో పాటు.. ఎస్పై ఇంద్రా సత్యమూర్తి ఇన్వెస్టిగేషన్ చుట్టూనే తిరుగుతుంది. సాల్ట్ యార్డ్లో జరిగే అక్రమాలను బయట పెట్టేందుకు ఎస్సై ఇంద్ర.. శక్తివేల్ సాయం అడిగినప్పటి నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది. పోలీసుల ఆధీనంలో ఉన్న కంటెయినర్ని పట్టుకునేందుకు శక్తివేల్ వేసిన ప్లాన్.. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ బ్లాక్.. సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థం మొత్తం భారీ యాక్షన్ సన్నివేశాలలతో ఆసక్తికరంగా సాగుతుంది. శక్తివేల్ ప్లాష్బ్యాక్ ఆకట్టుకుంటుంది. అయితే హీరో హీరోయిన్ల లవ్స్టోరీ మాత్రం సినిమాటిక్గా అనిపిస్తుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అంతగా కుదరలేదు. అలాగే రా ఏజెంట్స్ చేసే ఆపరేషన్స్ కూడా మరింత థ్రిల్లింగ్గా సాగితే బాగుండేది అనిపిస్తుంది. చివరి గంట మాత్రం భారీ యాక్షన్, ట్వీస్టులతో కథనం పరుగులు పెడుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే ట్రైన్ యాక్షన్ సీన్ అదిరిపోతుంది. ఇదే కథ, స్క్రీన్ప్లేతో స్టార్ హీరో చేస్తే మాత్రం.. ఫలితం మరోలా ఉండేది. తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ చేసుకోకపోవడం కూడా కొంతమేర మైనస్సే. స్పై యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లకు ‘లీడర్’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. శక్తివేల్ పాత్రకు శరవణన్ న్యాయం చేశాడు. రా ఏజెంట్ మాదిరే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సీరియస్ లుక్ని మెంటేన్ చేశాడు. యాక్షన్ సీన్లలో కూడా బాగానే నటించాడు. ఇక మీరాగా పాయల్ రాజ్పుత్ తెరపై కనిపించేది కాసేపే అయినా తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆండ్రియా, లాల్, శ్యామ్, అమృత అయ్యర్, వీటీవీ గణేష్, బాహుబలి ప్రభాకర్తో పాటు మిగిలన నటీనటులు తమ పాత్రల పరిధిమేర బాగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. జీబ్రాన్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. వేంకటేష్ సినిమాటోగ్రఫీ బాగుంది.ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -
సైలెంట్గా వైష్ణవిని పెళ్లి చేసుకున్న షన్ను.. ఫొటోలు వైరల్
యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ అలియాస్ షన్ను పెళ్లి చేసేసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరలో వైష్ణవి చోడిశెట్టి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నట్లు వెల్లడించిన ఇతడు.. ఇప్పుడు ఓ రిసార్ట్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు.(ఇదీ చదవండి: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?)అయితే షన్ను పెళ్లి అయిన సంగతి అతడు గానీ, వైష్ణవి గానీ వెల్లడించలేదు. పెళ్లి ఫొటోలని షేర్ చేసిన ఫొటోగ్రాఫర్.. తన స్నేహితుడి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడని చెప్పుకొచ్చాడు. దీంతో షణ్ముఖ్-వైష్ణవి పెళ్లి అయిందనే విషయం తెలిసింది. ఈ ఫొటోల్లో వధూవరులిద్దరూ కనిపించారు గానీ తాళి కడుతున్న ఫొటోలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.వైజాగ్కి చెందిన షణ్ముఖ్ జస్వంత్..యూట్యూబర్గా కెరీర్ మొదలుపెట్టాడు. 'వైవా' షార్ట్ ఫిల్మ్తో గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత పలు తెలుగు సినిమాల్లో సహాయ పాత్రలు చేశాడు. కానీ సాఫ్ట్వేర్ డెవలపర్, సూర్య తదితర యూట్యూబ్ సిరీస్లతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. బిగ్బాస్ షోలో పాల్గొని రన్నరప్గా నిలిచాడు. ఈ షో నుంచి బయటకొచ్చిన తర్వాత అప్పటికే ప్రేమలో ఉన్న సహ యూట్యూబర్ దీప్తి సునైనాతో బ్రేకప్ అయింది. తర్వాత కొన్నాళ్లకు వైష్ణవి చోడిశెట్టితో ప్రేమలో పడ్డ షన్ను.. ఇప్పుడు ఆమెనే పెళ్లి చేసుకున్నాడు.(ఇదీ చదవండి: నేను బెస్ట్ ఎక్స్ బాయ్ఫ్రెండ్ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా: షణ్ముఖ్ జస్వంత్) -
శేష్-మృణాల్ 'డకాయిట్' ట్రైలర్ రిలీజ్
అడివి శేష్, మృణాల్ ఠాకుర్ హీరోహీరోయిన్లుగా నటించిన 'డకాయిట్' సినిమా.. వచ్చే శుక్రవారం(ఏప్రిల్ 10) థియేటర్లలోకి రానుంది. అనురాగ్ కశ్యప్ విలన్గా చేస్తున్నాడు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఇది ఆకట్టుకునేలా ఉంది. మూవీపై అంచనాలు పెంచేస్తోంది. -
అరుణాచలంలో అన్నదానం చేసిన హీరోయిన్
హీరోయిన్ మృణాళిని రవి మంచి మనసు చాటుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరుణాచలంలో అన్నదానం చేసింది. దాదాపు వెయ్యిమంది భక్తులకు భోజనం పెట్టింది. మృణాళిని రవి మాట్లాడుతూ.. ఆకలితో ఉన్నవారికి కడుపు నింపాలన్న సేవాతత్వాన్ని మా నాన్న నేర్పించాడు. వీలైనప్పుడల్లా ఇతరులకు సాయం చేసేలా నా పేరెంట్స్ నన్ను ప్రోత్సహించారు. అన్నిదానాల్లోకెల్లా అన్నదానమే గొప్పదని నేను ఎల్లప్పుడూ నమ్ముతాను. అందుకే నాకు తోచినంత చేశాను అని చెప్పుకొచ్చింది.సినిమాసినిమాల విషయానికి వస్తే.. మృణాళిని రవి 'సూపర్ డీలక్స్' చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. 'గద్దలకొండ గణేశ్' మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. 'ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు', 'మామా మశ్చీంద్ర' సినిమాల్లో మెరిసింది. తెలుగులో కన్నా తమిళంలోనే అనేక సినిమాలు చేసింది. చివరగా 'రోమియో' అనే తమిళ చిత్రంలో తళుక్కుమంది.చదవండి: ఈ ధురంధర్ నటుడికి టిఫిన్ చేసే అలవాటే లేదు -
బైకర్, రాకాస.. తొలిరోజు వసూళ్లు ఎవరికెన్ని కోట్లు?
ఈ వీకెండ్ థియేటర్లలోకి 'బైకర్', 'రాకాస' అనే తెలుగు సినిమాలు వచ్చాయి. రెండింటికి సూపర్ రెస్పాన్స్ రానప్పటికీ పర్లేదు చూడొచ్చనే టాక్ అయితే వచ్చింది. ఒకటి బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ కాగా, మరొకటి హారర్ కామెడీ థ్రిల్లర్. ఈ రెండింటి తొలిరోజు కలెక్షన్స్ ఎంతొచ్చాయి? ప్రస్తుతం వీటి పరిస్థితి ఏంటనేది చూద్దాం.(ఇదీ చదవండి: ‘రాకాస’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)'రాకాస' విషయానికొస్తే.. మెగాడాటర్ నిహారిక నిర్మాతగా వ్యవహరించగా, సంగీత్ శోభన్-నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించారు. మానస శర్మ అనే మహిళా దర్శకురాలు ఈ చిత్రంతో టాలీవుడ్కి పరిచయమైంది. రిలీజ్ శుక్రవారమే అయినప్పటికీ ముందురోజు రాత్రి ప్రీమియర్లు వేశారు. వాటితో కలిపి తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.5.6 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. వీకెండ్ అయ్యేసరికి బ్రేక్ ఈవెన్ కావొచ్చేమో అనిపిస్తుంది.'బైకర్' విషయానికొస్తే.. శర్వానంద్ హీరోగా నటించిన మోటో రేసింగ్ డ్రామా మూవీ ఇది. ఒకప్పటి హీరో రాజశేఖర్ ఇందులో కీలక పాత్ర చేశారు. అభిలాష్ రెడ్డి దర్శకుడు కాగా యువీ క్రియేషన్స్ నిర్మించింది. రేసింగ్ సీన్స్ బాగున్నప్పటికీ ఎమోషన్స్ అనుకున్నంత వర్కౌట్ కాలేదని టాక్ అయితే వచ్చింది. దీని తొలిరోజు కలెక్షన్స్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రీమియర్లతో కలిసి మొదటిరోజు రూ.2.41 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. చూస్తుంటే ఈ రెండు చిత్రాలతో బాక్సాఫీస్ కాస్త ఊపిరి పీల్చుకునేలా కనిపిస్తోంది.(ఇదీ చదవండి: ‘బైకర్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
టిఫిన్ చేసే అలవాటు లేదు, రోజుకు 10 గంటలు నిద్ర!
రోజులో ఏది మర్చిపోయినా అల్పాహారం తినడం మాత్రం మిస్ అవొద్దని అంటుంటారు. కానీ, తాను అదే స్కిప్ చేస్తానంటున్నాడు బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా. ఛావా, ధురంధర్ సినిమాలతో ఒక్కసారిగా సెన్సేషన్ అయిపోయాడు అక్షయ్. అతడి యాక్టింగ్కు ప్రేక్షక జనం ఫిదా అయింది. చిన్నవయసులోనే బట్టతలతో బాధపడినప్పటికీ, దాన్నుంచి బయటపడి ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకున్నాడు. లుక్స్తో కాకుండా టాలెంట్తో సమాధానం చెప్పాలనుకున్నాడు. ఆచితూచి పాత్రలు ఎంచుకుంటూ పోతూ తన సత్తా చూపించాడు. కెరీర్లో ఫుల్ బిజీగా మారిన ఈ నటుడి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఓసారి చూసేద్దాం.. నో స్నాక్స్అక్షయ్ ఖన్నా కేవలం రెండుపూటలే భోజనం చేస్తాడు. ఉదయం అల్పాహారం జోలికి వెళ్లడు. మధ్యాహ్నం, రాత్రిపూట మాత్రం తనకు నచ్చింది తినేస్తాడు. అలా అని మధ్యలో ఖాళీ దొరికితే బిస్కెట్లు, సాండ్విచ్లు తినే టైపు కాదు, కేవలం ఛాయ్ తాగుతాడంతే! ఎక్కువగా ఇంటి భోజనాన్నే ఇష్టపడతాడు. అన్నం, పప్పు, కూరగాయలు, చికెన్, చేపలు, ఏదైనా నాన్వెజ్.. ఇవే ఆయన మెనూలో తరచూ కనిపిస్తుంటాయి. రాత్రిపూట అన్నానికి బదులుగా చపాతీ ఆరగిస్తాడు.మంచి నిద్ర ముఖ్యంతేలికగా జీర్ణమయ్యే ఆహారానికే మొదటి ప్రాధాన్యతనిస్తాడు. ఇంట్లో ఉన్నా, సెట్లో ఉన్నా ఇవే ఆహారపద్ధతులను కొనసాగిస్తుంటాడు. బెండకాయ, లిచీ పండ్లు, కేక్స్ తనకు చాలా ఇష్టమని గతంలో ఓ ఇంటర్వ్యూలో అతడే స్వయంగా చెప్పాడు. అన్నింటికన్నా మంచి నిద్ర అవసరం అంటుంటాడు. రోజుకు 10 గంటలు నిద్రపోతాడు. అలసిన శరీరం, మనసుకు ఊరటనిచ్చేది నిద్రేనంటాడు. మరీ నోరు కట్టేసుకోకుండా సింపుల్ డైట్తోనే ఐదు పదుల వయసులోనూ శరీరాన్ని ఫిట్గా ఉంచుకుంటున్నాడు అక్షయ్.చదవండి: మతిస్థిమితం కోల్పోయిన భానుప్రియ? స్పందించిన చెల్లెలు -
ఓటీటీలో డైరెక్ట్గా స్ట్రీమింగ్ కానున్న మూవీ.. ఫన్నీగా ట్రైలర్
బాలీవుడ్ నటుడు రాజ్కుమార్ రావు, సాన్యా మల్హోత్ర నటించిన సినిమా ‘టోస్టర్’. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ డైరెక్ట్గా విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. ఈ మూవీ ఏప్రిల్ 15 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. వివేక్ దాస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అర్చన పూరన్ సింగ్, అభిషేక్ బెనర్జీ, ఫరా ఖాన్, సీమా పహ్వా తదితరులు నటించారు. ఈ మూవీని రాజ్కుమార్ రావు సతీమణి నటి పత్రలేఖ కంపా ఫిల్మ్స్ బ్యానర్పై నిర్మించారు.ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. కథ మొత్తం భార్యాభర్తల మధ్య జరగనుందని అర్థం అవుతుంది. మహా పిసినారి పాత్రలో రాజ్కుమార్ రావ్ నటిస్తున్నాడు. ఒకరోజు పెళ్లికి వెళ్లిన రాజ్ కొత్త జంట కోసం రూ. 5వేలు విలువ చేసే ఒక టోస్టర్ను గిఫ్ట్గా ఇస్తాడు. అయితే, పలు కారణాలతో ఆ పెళ్లి ఆగిపోతుంది. దీంతో తాను ఇచ్చిన కానుకను తిరిగి ఇవ్వాలని పెళ్లి వారి ఇంటికి వెళ్తాడు. తను గిఫ్ట్గా ఇచ్చిన వస్తువు కోసం ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేది పూర్తి స్టోరీలో రివీల్ కానుంది. -
భానుప్రియ మతిస్థిమితం బాగోలేదా? సోదరి ఏమందంటే?
ఆకట్టుకునే ఆహార్యం, అద్భుతమైన నటన, నెమలిలా నాట్యం చేస్తూ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది హీరోయిన్ భానుప్రియ. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అనేక సూపర్ హిట్ సినిమాలు చేసింది. అయితే భర్త మరణించాక తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిన ఆమె డిమెన్షియా అనే వ్యాధి బారిన పడింది. డిమెన్షియా అంటే జ్ఞాపకశక్తిని కోల్పోవడం!భానుప్రియ గురించి దుష్ప్రచారంఈ వ్యాధి వల్ల డ్యాన్స్ స్కూల్ పెట్టాలన్న ఆలోచన కూడా విరమించుకుంది. కొద్దిరోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితి బాలేదని, మతిస్థిమితం కోల్పోయిందంటూ దుష్ప్రచారం జరుగుతోంది. దీనిపై భానుప్రియ సోదరి, హీరోయిన్ శాంతిప్రియ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ.. మా అక్క కొంతకాలంగా తీవ్ర మనోవేదన అనుభవిస్తోంది. ఆమెకు పెద్ద సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. తీరా చిత్రీకరణ సమయానికి ఆ పాత్రలో అనేక మార్పుచేర్పులు చేస్తున్నారు.ఇలా మోసం చేయడం సరికాదుఅది ఆమెను బాధిస్తోంది. ముందొకటి చెప్పి.. తీరా సెట్కు వెళ్లాక మాట మార్చేయడం పట్ల ఆమె ఎంతగానో కలత చెందింది. దాదాపు 280 సినిమాలు చేసి, ఎన్నో అవార్డులు గెలిచిన వ్యక్తి పట్ల ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఇలాంటి పరిస్థితిలో నా సోదరిని చూడలేకపోతున్నాను. భర్త చనిపోయాక అక్క మానసికంగా కుంగిపోయింది. ఎక్కడికీ వెళ్లకుండా ఇంటికే పరిమితమైంది. తనను కనీసం 80's స్టార్స్ రీయూనియన్కు కూడా ఎవరూ ఆహ్వానించరు.రీయూనియన్కి పిలవరుదీని గురించి మాట్లాడొద్దని అక్క నన్ను హెచ్చరించింది, అయినా సరే నిర్మొహమాటంగా చెప్తున్నా.. తనను ఎవరూ రీయూనియన్ పార్టీకి పిలవట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు.. పోనీ తన నెంబర్ మీ దగ్గర లేకపోతే నాకు లేదా మా అన్నయ్యకు ఫోన్ చేయొచ్చుగా.. ఇండస్ట్రీలో అందరికీ మా అన్నయ్య తెలుసు. కానీ ఎవరూ సంప్రదించరు. ఇకపోతే అక్క ఇకపై సినిమాలు చేయదు. నేను మాత్రం సినిమాల్లో కొనసాగుతాను. నాకోసం డబ్బింగ్బ్యాడ్ గర్ల్ సినిమాలో అక్క నాకోసం డబ్బింగ్ చెప్పింది. తన మానసిక స్థితి చెడిపోలేదు. బాగానే ఉంది. దయచేసి సోషల్ మీడియాలో అక్క గురించి అసత్య ప్రచారం వ్యాప్తి చేయొద్దు. యూట్యూబ్లో ముందూవెనకా ఆలోచించకుండా, ఏదీ తెలుసుకోకుండా అక్క గురించి నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. ఇది చాలా పెద్ద తప్పు అని మండిపడింది. కాగా భానుప్రియ.. సితార చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. బంగారు చిలక, అన్వేషణ, ఆలాపణ, అపూర్వ సహోదరులు, చక్రవర్తి, దొంగ మొగుడు, స్వర్ణకమలం, పెదరాయుడు, అన్నమయ్య, జయం మనదేరా.. ఇలా అనేక సినిమాలు చేసింది. పర్సనల్ లైఫ్చివరగా అయలాన్ మూవీలో హీరో తల్లిగా కనిపించింది. వ్యక్తిగత విషయానికి వస్తే.. భానుప్రియ 1998లో గ్రాఫిక్స్ ఇంజనీర్ ఆదర్శ్ కౌశల్ను పెళ్లాడింది. వీరికి 2002లో కూతురు పుట్టింది. ప్రస్తుతం ఆమె లండన్లో చదువుకుంటోంది. పెళ్లయిన ఏడేళ్లకే దంపతులిద్దరూ విడివిడిగా జీవించడం మొదలుపెట్టారు. కానీ విడాకులు తీసుకోలేదు. 2018లో ఆదర్శ్ గుండెపోటుతో మరణించాడు.చదవండి: నేను కాలితో తన్నడం వల్ల అనుష్కకు గాయం: అడివి శేష్ -
రామాయణలో మరో పవర్ఫుల్ పాత్రలో రణ్బీర్
భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా చాలా సినిమాలు ఇప్పటికే అలరించాయి. ఈ క్రమంలో హిందీలో ‘రామాయణ’ చిత్రాన్ని నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. అయితే, ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. తాజాగా ఈ మూవీ గురించి రణ్బీర్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఇందులో తను ద్విపాత్రాభినయం చేసినట్లు పేర్కొన్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ సంస్థ, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై భారీ బడ్జెట్తో నమిత్ మల్హోత్రా ఈ సినిమాను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు.ఒక వేదికపై రణ్బీర్ మాట్లాడుతూ రామాయణ చిత్రంలో శ్రీరాముడి పాత్రతో పాటు పరశురాముడిగా కూడా నటిస్తున్నట్లు ప్రకటించారు. శ్రీ మహావిష్ణువు ఆరో అవతారం పరశురాముడిగా కూడా నటించే ఛాన్స్ తనకు రావడం నిజంగానే అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఒక నటుడిగా, హావభావాలతో పాటు ఆ పాత్రల వెనుక దాగిన ఆధ్యాత్మికతను, భావోద్వేగాలను లోతుగా అర్థం చేసుకున్నానని తెలిపారు. రామాయణం గురించి పూర్తిగా తెలుసుకునేందుకు సుమారు ఏడాది పాటు సమయం కేటాయించానని ఆయన అన్నారు. -
కాలితో తన్నా.. నావల్ల అనుష్క నొప్పితో బాధపడింది!
ఏదో హడావుడిగా కాకుండా తాపీగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు అడివి శేష్. ఈయన కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం హిట్:ద సెకండ్ కేస్. ఈ సినిమా వచ్చి నాలుగేళ్లవుతోంది. ఇంతకాలం గ్యాప్ తర్వాత అతడు డెకాయిట్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యాడు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది.బాహుబలి జ్ఞాపకాలుఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా అడివి శేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా 'బాహుబలి' సినిమాలో అనుష్కను హీనంగా చూసే ఓ సీన్ గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. అడివి శేష్ మాట్లాడుతూ.. అనుష్క చాలా మంచి వ్యక్తి. స్వీటీ.. ఆ పేరులోనే తెలిసిపోతోంది. ఖైదీగా పడి ఉన్న అనుష్కను కట్టెతో తడుతూ నిద్రలేపాలి. ఆ సన్నివేశం చిత్రీకరణ అయిపోగానే నీకు ఏం తగల్లేదు కదా? అని అడిగాను.బలంగా తన్నడంతో..ఎందుకంటే అప్పటికే నావల్ల ఒకసారి తనకు దెబ్బ తగిలింది. నేను కాలితో తన్నడం వల్ల ఆమె మెడ నొప్పితో బాధపడింది. నిజానికి ముందు నేను సున్నితంగానే తన్నాను. కానీ రాజమౌళి సర్ అది సరిపోదన్నాడు. దాంతో నేను బలంగా తన్నాల్సి వచ్చింది. దానివల్ల ఆమెకు దెబ్బ తగిలింది. అప్పుడే తొలిసారి తనతో మాట్లాడాను అని అడివి శేష్ తెలిపాడు. కాగా బాహుబలి మొదటి భాగంలో భళ్లాల దేవ (రానా దగ్గుబాటి) కొడుకు భద్రుడిగా శేష్ నటించాడు.చదవండి: ధురంధర్లో విలన్ రోల్.. ముగ్గురు రిజెక్ట్ చేశారు: కాస్టింగ్ డైరెక్టర్ -
ధురంధర్లో విలన్గా.. ముగ్గురు రిజెక్ట్ చేశారు: కాస్టింగ్ డైరెక్టర్
కొన్ని సినిమాల్లో హీరోతో పాటు ఇతర పాత్రలు కూడా బాగా ఎలివేట్ అవుతుంటాయి. అలా ధురంధర్ మూవీలో కథానాయకుడు రణ్వీర్ సింగ్తో పాటు మిగతా అన్ని పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా విలన్గా అక్షయ్ ఖన్నా పోషించిన రెహ్మాన్ డకైత్ పాత్ర అయితే విపరీతంగా హైలైట్ అయింది. అక్షయ్ హావభావాలు, మేనరిజం, డ్యాన్స్.. ఇలా అన్నీ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. అయితే ఈ విలన్ పాత్ర కోసం అక్షయ్ కంటే ముందు పలువురు నటీనటులను సంప్రదించగా నిరభ్యంతరంగా తిరస్కరించారట! ముగ్గురు రిజెక్ట్ఈ విషయాన్ని కాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ చాబ్రా వెల్లడించాడు. బాలీవుడ్ హంగామాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. డకైత్ పాత్రను ముగ్గురు యాక్టర్స్ రిజెక్ట్ చేశారు. అందులో ఒకరు దక్షిణాదికి చెందిన ప్రముఖ నటుడు కాగా మరో ఇద్దరు బాలీవుడ్ యాక్టర్స్. వాళ్లు చెప్పిన కారణమేంటంటే.. ఇందులో చాలా ఎక్కువమంది యాక్టర్స్ పని చేస్తున్నారు. పైగా ఇది పూర్తిగా రణ్వీర్ సినిమా అని ఆఫర్ను తిరస్కరించారు. ఆయన తప్ప అందరూ..వారి పేర్లు ఇప్పుడు బయటకు చెప్పలేను కానీ ఆ పాత్రను తిరస్కరించినందుకు వాళ్లు కచ్చితంగా బాధపడే ఉంటారు. ధురంధర్లో నటించేందుకు మొదట అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా కూడా కాస్త తటపటాయించారు. ఆర్.మాధవన్ ఒక్కరే వెంటనే ఓకే చెప్పారు, మిగతా అందరూ కాస్త సమయం తీసుకున్నారు. దర్శకుడు ఆదిత్య, నేను.. ఇలా ఎంతోమంది స్టార్స్ను ఈ సినిమాలో భాగం చేయాలని ముందుగానే అనుకోలేదు. కానీ, అలా జరిగిపోయింది అని చెప్పుకొచ్చాడు.సినిమాఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ధురంధర్ చిత్రం గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ రూ.1400 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన ధురంధర్: ద రివేంజ్ ఇప్పటివరకు రూ.1500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతోంది.చదవండి: ఐశ్వర్య ఇంట్లో ఉండాలి.. అంత ఇగో లేదు: అభిషేక్ బచ్చన్ -
ఐశ్వర్య ఇంటికే పరిమితం..నేనలాంటి వ్యక్తిని కాదు: అభిషేక్
హీరోయిన్ ఐశ్వర్య రాయ్ తనకు భార్య అవడానికి ముందు మంచి స్నేహితురాలు అంటున్నాడు హీరో అభిషేక్ బచ్చన్. పెళ్లయ్యాక తను పని చేయకూడదని ఎన్నడూ కోరుకోలేదని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. అమ్మానాన్న పెళ్లి చేసుకునే సమయానికి నాన్న కంటే అమ్మనే పెద్ద స్టార్. అయినా వాళ్లు చక్కగా కలిసున్నారు. అందులో అసహజంగా ఏదీ కనిపించలేదు. వారి దాంపత్యాన్ని కళ్లారా చూశాను. కెరీర్ ప్రారంభంలోనే..ఆడవారి కన్నా మగవారే ఎక్కువ డామినెంట్గా ఉండాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను కెరీర్ మొదలుపెట్టిన తొలినాళ్లలోనే ఐశ్వర్యతో పరిచయం ఏర్పడింది. నా రెండో సినిమా తనతో కలిసే చేశాను. నాతో కలిసి ఎక్కువసార్లు నటించిన హీరోయిన్ కూడా తనే! ఆ సమయంలో మేము ప్రేమలో లేము. మంచి ఫ్రెండ్స్లా కలిసున్నాం. ఆ తర్వాత ప్రేమలో పడ్డాం, పెళ్లి చేసుకున్నాం. అలాంటి వ్యక్తిని కానునా భార్య తన పనిని వదులుకుంటేనే నేను సురక్షితంగా ఫీల్ అయ్యే వ్యక్తిని కాదు. అలాంటి అభద్రతాభావం మామధ్య లేదు. 'నేను సంపాదిస్తాను, నువ్వు ఇంటిని చూసుకో'వంటి చర్చ మా మధ్య ఎప్పుడూ రాలేదు. అలాగే నా ఎదుగుదల కోసం ఎవరినీ వాడుకోను. ఇండస్ట్రీలో నటుడిగా నన్ను మా నాన్న లాంచ్ చేయలేదు, నాకోసం ఒక్క సినిమా కూడా తీయలేదు. పైగా నేనే నిర్మాతగా మారి ఆయన సినిమా చేశాను, అందుకు నేను చాలా సంతోషిస్తాను. పెళ్లిఈరోజు నేను సాధించిన విజయాలన్నీ నా కష్టం, ప్రయత్నం ద్వారా అందుకున్నవే! అని చెప్పుకొచ్చాడు. కాగా అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ 2007లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2011లో కూతురు ఆరాధ్య జన్మించింది. అయితే అభిషేక్- ఐశ్వర్య చాలా అరుదుగా జంటగా కనిపిస్తారు. దీంతో చాలాసార్లు వీళ్లు విడిపోయారంటూ ప్రచారం జరగడం, దాన్ని దంపతులు కొట్టిపారేయడం పరిపాటిగా మారింది.చదవండి: నాలో సీమ ఫీలింగ్ ఉంది: విజయ్ దేవరకొండ -
ఈ బ్యానర్లో నాకు నాలుగో హిట్: శర్వానంద్
‘‘బైకర్’ ద్వారా నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ఇండియా గర్వించే సినిమా తీస్తామని చెప్పాం... తీశాం. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే చిత్రం ‘బైకర్’. నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అని గర్వంగా చెబుతాను’’ అని హీరో శర్వానంద్ తెలిపారు. శర్వానంద్, మాళవికా నాయర్ జోడీగా నటించిన చిత్రం ‘బైకర్’. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించారు. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్పై వంశీ–ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ప్రభాస్ అన్నకి థాంక్స్అదే రోజు సాయంత్రం నిర్వహించిన బంపర్ బ్లాక్ బస్టర్ మీట్లో శర్వానంద్ మాట్లాడుతూ–‘‘బైకర్’ని సపోర్ట్ చేసిన ప్రభాస్ అన్నకి థాంక్స్. ఈ చిత్రకథని నా వద్దకు పంపిన నిర్మాత వంశీ అన్నకి థ్యాంక్స్. యూవీ క్రియేషన్స్లో ఇది నాకు నాలుగో హిట్. ‘రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, మహానుభావుడు, బైకర్’. ఈ సినిమాను అద్భుతంగా నిర్మించిన వంశీ అన్నకి ధన్యవాదాలు. బైకర్ క్యారెక్టర్ కోసం 22 కిలోలు బరువు తగ్గాను. ‘బైకర్’ని యూత్ చూస్తున్నారు. ఇది ప్యూర్ ఫ్యామిలీ ఫిల్మ్. పిల్లలతో కలిసి ఈ సినిమా చూడండి. ‘బైకర్’కి బ్లాక్బస్టర్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు.రెండేళ్ల కష్టం‘‘బైకర్’కి వస్తున్న స్పందన చూసి చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఇది రెండేళ్ల కష్టం’’ అన్నారు మాళవిక. ‘‘ఈ సినిమాలో బైక్ రేసింగ్తో పాటు ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుందని చెప్పాను. ఆడియన్స్ ఆ ఎమోషన్కు కనెక్ట్ అయ్యారు’’ అని అభిలాష్ రెడ్డి పేర్కొన్నారు. నటుడు రాజశేఖర్, నటి జీవిత, డైరెక్టర్ సంపత్ నంది, కెమెరామెన్ యువరాజ్, నటుడు నిరూప్ నందకుమార్, ఎడిటర్ అనిల్ మాట్లాడారు. -
రామాయణతో ఓటీటీ బిగ్ డీల్.. నో చెప్పిన నిర్మాత!
రామాయణ మూవీ నుంచి రాముడి పాత్రను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ ఒక వీడియోను షేర్ చేసింది. దీంతో సినిమాపై బజ్ పెరిగిపోయింది. ఓటీటీ నుంచి కూడా భారీ ఢీల్ వచ్చినట్లు సమాచారం. ఇందులో రాముడిగా రణ్బీర్ కపూర్ ఆహార్యం ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. అయోధ్యలోకి ఆయన ఎంట్రీ సీన్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేలా ఉంది. ఇందులో సీతగా సాయిపల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్-1 ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల కానుంది. భారీ బడ్జెట్తో నమిత్ మల్హోత్రా, కన్నడ నటుడు యష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలు కలిపి సుమారు రూ. 4వేల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతుందని సమాచారం.రెండు భాగాలుగా విడుదల కానున్న ‘రామాయణ’ చిత్రానికి ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఏకంగా రూ. 1000 కోట్ల వరకు ఓటీటీ హక్కుల కోసం చెల్లించేందుకు ముందుకు వచ్చారట. అయితే ఈ భారీ ఆఫర్ను నిర్మాత నమిత్ మల్హోత్రా తిరస్కరించి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి దీర్ఘకాలిక విలువ, ప్రపంచవ్యాప్త సామర్థ్యంపై మల్హోత్రాకు గట్టి నమ్మకం ఉన్నందువల్లే ఆయన ఈ ఒప్పందాన్ని తిరస్కరించారని తెలుస్తోంది. రామాయణ సినిమాతో వెంటనే లభించే ఆర్థిక లాభం కోసం కాకుండా, ఈ ప్రాజెక్ట్ ఫ్రాంచైజీని ప్రపంచవ్యాప్త చలనచిత్ర దృశ్యంగా తీర్చిదిద్దడంపై ఆయన దృష్టి సారిస్తున్నారని చెబుతున్నారు. దీంతో అనేక దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసి మరింత లాభాన్ని పొందవచ్చు అనేది నిర్మాతల వ్యూహమని అంటున్నారు. వెయ్యి కోట్ల ఓటీటీ ఆఫర్ను కాదనడంతో సినీ వర్గాలను ఆశ్చర్యపరిచినప్పటికీ, ఈ ప్రాజెక్ట్పై చిత్ర నిర్మాతలకు ఉన్న నమ్మకాన్ని కూడా ఇది ప్రతిబింబిస్తుంది. ఇంతటి భారీ అంచనాలు ఉండటం వల్లనే రామాయణ మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. -
వాటిని అధిగమిస్తూ ఛాన్స్లు తెచ్చుకుంటున్నపూజా
సినిమాల్లో లక్కు అవకాశాలను అందించినా, నిలబెట్టేది మాత్రం ప్రతిభనే. అదే శాశ్వత స్థానాన్ని కల్పిస్తుంది. లక్కు, ప్రతిభలో మధ్య ఊగిసలాడుతున్న నటీమణుల్లో పూజాహెగ్డే ఒకరు. పుష్కరం కాలం పాటు కథానాయకిగా కొనసాగుతున్నారు. తెలుగులో అల్లుఅర్జున్ సరసన నటించిన అలవైకుంఠపురంలో, మహేష్బాబుకు జతగా నటించ్చిన మహర్షి వంటి చిత్రాలు మంచి విజయాలను సాధించడంతో పూజాహెగ్డేకి ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చింది. అయితే ఆ తర్వాత నటించిన కొన్ని భారీ చిత్రాలు నిరాశపరచడంతో ఈమెకి అవకాశాలు కరువయ్యాయి. అదే సమయంలో ఈమె నటించిన బీస్ట్ చిత్రం కూడా డిజాస్టర్ అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బ్యూటీని హిందీ చిత్రాలు ఆదుకున్నాయి. అయితే అక్కడ కూడా సరైన విజయం లిభించలేదు. ఈమధ్య సూర్యతో నటించిన రెట్రో చిత్ర విజయం పూజాహెగ్డేకు మళ్లీ ఆశలను చిగురింపజేసింది. కూలీ చిత్రంలో ఐటెం సాంగ్లో నటించి అలరించారు. ఇలాంటి తరుణంలో మరోసారి విజయ్తో జననాయకన్ చిత్రంలో నటించే అవకాశం వరించింది. అయితే ఈ చిత్రం సెన్సార్ సమస్యల్లో చిక్కుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో పూజాహెగ్డే ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ చిత్ర పరిశ్రమలో జయాపజయాలు సరి సమానం అని పేర్కొన్నారు. తాను నటిస్తూ బిజీగానే ఉన్నానని, ఎవరి ఊహాత్మక ప్రశ్నలకు బదులు చెప్పదలుచుకోలేదన్నారు. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో ఒక్క చిత్రంలో నటిస్తున్న పూజాహెగ్డే తమిళంలో ధనుష్తో జత కట్టడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. -
నాలో సీమ ఫీలింగ్ ఉంది: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ అనంతపురంలో ముగిసింది. అక్కడి స్థానికులు విజయ్–రష్మిక జంట మీద ఎంతో ప్రేమాభిమానాలు చూపించారని, బైక్ ర్యాలీలతో అభిమానులు విజయ్ పట్ల అభిమానం చాటుకున్నారని యూనిట్ పేర్కొంది. అలాగే తన రాయలసీమ ఫ్యాన్స్ని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మీట్లో కలిశారు. రాయలసీమకు ఎప్పుడొచ్చినా తన సొంతూరుకి వచ్చినట్లుగా అనిపిస్తోందని, తన లోపల సీమ ఫీలింగ్ ఉందని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.రష్మిక... బ్యాక్ టు జపాన్వచ్చే నెల జపాన్ వెళ్లనున్నారు రష్మికా మందన్నా. ‘క్రంచీ రోల్ అనిమే అవార్డ్స్–2026’ టెన్త్ ఎడిషన్ అవార్డుల ప్రదానోత్సవం మే 23న టోక్యోలో జరగనుంది. ఈ వేడుకకు రష్మికా మందన్నా ఓ ప్రజెంటర్గా హాజరు కానున్నారు. అయితే ‘క్రంచీ రోల్ అనిమే’ అవార్డు వేడుకలో ఆమె పాల్గొనడం ఇదేం తొలిసారి కాదు. 2024లో ఆమె ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని, ‘బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్’ విభాగంలో విజేతకు అవార్డును అందించారు. ఇలా ‘క్రంచీ రోల్ అనిమే’ అవార్డ్స్ ప్రదానోత్సవంలో ఓ ప్రజెంటర్గా పాల్గొన్న తొలి ఇండియన్ యాక్టర్గా నిలిచారామె. మళ్లీ వచ్చే నెలలో జపాన్ వెళ్లనున్నారు. ఇక మొత్తం 32 విభాగాల్లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగుతుంది. తాజాగా నామినేషన్స్ను ప్రకటించారు. ఈ క్రమంలోనే అవార్డుల ప్రజెంటర్స్ పేర్లను కూడా ప్రకటించారు నిర్వాహకులు. ఈ జాబితాలో రష్మికా మందన్నా పేరు ఉంది. -
మే 14న వీరభద్రుడు
సూర్య హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం ‘కరుప్పు’. త్రిష హీరోయిన్గా నటించారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ప్రకాశ్బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన ఈ చిత్రం మే 14న విడుదల కానుంది.కాగా, ఈ సినిమాకు తెలుగులో ‘వీరభద్రుడు’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లుగా వెల్లడించి, ఈ సినిమా కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో కత్తి పట్టుకుని మాస్ లుక్లో కనిపిస్తున్నారు సూర్య. ఈ సినిమాకు సంగీతం: సాయి అభ్యంకర్. -
మెరుపుతీగలా రకుల్.. 'దృశ్యం' పాప ఇప్పుడిలా!
మెరుపుతీగలా సన్నగా మారిపోయిన రకుల్నేపాల్ ట్రిప్ ఎంజాయ్ చేసిన భాగ్యశ్రీ బోర్సేగ్లామర్ చూపించేస్తున్న 'దృశ్యం' ఎస్తర్కశ్మీర్లో చీరకట్టులో అందంగా ప్రియమణిరిసార్ట్లో చిల్ అయిపోతున్న రాయ్ లక్ష్మీషార్ట్లో హెబ్బా పటేల్ అందాల జాతర View this post on Instagram A post shared by Esther (@_estheranil) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Lakshmi raai (@iamraailaxmi) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) -
టాలీవుడ్ హీరో పెళ్లి డేట్ ఫిక్స్.. నిశ్చితార్థం కూడా
తెలుగు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి తేదీపై అధికారిక ప్రకటన వచ్చింది. గత నెలలో తనకు కాబోయే భార్య కావ్య రెడ్డిని పరిచయం చేశాడు. ఇంట్లోనే చిన్నపాటి వేడుక నిర్వహించి టాలీవుడ్ సెలబ్రిటీలని పిలిచాడు. ఇది నిశ్చితార్థం అని చాలామంది భావించారు. అయితే ఇది ఇరు కుటుంబాల పరిచయ వేడుక అని త్వరలో ఎంగేజ్మెంట్, పెళ్లి తేదీలని వెల్లడిస్తానని అన్నాడు. ఇప్పుడు అదే చేశారు.(ఇదీ చదవండి: 'రామాయణ' కోసం రెహమాన్కి అన్ని కోట్ల పారితోషికమా?)కొన్నాళ్ల క్రితం రూమర్స్ వచ్చినట్లే ఈ నెల 29న తిరుపతిలో పెళ్లి జరగనుంది. అంతకు ముందు అంటే ఈ ఆదివారం(ఏప్రిల్ 5) హైదరాబాద్లో నిశ్చితార్థం జరగనుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత హైదరాబాద్లోనే టాలీవుడ్ సెలబ్రిటీల కోసం రిసెప్షన్(వివాహ విందు) ఏర్పాటు చేయనున్నారు.శ్రీనివాస్ విషయానికొస్తే ప్రముఖ నిర్మాత ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ పెద్ద కొడుకు. 'అల్లుడు శీను' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత చాలా సినిమాలు చేస్తున్నాడు గాన సరైన సక్సెస్ దక్కట్లేదు. ప్రస్తుతం ఓ మూడు సినిమాలు చేస్తున్నాడు. కావ్య రెడ్డి విషయానికొస్తే హైదరాబాద్ అమ్మాయి. ఈమె తండ్రి, తాత న్యాయవృత్తిలో కొనసాగుతున్నారు.(ఇదీ చదవండి: పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన శర్వానంద్.. విడాకులు నిజమేనా?) -
'రామాయణ' కోసం రెహమాన్కి అన్ని కోట్ల పారితోషికమా?
భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'రామాయణ' నుంచి రాముడు పాత్రకు సంబంధించిన గ్లింప్స్ వచ్చింది. రాముడిగా రణ్బీర్ కపూర్ ఆహార్యం బాగానే ఉన్నప్పటికీ ఏదో వెలితిలానే అనిపించింది. గ్రాఫిక్స్ మరీ తీసికట్టులా లేనప్పటికీ రూ.4000 కోట్ల బడ్జెట్ ఔట్పుట్ ఇదేనా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. సరే సినిమా రిలీజయ్యే టైంకి క్వాలిటీలో మార్పు ఉండొచ్చు. ఈ విషయం కాసేపు పక్కనబెడితే మరో ఆసక్తికరమైన ముచ్చట సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన శర్వానంద్.. విడాకులు నిజమేనా?)'రామాయణ' కోసం ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ హ్యాన్స్ జిమ్మర్ కలిసి పనిచేశారు. రీసెంట్గా రిలీజైన గ్లింప్స్ వీడియోలో రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. అయితే ఈ చిత్రానికి పనిచేసినందుకుగానూ రెహమాన్ రికార్డ్ స్థాయిలో పారితోషికం అందుకున్నాడట. ఇప్పటివరకు ఏ సంగీత దర్శకుడికి ఇవ్వనంత మొత్తం, ఏకంగా రూ.30 కోట్లని తీసుకున్నాడట. దీనితో పాటు రిలీజ్ తర్వాత వచ్చే కలెక్షన్స్ లాభాల్లోనూ వాటా కూడా రానుందట.'రామాయణ్' గ్లింప్స్ గురించి ఓ వైపు చర్చ జరుగుతుంటే.. మరోవైపు రెహమాన్ పారితోషికం కూడా సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నితీశ్ తివారి దర్శకుడు. ఈ ఏడాది దీపావళికి తొలి పార్ట్ రిలీజ్ కానుంది. రణ్బీర్ కపూర్ రాముడు కాగా.. సీతగా సాయిపల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యష్ నటిస్తున్నారు. ఇప్పటికే రామాయణాన్ని భారతీయ ప్రేక్షకులు చాలా సినిమాల్లో చూశారు. మరి ఇది ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్.. ప్రేమజంటని వెంటాడే మొసలి)(ఇదీ చదవండి: రూ.4,000 కోట్ల బడ్జెట్.. ఇదెలా మర్చిపోయారు? వీడియో వైరల్) -
ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్.. ప్రేమజంటని వెంటాడే మొసలి
ఇప్పుడంతా ఓటీటీ జమానా. కంటెంట్ నచ్చితే భాషతో సంబంధం లేకుండా వాటిని చూస్తున్నారు. అలా ఇప్పుడు ఓ రొమాంటిక్ సర్వైవల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్దమైంది. భయంకరమైన మొసలి.. ఓ ప్రేమ జంటని వెంటాడే కాన్సెప్ట్తో ఈ సినిమాని తీశారు. ఇంతకీ ఇది ఎందులో ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుంది? ఈ మూవీ సంగతేంటి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు మిస్టిక్ థ్రిల్లర్.. డైరెక్ట్ స్ట్రీమింగ్)ఈ ఏడాది ఫిబ్రవరి 13న థియేటర్లలోకి వచ్చిన హిందీ మూవీ 'తు యా మై'. షనయ కపూర్, ఆదర్శ్ గౌరవ్ జంటగా నటించారు. బిజోయ్ నంబియార్ దర్శకుడు. 2018లో వచ్చిన థాయ్ సినిమా 'ద పూల్' ఆధారంగా దీన్ని తీశారు. థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకుంది గానీ యాక్టింగ్, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ చిత్రం వచ్చే శుక్రవారం(ఏప్రిల్ 10) నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. హిందీలో మాత్రమే అందుబాటులోకి రానుంది.'తు యా మై' విషయానికొస్తే.. అవని(షనయ కపూర్) మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. బాగా డబ్బున్న అమ్మాయి. మారుతి కడమ్ అలియాస్ ఆలా ఫ్లోపరా(ఆదర్శ్ గౌరవ్) ఓ ర్యాపర్. గల్లీలో పెరుగుతుంటాడు. ఓ వీడియో చేసేందుకు వీళ్లిద్దరూ కలుస్తారు. తర్వాత ప్రేమలో కూడా పడతారు. కలిసి గోవా వెళ్లిన టైంలో ఓ పాడుబడిన హోటల్లో చిక్కుకుపోతారు. అక్కడి స్మిమ్మింగ్ పూల్లో రొమాంటిక్గా ఎంజాయ్ చేద్దామనుకుంటే వీళ్లని ఓ మొసలి వెంటాడుతుంది. దీని నుంచి ప్రేమజంట బయటపడ్డారా లేదా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన శర్వానంద్.. విడాకులు నిజమేనా?) -
పెళ్లి ఫొటోలు ఎక్కడ? విడాకులు నిజమేనా?
ఈ ఏడాది సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో సక్సెస్ అందుకున్న శర్వానంద్.. ఇప్పుడు 'బైకర్' మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. దీనికి కూడా మిశ్రమ స్పందన వినిపిస్తోంది. వీకెండ్ దాటితే అసలు రిజల్ట్ ఏంటనేది తెలుస్తుంది. సరే ఈ విషయాలు పక్కనబెడితే ఈ హీరో విడాకుల రూమర్స్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. అందుకు ఓ కారణం కూడా ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు మిస్టిక్ థ్రిల్లర్.. డైరెక్ట్ స్ట్రీమింగ్)సహాయ నటుడిగా కెరీర్ మొదలుపెట్టి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్.. 2022లో 'ఒకే ఒక జీవితం' సినిమాతో హిట్ కొట్టాడు. తర్వాత ఏడాది జూన్లో రక్షితా రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. జైపూర్లో ఈ వేడుక జరగ్గా టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ దంపతులు, సిద్ధార్థ్-అదితీ తదితరులు హాజరయ్యారు. వివాహం జరిగిన ఏడాదికే శర్వా-రక్షితకు కూతురు పుట్టింది. ఈ చిన్నారికి లీలా దేవి మైనేని అనే పేరు పెట్టారు. ఓ ఫొటోని కూడా శర్వా తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.అయితే గతేడాది సెప్టెంబరులో శర్వానంద్ విడాకులు గురించి కొన్ని పుకార్లు వచ్చాయి. ప్రస్తుతం శర్వా, అతడి భార్య రక్షిత విడివిడిగా ఉంటున్నారనే విషయం బయటకొచ్చింది. కూతురు కొన్నిరోజులు తండ్రి దగ్గర, మరికొన్ని రోజులు తల్లి దగ్గర ఉంటోందని టాక్ కూడా వినిపించింది. అలాంటిదేం లేదని శర్వా టీమ్ అప్పుడు క్లారిటీ ఇచ్చింది. దీంతో అంతా సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు శర్వా.. సోషల్ మీడియాలో తన పెళ్లి ఫొటోలు, ఫ్యామిలీ ఫొటోలని డిలీట్ చేసేశాడు. దీంతో గతంలో వినిపించిన రూమర్స్ నిజమేనా అని ఇప్పుడు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.శర్వా ఇన్ స్టాలో ప్రస్తుతం సినిమాల పోస్టర్స్, వ్యక్తిగత ఫొటోలు తప్పితే భార్య ఫొటో గానీ కూతురు ఫొటో, కుటుంబం ఫొటోలు ఎక్కడా లేకపోవడంతోనే విడాకుల విషయం మరోసారి తెరపైకి వచ్చింది.(ఇదీ చదవండి: అప్పుడు దెయ్యంగా.. ఇప్పుడు రొమాంటిక్ సినిమాలో) -
దురంధర్ నటుడికి జాక్పాట్.. జూనియర్ ఎన్టీఆర్ మూవీలో ఛాన్స్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్-2. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఈ మూవీ రిలీజైన వారం రోజుల్లోనే వెయ్యి కోట్ల వసూళ్లు సాధించింది. తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది. కేవలం 15 రోజుల్లోనే రూ.1501 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దురంధర్కు సీక్వెల్గా వచ్చిన ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. కేవలం మూడు నెలల్లోనే సీక్వెల్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దురంధర్ టీమ్కు ఎక్కడా లేని క్రేజ్ను తెచ్చిపెడుతోంది. ఈ సినిమాలో నటించిన వారికి ఆదరణ ఓ రేంజ్లో వస్తోంది. తాజాగా ఓ దురంధర్ నటుడికి ఏకంగా టాలీవుడ్ ఛాన్స్ తీసుకొచ్చింది దురంధర్. ఈ మూవీలో నటించిన బిమల్ ఒబెరాయ్ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సరసన ఛాన్స్ కొట్టేశారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తోన్న డ్రాగన్ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. టోవినో థామస్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో బిమల్కు అవకాశమొచ్చినట్లు తెలుస్తోంది.కాగా.. బిమల్ ఓబెరాయ్ దురంధర్లో బలోచ్ యునైటెడ్ ఫోర్స్ లీడర్ శ్రీరాని బలోచ్ పాత్రలో మెప్పించారు. ఈ పాత్ర అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. సీరియస్ అండ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో బిమల్ ఆడియన్స్ను అలరించారు. తాజాగా టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఎన్టీఆర్ మూవీలో ఎలాంటి రోల్ చేస్తారన్న విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. #Dhurandhar fame #BimalOberoi aka #ShiraniBaloch has been roped in by #PrashanthNeel for #Dragon. 🔥#NTRpic.twitter.com/kqkYsg3myv— Milagro Movies (@MilagroMovies) April 3, 2026 -
టాలీవుడ్లోకి జాక్వెలిన్ ఫెర్నాండెజ్..దర్శకుడు ఎవరంటే?
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు టాలీవుడ్ వెండితెరపై మెరవడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు హిందీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ భామ, ఇప్పుడు ఒక భారీ బడ్జెట్ తెలుగు సినిమాతో సౌత్ ఇండియాలోకి అడుగుపెడుతున్నారు. ‘పేపర్ బాయ్’, ‘అరి’ వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ జయశంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కమర్షియల్ హంగులతో పాటు వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమాను ఆయన తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. చిత్రంలోని అత్యంత కీలకమైన సన్నివేశాలను డార్జిలింగ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్తో సినిమాను రూపొందిస్తున్నారు.ఈ క్రేజీ ప్రాజెక్టులో జాక్వెలిన్ సరసన నటించే హీరో ఎవరు? సినిమా టైటిల్ ఏమిటి? అనే విషయాలను చిత్ర యూనిట్ ప్రస్తుతానికి గోప్యంగా ఉంచింది. అయితే, టాలీవుడ్కు చెందిన ఒక స్టార్ హీరో ఇందులో నటిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. త్వరలోనే ఈ చిత్ర టైటిట్తో పాటు ఇతర నటీనటుల వివరాలను అధికారికంగా ప్రకటించేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. -
అప్పుడు దెయ్యంగా.. ఇప్పుడు రొమాంటిక్ సినిమాలో
తెలుగమ్మాయిలకు హీరోయిన్గా అవకాశాలు రావట్లేదని ఒకప్పుడు అనేవారు. కానీ రీసెంట్ టైంలో ఈషా రెబ్బా, అనన్య నాగళ్ల, వైష్ణవి చైతన్య తదితరులు అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉన్నారు. 'మసూద' చిత్రంలో దెయ్యం పాత్రలో మెప్పించిన ఓ నటికి ఇప్పుడు హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. ఆ చిత్రాన్ని శుక్రవారం లాంఛనంగా మొదలుపెట్టారు.(ఇదీ చదవండి: గుడ్న్యూస్ చెప్పిన బండ్ల గణేశ్.. త్వరలో కూతురి పెళ్లి)గతేడాది చివరలో 'శంబాల' అనే థ్రిల్లర్ మూవీతో చాన్నాళ్ల తర్వాత హిట్ కొట్టిన ఆది సాయికుమార్.. ఇప్పుడు 'సైరాభాను' అనే ఓ రొమాంటిక్ ప్రేమకథా సినిమాలో నటించేందుకు సిద్ధమైపోయాడు. రాజేశ్ దండా నిర్మిస్తున్న ఈ మూవీ తాజాగా ప్రారంభమైంది. హీరో కిరణ్ అబ్బవరం క్లాప్ కొట్టాడు. ఇందులో హీరోయిన్గా 'మసూద'లో దెయ్యంగా నటించి ఆకట్టుకున్న బాంధవి శ్రీధర్ని తీసుకున్నారు.'మసూద'లో సహాయ నటిగా ఆకట్టుకుని హిట్ కొట్టినప్పటికీ బాంధవి శ్రీధర్కి పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ హల్చల్ చేసేది. ఇప్పుడు హీరోయిన్గా అంటే పెద్ద ఛాన్సే అనే చెప్పొచ్చు. ఈ సినిమా హిందూ-ముస్లిం బ్యాక్డ్రాప్లో హైదరాబాద్-ఆంధ్రా కనెక్షన్తో రొమాంటిక్ కామెడీ కాన్సెప్ట్తో రాబోతుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు మిస్టిక్ థ్రిల్లర్.. డైరెక్ట్ స్ట్రీమింగ్) -
ఓటీటీలోకి తెలుగు మిస్టిక్ థ్రిల్లర్.. డైరెక్ట్ స్ట్రీమింగ్
ఓటీటీలు అనగానే చాలామంది థ్రిల్లర్సే గుర్తొస్తాయి. అందుకు తగ్గట్లే ఆయా సంస్థలు ఇలాంటి కంటెంట్ని ఎప్పటికప్పుడు తీసుకొస్తుంటాయి. ఇప్పుడు కూడా అలానే మిస్టిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో తెలుగులో ఓ సిరీస్ తీశారు. అదే 'పోచమ్మ'. దీని గ్లింప్స్ని 'పెద్ది' డైరెక్టర్ బుచ్చిబాబు ఇప్పుడు రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే సిరీస్ స్ట్రీమింగ్ తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: గుడ్న్యూస్ చెప్పిన బండ్ల గణేశ్.. త్వరలో కూతురి పెళ్లి)సీరియల్ నటుడు, బిగ్బాస్ ఫేమ్ అంబటి అర్జున్ లీడ్ రోల్ చేస్తుండగా.. శ్రీ పూజా రెడ్డి, స్నేహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 17 నుంచి ఆహా ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది. శ్రుతి నాయుడు నిర్మించగా.. రమేష్ ఇంద్ర దర్శకత్వం వహించారు. గ్లింప్స్ బట్టి చూస్తుంటే.. థ్రిల్లింగ్, డివైన్ ఎలిమెంట్స్తో ఈ సిరీస్ తీసినట్లు తెలుస్తోంది. పోచమ్మ దేవత గొప్పతనం, మహిమని అంచనా వేయక తప్పులు చేసే కొందరిని ఆమె ఎలా శిక్షించింది? తనను పూజించే వారిని ఎలా రక్షించింది? అనేది స్టోరీ అనిపిస్తుంది.పోచమ్మకు కాపాడటం తెలుసు, వేధించడం తెలుసు, అవసరమైతే చంపడం కూడా తెలుసు అనే డైలాగ్ ఈ సిరీస్ ఎలా ఉండబోతోంది అని తెలియజేస్తోంది.మిస్టికల్ థ్రిల్లర్ కంటెంట్ చూసే ఆడియెన్స్ని ఆకట్టుకునేలా కనిపిస్తుంది.(ఇదీ చదవండి: ‘రాకాస’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
మెగా హీరో కొత్త సినిమా.. సంబరాల ఆగిపోయినట్టేనా?
మెగా హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం సంబరాలు ఏటిగట్టు చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే గ్లింప్స్ రిలీజ్ చేయగా అభిమానులను ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. అయితే ఈ మూవీ ఆగిపోయిందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే మెగా హీరో మరో కొత్త సినిమా ప్రకటించారు. క మూవీ డైరెక్టర్ సుజిత్, సందీప్ల దర్శకత్వంలో నటించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సాయి దుర్గ తేజ్ కెరీర్లో 19 మూవీగా నిలవనుంది. ప్రస్తుతం ఈ సినిమాను ఎస్డీటీ19 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కంచునున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే రివీల్ చేయనున్నారు. Secrets of the Ages… Power beyond imagination.Stepping into something truly powerful… Excited to be part of this journey with the Dynamic directors @Dir_Sujith & @Dir_SandeepM and Passionate Producer @Sahugarapati7 anna#SDT19 #CosmicChronicles @Shine_Screens… pic.twitter.com/OxXyLhUK6S— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 3, 2026 A powerful collaboration comes together for #SDT19 ❤️🔥Mega Supreme Hero @IamSaiDharamTej joins hands with visionary director duo @Dir_Sujith & @Dir_SandeepM, backed by blockbuster producer @Sahugarapati7 🔥A new cinematic chapter unfolds. ✨#CosmicChronicles #Archana… pic.twitter.com/dWagdUQwBk— Shine Screens (@Shine_Screens) April 3, 2026 -
రూ.4,000 కోట్ల బడ్జెట్.. ఇదెలా మర్చిపోయారు? వీడియో వైరల్
కొన్ని కథలు తెరపై ఎన్నిసార్లు చూపించినా చూడాలనిపిస్తుంది. తెలిసిన కథే అయినా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. అలాంటి ఇతిహాస కథే రామాయణం. రాముడి కథను మరోసారి సినీప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు సినిమా వస్తోంది.. అదే రామాయణ. రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ కోసం దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్ కేటాయించారు.టీజర్లో ఇది గమనించారా?హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం (ఏప్రిల్ 2న) టీజర్ కూడా వదిలారు. ఇందులో రాముడు శివధనస్సు విరిచినప్పటినుంచి అరణ్యవాసం వరకు అనేక విషయాలకు సంబంధించిన గ్లింప్స్ను జత చేశారు. అయితే శ్రీరాముడు నగర వీధుల్లో నడుస్తుంటే జనం పూలతో స్వాగతం పలికే చిన్న క్లిప్లో ఓ పొరపాటు దొర్లింది. ఓ వ్యక్తి తలపాగా ఉన్నట్లుండి రంగు మారింది. మొదట నీలిరంగులో, తర్వాత వంకాయ కలర్లో.. ఆ తర్వాత మళ్లీ నీలిరంగులోకి మారింది. అలా వదిలేశారేంటి?34 సెకన్ల నుంచి 38 సెకన్ల నిడివి మధ్యలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్ మూవీలో ఈ చిన్న తప్పిదాన్ని అలాగే వదిలేశారేంటి? అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఇది వీఎఫ్ఎక్స్ సమస్య కాదని కలర్ గ్రేడింగ్ వల్ల అలా జరిగిందని, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదంటున్నారు.సినిమారామాయణ విషయానికి వస్తే.. నితీశ్ తివారి దర్శకత్వం వహించిన ఈ మూవీని నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. 8సార్లు ఆస్కార్ పొందిన డీఎన్ఈజీ సంస్థ ఈ మూవీకి వీఎఫ్ఎక్స్ చేసే బాధ్యతలను చేపట్టింది. హన్మ్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. Notice the blue turban guy next to the kid his turban colour changes to purple in between shots 😳😳₹4000 Cr Movie has new technology altogether it seems 🤩🤩#Ramayana pic.twitter.com/Bu48kWPhlq— Pan India Review (@PanIndiaReview) April 3, 2026 చదవండి: యుగానికి ఒక్కడు సీక్వెల్.. నేనైతే అస్సలు చేయను: ఆండ్రియా -
'ఐ యామ్ నాట్ జెట్లీ..' బోల్డ్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్
'మత్తు వదలరా' సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు రితేశ్ రానా.. కమెడియన్ సత్యని హీరోగా ఓ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు 'జెట్లీ' అనే టైటిల్ ఖరారు చేశారు. ఇప్పటికే రిలీజైన టీజర్ గ్లింప్స్, పోస్టర్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. సత్య ఈజ్ నాట్ జెట్లీ అంటూ సాగే పుల్ మాస్ సాంగ్ను విడుదల చేశారు. ఈ పాటకు సాయి సోమయాజులు లిరిక్స్ అందించగా..శ్రావణ భార్గవి ఆలపించారు. ఈ పాటకు కాల భైరవ సంగీతమందించారు. కాగా.. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, రియా సింఘా, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. Repeat after us...SATYA IS NOT JETLEE ❌SATYA IS NOT JETLEE ❌#SatyaIsNotJetlee video song out now ❤🔥▶️ https://t.co/HYbBF6efT4#JETLEEA @RiteshRana's turbulence 🛫A @kaalabhairava7's musical.Starring #Satya, #RheaSingha, @vennelakishore @harshachemudu… pic.twitter.com/yNbmWTB1kj— Mythri Movie Makers (@MythriOfficial) April 2, 2026 -
‘రాకాస’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
‘కమిటీ కుర్రోళ్లు’ తర్వాత మెగా డాటర్ నిహారిక నిర్మించిన రెండో చిత్రం రాకస. ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు చేసినంత ప్రమోషన్స్..మరే చిత్రానికి చేయలేదు. మెగా హీరోలు కూడా ప్రమోషన్స్లో పాల్గొనడంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇక ట్రైలర్, టీజర్లు కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇలా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? నిర్మాతగా నిహారిక ఖాతాలో రెండో విజయం పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వీరబాబు అలియాస్ వీరు(సంగీత్ శోభన్).. తన ప్రియురాలు సుకన్యను పెళ్లి చేసుకోవాలని సొంతూరుకి వస్తాడు. కానీ అప్పటికే వేరే వ్యక్తితో సుకన్య పెళ్లికి రెడీ అవుతుంది. బ్రేకప్ బాధలో ఉన్న సమయంలోనే సోము(వెన్నెల కిశోర్) అనే వ్యక్తిని హత్య చేశాడనే ఆరోపణలు ఎదుర్కొనాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతని పాస్పోర్ట్ని పోలీసులు తీసుకెళ్తారు. సోము జాడని కనిపెడితే తన పాస్పోర్టు తిరిగి వస్తుందని.. స్నేహితుడు బాలు(గెటప్ శ్రీను)తో కలిసి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయంలో ఆ ఊరి చివరిలో ఎన్నో దశాబ్దాలుగా తిష్టవేసుకొని ఉన్న బ్రహ్మ రాక్షసుడికి నరబలి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో ఊరంతా కలిసి ఓ ముసలాడిని బలి ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా.. చివరి క్షణంలో అతను చనిపోతాడు. అతనికి బదులుగా బాలు పోవాల్సి ఉండగా.. వీరూ అడ్డుపడతాడు. దీంతో బాలుకి బదులుగా వీరూ ఆ కోటలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ కోట ప్లాష్బ్యాక్ స్టోరీ ఏంటి? నిజంగానే ఆ కోటలో బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడా? సుబ్బులక్ష్మి(నయన్ సారిక) ఎవరు? ఆమె ఎందుకు కోటలోకి వెళ్లింది? సోము సంగతి ఏంటి? నిజంగా చనిపోయాడా? లేదా బతికే ఉన్నాడా? బలి కోసం కోటలోకి వెళ్లిన తర్వాత వీరూకి ఎదురైన సవాళ్లు ఏంటి? తిరిగి ప్రాణాలలో బయటకు వచ్చాడా రాలేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. హారర్ కామెడీ చిత్రాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంటుంది. ఇలాంటి సినిమాల్లో నటీనటులు, కథను పట్టించుకోరు. భయపెడుతూ నవ్విస్తే చాలు.. ఆ సినిమాను ఆదరిస్తారు. రాకస టీమ్ కూడా అదే పని చేసింది. చిన్నప్పుడు చదువుకున్న బకాసురుడి కథను స్ఫూర్తిగా తీసుకొని దర్శకురాలు మానస శర్మ ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే హారర్ కంటే ఎక్కువగా కామెడీపైనే ఎక్కువ దృష్టిపెట్టారు. అది బాగానే వర్కౌట్ అయింది కూడా. చిన్న పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసే సన్నివేశాలతో ఆద్యంతం వినోదాత్మకంగా సినిమాను తీర్చిదిద్దారు.పాడుబడ్డ కోట..ఆ కోటకు వెయ్యేళ్ల చరిత్ర.. బ్రహ్మరాక్షసుడి కండీషన్..ఇలా సినిమా ప్రారంభమే ఆసక్తికరంగా ఉంటుంది. ఎప్పుడైతే హీరో ఎంట్రీ ఇస్తాడో కథనం కామెడీ వైపు టర్న్ తీసుకుంటుంది. ప్రియురాలి కోసం అమెరికా నుంచి రావడం..అనుకోకుండా హత్య కేసులో ఇరుక్కోవడం.. ఊరి పెద్దల తీర్పుతో పాస్పోర్టు కోల్పోవడం..ఇందంతా కామెడీగా సాగిపోతాయి. అయితే ఈ తరహా పంచ్లు, కామెడీ సీన్లు చాలా సినిమాల్లో చూడడంతో ఫస్టాఫ్ అంతగా ఆకట్టుకోదు. అసలు కథను ప్రారంభించడానికి ఇదంతా సాగదీశారనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్తో కథపై ఆసక్తి పెరుగుతుంది. హీరో ఎప్పుడైతే కోటలోకి ప్రవేశిస్తాడో.. అప్పటి నుంచి కథనం పరుగులు పెడుతూ.. నవ్వులు పూయిస్తుంది. బ్రహ్మరాక్షసుడి సీన్ భయపడితే..దెయ్యాల సీన్ నవ్వులు పూయిస్తుంది. ఇక గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్, నయన్ సారిక కూడా కోటలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నవ్వులు డబుల్ అవుతాయి. అదే సమయంలో బ్రహ్మరాక్షసుడి నుంచి ఈ గ్యాంగ్ ఎలా తప్పించుకుంటుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. క్లైమాక్స్ కాస్త ఎమోషనల్గా అనిపిస్తుంది. అయితే సినిమా ప్రారంభం నుంచి ఎండ్ వరకు చాలా వరకు కథనం ఊహకందేలా సాగుతుంది. ఈ రోజుల్లు దెయ్యాలు, రాక్షసులు ఉంటాయా? అని లాజిక్కులు వెతక్కుండా సినిమా చూస్తే ఎంజాయ్ చేస్తారు. ఎవరెలా చేశారంటే.. సంగీత్ శోభన్ మంచి నటుడు. ఏ పాత్రలోనైనా ఇట్టే లీనమైపోతాడు. వీరూ పాత్రలో కూడా ఒదిగిపోయాడు. తనదైన కామెడీ టైమింగ్, సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక నయన్ సారిక తెరపై అందంగా కనిపించింది. వీరిద్దరి లవ్ట్రాక్ అంతగా పండలేదు కానీ.. బోర్ మాత్రం కొట్టించదు. గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్ల కామెడీ కూడా ఈ సినిమాకు ప్లస్ అయింది. కోటలో వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు నవ్వులు పూయిస్తాయి. తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మాజీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ఇలాంటి సినిమాకు నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. కొన్ని చోట్ల బీజీఎంతోనే భయపెట్టాలి. ఈ విషయంలో సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్ సక్సెస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. వీఎఫ్ఎక్స్ విజువల్స్ బాగుతున్నాయి. ఎడిటింగ్ ఓకే. నిహారిక ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. గ్రాండ్ లెవల్ లో సినిమాను నిర్మించారు. -
ఆయనతో నావల్ల కాదు.. ఆ సినిమా చేయను: ఆండ్రియా
కొన్ని సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వాటిని రీరిలీజ్ చేసినా, సీక్వెల్ తీసినా చూసేందుకు ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అలా యుగానికి ఒక్కడు (ఆయిరత్తిల్ ఒరువన్) సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కార్తీ హీరోగా, ఆండ్రియా జెర్మియా, రీమా సేన్ హీరోయిన్లుగా నటించారు. ధనుష్ సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించాడు. 2010లో విడుదలైన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలోనే దర్శకుడు ప్రకటించాడు. ఆషామాషీ కాదుకానీ ఏళ్లు గడుస్తున్నా ఆ దిశగా పనులు జరగలేదు. గతేడాది చివర్లో మరోసారి సీక్వెల్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సెల్వ. ధనుష్, కార్తీతో కలిసి సీక్వెల్ తీస్తానని, కాకపోతే ఏడాదిపాటు వారు కాల్షీట్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నాడు. ఇప్పటికే చేతిలో సినిమాలతో బిజీగా ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు ఏడాదిపాటు డేట్స్ ఇవ్వాలంటే ఆషామాషీ కాదు. అదెప్పుడు సాధ్యమవుతుందో చూడాలి!సీక్వెల్లో నేనుండనుఇకపోతే యుగానికి ఒక్కడు సీక్వెల్పై నటి, సింగర్ ఆండ్రియా జెర్మియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. యుగానికి ఒక్కడు సినిమా చేయడం ఒక అద్భుతమైన అనుభవం. ఆ మూవీ నటిగా ఎదిగేందుకు తోడ్పడింది. అయితే రెండో భాగంలో నేను ఉంటానని మాత్రం ఊహించకండి. యుగానికి ఒక్కడు సీక్వెల్ తెరకెక్కితే సంతోషమే కానీ నేను మాత్రం అందులో చేయలేను.ఆయనతో పని చేయడం కష్టంఎందుకంటే మొదటి భాగమే 200 రోజులు తెరకెక్కించారు. అన్ని రోజులు పని చేయడమంటే మాటలు కాదు. అక్కడ అంత కష్టపడ్డాను గనుకే తర్వాత చేసిన సినిమాలు ఎంతో సులువుగా అనిపించాయి. ఏదేమైనా దర్శకుడు సెల్వరాఘవన్తో కలిసి పని చేయడం చాలా కష్టం అని పేర్కొంది. ప్రస్తుతం ఆండ్రియా చేతిలో మనుషి, పిశాచి 2, నో ఎంట్రీ సినిమాలున్నాయి.చదవండి: బండ్ల గణేశ్ ఇంట శుభకార్యం.. కూతురి పెళ్లి వేడుక -
15 రోజుల్లో దురంధర్-2 కలెక్షన్స్.. అఫీషియల్ ప్రకటన
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్-2. గతేడాది రిలీజై బ్లాక్బస్టర్గా నిలిచిన దురంధర్కు సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మార్చి 19న విడుదలైదన ఈ మూవీ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ మరో మైలురాయిని చేరుకుంది. రిలీజైన 15 రోజుల్లోనే రూ.1501 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు.తొలివారంలో వెయ్యి కోట్లు దాటిన దురంధర్ ది రివెంజ్.. రెండోవారంలో కాస్తా జోరు తగ్గింది. ఈ వసూళ్లతో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సినిమా కంటే ముందు దంగల్, బాహుబలి-2, పుష్ప-2 తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు భారతదేశంలో రూ. 937.32 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది.ఆదిత్య ధర్ డైరెక్షన్లో ఈ మూవీని తెరకెక్కించారు. పాకిస్తాన్కు వెళ్లిన ఇండియన్ స్పై జీవితం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ భారతీయ గూఢచారి హంజా అలీ మజారి పాత్రలో నటించారు. ఇందులో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడి, డానిష్ పాండోర్, సారా అర్జున్ కీలక పాత్రలు పోషించారు.Duniya bhar mein goonj rahi hai naye Hindustan ki dahaad. 🔥Day-wise break-up | IndiaWeek 1: ₹690 Cr*DAY 9: ₹42 Cr*DAY 10: ₹64 Cr*DAY 11: ₹71 Cr*DAY 12: ₹26 Cr*DAY 13: ₹28 Cr*DAY 14: ₹21 Cr*Day 15: ₹19 Cr*India: ₹961 Cr*Worldwide GBOC (2 weeks)India:… pic.twitter.com/jF0uS998P1— Jio Studios (@jiostudios) April 3, 2026 -
గుడ్న్యూస్ చెప్పిన బండ్ల గణేశ్.. త్వరలో కూతురి పెళ్లి
ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఇంట శుభకార్యం జరగనుంది. అతడి కూతురు జనని పెళ్లిపీటలెక్కనుంది. ఈ విషయాన్ని బండ్ల గణేశ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. వివాహ పనులు కూడా మొదలైనట్లు తెలిపాడు. దేవుడి ఆశీస్సులు, మా పెద్దల దీవెనలతో త్వరలో మా ఇంట్లో శుభకార్యం జరగబోతుంది.పసుపు- కుంకుమ ఫంక్షన్చిరంజీవి 'సూర్యతేజ చిలుకూరి'- చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి 'జనని బండ్ల'ల వివాహ సందర్భంగా పసుపు కుంకుమ కార్యక్రమం నిర్వహించాం అని తెలిపాడు. ఈ ఫంక్షన్కు సంబంధించిన ఫోటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. అందులో తమ వియ్యంకులతో పాటు కాబోయే అల్లుడి ఫోటోలు కూడా ఉన్నాయి. ఇది చూసిన అభిమానులు బండ్ల గణేశ్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సినిమాబండ్ల గణేశ్.. కెరీర్ ప్రారంభంలో కమెడియన్గా, సహాయ నటుడిగా మెప్పించాడు. సుస్వాగతం, మల్లీశ్వరి, ఆంధ్రావాలా, సరిలేరు నీకెవ్వరు.. ఇలా ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశాడు. డేగల బాబ్జీ మూవీలో హీరోగానూ కనిపించాడు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ ద్వారా నిర్మాతగా మారాడు. ఆంజనేయులు, గబ్బర్ సింగ్, బాద్షా, ఇద్దరమ్మాయిలతో, టెంపర్ వంచి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించాడు. ప్రస్తుతం చిరంజీవి సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు.చదవండి: అప్పుడేమో విరక్తి.. ఇప్పుడేమో ప్రశంసలు: బుల్లితెర 'సీత' -
'మీ హేమక్క ఎప్పుడు అలా చేయదు'.. వీడియో రిలీజ్
టాలీవుడ్ నటి హేమపై గతేడాది డ్రగ్స్ కేసు నమోదైంది. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో హేమ జైలుకు కూడా వెళ్లి వచ్చింది. కానీ ఆ తర్వాత ఈ కేసును కర్ణాటక హైకోర్టు పూర్తిగా కొట్టివేసింది. అయితే తనపై కేసు నమోదైనప్పుడు మీడియాలో చాలా వార్తలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల ప్రెస్ మీట్లోనూ తనకు పాజిటివ్ రాకుండానే.. వచ్చిందని రాసుకొచ్చారని తన బాధను పంచుకుంది.తాజాగా నటి హేమ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేను ప్రస్తుతం కొండాపూర్లోని పబ్కి వచ్చానని తెలిపింది. పోలీసుల రైడ్లో కొంతమందికి పాజిటివ్ వచ్చిందని చెబుతున్నారు. అక్కడే ఉన్న నన్ను కూడా టెస్ట్ చేశారని.. కానీ నాకు నెగెటివ్ వచ్చిందని చెబుతూ వీడియోను పోస్ట్ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 'రేపు మళ్లీ ఈ వీడియోను పోస్ట్ చేస్తాను.. మీ హేమక్క ఎప్పుడు తప్పు చేయదు.. జెన్యూన్గా ఉంటుంది.. ముక్కుసూటిగా ఉంటది.. లవ్ యూ ఆల్' అంటూ వీడియోలో మాట్లాడారు హేమ.HYD కొండాపూర్లోని క్వాక్ ఎరీనా పబ్పై పోలీసుల రైడ్లో కొంతమందికి పాజిటివ్ వచ్చింది అని చెబుతున్నారు.అక్కడ ఉన్న తనకు టెస్ట్ చేయగా నెగటివ్ వచ్చిందని నటి హేమ వీడియో విడుదల చేశారు. హేమ ఎప్పుడు తప్పు చేయదు జెన్యూన్ గా ఉంటుంది..ముక్కు సూటిగా మాట్లాడుతుంది ..అని అన్నారు నటి హేమ… pic.twitter.com/gzH3Y6EhQn— Tupaki (@tupaki_official) April 3, 2026 -
అతడి నుంచి తప్పించుకునేందుకు రెండో ఫ్లోర్ నుంచి దూకేశా..: నటి
లైంగిక వేధింపుల నుంచి తనను తాను కాపాడుకునేందుకు రెండో అంతస్తు నుంచి దూకానంటోంది బుల్లితెర నటి, హిందీ బిగ్బాస్ 13వ కంటెస్టెంట్ ఆర్తి సింగ్. అప్పుడు తన వయసు కేవలం 13 ఏళ్లేనని చెప్తోంది. చిన్న వయసులో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఆర్తి సింగ్ మాట్లాడుతూ.. అప్పుడు నాకు 13 ఏళ్లు. మా ఇంట్లో పనిచేసే వ్యక్తి నాపై అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించాడు. చేతులు జోడించి బతిమాలినా..నేను మంచి నిద్రలో ఉండగా నా గదిలోకి నడుచుకుంటూ వచ్చాడు. నా గదిలోకి ఎందుకు వచ్చావని గొడవపడ్డాను. నాపైకి వస్తుంటే నువ్వు నా అన్నయ్యవి కదా, ప్లీజ్ వెళ్లిపో అని రెండు చేతులు జోడించి వేడుకున్నాను. అతడు నా మాట వినలేదు. నేను బయట వరండా వైపు చూస్తే తలుపులు తాళం వేసి ఉన్నాయి. అమ్మ పొలానికి వెళ్లింది, ఇంట్లో ఒంటరిగా ఉన్నాను.రెండో ఫ్లోర్ నుంచి దూకేశా..అక్కడ వాతావరణం భయానకంగా మారింది. బయటకు వెళ్లే పరిస్థితి కనిపించలేదు. నేను వెంటనే అతడి నుంచి తప్పించుకుని రెండో అంతస్తుకు పరిగెత్తి అక్కడి నుంచి కిందకు దూకేశాను. నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను కాబట్టే ఆ రోజు నాపై ఏ అఘాయిత్యం జరగకుండా నన్ను నేను కాపాడుకోగలిగాను అంది. ఆర్తి సింగ్.. గృహస్తి, పరిచయ్, ఉత్తరన్, దేవోన్ కే దేవ్.. మహాదేవ్, వారిస్, విక్రమ్ బేతాళ్కీ రహస్య గాథ వంటి పలు హిందీ సీరియల్స్లో నటించింది. హిందీ బిగ్బాస్ 13వ సీజన్లో నాలుగో రన్నరప్గా నిలిచింది.చదవండి: పెళ్లయిన నెలకే ముగ్గురమయ్యాం అంటూ రష్మిక పోస్ట్ -
హ్యాపీ బర్త్ డే చిన్ని బాబు.. అల్లు అర్జున్ స్పెషల్ విషెస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుమారుడికి బర్త్ డే విషెస్ తెలిపారు. ఇవాళ అల్లు అయాన్ పుట్టినరోజు కావడంతో ప్రత్యేక ఫోటోను షేర్ చేశారు. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. హ్యాపీ బర్త్ డే మై చిన్ని బాబు అంటూ తనయుడిపై తన ప్రేమను చాటుకున్నారు. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ అల్లు అయాన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ మలయాళ డైరెక్టర్ బసిల్ జోసెఫ్ డైరెక్షన్లో పని చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు.Many happy returns of the day to the love of my life. Happy Birthday, my chinni babu. #HBDAlluAyaan #AyaanisaVibe pic.twitter.com/czUM77roIv— Allu Arjun (@alluarjun) April 3, 2026 -
పెళ్లయిన నెలకే 'ముగ్గురమయ్యాం' అంటూ రష్మిక పోస్ట్.. ప్రెగ్నెంట్?
విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా.. ఈ జంట పక్షులు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా సరే పర్సనల్ లైఫ్లో ఓ అడుగు ముందుకు వేయడానికి సమయం తీసుకున్నారు. ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లో వివాహం చేసుకున్నారు. ప్రేమలో ఉన్న విషయాన్ని వీలైనంతవరకు సీక్రెట్గానే ఉంచే ప్రయత్నం చేసినా పెళ్లిని మాత్రం అధికారికంగా ప్రకటించారు. రిసెప్షన్ను ఎంతో వైభవంగా జరుపుకున్నారు.బడ్డీమూన్పలు నగరాల్లో అభిమానుల కోసం స్వీట్లు కూడా పంచారు. పెళ్లయిన వెంటనే ఈ కొత్త జంట ఏకాంతంగా హనీమూన్కు వెళ్లకుండా ఫ్రెండ్స్ గ్యాంగ్తో బడ్డీమూన్కు వెళ్లింది. అత్యంత సన్నిహితులతో చేసే విహారయాత్రే ఈ బడ్డీమూన్. ఆ తర్వాత ఈ నూతన దంపతులు ఇతర పెళ్లి వేడుకలకు కూడా హాజరయ్యారు. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరలయ్యాయి.మేము ముగ్గురమయ్యాంఇదిలా ఉంటే తాజాగా రష్మిక సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి సెన్సేషన్గా మారింది. 'ఇప్పుడు మేము ముగ్గురమయ్యాం' అంటూ ఓ చిన్న యానిమేషన్ వీడియో క్లిప్ షేర్ చేసింది. అందులో రష్మిక, విజయ్తో పాటు ఓ పొద్దుతిరుగుడు పువ్వు ఉంది. రష్మిక టీ షర్ట్పై గుడ్డు ఫోటో కూడా ఉంది. దీంతో చాలామంది రష్మిక తల్లి కాబోతోందా? ఒక నెలలోనే గుడ్న్యూస్ చెప్పారు అంటూ శుభాకాంక్షలు చెప్తున్నారు.ఇదీ సంగతి!అసలు విషయమేంటంటే.. పొద్దుతిరుగుడు పువ్వును రష్మిక తన క్లోజ్ ఫ్రెండ్గా భావిస్తుంది. దానికోసం ఇన్స్టాగ్రామ్లో ప్రత్యేకంగా (Rashmikaru పేరిట) ఓ అకౌంట్ కూడా ఉంది. అందులో ఆ పువ్వుతో ముచ్చట్లు చెప్తున్న సంగతులను, కథలను యానిమేటెడ్ ఫోటో, వీడియోల ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ యానిమేషన్ ప్రపంచంలోకి విజయ్ను ఆహ్వానిస్తూ ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)చదవండి: అప్పుడేమో పెదవి విరిచి.. ఇప్పుడేమో రామాయణపై సీత ప్రశంసలు -
సడన్గా ఓటీటీకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హనుమాన్ ఫేమ్ వరలక్ష్మీ శరత్కుమార్ స్వీయ దర్శకత్వం వహించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ సరస్వతి. ఈ చిత్రంలో ప్రియమణి ప్రకాశ్రాజ్, రావు రమేశ్, రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా మార్చి 6న విడుదలైంది. ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద రెస్పాన్స్ వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా రాణించలేకపోయింది. ఈ సినిమాతో వరలక్ష్మీ దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చింది.తాజాగా ఈ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళం, తెలుగు భాషలతో పాటు కన్నడ, మలయాళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం థియేటర్లలో చూడనివారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. సరస్వతి కథేంటంటే..లక్ష్మి(వరలక్ష్మి శరత్కుమార్) సింగిల్ మదర్. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్స్గా పని చేస్తుంది. కూతురు సరస్వతి(నివేక్ష) తప్ప ఆమెకు మరో లోకం ఉండదు. ఆగస్ట్ 15న కూతురు పుట్టినరోజు కావడంతో చాక్లెట్ బాక్స్ ఇచ్చి స్కూల్లో డ్రాప్ చేస్తుంది. సాయంత్రం తిరిగి వచ్చేసరికి స్కూల్లో కూతురు కనిపించదు. సిబ్బందిని ప్రశ్నిస్తే.. సరస్వతి అనే పేరుతో ఆమె చెప్పిన క్లాస్లో ఏ అమ్మాయి లేరని చెబుతారు. పోలీసులు కూడా ఫిర్యాదు తీసుకోరు. అదేరోజు రాత్రి స్కూల్ నుంచి లక్ష్మికి ఓ ఫోన్ వస్తుంది. తాను ప్రిన్సిపల్ రూమ్ లోనే ఉన్నానని, తనతో పాటు ఇంకో ఇద్దరు అంకుల్స్ కూడా ఉన్నారని,వాళ్ళని చూస్తే భయమేస్తుందని సరస్వతి చెబుతుంది. లక్ష్మి అక్కడికి వెళ్లి చూడగా.. కూతురు అత్యాచారానికి గురై చనిపోతుంది. అదేరాత్రి కూతురు శవాన్ని శ్మశానంలో పాతిపెట్టి..ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది.అయితే సీఐ కృష్ణారెడ్డి(మురళీ శర్మ) మాత్రం సాక్ష్యం ఉంటేనే కేసు ఫైల్ చేస్తానంటూ.. శవం కోసం లక్ష్మి చెప్పిన ప్రదేశంలో తవ్వి చూస్తారు. కానీ అక్కడ పాప శవం లభించదు. ఏ సాక్ష్యాలు లేవని పోలీసులు కేసు నమోదు చేయరు. దీంతో లక్ష్మి కోర్టుని ఆశ్రయిస్తుంది. న్యాయవాది రామానుజం (ప్రకాశ్ రాజ్)ఆమెకు తోడుగా నిలుస్తాడు. ఎలాంటి సాక్ష్యాలు లేని ఈ కేసులో రామానుజం విజయ సాధించాడా? అసలు లక్ష్మి ఎవరు? ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి? సరస్వతిపై అత్యాచారానికి పాల్పడిందెవరు? పాఠశాల యాజమాన్యం వారికి ఎందుకు తోడుగా నిలిచింది? కేసు విచారణ క్రమంలో రామానుజానికి తెలిసిన అసలు నిజాలు ఏంటి? ఈ కథలో ప్రియమణి, కిషోర్ల పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూసేయాల్సిందే. -
అప్పుడేమో విరక్తి.. ఇప్పుడేమో ప్రశంసలు కురిపించిన 'సీత'
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న చిత్రం రామాయణ. నితీశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నమిత్ మల్హోత్రా వేల కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నాడు. నిన్న (ఏప్రిల్ 2న) హనుమాన్ జయంతి సందర్భంగా రామాయణ టీజర్ వదిలారు. టీజర్లో రాముడిని హైలైట్ చేసి చూపించారు. సీత, హనుమంతుడు, రావణాసురులను చూపించలేదు.టీజర్పై సీత ప్రశంసలుఈ టీజర్పై రామాయణ్ టీవీ సీరియల్లో సీతగా నటించిన దీపిక చికిల ప్రశంసలు కురిపించింది. టీజర్ చూశాను, చాలా బాగుంది. ఎంతో రిచ్గా, అద్భుతంగా తీశారు. ఒక అందమైన కావ్యంలా కనిపిస్తోంది, అందులో డౌటే లేదు. ఈ మూవీ కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను అని చెప్పుకొచ్చింది. అయితే దీపిక గతంలో రామాయణ కథపై సినిమాలు తీయడాన్ని విమర్శించింది. అప్పుడేమో విరక్తి'రామాయణాన్ని పదేపదే తెరకెక్కించాలని చూస్తున్నవారిని చూస్తుంటే విరక్తిగా అనిపిస్తోంది. ఎందుకంటే వాళ్లు తెరకెక్కించిన ప్రతిసారి ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తారు. కొత్త యాంగిల్, కొత్త లుక్.. ఇలా ఏదో ఒకటి డిఫరెంట్గా ఉండాలని ట్రై చేస్తారు. అలా వారు యదార్థ కథను నాశనం చేస్తున్నారు. కాబట్టి రామాయణంపై సినిమాలు తీయకపోవడమే మంచిది' అని దీపిక అభిప్రాయపడింది. ఇప్పుడు ఆమె తన మనసు మార్చుకుని రామాయణపై ప్రశంసలు కురిపించడం విశేషం!సీరియల్- సినిమాఇకపోతే దీపిక.. 1980లో దూరదర్శన్లో ప్రసారమైన రామాయణ సీరియల్లో సీతాదేవిగా నటించింది. ఇందులో అరుణ్ గోవిల్ రాముడిగా అరవింద్ త్రివేది రావణుడిగా, సునీల్ లహ్రి లక్ష్మణుడిగా, దారా సింగ్ హనుమంతుడిగా యాక్ట్ చేశారు. ఇక నితీశ్ తివారి రామాయణ విషయానికి వస్తే.. 8సార్లు ఆస్కార్ పొందిన డీఎన్ఈజీ అనే సంస్థ ఈ చిత్రానికి వీఎఫ్ఎక్స్ అందిస్తోంది. యశ్ రావణుడిగా, సాయిపల్లవి సీతగా కనిపించనున్నారు. ఈ మూవీ మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది.చదవండి: వెండితెరపై వీరుల పోరాటం -
శింబుతో జోడీ కట్టనున్న కాంతార హీరోయిన్!
హిట్ఫ్లాప్లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటాడు తమిళ హీరో శింబు. నిజానికి ఆయన సరైన హిట్ చూసి చాలాకాలమే అయింది. అదే విధంగా సినిమాలు చేయడంలో కాస్త వెనకబడ్డ శింబు ఆ మధ్య మణిరత్నం డైరెక్షన్లో థగ్లైఫ్లో నటించగా అది పూర్తిగా నిరాశపర్చింది. ప్రస్తుతం ఇతడు వెట్రిమారన్ దర్శకత్వంలో అరసన్ మూవీ చేస్తున్నాడు. డ్రాగన్ డైరెక్టర్తో..విజయ్ సేతుపతి పోలీస్ అధికారికగా కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీ ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగే గ్యాంగ్స్టర్స్ కథాంశంతో రూపొందుతోంది. ఇప్పుడు శింబు మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఓమై కడవులే మూవీతో దర్శకుడిగా పరిచయమైన అశ్వద్ మారిముత్తు డ్రాగన్తో సంచలన సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు శింబును డైరెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడట! ఈ మూవీని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుందని తెలుస్తోంది. కాంతార బ్యూటీసంతానం ముఖ్య పాత్ర పోషించనున్నాడు. చాలా గ్యాప్ తర్వాత శింబు, సంతానం కలిసి నటించనున్న చిత్రం ఇదే! ఈ మూవీలో శింబుకు జంటగా కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. భారీ బడ్జెట్తో రూపొందనున్న ఈ సినిమాకు గాడ్ లవ్ అనే టైటిల్ను ఫిక్స్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం! -
‘బైకర్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : బైకర్నటీనటులు: శర్వానంద్, మాళవిక నాయర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి తదితరులునిర్మాణ సంస్థ: యూవి క్రియేషన్స్నిర్మాతలు:వంశీ-ప్రమోద్దర్శకత్వం: అభిలాష్ రెడ్డిసంగీతం: జిబ్రాన్సినిమాటోగ్రఫీ: జె యువరాజ్ఎడిటింగ్: అనిల్ కుమార్ పివిడుదల తేది: ఏప్రిల్ 3, 2026శర్వానంద్ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు ‘బైకర్’ తో వచ్చాడు. ఇండియాలోనే తొలి మోటోక్రాస్ రేసింగ్ సినిమా ఇది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? శర్వా ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. విక్కీ అలియాస్ వికాస్ నారాయణ్ (శర్వానంద్) మోటోక్రాస్ రేసర్. తండ్రి సునీల్ నారాయణ్ అలియాస్ బుల్లెట్ సునీలే ఆయన గురువు. ఎప్పుటికైనా ఇండియాలో కూడా మోటోక్రాస్ రేసింగ్కు గుర్తింపు తీసుకురావాలనే తండ్రి కల కోసం విక్కీ అహర్నిశలు కష్టపడతాడు. నెంబర్ వన్ బైక్ రేసర్గా నిలుస్తాడు. కొడుకు ఛాంపియన్గా మారిన తర్వాత అంతర్జాతీయ స్థాయి రేసింగ్ పోటీల్లోకి దించాలనుకుంటాడు సునీల్. అందుకోసం ఐఎన్జీ అనే స్పాన్సరింగ్ కంపెనీ అధినేత(అతుల్ కులకర్ణి)ని ఒప్పిస్తాడు. అగ్రిమెంట్ కాగితాలపై సంతకం చేసిన తర్వాత విక్కీ అనూహ్యంగా రేసింగ్ నుంచి తప్పుకుంటాడు. తండ్రిని చిన్న మాట అంటేనే భరించలేని విక్కీ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అనన్య(మాళవిక నాయర్) ఎవరు? ఆమె విక్కీ జీవితంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? కొన్నాళ్ల పాటు రేసింగ్కు దూరంగా ఉన్న విక్కీ.. మళ్లీ మోటోక్రాస్ రేసర్గా ఎందుకు మారాడు? తిరిగి వచ్చిన కొడుక్కి సునీల్ మళ్లీ కోచింగ్ ఇచ్చాడా? లేదా? చివరకు తండ్రికొడుకులు కలిశారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..తెలుగు తెరపై స్పోర్ట్స్ డ్రామాలు కొత్త కాదు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, బాక్సింగ్, హాకీ.. ఇలా వివిధ క్రీడల నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంతో ఇప్పటివరకు సినిమా రాలేదు. అదొక్కటే బైకర్ ప్రత్యేకత. కథా, కథనం రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా సినిమాల మాదిరే సాగుతుంది. ఛాంపియన్గా ఉండే హీరో ఉన్నపళంగా క్రీడను వదిలేసి సాధారణ జీవితం గడపడం.. తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా మళ్లీ ఆయన క్రీడల్లోకి రావడం.. క్లైమాక్స్లో విజేతగా నిలవడం..స్పోర్ట్స్ డ్రామా చిత్రాలన్నీ దాదాపు ఇలానే సాగుతాయి. అయితే కథనం ఎలా సాగింది? ఎమోషన్ ఏమేరకు పండింది? అనేదానిపైనే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. బైకర్లోనూ మంచి ఎమోషన్స్ ఉన్నాయి. సంఘర్షణ ఉంది. కానీ, అది ప్రేక్షకుడిపై అంతగా ప్రభావం చూపించలేకపోయింది. విజువల్స్తో పాటు రేసింగ్ సన్నివేశాలు మాత్రం అదిరిపోతాయి. రేసింగ్ సీన్లను తెరపై చూస్తుంటే గూస్బంప్స్ వస్తాయి. రేసింగ్ వదిలేసి సాధారణ జీవితం గడుపుతున్నట్లుగా హీరో పరిచయ సన్నివేశాలు ఉంటాయి. భార్య, కొడుకుతో హాయిగా గడుపుతున్న సమయంలో తండ్రి గురించి ఓ వార్త వినడం.. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ మొదలయిన తర్వాత నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది. హీరో, హీరోయిన్ల లవ్స్టోరీ ఒకవైపు.. రేసింగ్ సీన్లు మరో వైపు.. ఫస్టాఫ్ అంతా ఇలా సాగుతుంది. ప్రతీది డీటైలింగ్గా చెప్పడంతో కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెంకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థం చాలా వరకు ఎమోషనల్గా సాగుతుంది. తండ్రి కోసం మళ్లీ రేసర్గా మారడం.. ప్రాక్టీస్ సమయంలో హీరో పడే ఇబ్బందులు.. విలన్ చేసే కుట్రలను ఛేదించి.. చివరకు విజేతగా నిలవడం.. ఇలా ఊహకందేలా కథనం సాగుతుంది. ముందుగా చెప్పినట్లు భావోద్వేగాలను మరింతగా పండించే అవకాశం ఉన్నా.. దర్శకుడు రేసింగ్ సీన్లపైనే ఎక్కువ దృష్టిపెట్టాడు. అవి ఆకట్టుకున్నాయి కూడా! అదే స్థాయిలో భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉండి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం శర్వా నటన అని చెప్పొచ్చు. తెరపై చూస్తుంటే అచ్చమైన స్పోర్ట్స్ మెన్లానే ఆయన లుక్ ఉంది. అటు యాక్షన్, ఇటు ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా నటించాడు. ఈ మూవీ కోసం శర్వానంద్ పడిన కష్టమంతా తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. హీరో తండ్రి, కోచ్ బుల్లెట్ సునీల్గా రాజశేఖర్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయనకు పెద్దగా డైలాగులు లేకున్నా.. కథ మొత్తం ఆయన పాత్ర చుట్టే తిరుగుతుంది. హీరోయిన్ మాళవిక నాయర్ కూడా తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని సీన్లు ‘జెర్సీ’ సినిమాను గుర్తు చేస్తాయి. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధిమేర నటించారు. సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. జిబ్రాన్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు. పాటలు కూడా సందర్భానుసారం వస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. రేసింగ్ సీన్లను తెరపై అద్భుతంగా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
హనుమాన్ జయంతి సందర్భంగా...
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియన్ మూవీ ‘పెద్ది’. ‘ఉప్పెన’ మూవీ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. క్రీడల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు.క్రికెట్, కుస్తీ వంటి క్రీడలతో పాటు కబడ్డీ కూడా ఈ సినిమాలో ఉంటుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. గురువారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ‘పెద్ది’ నుంచి రామ్ చరణ్ కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. -
వెండితెరపైకి వీరుల పోరాటం
స్వాతంత్య్ర సంగ్రామంలో ఎందరో మహానుభావులు పోరాటాలు చేశారు. బ్రిటిషర్లకు ఎదురు నిలిచి అమరులైన వారు ఎందరో ఉన్నారు. ఈ వీరుల పోరాట స్ఫూర్తిని కథలుగా మలిచి, వెండితెరపైకి తెస్తున్నారు కొందరు దర్శకులు. ఆ సినిమాల విశేషాలు తెలుసుకుందాం. పోరాటానికి కొత్త నిర్వచనం ‘‘ఆదిపత్యం కోసమే యుద్ధాలు జరుగుతున్న సమయంలో పోరాటానికి ఓ యోధుడు సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చాడు. అదేంటి అనేది ‘ఫౌజి’ సినిమాలో చూడొచ్చు’’ అని ఈ చిత్రం యూనిట్ చెబుతోంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఇది. ఈ సినిమా ప్రధానంగా 1940 నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. ఇందులో బ్రిటిష్ సైనికుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రకథ ప్రధానంగా ప్రేమ, త్యాగం, యుద్ధం వంటి అంశాల మేళవింపుతో ముడి పడి ఉంటుందని తెలిసింది. ‘ఫౌజి’లో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.గత నెలలో ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు ప్రభాస్. అయితే వేసవి కావడంతో ఓ చిన్న బ్రేక్లో భాగంగా ప్రభాస్ విదేశాలకు వెళ్లారని, వచ్చే నెలాఖర్లో తిరిగి ఆయన ‘ఫౌజి’ షూట్లో పాల్గొంటారని సమాచారం. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ దసరా సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఇటీవల ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. రణబాలి తిరుగుబాటు బ్రిటిషర్లకు ఎదురు నిలిచి, తిరుగుబాటు చేసిన ఓ యోధుడి కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘రణబాలి’. రాయలసీమ ప్రాంతంలో 1854–1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. ఆ సమయంలో భారతదేశ ప్రజల పట్ల బ్రిటిష్ పాలకులు ఎలాంటి ఆకృత్యాలకు పాల్పడ్డారు? మాతృభూమి కోసం రణబాలి ఎలాంటి పోరాటం చేశాడు? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథాంశం సాగుతుందని తెలిసింది. ‘డియర్ కామ్రేడ్ (2019), ఖుషి (2023)’ వంటి చిత్రాల తర్వాత ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా ముచ్చటగా మూడోసారి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.విజయ్ దేవరకొండతో ‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్ ఫిల్మ్ తీసిన రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో టైటిల్ రోల్లో విజయ్ దేవరకొండ నటిస్తుండగా, జయమ్మగా రష్మికా మందన్నా నటిస్తున్నారు. విలన్ సర్ థియోడోర్ హెక్టార్ పాత్రను ‘మమ్మీ’ సినిమా ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ అనంతపురంలో జరుగుతోందని తెలిసింది. విజయ్ దేవరకొండతో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటుండగా, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. టీ సిరీస్ ఫిలింస్, గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ల సమర్పణలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబరు 11న రిలీజ్ కానుంది. డేవిడ్ రెడ్డి ‘మనల్ని ఇండియన్ డాగ్స్ అనే బ్రిటిషర్లకు అతను వార్ డాగ్ అయ్యాడు..’, ‘ఏ బ్రిటిష్ ఇండియా నహీ హై, ఏ డేవిడ్ రెడ్డీకా ఇండియా హై’... ఇటీవల విడుదలైన ‘స్పీడ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి’ గ్లింప్స్లోని రెండు డైలాగ్స్ ఇవి. మంచు మనోజ్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘డేవిడ్ రెడ్డి’. 1897 నుంచి 1920 మధ్య బ్రిటిష్ పాలనా కాలం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. బ్రిటిష్ క్రూర పాలనకు ఎదురు నిలిచి పోరాడిన యోధుడి పాత్రలో మనోజ్ నటిస్తున్నారు. ఉక్రెయిన్ నటి మరియా ర్యబోషప్క హీరోయిన్గా నటిస్తుండగా, ఆర్. పార్తీబన్, కాంచన ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో భరత్ మోటుకూరి, నల్లగంగుల వెంకట్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుందని తెలిసింది. ది ఇండియా హౌస్ నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘ది ఇండియా హౌస్’. రామ్ వంశీకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వి మెగా పిక్చర్స్ పతాకంపై విక్రమ్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారతదేశ స్వాతంత్య్రం కోసం అప్పట్లో లండన్లో కొందరు భారతీయుల వ్యూహాత్మక కార్యాచరణ, అమలు వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ప్రధాన సినిమా కథాంశం 1905 నేపథ్యంలో సాగుతుంది. స్వాతంత్య్ర సమర యోధుడు వీర్ సావర్కార్ ప్రస్తావన ఈ సినిమా కథనంలో ఉంటుందని సమాచారం. సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ కీలక పాత్రæపోషిస్తున్నారు. ఒక తిరుగుబాటుదారుని కథ ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘అన్ని తిరుగుబాటులకు యుద్ధ రంగమే ఆధారం కాదు. కొన్ని విధి చేత ఎంపిక చేయబడతాయి. ఇది ఒక తిరుగుబాటుదారుని కథ’ అని ఈ సినిమా కాన్సెప్ట్ గురించి మేకర్స్ తెలి΄ారు. 18వ శతాబ్దంలో బెంగాల్ ప్రావిన్స్లో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఓ తిరుగుబాటుదారుని నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. తిరుగుబాటుదారునిగా రిషబ్ శెట్టి నటిస్తారు.ఈ కోవలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. -
శారీలో నభా నటేశ్ అందాలు.. ఎల్లో డ్రెస్లో పాయల్ రాజ్పుత్..!
ఎల్లో డ్రెస్లో పాయల్ రాజ్పుత్ అందాలు..ఏఐ పిక్స్ షేర్ చేసిన రేణు దేశాయ్..బిగ్బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా గ్లామరస్ పిక్స్..శారీలో మత్తెక్కిస్తోన్న హీరోయిన్ నభా నటేశ్ అందాలు.. మార్చి జ్ఞాపకాల్లో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి.. View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
తెలుగులో తొలి ఏఐ సినిమా.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
ఏఐ వచ్చాక అన్ని రంగాల్లో సరికొత్త సాంకేతికతను అందిపుచ్చకుంటున్నాయి. సినీ ఇండస్ట్రీలో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతున్నారు. తాజాగా పూర్తిస్థాయి కృత్రిమ మేధ (ఏఐ)తో రూపొందుతున్న తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్గా “అంబ’s రివెంజ్” ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు జయవర్ధన్ మాడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లలితకళా చిత్రాలు, నక్క తోక ఫిల్మ్స్ బ్యానర్లపై సంయుక్తంగా శ్రీకాంత్ రెడ్డి కుందూరు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర అంబ కథను ఆధారంగా తీసుకుని వినూత్నంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా ఈ మూవీ టైటిల్ పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ.. 'తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాం. “అంబs రివెంజ్” ప్రాజెక్టు కోసం అత్యాధునిక ఏఐ టూల్స్ను వినియోగింతాం. విజువల్స్, పాత్రల రూపకల్పన, కథన నిర్మాణం వంటి అంశాలను కొత్త శైలిలో ఆవిష్కరిస్తున్నాం. హనుమాన్ విజయోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ను విడుదల చేస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు సంభందించి పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం " అని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమలో ఏఐ ఆధారిత కథాచిత్రాల దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. ఈ పౌరాణిక ప్రయోగాత్మక చిత్రం తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. -
దురంధర్-2 కోసం స్టార్ హీరో త్యాగం..!
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజా చిత్రాన్ని మేకర్స్ వాయిదా వేశారు. ఈనెల 10న రిలీజ్ కావాల్సిన హారర్-కామెడీ చిత్రం భూత్ బంగ్లాను పోస్ట్పోన్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు.ప్రస్తుతం దురంధర్ ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అందుకే భూత్ బంగ్లాను ఓ వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల నుంచి వచ్చిన అభ్యర్థనల వల్లే వారం రోజులు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత ఏక్తా కపూర్ అధికారిక ప్రకటనలో తెలిపారు. ప్రేక్షకులకు మెరుగైన సినిమా అనుభవాన్ని అందించడం.. థియేటర్లలో సినిమా విజయవంతంగా రన్ అయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె అన్నారు. 'ధురందర్: ది రివెంజ్' చిత్రానికి మరింత సమయాన్ని ఇవ్వడం వల్ల పరిశ్రమకు ప్రయోజనం చేకూరుతుందని ఎగ్జిబిటర్లు భావించారు.కాగా.. భూత్ బంగ్లా చిత్రాన్ని బాలాజీ మోషన్ పిక్చర్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించగా.. అక్షయ్ కుమార్, శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్ నిర్మించారు. ఈ చిత్రంలో వామికా గబ్బి, పరేష్ రావల్, టబు, రాజ్పాల్ యాదవ్, జిషు సేన్గుప్తా, మిథిలా పాల్కర్ కీలక పాత్రల్లో నటించారు. -
‘కార్మేని సెల్వం’ మూవీ రివ్యూ
టైటిల్: ‘కార్మేని సెల్వం’నటీనటులు: సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్నిర్మాణ సంస్థ: పాత్వే ప్రొడక్షన్స్నిర్మాత:అరుణ్ రంగరాజులుదర్శకుడు: రామ్ చక్రిసంగీత దర్శకుడు: ‘మ్యూజిక్ యాజ్ ఎ సర్వీస్’ (MAAS)సినిమాటోగ్రఫీ: యువరాజ్ దక్షణ్ఎడిటింగ్: జగన్ ఆర్వీ, దినేష్ ఎస్విడుదల తేది: ఏప్రిల్ 3, 2026దర్శకుడిగా వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించడమే కాకుండా.. విలక్షణ నటుడిగానూ గుర్తింపు సంపాదించుకున్నాడు సముద్రఖని. ఒక పక్క స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే.. మరోపక్క కంటెంట్ ఉన్న సినిమాల్లో లీడ్ రోల్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రమే ‘కార్మేని సెల్వం’. రేపు(ఏప్రిల్ 3) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం ప్రత్యేక షో వేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..చెన్నైకి చెందిన సెల్వం(సముద్రఖని) ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి. వ్యాపారవేత్త సంపత్(గౌతమ్ మీనన్) దగ్గర డ్రైవర్గా పని చేస్తుంటాడు. భార్య శాంతి(లక్ష్మీ ప్రియా), కొడుకు బాలునే అతని ప్రపంచం. ఉన్నంతలో సంతోషంగా ఉండాలనేది అతని నైజం. బంధువుల ముందు చిన్నచూపు కావొద్దనేది భార్య శాంతి నైజం. ఫంక్షన్లో అవమానించారని, పౌరుషంతో ఇంట్లో దాచుకున్న డబ్బుతో పాటు మెడపై ఉన్న పుస్తెల తాడుని సైతం అమ్మి ఆడపడుచు కూతురుకి కానుకగా ఇచ్చేస్తుంది. ఓ రోజు కొడుకు తలకు గాయం కావడంతో ఆస్పత్రి ఖర్చులకై సొంత బావ దగ్గర రూ. 10 వేలు అప్పు తీసుకొస్తాడు సెల్వం. ఆ అప్పుని తీర్చేందుకు తన బాసుకు తెలియకుండా ఆయన కారుని టాక్సీలో పెడతాడు. టాక్సీలో ఎక్కినవాళ్ల మాటలు విని..సెల్వంకి డబ్బుపై ఆశ పెరుగుతుంది. ఆ ఆశ తన జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? భార్య, కొడుకుని వదిలేసి.. వేరే దేశం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకు సెల్వం తిరిగి ఇండియాకు వచ్చాడా? రాలేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణఈ సినిమా చివరిల్లో ఒక డైలాగు ఉంటుంది. ‘అవసరం లేనివి కొంటే..అవసరమైనవి కోల్పోతాం’. ఈ ఒక్క డైలాగ్తో ఈ కథ ఇచ్చే సందేశం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఉరుకుల పరుగుల జీవితం ఇది. డబ్బుపై ఆశతో ఫ్యామిలీని దూరం పెట్టి.. చిన్న చిన్న సంతోషలను సైతం మిస్ చేసుకుంటున్నాం. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అన్నట్లుగా.. పక్కవాళ్లను చూసి మన స్థాయిని మించి ఖర్చు చేస్తున్నాం. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలే.. ఇలాంటి పనులు చేసే అప్పులపాలు అవుతున్నాయి. కార్మెనీ సెలం సినిమాలో ఇదే చూపించారు. అప్పుల వల్ల మధ్యతరగతి కుటుంబాల సంబంధాలు, వారు తీసుకునే నిర్ణయాలని ఎలా ప్రభావితం అవుతాయి అనేది చాలా రియలిస్టిక్ ఇందులో చూపించారు. అయితే ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్తకాదు. మిడిల్ క్లాస్ కష్టాల నేపథ్యంలో బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచే సినిమాలు వస్తున్నాయి. కానీ ఇందులో ఇప్పటి మధ్యతరగతి కుటుంబాలు చేస్తున్న తప్పులను చూపించారు. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు చాలా ఎమోషనల్గా కథనం సాగుతుంది. ఫస్టాఫ్ మొత్తం మిడిల్ క్లాస్ కష్టాలను, సెకండాఫ్లో ఆ కష్టాల నుంచి బయటపడేందుకు చేసే అప్పులు, తప్పులను చూపిస్తూ..చివరిలో ఓ మంచి సందేశం అందించారు. ఆడపడచు పిలిచింది కదా అని సంతోషంగా ఫంక్షన్కి వెళ్తే.. అక్కడ వాళ్లను అవమానించడం.. అది తట్టుకోలేక దాచుకున్న కొద్ది డబ్బుని కూడా కానుకగా ఇవ్వడం.. అప్పు తీర్చడానికి సెల్వం తొలిసారి తప్పు దారి ఎంచుకున్నప్పటి నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇతరుల మాటలు విని.. సెల్వం చేసే తప్పులన్నీ మనమో లేదా మన చుట్టు ఉన్నవాళ్లో చేసే ఉంటారు. అందుకే ఆ పాత్రతో కనెక్ట్ అయిపోతారు. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తి పెంచుతుంది. సెకండాఫ్ మొత్తం మరింత ఎమోషనల్గా సాగుతుంది. జీవనోపాధి కోసం కుటుంబాలను వదిలి ఇతర దేశాలకు వెళ్లినవాళ్లు, వారి కుటుంబ సభ్యులు ఈ సినిమా చూస్తే వెక్కి వెక్కి ఏడుస్తారు.సెల్వం పాత్రలో సముద్ర ఖని ఒదిగిపోయాడు. . మధ్యతరగతి భర్తగా, తండ్రిగా తనదైన ఎమోషన్ను పండించారు. ఆయన సతీమణిగా లక్ష్మీ ప్రియా తనదైన సహజ నటనతో ఆకట్టుకుంది. అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.రేటింగ్: 2.75/5 -
ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్క రోజే 12 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల హడవుడి ఉంటుంది. ఈ వారంలో టాలీవుడ్లో శర్వానంద్ బైకర్ రిలీజ్ కానుంది. దీంతో పాటు సంగీత్ శోభన్ కొత్త సినిమా రాకాస థియేటర్లలో సందడి చేయనుంది. వీటితో పాటు సముద్రఖని కార్మేని సెల్వం ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటిలో బైకర్ మూవీపై ఆడియన్స్లో బజ్ క్రియేట్ అయింది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ శుక్రవారం బోలెడు సినిమాలు స్ట్రీమింగ్కు సిద్ధమైపోయాయి. శ్రీ విష్ణు లేటేస్ట్ మూవీ మృత్యుంజయ్ ఈ ఫ్రైడే ఓటీటీలో సందడి చేయనుంది. మరో తెలుగు సినిమా సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని కూడా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు ఆడియన్స్ విషయానికొస్తే ఈ రెండు కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఇక వీటితో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు, సిరీస్లు ఓటీటీలో అలరించేందుకు వస్తున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫిక్స్..మృత్యుంజయ్-(తెలుగు సినిమా)-ఏప్రిల్ 03మామ్లా లీగల్ హై- సీజన్-2(బాలీవుడ్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03వధ్-2(హిందీ సినిమా)-ఏప్రిల్ 03బ్లడ్హౌండ్స్ సీజన్-2(హాలీవుడ్ సిరీస్)-ఏప్రిల్ 03హై టైడ్స్- సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03గ్యాంగ్స్ ఆఫ్ గెలిసియా- సీజన్-2-(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03అమెజాన్ ప్రైమ్..మా కా సమ్- సీజన్-1(హిందీ సిరీస్)- ఏప్రిల్ 03జియో హాట్స్టార్..ఫైవ్ నైట్స్ ఏట్ ఫ్రెడ్డీస్-2(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 03జీ5..బాబ్జీ ఘర్ పర్ హై-ఫన్ ఆన్ ది రన్(హిందీ మూవీ)- ఏప్రిల్ 03ఆపీల్ టీవీ ప్లస్..యువర్ ఫ్రెండ్స్ అండ్ నెబర్స్(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03సన్ నెక్ట్స్..వడం(తమిళ సినిమా)- ఏప్రిల్ 03సోనీ లివ్సితారే జమీన్ పర్(బాలీవుడ్ మూవీ)-ఏప్రిల్ 03 -
రాయలసీమలో రణబలి షూటింగ్.. వీడియో వైరల్
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తోన్న హిస్టారికల్ యాక్షన్ మూవీ రణబలి. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనలో జరిగిన యధార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఏపీలోని నంద్యాల జిల్లాలో జరుగుతోంది.తాజాగా ఈ మూవీ షూటింగ్కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. విజయ్ దేవరకొండ గుర్రంపై వస్తున్న వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'ముండమోపి నాకొడకా.. యాడుండువ్ రా.. నీ ఇళ్లలోకి వచ్చినా..రాప్పా సంపుదువ్ కానీ..' అంటూ విజయ్ చెప్పిన డైలాగ్ వింటే ఫుల్ మాస్ యాక్షన్ మూవీగానే తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో వస్తోన్న కథ కావడంతో ఎక్కువ శాతం రాయలసీమ ప్రాంతంలో తెరెకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. Proper Rayalaseema Dialogues &Proper Rayalaseema Houses.నాకొడకా.. యాడుండువ్ రా.. నీ ఇళ్లలోకి వచ్చినా..Mass 💥 #RanaBali pic.twitter.com/UCPAarktV6— low battery🪫 (@low__battery287) April 2, 2026 -
దురంధర్-2 కలెక్షన్స్.. తెలుగు సినిమాల రికార్డ్స్ కష్టమే..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. దురంధర్కు సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తోంది. మొదటి వారంలో వెయ్యి కోట్లు దాటేసిన ఈ సినిమా.. ఆ తర్వాత తగ్గుతూ వస్తోంది. ఈ మూవీ రిలీజై రెండు వారాలు పూర్తయింది. ఈ సినిమా 14 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1435 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.ఈ లెక్కన చూస్తే రెండో వారంలో వసూళ్ల పరందా దురంధర్-2 వెనకపడినట్లే తెలుస్తోంది. దురంధర్ కేవలం హిందీలో రిలీజైనప్పటికీ రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సీక్వెల్ మూవీ హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేశారు. అయినప్పటికీ వసూళ్ల పరంగా కాస్తా జోరు తగ్గినట్లు కనిపిస్తోంది. ఇప్పుడున్న కలెక్షన్స్ ప్రకారమైతే రూ.1500 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.వసూళ్లు ఇలాగే కొనసాగితే పుష్ప-2, బాహుబలి-2 లాంటి టాలీవుడ్ చిత్రాల రికార్డ్స్ దాటడం కష్టంగానే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ కానుండడం దురంధర్ వసూళ్లపై ప్రభావం పడనుంది. ఈ సీక్వెల్గా ఆడియన్స్లో క్రేజ్ ఉన్నప్పటికీ రెండో వారానికి వచ్చేసరికి వసూళ్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్లో సారా అర్జున్ హీరోయిన్గా మెప్పించింది. ఆర్ మాధవన్, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషించారు. దురంధర్కు సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ మార్చి 19న థియేటర్లలో రిలీజైంది. -
ఆ విధానం రద్దు.. తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం..!
తెలంగాణ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న రెంటల్ విధానానికి స్వస్తి పలికారు. మల్టీప్లెక్స్ తరహాలో పర్సంటేజీ విధానంలోనే సినిమాలను ప్రదర్శించాలని నగరంలోని 23 సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు నిర్ణయించాయి. ఏప్రిల్ 3 నుంచే ఇది అమల్లోకి రానుందని ప్రకటించారు. ఎగ్జిబిటర్లకు రెవెన్యూ షేర్ ఇలా.. సినిమా ప్రదర్శితమైన తొలివారం 60 శాతం, రెండోవారం 50 శాతం, మూడోవారం 40 శాతం. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటన విడుదల చేసింది.ఇప్పటికే 23 మంది ఎగ్జిబిటర్లు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ను సంప్రదించార. తెలంగాణలోని పలువురు అగ్ర శ్రేణి డిస్ట్రిబ్యూటర్లతో చర్చించారు. వారి థియేటర్లు ముఖ్యమైన ప్రదేశాల్లో ఉన్నాయని అన్నారు. వాటిలో ప్రేక్షకులకు అన్ని సౌకర్యాలున్నాయని తెలిపారు. అయితే ఈ థియేటర్ల నిర్వహణ చాలా భారంగా మారిందన్నారు. ప్రస్తుత అద్దె విధానంతో నెట్టుకు రావడం కష్టసాధ్యమైందని వెల్లడించారు.పర్సంటేజీ ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శిస్తామన్న తమ ప్రపోజల్ను డిస్ట్రిబ్యూటర్లు అంగీకరించారని చెప్పారు. శశిధర్ రెడ్డి మాత్రమే నిర్మాతలు, ఇతర భాగస్వాములతో మరింత చర్చించి అభిప్రాయం చెబుతామన్నారని పేర్కొన్నారు. ఇకపై తెలంగాణలోని అన్ని సింగిల్ స్క్రీన్లలో సినిమాలను కేవలం శాతం ప్రాతిపదికనే ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్స్ స్పష్టం చేశారు. ఇది దశల వారీగా జరుగుతుందని అని ఫిల్మ్ ఛాంబర్ తన ప్రకటనలో పేర్కొంది.


