Movies
-
బిగ్బాస్ 'స్రవంతి' దాతృత్వం.. జవాన్ కుటుంబానికి ఆర్థిక సాయం
బిగ్బాస్ గౌతమ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సోలో బాయ్ (Solo Boy Movie). బుధవారం ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మురళీనాయక్ తల్లిదండ్రులు హాజరయ్యారు. వారి కుటుంబానికి యాంకర్, బిగ్బాస్ ఫేమ్ స్రవంతి ఆర్థిక సాయిం ప్రకటించారు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన శ్రీరాంనాయక్, జ్యోతిబాయి దంపతులు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. 'ఆపరేషన్ సిందూర్'లో మురళీనాయక్ మరణించిన విషయం తెలిసిందే.లక్ష రూపాయలు సాయంబిగ్ బాస్ ఫేమ్, యాంకర్ స్రవంతి చొక్కారపు సోషల్ మీడియా నుంచి స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో యాంకరింగ్ చేసే స్థాయికి ఆమె చేరుకుంది. అయితే, ఆమె పలు సందర్భాల్లో తోచిన సాయం చేసి దాతృత్వం చాటుకుంది. తాజాగా 'సోలో బాయ్' సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి ఆమె యాంకర్గా పనిచేశారు. ఆ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జవాన్ మురళీనాయక్ తల్లిదండ్రులకు ఆమె లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన బిడ్డను తిరిగి తీసుకురాలేమని, తమవంతుగా ఆర్థిక సాయం మాత్రం చేయగలమని ఆమె తెలిపింది. దేశాన్ని కాపాడే బిడ్డను కన్నందుకు వారికి కృతజ్ఞతలు చెప్పింది. ఆ కుటుంబం కోసం ఉచితంగానే యాంకరింగ్ చేస్తాసోలో బాయ్ వేడుక పూర్తికాగానే డబ్బులు ట్రాన్సఫర్ చేస్తానని ఆమె చెప్పింది. ఇంతలో సంగీత దర్శకుడు కూడా సాయం ప్రకటించారు. త్వరలో మురళీనాయక్ గ్రామం 'కళ్లితండా'లో సంగీత కచేరి ఏర్పాటు చేసి వచ్చిన డబ్బు ఆ కుటుంబానికి అందిస్తామని ప్రకటించారు. అదే కార్యక్రమానికి రెమ్యునరేషన్ లేకుండా యాంకరింగ్ చేస్తానని స్రవంతి తెలిపింది. స్రవంతి ఇలా సాయం చేయడం ఇదే మొదటిసారి కాదు. ఆమె సంపాదించిన డబ్బులో కొంత పలు సందర్భాల్లో సాయం చేసింది. గతేడాదిలో భారీ వర్షాలు విజయవాడను ముంచెత్తిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. కనీసం తాగేందుకు మంచినీరు లేక ఇబ్బందులు పడ్డారు. అప్పుడు స్రవంతి కూడా తనవంతుగా లక్ష రూపాయలు ముఖ్యమంత్రి నిధికి పంపింది. దీంతో స్రవంతిని నెటిజన్లు అభినందిస్తున్నారు. స్రవంతిలో అందమే కాదు.. మంచి గుణం కూడా ఉందంటూ ప్రశంసిస్తున్నారు. -
గుడ్నైట్ దర్శకుడికి శివకార్తికేయన్ ఛాన్స్.. తండ్రి పాత్రలో స్టార్ హీరో
కోలీవుడ్ నటుడు శివకార్తికేయన్ (Sivakarthikeyan)కు ఇప్పుడు మంచి కథలు వెతుక్కుంటూ వస్తున్నాయి. వరుస విజయాలతో మంచి జోరుమీదున్న శివకార్తికేయన్ కూడా చాలా జాగ్రత్తగా కథలు, దర్శకులను ఎంపిక చేసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈయన ఇంతకుముందు నటించిన అమరన్ చిత్రం ఘనం విజయం సాధించింది. ప్రస్తుతం ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న మదరాసి చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. అదేవిధంగా సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి చిత్రంలో నటిస్తున్నారు. రవిమోహన్, అధర్వ, ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల నాయకిగా నటిస్తున్నారు. ఈచిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇది శివకార్తికేయన్ నటిస్తున్న 25వ చిత్రం కావడం గమనార్హం. దీంతో ఈయన తన 26వ చిత్రానికి పచ్చజెండా ఊపినట్లు తాజా సమాచారం. దీనికి గుడ్నైట్ చిత్రం ఫేమ్ వినాయక్ చంద్రశేఖరన్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని ఫ్యాషన్ స్టూడియోస్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలలైనట్లు సమాచారం. ఇది తండ్రీ కొడుకుల అనుబంధాలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని, శివకార్తికేయన్కు తండ్రిగా మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ ( Mohanlal)ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. చిత్ర షూటింగ్ ఆగస్ట్ నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. -
హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్కు ఆస్కార్ అవార్డు
హాలీవుడ్ ప్రముఖ నటుడు–నిర్మాత టామ్ క్రూజ్ ఎట్టకేలకు ఆస్కార్ అవార్డు అందుకోనున్నారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ పదిహేనేళ్లుగా ప్రతి ఏడాది గవర్నర్స్ అవార్డ్స్ను అందిస్తున్న సంగతి తెలిసిందే. 16వ వార్షిక అవార్డు ప్రదానం ఈ ఏడాది నవంబరులో జరగనుంది. ఈసారి ఆస్కార్ గవర్నర్ అవార్డులను అందుకోనున్న వారి వివరాలను ఆస్కార్ కమిటీ అధికారికంగా వెల్లడించింది. హాలీవుడ్ నటుడు–నిర్మాత టామ్ క్రూజ్తో పాటు అమెరికన్ నటి–దర్శక–నిర్మాత–కొరియోగ్రాఫర్ డెబ్బీ అల్లెన్, ప్రొడక్షన్ డిజైనర్ విన్ థామస్లు ఈ ఏడాది ఆస్కార్ గౌరవ పురస్కారా లను స్వీకరించనున్నారు. అలాగే అమెరికన్ గాయని–నటి–రచయిత– సంగీత దర్శకురాలు డాలీ పార్టన్కు జీన్ హెర్షోల్ట్ హ్యూమానిటేరియన్ అవార్డు లభించింది.సినిమా రంగంలో సుధీర్ఘమైన కెరీర్, సినిమాల పట్ల ఎంతో అంకితభావం చూపిన నలుగురు దిగ్గజ వ్యక్తులను ఈ ఏడాది ఆస్కార్ గవర్నర్స్ అవార్డ్స్తో సత్కరించనున్నాం’’ అని ఆస్కార్ అకాడమీ అధ్యక్షురాలు జానెట్ యాంగ్ పేర్కొన్నారు. ఇక ఈ 16వ ఆస్కార్ గవర్నర్స్ అవార్డ్స్ వేడుక కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్లో నవంబరు 16న జరగనుంది. ఇక ఇప్పటివరకు నాలుగు ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ దక్కించుకున్నప్పటికీ టామ్ క్రూజ్కు అవార్డు దక్కలేదు. ఫైనల్గా ‘అకాడమీ గౌరవ పురస్కారం’ దక్కుతున్నందుకు ఆయన ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు. ఇక 98వ ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది. -
కుబేర మూవీ.. ఫుల్ ఎమోషనల్ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోలుగా నటించిన చిత్రం 'కుబేర'. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక రిలీజ్ ఒక్క రోజే సమయం ఉండడంతో మేకర్స్ కుబేర చిత్రంలో నాలుగో పాటను విడుదల చేశారు. నా కొడుకా అంటూ సాంగే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించగా.. నందకిశోర్ లిరిక్స్ అందించగా.. సిందూరి విశాల్ ఆలపించారు. ఈ ఎమోషనల్ సాంగ్ విడుదలైన కొద్ది సేపటికే అత్యధిక వ్యూస్తో దూసుకెళ్తోంది.కాగా.. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ నటించగా.. బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు.The soul touching #Kuberaa4thSingle is out now ♥️A Rockstar @ThisIsDSP musical 🎶#NaaKoduka - https://t.co/EF9sJ4w7xW#Kuberaa in cinemas June 20, 2025.#SekharKammulasKuberaa #Kuberaa #KuberaaBookings #KuberaaOn20thJune pic.twitter.com/B3Zqmyr86y— Kuberaa Movie (@KuberaaTheMovie) June 18, 2025 -
శేఖర్ కమ్ముల కుబేర.. భారీగా కట్స్ చెప్పిన సెన్సార్ బోర్డ్!
నాగార్జున, ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కుబేర’. రష్మికా మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. దాదాపు రూ.10 వేల కోట్ల స్కామ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కించారు. సునీల్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న గ్రాండ్ రిలీజ్ కానుంది.అయితే ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న కుబేర చిత్రానికి భారీగానే కట్స్ పడినట్లు తెలుస్తోంది. తెలుగులో 181 నిమిషాలు ఉండగా.. తమిళంలో 182 నిమిషాలు రన్టైమ్తో సీబీఎఫ్సీ అనుమతిచ్చింది. అయితే కుబేర సినిమాలోని 19 సన్నివేశాలకు కట్ చెప్పింది. దీంతో రన్టైమ్ దాదాపు 14 నిమిషాలు తగ్గిపోయింది. సెన్సార్ బోర్డ్ ట్రిమ్ చేసిన సీన్స్లో ధనుశ్, రష్మిక మందన్న, నాగార్జున కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తం 19 సన్నివేశాలు కట్ చేసిన సెన్సార్ బోర్డ్ యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అంటే 13 ఏళ్లలోపు పిల్లలు ఈ మూవీ చూసేందుకు అనుమతి లేదు. అయితే తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించిన ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇటీవలే కుబేర ట్రైలర్ విడుదల కాగా సినిమాపై అంచనాలు పెంచేసింది. -
ప్రభాస్ 'ది రాజాసాబ్'.. ఏకంగా రూ.5 కోట్లు సేవ్ చేసిన తమన్!
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం ది రాజాసాబ్. ఈ రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రాని మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే టీజర్ విడుదల కాగా.. ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. హారర్, కామెడీతో పాటు విజువల్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ మూవీలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ముగ్గురు హీరోయిన్లతో ఓ స్పెషల్ సాంగ్ను మారుతి ప్లాన్ చేసినట్లు చేస్తోంది. ఓ ఫుల్ మాస్ సాంగ్ను తీసుకొచ్చేందుకు మేకర్స్ నిర్ణయించారు. దీనికోసం ఓ హిందీ పాటను రీమిక్స్ చేయాలని భావించారు. అయితే ఆ సాంగ్ మ్యూజిక్ రైట్స్ ఉన్న ఆడియో సంస్థ ది రాజాసాబ్ టీమ్ను దాదాపు రూ.5 కోట్లు డిమాండ్ చేసిందని సమాచారం. దీంతో మేకర్స్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.ఈ సినిమాకు టాలీవుడ్ బీజీఎం కింగ్ ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో మేకర్స్ మరో ప్లాన్కు రెడీ అయ్యారు. తమన్తోనే ఓ ప్రత్యేక సాంగ్ను కంపోజ్ చేయనున్నారట. ముగ్గురు హీరోయిన్లతో చేసే పాటకు తమన్ తన రేంజ్లో అదిరిపోయే సంగీతం కొట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో ది రాజాసాబ్ టీమ్కు దాదాపు రూ.5 కోట్ల రూపాయలు సేవ్ అయినట్లే. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం తమన్ ఎలాంటి బీట్స్ అందిస్తాడో వేచి చూడాల్సిందే. ఎందుకంటే స్పెషల్ సాంగ్స్ కంపోజ్ చేయడంలో తమన్ హై టాలెంటెడ్ అని మనందరికీ తెలిసిందే. కాగా.. ది రాజాసాబ్ షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చినట్లు తెలుస్తోంది. కేవలం రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.#Prabhas to Groove with Three Heroines in a Special Song!👉 The shooting of #RajaSaab is nearly complete, with just two songs left to be filmed.👉 Initially, the team had planned a high-energy remix of a popular old Hindi classic. However, the music rights came with a… pic.twitter.com/OnBKt4x2FL— PaniPuri (@THEPANIPURI) June 18, 2025 -
'అశ్వత్థామ'గా గౌతమ్.. ఇదేందయ్యా ఇది.. ఇంకా మర్చిపోలే?
ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలంటారు. గౌతమ్ కృష్ణ (Gautham Krishna) అదే చేశాడు. బిగ్బాస్ షో వల్ల అవమానాలు పడ్డాడు, ఆదరణ పొందాడు. అదెలాగంటే.. తెలుగు బిగ్బాస్ ఏడో సీజన్లో పాల్గొన్న ఇతడు శివాజీకి కరెక్ట్ మొగుడిలా తయారయ్యాడు. నేను పట్టుకున్న మంచానికి మూడే కాళ్లు అన్నట్లు శివాజీ డిక్టేటర్గా వ్యవహరిస్తుంటే అది తప్పని ఎదిరించి నిలబడ్డాడు గౌతమ్ కృష్ణ. శివాజీని ప్రశ్నించేందుకు హౌస్మేట్స్ వెనకడుగు వేస్తుంటే గౌతమ్ మాత్రం అతడి పెద్దరికాన్ని గౌరవిస్తూనే మాటలు, చేతలతోనే ధీటుగా సమాధానం చెప్పేవాడు. అశ్వత్థామ అంటూ నవ్వులపాలు!కానీ షో మధ్యలోనే ఎలిమినేట్ అయ్యాడు. అయితే అతడిని వైల్డ్ కార్డ్గా హౌస్లోకి పంపించినప్పుడు అశ్వత్థామ 2.0 అంటూ వేసిన డైలాగ్ అప్పట్లో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. ఆ డైలాగ్కు ఓవర్ కాన్ఫిడెన్స్ తోడవడంతో గౌతమ్పై ట్రోలింగ్ జరిగింది. చివరకు ఫినాలేకు అడుగు దూరంలో ఉండగా ఎలిమినేట్ అయ్యాడు.అశ్వత్థామకు చావు లేదుబిగ్బాస్ 8వ సీజన్లో మరోసారి వైల్డ్కార్డ్గా ఎంట్రీ ఇచ్చాడు. ఎక్కడైతే మాటలు పడ్డాడో అక్కడే తన మాటతో, ఆటతో ప్రశంసలు దక్కించుకున్నాడు. రన్నరప్గా నిలిచాడు. మరోసారి చెప్తున్నా.. అశ్వత్థామ ఈజ్ బ్యాక్.. ఈ అశ్వత్థామకు చావు లేదు అంటూ షోలో డైలాగ్స్ వేశాడు. ఇప్పుడదే డైలాగ్ను తన పేరు ముందు చేర్చేసుకున్నాడు.పేరు ముందు అదే ట్యాగ్గౌతమ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సోలో బాయ్ (Solo Boy Movie). బుధవారం ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. ఇందులో గౌతమ్ తన పేరు ముందు అశ్వత్థామ అన్న ట్యాగ్ యాడ్ చేసుకున్నాడు. విమర్శలు, ప్రశంసలు అందించిన అశ్వత్థామ ట్యాగ్ను గౌతమ్ వాడుకోవడం చూసి నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అప్పుడే ఈ ట్యాగ్లు అవసరమా? అని కొందరు బుగ్గలు నొక్కుకుంటున్నారు. అయితే సినిమా కోసం నలుగురు మాట్లాడాలంటే ఇలాంటి ప్రయత్నాలు చేయడం మంచిదే, అందులోనూ అతడు పడి నిలబడ్డాడు అని మరికొందరు పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు . చదవండి: రజనీకాంత్ వదిలేసుకున్న అపరిచితుడు.. ఫస్ట్ హీరోయిన్ సదా కాదు -
టాలీవుడ్ టాప్ డైరెక్టర్తో సినిమా చేయాలని ఉంది: ది రాజాసాబ్ హీరోయిన్
కోలీవుడ్ భామ మాళివిక మోహనన్ ది రాజాసాబ్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే టీజర్ విడుదల చేయగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సలార్, కల్కి 2898 ఏడీ వంటి వరుస హిట్ సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.అయితే తాజాగా మాళవిక మోహనన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్చాట్ నిర్వహించింది. ఆస్క్ మాళివికా పేరుతో ట్విటర్ వేదికగా పలువురు నెటిజన్స్ అడిగి ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఓ నెటిజన్ మీరు నెక్ట్స్ మూవీ ఏ డైరెక్టర్తో సినిమా చేయాలనుకుంటున్నారు? ఆ దర్శకుడితోనే ఎందుకు? అని ప్రశ్నించాడు. దీనికి మాళవిక ఊహించని ఆన్సరిచ్చింది. ప్రస్తుతం నా దగ్గర పెద్ద లిస్టే ఉంది.. కానీ నేను రాజమౌళితో సార్తో పని చేయడం తనకిష్టమని తెలిపింది. ఇది చూసిన నెటిజన్స్ త్వరలోనే మీ కోరిక నెరవేరుతుందని కామెంట్స్ చేస్తున్నారు.(ఇది చదవండి: 'ది రాజాసాబ్'.. భయపెట్టడమే కాదు... (టీజర్))కాగా.. గతేడాది తంగలాన్ మూవీతో మెప్పించిన మాళవిక కోలీవుడ్లో పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన ది రాజాసాబ్లో కనిపించనుంది. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. I have a long list but if I had to pick one maker right now I would love to work with Rajamouli sir! ☺️ https://t.co/Mvovp1TzOd— Malavika Mohanan (@MalavikaM_) June 18, 2025 -
తింటుంటే అన్నంలో రక్తం.. రూ.10 ఇస్తే కడుపు నింపుకుందామని.. హరి కష్టాలు
పటాస్ షోతో ఫేమస్ అయ్యాడు ఎక్స్ప్రెస్ హరి (Express Hari). పలు టీవీషోలలో పాల్గొంటూ బుల్లితెర ప్రేక్షకులకు నవ్వులు పంచుతున్నాడు. కమెడియన్గా రాణిస్తున్న అతడు ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాడు. పిడికెడంత అన్నం కోసం రక్తాలే చిందించాడు. ఈ విషయాన్ని తాజాగా ఓ షోలో వెల్లడించాడు. తేజస్వి మదివాడ(Tejaswi Madivada) హోస్ట్గా వ్యవహరిస్తున్న కాకమ్మ కథలు రెండో సీజన్కు ఎక్స్ప్రెస్ హరి గెస్టుగా వచ్చాడు. ఈ సందర్భంగా తన కష్టాలు ఏకరువు పెట్టాడు.అన్నంలో రక్తపు బొట్లునాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను కష్టాలు చేశాను. మా పాఠశాలలో 250 మంది ఉండేవారు. చేతికి దెబ్బ తగిలి అన్నం తింటుంటే ఆ రక్తం భోజనంలో పడేది. మిగిలిపోయిన ఇడ్లీ కోసం పిలిస్తే ఎలా పరిగెత్తేవాళ్లమో తెలుసా? కిందపడి మోకాళ్లు గీసుకుపోయేవి. ఆ లైన్లో ముందు నిలబడితే ఒక ఇడ్లీ వస్తుంది కదా అన్న ఆరాటం!క్యాంటీన్లో చపాతీ కొనుక్కోవడానికి..మధ్యాహ్న సమయంలో అందరూ క్యాంటీన్కు వెళ్లి తినేవారు. అప్పుడు నాకు ఎవరైనా పది రూపాయలు ఇస్తే ఒక చపాతీ కొనుక్కుని తినాలనుకునేవాడిని అని చెప్పుకొచ్చాడు. ఆ మాటలు విని తేజు ఎమోషనలైంది. వెంటనే లేచి హరికి హగ్ ఇచ్చి ఓదార్చింది. నటి తేజస్వి యాంకరింగ్ చేస్తున్న కాకమ్మ కథలు టాక్ షో ఆహాలో ప్రసారమవుతోంది.చదవండి: చై-శోభితను పట్టించుకోని మహేశ్? వీడియోతో ఆన్సర్ దొరికేసింది! -
OTT: రాజీవ్ గాంధీ హత్య కేసు ఆధారంగా 'ద హంట్'
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసును ఆధారంగా చేసుకుని ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. అదే ద హంట్ (The Hunt: The Rajiv Gandhi Assassination Case). ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీలివ్ అధికారికంగా ప్రకటించింది. జూలై 4 నుంచి సోనీలివ్లో ప్రసారం కానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ టీజర్ కూడా రిలీజ్ చేసింది. అందులో.. 'రాజీవ్ గాంధీ బతికే ఉన్నారా? ఆయనింకా బతికే ఉన్నారా?' అని శ్రీలంకలోని భారత హై కమిషనర్ కార్యాలయానికి ఫోన్ రావడంతో టీజర్ మొదలవుతుంది. బాంబు పేల్చి రాజీవ్గాంధీని చంపిందెవరు? వారి ఉద్దేశ్యం ఏంటి? అన్న కోణాల్లో విచారణ మొదలుపెడతారు. ప్రతి సెకను కూడా ముఖ్యమేనంటూ నిందితులను పట్టుకునే పనిలో ఉంటారు. తర్వాత ఏం జరిగిందన్నది తెలియాలంటే ఓటీటీలో సిరీస్ చూడాల్సిందే! ద హంట్కు నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించాడు. కాగా 1991, మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్లో నాటి దేశ ప్రధాని రాజీవ్ గాంధీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో రాజీవ్ గాంధీ హతమయ్యారు. The assassination that shook the nation. The manhunt that stunned the world.The Hunt - The Rajiv Gandhi Assassination Case, streaming from 4th July on Sony LIV.#TheHuntOnSonyLIV pic.twitter.com/ExOXEZxYFK— Sony LIV (@SonyLIV) June 18, 2025 -
మంచు విష్ణు కన్నప్ప.. అతని ఎంట్రీ మరిచిపోలేని జ్ఞాపకం!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కన్నప్ప జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. తాజాగా మంచు విష్ణు తన కుమారుడి వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.తన కుమారుడు అవ్రామ్ కన్నప్ప మూవీతో అరంగేట్రం చేయడం సంతోషంగా ఉందంటూ మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. తను సెట్లోకి రావడం, మాటలు చెప్పడం, ఈ డ్రీమ్ ప్రాజెక్ట్లో నటించడం నా జీవితంలో అత్యంత భావోద్వేగ క్షణాల్లో ఒకటని తెలిపారు. ఒక తండ్రిగా నేను ఒకప్పుడు కలలు కన్న అదే ఆకాశం కింద మన బిడ్డ ప్రకాశించడం చూస్తే అంతకు మించింది ఏదీ ఉండదు..ఇది కేవలం అరంగేట్రం కాదు. ఇది జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకమని తన పోస్ట్లో రాసుకొచ్చారు. మీరు ఎల్లప్పుడూ నాకు ఇచ్చిన అదే ప్రేమ, ఆశీర్వాదాలతో మీరందరూ నా కుమారుడిపై కూడా చూపిస్తారని నేను ఆశిస్తున్నా.. అవ్రమ్ ప్రయాణం ప్రారంభం.. అది కన్నప్పతో మొదలు కావడం చాలా సంతోషంగా ఉందంటూ మంచు విష్ణు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.కాగా.. కన్నప్పలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా నటించారు. ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మించారు. ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి అగ్రతారలు నటించారు. వీరితో పాటు అర్పిత్ రాంకా, బ్రహ్మానందం, సప్తగిరి, ముఖేష్ రిషి, మధుబాల, ఐశ్వర్య భాస్కరన్, బ్రహ్మాజీ, దేవరాజ్, రఘు బాబు, శివ బాలాజీ కీలక పాత్రల్లో మెప్పించారు. కాగా.. ఈ సినిమాను ఇటీవలే సూపర్ స్టార్ రజినీకాంత్ వీక్షించారు. అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) -
పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు'.. ఆ బిగ్ మూవీతో పోటీ పడనుందా?
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు. ఈనెలలో విడుదల కావాల్సినా ఈ చిత్రం పలు కారణాలతో వాయిదా పడింది. ఈ నెలలోనే థియేటర్లలో చూడాలనుకున్న ఫ్యాన్స్కు తీవ్ర నిరాశ ఎదురైంది. ముఖ్యంగా ఈ సినిమా పలుసార్లు వాయిదా పడడం.. పెద్దగా బజ్ లేకపోవడంతో హరిహర వీరమల్లుకు డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ ముందుకు రాలేదు. ఇక చేసేదేం లేక జూన్ 12న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా వేయక తప్పలేదు.తాజాగా ఈ హరిహర వీరమల్లుకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కొత్త రిలీజ్ తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ మూవీ విడుదల తేదీని గురువారం ప్రకటిస్తామని పోస్టర్ను పంచుకున్నారు. ఈ ప్రకటనతో పవన్ అభిమానుల్లో కాస్తా ఆశలు చిగురించాయి. అయితే ఈ నెల చివరి వారంలో బాక్సాఫీస్ వద్దకు రానుందా..వచ్చే నెలలో రిలీజ్ కానుందా? అనేది రేపు క్లారిటీ రానుంది. అయితే మరో వైపు జూలై 25న థియేటర్లలో రానుందని సోషల్ మీడియా వేదికగా కొందరు పోస్టులు పెడుతున్నారు. అయితే అదే రోజు విజయ్ దేవరకొండ మూవీ కింగ్డమ్ విడుదల కానుంది. ఆ డేట్ కనుక ఖరారైతే బాక్సాఫీస్ వద్ద కింగ్డమ్తో హరిహర వీరమల్లు పోటీ పడడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మించారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. ఈ చిత్రంలో బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. Release Date Announcement Tomorrow 🦅💥#HariHaraVeeraMallu @MegaSuryaProd pic.twitter.com/9v6jryuTV0— HariHaraVeeraMallu (@HHVMTeam) June 18, 2025 -
రజనీకాంత్ వదిలేసుకున్న అపరిచితుడు.. ఫస్ట్ హీరోయిన్ సదా కాదు!
దర్శకుడు శంకర్ ఇప్పుడంటే తడబడుతున్నాడు కానీ అద్భుతః అని చెప్పుకునే సినిమాలు గతంలో బోలెడు తీశాడు. రోబో, అపరిచితుడు, ఇండియన్, జీన్స్, శివాజీ.. ఇలా ఎన్నో కళాఖండాలు ఆయన సృష్టించినవే! వీటిలో అపరిచితుడు సినిమా వచ్చి జూన్ 17 నాటికి 20 ఏళ్లు పూర్తయింది. 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యావత్ దేశాన్ని అల్లాడించేసింది. ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.🎥 తమిళ అన్నియన్ తెలుగులో అపరిచితుడు (Aparichitudu Movie)గా రిలీజైంది. విక్రమ్, సదా జంటగా నటించారు. దాదాపు రూ.26.38 కోట్ల బడ్జెట్తో ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించారు.🎥 శంకర్ (Shankar Shanmugam) సినిమాలకు డైలాగ్స్, స్క్రీన్ప్లేలో స్టార్ రైటర్ సుజాత రంగరాజన్ భాగమే ఎక్కువగా ఉంటుంది. అపరిచితుడు కథ కూడా ఆయనే రాశారని ప్రచారం జరగ్గా.. అది తన కథే అని శంకర్ వెల్లడించాడు.🎥 ఎక్కడైనా హీరో డబుల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్ చేస్తాడు. కానీ ఇక్కడ మాత్రం ఒకే మనిషి ముగ్గురి(రామానుజం, రెమో, అపరిచితుడు)లా కనిపిస్తాడు.🎥 దక్షిణాదిన అన్ని భాషల్లో రిలీజైన (హిందీలోనూ డబ్ అయింది) ఈ మూవీ 37 సెంటర్స్లో వంద రోజులు ఆడింది.🎥 అపరిచితుడు పబ్లిక్తో మాట్లాడే సీన్ను హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో తీశారు.🎥 శంకర్ ఈ కథ మొదటగా రజనీకాంత్కు వినిపించాడు. ఆయన సారీ అనడంతో విక్రమ్ (Chiyaan Vikram.) దగ్గరకు వెళ్లినట్లు భోగట్టా!🎥 విక్రమ్ భార్య శైలజ సైకాలజిస్ట్. దీంతో సినిమాలో హీరోకున్న పర్సనాలిటీ డిజార్డర్ గురించి భార్యను అడిగి ఆ మూడు పాత్రలకు తగ్గట్లుగా తనను తాను మల్చుకున్నాడు విక్రమ్.🎥 హీరోయిన్గా కూడా జీన్స్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ను అనుకున్నారు. కానీ బాలీవుడ్లో బిజీ అవడంతో కుదర్లేదు. సిమ్రాన్ను అడగ్గా అప్పుడే పెళ్లి పిక్స్ అవడంతో తనూ చేజార్చుకుంది. చివరగా జయంతో పెద్ద హిట్ కొట్టిన సదాకు ఈ అవకాశం వరించింది.🎥 ఏఆర్ రెహమాన్ లేకుండా సినిమా చేయని శంకర్.. ఈ చిత్రానికి రెహమాన్ శిష్యుడు హ్యారిస్ జైరాజ్ను తీసుకున్నాడు.🎥 ఫ్రెంచ్ భాషలో రిలీజైన తొలి దక్షిణాది చిత్రంగా నిలిచింది.🎥 ఫైట్ సన్నివేశం కోసం 120 కెమెరాలు ఉపయోగించిన తొలి భారతీయ చిత్రం.🎥 అపరిచితుడు మే 17, 2024లో రీరిలీజ్ అయింది.20 ఏళ్ల క్రితం లంచం, నిర్లక్ష్యం లేని సమాజాన్ని కోరుకున్న అపరిచితుడు కల ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది.చదవండి: చై-శోభితను పట్టించుకోని మహేశ్? వీడియోతో ఆన్సర్ దొరికేసింది! -
కంటతడి పెట్టించే ‘పాపా’
కవిన్, అపర్ణాదాస్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘డాడా’. గణేశ్ కె.బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో రూ. 40 కోట్లు వసూలు చేసింది. ఎన్నారై శ్రీమతి నీరజ కోట ఈ చిత్రాన్ని ‘పాపా’ పేరుతో తెలుగులో విడుదల చేశారు. ఈ చిత్రం కథ విషయానికొస్తే.. పెళ్ళికి ముందే హద్దులు దాటిన ఒక జంట జీవితంలో చోటు చేసుకున్న విచిత్ర మలుపుల సమహారమే ఈ చిత్రం. మణి (కవిన్), సింధు (అపర్ణ దాస్) ఇద్దరు ప్రేమించుకుంటారు. కాలేజీ టైంలోనే సింధు గర్భం దాల్చుతుంది. ఈ విషయం ఇద్దరి కుటుంబాలలో తెలిసి.. ఇద్దరిని బయటకు వెళ్లగొడతారు. బయటకు వచ్చి ఇద్దరు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఒకవైపు చదువుతూనే వైవాహిక జీవితాన్ని ఎలా కొనసాగించారు? ఈ క్రమంలో వారిద్దరికి ఎదురైన సమస్యలు ఏంటి? చివరి వరకు ఈ జంట కలిసే ఉందా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. వయసులో ఉండే ఆకర్షణలు, ఆవేశాలు, అపార్ధాలు, తరాల మధ్య అంతరాలు, వ్యక్తుల మధ్య ఉండే ఇగోలు, ఫ్రెండ్ షిప్, హెల్పింగ్ నేచర్, ముఖ్యంగా బంధాలు, భావోద్వేగాల కలబోతగా "పాపా" చిత్రాన్ని దర్శకుడు గణేష్ బాబు ఎంతో హృద్యంగా తెరకెక్కించాడు. కథగా చెప్పుకోవడానికి సింపుల్ గా ఉన్నా... కథనాన్ని రక్తి కటించిన తీరుకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.భాగ్యరాజా, విటివి గణేష్ తప్ప మిగతా పాత్రలు పోషించినవారు మనకు తెలియనివారే అయినప్పటికీ... ప్రేక్షకులు ఆయా పాత్రలతో ప్రయాణం చేస్తారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో కంట తడి పెట్టని వారంటూ ఎవరూ ఉండరు. హృదయాల్ని మెలిపెట్టేసే పతాక సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. . హీరోయిన్ అపర్ణాదాస్... కెరీర్ బిగినింగ్ నాటి నయనతారను కాస్త పోలి ఉండడం వల్ల... అట్లీ దర్శకత్వంలో ఆర్య - నయనతార నటించగా ఘన విజయం సాధించిన "రాజా - రాణి" చిత్రం గుర్తుకు వస్తుంది. అయితే ఆ పోలిక జోనర్ కు మాత్రమే పరిమితం.హీరోగా నటించిన కవిన్, హీరోయిన్ పాత్ర పోషించిన అపర్ణాదాస్ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తారు. వీళ్ళ అబ్బాయిగా చేసిన మాస్టర్ ఇయాన్ తోనూ మనం ప్రేమలో పడిపోతాం. ముఖ్యంగా క్లైమాక్స్ లో కంట తడి పెట్టని వారంటూ ఎవరూ ఉండరు. హృదయాల్ని మెలిపెట్టేసే పతాక సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. హీరోయిన్ అపర్ణాదాస్... కెరీర్ బిగినింగ్ నాటి నయనతారను కాస్త పోలి ఉండడం వల్ల... అట్లీ దర్శకత్వంలో ఆర్య - నయనతార నటించగా ఘన విజయం సాధించిన "రాజా - రాణి" చిత్రం గుర్తుకు వస్తుంది. అయితే ఆ పోలిక జోనర్ కు మాత్రమే పరిమితం. ఎడిటింగ్ పరంగా ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే మరింత బాగుండేదనిపిస్తుంది. అలాగే సెకండాఫ్ లో హీరోహీరోయిన్ల మధ్య కాన్ఫ్లిక్ట్ ను ఇంకొంచెం క్యాష్ చేసుకునెలా రెండుమూడు సీన్స్ కన్సీవ్ చేసుకుని ఉంటే ఎమోషన్ మరింత పండేదనిపిస్తుంది "సింగిల్ పేరెంటింగ్"లో ఉండే పెయిన్, తండ్రీకొడుకుల మధ్య బాండింగ్ కు ఇంకొంచెం ప్రాధాన్యత ఇచ్చి ఉంటే కూడా ఇంకా బాగుండేదనిపిస్తుంది. అయితే... మనసు తడిని వెలికి తీసే క్లైమాక్స్... ఇటువంటి చిన్న చిన్న కంప్లైంట్స్ కు తావు లేకుండా చేస్తుంది. -
8 వసంతాల హీరోయిన్.. 19 ఏళ్లకే ఇంత టాలెంట్ ఏంది బ్రో!
అనంతిక సనీల్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం '8 వసంతాలు'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు.అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ అనంతిక టాలెంట్ను నెటిజన్స్ షాకవుతున్నారు. కేవలం 19 ఏళ్లకే ఇంత ప్రతిభ ఎలా సాధించారంటూ చర్చించుకుంటున్నారు. అనంతిక కేవలం నటన మాత్రమే కాదు.. ఆమెలో మల్టీ టాలెంటెడ్ అని వేదికపైనే నిరూపించుకుంది. అనంతిక క్లాసికల్ డ్యాన్సర్తో పాటు కరాటేలో బ్లాక్ బెల్ట్, కలరిపయట్టు విద్యలో నైపుణ్యం, కత్తిసాము, చెండా వాయించడం(పెర్కషన్) లాంటి విద్యల్లో నైపుణ్యాలు సాధించింది. అంటే ఆమె కేవలం నటిగా మాత్రమే కాకుండా ఇన్ని రకాల నైపుణ్యాలు ఉన్నాయా? అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. తాజా ఈవెంట్లో అనంతికి చేసిన స్టంట్స్ చూస్తే ఆమె టాలెంట్ ఏంటో ఇట్టే తెలిసిపోతుంది.ఆమె వయస్సు కేవలం 19 సంవత్సరాలు కాగా.. తన టాలెంట్లో టాలీవుడ్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేరళకు చెందిన అనంతిక లా విద్యార్థిని కూడా. కాగా.. ఈ చిత్రంలో అనంతిక సనీల్కుమార్తో పాటు రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి, కన్న పసునూరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ లేడీ ఓరియంటెడ్ మూవీ జూన్ 20న థియేటర్లలో సందడి చేయనుంది.Ananthika Sanilkumar, a 19-year-old from Kerala, is a trained classical dancer, black belt in karate, and skilled in Kalaripayattu, sword fighting, and Chenda. She’s also a law student balancing her diverse talents. 🫡#AnanthikaSanilkumar #8Vasantalu #mythrimoviemakers pic.twitter.com/5K3WkEdQV1— cinemala baba (@Cinemalababa) June 17, 2025 -
ది రాజా సాబ్ టీజర్.. ఆ డైలాగ్ను ఇలా కూడా వాడేస్తున్నారా?
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'ది రాజా సాబ్'. రొమాంటిక్ హారర్ మూవీగా వస్తోన్న ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఎప్పటి నుంచో ఫ్యాన్స్ వెయిట్ మన రాజా సాబ్ టీజర్ విడుదలైంది. టీజర్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కామెడీతో పాటు హారర్ థ్రిల్లింగ్గా ఉండడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు కనిపించనున్నారు.అయితే ఈ టీజర్లోని ఓ డైలాగ్ను ఏకంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాడేశారు. ప్రజలకు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించేందుకు ఓ ప్రత్యేక వీడియోను రూపొందించారు. అందులో ది రాజాసాబ్ టీజర్లోని డైలాగ్ను చూపించారు. హలో హలో బండి కొంచెం మెల్లగా.. అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్తో ట్రాఫిక్ రూల్స్ అవగాహన కోసం కల్పించే ప్రయత్నం చేశారు.అంతేకాకుండా ప్రభాస్ మిర్చి సినిమాలో విజువల్స్ను కూడా ట్రాఫిక్ పోలీసులు వినియోగించారు. మిర్చి చిత్రంలో హెల్మెట్ ధరించిన బైక్పై వస్తున్న విజువల్స్ను ఇందులో చూపించారు. వీటితో పాటు సాహో మూవీలోని కొన్ని సీన్స్ను కూడా ఇందులో కలిపేశారు. కనీసం ఇది చూసైనా హైదరాబాద్ ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అవగాహన కల్పిస్తున్నారు. ప్రభాస్ క్రేజ్ దృష్ట్యా పోలీసులు చేసినా ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.మారుతి రియాక్షన్..ఈ వీడియో చూసిన ది రాజాసాబ్ డైరెక్టర్ మారుతి స్పందించారు. ఇది చాలా ఫర్ఫెక్ట్.. మా సినిమా డైలాగ్ను పాజిటివ్ కోణంలో ఉపయోగించడం సూపర్ అంటూ ఆ ట్వీట్కు రిప్లై ఇచ్చారు. కాగా.. ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న ది రాజా సాబ్ ఈ ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. Yes sir perfect... thank u for using our footage in positive manner— Director Maruthi (@DirectorMaruthi) June 17, 2025 #HYDTPweBringAwareness📢ℋℯ𝓁𝓁ℴ... ℋℯ𝓁𝓁ℴ....!బండి కొంచెం మెల్లగా #𝕯𝖗𝖎𝖛𝖊 చేయండి డార్లింగ్❤️𝖉𝖆𝖗𝖑𝖎𝖓𝖌.🏍️#WearHelmet#DarlingPrabhas #TheRajaSaab pic.twitter.com/OHSeM6kd1D— Hyderabad Traffic Police (@HYDTP) June 17, 2025 -
కోటి రూపాయల కారులో మోనాలిసా.. ఇప్పుడదే నా ఫ్రెండ్!
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ సినిమా అవకాశాల కోసం ఏళ్లతరబడి ఆఫీసుల చుట్టూ తిరిగేవారు చాలామంది. అదే సమయంలో అనుకోకుండా సినిమాల్లోకి వచ్చేవారూ బోలెడంతమంది ఉన్నారు. అందులో కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా ఒకరు. కుంభమేళాలో పూసలమ్ముకున్న ఈమె.. సోషల్ మీడియా పుణ్యమా అని ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. సినిమా అవకాశాలు ఆమె తలుపుతట్టాయి. కుంభమేళాతో పాపులర్షాప్ ఓపెనింగ్స్కు రమ్మని ఆహ్వానాలు అందాయి. అవన్నీ చూసి పొంగిపోయింది మోనాలిసా. జీవితం ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని ఆలోచించింది. అన్నింటినీ నవ్వుతూ ఓకే చెప్పింది. ఈ మధ్యే ఆమె నటించిన ఫస్ట్ సాంగ్ 'సాద్గి' కూడా రిలీజైంది. అందులో మోనాలిసా మరింత అందంగా కనిపించింది. కాకపోతే యాక్టింగ్ ఇంకాస్త మెరుగవ్వాల్సిన అవసరం ఉందన్న కామెంట్లు వినిపించాయి. కెమెరా ముందు నటించడం అదే తనకు తొలిసారి. నా ఫ్రెండ్.. కెమెరాఈ అనుభవం గురించి మోనాలిసా మాట్లాడుతూ.. సింగర్ ఉత్కర్ష్ శర్మ సర్ తన పాటలో నటించాలని అడగ్గానే ముందు మా ఇంట్లో మాట్లాడమన్నాను. వారు ఓకే అన్న తర్వాతే నేను అందులో యాక్ట్ చేశాను. అలాగే సాంగ్ కూడా నాకెంతగానో నచ్చింది. ఇప్పుడు కెమెరానే నా ఫ్రెండ్. కెమెరా ఎదుట కళ్లతోనే భావాలు పలికించడం, డ్యాన్స్ చేయడం కొత్తగా బాగుంది అని చెప్పుకొచ్చింది.రూ.1 కోటి కారులో మోనాలిసాఇదిలా ఉంటే తాజాగా మోనాలిసా ఖరీదైన కారులో కూర్చున్న ఫోటో ఒకటి నెట్టింట వైరలవుతోంది. ఈ కారు ధర దాదాపు రూ.1 కోటి ఉండొచ్చని అంటున్నారు. రూ.100కు పూసల దండ అమ్ముకున్న మోనాలిసా ఇప్పుడు కోటి విలువైన కారులో తిరుగుతుండటం చూసి ఫ్యాన్స్ సంతోషంగా ఫీలవుతున్నారు. మోనాలిసా ప్రస్తుతం ద డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమా చేస్తోంది. View this post on Instagram A post shared by Monalisa Official (@_monalisa_official) View this post on Instagram A post shared by Utkarsh Singh (@utkarshsinghofficial_)చదవండి: చై-శోభితను పట్టించుకోని మహేశ్? వీడియోతో ఆన్సర్ దొరికేసింది! -
విశ్వంభర ‘స్పెషల్’.. కీరవాణి కాదు.. భీమ్స్!
సంగీతం దర్శకుడు కీరవాణిపై ఒక విమర్శ ఉంది. రాజమౌళి సినిమాలకు తప్ప మిగతా చిత్రాలకు సరైన పాటలు అందించరు. నేపథ్య సంగీతం కూడా ఆ స్థాయిలో ఉండదు. ఆర్ఆర్ఆర్ తర్వాత కీరవాణి పలు సినిమాలకు సంగీతం అందించినా.. ఆ స్థాయిలో పాటలు ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం ఆయన సంగీతం అందిస్తున్న చిత్రాలలో విశ్వంభర(Vishwambhara) ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉందంట. దాని కోసం కీరవాణిని కాకుండా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ని రంగంతో దించారట మేకర్స్. సినిమా మొత్తానికి కీరవాణి సంగీతం అందించినా.. ఆ ఒక్క పాట మాత్రం భీమ్స్ కంపోజ్ చేస్తాడట.కీరవాణి ఖాతాలో పలు సూపర్ హిట్ స్పెషల్ సాంగ్స్ కూడా ఉన్నాయి. అయితే అవన్నీ రాజమౌళి సినిమాలవే కావడం విశేషం. మిగతా సినిమాలకు కూడా ఐటమ్స్ సాంగ్ చేసినా అవి అంతగా ఆకట్టుకోలేదు. ఆ కారణంగానే విశ్వంభర టీమ్ ఆ బాధ్యతను భీమ్స్ అప్పగించినట్లు సమాచారం. ఇప్పుడీ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఫుల్ ట్రెండ్లో ఉన్నాడు. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రానికి ఆయనే సంగీతం అందిస్తున్నాడు. ఇప్పుడు విశ్వంభర కోసం స్పెషల్ సాంగ్ చేయబోతున్నాడట. ఫోక్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ చేయడంలో భీమ్స్ స్పెషలిస్ట్. మరి విశ్వంభర కోసం కూడా ఫోక్ స్టైల్లోనే స్పెషల్ సాంగ్ చేస్తాడేమో చూడాలి.ఇక విశ్వంభర విషయానికొస్తే.. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ యాక్షన్ మూవీ ఇది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్పెషల్ సాంగ్ మినహా షూటింగ్ అంతా పూర్తయింది. అన్ని కుదిరిలే ఆగస్ట్ నెలాఖరు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. -
చై-శోభితను పట్టించుకోని మహేశ్? వీడియోతో ఆన్సర్ దొరికేసింది!
ఇంట్లో పెళ్లంటే ఆ సందడే వేరుంటుంది. పనులన్నీ ఒక ఎత్తయితే ఒక్కో కార్యక్రమానికి ఒక్కో రకంగా రెడీ కావడం మరో ఎత్తు. సెలబ్రిటీలు తమ ఇంట జరిగే ఫంక్షన్స్లో మరింత స్పెషల్గా కనిపించేలా జాగ్రత్తపడతారు. అందరికంటే భిన్నంగా, గ్రాండ్గా రెడీ అవ్వాలని తహతహలాడతారు. కానీ అక్కినేని ఇంట్లో మాత్రం అందరూ సింప్లిసిటీ, సాంప్రదాయానికి ప్రాధాన్యత ఇచ్చారు. అఖిల్- జైనబ్ వివాహంలో నాగార్జున (Nagarjuna Akkineni)-అమల, నాగచైతన్య- శోభిత ధూళిపాళ ట్రెడిషనల్గా రెడీ అయ్యారు. శోభితను పట్టించుకోని మహేశ్?అయితే రిసెప్షన్లో మాత్రం అందరూ ఎవరి టేస్ట్కు తగ్గట్లుగా వారు గ్రాండ్గానే కనిపించారు. ఈ వేడుకకకు మహేశ్బాబు సహా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. మహేశ్ మాత్రం సాదాసీదాగా టీషర్ట్తో వచ్చేశాడు. అయితే రిసెప్షన్ వేడుకలో మహేశ్ (Mahesh Babu).. చై-శోభితను పలకరించకుండా ముందుకుసాగిపోయిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు.. మహేశ్కు సమంత మంచి స్నేహితురాలు అని, ఆమె స్థానంలోకి వచ్చిన శోభిత (Sobhita Dhulipala)తో మాట్లాడటం ఇష్టం లేకే వారిని చూసీచూడనట్లు వెళ్లిపోయాడని ఎవరికి తోచినట్లు వారు కథలు అల్లేశారు.వీడియోతో క్లారిటీకానీ, అసలు విషయమేంటనేది ఇప్పుడు బయటకు వచ్చింది. అఖిల్ రిసెప్షన్కు సంబంధించి తాజాగా మరో వీడియో నెట్టింట వైరల్గా మారింది. అందులో మహేశ్ సతీమణి నమ్రత, సితార.. చై దంపతుల్ని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం మహేశ్ కూడా.. చైకి షేక్ హ్యాండ్ ఇచ్చి హత్తుకున్నాడు. అనంతరం శోభితను కూడా నవ్వుతూ పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. శోభితపై మహేశ్ ద్వేషం పెంచుకున్నాడని కామెంట్లు చేసినవారికి ఈ వీడియో చెంపపెట్టు అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.పెళ్లినాగచైతన్య - సమంత విషయానికి వస్తే వీరిది ప్రేమ వివాహం. ఇరు కుటుంబాల అంగీకారంతో 2017లో వీరి పెళ్లి జరిగింది. కలకాలం కలిసుంటారనుకుంటే నాలుగేళ్లకే విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం చై.. గతేడాది డిసెంబర్లో శోభితను రెండో పెళ్లి చేసుకున్నాడు. అటు సామ్ కూడా దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. కాగా అఖిల్- జైనబ్.. జూన్ 6న పెళ్లి చేసుకోగా జూన్ 8న రిసెప్షన్ జరిగింది. View this post on Instagram A post shared by Radhika (@the_mahi_dhfm2.0) The adorable glimpse of Yuvasamrat @chay_akkineni & #Sobhita garu shares the warm greetings with Superstar @urstrulyMahesh and #Namratha garu ✨A charming moment at #AkhilZainabReception ❤️#NagaChaitanya #Dhullakotteyala #NC24 pic.twitter.com/LSsmzcZnLw— Naga Chaitanya FC (@ChayAkkineni_FC) June 17, 2025 చదవండి: అవమానించారని అనుపమ ఆవేదన.. టాప్ హీరోయిన్లకూ అదే దుస్థితి తప్పలేదా? -
నాన్నకు కారు గిఫ్ట్ ఇచ్చిన తెలుగు యాంకర్
సాధారణంగా ఫాదర్స్ డే అనగానే చాలామంది విష్ చేస్తారు. లేదంటే వాట్సాప్లో స్టేటస్ పెడుతుంటారు. కానీ కొందరు మాత్రం నాన్న కలని నిజం చేస్తుంటారు. తెలుగు యాంకర్ లాస్య ఇప్పుడు అలాంటి ఓ పని చేసింది. తండ్రికి కారుని బహుమతిగా ఇచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నాన్నకు కారు కొనివ్వడానికి గల కారణాన్ని కూడా చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్లేస్: హీరోయిన్ కాజోల్)తెలుగులో కొన్నేళ్ల క్రితం యాంకర్గా పలు టీవీ షోలు చేసిన లాస్య.. తర్వాత కొన్నాళ్లకు బిగ్బాస్ 4వ సీజన్లోనూ పాల్గొంది. కాకపోతే విజేతగా నిలవలేకపోయింది. అయితేనేం సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తర్వాత మంజునాథ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈమెకు ఇద్దరు కొడుకులు కూడా పుట్టారు. ప్రస్తుతానికైతే యూట్యూబ్ వీడియోలు చేస్తూ సంపాదిస్తోంది. అలా కొద్దికొద్దిగా దాచుకున్న డబ్బుతో తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రికి టాటా ఆల్ట్రోజ్ కారుని బహుమతిగా ఇచ్చింది. దీని ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.10 లక్షల వరకు ఉంది.చిన్నప్పటి నుంచి నాన్న కారుతో తిరిగితే చూడాలనేది తన ఆశ అని చెప్పిన లాస్య.. పెళ్లి తర్వాత తాను కొన్న మొదటి కారుకి ఆయనే ఈఎంఐ చెల్లించారని, ఇప్పుడు తన దగ్గర డబ్బులు ఉండటంతో నాన్నకు కారు కొనిస్తున్నానని చెప్పుకొచ్చింది. ఆ ఫొటోలని ఇన్ స్టాలో, వీడియోని యూట్యూబ్లో పోస్ట్ చేసింది. కడపకు చెందిన లాస్య.. తల్లిదండ్రులు ప్రస్తుతం ఊరిలోనే ఉంటారు. ఈమె మాత్రం భర్తతో కలిసి హైదరాబాద్లో ఉంటోంది.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలో వచ్చేసిన రాధికా ఆప్టే సినిమా) -
అవమానించారని అనుపమ ఆవేదన.. టాప్ హీరోయిన్లకూ అదే కర్మ?
అనుపమ (Anupama Parameswaran).. మా గుండెకాయ అని చెప్పుకునే కుర్రాళ్లు బోలెడంతమంది. చూపు తిప్పుకోని అందంతో, సహజమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుందీ బ్యూటీ. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్న ఈ హీరోయిన్కు సొంతగడ్డ అయిన కేరళలో మాత్రం ఆదరణ దక్కలేదట! ఆ విషయాన్ని స్టేజీపై చెప్తూ ఎమోషనలైందీ కేరళ కుట్టి.నటన రాదని హేళనఅనుపమ ప్రస్తుతం జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే సినిమా చేస్తుంది. తాజాగా ఈ మూవీ ఈవెంట్లో అనుపమ మాట్లాడుతూ.. మలయాళంలో చాలామంది నన్ను రిజెక్ట్ చేశారు. నాకు నటన రాదని హేళన చేశారు. ఎంతో ట్రోల్ చేశారు. అలాంటిది దర్శకుడు ప్రవీణ్ నన్ను నమ్మి శక్తివంతమైన పాత్ర ఇచ్చారు అని చెప్పుకొచ్చింది. అక్కడే స్టేజీపై ఉన్న నటుడు, రాజకీయ నాయకుడు సురేశ్ గోపి ఈ మాటలు విని చలించిపోయాడు. ఆయన మాట్లాడుతూ.. అనుపమ మాటలు గుండె లోతుల్లోనుంచి వచ్చాయి. అయినా ఇలాంటివి జరగడం ఇది మొదటిసారి కాదు.ఆ హీరోయిన్ల విషయంలోనూ..ఒకప్పుడు హీరోయిన్ సిమ్రాన్ (Simran)ను కూడా మలయాళ చిత్రపరిశ్రమ పట్టించుకోకుండా వదిలేసింది. తను ఓ స్థాయికి చేరుకున్నాక నాకు తెలిసిన ఎంతోమంది టాప్ డైరెక్టర్లు తనను కథానాయికగా తీసుకోవాలని ఆమె వెంటపడ్డారు. కర్మంటే ఇదే.. అలాగే కేరళకు చెందిన అసిన్, నయనతార (Nayanthara) కూడా వివిధ భాషల్లో టాప్ హీరోయిన్గా రాణించారు. అనుపమ జీవితంలోనూ ఇదే జరుగుతుంది. తను తప్పకుండా రాణిస్తుంది. నా ఆశీస్సులు ఎప్పుడూ తనకు తోడుగా ఉంటాయి అని చెప్పుకొచ్చాడు. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ జూన్ 27న విడుదల కానుంది.సినిమాఅనుపమ విషయానికి వస్తే.. నివీన్ పౌలీ 'ప్రేమమ్' అనే మలయాళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో నాగచైతన్య 'ప్రేమమ్', అఆ, శతమానం భవతి, కృష్ణార్జున యుద్ధం, ఉన్నది ఒకటే జిందగీ, రాక్షసుడు, కార్తికేయ 2, రౌడీ బాయ్స్, 18 పేజీస్, టిల్లు స్క్వేర్ వంటి పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో.. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, బైసన్, లాక్డౌన్, పరదా, పెట్ డిటెక్టివ్ చిత్రాలున్నాయి.చదవండి: హీరో సందీప్ కిషన్ ఇంట విషాదం -
సడన్గా ఓటీటీలో వచ్చేసిన రాధికా ఆప్టే సినిమా
కొన్ని సినిమాలు థియేటర్లలోకి వచ్చిన వారాల వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి. ఇప్పుడు కూడా హీరోయిన్ రాధిక ఆప్టే లేటెస్ట్ మూవీ ఒకటి అలానే సడన్గా స్ట్రీమింగ్లోకి వచ్చింది. బోల్డ్ కాన్సెప్ట్తో డార్క్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రానికి కరణ్ కాందహారి దర్శకుడు కాగా మిగిలిన విభాగాల్లో హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేశారు. ఇంతకీ ఏంటీ సినిమా? ఎందులో అందుబాటులో ఉంది?రాధికా ఆప్డే లేటెస్ట్ బోల్డ్ మూవీ 'సిస్టర్ మిడ్ నైట్'. మే 30న థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇదో సినిమా ఉందనే విషయం కూడా జనాలకు తెలియలేదు. దీంతో ఎలా వచ్చిందో అలా వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ చిత్రం రెండు వారాలు కాగానే ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే ఇక్కడే ఓ ట్విస్ట్. ప్రస్తుతం యూకేలో అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ, గూగుల్ ప్లే ఫ్లాట్ ఫామ్స్లో హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో మన దగ్గర కూడా అందుబాటులోకి రావొచ్చు.(ఇదీ చదవండి: రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్లేస్: హీరోయిన్ కాజోల్)'సిస్టర్ మిడ్ నైట్' విషయానికొస్తే.. పెద్దలు పెళ్లి కుదర్చడంతో ఉమ(రాధికా ఆప్టే) గోపాల్ని పెళ్లి చేసుకుంటుంది. ముంబైలోని ఓ మురికివాడలో వీళ్లు నివసిస్తుంటారు. ఈ వివాహం ఇష్టం లేకుండా చేసేసరికి ఉమ.. భర్తతో కలవలేకపోతుంది. అతడు కూడా భార్యని తాకడానికి కూడా ఇబ్బంది పడుతుంటాడు. పెళ్లయి చాన్నాళ్లు అవుతున్నా భర్త తనతో అంటీముట్టనట్లు ఉండటంత.. తన లైంగిక వాంఛ గురించి బయటకు చెప్పలేక ఇబ్బంది పడుతుంది. అనారోగ్యానికి గురవుతుంది.ఓరోజు ఎలాగోలా ధైర్యం చేసి భర్తతో కలుస్తుంది. కానీ తెల్లారి లేచి చూసేసరికి ఉమ శవమై కనిపిస్తాడు. దీంతో ఈమె ఏం చేసింది? చివరకు ఏమైందనేదే స్టోరీ. బోల్డ్ అండ్ డార్క్ కామెడీకి తోడు కొన్ని సీన్లు మరీ పచ్చిగా ఉన్నాయి. రాధికా ఆప్డే యాక్టింగ్ బాగుందని అంటున్నారు. ఒకవేళ పొరపాటున గనక ఈ మూవీ చూస్తే మాత్రం ఒంటరిగానే చూడండి.(ఇదీ చదవండి: ఓటీటీ సినిమా 'పడక్కళమ్' రివ్యూ.. కామెడీ ఎంటర్టైనర్) -
హీరో సందీప్ కిషన్ ఇంట విషాదం
విశాఖపట్నం(కంచరపాలెం): టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన నానమ్మ, జ్ఞానాపురం సిరిల్ వీధికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయిని శ్రీపాదం ఆగ్నేసమ్మ(88) సోమవారం అర్ధరాత్రి కన్నుమూశారు. మంగళవారం సెయింట్ పీటర్స్ కేథడ్రల్ చర్చి సెమెట్రీలో ఆమె భూస్థాపన నిర్వహించారు. విశాఖలోని పలు ప్రాంతాల్లో ఉపాధ్యాయినిగా పనిచేసిన ఆగ్నేసమ్మ.. వృత్తిలో ఉన్న సమయంలో ఎంతోమంది పేద పిల్లలను చదివించి, వారి అవసరాలు తీర్చి అండగా నిలిచారు. ఆగ్నేసమ్మ పెద్ద కుమారుడు రవి తనయుడు, ప్రముఖ హీరో సందీప్ కిషన్ మద్రాసులో స్థిరపడినప్పటికీ, జ్ఞానాపురంలో తమ బంధువులతో సంబంధాలను కొనసాగిస్తున్నారు. తనకు ఎంతో ఇష్టమైన నానమ్మ(ఆగ్నేసమ్మ) మరణవార్త విని చలించిపోయిన సందీప్ కిషన్..తన మేనమామ, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె.నాయుడు, కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఇక్కడకు చేరుకున్నారు. ఆగ్నేసమ్మ భూ స్థాపన కార్యక్రమంలో పాల్గొని ఆమెకు నివాళులర్పించారు. సెయింట్ పీటర్స్ చర్చి పరిసరాల్లో పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. -
పాకిస్తాన్ టూర్.. అజ్ఞాతం వీడిన యూట్యూబర్ సన్నీ యాదవ్!
తెలుగు యూట్యూబర్, ట్రావెల్ వ్లాగర్ బయ్యా సన్నీయాదవ్(Bayya Sunny Yadav) కిడ్నాప్ డ్రామాకు తెరపడింది. నెల రోజులుగా కనిపించకుండా పోయిన సన్నీ యాదవ్ తాజాగా ఆంధ్రప్రదేశ్లోని సింహాచలంలో ప్రత్యేక్షమయ్యాడు. నెల క్రితం బైక్పై పాకిస్తాన్ వెళ్లి వచ్చిన అతను..చెన్నై ఎయిర్ పోర్ట్ నుంచి కనిపించకుండా పోయాడు. ఎయిర్పోర్ట్లో దిగగానే ఎన్ఐఏ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. పాకిస్తాన్కు వెళ్లి వచ్చిన సన్నీ యాదవ్.. అక్కడి ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐకి స్పైగా పని చేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ అధికారులు అతన్ని అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని సన్నీ యాదవ్ తండ్రి చెప్పడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో మరో యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్..సన్నీ దేశ ద్రోహి అంటూ పలు వీడియోలు చేయడంతో సన్నీ యాదవ్ ని కిడ్నాప్ చేశారేమోననే అనుమానాలు వచ్చాయి. అయితే తాజాగా సన్నీ యాదవ్ సింహాచలం వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి సస్పెన్స్కి తెర దించాడు. ‘నేను వచ్చేశా’ అంటూ సింహాచలం ఆలయం ముందు దిగిన ఫోటోని ఇన్స్టాలో షేర్ చేశాడు.అలాగే తనపై ఆరోపణలు చేసిన నా అన్వేష్ను లక్ష్యంగా చేసుకొని ఇన్స్టా స్టోరీలో వరుస పోస్టులు పెట్టాడు. ' అన్నయ్య నేనొచ్చేశా.. వైజాగ్ వెళ్తున్నా.. మీ ఇంటికెళ్తా.. అమ్మానాన్నకి ధైర్యం చెబుతా.. నువ్వు టెన్షన్ పడకు' అని వ్యంగ్యంగా పోస్ట్ పెట్టాడు. తనను గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని, ఇప్పుడే విడిచిపెట్టారని చెబుతూ.. రాబోయే నాలుగు రోజులు తనకు ఎంతో కీలకమని, ఇది హనీమూన్ కాదంటూ.. ఏదైనా ఎదుర్కొవడానికి రెడీగా ఉన్నానని’ రాసుకొచ్చాడు. ప్రస్తుతం సన్నీ యాదవ్ పోస్ట్ వైరల్గా మారింది. నెల రోజులుగా సన్నీ ఎక్కడ ఉన్నాడు? ఎన్ఐఏ అధికారులు నిజంగానే అదుపులోకి తీసుకున్నారా? లేదా? అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. View this post on Instagram A post shared by BAYYA SUNNY YADAV 🇮🇳 (@bayyasunnyyadav) -
రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్లేస్: హీరోయిన్ కాజోల్
బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కాజోల్.. హైదరాబాద్లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అదో భయంకరమైన ప్రదేశమని, జీవితంలో మళ్లీ అక్కడికి వెళ్లాలని అనుకోవట్లేదని చెప్పుకొచ్చింది. అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: కారులో విజయ్-రష్మిక జంటగా.. ప్రేమని కన్ఫర్మ్ చేస్తున్నారా?)హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న కాజోల్.. ప్రస్తుతం 'మా' అనే సినిమా చేసింది. జూన్ 20న ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రామోజీ ఫిల్మ్ సిటీ అత్యంత భయానక ప్రదేశం అని చెప్పుకొచ్చింది. 'ఎందుకో అక్కడ షూటింగ్ చేస్తున్నప్పుడు నెగెటివ్ వైబ్స్ వచ్చాయి. కొన్ని ప్రదేశాలు చాలా భయపెడతాయి. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని, మరోసారి అక్కడికి రాకూడదు అనిపిస్తుంది. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ అలాంటిదే. ప్రపంచంలోనే అత్యంత భయానకమైన చోటు అది' అని కాజోల్ చెప్పింది.మరి కాజోల్ని అంతలా భయపెట్టిన సంఘటన ఏంటనేది మాత్రం రివీల్ చేయలేదు. కాజోల్ కెరీర్ విషయానికొస్తే.. 1992 నుంచి సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ క్లాసిక్స్లో ఒకటైన 'దిల్ వాలియా దుల్హానియా లే జాయేంగే' సినిమాలో హీరోయిన్ ఈమె. తర్వాత కూడా పలువురు స్టార్స్తో మూవీస్ చేసింది. కొన్నాళ్లకు హీరో అజయ్ దేవగణ్ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రీసెంట్ టైంలో సలాం వెంకీ, లస్ట్ స్టోరీస్ 2, దో పత్తి తదితర చిత్రాలతో కాజోల్ ఆకట్టుకుంది. ఇప్పుడు 'మా' అనే హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.(ఇదీ చదవండి: 19 ఏళ్ల హీరోయిన్ అనంతిక.. ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?)"I’ve felt negative vibes during shoots. Some places were so scary, I just wanted to leave and never come back.Like Ramoji Film City in Hyderabad itself, which is known as one of the most haunted places in the world."- Bollywood Actress #Kajol pic.twitter.com/0znOCXyQ4s— Movie Threat (@MovieThreat) June 18, 2025 -
కారులో జంటగా.. ప్రేమని కన్ఫర్మ్ చేస్తున్నారా?
రష్మిక పేరు చెప్పగానే ఆమె సినిమాలతో పాటు హీరో విజయ్ దేవరకొండ కూడా గుర్తొస్తాడు. ఎందుకంటే వీళ్లిద్దరూ చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారనే రూమర్స్ ఉన్నాయి. కాకపోతే మీడియా కంటపడకుండా సీక్రెట్గా విదేశాలకు వెళ్లి వస్తుంటారు. వ్యక్తిగతంగా ఫొటోలు షేర్ చేస్తారు తప్పితే జంటగా అస్సలు కనిపించారు. కానీ ఎవరో తీసిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. రీసెంట్ టైంలో మాత్రం రష్మిక కొద్దికొద్దిగా ఓపెన్ అవుతోంది. విజయ్పై తనుకున్న ఇష్టాన్ని వ్యక్తపరుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీ సినిమా 'పడక్కళమ్' రివ్యూ.. కన్ఫ్యూజన్ కామెడీ ఎంటర్టైనర్)కొన్నిరోజుల క్రితం ఓ సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని రష్మిక చెప్పింది. దీంతో అందరి చూపు విజయ్ దేవరకొండపై పడింది. తాజాగా 'కుబేర' ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ రష్మిక మాట్లాడుతూ విజయ్ దగ్గర నుంచి అన్నీ తీసేసుకుంటా అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ముంబై ఎయిర్పోర్ట్లో ఒకే కారులో జంటగా వెళ్తూ కనిపించారు. ఇదంతా చూస్తున్న ఫ్యాన్స్.. ప్రేమని కన్ఫర్మ్ చేస్తున్నారా అని మాట్లాడుకుంటున్నారు.కెరీర్ విషయానికొస్తే.. యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలతో రష్మిక పాన్ ఇండియా సూపర్స్టార్ అయిపోయింది. ఈమె నటించిన 'కుబేర' రిలీజ్కి రెడీగా ఉంది. మరోవైపు గర్ల్ఫ్రెండ్, థామా తదితర సినిమాలు ఆల్రెడీ సెట్స్పై ఉన్నాయి. మరోవైపు విజయ్ దేవరకొండకు సరైన హిట్ పడక చాలా ఏళ్లు గడిచిపోయింది. ఇప్పుడు దృష్టంతా 'కింగ్డమ్'పైనే పెట్టుకున్నాడు. పలుమార్లు వాయిదాలు పడుతూ వస్తున్న చిత్రం.. జూలై 25న ఎట్టకేలకు రిలీజ్ కాబోతుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: 'పుష్ప 2'.. హిందీలో మరో సంచలనం)Our favs #VijayDeverakonda and #RashmikaMandanna just got spotted together after ages!! My heart’s so full 😭❤️ pic.twitter.com/Ku1Z2Nv75J— Lilly ✨ (@therwdygirl) June 18, 2025 -
సినిమా థియేటర్లకు ఆదరణ లేక..
మాచర్ల రూరల్: ఒకప్పుడు సినిమా విడుదల అంటే పల్లె, పట్టణం లేడా లేదు.. ఊరుంతా పండుగ వాతావరణం. టికెట్ దొరకతే ఆ ఆనందం లెక్క వేరు. అర్ధరాత్రి నుంచి అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరేవారు. అప్పట్లో ఏడాది కాలంగా ఒకే థియేటర్లో సినిమా ప్రదర్శించిన రోజులున్నాయి. ప్రస్తుతం రోజులు మారాయి. వినోద రంగం కొత్త పుంతలు తోక్కుతోంది. ఓటీటీలు రాకతో థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పట్టణంలో ఇలా.. మాచర్ల పట్టణంలో నీలిమా డీలక్స్, శ్రీ రామాటాకీస్, శ్రీనివాస మహాల్, నాగార్జున కళామందిర్, శ్రీ వెంకటేశ్వర థియేటర్లు ఉండేవి. చంద్రవంక నూతన బ్రిడ్జి నిర్మాణంతో నీలిమా డీలక్స్ «సినిమా హాలు వాగు నీటి ప్రవాహంతో థియేటర్కు రాకపోకలకు ఇబ్బంది కలుగుతుండటంతో 20 ఏళ్ల క్రితం ఆ థియేటర్ను పూర్తిగా మూసివేశారు. ప్రస్తుతం నాలుగు థియేటర్లు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాయి. ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో శ్రీ రామాటాకీస్, నాగార్జున కళామందిర్ ప్రేక్షకులు రాకపోవటంతో సినిమాలు రిలీజ్లు లేకపోవటంతో నెల రోజుల నుంచి ఆ రెండు థియేటర్లు మూసివేశారు. మల్టీప్లెక్స్ లు రాకతోనూ... మలీ్టఫ్లెక్స్ వచ్చిన తరువాత సింగిల్ స్క్రీన్కు వెళ్లేందుకు ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపటం లేదు. కరోనా వచ్చిన తరువాత సినిమా థియేటర్లు నిర్వహణ సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. అద్దె ప్రాతిపదికన నిర్వహించటం, డిస్ట్రిబ్యూటర్లుకు, ఎగ్జిబిటర్లు తమ వల్ల కావడం లేదని చెబుతున్నారు.ప్రస్తుతం సింగిల్ థియేటర్లకు సినిమా విడుదల చేసే సమయంలో ఒప్పందాలు చేసుకుంటున్నారు. మల్టిఫ్లెక్స్కు షేరు విధానం అమలు చేస్తున్నారు. అద్దె ప్రతిపాదన వలన ఆర్థికంగా నష్టపోతున్నట్లు సింగిల్ థియేటర్లు నిర్వాహకులు వాపోతున్నారు. భారీ బడ్జెట్ చిత్రాల విడుదల చేసినా కొన్ని రోజుల వరకు రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది. దీని వలన డి్రస్టిబ్యూటర్లు, నిర్మాతకు మాత్రమే ప్రయోజనం జరుగుతుందని, తమకు న్యాయం జరగటం లేదని చెబుతున్నారు. -
ఓటీటీ సినిమా రివ్యూ.. కన్ఫ్యూజన్ కామెడీ ఎంటర్టైనర్
సింపుల్ బడ్జెట్, డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు తీయడంలో మలయాళ దర్శకుల తర్వాత ఎవరైనా. ఎందుకంటే రీసెంట్ టైంలో అలా వచ్చిన పలు చిత్రాలు అటు థియేటర్లలో ఇటు ఓటీటీల్లో దుమ్మురేపుతున్నాయి. అలాంటి ఓ చిత్రమే 'పడక్కళమ్'. ఓవైపు నవ్విస్తూనే కన్ఫ్యూజన్ కామెడీతో ఆకట్టుకున్న ఈ చిత్రం ఎలా ఉంది? దీని సంగతేంటి అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?ఓ ఇంజినీరింగ్ కాలేజీ. షాజీ(సూరజ్ వెంజరమోడు) అనే ప్రొఫెసర్. ఆయన డిపార్ట్మెంట్ హెచ్ఓడీని సస్పెండ్ చేయడంతో ఆ స్థానంలోకి షాజీ వెళ్తాడు. అదే కాలేజీలో పనిచేస్తున్న మరో ప్రొఫెసర్ రంజిత్(షరాఫుద్దీన్)కి ఇది నచ్చదు. దీంతో తన దగ్గరున్న మాయాపెట్టెతో షాజీని తన కంట్రోల్కి తీసుకుని ఆటాడిస్తాడు. ఇదంతా జతిన్(సందీప్ ప్రదీప్) అనే కుర్రాడు చూసేస్తాడు. తన ఫ్రెండ్స్కి చెబుతాడు. కానీ వాళ్లు నమ్మరు. దీంతో రంజిత్ బ్యాగ్ని దొంగిలించడానికి జతిన్ ప్రయత్నిస్తాడు. తర్వాత కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల జతిన్ శరీరంలో రంజిత్, రంజిత్ బాడీలోకి షాజీ, షాజీ శరీరంలోకి జతిన్ ఆత్మలు ప్రవేశిస్తాయి. అసలు ఎందుకిలా జరిగింది? చివరకు ఏమైంది అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఇంజినీరింగ్ కాలేజీ బ్యాక్ డ్రాప్ సినిమాలు అనగానే హా ఏముంది లవ్ స్టోరీ అయ్యింటుందిలే అనుకుంటాం. కానీ ఇందులో 'జంబలకిడిపంబ' తరహాలో ఒకరి శరీరంలో మరొకరు ప్రవేశించడం అనే కాన్సెప్ట్ని జోడించడం కాస్త కొత్తగా అనిపించింది. పడక్కళమ్ అంటే యుద్ధభూమి అని అర్థం. సినిమా ప్రారంభంలోనే ఓ రాజ్యం, యుద్ధం అని మొదలుపెడతారు. ఓ మాయ పెట్టె గురించి చెబుతారు. కట్ చేస్తే ప్రస్తుతానికి వచ్చేస్తాం. కాలేజీలో జతిన్ గ్యాంగ్ చేసే అల్లరి, షాజీ-రంజిత్ పాత్రలు కాస్త నవ్విస్తాయి. అలా అలా ఫస్టాప్ అయిపోతుంది. సరిగ్గా ఇంటర్వెల్ సమయానికి ప్రధాన పాత్రధారులు ముగ్గరు.. ఒకరి శరీరాల్లోకి ఒకరు వెళ్లడం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది.సెకండాఫ్ అంతా కూడా ఒకరి శరీరంలోకి ప్రవేశించిన మరొకరు అసలు ఏం చేశారు? చివరకు మళ్లీ యాధావిధిగా వచ్చేశారా? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ మూవీస్తో పోలిస్తే ఈ సినిమా బాగుంది. కాకపోతే ఫస్టాప్ సరదాగా సాగిపోయినప్పటికీ.. సెకండాఫ్ మాత్రం కన్ఫ్యూజన్ కామెడీతో కొంతమేర ఆకట్టుకుంది. అక్కడక్కడ థ్రిల్లింగ్గా అనిపించినా లాజిక్స్ లాంటివి ఏం పట్టించుకోకుండా చూస్తే టైమ్ పాస్ అయిపోతుంది. చివర్లో కాస్త ఎమోషన్ సీన్స్ పడేసరికి ఓ మంచి సినిమా చూశాంలే అనే ఫీలింగ్ కలుగుతుంది.ఎవరెలా చేశారు?ఈ సినిమాలో జతిన్గా చేసిన సందీప్ ప్రదీప్కి ఎక్కువ స్కోప్ దొరికింది. ఫస్టాప్ అంతా అమాయక కుర్రాడిగా, సెకండాఫ్ అంతా అగ్రెసివ్గా పాత్రలో ఆకట్టుకున్నాడు. విలనీ లక్షణాలున్న పాత్రలో షరాఫుద్దీన్ కూడా మెప్పించాడు. సూరజ్ వెంజరమోడు పాత్ర కూడా బాగుంది కానీ ఇంకాస్త మంచిగా సీన్స్ పడుంటే బాగుంటుంది కదా అనిపించింది. మిగతా పాత్రధారులు ఓకే. టెక్నికల్ విషయాలకొస్తే.. కాలేజీలో జరిగే కన్ఫ్యూజన్ కామెడీ ఎంటర్టైనర్ సింపుల్ బడ్జెట్లో తీసేశారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఓకే ఓకే. డైరెక్షన్ కూడా పర్లేదు. ప్రస్తుతం హాట్స్టార్లో ఈ సినిమా తెలుగు డబ్బింగ్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కాసేపు అలా ఫ్యామిలీతో కలిసి నవ్వుకుందాం అనుకుంటే ఈ సినిమాపై ఓ లుక్కేయొచ్చు.- చందు డొంకాన -
థగ్లైఫ్ కర్ణాటకలో విడుదల కావాల్సిందే
న్యూఢిల్లీ: కన్నడ భాషపై ప్రముఖ నటుడు కమల్హాసన్ చేసిన వ్యాఖ్యలతో వివాదాస్పదంగా మారిన థగ్లైఫ్ సినిమా విడుదలపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. సినిమాను కర్ణాటక రాష్ట్రంలో విడుదలచేయాల్సిందేనంటూ థగ్లైఫ్ చిత్రబృందానికి అనుకూలంగా ఉత్తర్వులిచి్చంది. రాష్ట్రంలో సినిమా విడుదల వేళ భాషా సంబంధ నిరసన సంఘాలు ఎలాంటి అవాంతరాలు సృష్టించకుండా, ఉద్రిక్తతలు తలెత్తకుండా అంతా సజావుగా సాగేలా చూడాల్సిన బాధ్యత కర్ణాటక ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టంచేసింది. సినిమా చూడొద్దని ప్రేక్షకులపై ఎవరూ తుపాకీ తలకు గురిపెట్టకూడదని జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ మన్మోహన్ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘సినిమా విడుదలను, సినిమాను అడ్డుకునేందుకు అల్లరిమూకలు, నిరసనసంఘాలు వీధుల్లో వీరంగం ఆడతామంటే ఒప్పుకోం. శాంతిభద్రతలకు సంబంధించి చట్టాన్ని తూ.చ. తప్పకుండా ఖచి్చతంగా అమలుచేయాల్సిందే. ఆందోళనకారుల ఆగడాలను మేం అస్సలు సహించం. ఏదైనా అంశంపై ఒకరు అభ్యంతరకర వ్యాఖ్యలుచేస్తే ఇంకొరు దానిని తీవ్రంగా ఖండిస్తూ, ప్రతి విమర్శలు చేయొచ్చు. అంతేగానీ సినిమా విడుదలను అడ్డుకోకూడదు’’అని జస్టిస్ భూయాన్ వ్యాఖ్యానించారు. సినిమా విడుదల విషయంలో మీ వైఖరి ఏంటో జూన్ 18వ తేదీకల్లా చెప్పాలని కర్ణాటక ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. -
'పుష్ప 2'.. హిందీలో మరో సంచలనం
'పుష్ప 2' సినిమా పేరు చెప్పగానే రికార్డులే గుర్తొస్తాయి. ఎందుకంటే థియేటర్లలో రిలీజై ఏకంగా రూ.1800 కోట్ల మేర వసూళ్లు సాధించి హయ్యస్ట్ గ్రాసర్ మూవీస్లో ఒకటిగా నిలవగా.. తర్వాత ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా కొన్ని వారాల పాటు టాప్ ట్రెండింగ్లో కొనసాగింది. ఇప్పటికీ పలు షోలు, ప్రోగ్రామ్స్లోనూ పుష్పరాజ్ పేరు వినిపిస్తూనే ఉంది. తాజాగా బాలీవుడ్లో మరో సంచలనానికి ఈ మూవీ కారణమైంది.తొలుత థియేటర్లలో, తర్వాత ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్న పుష్ప 2.. ఇప్పుడు బుల్లితెరపై కూడా రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా హిందీ వెర్షన్ ఇటీవలే టీవీలో టెలికాస్ట్ చేయగా.. ఏకంగా దేశవ్యాప్తంగా 5.1 టీఆర్పీ వచ్చిందట. ఇది ఐపీఎల్ యావరేజ్ టీఆర్పీ కంటే ఎక్కువ కావడం విశేషం. థియేటర్లతో పాటు టీవీల్లోనూ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న 'స్త్రీ-2' సహా చాలా హిందీ చిత్రాల్ని టీఆర్పీ విషయంలో 'పుష్ప-2' దాటేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: 19 ఏళ్ల హీరోయిన్ అనంతిక.. ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?)అలానే 5.4 కోట్ల హిందీ జనాలు ఈ సినిమాని చూసినట్లు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే కాదు జూన్ 29న అంటే ఆదివారం రీలోడెడ్ హిందీ వెర్షన్ని టీవీలో ప్రసారం చేయనున్నారు. ఈసారి ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయో అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఇప్పట్లో కాకపోయినా సరే కొన్నాళ్ల తర్వాత అయినా సరే 'పుష్ప 3' తీయడం గ్యారంటీ. ఎందుకంటే పుష్ప అంటే సినిమా పేరు కాదు. నార్త్లో అదో బ్రాండ్ అయిపోయింది.బన్నీ విషయానికొస్తే ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో సూపర్ హీరో తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. ఇదివరకే దీపికా పదుకొణెని హీరోయిన్గా ప్రకటించగా మృణాల్, జాన్వీ కపూర్ కూడా ఈ మూవీలో ఉన్నారని టాక్ వినిపిస్తుంది. కొన్నిరోజుల క్రితం ఓ చోట మాట్లాడిన డైరెక్టర్ అట్లీ.. దేశంలోనే ఇది ఖరీదైన చిత్రమని చెప్పుకొచ్చాడు. మరి ఈ మూవీతో అల్లు అర్జున్ ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'విరాటపాలెం') -
టాలీవుడ్లో 19 ఏళ్ల హీరోయిన్.. ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?
సాధారణంగా హీరోయిన్లు అనగానే చాలామందికి ఓ అభిప్రాయం ఉంటుంది. గ్లామర్ చూపించో లేదంటే యాక్టింగ్ చేసో ఛాన్సులు కొట్టేస్తుంటారు అని అనుకుంటారు. అయితే వీళ్లలో కొందరు మాత్రం మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు. అంటే ఒకరిలోనే చాలా టాలెంట్స్ అనమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే 'మ్యాడ్'లో ఓ హీరోయిన్గా చేసిన అనంతిక అనే అమ్మాయి కోసం.రీసెంట్గానే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఈమె పూర్తి పేరు అనంతిక సనీల్ కుమార్. 19 ఏళ్ల ఈ కేరళ కుట్టి.. 2015 నుంచి సినిమాలు చేస్తోంది. తొలుత మిలీ, లాల్ సలామ్, రైడ్ అనే తమిళ సినిమాలు చేసింది గానీ పెద్దగా గుర్తింపు రాలేదు. తెలుగులో 'మ్యాడ్' చిత్రంలో ఓ హీరోయిన్గా చేసి హిట్ కొట్టిన తర్వాత దర్శకనిర్మాతల దృష్టిలో పడింది. 'రాజమండ్రి రోజ్ మిల్క్' అనే మరో తెలుగు మూవీలో లీడ్ రోల్ అవకాశమొచ్చింది. కాకపోతే ఆ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. అయితేనేం తెలుగులో బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తీసిన '8 వసంతాలు' సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'విరాటపాలెం')జూన్ 20న '8 వసంతాలు' సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతిక తన టాలెంట్స్ అన్నీ బయటపెట్టింది. ఇన్ని రోజులు ఈమె ప్రతిభావంతురాలు అనే టాక్ ఉంది గానీ ఇప్పుడు దాన్ని రియాలిటీలో చూపించింది. దీంతో ఈమె గురించి ఇప్పుడు టాలీవుడ్లో మాట్లాడుకుంటున్నారు.ప్రస్తుతం లా(న్యాయవాది) కోర్స్ చేస్తున్న అనంతిక.. క్లాసికల్ డ్సాన్స్ చేస్తుంది. కరాటేలో ఈమెకు బ్లాక్ బెల్ట్ ఉంది. కేరళకు చెందిన కళరిపయట్టు అనే మార్షల్ ఆర్ట్ కూడా వచ్చు. కత్తి ఫైటింగ్లోనూ ఈమె సిద్ధహస్తురాలే. అలానే కేరళ సంప్రదాయంలో ఒకటైన చెండా (డ్రమ్స్) కూడా బాగానే వాయిస్తుంది. ఇలా అనంతిక ఇన్నింట్లో ప్రతిభావంతురాలు అని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 19 ఏళ్లకే ఇలా ఉందంటే.. రాబోయే రోజుల్లో ఇంకెన్ని నేర్చుకుంటుందో?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్)#AnanthikaSanilkumar:• A trained classical dancer 💃• Black belt in Karate 🥋• Skilled in Kalaripayattu 🥷• Skilled in sword fighting 🗡️• Plays the Chenda (percussion) 🥁• An actor 👩🎤• A law student 👩🎓And she’s just 19 years old! 🫡 pic.twitter.com/crowkzdA6X— Movies4u Official (@Movies4u_Officl) June 17, 2025 -
ఆ శక్తి సినిమాకే ఉంది: ఫణీంద్ర నర్సెట్టి
‘‘సాహిత్యం, కవిత్వం, భాష విలువలు గతంతో పోలిస్తే ప్రస్తుతం తగ్గిపోతున్నాయి. భాషని బతికించే శక్తి సినిమాకే ఉంది. మా ‘8 వసంతాలు’ చూసిన తర్వాత ఎవరో ఒకరు ఆ భాషపై ఇష్టాన్ని పెంచుకోవచ్చు. మా చిత్రం ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎంతోమంది అభినందిస్తూ నాకు సందేశాలు పంపుతుండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి. ‘మ్యాడ్’ మూవీ ఫేమ్ అనంతికా సనీల్కుమార్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘8 వసంతాలు’.హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా పసునూరి, స్వరాజ్ రెబ్బాప్రగడ, సమీరా కిశోర్ ఇతర పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఫణీంద్ర నర్సెట్టి మాట్లాడుతూ– ‘‘మను’ సినిమా తర్వాత ఆరేళ్లు గ్యాప్ వచ్చింది. ఈ సమయంలో కొన్ని కథలపై వర్క్ చేశాను. అయితే ‘8 వసంతాలు’ కోసం స్త్రీ కోణంలోకి వెళ్లి ఆ సున్నితత్వాన్ని పట్టుకోవడానికి, కథ రాయడం కంటే స్త్రీ దృక్కోణాన్ని డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ టైమ్ పట్టింది.బలమైన స్త్రీ పాత్రలే స్ఫూర్తిగా నా కథలు ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన గౌరవాన్ని కోల్పోకుండా ఉండే అమ్మాయి ప్రయాణమే ‘8 వసంతాలు’. నేను రాసుకున్న శుద్ధీ అయోధ్య పాత్రకు అనంతిక కరెక్టుగా సరిపోయారు. నటిగానే కాదు... తనకి మార్షల్ ఆర్ట్స్తో పాటు దాదాపు 13 కళల్లో ప్రవేశం ఉంది. పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఫిల్మ్గా ‘మను’ చేశాను. ఇప్పుడు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రోడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్లో ‘8 వసంతాలు’ చేశాను. నాకు ఈ రెండు అనుభవాలూ ఉన్నాయి. ఈ సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని, తర్వాత ఎలాంటి కథలు చేయాలో నిర్ణయించుకుంటాను’’ అని చెప్పారు. -
హీరోలో విలన్
విలన్గా కెరీర్ను ఆరంభించి, ఆ తర్వాత హీరోలైన నటులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అలానే హీరోగా కెరీర్ను ఆరంభించి, ఆ తర్వాత విలన్గా చేస్తున్న జాబితా కూడా పెద్దదిగానే ఉంది. కానీ ఒకవైపు హీరోగా చేస్తూనే, మరోవైపు విలన్గా చేస్తున్నారు కొందరు తెలుగు హీరోలు. విలన్స్గానూ తమ సత్తా ఏంటో ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నారు. ఓసారి ఆ హీరోల్లో ఉన్న విలన్పై ఓ లుక్ వేద్దాం...రజనీకాంత్తో ఢీ: రొమాంటిక్ స్టార్ హీరో నాగార్జున విలన్ రోల్ చేస్తే ఎలా ఉంటుంది? అనేది ‘కూలీ’ సినిమాలో చూడొచ్చు. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘కూలీ’లో నాగార్జున ప్రతినాయకుడిగా నటించారు. ఈ సినిమాలో సైమన్ రోల్లో కనిపిస్తారు నాగార్జున. కాగా ‘కూలీ’ చిత్రీకరణప్రారంభమైనప్పుడు ఓ వ్యక్తిని నాగార్జున కిరాతకంగా చంపుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో లీకైంది.ఆ వీడియో బయటకు వచ్చినప్పుడే ఈ సినిమాలో నాగార్జున విలన్గా కనిపిస్తారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజమైంది. ఇక ఈ చిత్రంలో ఉపేంద్ర, శ్రుతీహాసన్, సత్యరాజ్, షౌబిన్ షాహిర్ ముఖ్య పాత్రలు చేశారు. అలాగే ఓ స్పెషల్ సాంగ్లో పూజా హెగ్డే అదిరిపోయే స్టెప్పులేశారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. వెండితెర బ్రహ్మ రాక్షస: యాక్షన్ చిత్రాల్లో విలన్లను చితక్కొడుతుంటారు ప్రభాస్. ఆరడుగుల ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్లు చేస్తుంటే, థియేటర్స్లో విజిల్స్ పడాల్సిందే. కానీ ఇప్పుడు తనలోని విలన్ యాంగిల్ని కూడా చూపించాలనుకుంటున్నారట ప్రభాస్. ఇందులో భాగంగానే ప్రభాస్ ‘బ్రహ్మ రాక్షస’ అనే సినిమా చేయనున్నారని, ‘హను–మాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారనే టాక్ వినిపిస్తోంది. హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మించనుందట. కానీ... ప్రభాస్ ప్రస్తుత కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమా సెట్స్కు వెళ్లడానికి ఎక్కువ సమయం పట్టేలా ఉంది.ఎన్టీఆర్ వార్: ఏ తరహా పాత్రనైనా అవలీలగా చేసేస్తారు ఎన్టీఆర్. ‘జై లవకుశ, టెంపర్’ చిత్రాల్లో హీరోగా కనిపించడంతో పాటు నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లోనూ ప్రేక్షకులను మెప్పించారు. మరోసారి ఈ తరహా పాత్రను ‘వార్ 2’ చిత్రంలో ఎన్టీఆర్ చేసినట్లుగా తెలుస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో భాగంగా రూపొందిన లేటెస్ట్ స్పై యాక్షన్ మూవీ ‘వార్ 2’.ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ లీడ్ రోల్స్ చేశారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రానిర్మించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పూర్తి స్థాయి విలన్ పాత్రలో కనిపిస్తారని, ఆ పాత్ర పేరు వీరేంద్రనాథ్ అని బాలీవుడ్ టాక్. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఇక హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లీడ్ యాక్టర్స్గా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ మూవీ ‘వార్’ (2019)కు సీక్వెల్గా ‘వార్ 2’ రానుంది.హీరో... విలన్ ఒక్కరే!: అల్లు అర్జున్ ‘ఆర్య 2’ సినిమా చూశారుగా! ఆ చిత్రంలో హీరోగా నటించిన అల్లు అర్జున్ పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ కనిపిస్తాయి. కానీ ఈసారి పూర్తి స్థాయిలో ఓ నెగటివ్ రోల్లో అల్లు అర్జున్ కనిపించనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది.ఈ మూడింటిలో ఒకటి విలన్ రోల్ అని, ఇప్పటివరకు అల్లు అర్జున్ను సిల్వర్ స్క్రీన్పై చూడని విధంగా ఆయన ఈ పాత్రలో కనిపిస్తారని టాక్. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ముంబైలోప్రారంభమైందని తెలిసింది. అల్లు అర్జున్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే జాన్వీ కపూర్, మృణాల్ ఠాగూర్ ఇతర ప్రధాన హీరోయిన్ పాత్రల్లో నటిస్తారనే ప్రచారం సాగుతోంది.బ్లాక్ స్వార్డ్: నటుడిగా కొంత గ్యాప్ తీసుకుని, ఇటీవల ‘భైరవం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మంచు మనోజ్. ఈ చిత్రంలో మనోజ్ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉన్నాయి. మరోసారి మంచు మనోజ్ విలన్గా కనిపించనున్నారు. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ‘మిరాయ్’ చిత్రంలో బ్లాక్ స్వార్డ్ పేరుతో విలన్ పాత్ర చేస్తున్నారు మంచు మనోజ్. ఇటీవల విడుదలైన ‘మిరాయ్’ టీజర్ మనోజ్ది విలన్ పాత్ర అని స్పష్టం చేసింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 5న రిలీజ్ కానుంది. మండాడిలో విలన్: తమిళ నటుడు సూరి, తెలుగు నటుడు సుహాస్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం ‘మండాడి’. మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఎల్రెడ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్గా మహిమా నంబియార్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో పూర్తి స్థాయి విలన్ పాత్రను సుహాస్ చేస్తున్నారు. ఇక అడివి శేష్ హీరోగా నటించిన ‘హిట్ 2’ చిత్రంలోనూ సుహాస్ విలన్గా నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. వీరే కాదు... రానా, సందీప్ కిషన్, నవీన్ చంద్ర, ఆది పినిశెట్టి, కార్తికేయ, వరుణ్ సందేశ్ వంటి వారు ఒకవైపు హీరో పాత్రలు చేస్తూనే, కథ కుదిరినప్పుడు విలన్ పాత్రలూ చేస్తున్నారు. – ముసిమి శివాంజనేయులు -
'సితారే జమీన్ పర్' రిలీజ్.. రూ.120 కోట్ల ఆఫర్ వద్దన్న అమిర్ ఖాన్!
బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ నటించిన తాజా చిత్రం సితారే జమీన్ పర్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో జెనీలియా దేశ్ముఖ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు. ఇటీవలే సెన్సార్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకుంది. ఎటువంటి కట్స్ లేకుండానే సితారే జమీన్ పర్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ తెగ వైరలవుతోంది. ఈ మూవీకి దాదాపు రూ.120 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసేందుకు అమెజాన్ ప్రైమ్ ముందుకొచ్చింది. అయితే ఈ డీల్ను అమిర్ ఖాన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కేవలం థియేటర్లలోనే ఆడుతుందని.. ఓటీటీలో విడుదల ఉండదని అమిర్ ఖాన్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఓటీటీలో సినిమా రిలీజ్ చేయకపోవడం వల్ల ఆడియన్స్ థియేటర్లకు రప్పించేందుకు అమిర్ ఖాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే సితారే జమీన్ పర్ థియేటర్లలో ప్రదర్శన తర్వాత యూట్యూబ్లో అందుబాటులో ఉంచుతారని అమిర్ ఖాన్ చెబుతున్నారు. కానీ అది ఉచితం కాదు.. ప్రేక్షకులు సినిమా చూడటానికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన వెంటనే యూట్యూబ్లో అందుబాటులోకి వస్తుందో లేదో అన్నదానిపై క్లారిటీ లేదు. అయితే ఎనిమిది వారాల థియేటర్ రన్ తర్వాత విడుదల కోసం అమెజాన్ రూ. 120 కోట్లు ఆఫర్ చేసింది. -
రష్మిక మూవీకి ఆల్ ది బెస్ట్ చెప్పిన విజయ్ దేవరకొండ!
నాగార్జున, ధనుశ్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కుబేర’. రష్మికా మందన్నా హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో ధనుశ్ బిచ్చగాడి పాత్రలో అభిమానులను మెప్పించనున్నారు. ధనిక-పేద తేడా, రూ.10 వేల కోట్ల స్కామ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది . సునీల్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. బిగ్ స్క్రీన్పై సందడి చేయబోతున్న కుబేర చిత్రానికి అభినందనలు తెలిపారు. శేఖర్ కమ్ముల సర్ పేరు నా ప్రయాణంలో ఎల్లప్పుడూ ప్రత్యేకం.. నాలాంటి చాలా మంది నటులకు ఆయనే ఆదర్శమని కొనియాడారు. ఈ మూవీలో ధనుశ్, నాగార్జున సర్, రష్మిక లాంటి స్టార్లను చూసేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కుబేర టీమ్కు ఆల్ ది బెస్ట్ అంటూ పోస్ట్ చేశారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసేందుకు ఇక వేచి ఉండలేను అంటూ రాసుకొచ్చారు. రష్మిక మూవీకి విజయ్ దేవరకొండ ఆల్ ది బెస్ట్ చెప్పడంపై అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.Wishing #Kuberaa all the very best as it heads to the big screen. @sekharkammula sir will always be a special name in my journey — he gave many actors like me hope. To see him now telling a story on this scale, with a cast filled with personal favourites like @dhanushkraja,…— Vijay Deverakonda (@TheDeverakonda) June 17, 2025 -
అనుష్కతో పోటీ పడనున్న సుహాస్.. ఓ భామ అయ్యో రామ రిలీజ్ ఎప్పుడంటే?
సుహాస్, మాళవిక మనోజ్ జంటగా నటించిన తాజా చిత్రం 'ఓ భామ అయ్యే రామ'. ఈ ప్రేమకథ చిత్రానికి రామ్ గోదాల దర్శకత్వం వహించారు. ఈ సినిమాను వీ ఆర్ట్స్ బ్యానర్లో హరీశ్ నల్లా నిర్మించారు. దాదాపు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ అనౌన్స్ చేశారు.ఈ విభిన్నమైన రొమాంటిక్ లవ్ స్టోరీని జూలై 11న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ప్రకటించారు. అదే రోజు అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఘాటి విడుదలవుతోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలు పోటీ పడనున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రవీందర్ విజయ్, బబ్లూ పృథ్వీ రాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, సాథ్విక్ ఆనంద్, నయని పావనిముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాధన్ సంగీతమందిస్తున్నారు. -
మహేశ్ బాబు ఒకవేళ 'పుష్ప' చేస్తే..?
కొన్నిసార్లు ఒకరు చేయాల్సిన సినిమా మరొకరి దగ్గరకు వెళ్తుంది. ఊహించని బ్లాక్బస్టర్ అయితే.. అరె ఈ మూవీ మా హీరో చేసుంటే బాగుండేదేమో అని అభిమానులు బాధపడుతుంటారు. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు టెక్నాలజీ వల్ల లేనిదాన్ని కూడా సృష్టించేస్తున్నారు. తాజాగా మహేశ్ బాబు ఒకవేళ 'పుష్ప' సినిమా చేసుంటే ఎలా ఉండేదా అని ఓ వీడియోని వైరల్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: కాంచీవరం చీరలో పూజా.. పేపర్ డ్రస్సులో అషు) 'వన్: నేనొక్కడినే' సినిమా తర్వాత మహేశ్ బాబు.. సుకుమార్తో మరో సినిమా చేయాల్సింది. కానీ ఎందుకో కాంబో సెట్ కాలేదు. అయితే అప్పుడు మహేశ్కి 'పుష్ప' కథే చెప్పారని, కానీ తనకు సెట్ కాదనే ఉద్దేశంతో వదులుకున్నారనే రూమర్స్ వచ్చాయి. తర్వాత సుక్కు.. అల్లు అర్జున్తో 'పుష్ప' చేయడం, ఇది పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ఇప్పుడు మరి ఎవరు చేశారో గానీ మహేశ్ బాబు ఒకవేళ 'పుష్ప' చేసుంటే ఎలా ఉండేదో అని చెబుతూ ఓ ఏఐ వీడియోని సృష్టించారు. ఇందులో పలు హిట్ సీన్స్ని రీ క్రియేట్ చేయడం బాగుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. మహేశ్ సినిమాల విషయానికొస్తే చివరగా 'గుంటూరు కారం'తో పలకరించారు. ప్రస్తుతం రాజమౌళి సినిమా చేస్తున్నారు. ఇదివరకే షూటింగ్ మొదలైంది కూడా. ఇందులో మహేశ్ సాహసికుడిగా కనిపించబోతున్నారు. 2027లో ఈ మూవీ రిలీజ్ ఉండొచ్చని టాక్ నడుస్తోంది. అప్పటివరకు మహేశ్ ఫ్యాన్స్కి వెయిటింగ్ తప్పదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'విరాటపాలెం')What if pushpa did by MB.. ?" Mahesh Babu " pic.twitter.com/HcbRuNAnU8— Sᴜʀʏᴀ.. 🐦🔥 (@Wolverine9121) June 16, 2025 -
ఏ మాయ చేశావే రీ రిలీజ్.. రూమర్స్పై స్పందించిన సమంత!
టాలీవుడ్ హీరోయిన్ సమంత తెలుగు వెండితెరకు పరిచయమై ఇప్పటికే దాదాపు 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. టాలీవుడ్లో ఏ మాయ చేశావే చిత్రం ద్వారా అడుగుపెట్టింది. ఈ మూవీలో అక్కినేని నాగ చైతన్య సరసన హీరోయిన్గా అభిమానులను మెప్పించింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ లవ్ ఎంటర్టైనర్ చిత్రంలో జెస్సీ పాత్రలో మెరిసింది. ఈ మూవీ రిలీజై జూలై 18 నాటికి 15 ఏళ్లు పూర్తవుతోంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ కోసం ఏ మాయ చేశావే చిత్రాన్ని మరోసారి బిగ్ స్క్రీన్పై రిలీజ్ చేస్తున్నారు. 2010లో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ వచ్చేనెల 18న రీ రిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం మరోసారి చైతూ, సమంత ఓకే వేదికపై కనిపిస్తారంటూ వార్తలొస్తున్నాయి. విడాకుల తర్వాత వీరిద్దరిని జంటగా ఎక్కడా చూడలేదు. ఈ సినిమా ప్రమోషన్ల కోసం వీరిద్దరు కలిస్తే ఫ్యాన్స్ చూడాలని కోరుకుంటున్నారు. దీంతో సామ్- చైతూ ఏ మాయ చేశావే ప్రమోషన్లలో కలుస్తున్నారంటూ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తాజాగా వీటిపై హీరోయిన్ సమంత స్పందించింది. ఇంతకీ ఆమె ఏమన్నారో చూసేయండి.తాజాగా సమంత ఈ వార్తలను కొట్టిపారేసింది. నేను ఏ మాయ చేసావే సినిమాను ప్రమోట్ చేయడం లేదని చెప్పింది. ఈ సినిమాను నేను అస్సలు ప్రమోట్ చేయడం లేదు.. అయితే ఈ టాక్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. ఈ సినిమాలోని జంటను కలిసి చూడాలని అభిమానులు ఇష్టపడొచ్చని.. కానీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని మేము జీవించలేము కదా అంటూ సామ్ స్పష్టం చేసింది. దీంతో వీరిద్దరిని కలిసి చూడాలనుకుంటున్న అభిమానులకు నిరాశే ఎదురైంది.తాను నటించిన మొదటి సినిమా ఏ మాయ చేసావే కాదని.. రాహుల్ రవీంద్రన్ నటించిన తమిళ చిత్రం మాస్కోవిన్ కావేరీ అని సమంత వెల్లడించింది. అయితే ఆ సినిమా షూటింగ్ మధ్యలో చాలా గ్యాప్ రావడంతో ఎవరికీ ఆ సినిమా గుర్తులేదని చెప్పుకొచ్చింది. నేను నటించిన రెండో చిత్రం ఏ మాయ చేశావే.. ఈ సినిమాలోని ప్రతి షాట్ తనకు గుర్తుందని తెలిపింది. దీంతో సమంత, నాగ చైతన్య ఏ మాయ చేసావే ప్రమోషన్ల కోసం కలవడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. -
కాంచీవరం చీరలో పూజా.. పేపర్ డ్రస్సులో అషు
న్యూస్ పేపర్ డ్రస్సులో హాట్ బ్యూటీ అషూరెడ్డికాంచీవరం పట్టుచీరలో మెరిసిపోతున్న పూజా హెగ్డేముంబై పూలమార్కెట్లో రాశీఖన్నా సందడిస్విమ్ వేర్లో కేక పుట్టిస్తున్న షెర్లీ షెటియాబ్లర్రీ పోజుల్లో అందంతో ధగధగలాడిస్తున్న కేతిక శర్మనాభి అందాలతో రెచ్చగొట్టేస్తున్న షాలినీ పాండేడిజైనర్ శారీలో వయ్యారంగా మీనాక్షి చౌదరి View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Shirley (@shirleysetia) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) -
ఓటీటీలోకి సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'విరాటపాలెం'
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు ఏదో ఓ కొత్త సినిమా లేదా వెబ్ సిరీస్ వస్తూనే ఉంటుంది. గతవారం అలా 30కి పైగా స్ట్రీమింగ్లోకి వచ్చాయి. ఈ వారం కూడా పలు తెలుగు స్ట్రెయిట్ మూవీస్, డబ్బింగ్ చిత్రాలు ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వాటి సంగతి అలా పక్కనబెడితే ఓ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఫస్ట్ లుక్ ప్రకటించడంతో స్ట్రీమింగ్ తేదీని కూడా ఖరారు చేశారు.(ఇదీ చదవండి: కీర్తి సురేశ్ కొత్త సినిమా.. నేరుగా ఓటీటీలోనే రిలీజ్)యూట్యూబర్ అభిజ్ఞ కానిస్టేబుల్గా నటిస్తున్న ఈ థ్రిల్లర్కి 'విరాటపాలెం' అనే టైటిల్ నిర్ణయించారు. ఇది వెబ్ సిరీస్గా రాబోతుంది. పొల్లూరు కృష్ణ దర్శకుడు. జూన్ 27న అంటే వచ్చే వారం నుంచి ఇది జీ5లో స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ రిలీజ్ చేసి మరీ ప్రకటించారు. ఫస్ట్ లుక్ బట్టి చూస్తే ప్రధాన పాత్రధారి కానిస్టేబుల్, వెనక చాలామంది కొత్త పెళ్లి కూతుళ్లు, ఆ వెనక అమ్మవారి విగ్రహం ఉంది. చూస్తుంటే ఆసక్తికరంగానే ఉంది.1980ల నాటి మారుమూల, భయానక గ్రామమైన విరాటపాలెం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఊరికి ఉన్న శాపం, ప్రతి వధువు తన పెళ్లి రోజే మరణించడం, దీంతో దశాబ్ద కాలంగా ఏ వివాహం జరగకపోవడం లాంటి అంశాలతో కథ ముందుకు సాగుతుంది. అలా చివరకు పెళ్లిళ్లు అనేవి జరగకుండా గ్రామం భయంతో స్తంభించిపోతుంది. ఓ పోలీసు కానిస్టేబుల్ (అభిజ్ఞ) ఆ గ్రామానికి రావడం, అక్కడి శాపం గురించి తెలుసుకోవడం, ఆ రహస్యాన్ని ఛేదించడం అనే ఉత్కంఠభరితమైన కథనంతో అందరినీ ఆకట్టుకునేలా ఈ సిరీస్ ఉండబోతోంది.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. గ్రౌండ్ జీరో, డిటెక్టివ్ షెర్డిల్, ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ లాంటి పరభాషా సినిమాలతో పాటు కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీస్, ద గ్రేట్ ఇండియన్ కపిల్ కామెడీ షో ఈ వీకెండ్లో స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రస్తుతానికైతే స్ట్రెయిట్ తెలుగు మూవీస్ ఏం లేవు.. వారాంతంలో సడన్ సర్ప్రైజులు ఉండొచ్చు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్) -
Thammudu Movie: ఆకట్టుకుంటున్న 'భూ అంటూ భూతం..' సాంగ్
నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న "తమ్ముడు" సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.ఈ రోజు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'భూ అంటూ భూతం..' రిలీజ్ చేశారు. మేనకోడలు బేబి దిత్యకు మేనమామ నితిన్ ధైర్యం చెప్పే సందర్భంలో ఈ పాటను చిత్రీకరించారు. 'భూ అంటూ భూతం..' పాటను అజనీష్ లోకనాథ్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా, అనురాగ్ కులకర్ణి, అక్షిత పోల ఆకట్టుకునేలా పాడారు. సింహాచలం మన్నేలా లిరిక్స్ రాశారు. 'భూ అంటూ భూతం..' పాట ఎలా ఉందో చూస్తే - 'భూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడీ, ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి. భూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడీ, ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి..పుట్టగానే నేరుగా నువు పరుగెత్తలే, పట్టుకుంటూ పడుతూ నడకేనేర్చావే, భయపడి అడుగు ఆపకే..అంటూ సాగుతుందీ పాట. -
రెండో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ఇలియానా
తెలుగులో 'పోకిరి' లాంటి హిట్ సినిమాతో ఫేమ్ సంపాదించిన ఇలియానా.. తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. కానీ ఫ్లాప్స్ పడటంతో ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. నటనని పూర్తిగా పక్కనబెట్టేసిన ఈమె..ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. అలాంటిది ఇప్పుడు ఈమె నుంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. రెండోసారి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది.ముంబైకి చెందిన ఇలియానా.. 'దేవదాసు' మూవీతో హీరోయిన్గా మారింది. అలా తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడలో పలు మూవీస్ చేసింది. టాలీవుడ్లో ఈమెకు అప్పట్లో జీరో సైజ్ బ్యూటీ అనే క్రేజ్ ఉండేది. అలా పోకిరి, శక్తి, మున్నా, జల్సా, జులాయి తదితర సినిమాలతో సక్సెస్ అందుకుంది. కానీ హిట్స్ కంటే ఈమెని ఫ్లాప్స్ ఎక్కువ వరించాయి. దానికి తోడు చాలా గ్యాప్ తర్వాత తెలుగులో చేసిన 'అమర్ అక్బర్ ఆంటోని' ఘోరంగా ఫెయిల్ అవడంతో పూర్తిగా టాలీవుడ్కి దూరమైంది.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' మారుతి.. ఏకంగా ఆరు కథలు!)చివరగా గతేడాది 'దో ఔర్ దో ప్యార్' అనే హిందీ సినిమాలో కనిపించింది. అంతకు ముందే అంటే 2023లోనే మైఖేల్ డోలన్ అనే విదేశీయుడితో ఓ కొడుక్కి జన్మనిచ్చింది. గతేడాది అక్టోబరులో తాను రెండోసారి ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని బయటపెట్టిన ఇలియానా.. తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా భర్త డోలన్, రోజుల బిడ్డతో ఉన్న ఫొటోని పోస్ట్ చేసింది. బెస్ట్ డాడీ అని చెప్పుకొచ్చింది.ఈ క్రమంలోనే ఇలియానా మరో బిడ్డకు జన్మనిచ్చిందని అంటున్నారు. అయితే ఆమె వైపు నుంచి మాత్రం ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. గత కొన్నేళ్ల నుంచి మాత్రం సోషల్ మీడియాకు ఇలియానా దురంగా ఉంటూనే వస్తోంది. ఇప్పుడు కూడా రెండో బిడ్డ పుట్టిన విషయాన్ని రివీల్ చేయట్లేదు. త్వరలో మంచి రోజు చూసి చెబుతుందేమో?(ఇదీ చదవండి: సమంత.. ఆ జ్ఞాపకం ఇంకా అలానే) -
సమంత, నాగ చైతన్య మళ్లీ కలుస్తారా?
సమంత(Samantha), నాగ చైనత్య కెరీర్లో మరిచిపోలేని చిత్రం ‘ఏ మాయ చేసావే’. గౌతమ్ మేనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2010లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. సమంత నటిగా ఎంట్రి ఇచ్చింది కూడా ఈ చిత్రంతోనే. అంతేకాదు నాగచైతన్యతో ప్రేమలో పడడానికి కారణం కూడా ఈ మూవీనే .అందుకే అటు నాగ చైతన్య(Naga Chaitanya)కు గాని, ఇటు సమంతకు గాని ‘ఏ మాయా చేసావే’ చిత్రం చాలా స్పెషల్. సమంత అయితే ఏకంగా ఈ చిత్రం పేరు (వైసీఎం)తో టాటూనే వేయించుకుంది. చైతన్యతో విడిపోయినా.. ఇప్పటికీ తన ఫేవరేట్ చిత్రం ఇదేనని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. నాగ చైతన్య కూడా తన ఫేవరేట్ చిత్రాల్లో వైఎంసీ ఒకటి అని చాలా సందర్భాల్లో చెప్పాడు. ఇలా ఇద్దరికీ చాలా ఇష్టమైన చిత్రం మళ్లీ థియేటర్స్లో సందడి చేయబోతుంది. జులై 18న ఈ చిత్రం రీరిలీజ్ కానుంది. అటు అక్కినేని ఫ్యాన్స్తో పాటు సమంత అభిమానులు కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రీరిలీజ్ చేయాలని సగటు సినీ ప్రియులు కూడా కోరుకున్నారు. ఎట్టకేలకు 15 ఏళ్ల తర్వాత మళ్లీ జెస్సీ(సమంత), కార్తీక్ (నాగ చైతన్య)ల లవ్స్టోరీ మళ్లీ వెండితెరపై చూడబోతున్నాం. అయితే ఇక్కడ ఈ సినిమా కంటే ఎక్కువగా మరో విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. రీరిలీజ్ ప్రమోషన్స్ లో సమంత, నాగ చైతన్య కలిసి పాల్గొంటారా? అని ఇరువురు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చర్చించుంటున్నారు. ఇద్దరు కలిసి ఇంటర్వ్యూలు ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. కానీ ఇది అసాధ్యమనే చెప్పాలి. చైతూ గుర్తులను ఒక్కొక్కటిగా చెరిపేస్తున్న సమంత.. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మాజీ భర్తని కలిసేందుకు ఇష్టపడుతుందా అంటే .. కష్టమనే చెప్పాలి. అటు నాగ చైతన్య కూడా శోభితతో పెళ్లి తర్వాత అన్ని మర్చిపోయి హాయిగా కొత్త జీవితాన్ని గడుపుతున్నాడు. ఆయన కూడా సామ్తో కలిసి ప్రమోషన్స్లో పాల్గొనడం కష్టమే. అభిమానుల కోరుకున్నట్లుగా వీరిద్దరు కలిసి ఒకే వేదికను పంచుకోవడం ఇప్పట్లో అసాధ్యం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
సింగర్తో జయం రవి రిలేషన్.. ఏకంగా ఇద్దరు కలిసి!
కోలీవుడ్ స్టార్ జయం రవి విడాకుల వ్యవహారం ప్రస్తుతం కోర్టులో పెండింగ్లో ఉంది. గతేడాది తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన స్టార్ హీరో.. ఆ తర్వాత తన భార్య ఆర్తి ఆరోపణలు చేయడంతో వివాదానికి దారితీసింది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. అంతేకాకుండా వీరి మధ్యలో సింగర్ కెన్నీషా పేరు తెరపైకి రావడంతో జయం రవితో రిలేషన్లో ఉందంటూ వార్తలొచ్చాయి. ఆర్తి రవి సైతం మూడో వ్యక్తి ప్రమేయం వల్లే తామిద్దరం విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసింది. అంతకుముందే జయం రవి, సింగర్ కెన్నీషా ఓ పెళ్లి వేడుకలో జంటగా కనిపించడంతో వీరి రిలేషన్పై మరింత టాక్ వినిపించింది. తాజాగా మరోసారి వీరిద్దరి రిలేషన్పై చర్చ మొదలైంది. ఇంతకీ ఆ సంగతి ఏంటో తెలుసుకుందాం.సాంగ్లో జయం రవి ప్రత్యక్షం..తాజాగా సింగర్ కెన్నీషా ఓ మ్యూజిక్ ఆల్బమ్ వీడియోను రిలీజ్ చేసింది. 'ఆండ్రమ్ ఇంద్రమ్'అనే పేరుతో మ్యూజిక్ వీడియో జూన్ 15న విడుదలైంది. ఈ పాటలో జయం రవి అతిథి పాత్రలో కనిపించాడు. అంతేకాకుండా రవి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కెనీషాకు అభినందనలు తెలిపారు. దీంతో వీరిద్దరి రిలేషన్పై మరోసారి కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం విడాకుల కేసు కోర్టులో ఉన్నందున వీరిద్దరి తమ రిలేషన్పై మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
సమంతకు చేదు అనుభవం.. జిమ్ నుంచి బయటకు రాగానే!
టాలీవుడ్ హీరోయిన్ సమంత సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల శుభం మూవీతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన సామ్ ప్రస్తుతం ముంబయిలో బిజీ అయిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు తెరకెక్కించనున్న రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్ వెబ్ సిరీస్లో కనిపించనుంది.అయితే తాజాగా ముంబయిలో సమంతకు చేదు అనుభవం ఎదురైంది. బాంద్రాలో జిమ్ చేసి బయటికి వస్తుండగా ఆమెను ఒక్కసారిగా ఫోటోలు తీసుకునేందుకు చుట్టుముట్టారు. దీంతో తీవ్ర అసౌకర్యానికి గురైన సామ్.. అరే రూకోజి ప్లీజ్ అంటూ హిందీలో మాట్లాడుతూ అసహనంగా కనిపించింది. ఆమె కారు ఇంకా రాకపోవడంతోనే బయట నిలబడాల్సి రావడంతో ఫోటోలు తీసేందుకు ఎగబడ్డారు. దీంతో సమంత అసహన వ్యక్తం చేసింది.కాగా.. గతేడాది సిటాడెల్: హనీ బన్నీలో వరుణ్ ధావన్తో కలిసి చివరిసారిగా కనిపించింది. అయితే ఆ తర్వాత సిటాడెల్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె రిలేషన్లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ దీనిపై ఇప్పటివరకు ఎవరూ కూడా స్పందించలేదు. చాలాసార్లు వీరిద్దరు జంటగా కనిపించడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి.Rarely see her get irritated or angry even when disturbed she usually remains cool n composed. That's a quality we need to inculcate taking from her✨@Samanthaprabhu2 #Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/9SMBRoYzxy— AkaSam (@SammuVerse) June 17, 2025 -
'రాజాసాబ్' మారుతి.. ఏకంగా ఆరు కథలు!
'రాజాసాబ్' టీజర్కి అన్నివైపుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కొన్నాళ్ల ముందు వరకు డైరెక్టర్ మారుతితో ప్రభాస్ ఎందుకు సినిమా చేస్తున్నాడా అని తిట్టుకున్న ఫ్యాన్స్.. ఇప్పుడు టీజర్ చూసి మెచ్చుకుంటున్నారు. పర్లేదు మూవీ డీసెంట్గానే ఉండొచ్చు, హిట్ కొట్టబోతున్నాం అని మురిసిపోతున్నారు. అయితే డైరెక్టర్ మారుతి గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ అవుతోంది.స్వతహాగా ఆర్టిస్ట్ అయిన మారుతి.. 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' సినిమాలతో దర్శకుడిగా మారాడు. ఈ రెండింటిలోనే బూతు డైలాగ్స్ ఉండేసరికి ఇతడిపై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. దీని నుంచి బయటపడేందుకు నానితో 'భలే భలే మగాడివోయ్' సినిమా తీశాడు. తనపై ఉన్న బూతు ముద్రని చెరిపేసుకున్నాడు. తర్వాత నుంచి కామెడీ ఎంటర్టైనర్స్ తీస్తున్నాడు. గతంలో 'ప్రేమకథా చిత్రమ్'తో హారర్ కామెడీ ట్రెండ్ సెట్ చేసిన మారుతి.. ఇప్పుడు 'రాజాసాబ్'తో హారర్ ఫాంటసీ స్టోరీతో రాబోతున్నాడు.(ఇదీ చదవండి: 'ఆవేశం' కోసం ఆశపడ్డ మంచు విష్ణు.. కానీ)సరే అసలు విషయానికొస్తే.. మారుతిలో దర్శకుడితో పాటు మంచి రైటర్ కూడా ఉన్నాడు. గతంలో తన కథలతో పలువురు దర్శకుల్ని పరిచయం కూడా చేశాడు. ఇప్పుడు 'రాజాసాబ్' తర్వాత కూడా అలానే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ మూవీ తర్వాత మరో కొత్త మూవీ చేయడానికి చాలా టైమ్ పట్టొచ్చు. కానీ అంతలో తన దగ్గరున్న ఆరు స్టోరీల్ని టాలీవుడ్లోనూ పలువురు యంగ్ డైరెక్టర్స్కి ఇవ్వాలని ఫిక్సయ్యాడట. త్వరలో ఇవి కార్యరూపం దాల్చనున్నాయి.ఇక 'రాజాసాబ్' సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చిన మారుతి.. చూచాయిగా ఉండకపోవచ్చని అన్నాడు. డిసెంబరులో రాబోయే సినిమా హిట్ అయిన దానిబట్టి తర్వాత ఆలోచిద్దాం అని చెప్పుకొచ్చాడు. మారుతి కామెంట్స్ బట్టి చూస్తే సెకండ్ పార్ట్ ఉండదు. డిసెంబరు 5న 'రాజాసాబ్' థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికీ ఇంకాస్త వర్క్ బ్యాలెన్స్ ఉంది. రిలీజ్కి ఇంకా చాలా సమయముంది కాబట్టి అంతలో పూర్తి చేసి చెప్పిన టైంకి రావొచ్చు. లేదంటే మాత్రం మళ్లీ డేట్ మారడం పక్కా.(ఇదీ చదవండి: సమంత.. ఆ జ్ఞాపకం ఇంకా అలానే) -
హీరామండి సక్సెస్.. అవకాశాలు మాత్రం నిల్: అదితిరావు హైదరి
బాలీవుడ్ నటి అదితి రావు హైదరీ గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింగి. హీరో సిద్ధార్థ్ను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వైవాహిక జీవితంలో ఫుల్ బిజీగా మారిపోయింది. ఆమె చివరిసారి సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'హీరామండి: ది డైమండ్ బజార్'లో కనిపించింది. ఈ సిరీస్లో తన నటనకు గానూ ప్రశంసలు అందుకున్నారు. అయితే ఈ సిరీస్ తర్వాత పెళ్లి చేసుకున్న బ్యూటీ.. ఇప్పటి వరకు ఎలాంటి కొత్త సినిమాను ఓకే చేయలేదు. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో అదితి రావు హైదరీ వెల్లడించింది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మాట్లాడింది.అదితి రావు మాట్లాడుతూ.. ' హీరామండి తర్వాత నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే చాలా ప్రేమ, ప్రశంసలు వచ్చాయి. అయితే నేను నా నెక్ట్స్ ఎలాంటి సినిమాకు ఇప్పటి వరకు సంతకం చేయలేదు. ఇంకా అవకాశాల కోసం వేచి ఉన్నా. జీవితంలో సమాన భాగస్వామిలాగే తెరపై మహిళలకు కూడా సమాన అవకాశాలు రావాలని కోరుకుంటున్నా' అని పంచుకుంది.కాగా.. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన 'హీరామండి: ది డైమండ్ బజార్' మే 1, 2024న నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. ఈ సిరీస్లో మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, తహా షా బాదుస్షా, అదితి రావు హైదరీ కీలక పాత్రల్లో మెప్పించారు. ప్రస్తుతం అదితి రావు హైదరి 'ఓ సాథీ రే'లో అనే సిరీస్లో నటించనుంది. ఆ తర్వాత 'పరివారిక్ మనురంజన్' అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్లో కనిపించనుంది. -
సమంత.. ఆ జ్ఞాపకం ఇంకా అలానే
సమంత పేరు చెప్పగానే చాలామందికి సినిమాలతో ఆమె వైవాహిక జీవితం కూడా గుర్తొస్తుంది. ఎందుకంటే హీరో నాగచైతన్యని కొన్నాళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాకపోతే ఇద్దరూ సరిపడక నాలుగేళ్లకు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం సమంత ఒంటరిగానే ఉంది. చైతూ మాత్రం హీరోయిన్ శోభితని గతేడాది పెళ్లి చేసుకున్నాడు. ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు.సరే ఈ విషయాల్ని కాసేపు పక్కనబెడితే చైతూతో ప్రేమ,పెళ్లి బంధంలోకి వెళ్లిన తర్వాత సమంత ఓ మూడు టాటూలు వేయించుకుంది. వాటిలో పక్కటెముకల మీద చైతూ అనే పేరు, అలానే చేతిపై మోర్స్ కోడ్లో చైతూ పేరు రాయించుకుంది. ప్రస్తుతానికైతే ఈ రెండు గుర్తుల్ని చెరిపేసుకుంది. అయితే మెడ వెనక భాగంలో సామ్.. 'వైఎంసీ' (ఏ మాయ చేశావె) టాటూ కూడా వేయించుకుంది. కొన్నిరోజుల క్రితం దీన్ని తీయించేసుకుందనే వార్తలు వచ్చాయి.(ఇదీ చదవండి: 'ఆవేశం' కోసం ఆశపడ్డ మంచు విష్ణు.. కానీ)అయితే అప్పట్లో ఓ మ్యాగజైన్ కోసం తీయించుకున్న ఫొటోల్లో మేకప్తో సామ్.. తన టాటూని కవర్ చేసుకుంది. ఆ విషయం ఇప్పడు క్లారిటీ వచ్చింది. తాజాగా ముంబైలోని బాంద్రాలో ఓ జిమ్ నుంచి సమంత బయటకొస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో మెడ వెనక భాగంలో 'వైఎంసీ' టాటూ కనిపించింది. ఇకపోతే 'ఏ మాయ చేశావె' సినిమా రీ రిలీజ్ కానుంది. జూలై 18న మరోసారి థియేటర్లలోకి రానుంది.ఓవైపు చైతూ.. శోభితని పెళ్లి చేసుకుని జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. మరోవైపు సమంత కూడా 'ఫ్యామిలీ మ్యాన్' డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో రిలేషన్లో ఉందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. గత కొన్నిరోజుల నుంచి వీళ్లు కలిసి కనిపించడంతో నెటిజన్లు ఇలా మాట్లాడుకున్నారు. ఇదివరకే రాజ్కి పెళ్లయింది. ఈ డేటింగ్ రూమర్స్ చూసి రాజ్ భార్య, భర్తని ఉద్దేశిస్తూ పరోక్షంగా కొన్ని పోస్టులు కూడా పెట్టింది. సినిమాల విషయానికొస్తే.. సమంత ప్రస్తుతం 'రక్త్ బ్రహ్మాండ్' అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ఇది వచ్చే ఏడాది రిలీజ్ కావొచ్చు.(ఇదీ చదవండి: సేతుపతి కోసం హిట్ బ్యూటీని పట్టేసిన పూరీ జగన్నాథ్)‘Stop it guys!’Samantha Ruth Prabhu walks out post-workout, clearly not in the mood for pap games today 💪📸🚫#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/EXElTyTYmu— Cinewoods (@Cinewoodsoffl) June 17, 2025 -
డైరెక్ట్గా ఓటీటీలోకి రానున్న ఆర్.మాధవన్ సినిమా
ఆర్.మాధవన్ నటించిన 'ఆప్ జైసా కోయి' (Aap Jaisa Koi) చిత్రం డైరెక్ట్గా ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించగా వివేక్ సోని దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీ డ్రామాతో తెరకెక్కిన ఈ ఫిల్మ్ ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ అభిప్రాయపడ్డారు. ఇందులో హీరోయిన్గా ఫాతిమా సనా షేక్ నటించారు.'ఆప్ జైసా కోయి' సినిమా నెట్ఫ్లిక్స్ (Netflix) వేదికగా జులై 11 నుంచి అందుబాటులో ఉండనుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో విడుదల కానుంది. ఇద్దరు వేర్వేరు మనస్తత్వాల జోడీని ప్రపంచానికి చూపాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. దంపతుల మధ్య పదేళ్ల గ్యాప్ ఉంటే ఎలాంటి చిక్కులు రావచ్చు.. వస్తే వాటిని ఎలా పరిష్కరించుకుంటారనేది ఈ చిత్రంలో చూపించనున్నారు.మహేశ్బాబు- రాజమౌళి సినిమా 'SSMB29'లో మాధవన్ నటించబోతున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్లోని ఒక కీలకమైన పాత్రలో నటించాలని ఇప్పటికే మేకర్స్ సంప్రదించారట. కెన్యాలో జరగబోయే షూటింగ్ సెట్స్లో ఆయన ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. అయితే, ఈ విషయంపై త్వరలో అధికారికంగా ప్రకటన రావచ్చని తెలుస్తోంది. -
'ఆవేశం' కోసం ఆశపడ్డ మంచు విష్ణు.. కానీ
'కన్నప్ప' సినిమా ప్రమోషన్లలో బిజిబిజీగా ఉన్న మంచు విష్ణు.. మీడియాలో తెగ కనిపిస్తున్నాడు. కొన్నిరోజుల నుంచి పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా గురించి, తన గురించి చాలా విషయాలు చెబుతున్నాడు. మూవీ రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో కొన్నిరోజుల క్రితం కొచ్చిలో ఈవెంట్ చేశారు. మోహన్ లాల్ చేతుల మీదుగా 'కన్నప్ప' ట్రైలర్ని లాంచ్ చేశారు. తర్వాత అక్కడి మీడియాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మలయాళ చిత్రసీమ గురించి కొన్ని విషయాలు మాట్లాడారు.'మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి లెజెండ్స్ సినిమాలను ఎప్పుడూ మిస్ అవ్వను. 'ట్రాన్స్' సినిమాలో ఫహాద్ ఫాజిల్ యాక్టింగ్ నాకు ఎంతగానే నచ్చేసింది. గతేడాది రిలీజై భారీ హిట్ కొట్టిన ఫహాద్ ఫాజిల్ 'ఆవేశం' కూడా చాలా బాగుంటుంది. దీన్ని తెలుగులోనే నేను రీమేక్ చేయాలనుకున్నా. కానీ అప్పటికే ఎవరో హక్కులు తీసేసుకోవడంతో ఇక సైలెంట్ అయిపోయాను' అని విష్ణు చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఇతడు 'ఆవేశం' చేసుంటే ఎలా ఉండేదో?(ఇదీ చదవండి: సేతుపతి కోసం హిట్ బ్యూటీని పట్టేసిన పూరీ జగన్నాథ్)చాన్నాళ్లుగా సరైన సినిమాలు చేయక పూర్తిగా వెనకబడిపోయిన మంచు విష్ణు.. లాంగ్ గ్యాప్ తీసుకుని చేసిన సినిమా మూవీ 'కన్నప్ప'. ఇందులో విష్ణు హీరోగా నటిస్తూనే, నిర్మాతగా భారీ బడ్జెట్ పెట్టాడు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తదితర స్టార్స్ని ఒప్పించి ఈ చిత్రంలో అతిథి పాత్రలు పోషించేలా చేశాడు. వీళ్లతో పాటు మోహన్ బాబు, కాజల్, శరత్ కుమార్.. ఇలా చాలామంది ప్రముఖ నటీనటులు ఇందులో నటించారు. చూస్తుంటే విష్ణు 'కన్నప్ప' చాలా నమ్మకం పెట్టుకున్నాడు. మరి ఈ మూవీ ఎలాంటి ఫలితం తీసుకొస్తుందో చూడాలి?'ఆవేశం' విషయానికొస్తే.. ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ ఓ గ్యాంగ్స్టర్గా నటించాడు. డిఫరెంట్ ఎమోషన్స్తో సరికొత్తగా కనిపించి ఆకట్టుకున్నాడు. అమెజాన్ ప్రైమ్లో మలయాళ, తమిళ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. లెక్క ప్రకారం తెలుగు కూడా ఉండాలి. కానీ రీమేక్ హక్కులు.. మన దగ్గర ఓ నిర్మాత తీసుకోవడంతో తెలుగు డబ్బింగ్ చేయలేదు. తెలుగులో ఈ సినిమాని బాలకృష్ణతో చేయాలని అనుకుంటున్నట్లు రూమర్స్ వచ్చాయి. కానీ ఇంతవరకు దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం) -
సుప్రీం కోర్టులో కమల్ సినిమాకు భారీ ఊరట!
కమల్ హాసన్ హీరోగా నటించిన ‘థగ్ లైఫ్’(Thug Life) చిత్రానికి సుప్రీ కోర్టు(supreme court of india)లో భారీ ఊరట లభించింది. కర్ణాటకలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అంతేకాదు ఈ సినిమాను నిలిపివేయాలంటూ బెదిరించిన సంఘాలను సుప్రీం కోర్టు హెచ్చరించింది. థియేటర్స్లో ఏమి ప్రదర్శించాలనే అధికారం గుంపులకు, ఆరాచక శక్తులకు లేదని, మూక బెదిరింపులకు చట్ట పాలనను తాకట్టు పెట్టలేమని కోర్టు పేర్కొంది. సెన్సార్ బోర్డు అనుమతి పొందిన ఏ సినిమానైనా విడుదల చేయాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.అలాగే కమల్ వ్యాఖ్యలను వ్యతిరేకించే హక్కు కర్ణాటక ప్రజలకు ఉందని, ప్రాథమిక హక్కులను కాపాడాలని ధర్మాసనం పేర్కొంది. ‘కమల్ వ్యాఖ్యలు తప్పు అని కర్ణాటక, బెంగళూరు వాసులు నమ్మితే.. అలా చెబుతూ ఒక ప్రకటన జారీ చేయవచ్చు. సినిమా థియేటర్లను తగలబెట్టాలని ఎందుకు బెదిరిస్తున్నారు?’ అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.చిత్ర నిర్మాత దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు నుంచి తనకే బదిలీ చేసుకున్న సుప్రీం కోర్టు.. దీనిపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం స్పందనను తెలియజేయాలని ఆదేశించింది. అలాగే ఈ విషయంలో క్షమాపణలు చెప్పాలంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తప్పు పట్టింది.అసలేం జరిగిందంటే.. కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ సినిమా ఆడియో లాంఛ్ ఈవెంట్లో కమల్ హాసన్ మాట్లాడుతూ.. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని అన్నారు. ఆయన చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకీ దారి తీశాయి. కమల్ వ్యాఖ్యలపై కన్నడిగులు భగ్గుమన్నారు. క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఆయన క్షమాపణలు చెప్పకపోవడంతో కర్ణాటకలో ఈ సినిమా విడుదలను నిషేధించారు. దీనిపై చిత్రబృందం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. నేడు ఆదేశాలు జారీ చేసింది. -
హిట్ బ్యూటీని పట్టేసిన పూరీ జగన్నాథ్
'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' డిజాస్టర్ల దెబ్బకు పూర్తిగా ఆలోచనలో పడిపోయిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. తన రూట్ మార్చి స్టోరీ రాశాడు. దాన్ని తమిళ నటుడు విజయ్ సేతుపతికి చెప్పి మెప్పించాడు. కొన్ని నెలల క్రితం ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ కాగా.. ఇందులో ఎవరెవరు నటిస్తారనే విషయాన్ని ఒక్కొక్కరిగా ప్రకటిస్తున్నారు. తాజాగా హిట్ చిత్రాల హీరోయిన్ని తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.మలయాళ నటి సంయుక్త.. ఇప్పటివరకు చాలా సినిమాలు చేసింది. వాటిలో చాలావరకు హిట్ అయ్యాయి. తెలుగులోనూ భీమ్లా నాయక్, బింబిసార, సర్, విరూపాక్ష తదితర చిత్రాలతో సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం స్వయంభు, అఖండ 2, హైందవ, నారీ నారీ నడుమ మురారీ అని నాలుగు చిత్రాలు చేస్తోంది. ఇప్పుడు పూరీ-విజయ్ సేతుపతి ప్రాజెక్ట్లోకి ఎంటరైంది.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం)సంయుక్తని తీసుకున్న విషయాన్ని పూరీ-ఛార్మీ ప్రకటించారు. ఆమెతో కలిసున్న ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విజయ్ సేతుపతి మూవీలో ఇప్పటికే టబు, కన్నడ నటుడు దునియా విజయ్ ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు సంయుక్త కూడా ఉందనేసరికి మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రంలో సేతుపతి.. బిచ్చగాడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. త్వరలో షూటింగ్ ప్రారంభించి ఈ ఏడాది చివర్లోనే రిలీజ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నారని సమాచారం.ఈ సినిమా విషయంలో పూరీ జగన్నాథ్ చాలా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో తాను తీసిన సినిమాలు విషయంలో ఏ తప్పులైతే జరిగాయో ఈసారి అలాంటివేం జరగకుండా కచ్చితంగా ప్రేక్షకుల్ని అలరించాలని భావిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం విజయ్ సేతుపతిని పూరీ సినిమా చేస్తున్న సినిమా గురించి అడిగితే.. తనకు కథ నచ్చే అవకాశమిచ్చానని, ఆయన గత చిత్రాల ఫ్లాప్ కావడం తనకేం సమస్య కాదని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: భారీ ధరకు ‘పెద్ది’ ఓటీటీ రైట్స్.. రిలీజ్కు ముందే రికార్డు!) -
ఓటీటీలో 'ఫైనల్ డెస్టినేషన్' చూడాలంటే..
హాలీవుడ్లో 'ఫైనల్ డెస్టినేషన్' ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన సినిమాలకు తెలుగులో భారీ క్రేజ్ ఉంది. తాజాగా ఈ సీక్వెల్ చిత్రాల నుంచి విడుదలైన కొత్త చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. అప్పట్లో అందరినీ ఈ సీక్వెల్స్ చిత్రాలు వణికించాయని చెప్పవచ్చు. అయితే, సుమారు 15 ఏళ్ల తర్వాత 'ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్' పేరుతో ఆరో భాగమైన చివరి పార్ట్ ని తీశారు. మే 15న భారత్లో విడుదలైంది. ప్రేక్షకులను థియేటర్లో భయపెట్టిన ఈ చిత్రం సడెన్గా ఓటీటీలోకి వచ్చేసింది.ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్లైన్స్ సడెన్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. కానీ, ప్రస్తుతం భారత్ నెట్వర్క్లో అందుబాటులో లేదు. ఇతర దేశాల్లో ఉంటున్న ఈమెజాన్ ప్రైమ్ యూజర్స్కు మాత్రమే ఈ చిత్రాన్ని చూసే ఛాన్స్ ఉంది. అయితే, మరో వారంలోనే భారత్లో కూడా స్ట్రీమింగ్కు రావచ్చని తెలుస్తోంది. రూ. 430 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 2300 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. జాక్ లిపోవ్స్కీ, అడమ్ స్టేయిన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సుమారు గంట 49 నిమిషాల రన్టైమ్ ఉన్న ఈ చిత్రంలో బ్రెక్ బసింగర్, విలియమ్ బ్లడ్వర్త్, రిచర్డ్ హార్మోన్, క్యాథలీన్ శాంటా జువానా, టియో బ్రియోన్స్ తదితరులు నటించారు. 2000లో తొలి పార్ట్ రాగా.. 2003, 2006, 2009, 2011లో మిగతా పార్ట్స్ వచ్చాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆరోది రిలీజ్ అయింది. -
భారీ ధరకు ‘పెద్ది’ ఓటీటీ రైట్స్.. రిలీజ్కు ముందే రికార్డు!
రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ (Peddi). ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రమిది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఆ మధ్య ఈ సినిమా నుంచి గ్లింప్స్ వచ్చింది. ఒకే ఒక షాట్తో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాడు. ‘ఏదైనా ఈ నేల మీదున్నప్పుడే సేసేయాల, పుడతాం ఏటి మళ్లీ’ అంటూ కోస్తాంధ్ర యాసలో రామ్చరణ్ చెప్పిన డైలాగులకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ ఒక్క గ్లింప్స్తోనే ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకుంది ఈ చిత్రం. భారీ ధరకు ఓటీటీ రైట్స్ ఇచ్చేశాడట నిర్మాత వెంకట సతీష్. డిజిటల్ రైట్స్ కోసం రెండు భారీ ఓటీటీ సంస్థలు పోటీ పడగా.. చివరకు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. అయితే ఈ డీల్లో కొన్ని కండీషన్స్ ఉన్నాయట. రూ. 105 కోట్లు తొలుత అందజేసి.. సినిమా రిజల్ట్ని బట్టి మరింత పెంచేస్తామని నెట్ఫ్లిక్స్ కండీషన్ పెట్టిందట. తెలుగు లో ఆడితే ఇంత.. హిందీలో ఈ స్థాయి కలెక్షన్స్ సాధిస్తే మరింత..అని ఒప్పందం కుదుర్చుకున్నారు. రిలీజ్ తర్వాత ఫలితాన్ని బట్టి రూ. 105 కోట్లతో పాటు మరింత అమౌంట్ నిర్మాతలకు వెళ్తుంది. షూటింగ్ అంతా పూర్తి చేసుకొని రిలీజ్కు రెడీ అయిన చిత్రాలకే ఓటీటీ డీల్ కావట్లేదు. ప్రభాస్ రాజాసాబ్, చిరంజీవి విశ్వంభర లాంటి చిత్రాలకు కూడా ఇంకా ఓటీటీ బిజినెస్ కాలేదు. అలాంటిది దాదాపు 50 శాతం షూటింగ్ పెండింగ్లో ఉన్న పెద్ది చిత్రానికి అప్పుడే ఓటీటీ డీల్ పూర్తి కావడం గొప్ప విషయమే. మల్టీస్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
ఆ టైమ్లో నాకు ప్రభాస్ ఒక్కడే సపోర్ట్గా నిలిచాడు: మారుతి
‘‘నేను దర్శకత్వం వహించిన ‘పక్కా కమర్షియల్’ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. దీంతో మా కాంబినేషన్లో(ప్రభాస్–మారుతి) మూవీ అనుకున్న ప్రొడ్యూసర్ డ్రాప్ అయ్యారు. కానీ, అలాంటి టైమ్లో నాకు సపోర్ట్గా నిలిచిన ఒకే ఒక వ్యక్తి ప్రభాస్గారు. అందుకే ‘ది రాజా సాబ్’ ను ఒక సవాల్గా తీసుకుని సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని డైరెక్టర్ మారుతి తెలిపారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న విడుదలకానుంది. (చదవండి: 'ఓ నిర్మాత నెగెటివ్ క్యాంపెయిన్ చేశారు'.. ఎస్కేఎన్ కామెంట్స్ వైరల్!)హైదరాబాద్లో సోమవారం నిర్వహించిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో మారుతి మాట్లాడుతూ–‘‘ప్రభాస్గారిని ‘బుజ్జిగాడు’ సినిమా స్టైల్లో ‘ది రాజా సాబ్’ ద్వారా వింటేజ్ లుక్లో చూపిస్తున్నాం. కొంత షూటింగ్, సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి’’ అన్నారు. టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా సంస్థ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ఈ సినిమా కోసం బిగ్గెస్ట్ ఇండోర్ సెట్ వేశాం. 40 నిమిషాల క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ చిత్రానికి హైలైట్గా నిలుస్తుంది. ఈ మూవీకి సీక్వెల్ పాన్ వరల్డ్ స్థాయిలో ఉంటుంది’’ అన్నారు. ఈ వేడుకలో ‘ది రాజా సాబ్’ క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కృతి, కెమేరామేన్ కార్తీక్ పళని, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ మాట్లాడారు. -
బుల్లితెర నటిపై ఫిర్యాదు.. డబ్బు కోసం మొదట భర్త ఉండగానే..
మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్నానని చెప్పి తనను మోసం చేసిందని కోలీవుడ్ బుల్లితెర నటి నిహానాబేగంపై వ్యాపారవేత్త పూందమల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. తమిళ్లో బాగా పాపులర్ అయిన 'పొన్ని, పాండియన్ స్టోర్స్' వంటి పలు సీరియల్స్లో నిహానాబేగం నటించింది. అయితే, చెన్నై దగ్గరలో ఉన్న కోళపాక్కంకు చెందిన రాజ్కన్నన్ అనే వ్యాపారవేత్త ఆమె తనను మోసం చేసి పెళ్లి చేసుకుందని ఆరోపిస్తూ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అందులో ఇద్దరు పిల్లల తల్లి అయిన నిహానాబేగం తాను భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు చెప్పిందన్నారు. ఆమెతో తన పరిచయం స్నేహంగా మారి, ఆ తరువాత పెళ్లి చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే నిహానాబేగం తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోలేదని తరువాత తెలిసిందని, తనను మోసం చేసి, రూ.20 లక్షలు తీసుకుందని ఆరోపించాడు. తనను మోసం చేసిన ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని, తన నుంచి తీసుకున్న రూ.20 లక్షలను తిరిగి ఇచ్చేలా చేయాలని బాధితుడు పిటిషన్లో కోరాడు. పోలీసులు నిహానాబేగంను, రాజ్కన్నన్ను పోలీస్స్టేషన్కు పిలిపించి విచారించడానికి సిద్ధమయ్యారు. -
'అల్లు అర్జున్' అందుకున్న అత్యుత్తమ అవార్డ్స్ ఇవే
పుష్ప–2 సినిమాతో 'అల్లు అర్జున్' ఉత్తమ నటుడిగా 'గద్దర్' అవార్డు అందుకున్నారు. గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం అవార్డ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తెలంగాణ చరిత్రలో బన్నీ పేరు చిరస్థాయిలో ఉండిపోనుంది. ఉత్తమ నటుడిగా గద్దర్ తొలి అవార్డ్ అందుకుని చరిత్ర పుటల్లోకి అల్లు అర్జున్ పేరు చేరింది. అదే విధంగా 69వ జాతీయ అవార్డుల్లో కూడా తెలుగు సినిమా సత్తా చాటింది. అక్కడ కూడా ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప) నిలవడం సరికొత్త ఘనత అని చెప్పొచ్చు. ఎందుకంటే 69 ఏళ్ల సినీ చరిత్రలో ఓ తెలుగు నటుడికి జాతీయ అవార్డ్ రావడం ఇదే ఫస్ట్ టైమ్.'ఆ బిడ్డ మీద ఒక్క చిన్న గీత పడాలా... గంగమ్మ తల్లి జాతరలో యాటను నరికినట్లు రప్పా రప్పా నరుకుతా.. ఒక్కొక్కడిని రప్పా రప్పా రప్పా...' అంటూ విలన్లకి వార్నింగ్ ఇస్తాడు పుష్పరాజ్. ఇదే డైలాగ్ రీసెంట్గా గద్దర్ అవార్డ్ అందుకుని మరోసారి చెప్పి తన అభిమానుల్లో జోష్ నింపారు. ప్రస్తుతం అల్లు అర్జున్- అట్లీ (AA22) చిత్రం కోసం పనిచేస్తున్నారు. బన్నీ ఇప్పటి వరకు నటించిన సినిమాలు 21.. అయితే, ఉత్తమ నటుడిగా 11సార్లు నామినేట్ అయ్యాడు. ఏడు చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా అత్యుత్తమ అవార్డ్స్ అందుకున్నాడు. మొత్తంగా దేశంలో పేరు పొందిన 18 అవార్డ్స్ను ఆయన సొంతం చేసుకున్నాడు.ఫిలింఫేర్ అవార్డులుపరుగు (2009)- ఉత్తమ నటుడువేదం (2011)- ఉత్తమ నటుడురేసు గుర్రం (2015)- ఉత్తమ నటుడురుద్రమదేవి (2016)- ఉత్తమ సహాయ నటుడుసరైనోడు (2017)- క్రిటిక్స్ ఉత్తమ నటుడుపుష్ప (2022)- ఉత్తమ నటుడుగద్దర్ అవార్డ్పుష్ప-2 (2024)- ఉత్తమ నటుడుఐఫా అవార్డ్స్రుద్రమదేవి (2016)- ఉత్తమ సహాయ నటుడుసైమా అవార్డ్స్సన్నాఫ్ సత్యమూర్తి (2015)- దక్షిణ భారత సినిమా స్టైలిష్ యూత్ ఐకాన్రుద్రమదేవి (2016)- ఉత్తమ నటుడుఅలా వైకుంఠపురంలో (2021)- ఉత్తమ నటుడుపుష్ప (2022)- ఉత్తమ నటుడు నంది అవార్డ్స్గంగోత్రి (2003) ఆర్య (2004)పరుగు(2008)వేదం(2010)రుద్రమదేవి (2015)నేషనల్ అవార్డ్పుష్ప(2022)- ఉత్తమ నటుడిగా 2023లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్ -
'రజనీకాంత్ కంటే విజయ్ ఎందులో గొప్ప'
నటుడు విజయ్ రాజకీయ పార్టీని నెలకొల్పి 2026లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈనెల 22న విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇప్పటి నుంచే ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవేడుకలో పార్టీ జిల్లా కార్యదర్శి ఏ.అప్పు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 2026లో విజయ్ ముఖ్యమంత్రి కావడం తథ్యం అన్నారు. తమిళగ వెట్రి కళగం పార్టీకి తమిళ ప్రజలు ఓట్లు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. 365రోజులు తమ తలైవన్ పుట్టినరోజును వేడుకను జరుపుకునే ఒకే ఒక్క పార్టీ తమిళగ వెట్రి కళగం అని ఆయన అన్నారు.రజనీకాంత్ కంటే విజయ్ ఎందులో గొప్ప: వేల్మురుగన్ఇదిలా ఉంటే తమిళ వాళ్ ఉరిమై పార్టీకి చెందిన వేల్మురుగన్ విజయ్పై విమర్శల దాడి చేశారు. ఒక వేడుకలో ఆయన మాట్లాడుతూ కరుణానిది పాలనలో పోరాడి, వాదాడి రాష్ట్రంలో 36 మెడికల్ కళాశాలను తీసుకొచ్చింది తానేనన్నారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన నటులు తమిళ సమాజానికి చేసిందేమిటని ప్రశ్నించారు. ఒక నటుడు (విజయ్) 10,12వ తరగతి విద్యార్థులను అభినందించడానికి మాత్రమే సమావేశాలు నిర్వహిస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. సూపర్స్టార్ రజనీకాంత్, విజయకాంత్ల కంటే విజయ్ ఏమైనా గొప్పా అంటూ ఫైర్ అయ్యారు. చిన్న నటుడు బాలా కూడా తాను స్వయంగా సంపాదించిన డబ్బును పేదలకు సాయం చేస్తున్నారని, రాఘవ లార్సెన్ తాను సంపాదించిన మొత్తంలో వృద్ధులు, వికలాంగుల కోసం ఆశ్రమాలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈయన మాత్రం సమావేశాలు మాత్రమే నిర్వహిస్తున్నారని ధ్వజం మెత్తారు. -
ఏఆర్.మురుగదాస్ కూతురి ఫంక్షన్.. రెట్రో పాటకు డ్యాన్స్
కోలీవుడ్ దర్శకుడు ఏఆర్.మురుగదాస్ తనలోని మరో కోణాన్ని అభిమానులకు పరిచయం చేశాడు. తన కుటుంబంతో పాటు డ్యాన్స్ చేసి అందరినీ ఆనందపరిచాడు. తన కూతురు హర్షిత హాఫ్ శారీ వేడుకలో సూర్య రెట్రో సినిమాలోని కన్నిమా అనే పాటకు మురుగదాస్, భార్య, కుమరుడు, కూతురు కలిసి వీర లెవల్లో డాన్స్ చేశారు. వీరి కుటుంబ డాన్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మురుగదాస్లోని ఈ యాంగిల్ను చూసి ప్రేక్షకులు ఆశ్యర్యపోతున్నారు. చిత్ర పరిశ్రమలో చాలా మంది దర్శకులు నటులుగా మారుతున్న విషయం తెలిసిందే. మురుగదాస్ కూడా నటుడవుతారేమో అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.గజని, స్టాలిన్, సర్కార్, దర్బార్,స్పైడర్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మురుగదాస్ రీసెంట్గా సికందర్ అనే బాలీవుడ్ సినిమాను తెరకెక్కించాడు. అయితే, ఆ చిత్రం భారీ డిజాస్టర్గా మిగిలింది. దీంతో ఏఆర్.మురుగదాస్ మార్కెట్ డౌన్ అయ్యిందనే ప్రచారం జోరందుకుంది. కాగా ప్రస్తుతం ఈయన శివకార్తికేయన్ హీరోగా మదరాసి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రుక్మిణి వసంత్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తదుపరి ఏఆర్.మురుగదాస్ చేసే చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. ఇలాంటి సమయంలో ఆయన ఇంట్లో ఒక వేడుక జరిగింది. -
హనుమాన్ జంక్షన్లో...
అర్జున్, జగపతి బాబు, వేణు తొట్టెంపూడి, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హనుమాన్ జంక్షన్’. మోహన్ రాజా దర్శకత్వం వహించారు. ఎడిటర్ మోహన్ సమర్పణలో ఎం.ఎల్. మూవీ ఆర్ట్స్ బ్యానర్పై ఎంవీ లక్ష్మి నిర్మించిన ఈ చిత్రం 2001 డిసెంబరు 21న విడుదలై ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాని ఈ నెల 28న రీ రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.‘‘యాక్షన్ , అద్భుతమైన హ్యూమర్ మేళవించిన సినిమా ‘హనుమాన్ జంక్షన్’. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, ఆకట్టుకునే సంభాషణలు, కామెడీ, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు కల్ట్ స్టేటస్ను తీసుకువచ్చాయి. అలాంటి ఎవర్ గ్రీన్ ఎంటర్టైనర్ మరోసారి ప్రేక్షకులను థియేటర్లో అలరించబోతోంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: సి. రామ్ప్రసాద్, సంగీతం: సురేశ్ పీటర్స్. -
తండ్రీ కొడుకులు
నిజ జీవితంలో తండ్రీ కొడుకులైన అక్కినేని నాగార్జున, అఖిల్ వెండితెరపైనా తండ్రీ కొడుకులుగా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. అఖిల్ హీరోగా నటిస్తున్న యాక్షన్ లవ్స్టోరీ చిత్రం ‘లెనిన్ ’. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. అక్కినేని నాగార్జున, నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో నాగార్జున నటించనున్నారనీ, కథ రీత్యా అఖిల్ పాత్రకు తండ్రి పాత్రలో కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది.ఇదే వాస్తవమైతే... నిజ జీవితంలో తండ్రీకొడుకులైన నాగార్జున, అఖిల్ సిల్వర్ స్క్రీన్ పై కూడా తండ్రీకొడుకులుగా కనిపించినట్లవుతుంది. అయితే ఈ విషయంపై పూర్తిస్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవల పెళ్లి చేసుకున్న అఖిల్ అతి త్వరలోనే ‘లెనిన్ ’ రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటారని, ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ తిరుపతిలో ప్రారంభం అవుతుందని ఫిల్మ్నగర్ టాక్. ఈ చిత్రం నవంబరులో రిలీజ్ కానుందని సమాచారం. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన ‘మనం’ సినిమాలో అఖిల్ ఓ చిన్న పాత్రలో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
ఫ్యామిలీ ఎంటర్టైనర్
హీరో రవితేజ, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్ లో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుంచి ప్రారంభమైంది. ‘‘రవితేజ నటిస్తున్న 76వ చిత్రం ఇది. హైదరాబాద్లో ఈ సినిమా కోసం వేసిన సెట్లో చిత్రీకరణ మొదలైంది. రవితేజ, ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.ఈ సినిమా కోసం రవితేజ స్పెషల్గా మేకోవర్ అయ్యారు. ఆయన ట్రేడ్మార్క్ కామిక్ టైమింగ్, మాస్ అప్పీల్తో కూడన పూర్తిస్థాయి ఫ్యామిలీ డ్రామా కథను ఈ సినిమా కోసం సిద్ధం చేశారు కిషోర్ తిరుమల. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. రవితేజ నటించిన ‘ధమాకా, మాస్ జాతర’ వంటి చిత్రాల తర్వాత ఈ సినిమాకు కూడా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. కాగా రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ‘మాస్ జాతర’ ఆగస్టు 27న రిలీజ్ కానుంది. -
ఆ హీరోతో పెళ్లి వార్తలు.. బొమ్మరిల్లు హీరోయిన్ రియాక్షన్!
బొమ్మరిల్లు హీరోయిన్ జెనీలియా తెలుగువారికి సుపరిచితమైన పేరు. టాలీవుడ్ సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ ఆ తర్వాత నటుడు రితేశ్ దేశ్ముఖ్ను పెళ్లాడింది. పెళ్లి తర్వాత దాదాపు సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం అమిర్ ఖాన్ చిత్రం సితారే జమీన్ పర్లో కనిపించనుంది. ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రం జూన్ 20న విడుదల కానుంది.అయితే గతంలో హీరో జాన్ అబ్రహంతో జెనీలియా పెళ్లి జరిగిందన్న వార్తలొచ్చాయి. దాదాపు 14 ఏళ్ల క్రితం జరిగిన ఈ ప్రచారంపై తాజాగా జెనీలియా స్పందించారు. ఆ వార్తలు ఎవరో సృష్టించారో తనకు తెలుసన్నారు. దానికి వాళ్లే సమాధానం చెప్పాలన్నారు.తాజా ఇంటర్వ్యూలో జెనీలియా మాట్లాడుతూ..'బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం.. నేు ఓ ప్రాజెక్ట్ కోసం కలిసి వర్క్ చేశాం. ఆ సినిమా సెట్లో అనుకోకుండా మా పెళ్లి జరిగిందంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే అదంతా కేవలం రూమర్స్ మాత్రమే. అందులో ఎలాంటి వాస్తవం లేదు. మాకు పెళ్లి జరగలేదు. కొంతమంది పీఆర్లు ఇలాంటి చెత్త న్యూస్ క్రియేట్ చేశారు. ఇలాంటి వార్తలు ఎందుకు ప్రచారం చేశారో వారినే అడగండి' అని అన్నారు. కాగా.. జెనీలియా - జాన్ అబ్రహం జంటగా ఫోర్స్ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా 2011లో విడుదల కాగా.. ఓ సీన్లో భాగంగా వీరిద్దరికీ నిజంగానే పెళ్లి చేశారంటూ తెగ వైరలైంది. ఆ కథనాలకు చెక్ పెడుతూ ఆ తర్వాత ఏడాదిలోనే రితేశ్ దేశ్ముఖ్ను పెళ్లాడారు. -
టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం
టాలీవుడ్ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ మన్నారా చోప్రా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి రమణ్ రాయ్ హండా తుదిశ్వాస విడిచారు. ఆయన 72 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషాద వార్తను నటి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ మృతిచెందారు. అంత్యక్రియలు జూన్ 18న నిర్వహించనున్నట్లు వెల్లడించారు.కాగా.. రమణ్ రాయ్ హండా బాలీవుడ్ హీరోయిన్స్ ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రాలకు మామ అవుతారు. ఆయనకు భార్య కామినీ చోప్రా, కుమార్తెలు మన్నారా, మితాలి చోప్రా ఉన్నారు. ఆయన ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ప్రియాంక, పరిణీతి చోప్రాల అత్త కామిని చోప్రాను వివాహం చేసుకున్నారు.కాగా.. మన్నారా థ్రిల్లర్ జిద్ అనే మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, పంజాబీ భాషల సినిమాల్లో నటించింది. తెలుగులో "ప్రేమ గీమ జాంత నై" చిత్రంతో పరిచయమైంది. ఆ తర్వాత సునీల్తో "జక్కన్న", సాయి ధరమ్ తేజ్తో "తిక్క" వంటి సినిమాల్లో నటించింది. అలాగే "రోగ్", "సీత" చిత్రాల్లో కూడా కనిపించింది. గతేడాది తెలుగులో రాజ్ తరుణ్ సరసన తిరగబడరా సామీ చిత్రంలో కనిపించనుంది. అంతే కాకుండా హిందీ బిగ్ బాస్ సీజన్-17లో టాప్-3 కంటెస్టెంట్స్లో ఒకరిగా నిలిచింది. -
'నా తమ్ముడి మరణానికి కారణం అదే'.. రూమర్స్పై రాహుల్ దేవ్!
రామ్ చరణ్ మూవీ ఎవడు చిత్రంలో అభిమానులను మెప్పించిన బాలీవుడ్ నటుడు రాహుల్ దేవ్. విలన్గా మాత్రమే కాకుండా విభిన్నమైన పాత్రల్లో ఫ్యాన్స్ను మెప్పించారు. సౌత్లో చివరిసారిగా అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీలోనూ కనిపించారు. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న రాహుల్ దేవ్ కుటుంబంలో ఇటీవల విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన తమ్ముడు, నటుడైన ముకుల్ దేవ్ ఆకస్మిక మరణం చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ తర్వాత ముకుల్ మరణంపై పలు రూమర్స్ వినిపించాయి. డిప్రెషన్ వల్లే అతను మృతి చెందాడని కథనాలొచ్చాయి.అయితే తాజాగా ఈ రూమర్లపై రాహుల్ దేవ్ స్పందించారు. ముకుల్ ఆరోగ్యం క్షీణించడానికి మానసిక ఆరోగ్య సమస్యలు కారణం కాదని తెలిపారు. అతని ఆహారపు అలవాట్లే కారణమని రాహుల్ దేవ్ వెల్లడించారు. చివరి నాలుగైదు రోజు తినడం పూర్తిగా మానేశాడని.. ఒంటరిగా ఉండేవాడని అన్నారు. ముఖ్యంగా అతనికి జీవితంపై ఆసక్తి కోల్పోయాడని.. ఎన్ని ఆఫర్స్ వచ్చినా తిరస్కరించేవాడని రాహుల్ దేవ్ వివరించారు.2019లో అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూసుకోవడానికి ఢిల్లీకి వెళ్లాడని రాహుల్ పంచుకున్నారు. అదే ఏడాదిలో తండ్రి మరణం.. 2023లో తల్లిని కోల్పోవడం అతని ఒంటరితనం మరింత ఎక్కువైందని వెల్లడించారు. ఒంటరిగా జీవించడం పరిస్థితిని మరింత దిగజార్చిందని అతను పేర్కొన్నాడు. ముకుల్ తన కుమార్తెను మిస్ అవుతున్నాడని.. తనను జాగ్రత్తగా చూసుకోవడం లేదని కూడా బాధపడేవాడని రాహుల్ అన్నారు. ముకుల్ మరణం తరువాత సోషల్ మీడియాలో వచ్చిన కథనాలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. అతను నిజంగా సూపర్ పవర్ అని.. అలాగే సున్నితమైన వ్యక్తిగా గుర్తుంచుకోవాలన్నారు.ఇక సినిమాల విషయానికొస్తే ముకుల్ 1996లో సుష్మితా సేన్ సరసన దస్తక్ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత జై హో, హిమ్మత్ వాలా, మేరే దో అన్మోల్ రతన్, యమ్లా పగ్లా దీవానా, సన్ ఆఫ్ సర్దార్, భాగ్ జానీ వంటి లాంటి చిత్రాలలో నటించాడు. అంతే కాకుండా ముమ్కిన్, ఘర్వాలీ ఉపర్వాలి, కషీష్, ఫిర్ కోయి హై, కుంకుమ్ ఏక్ ప్యారా సా బంధన్ లాంటి టీవీ సీరియల్స్లో నటించారు -
'తండ్రి నుంచి చాలా నేర్చుకుంటున్నారు'.. జయం రవి భార్య ఎమోషనల్ పోస్ట్!
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి పేరు గత కొద్దికాలంగా ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం తన భార్య ఆర్తితో విడాకులకు సిద్దమవడమే. గతేడాది సోషల్ మీడియా వేదికగా తాము విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత భార్య, భర్తలిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం అప్పట్లో మరింత హాట్ టాపిక్గా మారింది. ఆ తర్వాత వీరి మధ్యలో సింగర్ కెన్నీషా పేరు రావడంతో విడాకుల వ్యవహారం కాస్తా వివాదానికి దారితీసింది. అంతేకాకుండా మూడో వ్యక్తి ప్రమేయం వల్లే తాము విడిపోతున్నామంటూ ఆర్తి ఆరోపించింది. ప్రస్తుతం విడాకుల పంచాయతీ మాత్రం కోర్టులో పెండింగ్లో ఉంది.అయితే ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా జయం రవి భార్య ఆర్తి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. తన తండ్రి కృష్ణమూర్తి విజయ్కుమార్తో ఆమె కుమారులు సరదాగా ఆడుకుంటున్న వీడియోను పంచుకుంది. ఆయన తనకు ఎంత అండగా నిలిచారో నాకు మాత్రమే తెలుసన్నారు. ఎలాంటి షరతులు లేకుండా ప్రేమించడన్ని తన పిల్లలు కూడా ఆయన నుంచి నేర్చుకుంటారని రాసుకొచ్చింది. తనను మొదట ప్రేమించిన వ్యక్తి తన తండ్రేనని ఆర్తి ఎమోషనల్ పోస్ట్ చేసింది.ఆర్తి రవి తన తండ్రిన గురించి రాస్తూ.. 'తనను మొదట ప్రేమించిన వ్యక్తి నా తండ్రి. నన్ను మొదట ప్రేమించిన వ్యక్తి ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది. ఈ రోజు కొన్ని పదాలు వినడానికి మనసుకు చాలా బరువుగా ఉన్నాయి. కానీ వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తా. నా చుట్టూ చాలా అనిశ్చితిగా అనిపించినప్పుడు నేను ఎలా బయటపడాలో కూడా నాకు తెలియని రోజులు ఉన్నాయి. ఇప్పుడు మీరు నాతోనే ఉన్నారు.. కానీ ఏమి చేయాలో మీరు అడగలేదు. ప్రశాంతంగా, స్థిరంగా, బలంగా ఉన్నారు. తన తండ్రి ప్రేమను తాను తేలికగా తీసుకుంటున్నానని.. అయితే తన పిల్లలు మాత్రం ఆయన ప్రేమను చూసి చాలా నేర్చుకుంటున్నారు. షరతులు లేకుండా ప్రేమించబడటం ఎలా ఉంటుందో మిమ్మల్ని చూస్తే చాలు. మీరు నన్ను మాత్రమే కాదు.. నా పిల్లలను కూడా అలానే పెంచుతున్నారంటూ ' ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.అంతేకాకుండా జీవితంలో తన అనుభవాలు తనను ఎలా మార్చాయో కూడా ఆర్తి ప్రస్తావించింది. జీవితంలో మళ్లీ తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. ఇప్పుడు నేను మీ దృష్టిలో ఒకప్పుడు మీరు వదిలేసిన అమ్మాయిని కాదని నాకు తెలుసు. జీవితం నన్ను ఎవరూ ఊహించని విధంగా పరీక్షించింది. నేను వాగ్దానం చేస్తున్నా.. మళ్లీ మీ చిన్న అమ్మాయిగా తిరిగి వస్తా అంటూ పోస్ట్ చేసింది. కాగా.. దాదాపు 15 ఏళ్ల తర్వాత రవి తన భార్య ఆర్తి నుండి విడిపోతున్నట్లు గతేడాది ప్రకటించారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు సంతానం ఉన్నారు. View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi) -
శ్రీలీల బర్త్ డే సెలబ్రేషన్స్.. బ్లాక్ శారీలో ఈషా వావ్!
బాలిలో బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేస్తున్న సుకుమార్ భార్యబర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటలతో హీరోయిన్ శ్రీలీలనల్ల చీరలో కేక పుట్టిస్తున్న తెలుగమ్మాయి ఈషా రెబ్బామెరుపుల చీరలో జిగేలుమనిపిస్తున్న ప్రగ్యా జైస్వాల్బెడ్పై జాన్వీ కపూర్ టెంపరేచర్ పెంచే పోజులుగద్దర్ అవార్డ్ అందుకున్న నివేదా థామస్.. పోస్ట్ వైరల్ఫ్రెండ్స్-ఫ్యామిలీతో రాయ్ లక్ష్మీ బర్త్ డే సెలబ్రేషన్స్ View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Sonam Bajwa (@sonambajwa) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Aakanksha Singh (@aakankshasingh30) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) -
బిగ్బాస్ నుంచి మరో హీరో.. పోస్టర్ లాంచ్
బిగ్బాస్ తెలుగు ఫేమ్ రోహిత్ సాహ్ని, అబిద్ భూషణ్ (నాగభూషణం మనవడు), రియా కపూర్, మేఘనా రాజ్పుత్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'మిస్టీరియస్'. మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించారు. ఆష్లీ క్రియేషన్స్ బ్యానర్పై ఉషా, శివాని నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా పోస్టర్ లాంచ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్)దర్శకుడు మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. 'మిస్టీరియస్'లో ప్రతి పాత్ర అనుమానాస్పదంగా ఉండేలా సస్పెన్స్ మిస్టరీతో ప్రేక్షకులను కట్టిపడేసేలా తీశాం. షాకింగ్ ట్విస్ట్లు.. యాక్షన్స్, థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయని చెప్పుకొచ్చారు. నిర్మాత జయ్ వల్లందాస్ మాట్లాడుతూ.. పోస్టర్ లాంచ్ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధన్యవాదాలు చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: కూతురి పెళ్లి.. డ్యాన్స్ ఇరగదీసిన డైరెక్టర్ మురగదాస్) -
'ఎప్పటికీ నయం కానీ గాయం'.. ఎయిరిండియా సిబ్బందిపై నటి ప్రశంసలు!
అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదం తర్వాత బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత తొలిసారి ఎయిరిండియా ఫ్లైట్లో ప్రయాణిస్తున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ విషాదం తర్వాత కూడా ప్రయాణికుల కోసం చిరునవ్వుతో పలకరిస్తున్న ఎయిరిండియా క్యాబిన్ సిబ్బందిపై ఆమె ప్రశంసలు కురిపించారు. విమాన ప్రమాదం తర్వాత సిబ్బంది, ప్రయాణీకులలో నెలకొన్న భయం, మానసిక స్థితి గురించి ప్రస్తావించింది.రవీనా ఇన్స్టాలో రాస్తూ.. 'కొన్ని ప్రారంభాలు అన్ని అడ్డంకులను తట్టుకుని నిలవాలి. ప్రస్తుతం ఎయిరిండియా సిబ్బంది బాధలో ఉన్నప్పటికీ కొత్త సంకల్పం కోసం చిరునవ్వులతో ప్రయాణికులను స్వాగతిస్తున్నారు. ప్రయాణీకులు, సిబ్బంది మధ్య ఏదో తెలియని బంధం ఏర్పరుచుకున్నారు. ఈ విషాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపం. ఇది ఎప్పటికీ నయం కాని గాయం. కానీ ఎయిరిండియా ఎల్లప్పుడూ ఇలాంటి వాటిని అధిగమించి మళ్లీ బలంగా నిలబడాలనేదే వారి సంకల్పం' అంటూ ఫ్లైట్లో తాను దిగిన ఫోటోలను కూడా పంచుకుంది. బాధలోనూ తమ సంస్థ కోసం సిబ్బంది కష్టపడుతున్న తీరుపై రవీనా టాండన్ ప్రశంసలు కురిపించారు. కాగా.. జూన్ 12న జరిగిన విమాన ప్రమాదంలో 241 మంది మరణించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon) -
ఓటీటీలో క్రేజీ సిరీస్.. ఇప్పుడు రెండో సీజన్ రెడీ
ఇప్పుడంటే వెబ్ సిరీసుల హవా కాస్త తగ్గింది. లాక్ డౌన్ టైంలో మాత్రం పలు హిందీ సిరీసులు తెగ క్రేజ్ సొంతం చేసుకున్నాయి. వాటిలో ఒకటి 'స్పెషల్ ఓపీఎస్'. 2020 మార్చిలో తొలి సీజన్ రిలీజ్ కాగా.. మధ్యలో 1.5 పేరుతో ఓ నాలుగు ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. వ్యూయర్స్ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఐదేళ్ల విరామం తర్వాత రెండో సీజన్ని సిద్ధం చేశారు. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించడంతో పాటు ట్రైలర్ని కూడా విడుదల చేశారు.(ఇదీ చదవండి: 'కన్నప్ప' చూసిన రజినీకాంత్.. విష్ణుతో ఏం చెప్పారంటే?)కేకే మేనన్, కరణ్ థాకర్, వినయ్ పాఠక్, విపుల్ గుప్త తదితరులు కీలక పాత్రలు పోషించిన తొలి సీజన్కి నీరజ్ పాండే, శివమ్ నాయర్ దర్శకత్వం వహించారు. స్పై యాక్షన్ జానర్లో దీన్ని తెరకెక్కించారు. ఇప్పుడు రెండో భాగానికి నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తూనే నిర్మాతగానూ వ్యవహరించారు. హిమ్మత్ సింగ్, అతని టీమ్ ఈసారి.. 'ఏఐ', 'సైబర్ క్రైమ్' నుంచి భారత్కు ఎదురయ్యే సవాళ్లతో పోరాటం చేయనుంది. అందుకు తగ్గట్లే ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉంది. సిరీస్పై అంచనాలు పెంచుతోంది. జూలై 11 నుంచి హాట్స్టార్లో సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.రెండో సీజన్ కోసం ఇప్పటికే ఉన్నవాళ్లతో పాటు కొత్తగా పలువురు నటీనటులు చేరారు. అందులో సయామీఖేర్, ప్రకాశ్ రాజ్ తదితరులు ఉన్నారు. గతంలో వచ్చిన వాటితో పోలిస్తే ఈసారి మరింత థ్రిల్ పంచేలా సిరీస్ని తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. ఇకపోతే ఈ వారం దాదాపు 22కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు పలు ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వీటిలో స్ట్రెయిట్ తెలుగు మూవీస్ లేవు. కానీ పలు డబ్బింగ్, పరభాషా చిత్రాలు ఉండటం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్) -
Plane Crash: జీవితాల్ని నిలబెట్టిన విషాదం.. విడాకులు రద్దు
అహ్మదాబాద్ విమాన ప్రమాదం బాధిత కుటుంబాలను శోకసంద్రంలోకి నెట్టేసింది. జీవితం శాశ్వతం కాదని, మరణం ఎప్పుడు, ఎటువైపు నుంచి వస్తుందనేది చెప్పలేమని సమస్త ప్రజానీకానికి గుర్తు చేసింది. భూమిపై ఉన్నన్ని రోజులు గొడవలు తగ్గించి ప్రశాంతంగా, అయినవారితో సంతోషంగా గడపమని సందేశాన్ని పంపింది. విమాన ప్రమాదం అనే విషాదం కొందరి జీవితాల్లో మార్పు తెచ్చిందంటోంది సింగర్, నటి రాగేశ్వరి. విడాకులకు సిద్ధమైన వారు కూడా మనసు మార్చుకుని కలిసిపోయారని చెప్తోంది. సడన్గా ఎందుకీ మార్పు?మీకో విషయం తెలుసా? విమాన ప్రమాదం (Ahmedabad Air India Plane Crash) తర్వాత చాలామంది వారి కుటుంబాలకు ఫోన్ చేసి యోగక్షేమాలు అడుగుతున్నారు, కాసేపు మాట్లాడుతున్నారు. నాకు తెలిసిన రెండు జంటలు విడాకుల వరకు వెళ్లగా.. ఇప్పుడు కలిసిపోయారు. సడన్గా వారిద్దరి కుటుంబాలు అహంకారాన్ని పక్కనపెట్టేశాయి. సమస్యలను పరిష్కరించుకున్నారు. అకస్మాత్తుగా ఎందుకింత మార్పు వచ్చింది? విపత్తులు వచ్చినప్పుడే మనకు జీవితం విలువ తెలిసొస్తుందని సైకాలజిస్టులు అంటున్నారు.ప్రమాదాలే గుర్తు చేస్తాయిఎన్నో అపజయాలను చవిచూస్తే తప్ప విజయం అందదు. కొన్ని ఒడిదుడుకులను అధిగమిస్తే కానీ పైకి వెళ్లలేరు. ఇలాంటి విషాదాలు మనల్ని ఒక్కసారిగా ఆపేస్తాయి. జీవితంలో మనకు ఏది ముఖ్యమనేది గుర్తు చేస్తాయి. కాబట్టి ఇప్పుడైనా మీ కుటుంబానికి కాస్త సమయం కేటాయించండి. నువ్వెలాంటి బట్టలు వేసుకున్నావు? ఎలా కనిపిస్తున్నావు? ఏం మాట్లాడావు? అనేది జనాలు గుర్తుపెట్టుకోరు. కానీ ఎదుటివారితో ఎలా ప్రవర్తిస్తున్నావు? కుటుంబాన్ని ప్రేమించండివారిని ఎంత స్పెషల్గా చూస్తున్నావనేదే గుర్తుపెట్టుకుంటారు. మీ కుటుంబం ఎంత విలువైనదో గ్రహించండి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. భూమిపై ఉన్నన్నాళ్లూ మనం పీల్చుకునే ఊపిరి, పొందే ప్రేమ మాత్రమే శాశ్వతం. కాబట్టి వీలైతే క్షమించండి, సున్నితంగా మాట్లాడండి, ప్రేమగా ఉండండి అని చెప్పుకొచ్చింది. రాగేశ్వరి లూంబ్.. ఆంఖెన్, మై ఖిలాడీ తు అనారీ, దిల్ కిత్నా నడాన్ హై వంటి పలు చిత్రాల్లో నటించింది. దునియా, ప్యార్ కా రంగ్, సచ్ కా సాత్ వంటి ఎన్నో పాటలు పాడింది.విమానయానం విషాదం..అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం జూన్ 12న మెడికల్ కాలేజీపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఓ వ్యక్తి తప్ప అందరూ సజీవ సమాధి అయ్యారు. అలాగే మెడికల్ కాలేజీ క్యాంటీన్లో భోజనం చేస్తున్న పలువురు మృతి చెందగా కొందరికి తీవ్రగాయాలయ్యాయి. View this post on Instagram A post shared by Raageshwari 🌏 (@raageshwariworld)చదవండి: ప్రభాస్.. ఇద్దరు హీరోయిన్లు కావాలన్నాడు: మారుతి -
వాట్సాప్ వాడని డైరెక్టర్.. రాజమౌళి ప్రశంసలు!
టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రస్తుతం కుబేరా మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కోలీవుడ్ స్టార్ ధనుశ్, అక్కినేని నాగార్జున కీలక పాత్రల్లో తెరెకెక్కించిన ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శేఖర కమ్ములపై ప్రశంసలు కురిపించారు.తాను నమ్మే సిద్ధాంతాలకు.. చేసే సినిమాలకు ఎలాంటి సంబంధం ఉండదని రాజమౌళి అన్నారు. కానీ శేఖర్ కమ్ముల తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారని తెలిపారు. శేఖర్ చాలా సాప్ట్గా ఉంటారని.. తన సిద్ధాంతాలకు ఏది అడ్డొచ్చినా కొంచెం కూడా ఆయన కాంప్రమైజ్ అవ్వరని వెల్లడించారు. తాను నమ్మినా సిద్ధాంతాలపైనే సినిమాలు తీస్తారని... అందుకే ఆయనంటే ఎంతో గౌరవమని కొనియాడారు. మీరు వాట్సాప్ వాడుతారా అని శేఖర్ కమ్ములను రాజమౌళి అడగ్గా.. తాను ఉపయోగించనని ఆయన సమాధానమిస్తారు.ఈ కార్యక్రమంలో కుబేర ట్రైలర్ను కూడా రాజమౌళి విడుదల చేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మించారు. -
'కన్నప్ప' చూసిన రజినీకాంత్.. విష్ణుతో ఏం చెప్పారంటే?
మంచు విష్ణు 'కన్నప్ప' సినిమా వచ్చే వారం థియేటర్లలోకి రానుంది. రెండు రోజుల క్రితం ట్రైలర్ రిలీజ్ చేయగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కొచ్చిలో ఆ ఈవెంట్ చేసి కొంతమేర మలయాళ ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇప్పుడు తమిళ ఆడియెన్స్ని ఆకట్టుకునేందుకు సరికొత్త ప్లాన్తో విష్ణు ముందుకొచ్చాడు. సూపర్స్టార్ రజినీకాంత్కి సినిమా చూపించారు. దీంతో ఆయన తన అభిప్రాయాన్ని విష్ణుతో చెప్పగా.. ఆ విషయాన్ని వీడియో, ట్వీట్ రూపంలో విష్ణు బయటపెట్టాడు.మంచు ఫ్యామిలీకి రజినీకాంత్ సన్నిహితంగా ఉంటారు. గతంలో మోహన్ బాబుతో కలిసి 'పెదరాయుడు' సినిమాలో రజినీ నటించారు. తాజాగా ఆదివారంతో ఆ చిత్రానికి 30 ఏళ్లు పూర్తయింది. ఈ క్రమంలోనే ఆ చిత్ర సెలబ్రేషన్స్ చేసుకోవడంతో పాటు 'కన్నప్ప' సినిమాని కూడా అందరూ కలిసి వీక్షించారు. ఈ క్రమంలోనే రజినీకాంత్.. తనని హత్తుకుని మెచ్చుకున్నారని విష్ణు తెగ ఆనందపడిపోతున్నాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్)'రజినీకాంత్ అంకుల్ 'కన్నప్ప' సినిమా నిన్న రాత్రి చూశారు. పూర్తయిన తర్వాత నాకు గట్టిగా హగ్ ఇచ్చారు. మూవీ చాలా నచ్చిందని నాతో చెప్పారు. ఓ నటుడిగా ఈ హగ్ కోసం 22 ఏళ్లుగా ఎదురుచూశాను. దీంతో ఈ రోజు నాకెంతో ఆనందంగా ఉంది' అని మంచు విష్ణు పోస్ట్ పెట్టాడు.'కన్నప్ప'లో విష్ణు ప్రధాన పాత్ర పోషించినప్పటికీ.. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు అతిథి పాత్రలు పోషించారు. మోహన్ బాబు, కాజల్, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. జూన్ 27న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. మరి రిజల్ట్ ఏమొస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'రాజాసాబ్'లో మారిపోయిన తాత.. ప్రభాస్ కాదా?)Last night, @rajinikanth uncle watched #Kannappa. After the film, he gave me a tight hug. He told me that he loved #Kannappa. I’ve been waiting 22 years as an actor for that hug!!!Today, I feel encouraged. Humbled. Grateful. #Kannappa is coming on 27th June and I can’t wait… pic.twitter.com/HDYlLuDsdc— Vishnu Manchu (@iVishnuManchu) June 16, 2025 -
'ది రాజా సాబ్పై నెగెటివ్ క్యాంపెయిన్'.. నిర్మాత ఎస్కేఎన్ షాకింగ్ కామెంట్స్!
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'ది రాజా సాబ్'. రొమాంటిక్ హారర్ మూవీగా వస్తోన్న ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఎప్పటి నుంచో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న రోజు వచ్చేసింది. మన రాజా సాబ్ టీజర్ విడుదలైంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కామెడీతో పాటు హారర్ థ్రిల్లింగ్గా ఉండడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు కనిపించనున్నారు.అయితే ఇవాళ నిర్వహించిన టీజర్ ఈవెంట్కు నిర్మాత ఎస్కేఎన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభాస్ టీజర్తో పాటు సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమాకు ఓ నిర్మాత నెగెటివ్ క్యాంపెయిన్ చేశారని ఆరోపించారు. ఈ సినిమా మొదలైనప్పుడు నెగెటివ్ చేసినా నిర్మాత.. టీజర్ చూశాక రేపటి నుంచి పాజిటివ్ ట్రెండ్ చేస్తాడు. మారుతి ఎప్పుడూ అలాంటి క్యాంపెయిన్స్ను నమ్మలేదు. తన బెస్ట్ ఇస్తానని చెప్పాడు. డిసెంబర్ 5న పాన్ ఇండియా షేక్ అవుతుంది' ఎస్కేఎన్ కామెంట్స్ చేశారు. ఇవీ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇంతకీ ఎవరా? నిర్మాత టాలీవుడ్లో చర్చ మొదలైంది.(ఇది చదవండి: 'ది రాజాసాబ్'.. భయపెట్టడమే కాదు... (టీజర్))ఈ రొమాంటిక్ కామెడీ హారర్ ఫిల్మ్లో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధికుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఆ పని మానేయండి.. డబ్బు సంపాదించడానికి టైమ్ ఎక్కడ?: నాగ్
దేశంలో అత్యంత ధనిక హీరోల్లో కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) ఒకరు. షారూఖ్ ఖాన్, జుహీ చావ్లా తర్వాత రూ.3500 కోట్ల సంపదతో ఈయన మూడో స్థానంలో ఉన్నట్లు ఆ మధ్య వార్తలు వెలువడ్డాయి. వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పాటు వ్యాపార రంగంలో పెట్టుబడులు ఆయన సంపదను మరింత పెంచాయి. తాజాగా నాగ్ జెన్ జెడ్ (Generation Z)కు విలువైన సలహా ఇచ్చాడు.డబ్బు ఎప్పుడు సంపాదిస్తారు?కుబేర సినిమా ఈవెంట్లో యాంకర్ సుమ (Anchor Suma Kanakala) మాట్లాడుతూ.. జెన్ జెడ్ ఫోన్ రీచార్జులపై ఎక్కువ ఖర్చు పెడుతోంది. అసలేం చేయాలి? ఏం చేయకూడదు? అనేది ఓ సలహా ఇవ్వమని నాగార్జునను అడిగింది. అందుకాయన క్షణం ఆలోచించకుండా ఫోన్ చూడటం ఆపేయండి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఫోన్ చూస్తూ కూర్చుంటే డబ్బులు సంపాదించేందుకు సమయం ఎక్కడుంది? అని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారగా.. ఇదేంటి? ఈ సలహా నాకే చెప్తున్నట్లు ఉందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సినిమానాగార్జున చివరగా నా సామిరంగ సినిమాలో నటించాడు. ప్రస్తుతం కుబేర, కూలీ చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నాడు. ఇవి రెండు కూడా మల్టీస్టారర్ చిత్రాలే కావడం విశేషం. ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కుబేరకు శేఖర్ కమ్ముల డైరెక్టర్. రష్మికా మందన్న హీరోయిన్గా నటించగా జిమ్ సర్భ్ ముఖ్య పాత్ర పోషించింది. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్తో కలిసి ఎస్వీసీ ఎల్ఎల్పీపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. జూన్ 20న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతోంది.#Nagarjuna gives a financial advice to GenZ 🥲👌 pic.twitter.com/uV0pygF06W— Movies4u Official (@Movies4u_Officl) June 15, 2025 చదవండి: ప్రభాస్.. ఇద్దరు హీరోయిన్లు కావాలన్నాడు: మారుతి -
'రాజాసాబ్'లో మారిపోయిన తాత.. ప్రభాస్ కాదా?
ప్రభాస్ 'రాజాసాబ్' టీజర్ వచ్చింది. ఫుల్ ఆన్ ఎంటర్టైనింగ్గా ఉండటంతో అభిమానులు ఫుల్ హ్యాపీ అయిపోతున్నారు. అదే టైంలో వాళ్లకు చిన్న సందేహం కూడా వచ్చింది. అదే తాత గెటప్. ఎందుకంటే చాన్నాళ్ల క్రితం ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్.. ముసలి గెటప్లో కనిపించాడు. ఇప్పుడు టీజర్లో మాత్రం స్టోరీ అంతా వేరేలా ఉంది. దీంతో ఫ్యాన్స్ రకరకాలుగా ఊహించేసుకుంటున్నారు.టీజర్ బట్టి చూస్తే.. ఓ పెద్ద మహల్. దానికి యజమాని అయిన ఓ వ్యక్తి.. తరతరాలుగా ఆ మహల్తోపాటు ఆస్తిని అనుభవించాలని అనుకుంటాడు. దీంతో చనిపోయిన తర్వాత దెయ్యంగా మారి అక్కడే ఉండిపోతాడు. ఓ సందర్భంలో హీరోహీరోయిన్లు అక్కడికి వస్తారు. తర్వాత జరిగిన పరిణామాలే సినిమా స్టోరీ అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్)టీజర్ మొత్తంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ని తాతగా చూపించారు. కానీ గతంలో ప్రభాస్ని ముసలి గెటప్లో చూపించారు. దీంతో ఫ్యాన్స్ పలు థియరీలు అనుకుంటున్నారు. ఆత్మ రూపంలో ఉండే తాత.. క్లైమాక్స్లో ప్రభాస్ శరీరంలోకి ప్రవేశిస్తాడు. దీంతో ప్రభాస్.. తాతలా మారిపోయి విలన్స్ని చితక్కొట్టేస్తాడు అని మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజమేంటి? అనేది సినిమా వస్తే తప్పితే క్లారిటీ రాదు.ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతమందించగా.. మారుతి దర్శకుడు. పీపుల్స్ మీడియా సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించింది. ఇంకొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అది పూర్తి చేసుకుని ఈ ఏడాది డిసెంబరు 5న థియేటర్లలోకి సినిమాని తీసుకురాబోతున్నారు.(ఇదీ చదవండి: ప్రభాస్.. ఇద్దరు హీరోయిన్లు కావాలన్నాడు: మారుతి) -
ప్రభాస్.. ఇద్దరు హీరోయిన్లు కావాలన్నాడు: మారుతి
లవ్, యాక్షన్, ఫాంటసీ, మైథాలజీ.. ఇలా అన్ని రకాల సినిమాలు చేశాడు డార్లింగ్ ప్రభాస్ (Prabhas). అయితే హారర్ జానర్ను మాత్రం టచ్ చేయలేదు. ప్రేమకథా చిత్రం మూవీ చూసిన ప్రభాస్కు అలాంటి హారర్ మూవీ ఒకటి చేయాలని కోరిక పుట్టింది. ఆ సమయంలో మారుతి కలవడం, కథ చెప్పడం, అది నచ్చడంతో ది రాజా సాబ్ సెట్స్ మీదకు వెళ్లింది. అయితే మారుతి డైరెక్ట్ చేసిన చివరి చిత్రం పక్కా కమర్షియల్ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్గా నిలిచింది. అభయమిచ్చిన ప్రభాస్అలాంటి సమయంలో పాన్ ఇండియా హీరోతో సాహసం చేయడం దేనికని దర్శకుడు వెనకడుగు వేశాడు. తర్వాతెప్పుడైనా చూద్దామని వాయిదా వేయాలనుకున్నాడు. కానీ, ప్రభాస్ ఒప్పుకోలేదు. కథ నచ్చిందని.. ముందుకు వెళ్దామని అభయం ఇవ్వడంతో మారుతి (Director Maruthi) రెట్టింపు జోష్తో రాజా సాబ్ (The Raja Saab Movie) తెరకెక్కించాడు. పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది.ఇద్దరు హీరోయిన్లు కావాలిసోమవారం (జూన్ 16న) రాజాసాబ్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మారుతి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ప్రభాస్ సరదాగా మాట్లాడుతూ.. సినిమాలో ఇద్దరు హీరోయిన్లను పెట్టగలవా? అని అడిగాడు. సలార్లో ఉన్న కథానాయిక ఎప్పుడో ఒకసారి వస్తుంది. కల్కి 2898 ఏడీలో కూడా ఒకమ్మాయి వచ్చినట్లే వచ్చి వెళ్లిపోతుంది. ఆదిపురుష్లోనేమో సీతాదేవి ఎక్కడో ఉంటుంది. ఇద్దరేం ఖర్మ.. ముగ్గురిని తీసుకొచ్చిన డైరెక్టర్నా దగ్గర, నా ఇంట్లో ఎవరూ లేరు డార్లింగ్.. ఇద్దరు హీరోయిన్లను పెడతావా? అన్నాడు. అప్పుడు ఆయన్ను ఎగాదిగా చూసి మీ రేంజ్కు ఇద్దరేంటి? ముగ్గుర్ని పెడతానన్నాను. అలా ముగ్గురు హీరోయిన్లను తీసుకెళ్లి హారర్ కొంపలో పెట్టాను. ఇది రొమాంటిక్ హారర్ ఫాంటసీగా తెరకెక్కించాను అని మారుతి చెప్పుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు పాపం.. ప్రభాస్ రొమాంటిక్ లవ్స్టోరీలను చాలా మిస్సవుతున్నట్లున్నాడు అని కామెంట్లు చేస్తున్నారు. రాజాసాబ్ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు.చదవండి: సీక్రెట్ చెప్పిన శోభిత.. ట్రోలర్స్కు కౌంటర్? -
ఈ ఏడాదిలోనే జాన్వీ పెళ్లి.. జ్యోతిషుడి కామెంట్స్
సినిమా సెలబ్రిటీలు ప్రేమ, పెళ్లి అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్. దీని గురించి ఏ చిన్న రూమర్ వినిపించినా సరే అభిమానులు ఎగ్జైట్ అవుతుంటారు. కొన్నిసార్లు కొందరు జ్యోతిషులు.. పలువురు నటీనటుల భవిష్యత్ గురించి అంచనా వేసి చెబుతుంటారు. కొన్నిసార్లు ఇది నిజమైతే, కొన్నిసార్లు ఇది జరగదు. గతంలో వేణుస్వామి ఎంత రచ్చ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు బాలీవుడ్లోనూ సుశీల్ కుమార్ అనే జ్యోతిషుడు.. హీరోయిన్ జాన్వీ కపూర్ పెళ్లి గురించి కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్)సిద్ధార్థ్ కన్నన్ యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన సదరు జ్యోతిషుడు.. జాన్వీ కపూర్ కెరీర్ 2026లో మంచి స్థాయికి వెళ్తుందని చెప్పారు. అలానే ఈ ఏడాదిలోనే జాన్వీ పెళ్లి చేసుకుంటుందని, ఒకవేళ లేదంటే మాత్రం 33 ఏళ్లకు ఆమెకు వివాహం జరుగుతుందని అంచనా వేశాడు. ఓవైపు ఆమె వైవాహిక జీవితం సాఫీగా ఉంటుందని చెబుతూన.. గ్రహాగతుల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశముందని అభిప్రాయపడ్డాడు.ఏదేమైనా ఇప్పుడు జ్యోతిషుడు సుశీల్ కుమార్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జాన్వీ కపూర్కి బాయ్ ఫ్రెండ్ ఉన్నమాట నిజమే. గతంలో ఇతడితోనే పలుమార్లు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. గతంలో ఓసారి మాట్లాడుతూ.. తాను పెళ్లి చేసుకుని తిరుపతిలోనే సెటిల్ కావాలనుకుంటున్నానని జాన్వీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేతిలో రామ్ చరణ్ 'పెద్ది', బన్నీ-అట్లీ ప్రాజెక్ట్ తదితర క్రేజీ మూవీస్ ఉన్నాయి. ఇలాంటి టైంలో పెళ్లి చేసుకుంటుందా అంటే కచ్చితంగా లేదని చెప్పొచ్చు. మరి సదరు జ్యోతిషుడు ఏ అంచనాతో చెప్పాడో ఏమో?(ఇదీ చదవండి: 'ది రాజాసాబ్' టీజర్ రిలీజ్.. భయపెట్టడమే కాదు) -
ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో ధనుష్-నాగార్జున 'కుబేర', '8 వసంతాలు' అనే తెలుగు సినిమాలు రాబోతున్నాయి. ఆమిర్ ఖాన్ చాలా గ్యాప్ తీసుకుని నటించిన 'సితారే జమీన్ పర్' కూడా ఈ వీకెండ్లోనే బిగ్ స్క్రీన్పై సందడి చేయనుంది. వీటితో పాటు పలు చిత్రాలు-వెబ్ సిరీసులు కూడా స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: 'ది రాజాసాబ్' టీజర్ రిలీజ్.. భయపెట్టడమే కాదు)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. గ్రౌండ్ జీరో, డిటెక్టివ్ షెర్డిల్, ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ లాంటి పరభాషా సినిమాలతో పాటు కేరళ క్రైమ్ ఫైల్స్ సిరీస్, ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో కూడా ఈ వీకెండ్లో స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రస్తుతానికైతే స్ట్రెయిట్ తెలుగు మూవీస్ ఏం లేవు.. వారాంతంలో సడన్ సర్ప్రైజ్ ఉండొచ్చు. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీ రిలీజ్ కానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూన్ 16-22 వరకు)అమెజాన్ ప్రైమ్గ్రౌండ్ జీరో (హిందీ సినిమా) - జూన్ 20 (రెగ్యులర్ స్ట్రీమింగ్)హాట్స్టార్సర్వైవింగ్ ఓహియో స్టేట్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - జూన్ 18కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 20ఫౌండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 20జీ5డిటెక్టివ్ షెర్డిల్ (హిందీ మూవీ) - జూన్ 20ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ (మలయాళ సినిమా) - జూన్ 20నెట్ఫ్లిక్స్జస్టిన్ విలియమ్: మ్యాజిక్ లవర్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 17కౌలిట్జ్ & కౌలిట్జ్ సీజన్ 2 (జర్మన్ సిరీస్) - జూన్ 17ట్రైన్ రెక్: మేయర్ ఆఫ్ మేహమ్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 17అమెరికాస్ స్వీట్ హార్ట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 18రోషారియో టిజెరస్ సీజన్ 4 (స్పానిష్ సిరీస్) - జూన్ 18సమ్బడీ ఫీడ్ ఫిల్ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 18యోలాంతే (డచ్ సిరీస్) - జూన్ 18ద వాటర్ ఫ్రంట్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 19కే-పాప్: ద డీమన్ హంటర్స్ (కొరియన్ సినిమా) - జూన్ 20గ్రెన్ ఫెల్ అన్ కవర్డ్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 20ఒలింపో (స్పానిష్ సిరీస్) - జూన్ 20సెమీ సొయిటర్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 20ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3 (హిందీ కామెడీ షో) - జూన్ 21సన్ నెక్స్ట్జిన్: ద పెట్ (తమిళ సినిమా) - జూన్ 20ఆపిల్ ప్లస్ టీవీద బుకనీర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 18లయన్స్ గేట్ ప్లేకాబోల్ (ఫ్రెంచ్ సిరీస్) - జూన్ 20(ఇదీ చదవండి: కీర్తి సురేశ్ కొత్త సినిమా.. నేరుగా ఓటీటీలోనే రిలీజ్) -
సీక్రెట్ చెప్పిన శోభిత.. ట్రోలర్స్కు కౌంటర్?
కింగ్ అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) తీరిక లేకుండా వరుస పనులతో బిజీగా ఉన్నాడు. గతేడాది చివర్లో పెద్ద కొడుకు నాగచైతన్య పెళ్లి చేశాడు. ఆ తర్వాత షూటింగ్స్లో మునిగాడు. ఈ నెలలో (జూన్ 6న) చిన్నకుమారుడు అఖిల్ వివాహం జరిపించాడు. అతడు ప్రేమించిన అమ్మాయి జైనబ్ రవ్జీతోనే ఘనంగా పెళ్లి జరిపించి ఆమెను చిన్న కోడలిగా స్వీకరించాడు. పెళ్లి సింపుల్గా అయిపోయినా రిసెప్షన్ మాత్రం ఎంతో ఘనంగా జరిగింది. అందంగా ముస్తాబైన శోభితతాజాగా చై సతీమణి, హీరోయిన్ శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) జూన్ ముచ్చట్లు అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో అఖిల్ పెళ్లి సెలబ్రేషన్స్లో తను ముస్తాబైన పిక్స్ను పంచుకుంది. ఓ ఫోటోలో ఆరెంజ్ డ్రెస్లో శోభిత చాలా అందంగా మెరిసిపోగా.. మరోదాంట్లో మామ నాగార్జునను ఆత్మీయంగా హత్తుకుంది. అలాగే బరాత్ కోసం ఏర్పాటు చేసిన డీజే ఫోటోను కూడా యాడ్ చేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేశామని చెప్పకనే చెప్పింది.ట్రోలర్స్కు కౌంటర్?పనిలో పనిగా ఓ సీక్రెట్ చెప్పింది. నా సీక్రెట్ ఏంటో తెలుసా? ఎవరేమనుకుంటున్నారు? అసలేం జరుగుతుందనేది పట్టించుకోకపోవడమే అని కృష్ణమూర్తి చెప్పిన మాటను యథాతథంగా పొందుపరిచింది. అఖిల్ పెళ్లిలో శోభిత లుక్పై చాలానే ట్రోల్స్ వచ్చాయి. తను.. నాగచైతన్య పక్కన భార్యలా కాదు, ఆంటీలా ఉందని కొందరు నెగెటివ్ కామెంట్లు చేశారు. తన డ్రెస్సింగ్ స్టైల్, లుక్పైనా విమర్శలు వచ్చాయి. వాటన్నింటికీ కౌంటర్గానే ఐ డోంట్ కేర్ అనే సందేశాన్ని యాడ్ చేసినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad)చదవండి: రూ.230 కోట్ల మూవీ.. డైలాగ్తో సహా కథంతా కాపీయే!: దర్శకుడి -
కీర్తి సురేశ్ కొత్త సినిమా.. నేరుగా ఓటీటీలోనే రిలీజ్
తెలుగులో ఫేమస్ పద్యాల్లో 'ఉప్పు కప్పురంబు.. నొక్క పోలికనుండు' ఒకటి. ఈ పద్యాన్నే టైటిల్గా పెట్టుకుని ఓ సినిమా వచ్చేస్తోంది. హీరోయిన్ కీర్తి సురేశ్- హీరో సుహాస్ కాంబినేషన్లో వస్తున్న మూవీ ఉప్పు కప్పురంబు. ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ తన ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం రూపొందించిన ఒరిజినల్ మూవీ ఇది.ఓటీటీలో..ఐవి శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎల్లనార్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై రాధికా లావు నిర్మించారు. సినిమా బండి ఫేమ్ వసంత్ కథ అందించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. జూలై 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. చిట్టి జయపురం గ్రామవాసులు అందించే వినోదాల విందుకు సిద్ధంగా ఉండమని ప్రైమ్ వీడియో ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. Get ready for this heartwarming ride with the citizens of Chitti Jayapuram 🌴🫰#UppuKappuRambuOnPrime, New Movie, July 4 pic.twitter.com/kzV6ssNucY— prime video IN (@PrimeVideoIN) June 16, 2025 -
'ది రాజాసాబ్'.. భయపెట్టడమే కాదు... (టీజర్)
ప్రభాస్ పాన్ ఇండియా మూవీ 'ది రాజాసాబ్' (The RajaSaab) టీజర్ వచ్చేసింది. రొమాంటిక్ హారర్ కాన్సెప్ట్తో దర్శకుడు మారుతి తెరకెక్కించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. సలార్, కల్కి 2898 ఏడీ వంటి వరుస హిట్ సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన టీజర్ను చూస్తే వారి అంచనాలకు మించే ఈ చిత్రం ఉండొచ్చని చెప్పవచ్చు. సంగీతం తమన్ అందించారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఇది విడుదల కానుంది. -
ఈరోజు మా నాన్న ఉండుంటే.. ఆ థియేటర్తో 'మారుతి' అనుబంధం
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ది రాజాసాబ్' (The RajaSaab). సోమవారం టీజర్ విడుదల కానుంది. ఈ క్రమంలో పలు థియేటర్స్ వద్ద ప్రభాస్, మారుతి కటౌట్స్ ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. వాటిని చూసిన దర్శకుడు ఎమోషనల్ అయ్యారు. గతంలో తన తండ్రి అరటిపళ్లు అమ్మినచోట ఇప్పడు తన కటౌన్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందంటూ మారుతి తెలిపారు. ఇండస్ట్రీకి రాకముందు ఎన్నో పనులు చేసిన మారుతి.. టాలీవుడ్లో అడుగుపెట్టాక కూడా సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా పని చేశాడు. మచిలీపట్నం, వైజాగ్లో మారుతి పెరిగారు. ఆ ప్రాంతాలతో ఆయనకు మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే.'మచిలీపట్నం - సిరి కాంప్లెక్స్ (గతంలో కృష్ణ కిషోర్)తో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడ మా నాన్నగారికి ఒకప్పుడు చిన్న అరటిపళ్లు దుకాణం ఉండేది. ఎప్పటికైనా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని ఈ థియేటర్లో విడుదలైన అందరి హీరోల సినిమాల బ్యానర్స్ నేను ఎంతో ఆశతో కట్టేవాడిని. ఒక్కసారైనా నా పేరు ఇక్కడ చూడాలని కలలు కనేవాడిని. ఇప్పుడు ఇదే థియేటర్ వద్ద నిలబడి చూస్తుంటే.. నా ప్రయాణం ఎక్కడ ప్రారంభమైందో అన్ని గుర్తుకు వస్తున్నాయి. ఇప్పుడు జీవితం పరిపూర్ణమైందనిపిస్తుంది. పాన్ ఇండియా స్టార్ పక్కన నా కటౌట్ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఎవరికైనా ఇంతకు మించి ఇంకేం కావాలి. కానీ, ఈరోజు మా నాన్న ఉండుంటే చాలా గర్వపడేవారు. ఆయన్ని మిస్ అవుతున్నాననే బాధ ఉంది. ఏదైనా ఉన్న సమయంలోనే మన బాధ్యతలను పూర్తి చేయాలి. మన డార్లింగ్ను వెండితెరపై నేను ఎలా చూపించాలని ఆశ పడ్డానో మీ అందరికీ చూపించనున్నాను. మా పట్ల మీరు చూపుతున్న ప్రేమకు ధన్యవాదాలు చెప్పడం చాలా చిన్న పదం అవుతుంది.' అని ఆయన అన్నారు.MACHILIPATNAM - Siri complex (krishna Kishore in past)This is the place where my father once had a small banana stall…Where I used to write for banners of all heroes films released in this theater dreaming with hope :) I was one of those who wished “okkasaraina mana peru… pic.twitter.com/Wnu3cCUoOz— Director Maruthi (@DirectorMaruthi) June 16, 2025 -
రూ.230 కోట్ల మూవీ.. డైలాగ్తో సహా కథంతా కాపీయే!: దర్శకుడి ఆరోపణలు
మలయాళంలో ఇటీవల బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన చిత్రం తుడరుమ్ (Thudarum Movie). మోహన్లాల్, శోభన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.230 కోట్లు రాబట్టింది. దీంతో మలయాళ సినీచరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా తుడరుమ్ నిలిచింది. తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్ హాట్స్టార్లో అందుబాటులో ఉంది.2020లో రాసుకున్న కథతాజాగా ఈ మూవీ చూసిన డైరెక్టర్ సనల్ కుమార్ శశిధరణ్ (Sanal Kumar Sasidharan) తుడరుమ్పై సంచలన ఆరోపణలు చేశాడు. ఈ మేరకు ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టాడు. 2020లో నేను 'తీయట్టం' అని ఓ స్క్రిప్ట్ రాశాను. తుడరుమ్ చూస్తుంటే.. తీయట్టంలోని మూలకథను దొంగిలించినట్లే అనిపించింది. నా కథను చోరీ చేసి ఈ సినిమా రూపొందించారు. నా కథ సారాంశాన్ని గ్రహించేంత శక్తి వారికి లేకపోవడం వల్ల మూల కథ ఆత్మ ఇందులో చెక్కుచెదరకుండా కనిపిస్తోంది.డైలాగ్ కూడా నాదే!తీయట్టం కథ అంబి అనే ఆటో డ్రైవర్ చుట్టూ నడుస్తుంది. కొందరు ఓ వ్యక్తిని తల నరికి అతడి ఆటోలో పడేస్తారు. దీంతో ఈ హత్య కేసులో అంబి ఇరుక్కుంటాడు. ఇదే ప్రధాన కథ. నాకు మచ్చుకైనా చెప్పకుండా, ఎటువంటి క్రెడిట్ ఇవ్వకుండా దీన్ని కాస్త అటుఇటుగా మార్చేసి తుడరుమ్లో వాడుకున్నారు. అలాగే ఒరిజినల్లో.. నువ్వు చంపితే అది పాపం.. కానీ, తింటే అది శుద్ధి అవుతుంది అన్న డైలాగ్ను కూడా సందర్భం లేకపోయినా తుడురుమ్లో వాడుకున్నారు.ఓవర్ కాన్ఫిడెన్స్ఎంతో అనుభవమున్న దొంగలు కూడా ఎవరికీ దొరకములే అన్న అతి విశ్వాసంతో కొన్నిసార్లు తప్పులు చేస్తుంటారు. తుడరుమ్లో ఈ డైలాగ్ను చేర్చడం చూస్తే నాకలాగే అనిపించింది. నేనెప్పుడో ఈ సినిమా చేయాల్సింది. మంజు వారియర్, టోవినో థామస్, మురళీ గోపి వంటి నటులతో ఈ మూవీ చేసేందుకు ఓ పెద్ద నిర్మాణ సంస్థ ముందుకు వచ్చింది. కానీ ఐదు సంవత్సరాలు అయిపోయినందున వారంతా దాన్ని మర్చిపోయి ఉండొచ్చు. త్వరలోనే నా కథను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను అని రాసుకొచ్చాడు.చదవండి: 'కాంతార' చుట్టూ మరణాలు.. రిషబ్కు అర్చకుల సూచన -
రానా నాయుడు 2 రివ్యూ.. కుటుంబం కోసం 'యుద్దం'
వెబ్సిరీస్: రానా నాయుడు 2 నటీనటులు: వెంకటేశ్, రానా, అర్జున్ రాంపాల్, అభిషేక్ బెనర్జీ, రజత్ కపూర్, కృతి కర్బంద, సుర్విన్ చావ్లా, సుశాంత్ సింగ్ తదితరులు కథ: అనన్య మోదీ దర్శకత్వం: సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమన్ స్ట్రీమింగ్ : నెట్ఫ్లిక్స్ఎపిసోడ్స్: 8కుటుంబంతో చూడొచ్చా: ఇబ్బందికరమే. కానీ, సీజన్-1తో పోలిస్తే.. కాస్త బోల్డ్ కంటెంట్ తగ్గించారు.వెంకటేశ్, రానా నటించిన రానా నాయుడు(Rana Naidu) సీజన్-1కు సీక్వెల్గా తాజాగా సీజన్ -2 విడుదలైంది. నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మొదటి సీజన్ టైమ్లో ఈ వెబ్సిరీస్ భారీగా వివాదాస్పదమైంది. బూతులు, బోల్డ్ కంటెంట్ ఎక్కువ ఉందని విమర్శలు వచ్చాయి. అయితే, పార్ట్2లో అలాంటి కంటెంట్ తగ్గించారు. ఇందులో రానాకు పెద్దపీఠ వేస్తూ తెరకెక్కిచారు. వెంటకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. అయితే, ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం.కథేంటంటే..రానా నాయుడు (రానా ) నగరంలోని టాప్ సెలబ్రిటీలకు ఎలాంటి సమస్య వచ్చిన పరిష్కారం చూపుతాడు. అందుకోసం అతను ఎంత రిస్క్ అయినా సరే చేస్తాడు. అయితే, భార్య కోరిక మేరకు తన చీకటి గతాన్ని వదిలేయడానికి రానా ప్రయత్నిస్తుంటాడు. కానీ, అతడు అంగీకరించిన చివరి డీల్ పూర్తిచేసే క్రమంలో చిక్కుల్లో పడుతాడు. ఈ క్రమంలోనే రానా కొడుకు కిడ్నాప్ అవుతాడు. దీంతో రానా ఈ నేర ప్రపంచంలో మరింతగా ఇరుక్కుపోతాడు. కొడుకుని విడిపించుకునేందుకు బాలీవుడ్కు చెందిన ఒక స్టూడియో ఓనర్ విరాజ్ ఒబెరాయ్ (రజత్ కపూర్) నుంచి సాయం తీసుకుంటాడు. అందుకు ప్రతిగా తన దగ్గర మాత్రమే రానా పనిచేయాలని విరాజ్ షరతు విధిస్తాడు. తన కొడుకుని కాపాడే క్రమంలో రావూఫ్ మీర్జా (అర్జున్ రాంపాల్) తమ్ముడిని చంపేస్తాడు రానా. తన సోదరుడి చావుకు కారణమైన రానాపై పగ తీర్చుకోవాలని రవూఫ్ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో రానా కుటుంబాన్ని రావూఫ్ టార్గెట్ చేస్తాడు. రానా చుట్టూ ప్రమాదం పొంచివున్న విషయం నాగా నాయుడు (వెంకటేశ్)కు తెలుస్తోంది. అప్పుడు నాగా నాయుడు ఏం చేశాడు.? సెలబ్రిటీల కోసం రిస్క్ చేసే రానా తన ఫ్యామిలీ కోసం ఎలాంటి రిస్క్ చేశాడు..? రానాకు సాయిం చేస్తానని చెప్పిన విరాజ్ ఒబెరాయ్ (రజత్ కపూర్) చేసిన కుట్ర ఏంటి..? చివరికి తండ్రికొడుకులు తమ కుటుంబం కోసం ఎలాంటి పోరాటం చేస్తారు..? అనేది అసలు స్టోరీ.ఎలా ఉందంటే..రానా నాయుడు: సీజన్2 కిడ్నాప్తో మొదలౌతుంది. వెంటనే కథలోకి ప్రేక్షకులను తీసుకెళ్తాడు దర్శకుడు. సీజన్-1 తన క్లయింట్స్ కోసం పోరాటం చేసిన రానా.. సీక్వెల్లో తన కుటుంబం కోసం పెద్ద యుద్దమే చేస్తాడు. తొలి సీజన్లో ఎక్కువ బూతులు ఉండటంతో కాస్త ఇబ్బంది ఉంటుంది. ఇందులో అలాంటి సమస్య ఉండదు. ఒక మంచి థ్రిల్లర్ సినిమా చూస్తున్న ఫీల్ మనకు కలిగేలా మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. కుమారుడు కిడ్నాప్తో రానాకు మరోవైపు ఇంటి సమస్యలు పెరుగుతాయి. భార్య కూడా విడిపోయే స్థితికి వస్తుంది. తండ్రి నాగా నాయుడుతో పాటు, సోదరులతో సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయి. ఇలాంటి పరిస్థితిలో ఉన్న రానాకు నమ్మిన వాళ్లు కూడా కుట్రకు తెరలేపుతారు. ఇలా అనేక సంఘటనలు ప్రేక్షకులలో జోష్ నింపుతాయి. రానా, రావూఫ్ మీర్జా, విరాజ్ ఒబెరాయ్ కథలో కీలకం. ఈ మూడు పాత్రల చుట్టూ డ్రామా, యాక్షన్, థ్రిల్తో పాటు భారీ ట్విస్టులు మెప్పిస్తాయి. ఈ సీజన్లో రానా పాత్ర చాలా బలంగా ఉంటుంది. ఈ పాత్రను చాలా స్ట్రాంగ్గా డిజైన్ చేయడంలో దర్శకులు సుపర్ణ్ వర్మ, కరణ్ అంశుమన్ విజయం సాధించారు. ఓటమి అంచు వరకు వెళ్లి అతను గెలిచే తీరు అందరిలో థ్రిల్ పంచుతుంది.రానా నాయుడు తన సోదరుడిని చంపాడని రావూఫ్ మీర్జా (అర్జున్ రాంపాల్) తెలుసుకున్న సమయం నుంచి కథలో స్పీడ్ పెరుగుతుంది. వారిద్దరి మధ్య జరిగే వైరంతో పాటు అదే సమయంలో కుమారుడి కోసం రానా నాయుడు పడే తపన ప్రేక్షకులలో కంటతడి పెట్టిస్తుంది. అప్పుడు రానా ఫ్యామిలీలో కనిపించే ఎమోషన్స్.. వాటిని ప్రేక్షకులకు చూపించిన తీరు బాగుంటుంది. రానా నాయుడిని అంతం చేయాలని రావూఫ్ మీర్జా, విరాజ్ ఒబెరాయ్లు ప్లాన్ వేస్తున్న సమయంలో నాగా నాయుడు (వెంకటేశ్ ) ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు మరింత ఆసక్తిగా కథ రన్ అవుతుంది. ఇలా సిరీస్లో కొన్ని బలమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ.. వాటిని అక్కడక్కడ బలవంతంగా ఇరికించినట్టు అనిపిస్తుంది. కొన్ని చోట్ల అయితే తప్పని పరిస్థితిలో అతికించారనే ఫీల్ కలుగుతుంది. దర్శకులు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ మంచి సన్నివేశాలే ప్లాన్ చేసుకున్నారు. అయితే, ఈ సిరీస్లో అన్ని ఎపిసోడ్స్లకు మధ్య ఉండాల్సిన లింక్ దెబ్బతిందేమోననే అభిప్రాయం కలుగుతుంది. భారీ యాక్టర్స్ ఉన్నప్పటికీ అక్కడక్కడగా పెద్దగా ఎమోషన్ పండలేదు. రానా నాయుడు ప్రతి ఫ్యామిలీని ఆలోచింప చేస్తాడు. భార్య భర్తల మధ్య ఉండాల్సిన నమ్మకం, పిల్లలను ఎలా పెంచాలి అనేది చాలా క్లారిటీగా ఉంటుంది.ఎవరెలా చేశారంటే..సీక్వెల్లో రానా పాత్ర చాలా బలంగా ఉంటుంది. కథలో ఆయనే కీలకం. ఇందులో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్కటీ సుమారు 50 నిమిషాల నిడివితో ఉంటుంది. ఇందులో మహిళా పాత్రధారులకు కొంత స్కోప్ ఇచ్చారు. భర్తతో (రానా) ఇబ్బంది పడుతున్న భార్యగా సుర్వీన్ చావ్లా అద్భుతంగా నటించింది. సర్వీన్ చావ్లాకు కొన్ని బోల్డ్ సీన్లు ఉన్నప్పటికీ. ఆ సీన్లు సహజంగానే ఉంటాయి. ఆ ట్రాక్ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్కు కాస్త ఇబ్బంది అనిపించవచ్చు. నాగా నాయుడిగా వెంకటేశ్కు పెద్దగా స్క్రీన్ స్పేస్ ఉండదు. రానాకు విసుగు తెప్పించే పాత్రలో ఆయన అదరగొట్టాడు. అర్జున్ రాంపాల్ విలనిజాన్ని చాలా బలంగా చూపించాడు. ఎపిసోడ్స్ నిడివి తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది. నిర్మాణ విలువల విషయంలో నెట్ఫ్లిక్స్ ఎక్కడా కూడా రాజీపడలేదు. ఇందులో భారీ యాక్షన్ సీన్స్ సినిమా రేంజ్లో నిర్మించడం ఆశ్చర్యం కలిగిస్తాయి. మూడో సీజన్ కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. ఈ వెబ్ సిరీస్కు ప్రధాన బలం రానా, వెంకటేశ్, దర్శకత్వం అని చెప్పవచ్చు. కథను ఇంకాస్త బలంగా రాసుకుని ఉంటే రానా నాయుడు అదరగొట్టేవాడు. అయినప్పటికీ ఎంటర్టైన్ చేస్తాడు. -
'కాంతార' చుట్టూ మరణాలు.. రిషబ్కు అర్చకుల సూచన
రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన సినిమా కాంతార ఎంత హిట్ అయ్యిందో తెలియనిది కాదు, చిన్న బడ్జెట్తో తీస్తే కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. దేశంలో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ చిత్రానికి కాంతార: చాప్టర్ 1 పేరుతో పార్ట్ 2 తీస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ అనుకున్నట్లు సాగడం లేదు. ప్రారంభం నుంచి అడుగడుగునా అడ్డంకులు, అవరోధాలు ఈ సినిమాకు ఎదురవుతున్నాయి. జూనియర్ ఆర్టిస్టు కపిల్, నటుడు రాకేశ్ పూజారి, మిమిక్రీ కళాకారుడు నిజు వీకే ఈ సినిమాలో నటిస్తూ, ఆకస్మికంగా మరణించారు. ఇంతలో శనివారం రాత్రి షూటింగ్ చేస్తున్న పడవ మునిగిపోయింది.ఆర్టిస్టుల ఆకస్మిక మరణాలు● కేరళకు చెందిన ఎంఎఫ్ కపిల్ జూనియర్ ఆర్టిస్టుగా ఈ కాంతారా చాప్టర్ 1లో నటిస్తూ ఉండేవాడు. ఉడుపి జిల్లా కొల్లూరు వద్ద ఉన్న సౌప ర్ణికా నదిలో కపిల్ ఈత కొడుతూ నది లో మునిగి చనిపోయాడు. మే 6న సాయంత్రం 4 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది.● కామెడి కిలాడిగళు ద్వారా పేరు పొందిన రాకేశ్ పూజారి మంచి హాస్యనటుడు. ఈ సినిమాలో అవకాశం వచ్చింది. అయితే మే 12న ఉడుపిలో ఓ పెళ్లి వేడుకలో గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు. హీరో రిషబ్ శెట్టి ఆయన అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదని రాకేశ్ ఆత్మీయులు ఆవేదన వ్యక్తం చేశారు.● సరిగ్గా నెలరోజులకు జూన్ 12న కాంతార చాప్టర్ 1లో నటిస్తున్న కేరళకు చెందిన మిమిక్రీ కళాకారుడు నిజు వికే మరణించాడు. ఆగుంబే హోం స్టేలో నిజు విశ్రాంతి తీసుకుంటూ గుండెపోటుతో తనువు చాలించారు.ప్రమాదాలు సైతం● గతేడాది నవంబర్లో కొల్లూరు మార్గంలో షూటింగ్ సభ్యులతో వెళుతున్న బస్సు పల్టీ కొట్టింది. 20 మంది జూనియర్ ఆర్టిస్టులు గాయపడ్డారు. ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు.● కాంతార చాప్టర్ 1 సినిమా కోసం కుందాపుర వద్ద భారీ సెట్ ఒకటి వేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సెట్లను నిర్మించారు. అయితే సుడిగాలుల కారణంగా సెట్ ధ్వంసం అయి ఆస్తి నష్టం కలిగింది.● హాసన్జిల్లా హెరూరు గ్రామ శివార్లలోని అటవీ ప్రాంతంలో గోమాళ స్థలంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు వివాదం రాజుకుంది. ఈ సినిమా షూటింగ్ కోసం అడవులను నాశనం చేస్తున్నారని, పేలుళ్లు జరిపారని గ్రామస్తులు ధర్నా చేశారు. అటవీ శాఖాధికారులు కూడా తనిఖీ చేశారు.రిషబ్కు అర్చకుల సూచనరిషబ్ శెట్టి కొన్ని రోజుల క్రితం కద్రి బారైబెల్ వారాహి పంజుర్లి , జారందాయ దైవం ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సమయంలో రిషబ్ శెట్టికి అర్చకులు హెచ్చరికలు ఇచ్చినట్లు తెలిసింది. నీ కార్యం సఫలం కాకుండా పాడు చేసేందుకు పథకాలు నడుస్తున్నాయి అని పేర్కొన్నట్లు ప్రచారం సాగుతోంది. కాగా, సినిమాను ఎలాగైనా అక్టోబర్ 2న విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా కష్టాలు అంతటా హాట్ టాపిక్ అయ్యాయి. -
'కుబేర' ట్రైలర్ రిలీజ్.. మీరు చూశారా?
నాగార్జున, ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కుబేర’. రష్మికా మందన్నా హీరోయిన్. ఇందులో ధనుష్ బిచ్చగాడిగా నటించడం విశేషం. ధనిక-పేద తేడా, రూ.10 వేల కోట్ల స్కామ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా ట్రైలర్ని తాజాగా లాంచ్ చేశారు. సునీల్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.ఆదివారం జరిగిన ‘కుబేర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు రాజమౌళి ఈ చిత్రం ట్రైలర్, బిగ్ టికెట్స్ను లాంచ్ చేశారు. ఈ వేదికపై ఇంకా రాజమౌళి మాట్లాడుతూ – ‘‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ చూసి ఆశ్చర్యపోయాను. ఈ సినిమాలో రిచ్, పూర్ ప్రపంచాలను ఎలా కలిపారు? నాగార్జున, ధనుష్గార్లను ఏ విధంగా తీసుకొచ్చారు? వీరి మధ్య డ్రామా ఎలా ఉండబోతుందన్న నాకు ఈ సినిమా ట్రైలర్ ఇంకా ఆసక్తిని పెంచింది’’ అని అన్నారు. -
ప్రభుత్వ అవార్డులను స్వీకరించడం మన బాధ్యత: ‘దిల్’ రాజు
‘‘ప్రభుత్వ అవార్డులను స్వీకరించాలి. షూటింగుల్లో బిజీగా ఉన్నా, ఎక్కడ ఉన్నా, ప్రభుత్వం నుంచి అవార్డు వస్తుందంటే స్వీకరించడం మన బాధ్యత. ప్రభుత్వంతో జర్నీ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరిదీ. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం నుంచి అవార్డులు ప్రకటించినప్పుడు ఆ తేదీలను డైరీలో నోట్ చేసుకుని, ఒకవేళ మీకు అవార్డు ఉంటే ఆ అవార్డును స్వీకరించాలి. ఇది నా రిక్వెస్ట్. అది ఏ రాష్ట్రమైనా కానివ్వండి. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కూడా అవార్డులు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు మనకు రెండు కళ్లు’’ అని అన్నారు. తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత ‘దిల్’ రాజు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం శనివారం హైదరాబాద్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎఫ్డీసీ ఛైర్మన్ ‘దిల్’ రాజు, ఎఫ్డీసీ ఎండీ హరీష్ ఐఏఎస్ ఆదివారం హైదరాబాద్లో ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘తెలం గాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక సక్సెస్ కావడం సంతోషంగా ఉంది. అవార్డులు స్వీకరించిన అందరికీ ఎఫ్డీసీ తరఫున ధన్యవాదాలు చెబుతున్నాం. తెలంగాణ సీయం రేవంత్రెడ్డిగారికి స్పెషల్ థ్యాంక్స్.సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డిప్యూటీ సీయం మల్లు భట్టి విక్రమార్కగారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇంత పెద్ద ఈవెంట్లో చిన్న చిన్న తప్పులు ఉండొచ్చేమో. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఏమైనా తప్పులు జరిగి, ఈవెంట్కు వచ్చినవారు ఒకవేళ హర్ట్ అయితే ఎఫ్డీసీ తరఫున చైర్మన్గా క్షమాపణలు కోరుతున్నాను’’ అని అన్నారు. ‘‘సీయం రేవంత్ రెడ్డిగారి ఆదేశాలతో, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిగారి గైడెన్స్తో, ఎఫ్డీసీ చైర్మన్ ‘దిల్’ రాజుగారి విజన్తో తెలంగాణ గద్దర్ అవార్డ్స్ వేడుకను సక్సెస్ఫుల్గా నిర్వహించుకున్నాం. ఈ సక్సెస్కు కారణమైన ప్రతి ఒక్కరీ కృతజ్ఞతలు’’ అన్నారు ఎఫ్డీసీ ఎండీ హరీష్. -
నమ్మిన సిద్ధాంతల పైనే శేఖర్ సినిమాలు తీస్తారు: దర్శకుడు రాజమౌళి
‘‘శేఖర్ కమ్ముల తాను నమ్మిన సిద్ధాంతానికి ఏం అడ్డొచ్చినా, ఎంత ఆశ చూపినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒక్క ఇంచ్ కూడా పక్కకు జరగరు. తాను నమ్మిన సిద్ధాంతాల పైనే సినిమాలు తీస్తారు. శేఖర్ ఇండస్ట్రీకి వచ్చిన పాతిక సంవత్సరాల్లో అలానే ఉన్నారు. అలాంటి సినిమాలే తీశారు. ఆయన అలానే ఉండాలని మేం కోరుకుంటున్నాము’’ అని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. నాగార్జున, ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కుబేర’. రష్మికా మందన్నా హీరోయిన్.సునీల్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ‘కుబేర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు రాజమౌళి ఈ చిత్రం ట్రైలర్, బిగ్ టికెట్స్ను లాంచ్ చేశారు. ఈ వేదికపై ఇంకా రాజమౌళి మాట్లాడుతూ – ‘‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ చూసి ఆశ్చర్యపోయాను. ఈ సినిమాలో రిచ్, పూర్ ప్రపంచాలను ఎలా కలిపారు? నాగార్జున, ధనుష్గార్లను ఏ విధంగా తీసుకొచ్చారు? వీరి మధ్య డ్రామా ఎలా ఉండబోతుందన్న నాకు ఈ సినిమా ట్రైలర్ ఇంకా ఆసక్తిని పెంచింది’’ అని అన్నారు.నాగార్జున మాట్లాడుతూ – ‘‘కుబేర’ శేఖర్ కమ్ముల సినిమా. ‘మాయా బజార్’లో ఎన్టీఆర్గారు హీరోనా? ఏయన్నార్గారు హీరోనా? ఎస్వీ రంగారావుగారు హీరోనా? సావిత్రిగారు హీరోనా? కాదు... కేవీ రెడ్డిగారు హీరో. అలా.. ‘కుబేర’ సినిమాకు శేఖర్ కమ్ముల హీరో. ఈ సినిమా కథ చెప్పగానే శేఖర్ కమ్ముల కోసం ఒప్పుకున్నాను. ఎన్ని సంవత్సరాలైనా మీ (అభిమానులు) ప్రేమ, ఇలానే ఉంది. నేను ఏ పాత్రలు చేసినా అప్రిషియేట్ చేస్తున్నారు. మీరు ఉన్నంతవరకు ఏఎన్ ఆర్ లివ్స్ ఆన్ ’’ అని చెప్పారు.ధనుష్ మాట్లాడుతూ– ‘‘కుబేర’ సినిమా కోసం శేఖర్ కమ్ములగారు ఎంతో కష్టపడ్డారు. నాగార్జునగారితో మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. మ్యాన్ ఆఫ్ క్లాస్. నాగార్జునగారు, నేను, రష్మికల కంటే... ఫీల్డ్లో ఎక్కువగా డైరెక్షన్ టీమ్ కష్టపడింది. ‘కుబేర’ సినిమాలో రెండు ప్రపంచాలను చూస్తారు’’ అన్నారు.శేఖర్ కమ్ముల మాట్లాడుతూ– ‘‘నా ప్రతి సినిమాకు చెబుతుంటాను... సరస్వతీ దేవి తలదించుకోకుండా ఉంటే చాలని. కానీ ‘కుబేర’ సినిమాను సరస్వతీ దేవి తల ఎత్తుకుని చూస్తుంది.ఈ సినిమా నేపథ్యం ముంబై. తెలుగు, తమిళ భాషల్లో షూట్ చేశాం. నిజమైన పాన్ ఇండియా మూవీ ‘కుబేర’. కథ విషయంలో చైతన్య పింగళి సపోర్ట్ ఉంది. ‘శివ’ సినిమా టైమ్లో నాగార్జునగారి ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. ‘కుబేర’ కోసం ఏమైనా చేస్తానన్నారు. ఈ సినిమాలోని బిచ్చగాడు క్యారెక్టర్ కోసం ధనుష్ సన్నబడ్డాడు. సినిమా కోసం రష్మిక ఎంతైనా కష్టపడతారు. దేవిశ్రీ నిజమైన రాక్స్టార్. మంచి మ్యూజిక్ ఇచ్చాడు’’ అన్నారు.‘‘కుబేర’ గేమ్ను లాంచ్ చేయబోతున్నాం. హిందీ, ఇతర ఏరియాల్లో ‘కుబేర’ రిలీజ్కు అసోసియేట్ అవ్వడం హ్యాపీగా ఉంది’’ అన్నారు ‘ముగాఫే’ ప్రతినిధులు మనీష్, విపుల్. అమిగోస్ క్రియేషన్స్ ప్రతినిధి నాగేశ్వరరావు, కొరియోగ్రాఫర్ జావేద్, ఫైట్ మాస్టర్ శ్రీధర్, లిరిక్ రైటర్స్ భాస్కరభట్ల, నందకిశోర్, ప్రోడక్షన్ డిజైనర్ తోట తరణి మాట్లాడారు. ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధి నిరంజన్ పాల్గొన్నారు. -
చలో గుజరాత్
హీరో నాగచైతన్య గుజరాత్ వెళ్లనున్నారట. నాగచైతన్య హీరోగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్. ఇటీవల హైదరాబాద్లో ఈ సినిమాకు చెందిన భారీ షెడ్యూల్ చిత్రీకరణ జరిగింది. ఓ ప్రముఖ స్టూడియోలో గుహ సెట్ వేసి, నాగచైతన్య పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఈ నెల చివరి వారంలో గుజరాత్లోప్రారంభం కానుందని, నాగచైతన్యతో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా మేకర్స్ కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశారని సమాచారం. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్, బి. సుకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. -
విజయ్ దేవరకొండ నుంచి అన్నీ తీసేసుకుంటా: రష్మిక
విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే పేరు రష్మిక. వీళ్లిద్దరూ కలిసి రెండు సినిమాలు, అది కూడా చాలా ఏళ్ల క్రితం చేశారు. కానీ వీళ్ల గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుకోవడానికి ఓ కారణం ఉంది. అదే ప్రేమ. రష్మిక-విజయ్ చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో గట్టిగా టాక్ వినిపిస్తూ ఉంటుంది. అందుకు తగ్గట్లే ఇద్దరూ కలిసి ఎప్పటికప్పుడు విదేశాలకు టూర్స్కి వెళ్తుంటారు. కొన్నాళ్ల ముందు వరకు తమ బంధం గురించి పెద్దగా స్పందించని రష్మిక.. రీసెంట్ టైంలో మాత్రం మెల్లమెల్లగా క్లూలు ఇస్తోంది.తాజాగా హైదరాబాద్లో జరిగిన 'కుబేర' ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ రష్మిక చిన్న హింట్ ఒకటి ఇచ్చేసింది. యాంకర్ సుమ.. ఈ సినిమాలో నటించిన ధనుష్, నాగార్జునలని కూడా పలు ప్రశ్నలు అడిగింది. రష్మికని మాత్రం ఫలానా హీరోల నుంచి ఏం కాపీ కొడతారు అని అడగ్గా.. నాగార్జున దగ్గర నుంచి ఛార్మ్, ధనుష్ దగ్గర సూర్యుడి కింద అయిన పనిచేసేలా బలం, అల్లు అర్జున్ దగ్గర నుంచి స్వాగ్, విజయ్ దేవరకొండ దగ్గర నుంచి మాత్రం అన్నీ కావాలి అని సమాధానమిచ్చింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఇది నా రిక్వెస్ట్.. గద్దర్ అవార్డుల వేడుకపై దిల్ రాజు) శేఖర్ కమ్ముల తీసిన 'కుబేర' సినిమా జూన్ 20న రిలీజ్ కాబోతుంది. ఇందులో ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలు పోషించారు. ధనిక-పేద, డబ్బు బ్యాక్ డ్రాప్ స్టోరీతో మూవీ తీశారు. ఇందులో రష్మిక పాత్ర ఎలా ఉండబోతుందనేది ఇప్పటివరకు అయితే పెద్దగా రివీల్ చేయలేదు. కానీ ప్రమోషన్స్లో మాత్రం ఈమె బాగానే పాల్గొంటుంది. మొన్నీమధ్య టీమ్తో కలిసి ముంబై కూడా వెళ్లొచ్చింది.ఇక రష్మిక-విజయ్ దేవరకొండ బంధం విషయానికొస్తే.. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ వీళ్లు మాత్రం అటు అవును అని గానీ ఇటు లేదు గానీ చెప్పకుండా అలా సస్పెన్స్ మెంటైన్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే రష్మిక.. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అదే రీతిన బ్లాక్బస్టర్ హిట్స్ కొడుతూ ఫుల్ ఫామ్లో ఉంది. విజయ్ దేవరకొండ మాత్రం 'కింగ్డమ్' మూవీని రిలీజ్కి రెడీ చేస్తున్నాడు. జూలై 4న విడుదల అన్నట్లు చెప్పారు గానీ ఈసారి కూడా వాయిదా పడటం గ్యారంటీ అంటున్నారు.(ఇదీ చదవండి: హీరోయిన్ నివేదా థామస్ ఇంతలా మారిపోయిందేంటి?)"I want to Copy Everything from #VijayDeverakonda" - Rashmika pic.twitter.com/YEgwjURgrY— Movies4u Official (@Movies4u_Officl) June 15, 2025 -
అల్లు అర్జున్ డైరెక్టర్ చిత్రాలన్నీ కాపీనే?.. దర్శకుడి రియాక్షన్ ఇదే!
జవాన్ మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ. షారూఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం ఈ ఏడాది బిగ్ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశారు. అది కూడా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ భామ దీపికా పదుగొణె హీరోయిన్గా కనిపించనుంది.అయితే కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న అట్లీ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం ఆయనను డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ఈ సందర్భంగా డాక్టరేట్ స్వీకరించిన అట్లీ సినిమాల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా తన చిత్రాలన్నీ కాపీ చేశారంటూ వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. అంతేకాకుండా అల్లు అర్జున్ సినిమా గురించి కూడా మాట్లాడారు.అట్లీ మాట్లాడుతూ.. "సాధారణంగా ప్రేక్షకులు నా సినిమాలు కాపీ అని అంటారు.కానీ ఈ రోజు నా జీవితం గురించి నేను మీకు చెప్తా. ఈ రోజు నిజం చెబుతున్నా నేను తీసే సినిమాలన్నీ నా జీవితం నుంచి ప్రేరణ పొందా. ఇవాళ మీకు కనెక్ట్ అయ్యే ఒక ఉదాహరణ చెప్తా. విజయ్ నటించిన బిగిల్ సినిమా.. గ్యాంగ్స్టర్ నుంచి ఫుట్బాల్ కోచ్గా మారిన మైఖేల్ రాయప్పన్ పాత్రను జేపీఆర్ సార్ జీవితం నుంచి ప్రేరణ పొందా. రాయప్పన్ ఈ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు, ఛాన్సలర్ కూడా. ఈ రోజు మీరు నాకు డాక్టరేట్ ఇచ్చారు. నేను ఈ దేశం గర్వపడేలా చేస్తానని హామీ ఇస్తున్నా" అని అన్నారు.అల్లు అర్జున్ చిత్రం గురించి మాట్లాడుతూ..' ఈ సినిమాను కళానిధి మారన్ సర్ (సన్ పిక్చర్స్) నిర్మిస్తున్నారు. ఇది మన దేశంలో అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా నిలవనుంది. ఈ మూవీ కోసం అంతా కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. ఈ చిత్రం కోసం నేను పెద్ద కలలు కంటున్నా. ఈ మూవీ బడ్జెట్ ఇంకా లాక్ కాలేదు. నిర్మాత విడుదల తేదీని నిర్ణయిస్తారు.' అని పంచుకున్నారు. #Atlee: "Generally Audience says my films are copied, but I'm telling truth today that it's all inspired from my life. For Ex Bigil Raayappan character was inspired from JPR sir. You have given doctorate, i promise that I will make proud for this country. #AA22xA6 la therikka… pic.twitter.com/UQeZdqhJev— AmuthaBharathi (@CinemaWithAB) June 14, 2025 -
కాంతార షూటింగ్ సెట్లో ప్రమాదం.. నిర్మాణ సంస్థ క్లారిటీ!
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 సెట్లో ప్రమాదం జరిగిందని వస్తున్న వార్తలపై చిత్ర నిర్మాణ సంస్థ స్పందించింది. ఈ సినిమా సెట్లో ప్రమాదం చోటు చేసుకుందని.. 30 మంది కళాకారులతో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయిందని మీడియాలో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ క్లారిటీ ఇచ్చింది. తాజాగా హోంబలే ఫిల్మ్స్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఆదర్శ్ ఈ అంశంపై మాట్లాడారు.ప్రస్తుతం కాంతార చాప్టర్ 1 షూటింగ్ కర్ణాటకలోని మాణి జలాశయం వద్ద జరుగుతోంది. ఈ సినిమా సెట్లో ప్రమాదం చోటు చేసుకుందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు. చిత్రీకరణలో భాగంగా జలాశయం వద్ద తాము సెట్ వేశామని.. అయితే వీపరీతమైన గాలి వీయడంతో అది పాడైపోయిందని వెల్లడించారు. ఈ ఘటన జరిగినప్పుడు సెట్లో నటీనటులు కానీ.. సిబ్బంది లేరన్నారు. ఈ రోజు యథావిధిగా షూటింగ్ జరుగుతున్నట్లు వెల్లడించారు. షూటింగ్ జరిగే ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. గజ ఈతగాళ్లు, స్కూబా డైవర్స్ సమక్షంలోనే మూవీ షూట్ చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రకటనలో ఉదయం నుంచి వస్తున్న రూమర్స్కు నిర్మాణ సంస్థ చెక్ పెట్టేసింది.(ఇది చదవండి: 'కాంతార'ని వెంటాడుతున్న శాపం? ఈసారి ఏకంగా హీరో)కాగా.. 2022లో సూపర్ హిట్గా నిలిచిన కాంతార మూవీకి ప్రీక్వెల్గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. హీరో రిషభ్ శెట్టి దర్శకత్వంలోనే తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్గా రూపొందిస్తున్నారు. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. -
ప్రభాస్ ది రాజాసాబ్ టీజర్.. టైమ్ ఫిక్స్ చేసిన డైరెక్టర్
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ది రాజాసాబ్' (The RajaSaab). ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ ప్రకటించారు. సినిమా విడుదల తేదీతో పాటు టీజర్ రిలీజ్ను తేదీని కూడా చిత్ర యూనిట్ వెల్లడించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్గా నటిస్తున్నారు.అయితే ఇప్పటికే జూన్ 16న ఉదయం 10:52 గంటలకు మూవీ టీజర్ రిలీజ్ ఉంటుందని ప్రకటించిన మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని డైరెక్టర్ మారుతి తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. 'ఆల్ సెట్ డార్లింగ్స్.. లెట్స్ రాక్ ఫ్రమ్ టుమారో' అంటూ టైమ్ ఫిక్స్ చేశారు.టీజర్పై అధికారిక ప్రకటన రావడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్ తన కెరీర్లో చేస్తున్న తొలి రొమాంటిక్ హారర్ చిత్రమిదే కావడంతో ఫ్యాన్స్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో సందడి చేయనున్నారని సమాచారం. ది రాజా సాబ్ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.All SET darlings Hope u all ready 💖 Let's rock from tomorrow 10.52 am#TheRajaSaabTeaser pic.twitter.com/Q2aGbYAcnU— Director Maruthi (@DirectorMaruthi) June 15, 2025 -
ఫాదర్స్ డే.. మంచు లక్ష్మీ ఇలా మృణాల్ అలా
తండ్రి గురించి విషయాలు చెప్పిన మంచు లక్ష్మీతండ్రి సూపర్ హీరో అంటూ మృణాల్ క్రేజీ పోస్ట్బెస్ట్ డాడ్ అంటూ సాయేషా ఇన్ స్టా పోస్ట్త్వరలో తండ్రి కాబోతున్న భర్త గురించి కియారా ఇలాతల్లితో కలిసి ఎంజాయ్ చేస్తున్న సుప్రీతచీరలో అందమైన చందమామలా ఐశ్వర్యా రాజేశ్ View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Sayyeshaa (@sayyeshaa) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Ritika_nayak (@ritika_nayak__) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by Pujiitaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) -
ఖరీదైన కారు కొనుగోలు చేసిన నటుడు.. తొలి ఇండియన్గా ఘనత!
ప్రముఖ బాలీవుడ్ నటుడు రామ్ కపూర్ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. లగ్జరీ కార్ల బ్రాండ్లలో ఒకటైన లంబోర్గిని ఎస్ఈని తన సొంతం చేసుకున్నారు. ఈ ప్రత్యేక మోడల్ను కొనుగోలు చేసిన మొదటి భారతీయ నటుడిగా నిలిచారు. తన భార్య గౌతమి కపూర్తో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. ఈ కారు విలువ దాదాపు రూ.5.21 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది.ఈ లంబోర్గిని ఉరుస్ ఎస్ఈ మోడల్ కారును 2024లో అధికారికంగా భారతదేశంలో రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఏ నటుడు ఈ కారును కొనలేదు. దీంతో మొదట ఈ లగ్జరీ కారు కొన్న నటుడిగా రామ్ కపూర్ నిలిచారు. రామ్ తన బ్రాండ్ న్యూ లంబోర్గిని కారుతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే అతని వద్ద రామ్ పోర్స్చే , పోర్సే, ఫెరారీ , రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ వంటి కార్లను కూడా కలిగి ఉన్నారు.ఇక సినిమాల విషయానికొస్తే రామ్ కపూర్ ప్రస్తుతం వెబ్ సిరీస్ మిస్త్రీలో కనిపిస్తాడు. ఇది అమెరికన్ సిరీస్ ఆధారంగా తెరెకెక్కించారు. ఇందులో అతను డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ వెబ్ సిరీస్ జూన్ 27 నుంచి జియో హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. అంతేకాకుండా గతేడాది యుధ్రా మూవీలోనూ మెరిశారు. View this post on Instagram A post shared by Auto Journal India (@autojournal_india) -
ఇది నా రిక్వెస్ట్.. గద్దర్ అవార్డుల వేడుకపై దిల్ రాజు
తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా గద్దర్ అవార్డుల వేడుక జరిపింది. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా ఈ వేడుక శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకని దగ్గరుండి విజయవంతం చేసిన దిల్ రాజు.. తాజాగా మీడియాతో మాట్లాడారు. అవార్డ్స్ వేడుక సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.(ఇదీ చదవండి: 'కాంతార'ని వెంటాడుతున్న శాపం? ఈసారి ఏకంగా హీరో)గద్దర్ అవార్డ్స్ ప్రదానోత్సవంపై ప్రెస్ మీట్ పెట్టిన దిల్ రాజు.. 'గద్దర్ అవార్డ్స్ వేడుకలు నిన్న భారీ ఎత్తున నిర్వహించాం. ఆ ఈవెంట్ సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ అవార్డ్స్ వేడుక కోసం గత 6 నెలలు నుంచి వర్క్ చేశాం. ఇది పెద్ద సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. అవార్డ్ గ్రహీతలందరికీ థాంక్స్. ముఖ్యమంత్రి గారికి బిగ్ బిగ్ థ్యాంక్స్. ఇంత పెద్ద ఈవెంట్లో సీఎం.. రెండు గంటలు పైన ఉన్నారు. త్వరలో ఏపీలో కూడా అవార్డ్స్ మొదలవుతాయి. ప్రభుత్వం నుంచి అవార్డు వస్తుందంటే స్వీకరించే వాళ్లు ఎన్ని పనులున్నా కచ్చితంగా వచ్చి స్వీకరించాలి ఇది నా రిక్వెస్ట్' అని చెప్పుకొచ్చారు.అలానే ప్రభుత్వ అవార్డుల స్వీకరణలో సినీ పరిశ్రమ తీరుపై ఏఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల కోసం ఆరు నెలలుగా కష్టపడితే సక్సెస్ అయింది. ప్రభుత్వం అవార్డులు ఇస్తుందంటే అందరూ హాజరై తీసుకోవాలి. అవార్డుల తేదీ ప్రకటించాక ఆ తేదీన అందరూ అవార్డు కోసం కేటాయించాలి. ఇంత పెద్ద ఈవెంట్లో ఏవైనా పొరపాట్లు జరిగితే క్షమించాలని దిల్ రాజు కోరారు.ఈ వేడుకలో 'పుష్ప 2' చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డ్ స్వీకరించగా, ఉత్తమ నటిగా '35: ఇది చిన్న కథ కాదు' సినిమాకుగాను నివేదా థామస్ పురస్కారం అందుకుంది. గతేడాది అన్ని విభాగాలకు అవార్డులు బహుకరించగా.. 2014 నుంచి 2023 వరకు మాత్రం మూడేసి ఉత్తమ చిత్రాల్ని ఎంపిక చేసి అవార్డ్స్ ఇచ్చారు. గ్రహీతలకు సిల్వర్ మొమెంటో, ప్రశాంసా పత్రం, రూ.5 లక్షల మొత్తాన్ని అందజేశారు.(ఇదీ చదవండి: హీరోయిన్ నివేదా థామస్ ఇంతలా మారిపోయిందేంటి?) -
టాలీవుడ్ హీరోయిన్ ఇంతలా మారిపోయిందేంటి?
ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవాలంటే హీరోయిన్లు.. టాలెంట్తో పాటు ఫిజిక్ కూడా మెంటైన్ చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు బ్యూటీస్ మాత్రం గ్లామర్ని నమ్ముకోకుండా యాక్టింగ్తో అలరిస్తూ ఉంటారు. నటనకు స్కోప్ ఉండే మూవీస్ చేస్తుంటారు. అలాంటి వాళ్లలో నివేదా థామస్ ఒకరు. తాజాగా గద్దర్ అవార్డుల్లో కనిపించిన ఈమె.. అందరికీ ఓ రకంగా షాకిచ్చింది. ఎందుకంటే చాలా మారిపోయింది.(ఇదీ చదవండి: 'కాంతార'ని వెంటాడుతున్న శాపం? ఈసారి ఏకంగా హీరో)కేరళకు చెందిన నివేదా థామస్.. కుటుంబంతో కలిసి చెన్నైలో ఉంటుంది. బాలనటిగానే పలు సినిమాలు చేసిన నివేదా.. 2016లో వచ్చిన నాని 'జెంటిల్మేన్' మూవీత తెలుగులోకి హీరోయిన్గా పరిచయమైంది. అనంతరం నిన్ను కోరి, జై లవకుశ, 118, బ్రోచెవారెవరురా, వి, వకీల్ సాబ్ తదితర చిత్రాల్లో నటించింది. చివరగా '35: ఇది చిన్న కథ కాదు'లో ప్రధాన పాత్ర పోషించింది. ఈ మూవీకే ఉత్తమ నటిగా ఈమెని గద్దర్ అవార్డ్ వరించింది.తాజాగా శనివారం రాత్రి హైదరాబాద్లోని హైటెక్స్లో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం జరగ్గా.. నివేదా థామస్ కూడా హాజరైంది. కానీ పూర్తిగా చబ్బీగా కనిపించి అందరికీ షాకిచ్చింది. ఈమెని చూసి ఏంటి నివేదా ఇలా మారిపోయింది అని మాట్లాడుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతానికైతే నివేదా చేతిలో కొత్త సినిమాలేం లేవు. మరి నివేదా ఇంతలా మారిపోవడానికి వేరే ఏదైనా కారణముందా? అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలో మస్ట్ వాచ్ థ్రిల్లర్.. నరాలు తెగే ఉత్కంఠ.. 'స్టోలెన్' రివ్యూ) View this post on Instagram A post shared by Actress point 👉 (@actressz_point) -
'థగ్ లైఫ్' హిట్ సాంగ్.. వీడియో వర్షన్ వచ్చేసింది
కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ సినిమా 'థగ్ లైఫ్'.. జూన్ 5న విడుదలైన ఈ చిత్రం భారీ డిజాస్టర్గా నిలిచింది. ఎ. ఆర్. రెహమాన్ అందించిన సంగీతం బాగుందన్నప్పటికీ సినిమా స్టోరీ పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. అయితే, ఈ మూవీలో సూపర్ హిట్ సాంగ్ వీడియోను తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రంలో శింబు, త్రిష, అభిరామి, నాజర్ ముఖ్య పాత్రలు పోషించారు. రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మించాయి. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి విడుదల చేశారు.థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో సింగర్ చిన్మయి పాడిన 'ముత్తా ముజై' తమిళ్ వర్షన్ పాటా బాగా వైరల్ అయింది. అదే పాటను సినిమాలో మాత్రం సింగర్ ఢీ పాడింది. తెలుగు వర్షన్లో చిన్మయి ఆలపించింది. ప్రస్తుతం రెండు భాషలలో వీడియో వర్షన్ను విడుదల చేశారు. -
'కాంతార'ని వెంటాడుతున్న శాపం? ఈసారి ఏకంగా హీరో
'కాంతార' సినిమా సూపర్ హిట్. వందల కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ప్రీక్వెల్ తీయడం మొదలుపెట్టారు. అప్పటినుంచి ఏం శాపం వెంటాడుతుందో ఏమో గానీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. షూటింగ్కి వచ్చిన పలువురు నటులు చనిపోతున్నారు. ఇప్పుడు కూడా బోటు ప్రమాదం జరిగింది. ఆ టైంలో బోటులో హీరోతో పాటు ఏకంగా 30 మంది వరకు ఉన్నారు. కానీ కొద్దిలో భారీ ప్రమాదం నుంచి అందరూ తప్పించుకున్నారు. దీంతో టీమ్ అంతా ఊపిరి పీల్చుకుంది.(ఇదీ చదవండి: మోహన్ బాబు 'పెద్ద' కోరిక.. మోహన్ లాల్ ఫన్నీ కౌంటర్)కన్నడ హీరో రిషభ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ 'కాంతార 1'. గతంలో వచ్చిన చిత్రానికి ఇది ముందు భాగం అనమాట. ఈ ఏడాది అక్టోబరు 2న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు. అందుకు తగ్గట్లే చాన్నాళ్ల నుంచి షూటింగ్ చేస్తున్నారు. కానీ ఇదివరకే ముగ్గురు జూనియర్ ఆర్టిస్టులు మరణించారు. తొలుత రాకేష్ పూజారి అనే కన్నడ నటుడు సెట్లో గుండెపోటుతో మరణించాడు. తర్వాత కొన్నాళ్లకు జూనియర్ ఆర్టిస్ట్ కపిల్.. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని సౌపర్ణిక నదిలో ప్రమాదవశాత్తు మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. కొన్నిరోజుల క్రితం కళాభవన్ అనే వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు.కర్ణాటకలోని మాణి జలాశయంలో శనివారం రాత్రి షూటింగ్ జరుగుతుండగా బోటు నీటిలో మునిగింది. ప్రమాద సమయంలో హీరో రిషభ్ శెట్టి సహా 30 మంది నటీనటులు, సిబ్బంది అందులో ఉన్నారు. అయితే సంఘటన జరిగిన తర్వాత వారందరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ షూటింగ్ సామాగ్రి మాత్రం నీటిపాలైంది. అయితే చిత్రీకరణ మొదలైనప్పటి నుంచి ఇలా వరస ప్రమాదాలు జరుగుతుండటంతో సినిమాకు ఏమైనా శాపం పట్టుకుందా అని నెటిజన్లు, అభిమానులు మాట్లాడుకుంటున్నారు. షూటింగ్ పూర్తయ్యేలోపు ఇంకెన్ని జరుగుతాయో ఏంటోనని అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో మస్ట్ వాచ్ థ్రిల్లర్.. నరాలు తెగే ఉత్కంఠ.. 'స్టోలెన్' రివ్యూ) -
మోస్ట్ వయొలెంట్ చిత్రానికి సీక్వెల్.. సారీ చెప్పిన ఉన్ని ముకుందన్!
మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ గతేడాది మార్కో మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మోస్ట్ వయొలెంట్గా టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం సూపర్ హిట్గా నిలిచింది. దాదాపు రూ.100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో సీక్వెల్గా కూడా ఉంటుందని అభిమానులు భావించారు. దీంతో ఓ అభిమాని సైతం మార్కో-2 ఎప్పుడొస్తుందని ట్విటర్ వేదికగా హీరోను ప్రశ్నించాడు.దీనికి ఉన్ని ముకుందన్ కూడా రిప్లై ఇచ్చారు. ఈ విషయంలో క్షమించండి.. మార్కో సిరీస్ను కొనసాగించాలనే ఉద్దేశాన్ని విరమించుకున్నానని తెలిపారు. ఈ ప్రాజెక్ట్పై ఎక్కువగా నెగెటివిటీ ఉంది.. అయితే మార్కో కంటే మంచి సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తా.. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. దీంతో మార్కో సీక్వెల్ వస్తుందని భావిస్తోన్న అభిమానులకు నిరాశ ఎదురైంది.కాగా..2024 డిసెంబర్లో విడుదలైన ‘మార్కో చిత్రంలో వయొలెన్స్ విపరీతంగా ఉన్నట్లు టాక్ వినిపించింది. దీంతో కొందరు మార్కో చిత్రంపై విమర్శలు కూడా చేశారు. అయినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన మార్కోను రూ. 30 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఈ చిత్రం మలయాళం, హిందీ భాషలలో ఒకేసారి విడుదల కాగా.. తెలుగు వెర్షన్ జనవరి 1న, తమిళ వెర్షన్ జనవరి 3న థియేటర్లలోకి వచ్చింది. -
మోహన్ బాబు 'పెద్ద' కోరిక.. మోహన్ లాల్ ఫన్నీ కౌంటర్
టాలీవుడ్ నుంచి త్వరలో రాబోతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'కన్నప్ప'. ఇదివరకే ప్రమోషన్స్ చేస్తున్నారు. శనివారం సాయంత్రం కొచ్చిలో.. నటుడు మోహన్ లాల్ చేతుల మీదగా ట్రైలర్ రిలీజ్ చేశారు. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇదే ఈవెంట్లో మోహన్ లాల్-మోహన్ బాబు మధ్య ఫన్నీ సంభాషణ జరిగింది. అలానే మోహన్ బాబు ఓ పెద్ద కోరికని బయటపెట్టారు. ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ హారర్ సినిమా)'కన్నప్ప'లో మలయాళ సూపర్స్టార్ మోహన్ లాల్ అతిథి పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే తాజాగా కొచ్చిలో ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే మోహన్ లాల్ మాట్లాడుతుండగా.. మీ సినిమాలో తాను విలన్ చేస్తానని మోహన్ బాబుతో అన్నాడు. బదులుగా మీ మూవీలో తాను విలన్గా మోహన్ బాబు చెప్పుకొచ్చాడు. అలా అయితే తొలి సీన్లో మిమ్మల్ని కాల్చి పడేస్తానని మోహన్ లాల్ అనేసరికి స్టేజీపై ఉన్నవాళ్లంతా నవ్వుకున్నారు.మరోవైపు ఇదే వేడుకలో మాట్లాడిన మోహన్ బాబు.. కేరళలో 'తుడరుమ్' చిత్రాన్ని 'కన్నప్ప' అధిగమించాలని తాను కోరుకుంటున్నట్లు మోహన్ బాబు తన మనసులో మాట బయటపెట్టారు. ఆ మూవీ కంటే ఒక్క రూపాయి ఎక్కువ 'కన్నప్ప'కు రావాలని తాను అనుకుంటున్నట్లు మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఏప్రిల్ చివర్లో రిలీజైన మోహన్ లాల్ 'తుడరుమ్'.. మలయాళంలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. కేవలం కేరళలోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మరి మోహన్ బాబు చాలా పెద్దగా ఆశపడుతున్నారు. చూద్దాం మరి ఆయన కోరిక నెరవేరుతుందో లేదో?(ఇదీ చదవండి: ఓటీటీలో మస్ట్ వాచ్ థ్రిల్లర్.. నరాలు తెగే ఉత్కంఠ.. 'స్టోలెన్' రివ్యూ)#Mohanlal: You be the hero, I’ll play the villain in that film.#MohanBabu: No, I really want to act as a villain in your film, please...#Mohanlal: Then I’ll shoot and kill you in the first scene in that film!— #Kannappa Event | Kochi pic.twitter.com/8fGqUsXGUc— Whynot Cinemas (@whynotcinemass_) June 14, 2025 -
హారర్ కామెడీగా ‘లోపలికి రా చెప్తా’
కొండా వెంకట రాజేంద్ర హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘లోపలికి రా చెప్తా’. మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ కీలక పాత్రలు పోషించారు. హర్రర్ బేస్డ్ కామెడీ ఎంటర్ టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మాస్ బంక్ మూవీస్ పతాకంపై లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పాటలు, పోస్టర్స్ అన్నింటినీ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని తెలుపుతూ.. చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ‘లోపలికి రా చెప్తా’ చిత్రం జూలై 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా తెలిపారు.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకట రాజేంద్ర మాట్లాడుతూ.. ‘‘మా చిత్రంలో హీరో క్యారెక్టర్ డెలివరీ బాయ్. అందుకే చిత్రంలోని మొదటి సాంగ్ను ఓ డెలివరీ బాయ్తో విడుదల చేయించాం. ఆ పాటకు చాలా మంచి స్పందన వచ్చింది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం. సెన్సార్ కార్యక్రమాలను పూర్తయ్యాయి. జూలై 5 న గ్రాండ్గా థియేటర్లలోకి సినిమాను తీసుకు రానున్నాం. ప్రతిష్టాత్మకమైన సరిగమ ఆడియో కంపెనీ ఈ చిత్ర ఆడియో హక్కులు దక్కించుకుంది. అవుట్ ఫుట్ చూసి టీమంతా ఎంతో హ్యాపీగా ఉన్నాం. కచ్చితంగా ప్రేక్షకులను మెప్పించే సినిమాగా ‘లోపలికి రా చెప్తా’ నిలుస్తుంది. సహకరించిన అందరికీ ధన్యవాదాలు. త్వరలోనే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుసుకుందాం’’ అని అన్నారు. -
ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ హారర్ సినిమా
మరో క్రేజీ హారర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకు తగ్గట్లే చాలా ఏళ్ల తర్వాత చివరి భాగాన్ని రిలీజ్ చేయగా, యావరేజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆ చిత్రం నెలలోనే డిజిటల్ స్ట్రీమింగ్ అయిపోతోంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: ఓటీటీలో మస్ట్ వాచ్ థ్రిల్లర్.. నరాలు తెగే ఉత్కంఠ.. 'స్టోలెన్' రివ్యూ)సీక్వెల్స్, ఫ్రాంచైజీల ట్రెండ్ మన దగ్గర రీసెంట్ టైంలో బాగా పాపులర్ అయింది. కానీ హాలీవుడ్లో మాత్రం చాలా ఏళ్ల నుంచి ఈ ట్రెండ్ కొనసాగుతోంది. అలా 'ఫైనల్ డెస్టినేషన్' అనే భయానక చిత్రాల ఫ్రాంచైజీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. చావులు ఎంత భయంకరంగా ఉంటాయో ఈ సినిమాలో చూపిస్తారు. 2000లో తొలి భాగం రిలీజ్ కాగా.. 2003, 2006, 2009, 2011లో వరసగా నాలుగు చిత్రాలు రిలీజయ్యాయి. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నాయి.ఈ ఫ్రాంచైజీలో భాగంగా చివరిదైన 'ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్' మూవీ.. గత నెల అంటే మే 16న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజైంది. ప్రస్తుతం ఇంకా ఆడుతోంది. అదే టైంలో ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రస్తుతం ఉత్తర అమెరికాలో అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ఓటీటీ ఫ్లాట్ఫామ్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాకపోతే అద్దె విధానంలో చూడొచ్చు. జూన్ 17 నుంచి అంటే ఈ మంగళవారం ఉదయం నుంచి మన దేశంలో రెంట్ విధానంలో స్ట్రీమింగ్ కానుంది. ఒకవేళ హారర్, భయానక చిత్రాలంటే ఇష్టముంటే దీన్ని ఓసారి ప్రయత్నించండి. వీలైతే ఒంటరిగానే చూడండి.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) -
ది రాజాసాబ్ హీరోయిన్కు చేదు అనుభవం.. పోలీసులు నిద్రలేచారు!
తంగలాన్ బ్యూటీ మాళవిక మోహనన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన నటిస్తోంది. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ది రాజాసాబ్లో కనిపించనుంది. మలయాళం, తమిళ చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్లోనూ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన మాళవిక మోహనన్ తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. ముంబయి లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. తన స్నేహితులతో కలిసి రాత్రి సమయంలో లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తుండగా కంపార్ట్మెంట్ వద్ద ఉన్న గ్లాస్ డోర్ నుంచి ఓ వ్యక్తి తమవైపే చూస్తూ ముద్దిస్తావా అని సైగలు చేశాడని తెలిపింది. ఆ సమయంలో తీవ్ర భయాందోళనకు గురైనట్లు మాళవిక పంచుకుంది. ముంబయి లాంటి నగరంలో మహిళల భద్రత లేదని నటి మాళవిక మోహనన్ తెలిపింది.అయితే ఈ వార్త చూసిన ముంబయి పోలీసులు ఆమె జరిగిన ఘటనపై స్పందించారు. మాళివిక గారు మేము మీ గురించి వార్తల్లో చూశాం.. మీకెదురైన అనుభవాన్ని పంచుకున్నారు. నగరంలో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అనుభవాలు ఆశ్చర్యకరంగా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి. నగరంలో రోజులో ఏ సమయంలో లేదా ఏ ప్రదేశంలోనైనా.. దయచేసి 112 లేదా 100 నంబర్లో మమ్మల్ని సంప్రదించండి. మేము వీలైనంత త్వరగా మీకు అండగా నిలుస్తామని తెలిపారు.(ఇది చదవండి: రాత్రి ట్రైన్లో ప్రయాణం.. ఏకంగా ముద్దిస్తావా? అని అడిగాడు: మాళవిక మోహనన్)ముంబయి పోలీసులు తమ పోస్ట్లో రాస్తూ..'ముంబై నగరం ఎల్లప్పుడూ మహిళలకు సురక్షితంగా ఉంటుంది. భద్రత మరింత మెరుగుపరచడానికి మేము ఎలాంటి చర్యలకైనా సిద్ధం. నేరస్థుడిని తగిన విధంగా.. చట్టబద్ధంగా శిక్షిస్తాం. దయచేసి మీ పేరును ఉపయోగించి ఈ విషయాన్ని వ్యాప్తి చేయండి. ఇలాంటి సమస్యలను పరిష్కరించడంలో బాగా సహాయపడుతుంది.' అని విజ్ఞప్తి చేశారు. Ms @MalavikaM_ We came across an article in an online portal of a newspaper, which you shared your experince and raised concern over women safety in the city. We can imagine that experiences like these can be startling and leave a long term impact. Thus we must reiterate…— मुंबई पोलीस - Mumbai Police (@MumbaiPolice) June 14, 2025 -
అప్పుడు ‘నంది’..ఇప్పుడు ‘గద్దర్’..రెంటాల అరుదైన ఘనత
రచయిత, పరిశోధకుడు, సీనియర్ జర్నలిస్టు, ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది అవార్డు గ్రహీత అయిన డాక్టర్ రెంటాల జయదేవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘గద్దర్ ఫిల్మ్ అవార్డు’ను అందుకున్నారు. సినీ రంగాన్ని ప్రోత్సహిస్తూ, ఉత్తమ తెలుగు చిత్రాలకు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం ప్రారంభించిన గద్దర్ ఫిల్మ్ అవార్డులలో భాగంగా ‘తెలుగు సినిమాపై వచ్చిన ఉత్తమ రచనల’ కేటగిరీలో జయదేవ రాసిన పుస్తకానికి 2024వ సంవత్సరానికి గాను ఈ గౌరవం లభించింది. మరుగున పడిపోయిన మన సినీ చరిత్రలోని అనేక అంశాలను తవ్వితీసి, జయదేవ రచించిన ‘మన సినిమా... ఫస్ట్ రీల్’ పుస్తకాన్ని ‘ఉత్తమ సినీ గ్రంథం’గా రాష్ట్ర ప్రభుత్వ జ్యూరీ ఎంపిక చేసింది. శనివారం హైదరాబాద్లో వైభవంగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి గద్దర్ అవార్డు సిల్వర్ మెమెంటో, ప్రశంసాపత్రం, నగదు బహుమతిని జయదేవకు అందజేశారు. ఈ సందర్భంగా వేదికపై ‘మన సినిమా... ఫస్ట్ రీల్’ పుస్తకం ప్రతిని ఉప ముఖ్యమంత్రి అందుకొని, రచయితను అభినందించారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం సినిమా అవార్డులు ప్రకటించడం ఇదే తొలిసారి. ఆ తొట్టతొలి అవార్డే రెంటాల జయదేవను వరించడం విశేషం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంది అవార్డులుగా పాపులరైన ఈ పురస్కారాల్లో... గతంలో 2011వ సంవత్సరానికి గానూ జయదేవకు ‘ఉత్తమ సినీ విమర్శకుడు’గా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వ గౌరవం సైతం అందుకున్నారు. తాజా గద్దర్ అవార్డుతో... అటు నంది, ఇటు గద్దర్... రెండూ సాధించి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ పురస్కార విజేత అయిన తొలి జర్నలిస్టు అనే అరుదైన రికార్డు జయదేవకు దక్కింది. -
' ఆడవాళ్లు నిప్పు పట్టకూడదు'.. ఆసక్తిగా 8 వసంతాలు ట్రైలర్
అనంతిక సానిల్ కుమార్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం '8 వసంతాలు'. ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే ఒక అమ్మాయిల జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'చూడమ్మా ఆడవాళ్లు నిప్పు పట్టకూడదు.. కర్మకాండలు, అంత్యక్రియలకు వాళ్లు పనికిరారు' అనే డైలాగ్తోనే ఈ సినిమా ట్రైలర్ మొదలైంది. ఈ చిత్రంలో రవితేజ దుగ్గిరాల, హనురెడ్డి, కన్న పసునూరి కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.8 years of a woman's joy, tears and lessons. Witness her journey on the big screens ✨#8VasantaluTrailer out now ❤🔥▶️ https://t.co/pafCjIEa2D#8Vasantalu grand release worldwide on June 20th.Directed by #PhanindraNarsettiProduced by @MythriOfficialStarring… pic.twitter.com/8C5x3Noi8V— Mythri Movie Makers (@MythriOfficial) June 15, 2025 -
'భాయ్ ఇంకా మనతోనే ఉన్నారు'.. సుశాంత్ సోదరి ఎమోషనల్ పోస్ట్
ధోని మూవీలో అభిమానులను అలరించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్. పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన సుశాంత్ ఊహించని రీతిలో మృతి చెందారు. నేటికి సుశాంత్ మనకు దూరమై ఐదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సుశాంత్ను గుర్తు చేసుకున్న అతని సోదరి శ్వేతా సింగ్ కీర్తి ఎమోషనల్ పోస్ట్ చేసింది. తనను చాలా మిస్సవుతున్నట్లు రాసుకొచ్చింది. భౌతికంగా మీరు లేకపోయినా మాతో పాటు అభిమానుల గుండెల్లో నిలిచి ఉన్నారంటూ ఎమోషనలైంది. శ్వేత ఇన్స్టాలో రాస్తూ..' మా అన్న జూన్ 14, 2020న ఈ లోక విడిచి వెళ్లిపోయారు. ఇప్పుడు సీబీఐ కోర్టుకు ఒక నివేదికను సమర్పించింది. దాని కోసం మేము ప్రయత్నిస్తున్నాం. కానీ ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్న ఏమిటంటే.. ఏమి జరిగినా దేవునిపై విశ్వాసం కోల్పోకండి. మన సుశాంత్ జీవితాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. అతని చిరునవ్వు, చిన్నపిల్లవాడిలాంటి అమాయకత్వం ఎవరి హృదయాన్నైనా ప్రేమతో కదిలించగలదు. మన సుశాంత్ దేనికోసం నిలబడ్డారో.. మనం దానికోసం నిలబడాలి' అంటూ రాసుకొచ్చింది.'భాయ్ ఎక్కడికీ వెళ్లలేదు. అతను మీలో, నాలో, మనందరిలోనే ఉన్నాడు. మనం మరింత నేర్చుకోవాలనుకునే ప్రతిసారీ అతన్ని గుర్తు చేసుకుందాం. అతనికి ఇష్టం లేని నెగెటివ్ భావనను వ్యాప్తి చేయడానికి భాయ్ పేరును ఎప్పుడూ ఉపయోగించవద్దు. ఎందుకంటే సుశాంత్ దాని కోసం నిలబడలేదు. భాయ్ ఎంత మంది హృదయాలను ప్రభావితం చేశాడో చూడండి. అన్న పేరును నిలిచిపోయేలా చేయండి.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.కాగా.. సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14, 2020న ముంబైలోని తన అపార్ట్మెంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాపు. ఆ తర్వాత కొందరు ఆత్మహత్యగా భావించారు. కానీ ఆయన కుటుంబం న్యాయం కోసం ఇప్పటికీ పోరాడుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దాదాపు ఐదేళ్ల తర్వాత.. ఆరోపణలను నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదని పేర్కొంటూ సీబీఐ నివేదికను కోర్టుకు సమర్పించింది. View this post on Instagram A post shared by Shweta Singh Kirti (@shwetasinghkirti) -
ఓటీటీలో మస్ట్ వాచ్ థ్రిల్లర్.. నరాలు తెగే ఉత్కంఠ
ఓటీటీలో ఎప్పటికప్పుడు బోలెడన్ని కొత్త సినిమాలు వస్తుంటాయి. కొన్ని మాత్రమే నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. భాషతో సంబంధం లేకుండా మస్ట్ వాచ్ అనిపించుకుంటూ ఉంటాయి. అలాంటి ఓ మూవీ గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. కేవలం గంటన్నర నిడివితో రిలీజైన ఈ చిత్రం.. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియెన్స్ ఇస్తోంది? అదే 'స్టోలెన్'. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?ఓ చిన్న ఊరి రైల్వే స్టేషన్. జుంపా(మియా మేల్జర్) అనే మహిళ.. ఐదు నెలల తన కూతురితో ఫ్లాట్ఫామ్పై నిద్రపోతుంటుంది. మరో మహిళ సైలెంట్గా ఈ పాపని ఎత్తుకుపోతుంది. అదే టైంలో ట్రైన్ దిగి సోదరుడి కోసం ఎదురుచూస్తున్న రామన్(శుభం).. పాపని ఎత్తుకుపోయిన దొంగ అని జుంపా అనుమానిస్తుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగుతారు. కేసు నమోదు చేస్తారు. కాసేపటి తర్వాత అక్కడికి వచ్చిన రామన్ సోదరుడు గౌతమ్(అభిషేక్ బెనర్జీ) కూడా.. ఈ వ్యవహారంలో ఇరుక్కుంటాడు. ఇంతకీ పాపని ఎత్తుకెళ్లింది ఎవరు? ఊరి ప్రజలు.. అన్నదమ్ములపై ఎందుకు దాడి చేశారు? చివరకు పాప దొరికిందా లేదా అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సీట్ ఎడ్జ్ థ్రిల్లర్.. ఈ మాట గతంలో మీరు చాలాసార్లు వినే ఉంటారు. 'స్టోలెన్' చూస్తున్నంతసేపు మీరు కచ్చితంగా అదే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎలాంటి అనవసర హంగామా లేకుండా స్ట్రెయిట్గా స్టోరీలోకి వెళ్లడంతో సినిమా మొదలవుతుంది. అక్కడి నుంచి 90 నిమిషాల పాటు నాన్స్టాప్గా కథ పరుగులు పెడుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే వచ్చే ట్విస్టులు మనకు మతిపోయేలా చేస్తాయి. చివరకు ఓ మంచి మూవీ చూసిన అనుభూతి కలుగుతుంది.2017లో అసోంలో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా 'స్టోలెన్' సినిమా తీశారు. ఓ చిన్న ఊరిలోని రైల్వే స్టేషన్లో పాప కిడ్నాప్ కావడంతో మూవీ మొదలవుతుంది. పాపని ఎత్తుకుపోయిన కాసేపటికి నిద్రలేచిన తల్లి.. స్టేషన్లో ఓ వ్యక్తిని చూసి అనుమానిస్తుంది. కొంతసేపటి తర్వాత అసలు దొంగ ఎవరో ఆమెకు తెలుస్తుంది. కానీ అనుమానిత వ్యక్తి, అతడి సోదరుడు కూడా పోలీసుల దగ్గర ఇరుక్కుంటారు. సదరు వ్యక్తి అతి మంచితనం వల్ల.. గాలికి పోయే వ్యవహారాన్ని కాలికి తగిలించుకుంటాడు. అక్కడి నుంచి అన్మదమ్ములు ఎలాంటి కష్టాలు పడ్డారు? ఇంతకీ ఆ పాప.. సదరు మహిళ కూతురేనా? లేదంటే ఆమె కూడా దొంగతనంగా ఎత్తుకొచ్చిందా అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి.సినిమా చూస్తున్నప్పుడు మనం ఊహించింది జరగనప్పుడే థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఇందులో కేవలం నాలుగైదు పాత్రలే ఉంటాయి. అవి ప్రవరిస్తున్న విధానం చూసి వీడు మంచోడు, ఈమె చెడ్డది అని అనుకుంటాం. కానీ స్టోరీ ముందుకెళ్లేకొద్దీ మనం అనుకున్నది జరగదు. అదే టైంలో సాదాసీదాగా మొదలైన ఓ ఇన్వెస్టిగేషన్ డ్రామా కాస్త థ్రిల్లర్గా మారుతుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న పిల్లల అక్రమ రవాణా, సరోగసి గురించి సరికొత్త నిజం తెలుస్తుంది. కానీ చూస్తున్నంతసేపు మనం కూడా సినిమాలోని పాత్రలతో పాటు ఉన్నామా అనే అనుభూతి కలుగుతుంది. ఈ విషయంలో మాత్రం దర్శకనిర్మాతలు పూర్తిగా సక్సెస్ అయ్యారు.ఎవరెలా చేశారు?ఓటీటీలో సినిమాలు-వెబ్ సిరీసులతో పరిచయమైన అభిషేక్ బెనర్జీ ఇందులో గౌతమ్ పాత్రలో కనిపించాడు. ఇతడిదే మెయిన్ రోల్. రియలస్టిక్ ఫెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. రామన్గా చేసిన శుభం, జుంపా రోల్ చేసిన మియా మేల్జర్ కూడా జీవించేశారు. మిగిలిన పాత్రధారులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.టెక్నికల్గా చూస్తే చాలా బ్రిలియంట్ మూవీ. డైరెక్టర్ కరణ్ తేజ్పాల్కి ఇదే తొలి సినిమా. కానీ చూస్తున్నంతసేపు అలా ఎక్కడా అనిపించదు. సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే అయితే టాప్ నాచ్ ఉంటాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మూడ్కి తగ్గట్లు భలే కుదిరిందని చెప్పొచ్చు. మిగిలిన టెక్నీషియన్స్ కూడా అదరగొట్టేశారు. ప్రస్తుతానికి ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. ఒకవేళ మంచి రియలస్టిక్ థ్రిల్లర్ చూద్దామనుకుంటే మాత్రం 'స్టోలెన్' బెస్ట్ ఆప్షన్. -
వెండితెరపై మరోసారి జెస్సీ, కార్తీక్ల లవ్స్టోరీ
అక్కినేని నాగచైతన్యతో పాటు సమంతకు చాలా ప్రత్యేకమైన చిత్రం 'ఏమాయ చేసావె'(Ye Maaya Chesave). 2010 ఫిబ్రవరి 26న విడుదలైన ఈ చిత్రం 15 ఏళ్ల తర్వాత రీరిలీజ్ కానుంది. గౌతమ్ మేనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే సామ్ నటిగా తెరంగ్రేటం చేశారు. ఫిలింఫేర్ అవార్డ్తో పాటు స్పెషల్ జ్యూరీ విభాగంలో ఆమె నంది అవార్డ్ అందుకుంది. 'ఏమాయ చేసావె'తో నాగచైతన్య(Naga Chaitanya), సమంతలకు (Samantha) ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సినిమాతోనే వారు మొదటిసారి కలిసి పనిచేశారు. తర్వాత పెళ్లి వంటి తదితర అంశాల సంగతి తెలిసిందే. వారిద్దరి జీవితంలో చాలా ముఖ్యమైన చిత్రం ఇప్పుడు రీరిలీజ్ కానున్నడంతో ఫ్యాన్స్లో జోష్ మొదలైంది.జూలై 18న 'ఏమాయ చేసావె' రీరిలీజ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జెస్సీ పాత్రలో కనిపించిన సమంత.. మొదటి చిత్రంతోనే భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. ఏ.ఆర్.రెహ్మాన్ అందించిన సంగీతం నేటికీ విశేషంగా ఆదరించబడుతోంది. కార్తీక్ (నాగచైతన్య) అనే యువ అసిస్టెంట్ డైరెక్టర్కి, తనకంటే రెండేళ్ళు పెద్దదైన జెస్సీ అనే మలయాళ క్రిష్టియన్ అమ్మాయి మధ్య నడిచిన ప్రేమాయణం ఇందులో చక్కగా దర్శకుడు చూపించారు. ఈ ప్రయాణంలో వారు వారి కుటుంబాల నుంచి ఎదురుకున్న ఒడిదుడుకుల నేపథ్యంలో సాగే ఈ సినిమా ఏకకాలంలో తమిళంలో కూడా విడుదలైంది. అక్కడ 'విన్నైతాండి వరువాయా' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో శింబు, త్రిష ముఖ్య పాత్రల్లో నటించారు. కానీ ఈ సినిమా హిందీలో 'ఏక్ థా దీవానా' పేరుతో రీమేక్ అయింది. అక్కడ మాత్రం పరాజయం చవి చూసింది. -
హీరోయిన్గా ఊర్వశి కూతురు 'తేజలక్ష్మి'.. మొదటి సినిమా ఇదే
నటి ఊర్వశి వారసురాలు హీరోయిన్గా రంగప్రవేశం చేశారు. అమ్మ పాత్రలకు, అమాయకపు రోల్స్కు, ఎక్స్ప్రెషన్స్తోనే నవ్వించగల పాత్రలకు పెట్టింది పేరు ఊర్వశి. ఈమె అసలు పేరు కవిత రంజిని. కేరళలో పుట్టి పెరిగిన ఈమె చైల్డ్ ఆర్టిస్ట్గా వెండితెరకు పరిచయమైంది. ముందనై ముడిచ్చు అనే తమిళ సినిమాతో హీరోయిన్గా మారింది. కొంతకాలంపాటు హీరోయిన్గా నటించిన ఆమె ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలుపుకుని 700కు పైగా చిత్రాలు చేసింది.ఊర్వశి ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. అయితే, గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కుమార్తె 'తేజ లక్ష్మి' సినీ ఎంట్రీ ఉంటుందని ప్రకటించింది. ఆమె చెప్పినట్లుగానే తాజాగా తన మాతృభాష మలయాళీ ఇండస్ట్రీలో తేజ లక్ష్మి అడుగుపెట్టింది. నటి ఊర్వశి, నటుడు మనోజ్ జయన్ను ప్రేమించి 2000లో పెళ్లి చేసుకుంది. వారిద్దరికి జన్మించిన అమ్మాయే తేజ లక్ష్మి. ఆ తర్వాత మనోజ్తో విభేదాలు రావడంతో అతడితో విడాకులు తీసుకుని 2013లో శివ ప్రసాద్ని పెళ్లి చేసుకుని అతనితో కలిసి జీవిస్తోంది. కానీ తేజలక్ష్మి మాత్రం తన తండ్రితోనే కలిసి ఉంటోంది.మలయాళంలో 'సుందరియాయవల్ స్టెల్లా' అనే చిత్రంలో కథానాయికగా తేజ లక్ష్మి నటిస్తుంది. నటుడు మనోజ్ కే.విజయన్ తన కూతురు కథానాయకిగా ఎంట్రీ గురించి ఒక భేటీలో ఇలా మాట్లాడారు. 'తేజలక్ష్మికి సినిమాల్లో నటించాలనే కోరిక ఉన్నట్లు మొదట నా రెండో భార్య నాకు చెప్పింది. దీంతో వెంటనే నా కూతురికి ఒక సలహా ఇచ్చాను. ముందు మీ అమ్మ ఊర్వశికి చెప్పి ఆశీస్సులు తీసుకోమని పంపాను. అలాగే ఊర్వశి కూడా ఆమెను మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. ఊర్వశి సమ్మతించకపోతే తేజలక్ష్మి కథానాయకి అయ్యేదే కాదు. ముందుగా మాతృభాషలో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన తేజలక్ష్మి తరువాత తమిళం, తెలుగులో కూడా ఎంట్రీ ఇస్తుంది.' అని ఆయన అన్నారు. View this post on Instagram A post shared by Teja Lakshmi🪬 (@mkt_999) -
‘సన్రైజర్స్’ ఓనర్తో పెళ్లి.. స్పందించిన అనిరుధ్!
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందన్(Anirudh Ravichander ) పెళ్లిపై ప్రతిసారి ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. గతంలో నటి ఆండ్రియాతో అనిరుధ్ పెళ్లి అనే ప్రచారం జరిగింది. అందులో కూడా వాస్తవం లేదని తేలింది. వారిద్దరు డేటింగ్ చేసినా..కొన్నాళ్లకు బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఆ తర్వాత కీర్తి సురేశ్తో పెళ్లి పక్కా అని కోలీవుడ్ అంతా కోడై కూసింది. కీర్తి పెళ్లయిన తర్వాత ఆ రూమర్స్ తగ్గిపోయాయి. ఇక ఇప్పుడు ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ పెళ్లిపై మరో రూమర్ బయటకు వచ్చింది. ఐపీఎల్లో కీలక జట్టు ‘సన్రైజర్స్ హైదరాబాద్’ అధినేత కావ్యా మారన్( kavya Maran)ని పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త గత రెండు రోజులుగా నెట్టింట చక్కర్లు కొట్టింది. 2014 నుంచి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో మాత్రం పెళ్లి చేసుకుంటారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై అనిరుధ్ స్పందించాడు. ‘‘నాకు పెళ్లా..? చిల్ అవ్వండి.. ఇలాంటి రూమర్స్ని స్ప్రెడ్ చేయకండి’అని అనిరుధ్ ట్వీట్ చేశాడు. దీంతో కావ్యా మారన్ తో పెళ్లి అనేది కూడా పుకారేనని తేలిపోయింది. అనిరుధ్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన రజనీకాంత్ కూలీ, విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు. దీంతో పాటు నాని, శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న రెండో చిత్రం %ప్యారడైజ్’కి కూడా అనిరుధే మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. -
నా సూపర్ హీరోని స్మరించుకుంటున్నా : చిరంజీవి
ఫాదర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన తండ్రికి నీరాజనం అర్పిస్తూ హృదయపూర్వక సందేశాన్ని పంచుకున్నారు. మనం స్థిరంగా ఉండడానికి, జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి నాన్న ఎంతో తోడ్పాటు అందిస్తారని చెబుతూ.. ‘నా తండ్రిని, నా సూపర్ హీరోని స్మరించుకుంటున్నాను’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. ‘తమ బలం, జ్ఞానం, ప్రేమతో జీవితాలను తీర్చిదిద్దే ప్రపంచంలోని అద్భుతమైన తండ్రులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు’ అని కోట్ చేశారు. కాగా, చిరంజీవి నాన్న వెంకట్రావు పోలీస్ కానిస్టేబుల్గా పనిచేశారు. ఉద్యోగ రీత్యా ఆయనకు పలు ప్రాంతాలకు బదిలీలు జరిగడంతో చిరంజీవి బాల్యం నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరు వంటి వివిధ ప్రాంతాల్లో గడిచింది. నాన్న సాధారణ పోలీసు అయినప్పటికీ తమను ఎంతో క్రమశిక్షణగా పెంచారని గతంలో చిరంజీవి గుర్తు చేసుకున్నారు. Fathers give us roots to stay grounded and wings to soar high in our lives. Remembering My father, My Super Hero and wishing a Happy Father’s Day to all the wonderful fathers of the world, who shape lives with their strength, wisdom and love ! 🙏#HappyFathersDay— Chiranjeevi Konidela (@KChiruTweets) June 15, 2025 -
గద్దర్ అవార్డ్స్: డిప్యూటీ సీఎం పేరు మర్చిపోయిన బాలయ్య..వీడియో వైరల్
నందమూరి బాలకృష్ణ స్పీచ్ గురించి తెలుగు ప్రజలకు తెలిసిందే. అచ్చమైన తెలుగు భాషలో మాట్లాడినా.. దానిని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. కొన్ని సందర్భాలలో అసలు అర్థమే కాదు. ఏదో చెప్పబోయి.. మరేదో చెబుతుంటారు. సినిమాల్లో పెద్ద పెద్ద డైలాగులను అవలీలగా చెప్పినా.. బయట మాత్రం చిన్న చిన్న పదాలను కూడా సరిగ్గా పలకలేక తడబడుతుంటారు. ఆ మధ్య దేశభక్తి గేయం ‘సారే జహాసె అచ్చా’కూడా సరిగ్గా పాడలేక ట్రోలింగ్కి గురయ్యారు. ఇక తాజాగా మరోసారి బాలయ్య నవ్వుల పాలయ్యారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేరు మర్చిపోయి.. దాన్ని కవర్ చేసేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టంట బాగా వైరల్ అయింది.(చదవండి: సీఎం రేవంత్ సమక్షంలో అల్లు అర్జున్ మాస్ డైలాగ్..వీడియో వైరల్)శనివారం సాయంత్రం హైటెక్స్లో జరిగిన గర్దర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి బాలకృష్ణ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుని ఇచ్చి సన్మానించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ అవార్డును అందజేశారు. అనంతరం బాలకృష్ణ వారికి ధన్యవాదాలు చెబుతూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో భట్టి పేరుని మర్చిపోయారు. ఆర్థిక, విద్యుత్ మంత్రి, డిప్యూటీ సీఎం బట్టి..(గ్యాప్ తీసుకున్నాడు).. మల్లు..(గ్యాప్ తీసుకున్నాడు) అంటూ పూర్తి పేరుని పలకడానికి తడబడ్డారు. చాలాసేపు నీళ్లు నములుకున్న తర్వాత పక్కనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అందించడంతో భట్టి పేరుని స్పష్టంగా పలికి ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. భట్టి విక్రమార్క పేరు మర్చిపోయిన బాలకృష్ణ pic.twitter.com/OMKPh0GUeo— Telugu Scribe (@TeluguScribe) June 14, 2025 -
కోటి తారల వీణ... సినీ తెలంగాణ
తారలు తళుకులీనాయి... నింగిలోని నక్షత్రాలు కూడా తొంగి చూశాయి. అశ్వత్థామలు, లక్కీ భాస్కర్లు, పుష్పరాజ్లు, ఇది చిన్న కథ కాదు అన్నట్టుగా మాదాపూర్ హైటెక్స్కు అరుదెంచారు. అలనాడు ఇంటింటా వెలిగిన జయప్రద, జయసుధ, సుహాసినిలను వేదిక మీద చూసి గృహిణిలు తెగ ముచ్చటపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ ‘దిల్’ రాజు ఈ వేడుకకు కర్త, కర్మలై శోభ తెచ్చారు. ఆటలు, పాటలు, కళాప్రదర్శనలు...చూడ్డానికి వెండితెర చాలదు! అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రాజమౌళి...చుక్కల్లో చందమామలుగా అభిమానులను అలరించారు. ఇంతకాలం ఎదురుచూసిన సినీ అవార్డుల వేడుకకు తెలంగాణ ప్రభుత్వం పదింతలు అట్టహాసం కలిపి నభూతో అన్నట్టుగా నిర్వహించింది. చిత్రమాలికను చిత్తగించండి...ఇది సినిమా అవార్డ్స్ గనక సరదాగా ఓ డైలాగ్ చెబుతా అంటూ... ‘‘ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా... గంగమ్మ జాతరలో యేట తలలు నరికినట్లు రప్పా రప్పా నరుకుతా ఒక్కొక్కడిని. పుష్ప..పుష్పరాజ్..అస్సలు తగ్గేదేలే’ అంటూ ‘పుష్ప 2’ సినిమాలోని డైలాగ్ చెప్పి, అల్లు అర్జున్ అలరించారు. ‘‘ప్రతిష్ఠాత్మక తెలంగాణ గద్దర్ అవార్డు ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ ఇనిషియేటివ్ తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారికి, ఉపముఖ్యమంత్రి భట్టిగారికి, ‘దిల్’ రాజుగారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. మై లవ్లీ డైరెక్టర్ సుకుమార్గారు లేక పోతే ఈ అవార్డు సాధ్యమయ్యేది కాదు. డార్లింగ్... ఐ లవ్ యూ. ఈ అవార్డు ప్యూర్గా మీ విజన్. ‘పుష్ప’ నిర్మాతలు, ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు టీమ్ అందరికీ ధన్యవాదాలు. రాజమౌళిగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే... మీరు ఆ రోజు ‘పుష్ప 1’ సినిమాను హిందీలో రిలీజ్ చేయమని చెప్పక పోయి ఉంటే, ఈ రోజు ఇంతటి రేంజ్ ఉండేది కాదు. ధన్యవాదాలు సార్. ఇది నాకు చాలా స్పెషల్ అవార్డు. ‘పుష్ప 2’ గెలిచిన మొదటి అవార్డు ఇది. ఈ అవార్డును నా అభిమానులకు అంకితం ఇస్తున్నాను. మిమ్మల్ని మరింత గర్వపడేలా చేస్తాను. నా ఆర్మీ (ఫ్యాన్స్ను ఉద్దేశిస్తూ..)కి థ్యాంక్స్.– నటుడు అల్లు అర్జున్కళామతల్లి ముద్దుబిడ్డ గద్దరన్న పేరు మీద, ఆయన పేరు చిరస్థాయిగా ఉండేలా గౌరవించి అవార్డులివ్వడం సంతోషం. ఒక దళిత కుటుంబంలో పుట్టి అంచలంచెలుగా ఎదుగుతూ ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం సం పాదించుకున్నారు గద్దర్ అన్న. ఆయన పేరు శాశ్వతంగా నిలిచి పోయేలా అవార్డులిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. 1996లో ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుని ప్రారంభించాం. ఎంతోమంది ఈ అవార్డుని పొందారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ అవార్డు ఇస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఎన్టీఆర్ కొడుకుగా నాన్నగారి అవార్డుని తీసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ అవార్డు ద్వారా నాకు ఇచ్చిన పది లక్షల నగదును బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పతిక్రి ఇచ్చినట్లు భావిస్తున్నాను. ఇందుకు రేవంత్ అన్నకి థ్యాంక్స్. – నటుడు నందమూరి బాలకృష్ణ (ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు) గద్దరన్న పేరు మీద ఈ అవార్డులు ప్రారంభించడం, సినిమా ఇండస్ట్రీ అందర్నీ ఒక వేదికపైకి తీసుకొచ్చి ఈ అవార్డులివ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు చాలా గర్వకారణమైన మూమెంట్. మహబూబ్నగర్లో పుట్టిన పిల్లోణ్ని.. కాంతారావుగారి పేరు మీద ఈ అవార్డు ఇవ్వడం అనేది ఆయనకు నిజమైన నివాళి. ఈ అవార్డు తీసుకుంటున్న మొదటి వ్యక్తిని నేను అయినందుకు చాలా బాధ్యతగా భావిస్తున్నాను.. ఇంకా ఎంతో చేయాలనిపిస్తోంది. ఈ అవార్డు ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డిగారికి, ఉప ముఖ్యమంత్రి విక్రమార్కగారికి, ‘దిల్’ రాజుగారికి థ్యాంక్స్’’.– నటుడు విజయ్ దేవరకొండ (కాంతారావు ఫిల్మ్ అవార్డు)పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఈరోజు తెలుగు సినిమాకు అవార్డులు ఇచ్చుకోవడం జరుగుతోంది. 2014 నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరానికి బెస్ట్ ఫిల్మ్, సెకండ్ బెస్ట్ ఫిల్మ్, థర్డ్ బెస్ట్ ఫిల్మ్ జ్యూరీ వారు సెలెక్ట్ చేశారు. బెస్ట్ ఫిల్మ్ను సెలెక్ట్ చేయడానికి జ్యూరీ అన్ని సినిమాలు చూసింది. నేషనల్ అవార్డ్ పొందిన సినిమాలు, రివ్యూస్ వచ్చిన సినిమాలు, కమర్షియల్గా బాగా ఆడిన సినిమాలు... ప్రతి సంవత్సరానికి మూడు సినిమాలుగా జ్యూరీ సెలెక్ట్ చేసింది. హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్కి ప్రతి సినిమాకి నాలుగు అవార్డులు ఇవ్వడానికి జ్యూరీ కమిటీ అడగడం, ప్రభుత్వం దాన్ని అంగీకరించి ఈరోజు ఆ అవార్డులు ఇవ్వడం జరుగుతోంది. అలాగే 2024లో అద్భుతంగా, కళాత్మకంగా వచ్చిన ఎన్నో చిన్న సినిమాలను జ్యూరీ సెలెక్ట్ చేయడం, వారికి కూడా ఈ రోజు అవార్డులు ఇచ్చుకోవడం ఆనందకరం.– ఎఫ్డీసీ ఛైర్మన్ ‘దిల్’ రాజుఎన్ని అవార్డులు ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం అవార్డు అనేది ఇండస్ట్రీకి మొదటి నుంచీ చాలా ప్రత్యేకం. ఈ అవార్డుల కోసం వేచి చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిగారు, ఎఫ్డీసీ చైర్మన్ ‘దిల్’ రాజుగారికి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిగార్లకు థ్యాంక్స్. మమ్మల్ని ప్రోత్సహించడానికి గద్దర్గారి పేరుమీద ఈ అవార్డులు పెట్టడం ఆనందంగా ఉంది. – దర్శకుడు సుకుమార్ (బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు)గద్దర్గారి పేరు మీద నిర్వహిస్తున్న ఈ అవార్డు ప్రదానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డిగారి చేతుల మీదుగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కగారి చేతుల మీదుగా అందుకుంటున్న ఈ పురస్కారం బాసర సరస్వతీ దేవి ఆశీర్వచనంగా భావిస్తున్నాను. – సంగీత దర్శకుడు కీరవాణిఎక్కడెక్కడ ఏం సాధించినా మన నేల మీద, మన వాళ్ల మధ్య ఇలాంటి గౌరవం పొందడం ఎప్పటికీ మరచి పోలేని విషయం. ఇందుకు తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డిగారికి ధన్యవాదాలు. – రచయిత చంద్రబోస్గద్దర్ పేరుపై ఫిల్మ్ అవార్డ్స్ను ఇవ్వడంతో పాటు గద్దర్ ఫౌండేషన్ కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ. 3 కోట్ల రూ పాయలను మంజూరు చేశారు. గద్దర్ తనయుడు, గద్దర్ ఫౌండేషన్ చైర్మన్ సూర్యకిరణ్ గద్దర్ ఈ వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చెక్ను స్వీకరించారు. ఈ సందర్భంగా సూర్యకిరణ్ గద్దర్ మాట్లాడుతూ– ‘‘రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్నగారికి, ఉపముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్కగారికి, రాష్ట్ర మంత్రులు, అవార్డులు స్వీకరించిన సినిమా ఇండస్ట్రీ అందరికీ అభినందనలు. రేవంత్ అన్నగారి ఆధ్వర్యంలో 31 జనవరి 2024న గద్దర్ ఫౌండేషన్ ని ప్రకటించడం జరిగింది. అదే విధంగా రేవంత్ రెడ్డిగారు ప్రామిస్ చేసినట్లుగానే ఈ అవార్డు వేడుకను ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారు. నాన్నగారి సాహిత్యం, నాన్నగారి విలువలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రోత్సహిస్తూ గద్దర్ ఫౌండేషన్ కి రూ. 3 కోట్లు కేటాయించడాన్ని ఫౌండేషన్ తరఫున మేం స్వాగతిస్తున్నాం. ఇందుకు గద్దర్ ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు సార్... ప్రతి సంవత్సరం మీరు చేపడుతున్న కల్చరల్‡అండ్ మెమోరియల్ రీసెర్చ్ సెంటర్కి స్థలం కేటాయిస్తున్నట్లుగా నెక్లెస్ రోడ్లో ప్రకటించారు సార్.. దాన్ని కూడా త్వరగా పూర్తి చేసి, వచ్చే సంవత్సరం జయంతి ఉత్సవాలు (గద్దర్), సినిమా వేడుకలు కూడా అక్కడే చేసుకుందామని కోరుతూ, మరోసారి గద్దర్ ఫౌండేషన్ నుంచి మీకు, భట్టి అన్నకు, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నాను’’ అన్నారు.‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు సాధించిన సంగీతదర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్లను ప్రత్యేకంగా సన్మానించారు -
హాలీవుడ్కు వేదికవ్వాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ సినీ పరిశ్రమ హాలీవుడ్కు హైదరాబాద్ వేదికగా మారాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. ఈ దిశగా సినీ పెద్దలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. భారతీయ సినిమా అంటే ఒకప్పుడు బాలీవుడ్ అని అందరూ భావించేవారు.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. భారతీయ సినిమాల్లో తెలుగు సినిమా ముందు వరుసలో ఉందని చెప్పారు. ఇకపై బాలీవుడ్కు హైదరాబాద్ వేదిక కానుందని పేర్కొన్నారు. శనివారం హైటెక్స్లో తెలంగాణ గద్దర్ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. 2014 నుంచి 2024 వరకు ఉత్తమ చలనచిత్రాలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ ప్రభుత్వం సినీ పరిశ్రమను గౌరవించి 1964లో నంది అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆ అనవాయితీ ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగింది. కొన్ని కారణాలవల్ల ఈ అవార్డుల పంపిణీ వాయిదా పడుతూ వచ్చింది. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటయ్యాక సినీ అవార్డుల ప్రదానంపై నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత ఇవాళ గద్దర్ పేరుతో అవార్డులు అందిస్తున్నాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ఒక అధ్యాయం ‘భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ. తెలుగు సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదికైంది. రాష్ట్ర ప్రభుత్వం కొంత కఠినంగా కనిపించినా అది మీ అభివృద్ధి కోసమే. తెలుగు సినీ పరిశ్రమకు ఏం కావాలో నాకు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మరో 22 ఏళ్లు నేను క్రియాశీల రాజకీయాల్లో ఉంటా. నేను ఏ హోదాలో ఉన్నా సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తా. ఐటీ పరిశ్రమలాగే సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం. 2047 విజన్ డాక్యుమెంట్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఒక అధ్యాయం కేటాయిస్తాం. నేను ఇటీవల నీతి అయోగ్ సమావేశంలో ప్రధాని మోదీకి తెలంగాణ విజన్ గురించి వెల్లడించాను. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేరుస్తాం. ఇప్పటివరకు నేను అనుకున్నవన్నీ సాధించాను. ఇది కూడా సాధ్యమవుతుందని 100 శాతం నమ్మకం ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు నాలుగో తరం కొనసాగుతోంది. గద్దరన్న అంటే ఒక విప్లవం.. ఒక వేగుచుక్క.. ఆయనే మాకు ఒక స్ఫూర్తిం. ఆ స్ఫూర్తితోనే మేం పోరాటాలు చేశాం. తెలంగాణ అభివృద్ధికి మీ అందరి సహకారం ఉండాలని కోరుతున్నా’ అని రేవంత్రెడ్డి అన్నారు. గద్దర్ ఫౌండేషన్కు రూ.3 కోట్లు గద్దర్ ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు గద్దర్ ఫౌండేషన్కు ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఫౌండేషన్కు అవసరమైన నిధులు కేటాయిస్తామని గతంలో గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమం, సాంస్కృతిక రంగంపై తనదైన ముద్ర వేసిన గద్దర్ సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతోంది. ఇక ముందు గద్దర్ జయంతి వేడుకల కార్యక్రమాల నిర్వహణలోనూ గద్దర్ ఫౌండేషన్కు భాగస్వామ్యం కల్పిస్తూ మరో ఉత్తర్వును ప్రభుత్వం జారీ చేసింది. -
మా నాన్న నాకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఫ్రీడమ్: హీరో తేజ సజ్జా
‘చూడాలని ఉంది, కలిసుందాం రా, గంగోత్రి, ఛత్రపతి’ తదితర చిత్రాలతో బాల నటుడిగా ప్రేక్షకులకు దగ్గరై, ‘ఓ బేబీ’తో లీడ్ యాక్టర్గా మారి, ఆ తర్వాత చేసిన ‘జాంబిరెడ్డి’తో ఆకట్టుకున్నారు తేజ సజ్జా. ‘హను–మాన్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తేజ ‘ఫాదర్స్ డే’ గురించి ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఈ విధంగా...⇒ నాకు ఊహ తెలిసినప్పట్నుంచి మా నాన్నగారు వృత్తి రీత్యా బిజీగా ఉండేవారు. కానీ ఆదివారం మాత్రం నన్ను కూడా తనతో పాటు ఆఫీస్కు తీసుకుని వెళ్లేవారు. అక్కడ అందరూ పని చేస్తుంటే ఆసక్తిగా గమనించేవాడిని. అలా వెళ్లడం వల్లనో ఏమో నా ఆరేళ్ల్ల వయసుకే స్కూలు, సినిమా షూటింగ్లు వంటి పరిసరాల్లో నేను చాలా మామూలుగా ఉండగలిగాను. ఎలాంటి బెదురు లేకుండా షూటింగ్ చేసేవాణ్ణి. ⇒ నా అల్లరి విషయానికొస్తే... ఒకసారి స్కూల్ నుంచి మా నాన్నగారికి ఫోన్ చేసి, ‘మీ అబ్బాయి బాగా అల్లరి చేస్తున్నాడు’ అని కంప్లైంట్ చేశారు. నాన్న చాలా కూల్గా... ‘వాడిని పెంచింది నేను. ఏం చేస్తాడో, ఏం చెయ్యడో నాకు బాగా తెలుసు. మీరేం చెప్పినా నమ్మను. వాడిని అడగను కూడా’ అని ఫోన్ కట్ చేశారు. నాన్న అంత నమ్మారు కాబట్టి అప్పట్నుంచి ఈరోజు వరకూ నా వల్ల ఆయనకు చిన్న ఇబ్బంది కూడా కలగకుండా జాగ్రత్తగా, క్రమశిక్షణతో ఉంటున్నాను. ⇒ నాన్నకి నేనంటే చాలా నమ్మకం. నా ఇష్టాయిష్టాలకు, నా నిర్ణయాలకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. చదువు, సినిమాలు... ఇలా నన్ను అన్ని విషయాల్లోనూ ప్రోత్సహించారు. యాక్చువల్లీ నాన్నకు మొదట్లో సినిమాలంటే ఇష్టం ఉండేది కాదు. ఒకటి, రెండు సినిమాలు అయ్యాక నేను షూటింగ్స్ను పిక్నిక్లా ఎంజాయ్ చేస్తున్నానని నన్ను వెళ్లనిచ్చారు. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అయ్యాక ధైర్యం చేసి, నాన్న దగ్గరికి వెళ్లి, ‘ఈ చదువు నా వల్ల కావడం లేదు. సినిమా ఇండస్ట్రీకి వెళ్తాను’ అనగానే టీవీ చూస్తున్న నాన్న కనీసం తల కూడా తిప్పకుండా ‘సరే నీ ఇష్టం’ అన్నారు. అలా ఒక్క మాట కూడా అడగకుండా నాకు ఇష్టమైన కెరీర్ని ఎంచుకునేలా ప్రోత్సహించేసరికి, ఒక బాధ్యతలా భావించి, పట్టుదలతో పని చేస్తున్నాను. ⇒ నా లైఫ్లో మా నాన్నే నా హీరో. ఒక మామూలు వ్యక్తిగా లైఫ్ స్టార్ట్ చేసి, తన వృత్తిలో ఉన్నత స్థాయికి ఎదిగారు. కుటుంబంలో ఉన్న అందరి బాధ్యతలతో పాటు... బంధువుల్లో ఎంతో మందికి చదువు, ఉద్యోగం, పెళ్లి వంటి వాటికి హెల్ప్ చేశారు. ⇒ మా నాన్నకు కుటుంబం తప్ప వేరే వ్యాపకం లేదు. ఆఫీసు, ఇల్లు, కుటుంబం... ఇదే ఆయన లోకం. చేసే పనిలో నిజాయితీ, నిబద్ధత, అంకితభావం ఎలా ఉండాలో నాన్నగారి నుండి నేర్చుకున్నాను. మనం చేసే పనికి నూటికి నూరు శాతం న్యాయం చెయ్యాలని నేర్చుకున్నాను. అలాగే లైఫ్లో జరిగే ప్రతీ విషయం గురించి అదే పనిగా ఆలోచించకుండా ‘ప్రశాంతంగా ఉండటం’ అనేది మా నాన్న నుంచి నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. ⇒ మా నాన్నగారికి ఇప్పుడు 64 ఏళ్లు. ఆయన ఉదయం 5 గంటలకు నిద్రలేచి, గంట వాకింగ్ చేస్తారు. తర్వాత ఆఫీసుకు వెళ్లడం. గత 30 ఏళ్లుగా ఇదే దినచర్య. నాకు క్రమశిక్షణ ఉంది కానీ... ఇలాంటి క్రమశిక్షణను అలవాటు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ⇒ మా నాన్నగారి 60వ పుట్టినరోజు సందర్భంగా నా సం΄ాదనతో ఆయనకి ఒక మంచి కారు కొని, గిఫ్ట్గా ఇచ్చాను. అప్పుడు ఆయన చాలా సంతోషించారు. ఈ ‘ఫాదర్స్ డే’కి మా నాన్నగారికి నేను ఇచ్చే గిఫ్ట్ అంటే ‘సాక్షి’కి ఇచ్చిన ఈ ఇంటర్వ్యూనే. మా నాన్నగారు ఈ ఇంటర్వ్యూ చదివి, ఇచ్చే రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నాను. ⇒ నాకు పదేళ్లు వచ్చేసరికి మా నాన్న నాతో ఒక ఫ్రెండ్లా బిహేవ్ చేయడం మొదలుపెట్టారు. అన్ని రకాల పనులు, విషయాల్లో నా ఒపీనియన్ అడిగి తెలుసుకునే వారు. ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో నా అబీప్రాయానికి కూడా విలువ ఇచ్చేవారు. నేను చాలా బాధ్యతగా ఉండటానికి అది చాలా ఇన్స్పైర్ చేసింది.⇒ నాన్న నాతో చెప్పే చిన్న చిన్న మాటలే నాకు లోతైన అవగాహన కలిగిస్తాయి. నా కెరీర్ పరమైన, రోజువారీ విషయాల్లో ఆయన కలుగజేసుకోరు. కానీ ఎదుటి వ్యక్తి నొచ్చుకోకుండా ఎలా సాఫ్ట్గా మాట్లాడాలో, మనం చెప్పే మాట ఎదుట వ్యక్తికి సులువుగా అర్థమయ్యేలా ఎలా మాట్లాడాలో అప్పుడప్పుడు చెబుతుంటారు.⇒ నా లైఫ్లో మా నాన్న నాకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అంటే... చాలా చిన్న వయసులోనే నాకు సంబంధించినవి నేనే ఎంచుకునే ఫ్రీడమ్. వీటివల్లే నేను సొసైటీలో తిరిగి, చాలామంది వ్యక్తులను కలిసి, అన్ని రకాల పరిస్థితులను దగ్గరగా చూసి, ఆలోచించి, అందుకు తగ్గట్టు ప్రవర్తించడం నేర్చుకున్నాను. సినిమా షూటింగ్, ఇతర పనులతో ఎంత బిజీగా ఉన్నా నాన్నతో కూర్చుని మాట్లాడతాను. అయితే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు వరుస సినిమాల వల్ల నిజంగానే నాన్నగారితో ఎక్కువ టైమ్ గడపడానికి కుదరడం లేదు. అదో చిన్న లోటులా అనిపిస్తుంటుంది. -
బర్త్ డే స్పెషల్
దక్షిణాదిలోని యంగ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళుతున్నారు శ్రీలీల. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ చిత్రాలతో బిజీ బిజీగా ఉన్న ఈ బ్యూటీ పుట్టినరోజు జూన్ 14న. ఈ సందర్భంగా తెలుగులో ఆమె నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్సింగ్, మాస్ జాతర, లెనిన్’ సినిమాల నుంచి ప్రత్యేక పోస్టర్స్ రిలీజ్ చేసి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలి΄ారు మేకర్స్. పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.అలాగే ‘ధమాకా’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో రవితేజ–హీరోయిన్ శ్రీలీల రెండోసారి జోడీగా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే... అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లెనిన్’.‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది’ కాదు అనేది ఉపశీర్షిక. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పై మూడు సినిమాల నుంచి శ్రీలీల బర్త్ డే స్పెషల్ పోస్టర్స్ విడుదల అయ్యాయి. -
సీఎం రేవంత్ సమక్షంలో అల్లు అర్జున్ మాస్ డైలాగ్..వీడియో వైరల్
తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న గద్దర్ సినిమా అవార్డుల వేడుకలో అల్లు అర్జున్కు ఉత్తమ నటుడి అవార్డు లభించింది. 2024 ఏడాదిగాను పుష్ప-2 మూవీకి అల్లు అర్జున్ ఈ అవార్డును దక్కించుకున్నాడు. ఈ సందర్బంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. పుష్ప 2 చిత్రానికి అందిన తొలి అవార్డు ఇది. తెలంగాణ ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. ఈ అవార్డు వేడుకను ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నాను’అన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పుష్ప-2 మూవీలోని మాస్ డైలాన్ని చెప్పి ఆకట్టుకున్నాడు. ఇది సినిమా ఫంక్షన్ కదా.. తన సినిమాలోని డైలాగ్ను చెప్పవచ్చా.. అని అడిగి మరీ అల్లు అర్జున్ ‘రప్పా రప్పా’ డైలాగ్ చెప్పాడు. -
ఘనంగా గద్దర్ అవార్డ్స్ ప్రదానోత్సవం.. విజేతలు వీళ్లే
హైదరాబాద్లోని అంగరంగ వైభవంగా గద్దర్ అవార్డుల వేడుక జరిగింది. 2014 నుంచి 2024 వరకు వచ్చిన సినిమాలు, నటీనటులకుగానూ ఈ పురస్కారాల ప్రదానం చేశారు. అవార్డ్తో పాటు సిల్వర్ మొమెంటో, రూ.5 లక్షల ప్రైజ్మనీ అందజేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు చాలామంది హాజరయ్యారు.అవార్డులు అందుకున్న విజేతలు వీళ్లేఉత్తమ నటుడు- అల్లు అర్జున్( 2024 ఏడాదికి గాను పుష్ప-2 మూవీ)ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ఉత్తమ చిత్రం : కల్కి 2898 ఏడీద్వితీయ ఉత్తమ చిత్రం : పొట్టేల్తృతీయ ఉత్తమ చిత్రం: లక్కీ భాస్కర్ఉత్తమ బాలల చిత్రం: 35 చిన్న కథ కాదుఉత్తమ ప్రజాదరణ చిత్రం: ఆయ్: మేం ఫ్రెండ్సండీఉత్తమ సహాయ నటుడు: ఎస్జే సూర్య (సరిపోదా శనివారం)ఉత్తమ సహాయ నటి: శరణ్య (అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్)ఉత్తమ సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో (రజాకార్)ఉత్తమ నేపథ్య గాయకుడు: సిధ్ శ్రీరామ్: ఊరుపేరు భైరవ కోన (నిజమే నే చెబుతున్నా)ఉత్తమ నేపథ్య గాయని:శ్రేయా ఘోషల్: పుష్ప2 (సూసేటి అగ్గిరవ్వ) ఉత్తమ కొరియోగ్రాఫర్: గణేష్ ఆచార్య (దేవర-ఆయుధపూజ)ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ: చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్స్టర్)ఉత్తమ హాస్యనటుడు: సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా2)ఉత్తమ స్క్రీన్ప్లే రచయితగా వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)ఉత్తమ సినిమాటోగ్రాఫర్: విశ్వనాథ్ రెడ్డి (గామి)ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: అధ్నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ)ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: నల్ల శ్రీను (రజాకార్)ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: అర్చనా రావు, అజయ్కుమార్ (కల్కి 2898 ఏడీ)ఉత్తమ ఎడిటర్: నవీన్ నూలి (లక్కీ భాస్కర్)ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్ (రాజు యాదవ్)ఉత్తమ కథా రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)ఉత్తమ ఆడియోగ్రాఫర్: అరవింద్ మేనన్ (గామి)ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: అరుణ్ దేవ్ (35: చిన్న కథ కాదు), హారిక (మెర్సీ కిల్లింగ్)ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ కమ్యూనల్ హార్మోనీ సోషల్ అప్లిస్ట్: కమిటీ కుర్రాళ్లు -
గ్రాండ్గా గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న గద్దర్ సినిమా అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్లోని హైటెక్స్ ఈ వేడుకకు వేదికైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాగా.. టాలీవుడ్ నుంచి సినీ ప్రముఖులు ఎంతోమంది హాజరయ్యారు. అయితే ప్రత్యేక్ష ఆకర్షణగా అల్లు అర్జున్ నిలిచాడు. బన్నీతో పాటు విజయ్ దేవరకొండ కూడా కనిపించడం విశేషం.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నిర్మాత దిల్ రాజు.. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2014 నుంచి 2024 వరకూ గద్దర్ అవార్డులను అందజేశారు. సదరు పురస్కార గ్రహీతలకు సిల్వర్ మెమొంటో, రూ.5 లక్షల ప్రైజ్ మనీతో పాటు ప్రశంసా పత్రం అందించారు. సినీ తారల రాకతో హైటెక్స్ ప్రాంగణం సందడిగా మారింది. వేల మంది ఈవెంట్కు హాజరయ్యారు.'గామి' సినిమాకుగాను ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా విశ్వనాథ్ రెడ్డి, ఉత్తమ్ ఆర్ట్ డైరెక్టర్గా అద్నితిన్ జిహానీ చౌదరి.. 'కల్కి 2898ఏడీ' సినిమాకు అవార్డులు అందుకున్నారు. ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ నల్ల శ్రీను (రజాకార్), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనా రావు- అజయ్ కుమార్ (కల్కి), ఉత్తమ ఆడియోగ్రాఫర్ అరవింద్ మేనన్ (గామి), ఉత్తమ ఎడిటర్ నవీన్ నూలి (లక్కీ భాస్కర్), ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్), ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్, ఉత్తమ స్టోరీ రైటర్ శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి) అవార్డులు అందుకున్నారు. -
దేశంలోనే ఖరీదైన సినిమా.. అట్లీ ఎలివేషన్స్
అల్లు అర్జున్.. 'పుష్ప 2' తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ గురించి ఇదివరకే రెండు వీడియోలు రిలీజ్ చేశారు. వీటి ద్వారా మూవీ ఏ రేంజులో ఉండబోతుంది? ఎంత భారీ ఎత్తున నిర్మించబోతున్నారనేది హింట్ ఇచ్చేశారు. కానీ ఇటు బన్నీ గానీ అటు అట్లీ గానీ రీసెంట్ టైంలో మీడియాకు దొరకలేదు. కాబట్టి వీడియోలతో అభిమానులు సరిపెట్టుకున్నారు. కానీ తాజాగా సత్యభామ యూనివర్సిటీలో డాక్టరేట్ అందుకున్న అట్లీ.. అల్లు అర్జున్తో చేయబోయే చిత్రం గురించి అదిరిపోయే విషయాలు బయటపెట్టాడు.(ఇదీ చదవండి: 'కన్నప్ప' ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?)'దేశంలోనే ఇదే ఖరీదైన సినిమా. చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నాం. సరికొత్త టెక్నాలజీ కూడా పరిచయం చేయబోతున్నాం. బడ్జెట్ ఎంతనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. సినిమా తీయడం వరకే నా బాధ్యత. విడుదల ఎప్పుడనేది నిర్మాత తీసుకునే నిర్ణయం బట్టి ఉంటుంది' అని అట్లీ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అట్లీ చెప్పిన దాని బట్టి చూస్తుంటే హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ఇదివరకు కాస్ట్ లీ మూవీస్ అంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల గురించి మాట్లాడుకునేవాళ్లు. త్వరలో అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటారేమో. ఇందులో బన్నీ.. మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించబోతున్నాడని సమాచారం. అందుకు తగ్గట్లే దీపికా పదుకొణెని ఇదివరకే హీరోయిన్గా ప్రకటించారు. వీళ్లతో పాటు మృణాల్ ఠాకుర్, జాన్వీ కపూర్ కూడా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ముంబైలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైపోయిందని టాక్. ప్రస్తుతానికైతే అట్లీ చెప్పినవే అప్డేట్స్. మిగిలినవి త్వరలో బయటపెడతారేమో?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) "#AA22xA6 is the most expensive film of our country🫡📈. We are bringing many new technologies into the film🔥. It will make us all proud💯. I'm dreaming big, budget of the film is not yet locked🤞. Release date will be decided by the producer🤝"#Atlee | #AlluArjun pic.twitter.com/qwZx9LdMwp— AmuthaBharathi (@CinemaWithAB) June 14, 2025 -
యముడు: ధర్మో రక్షతి రక్షిత: పాట రిలీజ్
మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్గా ‘యముడు’ అనే చిత్రం రాబోతోంది. జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు 'ధర్మో రక్షతి రక్షితః' అనేది ఉప శీర్షిక. ఈ చిత్రంలో శ్రావణి శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ఇలా అన్నీ కూడా సినిమా మీద అంచనాల్ని పెంచేసింది.తాజాగా ఈ చిత్రం నుంచి ‘ధర్మో రక్షతి’ అంటూ సాగే ఓ అద్భుతమైన పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు వంశీ సరోజిని వికాస్ సాహిత్యాన్ని అందించగా.. సాయి చరణ్ భాస్కరుణి, అరుణ్ కౌండిన్య, హర్ష వర్దన్ చావలి ఆలపించారు. భవానీ రాకేష్ అందించిన బాణీ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకున్న ‘యముడు’ రిలీజ్ డేట్ను త్వరలోనే ప్రకటించనున్నారు. -
కాంతారను వెంటాడుతున్న విషాదాలు.. ఎందుకిలా జరుగుతోంది?
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) నటించిన బ్లాక్బస్టర్ మూవీ కాంతార (Kantara Movie). 2022లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. సుమారు రూ.16 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. భారీ సక్సెస్ సాధించిన ఈ చిత్రానికి మేకర్స్ ప్రీక్వెల్ (కాంతార: చాప్టర్ 1) ప్రకటించారు.అయితే ఏ ముహూర్తాన కాంతార 1 ప్రకటించారో కానీ అప్పటినుంచి ఏదో ఒక అడ్డంకులు, విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కాంతార నటుడు, మలయాళ మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ విజు (43) గుండెపోటుతో మరణించాడు. తీర్థహళ్లిలో చిత్రయూనిట్తో బస చేసిన అతడికి బుధవారం రాత్రి ఛాతీలో నొప్పి వచ్చింది. ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే కన్నుమూశాడు. ఇతడు మాలికాపురం, మార్కో వంటి పలు చిత్రాల్లో నటించాడు. 25 ఏళ్లుగా మిమిక్రీ రంగంలో రాణిస్తున్నాడు.గతంలో..షూటింగ్ ప్రారంభించిన కొత్తలో కర్ణాటకలోని ముడూరులో 20 మంది జూనియర్ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగనప్పటికీ పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకసారేమో తీవ్రమైన గాలివాన వల్ల భారీ సెట్ కూలిపోయింది. ఇటీవల మలయాళ జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తూ నదిలో మునిగి విగతజీవిగా తేలాడు. ఆ తర్వాత కన్నడ నటుడు, హాస్య నటుడు రాకేశ్ పూజారి (33) గుండెపోటుతో మరణించాడు. ఇప్పుడు కళాభవన్ కన్నుమూశాడు. ఈ వరుస విషాదాలు కాంతార చిత్రయూనిట్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి.అడవిలో పేలుళ్లుఅయితే నియమాలను ఉల్లంఘించి అటవీ ప్రాంతంలో కాంతార సినిమా చిత్రీకరిస్తున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో ఆరోపణలు వచ్చాయి. అడవిలో పెద్ద మంటలు వేసి షూటింగ్ చేస్తున్నారని, పేలుళ్లతో ఏనుగులు బెదిరిపోయి గ్రామాల మీదకు వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ విషయం అక్కడి అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రె దృష్టికి రాగా.. తక్షణమే షూటింగ్ ఆపేయాలని అధికారులను ఆదేశించారు.ఇకపోతే పంజుర్లి దేవుడి ఆగ్రహంతోనే ఇలా జరుగుతోందన్న పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. కాంతార సినిమాతోనే పంజుర్లి దేవుడు గురించి వెలుగులోకి వచ్చింది. పంజుర్లి అంటే పంది. చెడు చేసేవారిని శిక్షించి, మంచిని ఆశీర్వదించే భగవంతుడే పంజుర్లీ అని నమ్ముతారు.చదవండి: మా అక్కను పెళ్లి చేసుకుంటే 1+1 ఆఫర్.. అవాక్కైన హీరో -
'కన్నప్ప' ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?
మంచు విష్ణు హీరోగా నటిస్తూ, భారీ బడ్జెట్తో తీసిన సినిమా 'కన్నప్ప'. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోలు ఇందులో అతిథి పాత్రలు చేశారు. మోహన్ బాబు, కాజల్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. జూన్ 27న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్ర ఈవెంట్ తాజాగా కొచ్చిలో నిర్వహించారు. అక్కడే మోహన్ లాల్ చేతుల మీదుగా ఇప్పుడు ట్రైలర్ని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) ట్రైలర్ చూస్తుంటే విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. ప్రభాస్ స్క్రీన్ పెజెన్స్ కూడా అభిమానులకు నచ్చేలా ఉంది. గతంలో వచ్చిన కంటెంట్పై వచ్చింది. ట్రైలర్ని మాత్రం ట్రోలింగ్కి స్కోప్ లేకుండా బాగానే కట్ చేశారు. అలానే స్టోరీ ఏంటనేది కూడా చూచాయిగా చెప్పేశారు కూడా. సినిమా ఎలా ఉండబోతుందనేది కూడా ట్రైలర్తో శాంపిల్ చూపించేశారు.ఓ గూడెంలో నివసించే తిన్నడు (మంచు విష్ణు).. చిన్నప్పటి నుంచి దేవుడిని పెద్దగా నమ్మడు. పెద్దయిన తర్వాత కొన్ని సంఘటనల వల్ల గూడెం నుంచి ఇతడిని వెలివేస్తారు. అదే టైంలో నెమలి (ప్రీతి ముకుందన్)తో ప్రేమలో పడతాడు. తర్వాత శివుడు(అక్షయ్ కుమార్), రుద్ర(ప్రభాస్)ని భూమ్మీదకు పంపిస్తాడు. రుద్ర వల్ల తిన్నడు.. అతిపెద్ద శివభక్తుడు ఎలా అయ్యాడు? ఈ మొత్తం కథలో వాయు లింగం సంగతేంటి అనేదే స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: హైదరాబాద్ జట్టు ఓనర్తో అనిరుధ్ పెళ్లి?) -
అనసూయ ఒయ్యారాలు.. హల్దీ వేడుకల్లో 'బిగ్బాస్' శుభశ్రీ
ఒంపుసొంపులతో గ్లామర్ బెండ్ తీస్తున్న అనసూయహల్దీ వేడుక వీడియోని షేర్ చేసిన బిగ్బాస్ శుభశ్రీకొరియాలోని సియోల్లో కల్యాణి ప్రియదర్శినిమాళవిక మోహనన్ మత్తెక్కించే బాత్రూమ్ పోజులువయ్యారంగా చూస్తూ కిక్ ఇస్తున్న కోమలి ప్రసాద్నల్లంచు తెల్లచీరలో అరియానా ఫుల్ ఎంజాయ్హాట్ హాట్గా కనిపించేస్తున్న హీరోయిన్ నేహాశర్మ View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) -
హైదరాబాద్లో అత్యంత భారీ తెర.. వేచి ఉండక తప్పదు!
అత్యంత భారీ తెరపై సినీ అనుభవం కోసం.. హైదరాబాద్లోని సినీ ప్రియులు మరికొంత కాలం వేచి ఉండక తప్పదు. ఐ మ్యాక్స్ కార్పొరేషన్ ప్రకటనతో ఈ విషయం స్పష్టమైంది. పదేళ్ల క్రితం.. తెరమరుగై.. ఇటీవలే ఏషియన్ సినిమా గ్రూప్ అధిపతి సునీల్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నగరంలోని హకీంపేట ప్రాంతానికి సమీపంలో తమ ఆధ్వర్యంలో ఐమాక్స్ స్క్రీన్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే 70 అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్న స్క్రీన్ కోసం ప్రణాళికలను కూడా ఆయన వెల్లడించారు. ఇది ఐమాక్స్ అనుభవం కోసం ఆశగా ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఆనందాన్ని కలిగించింది. 2014లో ఐకానిక్ ప్రసాద్స్ ఐమాక్స్ తెర‘మరుగై’పోయిన దగ్గర నుంచి మళ్లీ ఐమాక్స్ తిరిగి రావాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారు ఐమాక్స్ మ్యాప్లో సిటీ తన స్థానాన్ని తిరిగి పొందే అవకాశం ఉందని సంతోషించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఖండించిన ఐమ్యాక్స్.. అయితే ఐమ్యాక్స్ కార్పొరేషన్ అధికారికంగా ఏషియన్ సినిమాస్తో భాగస్వామ్యం వార్తల్ని ఖండించింది. ఈ మేరకు ఐమ్యాక్స్ కార్పొరేషన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ప్రీతం డేనియల్, ఎక్స్లో పోస్ట్ చేసారు. దాంతో ఐమ్యాక్స్ నగరానికి ఇప్పట్లో రాదనే విషయం ఖరారైంది. దేశంలోనే తొలి ఐమ్యాక్స్ కలిగి ఉన్న నగరం అనే హోదాను పోగొట్టుకున్న సిటీ ఐమ్యాక్స్ తెరలు ఉన్న నగరాల జాబితాలో చేరడానికి కూడా మరింత కాలం వేచి ఉండక తప్పదు. The recent reports that IMAX is partnering with Asian Cinemas to bring an IMAX location to Hyderabad are entirely false. While IMAX is in conversation with multiple exhibitors about bringing IMAX to Hyderabad, no agreement is currently in place. IMAX is eager to expand into…— Preetham Daniel (@preethamdnl) June 11, 2025 -
పదేళ్ల వయసులోనే డైరెక్టర్.. గిన్నిస్ బుక్లో చోటు
ప్రతి వారం టీవీలోనో, ఓటిటి (OTT)లోనో, థియేటర్లోనో ఏదో ఒక సినిమా చూస్తూ ఉంటాం. సినిమా తీయడం టీమ్ ఎఫెర్ట్. చాలామంది కలిసి పని చేస్తేనే సినిమా తయారవుతుంది. వాళ్లందరూ ఏమేం చేయాలో చెప్పేవాడే డైరెక్టర్. అందుకే డైరెక్టర్ని ‘కెప్టెన్ ఆఫ్ ద షిఫ్’ అని పిలుస్తారు. ఎంతో అనుభవం, టాలెంట్ ఉంటే తప్ప డైరెక్టర్గా మారడం కష్టం. అలాంటిది పదేళ్ళ పిల్లాడు దర్శకుడిగా మారి సినిమా తీశాడంటే, ఆ సినిమా గిన్నిస్ బుక్ రికార్డ్స్లో చోటు సంపాదించిందంటే నమ్మడం సాధ్యమేనా? అవును సాధ్యమే! చిన్న వయసులోనే..ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసాడు కర్ణాటకకి చెందిన కిషన్ శ్రీకాంత్. బెంగళూరులో జన్మించిన కిషన్ చిన్నప్పటినుంచే సినిమాల మీద విపరీతమైన ఆసక్తి చూపించాడు. ఆ ఆసక్తి ఇష్టంగా మారి ఏకంగా సినిమాని డైరెక్ట్ చేసేదాక తీసుకెళ్లింది. 2006లో Care of Footpath సినిమాను పదేళ్ళ వయస్సులో కన్నడలో తీశాడు కిషన్. అనాథ బాలుడు విద్యను కాంక్షించే నేపధ్యంలో వచ్చిన ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, సౌరభ్ శుక్లా, జయశ్రీ వంటి ప్రముఖ నటులు నటించారు. అంతర్జాతీయంగా..మొత్తం ఐదు భారతీయ భాషల్లో డబ్ అయిన ఈ సినిమా 54వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో గోల్డెన్ లోటస్ అవార్డ్తో పాటు కర్ణాటక స్టేట్ అవార్డును గెలుచుకుంది. అంతర్జాతీయంగా కూడా సైప్రస్, ఇటలీ, దక్షిణ కొరియా ఫిలిం ఫెస్టివల్స్లో ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా, పూర్తి నిడివిగల ఫీచర్ ఫిలింని డైరెక్ట్ చేసినందుకు ‘అతి పిన్న ఫీచర్ ఫిలిం డైరక్టర్గా గిన్నిస్ బుక్లో రికార్డ్స్ సాధించాడు కిషన్.సినిమాలుఆ తరువాత కాలంలో Care of Footpath సీక్వెల్ను త్రిభాషా చిత్రంగా కన్నడ, హిందీ, తెలుగులో డైరెక్ట్ చేశాడు కిషన్. ఇందులో జువెనైల్ నేరాలు, న్యాయ వ్యవస్థ పనితీరుల గురించి చర్చించారు. ఇషా డియోల్, అవికా గోర్ నటించారు. ఈ రెండు సినిమాలతో పాటు Kill Them Young (2015), Teenage (2013), Enidu Manasali (2014), Maanja (2016) వంటి సినిమాలను డైరెక్ట్ చేశాడు. మరికొన్నిట్లో నటించాడు కూడా! -
మా అక్కను పెళ్లి చేసుకుంటే 1+1 ఆఫర్.. అవాక్కైన హీరో
అశ్విని శ్రీ (Ashwini Sree).. పలు సినిమాల్లో చిన్నాచితకా పాత్రలు చేసినా రాని గుర్తింపు బిగ్బాస్ షోతో వచ్చింది. తెలుగు బిగ్బాస్ ఏడో సీజన్లో పాల్గొన్న ఈమె షోకు గ్లామర్ అద్దింది. ప్రస్తుతం బుల్లితెర షోలలో సందడి చేస్తోంది. తాజాగా ఓ డ్యాన్స్ షోలో అశ్విని చేసిన కామెంట్లు నెట్టింట వైరల్గా మారాయి. ఆ డ్యాన్స్ షోలో హీరో అడివి శేష్ గెస్టుగా రావడాన్ని చూసి ఈ బిగ్బాస్ బ్యూటీ సర్ప్రైజ్ అయింది. మా అక్కకు మీరంటే చాలా ఇష్టం అని శేష్కు చెప్పింది. అక్కను పెళ్లి చేసుకుంటే..అందుకా హీరో.. నాక్కూడా మీ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టమని బదులిచ్చాడు. అప్పుడు అశ్విని.. మీరు మా అక్కను పెళ్లి చేసుకున్నారనుకోండి. మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్ వస్తుంది. అంటే అక్కను పెళ్లి చేసుకుంటే నేనూ వస్తాను అనేసరికి శేష్ నోరెళ్లబెట్టాడు. అయితే ఎలా వస్తాననేది కూడా చెప్తాననేసరికి హీరో నవ్వుతూనే సరేనని బదులిచ్చాడు. సదరు డ్యాన్స్ షో ప్రోమోలో ఇంతవరకే చూపించారు. ఏదేమైనా అశ్విని మాట్లాడిన తీరుకు అక్కడున్న జనం నవ్వాపుకోలేకపోయారు. ఇలా ట్విస్టులు ఇచ్చుకుంటూ మాట్లాడేబదులు అసలు విషయమేంటో డైరెక్ట్గా చెప్పొచ్చుగా అని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: 11A సీట్.. 1998లో అచ్చం ఇలాగే.. రెండో జన్మ ఎత్తిన సింగర్! -
తెలుగు నటి కల్పికపై మరో కేసు
కొన్నిరోజుల క్రితం హైదరాబాద్లోని ఓ క్లబ్లో నటి కల్పిక నానా హంగామా చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈమెపై మరో కేసు నమోదైంది. ఇన్ స్టాలో తనని అసభ్య పదజాలంతో దూషించిందని కీర్తన అనే యువతి.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించింది. ఆన్ లైన్ వేదికగా తనని వేధిస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలని కూడా కీర్తన.. పోలీసులకు అందించారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'టూరిస్ట్ ఫ్యామిలీ' దర్శకుడితో నాని.. పోస్ట్ వైరల్)కల్పిక గతంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'పడిపడి లేచే మనసు' తదితర సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకుంది. కానీ గత రెండు మూడేళ్ల నుంచి ఈమెకు పెద్దగా అవకాశాలు రావట్లేదు. ఈ క్రమంలోనే కొన్నిరోజుల క్రితం ఓ క్లబ్లో తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకునేందుకు వెళ్లి రచ్చ చేసింది. అదికాస్త పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేశారు.అయితే కల్పిక వ్యవహారం చూస్తుంటే ఈమె ఏమైనా బిగ్బాస్ షోలో అడుగుపెడుతుందా అనే అనుమానం వస్తోంది. ఎందుకంటే గతేడాది కూడా ఇలానే ఆర్జే శేఖర్ బాషా.. రాజ్ తరుణ్-లావణ్య వ్యవహారంలో ఉన్నాడు. అలా ఇతడిపై పోలీసులు కేసు కూడా పెట్టారు. ఇది జరిగిన కొన్నిరోజులకే బిగ్బాస్ హౌసులో అడుగుపెట్టాడు. మరి కల్పిక కూడా ఇలా ఏమైనా చేస్తుందా అనేది చూడాలి?(ఇదీ చదవండి: హైదరాబాద్ జట్టు ఓనర్తో అనిరుధ్ పెళ్లి?) -
Bhool Chuk Maaf Review: తెల్లారితే పెళ్లి.. కానీ రోజు మారదు.. ఇదేం ట్విస్ట్!
ఈ రోజుల్లో తాము చేసిన తప్పుని తెలుసుకొని సరిదిద్దుకునే వాళ్ళు అరుదుగా ఉంటారు. చాలామంది భయం లేకుండానే తప్పులు చేస్తుంటారు. మరి తప్పు చేసినవాడికి తన తప్పు తెలుసుకోవడానికి చిన్న పాటి భయం కలిగిస్తే అన్న ఆలోచనతోనే రూపుదిద్దుకున్న సినిమా భూల్ చుక్ మాఫ్. కరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ధమాన బాలివుడ్ నటుడు రాజ్కుమార్ రావు హీరోగా నటించారు. ఈ సినిమా కథ చాలా గమ్మత్తుగా ఉంటుంది. అంతే సరదాగా సినిమా అంతా సాగిపోతుంది కూడా.అంతలా కథలో ఏముందంటే... వారణాసి నగరానికి చెందిన తితిలి మిశ్ర, రంజన్ తివారి ప్రేమించుకుంటుంటారు. తితిలి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి తమ కూతురుని రంజన్ పెళ్ళాడాలంటే గవర్నమెంట్ ఉద్యోగం తప్పని సరి అని కండిషన్ పెడతారు. ఇది విన్న రంజన్ హమీద్ అంసారీ అనే బ్రోకర్ ద్వారా దొంగ దారిలో గవర్నమెంట్ ఉద్యోగం త్వరగానే సంపాదిస్తాడు. ఇంకేముంది ఇరు కుటుంబాలు కలిసి ఇద్దరికీ పెళ్ళి చేయాలని ఓ తేదీని నిర్ణయిస్తాయి. రేపు పెళ్ళి అనగా ఈ రోజు నిద్ర లేచి నలుగు కార్యక్రమానికి రెడీ అవుతుంటాడు రంజన్. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపి రేపటి తన పెళ్ళి గురించి కలలు కంటూ మరుసటి రోజు నిద్ర లేస్తాడు.కాని ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ నలుగు కార్యక్రమం రోజే రంజన్ నిద్ర లేస్తాడు. ఇలా ఎన్ని రోజులైనా అదే రోజు నిద్ర లేస్తూ ఉంటాడు. రంజన్ టైం లూప్ లో ఇరుక్కుపోయి ఇలా జరుగుతూ ఉంటుంది. ఏదో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించి చక్కగా పెళ్ళి చేసుకుందామన్న సమయంలో ఈ సమస్య రంజన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మరి రంజన్ ఈ టైం లూప్ నుండి బయటపడి పెళ్ళి చేసుకోగలుగుతాడా, అసలు ఇలాంటి సమస్య రంజన్ కు ఎందుకు వచ్చింది. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న భూల్ చుక్ మాఫ్ చూడాల్సిందే. ఈ సినిమా కథలో చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా కామెడీతో దానిని ప్రేక్షకుడికి చక్కగా అర్ధమయ్యేలా తీశాడు దర్శకుడు. సినిమా ఆద్యంతం నవ్వులతో గిలిగింతలు పెడుతూ హాయిగా సాగుతుంది. వర్త్ ఫుల్ వాచ్ ఫర్ ది వీకెండ్. -
'టూరిస్ట్ ఫ్యామిలీ' దర్శకుడితో నాని.. పోస్ట్ వైరల్
రీసెంట్ టైంలో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచిన సినిమా 'టూరిస్ట్ ఫ్యామిలీ'. మే 1న తమిళంలో రిలీజైన ఈ చిత్రం.. దాదాపు నెలరోజుల పాటు హౌస్ఫుల్ కలెక్షన్స్తో ఆకట్టుకుంది. కేవలం రూ.5 కోట్లు పెడితే రూ.75 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. ఇదే మూవీలో అభిషన్ జీవింత్ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి మూవీతోనే టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయాడు. ఇప్పుడు ఇతడు హీరో నానిని కలిశాడు.(ఇదీ చదవండి: హైదరాబాద్ జట్టు ఓనర్తో అనిరుధ్ పెళ్లి?) 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమా థియేటర్లలో ఉండగానే నాని చూసి తన రివ్యూ ఇచ్చేశాడు. దర్శకుడు అభిషన్ని మెచ్చుకున్నాడు. నానితో పాటు రాజమౌళి కూడా ఈ మూవీకి ఫిదా అయిపోయారు. అలాంటిది ఇప్పుడు అభిషన్ని నాని కలవడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే సినిమా గురించి చాలా డీటైలింగ్గా మాట్లాడటం తనకెంతో ప్రత్యేకంగా అనిపించిందని కుర్ర డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. నానిని కలవడం తనకు గౌరవంగా ఉందని కూడా అన్నాడు.రీసెంట్ టైంలో నాని ఓవైపు హీరోగా చేస్తూనే.. 'కోర్ట్' లాంటి చిన్న సినిమాలు తీస్తూ నిర్మాతగానూ తన అభిరుచి చాటుకుంటున్నాడు. అలాంటిది ఇప్పుడు అభిషన్ని కలిసి మాట్లాడాడు అంటే త్వరలో వీళ్లిద్దరూ కలిసి ఏదైనా ప్రాజెక్ట్ చేసినా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ మన దగ్గర థియేటర్లలో రిలీజ్ కాలేదు. ఓటీటీలో తెలుగు వెర్షన్ని నేరుగా అందుబాటులోకి తీసుకొచ్చారు. చూసిన ప్రతిఒక్కరూ సినిమాకు ఫిదా అయిపోతున్నారు. చూడాలి మరి అభిషన్-నాని కాంబో ఏమైనా సెట్ అవుతుందేమో?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) View this post on Instagram A post shared by Abishan Jeevinth (@abishan_jeevinth) -
11A సీట్.. 1998లో అచ్చం ఇలాగే.. మరో జన్మ ఎత్తిన సింగర్!
మనకేం అవుతుందిలే? అనుకునే రోజులు కావివి. మరణం ఎప్పుడు, ఎటువైపు నుంచి వస్తుందో ఊహించలేని కాలంలో ఉన్నామనడానికి అహ్మదాబాద్ విమాన ప్రమాదమే నిలువెత్తు ఉదాహరణ. ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ 171 విమానం టేకాఫ్ అయిన 39 సెకన్లలోనే కుప్పకూలింది. ఈ ప్రమాదం (Ahmedabad Plane Crash)లో విమానంలో ఉన్నవారు మరణించడటమే కాక అది కుప్పకూలిన భవంతిలో ఉన్న పలువురు మెడికల్ విద్యార్థులు సైతం ప్రాణాలు విడిచారు. నా విషయంలోనూ ఇదే మిరాకిల్ఇంత పెద్ద ప్రమాదంలో విమానం నుంచి ఒకే ఒక్కడు బయటపడ్డాడు. 11A సీటులో కూర్చున్న రమేశ్ విశ్వాస్ కుమార్ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. అయితే 27 ఏళ్ల క్రితం తన విషయంలోనూ ఇదే జరిగిందంటున్నాడు థాయ్ సింగర్ రౌంగ్సక్ లోయ్చుసక్ (47). సింగర్ మాట్లాడుతూ.. 'ఇండియాలో జరిగిన విమాన ప్రమాదంలో 11A సీటులో కూర్చున్న ఒకే ఒక్క వ్యక్తి బతికాడని వార్తల్లో చూశాను. నేను కూడా అదే సీటులో కూర్చుని ప్రాణాలతో బయటపడ్డాను.రెండో జన్మ..ఈ ప్రమాదం తర్వాత నాకు మరో జన్మ ఎత్తినట్లు అనిపించింది. కానీ ఆ తర్వాత విమానప్రయాణం చేసేటప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమయ్యేది. ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు. సురక్షితంగా ల్యాండ్ అయ్యేవరకు కిటికీవైపే చూస్తూ జాగ్రత్తగా ఉండేవాడిని. నల్లటి మేఘాలు కమ్ముకున్నప్పుడు, పిడుగు శబ్ధం వినబడినప్పుడు భయంతో వణికిపోయేవాడిని. నరకంలోకి వెళ్తున్నట్లే అనిపించేది. ఇప్పటికీ విమాన ప్రమాదంలో విన్న శబ్దాలు, ఆ మట్టి వాసన, నీటి రుచి అన్నీ అలాగే గుర్తున్నాయి' అని చెప్పుకొచ్చాడు.1998లో విషాదం1998లో సింగర్ ప్రయాణించిన థాయ్ ఎయిర్వేస్ ఫ్లైట్ TG261 విమానం బ్యాంకాక్ నుంచి సూరత్ బయల్దేరింది. ల్యాండ్ అయ్యే సమయానికి ఏవో ఇబ్బందులు తలెత్తడంతో అది వేగంగా వెళ్లి చిత్తడి నేలపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 101 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది చనిపోయారు. 45 మంది గాయపడ్డారు.మాటలకందని విషాదంజూన్ 12.. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన రోజు. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో ఎయిరిండియా విమానం.. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరింది. 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే అనూహ్య సమస్య తలెత్తింది. క్షణాల్లోనే బీఆర్ మెడికల్ కాలేజీ క్యాంటీన్పై పడి పేలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది చనిపోగా మెడికల్ కాలేజీ క్యాంటీన్లో ఉన్న పలువురు వైద్య విద్యార్థులు మృతి చెందారు.చదవండి: అఖిల్తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది? -
హైదరాబాద్ జట్టు ఓనర్తో అనిరుధ్ పెళ్లి?
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదో ఒక పెళ్లి రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. అయితే కొన్నిసార్లు నమ్మాలనిపించదు. మరికొన్నిసార్లు మాత్రం నిజంగా ప్రేమించుకుంటున్నారా? పెళ్లెప్పుడు చేసుకోబోతున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అలాంటి ఓ గాసిప్ పుల్గా వైరల్ అవుతోంది. అదే లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి?తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న అనిరుధ్.. గతంలో ఆండ్రియా, కీర్తి సురేశ్ లాంటి హీరోయిన్లతో డేటింగ్ చేశాడనే వార్తలొచ్చాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా కొన్ని వైరల్ అయ్యాయి. కానీ కాలక్రమేణా వాటి గురించి జనాలు మర్చిపోయారు. సడన్గా ఇప్పుడు సరికొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి యజమానిగా వ్యవహరిస్తున్న కావ్య మారన్ని అనిరుధ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని అంటున్నారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) 2014 నుంచి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, కానీ ఈ విషయం బయటపడకుండా సైలెన్స్ మెంటైన్ చేశారని.. త్వరలో మాత్రం పెళ్లి చేసుకుంటారనే పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇద్దరూ తమిళవాళ్లు కావడంతో ఇది నిజమేనేమోనని చాలామంది అనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఇరువైపుల నుంచి ఎలాంటి ఖండన లేదు. అలా అని అంగీకారం కూడా లేదు. కాబట్టి ఇప్పటివరకు అయితే ఇది రూమర్ మాత్రమే.అనిరుధ్ విషయానికొస్తే టీనేజీలోనే సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్గా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కావ్య మారన్ విషయానికొస్తే.. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కూతురు. ఇప్పటికే తండ్రితోపాటు పలు వ్యాపారాల్లో కీలకంగా ఉంది. వీటితో పాటు ఐపీఎల్లోనూ హైదరాబాద్ జట్టుకి యజమానిగా వ్యవహరిస్తోంది.(ఇదీ చదవండి: అఖిల్తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది?) -
ఇంటిమేట్ సీన్స్ అంటే కష్టంగా ఉంది కానీ.. : హీరోయిన్
ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల దగ్గరైన మలయాళ నటి అనంతిక. మ్యాడ్ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ టాలెంటెడ్ నటి.. తొలి సినిమాతో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ఇప్పుడు 8 వసంతాలు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నెల 20న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన అనంతిక.. సినిమాల్లోని ఇంటిమేట్ సన్నివేశాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. కథ డిమాండ్ చేస్తే అలాంటి సన్నివేశాల్లో నటించడానికి తను కూడా రెడీ అని చెప్పింది. ‘ఇప్పటి వరకు ఇంటిమేట్ సీన్స్ చేయలేదు. అలాంటి సన్నివేశాల్లో నటించడం కష్టంగా అనిపిస్తుంది. అలా అని నేను అలాంటి పాత్రను చేయనని చెప్పట్లేదు. నిజంగా కథ డిమాండ్ చేస్తే.. ఇంటిమేట్ సీన్స్ చేయడానికి నాకేమి ఇబ్బంది లేదు. అయితే అప్పుడు కూడా కొంత లిమిటేషన్ ఉంటుంది’ అని చెప్పింది.ఇక తన లక్ష్యాలను గురించి చెబుతూ.. తనకు సినిమాల్లోకి రావాలనే ఆసక్తే లేదని చెప్పింది. ‘చిన్నప్పటి నుంచే నేను డ్యాన్స్ నేర్చుకున్నాను. దాంతో పాటు కరాటే కూడా నేర్చుకున్నాను. అయితే ఇవ్వన్ని సినిమాల్లోకి రావాలని నేర్చుకోలేదు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. కోవిడ్ టైంలో ఖాలీగా ఉండడంతో ఓ మలయాళ సినిమాలోకి డ్యాన్సర్గా వెళ్లాను. అక్కడ డీఓపీ నన్ను చూసి హీరోయిన్గా ట్రై చెయ్యొచ్చు కదా అని సలహా ఇచ్చాడు. అప్పటి నుంచే సినిమాలకు ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశా. మంచి సందేశం ఇచ్చే చిత్రాలను చేయాలనుకున్నాను. నా పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను మాత్రమే ఎంచుకుంటున్నాను. అయితే నటిగా కొనసాగాలని నాకు లేదు. కొన్నేళ్ల తర్వాత అయినా నేను రాజకీయాల్లో వెళ్తా. దాని కోసమే నేను ‘లా’ చదువుతున్నాను. 35-40 ఏళ్ల వయసు వచ్చాక రాజకీయాల్లోకి వెళ్తా’ అని అనంతిక చెప్పుకొచ్చింది. -
సడన్గా ఆ సీన్లో నటించమన్నారు.. ఇష్టం లేకుండానే..: మధుబాల
రోజా సినిమాతో మధుబాల (Madhoo/ Madhubala) క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఈ హీరోయిన్ కెరీర్ తొలినాళ్లలో తనకంటూ కొన్ని హద్దులు గీసుకుంది. ముద్దు సన్నివేశాల్లో నటించకూడదని భీష్మించుకుని కూర్చుంది. కానీ ఓ సినిమా కోసం దాన్ని బ్రేక్ చేయాల్సి వచ్చిందని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మధుబాల మాట్లాడుతూ.. నేను పెరిగిన వాతావరణం వల్ల ఆన్స్క్రీన్లో కొన్ని సన్నివేశాల్లో నటించాలంటే ఇబ్బందిగా అనిపించేది. సడన్గా ఆ సీన్లో..ఆయా సీన్లలో నటించలేక సినిమాలు వదిలేసుకున్న సందర్భాలెన్నో..! అయితే ఓ సినిమా చేస్తున్న సమయంలో ముద్దు సన్నివేశంలో నటించాలన్నారు. దీనిగురించి నాకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. షూటింగ్కు ముందు ఒక్కమాటైనా చెప్పలేదేంటి? అని నిలదీశాను. అప్పుడు నన్ను పక్కకు తీసుకెళ్లి.. ఈ సీన్ అవసరం.. అందుకే చేయమంటున్నాం అని బతిమాలారు. అసలు ఆ సీన్ అవసరమే లేదుఇష్టం లేకపోయినా ఆ సన్నివేశంలో నటించాను. దాన్ని సినిమాలో ఉంచకూడదని దర్శకుడిని నేనడగలేదు. వాళ్ల ఇష్టానికే వదిలేశాను. తీరా ఆ సీన్కు ఎటువంటి ప్రాధాన్యత లేదని పక్కన పెట్టేశారు. అప్పుడు నాది చాలా చిన్నవయసు. కానీ, ఈ రోజుల్లో 22 ఏళ్ల అమ్మాయి కూడా చాలా తెలివిగా ఉంటున్నారు. ఏ సీన్కైనా రెడీ అని సాహసం చేస్తున్నారు అని చెప్పుకొచ్చింది. సినిమాల విషయానికి వస్తే మధుబాల నటించిన కన్నప్ప జూన్ 27న విడుదల కానుంది.చదవండి: పాకిస్తాన్లో 'దంగల్' ఎందుకు రిలీజ్ చేయలేదో చెప్పిన ఆమిర్ ఖాన్ -
'స్క్విడ్ గేమ్ 3' హైస్పీడ్లో ఫైనల్ గేమ్ (ట్రైలర్)
నెట్ఫ్లిక్స్ వేదికగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన కొరియన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్క్విడ్గేమ్ (Squid Game) నుంచి ఫైనల్ సీజన్ వచ్చేస్తుంది. 'స్క్విడ్ గేమ్ 3' ఫైనల్ గేమ్ పేరుతో తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. హ్యాంగ్ డాంగ్ హ్యుక్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు మంచి విజయాన్ని అందుకున్నాయి. జూన్ 27 నుంచి నెట్ఫ్లిక్స్ (Netflix) వేదికగా ఫైనల్ గేమ్ స్ట్రీమింగ్ కానున్నట్లు టీమ్ తెలిపింది. తెలుగుతో పాటు సుమారు పదికి పైగా భాషలలో విడుదల అవుతుంది.ఈ సిరీస్ ప్రపంచాన్నే ఓ ఊపు ఊపేసింది. గేమ్లో గెలిస్తే చాలు.. కలలో కూడా ఊహించలేనంత డబ్బు మీ సొంతం అనడంతో వందలాది మంది గేమ్ ఆడేందుకు వెళ్తారు. తీరా అక్కడికి వెళ్లాక గేమ్లో ఓడినవారి ప్రాణాలు తీస్తారు. తమ గెలుపు కోసం కొందరు ప్లేయర్స్ పక్కవారి ప్రాణాలు తీయడానికీ వెనకాడరు. చివరకు ఒకే ఒక్కరు విజేతగా నిలిచి డబ్బు గెలుచుకుంటారు. అలా ప్లేయర్ 456 ఓసారి గేమ్లో గెలిచి కోట్లాది ధనం పొందుతాడు.ఫస్ట్ సీజన్లో రెడ్ లైట్- గ్రీన్ లైట్ అని గేమ్ ఆడించిన ఓ బొమ్మను మరోసారి ఈ సీజన్లో ప్రవేశపెట్టారు. ఈ సారి గేమ్ మరింత క్రూరంగా ఉండనున్నట్లు కనిపిస్తోంది. ప్లేయర్ 456.. పాశవికమైన ఆట ఆడిస్తున్న వ్యక్తిని నేరుగా కలిసినట్లు చూపించారు. మరి అతడు ఈ ఆటను ఆపగలిగాడా? లేదా? అనేది తెలియాలంటే ఈ నెలాఖరులో స్క్విడ్ గేమ్ చివరి సీజన్ చూసేయాల్సిందే! -
డైరెక్టర్గా మారనున్న పాపులర్ కమెడియన్
అర్జున్ రెడ్డి, జాతిరత్నాలు, బ్రోచేవారెవరురా, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna). సినిమాలతో బిజీగా ఉన్న ఇతడి దృష్టి తాజాగా దర్శకత్వం మీదకు మళ్లింది. డైరెక్టర్గా ఓ సినిమా చేయబోతున్నానని ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రకటించాడు. అడ్వెంచర్ మూవీ తీయబోతున్నట్లు తెలిపాడు. నటనపై ఆసక్తి గలవారు వారి షో రీల్స్, రెజ్యూమ్లను తన మెయిల్ ఐడీకి పంపించాలని కోరాడు.రామకృష్ణ కెరీర్సైన్మా అనే షార్ట్ ఫిలింతో తొలిసారి కెమెరా ముందుకు వచ్చాడు. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ లఘుచిత్రంతోనే రాహుల్ కెరీర్ ప్రారంభించింది. జయమ్ము నిశ్చయమ్మురా మూవీలో హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించాడు. ఈ చిత్రానికి సంభాషణల రచయితగానూ పని చేశాడు. అర్జున్ రెడ్డి చిత్రంతో ఇక వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. చివరగా మనమే సినిమాలో కనిపించాడు. ఒకటీరెండు సినిమాల్లో పాటల రచయితగానూ తన ప్రతిభ చూపించాడు.చదవండి: అఖిల్తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది? -
'కేరళ క్రైమ్ ఫైల్స్ 2' స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
మలయాళంలో తెరకెక్కిన 'కేరళ క్రైమ్ ఫైల్స్: ది సెర్చ్ ఫర్ సీపీవో అంబిలి రాజు' (kerala crime files season 2) నుంచి మరో ట్రైలర్ విడుదలైంది. ఇదే సమయంలో విడుదల తేదీని ప్రకటించారు. తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది. 2023లో జియో హాట్స్టార్ వేదికగా 'కేరళ క్రైమ్ ఫైల్స్' వెబ్ సిరీస్కు సీక్వెల్గా దర్శకుడు అహ్మద్ కబీర్ తెరకెక్కించాడు. పార్ట్ 1లో ఒక్క మర్డర్ కేసుకు సంబంధించి చూపించాడు. పోలీసులకు సవాలుగా మారిన ఆ కేసును ఎలా పూర్తి చేస్తారనేది చాలా ఆసక్తిగా చెప్పాడు. అప్పుడు ఓటీటీలో మంచి ఆదరణ రావడంతో మేకర్స్ సీక్వెల్ను ప్లాన్ చేశారు. ఇప్పుడు పార్ట్2 కూడా క్రైమ్ కథాంశంతోనే నిర్మించారు. పలు మర్డర్ కేసులకు సంబంధించి పోలీసులు ఎలా చేధించారనేది దర్శకడు చెబుతున్నట్లు తెలుస్తోంది. అజు వర్గీస్, లాల్,నివాస్ వాలిక్కున్ను, జిన్జ్ షాన్, శ్రీజిత్ వంటి వారు ఇందులో నటించారు. జూన్ 20న జియోహాట్స్టార్లో ఈ వెబ్ సిరీస్ విడుదల కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడలో కూడా స్ట్రీమింగ్ కానుంది. -
మన 'పైడి జయరాజ్' పేరుతో అవార్డ్.. అందుకోనున్న 'మణిరత్నం'
భారతీయ సినిమా మాటలు నేర్వకముందే అంటే మూకీయుగంలోనే పైడి జైరాజ్ సినీ ప్రయాణం మొదలైంది. భారత తొలి మాటల చిత్రం అలం ఆరా (1931) సినిమాతో తనదైన ముద్ర వేసిన పైడి జైరాజ్ హిందీలో కూడా గుర్తింపు పొందారు. నేడు (జూన్ 14)న తెలంగాణ సర్కారు ఆయన పేరుతో అవార్డు ప్రదానం చేస్తోంది. హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు ఈ అవార్డు అందించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సిరిసిల్లకు చెందిన పైడి జైరాజ్ సెప్టెంబర్ 28, 1909లో జన్మించారు. పంజాబీ అయిన సావిత్రిని వివాహం చేసుకున్నారు. ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం. 2000 ఆగస్టు 11న ఆయన మరణించారు. సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును 1980లో అందుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా రాణించారు. 11 మూకీ సినిమాల్లో 156 టాకీ సినిమాల్లో హీరోగా, 300 సినిమాల్లో కారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు.1929లో బొంబాయికినిజాం కళాశాలలో గ్రాడ్యుయేట్ చదువుతున్న సమయంలో జైరాజ్ నాటకలు, సినిమాలపై ఆసక్తితో 1929లో బొంబాయి వెళ్లారు. స్టార్క్లింగ్ యూత్ అనే నిశ్శబ్ద చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు. ట్రయాంగిల్ ఆఫ్ లవ్, మాతభూమి, ఆల్ ఫర్ లవర్, మహాసాగర్ మోతి, ఫ్లైట్ ఇన్టు డెత్, మై హీరో మొదలైన పదకొండు నిశ్శబ్ద చిత్రాల్లో నటించాడు. శాంతారామ్, అశోక్ కుమార్, పథ్వీరాజ్ కపూర్, మోతీలాల్ వంటి వారితో ఏడు దశాబ్దాల పాటు కొనసాగారు. నిరూపారాయ్, శశికళ, దేవికారాణి, మీనాకుమారి లాంటి హీరోయిన్ల సరసన నటించారు. 86ఏళ్ల వయసులో 1995లో గన్ అండ్ గాడ్ సినిమా తరువాత సినీరంగం నుంచి తప్పుకున్నారు. టాకీకాలంలో మోహర్, మాల, ప్రతిమ, రాజ్ఘర్, సాగర్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అమర్సింగ్ రాథోడ్, పథ్వీరాజ్ చౌహాన్, మహారాణా ప్రతాప్, షాజహాన్, టిప్పు సుత్తాన్, హైదర్ ఆలీ వంటి పా త్రలు పోషించిన ఆయన హిందీ, ఉర్దూ, మరాఠీ, గుజరాతీ, ఒరియా, బెంగాలీ, పంజాబీ, కొంకణి, మలయాళం తదితర భాషా చిత్రాల్లో నటించారు. తెలుగులో ఒక్క సినిమాలో కూడా నటించలేదు.పైడి జైరాజ్ సినీ పురస్కారంరాష్ట్ర విభజన నాటి నుంచి 2014–2024 మధ్యలో విడుదలైన చిత్రాలకు గద్దర్ పేరున తెలంగాణ ఫిల్మ్ అవార్డులు ప్రభుత్వం ఇవ్వనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న నాలుగు ప్రత్యేక అవార్డులైన రఘుపతి వెంకయ్య, బీఎన్రెడ్డి, నాగిరెడ్డి–చక్రపాణి, ఎన్టీఆర్ జాతీయ అవార్డులకు తోడు తెలంగాణకు చెందిన పైడి జైరాజ్, కాంతారావు పేర్లతోనూ అవార్డులను ఇవ్వనుంది. సిరిసిల్లకు చెందిన పైడి జైరాజ్ పేరున తొలిసారిగా అవార్డు ప్రకటించగా, ఈనెల 14న ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు ప్రదానం చేయనున్నారు.తెలుగు సినిమాల సమీక్షల్లో తనదైన ముద్ర వేసి, సినీ రంగం పైన అనేక వ్యాసాలు, పుస్తకాలు రాసిన కరీంనగర్ ఫిల్మీ సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర పైడి జైరాజ్పై నిర్మించిన డాక్యుమెంటరీ గాను 2024 సంవత్సరానికి బెస్ట్ ఫిలిం క్రిటిక్గా రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డు ప్రకటించింది. ఈ అవార్డును శనివారం హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో రవిచంద్ర అందుకోనున్నారు. అవార్డు అందుకుంటున్న సందర్భంగా మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల జాయింట్ సెక్రటరీ జీవీ శ్యాంప్రసాద్లాల్, కరీంనగర్ ఫిలిం సొసైటీ బాధ్యులు లక్ష్మీ గౌతమ్, మాడిశెట్టి గోపాల్, అన్నవరం దేవేందర్, గాజోజు నాగభూషణం, కందుకూరి అంజయ్య, కోల రామచంద్రారెడ్డి, వారాల మహేశ్ తదితరులు అభినందించారు. -
అఖిల్తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది?
పీటల దాకా వచ్చిన పెళ్లిళ్లు ఆగిపోతే అది సామాన్యులకు సంకటం కావచ్చు కానీ సెలబ్రిటీల భవిష్యత్తుకు ఏ మాత్రం ఆటంకం కాదనేది తెలిసిందే. అందుకే ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్లు సర్వసాధారణంగా కనిపించే తారా లోకంలో సంఘటనలు సామాన్యులకు ఎప్పుడూ వింతల్లా, విశేషాల్లాగే ఉంటాయి. అలాంటిదే అఖిల్ ప్రేమ, నిశ్చితార్ధం, బ్రేకప్... తాజాగా పెళ్లి... అక్కినేని వంశ ఘనమైన నట వారసత్వాన్ని మోయడానికి సినీ రంగంలోకి దిగిన అఖిల్... ఇంకా కెరీర్ నిర్మాణంలో తడబడుతూనే ఉన్నాడనేది తెలిసిందే. అయితే కారణం తెలీదు గానీ చాలా మంది నట వారసులకు భిన్నంగా ఇంకా కెరీర్ రూపుదిద్దుకోకుండానే అఖిల్ పెళ్లికి మాత్రం తొందరపడ్డాడనే చెప్పాలి. నిజానికి 2016లో, అఖిల్ అక్కినేని తన ప్రియురాలైన 26 ఏళ్ల శ్రియా భూపాల్తో నిశ్చితార్థం చేసుకున్నప్పుడు కేవలం 22 సంవత్సరాలు అని సమాచారం. అంటే అక్కినేని యంగ్ హీరోకి ఆమెకీ దాదాపు 4 సంవత్సరాల వయస్సు అంతరం ఉందని తెలుస్తోంది. విచిత్రం ఏమిటంటే...తాజాగా అఖిల్ పెళ్లి చేసుకున్న యువతి కూడా తనకన్నా వయసులో పెద్ద అంటూన్నారు.మరోవైపు అఖిల్తో పెళ్లి రద్దు చేసుకున్న శ్రియా భూపాల్(Shriya Bhupal) ఎవరు? ప్రస్తుతం ఏం చేస్తోంది? అనే విషయానికి వస్తే... హైదరాబాద్లో అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన జివికె వారి ఇంట జన్మించిన శ్రియ, ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్, కాస్ట్యూమ్ మేకర్. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక ఫ్యాషన్ స్కూల్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన న్యూయార్క్లోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో ఆమె పట్టభద్రురాలైంది, ఫ్యాషన్ డిజైనర్గా శ్రియా శరణ్, సమంతా రూత్ ప్రభు కాజల్ అగర్వాల్ వంటి టాప్ టాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా ఆమె డిజైన్లను అందించారు. అంతేకాకుండా శ్రియా ’శ్రియా సోమ్’ అనే దుస్తుల బ్రాండ్ కు వ్యవస్థాపకురాలు కూడా. ప్రస్తుతం ఆమె లో ప్రొఫైల్ మెయిన్ టెయిన్ చేస్తున్నా... తన పనిలో బిజీగానే ఉన్నారని సమాచారం.అఖిల్తో బ్రేకప్ తర్వాత ఆమె చాలా వేగంగా కొత్త అనుబంధంలోకి అడుగుపెట్టింది. తెలంగాణ రాజకీయ ప్రముఖుడు, ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడైన అనిందిత్ రెడ్డి ని ఆమె పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరికీ ఒక బిడ్డ కూడా ఉన్నాడు. సినిమా సెలబ్రిటీ కాకపోయినా అనిందిత్ రెడ్డి కూడా సాదా సీదా యువకుడేమీ కాదు. అత్యంత అరుదైన రంగంలో అతను రాణిస్తున్నాడు. హైదరాబాద్ నుంచి టాప్ క్లాస్ రేసింగ్ డ్రైవర్గా నిలిచాడు. గత 2016లో యూరో జెకె 16 ఛాంపియన్ షిప్, యూరో జెకె 2017 ఛాంపియన్ షిప్లలో పాల్గొన్నాడు, ఫెడరేషన్ ఆఫ్ మోటార్స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎమ్ఎస్సి)లో 2017లో మోటార్స్పోర్ట్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా నిలిచాడు.అతను ఢిల్లీలో జరిగిన వోక్స్వ్యాగన్ వెంటో కప్ 2015ను గెలుచుకున్నాడు.2019లో, అతను వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ ఫార్మ్ నుంచి అత్యుత్తమ పెర్ఫార్మర్గా ఎంపికయ్యాడు. -
పాకిస్తాన్లో 'దంగల్' ఎందుకు రిలీజ్ చేయలేదో చెప్పిన ఆమిర్ ఖాన్
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్( Aamir Khan) నటించిన 'దంగల్' చిత్రం 2016లో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ మూవీని రిలీజ్ చేశారు. కానీ, పాకిస్తాన్లో భారత సినిమాలకు పెద్ద మార్కెట్ ఉంది. అయితే, దంగల్ చిత్రాన్ని పాక్లో ఎందుకు విడిదల చేయలేదో తాజాగా ఆ చిత్ర నటుడు ఆమిర్ ఖాన్ వెళ్లడించారు. రెజ్లర్ మహవీర్ ఫోగట్ జీవితకథతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 2,070 కోట్లు రాబట్టింది. నితేష్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.దంగల్ పాకిస్తాన్లో ఎందుకు విడుదల కాలేదో ఆమిర్ ఖాన్ ఇలా చెప్పారు. 'పాక్లో దంగల్ విడుదల కావాలంటే వారు రెండు షరతులు పెట్టారు. మన జాతీయ గీతం, జాతీయ జెండాను మూవీ నుంచి తొలగించాలని అక్కడి సెన్సార్ బోర్డు కోరింది. నేను అందుకు అంగీకరించలేదు. గీతా ఫోగట్ మ్యాచ్ గెలిచిన సన్నివేశంలో భారత జెండాతో పాటు జాతీయ గీతం ఉంటుంది. వాటిని తొలగిస్తినే ఈ చిత్రానికి అనుమతి ఉంటుందని పాక్ సెన్సార్ చెప్పింది. దీంతో ఒక సెకనులోపు, మా సినిమా పాకిస్తాన్లో విడుదల కాదని నేను వారికి చెప్పాను. పాకిస్తాన్ విడుదలను రద్దు చేయడం వల్ల తమ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిర్మాతలు నాతో చెప్పారు. అయినప్పటికీ, భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న దేనికీ మద్దతు ఇవ్వకూడదని స్పష్టంగా ఆరోజే చెప్పాను.ఏప్రిల్లో జరిగిన పహల్గాం దాడికి 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాక్పై భారత్ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో పాక్ నటీనటులను బ్యాన్ చేయాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ కోరింది. దీంతో వారిని పూర్తిగా భారత్లో నిషేధించారు. -
SSMB29: నిధి అన్వేషణ కోసం ఆఫ్రికా అడవుల్లోకి 'మహేశ్'
మహేశ్ బాబు(Mahesh Babu) కథానాయకుడిగా దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) తీస్తున్న చిత్రం పనులు స్పీడ్ అందుకున్నాయి. కొద్దిరోజుల క్రితం ఒడిసాలో చిత్రీకరణ జరుపుకున్న ఈ భారీ ప్రాజెక్ట్ అక్కడ కొన్ని కీలక సన్నివేశాలతోపాటు, యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కించారు. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్నా చిత్ర యూనిట్ ఇప్పుడు ఆఫ్రికాలోని అటవీ ప్రాంతాల్లోకి షిఫ్ట్ అవుతుంది. కథ రీత్యా ఈ సినిమాలోని అత్యంత కీలకమై సీన్స్ ఇక్కడ షూట్ చేయనున్నారని తెలుస్తోంది.SSMB29 టీమ్ జులైలో కెన్యాకు పయనమయ్యేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అక్కడ మసాయి-పిగ్మీస్ తెగలతో ఇప్పటికే మహేశ్బాబు కొద్దిరోజులు గడిపారు. ఆ ప్రాంతపు యుద్ధ విద్యలపై బేసిక్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. అక్కడి షెడ్యూల్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. పలు కారణాల వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు అక్కడికి వెళ్లేందుకు కావాల్సిన అన్ని అనుమతులు కూడా తీసుకున్నారట. దాదాపు 30రోజుల పాటు జరగనున్న షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసేశారట. అక్కడి ప్రఖ్యాత అంబోసెలి నేషనల్ పార్క్లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.కెన్యాలో జరిగే ఈ షెడ్యూల్లో ప్రియాంక చోప్రా సెట్స్లో అడుగుపెట్టనుంది. మహేశ్, పృథ్వీరాజ్ సుకుమార్తో పాటు మరికొందరు అక్కడ షూటింగ్లో పాల్గొననున్నారు. ఇక ఈ సినిమాకు ‘మహారాజా’, ‘మహారాజ్’ అనే టైటిల్స్ను అనుకుంటున్నారని, 18వ శతాబ్దం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఓ నిధి అన్వేషణతో ఈ సినిమా ఉంటుందనీ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దుర్గా ఆర్ట్స్పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. -
ఎయిరిండియా విమానంలో మంచు లక్ష్మి.. క్షేమం అంటూ పోస్ట్
గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే ఎయిరిండియా విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదం వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. అయితే, తాజాగా సినీ నటి మంచు లక్ష్మి( Manchu Lakshmi ) సోషల్మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ఎయిరిండియా విమానంలో తాను ప్రయాణించానని ఆమె చెప్పింది. చాలామంది తనకు ఏమైనా ప్రమాదం జరిగిందా అనే ఆందోళనతోనే కాల్స్ చేస్తున్నారని పేర్కొంది. దీంతో ఆమె అసలు విషయాన్ని చెబుతూ ఒక వీడియోతో పాటు ఎక్స్ పేజీలో పోస్ట్ చేసింది.'విమాన ప్రమాదం జరిగిన రోజే ఎయిరిండియా ఫ్లైట్లో నేను ప్రయాణించిన మాట వాస్తవమే.. కానీ, నేను ముంబై నుంచి లండన్ వెళ్లాను. అహ్మదాబాద్లో జరిగిన విషాదకరమైన విమాన ప్రమాదంతో నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. నేను లండన్ చేరిన వెంటనే ఈ వార్త తెలుసుకున్నాను. చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు, ఇది నిజంగా బాధాకరమైనది. ఈ విషాదంలో ఇంకా ఎక్కువ మంది రెసిడెంట్ డాక్టర్లు ప్రాణాలు కోల్పోయినట్లు విని నా గుండె పగిలిపోయింది. నేను ఈరోజు ఎయిర్ ఇండియాలో లండన్కు వెళ్లానని నమ్మలేకపోతున్నాను. ఈ రోజు ఊహించుకోవడానికి చాలా బాధాకరమైనది. మన ప్రాణాలు ఒక క్షణంలో ఎలా ముగిసిపోతాయి అనేది ఇదొక ఉదహారణ. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మనమేంటో అర్థం అవుతుంది. బాధిత కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతి.' అని మంచు లక్ష్మి తెలిపింది.Devastated by the tragic flight crash in Ahmedabad. So many innocent lives gone, it’s truly painful. My heart breaks as I hear about even more resident doctors who have lost their lives in this tragedy…Can’t believe I just flew to London today on Air India God is Great. This…— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) June 12, 2025 -
మృణాల్ కామెంట్స్ కమల్ హాసన్ చెవిన పడితే..
ఒకటి రెండు చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేకుంటే స్టార్ హీరోహీరోయిన్లకు జరిగే నష్టమేమీ ఉండదు. అయితే అభిమానులు ఆ సమయంలో కాస్త నిరాశపడతారు. హీరోహీరోయిన్లు మాత్రం వాటిని అధిగమించి పోతుంటారు. కమల్ హాసన్( Kamal Haasan) వంటి వారైతే ఇలాంటివి ఇంతకుముందు చాలా చూసి ఉంటారు. ఆయన సమీపకాలంలో నటించిన విక్రమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అయితే ఆ తరువాత ఆయన నటించిన ఇండియన్–2, థగ్లైఫ్ చిత్రాలు ప్రేక్షుకుల అంచనాలను అందుకోలేకపోయాయి. కాగా ప్రస్తుతం ట్విన్స్ స్టంట్మాస్టర్స్ అన్బరివ్లను దర్శకులుగా పరిచయంచేస్తూ కమల్ తన రాజ్కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్న చిత్రంలో కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈచిత్రం ద్వారా ఆయన ఏఐ అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయనున్నారు. ఇందులో కమల్ సరసన నటించనున్న హీరోయిన్ ఎవరనే చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కమలహాసన్ దృష్టిలో మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur) పడే ప్రయత్నం చేశారు. హిందీ, మరాఠి, తెలుగు భాషల్లో నటించిన ఈ అమ్మడు ఇంతకుముందు తమిళంలో శివకార్తికేయన్కు జంటగా నటించే అవకాశాన్ని చేజార్చుకున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈమె మార్కెట్ డల్ అయ్యింది. మళ్లీ కోలీవుడ్లో మిస్ అయిన అవకాశాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా తమకు నచ్చిన కథానాయకులతో జతకట్టాలని ఆశిస్తుంటారు. అలా మృణాల్ఠాకూర్ కమలహాసన్ సరసన నటించాలన్న కోరికను వ్యక్తం చేశారు. ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ కమల్తో కలిసి నటించాలని ఎంతగానో ఆశపడుతున్నానని పేర్కొన్నారు. కమల్తో కలిసి స్టెప్స్ వేయాలని ఆశపడుతున్నట్లు మృణాల్ చెప్పుకొచ్చింది. ఈ వార్త నటుడు కమల్ దృష్టికి వెళితే ఆమె కలను నెరవేరుస్తారా చూడాలి. -
అజిత్కి జోడీగా...
స్టార్ హీరో అజిత్కి జోడీగా శ్రీనిధీ శెట్టి నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ చిత్ర వర్గాలు. యశ్ హీరోగా రూపొందిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్: చాప్టర్ 1’తో హీరోయిన్గా పరిచయమయ్యారు శ్రీనిధీ శెట్టి. ఆ సినిమాపాన్ ఇండియా హిట్ కావడంతో ఈ బ్యూటీకి ఫుల్ క్రేజ్ నెలకొంది. ఆ తర్వాత ఆమె నటించిన ‘కేజీఎఫ్: చాప్టర్ 2’, తమిళ చిత్రం ‘కోబ్రా’ మంచి విజయాలు సాధించాయి. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్: ది థర్డ్ కేస్’ సినిమాతో తెలుగుకి పరిచయమయ్యారు శ్రీనిధి.ఈ చిత్రంలో తనదైన నటన, యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నారామె. ప్రస్తుతం తెలుగులో సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా ‘తెలుసు కదా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నీరజ కోన దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే... అజిత్ కుమార్తో నటించే క్రేజీ చాన్స్ను శ్రీనిధి అందుకున్నట్లు టాక్. అజిత్ నటిస్తున్న 64వ సినిమాలో ఆమెను కథానాయికగా ఎంపిక చేశారని సమాచారం.అజిత్తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి సినిమా తెరకెక్కించిన అధిక్ రవిచంద్రన్ ‘ఏకే 64’ (వర్కింగ్ టైటిల్)కి దర్శకత్వం వహిస్తారని కోలీవుడ్ టాక్. ప్రస్తుతం ప్రీప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ నవంబరులో ఆరంభం అవుతుందట. 2026 వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి... అజిత్కి జోడీగా శ్రీనిధి నటిస్తారా? లేదా అనే విషయం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. -
రెండు గంటలు... ఏడు ప్రాజెక్ట్లు!
ఎనిమిది పదుల వయసులో ఎంతో చురుకుగా సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, టీవీ షోలు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు అమితాబ్ బచ్చన్. వేగంగా పని చేయడం తనకు ఇష్టం అంటున్నారు ఈ బిగ్ బి. అందుకు ఉదాహరణగా ఇటీవల తాను రెండు గంటల్లో ఏడు ప్రాజెక్ట్లు (ఐదు వాణిజ్య ప్రకటనలు, రెండు ఫొటోషూట్లు) చేసిన విషయం గురించి చెప్పారు. ‘‘ఈ మధ్య నేను రెండు గంటల్లో ఏడు ప్రాజెక్ట్లు చేయడంతో నా డైరెక్టర్ ఫ్రెండ్ ఒకరు ‘ఇలా పని చేయడం సరి కాదు.ఒక్క రోజులో పూర్తి చేయాల్సిన పనిని నువ్వు రెండు గంటల్లో పూర్తి చేస్తే ఎలా? నువ్వు పని వి«ధానాన్నిపాడు చేస్తున్నావు. ఇలా చేస్తే క్లైంట్లు ఒకే రోజులో ఎక్కువ ప్రాజెక్ట్లు చేయమంటారు. అది కరెక్ట్ కాదు’ అని చమత్కారంగా అన్నాడు. ఆ మాటలు నాకు చాలా ఆనందాన్నిచ్చాయి. నాకు ఇలా స్పీడ్గా పని చేయడం ఇష్టం’’ అని పేర్కొన్నారు అమితాబ్ బచ్చన్. -
మిస్టరీ థ్రిల్లర్గా హంటర్ ఛాప్టర్ -1.. గ్రాండ్ రిలీజ్
హీరో వైభవ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'హంటర్ ఛాప్టర్ 1'. ఈ చిత్రంలో నందిత శ్వేతా, తాన్య హోప్ హీరోయిన్స్గా నటించారు. ఈ సినిమాకు షరీఫ్ గౌస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఎ.రాజశేఖర్, సాయి కిరణ్ బత్తుల నిర్మించారు.తాజాగా మిస్టరీ థ్రిల్లర్ హంటర్ చాప్టర్ 1 శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రానికి సంగీతాన్ని అర్రోల్ కొరెల్లి అందించారు. బాలాజీ కె రాజా సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. సస్పెన్స్, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఆకట్టుకోనుంది. -
థగ్ లైఫ్ బ్యాన్.. కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు!
కమల్ హాసన్ నటించిన చిత్రం థగ్ లైఫ్. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. తొలి మూడు రోజుల్లో భారీగానే వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఆ తర్వాత పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీ ఇప్పటివరకు పెద్దగానే వసూళ్లు రాబట్టలేకపోయింది. అయితే ఈ సినిమాను కర్ణాటకలో విడుదల చేయకపోవడం కూడా కలెక్షన్స్పై ప్రభావం చూపింది.అయితే థగ్లైఫ్ సినిమా నిషేధంపై సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. కన్నడపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలతో థగ్ లైఫ్ను కర్ణాటకలో నిషేధిస్తున్నట్లు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది. ఆ తర్వాత హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసింది. కమల్ క్షమాపణలు చెబితే విడుదలకు అనుమతి ఇస్తామని చెప్పిన ఆయన వెనక్కి తగ్గలేదు. దీంతో థగ్ లైఫ్ కర్ణాటకలో రిలీజ్ చేయలేదు.అయితే సెన్సార్ పూర్తయిన చిత్రాన్ని అనధికారికంగా నిషేధించారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. తాజాగా థగ్ లైఫ్పై నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 17కి వాయిదా వేసింది. చాలా ఏళ్ల తర్వాత కమల్- మణిరత్నం కాంబోలో వచ్చిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో శింబు, త్రిష కీలక పాత్రలు పోషించారు. -
పూర్ణ పెళ్లిరోజు.. శుభశ్రీ హల్దీ.. మెహరీన్ చిల్ మోడ్..
యూట్యూబ్లో హల్దీ సెలబ్రేషన్స్ వీడియో షేర్ చేసిన బిగ్బాస్ బ్యూటీ శుభశ్రీనో క్యాప్షన్ అంటున్న నటి కీర్తి భట్ వెకేషన్లో ప్రియా వారియర్పెళ్లిరోజు సెలబ్రేట్ చేసుకున్న పూర్ణ View this post on Instagram A post shared by PRUDHVI RAJ (@portraitsbyprudhviraj) View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Nidhi Agarwal (@nidhiagarwal_) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur)