Movies
-
దీపికా ప్రెగ్నెన్సీ.. రాకా యాక్షన్ సీన్స్పై క్లారిటీ..!
అల్లు అర్జున్- అట్లీ కాంబోలో తొలిసారి వస్తోన్న బిగ్ ప్రాజెక్ట్ రాకా. ఈ ఏడాది బన్నీ బర్త్ డే సందర్భంగా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో తోడేలును తలపించేలా బన్నీ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ పోస్టర్ చూస్తుంటే అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లుక్ చూస్తే బన్నీ నెగెటివ్ రోల్ చేయనున్నారని అర్థమవుతోంది. ఈ భారీ యాక్షన్ మూవీలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్గా కనిపించనుంది.దీపికా పదుకొణె ఇటీవలే రెండోసారి ప్రెగ్నెన్సీ ప్రకటించింది. ఇప్పటికీ ఆమెకు ఓ కూతురు ఉండగా.. మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో రాకా షూటింగ్ గురించి అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలోనే రాకా సంబంధించి ఓ టాక్ నెట్టింట వైరల్గా మారింది. దీపికా పాత్ర కోసం రాకా మార్పులు చేస్తారా? అన్న సందేహం ఫ్యాన్స్లో ఆసక్తి పెంచుతోంది. ఆమె ప్రెగ్నెంట్ కావడంతో యాక్షన్ సీన్స్ను డూప్తో చేయిస్తారని బాలీవుడ్లో చర్చ నడుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం రాకా స్క్రిప్ట్లో ఎలాంటి మార్పు చేయడం లేదని తెలుస్తోంది. దీపికా పదుకొణెకు అద్భుతమైన ఎంట్రీతో పాటు.. అల్లు అర్జున్తో ఒక బిగ్ యాక్షన్ సన్నివేశం కూడా ఉందని టాక్. అయితే ఈ యాక్షన్ సీన్స్లో మాత్రం దీపికా డూప్తో చేయించనున్నారు. మిగిలిన సన్నివేశాల్లో దీపికానే షూటింగ్లో కొనసాగించనున్నారు. ఆమె ప్రెగ్నెంట్ కారణంగా రాకా కథలో ఎలాంటి మార్పు ఉండదని మేకర్స్ స్పష్టం చేశారు. దీంతో అభిమానుల అనుమానాలకు ఇక తెరపడినట్లే. కాగా.. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రుక్మిణి పింక్ లవ్.. చీరలో పూజా హెగ్డే
పింక్ డ్రస్లో సోయగాలు చూపిస్తున్న రుక్మిణిఫన్నీ హావభావాలతో అలరిస్తున్న ఎస్తర్ అనిల్సొంతూరిలో సరదాగా గడిపేస్తున్న పూజా హెగ్డేకల్యాణి ప్రియదర్శన్ మత్తెక్కించే స్టిల్స్బ్లాక్ డ్రస్లో నవ్వుతూ నిహారిక పోజులుట్రిప్ జ్ఞాపకాల వీడియోతో మాళవిక మోహన్ View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Hansika Motwanni (@ihansika) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Esther (@_estheranil) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) -
'పిల్లల కోసం పెళ్లే కానక్కర్లేదు'.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్ నిత్యామీనన్ గురించి తెలుగువారికి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన హీరోయిన్గా మెప్పించింది. అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దుగుమ్మ తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. గతేడాది ఇడ్లీ కొట్టు, తలైవన్ తలైవి, కాదలిక్కా నెరమిల్లై చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు. కేయూరీ ప్రొడక్షన్స్ అనే పేరుతో నిర్మాణ సంస్థ కూడా ప్రారంభించారు.అయితే ఇటీవలే 39వ వసంతంలోకి అడుగుపెట్టిన మలయాళ బ్యూటీ పెళ్లి గురించి గతంలో చాలాసార్లు మాట్లాడింది. తాజాగా మరోసారి పెళ్లిపై నిత్యా చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. గతంలో సరైన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటానని చెప్పిన ముద్దుగుమ్మ.. పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం మాత్రమేనని అన్నారు. తాజాగా మరోసారి పెళ్లి, పిల్లలు అనే కాన్సెప్ట్పై మాట్లాడింది. ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్స్ చేసింది.పెళ్లికి.. పిల్లల్ని కనడానికి ఎలాంటి సంబంధం లేదని నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పిల్లలు కావాలనుకోవడం అనేది పూర్తిగా మన వ్యక్తిగత నిర్ణయమని అన్నారు. అందుకు పెళ్లి ఒక్కటే మార్గం కాదన్నారు. పెళ్లి చేసుకోకుండా పిల్లలను కనడం తప్పేం కాదని నిత్యామీనన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. పెళ్లి కేవలం లైఫ్లో ఓ పార్ట్ మాత్రమేనని.. ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నారు. పిల్లల్ని కనడానికి పెళ్లికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తనపై ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపారు. సింగిల్ లైఫ్ను ఆస్వాదిస్తున్నానని పేర్కొన్నారు. -
చిరంజీవి-బాబీ.. క్లారిటీ వచ్చింది
సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్' సినిమాతో వచ్చి హిట్ కొట్టిన చిరంజీవి.. తర్వాత మూవీని సమయానికి మొదలుపెట్టకపోయేసరికి ఎక్కడ లేని రూమర్స్ అన్నీ వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ తీయాల్సిన నిర్మాణ సంస్థ కేవీన్ ప్రొడక్షన్స్.. జన నాయగణ్, టాక్సిక్ చిత్రాల వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతుండటమే దీనికి కారణం. అయితే చిరు-బాబీ సినిమా నుంచి కేవీఎన్ తప్పుకొందని, మరో నిర్మాత కావాల్సి ఉందని రకరకాల పుకార్లు వచ్చాయి. ఇప్పుడు వాటన్నింటికీ దాదాపు చెక్ పడిపోయింది.(ఇదీ చదవండి: విష్ణుప్రియ, అనన్య కాదు ఈమె 'సబ్స్క్రిప్షన్' సంగతి తెలిస్తే..)రీసెంట్గానే నిర్మాణ సంస్థ మారిపోయిందనే రూమర్స్ని కేవీఎన్ ప్రొడక్షన్ ఖండించగా.. ఇప్పుడు దర్శకుడు బాబీ, చిరంజీవికి ఈరోజు(ఏప్రిల్ 28) లుక్ టెస్ట్ జరిగిందనే సంగతి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. మరోవైపు ఇప్పటికే సెట్ వర్క్ జరుగుతోందని, ప్రాజెక్ట్ లాంచ్ కాగానే ఇంటర్వెల్ ఎపిసోడ్తో షూటింగ్ మొదలవుతుందని కూడా మాట్లాడుకుంటున్నారు.ఇకపోతే 'కాకాజీ' అనే టైటిల్ అనుకుంటున్నట్లు కూడా రూమర్స్ వస్తున్నాయి. ఈ పేరుపై మెగా అభిమానుల్లో మిశ్రమ స్పందన వినిపిస్తోంది. టైటిల్ ఏమంత పవర్ఫుల్గా లేదని అనుకుంటున్నారు. మరి ఇదే పేరు ఫిక్స్ చేస్తారా లేదంటే ఏమైనా చేర్పులు మార్పులు ఉండబోతున్నాయా అనేది చూడాలి? ఇందులో ప్రముఖ నటీనటులు కూడా చాలామందే కనిపించబోతున్నట్లు సమాచారం.(ఇదీ చదవండి: నాకు టైమ్ ఇస్తే కోటిన్నర ఇస్తా.. లేదంటే కేసు పెడతా: అషురెడ్డి)Look test ☑️Locked the look of #Mega158 with Megastar @KChiruTweets garu today 🤗Can’t wait to begin this journey❤️🔥#ChiruBobby2 @KvnProductions @LohithNK01 pic.twitter.com/eWSLEqCqVN— Bobby (@dirbobby) April 28, 2026 -
పోకిరి విధ్వంసానికి 20 ఏళ్లు.. మాస్ డైలాగ్ రీ క్రియేట్..!
పూరి జగన్నాద్-మహేశ్ బాబు కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ మూవీ పోకిరి. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఈ మూవీలో ఇలియానా హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ఏప్రిల్ 28న 2006లో థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం రిలీజై సరిగ్గా నేటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పోకిరి మూవీ డైలాగ్స్ ఓసారి గుర్తు చేసుకుంటున్నారు. రెండు దశాబ్దాలైనా పోకిరి డైలాగ్స్ను తెలుగు ఆడియన్స్ చెవుల్లో మార్మోగుతూనే ఉంటాయి.తాజాగా స్వీడన్కు చెందిన నటుడు కర్ల్ స్వాన్బెర్గ్ పోకిరి మూవీ డైలాగ్ను రీ క్రియేట్ చేశాడు. ఆశిష్ విద్యార్థితో మహేశ్బాబు చెప్పే డైలాగ్ను రీ క్రియేట్ చేశాడు. మీ స్టేషన్లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా? ఎలా చచ్చిపోయాడో చెప్పనా? మీ నాన్న నిరోధ్ వాడాల్సింది..అనవసరంగా పుట్టావ్? అనే డైలాగ్ ఇప్పుడు విన్న గూస్బంప్స్ తెప్పిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అప్పట్లో పూరి జగన్నాధ్ మాస్ డైలాగ్స్కు అభిమానులు ఫిదా అయిపోయారు. మరోసారి పోకిరి డైలాగ్ను విని మీరు కూడా ఎంజాయ్ చేయండి. View this post on Instagram A post shared by Karl Svanberg (@raja.svanberg) -
'నాకు టైమ్ ఇస్తే కోటిన్నర ఇస్తా.. లేదంటే'.. అషురెడ్డి ఆడియో వైరల్
బిగ్బాస్ బ్యూటీ అషు రెడ్డి కేసు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఎన్నారై ధర్మేంద్రను పెళ్లి పేరుతో రూ.9.35 కోట్లు కాజేసిందని ఆయన తండ్రి సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వివాదంపై అషురెడ్డి తండ్రి కూడా స్పందించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ అషు హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఆడియో క్లిప్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇది అషురెడ్డి పెట్టిన ఆడియో అని వైరలవుతోంది.ఈ ఆడియోలో మాట్లాడుతూ.. 'ప్రవీణ అక్కకు ఫోన్ చేశావని నాకు కాల్ చేసింది. ఇప్పుడు మళ్లీ చెబుతున్నా.. నాకు మే వరకు టైమ్ ఇస్తే రూ.1.5 కోటి ఇచ్చేస్తా. మిగిలిన డబ్బులు నా లైఫ్లో సెటిల్ అయ్యాక ఇస్తా.. లేదు కుదరదు.. అంటే పెద్ద మనుషులకు ఫోన్ చేశావ్ కదా.. నా లైఫ్లో పెద్దమనిషి ప్రవీణ అక్కే.. నువ్వు ఎవరినీ పిలుచుకుంటావో నీ ఇష్టం. నేను ఈ విషయం గురించి మాట్లాడదలచుకోలేదు. నీ మొహం కూడా చూడాలనుకోవట్లేదు. లేదు.. కుదరదు అంటే నేనే వేధింపుల కేసు పెడతా. మా అక్కను, అమ్మను ఇందులోకి లాగొద్దు. నా పర్మిషన్ లేకుండా మా ఇంటికి రావడమేంటి? నా తరఫున ప్రవీణ అక్క, వేణుస్వామి వస్తారు.. మే వరకు ఆ డబ్బులు సెటిల్ చేస్తా' అని ఉంది. ఈ ఆడియో క్లిప్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అసలేం జరిగిందంటే..ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ మూర్తి రెండురోజుల క్రితం అషురెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2018 నుండి తన కుమారుడితో అషురెడ్డికి పరిచయం ఉందని పిర్యాదులో పేర్కొన్నారు. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుదపాలుగా రూ.9.35 కోట్లు కాజేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. లండన్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ధర్మేంద్ర పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. అయితే, అషురెడ్డి తండ్రి కూడా ఈ కేసు గురించి మాట్లాడారు. తన కూతురు ఇలాంటి పనిచేయదని ఆయన చెప్పుకొచ్చారు. -
విష్ణుప్రియ, అనన్య కాదు ఈమె 'సబ్స్క్రిప్షన్' సంగతి తెలిస్తే..
ఇన్ స్టాలో సబ్స్క్రిప్షన్ పేరిట యాంకర్ విష్ణుప్రియ, హీరోయిన్ అనన్య నాగళ్ల లాంటి వాళ్లు నెలొచ్చేసరికి ఏకంగా లక్షలు సంపాదిస్తున్నారని, అయితే దీనికోసం హద్దులు దాటేస్తున్నారని వార్తలొచ్చాయి. విష్ణుప్రియపై విజయవాడలో కేసు కూడా పెట్టగా.. అనన్య మాత్రం తన రోజూవారీ జీవితంలో జరిగే వాటిని పోస్ట్ చేయడానికే ఈ సబ్స్క్రిప్షన్ పెట్టానని చెప్పుకొచ్చింది. అయితే వీళ్లని మించే సబ్స్క్రిప్షన్ స్టోరీ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వృత్తిక పటేల్ అనే ఇన్ స్టా అకౌంటే ఈ చర్చకు కారణం. ఇంతకీ ఈమె ఎవరు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)వృత్తిక పటేల్ అనే అమ్మాయి పెద్ద సెలబ్రిటీ ఏం కాదు. కేవలం లక్ష పద్నాలుగ వేలమంది ఫాలోవర్స్ మాత్రమే ఈమెకు ఉన్నారు. కానీ ఈమెని 300 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.390 అంటే దాదాపు రూ.లక్ష రూపాయల వరకు నెలకు ఈమె సంపాదిస్తోంది. ఇంతా చెప్పుకొన్నాం కదా అయితే ఇక్కడే ఓ ట్విస్ట్. ఎందుకంటే మీరూ చూసేదంతా నిజం కాదు అన్నట్లు.. వృత్తిక పటేల్ అనేది అమ్మాయి కాదు. ఇది ఏఐ మాయాజాలంతో సృష్టించిన ఖాతా.అవును మీరు విన్నది నిజమే. వృత్తిక పటేల్ అనే వ్యక్తిని ఏఐలో సృష్టించిన ఓ వ్యక్తి లేదా వ్యక్తులు.. నిజంగా అమ్మాయిలా ఉండేలా ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఐపీఎల్, దేవుడు లాంటి రెగ్యులర్ టాపిక్స్కి సంబంధించి కొన్ని పోస్టులు కూడా పెడుతున్నారు. అలానే సబ్స్క్రిప్షన్ పెడితే 300 మంది వరకు చేరారు. ఈమె నిజమైన అమ్మాయి కాదు ఏఐ అని గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో వస్తున్నప్పటికీ ఈమె ఫాలోవర్స్ తగ్గడం లాంటివి జరగలేదు.విష్ణుప్రియ, అనన్య నాగళ్ల లాంటి వాళ్లు అమ్మాయిలు కాబట్టి వీళ్లపై కేసులు పెట్టారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. కానీ వృత్తిక పటేల్ ఖాతా నడుపుతున్న వ్యక్తులు ఎవరో గానీ టెక్నాలజీని ఉపయోగించి ఇన్ స్టాలో నెలకు సులభంగా లక్షకు పైనే సంపాదించేస్తున్నారు. కాబట్టి అబ్బాయిలా జాగ్రత్త!(ఇదీ చదవండి: తెలుగు హీరోల్లో 90 శాతం మంది డూపులతోనే..) View this post on Instagram A post shared by Vrutika Patel (@vrutikaapatel) -
'మెగా ఇంటికి నా పిల్లలు.. వాళ్లకు చెప్పేది అదొక్కటే'
టాలీవుడ్ నటి రేణు దేశాయ్ ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఆమె చివరిసారిగా రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు మూవీలో కనిపించింది. ఈ చిత్రంలో కీలక పాత్రలో మెప్పించింది. ప్రస్తుతం సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియాలో ఎప్పుడు టచ్లోనే ఉంటోంది. ఎక్కువగా ఆధ్యాత్మిక సేవలోనే కనిపిస్తోంది. ఎక్కడికెళ్లినా తన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేస్తోంది. అంతేకాకుండా మూగజీవాల కోసం తన వంతు పోరాటం చేస్తున్నారు.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే రేణు దేశాయ్.. హీరో పవన్ కల్యాణ్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరికి ఆద్య, అకీరా అనే పిల్లలు ఉన్నారు. అయితే కొన్నేళ్లకే ఆమె పవన్ కల్యాణ్తో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె సింగిల్గానే తన పిల్లలతో కలిసి ఉంటున్నారు. అయితే పేరేంట్స్ విడిపోయినప్పటికీ పిల్లలు తన తండ్రి వద్దకు వెళ్తుంటారు. మెగా ఫ్యామిలీ ఇంటికి కూడా వెళ్తుంటారు. దీనిపై రేణు దేశాయ్ను ప్రశ్నించగా.. ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. మెగా ఫ్యామిలీ ఇంటికి వెళ్లినప్పుడు పిల్లలకు ఏం చెప్తారన్న ప్రశ్నకు రేణు స్పందించింది.మీరు అక్కడికి వెళ్లి ఎలా ప్రవర్తిస్తారో అదే నా పెంపకాన్ని సూచిస్తుందని వారితో చెప్తానని రేణు దేశాయ్ తెలిపింది. పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే పెంచిన తల్లి పెంపకాన్నే ప్రశ్నిస్తారని పేర్కొంది. అందుకే తన పిల్లలకు విలువల గురించి ప్రత్యేకంగా నేర్పించానని వెల్లడించారు.అందుకే మెగా ఇంటికి వెళ్లేముందు అక్కడ మీరు ఎలా మాట్లాడతారు? ఎలా ఉంటారనేది ముఖ్యమని.. ఒక తల్లిగా నేను సరిగా పెంచానా? లేదా అన్నది డిసైడ్ అవుతుందని వారితో చెప్పానని వెల్లడించింది. ఒక మదర్గా నా ఇద్దరు పిల్లలను పెంచడంలో చాలా హ్యాపీగా ఉన్నానని రేణు తెలిపింది. ఒక తల్లిగా తన పెంపకంపై మచ్చ పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనదేనన్నారు. ఇతరులను గౌరవించడం, మర్యాదగా మాట్లాడటం తన పిల్లలకు నేర్పించానని రేణు అన్నారు. -
తెలుగు హీరోల్లో 90 శాతం మంది డూపులతోనే..
తెలుగులో ప్రస్తుతం స్టార్ హీరోలందరూ బడా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే వీళ్లలో నిజమైన ఫైట్స్ చేసేది ఎంతమంది అనేది ఎవరికీ తెలీదు. ఎందుకంటే చాలామంది డూప్స్ ఉపయోగిస్తుంటారు. కాకపోతే ఆ విషయం బయటపడకుండా జాగ్రత్త పడుతుంటారు. అలానే సీన్స్లోనూ సదరు డూప్ ఉన్నాడని తెలియకుండా చూసుకుంటారు. అయితే టాలీవుడ్లో 90 శాతం మంది హీరోలు, డూపులనే ఉపయోగిస్తున్నారని చెప్పి నటుడు, దర్శకుడు రవిబాబు షాకింగ్ కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: కాజల్ అగర్వాల్కి ఇది చివరి అవకాశం!)'నా సినిమాలో హీరోది మధ్య వయసు పాత్ర. దీని కోసం టాలీవుడ్లో ఎవరుంటారా అని చూస్తే ఒక్కరూ కనిపించలేదు. ఎందుకంటే నాలా ఫిజికల్గా బలంగా ఉండి, నాలా నటించి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనుకుంటే ఎవరూ దొరకలేదు. అందుకే నేనే చేశాను. అలానే మన దగ్గర 90 శాతం మంది హీరోలు డూప్స్ ఉపయోగిస్తుంటారు. నేను మాత్రం ఫైట్స్ సీన్స్లో మార్షల్ ఆర్ట్స్ లాంటివి, కిక్స్ నిజంగా ఫెర్ఫార్మ్ చేశాను' అన రవిబాబు చెప్పుకొచ్చాడు.సీనియర్ నటుడు చలపతిరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రవిబాబు.. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే 'అల్లరి' లాంటి కామెడీ మూవీస్తో దర్శకుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. గత కొన్నేళ్లలో చూసుకుంటే మూవీస్ అయితే తీస్తున్నాడు గానీ వాటిని పట్టించుకునే నాథుడు లేడు. ఇప్పుడు కూడా 'రేజర్' అనే రివేంజ్ యాక్షన్ డ్రామా సినిమా చేశారు. కొన్నిరోజుల క్రితం ట్రైలర్ రిలీజ్ చేయగా, ఇందులో అంత రక్తపాతమే కనిపించింది. మే 08న థియేటర్లలో రిలీజ్ కానుంది. మరి రవిబాబుకి ఇదెంత వరకు కలిసొస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా) -
హైకోర్టుకు అషురెడ్డి
బిగ్బాస్ ఫేమ్, సినీనటి అషురెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.. పెళ్లి పేరుతో తన కుమారుడిని రూ. 9.35 కోట్ల వరకు మోసం చేసిందంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వై.వి. ధర్మేంద్ర తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు ఆమెపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ హైకోర్టును అషురెడ్డి ఆశ్రయించారు. తనపై నమోదైన FIRను కొట్టివేయాలని ఆమె కోరారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అసలు వాస్తవాలను దాచిపెట్టి తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన చెందారు.ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ మూర్తి రెండురోజుల క్రితం అషురెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2018 నుండి తన కుమారుడితో అషురెడ్డికి పరిచయం ఉందని పిర్యాదులో పేర్కొన్నారు. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుదపాలుగా రూ.9.35 కోట్లు కాజేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. లండన్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ధర్మేంద్ర పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. అయితే, అషురెడ్డి తండ్రి కూడా ఈ కేసు గురించి మాట్లాడారు. తన కూతురు ఇలాంటి పనిచేయదని ఆయన చెప్పుకొచ్చారు. -
పోకిరి@ 20ఏళ్లు.. ఫస్ట్ చాయిస్ మహేశ్బాబు కాదు!
మహేశ్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘పోకిరి’. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2006 ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలైంది. టాలీవుడ్లో ఫస్ట్ రూ. 50 కోట్లు రాబట్టిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. అప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాస్తూ.. బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను బద్దలు కొట్టింది. 200లకు పైగా కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడి, ఒక అరుదైన రికార్డు క్రియేట్ చేయడమే కాకుండా.. 15 కేంద్రాల్లో 200 రోజుల పాటు ప్రదర్శించబడిన మొదటి తెలుగు చిత్రంగా నిలిచింది. 75ఏళ్ళ సినీ పరిశ్రమలో సరికొత్త రికార్డుగా పోకిరి నిలిచింది.హీరోగా ఫస్ట్ ఛాయిస్ మహేశ్ బాబు కాదుపోకిరి సినిమా కథ రాసుకున్నప్పుడు తొలుత మహేశ్ని అనుకోలేదట పూరి. మాస్ మహారాజ రవితేజని దృష్టిలో పెట్టుకొని ఈ కథను రెడీ చేశాడట. అయితే, పలు కారణాల వల్ల రవితేజతో ఈ సినిమాను పూరి చేయలేకపోవడంతో మహేశ్ ఎంట్రీ ఇచ్చేశారట. అలాగే ఈ సినిమాకు ‘పోకిరి’అనే టైటిల్ను కూడా చివర్లో ఫైనల్ చేశారట. మొదట్లో ఈ కథకి ‘ఉత్తమ్ సింగ్.. సన్నాఫ్ సూర్య’అని టైటిల్ను పూరి ఫిక్స్ చేసుకున్నాడట.. కానీ, ప్రాజెక్ట్ నుంచి రవితేజ తప్పుకోవడం వల్ల టైటిల్తో పాటు కథలో కొన్ని మార్పులు చేసి పోకిరి అనే టైటిల్ను ప్రకటించారట.పోకిరికి నో చెప్పిన ఇద్దరు హీరోయిన్స్ఈ సినిమాకు హీరోయిన్గా ఫస్ట్ చాయిస్ ఇలియానా కాదట. ఆమెను కూడా చివరి నిమిషంలో దర్శకుడు పూరి తీసుకున్నారు. తొలుత ఈ చిత్రానికి హీరోయిన్గా అయేషా టాకియాను సంప్రదించారట. అన్నీ ఓకే అయ్యాక మె కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో నటించడానికి ఒప్పులేదు. ఆ తర్వాత బాలీవుడ్ నటి కంగనా రనౌత్ని ఎంపిక చేస్తే.. షూటింగ్కి రెడీ అవుతున్న సమయంలో కంగనా కూడా హ్యాండించింది. తనకు బాలీవుడ్లో ‘గ్యాంగ్స్టర్’ చిత్రంలో నటించే అవకాశం రావడంతో ‘పోకిరి’ని వదులుకుంది. దీంతో చివరి నిమిషంలో ఇలియానాను సంప్రదిస్తే ఈ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఈ సినిమాతోనే ఇలియానా స్టార్ హీరోయిన్గా తన కెరీర్ మారిపోయింది.మహేశ్ కటౌట్ చూస్తే మిల్కీ బాయ్లా ఉంటాడు.. ఎప్పుడూ క్లీన్ షేవ్తో క్లాస్గా కనిపించే ఆయన తొలిసారి ఈ సినిమాలో ఊరమాస్ గెటప్లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. అతడు మూవీ తర్వాత సుమారు నాలుగు నెలలు గ్యాప్ తీసుకుని తన గెటప్ను చేంజ్ చేసుకున్నాడు. పోకిరి కోసం సరికొత్త లుక్లో కనిపించేందుకు చాలానే కష్టపడ్డాడు. అప్పటివరకు క్లాస్గా కనిపించే మహేశ్లోని ఊరమాస్ యాంగిల్ని ప్రేక్షలకు చూపించాడు పూరి. దాదాపు రూ.12 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ. 40 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఇంత షేర్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా పోకిరి రికార్డులకు ఎక్కింది. -
గుడ్న్యూస్ తర్వాత తొలిసారి కనిపించిన దీపికా పదుకొణె (వీడియో)
బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె- రణవీర్ సింగ్ దంపతులు ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించారు. అయితే, రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించిన తర్వాత తొలిసారిగా వారు కెమెరా ముందుకు రావడంతో అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. తాను తల్లికాబోతున్నట్లు ప్రకటించినప్పటికీ ముందుగా ఒప్పుకున్న సినిమాల కోసం ఆమె పనిచేస్తూనే ఉన్నారు.అల్లు అర్జున్- అట్లీ మూవీ రాకాలో దీపికా నటిస్తున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన సీన్స్ షూటింగ్ జరుగుతుంది. ఆపై షారుఖ్ ఖాన్ కింగ్ మూవీలోనే భాగమైన దీపికా.. ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్స్లో నటించేందుకు రెడీ అయిపోయిందట. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ కోసం షారుక్తో పాటు దీపిక కూడా సెట్లోకి అడుగుపెట్టినట్లు సమాచారం.దీపికా పదుకొణె- రణవీర్ సింగ్ దంపతులకు 2024లో దువా పదుకొణె సింగ్ అనే కుమార్తె జన్మించగా.. ఇప్పుడు రోండో బిడ్డ వారి జీవితంలోకి రానుంది. గర్భవతిగా ఉన్నప్పటికీ దీపికా సినిమా షూటింగులలో బిజీగా ఉండటంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. Late-night airport spotting alert! #RanveerSingh and #DeepikaPadukone keep it stylish, comfy, and oh-so-iconic 💼✨#MissMalini pic.twitter.com/uaWuuB1hz1— MissMalini (@MissMalini) April 28, 2026 -
పెద్ది, ది ప్యారడైజ్ చిత్రాలకు ఒకేరోజు లీకుల షాక్
టాలీవుడ్ అభిమానులు రెండు భారీ బడ్జెట్ సినిమాల విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ 'పెద్ది', నాని 'ది ప్యారడైజ్' ఈ రెండు చిత్రాలు ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద ఒకేసారి విడుదల కావాల్సి ఉండగా తర్వాత వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, ఒకేరోజు ఈ రెండు సినిమాల షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని వీడియో క్లిప్ప్ లీక్ అయ్యాయి. దీంతో మేకర్స్ కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.దర్శకుడు బుచ్చిబాబు ఒక సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ.. జూన్ 25న పెద్ది సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని తెలిపారు. ప్రస్తుతం స్పెషల్ సాంగ్ షూటింగ్ చేస్తున్నామని బుచ్చిబాబు అన్నారు. హైదరాబాద్లో వేసిన ఒక సెట్స్లో పెద్ది ఐటెమ్ సాంగ్ జరుగుతుంది. తాజాగా రామ్ చరణ్, శ్రుతి హాసన్ డ్యాన్స్ క్లిప్పింగ్స్ షూటింగ్ ప్రదేశం నుంచి లీక్ అయ్యాయి. పెద్ది ఐటెమ్ సాంగ్పై భారీ క్రేజ్ ఉంది. ‘ఆగడు’ సినిమాలో ‘జంక్షన్లో...’ అంటూ మహేష్ బాబుతో స్టెప్పులు వేసిన శ్రుతి హాసన్.. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండోసారి ఐటెమ్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్లో క్రేజ్ను పెంచారు.నాని 'ది ప్యారడైజ్' నుంచి కూడా ఒక ఒక ఫైట్ సీన్ లీక్ అయింది. ఇలా రెండు భారీ సినిమాల నుంచి కొన్ని వీడియోలు లీక్ కావడంతో అభిమానులలో ఉత్సాహం పెరిగినప్పటికీ, చిత్రనిర్మాతలలో ఆందోళన నెలకొంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న 'ది ప్యారడైజ్' ఆగష్టు 21, 2026న రానుంది. -
మహిమాన్వితమైన గుడికి విజయ్.. వీడియో వైరల్
తిరుచెందూర్ మురుగన్ (సుబ్రమణ్య స్వామి ఆలయం)ను నటుడు, టీవీకే అధినేత విజయ్ దర్శించుకున్నారు. కొద్దిరోజులుగా తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉన్న విజయ్ 4న విడుదల కానున్న ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం తిరుచెందూర్ మురుగన్ను విజయ్ దర్శించుకున్నారు. స్వామి ఆయుధం "వేల్" (శక్త్యాయుధము) చేత అందుకున్న విజయ్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. తిరుచెందూర్లోని సుబ్రహ్మణ్యుని విగ్రహం అత్యంత మహిమాన్వితమైనదని చెబుతారు. అందుకే స్వామి ఆశీస్సుల కోసం విజయ్ వచ్చినట్లు తెలుస్తోంది.తమిళనాడులో ఉన్న మురుగన్ ఆరు నివాసాలలో ఇది రెండవది. తమిళనాడులో అత్యధికంగా సందర్శించే మతపరమైన ప్రదేశాలలో ఒకటిగా ఈ ఆలయం ఉంది. సుబ్రహ్మణేశ్వర స్వామికి చెందిన ఆరు క్షేత్రాల్లో ఐదు క్షేత్రాలు పర్వత ప్రాంతాలపైనే ఉన్నాయి. కానీ, తిరుచెందూర్ మాత్రం సముద్ర తీరంలో కొలువై ఉంటుంది. ఇక్కడి సుబ్రహ్మణ్యుని విగ్రహం అత్యంత మహిమాన్వితమైనదని భక్తులు చెబుతారు. తిరుచెందూర్ మురుగన్కు అభిషేకం చేసిన విభూతి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే, గ్రహ, శత్రు, భూత, ప్రేత పిశాచ బాధలు ఉండవని నమ్ముతారు. తమిళనాడు నలుమూలల నుంచి తిరుచెందూర్కు చేరుకోవచ్చు. తూత్తుక్కుడి నుంచి 40 కిలోమీటర్లు, తిరునెల్వేలి నుంచి 60 కిలోమీటర్లు, కన్యాకుమారి నుంచి 90 కిలోమీటర్లు, మధురై నుంచి 175 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. నిరంతరం రైలు, బస్సు రవాణా సౌకర్యం ఉంది. #TVKVijay at Tiruchendur Murugan Temple for Vishwaroopa Darshan ❤️🔥💥pic.twitter.com/204nfbypKs— Troll Cinema ( TC ) (@Troll_Cinema) April 28, 2026 -
హీరోగా యాత్ర.. కుమారుడి ఎంట్రీపై ధనుష్ రియాక్షన్
తమిళ నటుడు ధనుష్ మల్టీ టాలెంటెడ్. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు.. కథా రచయిత, గీత రచయిత, గాయకుడు, దర్శకుడు, నిర్మాతగా మెప్పించిన విషయం తెలిసిందే. అయితే, కొద్దిరోజులుగా ధనుష్ పెద్ద కుమారుడు యాత్ర హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కథనాలు వచ్చాయి. తనను ధనుష్నే లాంచ్ చేయబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో తాజాగా ఇదే అంశం గురించి ధనుష్ను ప్రశ్నించగా ఆయన స్పందించారు.ధనుష్ కొత్త సినిమా కర.. ఈ మూవీ ఏప్రిల్ 30న విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న ధనుష్కు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. కుమారుడు యాత్ర సినిమాల్లోకి ఎప్పుడొస్తారనే ప్రశ్నపై ఆయన ఇలా స్పందించారు. 'నేను 16ఏళ్లకే సినిమా పరిశ్రమలోకి వచ్చాను. అందుకు కారణం మా కుటుంబ పరిస్థితులే.. ప్రస్తుతం యాత్ర వయసు 19ఏళ్లు. కానీ, వాడు నాకు చిన్నపిల్లోడిలానే కనిపిస్తాడు. రాబోయే రోజుల్లో వాడు ఏమవుతాడనేది నేను చెప్పలేను. సినిమా పరిశ్రమలోకి వస్తాడా అనేది కూడా చెప్పలేను. సమయం ఇంకా ఉంది. వాడు (యాత్ర) తన కెరీర్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో దానిని అమలు చేస్తాను.' అని ధనుష్ అన్నారు. -
పవర్ఫుల్ గుడి.. దర్శనం తర్వాత నా లైఫ్ మారిపోయింది: శృతి హాసన్
దైవం అన్నది మానవ జీవితంలో అతి ప్రధానమైనది. నాస్తికులు దీన్ని అంగీకరించకపోవచ్చు. ఆ విషయాన్ని పక్కన పెడితే ఏదో ఒక తరుణంలో మనిషి నిజమైన భక్తిని పొంది పరవశిస్తాడు. అలాంటి నిజమైన భక్తి పారవశ్యాన్ని పొంది తరించానంటున్నారు నటి శృతి హాసన్. నాస్తికుడైన కమలహాసన్ వారుసురాలిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్(Shruti Haasan) మాత్రం ఆస్తికురాలే. దైవభక్తి కలిగిన నటి. వ్యక్తిగతంగా సంచలన నటి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తమిళ్, తెలుగులో పలు హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఆమె రాణిస్తున్నారు. ఆ మధ్య ప్రేమలో పడ్డా, ఆ వ్యవహారం అచ్చిరాలేదనే చెప్పాలి. దీంతో ప్రస్తుతం తాను సింగిల్ అని బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చిన గట్స్ కలిగిన నటి శృతీహాసన్. ఇటీవల ఈమె నిజమైన భక్తి భావనను పొందిన విషయంపై ఒక భేటీలో పేర్కొన్నారు. ‘ఇటీవల నేను వారాహీ మాత ఆలయానికి వెళ్లాను. మనమే కాదు. దైవాలు కూడా మనల్ని ఎంచుకుంటారు. ఒక మిత్రుడు నువ్వు చాలా ప్రత్యేకంగా ఉన్నావు. రా దేవాలయానికి వెళ్లి వద్దాం అని పిలిచారు. అది చాలా చిన్న ఆలయమే. అయితే గర్భగుడిలోకి వెళ్లగానే నిజమైన భక్తి పారవశ్యాన్ని పొందాను. ఎలాంటి ఆడంబరం లేదు. వీఐపీల క్యూ లేదు. శక్తివంతమైన దేవత ’ అని నటి శృతి హాసన్ పేర్కొ న్నారు. అయితే, అమ్మవారి దర్శనం తర్వాత తన జీవితంలో చాలా మంచి మార్పులు వచ్చాయని, తనలో కొత్త శక్తి వచ్చిందని ఆమె చెప్పడం విశేషం.శృతి హాసన్ జీవితంలో మార్పులుశృతి హాసన్ చెన్నైలో సందర్శించిన ప్రసిద్ధ వారాహి దేవి ఆలయం మయిలాపూర్ (Mylapore)లో ఉంది. ఈ ఆలయం చెన్నైలోని ప్రసిద్ధ కపాలీశ్వర ఆలయానికి సమీపంలో ఉంది, ఇది వారాహి ఆరాధనకు అత్యంత శక్తివంతమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయ దర్శనం కొద్దిరోజుల తర్వాత శృతి హాసన్ అస్సాంలోని వారాహి మాత (కామాఖ్య దేవాలయం) కూడా దర్శించారు. ఇది అస్సాంలోని గువాహటిలో నీలాచల్ కొండలపై ఉంది. వారాహి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తన జీవితంలో మంచి మార్పులు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. ఇది ఒక ప్రముఖ శక్తి పీఠం ఆపై తంత్ర సాధనకు అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రదేశం.ఇకపోతే ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతికి జంటగా ట్రైన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇది నిర్మాణ దశలో ఉంది. సలార్–2 చిత్రంలో నటించనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగులో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటించడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. -
మద్రాసు హైకోర్టులో టీవీకే చీఫ్ విజయ్కు ఊరట
సాక్షి, చెన్నై: తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్ దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ పత్రాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ.12.60 కోట్లను అప్పుగా సతీమణికి ఇచ్చినట్లు విజయ్ పేర్కొనడంపై విచారణ జరపాలని దాఖలైన పిటిషన్ను మద్రాసు హైకోర్టు సోమవారం కొట్టివేసింది. పెరంబూరు నియోజకవర్గానికి చెందిన వెంకటేష్ వేసిన పిటిషన్లో ప్రధానంగా 3 అంశాలను ప్రస్తావించారు.విజయ్ తన సతీమణి సంగీతకు రూ.12.60 కోట్ల అప్పు ఇచ్చినట్లు నామినేషన్లో పేర్కొన్నారని, అయితే వీరు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారనే నేపథ్యంలో, ఇంత భారీ మొత్తాన్ని అప్పుగా చూపడం అనుమానాలకు తావిస్తోందన్నారు. పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల్లో విజయ్ దాఖలు చేసిన ప్రమాణపత్రాల్లో ఆస్తుల విలువలో రూ.100 కోట్ల మేర వ్యత్యాసం ఉందని, దీనిపై ఆదాయ పన్ను శాఖ విచారణ జరపాలని కోరారు. మద్రాసు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ ధర్మాధికారి, న్యాయమూర్తి జస్టిస్ జి.అరుల్ మురుగన్ల ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఇప్పటికే ఇదే అంశంపై దాఖలైన మరొక పిటిషన్ను కోర్టు గతంలోనే పరిష్కరించినందున, మళ్లీ అలాంటి పిటిషన్ను విచారణకు స్వీకరించలేమని న్యాయమూర్తులు తెలిపారు. ఐటీ విచారణ కోరుతూ దాఖలైన మరో అనుబంధ పిటిషన్పై విచారణను మాత్రం జూన్కు వాయిదా వేశారు. -
#కింగ్ 100లో ఎంట్రీ
నాగార్జున హీరోగా నటిస్తున్న ‘#కింగ్ 100’ సినిమాలో భాగమయ్యారు నటి టబు. ఆర్ఏ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్గా నటిస్తున్నారని తెలిసింది. కాగా, ఈ సినిమాలో నటి టబు భాగం అయినట్లుగా మేకర్స్ సోమవారం ప్రకటించారు. ‘‘సెట్స్లో మీ రాక మాకెంతో గౌరవంగా ఉంది.ఈ సినిమాలో మీరు భాగం కావడంతో మా మైల్స్టోన్ సినిమా మరింత స్పెషల్గా మారిపోయింది’’ అంటూ ‘#కింగ్ 100’ సినిమా యూనిట్ పేర్కొంది. అలాగే ఈ సినిమా చిత్రీకరణలో తాను జాయిన్ అయినట్లు ఇన్స్టా వేదికగా టబు పేర్కొన్నారు. అయితే ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా టబు కనిపిస్తారా? లేదా కీలక పాత్ర చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.నాగార్జున కెరీర్లోని ఈ వందో సినిమాలో సుస్మితా భట్, విజయేంద్ర ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారని, తండ్రీకూతుళ్ల ఎమోషన్ బ్యాక్డ్రాప్తో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘నిన్నే పెళ్లాడతా’(1996), ‘ఆవిడా మా ఆవిడే’ (1998) చిత్రాల్లో నాగార్జున, టబు జోడీగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
గాయపడ్డ సింహం సంతృప్తి ఇస్తుంది: ఫరియా అబ్దుల్లా
‘‘గాయపడ్డ సింహం’ చిత్ర కథ వినగానే కొత్తగా అనిపించింది. కశ్యప్ శ్రీనివాస్గారు నా పాత్ర గురించి చెప్పినప్పుడు చాలా ఎగై్జటింగ్గా అనిపించింది. ఇందులో ప్రతి పాత్రకి ప్రాధాన్యం ఉంటుంది. నేను చేసిన షాలిని పాత్రలో వినోదం ఎక్కువగా ఉంటుంది. మా మూవీ చూసిన ప్రేక్షకులకు ఓ మంచి సినిమా చూశామనే సంతృప్తి కలుగుతుంది’’ అని హీరోయిన్ ఫరియా అబ్దుల్లా చెప్పారు.తరుణ్ భాస్కర్ హీరోగా, ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గాయపడ్డ సింహం’. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. డైరెక్టర్ పవన్ సాధినేని సమర్పణలో కల్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఫరియా అబ్దుల్లా పంచుకున్న విశేషాలు.... ⇒ నేను ఏదైనా ఓ సినిమా ఒప్పుకోవాలంటే కథ, నా పాత్ర నచ్చాలి. ‘గాయపడ్డ సింహం’లో వ్లాగర్ షాలిని పాత్ర చేశాను. కశ్యప్ క్రియేట్ చేసిన యూనివర్స్, క్యారెక్టర్స్ అన్నీ చాలా హిలేరియస్గా వచ్చాయి. మా మూవీ ఫైనల్ ఔట్పుట్ చూశాను.. చాలా అద్భుతంగా వచ్చింది. సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. తరుణ్ భాస్కర్గారు సరదాగా ఉంటారు. ఆయన సెట్స్లో చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చినా నాకు నవ్వు వచ్చేది. ఈ మూవీలో శ్రీవిష్ణుగారి క్యారెక్టర్ చాలా ఆసక్తిగా ఉంటుంది. ఇందులో ప్రేమికుడి చేయి వదిలేసిన అమ్మాయిగా మానసా చౌదరి చేస్తే.. ఆ చేతిని పట్టుకునే అమ్మాయి పాత్ర నాది (నవ్వుతూ).⇒ ‘గాయపడ్డ సింహం’ లో యాక్షన్, రొమాన్స్, కామెడీ.. ఇలా అన్ని అంశాలను కలిపి హిలేరియస్గా తెరకెక్కించారు కశ్యప్ శ్రీనివాస్గారు. స్వీకర్ అగస్తి చాలా అందమైన సంగీతం ఇచ్చారు. ‘బ్రైడ్...’, ‘జింగాల...’ నాకు ఇష్టమైన పాటలు. ఈ చిత్రానికి నలుగురు నిర్మాతలు ఉన్నారు.. అందరూ చాలా క్రియేటివ్గా ఆలోచించే వారు. ఈ మూవీలో జేడీ చక్రవర్తిగారితో నాకు కాంబినేషన్ సీన్స్ లేవు. దుల్కర్ సల్మాన్గారి సినిమాలో అతిథి పాత్ర వస్తే చేయాలనుకోవడం లేదు. పూర్తి స్థాయి నిడివి ఉండే పాత్ర చేయాలని ఉంది. వచ్చే ఏడాది నేను ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తాను.. కొన్ని కథలు రాస్తున్నాను. ప్రస్తుతం ‘భగవంతుడు’, ‘సిగ్మా’ సినిమాలు పూర్తి చేశాను. సత్యదేవ్గారితో ఓ మూవీ చేస్తున్నాను. మరో రెండు సినిమాలు ప్రారంభం కాబోతున్నాయి. -
బొగ్గు స్కామ్పై సినిమా.. పవర్ఫుల్ పోలీస్గా యంగ్ బ్యూటీ
హీరోయిన్ సంయుక్త ప్రధాన పాత్రలో కోల్ సిండికేట్ నేపథ్యం, నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో రూపుదిద్దుకున్న యాక్షన్ సినిమా ‘ది బ్లాక్ గోల్డ్’. కేఎమ్సీ యోగేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రావు రమేశ్, మురళీ శర్మ, నాజర్, మనీష్ వాధ్వా, రాంకీ, రవీంద్ర విజయ్ ఇతర పాత్రల్లో నటించారు. మాగంటి పిక్చర్స్ సహకారంతో హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.‘‘తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంతో సాగే కథే ‘ది బ్లాక్ గోల్డ్’. సంయుక్త పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్ నగర్, ఆదిలాబాద్ లొకేషన్స్తో పాటుగా, హైదరాబాద్లో వేసిన సెట్స్లో ఈ సినిమా చిత్రీకరించాం. ఈ మూవీ కోసం పదికిపైగా భారీ సెట్స్ వేశాం. 60కిపైగా వర్కింగ్ డేస్లో చిత్రీకరణను పూర్తి చేశాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సహ నిర్మాత: సింధు మాగంటి, సంగీతం: సామ్ సీఎస్. -
20 వంద కోట్ల హిట్స్.. అక్షయ్ కుమార్ అరుదైన ఘనత
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భారతీయ సినిమా చరిత్రలో ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నారు. అక్షయ్ తన కెరీర్లో ఏకంగా 20 సినిమాలతో 100 కోట్ల నెట్ వసూళ్లు సాధించాడు. దాంతో ఈ ఘనత సాధించిన తొలి నటుడిగా నిలిచారు. ఖాన్ త్రయం అయిన షారూక్, సల్మాన్, అమీర్లను ఈ విషయంలో మించి అక్షయ్ ముందంజలో నిలిచాడు. ఇక ఈ వరుసలో అక్షయ్ తర్వాత స్ధానంలో సల్మాన్ ఖాన్ 18 సినిమాలతో ఉన్నాడు. ఇలా అజయ్ దేవగన్ 16 సినిమాలతో మూడో స్థానంలో, షారూక్ ఖాన్ 10 సినిమాలతో నాలుగో స్థానంలో, రణ్వీర్ సింగ్ 9 సినిమాలతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. 2012లో హౌస్ఫుల్ 2తో తొలిసారిగా 100 కోట్ల క్లబ్లో అక్షయ్ అడుగుపెట్టాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. కరోనా తర్వాత కూడా ఆయన నటించిన ఆరు సినిమాలు వంద కోట్ల మార్కును దాటాయి. తాజాగా విడుదలైన బూత్ బంగ్లాతో ఈ సంఖ్య 20కి చేరింది. రజనీకాంత్, విజయ్, ప్రభాస్ వంటి స్టార్లు కూడా 100 కోట్ల క్లబ్లో ఉన్నారు. కానీ అక్షయ్ స్థాయిలో వరుసగా ఇంత పెద్ద సంఖ్యలో సినిమాలు డెలివర్ చేయలేదు. ఎందుకంటే, హీరోలంతా ఏడాదికి లేదా రెండేళ్లకు ఒక సినిమా మాత్రమే చేస్తున్నారు. అక్షయ్ మాత్రమే ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేస్తూ ఇలా రికార్డులు సృష్టిస్తున్నాడు. -
'అర్జున్ రెడ్డి కంటే పెద్ద హిట్టవుతుంది'.. రిషబ్ శెట్టి కొత్త సినిమా ట్రైలర్
గతేడాది కాంతార-2 మూవీతో సూపర్ హిట్ కొట్టిన రిషబ్ శెట్టి ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. కొత్త ఏడాదిలో సడన్ షాకిచ్చాడు. ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రిషబ్ శెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం ఏ ఫిల్మ్ బై గిరి. ఈ మూవీలో ఇందిర హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.ఈ నేపథ్యంలో ఏ ఫిల్మ్ బై గిరి ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే రిషబ్ శెట్టి మూవీ స్క్రిప్ట్ రైటర్గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్లో సీన్స్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ సినిమా ద్వారా కరణ్ అనంత్, అనిరుధ్ మహేశ్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఎంజీ మూవీస్ ద్వారా ఎం అచ్చిబాబు రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో ఎన్.పి తాపేశ్వరి, హోన్నవలి కృష్ణ, ప్రమోద్ శెట్టి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు వాసుకి వైభవ్ సంగీతం అందించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ధనుశ్ కర.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది
ధనుశ్, మమిత బైజు జంటగా నటించిన లేటేస్ట్ మూవీ కర. ఈ సినిమాకు విఘ్నశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈశారి గణేశ్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే తమిళ ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్... తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. 'ఆరు నెలలుగా కొనసాగుతున్న గల్ఫ్ దేశాల యుద్ధం పరాకాష్టకు చేరుకుంది.. కువైట్లో ఉన్న వందలాది ఆయిల్ వనరులపై ఇరానా దాడులు చేసింది' అన్న డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. కర ట్రైలర్ చూస్తుంటే డబ్బు కోసం ఓ సామాన్యుడు చేసే పోరాటంగానే ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బ్యాంకులను కొల్లగొట్టి కోట్ల రూపాయలను దోచుకునే వ్యక్తిగా ధనుశ్ ఇందులో కనిపించారు. డబ్బు కోసం ఏదైనా చేసే దొంగ పాత్రలో ధనుశ్ కనిపించనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కాగా.. ఈ మూవీలో కె.ఎస్. రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీ పాండియరాజన్, సూరజ్ వెంజరమూడు, ఎం.ఎస్. బాస్కర్, శ్రీజ రవి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతమందించారు. -
'నా భర్తకు పదిమందితో ఎఫైర్స్'.. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కామెంట్స్
సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచమని మనందరికీ తెలుసు. కానీ మనకు పైకి కనిపించనంత అందంగా నటీమణుల జీవితాలు ఉండవని కొందరికే తెలుసు. పైకి కలర్పుల్గా కనిపించే వారి జీవితాల్లోనూ ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. అలా సినీతారల పర్సనల్ లైఫ్లో కూడా ఎన్నో బాధలు, కష్టాలు ఉంటాయి. కొందరు తమ ఆవేదన చెప్పుకోలేని పరిస్థితుల్లోనూ ఉంటారు. మరికొందరేమో సినీతారలు తాము పడిన కష్టాలను పంచుకుంటూ ఉంటారు. అలా తన పర్సనల్ లైఫ్ గురించి ఆనాటి హీరోయిన్, బుల్లితెర నటి షాకింగ్ విషయాలు పంచుకుంది. అప్పట్లో స్టార్గా పలు హీరోల సరసన మెప్పించిన పూజిత తన పెళ్లి, భర్త గురించి సంచలన విషయాలు వెల్లడించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన భర్త చేసిన ఘనకార్యాలను బయటపెట్టేసింది.'ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్' సినిమాలో రాజేంద్ర ప్రసాద్కు రెండో భార్యగా మెప్పించిన పూజిత.. అప్పటి వారికి సుపరిచితమైన పేరు. రుతురాగాలు వంటి సీరియల్తో మరింత ఫేమస్ అయింది. ఆ తర్వాత తెలుగులో దాదాపు 70కి పైగా సినిమాల్లో కనిపించింది. తెలుగుతో పాటు తమిళ, మళయాళం, కన్నడ భాషల్లో దాదాపు 140 సినిమాల్లో మెప్పించింది.భర్త మోసంపై ఒంటరి పోరాటం..వెండితెరపై అభిమానులను మెప్పించిన పూజిత రియల్ లైఫ్ మాత్రం భర్త చేసిన మోసంతో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని తెలిపింది. తన భర్త విజయ్ గోపాల్ గురించి తాజా ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించింది. తన భర్త దాదాపు 9 మంది మహిళలతో ఎఫైర్స్ నడిపాడని పూజిత తెలిపింది. కానీ చివరికీ ఒక ఐఏఎస్ అధికారిణిని పెళ్లి చేసుకున్నాడని పేర్కొంది. దాదాపు 28 ఏళ్ల వయసు కొడుకు ఉన్న ఓ మహిళా అధికారిణిని పెళ్లాడటం అప్పట్లో హాట్ టాపిక్గా నిలిచింది. తన భర్త మీడియా వ్యక్తి కావడంతో ఎలాంటి ఆధారాలు లేకుండా చేసి.. తనకి అన్యాయం చేశాడని చాలాసార్లు పూజిత చెప్పుకొచ్చింది.కాగా.. విజయగోపాల్ అనే వ్యక్తిని పెళ్లాడిన పూజితకు ఓ కుమారుడు జన్మించారు. దాదాపు 14 ఏళ్ల తరువాత పూజితను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు విజయ గోపాల్. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లి చేసుకున్నాడని అప్పట్లో నటి పూజిత రోడ్డుకెక్కింది. ఈ టాపిక్ సినీ ఇండస్ట్రీలో బాగా వైరలైంది. కానీ అప్పట్లో పూజితతో తాను కేవలం సహజీవనం మాత్రమే చేశానని ఆమె భర్త విజయ్ గోపాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. -
దీప్వీర్ కుమార్తె దువా తొలి లైవ్ మ్యూజికల్ షో వైరల్
బాలీవుడ్ నటుడు, రణవీర్, దీపికా పడుకోన్ దంపతుల కమార్తె దువా ఇంత చిన్న వయసులోనే లైవ్ షో ఇచ్చి అదరగొట్టింది. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో తన పెర్ఫామెన్స్తో దీప్వీర్ అభిమానులను ఆకట్టుకుంది. ధురందర్ సినిమా భారీ హిట్ కావడంతో సంతోషంలో మునిగితేలుతున్న రణవీర్కు దువా తన టాలెంట్తో మరింత ఆనందాన్ని ఇచ్చింది అంటున్నారు ఫ్యాన్స్. 'ధురందర్' స్టార్ రణ్వీర్ సింగ్, తన కుమార్తె దువా మొదటి కోకో మిలన్ (చిన్న పిల్లల కార్టూన్ షో) లైవ్ మ్యూజికల్ షో వీడియో నెట్టింట వైరల్గా మారింది. రణవీర్ సింగ్ , దీపికా పడుకోన్ తమ బిడ్డ దువా మొదటి లైవ్ షోను ఎంజాయ్ చేశారు. షో అనంతరం, రణవీర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. "ఇది మా దువా పాపకి తొలిప్రదర్శన కాబట్టి మాకు చాలా ప్రత్యేకమైనది. జీవితాంతం నిలిచిపోయే జ్ఞాపకాలను మిగుల్చుకునే అవకాశవ కల్పించిన NMACC బృందానికి చాలా కృతజ్ఞుడను’’, అంటూ NMACC బృందానికి ధన్యవాదాలు తెలిపారు.తాను, దీపిక, ఇంకా తాతయ్య, నానమ్మలతో కలిసి ఈ మ్యూజికల్కు హాజరైందని రణ్వీర్ వెల్లడించారు. ఎంతో సరదా, సంతోషం, అదొక రంగులమయం నిజంగా ఒక అద్భుతమైన అనుభవం అని తెగ సంతోష పడిపోయాడు.Ranveer talks about watching Cocomelon Live at the NMACC with Dua and Deepika 🥰🥰♥️♥️ #deepveer #RanveerSingh #DeepikaPadukone Ranveer: It is extra special for us because this is our Dua baby's first show 💖 pic.twitter.com/9REtUmny44— DeepVeer Fanclub (@DeepVeer_FC) April 26, 2026 కాగా దీపికా, రణవీర్లు 2018 నవంబర్ 14న పెళ్లి చేసుకోగా, 2024లో వారికి కుమార్తె జన్మించింది. మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నామంటూ ఇటీవల వీరు ప్రకటించారు. -
సొంతూరిలో నభా.. 'దృశ్యం' పాప సీరియస్ లుక్
సొంతూరిలో సరదాగా తిరిగేస్తున్న నభా నటేశ్నాభి అందాలతో సీరియల్ బ్యూటీ జ్యోతిరాయ్చిత్రమైన డ్రస్లో జాన్వీ కపూర్ పోజులుపెట్ డాగ్తో భాగ్య శ్రీ బోర్సే సరదా సరదాగాసీరియస్ లుక్లో అందంగా 'దృశ్యం' ఎస్తర్ట్రిప్ జ్ఞాపకాలు పంచుకున్న జైన్ మేరీ ఖాన్ View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Meagan Concessio (@meaganconcessio) View this post on Instagram A post shared by Esther (@_estheranil) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Zayn Khan (@zaynmarie) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) -
మహిళకు లైంగిక వేధింపులు.. బిగ్బాస్ కంటెస్టెంట్పై ఫిర్యాదు
ప్రముఖ మలయాళ నటుడు, బిగ్బాస్ ఫేమ్ షియాస్ కరీంపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కేరళలోని పాలారివట్టం పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. తనపై లైంగిక వేధింపులతో పాటు ఆర్థికంగా మోసం చేశాడంటూ విదేశాల్లో నివసిస్తున్న ఓ మహిళ కేరళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తన నగ్న చిత్రాలను అశ్లీల వెబ్సైట్లలో పెడతానని బెదిరించాడని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా తన వద్ద నుంచి రూ.65 లక్షలు బలవంతంగా వసూలు చేశాడని ఆరోపించింది. అందుకు సంబంధించిన సోషల్ మీడియా చాటింగ్స్, వాయిస్ రికార్డింగ్లను పోలీసులకు అందించింది. షియాస్ కరీంకు డబ్బుల చెల్లింపులకు సంబంధించిన బ్యాంకు లావాదేవీల రికార్డులను సైతం పోలీసులకు సమర్పించింది. అతని వల్ల తాను తీవ్ర మానసిక వేధింపులకు గురయ్యానని ఫిర్యాదులో ప్రస్తావించింది. వేధింపులు భరించలేకనే పోలీసుల ముందుకు వచ్చానని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.కాగా.. గతంలో ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక వేధింపులతో పాటు ఆర్థిక మోసానికి పాల్పడ్డాడని ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు షియాస్ను అరెస్టు చేశారు. మూడేళ్ల క్రితం చెన్నై విమానాశ్రయంలో అతడిని అరెస్టు చేశారు. అప్పట్లో ఎర్నాకుళంలో ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేస్తున్న కాసరగోడ్కు చెందిన మహిళను పెళ్లి పేరుతో మోసం చేశాడు.పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెపై లైంగిక దాడి వేధింపులతో పాటు దాదాపు రూ.11 లక్షలు వసూలు చేశాడని ఆ మహిళ ఆరోపించింది. -
అలరించేలా 'గోదారి గట్టుపైన' ట్రైలర్
కూతురిని చాలా ప్రేమించే తండ్రి.. కానీ కూతురేమో ఓ కుర్రాడితో ప్రేమలో పడటం. తద్వారా ముగ్గురి జీవితాల్లో ఏర్పడే సంఘర్షణ అనే కాన్సెప్ట్తో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ఇలాంటి స్టోరీతో తీసిన మరో మూవీ 'గోదారి గట్టుపైన'. సుమంత్ ప్రభాస్, జగపతిబాబు, నిధి ప్రదీప్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేయగా అది ఆకట్టుకుంటోంది.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా)షార్ట్ ఫిల్స్మ్, ఆల్బమ్ సాంగ్స్తో గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్.. 'మేమ్ ఫేమస్' సినిమాతో టాలీవుడ్లోకి వచ్చాడు. ఇప్పుడు గోదారి గట్టుపైన' చిత్రం చేశాడు. మే 08న ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది. ట్రైలర్ అయితే బాగానే ఉంది. పేరుకు తగ్గట్లే సరదాగా సాగిపోయే ప్రేమకథ చిత్రంలా అనిపించింది. అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ తీసి క్రేజ్ తెచ్చుకున్న సుభాష్ చంద్ర.. ఈ మూవీతో దర్శకుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు.(ఇదీ చదవండి: కాజల్ అగర్వాల్కి ఇది చివరి అవకాశం!) -
'నిజమైన కరెన్సీ అదే'.. పూరి జగన్నాధ్ సందేశం విన్నారా?
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాస్ యాక్షన్ చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో జతకట్టారు. తొలిసారి వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే పూరి జగనాధ్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా లైఫ్ పాఠాలు చెబుతుంటారు. పూరి మ్యూజింగ్స్ పేరుతో తన అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా పూరి రిలీజ్ చేసిన వీడియో మన టైమ్, మనీ గురించి మాట్లాడారు. ప్రతి రోజు మనం ఖర్చు చేస్తున్న సమయం గురించి వివరించారు. లైఫ్లో డబ్బు మాత్రమే ఇంపార్టెంట్ కాదని సందేశమిచ్చారు. గడిచిపోయిన సమయాన్ని మాత్రం ఏం చేసినా తిరిగి తీసుకురాలేమని అన్నారు. రియల్ కరెన్సీ పేరుతో పూరి ఏమన్నారో మీరు కూడా చదివేయండి.'అందరికీ దేవుడు ఇచ్చింది రోజుకి 24 గంటలు మాత్రమే. ఎన్ని గంటలు ఉన్నాయన్నది కాదు.. ఆ 24 గంటలు ఎలా ఖర్చు చేశామన్నదే ముఖ్యం. మనం ప్రతి రోజు డబ్బు కోసం రాత్రి, పగలు కష్టపడతాం. ఆరోగ్యం పాడు చేసుకుంటాం. డబ్బు కంటే విలువైన సమయాన్ని మాత్రం పట్టించుకోం. టైం గురించి వివరంగా చెప్పాలంటే.. ప్రతి ఉదయం మన పర్సు టైంతో నిండిపోయి ఉంటుంది. రాత్రి అయ్యేసరికి నువ్వు ఏం చేసినా.. చేయకపోయినా ఖర్చు అయిపోతుంది. మళ్లీ ఉదయం చూసుకుంటే పర్సు నిండా 24 గంటలు నిండే ఉంటాయి' అని అన్నారు.'నువ్వు టైమ్ను వేస్ట్ చేసినా కరిగిపోతుంది.. తెలివిగా ఇన్వెస్ట్ చేసినా అయిపోతుంది. ఈ రెండింటిలో మనం ఏం చేస్తున్నామనేది చాలా ముఖ్యం. ఎన్నేళ్లు కష్టపడినా పర్లేదు.. ఏదో రోజు బోలెడంత డబ్బు సంపాదించి మిగిలిన జీవితమంతా హ్యాపీగా బతుకుదామనుకుంటాం. బాగా సంపాదించిన తర్వాత ఎంజాయ్ చేయడానికి టైముండదు. అందుకే అదే రియల్ కరెన్సీ. డబ్బు మాయలో పడి కుటుంబంతో గడిపే అరుదైన క్షణాలు కోల్పోతాం. మిత్రులతో గడిపే అందమైన సాయంత్రాలు మిస్ అవుతాం''ఒక రోజులో మన నాలుగు గంటలు ట్రాఫిక్.. మరో నాలుగు గంటలు చిరాకులో గడిచిపోతాయి. మిగతావి నిద్రకు కేటాయిస్తాం. ఈరోజు కాకపోతే రేపు గుడ్న్యూస్ వింటామని ఎదురు చూస్తూ నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇలా మన జీవితంలో ఎంత పోగొట్టుకున్నామో కరిగిపోయిన కాలమే సమాధానం చెబుతుంది. ఈ భూమ్మీద మనకి లిమిటెడ్ అవర్స్ ఉన్నాయి. వాటిని ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. ఎంత సంపాదించినా ఏదో ఒక రోజు ప్రాణం వదిలేస్తాం. అందుకే వీలైనన్ని మధుర క్షణాలు మన అకౌంట్లో పడితేనే పుట్టినందుకు.. ఇక్కడ గడిపినందుకు ఏదో ఓ మీనింగ్ అంటూ ఉంటుంది. లేకపోతే ఈ జర్నీ మొత్తం నాశనమైపోద్ది' అంటూ సమయం విలువను కరెన్సీతో పోలుస్తూ సందేశమిచ్చారు మన టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్. -
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా
హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి సినిమాలతో కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేశ్ బాబు.. ప్రస్తుతం నాని 'ప్యారడైజ్' మూవీలో బిర్యానీ అనే పాత్ర చేస్తున్నాడు. ఇది కాకుండా అడపాదడపా చిత్రాలు చేస్తూనే ఉన్నాడు. అలా గతేడాది ఓ కామెడీ సినిమాతో రాగా అది ఇప్పుడు దాదాపు ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ దాని సంగతేంటి? ఎందులోకి రానుందనేది చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)సంపూర్ణేశ్ బాబు, సంజోష్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రొమాంటిక్ కామెడీ సినిమా 'సోదరా'. తెలంగాణలోని పల్లెటూరి నేపథ్యంగా సాగే కథతో దీన్ని తీశారు. గతేడాది ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాగా ప్రేక్షకుల్ని ఏ మాత్రం అలరించలేకపోయింది. తర్వాత అందరూ దీన్ని మరిచిపోయారు. ఇప్పుడీ చిత్రాన్ని మే 01 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించారు.'సోదరా' విషయానికొస్తే.. తెలంగాణలోని ఓ పల్లెటూరిలో చిరంజీవి (సంపూర్ణేశ్ బాబు), పవన్ (సంజోష్) అన్నదమ్ములు. చిరంజీవి కుటుంబం సోడా బిజినెస్ చేస్తుంటుంది. వయసు పెరిగిపోతున్నా పెళ్లి కావట్లేదని చిరు బాధపడుతుంటాడు. అలాంటి టైంలో ఎదురింట్లో దిగిన దివి(ఆర్తి గుప్తా)ని అన్నదమ్ములు ఇద్దరూ ప్రేమలో పడేయాలని చూస్తారు. దీంతో తమ్ముడిని చిరంజీవి వేరే ఊరికి పంపేస్తాడు. కట్ చేస్తే దివి, చిరంజీవిని రిజెక్ట్ చేస్తుంది. మరోవైపు పవన్.. కాలేజీలో భువి(ప్రాచీ బన్సాల్)ని ప్రేమిస్తాడు. ఓసారి సెలవులకు పవన్ ఇంటికి వచ్చినప్పుడు జరిగిన సంఘటనల వల్ల అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు వస్తాయి. మరి వీళ్లు ఎలా కలిశారు? చిరంజీవికి పెళ్లయిందా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: కాజల్ అగర్వాల్కి ఇది చివరి అవకాశం!) -
కాజల్ అగర్వాల్కి ఇది చివరి అవకాశం!
టాలీవుడ్లో స్టార్ హీరోలతో వరస సినిమాలు చేసి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్.. ఇప్పుడు పూర్తిగా వెనకబడిపోయింది. అప్పుడెప్పుడో 2017లో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి'లో అద్భుతమైన యాక్టింగ్ చేసి హిట్ కొట్టింది. తర్వాత చేసిన వాటిలో మూడేళ్ల క్రితం 'భగవంత్ కేసరి' మాత్రమే సక్సెస్ అందుకుంది. ఇందులో ఈమెది పెద్దగా గుర్తింపు లేని పాత్ర కావడం వల్ల హిట్ క్రెడిట్ రాలేదు. గతేడాది రిలీజైన 'కన్నప్ప'లో పార్వతి దేవిగా కనిపించింది గానీ వర్కౌట్ కాలేదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సోషల్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)ఓ రకంగా చెప్పాలంటే కాజల్ కెరీర్ చివరి దశలో ఉంది. ఇలాంటి టైంలో ఈమె లాయర్గా లీడ్ రోల్ చేసిన 'ద ఇండియన్ స్టోరీ' సినిమా విడుదలకు సిద్ధమైంది. లెక్క ప్రకారం గతేడాది ఆగస్టులోనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా వేసుకున్నారు. గతేడాది అక్టోబరులోనే షూటింగ్ పూర్తవగా ఇన్నాళ్లకు రిలీజ్ డేట్ ప్రకటించారు.జూలై 24 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుందని పోస్టర్ వదిలారు. ఇందులో కాజల్తోపాటు మరాఠీ స్టార్ నటుడు శ్రేయస్ తల్పడే ప్రధాన పాత్ర చేశాడు. పంటకు ఉపయోగించే రసాయనాల దుర్వినియోగం, సాగులో పురుగు మందుల మితిమీరిన వినియోగం, దీని వెనకున్న భారీ కుంభకోణాల నేపథ్యంగా ఈ మూవీని తెరకెక్కించారు.ఇండస్ట్రీలో ఉండాలి, ఇంకా మూవీస్ చేయాలనుకుంటే మాత్రం ఇది హిట్ కావడం కాజల్కి చాలా కీలకం. ఒకవేళ ఇది సక్సెస్ అయితే ఇంకొన్ని ఆఫర్స్ వస్తాయి. లేదంటే మాత్రం మెల్లగా ఈమెని పట్టించుకోవడం దర్శకులు తగ్గించేస్తారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: రవితేజ.. 'అక్కాయిలు బాగున్నారా?') -
టాక్సిక్ వాయిదా పడే ఛాన్స్.. అంతా యశ్ వల్లేనా?
కేజీఎఫ్ తర్వాత యశ్ నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం టాక్సిక్. ఈ బిగ్ ప్రాజెక్ట్కు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ ఓసారి వాయిదా వేశారు. మార్చిలో రావాల్సిన ఈ చిత్రం జూన్కు పోస్ట్పోన్ అయింది. ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్ ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. టీజర్లో బోల్డ్ సీన్ ఉండడంతో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. అయితే ఈ మూవీ రిలీజ్ మరోసారి వాయిదా పడనుందనే టాక్ వినిపిస్తోంది. జూన్ 4న రిలీజ్ కావడం కష్టమేనని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. అంతేకాకుండా ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం కూడా ఉన్నట్లు సమాచారం.ఓటీటీ డీల్ ఆలస్యం..!ఈ బిగ్ మూవీ ఓటీటీ డీల్పై వివాదం కొనసాగుతోంది. ఈ మూవీ నిర్మాతలు డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా రూ.250 కోట్ల భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఓటీటీ యాజమాన్యాలు రూ.110 కోట్లకు పైగా చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. నిర్మాతల డిమాండ్ వల్లే టాక్సిక్ మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది.యశ్ వల్లేనా..?ఈ మూవీ ఓటీటీ డీల్ ఆలస్యానికి హీరో యశ్ ఓ కారణమని తెలుస్తోంది. సాధారణంగా పెద్ద ప్రాజెక్టులకు ఓటీటీ డీల్ సమయంలో ఆ సంస్థ ప్రతినిధులకు సినిమా ప్రివ్యూ చూపించాలి. కానీ మాత్రం ఈ విషయంలో ఒప్పుకోవడం లేదని సమాచారం. ఈ చిత్రాన్ని కేవలం థియేటర్లలోనే చూడాలని..ముందే చూపించడం వల్ల సినిమాపై ఆసక్తి తగ్గుతుందని యశ్ భావిస్తున్నారట. యశ్ నిర్ణయం వల్ల తీసుకున్న అంత పెద్ద మొత్తాన్ని ఇచ్చేందుకు ఓటీటీలు వెనకాడుతున్నాయని లేటేస్ట్ టాక్. అందుకే టాక్సిక్ మరోసారి వాయిదా తప్పదని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
రవితేజ.. 'అక్కాయిలు బాగున్నారా?'
ఒకప్పుడు స్టార్ హీరోగా వరస హిట్స్ అందుకున్న రవితేజ.. ఇప్పుడు పూర్తిగా డౌన్ అయిపోయాడు. ఎంతలా అంటే సరైన హిట్ కొట్టి దాదాపు ఐదేళ్లు గడిచిపోయింది. ఆడియెన్స్ కూడా ఇతడి మూవీస్ థియేటర్లలో రిలీజ్ అవుతున్నా సరే పెద్దగా పట్టించుకోవట్లేదు. ఈ ఏడాది సంక్రాంతికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే మూవీతో వచ్చాడు. కంటెంట్ పర్లేదనిపించింది గానీ వసూళ్లు పెద్దగా రాలేదు. సరే ఇవన్నీ పక్కనబెడితే ఇప్పుడు రవితేజ చేయబోయే కొత్త సినిమా కోసం ఓ విచిత్రమైన టైటిల్ అనుకుంటున్నారట.(ఇదీ చదవండి: ప్రీమియర్లకే నెగిటివ్ టాక్.. కానీ తొలి వీకెండే 'మైఖేల్'కి వేల కోట్ల కలెక్షన్స్)ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఇరుముడి' అనే సినిమాని రవితేజ చేస్తున్నారు. కూతురి సెంటిమెంట్తో పాటు అయ్యప్ప మాలకు సంబంధించిన పార్ట్ కూడా ఇందులో ఉండనుంది. దీని తర్వాత చేయబోయే మూవీ ఏంటనేది ఇంకా ఖరారు కాలేదు. ఇప్పుడదే ఫైనల్ అయ్యేలా ఉందని తెలుస్తోంది. 'రాజరాజచోర' అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయమై మెప్పించిన హసిత్ గోలి.. తర్వాత 'స్వాగ్' తీశాడు గానీ ఫ్లాప్ అయింది.ఇప్పుడీ దర్శకుడే రవితేజకు ఓ స్టోరీ చెప్పాడని, దీన్ని దిల్ రాజు నిర్మించనున్నారని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసమే 'అక్కాయిలు బాగున్నారా?' అనే టైటిల్ అనుకుంటున్నారని తెలుస్తోంది. మరి ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సోషల్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
దురంధర్-2 ఓటీటీ డేట్.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్-2. మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన సరికొత్త రికార్డ్స్ సృష్టించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ మూవీ పుష్ప-2 కలెక్షన్స్ను దాటేసింది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడోస్థానంలో నిలిచింది. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. గతేడాది డిసెంబర్లో రిలీజైన దురంధర్కు సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.బాక్సాఫీస్ను షేక్ చేసిన ఈ మూవీ కోసం ఓటీటీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ డేట్పై సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. మే 14 వ తేదీ నుంచి ఓటీటీకి రానుందన్న వార్త వైరల్గా మారింది. ఇప్పటికే ఈ మూవీ రిలీజై నెల పైగా కావడంతో ఓటీటీ విడుదలపై త్వరలోనే ప్రకటన వచ్చే ఛాన్సుంది. ఈ మూవీని జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రణ్వీర్ సరసన సారా అర్జున్ హీరోయిన్గా మెప్పించింది. ఈ మూవీలో సంజయ్దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. #Dhurandhar2TheRevenge — MAY 14th On Jio HOTSTAR 🧨💥 pic.twitter.com/RIe0vDQ190— OTT STREAM UPDATES (@newottupdates) April 26, 2026 -
ఓటీటీలోకి సోషల్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
సినిమాల్లో కమర్షియల్ అంశాలే ఎక్కువగా ఉంటాయి. అలా ఉంటేనే థియేటర్లలో ఆడతాయి. సమాజంలో జరిగే చాలా సంఘటనలని చూపించాలనుకుంటే మాత్రం వెబ్ సిరీస్లు బెస్ట్ ఆప్షన్. ఈ తరహా ప్రయత్నాలు ఇప్పటికే చాలా జరిగాయి, జరుగుతున్నాయి. ఇప్పుడు పోటీ పరీక్షల్లో జరిగే లొసుగులపై ఓ సిరీస్ తీశారు. దాని స్ట్రీమింగ్ తేదీని తాజాగా ప్రకటించారు. తెలుగులోనూ ఇది అందుబాటులోకి రానుందని వెల్లడించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)'ప్రేమదేశం' లాంటి సినిమాతో హీరోగా అప్పట్లో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న అబ్బాస్.. తర్వాత కాలంలో నటనకు దూరమైపోయాడు. రీసెంట్గానే 'హ్యాపీరాజ్' అనే తమిళ సినిమాలో తండ్రిగా నటించి రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు 'ఎగ్జామ్' అనే సోషల్ థ్రిల్లర్ సిరీస్లోనూ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించబోతున్నాడు. ఈయనకు ఇదే ఓటీటీ అరంగేట్రం కావడం విశేషం.దుశారా విజయన్, అదితీ బాలన్, అబ్బాస్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఎగ్జామ్' సిరీస్.. మే 15 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ దర్శకద్వయం పుష్కర్-గాయత్రి దీనికి క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ కాగా ఏ.సర్కుణం దర్శకత్వం వహించారు. మీ భవిష్యత్తుని డిసైడ్ చేసేది ఎగ్జామ్, మరి ఎగ్జామ్ని డిసైడ్ చేసేది ఎవరు? అనేది ఈ సిరీస్ కాన్సెప్ట్. చూస్తుంటే పోటీ పరీక్షల్లో జరిగే లొసుగులు ఇందులో చూపించబోతున్నారనిపిస్తోంది.(ఇదీ చదవండి: ప్రీమియర్లకే నెగిటివ్ టాక్.. కానీ తొలి వీకెండే 'మైఖేల్'కి వేల కోట్ల కలెక్షన్స్) View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
సమంత, కీర్తి సురేశ్, పూజా హెగ్డే.. హిట్ పడాల్సిందే!
ఒకప్పుడు సినిమా అంటే కేవలం ఒక స్టార్ హీరో, పేరున్న నటీనటులు, నలుగురు వెన్నెముక లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉండాల్సిందే. అప్పుడే ఆ సినిమాకు కలెక్షన్లు వచ్చేవి, ప్రేక్షకులు థియేటర్ల వైపు అడుగులు వేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది.. ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది.ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తోంది ఎవరన్నది కాదు, ఏం చూపిస్తున్నారన్నదే ముఖ్యం. భాషా బేధాలు చెరిగిపోయాయి.. కేవలం కంటెంట్ ఉంటే చాలు, నటీనటులు కొత్తవారైనా సరే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కథలో దమ్ముంటే, ఆ సినిమాను నెత్తిన పెట్టుకుని గ్లోబల్ రేంజ్కు తీసుకెళ్తున్నారు.అదే కథలో వైవిధ్యం లేకపోతే.. స్టార్ హీరో సినిమా అయినా సరే.. రెండో రోజే థియేటర్స్ ఖాలీ అయిపోతున్నాయి. అందుకే ఇప్పుడు హీరోల పరిస్థితి దారుణంగా ఉంది. ఫ్యాన్స్తో పాటు సినీ ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే కొత్త ప్రయోగాలు చేయాల్సిందే. హీరోయిన్ల పరిస్థితి కూడా అంతే. వైవిధ్యమైన పాత్రలతో అలరించపోతే.. వారిని ఈజీగా పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పటికే అనుష్క, తమన్నా లాంటి హీరోయిన్లను తెలుగు ప్రేక్షకులు మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇక సమంత, కీర్తి సురేశ్, పూజా హెగ్డే లాంటి తారలు కూడా హిట్లేక అల్లాడిపోతున్నారు. ఒకప్పుడు కమర్షియల్ హీరోయిన్గా రాణించిన సమంత..ఇటీవల తన పంథాను మార్చేసింది. స్టార్ హీరోల పక్కన నటించడం ఆపేసి.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోకస్ చేసింది. దీంతో దర్శక నిర్మాతలు కమర్షియల్ సినిమాలకు సమంత పేరుని పరిశీలించడం కూడా మానేశారు. మరోవైపు ఆమె సోలోగా చేసిన శాకుంతలం, యశోద సినిమాలు బక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ ‘మా ఇంటి బంగారం’పైనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్లో నిర్మించడంతో అటు నిర్మాతగా, ఇటు నటిగా ఈ మూవీ సమంతకు చాలా ముఖ్యం. ఈ మూవీ హిట్ అయితేనే.. సమంత స్టార్ లిస్ట్లో మరికొంతకాలం కొనసాగుతుంది. లేదంటే ఆమెను కూడా తెలుగు ప్రేక్షకులు మర్చిపోయే ప్రమాదం ఉంది. మే 15న ఈ మూవీ విడుదల కానుంది.ఇక కీర్తి సురేశ్ పరిస్థితి కూడా సమంతలాగే ఉంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన కీర్తి.. ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ఎల్లమ్మ సినిమాలు అవకాశం వచ్చినట్లే వచ్చి.. చేజారిపోయింది. ఇప్పుడు వెంకటేశ్-అనిల్ రావిపూడి చిత్రంలో చాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే రౌడీ జనార్థన చిత్రంలోనూ విజయ్కి జోడీగా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితేనే కీర్తి సురేశ్కు మరిన్ని అవకాశాలు వచ్చే చాన్స్ ఉంది.ఇక పూజా హెగ్డె.. ‘అల..వైకుంఠపురములో’ మూవీతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఒకప్పుడు తెలుగు,తమిళ, హిందీ సినిమాలతో బిజీ అయిపోయింది. కానీ ఇప్పుడు ఆమెకు ఎక్కడ అవకాశాలు రావట్లేదు. తెలుగులో అయితే పూజా హెగ్డే పేరునే మర్చిపోతున్నారు. నాని – సుజిత్ కాంబోలో వస్తున్న ‘బ్లడీ రోమియో’ లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా హిట్ అయితేనే పూజా కూడా కొన్నాళ్ల పాటు స్టార్ హీరోయిన్ లిస్ట్లో కొనసాగుతుంది. లేదంటే పూజా పేరుని కూడా టాలీవుడ్ మర్చిపోతుంది. అందుకే సమంత, కీర్తి, పూజా హెగ్డేలకు అర్జెంట్గా హిట్ అవసరం. మరి ఈ కొత్త చిత్రాలన్ని విజయం సాధించి.. ఈ తారలను మరికొంతకాలం స్టార్ హీరోయిన్లుగా కొనసాగిస్తాయో లేదో చూడాలి. -
రెండోసారి పెద్ది వాయిదా.. అసలు కారణం ఇదే..!
రామ్ చరణ్- బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడడంతో అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఓ ఐటమ్ సాంగ్ మినహా ఈ మూవీ షూట్ మొత్తం దాదాపు పూర్తయింది. ఈ స్పెషల్ సాంగ్లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ రామ్ చరణ్తో కలిసి డ్యాన్స్ చేయనుంది. అయితే పెద్ది మూవీ జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ రెండుసార్లు వాయిదా పడడంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అసలు కారణాలేంటని నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్ వల్లే వాయిదా వేశారని కొందరు భావిస్తున్నారు. కానీ ఇతర కారణాల వల్లే రెండోసారి వాయిదా వేశారని అంటున్నారు. అసలు ప్రధాన కారణం ఇదేనని సోషల్ మీడియాలో వైరలవుతోంది.పెద్ది మూవీ ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్లో చరణ్ గెటప్కు సంబంధించిన సీజీ వర్క్ ఇంకా పూర్తి కాలేదని సమాచారం. అందువల్లే ఏప్రిల్ 30 నుంచి జూన్కు పోస్ట్పోన్ చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. పీరియాడిక్ నేపథ్యానికి తగ్గనట్లుగా ప్రతి ఫ్రేమ్ను జాగ్రత్తగా రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అభిమానులకు మరింత అనుభూతి ఇచ్చేందుకే ఈ మూవీని వాయిదా వేయాల్సి వచ్చిందని మేకర్స్ చెప్పిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ సినిమాలో చెర్రీ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని జూన్ 25 రిలీజ్ చేయనున్నారు. -
ప్రీమియర్లకే నెగిటివ్ టాక్.. కానీ తొలి వీకెండే వేల కోట్ల కలెక్షన్స్
ఒక సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే ప్రేక్షకులు దాన్ని చూసేందుకు పెద్దగా ఇష్టపడరు. కానీ మైఖేల్ జాక్సన్ బయోపిక్ విషయంలో మాత్రం ఇది రివర్స్లో జరిగింది. పదో వందో కాదు ఏకంగా మూడు రోజుల్లోనే వేలకోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇది చూసి, బాక్సాఫీస్ ట్రేడ్ పండితులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ రేంజు అభిమానమా అని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ 'మైఖేల్' మూవీ సంగతేంటి? తొలి వీకెండ్ వసూళ్లెంత?(ఇదీ చదవండి: ఇవి ఉన్నాయి.. అవి వదిలేశా.. సమంత పోస్ట్ వైరల్)ఒకప్పుడు సంగీత ప్రపంచాన్ని షేక్ చేసిన పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసిన సినిమా 'మైఖేల్'. ఇందులో మైఖేల్ జాక్సన్ అన్న కొడుకు జాఫర్ జాక్సన్ టైటిల్ రోల్ చేశాడు. చిన్నాన్న డ్యాన్సుల దగ్గర నుంచి స్టైల్ వరకు ప్రతిదాన్ని ఉన్నది ఉన్నట్లు దింపేశాడు. ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు.. మూడు రోజుల్లోనే $217.4 మిలియన్ల కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తోంది.భారతీయ కరెన్సీ ప్రకారం వసూళ్లు మొత్తం రూ.2049 కోట్లు. అయితే అత్యధిక వసూళ్లు సాధించిన బయోపిక్ రికార్డ్ ఇదివరకు 'ఓపెన్ హైమర్' పేరిట 180.4 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పుడు దీన్ని అధిగమించిన 'మైఖేల్'.. గ్లోబల్ వైడ్ సరికొత్త ఘనత సాధించింది. అయితే విడుదల ముందు రోజు ప్రీమియర్లు వేస్తే చూసిన చాలామంది.. 'మైఖేల్' బయోపిక్ అంతేం మెప్పించలేదని పెదవి విరిచారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైఖేల్ జాక్సన్ అభిమానులు మాత్రం ఆయన్ని చివరిసారి బిగ్ స్క్రీన్పై చూసుకోవాలని అనుకున్నారు. అందుకు తగ్గట్లే ఇక్కడ అక్కడ తేడా లేకుండా థియేటర్లకు వెళ్లి సినిమాని చూస్తున్నారు.అయితే 'మైఖేల్' పేరుతో రిలీజైన ఈ సినిమాలో పాజిటివ్ యాంగిల్ మాత్రమే చూపించారు. వివాదాల జోలికి పోలేదు. అలానే కథని మధ్యలోనే ఆపి, సీక్వెల్ కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. మరి ఈ రెండో భాగం ఎప్పుడొస్తుందనేది చూడాలి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్) -
జగపతి బాబు, లయ కొత్త సినిమా.. టీజర్ విడుదల
జగపతి బాబు, లయ, హృతిక నటించిన కొత్త సినిమా ‘వదలా’.. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆసక్తిగా ఉండటంతో సినిమాపై బజ్ క్రియేట్ అయింది. ఆకెళ్ల వి. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ్, కిశోర్ నాయుడు నిర్మాతలుగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం చేసుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది ఈ చిత్రంలో చూపించారు. -
లేడీ ఫ్యాన్ చేసిన పనికి షాకైన ధునుష్.. వీడియో వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్కి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయనకు ఇక్కడ కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. సినిమా ఈవెంట్ కోసం ఎప్పుడు వచ్చిన.. ధనుష్ని చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలి వస్తుంటారు. నిన్న(ఏప్రిల్ 26) హైదరాబాద్లో నిర్వహించిన ‘కర’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లోనూ అదే జరిగింది. ధనుష్ వస్తున్నాడని తెలిసి భారీగా అభిమానులు తరలివచ్చారు. అందులో ఓ మహిళా అభిమాని చేసిన పనికి ధనుష్ షాకయ్యాడు. ఇంతకీ ఏం జరిగింది?ధనుష్ కోసం..ధనుష్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘కర’. కుష్మిత గణేష్ సమర్పణలో విఘ్నేష్ రాజా దర్శకత్వంలో డా. ఇషారి కె. గణేశ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. సీహెచ్ సతీష్ కుమార్, రాజేశ్కుమార్ బొబ్బర ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో జరిగింది. ఈ ఈవెంట్కి ధనుష్ కూడా వస్తున్నాడని తెలిసి ఓ మహిళా అభిమాని ఆ హోటల్కి వెళ్లింది. తన అభిమాన హీరోని లైవ్లో చూసి మురిసిపోయింది.మోకాళ్లపై కూర్చోని.. ఈవెంట్ ముగిసిన తర్వాత ధనుష్ వేదికపై నుంచి వెళ్తుండగా.. సదరు మహిళా అతన్ని కలిసేందుకు వచ్చింది. తెలిసిన వారి సహాయంతో ధనుష్ను దగ్గరకు వెళ్లింది. అతను ఆమెను పలకరించగానే.. భావోద్వేగానికి లోనైంది. ఒక్కసారిగా మోకాళ్లపై కూర్చొని నమస్కరించింది. ఊహించని ఈ పరిణామానికి ధనుష్ షాకయ్యాడు. క్షణాల్లో తెరుకొని వెంటనే ఆమెను పైకి లేపేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె మళ్లీ అలాగే చేయడంతో కాసేపు ఇబ్బందిపడ్డారు. ఆ తర్వాత ఆమెను పైకి లేపి, మాట్లాడి, చివరకు ఆమెతో కలిసి ఫొటో దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. A female fan goes down on her knees to greet #Dhanush at the #Kara event.#MamithaBaiju pic.twitter.com/ZtTLrqPmId— Milagro Movies (@MilagroMovies) April 26, 2026 -
ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ఈసారి కూడా చెప్పుకోదగ్గ సినిమాలేవి థియేటర్లలోకి రావట్లేదు. తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన 'గాయపడ్డ సింహం', కమెడియన్ సత్య లీడ్ రోల్ చేసిన 'జెట్ లీ' రిలీజ్ కానున్నాయి. ఇక డబ్బింగులు విషయానికొస్తే ధనుష్ 'కర', మోహన్ లాల్-ముమ్ముట్టి 'పేట్రియాట్', సాయిపల్లవి 'ఒక రోజు'తో పాటు హిందీ చిత్రం 'రాజా శివాజీ'.. బిగ్ స్క్రీన్స్పైకి రానున్నాయి.(ఇదీ చదవండి: ఇవి ఉన్నాయి.. అవి వదిలేశా.. సమంత పోస్ట్ వైరల్)మరోవైపు ఓటీటీల్లోనూ చెప్పుకోదగ్గ సినిమాలు ఈసారి చాలానే స్ట్రీమింగ్ కాబోతున్నాయి. బైకర్, రాకాస లాంటి తెలుగు మూవీస్తో పాటు ద కేరళ స్టోరీ 2, లీడర్, ఆడు 3 లాంటి డబ్బింగ్ మూవీస్ ఆసక్తి రేపుతున్నాయి. గ్లోరీ అనే డబ్బింగ్ సిరీస్ కూడా బాగానే ఉందనిపించేలా ఉంది. వీటితో పాటు వీకెండ్ వచ్చేసరికి సడన్ సర్ప్రైజులు కూడా ఉండే అవకాశముంది. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ సినిమా రాబోతుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఏప్రిల్ 27 నుంచి మే 03 వరకు)నెట్ఫ్లిక్స్షుడ్ ఐ మ్యారీ ఏ మర్డరర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 29మ్యాన్ ఆన్ ఫైర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 30బైకర్ (తెలుగు మూవీ) - మే 01రాకాస (తెలుగు సినిమా) - మే 01గ్లోరీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 01హాట్స్టార్బ్యాచ్మేట్స్ (తెలుగు సిరీస్) - ఏప్రిల్ 30అమెజాన్ ప్రైమ్ద హౌస్ ఆఫ్ ద స్పిరిట్స్ (స్పానిష్ సిరీస్) - ఏప్రిల్ 29సప్నే vs ఎవ్రీవన్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 01లీడర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 01 (రూమర్ డేట్)జీ5లారెన్స్ ఆఫ్ పంజాబ్ (హిందీ సిరీస్) - ఏప్రిల్ 27ద కేరళ స్టోరీ 2 (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 01ఆడు 3 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 01డిటెక్టివ్ ధనంజయ్ రహస్యజల్ (మరాఠీ సిరీస్) - మే 01సోనీ లివ్ఉందేఖి సీజన్ 4 (హిందీ సిరీస్) - మే 01ఆపిల్ టీవీ ప్లస్విడోస్ బే (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 29ఎమ్ఎక్స్ ప్లేయర్క్యాంపస్ బీట్స్ రిటర్న్స్ (హిందీ సిరీస్) - ఏప్రిల్ 29(ఇదీ చదవండి: 'పెద్ది' సందేహాలన్నీ క్లియర్ చేసిన బుచ్చిబాబు) -
ఓటీటీలోకి 'బైకర్' సినిమా.. అధికారిక ప్రకటన
ఈ ఏడాది సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో హిట్ కొట్టిన హీరో శర్వానంద్.. ఈ నెల తొలివారంలో మరో మూవీతో వచ్చి హిట్ కొట్టాడు. బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు నెల తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: అషురెడ్డి వివాదం.. సంచలన నిజాలు బయటపెట్టిన తండ్రి)శర్వానంద్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'బైకర్'. సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్ర చేశారు. అభిలాష్ రెడ్డి దర్శకుడు. బైక్ రేసింగ్ స్టోరీతో సరికొత్తగా దీన్ని తెరకెక్కించారు. చూసిన చాలామంది బాగానే ఉందన్నారు కానీ ఎందుకనో జనాలు ఈ మూవీని థియేటర్కి వెళ్లి చూసేందుకు పెద్దగా ఇష్టపడలేదు. కలెక్షన్సే దీనికి ఉదాహరణ. ఇప్పుడీ చిత్రం మే 01వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఇదే పేరుతో.. హిందీలో మాత్రం 'శర్వా' అనే టైటిల్తో అందుబాటులోకి రానుంది.'బైకర్' విషయానికొస్తే.. బుల్లెట్ సునీల్ అలియాస్ సునీల్ నారాయణ్(రాజశేఖర్) మాజీ మోటోక్రాస్ రేసర్. మన దేశంలో మోటోక్రాస్ రేసింగ్ క్రీడకు గుర్తింపు తీసుకురావాలనేది ఈయన ఆలోచన. ఇందులో భాగంగా రేసర్లని తీర్చిదిద్దుతుంటాడు. ఈయన కొడుకు వికాస్ నారాయణ్(శర్వానంద్).. తండ్రి దగ్గరే ట్రైనింగ్ తీసుకుని టాప్ రేసర్ అవుతాడు. అంతర్జాతీయ పోటీలోనూ పాల్గొంటాడు కానీ కొన్ని కారణాల వల్ల మూడో స్థానంలో నిలుస్తాడు. తర్వాత రేసింగ్ నుంచే వికాస్ దూరం కావాలని నిర్ణయించుకుంటాడు. తండ్రి కొడుకుల మధ్య దూరాన్ని పెంచిన ఆ నిర్ణయం వెనకున్న కారణమేంటి? చివరకు ఏమైంది? వీళ్లిద్దరూ మళ్లీ కలిశారా లేదా అనేది మిగతా స్టోరీ. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకుని షాకిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. భర్త ఎవరంటే?) -
టాలీవుడ్ అప్డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడో తెలుసా?
టాలీవుడ్ నుంచి ఇప్పుడు వరుస పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలంతా ఇప్పుడు షూటింగ్లో బిజీ అయిపోయారు. వీరితో పాటు సీనియర్ హీరోలు నాగార్జున, బాలకృష్ణ, వెంకటెశ్ కూడా సమ్మర్లోనూ సెట్స్లోనే ఉంటున్నారు. మరి ఏ హీరో ఎక్కడ ఉన్నాడు? కొత్త సినిమాల షూటింగ్ ఎక్కడెక్కడ జరుగుతుంది? ఓ లుక్కేయండి.🎥 ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది🎥 అల్లు అర్జున్ అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న రాకా మూవీ షూటింగ్ ముంబై లో జరుగుతుంది. ప్రస్తుతం బన్నీ ముంబైలోనే ఉన్నాడు.🎥 ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. అక్కడ వేసిన ఓ సెట్లో కీలకమైన సన్నివేశలు షూట్ చేస్తున్నారు.🎥 రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా షూటింగ్ వన్ స్టూడియో శంకరపల్లి లో జరుగుతోంది. అక్కడే ఓ సెట్లో ఐటమ్ సాంగ్ షూట్ చేస్తున్నారు.🎥 నందమూరి బాలకృష్ణ మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ జన్వాడ గుంటూరు కారం సెట్ లో జరుగుతోంది.🎥 కార్తీక్ డైరెక్షన్లో నాగార్జున హీరోగా కెక్కుతున్న సినిమా షూటింగ్ ఎల్బీ నగర్ లో జరుగుతుంది. నాగార్జున కెరీర్లో 100వ సినిమా ఇది.🎥 వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరుగుతోంది.🎥 నాని శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ ముచ్చింతల్ లో జరుగుతుంది.🎥 విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో నటిస్తున్న రణబాలి సినిమా షూటింగ్ గండిపేట సెట్ లో జరుగుతుంది.🎥 రవితేజ శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కుతున్న ఇరుముడి సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.🎥 శర్వానంద్ సంపత్ నంది కాంబోలో తెరకెక్కుతున్న భోగి సినిమా షూటింగ్ ముచ్చింతల్ లో జరుగుతోంది.🎥 రష్మిక , రవీంద్ర పుల్లే డైరెక్షన్ లో నటిస్తున్న మైసా సినిమా షూటింగ్ కేరళ లో జరుగుతోంది.🎥 శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ శంకర పల్లి లో జరుగుతుంది.🎥 గోపీచంద్ సంకల్ప్ రెడ్డి కాంబోలో తెరకెక్కుతున్న భరతవర్ష సినిమా షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతోంది. -
ఓటీటీలో నంబర్ వన్ సినిమా.. తండ్రి-కొడుకుల బంధానికి ఫిదా
జీవీ ప్రకాశ్కుమార్, శ్రీ గౌరిప్రియ జోడీగా నటించిన చిత్రం హ్యాపీ రాజ్.. విజయవంతంగా థియేటర్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ మూవీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మస్ట్ వాచ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. దర్శకులు మారియా ఎలాంచెజియన్ తెరకెక్కించిన ఈ మూవీని జైవర్దన్ నిర్మించారు. ఈ మూవీతో సుమారు 11ఏళ్ల తర్వాత నటుడు అబ్బాస్ వెండితెరపై కనిపించాడు. అయితే, ఓటీటీలో హ్యాపీ రాజ్ దూసుకుపోతున్నాడు.ట్రెండింగ్లో హ్యాపీ రాజ్తమిళ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటున్న 'హ్యాపీ రాజ్' అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ్, కన్నడ,మలయాళంలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రం దేశవ్యాప్తంగా విభిన్న వర్గాల ప్రేక్షకులలో వేగంగా ఆదరణ పొందింది. ప్రస్తుతం ఈ చిత్రం భారతదేశంలోని ప్రైమ్ వీడియోలో నంబర్ వన్ సినిమాగా చార్టులలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ విజయంపై చిత్ర యూనిట్ కూడా సంతోషాన్ని వ్యక్తపరిచింది.ప్రతి కుమారుడు తన తండ్రితో చూడాల్సిన సినిమా అంటూ చాలామంది నెటిజన్లు హ్యాపీ రాజ్ మూవీ గురించి పోస్టులు పెడుతున్నారు. సినిమా చూస్తున్నంత సేపు ఔట్ అండ్ ఔట్ కామెడీతో పాటు హృదయాన్ని హత్తుకునే ఎమోషనల్ సన్నివేశాలతో కన్నీళ్లు తెప్పిస్తుందని తెలుపుతున్నారు. ఓటీటీలో కుటుంబం మొత్తం చూడాల్సిన సినిమా అంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. -
కన్నీరు పెట్టుకున్న ఆమిర్ ఖాన్.. ఓదార్చిన సాయి పల్లవి: వీడియో
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తన కుమారుడు జునైద్ ఖాన్ని హీరోగా వెండితెరకు పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా సునీల్ పాండే తెరకెక్కించిన చిత్రం ఏక్ దిన్. ఈ మూవీతో సాయి పల్లవి బాలీవుడ్కి ఎంట్రీ ఇస్తోంది.ఆమిర్ ఖాన్, మన్సూర్ ఖాన్, అపర్ణ పురోహిత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టీమ్ మ్యూజికల్ ఈవెంట్ని నిర్వహించింది. ఈ ఈవెంట్కి ఆమిర్ కూడా హాజరయ్యాడు. కొడుకు జునైద్, కోస్టార్ సాయి పల్లవి మధ్యలో కూర్చొని సినిమా వీక్షించాడు. కొడుకుని తొలిసారి బిగ్స్క్రీన్పై చూసి ఆమిర్ భావోద్వేగానికి లోనయ్యాడు. కళ్లజోడు తీసి కన్నీళ్లను తుడుచుకొని సంతోషంగా సినిమాను వీక్షించాడు. ఆమిర్ ఎమోషనల్ అవుతుంటే..పక్కనే ఉన్న సాయి పల్లవి ఆయనను ఓదార్చే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
సాయి పల్లవి చాన్స్ కొట్టేసిన రుక్మిణీ వసంత్!
దివంగత ప్రఖ్యాత గాయని, భారతరత్న అవార్డుగ్రహీత ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితం ఆధారంగా ఓ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ బయోపిక్కు ‘జెర్సీ’ సినిమా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నారని, గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మాణంలో భాగస్వామిగా ఉంటుందనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. అలాగే ఎంఎస్ సుబ్బులక్ష్మి పాత్రలో సాయి పల్లవి నటిస్తారనే టాక్ తొలుత వినిపించింది. కానీ ఇప్పుడు ఈ చాన్స్ కన్నడ నటి, ‘కాంతార’ ఫేమ్ రుక్మిణీ వసంత్ను వరించిందని టాక్. ‘రామాయణ’ (రెండు భాగాలుగా రానున్న సినిమా), ధనుష్ కొత్త చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. దీంతో కాల్షీట్స్ సర్దుబాటు చేయలేక ఎంఎస్ సుబ్బులక్ష్మి సినిమా నుంచి సాయి పల్లవి తప్పుకోవాల్సి వచ్చిందట. ఆ చాన్స్ రుక్మిణీ వసంత్కి వెళ్లిందని సమాచారం. మరి... ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్లో రుక్మిణీ వసంత్ ఫైనలైజ్ అవుతారా? వేచి చూడాల్సిందే. -
నా హృదయానికి దగ్గరైన సినిమా కర : ధనుష్
‘‘అసాధారణమైన పరిస్థితుల్లో చిక్కుకున్న ఒక సాధారణ మనిషి కథ ‘కర’. నా హృదయానికి దగ్గరైన చిత్రం ఇది’’ అని ధనుష్ అన్నారు. ధనుష్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘కర’. కుష్మిత గణేష్ సమర్పణలో విఘ్నేష్ రాజా దర్శకత్వంలో డా. ఇషారి కె. గణేశ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. సీహెచ్ సతీష్ కుమార్, రాజేశ్కుమార్ బొబ్బర ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘కర’ తెలుగు ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ వేడుకలో ధనుష్ మాట్లాడుతూ– ‘‘విఘ్నేష్ రాజా స్పెషల్ ఫిల్మ్మేకర్. ‘కర’లాంటి సినిమా ఇచ్చిన తనకు థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు. ‘‘కర’ ట్రైలర్ బాగుంది. ఈ సినిమా విజయం సాధించాలి’’ అంటున్న అతిథి బుచ్చిబాబుని రామ్ చరణ్ ఫ్యాన్స్ ‘పెద్ది’ అప్డేట్ కోసం అడగ్గా.. ‘‘స్పెషల్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. జూన్ 25న ఈ సినిమాని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. మరో అతిథి వెంకీ అట్లూరి మాట్లాడుతూ– ‘‘సార్’ సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందో అందుకు రెండున్నర రెట్లు ఎక్కువగా ‘కర’ హిట్ కావాలి’’ అని చెప్పారు. ఇషారి కె. గణేశ్ మాట్లాడుతూ– ‘‘మన జీవితంలో నిత్యం జరుగుతున్నవే ఈ సినిమాలో ఉంటాయి’’ అన్నారు. ‘‘ధనుష్గారు ‘కర’కు ఓకే చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ప్రేక్షకుల డబ్బు, సమయాన్ని గౌరవించేలా ఈ సినిమా వారిని ఎంటర్టైన్ చేస్తుంది’’ అని చెప్పారు విఘ్నేష్ రాజా. సతీష్ మాట్లాడుతూ –‘‘ధనుష్ సార్తో ఓ మంచి హిట్ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు. నా మిత్రుడు రాజేశ్ స΄ోర్ట్ చాలా ఉంది’’ అన్నారు. కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలోని నా ΄ాత్ర కోసం ్ర΄ోస్థటిక్ మేకప్ వేయడానికి, తీయడానికి నాలుగు గంటలు పట్టేది’’ అని అన్నారు. -
అలాంటి ప్రశ్న వేయడమే తప్పు : శ్రియ
ఇంతకుముందు హీరోయిన్లను వెంటాడే భయాల్లో ఒకటి పెళ్లి, మరొకటి వయసు. పెళ్లి అయితే హీరోయిన్ అవకాశాలు పోతాయేమోనన్న భయం ఎక్కువగా ఉండేది. అదేవిధంగా వయసు మీరితే అందం కరిగిపోతుందనే భయం కూడా ఉండేది. అయితే ఇప్పుడా భయం ఎవరిలోనూ కనిపించడంలేదు. పెళ్లి అయ్యి, నాలుగు పదుల వయసు దాటిన నటీమణులు కూడా అగ్ర కథానాయికలుగా రాణిస్తున్నారు. కొందరు పెళ్లిళ్లు చేసుకుని కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండి మళ్లీ నటించడానికి సిద్ధం అవుతున్నారు. అలాంటి వారిలో శ్రియ ఒకరు. ఈ భామ దక్షిణాదిలో అగ్ర కథానాయకిగా వెలుగొందారు. కాగా వివాహానంతరం నటనకు కొద్ది కాలం దూరంగా ఉన్న శ్రియ ఇప్పుడు మళ్లీ నటించడంపై పూర్తిగా దృష్టి సారిస్తున్నారు. ఇటీవల సూర్య హీరోగా నటించిన రెట్రో చిత్రంలో స్పెషల్ సాంగ్లో నటించి మెప్పించారు. ఈ భామను ఇటీవల 43 మూడేళ్ల వయసులో ఇంత అందాన్ని ఎలా మెయిన్టెయిన్ చేస్తున్నారు, ఎలా అవకాశాలను అందుకుంటున్నారు అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు శ్రియ బదులిస్తూ వయసును బట్టి నటీమణులను అంచనా వేయరాదంటూ ఘాటుగా పేర్కొన్నారు. అసలు ఈ ప్రశ్న వేయడమే తప్పు అన్నారు. వయసుతో పని ఏముంది? పెళ్లి అయితే నటీమణుల పని అయిపోతుంది అన్న ఆలోచనే రాకూడదు అని అన్నారు. ఇంకా చెప్పాలంటే సినిమాల్లో సాధించడానికి వయసు ఆటంకమే కాదన్నారు. ప్రతిభ ముఖ్యమని, ప్రతి భావంతులైన కళాకారులు ఏ వయసులోనైనా సాధించగలరని అన్నారు. కాగా 43 ఏళ్ల వయసులోనూ తరగని అందాలతో ఆకట్టుకుంటున్న శ్రియ ఇప్పటికీ ఐటమ్ సాంగ్స్లో నటించడానికి సిద్ధం అంటున్నారు. -
టైటిల్ ఫిక్స్?
దర్శకుడు నాగ్ అశ్విన్ ‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా రూపొందిన తొలి సినిమా ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా, అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపికా పదుకోన్ ప్రధానపాత్రల్లో నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా 2024 జూన్లో విడుదలై, సూపర్హిట్గా నిలిచింది. కాగా, ఈ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రానున్న తదుపరి చిత్రం ‘కల్కి 2’ చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్లో మొదలైంది. కమల్, అమితాబ్పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే ప్రభాస్ ప్రస్తుతం ఫారిన్లో ఉన్నారని, మేలో ప్రారంభమయ్యే ఈ సినిమా షెడ్యూల్లో ఈ హీరోపాల్గొంటారని తెలిసింది. అలాగే ఈ చిత్రానికి ‘కర్ణ 3102 బీసీ’ అనే టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారట. ‘కల్కి 2898 ఏడీ’ (కల్కిపార్ట్ 1) సినిమాలో కర్ణుడిపాత్రలో ప్రభాస్ కొద్ది నిమిషాలు మాత్రమే స్క్రీన్పై కనిపిస్తారు. కానీ ‘కర్ణ 3102 బీసీ’ మూవీలో కర్ణుడిగా ప్రభాస్ స్క్రీన్పై దాదాపు 30 నిమిషాలు కనిపిస్తారట. ఇంకా ‘కల్కి 2’ మూవీ ముఖ్యంగా కర్ణుడి చుట్టూ తిరుగుతుందని, సినిమాలో కర్ణుడి పునర్జన్మ ఎలా జరిగింది? అనే దానిపైనే ప్రధాన కథనం ఉంటుందని టాక్. ఇక ఈ సంగతి ఇలా ఉంచితే... ‘కల్కి 2’లో దీపికా పదుకోన్ నటించడం లేదని ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు. మరి... దీపిక ప్లేస్లో ఎవరు నటిస్తారనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది చివర్లో విడుదల కావొచ్చనే ప్రచారం జరుగుతోంది. -
రజనీకాంత్కు విలన్గా..?
ఇన్ని రోజులు కెమెరా వెనకాల యాక్షన్, కట్ చెప్పిన దర్శకుడు శంకర్ ఇక తెరపై నటుడిగా కనిపించనున్నారనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. సిల్వర్ స్క్రీన్పై విలన్ రోల్లో నటించేందుకు ఆయన రెడీ అవుతున్నారట. రజనీకాంత్ హీరోగా సీబీ చక్రవర్తి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కమల్హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాలోని విలన్ రోల్లో శంకర్ నటించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ప్రస్తుతం దర్శకుడిగా శంకర్ ఓ హిస్టారికల్ మూవీ తీయాలని స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. ఇందుకు సమయం పడుతుందట. ఈలోపు విలన్గా ఈ అవకాశం రావడంతో చేయాలనుకుంటున్నారని టాక్. ఇదిలా ఉంటే... కొంతకాలం క్రితం వచ్చిన ‘సీత, ప్రేమికుడు, కాదల్ వైరస్, శివాజీ’ వంటి చిత్రాల్లో శంకర్ జస్ట్ అలా కనిపించారు. ఇప్పుడు రజనీకాంత్ సినిమాలో పూర్థి స్థాయి నటుడిగా కనిపిస్తారా? త్వరలోనే క్లారిటీ రావొచ్చు. -
నన్ను ఎగతాళి చేశారు.. నేషనల్ అవార్డ్తో సమాధానం చెప్పా
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం 'కర' ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ధనుష్కు ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచిన 'పొల్లాదవన్' సినిమాలో ఉపయోగించిన బైక్ నంబర్ ప్లేట్ను జ్ఞాపికగా అందించారు. దాంతో ధనుష్ పాత రోజులను గుర్తు చేసుకున్నారు. తన కెరీర్ మలుపు తిరిగిన క్షణాలను అభిమానులతో పంచుకున్నారు.వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పొల్లాదవన్' నా కెరీర్ను పూర్తిగా మార్చేసింది. ఆ సినిమాకు ముందు నన్ను చూసి చాలా మంది చాలా బక్కగా ఉన్నావని ఎగతాళి చేసేవారు. కానీ 'పొల్లాదవన్'లో నేను మొదటిసారి సిక్స్ ప్యాక్తో కనిపించినప్పుడు ప్రేక్షకులు చప్పట్లతో, ఈలలతో నన్ను స్వాగతించారు. నా జీవితంలో అది మర్చిపోలేని క్షణం. మన ఆలోచనలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. భగవద్గీతలో చెప్పినట్లుగా 'యద్భావం తద్భవతి'. మనం ఏదైనా బలంగా నమ్మితే, దాన్ని సాధించగలం.నా కెరీర్ ప్రారంభ రోజులైన "2002-03 సమయంలో నాకు జాతీయ అవార్డు వస్తుందని ఎవరైనా అంటే అందరూ నవ్వుకునేవారు. కానీ నాకు నా మీద నమ్మకం ఉంది. ఏదో ఒకరోజు ఆ అవార్డు నా చేతిలో ఉంటుందని గట్టిగా నమ్మాను. చివరకు అదే జరిగిందని ధనుష్ అన్నారు. తన పట్టుదల, కృషికి ప్రతిఫలంగా 2010లో ఆడుకాలం, 2019లో అసురన్ చిత్రాలకు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాలు అందుకున్నారు. అంతేకాదు, నిర్మాతగా కూడా కాక ముట్టై, విసారణై వంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇక 'కర' సినిమా విషయానికి వస్తే ధనుశ్, మమిత బైజు జంటగా నటించారు. ఈ సినిమాకు విఘ్నశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈశారి గణేశ్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి విడుదల చేస్తున్నారు. కె.ఎస్. రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీ పాండియరాజన్, సూరజ్ వెంజరమూడు, ఎం.ఎస్. బాస్కర్, శ్రీజ రవి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతమందించారు. -
'పెద్ది' సందేహాలన్నీ క్లియర్ చేసిన బుచ్చిబాబు
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా వాయిదా మీద వాయిదా పడుతూనే ఉంది. ఎట్టకేలకు జూన్లో వస్తుందని అధికారికంగా ప్రకటించారు గానీ తేదీ ఎప్పుడనేది ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు. అలానే ఐటమ్ సాంగ్ షూటింగ్ ఎప్పుడు చేస్తారు? అందులో చేసే బ్యూటీ ఎవరు? తదితర వివరాలపై స్పష్టత రాకపోయేసరికి అభిమానులు ఫ్రస్టేట్ అవుతున్నారు. ఇప్పుడు వీటన్నింటిపై దర్శకుడు బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చేశారు.(ఇదీ చదవండి: ఇవి ఉన్నాయి.. అవి వదిలేశా.. సమంత పోస్ట్ వైరల్)ధనుష్ 'కర' సినిమా ఈనెల 30న తెలుగు, తమిళంలో రిలీజ్ కానుంది. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఆదివారం రాత్రి హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న దర్శకుడు బుచ్చిబాబు.. జూన్ 25న 'పెద్ది' సినిమా థియేటర్లలోకి వస్తుందని ప్రకటించాడు. అలానే ఐటమ్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుందని చెప్పాడు. దీంతో చరణ్ అభిమానులు ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథతో 'పెద్ది' తీస్తున్నారు. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తుండగా.. జగపతిబాబు, దివ్యేందు తదితరుల ఇతర పాత్రలు చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేయగా అవి రెండూ సూపర్ హిట్ అయ్యాయి.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకుని షాకిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. భర్త ఎవరంటే?)#Peddi - 25th June 🔒#RamCharan pic.twitter.com/Jnrer2KFrY— Suresh PRO (@SureshPRO_) April 26, 2026 -
పెళ్లి చేసుకుని షాకిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. భర్త ఎవరంటే?
టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ మెహ్రీన్ పెళ్లి చేసుకుంది. గతంలో మాజీ సీఎం మనవడితో నిశ్చితార్థం చేసుకుని రద్దు చేసుకున్న ఈమె ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. హిమాచల్ ప్రదేశ్లోని ఓ రిసార్ట్లో ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరగ్గా.. ఆ ఫొటోలని ఇప్పుడు పంచుకుంది. తన భర్త అర్ష్ ఔలక్ని పరిచయం చేసింది. ఈమె భర్తకు సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేదని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఇవి ఉన్నాయి.. అవి వదిలేశా.. సమంత పోస్ట్ వైరల్)పంజాబ్కి చెందిన మెహ్రీన్.. నాని 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత ఎఫ్ 2, ఎఫ్ 3, మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్, పంతం, కవచం, చాణక్య, ఎంత మంచివాడవురా, అశ్వద్ధామ, మంచి రోజులొచ్చాయి, స్పార్క్ లైఫ్ మూవీస్ చేసింది. తమిళ, హిందీ, పంజాబీ, కన్నడలో పలు చిత్రాల్లో నటించింది.ఇకపోతే హరియాణాకు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన భజన్ లాల్ మనవడు అయిన భవ్య బిష్ణోయ్తో 2021 మార్చిలో మెహ్రీన్కి నిశ్చితార్థం జరిగింది. కానీ ఏమైందో ఏమో దీన్ని రద్దు చేసుకున్నారు. అనంతరం భవ్య పరి అనే ఐఏఎస్ అధికారిణిని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మెహ్రీన్ కూడా అర్ష్ అనే వ్యక్తితో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతానికైతే మెహ్రీన్ చేతిలో కొత్త సినిమాలేం లేవు. చూస్తుంటే నటనకు రిటైర్మెంట్ ఇచ్చేలానే ఉంది.(ఇదీ చదవండి: అషురెడ్డి వివాదం.. సంచలన నిజాలు బయటపెట్టిన తండ్రి) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
ఇవి ఉన్నాయి.. అవి వదిలేశా.. సమంత పోస్ట్ వైరల్
తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన సమంతని ఇప్పుడెవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. అడపాదడపా మూవీస్ చేస్తున్నప్పటికీ.. వాటి కంటే విడాకులు, ఆరోగ్య సమస్యలు, రెండో పెళ్లి తదితర అంశాలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈమె లీడ్ రోల్ చేసిన 'మా ఇంటి బంగారం' మరో రెండు వారాల్లో రిలీజ్ కానుంది. అలానే మంగళవారం ఈమె పుట్టినరోజు కూడా. ఇంతలోనే చిన్నపాటి షాకిచ్చింది. తన దగ్గర ఇప్పుడేముంది? వేటిని వదులుకున్నానని ఓ పోస్ట్ రూపంలో బయటపెట్టింది.(ఇదీ చదవండి: 'వారణాసి' కంటే ముందు మహేశ్ నుంచి ఓ సినిమా)పని మీద ప్రేమ, నడిపించే శక్తి, మనసు చెప్పే విషయం, సంకల్పం, నమ్మిన నిజం, ఓ లక్ష్యం తనతో పాటు ఉన్నాయని చెప్పుకొచ్చిన సమంత.. ఎవరో వచ్చి ఎంపిక చేస్తారని ఎదురుచూడటం, నియంత్రించే ఆలోచన, నచ్చినట్లు ఉండాలనుకునే లక్షణం, పట్టుకుని వేలాడటం, హడావుడి పడటం లాంటి అంశాలని వదిలేశానని తెలిపింది. ఇందుకు సంబంధించి నాలుగు ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.చూస్తుంటే సమంత.. గత కొన్నేళ్లలో తన జీవితంలో జరిగిన సంఘటనలు, వాటి వల్ల తనలో వచ్చిన మార్పుల గురించి పరోక్షంగా ఈ పోస్టుతో చెప్పే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. ఇక 'మా ఇంటి బంగారం' విషయానికొస్తే.. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన యాక్షన్ మూవీ ఇది. ఓ ఇంటికి కోడలిగా వచ్చిన హీరోయిన్(సమంత).. రౌడీలని ఎందుకు చితక్కొట్టాల్సి వచ్చిందనేది కాన్సెప్ట్. ఈ చిత్రానికి సామ్ భర్త రాజ్ నిడిమోరు స్టోరీ, నిర్మాణ పరంగా సహకారం అందించారు.(ఇదీ చదవండి: అషురెడ్డి వివాదం.. సంచలన నిజాలు బయటపెట్టిన తండ్రి) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
రామ్ చరణ్ పెద్ది రిలీజ్.. భారీ రికార్డ్కు మేకర్స్ ప్లాన్..!
రామ్ చరణ్- బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడడంతో అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఓ ఐటమ్ సాంగ్ మినహా ఈ మూవీ షూట్ మొత్తం దాదాపు పూర్తయింది. ప్రస్తుతం ఈ సాంగ్ను హైదరాబాద్లోనే షూట్ చేస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ రామ్ చరణ్తో కలిసి స్టెప్పులు వేయనుంది.అయితే పెద్ది మూవీ జూన్లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతలోనే పెద్ది ప్రీమియర్స్కు సంబంధించిన మరో క్రేజీ టాక్ వినిపిస్తోంది. పెద్ది సినిమా ప్రీమియర్స్ విషయంలో కొత్త రికార్డ్ సెట్ చేయనుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జూన్ 24 న సాయంత్రం ఆరు గంటల నుంచే పెద్దఎత్తున ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ విషయంపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు రామ్చరణ్ స్పెషల్ సాంగ్లో స్టెప్స్ ఫ్యాన్స్కు గూస్ బంప్స్ తెప్పిస్తాయని అంటున్నారు. దీంతో పెద్ది మూవీపై అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది. కాగా.. ఈ సినిమాలో చెర్రీ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. త్వరలోనే పెద్ది రిలీజ్ డేట్పై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. -
అషురెడ్డి వివాదం.. సంచలన నిజాలు బయటపెట్టిన తండ్రి
బిగ్బాస్ ఫేమ్ అషురెడ్డి గురించి గత రాత్రి నుంచి పలు వార్తలు వస్తున్నాయి. లండన్కి చెందిన ధర్మేంద్ర అనే ఎన్నారై దగ్గర నుంచి రూ.9.5 కోట్లు తీసుకుని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ హైదరాబాద్ సీసీఎస్లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా స్పందించిన అషురెడ్డి.. తన అనుమతి లేకుండా అవాస్తవాలు ప్రచారం చేస్తే లీగల్ చర్యలు తీసుకుంటానని రాసుకొచ్చింది. ఇప్పుడు ఈమె తండ్రి వెంకటకృష్ణారెడ్డి, మీడియాతో మాట్లాడుతూ సంచలన నిజాలు బయటపెట్టారు.(ఇదీ చదవండి: 'వారణాసి' కంటే ముందు మహేశ్ నుంచి ఓ సినిమా)'2021లో ఓ కాల్ వచ్చింది. కాకినాడ నుంచి సత్యనారాయణ అని తనని తాను పరిచయం చేసుకుని మీ అమ్మాయి పెళ్లి సంబంధం కోసం ఫోన్ చేశానని అన్నారు. మా అమ్మాయి మీకెలా తెలుసు అని అడిగాను. దీంతో మా అమ్మాయి, వాళ్ల అబ్బాయి కలిసి ఉద్యోగం చేశారని అలా పరిచయం అని నాతో చెప్పారు. ఓసారి కాకినాడ వచ్చి వెళ్లండి అని కూడా అన్నారు. నేను కాకినాడ వెళ్లలేదు గానీ తెలిసిన వాళ్లతో సదరు ధర్మేంద్ర కుటుంబం గురించి తెలుసుకోమన్నాను. అప్పటికే అతడికి పెళ్లయి విడాకుల కేసు నడుస్తోందని, సత్యనారాయణ నడుపుతున్న ఫైనాన్స్ కంపెనీపై కాల్ మనీ కేసు ఉన్నట్లు తెలిసింది. దీంతో సంబంధం వద్దని నేరుగా చెప్పలేక తర్వాత చెబుదాం అని నాన్చుతూ వచ్చాం. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఆయన గురించి వినడం''నేను వైజాగ్లో ఉంటాను. మా అమ్మాయి, తల్లితో కలిసి హైదరాబాద్లో ఉంటుంది. మొదట నుంచి నాకు, అమ్మాయి ఇండస్ట్రీకి వెళ్లడం ఇష్టం లేదు. అషురెడ్డికి ఏం తెలీదు, అమయకురాలు. తల్లి పోత్రాహంతోనే సినిమాల్లోకి వెళ్లింది. ధర్మేంద్రతో ఆర్థిక వ్యవహారాల గురించి నాకు ఏం తెలీదు. కానీ మాపై చేసినవన్నీ ఆరోపణలు మాత్రమే. ఏమైనా సాక్ష్యాలు ఉంటే నిరూపించుకోవాలి. ప్రస్తుతం మా అమ్మాయి వేరే చోట ఉంది. రాత్రికల్లా హైదరాబాద్ చేరుకుంటుంది. రేపు(సోమవారం) ప్రెస్ మీట్ పెట్టి అసలేం జరిగిందో చెబుతుంది. ఇదే సంగతి నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పింది. నేను కూడా ఈ రాత్రికి హైదరాబాద్ వెళ్తాను' అని అషురెడ్డి తండ్రి వెంకటకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: సాయిపల్లవి లేదా రుక్మిణి.. ఇద్దరిలో ఎవరు?) -
పెళ్లి వేడుకలో మెరిసిన నమ్రతా.. ఫుల్ గ్లామరస్గా ఆషిక రంగనాథ్..!
పెళ్లి వేడుకలో నమ్రతా శిరోద్కర్ సందడి..శారీలో బాలీవుడ్ భామ కాజోల్ అందాలు..చుడిదార్లో హీరోయిన్ ప్రియమణి పోజులు..డిగ్రీ ఫోటోను షేర్ చేసిన హీరోయిన్ మాధవీలత..ఫుల్ గ్లామరస్గా కనిపించిన నా సామిరంగ బ్యూటీ..సముద్ర తీరాన నటి ఐశ్వర్య రఘుపతి చిల్.. View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Leader ll Runs NGO ll (@actressmaadhavi) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Aishwarya Ragupathi (@aishwarya_ragupathi) View this post on Instagram A post shared by Siddhi Idnani (@siddhi_idnani) -
సాయిపల్లవి లేదా రుక్మిణి.. ఇద్దరిలో ఎవరు?
ప్రస్తుతం దక్షిణాదిలో క్రేజ్ పరంగా కొందరు హీరోయిన్లు టాప్లో ఉన్నారు. వాళ్లలో సాయిపల్లవి, రుక్మిణి వసంత్ కచ్చితంగా ఉంటారు. ఎందుకంటే రామాయణ, కల్కి 2 లాంటి క్రేజీ పాన్ ఇండియా మూవీస్తో సాయిపల్లవి.. ఎన్టీఆన్ 'డ్రాగన్'తో రుక్మిణి ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు వీళ్లిద్దరికీ సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ తెగ వైరల్ అయిపోతోంది. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: 'వారణాసి' కంటే ముందు మహేశ్ నుంచి ఓ సినిమా)ఎన్నో వందల పాటలతో దిగ్గజ గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ తీసేందుకు అంతా సిద్ధమైంది. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి.. ఈ క్రేజీ బయోపిక్కి దర్శకుడు కాగా సుబ్బలక్ష్మి పాత్ర కోసం సాయిపల్లవిని ఎంపిక చేశారనే న్యూస్ బయటకొచ్చింది. ఇప్పుడు ఉన్నట్టుండి రుక్మిణి పేరు తెరపైకి వచ్చింది. పలు సినిమాల బిజీ షెడ్యూల్స్ కారణంగా సాయిపల్లవి, ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొందని అంటున్నారు.మరికొందరేమో సుబ్బలక్ష్మి బయోపిక్లో సాయిపల్లవి ఇంకా ఉందని, రుక్మిణి అంటూ వస్తున్నవి రూమర్స్ మాత్రమేనని చెబుతున్నారు. మరి ఇందులో నిజానిజాలేంటనేది దర్శకనిర్మాతే క్లారిటీ ఇవ్వాలి.(ఇదీ చదవండి: సరైన తిండి పెట్టలేదు.. రెమ్యునరేషన్ అడిగితే బెదిరిస్తున్నారు) -
విశాల్పై అంజలి సెటైర్లు.. కాన్సెప్ట్ వీడియో
విశాల్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘మకుటం’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్పై 99వ సినిమాగా ఆర్.బి. చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్పటి వరకు వచ్చిన కంటెంట్, పోస్టర్లు చూస్తే ఇదొక డిఫరెంట్ యాక్షన్ సినిమా అని అర్థం అవుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చారు. విశాల్, అంజలి కాంబోకి ఉన్న హిట్స్, క్రేజ్ అందరికీ తెలిసిందే. అయితే ఈ ‘మకుటం’ చిత్రంలోనూ విశాల్ సరసన అంజలి నటించనున్నారు. ఈ మేరకు అంజలి, విశాల్ కలిసి ఓ కాన్సెప్ట్ వీడియోని చేశారు.హీరోయిన్ అంజలి వద్దకు దర్శకుడైన విశాల్ కథ చెప్పడానికి వెళ్తాడు. ఇక కథ చెప్పండి డైరెక్టర్ గారు అని అంజలి అంటారు. ఒక అందమైన గ్రామం అని విశాల్ అంటే.. అది ప్రొడక్షన్ వాళ్లు చూసుకుంటారు కదా.. ముందు మీరు కథ చెప్పండని కౌంటర్ వేస్తారు అంజలి. ఇలా విశాల్ కథ చెబుతూ ఉంటే మధ్య మధ్యలో అంజలి సెటైర్లు వేస్తుంటారు. విశాల్ ఇలా ఏదేదో చెబుతుంటారు.. అసలు మీ వద్ద కథ ఉందా? అని అంజలి అడగడంతో విశాల్ పారిపోతారు. మంచి కథ అని మేనేజర్ చెప్పారే.. విశాల్ ఏంటి ఇలా చెబుతున్నారని అంజలి అనుకుంటారు. కథ అడుగుతోందే.. ఎలా.. రేపు వచ్చి మరో కథ చెబుదాం అని విశాల్ వెళ్లిపోతారు.ఈ కాన్సెప్ట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాధ్యతల్ని విశాల్ చూసుకుంటున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.. @VishalKOfficial & @yoursanjali chemistry is the major highlight Of the film. #Makutam #MAGUDAM pic.twitter.com/vyj65qzJng— Filmy Today (@Filmy_Today) April 26, 2026 -
రేర్ పిక్ షేర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఈ ఫోటోలో ఎక్కడుందో తెలుసా?
మన చిన్నప్పటి జ్ఞాపకాలు ఎవరికైనా చాలా స్పెషల్. స్కూల్, కాలేజీ డేస్ ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని క్షణాలు. ఆనాటి రోజులను ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా ఉంటుంది. మన ఫ్రెండ్స్తో కలిసి తిరిగినా రోజులను చూసి చాలా మురిసిపోతాం. ఆ రోజుల్లో దిగిన ఒక్క ఫోటో ఉన్న సరే పట్టలేనంతగా సంతోషంతో మనల్ని మనం చూసుకుని సంబురపడిపోతాం. అలా తాను డిగ్రీ చదివిన రోజులను టాలీవుడ్ హీరోయిన్ మరోసారి గుర్తుకు తెచ్చుకుంది. తన ఫ్రెండ్స్తో ఉన్న ఆనాటి రేర్ పిక్ను షేర్ చేసింది. ఇంతకీ నేను ఎక్కడ ఉన్నానో చెప్పుకొండి అంటూ అభిమానులకు చిన్న పరీక్ష పెట్టింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో చూసేద్దాం.నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాధవి లత. 2008లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత మాధవి స్నేహితుడా, అరవింద్-2 చిత్రాల్లో మెప్పించింది. అంతే కాకుండా మహేష్ బాబు హీరోగా వచ్చిన అతిథి చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలిగా మొట్టమొదటిసారి కనిపించింది. కానీ ఆ తర్వాత పెద్దగా సక్సెస్ రాకపోవడంతో సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న ముద్దుగుమ్మ.. బీజేపీ నాయకురాలిగా కొనసాగుతున్నారు. View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Leader ll Runs NGO ll (@actressmaadhavi) -
'వారణాసి' కంటే ముందు మహేశ్ నుంచి ఓ సినిమా
ప్రస్తుతం 'వారణాసి' సినిమాతో మహేశ్ బాబు బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ తొలి వారంలో ఇది థియేటర్లలోకి రానుంది. కానీ ఇంతకంటే ముందే మహేశ్ ఓ మూవీతో రాబోతున్నాడు. కాకపోతే ఇది ఈయన నటించిన చిత్రం కాదు నిర్మాతగా వ్యవహరించినది. ఇప్పుడీ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ప్రకటించారు.(ఇదీ చదవండి: సరైన తిండి పెట్టలేదు.. రెమ్యునరేషన్ అడిగితే బెదిరిస్తున్నారు)కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య తదితర సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వెంకటేశ్ మహా తీసిన లేటెస్ట్ మూవీ 'రావు బహదూర్'. సత్యదేవ్ హీరోగా నటించాడు. గతేడాది ఆగస్టులోనే టీజర్ రిలీజ్ చేయగా ఆసక్తికరంగా అనిపించింది. కొన్నిరోజుల క్రితం తొలి పాట రిలీజ్ చేశారు. ఇప్పుడు విడుదల తేదీని ప్రకటించారు. జూన్ 5న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా పోస్టర్ వదిలారు.జీఎంబీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మహేశ్బాబు, నమ్రత.. ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, ఎ ప్లస్ ఎస్ మూవీస్ సంస్థలపై చింతా గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్చంద్ర నిర్మిస్తున్నారు. ఓ రాజవంశం నేపథ్యంలో సాగే ఈ సినిమాని సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో రాకాస.. అఫీషియల్ ప్రకటన వచ్చేసింది) View this post on Instagram A post shared by GMB Entertainment (@gmbents) -
విష్ణుప్రియతో రెండో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన జేడీ చక్రవర్తి
యాంకర్ విష్ణుప్రియకు జేడీ చక్రవర్తి అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. గతంలో ఓ ఇంటర్వ్యూలో చాన్స్ వస్తే జేడీ చక్రవర్తిని పెళ్లి చేసుకుంటానని కూడా ఆమె చెప్పింది. అప్పటి నుంచి జేడీ, విష్ణుప్రియల పెళ్లిపై రకరకాల రూమర్స్ వచ్చాయి. నిజంగానే వీరిద్దరు ప్రేమలో ఉన్నారని.. పెళ్లి చేసుకుంటారని సోషల్ మీడియా కోడై కూసింది. తాజాగా ఈ పుకార్లపై జేడీ చక్రవర్తి స్పందించాడు. ఆయన కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం గాయపడ్డ సింహం. తరుణ్ భాస్కర్ హీరోగా ఫరియా అబ్ధుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటించారు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే1న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా జేడీ చక్రవర్తి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.ఈ సందర్భంగా యాంకర్ విష్ణుప్రియతో రిలేషన్, రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వస్తున్న రూమర్స్పై యాంకర్ ప్రశ్నించగా.. జేడీ చక్రవర్తి ఇలా సమాధానం ఇచ్చాడు. ‘విష్ణుప్రియ గురించి నేను ఒక విషయం చెబుతా. నేను నటుడిగానే కాకుండా నాకు మరో కోణం ఉంది. అదే ఫిలాసఫి. దానిపరంగా విష్ణుప్రియ నా శిష్యురాలు. విష్ణుప్రియకు నేను ఫోన్ చేస్తే గురువుగారు అనే మాట్లాడుతుంది. అసలు ఆ అమ్మాయికి నాకు ఎఫైర్ ఉందని అనుకోవడం అన్నంత దుర్మార్గం ఇంకోకటి లేదు. ఆమె నా శిష్యురాలు... పైగా పెళ్లి చేసుకోవడమా? ఆ అమ్మాయి నన్ను గురువుగా భావిస్తోంది. అలాంటి అమ్మాయితో నా పెళ్లి ముడిపెట్టడం సరికాదు’ అని జేడీ చెప్పుకొచ్చాడు.ఇక విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ వివాదం గురించి మాట్లాడుతూ.. ‘ఆమె నాకు ఫిలాసఫికల్గా మాత్రమే శిష్యురాలు.తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్తో నాకు ఏ సంబంధం లేదు. తన ఇష్టం తనది.. తను నాతో డిస్కష్ చేసేది ఫిలాసఫి. విపరీతమైన దైవభక్తి, విపరీతమైన జ్ఞానం ఆ అమ్మాయిలో ఉన్నాయి. ఫిలాసఫి వేరు, దేవుడు వేరు. ఫిలాసఫికి సంబంధించిన విషయాలకే తను నాకు ఫోన్ చేసి కన్సల్ట్ అవుతుంది. దాని మీద మాత్రమే మేమిద్దరం మాట్లాడుకుంటాం. నేను విష్ణుప్రియని కలిసి దాదాపు మూడేళ్లు అవుతోంది అని జేడీ చక్రవర్తి తెలిపారు. -
పెద్ది ఐటమ్ సాంగ్.. శృతి హాసన్కు భారీ రెమ్యునరేషన్..!
రామ్ చరణ్- బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడడంతో అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఓ ఐటమ్ సాంగ్ మినహా ఈ మూవీ షూట్ మొత్తం దాదాపు పూర్తయింది. పెద్ది ఐటమ్ సాంగ్ కోసం పలువురు హీరోయిన్స్ను పరిశీలించగా.. చివరికీ కోలీవుడ్ భామ శృతిహాసన్ పేరు ఖరారు చేశారు.ప్రస్తుతం ఈ సాంగ్ను హైదరాబాద్లోనే షూట్ చేస్తున్నారు. ఇవాళ ఈ సాంగ్ షూటింగ్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శృతిహాసన్ రెమ్యునరేషన్పై టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ స్పెషల్ ఐటమ్ సాంగ్ కోసం దాదాపు రూ.3 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే ఈ కోలీవుడ్ బ్యూటీ జాక్పాట్ కొట్టేసినట్లే. కాగా.. ఈ పాటను టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కంపోజ్ చేస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్ను ఏప్రిల్ 30వ తేదీ నాటికి పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.కాగా.. పెద్ది మూవీ రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్కుమార్ సైతం కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తోన్న సంగతి తెలిసిందే. రెండుసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని జూన్కు పోస్ట్పోన్ చేశారు. -
సరైన తిండి పెట్టలేదు.. రెమ్యునరేషన్ అడిగితే బెదిరిస్తున్నారు
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. సినిమాల్లో మాత్రమే అని కాకుండా వెబ్ సిరీస్లతోనూ చిన్న చిన్న నటీనటులకు అవకాశాలు దొరుకుతున్నాయి. అలానే ఓ సిరీస్లో ఛాన్స్ దక్కించుకున్న మలయాళ యువనటి అనుగ్రహ నంబియార్.. షూటింగ్ సందర్భంగా తనకెదురైన ఇబ్బందుల గురించి, హీరో అతడి భార్యపై కూడా సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: ఓటీటీలో రాకాస.. అఫీషియల్ ప్రకటన వచ్చేసింది)కేరళకు చెందిన 23 ఏళ్ల నటి అనుగ్రహ ఎస్ నంబియార్.. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. 'అడిపోలి' అనే మూవీ కూడా చేసింది. ప్రస్తుతం హాట్స్టార్లో వారం వారం ప్రసారమవుతున్న 'రిసార్ట్' అనే వెబ్ సిరీస్లో శ్రీనిధి అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సిరీస్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని చెబుతూ ఇన్ స్టాలో దాదాపు 6 నిమిషాల వీడియోని అనుగ్రహ పోస్ట్ చేసింది.'సిరీస్ కోసం అగ్రిమెంట్పై సంతకం చేసినప్పటికీ నా పాత్రకు సంబంధించిన షూటింగ్ మొదలుపెట్టలేదు. మరే సినిమాల్లోనూ నటించొద్దని చెప్పారు. దీంతో గత నాలుగు నెలలుగా పనిలేకపోయేసరికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నిర్మాణ సంస్థని సంప్రదిస్తే సరైన సమాధానం చెప్పట్లేదు. వాళ్లు వీళ్లు అని తప్పించుకుంటున్నారు. నేను చిన్న గ్రామం నుంచి వచ్చిన సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయిని. నా కలలు అడ్డుకోవడానికి మీకెవరికీ హక్కు లేదు''ఇంకా చెప్పాలంటే షూటింగ్ టైంలో సరైన సౌకర్యాలు లేవు. సరైన భోజనం కూడా పెట్టలేదు. పారితోషికం గురించి అడిగితే బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితుల కారణంగా నా ఆరోగ్యం దెబ్బతింది. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో కూడా చేరాను. తన పరిస్థితి విషమించి ఉంటే చనిపోయేదాన్ని. నేను ఆస్పత్రిలో చేరితే విజయ్ నిర్లక్ష్యంగా స్పందించాడు. తనపై విజయ్, అతడి భార్య నక్షత్ర అనుచితంగా మాట్లాడిన ఆధారాలు కూడా ఉన్నాయి. నా లాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదు. ఈ వ్యవహారంపై నిర్మాతలు, సంబంధిత వ్యక్తులు స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను' అని అనుగ్రహ చెప్పుకొచ్చింది. సిరీస్ దర్శకనిర్మాతలు ఈ విషయంపై స్పందించాల్సి ఉంది.(ఇదీ చదవండి: రూ. 9 కోట్ల మోసం.. ఫోటోలతో స్పందించిన అషురెడ్డి) View this post on Instagram A post shared by Anugraha S Nambiar (@anugraha_s_nambiar_) -
'మా లైఫ్లో నువ్వు ఉండటం అదృష్టం'.. బిగ్బాస్ శివజ్యోతి ఎమోషనల్ పోస్ట్
బిగ్బాస్ ఫేమ్, యాంకర్ శివజ్యోతి పేరు అందరికీ సుపరిచితమే. ఈ ఏడాది ప్రారంభంలోనే గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి 12న తనకు పండంటి బిడ్డ పుట్టినట్లు వెల్లడించింది. ఆ తర్వాత తనకు కూతురు పుట్టిందని జెండర్ రివీల్ చేసింది. ఈ ఏడాది ఆమెకు మరింత స్పెషల్గా మారింది.ఇవాళ తన పెళ్లి రోజు కావడంతో ప్రత్యేకంగా తన భర్తకు విషెస్ తెలిపింది. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ గంగా అంటూ తన భర్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పింది. ఈ సంవత్సరం మాకు చాలా ప్రత్యేకమైనది… ఎందుకంటే మాతో పాటు మా చిన్న తల్లి కూడా ఉన్నారంటూ రాసుకొచ్చింది. మా జీవితంలో నువ్వు ఉండటం మా అదృష్టం.. నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాం అంటూ భర్తపై ప్రేమను చాటుకుంది బిగ్బాస్ శివజ్యోతి. ఇది చూసిన పలువురు సినీతారలు ఈ జంటకు పెళ్లి రోజు విషెస్ చెబుతున్నారు. View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) -
నువ్వేం మనిషివయ్యా సుధీర్.. ‘ఫ్రీ’ కోసం పిల్లలు కంటావా?: మల్లారెడ్డి
ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత మల్లారెడ్డికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ‘పాలమ్మినా.. పూలమ్మినా.. ’అనే డైలాగ్తో పాటు ఆయన ఏం మాట్లాడినా..ఆ మాటలు నెట్టింట వైరల్ అవుతుంటాయి.ఇక ఇటీవల తన 50 ఏళ్ల వివాహ వార్షికోత్సవం (గోల్డెన్ జూబ్లీ) సందర్భంగా తన భార్య కల్పనను మరోసారి పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచాడు. అయితే ఎప్పుడు రాజకీయ సభల్లో లేదా కాలేజీలో నిర్వహించే ఈవెంట్స్లో మాత్రమే పాల్గొనే మల్లారెడ్డి..తొలిసారి ఓ ఎంటర్టైన్మెంట్ షోకి గెస్ట్గా వెళ్లాడు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వహిస్తున్న ఎంటర్టైన్మెంట్ షో ‘సర్కార్ షో’ ఆరో సీజన్లో పాల్గొన్నాడు. సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యహరిస్తోన్న ఈ ఎంటర్ టైన్మెంట్ షో లో మల్లారెడ్డి తనదైన డైలాగులు, డ్యాన్స్ లు చేసి అలరించారు. తాజాగా దీనికి సంబంధించిన కొత్త ప్రోమో రిలీజ్ అయింది. అందులో హోస్ట్ సుధీర్పై మల్లారెడ్డి వేసిన పంచులు నవ్వులు పూయిస్తుంది. ‘పెళ్లి చేసుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా సార్’ అని సుధీర్ అడిగితే..‘పనికిరానోళ్లకు ప్రాబ్లమ్స్ ఉంటాయి’ అని తనదైన శైలీలో జవాబిచ్చాడు. అంతేకాదు ‘ఇంత ఏజ్ వచ్చినా పెళ్లి చేసుకోకపోతే నువ్వేం మనిషివయ్యా’ అని సుధీర్ని అనగానే.. పక్కనే ఉన్న అలీ, శివాజీ పలగబడి నవ్వారు. ఇక ‘సుధీర్ నువ్వు పెళ్లి చేసుకో.. నీ పిల్లలకు మల్లారెడ్డి తన కాలేజీలో ఫ్రీ సీటు ఇస్తాడు’అని అలీ అంటే..‘అవన్నీ ఏం లేవు..ఇది గవర్నమెంట్ కాదు’అని అంటూనే.. ‘ఫ్రీ కోసం పిల్లలు కంటడా ఏంటి? అని చమత్కరించాడు. ఇక ‘మీ బయోపిక్లో ఎవరు నటిస్తే బాగుంటుంది’అని సుధీర్ అడిగితే.. ‘డైరెక్టర్ ఎవరిని సెట్ చేస్తే వాళ్లు నటిస్తారు’ అని మల్లారెడ్డి తనదైన శైలీలో జవాబిచ్చాడు. ఇంకా మల్లారెడ్డి ఏం మాట్లాడాడు.. ఆయన చేసిన సందడి ఎంటి అనేది మే1న ఫుల్ ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. -
పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన ప్రముఖ క్యాస్టింగ్ డైరెక్టర్
ఇప్పుడంతా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ పెళ్లి భాజాలు మోగుతున్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ క్యాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ పెళ్లి చేసుకుంది. తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ శుభవార్త తెలుసుకున్న బాలీవుడ్ స్టార్స్ నూతన దంపతులకు విషెసె చెబుతున్నారు. రణవీర్ సింగ్, కృతి సనన్, పరిణీతి చోప్రా, ఖుషీ కపూర్, శర్వరి, వాణి కపూర్, వరుణ్ ధావన్, రష్మిక మందన్నతో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. అయితే ఆమె తన భర్త వివరాలను వెల్లడించలేదు.కాగా.. షానూ శర్మ పలువురు బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు క్యాస్టింగ్ డైరెక్టర్గా పనిచేసింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కీలక పాత్రల్లో వచ్చిన వార్-2 మూవీకి సైతం వర్క్ చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు నటుల కెరీర్ను తీర్చిదిద్దడంలో షానూ ప్రధాన పాత్ర పోషించింది. ఆమె రణ్వీర్ సింగ్ బ్యాండ్ బాజా బారాత్, వాణి కపూర్ మూవీ దమ్ లగా కే హైషాలో, అర్జున్ కపూర్ ఇషాక్జాదే చిత్రాలకు నటీనటులను ఎంపికచేసింది. అనుష్క శర్మ నటించిన రబ్ నే బనా ది జోడి మూవీకి క్యాస్టింగ్ డైరెక్టర్గా సేవలందించారు. గతేడాది రిలీజైన సైయారా మూవీకి అహాన్ పాండే, అనీత్ పడ్డాను షానూ శర్మనే ఎంపిక చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా మారింది. View this post on Instagram A post shared by Shanoo Sharma🌻 (@shanoosharmarahihai) -
ఓటీటీలో 'ది కేరళ స్టోరీ 2'.. స్ట్రీమింగ్ తేదీ మార్పు
‘ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్’ ఓటీటీ స్ట్రీమింగ్ తేది మారింది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ది కేరళ స్టోరీకి కొనసాగింపుగా ఫిబ్రవరి 27న విడుదలైన ఈ చిత్రం కొద్దిరోజుల క్రితమే ఓటీటీ రిలీజ్ గురించి ప్రకటించారు. అయితే, తాజాగా మరో తేదిని ప్రకటిస్తూ ఎక్స్ పేజీలో షేర్ చేశారు. దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్, రచయిత విపుల్ అమృత్ లాల్ షా తెరకెక్కించిన ఈ చిత్రం అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. మరి ఓటీటీలో ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.ది కేరళ స్టోరీ 2 మొదట మే 8 ZEE5లో విడుదల అవుతుందని ప్రకటించినప్పటికీ, స్ట్రీమింగ్ తేదీని మే 1, 2026కి ముందుకు జరిపారు. అయితే, ఈ ముందస్తు విడుదలకు గల సరైన కారణాన్ని చిత్ర నిర్మాతలు గానీ, ప్లాట్ఫామ్ గానీ వెల్లడించకపోవడంతో, ఈ మార్పు చాలా మందిని ఆశ్చర్యపరిచింది. థియేటర్స్లో విడుదల సమయంలో అనేక చట్టపరమైన అడ్డంకులను ఎదుర్కొని, బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను పొందింది. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. Love looked like a new beginning, until it started closing in. Divya, Neha, and Surekha step into relationships built on trust, only to face a reality that reshapes their lives. Watch #TheKeralaStory2, streaming from 1st May on ZEE5.#TheKeralaStory2OnZee5… pic.twitter.com/t4Ev3wbgiR— ZEE5Official (@ZEE5India) April 25, 2026 -
సుశాంత్ సింగ్ కేసు.. ప్రియురాలికి బిగ్ రిలీఫ్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో ప్రియురాలు రియా చక్రవర్తికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ కేసులో ఆమె ఇప్పటికే నిర్దోషిగా బయటకొచ్చారు. ఈ నేపథ్యంలోనే బ్యాంక్ ఖాతాలను పునరుద్ధరించాలని ముంబైలోని ఒక ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె సోదరుడు షోవిక్, తల్లి సంధ్యలకు చెందిన బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని ఆదేశించింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మిస్టరీ డెత్ కేసులో వీరి బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు.కాగా.. 2020లో హీరో సుశాంత్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన మృతి తర్వాత ప్రియురాలైన రియా చక్రవర్తితో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. అయితే సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో రియా చక్రవర్తితో పాటు ఆమె తమ్ముడు షోయిక్లకు చివరికి క్లీన్ చిట్ లభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రియా తిరిగి తన కెరీర్ నటనలో మళ్లీ అడుగుపెట్టింది. ఆమె ఇటీవలే రోడీస్లో కనిపించింది. ఆమె తన సొంత పాడ్కాస్ట్ను కూడా ప్రారంభించింది. ఇందులో అమీర్ ఖాన్, సుష్మితా సేన్, ఫర్హాన్ అక్తర్, హనీ సింగ్ లాంటి ప్రముఖులను ఇంటర్వ్యూ చేసింది. -
బాయ్ఫ్రెండ్ని హీరోగా పరిచయం చేస్తున్న పాయల్
‘ఆర్ఎక్స్ 100’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి..తొలి మూవీతోనే తెలుగు యువత మనసు దోచుకున్న బ్యూటీ పాయల్ రాజ్పుత్. అంతకు ముందు పంజాబీలో సినిమాలు చేశారు. హిందీ సీరియళ్లలో నటించారు. అయితే, అక్కడ రాని గుర్తింపు... తెలుగులో ఒక్క సినిమాతో వచ్చింది. ‘ఆర్ఎక్స్ 100’ విడుదలైన తర్వాత పాయల్ రాజ్పుత్కు ఓవర్ నైట్లో స్టార్డమ్ వచ్చింది. అక్కడ నుంచి తెలుగులో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ‘మంగళవారం’తో మరో హిట్ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ఈ బ్యూటీ..తన బాయ్ఫ్రెండ్ని తెలుగు తెరకు పరచయం చేయనుంది. సోషల్ మీడియాను రెగ్యులర్గా ఫాలో అయ్యవాళ్లకు సౌరబ్ ధింగ్ర గురించి తెలిసే ఉంటుంది. పాయల్తో కలిసి చేసిన హాట్ఫోటో షూట్ అప్పట్లో బాగా వైరల్ అయింది. ఆయన ఇప్పుడు ‘ఫస్ట్ టైం’ అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి హేమంత్ ఇప్పనపల్లి కథ-దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్ని ఈ నెల 28 విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్కి పాయల్ రాజ్పుత్ ముఖ్యఅతిథిగా రాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బిగ్ బాస్' ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్ గా అనిక్క విక్రమన్ హీరోయిన్ గా, ఇతర ముఖ్య పాత్రల్లో మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు నటిస్తున్నారు. శ్రీ వెంకట్ మరియు సూరజ్ ఎస్ కురుప్ సంగీతాన్ని అందించగా వేణు మురళీధర్ మరియు రామ్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు. -
రూ. 9 కోట్ల మోసం.. ఫోటోలతో స్పందించిన అషురెడ్డి
బిగ్బాస్ ఫేమ్, సినీనటి అషురెడ్డి తనపై నమోదైన కేసు గురించి సోషల్మీడియా ద్వారా స్పందించింది. తన ప్రమేయం లేకుండా తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఇన్స్టాగ్రామ్లో ఆమె ఒక పోస్ట్ చేసింది. ఆపై ఆమె పలు ఫోటోలను షేర్ చేసింది. కొద్దిరోజుల క్రితం ఆమె కొల్హాపూర్ లక్ష్మీదేవి క్షేత్రం దర్శించుకున్న దృశ్యాలను పంచుకుంది. అయితే, అందులో అమ్మవారికి సమర్పించిందేకు కొబ్బరికాయ, పూలు, పసుపు, కుంకుమ, మెట్టెలు, తాళి వంటి వస్తువులు ఉండటం విశేషం.(ఇదీ చదవండి: నటి అషురెడ్డిపై కేసు నమోదు.. పెళ్లి పేరుతో రూ. 9 కోట్లు మోసం)సినీ నటి అషురెడ్డిపై హైదరాబాద్లో కేసు నమోదైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిందని హైదరాబాద్ షేక్పేట్కు చెందిన వై.వి.ధర్మేంద్ర ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తన నుంచి రూ.9.35 కోట్లు కాజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. లండన్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా తాను పని చేస్తున్నానని చెప్పిన ధర్మేంద్ర.. 2018లో భారత్కు వచ్చిన సమయంలో అషురెడ్డి పరిచయమైనట్లు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) -
జైలులో ఉన్నప్పుడే సీక్వెల్ ఆలోచన వచ్చింది: సంజయ్ దత్
‘ఖల్ నాయక్ రిటర్న్స్’ అంటున్నారు సంజయ్ దత్. సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘ఖల్ నాయక్’. 1993లో విడుదలైన, ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలోని బలరామ్ ప్రసాద్ అలియాస్ భల్లు పాత్రలో సంజయ్ దత్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తాజాగా ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ పేరుతో ‘ఖల్ నాయక్’ సినిమా సీక్వెల్ను ప్రకటించారు సంజయ్ దత్. ప్రతి స్టోరీకి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చేసింది. ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ అంటూ ఈ సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ను ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు సంజయ్ దత్(Sanjay Dutt). అలాగే ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ మోషన్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ను ముంబైలో నిర్వహించారు. ఈ వేడుకలో సంజయ్ దత్ మాట్లాడుతూ–‘‘నేను జైలులో ఉన్నప్పుడు ‘ఖల్ నాయక్’ సినిమా ఆలోచన వచ్చింది. ఆ సమయంలో జైలులో ఉన్న దాదాపు 4వేల మంది ఖైదీలతో ‘ఖల్ నాయక్’ సినిమా గురించి మాట్లాడాను. ఈ సినిమా వారికి నచ్చిందా? సీక్వెల్ గురించి ఆసక్తిగా ఉన్నారా? అన్న విషయాలను తెలియజేయాలని పేపర్స్ ఇచ్చాను. వారు తిరిగి ఇచ్చిన లెటర్స్ను నేను చదివాను.‘ఖల్ నాయక్’ సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చాలా మంది పేర్కొన్నారు. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత, ‘ఖల్ నాయక్’ సీక్వెల్ గురించి సుభాష్గారితో మాట్లాడాను. ఆయన సీక్వెల్కి స్కోప్ ఉందని చెప్పారు. ఇలా ఇప్పుడు ‘ఖల్ నాయక్’ సినిమా చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు సంజయ్ దత్. ఈ ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ సినిమాను అస్పెట్ ఎంటర్టైన్మెంట్, జియో స్టూడియోస్ సంస్థల అసోసియేషన్తో సంజయ్ దత్ నిర్మించనున్నారు. అయితే దర్శకుడు ఎవరు? అన్నది తెలియాలి. -
నటి అషురెడ్డిపై కేసు నమోదు.. పెళ్లి పేరుతో రూ. 9 కోట్లు మోసం
బిగ్బాస్ ఫేమ్, సినీనటి అషురెడ్డి(అశ్విని రెడ్డి)పై హైదరాబాద్లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిందని హైదరాబాద్ షేక్పేట్కు చెందిన వై.వి.ధర్మేంద్ర ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తన నుంచి రూ.9.35 కోట్లు కాజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. లండన్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా తాను పని చేస్తున్నానని చెప్పిన ధర్మేంద్ర.. 2018లో భారత్కు వచ్చిన సమయంలో అషురెడ్డి పరిచయమైనట్లు పేర్కొన్నారు.పోలీసులతో ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ' అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమా ఛాన్స్లో కోసం హైదాబాద్ వచ్చినట్లు అషురెడ్డి చెప్పింది. మా అబ్బాయికి పరిచయం అయిన కొద్దిరోజుల్లోనే ప్రేమిస్తున్నాని చెప్పి పెళ్లి చేసుకుందామని నమ్మించింది. ఈ క్రమంలో మా అబ్బాయిని డబ్బులు అడగటం మొదలు పెట్టింది. బంగారం, కారు పలు ఆస్తులను కొనుగోలు చేయించుకుని తన పేరుతోనే రిజిస్టర్ చేయించుకుంది. అయితే, కొద్దిరోజుల క్రితం ధర్మేంద్రను కలిశారు. అషురెడ్డితో పెళ్లి సంబంధాన్ని ఖాయం చేస్తున్నామని ముహూర్తం కోసం పూజారిని కూడా పిలిపించి హడావుడి చేశారు. కానీ, వెంటనే ముఖం చాటేసి పెళ్లికి నిరాకరించారు. గతేడాది వరకు నా కుమారుడితో ఆమె టచ్లోనే ఉంది. ఇప్పటి వరకు రూ.9.35 కోట్ల వరకు నగదు, సుమారు 5 కిలోల బంగారం, కారు, ఫ్లాట్ కొనుగోలు చేసి తన పేరుతో రాయించుకుంది. ఆమెతో పాటు తన సోదరి కూడా రూ. 50 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వలేదు.' అని ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ పేర్కొన్నారు. దీంతో హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
విలువలు ముఖ్యం.. కోట్ల డబ్బును కాదన్న జి.వి. ప్రకాష్
సినిమా, స్పోర్ట్స్ రంగాలకు చెందిన అగ్ర నటులు, గొప్ప క్రీడాకారులు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటారనే విషయం తెలిసిందే. అయితే, వృత్తిపరంగా తీసుకునేంత రేంజ్లో వాణిజ్య ప్రకటనలకు కూడా భారీ మొత్తంలో డబ్బు తీసుకుంటారు. ఇందులో కొందరు మాత్రం ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అన్న చందంగా దొరికిన ప్రతి బ్రాండ్లకు ప్రచారం చేసి బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటారు. మరికొందరు సమాజ హితం కోరి ప్రజలకు హాని చేసే వస్తువులకు ప్రమోషన్ చేయరు. ఇప్పుడు ఇదే కోవలో సంగీత దర్శకుడు జి. వి. ప్రకాష్ కుమార్ ఉన్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి.బ్రాండ్ ఎండార్స్మెంట్ల విషయంలో సంగీత దర్శకుడు జి. వి. ప్రకాష్ కుమార్ ఒక బలమైన ప్రకటన చేశారు. భారీ రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్లు వచ్చినప్పటికీ, తాను మద్యం, జూదాన్ని ప్రచారం చేయనని పేర్కొన్నారు. ఈ అంశంలో కొందరు తనను సంప్రదించారని భారీ మొత్తంలో డబ్బు కూడా ఆఫర్ చేశారని చెప్పుకొచ్చారు. పలుమార్లు చాలామంది పదేపదే తనను సంప్రదించినప్పటికీ నిరంతరం నిరాకరిస్తున్నానని ఆయన వెల్లడించారు.తాజాగా ప్రముఖ కంపెనీకి చెందిన ఒక సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ను ప్రచారం చేయడానికి తనకు కోట్లు కూడా ఆఫర్ చేశారని, కానీ అది తన వ్యక్తిగత విలువలకు అనుగుణంగా లేకపోవడంతో దానిని తిరస్కరించానని ప్రకాష్ కుమార్ తెలిపారు. కీర్తితో పాటు తమకు సమాజం పట్ల బాధ్యత కూడా ఉండాలని అందుకే వాటికి దూరంగా ఉంటున్నాని అన్నారు. వినోద పరిశ్రమలో ఆర్థిక లాభం కంటే నైతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తున్నందుకు ఆయన వైఖరికి అభిమానులు ప్రశంసలు కురిపించారు.సంగీత దర్శకుడిగా పనిచేస్తూనే హీరోగా కూడా జి. వి. ప్రకాష్ రాణిస్తున్నారు. యుగానికి ఒక్కడు, మదరాసు పట్టణం, ఆకాశం నీ హద్దురా, అమరన్, లక్కీ భాస్కర్, పరాశక్తి, ఇడ్లీ కొట్టు వంటి చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. -
ఓటీటీలో రాకాస.. అఫీషియల్ ప్రకటన వచ్చేసింది
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా విడుదలైన కొత్త సినిమా రాకాస... బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్న ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. రాకాస చిత్రంలో సంగీత్ శోభన్- నయన్ సారిక హీరో హీరోయిన్గా నటించారు. ఓటీటీ సిరీస్లతో బాగా పాపులర్ అయిన దర్శకురాలు మానస శర్మ ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రల్లో నటించారు.రాకాస చిత్రం 2026 మే 1న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా సదరు ఓటీటీ యాప్ కేటలాగ్లో అధికారికంగా చేర్చబడింది. అయితే, ఓటీటీ ప్రేక్షకుల కోసం తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళం వంటి ఇతర భాషలలో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. రూ. 15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన రాకాస చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించింది. ఓటీటీ కోసం నెట్ఫ్లిక్స్తో రూ. 10 కోట్లకు ఢీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఫైనల్గా రాకాస చిత్రం నిర్మాత నిహారికకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.కథేంటంటే.. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వీరబాబు అలియాస్ వీరు(సంగీత్ శోభన్).. తన ప్రియురాలు సుకన్యను పెళ్లి చేసుకోవాలని సొంతూరుకి వస్తాడు. కానీ అప్పటికే వేరే వ్యక్తితో సుకన్య పెళ్లికి రెడీ అవుతుంది. బ్రేకప్ బాధలో ఉన్న సమయంలోనే సోము(వెన్నెల కిశోర్) అనే వ్యక్తిని హత్య చేశాడనే ఆరోపణలు ఎదుర్కొనాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతని పాస్పోర్ట్ని పోలీసులు తీసుకెళ్తారు. సోము జాడని కనిపెడితే తన పాస్పోర్టు తిరిగి వస్తుందని.. స్నేహితుడు బాలు(గెటప్ శ్రీను)తో కలిసి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు.అదే సమయంలో ఆ ఊరి చివరిలో ఎన్నో దశాబ్దాలుగా తిష్టవేసుకొని ఉన్న బ్రహ్మ రాక్షసుడికి నరబలి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో ఊరంతా కలిసి ఓ ముసలాడిని బలి ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా.. చివరి క్షణంలో అతను చనిపోతాడు. అతనికి బదులుగా బాలు పోవాల్సి ఉండగా.. వీరూ అడ్డుపడతాడు. దీంతో బాలుకి బదులుగా వీరూ ఆ కోటలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ కోట ప్లాష్బ్యాక్ స్టోరీ ఏంటి? నిజంగానే ఆ కోటలో బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడా? సుబ్బులక్ష్మి(నయన్ సారిక) ఎవరు? ఆమె ఎందుకు కోటలోకి వెళ్లింది? సోము సంగతి ఏంటి? నిజంగా చనిపోయాడా? లేదా బతికే ఉన్నాడా? బలి కోసం కోటలోకి వెళ్లిన తర్వాత వీరూకి ఎదురైన సవాళ్లు ఏంటి? తిరిగి ప్రాణాలలో బయటకు వచ్చాడా రాలేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
'స్టాలిన్'లో ఖుష్బు పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
ప్రముఖ సినీనటి ఆమని ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా కొనసాగారు. 90వ దశకంలోని అత్యంత ప్రజాదరణ పొందిన తారలలో ఒకరైన ఆమని, మెగాస్టార్ చిరంజీవితో చేజారిన ఒక మూవీ గురించి ఇటీవల మాట్లాడారు. చిరంజీవితో తెర పంచుకోనందుకు తాను ఇప్పటికీ బాధపడుతున్నానని వెల్లడించారు. ఆ క్షణాన్ని గుర్తుచేసుకుంటూ, 'స్టాలిన్' చిత్రంలో చిరంజీవి సోదరి పాత్ర మొదట తనకే ఆఫర్ చేయబడిందని ఆమని గుర్తుచేసుకున్నారు.'స్టాలిన్'లో చిరంజీవికి సోదరిగా ఖుష్బు సుందర్ నటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ పాత్రలో నటించాలని మొదట చిత్ర యూనిట్ ఆమనిని సంప్రదించిందట. ఆమె దానిని తిరస్కరించానని ఇలా చెప్పుకొచ్చారు. "నా కలల హీరోకి సోదరిగా నటించడం నేను ఊహించుకోలేకపోయాను. అందుకే ఆ పాత్రను తీసుకోలేదు. హీరోయిన్గా మాత్రమే చిరు పక్కన నటించాలని ఒకప్పుడు కలలు కనేదానిని.. కానీ, కుదరలేదు." అని ఆమె పంచుకున్నారు. ఆమె వెల్లడించిన విషయం ఇప్పుడు వైరల్ అయింది.గతంలో కూడా చిరు సినిమా గురించి ఆమని పలు విషయాలు పంచుకున్నారు. చిరంజీవితో ఒక్క సినిమా అయినా సరే నటించాలనేది తన కోరిక అని , కానీ అది నెరవేరలేదని చెప్పుకొచ్చారు. అయితే ఒకటి రెండు సార్లు చిరు సరసన హీరోయిన్గా అవకాశం వచ్చిందని నిర్మాతలు కూడా తన డేట్లు తీసుకున్నారని గుర్తు చేసుకుంది. కానీ, చివరి నిమిషంలో ఏం జరిగిందో ఏమో తనను తీసేసి మరో హీరోయిన్ను తీసుకున్నారని బాధపడ్డారు. కనీసం రామ్ చరణ్క్ మదర్గా ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని ఆమని చెప్పడం విశేషం.ఆమని తెలుగు, తమిళ సినిమాల్లో రాణించారు. శుభలగ్నం, శుభసంకల్పం, శుభమస్తు, మావిచిగురు, ఘరానా బుల్లోడు, అమ్మ దొంగా వంటి భారీ హిట్ సినిమాల్లో నటించారు. ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకిడిపంబ (1993) సినిమాలో నరేష్ సరసన కథానాయకిగా సినీ రంగప్రవేశం చేశారు. -
విజయ్ని ఎలా మోసం చేశావ్.. ఫ్యాన్స్ ఫైర్
నటుడు, తమిళ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం జన నాయకన్. పూజాహెగ్డే కథానాయకిగా నటించిన చిత్రంలో మమతా బైజు కీలక పాత్రను పోషించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని గత జనవరి 9న తెరపైకి రావాల్సి ఉంది. అయితే సెన్సార్ సమస్యల కారణంగా విడుదల ఆగిపోయింది. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు పూర్తయిన తర్వాత జననాయకన్ విడుదలవుతుందని అందరూ ఎదురు చూశారు. ఇలాంటి పరిస్థితుల్లో చిత్రం ఇటీవల పూర్తిగా ఇంటర్నెట్లో లీకై యావత్ సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. చిత్ర నిర్మాత ఫిర్యాదు మేరకు చెన్నై సైబర్ క్రైమ్శాఖ అధికారులు విచారణ చేపట్టి ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఉన్న మరికొందరిని కనిపెట్టే పనిలో ఉన్నారు. కాగా జననాయకన్ చిత్రం ఎడిటింగ్ నుంచి లీక్ అయినట్లు దర్యాప్తులో తేలింది. ఈ చిత్రానికి ప్రదీప్ కె రాఘవ్ పనిచేశారు. ఆయన వద్ద పనిచేసిన సహాయ ఎడిటర్ జననాయకన్ చిత్రాన్ని ఇంటర్నెట్లో లీక్ చేసినట్లు తేలింది. దీంతో చిత్ర ఎడిటర్ ప్రదీప్ కె రాఘవ్కు చిత్ర లీకేజ్తో సంబంధం లేకపోయినా ఆయన దక్షిణ భారత సినీ ఎడిటర్ అసోసియేషన్లో సభ్యత్వం లేని సహాయ ఎడిటర్లతో పనిచేయించినందుకుగాను ప్రదీప్ కె రాఘవ్ను సస్పెండ్ చేసినట్లు ఎడిటర్ అసోసియేషన్ నిర్వాహకులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. విజయ్ ఫ్యాన్స్ ఫైర్జన నాయగన్ ఎడిటర్ ప్రదీప్ కె రాఘవ్పై విజయ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. రాజకీయ కుట్రలో భాగంగా విజయ్ శత్రువులతో ఎడిటర్ ప్రదీప్ చేతులు కలిపాడంటూ పోస్టులు పెడుతున్నారు. డబ్బుకు అమ్ముడుపోయి ఇలాంటి పనిచేసి వుంటాడని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఎంతగానో నమ్మిన విజయ్ని ఎలా మోసం చేశావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే, అసలు వాస్తవం ఎడిటర్ ప్రదీప్కు ఈ లీక్ వ్యవహారంలో సంబంధం లేదు. సినీ ఎడిటర్ అసోసియేషన్లో సభ్యత్వం లేని సహాయ ఎడిటర్లతో జన నాయగన్ మూవీ కోసం ఆయన పనిచేయించుకోవడంతో సమస్య వచ్చింది. వారి వల్లే ఈ మూవీ లీక్ అయిందని పోలీసులు తెలిపారు. -
2026 మిస్
తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు హీరోలు, దర్శకులు జెట్ స్పీడ్తో సినిమాలు చేస్తుంటారు. కుదిరితే ఏడాది రెండు లేదంటే కనీసం ఏడాదికి ఒక సినిమా అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ప్రస్తుతం తెలుగులో చాలామంది ఒక్కో సినిమా కోసం ఏడాది, రెండేళ్లు కూడా పని చేస్తున్నారు. భారీ బడ్జెట్, విదేశాల్లో షూటింగ్స్, నటీనటుల డేట్స్ క్లాష్,పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్, విజువల్ ఎఫెక్ట్స్, ప్రమోషన్స్, రిలీజ్ డేట్స్ క్లాష్... ఇలా కారణాలు ఏవైనా కొందరు రెండు మూడేళ్లకు ఓ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రతి ఏడాది ఓ సినిమాని ఆడియన్స్ ముందుకి తీసుకొచ్చే వాళ్లు తక్కువగానే ఉంటున్నారు. పైగా ప్రస్తుతం తెలుగు సినిమా గ్లోబల్ రేంజ్కి వెళ్లింది. దీంతో నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా, అనుకున్న ఔట్పుట్ వచ్చేవరకు రాజీ పడటం లేదు. లేట్ అయినా పర్లేదు కానీ ఫైనల్గా ఆడియన్స్కి బెస్ట్ ఔట్పుట్ ఇచ్చి, వారిని సంతృప్తి పరచాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ కారణంగా షూటింగ్,పోస్ట్ ప్రోడక్షన్కే చాలా సమయం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు హీరోలు ప్రతి ఏడాది తమ సినిమాలను విడుదల చేయలేక΄ోతున్నారు. ఇందులో భాగంగా హీరోలు నాగార్జున, బాలకృష్ణ, మహేశ్బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్... ఇలా పలువురు హీరోలు 2026ని మిస్ అవుతున్నారు. వారి సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఆ విశేషాలేంటో ఓసారి చూద్దాం.రెండోసారి... తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోల్లో నాగార్జున ఒకరు. గతంలో వరుస సినిమాలతో అటు అక్కినేని అభిమానులను ఇటు ప్రేక్షకులను అలరించిన ఆయన సోలో హీరోగా వరుసగా రెండేళ్లు మిస్ అవుతున్నారు. ఆయన హీరోగా నటించిన ‘నా సామిరంగ’ 2024లో విడుదలైంది. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైంది. ఆ తర్వాత నాగార్జున సోలో హీరోగా ఏ చిత్రంలోనూ నటించలేదు. అయితే ‘కుబేర, కూలీ’ వంటి తమిళ సినిమాల ద్వారా తెలుగు–తమిళ ప్రేక్షకులను పలకరించారాయన. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కూలీ’. ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో తనదైన నటనతో మెప్పించారు నాగార్జున. ఈ సినిమా 2025 ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది.అదే విధంగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘కుబేర’ సినిమాలోనూ ధనుష్తో కలిసి నటించారు. ఈ సినిమా 2025 జూన్ 20న విడుదలైంది. ఇదిలా ఉంటే... తన కెరీర్లో మైలురాయిగా నిలిచే 100వ సినిమా కోసం కాస్త సమయం తీసుకుని కథని ఓకే చేశారు నాగార్జున. ఆయన నటిస్తున్న 100వ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని తమిళ దర్శకుడు ఆర్. కార్తీక్ అందుకున్న విషయం తెలిసిందే. తన కెరీర్లో 100వ సినిమా అనేది కీలకమైనది కావడంతో అన్నపూర్ణ స్టూడియోస్పై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు నాగార్జున.ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లోని కులు మనాలీలో శరవేగంగా జరుగుతోంది. సినిమాలోని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ కార్తీక్. ఈ మూవీలో మునుపెన్నడూ చూడని ఒక విభిన్నమైన లుక్లో కనిపించబోతున్నారు నాగార్జున. ఈ చిత్రంలో ఆయన 25 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు వివిధ దశల్లో, విభిన్న గెటప్స్లో కనిపించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆధునిక హాలీవుడ్ చిత్రాల్లో వాడే ‘డి–ఏజింగ్’ సాంకేతికత సాయంతో నాగార్జునను 25 ఏళ్ల యువకుడిగా చూపించబోతున్నారు. సాధారణ స్థాయి నుంచి కోటీశ్వరుడిగా ఎదిగే ఒక వ్యక్తి ప్రయాణం నేపథ్యంలో సాగే ఈ చిత్రకథ తండ్రీ–కూతుళ్ల మధ్య ఉండే సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుందట. ఈ చిత్రంలో టబు, సుస్మితా భట్, విజయేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కింగ్ 100, కింగ్ 100 నాటౌట్, లాటరీ కింగ్’ వంటి టైటిల్స్ని పరిశీలిస్తున్నారట మేకర్స్. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరాకి రిలీజ్ చేయాలని తొలుత యూనిట్ అనుకుందట. అయితే నాగార్జునకు బాగా కలిసొచ్చిన సంక్రాంతి సందర్భంగా 2027లో విడుదల చేయనున్నారని ఫిల్మ్నగర్ టాక్. ఈ రకంగా చూస్తే సోలో హీరోగా నాగార్జున వరుసగా 2025, 2026... రెండేళ్లను మిస్ అవుతున్నట్లే లెక్క. ఏడాది గ్యాప్ బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ 2: తాండవం’ గత ఏడాది విడుదలైంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ‘సింహా, లెజెండ్, అఖండ’ వంటి హిట్ మూవీస్ తర్వాత బాలకృష్ణ– బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఎం. తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమా 2025 డిసెంబరు 12న విడుదలైంది. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ నటించనున్న చిత్రం ‘ఎన్బీకే 111’ (వర్కింగ్ టైటిల్). ఈ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.‘వీర సింహారెడ్డి’ (2023) తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ‘ఎన్బీకే 111’. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభం అయింది. ఈ చిత్రంలో బాలకృష్ణకి జోడీగా నయనతార నటిస్తున్నారు. ‘సింహా, శ్రీరామరాజ్యం, జై సింహా’ వంటి సినిమాల తర్వాత బాలకృష్ణ– నయనతార జోడీగా నటిస్తున్న నాలుగో చిత్రమిది. పవర్ఫుల్ ఎమోషన్ ్స, మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో ముంబై నేపథ్యంలో ఉంటుందట. ఈ మూవీలో బాలకృష్ణ గ్యాంగ్స్టర్ తరహా పాత్రలో కనిపిస్తారని టాక్.దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబరులో విడుదల చేయాలని చిత్రయూనిట్ తొలుత భావించింది. అయితే రెగ్యులర్ షూటింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో షూటింగ్ ఆలస్యమైనా సరే ఔట్పుట్ విషయంలో రాజీ పడకూడదన్నది మేకర్స్ ఆలోచన అట. ఈ నేపథ్యంలోనే చిత్రీకరణ, పోస్ట్ ప్రోడక్షన్ పనులు అనుకున్న సమయానికి పూర్తి కావనే ఆలోచనతో డిసెంబరులో విడుదల చేద్దామన్నది మరో ఆలోచన అట. అయితే బాలకృష్ణకి బాగా కలిసొచ్చే సంక్రాంతి సెంటిమెంట్ని రిపీట్ చేస్తూ 2027 సంక్రాంతికి ‘ఎన్బీకే 111’ని విడుదల చేసేందుకు ఫిక్స్ అయ్యారట మేకర్స్. ఈ లెక్కన చూస్తే 2026ని బాలకృష్ణ మిస్ అయినట్లే అని భావించవచ్చు. రెండున్నరేళ్లకు పైగా గ్యాప్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్నీల్’ (వర్కింగ్ టైటిల్). ఈ మూవీకి ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రం ‘దేవర: పార్ట్ 1’ 2024 లో విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కల్యాణ్రామ్ నిర్మించిన ఈ సినిమా 2024 సెప్టెం బరు 27న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత ఆయన నటించిన చిత్రం ‘వార్ 2’. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో హృతిక్ రోషన్ హీరోగా నటించారు. ఈ మూవీలో ప్రతి నాయకుడిగా నటించారు ఎన్టీఆర్. అంతేకాదు... ఈ చిత్రం ద్వారా ఆయన బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.‘దేవర: పార్ట్ 1’ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రపోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ‘డ్రాగన్ ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఓ పాత్రలో కాస్త బొద్దుగా కనిపించే ఆయన మరో పాత్ర కోసం బాగా సన్నబడ్డారు.ఈ రెండు పాత్రల కోసం ఆయన మేకోవర్ అయిన తీరు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మూవీని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించింది. అయితే ఆ రిలీజ్ డేట్లో మార్పు చేసుకుంది. జనవరి 9న కాకుండా జూన్ 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ తేదీకి ‘డ్రాగన్’ తప్పకుండా ప్రేక్షకుల ముందుకొస్తుందని అందరూ అనుకున్నారు.మే 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని అభిమానులు ఎదురు చూశారు. అనుకున్నట్లే అప్డేట్ వచ్చింది.. అయితే సినిమాని 2026 జూన్ 25 నుంచి 2027 జూన్ 11కి విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో తమ అభిమాన హీరో సినిమా కోసం మరో ఏడాది పాటు ఫ్యాన్స్ నిరీక్షించక తప్పదు. ఈ విధంగా చూస్తే ‘దేవర: పార్ట్ 1’ విడుదలైన 2024 సెప్టెంబరు 27 నుంచి 2027 జూన్ 11 మధ్య గ్యాప్ రెండున్నరేళ్లకు పైగానే ఉంది. సెకండ్ టైమ్ ‘ఏంట్రోయ్... గ్యాప్ ఇచ్చావ్’ అంటూ నటుడు మురళీ శర్మ అనగానే... ‘గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది..’ అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగులు ‘అల వైకుంఠపురములో...’ సినిమాలో చూశాం. ప్రస్తుతం అల్లు అర్జున్ కెరీర్ పరంగా చూస్తే ఆయన కావాలని గ్యాప్ ఇవ్వకున్నా వస్తోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప: ది రూల్’. సుకుమార్ రైటింగ్స్తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా 2024 డిసెంబరు 5న విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించినట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘పుష్ప: ది రూల్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత అల్లు అర్జున్ నటించనున్న 22వ సినిమా విషయంలో ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది.‘పుష్ప: ది రూల్’ మూవీ తర్వాత అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా తమిళ డైరెక్టర్ అట్లీతో నటించేందుకు అల్లు అర్జున్ పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ‘ఏఏ 22 ఏ6’ అనే వర్కింగ్ టైటిల్తో ప్రారంభమైన ఈ సినిమాకి ‘రాకా’ అనే టైటిల్ని ఫిక్స్ చేశారు మేకర్స్. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్నారు. భారీ సాంకేతికతతో హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. హీరో అల్లు అర్జున్ బర్త్ డే (ఏప్రిల్ 8) సందర్భంగా ‘రాకా’ అనే టైటిల్ని ఖరారు చేసి, ఫస్ట్ లుక్తో అల్లు అర్జున్ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.ఈ సందర్భంగా విడుదల చేసిన ఆయన ఫస్ట్ లుక్ ట్రెండ్ అవుతోంది. ఈపోస్టర్ చూస్తే.. అల్లు అర్జున్ ఇంత వరకు కనిపించని ఓ సరికొత్త అవతారంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. గుండు, వింత శరీరాకృతి, చూపుల్లో వాడీ వేడి... ఇలా సరికొత్త లుక్లో ఉండటంతో ‘రాకా’పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ‘‘భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘రాకా’ ఒకటి. భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన యాక్షన్, అద్భుతమైన విజువల్స్, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కథనాన్ని మేళవించి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందేలా ‘రాకా’ని తెరకెక్కిస్తున్నారు అట్లీ.హాలీవుడ్ సినిమాలకు దీటుగా విజువల్ ఎఫెక్ట్స్కి ప్రాధాన్యం ఇచ్చారాయన. ‘అవతార్’, ‘డ్యూన్’, ‘బార్బీ’ వంటి హాలీవుడ్ చిత్రాలకు పని చేసిన కన్నెక్ట్ మాబ్ సీన్ అనే ప్రముఖ టెక్నికల్ టీమ్ ఈ చిత్రానికి పని చేస్తోంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రకంగా చూస్తే వరుసగా 2025, 2026 ఏడాదిలను అల్లు అర్జున్ మిస్ అయ్యారు. సంవత్సరం గ్యాప్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాల నటుడిగా తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న తేజ సజ్జా ‘జాంబి రెడ్డి’ (2021) సినిమాతో సోలో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఆ మూవీ మంచి హిట్గా నిలిచింది. ‘జాంబి రెడ్డి’ వంటి హిట్ మూవీ తర్వాత తేజ సజ్జా–ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన ద్వితీయ చిత్రం ‘హనుమాన్’. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ మూవీ పాన్ ఇండియా హిట్గా నిలిచింది.ఈ మూవీ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్నారు తేజ సజ్జా. ‘హనుమాన్’ వంటి హిట్ మూవీ తర్వాత తేజ హీరోగా నటించిన చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్గా నటించగా, మంచు మనోజ్ ప్రధాన పాత్రపోషించారు. పీపుల్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా 2025 సెప్టెంబరు 12న విడుదలై, హిట్గా నిలిచింది. ‘హనుమాన్’, ‘మిరాయ్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల తర్వాత తేజ సజ్జా నటించనున్న చిత్రాలపై ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది.అయితే తన హిట్ సినిమాలైన ‘జాంబి రెడ్డి’కి సీక్వెల్గా ‘జాంబీ రెడ్డి 2’, ‘హనుమాన్’ మూవీకి సీక్వెల్గా ‘జై హనుమాన్’, ‘మిరాయ్’ చిత్రం సీక్వెల్ ‘మిరాయ్: జైత్ర’ లో నటించనున్నట్లు తేజా సజ్జా పేర్కొన్న సంగతి తెలిసిందే. వీటిల్లో ముందుగా ‘జై హనుమాన్ ’ మూవీ సెట్స్పైకి వెళ్లనుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ‘కాంతారా’ మూవీ ఫేమ్ రిషబ్ శెటì ్ట హనుమంతుడి పాత్ర చేయనున్నారు. ఈ మూవీలో తేజ సజ్జా తన పాత్రని కొనసాగించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాది సెట్స్పైకి వెళ్లి, 2027లో విడుదల కానుంది. ఈ లెక్కన చూస్తే తేజ సజ్జా 2026ని మిస్ అవుతున్నారు.మూడేళ్లు గ్యాప్... హీరో మహేశ్బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ‘ఆర్ఆర్ఆర్’ (2022) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చో ప్రా హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక మహేశ్బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘గుంటూరు కారం’. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటించారు. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది. ఆ మూవీ తర్వాత ‘వారణాసి’ కోసం మేకోవర్ అయ్యేందుకు కాస్త గ్యాప్ తీసుకున్నారు మహేశ్బాబు. ఈ మూవీ కోసం ΄÷డవాటి హెయిర్ స్టైల్తో పాటు లైట్గా గెడ్డం కూడా పెంచారాయన. ఫిజికల్ మేకోవర్ కోసం బాగా కృషి చేశారు.ఇందుకోసం దాదాపు ఆరు నెలల పాటు ట్రైన్ అయ్యారట. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. రాజమౌళి సినిమా అంటే కనీసం రెండేళ్లకుపైగా చిత్రీకరణకు సమయం పడుతుంది. ఆ తర్వాతపోస్ట్ ప్రోడక్షన్కి కూడా దాదాపు ఆర్నెళ్ల నుంచి ఏడాది పాటు సమయం పడుతుంది. ఈ సినిమాలో మైథాలజీ బ్యాక్డ్రాప్కి అధిక ప్రాధాన్యం ఉంది. రామాయణం ఎపిసోడ్ని తనదైన శైలిలో తెరపై చూపించబోతున్నారు రాజమౌళి.‘గతంలో తాను తీసిన సినిమాలన్నీ రామాయణం నుంచి స్ఫూర్తి పొందినవే అని, మొదటిసారి ఆ రామాయణం ఎపిసోడ్ని ‘వారణాసి’లో చూపిస్తున్నాను’ అంటూ రాజమౌళి పేర్కొన్న సంగతి తెలిసిందే. రామాయణం ఎపిసోడ్ 25 నిమిషాల పాటు ఉండబోతుందట. ‘వారణాసి’ చిత్రంలో మహేశ్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో భాగంగా త్రేతాయుగంలో రాముడి పాత్రలో కనిపించనున్నారు మహేశ్. అదే విధంగా రుద్ర అనే సాహస వీరుడిగా మరో పాత్రలో కనిపిస్తారు. ఈ మూవీ కోసం హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో ప్రత్యేకంగా వేసిన వారణాసి సెట్లో తీసిన సన్నివేశాలు హైలైట్గా నిలుస్తాయని టాక్. ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే.అందులో భాగంగానే హాలీవుడ్కి ఏ మాత్రం తగ్గని అంతర్జాతీయ ప్రమాణాలతో ‘వారణాసి’ని తెరకెక్కిస్తున్నారట రాజమౌళి. మహేశ్బాబు, రాజమౌళి కలిసి చేస్తున్న ఈ ఎపిక్ అడ్వెంచర్పై వరల్డ్ వైడ్గా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా ‘‘వారణాసి’ నా కలల ప్రాజెక్ట్. జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశం ఇది. ఈ సినిమా విడుదలయినప్పుడు దేశమంతా గర్వపడుతుంది’’ అంటూ మహేశ్బాబు చె΄్పారంటే సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీన్ని బట్టి చూస్తే 2025, 2026 ఏడాదిలను మహేశ్బాబు కూడా మిస్ అయినట్లే. ‘గుంటూరు కారం’ విడుదల తేదీ నుంచి ‘వారణాసి’ రిలీజ్ డేట్ వరకు చూస్తే మూడేళ్లకు పైగా ఆయన సినిమా కోసం ప్రేక్షకులు నిరీక్షించినట్లే లెక్క. పైన పేర్కొన్న హీరోలే కాదు.. మరికొంత మంది కూడా 2026ని మిస్ అయ్యే అవకాశాలున్నాయి. - డేరంగుల జగన్ మోహన్ -
కేరళలో యాక్షన్
హీరోయిన్ రష్మికా మందన్న యాక్షన్ బాట పట్టారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మైసా’. రవీంద్ర పుల్లె రచన, దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేశ్ ఇతర పాత్రలుపోషిస్తున్నారు. అన్ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ కేరళలో ప్రారంభం అయింది. ‘‘యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘మైసా’. ఈ మూవీలో రష్మిక గోండు గిరిజన అమ్మాయిగా కనిపించనున్నారు.పాన్ ఇండియాగా రూపొందుతోన్న ఈ మూవీలో తన కెరీర్లో అత్యంత సవాల్తో కూడిన పాత్ర చేస్తున్నారు రష్మిక. 15 రోజుల పాటు జరగనున్న యాక్షన్ ప్యాక్డ్ షూటింగ్ షెడ్యూల్ను కేరళలో ప్రారంభించాం. కేచా ఖంపక్దీ మాస్టర్ హై ఓల్టేజ్ యాక్షన్ కొరియోగ్రఫీని అందిస్తున్నారు. రష్మికతో పాటు కీలక నటీనటులు పాల్గొంటున్న ఈ యాక్షన్ షెడ్యూల్ సినిమాలో మేజర్ హైలెట్గా నిలిచేలా ఉంటుంది. అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండి లాంగ్ యాక్షన్ సన్నివేశాలను పర్యవేక్షిస్తున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: శ్రేయాస్ పి. కృష్ణ. -
కాజల్ రెడీ.. రకుల్ ఇంకా వెయిటింగ్!
నందమూరి బాలకృష్ణ సినిమా నుంచి నయనతార తప్పుకోవడంతో తాజాగా కాజల్ అగర్వాల్ను ఆ ప్రాజెక్ట్లోకి తీసుకున్నారు. దీంతో కాజల్ మరోసారి మెయిన్ లీడ్గా టాలీవుడ్లో అడుగుపెడుతోంది. పెళ్లయ్యాక, బిడ్డకు జన్మనిచ్చినా కాజల్ సినిమాలు చేయడం ఆపలేదు. భగవంత్ కేసరి, సత్యభామ, కన్నప్ప వంటి చిత్రాల్లో కాజల్ నటించింది. ఇక ఇప్పుడు మరోసారి ప్రధాన పాత్రతో వస్తోంది. ఇది తనకు రీఎంట్రీ లాంటిదే.అయితే రకుల్ ప్రీత్ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. టాలీవుడ్లో ఆమెకు పెద్ద గ్యాపే వచ్చింది. ఆ మద్య వచ్చిన ఇండియన్-2తో మళ్లీ తన ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని ఆశించింది. కానీ ఆ అవకాశాలు ఫలించలేదు. ఆ సినిమా తర్వాత ఆమెకు సౌత్లో కొత్త ప్రాజెక్టులు ఏమాత్రం దొరకలేదు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో మాత్రం రకుల్ పలు సినిమాలు చేసింది. మంచి ప్రాజెక్టు దొరికితే సౌత్లో తిరిగి అడుగుపెట్టాలని చూస్తోంది. కొత్త ఏడాదిలో సౌత్లోకి రీఎంట్రీ చేస్తానని రకుల్ ప్రకటించింది. కానీ ఎందుకో ఇప్పటివరకు ఆ ప్రకటనకు సంబంధించిన ప్రాజెక్టు ఏదీ వెలుగులోకి రాలేదు. -
ట్రంప్ మీద రివేంజ్ ఏంట్రా? ఫన్నీగా ట్రైలర్
ఈ నగరానికి ఏమైంది, పెళ్లి చూపులు సినిమాలతో దర్శకుడిగా ఆకట్టుకున్న తరుణ్ భాస్కర్.. చాన్నాళ్ల నుంచి నటుడిగానే కనిపిస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో 'ఓం శాంతి శాంతి శాంతిః' మూవీతో వచ్చాడు గానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మరో మూవీతో వచ్చేశాడు. అదే 'గాయపడ్డ సింహం'. మే 01న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: తగ్గిపోయిన సినిమాల 'లైఫ్'.. ఎవరు దీనికి కారణం?)ట్రైలర్ విషయానికొస్తే.. అమెరికా వెళ్లి సెటిలైపోవాలని ఆశపడ్డ హీరోని ట్రంప్, తిరిగి స్వదేశానికి పంపిస్తాడు. దీంతో ట్రంప్పై ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్సవుతాడు. ఈ క్రమంలోనే ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? జేడీ చక్రవర్తి తదితరుల పాత్రలేంటి అనేది మిగతా స్టోరీలా అనిపిస్తుంది. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగ నటించగా.. హీరో శ్రీ విష్ణు అతిథి పాత్రలో కనిపించనున్నాడు.ట్రైలర్ అయితే కామెడీ, థ్రిల్లింగ్గా బాగానే ఉంది. కానీ ఐపీఎల్, వేసవిని తట్టుకుని ఈ సినిమా ఎంతవరకు నిలబడుతుందో చూడాలి? దీంతో పాటు మే 01న కమెడియన్ సత్య హీరోగా చేసిన 'జెట్ లీ', ధనుష్ 'కర' చిత్రాలు కూడా థియేటర్లలోకి రానున్నాయి.(ఇదీ చదవండి: చిరంజీవికి కావాలి ఓ నిర్మాత?) -
చిరంజీవికి కావాలి ఓ నిర్మాత?
చిన్న చిన్న హీరోల సినిమాలకు ఇబ్బందులు వచ్చాయంటే ఏదో అనుకోవచ్చు. స్టార్ హీరోల్లో ఒకరైన చిరంజీవి మూవీకి, అది కూడా ఇంకా మొదలవకముందే వస్తున్నాయంటే ఏమనుకోవాలి? ఈ ఏడాది సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్' మూవీతో హిట్ కొట్టిన చిరు.. లెక్క ప్రకారం డైరెక్టర్ బాబీతో ఈ పాటికే కొత్త ప్రాజెక్టుని మొదలుపెట్టేయాలి. కానీ ఎక్కడో సమస్యలు ఈ చిత్రానికి చుట్టుకుంటున్నాయి. దీంతో నిర్మాత విషయంలో లేనిపోని టెన్షన్స్ అన్నీ వస్తున్నాయి. ఇంతకీ అసలేం జరుగుతోంది?(ఇదీ చదవండి: తగ్గిపోయిన సినిమాల 'లైఫ్'.. ఎవరు దీనికి కారణం?)తమిళ స్టార్ హీరో విజయ్తో 'జన నాయగణ్' తీసిన నిర్మాత వెంకట్ కె నారాయణ.. ఈ సినిమాతో బోలెడన్ని లాభాలు అందుకోవచ్చని ఆశపడ్డారు. కానీ అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి. సంక్రాంతికి థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం.. సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి.మరోవైపు కన్నడ స్టార్ హీరో యష్తో ఈయనే 'టాక్సిక్' నిర్మించారు. ఇది కూడా మార్చిలోనే విడుదలవ్వాలి. కానీ అనివార్య కారణాల వల్ల జూన్ 4కి వాయిదా పడింది. మరోవైపు ఈయనే నిర్మించిన 'కేడీ' అనే పాన్ ఇండియా సినిమాలోని పాట, కొన్నిరోజుల ముందు వివాదంలో ఇరుక్కుంది. తాజాగా ట్రైలర్ కూడా ఇలాంటి సమస్యే ఎదురవగా యూట్యూబ్ నుంచి తీసేశారు. ఇలా లెక్కకు మించిన సమస్యల కారణంగా ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు.ఇన్ని ఇబ్బందులు ఉండటంతో చిరు-బాబీ చేయాల్సిన కొత్త ప్రాజెక్టు సందిగ్ధంలో పడింది. చిరు సినిమా నుంచి కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మాతగా తప్పుకొందని కొందరు అంటున్నారు. లేదు లేదు ఈయనతో పాటు మరో నిర్మాత కావాల్సి ఉందని రూమర్స్ వస్తున్నాయి. అందుకు తగ్గట్లే చిరు తెలిసిన ఓ నిర్మాత.. ఈ మూవీ విషయంలో భాగస్వామిగా మారబోతున్నాడని మరో టాక్ వినిపిస్తుంది. ఏదో ఒకటి త్వరగా దీనిపై క్లారిటీ అయితే రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: 60 ఏళ్ల వయసులో స్టార్ హీరో సర్జరీ.. రిస్క్ చేశాడా?) -
‘మండాడి’ కోసం 100 రోజులు.. సుహాస్కు ప్లస్ అయ్యేనా?
సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ సినిమా అంతా కూడా తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగుతుంది. ఇక ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ నిర్మిస్తోంది. మదిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఎంతో సుదీర్ఘమైన, సవాలుతో కూడిన షెడ్యూల్తో సినిమా షూటింగ్ పూర్తయిందని మేకర్స్ తెలిపారు. ప్రతీదీ రియలిస్టిక్గా ఉండాలన్న ఉద్దేశంలో రియల్ లొకేషన్స్లో ఎంతో శ్రమించి షూటింగ్ చేశారు. ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్, ఒళ్లుగగుర్పొడిచే సెయిల్బోట్ రేస్ సన్నివేశాలు ఇలా ఎన్నెన్నో ఈ చిత్రంలో ఉన్నాయి.ఇప్పుడు షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో పోస్ట్-ప్రొడక్షన్ కార్యక్రమాల్ని ప్రారంభించారు. సూరి, సుహాస్లు పాత్రలకు తగ్గట్టుగా తమ శరీరాకృతిని, లుక్స్ను మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీతో సుహాస్ కోలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. ఇందులో సుహాస్ ఓ డిఫరెంట్ పాత్రను పోషించారు. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం సుహాస్ ఏకంగా వంద రోజుల్ని కేటాయించారు. వంద రోజుల కాల్ షీట్లను ఇవ్వడం చూస్తుంటే అతనికి ఈ మూవీ మీద ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది. మరి ఈ చిత్రంతో సుహాస్ పాన్ ఇండియా యాక్టర్ అవుతాడో చూడాలి. ఈ మూవీలో మహిమా నంబియార్ హీరోయిన్గా నటించగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫర్గా పని చేస్తున్నారు. -
60 ఏళ్ల వయసులో స్టార్ హీరో సర్జరీ.. రిస్క్ చేశాడా?
సినిమా హీరోలలో కొంతమంది మాత్రమే ప్రయోగాత్మక పాత్రలు చేస్తుంటారు. అలాంటి అతికొద్ది మంది హీరోలలో విక్రమ్ చియాన్ ఒకరు. సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ.. వైవిధ్యమైన పాత్రలు, విభిన్నమైన గెటప్లతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. అందుకోసం తన శరీరాన్ని దారుణంగా కష్టపెడుతుంటాడు. పాత్ర డిమాండ్ చేస్తే.. బరువు పెరగడానికైనా.. తగ్గడానికైనా రేడీ అంటాడు.విక్రమ్ కెరీర్ చూస్తే.. శివపుత్రుడు, అపరిచితుడు, కోబ్రా, ఐ, తంగలాన్.. ఇవన్నీ ప్రయోగాత్మక చిత్రాలే. ప్రతి సినిమాలోనూ వైవిధ్యమైన పాత్రలను పోషించాడు. దాని కోసం విక్రమ్ ఎంత కష్టపడ్డారో అందరికి తెలిసిందే. కోబ్రా సినిమాలో అయితే ఏకంగా 7 విభిన్నమైన పాత్రల్లో కనిపించి షాకిచ్చాడు. చివరిగా చేసిన తంగలాన్, వీరధీర సూర బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచినా.. విక్రమ్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. త్వరలోనే మూడు సినిమాలతో వస్తానని విక్రమ్ ఇప్పటికే ప్రకటించాడు. ఇదిలా ఉంటే..తాజాగా విక్రమ్ తన లుక్ని పూర్తిగా మార్చుకున్నాడు. ఇటీవల ఓ రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్న విక్రమ్ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. అందులో విక్రమ్ చాలా యంగ్గా, ఒత్తైన జుట్టుతో కనిపించాడు. విక్రమ్ వయసు ప్రస్తుతం 60 ఏళ్లు. ఈ వయసులోనూ విక్రమ్ అంత యంగ్గా కనిపించడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇలా యవ్వనంగా కనిపించేందుకు విక్రమ్ సర్జరీ చేయించుకున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. విదేశాల్లో ఆయన అత్యాధునిక కాస్మోటిక్ ట్రీట్మెంట్లు చేయించుకోవడం వల్లే ఇలా యంగ్గా కనిపిస్తున్నాడని కొంతమంది అంటుంటే.. మరికొందరు మాత్రం ప్రకృతి వైద్యం, ఆరోగ్యకరమైన అలవాట్ల వల్ల ఈ మార్పు వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. విక్రమ్ సర్జరీకి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ పుకారు చక్కర్లు కొడుతోంది. -
మాళవిక అందాల జాతర.. సంయుక్త వయ్యారాలు
గ్లామర్ ఒలకబోసేస్తున్న మాళవిక మోహనన్ముంబై బీచ్ ఒడ్డున రాశీ గ్లామర్ షోవయ్యారంగా ఒంపు సొంపులతో సంయుక్తరెడ్ డ్రస్లో హాట్ హాట్గా రుక్మిణి వసంత్శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న నేహా శర్మ View this post on Instagram A post shared by Esther (@_estheranil) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Zayn Khan (@zaynmarie) -
అప్పుడు సత్య షాకయ్యాడు : రితేష్ రానా
హాస్య నటుడు సత్య హీరోగా నటించిన సినిమా ‘జెట్లీ’. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రియా సింఘా హీరోయిన్గా నటించగా, ‘వెన్నెల’ కిశోర్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో రితేష్ రానా మాట్లాడుతూ– ‘‘జయేంద్ర అనే రచయిత, నేను 2020లో ఓ ఇంటెన్స్ థ్రిల్లర్ స్టోరీ అనుకున్నాం. ఆ కథకు కొంతమంది హీరోలను సంప్రదించాం. కానీ కుదర్లేదు. ఇదే కథలో సత్యది ముందు ఫ్లైట్ అటెండర్ క్యారెక్టర్. ఆ తర్వాత ఈ కథకు కాస్త హ్యూమర్ జోడించి, సత్యతోనే హీరో పాత్ర చేయించాం. ‘నువ్వే హీరో’ అని సత్యకు చెప్పగానే షాక్ అయి, రిస్క్ అన్నారు. కానీ ఈ కథను ఎలా తెరకెక్కిస్తానో చెప్పగానే, హీరోగా నటించేందుకు ఓకే చెప్పారు.‘వెన్నెల’ కిశోర్గారు ఈ సినిమా అంతా సుడోకు ఆడుకుంటుంటారు. ఆయనది కాస్త టిపికల్ క్యారెక్టర్. రియా సింఘా స్పెషల్ ఏజెంట్ రోల్ చేశారు. అలాగే ఈ సినిమాలోని కీలకమైన ప్రజాపతి పాత్రను అజయ్గారు చేశారు. ప్రధాన కథ ఆయన పాత్ర చుట్టూ తిరుగుతుంది. ప్రజాపతి యాభైవేల కోట్ల రూపాయల బ్యాంకు స్కామ్ చేసి, పారిపోతాడు. ఆయన్ను దుబాయ్ నుంచి కొచ్చికి తీసుకురావడమే ఈ సినిమా స్టోరీ. యాక్షన్, థ్రిల్, హ్యూమర్తో సాగే మంచి ఎంటర్టైనర్. 80 శాతం కథ ఫ్లైట్లోనే జరుగుతుంది. ఎకానమీ, బిజినెస్ క్లాస్, కార్గో, కాక్పిట్ ఇలా ఒకే ఫ్లోర్పై ఐదు సెట్లు వేశాం. ఈ సినిమా హిట్ అయితే సీక్వెల్ గురించి ఆలోచిస్తాను. నా నెక్ట్స్ మూవీ హారర్ జానర్లో ఉంటుంది. చెర్రీగారి నిర్మాణంలోనే ఉండొచ్చు. ‘మత్తు వదలరా 3’ సినిమా ఆలోచన ఉంది’’ అని చెప్పారు. -
తగ్గిపోయిన సినిమాల 'లైఫ్'.. ఎవరు దీనికి కారణం?
మనిషి జీవితం రోజురోజుకీ మారుతోంది. మరోవైపు సినిమాలు తీసే, చూసే విధానం కూడా మారుతోంది. ఒకప్పుడు స్టార్ హీరోతో కమర్షియల్ మూవీ తీస్తే చాలు.. కథ కొంచెం అటుఇటుగా ఉన్నాగానీ 50, 100 రోజుల పాటు ఆడేవి. మరి ఈ తరహా చిత్రాలపై జనాలకు మోజు తగ్గిందో లేదంటే నిర్మాతల అత్యుత్సాహం కొంపముంచుతోందో తెలియట్లేదు గానీ తెలుగు సినిమాల జీవితకాలం తగ్గిపోయింది. కేవలం మూడంటే మూడు రోజులకు వచ్చేసింది. మరి ఈ పరిస్థితికి ఎవరు కారణం? ప్రస్తుతం ఏం జరుగుతోంది?ఒకప్పుడు 50,100 రోజుల పాటు సినిమాలు ఆడేవి. తర్వాత అవి వారాలకు వచ్చాయి. ఇప్పుడు మొదటి వీకెండ్ అయ్యేసరికి సినిమా పరిస్థితి అటో ఇటో తేలిపోతోంది. శుక్రవారం రిలీజైన చిత్రానికి ఆదివారం వచ్చేసరికల్లా హిట్ లేదా ఫ్లాప్ అనే ముద్రపడిపోతుంది. హిట్ అయితే సోమవారం నుంచి కాస్తోకూస్తో జనాలు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. ఫ్లాప్ అని టాక్ వస్తే మాత్రం థియేటర్ వైపే చూడట్లేదు.ఒకప్పుడు సినిమా టాక్ యావరేజ్గా ఉన్నా సరే వారం, పదిరోజుల తర్వాత పికప్ అయ్యేది. మౌత్ టాక్ ఇందులో కీలక పాత్ర పోషించేంది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. కనీస ఊపిరి పీల్చుకునేంత టైమ్ కూడా సినిమాలకు దొరకట్లేదు. దీనికి కారణం సోషల్ మీడియా. ఒకప్పుడు జనాలు స్వయంగా థియేటర్కి వెళ్లి సినిమా చూసి.. నచ్చితే నలుగురికి చెప్పేవారు. కానీ ఇప్పుడు మొదటి షో పూర్తయ్యేసరికే ట్విటర్ రివ్యూలు, పబ్లిక్ టాక్ అని మూవీ రిజల్ట్ చాలా వేగంగా బయటకొచ్చేస్తుంది. దీంతో ఆడియెన్స్ వెళ్లాలా వద్దా అనేది డిసైడ్ అయిపోతున్నారు.సినిమాల లైఫ్ తగ్గడానికి మరో కారణం 'అంచనాలు'. కొందరు హీరోలు, దర్శకులు.. తమ సినిమాలో అది ఉంది, ఇది ఉంది అని చెప్పి అంచనాలు పెంచేస్తున్నారు. తీరా చూస్తే ఓస్ ఇంత దానికా అంత హడావుడి అని జనాలకు అనిపిస్తోంది. దీంతో ఆయా మూవీస్ నచ్చట్లేదు. ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులు.. ప్రతి మూవీలోనూ 'వావ్ ఫ్యాక్టర్' ఉందా లేదా అని వెతుకుతున్నారు. కథ పక్కనబెడితే సర్ప్రైజ్ లేదా ఎంటర్టైన్మెంట్స్ ఎలిమెంట్స్ లాంటివి ఉన్నాయా లేదా అని చూస్తున్నారు. అలాంటివి లేకపోతే ఆ సినిమాని పట్టించుకోవట్లేదు. దీని వల్ల నెమ్మదిగా సాగే కంటెంట్ ఉన్న చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోతున్నాయి.ఈ నెలలోనే చూసుకుంటే డెకాయిట్, బైకర్, రాకాస సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. కానీ యావరేజ్గా ఉన్నాయని ఆడియెన్స్ ఫిక్సయిపోవడంతో మూడు రోజులకు మించి ఊపు కొనసాగించలేకపోయాయి. చిత్రబృందాలు ఎంతలా ప్రమోషన్స్ చేసినా ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. ఒకప్పుడు ఈ తరహా చిత్రాలకు లాంగ్ రన్ ఉండేది. కానీ ఇప్పుడు అలాంటిదేం లేదంటేనే పరిస్థితి ఎంతలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.ఇప్పుడివే దర్శకనిర్మాతలకు అతిపెద్ద సవాళ్లుగా మారిపోయాయి. ఇండస్ట్రీ ధోరణి కూడా మొదటి వీకెండ్ అయ్యేసరికి ఎలాగోలా డబ్బులొచ్చేస్తే చాలులే అన్నట్లే తయారైంది. మరోవైపు ఆడియెన్స్ టేస్ట్ కూడా మారిపోతోంది. ఒకప్పుడు సినిమాలు చూసి బాగుంది బాగోలేదు అని అనుకునేవారు. కానీ ఇప్పుడంతా ఫస్ట్ డే ఫస్ట్ షోకే డిసైడ్ అయిపోతున్నారు. టాక్ బాగోలేకపోతే సినిమాని నిర్ధాక్ష్యిణ్యంగా వదిలేస్తున్నారు. మరోవైపు ఓటీటీలో ప్రతి వీకెండ్ వస్తున్న పరభాషా సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ అవుతున్న తెలుగు చిత్రాల జీవితకాలం తగ్గడానికి ఓ రకంగా కారణమవుతున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే మాత్రం టాలీవుడ్కి రాబోయేది గడ్డుకాలమే! -
కమల్-రజనీకి విలన్గా మెగా డైరెక్టర్?
సినిమాలు తీసే దర్శకులు తర్వాతి కాలంలో నటులుగా మారడం అనే ట్రెండ్ తమిళంలో ఎప్పటినుంచో ఉంది. కేఎస్ రవికుమార్, సెల్వరాఘవన్ తదితరులు ఇప్పటికే కీలక పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో మరో స్టార్ డైరెక్టర్ చేరబోతున్నాడట. రజనీ-కమల్ మల్టీస్టారర్ కోసం ఈయన నటుడిగా మారబోతున్నాడనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.(ఇదీ చదవండి: 'ఠాగూర్' సినిమా నాదే.. కానీ వాళ్లు పట్టుకెళ్లిపోయారు: రాజశేఖర్)కమల్హాసన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు. నటుడిగా కాస్త జోరు తగ్గించినప్పటికీ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. రజనీకాంత్ 173వ మూవీలో కమల్ నటించడంతో పాటు నిర్మిస్తున్నారు కూడా. శిబి చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే ఓ వీడియో వదలగా అదేమో హైప్ పెంచేసింది. ఇప్పుడు ఆ హైప్ని రెట్టింపు చేసే విషయం ఒకటు బయటకు వచ్చింది.కమల్హాసన్తో 'భారతీయుడు', రజనీకాంత్తో రోబో, శివాజీ లాంటి హిట్ సినిమాలు తీసిన దర్శకుడు శంకర్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. రీసెంట్ టైంలో ఈయన తీసిన గేమ్ ఛేంజర్, ఇండియన్ 2 చిత్రాలు, బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన ఫ్లాపులుగా నిలిచాయి. దీంతో తర్వాతి ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందో అసలు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఇలాంటి టైంలో ఈయన నటుడిగా మారబోతున్నాడని, అది కూడా రజనీ-కమల్కి విలన్గా చేయబోతున్నారని అనేసరికి ఆసక్తికరంగా అనిపించింది. మరి ఇది నిజమా కాదో అనేది తెలియాలంటే కొన్నిరోజులు వెయిట్ చేయాలేమో?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా) -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా
ఈ వారం ఓటీటీల్లోకి బ్యాండు మేళం, లేచింది మహిళా లోకం, ప్రతిఛాయ, మెన్షన్ హౌస్ మల్లేష్, హ్యాపీరాజ్ తదితర స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వీటితో పాటు మరో తెలుగు మూవీ కూడా పెద్దగా హడావుడి లేకుండానే స్ట్రీమింగ్లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: ఓటీటీలో హార్డ్ హిట్టింగ్ కోర్ట్ రూమ్ సినిమా.. తెలుగు రివ్యూ) రాజేశ్ మేరు, నవ్య చిట్యాల హీరోహీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ కామెడీ సినిమా 'లగ్గం టైమ్'. ఈ ఏడాది ఫిబ్రవరి 6న థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా పేరున్న నటీనటులు ఎవరూ లేకపోవడంతో జనాలు తెలియకుండానే బిగ్స్క్రీన్పై నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు దాదాపు రెండున్నర నెలల తర్వాత ఆహా ఓటీటీలోకి వచ్చేసింది.'లగ్గం టైమ్' విషయానికొస్తే.. అనన్య(నవ్య) పెళ్లిరోజున బాయ్ ఫ్రెండ్ సూర్య(రాజేశ్).. పెళ్లి ఇంటి నుంచి ఈమెని తీసుకెళ్లిపోవాలని ప్లాన్ చేస్తాడు. కానీ అక్కడ జరిగిన ఓ అనుకోని సంఘటన వల్ల పరిస్థితులు మారిపోతాయి. మరోవైపు పెళ్లికొడుకు చంద్ర కిడ్నాప్ అవుతాడు. ఈ కేసులో సూర్యనే నిందితుడిగా అనుమానిస్తూ పోలీసులు పట్టుకుంటారు. అసలు పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేసింది ఎవరు? పూణెలో మొదలైన సూర్య-అనన్య ప్రేమకథకు చివరకు శుభం కార్డు పడిందా లేదా?అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'ఠాగూర్' సినిమా నాదే.. కానీ వాళ్లు పట్టుకెళ్లిపోయారు: రాజశేఖర్) -
ఎందుకు సినిమాలు తీస్తున్నానో అప్పుడే అర్థమైంది: రాజమౌళి
దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు వారణాసి ప్రమోషన్స్లో బిజీ అయిపోయాడు. వచ్చే ఏడాదిలో విడుదలయ్యే ఈ సినిమాకు ఇప్పటి నుంచే ప్రచారం మొదలు పెట్టాడు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ని మెక్సికోలో జరుగుతోన్న ‘కామిక్కాన్ ఎక్స్పీరియన్స్ - 2026’లో ప్రదర్శించారు. ఈసందర్భంగా రాజమౌళి వీడియో ద్వారా అక్కడి ప్రేక్షకులకు సందేశమిచ్చారు.‘నాకు మెక్సికో అంటే చాలా ఇష్టం. నేను తెరకెక్కించిన బాహుబలి మూవీలో కూడా సిటీ సెంటర్ నిర్మాణానికి చిచెన్ ఇట్జా(మెక్సికోలో ఒక నగరం) స్ఫూర్తిగా తీసుకున్నా. గత 25 ఏళ్లుగా నేను సినిమా రంగంలోనే ఉన్నాను.ఎంతో కష్టపడి సినిమాలు చేస్తున్నాను. మనం తెరకెక్కించిన చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రపంచమంతా ఆదరించినప్పుడు నా సంతోషానికి అవధులు లేవు. నాటు నాటు పాటకు ప్రపంచం అంతా స్టెప్పులేస్తుంటే.. అది చూసి చాలా సార్లు ఎమోషనల్ అయ్యాను. అప్పుడే నేను సినిమాలు ఎందుకు చేస్తున్నానో అర్థమైంది. వీలైనంత వరకు ప్రపంచం మెచ్చే చిత్రాలనే తెరకెక్కించడానికి ప్రయత్నిస్తాను’ అని రాజమౌళి అన్నారు. వారణాసి విషయానికొస్తే.. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న టైమ్ ట్రావెల్ అండ్ యాక్షన్ అడ్వెంచరస్ సినిమా ఇది. ఈ సినిమాలో రుద్రగా, రాముడిగా మహేశ్బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మందాకినిగా ప్రియాంకా చోప్రా, విలన్ కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్, ఓ కీలక పాత్రలో ప్రకాశ్రాజ్ నటిస్తున్నారు.కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. -
లావణ్య త్రిపాఠి మూవీ.. రిలీజ్ డేట్ ప్రకటన
మెగా కోడలు లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ నుంచి తాజాగా మరో అప్డేట్ వచ్చింది. మార్చి 6న విడుదల కావాల్సిన ఈ చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కొత్త రిలీజ్ డేట్ను ప్రకటించారు. దర్శకుడు తాతినేని సత్య తెరకెక్కించిన ఈ మూవీని ఆనంది ఆర్ట్స్ సమర్పణలో నాగమోహన్ నిర్మిస్తున్నారు. ఇందులో వి.కె.నరేశ్, వి.టి.వి.గణేశ్, సప్తగిరి వంటి వారు నటిస్తున్నారు. సంగీతం మిక్కీ జె.మేయర్ అందిస్తున్నారు.‘సతీ లీలావతి’ చిత్రం మే 8న విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. ఇదే పాయింట్తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ కథలో భార్యగా లీలావతి పాత్రలో లావణ్య త్రిపాఠి నటించగా.. భర్తగా దేవ్ మోహన్ నటించారు. లావణ్య పెళ్లి తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్పై సోషల్మీడియాలో బజ్ క్రియేట్ అయింది. -
‘వారాణాసి’ బ్యూటీకి అరుదైన గౌరవం
హీరోయిన్ ప్రియాంక చోప్రాకు అరుదైన గౌరవం లభించింది. ఆమెను ‘గ్లోబల్ వాన్ గార్డ్’ పురస్కారం వరించింది. ఆసియా పసిఫిక్ కమ్యూనిటీకి చెందిన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులను ‘గోల్డ్ హౌస్’ సంస్థ ‘గోల్డ్ గాలా’ ఈవెంట్లో సత్కరిస్తుంటుంది. ‘గోల్డ్ గాలా – 2026’ ఐదో వార్షికోత్సవం ఈ ఏడాది మే 9న లాస్ ఏంజిల్స్లోని మ్యూజిక్ సెంటర్లో జరగనుంది. ఈ వేడుకలోనే ప్రియాంక చోప్రా గ్లోబల్ వాన్ గార్డ్ సత్కారం అందుకోనున్నారు. సినిమా పరిశ్రమలో పాతిక సంవత్సరాల కెరీర్, ఏషియన్ పసిఫిక్ అండ్ వెస్ట్రన్ ఇండస్ట్రీల మధ్య వారధిగా ఉండటం వంటి అంశాల నేపథ్యంలో ప్రియాంకను ఈ అవార్డుకి ఎంపిక చేశారు. ప్రియాంకతో పాటు అమెరికన్ నటుడు చార్లెస్ మైఖేల్ మెల్టన్, సౌత్ కొరియన్ సింగర్ కిమ్ యూన్ జే వంటి వారు ఈ వేడుకలో పురస్కారాలను అందుకోనున్నారు. ‘ఏ న్యూ గోల్డ్ వరల్డ్’ థీమ్తో జరగనున్న ‘గోల్డ్ గాలా – 2026’ ఈవెంట్లో సినీ ఇండస్ట్రీతో పాటు వ్యాపారం, ఫ్యాషన్, స్పోర్ట్స్ వంటి ఇతర రంగాల్లో ప్రతిభ చూపిన వారికి కూడా అవార్డులను ప్రదానం చేస్తారు. వివిధ రంగాలకు చెందిన 650 మంది ప్రముఖుల సమక్షంలో ‘గోల్డ్ 100’ జాబితాలో ఉన్న వారికి అవార్డులు ప్రదానం చేస్తారు. -
అడివి శేష్ ప్రేమ కథ.. కళ్లు చెమ్మగిల్లే స్టోరీ
డెకాయిట్ మూవీతో అడివి శేష్ ప్రేక్షకులను మెప్పించాడు. భగ్నప్రేమికుడు ఎలా ఉంటాడో చాలా ఎమోషనల్ టచ్తో నటించాడు. గతంలో గూఢచారి, మేజర్ వంటి సినిమాలతో సీరియస్ పాత్రలు చేసినప్పటికీ అందులో లవ్ సీన్ వస్తే జీవించేస్తాడు. ఇంతటి బరువైన సీన్లో కూడా సులువుగా అతను నటించడం చూసి ప్రేక్షకుల ఫిదా అయిపోయారు. 'క్షణం', 'డెకాయిట్' వంటి సినిమాల్లో ఆ 'బిట్టర్ స్వీట్ పెయిన్' ఎలా వచ్చిందో ఒక ఇంటర్వ్యూలో అడివి శేష్ వివరణ ఇచ్చారు.సినిమాల్లో ఎంట్రీకి ముందు అడివి శేష్ అమెరికాలో ఉండేవారని తెలిసిందే. అక్కడ తనకు 17ఏళ్ల వయసులోనే ప్రేమలో పడ్డానని శేష్ ఇలా చెప్పాడు. అయితే, ప్రేమ విషయంలో ఎంతో క్షోభను అనుభవించానంటూ కొన్ని బాధాకరమైన విషయాలను ఇలా బయటపెట్టారు. అమెరికాలో ఉన్నప్పుడు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడ్డాను.. కానీ, రెండూ విషాదాన్నే ఇచ్చాయి. నా పుట్టినరోజు నాడే ప్రేమించిన అమ్మాయి మరోకరిని పెళ్లి చేసుకుంది. ఆ సంఘటన నేను భరించలేకపోయాను. ప్రతి పుట్టినరోజు నాడు అందరూ శుభాకాంక్షలు చెబుతుంటే.. నాకు ఆ సంఘటనే గుర్తుకు వస్తుంది. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. మరో ప్రియురాలు అకాల మరణం ఎంతగానో నన్ను కుంగదీసింది.అడివి శేష్ ప్రేమ జీవితం గురించి తెలుసుకున్న తర్వాత నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అడివి శేష్ జీవితంలో ఇంతటి విషాదమా..? అంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ గుండె కోత వింటే ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లాల్సిందేనని . ఆయన ధైర్యానికి ఫిదా అవుతున్నారు. -
ఫాల్కే ఫిలిం ఫెస్టివల్కు 'ది థర్డ్' ఎంపిక
సీనియర్ జర్నలిస్టు, రచయిత కె.ఎ. మునిసురేష్ పిళ్లె తొలిసారిగా దర్శకత్వం వహిస్తూ రూపొందించిన షార్ట్ ఫిలిం The 3rd న్యూఢిల్లీలో ఏప్రిల్ 30న జరిగే 16వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2026 లో స్క్రీనింగ్కు ఎంపికైంది. భారత చలనచిత్ర పితామహుడిగా అందరూ కీర్తించే దాదాసాహెబ్ ఫాల్కే జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఏప్రిల్ 30న ఢిల్లీలో ఈ ఫెస్టివల్ జరుగుతుంటుంది. ఈ ఏడాది చిత్రోత్సవానికి తెలుగులో సురేష్ పిళ్లె రూపొందించిన ఈ షార్ట్ ఫిలిం ఎంపికైంది.ర్యాంకుల ఒత్తిడితో ఇంటర్మీడియట్ విద్యార్థుల ప్రాణాలను బలితీసుకునే కార్పొరేట్ జూనియర్ కాలేజీల దుర్మార్గాలు, చదువుల్లో వెనుకబడిన పిల్లలను సూటిపోటిమాటలతో తూట్లు పొడిచే లెక్చరర్ల వైఖరి కథాంశంగా ఈ 40 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిలిం రూపొందించినట్లు సురేష్ పిళ్లె చెప్పారు. ఫిజిక్స్ సబ్జెక్టులో వెనుకబడిన ఒక విద్యార్థినిని ర్యాంకులు మాత్రమే జీవిత పరమార్థం అని చెబుతూ ఉండే లెక్చరర్ టార్చర్ పెడుతుంటాడు. ఇది తట్టుకోలేక ఆ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడుతుంది. సెలవురోజుల్లో కూడా జూమ్ క్లాసులు అంటూ పిల్లల్ని వేధించే ఆ లెక్చరర్ కు, విద్యార్థిని మరణం తర్వాత భిన్నమైన అనుభవాలు ఎదురౌతాయి. అతనికి ఎదురయ్యే అనుభవాలు ఏమిటి? ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నాడు? అంతిమంగా ఆ వేధింపుల లెక్చరర్లో వచ్చిన పరివర్తన ఏంటి? అనే దిశగా ఈ చిత్రం సాగుతుంది.సృష్టిలో ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది అని న్యూటన్స్ థర్డ్ లా చెబుతుంది. మీరు కష్టపడి చదవకపోతే దానికి ప్రతిచర్యగా మీ జీవితాలు నాశనమైపోతాయి అంటూ.. ఫిజిక్స్ లెక్చరర్ పిల్లల్ని టార్చర్ పెడుతుంటాడు. జీవితంలో ప్రతి విషయానికీ న్యూటన్స్ థర్డ్ లా నే ఆపాదించి మాట్లాడుతుంటాడు. అలాంటి లెక్చరర్ చేసిన పాపానికి, న్యూటన్స్ థర్డ్ లా చెప్పినట్టుగానే, ఎదురైన సమానమైన ప్రతిచర్య ఏమిటన్నదే ఈ సినిమా అని సురేష్ పిళ్లె వివరించారు. ఆదర్శిని చిత్రాలు బ్యానర్ పై భారతమ్మ నిర్మాతగా రూపొందిన చిత్రానికి ఆదర్శిని భారతీకృష్ణ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ చేశారు. ప్రధానపాత్రల్లో ఆదర్శిని శ్రీ, ఒబ్బు ప్రసాద్, సూరావజ్ఝుల రాము, పెమ్మరాజు విజయరామచంద్ర, డా.కిరణ్ కుమార్, బాలమురళి తదితరులు నటించారు. సునో యాప్ ద్వారా ఏఐ సహకారంతో స్వరపరిచిన రెండు పాటలకు సాహిత్యాన్ని మునిసురేష్ పిళ్లెనే అందించారు. పదిమంది నటులు ఇందులో తొలిసారిగా నటించారు. ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్కు ఎంపికైన ఈ చిత్రానికి కథ మాటలు పాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం బాధ్యతలను కె.ఎ. మునిసురేష్ పిళ్లె నిర్వహించారు. -
'వారణాసి' స్పెషల్ వీడియో.. ఫ్యాన్స్కు నిరాశ
మహేష్ బాబు-రాజమౌళి సినిమా వారణాసి ప్రపంచ వేదికపై తొలి ప్రదర్శన జరిగింది. అత్యంత భారీ బడ్జెట్తో కె.ఎల్.నారాయణ, ఎస్.ఎస్.కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టైటిల్ గ్లింప్స్కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ క్రమంలో శనివారం ఉదయం మెక్సికోలో జరిగిన ప్రఖ్యాత కామిక్కాన్ ఎక్స్పీరియన్స్ - 2026లో ‘వారణాసి టు ది వరల్డ్’ పేరుతో తొలి ప్రపంచ ప్రదర్శన కార్యక్రమం జరిగింది. అందులో ఈ మూవీ నుంచి కొన్ని వీడియోలను ప్రదర్శించారు.మెక్సికో ఈవెంట్లో , వారణాసి మూవీకి సంబంధించిన ప్రత్యేకమైన వీడియోను ప్రదర్శించారు. అయితే, అది కేవలం ఆ ఈవెంట్ వరకు మాత్రమే పరిమితం చేశారు. కానీ, డిజిటల్గా విడుదల చేయబడదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే, వారణాసి తెరవెనుక దృశ్యాలను చూడటానికి అభిమానులు మరికొంత కాలం వేచి ఉండాల్సిందే.వారణాసిలో రుద్ర, శ్రీరాముడిగా మహేష్ బాబు రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ మూవీకి సంగీతం ఎం.ఎం.కీరవాణి అందించారు. -
అక్షయ్ కుమార్ కుమార్తెకు వేధింపులు.. ఒకరి అరెస్ట్
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తెను వేధించిన వారిలో ఒకరిని అరెస్ట్ చేసినట్లు మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. నిందితుడిని కోర్టుకు హాజరుపరుస్తామని పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం సైబర్ నేరాల గురించి అక్షయ్ కుమార్ మాట్లాడుతూ తన కుటుంబంలో జరిగిన సంఘటన గురించి చెప్పుకొచ్చారు. ముంబైలో జరిగిన సైబర్ నేరాల అవగహన సదస్సులో పాల్గొన్న అక్షయ్ తన కుమార్తె ఎదుర్కొన్న ఒక అంశాన్ని ప్రపంచానికి తెలిపారు.ఏం జరిగిందంటే..?13 ఏళ్ల తన కుమార్తె వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు జరిగిన ఒక సంఘటనను గతంలో మీడియాతో ఆయన పంచుకున్నారు. పిల్లల చేతిలో మొబైల్ ఉండటం వల్ల ఒక్కోసారి వారు కూడా సైబర్ నేరాల ఉచ్చులో చిక్కుకోవాల్సి ఉంటుందని ఆయన ఇలా తెలిపారు. 'నా కుమార్తె ఆన్లైన్ వీడియో గేమ్ ఆడుతున్న సమయంలో ఆవతలి వ్యక్తి నుంచి ఒక మెసేజ్ వచ్చింది. మంచివాడిగానే మొదట ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. చాలా బాగా ఆడుతున్నావ్ అంటూనే మీరు మేల్, ఫీమేల్నా అంటూ జెండర్ గురించి మెసేజ్ చేశాడు. ఆమె పేరు చెప్పగానే అతను ఇంకో మెసేజ్ పంపాడు. నీ నగ్న చిత్రాలను నాకు పంపగలవా..? అంటూనే కాస్త బెదిరించేలా మెసేజ్ చేశాడు. ఆ సమయంలో వెంటనే నా కూతురు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, ధైర్యంగా వెళ్లి నా భార్యతో చెప్పింది. ' అని గుర్తుచేసుకున్నారు.అక్షయ్ కుమార్తె నిటారపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఆందోళనకు లోనై చాలామంది పిల్లలు కొన్ని తప్పులు చేస్తుంటారు. తల్లిదండ్రులకు చెబితే ఏమంటారోనని సంకోచిస్తారు. కానీ, అక్షయ్ కుమార్తె తను ఎదుర్కొన్న వేధింపుల గురించి తల్లితో పంచుకుని మంచిపని చేసిందని సోషల్మీడియాలో చాలామంది కొనియాడారు. ఆమె ధైర్యానికి ఫిదా అయ్యారు. -
పాన్ ఇండియా సినిమా ట్రైలర్ తొలగింపు
జన నాయగన్ మూవీ నిర్మాత వెంకట్ కె నారాయణ నిర్మించిన మరో పాన్ ఇండియా చిత్రం 'కేడీ ది డెవిల్'. . కన్నడలో తెరకెక్కుతున్న ఈ మూవీ కొద్దిరోజుల క్రితం ఒక పాట వివాదాస్పదం కావడంతో టైటిల్ బాగా వైరల్ అయింది. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్లో లేదు. దీంతో సోషల్మీడియాలో నెటిజన్లు పోస్టులు షేర్ చేయడంతో నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ క్లారిటీ ఇచ్చింది.'కేడీ ది డెవిల్' మూవీ ట్రైలర్ ధ్రువీకరించని కంటెంట్తో పొరపాటున విడుదలైందని చిత్ర యూనిట్ వివరణ ఇచ్చింది. దీంతో యూట్యూబ్ నుంచి తొలగించామని క్లారిటీ ఇచ్చింది. సెన్సార్ మార్గదర్శకాలను అనుసరించి మరోసారి కొత్త వెర్షన్ను యూట్యూబ్లో ట్రైలర్ అప్లోడ్ చేస్తామని నిర్మాత క్లారిటీ ఇచ్చారు.దర్శకుడు ప్రేమ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో నటుడు ధ్రువ సర్జ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో నటి శిల్పాశెట్టి, వి.రవిచంద్రన్, రమేష్ అరవింద్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. వీరితోపాటు బాలీవుడ్ నటుడు సంజయ్దత్ నటి నోరా ఫతేహితో ఒక ప్రత్యేక పాటలు నటించడం విశేషం. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
హీరో సంచలన నిర్ణయం.. రీషూట్ చేస్తున్న మేకర్స్ ?
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘లెనిన్’కు విడుదల ముందే కష్టాలు మొదలయ్యాయని తెలుస్తోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదల విషయంలో ఇప్పటికే ఒక్కసారి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూన్ 26న రిలీజ్ చేస్తామని కొత్త తేదీని ప్రకటించారు. అయితే, ఇప్పడు తాజాగా వస్తున్న రూమర్స్ ప్రకారం చూస్తే జూన్లో లెనిన్ రావడం కష్టమేనని తెలుస్తోంది.'లెనిన్' మూవీ గురించి ఇండస్ట్రీలో వస్తున్న రూమర్స్ ప్రకారం రీషూట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ఏడాదికి పైగా నిర్మాణ దశలోనే ఉంది. అయితే, అఖిల్ కోరికమేరకు కొన్ని సీన్స్ రీషూట్ చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ మూవీ జూన్ 26న విడుదల కావడం కష్టమేనని గుసగుసలు మొదలయ్యాయి.లెనిన్ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించాయి. సినిమాపై భారీగానే బజ్ క్రియేట్ అయింది. ప్రేక్షకుల అంచనాలను లెనిన్ అందుకుంటాడో లేదో కొద్దిరోజుల్లోనే తేలనుంది. అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, సితార ఎంటర్టైన్మెంట్స్పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. -
చెన్నైలో త్రిష కలల సౌధం ధర ఎంతంటే..
తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో రెండు దశాబ్దాలకుపైగా తనదైన ముద్ర వేసి సౌత్ క్వీన్గా పేరు తెచ్చుకున్నారు నటి త్రిష కృష్ణన్. గ్లామర్ ప్రపంచంలో ఉంటూ నిత్యం వెలుగు జిలుగుల మధ్య గడిపే సెలబ్రిటీల ఇళ్లు అంటే సాధారణంగా ఆడంబరాలకు నిలయంగా ఉంటాయని అందరూ భావిస్తారు. కానీ, చెన్నైలోని త్రిష నివాసం ఇందుకు భిన్నం. ఆడంబరం కంటే అభిరుచికి, ప్రదర్శన కంటే ప్రశాంతతకు పెద్దపీట వేస్తూ ఆమె తీర్చిదిద్దుకున్న ఈ ఇల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.చెన్నైలోని అత్యంత ఖరీదైన, ప్రతిష్టాత్మకమైన ప్రాంతాలలో ఒకటైన తైనాంపేటలోని సెనోటాఫ్ రోడ్లో త్రిష నివాసం ఉంది. నగరంలోని వీవీఐపీలు, ఉన్నతాధికారులు నివసించే ఈ ప్రాంతం భద్రతకు, గోప్యతకు మారుపేరు. దాదాపు రూ.10 కోట్ల విలువ చేసే ఈ ఇంటిని తన వ్యక్తిత్వానికి తగ్గట్లుగా మలుచుకున్నారు. త్రిష నివాసంలో ప్రతి మూలా ఆమె అభిరుచిని ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా ఇంటి లోపల వాడిన రంగులు, అలంకరణ సామాగ్రి కళ్లకు ఇంపుగా ఉంటాయి. దక్షిణ భారత సంప్రదాయ కట్టడాల శైలిని విస్మరించకుండానే ఆధునిక ఆర్కిటెక్చర్ను ఇందులో జోడించారు. పెద్ద కిటికీలు సహజ సిద్ధమైన వెలుతురు ఇంట్లోకి వచ్చేలా చేస్తూ ఒక హైబ్రిడ్ లుక్ ఇస్తున్నాయి. భారీ అలంకరణల కంటే, కంఫర్ట్కే ప్రాధాన్యం ఇస్తూ గదులను డిజైన్ చేశారు.గతంలో ఈ ఇల్లు కొన్ని అవాంఛనీయ ఘటనల వల్ల కూడా వార్తల్లో నిలిచింది. గుర్తు తెలియని వ్యక్తులు చేసిన నకిలీ బాంబు బెదిరింపు కాల్స్ వల్ల పోలీసులు ఇక్కడ సోదాలు నిర్వహించాల్సి వచ్చింది. అయితే, ఇలాంటి ఆటంకాలు ఎదురైనా తన వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలగకుండా త్రిష జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇదీ చదవండి: ‘మూన్లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ! -
పొలిటికల్ థ్రిల్లర్ సినిమా తెలుగులో స్ట్రీమింగ్
ప్రేమమ్, సర్వం మాయ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు నివిన్ పాలీ.. ఈ ఏడాది కూడా ఆయన నటించిన రెండు చిత్రాలు 'సంభవం అధ్యాయం ఒన్ను', 'ప్రతిఛాయ' మంచి విజయాన్ని అందుకున్నాయి. జియో హాట్స్టార్ వేదికగా ఓటీటీలో కూడా అదరగొడుతున్నాయి. అయితే, సడెన్గా ప్రతిఛాయ(Prathichaya) చిత్రం తెలుగులో కూడా స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఏప్రిల్ 24న ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఒక్కరోజు గ్యాప్లోనే తెలుగులో స్ట్రీమింగ్కు రావడం విశేషం.ప్రతిఛాయ మూవీ నివిన్ పౌలీ ప్రధాన పాత్రలో నటించిన ఒక మలయాళ రాజకీయ థ్రిల్లర్. ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, థియేటర్లలో ప్రదర్శితమైనప్పుడు విమర్శకులు, ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. ఇప్పుడు, నిర్మాతలు శ్రీ గోకులం మూవీస్ మరియు ఆర్డీ ఇల్యూమినేషన్స్ ఎల్ఎల్పి, ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తుందనే ఆశతో డిజిటల్ మాధ్యమం వైపు దృష్టి సారించారు.కేరళ రాజకీయాల చుట్టూ తిరిగే ఫిక్షన్ స్టోరీగా ఈ మూవీ ఉంటుంది. కేరళ ముఖ్యమంత్రి తనను లైంగిక వేధించాడంటూ ఓ మహిళ ఆరోపిస్తుంది. దీంతో కొన్ని రోజుల తర్వాత మనస్తాపంతో సీఎం వర్గీస్ మరణిస్తాడు. ఇలాంటి సమయంలో ఆయన కుమారుడు జాన్ (నివిన్) రాజకీయాల్లోకి వెళతాడు. ఇష్టం లేకుండా పాలిటిక్స్లోకి వెళ్లిన జాన్కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అనేది ఈ మూవీ అసలు కథ. తన తండ్రి నిజంగానే ఒక మహిళను వేధించాడా..? అనే మిస్టరీని జాన్ ఎలా ఛేదించాడో తెలుసుకోవాలంటే ప్రతిఛాయ చూడాల్సిందే. -
విజయ్ ఆంటోనికి జోడీగా ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్..
వైవిధ్య కథా పాత్రలతో కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని. ఈయన తాజాగా శశి దర్శకత్వంలో నటించిన నూరుసామి చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. విజయ్ అంటోని తన నూతన చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి ఎం.మారన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు ఇరవుక్కు అయిదు కంగళ్, కన్నై నంబాతే (కళ్లను నమ్మొద్దు), బ్లాక్ మెయిల్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను పొందింది. తాజాగా సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని హీరోగా మరో చిత్రాన్ని చేయడానికి సిద్ధమయ్యారు. దీనికి అప్పాకుట్టి అనే టైటిల్ను నిర్ణయించారు. ఇందులో విజయ్ ఆంటోనికి జంటగా ప్రీతి అస్రాని నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. తెలుగులో మంచు మనోజ్ నటించిన ఊ కొడతారా? ఉలిక్కి పడతారా? చిత్రంతో ప్రీతి అస్రాని చైల్డ్ ఆర్టిస్గా వెండితెరకు పరిచయం అయింది. 'మళ్లీ రావా', గుండెల్లో గోదారి, దొంగలున్నారు జాగ్రత్త, సీటీమార్, తదితర సినిమాల్లో నటించిన ప్రీతి ఆస్రానీ హీరోయిన్గా ఇప్పటికే తమిళంలో 'కిస్' మూవీతో వచ్చింది. -
ఈద్కి ఫిక్స్
సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ‘ఎస్వీసీ 63’ (వర్కింగ్ టైటిల్) సినిమా విడుదల ఖరారైంది. 2027 ఈద్కి (రంజాన్ పండగ) ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీలో నయనతార హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ముంబైలో ఆరంభమైంది.ఈ చిత్రాన్ని 2027 ఈద్కి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు శుక్రవారం చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే హీరో సల్మాన్ ఖాన్ కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానుల కోసం ఓ పోస్ట్ చేశారు. ‘‘ఎస్వీసీ 63’ విడుదలకు చాలా రోజులు ఉందని మీరు నిరాశపడకండి. మీ ఎదురు చూపులకు తగినట్లుగానే ఈ చిత్రం ఉంటుంది’’ అని పేర్కొన్నారు సల్మాన్ ఖాన్. -
శ్రీరామ్ పరాశర@24 క్రాఫ్ట్స్
సాక్షి, అమరావతి: కళ్లు చెదిరే సెట్టింగ్స్..అద్భుతమనిపించే విజువల్స్.. ఇవి ఏ పాన్ ఇండియా చిత్రాల్లో కనిపించే దృశ్యాలు కాదండోయ్.!! ఓ యువ దర్శకుడు ఒక్కడే సినిమాకు అవసరమైన 24 క్రాఫ్ట్లను నిర్వర్తించి ఔరా అనిపించాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( ఏఐ) సాయంతో ఇంతటి అద్భుతం చేశాడు యవదర్శకుడు రామ్ పరాశర. రామాయణం పేరుతో ఆయన రూపొందిస్తున్న పౌరాణిక చిత్రం టీజర్ను ఎపిక్ రామాయణ పేరుతో ఇటీవల విడుదల చేశారు. ఐదు రోజుల్లోనే లక్షల వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. అన్నీ తానై.. టీజర్లో చూపించిన విజువల్స్, గ్రాఫిక్స్, నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు శ్రీరాముడి పాత్రను చూపించిన తీరు, యుద్ధ సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు రామ్. టీజర్లో రెండో వ్యక్తి అనే మాటే లేదు. డైరెక్షన్ నుంచి ఎడిటింగ్ వరకూ, సౌండ్ డిజైన్ నుంచి విజువల్ ఎఫెక్ట్స్ వరకూ 3డీ నుంచి యానిమేషన్ వరకు మొత్తం 24 విభాగాలను ఒక్కడే నిర్వహించి రికార్డు సృష్టించాడు. టీజర్ ప్రారంభంలో శివుడి ధనస్సు గురించి వినిపించే పవర్ఫుల్ వాయిస్ ఓవర్, ప్రేక్షకుడిని వెంటనే పురాణ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ప్రతి ఫ్రేమ్లో కనిపించే డీటైల్, గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ పాన్–ఇండియా సినిమా స్థాయిని తలపిస్తున్నాయి. అవకాశం సృష్టించుకున్నా.. ‘‘ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మా స్వగ్రామం. గుంటూరులో పెరిగాను. ప్రముఖ సంస్థలో ఐదేళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాను. సినిమా మీద ఆసక్తితో ఆరేళ్లకిందట హైదరాబాద్ వచ్చి దర్శకుడిగా మారాలని ప్రయత్నిస్తున్నాను. ఓ పెద్ద బ్యానర్లో దర్శకుడిగా అవకాశం వచ్చి కొన్ని రోజుల పాటు షూటింగ్ కూడా జరిగిన తర్వాత సినిమా ఆగిపోయింది. అప్పటి నుంచి అవకాశాల కోసం ఎక్కని ఆఫీసు మెట్టు లేదు. అయినా ఫలితం లేకపోవడంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సాయంగా తీసుకున్నాను. ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో అద్భుత రామాయణ దృశ్య కావ్యాన్ని రూపొందిస్తున్నాను. ఏఐ టూల్స్ వాడి కేవలం మూడు రోజుల్లో రూపొందించిన టీజర్కు భారీ స్పందన వస్తోంది.’’ –శ్రీ రామ్ పరాశర బొమ్మకంటి. -
రేస్ స్టార్
వైట్ అండ్ వైట్ సూట్, కళ్ళకి నల్ల కళ్ళజోడు... గంభీరమైన చూపు... తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బూత్ దగ్గర కనిపించిన అజిత్.. ఓటర్లు రికార్డు స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకున్నా, ఉదయం అందరికంటే ముందు వచ్చి ఓటు వేసిన అజిత్ గురించే తమిళనాడు మొత్తం ఈరోజు మాట్లాడింది. అజిత్ ను చూస్తే ఎంజిఆర్ను చూసినట్లే ఉందంటూ సామాన్య ప్రజలు మాట్లాడుకున్నారు.సినిమాల్లోనే కాదు సినీ ప్రపంచానికి ఆవల కూడా అజిత్ జీవితం ఆసక్తికరం. ఒకసారి ఫోటోగ్రఫీ, మరోసారి డ్రోన్ టెక్నాలజీ, ఇప్పుడు కార్ రేసింగ్... సినిమాకు అవతల ఎన్నో....కార్ రేసింగ్... ఒక హీరోని తలచుకోగానే అతను నటించిన సినిమా సన్నివేశాలో, డైలాగులో డ్యాన్సులో...గుర్తుకొస్తాయి. కానీ తమిళ స్టార్ హీరో అజిత్ గుర్తొస్తే సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ నుంచి ఆయన కార్ రేసింగ్ హాబీ దాకా మరెన్నో గుర్తొస్తాయి. తెరపై టాప్ హీరోల్లో ఆయన ఒకరు కానీ తెరవెనుక మాత్రం ఆయన ఒక్కరే. ఆయన గత సెప్టెంబర్లో ‘54 ఏళ్ల అజిత్ కుమార్ రేసింగ్’ పేరుతో తన జట్టును కూడా ప్రారంభించారు. ఇటీవల బెల్జియంలో జరిగిన ఒక ప్రధాన కార్ రేసింగ్ ఈవెంట్లో అజిత్ జట్టు రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. అలా యూరప్లో విజయవంతమైన కార్ రేసింగ్ ప్రదర్శన తర్వాత తమిళనాడు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడం కోసం చెన్నైకి తిరిగి వచ్చారు.సాల్ట్ అండ్ పెప్పర్... సాదా సీదాగా కనిపించే హీరోల్లో అజిత్ ముందున్నా ఆయన స్టైల్స్ ఎప్పుడూ టాక్ ఆఫ్ ద టౌన్ అవుతూనే ఉంటాయి. చెన్నై విమానాశ్రయంలో అజిత్ తన ట్రేడ్మార్క్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్తో సాధారణ దుస్తులలో రిలాక్స్డ్గా, నిరాడంబరంగా కనిపించినప్పటికీ.. ఆయన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అనేక మంది ఆయన లుక్ను ‘క్లాసీ లుక్’ అని ‘అప్రయత్నంగా స్టైలిష్’ అని అభివర్ణించారు. నిజానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేకమంది సెలబ్రిటీలకు అనుసరణీయంగా మారిన ఈ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ పరిచయం చేసింది ఆయనే. ఆ మాట కొస్తే... ఆయన లుక్లో మాత్రమే కాదు ఆయన జీవితంలో కూడా వెలుగు నీడలు చాలానే ఉన్నాయి. ఆ విషయాలు ఆయనే పలు మార్లు పంచుకున్నారు కూడా.కొన్ని పరిణామాల నేపథ్యంలో ఇటీవలే అజిత్ దుబాయ్లో నివసించాలని నిర్ణయించుకున్నారు. ‘‘ప్రధానంగా మోటార్ స్పోర్ట్స్ కోసమే ఈ నిర్ణయం. ఎందుకంటే ప్రధాన సర్క్యూట్లు అన్నీ ఇక్కడే జరుగుతాయి’’ అని ఆయన చెప్పారు. గత 2025లో ‘విడాముయార్చి’ ’గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాలు విడుదలైన తర్వాత, అజిత్ తన దృష్టిని మరింత ఎక్కువగా రేసింగ్ వైపు మళ్లించారు.స్వంతంగా వంట... తన పనులన్నీ తానే స్వయంగా చూసుకోవాలనే తన నిర్ణయం గురించి మాట్లాడుతూ ‘నేను మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాను. నాకు అడ్వాన్స్ డ్గా ఆలోచించే అద్భుతమైన తల్లిదండ్రులు ఉన్నారు, మా పనులు స్వయంగా చేసుకునేలా మమ్మల్ని పెంచారు. మాకు చిన్న వయసులోనే వంట నేర్పించారు’ అని అజిత్ అంటారు.– ఎస్. సత్యబాబు, సాక్షి, హైదరాబాద్ -
అడివి శేష్ డెకాయిట్.. చిచ్చుబుడ్డి ఫుల్ వీడియో వచ్చేసింది..!
టాలీవుడ్ హీరో అడివి శేష్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ డెకాయిట్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఏప్రిల్ 10న రిలీజైన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. మొదటిరోజు అడివి శేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రూ. 15 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపిస్తోంది. ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. చిచ్చుబుడ్డి అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాటలో సింగర్ జోనితా గాంధీ ఆకట్టుకుంది. ఈ పాటకు భాస్కర భట్ల రవికుమార్ లిరిక్స్ అందించగా.. రామ్ మిరియాల, జోనితా గాంధీ ఆలపించారు. ఈ సాంగ్ భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ఫుల్ వీడియో సాంగ్ చూసేయండి. -
'తాను నాటింది తానే నరుక్కోవాలి'.. ఆసక్తిగా కర తెలుగు టీజర్
ధనుశ్, మమిత బైజు జంటగా నటించిన లేటేస్ట్ మూవీ కర. ఈ సినిమాకు విఘ్నశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈశారి గణేశ్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్ మేకర్స్ రిలీజ్ చేశారు.టీజర్ చూస్తుంటే అన్యాయంపై పోరాడే పాత్రలో ధనుశ్ నటించినట్లు తెలుస్తోంది. టీజర్లో సన్నివేశాలు చూస్తుంటే ఈ ఫుల్ అగ్రెసివ్గా కథ ఉండనున్నట్లు అర్థమవుతోంది. 'తాను నాటింది తానే నరుక్కోవాలి.. నేను నాటిన విత్తనం ఇప్పుడు కోతకు వచ్చింది. అంతకంటే ముందు నా మీద పడ్డ మచ్చను తుడిచేయాలి. నన్ను నమ్ముకున్న వారిని ముందుకు తీసుకెళ్లాలి' అనే డైలాగ్ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ మూవీలో కె.ఎస్. రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీ పాండియరాజన్, సూరజ్ వెంజరమూడు, ఎం.ఎస్. బాస్కర్, శ్రీజ రవి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతమందించారు. -
వారణాసి గ్లోబల్ ఈవెంట్.. టైమింగ్స్ ఇవే..!
మహేశ్బాబు హీరోగా తెరకెక్కిస్తోన్న వారణాసి మూవీని డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టైటిల్ ప్రకటనతోనే ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తోన్న ఈ మూవీ కోసం పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు దర్శకధీరుడు. అందుకే వారణాసి సినిమాని అంతర్జాతీయ స్థాయిలో ఏడాది ముందు నుంచే ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీలోని కొన్ని సీన్స్ను మెక్సికోలో జరగనున్న కామిక్ కాన్ ఎక్స్పీరియెన్స్లో ప్రదర్శించనున్నారు. ఇండియన్ టైమ్ ప్రకారం రేపు ఉదయం 5.15 గంటలకు ఈ ఈవెంట్ జరగనుంది. ఈ సినిమాపై ఏప్రిల్ 24న ప్రతిష్టాత్మక థండర్ స్టేజ్లో ప్రత్యేక ప్యానెల్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ ‘వారణాసి టు ది వరల్డ్’ అనే సెగ్మెంట్ను హోస్ట్ చేయనున్నారు. ఈవెంట్లో వారణాసి మేకింగ్ వీడియోలు ప్రదర్శించునున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాజమౌళి నుంచి ప్రత్యేక వీడియో సందేశం కూడా ఉండనుంది. ఇప్పటి వరకు విడుదల కాని బిహైండ్-ది-సీన్స్ ఫుటేజ్ ఫ్యాన్స్కు పరిచయం చేయనున్నారు. దీంతో పాన్ వరల్డ్ రేంజ్లో వారణాసి ప్రమోషన్స్ షురూ కానుంది. -
రీ రిలీజ్లోనూ డార్లింగ్ సత్తా.. పవన్ కల్యాణ్ మూవీ రికార్డ్ బ్రేక్
టాలీవుడ్ కొన్ని నెలలుగా రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన డార్లింగ్ మూవీని కూడా బిగ్ స్క్రీన్పై విడుదల చేశారు. విడుదలైన 16 సంవత్సరాల తర్వాత థియేటర్లలో మళ్లీ సందడి చేసింది. 2010లో ఏప్రిల్ 23న రొమాంటిక్ కామెడీ మూవీ రిలీజైంది. ఈ మూవీలో ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు.ఈ రొమాంటిక్ మూవీ రీ రిలీజ్లోనూ సత్తా చాటింది. మొదటి రోజు ఏకంగా రూ.7.59 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. తెలుగు రీ-రిలీజ్ మూవీస్లో మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, మహేశ్ బాబు ఖలేజా చిత్రాల వసూళ్లను అధిగమించింది.ఈ సినిమా కంటే ముందు 'బాహుబలి: ది ఎపిక్' తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. రూ.19.65 కోట్లు వసూలు చేసింది. కాగా.. డార్లింగ్ మూవీని 4కె వర్షన్లో రిలీజ్ చేశారు. బాహుబలి: ది ఎపిక్ ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు రీ-రిలీజ్గా నిలిచింది. కాగా.. డార్లింగ్ మూవీకి ఎ. కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో నిర్మించారు. -
మేకప్ లేకుండా 'ఫౌజీ' బ్యూటీ.. మెరిసిపోతున్న నేహా శెట్టి
'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి క్యూట్ లుక్స్తెల్లి చీరలో జిగేలుమంటున్న అనంతికమెరిసిపోతున్న 'టిల్లు' భామ నేహా శెట్టిచీరలో నిండుగా హీరోయిన్ కాయదు లోహర్గ్లామర్ షోతో రచ్చ లేపుతున్న కృతి సనన్నవ్వుతూ మాయ చేస్తున్న శ్రీలీల View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by aswinprakash_ | | 🇮🇳 (@_thrilokadhipathi_) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరోయిన్
'కేరింత' సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సుకృతి ఇప్పుడు శుభవార్త చెప్పేసింది. తాను ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నానని సంగతి బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుంది.(ఇదీ చదవండి: నా భార్య దగ్గర దాచడానికి ఏం లేదు: రకుల్ ప్రీత్ సింగ్ భర్త)ఢిల్లీకి చెందిన సుకృతి అంబటి.. చదువుతున్న టైంలో డ్యాన్స్, యాక్టింగ్కి సంబంధించి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చేది. అలా దిల్ రాజు నిర్మించిన 'కేరింత' సినిమాలో భావన అనే పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రంతో మంచి గుర్తింపే వచ్చినప్పటికీ ఏ భాషలోనూ మరో మూవీ చేయలేదు. పూర్తిగా యాక్టింగ్ కెరీర్ పక్కనబెట్టేసింది.2022 డిసెంబరులో అక్షయ్ సింగ్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఓవైపు జాబ్, మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు తల్లి కాబోతున్న విషయాన్ని రివీల్ చేసింది. బీచ్ ఒడ్డున్న బేబీ బంప్తో దిగిన ఫొటోలని ఈ సందర్భంగా షేర్ చేసింది.(ఇదీ చదవండి: 'ఠాగూర్' సినిమా నాదే.. కానీ వాళ్లు పట్టుకెళ్లిపోయారు: రాజశేఖర్) View this post on Instagram A post shared by Sukrithi Ambati (@itsmesukrithi) -
'ఠాగూర్' సినిమా నాదే.. కానీ వాళ్లు పట్టుకెళ్లిపోయారు
'ఠాగూర్' పేరు చెప్పగానే మెగాస్టార్ చిరంజీవి గుర్తొస్తారు. ఇందులో ఆయన చెప్పిన డైలాగ్స్, అద్భుతమైన యాక్టింగ్ మరోసారి మదిలో మెదులుతాయి. చెప్పాలంటే చిరు కెరీర్లోనే మైలురాయి లాంటి సినిమా ఇది. అయితే ఇదో రీమేక్ అని చాలామందికి తెలీదు. అలానే రాజశేఖర్ చేయాల్సిన ఈ మూవీ.. చిరంజీవి చేతుల్లోకి వచ్చిందనే సంగతి కూడా ఇప్పటి జనరేషన్లో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడీ విషయంపై స్వయంగా రాజశేఖర్ స్పందించారు. అప్పట్లో ఏం జరిగిందో బయటపెట్టారు.(ఇదీ చదవండి: బ్లాక్బస్టర్ సక్సెస్.. 'ధురంధర్' నటుడికి కోటి రూపాయల గిఫ్ట్)''ఠాగూర్' నేను కొనుక్కున్న సినిమా. అడ్వాన్స్ అంతా ఇచ్చేశా. నిర్మాత నా ఫ్రెండే కదా అని అగ్రిమెంట్ చేసుకోలేదు. ఠాగూర్ మధు ఉన్నారు కదా! చిరంజీవి కోసం ఆయన వెళ్లి, ప్రొడ్యూసర్ని కలిసి ఎక్కువ డబ్బులిస్తానని చెప్పి పట్టుకెళ్లిపోయారు. నేను అగ్రిమెంట్ చేయలేదు కాబట్టి నాకు ఇవ్వలేదు. ఇది జరిగింది' అని రాజశేఖర్ అప్పటి సంగతులు గుర్తుచేసుకున్నారు.శంకర్ దర్శకత్వంలో అర్జున్ చేసిన 'జెంటిల్మన్' సినిమా కూడా తానే చేయాలని.. కానీ 'అల్లరి ప్రియుడు' షూటింగ్ టైంలోనే ఆ అవకాశం రావడంతో తప్పక వదులుకున్నానని రాజశేఖర్ చెప్పారు. దీనిబట్టి అర్థమైంది ఏంటంటే.. సినిమా ఇండస్ట్రీలో తెర వెనక చాలా జరుగుతుంటాయి. కాకపోతే అప్పుడు సోషల్ మీడియా లాంటివి లేకపోవడం నిజాలు బయటకు రాలేదు. ఇప్పుడు ఈయనే చెప్పడంతో జరిగింది ఇది అని అందరికీ క్లారిటీ వచ్చింది.తమిళంలో విజయకాంత్ హీరోగా ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో 'రమణ' సినిమా వచ్చింది. ఇది బ్లాక్బస్టర్ కాగా తెలుగులో దీన్నే 'ఠాగూర్'గా రీమేక్ చేశారు. వివి వినాయక్ దర్శకత్వం వహించారు. ఇక్కడ కూడా అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. సూపర్హిట్గా నిలిచింది. ఒకవేళ ఇది రాజశేఖర్ చేసుంటే ఎలా ఉండేదో మరి?(ఇదీ చదవండి: నా భార్య దగ్గర దాచడానికి ఏం లేదు: రకుల్ ప్రీత్ సింగ్ భర్త) -
'నాకేలాంటి దురుద్దేశం లేదు.. తమన్నా కాళ్లు పట్టుకుంటా'
ప్రముఖ బాలీవుడ్ నటుడు అన్ను కపూర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో తమన్నాపై డ్యాన్స్పై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా తమన్నా చాలా తెల్లగా ఉంటుందని అన్నారు. ఈ వ్యాఖ్యలను కొందరు తప్పుబట్టారు. ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాగా.. స్త్రీ 2 చిత్రంలోని ఆజ్ కీ రాత్ ఐటమ్ సాంగ్ను ఉద్దేశించి మాట్లాడారు. అదే సమయంలో తమన్నా డ్యాన్స్ గురించి మాట్లాడారు. అదే సమయంలో ఆమె శరీర రంగుపై కామెంట్స్ చేయడంతో వివాదానికి దారితీసింది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అన్ను కపూర్ ఈ వివాదంపై స్పందించారు. తన కామెంట్స్ను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. అదే మాటను తాను మిల్కీ బాడీ అని చెబితే సమస్య వచ్చేది కాదేమోనని అన్నారు. కేవలం లాంగ్వేజ్ మారినంత మాత్రాన అర్థం మారదన్నారు. తమన్నాను ప్రశంసించడానికే అలా అన్నానని.. అంతే తప్ప తనకు మరో ఉద్దేశం లేదని తెలిపారు. నా కామెంట్స్తో తమన్నా బాధపడి ఉంటే ఆమె కాళ్లు పట్టుకోవడానికైనా రెడీగా ఉన్నానని స్పష్టం చేశారు. నా మనసులో ఎలాంటి దురుద్దేశం లేనప్పుడు.. ఆమె కాళ్లు పట్టుకోవడం పెద్ద విషయం కాదన్నారు. -
నా భార్య దగ్గర దాచడానికి ఏం లేదు
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రెండేళ్ల క్రితం నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లిచేసుకుంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది. రీసెంట్గా భార్యభర్తలిద్దరూ ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పలు విషయాలు మాట్లాడారు. అయితే ఓ సందర్భంలో తన వైవాహిక బంధాన్ని జాకీ భగ్నానీ.. 'సిట్యుయేషన్షిప్' అనడం కాస్త వింతగా అనిపించింది. శారీరక లేదా తాత్కాలిక సంబంధం గురించి చెప్పేటప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తారు. దీంతో ఈ కామెంట్స్పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. దీంతో స్వయంగా రకుల్.. తన భర్త చెప్పిన ఉద్దేశం గురించి క్లారిటీ ఇచ్చింది.(ఇదీ చదవండి: కిస్ సీన్.. చాలా అసౌకర్యంగా అనిపించింది: హీరోయిన్ కాజోల్)ఇంటర్వ్యూలో జాకీ భగ్నానీ మాట్లాడుతూ.. మేం పెళ్లి చేసుకున్నాం కానీ మా మధ్య ఉన్నది ఓ సిట్యుయేషన్షిప్ లాంటిది. మేం ఒకరికొకరం అంకితమయ్యాం. నేను ఆమెతో దేని గురించైనా స్వేచ్ఛగా మాట్లాడగలను. అంతెందుకు రకుల్ పక్కనే ఉన్నప్పుడు నా ఎక్స్(మాజీ ప్రేయసి) నుంచి కాల్ వచ్చినా ఏ మాత్రం ఇబ్బందిపడకుండా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతాను. నా భార్య దగ్గర దాచడానికి ఏం లేదు. అందుకే ఈ బంధంలో నాకు ఎప్పుడూ ఊపిరాడనట్లు అనిపించలేదు. తామిద్దరం చాలా ఫ్రీగా ఉంటాం అని చెప్పుకొచ్చాడు.ఇక సిట్యుయేషన్షిప్ అనే పదంపై ట్రోల్స్ ఎక్కువగా వస్తుండేసరికి రకుల్.. తన ఇన్ స్టా వేదికగా స్పందించింది. ఓ గంటపాటు జరిగిన సంభాషణలోని ఒక లైన్ తీసుకుని హెడ్ లైన్గా మార్చడం మాకు నవ్వు తెప్పించింది. కానీ అలా చేయడం సరైంది కాదు. సందర్భం ముఖ్యం. మా మాటల్ని క్లిక్ బైట్ చేయడం కరెక్ట్ కాదు అని పేర్కొంది. సిట్యుయేషన్షిప్ వ్యాఖ్యని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ వివాదం చెలరేగిందని.. తమ బంధాన్ని స్వేచ్ఛగా, పరస్పర నమ్మకంతో కొనసాగిస్తున్నామని చెప్పడమే రకుల్-జాకీ ఉద్దేశంలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: బ్లాక్బస్టర్ సక్సెస్.. 'ధురంధర్' నటుడికి కోటి రూపాయల గిఫ్ట్)Jackky Bhagnani calls marriage with Rakul Preet Singh 'situationship' 😳😱“Rakul and I are married, but we are like in a situationship, which is, of course, we are exclusive to each other because that’s why we are married. But the most important thing is that I can talk to her… pic.twitter.com/4a3xBLl3Tv— FILMYNEWS (@filmynewsnetwrk) April 24, 2026 -
కోటి రూపాయల బోనస్.. దురంధర్ యాక్టర్ రియాక్షన్
రణ్వీర్ సింగ్ దురంధర్-2 నెల రోజులు దాటినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటికే పుష్ప-2 రికార్డ్ బద్దలు కొట్టిన ఈ సినిమా బాహుబలి-2 రికార్డ్ దిశగా దూసుకెళ్తోంది. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో దురంధర్ నటీనటులు ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. అలా ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు రాకేశ్ బేడీ. ఈ మూవీతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జమిల్ జమాలి పాత్రలో తన నటనతో ఆడియన్స్ను కట్టిపడేశారు.ఈ సినిమాలో నటించిన రాకేశ్ బేడీకి పారితోషికం దాదాపు రూ.50 లక్షలు తీసుకున్నారని టాక్. అయితే తాజాగా ఆయనకు సంబంధించి మరో న్యూస్ వైరలవుతోంది. దురంధర్-2 బ్లాక్బస్టర్ కావడంతో ఏకంగా ఆయనకు కోటి రూపాయలు ముట్టజెప్పారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రాకేశ్ బేడీకి కోటి రూపాయల చెక్ కూడా అందజేశారని వార్తలొస్తున్నాయి.ఈ నేపథ్యంలో రాకేశ్ బేడీ స్పందించారు. తనకు కోటి బోనస్ ఇచ్చారని వస్తోన్న వార్తలపై ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. నాకు ఆ డబ్బు ఇచ్చి ఉంటే ఎక్కడుందో చెప్తే వెళ్లి తెచ్చుకుంటానని అన్నారు. నా ఖాతాలో ఇంకా డబ్బులు జమ కాలేదన్నారు. దీంతో కోటి రూపాయలు ఇచ్చారన్న వార్తలు కేవలం రూమర్స్ మాత్రమేనని అర్థమవుతోంది. -
'పరమపద సోపానం' మూవీ రివ్యూ
ఇన్నాళ్లు బుల్లితెరపై అలరించిన అర్జున్ అంబటి..ఇప్పుడు వెండితెరపై దూసుకెళ్తున్నాడు. రామ్ చరణ్ పెద్ది సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు హీరోగానూ సినిమాలు చేస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 'పరమపద సోపానం'. నాగ శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గణపర్తి నారాయణరావు, తేలప్రోలు ప్రసన్న ఆంజనేయులు నిర్మించారు. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ నటించిన ఈ చిత్రం నేడు(ఏప్రిల్ 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. హెల్త్ కమిషనర్ సత్యప్రకాశ్ దారుణ హత్యతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. ఈ క్లిష్టమైన కేసును ఛేదించేందుకు పోలీస్ ఆఫీసర్ అశ్వద్ధామ(అజయ్ రత్నం) రంగంలోకి దిగుతాడు. అయితే మృతదేహంపై తర్వాత చావబోయే వ్యక్తి వేలిముద్రలు దొరకడం కేసును మరింత మిస్టరీగా మారుస్తుంది. చివరకు ఈ కేసులో ప్రధాన సాక్షిగా అర్జున్(అర్జున్ అంబటి) గుర్తిస్తారు.అర్జున్ ఒక గేమ్ డిజైనర్. మల్టీనేషనల్ కంపెనీలో చేసుకునే అతను పీటీఎస్డీ(Post-Traumatic Stress Disorder) అనే వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. ఎవరో తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారనే భయం అతన్ని వెంటాడుతుంటుంది.అర్జున్ భద్రత కోసం సీఐ నేహా((జెనిఫర్ ఇమాన్యుయేల్)ను నియమిస్తారు. కానీ హత్యలు అక్కడితో ఆగవు… ప్రభుత్వ ఉద్యోగులు షబీనా భేగమ్ పాటు జాన్ రాజ్ కూడా క్రూరంగా హత్యకు గురవుతారు. ఈ హత్యల వెనుక ఉన్న అసలు మాస్టర్మైండ్ ఎవరు? అర్జున్ ఎందుకు టార్గెట్ అయ్యాడు? హెల్త్ మినిస్టర్ పురుషోత్తం రెడ్డి పాత్ర ఏమిటి? ఈ మొత్తం కథకు ‘పాలకడలి’ గ్రామంతో ఉన్న రహస్య సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్కి వెళ్లి ‘పరమపద సోపానం’ మూవీ చూడాల్సిందే .విశ్లేషణఇదొక డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. దర్శకుడు నాగ శివ తన తొలి చిత్రానికే బలమైన కథను ఎంచుకుని, సోషల్ ఎలిమెంట్తో కూడిన కమర్షియల్ సినిమాగా తెరకెక్కించాడు. ఇలా తక్కువ బడ్జెట్లో పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా అందించడం పెద్ద ఛాలెంజ్. ఈ విషయంలో దర్శకుడు విజయం సాధించాడు. సస్పెన్స్, కామెడీ ఎలిమెంట్స్తో ఫస్టాఫ్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇంటర్వల్ ట్విస్ట్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థం వచ్చే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొంత సాగదీతగా అనిపిస్తుంది.అయితే అందులో టచ్ చేసిన సోషల్ ఎలిమెంట్ బాగుంటుంది.క్లైమాక్స్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది.అర్జున్ పాత్రకు అర్జున్ అంబటి న్యాయం చేశాడు.ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే ఫైట్లో అదరగొట్టేశాడు. హీరోయిన్ జెనిఫర్ ఇమ్మాన్యుల్ కూడా పోలీస్ పాత్రలో మెప్పించింది. ఆమెకు ఒక స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్ లభించింది అని చెప్పాలి. అజయ్ రత్నంకి చాలా కాలం తర్వాత ఒక పవర్ఫుల్ రోల్ దొరికింది. సీనియర్ నటుడు పిల్లా ప్రసాద్ కూడా విలన్ పాత్రలో ఆకట్టుకున్నారు.సాంకేతికంగా సినిమా బాగుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే.. ‘పరమపద సోపానం’ ఎంటర్టైన్ చేస్తుంది.- రేటింగ్: 2.5/5 -
రామ్ చరణ్ పెద్ది రిలీజ్.. ఆ డేట్నే ఫిక్స్ చేశారా?
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీకి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఓ ఐటమ్ సాంగ్ మినహా దాదాపు షూటింగ్ అంతా పూర్తయింది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ రెండోసారి కూడా వాయిదా పడింది. ఏప్రిల్ 30న థియేటర్లలోకి రావాల్సిన పెద్దిని జూన్కు షిఫ్ట్ చేశారు.అయితే రిలీజ్ తేదీని మాత్రం అఫీషియల్గా ప్రకటించలేదు. దీంతో పెద్ది విడుదల తేదీపై నెట్టింట చర్చ మొదలైంది. ఈ మూవీ రిలీజ్ డేట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెద్దిని జూన్ 25న విడుదల చేస్తారని లేటేస్ట్ టాక్. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుందన్న వార్త హల్చల్ చేస్తోంది. ఈ విషయంపై ఇప్పటి వరకు పెద్ది మేకర్స్ స్పందించలేదు. రాబోయే రోజుల్లో పెద్ది రిలీజ్ డేట్పై క్లారిటీ రానుంది.కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ కోసం శృతి హాసన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. -
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ డైరెక్టర్
టాలీవుడ్ డైరెక్టర్ బాబీ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతర వీరికి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక బాబీ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం చిరంజీవితో జతకట్టారు. వాల్తేరు వీరయ్య హిట్ తర్వాత మరోసారి ఈ కాంబో రిపీట్ కానుంది. బాబీతో ‘మెగా 158’ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కించనున్న చిత్రం వచ్చే నెలలో సెట్స్పైకి వెళ్లనుంది. ఈ భారీ ప్రాజెక్ట్కు సంబంధించిన టైటిల్ కాకాజీ అని ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఫ్యామిలీతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ బాబీ pic.twitter.com/aXxXVBlxUM— Telugu360 (@Telugu360) April 24, 2026 -
‘గేదెల రాజు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
రఘు కుంచె కీలక పాత్రలో నటిస్తూ సంగీతం సమకూర్చిన తాజా చిత్రం ‘గేదెల రాజు’. చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. రామచంద్రం పుణ్యమూర్తుల, వికాస్, టీనా శ్రావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి ఇతర పాత్రలు పోషించారు. వాణి రవికుమార్ మోటూరి నిర్మించిన ఈ మూవీ నేడు(ఏప్రిల్ 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాంకథేంటంటే.. కాకినాడకు చెందిన రౌడీ షీటర్ గేదెల రాజు(రఘు కుంచె) కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటాడు. స్థానిక ఎమ్మెల్యే గేదెల రాజుకే టికెట్ కేటాయిస్తాడు. అదే పార్టీకి చెందిన దుర్గ(శ్రీకాంత్ అయ్యంగార్) కూడా టికెట్ ఆశిస్తాడు. వీరిద్దరికి పడకపోవడంతో..ఎమ్మెల్యే ఇంటికి పిలిపించుకొని కలిసి పని చేయాలని చెబుతారు. అందుకు ఇద్దరు నిరాకరించి..అక్కడ నుంచి వెళ్లిపోతారు. అదే రోజు రాత్రి గేదెల రాజు హత్యకు గురవుతాడు. ఎమ్మెల్యే మనిషి కావడంతో పోలీసులు ఈ కేసుని సీరియస్గా తీసుకుంటారు. గేదెర రాజు సోదరుడు శ్యాంబాబుతో పాటు దుర్గను కూడా పిలిచి విచారిస్తారు. అయితే ఈ కేసుతో వాళ్లకు సంబంధం లేదని తెలుస్తుంది. మరి గేదెల రాజుని చంపిందెవరు? ఎందుకు చంపారు? రిచ్ (వికాస్)-మీరా(మౌనిక), విజయ్ (రామచంద్రం)-సత్య(టీనా శ్రావ్య)లతో గేదెల రాజుకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు హంతకులను పోలీసులు కనిపెట్టారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో సాగే మర్డర్ మిస్టరీ స్టోరీ ఇది. చూస్తే ఒకటే నిజం, చూడకపోతే వంద అనుమానాలు అని ఈ సినిమాకు క్యాప్షన్ పెట్టారు. అలా ఎందుకు పెట్టారనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. హత్య చేసిందెవరు అనేది సినిమా చూసే ప్రేక్షకులు చివరి వరకు కనిపెట్టకుండా ఆసక్తికరంగా కథనాన్ని నడిపించాడు దర్శకుడు చైతన్య మోటూరి. అయితే దీని కోసం రెండు లవ్స్టోరీలతో పాటు మొత్తం ఐదు ఉపకథలను రాసుకున్నాడు. వాటికి ఈ హత్యకు సంబంధం ఉన్నప్పటికీ.. తెరపై చూస్తుంటే మాత్రం కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. స్క్రీన్ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది.గేదెల రాజు మర్డర్ సీన్తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత దుర్గ పాత్ర ఎంట్రీ.. కార్పోరేటర్ బరిలో ఇద్దరూ ఉండడంతో ఈ హత్య అతనే చేయించాడేమో అనుకునేలోపు అతనికి సంబంధం చూపించారు. ఆ తర్వాత రిచ్ పాత్ర ఎంట్రీ..అతని నేపథ్యం.. మీరాతో ప్రేమాయణం చూపిస్తూనే మరోవైపు విజయ్-సత్యల ప్రేమకథను నడిపించారు. గేదెల రాజు హత్యకు ఈ జంటలకు ఏదో సంబంధం ఉంటుందని అనుకునేలోపు.. డెక్క, శివయ్య పాత్రలను పరిచయం చేసి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశారు. చిన్న ట్విస్ట్తో ఇంటర్వెల్ సీన్ ఉంటుంది. ఇక సెకండాఫ్లో కథనం సాగదీతగా అనిపిస్తుంది. గేదెల రాజు శత్రువులు ఎవరు? రెండు ప్రేమ కథలతో అతనికి ఉన్న సంబంధం ఏంటనేది చూపించడానికి కథను సాగ..దీశారు. పెద్ద రౌడీ షీటర్ అని మాటల్లో చెప్పడమే కానీ...తెరపై అతని చూసి భయపడేలా ఒక్క సన్నివేశం కూడా ఉండదు. పైగా హత్య రోజు జరిగిన సీన్ కూడా గొప్పగా అనిపించదు. ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించరు. మహాభారతంలోని కనిక నీతి కథకు ఈ కథను ముడిపెట్టిన తీరు బాగుంది.ఎవరెలా చేశారంటే.. గేదెల రాజు పాత్రకు రఘు కుంచె న్యాయం చేశాడు. ఒక రౌడీ షీటర్ మాట తీరు ఎలా ఉంటుందో, ఎలా కోపంగా చూస్తాడో తెరపై రఘు కుంచె అలానే నటించాడు. గోదావరి యాసను కూడా బాగా మ్యానేజ్ చేశాడు. శివయ్యగా రవి ఆనంద్ బాగా నటించాడు. రిచ్గా వికాస్, విజయ్గా రామచంద్రంతో పాటు టీనా శ్రావ్య, మౌనికలు కూడా తమదైన నటనతో ఆకట్టుకున్నారు. సాంకేతికంగా సినిమా ఓకే. రఘు కుంచె నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో చాలా వరకు సాగదీత సీన్లు ఉన్నాయి. వాటిని కట్ చేసి నిడివి తగ్గించాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
ఓటీటీకి ది కేరళ స్టోరీ-2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆదా శర్మ కీలక పాత్రలో వచ్చిన మూవీ ది కేరళ స్టోరీ. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్గా ది కేరళ స్టోరీ-2 చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. రచయిత విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు. ఫిబ్రవరి 27న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.తాజాగా ఈ సినిమా ఓటీటీ వచ్చేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం మే 8వ తేదీ నుంచి ఓటీటీలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని ఓటీటీ ఫ్లాట్ఫామ్ జీ5 అఫీషియల్గా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ను రిలీజ్ చేసింది. ఈ సినిమాను కేరళలో జరిగిన నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. Behind every “perfect” romance can lie a calculated trap. Witness the moment Divya, Neha, and Surekha’s dreams spiraled into a nightmare.Watch #TheKeralaStory2, streaming from 8th May on ZEE5.#TheKeralaStory2OnZee5#TheKeralaStory2GoesBeyond #ShowYourDaughters… pic.twitter.com/TMdec083gG— ZEE5Official (@ZEE5India) April 24, 2026 -
మృణాల్ ఠాకుర్ గ్లామర్ షో.. వీడియో సాంగ్ రిలీజ్
మృణాల్ ఠాకుర్ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు 'సీతారామం', 'హాయ్ నాన్న' సినిమాల్లో ఈమె పోషించిన పాత్రలు, అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్లే గుర్తొస్తాయి. అంతెందుకు ఈ నెల ప్రారంభంలోనే రిలీజైన 'డెకాయిట్'లోనూ సరస్వతి అనే పాత్రలో అద్భుతంగా నటించింది. మూవీ ఓకే ఓకే అనిపించుకుంది గానీ మృణాల్ యాక్టింగ్ని అందరూ మెచ్చుకున్నారు.(ఇదీ చదవండి: బ్లాక్బస్టర్ సక్సెస్.. 'ధురంధర్' నటుడికి కోటి రూపాయల గిఫ్ట్)అయితే తెలుగులో ఫెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్న మృణాల్.. బాలీవుడ్లో మాత్రం పూర్తిగా గ్లామరస్ రోల్స్ చేస్తోంది. ఇప్పుడు కూడా వరుణ్ ధావన్తో 'హే జవానీ తో ఇష్క్ హోనా హై' అనే రొమాంటిక్ కామెడీ మూవీ చేసింది. ఇందులో మృణాల్తో పాటు పూజా హెగ్డే కూడా హీరోయిన్గా చేసింది.వచ్చే నెల 22న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా టీజర్ కొన్నిరోజుల క్రితం రిలీజ్ చేయగా పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ట్రయాంగిల్ లవ్-ఫ్యామిలీ తరహా రొటీన్ స్టోరీనే అని చాలామంది పెదవి విరిచారు. కంటెంట్ పరంగా ఎలా ఉంటుందో పక్కనబెడితే గ్లామర్ విషయంలో మాత్రం తగ్గేదే లే అన్నట్లు ఉంది. తాజాగా 'వావ్' పేరిట మూవీలోని వీడియో సాంగ్ రిలీజ్ చేయగా.. ఇందులో మృణాల్ అదిరిపోయే గ్లామర్ షో చేసింది. పూజా హెగ్డే కూడా ఏ మాత్రం తగ్గకపోవడం విశేషం.(ఇదీ చదవండి: కిస్ సీన్.. చాలా అసౌకర్యంగా అనిపించింది: హీరోయిన్ కాజోల్) -
చాలా అసౌకర్యంగా అనిపించింది.. నో చెప్పాలనుకున్నా కానీ
'దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే' సినిమాతో పాన్ ఇండియా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న హీరోయిన్ కాజోల్.. తర్వాత హీరో అజయ్ దేవగణ్ని పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లయింది. అయినా సరే ఇప్పటికీ అడపాదడపా సినిమాలు చేస్తోంది. మరోవైపు 'ద ట్రయల్' అనే సిరీస్తో ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే కెరీర్ ప్రారంభం నుంచి ముద్దు సీన్లలో నటించకూడదనే పాలసీ పెట్టుకున్న ఈమె.. ఓటీటీ సిరీస్ కోసం దాన్ని పక్కనబెట్టేసింది. సహ నటుడితో కిస్ సీన్ చేసింది. ఇన్నాళ్లకు సదరు సన్నివేశం గురించి స్పందించింది. చేస్తున్నప్పుడే చాలా అసౌకర్యంగా ఫీలయ్యానని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: నా ఓటు టీవీకే పార్టీకే వేశా.. విజయ్ సీఎం అవుతాడు)రీసెంట్గా ఓ యూట్యాబర్తో పాడ్కాస్ట్లో పాల్గొన్న కాజోల్.. తాను ముద్దు సన్నివేశంలో నటించడానికి గల కారణాల్ని బయటపెట్టింది. 'అది కేవలం కిస్ సీన్ మాత్రమే కాదు. ఆ పాత్ర భావోద్వేగాలకు, ఆలోచనలకు ఎంతో కీలకం. దాన్ని తీసేస్తే పాత్రలోని డెప్త్ తగ్గిపోతుంది. కానీ ఆ సీన్ తీస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. స్టోరీ చెప్పినప్పుడు ఓకే చెప్పాను గానీ సెట్స్కి వెళ్లినప్పుడు చాలా అసౌకర్యంగా అనిపించింది. చివరి నిమిషంలో 'ఇది చేయను' అని చెప్పాలనిపించింది. కానీ ఇది పూర్తిగా ప్రొఫెషనల్ నిర్ణయం అని భావించి చేశాను' అని చెప్పుకొచ్చింది.'ద ట్రయల్' సిరీస్లో కాజోల్ లాయర్ పాత్ర చేసింది. ఇందులోనే ఓ సీన్లో భర్తగా నటించిన జీషూ సేన్ గుప్తాతో ముద్దు సీన్ చేసింది. అయితే 1992లో ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి కిస్ సీన్ చేయకూడదని కాజోల్ తనకు తానుగా రూల్ పెట్టుకుంది. కానీ ఈ సిరీస్ కోసం చేసేసరికి అంతా ఆశ్యర్యపోయారు. ఈ సిరీస్ రెండో సీజన్ కూడా త్వరలో రిలీజ్ కానుంది.కాజోల్ వ్యక్తిగత జీవితానికొస్తే.. హీరో అజయ్ దేవగణ్ని ప్రేమించి 1999లో పెళ్లి చేసుకుంది. వీళ్లకు నైసా, యుగ్ అని ఇద్దరు పిల్లలున్నారు.(ఇదీ చదవండి: బ్లాక్బస్టర్ సక్సెస్.. 'ధురంధర్' నటుడికి కోటి రూపాయల గిఫ్ట్) -
సల్మాన్ ఖాన్ -వంశీ పైడిపల్లి మూవీ విడుదలపై ప్రకటన
సల్మాన్ ఖాన్- వంశీ పైడిపల్లి సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ‘దిల్’ రాజు, శిరీష్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ మూవీ కొద్దిరోజుల క్రితమే పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఇందులో సల్మాన్ ఖాన్ సరసన నయనతార నటిస్తుంది. వచ్చే ఏడాది రంజాన్- 2027 సందర్భంగా విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. మరోవైపు ప్రస్తుతం సల్మాన్ ‘మాతృభూమి’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. -
బ్లాక్బస్టర్ సక్సెస్.. 'ధురంధర్' నటుడికి కోటి రూపాయల గిఫ్ట్
గత నెలలో రిలీజైన 'ధురంధర్ 2' సినిమా ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు ఉన్న అన్ని బాక్సాఫీస్ రికార్డులని బద్దలు కొట్టేసింది. ఇంకా థియేటర్లలో ఆడుతూనే ఉంది. ఈ మూవీ గురించి మెల్లగా అందరూ మర్చిపోతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇందులో నటించిన రాకేశ్ బేడీ.. నిర్మాతల నుంచి రూ.కోటి గిఫ్ట్ అందుకోవడమే దీనికి కారణం. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: ‘రాకా’ నుంచి తప్పుకున్న దీపికా పదుకొణె.. టీమ్ క్లారిటీ)'ధురంధర్' మొదటి భాగంలో అక్షయ్ ఖన్నా తనదైన యాక్టింగ్తో ఆకట్టుకోగా.. గత నెలలో రిలీజైన రెండో భాగంలో హీరో రణ్వీర్ సింగ్ ఫెర్ఫార్మెన్స్ అదరగొట్టేశాడు. అయితే చివరలో రాకేశ్ బేడీ చేసిన జమీల్ జమాలీ పాత్రతో ఇచ్చిన ట్విస్ట్ అయితే ప్రతి ఒక్కరూ అవాక్కయ్యేలా చేసింది. అప్పటివరకు పాక్ రాజకీయ నాయకుడి పాత్రనే అని అంతా అనుకున్నారు. కానీ ఇతడు కూడా భారతదేశ్ గూఢచారి అనేది సర్ప్రైజింగ్గా అనిపించింది. హీరో, విలన్ తదితరులని ఎంతలా మెచ్చుకున్నారో.. రాకేశ్ బేడీకి కూడా అంతకంటే ఎక్కువ ప్రశంసలు దక్కాయి.రెండు భాగాల్లోనూ అద్భుతంగా నటించి మెప్పించిన రాకేశ్ బేడీకి రూ.50 లక్షల రెమ్యునరేషన్ అని ముందే మాట్లాడుకున్నారు. అది చెల్లించేశారు కూడా. కానీ ఇప్పుడు సినిమా ఘనవిజయం సాధించడంతో దర్శకనిర్మాత ఆదిత్యధర్.. ఈయనకు అదనంగా రూ.కోటి రూపాయల చెక్ ఇచ్చాడట. ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. 'ధురంధర్ 2' కలెక్షన్స్ ప్రస్తుతం రూ.1800 కోట్లకు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: నా ఓటు టీవీకే పార్టీకే వేశా.. విజయ్ సీఎం అవుతాడు) -
15 ఏళ్ల తర్వాత సమీరా రెడ్డి రీఎంట్రీ..
బాలీవుడ్ నటి సమీరా రెడ్డి సుమారు 15 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తుంది. 2014లో వ్యాపారవేత్త అక్షయ్ వర్దేను వివాహం చేసుకున్న సమీరా.. అంతకు ముందే సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కృష్ణం వందే జగద్గురుం (2012) మూవీలో ప్రత్యేక గీతంలో మాత్రమే ఆమె కనిపించారు. అయితే, ఇప్పుడు సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ‘ఆఖ్రీ సవాల్’లో కీలక పాత్రలో ఆమె నటిస్తుంది. ఈ చిత్రం మే 8న విడుదల కానుంది.ఆఖ్రీ సవాల్ మూవీలో సమీరా రెడ్డి పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. తన రీఎంట్రీ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను నటించబోయే పాత్రల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నానని సమీరా వెల్లడించింది. రొటీన్ కమర్షియల్ పాత్రల కంటే, నటనకు ఆస్కారం కల్పించే అర్థవంతమైన పాత్రలపైనే తన దృష్టి ఉంటుందని ఆమె నొక్కి చెప్పింది.ఆఖ్రీ సవాల్ చిత్రాన్ని జాతీయ అవార్డు దర్శకుడు అభిజీత్ మోహన్ వారంగ్ తెరకెక్కిస్తున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ప్రయాణాన్ని కథగా రాసుకుని ఈ మూవీని తీసినట్లు సమాచారం. ఇందులో సంజయ్ దత్ ప్రొఫెసర్ గోపాల్ నాదకర్ణిగా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు నమాశి చక్రవర్తి పీహెచ్డీ విద్యార్థి పాత్రలో కనిపించబోతున్నాడు. ఆఖ్రీ సవాల్ చిత్రం ద్వారా ఆర్ఎస్ఎస్పై వచ్చిన ఆరోపణలు గురించి చూపించనున్నారు. ఇందిరా గాంధీ హత్య తర్వాత జరిగిన ఘటనలు.. 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత వంటి అంశాలను ఈ మూవీలో చూపనున్నారు. అత్యంత భారీ బడ్జెట్తో ప్రముఖ వ్యాపారవేత్త నిఖిల్ నందా, సంజయ్ దత్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. -
చిరంజీవి, బాలకృష్ణ.. రేసులో తెలుగు హీరోయిన్
‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి- బాబీ కాంబినేషన్లో రానున్న చిత్రంలో డస్కీ బ్యూటీ డింపుల్ హయాతికి ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. ఈమేరకు సోషల్మీడియాలో కథనాలు వస్తున్నాయి. చివరిగా భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతో మెప్పించిన ఈ తెలుగు బ్యూటీకి తన కెరీర్లో ఎక్కువగా గ్లామరస్ పాత్రలే దక్కాయి. అయితే, చిరు సినిమాలో తనకు ఒక సీరియస్ పాత్రను దర్శకుడు బాబీ క్రియేట్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.తాజా వార్తల ప్రకారం చిరంజీవి- బాబీ సినిమాలో డింపుల్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. తొలిసారి నెగటివ్ పాత్ర కోసం ఆమెను ఎంపిక చేశారని తెలియడంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆసక్తికరంగా, బాలకృష్ణ- గోపీచంద్ మలినేని తదుపరి చిత్రం కోసం నిర్మాతలు ఆమె పేరును పరిశీలిస్తున్నారనే రూమర్ వచ్చింది. అందులో కూడా ప్రతినాయక పాత్రే కావడం విశేషం. ఇలా రెండు పెద్ద ప్రాజెక్ట్లలో ఆమె పేరు రావడంతో డింపుల్ వైరల్ అవుతుంది. డింపుల్లో మంచి టాలెంట్ ఉంది. కానీ, ఆమె కెరీర్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే మంచి ఛాన్స్ ఇంకా రాలేదని నెటిజన్లు చెబుతుంటారు. చిరు- బాబీ చిత్రాన్ని కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుండగా.. బాలకృష్ణ- గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ను వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. -
‘వాలా 2 ’మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: వాలా 2నటీనటులు:హషిర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, బిజు కుట్టన్, అజిన్ జాయ్, వినాయక్ వి తదితరులు నిర్మాణ సంస్థ: షైన్ స్క్రీన్స్రచన: విపిన్ దాస్దర్శకత్వం: సావిన్ ఎస్ఏవిడుదల తేది: ఏప్రిల్ 24, 2026విభిన్నమైన కథాంశాలతో ప్రస్తుతం మలయాళం చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాయి. తెలుగులోనూ మలయాళ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. అందుకే అక్కడ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. అలా రిలీజ్ అయిన తాజా చిత్రమే వాలా 2. మలయాళంలో ఏప్రిల్ 2న విడుదలైన ఈ చిత్రం అక్కడ ఇప్పటికే రూ. 210 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. భారీ అంచనాల మధ్య నేడు(ఏప్రిల్ 24) తెలుగులో రిలీజైన ఈ మలయాళ బ్లాక్ బస్టర్ టాలీవుడ్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. నలుగురు విలేజ్ కుర్రాళ్ల చుట్టూ తిరిగే కథ ఇది. మిడిల్ క్లాస్కు చెందిన హాషిర్, అలన్, వినాయక్, అజిన్ మంచి స్నేహితులు. తల్లిదండ్రులు కష్టపడి కాలేజీకి పంపిస్తే.. వాళ్లు మాత్రం అక్కడ చదువు మీదకంటే..అల్లరి పనులపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అమ్మాయిలకు సైట్ కొట్టడం.. గొడవలు..రోజు ఇదే పని. ఓ సారి ఈ అల్లరి హద్దు దాటి, డ్రగ్స్ సేవించి టీచర్పై చేయి చేసుకోవడం దాకా వెళ్తుంది. దీంతో ఈ నలుగురిని కాలేజీ నుంచి బయటకు పంపించే పరిస్థితి ఏర్పడుతుంది. లోకస్ ఎస్సై (ఆల్ఫోన్స్ పుత్రన్) కలగజేసుకొని వీళ్లను కాపాడతాడు. ప్రిన్సిపల్తో మాట్లాడి పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తాడు. సమాజం మాత్రం వీరిని లూజర్గానే చూస్తుంది. వీళ్లు మాత్రం ఎలాగైనా ఇంటర్ పాసై.. ఉన్నత చదువు కోసం, ఉపాది కోసం యూకే వెళ్లాలనుకుంటారు. మరి వీరి కల నెరవేరిందా? పరీక్షల్లో ఈ నలుగురూ పాసయ్యారా? యూకే వెళ్లిన అలన్, వినాయక్కు ఎదురైన సమస్యలు ఏంటి? అజిన్ దుబాయ్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? హాషిర్ ఊర్లోనే ఎందుకు ఉండిపోయాడు? కళాశాల నుంచి బయటకు వచ్చాకా ఈ నలుగురి జీవితాల్లో ఎలాంటి మలుపులు వచ్చాయి? అన్నదే మిగతా కథ. ఎలా ఉందంటే.. మలయాళ సినిమాలలో చాలా వరకు వాస్తవికానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఒక సింపుల్ పాయింట్ తీసుకొని..దానికి ఎమోషన్స్ జోడించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా తెరకెక్కిస్తుంటారు. స్టార్స్ లేకున్నా..ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. అలా తెరకెక్కిన మరో మలయాళ ఆణిముత్యమే ఈ వాలా 2. 2024లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘వాలా’కు కొనసాగింపు ఇది. ఆ సినిమా మాదిరే ఈ కథ కూడా కాలేజీ కుర్రాళ్ల చుట్టూనే తిరుగుతుంది. అయితే ఇక్కడ తోబుట్టువుల అనుబంధంతో పాటు విదేశాలకు వెళ్లిన యువతరం కష్టాలను మనసుకు హత్తుకునేలా చూపించారు. వాలా మాదిరే ఈ చిత్రం కూడా ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతూ.. చివరిలో కన్నీళ్లను పెట్టిస్తుంది. ప్రేక్షకులు కథకు కనెక్ట్ అయి.. భావోద్వేగానికి గురయ్యేలా చేయడంతో దర్శకుడు సావిన్ ఎస్.ఏ, రచయిత విపిన్ దాస్ వందశాతం సక్సెస్ అయ్యారు.హాషిర్, అలన్ల బాల్యం సన్నివేశాలతో సినిమా ప్రారంభం అవుతుంది. తమ్ముడు పుట్టిన తర్వాత హాషిర్, చెల్లి పుట్టిన తర్వాత అలన్ పడే ఇబ్బందులను కామెడీగా చూపించి.. కథను కాలేజీ టర్న్ చేశారు. అక్కడ స్నేహాలు.. ప్రేమలు, చిన్న చిన్న గొడవలు ఇవన్నీ ప్రతి ఒక్కరికి కాలేజీ డేస్ని గుర్తుకు తెస్తాయి. ప్రస్తుతం కాలేజీ చదువుతున్న యువతకు అయితే ఈ నలుగురి పాత్రలను తమలోనో లేదా తమ స్నేహితుల్లోనూ చూసుకుంటారు. థియేటర్స్లో పోలీసు అధికారిపై వేసే పంచులు, ముజీబ్ సార్ ఎపిసోడ్ కడుపుబ్బా నవ్విస్తాయి. ఫస్టాఫ్ అంతా ఇలా ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇక సెకండాఫ్ మాత్రం చాలా ఎమోషనల్గా సాగుతుంది. ప్రథమార్థం ఎంత నవ్వులు పూయిస్తుందో.. ద్వితియార్థం అంత ఎమోషనల్కు గురి చేస్తుంది. మధ్యతరగతి యువత కష్టాలను, కెరీర్ టెన్షన్స్తో పాటు తోబుట్టువుల బంధం, పెరెంట్స్ పడే ఇబ్బందులను గుండెను పిండేసేలా చూపించారు. పతాక సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి.ఎవరెలా చేశారంటే.. ఇందులో నటించవారంతా కొత్తవాళ్లే. అయినా కూడా చక్కగా నటించారు. హాషిర్, అలెన్, అజిన్, వినాయక్ పాత్రలు మన నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి. వీరి మధ్య ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ప్రతిఒక్కరు చాలా సహజంగా నటించి మెప్పించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. సంగీతం, ఎడిటింగ్ బాగా కుదిరింది. డబ్బింగ్ కూడా చక్కగా కుదరడంతో ఇది మలయాళ సినిమా అనేదే మర్చిపోతాం.నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
ఖురాన్ నేర్చుకున్న ధురంధర్ దర్శకుడి సతీమణి
బాలీవుడ్ నటి యామీ గౌతమ్, ఇమ్రాన్ హష్మీ జంటగా నటించిన చిత్రం హక్.. గతేడాది విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిత్ర దర్శకుడు సుపర్న్ ఎస్ వర్మ ఈ మూవీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సినిమా మేకింగ్లో భాగంగా వాస్తవికతను తెలుసుకునేందుకు తమ టీమ్ ఎంతగానో శ్రమించిందని ఆయన వెల్లడించారు.హక్ సినిమా ఇస్లాం మత విధానం, వారి ఆచారాలు వంటి అంశాలతో నిండి ఉంటుంది. దీంతో ఇస్లామిక్ చట్టాన్ని అర్థం చేసుకోవడానికి తమకు సుమారు ఏడాదిన్నర సమయం పట్టిందని దర్శకుడుసుపర్న్ ఎస్ వర్మ తెలిపారు. షా బానో పాత్రలో యామీ గౌతమ్ జీవించారిన ఆయన అన్నారు. యామీ గౌతమ్ తన పాత్రను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి మత గ్రంథాలను అధ్యయనం చేయడంతో సహా విస్తృతమైన సన్నాహాలు చేశారని సుపర్న్ వర్మ వెల్లడించారు. ఈ పాత్ర కోసం పవిత్ర ఖురాన్ను కూడా యామీ నేర్చుకున్నారని ఆయన తెలిపారు. ఈ మూవీతో యామీ గౌతమ్కు మంచి గుర్తింపు దక్కింది. ధురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్కు ఆమె సతీమణి అనే విషయం తెలిసిందే.45 ఏళ్ల క్రితం జరిగిన షా బానో కేసును తిరిగి ఈ మూవీతో మరోసారి గుర్తుచేశారు. మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన షా బానో(62)కు, తన భర్త మహమ్మద్ అహ్మద్ ఖాన్ త్రిబుల్ తలాక్ ద్వారా విడాకులిచ్చాడు. జస్ట్ త్రిబుల్ తలాక్ అనే పదంతో తమ 40 ఏళ్ల బంధం తెగిపోయింది. అయితే, పిల్లల పోషణ బాధ్యతను పట్టించుకోకుండా భార్యను వదిలేయడంతో ఆమె 125 సీఆర్పీసీ కింద కోర్టులో పిటిషన్ వేసింది. సుమారు పదేళ్ల తర్వాత సుప్రీంలో షా బానో కేసు గెలిచింది. దీంతో భారతీయ ముస్లిం మహిళల హక్కులను కాపాడిన కేసుగా షా బానో తీర్పుకు ప్రాధాన్యత దక్కింది. -
ప్రభాస్ అభిమానిపై థియేటర్ సిబ్బంది దాడి
ప్రభాస్ హిట్ సినిమా డార్లింగ్ రీ-రిలీజ్ అయింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సుదర్శన్ థియేటర్లో షో రన్ అవుతుండగా ఉద్రిక్తత వాతావరణం కనిపించింది. ‘డార్లింగ్’ సినిమా విడుదలై 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 4K వెర్షన్లో రీ రిలీజ్ చేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ భారీగా సంఖ్యలో మరోసారి సినిమా చూసేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే, సినిమా చూస్తున్న ప్రభాస్ అభిమానిపై సుదర్శన్ థియేటర్ యాజమాన్యం దాడి చేసినట్లు ఒక వీడియో వైరల్ అవుతుంది.డార్లింగ్ సినిమాలోని పాటలు ఒక షోలో వేసి, మరో షోలో వేయకపోవడంతో అభిమానులు అభ్యంతరం తెలపడంతో తమపై దాడి చేశారని ప్రభాస్ ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే, థియేటర్ నిర్వహాకుల వర్షన్ మరోలా ఉంది. సదరు వ్యక్తి మద్యం మత్తులో థియేటర్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో తాము రియాక్ట్ అయ్యామని పేర్కొన్నారు. అయితే, ఈ విషయంలో నెటిజన్ల నుంచి వ్యతిరేఖత వస్తుంది. థియేటర్స్లలో తరుచుగా ఇలాంటి గొడవలు జరగడం సహజం. ఇలాంటి సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన యాజమాన్యం ఒకరిని కర్రతో కొట్టడం ఏంటి అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.ఈ వేసవిలో సినిమా సందడి పెద్దగా కనిపించలేదు. కొత్త సినిమాలు విడుదల లేకపోవడంతో థియేటర్స్ బోసిపోయాయి. ఇలాంటి సమయంలో ప్రభాస్ హిట్ సినిమా ప్రమోషన్లతో హడావిడి చేసిన చిన్న సినిమాలు రెండురోజుల్లోనే చేతులు ఎత్తేయడంతో బాక్సాఫీస్ వద్ద పరిస్థితి మారిపోయింది. ఇలాంటి టైంలో డార్లింగ్ రూపంలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్కు మరో ఆక్సీజెన్ దొరికింది. డార్లింగ్ సినిమాకు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు రావడం విశేషం. దర్శకుడు ఏ.కరుణాకరన్ తెరకెక్కించిన ఈ లవ్ స్టోరీకి భారీ సంఖ్యలోనే ఫ్యాన్స్ ఉన్నారు.ప్రభాస్ ఫ్యాన్పై #Sudarshan35MM థియేటర్ మేనేజ్మెంట్ దాడిSongs ఒక షోలో వేసి, మరో షోలో వేయకపోవడంతో అభిమానులు అభ్యంతరం తెలిపారు. Songs వేయాలని అడిగిన అభిమానిపై దాడి జరిగినట్టు సమాచారం.#Darling4K #Prabhas pic.twitter.com/l9zwd6sy4u— Milagro Movies (@MilagroMovies) April 23, 2026Ikada women bag lagindhi so daniki godava chesthe management motham ochi godava karraltho kottaru but baitaki anti fans misbehaving of women and spread chestunaru please share and repost this video atanu na Friend eh he's not that kind of man of misbehaving with women.#Darling4K pic.twitter.com/HIkXL8ZjVq— Jack Sparrow (@Jack_Sparrow131) April 23, 2026 -
అజిత్పై విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం.. వివరణ ఇచ్చిన టీమ్
ఓట్లు వేసిన సెలబ్రటీలు అందరూ మీడియా ముందుకు వచ్చి ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చే విధంగా వ్యాఖ్యలు చేశారు. కొందరు అయితే, తాజాగా ఓటర్లలో చైతన్యం వచ్చిందని, ఎవరికి వారు వారికి నచ్చిన వారికి ఓట్లు వేసుకోవాలని సూచించారు. అదే సమయంలో అజిత్ చేసిన ఓ వ్యాఖ్య చర్చకు దారి తీసింది. ఆయన్ని తమిళనాడులో మార్పు తథ్యమా..? అని ఓ మీడియా ప్రశ్నించగా, ఆయన నో నెవర్ అని వ్యాఖ్యలు చేసి వెళ్లి పోయారు.అయితే, ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. తమిళానాడులో మార్పు అవశ్యం లేదంటూ అజిత్ వ్యాఖ్యలు చేశారంటూ మీడియా హల్ చల్చేయడంతో టీవీకే విజయ్ అభిమానులలో ఆగ్రహం రేగినట్టైంది. దీంతో మేల్కొన్న అజిత్ తన మేనేజర్ సురేష్ చంద్ర ద్వారా వివరణ ఇచ్చారు. నో నెవర్ అని అజిత్ ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదని, ఇప్పుడు వద్దు అని వారిస్తూ ఆంగ్లంలో చేసిన వ్యాఖ్యలు మరో విధంగా అర్థానికి దారి తీసినట్టు ప్రకటించారు. -
రహస్యం ఏంటి?
ప్రముఖ నిర్మాత–దర్శకుడు ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందిన మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’. హీరోయిన్ కామాక్షీ భాస్కర్ల ప్రధాన పాత్ర పోషించారు. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ మూవీలో మహాదేవి పాత్రలో నటించిన కామాక్షీ భాస్కర్ల లుక్ని ఇటీవల రివీల్ చేశారు మేకర్స్. తాజాగా నటుడు శ్రవణ్ రెడ్డి పోషించిన సింహ పాత్ర లుక్ను విడుదల చేశారు. ‘‘డర్టీ హరి’ చిత్రంతో శ్రవణ్ రెడ్డిని తెలుగు తెరకు పరిచయం చేశారు ఎం.ఎస్. రాజు. ఇప్పుడు మరోసారి ‘అగధ’లో సింహ పాత్ర చేసే అవకాశం ఇచ్చారాయన. కథలోని దైవిక, ఆధ్యాత్మిక అంశాల చుట్టూ ఉన్న రహస్యాన్ని ఛేదించే పాత్రను సింహ పోషించారు. 85 రోజుల షూటింగ్... విస్తృతమైన సెట్ వర్క్... దాదాపు 45 నిమిషాల వీఎఫ్ఎక్స్తో ‘అగధ’ ప్రేక్షకులకు ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
కథ కొత్తగా ఉంటేనే చేస్తాను – జేడీ చక్రవర్తి
‘‘కథ వర్కౌట్ కాకపోతే క్యారెక్టర్స్ నిలవవు. ఒకవేళ నిలిచినా సినిమా ఆడదు. కథ వర్కౌట్ అయితేనే సినిమా ఆడుతుంది. ‘శివ’లో నా క్యారెక్టర్ నా పేరుగా మారిపోయింది. చక్రవర్తి అంటే గుర్తుపట్టరు, జేడీ చక్రవర్తి అంటేనే గుర్తుపడతారు. అలాగే భవాని, సత్య, కల్లు మామ... ఇలా చాలా పాత్రలు ఆడియన్స్కు గుర్తుండిపోయాయి. ‘వైఫ్ ఆఫ్ వి. వరప్రసాద్’ సినిమాలో నేను చేసిన త్యాగరాజు పాత్ర నా ఫేవరెట్ క్యారెక్టర్. ఈ పాత్ర వర్కౌట్ అయ్యింది కానీ సినిమా మాత్రం ఆడలేదు. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. అందుకే ప్రయోగాత్మక సినిమాలు, పాత్రలు చేస్తుండటం ఆపను. హీరో, విలన్... ఇలా బేరీజు వేసుకోను. కాకపోతే కథ కొత్తగా ఉంటేనే చేయాలనిపిస్తుంది’’ అని జేడీ చక్రవర్తి అన్నారు. తరుణ్ భాస్కర్ హీరోగా కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘గాయపడ్డ సింహం’. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటించగా, జేడీ చక్రవర్తి ఓ కీలక పాత్రలో నటించారు. పవన్ సాధినేని సమర్పణలో కల్యాణ చక్రవర్తి మంధని, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నేను బ్రూటర్ ధర్మ అనే పాత్ర చేశాను. కానీ స్క్రీన్పై నేను చేసే పనులు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాయి. దర్శకుడు కశ్యప్ నా పాత్రను కొత్తగా ప్రజెంట్ చేశాడు. ఫస్ట్ హాఫ్–సెకండ్ హాఫ్.. రెండింటిలో ఒకే విధంగా కనిపిస్తూ, రెండు షేడ్స్లో కనిపించే ధర్మ పాత్ర నన్ను ఎగ్జైట్ చేసింది’’ అని అన్నారు. -
చాలా ఇష్టమంటోన్న బిగ్బాస్ దివి.. ఫస్ట్ టైమ్ అంటోన్న యషిక ఆనంద్
మొక్కల పెంపకంలో బిజీగా బిగ్బాస్ దివి..శారీలో బిగ్బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా అందాలు..బీచ్లో చిల్ అవుతోన్న బాలీవుడ్ భామ సిమ్రత్ కౌర్..ఫస్ట్ టైమ్ ఓటేసిన ఆనందంలో యషిక ఆనంద్ పోజులు..పెళ్లి కూతురిలా ముస్తాబైన మంచు లక్ష్మీ.. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 20 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లలో కొత్త సినిమాల సందడి ఉంటుంది. ఈ వారంలో కూడా పెద్ద సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద కనిపించడం లేదు. వాళా-2 తెలుగు డబ్బింగ్ వర్షన్తో పాటు గేదేల రాజు లాంటి సినిమాలపై అంతగా బజ్ లేదు. వాళా-2 మలయాళ హిట్ మూవీ కావడంతో కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఫ్రైడే సినిమాలు అలరించేందుకు రెడీ అయిపోయాయి. వీటిలో తెలుగు మూవీ బ్యాండ్మేళంపై ఆడియన్స్లో ఆసక్తి నెలకొంది. దీంతో పాటు జీవీ ప్రకాశ్ హ్యాపీ రాజ్ డబ్బింగ్ సినిమా, మలయాళ మూవీ ప్రతిఛాయ ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. అంతే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ నుంచి పలు చిత్రాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్కు సిద్ధమయ్యాయి. ఈ శుక్రవారం ఒక్క రోజే అన్ని కలిపి దాదాపు 20 చిత్రాలు ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్ఫ్లిక్స్ అపెక్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 24 నుక్కడ్ నాటక్(హిందీ సినిమా)- ఏప్రిల్ 24 ఇఫ్ విషెస్ కుడ్ కిల్(హాలీవుడ్ మూవీ)- ఏప్రిల్ 24 నీ ఫరెవర్(హిందీ మూవీ)- ఏప్రిల్ 24 సోనిక్3 ది హెడ్జ్హాగ్(హాలీవుడ్)- ఏప్రిల్ 24 అన్కామన్ వాలర్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 24 మై డ్రెస్అప్ డార్లింగ్(జపనీస్ మూవీ)- ఏప్రిల్ 2528యర్స్ లేటర్- ది బోన్ టెంపుల్(హాలీవుడ్)- ఏప్రిల్ 26జియో హాట్స్టార్ ప్రతి ఛాయ (మలయాళ మూవీ) - ఏప్రిల్ 24 24 (హిందీ సిరీస్) - ఏప్రిల్ 24సన్ నెక్స్ట్జేసీ ది యూనివర్సిటీ(కన్నడ మూవీ)- ఏప్రిల్ 24జీ5 బ్యాండు మేళం (తెలుగు మూవీ) - ఏప్రిల్ 24 జిరాక్స్ (కన్నడ సిరీస్) - ఏప్రిల్ 24అమెజాన్ ప్రైమ్ హ్యాపీరాజ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఏప్రిల్ 24 నాటీ బిజినెస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 24 మార్టీ సుప్రీమ్(హాలీవుడ్ మూవీ)- ఏప్రిల్ 24 న్యూ బండిట్స్- సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 24 ఇమ్మార్షల్ కాంబాట్(హాలీవుడ్)- ఏప్రిల్ 24లయన్స్ గేట్ ప్లే గ్రీన్ ల్యాండ్ 2: మైగ్రేషన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 24ఆపిల్ టీవీ ప్లస్ మై బ్రదర్ ద మినోటర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 24హులు..నో అదర్ ఛాయిస్ (హాలీవుడ్)- ఏప్రిల్ 24ముబీ..సౌండ్ ఆఫ్ ఫాలింగ్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 24 -
ఓటేసిన తర్వాత త్రిష చేసిన తొలి పోస్ట్ ఇదే!
తమిళనాడు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈసారి రాష్ట్రంలో ముక్కోనపు పోటీ నెలకొంది. డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు కోలీవుడ్ స్టార్ విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం(టీవీకే)’ పార్టీ కూడా తొలిసారి ఎన్నికల బరిలోకి దిగింది.దీంతో సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. టీవీకే అధినేత హీరో విజయ్, రజనీకాంత్, అజిత్, ధనుష్, శ్రుతి హాసన్, కమల్ హాసన్, త్రిష, ఖుష్బూ, శివ కార్తికేయన్, డైరెక్టర్ అట్లీ తదితర ప్రముఖులు తమకు కేటాయించిన పోలీంగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. అయితే వీరిలో అందరి దృష్టిని ఆకర్షించింది త్రిష అని చెప్పొచ్చు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు విజయ్తో ఆమె రిలేషన్లో ఉన్నట్లు రూమర్స్ రావడం.. అవి నిజమే అన్నట్లుగా ఇద్దరూ కలిసి ఓ ఫంక్షన్కి హాజరకావడంతో త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నేడు ఓటు వేయడానికి వచ్చిన త్రిషపై మీడియా ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అయితే త్రిష మాత్రం సింపుల్గా వచ్చి ఓటు వేసి వెళ్లింది. విజయ్కి మద్దతుగా ఒక్క మాట మాట్లాడలేదు కానీ.. తాను టీవీకే పార్టీకే ఓటు వేశానని పరోక్షంగా చెప్పేసింది.ఇన్స్టాలో తొలి పోస్ట్.. చెన్నైలోని పోలింగ్ కేంద్రంలో తన తల్లి ఉమతో కలిసి ఓటు వేసిన త్రిష, ఆ తర్వాత తన వేలికి ఉన్న సిరా చుక్కను చూపిస్తూ ఫోటో దిగి వెళ్లిపోయారు. కాసేపటికే ఆ ఫోటోని తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేసింది. అంతవరకు బాగానే ఉన్నా.. ఆ ఫోటోకు ఆమె జోడించిన పాట ఇప్పుడు అసలైన రచ్చకు కారణమైంది.పాటతో ఇలా చెప్పేసిందిత్రిష షేర్ చేసిన పోటోకి బ్యాగ్రౌండ్లో ఓ పాటను జోడించింది. అది విజయ్తో కలిసి త్రిష నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'గిల్లి'లోని 'అర్జునర్ విల్లు' అనే పాట. కేవలం పాటను ఎంచుకోవడమే కాదు, అందులో కేవలం 'విజిల్స్'వినిపించే భాగాన్ని మాత్రమే ఆమె తన పోస్ట్కి జత చేసింది. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. విజయ్ పార్టీ గుర్తు విజిల్. అందుకే త్రిష ఆ పాటతో షేర్ చేసిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. విజయ్కు మద్దతు తెలపడానికే త్రిష ఈ పాటను వాడారని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక విజయ్ అభిమానులు అయితే త్రిషను ఏకంగా ‘వదినమ్మ’అని సంభోదిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్ -త్రిషలు పెళ్లి చేసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. -
ఓటీటీకి వంద కోట్ల సూపర్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
మలయాళ సినిమాలు ఓటీటీలో తెగ చూసేస్తున్నారు. దీంతో అక్కడి హిట్ అయిన చిత్రాలు తెలుగు డబ్బింగ్ వర్షన్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కంటెంట్ నచ్చడంతో ఓటీటీల్లో ఎక్కువగా మలయాళ చిత్రాలకే డిమాండ్ ఉంటోంది. ఇటీవలే స్ట్రీమింగ్ వచ్చేసిన సంభవం అధ్యాయం ఒన్ను సినీ ప్రియులను ఆకట్టుకుంది. అంతలోనే మరో మలయాళ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.మిధున్ మాన్యువల్ థామస్ డైరెక్షన్లో వచ్చిన ఆడు 3: వన్ లాస్ట్ రైడ్: పార్ట్ 1 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రం జీ5 వేదికగా మే 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. అక్కడ హిట్ కొట్టిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఓటీటీ ప్రియులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే. ఈ మూవీలో జయసూర్య, వినాయకన్, ఇంద్రన్స్, ధర్మజన్, సైజు కురుప్, అల్లేయ బోర్న్ కీలక పాత్రల్లో నటించారు. #Aadu3 (Malayalam) Streaming from May 1 on Zee5 in Malayalam, Tamil, Telugu, Kannada & Hindi 🍿!!#OTT_Trackers pic.twitter.com/eJURte08qN— OTT Trackers (@OTT_Trackers) April 23, 2026 -
తమిళనాడు ఎన్నికలు.. హీరోయిన్కు చేదు అనుభవం
ప్రముఖ నటి అక్షయ హరిహరన్కు చేదు అనుభవం ఎదురైంది. తమిళనాడు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లిన ఆమెకు షాక్ తగిలింది. అప్పటికే ఆమె ఓటును మరొకరు వేయడంతో షాకింగ్కు గురైంది. అడయార్లోని పోలింగ్ కేంద్రానికి వెళ్లిన హరిహరన్ ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.నా దగ్గర ఉన్న అన్ని ఐడీలు చూపించి ఓటు వేసే అవకాశం కల్పించాలని పోలింగ్ సిబ్బందిని కోరినట్లు అక్షయ హరిహరన్ తెలిపింది. నా ఓటు వేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను కోరింది. అలాగే ఆ ఓటును క్యాన్సిల్ చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది. తన ఓటు వేసేందుకు వచ్చిన సెలబ్రిటీకి ఇలాంటి అనుభవం ఎదురవ్వడం ఎన్నికల అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. కాగా.. అక్షయ హరిహరన్ తమిళంలో పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. సబా నాయగన్, రంగోలి, బ్లడీ బగ్గర్, హే సినామికా లాంటి సినిమాల్లో మెప్పించింది. నా ఓటు వేరే వాళ్లు వేశారని తెలిసి షాక్ అయ్యాను: నటి అక్షయ హరిహరన్ఓటు వేసేందుకు అడయార్ లోని పోలింగ్ కేంద్రానికి వెళ్లానుకానీ అప్పటికే నా పేరుతో వేరే వ్యక్తి ఓటు వేసినట్లు తెలిసి షాక్ అయ్యానునా దగ్గర ఉన్న అన్ని ఐడీలు చూపించి ఓటు వేసే అవకాశం కల్పించాలని పోలింగ్ సిబ్బందిని… pic.twitter.com/SJtyWZkQ8L— ChotaNews App (@ChotaNewsApp) April 23, 2026 -
కొత్త బ్యూటీతో విజయ్ డేటింగ్.. ఎవరీ అలియా?
సినీ తారలకు ప్రేమ, పెళ్లిళ్లు ఎంత కామనో.. బ్రేకప్, విడాకులు కూడా అంతే కామన్. ఎప్పుడు ఎందుకు ప్రేమలో పడతారో..ఎందుకు విడిపోతారో తెలియదు. ఇలా ప్రేమ విషయాన్ని బయటపెట్టి..అలా బ్రేకప్ చెప్పుకుంటారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటామని చెప్పి.. కొన్నాళ్లకే బ్రేకప్ అయిపోయిందటారు. అలా విడిపోయి సడెన్ షాక్ ఇచ్చిన వారిలో విజయ్ వర్మ-తమన్నా జంట ఒకటి. దాదాపు మూడేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట.. కొన్నాళ్ల క్రితం విడిపోయి అందరికి షాకిచ్చింది. తమన్నాతో బ్రేకప్ తర్వాత విజయ్ పలువురు హీరోయిన్లతో సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దంగల్ బ్యూటీ ఫాతిమా సనాతో ప్రేమలో పడ్డాడనే వార్తకు కూడా వినిపించాయి. కానీ ఫాతిమా ఆ వార్తలను ఖండించింది. ఆ తర్వాత విజయ్ మరో యంగ్ బ్యూటీతో రిలేషన్లో ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. అది నిజమే అన్నట్లుగా వాలెంటైన్స్ డే రోజు ఓ అమ్మాయి చేతిలో చేయి వేస్తున్న ఫోటోని షేర్ చేసి..దానికి లవ్ ఎమోజీనీ జోడించాడు. ఈ పోస్ట్ని ఖుషి అహుజా అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్కు ట్యాగ్ చేశాడు. దీంతో విజయ్ వర్మ మరోసారి ప్రేమలో పడ్డాడని అనుకున్నారు.తాజాగా ఆ బ్యూటీ పేరు బయటకు వచ్చింది. విజయ్ వర్మ ప్రస్తుతం నటి అలియా ఖురేషితో రిలేషనల్లో ఉన్నట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. అలియా ఖురేషితో కలిసి విజయ్ వర్మ ఓ హోటల్ నుంచి బయటకు వస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.ఇద్దరూ కలిసి ముంబైలోని ఓ హోటల్ నుంచి బయటకు రావడం, ఒకే కారులో కలిసి వెళ్లడంతో ఇద్దరూ రిలేషన్లో ఉన్నరానే పుకార్లు బయటకు వచ్చాయి.ఎవరీ ఖురేషీ?షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమాలోని గర్ల్ గ్యాంగ్లో ‘జాన్వి’పాత్రలో మెరిసిన బ్యూటీనే అలియా ఖురేషి. నటి మాత్రమే కాదు, సింగర్ కూడా. ఇన్స్టాలో ‘ఝాలివర్స్’ పేరుతో ఉన్న ఆమెకు లక్షల్లో ఫాలోయర్స్ ఉన్నారు. ప్రముఖ మ్యూజికల్ సిరీస్ 'బందిష్ బాండిట్స్' రెండవ సీజన్లో అనన్య పాత్రలో కనిపించింది. తాజాగా ఇభ్రహీం అలీఖాన్, ఖుషీ కపూర్ల ‘ నదానియన్’ మూవీలో కీలక పాత్ర పోషించింది. మరి నిజంగానే విజయ్ - అలియాలు ప్రేమలో ఉన్నారా? లేక జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనా అనేది తెలియాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే. Vijay Varma was spotted with rumoured girlfriend Alia Qureshi at Mizu Restaurant in Bandra, sparking fresh dating buzz.#VijayVarma #AliaQureshi #CelebSpotted #Bollywood #DatingRumours #Mumbai pic.twitter.com/aMnpXoolNq— The Daily Jagran (@TheDailyJagran) April 21, 2026 -
పెద్ది ఐటమ్ సాంగ్.. ఎట్టకేలకు స్టార్ హీరోయిన్ ఫిక్స్..!
రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ వాయిదా వేయడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇంకా ఓ ఐటమ్ సాంగ్ షూట్ పెండింగ్లో ఉండడంతో ఏప్రిల్ 30న రావాల్సిన పెద్ది జూన్కు షిఫ్టయ్యాడు. అయితే ఇప్పటి వరకు ఐటమ్ సాంగ్ కోసం హీరోయిన్ ఎంపిక చేయకపోవడంతో ఫ్యాన్స్లో క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది. రోజుకొక హీరోయిన్ పేరు వినిపిస్తున్న వీటిపై అధికారిక ప్రకటనైతే రాలేదు.ఇటీవలే సంయుక్త మీనన్ ఈ ఐటమ్ సాంగ్ చేయనుందని టాక్ వినిపించింది. గతంలో మృణాల్ ఠాకూర్, మానస అని పలువురు కూడా తెరపైకొచ్చాయి. కానీ అంతలోనే ఊహించని మరో స్టార్ హీరోయిన్ పేరు బయటకొచ్చింది. పెద్ది ఐటమ్ సాంగ్లో కోలీవుడ్ భామ శృతి హాసన్ చేయనుందని లేటేస్ట్ టాక్ నడుస్తోంది. దాదాపు శృతిని మేకర్స్ ఖరారు చేశారని తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఒకవేళ ఇదే నిజమైతే పెద్ది సరసన శృతి హాసన్ చిందులేయనుంది. ఈ ఐటమ్ సాంగ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఫ్యాన్స్లో క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఈ సాంగ్ కచ్చితంగా స్పెషల్గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాని బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు. -
అప్పుడు మేజర్.. ఇప్పుడు డెకాయిట్.. మూవీ లవర్స్కు గుడ్ న్యూస్
టాలీవుడ్ హీరో అడివి శేష్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ డెకాయిట్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఏప్రిల్ 10న రిలీజైన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. మొదటిరోజు అడివి శేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రూ. 15 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. ఇప్పటికీ వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపిస్తోంది. ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహించారు. తాజాగా డెకాయిట్ మూవీ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. సినీ ప్రియులకు ఊరట కల్పించేలా టికెట్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని అడివి శేష్ ట్విటర్లో షేర్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు తగ్గించారు. ఏపీలోని సింగిల్ స్క్రీన్స్లో రూ.105, రూ.70గా ధరలు నిర్ణయించారు. తెలంగాణలోని సింగిల్ స్క్రీన్స్లో రూ.105, రూ.80, రూ.50గా ఖరారు చేశారు. టీజీలోని అన్ని మల్టీప్లెక్స్ల్లో మాత్రం రూ.150గా ఫిక్స్ చేశారు. తగ్గించిన ధరలు ఈనెల 24వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. కాగా.. గతంలో మేజర్ సినిమాకు కూడా ఇదే తరహాలో టికెట్ ధరలు తగ్గించారని ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో డెకాయిట్ మూవీని థియేటర్లలో చూడాలనుకున్నావారికి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మూవీని సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మించారు. ఈ చిత్రంలో ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు. Thank you for all the LOVE ❤️🔥❤️🔥❤️🔥Appudu #MAJOR ki Lowest Ticket PriceIppudu #DACOIT ki. We called the Theaters and Spoke to them about Lowering Ticket Prices ❤️🔥❤️🔥❤️🔥ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ధరల్లో:👉 ఆంధ్రప్రదేశ్ – ₹105, ₹70👉 తెలంగాణ – ₹105, ₹80, ₹50… pic.twitter.com/63Cq0H0Q4m— Adivi Sesh (@AdiviSesh) April 23, 2026 -
ఆదా శర్మ.. మరో సెన్సేషనల్ సినిమా
ది కేరళ స్టోరీ మూవీతో సెన్సేషనల్ హిట్ కొట్టిన హీరోయిన్ ఆదా శర్మ. ఈ మూవీపై ఎన్ని వివాదాలొచ్చినా బాక్సాఫీస్ వద్ద మాత్రం సూపర్ హిట్ను సొంతం చేసుకుంది. బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 2023లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కళ్ల చెదిరే కలెక్షన్స్ రాబ్టటింది. ఇటీవలే ఈ మూవీకి సీక్వెల్గా వచ్చిన ది కేరళ స్టోరీ-2 రిలీజై హిట్గా నిలిచింది.తాజాగా ఆదా శర్మ మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది ముద్దుగుమ్మ. గవర్నర్ ది సైలెంట్ సేవియర్ పేరుతో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా షేర్ చేసింది ఆదా శర్మ. 'ఈనాడు మనం ఒక ప్రపంచ శక్తిగా నిలిచామంటే.. దానికి కారణం ఒక అజ్ఞాత వీరుడు సాగించిన ఒక అప్రకటిత యుద్ధమే' అంటూ గవర్నర్ పోస్టర్ పంచుకుంది. ఈ చిత్రం జూన్ 12, 2026న థియేటర్లలో విడుదల కానుందని పోస్ట్ చేసింది. ఈ చిత్రానికి చిన్మయి దీపక్ మండ్లేకర్ దర్శకత్వం వహించగా.. విపుల్ అమృత్లాల్ షా నిర్మించారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఆర్బీఐ బ్యాంక్, మనదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బ్యాంకుల్లో జరిగే అవతవకలు, మోసాలే లక్ష్యంగా ఈ మూవీని రూపొందించినట్లు పోస్టర్లో చూస్తే అర్థమవుతోంది. గవర్నర్ టైటిల్తోనే ఈ మూవీ థీమ్ ఏంటో ఇట్టే తెలిసిపోతోంది. My next ❤️GOVERNOR releasing in cinemas on 12th June, 2026.We are a world power todaybecause an unsung hero fought an untold war.GOVERNOR releasing in cinemas on 12th June, 2026.@BajpayeeManoj @adah_sharma #NoushadMohamedKunju @madhoo69 #ParitoshSand @KurupKrisha… pic.twitter.com/QdlMFeeM0v— Adah Sharma (@adah_sharma) April 23, 2026 -
నా ఓటు టీవీకే పార్టీకే వేశా.. విజయ్ సీఎం అవుతాడు: వీటీవీ గణేష్
తమిళనాడులో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. సినీ నటుడు విజయ్ పార్టీ టీవీకే కూడా ఈ సారి పోటీలో ఉండడంతో సినీ తారలంతా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్నారు. రజనీకాంత్, ధనుష్, త్రిష, మణిరత్నం, అజిత్, శృతీహాజన్తో పాటు పలువురు తమిళ స్టార్స్ ఇప్పటికే తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. వీరితో పాటు సినీ నటుడు వీటీవీ గణేష్ కూడా తన ఓటు హక్కుని వినియోగించుకున్నాడు. చెన్నై నందనంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో ఓటు వేశాడు. అనంతరం పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్న ఆయనను మీడియా పలకరించగా, తాను టీవీకే పార్టీ అభ్యర్థికి ఓటు వేశానని.. విజయ్ సీఎం అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు.‘ఇప్పుడే ఓటు హక్కు వినియోగించుకున్నాను. విజయ్ పార్టీ టీవీకేకు ఓటు వేశాను. సొసైటీని అప్గ్రేడ్ చేయడానికి విజయ్ పర్ఫెక్ట్ ఫిట్ అని నేను నమ్ముతున్నాను. సిస్టమ్, ప్రజలకు మంచి చేస్తారని బలంగా నమ్ముతున్నాను. నాకు ఇతర పార్టీల గురించి మాట్లాడటం ఇష్టం లేదు. ఎందుకంటే నేను టీవీకే పార్టీకి చెందిన వాడిని కాబట్టి ఆ పార్టీ గురించే మాట్లాడుతాను. టీవీకే పార్టీ గెలువాలని కోరుకొంటున్నాను. నిన్నటి వరకు విజయ్ పార్టీ గెలుస్తుందా? లేదా? అనే కొంత గందరగోళం ఉంది. ఓటింగ్ సరళిని చూస్తే ఈ రోజు మాత్రం విజయ్ పార్టీ విజయం సాధించడం ఖాయమని తేలిపోయింది. మే 4వ తేదీ వరకు వేచి ఉండండి. టీవీకే పార్టీ గెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు’ వీటీవీ గణేష్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, విజయ్ టీవీకే పార్టీ తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. విజయ్ కూడా తిరుచురాపల్లి ఈస్ట్, పెరంబూర్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. మే 4న తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.#WATCH | Tamil Nadu Elections 2026 | Actor VTV Ganesh says, "I cast my vote to TVK. Vijay is a perfect fit to upgrade the society, people and the system... I want him to become the CM..."He also says, "Young voters should exercise their voting rights..." pic.twitter.com/RWJ5mc5ydS— ANI (@ANI) April 23, 2026 -
కొన్ని దుష్టశక్తులు నాపై కుట్ర: సింగర్ మంగ్లీ మరో పోస్ట్
సింగర్ మంగ్లీ వివాదం ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో మరో పోస్ట్ చేసింది. మైక్రో ఫైనాన్స్, శుభక్షేత్ర ఇన్ఫ్రా మోసాలతో బాధితులకు అన్యాయం జరిగిందని తెలిపింది. వాళ్లకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నానని వెల్లడించింది. బాధితుల తరఫున అండగా ఉంటానని గతంలో చెప్పానని.. ఇప్పుడు కూడా ఆ మాటకు కట్టుబడి ఉన్నానని పేర్కొంది. ఈ ఆర్థిక మోసాలతో నాకు ఎలాంటి ప్రమేయం లేదని బహిరంగంగా ప్రకటిస్తున్నానని మంగ్లీ తెలిపింది.కానీ కొందరు వ్యక్తులు, దుష్ట శక్తులు అదే పనిగా నాపై దుష్ప్రచారం చేస్తున్నారని సింగర్ మంగ్లీ ఆవేదన వ్యక్తం చేసింది. నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజం ఏంటనేది నిలకడపై తెలుస్తుందని.. న్యాయ వ్యవస్థ, చట్టాలపై తనకు పూర్తిగా నమ్మకముందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Mangli 🎙️ (@iammangli) -
ఏడాది తర్వాత సినీ నటి రన్యారావు విడుదల
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావు విడుదల అయ్యారు. విదేశాల నుంచి భారత్కు అక్రమంగా బంగారాన్ని తీసుకొస్తూ బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె పట్టుబడిన విషయం తెలిసిందే. ఒక ఏడాదిలోనే 127 కిలోల బంగారాన్ని అక్రమంగా తీసుకువచ్చినట్లు ఈడీ అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ కేసు నమోదు చేసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఆమెను ఇక విచారించబోదని తెలిపారు. గత ఏడాది మార్చిలో రన్యారావు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆమె అరెస్ట్ గడువు ముగియడాన్ని కూడా డీఆర్ఐ అధికారులు సవాలు చేయబోదని, గడువు పొడిగింపు కోరడం లేదని అధికారులు పేర్కొన్నారు. దీంతో బెంగళూరులోని ఆర్థికనేరాల నియంత్రణ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు తీర్పు అనంతరం పరప్పన అగ్రహార కారాగారం నుంచి రన్యారావు విడుదలయ్యారు. -
‘రాకా’ నుంచి తప్పుకున్న దీపికా పదుకొణె.. టీమ్ క్లారిటీ
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె రెండోసారి తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవల ఆమే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే ప్రెగ్నెన్సీ ప్రకటన తర్వాత దీపికపై రకరకాల రూమర్స్ వచ్చాయి. సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు ఇప్పటికే ఆమె ఒప్పుకున్న ‘రాకా’ మూవీ నుంచి కూడా తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. ప్రెగ్నెంట్తో ఆమె షూటింగ్లో పాల్గొనడం కష్టం అని తెలిసి.. దీపిక స్థానంలో మరో నటిని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై ‘రాకా’ టీమ్ స్పందించింది. దీపికను తొలగించారనే వార్తల్లో నిజం లేదని టీమ్ స్పష్టం చేసింది. అంతేకాదు ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిన తర్వాత ఆమె పాత్ర నిడివిని తగ్గించారనే ప్రచారాన్ని కూడా టీమ్ ఖండించింది. సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం అని.. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ కొనసాగుతుందని స్పష్టం చేసింది.అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో దీపిక కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఆమె పాత్రకు యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయట. గర్భం దాల్చినప్పటికీ.. యాక్షన్ సీన్స్ చేసేందుకు దీపిక ఒప్పుకుందట. నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఈ షూటింగ్ పూర్తి చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో దీపికతో పాటు రష్మిక, జాన్వీకపూర్, మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నట్లు సమాచారం.బన్నీ హీరోగా, విలన్గా ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఇప్పటికే విలన్ లుక్ రిలీజ్ అయింది. త్వరలోనే హీరో పాత్రకు సంబంధించిన లుక్ కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హీరో పాత్రలో బన్నీ స్టైలీష్గా కనిపించబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
తారలెందరో...తాగుబోతులు కొందరే..
సినిమా సెలబ్రిటీల్లో మద్యపానం చాలా సార్లు ‘‘సోషల్ ఫన్’’గా మొదలై, ఆ తర్వాత అలవాటుగా మారిపోతుంది. షూటింగ్ల మధ్య రిలాక్స్ కావడానికి లేదా ఫ్రెండ్స్తో కాసేపు టైమ్ స్పెండ్ చేయడానికి సాకుగా మొదలయే డ్రింకింగ్, తర్వాత తర్వాత పలు సందర్భాల్లో కంట్రోల్ తప్పే పరిస్థితులు తీసుకువస్తుందని పెద్ది హీరోయిన్ జాన్వీకపూర్ అభిప్రాయపడ్డారు. అయితే, ఎప్పుడు ఆపాలో తెలుసుకోవడం అవసరం అంటారామె‘‘లైఫ్లో బ్యాలెన్స్ చాలా ముఖ్యం’’ అన్నదే ఆమె మెసేజ్. ‘‘మద్యం అలవాటు గురించి సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు’’ అని చెప్పింది. ఆమె సందేశం స్పష్టంగా ఉంది ‘‘అడిక్షన్ అంటే తప్పు కాదు అది ఒక సమస్య. దానికి పరిష్కారం అవసరం. అంటూ అమహ అనే స్వఛ్చంద సంస్థతో కలిసి ఇటీవలే ఆమె ఆఫ్ ద రాక్స్ పేరుతో మద్యపానంపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ నేపధ్యంలో మద్యం తాగి పడిపోయి మృతి చెందారని తన తల్లి శ్రీదేవి మరణం గురించి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మన దగ్గర కూడా మహానటి సావిత్రి సహా అనేక మంది స్టార్ల జీవితాలను మద్యం మహమ్మారి పొట్టన బెట్టుకున్న కధలూ మనకు తెలుసు. సినీ ప్రముఖుల్లో కొందరు ఆ అలవాటుకే జీవితాన్ని అర్పించుకుంటే మరికొందరు మాత్రం తొలుత మత్తు కోరల్లో చిక్కినప్పటికీ ఆ తర్వాత దాని నుంచి విజయవంతంగా తప్పించుకోగలుగుతారు. అలాంటి వారే యువ తారలకు స్ఫూర్తిగా నిలుస్తారు. సీసా వదిలేశాకే....సీన్ మారింది...‘‘బాటిల్ నుంచి బయటపడిన తర్వాతే నిజమైన నన్ను తిరిగి పొందాను’’అంటూ చెప్పారు నటి, దర్శకురాలు పూజా భట్. ఓ ఇంటర్వ్యూలో ఆమె తన మద్యం అలవాటుపై ఓపెన్ గా మాట్లాడారు యుక్త వయసులో మద్యానికి అలవాటు పడిన తాను 45 ఏళ్ల వయసులో దాని నుంచి బయటపడాలనే కీలక నిర్ణయం తీసుకున్నానని ఆమె చెప్పారు. ‘‘నేను ఇంకో 10 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించాలంటే ఇప్పుడే మద్యం వదలేయాలి అనిపించింది. లేదంటే అదే నన్ను నాశనం చేసేస్తుందని అర్ధమైంది’’ అని అన్నారామె.తన జీవితంలో మద్యం ఒక ‘బ్యాండ్ఎయిడ్’లా (ఏదైనా దెబ్బ తగిలిన వెంటనే దానికి చేసే ప్రాధమిక చికిత్స) మారిపోయిందని, ప్రతీసారీ తన బాధను మర్చిపోవడానికి దానిని ఉపయోగించేదానినని ఆమె పంచుకుంది.‘‘చెడు సంబంధం, మద్యం ఇవి రెండూ నన్ను బాధ నుంచి తప్పించడానికి నేను వాడుకున్న సాధనాలే,’’ అని ఆమె చెప్పింది. అయితే చివరకు తనను తాను అర్థం చేసుకుని, జీవితంలో ఎదురైన ఖాళీని ఎదుర్కొని ముందుకు సాగానని చెప్పింది. ‘‘నేను బాటిల్ను పూర్తిగా వదిలేశాను ఇప్పటికి ఏడు సంవత్సరాలుగా సోబర్గా ఉన్నాను,’’ అని ఆమె సగర్వంగా ప్రకటించింది.నమ్మించి నాశనం చేస్తుంది‘‘మద్యం నెమ్మదిగా నా జీవితంలోకి వచ్చింది. ఒక దశలో దానివల్ల నా జీవితం తలకిందులైంది, ఈ అలవాడు మొదట మనకు ఎంతో సహాయం చేస్తున్నట్టు అనిపిస్తుంది. కొంత కాలం తర్వాతే దాని వల్ల మనం నాశనం అవుతున్నాం అనేది తెలుస్తుంది. అది నిజానికి ఏ సమస్యకు పరిష్కారం కాదు’’ అంటారు ఒకనాటి అందాల తార మనీషా కొయిరాలా.. హౌ కేన్సర్ గేవ్ మి ఎ న్యూ లైఫ్ పేరిట తను రాసిన పుస్తకంలో ఆమె తన జీవితానుభవాల్లో మద్యం వ్యసనం గురించి వివరించారు. ‘‘ సంబంధాలు కావచ్చు, మద్యం లాంటి అలవాట్లు కావచ్చు జీవితంలో ఏదైనా పరే... మనమే నియంత్రించాలి. లేదంటే మనమే బాధితులం అవుతాం,’’ అని స్పష్టంగా చెబుతారు.విస్కీ నుంచి విముక్తి...‘‘ఒకప్పుడు విస్కీకి బాగా అలవాటు పడిపోయాను ఓ రకంగా చెప్పాలంటే విస్కీకి బానిసయ్యాను’’ అంటూ గుర్తు చేసుకుంటారు శృతిహాసన్. క్రమక్రమంగా దాని వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు, డిప్రెషన్... ఇంకా ఎన్నో చుట్టుముట్టాయని తాను గుర్తించానని తెలిపారు. మద్యం తన జీవితాన్ని నియంత్రిస్తున్నదని గ్రహించి దాన్ని పూర్తిగా వదిలేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అందుకు అనుగుణంగా ఆమె తన జీవనశైలిని పూర్తిగా మార్చుకున్నారు. ముఖ్యంగా నైట్ పార్టీలు, మద్యం ఉప్పోంగే విందు వినోదాల వాతావరణానికి దూరంగా ఉండడం అలవాటు చేసుకుంది. ‘‘ఇప్పుడు వ్యసనం నుంచి పూర్తిగా స్వేచ్ఛ లభించింది. దీని గురించి నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు నా జీవితం ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది,’’ అని సంతోషం వ్యక్తం చేశారు. -
తల్లి కాబోతున్న మోనాలిసా.. పోలీసులకు భర్త ట్విస్ట్ !
కుంభమేళాలో పూసలు, రుద్రాక్ష మాలలు అమ్ముతూ సోషల్మీడియాలో గుర్తింపు పొందిన ‘మోనాలిసా భోంస్లే’ తల్లి కాబోతున్నట్లు ఆమె భర్త ఫర్మాన్ తెలిపాడని కథనాలు వస్తున్నాయి. తల్లిదండ్రులను కాదని కేరళకు చెందిన ఫర్మాన్ అనే యువకుడిని ప్రేమించి మార్చి 11న ఒక ఆలయంలో వివాహం చేసుకుంది. అయితే, పోలీసు దర్యాప్తులో మోనాలిసా మైనర్ అని తేలడంతో ఆమె భర్తపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా మోనాలిసాను విచారణకు హాజరు కావాలని తెలిపారు.మోనాలిసా పుట్టిన ఆసుపత్రి రికార్డుల ప్రకారం పెళ్లి జరిగిన నాటికి ఆమె వయసు 16 ఏళ్ల 2 నెలల 12 రోజులేనని అధికారికంగా తేలింది. దీంతో మోనాలిసా భర్తపై పోక్సో కేసు నమోదు చేయడంతో చిక్కుల్లో పడ్డాడు. ఈ అంశంపైన ఆమెను విచారించాలని పోలీసులు ప్రయత్నం చేశారు. అయితే, తన భార్య మోనాలిసా ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో ఈ విచారణ కోసం ప్రయాణం చేయలేదని మధ్యప్రదేశ్ పోలీసులతో ఫర్మాన్ ఖాన్ తెలియజేశారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మోనాలిసా కేరళలో ఉంది.మోనాలిసా తల్లి కాబోతుందని ఫర్మాన్ పోలీసులు వద్ద తెలిపారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఆమె నిజంగానే తల్లి కాబోతుందా..? లేదా కేసు నుంచి తప్పించుకునేందుకు ఫర్మాన్ ఏమైనా ప్లాన్ చేశాడా అనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. -
ధృవ నక్షత్రం విడుదలపై క్లారిటీ రానుందా..?
విక్రమ్- దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘ధృవ నక్షత్రం’.. సుమారు పదేళ్ల క్రితమే విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడింది. సినిమా మొదలు పెట్టిన సమయం నుంచి అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ఈ ప్రాజెక్ట్ చివరకు కోర్టు వరకు పంచాయితీ చేరింది. హీరో శింబుతో దర్శకుడు గౌతమ్ మేనన్ ఒక సినిమా చేస్తానని ఒప్పుకుని రూ. 2.40 కోట్లు అడ్వాన్స్ తీసుకుని పూర్తి చేయలేదంటూ ఆల్ ఇన్ పిక్చర్స్ సంస్థ చెన్నై హకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమకు డబ్బు తిరిగి ఇచ్చిన తర్వాతే ‘ధృవ నక్షత్రం’ సినిమా విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరింది. దీంతో ‘ధృవ నక్షత్రం’ చిత్రానికి బ్రేకులు పడ్డాయి.‘ధృవ నక్షత్రం’ సినిమా విడుదలకు సంబంధించిన వివాదంలో ఇరుపక్షాల వాదనలను మద్రాస్ హైకోర్టు వినడం పూర్తి చేసింది. కోలీవుడ్లో తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది. ఏప్రిల్ 24న తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ‘ధృవ నక్షత్రం’ మూవీ విడుదలపై క్లారిటీ వస్తుంది. ఈ సినిమాలో రీతూవర్మ, సిమ్రన్, ఐశ్వర్య రాజేశ్, రాధిక తదితరులు కీలకపాత్రలు పోషించారు. -
'వారణాసి' బిగ్ అప్డేట్.. ఎక్స్క్లూజివ్ వీడియోపై ప్రకటన
మహేష్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ ప్రతిష్టాత్మక భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలుస్తోంది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ , ప్రియాంక చోప్రా కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు ఐమాక్స్ (IMAX) అనుభవాన్ని ఇవ్వాలని మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఒక వేదికపై రాజమౌళి మాట్లాడుతూ సినిమాను ఐమ్యాక్స్ వెర్షన్లో తీస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఐమ్యాక్స్ వెర్షన్లో ‘వారణాసి’ స్పెషల్ వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. ఇప్పుడు మెక్సికోలో వారణాసి మూవీలోని ఐమ్యాక్స్ వెర్షన్ సీన్స్ను ప్రదర్శించనున్నారు.‘వారణాసి’ సినిమా మొత్తం ట్రూ ఐమ్యాక్స్ ఫార్మాట్లో ఉండదని రాజమౌళి ఇప్పటికే చెప్పారు. కేవలం కీలక సన్నివేశాల్లో మాత్రమే ఆ ఫార్మాట్ను ఆస్వాదిస్తారని గతంలో తెలిపారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నుంచి తాజాగా ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. 2026 ఏప్రిల్ 24న జరిగే సీసీఎక్స్పీ మెక్సికో (CCXP Mexico)లో 'వారణాసి' మూవీ నుంచి CCXP మెక్సికో అభిమానుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రివ్యూతో పాటు, మునుపెన్నడూ చూడని తెర వెనుక దృశ్యాలను ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని ఎస్.ఎస్. కార్తికేయ అధికారికంగా తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఆయన స్వయంగా హాజరవుతుండగా, రాజమౌళి ప్రత్యేకంగా రికార్డ్ చేసిన వీడియో సందేశం ద్వారా ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.CCXP Mexico (Comic Con Experience Mexico) అనేది లాటిన్ అమెరికాలో జరుగుతున్న అతిపెద్ద పాప్ కల్చర్. ఇందులో కొత్త సినిమాలు, సిరీస్ల ట్రైలర్ లాంచ్లు ముఖ్యంగా జరుగుతుంటాయి. ఇక్కడ ఎక్స్క్లూజివ్ కంటెంట్ ముందుగానే చూడొచ్చు. సినీ అభిమానులకు ఇదొక డ్రీమ్ ఈవెంట్. View this post on Instagram A post shared by CCXP México 🇲🇽 (@ccxp_mx) -
ఓటు హక్కు వినియోగించుకున్న అజిత్, విజయ్
తమిళనాడు శాసనసభ ఎన్నికల పోలింగ్ మొదలైంది. కోలీవుడ్ స్టార్ నటుడు అజిత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నైకి దక్షిణాన ఉన్న తిరువన్నీయుర్ పోలింగ్ కేంద్రంలో తొలి ఓటు వేసిన వ్యక్తిగా అజిత్ గుర్తింపు పొందారు. బెల్జియంలో అంతర్జాతీయ కార్ రేసింగ్ పోటీలో విజేతగా నిలిచిన అజిత్.. ఎన్నికల సందర్భంగా బుధవారం ఇండియాకు వచ్చారు. అందరికంటే ముందుగా పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేయడంతో పాటు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ తన ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. చెన్నైలోని నీలాంకరై మున్సిపల్ స్కూల్లో ఆయన ఓటు వేశారు. ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ తన కూతురు శృతి హాసన్తో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూలో నిల్చొని ఓటు వేసిన అనంతరం అందరూ తమ హక్కును ఉపయోగించుకోవాలని కోరారు. தமிழ்நாட்டின் முதல் ஓட்டு.. முதல் ஆளாய் வாக்களித்த நடிகர் அஜித்! | Tamil Nadu Assembly election | TNElection | Election2026 | Tamilnadu Legislative Assemblyel ection2026 |#Ajith #AK #AjithKumar #TNElection #Election2026 #Electionday #PollingDay #Assemblyelections… pic.twitter.com/AiSrEumptI— News Tamil 24x7 (@NewsTamilTV24x7) April 23, 2026 News Tamil Breaking || நீலாங்கரையில் தனது வாக்கை செலுத்திய விஜய்!#Vijay #TVK #TVKVijay #TNElection #Election2026 #Electionday #Assemblyelections #NewsTamil24x7 pic.twitter.com/AnD0dtaQZD— News Tamil 24x7 (@NewsTamilTV24x7) April 23, 2026 -
అవాస్తవాలు ఆవేదనను కలిగించాయి: సాయి పల్లవి
సౌత్ ఇండియా స్టార్ నటి సాయి పల్లవి తన నటనతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు పొందారు. తమిళనాడులోని కోయంబత్తూర్కు చెందిన ఈ బ్యూటీ వైద్య విద్యను పూర్తి చేసి భారతీయ కథానాయకిగా విజయం సాధించారు. ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ఈమె సినీ జీవితాన్ని మలుపుతిప్పింది. ఆ తరువాత తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ అగ్ర కథానాయికిగా రాణిస్తున్నారు. తాజాగా హిందీ ప్రేక్షకుల మనసులను దోచుకోవడానికి సిద్ధం అవుతున్నారు. హిందీలో సాయిపల్లవి కథానాయకిగా నటించిన ఏక్ దిన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం రామాయణ అనే రెండు భాగాలుగా రూపొందుతున్న చిత్రాల్లో సీతగా నటిస్తున్నారు. సాయిపల్లవిని చాలా మంది నటీమణుల మాదిరిగానే ఒక విషయం గాయపరిచింది. ఈమె గత రెండేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో మీరు మలయాళి కదా తెలుగులో ఎలా మాట్లాడగలుగుతున్నారు అనే ప్రశ్నకు తాను మలయాళీ కాదు తమిళమ్మాయి అని బదులిచ్చారు. ఆ విషయాన్ని వక్రీకరించి రెండేళ్ల తరువాత ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ప్రచారం తనను చాలా బాధించిందన్నారు. తాను తమిళ అమ్మాయిని, తన పూర్వీకులు తమిళం అని మాత్రమే చెప్పానని, ఇతర భాషలనో, ఇతరులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయలేదు అని ఆమె పేర్కొన్నారు.


