breaking news
Movies
-
'మా అమ్మ ప్రెగ్నెన్సీ'.. వీడియో షేర్ చేసిన బిగ్బాస్ బ్యూటీ
బిగ్బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ (Priyanka Jain) ఇటీవల 27వ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంది. ఆ సమయంలో కేక్ను కాలి చెప్పుపై పెట్టి ఫోటోలకు పోజిస్తూ విమర్శలపాలైన సంగతి తెలిసిందే! అయితే తన బర్త్డే రోజు మరో పని కూడా చేసింది. తనకు జన్మనిచ్చిన తల్లి కోసం ఓ ఫోటోషూట్ ప్లాన్ చేసింది. మా అమ్మ ప్రెగ్నెన్సీ అంటూ సదరు షూట్ ఎలా జరిగిందో తెలియజేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది.నా బేబీ కోసం ఆలోచిస్తున్నా..ప్రియాంక ప్రియుడు, నటుడు శివకుమార్ ఈ వీడియో రికార్డ్ చేశాడు. మీ అమ్మ ప్రెగ్నెన్సీ షూట్ జరుగుతోంది. మరి నీకు తమ్ముడు కావాలా? చెల్లి కావాలా? అని అడిగాడు. అందుకు ప్రియాంక.. నువ్వు తమ్ముడు, చెల్లి అని అడుగుతున్నావు. నేనింకా నాకెప్పుడు బేబీ పుడుతుందా? అని ఆలోచిస్తున్నా అని పంచ్ వేసింది. ఆ మాటతో షాకైన శివకుమార్.. పెళ్లి చేసుకున్నాక ఇలాంటివి మాట్లాడమని ఆన్సరిచ్చాడు.27 ఏళ్ల కిందట ప్రెగ్నెంట్దానికి ప్రియాంక బదులిస్తూ.. పెళ్లి చేసుకున్నాకే కదా పిల్లల్ని కనేది.. ఆ పెళ్లే ఎప్పుడు అవుతుందా? అని ఆలోచిస్తున్నాను. ఒకమ్మాయిగా నా బాధ నీకేం తెలుసులే అని కామెంట్ చేసింది. తర్వాత తన తల్లి ప్రెగ్నెన్సీ షూట్ గురించి మాట్లాడుతూ.. మా అమ్మ 27 ఏళ్ల కింద ప్రెగ్నెంట్ అయింది. అప్పుడు తన కడుపులో నేనున్నాను. ఆ ప్రెగ్నెన్సీని ఇప్పుడు రీక్రియేట్ చేస్తున్నాం. నేను పుట్టేముందు మా అమ్మ ఎలా ఫీలైంది? అని కళ్లారా చూడాలనుకున్నాను. అలాగే తనకు సీమంతం కూడా జరగలేదు. అందుకే ఇలా ఫోటోషూట్ ప్లాన్ చేశాను అంది. కూతురు తనకు ప్రెగ్నెన్సీ షూట్ చేసేసరికి ప్రియాంక తల్లి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. చదవండి: ఎంతోసేపు పురిటినొప్పులు భరించాక పుట్టావురా.. నటి భావోద్వేగం -
ఈ సినిమాకు వెళ్తే థియేటర్లలో డబ్బుల వర్షం..
మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం వర్జిన్ బాయ్స్. దయానంద్ గడ్డం రచనా దర్శకత్వంలో రాజా దారపునేని నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ జూలై 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తుండగా వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్గా, జేడీ మాస్టర్ కొరియోగ్రఫర్గా పని చేశారు. శనివారం నాడు వర్జిన్ బాయ్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా.. ఈ సినిమా టికెట్ కొన్న 11 మందికి ఐఫోన్లు గిఫ్ట్ ఇస్తామన్నారు. మనీ రైన్ ఇన్ థియేటర్స్ అనే కాన్సెప్ట్తో కొన్ని థియేటర్లలో డబ్బు వర్షంలా కురిపిస్తామని, ఆ డబ్బు ప్రేక్షకులు సొంతం చేసుకోవచ్చు అని బంపరాఫర్లు ప్రకటించారు.ఈ సందర్భంగా నటుడు రోనిత్ మాట్లాడుతూ... "నేను, దర్శకుడు దయ కాలేజ్ ఫ్రెండ్స్. అప్పటినుండే ఇద్దరం సినిమాలు చేయాలని అనుకునే వాళ్ళం. చూస్తే పది సంవత్సరాల తర్వాత ఒక సినిమా స్టేజిపై ఉన్నాము. చిన్న సినిమాలకు ఊపిరి పోసే సినిమాగా వర్జిన్ బాయ్స్ నిలుస్తుందని అనుకుంటున్నాను" అన్నారు. నటుడు శ్రీహాన్ మాట్లాడుతూ.. తనను నమ్మి తనపై ఎంతో ఖర్చు పెట్టి ఎంకరేజ్ చేసిన నిర్మాతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.నటి మిత్ర శర్మ మాట్లాడుతూ... "ఈ సినిమాలో నా క్యారెక్టర్ కొంచెం కొత్తగా అనిపించింది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దయానంద్ కు థాంక్స్. ఏదైనా సాధించాలి అనే సంకల్పంతో ముందుకు వచ్చాడు. తన కష్టం వల్లే మేము ఈరోజు ఈ స్టేజి మీద ఉన్నాము. రోనిత్ ఎంతో మంచి పర్ఫార్మెన్స్ చేశారు. శ్రీహాన్ చేసిన క్యారెక్టర్ లేకపోతే సినిమాలో కిక్ ఉండదు. అలాగే గీతానంద్ తో కలిసిన నటించడం బాగా ఎంజాయ్ చేశాను. చాలా సైలెంట్ గా ఉండే వ్యక్తి, బాగా సపోర్ట్ చేస్తారు. నేను మీ అందరిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను" అంటూ ముగించారు. -
9 రోజులు మంచినీళ్లు తాగే బతుకుతా.. అన్నం ముట్టను: హీరోయిన్
చాలామంది వారానికోసారి లేదా ఏదైనా పండగ ఉన్నప్పుడు ఉపవాసం చేస్తుంటారు. అలా బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రి (Nargis Fakhri)కి కూడా ఉపవాసం చేసే అలవాటుందట! కాకపోతే ఎప్పుడో ఒకసారి కాదు.. ఏకధాటిగా 9 రోజులు ఏమీ తినకుండా ఉంటుందట! ఇలా ఏడాదికి రెండుసార్లు దీన్ని కఠిన దీక్షలా పాటిస్తానని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నర్గీస్ ఫక్రి మాట్లాడుతూ.. నేను ఏడాదికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను. ఆ సమయంలో ఏమీ తినను. 9 రోజులు తిండి లేకుండా..తొమ్మిదిరోజులపాటు కేవలం నీళ్లు తాగే బతుకుతాను. ఇది చాలా కష్టంగా ఉంటుంది. 9 రోజులయిపోయేసరికి ముఖం వికృతంగా మారుతుంది. కళ్లు, బుగ్గలు లోపలకు వెళ్లిపోయి, దవడ బయటకు వచ్చినట్లు కనిపిస్తుంది. ముఖంలో మాత్రం కాస్త గ్లో ఉంటుంది. అయితే ఇది పాటించమని నేనెవరికీ సలహా ఇవ్వను. చాలామంది ఏదైనా త్వరగా జరిగిపోవాలనుకుంటారు. కానీ దేనికైనా సమయం పడుతుంది. ఉదాహరణకు మంచి నిద్ర కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. నేనైతే రోజూ ఎనిమిది గంటలు నిద్రపోతాను. సినిమాఎప్పటికప్పుడు నీళ్లు తాగుతూ ఉంటాను. విటమిన్స్, మినరల్స్ వంటి మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాను అని చెప్పుకొచ్చింది. నర్గీస్ ఫక్రి.. రాక్స్టార్ (2011) మూవీతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. మే తేరా హీరో, హౌస్ఫుల్ 3, టొర్బాజ్, అజర్, మద్రాస్ కేఫ్, అమవాస్ వంటి పలు చిత్రాల్లో నటించింది. ఇటీవల హౌస్ఫుల్ 5 సినిమాతో అలరించింది.చదవండి: పాపం.. ఏదో నోరు జారింది.. రష్మికను వదిలేయండి: నటి -
ఎంతోసేపు పురిటినొప్పులు భరించాక పుట్టావురా.. నటి భావోద్వేగం
బుల్లితెర నటి సమీరా షెరిఫ్ (Sameera Sherief) సంతోషంలో తేలియాడుతోంది. ఇటీవల ఆమె రెండోసారి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే! తాజాగా ఈ బుడ్డోడికి పేరు కూడా పెట్టేసింది. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ పిల్లాడి ఫేస్ను రివీల్ చేసింది. 'సయ్యద్ ఆమిర్'ను మీ అందరికీ పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ జర్నీ అంత ఈజీగా జరగలేదు. గర్భవతిగా ఉన్నప్పుడు ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. అప్పుడు నా కడుపులో ఉన్న ఆమిర్ నన్ను గట్టిగా పట్టుకున్నాడు. నీకోసం నేను నిలబడతానేను బాధలో ఉన్నప్పుడు దాన్ని అధిగమించే శక్తినిచ్చాడు. ఏం జరుగుతుందో? ఏంటో? అన్న భయంలో కూరుకుపోయినప్పుడు నాకు ధైర్యాన్నిచ్చాడు. ఇప్పుడు బయట ప్రపంచంలోకి అడుగుపెట్టిన తనకు అండగా నిలబడాల్సిన బాధ్యత నాపై ఉంది. ఈ విషయంలో మేము వెనకడుగు వేసేదే లేదు. మేమిద్దరం జంటగా అన్నీ ఎదుర్కొన్నాం. లేబర్ గదిలో చాలాసేపు పురిటినొప్పుల బాధ అనుభవించాక వీడు పుట్టాడు. ఇది మా హృదయాల్లో శాశ్వతంగా గుర్తుండిపోతుంది.గర్విస్తున్నాంఆమిర్.. నువ్వు మా జీవితాల్లోకి రావడం ఆ దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నాం. మాటల్లో చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాం. హీరా భయ్యా కూడా ఫుల్ ఖుషీ అవుతున్నాడు. నిన్ను ఎప్పుడెప్పుడు ఎత్తుకోవాలా? అని రోజులు లెక్కపెట్టుకుంటూ కూర్చున్నాడు. నీకోసమే ఆలోచించాడు. మన కుటుంబమంతా నిన్ను చూసి గర్విస్తోంది అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్కు బాబును ఎత్తుకున్న ఫోటోలను జత చేసింది. ఇది చూసిన అభిమానులు మరోసారి సమీరాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా సమీరా.. అభిషేకం, ముద్దుబిడ్డ, భార్యామణి, ఆడపిల్ల వంటి పలు సీరియల్స్ చేసింది. కొన్ని షోలకు యాంకర్గానూ పని చేసింది. View this post on Instagram A post shared by Sameera Sherief (@sameerasherief) చదవండి: నాలో ఏదైనా లోపం ఉందా? సరైన దారిలో లేనా?.. ఏడ్చేసిన మిత్ర -
పాపం.. ఏదో నోరు జారింది.. రష్మికను వదిలేయండి: నటి
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) బాక్సాఫీస్ క్వీన్గా మారిపోయింది. తను ఏ సినిమా పట్టుకున్నా అది బ్లాక్బస్టరే అవుతోంది. ఇటీవల వచ్చిన కుబేర మూవీ కూడా ఈజీగా వంద కోట్లు దాటేసింది. కర్ణాటకలోని కూర్గ్లాంటి చిన్న పట్టణం నుంచి వచ్చిన ఆమె నేడు దేశంలోనే టాప్ హీరోయిన్స్లో ఒకరిగా పేరు సంపాదించింది.నేనే మొదటి నటి..అయితే అప్పుడప్పుడూ ఆమె నోరు జారి విమర్శలపాలవుతూ ఉంటుంది. ఆ మధ్య రష్మిక.. కూర్గ్ జిల్లాలోని కొడవ జాతి నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఏకైక నటిని అని తన గురించి తాను గొప్పగా చెప్పుకుంది. ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది. ఎందుకంటే తనకన్నా ముందు పలువురు నటీనటులు కూర్గ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చారు.నోరు జారింది.. వదిలేయండికొడవ జాతికి చెందిన హర్షిక పూనాచ (Harshika Poonacha) వారిలో ఒకరు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. రష్మిక పొరపాటున నోరు జారి ఉంటుంది. తనను క్షమించేయండి. కానీ బాలీవుడ్లో అడుగుపెట్టిన మొదటి కొడవ నటి తనే అన్నది మాత్రం నిజం కాదు. కొడవ జాతికి చెందిన గుల్షన్ దేవయ్య చాలా ఏళ్లుగా బాలీవుడ్లో నటుడిగా పని చేస్తున్నాడు. అయితే టాలీవుడ్లో, బాలీవుడ్లో మంచి పేరు సంపాదించుకున్న రష్మికను చూసి మా కొడవ జాతి అంతా సంతోషిస్తున్నాం. కిందకు లాగకండితన సక్సెస్, ఫేమ్ చూస్తుంటే సంతోషంగా ఉంది. స్త్రీలు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మా తెగలో చాలా ఎంకరేజ్ చేస్తారు. ప్రస్తుతం రష్మిక మంచి స్థానంలో ఉంది. తనను కిందకు లాగకండి. వీలైతే మరింత ప్రోత్సహించండి అని పేర్కొంది. హర్షిక పూనాచ.. తెలుగులో ఏడుకొండలవాడా వెంకటరమణా అందరూ బాగుండాలి, అప్పుడలా ఇప్పుడిలా సినిమాలు చేసింది. కన్నడ చలనచిత్ర పరిశ్రమలో నటిగా రాణిస్తోంది.చదవండి: సుడిగాలి సుధీర్పై కోపం? అనిల్ రావిపూడి ఏమన్నారంటే? -
OTT: ‘విరాటపాలెం–పీసీ మీనా రిపోర్టింగ్’ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో ‘విరాటపాలెం–పీసీ మీనా రిపోర్టింగ్’ సిరీస్ ఒకటి. ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం. మనిషి మనుగడకు నమ్మకమే పునాది. మనం నమ్మిన సిద్ధాంతమే మనల్ని నడిపిస్తుంది. కానీ ఆ నమ్మకం మూఢ నమ్మకం కాకూడదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజుల్లో కూడా మూఢనమ్మకాల వల్ల చాలా చోట్ల జరగరానివి జరుగుతుండడం ఆందోళనకరం. మూఢనమ్మకం మూర్ఖత్వమేనని చెప్పేదే ‘విరాటపాలెం–పీసీ మీనా రిపోర్టింగ్’(Viraatapalem PC Meena Reporting) సిరీస్. జీ5 వేదికగా స్ట్రీమ్ అవుతోన్న ఈ సిరీస్ కథాంశమంతా దాదాపు మూఢనమ్మకాల మీదే కొనసాగుతుంది. అలాగే సిరీస్లోని ప్రతి ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠ రేపుతుందనడంలో సందేహం లేదు. ఇక కథాంశంలోకి వస్తే... 1980 సంవత్సరంలో ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతంలోని ఓ మారుమూల పల్లెటూరులో జరిగిన కథే ఈ సిరీస్. ఆ ఊరిలో పెళ్ళైన మొదటిరాత్రే పెళ్ళికూతుళ్ళు రక్తపు వాంతులు చేసుకుని చనిపోతుంటారు. దాదాపు పది సంవత్సరాల నుండి ఇలానే ఊళ్ళో జరగడం చూసి ఊళ్ళోని జనాలు తమ ఊరికి పెద్ద శాపం తగిలిందనుకుని కుమిలి΄ోతుంటారు. అంతేకాదు... ఆ ఊళ్ళో పెళ్ళి చేసుకోవడానికి కూడా జంకుతుంటారు. ఇదే సమయంలో ఆ ఊరికి కానిస్టేబుల్ మీనా కొత్తగా ట్రాన్స్ఫరై వస్తుంది. ఇలా పెళ్ళి కూతుళ్ళు చనిపోవడం చూసి మీనా దీనిపై విచారణ ప్రారంభిస్తుంది. ఒక దశలో విచారణ ఏదీ కొలిక్కి రానందున తానే పెళ్ళి పీటలెక్కి విచారణను వేగవంతం చేస్తుంది. పెళ్ళి చేసుకోబోతున్న మీనా కూడా తాళి కట్టించుకున్న తరువాత రక్తపు వాంతులు చేసుకుంటుంది. ఆ తరువాత కథ అనుకోని మలుపులు తిరుగుతుంది. మరి... పెళ్ళి కూతురు అయిన మీనా ఈ కేసును సాల్వ్ చేయగలిగిందా? అసలు ఈ పెళ్ళి కూతుళ్ళు చని΄ోవడానికి కారణం ఆ ఊరికి పట్టిన శాపమేనా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ‘విరాట΄ాలెం–పీసీ మీనా రి΄ోర్టింగ్’ సిరీస్ చూడాల్సిందే. చిన్న కథతో ఉత్కంఠ రేపే ΄ాయింట్తో ఊహకందని ట్విస్టులతో ప్రేక్షకుడిని ఉర్రూతలూగించే ఈ సిరీస్ చూడదగినదే. పిల్లలు లేకుండా పెద్దలు చూడగలిగే ఈ సిరీస్ వాచబుల్ ఫర్ ది వీకెండ్. – హరికృష్ణ ఇంటూరు -
కొడుకు వీడియో వైరల్.. క్షమాపణలు చెప్పిన విజయ్ సేతుపతి!
కొడుకు సూర్య వైరల్ వీడియో వివాదంపై తమిళ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) స్పందించాడు. తన కొడుకు చేసిన పనికి ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని అని మీడియా ముఖంగా తెలియజేశాడు. విజయ్ సేతుపతి కొడుకు సూర్య(Surya) హీరోగా నటించిన తొలి సినిమా ‘ఫీనిక్స్’ జులై 4న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మంచి టాక్ సంపాదించుంది. అయితే ఈ సినిమా ప్రీమియర్ షోనే వివాదస్పదంగా మారింది. సూర్యకు సంబంధించిన వీడియోలను డిలీట్ చేయాలని అతని టీమ్ మీడియాపై ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వివాదంపై విజయ్ సేతుపతి స్పందించాడు. ‘సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు నిజంగా అలాంటి ఒత్తిడి తెచ్చి ఉంటే.. అది తెలియకుండా జరిగి ఉండవచ్చు లేదా వేరొకరు చేసి ఉండవచ్చు. ఈ విషయంలో ఎవరైనా బాధపడితే వారిని నా తరపున క్షమాపణలు చెబుతున్నాను’ అని విజయ్ సేతుపతి అన్నారు.ఫినిక్స్ విషయానికొస్తే..ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్. స్టంట్ మాస్టర్ అనల్ అరసు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.దేవదర్శిని, వరలక్ష్మి శరత్కుమార్ ఇతర కీలక పాత్రలు పోషించారు. జులై 4న విడుదలైన ఈ చిత్రానికి ప్రశంసలు అయితే భారీగానే వచ్చాయి కానీ కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాలేదు. పోటీలో సిద్ధార్థ్ 3బీహెచ్కే తో పాటు మరో సినిమా ఉండడం వల్లే.. తొలిరోజు ఫినిక్స్కి అతి తక్కువ(రూ. 10 లక్షలు) వసూళ్లు వచ్చాయి. వారంతంలో కలెక్షన్స్ పెరిగే చాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.విజయ్ సేతుపతి విషయానికొస్తే.. ఇటీవల ఏస్ చిత్రంలో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో ‘తలైవన్ తలైవీ’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో నిత్యా మీనన్, యోగి బాబు, చెంబన్ వినోద్ జోస్, శరవణన్ కీలక పాత్రల్లో నటించబోతున్నారు. -
సుడిగాలి సుధీర్పై కోపం? అనిల్ రావిపూడి ఏమన్నారంటే?
మ్యాజిక్ షోలు చేసుకునే స్థాయి నుంచి కమెడియన్గా, యాంకర్గా, హీరోగా ఎదిగాడు సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer). యాంకర్ రష్మీతో లవ్ ట్రాక్తో మరింత పాపులర్ అయ్యాడు. మొదట్లో సినిమాల్లో చిన్నాచితకా పాత్రలు చేసిన సుధీర్ ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు. సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్, గాలోడు, కాలింగ్ సహస్ర, వాంటెడ్ పండుగాడ్ వంటి చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం G.O.A.T. మూవీ చేస్తున్నాడు.సుధీర్పై మితిమీరిన రోస్టింగ్మరోవైపు టీవీ షోలలో యాంకర్గానూ పని చేస్తున్నాడు. అయితే బుల్లితెరపై ఆయన్ను విపరీతంగా రోస్ట్ చేస్తుంటారు. షో ఏదైనా సుధీర్ను ఆడుకోవడం మాత్రం గ్యారెంటీ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. కొన్నిసార్లు నటుడిపై మితిమీరిన పంచ్లు వేస్తుండటం అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. అంతేకాదు, సుధీర్ కూడా తనపై వేసే పంచ్లకు హర్టవడా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అందరూ ఆడుకునేవారేడ్రామా జూనియర్స్లో పిల్లల నుంచి జడ్జి అనిల్ రావిపూడి (Anil Ravipudi) వరకు అందరూ సుధీర్ను ఆడుకునేవారే! అనిల్ రావిపూడి.. గతంలో కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ షోలోనూ సుధీర్ను రోస్ట్ చేసేవాడు. దీంతో ఈ డైరెక్టర్కు తాజాగా ఓ ఇంటర్వ్యూలో.. సుధీర్పై ఎందుకంత కోపం? అన్న ప్రశ్న ఎదురైంది. అందుకు అనిల్ రావిపూడి స్పందిస్తూ.. సుధీర్ను పంచులతో ఫ్రై చేస్తుంటే నాకు జాలేస్తుంటుంది. పాపం, అతడు హీరోగా కూడా సినిమాలు చేశాడు.. ఆయన్ని అంతలా ఫ్రై చేయాలా? అని అడిగితే సుధీర్ను రోస్ట్ చేయడమే కాన్సెప్ట్ అనేవారు.అందుకే తప్పడం లేదుషో నిర్వాహకులే అలా అన్నాక మేమేం చేస్తాం. మాకు ఇష్టం లేకపోయినా సుధీర్ను ఏదో ఒకటి అనాల్సి వస్తుంది. ఎందుకంటే సుధీర్ను ఫ్రై చేస్తేనే జనం నవ్వుతారు, చప్పట్లు కొడతారని చెప్పారు. ప్రేక్షకులు అదంతా ఎంజాయ్ చేస్తున్నారని తెలిశాక మేమూ ఇంకాస్త ఎక్కువ రోస్ట్ చేస్తున్నాం. సుధీర్ చాలా స్పోర్టివ్. ఎలాంటి జోకులు వేసినా ఫీలవ్వడు. కొన్ని పంచులు వేయడానికి నేను మొహమాటపడితే కూడా.. ఏం పర్లేదు సర్, జనాలు నవ్వడమే కావాలి.. మీరు ఫ్లోలో వెళ్లిపోండి అని చెప్తాడు.నేనే కట్ చేస్తుంటా..అయినా సరే, కొన్నిసార్లు నేనే తటపటాయిస్తుంటాను. కొన్ని పంచులు ఓవర్ అయిపోతుందన్నప్పుడు వాటిని కట్ చేస్తుంటాను. సరదా కోసమే తప్ప వ్యక్తిగతంగా మాత్రం ఎవరినీ ఏదీ అనుకోము అని చెప్పుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు.. మనల్ని నవ్వించడం కోసం సుధీర్ అడిగి మరీ తిట్టించుకుంటాడా? అని అతడిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.చదవండి: ప్రభాస్ రూ.50 లక్షల సాయం? ఒక్క రూపాయి అందలేదు: ఫిష్ వెంకట్ ఫ్యామిలీ -
శేఖర్ కమ్ములతో సినిమా..వపర్ఫుల్ పాత్రలో సమంత!
‘‘శేఖర్ కమ్ముల(Sekhar Kammula)తో సినిమా చేయాలని ఉంది. హీరోయిన్లకు ఆయన మంచి పాత్రలు రాస్తారు’’ అన్నట్లుగా ఓ సందర్భంలో సమంత(Samantha) పేర్కొన్నారు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది. ఇటీవల నాగార్జున–ధనుష్లతో ‘కుబేర’ వంటి హిట్ మూవీ ఇచ్చిన శేఖర్ కమ్ముల తదుపరి ఒక ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా చేయాలనుకుంటున్నారని సమాచారం. ఈ చిత్రంలో సమంత కథానాయికగా నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఒక బలమైన అంశం చుట్టూ తిరిగే ఈ చిత్రంలో కథానాయిక పాత్ర చాలా వపర్ఫుల్గా ఉంటుందట. ఇదిలా ఉంటే నాని హీరోగా శేఖర్ కమ్ముల ఓ సినిమా చేయనున్నారనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. ‘‘ఈ సినిమాకి సంబంధించిన చర్చ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయ్యాక ఈ సినిమా గురించిన వివరాలను షేర్ చేస్తాను’’ అని ఆ మధ్య శేఖర్ కమ్ముల స్పష్టం చేశారు. ఈలోపు సమంతతో ఆయన సినిమా చేయనున్నారనే వార్త తెరపైకి వచ్చింది. మరి... శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నెక్ట్స్ రానున్న సినిమా ఏంటి? అది హీరో ఓరియంటెడ్ మూవీనా? లేక హీరోయిన్ ఓరియంటెడా? ఎవరు నటిస్తారు? అనేది తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడక తప్పదు. -
నాలో ఏదైనా లోపం ఉందా? సరైన దారిలో లేనా?.. ఏడ్చేసిన బిగ్బాస్ బ్యూటీ
బిగ్బాస్ బ్యూటీ మిత్రా శర్మ (Mitraaw Sharma) హీరోయిన్గా, నిర్మాతగా అందరికీ సుపరిచితురాలే! తను బిగ్బాస్ నాన్స్టాప్ (ఓటీటీ) సీజన్లో పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఎప్పుడూ ఎవరో ఒకరికి సాయం చేస్తూ తన మంచి మనసు చాటుకుంటూ ఉంటుంది. మిత్రా శర్మ కథానాయికగా నటించిన తాజా చిత్రం వర్జిన్ బాయ్స్. ఈ మూవీ జూలై 11న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మిత్ర భావోద్వేగానికి లోనైంది. అమ్మ-నాన్నను కోల్పోయానేను పుట్టగానే అమ్మను కోల్పోయాను. చిన్నవయసులోనే నాన్నకూ దూరమాయ్యాను మా నాన్న టీచర్. ఆయన నాకు ఇచ్చింది విద్య మాత్రమే! ఆయన చనిపోయేముందు కూడా నువ్వు లేకుండా నేను బతకలేను నాన్న అని చాలా బాధపడ్డాను. ఆయన వెళ్లిపోయాక నాకంటూ ఎవరూ లేకుండా పోయారు. నా జీవితంలో ఎవరైనా ఉంటే వారికోసం ఏదైనా చేయాలనుకున్నాను. కానీ, అర్హత ఉన్నవారికే సాయం చేయాలి. ఎందుకంటే జీవితంలో ఎన్నో రిజెక్షన్స్ చూశాను.తలరాత మార్చలేరుగాతిరస్కరణకు గురైనప్పుడల్లా నాకేమనిపించేదంటే.. నాలో ఏమైనా లోపం ఉందా? సరైన దారిలో లేనా? లేదంటే టైం బాగోలేదా? ఇలా నన్ను నేనే ప్రశ్నించుకునేదాన్ని. తర్వాత మళ్లీ నాకు నేనే సర్ది చెప్పుకునేదాన్ని. మన దగ్గరున్న డబ్బు ఆఖరి రూపాయి వరకు ఎవరైనా తీసుకెళ్లవచ్చు. కానీ మన తలరాతను తీసుకెళ్లలేరు కదా అని రియలైజ్ అయ్యేదాన్ని. సాయం చేయాలి.. నాకంటూ మంచి మనుషులను సంపాదించుకోవాలి అనే లక్ష్యంతోనే ముందుకువెళ్తున్నాను అంటూ మిత్ర శర్మ కన్నీళ్లు పెట్టుకుంది.సినిమాగీతానంద్, మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వర్జిన్ స్టోరీ. శ్రీహాన్, రోనీత్, జెన్నిఫర్, అన్షుల, సుజిత్ కుమార్, అభిలాష్ కీలక పాత్రల్లో నటించారు. దయానంద దర్శకత్వం వహించగా దారపునేని రాజా నిర్మించారు. జూలై 11న ఈ సినిమా రిలీజవుతోంది. సినిమా చూసినవారికి ఐఫోన్లు కూడా రిటర్న్ గిఫ్ట్గా ఇస్తామని ప్రకటించారు. సినిమా చూశాక.. టికెట్ ఫోటో తీసి 8019210011 నెంబర్కు వాట్సాప్ చేయాలని.. లక్కీ డ్రా ద్వారా 11 మందిని సెలక్ట్ చేసి ఐఫోన్ పంపిస్తామని క్రేజీ ఆఫర్ ఇచ్చారు.చదవండి: ప్రభాస్ రూ.50 లక్షల సాయం? ఒక్క రూపాయి అందలేదు: ఫిష్ వెంకట్ -
మందు తాగను,గుడ్డు కూడా తినను మరి ఆ పని ఎలా చేస్తా? : హీరో భార్య
మద్యపానం, లేదా ఇంకేదైనా చెడు అలవాట్లపై వాటి ప్రచారాలపై ఇదేందయ్యా మీరు ప్రముఖులు కదా ఇలా చేయవచ్చా? అని ప్రస్తుతం సెలబ్రిటీలు ఎవరిని ప్రశ్నించినా, వ్యక్తిగతం వేరే, వృత్తిగతం వేరే వ్యాపకాలు వేరే వ్యాపారం వేరే అంటూ దేనికి దాన్ని విడదీసి చూడాలంటూ చిలకపలుకులు వల్లిస్తున్నారు. మద్యం తదితర హానికారక పదార్ధాల ప్రకటనల్లో నటించడం దగ్గర నుంచి పబ్స్, క్లబ్స్ వంటి వ్యాపారాల్లో సెలబ్రిటీలు లేదా వారి సంబంధీకుల పేర్లతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాలుపంచుకుంటున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్లో ఓ టాప్ హీరో భార్య తనకు ఇష్టం లేని పనులు చేయబోనని అంతేకాక మరొకరి చేత చేయించబోనని ఖండితంగా చెప్పడం బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. ‘‘కొన్ని వ్యాపారాలు నా నమ్మకాలకు విరుద్ధం’’ అంటున్న ఆమె ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ భార్య మిరా రాజ్పుత్(Mira Rajput ) ఫోర్బ్స్ ఇండియా నిర్వహించిన ఓ ప్యానల్ చర్చలో మాట్లాడుతూ, ‘‘నేను సంపూర్ణ శాకాహారిని, కనీసం గుడ్లు కూడా తినను. అలాగే ఇంతవరకూ చేయలేదు భవిష్యత్తులో కూడా మద్యపానం చేయను. అలాంటప్పుడు మాంసాహారం మద్యం అందించే వ్యాపారంలో పెట్టుబడి ఎలా పెడతాను? అది నా నమ్మకాలకు పూర్తి విరుద్ధం కదా’’ అని చెప్పింది.ఇటీవల ఓ ప్రముఖ బ్రాండ్ నుంచి రెస్టారెంట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టమని వచ్చిన అవకాశాన్ని ఆమె తిరస్కరించారు. దీనికి కారణాలను గురించి ఆమె మాట్లాడుతూ ఆ కారణాలు తన జీవనశైలితో మాత్రమే కాదని వ్యక్తిగత నైతిక విలువలతో ముడిపడి ఉన్నవని అంటోంది.‘‘నిజమే వ్యాపారంలో లాభం ముఖ్యం అయినా, అది వ్యక్తిగత విలువలకు భంగం కలిగించకూడదు. నాపై నమ్మకం ఉంచినవారికి, నా కుటుంబానికి సమాజంతో సత్సంబంధాలు ఉండాలంటే, నేను నమ్మే విషయాలలో నాకు స్పష్టత ఉండాలి’’ అంటూ ఎంతో స్వఛ్చంగా స్పష్టంగా ఆమె చెప్పిన మాటలు సినీ వర్గాలను ఆకట్టుకున్నాయి.ఒక పబ్లిక్ ఫిగర్గా తన నిర్ణయాలు సమాజంపై ప్రభావం చూపుతాయన్న అంటూ అంగీకరించిన మీరా. ‘‘బయట ఎంతో మంది ఎన్నో మంచి మాటలు ఎప్పుడూ చెబుతుంటారు, కానీ మన స్వంతమైన చైతన్యం మనకు మార్గం చూపాలి. మనం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, అది మన అంతరాత్మ అంగీకరించేలా దానికి నచ్చేలా ఉండాలి’’ అని స్పష్టం చేశారు. మిరా రాజ్పుత్ ప్రస్తుతం హోలిస్టిక్ హెల్త్, నేచురల్ లివింగ్, స్కిన్ కేర్ రంగాల్లో వ్యాపారాల్ని పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు ఆమె సోషల్ మీడియా ద్వారా కూడా ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రోత్సహిస్తున్నారు.ప్రస్తుతం సినీరంగానికి అవతల.. రెస్టారెంట్ లతో సహా అనేకానేక వ్యాపారాల్లో సెలబ్రిటీలు పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పటిదాకా ఏ పెద్ద సెలబ్రిటీ కి సాధ్యం కాని విధంగా మీరా రాజ్పుత్ వ్యక్తం చేసిన నైతిక విలువలు... అభినందనీయం మాత్రమే కాదు...రూ.వందల కోట్లు ఉన్నా ఇంకా డబ్బు పిచ్చితో సమాజాన్ని భ్రష్టు పట్టించే వ్యాపారాలకు వెన్ను దన్నుగా నిలుస్తున్న సెలబ్రిటీలకు. ఇకనైనా అనుసరణీయం కూడా. -
ప్రభాస్ రూ.50 లక్షల సాయం? ఒక్క రూపాయి అందలేదు: ఫిష్ వెంకట్ ఫ్యామిలీ
టాలీవుడ్లో విలన్గా, కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న ఫిష్ వెంకట్ (Fish Venkat) చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. బోడుప్పల్లోని ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్నాడు. చాలా ఏళ్ల క్రితమే వెంకట్ రెండు కిడ్నీలు చెడిపోయాయి. అప్పటినుంచి డయాలసిస్ చేయించుకుంటూ ప్రాణాలు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు పరిస్థితి క్లిష్టంగా మారడంతో కనీసం ఒక్క కిడ్నీ అయినా మార్చాలని వైద్యులు చెప్తున్నారు.ప్రభాస్ టీమ్ ఫోన్ కాల్అందుకోసం రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందన్నారు. దీంతో అతడి భార్య, కూతురు సాయం కోసం అర్థిస్తూ మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో నటుడి పరిస్థితి తెలుసుకున్న హీరో ప్రభాస్ (Prabhas).. ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారని ప్రచారం జరిగింది. కిడ్నీ దాత ఉంటే ఆపరేషన్కు ఏర్పాట్లు చేసుకోమని, అందుకు అవసరమైన డబ్బు ఇస్తామని ప్రభాస్ టీమ్ ఫోన్ చేశారని ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి మీడియాతో చెప్పింది.ఇల్లు అమ్మేసినా సరిపోదుకట్ చేస్తే అదంతా ఫేక్ కాల్ అని తెలుస్తోంది. ఆపదలో ఉన్నవారికి ప్రభాస్ పేరు చెప్పి లేనిపోని ఆశలు కల్పించి మరింత దుఃఖంలోకి నెట్టేశారని తెలుస్తోంది. ఈ విషయం గురించి నటుడి భార్య మాట్లాడుతూ.. ప్రభాస్ అసిస్టెంట్ అని చెప్పి మాకు ఓ ఫోన్ కాల్ వచ్చిన మాట వాస్తవమే.. కావాల్సినంత సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పుడు మేము ఫోన్ చేస్తే కలవడం లేదు. ప్రభాస్ నిజంగా డబ్బు ఇస్తే ఇచ్చామనే చెప్తాం. కానీ ఆయన మాకు ఏ సాయం చేయలేదు. ఇదంతా ఫేక్ న్యూస్. హీరోలు సాయం చేస్తే బాగుండు. మా ఇల్లు అమ్మి ఆపరేషన్ చేద్దామన్నా ఆ డబ్బు దేనికీ సరిపోదు అని ఆవేదన వ్యక్తం చేసింది.ప్రభాస్ పేరిట మోసం!నటుడి కూతురు స్రవంతి సైతం స్పందిస్తూ.. ప్రభాస్ పీఏ అంటూ ఐదురోజుల కిందట నాకు ఫోన్ కాల్ వచ్చింది. మీకు సాయం కావాలంటే చెప్పండి, తప్పకుండా చేస్తామని మాటిచ్చాడు. నేను మా నాన్న పరిస్థితిని వివరించాను. అందుకాయన.. ప్రభాస్ సర్ షూటింగ్లో ఉన్నాడు.. కాసేపయ్యాక తిరిగి కాల్ చేస్తానన్నాడు. నేను నిజమేనని నమ్మాను. సినిమాకానీ, రెండురోజుల నుంచి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. మాకు ప్రభాస్ వైపు నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందలేదు అని క్లారిటీ ఇచ్చింది. కాగా ఫిష్ వెంకట్.. బలుపు, ఒక లైలా కోసం, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, దరువు, అదుర్స్, దిల్, సూపర్స్టార్ కిడ్నాప్, ఈడో రకం, ఆడో రకం, గద్దలకొండ గణేశ్, ఖైదీ నెం.150 ఇలా అనేక సినిమాలు చేశాడు.ప్రభాస్ పీఏ అని ఒకరు ఫేక్ కాల్ చేశారుమా నాన్న ఫిష్ వెంకట్ గురించి వివరాలు తెలుసుకొని సాయం చేస్తా అన్నారు కానీ, ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి సాయం అందలేదుతమకు వచ్చిన నెంబర్కు కాల్ చేస్తే ఎవరూ లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఫిష్ వెంకట్ కూతురుఇలా ఫేక్ కాల్స్తో… https://t.co/DEv0J843Ks pic.twitter.com/0sxOU9TpF3— Telugu Scribe (@TeluguScribe) July 5, 2025చదవండి: 'హరి హర వీరమల్లు' రికార్డ్ వ్యూస్.. అంతా ఫేక్! -
సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న సురేశ్ రైనా.. ప్రకటన విడుదల
టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా (Suresh Raina) కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాడు. సినిమా నటుడిగా అవతారం ఎత్తేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని రైనా స్వయంగా వెల్లడించాడు. తాను కోలీవుడ్లో నటించనున్నట్లు తెలిపాడు.ఇందుకు సంబంధించి తమిళ సినిమా నిర్మాణ సంస్థ నుంచి శనివారం అధికారిక ప్రకటన వెలువడింది. డ్రీమ్ నైట్ స్టోరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీలో రైనాకు స్వాగతం పలుకుతున్న వీడియోను క్రికెటర్ శివం దూబే చేతుల మీదుగా విడుదల చేశారు.క్రికెట్ మైదానం నుంచి.. కోలీవుడ్ ఫ్రేమ్స్ దాకా..ఈ నేపథ్యంలో సురేశ్ రైనా స్పందిస్తూ.. ‘‘క్రికెట్ మైదానం నుంచి.. కోలీవుడ్ ఫ్రేమ్స్ దాకా.. చెన్నై నాలో నిండి నన్ను ముందుకు నడిపిస్తోంది. నా ఈ కొత్త ప్రయాణంలో డీకేఎస్ సంస్థతో జట్టుకట్టడం ఎంతో గర్వంగా ఉంది’’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. కాగా ఉత్తరప్రదేశ్కు చెందిన సురేశ్ రైనా.. 2005 నుంచి 2018 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.అంతర్జాతీయ స్థాయిలో 226 వన్డేలు, 78 టీ20లు, 18 టెస్టులు ఆడిన రైనా.. ఆయా ఫార్మాట్లలో 5615, 1604, 768 పరుగులు సాధించాడు. ఇక ఈ లెఫ్టాండర్ బ్యాటర్కు ఐపీఎల్లో ఘనమైన రికార్డు ఉంది. క్యాష్ రిచ్ లీగ్లో మొత్తంగా 205 మ్యాచ్లు ఆడిన రైనా.. 5528 పరుగులు సాధించి మిస్టర్ ఐపీఎల్గా గుర్తింపు పొందాడు.చిన్న తలాగా అభిమానుల హృదయాల్లో చోటుఇక ఐపీఎల్ కెరీర్లో చాలా ఏళ్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన సురేశ్ రైనా.. చిన్న తలాగా గుర్తింపు పొందాడు. మహేంద్ర సింగ్ ధోని తర్వాత అంతటి స్థాయిలో చెన్నై అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు అక్కడి నుంచే తన సినీ ప్రయాణం కూడా మొదలుపెట్టనున్నాడు.సంతోషంగా ఉందితాను తమిళ సినిమా ద్వారా అరంగేట్రం చేయడం గురించి సురేశ్ రైనా మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు నా దగ్గరకు వచ్చి కథ చెప్పినపుడు అది నా మనసుకు ఎంతో దగ్గరగా అనిపించింది. క్రికెట్కు సంబంధించిన ఈ సినిమాలో నటించడం గర్వకారణం.అది కూడా ఎన్నో ఏళ్లుగా సీఎస్కేకు ఆడి.. తమిళనాడు నుంచి నా సినిమా ప్రయాణం మొదలుపెట్టడం మరింత సంతోషంగా ఉంది. ఇక్కడి ప్రజలు మాపై ఎంతో ప్రేమను కురిపించారు’’ అని పేర్కొన్నాడు. కాగా సురేశ్ రైనా నటిస్తున్న తమిళ చిత్రానికి లోగాన్ దర్శకుడు కాగా.. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా మరో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా కోలీవుడ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అదే విధంగా.. కేరళకు చెందిన మాజీ పేసర్ శ్రీశాంత్ కూడా తమిళ సినీ రంగంలో నటుడిగా అడుగుపెట్టాడు. నయనతార, సమంతలతో కలిసి విజయ్ సేతుపతి నటించిన కాతువాకుల రెండు కాదల్ సినిమాలో శ్రీశాంత్ మోబీ అనే పాత్రలో నటించాడు.చదవండి: వేలంలో రికార్డులు బద్దలు.. అత్యంత ఖరీదైన ఆటగాడిగా సంజూ శాంసన్ -
‘లోపలికి రా చెప్తా’ మూవీ రివ్యూ
టైటిల్: లోపలికి రా చెప్తానటీనటులు: కొండా వెంకట రాజేంద్ర, మనీషా జష్ణాని, సుస్మిత ఆనాల, సాంచిరాయ్, అజయ్ కార్తీక్, ప్రవీణ్ కటారి, రమేష్ కైగూరి, వాణి ఐడా తదితరులునిర్మాతలు: లక్ష్మీ గణేష్ చేదెళ్ళ, కొండ వెంకట రాజేంద్రకథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొండా వెంకట రాజేంద్రసంగీతం: దేవ్ జాండ్సినిమాటోగ్రఫీ:రేవంత్ లేవాక, అరవింద్ గణేష్విడుదల తేది: జులై 5, 2025కొండా వెంకట రాజేంద్ర కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన హారర్ కామెడీ చిత్రం ‘లోపలికి రా చెప్తా’(Lopaliki Ra Chepta Review). మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరోయిన్లుగా నటించారు. లక్ష్మీ గణేశ్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నేడు(జులై 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..డెలివరీ బాయ్ రామ్ (కొండా వెంకట రాజేంద్ర), ప్రియ(సుస్మిత ఆనాల)కి పెళ్లి జరుగుతుంది. శోభనం రోజు గదిలోకి వెళ్లిన తర్వాత ప్రియ దెయ్యంలా మారి..రామ్ని భయపెట్టి, ముద్దు కూడా పెట్టుకోనియకుండా బయటకు పంపుతుంది. స్నేహితుడు ఇచ్చిన సలహాతో చేతికి తాయత్తు కట్టుకొని వెళితే.. రెండో రాత్రి కూడా అలాంటి పరిస్థితే ఎదురవుతుంది. దీంతో ఓ మంత్రగాడి(వంశీ) దగ్గరకు వెళ్తారు. ఆ మంత్రగాడు రామ్ నేపథ్యం గురించి అడగడంతో కథ ప్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. డెలివరీ బాయ్ రామ్కి రోడ్డుపై ఓ అమ్మాయి(సాంచిరాయ్) పరిచయం అవుతుంది. ఆమెనే నెంబర్ ఇచ్చి.. రాత్రికి తన అపార్ట్మెంట్కి రమ్మని కబురు పంపుతుంది. అక్కడి వెళ్లిన రామ్.. విల్లా నెంబర్ తప్పుగా చెప్పి లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విల్లా నెంబర్ 91లో ఉన్నది ఎవరు? నైనిక (మనీషా జష్ణాని) ఎవరు? ఆమెతో రామ్కి ఉన్న సంబంధం ఏంటి? విక్కీ(అజయ్ కార్తిక్) ఎవరు? రామ్ ఫస్ట్ నైట్ జరగకుండా అడ్డుకుంటున్న దెయ్యం ఎవరు? దాని కోరిక ఏంటి? చివరకు రామ్ శోభనం జరిగిందా లేదా? అనేదే మిగతా కథ.(Lopaliki Ra Chepta Review)ఎలా ఉందంటే..హారర్ కామెడీ చిత్రాలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. ఇప్పటికే పదుల సంఖ్యలు ఈ జానర్లో చిత్రాలు వచ్చాయి. లోపలికి రా చెప్తా కూడా ఆ కోవలోకి చెందిన సినిమానే. హారర్ కామెడీకి రొమాన్స్ని యాడ్ చేసి యూత్పుల్ ఎంటర్టైనింగ్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కొండా వెంకట రాజేంద్ర. హారర్ కంటే ఎక్కువ కామెడీ, రొమాంటిక్ సీన్లపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. అవి బాగా వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్నైట్ సీన్తో సినిమా ప్రారంభం అవుతుంది. భార్య వింతగా ప్రవర్తిండంతో కథ హారర్ జోన్లోకి వెళ్తుంది. అయితే దర్శకుడు అక్కడ కూడా ఎక్కువగా భయపెట్టకుండా..కామెడీపైనే ఎక్కువ దృష్టిపెట్టాడు. మంత్రగాడి దగ్గరకు వెళ్లడం.. ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలన్నీ రొటీన్గానే ఉంటాయి. ప్లాష్బ్యాక్లోకి వెళ్లిన తర్వాత కథనంపై ఆసక్తికరంగా సాగుతుంది. అమ్మాయి నెంబర్ ఇవ్వడం.. అపార్ట్మెంట్లోకి వెళ్లడం.. ఇద్దరి మధ్య రొమాన్స్.. ఇవన్నీ యూత్ని ఆకట్టుకుంటాయి. నైనిక ఎపిసోడ్ కాస్త ఎమోషనల్గా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ని బాగా ప్లాన్ చేశారు. ఇక సెకండాఫ్ మొత్తం దెయ్యం చుట్టునే కథనం తిరుతుంది. దెయ్యంతో శోభనం సీన్ నవ్వులు పూయిస్తుంది. ఓ మంచి సందేశంతో సినిమా ముగుస్తుంది. ప్రతి పది నిమిషాలకు ఒక రొమాంటిక్ సీన్ లేదా పాటనో పెట్టి బోర్ కొట్టకుండా చేశాడు. అయితే కొన్ని చోట్ల మోతాదుకు మించిన రొమాన్స్ ఉండడం, డబుల్ మీనింగ్ పాట ఫ్యామిలీ ఆడియన్స్కి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. యూత్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా ‘లోపలికి రా చెప్తా’ కోసం థియేటర్ లోపలికి వెళితే.. ఎంటర్టైన్మెంట్ మాత్రం గ్యారెంటీ.ఈ సినిమాకు కొండా వెంకట రాజేంద్ర దర్శకత్వం వహించడంతో పాటు హీరోగాను నటించాడు. రెండింటికి తగిన న్యాయం చేశాడు. తెరపై చాలా ఎనర్జిటిక్గా కనిపించాడు. నైనిక పాత్రలో నటించిన మనీషా జష్ణాని తెరపై కావాల్సినంత అందాలను ప్రదర్శించింది. ఎమోషనల్ సీన్లలో చక్కగానే నటించింది. ఇక దెయ్యం పట్టిన భార్య ప్రియగా సుస్మిత ఉన్నంతలో బాగానే చేసింది. అయితే హారర్ సీన్లను బలంగా రాసుకోలేకపోవడంతో..ఆమె భయపెట్టిన ప్రతిసారి థియేటర్స్లో నవ్వులే పూసాయి తప్ప భయం పుట్టలేదు. సాంచిరాయ్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. ‘టిక్ టాక్ చేద్దామా’ పాటలో అందాలను ఆరబోసి యూత్ని ఆకట్టుకుంది. అజయ్ కార్తీక్, ప్రవీణ్ కటారి, రమేష్ కైగూరి, వాణి ఐడాతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. దేవ్ జాండ్ సంగీతం బాగుంది. టిక్ టాక్ చేద్దామా పాట యూత్ని ఆకట్టుకునేలా ఉంటుంది. అలాగే సుదిలోనా దారం పాట థియేటర్స్లో నవ్వులు పూయిస్తుంది. బీజీఎం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
'హరి హర వీరమల్లు' రికార్డ్ వ్యూస్.. అంతా ఫేక్!
పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు (hari hara veera mallu) ట్రైలర్ తాజాగా విడుదలైంది. 24 గంటల్లోనే తెలుగు ట్రైలర్కు 48 మిలియన్ల వ్యూస్ వచ్చాయని నిర్మాణసంస్థ తెలిపింది. ఇదే సమయంలో టాలీవుడ్ చరిత్రలోనే ఒక్కరోజులో అత్యధికంగా వ్యూస్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసిందని మేకర్స్ ప్రకటించారు. అయితే, ఈ వ్యూస్ అన్నీ ఫేక్ అంటూ సోషల్మీడియాలో భారీగా వైరల్ అవుతుంది. అందుకు సంబంధించిన పలు ఆధారాలు చూపుతూ కామెంట్లు చేస్తున్నారు.'హరి హర వీరమల్లు' సినిమాను ఐదేళ్లకు పైగా నిర్మించారు. ఆపై పవన్ నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం.. విడుదల విషయంలో పలుమార్లు వాయిదా పడటంతో సినిమాపై బజ్ తగ్గింది. దీంతో ట్రైలర్ వ్యూస్తో బజ్ క్రియేట్ చేయాలని, అందుకోసం మేకర్స్ ఇలాంటి (యూట్యూబ్ వ్యూస్) ప్లాన్ వేశారని చెబుతున్నారు. అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత ఒక మిల్లీ సెకనులోనే సుమారు 1.7 లక్షల వ్యూస్ రావడం ఏంటి అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదేరోజు రాత్రి 1 నుంచి 4గంటలలోపు ఏకంగా 11 మిలియన్ల వ్యూస్ 'వీరమల్లు'కు వచ్చాయని ఆధారాలు కూడా వైరల్ చేస్తున్నారు. 24 గంటల్లోనే 48 మిలియన్ల వ్యూస్ వస్తే ఆ తర్వాతి 24 గంటల్లో కేవలం ఒక మిలిన్ వ్యూస్ కూడా రాకపోవడం ఏంటి..? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ వచ్చేందుకు కొన్ని బాట్లను ఉపయోగిస్తారని అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని చాలా వేదికల మీద నిర్మాతలు కూడా చెప్పారు. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మొదటిరోజు కలెక్షన్లు రూ. 186 కోట్లు అని మేకర్స్ ప్రకటించారు. తర్వాత అదంతా ఫేక్ అని తేలడంతో మరుసటి రోజు నుంచి వారు కలెక్షన్లు ప్రకటించలేదు. ఇలా పలు ఉదాహరణలను గుర్తు చేస్తూ.. ఎందుకు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసుకోవడం అని చిత్రపరిశ్రమపై నెటిజన్లు మండిపడుతున్నారు. వీరమల్లు మాత్రమే కాదు. సినిమా ఏదైనా కావచ్చు.. బాగుంటే కాసుల వర్షం కురుస్తుంది. కథలో విషయం లేకుంటే ఇలాంటి జిమ్మిక్కులు ఎన్ని చేసినా చివరకు మిగిలేది అపకీర్తి మాత్రమేనని గుర్తించాలి.24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన సౌత్ సినిమాలుహరి హర వీరమల్లు: 48 మిలియన్స్ పుష్ప2: 44.67Mగుంటూరు కారం: 37.68Mగేమ్ ఛేంజర్: 36.24Mసలార్: 32.58Mలియో: 31.91Mది గోట్: 29.28Mబీస్ట్: 29.08Mసర్కారువారి పాట: 26.77Mతునివు: 24.96M6) screen recording proof pic.twitter.com/UmgNcjl9aC— YASHwAnth 🗡️ (@Yashwanth1674) July 4, 2025 -
'ఓ భామ అయ్యో రామా' ట్రైలర్.. హిట్ కొట్టేలా సుహాస్
టాలీవుడ్ హీరో సుహాస్, మాళవిక మనోజ్ నటించిన 'ఓ భామ అయ్యో రామా'(Oh Bhama Ayyo Rama) సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఈ ప్రేమకథ చిత్రానికి రామ్ గోదాల దర్శకత్వం వహించారు. ఈ సినిమాను వీ ఆర్ట్స్ బ్యానర్లో హరీశ్ నల్లా నిర్మించారు. జూలై 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను మెప్పించాయి. తాజాగా వచ్చిన ట్రైలర్ కూడా అంతే స్థాయిలో ఉంది. కామెడీ, లవ్, ఎమోషనల్ సీన్స్తో ట్రైలర్ కట్ ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. కాగా.. ఈ చిత్రంలో రవీందర్ విజయ్, బబ్లూ పృథ్వీ రాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, సాథ్విక్ ఆనంద్, నయని పావని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాధన్ సంగీతమందిస్తున్నారు. -
సైఫ్ అలీ ఖాన్కు చుక్కెదురు.. చేజారిన రూ.15 వేల కోట్లు
భోపాల్లోని పూర్వీకుల ఆస్తులకు సంబంధించి సైఫ్ అలీ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్ను మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. తన ముత్తాత పాకిస్తాన్కు వలస వెళ్లిన కారణంగా రూ.15,000 కోట్ల విలువైన ఆస్తులను "శత్రువుల ఆస్తి"గా న్యాయస్థానం గుర్తించింది. సైఫ్ అలీ ఖాన్, ఆయన సోదరీమణులు సోహా, సబా, తల్లి షర్మిలా ఠాగూర్ తమ పూర్వీకుల ఆస్తులకు వారసులుగా గుర్తించాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. దీంతో వారు రూ. 15 వేల కోట్ల ఆస్తులపై హక్కులను కోల్పోయారు.సైఫ్ అలీ ఖాన్ ఆస్తి వారసత్వ వివాదాన్ని కొత్తగా విచారించాలని, ఒక సంవత్సరం కాలపరిమితిని నిర్ణయించాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. 1947లో విభజన తర్వాత పాకిస్తాన్కు వలస వెళ్లిన వ్యక్తులకు సంబంధించిన ఆస్తులను కేంద్ర ప్రభుత్వం క్లెయిమ్ చేసుకోవడానికి 1968 నాటి శత్రు ఆస్తి చట్టం అనుమతిస్తుందని హైకోర్టు గుర్తుచేసింది.రూ. 15 వేల కోట్ల ఆస్తి స్టోరీ ఎంటి..?బ్రిటిషర్లకాలంలో ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ ప్రాంతాల్లో పటౌడీ సంస్థానాన్ని పాలించిన హమీదుల్లాహ్ రాజకుటుంబానికి చెందిన రూ.15,000 కోట్ల విలువైన ఆస్తులు ఎవరి పరం కానున్నాయనే ప్రశ్న తలెత్తింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పూర్వీకులకు చెందిన ఈ ఆస్తులు ఇప్పుడు ఎవరికి చెందుతాయనే అంశం మరోసారి తెరమీదకొచ్చింది. సైఫ్ వాళ్ల నానమ్మ.. పటౌడీ సంస్థానానికి అసలైన వారసురాలని సీనియర్ న్యాయవాది జగదీశ్ ఛవానీ వాదిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ వాదన దీనికి భిన్నంగా ఉంది.స్వాతంత్య్రం వచ్చేనాటికి భోపాల్ కేంద్రంగా పాలిస్తున్న పటౌడీ సంస్థానానికి ముహమ్మద్ హమీదుల్లాహ్ చివరి నవాబ్గా ఉన్నారు. ఆయన తదనంతరం ఆయన పెద్దకుమార్తె అబీదా సుల్తాన్ బేగమ్కు ఈ ఆస్తులు దక్కుతాయి. అయితే స్వాతంత్య్రం వచ్చాక విభజన సమయంలో ఆమె పాకిస్తాన్కు వలసవెళ్లారు. ఈ లెక్కన ఇప్పుడు వారసులు భారత్లో లేరు. అందుకే శత్రు ఆస్తుల చట్టం కింద ఆ ఆస్తులన్నీ ఇప్పుడు కేంద్ర హోం శాఖ పరిధిలోని భారత శత్రు ఆస్తుల సంరక్షణ సంస్థ(సీఈపీఐ) పర్యవేక్షణలోకి వస్తాయి’’ అని మోదీ సర్కార్ చెబుతోంది.ప్రభుత్వ వాదనను సైఫ్కు సంబంధించిన లాయర్ ఛవానీ కొట్టిపారేశారు. ‘‘ పెద్దకుమార్తె అబీదా పాకిస్తాన్కు వెళ్లిన తర్వాత 1960లో హమీదుల్లాహ్ మరణించారు. దాంతో ఆస్తి వారసత్వంగా తనకే వస్తుందని రెండో కుమార్తె సాజిదా సుల్తాన్ బేగమ్ భారత ప్రభుత్వాన్ని కోరారు. అందుకు సమ్మతిస్తూ 1962 జనవరి 10న కేంద్రం ఒక ఉత్తర్వు జారీచేసింది. ఈ లెక్కన సాజిదా అసలైన వారసురాలు. ఆమె నుంచి వారసత్వంగా సాజిదా కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ(టైగర్ పటౌడీ) ఆయన తదనంతరం సైఫ్ అలీ ఖాన్ ఆ ఆస్తులకు హక్కుదారు అవు తారు’’ అని ఛవానీ వాదించారు.తమ ఆస్తులను శత్రు ఆస్తులుగా లెక్కకట్టొద్దని, మోదీ ప్రభుత్వం తెచ్చిన శత్రు ఆస్తుల(సవరణ, ధృవీకరణ) చట్టాన్ని సవాల్ చేస్తూ టైగర్ పటౌడీ భార్య, అలనాటి బాలీవుడ్ నటి షర్మిలా ఠాకూర్ 2015లో మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గత ఏడాది డిసెంబర్ 13న జస్టిస్ వివేక్ ఆగ్రావాల్ విచారణ చేపట్టారు. సైఫ్ తల్లి షర్మిలా వేసిన పిటిషన్ను ప్రభుత్వ న్యాయవాది తప్పుబట్టారు. ఇప్పుడు శత్రు ఆస్తుల చట్టం,1968 లేదు. దాని స్థానంలో 2017లో కొత్త చట్టమొచ్చిందని న్యాయస్థానం తెలిపింది. ఏమైనా ఫిర్యాదులుంటే సంబంధిత అప్పీలేట్ అథారిటీ ముందు గోడు వెళ్లబోసుకోండి’’ అని సూచించారు. అయితే, తాజాగా పూర్తి విచారణ తర్వాత ఆ రూ. 15 వేల కోట్ల ఆస్తలు 'శత్రువుల ఆస్తి'గానే గుర్తించాలని కోర్టు పేర్కొంది. కానీ, ఒక సంవత్సరంలోపు మళ్లీ పూర్తి విచారణ జరపాలని న్యాయస్థానం సూచించింది. -
నా వయసు, పెళ్లి గురించి మీకెందుకు: రెజీనా
ఈ తరం అమ్మాయిలు పెళ్లి కంటే కెరీర్పైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారన్నది కాదనలేని విషయం. ఇంతకు ముందు 16, 18 ఏళ్లకే అమ్మాయిలను పెళ్లీడుకొచ్చారనే వారు. ఇప్పుడు అంతా మారిపోయింది. 21 ఏళ్లు దాటిన తరువాతనే పెళ్లిపై ఆసక్తి చూపుతున్నారు. అయితే సినిమా రంగంలో అయితే 35 దాటిపోతోంది. చాలా మంది హీరోయిన్లు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్గానే ఉంటున్నారు. అలాంటి వారిలో నటి రెజీనా( Regina Cassandra) ఒకరు. ఈమె బహుభాషా నటి. తమిళం, తెలుగు, కన్నడం భాషల్లో కథానాయకిగా నటించి పాపులర్ అయ్యారు. ముఖ్యంగా తమిళంలో 2005లో విడుదలైన కండనాళ్ మొదల్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత నటించిన అసుర చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టినా, శివకార్తీకేయన్కు జంటగా నటించిన కేడీబిల్లా కిల్లాడి రంగా చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత తెలుగు, కన్నడం భాషల్లోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయితే కొంత కాలంగా సరైన అవకాశాలు రావడం లేదనే చెప్పాలి. దీంతో ప్రత్యేక పాటల్లో నటించడంతోపాటు ప్రతినాయకి పాత్రల్లో నటించడానికి సై అన్నారు. అదే సమయంలో వెబ్ సిరీస్లోనూ నటించడం ప్రారంభించారు. ఇలా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటున్న రెజీనా చాలా బోల్డ్ నటి అనే ముద్ర వేసుకున్నారు. అందాలారబోతకు నో చెప్పని ఈ భామ వయసు 34 ఏళ్లు. ఈమె తమిళంలో చివరిగా నటించిన చిత్రం విడాముయర్చి. అందులో నెగిటీవ్ పాత్రలో నటించారు. కాగా ఇటీవల ఒక భేటీలో 34 ఏళ్లు వచ్చాయి. పెళ్లెప్పుడు చేసుకుంటారన్న ప్రశ్నకు ముక్కు సూటిగా బదులిచ్చిన రెజీనా పెళ్లెప్పుడు చేసుకుంటావని తన తల్లే అడగదని, మీరెందుకు అడుగుతున్నారు? మీకెందుకు అంత అక్కర అని చెప్పింది. అంతే కాకుండా తనతో ఎవరైనా సంబంధం పెట్టుకుంటే వారికే కష్టం అనీ, అందుకే ఫ్రెండ్షిపే బెటర్ ఈజీగా ఉంటుందని చెప్పారు. దీంతో నెటిజన్లు ఈ అమ్మడిపై రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు.అసలు జీవితంలో పెళ్లి చేసుకుంటారా? లేక అవివాహితగానే ఉండిపోతారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
'తమ్ముడు' ఫస్ట్ డే కలెక్షన్స్.. నితిన్ కెరీర్లో ఇదే తక్కువ
నితిన్ నటించిన 'తమ్ముడు' సినిమా జూలై 4న విడుదలైంది. దర్శకుడు వేణు శ్రీరాం ఈ మూవీని తెరకెక్కించారు. అయితే, ప్రేక్షకులను ఏమాత్రం ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. దీంతో మొదటిరోజు చాలా తక్కువ కలెక్షన్స్ సాధించినట్లు సాక్నిక్ వెబ్సైట్ ప్రకటించింది. నితిన్ కెరీర్లోనే అత్యంత తక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకున్న మూవీగా తమ్ముడు అని పేర్కొంది. ఆయన నటించిన గత సినిమా 'రాబిన్ హుడ్' ఫస్ట్ డే నాడు రూ. 4.8 కోట్ల గ్రాస్ సాధించిగా తమ్ముడు కలెక్షన్స్ ఆ మార్క్ను కూడా చేరుకోలేకపోయింది.భీష్మ, రంగ్ దే సినిమాల తర్వాత సరైన విజయం లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్పై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఆపై దర్శకుడు వేణు శ్రీరాం కూడా ఎం.సి.ఏ, వకీల్ సాబ్ సినిమాల తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజుతో మూడో సినిమాగా 'తమ్ముడు' ప్రాజెక్ట్ను ప్లాన్ చేయడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. కానీ, తమ్ముడు చిత్రం వారిని తీవ్రంగానే నిరాశపరిచింది. దీంతో మొదటిరోజు కేవలం రూ. 4 కోట్ల గ్రాస్ మాత్రమే బాక్సాఫీస్ వద్ద సాధించినట్లు పలు వెబ్సైట్లు ప్రకటించాయి. అయితే, కలెక్షన్ల వివరాలు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. నితిన్ కెరీర్లోనే అత్యంత తక్కువ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా తమ్ముడు నిలిచిందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.దిల్ రాజు నిర్మించిన 'తమ్ముడు' సినిమా నితిన్ కెరీర్ను తిరిగి ప్రారంభిస్తుందని అందరూ భావించారు. కానీ, అది వారిద్దరికీ మరో పరాజయంగా మారింది. వరుస పరాజయాలతో బాక్సాఫీస్ వద్ద నితిన్ పోరాటం కొనసాగుతోంది. ఇది అభిమానులను మాత్రమే కాకుండా చిత్ర పరిశ్రమ మార్కెట్ను కూడా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో గేమ్ ఛేంజర్ వల్ల భారీగా నష్టపోయిన దిల్ రాజు ఇప్పుడు మరోసారి భారీగా నష్టపోవడం తప్పదని తెలుస్తోంది. ఈ మూవీ కోసం ఆయన రూ. 50 కోట్లకు పైగానే ఖర్చు చేశారని టాక్. అయితే, తమ్ముడు సినిమా కేవలం రూ. 20 కోట్ల వరకు మాత్రమే మార్కెట్ చేసినట్లు సమాచారం. -
దివాలా తీశామన్నారు.. రకుల్ భర్త జాకీ భగ్నానీ రియాక్షన్
బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ(Jackky Bhagnani ) దివాలా తీశారని కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh)ను పెళ్లాడిన తర్వాత ఆయన నిర్మించిన మొదటి సినిమా 'బడే మియాన్ చోటే మియాన్' వల్ల భారీగా నష్టపోవడంతో తన ఆఫీస్, ఇల్లు అన్నీ అమ్మేశారని పలు కథనాలు వైరల్ అయ్యాయి. అయితే, తాజాగా ఈ అంశం గురించి జాకీ భగ్నానీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.'బడే మియాన్ చోటే మియాన్' విడుదలైన తర్వాత తనతో పాటు కుటుంబం ఎదుర్కొన్న కష్ట సమయాల గురించి ఆయన రకుల్ భర్త జాకీ ఇలా మాట్లాడారు. ' నేను నా జుహు కార్యాలయాన్ని తనఖా పెట్టిన మాట వాస్తవమే.. కానీ, ఇప్పుడు మళ్లీ తిరిగి సొంతం చేసుకున్నాను. గతంలో వార్తల్లో నిలిచిన భవనం ఇదే. నేను దివాళా తీయడం వల్ల దానిని అమ్మాల్సి వచ్చిందని, ఆహారం కొనడానికి కూడా నా దగ్గర డబ్బు లేదని వారు చెప్పారు. నేను పారిపోయానని వారు చెప్పారు. ఈ పుకార్లకు నేను ఎవరినీ నిందించాలనుకోవడం లేదు, కానీ అవి ఎలా ప్రారంభమయ్యాయో నాకు తెలియదు. అయితే, వాటి వల్ల నా కుటుంబం బాగా ఇబ్బంది పడింది. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాను.' అని ఆయన అన్నారు. ఇదే సమయంలో 'బడే మియాన్ చోటే మియాన్' సినిమా కోసం దర్శకుడిగా అలీ అబ్బాస్ జాఫర్ను ఎంపిక చేసి తప్పుచేశానని ఆయన అన్నారు.జాకీ భగ్నానీ సొంత బ్యానర్ పూజా ఎంటర్టైన్మెంట్స్ ద్వారా బడే మియాన్ చోటే మియాన్ను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.59 కోట్లు మాత్రమే రాబట్టింది. దీంతో భారీ నష్టాలను ఆయన ఎదుర్కొన్నాడు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ వంటి స్టార్స్ ఈ చిత్రంలో నటించారు. అయితే, కనీసం ఓపెనింగ్స్ కూడా పెద్దగా లేకపోవడంతో కనీసం రెండురోజులు కూడా సినిమా రన్ కాలేదు. 1986 నుంచి పూజా ఎంటర్టైన్మెంట్స్ నుంచి పలు సినిమాలను జాకీ భగ్నానీ కుటుంబం నిర్మించింది. బాలీవుడ్లో ఈ బ్యానర్ నుంచి మంచి విజయాలు సాధించిన చిత్రాలు ఉన్నాయి. -
ఒకప్పుడు నేషనల్ అవార్డ్ విన్నర్.. ఇప్పుడేమో ఆటో డ్రైవర్
కర్ణాటకు చెందిన షఫీక్ సయ్యద్.. బెంగుళూరు మురికివాడలో జన్మించాడు. చిన్నతనంలోనే పెద్ద పెద్ద కలలు కన్నాడు. ఏదోరోజు అమితాబ్ బచ్చన్ అంతటి స్టార్ కావాలని కోరిక పెంచుకున్నాడు. సినిమాపై మక్కువతో కేవలం 12ఏళ్ల వయసులో ఒంటరిగానే ముంబై రైలు ఎక్కాడు. అనుకున్నట్లుగానే సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నాడు. తొలి సినిమాతోనే ఉత్తమ బాల నటుడిగా నేషనల్ అవార్డ్ అందుకుని దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోయాడు. ఆప్పుడు తన ఆశలకు జీవం వచ్చింది. ఇక గొప్ప స్టార్ అయిపోతానని నిర్ణయించుకున్నాడు. కానీ, తర్వాత ఛాన్సులు రాలేదు. అదే వచ్చింటే ఒక అమితాబ్, చిరంజీవిలా ఇండస్ట్రీని ఏలేవాడేమో చెప్పలేము కదా..!1988లో విడుదలైన 'సలాం బాంబే' సినిమా ఒక సంచలనం. ఎక్కడ చూసిన షఫీక్ సయ్యద్ పోస్టర్స్తోనే సినిమా టైటిల్ కనిపించేది. ఈ చిత్రాన్ని మీరా నాయర్ దర్శకత్వం వహించడమే కాకుండా ఆమె నిర్మాతగా ఉన్నారు. ముంబైలోని మురికివాడల్లో నివసించే పిల్లల దైనందిన జీవితాలను ఈ చిత్రంలో చూపించారు. ఆ ఏడాదిలో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డ్ను అందుకోవడంతో పాటు ఉత్తమ బాల నటుడిగా షఫీక్ సయ్యద్ కూడా అవార్డ్ దక్కించుకున్నాడు. ఆపై సలాం బాంబే మూవీ ఆస్కార్ అవార్డ్కు కూడా నామినేట్ అయింది. భారత్ నుంచి అలా ఎంపికైన రెండో చిత్రంగా రికార్డ్ పొందింది. లెక్కలేనన్ని అంతర్జాతీయ అవార్డ్స్ను ఈ చిత్రం అందుకుంది. వీటన్నింటికీ కారణం సలాం బాంబేలో షఫీక్ సయ్యద్ నటనే అని అప్పట్లో చెప్పుకునేవారు.'షఫీక్ సయ్యద్' ఎందుకు ఆటో నడుపుతున్నాడు'సలాం బాంబే' సినిమా వల్లే షఫీక్ సయ్యద్కు మంచి గుర్తింపు వచ్చింది. ఏదైనా పార్టీలో అతను కనిపిస్తే చాలు పెద్దపెద్ద వారు కూడా పోటోలు దిగేందుకు పోటీపడేవారు. దీనిని బాలీవుడ్ మేకర్స్ జీర్జించుకోలేకపోయారు. తమ పిల్లలకు దక్కిని గౌరం ఇతనికి ఇంతలా రావడం ఏంటి అనే అక్కసు వారిలో మొదలైంది. అంతే, షఫీక్ సయ్యద్కు ఛాన్సులు ఆగిపోయాయి. ఒక్క సినిమాతోనే దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సయ్యద్.. రెండో సినిమా ఛాన్సు కోసం ఐదేళ్లు పోరాడాడు. ఆకలితోనే అక్కడి సినిమా ఆఫీసుల చుట్టు తిరిగాడు. అలా 1993లో పతంగ్ అనే సినిమాలో నటించాడు. ఆ తర్వాత అతనికి ఎవరు కూడా ఛాన్సులు ఇవ్వలేదు. దీంతో తిరిగి బెంగళూరు వచ్చేశాడు. కుటుంబానికి ఆర్థికంగా నిలబడేందుకు ఏదో చిన్నచిన్న పనులు చేసుకునేవాడు. ప్రస్తుతం తన జీవనోపాధి కోసం బెంగళూరులోనే ఆటో నడుపుతున్నాడు. భార్య, తల్లి, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తెలతో కలిసి నివసిస్తున్నాడు. అప్పుడప్పుడు కొన్ని టీవీ ప్రోగ్రామ్లలో గెస్ట్గా పిలుస్తుంటారని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. -
ధనుష్తో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ.. హిట్ దక్కేనా..?
బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు ధనుష్. తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఆయన ఉన్నారు. తాజాగా కుబేర చిత్రంతో ప్రేక్షకులను మెప్పించాడు. తమిళం, తెలుగు భాషల్లో విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కాగా ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన ఇడ్లీ కడై చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. అలాగే హిందీలో ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'తేరే ఇష్క్ మే' చిత్రం షూటింగ్ను పూర్తి చేశారు. కాగా ఇప్పుడు మరో నూతన చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. దీన్ని వేల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి 'అరువడై' అనే టైటిల్ను నిర్ణయించినట్లు సమాచారం. కాగా ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 15వ తేదీన ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఇకపోతే ఇందులో నటుడు ధనుష్కు జంటగా నటి పూజాహెగ్డేను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇంతకుముందు ఈ చిత్రంలో మాలయాళ బ్యూటీ మమితా బైజు నటించనున్నట్లు ప్రచారం జరిగింది. కాగా తాజాగా పూజాహెగ్డేను ఎంపిక చేసినట్లు తెలిసింది. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే గత 12 ఏళ్ల క్రితం జీవాకు జంటగా ముఖముడి చిత్రంతో కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే ఆ తరువాత విజయ్ సరసన బీస్ట్ చిత్రంలో నటించారు. ఈ రెండు చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. అలాగే ఇటీవల సూర్యకు జంటగా రెట్రో చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ధనుష్తో జత కట్టడానికి సిద్ధం అవుతున్నారన్నమాట. ఇది ఇక్కడ ఈ అమ్మడు నటించే నాలుగవ చిత్రం అవుతుంది. ఈ చిత్రానికి పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విష్నేశ్ రాజా కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించనున్నారు. -
ఇండియన్ సినిమా చేయడం హ్యాపీ
‘‘ఇండియాని చాలా మిస్ అయిపోతున్నాను. హిందీ సినిమాలను కూడా మిస్సవుతున్నాను. ఇప్పుడు ఓ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అంటూ ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంకా చోప్రా చెప్పిన విషయాలు వైరల్గా మారాయి. ఈ బ్యూటీ నటించిన హాలీవుడ్ చిత్రం ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఆమె ఇండియన్ సినిమాల గురించి కూడా మాట్లాడారు. ‘‘ఇండియాలో 2002లో నా తొలి సినిమా (తమిళ చిత్రం ‘తమిళన్’)తో కెరీర్ మొదలుపెట్టి, ఎన్నో రకాల సినిమాలు చేశాను.ఎందరో ప్రతిభావంతులతో సినిమాలు చేశాను. అందుకే ఈ సంవత్సరం ఇండియన్ సినిమా (మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాని ఉద్దేశించి) చేయడం చాలా ఆసక్తిగా ఉంది. భారతీయ ప్రేక్షకులు నా పై చూపించే ప్రేమ నాకెంతో విలువైనది. నాపై వారి ప్రేమ ఎప్పటికీ అలానే ఉండాలని కోరుకుంటున్నా’’ అని ప్రియాంకా చోప్రా పేర్కొన్నారు.హాలీవుడ్ సింగర్–యాక్టర్–మ్యూజిక్ డైరెక్టర్ నిక్ జోనస్ని 2018లో పెళ్లి చేసుకున్న ప్రియాంక ఆ తర్వాత భారతీయ చిత్రాలు ఎక్కువ చేయడంలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో మహేశ్బాబు–రాజమౌళి కాంబినేషన్లోని సినిమాలో నటించడం పట్ల ఆమె చాలా ఆనందంగా ఉన్నారు. ఈ చిత్రం 2027 వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది. -
ముప్పై రోజులు... మూడు ప్రదేశాలు
‘తండేల్’ వంటి బ్లాక్బస్టర్ సినిమా తర్వాత నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్సీ 24’ (వర్కింగ్ టైటిల్). ‘విరూపాక్ష’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్పై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు.ఈ సినిమా రెండో షెడ్యూల్ హైదరాబాద్లో ఆరంభమైనట్లు చిత్రయూనిట్ తెలిపింది. ‘‘మిస్టిక్ థ్రిల్లర్గా రూపొందుతోన్న చిత్రం ‘ఎన్సీ 24’. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన గుహ సెట్లో ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేశాం. రషెస్ చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు మరింత ఉత్సాహంతో హైదరాబాద్లో రెండవ షెడ్యూల్ను ప్రారంభించాం.ముప్పై రోజుల పాటు హైదరాబాద్లోని మూడు ప్రధాన ప్రదేశాల్లో షూటింగ్ ప్లాన్ చేశాం. ఈ షెడ్యూల్లో నాగచైతన్యతో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నాం. చైతన్య కెరీర్లో అత్యధిక బడ్జెట్తో నిర్మిస్తున్న చిత్రం ఇది’’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ బి. లోక్నాథ్, కెమెరా: రాగుల్ ధరుమన్. -
ఓటీటీకి శ్రద్ధా శ్రీనాథ్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రద్ధా శ్రీనాధ్, కిశోర్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'కలియుగం-2064'. ఈ సినిమాకు ప్రమోద్ సుందర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించిన ఈ చిత్రం వచ్చే మే 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాను ఆర్కే ఇంటర్నేషనల్, ప్రైమ్ సినిమాస్ బ్యానర్లపై కేఎస్ రామకృష్ణ, కే రామ్ చరణ్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేశారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. జూలై 11 నుంచి సన్ నెక్ట్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. 2064లో మనుషులు పరిస్థితి ఏంటనే కోణంలోనే ఈ సినిమాకు రూపొందించారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. కాగా.. ఈ చిత్రానికి డాన్ విన్సెంట్ సంగీతమందించారు. When the world ends, who do you become?Hope, fear, and survival collide in a future gone dark.Kaliyugam — streaming from 11th July on SunNXT.#KaliyugamOnSunNXT #DystopianDrama #StreamingFromJuly11 #EdgeOfDarkness #Kaliyugam #NewOnSunNXT #FutureUnraveled #WatchItOnSunNXT… pic.twitter.com/DX64AIVYZf— SUN NXT (@sunnxt) July 4, 2025 -
రోడ్డుపై బిగ్బాస్ బ్యూటీ చిందులు.. బుల్లితెర భామ బర్త్ డే సెలబ్రేషన్స్!
రోడ్డుపై చిందులేస్తూ ఎంజాయ్ చేస్తోన్న బిగ్బాస్ బ్యూటీ దివి..బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్న బుల్లితెర భామ జ్యోతిపూర్వాజ్..యూఎస్లో యాంకర్ శ్రీముఖి చిల్..రెడ్ శారీలో ఆదితి గౌతమ్ గ్లామరస్ లుక్..రెడ్ డ్రెస్లో హీరోయిన్ రెజీనా పోజులు.. View this post on Instagram A post shared by Kanduri SriRangaSudha (@im_ksudha) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
రామాయణ పార్ట్-1 గ్లింప్స్.. రచయితపై నెటిజన్ల ట్రోల్స్!
రణ్బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా మైథలాజికల్ చిత్రం 'రామాయణ'. ఈ సినిమాలో రాముడిగా రణ్బీర్కపూర్ , సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. కేజీఎఫ్ స్టార్ యశ్ రావణుడిగా కనిపించనున్నారు. నితిశ్ తివారీ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి ఇదే తొలి వీడియో కావడం విశేషం. గతంలో రామాయణంపై చాలా సినిమాలొచ్చినా.. ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మరోసారి భారీ బడ్జెట్తో రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.అయితే రామాయణం అంటే అందరికీ గుర్తుకొచ్చేది శ్రీరాముడు మాత్రమే కాదు.. వాల్మీకి పేరు తప్పకుండా ఉంటుంది. అయితే ఈ సినిమాకు కథ అందించిన రచయిత శ్రీధర్ రాఘవన్పై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు కథను తానే రాసినట్లు చెప్పుకోవడంపై నెటిజన్స్ మండిపడుతున్నారు. రామాయణం రచించింది వాల్మీకి అయితే.. ఆ క్రెడిట్ కూడా మీరు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. పఠాన్, టైగర్-3 చిత్రాలకు కథ అందించిన శ్రీధర్ రాఘవన్ రామాయణం కూడా రాశాడంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. what about brother valmiki? pic.twitter.com/OtR1lfZQtf— Shreemi Verma (@shreemiverma19) July 3, 2025 Sridhar Raghavan calling himself the writer of Ramayana is not too different from an Indian calling themselves Caucasian or a homeopath calling themselves doctor. pic.twitter.com/L5qIUH0RXL— রাজ শেখর (@DiscourseDancer) July 4, 2025 The writer of #Ramayana is Shridhar Raghavan, who also wrote Pathaan and Tiger 3 pic.twitter.com/18FS6jmzLu— Prayag (@theprayagtiwari) July 3, 2025 -
నితిన్ తమ్ముడు మూవీ.. ఏ ఓటీటీకి రానుందంటే?
రాబిన్హుడ్ తర్వాత నితిన్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందకొచ్చారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. అభిమానుల భారీ అంచనాల మధ్య ఇవాళే థియేటర్లలో విడుదలంది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలకపాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. అయితే తొలి రోజే ఈ చిత్రం మిక్స్డ్ టాక్ను తెచ్చుకుంది. ట్రైలర్కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.అయితే మొదటి రోజు మిశ్రమ స్పందన తెచ్చుకున్న తమ్ముడు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్పై నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా ఏ ఓటీటీలో రానుందని తెగ వెతికేస్తున్నారు. ఈ సినిమా విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే డిజిటల్ ఫ్లాట్ఫామ్లో సందడి చేసే అవకాశముంది. ఈ సినిమాను హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి వచ్చే రెస్పాన్స్ చూస్తే కాస్తా త్వరగానే ఓటీటీలోకి సందడి చేసే ఛాన్స్ కనిపిస్తోంది. -
పాపం అనుదీప్.. ఎంత కష్టమొచ్చింది? వీడియో వైరల్
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన హరిహర వీరమల్లు సినిమా (Hari Hara Veera Mallu Movie) ట్రైలర్ను గురువారం (జూలై 3) రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లోని విమల్ థియేటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు జ్యోతికృష్ణ, నిర్మాత ఏఎం. రత్నం సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అందులో జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీ కూడా ఉన్నాడు.ఈవెంట్ మొదలైన కాసేపటికి అనుదీప్ (Anudeep K.V) స్టేజీపైకి ఎక్కేందుకు వెళ్లాడు. కానీ, అక్కడున్న పోలీసులు అతడిని అడ్డుకుని ముందుకు వెళ్లనివ్వలేదు. అనుదీప్ను గుర్తించక వెనక్కు నెట్టేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయ్యో, మా అనుదీప్ను గుర్తుపట్టలేదా? అందరిముందు పరువు పోయిందిగా అంటూ నెటిజన్లు పలు మీమ్స్ వైరల్ చేస్తున్నారు.సినిమాల విషయానికి వస్తే.. పిట్టగోడ చిత్రంతో దర్శకుడిగా మారాడు అనుదీప్. రెండో సినిమా 'జాతిరత్నాలు'తో సూపర్ హిట్ అందుకున్నాడు. తమిళ హీరో శివకార్తికేయన్తో ప్రిన్స్ మూవీ తీశాడు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్, కల్కి 2898 ఏడీ చిత్రాల్లో అతిథి పాత్రలో కనిపించాడు. Paavam Anudeeep KV 😂😂🤣🤣😭😭Andari mundhu paravu poindi ga 😭😭#HHVMTrailer #HariHaraVeeraMallu #HariHaraVeeraMalluTrailer pic.twitter.com/5vauW1ALXn— Vamc Krishna (@lyf_a_zindagi) July 4, 2025 చదవండి: బిగ్బాస్ షోలో రోబో ఎంట్రీ.. కంటెస్టెంట్లకు కష్టమే! -
పుష్ప-2 రేంజ్లో మాస్ సాంగ్.. మరోసారి వైరల్ అవుతోన్న శ్రీలీల!
గాలి జనార్దన రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా నటిస్తోన్న చిత్రం జూనియర్. ఈ మూవీలో హీరోయిన్గా శ్రీలీల కనిపించనుంది. రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో జెనీలియా దేశ్ముఖ్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్, టీజర్కు ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడడంతో వరుస అప్డేట్స్తో మేకర్స్ అలరిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే జూనియర్ మూవీ నుంచి మరో లిరికల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు. వైరల్ వయ్యారి అంటూ సాగే మాస్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ పాటలో శ్రీలీల మరోసారి తనదైన డ్యాన్స్తో అదరగొట్టినట్లు తెలుస్తోంది. పుష్ప-2లో ఐటమ్ సాంగ్ రేంజ్లో శ్రీలీల అలరించినట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది. తాజాగా విడుదలైన పాట మాస్ ఆడియన్స్ను ఊపేస్తోంది. కాగా.. ఈ పాటను కల్యాణ్ చక్రవర్తి రాయగా.. హరిప్రియ, దేవిశ్రీ ప్రసాద్ ఆలపించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే. -
యంగ్ హీరోను ఇండస్ట్రీ నుంచి తరిమేయాలని స్టార్ సెలబ్రిటీల ప్లానింగ్
సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య పోటీ ఎప్పుడూ ఉండేదే! అయితే కొత్తగా వచ్చే హీరోహీరోయిన్స్ ఎదుగుతున్నారంటే కొందరు బడా స్టార్స్ అస్సలు తట్టుకోలేరు. హీరో కార్తీక్ ఆర్యన్ విషయంలో ఇదే జరిగిందంటున్నాడు సింగర్ అమాల్ మాలిక్ (Amaal Mallik). బాలీవుడ్లోని చీకటి కోణం గురించి సింగర్ అమాల్ మాలిక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. మాయా ప్రపంచంసినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉంటాయో జనాలకు అర్థమవుతోంది. ఇక్కడ చీకట్లోనే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్.. దాన్ని ఎదిరించలేకపోయాడు. అతడిది ఆత్మహత్య అని కొందరు, హత్య అని మరికొందరు అంటుంటారు. ఏదేమైనా అతడు మనమధ్య లేడనేది నిజం. ఈ పరిశ్రమ వారి మనసును, మెదడును దెబ్బతీస్తుంది. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. సినిమా ఇండస్ట్రీ అనేదే ఒక మాయాప్రపంచం. తగిన శాస్తిఈ విషయం జనాలకు అర్థమయ్యాక బాలీవుడ్పై వారి అభిప్రాయమే మారిపోయింది. వీళ్లు చెడ్డవాళ్లు.. ఊరికే వదిలిపెట్టకూడదు అని జనాల్లో కోపం కట్టలు తెంచుకుంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో సెలబ్రిటీలను, వారి సినిమాలను ప్రజలు దూరం పెట్టారు. ఈ పతనాన్ని చూసేందుకు వారు నిజంగానే అర్హులు. ఒక మంచి మనిషి (సుశాంత్ సింగ్) మన మధ్య లేకుండా పోయాడు. సమస్యలను ఎదిరించి..కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan)ను కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తొక్కడానికి ప్రయత్నించారు. కానీ, అతడు చిరునవ్వుతోనే ఆ సమస్యలను జయించాడు. అతడికి పేరెంట్స్ సపోర్ట్ ఉంది. ఇండస్ట్రీకి కొత్తవాడయినా తన స్వయంకృషితో ఎదిగాడు. కార్తీక్ను ఇండస్ట్రీ నుంచి బయటకు పంపించేందుకు దాదాపు వంద మంది ప్రయత్నిస్తున్నారు. అందులో పెద్ద హీరోలు, నిర్మాతలు.. ఎందరో ఉన్నారు అని చెప్పుకొచ్చాడు.సినిమాప్యార్ కా పంచనామా సినిమాతో బాలీవుడ్లో హీరోగా కెరీర్ మొదలుపెట్టాడు కార్తీక్ ఆర్యన్. ప్యార్ కా పంచనామా 2, లుకా చుప్పి, లవ్ ఆజ్ కల్, ధమాకా, భూల్ భులయ్యా 2, భూల్ భులయ్యా 3, ఫ్రెడ్డీ, షెహజాదా (అల వైకుంఠపురములో రీమేక్), సత్య ప్రేమ్కీ కథ వంటి చిత్రాల్లో నటించాడు.చదవండి: బిగ్బాస్ షోలో రోబో ఎంట్రీ.. కంటెస్టెంట్లకు కష్టమే! -
ఓటీటీకి వచ్చేసిన ఫీల్ గుడ్ మూవీ.. ఓకేసారి నాలుగింటిలో స్ట్రీమింగ్!
కోలీవుడ్ నటుడు సత్యరాజ్, కాళీ వెంకట్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం మద్రాస్ మ్యాట్నీ. ఈ సినిమాకు కార్తికేయన్ మణి దర్శకత్వం వహించారు. జూన్ 6న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ సమర్పణలో మెడ్రాస్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.ఎలాంటి ప్రకటన లేకుండానే ఏకంగా నాలుగు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. జూలై 4 తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్తో పాటు సన్ నెక్స్ట్, టెంట్కొట్టా, సింప్లీ సౌత్ ఫ్లాట్ఫామ్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. రిలీజై నెల రోజులు కాకముందే ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది ఈ సినిమా. మద్రాస్ మ్యాట్నీ చిత్రంలో మిడిల్ క్లాస్ లైఫ్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ కథను యథార్థంగా తెరపై ఆవిష్కరించారు. ఈ చిత్రానికి బాలా సారంగన్ సంగీతం అందించారు. Recent Tamil Feel Good Movie ❤️✨ #MadrasMatinee streaming from Tonight on PrimeVideo, Tentkotta, Sunnxt & SimplySouth 🍿!!@kaaliactor @keyanmk@Roshni_offl @gk_anand@cinemapayyan#OTT_Trackers pic.twitter.com/TlyWKLW4Xv— OTT Trackers (@OTT_Trackers) July 3, 2025 -
‘జాలిరెడ్డి’ కొత్త సినిమా.. లుక్ అదిరిందిగా..
సప్త సాగరాలు దాటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు హేమంత్ రావు, తాజాగా "666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్" అనే టైటిల్తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు, ఈ చిత్రంలో పుష్ప చిత్రంలో జాలిరెడ్డి పాత్రలో అలరించిన నటుడు డాలీ ధనుంజయ హీరోగా నటిస్తుండగా.. కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. జె.ఫిల్మ్స్ పతాకంపై వైశాక్ గౌడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి డాలీ ధనుంజయ్ న్యూ లుక్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్. డిఫరెంట్ గా మ్యాన్ లీ లుక్ లో ఉన్న ధనుంజయ్ లుక్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. పుష్ప 1,2 చిత్రాలతో పాపులర్ అయిన డాలీ ధనుంజర్ 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రంలో డిఫరెంట్ రోల్ లో నటించారు.విజే ఫిలిమ్స్ బ్యానర్ పై డాక్టర్ వైశాక్ జే. గౌడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జైలర్ 2, పెద్ది చిత్రాల్లో నటిస్తోన్న శివరాజ్ కుమార్ ఈ సినిమాలో మరో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. చరణ్ రాజ్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విశ్వాస్ కశ్యప్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ ''666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్'' చిత్రం కన్నడ తో పాటు తెలుగులో ఒకేసారి విడుదల కాబోతోంది. -
మహేష్, రాజమౌళి సినిమా ఆ ఓటీటీలోనే...రికార్డ్స్ బద్ధలయ్యాయిగా...
దర్శక దిగ్గజం రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎమ్బి29(SSMB29) సినిమా ఇప్పుడు మన దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ సినీ వర్గాలను ఆకర్షిస్తోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని విక్రయించారంటూ వస్తున్న వార్తలు కూడా సంచలనంగా మారాయి. దీనికి కారణం చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఈ సినిమా ఓటీటీ హక్కుల ధర పలకడమే.ఇప్పటి దాకా ఓటీటీలో అత్యధిక ధర పలికిన చిత్రంగా రాజమౌళి, రామ్చరణ్,ఎన్టీయార్ల సినిమా ఆర్ఆర్ఆర్ నిలుస్తోంది. ఆ తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ల పుష్ప 2, లోకేష్ కనగరాజ్ హీరో విజయ్ల తమిళ చిత్రం లియో, అట్లీ, షారూఖ్ఖాన్ల హిందీ చిత్రం జవాన్, ప్రశాంత్ నీల్, ప్రభాస్ల సలార్, ఓంరౌత్, ప్రభాస్ల ఆదిపురుష్, సిద్ధార్ధ్ ఆనంద్, షారూఖ్ ల పఠాన్ చిత్రాలు నిలుస్తున్నాయి ఇవన్నీ రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల మధ్య చెల్లించి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లు స్వంతం చేసుకున్నట్టు సమాచారం. వీటిలో ఆదిపురుష్, పఠాన్, పుష్ప2 తప్ప మిగిలినవన్నీ నెట్ఫ్లిక్స్ ఖాతాలోనే పడ్డాయి. తద్వారా భారతీయ సినిమాలకు అత్యధిక రేట్లకు కొనుగోలు చేయడంలో ఎవరికీ అందనంత స్థాయిలో నెట్ఫ్లిక్స్ దూసుకుపోతోంది.అదే క్రమంలో మరోసారి తన సత్తా చాటిన నెట్ఫ్లిక్స్ ఎస్ఎస్ఎమ్బి 29 హక్కుల్ని కూడా దక్కించుకుందని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో మరే చిత్రానికి పెట్టనంత ధరను చెల్లించి ఈ చిత్రం పోస్ట్ థియేట్రికల్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. తద్వారా ఇది భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద నాన్–థియేట్రికల్ డీల్స్గా నిలుస్తోందని సమాచారం.రాజమౌళి మునుపటి చిత్రం ఆర్ఆర్ఆర్ సైతం నెట్ఫ్లిక్స్లోనే ఆ సినిమాను కూడా భారీ ధరకు కొనుగోలు చేసిన నెట్ఫ్లిక్స్ ప్రారంభంలోనే అద్భుతమైన వీక్షక విజయం అందుకుంది, అంతేకాక ఆ సినిమా పాట ఆస్కార్ అందుకోవడంతో నెట్ఫ్లిక్స్కు మరోసారి కాసుల పంట పండింది. ఆ అవార్డ్ ద్వారా వచ్చిన ప్రపంచవ్యాప్త గుర్తింపుతో ఓటీటీలో ఆ సినిమాకు వీక్షకులు వెల్లువెత్తారు. దాందో ఆర్ఆర్ఆర్కి భారీ ధర చెల్లించినప్పటికీ నెట్ఫ్లిక్స్ భారీ లాభాలను ఆర్జించడానికి ఇదో కారణం.ఈ నేపధ్యంలో రాజమౌళి చిత్రాలపై గురి కుదిరిన నెట్ఫ్లిక్స్ చాలా ముందస్తుగానే ఓటీటీ హక్కులపై కన్నేసింది. అపజయాలు అంతే తెలియని దర్శకుడు రూపొందిస్తున్న ఎస్ఎస్ఎమ్బి 29 చిత్రంలో ప్రియాంక చోప్రా వంటి ఇంటర్నేషనల్ స్టార్ ఉండడం అంతర్జాతీయ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకునే అంశమే. అందుకే ఈ చిత్రం అత్యంత భారీ ధర పలికింది అనుకోవచ్చు. వచ్చే 2027లో విడుదల కానున్న ఈ భారీ చిత్రం ఇంకెన్నో సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. -
నాపై ఎందుకు ఇంత ద్వేషం.. ఇదేం మొదటిసారి కాదు: ఉర్ఫీ జావెద్
విచిత్రమైన దుస్తుల వేషధారణతో ఫేమ్ తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావెద్. ఆ తర్వాత బిగ్బాస్లోనూ మెరిసింది. ఇటీవల కరణ్ జోహార్ హోస్ట్ చేసిన ది ట్రైటర్స్ అనే షోలోనూ కనిపించింది. అమెజాన్ ప్రైమ్లో ప్రసారమైన ఈ షోలో చాలామంది కంటెస్టెంట్స్గా పాల్గొన్నారు. అయితే చివరికీ రియాలిటీ టీవీ షో 'ది ట్రెయిటర్స్' విజేతగా ఉర్ఫీ జావెద్ నిలిచింది.అయితే ది ట్రైటర్స్ విజేతగా నిలిచిన ఉర్ఫీ జావెద్కు సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. కొందరు నెటిజన్స్ చాలా అసభ్యకరంగా సందేశాలు పంపారు. ఈ విషయాన్ని ఉర్ఫీ తన ఇన్స్టా వేదికగా పోస్ట్ చేసింది. తనపై వస్తున్న కామెంట్స్ను స్క్రీన్ షాట్ రూపంలో షేర్ చేసింది. తనకు ఇలా జరగడం ఇదేమీ మొదటిసారి కాదని అంటోంది.ఉర్ఫీ జావెద్ తన ఇన్స్టాలో రాస్తూ.. 'ఒక అమ్మాయి చేసే పని మీకు నచ్చకపోతే ఆర్ అనే పదాన్ని కామెంట్స్లో వదిలేయండి. నన్ను ఇలా బెదిరించడం, అసభ్యకరంగా మాట్లాడడం ఇదేం మొదటిసారి కాదు. కానీ ఈసారి నా దుస్తుల వల్ల కాదు.. నేను ఒక షో గెలిచినందు వల్ల. మీ అభిమానించే ఆటగాడు గెలవకపోతే నన్ను బెదిరించడం లాంటివి ఊహించుకోండి. నేను అప్లోడ్ చేసిన వాటిలో ఇవి చాలా డీసెంట్ కామెంట్స్. నేను ఏం చేసినా, ప్రజలు ద్వేషించడం, అసభ్యకరంగా కామెంట్స్ చేయడాన్నే ఇష్టపడుతున్నారు. ఇలాంటి ద్వేషం చూపిస్తూ చేసే మీ కామెంంట్స్ నన్ను ఇంతకు ముందు ఎప్పుడూ ఆపలేదు.. ఇకపై ఎప్పటికీ ఆపలేవు కూడా' అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చింది.కాగా.. అంతకుముందే తాను 'ది ట్రెయిటర్స్' గెలవడం వరకు జరిగిన ప్రయాణాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. నా ఈ ప్రయాణం సులభం కాదని.. ఎన్నోసార్లు ఏడ్చానని తెలిపింది. జీవితంలో చాలా బాధలు ఎదురయ్యాయి.. ఒకానొక సమయంలో అన్ని వదిలేసి పారిపోవాలనుకున్నానని పేర్కొంది. తనకు చాలా బెదిరింపులు, అత్యాచార బెదిరింపులు, నాపై ఎంతోమందికి ద్వేషం ఉన్నప్పటికీ ఎక్కడా వెనకడుగు వేయలేదని రాసుకొచ్చింది. 'బిగ్ బాస్లో ఓడిపోయినప్పుడు మంచి జీవితాన్ని గడపడానికి నా చివరి అవకాశాన్ని కోల్పోయానని అనిపించిందని తెలిపింది. బిగ్ బాస్కు వెళ్లేముందు బట్టలు కొనడానికి స్నేహితుల నుంచి రుణం కూడా తీసుకున్నా.. ఆ సమయంలో నేను తిరిగి చెల్లించగలనో కూడా నాకు తెలియదని ఉర్ఫీ చెప్పుకొచ్చింది. -
‘సోలో బాయ్’ మూవీ రివ్యూ
టైటిల్: సోలో బాయ్నటీనటులు: గౌతమ్ కృష్ణ, శ్వేతా అవస్థి, రమ్య పసుపులేటి, పోసాని కృష్ణ మురళి, అనితా చౌదరి, షఫీ, ఆర్కే మామ, భద్రమ్, ఆనంద్ చక్రపాణి, సూర్య, ల్యాబ్ శరత్, అరుణ్ కుమార్, రజినీ వర్మ తదితరులునిర్మాణ సంస్థ : సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్నిర్మాత : సెవెన్ హిల్స్ సతీష్ కుమార్దర్శకత్వం : పి. నవీన్ కుమార్సంగీతం: జుడా సాండీసినిమాటోగ్రఫీ:త్రిలోక్ సిద్ధువిడుదల తేది: జులై 4, 2025బిగ్బాస్ షోతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు గౌతమ్ కృష్ణ. అంతకు ముందు హీరోగా ఒకటి రెండు సినిమాల్లో నటించినా..అంతగా గుర్తింపు రాలేదు కానీ, బిగ్బాస్లోకి వచ్చిన తర్వాత ఫేమస్ అయ్యాడు. ఈ యంగ్ హీరో నటించిన తాజా చిత్రం ‘సోలో బాయ్’. రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ..ఎట్టకేలకు నేడు(జులై 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.సోలో బాయ్ కథేంటంటే..?కృష్ణమూర్తి (గౌతమ్ కృష్ణ) మిడిల్ క్లాస్ యువకుడు. తల్లిదండ్రులు (పోసాని కృష్ణ మురళి, అనితా చౌదరి) అతన్ని ఉన్నంతలో అల్లారు ముద్దుగా పెంచుతాడు. ఇంజనీరింగ్ కాలేజీలో ప్రియ(రమ్య పసుపులేటి)తో ప్రేమలో పడతాడు. ఉద్యోగం వచ్చాక..పెళ్లి చేసుకుందామని ప్రియని అడగ్గా.. ‘నా డ్రైవర్కి కూడా నీ కంటే ఎక్కువ జీతం వస్తుంది’ అని అవమానించి బ్రేకప్ చెబుతుంది. ఆ బాధతో కృష్ణమూర్తి తాగుడుకు బానిసైపోతాడు. తండ్రి ప్రోత్సాహంతో మళ్లీ మాములు మనిషిగా మారి ఉద్యోగంలో చేరిన కృష్ణమూర్తి జీవితంలోకి శ్రుతి(శ్వేత అవస్తి) అనే అమ్మాయి వస్తుంది. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. జీవితం సాఫీగా సాగుతుందన్న సమయంలో తండ్రి మరణిస్తాడు. అదే సమయంలో ఆర్థిక పరిస్థితుల కారణంగా భార్య శ్రుతి విడాకులు ఇస్తుంది. ఒకవైపు తండ్రి మరణం, మరోవైపు భార్య విడాకులు.. వీటన్నింటిని తట్టుకొని కృష్ణ మూర్తి మిలియనీర్గా ఎలా ఎదిగాడు? అనేదే సోలోబాయ్ కథ.విశ్లేషణఓ మధ్యతరగతి యువకుడి సక్సెస్ స్టోరీ ఇది. చేతిలో రూపాయి కూడా లేని ఓ యువకుడు తన కష్టంతో, తెలివి తేటలతో చివరకు ఎలా కోటీశ్వరుడు అయ్యాడనేదే సోలోబాయ్ కథ. ఇలాంటి కాన్సెప్ట్తో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. అయితే వాటి ఛాయలు ఇందులో కనిపించకుండా చేయడంతో దర్శకుడు కొంతమేర సక్సెస్ అయ్యాడు. రొటీన్ కథే అయినా.. కథనం కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి కనెక్ట్ అయ్యే విధంగా ఈ కథను తీర్చిదిద్దారు. మధ్యతరగతి కుటుంబంలో ఉండే బాధలు, అవమానాలు తెరపై కళ్లకు కట్టినట్లు చూపించారు. కాలేజీ సీన్లు యువతను ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్లో కథ కృష్ణమూర్తి కాలేజీ లైఫ్.. పెళ్లి..విడాకులు చుట్టు తిరుగుతుంది. సెకండాఫ్లో కృష్ణమూర్తి ఎలా కోటీశ్వరుడు అయ్యాడనేని చూపించారు. మధ్యలో దళారి వ్యవస్థ రైతులను ఎలా మోసం చేస్తుందనే పాయింట్ కూడా ఉంటుంది. అయితే దాన్ని అలా టచ్ చేసి మళ్లీ రొటీన్ కథలోకి వెళ్లిపోయారు. ఈ సినిమాలో కృష్ణమూర్తి పాత్రలో గౌతమ్ కృష్ణ సంపూర్ణ నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకుంటూ ఎమోషన్స్ నుండి ప్రతి సీన్లను ప్రేక్షకులను మెప్పించారు. ప్రియా క్యారెక్టర్ లో రమ్య పసుపులేటి సినిమాలో కనిపించే స్క్రీన్ టైమ్ తక్కువ అయినప్పటికీ మంచి మంచి ఇంపాక్ట్ ఉండే పాత్రగా నిలిచారు. అలాగే శ్వేత అవస్తి మంచి పర్ఫామెన్స్ తో తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. పోసాని మురళి, అనిత చౌదరి హీరోకు తల్లిదండ్రులుగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాతావరణం లో చాలా బాగా నటించారు. అలాగే భద్రం, షఫీ, చక్రపాణి తదితరులు తమ పాత్రల పరిధిలో నటిస్తూ చిత్రానికి బోనస్గా నిలిచారు. సినిమాలోని పాటలు సిచువేషన్ కి తగ్గట్లు బీజీయంతో సినిమాను మరో మెట్టు పైకి వెళ్లే విధంగా సంగీత దర్శకుడు సహాయపడ్డాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
బిగ్బాస్ షోలో రోబో ఎంట్రీ.. కంటెస్టెంట్లకు కష్టమే!
బిగ్బాస్ షో (Bigg Boss Reality Show)కి ఉన్న క్రేజే వేరు. గొడవలు, కొట్లాటలు, ప్రేమలు, స్నేహాలు, ఆటలు, పాటలు, సరదా స్కిట్టులు.. ఇలా చాలానే ఉంటాయి. వినోదమంతా ఒక్కచోటే దొరికితే ప్రేక్షకులకు ఇంకేం కావాలి. అందుకే ప్రతి ఏడాది బిగ్బాస్ ఎప్పుడు మొదలవుతుందా? అని వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అటు బిగ్బాస్ టీమ్ కూడా.. జనాలను నిరాశపర్చకుండా ఉండేందుకు కంటెస్టెంట్ల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. బిగ్బాస్ హౌస్లో AI రోబోసింగర్, డ్యాన్సర్, మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యాంకర్, యాక్టర్, కొరియోగ్రాఫర్.. ఇలా వేర్వేరు ప్రొఫెషన్స్కు చెందినవారిని పార్టిసిపెంట్లుగా సెలక్ట్ చేస్తారు. ఆ మధ్య హిందీ బిగ్బాస్లో గాడిదను, శునకాన్ని తీసుకొచ్చారు. ఈసారి ఏకంగా ఏఐ రోబోను బిగ్బాస్ హౌస్కు తీసుకొస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. హిందీ బిగ్బాస్ 19వ సీజన్ కోసం ఈ రకంగా ప్లాన్ చేస్తున్నారట! ఈ విషయం తెలుసుకున్న జనాలు.. మరమనిషి హౌస్లోకి రావడమేంటని నోరెళ్లబెడుతున్నారు.రోబో విశేషాలుయూఏఈకి చెందిన ఈ రోబో పేరు హబుబు. దీనికి ఏడు భాషలు వచ్చు. అందులో హిందీ కూడా ఉంది. తను పాటలు పాడుకుంటూ ఇంట్లో పనులన్నీ చకచకా చేయగలదు. మనిషిలా భావోద్వేగాలు కూడా పలికించగలదు. ముఖానికి గోల్డెన్ కలర్ మాస్క్తో లెహంగాలో క్యూట్గా కనిపిస్తుంది. తను నిజంగా బిగ్బాస్ షోలో అడుగుపెడితే గేమ్ ఛేంజర్గా మారడం ఖాయం. తన స్పీడును కంటెస్టెంట్లు అందుకోవడం కష్టమే! మరి నిజంగా హబుబు రియాలిటీ షోలో భాగమవుతుందా? లేదా? అన్నది చూడాలి!చదవండి: పాచిపని కూడా ఇవ్వట్లేదు.. ఈ బతుకొద్దనుకున్నా.. పాకీజా కన్నీళ్లు -
ఆర్మీ ఆఫీసర్గా సలార్ హీరో.. అఫీషియల్ ట్రైలర్ వచ్చేసింది!
సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ ఏడాది ఎంపురాన్-2 మూవీతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించారు. ప్రస్తుతం మరో యాక్షన్ సినిమాతో అభిమానులను అలరించేందుకు వస్తున్నాడు. ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తోన్న యాక్షన్ చిత్రం సర్జమీన్. కాయోజ్ ఇరానీ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో కాజోల్ హీరోయిన్గా నటించింది.తాజాగా సర్జమీన్ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఆర్మీ అధికారి పాత్రలో కనిపించనున్నారు. దేశభక్తి నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే విడుదల చేయనున్నారు. ఈ నెల 25 నుంచి జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్తారు. ఈ సినిమాతోనే కాయోజ్ ఇరానీ డైరెక్టర్గా అరంగేట్రం చేస్తున్నారు. Yahaan har faisla ek kurbani hai, desh ki ya apno ki… kuch aisi Sarzameen ki kahaani hai🇮🇳#Sarzameen, releasing July 25, only on #JioHotstar#SarzameenOnJioHotstar@PrithviOfficial @itsKajolD #IbrahimAliKhan #KaranJohar @adarpoonawalla @apoorvamehta18 @AndhareAjit @kayoze… pic.twitter.com/qMDDJA19Vq— JioHotstar (@JioHotstar) July 4, 2025 -
పాచిపని కూడా ఇవ్వట్లేదు.. ఈ బతుకొద్దనుకున్నా.. పాకీజా కన్నీళ్లు
పాకీజా (Actress Pakeezah Vasuki) పేరు చెప్పగానే గుర్తొచ్చే చిత్రం అసెంబ్లీ రౌడీ. ఈ మూవీలో నటి వాసుకి.. పాకీజాగా బ్రహ్మానందంతో కలిసి చేసే కామెడీ భలే ఉంటుంది. అందుకే.. ఎన్నో సినిమాల్లో నటించినా సరే తన పేరు పాకీజాగానే స్థిరపడిపోయింది. వాసుకి.. పెదరాయుడు, రౌడీ ఇన్స్పెక్టర్ ఇలా అనేక సినిమాలు చేసి పేరు, డబ్బు సంపాదించింది. కానీ సంపాదించినదంతా పోగొట్టుకుని ఖాళీ చేతులతో, కడుపు మాడ్చుకుంటూ బతికేంత దుస్థితి చేరుకుంది.కష్టాలు తీరాయనుకునేలోపే..ఈ విషయం తెలిసిన టాలీవుడ్ ప్రముఖులు తనకు అండగా నిలిచారు. తోచిన సాయం చేశారు. దీంతో ఆమె కష్టాల నుంచి గట్టెక్కినట్లే అని అంతా అనుకునేలోపే తిరుపతి వీధుల్లో భిక్షాటన చేస్తూ కనిపించింది. ఇటీవల మరోసారి మీడియా ముందుకు వచ్చి తనకు పూట గడవడమే గగనంగా ఉందని కన్నీళ్లు పెట్టుకుంది. అయితే అందరూ సాయం చేసినా తిరిగి మళ్లీ కష్టాల ఊబిలోకి కూరుకుపోవడానికి గల కారణాన్ని పాకీజా తాజాగా బయటపెట్టింది.దుబారా చేయలేదుఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో నేను కష్టాల్లో ఉన్నప్పుడు రూ.7.5 లక్షల దాకా సాయం అందింది. ఆ డబ్బు నేను వృథాగా ఖర్చు చేయలేదు. మూడున్నర లక్షల అప్పు తీర్చేసుకున్నాను. హైదరాబాద్లో ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాను. వంటసామాగ్రి కొనడం.. ఇక్కడినుంచి చెన్నై, కారైకూడి, మధురై వెళ్లడం.. ఇలా వీటికే డబ్బంతా అయిపోయింది.అద్దె కట్టడమే కష్టంగా..ఇక్కడ అవకాశాలు లేవని తమిళనాడు వెళ్లిపోయాను. అక్కడ రేకుల ఇంటికి వెయ్యి రూపాయల అద్దె కట్టడానికి కష్టమైపోయింది. ఇంట్లో పాచిపని చేస్తానంటే కూడా ఎవరూ పనివ్వడం లేదు, అదేమంటే నేను నటినని దూరం పెడుతున్నారు. ఆరు నెలల్లో పిచ్చిదాన్నైపోతానేమో అనిపించింది. ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. పది రూపాయల ఇడ్లీ పిండి కొనుక్కుంటే అది రెండు రోజులు వచ్చేది. ఉదయం, సాయంత్రం ఇడ్లీ చేసుకునేదాన్ని.కన్నీళ్లు పెట్టుకున్న పాకీజామధ్యాహ్నం గంజి తాగేదాన్ని. నాన్వెజ్ మర్చిపోయి చాలాకాలమే అవుతోంది. ఇప్పుడు వచ్చిన రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని జాగ్రత్తగా దాచుకుంటాను. పొదుపుగా వాడుకుంటాను. ఇంకెన్నడూ సాయం కోసం అడగను అని పాకీజా కన్నీళ్లు పెట్టుకుంది. ఇదే ఇంటర్వ్యూలో బిగ్బాస్ బ్యూటీ మిత్రా శర్మ.. పాకీజాకు రూ.50 వేలు సాయం చేసింది.చదవండి: సాయం కోసం కన్నీళ్లు పెట్టుకున్న ఫిష్ వెంకట్ కూతురు.. 'ప్రభాస్' సాయం -
అల్లు అరవింద్ను ప్రశ్నించిన ఈడీ
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravnid)ను ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) ప్రశ్నించింది. ఓ బ్యాంక్ స్కామ్ గురించి ఆయన్ను విచారించింది. 2018- 19 మధ్య రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ అండ్ రామకృష్ణ టెలోక్ట్రానిక్స్ పేరుతో రెండు సంస్థలు ఏర్పాటయ్యాయి. ఈ రెండు సంస్థలు కలిసి యూనియన్ బ్యాంక్ నుంచి రూ.101 కోట్ల రుణం తీసుకున్నాయి. అలా తీసుకున్న రుణాలను సొంత అవసరాలకు వాడుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. పైగా తీసుకున్న లోన్ కూడా కట్టలేదట! ఈ రెండు సంస్థలు కొన్న ఆస్తుల్లో, చేసిన లావాదేవీల్లో అల్లు అర్జున్ పేరు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ను శుక్రవారం (జూలై 4న) విచారణకు పిలిచారు. రామకృష్ణ కంపెనీలు చేసిన బ్యాంక్ స్కామ్లో నిర్మాతకు ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలో అధికారులు విచారణ జరిపారు. 2018- 19 మధ్యకాలంలో నిర్మాత జరిపిన ఆర్థిక లావాదేవీలు, ఆస్తి కొనుగోళ్ల గురించి ఆరా తీశారు. దాదాపు మూడు గంటలపాటు ఈ విచారణ కొనసాగింది. మళ్లీ వచ్చే వారం విచారణకు హాజరవ్వాలని ఈడీ అధికారులు.. అల్లు అరవింద్ను కోరారు.చదవండి: తమ్ముడు మూవీ రివ్యూ -
సాయం కోసం కన్నీళ్లు పెట్టుకున్న ఫిష్ వెంకట్ కూతురు.. 'ప్రభాస్' టీమ్ నుంచి కాల్
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat) ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. కొద్దిరోజులుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం బోడుప్పల్లోని ఆర్బీఎం ఆస్పత్రిలో వెంకట్ చికిత్స తీసుకుంటున్నారు. పూర్తిగా మాట్లాడలేని స్థితిలో ఆయన ఉన్నారు. ఈ క్రమంలో తన కూతురు స్రవంతి మీడియాతో మాట్లాడింది. చాలా ఏళ్ల క్రితమే తన తండ్రి రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయని స్రవంతి చెప్పింది. సుమారు నాలుగేళ్ల నుంచి డయాలసిస్ ద్వారా తన తండ్రి ప్రాణాలను కాపాడుకుంటూ వస్తున్నట్లు ఆమె తెలిపింది. అయితే, ఇప్పుడు పరిస్థితి క్లిష్టంగా మారిందని, ఆపరేషన్ చేసి కనీసం ఒక కిడ్నీ అయినా మార్చాల్సిన పరిస్థితి ఉందని స్రవంతి చెప్పింది. అందుకు రూ. 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని, దాతలు ఎవరైనా సాయం చేయాలని ఆమె కోరింది. తన తండ్రి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించడం వల్ల ఆందోళనగా ఉందని ఆపరేషన్ కోసం కావాల్సినంత డబ్బు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ఫిష్ వెంకట్ కుమార్తె స్రవంతి కన్నీళ్లు పెట్టుకుంది. దీనస్థితిలో ఉన్న తమను ఆదుకోవాలంటూ ఆమె కోరింది. అయితే, తాజాగా ఆమె మీడియాతో మరోసారి మాట్లాడుతూ.. హీరో ప్రభాస్ (Prabhas) టీమ్ నుంచి కాల్ వచ్చినట్లు తెలిపింది. ఆయన అసిస్టెంట్ కాల్ చేసి 'కిడ్నీ ఇచ్చే డోనర్ (దాత) ఉంటే ఏర్పాట్లు చేసుకోండి. ఆపరేషన్కు కావాల్సిన డబ్బు ఏర్పాటు చేస్తాం' అని హామీ ఇచ్చారని మీడియాతో ఆమె తెలిపింది.తన తండ్రి రక్తం గ్రూపుతో మ్యాచ్ అయ్యే దాతలు ఎవరైనా ఉన్నారేమోనని ఎదురుచూస్తున్నట్లు ఆమె ఇలా చెప్పారు. 'నా రక్తం గ్రూప్ మ్యాచ్ కాకపోవడంతో డాక్టర్స్ తిరష్కరించారు. నాన్న తమ్ముడి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది. కానీ, ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. దీంతో డాక్టర్స్ వద్దన్నారు. దాతలు ఎవరైనా ఉన్నారేమోనని పలు డోనర్ సంస్థలను సంప్రదిస్తున్నాం' అని ఆమె పేర్కొంది. ఫిష్ వెంకట్ చాలా సినిమాల్లో నటించారు. ఆది, గబ్బర్ సింగ్, నాయక్, బన్ని, దిల్, అత్తారింటికి దారేది, డీజే టిల్లు వంటి చిత్రాల్లో ఆయన మెప్పించారు. -
తమ్ముడు మూవీ రివ్యూ
టైటిల్: తమ్ముడునటీనటులు: నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్ తదితరులునిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్నిర్మాత : దిల్ రాజు, శిరీష్దర్శకత్వం: శ్రీరామ్ వేణుసంగీతం: అజనీష్ లోకనాథ్సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్ఎడిటింగ్: ప్రవీణ్ పూడివిడుదల తేది: జులై 4, 2025నితిన్ ఖాతాలో హిట్ పడి చాలా ఏళ్లు అయింది. భారీ అంచనాలు పెట్టుకున్న రాబిన్ హుడ్ కూడా నితిన్ని నిరాశ పరిచింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో పవన్ కల్యాణ్ ఆల్ టైం సూపర్ హిట్ ‘తమ్ముడు’ టైటిల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం నితిన్ని హిట్ ట్రాక్ ఎక్కించిందా? లేదా? రివ్యూ (Thammudu Movie Review)లో చూద్దాం.కథజై (నితిన్) ఆర్చరీలో ఇండియాకి గోల్డ్ మెడల్ తేవాలనుకుంటాడు. కానీ ప్రాక్టీస్పై దృష్టి పెట్టలేకపోతాడు. దానికి కారణం.. చిన్నప్పుడు తన అక్క స్నేహలత అలియాస్ ఝాన్సీ( లయ) విషయంలో చేసిన ఒక చిన్న తప్పు! ఆ తప్పు కారణంగా అక్క అతన్ని చిన్నప్పుడే దూరం పెడుతుంది. అక్కని కలిస్తే తప్ప తను ప్రాక్టీస్పై దృష్టి పెట్టలేనని స్నేహితురాలు చిత్ర ( వర్ష బొల్లమ) తో కలిసి వైజాగ్ వస్తారు. అక్క కోసం వెతకగా ఆమె ఫ్యామిలీతో కలిసి అంబరగొడుగు జాతర వెళ్లినట్టు తెలుస్తుంది. దీంతో జై అక్కడికి వెళ్తాడు. అక్కడ బిజినెస్మెన్ అజార్వాల్ మనుషులు ఆమెను చంపేందుకు ప్రయత్నిస్తారు. అజార్వాల్ మనుషులు ఝాన్సీని ఎందుకు టార్గెట్ చేశారు? వారి బారి నుంచి అక్కని జై ఎలా రక్షించాడు? అతనికి గిరిజన యువతి రత్నం (సప్తమి గౌడ) ఎలాంటి సహాయం చేసింది? ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఝాన్సీ ఇచ్చిన మాట ఏంటి? చివరకు అది నెరవేరిందా లేదా? అక్క విషయంలో జై చేసిన తప్పు ఏంటి? చివరకు అక్కతో ప్రేమగా తమ్ముడు అనిపించుకున్నాడా లేదా అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే...అక్క ఇచ్చిన మాట కోసం తమ్ముడు చేసిన పోరాటమే ఈ సినిమా కథ. చాలా రొటీన్ స్టోరీ. కానీ దర్శకుడు తనదైన స్క్రీన్ప్లేతో తెరపై కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. సినిమాకి కీలకమైన అక్క- తమ్ముడు సెంటిమెంట్ను ఆకట్టుకునేలా చూపించడంలో మాత్రం దర్శకుడు విఫలం అయ్యాడు. సినిమా ప్రారంభం నుంచి ఎండ్ వరకు ప్రతిదీ మన ఊహకి అందేలా సాగడం, ఎమోషనల్ సన్నివేశాలు సరిగా పండకపోవడం సినిమాకి మైనస్ అనే చెప్పాలి.ఫ్యాక్టరీ ప్రమాదం సన్నివేశంతో చాలా ఎమోషనల్గా కథను ప్రారంభించాడు దర్శకుడు. విలన్ పరిచయం సీన్ డిఫరెంట్గా ప్లాన్ చేశాడు. భారీ ఎలివేషన్తో విలన్ను పరిచయం చేసి.. ఆ తరువాత కథని హీరో వైపు మళ్లించాడు. ఆర్చరీలో బంగారు పథకమే లక్ష్యం గా ఉన్న జై... అక్క విషయంలో చేసిన తప్పుని పదేపదే గుర్తు తెచ్చుకోవడం... కోచ్ చెప్పిన మాటతో అక్క కోసం వెళ్ళడంతో అసలు కథ ప్రారంభం అవుతుంది. అంబరగొడుగు నేపథ్యం సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.ఊహించింది తెరపై జరుగుతుంటే కొన్ని చోట్ల ఎంజాయ్ చేస్తాం. ఇంటర్వెల్ వరకు కథనం సోసోగానే సాగుతుంది. అజార్వాల్ గ్యాంగ్ నుంచి ఝాన్సీ ఫ్యామిలీని జై ఎలా రక్షించాడు? అనేదే సెకండాఫ్ స్టోరీ. అయితే మధ్య లో వచ్చే యాక్షన్ సీన్స్ మాత్రం అదిరిపోయాయి. యాక్షన్ కొరియోగ్రఫీ కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్ రొటీన్గా సాగుతుంది. ఎడిటింగ్ పర్వాలేదు. సంగీతం, సినిమాటోగ్రఫీ బాగుంది. బీజీఎమ్ సినిమాకు ప్లస్ పాయింట్గా నిలిచింది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు.ఎవరెలా చేశారంటే..జై పాత్రలో నితిన్ (Nithiin) చక్కగా నటించారు. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. అయితే ఆయన ఈ సినిమాలో హీరో అనడం కంటే... కీలక పాత్రధారి అని చెప్పడం బెటర్. రత్నం పాత్రకి సప్తమి గౌడ న్యాయం చేసింది. ఝాన్సీగా లయ నటనకు వంక పెట్టాల్సిన అవసరం లేదు. చిత్రగా వర్ష బొల్లమ్మ బాగా నటించింది. మిగతావాళ్లందరూ తమ పాత్రలతో మెప్పించారు.- అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
డేటింగ్ యాప్లో పరిచయం.. ప్రియుడితో బోనీ కూతురి ఎంగేజ్మెంట్
ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor) కూతురు అన్షులా కపూర్ (Anshula Kapoor) గుడ్న్యూస్ చెప్పింది. ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వెల్లడించింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రియుడు రోహన్ తక్కర్ తన వేలికి ఉంగరం తొడుగుతున్న ఫోటోలను షేర్ చేసింది. 'డేటింగ్ యాప్ ద్వారా ఒకరికొకరం పరిచయమయ్యాం. తొలిసారిగా మంగళవారం అర్ధరాత్రి 1.15 గంటలకు ఫోన్ చేస్తే పొద్దున ఆరింటివరకు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈ ప్రయాణం దేనికో ఆరంభం పలకనుందని నాకప్పుడే అనిపించింది. అర్ధరాత్రి ఒంటిగంటకు..మూడేళ్ల క్రితం నాకిష్టమైన న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్లో ప్రపోజ్ చేశాడు. అది కూడా అర్ధరాత్రి 1.15 గంటలకు! అప్పుడు ఏదో మ్యాజిక్ జరిగినట్లు ఈ ప్రపంచమే కొన్ని క్షణాలపాటు ఆగిపోయినట్లనిపించింది. అతడి చెంత ఉంటే ఇంట్లో ఉన్నట్లే అనిపిస్తుంది. అతడు ప్రపోజల్కు ఓకే చెప్పాను. నా బెస్ట్ఫ్రెండ్తో ఎంగేజ్మెంట్ జరిగింది' అని అన్షులా రాసుకొచ్చింది.అమ్మను ఎక్కువ మిస్ అవుతున్నా..ఇది చూసిన ఆమె అన్న, నటుడు అర్జున్ కపూర్ భావోద్వేగానికి లోనయ్యాడు. మీరు జీవితాంతం సంతోషంగా ఉండాలి. లవ్ యూ గయ్స్.. ఈరోజు అమ్మను కాస్త ఎక్కువగా మిస్ అవుతున్నాను అని రాసుకొచ్చాడు. అటు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ సైతం.. మా సిస్టర్ పెళ్లి చేసుకోబోతుందోచ్ అని కామెంట్ల రూపంలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.బోనీ కపూర్ రెండు పెళ్లిళ్లునిర్మాత బోనీ కపూర్ మొదటి భార్య పేరు మోనా శౌరీ కపూర్. ఈవిడ కూడా నిర్మాతే! వీరిద్దరూ 1983లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు అర్జున్ కపూర్, అన్షులా కపూర్ సంతానం. 1996లో బోనీ.. భార్య మోనాకు విడాకులిచ్చాడు. అదే ఏడాది హీరోయిన్ శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి జాన్వీ కపూర్, ఖుషి కపూర్ సంతానం. కాగా మోనా శౌరీ.. 2012లో కన్నుమూయగా, శ్రీదేవి 2018లో మరణించింది. జాన్వీ, ఖుషి సవతి తల్లి కూతుర్లయినప్పటికీ అర్జున్, అన్షులా.. వారితో అన్యోన్యంగా ఉంటారు. ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు. View this post on Instagram A post shared by Anshula Kapoor (@anshulakapoor) చదవండి: ఓటీటీలో 'నార్నే నితిన్' ఫస్ట్ సినిమా స్ట్రీమింగ్ -
భారత్లో అత్యంత ఖరీదైన చిత్రం ఇదే.. ఆ తర్వాతే ప్రభాస్ 'కల్కి'
బాలీవుడ్లో తెరకెక్కుతున్న 'రామాయణ' సినిమా గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ విజువల్స్ అద్బుతంగా ఉన్నాయంటూ గ్రాఫిక్స్ వర్క్పై ప్రశంసలు అందుతున్నాయి. ఈ మూవీ భారతదేశంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డ్ నెలకొల్పనుంది. మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. ఈ కావ్యాన్ని ఆధారం చేసుకుని ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. కానీ, గ్రాఫిక్స్ వర్క్ ప్రధాన బలంగా ఒక అద్భుతాన్ని దర్శకుడు నితేశ్ తివారీ వెండితెరపై చూపించనున్నాడు. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్లో 'రామాయణ' పేరుతో అత్యంత భారీ బడ్జెట్ పేరుతో సినిమా వస్తుంది.భారతీయ సినీ చరిత్రలో అత్యంత బడ్జెట్ చిత్రంగా 'రామయణ'అన్ని యుద్ధాల్ని అంతం చేసే యుద్ధం మొదలైందని తాజాగా విడుదలైన రామయణ గ్లింప్స్లో మేకర్స్ పేర్కొన్నారు. అదేవిధంగా ఈ చిత్రంతో బాక్సాఫీస్ రికార్డ్లు అన్నీ అంతం కావడమే కాకుండా కొత్త రికార్డ్ మొదలైంది. రామయణ పార్ట్-1 కోసం ఏకంగా రూ. 835 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దేశంలోనే అత్యంత ఖరీదైన సినిమాగా 'రామాయణ' చరిత్ర సృష్టించింది. రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఇప్పటివరకు అత్యధిక బడ్జెట్ చిత్రాలుగా నిలిచిన కల్కి 2898 ఏడీ (రూ. 600 కోట్లు), ఆర్ఆర్ఆర్ (రూ. 550 కోట్లు), ఆదిపురుష్ (రూ. 550 కోట్లు) వంటి చిత్రాలను రామాయణ అధిగమించింది.భారీ తారాగణంరామాయణ సినిమాలో రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. లంకాధిపతి రావణుడి పాత్రలో 'కేజీఎఫ్' ఫేమ్ యశ్ కనిపించనున్నారు. రవి దూబే (లక్ష్మణుడు), సన్నీ డియోల్ (ఆంజనేయుడు)గా కనిపించనున్నారు. వీరితో పాటు వివేక్ ఒబెరాయ్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా, కాజల్ అగర్వాల్, అరుణ్ గోవిల్, షీబా చద్దా వంటి సూపర్స్టార్స్ ఈ మూవీ కోసం పనిచేస్తున్నారు. దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ దర్శకత్వంలో ఈ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతుంది.ఎనిమిది ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న సంస్ధతో మ్యాజిక్ఈ మూవీ కోసం ఉత్కంఠభరితమైన విజువల్ ఎఫెక్ట్లను మేకర్స్ అందించనున్నారు. అందు కోసం కోట్ల రూపాయలే ఖర్చుచేస్తున్నారు. ప్రపంచంలోనే గుర్తింపు పొందిన బ్రిటిష్-ఇండియన్ VFX కంపెనీ ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తుంది. ఈ సంస్థ ఇప్పటికే ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్కు గాను ఎనిమిది ఆస్కార్ అవార్డ్లను గెలుచుకుంది. ఆపై ఈ మూవీకి హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మెర్ పనిచేస్తున్నారు. ఆయన గ్లాడియేటర్, ఇంటర్ స్టెల్లర్, ది లయన్ కింగ్, డ్యూన్ వంటి టాప్ చిత్రాలకు సంగీతం అందించారు. ఆర్ రెహమాన్ కూడా రామయణ చిత్రానికి సంగీతంలో భాగం పంచుకోవడం విశేషం. -
ఓటీటీలో 'నార్నే నితిన్' ఫస్ట్ సినిమా స్ట్రీమింగ్
జూ. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్(Narne Nithin) నటించిన మొదటి సినిమా 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు'(Sri Sri Sri Raja Vaaru) ఓటీటీలోకి సడెన్గా వచ్చేసింది. వరుస హిట్లతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న నార్నే నితిన్.. 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్', 'ఆయ్' వంటి సినిమాలతో టాలీవుడ్లో గుర్తింపు పొందాడు. అయితే, ఈ చిత్రాల కంటే ముందుగా ఆయన నటించిన చిత్రం 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు'. ఈ ఏడాది జూన్ 6న థియేటర్స్లోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో సంపద హీరోయిన్గా నటించగా చింతపల్లి రామారావు, ఎం. సుబ్బారెడ్డి నిర్మాతలు.'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' మూవీ ఆహా(Aha) తెలుగులో సడెన్గా స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఆపై అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ప్రకటన లేకుండానే జులై 4న ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. 2022లో ప్రారంభం అయిన ఈ మూవీ పలు కారణాల వల్ల విడుదల విషయంలో జాప్యం ఏర్పడింది. ఈ చిత్రానికి సతీశ్ వేగేశ్న(Satish Vegesna) దర్శకత్వం వహించారు. గతంలో ఆయన 'శతమానం భవతి' వంటి విజయవంతమైన సినిమాను తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఈ చిత్రం మెప్పించలేదు. నార్నే నితిన్ మొదటి సినిమా కావడంతో ఓపెనింగ్స్ కాస్త పర్వాలేదనిపించాయి.కథేంటంటే..మనల్ని మనం జయించుకోవడమే సక్సెస్ అంటే అనే కాన్సెప్ట్తో ఈ సినిమాను రూపొందించారు. గోదావరి జిల్లా ఆత్రేయపురంలో ఈ కథ ప్రారంభం అవుతుంది. ఆ ఊరిలో సుబ్బరాజు (నరేశ్ వీకే), కృష్ణమూర్తి (రావు రమేశ్) మంచి స్నేహితులు. అయితే, పుట్టుకతోనే చలనం లేకుండా జన్మించిన జన్మించిన రాజా (నార్నే నితిన్) సిగరెట్ పొగతో ఊపిరి పోసుకుంటాడు. చనిపోయాడు అనుకున్న కుమారుడిలో తిరిగి చలనం కనిపించడంతో సుబ్బరాజు (నరేశ్ వీకే) చాలా సంతోషిస్తాడు. అయితే, తన కుమారుడు పెరిగే కొద్ది సిగరెట్కు బానిస కావడం తండ్రిగా సహించలేడు. రాజాకు ఉన్న సిగరెట్ అలవాటుతో అతన్ని ఊరి వాళ్లు అందరూ ఆటపట్టిస్తూ ఉంటారు.కృష్ణమూర్తి (రావు రమేశ్) కూతురు నిత్య (సంపద) అంటే రాజాకి చాలా ఇష్టం. ఇద్దరూ ఒకరినిఒకరు విడిచిపెట్టలేనంత ప్రేమలో ఉంటారు. కానీ, ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. జులాయిగా తిరుగుతున్న రాజాకు తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయడం కృష్ణమూర్తికి ఇష్టం ఉండదు. కానీ, కూతురి కోసం పెళ్లికి ఓకే చెబుతాడు. అయితే, నిశ్చితార్థం నాడు రాజా చేసిన ఒక పొరపాటు వల్ల అక్కడ పెద్ద గొడవే జరుగుతుంది. దీంతో వారిద్దరి పెళ్లి ఆగిపోతుంది. ఆపై స్నేహితులుగా ఉన్న వారి తండ్రుల మధ్య దూరం పెరుగుతుంది. ఈ క్రమంలోనే కృష్ణమూర్తికి సుబ్బరాజు ఒక ఛాలెంజ్ ఇసురుతాడు. ఈ సవాల్లో తాను గెలిస్తే నిత్యను రాజాకి ఇచ్చి పెళ్లి చేయాలని కోరతాడు. అందుకు కృష్ణమూర్తి కూడా రెడీ అంటాడు. అయితే, ఫైనల్గా రాజా గెలుస్తాడా..? తను ప్రేమించిన నిత్యను పెళ్లి చేసుకుంటాడా..? ఛాలెంజ్ కోసం సిగరెట్ ఆపేస్తాడా..? నిశ్చతార్థంలో జరిగిన గొడవకు కారణం ఏంటి..? వంటి అంశాలు తెలియాలంటే శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా చూడాల్సిందే. -
చదివింది ఇంటర్, ఫస్ట్ సినిమానే హిట్.. లగ్జరీ కారు కొన్న నటి
హీరో నాని నిర్మించిన 'కోర్ట్' సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ సినిమాలో 'జాబిలి' పాత్రలో నటించిన తెలుగమ్మాయి శ్రీదేవి బాగా పాపులర్ అయిపోయింది. వైష్ణవ్తేజ్ చేసిన ‘ఆదికేశవ’లో ఓ పాత్రలో ఆమె కనిపించినప్పటికీ హీరోయిన్గా కోర్ట్ సినిమానే మొదటిది కావడం విశేషం. తాజాగా కొత్త కారు కొన్నట్లు శ్రీదేవి సోషల్మీడియా ద్వారా తెలిపింది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసిందికొత్త కారు కొనడం తన కోరిక అంటూ.. ఎంజీ హెక్టార్ (MG Hector) కారును శ్రీదేవి పోస్ట్ చేసింది. అయితే, ఈ లగ్జరీ కారు ధర రూ. 25 లక్షల వరకు వుంటుందని సమాచారం. చిన్నవయసులోనే తను అనుకున్న కలను నెరవేర్చుకుందని శ్రీదేవిపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కోర్టు సినిమాకు గాను రూ. 10 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సోషల్మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఈ సినిమా ద్వారా ఆమెకు సోషల్మీడియాలో ఫాలోవర్స్ పెరిగారు. ఆపై పలు సినిమా ఛాన్సులు రావడంతో కాస్త సంపాదన కూడా పెరిగిందని టాక్.శ్రీదేవి పూర్తిపేరు శ్రీదేవి ఆపళ్ల. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ ఈమె సొంతూరు. 'కోర్ట్' మూవీలో జాబిలి పాత్ర కోసం ఎవరు సెట్ అవుతారా అని డైరెక్టర్ రామ్ జగదీశ్ వెతుకుతున్న క్రమంలోనే ఈమె చేసిన ఓ ఇన్ స్టా రీల్ ని ఫ్రెండ్ చూపించాడు. దీంతో ఈమెనే జాబిలి అని ఫిక్సయ్యాడు. పిలిపించి ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశారు. ఈ ఏడాదిలోనే ఆమె ఇంటర్ పూర్తి చేసింది. అమ్మానాన్నలిద్దరూ రియల్ఎస్టేట్ రంగంలో ఉన్నారు. సినిమాలు అంటే ఇష్టంతోనే ఎక్కువగా రీల్స్ చేసేదానిని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. -
'ఉప్పు కప్పురంబు' మూవీ రివ్యూ.. డిఫరెంట్ పాత్రలో కీర్తి సురేశ్
టైటిల్ : ఉప్పు కప్పురంబునటీనటులు: కీర్తి సురేశ్, సుహాస్, బాబు మోహన్, శత్రు, తాళ్లూరి రామేశ్వరినిర్మాణ సంస్థ: అమెజాన్ ప్రైమ్నిర్మాత: రాధిక లావుకథ: వసంత్ మురళీకృష్ణ దర్శకత్వం: ఐవీ శశివిడుదల తేది: జులై 4, 2025స్ట్రీమింగ్: అమెజాన్జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్(Keerthy Suresh) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఉప్పు కప్పురంబు’ (Uppu Kappurambu). జులై 4న డైరెక్ట్గా అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. నటుడు సుహాస్ కీలక పాత్ర పోషించారు. సెటైరికల్ కామెడీ డ్రామాగా దర్శకులు ఐవీ శశి రూపొందించగా.. రాధికా ఎల్ నిర్మించారు. ఈ చిత్రానికి వసంత్ మురళీకృష్ణ కథని అందించారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఒక గ్రామంలో శ్మశాన వాటిక కోసం ఏర్పడిన సంక్షోభాన్ని.. అక్కడి ప్రజలు ఏవిధంగా పరిష్కరించుకుంటారనే కథనంతో ఈ సినిమా సిద్ధమైంది. 1990 నాటి బ్యాక్డ్రాస్ స్టోరీతో వచ్చిన ఉప్పు కప్పురంబు సినిమా ఎలా ఉంది తెలుసుకుందాం.కథేంటంటే..‘ఉప్పు కప్పురంబు’ సినిమాకు కథను పరిచయం చేస్తూ హీరో రానా వాయిస్ ఇచ్చారు. సుమారు 300 ఏళ్ల చరిత్ర ఉన్న ' చిట్టి జయపురం' అనే గ్రామానికి పెద్దగా (సుబ్బరాజు) శుభలేఖ సుధాకర్ ఉంటారు. అయితే, ఆయన మరణించడంతో అతని కుమార్తె అపూర్వ (కీర్తి సురేష్) గ్రామ పెద్దగా కొనసాగుతుంది. వయసులో చిన్నపిల్ల అయిన అపూర్య గ్రామ పెద్ద ఏంటి..? అంటూ భద్రయ్య (బాబు మోహన్), మధు (శత్రు) తీవ్రంగా వ్యతిరేఖిస్తారు. అయితే, ఇక్కడ వారిద్దరు కూడా ఒకరిపైమరోకరు ఆధిపత్యం కోసం పోరాడుతూనే అపూర్వను ఇబ్బంది పెట్టాలని చూస్తారు. అలా వారు రెండు వర్గాలుగా విడిపోయి ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. గ్రామ పెద్దగా ఉన్న అపూర్వకు ఒక సమస్య వచ్చి పడుతుంది.గ్రామంలో ఎవరు మరణించినా వారి ఆచారం ప్రకారం ఉత్తరాన మాత్రమే పాతిపెట్టడం ఆనవాయితీగా ఉంది. చాలా ఏళ్ల నుంచి వారు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో ఆ స్మశానం నిండిపోయిందని అక్కడి కాపరిగా ఉండే చిన్న (సుహాస్) తెలుపుతాడు. అయితే, నలుగురికి మాత్రమే అక్కడ చోటు ఉందని చిన్న చెబుతాడు. ఈ సమస్యను పరిష్కరించాలని అపూర్వను కోరుతాడు. గ్రామ సభ ఏర్పాటు చేసి ఆ నలుగురిని లాటరీ పద్ధతి ద్వారా అపూర్వ ఎంపిక చేస్తుంది. అయితే, సడెన్గా జరిగిన ఒక ప్రమాదంలో అదేరోజు మరో నలుగురు మరణిస్తారు. తప్పని పరిస్థితిలో వారిని అక్కడ పాతిపెట్టాక శ్మశానం హౌస్ఫుల్ అని బోర్డు పెట్టేస్తారు. అయితే, ఆ శ్మాశనంలో ఇంకోకరికి చోటు ఉంటుంది. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా చిన్న దాచిపెడుతాడు. అలా అతను ఎందుకు చేశాడు..? గ్రామానికి తూర్పు దిక్కున మాత్రమే శ్మశానం ఎందుకు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు..? శ్మశాన కాపరిగా ఉన్న చిన్న చేసిన మోసం వల్ల అపూర్వకు ఎదురైన చిక్కులు ఏంటి..? ఫైనల్గా అపూర్వ కనుగొన్న పరిష్కారం ఏంటి..? అనేది తెలియాలంటే ఉప్పు కప్పురంబు సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. 1990 కాలం నాటి ప్రజలు శ్మశానంలో ఆరు అడుగుల స్థలం కోసం ఎలాంటి ఇబ్బందులు పడేవారో ఈ చిత్రంతో దర్శకుడు ఐవీ శశి చక్కగా చూపారు. ఆ రోజులకు తగ్గట్టుగానే పాత్రలను డిజైన్ చేయడమే కాకుండా కథను కూడా కాలానికి అనుగునంగా రాసుకున్నాడు. దీంతో ఓటీటీ ప్రియులకు మంచి వినోదాన్ని ఈ చిత్రం ఇస్తుంది. పరిశ్రమలోకి వచ్చే కొత్త రచయితలు, దర్శకులు ఇలా సరికొత్త కాన్సెప్ట్లతో ప్రేక్షకులను మెప్పించేలా మూవీ ఉంటుంది. ఇంత చిన్న పాయింట్తో కూడా సినిమా తీయొచ్చా..? అని మిమ్మల్ని ఆశ్చర్యపరిచేలా చేస్తారు. ప్రస్తుతం సమాజంలో నెలకొన్న సమస్యల్లో ఒకటి శ్మశానం. ఆ పాయింట్కు కాస్త వినోదం జోడించి తెరపై చూపించడంలో దర్శకుడు ఐవీ శశి విజయం సాధించారు.ఇప్పటి వరకు కీర్తి సురేష్ గ్లామర్, డీ గ్లామర్ పాత్రలతో మెప్పించింది. అయితే ఈ సినిమాలో చాలా ప్రత్యేకమైన పాత్రలో అదరగొట్టింది. మంచి కామెడీ స్కోప్ ఉన్న పాత్రలో దుమ్మురేపింది. అపూర్వ ఊరి పెద్ద అయిన తర్వాత శ్మశానం సమస్య తెరపైకి వస్తుంది. ఏదో తాత్కాలికంగా దానిని తీర్చాం అనుకునేలోపు నలుగురు చనిపోతారు. దీంతో ఆ సమస్య మరింత తీవ్రం అవుతుంది. అలాంటి సమయంలో సుహాస్ ఒక ప్లాన్తో తెరపైకి వస్తాడు. ఇలా శ్మశానం చుట్టూ సమస్యలు వాటికి పరిష్కారాలు తెరపై దర్శకుడు చూపిస్తాడు. కీర్తి సురేశ్ గ్రామ పెద్దగా నటన బాగున్నప్పటికీ ఆమె పాత్రలో చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అవి ప్రేక్షకుడికి లాజికల్గా అనిపించవు. ఒక సీన్లో అమాయకంగా కనిపించిన కీర్తి.. మరో సీన్లో చాలా తెలివైన అమ్మాయిగా వ్యవహరిస్తుంది. ఇలాంటి సీన్స్ కాస్త తికమకకు గురిచేస్తాయి. కొన్ని సీన్లు మరీ ఓవర్ రియాక్ట్ అయ్యేలా ఉంటాయి. కానీ, ఆమె నటన మాత్రం అదిరిపోతుంది. సుహాస్ పాత్ర చాలా స్టేబుల్గానే ఉంటుంది. ఎక్కడా కూడా తడబాటు లేకుండా సెట్ చేశాడు. సినిమా మొత్తం ఎక్కువగా సుహాస్, కీర్తిల మధ్యే జరుగుతుంది. కథలో అక్కడక్కడ చిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆలోచింపచేస్తుంది. మిమ్మల్ని 30 ఏళ్లు వెనక్కు తీసుకెళ్తుంది. క్లైమాక్స్లో ఊరి సమస్యకు పరిష్కారం కనుగొన్న తీరు కాస్త ఎమోషనల్గా సీన్ రాసుకోవడం బాగుంది. ఎలాంటి అంచనాలు లేకుండా సరదాగా ఓటీటీలో చూడాల్సిన సినిమా అని చెప్పొచ్చు. ఇందులో కీర్తి సురేశ్ నటన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మెప్పిస్తుంది కూడా..ఎవరెలా చేశారంటే.. ఈ మూవీలో కీర్తి సురేష్ పాత్ర చాలా బలం. అందుకు తగ్గట్లుగానే ఆమె నటించింది. ఇప్పటి వరకు ఆమె చేసిన పాత్రలు అన్నీ కూడా చాలా రొటీన్గానే ఉంటాయి. కానీ అపూర్వ పాత్ర మాత్రం చాలా ప్రత్యేకంగా ఎప్పిటికీ నిలిచిపోతుంది. ఇందులో అమాయకంగా, క్యూట్గా, అల్లరి పిల్లగా, బాధ్యతగల గ్రామ పెద్దగా ఇలా పలు షేడ్స్ ఆమె నటనలో కనిపిస్తాయి. ఒక మంచి పాత్రే కీర్తికి పడింది అని చెప్పవచ్చు.కాటి కాపరి పాత్రలో సుహాస్ మెప్పించాడు. ఎక్కడా కూడా ఆయన తగ్గలేదు.'నిజం' సినిమాలో మహేశ్బాబుకు అమ్మగా నటించిన తాళ్లూరి రామేశ్వరికి ఈ చిత్రంలో చాలా మంచి పాత్ర పడింది. ఈ మూవీతో ఆమెకు మరిన్ని ఛాన్సులు రావచ్చని చెప్పొచ్చు. బాబు మోహన్, శత్రు తమ పాత్రల మేరకు మెప్పించారు. సంగీతం, సినిమాటోగ్రాఫర్ ఈ మూవీకి బలాన్ని చేకూర్చాయి. మూవీ నిర్మాణ విలువలు బడ్జెట్కు మించే ఉన్నాయని చెప్పవచ్చు. 'ఉప్పు కప్పురంబు' ఓటీటీలో ఎవరినీ నిరుత్సాహపరచని సినిమాగా తప్పకుండా మిగిలిపోతుంది. -
‘తమ్ముడు’ మూవీ ట్విటర్ రివ్యూ
శ్రీరామ్ వేణు దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు (జులై 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నరు.తమ్ముడు కథేంటి? ఎలా ఉంది? నితిన్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్ (ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు.అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.ఎక్స్లో తమ్ముడు చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది.. బాగోలేదని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.#Thammudu Review : A Good emotional Ride with Solid Production values - 3/5 💥💥💥Mainly Youth Star ⭐️ @actor_nithiin has given one of the career best performance 🔥🔥🔥💥💥 with a good comeback film 🎥👍❤️🔥 #Nithiin Director #SriramVenu Handled the subject very well with… pic.twitter.com/Xy0CFOvlKH— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) July 4, 2025 తమ్ముడు సినిమాలో విలువలతో పాటు మంచి ఎమోషన్ పండించే సన్నివేశాలు ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. నితిన్ కెరీర్లో బెస్ట్ ఫెర్పార్మెన్స్ ఇచ్చాడు. దర్శకుడు శ్రీరామ్ వేణు కథను చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో చాలా బాగా హ్యాండిల్ చేశాడు. బీజీఎమ్ బాగుంది. క లయ, సప్తమీ గౌడ, వర్ష బొలమ్మ యాక్టింగ్ బాగుందంటూ ఓ నెటిజన్ 3 రేటింగ్ ఇచ్చాడు. Second half has excellent fight sequences…fans ki full meals aa fight sequences…Overall good movie. One time watch.Must in Theaters.#Thammudu @actor_nithiin https://t.co/ZHf0uZ0tr2— Mythoughts 🚩 (@MovieMyPassion) July 4, 2025 ఫస్టాఫ్ పర్వాలేదు. సెకండాఫ్లో ఫైట్ సీక్వెన్స్ అదిరిపోతాయి. ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్లా ఫైట్ సీక్వెన్స్ తీర్చిదిద్దారు. ఓవరాల్గా తమ్ముడు గుడ్ మూవీ. ఒక్కసారి చూడొచ్చు. కచ్చితంగా థియేటర్స్లో చూడాలి’ అని ఒక నెటిజన్ రాసుకొచ్చాడు. Below average film. Apart from two fight sequences, the film is boring in the second half.The issue with #Thammudu is the lack of emotion and the brother/sister emotion doesn’t work. The choreography for action sequences which is important for this film could’ve been much…— Sharat chandra 🦅 (@Sharatsays2) July 4, 2025బిలో యావరేజ్ సినిమా ఇది. రెండు ఫైట్ సీక్వెన్స్ మినహా సెకండాఫ్ అంతా బోరింగ్గా సాగుతుంది. అక్కా తమ్ముడు సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. సినిమాకు అదే ప్లస్ అయింది. వేణు శ్రీరామ్ డిసప్పాయింట్ చేశాడు. టెక్నికల్గా సినిమాను ఉన్నతంగా తీర్చిదిద్దడంతో సక్సెస్ అయ్యాడు కానీ.. సరైన కథనే రాసుకోలేకపోయాడు. టీం పడిన కష్టం తెరపై కనిపించింది. కానీ అది ప్రేక్షకుడిపై ప్రభావం చూపలేకపోయింది’అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.#Thammudu A Lackluster Action-Adventure Drama That Tests Your Patience from start to finish! Director Venu Sriram attempts to deliver a unique action-adventure film with an interesting backdrop. However, he completely fails. The on-screen proceedings are outright silly at…— Venky Reviews (@venkyreviews) July 4, 2025 విలన్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉన్నా.ఆ పాత్ర తాలుకు సంఘర్షణ ఆకట్టుకోలేకపోయింది. బీజీఎం బాగుంది. సెకండాఫ్లో ఒక సీన్ బాగుంది. అంతకు మించి సినిమాలో చెప్పుకోవడానికి ఏమి లేదంటూ మరో నెటిజన్ 1.75 రేటింగ్ ఇచ్చాడు.#Thammudu is a super knit commercial movie.First half starts a bit slow and the director takes his own time to establish the plot. There’s no looking back from the pre-interval to the superb INTERVAL BANG 💥.Post interval scenes are the major highlights of the movie.3.5/5— Peter Reviews 🔥🪓 (@urstruelypeter) July 4, 2025#thammudu First Half Review: Starts off with a familiar setup and unfolds at a slow pace, especially during the forest portions. The drama and stakes feel underwhelming so far. Hoping the second half picks up and delivers better.#ThammuduTrailer #nithin #DilRaju— Dingu420 (@dingu420) July 4, 2025 -
జీవితంలో ఏం సాధించానో ఇప్పుడే తెలిసొచ్చింది: సమంత
నటి సమంత రూటే వేరు. తనకు నచ్చినట్లు ప్రవర్తించే నటీమణుల్లో ఈమె ముందుంటుందని చెప్పవచ్చు. ఎప్పుడూ సోషల్మీడియాతో తన అభిమానులకు ఆమె టచ్లో ఉంటారు. తనకు నచ్చిన ప్రతి విషయాన్ని ఆమె పంచుకుంటారు. విడాకులు, మయోసైటిస్ ఇలా తన జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితుల గురించి కూడా అందులో వ్యక్తపరుస్తూ ఉంటారు. తాజాగా తాను ఎవరూ..? ఎంత పెద్ద సెలబ్రిటీ..? జీవితంలో ఏం సాధించానో తెలుసుకున్నానని చెప్పుకొచ్చారు.విడాకులు పొందిన సమంత ఆ తరువాత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురై దాని నుంచి బయట పడటానికి పెద్ద పోరాటమే చేశారు. అలా చాలా కాలం నటనకు దూరం అయిన ఈమె మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యారు. అలా వెబ్ సిరీస్లో నటించిన సమంత ఇటీవల నిర్మాతగానూ అవతారమెత్తి శుభం అనే చిత్రాన్ని నిర్మించారు కూడా. ఇలా నిత్యం సామాజిక మాధ్యమాల్లో యాక్టీవ్గా ఉంటున్న సమంత తాజాగా సామాజిక మాధ్యమాల్లో మరో టీట్ చేశారు. అందులో తన చేతిలో ఎప్పుడూ సెల్ఫోన్ ఉంటుందన్నారు. దీంతో సడన్గా తనకొక ఆలోచన వచ్చిందనీ, దీంతో వెంటనే తన సెల్ఫోన్ను మూడు రోజుల పాటు స్విచ్చ్ ఆఫ్ చేసినట్లు చెప్పారు. ఆ మూడు రోజులు ఎవరితోనూ మాట్లాడలేదనీ, ఎవరినీ చూడలేదనీ, పుస్తకాలు చదవడం, రాయడం వంటివేవీ చేయలేదన్నారు. ఇంకా చెప్పాలంటే ఏ పని చేయలేదన్నారు. అలా మూడు రోజులు మెదడుకు పూర్తిగా విశ్రాంతినిచ్చినట్లు చెప్పారు. ఆ అనుభవం చాలా కొత్తగా ఉందన్నారు. తన ఈగోలో చాలా భాగం తన సెల్ఫోన్తోనే అన్నది అప్పడు అర్థం అయ్యిందన్నారు. తాను ఎవరూ? ఎంత సెలబ్రిటీనీ? ఏం సాధించాను? అన్న విషయాలు తన సెల్ఫోన్నే చెబుతుందన్నారు. అది లేని రోజున తాను ఒక సాధారణ జీవినని అనే భావన కలిగిందన్నారు. పుట్టుకకు గిట్టుటకు మధ్య కాలంలో సెల్ఫోన్ మనకు ప్రకృతికి చెందిన విషయాలను కనుమరుగు చేసిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మన పెద్దలకు, ఆరోగ్యానికి సెల్ఫోన్ ఎంత ఆటంకంగా మారిందన్నది అవగతం చేసుకున్నానని నటి సమంత అన్నారు. ఈమె చేసిన పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
గుండెను గుచ్చే అందమైన ముల్లు
‘కాంటా లగా’ మ్యూజిక్ ఆల్బమ్ ఫేమ్, ప్రముఖ బాలీవుడ్ నటి షెఫాలీ జరీవాలా బ్యూటీ ట్రీట్మెంట్లో భాగంగా ఓ ఇంజెక్షన్ తీసుకున్న కొద్దిసేపటికే కార్డియాక్ అరెస్ట్తో మృతిచెందిన సంఘటన ఇటీవల చాలా సంచలనం రేపింది. షెఫాలీ అనేక ఏళ్లుగా ఈ చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఆరోజు ఆమె ఉపవాసంలో ఉండి... ఇంజెక్షన్ తీసుకున్నందున ఇలా జరిగిందనే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో సాధారణంగా నటీనటులతో పాటు ఇతరులు తీసుకునే బ్యూటీ చికిత్సలనూ అలాగే... గుండెపై వాటి ప్రభావాలను చూద్దాం...‘అందమె ఆనందం... ఆనందమె జీవిత మకరందం’ అంటూ తెలుగు కవులు వినిపించారూ... వివరించారు. అందం ఆనందాన్నిస్తుంది. దానికి ప్రాణాల్ని మూల్యంగా చెల్లించాలా అన్నది సమాజం అడుగుతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలో అసలు బ్యూటీ చికిత్సలో జరిగేదేమిటి, వాటి పర్యవసానాలేమిటి, గుండెపైన వాటి ప్రభావాలేమిటో తెలుసుకుందాం. మొదట్లో సినీతారలు... తర్వాత్తర్వాత క్రమంగా బాగా ధనవంతులు మొదలు... నేడు సామాన్యుల వరకూ సౌందర్య కాంక్ష చేరింది. ఇప్పుడు పార్లర్కు వెళ్లడమన్నది మధ్యతరగతీ, దిగువ మధ్యతరగతికీ సాధారణమైంది. మెరుస్తున్న మేని నిగారింపు, యూత్ఫుల్ లుక్తో కనిపించడం అందరికీ ఇష్టమైన అంశమైంది. బ్యూటీ థెరపీ లేదా ఈస్థటిక్ ట్రీట్మెంట్ అని పిలిచే సౌందర్య చికిత్సల్లో రక్తనాళం ద్వారా నేరుగా రక్తంలోకి పంపించే గ్లుటాథియోన్ డ్రిప్స్ మొదలుకొని రకరకాల మీసోథెరపీ (మీసో థెరపీ అంటే చర్మంలో ఉండే మూడు పొరల్లోని మధ్యపొరపై ప్రభావం చూపేవి) మందులూ, కొలాజెన్ ΄ పౌడర్లు, చర్మం నిగారింపుతో ఫెయిర్గా కనిపించేందుకు వాడే ఇంజెక్షన్లు, పైపూతగా వాడే క్రీములు, ΄ పౌడర్లు... ఇలా రకరకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. పైకి మిలమిలా మెరుస్తూ ఉండే చర్మం వెనక కొన్ని నల్లటి చిక్కటి చీకటి రహస్యాలూ ఉంటాయి. కొన్నింటిపైన ఓ మేరకు నియంత్రణలు ఉన్నప్పటికీ... మరికొన్నింటి విషయంలో అసలు ఎలాంటి అదుపూ లేకుండా ఏమాత్రం శిక్షణ లేనివారూ, తమకు ఎలాంటి పరిజ్ఞానమూ లేనివారూ చేసేవి కూడా ఉంటాయన్నది ఓ నగ్న సత్యం. ఇదీ చదవండి: Tip of the Day : రాగుల జావతో మ్యాజిక్ బ్యూటీ చికిత్సల్లో ఎన్నెన్నో రకాలు... వ్యక్తులు అందంగా కనిపించేందుకు చేసే చికిత్సల్లో పలు రకాలైనవి ఉంటాయి. ఉదాహరణకు... → పెరుగుతున్న వయసు ఛాయలు చర్మంపై కనిపించకుండా... ముడుతలూ, లోతైన గీతలు కనిపించకుండా చేసేందుకు యాంటీ ఏజింగ్ చికిత్సగా బొటాక్స్ ఇంజెక్షన్లు, ఇతర డర్మల్ ఫిల్లర్స్ → మార్కెట్లో యాంటీ ఏజింగ్ మందులు, డీ–టాక్స్ లేదా ఇమ్యూనిటీ బూస్టర్స్గా పిలుస్తూ... రక్తనాళం ద్వారా రక్తంలోకి మందును ఎక్కించే గ్లుటాథియోన్, నికొటినెమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ (ఎన్ఏడీ+) మందులు → రక్తంలోని ప్లాస్మాను వేరు చేసి చర్మంలోకి ఎక్కించే పీఆర్పీ (ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా) థెరపీ, (జుట్టు ఒత్తుగా పెరిగేలా చేసే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ (జీఎఫ్సీ) చికిత్స, ఎగ్జోసోమ్స్, చర్మాన్ని ఉత్తేజితం చేసే పాలీ డైయాక్సీ రైబో న్యూక్లియోటైడ్ (పీడీఆర్ఎన్) వంటి చికిత్సలు → కొలాజెన్ పెపై్టడ్స్, బయోటిన్, చర్మాన్ని తెల్లగా మార్చే గుట్లాథియోన్ లాంటి పిల్స్తో పాటు కొన్ని హార్మోన్ థెరపీలు. ఇవన్నీ ఆహారంలోని సప్లిమెంట్స్ కాగా... వీటిలో కొన్నింటిని నోటిద్వారా (ఓరల్గా) ఇస్తారు → ఇక పైపూత లేపనాలు (టాపికల్)గా వాడే పెపై్టడులూ, రెటినాయిడ్స్ ఉండే క్రీములు... ఇవి సౌందర్య ఔషధ రూపాల్లో ఇస్తుండటం వల్ల వీటిని ‘కాస్మస్యూటికల్స్’గానూ చెబుతారు.మన దేశంలోఅనుమతిఉన్నవి కొన్నే...మన దేశంలో ఇలాంటి మందులకు అనుమతి ఇచ్చే అత్యున్నత అథారిటీ ‘సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ – సీడీఎస్సీఓ) అనే సంస్థ. దీనితో పాటు అమెరికన్ సంస్థ ఎఫ్డీఏ అనుమతించిన వాటిని మనదేశంలోనూ అనుమతిస్తుంటారు. వాటిల్లో కొన్నింటికే అనుమతులున్నాయి → ఉదాహరణకు రక్తంలోకి ఎక్కించే గ్లుటాథియోన్, హై–డోస్ విటమిన్ సి, ఎన్ఏడీ+ లేదా మరికొన్ని మిశ్రమ మందులు (కాక్టెయిల్స్)కు పై సంస్థల అనుమతి లేదు → చర్మంలో ఉండే మూడు పొరల్లో మధ్యపొరపై పనిచేసే మరికొన్ని చికిత్సలను ‘ఎక్సోజోమ్ బేస్డ్’ చికిత్సలు అంటారు. వీటితో పాటు స్టెమ్సెల్ థెరపీల వంటివాటిని శిక్షణ పొందిన క్వాలిఫైడ్ నిపుణులు అందిస్తేనే సురక్షితం.ప్రమాదాలూ / అనర్థాలు ఎప్పుడంటే... ముందుగా చెప్పిన ప్రకారం... అత్యంత సుశిక్షితులూ, అన్ని విధాలా తగిన విద్యార్హతలు ఉన్న డర్మటాలజిస్టుల వంటి నిపుణులు మాత్రమే ఈ చికిత్సలను అందించాల్సిన నేపథ్యంలో ప్రస్తుతం చాలాచోట్ల అనధికారిక సెలూన్లు, స్పాలు ఇంకా చెప్పాలంటే కొన్నిచోట్ల ఇళ్లలో కూడా అనధికారికంగా ఈ ఔషధాలనూ, ఇవ్వకూడని సప్లిమెంట్లను ఇస్తున్నారు. పైగా ఇళ్లలో ఇచ్చే ఈ చికిత్సల్లో ఏవైనా దుష్ప్రభావాలు ఎదురైతే... వాటి పర్యవసానాలేమిటీ, వాటిని ఎలా ఎదుర్కోవాలన్న పరిజ్ఞానం అనర్హులైన చికిత్సకులకు ఉండదూ, అలా ఎదుర్కొనేందుకు అవసరమైన వనరులూ ఉండవు. అయినప్పటికీ చాలామంది వీటిని యధేచ్ఛగా ఇస్తున్నారూ... అలాగే అందంపై ఆసక్తి ఉన్న యువతీయువకులు తీసుకుంటున్నారు.చదవండి: క్యాషియర్ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటే నేరమా బాస్?!ఇవీ నమోదైన (డాక్యుమెంటెడ్) ప్రమాదాలు / అనర్థాలు → అలర్జిక్ రియాక్షన్లు, అనాఫిలాక్సిస్ అనర్థాలు (అదుపు చేయలేని విధంగా చాలా తక్కువ వ్యవధిలో వచ్చే తీవ్రమైన రియాక్షన్లు వీటి ద్వారా ఒక్కోసారి షాక్ కూడా కలిగితే దాన్ని అనాఫిలెక్టిక్ షాక్గా కూడా వ్యవహరిస్తారు). ఈ రియాక్షన్లు అరుదుగా ప్రాణాంతకమూ అయ్యే అవకాశాలు లేక΄ోలేదు → రక్తంలోకి ఎక్కించే గ్లుటాథియోన్ ఇంజెక్షన్లతో అనాఫిలెక్టిక్ షాక్, అసెప్టిక్ మెనింజైటిస్ (మెదడు, వెన్నుపాములో ఉండే పొరల వాపు) వంటివి చాలా అరుదు. అయితే కొన్నిసార్లు ఇలాంటి రియాక్షన్స్ కనిపించిన దాఖలాలు ఉన్నాయి → హై–డోస్ విటమిన్ బి కాంప్లెక్స్ ఇచ్చిన కొన్ని సందర్భాల్లో అవి వికటించి, ప్రాణాంతకంగా మారిన సందర్భాలూ ఉన్నాయి. నిజానికి చాలాకాలం నిల్వ చేయడానికి అందులో వాడే ప్రిజర్వేటివ్స్ వల్ల ఇలాంటి రియాక్షన్లు కనిపించాయి → కొన్ని సందర్భాల్లో బ్యూటీ మందులు వాడాక ఇన్ఫెక్షన్లు, రక్తానికి ఇన్ఫెక్షన్ (సెప్సిస్) కనిపించాయి → స్టెమ్ సెల్ చికిత్సల్లో కొంతమేరకు కనిపించే ముప్పు (రిస్క్)→ స్టెమ్సెల్స్తో చేసే చికిత్సల్లో ఇమ్యూన్ రియాక్షన్స్, ఇన్ఫెక్షన్స్ వచ్చే ముప్పు ఉన్నందున నిజానికి బ్యూటీ చికిత్సల్లో స్టెమ్సెల్స్కు అనుమతి లేదు.ప్రజలు తెలుసుకోవలసిన అంశాలు... → బ్యూటీ చికిత్స అందించేవారికి వాస్తవంగా ఆ అర్హత ఉందా, వారికి తగిన విద్యార్హతలు ఉన్నాయా వంటి అంశాలను అడిగి తెలుసుకోవాలి → చాలా త్వరగా ప్రభావం చూపుతాయన్న ‘క్విక్ ఫిక్స్ మార్కెటింగ్’ ప్రచారాలను నమ్మడం సరికాదు. మెల్లగా వచ్చే ప్రభావాలే దీర్ఘకాలం నిలుస్తాయి. ఇవి చాలావరకు నిరపాయకరమని గుర్తించాలి → ఆ సౌందర్యసాధనాలకూ, ఉత్పాదనలకు ఎఫ్డీఏ లేదా సీడీఎస్సీవో సంస్థల ఆమోదం ఉందా అని చూడాలి→ గ్లుటాథియోన్ వంటి మందులు ఇచ్చే సమయంలో అది నిరపాయకరమైన మోతాదులోనే ఉందా అని చూడాలి. అంటే వారానికి 600 నుంచి 1200 ఎంజీకి మించి మందు తీసుకోకూడదు. (అనర్థాలు సంభవించిన కొన్ని కేసులను చూసినప్పుడు కొందరు అవసరమైన మోతాదుకు ఐదు రెట్లు ఇచ్చిన దాఖలాలనూ గుర్తించారు) చివరగా... అందం చాలా ఆకర్షణీయమైదే. అందరూ కోరుకునేదే. అయితే దానికి చెల్లించాల్సిన మూల్యం ప్రాణాలు కాకూడదు. అందంగా ఉండటం కంటే ఆరోగ్యంగా జీవించి ఉండటం ముఖ్యం.ఎందుకీ అనర్థాలు... ఈ అనర్థాలకు చాలా కారణాలు ఉంటాయి. → చట్టపరంగా వీటిని అదుపు చేసే యంత్రాంగం కొరవడటం → యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ తరహా క్లినిక్లూ, చికిత్సల గురించి విపరీత ప్రచారం → ఏమాత్రం అర్హతా, పర్యవసానాలపై అవగాహన లేని అనర్హులు చికిత్సలందించడం. అన్నిటికంటే ముఖ్యంగా వినియోగ దారుల్లో కొరవడిన అవగాహన : ఈ ఉత్పాదనల విషయంలో ప్రజల్లో ఎలాంటి అవగాహన లేక΄ోవడం వల్ల కూడా ఈ తరహా అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు ‘స్వాభావికమైన, ప్రకృతిసిద్ధమైన (నేచురల్)’ వంటి మాటలు ఉపయోగించినప్పుడు అవేవీ ప్రమాదకరం కానివిగా భావిస్తూ చాలామంది ప్రమాదకరమైన సింథసైడ్ రసాయనాలనూ విచ్చలవిడిగా వాడుతున్నారు.వసతులన్నీ హాస్పిటల్స్లోనే... బ్యూటీ చికిత్సలు తీసుకునే సమయంలో అది పెద్ద హాస్పిటల్ అయి ఉండటం, ఎమర్జెన్సీ సౌకర్యాలూ కలిగి ఉండేలా చూసుకోవడం ముప్పును తప్పిస్తుంది. వాస్తవానికి రక్తంలోకి ఎక్కించే గ్లుటాథియోన్ వంటివి తగిన మోతాదులో ఇచ్చినప్పుడు గుండె΄ోటు రావడం, గుండె ఆగి΄ోవడం (కార్డియాక్ అరెస్ట్), అనాఫిలెక్టిక్ షాక్కు గురికావడం వంటి సందర్భాలు చాలా అరుదు. అయితే అన్ని వసతులూ, ఎమర్జెన్సీ సౌకర్యాలు ఉన్న ఆసుపత్రితో తగిన విద్యార్హతలూ, చికిత్స అర్హతలూ కలిగిన డాక్టర్ల ఆధ్వర్యంలో బ్యూటీ చికిత్సలు తీసుకుంటే... ఒకవేళ ఏవైనా రియాక్షన్స్, అనాఫిలెక్టిక్ రియాక్షన్స్ వచ్చినా తక్షణం చికిత్స అందించడం వల్ల ప్రాణాలను కాపాడటానికి అవకాశముంటుంది. -
పైరసీ నియంత్రణకి కఠిన చర్యలు: ‘దిల్’ రాజు
‘‘చిత్ర పరిశ్రమకి వీడియో పైరసీ అన్నది చాలా నష్టం కలిగిస్తోంది. ఈ పైరసీ నియంత్రణకి కఠిన చర్యలు చేపడుతున్నాం... ఇందుకోసం త్వరలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నాం’’ అని తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ‘దిల్’ రాజు తెలిపారు. ఎఫ్డీసీ ఎండీ సీహెచ్ ప్రియాంకతో కలిసి గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పలు కీలక సమావేశాలు నిర్వహించాం. సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం.ఎఫ్డీసీ నోడల్ ఏజెన్సీగా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైబర్ సెల్, పోలీస్ శాఖల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి, సినిమా షూటింగ్లకు ఆన్లైన్ అనుమతులపైనా చర్చించనున్నాం. సినీ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందరం కలిసి సినీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది’’ అన్నారు. ‘‘ఇండస్ట్రీ సమస్యలను ఎవరైనా మా దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తాం’’ అని ఎఫ్డీసీ ఎండీ సీహెచ్ ప్రియాంక హామీ ఇచ్చారు. -
సైకో కిల్లర్గా చేయాలని ఉంది: వర్ష బొల్లమ్మ
‘‘హీరోయిన్గా కొన్ని సినిమాలు చేశాను. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశం వచ్చినా చేస్తాను. స్క్రీన్పై వర్ష బాగా నటిం చిందనే పేరు తెచ్చుకుంటే చాలు. ఉదాహరణకు నిత్యా మీనన్గారికి మంచి పెర్ఫార్మర్గా పేరుంది. ఆమెలా పేరు తెచ్చుకోవాలని ఉంది. ‘తమ్ముడు’ కథ విన్నప్పుడు, ఈ సినిమాలో నేను చేసిన చిత్ర క్యారెక్టర్ కొత్తగా అనిపించింది.సవాల్గా తీసుకుని, ఈ సినిమా చేశాను’’ అని హీరోయిన్ వర్ష బొల్లమ్మ అన్నారు. నితిన్ హీరోగా నటించిన యాక్షన్ చిత్రం ‘తమ్ముడు’. ఈ చిత్రంలో లయ, సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ, బాల నటి శ్రీరామ్ దిత్య ఇతర కీలక పాత్రల్లో నటించారు.శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకరుల సమావేశంలో వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ– ‘‘అక్కాతమ్ముడు సెంటిమెంట్ నేపథ్యంలో సాగే సినిమా ‘తమ్ముడు’. కానీ కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. ఈ సినిమాలో నితిన్ క్యారెక్టర్ జైకి ఓ డ్రైవింగ్ ఫోర్స్లా ఉంటుంది చిత్ర పాత్ర.ఏదైనా చేయాలనుకుంటే వెంటనే చేసేయాలనుకునే మనస్తత్వం చిత్రది. ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. ఇక ఓ సైకో కిల్లర్ రోల్ చేయాలన్నది నా ఆకాంక్ష. ప్రస్తుతం ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్ సిరీస్, మరో వెబ్ సిరీస్లో నటిస్తున్నాను. మరో రెండు సినిమాలు ఉన్నాయి’’ అని అన్నారు. -
కాంతా లగా ఫేమ్ ఆకస్మిక మరణం.. ఆమెను తలచుకుని భర్త ఎమోషనల్!
'కాంతా లగా' అనే పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి షఫాలీ జరివాలా (Shefali Jariwala). 2002లో వచ్చిన ఈ పాటతోనే మొదటి వైరల్ సెలబ్రిటీగా ఆమె గుర్తింపు పొందింది. ఆ సమయంలో ఇన్స్టాగ్రామ్, రీల్స్ వంటివి లేకున్నా ఈ ఒక్క సాంగ్తో యూత్కు దగ్గరైంది. కానీ ఊహించని విధంగా ఆమె ఆకస్మిక మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే తాజాగా ఆమె మరణాన్ని తలచుకుని భర్త పరాగ్ త్యాగి ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన భార్యతో ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు.పరాగ్ తన పోస్ట్లో రాస్తూ.. 'షెఫాలి నువ్వు ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతావు. నువ్వు ఒక నమ్మకమైన స్నేహితురాలు, నా ప్రియమైన భార్య. నువ్వు మా అందరిని అమ్మలా చూసుకున్నావ్. ఎల్లప్పుడూ ఇతరులకు మొదటి స్థానం ఇచ్చే నువ్వు గొప్ప అంకితభావం గల వక్తి. కేవలం ఆప్యాయతగల భార్య మాత్రమే కాదు.. సింబాకు అద్భుతమైన తల్లివి కూడా. నువ్వు ప్రేమించిన వారి వెంట నిలిచే నమ్మకమైన స్నేహితురాలివి. అందుకే షెఫాలి గుర్తింపునకు అర్హురాలు. ఆమె ప్రజలను అలరించిన విధానం మరిచిపోలేనిది. ఇప్పుడు మనతో లేకపోయినా తన ప్రేమను ఎప్పటికీ మరచిపోలేం. శాశ్వతంగా నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.' అంటూ ఎమోనషల్ అయ్యారు. కాగా.. ఆమె మరణం తర్వాత ఐదు రోజులకు షెఫాలీ జరివాలా జ్ఞాపకార్థం ముంబయిలో ప్రార్థనా సమావేశం నిర్వహించారు. View this post on Instagram A post shared by Parag Tyagi (@paragtyagi) -
కలర్ ఫుల్ శారీలో అనసూయ.. బ్లాక్ డ్రెస్లో బిగ్బాస్ విష్ణుప్రియ గ్లామరస్ లుక్స్!
కుమారుడితో హీరోయిన్ అమలాపాల్ పోజులు..కలర్ఫుల్ శారీలో అనసూయ అదిరిపోయే లుక్స్..మొబైల్తో బిజీ బిజీగా సురేఖవాణి కూతురు సుప్రీత..బ్లాక్ బ్యూటీలా బిగ్బాస్ ముద్దుగుమ్మ విష్ణు ప్రియ.. View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Gayatri Bhargavi (@gayatri_bhargavi) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
వైరల్ ఎలా అవ్వాలంటోన్న శ్రీలీల.. అసలు విషయం ఏంటంటే?
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఈ ఏడాది నితిన్ సరసన రాబిన్హుడ్లో మెప్పించిన భామ.. ప్రస్తుతం మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం జూనియర్. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో జెనీలియా కీలక పాత్ర పోషించారు.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. ఇప్పటికే విడుదలైన సాంగ్, టీజర్కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో లిరికల్ సాంగ్ను మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈనెల 4న వైరల్ వయ్యారి అంటూ సాగే పాటను రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలీల, దేవీశ్రీ ప్రసాద్ చేసిన ప్రమోషన్ వీడియో నెట్టింట వైరల్గా మారింది.ఈ వీడియో మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీకి కాల్ చేసిన శ్రీలీల.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన మీ రీల్సే కనిపిస్తున్నాయి.. మీలా వైరల్ ఎలా అవ్వాలో నేర్పిస్తారా అని అడిగింది. ఏంటీ వైరల్ ఎలా అవ్వాలో మీకు నేర్పాలా?కామెడీ వద్దమ్మా? మీరే నాకు నేర్పాలని దేవీశ్రీ అన్నారు. నిజమే కదా.. మీరు వయ్యారంగా ఓ మాస్ స్టెప్ వేస్తే అదే వైరలైపోద్ది అని చెప్పాడు. అదేదో మీరే ఇవ్వండి సార్ అని శ్రీలీల ముద్దుగా అడగడంతో.. వైరల్ వయ్యారి అంటే ఎలా ఉంది సాంగ్ అంటూ దేవీశ్రీ మ్యూజిక్ అదరగొట్టేశాడు. ఇదంతా వైరల్ వయ్యారి పాట కోసమే వీరిలా వైరైటీ ప్రమోషన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కాగా.. వారాహి చిత్రం బ్యానర్పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జూన్ 18న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.#Junior second single #ViralVayyari out on July 4thIn cinemas July 18th. @sreeleela14 @ThisIsDSP pic.twitter.com/TDAbv8w5Rz— ScreenTimeGuru (@ScreenTimeGuru) July 1, 2025 -
రజినీకాంత్ కూలీ చిత్రం.. అమిర్ ఖాన్ పాత్రపై అఫీషియల్ ప్రకటన
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కూలీ. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ (lokesh kanagaraj) దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు.అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ నటిస్తున్నారని గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు అమిర్ ఖాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో దహా అనే పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. తాజాగా విడుదలైన అమిర్ ఖాన్ లుక్ అదిరిపోయిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో కూలీ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.Introducing #AamirKhan as Dahaa, from the world of #Coolie 😎⚡#Coolie is all set to dominate IMAX screens worldwide from August 14th 🔥@rajinikanth @Dir_Lokesh @anirudhofficial @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @anbariv @girishganges… pic.twitter.com/Z8pI5YJzRe— Sun Pictures (@sunpictures) July 3, 2025 -
ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ మూవీ.. ఆ నాలుగు పాత్రలపైనే ఆసక్తి!
మార్వెల్ స్టూడియోస్ నుంచి మరో చిత్రం అలరించేందుకు సిద్ధమైంది. ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ జూలై 25న ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో థియేటర్లలోకి రానుంది. ఇటీవలే తెలుగు ట్రైలర్ను కూడా విడుదల చేశారు మేకర్స్. ఇందులో మార్వెల్ మొదటి సూపర్ హీరో కుటుంబానికి, గ్రహాలను మింగేసే గెలాక్టస్కి మధ్య జరగబోయే భీకర పోరాటం ఈ సినిమాలో చూపించనున్నారు. ఫైట్స్, విజువల్స్ చూస్తే ఈ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచేలా కనిపిస్తోంది. 1960ల నాటి రెట్రో-ఫ్యూచరిస్టిక్ సెట్టింగ్లో ఈ సినిమా ఉండనుంది. ఈ చిత్రంలోని నలుగురి పాత్రలపై ఓ లుక్కేద్దాం. రీడ్ రిచర్డ్స్ (మిస్టర్ ఫెంటాస్టిక్) పాత్రలో పెడ్రో పాస్కల్ కనిపించనున్నారు. ఫెంటాస్టిక్ ఫోర్కు నాయకుడిగా ఉంటారు. రీడ్ రిచర్డ్స్ తన శరీర ఆకృతి మార్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. సూ స్టార్మ్ (ఇన్విజిబుల్ ఉమెన్)గా వెనెస్సా కిర్బీ కనిపించనుంది. ఆమె క్షిపణుల నుంచి వచ్చే ఇంటర్ డైమెన్షనల్ శక్తి దాడులను నిరోధించేంత శక్తివంతమైన పాత్ర పోషించింది. జానీ స్టార్మ్ (హ్యూమన్ టార్చ్) గా జోసెఫ్ క్విన్ నటించారు. బెన్ గ్రిమ్ (ది థింగ్) పాత్రలో ఎబోన్ మోస్-బచ్రాచ్ కనిపిస్తారు.కాగా.. ఈ చిత్రానికి మాట్ షాక్మాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను కెవిన్ ఫీజ్ నిర్మించారు. 'ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్' ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో జూలై 25, 2025న విడుదల కానుంది. ఈ యాక్షన్ అడ్వెంచర్లో పాల్ వాల్టర్ హౌసర్, జాన్ మల్కోవిచ్, నటాషా లియోన్, సారా నైల్స్ కూడా కనిపించనున్నారు. -
ఓటీటీలో పోటాపోటీగా సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసును ఆధారంగా చేసుకుని తెరకెక్కిన 'ది హంట్' వెబ్ సిరీస్ జులై 4న ఓటీటీలో విడుదల కానుంది. 'సోనీలివ్' (SonyLiv) వేదికగా తెలుగుతో పాటు హిందీ, తమిళ్ వర్షన్లో స్ట్రీమింగ్ కానుంది. నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అమిత్ సియాల్తో పాటు సాహిల్ వైద్, భగవతీ పెరుమాళ్ తదితరులు నటించారు. 1991, మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్లో నాటి దేశ ప్రధాని రాజీవ్ గాంధీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో రాజీవ్ గాంధీ హతమయ్యారు. అయితే, ఈ హత్యకు వారి ఉద్దేశ్యం ఏంటి..? హత్య, తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి అనే కోణాల్లో ఈ మూవీ ఉండనుంది.హీరోయిన్ కీర్తి సురేశ్(Keerthy Suresh)- హీరో సుహాస్ కాంబినేషన్లో వస్తున్న మూవీ 'ఉప్పు కప్పురంబు' (Uppu Kappurambu). ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతుంది. ఐవి శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎల్లనార్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై రాధికా లావు నిర్మించారు. సినిమా బండి ఫేమ్ వసంత్ కథ అందించారు. జులై 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.మణిరత్నం దర్శకత్వం వహించిన 'థగ్ లైఫ్' (Thug life) ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీలో కమల్ హాసన్ (Kamal Haasan) కథానాయకుడిగా, శింబు, త్రిష, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. జులై 3 నుంచి నెట్ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం,హిందీ మలయాళం, కన్నడలో ఉంది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచిన ఈ చిత్రం భారీ డిజాస్టర్గా నిలిచింది.నటి, దర్శకురాలు రేవతి తెరకెక్కించిన ‘గుడ్వైఫ్’ (Good Wife) వెబ్సిరీస్ జులై 4న విడుదల కానుంది. ఇందులో ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రలో నటించారు. ఆమెకు భర్తగా సంపత్ రాజ్ నటించారు. 'జియో హాట్స్టార్' (Jio Hotstar) వేదికగా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీలో స్ట్రీమింగ్ కానుంది. అమెరికన్ సిరీస్ 'ది గుడ్వైఫ్' ఆధారంగా ఈ వెబ్ సిరీస్ను ఇండియాలో తెరకెక్కించారు. -
‘సోలో బాయ్’ ప్రతి ఒక్కరిలో కనిపిస్తాడు : సెవెన్ హిల్స్ సతీష్
సొంతంగా కష్టపడి తన కాళ్ళ మీద తాను బతకాలనుకునే ఆలోచన గల వ్యక్తి చుట్టు తిరిగే కథే ఇది. ప్రతి ఒక్కరిలోను సోలో బాయ్ క్యారెక్టర్ కనిపిస్తుంది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది అన్నారు నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్. బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి నవీన్ కుమార్ దర్శకత్వం వహించారు. జులై 4న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత సతీష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ గతంలో బట్టల రామకృష్ణ బయోపిక్ సినిమా తీసినప్పుడు ఒక ఎక్స్పరిమెంట్ లాగా చేశాం. అది మాకు వర్కౌట్ అయింది. ఇప్పుడు ఆ సమయంలో నేర్చుకున్న వాటిని బేస్ చేసుకుని తగ్గ జాగ్రత్తలు తీసుకుంటూ సోలో బాయ్ సినిమా చేశాము. కానీ ప్రస్తుతం స్టార్స్ ఉన్న సినిమాలకు థియేటర్లు ముందుగానే బ్లాక్ అవుతున్నాయి. సింగిల్ స్క్రీన్స్ పై ఇంకా బ్యాలెన్స్ కాలేదు.→ ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకునేప్పటికీ రెండు గంటల పది నిమిషాలు ఫైనల్ అవుట్ పుట్ వచ్చింది. U/A సర్టిఫికేట్ తో ఆంధ్ర తెలంగాణలో కలిపి సుమారు 120 నుండి 150 స్క్రీన్స్ మధ్యలో విడుదల కానుంది.→ గౌతమ్ ఈ సినిమా ప్రమోషన్లలో 100% మంచి సపోర్ట్ ఇస్తున్నారు. బిగ్ బాస్ రెండు సీజన్లో ఉండటం వల్ల అతని ఫేమ్ ఈ సినిమాకు మరింత తోడ్పడుతుంది అనుకుంటున్నాను.→ నాకు ఉన్న బడ్జెట్లో నాకు ఉన్న సర్కిల్లో నేను మంచి సినిమాని ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నం చేశాను. అది కచ్చితంగా ప్రేక్షకులను అన్ని విధాలుగా ఎంటర్టైన్ చేసి ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని అనుకుంటున్నాను.→ ఈ చిత్ర కథలు నా ఇన్వాల్వ్మెంట్ కొంత ఉంది. ఒక స్క్రిప్ట్ అనుకుంటున్నాము. నా మిత్రులు ఎవరైనా నిర్మాతలుగా ఆ కథకు నేను దర్శకుడిగా చేద్దామనుకుంటున్నాను. అనుకున్న బడ్జెట్ కంటే కొంత తక్కువలోనే ఈ సినిమాను పూర్తి చేయగలిగాం→ నార్నె నితిన్ తో ఒక సినిమా చేయబోతున్నాను. థ్రిల్లర్ జోనర్ లో కథ ఒకే అయింది. -
రెండో భర్తతోనూ విడాకులు.. అందుకేనన్న బాలీవుడ్ నటి!
పలు సూపర్ హిట్ సినిమాల్లో మెప్పించిన బాలీవుడ్ నటి చాహత్ ఖన్నా. తన అందం, అద్భుతమైన నటనతో అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్లో ద ఫిలిం, థాంక్యూ, ప్రస్థానం, యాత్రిస్ సినిమాలతో పాటు బుల్లితెరపై కాజల్, ఖుబూల్ హై వంటి సీరియల్స్లో చాహత్ నటించింది. అయితే 2006లో భరత్ నర్సింగనిని పెళ్లాడిన ముద్దుగుమ్మ.. నాలుగు నెలలకే విడాకులిచ్చింది. ఆ తర్వాత 2013లో ఫర్హాన్ మీర్జాను పెళ్లాడగా 2018లో అతనితో కూడా తెగదెంపులు చేసుకుంది. రెండుసార్లు పెళ్లి చేసుకోగా రెండుసార్లూ విడాకులే తీసుకుంది చాహత్ ఖన్నా. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె రెండోసారి విడాకులు తీసుకోవడంపై మాట్లాడింది. కేవలం తన పిల్లల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని అంటోంది.రెండోసారి విడాకుల గురించి చాహత్ మాట్లాడుతూ.. 'నేను ఎప్పుడూ నాకు సరైనది అనిపించిన దాన్నే చేశా. దానికే కట్టుబడి ఉంటా. ఏదైనా తప్పని అనిపిస్తే అలాంటి పని చేయను. ఎవరైనా తప్పు చేస్తుంటే కూడా చెప్పే ధైర్యం నాకు ఉంది. ప్రపంచం ఏమి చెప్పినా నేను ఎప్పుడూ తప్పును సమర్ధించను. మీకు ఆ రకమైన నమ్మకం, ధైర్యం, ఆత్మగౌరవం ఉండాలి. కేవలం ఒక మహిళగా మాత్రమే కాదు, ఒక మనిషిగా.. ఏదైనా కరెక్ట్ కాదనిపిస్తే అందులో భాగం కాలేను. అలాంటి వాటికి నేను దూరంగా వెళ్తాను. అలాగే మనం పిల్లల కోసం ఆలోచిస్తూ మనకు సరిగాలేని వివాహ బంధంలో ఉండిపోకూడదు. ఎందుకంటే పిల్లలు మనకంటే ఎక్కువగా ప్రభావితమవుతారు. అది కలిగించే నష్టం మీకు కూడా తెలియదు. వారు పెద్దయ్యాక వారి స్నేహితుల నుంచి విన్నప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది. అందుకే నా కుమార్తెల కోసం నేను దూరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నా' అని తెలిపింది. -
'కుబేర' నుంచి తొలగించిన వీడియో సాంగ్ వచ్చేసింది
ధనుష్, నాగార్జున కాంబినేషన్లో దర్శకుడు శేఖర్ కమ్ముల(Sekhar kammula) తెరకెక్కించిన చిత్రం 'కుబేర'.. ఇందులో రష్మిక మందన్న కీలకపాత్రలో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే ఈ మూవీ రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. తాజాగా ఈ మూవీ నుంచి 'పీ పీ డుమ్ డుమ్' అంటూ సాగే వీడియో సాంగ్ను యూట్యూబ్లో విడుదల చేశారు. ఇందులో రష్మిక వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా కావాల్సిందే. అయితే, ఈ పాట సినిమాలో లేదు. రన్టైమ్ ఎక్కువగా ఉండటంతో దీనిని తొలగించారు. ఓటీటీ విడుదల సమయంలో మళ్లీ యాడ్ చేసే ఛాన్స్ ఉంది. చైతన్య రాసిన ఇంగ్లిష్ లిరిక్స్ యూత్ను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సాంగ్ మొత్తం ఇంగ్లిష్ పదాలతోనే ఉండడం విశేషం. మంగ్లీ సోదరి ఇంద్రావతి ఈ పాటను ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించారు. -
అనుమానాస్పద స్థితిలో నటి మృతి.. అతిగా డ్రగ్స్ తీసుకుందా?
ప్రముఖ అడల్ట్ ఫిల్మ్ స్టార్ కైలీ పేజీ(28) అనుమానాస్పదంగా మృతి చెందారు. జూన్ 25న ఆమె లాస్ ఏంజిల్స్లోని తన నివాసంలో మరణించినట్లు లాస్ ఏంజిల్స్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ నిర్ధారించారు. ఆమె మరణానికి గల కారణం ఇంకా అధికారికంగా నిర్ధారించబడలేదు. కానీ మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకోవలడం వల్లే ఆమె చనిపోయిందని పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రగ్ సంబంధిత వస్తువులు ఆమె ఇంటిలో కనిపించడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు. అంతేకాదు ఆమె గదిలో ఇతరులు సన్నిహితంగా ఉన్న గ్రాఫిక్ ఫోటోలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ అతిగా తీసుకోవడం వల్ల చనిపోయిందా లేదా ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.కైలీ పేజీ అసలు పేరు కైలీ పైలెంట్. 2016లో అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థలతో కలిసి దాదాపు 200పైగా సినిమాల్లో నటించింది. 2017లో వచ్చిన నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్ "హాట్ గర్ల్స్ వాంటెడ్: టర్న్డ్ ఆన్"లో కూడా కనిపించారు, ఇందులో ఆమె అడల్ట్ ఇండస్ట్రీలోని తన అనుభవాలు, అక్కడ ఎదురయ్యే సవాళ్ల, సమస్యలను గురించి ఓపెన్గా మాట్లాడింది. కైలీ మరణ వార్త తెలియగానే ఆమె స్నేహితులు, సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. -
హీరో చెంప చెళ్లుమనిపించింది.. ఆ దెబ్బతో ఇమేజ్ డ్యామేజ్!
ఆవేశం అనర్థదాయకం అని ఈ హీరోయిన్ విషయంలో రుజువైంది. ఆవేశంతో చేసిన ఓ పని వల్ల తన కెరీర్ తలకిందులైంది. టాప్ హీరోయిన్గా వెలుగు వెలిగిన ఆమె చివరకు వెండితెరపై అవకాశాల్లేక బుల్లితెరకు షిఫ్ట్ కావాల్సి వచ్చింది. ఆమె సోదరి మాత్రం ఇప్పటికీ సినిమాల్లో రాణిస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు ఫరా నాజ్. ఆమె సోదరి టబు.చిన్న వయసులోనే..హైదరాబాద్లో పుట్టిన ఫరా నాజ్ (Farah Naaz Hashmi) తర్వాత ముంబైకి షిఫ్ట్ అయింది. యష్ చోప్రా 'ఫాల్సే' మూవీతో 1985లో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. అప్పుడామె వయసు 17 ఏళ్లు మాత్రమే! ఈ సినిమా డిజాస్టర్ అయినా తన అందానికి, టాలెంట్కు ముగ్ధులైన దర్శకనిర్మాతలు ఆమెకు మరిన్ని ఛాన్సులిచ్చారు. మార్తే డం టక్, నసీబ్ అప్నా అప్నా, లవ్ 86, ఇమాందార్, వీరు దాదా, దిల్జలా, బాప్ నంబ్రీ బేటా దస్ నంబ్రీ.. ఇలా ఎన్నో హిట్ చిత్రాలు చేసింది. రాజేశ్ ఖన్నా, ధర్మేంద్ర, సంజయ్ దత్, ఆమిర్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి యాక్ట్ చేసింది.ఆవేశంస్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన ఫరా నాజ్కు ఆవేశం ఎక్కువ. ఓసారి ఇంట్లో గొడవపడ్డప్పుడు ఆవేశంతో చేయి కోసుకుంది. అలా అని చనిపోవాలని ప్రయత్నించలేదు, కాకపోతే తన కోపాన్ని, బాధను అలా బయటపెట్టిందట! తన బాధ ఇంట్లోవాళ్లకు అర్థమవ్వాలనే అలాంటి పని చేసినట్లు తను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ ఆవేశం తర్వాత కూడా అలాగే కంటిన్యూ అయింది.చెంప చెళ్లుమనిపించిందికసం వర్దీకీ సినిమాలో చుంకీ పాండేతో కలిసి నటించింది ఫరా. ఆ మూవీ షూటింగ్లో చుంకీ పాండే ఏదో జోక్ వేస్తే హీరోయిన్కు ఒళ్లంతా మండిపోయింది. ఆవేశం పట్టలేక అతడి చెంప చెళ్లుమనిపించినట్లు అప్పట్లో బోలెడు వార్తలు వచ్చాయి. అదే ఏడాది ఆమె నటించిన రఖ్వాలా సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఫరాకు బదులు మాధురీ దీక్షిత్ను హీరోయిన్గా తీసుకుని ఉండుంటే సినిమా హిట్టయ్యేదని అనిల్ కపూర్ ఫీలయ్యాడట! ఈ విషయం తెలిసిన ఫరా.. అనిల్ను బెదిరించినట్లు భోగట్టా! ఇలా వరుస వివాదాలతో ఫరాపై నెగెటివిటీ పెరిగింది. అది నెమ్మదిగా తన ఇమేజ్ను దెబ్బ తీసింది.చెల్లితో అసభ్యంగా..జాకీ ష్రాఫ్తో కలిసి దిల్జలా మూవీ చేసింది ఫరా. ఈ సినిమా అయిపోయాక నటుడు డానీ డెంజోంగ్ప ఓ పార్టీ ఇచ్చాడు. దానికి ఫరా.. టబును తీసుకుని వెళ్లింది. తను తాగి పడిపోయింది. అప్పుడు పూటుగా తాగిన జాకీ ష్రాఫ్.. టబును ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. అది చూసిన డానీ వెంటనే జాకీ ష్రాఫ్ను బయటకు తీసుకెళ్లిపోయాడు. ఈ వ్యవహారంపై మండిపడ్డ ఫరా.. మీడియా ముందే నటుడిని ఎండగట్టింది. అనంతరకాలంలో మాత్రం అపార్థం చేసుకున్నానని యూటర్న్ తీసుకుంది.రెండు పెళ్లిళ్లుఫరా.. రెజ్లింగ్ లెజెండ్ దారా సింగ్ కుమారుడు విందు దారా సింగ్ను పెళ్లాడింది. 1986లో వీరి వివాహం జరగ్గా 1997లో కుమారుడు జన్మించాడు. కానీ ఆ తర్వాత దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో పెళ్లయిన ఆరేళ్లకే విడిపోయారు. విడాకులు తీసుకున్న ఏడాదే నటుడు సుమీత్ సైగల్ను రెండో పెళ్లి చేసుకుంది. ఆయనక్కూడా ఇది రెండో పెళ్లే! అయితే పిల్లలు వద్దనుకుని ఓ నిర్ణయానికి వచ్చాకే వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఫరా.. తెలుగులో ఒంటరి పోరాటం, విజేత విక్రమ్ సినిమాలు చేసింది. 20 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. మధ్యలో బుల్లితెరపై సీరియల్స్ చేసింది.చదవండి: ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.. అందుకే అంత ద్వేషం: స్మృతి ఇరానీ -
జానీ మాస్టర్ ఎఫెక్ట్.. 'నయనతార' దంపతులపై తీవ్ర విమర్శలు
మైనర్పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై పోక్సో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన కొంతకాలం జైలులో ఉండి బెయిల్పై బయటకు వచ్చారు. నయనతార, విఘ్నేష్ శివన్లు తమ సినిమా కోసం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను తీసుకున్నారు. ఇదే విషయాన్ని వారు ప్రకటించారు. దీంతో ఈ దంపతులపై కోలీవుడ్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈమేరకు బాలీవుడ్ మీడియా కూడా పలు కథనాలు ప్రచురించింది.నయనతార, విఘ్నేష్ శివన్లు నిర్మిస్తున్న కొత్త సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' కోసం కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ పనిచేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదే విషయాన్ని చెబుతూ కొన్ని ఫోటోలను కూడా జానీ షేర్ చేశాడు. అయితే, ఈ ప్రకటన వెలువడిన తర్వాత నయనతార దంపతులను కోలీవుడ్ మీడియా తప్పుబడుతుంది. తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసిన బాలికపైనే లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని కొరియోగ్రాఫర్గా ఎందుకు తీసుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. తప్పనిపించలేదా..? కోలీవుడ్లో మీకు ఎవరూ కొరియోగ్రాఫర్ దొరకలేదా..? అంటూ విమర్శించారు.నేరస్థులకే ఛాన్సులు: చిన్మయికోలీవుడ్ టాప్ సింగర్ చిన్మయి శ్రీపాద ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు. జానీ మాస్టర్, విఘ్నేష్ ఫోటోలను షేర్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చారు. 'జానీ, ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో షరతులతో కూడిన బెయిల్పై బయటకు వచ్చాడు. మనం 'ప్రతిభావంతులైన' నేరస్థులను ప్రేమిస్తున్నట్లు అనిపిస్తుంది. అలాంటి వారిని ప్రోత్సహిస్తూనే ఉంటాము. వారినే అధికార స్థానాల్లో ఉంచుతాము. మహిళలను ఎక్కువగా వేధించేది నేరస్థులే అని గుర్తుపెట్టుకోవాలి. 'నాకు ఏమీ జరగకుండా చూడండి' మనం ఏం చేస్తున్నామో ఆలోచించండి స్వీట్' అంటూ ఆమె తెలిపారు.చిన్మయి చేసిన ఈ పోస్ట్ వైరల్ అయింది. ఆన్లైన్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. తీవ్రమైన నేరం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో కలిసి పనిచేయాలనే ఈ జంట నిర్ణయాన్ని చాలా మంది నెటిజన్లు ప్రశ్నించారు. మరికొందరు వారు "లైంగిక వేటగాడిని వేదికగా చేసుకున్నారని" ఆరోపించారు. నయన్ తనను తాను స్వయంకృషి కలిగిన మహిళగా చెప్పుకుంది. మహిళా నటుల కష్టాలను ఆమె తెరపైకి తీసుకొచ్చింది. వేదికలపై తారలు మాట్లాడాలని కోరింది. కష్ట సమయంలో తనకు మద్దతు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపింది. అయినప్పటికీ, పోక్సో కింద నిందితుడైన వ్యక్తికి తన భర్త మద్దతు ఇవ్వడం ఆమెకు బాగానే ఉంది అంటూ కొందరు విమర్శించారు. ఏదేమైన నయనతార దంపతులు తీసుకున్న నిర్ణయం పట్ల కోలీవుడ్ నుంచి తీవ్రంగా వ్యతిరేఖత వస్తుంది.Jani is out on conditional bail involving a minor’s sexual assault.We as a people seem to love ‘talented’ offenders and will keep promoting them and keeping them in positions of power which the offenders use to harangue the women more - “See nothing will happen to me.” It is… pic.twitter.com/irXOqZp824— Chinmayi Sripaada (@Chinmayi) July 2, 2025Nayan called herself a self-made woman who knows the struggles of female actors, urged stars to speak out, and thanked those who supported her. Yet she's fine with her husband backing a man accused under POCSO. Why the double standards? #Jani #VigneshShivan pic.twitter.com/Bz1sXpumvq— Films Spicy (@Films_Spicy) July 2, 2025don't know when wikki is gonna understand he's not a single person anymore.Whatever he does/speaks directly attached to #Nayanthara.She is a self made woman who stood up for herself and women in cinema in the past.A happy post with a pedophile dance master is seriously a big mess pic.twitter.com/SaG9sT2kQD— common_man (@IronladyNa5366) July 2, 2025It's not news that Vignesh Shivan and Nayan support predators. Why are y'all surprised? pic.twitter.com/f9u97SB2Ko— ஜமுனா (@velu_jamunah) July 2, 2025 -
మెట్లు ఎక్కలేని స్థితిలో స్టార్ హీరో కూతురు.. ఇప్పుడేకంగా హీరోయిన్గా!
తండ్రి బాటలో అడుగులు వేసేందుకు సిద్ధమైంది విస్మయ (Vismaya Mohanlal). మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ కూతురిగా సినీ ఇండస్ట్రీలో కాలు మోపనుంది. తుడక్కం అనే మలయాళ చిత్రంతో వెండితెరపై రంగప్రవేశం చేయనుంది. అయితే విస్మయ ఇప్పటికే రచన, మార్షల్ ఆర్ట్స్లో ఆరి తేరింది. 'గ్రెయిన్స్ ఆఫ్ స్టార్డస్ట్' అనే పుస్తకంతో రచయిత్రగా ప్రయాణం ప్రారంభించింది. థాయ్లాండ్లో మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకుంది. ఇప్పుడు హీరోయిన్గా అలరించనుంది.థాయ్ల్యాండ్లో ఫిట్నెస్ ట్రైనింగ్విస్మయ మొదట్లో కాస్త బొద్దుగా ఉండేది. థాయ్ల్యాండ్లో ఫిట్నెస్ క్యాంప్నకు వెళ్లి తన శరీరంపై ఫోకస్ చేసింది. అటు మార్షల్ ఆర్ట్స్, ఇటు ప్రత్యేక వ్యాయామాలతో 22 కిలోల బరువు తగ్గింది. ఈ విషయాన్ని 2020 డిసెంబర్లో తనే ఓ పోస్ట్ ద్వారా వెల్లడించింది. నాలుగు మెట్లు ఎక్కుతుంటే ఆయాసం వచ్చేది. ఫిట్గా ఉండాలనిపించేది కానీ అందుకోసం ఏదీ చేయకపోయేదాన్ని. కానీ, ఇక్కడికి వచ్చాక అంతా మారిపోయింది.నా వల్ల కాదనుకున్నప్పుడల్లా..కొండలు ఎక్కేస్తున్నాను. ఎక్కువసేపు స్విమ్మింగ్ చేస్తున్నాను. ఇదంతా నా కోచ్ వల్లే సాధ్యమైంది. నాకోసం 100 శాతం కష్టపడ్డాడు. ఎప్పుడూ నా వెంటే ఉన్నాడు. గాయాలవుతున్నా సరే.. నా ఫిట్నెస్ జర్నీ ఆపకూడదని నాకు ధైర్యాన్ని నూరిపోశాడు. నా వల్ల కాదనుకున్న ప్రతిసారి.. కచ్చితంగా అవుతుందని వెన్నుతట్టి ప్రోత్సహించాడు. ఇక్కడకు వచ్చాక కేవలం బరువు తగ్గడమే కాదు, కొత్త విషయాలు నేర్చుకున్నాను, కొత్తవారిని కలిశాను. నన్ను నేను నమ్మడం మొదలుపెట్టాను. నా జీవితమే మారిపోయిందినేను చేయలేను అనే ఆలోచన నుంచి ఏదైనా చేయగలిగేలా చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడికి వచ్చాక నా జీవితమే మారిపోయింది అని రాసుకొచ్చింది. అప్పటినుంచి తన ఫిట్నెస్ను కాపాడుకుంటూ వస్తోంది. తుడక్కం సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రానికి జూడ్ ఆంథొనీ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. జూడ్ ఆంథొని గతంలో సారాస్, 2018 వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్పై ఆంథొనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Vismaya Mohanlal (@mayamohanlal) చదవండి: సిగ్గు లేని మనిషి.. వెబ్ సిరీస్ కోసం కాంప్రమైజ్ అడిగాడు: నటి -
ఒకే ఒక పెద్ద సినిమా.. టాలీవుడ్కి ఏమైంది?
టాలీవుడ్లో మొన్నటి వరకు పోటీ లేకుండా సినిమా రిలీజ్ అయ్యేది కాదు. ఒకేవారం పెద్ద సినిమాతో పాటు మూడు, నాలుగు చిన్న చిత్రాలు కూడా రీలీజ్ అయ్యేవి. కానీ సమ్మర్ నుంచి టాలీవుడ్లో పెద్దగా పోటీ లేకుండా సినిమాలు వస్తున్నాయి. ఇక గత నెలలో థగ్లైఫ్, కుబేర, కన్నప్ప లాంటి పెద్ద సినిమాలు వచ్చినా.. వాటి మధ్యలో కూడా వారం, వారం గ్యాప్ ఉంది. వీటితో పాటు రెండు, మూడు చిన్న సినిమాలు కూడా వచ్చాయి. కానీ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయాయి. ఇక జులైలో టాలీవుడ్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నెల మొత్తంలో ఒకే ఒక పెద్ద సినిమా రిలీజ్ కానుంది. మిగిలిన సినిమాలన్ని పెద్దగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగబోతున్నాయి.జులై మొదటి వారంలో తమ్ముడు చిత్రంలో నితిన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ హీరోయిన్లుగా నటించగా, లయ కీలక పాత్ర పోషించింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంపై మోస్తరు అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాల మేరకు అయినా సినిమా ఆడుతుందో లేదో జులై 4న తెలుస్తుంది. ఇక అదే రోజు సిద్ధార్థ్ నటించిన 3 బి.హెచ్.కె కూడా విడుదల కానుంది. తమ్ముడుతో పోలిస్తే ఈ సినిమాపై పెద్దగా అంచనాలు అయితే లేవు. హిట్ టాక్ వస్తే తప్ప థియేటర్కి వెళ్లి చూసే పరిస్థితి అయితే ఈ సినిమాకు లేదు.ఇక రెండో వారంలో అనుష్క షూటీ రిలీజ్ కావాల్సింది. కానీ అది వాయిదా పడింది. దీంతో ఈ వారంలో ఎలాంటి పోటీ లేకుండా సింగిల్గా బరిలోకి దిగుతున్నాడు సుహాస్. ఆయన హీరోగా నటించిన ఓ భామ అయ్యో రామ జులై 11న రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. మరి సింగిల్గా వస్తున్న సుహాస్.. సూపర్ హిట్ కొడతాడో లేదో చూడాలి.ఇక మూడో వారంలో మేఘాలు చెప్పిన ప్రేమ కథ(జులై 17) అనే చిన్న సినిమాతో పాటు జూనియర్(జులై 18 అనే కన్నడ-తెలుగు సినిమా కూడా ఇక్కడ విడుదల కాబోతుంది. గాలి జనార్థన్రెడ్డి కొడుకు కిరీటీ హీరోగా నటిస్తున్న జూనియర్పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం, హీరోయిన్గా శ్రీలీల నటించడం, మరో కీలక పాత్రలో జెనీలియా కనిపించడంతో జూనియర్పై టాలీవుడ్లో మంచి హైప్ క్రియేట్ అయింది.ఇక చివరి వారంలో (జూలై 24) హరిహరి వీరమల్లు రాబోతుంది. ఈ నెలలో వస్తున్న ఏకైక పెద్ద సినిమా ఇదే. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఎంఎం రత్నం భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ పీరియాడికల్ డ్రామాలో నిధి అగర్వాల హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసిది. -
సూర్య, దీపికా పదుకొణెలతో 8 వసంతాలు..: డైరెక్టర్
8 వసంతాలు (8 Vasantalu Movie).. ఇది ప్రేమ కథ కాదు, ప్రేమ కావ్యమని చెప్పొచ్చు. ఫణీంద్ర నర్సెట్టి డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవి దుగ్గిరాల, హనురెడ్డి, అనంతిక సనిల్ కుమార్ హీరోహీరోయిన్లుగా నటించారు. కవిత్వం, భావుకత పుష్కలంగా ఉన్న ఈ సినిమా చాలామందికి నచ్చేసింది. అయితే ఈ సినిమా కోసం దర్శకుడు మొదట స్టార్ హీరోహీరోయిన్లను అనుకున్నాడట! ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. సూర్య, దీపికతో..ఫణీంద్ర నర్సెట్టి మాట్లాడుతూ.. 8 వసంతాలు మూవీ పెద్దవాళ్లతో చేద్దామనుకున్నాను. సూర్య, దీపికా పదుకొణెను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాను. అందుకే డైలాగులు అంత బలంగా ఉంటాయి. మైత్రీ మూవీ మేకర్స్ దగ్గరకు కథ తీసుకెళ్లినప్పుడు కొత్తవాళ్లతో అయితే ఇంకా బాగుండొచ్చు అన్నారు. పెద్దవాళ్లతో అంటే ఇబ్బందులు ఎదురవొచ్చేమో, కథ ఎక్కడైనా పాడవుతుందేమో.. ఒక్కసారి ఆలోచించు అన్నారు. అప్పుడు నేను ఆలోచించి కొత్తవాళ్లతో ముందుకు వెళ్లాను అని చెప్పుకొచ్చారు.చదవండి: సిగ్గు లేని మనిషి.. వెబ్ సిరీస్ కోసం కాంప్రమైజ్ అడిగాడు: నటి -
'రామాయణ' సినిమా నుంచి ఫస్ట్ వీడియో విడుదల
'రామాయణ' సినిమా నుంచి పాత్రల పేర్లను పరిచయం చేస్తూ ఒక వీడియోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రాజక్ట్ నుంచి విడుదలైన తొలి వీడియో ఇదే కావడం విశేషం. మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. రామాయణంలోని ప్రతి సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్లో 'రామాయణ' పేరుతో అత్యంత భారీ బడ్జెట్ పేరుతో సినిమా వస్తుంది.దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' చిత్రంలో రాముడిగా రణ్బీర్కపూర్ , సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. రవి దూబే (లక్ష్మణుడు), సన్నీ డియోల్ (ఆంజనేయుడు)గా కనిపించనున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మెర్ పనిచేస్తున్నారు. ఆయన గ్లాడియేటర్, ఇంటర్ స్టెల్లర్, ది లయన్ కింగ్, డ్యూన్ వంటి టాప్ చిత్రాలకు సంగీతం అందించారు. ఏఆర్ రెహమాన్ కూడా రామయణ చిత్రానికి సంగీతంలో భాగం పంచుకోవడం విశేషం. రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. 2026 దీపావళీ సందర్భంగా రామాయణ-1 విడుదల కానుంది. 2027 దీపావళీకి పార్ట్-2 రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. -
సిగ్గు లేని మనిషి.. వెబ్ సిరీస్ కోసం కాంప్రమైజ్ అడిగాడు: నటి
సినిమా అవకాశాల కోసం వెళ్తే చేదు అనుభవాలు ఎదుర్కొన్న నటీనటులు ఎందరో! అయితే సినిమాలే కాదని ఓటీటీలో ఛాన్సులు కావాలంటే కూడా పిచ్చి కండీషన్లు పెడుతున్నారని చెప్తున్నారు నటి హెల్లీ షా (Helly Shah). తనకు ఓ వెబ్ సిరీస్లో ఆఫర్ వచ్చిందట.. కానీ వాళ్లు చెప్పిన కండీషన్కు ఓకే అంటేనే ఎంపిక చేస్తామని మెలిక పెట్టారట! ఈ విషయం గురించి హెల్లీ షా మాట్లాడుతూ.. గతంలో నాకు పెద్ద వెబ్ సిరీస్లో భాగమయ్యే ఛాన్స్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ కోసం నన్ను సంప్రదిస్తూ ఓ మెసేజ్ వచ్చింది. కండీషన్కు ఒప్పుకుంటే..అది చూడగానే.. నేను మీ ప్రాజెక్టులో భాగం కావాలనుకుంటున్నారా? అని కన్ఫర్మేషన్ కోసం అడిగాను. అందుకు అవతలివైపు నుంచి అవును, అందుకోసమే మీకు మెసేజ్ చేశాం అని రిప్లై వచ్చింది. నేను చాలా సంతోషించాను. కానీ అంతలోనే.. ఓ కండీషన్.. మేము చెప్పిన ప్రదేశానికి వచ్చి చెప్పినట్లు చేయాలి. అందుకు ఓకే అంటే ఈ ప్రాజెక్ట్ మీ మీ సొంతం అన్నారు. నా వల్ల కాదు, మీరు వేరే ఎవర్నైనా చూసుకోండి అని రిప్లై ఇచ్చాను.ఆన్లైన్లో అయినా ఓకేఅప్పటికీ అవతలి వ్యక్తి ఊరుకోలేదు. పర్లేదు, మీరు రాకపోయినా సరే, ఫోన్లోనే నేను చెప్పింది చేయండి. ఆన్లైన్లో అయినా నాకేం పర్లేదని బదులిచ్చాడు. అతడు అన్న మాటల్ని నా నోటితో ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. ఆన్లైన్లో కాంప్రమైజ్ అడిగాడు. ఈ సోదంతా నాకెందుకు అని అతడి నెంబర్ బ్లాక్లిస్ట్లో పెట్టాను. ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సిగ్గులేని జనాలు మారరు. కొంచెమైనా పద్ధతిగా ప్రవర్తించరు. ఇలాంటి మనుషులతో నాకెందుకు అని ఆ వెబ్ సిరీస్ను వదిలేసుకున్నాను అని చెప్పుకొచ్చారు.సీరియల్స్- సినిమాహెల్లీ షా ప్రస్తుతం గుజరాతీ మూవీ దేడ చేస్తున్నారు. ఇందులో హెల్లీ గర్భవతిగా కనిపించనున్నారు. ఈ మూవీ జూలై 4న విడుదలవుతోంది. ఇకపోతే హెల్లీ షా.. అలక్ష్మి: హమారీ సూపర్ బహు, ఖేల్తీ హై జిందగీ ఆంఖ్ మిచోలి, దేవాన్షి, స్వరాగిని- జోడైన్ రిష్తో కే సుర్, ఇష్క్ మే మర్జవాన్ 2: నయా సఫర్ వంటి పలు సీరియల్స్ చేశారు. గుల్లక్, పిరమిడ్ వంటి వెబ్ సిరీస్లలోనూ మెరిశారు.చదవండి: ఓటీటీలోకి సడన్గా వచ్చేసిన భారీ బడ్జెట్ మూవీ.. ఎక్కడంటే? -
సినిమానే వదిలేస్తా కానీ..తెరపై ఆ పని చేయలేను : రష్మిక
రష్మిక మందన్నా(Rashmika Mandanna).. ఈ పేరు ఇప్పుడు కుర్రకారుకు తారక మంత్రంగా మారింది. కన్నడంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఈ భామ ఇప్పుడు జాతీయ స్థాయి క్రష్ హీరోయిన్గా మారారు. కన్నడ చిత్ర పరిశ్రమలో నటిగా పయనాన్ని మొదలెట్టినా, ఈమెను క్రేజీ హీరోయిన్ను చేసింది మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమనే అనేది ఎవరూ కాదనలేని నిజం. అక్కడ ఛలో చిత్రంతో కెరీర్ను ప్రారంభించి ఇటీవల విడుదలయిన కుబేర వరకూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి అగ్ర కథానాయకిగా రాణిస్తున్నారు. అదే విధంగా తమిళంలోనూ సుల్తాన్, వారిసు చిత్రాల్లో మెరిశారు. ఇకపోతే గుడ్బై అంటూ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా అక్కడ తొలి చిత్రం యావరేజ్ అనిపించుకున్నా, ఆ తరువాత నటించిన యానిమల్ చిత్రం సూపర్హిట్ అయ్యింది. రణ్బీర్ కపూర్కు జంటగా నటించిన యానిమల్ చిత్రం గత 2023 డిశంబర్ నెలలో తెరపైకి వచ్చి రక రకాల విమర్శనలను ఎదుర్కొంది.ముఖ్యంగా నటుడు రణ్బీర్ కపూర్ పాత్రపై మాత్రం ఘోరంగా విమర్శలు ట్రోల్ అయ్యాయి. ఆయన ఎక్కువగా సిగరెట్స్ కాల్చే సన్నివేశాలపై తీవ్ర విమర్శలు దొర్లాయి. అయితే వసూళ్లను మాత్రం రికార్డు స్థాయిలో రాబట్టుకుంది. దీని గురించి ఇటీవల ఒక భేటీలో స్పందించిన నటి రష్మిక మందన్నా తాను ఆ చిత్రాన్ని చిత్రంగానే చూశానన్నారు. చిత్రంలో హీరో సిగరెట్టు తాగితే అది ఇతరులను సిగరెట్లు తాగే విధంగా ప్రేరేపిస్తున్నాయి అని అంటున్నారని, సమాజంలో ప్రజలు సిగరెట్స్ తాగడం అనేది సర్వ సాధారణం అని పేర్కొన్నారు. అయితే తాను మాత్రం సినిమాల్లో కూడా సిగరెట్స్ తాగే విధంగా నటించనని చెప్పారు. ఒకవేళ అలాంటి పాత్రలు వస్తే.. సినిమానే వదిలేస్తానని అన్నారు. ఇకపోతే చిత్రాన్ని చిత్రంగానే చూడమని, ఇతరులను చిత్రం చూడమని ఎవరినీ చిత్రం చూడమని వత్తిడి చేయడం లేదని అన్నారు. ఇక్కొక్కరికి ఒక్కో చెడ్డ అలవాటు ఉంటుందని దాన్ని యానిమల్ చిత్రంలో దర్శకుడు చూపించారు అంతే అని నటి రష్మిక మందన్నా పేర్కొన్నారు. అయితే చిత్రం విడుదలై ఏడాదిన్నర పైగా అయినా యానిమల్ చిత్రం విమర్శల నుంచి తప్పించుకోలేకపోతోంది. -
'హరి హర వీరమల్లు' ట్రైలర్ ఎట్టకేలకు విడుదల
పవన్ కల్యాణ్ (Pawan kalyan) నటించిన 'హరి హర వీరమల్లు'( Hari Hara Veera Mallu) మూవీ ట్రైలర్ వచ్చేసింది. సినిమా విడుదల తేదీతో పాటు ట్రైలర్ రిలీజ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన 'వీరమల్లు' ఎట్టకేలకు వచ్చేశాడు. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సుమారు 5ఏళ్లకు పైగా ఈ చిత్రాన్ని మేకర్స్ నిర్మించారు. దీంతో బడ్జెట్ కూడా భారీగానే పెరిగిపోయిందని నిర్మాత ఎ.ఎం రత్నం చెప్పారు. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ చారిత్రక యోధుడిగా కనిపించనున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. బాబీ దేవోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్రావు నిర్మిస్తున్నారు. ఎ.ఎం.రత్నం సమర్పకులు. సుమారు రూ. 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో జులై 24న విడుదల కానుంది. -
దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం.. తొలి ఇండియన్గా రికార్డు
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం దక్కింది. ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026’కు ఆమె ఎంపికయ్యారు. ఈ విషయాన్ని తాజాగా హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారికంగా వెల్లడించింది. వినోదరంగంలో గణనీయంగా కృషి చేసినందుకుగాను ప్రతి ఏటా హాలీవుడ్ ఫిల్మ్ చాంబర్ ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ ’ జాబితాను వెల్లడిస్తుంది. ఈ ఏడాది మోషన్ పిక్చర్స్ విభాగంలో దీపికను ఎంపిక చేసినట్లు హాలీవుడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. ఈ జాబితాలో డెమి మూర్, రాచెల్ మెక్ఆడమ్స్, ఎమిలీ బ్లంట్ వంటి హాలీవుడ్ తారలతో పాటు మొత్తం 35 మంది ఉన్నారు. భారత్ నుంచి ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్’ గౌరవం దక్కించుకున్న తొలి నటిగా దీపిక చరిత్ర సృష్టించింది. బాలీవుడ్ అగ్రతారలు అయిన షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా ఈ జాబితాలో స్థానం పొందలేకపోవడం గమనార్హం.2006లో ఉపేంద్ర హీరోగా నటించిన కన్నడ సినిమా ఐశ్వర్యతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది దీపిక. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన బాలీవుడ్ మూవీ ఓం శాంతి ఓం తో మంచి గుర్తింపు సంపాదించుంది. 2017లో త్రిబుల్ ఎక్స్: ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ సినిమాలో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కల్కి 2898 ఏడీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం అల్లు అర్జున్ -అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. -
ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.. అందుకే అంత ద్వేషం: స్మృతి ఇరానీ
బుల్లితెర, వెండితెర, రాజకీయం.. అన్నిచోట్లా తనదైన మార్క్ చూపించారు స్మృతి ఇరానీ (Smriti Irani). సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన స్మృతి చిన్న వయసులోనే జీవితాన్ని చదివేశారు. కష్టాలు, తిరస్కరణలు తనను రాటు దేల్చాయి. అందుకే నటిగా మొదలైన తన ప్రయాణం కేంద్రమంత్రిని చేసింది. స్మృతి ఇరానీ మొదట యాడ్స్లో.. తర్వాత సీరియల్స్లో నటించారు. నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సీరియల్స్ కూడా నిర్మించారు. నా జీవితం అగ్నిపథ్ సినిమావంటిదిజై బోలో తెలంగాణ సహా పలు చిత్రాల్లో యాక్ట్ చేశారు. రాజకీయాల్లోనూ చురుకుగా ఉంటూ బీజేపీలో కేలక నేతగా ఎదిగారు. ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగానూ సేవలందించారు. తాజాగా స్మృతి ఇరానీ దర్శకనిర్మాత కరణ్ జోహార్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. మీ జీవితాన్ని ప్రతిబింబించే పాట ఏది? అన్న ప్రశ్నకు స్మృతి.. పాట సంగతేమోకానీ, కుచ్ కుచ్ హోతా హై మూవీ నుంచి నా లైఫ్ సడన్గా అగ్నిపథ్ మూవీగా మారిపోయిందని బదులిచ్చారు. అమ్మకు అన్యాయంఏదైనా ప్రేమగీతం చెప్తారనుకుంటే ఇలా ప్రతీకారంతో రగిలిపోయే సినిమాను ఎంపిక చేసుకున్నారేంటని కరణ్ తిరిగి ప్రశ్నించారు. అందుకు స్మృతి స్పందిస్తూ.. తల్లి లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కొడుకు చేసే ప్రయత్నాలను అగ్నిపథ్లో చూపిస్తారు. అమ్మకు అన్యాయం జరిగిందన్నది అతడి ఆవేదన. నా లైఫ్లోనూ అదే జరిగింది. మా అమ్మకు అన్యాయం జరిగిందని నేను భావిస్తాను. నాకు ఏడేళ్ల వయసున్నప్పుడు తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. ఎందుకో తెలుసా? తను కొడుకును కనివ్వలేదని!అద్దె ఇంట్లో ఉన్న అమ్మకు..అగ్నిపథ్ సినిమాలోలాగే నేను కూడా నా తల్లికి న్యాయం చేయాలనుకున్నాను. ఆ ఇంటికి అమ్మను తిరిగి తీసుకెళ్లాలనుకున్నాను. ఎప్పటికైనా ఆ ఇల్లు కొనివ్వాలని డిసైడయ్యాను. దాదాపు అమ్మ జీవితమంతా అద్దింట్లోనే ఉంది. ఆరేళ్ల క్రితం తనకు ఇల్లు కొనిచ్చాను. కానీ, ఫ్రీగా ఉండటం ఇష్టం లేక ప్రతి నెలా నాకు రూ.1 అద్దె కడుతోంది అని చెప్పుకొచ్చారు.కష్టాలతో సావాసంమరో ఇంటర్వ్యూలోనూ తన పేరెంట్స్ కష్టాలు బయటపెట్టారు స్మృతి ఇరానీ. నాన్న ఆర్మీ క్లబ్ బయట పుస్తకాలు అమ్మేవాడు. అమ్మ ఇంటింటికీ తిరిగి మసాలా దినుసులు అమ్మేది. నాన్న పెద్దగా చదువుకోలేదు. కానీ, అమ్మ డిగ్రీదాకా చదివింది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుడు రూ.150 మాత్రమే వారి చేతిలో ఉన్నాయి. గేదెల కొట్టంలోని ఓ గదిలో వారు నివసించేవారు అని పేర్కొన్నారు. కాగా స్మతి పేరెంట్స్ ప్రేమించి పెళ్లి చేసుకోగా.. కొన్నేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు.చదవండి: ఓటీటీలోకి సడన్గా వచ్చేసిన భారీ బడ్జెట్ మూవీ.. ఎక్కడంటే? -
ఓటీటీలోకి సడన్గా వచ్చేసిన భారీ బడ్జెట్ మూవీ.. ఎక్కడంటే?
కొన్ని సినిమాలు థియేటర్లలో మ్యాజిక్ చేద్దామనుకుంటాయి. తీరా కనీస ఆదరణ కూడా దక్కక బొక్కబోర్లా పడతాయి. థగ్ లైఫ్ సినిమా అలాంటి కోవకు చెందినదే! మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ మూవీలో కమల్ హాసన్ (Kamal Haasan) కథానాయకుడిగా, శింబు, త్రిష, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. జూన్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన థగ్ లైఫ్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఓటీటీలో థగ్లైఫ్ఈ సినిమాను ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ రూ.130 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో రూ.90 కోట్లే ఇస్తామని పేచీ పెట్టింది. చివరకు చర్చల అనంతరం రూ.110 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు భోగట్టా. అంతేకాదు సినిమా రిలీజయ్యాక 8 వారాల తర్వాతే ఓటీటీలో ప్రసారం చేస్తామన్న ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకున్నారు. దాంతో నాలుగు వారాల్లోనే థగ్ లైఫ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా నేడ (జూలై 3) సడన్గా నెట్ఫ్లిక్స్లో దర్శనమిచ్చింది. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.వివాదాలుథగ్ లైఫ్ రిలీజ్కు ముందు భారీ అంచనాలున్నాయి. ఎప్పుడైతే కర్ణాటకలో సినిమా ప్రమోషన్స్లో కమల్ హాసన్ నోరు జారారో అప్పటినుంచే కష్టాలు మొదలయ్యాయి. తమిళ భాష నుంచే కన్నడ భాష పుట్టిందని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో థగ్లైఫ్ కన్నడలో రిలీజ్ కాకుండా ఆగిపోయింది. ఈ వ్యవహారం కోర్టుదాకా వెళ్లగా.. కర్ణాటకలో సినిమా రిలీజ్ చేసేందుకు అనుమతి తెచ్చుకున్నారు.కానీ అప్పటికే థగ్లైఫ్ మిగతా చోట్ల రిలీజై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో కర్ణాటకలో ఈ సినిమా రిలీజ్ చేయలేదు. ఇదిలా ఉంటే.. థగ్ లైఫ్ సినిమా రిలీజైన 8 వారాల తర్వాతే నెట్ఫ్లిక్స్లో విడుదల చేస్తామని చిత్రయూనిట్ ఓటీటీతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ దాన్ని రద్దు చేయడం వల్ల మల్టీప్లెక్స్ థియేటర్లు.. థగ్లైఫ్ నిర్మాత కమల్ హాసన్పై రూ.25 లక్షల జరిమానా వేసినట్లు తెలుస్తోంది. Streaming now on NETFLIX #ThugLife pic.twitter.com/u3BxaX2Dfm— Christopher Kanagaraj (@Chrissuccess) July 2, 2025 చదవండి: అది నా ఫార్ములా కాదు – నిర్మాత ‘దిల్’ రాజు -
'మ్యాడ్' హీరోతో నిహారిక కొత్త సినిమా షురూ
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా కొత్త సినిమా ఆరంభమైంది. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ‘కమిటీ కుర్రోళ్ళు’ వంటి హిట్ చిత్రం తర్వాత పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ద్వితీయ సినిమా ఇది. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్స్ వశిష్ట కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టారు. తొలి సన్నివేశానికి దర్శకుడు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ‘‘ఫ్యాంటసీ, కామెడీ జోనర్ తెరకెక్కనున్న చిత్రమిది. రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 15 నుంచి హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో జరగనుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘వెన్నెల’ కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుఖ్వీందర్ సింగ్, అరుణ భిక్షు, రమణ భార్గవ్, వాసు ఇంటూరి, రోహిణి, రోహన్ ఇతర పాత్రలు పోషించనున్న ఈ సినిమాకి సంగీతం: అనుదీప్ దేవ్, కెమేరా: రాజు ఎడురోలు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మన్యం రమేష్. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
ప్రభాస్కు కథ చెప్పిన 'అమరన్' డైరెక్టర్!
హీరో ప్రభాస్ (Prabhas), ‘అమరన్’ ఫేమ్ రాజ్కుమార్ పెరియసామి కాంబినేషన్లో ఓ సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్ను కలిసి రాజ్కుమార్ ఓ కథ వినిపించారని, అది నచ్చి ప్రభాస్ సినిమా చేయడానికి ఆసక్తి కనబర్చారని భోగట్టా. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనుందట. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇటు రాజ్కుమార్ కూడా ధనుష్తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ ఇద్దరూ తమ కమిట్మెంట్స్ పూర్తి చేశాకే ఈ హీరో–దర్శకుడి కాంబినేషన్ గురించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ప్రభాస్ చేతిలో ది రాజా సాబ్, ఫౌజీ, సలార్ 2, స్పిరిట్ చిత్రాలున్నాయి. ఇందులో ది రాజాసాబ్ డిసెంబర్ 5న విడుదల కానుంది.చదవండి: అది నా ఫార్ములా కాదు – నిర్మాత ‘దిల్’ రాజు -
అది నా ఫార్ములా కాదు – నిర్మాత ‘దిల్’ రాజు
‘‘ఓ నిర్మాతకు ఓ హీరోతో సినిమా కమిట్మెంట్ కావాలంటే అబ్నార్మల్ అడ్వాన్స్లు ఇచ్చి, వాళ్లను హోల్డ్ చేసుకుని సినిమా ప్లాన్ చేయాలి. అది నా ఫార్ములా కాదు. హీరోలకు, దర్శకులకు అడ్వాన్స్ల రూపంలో డబ్బులిచ్చి, వారిని కట్టడి చేయడం అనే దానికి నేను వ్యతిరేకం. ఓ దర్శకుడితో నాకు వేవ్ లెంగ్త్ సింక్ అయితే సినిమా చేస్తాను’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘తమ్ముడు’. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమీ గౌడ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో ‘దిల్’ రాజు పంచుకున్న విశేషాలు.→ కథగా చూస్తే ‘తమ్ముడు’ సింపుల్ స్టోరీ. అక్కా తమ్ముడి మధ్య ఓ సమస్య రావడం, వారు ఆ సమస్యను సాల్వ్ చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేశారు? అనేది మూవీలో చూస్తారు. స్క్రీన్ప్లే పరంగా కొత్తగా చూపిస్తూ, యాక్షన్ సీక్వెన్స్లతో ఆసక్తికరంగా తీశాడు వేణు శ్రీరామ్. ఇది యాక్షన్ ప్యాక్డ్ సినిమా. మొదటి ఇరవై నిమిషాల తర్వాత ఈ సినిమాలోని మిగిలిన కథంతా ఒక్క రోజులో జరుగుతుంది. → మా బ్యానర్లోని గత సినిమాలు అమెజాన్లో స్ట్రీమింగ్ అయ్యాయి. కానీ ఒకరితోనే ముందుకు వెళ్లలేం కదా. సో... ‘తమ్ముడు’ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక థియేటర్లో సినిమా ప్రదర్శనకు ముందు ఆ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందో తెలిసేలా ఉండటం కరెక్ట్ కాదు. ఈ విషయం గురించి ఓటీటీ సంస్థలతో మాట్లాడినప్పుడు సపోర్ట్ చేస్తామన్నారు. → ఎఫ్డీసీ నుంచి గద్దర్ అవార్డ్స్ వేడుక చేశాం. అలాగే మన హైదరాబాద్లో ఆగిపోయిన చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ను ఈ ఏడాది ఎఫ్డీసీ ద్వారా నిర్వహించాలని అనుకుంటున్నాం. ఆన్లైన్ టికెటింగ్, రన్ట్రాక్ (సినిమా వసూళ్లను ట్రాక్ చేసే విధానం) లను తెలంగాణాలో తీసుకువచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. → మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్రాజు ప్రొడక్షన్స్ సంస్థల్లో ఈ ఏడాది నాలుగు సినిమాలు (రౌడీ జనార్థన, ఎల్లమ్మ, దేత్తడి, మరో సినిమా స్క్రిప్ట్ స్టేజ్లో ఉంది) రెడీ అవుతున్నాయి. ఇంకా అనిల్ రావిపూడితో ఓ సినిమా, ‘మార్కో’ హనీఫ్తో ఓ సినిమా, ఓ ఇద్దరు కొత్త డైరెక్టర్స్ సినిమాలు ఉన్నాయి. ఇంకా ఓ అడ్వెంచరస్ సినిమా కూడా ఉంది. ప్రశాంత్ నీల్తో సినిమా ఉంటుంది. హోల్డ్లో ఉన్న ‘సెల్ఫిష్’ సినిమాపై ఈ వారంలో ఓ కార్లిటీ వస్తుంది. కొత్తవారిని ప్రోత్సహించే విధంగా ‘దిల్’ రాజు డ్రీమ్స్లో కొన్ని ప్రాజెక్ట్స్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ‘దిల్’ రాజు డ్రీమ్స్లో నిర్మాతలు కూడా దరఖాస్తు చేసు కుంటున్నారు. కథ బాగుంటే మేమే బడ్జెట్ కేటాయించి వాళ్లతో సినిమా చేస్తాం. వాళ్లు సినిమా చేసుకుని మా దగ్గరకు వస్తే మా గైడెన్స్తో ఆ సినిమాను రిలీజ్ చేస్తాం. ఇక పైరసీని అరికట్టేందుకు ఇండస్ట్రీ నుంచి గట్టి చర్యలు తీసుకుంటున్నాం. కేంద్రప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తోంది. ఇటీవల విడుదలైన ‘కుబేర, కన్నప్ప’ చిత్రాల పైరసీ ప్రభావం కాస్త తగ్గింది → ‘గేమ్ చేంజర్’ చిత్రా నికి నిర్మాత మీరేనా? జీ స్టూడియోస్ సంస్థనా? జీ స్టూడియోస్ తమ సినిమా అంటున్నారట? అనే ప్రశ్నకు– ‘‘ఒకవేళ వాళ్లే అయితే లాస్ కట్టమనాలి’’ అని ‘దిల్’ రాజు బదులిచ్చారు.అవమానపరచాలనుకోలేదు: నిర్మాత శిరీష్ ‘‘మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్తో చిరంజీవి, రామ్చరణ్గారికి ఎంతో అనుబంధం ఉంది. నేను అభిమానించే హీరోల్లో రామ్చరణ్గారు ఒకరు. ఆయన్ని అవమానపరచడం, కించపరచడం చేయను. అది జరిగిందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు కాబట్టి వాళ్లకు, చరణ్గారికి క్షమాపణలు చెబుతున్నాను. మా బ్యానర్లో చరణ్గారితోనే మరో సినిమా చేయబోతున్నాం’’ అంటూ శిరీష్ ఓ వీడియో బైట్ రిలీజ్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో ‘గేమ్ చేంజర్’ ఫ్లాప్ తర్వాత ఆ చిత్రదర్శకుడు శంకర్, హీరో రామ్చరణ్ కనీసం ఫోన్ కూడా చేయలేదన్నట్లుగా శిరీష్ పేర్కొన్నారు. ఆ తర్వాత నెలకొన్న వివాదంపై తన స్పందనను ఇలా వీడియో బైట్ ద్వారా తెలియజేశారు. -
'అలాంటి వారికే ఇండస్ట్రీలో గుర్తింపు'.. పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్!
టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ మరోసారి వార్తల్లో నిలిచింది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్పై ఆరోపణలతో టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన పూనమ్ మరో ట్వీట్ చేసింది. ఒరిజినల్ కంటెంట్, స్క్రిప్ట్ ఉన్న దర్శకుడు క్రిష్ అంటూ కొనియాడింది. ఎన్నో కాపీరైట్ సమస్యలు, పీఆర్ స్టంట్లు ఉన్న దర్శకుడికి వచ్చినంత గుర్తింపు, విజయం లభించడం లేదని రాసుకొచ్చింది. ఈ ట్వీట్ చూస్తే మరోసారి త్రివిక్రమ్ను ఉద్దేశించే పరోక్షంగా పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే పవన్ కల్యాణ్ మూవీ హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్కు ముందు పూనమ్ చేసిన ట్వీట్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఈ నెలలోనే రిలీజ్ కానుందని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ట్రైలర్ రిలీజ్ తేదీని ప్రకటించారు. ఈనెల 3న ఉదయం 11 గంటల 10 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీకి మొదట క్రిష్ దర్శకత్వం వహించగా.. కారణాలేంటో తెలీదు గానీ మధ్యలోనే తప్పుకున్నాడు. దీంతో చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం కొడుకు జ్యోతికృష్ణ.. డైరెక్షన్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయినప్పటికీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో బాబీ డియోల్, అనుపమ ఖేర్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు.Krish a director with original content and authentic scripts doesn’t get as much recognition or success like that of a director with multiple copyright issues and pr stunts.— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) July 2, 2025 త్రివిక్రమ్పై మా అసోసియేషన్కు ఫిర్యాదుపూనమ్ కౌర్ టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్పై ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గతంలోనే మెయిల్ ద్వారా ఇప్పటికే మా అసోసియేషన్కు ఫిర్యాదు చేశానని తెలిపింది. క్లియర్గా త్రివిక్రమ్ శ్రీనివాస్పైనే ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. అంతేకాదు రాజకీయ, సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరో కాపాడుతున్నారని కూడా చెప్పానని పూనమ్ కౌర్ ప్రస్తావించింది. ఈ విషయంపై నేను మహిళల గ్రూప్తో మాట్లాడతానని కూడా పూనమ్ వెల్లడించింది. అంతేకాకుండా తన మెయిల్కు రిప్లై కూడా వచ్చిన స్క్రీన్షాట్ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. -
తమిళనాడులో అక్కినేని కోడలు శోభిత..ఫ్యాషన్ డ్రెస్లో మిల్కీ బ్యూటీ తమన్నా!
తమిళనాడులో ఎంజాయ్ చేస్తోన్న అక్కినేని కోడలు శోభిత..శారీలో అనుపమ పరమేశ్వరన్ క్యూట్ లుక్స్..ఫ్యాషన్ డ్రెస్లో మిల్కీ బ్యూటీ తమన్నా హోయలు..కలర్ఫుల్ శారీలో టాలీవుడ్ నటి శాన్వీ మేఘన..పింక్ శారీలో బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ గ్లామరస్ లుక్స్.. View this post on Instagram A post shared by Seetha🦋🇮🇳 (@kirrakseetha) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by PARVATHY KRISHNA (@parvathy_r_krishna) -
ముంబయి టూ గోవా.. పరుగులు తీసిన స్టార్ హీరో.. వామ్మో అన్ని కిలో మీటర్లా?
పార్టీలు చేసుకోవాలి క్యాసినోలు చూసుకోవాలి బీర్లు తాగాలి బీచ్లలో పడి దొర్లాలి... గోవా అనగానే లెట్స్ గో... అనేందుకు చాలా మందికి అవే కారణాలు కావచ్చు. కానీ ఆ అగ్రనటుడు మాత్రం గోవాకి పరుగులు తీసిన కారణం వీటికి పూర్తిగా భిన్నం కావడం విశేషం. ఫిట్గా ఉండండి హిట్ అనిపించుకోండి అని ప్రభోధించడానికి ఆయన ఎంచుకున్న మార్గం ఏకంగా 600 కి.మీ ప్రయాణం అది కూడా ఎలా? పరుగులు తీస్తూ కాసేపు సైక్లింగ్లో మరింత సేపు...ఇంతకీ ఎవరా నటుడు? ఏమా కధ? లెట్స్ గెట్ ఇన్ టూ దిస్ స్టోరీ...ఫ్యాషన్ రంగంలో మోడల్ సినిమా రంగంలో నటుడు, అనగానే చాలామంది గుర్తుకు రావచ్చు కానీ.. ఫిట్నెస్ ఐకాన్ అనేది కూడా వీటికి జతకలిస్తే మాత్రం దేశవ్యాప్తంగా గుర్తుకు వచ్చే ఏకైక పేరు మిలింద్ సోమన్. గత కొన్నేళ్లుగా అన అనూహ్యమైన ఫిట్నెస్ స్థాయిలతో అందర్నీ అబ్బుపరుస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న మిలింద్..మరోసారి తన శారీరక సామర్ధ్యాన్ని చాటుకున్నాడు. ‘ది ఫిట్ ఇండియా రన్’ పేరుతో ఏటా నిర్వహించే రన్నింగ్ ఈవెంట్ దీనికి వేదికగా నిలిచింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న ఆయన ముంబయి నుంచి గోవా వరకు సుమారు 600 కిలోమీటర్ల దూరం మోటారు వాహనం లేకుండా ప్రయాణించారు. ఈ ప్రయాణం 5 రోజుల్లో పూర్తి చేసిన ఘనత సాధించాడు.ఈ మార్గంలో ప్రతిరోజూ సుమారు 90కిమీ సైక్లింగ్ 21కిమీ పరుగు ఇలా విభజించుకుంటూ ఆయన ప్రయాణించాడు. గత నెల అంటే జూన్ 26న ముంబైలోని శివాజీ పార్క్ నుంచి మిలింద్ సోమన్ ఫిట్ ప్రారంభమైంది. మహారాష్ట్ర భూభాగానికి ఆనుకుని ఉన్న కొంకణ్ బెల్ట్ను పూర్తిగా కవర్ చేస్తూ పెన్, కొలాడ్, చిప్లూన్, రత్నగిరి, కంకవళి ల మీదుగా ప్రయాణిస్తూ జూన్ 30న గోవాకు చేరుకున్నాడు. తన సాహస ప్రయాణాన్ని తాజాగా ఆయన ఇన్ షేర్ చేశాడు. దానితో పాటే ఓ సందేశాన్ని కూడా.'ఫిట్ ఇండియన్ రన్ 5రోజుల పాటు 600కిమీ పూర్తి చేశాను. ఇది ప్రతీ ఏటా తప్పనిసరిగా నేను ఎదుర్కునే ఛాలెంజ్, శరీరం, మనస్సు బాగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకునేందుకు ఇలాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం నాకు ఉపకరిస్తుంది. అనేక మంది నాకు బెస్ట్ విషెస్ చెప్పడం మరెన్నో అఛీవ్ చేయాలని కోరుతుండడం నాకు మరింత ప్రేరణగా మారుతోంది. ప్రతి భారతీయుడు ఫిట్ ఇండియన్ అవ్వాలి. జైహింద్' అంటూ పంచుకున్నాడు.ప్రతీ ఒక్కరిలో ఫిట్నెస్ పట్ల ఆసక్తి పెంచేందుకు గత 2020లో భారత ప్రభుత్వం ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ను ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ కార్యక్రమంలో మిలింద్ పాల్గొంటున్నాడు. ఈ సారి 60ఏళ్ల వయసులో కూడా అదే ఉత్సాహంతో ఆయన సాధించిన ఈ ఫీట్... ఫిట్నెస్లో ఆసక్తి ఉన్న చాలామందికి ప్రేరణ అందిస్తోంది. -
ఓటీటీకి వచ్చేస్తోన్న హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలో మలయాళ చిత్రాలకు పుల్ డిమాండ్ ఉంటోంది. గతంలో వచ్చిన పలు సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిన్న సినిమాలు సైతం డిజిటల్ ఫ్లాట్ఫామ్లో ఆడియన్స్ను ఆదరణ దక్కించుకున్నాయి. మలయాళంలో నుంచి వచ్చే చిత్రాల్లో ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కావడంతో ఓటీటీల్లో సత్తా చాటుతున్నాయి. తాజాగా మరో మలయాళ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.టొవినో థామస్ హీరోగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ నరివెట్ట స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. మలయాళ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది. ఈనెల 11 నుంచి సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ట్రైలర్ను కూడా రిలీజ్ చేసింది. ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ సినిమాలో టొవినో థామస్ పోలీస్ కానిస్టేబుల్గా నటించగా.. సూరజ్ వెంజరమూడు, చేరన్ కీలక పాత్రలు పోషించారు. ఈ యాక్షన్ మూవీకి అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది మే 23న మలయాళంలో విడుదలైన ఈ సినిమా.. తెలుగులోనూ మే 30న రిలీజైంది.Echoes of truth, shadows of injustice!Watch Narivetta from July 11 only on SonyLIV#NarivettaOnSonyLIV@ttovino #SurajVenjaramoodu #Cheran #AnurajManohar #AryaSalim #JakesBijoy pic.twitter.com/lon0ikr836— Sony LIV (@SonyLIV) July 2, 2025 -
తెలుగులో ఎంట్రీ ఇస్తోన్న భజరంగీ భాయిజాన్ ఫేమ్..!
సల్మాన్ ఖాన్ మూవీ బజరంగీ భాయిజాన్లో నటించి అభిమానులను సంపాదించుకున్న నటి హర్షాలీ మల్హోత్రా. ఈ సినిమాలో మున్ని అనే పాత్రలో సినీ ప్రియులను మెప్పించింది. ముంబయికి చెందిన హర్షాలీ బాలనటిగా కెరీర్ ప్రారంభించింది. హిందీలో పలు సీరియల్స్లో తన నటనతో రాణించింది. 2015లో విడుదలైన బజరంగీ భాయిజాన్ మూవీతోనే ఆమెకు గుర్తింపు వచ్చింది.ప్రస్తుతం హర్షాలీ మల్హోత్రా టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న అఖండ సీక్వెల్లో నటిస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ చిత్రంలో హర్షాలీ.. జనని పాత్రలో కనిపించనుందని తెలిపారు. ఈ మేరకు హర్షాలీ మల్హోత్రా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు.కాగా.. గతంలో బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ సూపర్ హిట్గా నిలిచింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్గా అఖండ-2ను తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ మూవీలో సంయుక్త, ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం దసరా ఈ ఏడాది కానుకగా సెప్టెంబరు 25న విడుదల కానుంది. A smile of an angel and a heart of gold ❤️Introducing Bajrangi Bhaijaan fame #HarshaaliMalhotra as 'JANANI' from #Akhanda2 ✨#Akhanda2 THANDAAVAM IN THEATRES DUSSEHRA 25th SEPTEMBER #Akhanda2Thaandavam 'GOD OF MASSES' #NandamuriBalakrishna #BoyapatiSreenu @AadhiOfficial… pic.twitter.com/t5M3pVh8c1— 14 Reels Plus (@14ReelsPlus) July 2, 2025 -
'ఏ మాయ చేశావే నాగచైతన్యతో కాదు.. ఆ స్టార్ హీరోతో చేయాలని': డైరెక్టర్
ఏ మాయ చేశావే మూవీతో టాలీవుడ్లో సూపర్ హిట్గా నిలిచింది. నాగచైతన్య, సమంత హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. హీరోయిన్ సమంత ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ లవ్ ఎంటర్టైనర్ చిత్రంలో జెస్సీ పాత్రలో మెరిసింది. 2010లో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. దీంతో ఈ సినిమా రిలీజై జూలై 18 నాటికి 15 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రం గురించి మాట్లాడారు. అయితే మొదటి ఏ మాయ చేశావే చిత్రానికి హీరోగా నాగచైతన్యను అనుకోలేదని తెలిపారు. స్టార్ హీరో మహేశ్ బాబుతోనే తీద్దామని ఈ కథను రాసుకున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో క్లైమాక్స్లో చిరంజీవి గెస్ట్ రోల్గా పెట్టాలని అనుకున్నట్లు గౌతమ్ వాసుదేవ్ తెలిపారు. క్లైమాక్స్ భిన్నంగా ఉండాలని మెగాస్టార్తో ప్లాన్ చేశానని పేర్కొన్నారు.కాగా.. జూలై 18న 'ఏమాయ చేసావె' రీ రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఏకకాలంలో తమిళంలో కూడా విడుదలైంది. అక్కడ 'విన్నైతాండి వరువాయా' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో శింబు, త్రిష ముఖ్య పాత్రల్లో నటించారు. కానీ ఈ సినిమా హిందీలో 'ఏక్ థా దీవానా' పేరుతో రీమేక్ అయింది. అక్కడ మాత్రం పరాజయం చవి చూసింది. Gautam Vasudev Menon explaining how the #YMC story developed keeping Mahesh babu @urstrulyMahesh in mind , and initial climax he planned was different planning to cast Chiranjeevi as guest role pic.twitter.com/iC2gXj3uhu— #Coolie varaaru 🌟 (@yourstrulyvinay) July 1, 2025 -
'రామ్చరణ్ ఒప్పుకోకుంటే సినిమా రిలీజ్ అయ్యేది కాదు'.. దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి
మెగా హీరో రామ్ చరణ్ వివాదంపై దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ రెడ్డి స్పందించారు. గేమ్ ఛేంజర్ కోసం చరణ్ మాకు పూర్తిగా సహకరించారని తెలిపారు. గేమ్ ఛేంజర్ రిలీజ్ సమయంలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని విడుదల చేయమని సలహా ఇచ్చిందే రామ్ చరణ్ అని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శిరీష్ రెడ్డి చేసిన కామెంట్స్ వివాదంగా మారడంతో ఆయన క్లారిటీ ఇచ్చారు.నిర్మాత శిరీష్ రెడ్డి మాట్లాడుతూ..'మెగా అభిమానులకు నమస్కారం. మా ఎస్వీసీ సంస్థకు, రామ్ చరణ్కు అవినాభావ సంభంధం ఉంది. నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏదైనా చిన్న మాట దొర్లినా రామ్ చరణ్కు, అభిమానులకు నా క్షమాపణలు. నేను అన్న ఉద్దేశం కాదు. మాకు మెగా హీరోలతో మంచి సంబంధాలు ఉన్నాయి. అలాంటి వాళ్లను నేను అవమానించేంత ముర్ఖుణ్ణి కాదు. రామ్ చరణ్ వల్లే సంక్రాంతికి వస్తున్నాం మూవీని రిలీజ్ చేశాం. అలాంటి వ్యక్తిని నేను ఎందుకు అంటాను. మా ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చేలా ప్రవర్తించకండి. నా ఫస్ట్ ఇంటర్వ్యూ కావడం వల్ల ఏదైనా పొరపాటు జరిగి ఉంటే క్షమించండి. త్వరలోనే రామ్ చరణ్తో మరో సినిమా చేయబోతున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు' అంటూ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.Official statement from our Producer Shirish Garu. pic.twitter.com/I4mv9r18w7— Sri Venkateswara Creations (@SVC_official) July 2, 2025 -
కూతురిగా చేసిన నటితో రొమాన్స్.. డైరెక్టర్ వద్దని చెప్పారు: అమిర్ ఖాన్
ఆమిర్ ఖాన్ ఇటీవలే 'సితారే జమీన్ పర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతనెల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో జెనీలియా దేశ్ముఖ్ కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల మార్కును దాటేసింది. అయితే గతంలో అమిర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో మొదటిస్థానంలో ఉంది. ఈ మూవీలో బాలీవుడ్ ఫాతిమా సనా షేక్ అమిర్ ఖాన్ కూతురిగా మెప్పించింది.అయితే దంగల్లో అమిర్ ఖాన్ కూతురిగా నటించిన ఫాతిమా సనా షేక్ ఆ తర్వాత 2018లో వచ్చి థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ మూవీలో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో అమిర్ ఖాన్ కలిసి రొమాన్స్ చేసింది. అయితే తన కూతురి పాత్రలో నటించిన ఆమెతో అమిర్ ఖాన్ రొమాన్స్ చేయడంపై తాజాగా స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన.. ఈ సినిమా మా ఇద్దరి మధ్య ఎలాంటి రొమాంటిక్ యాంగిల్ ఉండదని థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ డైరెక్టర్ విజయ్ కృష్ణ ఆచార్య అన్నారని గుర్తు చేశారు. అయితే తనకు ప్రేమికుడిగా నటించడానికి ఫాతిమాకు ఎలాంటి అభ్యంతరం లేదని డైరెక్టర్తో చెప్పానని అమిర్ ఖాన్ వెల్లడించారు. ఎందుకంటే నేను ఆమె తండ్రిగా ఒక సినిమాలో మాత్రమే నటించా.. నిజ జీవితంలో కాదని డైరెక్టర్తో చెప్పినట్లు తెలిపారు. నేను నిజ జీవితంలో ఆమె ప్రియుడిని కాదు.. మేమిద్దరం కలిసి కేవలం సినిమా చేస్తున్నామని దర్శకుడితో చెప్పినట్లు వివరించారు. అంతే కాకుండా గత సినిమాల్లో తల్లి-కొడుకులుగా నటించిన అమితాబ్ బచ్చన్- వహీదా రెహ్మాన్లు.. ఆ తర్వాత ప్రేమికులుగా నటించారని అమిర్ గుర్తు చేశారు. దీపిక, ఆలియా భట్, శ్రద్ధా కపూర్ లాంటి తారలు ఈ మూవీని రిజెక్ట్ చేసినప్పటికీ ఫాతిమా ఈ చిత్రానికి సంతకం చేశారని అమిర్ ఖాన్ తెలిపారు. ఇది ఒక అద్భుతమైన సినిమా అని నిర్మాత ఆదిత్య చోప్రా నుంచి కాల్ వచ్చిన తర్వాత తాను షాక్ అయినట్లు గుర్తు చేసుకున్నారు. అయితే'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. -
నటుడితో సంబంధం అంటగట్టారు.. సెట్లో ఏడ్చేశా.. హీరో విజయ్..: వనిత
చిన్న వయసులోనే వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు వనిత (Vanitha Vijayakumar). తల్లిదండ్రులు మంజుల- విజయ్ కుమార్ల నుంచి నటనను పుణికి పుచ్చుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తమిళ, మలయాళంలో పలు సినిమాలు చేసింది. తెలుగులో దేవి చిత్రంలో నటించారు. ఆ మధ్య వచ్చిన మళ్లీ పెళ్లి మూవీలోనూ యాక్ట్ చేశారు. ప్రస్తుతం మిసెస్ అండ్ మిస్టర్ మూవీ చేస్తోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా దర్శకురాలిగానూ బాధ్యతలు చేపట్టింది.సెట్లో ఏడ్చేశా..ఈ మూవీతో వనిత కూతురు జోవిక నిర్మాతగా పరిచయం కానుంది. జూలై 11న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో వనితా విజయ్కుమార్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. చంద్రలేఖ సినిమాతో హీరోయిన్గా నా ప్రయాణం మొదలైంది. ఇందులో విజయ్ (Vijay) హీరో. ఆ సినిమా చేస్తున్నప్పుడు నా వయసు దాదాపు 15 ఏళ్లుంటాయనుకుంటా.. 40 ఏళ్ల వయసున్న రాజ్కిరణ్తో నాకు ముడిపెట్టి చేసి వార్తలు రాశారు. అవి చూసి తట్టుకోలేకపోయాను. సెట్లోనే ఏడ్చేశాను.మొదట పలకరించలేదుఅప్పుడు విజయ్ నన్ను చూసి పలకరించకుండానే వెళ్లిపోయాడు. తర్వాత కొంతసేపటికి వచ్చి అసలేమైందని అడిగాడు. నేనుం ఏం కాలేదని చెప్పాను. పర్వాలేదు, ఏం జరిగిందో చెప్పు అనేసరికి నా బాధనంతా వెళ్లగక్కాను. ఓ నటుడితో నాకు రిలేషన్ అంటగడుతున్నారని, అందుకు బాధగా ఉందని చెప్పాను. అప్పుడు విజయ్.. నీ గురించి వాళ్లు ఏదీ రాయకపోతే నువ్వు ఇండస్ట్రీలో ఉన్నా లేనట్లే! నీ గురించి ఏదో ఒకటి రాస్తున్నారంటే నువ్వు ఫేమస్ అయ్యావని అర్థం. ఓదార్చాడుఈ విమర్శలు, పుకార్ల గురించి బాధపడకు. నీ నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టు అని సలహా ఇచ్చాడు. విజయ్ ఎప్పుడూ అంతే.. మొదట నేను ఏడుస్తున్నా నా దగ్గరకు కూడా రాలేదు. అసలేమైందని కనుక్కున్న తర్వాతే నా దగ్గరకు వచ్చి పలకరించాడు, నా సమస్యను పరిష్కరించాడు. ఇకపోతే రాజ్కిరణ్ సర్ చాలా మంచివాడు. అలాంటి మనిషి వ్యక్తిత్వాన్ని తప్పుపట్టారు. నాతో సంబంధం అంటగట్టారు. ఆ విషయంలో చాలా బాధపడ్డాను అని వనిత విజయ్ కుమార్ చెప్పుకొచ్చారు.చదవండి: మమ్మల్ని చంపుకుతింటున్నారు.. ఇండస్ట్రీలో ఫ్లాపులే లేవా? దిల్ రాజు -
జవాన్ కుటుంబానికి సాయం.. మర్యాదగా మాట్లాడండి: గౌతమ్ వార్నింగ్
బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా, రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా నటించిన చిత్రం సోలో బాయ్. అనిత చౌదరి, పోసాని కృష్ణ మురళి, అరుణ్ కుమార్, భద్రం, షఫీ, ఆర్కే మామ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నవీన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రిలోక్ సిద్దు సినిమాటోగ్రాఫర్గా, జుడా సంధ్య మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేశారు. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై శ్రీమతి వినాద్రి, బేబీ నేహా శ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మించారు. జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్కు వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.డైరెక్టర్ అవుదామని వచ్చి..ఈ సందర్భంగా వివి వినాయక్ మాట్లాడుతూ... "నిర్మాత సతీష్ ఒక దర్శకునిగా ఇండస్ట్రీకి వచ్చి బట్టల రామస్వామి బయోపిక్ ద్వారా నిర్మాతగా మారారు. ఎంతో కష్టపడి చాలా సాధారణ స్థాయి నుంచి ఇక్కడ వరకు వచ్చారు. ఈ చిత్రంలో నటించిన గౌతమ్ కృష్ణకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను" అన్నారు. రఘు కుంచె మాట్లాడుతూ... "నిర్మాత సతీష్ నాకు ఎంతోకాలంగా పరిచయం. ఆయన ఓటీటీ ద్వారా విడుదల చేసిన బట్టల రామస్వామి బయోపిక్ మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఆర్పీ పట్నాయక్ గారితో కలిసి చేసిన కాఫీ విత్ ఎ కిల్లర్ ఎంతో పాపులర్ అయింది. ఇప్పుడు సోలో బాయ్ మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా" అన్నారు.బిగ్బాస్ నుంచి హీరోగా..హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ... "నేను బిగ్బాస్కు వెళ్లక ముందు ఈ సినిమా మొదలైంది. నాకు ఎటువంటి ఫేమ్ లేని సమయంలో నన్ను నమ్మి సతీష్ గారు ఈ సినిమా మొదలుపెట్టారు. దానికి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చిత్ర పరిశ్రమలో ఎటువంటి పరిచయాలు లేకుండా కేవలం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి ఇలా ఒక సినిమాలో హీరోలా నిలబడటం అనేది చాలా పెద్ద విషయం. నేను దాన్ని ఒక సక్సెస్ లా చూస్తున్నాను.మర్యాద ఇచ్చి మాట్లాడండిఅలాగే దివంగత జవాన్ మురళి నాయక్ గారి కుటుంబానికి మేము అండగా నిలిచి ఆర్థిక సాయం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది సోషల్ మీడియాలో ఆ కుటుంబానికి ఇప్పటికే ఎంతోమంది సహాయం చేశారు, ఇంకా మీరు ఎందుకు ఇస్తున్నారు? అని అన్నారు. మురళి నాయక్ అనే వ్యక్తి ఒక సైనికుడు. ఆయనకు మర్యాద ఇచ్చి మాట్లాడండి. జై హింద్" అంటూ ముగించారు. సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో గౌతమ్.. మురళీ నాయక్ పేరెంట్స్కు రూ.1 లక్ష ఆర్థిక సాయం చేశాడు.చదవండి: మీ చేతిలో కీలుబొమ్మలం కాదు.. స్నేహితురాలిని పెళ్లాడిన నటి!? -
రైతుల కష్టాల నేపథ్యంతో ‘వీడే మన వారసుడు’
రమేష్ ఉప్పు హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘వీడే మన వారసుడు’. లావణ్యా రెడ్డి, సర్వాణి మోహన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ–‘‘ఒకప్పుడు సందేశాత్మక చిత్రాలు వచ్చేవి. ఆ తరహాలో ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘రైతుల కష్టాలను చక్కగా ఆవిష్కరించిన కుటుంబకథా చిత్రం ఇది’’ అని పేర్కొన్నారు రమేష్ ఉప్పు. ఈ కార్యక్రమంలో దర్శకులు సముద్ర, వీఎన్ ఆదిత్య, నటుడు–దర్శక–నిర్మాత సాయి వెంకట్, ΄ోలీసాఫీసర్ రమావత్ తేజ, హీరో కృష్ణ సాయి, కాంగ్రెస్ నాయకుడు సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. -
ఒంటరిగా ఉండలేను.. ఐశ్వర్య సలహానే పాటిస్తున్నా : అభిషేక్
తనపై వచ్చే నెగెటివిటీని ఎదుర్కోవడానికి భార్య ఐశ్వర్య ఇచ్చే సలహాను పాటిస్తున్నానని చెప్పారు బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan). ఆమె ఇచ్చిన సలహాతో ఇప్పుడు పాజిటివ్ విషయాలపై మాత్రమే దృష్టిపెడుతున్నానని అన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నటుడిగా తనపై వచ్చే ఫేక్ న్యూస్, ట్రోలింగ్ని ఎలా ఎదుర్కొంటున్నాడో వివరించాడు. ‘నా చుట్టు ఉన్నవారిని సంతోషంగా ఉంచాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. అలా చేయడానికి ప్రయత్నిస్తాను. కానీ కొన్నిసార్లు కాలమే మనకు కఠినంగా ఉండమని చెబుతుంది. ఒక నటుడిగా అలా ఉండడం నాకు కుదరదు. అలా ఉంటే ఆ ప్రభావం నా కెరీర్పై పడుతుంది. ఎన్ని విమర్శలు వచ్చినా సరే నలుగురిని సంతోషంగా ఉండేలా చేయాలనే మనస్తత్వం నాది. నెగెటివ్ విషయాలు చెప్పే వారి గురించి ఎక్కువగా ఆలోచించేవాడిని, ట్రోలింగ్పై కూడా దృష్టిపెట్టేవాడిని. కానీ నా భార్య ఇచ్చిన ఒక సలహాతో వాటిని దూరం పెట్టేశాను.‘తప్పుడు వార్తలు మనపై ఎలాంటి ప్రభావం చూపవు. పాజిటివ్ విషయాలపై మాత్రమే దృష్టిపెట్టండి. దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది’ అని ఐశ్వర్య నాకు సలహా ఇచ్చింది. ఇప్పుడు అదే నేను ఫాలో అవుతున్నాను. ట్రోలింగ్ని పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తున్నాను. ఒంటరిగా ఎక్కువ రోజులు ఉండడం నా వల్ల కాదు. కుటుంబాన్ని చూడకుండా ఉండలేను. నా పక్కన మాట్లాడడానికి ఒక మనిషి కచ్చితంగా ఉండాలి. ఇంట్లో అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటాం. వర్క్ బిజీగా గడుపుతున్నప్పటికీ అప్పుడప్పుడు మనకోసం కూడా సమయం కేటాయించుకోవాలి’ అని అభిషేక్ అన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన కాళిధర్ లాపత మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. జీ 5’ వేదికగా జులై 4 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. -
అల్లు అర్జున్ స్టార్డమ్ని మరెవరూ టచ్ చేయలేరు: టాప్ డైరెక్టర్
పుష్ప2 సినిమా అల్లు అర్జున్(Allu Arjun) స్టార్డమ్ని ఆకాశానికి చేర్చిందనేది తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక మంది టాప్ స్టార్స్ ఉండగా ఒక్కసారిగా వీరందరినీ మన బన్నీ దాటేశాడు. తన తదుపరి సినిమాకి ఏకంగా రూ.300కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడనే వార్త టాప్ బాలీవుడ్ స్టార్స్కి కూడా దిమ్మదిరిగిపోయేలా షాక్ ఇచ్చింది. ఓ వైపు ఎంతో కాలంగా ఇంటర్నేషనల్ స్టార్స్గా వెలుగొందుతున్న ఎందరో బాలీవుడ్ హీరోలు, మరోవైపు ఇటీవలే గ్లోబల్ స్టార్స్గా మారిన దక్షిణాది హీరోలు.. మరి వీరందరిలో భవిష్యత్తులో బన్నీని బీట్ చేయగల హీరో ఎవరు? అనే ప్రశ్నలు చర్చలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలోనే అల్లు అర్జున్ స్టార్డమ్ని బీట్ చేయడం ఇప్పట్లో మరెవరికీ సాధ్యం కాదు ఓ టాప్ డైరెక్టర్ తేల్చేయడం విశేషం.ఆయన కూడా సాదా సీదా హిందీ సినిమాల దర్శకుడేమీ కాదు అనేక హిట్ చిత్రాలు అందించిన అగ్రగామి బాలీవుడ్ దర్శకుడు మధర్ భండార్కర్(Madhur Bhandarkar). తాజాగా ఆయన మాట్లాడుతూ ఈ అభిప్రాయం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. ‘‘సమీప రోజుల్లో, ఎవ్వరూ కూడా అల్లూ అర్జున్ దక్కించుకున్న క్రేజ్ను కనీసం తాకలేరు. ఆయన నిజమైన పాన్ఇండియా స్టార్’’ అని మధుర్ భండార్కర్ అన్నారు. అంతేకాదు.. పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన తీరు. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ భారీగా మాస్ ఆకర్షణను సంపాదించి పెట్టిందని ప్రాంతాలకతీతంగా అల్లు అర్జున్ను ప్రేక్షకులతో కనెక్ట్ చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.పుష్ప సినిమా విజయం గతంగా మారిపోయినా ఇప్పటికీ అల్లు అర్జున్ను ప్రశంసిస్తున్న వారి జాబితా అంతకంతకూ పెరిగిపోతుండడం విశేషం. బన్నీని ఆకాశానికి ఎత్తేస్తున్న బాలీవుడ్ ప్రముఖుల్లో మధుర్ భండార్కర్ మాత్రమే కాదు అల్లు అర్జున్ మాత్రమే పుష్ప చేగలడంటూ బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ అన్నాడు. అతని ఎనర్జీ ఎక్స్ట్రార్డినరీ అంటూ యువ హీరో కార్తీక్ ఆర్యన్ పొగిడితే...ఐకాన్స్టార్తో ఒక్కసినిమాలో అయినా నటించాలని ఉందని బాలీవుడ్ నటి అనన్య పాండే తపిస్తున్నారు. అతని లాంటి డ్యాన్సర్ని చూడలేదని టాప్ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ తేల్చేశారు. ఆయన ఎనర్జీ మరెవరికీ సాధ్యం కాదు అని బాలీవుడ్లో ఎనర్జిటిక్ హీరోగా పేరున్న షాహిద్ కపూర్ ఒప్పేసుకున్నాడు. అతనో స్టైల్ ఐకాన్ అంటూ మరో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్లు...అభివర్ణించాడు. ఇలా ఎందరో బన్నీపై భారీ స్థాయిలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న అల్లు అర్జున్ అట్లీల సినిమా పై అంచనాలను వీరి అభిప్రాయాలు మరింతగా పెంచేస్తున్నాయనేది నిజం. ఈ నేపధ్యంలో ఆ స్థాయి అంచనాలను అందుకోవడానికి బన్నీ అట్లీ ద్యయం మరింతగా కృషి చేయకతప్పదు. -
మీ చేతిలో కీలుబొమ్మలం కాదు.. స్నేహితురాలిని పెళ్లాడిన నటి!?
క్రూరమైన మగాళ్ల కన్నా నా బెస్ట్ ఫ్రెండ్ (మోడల్ అన్సియా) చాలా బెటర్. అందుకే తనను పెళ్లి చేసుకున్నా అని ఓ వీడియో రిలీజ్ చేసింది మలయాళ బుల్లితెర నటి ప్రార్థన కృష్ణ నాయర్ (Prarthana Krishna N Nair). ఆ వీడియోలో నటి, తన స్నేహితురాలితో గుడికి వెళ్లింది. అక్కడ వీరిద్దరూ దండలు మార్చుకున్నారు. ఒకరి మెడలో మరొకరు పసుపు తాడు కట్టారు. మీ చేతిలో కీలుబొమ్మలం కాదునుదుటన కుంకుమ దిద్ది జంటగా అడుగులు వేశారు. ఈ ఇద్దరమ్మాయిల పెళ్లి వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. ఆడవాళ్లందరూ మీ చేతిలో కీలుబొమ్మలు కాదు. రియల్ లైఫ్లో నటించేవా మగవాళ్లకు మా జీవితాల్లో చోటు లేదు అని నటి క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిన కొందరు వీరిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకున్నారా? అని ఆశ్చర్యపోయారు.అసలు విషయమిదే!తాజాగా ఈ వీడియోపై క్లారిటీ ఇచ్చింది ప్రార్థన. మేము చాలా వైరల్ అయిపోయాం. మా పెళ్లి నిజం కాదు, అది కేవలం షూటింగ్ మాత్రమే! వేరే ఇండస్ట్రీకి చెందిన నటులు ఇలాగే చేశారు. అది చూసి మేము కూడా ట్రై చేశామంతే! తను నా బెస్ట్ ఫ్రెండ్. తనకిదివరకే పెళ్లయింది, ఓ బాబు కూడా ఉన్నాడు అంటూ అసలు విషయం బయటపెట్టింది. View this post on Instagram A post shared by Prarthana KriShna N Nair (@_actress_prarthanakrishnanair_) View this post on Instagram A post shared by Prarthana KriShna N Nair (@_actress_prarthanakrishnanair_) చదవండి: ప్రియాంక బర్త్డే.. కాలి చెప్పుపై కేక్.. 'తిండితో ఆటలా?' -
నేను డాక్టర్ని కాదు.. పుకార్లపై క్లారిటీ ఇచ్చిన తెలుగు బ్యూటీ
కోమలి ప్రసాద్( Komalee Prasad) నటిగా తెలుగు తెరపై తనకు వచ్చి అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి నటిగా పేరు సంపాదించుకున్నారు. ఇక త్వరలోనే ‘శశివదనే’ చిత్రంతో తెరపైకి రాబోతోన్నారు. ఈలోపు కోమలి ప్రసాద్ మీద సోషల్ మీడియా, మీడియాలో ఓ అసత్య ప్రచారం మొదలైంది. యాక్టింగ్ కెరీర్ను వదిలి పెట్టారని, డాక్టర్ వృత్తిలోకి వెళ్లారని కోమలి ప్రసాద్ మీద రూమర్లు క్రియేట్ చేశారు. దీంతో ఈ వార్తల్ని ఖండిస్తూ కోమలి ప్రసాద్ సోషల్ మీడియాలో పోస్ట్ వేశారు.‘అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అయ్యానని, నటనకు పూర్తిగా దూరం అయ్యానంటూ అసత్య ప్రచారాలు, తప్పుదోవ పట్టించే వార్తల్ని ప్రచురిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ రూమర్లను నిజం అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయి. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని అందరికీ స్పష్టంగా తెలియజేయాలని అనుకుంటున్నాను. ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఎంతో కష్టపడి ఇప్పటి వరకు సినిమాల్లో కెరీర్ను కొనసాగిస్తూ ఈ స్థాయి వరకు వచ్చాను. ఆ శివుని ఆశీస్సులతో నా కెరీర్ను ముందుకు సాగిస్తున్నాను.నాలో, నా శ్రేయోభిలాషులలో అనవసరమైన ఆందోళనలను రేకెత్తించేలా ఈ రూమర్లను ప్రచారం చేస్తున్నారు. ఇలా తప్పుదారి పట్టించే సమాచారం వ్యాప్తి చెందకూడదని నేను కోరుకుంటున్నాను. అందుకే ఈ స్పష్టతనిస్తూ పోస్ట్ వేస్తున్నాను. చివరి శ్వాస వరకు నటిగా నా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ ప్రయాణంలో నా వెన్నెంటే ఉన్న నా శ్రేయోభిలాషులందరికీ, నా కంటే నన్ను ఎక్కువగా నమ్మిన వారందరికీ ధన్యవాదాలు. నేను ప్రస్తుతం నా స్క్రిప్ట్లను జాగ్రత్తగా ఎంచుకుంటున్నాను. త్వరలో కొత్త ప్రకటనలతో మీ అందరినీ చాలా గర్వపడేలా చేస్తాను’ అని కోమలి ప్రసాద్ అన్నారు. -
ప్రియాంక బర్త్డే.. కాలి చెప్పుపై కేక్.. 'తిండితో ఆటలా?'
ఏ డైలాగ్స్ చెప్పకుండా, కేవలం హావభావాలతోనే ఎమోషన్స్ పలికించడం చాలా కష్టం. అయినా సరే అదెంత పని అన్నట్లుగా కళ్లతోనే నటించేసింది ప్రియాంక జైన్ (Priyanka M Jain). మౌనరాగం సీరియల్తో బోలెడంత పాపులారిటీ తెచ్చుకుంది. అంతేకాదు, ఈ సీరియల్ హీరో శివకుమార్తో ఆఫ్స్క్రీన్లోనూ ప్రేమాయణం నడిపింది. 2018లో ఈ సీరియల్ రాగా.. అప్పటినుంచి ఇప్పటివరకు ఎంతో అన్యోన్యంగా కలిసుంటున్నారీ లవ్ బర్డ్స్. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. బిగ్బాస్ షోతో పాపులర్జానకలి కలగనలేదు సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ప్రియాంక.. తెలుగు బిగ్బాస్ ఏడో సీజన్తో అందరికీ సుపరిచితురాలైంది. ప్రస్తుతం ఈ బ్యూటీ టీవీ షోలలో కనిపిస్తోంది. తాజాగా పరి (శివకుమార్ ప్రియాంకను ముద్దుగా పిల్చుకునే పేరు) 27వ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మీ అభిమానం వల్లే..ఈ రోజు నేనీ స్థాయిలో ఉన్నానంటే అందుకు మీరే కారణం. అభిమానులు, ప్రేక్షకులు నాపై చూపించిన ప్రేమకు చప్పట్లు కొట్టి తీరాల్సిందే! మీరు నన్ను ఎంతగానో నమ్మారు. నేను పోషించిన ప్రతి పాత్రకు, తీసుకున్న ప్రతి నిర్ణయాలకు మీ ఆశీర్వాదాలే కారణం. నా ప్రయాణంలో భాగమైనందుకు థాంక్యూ అని రాసుకొచ్చింది. అయితే ఓ ఫోటో తన కాలి చెప్పుపై బర్త్డే కేక్ను పెట్టింది. తర్వాత అదే కేక్ను ఆరగించింది. తిండితో ఆటలా?ఇది చూసిన సెలబ్రిటీలు.. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం.. తినే ఆహారాన్ని అలా కాళ్లపై పెట్టి కించపరిస్తే తిండి దొరకదు, ఎంత వయసు వస్తే ఏంటి? సంస్కారం ఉండొద్దా? అన్నం కూడా అలాగే చెప్పులతో తింటావా? తిండితో ఆటలొద్దు, తినేదాన్ని కాలుమీద పెట్టినందుకు సిగ్గనిపించట్లేదా? అని ఆగ్రహంతో కామెంట్లు చేస్తున్నారు. అభిమానులు మాత్రం బ్యూటిఫుల్ పరికి హ్యాపీ బర్త్డే అని విషెస్ చెప్తున్నారు. View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) చదవండి: మమ్మల్ని చంపుకుతింటున్నారు.. ఇండస్ట్రీలో ఫ్లాపులే లేవా? దిల్ రాజు -
ఆ విషయంలో మంచు విష్ణుని ఫాలో అవుతాం : దిల్ రాజు
నెగెటివ్ ట్రోలింగ్ని, ఫేక్ రివ్యూస్ని అరికట్డడంలో మంచు విష్ణుని ఫాలో అవుతాం అంటున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. కన్నప్ప సినిమా విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీకి చాలా ఉపయోగపడేదని అభినందించాడు. ఇకపై మేము కూడా అదే ఫాలో అవుతామని చెప్పారు.మంచు విష్ణు తీసుకున్న నిర్ణయం ఏంటి?మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం కన్నప్ప జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్కి రెండు రోజుల ముందే మంచు విష్ణు ఓ హెచ్చరికను జారీ చేశారు. కన్నప్ప సినిమాని టార్గెట్గా చేసుకొని కావాలని ఎవరైన నెగెటివ్గా పోస్టులు పెట్టిన, వ్యక్తిగత హననానికి పాల్పడినా.. ఉద్దశ్యపూర్వకంగా విమర్శలు చేస్తూ పరువుకు భంగం కలిగిస్తే కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ పబ్లిక్ కాషన్ నోటీస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది మంచి ఫలితాన్నే ఇచ్చింది. రిలీజ్ తర్వాత ఫేక్ రివ్యూస్, నెగెటివ్ ట్రోలింగ్ పెద్దగా జరగలేదు. ట్వీటర్లో సినిమాపై, మంచు ఫ్యామిలీపై నెగెటివ్ పోస్ట్లు పెట్టలేదు. సినిమాకు విమర్శల కంటే ప్రశంసలే ఎక్కువగా వచ్చాయి.అదే ఫాలో అవుతాం : దిల్ రాజుసినిమాను కాపాడాడానికి ఎవరు ఏ మంచి చేసినా.. మేమంతా అది ఫాలో అవుతామని అన్నారు దిల్ రాజు. ఆయన నిర్మించిన తాజా చిత్రం తమ్ముడు జులై 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. నెగెటిట్ ట్రోలింగ్పై స్పందించారు. ‘కన్నప్ప చిత్రబృందం మంచి నిర్ణయం తీసుకుంది. రిలీజ్కు ముందే అలా ఒక హెచ్చరిక జారీచేస్తే.. ఫేక్ రివ్యూస్, నెగెటివ్ ట్రోలింగ్, పైరసీ తగ్గిపోతుంది. అలా అని రివ్యూస్ని ఆపడం మా ఉద్దేశం కాదు. రివ్యూస్ రాయండి. కానీ రాసే ముందు ఒక్కసారి ఆలోచించండి. సినిమాపై కావాలని నెగెటివ్గా రాస్తే.. ఎక్కువగా నష్టపోయేది నిర్మాత మాత్రమే. హీరోలు, దర్శకులు ఈ సినిమా కాకపోతే మరో సినిమాతో హిట్ కొడతారు. కానీ నిర్మాత అయితే ఆ సినిమాకు డబ్బులు పోగొట్టుకోవాల్సిందే కదా? అది దృష్టిలో పెట్టుకొని జన్యూన్గా రివ్యూస్ ఇవ్వండి. దయచేసి హెల్ప్ చేయకపోయినా పర్లేదు ..డ్యామేజ్ మాత్రం చేయెద్దు’ అని దిల్ రాజు విజ్ఞప్తి చేశాడు. -
సైడ్ యాక్టర్గా అజిత్.. నాకు నచ్చలేదు: విష్ణు
మంచు విష్ణు (Vishnu Manchu) తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్తో తీశారు. టాలీవుడ్లో ఎవరూ దొరకలేదా? అంటే? వరుస ఫ్లాపులు అందుకున్న తనతో కన్నప్ప వంటి మైథాలజీ సినిమా తీసేందుకు ఎవరూ ముందుకు రారని అసలు విషయం చెప్పారు. అందుకే మహాభారత్ సీరియల్ తీసిన ముకేశ్తో కన్నప్ప సినిమాను తెరకెక్కించినట్లు వెల్లడించారు. బాలీవుడ్లో ఛాన్స్మరి హీరోగా బాలీవుడ్లో అడుగుపెట్టే ఆలోచనలేమైనా ఉన్నాయా? అంటే విష్ణు ఇలా స్పందించారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు మాట్లాడుతూ.. చాలాకాలం క్రితం హిందీలో సినిమా చేయమని కొందరు నన్ను సంప్రదించారు. కానీ వారు ఆఫర్ చేసినవేవీ నాకు నచ్చకపోవడంతో అక్కడ సినిమాలు చేయలేదు. పైగా నటుడిగా నాకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాను. అదే సమయంలో అభిమానుల ప్రేమను పొందాను. వారిని నేను గౌరవించాల్సిన అవసరం ఉంది. ఏవి పడితే అవి చేసి వారిని నేను బాధపెట్టలేను.చిన్న రోల్.. నచ్చలేదుఉదాహరణకు స్టార్ హీరో అజిత్ను తీసుకుందాం. ఆయన ఇండియాలోనే పెద్ద సూపర్స్టార్స్లో ఒకరు. షారూఖ్ ఖాన్ అశోక మూవీలో ఆయన సైడ్ రోల్ చేశారు. అది నాకు నచ్చలేదు. అజిత్ అన్నతో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు.. మీరు ఇంత చిన్న పాత్ర చేసినందుకు నిరాశచెందాను అని చెప్పాను. అందుకాయన చిన్నగా నవ్వి సైలెంట్గా ఉండిపోయారు.సెల్ఫిష్గా ఆలోచించలేనుకాబట్టి ఏదో ఒక రోల్.. అని లైట్ తీసుకుని సినిమా చేయలేను. జనాలకు నచ్చినా, నచ్చకపోయినా నా ఇష్టమొచ్చిన సినిమాలు చేస్తా అని సెల్ఫిష్గా ఆలోచించలేను అని విష్ణు చెప్పుకొచ్చారు. కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. విష్ణు తిన్నడు/కన్నప్పగా నటించారు. అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్లాల్, శరత్కుమార్, కాజల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 27న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది.చదవండి: మమ్మల్ని చంపుకుతింటున్నారు.. ఇండస్ట్రీలో ఫ్లాపులే లేవా? దిల్ రాజు -
మమ్మల్ని చంపుకుతింటున్నారు.. ఇండస్ట్రీలో ఫ్లాపులే లేవా? దిల్ రాజు అసహనం
రామ్చరణ్ ప్రధాన పాత్రలో నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా (Game Changer Movie) వచ్చి ఆరు నెలలు దాటిపోయింది. అయినా ఈ సినిమా పేరు సోషల్ మీడియాలో, ఫిల్మీదునియాలో మార్మోగిపోతోంది. కారణం.. దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ మొట్టమొదటిసారి మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం.. అందులో శిరీష్ ఏమన్నారంటే..? 'గేమ్ ఛేంజర్తో మా పని అయిపోయిందనుకున్నాం.. అంత నష్టం వచ్చినా హీరో, దర్శకుడు కనీసం ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు. అలా అని వారిని తప్పుపట్టడం లేదు. రామ్చరణ్తో ఎలాంటి విభేదాలు లేవు. గేమ్ ఛేంజర్ నష్టాన్ని దాదాపు 70% సంక్రాంతికి వస్తున్నాం కవర్ చేసేసింది' అని పేర్కొన్నారు.చంపుకుతింటున్నారుఈ కామెంట్స్ మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించడంతో శిరీష్ను ఏకిపారేశారు. దీంతో శిరీష్.. మెగా ఫ్యాన్స్కు క్షమాపణలు చెప్తూ లేఖ విడుదల చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై దిల్ రాజు (Dil Raju) అసహనం వ్యక్తం చేశారు. తమ్ముడు మూవీ ప్రమోషన్స్లో ఆయన మాట్లాడుతూ.. ఎప్పుడో జనవరిలో రిలీజైన గేమ్ ఛేంజర్ గురించి పదేపదే అడిగి చంపుకు తింటున్నారు. సినిమా రిలీజై ఆరు నెలలు అయిపోయింది. ప్రతిదాంట్లో గేమ్ ఛేంజర్ టాపిక్ తప్ప మరొకటి లేనే లేదు. తొలిసారి ఇంటర్వ్యూ ఇస్తే..ఎందుకసలు? బాగా ఆడిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి అడగొచ్చు కదా! ఇండస్ట్రీలో ఎన్నో ఫ్లాపులు వచ్చాయి. అలాంటప్పుడు గేమ్ ఛేంజర్ను మాత్రమే పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు? ఇండస్ట్రీలో ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అయినవి ఉన్నాయి. ఏ సినిమాను ఇంతగా పట్టించుకోలేదు. నా సోదరుడు శిరీష్ తొలిసారి ఇంటర్వ్యూ ఇస్తే ఆయన్ని కూడా వివాదంలోకి లాగి ట్రోల్ చేస్తున్నారు. ఇదంతా అవసరం లేదు కదా!22 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా..మేము తమ్ముడు సినిమా కోసం ప్రమోషన్స్ చేస్తున్నాం. దాన్ని వదిలేసి ఆరు నెలల కిందట రిలీజైన సినిమా గురించే మాట్లాడుతున్నారు. రామ్చరణ్కు, మాకు మధ్య సత్సంబంధాలున్నాయి. చరణ్కు ఈ ఏడాది హిట్ ఇవ్వలేకపోయాం. మంచి స్క్రిప్టు సెలక్ట్ చేసుకుని చరణ్తో సూపర్ హిట్ మూవీ చేస్తామని ఇదివరకే ప్రకటించాను. 22 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ అందరు స్టార్ హీరోలతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ అందరితోనూ సినిమాలు తీసిన సంస్థ ఇది. చీల్చి చెండాడుతున్నారుఎక్కడా ఏ వివాదం లేకుండా పని చేసుకుంటూ వచ్చాను. కానీ ఆరు నెలల కిందట ఫ్లాప్ అయిన ఒక్క సినిమాను పట్టుకుని మమ్మల్ని చీల్చి చెండాడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ఇదే టాపిక్. జరిగిన సంభాషణంతా వదిలేసి కావాల్సిన చిన్న క్లిప్ తీసుకుని సంచలన హెడ్డింగ్స్ పెట్టి కాంట్రవర్సీ చేస్తున్నారు. ఇంత నెగిటివిటీ ఎందుకు? అయిపోయిన సినిమాను వదిలేయండి. జనవరి తర్వాత ఇండస్ట్రీలో ఎన్నో ఫ్లాపులున్నాయి. వాటిలో ఒక్క సినిమా గురించైనా మాట్లాడుతున్నారా? అని అసహనం వ్యక్తం చేశాడు.చదవండి: బడ్జెట్ కాదు .. సబ్జెక్ట్ ముఖ్యం గురూ -
సుష్మితా సేన్కి అరుదైన వ్యాధి.. 8 గంటలకో స్టెరాయిడ్, లేదంటే..
నటీనటులు కూడా మనుషులే. వాళ్లకు అందరిలాగే కోపాలు, బాధలు, సమస్యలు ఉంటాయి. కానీ వాటిని బయట ప్రపంచానికి తెలియనీకుండా.. సంతోషంగా ఉన్నట్లు నటిస్తూ ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తుంటారు. అలాంటి వారిలో నటి సుష్మితా సేన్ కూడా ఒకరు. తన అందచందాలతో అలరించడమే కాకుండా.. బోల్డ్ స్టేట్మెంట్స్ , జిమ్లో కసరత్తులు చేస్తూ ఓ వర్గానికి ఇన్సిపిరేషన్గా నిలిచిన ఈ మాజీ మిస్ యూనివర్స్.. ఒకప్పుడు చావు అంచులదాక వెళ్లి వచ్చింది. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే..తెరపై ఎనర్జిటిక్గా కనిపించింది. మొన్నటి వరకు ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి స్టెరాయిడ్ తీసుకునేదట. ఆమె తీసుకున్న ఓ నిర్ణయమే ఇప్పుడు ఆమెని ఆరోగ్యకరంగా ఉండేలా చేసిందట.ఏం జరిగింది?సుష్మిత కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలోనే అనారోగ్య సమస్యలతో పోరాటం చేయాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 2014 నుంచే ఆమె ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన అడిసన్స్ డిసీజ్తో బాధపడుతున్నటు వెల్లడించింది. ఆమె శరీరంలో కార్డిసోల్ అనే హర్మోన్ ఉందని తేలిందట. ఇది ప్రాణాంతకమైనది అని..దీన్ని సరి చేయాలంటే.. ప్రతి 8 గటలకు ఒకసారి హైడ్రో కార్డిసోన్ అనే స్టెరాయిడ్ ని ఇంజెక్ట్ చేయాలని వైద్యులు చెప్పారట. అలాగే వ్యాయామాలు, బరువైన పనులు చేయకూడదని సూచించారట.జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ కానీ సుష్మిత మాత్రం తన ఫిట్నెస్ కోచ్ని పిలిపించుకొని జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేసిదంట. యాంటీ గ్రావిటీ వ్యాయామాలతో పాటు డిటాక్సిఫికేషన్ ప్రారంభించిందట. అయితే ఓ రోజు సుష్మిత తీవ్ర అస్వస్థతకు గురికావడంతో దుబాయ్ నుంచి అబుదబీ తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఆ తర్వాత టర్కీ వైద్యులు ఫోన్ చేసి సుష్మితా జీవితంలో మిరాకిల్ జరిగిందని చెప్పాడట. తన అడ్రిల్ గ్రంధి ఇప్పుడు సవ్యంగా పని చేస్తుందని చెప్పారట. తన 35 ఏళ్ల వైద్య కెరీర్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడట. ఇకపై ఎనిమిది గంటలకు ఒకసారి స్టెరాయిడ్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పడంతో సుష్మితా ఊపిరిపీల్చుకుందంట. 1975, నవంబర్ 19న ఓ బెంగాలీ కుటుంబంలో జన్మించిన సుస్మితా సేన్ తనకు 18వ ఏట(1994) విశ్వసుందరిగా కిరీటం అందుకుని చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. 1997లో రత్సగన్ అనే తమిళ్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత పలువరు అగ్రహీరోలతో సినిమాలు చేసింది. తెలుగులో నాగార్జున తో కలిసి 'రక్షకుడు' అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత బాలీవుడ్లోనూ రాణించింది. ప్రస్తుతం పలు చిత్రాలతో పాటు వెబ్ సిరీస్ చేస్తూ కెరీర్ పరంగా ఇప్పటికీ బీజీగా ఉన్నారు. -
సహజత్వానికి చిరునామా సాయి పల్లవి
మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలి అన్నది నానుడి. అలా నటి అన్న తరువాత కాస్త గ్లామర్ అవసరం అన్నది సినిమా వాళ్ల మాట. అందుకే అందాలారబోతకు దూరంగా ఉన్న వాళ్లు కూడా ఇప్పుడు అందుకు సిద్ధం అంటున్నారు. అయితే ఎలాంటి గ్లామర్ అవసరం లేకుండానే పాన్ ఇండియా స్టార్ అయిన కథానాయకి ఎవరైనా ఉన్నారంటే అది నటి సాయిపల్లవినే అవుతారు. డాక్టర్ అయ్యి యాక్టర్ అయిన అరుదైన తారలలో ఈమె ఒకరు. సాయిపల్లవి మంచి డాన్సర్. తద్వారా కలిగిన ఆసక్తినే సినిమా. తొలి రోజుల్లో చిన్న చిన్న పాత్రలో నటించిన సాయిపల్లవి ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం ఏ ముహూర్తాన విడుదలై సంచలన విజయం సాధించిందో గానీ, ఆ తరువాత తెలుగు, తమిళం భాషల్లోనూ వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి.అయితే తెలుగులో మంచి విజయాలను అందుకుంటున్న సాయిపల్లవికి అక్కడ ప్లాప్ల సంఖ్చ చాలా తక్కువే. అదే విధంగా ప్లాప్ అయిన చిత్రాలలోనూ తన నటనకు మంచి మార్కులు పడటం అనేది అరుదైన విషయమే. అందుకు కారణం పాత్రల విషయంలో సాయిపల్లవి చూపే ప్రత్యేక శ్రద్దనే అని చెప్పవచ్చు. తనకు నచ్చిన బాటలో పయనిస్తున్న ఈమె అందంపై కాకుండా అభినయనానికి ప్రాముఖ్యనిస్తున్నారు. అలా సహజ నటిగా పేరు తెచ్చుకున్న సాయిపల్లవి ఇప్పటి వరకూ గ్లామరస్ పాత్రల్లో నటించిందే లేదు.అలా ఆమె సహజత్వానికి చిరునామాగా ముద్ర వేసుకున్నారు. ఇటీవల తమిళంలో అమరన్ చిత్రంలో నటించి అందరి అభినందనలను అందుకున్న సాయిపల్లవి, తెలుగులో నాగచైతన్యకు జంటగా నటించిన తండేల్ చిత్రంలోనూ నటనలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్ని చిత్రాల్లో నటించామన్నది కాకుండా ఎన్ని మంచి చిత్రాల్లో నటించామన్నదే ముఖ్యం అని భావించే సాయిపల్లవి ప్రస్తుతం బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. అక్కడ రామాయణం అనే రెండు భాగాలుగా తెరకెక్కుతున్న భారతీయ ఇతిహాస గాథలో సీతగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె నటన ఎంతగా ఆకట్టుకుంటుందోన్న ఆసక్తి ఇప్పుడు సినీ ప్రేమికుల్లో నెలకొంది. -
బడ్జెట్ కాదు .. సబ్జెక్ట్ ముఖ్యం గురూ
కొత్త సంవత్సరం వచ్చి ఆరు నెలలు పూర్తయింది. చూసినవాళ్లకు చూసినన్ని అన్నట్లుగా ఈ ఆరు నెలల్లో స్ట్రయిట్ మూవీస్100కి పైగా రిలీజ్ అయ్యాయి. కానీ వందలో హిట్ అంటే పది శాతమే. కోట్లు బడ్జెట్ పెట్టి గ్రాండ్గా తీసినంత మాత్రాన వసూళ్లు కూడా గ్రాండ్గా ఉంటాయనుకుంటే బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డట్టే. ‘బడ్జెట్ కాదు... సబ్జెక్ట్ ముఖ్యం’ అనే పంథాలో సినిమా పరిశ్రమ వెళ్లాల్సిన అవసరం ఉంది. 2025లో హిట్ అయిన చిత్రాలతోపాటు భారీ అంచనాల మధ్య థియేటర్కి వచ్చి, నిరాశపరిచిన పెద్ద చిత్రాల గురించి ఓ రౌండప్.⇒ 2025 సినిమా బాక్సాఫీస్ బోలెడన్ని అంచనాలతో మొదలైంది. జనవరిలో దాదాపు పదిహేను చిత్రాలు విడుదల కాగా... రెండంటే రెండే హిట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సంక్రాంతి పండగకి ముందుగా వచ్చిన చిత్రం రామ్చరణ్ ‘గేమ్ చేంజర్’. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో అనిత సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలై, అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఆ వెంటనే వచ్చిన బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమా ఎబౌ యావరేజ్ హిట్గా నిలిచింది.బాబీ కొల్లి దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సంక్రాంతికి మంచి హిట్ అంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమానే. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. కాగా ఈ సీజన్లో ‘గేమ్ చేంజర్’ రూపంలో నష్టాలు చవి చూసిన ‘దిల్’ రాజుకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ కాస్త ఊరటనిచ్చింది. ⇒ ఫిబ్రవరిలో దాదాపు పదిహేను సినిమాలు విడుదలైతే, ‘తండేల్’ సినిమా రూపంలో ఒకే ఒక్క హిట్ దక్కింది. అక్కినేని నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా నటించిన చిత్రం ‘తండేల్’. చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. శ్రీకాకుళం మత్స్యకారుల్లోని కొందరి జీవితాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంతో నాగచైతన్య తొలిసారి వంద కోట్ల క్లబ్లో చేరారు. ⇒ మార్చిలో దాదాపు 20 సినిమాలు విడుదల కాగా, రెండు శాతం హిట్ దక్కింది. ఈ హిట్టయిన రెండు సినిమాలూ భారీ బడ్జెట్ కాదు... భారీ స్టార్స్ కూడా లేరు. నూతన తారలు రోషన్, శ్రీదేవి జంటగా, ప్రియదర్శి ప్రధానపాత్రలో రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కోర్ట్’. హీరో నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ‘కోర్ట్’ చిన్న సినిమాగా రిలీజై, సక్సెస్పరంగా పెద్ద సినిమా అనిపించుకుంది.కంటెంట్ ఉంటే స్టార్స్, భారీ బడ్జెట్ అవసరం లేదనడానికి ‘కోర్ట్’ ఓ తాజా ఉదాహరణ. అలాగే హిట్ మూవీ ‘మ్యాడ్’కి సీక్వెల్గా విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ అంచనాలు అందుకుంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ⇒ ఈ ఏడాది వేసవికి టాలీవుడ్ బాక్సాఫీస్ చల్లబడింది. ఏప్రిల్లో రిలీజైన ఏ సినిమా ఆడియన్స్తో క్లాప్ కొట్టించలేకపోయింది. సిద్ధు జొన్నలగడ్డ హిరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్షన్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన స్పై యాక్షన్ ఫిల్మ్ ‘జాక్’ ఫ్లాప్గా నిలిచింది. అలాగే ప్రదీప్ మాచిరాజు హీరోగా మాంక్స్ అండ్ మంకీస్ సంస్థ నిర్మించిన ‘అక్కడ అమ్మాయి... ఇక్కడ అబ్బాయి’ చిత్రం మెప్పించలేకపోయింది. ఈ చిత్రానికి నితిన్–భరత్ దర్శకులు. ఇదే నెలలో వచ్చిన సూపర్ నేచురల్ హారర్ మూవీ ‘ఓదెల 2’, కల్యాణ్రామ్–విజయశాంతిల యాక్షన్ చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు.దర్శకుడు సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్తేజ్ దర్శకత్వంలో డి. మధు, సంపత్ నంది నిర్మించిన చిత్రం ‘ఓదెల 2. ఇక ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చిత్రాన్ని నిర్మించారు. ‘కోర్ట్’ వంటి సూపర్హిట్ తర్వాత ప్రియదర్శి హీరోగా ‘సారంగపాణి జాతకం’ సినిమా వచ్చింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం హిట్ కాలేదు. ఇలా ఏప్రిల్ పూర్తిగా నిరాశ పరిచింది. ⇒ మే నెల తొలి రోజే ‘హిట్: ది థర్డ్ కేస్’తో ప్రేక్షకులను పలకరించారు నాని. శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా టైటిల్కి తగ్గట్టే హిట్ అయింది. ఇక శ్రీవిష్ణుకి ‘సింగిల్’ సినిమా రూపంలో మరో సూపర్హిట్ లభించింది. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘వెన్నెల’ కిశోర్ కీలకపాత్రలో మెప్పించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు.హీరోయిన్ సమంత నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. నూతన తారలు నటించిన ఈ చిత్రంలో సమంత అతిథిపాత్ర చేశారు. ‘శుభం’ ఓ మంచి ప్రయత్నంగా నిలిచిపోయింది. ఇక నవీన్చంద్ర ‘లెవన్’, రాజేంద్రప్రసాద్–అర్చన–రూపేష్–ఆకాంక్షా సింగ్ లీడ్ రోల్లో చేసిన ‘షష్టిపూర్తి’, తమిళ హిట్ ఫిల్మ్ ‘గరుడన్’ రీమేక్గా బెల్లంకొండ సాయిశ్రీనివాస్–నారా రోహిత్– మంచు మనోజ్ నటించిన ‘భైరవం’ సినిమాలు ప్రేక్షకులను పూర్తిగా మెప్పించే ప్రయత్నంలో తడబడ్డాయి. ‘లెవన్’ సినిమాకు లోకేశ్ అజ్ల్సస్, ‘భైరవం’కు విజయ్ కనకమేడల, ‘షష్టిపూర్తి’కి పవన్ప్రభ దర్శకత్వం వహించారు. ⇒ నార్నే నితిన్ హీరోగా రూపొందిన ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ జూన్ తొలి వారంలో వచ్చి ఫ్లాప్గా నిలిచింది. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో చింతపల్లి రామారావు ఈ సినిమాను నిర్మించారు. ఇక జూన్ మూడో వారంలో ధనుష్–నాగార్జున–రష్మికా మందన్నా లీడ్ రోల్స్లో నటించిన ‘కుబేర’ సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్స్కు వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమాను పుస్కూర్ రామ్మోహన్ రావు, సునీల్ నారంగ్ నిర్మించారు. అయితే ‘కుబేర’ సినిమా తెలుగులో హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ తమిళంలో ఆదరణ దక్కలేదు. ఈ చిత్రం విడుదలైన రోజే అనంతిక సనీల్కుమార్–హను రెడ్డి–రవితేజ దుగ్గిరాల లీడ్ రోల్స్లో నటించిన మీడియమ్ రేంజ్ సినిమా ‘8 వసంతాలు’ అలరించలేకపోయింది.ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన చిత్రం ఇది. జూన్ చివర్లో విష్ణు మంచు కలల ్రపాజెక్ట్ ‘కన్నప్ప’ విడుదలైంది. ప్రభాస్, మోహన్బాబు, మోహన్లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్కుమార్, ఆర్. శరత్కుమార్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చాలా గ్యాప్ తర్వాత ‘కన్నప్ప’ రూపంలో విష్ణు చెంత ఓ మంచి హిట్ చేరింది. ముఖేష్ కుమార్ దర్శకత్వంలో ఎమ్. మోహన్బాబు ‘కన్నప్ప’ను నిర్మించారు. ఇలా ఈ ఏడాది ప్రథమార్ధం తొమ్మిది హిట్స్తో సరిపెట్టుకుంది. ‘మంచిని ఆశిద్దాం’ అంటారు కాబట్టి ద్వితీయార్ధం హిట్స్తో కళకళలాడాలని కోరుకుందాం. -
మెగా ఫ్యాన్స్కు దిల్ రాజు సోదరుడు క్షమాపణలు
రామ్ చరణ్ అభిమానులకు దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి క్షమాపణలు తెలిపారు. తాను మాట్లాడిన మాటలతో మెగా అభిమానులు బాధపడినట్లు తెలిసిందన్నారు. నా వ్యాఖ్యల పట్ల ఎవరినైనా ఇబ్బందిపెట్టి ఉంటే కమాపణలు కోరుతున్నట్లు పత్రిక ప్రకటన విడుదల చేశారు. గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్ తమకు పూర్తిగా సహకరించారని ఆయన లేఖలో రాసుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో తమకు ఎన్నో ఏళ్లుగా మంచి సాన్నిహిత్యం ఉందని తెలిపారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్తో పాటు మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించమని శిరీష్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు. ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలను అయినా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే క్షమించాలని లేఖ ద్వారా కోరారు.అయితే గేమ్ ఛేంజర్ సినిమా ఫెయిల్యూర్ తర్వాత రామ్ చరణ్ కానీ, డైరెక్టర్ శంకర్ కానీ కనీసం ఫోన్ కూడా చేయలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే తన సోదరుడు చేసిన కామెంట్స్పై దిల్ రాజు వివరణ కూడా ఇచ్చారు. అతను ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వలేదని.. ఫస్ట్ టైమ్ కావడం వల్లే ఎమోషనల్గా అలా మాట్లాడి ఉంటారని అన్నారు. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత రావడంతో శిరీష్ రెడ్డి క్షమాపణలు చెబుతూ లేఖ విడుదల చేశారు.అసలు శీరిష్ రెడ్డి ఏం చెప్పారంటే?గేమ్ ఛేంజర్ గురించి నిర్మాత శిరీష్ రెడ్డి మాట్లాడుతూ..' గేమ్ ఛేంజర్ సినిమాతో మా బతుకు అయిపోయిందని అనుకున్నాం. అయితే, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మళ్లీ నిలబడుతామని నమ్మకం వచ్చింది. ఇదంతా కూడా కేవలం 4రోజుల్లోనే జీవితం మారిపోయింది. ఆ సినిమా లేకుంటే మా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోలేం. అప్పుడు అందరూ మా పని అయిపోయిందని హేళన చేసేవారు. గేమ్ ఛేంజర్ ప్లాప్ అయింది. హీరో వచ్చి మాకు ఏమైన సాయం చేశాడా..? దర్శకుడు వచ్చి ఏమైనా సాయం చేశాడా..? అంత నష్టం వచ్చినా కూడా వారు కనీసం ఒక్క ఫోన్ కాల్ చేసి ఎలా ఉన్నారు..? పరిస్థితి ఏంటి అని కూడా ఎవరూ అడగలేదు. చివరకు చరణ్ కూడా అడగలేదు. అలా అని నేను వారిని తప్పుపట్టడం లేదు.' అని అన్నారు. -
లండన్లో రష్మిక చిల్.. జూన్ జ్ఞాపకాల్లో చాహల్ మాజీ భార్య ధనశ్రీ!
లండన్లో చిల్ అవుతోన్న రష్మిక మందన్నా..జూన్ జ్ఞాపకాల్లో చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ..ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ గ్లామరస్ లుక్స్..అదిరిపోయే అవుట్ఫిట్లో అరియానా గ్లోరీ..వెకేషన్లో నిషా అగర్వాల్ చిల్.. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
హీరోయిన్గా స్టార్ హీరో కుమార్తె ఎంట్రీ.. ఇంతకీ ఎవరంటే?
సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది కామన్గా వినిపించే పదమే. చాలామంది అగ్రతారల పిల్లలు కూడా సినిమానే కెరీర్గా ఎంచుకోవడం మనం ఎక్కువగా చూస్తుంటాం. వారి బాటలోనే నడుస్తూ ఇండస్ట్రీలో తమ వారసత్వాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తుంటారు. అలా మరో స్టార్ హీరో కుటుంబం నుంచి వెండితెరపై ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కూతురు విస్మయ అరంగేట్రానికి సిద్ధమైంది.మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమార్తె విస్మయ కథానాయికగా సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. తుడక్కం అనే సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రానికి జూడే ఆంథానీ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. జుడే ఆంథోని గతంలో సారాస్, 2018 వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్పై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఆశీర్వాద్ నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. విస్మయ మోహన్ లాల్ను వెండితెరకు పరిచయం చేస్తున్నందుకు ఆశీర్వాద్ సినిమాస్కు ఎంతో గర్వంగా ఉందని సోషల్ మీడియాలో వేదికగా ప్రకటించింది. ఈ సంతోషకరమైన వార్తను మోహన్ లాల్ సైతం ట్వీట్ ద్వారా పంచుకున్నారు. తుడక్కం సినిమాపై నీ జీవితకాల ప్రేమకు ఇదే మొదటి అడుగు అంటూ రాసుకొచ్చారు.కాగా..విస్మయ సినిమా రంగానికి దూరంగా ఉన్నప్పటికీ.. రచయితగా రాణిస్తోంది. రచయితగా ఆమె తన తొలి పుస్తకం 'గ్రెయిన్స్ ఆఫ్ స్టార్డస్ట్'ను 2021లో పెంగ్విన్ బుక్స్ ద్వారా విడుదల చేసింది. అంతేకాకుండా విస్మయ మార్షల్ ఆర్ట్స్ పట్ల కూడా నైపుణ్యం సాధించింది. థాయ్లాండ్లో మార్షల్ ఆర్ట్స్లోనూ శిక్షణ తీసుకున్నారు.మరోవైపు విస్మయ సోదరుడు ప్రణవ్ మోహన్లాల్ సైతం జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం 'ఆది'మూవీతోనే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ప్రణవ్ ప్రస్తుతం డైస్ ఐరే అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక మోహన్ లాల్ విషయానికొస్తే ఈ ఏడాదిలో ఎంపురాన్-2తో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన 'ఎంపురాన్'-2 బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత తుడురుమ్ అనే మూవీతో అలరించారు. Dear Mayakutty, may your "Thudakkam" be just the first step in a lifelong love affair with cinema.#ThudakkamWritten and Directed by Jude Anthany Joseph and Produced by Antony Perumbavoor, Aashirvad Cinemas#VismayaMohanlal@antonyperumbavoor @aashirvadcine… pic.twitter.com/YZPf4zhSue— Mohanlal (@Mohanlal) July 1, 2025 -
మరింత క్షీణించిన ఫిష్ వెంకట్ ఆరోగ్యం.. కన్నీటి పర్యంతమవుతోన్న భార్య!
ఈ రోజుల్లో ఎప్పుడు.. ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం. విధి రాతకు ఇక్కడ ఎవరు అతీతులం కాదేమో. ఎవరి జీవితంలో ఎప్పుడెలా తలకిందులవుతుందో ఊహించలేం. అలాంటి పరిస్థితి రాకూడదని మనం అనుకుంటాం. కానీ ప్రస్తుతం మనందరిని వెండితెరపై నవ్వించినా ఫిష్ వెంకట్ పరిస్థితి చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాకతప్పదు. గతంలోనే కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయినా కూడా ఆయన పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు.గత కొద్ది నెలలుగా బాగానే ఉన్నా ఫిష్ వెంకట్ మరోసారి ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. కిడ్నీల ఫెయిల్యూర్తో తొమ్మిది నెలల క్రితమే డయాలసిస్ చికిత్స తీసుకున్న ఆయన.. మళ్లీ ఆరోగ్యం క్షీణించి ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్నారు. ఎవరినీ గుర్తు పట్టేలేనంతగా ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఫిష్ వెంకట్ ఫ్యామిలీ.. తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైనా దాతలు తమకు అండగా నిలవాలని ఆయన భార్య, కూతురు వేడుకుంటున్నారు. మళ్లీ ఆయన ఆరోగ్యం మొదటికి రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఫిష్ వెంకట్కు డయాలసిస్ చేస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో డయాలసిస్తో పాటు ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అవసరమని వైద్యులు అంటున్నారు. గతంలో చికిత్సకు డబ్బుల్లేక గాంధీ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమాల్లో విలన్ అంటే కొందరు గుర్తొస్తారు.. అలాంటి వారిలో ఫిష్ వెంకట్ ఒకరు. మెయిన్ విలన్ పక్కన ఉండే పాత్రలో బోలెడన్ని మూవీస్ చేశారు. ఎన్టీఆర్ 'ఆది' మూవీలో తొడకొట్టు చిన్నా అనే డైలాగ్తో తెగ పాపులర్ అయ్యారు. టాలీవుడ్లో దాదాపు స్టార్ హీరోలందరితోనూ చేసిన ఈ నటుడు.. ప్రస్తుతం ఫిష్ వెంకట్ దయనీయ స్థితిలో ఉన్నాడు. దాతలు ఎవరైనా సరే సాయం చేస్తే కోలుకునే అవకాశముందని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. కాగా.. నాలుగేళ్ల క్రితమే ఆయనకు బీపీ, షుగర్ రావడంతో కాలు మొత్తం ఇన్ఫెక్షన్ కావడంతో ఆపరేషన్ చేశారు. -
గేమ్ ఛేంజర్పై శిరీష్ కామెంట్స్.. అసలు విషయం చెప్పిన దిల్ రాజు!
టాలీవుడ్లో ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ హాట్ టాపిక్గా మారింది. ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైన శిరీష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమా ఫెయిల్యూర్ తర్వాత హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ మాట వరసకు కూడా ఫోన్ చేయలేదంటూ మాట్లాడారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శిరీష్ గేమ్ ఛేంజర్ సినిమాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఈ వార్తల వేళ నిర్మాత దిల్ రాజు స్పందించారు. గత పది రోజులుగా ప్రతి ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ టాపిక్ లేకుండా జరగడం లేదన్నారు. గేమ్ ఛేంజర్ మూవీతో నేనే ఎక్కువగా ట్రావెల్ అయ్యాను.. శిరీష్కు ఈ సినిమాతో కనెక్షన్ చాలా తక్కువని తెలిపారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీని శిరీష్ చూసుకున్నారని వివరించారు. గేమ్ ఛేంజర్ సమయంలో శంకర్ ఇండియన్-2 చేయడం వల్ల మా సినిమా వాయిదా పడుతూ వచ్చిందని వెల్లడించారు. అయినా కూడా రామ్ చరణ్ మా సినిమాకు చాలా ఓపికగా సహకరించి పూర్తి చేశారని దిల్ రాజు తెలిపారు. నా సోదరుడు శిరీష్ మొదటిసారి ఇంటర్వ్యూలో మాట్లాడారని.. ఆయన మొత్తం డిస్ట్రిబ్యూషన్ కోణంలోనే ఆలోచిస్తారని అన్నారు. శిరీష్ ఎమోషనల్గా మాట్లాడారు.. కానీ అతని ఉద్దేశం అస్సలు అది కాదని.. రామ్ చరణ్తో మాకు ఎలాంటి వివాదం ఉండదని దిల్ రాజు స్పష్టం చేశారు.కాగా.. ప్రస్తుతం దిల్ రాజు నిర్మించిన తమ్ముడు మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటించారు. ఈ మూవీలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతో లయ టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది. తమ్ముడు చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. -
‘మైత్రీ’ వాళ్లకి ‘రేట్లు’ మాత్రమే కావాలి.. కోట్లల్లో నష్టపోయాం : దిల్ రాజు సోదరుడు
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ వల్ల కోట్ల రూపాయలు నష్టపోయామని చెబుతున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్. డిస్ట్రిబ్యూటర్గా, నిర్మాతగా రాణిస్తున్న శిరీష్..తాజాగా ఓ ఇంటర్వ్యూలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలను కొని భారీగా నష్టపోయమని, తిరిగి ఇస్తామని చెప్పిన డబ్బులను కూడా ఇవ్వలేదని విమర్శించాడు. అదే సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన సినిమాలను కొని నష్టపోతే.. ఆ నిర్మాత సూర్యదేవరనాగవంశి తిరిగి డబ్బులు ఇచ్చాడని చెబుతూ.. మైత్రీ నిర్మాతలకి, నాగవంశీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేశా చేశారు. (చదవండి: 'ఆర్య'కు రెమ్యునరేషన్.. అందుకే అల్లు అర్జున్ ఆ రేంజ్కు వెళ్లాడు: శిరీష్)‘మైత్రీ మూవీస్ బ్యానర్ సినిమాల వల్ల మేం నష్టపోయామే తప్ప.. ఒక్క రూపాయి లాభం వచ్చింది లేదు. వాళ్లకు రేట్లు(డబ్బులు) మాత్రమే కావాలి. మొదట్లో వారి సినిమాలన్నీ నైజాంలో మేమే డిస్ట్రీబ్యూషన్ చేశాం. అల వైకుంఠమురములో.. చిత్రాన్ని నైజాం ఏరియాకి రూ.20 కోట్లకు కొంటే.. రూ. 40 కోట్లు(షేర్) వచ్చింది. ఆ తర్వాత పుష్ప సినిమా వస్తే..దాన్ని రూ.42 కోట్లకి ఇస్తామని చెప్పారు. సూపర్ డూపర్ హిట్టయినా సినిమాకే రూ. 40 కోట్లు వస్తే..వీళ్లు నెక్ట్స్ సినిమాకి రూ. 42 కోట్లు అడగడం ఎంత వరకు న్యాయం? ఇలా చేస్తే డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఎలా బతకగలడు? వాడు సంపాదించుకోవద్దా? (చదవండి: 'గేమ్ ఛేంజర్'తో మా బతుకు అయిపోయింది.. మమ్మల్ని అతనే కాపాడాడు: నిర్మాత)ఇదే కాదు మైత్రీ నిర్మించిన సవ్యశాచి చిత్రాన్ని రూ.5.50 కోట్లకు కొంటే.. మూడున్నర కోట్ల నష్టం వచ్చింది. మరిన్ని చిత్రాలు ఇచ్చి ఆ నష్టాన్ని పూడుస్తామని చెప్పారు. ఆ తర్వాత చిత్రలహరి, అమర్ అక్బర్ అంథోని, గ్యాంగ్ లీడర్ చిత్రాలను ఇచ్చారు. కానీ వాటి వల్ల కూడా నష్టాలే వచ్చాయి. నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రానికి రూ. 7 కోట్ల ఎన్ఆర్ఏ అడిగారు. కానీ ఆ సినిమా వల్ల కూడా రూ.1.75 కోట్లు నష్టం వచ్చింది. ఉప్పెన చిత్రాన్ని మొదటి మాకే ఇస్తానని చెప్పి..రిలీజ్ సమయానికి మేమే సొంతంగా రిలీజ్ చేస్తామని అన్నారు. దీంతో దిల్ రాజు వెళ్లి మాట్లాడి డీల్ సెట్ చేశారు. ఆ చిత్రంతో కొంత లాభాలు వచ్చాయి. ఆ తర్వాత పుష్ప చేశారు. ఇక చివరిగా ‘అంటే సుందరానికి ..’ చిత్రాన్ని మేమే నైజాంలో రిలీజ్ చేసి.. మైత్రీ వాళ్లని దూరం పెట్టేశాం. వారి బ్యానర్లో వచ్చిన చిత్రాలను మేము రిలీజ్ చేయడం లేదు’ అని శిరీష్ అన్నారు. -
డకాయిట్ నుంచి శృతి హాసన్ అవుట్.. కారణం అదేనన్న అడివి శేష్!
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటిస్తోన్న తాజా డగాయిట్. క్షణం, గూఢచారితో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామెన్గా పనిచేసిన షానీల్ డియో డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అడివి శేష్ సరసన హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇద్దరు మాజీ ప్రేమికుల కథగా డకాయిట్ను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫైర్ గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు.అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ను ఎంపిక చేశారు. కానీ ఆ తర్వాత ఊహించని విధంగా ఆమె ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే ఆమె తప్పుకోవడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఆ తర్వాత ఈ సినిమాలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ను ఎంచుకున్నారు. తాజాగా శృతి హాసన్ మూవీ తప్పుకోవడంపై అడివి శేష్ స్పందించారు. శృతిహాసన్తో తనకు విభేదాలు తలెత్తాయని వచ్చిన రూమర్స్పై క్లారిటీ ఇచ్చారు.(ఇది చదవండి: 'డకాయిట్' ఫైర్ గ్లింప్స్ విడుదల)డకాయిట్ నుంచి శృతిహాసన్ తప్పుకోవడంపై ఎలాంటి వివాదం లేదని అడివి శేష్ అన్నారు. మా ఇద్దరి మధ్య విభేదాల వల్లే తాను తప్పుకుందని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఇక్కడ ప్రధానంగా వర్కింగ్ స్టైల్ కుదరక పోవడం వల్లే తాను తప్పుకుందని తెలిపారు. అంతేకాకుండా శృతిహాసన్ కూలీ మూవీతో బిజీగా ఉన్నారని శేష్ తెలిపారు.అడివి శేష్ మాట్లాడుతూ..'కూలీతో ఆమె బిజీగా ఉన్నారు. సినిమా చేయడానికి నాకు చాలా టైమ్ పడుతుంది. ఆ ప్రాసెస్లో నాకు సింక్ అవ్వాలి. అంతే తప్ప ఇందులో ఎలాంటి వివాదం లేదు. మృణాల్ స్క్రిప్ట్ వినగానే ఓకే చెప్పారు. పది గంటలకు కథ చెప్పగానే.. మధ్యాహ్నం ఒంటిగంటకే ఓకే చేసింది. ప్రస్తుతం ఈ సినిమా అరవై శాతం పూర్తయింది' అని పంచుకున్నారు. కాగా.. డకాయిట్ మూవీని తెలుగు, హిందీలో ఓకేసారి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అనుపమ పరమేశ్వరన్ మూవీ.. సెన్సార్ బోర్డ్పై సినీ సంఘాల ఆగ్రహం!
టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చేసిన లేటెస్ట్ మలయాళ మూవీ 'జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ'. ఈ చిత్రంలో మలయాళ నటుడు, కేంద్రమంత్రి సురేశ్ గోపీ కీలక పాత్రలో నటించారు. జూన్ 27న విడుదల కానున్న ఈ సినిమాకు ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. సెన్సార్ కోసం బోర్డ్ ముందుకు వెళ్లగా.. సర్టిఫికెట్ ఇచ్చేందుకు నో చెప్పింది. జానకి అనే పేరు సీతాదేవికి మరో పేరు అని.. అలాంటి పాత్రకు ఈ పేరు పెడితే స్క్రీనింగ్ చేయడం కుదరదని సెన్సార్ బోర్డ్ పేర్కొంది. సినిమాలో జానకి అనే పేరుని ఉపయోగించొద్దని సెన్సార్ బోర్డు ఈ చిత్ర నిర్మాతలకు క్లారిటీ ఇచ్చింది. టైటిల్, పాత్ర పేరుని మార్చాలని చిత్రబృందానికి బోర్డ్ సూచించింది. దాడికి గురైన మహిళ పాత్రకు సీతాదేవి పేరు పెట్టలేమని బోర్డు చెప్పింది. జానకి అనే మహిళ.. కోర్టులో చేసే న్యాయపోరాటం అనే స్టోరీతో 'జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ' సినిమాని డైరెక్టర్ ప్రవీణ్ నారాయణ్ తీశారు.అయితే సెన్సార్ బోర్డ్ అభ్యంతరం చెప్పడంపై మలయాళ చిత్ర సంస్థలు మండపడుతున్నాయి. సెన్సార్ బోర్డ్ వైఖరిని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించాయి. అసోసియేషన్ ఫర్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ (AMMA), నిర్మాతల సంఘం, ది ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ తిరువనంతపురంలోని సీబీఎఫ్సీ ప్రాంతీయ కార్యాలయం ముందు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. సీబీఎఫ్సీ నిర్ణయం ఏకపక్షంగా ఉందని ఆరోపిస్తూ ఆందోళన నిర్వహించారు.(ఇది చదవండి: పేరు తీసేయాల్సిందే.. అనుపమ సినిమాకు కష్టాలు)అయితే 'జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ' సినిమాలో ఎటువంటి మతపరమైన అంశాలు లేవని దర్శకుడు స్పష్టం చేశారు. అయినా కూడా ఈ నిర్ణయం తమను నిరాశకు గురి చేస్తోందని ది ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ జనరల్ సెక్రటరీ ఉన్నికృష్ణన్ కామెంట్స్ చేశారు. అయితే ఈ సినిమాకు తిరువనంతపురంలోని సీబీఎఫ్సీ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ముంబయి ప్రధాన కార్యాలయంలో ఈ మూవీ సెన్సార్కు అడ్డంకులు ఎదురయ్యాయి. దీనిపై నిర్మాతలు ఇప్పటికే కేరళ హైకోర్టు ఆశ్రయించారు. -
నా రియల్ లైఫ్లో వాళ్లు లేరు.. అయినా ఫీల్ కాలేదు: లయ
తెలుగులో చాలా సినిమాల్లో హీరోయిన్గా మెప్పించిన బ్యూటీ లయ. భద్రం కొడుకో మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టిన లయ.. ఆ తర్వాత స్వయంవరం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్గా మెప్పించింది. అయితే పెళ్లి తర్వాత యూఎస్ వెళ్లిపోయిన లయ.. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా జాబ్ కూడా చేసింది. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది.నితిన్ హీరోగా వస్తోన్న తమ్ముడు చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో రిలీజ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్కు హాజరైన లయ.. తమ్ముడు సినిమా గురించి తన అనుభవాలు పంచుకుంది. నా రియల్ లైఫ్లో అక్కా, తమ్ముడు అంటూ తనకెవ్వరు లేరని తెలిపింది. అందుకే ఈ చిత్రం తన కెరీర్లో చాలా స్పెషల్ అని ఆనందం వ్యక్తం చేసింది. ఈ మూవీ కోసం దాదాపు 90 రోజుల పాటు చెప్పుల్లేకుండానే పని చేశానని లయ వెల్లడించింది.లయ మాట్లాడుతూ..' ఈ సినిమాలో ఉన్న ఎమోషన్స్కు నేను ఎప్పుడు ఫీలవ్వలేదు. ఎందుకంటే నాకు అక్కా, తమ్ముడు, చెల్లి లాంటి వాళ్లు ఎవరూ లేరు. నా సినిమా జర్నీలో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. సినిమా మొత్తం చెప్పుల్లేకుండా పరిగెత్తడం చాలా ఈజీ అనుకున్నా. కానీ తర్వాత రోజు అలానే చేస్తుంటే ఆ నొప్పి అప్పుడు అర్థమైంది. దెబ్బ మీద దెబ్బ తగిలి అలానే అలవాటు చేసుకున్నా. ఇన్నాళ్లు నా పాత సినిమాలు చూసి ఎలా అభిమానించారో.. నా తమ్ముడు సినిమాకు కూడా అలాగే మద్దతిస్తారని ఆశిస్తున్నా' అని తన అనుభవాన్ని పంచుకుంది.కాగా.. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమీ గౌడ కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నితిన్ అక్కగా ఝాన్సీ కిరణ్మయి పాత్రలో నటించింది. -
'తనే నా జీవితంలో మొదటి స్నేహితురాలు'.. తమ్ముడు డైరెక్టర్ భావోద్వేగం
తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు టాలీవుడ్ హీరో నితిన్. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ హీరోయిన్లుగా నటించారు. చాలా ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోన్న లయ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో జూలై 04న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో తమ్ముడు మూవీ రిలీజ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈవెంట్కు హాజరైన దర్శకుడు వేణు శ్రీరామ్ తన జర్నీ గురించి మాట్లాడారు.తన జీవితంలో మొదటి స్నేహితురాలు అక్క అని వేణు శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన తన సోదరిని అందరికీ పరిచయం చేశారు. నా జీవితంలో మొట్టమొదటి కెమెరా మా అక్కనే కొనిచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు. తనకు తొందరగానే పెళ్లి అయిపోందన్నారు. నా మొదటి షార్ట్ ఫిలిం ఆ కెమెరాతోనే తీశానని వేణు శ్రీరామ్ వెల్లడించారు. మా అక్క కష్టపడేతత్వం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. -
టిక్ టాక్ చేద్దామా.. లిప్లాక్ చేద్దామా..!
కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘లోపలికి రా చెప్తా’. కొండా వెంకట రాజేంద్ర హీరోగా నటించడమే కాకుండా ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. మాస్ బంక్ మూవీస్ పతాకంపై లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మించిన ఈ కామెడీ హారర్ మూవీ జులై 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి 'టిక్ టాక్ చేద్దామా..'అనే పాటను టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ జాండ్ కంపోజ్ చేసిన ఈ పాట యూత్ని ఆకట్టుకునేలా ఉంది. రీసెంట్ గా ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన "లోపలికి రా చెప్తా" ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. అలాగే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు కూడా ఆకట్టుకుంటున్నాయి. హారర్ కామెడీ జానర్ లో ఈ సినిమా ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందనే నమ్మకం ఉందని చిత్ర బృందం పేర్కొంది. -
పవన్ కల్యాణ్ ‘తమ్ముడు’ సినిమా చూలేదు : కాంతర హీరోయిన్
‘పుష్ప’ చిత్రంలో రష్మిక చేసిన పాత్ర అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి ఆఫర్స్ వస్తే కచ్చితంగా చేస్తాను. కానీ కాంతర సక్సెస్ తర్వాత నాకు అన్ని అలాంటి క్యారెక్టర్సే ఆఫర్ చేశారు. అందుకే చాలా మూవీస్ వదులుకున్నాను. ఎక్కువ చిత్రాలు చేయకపోవడానికి కారణం ఇదే. డిఫరెంట్ రోల్స్ వస్తే కచ్చితంగా చేస్తా. కమర్షియల్ సినిమా చేయడం కూడా ఇష్టమే. ‘తమ్ముడు’ కూడా కమర్షియల్ చిత్రమే’ అని అన్నారు కన్నడ బ్యూటీ సప్తమి గౌడ. ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం ‘తమ్ముడు’. నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ కీలక పాత్రలు పోషించారు. జులై 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సప్తమి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ కాంతార సినిమా తర్వాత దర్శకుడు శ్రీరామ్ వేణు గారి దగ్గర నుంచి "తమ్ముడు" మూవీ కోసం కాల్ వచ్చింది. హైదరాబాద్ వచ్చి లుక్ టెస్ట్ ఇచ్చాను. లుక్ టెస్ట్ లో ఓకే అయ్యాక, డైలాగ్ వెర్షన్ చెప్పారు. అప్పటికే రత్న క్యారెక్టర్ గురించి కంప్లీట్ గా స్క్రిప్ట్ ఉంది. హార్స్ రైడింగ్ నేర్చుకోమని చెప్పారు. అరకులో షూటింగ్ చేశాం. నితిన్ గారి భుజానికి గాయం వల్ల షూటింగ్ కొంత ఆలస్యమైంది. "తమ్ముడు" మూవీకి వర్క్ చేయడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది.→ అంబరగొడుగు అనే ఊరిలో ఉండే రత్న అనే అమ్మాయి క్యారెక్టర్ నాది. తను పవన్ కల్యాణ్ అభిమాని. నా క్యారెక్టర్ కు ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. కాంతారతో చూస్తే లుక్ వైజ్ నా క్యారెక్టర్ ఒకేలా ఉంది అనిపించవచ్చు కానీ క్యారెక్టర్ గా చూస్తే పూర్తిగా భిన్నమైనది.→ "తమ్ముడు" కాస్త సీరియస్ సబ్జెక్ట్..ఇందులో నా క్యారెక్టర్ ద్వారా ఫన్ క్రియేట్ అవుతుంది. లయ, నితిన్ గారు కొన్ని పరిస్థితుల్లో అంబరగొడుగు అనే ఊరికి వస్తారు. వారి జర్నీలో రత్న ఎలా భాగమైంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. నితిన్, లయ గారు ఉన్న సిచ్యువేషన్ తెలియకుండా వారితో నా తరహాలో జోవియల్ గా ఉంటాను. అది ఆడియెన్స్ కు హ్యూమర్ ఇస్తుంది.→ కొండలు, గుట్టల్లాంటి ప్రాంతంలో హార్స్ రైడింగ్ చేయాల్సివచ్చింది. రోజూ మూడు, నాలుగు గంటలు హార్స్ రైడింగ్ చేయడంతో ఇబ్బందిపడ్డాను. కానీ ఆ సన్నివేశాలన్నీ బాగా వచ్చాయనే సంతృప్తి ఉంది.→ పవన్ కల్యాణ్ తమ్ముడు సినిమా గురించి నాకు ఐడియా ఉంది. వేణు గారు చెప్పారు. కానీ ఇప్పటి వరకు నేను ఆ సినిమాను చూడలేదు. మా మూవీ రిలీజ్ లోపు పవన్ గారి తమ్ముడు మూవీ చూస్తాను.→ "తమ్ముడు" సినిమా నటిగా నాకు తప్పకుండా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నా. ఈ చిత్రంలో నాది లెంగ్తీ రోల్ కాదు, కానీ ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్. రత్న క్యారెక్టర్ రాసేప్పుడు మిగతా వాటి కంటే ఎంజాయ్ చేశానని డైరెక్టర్ వేణు గారు చెప్పేవారు. ఈ సినిమాకు ఫస్ట్ సెలెక్ట్ అయిన ఆర్టిస్ట్ నేనే.→ ఈ మూవీలో నితిన్ తో నాకు లవ్ ట్రాక్ ఉంటుంది. మా టీనేజ్ ప్రేమ తర్వాత మరింత పరిణితి చెందుతుంది. మూవీలో రత్న, నితిన్ క్యారెక్టర్ కలవాలని ప్రేక్షకులు కోరుకుంటారు. దిల్ రాజు గారి ఎస్వీసీ సంస్థలో నా ఫస్ట్ తెలుగు మూవీ చేయడం హ్యాపీగా ఉంది. ఒక సినిమా బాగా ప్రమోషన్ చేసి రిలీజ్ చేయాలంటే మంచి సంస్థలకే సాధ్యమవుతుంది. డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు "తమ్ముడు" మూవీ కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రతి క్యారెక్టర్ ను పక్కాగా డిజైన్ చేసుకున్నారు. ఆర్టిస్టులే కాదు టెక్నీషియన్స్ నుంచి కూడా తనకు కావాల్సిన ఔట్ పుట్ కాంప్రమైజ్ కాకుండా తీసుకున్నారు.→ ప్రస్తుతం తెలుగులో మరో రెండు చిత్రాలతో పాటు తమిళంలో, కన్నడలో మూవీస్ చేస్తున్నా. వాటి డీటెయిల్స్ త్వరలో వెల్లడిస్తా. భాషాలకు అతీతంగా అన్ని చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నా. -
హిరణ్యకశిపుడిని పరిచయం చేస్తూ 'మహావతార్' ప్రోమో విడుదల
హోంబలే ఫిల్మ్స్ సంస్ధ నిర్మిస్తున్న భారీ యానిమేటెడ్ చిత్రం 'మహావతార్: నరసింహ'.. రాక్షస రాజు హిరణ్యకశిపుడి పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియోను తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్కు మంచి ఆదరణ లభించింది. జులై 25న పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదల కానుంది. కేజీఎఫ్,సలార్,కాంతార వంటి భారీ ప్రాజెక్ట్లను నిర్మించిన ఆ సంస్థ దర్శకుడు అశ్విన్ కుమార్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సామ్ సీఎస్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా.. శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్లు నిర్మిస్తున్నారు. మహావతార్ సిరీస్లో భాగంగా వస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. అయితే, ఈ కథకు సీక్వెల్గా ఇతర అవతారాలతో పలు సినిమాలు రానున్నాయన మేకర్స్ హింట్ ఇచ్చారు. యానిమేషన్లో ఈ చిత్రం ఒక బెంచ్ మార్క్ను సెట్ చేస్తుందని దర్శకుడు తెలిపారు. -
'అల్లు అర్జున్' రెమ్యునరేషన్.. అందుకే ఆ రేంజ్లో ఉన్నాడు: శిరీష్
ఆర్య సినిమా 2004లో భారీ విజయం అందుకుంది. కథ, దర్శకత్వం సుకుమార్. ఈ మూవీ అల్లు అర్జున్తో పాటు నిర్మాతలు దిల్ రాజు-శిరీష్ల బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కు కూడా రెండో సినిమానే.. అయితే, రూ. ఆరు కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 35 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, ఆ సినిమాకు అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారో తాజాగా నిర్మాత శిరీష్ చెప్పుకొచ్చారు.'ఆర్య సినిమాకు మా బడ్జెట్ రూ. 6 కోట్లు మాత్రమే. అయితే, అల్లు అర్జున్కు రెమ్యునరేషన్ ఎంత ఇవ్వాలో చెప్పాలని అల్లు అరవింద్ను అడిగాం. కానీ, సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత కూడా ఎంత అనేది ఆయన చెప్పలేదు. మాకు మాత్రం చాలా టెన్షన్గా ఉంది. ఆయన (అల్లు అరవింద్) ఎంత అడుగుతాడోనని మాలో ఒత్తిడి ఉంది. సినిమా విడుదలకు నాలుగు రోజుల ముందు ఆయన ఇంటికి వెళ్లాం. అప్పటికీ రెమ్యునరేషన్ గురించి తేల్చలేదు. మరుసటిరోజున ప్రసాద్ ల్యాబ్లో సినిమా వేశాం. అరవింద్ గారు సినిమా చూసి ఇంటికి వెళ్లిపోయారు. అప్పుడు దిల్ రాజు కూడా ఆయన ఇంటికి వెళ్లారు. సార్.. ఇప్పటికైనా అల్లు అర్జున్ రెమ్యునరేషన్ చెప్పండి అంటూ దిల్ రాజు రిక్వెస్ట్ చేశాడు. (ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్'తో మా బతుకు అయిపోయింది.. మమ్మల్ని అతనే కాపాడాడు: నిర్మాత)అప్పుడు అరవింద్( Allu Aravind) ఒక్కటే మాట చెప్పారు. 'ఆర్య సినిమా నైజాంలో కోటి రూపాయలు చేస్తే నా కొడుక్కి పది లక్షలు ఇవ్వండి. రెండు కోట్లు చేస్తే ఇరవై లక్షలు, మూడు కోట్లు చేస్తే ముపై లక్షలు, నాలుగు కోట్లు చేస్తే నలభై లక్షలు ఇవ్వండి. అదే నా కొడుకు రెమ్యునరేషన్. అయితే, ఐదు కోట్లు చేస్తే యాభై లక్షలు ఇవ్వవద్దు. నా కొడుకు రెమ్యునరేషన్ రూ.40 లక్షలు మాత్రమే. కానీ, సినిమా వల్ల నష్టపోయి నైజాంలో కోటి చేస్తే పది లక్షలు మాత్రమే ఇవ్వండి. అంతకు మించి ఇవ్వద్దు.' అని అరవింద్ చెప్పారు.అల్లు అరవింద్ గారు చాలా ఆదర్శంగా నాడు రెమ్యునరేషన్ అడిగారని ఆ ఇంటర్వ్యూలో శిరీష్ చెప్పుకొచ్చారు. అందుకే నేడు అల్లు అర్జున్ అంత స్థాయిలో ఉన్నాడని ఆయన పేర్కొన్నారు. ఇండస్ట్రీలో చాలామంది హీరోల తండ్రులు నిర్మాతలుగా ఉన్నారు. ఒక నిర్మాత బాధలు ఎలా ఉంటాయో వాళ్లకు తెలుసు. కానీ, డబ్బు విషయంలో అలాంటి హీరోల ప్రవర్తన ఎలా ఉందో అందరికీ తెలుసు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. -
కన్నడ బిగ్బాస్ హోస్ట్ ఎవరో ప్రకటించిన టీమ్
బిగ్బాస్ షో వివిధ రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉన్న సెలబ్రిటీ రియాల్టీ షో అని తెలిసిందే. త్వరలో కన్నడ బిగ్బాస్-12 సీజన్ ప్రారంభం కానుంది. దాదాపు అన్ని సీజన్లకు హోస్ట్గా వ్యవహరించిన హీరో సుదీప్ ఇకపై తాను ఆ కార్యక్రమానికి హోస్ట్గా చేయాలనుకోవడం లేదని ఆయన గతంలోనే ప్రకటించారు. అయితే, ఈసారి ఎవరు హోస్ట్గా చేస్తారని కన్నడలో ఆసక్తి పెరిగింది. మళ్లీ కిచ్చా సుదీప్ హోస్ట్గా రావాలని ఆయన అభిమానులు #KicchaBackOnBBK, #BiggBossKannada12 హ్యాష్ట్యాగ్స్తో వైరల్ చేశారు. దీంతో సుదీప్ మనసు మార్చుకున్నారు. మళ్లీ హోస్ట్గా చేస్తానని ఆయన అధికారికంగా ప్రకటించారు.బిగ్బాస్ హోస్ట్ విషయంలో కిచ్చా సుదీప్ తన మనసు మార్చుకున్నారు. మళ్ళీ 'బిగ్ బాస్' షోను హోస్ట్ చేయడానికి అంగీకరించారు. ఈమేరకు మీడియా సమావేశం పెట్టి ప్రకటించారు. కలర్స్ కన్నడ ఛానల్ 'బిగ్ బాస్' నిర్వాహకులు కిచ్చా సుదీస్తో పలుమార్లు చర్చలు జరిపి ఒప్పించారని తెలిసింది. కిచ్చా సుదీప్ హోస్ట్గా ఒప్పుకోకుంటే తమకు వేరే ఆప్షన్లు లేవని నిర్వహాకులు అన్నారు. అందుకే ఆయన్ను ఒప్పించామని మీడియా సమావేశంలో చెప్పారు. అయితే, 12వ సీజన్ తర్వాత, 13వ సీజన్కు ఎవరు హోస్ట్గా ఉంటారనే ప్రశ్న తలెత్తింది. ఈ విషయాన్ని కిచ్చా సుదీప్ స్వయంగా విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. రాబోయే 4 సీజన్లకు తానే హోస్ట్గా ఉంటానని ఆయన అన్నారు. తాము అలాంటి ఒప్పందం చేసుకున్నామని ప్రకటించారు.కన్నడ బిగ్బాస్ ఎందుకు చేయనని చెప్పానంటే..మిగతా భాషల్లో బిగ్బాస్కు వచ్చిన గుర్తింపు, ఆదరణ కన్నడ బిగ్బాస్కు రావట్లేదు. మిగతా షోలతో మా షోను పోల్చి చూస్తే దీనికి మరింత గౌరవం రావాలి అని చెప్పుకొచ్చాడు. అలాంటి గుర్తింపు లేనప్పుడు దీనికోసం కేటాయించే సమయాన్ని సినిమాలపై పెడితే బాగుంటుందని నా ఫీలింగ్. అందుకే హోస్టింగ్కు గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నా. అందుకే నాకు బిగ్బాస్ను వదిలేయాలన్న ఆలోచన వచ్చిన వెంటనే ట్వీట్ చేశానని ఆయన అన్నారు. గతంలో జరిగిన పొరపాట్లను సరిచేస్తామని చెప్పడంతోనే హోస్ట్గా చేసేందుకు ఒప్పుకున్నానని సుదీప్ అన్నారు. -
ఎప్పటికీ 'తమ్ముడు' అనిపించుకోలేవు (ట్రైలర్)
నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ మరో ట్రైలర్ను విడుదల చేశారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలకపాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్ కానుంది. అయితే, తాజాగా రిలీజ్ ట్రైలర్ పేరుతో మరోటి వదిలి ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేశారు. మొదటి ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు మరో పవర్ఫుల్ వీడియోను షేర్ చేసి మూవీపై మరింత అంచనాలు పెంచేశారు.రత్న అనేపాత్రలో సప్తమి గౌడ, చిత్రగా వర్ష బొల్లమ్మ, ఝాన్సీ కిరణ్మయిగా లయ, గుత్తిపాత్రలో స్వసిక విజయన్, అగర్వాల్గా సౌరభ్ సచ్దేవ్ కనిపించబోతున్నారు. నితిన్-దిల్ రాజు కాంబినేషన్లో ఇప్పటికే ‘దిల్, శ్రీనివాస కళ్యాణం’ సినిమాలొచ్చాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో శ్రీరామ్ వేణు ‘ఎంసీఏ, వకీల్ సాబ్’ వంటి చిత్రాలు తీశారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న ‘తమ్ముడు’పై సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది’’ అని మేకర్స్ తెలిపారు. -
'విశ్వంభర' విడుదలకు ఇదే ఛాన్స్.. లేదంటే వచ్చే ఏడాదే..!
చిరంజీవి 'విశ్వంభర' ( Vishwambhara) సినిమా 2023 అక్టోబర్ నెలలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో విడుదల కావాల్సి ఉంది. ఆ మేరకు అధికారికంగా ప్రకటించారు కూడా.. కానీ, పలు కారణాలతో వాయిదా వేశారు. అయితే, ఇప్పటికీ విశ్వంభర నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. దర్శకుడు వశిష్ఠ(Mallidi Vassishta) తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. తాజా సమాచారం ప్రకారం, ఈ ఏడాదిలో ఈ సినిమా విడుదల కష్టమే అని తెలుస్తోంది. జులై-ఆగష్టు నెల దాటితే వచ్చే ఏడాది సమ్మర్లోనే విశ్వంభర ప్రేక్షకుల ముందుకు రావచ్చని ఇండస్ట్రీలో టాక్ ఉంది.విశ్వంభర టీజర్లో చూపించిన గ్రాఫిక్స్పై చిరు అభిమానుల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. వీఎఫ్ఎక్స్ పనుల విషయంలో భారీగా ట్రోల్స్ రావడంతో విశ్వంభరకు గ్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. దీంతో సినిమా మరింత ఆలస్యం అయింది. ఈ ఏడాది దసరాకు విశ్వంభరను విడుదల చేయలేరు. ఆ సమయంలో అఖండ2, ఓజీ చిత్రాలు ఉన్నాయి. దీపావళీకి ఇప్పటికే చాలా సినిమాలు లాక్ అయిపోయాయి. నవంబర్, డిసెంబర్ నెలలో విడుదల చేద్దామంటే వచ్చే సంక్రాంతికి అనిల్ రావిపూడి- చిరు సినిమా జనవరి 10 స్లాట్ను బుక్ చేసుకుంది. తక్కువ గ్యాప్లో ఇలా రెండు సినిమాలు వస్తే మార్కెట్ మీద ప్రభావం చూపొచ్చు. అందుకే విశ్వంభరకు కష్టాలు ఎక్కువ అయ్యాయి. చూస్తుంటే 2026 సంక్రాంతికి మెగా 157 ముందు రిలీజై ఆ తర్వాత తాపీగా విశ్వంభర వస్తుందనే కామెంట్స్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి. విశ్వంభర టీజర్లో వచ్చిన విమర్శల వల్ల దర్శకుడు వశిష్ట కూడా మరింత అలర్ట్ అయిపోయాడట. చిరంజీవి లాంటి పెద్ద హీరోతో ఛాన్స్ వచ్చినప్పుడు దానిని కాపాడుకోవాలని క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా పగలు రాత్రి విశ్వంభర కోసం పనిచేస్తున్నారట. విడుదల ఆలస్యం అయినా సరే భారీ హిట్ కొట్టాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. -
గేమ్ ఛేంజర్తో భారీ నష్టాలు.. 'చరణ్' కనీసం ఫోన్ కూడా చేయలేదు: నిర్మాత
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంలో నటించాలని చాలామంది నటీనటులకు కోరిక ఉంటుంది. ఆ సంస్థకు అంత గుర్తింపు రావడంలో నిర్మాత దిల్ రాజు పాత్ర చాలా కీలకం. అయితే, తెరవెనుక ఆయన సోదరుడు శిరీష్ రెడ్డి శ్రమ వెలకట్టలేనిదని ఇండస్ట్రీలో చాలామంది చెబుతుంటారు. అయితే, వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై అనేక విజయవంతమైన సినిమాలను నిర్మించిన వారిద్దరూ ఈ ఏడాదిలో రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో గేమ్ ఛేంజర్ను భారీ బడ్జెట్తో (రూ.450 కోట్లు) తెరకెక్కించారు. అయితే, ఈ మూవీ డిజాస్టర్ వల్ల ఎదురైన ఇబ్బందుల గురించి తాజాగా శిరీష్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. గేమ్ ఛేంజర్ వల్ల వచ్చిన నష్టాలతో తమ బతుకు అయిపోయిందని అనుకున్నామని చెప్పారు. కానీ, 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో అంతా మారిపోయిందని ఆయన అన్నారు.గేమ్ ఛేంజర్ గురించి నిర్మాత శిరీష్ రెడ్డి ఇలా చెప్పారు.' గేమ్ ఛేంజర్ సినిమాతో మా బతుకు అయిపోయిందని అనుకున్నాం. అయితే, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మళ్లీ నిలబడుతామని నమ్మకం వచ్చింది. ఇదంతా కూడా కేవలం 4రోజుల్లోనే జీవితం మారిపోయింది. ఆ సినిమా లేకుంటే మా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోలేం. అప్పుడు అందరూ మా పని అయిపోయిందని హేళన చేసేవారు. గేమ్ ఛేంజర్ ప్లాప్ అయింది. హీరో వచ్చి మాకు ఏమైన సాయం చేశాడా..? దర్శకుడు వచ్చి ఏమైనా సాయం చేశాడా..? అంత నష్టం వచ్చినా కూడా వారు కనీసం ఒక్క ఫోన్ కాల్ చేసి ఎలా ఉన్నారు..? పరిస్థితి ఏంటి అని కూడా ఎవరూ అడగలేదు. చివరకు చరణ్ కూడా అడగలేదు. అలా అని నేను వారిని తప్పుపట్టడం లేదు. మాకు ఇష్టం ఉండి సినిమా తీశాం. డబ్బు పోగొట్టుకున్నాం. రెమ్యునరేషన్లో కొంత ఇవ్వాలని మేము ఎవరినీ అడగలేదు.. అంత స్థాయికి మా సంస్థ ఇంకా దిగజారిపోలేదు. అయితే, మమ్మల్ని నమ్మిన డిస్ట్రిబ్యూటర్స్ను మేము కాపాడుకున్నాం. అయితే, గేమ్ ఛేంజర్ పోయిందని రామ్ చరణ్తో ఎలాంటి విభేదాలు రాలేదు. మరో కథ వస్తే ఆయన వద్దకు వెళ్తాం. ఆయన సినిమా చేయవచ్చు లేదా చేయకపోవచ్చు. నిర్ణయం ఆయనదే కదా.. మేము ఎవరినీ బ్లేమ్ చేయడం లేదు. ఇష్టం ఉండి సినిమా తీశాం, పోగొట్టుకున్నాం. ఈ వ్యాపారంలో ఎవరినీ నిందించలేము. గేమ్ ఛేంజర్ వల్ల వచ్చిన నష్టం చెప్పుకుంటే బాగాదో. కానీ, చాలా మొత్తంలో నష్టపోయాం. అయితే, సంక్రాంతికి వస్తున్నాం సినిమా వల్ల బయటపడ్డాం. గేమ్ ఛేంజర్ నష్టాన్ని సుమారు 70 శాతం వరకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా కవర్ చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి లేకుంటే ఈరోజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఉండేది కాదని చెబుతాను. మమ్మల్ని తిరిగి నిలబెట్టింది అనిల్ అని నేను నమ్ముతా.' అని శిరీష్ రెడ్డి అన్నారు. -
ధనుష్ రూ. 20 కోట్లు డిమాండ్.. విషయం తెలిసి బాధేసింది: వెట్రిమారన్
నటుడు ధనుష్, దర్శకుడు వెట్రిమారన్ కాబినేషన్లో వడచైన్నె అనే చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి నిర్మాత కూడా ధనుష్ కావడం విశేషం. కాగా దానికి సీక్వెల్ ఉంటుందని గతంలోనే ప్రకటించారు. ఇటీవల ఓ సినిమా వేడుకలో వడచైన్నె– 2 చిత్రం గురించి అభిమానులు అడిగిన ప్రశ్నకు వచ్చే ఏడాది ఆ చిత్రం ఉంటుందని ధనుష్ బదులిచ్చారు. కాగా ప్రస్తుతం దర్శకుడు వెట్రిమారన్ ఉత్తర చైన్నె నేపధ్యంలో నటుడు శింబు కథానాయకుడిగా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనతో కూడిన ఒక వీడియోను ఇటీవల విడుదల చేశారు. దీంతో నటుడు ధనుష్ నటించాల్సిన వడచైన్నె– 2లో శింబు నటిస్తున్నారనే ప్రచారం హోరెత్తుతోంది. అంతే కాకుండా వడచైన్నె– 2 చిత్ర కాపీ రైట్స్ కోసం నటుడు ధనుష్ రూ.20 కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో దర్శకుడు వెట్రిమారన్ ఈ వ్యవహారంపై స్పందించాల్సిన పరిస్థితి. ఆయన వివరణ ఇస్తూ ప్రస్తుతం జరుగుతున్న చర్చ గురించి తానూ గమనిస్తున్నానని, అయితే శింబు హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం వడచైన్నె 2 కాదనీ, ఉత్తర చైన్నె నేపధ్యంలో సాగే మరో కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. అయితే వడచైన్నె చిత్రంలోని పాత్రల ఛాయలుగానీ కొనసాగింపులు గానీ ఉంటే ఈ చిత్ర నిర్మాత (ధనుష్)తో తాము మాట్లాడుకుని అనుమతి పొందుతామని చెప్పారు. ఇకపోతే నటుడు ధనుష్ కాపీరైట్ రూ.20 కోట్లు అడిగారన్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. ఈ విషయమై ధనుష్తో చర్చించానని, ఆయన సార్ మీకు ఏది కరెక్టో అది చేయండి, తాము తమ సైడ్ నుంచి నో అబ్జెక్స్ పత్రం ఇస్తాం అని చెప్పారన్నారు. అంతే కానీ డబ్బు ఏమీ వద్దు అని ఆయన చెప్పారన్నారు. అలాంటిది ప్రస్తుతం జరుగుతున్న వదంతులు బాధిస్తున్నాయని దర్శకుడు వెట్రిమారన్ ఆవేదన వ్యక్తం చేశారు. -
కొత్తపల్లిలో ఒకప్పుడు!
‘కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి సినిమాలను నిర్మించిన నటి–నిర్మాత ప్రవీణ పరుచూరి ‘కొత్తపల్లిలో ఒకప్పుడు..’ అనే సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాను నిర్మించిన రానా, ప్రవీణ కలిసి మళ్లీ ‘కొత్తపల్లిలో ఒకప్పుడు..’ చిత్రం నిర్మిస్తున్నారు.‘‘ఓ ఘటన తర్వాత ఊహించని మలుపు తిరిగిన ఓ గ్రామీణ యువకుడి జీవితం నేపథ్యంతో ఈ సినిమా కథనం ఉంటుంది. తెలుగు సినిమాకు ఒక లవ్లెటర్లాంటిది ఈ చిత్రం. నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తాం’’అని యూనిట్ పేర్కొంది. -
దీపావళికి కె–ర్యాంప్
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కె–ర్యాంప్(K-RAMP)’ ఈ దీపావళికి థియేటర్స్లో సందడి చేయనుంది. ఈ చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తున్నారు. జైన్స్ నాని దర్శకత్వంలో హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేష్ దండా, శివ బొమ్మకు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరు కుంది.కాగా సోమవారం ‘కె–ర్యాంప్’ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేసి, ఈ చిత్రాన్ని ఈ దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘‘కిరణ్ అబ్బవరం కెరీర్లో ‘కె–ర్యాంప్’ చిత్రం మరో ఫ్రెష్ అటెంప్ట్ అవుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: చేతన్ భరద్వాజ్, సహ–నిర్మాత:జి. బాలాజీ. -
పాన్ ఇండియా చిత్రం ఆరంభం
విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వస్తున్న పాన్ ఇండియా చిత్రం శనివారం ఆరంభమైంది. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్గా నటించనున్నారు. చార్మీ కౌర్ సమర్పణలో పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్పై పూరి జగన్నాథ్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. ‘‘ఈ సినిమాకి సంబంధించిన అన్ని విషయాల్లో పూరి చాలా కేర్ తీసుకుంటున్నారు.దేశవ్యాప్తంగా ప్రేక్షకులని అలరించే స్క్రిప్ట్ని సిద్ధం చేయడంతో పాటు నటీనటులను కూడా ఎంపిక చేశారు. ప్రీ ప్రోడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఈ వారంలోనే రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మా చిత్రం విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. టబు, విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి సీఈఓ: విషు రెడ్డి. -
గూఫీ విషయాలు చెప్పేస్తున్నా.. ‘రా’ కోరుకుంటా..రష్మిక మందన్న కామెంట్స్
ప్రస్తుతం రష్మిక మందన్న అంటే నేషనల్ క్రష్...మెగాస్టార్ చిరంజీవి సైతం తన అభిమానాన్ని దాచుకోలేనంటూ మాట్లాడేంత స్థాయికి ఎదిగిపోయింది. ప్రస్తుతం ఈ సౌత్ బ్యూటీ ఏం మాట్లాడినా, ఏం చేసినా సెన్సేషన్. వరుస విజయాల ఈ కధానాయిక పంచుకునే విశేషాల కోసం సోషల్ మీడియా నిరంతరం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే... రష్మిక మందన్న తొలిసారిగా స్నాప్ చాట్లోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించింది.ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాల తర్వాత అదే స్థాయిలో ఇండియన్ యువతను ఆకట్టుకుంటున్న స్నాప్చాట్ లో ఆమె ఖాతా తెరవడం అభిమానులకు మరిన్ని విశేషాలతో కనువిందు చేయడమే అనడంలో సందేహం లేదు. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ ‘‘నేను ఎల్లప్పుడూ కొంచెం ‘రా’ గా( పచ్చిగా) కొంచెం వాస్తవంగా ఉండగలిగే ప్రదేశాలనే కోరుకుంటాను. అదే క్రమంలో ఇప్పుడు, స్నాప్చాట్లో ప్రవేశించాను. దీని ద్వారా నా తెర వెనుక క్షణాలు, నా చిన్న చిన్న ఆనందాలు కూడా పంచుకుంటాను.అంతేకాదు గూఫీ విషయాలు (చిన్న చిన్న పొరపాట్లు, తడబాట్లు, నవ్వు తెప్పించే చిరు తప్పిదాలు..వగైరా) కూడా. మధ్యలో ఉన్న ప్రతిదాన్ని (నా సోషల్ మీడియా బృందం చేసే ముందు కూడా) పంచుకునే సమయం ఇది. మీరు దీన్ని చూస్తుంటే, చాలా ధన్యవాదాలు, అభిమానులు ఇప్పటివరకు ప్రతిదానిలో అక్షరాలా భాగమయ్యారు వారికి ఇంకా ఎక్కువ సమయం అందివ్వడానికి నేను వేచి ఉండలేను. త్వరలో మిమ్మల్ని కలుస్తాను, నా ప్రేమికులారా ’’అని రష్మిక మందన్న ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సో వేచి చూద్దాం..స్నాప్చాట్ వేదికగా ఈ నేషనల్ క్రష్ సృష్టించే జోష్ ఎలా ఉంటుందో... -
ముద్దుల కుమారుడితో టాలీవుడ్ జంట చిల్.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ఈ ఏడాదిలోనే తండ్రైన సంగతి తెలిసిందే. ఆయన సతీమణి రహస్య(Rahasya Gorak ) పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ జంట తమ ముద్దుల కుమారుడితో చిల్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కిరణ్ అబ్బవరం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.కాగా.. కిరణ్ అబ్బవరం, రహస్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి నటించిన ‘రాజావారు రాణిగారు’ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు.పెద్దల అంగీకారంతో 2024 ఆగస్ట్ 22న వీరిద్దరి వివాహం జరిగింది. ఈ ఏడాది జనవరిలో ప్రెగ్నెన్నీ విషయాన్ని ప్రకటించారు. ఇక కిరణ్ అబ్బవంరం సినిమాల విషయాలకొస్తే..‘క’తో గతేడాది భారీ హిట్ అందుకున్నాడు. ఇటీవల వచ్చిన ‘దిల్ రూబా’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం ‘కె-ర్యాంప్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నాడు. #TFNReels: Cutest fam vibes!😍 Actor @Kiran_Abbavaram and #RahasyaGorak’s adorable video with their lil munchkin is pure love!!💗#KiranRahasya #KiranAbbavaram #FamilyGoals #TeluguFilmNagar pic.twitter.com/VPg9xAOnXF— Telugu FilmNagar (@telugufilmnagar) June 30, 2025 -
ఈ వారం ఓటీటీ సినిమాలు.. ఆ తెలుగు సినిమానే కాస్తా స్పెషల్!
చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. ప్రస్తుతం థియేటర్లలో కన్నప్ప సందడి చేస్తుండగా.. ఈ వారంలో తమ్ముడు అంటూ నితిన్ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. దీంతో బిగ్బాస్ గౌతమ్ నటించిన సోలో బాయ్ కూడా బాక్సాఫీస్ వద్దకు రానుంది. అయితే ఈ వారంలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో సినీ ప్రియులంతా ఓటీటీ వైపు చూస్తున్నారు.మిమ్మల్ని అలరించేందుకు ఈ వారం కూడా బోలెడు సినిమాలు, వెబ్ సిరీస్లు సిద్ధమైపోయాయి. వాటిలో ప్రధానంగా తెలుగులో వస్తోన్న ఉప్పు కప్పురంబు సినిమాపై ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా ప్రియమణి నటించిన వెబ్ సిరీస్ గుడ్ వైఫ్, ప్రియాంక చోప్రా హెడ్ ఆఫ్ స్టేట్, అమితాబ్ బచ్చన్ నటించిన కాళిధర్ లపతా కాస్తా ఆసక్తి క్రియేట్ చేస్తున్నాయి. వీటితో పాటు కమల్ హాసన్ నటించిన భారీ చిత్రం థగ్ లైఫ్ కూడా ఓటీటీకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే జూలై మూడో తేదీ నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. మరి ఏ యే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్..అటాక్ ఆన్ లండన్- హంటింగ్ ది 7/7 బాంబర్స్- జూలై 01ది ఓల్డ్ గార్డ్-2- జూలై 02థగ్ లైఫ్(తమిళ సినిమా)- జూలై 03(రూమర్ డేట్)ది శాండ్మాన్ సీజన్-2- జూలై 03ది సమ్మర్ హికరు డైడ్- జూలై 05అమెజాన్ ప్రైమ్ వీడియో..ది హెడ్స్ ఆఫ్ స్టేట్- జూలై 02ఉప్పు కప్పురంబు(తెలుగు సినిమా)- జూలై 04జియో హాట్స్టార్కంపానియన్- జూన్ 30గుడ్ వైఫ్(వెబ్ సిరీస్)- జూలై 04జీ5కాళిధర్ లపతా(హిందీ సినిమా)- జూలై 04సోనిలివ్ది హంట్- రాజీవ్ గాంధీ హత్య కేసు- జూలై 04 -
మీరనుకున్నట్లు శ్రీదేవి అమాయకురాలు కాదు: సీనియర్ నటి పూనమ్
టాలీవుడ్ ప్రియుల గుండెల్లో అతిలోక సుందరిగా ముద్రవేసుకున్న హీరోయిన్ శ్రీదేవి. బాలీవుడ్తో పాటు తెలుగులోనూ స్టార్ హీరోయిన్గా మెప్పించింది. తాజాగా ఆమెపై మరో నటి, హీరోయిన్ పూనమ్ ధిల్లాన్ ప్రశంసలు కురిపించారు. అందరూ అనుకున్నట్లుగా తానేమీ తెలివితక్కువ వ్యక్తి కాదని తెలిపింది. తను చాలా అందమైన, అద్భుతమైన మనిషి అని అన్నారు. మీడియాలో చూపినట్లుగా మాటలు రాని వ్యక్తి కాదని పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నటి పూనమ్ ధిల్లాన్.. శ్రీదేవిని ఉద్దేశించి ఇలా కామెంట్స్ చేశారు.నటి పూనమ్ ధిల్లాన్ మాట్లాడుతూ.. 'శ్రీదేవి చాలా తెలివైన నటి. మీడియా ఆమెను మాటలు రాని వ్యక్తిగా ముద్ర వేసింది. కానీ ఆమె అంత తెలివైనది కాదు. తనను అమాయకురాలిగా ముద్ర వేయడం అదంతా ఒక కుట్ర అని నేను చెప్తున్నా. ఎందుకంటే ఆమె చాలా తెలివిగల అమ్మాయి. అలా కాకపోతే ఆమె అంత అద్భుతమైన నటి ఎలా అవుతుంది? అందుకే శ్రీదేవి అమాయకురాలిగా నమ్మడాన్ని నిరాకరిస్తున్నా. నేను ఎల్లప్పుడూ ఆమె పనిని ఆరాధించేదాన్ని. తనతో కలిసి రెండు చిత్రాలలో పనిచేశా. శ్రీదేవి చాలా నిగ్రహం కలిగిన వ్యక్తి.' అని పంచుకుంది. కాగా.. శ్రీదేవి, పూనమ్ ధిల్లాన్ 'సోనే పే సుహాగా', 'జుదాయి' వంటి చిత్రాల్లో కలిసి పనిచేశారు.ఇక సినిమాల విషయానికొస్తే నటి పూనమ్ ధిల్లాన్ చివరిసారిగా రితేష్ దేశ్ముఖ్, తమన్నా భాటియా నటించిన 'ప్లాన్ ఎ ప్లాన్ బి'లో కనిపించింది. ఆమె జియో హాట్స్టార్ షో 'దిల్ బెకరార్'లో కూడా కనిపించనుంది. -
23 ఏళ్లుగా ఇండస్ట్రీలో.. అల్లు అర్జున్ స్థాయికి రాలేకపోయావ్: దిల్ రాజు
నితిన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తమ్ముడు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. జూలై 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ గట్టిగా చేస్తోంది చిత్రయూనిట్. ఈ క్రమంలో దిల్ X తమ్ముడు పేరుతో ఓ స్పెషల్ చిట్చాట్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాల గురించి మాట్లాడారు.సత్సంబంధాలు లేకపోయినా..నితిన్ మాట్లాడుతూ.. దిల్రాజు (Dil Raju)ను నేను అంకుల్ అని పిలిచేవాడిని. నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు మా నాన్న, రాజు కలిసి తొలిప్రేమ సినిమా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ సినిమా హిట్టయినప్పుడు అందరం కలిసి తిరుపతి వెళ్లాం. అలా రాజుతో పరిచయం ఏర్పడింది. 2005లో రామ్ సినిమా చేశాను. అప్పుడు రిలీజ్కు ఇబ్బందులు ఎదురయ్యాయి. మన మధ్య సత్సంబంధాలు లేకపోయినా మీరు వచ్చి కొంత అమౌంట్ ఇచ్చి సమస్యను పరిష్కరించారు. చాలామంది హీరోలకు, నిర్మాతలకు సాయం చేశారు. అలాంటిది మీరు సినిమాలను తొక్కేస్తారన్న విమర్శలు విన్నప్పుడు బాధేసింది అని చెప్పుకొచ్చాడు.జయం సినిమాకు ముందే..దిల్ రాజు తన ప్రయాణం గురించి మాట్లాడుతూ.. జయం సినిమా పోస్టర్స్ చూసి ఈ కుర్రాడు భలే ఉన్నాడనుకున్నాను. అప్పుడు నువ్వు ఎవరో కాదు, సుధాకర్ రెడ్డి కుమారుడు అనగానే.. మరింకే, నితిన్తో సినిమా చేద్దామని వినాయక్తో అన్నాను. అలా జయం రిలీజ్కు ముందే దిల్ మూవీ ఫిక్స్ చేశాం. కాకపోతే దిల్ టైటిల్ బూరుగుపల్లి శివరామకృష్ణ గారి దగ్గర ఉంది. ఆయన దగ్గరకు వెళ్లి ఈ టైటిల్ మా సినిమాకు బాగుంటుందని అడగ్గానే ఇచ్చారు. ఆయన టైటిల్ ఇవ్వడం వల్లే 'దిల్' రాజు అనేది ఒక బ్రాండ్ అయిపోయింది.గేమ్ ఛేంజర్ నష్టాలునేను 2003లో నిర్మాతనయ్యాను. నువ్వు 2002లో హీరో అయ్యావు. నాకంటే ఒక ఏడాది సీనియర్వి. నేను జూనియర్ను. అయినా నేను ఒక్కొక్కటిగా సాధించుకుంటూ టాప్ పొజిషన్లోకి వచ్చాను. ఆర్య సినిమా చేస్తున్నప్పుడు అల్లు అర్జున్ను, దిల్ సినిమా చేస్తున్నప్పుడు నితిన్ (Nithiin)ను ఫ్యూచర్ స్టార్స్ అని ఊహించాను. కానీ, నువ్వు ఆ స్థాయికి రాలేకపోయావు. అదే నువ్వు కోల్పోయావు. తమ్ముడుతో సక్సెస్ వస్తుంది కానీ పూర్వ వైభవం రావడానికి అది సరిపోదు అన్నాడు.రెండు ప్రాపర్టీలు అమ్ముకుంటా..గేమ్ ఛేంజర్ డిజాస్టర్ గురించి ఓపెన్ అవుతూ.. జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజవగానే నాకు నష్టం రాబోతుందని అర్థమైంది. కాకపోతే 14న రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం కచ్చితంగా హిట్ కొడుతుందని నమ్మకంగా ఉన్నాను. ఒకవేళ ఆ సినిమా లేకపోయినా.. రెండు ప్రాపర్టీలు అమ్ముకుని ఆ నష్టాల నుంచి బయటపడేవాడిని. అది పెద్ద విషయం కాదు అని చెప్పుకొచ్చాడు. ఇక వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న నితిన్కు.. తమ్ముడు సినిమా విజయాన్ని సాధించి పెట్టాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు బాధపడొద్దు: శ్రావణ భార్గవి పోస్ట్ -
ఓటీటీలో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ఓటీటీల్లో మిస్టరీ థ్రిల్లర్స్కు ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. ఓటీటీలో ఇలాంటి కంటెంట్నే ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగానే అలాంటి సరికొత్త కంటెంట్తో వెబ్ సిరీస్లు, చిత్రాలు వచ్చేస్తున్నాయి. తాజాగా ఓటీటీ ప్రియులను అలరించేందుకు మరో సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వచ్చేస్తోంది. బాలీవుడ్ నటి వాణి కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన మండల మర్డర్స్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది.ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా వెల్లడించింది. జూలై 25 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కొత్త పోస్టర్ను నెట్ఫ్లిక్స్ విడుదల చేసింది. ఈ సిరీస్లో వాణికపూర్ తొలిసారి డిటెక్టివ్ పాత్రలో కనిపించనుంది. ఈ సిరీస్లో వైభవ్ రాజ్ గుప్తా, సుర్వీన్ చావ్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ను చరణ్దాస్పూర్ పట్టణం నేపథ్యంలో తెరకెక్కించారు. శతాబ్దాల క్రితం జరిగిన హత్యల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ను యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్కు గోపి పుత్రన్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ను ఆదిత్య చోప్రా, ఉదయ్ చోప్రా, యోగేంద్ర మోగ్రే, అక్షయ్ విధాని నిర్మించారు. 'ది రైల్వే మెన్' (2023) తర్వాత నెట్ఫ్లిక్స్, యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో వస్తోన్న సిరీస్ ఇదే కావడం విశేషం. Har vardaan mein ek shraap chhupa hai, mol chukane ka waqt jald aane wala hai 🕸️Watch Mandala Murders, out 25 July, only on Netflix.#MandalaMurders #MandalaMurdersOnNetflix #VaibhavRajGupta @SurveenChawla @ShriyaP #JameelKhan @gopiputhran @manan_rawat @MogreYogendra… pic.twitter.com/eQm3iX4x8a— Vaani Kapoor (@Vaaniofficial) June 30, 2025 -
రూ.67 లక్షల కారు.. నాన్న కొనివ్వలేదు, నేనే లోన్ పెట్టి..: సురేశ్ గోపి కుమారుడు
'తండ్రి ఎంత సంపాదించాడన్నది నాకు ముఖ్యం కాదు. నా కష్టార్జితంతోనే నేను ముందుకు సాగుతాను' అంటున్నాడు మలయాళ నటుడు మాధవ్ సురేశ్. కేంద్రమంత్రి, నటుడు సురేశ్ గోపి కుమారుడే మాధవ్. ఇటీవల ఇతడు లగ్జరీ బ్రాండ్ గోల్ఫ్ జీటీఐ కారు కొనుగోలు చేశాడు. తండ్రి సంపాదనతోనే ఇంత పెద్ద కారు కొన్నాడని పలువురు కామెంట్లు చేశారు. తాజాగా ఈ కామెంట్లపై మాధవ్ స్పందించాడు. నాన్న కొనివ్వలేదు..ఓ ఇంటర్వ్యూలో మాధవ్ సురేశ్ (Madhav Suresh) మాట్లాడుతూ.. ఇటీవల నేను గోల్ఫ్ జీటీఐ కారు కొన్నాను. కేరళలో దీని ధర రూ.67 లక్షలు. మిగతా రాష్ట్రాల్లో అయితే దీని ఖరీదు ఇంకా ఎక్కువే ఉంటుంది. అయితే కారు తెచ్చుకోగానే చాలామంది మా నాన్నే కొనిచ్చాడని నన్ను తీసిపడేశారు. మీ అందరికీ ఓవిషయం చెప్తున్నా.. అది లోన్ తీసుకుని కొన్నాను. ప్రతి నెల కారు ఈఎమ్ఐ నేనే కట్టుకుంటాను. నా సంపాదనతోనే లోన్ చెల్లిస్తాను. మా నాన్న సంపాదించిందంతా ఆయన రిటైర్ అయ్యాక విశ్రాంత జీవితం గడిపేందుకు ఉపయోగపడుతుంది. లేదంటే నా సోదరీమణుల పెళ్లికి ఖర్చు చేస్తాడు. ఆయన డబ్బు వాటికోసం మాత్రమే ఉపయోగించాలి.ట్రోల్స్.. లైట్ తీసుకుంటాఒకవేళ నేను సంపాదించలేకపోతే అప్పుడు ఆయన సాయం తీసుకుంటాను. కానీ నేను కొన్న కారు మా నాన్న ఇచ్చిందైతే కాదు. నేను నా కోసం, నా కుటుంబం కోసం కష్టపడుతున్నాను. ఇక నన్ను తిట్టేవాళ్లపై నాకేమాత్రం కోపం లేదు. ఎందుకంటే నాకోసం వారు సమయం కేటాయిస్తున్నారు. అలా అని వారి ట్రోలింగ్కు స్పందిస్తూ కూర్చోను. నాకు గౌరవం ఇచ్చేవారినే తిరిగి గౌరవిస్తాను. నాన్న బీజేపీ మంత్రి అవడం వల్ల చాలామంది ఆయన్ని, మా కుటుంబం మొత్తాన్ని ద్వేషిస్తూ ఉంటారు. వాటిని నేను లెక్క చేయను అని మాధవ్ సురేశ్ చెప్పుకొచ్చాడు.సినిమా..మాధవ్ ప్రస్తుతం 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' మూవీ చేశాడు. ఇందులో సురేశ్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ టైటిల్పై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. సీతాదేవి మరో పేరైన జానకిని.. సినిమాలో దాడికి గురైన మహిళకు పెట్టడం సమంసజం కాదని అభిప్రాయపడింది. ఈ విషయంపై నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. దీంతో జూన్ 27న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది.చదవండి: మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు బాధపడొద్దు: శ్రావణ భార్గవి పోస్ట్ -
'నేను ఏం మాట్లాడిన అలానే తీసుకుంటారు'.. విడాకుల రూమర్స్పై అభిషేక్ బచ్చన్!
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్-ఐశ్వర్య జంటపై గత కొన్ని నెలలుగా రూమర్స్ వస్తూనే వినిపిస్తున్నాయి. వీరిద్దరు విడాకుల తీసుకోబోతున్నారంటూ చాలాసార్లు కథనాలొచ్చాయి. గతంలో ఐశ్వర్యరాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి చాలాసార్లు కనిపించడంతో ఈ రూమర్స్ ఎక్కువయ్యాయి. అంతేకాకుండా ఐశ్వర్య బర్త్ డే ఆలస్యంగా విష్ చేయడం.. ఆమెతో అభిషేక్ బచ్చన్ ఎక్కువగా కనిపించకపోవడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ వార్తలపై అభిషేక్ ఇప్పటివరకు స్పందించలేదు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అభిషేక్ బచ్చన్.. తనపై వస్తున్న రూమర్స్పై స్పందించారు. సోషల్ మీడియాలో తన గురించి జరుగుతున్న తప్పుడు సమాచారంపై తాను ఎందుకు స్పందించలేదనే విషయాన్ని వెల్లడించారు. నెగెటివ్ వార్తలు రాయడం అనేది ఈ రోజుల్లో కొత్త ట్రోలింగ్ ట్రెండ్ అని అభిషేక్ అన్నారు. తాను ఏం మాట్లాడిన ప్రజలు నెెగెటివ్గానే తీసుకుంటారని స్పష్టం చేశారు.అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.. "గతంలో నా గురించి వచ్చిన కథనాలేవీ నన్ను ఎలాంటి ప్రభావితం చేయలేదు. ఎందుకంటే ఈ రోజు నాకు ఒక కుటుంబం ఉంది. నేను ఏదైనా మాట్లాడితే అది వారిని చాలా బాధ పెడుతుంది. నేను ఏం చెప్పినా ప్రజలు దాన్ని నెగెటివ్గానే తీసుకుంటారు. ఎందుకంటే నెగెటివ్ వార్తలే ఎక్కువగా అమ్ముడవుతాయి. అలాంటి ప్రతికూలతను బయటపెట్టే వ్యక్తులు తమ మనస్సాక్షితో జీవించాలి. ఇక్కడ మనందరికీ కూడా కుటుంబాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఇది ఒక కొత్త ట్రోలింగ్ ఫ్యాషన్. మీరు సోషల్ మీడియాలో ఏదైనా చెప్పే బదులు.. డైరెక్ట్గా నాతో వచ్చి చెప్పడానికి మీకు అనుమతి ఇస్తా. కానీ నా ఎదురుగా వచ్చి చెప్పడానికి మీకు ధైర్యం ఉండదు. ఎవరైనా నా ఎదురుగా వచ్చి మాట్లాడితే వారిని స్వయంగా నేనే గౌరవిస్తా" అని అన్నారు. కాగా.. అభిషేక్ ప్రస్తుతం కాళిధర్ లపతా చిత్రంలో కనిపించనున్నారు. ఈ సినిమాకు మధుమిత దర్శకత్వం వహించారు. మరోవైపు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 13 ఏళ్ల కుమార్తె ఆరాధ్య బచ్చన్ ఉన్నారు. -
'మీ పిల్లలకు తల్లి లేకుండా చేస్తున్నావ్'.. చాలా బాధేసింది: డైరెక్టర్
సింగిల్ పేరెంటింగ్ అన్నది చాలా కష్టం. తల్లి/తండ్రి లేని లోటు తెలియకుండా పిల్లల్ని పెంచాలి. అమ్మానాన్న అన్నీ ఒక్కరై పిల్లల్ని చూసుకోవాలి. ఇద్దరి ప్రేమను ఒక్కరే పంచాలి. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) కూడా అదే పని చేస్తున్నాడు. 2017లో సరోగసి ద్వారా కవలలకు తండ్రయ్యాడు. అప్పటినుంచి అన్నీ తానై పిల్లల్ని చూసుకుంటున్నాడు. కానీ కొందరు దీన్ని కూడా తప్పుపట్టారు. ఆ చిన్నారులకు తల్లి లేకుండా చేశావని నిర్మాతను విమర్శించారు. ఆ మాటలు తననెంతగానో బాధపెట్టాయంటున్నాడు కరణ్ జోహార్.నాపై నాకే అనుమానంతాజాగా ఓ ఇంటర్వ్యూలో కరణ్ మాట్లాడుతూ.. నీ పిల్లలకు తల్లి లేకుండా చేస్తున్నావన్న విషయం నీకర్థమవుతోందా? అన్న కామెంట్లు చూసి భరించలేకపోయాను. నేనేమైనా తప్పు చేస్తున్నానా? అని నామీద నాకే అనుమానమేసింది. అప్పుడు వెంటనే పిల్లల గదిలోకి వెళ్లాను. అప్పుడు వారి వయసు ఐదేళ్లుంటాయంతే! మీరు సంతోషంగానే ఉన్నారా? అని అడిగాను. నువ్వు మా నాన్నవి కాబట్టి హ్యాపీగా ఉన్నామన్నారు. నేను ఆ సమాధానం కోసమే ఎదురుచూశాను. సింగిల్ పేరెంట్గా..వారి రెస్పాన్స్ విన్నాక నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఎవరేమనుకున్నా నాకనవసరం అనిపించింది. సింగిల్ పేరెంట్గా ఉన్నందుకు గర్వంగా ఫీలయ్యాను. మా అమ్మానాన్నకు నేను ఒక్కడినే సంతానం. ఇప్పుడు నేను సింగిల్ పేరెంట్గా ఉన్నాను. నాకు అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, లైఫ్ పార్ట్నర్ అంటూ ఎవరూ లేరు. ఉన్నదల్లా నా కుటుంబం, స్నేహితులు.. వీళ్లెప్పుడూ నా వెన్నంటే ఉంటారు. అందుకు గర్విస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: తెలుగు డైరెక్టర్లు ఎవరూ నాతో సినిమా చేయరు.. అందుకే!: విష్ణు -
దిల్ రాజు బయోపిక్.. హీరోగా ఎవరు సెట్ అవుతారంటే?
నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలకపాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్ కానుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్తో ఫుల్ బిజీ అయిపోయారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే హీరో నితిన్- దిల్ రాజుతో ఇంటర్వ్యూ నిర్వహించారు.ఈ ఇంటర్వ్యూలో నితిన్- దిల్ రాజు మధ్య సరదా సంభాషణ జరిగింది. భవిష్యత్తులో మీ బయోపిక్ తీసే అవకాశముందా? అని నితిన్ ప్రశ్నించారు. అందుకు తగిన కంటెంట్ ఉంటుందా? అని అడిగారు. దీనికి దిల్ రాజు సమాధానమిచ్చారు. కచ్చితంగా కావాల్సిన కంటెంట్ ఉంటుంది.. దాదాపు 30 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నానని తెలిపారు. ఒకవేళ బయోపిక్ తీస్తే హీరోగా ఎవరైతే సెట్ అవుతుందని నితిన్ అడిగారు. చాలామంది నితిన్ నీ తమ్ముడిలా ఉంటారని చెబుతారు. అది నువ్వు ఒక్కడినే అని నాకు అనిపిస్తోందని అన్నారు.#Nithiin: మీ బయోపిక్ తీసే అంత కంటెంట్ మీ లైఫ్ ఉందా ? Dil Raju: Yea Definite గా ఉంది. pic.twitter.com/ZbDxyfFogS— Rajesh Manne (@rajeshmanne1) June 30, 2025 -
తెలుగు డైరెక్టర్లు ఎవరూ నాతో సినిమా చేయరు.. అందుకే!: విష్ణు
టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Vishnu Manchu)కు హిట్టు పడి చాలా ఏళ్లే అయింది. ఆయన చివరగా జిన్నా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2022లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈసారి రొటీన్ సినిమాలు కాదని తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను పట్టాలెక్కించాడు. దీనికోసం ఎంతో అధ్యయనం చేసిన తర్వాతే కన్నప్ప షూటింగ్ మొదలుపెట్టాడు. మోహన్బాబు, మోహన్లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్ వంటి బడా తారలు కీలక పాత్రలు పోషించారు. కన్నప్పపై ట్రోలింగ్మహాభారత్, రామాయణ్ సీరియల్స్ తెరకెక్కించిన హిందీ దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లభిస్తోంది. దీంతో సినిమా సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ వేడుకలో విష్ణు.. కన్నప్పపై జరిగిన ట్రోలింగ్ గురించి మాట్లాడాడు. కన్నప్ప సినిమా టీజర్ రిలీజైనప్పుడు ఉత్తి పుణ్యానికే నెగెటివిటీ ప్రచారం చేశారు. యూట్యూబ్లో నాన్నగారి గురించి, నా గురించి ఏమీ లేకపోయినా నెగెటివ్ థంబ్నైల్స్ పెడితే వారికి ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయి, ఆదాయం వస్తోంది. వీఎఫ్ఎక్స్ గుర్తించలేకపోయారుఅది ఎంత పెద్ద తప్పని వారు రియలైజ్ అవట్లేదు. లొకేషన్స్ బాలేవు, గ్రాఫిక్స్ బాగోలేవు అని నానామాటలు అన్నారు. చాలామందికి తెలియని విషయమేంటంటే నేను రిలీజ్ చేసిన మొదటి టీజర్లో చాలా తక్కువ వీఎఫ్ఎక్స్ ఉన్నాయి. రెండో టీజర్లో మాత్రం 70% వీఎఫ్ఎక్స్ ఉన్నాయి. అదెవరూ గుర్తించలేకపోయారు. మోహన్లాల్గారి ఎపిసోడ్లో ఆ బాణాలు తప్ప అన్నీ ఒరిజినలే! రియల్ లొకేషన్లో షూట్ చేశాం అన్నాడు. నాతో ఎవరూ చేయరుతెలుగులో లెజెండరీ డైరెక్టర్స్ ఉన్నా, హిందీలో ముకేశ్ కుమార్నే ఎందుకు నమ్మారు? ఆయనకే ఎందుకు డైరెక్షన్ బాధ్యతలు ఇచ్చారన్న ప్రశ్న ఎదురైంది. అందుకు విష్ణు స్పందిస్తూ.. నాతో తెలుగులో ఏ డైరెక్టర్ పని చేయరని నాకు తెలుసు. కన్నప్ప స్క్రిప్ట్ తీసుకెళ్తే ఎవరూ నాతో చేయరని అందరికీ తెలుసు. పైగా దీనికంటే ముందు నేను చేసిన రెండు,మూడు సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. అందువల్ల ఇక్కడ ఎవరూ చేయరు. మహాభారతాన్ని (సీరియల్) అంత గొప్పగా తీసిన ముకేశ్ కన్నప్పను అంతే అద్భుతంగా తెరపై చూపించగలరని నమ్మాను అని చెప్పాడు. ముకేశ్ కుమార్ సింగ్కు దర్శకుడిగా ఇదే తొలి సినిమా కావడం విశేషం!చదవండి: మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు బాధపడొద్దు: శ్రావణ భార్గవి పోస్ట్ -
డైరెక్ట్గా ఓటీటీకి సలార్ హీరో సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సలార్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఫేమ్ తెచ్చుకున్న హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఆ తర్వాత ఆడుజీవితం సినిమాతో మరోసారి సినీ ప్రియులను అలరించాడు. ఈ ఏడాది ఎంపురాన్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మోహన్ లాల్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకు తానే స్వయంగా దర్శకత్వం వహించారు.ప్రస్తుతం మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కాయోజ్ ఇరానీ దర్శకత్వం వహిస్తోన్న సర్జమీన్ అనే బాలీవుడ్లో చిత్రంలో కనిపించనున్నారు. ఈ మూవీలో కాజోల్ హీరోయిన్గా కనిపించనుంది. దేశభక్తి నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమార్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే విడుదల చేయనున్నారు.సర్జమీన్ మూవీని జూలై 25 నుంచి జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు అఫీషియల్ ప్రకటన పేరుతో ఓ వీడియోను పంచుకున్నారు. ఈ చిత్రంలో ఇబ్రహీం అలీ ఖాన్ ఉగ్రవాదిగా కనిపంచనున్నట్లు తాజాగా రిలీజ్ చేసిన వీడియో చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్తారు. ఈ సినిమాతోనే కాయోజ్ ఇరానీ డైరెక్టర్గా అరంగేట్రం చేస్తున్నారు.సర్జమీన్' కథేంటంటే?కశ్మీర్ నేపథ్యంతో ఈ మూవీని తెరకెక్కించారు. తన విధి పట్ల ఎంతో నిబద్ధత చూపించే విజయ్ మీనన్ (పృథ్వీరాజ్) చుట్టూ తిరుగుతుంది. ఇక ఈ సినిమాలో మీరా పాత్రలో కాజోల్, హర్మన్ పాత్రలో ఇబ్రహీం అలీ ఖాన్ నటించారు. మాతృభూమిని కాపాడటం కంటే ముఖ్యమైనది మరొకటి లేదు అనే క్యాప్షన్తో జియోహాట్స్టార్ ఈ వీడియోను షేర్ చేసింది. Sarzameen ki salamati se badhkar kuch nahi 🇮🇳#Sarzameen, releasing July 25, only on @JioHotstar!#SarzameenOnJioHotstar@itsKajolD #IbrahimAliKhan #KaranJohar @adarpoonawalla @apoorvamehta18 @AndhareAjit @kayoze @MARIJKEdeSOUZA @somenmishra0 @Soumil1212 #ArunSingh… pic.twitter.com/qtxTBsq4Iq— Prithviraj Sukumaran (@PrithviOfficial) June 30, 2025 -
సోషల్ మీడియా క్రేజ్.. ఏకంగా మూవీ ప్రమోషన్లలో కుమారి ఆంటీ!
సోషల్ మీడియా వచ్చాక ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతున్నారో అర్థం కావడం లేదు. గతంలో సోషల్ మీడియా వల్ల ఎంతో మంది ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. అలాంటి వారి పేరు కూడా తెలియని వారు చాలామంది ఫేమస్ అయ్యారు. కుమారి ఆంటీ, కుర్చీ తాత, మోనాలిసా ఇలా ఎందరో ఉన్నారు. హైదరాబాద్లో రోడ్డు పక్కన్ భోజనాలు విక్రయించే కుమారి ఆంటీ ఓకే ఒక్క మాటతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకుంది. టూ లివర్స్ ఎక్స్ట్రా మీది మొత్తం థౌజండ్ అయ్యిందని ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాను షేక్ చేశాయి.అదే ఫేమ్తో ఇప్పుడు ఏకంగా మూవీ ప్రమోషన్లలో భాగమయ్యారు కుమారి ఆంటీ. నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల జంటగా నటించిన సినిమా షో టైమ్ ప్రమోషన్లలో సందడి చేశారు. సోషల్ మీడియా వల్ల వచ్చిన క్రేజ్తో ఆమె ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కుమారి ఆంటీ ప్రమోషన్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది.నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల జంటగా నటించిన లేటేస్ట్ మూవీ 'షో టైమ్'. అనిల్ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ పతాకంపై కిషోర్ గరికిపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మదన్ దక్షిణా మూర్తి దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో వీకే నరేష్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్గా వస్తోన్న ఈ చిత్రం జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. -
యానిమల్ ఎఫెక్ట్..'హరి హర వీరమల్లు'లో బాబీ డియోల్ పాత్ర ఎలా ఉండబోతుందంటే..
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. జూలై 24న విడుదల కానున్న 'హరి హర వీరమల్లు' సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు విశేష స్పందన లభించింది. జూలై 3న ట్రైలర్ ఆవిష్కరణ జరగనుంది.'హరి హర వీరమల్లు' చిత్రానికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇది పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. అలాగే పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ కనిపించని విధంగా మొదటిసారి చారిత్రక యోధుడి పాత్రలో కనువిందు చేయనున్నారు. ఇక 'యానిమల్' సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న బాబీ డియోల్.. 'హరి హర వీరమల్లు'లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తుండటం మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు.నిజానికి బాబీ డియోల్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ప్రారంభంలోనే చిత్రీకరించారు. కానీ, 'యానిమల్'లో బాబీ నటనను చూసిన తర్వాత దర్శకుడు జ్యోతి కృష్ణ 'హరి హర వీరమల్లు'లో ఆయన పాత్రను పునః రచించాలని నిర్ణయించుకున్నారు. ఆ పాత్రను సరికొత్తగా తీర్చిదిద్ది, మరింత శక్తివంతంగా మలిచారు.బాబీ డియోల్ గురించి జ్యోతి కృష్ణ ఇలా అన్నారు.. "యానిమల్ చిత్రంలో బాబీ డియోల్ నటన అద్భుతం. పాత్రకు సంభాషణలు లేకపోయినా, హావభావాల ద్వారానే భావోద్వేగాలను వ్యక్తపరిచిన ఆయన అసమాన ప్రతిభ ఆశ్చర్యపరిచింది. అందుకే మా సినిమాలో కూడా ఆయన పాత్ర కోణాన్ని మార్చి, పూర్తిగా సరికొత్త రూపం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను" అని జ్యోతి కృష్ణ తెలిపారు. జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్ని విభాగాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. బాబీ డియోల్ పోషించిన ఔరంగజేబు పాత్ర విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. బాబీ డియోల్ నటనలోని భావోద్వేగ లోతును తీసుకురావడం కోసం.. ఆ పాత్రను ఎంతగానో మెరుగుపరిచారు. జ్యోతి కృష్ణ దిద్దిన మెరుగులతో ఔరంగజేబు పాత్ర మరింత బలంగా, ఆకర్షణీయంగా మారింది.యానిమల్ తర్వాత బాబీ డియోల్ సరికొత్త స్టార్డమ్ చూశారు. ఆ స్టార్డమ్ కి న్యాయం చేయడానికి మరియు ఆయనపై ఉన్న అంచనాలను అందుకోవడానికి ఔరంగజేబు పాత్రకు మరింత ఆకర్షణీయమైన ఆర్క్ అవసరమని జ్యోతి కృష్ణ భావించారు. అందుకే ఆ పాత్ర వ్యక్తిత్వం, నేపథ్య కథ, ఆహార్యం వంటి అంశాల్లో కీలక మార్పులు చేశారు. "నేను సవరించిన స్క్రిప్ట్ను చెప్పినప్పుడు, బాబీ గారు చాలా ఉత్సాహపడ్డారు. ఆయన తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఇష్టపడే నటుడు. హరి హర వీరమల్లులో బాబీ డియోల్ ఎంతో శక్తివంతంగా కనిపిస్తారు. ఆయనతో కలిసి పని చేయడం గొప్ప అనుభవం" అని దర్శకుడు జ్యోతి కృష్ణ పేర్కొన్నారు.ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్రానికి జ్ఞాన శేఖర్ వి.ఎస్., మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ప్రతిభగల సాంకేతిక బృందం సహకారంతో ఈ చిత్రం ఒక దృశ్య కావ్యంగా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటుందని చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉంది. 'హరి హర వీరమల్లు' చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. -
కింగ్డమ్ గురించి తిడుతూనే ఉన్నారు.. మీకు మాటిస్తున్నా: నాగవంశీ
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగాన్ని మార్చి 28న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సినిమా పూర్తి కాకపోవడంతో మే 30కి వాయిదా వేశారు. అప్పటికీ కింగ్డమ్కు మెరుగులు దిద్దడం కంప్లీట్ కానందున జూలై 4న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సరిగ్గా ఇదే రోజు నితిన్ తమ్ముడు చిత్రం విడుదలవుతోంది.మళ్లీ వాయిదాఅయితే కింగ్డమ్ (Kingdom Movie) వాయిదా పడటం ఖాయం అంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. చివరకు అదే నిజమైంది. కింగ్డమ్ వాయిదా వేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశాడు. నేను ఏం పోస్ట్ చేసినా కింగ్డమ్ సినిమా గురించి తిట్లు వస్తూనే ఉంటాయని నాకు తెలుసు. మీకు వెండితెరపై ఒక అద్భుతమైన అనుభూతిని అందించేందుకు మా టీమ్ ఎంతగానో కృషి చేస్తోంది. మీకు మాటిస్తున్నా.. కింగ్డమ్ చూశాక మీకు కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేనంత గొప్పగా ఉంటుంది. కింగ్డమ్దే విజయంనేను ఎంతో నమ్మితే కానీ ఇలా మాట్లాడనని మీకు తెలుసు. ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా మీ క్రియేటివిటీ అంతా నాపై చూపిస్తారు. నేను సినిమా చూసి చెప్తున్నా.. కింగ్డమ్దే గెలుపు. త్వరలోనే అదిరిపోయే రిలీజ్ డేట్ టీజర్, సాంగ్ అనౌన్స్మెంట్తో కలుద్దాం అన్నాడు. దీంతో కింగ్డమ్ వాయిదా కన్ఫార్మ్ అయిపోయింది. Em post chesina, Kingdom sweet curses mathram vasthune untayi ani telusu 😅But trust me our team is working around the clock to bring you a Massive Big Screen Experience… One thing I can promise you - The ADRENALINE RUSH this film delivers is unreal 🔥🔥And you all know…— Naga Vamsi (@vamsi84) June 30, 2025 చదవండి: మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు బాధపడొద్దు: శ్రావణ భార్గవి పోస్ట్ -
‘షర్మిలా ఠాగూర్, సైఫ్ అలీ ఖాన్ను పిలవండి.. ఎవరూ వేలెత్తి చూపరు’
ఇంగ్లండ్- భారత్ మధ్య టెస్టు సిరీస్కు కొత్త పేరు పెట్టడం పట్ల టీమిండియా మాజీ క్రికెటర్ ఫారూఖ్ ఇంజనీర్ (Farookh Engineer) అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ చర్య వల్ల ఇంగ్లండ్- వేల్స్ క్రికెట్ బోర్డు తన విశ్వసనీయతను కోల్పోయిందని విమర్శించాడు. భారత క్రికెట్ రంగానికి సేవ చేయడంతో పాటు ఇంగ్లండ్కూ ఆడిన మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ (Mansur Ali Khan Pataudi) పేరు తొలగించడం ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కాదన్నాడు.గొప్ప కుటుంబంకాగా ఇంగ్లండ్- టీమిండియా మధ్య టెస్టు సిరీస్ను గతంలో పటౌడీ ట్రోఫీగా పిలిచేవారు. అయితే, తాజాగా ఈ సిరీస్కు టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేసింది ఈసీబీ. ఈ క్రమంలో విమర్శలతో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నుంచి విజ్ఞప్తి రాగా.. విజేత జట్టు కెప్టెన్కు పటౌడీ మెడల్ను అందజేస్తామని ప్రకటించింది. తద్వారా పటౌడీ పేరు చిరస్మరణీయం కానుంది.అయితే, ఈసీబీ నిర్ణయం తనకు అంతగా సంతృప్తినివ్వలేదని షారూఖ్ ఇంజనీర్ అన్నాడు. ‘‘టైగర్ పటౌడీ నాకు స్నేహితుడు. ఇద్దరం కలిసి చాన్నాళ్లు క్రికెట్ ఆడాము. అతడిది గొప్ప వారసత్వం. వారిది గొప్ప కుటుంబం. 2007లో పటౌడీ ట్రోఫీని ప్రవేశపెట్టినపుడు ఎంతో సంతోషించా.షర్మిలా ఠాగూర్, సైఫ్ అలీ ఖాన్ను పిలవండిఅయితే, ఇప్పుడు ఆ పేరును తీసేయడం తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆండర్సర్- టెండుల్కర్ కూడా దిగ్గజ ఆటగాళ్లే. వారికి ఎవరూ సాటిరారు. ట్రోఫీకి వారి పేరు పెట్టడంలో ఎలాంటి తప్పూ లేదు. అయితే, ఇలాంటి చర్య వల్ల ఈసీబీ తన విశ్వసనీయతను కోల్పోయింది.మెడల్ ఇస్తామంటూ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. మెడల్ అందిస్తామని చెప్పింది. కేవలం ఇలా చేస్తే సరిపోదు. మన్సూర్ భార్య షర్మిలా ఠాగూర్, కుమారుడు సైఫ్ అలీ ఖాన్ల చేతుల మీదుగా ఆ పతకం విజేత జట్టు కెప్టెన్కు అందజేయాలి. ఈసారి ఇలా చేయడం వల్ల ఈసీబీ వైపు ఎవరూ వేలెత్తి చూపే అవకాశం ఉండదు’’ అని ఫారూఖ్ ఇంజనీర్ పీటీఐతో పేర్కొన్నాడు. కాగా బాలీవుడ్ నటి షర్మిలాను పెళ్లాడిన మన్సూర్కు కుమారుడు సైఫ్తో పాటు కుమార్తెలు సబా, సోహా ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజా ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా పరాజయంతో మొదలుపెట్టింది. లీడ్స్ వేదికగా తొలి టెస్టులో గిల్ సేన.. స్టోక్స్ బృందం చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇరుజట్ల మధ్య మొత్తంగా ఐదు టెస్టులు జరుగనుండగా.. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియం రెండో మ్యాచ్ (జూలై 2-6)కు వేదిక. చదవండి: ఇకపై మళ్లీ ఆడగలనా? -
మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు బాధపడొద్దు: శ్రావణ భార్గవి పోస్ట్
టాలీవుడ్ స్టార్ సింగర్స్ శ్రావణ భార్గవి (Ravuri Sravana Bhargavi)- హేమచంద్ర ఇప్పటికీ విడివిడిగానే జీవిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ విడిపోయారంటూ 2022లో పుకార్లు మొదలయ్యాయి. అవి అబద్ధమంటూ ఏనాడూ వీరిద్దరూ జంటగా బయటకు రాలేదు. పైగా హేమచంద్ర లేకుండానే కూతురితో ఒంటరిగా ట్రిప్స్కు వెళ్తోంది శ్రావణ భార్గవి. దీంతో వీరు దాపంత్య జీవితానికి స్వస్తి పలికి, ఒంటరిగా జీవిస్తున్నారని అభిమానులకు అర్థమైపోయింది.తప్పు చేస్తున్నామా?తాజాగా శ్రావణ భార్గవి ప్రేమ గురించి ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. జీవితం చాలా సున్నితమైనది. అవసరాలు, గొడవలు, అపార్థాలు, చిక్కుముళ్లు.. వీటితోనే బతికేయడంలో అర్థంపర్థం లేదు. ప్రేమ ఒక్కటే అర్థవంతమైనది. మనం మనస్ఫూర్తిగా ఒకర్ని ప్రేమించినప్పుడు తప్పు చేస్తున్నామా? అని కించిత్తు కూడా బాధపడనక్కర్లేదు. ఉదారంగా, మంచి మనసుతో ఎక్కువగా ప్రేమించడానికి ప్రయత్నించండి. ఆ ప్రేమే.. మనం జీవితంలో గెలిచామా? ఓడామా? అనేది నిర్ణయిస్తుంది అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది.హేమచంద్రతో ప్రేమపెళ్లిటాలీవుడ్ స్టార్ సింగర్ శ్రావణ భార్గవి.. పాటలు పాడటమే కాదు, రాస్తుంది కూడా! అలాగే హీరోయిన్స్కు డబ్బింగ్ కూడా చెప్తుంది. ‘గబ్బర్సింగ్’, ‘రామయ్య వస్తావయ్యా’ చిత్రాల్లో శ్రుతీహాసన్కి డబ్బింగ్ చెప్పింది. ఈగ హిందీ వర్షన్లో సమంతకు డబ్బింగ్ చెప్పింది. 2013లో సింగర్ హేమచంద్రను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి 2016లో కుమార్తె శిఖర చంద్రిక జన్మించింది. శ్రావణ భార్గవి- హేమచంద్ర ఒకప్పుడు కలిసి టీవీ షోలు చేశారు. ఓ షోలో జడ్జిలుగా కూడా వ్యవహరించారు. లక్కీ లవ్ అనే షార్ట్ ఫిలింలో జంటగానూ నటించారు.చదవండి: రూ. 25 కోట్ల ఎఫెక్ట్.. అక్షయ్ సినిమాపై మనసు మార్చుకున్న నటుడు -
'కన్నప్ప'కు ఇలా జరగడం బాధేస్తుంది: మంచు విష్ణు
మంచు విష్ణు (Manchu Vishnu) నటించిన కన్నప్ప (Kannappa) సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా హిందీ వర్షన్లో 80 శాతం సీట్లు ఫిల్ అవుతున్నాయి. ఆపై తమిళనాడులో కూడా మంచి టాక్తో రన్ అవుతుంది. తెలుగులో కూడా మ్యాట్నీ, సాయంత్రం షోలు హౌస్ఫుల్ అయిపోతున్నాయి. అయితే, తాజాగా మంచు విష్ణు తాజాగా సోషల్మీడియాలో విజ్ఞప్తి చేస్తూ పోస్ట్ పెట్టారు. కన్నప్ప చిత్రం పైరసీకి గురవుతుందంటూ విష్ణు ఆవేదన చెందారు. ఎంతో కష్టపడి సినిమాను నిర్మించామని, ఎవరూ పైరసీని ప్రొత్సహించొద్దంటూ విజ్ఞప్తి చేశారు.కన్నప్ప సినిమా పైరసీకి గురైందని నటుడు మంచు విష్ణు తన ఎక్స్ పేజీలో పోస్ట్ చేశారు. ఇప్పటికే సుమారు 30వేలకు పైగానే అనధికారిక పైరసీ లింక్లను తమ టీమ్ తొలగించిందని ఆయన పేర్కొన్నారు. పైరసీ అంటే మరొకరి శ్రమను దోచుకోవడమే.. ఇలాంటి చర్య దొంగతనంతో సమానం అవుతుందన్నారు. ఈ విషయంలో చాలా బాధగా ఉందని విష్ణు ఆవేదన చెందారు. ' మన ఇంట్లో పిల్లలకు మనం దొంగతనం చేయమని మనం నేర్పించం. ఇలా ఒక సినిమాను పైరసీలో చూడడం కూడా దొంగతనంతో సమానమే అవుతుంది. దయచేసి ఇలాంటి వాటిని అరికట్టండి. మా ‘కన్నప్ప’ సినిమాను ఆదరించండి.' అంటూ విష్ణు కోరారు.కన్నప్ప సినిమా మూడురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 58 కోట్లు సాధించినట్లు తెలుస్తోంది. ఫస్ట్ షో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఈ మూవీలో ప్రభాస్ పాత్రతో పాటు మంచు విష్ణు నటన అద్భుతంగా ఉందంటూ టాక్ బయటకు రావడంతో టికెట్లు బాగానే తెగుతున్నాయి. బుక్మైషోలో ప్రతిరోజు సుమారు ఒక లక్షకు పైగానే టికెట్లు సేల్ అవుతున్నాయి. -
ఐకానిక్ అవార్డ్ : సినిమాటోగ్రాఫర్కు విజన్ చాలా ముఖ్యం
డైరెక్టర్ విజన్ ఒకటైతే.. సినిమాటోగ్రాఫర్ విజన్ మరోలా ఉంటుంది. సినిమాకు కళను తెచ్చే సినిమాటోగ్రఫీ చేయడం కష్టతరమైన పని.. కానీ నచ్చిన మెచ్చిన పనిలో తన కష్టాన్ని చూపిన కిషోర్ బొయిదాపు(Kishore Boyidapu) ఇంటర్నేషనల్ ఐకానిక్ సినిమాటోగ్రాఫర్ అవార్డు అందుకున్నాడు. ఇటీవలే నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో ‘105 మినిట్స్’ చిత్రానికి అవార్డు లభించింది. తన కుంటుంబ సినిమా నేపథ్యాన్ని, సినిమాటోగ్రఫీ విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నాడు. – బంజారాహిల్స్ బోరబండలోని గాయత్రినగర్కు చెందిన కిషోర్ స్వస్థలం విజయవాడ. ఆయన కుటుంబానిది సినిమా నేపథ్యం. తన ఇద్దరు బాబాయిర్లు ఒకరు ప్రముఖ పీఆర్ఓ దివంగత బీఏ రాజు, మరో బాబాయి కెమెరామెన్ రామ్కుమార్, తన అన్నల్లో ఒకరు కెమెరామెన్ రవి, మరో అన్న అనిల్ దర్శకుడిగా పనిచేస్తున్నారు. కుటుంబం మొత్తం సినిమా నేపథ్యం అవడంతో సినిమాలపై మక్కువతో 2002లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. రవిప్రసాద్ యూనిట్లో మొదట కెమెరా అసిస్టెంట్గా కెరీర్ ప్రారంభించాడు. మెచ్చిన, నచ్చిన పనిలో కష్టాన్ని నమ్మిన కిషోర్ త్వరగానే స్లమ్డాగ్ మిలీనియర్, మిషన్ ఇంపాజిబుల్–4, లెటర్స్, సూటబుల్ బాయ్స్ వంటి హాలీవుడ్ ప్రాజెక్టులకు సెకండ్ యూనిట్ కెమెరామెన్గా ప్రతిభను కనబరిచాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అనిల్ మోహతా ప్రియ శిష్యుడిగా సీక్రెట్ సూపర్స్టార్, ఏ దిల్హై ముష్కిల్, బియాండ్ ది క్లౌడ్స్, హిందీ జెర్సీ వంటి అగ్రచిత్రాలతో పాటు అగ్రహీరోల యాడ్ ఫిల్మ్స్కి సినిమాటో గ్రాఫర్గా సత్తాచాటాడు. కెమెరామెన్గా.. బోయ్ మీట్స్ గరల్స్ చిత్రంతో కెమెరామెన్గా మారిన్ కిషోర్ ‘కిరాక్, వశం, కర్త–కర్మ–క్రియ, 105 మినిట్స్, మైనేమ్ ఈజ్ శృతి’తో పాటు పలు నూతన చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేశాడు. 105 మినిట్స్ చిత్రానికి ఐకానిక్ అవార్డు అందుకున్నాడు. ముంబై నుండి నగరానికి షిఫ్ట్ అయిన కిషోర్ తన ఫోకస్ అంతా తెలుగు చిత్రాలపైనే అని పేర్కొన్నాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సినిమాటోగ్రాఫర్గా రాణించడమే లక్ష్యమని తెలిపాడు. -
రూ. 25 కోట్ల ఎఫెక్ట్.. అక్షయ్ సినిమాపై మనసు మార్చుకున్న 'పరేష్ రావల్'
బాలీవుడ్లో వినోదాలు పంచిన సిరీస్ల్లో ‘హెరాఫెరీ’ (Hera Pheri) ఒకటి. గత కొన్ని నెలలుగా ‘హెరాఫెరీ 3’ మూవీ సీక్వెల్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. సుమారు 20 ఏళ్ల తర్వాత పార్ట్-3 ప్లాన్ చేశారు. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్, టబు, ఓం పురి, గుల్షన్ గ్రోవర్ వంటి స్టార్స్ ఈ సిరీస్లలో నటించారు. అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ ప్రస్తుత సీక్వెల్ను నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, సడెన్గా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రముఖ నటుడు పరేష్ రావల్ (శంకర్ దాదా ఎంబిబిఎస్ ఫేం) కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. కామెడీ ప్రధాన కాన్సెప్ట్తో వచ్చిన గత రెండు సిరీస్లో ఆయన పాత్ర చాలా కీలకం. కానీ, పార్ట్-3 నుంచి ఆయన తప్పుకుంటున్నట్లు చెప్పడంతో సినిమాపై అంచనాలు అన్నీ తారుమారు అయిపోయాయి. దీంతో అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ రంగంలోకి దిగింది. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వారు చర్యలు ప్రారంభించారు. దీంతో పరేష్ రావల్ దిగొచ్చినట్లు తెలుస్తోంది. హెరాఫెరీ-3లో తాను నటిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.'హేరా ఫేరి 3' సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నెల రోజుల తర్వాత తిరిగి అందులో భాగమవుతున్నానని నటుడు పరేష్ రావల్ తాజాగా స్పష్టం చేశారు. ఇటీవల పాడ్కాస్ట్లో కనిపించిన ఆయన, చిత్ర బృందంతో పరిస్థితులు చక్కబడ్డాయని, దర్శకుడు ప్రియదర్శన్తో మంచి స్నేహం ఉందని చెప్పారు. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టితో కలిసి ఈ ప్రాజెక్ట్లో చేరానని తెలిపారు. వారు ముగ్గురు మంచి స్నేహితులని పరేష్ రావల్ అన్నారు. ఆపై అక్షయ్ కుమార్ తనకు చిరకాల స్నేహితుడని ఆయన కితాబు ఇచ్చారు. రావల్ అకస్మాత్తుగా సినిమా నుండి నిష్క్రమించిన తర్వాత.., అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ అతనిపై రూ. 25 కోట్ల దావా వేసింది, అతని చర్యల వల్ల ఆర్థిక నష్టాలు సంభవించాయని, నిర్మాణ షెడ్యూల్కు అంతరాయం కలిగిందని ఆరోపించింది. ఈ కారణం వల్లే ఆయన తిరిగి ఈ ప్రాజెక్ట్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. పరేష్ రావల్ ఈ మూవీ కోసం రూ. 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఆయన ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అడ్వాన్స్ కూడా తీసుకున్నారట. అందుకే న్యాయపరమైన చిక్కులు వస్తాయిని తన మనసు మార్చుకున్నారని టాక్. బాలీవుడ్లో వినోదాత్మక చిత్రాభిమానులను అలరిస్తుందనే భారీ అంచనాల మధ్య రూపొందుతున్న చిత్ర ‘హేరా ఫేరి 3‘(Hera Pheri 3) . ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర కధానాయకుడు అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. -
ఓటీటీలో 'కె.విశ్వనాథ్' చివరి సినిమా.. 15 ఏళ్ల తర్వాత స్ట్రీమింగ్
కళాతపస్వి 'కె.విశ్వనాథ్' దర్శకత్వం వహించిన చివరి సినిమా 'శుభప్రదం'.. 15 ఏళ్ల తర్వాత ఓటీటీలో విడుదలైంది. 2010లో విడుదలైన ఈ చిత్రంలో అల్లరి నరేష్, మంజరి ఫడ్నిస్ జంటగా నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. పాటలు పరంగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కానీ, బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేదు. సాగర సంగమం, శ్రుతిలయలు, సూత్రధారులు, ఆపద్భాంధవుడు, శుభసంకల్పం... ఇలా ఒకదాన్ని మించి మరొకటి? సినిమాలను తెరకెక్కించిన దర్శకులు కె. విశ్వనాథ్.. అయితే, చాలా కాలం గ్యాప్ తర్వాత ఆయన 'శుభప్రదం' సినిమా కోసం మళ్లీ మెగాఫోన్ పట్టారు. కానీ, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చాలా బలహీనంగా ఉన్నాయని ఈ సినిమాపై విమర్శలు వచ్చాయి. హీరోయిన్ పాత్ర చాలా బలంగా ఉందని , హీరో పాత్ర అంతగా మెప్పించలేదని రివ్యూలు ఇచ్చారు. ప్రేక్షకుల హృదయాలను శుభప్రదం అస్సలు ఆకర్షించలేదని చాలామంది చెప్పారు. సుమారు 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి విశ్వనాథ్ చివరి సినిమా రావడంతో ఆయన అభిమానులు మాత్రం చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.'శుభప్రదం' సినిమా 'జియోహాట్స్టార్' (jiohotstar)లో సడెన్గా స్ట్రీమింగ్ అవుతుంది. ఈమేరకు సోషల్మీడియాలో ఒక పోస్టర్ను కూడా పంచుకున్నారు. కె.విశ్వనాథ్ సుమారు 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. అందులో 5 సినిమాలు జాతీయ ఉత్తమ చలనచిత్రం అవార్డ్స్ అందుకోవడం విశేషం. అంతటి గొప్ప దర్శకుడి చివరి సినిమా అందరికీ అందుబాటులో ఉండాలని ఓటీటీలో విడుదల చేశారు. 92 ఏళ్ల వయసులో కె. విశ్వనాథ్ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2023 ఫిబ్రవరి 2న శివైక్యం చెందారు. -
'కన్నప్ప' తర్వాత మంచు విష్ణు సినిమా ఇదే.. దర్శకుడు ఎవరంటే..?
'కన్నప్ప' సినిమా విజయం తర్వాత మంచు విష్ణు జోరు పెంచుతున్నారు. త్వరలో ఆయన నటించనున్న కొత్త సినిమాపై వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ను తెరకెక్కించనున్న దర్శకుడు ఎవరో కూడా సమాచారం బయటికి వచ్చింది. కన్నప్ప మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా మ్యాట్నీ, సాయింత్రం షోలు హౌస్ఫుల్ అవుతున్నాయి. దీంతో కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. ఇదే జోష్తో ఆయన మరో సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. 'కన్నప్ప'కు కొరియోగ్రాఫర్గా పనిచేసిన ప్రభుదేవా దర్శకత్వంలో మంచు విష్ణు తర్వాతి సినిమా ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త వైరల్ అవుతుంది.'కన్నప్ప' హిట్ తర్వాత మంచు విష్ణు- ప్రభుదేవా కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ రానుందని సోషల్మీడియాలో వార్తలు వస్తున్నాయి. స్టార్ కొరియోగ్రాఫర్గా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ప్రభుదేవా ఇప్పటికే కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. గతంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి వంటి సినిమాలతో దర్శకుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, కన్నప్ప సినిమాకు కొరియోగ్రాఫర్గా పనిచేసిన ప్రభుదేవా... మంచు విష్ణుతో మంచి స్నేహం ఏర్పడింది. దీంతో వారిద్దరూ కలిసి ఒక సినిమా చేయనున్నారని టాక్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం కమర్షియల్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ జానర్లో ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కూడా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు ఫ్యామిలీనే నిర్మించనుంది. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
విజయ్ సేతుపతి- నిత్యా మీనన్ సినిమా టీజర్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే
కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కొత్త సినిమా ‘తలైవా తలైవి’ (Thalaivan Thalaivi) టీజర్ను విడుదల చేశారు. ఆపై మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించారు. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాతీయ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ నిత్యా మీనన్ (Nithya Menen) ఆయనకు జోడీగా నటిస్తున్నారు. సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటుడు యోగిబాబు, సెంబన్ వినోద్ జోస్, దీపా శంకర్, శరవణన్, రోషిణి హరిప్రియన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. జులై 25న విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమిళ్తో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. -
కుబేర 2.. ధనుష్ను రీప్లేస్ చేసే దమ్మున్న తెలుగు హీరో
ప్రస్తుతం సీక్వెల్స్ యుగం నడుస్తోంది. పలు సినిమాలు ముందుగానే 1,2,3 భాగాలు ఉంటాయని ప్రకటించి తీస్తుంటే మరికొన్ని మాత్రం సినిమా సక్సెస్ తర్వాత మాత్రమే ఎనౌన్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా భారీ విజయాన్ని దక్కించుకోవడంతో పాటు భారీ చర్చోపచర్చలకు కారణం కూడా అయిన సినిమాగా కుబేర ను చెప్పుకోవచ్చు. ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయి మరిన్ని రికార్డులకు చేరువవుతోంది. మరోవైపు అనేక రకాల చర్చలకు కూడా ఈ సినిమా విజయం దారి తీసింది. ముఖ్యంగా మన టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల కుబేర సినిమాకు హీరోగా ధనుష్ను ఎంచుకోవడం ఆ సినిమా ప్రారంభాన్ని కన్నా ఇప్పుడే అత్యంత చర్చనీయాంశంగా మారింది. అంత బలమైన సబ్జెక్టు ఉన్న, లోతైన నటనకు అవకాశం ఉన్న చిత్రంలో మన తెలుగు నటుల్లో ఎవరూ ఎందుకు హీరోగా చేయలేకపోయారు? లేదా శేఖర్ కమ్ముల చేయించలేదా? లేక అసలు ధనుష్ స్థాయిలో పూర్తి డీ గ్లామర్ పాత్రలో నటించగల దమ్ము ఉన్న నటుడు టాలీవుడ్లోనే లేడా అంటూ సోషల్ మీడియా వేదికగా చర్చోపచర్చలు వాదోపవాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలోనే తొలుత టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండను శేఖర్ కమ్ముల బిచ్చగాడి పాత్ర కోసం సంప్రదించారని అయితే తిరస్కారం ఎదురైందని ఒక ప్రచారం కూడా వెలుగులోకి వచ్చింది. ఇలాంటివే మరికొన్ని కూడా వచ్చినప్పటికీ అవి ఎంత వరకూ నిజమో తెలీదు.. సరే ఒకరిద్దరు ఒప్పుకోలేదు మరి ఇంకెవరూ శేఖర్ కమ్ములకు తట్టలేదా..?అంటూ ఈ చర్చల సందర్భంగా కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారు తమ వంతుగా కొన్ని పేర్లు కూడా తెరమీదకు తెస్తున్నారు. అందులో అత్యధికులు పేర్కొంటున్న పేరు అనూహ్యంగా ఓ చిన్న హీరోది కావడం విశేషం.అతడే అల్లరి నరేష్. ప్రముఖ దివంగత దర్శకుడు ఇవివి సత్యనారాయణ ఇద్దరు కుమారుల్లో ఒకడైన అల్లరి నరేష్ ఒకప్పుడు సీనియర్ కామెడీ హీరో రాజేంద్ర ప్రసాద్ స్థానాన్ని భర్తీ చేస్తాడని చేసేశాడని కూడా భావించారు. అయితే కొంత కాలంగా ఆయన కెరీర్ అంత సంతృప్తికరంగా లేదు. అయితే జయాపజయాలకు అతీతంగా అల్లరి నరేష్ మాత్రం వైవిధ్యభరిత పాత్రల్లో తనను తాను నిరూపించుకుంటున్నాడు నేను, గమ్యం, నాంది, శంభో శివ శంభో, ఉగ్రం, బచ్చలమల్లి... వంటి చిత్రాల్లో అల్లరి నరేష్ నట విశ్వరూపాన్ని మనం చూశాం. ఈ చిత్రాల జయాపజయాలు అటుంచితే అల్లరి నరేష్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ నేపధ్యంలో ధనుష్ను అడ్డం పెట్టుకుని తెలుగు హీరోలు, నటులను తీసి పారేస్తున్నవారిని ఎదుర్కునే క్రమంలో అనేక మంది తెలుగు సినీ అభిమానులు అల్లరి నరేష్ను అస్త్రంగా మారాడు. అలాంటి వారిలో కొందరు మరో అడుగు ముందుకేసి కుబేర 2 సినిమా తీయాలని అందులో హీరోగా అల్లరి నరేష్ను ఎంచుకోవాలని సూచిస్తూ, ఆ సినిమా కధ సైతం అందుకు అనువుగానే ఉంటుందని ఊహాగానాలు చేసేస్తున్నారు. ఎంతో కాలంగా సినీ పరిశ్రమలో ఉన్నా స్టార్ హీరో కాలేకపోయినా, వైవిధ్య భరిత పాత్రలు ధరించడం ద్వారా స్టార్స్ని తలదన్నేలా సినీ ప్రేక్షకుల గుండెల్లో అల్లరి నరేష్ కొలువుదీరాడని కుబేర చిత్రం విజయానంతర పరిణామాలు తేల్చేశాయి. -
విడుదలై తర్వాత వెట్రిమారన్ చేస్తున్న సినిమా ఇదే
నటుడు శింబు గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈయన ఏ చిత్రంలో నటించినా సంచలనమే అవుతుంది. అదేవిధంగా కోలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన దర్శకుడు వెట్రిమారన్. ఈయన చిత్రాలు ఇతర చిత్రాలకు కంటే కూడా పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను ఎండగట్టే కథాంశాలే ఈయన చిత్రాలకు కంటెంట్ అవుతాయి. ఈయన ఇటీవల తెరకెక్కించిన విడుదలై, విడుదలై 2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. తదుపరి చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే చెప్పాలి. అలాంటి వారికి సంచలన న్యూస్ ఏమిటంటే నటుడు శింబు హీరోగా చిత్రం చేయబోతున్నారన్నదే. వీరి కాంబినేషన్లో రూపొందుతున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. కాగా ఇది ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఇది ఇంతకు ముందు వడచెన్నై చిత్రంలో దర్శకుడు అమీర్ పోషించిన రాజన్ వాగైయరో పాత్రతో కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని సమాచారం. దీంతో ఈ చిత్రానికి రాజన్ వాగైయారో అనే టైటిల్ నిర్ణయించినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రంలో దర్శకుడు నెల్సన్, నటుడు కవిన్ ప్రత్యేక పాత్రల్లో నటించనున్నట్లు, ఆండ్రియా(Andrea Jeremiah) ముఖ్యపాత్రను పోషించనున్నట్లు సమాచారం. చిత్ర షూటింగును వచ్చే వారంలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగే సోషల్ పొలిటికల్ కథాచిత్రంగా ఉంటుందని సమాచారం. కేజీ చిత్రాన్ని కలైపులి ఎస్ ధాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీన్ని వెట్రిమారన్ చాలా టైట్ షెడ్యూల్లో పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెలువడే అవకాశం ఉందని సమాచారం. -
ముందుంది మస్త్ మజా
2025 నేటితో సగం పూర్తయింది. అయితే ఈ ప్రథమార్ధంలో వచ్చిన స్టార్ హీరోల చిత్రాల సంఖ్య తక్కువే. కానీ ద్వితీయార్ధం ధూమ్ ధామ్గా ఉండబోతోంది. పలువురు స్టార్స్ వెండితెరపైకి దూసుకు రావడానికి రెడీ అయ్యారు. సో... 2025 సెకండాఫ్ హీరోల అభిమానులకు పండగే. అలాగే హీరోయిన్ల ఫ్యాన్స్కి కూడా. ‘ముందుంది మస్త్ మజా’ అంటూ థియేటర్లకు రానున్న ఆ చిత్రాల గురించి...ఈ ఏడాదే విశ్వంభర ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ‘విశ్వంభర’ వాయిదా పడింది. చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్ ఇది. త్రిష హీరోయిన్గా నటించగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ లీడ్ రోల్స్లో నటించారు. ఈ చిత్రంలో ఆంజనేయస్వామి భక్తుడు దొరబాబుపాత్రలో చిరంజీవి కనిపిస్తారని, ‘విశ్వంభర’ అనే పుస్తకం, ‘విశ్వంభర’ ప్రపంచం సినిమాలో కీలకంగా ఉంటాయని తెలిసింది. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ వర్క్స్తో యూనిట్ బిజీగా ఉంది. ‘విశ్వంభర’ ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది.అఖండ తాండవం హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో రానున్న తాజా చిత్రం ‘అఖండ 2’. 2021లో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’కు సీక్వెల్గా ‘అఖండ 2: తాండవం’ తెరకెక్కుతోంది. సంయుక్త ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారని టీజర్ స్పష్టం చేస్తోంది. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది. సైమన్ ఈజ్ కమింగ్ ధనుష్తో కలిసి ‘కుబేర’ సినిమాతో థియేటర్స్లోకి వచ్చారు నాగార్జున. శేఖర్ కమ్ముల దర్శకత్వంలోని ఈ మూవీలో నాగార్జున చేసిన లీడ్ రోల్ ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈసారి అంతకంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉండే రోల్ని నాగార్జున ‘కూలీ’లో చేశారు. రజనీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో సైమన్ అనే పవర్ఫుల్ విలన్పాత్రలో నాగార్జున కనిపిస్తారు. నాగార్జున పూర్తి స్థాయి విలన్గా కనిపించనున్న ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఇటు వీరమల్లు... అటు ఓజీ పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు, ఓజీ’... ఈ రెండు సినిమాలూ ఈ ఏడాదే విడుదల కాన్నాయి. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ‘హరిహర వీరమల్లు’ రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. తొలి భాగం ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’గా జూలై 24న విడుదల కానుంది. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధీ అగర్వాల్ హీరోయిన్. ఏయం రత్నం సమర్పణలో అద్దంకి దయాకర్ రావు నిర్మించారు. ఇక పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘ఓజీ’. ఇందులో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్. ఈ గ్యాంగ్స్టర్ సినిమాను సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 25న ఈ చిత్రం రిలీజ్ కానుంది.పోలీసాఫీసర్ లక్ష్మణ్ భేరీరవితేజ పోలీసాఫీసర్గా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లక్ష్మణ్ భేరీ అనే పవర్ఫుల్పోలీసాఫీసర్పాత్రలో రవితేజ కనిపిస్తారు. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ఇది. షూటింగ్ దాదాపు పూర్తయింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. రాజా సాబ్ రెడీ విష్ణు మంచు టైటిల్ రోల్ చేసిన ‘కన్నప్ప’ సినిమాలో రుద్రగా కనిపించి ప్రేక్షకులను అలరించారు ప్రభాస్. కాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజాసాబ్’ డిసెంబరు 5న విడుదల కానుంది. ఈ హారర్ కామెడీ యాక్షన్ సినిమాను మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దికుమార్ హీరోయిన్లు. తాతా మనవళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రభాస్ తాతగా సంజయ్ దత్ కనిపిస్తారు.ఆంధ్రా కింగ్ తాలూకా... ఓ సినిమా హీరోకి, ఆ హీరో ఫ్యాన్కి మధ్యలో జరిగే సంఘటనలతో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా రూపొందుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరో అభిమానిగా రామ్, సినిమా స్టార్ సూర్యకుమార్గా ఉపేంద్ర కనిపిస్తారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. పి. మహేశ్బాబు దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ రాజమండ్రిలో ఆరంభమైంది. ఈ సినిమా విడుదల తేదీపై త్వరలో స్పష్టత రానుంది. సెంటిమెంటల్ తమ్ముడు ఈ ఏడాది మార్చిలో నితిన్ నుంచి ‘రాబిన్హుడ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూలైలో ‘తమ్ముడు’ సినిమాతో మరోసారి వస్తున్నారు నితిన్. అక్కా తమ్ముడు సెంటిమెంట్తో వస్తున్న ఈ సినిమాలో సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ, లయ కీలకపాత్రధారులు. లయ తమ్ముడిపాత్రలో నితిన్ కనిపిస్తారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్ కానుంది. త్వరలో కింగ్డమ్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’. ఈ సినిమా రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్పై మేకర్స్ నుంచి ఇంకా స్పష్టత రాలేదు కానీ జూలై చివర్లో లేదా ఆగస్టులో ‘కింగ్డమ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. అంతేకాదు... ఈ సినిమా రెండు డిఫరెంట్ టైమ్లైన్స్లో సాగుతుందని టాక్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ప్రేమికులు క్రైమ్ చేయాల్సి వస్తే! ఈ ఏడాది మే 1న నాని హీరోగా చేసిన ‘హిట్ 3’ సినిమాలో అడవి శేష్ గెస్ట్ రోల్ చేశారు. ఇక ఆయన సోలో హీరోగా నటిస్తున్న ‘డెకాయిట్: ఏ లవ్స్టోరీ’ డిసెంబరు 25న రిలీజ్ కానుంది. ఈ క్రైమ్ లవ్స్టోరీ థ్రిల్లర్ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా, అనురాగ్ కశ్యప్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. బ్రేకప్ చేప్పుకున్న ప్రేమికులు కలిసి ఓ క్రైమ్ చేయాల్సి వస్తే ఏం జరుగుతుంది? అన్నదే ఈ సినిమా కథనం అని తెలిసింది. సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమాకు సునీల్ నారంగ్ సహ–నిర్మాత.కిష్కింధపురిలో...బెల్లకొండ సాయిశ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. అలాగే లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో ‘హైంధవ’, సాగర్కె. చంద్ర దర్శకత్వంలో ‘టైసన్ నాయుడు’ సినిమాలు కూడా చేస్తున్నారు సాయిశ్రీనివాస్. ఈ రెండు చిత్రాల్లో ఏదో ఒక చిత్రం ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది.సోషియో ఫ్యాంటసీ ‘స్వయంభూ’ నిఖిల్ హీరోగా నటిస్తున్నపాన్–ఇండియా మూవీ ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రంలో నిఖిల్ ఒక యోధుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో సంయుక్త, నభా నటేశ్ హీరోయిన్లు. ఇందులో హీరో మాత్రమే కాదు... హీరోయిన్లు కూడా యాక్షన్ సన్నివేశాల్లో కనిపిస్తారు. ‘ఠాగూర్’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది.లవ్స్టోరీ తెలుసు కదాఈ ఏడాది వేసవిలో ‘జాక్’ సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ థియేటర్స్కి వచ్చారు. ఇక ఈ దీపావళికి ‘తెలుసు కదా’ అనే లవ్స్టోరీతో రానున్నారు సిద్ధు. స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 17న రిలీజ్ కానుంది. ముక్కోణపు ప్రేమకథగా ‘తెలుసు కదా’ ఉంటుందట. ఏటిగట్టు సంబరాలు సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ మూవీ ‘సంబరాల ఏటిగట్టు’. రాయలసీమ బ్యాక్డ్రాప్లో రోహిత్ కేపీ దర్శకత్వంలో కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఐశ్వర్యా లక్ష్మి, అనన్య నాగళ్ల, శ్రీకాంత్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ 75 శాతం పూర్తయింది. ఈ సినిమా సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది. మిరాయ్ అడ్వెంచర్ ‘హను–మాన్’ వంటి సక్సెస్ఫుల్ చిత్రం తర్వాత హీరో తేజ సజ్జా నటిస్తున్న అడ్వెంచరస్ యాక్షన్ మూవీ ‘మిరాయ్’. ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్. మంచు మనోజ్ విలన్గా చేస్తున్నారు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది. ఇంకా నవీన్చంద్ర ‘షో టైమ్’, ఆది సాయికుమార్ ‘శంబాల’, సుహాస్ ‘ఓ భామ అయ్యో రామ’తోపాటు పలు మీడియమ్, స్మాల్ బడ్జెట్ చిత్రాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. ఉమన్ పవర్ఒకవైపు స్టార్ హీరోల చిత్రాలు వరుసగా విడుదలవుతుంటే... స్టార్ హీరోయిన్ల చిత్రాలూ దూసుకు వస్తున్నాయి. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో తమ పవర్ చూపించడానికి అనుష్క, లావణ్యా త్రిపాఠి, రష్మికా మందన్నా వంటి తారలు రెడీ అయ్యారు. ⇒ పగ, ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైన ఓ బాధిత గిరిజన మహిళ నేర ప్రపంచంలోకి అడుగుపెట్టి, లెజెండ్గా ఎలా ఎదిగింది? అనే కథాంశంతో అనుష్క ‘ఘాటీ’ రూపొందింది. క్రిష్ దర్శకత్వంలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో జూలై 11న విడుదల కానుంది. ఈ చిత్రంలో తమిళ హీరో విక్రమ్ ప్రభు లీడ్ రోల్ చేశారు. ⇒ కుటుంబ బంధాలను నిలపడానికి సతీ లీలావతి ఏం చేసింది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘సతీ లీలావతి’. లావణ్యా త్రిపాఠి టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రంలో దేవ్ మోహన్ ఆమె భర్తపాత్ర చేశారు. భార్యాభర్తల అనుబంధాన్ని ఎమోషనల్గా, ఎంటర్టైనింగ్గా చూపిస్తూ, తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో నాగమోహన్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. . ⇒ స్టార్ హీరోల చిత్రాల్లోనూ గుర్తింపు తెచ్చుకునేపాత్రలు చేస్తూ దూసుకెళుతున్న రష్మికా మందన్నా నటించిన తొలి ఉమన్ సెంట్రిక్ మూవీ ‘ది గర్ల్ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రం విడుదల తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి ఓ లీడ్ రోల్ చేశారు. ఈ ప్రేమకథా చిత్రంలో క్లిష్టమైన రిలేషన్షిప్ని ఎదుర్కొనే కాలేజీ విద్యార్థినిగా రష్మిక నటించారు. ఇక ఇది కాకుండా ‘మైసా’ అనే మరో ఫిమేల్ సెంట్రిక్ మూవీ కూడా రష్మిక డైరీలో ఉంది. ⇒ అనుపమా పరమేశ్వరన్, దర్శనా రాజేంద్రన్, సంగీత ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘పరదా’. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో విజయ్ డొంకాడ, పీవీ శ్రీనివాసులు, శ్రీధర్ మక్కువ ఈ సినిమాను నిర్మించారు. మూఢ నమ్మకాలు, మహిళా సాధికారిత వంటి అంశాలతో రూపొందిన ‘పరదా’ ఈ ఏడాదే రిలీజ్ కానుంది.⇒ ఇంకా కీర్తీ సురేష్ ‘రివాల్వర్ రీటా’ అంటూ టైటిల్ రోల్లో ఆగస్ట్ 27న థియేటర్స్కు రానున్నారు. జేకే చంద్రు దర్శకత్వంలో రూపొందిన ఈ తమిళ చిత్రం తెలుగులోనూ రిలీజ్ అయ్యే చాన్స్ ఉంది. అలాగే వరలక్ష్మిపోలీసాఫీసర్గా నటించిన ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో సింగపూర్ బాలకృష్ణ, మల్లెల ప్రభాకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంకా మరికొందరు నాయికలు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో తమ పవర్ని నిరూపించుకోనున్నారు. కన్యారాశి టైమ్ వచ్చిందిహిట్ మూవీ ‘ఈ నగరానికి ఏమైంది’ (2018)కి సీక్వెల్గా ‘ఈఎన్ఈ రిపీట్’ సినిమా రానుంది. ‘ఏలినాటి శనిపోయింది.. కన్యారాశి టైమ్ వచ్చింది’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. తొలి భాగంలో నటించిన విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమాను సీక్వెల్లోనూ నటించనున్నారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ సీక్వెల్కు దర్శకత్వం వహించనున్నారు. డి. సురేష్బాబు, సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంగీతం: వివేక్ సాగర్.ఫీల్గుడ్ లవ్స్టోరీనరేశ్ అగస్త్య హీరోగా విపిన్ దర్శకత్వంలో ఉమా దేవి కోట నిర్మించిన చిత్రం ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’. ఈ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాలో రబియా ఖతూన్ కథానాయికగా నటించారు. ఈ సినిమాను జూలై 17న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘ఫీల్గుడ్ లవ్స్టోరీతో రూపొందించిన ఈ చిత్రంలో మ్యూజిక్కి మంచి స్కోప్ ఉంది. జస్టిన్ ప్రభాకరన్ మంచి ట్యూన్స్ ఇచ్చారు. ఈ చిత్రం మంచి అనుభూతినిచ్చేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
రెమ్యునరేషన్ గురించి అస్సలు ఆలోచించను: కీర్తి సురేశ్
కీర్తిసురేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం ఉప్పు కప్పురంబు. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో సుహాస్ కీలక పాత్ర పోషించారు. సెటైరికల్ కామెడీ వస్తోన్న ఈ సినిమాకు ఐవీ శశి దర్శకత్వం వహిచారు. రాధికా ఎల్ నిర్మించిన ఈ చిత్రానికి వసంత్ మురళీకృష్ణ మరింగంటి కథ అందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ కానుంది.ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు సుహాస్, కీర్తి సురేశ్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కీర్తి సురేశ్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన రెమ్యునరేషన్ గురించి కూడా మాట్లాడింది. నా విషయంలో పారితోషికం అనేది లాస్ట్ ఆప్షన్ అని చెప్పింది. తనకు మొదట కథనే చాలా ముఖ్యమని తెలిపింది. డిఫరెంట్ రోల్స్ చేయడమే నా లక్ష్యమని పేర్కొంది. ప్రతి ఒక్క సినిమాలో కొత్తగా చేయాలని ఉంటుందని కీర్తి సురేశ్ వెల్లడించింది. సినిమాలో ఛాలెంజ్ రోల్ చేయడం తనకిష్టమని తెలిపింది. కాగా.. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా జూలై 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. -
రెజీనా గ్లామరస్ లుక్స్... బర్త్ డే పార్టీలో తమన్నా చిల్!
బర్త్ డే పార్టీలో ఎంజాయ్ చేస్తోన్న తమన్నా భాటియా..వెబ్ సిరీస్ జ్ఞాపకాల్లో శ్వేతాబసు ప్రసాద్..గ్రీన్ డ్రెస్లో అందాలు ఆరబోస్తోన్న రెజీనా కసాండ్రా..వెకేషన్లో చిల్ అవుతోన్న శిల్పా శిరోద్కర్..డిఫరెంట్ లుక్స్లో ఆదా శర్మ పోజులు పట్టు పరికిణీలో నటి శృతిక అర్జున్ హోయలు.. View this post on Instagram A post shared by Shrutika Arjun (@shrutika_arjun) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra)