breaking news
Movies
-
ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్.. ఎమోషనల్ సాంగ్ ఫుల్ వీడియో!
లవ్ టుడే, డ్రాగన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్. ఇటీవలే 'డ్యూడ్' మూవీతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీపావళి సందర్భంగా రిలీజైన ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాడు ప్రదీప్ రంగనాథన్. ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ వీడియో సాంగ్ను రిలీజ్ చేశారు. బాగుండు పో.. అంటూ సాగే ఫుల్ వీడియో పాటను విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ సాంగ్ యూత్ ఆడియన్స్ను అలరిస్తోంది. ఈ ఎమోషనల్ లవ్ సాంగ్కు రాజజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. సంజీత్ హెగ్డే, సాయి అభ్యంకర్ ఆలపించారు. ఈ పాటను సాయి అభ్యంకర్ కంపోజ్ చేశారు. కాగా.. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. -
‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ రివ్యూ
మూవీ: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోనటీనటులు: తిరువీర్, టీనా శ్రావ్య, నరేంద్ర రవి, యామిని నాగేశ్వర్, వాల్తేర్ విజయ్, ప్రభావతి, మాధవి, జోగారావు, బ్యాక్ భాషా తదితరులునిర్మాణ సంస్థ: 7పీఎం ప్రొడక్షన్, పప్పెట్ షో ప్రొడక్షన్నిర్మాత: అగరం సందీప్రచన, దర్శకత్వం: రాహుల్ శ్రీనివాస్సంగీతం: సురేష్ బొబ్బిలిసినిమాటోగ్రఫి: సోమశేఖర్ఎడిటర్: నరేష్ అడుపవిడుదల తేది: నవంబర్ 7, 2025కథేంటంటే.. విజయనగరం జిల్లాకు చెందిన రమేశ్(తీరువీర్) ఓ ఫోటోగ్రాఫర్. ఊర్లోనే ఓ ఫోటో స్టూడియో పెట్టుకొని పెళ్లిళ్లతో పాటు ఇతర కార్యక్రమాల ఫోటోలు తీస్తుంటాడు. అతని అసిస్టెంట్ రామ్(రోహన్ రాయ్)కి పనిమీద కంటే తిండిమీదే ధ్యాస ఎక్కువ. రామ్ చేసే చిన్న చిన్న తప్పులను పట్టించుకోకుండా..తన స్టూడియోకి ఎదురుగా ఉన్న పంజాయితీ ఆఫీస్లో పనిచేసే హేమ(టీనా శ్రావ్య)ను ప్రేమిస్తూ ఉంటాడు రమేశ్. హేమకు కూడా రమేశ్ అంటే ఇష్టమే కానీ..ఒకరికొకరు బయటకు చెప్పుకోకుండా చూపులతోనే ప్రేమించుకుంటూ జీవితాన్ని హాయిగా గడిపేస్తుంటారు. కట్ చేస్తే.. ఓ రోజు అదే ప్రాంతానికి చెందిన ఆనంద్(నరేంద్ర రవి) రమేశ్ స్టూడియో దగ్గరకు వచ్చి.. జిల్లాలోనే ది బెస్ట్ ప్రీవెడ్డింగ్ షూట్ చేయాలని అడ్వాన్స్ ఇచ్చివెళ్లిపోతారు. ఔట్డోర్లో షూటింగ్ అంటే..తనకు కాబోయే భార్య సౌందర్య(యామిని)తీసుకొని జిల్లాకు వెళ్తాడు. దాదాపు లక్షన్నర వరకు ఖర్చు చేయించి..షూట్ కంప్లీట్ చేస్తాడు. ఆ షూట్ ఫుటేజ్ చిప్ని తన అసిస్టెంట్ రామ్ కి ఇచ్చి..స్టూడియోలో పెట్టమని చెప్తాడు. పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టని రామ్.. ఆ చిప్ని ఎక్కడో పారేస్తాడు. ఈ విషయం ఆనంద్కు తెలిస్తే..ఎక్కడ చంపేస్తాడో అనే భయంతో రమేశ్ కీలక నిర్ణయం తీసుకుంటాడు. అదేంటి? తన నిర్ణయం తప్పని తెలిసిన తర్వాత రమేశ్ ఏం చేశాడు? ఆనంద్, సౌందర్యల పెళ్లి ఆగిపోవడానికి గల కారణం ఏంటి? రమేశ్ తీసుకున్న నిర్ణయం ఆయనతో పాటు ఆనంద్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించింది? ఈ సమస్య నుంచి బయటపడేందుకు రమేశ్కు హేమ ఎలాంటి సహాయం చేసింది? చివరకు ఆనంద్, సౌందర్యల పెళ్లి జరిగిందా? లేదా? అనేది తెలియాలంటే థియేటర్స్లో సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకు పెద్ద కథ అవరసరం లేదు. సింపుల్ స్టోరీ అయినా సరే.. చెప్పాలనుకునే పాయింట్ని సిన్సియర్గా తెరపై చూపిస్తే చాలు.. ఆ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ చాలా సింపుల్ కథను ఎంచుకొని.. కమర్షియల్ ఎలిమెంట్స్, ఎలివేషన్స్ జోలికి పోకుండా.. లీనియర్ స్క్రీన్ ప్లేతో ఎక్కడ బోర్ కొట్టించకుండా కథనాన్ని నడిపించాడు. నటీనటుల ఎంపిక విషయంలోనూ ఆయన సక్సెస్ అయ్యాడు. స్టార్స్ని కాకుండా కంటెంట్ని నమ్ముకొని ఈ సినిమాను తెరకెక్కించాడు. ఒక్క సంఘటన మనిషి జీవితాన్ని ఎలా మారుస్తుంది? సందర్భాన్ని బట్టి మనిషి స్వభావం ఎలా మారుతుందనే విషయాన్ని కామెడీ వేలో చక్కగా చూపించారు. ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు వినోదాత్మకంగానే సాగుతుంది. ఎమోషనల్ సన్నివేశాలు తక్కువే ఉన్నప్పటికీ.. అవి అలా గుర్తిండిపోతాయి. ఫస్టాఫ్ మొత్తం వినోదాత్మకంగా సాగుతుంది. ఆనంద్, సౌందర్యల ప్రీ వెడ్డింగ్ షూట్.. చిప్ పోవడం.. ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకు హీరో చేసే ప్రయత్నాలు...ఇవన్నీ నవ్వులు పూయిస్తాయి. పెళ్లి చెడగొట్టేందుకు హీరో చేసే ప్రయత్నాలు..కొంతవరకు సాగదీతగా అనిపిస్తాయి. సెకండాఫ్లో కథనాన్ని పరుగులు పెట్టించాడు. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్లను కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఆనంద్, సౌందర్యలు విడిపోవడానికి గల కారణం నవ్విస్తూనే..ఆలోచింపజేస్తూంది. ఆటో సీన్తో అందరిని ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ భావోద్వేగానికి గురి చేస్తాయి. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. అవేవి పట్టించుకోకుండా చూస్తే.. అందరికీ నచ్చేస్తుంది. కామెడీ పేరుతో వల్గారిటీని చూపిస్తున్న ఈ రోజుల్లో.. ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు. ఈ విషయంలో ఆయనను అభినందించాల్సిందే. ఎవరెలా చేశారంటే.. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలను ఎంచుకోవడంలో తీరువీర్ దిట్ట. ఈ సారి కూడా అలాంటి కథతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫోటోగ్రాఫర్ రమేశ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. తెరపై అమాయకత్వంగా కనిపిస్తూనే..హీరోయిజాన్ని పండించాడు. ఇక ఈ సినిమాలో బాగా పండిన పాత్ర నరేంద్ర రవిది. పెళ్లికొడుకు ఆనంద్ పాత్రలో ఆయన జీవించేశాడు. నవ్విస్తూనే కొన్ని చోట్ల భావోధ్వేగానికి గురి చేస్తాడు. హేమా పాత్రకు టీనా శ్రావ్య న్యాయం చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్ మరోసారి తనదైన నటనతో నవ్వులు పూయించాడు. యామిని నాగేశ్వర్, వాల్తేర్ విజయ్, ప్రభావతి, మాధవి, జోగారావుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక నిపుణులకొస్తే సురేశ్ బొబ్బిలి సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. సోమశేఖర్ సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
శుక్రవారం సినిమాల జాతర.. ఓటీటీల్లో ఏకంగా 17 చిత్రాలు!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలా బాక్సాఫీస్ వద్ద సినిమాలు సందడి. అలా ఈ ఫ్రైడే సుధీర్ బాబు నటించిన జటాధర, రష్మిక ది గర్ల్ఫ్రెండ్, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ప్రేమిస్తున్నా లాంటి చిత్రాలు థియేటర్లలో రిలీజవుతున్నాయి. వీటితో పాటు ఆర్యన్, ఫీనిక్స్ లాంటి డబ్బింగ్ సినిమాలు వచ్చేస్తున్నాయి. వీటిలో ఒకట్రెండ్ చిత్రాలపైనే ఆడియన్స్లో ఆసక్తి నెలకొంది. వీటి సంగతి పక్కన పెడితే.. శుక్రవారం ఓటీటీల్లోనూ సినిమాలు స్ట్రీమింగ్కు రెడీ అవుతుంటాయి. అలా ఈ వారంలో తెలుగులో చిరంజీవ మూవీ స్ట్రీమింగ్కు రానుంది. బాలీవుడ్ నుంచి ఏక్ చతుర్ నార్ అనే సినిమా వస్తోంది. వీటితో పాటు పలు హాలీవుడ్ మూవీస్, వెబ్ సిరీసులు కూడా సందడి చేయనున్నాయి. మరి ఏయే చిత్రాలు ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో తెలియాలంటే మీరు కూడా ఓ లుక్కేయండి. ఈ శుక్రవారం ఓటీటీ సినిమాలు..నెట్ఫ్లిక్స్ ఏక్ చతుర్ నార్(హిందీ సినిమా) - నవంబరు 07 బారాముల్లా (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 07 ఫ్రాంకెన్ స్టెయిన్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 07 మ్యాంగో(హాలీవుడ్ మూవీ)- నవంబరు 07 యాజ్ యూ స్టూడ్ బై-(కొరియన్ థ్రిల్లర్ మూవీ)- నవంబరు 07 గ్రూమ్ అండ్ టూ బ్రైడ్స్(హాలీవుడ్ సినిమా)- నవంబరు 07 జియో హాట్స్టార్ఆల్ హర్ ఫాల్ట్- (హాలీవుడ్ మూవీ)- నవంబరు 07అమెజాన్ ప్రైమ్ వీడియోమ్యాక్స్టన్ హాల్ (జర్మన్ సిరీస్) - నవంబరు 07ఆహా చిరంజీవ (తెలుగు చిత్రం) - నవంబరు 07జీ5 కిస్ (తమిళ సినిమా) - నవంబరు 07 తోడే దూర్ తోడే పాస్ (హిందీ వెబ్ సిరీస్) - నవంబరు 07సోనీ లివ్ మహారాణి సీజన్ 4 (హిందీ వెబ్ సిరీస్) - నవంబరు 07ఆపిల్ ప్లస్ టీవీ ప్లరిబస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - నవంబరు 07మనోరమ మ్యాక్స్ కరమ్ (మలయాళ సినిమా) - నవంబరు 07లయన్స్ గేట్ ప్లే అర్జున్ చక్రవర్తి (తెలుగు సినిమా) - నవంబరు 07 ద హ్యాక్ సీజన్- 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - నవంబరు 07సన్ నెక్ట్స్ఎక్కా(కన్నడ సినిమా)- నవంబరు 07 -
'సినిమా తీయడం గొప్ప కాదు'.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ రోజుల్లో సినిమాలు తీయడం గొప్పకాదన్నారు. మనం తీసిన సినిమాకు ఆడియన్స్ను రప్పించడమే అసలైన సవాల్ అని తెలిపారు. ప్రెస్మీట్స్ పెట్టి ట్రైలర్స్ లాంఛ్ చేయడం కంటే.. మీరిచ్చే కంటెంట్తో ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టాలని సూచించారు. మార్నింగ్ షోకు ఆడియన్స్ తీసుకురావడమే గొప్పదనమన్నారు. మీడియా వాళ్లు కూడా పాజిటివ్గా రివ్యూలు ఇస్తే సినిమా ఇండస్ట్రీకి ఎంతో మేలని దిల్ రాజు అన్నారు. మీరు అలా రాసినప్పుడే మార్నింగ్ ఫస్ట్ షోలకు కలెక్షన్స్ పెరుగుతున్నాయని తెలిపారు. సంతాన ప్రాప్తిరస్తు మూవీ ట్రైలర్ లాంఛ్కు హాజరైన దిల్ రాజు మాట్లాడారు.కాగా.. విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం సంతాన ప్రాప్తిరస్తు(Santhana Prapthirasthu). ఈ మూవీకి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో సంతానం కోసం యువత పడే పాట్లను ఇందులో చూపించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. సినిమాలు తీయడాలు, ప్రెస్ మెట్లు పెట్టి ట్రైలర్లు లాంచ్ చేయడం గొప్ప కాదు..మార్నింగ్ షోకు జనాలను తీసుకొచ్చి, సినిమా సక్సెస్ అనిపించుకోవడమే గొప్ప! - #DilRaju#SanthanaPrapthirasthu pic.twitter.com/MxmRCTmP9s— Suresh PRO (@SureshPRO_) November 6, 2025 -
మహిళా క్రికెటర్ కధతో సినిమా... నవంబరు 7న మళ్లీ విడుదల...
కళ అంటే కాసుల్ని మాత్రమే కాదు కలల్ని ఒడిసిపట్టేది కూడా. సినిమా అంటే వ్యాపారం కావచ్చు కానీ వ్యాపారం మాత్రమే కారాదు. దీన్ని గుర్తించిన సినీ రూపకర్తలకు డబ్బులకు మించిన ఆత్మసంతృప్తిని ఆనందాన్ని కొన్ని సినిమాలు అరుదుగానైనా అందిస్తాయి. బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ అండ్ టీమ్ ఇప్పుడు అచ్చంగా అలాంటి ఆనందాన్నే అనుభవిస్తున్నారు. అవును . ప్రస్తుతం మహిళా క్రికెట్ విజయ విహారంలో ఊగిపోతున్న భారతావని సంబరంలో సగర్వంగా పాలు పంచుకోవడానికి వారికి సరైన కారణం ఉంది మరి.అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan), సయామి ఖేర్ నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘ఘూమర్’(Ghoomer Movie) ఈ నవంబర్ 7న తిరిగి థియేటర్లలోకి రానుంది. మాములూగా అయితే ఇది కేవలం ఓ సినిమా రీ రిలీజ్ మాత్రమే. కానీ భారత మహిళా క్రికెట్ జట్టు తొలి ఐసిసి ప్రపంచ కప్ దక్కించుకున్న సందర్భంలో ఈ విజయానికి ఈ సినిమా ఓ కళాత్మక అభినందన కూడా. ఈ విషయాన్ని సినిమా టీమ్ సగర్వంగా ప్రకటించింది.గత బుధవారం ప్రొడక్షన్ బ్యానర్ హోప్ ప్రొడక్షన్ ్స తమ ఇన్ స్ట్రాగామ్లో టీమ్ ఇండియా విజయం సాధించిన చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని అభినందన సందేశాన్ని అందిస్తూ ఒక నోట్ రాసింది. ‘‘ అభిరుచి, పట్టుదల నమ్మకపు శక్తి.ఘూమర్ రిటర్న్స్ తో భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ విజేతలకు అభినందనలు అందిస్తున్నాం’’ అని అభిషేక్ సయామి నటించిన చిత్రం పోస్టర్తో పాటు పంచుకుంది.గత 2023లో విడుదలైన సినిమా ఘూమర్. తన అంతర్జాతీయ అరంగేట్రానికి ముందు ప్రమాదంలో కుడి చేయి కోల్పోయిన ఔత్సాహిక క్రికెటర్ అనినా (సయామి)అనే మహిళా క్రికెటర్ పోరాటం చుట్టూ తిరుగుతుంది. వృత్తి పరంగా అవమానానికి గురైన మాజీ క్రికెటర్ పాడీ (అభిషేక్) ఆమెకు ఎడమచేతి వాటం బౌలర్గా మారడానికి శిక్షణ ఇస్తాడు, ఆమె భారత మహిళా క్రికెట్ జట్టులోకి తిరిగి రావడానికి సహాయపడటానికి ’ఘూమర్’ అనే కొత్త బౌలింగ్ టెక్నిక్ను కనిపెట్టడం ద్వారా ఆమెకు కొత్త ఆశను కలలను ఆయన అందిస్తాడు. ఈ చిత్రం హంగేరియన్ షూటర్ కరోలీ టకాక్స్ జీవిత కథ నుంచి ప్రేరణ పొందింది, ఆయన తన కుడి చేతికి తీవ్రంగా గాయమైన తర్వాత కూడా పట్టుదల సడలకుండా తన ఎడమ చేతితో రెండు ఒలింపిక్ బంగారు పతకాలను గెలుచుకున్నాడు.ఈ సందర్భంగా దర్శకుడు ఆర్. బాల్కి తమ చిత్రం తిరిగి విడుదల కావడం పట్ల తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. ‘ఘూమర్ మహిళల క్రికెట్ కు మహిళా క్రికెటర్ల స్థితిస్థాపకతకు ఒక పురస్కారం. ఘూమర్ను చిత్రీకరించిన అదే స్టేడియంలోనే వారు ఘన విజయాన్ని సాధించారు’’ అని బాల్కీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విజయాలను కీర్తించేవారు ఎందరో. కానీ స్ఫూర్తిని అందించే వారు కొందరే. అలాంటివారికి ఆ విజయాలు ఎప్పుడూ రుణపడి ఉంటాయి. వ్యాపార లెక్కలకు అతీతంగా ఇలాంటి స్ఫూర్దిదాయక సినిమాలు మరిన్ని రావాలని ఆశిద్ధాం. -
పిల్లల కోసం ఆ మాత్రం చేయలేరా?. సంతాన ప్రాప్తిరస్తు ట్రైలర్ చూశారా?
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం సంతాన ప్రాప్తిరస్తు(Santhana Prapthirasthu Trailer). ఈ మూవీకి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో సంతానం కోసం యువత పడే పాట్లను ఇందులో చూపించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే లవ్, పెళ్లి, పిల్లలు అనే కాన్సెప్ట్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. చెప్పినమాట విననివాడే కొడుకు.. చెప్పినమాట విన్నట్లు నటించేవాళ్లే కూతురు.. అంతే పెద్దా తేడా లేదు... అనే డైలాగ్స్ నవ్వులు తెప్పిస్తున్నాయి. ప్రేమ పెళ్లి తర్వాత పిల్లల కోసం మన హీరో ఎన్ని కష్టాలు పడ్డారనేదే సంతాన ప్రాప్తిరస్తు. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి. ఈ చిత్రాన్ని పిల్లల దినోత్సవం కానుకగా నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతమందించారు. -
విశ్వక్ సేన్- అనుదీప్ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్
మాస్ కా దాస్గా పేరున్న టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen). మాస్ చిత్రాలతో పాటు కామెడీ ఎంటర్టైనర్లతోనూ మెప్పించారు. ఈ ఏడాది లైలా అనే రొమాంటిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ సినిమా అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం మరో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ ఫంకీ(FUNKY). ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో కయాద్ లోహర్ హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు వెల్లడించారు. 2026 ఏప్రిల్ 3న సమ్మర్లో థియేటర్లలో ఫంకీ సందడి చేయనుందని తెలిపారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ను పంచుకున్నారు. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వీకే నరేశ్, వీటీవీ గణేశ్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. Unlimited Laughter. 😆Unlimited Entertainment. 😎Unlimited FUN! 🥳#FUNKY GRAND RELEASE WORLDWIDE on APRIL 3rd, 2026. 🎬#FunkyFromApril3rd 🤘🏻Mass Ka Das @VishwakSenActor @11Lohar @anudeepfilm @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo @NavinNooli @Venkatupputuri… pic.twitter.com/KLdhiJrMWL— Sithara Entertainments (@SitharaEnts) November 6, 2025 -
రష్మిక - విజయ్ పెళ్లి.. డేట్, వేదిక ఫిక్స్ చేశారుగా!
టాలీవుడ్లో మోస్ట్ క్రేజ్ ఉన్న జంటల్లో వీరిద్దరు ముందు వరుసలో ఉంటారు. వీళ్లు ఎక్కడా కనిపించినా సరే డేటింగ్ వార్తలు పుట్టుకొస్తాయి. చాలాసార్లు ఈ జంటపై రూమర్స్ వినిపించినా అస్సలు పట్టించుకోలేదు. అంతేకాదు ఎప్పుడు వాటిపై స్పందించలేదు కూడా. అలాంటిది ఇటీవలే వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయినట్లు వార్చలొచ్చాయి. ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటనైతే రాలేదు. రష్మిక, విజయ్ చేతులకు ఉన్న రింగ్స్ చూసిన ఫ్యాన్స్ మాత్రం ఎంగేజ్మెంట్ అయినట్లు ఫిక్సయిపోయారు.అయితే నిశ్చితార్థం గురించి ఇంకా అధికారిక ప్రకటనే రాలేదు. కానీ రష్మిక- విజయ్ పెళ్లిపై అప్పుడే చర్చ మొదలైంది. వీరిద్దరు పెళ్లి ఎక్కడ చేసుకుంటారు? సింపుల్గానా?..డెస్టినేషన్ వెడ్డింగా? అని సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. కొందరైతే పెళ్లి వేదికను కూడా ప్రకటించేశారు. అంతే కాదండోయ్ తేదీ, ముహుర్తం కూడా ఖరారు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ జంట ఒక్కనున్నారని నెట్టింట పోస్ట్ వైరలవుతోంది. రాజస్థాన్ ఉదయ్పూర్లోని కోట ఈ గ్రాండ్ వెడ్డింగ్కు వేదిక కానుందన్న వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇది ఎంతవరకు నిజమనే మాట పక్కనపెడితే రష్మిక- విజయ్ పెళ్లి విషయంలో వారికంటే ఆడియన్సే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. ఏదేమైనా రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి కోసం టాలీవుడ్ ప్రియులే కాదు.. దక్షిణాది ఫ్యాన్స్ సైతం ఎంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇటీవల ఓ టాక్ షోకు హాజరైన రష్మిక తన చేతికి ఉన్న ఉంగరాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. వాటిలో ఒకటి చాలా స్పెషల్ అని తెలిపింది. ఆడియన్స్ ఏమనుకున్నా అది నాకు సంతోషమేనని తెలిపింది. దీంతో పరోక్షంగా ఆమె నిశ్చితార్థం అయినట్లు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రస్తుతం రష్మిక నటించిన మూవీ ది గర్ల్ఫ్రెండ్ విడుదలకు సిద్దమైంది. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by The Cine Gossips (@thecinegossips) -
కల్కి సీక్వెల్లో హీరోయిన్గా ఛాన్స్! కల్యాణి ఏమందంటే?
గతేడాది బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసిన చిత్రాల్లో కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD Movie) ఒకటి. ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషించారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ వెయ్యి కోట్లపైనే వసూలు చేసి బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది. రెండో పార్ట్ ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.దీపికా స్థానంలో కల్యాణి?ఇలాంటి సమయంలో కల్కి సీక్వెల్ నుంచి దీపికా(Deepika Padukone)ను తొలగిస్తున్నట్లు ప్రచారం జరిగింది. 8 గంటల పని, తన టీమ్ మెంబర్స్కు లగ్జరీ వసతులు, లాభాల్లో వాటా.. ఇలా కొన్ని భారీ షరతుల కారణంగా ఆమెను సైడ్ చేశారు. దీంతో దీపికా పాత్రలో ఎవరు నటించనున్నారంటూ సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. దీపికా స్థానంలో ఆలియా భట్, సాయిపల్లవి, అనుష్కల పేర్లు వినిపించాయి. ఇటీవల కొత్త లోక: చాప్టర్ 1తో సక్సెస్ అందుకున్న కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది.అంతకన్నా సంతోషం ఇంకేముంది?ఈ రూమర్పై కల్యాణి స్పందించింది. కొందరు ఇదేపనిగా యాక్టర్స్ గురించి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారనుకుంటా.. ఏదేమైనా నా పేరు పరిశీలిస్తున్నారంటే నాకు సంతోషంగానే ఉంది. నన్ను ఎంపిక చేయాలని భావిస్తున్నారంటే అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది? కానీ, వాళ్లు ఎవర్ని ఫైనల్ చేశారు? ఎవరిని తీసుకోబోతున్నారు? అన్నది చెప్పడం చాలా కష్టం. జనాలు నన్ను ఆ పాత్రలో చూడాలని కోరుకుంటున్నారంటేనే ఎంతో సంబంరంగా ఉంది. ఇలాంటి అనుభూతి ఇంతకుముందెన్నడూ కలగలేదు అని చెప్పుకొచ్చింది.చదవండి: పెళ్లి సందడి షురూ.. జగద్ధాత్రి సీరియల్ నటి హల్దీ ఫంక్షన్ -
ఇండో-చైనా యుద్ధంపై సినిమా.. ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత ఫర్హాన్ అక్తర్ లేటెస్ట్ మూవీ '120 బహదూర్'. 1962లో జరిగిన ఇండో-చైనా యుద్ధ నేపథ్య కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబరు 21న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ఫర్హాన్ అక్తర్, రాశీఖన్నా లీడ్ రోల్స్ చేశారు. రజనీష్ ఘయ్ దర్శకత్వం వహించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్.. బడా నిర్మాత భార్య హీరోయిన్)మన దేశానికి చెందిన 120 మంది సైనికులు.. ఏకంగా 3000 మంది చైనా సైన్యంతో ఎలా పోరాడారు? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారనేది '120 బహదూర్' మూవీ స్టోరీ. ట్రైలర్ చూస్తుంటే ఇదివరకే వచ్చిన వార్ బ్యాక్ డ్రాప్ మూవీలా ఆకట్టుకుంటున్నాయి. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అలరించేలా ఉన్నాయి.(ఇదీ చదవండి: తమిళ సినిమాలో అనసూయ రొమాంటిక్ సాంగ్) -
పెళ్లి సందడి షురూ.. జగద్ధాత్రి సీరియల్ నటి హల్దీ ఫంక్షన్
బుల్లితెర నటి దీప్తి మన్నె (Deepthi Manne) పెళ్లి ఘడియలు వచ్చేశాయి. గత నెలలో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించిన ఆమె ఇప్పుడు పెళ్లిపీటలెక్కబోతోంది. ప్రియుడు రోహన్తో ఏడడుగులు వేయనుంది. ఇప్పటికే పెళ్లి పనులు మొదలయ్యాయి. ఈ క్రమంలో నటి దీప్తి - రోహన్ జంట హల్దీ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో హల్దీ వేడుకలు సంతోషంగా, ఉత్సాహంగా సాగాయి. సీరియల్స్తో ఫేమస్ఈమేరకు ఓ వీడియోను దీప్తి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు.. నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బెంగళూరుకు చెందిన దీప్తి మన్నె.. మొదట్లో కన్నడ భాషలో సీరియల్స్, సినిమాలు చేసింది. తర్వాత తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. రాధమ్మ కూతురు, జగద్ధాత్రి, పద్మావతి వంటి పలు సీరియల్స్ చేసింది. తెలుగులో ఇక సెలవ్ అనే సినిమాలోనూ యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Navya Rao (@navya_raooo) View this post on Instagram A post shared by Deepthi Manne (@deepthimanne_official) చదవండి: బూతులు, అసభ్యకరమైన కామెంట్లు.. పోలీసులకు చిన్మయి ఫిర్యాదు -
కేజీఎఫ్ నటుడు కన్నుమూత
కన్నడ నటుడు, కేజీఎఫ్ ఫేమ్ హరీశ్ రాయ్ (Harish Rai) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గురువారం తుదిశ్వాస విడిచారు. కన్నడలో అనేక సినిమాలు చేసిన హరీశ్.. కేజీఎఫ్ మూవీలో చాచా అనే ముస్లిం వ్యక్తిగా నటించారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. కేజీఎఫ్ రెండో పార్ట్ రిలీజయ్యే సమయానికి ఆయనకు థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది.క్యాన్సర్తో పోరాటంచూస్తుండగానే క్యాన్సర్ ముదిరి నాలుగో స్టేజీకి చేరింది. ఈ మహమ్మారి కారణంగా అతడు బక్కపలుచగా మారిపోయారు, కానీ, పొట్టభాగం మాత్రం ఉబ్బిపోయింది. చికిత్స చేయించుకోవడానికి రూ.70 లక్షలు అవుతాయని.. ఎవరైనా సాయం చేయండంటూ ఆగస్టులో మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే హీరో ధ్రువ్ సర్జా తనకు తోచిన సాయం చేశారు. గతంలో యష్ కూడా సాయం చేశారు. ఇకపోతే హరీశ్ రాయ్.. ఓం, రాజ్ బహదూర్, దండుపాల్య, సంజు వెడ్స్ గీత వంటి పలు చిత్రాల్లో నటించారు.చదవండి: స్పిరిట్లో దగ్గుబాటి హీరో? కెరీర్ టర్న్ అవడం ఖాయం! -
పూసలమ్మే మోనాలిసాతో ఫస్ట్ మూవీ.. నిర్మాత నల్గొండవాసి
నల్గొండ జిల్లా: నిడమనూరు చెందిన విరిగినేని అంజయ్య సినీ రంగంలోకి ప్రవేశించారు. ప్రస్తుతం సహకారం సంఘం జిల్లా డైరెక్టర్ ఉన్న అంజయ్య సినీ రంగంలోకి నిర్మాతగా (పొడ్యూసర్) అడుగుపెట్టారు. మొదటి సినిమానే కుంభమేళాలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో ఫేం అయినా మోనాలిసాతో ‘లైఫ్’ అనే సినిమా తీస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి బుధవారం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో ప్రారంభ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, సీనియర్ నటుడు సురేష్ హాజరయ్యారు. గతంలో సినీ రంగంలో డైరెక్టర్గా, సినీ ఫొటోగ్రాఫర్గా పలువురు నిడమనూరు మండల వాసులు పనిచేశారు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ చోటా కే.నాయకుడు నిడమనూరు మండలానికి చెందిన మేరెడ్డి సత్యనారాయణరెడ్డి దగ్గర అసిస్టెంట్గా పనిచేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు మేరెడ్డి వెంకట్రాహుల్, నల్లమోతు సిద్ధార్థ తదితరులు హాజరయ్యారు. -
తమిళ సినిమాలో అనసూయ రొమాంటిక్ సాంగ్
గతంతో పోలిస్తే సినిమాలు చేయడం తగ్గించేసిన అనసూయ.. గతేడాది పుష్ప 2, రజాకర్ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ ఏడాది రిలీజైన వాటిలో 'అరి' అనే మూవీలో లీడ్ రోల్ చేయగా 'హరిహర వీరమల్లు'లో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ప్రస్తుతానికైతే అనసూయ కొత్త చిత్రాల్లో నటించట్లేదు. అలాంటిది ఈమె చేసిన తమిళ చిత్రంలోని రొమాంటిక్ సాంగ్ ఇప్పుడు రిలీజైంది. దీంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్.. బడా నిర్మాత భార్య హీరోయిన్)నాలుగైదేళ్ల క్రితం తెలుగులో వరస సినిమాలు చేసిన అనసూయ.. అదే టైంలో తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాంటి వాటిలో 'ఊల్ఫ్' ఒకటి. ప్రభుదేవా హీరో. అనసూయతో పాటు లక్ష్మీ రాయ్ హీరోయిన్గా చేసింది. వినూ వెంకటేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్ని 2023 ఆగస్టులో రిలీజ్ చేశారు. తర్వాత ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా లేదు. అలాంటిది ఇప్పుడు ఈ చిత్రం నుంచి 'సాసా' అంటూ సాగే రొమాంటిక్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.ఇందులో ప్రభుదేవా సరసన అనసూయ, లక్ష్మీ రాయ్, మరో నటి గ్లామరస్గా కనిపించారు. పేరుకే తమిళ సినిమా అయినప్పటికీ 'ఊల్ఫ్'ని తెలుగు, కన్నడ, హిందీలోనూ రిలీజ్ చేస్తామని టీజర్ రిలీజ్ టైంలో ప్రకటించారు. ఇప్పుడు వీడియో సాంగ్ రిలీజ్ చేశారు కాబట్టి త్వరలో ఏమైనా మూవీని థియేటర్లలోకి తీసుకొస్తారేమో చూడాలి? ఏదేమైనా అనసూయ ఇలాంటి రొమాంటిక్ పాటలో కనిపించడం తెలుగు ప్రేక్షకులకు చిన్నపాటి షాకే అని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: కొత్తింట్లోకి బిగ్ బాస్ ఫేమ్ కమెడియన్ జ్యోతి.. ఫొటోలు వైరల్) -
బూతులు, అసభ్యకరమైన కామెంట్లు.. పోలీసులకు చిన్మయి ఫిర్యాదు
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) మరోసారి ట్రోలింగ్ బారిన పడింది. రాయడానికి, చెప్పడానికి కూడా వీలు లేని పదాలతో ఆమెను దారుణంగా తిడుతున్నారు. తననే కాకుండా, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారంటూ హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్కు చిన్మయి ఎక్స్ (ట్విటర్)లో ఫిర్యాదు చేసింది. సజ్జనార్కు ఫిర్యాదు'వాళ్ళు పబ్లిక్గా మహిళలపై మాట్లాడుతున్న భాష దారుణంగా వుంది. ఇలాంటి వాళ్ళు మీ ఫ్రెండ్స్లో ఉన్నా ప్రొత్సహించకండి. ఈ రోజువారీ వేధింపులతో విసిగిపోయాను. మా అభిప్రాయాలు నచ్చకపోతే దాన్ని పట్టించుకోకండి. అంతేకానీ, నా పిల్లలు చనిపోవాలని ఎలా కోరుకుంటారు? వీళ్లను అలాగే వదిలేయలేను. అందుకే నాపై వేధింపులను మీ దృష్టికి తీసుకొస్తున్నా..' అంటూ సజ్జనార్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. దీనిపై సజ్జనార్ స్పందిస్తూ.. చిన్మయి ఫిర్యాదును సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు.ఏం జరిగింది?రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది గర్ల్ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 7న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్లో రాహుల్ మాట్లాడుతూ.. మంగళసూత్రం ధరించాలా? వద్దా? అనేది నా భార్య చిన్మయి ఇష్టం. ఆ విషయంలో తనను బలవంతం చేయను అన్నాడు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. రాహుల్- చిన్మయి దంపతులను నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. ఇలాంటివారికి పిల్లలు పుట్టకూడదు.. పుట్టినా వెంటనే చనిపోవాలి అని కొందరు మరీ దారుణంగా కామెంట్స్ చేయడంతో చిన్మయి పోలీసులను ఆశ్రయించింది. Respected @SajjanarVC SirPlease take cognisance of this. I am sick and tired of this everyday abuse and women deserve better in Telangana. If they dont like an opinion they can ignore and leave. I am happy to file a complaint and even if this case takes 15 years let law take its… https://t.co/l4In1xLlhx— Chinmayi Sripaada (@Chinmayi) November 5, 2025Apparently This is Mr Charan Reddy here. *Sanghi* Far Right Hindu Conservative who wishes that women he dislikes for tweets dont have children and even if they give birth to children they should be dead as soon as they are born.JUST BECAUSE HE DOESNT LIKE AN OPINION. If a… https://t.co/Rz5h7GBbSs pic.twitter.com/mXFHaX1yZS— Chinmayi Sripaada (@Chinmayi) November 5, 2025 చదవండి: 12 ఏళ్ల తర్వాత వెండితెరపై రోజా రీఎంట్రీ -
ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్.. బడా నిర్మాత భార్య హీరోయిన్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్నింటిని మాత్రం సర్ప్రైజ్ స్ట్రీమింగ్ అనేలా అప్పటికప్పుడు అనౌన్స్ చేస్తూ ఉంటారు. అలా ఓ హిందీ కామెడీ థ్రిల్లర్ రిలీజ్ గురించి ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చింది. ప్రజల సొమ్ము దొచుకునే కొందరిపై ఓ మహిళ పాములా పగబడితే అనే కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తీశారు. ఇంతకీ ఇది ఏ ఓటీటీలో ఎప్పుడు రానుంది?(ఇదీ చదవండి: దుల్కర్ సల్మాన్ 'కాంత' ట్రైలర్ రిలీజ్)2004లో వచ్చిన ఉదయ్ కిరణ్ 'లవ్ టుడే' సినిమాతో హీరోయిన్ అయిన దివ్య ఖోస్లా.. తర్వాత ఏడాదే బాలీవుడ్ బడా నిర్మాత, టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ని పెళ్లి చేసుకుంది. నటన పక్కనబెట్టేసింది. 2016 నుంచి నటి, దర్శకురాలిగా సినిమాలు చేస్తున్న ఈమె.. ఇప్పుడు 'ఏక్ చతుర్ నార్' అనే సినిమాతో వచ్చింది. డార్క్ కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబరు 12న థియేటర్లలోకి రాగా.. శుక్రవారం(నవంబరు 07) నుంచి నెట్ఫ్లిక్స్లోకి రానుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.ఏక్ చతుర్ నార్ విషయానికొస్తే.. లక్నోలోని ఓ మురికివాడలో మమత (దివ్య ఖోస్లా).. కొడుకు, అత్తతో కలిసి జీవిస్తుంటుంది. మెట్రో స్టేషన్లో ఉద్యోగం చేస్తుంటుంది. ఓ రోజు మమత పనిచేస్తున్న చోట పెద్ద ఫైనాన్షియర్ అభిషేక్ వర్మ (నీల్ నితిన్ ముఖేష్) ఫోన్ దొంగతనానికి గురవుతుంది. ఆ ఫోన్ని పట్టుకోవడానికి వెళ్లిన మమత ఏం చేసింది? అసలు ఫైనాన్షియర్కి మమతకు మధ్య గొడవేంటి? ఆ ఫోన్లో ఏముంది? దీన్ని అడ్డం పెట్టుకుని మమత ఏమేం పనులు చేసిందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: కొత్తింట్లోకి బిగ్ బాస్ ఫేమ్ కమెడియన్ జ్యోతి.. ఫొటోలు వైరల్)Ek Chatur Naar, joh hai tez tarrar jaise chaaku ki dhaar 👀 Jeetega is khel mein kaun? 😏Watch Ek Chatur Naar, out 7 November, on Netflix.#EkChaturNaarOnNetflix pic.twitter.com/IwpE0kUXNN— Netflix India (@NetflixIndia) November 6, 2025 -
ఇది ప్రతి యువకుడి కథ.. శ్రీ విష్ణు కొత్త సినిమా
శ్రీవిష్ణు హీరోగా కొత్త సినిమా మొదలైంది. సన్నీ సంజయ్ దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. 'ప్రతి యువకుడి కథ' అనే ట్యాగ్లైన్తో ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు.'దైనందిన జీవితాన్ని నిర్వచించే సంఘర్షణలు, ఆశలు, భావోద్వేగాలు వంటివి అన్వేషించే కథతో సన్నీ సంజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకూ గొప్ప పాత్రలతో అలరించిన శ్రీవిష్ణు ఈ చిత్రంలో అద్భుత పాత్ర చేయనున్నారు' అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. 'అనగనగా' అనే ఓటీటీ సినిమాతో సంజయ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు.The story of every YOUNGSTER 🤘A new-gen entertainer packed with laughs, vibes & emotions that stay with you ❤️🔥#SitharaEntertainments Production No.39 x @SreeVishnuOffl 🔥Directed by @ASunnySanjayProduced by @vamsi84 & #SaiSoujanyaShoot begins soon 🎬@SitharaEnts… pic.twitter.com/la5NV2YIK9— Sithara Entertainments (@SitharaEnts) November 5, 2025 -
బ్రహ్మచారి.. భర్త కావాలనుకుంటే? 'పురుష' ఫస్ట్ లుక్
'బ్రహ్మచారి.. భర్త కావాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ధభూమిగా మారుతుంది' అనే క్యాప్షన్తో 'పురుష' ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ పోస్టర్ ఆవిష్కరించారు. బత్తుల సరస్వతి సమర్పణలో తన తనయుడు పవన్ కల్యాణ్ను హీరోగా పరిచయం చేస్తూ బత్తుల కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు.వీరు వులవల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. వైష్ణవి కొక్కుర, విషిక, హాసినీ సుధీర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం అని చిత్రయూనిట్ పేర్కొంది. -
అదిరే అభి నా సినిమాకు సాయం చేశాడు: అనిల్ రావిపూడి
‘‘గౌతమ్ ఎస్ఎస్సీ’ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. ఆ చిత్రంలో అభి మంచి పాత్ర చేశాడు. మేము చాలా ఏళ్లు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నాం. కందిరీగ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగులు రాసేందుకు అభి సాయం చేశాడు. అదిరే అభిగా ‘జబర్దస్త్’తో తెలుగు ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు దర్శకుడిగానూ ‘చిరంజీవ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. రాజ్ తరుణ్కు ఈ సినిమా మంచి కమ్ బ్యాక్ కావాలి. ‘చిరంజీవ’ చిత్రం ఘన విజయం సాధించాలి’’ అని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు. ఆహాలో చిరంజీవ మూవీరాజ్ తరుణ్, కుషిత కల్లపు జోడీగా నటించిన చిత్రం ‘చిరంజీవ’ (Chiranjeeva Movie). అభినయ కృష్ణ దర్శకత్వం వహించారు. రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7 నుంచి ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ సినిమా ప్రీమియర్ షోకి, ప్రెస్ మీట్కి అనిల్ రావిపూడి అతిథిగా హాజరయ్యారు. పన్నెండేళ్లుగా ట్రై చేస్తున్నా..రాజ్ తరుణ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం కోసం అభి మా అందరి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ కష్టపడ్డాడు’’ అని తెలిపారు. ‘‘చిరంజీవ’ అందర్నీ నవ్విస్తుంది’’ అన్నారు రాహుల్ అవుదొడ్డి. అభినయ కృష్ణ మాట్లాడుతూ– ‘‘పది పన్నెండేళ్ల నుంచి దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్నాను. ఆహా నుంచి శ్రావణిగారికి ‘చిరంజీవ’ కథ నచ్చడంతో ఈ సినిమా తీశారు’’ అన్నారు.చదవండి: స్పిరిట్లో దగ్గుబాటి హీరో? కెరీర్ టర్న్ అవడం ఖాయం! -
త్వరలోనే తెలుగు నేర్చుకుంటా: మోనాలిసా
ఉత్తరప్రదేశ్లోని కుంభమేళాలో పూసలు అమ్ముతూ, తన కనులతో సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారిన మోనాలిసా ‘లైఫ్’ సినిమాతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతున్నారు. శ్రీను కోటపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి చరణ్ హీరోగా నటిస్తున్నారు. వెంగమాంబ క్రియేషన్స్పై అంజన్న నిర్మిస్తున్న ‘లైఫ్’ ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పూజతో ఈ చిత్రం ప్రారంభమైంది. మంచి మెసేజ్ ఇచ్చే మూవీ..ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత డీఎస్ రావ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటులు సురేష్ క్లాప్ కొట్టగా, శివన్నారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా అంజన్న మాట్లాడుతూ.. ‘‘సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీవితాల్లో చోటు చేసుకుంటున్న ఘటనల ఆధారంగా ‘లైఫ్’ రూపొందుతోంది’’ అని తెలిపారు. ‘‘ఈ చిత్రకథలో నేటి తరానికి చక్కటి సందేశం ఉంది’’ అని శ్రీను కోటపాటి చెప్పారు. ‘‘యూత్కు బాగా కనెక్ట్ అయ్యే కథాంశంతో మా సినిమా రూపొందుతోంది’’ అన్నారు సాయి చరణ్. ‘‘నేను తెలుగు సినిమా చేస్తుండడం చెప్పలేని ఆనందంగా ఉంది. త్వరలో తెలుగు నేర్చుకుంటాను’’ అని మోనాలిసా పేర్కొన్నారు. చదవండి: 12 ఏళ్ల తర్వాత వెండితెరపై రోజా రీఎంట్రీ -
దుల్కర్ సల్మాన్ 'కాంత' ట్రైలర్ రిలీజ్
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'కాంత'. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో సినిమా ఇండస్ట్రీ గురించి ఈ చిత్రంలో సముద్రఖని, రానా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవంబరు 14న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు తెలుగు, తమిళ ట్రైలర్స్ ఒకేసారి రిలీజ్ చేశారు.లెక్క ప్రకారం సెప్టెంబరులోనే ఈ సినిమాని రిలీజ్ చేద్దామని ఫిక్సయ్యారు. కానీ అనుకోని కారణాల వల్ల నవంబరులో విడుదల చేస్తున్నారు. తొలుత ఇందులో దుల్కర్ మాత్రమే నటిస్తున్నాడని అనుకున్నారు. కానీ రానా కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ట్రైలర్తో క్లారిటీ వచ్చింది. దుల్కర్-రానా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. -
12 ఏళ్ల తర్వాత వెండితెరపై రోజా రీఎంట్రీ
ఒకప్పుడు హీరోయిన్గా వెండితెరను ఏలిన ఎంతోమంది తారలు ఇప్పుడు స్క్రీన్పై తల్లి, అత్త, వదిన పాత్రలు పోషిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు. వెండితెరకు దూరంగా ఉండటానికి బదులుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా (Roja Selvamani) కూడా.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్కు రెడీ అయ్యారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు అధికారిక ప్రకటన వెలువడింది.డీగ్లామర్ లుక్లో రోజాడీడీ బాలచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న లెనిన్ పాండ్యన్ సినిమాలో రోజా నటిస్తున్నారు. 'చాన్నాళ్ల తర్వాత రీఎంట్రీ.. సంతోషంగా ఉంది డియర్' అంటూ నటి ఖుష్బూ సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో రోజా నటించిన సినిమాలు, పాటల క్లిప్పింగ్స్ను జత చేశారు. చివర్లో రోజా డీగ్లామర్ పాత్రలో వయసైపోయిన పెద్దావిడగా కనిపించారు. ఆమె పాత్ర పేరు సంతానం అని రివీల్ చేశారు. ఈ సినిమా విషయానికి వస్తే.. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా తమ్ముడు గంగై అమరన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. శివాజీ గణేశన్ మనవడు దర్శన్ గణేశన్ నటుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని సత్యజోతి ఫిలింస్ బ్యానర్ నిర్మిస్తోంది.రోజా హీరోయిన్గా..హీరోయిన్ అవాలని రోజా ఎన్నడూ అనుకోలేదు. ప్రేమ తపస్సు సినిమాలో హీరోయిన్ సెలక్షన్స్ కోసం డైరెక్టర్ శివప్రసాద్ తన కాలేజీకి వెళ్లారు. అక్కడ ఆల్బమ్లో రోజా ఫోటో చూసి ఆరా తీస్తే.. నాగరాజారెడ్డి కూతురని తెలిసింది. వీళ్లిద్దరూ అప్పటికే మంచి ఫ్రెండ్స్. దీంతో ఆయన అడగ్గానే రోజా తండ్రి కాదనలేకపోయారు. ఒక సినిమాయే కదా, చేయమన్నారు. అలా ప్రేమతపస్సుతో రోజా వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు.12 ఏళ్ల తర్వాత రీఎంట్రీఫస్ట్ సినిమాకే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అనేక సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా రాణించారు. రాజకీయాల్లో వచ్చాక సినిమాలకు గుడ్బై చెప్పారు. తెలుగులో చివరగా 2013లో, తమిళంలో అయితే 2015లో చివరగా రోజా సినిమాలు వచ్చాయి. లాంగ్ గ్యాప్ తర్వాత ఆమె మరోసారి వెండితెరపై సందడి చేయబోతున్నారు. మరి తెలుగులోనూ సినిమాలు చేస్తారా? అనేది చూడాలి! View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) చదవండి: పవన్కు అన్యాయం.. గౌరవ్పై దివ్య చిన్నచూపు? భోజనం కట్! -
కొత్తింట్లోకి కమెడియన్ జ్యోతి.. ఫొటోలు వైరల్
తెలుగు సినిమాల్లో కమెడియన్, వ్యాంప్ తరహా పాత్రల్లో నటించి జ్యోతి గుర్తింపు తెచ్చుకుంది. అలానే బిగ్బాస్ తెలుగు తొలి సీజన్లోనూ పాల్గొంది గానీ ఒకటి రెండు వారాలు కూడా హౌస్లో ఉండలేక ఎలిమినేట్ అయిపోయింది. గత కొన్నాళ్లలో పెద్దగా మూవీస్లో కనిపించని ఇప్పుడు కొత్త ఇంట్లో అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: పవన్కు అన్యాయం.. గౌరవ్పై దివ్య చిన్నచూపు? భోజనం కట్!)ఎవడిగోలవాడిది, గుడుంబా శంకర్, మహత్మ, దరువు, రంగ ది దొంగ, కెవ్వు కేక తదితర సినిమాలు చేసింది. చివరగా 2020లో వచ్చిన 'గోల గోల' అనే చిత్రంలో కనిపించింది. ఇది కాకుండా 2017లో మొదలైన బిగ్బాస్ షోలోనూ పాల్గొంది. కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. రీసెంట్ టైంలో అయితే ఒకటి రెండు ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షోల్లో కనిపించింది అంతే.చాన్నాళ్ల తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన జ్యోతి.. నూతన గృహప్రవేశం చేసినట్లు చెప్పుకొచ్చింది. కొడుకుతో కలిసి దిగిన ఫొటోలని షేర్ చేసింది. దీంతో జ్యోతికి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: మెడలో నెక్లెస్తో అల్లు శిరీష్.. కాబోయే భార్యతో..) -
స్పిరిట్లో దగ్గుబాటి హీరో? కెరీర్ టర్న్ అవడం ఖాయం!
డార్లింగ్ ప్రభాస్ (Prabhas) చాలా బిజీ అయిపోయాడు. ఒకదానివెంట మరొకటి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. రాజాసాబ్ రిలీజ్కు దగ్గరపడితే ఫౌజీ షూటింగ్ జరుగుతోంది. మరోవైపు స్పిరిట్ మూవీ.. ఆ వెంటనే సలార్, కల్కి సినిమా సీక్వెల్స్ చేయనున్నాడు. రాజాసాబ్ రిలీజే కాలేదు. అప్పుడే దాని సీక్వెల్కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.స్పిరిట్ సంగతులుఅర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు సందీప్రెడ్డి వంగా. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేస్తున్న సినిమాయే స్పిరిట్. ఇటీవలే ఈ మూవీ ఆడియో గ్లింప్స్ రిలీజ్ చేసి.. కావాల్సినంత హైప్ తీసుకొచ్చారు. ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రి హీరోయిన్గా నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్, కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నట్లు ప్రకటించారు. దగ్గుబాటి హీరో?అలాగే కొరియన్ నటుడు డాన్లీ కూడా సినిమాలో భాగమైనట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది. దగ్గుబాటి హీరో కూడా ఈ సినిమాలో భాగమయ్యాడట! ఆ హీరో మరెవరో కాదు, రానా తమ్ముడు అభిరామ్. ఫుల్ యాటిట్యూడ్ ఉండే పాత్రలో అభిరామ్ను ఎంపిక చేశారట! మరి ఇదెంతవరకు నిజమన్నది చూడాలి!నిజమైతే కెరీర్ టర్న్ అయినట్లే!అభిరామ్.. అహింస సినిమాతో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తేజ దర్శకత్వం అనగానే మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కట్ చేస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. అసలు ఎప్పుడొచ్చిందో, ఎప్పుడెళ్లిందో కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. అయినప్పటికీ అభిరామ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడేకంగా రెండో సినిమాకే స్పిరిట్లో ఛాన్స్ కొట్టేసినట్లు టాక్ నడుస్తోంది. ఇది నిజమైతే అతడి పంట పండినట్లే!చదవండి: పవన్కు అన్యాయం.. గౌరవ్పై దివ్య చిన్నచూపు? భోజనం కట్ -
పవన్కు అన్యాయం.. గౌరవ్పై దివ్య చిన్నచూపు? భోజనం కట్!
డిమాన్ పవన్ టాస్క్ల వీరుడు.. అతడితో పోటీపడితే ఓటమి తథ్యం అని హౌస్మేట్స్కు బాగా తెలుసు. వీళ్లందరికంటే బిగ్బాస్ (Bigg Boss Telugu 9)కు మరీ ఎక్కువ తెలుసు. అందుకే.. అతడ్ని సైడ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు. అదెలాగో బుధవారం (నవంబర్ 5వ) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..నిఖిల్ ఔట్రెబెల్స్ దివ్య, సుమన్.. బిగ్బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్కులను ఎవరికీ అనుమానం రాకుండా చకచకా పూర్తి చేస్తున్నారు. రెండో టాస్కులో భాగంగా పాల ప్యాకెట్లన్నీ కొట్టేశారు. కానీ, ఉదయాన్నే ఏమీ తెలియని అమాయకుల్లా ఫేస్ పెట్టారు. దివ్య అయితే.. ప్యాకెట్స్ ఎవరు కొట్టేశారో.. ప్లీజ్, ఇచ్చేయండి అని మహానటిలా నటించేసింది. ఈ దొంగతనం టాస్క్ విజయవంతంగా పూర్తి చేసినందున హౌస్లో ఒకరిని కంటెండర్ రేసు నుంచి తప్పించవ్చన్నాడు బిగ్బాస్. దీంతో దివ్య.. నిఖిల్ను తప్పిస్తున్నట్లు చెప్పింది.కెప్టెన్కు ఎదురుతిరిగిన గౌరవ్పాల ప్యాకెట్లు కనిపించకపోవడంతో రీతూ (Rithu Chowdery) హస్తం ఉందని తనపైనే అనుమానం వ్యక్తం చేశారు. కానీ, రాము సరదాగా.. ఏమో దివ్యనే రెబల్ కావొచ్చేమో అన్నాడు. నిఖిల్ మాత్రం.. సీరియస్గానే దివ్య రెబల్ అని తేల్చేశాడు. మరోవైపు కిచెన్లో మళ్లీ గొడవ మొదలైంది. మధ్యాహ్నానికి కూరగాయలు కట్ చేయమని గౌరవ్కు ఆర్డరేసింది దివ్య. ఇంకా బ్రేక్ఫాస్టే తినలేదు.. అప్పుడే లంచ్కోసం ప్రిపరేషన్ ఏంటి? అని గౌరవ్ వాదించాడు. భోజనమే ఉండదుఈ గొడవ ముదరడంతో.. గౌరవ్ను కిచెన్ డిపార్ట్మెంట్ నుంచి పీకేసి వాష్రూమ్స్ క్లీన్ చేయాలని ఆర్డరేసింది కెప్టెన్ దివ్య. తాను ఆ పని చేయనని గౌరవ్ మొండికేయగా.. అలాగైతే రేపు నీకు భోజనమే ఉండదని దివ్య బెదిరించింది. ఇదిలా ఉంటే ఎవరు రెబల్ అనుకుంటున్నారో ఓటింగ్ వేయాలన్నాడు బిగ్బాస్. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్లు కంటెండర్ రేస్ నుంచి తప్పుకుంటారన్నాడు. దీంతో కొందరు కావాలని పవన్ పేరు చెప్పి అతడిని ఈజీగా సైడ్ చేశారు. దెబ్బకు జడుసుకున్న రీతూఅనంతరం ఓ హారర్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో తనూజ భయపడుతూనే టాస్క్ విజయవంతంగా పూర్తి చేసింది. తర్వాత దివ్య.. ధైర్యంగా లోనికి వెళ్లి వచ్చింది. అనంతరం రీతూ.. తనకు భయమనేదే లేదు, ఆడపులి అని బిల్డప్ కొడుతూ లోపలకు వెళ్లింది. కానీ అక్కడున్న దెయ్యాల గెటప్స్ చూసి నిలువెల్లా వణికిపోయింది. చివర్లో మాత్రం ఓ నవ్వు నవ్వి దెయ్యాలు సైతం జడుసుకునేలా చేసింది. ఈ గేమ్లో తనూజ గెలిచింది.చదవండి: జుట్టు పట్టి నేలకేసి కొట్టాడు.. ఆ రాక్షసుడి వల్ల డిప్రెషన్లో.. నటి -
సింగారాల సీతాకోక.. సాంగ్ ప్రోమో రిలీజ్
శివకార్తికేయన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం పరాశక్తి. సుధా కొంగర దర్శకత్వం వహించారు. ఈ క్రేజీ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ సంస్థ అధినేత ఆకాశ్ భాస్కర్ భారీఎత్తున నిర్మించారు. ఇది పీరియాడికల్ సినిమా కావడంతో పరాశక్తిపై ప్రారంభం నుంచే ఆసక్తి నెలకొంది. సినిమా టైటిల్ కూడా ఇందుకు ఒక కారణం. దివంగత నటుడు శివాజీగణేశన్ కథానాయకుడిగా నటించిన తొలిచిత్రం పేరు పరాశక్తి. అదే పేరుతో మళ్లీ ఇన్నాళ్లకు శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ అనంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని 2026 జనవరిలో సంక్రాంతి సందర్బంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇదివరకే ప్రకటించారు. మంగళవారం నాడు ఈ సినిమా నుంచి సింగారాల సీతాకోక.. పాట ప్రోమోను విడుదల చేశారు. ఇందులో శివకార్తికేయన్, శ్రీలీల స్టెప్పులేశారు. ఫుల్ సాంగ్ నేడు (నవంబర్ 6న) విడుదల కానుంది. -
శివ తాండవం కోసం పది రోజులు ప్రాక్టీస్ చేశాను
‘‘దెయ్యం వేట, ఫ్యామిలీ ఎమోషన్, భక్తి, శివుడు గురించి కథలు... ఇలా చాలా లేయర్స్ ఉన్న చిత్రం ‘జటాధర’. అరుణాచల ప్రస్తావన కూడా ఉంది. మన పురాణాల్లో ఉన్న కొన్ని కథలకి సొల్యూషన్గా ఈ మూవీ చేశాం. ఈ సినిమా చేయడానికి ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ నన్ను చాలా ఎగ్జయిట్ చేసింది. యాక్షన్, ఫ్యామిలీ, మైథాలజీ... ఇలా అన్ని భావోద్వేగాలు కుదిరిన సినిమా ‘జటా ధర’’ అని సుధీర్ బాబు తెలిపారు. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో సుధీర్బాబు హీరోగా నటించిన చిత్రం ‘జటాధర’. సోనాక్షీ సిన్హా, శిల్పా శిరోద్కర్ తదితరులు కీలక పాత్రధారులు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేశ్ కుమార్ బన్సల్, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ, శిల్పా సింఘాల్, నిఖిల్ నంద నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సుధీర్బాబు పంచుకున్న విశేషాలు... → చిన్నప్పుడు మనం జానపద, చందమామ కథలు విని ఉంటాం. గతంలో బ్యాంకులు లేని సమయంలో ధనాన్ని భూమిలో పాతి, ఒక బంధనం వేసేవారని, దానికి ఒక పిశాచి కాపలాగా ఉండేదని ఓ కథ ప్రచారంలో ఉండేది. అలాంటి కథని ప్రజెంట్ టైమ్లోకి తీసుకొచ్చి మా ‘జటాధర’లో చాలా ఆసక్తిగా చూపించాం. ఈ చిత్రకథ విన్నప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూడదగ్గ కథలా అనిపించింది. ఈ సినిమాలో దెయ్యాల వేటగాడిలా కనిపిస్తాను. అయితే తనకి మాత్రం దెయ్యాలున్నాయంటే నమ్మకం ఉండదు. దేవునిపై నమ్మకం ఉంటుంది. సైన్స్ని నమ్ముతాడు. అలా ఎందుకు? అనేది సినిమాలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఏ, బీ, సీ సెంటర్ అనే తేడా లేకుండా అందరికీ నచ్చే సినిమా ఇది. ధన పిశాచి పాత్రలో సోనాక్షీ సిన్హా నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. శిల్పా శిరోద్కర్గారు శోభ అనే బలమైన పాత్రలో అద్భుతంగా నటించారు. → రాజీవ్ అద్భుతమైన సంగీతం, నేపథ్య సంగీతం ఇచ్చారు. ఈ మూవీలో శివతాండవం ఎపిసోడ్ ఉంటుంది. నేనెప్పుడూ క్లాసికల్ డ్యాన్స్ చేయలేదు. ఆ సీక్వెన్స్ కోసం దాదాపు పది రోజులు ప్రాక్టీస్ చేసి, చేశాను. చిత్ర పరిశ్రమలో బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లకి అవకాశాలు సులభం అని... కొత్తవాళ్లకి, ఇండస్ట్రీ నేపథ్యం లేనివారికి కష్టం అనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. నిజానికి బయటవాళ్లకే కాదు.. నాకు కూడా కష్టమే. → మా సినిమాలో శివుడు కనిపించే ఒక ఎపిసోడ్ ఉంది. అక్కడ సూపర్స్టార్ కృష్ణ గారిని చూపించాలనుకున్నాం. కానీ వీఎఫ్ఎక్స్కి ఎక్కువ సమయం కుదరలేదు. ఈ మూవీలో కృష్ణగారు కానీ, మహేశ్ బాబుగారు కానీ కనిపించరు. ఇక నా తర్వాతి చిత్రం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఉంటుంది. కాన్సెప్ట్ పరంగా అది ఒక ‘బాహుబలి’ లాంటి సినిమా. అలాగే బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ కూడా చేయాల్సి ఉంది. -
మంచి సినిమా నిర్మించానని సంతృప్తిగా ఉంది
‘‘నిర్మాతగా ఎన్నో సినిమాలు చేశాను, చేస్తున్నాను. సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాను. అయితే ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ ద్వారా నేను సంపాదించాలనుకున్నది డబ్బు కాదు... సంతృప్తి. ఒక నిర్మాతగా ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమా నిర్మించానని సంతృప్తిగా ఉంది’’ అని అల్లు అరవింద్ తెలిపారు. రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 7న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘రాహుల్లాంటి సున్నితమైన మనసు, కమిటెడ్ పర్సన్ మాత్రమే ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమా రూపొందించగలరు. మన అక్క, చెల్లి, పిన్నిల మనసుల్లో ఏముంటుంది? ఎలాంటి ఆశలు ఉంటాయి? అనుకుని ఈ మూవీ చూడాలి. రష్మిక ఈ సినిమాలో జీవించేసింది. దీక్షిత్ నటన నచ్చి, మరో సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చాను’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో రష్మిక నటన ఈ దశాబ్దంలో ఒక మహిళా నటి తెలుగులో చేసిన బెస్ట్ పర్ఫార్మెన్స్గా నిలుస్తుంది’’ అని రాహుల్ రవీంద్రన్ చెప్పారు. ఈ సమావేశంలో దీక్షిత్, ధీరజ్, విద్య కొప్పినీడి తదితరులు పాల్గొన్నారు. -
తలైవర్ 173 షురూ
రజనీకాంత్–కమల్హాసన్ మళ్లీ కలిసి నటించనున్నారనే వార్తలు కొంత కాలంగా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ సెట్ అయింది. అయితే ఇద్దరూ సిల్వర్ స్క్రీన్ని షేర్ చేసుకోవడం లేదు. రజనీకాంత్ హీరోగా తన నిర్మాణ సంస్థ రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్పై కమల్హాసన్ ఓ సినిమా నిర్మించనున్నారు. రజనీ నటించనున్న 173వ చిత్రం ఇది. ఈ చిత్రానికి సుందర్. సి దర్శకత్వం వహించనున్నారు. ‘‘ఐదు దశాబ్దాల స్నేహం, ఒకరంటే మరొకరికి గౌరవం, అసమానమైన వారసత్వం కలిగిన రజనీకాంత్, కమల్హాసన్ల గొప్ప కలయికలో రానున్న చిత్రం ఇది. 44 ఏళ్ల రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ అద్భుత ప్రయాణం, రజనీకాంత్ అద్భుత స్క్రీన్ ప్రెజెన్స్, కథను చెప్పడంలో అత్యంత ప్రతిభ గల సుందర్ .సి, కమల్హాసన్–ఆర్. మహేంద్రన్ల కాంబినేషన్లో ‘తలైవర్ 173’ ఓ గొప్ప సినిమాటిక్ అనుభూతిని ఇచ్చేలా ఉంటుంది. ‘అరుణాచలం’ తర్వాత 28 ఏళ్లకు రజనీ–సుందర్ల కాంబో మళ్లీ కుదిరింది. రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా ఈ చిత్రం 2027 సంక్రాంతికి రిలీజ్ కానుంది’’ అని ఈ చిత్రం టీమ్ ఓ ప్రెస్నోట్ని షేర్ చేసింది. -
జుట్టు పట్టి నేలకేసి కొట్టాడు.. ఆ రాక్షసుడి వల్ల డిప్రెషన్లో.. నటి కన్నీటిగాథ
ప్రియుడి చేతిలో నరకం చూశానంటోంది మలయాళ బుల్లితెర నటి జసీలా పర్వీణ్ (Jaseela Parveen). కొత్త ఏడాది సెలబ్రేషన్స్ రోజు తనపై విచక్షణా రహితంగా దాడి చేశాడంది. రక్తం వచ్చేలా కొట్టాడంటూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నాకేం జరిగిందో మీకు తెలియాలనుకుంటున్నాను. సింపతీ కోసం ఇదంతా చేయడం లేదు. నాకు మీ సపోర్ట్ కావాలి. అలాగే నెక్స్ట్ ఏం చేయాలో కాస్త మీరే చెప్పండి. నేలకేసి కొట్టాడుడాన్ థామస్కి మందు తాగే అలవాటు, అలాగే సిగరెట్ కూడా తాగుతాడు. తన ప్రవర్తన కూడా సరిగా ఉండదు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ రోజు ఇదే విషయంపై ఇద్దరికీ గొడవ జరిగింది. క్షణాల్లోనే అతడు రాక్షసుడిగా మారిపోయాడు. నన్ను కడుపులో తన్నాడు. ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. నా తల నేలకేసి కొట్టాడు. జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లాడు. ఎక్కడపడితే అక్కడ మృగంలా కొరికాడు. చేతికి దొరికిన వస్తువుతో నా ముఖంపై కొట్టాడు. మాజీ ప్రియుడితో జసీలా పర్వీణ్చాలా రక్తం పోయిందిదీంతో నా పై పదవి చిట్లిపోయి రక్తం కారింది. నన్ను చాలాసేపు చితకబాదాడు. చాలా రక్తం పోయింది. నన్ను హాస్పిటల్కు తీసుకెళ్లమని వేడుకున్నాను, కానీ వినలేదు. పోలీసులకు సమాచారమివ్వడానికి ప్రయత్నించగా నా ఫోన్ లాక్కున్నాడు. తర్వాత కాసేపటికి హాస్పిటల్కు తీసుకెళ్లాడు. మెట్లపై నుంచి పడిపోయానని అబద్ధం చెప్పాడు. అతడు చేసిన పనికి నేను నా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇంత జరిగినా కాస్తంతయినా పశ్చాత్తాపపడలేదు. చిన్న గాయాలు కావునన్ను వేధిస్తూనే ఉన్నాడు. శారీరకంగా, మానసికంగా హింసించాడు. ఇలాంటి వ్యక్తిని సహించేది లేదని నిర్ణయించుకున్నా.. జనవరి 14న పోలీసులకు ఫిర్యాదు చేశాను. కానీ, వాళ్లు వెంటనే స్పందించలేదు. ఇప్పుడైతే కేసు నడుస్తోంది. నాకు అయిన గాయాలు చిన్నవి కావు, అవి నిరూపించేందుకు నా దగ్గర బలమైన సాక్ష్యాలున్నాయి. లాయర్ను పెట్టుకునేంత డబ్బు నా దగ్గర లేదు. అందుకే కోర్టుకు నేనొక్కదాన్నే వెళ్లి వస్తున్నాను. కోర్టులో నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు.న్యాయం కోసం పోరాడతా..ఆర్టిస్టుగా నా ముఖం నాకెంతో ముఖ్యం. నా ఫేస్ పాడుచేసిన కారణంగా నెలలపాటు పని చేయలేకపోయా.. ఆర్థిక ఇబ్బందులు, మానసిక వేదనతో నరకం అనుభవించాను. అతడు మాత్రం ఓ సీనియర్ లాయర్ను పెట్టుకుని కేసును ఆలస్యం చేస్తూ పోతున్నాడు. నేను ఇంకా మౌనంగా ఉండే ప్రసక్తే లేదు. నాకు న్యాయం కావాలి. న్యాయం జరిగేవరకు పోరాడుతూనే ఉంటాను. దయచేసి ఇప్పుడు నేనేం చేయాలో ఎవరైనా లాయర్స్ సలహా ఇవ్వండి అని రాసుకొచ్చింది. జసీలా.. ఆగస్టు 27, పెట్ డిటెక్టివ్ సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Jaseela parveen (@jaseela_parveen) చదవండి: హీరోలకే నా సలహా.. రెమ్యునరేషన్ తగ్గించండి: విష్ణు విశాల్ -
మెడలో నెక్లెస్తో అల్లు శిరీష్.. కాబోయే భార్యతో..
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు, అల్లు అర్జున్ తమ్ముడు, హీరో శిరీష్ (Allu Sirish) ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ప్రియురాలు నయనిక వేలికి ఉంగరం తొడిగాడు. అక్టోబర్ 31న ఈ నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా తన ఎంగేజ్మెంట్ ఫోటోలను శిరీష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో అతడు వైట్ డ్రెస్సులో మెడకు నెక్లెస్తో కనిపించాడు. అటు నయనిక ఎరుపు రంగు లెహంగాలో, ముత్యాల దండతో మెరిసిపోయింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.శిరీష్ లవ్స్టోరీఅల్లు శిరీష్కు పెళ్లి చేయాలని అరవింద్ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. కానీ, శిరీష్ ఓకే చెప్పాలిగా! అలాంటి సమయంలో (2023లో) వరుణ్తేజ్- లావణ్యల పెళ్లి జరిగింది. ఈ జంట కోసం హీరో నితిన్- షాలిని దంపతులు ఓ పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడికి షాలిని బెస్ట్ ఫ్రెండ్ నయనిక కూడా వచ్చింది. ఇటు వరుణ్ తరపున శిరీష్ పార్టీకి హాజరయ్యాడు. అక్కడే శిరీష్- నయనిక చూపులు కలిశాయి, మనసులు కూడా కలుసుకున్నాయి. పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రెండేళ్ల ప్రేమ ఇప్పుడు మూడుముళ్ల బంధంగా మారనుంది.శిరీష్ జర్నీ'గౌరవం' (2013) సినిమాతో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు శిరీష్. కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో, బడ్డీ తదితర చిత్రాలు చేశాడు. హిట్ల కన్నా ఎక్కువ ఫ్లాపులే అందుకోవడంతో సినిమాలు తగ్గించేశాడు. ఏడాదిన్నరకాలంగా అతడి నుంచి ఏ సినిమా రాలేదు. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) చదవండి: నీళ్ల బాటిల్ రూ.100.. కాఫీ రూ.700.. సుప్రీంకోర్టు సీరియస్ -
హీరోలకే నా సలహా.. రెమ్యునరేషన్ తగ్గించండి: విష్ణు విశాల్
చాలామంది హీరోలు తమ ప్రతి సినిమాకు ఎంతోకొంత పారితోషికం పెంచుకుంటూ పోతారు. అందులోనూ హిట్టు పడిందంటే రెట్టింపు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంటారు. అయితే ఎప్పుడూ మన జీతాల గురించే కాకుండా నిర్మాతల కోణంలోనూ ఆలోచించాలంటున్నాడు తమిళ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal). ఈయన హీరోగా నటించడంతోపాటు నిర్మించిన లేటెస్ట్ మూవీ ఆర్యన్ (Aaryan Movie). ఈ సినిమా తమళనాడులో అక్టోబర్ 31న విడుదలైంది. హీరోలకే నా సలహామిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కలెక్షన్లు పర్వాలేదన్నట్లుగా ఉన్నాయి. ఓటీటీ, శాటిలైట్ రైట్స్ మంచి రేటుకే అమ్ముడవడంతో నిర్మాత గండం గట్టెక్కినట్లే కనిపిస్తోంది! ఇకపోతే ఈ సినిమా తెలుగులో ఆలస్యంగా నవంబర్ 7న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఓ ఈవెంట్లో విష్ణు విశాల్ మాట్లాడుతూ.. నేను నిర్మాతలకు ఎటువంటి సలహాలు ఇవ్వను. హీరోలకు, ఆర్టిస్టులకు మాత్రం ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. మీ రెమ్యునరేషన్ను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడం ఖాయంఅప్పుడే నిర్మాతలు సినిమాను మరింత క్వాలిటీగా తీయగలరు. లేదంటే చాలా సినిమాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడం ఖాయం! అని చెప్పుకొచ్చాడు. చాలామంది హీరో అభిప్రాయాన్ని కొనియాడుతున్నారు. కోట్లకు పడగలెత్తిన హీరోలు ఓసారి విష్ణు చెప్పేది వింటే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. ఆర్యన్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి, సెల్వరాఘవన్ కీలక పాత్రలు పోషించారు. ప్రవీణ్ కె దర్శకత్వం వహించాడు.చదవండి: దెయ్యాలకే దడ పుట్టించిన రీతూ.. గేమ్ గెలిచింది మాత్రం! -
రామ్ చరణ్,ఎన్టీఆర్ బాటలోనే రామ్.. మిగిలిన వాళ్ళు?
అసలు కన్నా కొసరు ముద్దు అన్నట్టు మన తెలుగు హీరోలకు మొదటి నుంచీ తమ పేర్ల కన్నా వాటి ముందు తగిలించుకునే ట్యాగ్స్ పిచ్చి ఎక్కువ. తాజాగా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అంటూ తాను తగిలించుకున్న ట్యాగ్ను స్వఛ్చందంగా వదిలేసుకున్నట్టు తెలుస్తోంది. ఇటు సినిమా సర్కిల్లోనూ అటు సోషల్ మీడియాలోను రామ్ చరణ్ ను గ్లోబల్ స్టార్ గా పిలుచుకుంటారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు రాబోతున్న పెద్ది సినిమాకు గ్లోబల్ స్టార్ ట్యాగ్ ను తొలగించారని సమాచారం. లేటెస్ట్ గా వస్తున్న పోస్టర్ లోను గ్లోబల్ స్టార్ తొలగించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గా పేర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో తెలుగు హీరోల ట్యాగ్ పిచ్చి మరోసారి చర్చనీయాంశంగా మారింది.టాలీవుడ్ హీరోలు అదనపు స్టార్ ట్యాగ్ లను తగిలించుకోవడం ఎలాగైతే మొదటి సారి కాదో అలాగే వదిలించుకోవడం కూడా ఇదే ప్రధమం కాదు. గతంలో ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో వచ్చిన శక్తి సినిమా టైమ్ లో ఏ1 స్టార్ అనే ట్యాగ్ ను ఎన్టీయార్ తగిలించుకున్నారు. అయితే ఆ సినిమా దారుణంగా ప్లాప్ అవడంతో మేల్కొన్న తారక్ మరోసారి ఆ ట్యాగ్ ను యూజ్ చేయలేదు. ఆ తర్వాత ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ను జత చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఆచార్య, గేమ్ ఛేంజర్ సినిమాల రిలీజ్ టైమ్ లో ఈ ట్యాగ్ను స్క్రీన్ నేమ్ గా వేశారు. కానీ ఆ సినిమాలు బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇక ఇదే దారిలో మరో యంగ్ హీరో రామ్ పోతినేని కూడా ట్యాగ్ త్యాగం చేస్తున్నాడు. చాలా ల్యాంగ్ గ్యాప్ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో రామ్ పోతినేని కి ముందు ఉస్తాద్ అని ట్యాగ్ను తగిలించుకున్నాడు రామ్. ఆ తర్వాత చేసిన ఇస్మార్ట్ శంకర్ 2 సహా పలు సినిమాలు డిజాస్టర్స్ కావడంతో ఉస్తాద్ ట్యాగ్ కు గుడ్ బై చెప్పేస్తున్నాడట రామ్. తన పాత ఎనర్జిటిక్ స్టార్ ట్యాగ్ తో సరిపెట్టుకుంటున్నాడు. రాబోతున్న ఆంధ్ర కింగ్ సినిమా పోస్టర్ లోను ఆ పాత ట్యాగ్తోనే వస్తున్నాడు. వేలం వెర్రి కాకూడదుమరే భాషా చిత్ర పరిశ్రమలోనూ లేనంతగా టాలీవుడ్లో ఈ స్టార్ టైటిల్స్ చాలా కాలం పాటు హీరోలను ఎలివేట్ చేసే మార్కెటింగ్ సాధనాలుగా పనిచేశాయి. ఎన్టీయార్ తరంలో నట రత్న, నట సామ్రాట్, సూపర్స్టార్, రెబల్ స్టార్...ఆ తర్వాత అవి వారసత్వ సంపద తరహాలో అనివార్యంగా వారసులకు అంటగట్టేశారు. చిరంజీవి తరం వరకూ కూడా ఈ తరహా ట్యాగ్స్ బాగానే అనిపించాయి. ఎందుకంటే అప్పట్లో తెలుగు సినిమా ప్రేక్షకుల వరకూ మాత్రమే అవి పరిమితం కాబట్టి వారు తమ హీరోలను దేవుళ్ల తరహాలో ఆరాధించడానికి అలవాటు పడ్డారు కాబట్టి ఓకే అనిపించాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన తర్వాత ఇలాంటి ట్యాగ్స్ అవసరమా అనే ప్రశ్న తలెత్తుతోంది. తగిలించుకున్న ట్యాగ్కు తగ్గ స్ఠాయి లేకపోతే అన్య భాషా ప్రేక్షకుల దగ్గర నవ్వుల పాలు కామా?ఉదాహరణకు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాను ఎప్పటి నుంచో గ్లోబల్ స్టార్గా మీడియా పేర్కొంటోంది. ఆమె అటు హాలీవుడ్, ఇటు ఇండియన్ సినిమా రెండింటిలోనూ రాణిస్తోంది కాబట్టి అభ్యంతర పెట్టడానికి ఏమీ లేదు. కానీ ఒకే ఒక్క సినిమా ఫలితం చూసి గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ను రామ్ చరణ్ జత చేసుకోవడం ఒక తొందరపాటే అని చెప్పాలి. వదులుకోవడం మంచి పరిణామమే అని కూడా చెప్పాలి. ఈ ఉదంతం నుంచి ఇకనైనా యువ హీరోలు పాఠం నేర్చుకోవాలి. తాము తగిలించుకునే ట్యాగ్ అర్ధవంతంగా ఉన్నంతవరకూ ఓకే కానీ అతిశయోక్తిగా ఉండకుండా జాగ్రత్త పడాలి. లేకుంటే మాత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కు చేరువవుతున్న తెలుగు సినిమా స్థాయిని తెలుగు స్టార్స్ తమ కీర్తి కండూతితో దిగజార్చినట్టే అవుతుంది. -
నీళ్ల బాటిల్ రూ.100.. కాఫీ రూ.700.. సుప్రీంకోర్టు సీరియస్
ఏ సినిమా అయినా సరే.. టికెట్ ధర రూ.200కి దాటకూడదని కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ఓ నిర్ణయం తీసుకుంది. ఇతర భాషా చిత్రాలకు సైతం ఇదే వర్తిస్తుందని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని కర్ణాటక మల్టీప్లెక్స్ థియేటర్ల ఓనర్లు వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. సినిమా చూడాలంటే రూ.2000?టికెట్ ధరలతో పాటు థియేటర్లలో విక్రయించే తినుబండారాలపై భారీ మొత్తంలో వసూలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఒక్క నీళ్ల బాటిల్కు రూ.100, కాఫీకి రూ.700 వసూలు చేస్తారా? అని ఆగ్రహించింది. సాధారణ ప్రజలు ఒక సినిమా చూడటానికి మల్టీప్లెక్స్కు వస్తే రూ.1,500 నుంచి రూ.2,000 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇప్పటికే థియేటర్లకు వచ్చేవారి సంఖ్య తగ్గుతోంది. ఇలాగైతే థియేటర్లు ఖాళీటికెట్, తినుబండారాల ధరలు అందుబాటులో లేకపోతే థియేటర్లు ఖాళీ అవడం ఖాయం అని అభిప్రాయపడింది. టికెట్ ధర రూ.200 ఉండాలనే హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాన్ని తాము సమర్థిస్తున్నామని జస్టిస్ విక్రమ్ నాథ్ తెలిపారు. అయితే టికెట్ కౌంటర్లలో డబ్బు చెల్లించి టికెట్లు కొనుగోలు చేసే వారి గుర్తింపు కార్డు (ఐడీ) వివరాలు సేకరించాలన్న హైకోర్టు ఉత్తర్వులు తక్షణమే అమలు కాకుండా వాటిపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.చదవండి: బండ్ల గణేశ్ సెటైర్లు.. కౌంటరిచ్చిన అల్లు అరవింద్ -
దెయ్యాలకే దడ పుట్టించిన రీతూ.. గేమ్ గెలిచింది మాత్రం!
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్ కొన్నిసార్లు దెయ్యాలకొంపలానూ మారిపోతుంటుంది. ఏమాటకామాట.. దెయ్యం అనగానే అందరికీ గుర్తొచ్చేది సోహైల్! భయమనేది మా ఇంటావంటా లేదన్నట్లుగా బిల్డప్ ఇచ్చి చీకటి గదిలోకి వెళ్లాడు. తీరా అక్కడ చిన్న వెలుతురు లేకపోగా వింత శబ్ధాలు, ఫ్లాష్ లైట్లలో దెయ్యం ఆకారాలు చూసి మామూలుగా జడుసుకోలేదు. ఇప్పుడదే టాస్క్ తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్లోనూ రిపీట్ అవుతోంది.ఆడపులి..ఈ మేరకు ప్రోమో కూడా వదిలారు. తనూజ భయంభయంగానే ఆ గదిలోకి వెళ్లి తనకిచ్చిన టాస్క్ పూర్తి చేసింది. తర్వాత రీతూ వంతు వచ్చింది. లోపల జాగ్రత్త.. అని సంజనా ధైర్యం చెప్తుంటే.. ఆడపులి ఇక్కడ అని బిల్డప్ ఇచ్చింది. తీరా లోపలకు వెళ్లాక ఆ దెయ్యం కాళ్లు పట్టుకోవడమే తక్కువ అన్నట్లుగా మారింది. ఇలా చేస్తే నేను బయటకు పోతా.. అన్న ప్లీజ్.. ప్లీజ్.. అంటూ వేడుకుంటూనే ఉంది. చివర్లో మాత్రం దెయ్యంలా ఓ నవ్వు నవ్వింది. ఆ నవ్వుకు దెయ్యాలే జడుసుకుని పారిపోవడం ఖాయం! ఈ గేమ్లో తనూజ గెలిచినట్లు తెలుస్తోంది. ఇక సుమన్, దివ్య ఎవరికీ అనుమానం రాకుండా సీక్రెట్ టాస్కులు పూర్తి చేస్తున్నారు. మరి చివరకు ఎవరు కెప్టెన్సీ కంటెండర్లవుతారో చూడాలి! చదవండి: బండ్ల గణేశ్ సెటైర్లు.. కౌంటరిచ్చిన అల్లు అరవింద్ -
రష్మిక ది గర్ల్ఫ్రెండ్ మూవీ.. ఎమోషనల్ సాంగ్ రిలీజ్
దీక్షిత్ శెట్టి, రష్మిక మందన్నా హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ది గర్ల్ఫ్రెండ్. ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజ్కు అంతా సిద్ధమైంది. ఈనెల 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు అభిమానులు ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో మరో సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా ఈ మూవీ ఫుల్ ఎమోషనల్ సాంగ్ను రిలీజ్ చేశారు. నీదే కథ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు రాకేందు మౌలి లిరిక్స్ అందించగా.. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ సాంగ్ను హేషమ్ అబ్దుల్ వాహబ్ కంపోజ్ చేశారు. ఈ పాట రష్మిక ఫ్యాన్స్ను తెగ అలరిస్తోంది. కాగా.. ది గర్ల్ఫ్రెండ్ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు. -
'మీ ఇంట్లో లంకె బిందెలున్నాయి'.. జటాధర రిలీజ్ ట్రైలర్ చూశారా?
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu) మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా వస్తోన్న డివోషనల్ బ్యాక్ డ్రాప్ కథా చిత్రం 'జటాధర'(JATADHARA Release Trailer). ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ విడుదలకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.ఈ నేపథ్యంలో మరో ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. మీ ఇంట్లో లంకె బిందెలున్నాయి అనే డైలాగ్లో ట్రైలర్ ప్రారంభమైంది. దెయ్యాలు, భూతాలు అనే కాన్సెప్ట్తోనే ఈ మూవీని తీసినట్లు క్లియర్ కట్ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మరి ఇలాంటి కాన్సెప్ట్ అభిమానులను అలరిస్తుందా? ఎప్పటిలాగే అలా వచ్చి ఇలా వెళ్లిపోతుందా? తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం రిలీజ్ ట్రైలర్ చూసేయండి.ఈ సినిమాకు వెంకటేశ్ కల్యాణ్- అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్-ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ మూవీ ద్వారానే బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. నమ్రతా శిరోద్కర్ సిస్టర్ శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలో మెప్పించనుంది. -
డైరెక్టర్కు బంపరాఫర్.. నీ సొంతింటి బాధ్యత నాదే: టాలీవుడ్ నిర్మాత
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం ది గర్ల్ఫ్రెండ్. ఈ మూవీలో రష్మిక, దీక్షిత్ శెట్టి జంటగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్కు రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా మూవీ నిర్మాతల్లో ఒకరైన ధీరజ్ మొగిలినేని ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాహుల్ రవీంద్రన్ తనతో ఓ మాట అన్నారని తెలిపారు. ఈ మూవీ సూపర్ హిట్ అయితే నెక్ట్స్ మూవీకి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుని ఓ ఇల్లు కొనుక్కుంటానని నాతో చెప్పారని అన్నారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్కు హైదరాబాద్లో ఇప్పటివరకు సొంతిల్లు లేదన్నారు. ఈ సినిమా హిట్ అయితే నేనే మీ ఇంటి కలను నెరవేరుస్తానని నిర్మాత ధీరజ్ మొగిలినేని హామీ ఇచ్చారు.కాగా.. ది గర్ల్ఫ్రెండ్ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు. ఈ నెల 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
బండ్ల గణేశ్ సెటైర్లు.. కౌంటరిచ్చిన అల్లు అరవింద్
చేతికి మైక్ దొరికితే చాలు.. అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడేది ఇద్దరే ఇద్దరు. ఒకరు రాజేంద్రప్రసాద్, మరొకరు బండ్ల గణేశ్. ఈ మధ్య వీళ్ల మాటతీరు అలాగే ఉంటోంది. తెలియకుండానే లేనిపోని వివాదాలను మీదేసుకుంటున్నారు. ఆ మధ్య రాజేంద్రప్రసాద్.. డేవిడ్ వార్నర్, అలీ, రోజాలపై నోరు జారి తర్వాత క్షమాపణలు చెప్పాడు. ఈ మధ్యేకంగా మాస్ జాతర మూవీ చూసి షాకవ్వకపోతే ఇండస్ట్రీని వదిలేస్తా అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు.విజయ్, అల్లు అరవింద్పై సెటైర్లుఇక బండ్ల గణేశ్ (Bandla Ganesh).. లిటిల్ హార్ట్స్ సక్సెస్ ఈవెంట్లో కొత్త హీరో మౌళిని మెచ్చుకుంటూనే విజయ్ దేవరకొండపై సెటైర్లు వేశాడు. అల్లు అరవింద్ గురించైతే దారుణంగా మాట్లాడాడు. ఈ సినిమాకి బన్నీ వాసు, వంశీ ఎంతో కష్టపడితే చివరకు అల్లు అరవింద్ సినిమా అంటున్నారు. ఆయన చివరి నిమిషంలో వచ్చి పేరు కొట్టేస్తారు అని కామెంట్స్ చేశాడు. రెండు రోజుల క్రితం జరిగిన కె-ర్యాంప్ సక్సెస్ ఈవెంట్లోనూ మరోసారి హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ట్రోల్స్ రావడంతో ఇప్పుడు క్షమాపణలు చెప్పాడు.నాకంటూ ఓ స్థాయి ఉంది: అల్లు అరవింద్ఇక బండ్ల గణేశ్ వ్యాఖ్యలపై అల్లు అరవింద్ (Allu Aravind)కు ప్రశ్న ఎదురైంది. అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ది గర్ల్ఫ్రెండ్. దీక్షిత్ శెట్టి, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న ఈ మూవీ నవంబర్ 7న విడుదల కానుంది. బుధవారం ఈ సినిమా ప్రీరిలీజ్ ప్రెస్మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఓ విలేఖరి ఓ ప్రశ్న లేవనెత్తాడు. ఆ మధ్య బండ్ల గణేశ్ మీ గురించి మాట్లాడుతూ.. మీరు చివర్లో వచ్చి క్రెడిట్ తీసుకుంటారన్నారు. ఆ మాటకు మీరు చాలా ఫీలయ్యారని ఇన్సైడ్ టాక్.. మీరేమంటారు? అని ప్రశ్నించాడు. అందుకు అల్లు అరవింద్ సింపుల్గా.. నాకంటూ ఓ స్థాయి ఉంది. దాని గురించి మాట్లాడను అని తేల్చి పడేశాడు.చదవండి: ఎవరినీ ఉద్దేశించి అనలేదు.. క్షమించండి: బండ్ల గణేశ్ -
ఎవరినీ ఉద్దేశించి అనలేదు.. క్షమించండి: బండ్ల గణేశ్
ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) మరోసారి క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. కె-ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధపెట్టాయని తెలిసింది. నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు. నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే. ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు అని రాసుకొచ్చాడు.అసలేం జరిగిందంటే?కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'K ర్యాంప్' సినిమా దీపావళికి రిలీజైంది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ర్యాంపేజ్ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్ పేరిట సోమవారం ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ ఈవెంట్కు బండ్ల గణేష్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. టాలెంట్ను నమ్ముకుని పైకి వస్తున్న కిరణ్ అబ్బవరాన్ని పొగిడే క్రమంలో తెలుగులోని ఓ స్టార్ హీరోను కింపరిచేలా కామెంట్స్ చేశాడు. బండ్ల గణేశ్ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో ఒక్క సినిమా హిట్ కాగానే లూజ్ ప్యాంట్లు, కొత్త చెప్పులు, కళ్లకు అద్దాలు పెట్టుకుని.. కాలు మీద కాలు వేసుకుని వాట్సప్.. వాట్సప్ అంటూ పోజులు కొడుతున్నారు.విజయ్పైనే విమర్శలుతన తర్వాతి సినిమా కోసం లోకేష్ కనగరాజ్ను తీసుకురా... రాజమౌళిని తీసుకురా... సుకుమార్ను తీసుకురా... అనిల్ రావిపూడిని తీసుకురా అంటున్న ఈ రోజుల్లో ఆరుగురు కొత్త దర్శకులను కిరణ్ పరిచయం చేశాడు' అని ఎలివేషన్ ఇచ్చాడు. ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) మాత్రమే ఎక్కువగా 'వాట్సాప్.. వాట్సాప్ మై రౌడీ బాయ్స్' అంటూ ఫ్యాన్స్ను పలకరిస్తుంటాడు. దీంతో బండ్ల.. విజయ్పైనే విమర్శలు గుప్పించాడని ప్రచారం జరిగింది. కిరణ్ను పొగడటం తప్పు కాదు కానీ మధ్యలో విజయ్ ఏం పాపం చేశాడని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే బండ్ల క్షమాపణలు చెప్తూ ట్వీట్ చేశాడు. ఇటీవల కె రాంప్ సినిమా సక్సెస్ మీట్లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధపెట్టాయని తెలిసింది. నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు.నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే.ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు.మీ బండ్ల గణేష్— BANDLA GANESH. (@ganeshbandla) November 5, 2025 -
సతీమణి బర్త్ డే.. కేఎల్ రాహుల్ స్పెషల్ విషెస్!
బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టికి ఆమె భర్త, టీమిండియా క్రికెటర్ ప్రత్యేక విషెస్ తెలిపారు. ఇవాళ అతియా శెట్టి పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో ఉన్న ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేశారు. కాగా.. ఇవాళ అతియా తన 33వ పుట్టినరోజు జరుపుకుంటోంది.కేఎల్ రాహుల్ తన పోస్ట్లో రాస్తూ.. "నా ప్రాణ స్నేహితురాలు, సతీమణి, ప్రేమికురాలు, స్ట్రెస్ బాల్, గూఫ్బాల్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. గడిచిన ప్రతి సంవత్సరం నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నా' అంటూ సతీమణిపై ప్రేమ కురిపించారు. దీనికి లవ్ యూ అంటూ అతియా శెట్టి రిప్లై కూడా ఇచ్చింది. కూతురు బర్త్ డే సందర్భంగా సునీల్ శెట్టి బర్త్ డే విషెస్ చెబుతూ నెట్టింట పోస్ట్ చేశారు. అతియాతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. అతియా బ్రదర్ అహన్ శెట్టి కూడా సిస్టర్కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రాణ స్నేహితుడిగా ఉన్న వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశాడు.కాగా.. అతియా శెట్టి కొంతకాలంగా సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటోంది. 2023 జనవరి 23న క్రికెటర్ కేఎల్ రాహుల్ను పెళ్లాడింది. ముంబయి సమీపంలోని ఖండాలా ఉన్న సునీల్ శెట్టి ఫామ్హౌస్లో వీరిద్దరి వివాహం జరిగింది. ఆ తర్వాత ఈ జంటకు ఈ ఏడాది మార్చిలో తమ మొదటి బిడ్డకు ఎవారా అనే కుమార్తెకు స్వాగతం పలికారు. మరోవైపు అతియా 2015లో హీరోయిన్గా ఇండస్ట్రీలో రంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత ముబారకన్, మోతీచూర్ చక్నాచూర్ వంటి చిత్రాలలో నటించింది. View this post on Instagram A post shared by KL Rahul👑 (@klrahul) -
హీరోయిన్తో ఆటోడ్రైవర్ దురుసు ప్రవర్తన!
ఓ ఆటోడ్రైవర్ తనతో దురుసుగా ప్రవర్తించాడంటూ బాలీవుడ్ హీరోయిన్ షమీమ్ అక్బర్(Shamim Akbar Alli) పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన కూతురు ముందే తనను అసభ్యపదజాలంతో దూషించాడని..అంతేకాకుండా నా చేయిపట్టుకొని గట్టిగా లాగాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు.. విచారణ చేపట్టారుఅసలేం జరిగింది?ఫిర్యాదులో ఉన్న వివరాల ప్రకారం..‘ఇన్ ది మంత్ ఆఫ్ జూలై’ ఫేం షమీమ్ అక్బర్ అల్లీ(32)కి ఐదేళ్ల కూతురు ఉంది. ఈ నెల 1న తన కూతురుని స్కూల్ నుంచి తీసుకురావడానికి ముంబైలోని మైరా రోడ్లో ఉన్న తన నివాసం ముందు ఆటోని ఆపింది. మధ్యాహ్నం 2.45 గంటల సమీపంలో ఆమె ఆటో ఎక్కి స్కూల్ దగ్గరకు వెళ్లింది. అక్కడ ఆటో ఆపమని చెప్పగానే..అప్పటికే చిరాకుగా ఉన్న డ్రైవర్..ఇక్కడ ఎందుకు ఆపావని ఆమెపై ఫైర్ అయ్యాడు. తనకు అర్జెంట్ పని ఉందని.. వెంటనే కిరాయి ఇవ్వమని డిమాండ్ చేశాడు. ఆమె మాత్రం డబ్బులు ఇవ్వకుండా..స్కూల్లో ఉన్న తన కూతురుని తీసుకొని మళ్లీ అదే ఆటో ఎక్కి ఇంటివద్ద డ్రాప్ చేయమని చెప్పింది. ఇంటి గేట్ వద్దకు చేరుకోగానే..ఆమె కూతురు ఫౌంటేన్ ఏరియా చుట్టు ఒక రౌండ్ తిరగమని కోరింది. అయితే అప్పటికే డ్రైవర్ కోపంగా ఉండడంతో.. ‘మనం వేరే ఆటోలో వెళదాం లే’ అంటూ చిన్నారిని తీసుకొని హీరోయిన్ దిగబోయింది. డ్రైవర్ ఒక్కసారిగా ఆమెపై గట్టిగా అరిచాడు. వెనక్కి తిరిగి దిగబోతున్న హీరోయిన్ చేయిని పట్టుకొని గట్టిగా లాగాడు. కూతురు ముందే తనపై దుర్భాషలాడాడు.డ్రైవర్ కోసం గాలింపు!సదరు డ్రైవర్పై నటి సీరియస్ అవ్వడంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడు. సాయంత్రం ఆమె కాశీమీరా పోలీసు స్టేషన్లో ఆ డ్రైవర్పై ఫిర్యాదు చేసింది. తన కూతురు ముందే తనతో దురుసుగా ప్రవర్తించిన డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆటో రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా డ్రైవర్ వివరాలను తెలుసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని..త్వరలోనే డ్రైవర్ని అదుపులోకి తీసుకుంటామని పోలీసులువెల్లడించారు. నటి షమీమ్ అక్బర్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో టచ్లోనే ఉంటున్నారు. View this post on Instagram A post shared by Shamim Akbarali (@officialshamimakbarali) -
మగాళ్లకూ ఆ నరకం తెలియాలి: రష్మిక మందన్నా
హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఏది పట్టినా బంగారమే అవుతోంది. యానిమల్ నుంచి కుబేర వరకు ఆమె చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్టే.. ఒక్క సికిందర్ తప్ప! ఈ ఏడాది రష్.. ఇప్పటివరకు నాలుగు సినిమాల(ఛావా, సికిందర్, కుబేర, థామా)తో అలరించింది. ఇప్పుడేకంగా ఐదో మూవీ 'ది గర్ల్ఫ్రెండ్' (The Girlfriend Movie)తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.టాక్ షోలో రష్మికరాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 7న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్ కోసం బాగానే కష్టపడుతోందీ బ్యూటీ. ఈ మధ్యే తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ స్టేజీపైనా సందడి చేసింది. తాజాగా జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకి హాజరైంది. ఈ టాక్ షోలో సినిమా కోసమే కాకుండా ఇతరత్రా విషయాలపైనా మాట్లాడింది.మగాళ్లకు పీరియడ్స్ రావాలిముందుగా ఆమె మనసులో ఉన్న కోరిక గురించి జగపతిబాబు ప్రస్తావించాడు. మగాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే బాగుండని ఫీలైనట్లున్నావ్? అని అడిగాడు. అందుకు రష్మిక క్షణం ఆలోచించకుండా అవునని తలూపింది. మగాళ్లకు ఒక్కసారైనా పీరియడ్స్ వస్తే.. ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం అవుతుంది అని చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.చదవండి: ఓటీటీలో 'మిత్రమండలి'.. 20 రోజుల్లోనే స్ట్రీమింగ్ -
హీరో మంచు మనోజ్ సతీమణి ఎమోషనల్.. ఆ ఒక్క పాటతో కన్నీళ్లు!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాలతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. భైరవం, మిరాయ్ చిత్రాలతో వెండితెరపై సందడి చేశారు. ఇటీవలే విడుదలైన మిరాయ్తో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీలో విలన్ పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నారు. తేజ సజ్జా కీలక పాత్రలో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది.అయితే హీరో మంచు మనోజ్ తాజాగా ఓ మూవీ ఈవెంట్కు ముఖ్య అథితిగా పాల్గొన్నారు. రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమా సాంగ్ను లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమానికి సతీమణి భూమా మౌనికతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మంచు మనోజ్ అన్నారు. అంతేకాకుడా మౌనికతో తన ప్రేమ విషయాన్ని కూడా పంచుకున్నారు. రాజ్యాలేమీ లేకపోయినా.. రాణిలా చూసుకుంటానని మాటిచ్చానని తెలిపారు.అయితే ఈవెంట్కు హాజరైన మిట్టపల్లి సురేందర్ ఓ సాంగ్ను ఆలపించారు. 'రాజ్యమేదీ లేదుగానీ.. రాణిలాగా చూసుకుంటా.. కోట కట్టేలేనుకానీ.. కళ్లలో నిన్నే దాచుకుంటా' అంటూ మంచు మనోజ్, మౌనికలను ఉద్దేశించి రాజు వెడ్స్ రాంబాయి చిత్రంలోని పాట పాడారు. భర్తను ప్రేమించే ప్రతి అమ్మాయి కోరుకునేది ఇదేనంటూ మాట్లాడారు. ఈ పాట విన్న భూమా మౌనిక తీవ్ర భావోద్వేగానికి గురైంది. వేదికపైనే కన్నీళ్లు ఆపులేకపోయింది. ఫుల్ ఎమోషనల్ అవుతూ ఏడ్చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Celebrities Tollywood (@celebrities_tollywood_) -
మోహన్లాల్ కుమారుడి థ్రిల్లర్ సినిమా ( ట్రైలర్)
మలయాళ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్లాల్ (Pranav Mohanlal) హీరోగా నటిస్తున్న చిత్రం డియస్ ఈరే.. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ ఈ చిత్రాన్ని నవంబర్ 7న తెలుగులో విడుదల చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ను రిలీజ్ చేశారు. నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ మూవీ కావడంతో తెలుగు ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భూత కాలం', మమ్ముట్టి 'భ్రమ యుగం' చిత్రాలకు దర్శకత్వం వహించిన రాహుల్ సదాశివన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. -
‘రాజు వెడ్స్ రాంబాయి’ బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం : మంచు మనోజ్
‘‘ఒక పల్లెటూరులో జరిగిన వాస్తవ ఘటనలతో రూపొందిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అలాగే బోలెడన్ని అవార్డ్స్ వస్తాయి’’ అని హీరో మంచు మనోజ్ చెప్పారు. అఖిల్ ఉడ్డెమారి, తేజస్విని జంటగా సాయిలు కం΄ాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్సూన్ టేల్స్ బ్యానర్స్పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘రాంబాయి నీ మీద నాకు...’ అంటూ సాగే ΄ాటను హీరో మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. మంచు మనోజ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా రిలీజ్ తర్వాత సాయిలుకు బెదిరింపు కాల్స్ వస్తాయి. అప్పుడు తనకు సపోర్ట్గా నేనుంటాను’’ అన్నారు. ‘‘గతించిన చరిత్రకు, ప్రస్తుత చరిత్రకు మా సినిమా ఓ సాక్ష్యం’’ అన్నారు వేణు ఊడుగుల. ‘‘మా సినిమా చూస్తున్నవాళ్లకు తమ ప్రేమ గుర్తుకొస్తుంది’’ అన్నారు సాయిలు. ‘‘సూపర్ హిట్ ఆల్బమ్ అనే మాట మా సినిమాతో మళ్లీ వినిపిస్తుందని నమ్ముతున్నాం’’ అని పేర్కొన్నారు రాహుల్ మోపిదేవి. -
‘పిఠాపురంలో’ మూడు ప్రేమకథలు
‘అయోధ్య రామయ్య, చెప్పాలని ఉంది, జోరుగా హుషారుగా..’ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహేశ్చంద్ర తెరకెక్కించిన కొత్త చిత్రానికి ‘పిఠాపురంలో..’ అనే టైటిల్ ఖరారైంది. ‘అలా మొదలైంది’ అన్నది ఉపశీర్షిక. సన్నీ అఖిల్, రెహానా, డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ ప్రధానపాత్రల్లో నటించారు. దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్ఎం మురళి (గోదారి కిట్టయ్య) నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మహేశ్ చంద్ర మాట్లాడుతూ– ‘‘కుటుంబ భావోద్వేగాలు కలగలిసిన ప్రేమకథా చిత్రమిది. ఈ చిత్రంలో మూడు జంటల ప్రేమకథలను, ముగ్గురు తండ్రుల పెంపకాల్లోని లోటు΄ాట్లని చూడొచ్చు. కథను నమ్మి, ఈ సినిమా తీశాం. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. -
ఓటీటీలో 'మిత్రమండలి'.. 20 రోజుల్లోనే స్ట్రీమింగ్
నటుడు ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించిన కొత్త చిత్రం ‘మిత్రమండలి’ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, వెన్నెల కిశోర్,సత్య, విష్ణు, రాగ్ మయూర్ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 16న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించలేదు. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. అయితే, ఈ మూవీకి సమర్పకులుగా నిర్మాత బన్నీ వాస్ ఉన్నారు.మిత్రమండలి(Mithra Mandali) సినిమా నవంబర్ 6న ఓటీటీ విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అమెజాన్ ప్రైమ్(amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్ను షేర్ చేశారు. కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలోకి ఈ చిత్రం రానున్నడంతో సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.కథేంటంటే...జంగ్లీపట్నానికి చెందిన నారాయణ(వీటీవీ గణేష్)కి కులపిచ్చి. తన తుట్టె కులానికి చెందినవాళ్లు ఇతర కులాలకు చెందినవారిని పెళ్లి చేసుకంటే.. వారిని చంపేసే రకం. తుట్టె కులం అండతో ఎమ్మెల్యే కావాలనుకుంటాడు. ఓ ప్రధాన పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వడానికి ముందుకు వస్తుంది. అదే సమయంలో నారాయణ కూతురు స్వేచ్ఛ(నిహారిక ఎన్ఎమ్) ఇంటి నుంచి పారిపోతుంది. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించి, ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఎస్సై సాగర్ (వెన్నెల కిశోర్)ని కలుస్తాడు. లంచం ఇచ్చి గుట్టుచప్పుడు కాకుండా తన కూతురు ఆచూకీ కనుక్కోమని చెబుతాడు.అయితే, స్వేచ్ఛ పారిపోవడం వెనక ఆ ప్రాంతానికి చెందిన నలుగురు కుర్రాళ్లు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నలుగురు ఆవారాగాళ్లు. రోజంతా బాతకాలు కొట్టడం.. సాయంత్రం మందేసి చిందులు వేయడమే వీరి పని. ఇలాంటి చిల్లర గాళ్లకి స్వేచ్ఛకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? స్వేచ్ఛ పారిపోవడం వెనున ఉన్న అసలు కారణం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా(Mithra Mandali) చూడాల్సిందే. -
తెలుగు ఇండస్ట్రీని చూసి నేర్చుకోండి: సోనాక్షి
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సుధీర్ బాబు హీరోగా వస్తోన్న జటాధర మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. సోనాక్షి రోల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీ నవంబర్ 7న రిలీజవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లతో బిజీగా ఉన్న బాలీవుడ్ నటి సౌత్ ఇండస్ట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తెలుగు పరిశ్రమలో పనిచేసిన తన అనుభవాన్ని పంచుకుంది.దక్షిణాది సినీ ఇండస్ట్రీని చూసి బాలీవుడ్ కొన్ని విషయాలు నేర్చుకోవాలని సోనాక్షి సిన్హా అభిప్రాయం వ్యక్తం చేసింది. దక్షిణాది సినీ పరిశ్రమలో సమయపాలన పాటిస్తారని తెలిపింది. తొమ్మిది గంటలకు షూటింగ్కు వస్తే సాయంత్రం ఆరు వరకే ఉంటుందని.. ఈ విషయంలో వారిని అభినందించాల్సిందేనని అన్నారు. వారిని చూసి బాలీవుడ్ మేకర్స్ నేర్చుకోవాలని హితవు పలికింది. బాలీవుడ్లో అర్ధరాత్రి వరకు షూటింగ్స్ జరుగుతుంటాయని విమర్శించింది. సౌత్లా చేయాలంటే క్రమశిక్షణ అవసరమని సోనాక్షి వెల్లడించింది. తెలుగు చిత్ర పరిశ్రమను చూసైనా బాలీవుడ్ మారాలని సలహా ఇచ్చింది.తన మొదటి తెలుగు ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ..' స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. ప్రాంతీయ భాషల్లో సినిమాలు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నా. గతంలో నేను (లింగా) ఒక తమిళ సినిమా చేశా. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చేశా. ఎల్లప్పుడూ ఇలాంటి చిత్రాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నా. కానీ అంతకు ముందు నా షెడ్యూల్ కుదరక సినిమాలు ఒప్పుకోలేదు' అని చెప్పిందిఆ తర్వాత వర్క్ లైఫ్ ప్రస్తావిస్తూ..' హిందీ, తెలుగు సినిమా పని సంస్కృతిని పోల్చి చూస్తే.. దక్షిణది పరిశ్రమలో సమయపాలన గ్రేట్. అక్కడ పని, లైఫ్ బ్యాలెన్స్ చాలా బాగుంది. ఈ విషయాన్ని వారి నుంచి మనం కచ్చితంగా నేర్చుకోవాల్సిందే. సెట్లోని క్రమశిక్షణ తనకు ప్రత్యేకంగా అనిపించింది. ఉదయం తొమ్మిది గంటలకు షూటింగ్కు వెళ్తే.. ఆరు గంటల తర్వాత అస్సలు షూట్ చేయరు. అది నిజంగా చాలా గ్రేట్. ఇక్కడ తెలుగు సినీ పరిశ్రమలో క్రమశిక్షణను అంగీకరించాల్సిన విషయం' అని తెలిపింది. కాగా.. జటాధర మూవీలో ధన పిశాచి పాత్రలో సోనాక్షి సిన్హా కనిపించనుంది. -
పెళ్లి రిసెప్షన్లో వాంతులు.. దుల్కర్ సల్మాన్పై కేసు
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్కు కేరళలోని పతనంతిట్ట జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆయన బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్న రోజ్ బ్రాండ్ బిర్యానీ రైస్ యజమానిపై కూడా ఫిర్యాదు చేశారు. జిల్లాలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్లో రోజ్ బ్రాండ్ రైస్తో చేసిన బిర్యానీ తిన్న వారందరూ ఫుడ్ పాయిజనింగ్కు గురయ్యారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే దుల్కర్కు నోటీసులు జారీ చేశారు.నివేదికల ప్రకారం.. 2025 డిసెంబర్ 3న కమిషన్ ముందు దుల్కర్ సల్మాన్ హాజరు కావాలని ఆదేశించబడింది. నటుడితో పాటు, రోజ్ బ్రాండ్ బిర్యానీ రైస్ మేనేజింగ్ డైరెక్టర్, మలబార్ బిర్యానీ అండ్ స్పైసెస్ జిల్లా మేనేజర్ను కూడా హాజరు కావాలని కోరింది.సంఘటన ఎప్పుడు జరిగింది..?2025 ఆగస్టు 24న ఈ ఘటన జరిగింది. పతనంతిట్ట జిల్లా వల్లికోడ్కు చెందిన క్యాటరింగ్ కాంట్రాక్టర్ పి.ఎన్. జయరాజన్ చేసిన ఫిర్యాదుతో దుల్కర్పై కేసు నమోదు చేశారు. వల్లికోడ్లో జరిగిన వివాహ రిసెప్షన్ కోసం బిర్యానీ తయారు చేయడానికి 50 కేజీల రోజ్ బ్రాండ్ బిర్యానీ రైస్ను ఆయన కొనుగోలు చేశాడు. ఆ వంటకం తిన్న చాలా మందికి ఫుడ్ పాయిజనింగ్ కావడం వల్ల వాంతులు చేసుకున్నారని ఆయన ఆరోపించారు.అయితే, బియ్యం సంచులపై ప్యాకింగ్ తేదీతో పాటు గడువు తేదీ కూడా ముద్రించి లేదని గుర్తించినట్లు చెప్పారు. దీంతో ఆహార ఉత్పత్తి భద్రత చట్టప్రకారం ఆ కంపెనీ లేబులింగ్ ప్రమాణాలను పాటించలేదని జయరాజన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఎ.కె. ట్రేడర్స్ మేనేజింగ్ డైరెక్టర్ మొదటి నిందితుడిగా, మలబార్ బిర్యానీ స్పైస్ పతనంతిట్ట మేనేజర్ రెండవ నిందితుడిగా, బ్రాండ్ అంబాసిడర్ దుల్కర్ సల్మాన్ మూడవ నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతానికి, దుల్కర్ సల్మాన్, రోజ్ బ్రాండ్ బిర్యానీ రైస్ ప్రతినిధుల నుంచి నోటీసుకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. -
పెద్ది 'చికిరి' సాంగ్ అర్థమిదే..
రామ్చరణ్- బుచ్చిబాబు సినిమా ‘పెద్ది’.. ఈ మూవీ నుంచి మొదటి పాట 'చికిరి చికిరి' (Chikiri) విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, చికిరి అంటే అర్థం ఏంటో చెబుతూ తాజాగా ఒక వీడియోలో బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్ పంచుకున్నారు. అలంకరణ అవసరంలేని ఆడపిల్లల్ని ముద్దుగా తమ గ్రామంలో చికిరి అని పిలుస్తారని దర్శకుడు చెప్పగానే దానికి రెహమాన్ కూడా బాగుంది కదా అంటూ.. ఈ పదంతోనే ఒక పాట ఇద్దామని పేర్కొన్నారు. అయితే పూర్తి పాట నవంబర్ 7న విడుదల కానుందని ప్రకటించారు.మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ మూవీలో జాన్వీకపూర్ అచ్చియ్యమ్మ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'నా కెరీర్లోనే అత్యంత చెత్త రోల్'.. బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ భామ హ్యుమా ఖురేషీ ప్రస్తుతం వెబ్ సిరీస్లతో ఫుల్ బిజీ అయిపోయింది. మహారాణి సీజన్-4తో పాటు మరో ఆసక్తికర సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఢీల్లీ క్రైమ్ పేరుతో వస్తోన్న మూడో సీజన్లో హ్యుమా ఖురేషీ కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే రెండు సీజన్స్ సూపర్ హిట్ కాగా.. మూడో సీజన్ నవంబర్ 13న స్ట్రీమింగ్కు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్కు హాజరైన హ్యుమా ఖురేషి తన రోల్ బడీ దీదీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముంబయిలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ రోల్ గురించి ఉత్తమంగానే చెబుతున్నా.. నా లైఫ్లో చేసిన అత్యంత చెత్త పాత్ర అని షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాకుండా బహుశా చెత్త పాత్రలు పోషించే ఉత్తమ వ్యక్తుల్లో నేను కూడా ఒకరిని అంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.తన పాత్ర గురించి మాట్లాడుతూ.. 'బడి దీదీ పాత్ర పోషించడం చాలా సరదాగా ఉంది. చీకటి పాత్రలు చేసినప్పుడు ఎటువంటి పరిమితులు ఉండవు. మీరు స్వేచ్ఛగా ప్రయోగాలు చేయొచ్చు. కానీ నేను కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నా. నేను చిత్రీకరించే ప్రతి స్త్రీకి ఏజెన్సీ, దృక్పథం ఉండేలా చూసుకుంటా. ఇక్కడ నాకు కొంత ఏజెన్సీ ఉన్నప్పటికీ.. అది చాలా ప్రతికూలంగా ఉంటుంది. అందుకే నేను దీన్ని చేయాలా వద్దా అని ఆలోచించా. కానీ ఢిల్లీ క్రైమ్ చాలా ముఖ్యమైన సిరీస్ అనిపించింది. ఇది సమాజానికి అద్దం పట్టే కథ. కొన్నిసార్లు బాగా పాపులరైన వ్యక్తి ప్రతికూల పాత్ర పోషించినప్పుడే అది సమస్యను హైలైట్ చేస్తుంది. నా పాత్ర ఈ విషయం గురించి అవగాహన పెంచడానికి సహాయపడితే అది నిజంగా నాకు గౌరవమేనని' వెల్లడించింది.కాగా.. ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ తొలి సీజన్ 2019 మార్చి, రెండో సీజన్ 2022 ఆగస్టులో విడుదలయ్యాయి. ఈ సీజన్-3లొ షెఫాలీ షా, హ్యూమా ఖురేషి, రాజేష్ తైలాంగ్, రసిక దుగల్, సయాని గుప్తా కీలక పాత్రల్లో నటించారు. రిచీ మెహతా, తనూజ్ చోప్రా ఈ సిరీస్ని రూపొందించారు. ఈ సీజన్లో ఢిల్లీకి చెందిన 30 మంది అమ్మాయిల ట్రాఫికింగ్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ కథ సిల్చార్, ముంబయి, రోహ్తక్, సూరత్, ముజఫర్పూర్ లాంటి నగరాల్లో జరిగిన ఘటనలో నేపథ్యంలో రూపొందించారు. -
రవితేజతో గ్లామర్ బ్యూటీ.. 'ఫుల్ కిక్'
రవితేజ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘మాస్ జాతర’ కొద్దిరోజుల క్రితమే విడుదలైంది. అయితే, అనుకున్నంత రేంజ్లో మెప్పించలేదు. దీంతో ఆయన తదుపరి సినిమా (RT 76) పనిలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుగుతుంది. ఒక ప్రత్యేకమైన సాంగ్ చిత్రకరణ జరుగుతుంది.ఇటీవలే స్పెయిన్లో ఒక పాట చిత్రీకరణను ముగించిన ఈ బృందం ఇప్పుడు హైదరాబాద్లో మరో పాటను చిత్రీకరించే పనిలో ఉంది. గతంలో రవితేజతో ఖిలాడిలో జతకట్టిన డింపుల్ హయాతి, RT 76 తారాగణంలో చేరినట్లు ఆమె ధృవీకరించింది. ఆమె స్వయంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం రవితేజతో కలిసి ఒక పాటను చిత్రీకరిస్తున్నారని డింపుల్ పంచుకుంది. ఆపై "చార్ట్బస్టర్" రాబోతోందని అభిమానులకు సూచించింది. ఆమెతో పాటు ఆషికా రంగనాథ్ కూడా ఇందులో భాగం కానుంది. గతంలో రవితేజ, డింపుల్ కలిసి 'ఖిలాడి' సినిమాలో 'ఫుల్ కిక్' అంటూ ఒక పాటలో ఇద్దరూ దుమ్మురేపారు.ఈ ప్రాజెక్ట్కు మొదట ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, అనార్కలి అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని సమాచారం. ఇది 2026 సంక్రాంతి విడుదలకు సిద్ధంగా ఉంది. చాలా రోజుల తర్వాత రవితేజ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రంతో రానున్నడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
రూ. 7వేల కోట్ల సినిమా.. ఓటీటీలో ఉచితంగానే స్ట్రీమింగ్
హాలీవుడ్ సినిమా జురాసిక్ వరల్డ్: రీబర్త్ (Jurassic World Rebirth) మరో ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ ఏడాది జులైలో విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 7500 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. 2025లో విడుదలైన హాలీవుడ్ చిత్రాల్లో కలెక్షన్స్ పరంగా నాలుగో స్థానంలో ఉంది. భారత్లో కూడా రూ. 100 కోట్లకు పైగానే రాబట్టి సత్తా చాటింది. అయితే, గత చిత్రాల ప్రభావం వల్లే ఈ కలెక్షన్స్ వచ్చాయని, రీబర్త్ పేరుతో వచ్చిన ఈ సీక్వెల్ అంతగా ప్రేక్షకులను మెప్పించలేదని రివ్యూలు వచ్చాయి. ఈ చిత్రంలో స్కార్లెట్ జాన్సన్, జోనాథన్ బెయిలీ, మహర్షలా అలీ కీలక పాత్రల్లో నటించారు. గారెత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించారు.జురాసిక్ వరల్డ్: రీబర్త్ చిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ (amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. అమెజాన్లో ఈ మూవీ చూడాలంటే అదనంగా రూ. 399 చెల్లించాలని మొదట ప్రకటించారు. కొద్దిరోజుల తర్వాత దానిని రూ. 119కి తగ్గించారు. ఈ క్రమంలోనే తాజాగా జియోహాట్స్టార్ (JioHotstar)సంస్థ ఒక కీలక ప్రకటన చేసింది. జురాసిక్ వరల్డ్: రీబర్త్ చిత్రాన్ని ఉచితంగానే చూడొచ్చని తెలిపింది. నవంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని జియోహాట్స్టార్ ప్రకటించింది.ప్రపంచవ్యాప్తంగా పిల్లలతో పాటు పెద్దలను కూడా ‘జురాసిక్ పార్క్’ చిత్రాలు ఆకట్టుకున్నాయి. 2022లో వచ్చిన ‘జురాసిక్ వరల్డ్: డొమినియన్’కు సీక్వెల్గా ‘జురాసిక్ వరల్డ్: రీబర్త్’ (Jurassic World Rebirth) పేరుతో విడుదల చేశారు. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. విజువల్స్తో పాటు కొన్ని థ్రిల్లింగ్కు గురిచేసే సీన్లు ఉన్నప్పటికీ ప్రేక్షకులను మాత్రం పెద్దగా మెప్పించలేదు. కథ మొత్తం సాగదీతగానే ఉంటుంది. -
మంగళసూత్రం ఎపిసోడ్.. చిన్మయి కౌంటర్!
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఎపిసోడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ చేసిన కామెంట్స్పై పెద్దఎత్తున చర్చ మొదలైంది. మంగళసూత్రం ధరించడమనేది చిన్మయి ఇష్టమని.. తానైతే తప్పనిసరిగా వేసుకోవాలని చెప్పనని అన్నారు. ఈ కామెంట్స్పై కొందరు నెటిజన్స్ విమర్శించగా.. మరికొందరు సమర్థించారు. దీంతో రాహుల్, చిన్మయి జంటపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.దీంతో తమపై పెద్దఎత్తున ట్రోల్స్ రావడంతో సింగర్ చిన్మయి స్పందించింది. ఆయన ఏందో ఒక సందర్భంలో అలా మాట్లాడారని తెలిపింది. అదే ఇప్పుడు చర్చకు కారణమైంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న చర్చపై నాకు ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొంది. కానీ మనదేశంలోని మహిళల గురించే ఆందోళన చెందుతున్నానన నెటిజన్లకు కౌంటరిచ్చింది.(ఇది చదవండి: నా భార్యకు తాళి వేసుకోవద్దనే చెబుతా: రాహుల్ రవీంద్రన్)ఓ నెటిజన్ చిన్మయి- వైరముత్తు ఎపిసోడ్పై ప్రశ్నించాడు. వైరముత్తు నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోయారు.. కానీ ఇక్కడ ఇతర మహిళల గురించి ఆందోళన చెందుతున్నారని వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. దీనిపై చిన్మయి స్పందిస్తూ..అవును.. ఎందుకంటే లైంగిక వేధింపులకు గురి కావడం నా తప్పే.. కానీ మీలాంటి పురుషులు నా లైంగిక వేధింపుల ఎపిసోడ్ గురించి ఎందుకు ప్రస్తావించాలి? దయచేసి ఢిల్లీ గాలిని పీల్చుకోండి.. ఎందుకంటే నేను అలాంటి గాలిని తట్టుకోలేనంటూ తనదైన శైలిలో ఇచ్చిపడేసింది. కాగా.. 2018లో మీటూ ఉద్యమం సమయంలో ఓ ఈవెంట్లో వైరముత్తు తనను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దాదాపు 20 మంది మహిళలు ఆతనిపై ఆరోపణలు చేశారు.కాగా.. సింగర్ చిన్మయి, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఏడాది డేటింగ్ తర్వాత 2014లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు జూన్ 2022లో కవలలు జన్మించారు. ప్రస్తుతం రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ది గర్ల్ఫ్రెండ్ మూవీ నవంబర్ 7న రిలీజ్ కానుంది. He literally said it in some context on an interview which has become a tweet. The rage from the men calling him all sorts of abuses - I am worried for the women here truth be told— Chinmayi Sripaada (@Chinmayi) November 4, 2025 -
సీక్రెట్ టాస్క్లో ఇరగదీసిన దివ్య.. కల్యాణ్కు అన్యాయం
బిగ్బాస్లో నామినేషన్స్లో మొదలైన గొడవలు పూర్తి అయ్యాక కొత్త కెప్టెన్ కోసం కంటెండర్షిప్ పోటీ మొదలైంది. అయితే, ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం మూడు టీమ్లను బిగ్బాస్ ఏర్పాటు చేశాడు . రీతూ, భరణి, నిఖిల్, డీమాన్ (బ్లూ),దివ్య, కళ్యాణ్, సాయి, సుమన్ శెట్టి (పింక్),తనూజ, ఇమ్మూ, గౌరవ్, రాము (ఆరెంజ్) అంటూ సభ్యుల ఎంపిక ఛాన్స్ వారికే ఇచ్చాడు. కానీ, హౌస్లో ఇద్దరిని ‘రెబల్స్’గా మార్చిన బిగ్బాస్.. వారికి సీక్రెట్ టాస్క్లను అప్పగించాడు. వారిలో సుమన్ శెట్టి, దివ్య ఉన్నారు. మంగళవారం జరిగిన ఎపిసోడ్లో దివ్య దుమ్మురేపింది. సీక్రెట్ టాస్క్ను సుమన్ శెట్టితో కలిసి గేమ్లో సత్తా చాటింది. కానీ, అదే సమయంలో పెద్ద పొరపాటే చేసింది.రెబల్స్గా సుమన్, దివ్యమంగళవారం ఎపిసోడ్ మొత్తం దివ్య, సుమన్ శెట్టిలదే అని చెప్పాలి. తాజాగా జరిగిన కెప్టెన్సీ కంటెండర్షిప్ రేసులో రెబల్గా మారి సుమన్ శెట్టి సీక్రెట్ టాస్క్లతో మెప్పించాడు. ఆపై కామనర్గా ఎంట్రీ ఇచ్చిన దివ్య తన పాత్రలో అద్భుతంగా నటించేసింది. అలా ఇద్దరూ సీక్రెట్ టాస్క్లో మెప్పించారు. గార్డెన్ ఏరియాలో ఒక టెలిఫోన్ ఉంచిన బిగ్బాస్.. సమయానుకూలంగా అందరికీ కాల్ చేస్తాడు. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ల కోసం జరిగే పోటీలో హస్మేట్స్ గెలవడానికి టీమ్స్ మద్దతు అవసరమని చెబుతూ.. హౌస్మేట్స్ అందరి మధ్యలోనే రెబల్స్ ఉన్నారని చెబుతాడు. వారు మిమ్మల్ని ఈ పోటీ నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు కాబట్టి ఆట జాగ్రత్తగా ఆడాలని సూచిస్తాడు. ఈ క్రమంలోనే రెబల్స్ సుమన్ శెట్టి, దివ్యలకు సీక్రెట్ టాస్క్లు ఇస్తాడు. అవి పూర్తి చేస్తే హౌస్మేట్స్లలో ఒక్కరిని ఆట నుంచి తప్పించే ఛాన్స్ వారికి ఉంటుంది.కల్యాణ్కు దివ్య అన్యాయంసీక్రెట్ టాస్కు ప్రకారం సుమన్, దివ్య ఏం చేయాలంటే.. హౌస్లో ఎవరైనా ముగ్గురినీ వాళ్లు కూర్చున్న ప్లేస్ నుంచి లేచేలా చేసి ఆ ప్లేస్లో వీరు కూర్చోవాలి. అయితే, ఆ ముగ్గురిలోనే ఒక్కరిని ఆట నుంచి తప్పించాలి. ఈ టాస్క్లో భరణి, కళ్యాణ్, గౌరవ్, రీతూలతో దివ్య పూర్తి చేసింది. అయితే , ఇక్కడ భరణిని సేవ్ చేయాలనే ఉద్దేశంతో తన టీమ్లో ఉన్న కల్యాణ్ను కెప్టెన్ కంటెండర్షిప్ నుంచి తప్పిస్తుంది. ఇదొక్కటే ఆమె చేసిన అతిపెద్ద తప్పు. దీంతో తర్వాత జరిగిన ఒక గేమ్లో దివ్య టీమ్ ఘోరంగా ఓడిపోతుంది. అదే కల్యాణ్ ఉండివుంటే తప్పకుండా సత్తా చాటేవాడని చెప్పవచ్చు. భరణి కెప్టెన్ రేసులో ఉండాలని కల్యాణ్ను తప్పించి ఆమె చేసిన పొరపాటుతో తన టీమ్ కూడా ఓడిపోయింది.రెండో టాస్క్లో భాగంగా ఫ్రిడ్జ్లో ఉన్న పాలు దాచమని రెబల్స్కు బిగ్బాస్ ఆదేశించాడు. ఆపై అందులోని ఒక లీటర్ పాలు తాగాల్సి ఉంటుందని కూడా సూచిస్తాడు. అయితే, సుమన్, దివ్య చాలా స్మార్ట్గా ప్లాన్ చేసి టాస్క్ను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక సందర్భంలో కల్యాణ్కు అనుమానం వచ్చినా చాలా తెలివిగా దివ్య డైవర్ట్ చేస్తుంది. టాస్క్ పరంగా దివ్య అదరగొట్టింది. కానీ, కల్యాణ్ను ఆట నుంచి తప్పించి కాస్త మైనస్ అయింది. నాగార్జున పనిష్మెంట్.. లెక్కచేయని పవన్, రీతూడీమాన్ పవన్, రీతూ ఇద్దరూ ఈ వారం మాట్లాడుకోవద్దనే పనిష్మెంట్ నాగార్జున ఇచ్చారు. అయితే, డీమాన్ భోజనం తింటున్న సమయంలో రీతూ వచ్చి అతని పక్కనే కూర్చుంది. దీంతో రీతూకు కూడా ఒక ముద్ద తినిపించాడు. నాగార్జున గారు ఇచ్చిన పనిష్మెంట్ మరిచిపోయారా అంటూ దివ్య ప్రశ్నిస్తుంది. రేపు ఒక వీడియో వేసి మళ్లీ నన్నే అంటారు. కెప్టెన్గా ఏం చేశావ్ అని అడుగుతారు అంటూ వారిద్దరిపై దివ్య ఫైర్ అవుతుంది. దీంతో రీతూ, పవన్ ఇద్దరూ కూడా దివ్యపై మండిపడుతారు. మీకు ఉన్న శిక్ష ప్రకారం మాట్లడుకోవద్దు అంటే ఇవన్నీ కూడా చేయొద్దనే వస్తుంది. కుకింగ్ సమయంలో మాత్రమే మీరు మాట్లాడుకోవచ్చు. ఇది సింపుల్ లాజిక్.. ఇందులో కూడా లూప్ హోల్స్ వెత్తుకుంటానంటే నేనేం చేయలేను.. అంటూ దివ్య ఫైర్ అయింది. ఇందులో పూర్తిగా రీతూదే తప్పు. ఆపై పవన్ది కూడా.. ఈవారం హౌస్ట్ నాగార్జున ఈ విషయంపై మాట్లాడే ఛాన్స్ ఉంది. -
వాస్తవ సంఘటనలతో 'ఢిల్లీ క్రైమ్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్లు ఎప్పటికీ మెప్పిస్తాయి. అయితే, వాస్తవ సంఘటన ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఫ్రాంచైజీలో భాగంగా సీజన్-3 రానుంది. నవంబర్ 13న నెట్ఫ్లిక్స్లో విడుదల కానున్న ఢిల్లీ క్రైమ్-3 ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు. ఎవరికీ అంతుపట్టకుండా సాగే వరుస హత్యలను చేధించే క్రమంలో పోలీసుల జరిపే శోధన ఎలా ఉంటుందో ఇందులో చూపారు.ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ తొలి సీజన్ 2019 మార్చి, రెండో సీజన్ 2022 ఆగస్టులో విడుదలయ్యాయి. ఈ రెండూ భారీ విజయం అందుకోవడంతో సీజన్-3ని తెరకెక్కించారు. ‘ప్రైమ్టైమ్ ఎమ్మీ అవార్డు ఫర్ అవుట్స్టాండింగ్ డ్రామా సిరీస్’ అవార్డ్ను అందుకున్న తొలి భారతీయ వెబ్సిరీస్గా ‘ఢిల్లీ క్రైమ్’ నిలిచిన సంగతి తెలిసిందే. సీజన్-3లొ షెఫాలీ షా, హ్యూమా ఖురేషి, రాజేష్ తైలాంగ్, రసిక దుగల్ నటించారు. రిచీ మెహతా, తనూజ్ చోప్రా ఈ సిరీస్ని రూపొందించారు.దేశంలో ఒకప్పుడు నిర్భయ అత్యాచారం కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ కేసును పోలీసులు ఎలా ఇన్విస్టిగేషన్ చేశారనే తీరును ఫస్ట్ సీజన్లో చూపారు. వృద్ధులను టార్గెట్ చేసుకుని నగరంలో జరిగే వరసు హత్యలకు సంబంధించిన దర్యాప్తు ఆధారంగా రెండో సీజన్ రూపొందించారు. అయితే, సీజన్-3లో హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడే ఓ మహిళను డీసీపీ (షెఫాలీ) ఎలా పట్టుకున్నారో చూపించనున్నారు. -
శివ కార్తికేయన్- వెంకట్ సినిమా.. ట్రెండింగ్ హీరోయిన్కు ఛాన్స్
కోలీవుడ్లో చాలా తక్కువ చిత్రాలతోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న నటుడు శివ కార్తికేయన్(Sivakarthikeyan ). అంతేకాకుండా ఇటీవల అయిలాన్, మావిరన్,అమరన్ వంటి చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన కథానాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి చిత్రంలో శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మోహన్ ప్రతినాయకుడుగాను అధర్వ ముఖ్యపాత్రలోనూ నటిస్తుండగా, టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2026 జనవరిలో పొంగల్ రేస్కు సిద్ధమవుతోంది. దీంతో శివకార్తికేయన్ తర్వాత చిత్రానికి రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం వెంకట్ ప్రభు(Venkat Prabhu) దర్శకత్వంలో నటించిన ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. దర్శకుడు వెంకట్ ప్రభు ఇంతకుముందు విజయ్ కథానాయకుడిగా నటించిన గోట్ చిత్రంలో శివ కార్తికేయన్ గౌరవ పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. తాజాగా వీరి కాంబోలో రూపొందనున్న చిత్రం టైమ్ ట్రావెల్ కథాంశంతో సాగుతుందని సమాచారం. శివ కార్తికేయన్ చివరి చిత్రం మదరాసి అనుకున్నంత రేంజ్లో మెప్పించలేదు. అదే విధంగా వెంకట్ ప్రభు చిత్రం గోట్ కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో భారీ హిట్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఇకపోతే ఇందులో శివకార్తికేయన్కు జంటగా కల్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) నటించనున్నట్లు తాజా సమాచారం. ఈమె ఇటీవల మలయాళంలో నటించిన ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రం 'కొత్త లోక' సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న కల్యాణి ప్రియదర్శన్ ఇంతకుముందే హీరో అనే చిత్రంలో శివకార్తికేయన్కు జంటగా నటించారన్నది గమనార్హం. ఇప్పుడు ఈ జంట మళ్లీ రిపీట్ కానున్నదన్నమాట. -
హిందీ రిలీజ్ గురించి అడుగుతున్నారు: హీరో ఆది సాయికుమార్
‘‘సినిమాలోని కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకులు థియేటర్స్కు వస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ ఉన్న మా ‘శంబాల’ ఏ ఒక్కరినీ నిరాశపరచదు. మా చిత్రాన్ని ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అని ఆది సాయికుమార్ అన్నారు. ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ‘శంబాల: ఏ మిస్టికల్ వరల్డ్’. అర్చన అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ కీలక పాత్రలు చేస్తున్నారు. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 25న రిలీజ్ కానుంది.ఈ సినిమా ట్రైలర్ను ఇటీవల విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్కు మంచి స్పందన లభించిందని చిత్రబృందం పేర్కొంది. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆది సాయికుమార్ మాట్లాడుతూ– ‘‘మా ట్రైలర్ను రిలీజ్ చేసిన ప్రభాస్గారికి థ్యాంక్స్. ఈ ట్రైలర్ చూసి, రానాగారు మెచ్చుకుని, తన వంతుగా సాయం చేస్తానని చెప్పారు. కొంతమంది హిందీ రిలీజ్ గురించి అడుగుతున్నారు.ఇంకా మాకు సపోర్ట్గా నిలిచిన దుల్కర్, సందీప్ కిషన్, కిరణ్ అబ్బవరం, సహకరించిన నిర్మాతలు వంశీ, ప్రమోద్, ప్రసాద్ అన్నలకు ధన్యవాదాలు. రాజీపడకుండా నిర్మించిన నిర్మాతలకు లాభాలు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన చిత్రమిది’’ అని యుగంధర్ ముని చెప్పారు. -
శివతో పెద్ద స్టార్ని చేశారు: నాగార్జున
‘‘శివ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి ప్రేమతో వచ్చిన మీ అందరికీ (ఫ్యాన్స్) ధన్యవాదాలు. ఈ సినిమాని మీ తల్లిదండ్రులు థియేటర్స్లో చూసుంటారు. ఇప్పుడు అదే ప్రేమతో మీరూ వచ్చారు. 36 ఏళ్ల క్రితం నాతో ‘శివ’ సినిమా తీసి, నన్ను పెద్ద స్టార్ని చేసిన నా మిత్రుడు రామ్గోపాల్ వర్మకి థ్యాంక్స్. మంగళవారం ఉదయం ‘శివ’ చూశాను. అద్భుతంగా అనిపించింది’’ అన్నారు నాగార్జున. రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున, అమల జోడీగా నటించిన చిత్రం ‘శివ’. అన్నపూర్ణ స్టూడియోస్పై అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న విడుదలైంది.అన్నపూర్ణ స్టూడి యోస్ 50 ఏళ్ల సందర్భంగా సరికొత్త 4కె డాల్బీ అట్మాస్లో ఈ నెల 14న ‘శివ’ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కినేని అభిమానుల సమక్షంలో రీ రిలీజ్ ట్రైలర్ని లాంచ్ చేశారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘దాదాపు 6 నెలల పాటు రాము చాలా ప్రేమతో ఇష్టపడి ప్రతి సౌండ్ ట్రాక్ని మళ్లీ ఒరిజినల్ సినిమా చేసినట్టుగా అద్భుతంగా డిజైన్ చేశాడు. శివ ఈజ్ ఫరెవర్.మరో 36 ఏళ్ల తర్వాత కూడా ‘శివ’ని మళ్లీ మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ‘శివ’కి ముందు ‘శివ’కి తర్వాత అని రాజమౌళిగారు అన్నట్టు ‘శివ’ ఎప్పటికీ నిలిచిపోతుంది’’ అని చెప్పారు. 36 ఏళ్ల తర్వాత మేమిద్దరం (నాగార్జున, వర్మ) ఒకే వేదికపై ఇలా మీ ముందు రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ చేస్తూ మాట్లాడతామని ఎప్పుడూ ఊహించలేదు. ఇది చాలా గొప్ప అనుభూతి. రీ రిలీజ్ కోసం కొత్త టెక్నాలజీని ఉపయోగించాం. మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. చిరంజీవిగారు చెప్పినట్టు సినిమా ఉన్నంత వరకు ‘శివ’ చిరంజీవిలా చిరస్మరణీయం’’ అని రామ్గోపాల్ వర్మ పేర్కొన్నారు. -
ధన పిశాచి సర్ప్రైజ్ చేస్తుంది: నిర్మాత ప్రేరణ అరోరా
‘‘నేను హిందీలో సినిమాలు చేస్తున్నప్పటికీ నాకు తెలుగు సినిమాలు, తెలుగు సంస్కృతి అంటే చాలా ఇష్టం. రామ్చరణ్గారి ‘ఆరెంజ్’ చిత్రం చూశాను. అప్పట్నుంచి తెలుగు సినిమాలను ఫాలో అవుతున్నాను. ఇండియన్ సినిమాకి తెలుగు పరిశ్రమ గొప్ప చిత్రాలను అందించింది. తెలుగులో సినిమా చేయాలనే నా కల ‘జటాధర’ సినిమాతో నెరవేరడం హ్యాపీగా ఉంది. ప్రేక్షకులకు మంచి అనుభూతినిచ్చే చిత్రం ఇది’’ అని చెప్పారు నిర్మాత ప్రేరణ అరోరా. సుధీర్బాబు, సోనాక్షీ సిన్హా లీడ్ రోల్స్లో, శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలో నటించిన సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘జటాధర’.ఈ ద్విభాషా (తెలుగు, తమిళ) చిత్రానికి వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 7న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రేరణ అరోరా మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ అంశాలు, ఎమోషన్స్, మైథలాజికల్, సూపర్ నేచురల్ విషయాలు, ఆశ, అత్యాశ... ఇలా అన్ని అంశాలు ‘జటాధర’లో చక్కగా కుదిరాయి.సుధీర్గారు చేసిన క్యారెక్టర్, ఆయన పెర్ఫార్మెన్స్ ఆడియన్స్కు గుర్తుండిపోతాయి. సోనాక్షీ సిన్హాగారు చేసిన ధన పిశాచి క్యారెక్టర్ ఆడియన్స్ను సర్ప్రైజ్ చేస్తుంది. ఈ పాత్రకు సోనాక్షినే పర్ఫెక్ట్ చాయిస్. సుధీర్బాబు–సోనాక్షిల మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్లు అలరిస్తాయి. శిల్పాగారి క్యారెక్టర్ కాస్త నెగటివ్ షేడ్స్తో ఉంటుంది. ఇంకా ఈ చిత్రంలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం, నాగబంధం, పిశాచి బంధం, బ్లాక్ మ్యాజిక్ వంటి అంశాలను చూపించాం. ఈ సినిమాకు సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ఉండే స్కోప్ ఉంది. తెలుగులో ఓ పెద్ద హీరోతో సినిమా చేయనున్నాం’’ అని చెప్పారు. -
దుబాయ్లో సమంత సందడి.. శ్వేతా మీనన్ బోల్డ్ లుక్!
దుబాయ్లో సమంత సందడి..ఏడారిలో చిల్ అవుతోన్న నటాషా స్టాంకోవిచ్..హీరోయిన్ శ్వేతా మీనన్ బోల్డ్ లుక్..శారీలో హీరోయిన్ లయ పోజులు..ది గర్ల్ఫ్రెండ్ మూవీ ప్రమోషన్స్లో రష్మిక..ఫ్యామిలీతో కాజల్ అగర్వాల్ చిల్.. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Aaditi S Pohankar (@aaditipohankar) View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) -
కొత్త కారు కొన్న డ్యాన్సర్.. అంతలోనే అనంత లోకాలకు!
కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. నగర సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ రియాలిటీ షో డ్యాన్సర్ సుధీంద్ర(36) మృతిచెందారు. రోడ్డుపక్కన కారు ఆపి నిలిపి ఉండగా.. వేగంగా వచ్చిన ట్రక్కు సుధీంద్రను ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్యాన్సర్ సుధీంద్రకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.నిద్రమత్తులో ట్రక్కు నడిపిన డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కారు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కాగా.. కొత్త కారు కొన్న సుధీంద్ర తన తమ్ముడికి చూపించేందుకు వెళ్తండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే కారులో సమస్య రావడంతో నేలమంగళ తాలూకాలోని పెమ్మనహళ్లి సమీపంలో హైవే పక్కన ఆపినట్లు సమాచారం. కాగా.. సుధీంద్ర పలు టెలివిజన్ రియాలిటీ షోలలో పాల్గొన్నారు. A Life Lost, A System Failed: Sudheendra’s Death Near Nelamangala Exposes Stark Road Safety NeglectThe tragic death of 36-year-old dancer Sudheendra near Nelamangala is not just a personal loss it’s a damning indictment of our civic infrastructure and administrative apathy.… pic.twitter.com/6FrnDY9A6g— Karnataka Portfolio (@karnatakaportf) November 4, 2025 -
మౌనికను మొదటిసారి కలిసినప్పుడే మాట ఇచ్చా: మంచు మనోజ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ టాలీవుడ్ మూవీ సాంగ్ రిలీజ్ ఈవెంట్కు హాజరైన మనోజ్.. ప్రేమ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా తన ప్రేమకథ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ పాటను ప్రస్తావిస్తూ తన లవ్ ప్రపోజల్ను రివీల్ చేశారు. రాజ్యమేదీ లేదుగానీ రాణిలాగా చూసుకుంటాననే లిరిక్ తన నచ్చిందని మనోజ్ తెలిపారు. ప్రపంచంలో ఎలాంటి తారతమ్యాలు లేనిది ఒక్క ప్రేమ మాత్రమేనన్నారు. రాజా వెడ్స్ రాంబాయి అనే మూవీ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన మనోజ్ తన ప్రేమ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. నేను కూడా ఫస్ట్ మౌనికను కలిసినప్పుడు ఓ మాట ఇచ్చానని మనోజ్ వెల్లడించారు. నాకు ఎలాంటి రాజ్యాలు లేవు.. నిన్ను బాగా చూసుకుంటానని చెప్పా.. సినిమాలు కూడా చేయట్లేదు.. జీవితాంతం నిన్ను చూసుకుంటానని మాట ఇచ్చా అని గుర్తు చేసుకున్నారు. ఎవరైనా సరే మనల్ని నమ్ముకుని వచ్చారంటే.. వారికోసం మన నిలబడాలి.. అలాంటి వాళ్ల చేయిని వదలకండి అని అన్నారు. శివుడు ఎక్కడో ఉండడు.. ఒకరి కోసం నిలబడినప్పుడు మీరు దేవుడిలా మారతారని పేర్కొన్నారు. ప్రాణముంటేనే శివ.. ప్రాణం లేకపోతే శవ.. శివుడు యాక్టివేట్ కావాలంటే పదిమంది కోసం మీరు నిలబడాలని పిలుపునిచ్చారు. మంచు మనోజ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Indiramma Intilo puttina, Indira Gandhi Intilo Puttina. Prema Andharidi- #ManchuManoj at #RajuWedsRambai song launch event pic.twitter.com/qdJWP5I8CA— Suresh PRO (@SureshPRO_) November 4, 2025 -
మరో బాహుబలి వచ్చేస్తోంది.. లేటేస్ట్ టీజర్ చూశారా?
దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన మహిస్మతి సామ్రాజ్యం మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుంది. ఇటీవలే బాహుబలి ది ఎపిక్ పేరుతో మీ ముందుకొచ్చారు. ఈ మూవీ అక్టోబర్ 31న విడుదలై ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో మరో బాహుహలి చిత్రం ముందుకొస్తుంది. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో టీజర్ను విడుదల చేశారు. ఈ బాహుబలి యానిమేషన్ మూవీతో ప్రేక్షకుల సరికొత్త అనుభూతిని అందించనున్నారు మేకర్స్. బాహుబలి ది ఎటర్నల్ వార్ పార్ట్-1 పేరుతో ఈ సినిమాను రూపొందించారు. తాజాగా టీజర్ రిలీజ్ చేయగా.. యానిమేషన్ సీన్స్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ యానిమేషన్ చిత్రాలకు ప్రముఖ అవార్డ్ గ్రహీత, డైరెక్టర్ ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలకు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా ఉన్నారు. Amarendra Baahubali’s death wasn’t his End…it was the beginning of something Eternal. 🔥#BaahubaliTheEternalWar Teaser out now!Telugu: https://t.co/sj4FkCLo5sHindi: https://t.co/waTg71bKIeTamil: https://t.co/6YYjTrc4RD#Baahubali @ssrajamouli #Prabhas @meramyakrishnan… pic.twitter.com/qDdERcMX7e— Baahubali (@BaahubaliMovie) November 4, 2025 -
'మీరు అలా చెప్పడం సరికాదు'.. ప్రకాశ్ రాజ్పై చైల్డ్ ఆర్టిస్ట్ ఫైర్!
ఈ ఏడాది కేరళ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులను ప్రకాశ్ రాజ్ నేతృత్వంలోని జ్యూరీ ఎంపిక చేసింది. 2024కు గానూ ప్రకటించిన అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా మంజుమ్మెల్ బాయ్స్ నిలవడంతో పాటు ఏకంగా 9 విభాగాల్లో అవార్డ్స్ దక్కించుకుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు.అయితే ఈ అవార్డుల ప్రకటనపై మలయాళ చైల్డ్ ఆర్టిస్ట్ విమర్శలు చేసింది. మలికాపురం, గు లాంటి చిత్రాల్లో తన పాత్రలకు పేరు తెచ్చుకున్న బాలనటి దేనానంద జిబిన్ సోషల్ మీడియాలో జ్యూరీని విమర్శించింది. ఈ అవార్డుల్లో బాల నటులను విస్మరించడంపై తన ఆవేదన వ్యక్తం చేసింది. తాను మైనర్ కావడంతో ఆమె తల్లిదండ్రులు నిర్వహించే దేవా సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. పిల్లలకు అవార్డులకు ప్రకటించేందుకు జ్యూరీ సభ్యులకు కళ్లు మూసుకుపోయానని రాసుకొచ్చారు.దేవానంద తన ఇన్స్టాలో రాస్తూ.. 'మీ కళ్లతో పిల్లల్ని దగ్గరగా చూడండి. అంతే కానీ ఇక్కడంతా చీకటిగా ఉందని మాత్రం చెప్పకండి. పిల్లలు కూడా ఈ సమాజంలో భాగమే. రాబోయే తరానికి 2024 మలయాళ చలనచిత్ర అవార్డులను ప్రకటించడంలో జ్యూరీకి కళ్లు మూసుకుపోయాయి. స్టానర్తి శ్రీకుట్టన్, గు, ఫీనిక్స్, ఏఆర్ఎం లాంటి సినిమాల్లో పిల్లలు నటించారు. ఇద్దరు పిల్లలకు అవార్డులు ఇవ్వకుండా కూర్చోవడం కాదు.. మరిన్ని పిల్లల సినిమాలు చేయాలని చెప్పడానికి ప్రయత్నించండి. కనీసం ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్లకైనా అవార్డ్స్ ఇచ్చి ఉంటే.. అది ఎంతో మంది నా లాంటి పిల్లలకు ప్రోత్సాహంగా ఉండేది. పిల్లలకు మరిన్ని అవకాశాలు రావాలని.. వారు కూడా సమాజంలో భాగమేనని జ్యూరీ చైర్మన్ చెప్పడంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నా. అన్ని మీడియా, చిత్రనిర్మాతలు, సాధారణ ప్రజలు కూడా దీని గురించి చర్చించాలి. మా హక్కులను పెట్టుబడి పెట్టడం కాదు.. మార్పులు జరగాలి. మార్పులతో పాటు పిల్లల హక్కులను కూడా కాపాడుకోవాలి' అంటూ పోస్ట్ చేశారు.దీంతో ప్రస్తుతం ఈ విషయం మలయాళ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం అవార్డుల ప్రకటన అనంతరం నటుడు ప్రకాశ్ రాజ్ మీడియాతో మాట్లాడారు. ఇందులో ఆయన పిల్లల విభాగం అవార్డులపై కామెంట్స్ చేశారు. ఆ వీడియో క్లిప్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దేవానంద విమర్శించింది.ప్రకాష్ రాజ్ ఏమన్నారంటే?ఉత్తమ బాలల చిత్ర విభాగానికి ఆరు సినిమాలు వచ్చినప్పటికీ.. ఏవీ కూడా ప్రమాణాలకు అనుగుణంగా లేవని జ్యూరీ నిర్ణయించిందని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. ఇది ఈ సినిమాల నటులకు కూడా వర్తిస్తుందని అన్నారు. చిన్న పిల్లల విభాగంలో మనకు ఒక్క బెస్ట్ సినిమా కూడా కనిపించలేదు.. అంతేకాకుండా పిల్లలతో సినిమా తీసే ప్రయత్నం కూడా జరగలేదని వెల్లడించారు. సినిమాలు అంటే కేవలం పెద్దలు, యువకులు మాత్రమే కాదు.. పిల్లలు కూడా సమాజంలో భాగమని దర్శకులు, రచయితలు గ్రహించాలని ప్రకాశ్ రాజ్ సూచించారు. పిల్లలు ఏమి ఆలోచిస్తారో మనం తెలుసుకోవాలన్నారు. ఏ సినిమా కూడా పిల్లల అవగాహన గురించి మాట్లాడదని అన్నారు. దీంతో బాల నటులపై ప్రకాశ్ రాజ్ చేసిన కామెంట్స్పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. దర్శకుడు వినేష్ విశ్వనాథ్, మరో నటుడు ఆనంద్ మన్మధన్ కూడా జ్యూరీ విధానాన్ని ప్రశ్నించారు. View this post on Instagram A post shared by Devanandha Jibin (@devanandha.malikappuram) -
స్వేచ్ఛ కోసం భర్త చేసే అలుపెరగని పోరాటం ‘పురుష:’
ప్రస్తుతం సినిమాని రిలీజ్ చేయడం కంటే.. జనాల్లోకి ఎలా తీసుకెళ్తున్నాం.. ఎలా ప్రమోట్ చేస్తున్నాం.. ఎలాంటి కంటెంట్తో ఆడియెన్స్ను మెప్పిస్తున్నాం అన్నది ముఖ్యంగా మారింది. అందుకే ‘పురుష:’ టీం డిఫరెంట్ పోస్టర్లు, రకరకాల క్యాప్షన్స్తో సినిమా కాన్సెప్ట్ను తెలియజేసేలా కంటెంట్ను బయటకు వదులుతోంది.బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు తన తనయుడు పవన్ కళ్యాణ్ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘పురుష:’. ఈ సినిమాకు వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు.అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఈ మూవీలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్లు కథానాయికలుగా నటిస్తున్నారు. గబి రాక్, అనైరా గుప్తా కీలక పాత్రలు పోషించారు. చిత్రీకరణ ముగియడంతో యూనిట్ అంతా కూడా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి రెండు పోస్టర్లు వదిలారు. ‘ప్రతీ మగాడి యుద్ధం (విజయం) వెనక ఓ ఆడది ఉంటుంది’; ‘ స్వేచ్ఛ కోసం భర్త చేసే అలుపెరగని పోరాటం’ అంటూ ఇలా డిఫరెంట్ క్యాప్షన్స్తో రీలీజ్ చేసిన ఈ పోస్టర్లు సినిమా ఎలా ఉండబోతోందనే విషయాన్ని చెప్పకనే చెప్పేస్తున్నాయి. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్గా రానున్న ఈ మూవీ రిలీజ్ డేట్ను త్వరలోనే ప్రకటించనున్నారు. -
నాగార్జున ఐకానిక్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న రీ రిలీజ్ ట్రైలర్
అక్కినేని నాగార్జున నటించిన ఐకానిక్ కమర్షియల్ మూవీ 'శివ' రీరిలీజ్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో రామ్గోపాల్ వర్మ దర్శకునిగా పరిచయమయ్యారు. అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న రిలీజై బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇళయరాజా సంగీతంలో ఈ సినిమా మ్యూజికల్ హిట్గానూ నిలిచింది. ఈ సినిమాని ‘శివ’ (1990) పేరుతోనే హిందీలో రీమేక్ చేసిన రామ్గోపాల్ వర్మ అక్కడ కూడా హిట్ అందుకున్నారు. ఇప్పుడు తెలుగులో మరోసారి వెండితెరపైకి రానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కల్ట్ మూవీ శివను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీని మరోసారి బిగ్ స్క్రీన్పై ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలోనే శివ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. సరికొత్త 4కె వర్షన్లో శివ ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్, హీరోలు శివ మూవీపై ప్రశంసలు కురిపించారు. తెలుగు సినిమా గతిని మార్చేసిన సినిమా శివ అంటూ పలవురు స్టార్స్ కామెంట్స్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం శివ 4కె ట్రైలర్ మీరు కూడా చూసేయండి.కాగా.. ఈ సినిమాను నవంబర్ 14న థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రంలో అమల హీరోయిన్గా నటించారు. కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవలు, గ్యాంగ్లు, రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం స్టూడెంట్స్ని ఎలా ఉపయోగించుకుంటారు? విద్యార్థుల మధ్య ఎలాంటి గొడవలు సృష్టిస్తారు? ఇలాంటి సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించి సరికొత్త ట్రెండ్ని సృష్టించారు రాం గోపాల్ వర్మ. -
'దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి'.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ తాను నెక్ట్స్ ప్రాజెక్ట్ చేస్తున్నారన్న వార్తలపై స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించడం లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తనపై అలాంటి వార్తలు రాసి ఇబ్బంది పెట్టవద్దని ట్విటర్ వేదికగా కోరారు.బండ్ల గణేశ్ తన ట్వీట్లో ప్రస్తావిస్తూ..' మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక విన్నపం. ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించడం లేదు. అలాగే ఎవరితోనూ సినిమా చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదు. దయచేసి ఇలాంటి వార్తలు రాయడం ద్వారా నన్ను ఇబ్బంది పెట్టకండి.మీ అందరి ప్రేమ, మద్దతు ఎప్పుడూ నాతోనే ఉండాలి. చేతులెత్తి నమస్కరిస్తూ ఇంతటితో విన్నవించుకుంటున్నా. ఇట్లు మీ బండ్ల గణేశ్' అంటూ పోస్ట్ చేశారు.కాగా.. గతనెలలో తెలుసు కదా మూవీ ఈవెంట్లో బండ్ల గణేశ్ ఆసక్తిక కామెంట్స్ చేశారు. నేను టెంపర్ సినిమాతో బ్రేక్ తీసుకున్నా.. ఫ్లాప్ మూవీతో కాదు, బ్లాక్బస్టర్ సినిమా ఇచ్చి బ్రేక్ తీసుకున్నా.. ఇప్పుడు మొదలవుతుంది సెకండాఫ్ అంటూ మాట్లాడారు. ఇప్పుడే అసలు సినిమా మొదలు కాబోతుంది అంటూ సెకండ్ ఇన్నింగ్స్ ఉండబోతుందని కామెంట్స్ చేశారు. దీంతో మెగాస్టార్తో ఓ సినిమా చేయనున్నారని టాలీవుడ్లో టాక్ వినిపించింది. ఈ వార్తల నేపథ్యంలోనే తాజాగా నిర్మాత క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక విన్నపం:ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించడం లేదు, అలాగే ఎవరితోనూ సినిమా చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదు.దయచేసి కానీ వార్తలు రాయడం ద్వారా నన్ను ఇబ్బంది పెట్టకండి.మీ అందరి ప్రేమ, మద్దతు ఎప్పుడూ నాతో వుండాలి చేతులెత్తి నమస్కరిస్తూ…— BANDLA GANESH. (@ganeshbandla) November 4, 2025 -
విజయ్తో ఎంగేజ్మెంట్ రింగ్.. అసలు విషయం చెప్పేసిన రష్మిక!
ఈ ఏడాది వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న బ్యూటీ రష్మిక మందన్నా. ఇప్పటికే ఛావాతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ.. ఇటీవలే థామా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం రష్మిక నటించిన ది గర్ల్ఫ్రెండ్ రిలీజ్కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో సందడి చేయనుంది.ది గర్ల్ఫ్రెండ్ మూవీ ప్రమోషన్లలో భాగంగా రష్మిక తాజాగా టాలీవుడ్ టాక్ షోకు హాజరైంది. నటుడు జగపతిబాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము..నిశ్చయమ్మురా టాక్ షోలో సందడి చేసింది. ఈ షోలో పాల్గొన్న రష్మిక చేతికి రెండు ఉంగరాలు కనిపించడంతో అందరి దృష్టి వాటిపై పడింది. ఈ సందర్భంగా రష్మికను జగపతిబాబు సరదాగా ఆటపట్టించారు. దళపతి విజయ్, విజయ్ సేతుపతి, విజయ్ దేవరకొండతో ఫ్రెండ్షిప్, విజయ్ సేతుపతి ఫ్యాన్, దళపతి విజయ్కి ఆల్ టైమ్ ఫ్యాన్ ఇలా విజయాన్ని సొంతం చేసేసుకున్నావా? అంటూ ఫన్నీగా మాట్లాడారు.ఆ తర్వాత చేతికి ఉన్న రింగ్స్ను సెంటిమెంట్తోనే పెట్టుకున్నావా అని జగపతిబాబు అడిగారు. దీనికి రష్మిక మాట్లాడుతూ.. అవీ చాలా ఇంపార్టెంట్ అని ముద్దుగుమ్మ చెప్పేసింది. వాటిలో ఒక రింగ్ ఫేవరేట్ అయి ఉంటుంది.. దానికి ఓ హిస్టరీ కూడా ఉంటుందని జగపతి నవ్వుతూ అన్నారు. దీనిపై ఆడియన్స్ ఏదో గోల చేస్తున్నారు.. అదేంటో కనుక్కోండని రష్మికతో చెప్పగా.. అది తాను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నానంటూ సంతోషం వ్యక్తం చేసింది.అయితే గతనెలలో రష్మిక- విజయ్ దేవరకొండకు ఎంగేజ్మెంట్ జరిగిందని వార్తలొచ్చాయి. కానీ ఈ విషయాన్ని ఎవరూ కూడా అధికారికంగా ప్రకటించలేదు. దీంతో టాలీవుడ్ ప్రియులతో పాటు అభిమానుల్లోనూ సస్పెన్స్ నెలకొంది. ఇటీవల తరచుగా రష్మిక చేతికి ప్రత్యేక రింగ్ కనిపించడంతో నిశ్చితార్థం జరిగినట్లు ఫ్యాన్స్ ఫుల్గా ఫిక్సయిపోయారు. -
జక్కన్న ప్లాన్ అదుర్స్.. భారతీయ సినీ చరిత్రలోనే తొలిసారి!
సినిమాను తెరకెక్కించడమే కాదు..దాన్ని జనాలకు రీచ్ అయ్యేలా ప్రచారం చేయడంతో రాజమౌళి(SS Rajamouli) దిట్ట. ఎలా ప్రమోషన్స్ చేస్తే ఒక సినిమా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది? ఎలాంటి ఈవెంట్స్ పెడితే సీనీ ప్రేక్షకులు ఆకర్షితులవుతారు? అనే విషయం జక్కన్నకు బాగా తెలుసు. అంతేకాదు తన ప్రచారాన్ని ఎలా సొమ్ము చేసుకోవాలో కూడా ఆయన తెలిసినట్లుగా మరెవరికీ తెలియదేమో. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు జక్కన చేసిన ప్రమోషన్స్ చాలా ప్లస్ అయ్యాయి. దేశవ్యాప్తంగా ఆయన నిర్వహించిన ఈవెంట్స్ రిలీజ్కు ముందే సినిమాపై హైప్ని క్రియేట్ చేశాయి. ఇప్పుడు మహేశ్బాబు సినిమా(SSMB29)ను కూడా స్ట్రాటజీని అప్లే చేయబోతున్నారు. ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారట. టైటిల్ అనౌన్స్మెంట్ మొదలు..టీజర్, ట్రైలర్.. ఇలా పలు ఈవెంట్లను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబోతున్నారు. ఈ నెల 15న సినిమా టైటిల్ని ప్రకటించబోతున్నారు. ఈ ఈవెంట్ని హైదరాబాద్లోని రామోజీఫిల్మ్ సిటీలో నిర్వహించబోతున్నారు.భారీ ధరకు ప్రచార రైట్స్జక్కన్న ఏం చేసిన కొత్తగా ఉంటుంది. అలాగే ప్రతీదీ బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొనే చేస్తాడు. ప్రమోషన్స్కి భారీగా ఖర్చు చేస్తున్న జక్కన్న.. ఆ సొమ్ముని కూడా తిరిగి నిర్మాతకు అప్పగిస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్ రైట్స్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్స్టార్కి అమ్మేశారు. భారీ ధరకు జియోస్టార్ ఈ రైట్స్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ మొదలు.. ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఈవెంట్స్ని జియోస్టార్కు విక్రయించి..ఈ రూపంలోనూ నిర్మాతకు భారీ సొమ్ముని అందించాడట. ఇప్పటివరకు ఏ సినిమా టైటిల్ రివిల్ కార్యక్రమానికి సంబంధించిన హక్కులను ఇలా ఓటీటీ సంస్థలు కొనుగోలు చేయలేదు. కానీ తొలిసారి మహేశ్ బాబు- రాజమౌళి సినిమా విషయంలోనే ఇలా జరగటం విశేషం.(చదవండి: 100 కోడిగుడ్లతో కొట్టించుకున్న స్టార్ హీరో.. ఒక్క మాట అనలేదు!)ఈ నెల 15న జరిగే టైటిల్ రిలీజ్ ఈవెంట్కి దాదాపు లక్ష మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ గ్లింప్స్ ని ప్రదర్శించడానికి రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ తెర ఏర్పాటు చేస్తున్నారట. భారతీయ సినీ చరిత్రలో ఇంతవరకు జరగని రీతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారట.టైటిల్ ఇదేనా.. రాజమౌళి ఒక సినిమాను ప్రకటించినప్పుడే వర్కింగ్ టైటిల్ని ప్రకటిస్తాడు. అదే టైటిల్ని సినిమాకు పెట్టి..అధికారికంగా వెల్లడిస్తాడు. కానీ మహేశ్ బాబు సినిమా టైటిల్ విషయంలో జక్కన్న గోప్యత పాటించాడు. సినిమా పేరు గురించి ఇంతవరకు ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ ‘వారణాసి’అనే టైటిల్ని పెట్టబోతున్నట్లు ఆ మధ్య నెట్టింట వైరల్ అయింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసే సినిమాకు అలాంటి సింపుల్ టైటిల్ పెట్టరని చాలా మంది కొట్టిపారేశారు. (చదవండి: 'రాజాసాబ్' వాయిదా రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత)మహేశ్ ఫ్యాన్స్ కూడా పెదవి విరిచారు. కానీ ఈ సినిమాకు ‘వారణాసి’నే టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 15న ఇదే టైటిల్ని ప్రకటిస్తారట. ఇప్పటికే ఈ పేరుని మరో నిర్మాత ఫిలిం చాంబర్లో రిజిస్టర్ చేయించుకొన్నాడు . ఆయన అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారట. ఒకవేళ అది కుదరకపోతే..‘వారణాసి’ ముందో లేదా వెనకాలో ఏదో ఒక పదాన్ని యాడ్ చేసి నవంబర్ 15న టైటిల్ని ప్రకటిస్తారు. టైటిల్ కోసం మహేశ్ ఫ్యాన్స్తో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సినీ ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. -
దుల్కర్ సల్మాన్ కాంత.. ట్రైలర్ ఎప్పుడంటే?
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri borse) జంటగా నటిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం కాంత(Kaantha Movie). ఈ మూవీకి సెల్వరాజ్ సెల్వమణి దర్శకత్వం వహించారు. 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇప్పటికే సాంగ్స్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ఫస్ట్ స్పార్క్ పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేశారు.ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ను డేట్ను ప్రకటించారు మేకర్స్. నవంబర్ 6న కాంత ట్రైలర్ విడుదల చేస్తామని వెల్లడించారు. కాగా.. ఈ మూవీని స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సముద్రఖని ఓ కీలక పాత్రలో నటించారు. THE FIRST SPARK (Tamil) - OUT NOW!💥TRAILER ON NOV 6th!⚡️https://t.co/FV0u8YSzdkA @SpiritMediaIN and @DQsWayfarerFilmproduction#Kaantha #DulquerSalmaan #RanaDaggubati #SpiritMedia#DQsWayfarerfilms #Bhagyashriborse#SelvamaniSelvaraj #Kaanthafilm#KaanthaFromNov14…— Wayfarer Films (@DQsWayfarerFilm) November 4, 2025 -
చైతూ సరసన సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ.. ఫస్ట్ లుక్ అదుర్స్!
తండేల్ మూవీ తర్వాత అక్కినేని హీరో నాగచైతన్య(Naga chaitanya) భారీ ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ మూవీ కోసం కార్తీక్ దండుతో ఆయన జతకట్టారు. చైతూ కెరీర్లో 24వ చిత్రంగా రానున్న ఈ సినిమాను ఎన్సీ24(NC24) వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. అడ్వంచరస్ మైథాలజీ చిత్రంగా రానున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.తాజాగా ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ అడ్వెంచరస్ మూవీలో దక్ష పాత్రలో మెప్పించనుంది. తాజాగా రిలీజైన పోస్టర్ చూస్తుంటే పురావస్తు శాఖలో శాస్త్రవేత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం మూవీలోనూ ఐపీఎస్ ఆఫీసర్గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సారి మరో డిఫరెెంట్ రోల్తో అభిమానులను అలరించనున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. Super excited to be a part of this team and to Be playing ‘DAKSHA’ . Get ready for a an exciting journey 🥰 https://t.co/NsfGkrI71X— Meenaakshi Chaudhary (@Meenakshiioffl) November 4, 2025 -
స్కూల్ డ్రస్ పాప ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. గుర్తుపట్టారా?
ఈమె తల్లిదండ్రులు ఇద్దరూ స్టార్సే. దీంతో ఈమె కూడా పెరిగి పెద్దయ్యాక ఇండస్ట్రీలోకి వచ్చింది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తోంది. రీసెంట్గానే సూపర్స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడు స్కూల్ డ్రస్సులో కనిపిస్తోంది. మరి ఇన్ని హింట్స్ ఇచ్చాం కదా! ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన స్కూల్ డ్రస్సులో మధ్యలో ఉన్న కూర్చుని పాప పేరు శ్రుతి హాసన్. తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా ఈమె అందరికీ తెలుసు. ఈమె తల్లి సారిక కూడా నటి. తండ్రి కమల్ 'హే రామ్' మూవీలో బాలనటిగా శ్రుతి హాసన్ నటించింది. అలా తొలిసారి స్క్రీన్పై మెరిసింది. మరోవైపు టీనేజీలోకి వచ్చిన తర్వాత మ్యూజిక్ నేర్చుకుని సింగర్గా గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం 2009లో లక్ అనే హిందీ మూవీతో తిరిగి నటిగా మారిపోయింది.(ఇదీ చదవండి: ఈ జనరేషన్ ఆడపిల్లల మనసు ఆవిష్కరించిన సినిమా.. ఓటీటీ రివ్యూ)'అనగనగా ఓ ధీరుడు' సినిమాతో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్కు 'గబ్బర్ సింగ్'తో బ్రేక్ దొరికింది. తర్వాత తెలుగు, తమిళ, హిందీ అంటూ మూవీస్ చేసింది. 2023లో 'సలార్', ఈ ఏడాది రజనీకాంత్ 'కూలీ' చిత్రాలతో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని కూడా పలకరించింది. రీసెంట్గా ఈమె స్కూల్ ఫొటో ఎందుకో వైరల్ అయింది. దీంతో ఈమె ఎక్కడుందా అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఆ పాప శ్రుతి హాసన్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు.శ్రుతి హాసన్ వ్యక్తిగత జీవితానికొస్తే.. కెరీర్ ప్రారంభంలో హీరో సిద్ధార్థ్తో డేటింగ్ చేసినట్లు వార్తలొచ్చాయి. ఇది నిజమా కాదా అనుకునేలోపు ఓ విదేశీయుడితో చెట్టాపట్టాలు వేసుకుని కనిపించింది. కొన్నాళ్ల క్రితం ఆర్టిస్ట్ శంతను హజరికాతో కొన్నాళ్లు డేటింగ్ చేసింది. అతడి నుంచి కూడా విడిపోయింది. ప్రస్తుతానికైతే ఒంటరిగానే ఉంది. మరి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో?(ఇదీ చదవండి: నా భార్యకు తాళి వేసుకోవద్దనే చెబుతా: రాహుల్ రవీంద్రన్) -
రామ్ మిరియాల నోట ‘సంతాన ప్రాప్తిరస్తు’ పాట
రామ్ మిరియాల పాడితే ఆ పాట ఛాట్ బస్టర్ కావాల్సిందే. 'చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే..', 'టిల్లు అన్న డీజే పెడితే..', 'ఛమ్కీల అంగీలేసి..', 'ఊరు పల్లెటూరు..', 'టికెట్ ఏ కొనకుండా..', 'సుఫియానా...' ఇలా రామ్ మిరియాల పాటలన్నీ మ్యూజిక్ లవర్స్ కు ఫేవరేట్ సాంగ్స్ అయ్యాయి. ఈ వెర్సటైల్ సింగర్ "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా టైటిల్ సాంగ్ పాడారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను సునీల్ కశ్యప్ కంపోజ్ చేశారు.ఈ పాట ఎలా ఉందో చూస్తే - 'సంతాన ప్రాప్తిరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు...సంతాన ప్రాప్తిరస్తు ఆశీర్వదిస్తూ, ఆల్ ది బెస్టు, నెత్తిన జిలకర బెల్లం పెట్టు, మంగళసూత్రం మెళ్లోన కట్టు, లక్షలు వోసి దావత్ వెట్టు, కొత్తగ వేరే కాపురమెట్టు, నీదేమో నైట్ షిఫ్టు, నీ వైఫుది మార్నింగ్ షిఫ్టు, వీకెండ్ లో రొమాన్స్ కు ప్లానింగ్ చేసి లెక్కలుగట్టు...' అంటూ ప్రస్తుత కాలంలో యూత్ మ్యారీడ్ లైఫ్ స్టైల్ ను చూపిస్తూ సాగుతుందీ పాట.విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న "సంతాన ప్రాప్తిరస్తు" సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్స్, ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. -
అమ్మాయిలతో 100 కోడిగుడ్లు కొట్టించుకున్న స్టార్ హీరో!
కొంతమంది హీరోలు పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి సాహసాలు చేయడానికైనా రెడీ అవుతుంటారు. రిస్కీ షాట్స్ సైతం డూప్ లేకుండా ట్రై చేస్తుంటారు. స్టంట్స్ విషయంలోనూ వెనకడుగు వేయరు. ప్రేక్షకులను అలరించడానికి ఎంత కష్టమైన భరిస్తారు. అలాంటి హీరోల్లో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్(Akshay Kumar) ఒకరు. ఎలాంటి పాత్రలోనైనా జీవించే గొప్ప నటుడు ఆయన. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి పని చేయడానికైనా రెడీ అవుతుంటాడు. ఓ సినిమాలోని పాట కోసం ఏకంగా 100 కోడిగుడ్లతో కొట్టించుకున్నాడట. దుర్వాసనతో పాటు నొప్పి కలిగినా..ఒక్కమాట కూడా అనకుండా షూట్ అయ్యేవరకు అలాగే ఉండిపోయాడట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొరియోగ్రాఫర్ చిన్నిప్రకాశ్ చెప్పారు. ‘అంకితభావంతో పనిచేసే అతికొద్ది మంది హీరోల్లో అక్షయ్ ఒకరు. పాత్ర కోసం వందశాతం కష్టపడతాడు. ఆయనతో నేను దాదాపు 50 పాటల వరకు కొరియోగ్రాఫర్గా పనిచేశాను. ఎలాంటి కష్టమైన స్టెప్పులు ఇచ్చినా..ట్రై చేసేవాడు. స్టెప్స్ మార్చమని ఎప్పుడూ అడగలేదు. ‘ఖిలాడి’ చిత్రంలో ఓ పాట కోసం అక్షయ్ 100 కోడిగుడ్లతో కొట్టించుకున్నాడు. ఆ సీన్లో ఆయన చుట్టూ అమ్మాయిలు చేరి కోడిగుడ్లతో కొట్టాలి. ఈ విషయం చెప్పగానే వెంటనే చేసేద్దాం అని చెప్పాడు. అమ్మాయిలంతా కోడిగుడ్లని ఆయనపై విసిరేశారు. నొప్పి కలిగినా ఒక్క మాట కూడా అనలేదు. దుర్వాసన పోవడం కోసం చాలా కష్టపడ్డాడు. ఒక్కరిని కూడా కోపగించుకోలేదు. స్టార్ హీరో అయినప్పటికీ.. చాలా సింపుల్గా ఉంటాడు. అక్షయ్లా కష్టపడే నటీనటులను నేను ఇప్పటివరకు చూడలేదు’ అని చిన్ని ప్రకాశ్ చెప్పకొచ్చాడు. అబ్బాస్, మస్తాన్ దర్శకత్వంలో అక్షయ్కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఖిలాడి’ చిత్రం 1992లో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. -
బాలీవుడ్ సినిమా.. ట్రైలరే ఇలా ఉంటే..?
బాలీవుడ్ నుంచి మరో అడల్ట్ కామెడీ సినిమా మస్తీ-4 రానుంది. మస్తీ (Masti) ఫ్రాంచైజీలో ఇప్పటికే వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మెప్పించాయి. ఈ సీరిస్ నుంచి రానున్న మస్తీ-4 చిత్రంలో హీరోలు రితేశ్ దేశ్ముఖ్, వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నారు. మిలాప్ మిలన్ జావేరి దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 21న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో శ్రేయ శర్మ, రూహి సింగ్, ఎల్నాజ్ నోరౌజి తదితరులు నటించారు. -
నా భార్యకు తాళి వేసుకోవద్దనే చెబుతా: రాహుల్ రవీంద్రన్
'అందాల రాక్షసి' హీరోగా తెలుగు ప్రేక్షకులకు తెలిసిన రాహుల్ రవీంద్రన్.. ఇప్పుడు ఓవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాడు. మరోవైపు దర్శకుడిగానూ హిట్ కొట్టేందుకు సిద్ధమైపోయాడు. పాన్ ఇండియా సెన్సేషన్ రష్మికతో 'ద గర్ల్ ఫ్రెండ్' అనే ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ తీశాడు. ఈ శుక్రవారం ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాహుల్.. తన భార్య తాళిబొట్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'నాకు పెళ్లి అయిన తర్వాత.. మంగళసూత్రం (తాళి) మెడలో వేసుకోవాలా వద్దా అనేది నీ నిర్ణయమే అని నా భార్య చిన్మయికి చెప్పాను. నేనైతే తాళి వేసుకోవద్దనే చెబుతాను. ఎందుకంటే పెళ్లి తర్వాత అమ్మాయిలకు తాళిబొట్టు ఉన్నట్లు అబ్బాయిలకు ఏం ఉండదు. ఇది ఓ వివక్ష లాంటిదే. మగవారికి లేని నిబంధన మహిళలకు మాత్రమే ఉండటం సరికాదు' అని రాహుల్ రవీంద్రన్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ జనరేషన్ ఆడపిల్లల మనసు ఆవిష్కరించిన సినిమా.. ఓటీటీ రివ్యూ)రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. వాటిని కూడా పాజిటివ్గానే తీసుకుంటున్నాడు. తాజాగా రాహుల్ ఇలా అన్నాడని చెప్పి ఓ ట్విటర్ పేజీలో పోస్ట్ పెట్టగా.. దానికి స్పందించిన ఓ నెటిజన్.. 'నీ మీదున్న గౌరవం పోయింది రాహుల్ అన్న' అని రాసుకొచ్చాడు. దీనిపై స్పందించిన రాహుల్.. 'ఒకరి మాటలతో ఏకీభవించకపోవడం, ఒకరిపై గౌరవం పోవడం ఓకే బడ్డీ. కానీ నువ్వు ఈ విషయాన్ని కూడా గౌరవంగా సంభోదిస్తూ చెప్పావ్ చూడు. ఆ విషయంలో నిన్ను మెచ్చుకుంటున్నాను' అని అన్నాడు.'ద గర్ల్ ఫ్రెండ్' సినిమా విషయానికొస్తే.. రష్మిక లీడ్ రోల్ చేసింది. దీక్షిత్ శెట్టి ఈమె సరసన నటించాడు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ప్రేమకథనే అయినప్పటికీ సమ్థింగ్ డిఫరెంట్గా ఉండబోతుందనిపిస్తోంది. రాహుల్ నటుడే అయిప్పటికీ గతంలో 'చిలసౌ' అనే మూవీతో దర్శకుడిగా మారాడు. హిట్ కొట్టాడు. తర్వాత 'మన్మథుడు 2' తీశాడు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు డైరెక్టర్గా వస్తున్నాడు. వ్యక్తిగత జీవితానికొస్తే సింగర్ చిన్మయిని రాహుల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' వాయిదా రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత) -
విజయ్ సేతుపతి కుమారుడి సినిమా.. అదిరిపోయేలా ట్రైలర్
విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చేశాడు. అతను నటించిన తొలి సినిమా తమిళ్లో ‘ఫీనిక్స్’ పేరుతో ఇప్పటికే విడుదలైంది. అక్కడ ఫర్వాలేదనిపించిన ఈ మూవీ ఇప్పుడు ఇదే టైటిల్తో తెలుగులో కూడా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా తెలుగు ట్రైలర్ను విడుదల చేశారు.ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని రాజ్యలక్ష్మి అనల్ అరసు నిర్మించారు. జూలై 4న తమిళ్లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, తెలుగు వర్షన్ నవంబర్ 7న థియేటర్లో విడుదల కానుంది. ఈమేరకు హైదరాబాద్లో ప్రీరిలీజ్ ఈవెంట్ను కూడా మేకర్స్ నిర్వహించారు.ఫీనిక్స్ సినిమాలో యాక్షన్తో పాటు అద్భుతమైన ఎమోషన్ కూడా సూర్య సేతుపతి పండిచాడు. వరలక్ష్మీ శరత్కుమార్ ఒక కీలకమైన పాత్రలో నటించారు. మీడియా సమావేశంలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. తన కుమారుడు ఒక మంచి సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఎమోషనల్ అండ్ హై యాక్షన్ స్టోరీతో సినిమా తీశామని తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆయన తెలిపారు. -
మమ్ముట్టి ఖాతాలో అరుదైన రికార్డు
మమ్ముట్టి(Mammootty) నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రల్లో అయినా ఆయన జీవించేస్తాడు. తెరపై స్టార్లా కాకుండా పాత్రకు తగ్గ నటుడిలాగానే కనిస్తాడు. ఆయన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేశారు. అందులో ఒకటి ‘భ్రమయుగం’(Bramayugam). గతేడాది విడుదలైన ఈ చిత్రం ఎన్ని రికార్డులకు క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. భారీ వసూళ్లతో పాటు విమర్శకుల ప్రశంసలను దక్కించుంది. తాజాగా 55వ కేరళ రాష్ట్ర సినిమా అవార్డుల్లోనూ(Kerala State Film Awards 2025) ఈ చిత్రం సత్తా చాటింది. నాలుగు ప్రతిష్ఠాత్మక విభాగాల్లో అవార్డులను సాధించింది.ఉత్తమ నటుడిగా మమ్ముట్టి, ఉత్తమ సహాయ నటుడిగా సిద్ధార్థ్ భరతన్, ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడిగా క్రిస్టో జేవియర్, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గా రోనెక్స్ జేవియర్ అవార్డులు గెలుపొందారు. ఈ అవార్డుతో మమ్ముట్టి ఖాతాలో మరో అరుదైన రికార్డు నమోదైంది. రాష్ట్ర స్థాయిలో అత్యధిక సార్లు(7) ఉత్తమ నటుడి విభాగంలో అవార్డు అందుకున్న నటుడిగా మమ్ముట్టి రికార్డు సృష్టించారు.భ్రమయుగంలో తాంత్రిక విద్యలు తెలిసిన కొడుమోన్ అనే పాత్రను మమ్ముట్టి పోషించారు. . ఈ పాత్రలో మమ్ముట్టి ఒదిగిపోయిన తీరు.. భారతదేశపు అత్యుత్తమ నటుల్లో ఒకరిగా ఆయన స్థాయిని పునరుద్ఘాటించింది. కొన్ని తరాలకు గుర్తుండిపోయే సరికొత్త ఆలోచనలతో, సృజనాత్మక సరిహద్దులను చెరిపివేసి.. మలయాళ సినిమా ఎలా ముందుకు వెళుతుందో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణగా 'భ్రమయుగం' నిలిచింది. నిర్మాతలు రామచంద్ర చక్రవర్తి (నైట్ షిఫ్ట్ స్టూడియోస్), ఎస్. శశికాంత్ (వైనాట్ స్టూడియోస్) తమ సినిమా సృజనాత్మక దృష్టిని గుర్తించినందుకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం, జ్యూరీ, విమర్శకులు, మీడియా మరియు ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.“ఈ అవార్డులు ప్రయోగాత్మక కథలపై మా నమ్మకాన్ని మరింత బలపరిచాయి. మరిన్ని ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి, కేరళ సినిమాకు కొత్త దారులు చూపే ప్రయత్నాలను కొనసాగించడానికి ఇవి మాకు ప్రేరణగా నిలుస్తాయి. మా దర్శకుడు, నటీనటులు, సాంకేతిక బృందం మరియు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.” అంటూ నిర్మాతలు తమ ఆనందాన్ని పంచుకున్నారు.గత సంవత్సరం విడుదలై విశ్వవ్యాప్త ప్రశంసలు అందుకున్న 'భ్రమయుగం' చిత్రానికి రాహుల్ సదాశివన్ రచన మరియు దర్శకత్వం వహించారు. మమ్ముట్టి, అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ వంటి అద్భుతమైన తారాగణం నటించారు. -
పాన్ ఇండియా చిత్రంగా ‘కాళీమాతా’
ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి(Kethireddy Jagadishwar Reddy) కొత్త సినిమాను ప్రకటించాడు. నిజ సంఘటనల ఆధారంగా ‘కాళీమాతా’(Kalimatha)ని తెరకెక్కించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రానికి ఆయన కథను అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ని ప్రకటిస్తూ ఓ గ్లింప్స్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ.. ‘కాళీమాతా కేవలం సినిమా కాదు — ఇది ఒక ఉద్యమం.నిజ సంఘటనల స్ఫూర్తితో రూపొందుతున్న ఈ చిత్రం మతం, జాతి, భాష, ప్రాంతం అనే సరిహద్దులను దాటి — “సత్యానికి పాస్పోర్ట్ ఉండదు” అనే విశ్వసత్యాన్ని ప్రతిధ్వనింపజేస్తుంది. ఇది న్యాయం కోసం, సత్యం కోసం మానవత్వం చేసే ఆత్మపోరాటాన్ని ప్రతిబింబిస్తుంది.ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్స్ నటించబోతున్నారు. అలాగే ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు ఈ చిత్రంలో భాగమవుతున్నారు. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒడియాతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ విడుదల చేస్తాం. కాస్టింగ్తో పాటు పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’ అన్నారు. -
కమల్ హాసన్ బర్త్డే స్పెషల్.. హిట్ సినిమా రీరిలీజ్
కోలీవుడ్ నటుడు కమల్ హాసన్ పుట్టినరోజు సందర్బంగా ఫ్యాన్స్కు కానుక ఇవ్వనున్నారు. నవంబర్ 7న ఆయన బర్త్డే సందర్బంగా విక్రమ్ సినిమా రీరిలీజ్ కానుంది. 2022లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. దాదాపు అయిదు భాషల్లో సత్తా చాటింది. తమిళనాడులో కలెక్షన్లపరంగా అనేక రికార్డ్లను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సుమారు రూ. 400కోట్లు పైగా వసూలు చేసి కమల్ కెరీర్లోనే భారీగా వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు మరోసారి థియేటర్లోకి విక్రమ్ రానున్నడంతో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన విక్రమ్లో కమల్కు దీటుగా విజయ్ సేతుపతి(Vijay sethupathi), ఫహద్ ఫాజిల్(Fahadh Faasil) కీలక పాత్రల్లో మెప్పించారు. సినిమా చివర్లో రోలెక్స్గా సూర్య మెరుపులు అదరగొట్టేశారు. అయితే, కమల్ బర్త్డే సందర్భంగా విక్రమ్ స్పెషల్ షోలు వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో ఇప్పటికే హైదరాబాద్లోని విమల్ (మైత్రీ మూవీస్) థియేటర్ ఒక పోస్టర్ షేర్ చేసింది. ఆపై ఆర్టీసీ క్రాస్రోడ్లో ఉన్న సంధ్యలో కూడా విక్రమ్ షో ఉండనుంది. విజయవాడ అలంకార్, వైజాగ్ సంగం థియేటర్స్కు సంబంధించి ఇప్పటికే టికెట్లు ఓపెన్ అయ్యాయి. -
'రాజాసాబ్' వాయిదా రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
గతేడాది 'కల్కి'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రభాస్.. ఈ ఏడాది 'కన్నప్ప'లో అతిథి పాత్రలో మెరిశాడు. బాహుబలి రీ రిలీజ్ వల్ల మరోసారి థియేటర్లలోకి వచ్చాడు. కానీ స్ట్రెయిట్ మూవీ మాత్రం రాలేదు. లెక్క ప్రకారం డిసెంబరు 5న 'రాజాసాబ్' రావాల్సింది. కానీ సంక్రాంతికి వాయిదా వేశాడు. జనవరి 9న రిలీజ్ అని అధికారికంగానే ప్రకటించారు. గత రెండు మూడు రోజులుగా మళ్లీ వాయిదా అనే రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాటిపై నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది.'రాజాసాబ్' సినిమా నుంచి ఇప్పటికే టీజర్, ట్రైలర్ రిలీజయ్యాయి. ఇవి చూసుంటే ఇందులో వీఎఫ్ఎక్స్ ఎక్కువగానే ఉండబోతుందని అర్థమవుతుంది. అందుకు తగ్గట్లే పని జరుగుతోంది. అయితే వీఎఫ్ఎక్స్ పనులు ఈసారి కూడా ఆలస్యమయ్యేలా ఉన్నాయనే రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని ఖండించిన నిర్మాత.. చెప్పినట్లుగానే జనవరి 9న మూవీ రిలీజ్ అవుతుందని మరోసారి స్పష్టం చేశారు.(ఇదీ చదవండి: ఈ జనరేషన్ ఆడపిల్లల మనసు ఆవిష్కరించిన సినిమా.. ఓటీటీ రివ్యూ)డిసెంబరు 25వ తేదీ కల్లా సినిమా తొలి కాపీ రెడీ అయిపోతుందని, అమెరికాలో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నామని.. పనిలోపనిగా నిర్మాత చెప్పుకొచ్చారు. ఈ మేరకు నోట్ రిలీజ్ చేశారు. దీంతో వాయిదా ఏం లేదులే అని ప్రభాస్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని హారర్ ఫాంటసీ కథతో తీశారు. భయపెట్టే అంశాలతో పాటు కమర్షియల్ సినిమాల్లో ఉండే పాటలు, ఫైట్స్, రొమాన్స్ లాంటివి కూడా ఉండబోతున్నాయి. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ అని ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్రధారి. తమన్ సంగీతమందిస్తున్నాడు.(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటికి అసభ్య వీడియోలు.. వ్యక్తి అరెస్ట్) -
తెలుగు సీరియల్ నటికి అసభ్య వీడియోలు.. వ్యక్తి అరెస్ట్
తెలుగు, కన్నడ భాషల్లో సీరియల్స్ చేస్తున్న ఓ నటి.. నెలలుగా ఇబ్బంది పడుతోంది. ఇక తట్టుకోలేక ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. దీంతో ఈ నటిని వేధిస్తున్న వ్యక్తిని బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడీ విషయం చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: భరణితో ట్రోల్స్.. ఫైర్ అయిన మాధురి)ఏం జరిగింది?స్వతహాగా బెంగళూరుకి చెందిన ఓ నటి.. కన్నడతోపాటు తెలుగులోనూ సీరియల్స్ చేస్తోంది. ఈమెకు ఓ రోజు నవీన్ అనే వ్యక్తి నుంచి ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. కానీ ఈమె దీన్ని తిరస్కరించింది. పలుమార్లు ఇలానే చేసింది. దీంతో కక్ష పెంచుకున్న ఇతడు.. అభ్యంతరకర వీడియోలు పంపించడం మొదలుపెట్టాడు. బ్లాక్ చేయడంతో పలు ఫేక్ అకౌంట్స్ సృష్టించి మరీ సదరు నటికి మెసేజులు, వీడియోలు పంపిస్తూనే ఉన్నాడు.దాదాపు మూడు నెలల పాటు నవీన్ వల్ల మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్న సదరు నటి.. ఇక తట్టుకోలేక వ్యక్తిగతంగా అతడిని కలిసి సమస్యని పరిష్కరించుకోవాలని అనుకుంది. ఈ క్రమంలోనే నాగభైరవి ప్రాంతంలోని నందన్ ప్యాలెస్లో నవీన్ని కలిసింది. ఇవన్నీ ఆపేయాలని కోరింది. అయినా సరే అతడిలో మార్పు రాకపోవడంతో పోలీసులని ఆశ్రయించింది. దీంతో నటి ఫిర్యాదు మేరకు నవీన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు సాగుతోంది.(ఇదీ చదవండి: ఈ జనరేషన్ ఆడపిల్లల మనసు ఆవిష్కరించిన సినిమా.. ఓటీటీ రివ్యూ) -
భరణితో ట్రోల్స్.. ఫైర్ అయిన మాధురి
బిగ్బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu)లో మాధురి ( Madhuri) కేవలం మూడు వారాలు మాత్రమే ఉన్నారు. అయితే, హౌస్లో ఉన్నన్నిరోజులు తనదైన రీతిలో ముద్రవేశారు. వైల్డ్కార్డ్ ఎంట్రీ ఇచ్చిన మాధురి 8వ వారంలో ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలో బిగ్బాస్ షో గురించి పలు వ్యాఖ్యలు చేశారు. ఆపై భరణి, తనను కలిపి ట్రోల్ చేస్తున్నవారిపై విరుచుకుపడ్డారు. భరణి రీఎంట్రీ వెనుకు దాగి ఉన్న అసలు కారణం ఏంటో మాధురి ఓపెన్గా చెప్పారు.భరణితో మీమ్స్.. భగ్గుమన్న మాధురిబిగ్బాస్లో మాధురి ఉన్నన్నిరోజులు తన గేమ్తో పాటు పదునైన మాటలతో ఫైర్ అయ్యారు. అయితే, హౌస్లో ఉన్నది కొద్దిరోజులు మాత్రమే అయినప్పటికీ తనకు నచ్చినట్లు వ్యవహరించారు. ఎక్కడా కూడా బిగ్బాస్కు సరెండర్ అయి గేమ్ ఆడలేదనిపించేలా సత్తా చాటారు. అయితే.. ఆమె హౌస్లో ఉండగా కొందరు అదేపనిగా భరణి, మాధురి ఫోటోలతో ట్రోల్స్ చేశారు. వాటిపై ఆమె ఇలా ఇరుచుకుపడ్డారు. 'సోషల్మీడియాలో కొందరు బుద్దిలేని ఎదవలు మాత్రమే ఇలాంటి మీమ్స్ వేశారు. దీపావళి పండగ సందర్బంగా హోస్ట్ నాగార్జున చెబితేనే భరణితో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. అది కూడా చాలా దూరంగా ఉంటూనే రెండు స్టెప్పులు వేశాను. కనీసం అతని చేతులు కూడా నేను టచ్ చేయలేదు. ఎలాంటి అశ్లీలత లేకుండా డ్యాన్స్ చేస్తే నీచాతినీచంగా ఇలాంటి ట్రోల్స్ చేస్తారా..? నాపై ఎవడైతే ట్రోల్స్ చేశాడు వాడు మనిషి కాదు.. ఒక పశువుతో సమానం. మనిషి జన్మ ఎత్తినవాడు ఎవడూ కూడా ఇలాంటి నీచమైన ట్రోల్స్ చేయడు.' అని ఆమె ఆవేదన చెందారు.భరణి రీఎంట్రీ వెనుక నాగబాబుబిగ్బాస్లో అత్యంత పేలవమైన కంటెస్టెంట్గా భరణి ఉన్నారు. హౌస్లో అందరితో బాగుండాలనే ఆలోచనతో ఎక్కువగా బాండింగ్స్ పెట్టుకోవడం ప్రేక్షకులకు నచ్చేలేదు. తను సేఫ్ గేమ్ ఆడుతున్నాడని హౌస్ట్ నాగార్జున కూడా చెప్పారు. దీంతో ఆయన 7వ వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. అయితే, రీఎంట్రీ పేరుతో దమ్ము శ్రీజ, భరణిని హౌస్లోకి పంపారు. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే హౌస్లో ఉంచుతామని బిగ్బాస్ చెప్పారు. అయితే, దమ్ము శ్రీజ రీఎంట్రీ ఉంటుందని ప్రేక్షకులు ఎక్కువగా భావించారు. కానీ, ఫైనల్గా ఆ ఛాన్స్ భరణికి దక్కింది. ఈ అంశంలో మాధురి కూడా ఇలా రియాక్ట్ అయ్యారు. మెగా బ్రదర్ నాగబాబు ఆశీస్సులు భరణికి ఉన్నాయని.., అందుకే నాగబాబుకు రెండో ఛాన్స్ ఇచ్చారని ఆమె అభిప్రాయపడ్డారు. ఇదే విషయంలో దమ్ము శ్రీజ కూడా రియాక్ట్ అయింది. భరణి రీఎంట్రీ కోసం తనను బలి చేశారని ఆమె చెప్పింది. భరణి రీఎంట్రీపై చాలామంది ప్రేక్షకులు కూడా తమ అసంతృప్తి తెలిపారు.భరణి కోసం ట్వీట్ వేసిన నాగబాబుబిగ్బాస్ సీజన్ ప్రారంభంలోనే భరణి కోసం నాగబాబు అండగా నిలిచారు. ఈ క్రమంలో ఆయన ఇలా ట్వీట్ చేశారు. 'నాకు చాలా సన్నిహితుడైన నా ప్రియమైన భరణి శంకర్.. బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రయాణం అతనికి నిజంగా విజయాన్ని, గుర్తింపును తీసుకురావాలి.' అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.తనూజ విన్నర్ అవుతుందిబిగ్బాస్ సీజన్ 9 విన్నర్ తనూజ అవుతుందని మాధురి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తనకే ఎక్కువ ఛాన్స్ ఉందన్నారు. అందరూ అనుకుంటున్నట్లు ఆమె సేఫ్ గేమ్ ఆడటం లేదని క్లారిటీ ఇచ్చారు. 'వాస్తవంగా ఎలిమినేషన్ రౌండ్లో నన్ను సేవ్ చేస్తానని తనూజ కోరింది. నేను వద్దని చెప్పాను. గౌరవ్కు గేమ్ ఆడాలని ఆశ ఉంది కాబట్టి తనను సేవ్ చేయమని తనూజను కోరాను. అంతేకాకుండా హౌస్లో ఉండటం నాకు ఇష్టం లేదు. నా భర్త పుట్టినరోజు ఉందని తనూజకు చెప్పాను. ఎట్టిపరిస్థితిల్లోనూ నన్ను సేవ్ చేయవద్దని ఒట్టు కూడా తనూజతో వేయించుకున్నాను.' అని మాధురి చెప్పారు. -
ఈ జనరేషన్ ఆడపిల్లల మనసు ఆవిష్కరించిన సినిమా.. ఓటీటీ రివ్యూ
కొన్నాళ్ల క్రితం పలు వివాదాలకు కారణమైన తమిళ సినిమా 'బ్యాడ్ గర్ల్'. బ్రహ్మణులని కించపరిచే సీన్స్ ఉన్నాయని చెప్పి టీజర్ రిలీజ్ టైంలో చాలా హడావుడి చేశారు. సెన్సార్ దగ్గర కూడా పలు సమస్యలు ఎదుర్కొని ఎట్టకేలకు సెప్టెంబరు తొలివారంలో థియేటర్లలోకి వచ్చింది. రెండు నెలల తర్వాత ఇప్పుడు(నవంబరు 04 నుంచి) ఓటీటీలోకి వచ్చేసింది. హాట్స్టార్లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?మధ్యతరగతి కుటుంబానికి చెందిన టీనేజ్ అమ్మాయి రమ్య (అంజలి శివరామన్). అందరు ఆడపిల్లల్లానే తనకు కూడా ఓ బాయ్ ఫ్రెండ్, సుఖంగా ఉండేందుకు చిన్న ఇల్లు ఉంటే చాలు అని కలలు కంటూ ఉంటుంది. స్కూల్ చదువుతున్నప్పుడు నలన్ (హ్రిదు హరూన్), కాలేజీలో అర్జున్ (శశాంక్), ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇర్ఫాన్ (టీజే అరుణాచలం)తో రిలేషన్లో ఉంటుంది. వీటిలో ఏ బంధం కూడా ఎక్కువరోజులు నిలబడదు. కంటికి రెప్పలా చూసుకునే తల్లి, అద్భుతమైన స్నేహితురాలు ఉన్నా సరే ఈమెని సమాజం 'బ్యాడ్ గర్ల్' అని ముద్ర వేస్తుంది. ఇలా కావడానికి కారణమేంటి? చివరకు రమ్య ఏం చేసింది? అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఓ కుర్రాడు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో తిరిగితే సమాజం అతడిని ఏం అనదు. ఇదే పని ఓ అమ్మాయి చేస్తే తిరుగుబోతు అనే ముద్ర వేస్తుంది. ఆమె వైపు నుంచి తప్పుందా? అబ్బాయిల వైపు తప్పుందా? అనేది ఎవరు పట్టించుకోరు. సరిగ్గా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొని నిలబడిన ఓ అమ్మాయి కథే 'బ్యాడ్ గర్ల్'.సాధారణంగా అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో తీసే సినిమాల్లో మగాళ్లని కొన్నింట్లో వెధవల్లా, మరికొన్నింట్లో విలన్స్గా చూపిస్తుంటారు. 'బ్యాడ్ గర్ల్'లో అలాంటివేం ఉండవు. కేవలం ఓ అమ్మాయి మనసుని.. టీనేజీ నుంచి 30స్లోకి వచ్చేంతవరకు ఆవిష్కరించారు. ఏ మతం, ఏ కులంలో పుట్టినా సరే ఆడవాళ్లకూ మనసు ఉంటుంది. దానికి బోలెడన్ని కోరికలు ఉంటాయి. ఈ సినిమాలోనూ హీరోయిన్కి ప్రేమ, శృంగారం లాంటి ఆలోచనలు ఎక్కువగానే ఉంటాయి. ఎంతలా అంటే 9వ క్లాస్లో ఉన్నప్పుడే స్కూల్లోనే ఓ అబ్బాయికి ముద్దు పెడుతుంది. కాలేజీకి వెళ్లేసరికి శృంగారం, జాబ్ చేస్తున్నప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్.. ఇలా ఉంటాయి.ఓ అమ్మాయి తనకు నచ్చినట్లు బతికితే ఈ సమాజం, ఇందులోని వ్యక్తులు.. 'బ్యాడ్ గర్ల్'గా ఎలా ముద్రవేస్తారు అనేది చెప్పిచెప్పనట్లు ఈ సినిమాలో చూపించారు. క్లైమాక్స్లో ఆడపిల్లని పిల్లి పిల్లతో పోల్చి చూపించడం.. ఈ క్రమంలో రమ్య తల్లి చెప్పే డైలాగ్ భలే అనిపిస్తాయి. 'ఓ అబ్బాయి చేసిన గాయాన్ని మరో అబ్బాయి మానిపోయేలా చేయలేడు' లాంటి కొన్ని డైలాగ్స్ కూడా అవును నిజమే కదా అనిపించేలా చేస్తాయి. మూవీ విడుదలకు ముందు బ్రహ్మణులని టార్గెట్ చేసేలా సీన్స్ ఉన్నాయని అన్నారు గానీ చూస్తున్నప్పుడు అలా ఏం కనిపించలేదు.ఎవరెలా చేశారు?రమ్యగా అంజలి శివరామన్ అద్భుతంగా ఫెర్ఫార్మ్ చేసింది. టీనేజీ అమ్మాయిలా ఎంత బాగుందో.. స్వతంత్ర భావాలుండే మహిళగానూ చక్కగా ఇమిడిపోయింది. ఈమె పలికించిన చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ చాలా సహజంగా అనిపించాయి. ఈమె తల్లి పాత్ర చేసిన శాంతిప్రియ చాలా రియలస్టిక్ యాక్టింగ్ చేశారు. రమ్య స్నేహితురాలిగా చేసిన సెల్వి, బాయ్ఫ్రెండ్స్గా చేసిన హ్రిదు, శశాంక్, అరుణాచలం కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.టెక్నికల్ విషయాలకొస్తే దర్శకురాలు వర్ష భరత్ గురించి చెప్పాలి. ఇప్పటి జనరేషన్ అమ్మాయిలు ఎలా ఉన్నారు? ఎలా ఆలోచిస్తున్నారు? ఎలా ఉండాలనుకుంటున్నారు? వాళ్ల కోరికలు ఏంటి అనే విషయాల్ని ఫెర్ఫెక్ట్గా చూపించారు. ఈమెకు తోడు అమిత్ త్రివేది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ సరిగ్గా సరిపోయాయి. ఈ తరహా సినిమాలు అందరికీ నచ్చకపోవచ్చు. చూసే వ్యక్తుల పాయింట్ ఆఫ్ వ్యూ బట్టి ఆధారపడి ఉంటుంది. కొన్ని డైలాగ్స్ రియలస్టిక్గా ఉంటాయి కాబట్టి కుదినంతవరకు ఒంటరిగానే చూడండి.- చందు డొంకాన -
భరణిపై భగ్గుమన్న తనూజ.. బంధాలకు గుడ్బై
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి దివ్వెల మాధురి ఎలిమినేషన్ అయిపోయాక సోమవారం ఎపిసోడ్ మొదలైంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియ మొత్తం తనూజ చుట్టే నడిచిందని చెప్పవచ్చు. తనూజపై దివ్య,భరణి, ఇమ్మాన్యేయల్, సాయి శ్రీనివాస్లు మాటలతో ఎదురుదాడికి దిగారు. సోమవారం జరిగిన ఎపిసోడ్ మొత్తం తనూజ చుట్టే జరిగింది. ఇంటి సభ్యులు ఒకరిని ఒకరు నామినేట్ చేసుకుంటూ మాటల తూటాలు పేల్చుకున్నారు. టెడ్డీ బేర్ల టాస్క్ పేరుతో రేసులో చివరగా చేరిన సభ్యులకు నామినేషన్ బాధ్యత ఇచ్చారు. మొదటి రౌండ్లో సంజన నామినేట్ అయితే.. తరువాతి రౌండ్లో తనూజ, భరణి మధ్య మాటల యుద్ధంతో హౌస్ హీటెక్కింది. అయితే.. తనూజ వల్లనే తాను హౌస్ నుంచి బయటకు వెళ్లానని, ఆమె ఒక్కసారి కూడా తనను సేవ్ చేయలేదని భరణి ఫైర్ అయ్యాడు.మొదటి రౌండ్లోనే అందరికంటే చివరిగా సంజన ఉండటంతో తనకు నామినేషన్ చేసే ఛాన్స్ దక్కింది. అయితే, సంజనకి తన ఫొటో ఉన్న టెడ్డీయే రావడంతో బిగ్బాస్ ఆదేశాల మేరకు మరోకరితో స్వాప్ చేయాలని సంచాలక్ దివ్యకు అధికారం ఇస్తాడు. దీంతో రీతూతో స్వాప్ చేసే అవకాశం దివ్య ఇస్తుంది. ఇక్కడ సంజన, రీతూ ఇద్దరూ వాదించుకోవాలి. ఫైనల్గా ఎవరి వాదన బలంగా ఉంటే వారిని సంచాలక్ సేవ్ చేస్తారు. బలహీనంగా ఉన్న వారిని నామినేట్ చేస్తారు. అలా ఇద్దరి వాదనలో రీతూ పాయింట్లు చాలా బలంగా ఉన్నాయని అనిపిస్తుంది. సంజన వేసిన కౌంటర్లకు రీతూ చెప్పిన సమాధానాలు బాగానే ఉన్నాయి. దీంతో సంజనని నామినేట్ చేసి.. రీతూని సేవ్ చేసింది దివ్య.తనూజ-భరణి బంధం కట్ తరువాతి రౌండ్లో తనూజ, భరణి మధ్య మాటల యుద్ధం మొదలైంది. భరణి మాట్లాడుతూ.. 'తనూజ వల్ల నేనే హౌస్ నుంచి బయటకు వెళ్లాను. ఆమె ఒక్కసారి కూడా నన్ను సేవ్ చేయలేదు' అని ఫైర్ అయ్యాడు. ఇన్నిరోజులు నాన్న-కూతురు బాండింగ్లో ఉన్న వారిద్దిరూ తమలో ఎవరు హౌస్లో ఉండేందుకు ఎక్కువ అర్హులో వాదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు తనూజ కోసం మూడుసార్లు సపోర్ట్గా టాస్క్లలో నిలబడ్డానని భరణి అంటారు. దీంతో తనూజ కూడా గట్టిగానే వాదించింది. అవన్నీ సపోర్టింగ్ టాస్క్లు కాబట్టే నిలబడ్డారని చెప్పుకొచ్చింది. తనూజ బలమైన పాయింట్లతో భరణిని చిక్కుల్లో పడేసింది. ఇప్పటికీ నీ గేమ్ కూడా మరోకరు ఆడుతున్నారంటూ ఫైర్ అయింది. ఇక ఇద్దరి వాదనలు విన్న తర్వాత దివ్య కూడా ఏం చేయలేకపోయింది. తనూజ కౌంటర్స్ బలంగా ఉండటంతో తప్పనిసరిగా భరణిని నామినేట్ చేసింది. టాస్క్ ముగిసిన తర్వాత భరణి కాస్త రియాలిటీలోకి వచ్చినట్లు ఉన్నాడు. తనూజ, దివ్యల దగ్గరికి వెళ్లి ఇక నుంచి మీరిద్దరూ నా గురించి మాట్లాడకండి. మీ ఆట మీరు ఆడుకోండి అంటూ తమ బంధం ఇంతటితో ముగిసిందని స్పష్టంగా చెప్పేశాడు.పెళ్లి కూతురులా తనూజ.. ఇమ్మాన్యుయేల్ కౌంటర్స్తర్వాతి నామినేషన్లో కూడా ఇమ్మాన్యుయేల్తో తనూజ పోటీ పడాల్సి వచ్చింది. తన నామినేషన్ తనూజ అంటూ ఇమ్ము ఫైర్ అయ్యాడు. తనూజ సేఫ్ గేమ్ ఆడుతోందని అతను గట్టిగానే ఆరోపించాడు. అయితే, ఇమ్ము ప్రశ్నలకు తనూజ సరైన సమాధానం చెప్పలేకపోయింది. కానీ, ఈసారి కూడా సంచాలకులు తనూజని నామినేట్ చేయలేదు. అయితే, నామినేషన్ చేసే ఛాన్స్ తనూజకి రావడంతో తను కూడా ఇమ్మాన్యుయేల్ని నామినేట్ చేసింది. ఇమ్ము చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడని.. సపోర్ట్ చేస్తున్నా అనే పేరుతో ఒక ముసుగు వేసుకుని సేఫ్ ఆడుతున్నాడని తనూజ చెబుతుంది. అయితే, ఇమ్ము కూడా గట్టిగానే తిరిగి కౌంటర్ ఇచ్చాడు. నువ్వు బెడ్డు టాస్కులో చీర కట్టుకొని పెళ్లి కూతురులా కూర్చుంటే మేము సపోర్ట్ చేశామని గుర్తు చేశాడు. అసులు నువ్వు టాప్-5లోకి ఎలా వచ్చావ్ ఆ గేమ్లో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని ఇమ్ము అన్నాడు. ఇలా ఇద్దరూ ఒకరినొకరు గట్టిగానే మాటలతో రెచ్చిపోయారు. మరోవైపు రాము, కళ్యాణ్ని నామినేట్ చేశాడు. ఫైనల్గా సంచాలక్గా ఉన్న డీమాన్.. కళ్యాణ్ని నామినేట్ చేసి ఇమ్ముని సేవ్ చేస్తాడు.దివ్య- తనూజ మాటల యుద్ధంచివర్లో బిగ్ బాస్ ఒక సరప్రైజ్ ఇస్తాడు. కెప్టెన్ దివ్యకు ప్రత్యేక అధికారం ఇస్తూ.. ఇప్పటివరకు నామినేట్ కానివారిలో ఒకరిని నామినేట్ చేయాలని కోరుతాడు. దాంతో తనూజను నామినేట్ చేస్తున్నట్లు దివ్య చెప్పింది. ఇక్కడ కూడా భరణి పేరుతో డ్రామ నడిచింది. భరణి, తనూజల బాండ్ దివ్య బ్రేక్ చేసింది అని అందరూ అనుకుంటున్నారు. అలాంటి ఆరోపణలు రావడానికి కారణం నువ్వే (తనూజ) అంటూ దివ్య నామినేట్ చేసింది. దానికి తనూజ కూడా బలంగానే కౌంటర్ ఇస్తుంది. నేను ఆయన్ని (భరణి) నామినేట్ చేశానని నువ్వు నన్ను నామినేట్ చేశావ్ అంటూ ఫైర్ అయింది. ఆపై వెంటనే దివ్య కూడా మరో పంచ్ విసురుతుంది. తనూజ ఎప్పుడూ ఏడుస్తూ కూర్చుంటుంది అంటూ ప్రతి టాస్క్లో సింపతీ కోసం చూస్తుందని తనూజపై కామెంట్ చేసింది. ఇలా ఇద్దరి మధ్య పెద్ద మాటల యుద్దమే నడిచింది. ఫైనల్గా 9వ వారం నామినేషన్స్లో సంజన, సుమన్ శెట్టి, భరణి, కళ్యాణ్, రాము, సాయి శ్రీనివాస్, తనూజ ఉన్నారు. -
స్టార్ హీరోపై బండ్ల గణేష్ పంచ్లు
టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం నటించిన 'K ర్యాంప్' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. క సినిమా తర్వాత కిరణ్ మరో హిట్ అందుకున్నాడు. దీంతో కె ర్యాంప్ సక్సెస్ మీట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రంలో నిర్మాత బండ్ల గణేష్తో పాటు సినీ, రాజకీయ నాయకులు అతిథిలుగా వచ్చారు. ఈ క్రమంలో స్టేజీపై బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కిరణ్ అబ్బవరాన్ని ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో పోల్చడమే కాకుండా.. విజయ్ దేవరకొండపై పరోక్షంగా పంచ్లు వేశారని తెలుస్తోంది.బండ్ల గణేష్ కామెంట్లు ఎవరిపై..'K ర్యాంప్' సినిమా సక్సెస్ ఈవెంట్లో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. ' ఈ రోజుల్లో ఒక్క సినిమా హిట్ కాగానే లూజు పేంట్లు, కొత్త కొత్త చెప్పులు, కళ్లకు అద్దాలు పెట్టుకుని ఆపై కాలు మీద కాలు వేసుకుని వాట్సప్.. వాట్సప్ అంటూ తన తర్వాతి సినిమా కోసం లోకేష్ కనగరాజ్ను తీసుకురా... రాజమౌళిని తీసుకురా... సుకుమార్ను తీసుకురా... అనీల్ రావిపూడిని తీసుకురా అంటున్న ఈ రోజుల్లో ఆరుగురు కొత్త దర్శకులను కిరణ్ పరిచయం చేశాడు. ' అని బండ్ల అన్నారు. ఇప్పటివరకు కిరణ్ చేసిన ప్రతి సినిమా కూడా కొత్త డైరెక్టర్తోనే చేశాడని గుర్తుచేశాడు.చిరంజీవిని ఆదర్శంగా తీసుకోకిరణ్ అబ్బవరంను మెగాస్టార్ చిరంజీవితో బండ్ల గణేష్ పోల్చారు. తనపై ప్రశంసల వర్షం కురిపించారు. కిరణ్ ఒక రియల్ కుర్రోడు. బాంచెన్ హీరో అంటే ఇలాగే ఉండాలి. ప్రస్తుతం కిరణ్ని చూస్తుంటే నాకు చిరంజీవినే గుర్తొస్తున్నారు. కెరీర్ ప్రారంభంలో చిరంజీవి కూడా ఇలాగే ఉండేవారు. ఆయన ఇప్పటికే 150 సినిమాలు పూర్తి చేసి.. త్వరలో భారతరత్న అందుకోబోతున్నారు. అయినప్పటికీ చిరంజీవి లాంటి వ్యక్తి కూడా గ్రౌండ్ మీద ఉంటాడు. నువ్వు (కిరణ్) చిరంజీవిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు వెళ్లు.. నిన్ను చూస్తేంటే చాలా ముచ్చటేస్తుంది. అంటూ పొగడ్తలతో ముచ్చేత్తారు.రౌడీ బాయ్స్ను టార్గెట్ చేసిన బండ్లసినిమా పరిశ్రమలో విజయ్ దేవరకొండ మాత్రమే ఎక్కువగా 'వాట్సాప్ వాట్సాప్ మై రౌడీ బాయ్స్' అంటూ తన ఫ్యాన్స్ను పలకరిస్తుంటాడు. ఇప్పుడు బండ్ల గణేష్ కూడా ఇదే ఆటిట్యూడ్తో విజయ్ పేరు ఎత్తకుండా పరోక్షంగా పంచ్లు వేశారని సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఒక హీరోను పొగిడేందుకు మరో నటుడిని కించపరచేలా ఈ వ్యాఖ్యలు ఏంటి అంటూ నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఆ మధ్య లిటిల్ హార్ట్స్ ఈవెంట్లో మాట్లాడుతూ ఇండస్ట్రీలో పెద్దలు సెలబ్రిటీలు చేసే పొగడ్తలు నమ్మవద్దు, అన్నీ అబద్దాలే అంటూ నటుడు మౌళికి హితబోధ చేసి ఇప్పుడు ఈ భజన అవసరమా అంటూ బండ్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, గణేష్ అన్నది నిజంగా విజయ్ దేవరకొండనేనా కాదా అనేది పక్కన పెడితే కిరణ్ని పొగిడే క్రమంలో మరొకరి ప్రస్తావన ఎందుకనే ప్రశ్న ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. -
జైలర్– 2 ఫ్యాన్స్కు గుడ్న్యూస్
నటుడు రజనీకాంత్( Rajinikanth) హీరోగా నటించిన చిత్రం జైలర్. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటుడు వసంత్ రవి,రమ్యకృష్ణ, యోగిబాబు, సునీల్ తదితరులు ముఖయ పాత్రలు పోషించారు. మోహన్లాల్, శివరాజ్కుమార్, జాకీష్రాప్ తదితర స్టార్స్ అతిథి పాత్రల్లో మెరిన ఈ చిత్రంలో నటి తమన్న ఐటమ్ సాంగ్లో నటించారు. 2023లో తెరపైకి వచ్చిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. దీంతో తాజాగా జైలర్– 2 చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్ర షూటింగ్ పలు ప్రదేశాలో జరుపుకుంది. చివరిగా గోవాలో చిత్రీకరణను జరుపుకుంది. ఇందులో పాల్గొన్న రజనీకాంత్ తన షూటింగ్ను పూర్తి చేసుకుని తాజాగా చెన్నైకి తిరిగి వచ్చారు. ఆయన్ని చెన్నై విమానాశ్రయంలో పలువురు అభిమానులు కలిసి ఫొటోలు దిగారు. కాగా రజనీకాంత్ తదుపరి సుందర్.సీ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతారనే ప్రచారం జరుగుతోంది. ఈయన చాలా కాలం క్రితం సుందర్.సీ దర్శకత్వంలో నటించిన అరుణాచలం చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో తాజాగా మరోసారి ఈ కాంబోలో చిత్రం తెరకెక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది వినోదాన్ని మేళవించిన కమర్షియల్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. కాగా ఈ చిత్రం తరువాత రజనీకాంత్, కమలహాసన్ కాంబోలో చిత్రం తెరకెక్కుతుందని తెలిసింది. దీన్ని రజనీకాంత్ ,కమలహాసన్ల వారుసురాళ్లు, సౌందర్య రజనీకాంత్, శృతీహాసన్ కలిసి నిర్మిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ క్రేజీ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటనను కమలహాసన్ పుట్టిన రోజు అయిన ఈ నెల 7న రజనీకాంత్ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ ప్రకటన కోసం ఈ ఇద్దరు స్టార్స్ హీరోలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
మోహన్బాబు @ 50
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు మంచు మోహన్బాబు. ఆయన స్వర్ణోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆయన తనయుడు విష్ణు మంచు ఈ నెల 22న ‘ఎమ్బీ50– ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్’ పేరుతో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ‘‘నాన్నగారు(మోహన్ బాబు) ఇండస్ట్రీలోకి వచ్చి ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఐదు దశాబ్దాలుగా ఆయన ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు. శక్తివంతమైన నటన, ఐకానిక్ డైలాగ్ డెలివరీ, తెరపై చూపించిన ప్రతిభ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంటుంది. 600కి పైగా చిత్రాల్లో నటించారంటే ఆయన బహుముఖ ప్రజ్ఞ, క్రమశిక్షణ, కళ పట్ల అంకితభావాన్ని చాటుతాయి. కేవలం సినీ విజయాలే కాకుండా కళ, విద్య, దాతృత్వం పట్ల ఆయన చూపిన నిబద్ధత కూడా గొప్పది. ఎలాంటి సినిమా నేపథ్యం లేకపోయినా సినీ ప్రయాణం మొదలు పెట్టి.. తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుని, విలక్షణ నటుడిగా ఎదిగిన ఈ ప్రయాణం గురించి మరోసారి చాటి చెప్పబోతున్నాం. ‘ఎమ్బీ50– ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్’ ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా అందరికీ గుర్తుండిపోయేలా ఈ వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అని విష్ణు మంచు తెలిపారు. -
ది గర్ల్ ఫ్రెండ్లో రష్మిక కనిపించరు: దీక్షిత్ శెట్టి
‘‘మనం ఒకే తరహాలో సాగే ప్రేమ కథా చిత్రాల్ని చూసి ఉంటాం. ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ప్రేమ కథని మరో కోణంలో చూపిస్తుంది. మనం వినోదం కోసం సినిమాలు చూస్తుంటాం. కానీ, కొన్ని సినిమాల్లోని ఫీల్ మనతో పాటే ఇంటివరకూ క్యారీ అవుతుంది. అలాంటి సినిమా ఇది. నా కెరీర్లో చేసిన మూవీస్లో ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఉత్తమ చిత్రం అని చెప్పగలను’’ అని దీక్షిత్ శెట్టి చెప్పారు. రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు.ఈ సినిమా ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ–‘‘దసరా’ చిత్రం తర్వాత రాహుల్ రవీంద్రన్గారు నన్ను సంప్రదించి, ‘ది గర్ల్ ఫ్రెండ్’లో విక్రమ్ పాత్రకి నేను సరిపోతానని చెప్పారు. రాహుల్గారికి ఉన్న క్లారిటీ వల్ల విక్రమ్ పాత్ర చేయడం సులభం అయ్యింది. ఈ సినిమా కేవలం యువత కోసమే కాదు.. కుటుంబ ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుంది. ఈ చిత్రంలో రష్మికగారి నటన చూశాక ‘ది గర్ల్ ఫ్రెండ్’ కి మరో నాయిక న్యాయం చేయలేదేమో? అనిపించింది. సినిమా చూస్తున్నంత సేపు తెరపై రష్మిక కనిపించరు.. ఆమె చేసిన భూమా పాత్ర మాత్రమే కనిపిస్తుంది.రాహుల్ రవీంద్రన్ మంచి రైటర్, డైరెక్టర్. అంతకంటే మంచి మనిషి. ‘ది గర్ల్ ఫ్రెండ్’ షూటింగ్ టైమ్లో అల్లు అరవింద్గారు రషెస్ చూసి, పిలిస్తే వెళ్లాను. ఆయన నన్ను అభినందించి, తర్వాతి చిత్రానికి అడ్వాన్స్ ఇవ్వడం చాలా సంతోషంగా అనిపించింది. విద్య, ధీరజ్గార్లు మా యూనిట్కి కావాల్సినంత సపోర్ట్ ఇచ్చారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం మా సినిమాకు హైలైట్ అవుతుంది. నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకోవడం నాకు ఇష్టం. అందుకే తెలుగు భాషని కూడా నేర్చుకున్నాను. విక్రమ్ పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పాను.బాగా నటిస్తే భాషతో సంబంధం లేకుండా ఆయా నటీనటులను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ‘దసరా’ చిత్రం నుంచి హీరో నానిగారితో నా అనుబంధం కొనసాగుతోంది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ టీజర్, ట్రైలర్ బాగున్నాయంటూ ఆయన ప్రశంసించడం సంతోషం. ఇక నేను కన్నడలో నటించిన ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ సినిమాను తెలుగులో ఈ నెల 21న విడుదల చేయబోతున్నాం. తెలుగులో ‘షబనా, కేజేక్యూ’ తో పాటు మరో సినిమాలో నటిస్తున్నా. కన్నడలో శివ రాజ్కుమార్గారితో కలిసి ఓ మూవీ చేస్తున్నా. మలయాళంలో నటించిన ‘ఏంజెల్ నెం.16’ రిలీజ్కు రెడీ అవుతోంది. తమిళంలో ఒక మూవీ షూటింగ్లో పాల్గొంటున్నాను’’ అని తెలిపారు. -
స్టెప్పులు అదుర్స్
ఫుల్ ఎనర్జీతో అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నారు రవితేజ. ఆయన హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్ . ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ స్టూడియోలో జరుగుతోంది.ప్రత్యేకంగా వేసిన సెట్లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రవితేజ– ఆషికలపై అదిరిపోయే పాటని చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘‘ఈ సినిమాలో రవితేజ న్యూ స్టైలిష్ లుక్లో కనిపిస్తారు. హ్యూమర్, ఎమోషన్ , రవితేజ మార్క్ ఎనర్జీతో పాటుగా, మంచి ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. రవితేజ కెరీర్లోని ఈ 76వ సినిమాకు ‘అనార్కలి, రోల్ మోడల్, భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
విడాకుల రూమర్స్.. ఐశ్వర్య రాయ్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్ పాల్గొన్న ఒప్రా విన్ఫ్రే ఇంటర్వ్యూ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ ఇంటర్వ్యూలో ఒప్రా ఐశ్వర్య, అభిషేక్ల పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోను ప్రదర్శించగా ఆ దృశ్యాలు ప్రేక్షకులలో ఉత్సాహాన్ని రేకెత్తించాయి.భారతీయ పెళ్లిళ్ల ప్రత్యేకతపై మాట్లాడిన అభిషేక్ బచ్చన్, “భారతీయులు సంబరాలు చేసుకోవడాన్ని ఎంతో ఇష్టపడతారు. అందుకే మా పెళ్లి వేడుక కూడా అనేక రోజులు కొనసాగింది” అని తెలిపారు.అయితే ఒప్రా “ఇంత పెద్ద పెళ్లి తర్వాత విడాకులు తీసుకోవడం కష్టం కదా?” అని ప్రశ్నించగా దానికి ఐశ్వర్య ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా “మేం ఆ ఆలోచనను ఏ మాత్రం మనసులోకి రానివ్వం” అని స్పష్టంగా సమాధానమిచ్చింది. ఆ సమాధానంతో ఐశ్వర్య రాయ్కు భారతీయ వైవాహిక బంధంపై ఉన్న నిబద్ధతను, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించిందని అభిమానులు పేర్కొంటున్నారు. ఆమె మాటలతో బచ్చన్ జంట మధ్య ఉన్న ప్రేమ, అనుబంధాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. -
గుమ్మడి నర్సయ్య పోస్టర్.. ప్రభాస్ పెద్దమ్మ ప్రశంసలు!
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో వస్తోన్న చిత్రం గుమ్మడి నర్సయ్య. ఇటీవలే ఈ మూవీ మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ మూవీకి యంగ్ డైరెక్టర్ పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్లో ఎన్. సురేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడైన గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల రిలీజైన గుమ్మడి నర్సయ్య’ మోషన్ పోస్టర్పై ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవీ ప్రశంసలు కురిపించింది. ఈ మోషన్ పోస్టర్ను చూసిన శ్యామలా దేవీ దర్శకుడిని ప్రశంసలతో ముంచెత్తారు.శ్యామలా దేవీ మాట్లాడుతూ .. ‘పోస్టర్ ఎక్సలెంట్గా ఉంది.. ఈ మోషన్ పోస్టర్ చూస్తేనే సినిమా ఎలా ఉండబోతోందో అర్థం అవుతోంది.. ఎన్ని అవార్డులు వస్తాయో తెలుస్తోంది.. గుమ్మడి నర్సయ్యగా శివ రాజ్ కుమార్ ప్రాణం పెట్టి నటిస్తున్నట్టుగా కనిపిస్తోంది.. చిత్రయూనిట్కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతమందిస్తున్నారు. త్వరలోనే మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు. -
విష్ణు విశాల్ ఆర్యన్.. అర్థం లేని క్లైమాక్స్.. దెబ్బకు కట్!
కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ నటించిన లేటేస్ట్ మూవీ ఆర్యన్. శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇటీవలే తమిళనాడు థియేటర్లలో విడుదలైంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా దర్శకుడు కె ప్రవీణ్ తెరకెక్కించారు. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోన్న ఈ చిత్రానికి తొలి రోజే మిక్స్డ్ టాక్ వచ్చింది. భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ సినిమా వసూళ్ల పరంగా అంతగా రాణించలేకపోతోంది.అయితే ఈ మూవీలోని క్లైమాక్స్ సీక్వెన్స్పై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. ఈ మూవీ క్లైమాక్స్లో విలన్ సెల్వ రాఘవన్ ఆ నలుగురిని ఎందుకు చంపాడనేది ఈ సీన్తో సెట్ కాలేదని ప్రేక్షకులు సోషల్ మీడియాలో వేదికగా నిలదీశారు. ఆ సన్నివేశం స్క్రీన్ప్లేతో సరిపోలేదని ఆడియన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు.దీంతో ఆర్యన్ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూవీలో కీలకమైన క్లైమాక్స్ చివరి పది నిమిషాలను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రేక్షకుల నుంచి విమర్శలు రావడంతో ఆ సీన్లను తీసేసినట్లు తెలిపారు. ఈ రోజు నుంచి థియేటర్లలో సెల్వ రాఘవన్ క్లైమాక్స్ సీన్స్ కట్ చేసినట్లు వెల్లడించారు. కొత్త వెర్షన్ సోమవారం నుంచే థియేటర్లలోకి వస్తుందని ఆర్యన్ నిర్మాతలు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ చిత్రంలోని పది నిమిషాల క్లైమాక్స్ సీన్స్ తెలుగు వెర్షన్ నుంచి తొలగించనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ అక్టోబర్ 31న విడుదల చేయాలని భావించారు. కానీ రవితేజ మాస్ జతార, ఎస్.ఎస్. రాజమౌళి బాహుబలి: ది ఎపిక్ రిలీజ్ కావడంతో వాయిదా వేసుకున్నారు. ఈ మూవీని నవంబర్ 7న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ మూవీని విష్ణు విశాల్ తన బ్యానర్లో నిర్మించారు. ఈ మూవీకి గిబ్రాన్ సంగీతమందించారు. #Aaryan - The suspense soars in theatres now, with solid audience response 💥A big opening weekend for the film all over!@TheVishnuVishal @VVStudioz @adamworx @selvaraghavan @ShraddhaSrinath @Maanasa_chou @GhibranVaibodha @dop_harish @Sanlokesh @silvastunt @PC_stunts… pic.twitter.com/Wa0lezNEaj— Vishnu Vishal Studioz (@VVStudioz) November 3, 2025 -
ప్రభాస్తో రష్మిక సినిమా.. నా చావుకు కారణం అదేనన్న నెటిజన్!
రష్మిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ది గర్ల్ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి శెట్టి హీరోగా నటించారు. ఈ మూవీ నవంబర్ 7న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. రష్మిక సైతం ప్రమోషన్స్లో దూసుకెళ్తోంది. ఇటీవలే బిగ్బాస్ షోలోనూ సందడి చేసింది.తాజాగా ది గర్ల్ఫ్రెండ్ మూవీ ప్రమోషన్లలో భాగంగా నెటిజన్స్తో చిట్చాట్ నిర్వహించింది. రష్అవర్ పేరుతో ట్విటర్ వేదికగా ప్రశ్నలు అడగాలని అభిమానులను కోరింది. దీంతో ఓ నెటిజన్ కాస్తా విభిన్నమైన ప్రశ్న వేశాడు. వీలైతే మీరు ప్రభాస్తో కలిసి నటిస్తారా? అలా జరిగితే మీ కాంబో హైప్ దెబ్బకు థియేటర్ నా శవాన్ని తీసుకెళ్లండి అంటూ ఫన్నీగా అడిగాడు. దీనికి స్పందించిన రష్మిక.. ప్రభాస్తో నటించడం నాకు కూడా ఇష్టమే.. ఒకవేళ ప్రభాస్ ఈ మేసేజ్ చూస్తారని ఆశిస్తున్నా.. మేమిద్దరం కలిసి భవిష్యత్తులో నటిస్తే నా కెరీర్లో చాలా ప్రత్యేకంగా నిలవనుంది అంటూ రిప్లై ఇచ్చింది. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. గతంలో ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తోన్న సినిమాలో రష్మికను సంప్రదించారని వార్తలొచ్చాయి. కానీ చివరికీ బాలీవుడ్ భామ, యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ ఆ ఛాన్స్ కొట్టేసింది. యానిమల్ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే థామా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ముద్దుగుమ్మ సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ది గర్ల్ఫ్రెండ్ చిత్రంతో మరోసారి అలరించేందుకు వస్తోంది.😆😆😆😆🩷 I love it.. I hope Prabhas sir see’s this message and I hope we really do work together on something special soon! 🩷— Rashmika Mandanna (@iamRashmika) November 3, 2025 -
అక్టోబర్ బాక్సాఫీస్ వసూళ్లు.. వంద కోట్లకు దూరంగా టాలీవుడ్!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సంక్రాంతికి ఉన్న క్రేజే వేరు. ఈ పండుగకు మూవీ రిలీజ్ చేసేందుకు ఏడాది ముందుగానే ప్లాన్ చేస్తుంటారు. ఈ పండుగకు ఉన్న మార్కెట్ అలాంటిది. ఆ తర్వాత సినిమా వాళ్లకు బాగా కలిసొచ్చే పండుగలు దసరా, దీపావళి. ఈ రెండు ఫెస్టివల్స్కు సైతం పెద్దఎత్తున చిత్రాలు రిలీజ్కు సిద్ధమైపోతాయి. అలాగే ఈ ఏడాది కూడా చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే ఈ పండుగల బాక్సాఫీస్ బరిలో హిట్గా నిలిచిందెవరు? అభిమానులను నిరాశపరిచిందెవరు? మీరు ఓ లుక్కేయండి.ఈ ఏడాది అక్టోబర్లో టాలీవుడ్ నుంచి దసరాకు పెద్ద చిత్రాలేవీ రిలీజ్ కాలేదు. దీనికి కారణం బాక్సాఫీస్ బరిలో కాంతార చాప్టర్-1 నిలవడమే. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ రావడంతో తెలుగు చిత్రాలు రిలీజ్ చేసే సాహసం చేయలేదు. ఆ తర్వాత శశివదనే, మిత్రమండలి, ఎర్రచీర, కానిస్టేబుల్ లాంటి చిన్న సినిమాలు అలా వచ్చి.. ఇలా వెళ్లాయి. వీటిపై పెద్దగా బజ్ లేకపోవడంతో వారంలోపే బాక్సాఫీస్ వద్ద కనుమరుగయ్యాయి.ఇక రెండో వారంలో 'అరి', 'కానిస్టేబుల్', 'మటన్ షాప్ వంటి కొన్ని చిన్న సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో కానిస్టేబుల్, మటన్ షాప్ అసలు ఊసే లేదు. కొద్దొ గొప్పో 'అరి' మూవీ మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా.. కేవలం మౌత్ టాక్తోనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. అరిషడ్వర్గాలుఅనే ఒక కొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక దివాళీ విషయానికొస్తే వరుసగా మూడు తెలుగు చిత్రాలు రిలీజ్ చేశారు. అందులో కిరణ్ అబ్బవరం కె-ర్యాంప్, సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వీటితో పాటు కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ కూడా పోటీపడింది. వీటిలో కె-ర్యాంప్ ఫర్వాలేదనిపించగా.. తెలుసు కదా మూవీతో సిద్ధు మరోసారి నిరాశపరిచాడు. ఈ రెండు తెలుగు సినిమాలు దీవాళీ బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో రాణించలేకపోయాయి. ఇక డ్రాగన్ హీరో డ్యూడ్ కూడా దీపావళికి వందకోట్ల మార్క్ అందుకుంది.ఈ అక్టోబర్ నెల చివర్లో రాజమౌళి బాహుహలి ది ఎపిక్, రవితేజ మాస్ జాతర బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. రెండు భాగాలను కలిపి దర్శకధీరుడు ప్రేక్షకులను సరికొత్త థ్రిల్ అందించారు. అయితే భారీ అంచనాలు పెట్టుకున్న మాస్ మహారాజా ఫ్యాన్స్కు మాత్రం మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. మాస్ హీరోగా పేరున్న రవితేజ అదే పంథాలో రావడం.. కొత్తదనం లేకపోవడంతో మరో డిజాస్టర్ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఓవరాల్గా చూస్తే ఈ దసరా, దీపావళి తెలుగు సినిమాలకు కలిసి రాలేదనే చెప్పాలి. డబ్బింగ్ సినిమాలైనా కాంతార చాప్టర్-1, డ్యూడ్ బాక్సాఫీస్ వద్ద సత్తాచాటగా.. టాలీవుడ్ చిత్రాలు మాత్రం వందకోట్ల మార్క్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. ఈ లెక్కన అక్టోబర్ మన తెలుగు సినిమాలకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఇక టాలీవుడ్ సినీ ప్రియుల ఆశలన్నీ వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ సినిమాలపైనే. పొంగల్ బాక్సాఫీస్ మూవీస్ మనశంకరవరప్రసాద్గారు, ది రాజాసాబ్, అనగనగ ఒక రాజు వంద కోట్ల మార్క్ చేరుకుంటాయోమో వేచి చూడాల్సిందే. -
రవితేజ.. తిరిగి చూసుకోవాల్సిన టైమొచ్చింది!
రవితేజ.. టాలీవుడ్లో ఈ పేరుకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్లోకి ఇండస్ట్రీలోకి వచ్చి.. చిన్నచితకా గుర్తింపు లేని పాత్రలు చేస్తూ ఆపై నటుడిగా, తర్వాత కాలంలో స్టార్ హీరో అయిన ఇతడు.. ఎందరో వర్ధమాన నటీనటులకు ఆదర్శం. కానీ ప్రస్తుతానికొస్తే రవితేజ సినిమాలపై బోలెడన్ని విమర్శలు. తాజాగా 'మాస్ జాతర'తో మరో ఫెయిల్యూర్. ఇదంతా చూస్తుంటే అసలు రవితేజ ఎందుకిలా చేస్తున్నాడు? ఎక్కడ తప్పు జరుగుతోంది? అనేది సగటు ప్రేక్షకుడి సందేహం.(ఇదీ చదవండి: 'బాహుబలి' లేకపోతే ఆ సినిమాలు తీసేవాడిని కాదు: మణిరత్నం)గత కొన్నేళ్లుగా రవితేజ సరైన సినిమాలు చేయట్లేదు. ఎవరు ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవం. ఈగల్, టైగర్ నాగేశ్వరరావు లాంటి ఒకటి రెండు ప్రయోగాలు చేసినప్పటికీ వాటిలో యూనిక్ పాయింట్ని కమర్షియల్ అంశాలు డామినేట్ చేశాయి. దీంతో ఇవి కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్గానే మిగిలిపోయాయి.2017లో వచ్చిన 'రాజా ది గ్రేట్' సినిమా హిట్. దీని తర్వాత 'టచ్ చేసి చూడు', నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా, క్రాక్, ఖిలాడీ, రామారావ్ ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర.. ఇలా 13 చిత్రాలొచ్చాయి. వీటిలో క్రాక్, ధమాకా మాత్రమే హిట్. 'ధమాకా'పై విమర్శలున్నప్పటికీ కలెక్షన్స్ బాగానే వచ్చాయి కాబట్టి హిట్టే.(ఇదీ చదవండి: ఇండస్ట్రీ వదిలేస్తా.. రాజేంద్రప్రసాద్ ఇప్పుడేమంటారు?)అసలు ఇన్ని ఫ్లాప్స్ వస్తున్నా సరే రవితేజ సినిమాలు చేస్తూనే ఉన్నారు. అది కూడా స్టార్ హీరోలతో పోలిస్తే వేగంగా. అయితే వేగంగా చేయడం కంటే కంటెంట్ పరంగా ఏది చేస్తున్నాం? ఎలాంటిది చేస్తున్నాం? ప్రేక్షకులకు ఇది నచ్చుతుందా? లాంటి అంశాలు రవితేజ ఓసారి ఆలోచించుకుంటే మంచిదేమో!రవితేజ అనగానే చాలామంది పాత సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు గానీ కొత్త చిత్రాల్లో ఒక్క దాని గురించి మాట్లాడట్లేదు. రవితేజ వైపు నుంచి యాక్టింగ్ పరంగా ఎలాంటి లోటు అయితే కనిపించట్లేదు. కానీ ఆయనకు తగ్గ సినిమాలే ఎంచుకోవట్లేదు. ఈ విషయంలో రవితేజ కూడా పొరపాటు చేస్తున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ వాళ్లని ఎంకరేజ్ చేస్తున్నారు. అసలు స్టార్ దర్శకుల్ని రవితేజ వద్దనుకుంటున్నారా? లేదా వాళ్లే రవితేజ దగ్గరకు రావట్లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్.హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ పోతే రవితేజ కూడా సగటు హీరోగానే మిగిలిపోతారేమో అనిపిస్తుంది. ఇప్పటికైనా ఓసారి వెనక్కి తిరిగి చూసుకుని ట్రెండ్కి దగ్గ దర్శకులు, ట్రెండ్కి తగ్గ స్టోరీస్ చేస్తే ఒకటి కాకపోయినా మరొకటి అయినా హిట్ అయి ప్రేక్షకులకు నచ్చే అవకాశముంది. చూడాలి మరి రవితేజ ఏం చేస్తారో? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 మూవీస్.. అవి మిస్ అవ్వొద్దు) -
ఉత్తమ చిత్రంగా మంజుమ్మెల్ బాయ్స్.. ఉత్తమ నటుడిగా మమ్ముట్టి.. ఫుల్ లిస్ట్ ఇదే!
కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటించింది. ఇవాళ ప్రకటించిన 55వ అవార్డ్స్లో ఉత్తమ చిత్రంగా మంజుమ్మెల్ బాయ్స్ నిలిచింది. ఉత్తమ నటుడిగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నిలిచారు. భ్రమయుగం చిత్రానికి గానూ ఈ ఘనత దక్కించుకున్నారు. ఉత్తమ నటిగా శామ్లా హంజా అవార్డ్ను సొంతం చేసుకుంది. ఫెమినిచి ఫాతిమా మూవీకి గానూ ఈ అవార్డ్ వరించింది. 2024 ఏడాదికి గానూ ఈ అవార్డులను ప్రకటించారు. మంజుమ్మెల్ బాయ్స్ ఏకంగా 9 విభాగాల్లో సత్తా చాటింది.కేరళ ఫిల్మ్ అవార్డ్స్ వీళ్లే..ఉత్తమ చిత్రం - మంజుమ్మెల్ బాయ్స్ (దర్శకుడు - చిదంబరం)ఉత్తమ నటుడు - మమ్ముట్టి (భ్రమ యుగం)ఉత్తమ నటి – శామ్లా హంజా (చిత్రం - ఫెమినిచి ఫాతిమా)ఉత్తమ దర్శకుడు - చిదంబరం ( మంజుమ్మెల్ బాయ్స్)రెండో ఉత్తమ చిత్రం - ఫెమినిచి ఫాతిమా (దర్శకుడు - ఫాసిల్ ముహమ్మద్)ప్రత్యేక జ్యూరీ (చిత్రం) - ప్యారడైజ్ (దర్శకుడు: ప్రసన్న వితానగే)ప్రత్యేక జ్యూరీ(ఫీమేల్) - జ్యోతిర్మయి (బౌగెన్విల్లా), దర్శన రాజేంద్రన్ (స్వర్గం)ప్రత్యేక జ్యూరీ (మేల్) - టోవినో థామస్ (ఏఆర్ఎం), ఆసిఫ్ అలీ (కిష్కింధ కాండం)ఉత్తమ జనాదరణ పొందిన చిత్రం - ప్రేమలు (దర్శకుడు: గిరీష్ ఎ.డి.)ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్(మేల్) – సౌబిన్ షాహిర్ (మంజుమ్మెల్ బాయ్స్), సిద్ధార్థ్ భరతన్ (భ్రమయుగం)ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ (ఫీమేల్) - లిజోమోల్ జోస్ (నాదన్న సంభవం)ఉత్తమ తొలి దర్శకుడు - ఫాసిల్ ముహమ్మద్ (ఫెమినిచి ఫాతిమా)ఉత్తమ స్క్రీన్ ప్లే (ఒరిజినల్) - చిదంబరం (మంజుమ్మెల్ బాయ్స్)ఉత్తమ స్క్రీన్ ప్లే (అడాప్టెండ్) - లాజో జోస్, అమల్ నీరద్ (బౌగిన్ విల్లా)ఉత్తమ ఎడిటర్ - సూరజ్ ఇ.ఎస్. (కిష్కింధ కాండం)ఉత్తమ సినిమాటోగ్రఫీ - షైజు ఖలీద్ (మంజుమ్మెల్ బాయ్స్)ఉమెన్ స్పెషల్ కేటగిరీ అవార్డ్- పాయల్ కపాడియా (ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్)ఉత్తమ కథ - ప్రసన్న వితనగే (స్వర్గం)ఉత్తమ స్వరకర్త - సుషిన్ శ్యామ్ (బౌగిన్విల్లా)ఉత్తమ నేపథ్య సంగీతం - క్రిస్టో జేవియర్ (భ్రమయుగం)ఉత్తమ నేపథ్య గాయకుడు (మేల్) - కె.ఎస్. హరిశంకర్ (చిత్రం - ARM)ఉత్తమ నేపథ్య గాయని (మహిళ) - సెబా టామీ (చిత్రం - ఆమ్ ఆ)ఉత్తమ లిరిక్స్ - మంజుమ్మెల్ బాయ్స్ఉత్తమ ఆర్ట్ డైరెక్షన్ - అజయన్ చలిస్సేరి (మంజుమ్మెల్ బాయ్స్)ఉత్తమ సింక్ సౌండ్ - అజయన్ అడాత్ (పాణి)ఉత్తమ సౌండ్ మిక్సింగ్ - ఫజల్ ఎ.బ్యాకర్, షిజిన్ మెల్విన్ హట్టన్ (మంజుమ్మెల్ బాయ్స్)ఉత్తమ సౌండ్ డిజైనింగ్ - షిజిన్ మెల్విన్ హట్టన్, అభిషేక్ నాయర్ (మంజుమ్మెల్ బాయ్స్)ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ (మేల్) - భాసి వైకోమ్, రాజేష్ (బరోజ్ 3డీ)ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ (ఫీమేల్) - సయనోరా ఫిలిప్ (బరోజ్ 3డీ)ఉత్తమ కొరియోగ్రఫీ - సుమేష్ సుందర్, జిష్ణుదాస్ ఎం.వి. (బౌగెన్విల్లా )ఉత్తమ మేకప్ - రోనెక్స్ జేవియర్ (బౌగెన్విల్లా, భ్రమయుగం)ఉత్తమ కాస్ట్యూమ్ - సమీరా సనీష్ (రేఖాచిత్రం, బౌగెన్విల్లా)ఉత్తమ వీఎఫ్ఎక్స్- జితిన్ లాల్, ఆల్బర్ట్ థామస్, అనిరుద్ధ ముఖర్జీ (ఏఆర్ఎం)ఉత్తమ ప్రాసెసింగ్ ల్యాబ్/కలరిస్ట్ - శ్రీక్ వేరియర్ (మంజుమ్మెల్ బాయ్స్, బౌగెన్విల్లా) -
నిశ్చితార్థం కోసం అల్లు స్నేహా.. ఐలాండ్లో తమన్నా
మరిది నిశ్చితార్థం కోసం ఇలా ముస్తాబైన అల్లు స్నేహామలేషియాలోని ఓ ఐలాండ్లో తమన్నా ఫొటోషూట్దిక్కులు చూస్తూ రుక్మిణి వసంత్ ఫన్నీ పోస్ట్సిల్క్ చీరలో అందమే అసూయపడేలా రష్మిక'బైసన్' షూటింగ్.. సైకిల్ తొక్కుతూ అనుపమగ్రౌండెడ్ అంటూ నేలపై కూర్చుని అదితీ స్టిల్స్ View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
'ఎంతోమంది అమ్మాయిలతో రిలేషన్స్'.. బిగ్బాస్ కంటెస్టెంట్పై సంచలన ఆరోపణలు!
బుల్లితెర రియాలిటీ షో బిగ్బాస్ ప్రస్తుతం ఆడియన్స్ను అలరిస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ ఈ షో నడుస్తోంది. బుల్లితెర ప్రియుల్లో అత్యంత ఆదరణ ఈ షో పలువురు నటీనటులు కంటెస్టెంట్స్గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది హిందీలో బిగ్బాస్-19వ సీజన్కు చేరుకుంది. ఇందులో ప్రముఖ బుల్లితెర నటుడు అభిషేక్ బజాజ్ కూడా కంటెస్టెంట్గా హౌస్లో అడుగుపెట్టారు.అయితే బిగ్బాస్లో ఉన్న బుల్లితెర నటుడిపై ఆయన మాజీ భార్య ఆకాంక్ష జిందాల్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. అతని వ్యక్తిగత జీవితంపై సంచలన కామెంట్స్ చేసింది. వైవాహిక జీవితంలో అభిషేక్ తనను మోసం చేశాడని ఆరోపించింది. వాస్తవాలను దాచిపెట్టి.. నటించడంలో అతన్ని మించినవారు లేరని ఆకాంక్ష ఆరోపించింది.అభిషేక్ బజాజ్ తన వయస్సు, వైవాహిక జీవితం గురించి అబద్ధాలు ఆకాంక్ష జిందాల్ చెబుతున్నాడని తెలిపింది. అంతేకాకుండా అతనికి చాలా మంది అమ్మాయిలతో రిలేషన్స్ ఉన్నాయని సంచలన కామెంట్స్ చేసింది. తాము విడాకులు తీసుకోవడానికి అదే కారణమని.. తనతో పాటు ఎంతోమంది మహిళల జీవితాలతో ఆడుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆకాంక్ష జిందాల్ మాట్లాడుతూ.. “సల్మాన్ సార్ ముందు కూడా అబద్ధం చెప్పడానికి అస్సలు వెనుకాడడు. అతని వయస్సు, వైవాహిక స్థితి గురించి అబద్ధం చెప్పడం ఎప్పుడు అలవాటే. ఇప్పుడు బిగ్బాస్ హౌస్లో 21 ఏళ్ల వ్యక్తిగా తన చరిత్రను రిపీట్ చేస్తున్నాడు. అతని డిక్షనరీలో సిగ్గు అనే పదానికి చోటు లేదు. ఈ విషయాన్ని నేను ప్రతీకారం కోసం చెప్పడం లేదు. మీరందరూ ఇతర పోటీదారుల గురించి మాట్లాడే విధంగానే నిజం బయటకు రావాలని కోరుకుంటున్నా" అని తెలిపింది. -
'బాహుబలి' లేకపోతే ఆ సినిమాలు తీసేవాడిని కాదు: మణిరత్నం
పదేళ్ల క్రితం థియేటర్లలోకి వచ్చిన 'బాహుబలి'ని ఇప్పుడు రీరిలీజ్ చేశారు. రెండు భాగాల్ని కలిపి ఒక్కటిగా చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. వీకెండ్ అయ్యేసరికి ఏకంగా రూ.25 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని అంటున్నారు. ఇది నిజమైతే మాత్రం రికార్డే. ఎందుకంటే రీ రిలీజ్ మూవీస్కి ఈ రేంజు వసూళ్లు ఎప్పుడూ రాలేదు. మరోవైపు ప్రముఖ దర్శకుడు మణిరత్నం.. 'బాహుబలి' లేకపోతే తాను ఆ సినిమాల్ని తీసేవాడిని కాదని చెబుతున్నా ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'వార్ 2' ఫ్లాప్ దెబ్బకు నిర్మాత షాకింగ్ నిర్ణయం)ఏంటి విషయం?'బాహుబలి' సినిమా మన దేశంలో సరికొత్త ట్రెండ్ సృష్టించింది. తెలుగు మూవీకి పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ చేయడంతో పాటు ఓ కథని రెండు భాగాలుగా కూడా చెప్పొచ్చనే దారిని దర్శకులకు చూపించింది. గతంలో అంటే 2022లో ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ పేరుతో ఓ సదస్సు జరిగింది. ఇందులో మాట్లాడిన డైరెక్టర్ మణిరత్నం.. 'బాహుబలి' లేకపోయింటే తాను 'పొన్నియిన్ సెల్వన్' తీసేవాడిని కాదని అన్నారు.''బాహుబలి' లేకపోతే 'పొన్నియిన్ సెల్వన్' లేదు. రాజమౌళి తన సినిమాను రెండు భాగాలుగా తీయకపోతే నేను ఈ చిత్రాన్ని తీసేవాడిని కాదు. ఇదే విషయాన్ని నేను రాజమౌళిని కలిసినప్పుడు చెప్పాను. రాజమౌళి మన సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కేలా చేశారు. ఆయన అలా చేయడం వల్లే మేము కూడా ఒక సినిమాను రెండు భాగాలుగా తీయగలిగాం' అని మణిరత్నం చెప్పారు. పాత వీడియోనే అయినప్పటికీ అది ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఇండస్ట్రీ వదిలేస్తా.. రాజేంద్రప్రసాద్ ఇప్పుడేమంటారు?)If Rajamouli hadn’t made #Baahubali, I wouldn’t have made #PonniyinSelvan. He showed that Indian movies can be made on a big scale and still win hearts. Thank you, #Rajamouli, for the inspiration.:– Director Mani Ratnampic.twitter.com/hJ4CKQvtbo— Milagro Movies (@MilagroMovies) November 3, 2025 -
సచిన్, లక్ష్మణ్, రోహిత్ వచ్చారు.. మీరెక్కడా సార్?
భారత మహిళల క్రికెట్ చిరకాల స్వప్నం నెరవేరింది. మూడోసారి ఫైనల్ చేరిన మన వనితలు కప్ను ఒడిసి పట్టుకున్నారు. కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ ఎట్టకేలకు విశ్వ విజేతగా నిలిచారు. భారత మహిళల క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ సాధించడంతో దేశవ్యాప్తంగా ప్రజలు సంబురాలు చేసుకున్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న భారతీయులు మన మహిళలను ప్రశంసలతో ముంచెత్తారు. అదే సమయంలో రన్నరప్గా నిలిచిన దక్షిణాఫ్రికా మహిళల టీమ్ను సైతం కొనియాడారు.అయితే తమ టీమ్ రన్నరప్గా నిలవడంతో ప్రముఖ దక్షిణాఫ్రికా నటి స్పందించింది. సౌత్ఆఫ్రికాకు చెందిన ప్రముఖ నటి, రచయిత్రి తంజా వుర్ విన్నర్గా నిలిచిన భారత మహిళల టీమ్పై ప్రశంసలు కురిపించింది. అదే సమయంలో సొంత దేశంలోని పురుష క్రికెటర్లతో పాటు ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతీయులు చూపించిన ప్రేమ, మద్దతు.. మన మహిళా క్రికెట్ జట్టుకు సౌతాఫ్రికన్స్ సపోర్ట్ ఇవ్వకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో వీడియో షేర్ చేస్తూ తన ఆవేదన వ్యక్తం చేసింది. భారతీయులు క్రీడల పట్ల చూపిస్తున్న ప్రేమ, మద్దతు మనవాళ్లకు ఎందుకు రాదని ప్రశ్నించింది.వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో మాజీ క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, వీవీఎస్ లక్ష్మణ్ మహిళా క్రికెటర్లను ఉత్సాహపరిచేందుకు స్టేడియానికి వచ్చారని కొనియాడింది. మరి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్స్ ఎక్కడ? అని నిలదీసింది. ఎందుకంటే మీకు ఈ మ్యాచ్ అంత ముఖ్యం కాకపోవచ్చంటూ సౌతాఫ్రికా పురుష క్రికెటర్లను ఉద్దేశించి ఘాటుగా విమర్శించింది. సౌతాఫ్రికా క్రీడా మంత్రి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం.. మహిళల క్రీడల పట్ల తన దేశ వైఖరిని సోషల్ మీడియా వేదికగా ఎండగట్టింది.స్మృతి మంధానతో పాటు భారత మహిళ క్రికెటర్స్ చాలా బాగా ఆడారని తంజా వుర్ ప్రశంసలు కురిపించింది. భారతీయ అభిమానుల నమ్మకాన్ని ఆమె కొనియాడింది. ఇలాంటి మద్దతు టీమ్ ఇండియాకు బాాగా కలిసొచ్చిందని తంజా వుర్ తెలిపింది. ఏది ఏమైనా ఈ రోజు మీరు ఈ ప్రపంచ కప్ విజేతలు.. మీరు దానికి అర్హులు అంటూ టీమిండియాను ప్రశంసంచింది. కాగా.. ఈ ప్రతిష్టాత్మ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ క్రికెటర్స్ జాక్వస్ కల్లిస్, ఏబీ డివిలియర్స్, గ్రేమ్ స్మిత్ లాంటి వాళ్లెవరూ కూడా స్టేడియంలో కనిపించలేదు. దీంతో నటికి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వీడియోను రిలీజ్ చేసింది. View this post on Instagram A post shared by Thanja Vuur 🔥 (@cape_town_cricket_queen) -
విడిపోనున్న తండ్రీకూతురు.. తనూజ ఎలిమినేట్ అవ్వాలన్న భరణి
మాధురి వెళ్లిపోయింది.. ఇంక హౌస్లో గొడవలు జరుగుతాయో, లేవో? అని నిరాశపడ్డ బిగ్బాస్ప్రియులకు పండగలాంటి వార్త. ఈరోజు నామినేషన్స్లో లెక్కలేనన్ని గొడవలు జరగనున్నాయి. కానీ, అన్నీ తనూజ చుట్టే తిరిగేట్లు కనిపిస్తోంది. తనూజ వర్సెస్ భరణి, తనూజ వర్సెస్ ఇమ్మాన్యుయేల్, తనూజ వర్సెస్ దివ్య.. ఇలా నేటి నామినేషన్స్ జరగనున్నాయి.తనూజ వర్సెస్ ఇమ్మూతాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో.. ఇమ్మాన్యుయేల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడంది తనూజ. అందుకు ఇమ్మూ మాట్లాడుతూ.. నావల్ల అయినంతవరకు సపోర్ట్ అని మోయగలుగుతాను. భుజాలు నొప్పి వస్తున్నాయి, చచ్చిపోయేలా ఉన్నాను అన్నప్పుడు దింపేస్తాను అన్నాడు. అంత బరువుగా ఉన్నప్పుడు భుజాన ఎక్కించుకోకు అంది తనూజ. అందుకే దింపేశానని ఇమ్మూ.. ఇలా ఒకరిపై ఒకరు కౌంటర్లు ఇచ్చుకున్నారు. ఏవైనా ఉంటే బయట చూసుకోండిభరణి.. తనూజ నన్నే టాస్కులోనూ సేవ్ చేయలేదు. నేను తనను రెండు టాస్కుల్లో సేవ్ చేశాను. తనకన్నా బాగా ఆడాను అని తెలిపాడు. అది సపోర్టింగ్ గేమ్ కాబట్టి సపోర్ట్ చేశారని సులువుగా తేల్చేసింది తనూజ. అక్కడితో ఆగకుండా.. మాటమాటకీ ఇమ్మాన్యుయేల్, దివ్య మధ్యలో వస్తే తనూజ మాట్లాడేందుకు స్పేస్ ఎక్కడుంది? ఏదైనా పాయింట్ మాట్లాడితే అది మీ పర్సనల్ అంటున్నారు. పర్సనల్స్ ఏవైనా ఉంటే బయట పెట్టుకోండి, హౌస్లో కాదు అని అరిచేసింది.తనూజ ఎలిమినేట్ అవ్వాలన్న భరణిఏదైతే బాండింగ్ వల్ల నేను బయటకు వెళ్లొచ్చానో.. తను కూడా ఒకసారి బయటకు వెళ్లొస్తే పరిస్థితి అర్థం అవుతుంది.. తను వెళ్లిపోవాలని కోరుకుంటున్నాను అని భరణి ఒక్క ముక్కలో తేల్చేశాడు. మొత్తానికి కలిసిమెలిసుండే తండ్రీకూతుళ్లు ఈరోజు భారీస్థాయిలోనే గొడవపడేట్లు కనిపిస్తోంది. చదవండి: నేనే హీరోయిన్ అన్నారు.. ఇంత మోసం చేస్తారనుకోలేదు! -
'వార్ 2' ఫ్లాప్ దెబ్బకు నిర్మాత షాకింగ్ నిర్ణయం
ఈ ఏడాది భారీ అంచనాలతో రిలీజైన సినిమాల్లో 'వార్ 2' ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ తొలిసారి హిందీలో చేసిన చిత్రం, హృతిక్ రోషన్ మరో హీరో కావడంతో విడుదలకు ముందు చాలా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత రిజల్ట్ మారిపోయింది. పాన్ ఇండియా లెవల్లో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. తెలుగులో ఘోరమైన నష్టాలు వచ్చాయని మొన్నీమధ్యే ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు.'వార్ 2' తర్వాత ఈ స్పై యూనివర్స్ నుంచి 'ఆల్ఫా' అనే సినిమా రావాలి. ఆలియా భట్, శర్వారీ ప్రధాన పాత్రల్లో నటించగా.. ఈ మూవీని ఈ ఏడాది డిసెంబరు 25న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు వాయిదా ప్రకటన బయటకొచ్చింది. వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తి కాలేదని, దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్ 17న చిత్రం థియేటర్లలోకి వస్తుందని అనౌన్స్ చేశారు.(ఇదీ చదవండి: శివగామిని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇలా మార్చేశారేంటి!)ఇదంతా చూస్తుంటే నిర్మాణ సంస్థ రిలీజ్ విషయంలో కావాలనే ఇలా చేసిందా అనే సందేహం వస్తోంది. ఎందుకంటే 'వార్ 2' వల్ల ఈ యూనివర్స్పై చాలా విమర్శలు వచ్చాయి. ఒకటే స్టోరీని ఎన్నిసార్లు తిప్పితిప్పి తీస్తారా అనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి టైంలో థియేటర్లలోకి 'ఆల్ఫా' వస్తే 'వార్ 2' ఫెయిల్యూర్ ప్రభావం దీనిపై పడే అవకాశముంది. అందుకే నాలుగు నెలలు వాయిదా వేశారా అనిపిస్తుంది.ఈ యూనివర్స్లో ఇప్పటివరకు ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, టైగర్ 3, పఠాన్, వార్ 2 చిత్రాలు వచ్చాయి. ఒకప్పటితో పోలిస్తే ఈ యూనివర్స్పై ఇప్పుడు జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు కనిపించట్లేదు. దీంతో 'ఆల్ఫా' ఫలితం అనేది నిర్మాణ సంస్థకు చాలా కీలకం. ఒకవేళ మూవీ హిట్ అయితే పర్లేదు. తేడా కొడితే మాత్రం తర్వాత అనుకున్న 'పఠాన్ vs టైగర్' లాంటివి అటకెక్కేయొచ్చు.(ఇదీ చదవండి: ఇండస్ట్రీ వదిలేస్తా.. రాజేంద్రప్రసాద్ ఇప్పుడేమంటారు?) -
బాహుబలి రాకెట్ సక్సెస్.. గర్వంగా ఉందన్న రాజమౌళి
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోసారి తన శక్తిని చాటుకుంది. బాహుబలి రాకెట్ (ఎల్వీఎం3-ఎం5)ను విజయవంతంగా ప్రయోగించింది. నవంబర్ 2న శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఎల్వీఎం3-ఎం5 ద్వారా సీఎంఎస్-03 శాటిలైట్ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ పూర్తిగా భారతదేశంలో తయారుకావడం విశేషం. రాకెట్ సక్సెస్.. రాజమౌళి హర్షంఎల్వీఎం3-ఎం5 రాకెట్ సుమారు 4,410 కేజీలు బరువుంది. ఇది భారత భూభాగంతో సహా సముద్ర ప్రాంతంలోనూ అన్ని వేళల్లో సేవలందిస్తుంది. ఈ ఉపగ్రహం దాదాపు 15 ఏళ్ళు పాటు పనిచేస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) హర్షం వ్యక్తం చేశాడు.నిజంగా మాకు గర్వకారణంఅత్యంత బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-03 విజయవంతమవడం ఆనందకరం. భారతదేశ శక్తిసామర్థ్యాలను అంతరిక్షంలోనూ చాటిచెప్తున్నందుకు గర్వంగా ఉంది. బాహుబలి.. ఈ పేరుకున్న బలం, దమ్ము అలాంటిది! ఇస్రో శాస్త్రవేత్తలు ఈ రాకెట్కు బాహుబలి అని పేరు పెట్టడం పట్ల మా బాహుబలి టీమ్ ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇది నిజంగా మాకు గర్వకారణం అని రాజమౌళి ట్వీట్ చేశాడు. Congratulations to #ISRO on the successful launch of the heaviest communication satellite CMS-03 today! A proud moment for India showcasing our technological strength and self-reliance in space exploration. Onwards and upwards! 🇮🇳🚀Our entire Baahubali team is elated as @ISRO… pic.twitter.com/Ppcso76Mmu— rajamouli ss (@ssrajamouli) November 2, 2025చదవండి: ఫ్యామిలీలో కొత్త మెంబర్.. బుల్లితెర జంట పోస్ట్ -
ఇండస్ట్రీ వదిలేస్తా.. రాజేంద్రప్రసాద్ ఇప్పుడేమంటారు?
సినిమా సెలబ్రిటీల్లో కొందరు మైక్ అందుకోగానే నోటికొచ్చింది మాట్లాడేస్తుంటారు. తమ సినిమాల గురించి ఆహా ఓహో అనే రేంజులో పొగిడేస్తుంటారు. అయితే ఇలా వర్కౌట్ అయిన సందర్భాలు చాలా తక్కువే అని చెప్పొచ్చు. రీసెంట్గా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా ఇలానే పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయారు.అసలు విషయానికొస్తే 'మాస్ జాతర' ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్.. 'ఈ సినిమా నెక్స్ట్ లెవల్లో ఉండబోతుంది. చూసి షాక్ అవ్వకపోతే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతాను' అని చెప్పారు. గత శుక్రవారం సాయంత్రం షోలతో ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు వీకండ్ పూర్తయిన తర్వాత ఫలితం తేలిపోయింది. రవితేజ ఖాతాలో మరో డిజాస్టర్ పడింది! దీంతో పలువురు నెటిజన్లు రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ని మళ్లీ గుర్తుచేస్తున్నారు. మాట మీద నిలబడి ఇండస్ట్రీని వదిలేస్తారా అని కామెంట్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: శివగామిని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇలా మార్చేశారేంటి!)ఇప్పుడే కాదు గతంలోనూ ఒకరిద్దరు యంగ్ హీరోలు ఇలానే తమ సినిమా రిలీజులకు ముందు.. హిట్ అవ్వకపోతే పేరు మార్చుకుంటూ అది ఇది అని నోరుజారారు. తీరా మూవీ రిజల్ట్ తేడా కొట్టేసిన తర్వాత ఏదో కవర్ చేశారు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ కూడా అలాంటి కవర్ డ్రైవ్స్ ఏమైనా వేస్తారా? లేదంటే సరదాకే అలా అన్నాను అని అంటారా అనేది చూడాలి?గతంలోనూ పలు ఈవెంట్స్ సందర్భంగా అలీ, రోజా, డేవిడ్ వార్నర్పై నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. క్షమాపణలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడిచ్చిన స్టేట్మెంట్కి సినిమాకు వచ్చిన ఫలితానికి ఏమని స్పందిస్తారో చూడాలి? మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే మాట్లాడిన హీరో రవితేజ కూడా.. గత కొన్ని మూవీస్తో చిరాకు పెట్టాను, ఈసారి హిట్ కొట్టబోతున్నాం అని అన్నారు. తీరా చూస్తే 'మాస్ జాతర'.. బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. చూస్తుంటే సెలబ్రిటీలు.. స్టేట్మెంట్ ఇచ్చే విషయంలో ఆచితూచి మాట్లాడటం అవసరం అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 మూవీస్.. అవి మిస్ అవ్వొద్దు) -
ఓటీటీలోకి రానున్న ‘మటన్ సూప్’ సినిమా
టాలీవుడ్లో ‘మటన్ సూప్’ పేరుతో విడుదలైన సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. అలుకా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ బ్యానర్లపై రామచంద్ర వట్టికూటి దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కింది. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల ఈ మూవీని నిర్మించారు. రమణ్, వర్ష విశ్వనాథ్, జెమినీ సురేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ అక్టోబర్ 10న విడుదలై మంచి టాక్ను సొంతం చేసుకుంది.ఆ వారంలో బాక్సాఫీస్ దగ్గర విడుదలైన నాలుగు చిత్రాల్లో ‘మటన్ సూప్’ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కింది. ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకులు సైతం సినిమాలో ప్రధానాంశం వైవిధ్యంగా ఉందని ప్రశంసించటం విశేషం. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్గా ‘మటన్ సూప్’ రూపొందింది. నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని, ఉహించని మలుపులతో, ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్టులతో, గ్రిప్పింగ్ స్క్రీన్ప్లేతో దర్శకుడు సినిమాను తెరకెక్కించారు.త్వరలోనే ఈ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చాలా తక్కువ బడ్జెట్లో ‘మటన్ సూప్’ సినిమాను ఎక్కడా తగ్గకుండా దర్శకుడు రామచంద్ర వట్టికూటి తెరకెక్కించారు. ఈ హిట్తో తాజాగా ఆయన మరో వైవిధ్యమైన కంటెంట్తో నెక్ట్స్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. -
'ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాపై తప్పుడు ప్రచారం'
జూనియర్ ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాపై ఈ మధ్య చాలా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. మూవీ షూటింగ్ ఆగిపోయిందని కొద్దిరోజులుగా ప్రచారం అయింది. అయితే, ఈ మూవీ రెండు భాగాలుగా రానుందని సోషల్మీడియాలో కొత్త ప్రచారం తెరపైకి తీసుకొచ్చారు. 'డ్రాగన్' పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీని మొదట ఒకే భాగంగా నిర్మించాలని మేకర్స్ అనుకున్నారట.. కానీ, రన్ టైమ్ ఎక్కువ రావడంతో రెండు పార్ట్స్గా విడుదల చేసేందుకు వారు ప్లాన్ చేసినట్టు ప్రచారం జరిగింది. అయితే, అందులో ఎలాంటి నిజం లేదని ప్రశాంత్ నీల్ టీమ్ తాజాగా ఒక పోస్ట్ చేసింది.దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే కేజీఎఫ్ చిత్రాలను రెండు భాగాలుగా నిర్మించి భారీ విజయాన్ని అందుకున్నారు. సలార్ మూవీని కూడ రెండు పార్ట్స్గా విడుదల చేస్తామని తెలిపారు. ఇదే క్రమలో తారక్ సినిమాను కూడా సీక్వెల్ ప్లాన్ చేసే పనిలో ఉన్నారని ఒక వార్త ట్రెండ్ అయింది. అయితే, తాజాగా ప్రశాంత్ నీల్ టీమ్ ఖండించింది. ' #NTRNeel సినిమా రెండు భాగాలుగా ఉంటుందని వస్తున్న ఊహాగానాలను ఎవరూ నమ్మవద్దు. ఈ ప్రాజెక్ట్ ఒకే భాగంగా వస్తుంది. ఇదీ చాలా శక్తివంతమైన కథ . భారీ హిట్ కొట్టేలా రూపొందించబడింది. కేవలం ఒక భాగంగా మాత్రమే విడుదల కానుంది.' అంటూ ప్రశాంత్ టీమ్ పేర్కొంది. -
ఫ్యామిలీలో కొత్త మెంబర్.. బుల్లితెర జంట పోస్ట్
నువ్వే కావాలి, ప్రేమించు వంటి సినిమాలతో ఒకప్పుడు వెండితెరపై సందడి చేశాడు సాయి కిరణ్ (Actor Sai Kiran). ప్రస్తుతం మాత్రం బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ బిజీ అయ్యాడు. కోయిలమ్మ సీరియల్లో నటించే సమయంలో సహనటి స్రవంతి (Actress Sravanthi)తో ప్రేమలో పడ్డాడు. 2024 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నాడు. ఇటీవలే స్రవంతి.. తాను గర్భం దాల్చిన విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది.ఫ్యామిలీలో కొత్త మెంబర్తాజాగా తమ కుటుంబంలోకి కొత్త మెంబర్ చేరినట్లు తెలిపింది. ఏంటి? అప్పుడే డెలివరీ అయిందా? అనుకునేరు.. కాదు! స్రవంతి భర్త కోసం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కానుకగా ఇచ్చింది. ఈ మేరకు ఓ వీడియోతోపాటు పలు ఫోటోలు షేర్ చేసింది. బుల్లెట్ బైక్ అంటే తన భర్తకు ఎంతో ఇష్టమని చెప్తోంది. అందుకే ఈ బైక్ను కానుకగా ఇచ్చినట్లు తెలిపింది.గతేడాది థార్.. ఇప్పుడు బైక్స్రవంతి షేర్ చేసిన వీడియోలో వీరిద్దరూ కొత్త బైక్ ముందు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. తర్వాత జంటగా ఫోటోలకు పోజిచ్చారు. గతేడాది వీరు మహీంద్రా థార్ సొంతం చేసుకున్నారు. ఏడాది తిరిగేసరికి ఇప్పుడు బుల్లెట్ బైక్ కొన్నారు. ఇది చూసిన అభిమానులు సాయికిరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Actress Sravanthi (@sravanthi.official) View this post on Instagram A post shared by Sai Kiran Ram (@saikiran_official_23) చదవండి: నేనే హీరోయిన్ అన్నారు.. ఇంత మోసం చేస్తారనుకోలేదు! -
శివగామిని ఇలా మార్చేశారేంటి!
రమ్యకృష్ణ పేరు చెప్పగానే ఇప్పటి జనరేషన్కి అయితే శివగామి పాత్ర గుర్తొస్తుంది. ఎందుకంటే 'బాహుబలి'లో ప్రభాస్, రానానే కాదు రమ్యకృష్ణ తన యాక్టింగ్తో చూపించిన డామినేషన్.. ఈమె సెకండ్ ఇన్నింగ్స్కి మంచి పునాది వేసింది. ఇప్పటికీ వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రమ్యకృష్ణ.. మునుపెన్నడూ లేని విధంగా ఓ దెయ్యం సినిమా కోసం కనిపించనుంది. ఆ లుక్స్ ఇప్పుడు తెగ వైరల్ అయిపోతున్నాయి.(ఇదీ చదవండి: ఎంతోమంది కళ్లు తెరిపించే మూవీ.. 'తలవర' రివ్యూ)గత కొన్నాళ్లుగా సినిమాలైతే చేస్తున్నాడు గానీ ఒక్క హిట్ కూడా కొట్టలేకపోతున్న డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.. ప్రస్తుతం 'పోలీస్ స్టేషన్ మైన్ భూత్' అనే హారర్ మూవీ తీస్తున్నాడు. మనోజ్ బాజ్పాయ్ పోలీస్గా చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం ఈ చిత్రం గురించి చెప్పిన ఆర్జీవీ.. ఓ డాన్ చనిపోయి దెయ్యమవుతాడని, తర్వాత పోలీసులని ఎలా ఇబ్బంది పెట్టాడనేది కాన్సెప్ట్ అని చెప్పుకొచ్చాడు.ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా నటిస్తోందని, ఆమె లుక్ ఇదేనంటూ ఆర్జీవీ రెండు ఫొటోలని పోస్ట్ చేశాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా మాసీగా కనిపించింది. చేతిలో సిగరెట్, ముఖంపై బొట్లు, జీన్స్ ప్యాంట్ ఇలా టామ్ బాయ్ తరహాలో కనిపించింది. అయితే ఈమెది దెయ్యం పాత్ర కాదని ఆర్జీవీ క్లారిటీ ఇచ్చాడు. రీసెంట్గానే 'బాహుబలి' మూవీ ఎపిక్ పేరిట రిలీజైంది. దీంతో ఆ మూవీ లవర్స్.. మా శివగామిని ఇలా మార్చేశారేంటి? అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 మూవీస్.. అవి మిస్ అవ్వొద్దు) -
నేనే హీరోయిన్ అన్నారు.. ఇంత మోసం చేస్తారనుకోలేదు!
సినిమా హీరోహీరోయిన్లకన్నా బిజీగా ఉంటుంది యాంకర్ సుమ (Anchor Suma Kanakala). ఎప్పుడూ ఏదో ఒక షో, ఈవెంట్, ఇంటర్వ్యూ అంటూ పరిగెడుతూనే ఉంటుంది. రోజులో ఎన్ని ఈవెంట్స్ చేసినా సరే కొంచెం కూడా అలిసిపోయినట్లుగా కనిపించదు. రోజంతా హుషారుగానే కనిపిస్తుంది, గలగలా మాట్లాడుతూనే ఉంటుంది. యాంకరింగే కాకుండా గతంలో సినిమాలు కూడా చేసింది. అప్పుడెప్పుడో చివరగా జయమ్మ పంచాయితీ (2022) మూవీ చేసింది. నా చెక్కు కొట్టేసిందితాజాగా మరోసారి వెండితెరపై కనువిందు చేయనుంది. ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన 'ప్రేమంటే..' మూవీలో సుమ కానిస్టేబుల్గా యాక్ట్ చేసింది. ఈ సినిమా టీజర్ ఈవెంట్లో సుమ మాట్లాడుతూ.. ఈరోజు చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఎప్పుడూ ప్రోగ్రాం మనమే స్టార్ట్ చేస్తుంటాం. అలాంటిది ఈ రోజు యాంకర్ గీత ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి మన చెక్కు కొట్టేసింది. నన్ను ఈ సినిమాలో ప్రియదర్శి పక్కన హీరోయిన్ అని చెప్పారు. ఇంత మోసం చేస్తారా?అయితే దర్శి కంటే నా వయసు మరీ తక్కువ కావడంతో డైరెక్టర్ నవనీత్ వద్దన్నారు. ఆ తర్వాత పవర్ఫుల్ కానిస్టేబుల్ అని చెప్పి తీసుకున్నారు. సినిమాలో ఓ సీన్ చేశాక అది పవర్ఫుల్ కానిస్టేబుల్ కాదు, పవర్లెస్ కానిస్టేబుల్ అని తెలిసింది. నన్ను ఇంత మోసం చేస్తారనుకోలేదు. దర్శకుడిపై కేసు పెట్టాలనుకున్నాను. కానీ కుర్రాడికింకా పెళ్లి కాలేదని వదిలేశాను. పెళ్లి చేసుకుంటే అంతకన్నా పెద్ద కేసు ఇంకోటి ఏముంటుంది? నేనే గ్లామర్గా కనిపించా..ఆనంది.. నా రోల్ కొట్టేశావ్.. అయినా ఇట్స్ ఓకే! పర్వాలేదు, బాగా చేశావు. గ్లామర్ విషయానికి వస్తే నీకంటే నేనే ఎక్కువ గ్లామర్గా కనిపించానని చెప్తున్నారు. ఈ సినిమాలో నాక్కూడా ఓ పాట ఉంది. అందులో ఒక హుక్స్టెప్ ఉంది. పాట రిలీజయ్యాక మీరందరూ ఆ హుక్స్టెప్ చేయాలి అంటూ సరదా స్పీచ్ ఇచ్చింది. ప్రియదర్శి-ఆనంది కాంబినేషన్లో వస్తున్న ప్రేమంటే సినిమాతో నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ మూవీ నవంబర్ 21న విడుదల కాబోతోంది.చదవండి: ఏడ్చేసిన సుమన్.. నామినేషన్స్లో ఎవరంటే? -
ఈ వారం ఓటీటీల్లోకి 17 మూవీస్.. అవి మిస్ అవ్వొద్దు
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి రష్మిక 'ద గర్ల్ ఫ్రెండ్', సుధీర్ బాబు 'జటాధర'తో పాటు 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో', 'ప్రేమిస్తున్నా' అనే తెలుగు సినిమాలతో పాటు 'ఆర్యన్', 'ఫీనిక్స్' అనే డబ్బింగ్ చిత్రాలు రాబోతున్నాయి. వీటిలో రష్మిక మూవీ తప్పితే మిగతా వాటిపై హైప్ లేదు. ఓటీటీల్లోనూ ఈ వీకెండ్ రిలీజయ్యే వాటిలో కొన్నిమాత్రమే ఆసక్తి కలిగిస్తున్నాయి.(ఇదీ చదవండి: ఎంతోమంది కళ్లు తెరిపించే మూవీ.. 'తలవర' రివ్యూ)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల్లో 'బ్యాడ్ గర్ల్', 'బారాముల్లా', 'కిస్', 'ద ఫెంటాస్టిక్ ఫోర్', 'అర్జున్ చక్రవర్తి'.. ఉన్నంతలో కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. వీటితో పాటు కొన్ని ఇంగ్లీష్ మూవీస్, వెబ్ సిరీసులు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా వీకెండ్లో సడన్ సర్ప్రైజ్ అన్నట్లు కొత్త చిత్రాలు ఏమైనా రావొచ్చు కూడా. ఇంతకీ ఏ ఓటీటీలో ఏయే మూవీస్ రానున్నాయంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (నవంబరు 03 నుంచి 09 వరకు)హాట్స్టార్బ్యాడ్ గర్ల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబరు 05ద ఫెంటాస్టిక్ 4: ఫస్ట్ స్టెప్స్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 05నెట్ఫ్లిక్స్డాక్టర్ సూస్ ద స్నీచెస్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 03ఇన్ వేవ్స్ అండ్ వార్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 03బారాముల్లా (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 07ఫ్రాంకెన్ స్టెయిన్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 07అమెజాన్ ప్రైమ్నైన్ టూ నాట్ మీట్ టూ యూ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 03మ్యాక్స్టన్ హాల్ (జర్మన్ సిరీస్) - నవంబరు 07ఆహాచిరంజీవ (తెలుగు చిత్రం) - నవంబరు 07జీ5కిస్ (తమిళ సినిమా) - నవంబరు 07తోడే దూర్ తోడే పాస్ (హిందీ సిరీస్) - నవంబరు 07సోనీ లివ్మహారాణి సీజన్ 4 (హిందీ సిరీస్) - నవంబరు 07ఆపిల్ ప్లస్ టీవీప్లరిబస్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 07మనోరమ మ్యాక్స్కరమ్ (మలయాళ సినిమా) - నవంబరు 07ఎమ్ఎక్స్ ప్లేయర్ఫస్ట్ కాపీ సీజన్ 2 (హిందీ సిరీస్) - నవంబరు 05లయన్స్ గేట్ ప్లేఅర్జున్ చక్రవర్తి (తెలుగు సినిమా) - నవంబరు 07ద హ్యాక్ సీజన్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 07(ఇదీ చదవండి: బిగ్బాస్లో పిక్నిక్ పూర్తి.. దువ్వాడ కోసమే బయటకు! ఏమన్న ప్లానా?) -
'మంచు' ఫ్యామిలీని కలిపే బిగ్ ఈవెంట్.. గత వైభవం మళ్లీ..
మోహన్బాబు టాలీవుడ్ లెజండ్ అని ఎవరూ కాదనలేరు.. చిరంజీవి వంటి స్టార్ కంటే తెలుగు తెరపై మెరిసిన బాక్సాఫీస్ కలెక్షన్ల కింగ్.. వెండితెరపై ఆయన వైభవాన్ని ఇప్పటి తరం చూడలేదు. మోహన్బాబు నటించిన సినిమా వస్తుందంటే చాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం.. అందుకే కలెక్షన్ కింగ్ అనే ట్యాగ్ ఇండస్ట్రీ ఇచ్చింది. ఆయన మాట ఒక అగ్నిపర్వతం.. కానీ, తన మనసు మంచు పర్వతం. 50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో 600 సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించారు. నటుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా ఎందరికో స్ఫూర్తిదాయకం మోహన్బాబు జీవితం. నవంబర్ 22 నాటికి తను ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తి కానున్నాయి. మోహన్బాబు హీరోగా నటించిన స్వర్గం నరకం సినిమా 1975 నవంబర్ 22న విడుదలైంది.మోహన్బాబు యాభయ్యేళ్ల సినీ ప్రయాణాన్ని పురస్కరించుకుని నవంబరు 22న ఇండిస్ట్రీలో ఒక వేడుకను జరపాలని ఆయన కుమారుడు మంచు విష్ణు ఉన్నారు. నేటి నటీనటులకు మాత్రమే కాకుండా ఎందరికో స్ఫూర్తి నింపే తన ప్రయాణాన్ని గౌరవించుకునే క్రమంలో ‘MB50 - ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్’ (MB50 - A Pearl White Tribute) పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఒక నటుడిగా భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకునేలా చాలామంది సెలబ్రిటీలు పాల్గొననున్నారు.నాన్నతో మనోజ్మంచు ఫ్యామిలీలో కొంత కాలంగా వివాదాలు ఉన్న విషయం తెలిసిందే.. కుటుంబ ఆస్తి వ్యవహారంలో మోహన్బాబు, ఆయన కుమారుడు మనోజ్ మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో కుటుంబం అంతా వేర్వేరుగా ఉంది. ఇప్పటికే మంచు లక్ష్మీ తన కెరీర్ కోసం ముంబైలో ఉంటున్నారు. ఇలా అందరూ తమకు నచ్చినట్లు తలో దారి చూసుకున్నారు. అయితే, ఈ కార్యక్రమంతో వారందరూ తిరిగి కలిసిపోవాలని అభిమానులు కోరుతున్నారు. కనీసం ఈ సంతోషకరమైన ఈవెంట్తో అయినా సరే మంచు బ్రదర్స్ గతంలో మాదరి కనిపిస్తే చాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మోహన్బాబు కూడా తన కుమారులను ఒక్కటిగా చూడాలనే ఆలచోనతో ఉన్నట్లు తెలుస్తోంది. -
ఏడ్చేసిన సుమన్.. నామినేషన్స్లో ఎవరంటే?
బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9)లో తొమ్మిదో వారం నామినేషన్స్కు రంగం సిద్ధమైంది. ఫైర్ బ్రాండ్ మాధురి వెళ్లిపోవడంతో ప్రస్తుతం హౌస్లో 13 మంది మిగిలారు. వీరికి గతంలోని పాత బొమ్మల టాస్కే ఇచ్చారు. బజర్ మోగగానే వేరేవారి ఫోటో ఉన్న బొమ్మ తీసుకుని సేఫ్ జోన్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆఖరిగా జోన్లో అడుగుపెట్టేవారు, వారి దగ్గరున్న బొమ్మపై ఎవరి ఫోటో ఉంటుందో వారు నామినేషన్ జోన్లోకి వస్తారు.ఏడ్చేసిన సుమన్తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో.. సంజనా (Sanjana Galrani) మాట్లాడుతూ.. నేను సోలో ప్లేయర్గానే ఉన్నాను. కానీ, రీతూ గేమ్లో డిమాన్ పవన్ సాయం చేస్తున్నాడు. అది అందరికీ కనిపిస్తుందని చెప్పింది. అది విన్న రీతూ.. మీకెలా బాండ్స్ ఉన్నాయో, నాకూ అలాగే హౌస్లో ఒక బాండ్ ఉంది. అది మీకు తప్పనిపిస్తే నేనేం చేయలేను అని ఇచ్చిపడేసింది. సుమన్ మాట్లాడుతూ.. నా వల్ల పొరపాటు జరిగింది కాబట్టి, తనూజను సేవ్ చేసి నేను నామినేట్ అవాలనుకుంటున్నా అని ఏడ్చేశాడు. అందుకు తనూజ ఒప్పుకోలేదు. సుమన్ (Suman Shetty) కళ్లలో నీళ్లు తిరిగేసరికి పవన్, కల్యాణ్ అతడిని ఓదార్చారు.నామినేషన్స్లో ఎవరు?మొత్తానికి ఈ వారం భరణి, సంజనా, తనూజ, రాము, సాయి, కల్యాణ్ నామినేట్ అయ్యారని తెలుస్తోంది. తనూజ.. ఇమ్మాన్యుయేల్ను నామినేట్ చేశారంటున్నారు. అది నిజమేనా? ఏమైనా మార్పులుచేర్పులున్నాయా చూడాలి! బిగ్బాస్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఇమ్మూ నామినేషన్స్లో లేడు. ఇది అతడికే మైనస్ అవుతుంది. నామినేషన్స్లోకి వస్తేనే అతడి అభిమానులకు ఓట్లేయడం అలవాటవుతుంది. తనకు ఏ స్థాయిలో ఓట్లు పడతాయి? దాన్ని పెంచేందుకు ఇంకా ఎలా కృషి చేయాలన్నది ఐడియా వస్తుంది? లేదంటే టాప్ 2కి బదులుగా టాప్ 5తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. చదవండి: తనూజ కాళ్లు పట్టుకున్న రాము.. ఎలిమినేషన్తో మాధురి కంటతడి -
బిగ్బాస్లో పిక్నిక్ పూర్తి.. దువ్వాడ కోసమే బయటకు! ఏమన్న ప్లానా?
బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9) నుంచి ఎలిమినేట్ అయితే ఎవరైనా బాధపడతారు. కానీ మాధురి మాత్రం సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? నవంబర్ 4న ఆమె పార్ట్నర్ దువ్వాడ శ్రీనివాస్ పుట్టినరోజట! ఆయన పుట్టినరోజునాడు పక్కనలేకపోతే ఏం బాగుంటుంది? అందుకే.. అలా పిక్నిక్కు వెళ్లినట్లు బిగ్బాస్కు వెళ్లి ఇలా బర్త్డే సమయానికి బయటకు వచ్చేసింది. బిగ్బాస్ బజ్లో కూడా అదే విషయాన్ని నొక్కి చెప్తోంది.ఎంట్రీ, ఎలిమినేషన్ అంతా మాధురి చేతిలోనే..తాజాగా రిలీజైన బిగ్బాస్ బజ్ ప్రోమోలో యాంకర్ శివాజీ మాట్లాడుతూ.. 100% తెలుగు ఇళ్లలోకి వెళ్లాలనుకున్నారు. నిజంగా వెళ్తే ఇంత తొందరగా ఎలా వస్తారు? అని ముఖం మీదే అడిగేశాడు. అందుకు మాధురి (Divvala Madhuri).. నేను రావాలనుకున్నాను, కాబట్టే బయటకు వచ్చాను. నాకు యాక్టింగ్ రాదు, మాస్కులు లేనే లేవు, నేను బయట ఎలా ఉన్నానో లోపల కూడా అలాగే ఉన్నాను. బిగ్బాస్కు వెళ్లాలనుకున్నాను కాబట్టి వెళ్లాను, రావాలనుకున్నాను కాబట్టి వచ్చాను అని చాలా క్లారిటీగా బదులిచ్చింది.భయం నా బ్లడ్డులోనే లేదుఒకానొక దశలో శ్రీజకు భయపడినట్లు అనిపించింది అని శివాజీ అడగ్గా.. భయమనేది నా బ్లడ్డులోనే లేదని మాధురి డైలాగ్ పేల్చింది. మీరు తోపు అని ఎవరూ అనలేదంటూ శివాజీ కూడా ఆమెకు కౌంటరిచ్చాడు. మాధురి బిగ్బాస్ నుంచి వచ్చేముందు కూడా నాగార్జునతో నవంబర్ 4న మా ఆయన బర్త్డే.. ఆ పుట్టినరోజుకల్లా రావాలనుకున్నాను, వచ్చేశాను అన్నట్లుగా మాట్లాడింది. ఇప్పుడీ బజ్ ప్రోమో చూస్తుంటే మాధురి పిక్నిక్కు వెళ్లినట్లే కనిపిస్తోంది. మూడు వారాలు హౌస్లో ఉన్న మాధురితనపై ఉన్న నెగెటివిటీ పోగొట్టుకోవడానికి బిగ్బాస్ను ఎంచుకుంది. అక్టోబర్ 12 వైల్డ్కార్డ్ కంటెస్టెంట్గా హౌస్లో అడుగుపెట్టింది. ఫస్ట్ వీక్ నామినేషన్స్లో లేదు. రెండో వారం తననెవరూ నామినేట్ చేయలేదు. కానీ ఆ వారంలో ఆమె రీతూను బండకేసి కొడ్తా.. జుట్టుపట్టుకుని ఈడ్చి కొడ్తా.. అంటూ హద్దులు మీరి మాట్లాడింది. హౌస్మేట్స్ కూడా ఫేక్ బాండ్స్, ఇన్సెక్యూర్ అంటూ ఆమె మెడలో ఎక్కువ బోర్డులు వేశారు. దీంతో తనకు డైరెక్ట్ నామినేషన్ అనే పనిష్మెంట్ ఇచ్చింది తనూజ. పిక్నిక్ పూర్తయిందిమాధురి కూడా ఇదే కోరుకుంది. అందుకే తనూజ దగ్గర గోల్డెన్ బజర్ ఉన్నప్పటికీ దాన్ని తనకోసం వాడొద్దని మరీమరీ చెప్పింది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం భర్త/ పార్ట్నర్ బర్త్డే సమయానికి బయటకు వచ్చేసింది. ఆమె అరుపులు, కేకలు, హద్దులు మీరి మాట్లాడటం చాలామందికి చిరాకు పుట్టించింది. అదే సమయంలో ముక్కుసూటిగా మాట్లాడటం, ఉన్నదున్నట్లు చెప్పడంతో తనపై పాజిటివిటీ కూడా వచ్చింది. మొత్తానికి మాధురి ఎలిమినేషన్కు పెద్దగా కారణాలంటూ ఏమీ లేదు. తనే వచ్చింది.. తనే దర్జాగా వెళ్లిపోయింది.చదవండి: తనూజ కాళ్లు పట్టుకున్న రాము.. ఎలిమినేషన్తో మాధురి కంటతడి -
బిగ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోనున్న 'ప్రభాస్'..!
హనుమాన్ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి, దర్శకుడు ప్రశాంత్ వర్మ మధ్య మొదలైన ఆర్థిక వివాదం ఇండస్ట్రీని కుదిపేస్తుంది. దీంతో ప్రశాంత్ వర్మ తర్వాతి సినిమాల పరిస్థితి ఏంటి అనేది పెద్ద చర్చగా మారింది. ప్రస్తుతం ఆయన చేతిలో జై హనుమాన్, మహాకాళి, అధీరా ప్రాజెక్ట్లతో పాటు ప్రభాస్, నందమూరి మోక్షజ్ఞ సినిమాలు ఉన్నాయి. అయితే, ప్రశాంత్ వర్మ చాలామంది నిర్మాతల వద్ద భారీగా అడ్వాన్స్లు తీసుకుని మోసం చేస్తున్నారని ఇండస్ట్రీలో వైరల్ అయింది. దీంతో ప్రభాస్ సినిమాపై నీలినీడలు కమ్ముకున్నట్లు సమాచారం.సలార్ సినిమా తర్వాత కన్నడ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ (Hombale Films)తో ప్రభాస్ ఇప్పటికే మూడు చిత్రాల ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే, దర్శకులను ఎంచుకోవడానికి ప్రభాస్కు ఆ సంస్థ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు సమాచారం. ఈ ఒప్పందంలో భాగంగా, ప్రభాస్ మొదట ప్రశాంత్ నీల్తో కలిసి సలార్- 2 సినిమా చేయనున్నారు. మిగిలిన రెండు ప్రాజెక్ట్లలో ఒకటి ప్రశాంత్ వర్మతో కలిసి పనిచేయాలని ఆయన మొదట భావించారట. అయితే, ప్రశాంత్ వర్మ చుట్టూ ఇటీవలి ఏర్పడిన వివాదాల దృష్ట్యా, ప్రభాస్ తన ఎంపికలను పునరాలోచించుకుని, బదులుగా ఇతర దర్శకులతో పనిచేయడం వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు లేని తన ఇమేజ్ను కాపాడుకోవడానికి పేరుగాంచిన ప్రభాస్.. వివాదాల్లో చిక్కుకున్న చిత్రనిర్మాతలకు దూరంగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడతాడు. దీంతో ప్రశాంత్ వర్మతో సినిమా చేయడం కష్టమనే చెప్పవచ్చు.‘హను-మాన్’తో జాతీయ స్థాయిలో ప్రశాంత్ వర్మకు గుర్తింపు దక్కింది. దీంతో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ (Ranveer Singh)తో ‘బ్రహ్మరాక్షస్’ (Brahma Rakshas) అనే సినిమాను తెరకెక్కించాలని ప్రశాంత్ చర్చలు జరిపారని గతంలో వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇదే మైథాలాజికల్ స్టోరీని ప్రభాస్ ఇమేజ్కు అనుగుణంగా మార్చినట్లు వార్తలు వచ్చాయి. ఈమేరకు చర్చలు కూడా జరిగినట్లు టాక్.. ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఆర్థిక చిక్కుల్లో పడటంతో ఈ ప్రాజెక్ట్కు బ్రేకులు పడినట్లే అని తెలుస్తోంది. అయితే, తనకు, నిరంజన్ రెడ్డి నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ మధ్య వచ్చిన వార్తలన్నీ చాలా నిరాధారమైనవని ఆయన పేర్కొన్నారు. తనను కొందరు కావాలని లక్ష్యం చేసుకుని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని షోషల్మీడియాలో లేఖ విడుదల చేశారు. -
తనూజ కాళ్లు పట్టుకున్న రాము.. ఎలిమినేషన్తో మాధురి కంటతడి
సరిపోదా శనివారం అన్నట్లు నాగార్జున.. తనూజకు ఒక్కదానికే స్పెషల్గా సండేరోజు క్లాస్ పీకారు. దాన్ని క్లాస్ పీకడం అని కూడా అనరు. ఎక్కువగా కోప్పడకు, చెప్పే విధానం మార్చుకో, సహనంగా ఉండటానికి ప్రయత్నించు అని తనూజను బుజ్జగించినట్లే ఉంది. ఎలిమినేషన్ను మలుపు తిప్పే అస్త్రం తనూజ దగ్గర ఉన్నప్పటికీ దాన్ని వాడకుండా భద్రంగా కాపాడుకుంది. మరి ఆదివారం (నవంబర్ 2వ) ఎపిసోడ్లో ఏం జరిగాయో చూసేద్దాం..పర్ఫామెన్స్ ఇరగదీశారుది గర్ల్ఫ్రెండ్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా రష్మిక, దీక్షిత్ శెట్టి బిగ్బాస్ షోకి వచ్చారు. వీళ్ల ఎదుటే హౌస్మేట్స్తో కొన్ని సీన్స్ రీక్రియేట్ చేయించారు. వాళ్ల యాక్టింగ్ చూసి రష్మిక కొన్నిసార్లు నోరెళ్లబెట్టేసింది. యాక్టింగ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇమ్మాన్యుయేల్ ఎగరేసుకుపోయాడు. ఇక నామినేషన్స్లో ఉన్న అందరినీ నాగార్జున సేవ్ చేసుకుంటూ రాగా చివరకు గౌరవ్, మాధురి మిగిలారు. గౌరవ్, మాధురి.. ఇద్దర్నీ గేటు బయటకు తీసుకొచ్చాక హౌస్మేట్స్తో ఓ విషయం చెప్పాడు నాగ్. కాళ్లు పట్టుకున్న రాముఓట్ల పరంగా మాధురి చిట్టచివరి స్థానంలో ఉందన్నాడు. అయితే తనూజ దగ్గరున్న గోల్డెన్ బజర్ ఉపయోగించి మాధురిని సేవ్ చేస్తే గౌరవ్ ఎలిమినేట్ అవుతాడని వెల్లడించాడు. అప్పటికే గౌరవ్ను నామినేట్ చేసి కుంగిపోతున్న రాము.. అతడ్ని కాపాడమని తనూజ కాళ్లావేళ్లా పడ్డాడు. చివరకు తనూజ గోల్డెన్ బజర్ ఉపయోగించకపోయేసరికి మాధురి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించి గౌరవ్ను ఇంట్లోకి పంపారు. ఈ సంతోషం పట్టలేక రాము.. తనూజ కాళ్లు మొక్కడం గమనార్హం. మాధురి సంతోషంగానే బయటకు వచ్చేసింది.నా బంగారం తనూజ: మాధురిఎలిమినేట్ అవుతారనుకున్నారా? అని నాగ్ అడగ్గా.. బయటకు రావాలనే కోరుకున్నా.. ఎందుకంటే నవంబర్ 4న మా ఆయన బర్త్డే సార్.. అంటూ మాధురి అసలు విషయం చెప్పింది. తన ఏవీ చూసుకుని లైఫ్లాంగ్ మెమొరీ అని ఎమోషనలైంది. ముగ్గురికి గులాబీలు, ముగ్గురికి ముళ్లు ఇవ్వమని మాధురికి టాస్క్ ఇచ్చారు. మొదటి గులాబీ.. నా బంగారం తనూజకి ఇస్తా.. తను చాలా స్వీట్, నేను బయట ఉన్నప్పుడు తనూజ మాస్క్తో ఆడుతుంది, సీరియల్ యాక్టింగ్ చేస్తుందన్నారు. అంతా అబద్ధం, తను తనలాగే ఉంది అని కంటతడి పెట్టుకుంది. డిమాన్ పవన్, పవన్ కల్యాణ్కు సైతం రోజాలు ఇచ్చింది.100%ఫేక్ముళ్ల గురించి అడగ్గానే మొదటిది భరణికి ఇస్తానంది. 100% ఫేక్ ఎవరైనా ఉన్నారంటే అది భరణి గారే.. హౌస్లో ఉండటానికి తనకు అర్హత లేదు అని కుండబద్ధలు కొట్టి చెప్పింది. దివ్య కూడా అంతే.. తన గేమ్ కంటే పక్కవాళ్ల గేమ్పైనే ఎక్కువ శ్రద్ధ పెడుతుంది. వాళ్ల గొంతు కూడా తనే అయిపోతుంది. అవి తగ్గించుకుని ఆడితే బెటర్ అని పేర్కొంది. వెళ్లిపోయేముందు.. తనూజ, నేనొక్కటే కోరుకుంటున్నా.. నువ్వు స్ట్రాంగ్గా, నవ్వుతూ ఉండాలి. విన్నర్గా చూడాలి.. నువ్వు గెలిస్తే నేను గెలిచినట్లే అని చెప్పి వీడ్కోలు తీసుకుంది.చదవండి: బిగ్బాస్ నుంచి 'మాధురి' ఎలిమినేట్.. భారీగా రెమ్యునరేషన్ -
100 అడుగుల లోయలో పడిపోయిన హీరోహీరోయిన్
సినిమా షూటింగ్లో కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఆపదే అగరా షూటింగ్లో జరిగింది. ఎంపీ.నక్కీరన్, లిబియాశ్రీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కేరళలోని పాలక్కాడు అట్టప్పాడి ప్రాంతాల్లో జరుగుతోంది. ఓ సీన్ చిత్రీకరస్తున్న సమయంలో హీరోహీరోయిన్లు కాలుజారి లోయలో పడిపోయారట! ఈ విషయాన్ని దర్శకుడు వెల్లడించాడు.100 అడుగుల లోయలో..జీవాభారతి మాట్లాడుతూ.. కేరళలోని అట్టప్పాడి కొండ ప్రాంతాల్లో హీరో హీరోయిన్లకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించాం. హీరోయిన్లు ఒకచోట నిలబడి మాట్లాడుకుంటున్న సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా లిబియాశ్రీ కాలుజారి 100 అడుగుల లోయలోకి పడిపోయారు. ఆమెని కాపాడే ప్రయత్నంలో హీరో నక్కీరన్ కూడా లోయలోకి పడిపోయారు. ఓ పొడవైన తాడును తీసుకొచ్చి వారిని పైకి తీసుకొచ్చాం. వాళ్లు పడ్డ ప్రాంతం పచ్చికతో నిండి ఉండడంతో అదృష్టవశాత్తూ చిన్నచిన్న గాయాలతో బయటపడ్డారు. లిబియాశ్రీ ప్రథమ చికిత్స అనంతరం మళ్లీ షూటింగ్లో పాల్గొన్నారు అని తెలిపాడు.అగరా సినిమాను ఎంపీఎన్ మూవీస్ పతాకంపై ఎంపీ నక్కీరన్ నిర్మిస్తున్నారు. జీవాభారతి కథ, కథనం, మాటలు పాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నిశాంత్, జీవాభారతి, కోవై డాక్టర్ కె.కన్నన్, రంగరాజన్ సుబ్బయ్య, సెంథిల్ తంగవేల్, రమేష్రాజా, ఆర్.ప్రభు, జి.గణేష్కుమార్, సెంథిల్కుమార్, ఇనియన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి యూఎం.స్టీవెన్ సతీష్ సంగీతం, చాయాగ్రహణం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కోవై డాక్టర్ కె.కన్నన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
బిగ్బాస్ నుంచి 'మాధురి' ఎలిమినేట్.. భారీగా రెమ్యునరేషన్
బిగ్బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu) నుంచి 8వ వారంలో మాధురి ( Madhuri) ఎలిమినేట్ అయ్యారు. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం అందరికంటే ఆమెకు తక్కువ రావడంతో హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. నామినేషన్స్లో సంజన, మాధురి,రాము, కల్యాణ్, తనూజ, రీతూ, పవన్, గౌరవ్ ఉన్నారు. అయితే, వీరిలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అయిన మాధురి, గౌరవ్ మధ్య లాస్ట్ వరకు గట్టి పోటీ నెలకొంది.. కానీ, ఫైనల్గా మాధురి ఎలిమినేట్ అయ్యారు. అయితే, బిగ్బాస్ నుంచి మాధురికి భారీగానే రెమ్యునరేషన్ అందినట్లు తెలుస్తోంది.సేవా కార్యక్రమాలకు రెమ్యునరేషన్బిగ్ బాస్ హౌస్లో మాధురి కేవలం మూడు వారాలు మాత్రమే ఉన్నారు. కానీ, చాలా బలంగానే తన మార్క్ వేశారు. అసలైన ఫైర్ బ్రాండ్గా హౌస్లో పేరు పొందారు. తన మాటలతో పాటు ఆటలోనూ సత్తా చాటారు. మాధురికి ఉన్న ఇమేజ్ వల్ల బిగ్బాస్ కూడా భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేవలం మూడు వారాలకే రూ. 9 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ సీజన్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఆమె నిలిచారు. అయితే, ఈ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తామని ఆమె ఇప్పటికే ప్రకటించారు. వికలాంగులు, క్యాన్సర్ రోగుల కోసం తమ వంతు సాయంగా ఈ డబ్బులు వితరణ చేస్తామన్నారు. ఇదే విషయాన్ని దువ్వాడ శ్రీనివాస్ కూడా ప్రకటించారు.మాధురికి హౌస్లోకి వెళ్లక ముందే చాలా ట్రోలింగ్కు గురయ్యారు. తన వ్యక్తిగత కారణాల వల్ల ఆమె చుట్టూ అనేక వివాదాలు ఉండటంతో నెటిజన్లు ఆమెను ఇష్టపడలేదు. ఆమెను ఎందుకు సెలక్ట్ చేశారంటూ బిగ్బాస్ టీమ్ను కూడా తప్పుబట్టారు. అయితే, హౌస్లోకి వచ్చిన తర్వాత ఆమె చాలా ముక్కుసూటి మనిషి అంటూ చాలామంది కామెంట్లు చేయడం విశేషం. తనకు అనిపించిన విషయం ఏదైనా సరే బహిరంగంగానే చెబుతారని పేరు పొందారు. తన గేమ్లో ఎప్పుడూ కూడా నిజాయితీ కోల్పోలేదని చాలామంది కామెంట్ల రూపంలో తెలిపారు. సోషల్ మీడియాలో ఆమె పట్ల మిశ్రమ స్పందనలు కూడా కనిపించాయి. ఆమె నిజాయితీకి, ధైర్యానికి కొందరు మద్దతు ఇస్తే.. మరికొందరు ఆమె అగ్రెసివ్ తీరు వల్లే బయటకు వచ్చారని అభిప్రాయపడ్డారు. విపరీతమైన నెగటివిటీతో హౌస్లోకి అడుగుపెట్టిన మాధురి.. బిగ్బాస్ షో వల్ల దానిని కాస్త తగ్గించుకున్నారని చెప్పవచ్చు. ఈ సీజన్లో చాలా పాపులర్ కంటెస్టెంట్గా మాధురి పేరు ఎప్పటికీ ఉండిపోయేలా తన గేమ్తో చూపించారని ఎక్కువ మంది చెప్పడం విశేషం.నాకు ముందే తెలుసు: మాధురిహౌస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అవుతానని తాను ముందే అనుకున్నట్లు స్టేజీపై నాగార్జునతో మాధురి పంచుకున్నారు. నవంబరు 4 తన భర్త పుట్టినరోజు కాబట్టి ఆయన వద్ద ఉండటం తనకు సంతోషంగా ఉందన్నారు. అయితే, తనకు బిగ్బాస్ ఎంతో నేర్పిందని మాధురి పేర్కొన్నారు. హౌస్లో తనకు తనూజ అంటే చాలా ఇష్టమని తెలిపారు. ఆమె చాలా స్వీట్ అంటూ కితాబు ఇచ్చారు. తనూజ సీరియల్లో చేసినట్లు నటిస్తోందని అందరూ అంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. తరువాత కల్యాణ్ ఎలాంటి మాస్క్ లేకుండా నిజాయతీగా ఆడుతున్నాడని చెప్పిన మాధురి.. డిమోన్ పవన్ కూడా చాలా స్వీట్ అంటూనే మంచి అబ్బాయని పేర్కొన్నారు. హౌస్లో 100శాతం ఫేక్ ఎవరైనా ఉన్నారంటే అది భరణి మాత్రమేనని చివరిగా తెలిపారు. -
తెరపైకి ముత్తురామలింగ దేవర్ బయోపిక్..
తమిళనాడులో ఒక వర్గం దైవంగా భావించే నాయకుడు పసుమ్పొన్ ముత్తురామలింగదేవర్. సామాజిక సేవకుడిగా పేరు గాంచిన ఈయన తమిళనాడు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. తమిళనాడు రాజకీయాల్లో కింగ్ మేకర్గా పేరొందిన ముత్తురామలింగ దేవర్ పార్లమెంట్ సభ్యుడుగా దేశ రాజకీయాల్లోనూ రాణించారు. బ్రిటిష్ కాలంలోనే గాంధీజీ అహింసా వాదాన్ని వ్యతిరేకించి సుభాష్ చంద్రబోస్ సిద్ధాంతాన్ని ఆచరించి ఆయనతో పయనించారు. అలా సుభాష్చంద్రబోస్తో పాటు నిషేధాని ఎదుర్కొన్న నాయకుడు ముత్తురామలింగ దేవర్. తమిళనాడులో 1953 ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచి కామరాజ్ను రాజకీయ నాయకుడిని చేసిన ఘనత ఇతనిది. ఆ తరువాత విభేదాలు కారణంగా కాంగ్రెస్ పార్టీని వీడి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి ప్రాతినిథ్యం వహించి ముత్తురామలింగదేవర్ అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ నిర్ణయాలనే విభేదించారు. నేరారోపణలు కారణంగా జైలు జీవితాన్ని అనుభవించి, న్యాయ విచారణలో నిర్దోషిగా తిరిగొచ్చి ప్రజాసేవలోనే గడిపిన ఆయన ఆజన్మ బ్రహ్మచారి అన్నది విశేషం. తన ఆస్తిని తన అనుచరులకు పంచిన ఘనత ఇతనిది. అలాంటి ప్రజాసేవకుడు పసుమ్పొన్ ముత్తురామలింగ దేవర్ జీవిత చరిత్ర ఇప్పుడు దేశీయ తలైవన్ పేరుతో చిత్రంగా రూపొందింది. ఎస్ఎస్ఆర్.సత్య పిక్చర్స్ పతాకంపై ఎస్ఎస్ఆర్ సత్య నిర్మించిన ఈ చిత్రానికి ఆర్.అరవింద్రాజ్ దర్శకత్వం వహించారు. ముత్తురామలింగ దేవర్ పాత్రలో బషీర్ నటించగా, దర్శకుడు భారతిరాజా, రాధారవి, వైగై చంద్రశేఖర్, ఎంఎస్ భాస్కర్ ముఖ్యపాత్రలు పోషించారు. దర్శకుడు అరవింద్రాజ్ కీలక పాత్రను పోషించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం దేవర్ 118వ జయంతి సందర్భంగా అక్టోమర్ 31న విడుదలైంది. -
క్రైమ్... సస్పెన్స్
అజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ది బ్రెయిన్’. బేబీ దాన్విత, అజయ్ ఘోష్, శరత్ లోహిత్, జయచంద్ర నాయుడు ఈ చిత్రంలోని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అశ్విన్ కామరాజ్ కొప్పాల దర్శకత్వంలో ఎండ్లూరి కళావతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. దర్శకుడు అశ్విన్ మాట్లాడుతూ – ‘‘క్రైమ్ అండ్ సస్పెన్స్ జానర్లో ‘ది బ్రెయిన్’ సినిమా ఉంటుంది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీస్తున్నాం. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎల్ రాజా. -
సైన్స్ ఫిక్షన్ షురూ
చాందినీ చౌదరి, సుశాంత్ యాష్కీ లీడ్ రోల్స్లో సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ జానర్లో ఓ సినిమా ఆరంభమైంది. వికాస్ దర్శకత్వంలో సృజన గోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. ఈ వేడుకకు అతిథిగా హాజరైన నటుడు–దర్శకుడు తరుణ్ భాస్కర్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టి, ‘‘ఈ సినిమా కాన్సెప్ట్ విన్నాను. కొత్తగా ఉంది’’ అని తెలిపారు.సృజన గోపాల్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంతో కొత్త కాన్సెప్ట్ని పరిచయం చేస్తున్నాం. సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ జానర్లో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చేలా ఉంటుంది. ఒక సూపర్ నేచురల్ ఎలిమెంట్ కూడా ఉంది. ఎవరూ ఊహించని ఒక సూపర్ హీరోని పరిచయం చేయనున్నాం’’ అని చెప్పారు. -
ఫైట్ చేసేద్దాం
నువ్వా... నేనా తేల్చేసుకుందాం... ఫైట్ చేసేద్దాం అనే టైపులో విలన్లకు సవాల్ విసిరి, రంగంలోకి దిగాడు శంకరవరప్రసాద్. అందర్నీ రఫ్ఫాడించడం మొదలుపెట్టాడు. చిరంజీవి హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’కి సంబంధించిన షూటింగ్ అప్డేట్ ఇది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్నారు.ఓ కీలక పాత్రలో హీరో వెంకటేశ్, హీరోయిన్గా నయనతార నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. చిరంజీవి, ఫైటర్స్ పాల్గొనగా ఫైట్ చిత్రీకరిస్తున్నారు. ‘‘ఈ స్టైలిష్ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ విజువల్గా అద్భుతంగా ఉంటుంది. ఫైట్ మాస్టర్ వెంకట్ పర్యవేక్షణలో రూపొందిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. -
ఇట్స్ షో టైమ్
‘పఠాన్’ వంటి బ్లాక్బస్టర్ సినిమా తర్వాత హీరో షారుక్ ఖాన్, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రానికి ‘కింగ్’ అనే టైటిల్ ఖరారైంది. ఆదివారం (నవంబరు 2) షారుక్ ఖాన్ బర్త్ డే సందర్భంగా ఈ టైటిల్ ప్రకటన వీడియోను రిలీజ్ చేశారు.‘ఎంత మందిని చంపానో గుర్తు లేదు’, ‘వాళ్లు మంచివారా? చెడ్డవారా అని నేను అడగలేదు’, ‘వాళ్ల కళ్లలో నాకు భయం కనిపిస్తే అదే వారి ఆఖరి శ్వాస అవుతుంది’, ‘ఇట్స్ షో టైమ్’ అనే డైలాగ్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్గా, షారుక్ తనయ సుహానా కీలక పాత్ర చేస్తున్నారు. -
ఫిల్మ్నగర్ బాధలు తెలుసు: సుధీర్బాబు
‘‘ఒక్క సినిమా చాలు అనుకున్న నేను 20 సినిమాలు చేశాను. వీటిలో హిట్ చిత్రాలకు కారణం నా కష్టమైతే ఫెయిల్యూర్స్కి కారణం కూడా నేనే. మహేశ్గారు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నా, నేను అడగలేదు. నేను ఇరవై సినిమాలు చేయడానికి కారాణం ఒక్కటే. కృష్ణగారి అల్లుడు, మహేశ్గారి బావ... సుధీర్బాబు. అయితే నా యాక్షన్ వీడియోలు పట్టుకుని ప్రతి ఆఫీస్కి తిరిగాను. నాకు కృష్ణానగర్ కష్టాలు తెలియకపోవచ్చు కానీ ఫిల్మ్నగర్ బాధలు తెలుసు. అవకాశాల కోసం బస్సులో నేను ట్రావెల్ చేయకపోవచ్చు. కానీ కారులో కూర్చుని ఏడవడం తెలుసు.ఇవన్నీ నేను సింపతీ కోసం చెప్పట్లేదు. మీరందరూ (వేడుకలో వీక్షకులను ఉద్దేశిస్తూ..) మహేశ్బాబుగారిపై ప్రేమతోనే వచ్చారు. థ్యాంక్యూ సో మచ్. కానీ ఇందులో ఎవరో ఒకరు ఏదో మూలన నాకోసం వచ్చి ఉంటారని, నా కోసం చప్పట్లు కొట్టి ఉంటారని నా మనసుకు తెలుస్తోంది. నేను మరింత కష్టపడతాను’’ అని హీరో సుధీర్బాబు అన్నారు. సుధీర్బాబు, సోనాక్షి సిన్హా లీడ్ రోల్స్లో, శిల్పా శిరోద్కర్ కీ రోల్లో నటించిన చిత్రం ‘జటాధర’.ఈ ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రానికి వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుధీర్బాబు మాట్లాడుతూ– ‘‘నేను చేసిన 20 సినిమాల్లో ‘జటాధర’ బెస్ట్ స్క్రిప్ట్. ఇందులో ఘోస్ట్ హంటర్ క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా కోసం శివ తాండవం చేయడం అద్భుతమైన అనుభూతి. ఇది ఆ శివుని దీవెనగా భావిస్తున్నాను’’ అని తెలిపారు. ‘‘ఈ సినిమా ఆడియన్స్కు నచ్చుతుంది’’ అని పేర్కొన్నారు శివిన్, ప్రేరణ. -
తెరపై తండ్రి కూతురు.. నిజజీవితంలో ఆమెపై వేధింపులు
ఓటీటీలో 'స్ట్రేంజర్ థ్రింగ్స్' అనే వెబ్ సిరీస్ మన దగ్గర కూడా బాగానే ఫేమస్. సూపర్ హీరో అడ్వెంచరస్ కాన్సెప్ట్తో తీసిన ఈ సిరీస్ నుంచి ఇప్పటికే నాలుగు సీజన్లు వచ్చాయి. అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఈ నెలలో చివరిదైన ఐదో సీజన్ స్ట్రీమింగ్ కానుంది. ఇంతలోనే ఇందులో లీడ్ రోల్ చేసిన నటి.. సహనటుడిగా చేసిన ఫిర్యాదు వెలుగులోకి వచ్చింది.ఈ సిరీస్లో మిల్లీ బాబీ బ్రౌన్, ఎలెవన్ అనే పాత్ర చేయగా.. డేవిడ్ హార్బర్, జిమ్ హాపర్ అనే పోలీస్ రోల్ చేశాడు. ఇందులో వీళ్లిద్దరూ తండ్రి కూతురిగా నటించారు. కానీ నిజజీవితంలో మాత్రం మిల్లీని డేవిడ్ వేధించడంతో పాటు ఏడిపించాడట కూడా. ఇదంతా కూడా ఐదో సీజన్ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే జరిగిందని మిల్లీ తన ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం ఈ విషయమై నెట్ఫ్లిక్స్ సంస్థ దర్యాప్తు చేస్తోంది.(ఇదీ చదవండి: అప్పుడేమో టాలీవుడ్ ఫేమస్ కమెడియన్.. ఇప్పుడు డీజే)షూటింగ్ టైంలో ఈ వేధింపులు జరగడంతో చాన్నాళ్ల క్రితమే మిల్లీ, డేవిడ్పై ఫిర్యాదు చేసిందని.. తర్వాత నెలల పాటు విచారణ సాగుతూనే ఉందట. తాజాగా ఈ విషయం బయటపడింది. సిరీస్ చివరి సీజన్ రిలీజ్ మరికొద్ది రోజులు ఉందనగా ఇదంతా బయటకు రావడం నటి అభిమానులకు షాకింగ్ అనిపించింది.చివరిదైన ఐదో సీజన్ విషయానికొస్తే.. రీసెంట్గానే ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంగ్లీష్తో పాటు తెలుగు, తమిళ, హిందీలోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. నవంబరు 26, డిసెంబరు 25, డిసెంబరు 31న ఫైనల్ సీజన్కి సంబంధించిన ఎపిసోడ్స్ అన్నీ విడతలవారీగా రాబోతున్నాయి.(ఇదీ చదవండి: రూ.200 కోట్ల వివాదం.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ వర్మ) -
చాందినీ చౌదరి కొత్త సినిమా గ్రాండ్ లాంచ్
చాందినీ చౌదరి, సుశాంత్ యాష్కీ హీరోహీరోయిన్లుగా కొత్త సినిమా మొదలైంది. సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ జానర్లో దీన్ని తెరకెక్కించనున్నారు. వికాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సహచారి క్రియేషన్స్ బ్యానర్పై సృజన గోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆదివారం (నవంబరు 02) ఘనంగా లాంచ్ అయింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు తరుణ్ భాస్కర్ క్లాప్ కొట్టగా, గీతా భాస్కర్, చిత్ర యూనిట్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.సైన్స్ ఫిక్షన్, డార్క్ కామెడీతో పాటు ఈ చిత్రంలో ఒక సూపర్ నేచురల్ ఎలిమెంట్ కూడా ఉంది. ఈ చిత్ర కాన్సెప్ట్ వీడియోను టీమ్ త్వరలోనే విడుదల చేయనుంది. నవంబర్ చివరిలో హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో జీవన్ కుమార్, అజయ్ గోష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తుండగా, జితిన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
అప్పుడేమో టాలీవుడ్ ఫేమస్ కమెడియన్.. ఇప్పుడు డీజే
టాలీవుడ్లోకి ప్రతి ఏడాది వందలాది మంది నటులు, హీరోహీరోయిన్లు వస్తూనే ఉంటారు. వీళ్లలో కొందరు నిలబడతారు. మరికొందరు మాత్రం కొన్నాళ్ల పాటు పలు సినిమాల్లో కనిపిస్తారు. కొన్నాళ్ల తర్వాత పూర్తిగ తెరమరుగైపోతారు. ఈ హాస్య నటుడు కూడా సేమ్ అలానే. ఒకప్పుడు అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు ఇండస్ట్రీని వదిలేసి డీజేగా పనిచేస్తున్నాడు. ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు బబ్లూ. తేజ తీసిన 'చిత్రం' సినిమాతో కమెడియన్గా కెరీర్ ప్రారంభించిన ఇతడు.. తర్వాత ఆనందం, ఎవడి గోల వాడిదే, ఆర్య, చిరుత, బోణీ తదితర చిత్రాలు చేశాడు. మంచు విష్ణు హీరోగా చేసిన 'వస్తాడు నా రాజు'లో చివరగా కనిపించాడు. కొన్నాళ్ల క్రితం బబ్లూ పలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. తన కెరీర్ గురించి చెప్పాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'డ్యూడ్'.. డేట్ ఫిక్సయిందా?)బబ్లూ అసలు పేరు సదానంద్. 'ముద్దుల మేనల్లుడు' సినిమాలో బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. జంధ్యాల తీసిన 'పోపుల పెట్టె' సీరియల్లో బబ్లూ పాత్ర చేశాడు. తర్వాత నుంచి ఇదే అతడి పేరు అయిపోయింది. వయసొచ్చిన తర్వాత 'చిత్రం'లో నటించే అవకాశమొచ్చింది. తర్వాత పవన్ కల్యాణ్, బన్నీ, చరణ్ సినిమాలు చేశాడు. అయితే జీవితం సంతోషంగా సాగిపోతున్న సమయంలో కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు వరసగా చనిపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయానని, ఇంట్లోనే అలా ఉండిపోవడం వల్ల నటనకు దూరమయ్యానని బబ్లూ చెప్పుకొచ్చాడు. మంచి ఆఫర్స్ వస్తే ఇప్పుడు కూడా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా అన్నాడు.యాక్టింగ్ చేయట్లేదని బబ్లూ ఖాళీగా అయితే లేడు. ప్రస్తుతం డీజేగా పనిచేస్తున్నాడు. ఇతడి ఇన్ స్టా ఓపెన్ చేసి చూస్తే మొత్తం డీజే వీడియోలే ఉంటాయి. 2006 నుంచి డీజే వృత్తిలో ఉన్నట్లు సోషల్ మీడియాలో ఉంది. అంటే ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు ఈ పని కూడా చేసేవాడనమాట. ఒకప్పుడు కమెడియన్గా స్టార్ హీరోలతో పనిచేసిన బబ్లూ.. ఇప్పుడు ఎలాంటి మొహమాటం లేకుండా డీజేగా చేస్తుండటం మెచ్చుకోదగిన విషయమే!(ఇదీ చదవండి: రూ.200 కోట్ల వివాదం.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ వర్మ) View this post on Instagram A post shared by DJ Bablooo (@actor_sada_dj_babloo) -
స్కర్ట్లో బుల్లితెర భామ అందాలు.. పెళ్లి కూతురిలా నిహారిక!
అలాంటి శారీలో రష్మిక మందన్నా బ్యూటీ లుక్..బ్లూ స్కర్ట్లో అందాలు ఆరబోస్తున్న జ్యోతిపూర్వాజ్..రెడ్ స్కర్ట్లో అనన్య నాగళ్ల అదిరిపోయే లుక్స్..పెళ్లి కూతురిలా ముస్తాబైన నిహారిక కొణిదెల..మెరూన్ శారీలో మెరిసిపోతున్న నటి విమలా రామన్.. View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Vimala Raman (@vimraman) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
కొరియోగ్రాఫర్ జానీకి అవకాశాలు.. సింగర్ చిన్మయి సంచలన ట్వీట్!
సింగర్ చిన్మయి శ్రీపాద ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సింగర్గా రాణిస్తూనే మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దారుణాలపై పోరాటం చేస్తూనే ఉంటోంది. గతంలో మీటూ ఉద్యమంలోనూ చిన్మయి శ్రీపాద పేరు గట్టిగా వినిపించింది. తాజాగా చిన్మయి మరో చేసిన ట్వీట్ హాట్ టాపిక్గా మారింది.టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, సింగర్ కార్తీక్ లాంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వడంపై చిన్మయి శ్రీపాద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వారికి అవకాశాలివ్వడం అంటే లైంగిక దాడులను ప్రోత్సహించడమేనంటూ సంచలన పోస్ట్ చేసింది గాయని. అధికారం, ప్రభావం, డబ్బును దుర్వినియోగం చేసే పురుషుల చేతుల్లో పెట్టడం అంటే లైంగిక వేధింపులకు మద్దతు ఇవ్వడమేనని చిన్మయి మండిపడింది. మన నమ్మే కర్మ సిద్ధాంతం నిజమైతే.. అది తప్పకుండా వదిలిపెట్టదని సింగర్ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో చిన్మయికి మద్దతుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.టాలీవుడ్ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఓ మహిళ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతనికి బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అంతేకాకుండా జానీ మాస్టర్పై పోక్సో కేసు కూడా నమోదు చేశారు. మరోవైపు కోలీవుడ్ సింగర్ కార్తీక్పై సైతం లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. I dont and will never understand the repeated platforming of Jani master or Singer Karthik.Putting power and influence AND money in the hands of men who misuse it is like saying - Here is my support go sexually assault.If there is a Karma theory at work - may it come back and…— Chinmayi Sripaada (@Chinmayi) November 2, 2025 -
ఓటీటీలోకి 'డ్యూడ్'.. డేట్ ఫిక్సయిందా?
లవ్ టుడే, డ్రాగన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్. ఇతడి నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ 'డ్యూడ్'. దీపావళి సందర్భంగా గత నెలలో థియేటర్లలోకి వచ్చింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు నిర్మాతలు ప్రకటించారు. అలాంటిది ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయిందట. ఈ మేరకు డేట్ వైరల్ అవుతోంది.'డ్యూడ్' చిత్రంలో ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించారు. శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. పరువు హత్యల బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రంలో ఆర్య సినిమా పోలికలు ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో టాక్ వినిపించింది. దర్శకుడు కూడా ప్రమోషన్స్లో మాట్లాడుతూ.. ఈ కథకు ఆర్య-2 సినిమా స్పూర్తి అన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ మూవీ.. నవంబరు 14 నుంచి నెట్ఫ్లిక్స్లోకి రానుందని సమాచారం.(ఇదీ చదవండి: రూ.200 కోట్ల వివాదం.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ వర్మ)విడుదలకు ముందు 'డ్యూడ్' ఓటీటీ హక్కుల డీల్ జరిగిపోయింది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ క్రమంలోనే ఈనెల 14 నుంచి సినిమాని స్ట్రీమింగ్ చేసే అవకాశముంది. తెలుగు, తమిళ భాషలతో పాటు మిగతా దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి రావొచ్చు.'డ్యూడ్' విషయానికొస్తే.. గగన్ (ప్రదీప్ రంగనాథన్).. ఆముద(నేహాశెట్టి)ని ఇష్టపడతాడు. కానీ ఆమె మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. మరోవైపు మేనమామ కూతురు కుందన (మమిత బైజు)కి చిన్నప్పటినుంచి గగన్ అంటే ఇష్టం. కానీ గగన్కి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. కుందన పెళ్లి ప్రపోజల్ తెచ్చినా రిజెక్ట్ చేస్తాడు. ఆ బాధలో పార్ధు(హృదయ్)ని కుందన ఇష్టపడుతుంది. కానీ అనుకోని పరిస్థితుల్లో కుందన, గగన్కి పెళ్లవుతుంది. కానీ ఆమె మనసులో పార్ధు ఉన్నాడని గగన్కి తెలుసు. దీంతో కుందన, ఆమె ప్రియుడిని కలిపే పనిలో ఉంటాడు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సందీప్ రెడ్డి వంగా దెబ్బకు బాలీవుడ్ గల్లంతు.. ఇప్పటికీ) -
ఆమె ఉన్నట్టా..లేనట్టా..?.. నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా చూశారా?
థ్రిల్లర్ జోనర్లందు సైకలాజికల్ థ్రిల్లింగే వేరయా...నిజానికి సినిమాల్లో ఉన్న అన్ని జోనర్లలో థ్రిల్లర్ జోనర్ కు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులోను సైకలాజికల్ థ్రిల్లర్ మరింత ప్రత్యేకమైనది, ఎందుకంటే చూసే ప్రేక్షకుడిని ఆద్యంతం కట్టిపడేసేది ఈ సైకలాజికల్ థ్రిల్లరే. నెట్ ఫ్లిక్స్ ఓటిటి వేదికగా ఇటీవలే విడుదలైన సినిమా ది ఉమెన్ ఇన్ కేబిన్ 10(The Woman In Cabin 10 OTT Movie Review) ఈ కోవకు చెందినదే. ప్రముఖ నవలా రచయిత్రి రూత్ వేర్ రాసిన పుస్తకం ఆధారంగా తీసిన ఈ సినిమాను దర్శకులు సైమన్ స్టోన్ తెరకెక్కించారు. నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా లభ్యమవుతోంది. ఈ సినిమా చాలా వరకు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇక ఈ సినిమా కథాంశానికొస్తే...ఇన్వేస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన లారా కు ధనవంతురాలైన అనీబల్మర్ నుండి ఓ ఆహ్వానం అందుతుంది. క్యాన్సర్ బాధితురాలిగా ఆఖరి దశలో ఉన్న అనీబల్మర్ తన యావదాస్తిని తన భర్త అయిన రిచర్డ్ పేరిట రాయడానికి, అలాగే తాను నిర్వహించే స్వచ్ఛంధ సంస్థకు ఫండ్ రైజింగ్ కోసం ప్రపంచంలో ఉన్న ధనవంతులతో పాటు లారాని కూడా ఓ షిప్ ప్రయాణానికి ఆహ్వానిస్తుంది. వీరంతా కలిసి ఓ విలాసవంతమైన షిప్ లో నార్వేకి వెళుతుంటారు. లారాకి ఆ షిప్ లో 8వ నెంబరు గదిని కేటాయిస్తారు. రెండు రోజుల ఈ ప్రయాణంలో ప్రతి క్షణం విందులు, వినోదాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అనూహ్యంగా ఓ రోజు రాత్రి 10 వ నెంబరు గది నుండి ఓ అమ్మాయి సముద్రంలోకి పడిపోవడం లారా గమనిస్తుంది. ఇదే విషయం నిర్వాహకులకు చెబితే ఆ గదిని ఎప్పుడూ తెరవలేదని, దాంట్లో ఎవరూ లేరని లారాకు చెబుతారు. లారా వాళ్ళ మాటలు నమ్మదు, ఇంతలో లారా పై కూడా ఓ హత్యా ప్రయత్నం జరుగుతుంది. ఆ 10వ నెంబరులో ఉన్న అమ్మాయి ఎవరో, ఎందుకు పడిపోయిందో తెలుసుకోవడానికి లారా శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతకీ ఆ గదిలో ఆమె ఉన్నట్టా లేనట్టా, అలాగే లారా పై హత్యాయత్నం చేసిందెవరు ? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానలు కావాలంటే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ది ఉమెన్ ఇన్ కేబిన్ 10 సినిమాని చూడాల్సిందే. అక్కడక్కడా కాస్త స్లో గా అనిపించినా ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్. ఫైండ్ అవుట్ ది ఉమెన్ ఇన్ కేబిన్ 10 దిస్ వీక్.- హరికృష్ణ ఇంటూరు -
పెళ్లి తర్వాత లైఫ్లో థ్రిల్ కావాలా?.. అయితే ఈ టీజర్ చూసేయండి!
టాలీవుడ్ హీరో ప్రియదర్శి పులికొండ(Priyadarshi Pulikonda) నటిస్తోన్న తాజా చిత్రం 'ప్రేమంటే'(Premante). ఈ మూవీతో నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. థ్రిల్ ప్రాప్తిరస్తు అనేది సబ్ టైటిల్. ఈ సినిమాలో ఆనంది(Anandhi) హీరోయిన్గా కనిపించనుంది. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రానున్న ఈ చిత్రాన్ని జాన్వి నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు.ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తే పెళ్లి అనే కాన్సెప్ట్తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత నా లైఫ్ థ్రిల్లింగ్గా ఉండాలి అంతే అని హీరోయిన్ చెప్పే డైలాగ్తో కథేంటో అర్థమవుతోంది. ఫుల్ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమా నవంబర్ 21న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీకి లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చారు. #PremanteTeaser out now!https://t.co/La06f3A9sSA Rollercoaster of Love, Laughter and Thrills on your way. ❤️In theatres from 21st November #ThrilluPraptirasthuWritten and Directed by @NavaneethFilm@Preyadarshe @anandhiactress @ItsSumaKanakala @leon_james… pic.twitter.com/OCeJ7btclu— Rana Daggubati (@RanaDaggubati) November 2, 2025 -
రూ.200 కోట్ల వివాదం.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ వర్మ
గత రెండు మూడు రోజుల నుంచి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు ప్రముఖంగా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. టాలీవుడ్లోని పలువురు నిర్మాతల దగ్గర నుంచి ఈ యువ దర్శకుడు అడ్వాన్సులు తీసుకున్నాడని, బదులుగా సినిమాలు చేయకుండా ఆలస్యం చేస్తున్నాడని.. దీంతో సదరు నిర్మాతలు ఫిలిం ఛాంబర్ని ఆశ్రయించారని వినిపించింది. ఇదిలా ఉండగా 'హనుమాన్' నిర్మాత నిరంజన్ రెడ్డి, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఒకరిపై ఒకరు ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదులు చేసుకున్నారనే విషయం బయటకు రావడం హాట్ టాపిక్ అయిపోయింది.'హనుమాన్' తర్వాత అధీర, మహాకాళీ, జై హనుమాన్, బ్రహ్మరాక్షస సినిమాలు తమ నిర్మాణ సంస్థలోనే చేస్తానని చెప్పి రూ.10.34 కోట్ల అడ్వాన్స్ ప్రశాంత్ వర్మ తీసుకున్నారని, కానీ నిమాలు చేయడం లేదని నిర్మాతల మండలిలో ప్రశాంత్పై నిర్మాత నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ చిత్రాల వల్ల జరిగిన నష్టానికిగానూ ప్రశాంత్ వర్మ నుంచి తమకు రూ.200 కోట్ల నష్టపరిహారం కావాలని నిరంజన్ రెడ్డి కోరారు.(ఇదీ చదవండి: ప్రశాంత్ వర్మ రూ.200 కోట్ల వివాదం.. నిర్మాత ఫిర్యాదు)మరోవైపు ప్రశాంత్ వర్మ కూడా తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. నిరంజన్ రెడ్డి చర్యల వల్లే తనకు భారీ నష్టాలు, కెరీర్లో ఎదురుదెబ్బలు తగిలాయని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా నిరంజన్ రెడ్డికి తాను ఏమీ అప్పులేనని.. అధీర, మహాకాళీ, జై హనుమాన్, బ్రహ్మరాక్షస లాంటి సినిమాలు ఆయనతో చేస్తానని ఎక్కడా చెప్పలేదని, అగ్రిమెంట్లు లాంటివి కూడా జరగలేదని అన్నట్లు న్యూస్ బయటకొచ్చింది. తాను దర్శకత్వం వహించిన హనుమాన్ రూ. 295 కోట్లు రాబట్టిందని, ఆ లాభాల నుంచి తనకు వాటా రావాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.15.82 కోట్లు మాత్రమే ఇచ్చారని, తనకు ఇవ్వాల్సిన వాటాని ఎగ్గొట్టేందుకు ఈ డ్రామాలన్నీ అని ప్రశాంత్ వర్మ అన్నట్లు తెలిసింది.ఇప్పుడు ఈ వివాదంపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఓ నోట్ రిలీజ్ చేశాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'పలు మీడియా, న్యూస్ ఛానెల్స్, సోషల్ మీడియా ఖాతాల్లో అసంపూర్తి, ధ్రువీకరించని సమాచారం మాత్రమే చూపిస్తున్నారు. ప్రస్తుతం ఫిలిం ఛాంబర్, డైరెక్టర్ అసోసియేషన్ దగ్గర ఈ వివాదం పెండింగ్లో ఉంది. అక్కడ మాట్లాడిన విషయాలన్నీ బయటకు చెప్పడం సరికాదు. అలానే నాపై చేసిన ఆరోపణలు అన్నీ అవాస్తవం. ప్రతీకారంతో చేస్తున్నట్లు కనిపిస్తోంది. అన్ని మీడియా సంస్థలు, న్యూస్ ఛానెల్స్ కూడా అసంపూర్తి సమాచారాన్ని చూపిస్తున్నాయి. ఫిలిం ఛాంబర్ నుంచి తుది తీర్పు వచ్చే వరకు వేచి ఉండండి' అని ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మరి వీరిద్దరిలో ఎవరు తప్పు చేశారు? ఎవరు కరెక్ట్ అనేది కొన్ని రోజుల్లో ఫిలిం ఛాంబర్ తేల్చనుంది.(ఇదీ చదవండి: సందీప్ రెడ్డి వంగా దెబ్బకు బాలీవుడ్ గల్లంతు.. ఇప్పటికీ) -
నా అభిమానులకు అంకితమిస్తున్నా.. ఐకాన్ స్టార్ ట్వీట్
ప్రతిష్టాత్మక అవార్డ్ను తన అభిమానులకు అంకితమిస్తున్నానని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఇలాంటి అరుదైన గౌరవమిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది అవార్డులు పొందిన వారికి హృదయపూర్వక అభినందనలు చెబుతూ ఐకాన్ స్టార్ ట్వీట్ చేశారు. 2024 ఏడాదిగానూ ప్రకటించిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులను తాజాగా ప్రకటించారు.ఈ ప్రతిష్టాత్మక అవార్డుల్లో మోస్ట్ వర్సటైల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యారు. అంతేకాకుండా పుష్ప-2 మూవీకి గానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీశ్రీ ప్రసాద్ అవార్డ్ దక్కించుకున్నారు. ఈ అవార్డ్స్లో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా సత్తా చాటింది. దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ -2025లో ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా నిలిచింది. గతేడాది విడుదలై ప్రేక్షకుల్ని భయంతో పరుగులు పెట్టించిన శ్రద్దాకపూర్ మూవీ స్త్రీ- 2 ఉత్తమ చిత్రంగా అవార్డును దక్కించుకుంది.దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్లో ఉత్తమ నటీనటులుగా కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ నిలిచారు. చందు ఛాంపియన్ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా కబీర్ ఖాన్, ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్గా దినేశ్ విజన్ అవార్డులు సొంతం చేసుకున్నారు. క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ చిత్రంగా లాపత్తా లేడీస్, ఉత్తమ నటీనటులుగా విక్రాంత్ మాస్సే, నితాన్షీ గోయెల్ అవార్డులు దక్కించుకున్నారు. ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్గా ఏఆర్ రెహమాన్ నిలిచారు. Thanks to the Dadasaheb Phalke International Film Awards for the incredible honour. Truly humbled. @Dpiff_official My warm congratulations to all the winners across categories this year.A sincere thank you to my audience for your continued love and support… I humbly dedicate…— Allu Arjun (@alluarjun) November 2, 2025 -
60 ఏళ్ల హీరో.. అర్థరాత్రి 2 గంటలకు జిమ్.. ఉదయం నిద్రపోతాడు!
సీనీ హీరోలు ఫిట్నెస్ మెయింటైన్ చేయడంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. గంటలపాటు జిమ్ లో కష్టపడి నోరుకట్టుకుని మరీ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంటారు. రాత్రి త్వరగా పడుకోవడం.. ఉదయాన్నే లేచి.. వ్యాయామం..ఒక్క పూట భోజనం చేస్తూ తమ ఫిజిక్ని వయసు కన్న తక్కువగా ఉండేలా చూసుకుంటారు. అయితే ఓ హీరో మాత్రం ఇందుకు విరుద్ధంగా డైట్ ఫాలో అవుతున్నాడు. ఉదయం జిమ్ చేయకుండానే.. రాత్రిళ్లు త్వరగా నిద్రపోకుండానే అద్భుతమైన ఫిట్నెస్ని మెయింటైన్ చేస్తూ..60లోనూ 20 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నారు. ఆయనే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan ). ఆయన రాత్రంతా మెలకువతో ఉండి ఉదయం ఐదు గంటకు నిద్రపోతాడు అట. అంతేకాదు అర్థరాత్రి 2 గంటకు జిమ్ చేస్తాడట. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.‘నేను ప్రతిరోజు ఉదయం 5 గంటలకు పడుకొని పది గంటలకు అలా మెల్కొంటాను. అర్థరాత్రి రెండు గంటలకు జిమ్ చేస్తాను. ఆ తర్వాత స్నానం చేసుకొని ఉదయం 5 గంటలకు నిద్రపోతాను. అప్పుడప్పుడు మద్యం కూడా తీసుకుంటాను.అయితే ఎప్పుడైన నిర్ధిష్టమైన పాత్ర కోసం ఒక షేప్లోకి రావాలంటే మాత్రం మద్యం తీసుకోవడం మానేస్తాను. అలాగే వైట్ రైస్, స్వీట్లు కూడా తినడం మానేస్తాను. కొన్నిసార్లు చాక్లెట్, ఐస్క్రీం కూడా తింటాను. కానీ వర్కౌట్ మాత్రం చేస్తుంటాను’ అని షారుఖ్ ఖాన్ అన్నారు. నేటితో(నవంబర్ 2) ఆయన 60 ఏళ్ల వయసుకు చేరుకున్నారు. అయినప్పటికీ ఫిట్నెస్ విషయంలో మాత్రం 20 ఏళ్ల కుర్రాడిలాగే కనిపిస్తాడు. -
సందీప్ రెడ్డి వంగా దెబ్బకు బాలీవుడ్ గల్లంతు.. ఇప్పటికీ
'అర్జున్ రెడ్డి'తో తెలుగులో హిట్ కొట్టి.. తర్వాత బాలీవుడ్కి వెళ్లిపోయిన సందీప్ రెడ్డి వంగా.. కబీర్ సింగ్, యానిమల్ అంటూ హిందీలోనే మూవీస్ తీశాడు. ఇవి బ్లాక్ బస్టర్ హిట్ అయి వందల కోట్ల కలెక్షన్ తెచ్చుకున్నా సరే ఇతడిపై బాలీవుడ్ సెలబ్రిటీల కడుపు మంట చల్లారలేదని చెప్పొచ్చు. అవకాశం దొరికినా ప్రతిసారి ఎవరో ఒకరు విమర్శిస్తూనే ఉంటారు. వాటికి సందీప్ కూడా ఎప్పటికప్పుడు కౌంటర్స్ ఇస్తూనే ఉంటాడు.గత నెలలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 'స్పిరిట్' మూవీ నుంచి ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ పేరు ముందు 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్స్టార్' అని సందీప్ ప్రస్తవించాడు. ఈ ట్యాగ్ వల్ల బాలీవుడ్ గల్లంతు అయిపోయింది. అటు సల్మాన్ ఇటు షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్.. మా హీరో సూపర్స్టార్ అంటే మా హీరో సూపర్స్టార్ తెగ ట్వీట్స్ పెట్టి హడావుడి చేశారు. మరోవైపు పలువురు పీఆర్స్ కూడా ప్రభాస్ కంటే సల్మాన్, షారుఖ్ తోపు అన్నట్లు రాసుకొచ్చారు.(ఇదీ చదవండి: ప్రశాంత్ వర్మ రూ.200 కోట్ల వివాదం.. నిర్మాత ఫిర్యాదు)ఇదంతా జరిగి వారంపైనే అయిపోయింది. తాజాగా ఈ ట్యాగ్ విషయం మరోసారి చర్చనీయాంశమైంది. దీనికి కారణం షారుఖ్ ఖాన్ 'కింగ్' మూవీ అనౌన్స్మెంట్. షారుఖ్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం(నవంబరు 02) గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇందులో.. 'సూపర్స్టార్ అనే ట్యాగ్ మించిన స్టార్స్ ఉంటే వాళ్లని కింగ్ అని పిలుస్తారు. హ్యాపీ బర్త్ డే ఇండియాస్ కింగ్' అని డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ రాసుకొచ్చాడు.డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ చేసిన ట్వీట్ చూస్తే కచ్చితంగా సందీప్ రెడ్డి వంగా కౌంటర్ ఇవ్వడం కోసమే ఇలా పెట్టాడా అనే సందేహం వస్తుంది. చూస్తుంటే సందీప్ రేపిన రచ్చ బాలీవుడ్లో ఇప్పట్లో చల్లారేలా లేదుగా అనిపించడం గ్యారంటీ. రాబోయే రోజుల్లో ఈ ట్యాగ్ గోల ఎంతవరకు వెళ్తుందో చూడాలి?(ఇదీ చదవండి: వాట్సాప్లో మార్ఫ్డ్ వీడియోలు.. ఏడాదిపాటు డిప్రెషన్లో: విష్ణుప్రియ)When stars go beyond being “just a superstar” they are called 👑 Happy Birthday INDIA’s KING pic.twitter.com/NZmChE3OIy— Siddharth Anand (@justSidAnand) November 2, 2025 -
క్రికెట్లో సెంచరీ కాదు.. ఈ రోజుల్లో ఇలాంటి సెంచరీ ఎప్పుడైనా చూశారా?
ఒకప్పుడు సినిమాలు అంటే సెంచరీలు కొట్టేవి. హాఫ్ సెంచరీతో మొదలై డబుల్ సెంచరీలు కొట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇదేంటి సినిమాల గురించి చెబుతూ క్రికెట్తో పోలుస్తున్నారని మీకనిపిస్తోందా? నేను చెప్పేదాంట్లో వింతేముంది.. సెంచరీ అనే పదం అందరికీ తెలిసిందే. క్రికెట్లో వంద రన్స్ చేస్తే సెంచరీ కొట్టినట్లే. మరి సినిమాల్లో సెంచరీ అంటే మామూలు విషయం కాదు. అది కూడా ఈ రోజుల్లో కొట్టమనేది ఇక అసాధ్యమే.ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్లాక్బస్టర్ హిట్ అయినా సినిమా కూడా నెల రోజులు బాక్సాఫీస్ వద్ద ఆడిందంటే గొప్పే. వారం రోజులు దాటిందంటే చాలు.. రిలీజైన చిత్రాలు థియేటర్లలో కనిపించడం లేదు. అవీ చిన్నా, పెద్దా అనే తేడా లేకుండానే కనుమరుగువుతున్నాయి. ఈ రోజుల్లో ఎంత హిట్ సినిమా అయినా కూడా నెల రోజులు బాక్సాఫీస్ వద్ద నిలవడం కూడా గగనమే అన్నట్లుంది పరిస్థితి. ఇటీవల రిలీజైన కాంతార చాప్టర్-1 సూపర్ హిట్గా నిలిచినా నెల రోజుల్లోపే ఓటీటీకి వచ్చేసింది. అలాంటి ఈ రోజుల్లో ఒక సినిమా వంద రోజులు ఆడిందంటే మీరు నమ్ముతారా? నమ్మరు కాక నమ్మరు. కానీ ఇప్పుడు తప్పకుండా నమ్మాల్సిందే. అదేంటో మీరు కూడా చదివేయండి.ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మూవీ మహావతార్ నరసింహా. పాన్ ఇండియా రేంజ్లో జులై 25న విడుదలైన ఈ యానిమేషన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. మొదటి రోజు నుంచి అద్భుతమైన స్పందన రావడంతో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా రిలీజై 50 రోజులు పూర్తయినా కూడా 200 థియేటర్స్ పైగానే ఈ సినిమాను ప్రదర్శించారు.ఈ చిత్రం ఏకంగా ఇప్పుడు సెంచరీ కొట్టేసింది. ఏకంగా థియేటర్లలో సెంచరీ పూర్తి చేసుకుంది. ఈ రోజుల్లో అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసింది ఈ యానిమేషన్ మూవీ. ఈ విషయాన్ని హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 100 రోజుల కీర్తి.. ఇది ఒక తిరుగులేని గాథ.. మహావతార్ నరసింహ బాక్సాఫీస్ చరిత్రను తిరిగి రాస్తూ గర్జిస్తున్నాడు అంటూ పోస్ట్ చేసింది. ఈ ప్రయాణంలో భాగమైనందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేసింది.అయితే ఈ రోజుల్లో వంద రోజులు బాక్సాఫీస్ వద్ద నిలిచిందంటే మామూలు విషయం కాదు. భారీ చిత్రాలు సైతం నెల రోజులకే కనుమరుగవుతున్న తరుణంలో బాక్సాఫీస్ వద్ద సెంచరీ కొట్టడం నిజంగా అద్భుతమనే చెప్పాలి. కాగా.. ఈ మూవీని అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా తెరకెక్కించారు. 100 DAYS of glory. One unstoppable saga! 🔥#MahavatarNarasimha roars on, rewriting box-office history.Eternally grateful to our amazing audience for being part of this divine journey. 🙏🏻❤️#Mahavatar @hombalefilms @VKiragandur @ChaluveG @kleemproduction @shilpaadhawan… pic.twitter.com/yZcsyCazkw— Hombale Films (@hombalefilms) November 1, 2025 -
వాట్సాప్లో మార్ఫ్డ్ వీడియోలు.. ఏడాదిపాటు డిప్రెషన్లో!
'పోవే పోరా' షోతో పాపులర్ అయింది విష్ణుప్రియ (Vishnu Priya Bhimeneni). బుల్లితెర యాంకర్గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్లోనూ పాల్గొంది. అప్పుడప్పుడూ కొన్ని సాంగ్స్లో తళుక్కుమని మెరుస్తున్న విష్ణు యాంకర్గా మాత్రం తెరపై పెద్దగా కనిపించడమే లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ బ్యూటీ అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది.వేరే యాంకర్స్ ఈర్ష్యవిష్ణుప్రియ మాట్లాడుతూ.. నేను యాంకర్గా చేసేటప్పుడు వేరే ఛానల్ యాంకర్స్ నాపై కుళ్లుకున్నారు. మేము ఇన్నేళ్లుగా కష్టపడ్డా రాని పేరు ఈమెకు అలా అడుగుపెట్టిన వెంటనే ఎలా వచ్చిందని ఈర్ష్యపడ్డారు. నాతో సరిగా ఉండేవారు కాదు. నాకు యాంకరింగ్ పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి ఆల్బమ్ సాంగ్స్, సినిమా పాటలు చేస్తున్నాను. బిగ్బాస్ షోకి రమ్మని ఆహ్వానం వస్తే అస్సలు వెళ్లను. ఒక్కసారి వెళ్లినందుకే నా చెప్పు తీసుకుని కొట్టుకోవాలనిపించింది. బిగ్బాస్పై నా అభిప్రాయంనన్ను నేను ఎంతో తిట్టుకున్నా.. అక్కడ తిండి, నిద్ర ఏవీ ఉండవు. నాకైతే అదొక నరకమే! ఇల్లు కొనడం కోసమే బిగ్బాస్కు వెళ్లాను. కానీ ఇంకా టైల్స్ పోయిన పాతింట్లోనే ఉన్నాను. అప్పుడప్పుడు అదే బాధగా అనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఆ ఇల్లును బ్యాంకువాళ్లు అమ్మేసేవాళ్లే! మా అమ్మ లోన్ కట్టలేకపోయింది. ఇండస్ట్రీకి వచ్చిన మూడేళ్లలో దాదాపు 12 లక్షల రూపాయల లోన్ మొత్తం తీర్చేశాను. మరో ఐదారు లక్షలు పెట్టి ఇంటిని పునరుద్ధరించాను. సంపాదించిదంతా ఆ ఇంటికే పోయింది.మూడు బ్రేకప్స్ఇప్పటివరకు మూడు బ్రేకప్స్ అయ్యాయి. మొదటగా ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కూడా అయిపోతుందనుకున్నాను. కానీ, అది జరగలేదు. అయినా ఏది జరిగినా మన మంచికే అని తర్వాత అర్థమైంది. అలా అని ప్రేమ జోలికి వెళ్లననుకునేరు.. కచ్చితంగా ప్రేమ పెళ్లే చేసుకుంటా.. నన్ను పెళ్లి చేసుకునే అబ్బాయికి వేదాల గురించి తెలిసుండాలి. సింగింగ్, డ్యాన్స్ వచ్చుండాలి. వంట రావాలి. అలాంటి అబ్బాయి నాకు తారసపడితే పెళ్లి చేసుకుంటా.. లేదంటే సన్యాసం పుచ్చుకుంటాను. 50 ఏళ్లు వచ్చేసరికి కాశీకి వెళ్లిపోదామా? అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి.అమ్మకు డయాబెటిస్నా చిన్నతనంలోనే అమ్మానాన్న విడిపోయారు. అమ్మకు ఇష్టం లేదని నాన్నతో మాట్లాడేదాన్ని కాదు. అమ్మ డయాబెటిస్ రోగి. సరిగా మందులు వేసుకునేది కాదు. ఒకరోజు హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాం. మూడు రోజుల కంటే ఎక్కువ బతకదన్నారు. దేవుడి దయ వల్ల ఏడాదివరకు బతికింది. అమ్మ ఆస్పత్రిపాలైనప్పుడు లక్షల్లో బిల్లయింది. నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోవడంతో మొహమాటం వదిలేసి తెలిసినవాళ్లకు ఫోన్ చేసి డబ్బు సాయం అడిగాను. హాస్పిటల్ బిల్లు కట్టడం కోసమే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను. 42 ఏళ్లకే అమ్మ చనిపోయింది. రెండేళ్లపాటు డిప్రెషన్కు లోనయ్యాను. అమ్మను తీసుకెళ్లి నన్నెందుకు ఉంచావని దేవుడిని తిట్టుకున్నాను.డిప్రెషన్లో..నేను బాధపడ్డ మరో సందర్భం.. నాపై మార్ఫ్డ్ వీడియోలు చేశారు. దాన్ని వాట్సాప్లో షేర్ చేశారు. అది చూడటానికి నిజందానిలాగే ఉంది. తట్టుకోలేకపోయాను. ఆరు నెలల నుంచి ఏడాదిపాటు డిప్రెషన్కు వెళ్లిపోయాను. సరిగ్గా అదే సమయంలో ఫేస్బుక్ హ్యాకై అశ్లీల పోస్టులు పెట్టారు. నేనెక్కడికి వెళ్లినా.. నీదో వీడియో చూశామని అబ్బాయిలు కామెంట్ చేసేవారు. అమ్మ పెంపకం వల్ల ధైర్యంగా నిలబడ్డా.. లేదంటే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని అని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది.చదవండి: బిగ్బాస్ స్టేజీపై రష్మిక.. భరణి సిగ్గు చూస్తే నిజంగా.. -
సిద్ధార్థ్ లేటేస్ట్ వెబ్ సిరీస్.. ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో వస్తోన్న వెబ్ సిరీస్ ఆపరేషన్ సఫేద్ సాగర్(Operation Safed Sagar). కార్గిల్ యుద్ధ నేపథ్యంలో ఈ సిరీస్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కార్గిల్ వార్ టైమ్లో ఇండియన్ ఎయిర్ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్పై ఈ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్కు ఓని సేన్ దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సిరీస్లో జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. కార్గిల్ సమయంలో భారత వైమానిక దళం 47 రోజుల పాటు ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ సఫేద్ సాగర్ వచ్చే ఏడాదిలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో మిహిర్ అహుజా, తారుక్ రైనా, అర్నవ్ భాసిన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
మహేశ్ బాబు సినిమా ఈవెంట్.. ఓటీటీలో లైవ్
మహేశ్బాబు(Mahesh Babu) అభిమానులు గుంటూరు కారం సినిమా తర్వాత ఆయన్ను వెండితెరపై మళ్లీ చూసేందుకు ఆశ పడుతున్నారు. ఈ క్రమంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB29 ప్రాజెక్ట్ అప్డేట్ కోసం వారు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే నాలుగు షెడ్యూల్ పైగానే పూర్తి చేసుకుంది. ఒరిస్సా, కెన్యా, వంటి ప్రదేశాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. నైరోబి, టాంజానియాల్లో కొత్త షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తోంది. అయితే, నవంబర్ 16న సినిమా టైటిల్తో పాటు మహేశ్ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. అందుకోసం గ్రాండ్గా ఒక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.SSMB29 ప్రాజెక్ట్ గురించి నవంబర్ 16న హైదరాబాద్లో ఒక భారీ ఈవెంట్ను ఏర్పాటు చేయాలని రాజమౌళి ఉన్నారట. సినిమా టైటిల్ గ్లింప్స్ వీడియోను ఆవిష్కరించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయనున్నారని తెలుస్తోంది. అయితే, ఈ కార్యక్రమాన్ని అందరూ చూసేందుకు వీలు ఉండేందుకు ప్రముఖ OTT ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం చేయనుందట. ఈ అంశం గురించి త్వరలో అధికారికంగా ప్రకటన కూడా రావచ్చని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా , పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్తో పాటు మరికొందరు సెలబ్రిటీలు పాల్గొననున్నారని సమాచారం.ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటివరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి చూపించబోతున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2027 ప్రారంభంలో విడుదల చేయాలని చూస్తోంది. -
కాంతార చాప్టర్-1 షూట్.. ఆ సీన్స్ కోసం ఏకంగా!
కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన లేటేస్ట్ మూవీ కాంతార చాప్టర్-1. గతంలో సూపర్ హిట్గా నిలిచిన కాంతారకు ప్రీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ ఏడాది దసరా కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది.ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో కాంతార టీమ్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి మూవీ షూటింగ్ సహకరించిన అన్నదమ్ములకు శుభాకాంక్షలు తెలిపారు. కుందాపురకు చెందిన ఉవా మెరిడియన్ ఫిల్మ్ స్టూడియో యాజమానులు ఉదయ్ కుమార్ శెట్టి, వినయ్ కుమార్ శెట్టి తమ సినిమా కాంతార చాప్టర్-1 ఎంతో సహకరించారని అన్నారు. కాంతారా చాప్టర్ 1 షూటింగ్ కోసం 22 వేల చదరపు అడుగుల ఏసీ సెట్ను రూపొందించారని వెల్లడించారు. ఇందులోనే ఇండోర్ సీక్వెన్స్ తెరకెక్కించామని ట్విటర్లో పోస్ట్ చేశారు. తన మూవీకి మద్దతుగా నిలిచిన మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉంటామని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాంతార చాప్టర్-1 మూవీని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. రిషబ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ సినిమా ఛావాను అధగమించింది. అంతేకాకుండా కన్నడ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో మూవీగా ఘనత సాధించింది. ఈ మూవీలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. Uday Kumar Shetty and Vinay Kumar Shetty, the dynamic brothers from Kundapura and proud owners of Uva Meridian!. They helped to build a 22,000 sq.ft A/C floor for shooting Kantara Chapter 1, where all of our indoor sequences was shot. We remain thankful for their constant support… pic.twitter.com/hUPGm3F4qy— Rishab Shetty (@shetty_rishab) November 1, 2025 -
బాలీవుడ్ బాద్షా లేటేస్ట్ యాక్షన్ మూవీ.. పవర్ఫుల్ గ్లింప్స్ రిలీజ్
డంకీ తర్వాత బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్(Shah Rukh Khan) నటిస్తోన్న మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తన నెక్ట్స్ మూవీని సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో చేస్తున్నారు. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎప్పుడెప్పుడా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఇవాళ షారూక్ బర్త్ డే కావడంతో ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.షారూక్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా మూవీ టైటిల్ను రివీల్ చేశారు. అందరూ ఊహించినట్లుగానే కింగ్(King Movie) అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ ఫుల్ యాక్షన్ మూవీ గ్లింప్స్ షారూక్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. షారూక్ ఖాన్- సిద్ధార్థ్ కాంబోలో వచ్చిన పఠాన్ సూపర్హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. Sau deshon mein badnaam, Duniya ne diya sirf ek hi naam - #KING#KingTitleReveal It’s Showtime!In Cinemas 2026. pic.twitter.com/l3FLrUH1S0— Shah Rukh Khan (@iamsrk) November 2, 2025


