breaking news
Movies
-
కీ రోల్కి సై
విశాల్ హీరోగా రవి అరసు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దుషారా విజయన్ కథానాయికగా నటిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్పై ఆర్బీ చౌదరి నిర్మిస్తున్నారు. విశాల్ కెరీర్లో 35వ మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో హీరోయిన్ అంజలి కీ రోల్లో నటిస్తున్న విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. ‘‘అంజలి ప్రస్తుతం ఆచితూచిపాత్రలను ఎంచుకుంటున్నారు.ఈ క్రమంలో విశాల్ 35 కథ నచ్చి, ఆమె ఓకే చెప్పారు. ‘మద గద రాజా’ చిత్రంలో అంజలి, వరలక్ష్మిలతో విశాల్ చేసిన సందడికి కాసుల వర్షం కురిసింది. మళ్లీ ఇప్పుడు విశాల్, అంజలి కాంబోలో ఈ సినిమా రాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’’ అని యూనిట్ తెలిపింది. -
కామెరూన్తో ఫస్ట్ లుక్ రిలీజ్?
హీరో మహేశ్బాబు–దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ను సెప్టెంబరులో నైరోబీ, టాంజానియా, సౌత్ ఆఫ్రికా లొకేషన్స్లో ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. కాగా ఈ సినిమా అప్డేట్ను నవంబరులో వెల్లడిస్తామని మహేశ్బాబు బర్త్ డే సందర్భంగా ఈ ఆగస్టు 9న రాజమౌళి పేర్కొన్నారు. ఈ సినిమాకు ‘జెన్ 63’ అనే టైటిల్ను అనుకుంటున్నారనే వార్త ప్రచారంలో ఉంది.ఇక ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్రదర్శకుడు జేమ్స్ కామెరూన్ ఇండియా వచ్చినప్పుడు ఈ ‘జెన్ 63’ ఫస్ట్ లుక్, ప్రమోషనల్ కంటెంట్ను ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేస్తే గ్లోబల్ రేంజ్లో రీచ్ ఉంటుందని రాజమౌళి భావిస్తున్నారట. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.ఇదిలా ఉంటే... 2023లో జరిగిన ఓ అంతర్జాతీయ అవార్డుల వేడుకలో భాగంగా రాజమౌళి, జేమ్స్ కామెరూన్ కలుసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని కామెరూన్ ప్రశంసించారు. ఇదిలా ఉంటే... జేమ్స్ కామెరూన్ డైరెక్షన్లోని ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ చిత్రం ఈ డిసెంబరు 19న తెలుగులోనూ రిలీజ్ కానుంది. -
పెళ్లి పీటలెక్కిన బిగ్బాస్ బ్యూటీ.. రాఖీ సావంత్ మాజీ బాయ్ఫ్రెండ్ సందడి!
ప్రముఖ నటి, బిగ్బాస్ కంటెస్టెంట్ సబా ఖాన్ పెళ్లి పీటలెక్కింది. ప్రముఖ వ్యాపారవేత్తను ఆమె పెళ్లాడింది. రాజస్థాన్లోని జోధ్పూర్లో వీరిద్దరి పెళ్లి గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కాగా.. సభా ఖాన్ హిందీ బిగ్బాస్ సీజన్-12లో కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. కానీ ఈ సీజన్ టైటిల్ను బుల్లితెర నటి దీపికా కక్కర్ గెలుచుకుంది.'బిగ్ బాస్ 12' ఫేమ్ సబా ఖాన్ వ్యాపారవేత్త వసీంను వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లిలో రాఖీ సావంత్ మాజీ భాయ్ఫ్రెండ్ ఆదిల్ ఖాన్ సందడి చేశారు కాగా.. ఆదిల్.. సబా ఖాన్ సోదరి సోమి ఖాన్ను వివాహం చేసుకున్నాడు. కాగా.. సబా ఖాన్ భర్త వసీం జోధ్పూర్కు చెందిన నవాబ్ కుటుంబానికి చెందినవాడు. ఈ పెళ్లికి స్నేహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. View this post on Instagram A post shared by Saba Khan (@sabakhan_ks) -
రజినీకాంత్ కూలీ.. మాస్ సాంగ్ వచ్చేసింది!
రజినీకాంత్ హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కూలీ. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఆగస్టు 14న థియేర్లలో విడుదలైన కూలీ తొలి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.151 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. విజయ్ సినిమా లియో రికార్డ్ను కూలీ అధిగమించింది. కూలీ మూవీ రిలీజైన వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.222.5 కోట్ల నెట్ వసూళ్లు సాధించిందితాజాగా ఈ మూవీ నుంచి కొక్కి అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను అమోగ్ బాలాజీ పాడగా.. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేశారు. ఈ మాస్ రజినీకాంత్ను ఫ్యాన్స్ తెగ ఆకట్టుకుంటోంది. కాగా.. కాగా.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించి ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, అమీర్ ఖాన్ వంటి స్టార్స్ నటించారు.Electrifying & Addictive #Kokki lyric video is out now!🖤🔥 #Coolie▶️ https://t.co/XC6UiW0qcZ #Coolie ruling in theatres worldwide🌟@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja… pic.twitter.com/Sxn6Xu4Xe7— Sun Pictures (@sunpictures) August 22, 2025 -
అచ్చొచ్చిన ప్లేస్లో భాగ్యశ్రీ.. జపాన్ బీచ్లో మీనాక్షి
జపాన్ బీచ్లో ఎంజాయ్ చేస్తున్న మీనాక్షిఆగస్టు జ్ఞాపకాలు షేర్ చేసిన దీపికా పిల్లిఅచ్చొచ్చిన ప్లేస్ గురించి చెప్పిన భాగ్యశ్రీ బోర్సేజమ్ము కశ్మీర్ టూర్లో యామీ గౌతమ్రెడ్ శారీలో అందాలతో కవ్విస్తున్న కృతి కర్బందామట్టి పాత్రలు చేస్తూ బిజీబిజీగా అనికా సురేంద్రన్బిగ్బాస్ అగ్నిపరీక్ష కోసం శ్రీముఖి రెడీ View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Parvathy Thiruvothu (@par_vathy) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Yami Gautam Dhar (@yamigautam) -
ఓటీటీకి పరదా హీరోయిన్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక సినిమాల చూసే తీరు పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్కు ఫుల్ డిమాండ్ ఉంటోంది. ఆడియన్స్ అభిరుచికి తగినట్లుగానే ఓటీటీలు సైతం అలాంటి కంటెంట్తోనే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఇక మలయాళ చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలకు ఓటీటీల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.తాజాగా మరో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. పరదాలో నటించిన దర్శన రాజేంద్రన్ లీడ్ రోల్లో ఈ వెబ్ సిరీస్ను తెరెకెక్కించారు. క్రిషంద్ దర్శకత్వంలో వస్తోన్న ఈ 4.5 గ్యాంగ్ సిరీస్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఆగస్టు 29 నుంచి స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు.ట్రైలర్ చూస్తే క్రైమ్, కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ను తిరువనంతపురంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించారు. పరదా సినిమా హీరోయిన్ దర్శన రాజేంద్రన్ కీలక పాత్ర పోషించడంతో ఈ సిరీస్పై ఆసక్తి నెలకొంది. ఆమె లేడీ విలన్గా కనిపించనుంది. ఈ సిరీస్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. -
అధికారిక ప్రకటన.. 'వాల్తేరు వీరయ్య' కాంబో మరోసారి
'భోళా శంకర్' వచ్చి రెండేళ్లు దాటిపోయింది. ఆ సినిమా ఫలితం వల్ల ఆలోచనలో పడిపోయిన చిరంజీవి రూట్ మార్చారు. 'విశ్వంభర' మొదలుపెట్టారు. అయితే ఇది భారీ బడ్జెట్ చిత్రం కావడంతో లేట్ అవుతూ వస్తోంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలోనూ ఓ చిత్రం చేస్తున్నారు. దీనికి 'మన శంకర వరప్రసాద్ గారు' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అలానే శ్రీకాంత్ ఓదెలతోనూ ఓ మూవీ కమిట్ అయ్యారు. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది.(ఇదీ చదవండి: లండన్ నుంచి చెన్నై వచ్చి..దళపతి విజయ్ భార్య బ్యాక్ గ్రౌండ్ తెలుసా?)రెండో ఇన్నింగ్స్లో చిరు సినిమాలు చేస్తున్నారు గానీ సరైన ఫలితాలు రావట్లేదు. ఈ క్రమంలోనే వచ్చి మంచి కమర్షియల్ హిట్ అయిన సినిమా 'వాల్తేరు వీరయ్య'. ఈ చిత్రానికి బాబీ దర్శకుడు. ఇప్పుడు మరోసారి చిరుని డైరెక్ట్ చేసే ఛాన్స్ బాబీ అందుకున్నాడు. యష్ 'టాక్సిక్', దళపతి విజయ్ 'జననాయగన్' చిత్రాల్ని నిర్మిస్తున్న కెవిఎన్ ప్రొడక్షన్.. చిరు-బాబీ కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.'మెగా 158' పేరుని ఈ ప్రాజెక్టుకి వర్కింగ్ టైటిల్గా నిర్ణయించారు. నెత్తురు-గొడ్డలిని పోస్టర్లో చూపించారు. చూస్తుంటే ఇది యాక్షన్ మూవీలా అనిపిస్తుంది. మరి షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారు. హీరోయిన్, సంగీత దర్శకుడు ఎవరనేది త్వరలో వెల్లడిస్తారేమో?(ఇదీ చదవండి: చిరంజీవి లుక్లో VFX లేదు.. 95% ఒరిజినల్: అనిల్ రావిపూడి)It’s the #ChiruBobby2 STATEMENT that sends shivers down the spine 🔥‘The Blade that set the BLOODY BENCHMARK 💥’A MEGASTAR @KChiruTweets hysteria in @dirbobby’s presentation ❤️Produced by @KvnProductions & @LohithNK01 ✨#HBDMegastarChiranjeevi #MEGA158#ABC - AGAIN' BOBBY… pic.twitter.com/yCLmtNcRzX— KVN Productions (@KvnProductions) August 22, 2025 -
ఒంటరి బతుకు.. నాకేమైనా అయితే ఎవరూ రారు.. నటి ఎమోషనల్
ఇండస్ట్రీలో అవకాశలెప్పుడూ ఒకేలా ఉండవు. వయసు పెరిగేకొద్దీ నటీనటులకు అవకాశాలు తగ్గిపోతుంటాయి. ముఖ్యంగా యాక్ట్రెస్లకు అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. కానీ, బాలీవుడ్ నటి ఉషా నదకర్ణి (Usha Nadkarni) మాత్రం ఎప్పుడూ షూటింగ్స్తో బిజీగా ఉంటోంది. తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. ఈమె గతంలో పవిత్ర రిష్తా సీరియల్లో నటించింది. ఈ సీరియల్లో ప్రధాన పాత్ర పోషించిన అంకిత లోఖండే.. తాజాగా నటి ఉషాను ఇంటర్వ్యూ చేసింది.గ్లిజరిన్ లేకుండా..ఈ సందర్భంగా ఉషా గొప్పతనాన్ని చెప్పుకొచ్చింది. ఉషాతో తాను అంత సన్నిహితంగా ఉండేదాన్ని కాదని, అయినా ఆమె తనకు చాలా విషయాలను దగ్గరుండి నేర్పించిందని తెలిపింది. గ్లిజరిన్ లేకుండా ఏడ్చేస్తుందని, ఎక్కువ మేకప్ వేసుకోదని పేర్కొంది. ఇప్పటికీ ఒంటరిగా ధైర్యంగా జీవిస్తోందని తెలిపింది. ఆ మాటతో ఉషా భావోద్వేగానికి లోనైంది. నాకంటూ ఎవరూ లేరు'అవును, ఒంటరిగా బతుకుతున్నా.. కానీ నాకూ ఎమోషన్స్ ఉంటాయి. ఒక్కోసారి భయమేస్తుంటుంది. సడన్గా స్లిప్ అయి కిందపడిపోతే ఎవరికీ తెలియదు. నన్ను చూసేందుకు ఎవరూ రారు. నా కొడుకు విదేశాల్లో నివసిస్తున్నాడు. ఓ సోదరుడిని ఈ మధ్యే కోల్పోయాను. ఇక్కడ నాకోసం ఎవరూ లేరు' అని భావోద్వేగానికి లోనైంది. అంకిత వెంటనే లేచి ఉషను హత్తుకుని నీకోసం నేనున్నానంటూ మాటిచ్చింది. ఏ అవసరమొచ్చినా ఒక్క ఫోన్ కాల్ చేస్తే వచ్చేస్తానంది. నేను చనిపోతే..ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైతం తన ఒంటరితనం గురించి మాట్లాడింది. 1987 నుంచి నేను ఒంటరిగా ఉంటున్నాను. మొదట్లో భయమేసింది. ఎవరైనా తలుపు తీసుకుని వచ్చి నాపై దాడి చేస్తారేమోనని భయపడేదాన్ని. కానీ, ఇప్పుడా భయం లేదు. ఎవరి మరణం ఎలా రాసిపెట్టుందో ఎవరికీ తెలియదు. ఒకవేళ నేను నిద్రలోనే చనిపోతే పక్కింటివాళ్లు డోర్ కొడతారు, ఎంతకూ తలుపు తీయకపోతే చనిపోయానని వాళ్లే అర్థం చేసుకుంటారు అని చెప్పుకొచ్చింది.చదవండి: వందలకోట్ల వరకట్నం.. నేను గర్భంతో ఉండగా..: హీరో భార్య -
మెగాస్టార్-బాలయ్య కాంబోలో సినిమా.. అనిల్ రావిపూడి ఏం చెప్పారంటే?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు అభిమానులకు డబుల్ డోస్ ఇచ్చేశారు. బుధవారం విశ్వంభర గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ఇవాళ అనిల్ రావిపూడి- చిరు కాంబోలో వస్తోన్న సినిమా బిగ్ అప్డేట్ ఇచ్చారు. మెగా 157 టైటిల్ను రివీల్ చేశారు. ఈ సినిమాకు మన శంకరవరప్రసాద్ గారు అనే పేరు ఖరారు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గ్లింప్స్ కూడా విడుదల చేశారు.ఈ ఈవెంట్కు హాజరైన అనిల్ రావిపూడికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. రాబోయే రోజుల్లో మెగాస్టార్- బాలయ్యతో కలిసి సినిమా చేస్తారా అని? మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి అనిల్ రావిపూడి స్పందించారు. వెంకటేశ్, చిరంజీవితో మన ప్రయాణం మొదలైంది.. బాలకృష్ణ 50 ఏళ్ల వేడుకలో చిరంజీవిగారే మైకులో చెప్పారని అనిల్ తెలిపారు. ఇద్దరు కూడా ఎవరికీ వారు డిఫరెంట్ ఇమేజ్ ఉన్న హీరోలు.. వారికి తగిన కథ సెట్ అయితే తప్పకుండా చేస్తానన్నారు. అలాంటి కథ కుదిరితే ఎవరు చేసినా బాగుంటుందని అనిల్ రావిపూడి అన్నారు. -
వందలకోట్ల వరకట్నం.. నేను గర్భంతో ఉండగా..: హీరో భార్య
తెలుగు హీరో ధర్మ మహేశ్ (Dharma Mahesh) తనను, తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ అతడి భార్య గౌతమి ఆరోపించింది. ఇన్నాళ్లూ మౌనంగా భరించానని, కానీ ఇకపై సహించేది లేదని చెప్తోంది. భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ ఇటీవలే ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.గర్భంతో ఉన్నప్పుడు..తాజాగా ఓ ఇంటర్వ్యూలో గౌతమి మాట్లాడుతూ.. ధర్మ మహేశ్ నటుడయ్యాకే విశ్వరూపం చూపించాడు. సినిమాల్లో హీరో, కానీ నిజ జీవితంలో విలన్. అర్ధరాత్రి వరకు అమ్మాయిలతో తిరిగి ఇంటికి వచ్చేవాడు. నేను గర్భవతిగా ఉన్నప్పుడు నన్ను చంపేందుకు ప్లాన్ చేశాడు. పిల్లాడు పుట్టిన తర్వాత కొడుకుగా అంగీకరించలేదు. నా డబ్బు, నా హోటల్స్ మీద వచ్చే లాభాలు మాత్రం తీసుకుంటాడు. అతడి కుటుంబం మొత్తానికి డబ్బంటే పిచ్చి. చంపేస్తానని బెదిరింపులువాళ్లు వందల కోట్ల వరకట్నం కావాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ భరించలేకే పోలీసులను ఆశ్రయించాను. అయినప్పటికీ పోలీసులంటే ధర్మ మహేశ్కు లెక్కలేదు. ఇంతవరకు విచారణకు హాజరు కాలేదు. పైగా నన్ను, నా కుటుంబాన్ని తుపాకీతో కాల్చేస్తానని బెదిరించాడు. ఇన్నాళ్లు నోరు మూసుకుని మౌనంగా కూర్చున్నా.. ఇక నావల్ల కాదు! విడాకులివ్వను, ఇలాగే వేధిస్తానంటే ఊరుకోను. సామరస్యంగా విడిపోదాం అని చెప్పుకొచ్చింది.సినిమాకాగా ధర్మ మహేశ్, గౌతమి 2019లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు సంతానం. గతంలో మహేశ్పై వరకట్న వేధింపుల ఆరోపణలు రాగా.. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరోసారి భార్యను వేధింపులకు గురిచేయడంతో ఆమె మీడియా ముందుకు వచ్చింది. మహేశ్.. సిందూరం, డ్రింకర్ సాయి చిత్రాల్లో నటించాడు.చదవండి: పేడ రుద్దుకున్న కంటెస్టెంట్.. శ్రీముఖికి ఇచ్చిపడేసిందిగా! -
ప్రేమ కోసం లండన్ నుంచి చెన్నై.. విజయ్ భార్య బ్యాక్ గ్రౌండ్ తెలుసా?
దళపతి విజయ్.. తమిళనాడులో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఓ హీరో. ఓవైపు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోనూ అడుగుపెట్టాడు. సొంతంగా టీవీకే అనే పార్టీ పెట్టి, వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడనున్నాడు. తాజాగా మధురైలో పార్టీ మీటింగ్ పెడితే లక్షలాది జనం తరలివచ్చారు. ఇలా విజయ్ గురించి చాలానే తెలుసు. కానీ ఈ హీరో ప్రేమ వివాహం చేసుకున్నాడని, ఓ సినిమా చూసి ఇతడిని, భార్య సంగీత పెళ్లి చేసుకుందనే విషయం మీలో ఎంతమందికి తెలుసు?దళపతి విజయ్ భార్య పేరు సంగీత సోమలింగం. భర్త ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఈమె ఎందుకనో మీడియా అట్రాక్షన్ కోరుకోలేదు. ఈమె గురించి మీడియాలో, సోషల్ మీడియాలోనూ పెద్దగా ప్రస్తావన ఉండదు. సంగీత విషయానికొస్తే.. ఈమె ఓ శ్రీలంకన్ తమిళియన్. తండ్రి యూకేకి వలస వెళ్లి బిజినెస్మ్యాన్ అయిపోయాడు. అలా యూకేలో తండ్రితో కలిసి నివసిస్తున్నప్పుడు అనుకోకుండా విజయ్ 'పూవే ఉనక్కాగ' సినిమా చూసిన సంగీత.. అతడితో వన్ సైడ్ ప్రేమలో పడిపోయింది. నేరుగా చెన్నైలో వాలిపోయింది.(ఇదీ చదవండి: బాగా చూసుకుంటా.. కిరణ్ అబ్బవరం గురించి భార్య పోస్ట్)ఓసారి షూటింగ్లో విజయ్ని కలిసిన సంగీత.. కొన్ని గంటలపాటు మాట్లాడింది. కాసేపు మాట్లాడుకున్నది కాస్త డిన్నర్ డేట్ వరకు వెళ్లింది. తర్వాత దాదాపు మూడేళ్ల పాటు విజయ్-సంగీత డేటింగ్ చేసుకున్నారు. అలా కొన్నాళ్ల తర్వాత సంగీత తల్లిదండ్రులని విజయ్ కలవడం, వాళ్లకు ఇతడు నచ్చడంతో పెళ్లికి అంగీకారం తెలిపారు. అలా 1999లో హిందూ-క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహ వేడుక జరిగింది. తర్వాత జేసన్, దివ్య అని ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.హీరోగా విజయ్.. ఇన్నేళ్ల పాటు తన క్రేజ్ అంతకంతకు పెంచుకుంటూ పోయాడు. రెమ్యునరేషన్ కూడా భారీగానే అందుకుంటున్నాడు. మరోవైపు సంగీత కూడా రూ.400 కోట్లకు ఆస్తిపరురాలని కొన్ని ఆర్టికల్స్లో ప్రస్తావించారు. అలా భర్త ఎంత సెలబ్రిటీ అయినా సరే మీడియా అటెన్షన్ పడకుండా లో-ప్రొఫైల్ మెంటైన్ చేయడం అంటే విచిత్రమనే చెప్పాలి.(ఇదీ చదవండి: చిరంజీవి లుక్లో VFX లేదు.. 95% ఒరిజినల్: అనిల్ రావిపూడి) -
'అనిల్ రావిపూడి- మెగాస్టార్ కాంబో.. మీ ఊహకు మించి ఉంటుంది'
ఈ రోజు మెగాస్టార్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాకుండా చిరంజీవి సినిమాల అప్డేట్స్ రావడంతో డబుల్ ఎనర్జీతో పుట్టినరోజును ఎంజాయ్ చేస్తున్నారు. విశ్వంభరతో పాటు అనిల్ రావిపూడి- మెగాస్టార్ కాంబోలో వస్తోన్న మూవీ టైటిల్ను కూడా రివీల్ చేశారు. టైటిల్ గ్లింప్స్ను రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న సినిమాకు మన శంకరవరప్రసాద్ గారు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరు గురించి మాట్లాడారు.చిరంజీవి సినిమాల్లో రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు అంటే తనకు చాలా ఇష్టమన్నారు. రీ ఎంట్రీలో చిరంజీవి స్వాగ్ను చూపించాలకున్నట్లు తెలిపారు. చివరగా నాకు ఆ అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. మెగాస్టార్ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అంతకుమించి ఉంటుందని అనిల్ రావిపూడి ఆసక్తికర కామెంట్స్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మీకు డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ అందిస్తానని అన్నారు.కాగా.. ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా లేడీ సూపర్స్టార్ నయనతార నటిస్తోంది. ఈ సినిమా భార్యాభర్తల రిలేషన్పై ఆధారంగా ఉంటుందని అనిల్ రావిపూడి గతంలో అన్నారు. దీనిలో 70 శాతం కామెడీ, 30 శాతం ఎమోషనల్ డ్రామా ఉంటుందన్నారు. చిరంజీవిని ఇటీవలి కాలంలో ఎవరూ చూపించని కొత్త లుక్లో ప్రజెంట్ చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. -
నువ్వు నా హీరో.. తండ్రి పుట్టినరోజు సెలబ్రేట్ చేసిన రామ్చరణ్
తండ్రే తనకు ఇన్స్పిరేషన్ అంటున్నాడు మెగా హీరో రామ్చరణ్ (Ram Charan). నేడు (ఆగస్టు 22) చిరంజీవి (Chiranjeevi Konidela) 70వ పుట్టినరోజు. ఈ సందర్భంగా తండ్రితో కేక్ కట్ చేయించి, బర్త్డే సెలబ్రేట్ చేశాడు చరణ్. తండ్రి పాదాలకు నమస్కరించి ఆయన్ను మనసారా హత్తుకున్నాడు. అనంతరం చిరంజీవికి కేక్ తినిపించాడు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.నా హీరో..నాన్నా.. ఈరోజు కేవలం నీ పుట్టినరోజు మాత్రమే కాదు. నీలాంటి మనిషిని సెలబ్రేట్ చేసుకునే రోజు. నా హీరో, నా గైడ్, నా ఇన్స్పిరేషన్.. అన్నీ నువ్వే! నా ప్రతి విజయం, నేను పాటించే విలువలన్నీ నీ నుంచి వచ్చినవే.. 70 ఏళ్ల వయసు వచ్చినా నీ మనసు మాత్రం చిన్నపిల్లాడిలా మారిపోతోంది. నువ్వు సంపూర్ణ ఆరోగ్యంతో, సుఖ సంతోషాలతో మరెన్నో యేళ్లు గడపాలని కోరుకుంటున్నాను. ఉత్తమ తండ్రిగా ఉన్నందుకు థాంక్యూ నాన్న.. అంటూ రామ్చరణ్ ఎమోషనల్ అయ్యాడు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) చదవండి: వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్.. చిరుకు అల్లు అర్జున్ బర్త్డే విషెస్ -
పేడ రుద్దుకున్న కంటెస్టెంట్.. శ్రీముఖికి ఇచ్చిపడేసిందిగా!
బిగ్బాస్ షో (Bigg Boss Reality Show)లో అడుగుపెట్టాలన్నది చాలామంది ఆశ. ఎలాగైనా సరే బిగ్బాస్ టీమ్ కంట్లో పడాలని చిత్రవిచిత్ర పనులు చేసిన జనాలున్నారు. అందులో మల్టీస్టార్ మన్మద రాజా ఒకరు. ఏకంగా అన్నపూర్ణ స్టూడియో ముందు నిరాహార దీక్ష కూడా చేశాడు. ఇతడు అగ్నిపరీక్ష షోకి సెలక్ట్ అవగా.. ఫస్ట్ ఎపిసోడ్లో స్టేజీపై ఎంట్రీ ఇచ్చాడు.పేడ రుద్దుకోమని టాస్క్కానీ ఏడుపొక్కటే ఆయుధం అన్నట్లుగా కేవలం సింపతీ కోసమే ట్రై చేశాడు. ఇది చూసి జడ్జిలు ముగ్గురూ అతడిని రిజెక్ట్ చేశారు. బిగ్బాస్లో ఛాన్స్ కావాలంటూ సోషల్ మీడియాలో పిచ్చిపనులు చేసే వాళ్లందరికీ హౌస్లో ఎంట్రీ ఉండదని అతడి ఎలిమినేషన్తో క్లారిటీ ఇచ్చేశారు. ఇకపోతే తాజాగా సెకండ్ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో పేడ రుద్దుకోమని చెప్పగానే ఓ లేడీ కంటెస్టెంట్ ఏమాత్రం ఆలోచించకుండా బుగ్గలపై పేడ పూసుకుంది. మరో లేడీ కంటెస్టెంట్ దమ్ము శ్రీజ స్టేజీపై కాస్త అతిగా ప్రవరిస్తూ జడ్జిలకు చిరాకు తెప్పించింది.శ్రీముఖికి కౌంటర్ఆమె అరుపులకు శ్రీముఖి స్పందిస్తూ.. ఇలా మొత్తుకుంటే పిల్ల ఏం అరుస్తుందని టీవీలు బంద్ చేస్తారని సరదాగా అంది. అలాగైతే సీజన్ 3లో నువ్వున్నప్పుడే టీవీలు ఆఫ్ చేసేవారని శ్రీజ కౌంటరిచ్చింది. ఆమెకు అభిజిత్ రెడ్ ఫ్లాగ్ ఇవ్వగానే.. ఓ, పవర్ఫుల్గా ఉండేవాళ్లను హ్యాండిల్ చేయలేక రెడ్ ఇచ్చారా? అని నిలదీసింది. మరో ప్రోమోలో గొంగలి కప్పుకుని వచ్చిన తాత నర్సయ్య తన పాటతో అదరగొట్టాడు. ఈ ఎపిసోడ్లో మిరాయ్ ప్రమోషన్స్ కూడా జరిగాయి. చదవండి: అగ్నిపరీక్ష: బిగ్బాస్ కోసం నిరాహార దీక్ష.. గెంటేసిన జడ్జిలు -
చిరంజీవి లుక్లో VFX లేదు.. 95% ఒరిజినల్: అనిల్ రావిపూడి
గతంలో సినిమాని సినిమాగా చూసి ఎంటర్టైన్ అయ్యేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గ్రాఫిక్స్, లాజిక్కులు, హీరో లుక్.. ఇలా అన్నింటినీ పరిశీలిస్తున్నారు. ఏ మాత్రం తేడా అనిపించినా సరే సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. రీసెంట్ టైంలో హరిహర వీరమల్లు, వార్ 2 చిత్రాలు ఇలాంటి అనుభవాల్ని ఎదుర్కొన్నాయి. గతేడాది 'విశ్వంభర' కూడా టీజర్తో చాలానే విమర్శలు ఎదుర్కొంది.అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి.. తన కొత్త సినిమా విషయంలో ముందే జాగ్రత్త పడుతున్నట్లు అనిపిస్తుంది. ఈ డైరెక్టర్.. చిరంజీవితో ఓ కామెడీ మూవీ చేస్తున్నాడు. చిరు బర్త్ డే సందర్భంగా తాజాగా టైటిల్ రివీల్ చేశారు. 'మన శంకర వరప్రసాద్ గారు' అని టైటిల్ పెట్టినట్లు చెబుతూ ఓ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో సిగరెట్ తాగుతూ సూట్ వేసుకుని చిరంజీవి స్టైలిష్గా కనిపించారు.(ఇదీ చదవండి: బాగా చూసుకుంటా.. కిరణ్ అబ్బవరం గురించి భార్య పోస్ట్)అయితే చిరు లుక్పై ట్రోల్స్ వస్తాయని భయపడ్డాడో ఏమో గానీ అనిల్ రావిపూడి.. 'చిరంజీవి సూట్లో ఎలా ఉంటారో చూడటం నాకు చాలా ఇష్టం. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఇంకా చాలా లుక్స్ ఉన్నాయి. చిరంజీవి లుక్కి VFX ఏమి లేదు.. 95 శాతం ఒరిజినల్' అని చెప్పుకొచ్చాడు. ఈ మూవీ కోసం జిమ్కి వెళ్లి సన్నబడ్డారని చెప్పుకొచ్చాడు. అనిల్ స్పీచ్ చూస్తుంటే ట్రోల్స్ వచ్చి తర్వాత క్లారిటీ ఇవ్వడం కంటే ముందే జాగ్రత్తపడుతున్నాడేమో అనిపిస్తుంది.ఈ సినిమాలో నయనతార హీరోయిన్ కాగా భీమ్స్ సంగీతమందిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ ప్లాన్ చేశారు. లెక్క ప్రకారం చిరంజీవి 'విశ్వంభర' ఈ మూవీ కంటే ముందు రిలీజ్ కావాలి. కానీ వీఎఫ్ఎక్స్ వర్క్స్ కారణంగా వచ్చే ఏడాది వేసవికి వాయిదా వేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ కొత్త సినిమా.. తెలుగులోనూ) -
అగ్నిపరీక్ష: బిగ్బాస్ కోసం నిరాహార దీక్ష.. గెంటేసిన జడ్జిలు
బిగ్బాస్ 9వ సీజన్లో సామాన్యుల ఎంట్రీ ఉండబోతోంది. కానీ ఆ సామన్యులెవరన్నది తేల్చేందుకు అగ్నిపరీక్ష (Bigg Boss Agnipariksha) షో మొదలుపెట్టారు. ఇందులో 45 మంది పాల్గొననున్నారు. సామాన్యుల కలను నెరవేర్చడానికే ఈ అగ్నిపరీక్ష అంటూ తొలి ఎపిసోడ్ జియో హాట్స్టార్లో రిలీజ్ చేశారు. మరి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేద్దాం..రెడ్ ఫ్లాగ్ ఇచ్చారంటే ఎలిమినేట్అగ్నిపరీక్ష స్టేజీపై వచ్చిన సామాన్యులకు బిగ్బాస్ షోలో ఉండే అర్హత ఉందా? లేదా? అన్నది జడ్జిలు నవదీప్, అభిజిత్, బిందుమాధవి తేల్చనున్నారు. ఏ కంటెస్టెంట్కైనా వీరు ముగ్గురూ రెడ్ ఫ్లాగ్ ఇచ్చారంటే మాత్రం అతడు/ఆమె నేరుగా ఎలిమినేట్ అయినట్లు లెక్క! మొదటగా విజయవాడ నుంచి దివ్య నిఖిత నైటీలో వచ్చింది. ఈమె ఎంబీబీఎస్ చదువుతోంది. ఒక సాయిపల్లవి, ఒక శ్రీలీల.. ఒక దివ్య నిఖితలా అందరికీ గుర్తుండిపోవాలన్నదే తన కోరిక అంది.డేర్ అండ్ డాషింగ్అభిజిత్ను నామినేట్ చేయమని టాస్క్ ఇవ్వగా.. ఒకే ఒక మైండ్ టాస్క్ ఆడి గెలిచావు. ఎప్పుడూ సోఫాలోనే కూర్చుంటూ గేమ్ కంటే కూడా వేరేవాళ్లమీదే ఫోకస్ పెట్టావు. నీ ఆట నాకు నచ్చలేదు. గేమ్పై ఫోకస్ లేని నిన్ను నామినేట్ చేస్తానంటూ ధైర్యంగా మాట్లాడింది. తర్వాత నాన్న గురించి చెప్తూ ఎమోషనలైంది. ఆమెకు ముగ్గురు జడ్జిలు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు.మాస్క్ మ్యాన్ ఎంట్రీతర్వాత మాస్క్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చాడు. ఏడేళ్లుగా మాస్క్ వేసుకునే తిరుగుతున్నట్లు చెప్పాడు. ఇతడి పేరు హృదయ్ మానవ్ అని తెలిపాడు. తిక్కగా మాట్లాడుతున్న అతడి వైఖరి నచ్చిక అభిజిత్ రెడ్ ఫ్లాగ్ ఇవ్వడంతో మానవ్ హర్టయ్యాడు. నన్ను చూడగానే జడ్జి చేస్తున్నారు.. బిగ్బాస్ కోసం ఈ మాస్క్ వేసుకోలేదన్నాడు. గత మూడు సీజన్ల నుంచి మంచి కంటెస్టెంట్లే రాలేదు, అందుకే నేనొచ్చానని తన గురించి తాను ఓవర్గా చెప్పుకున్నాడు. పెద్దావిడకు ఛాన్సిచ్చిన అభిజిత్దీంతో బిందుమాధవి.. మాస్క్ మ్యాన్కు లూజర్ అనే బోర్డు వేసింది. అయినా అతడు వెనక్కు తగ్గలేదు, జడ్జిలపై ఫైర్ అయ్యాడు. సరే, నీగురించి ఇంకాస్త తెలుసుకోవాలంటూ నవదీప్ ఒక్కడే.. అతడికి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. మూడో కంటెస్టెంట్గా.. ముసలి వయసులో ఉన్న కేతమ్మ వచ్చింది. తనకు ఛాన్సిద్దామని అభిజిత్ ఒక్కడే గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. నాలుగో కంటెస్టెంట్గా ప్రియా శెట్టి వచ్చింది. ముఖంలోనే కాకుండా తన మాటల్లోనూ క్యూట్నెస్ ఉంది. ఆమెకు అభిజిత్ మినహా ఇద్దరు జడ్జిలు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. మల్టీ స్టార్ మన్మధ రాజాకు ఝలక్ఐదో కంటెస్టెంట్గా మల్టీ స్టార్ మన్మధ రాజా వచ్చాడు. బిగ్బాస్లో ఛాన్స్ కోసం నిరాహార దీక్ష చేశానన్నాడు. తనకు ఆస్తులు లేవు, అయినవారు లేరంటూ ఏడుస్తూ సింపతీ పొందే ప్రయత్నం చేశాడు. సింపతీకి చోటు లేదంటూ జడ్జిలు అతడిని బయటకు పంపించేశారు. ఆరో కంటెస్టెంట్గా సయ్యద్ అబూ వచ్చాడు. నవదీప్ ఒక్కడే గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. ఏడో కంటెస్టెంట్గా దివ్యాంగుడు ప్రసన్నకుమార్ వచ్చాడు. ఒంటికాలుతోనే మారథాన్ చేసినట్లు తెలిపాడు. అతడి టాలెంట్కు అందరూ ఫిదా అయ్యారు. జడ్జిలు ముగ్గురూ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. గ్రీన్ ఫ్లాగ్ వచ్చిన కంటెస్టెంట్లు నెక్స్ట్ రౌండ్కు వెళ్తారు.చదవండి: వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్.. చిరుకు అల్లు అర్జున్ బర్త్డే విషెస్ -
ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ కొత్త సినిమా.. తెలుగులోనూ
అనుపర పరమేశ్వరన్ వరస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈమె లీడ్ రోల్ చేసిన 'పరదా'.. ఈ రోజే(ఆగస్టు 22) థియేటర్లలోకి వచ్చింది. మరో మూడు వారాల్లో 'కిష్కిందకాండ' అనే హారర్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఇకపోతే కొన్నిరోజుల క్రితం ఈమె ప్రధాన పాత్రలో నటించిన మలయాళ సినిమా.. పలు వివాదాల్లో చిక్కుకుంది. తర్వాత థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఇంతకీ ఏంటా సినిమా?(ఇదీ చదవండి: అనుపమ 'పరదా' సినిమా రివ్యూ)కోర్ట్ రూమ్ థ్రిల్లర్ స్టోరీతో తీసిన 'జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ'.. గతవారం ఓటీటీలోకి వచ్చింది. అయితే మలయాళ, కన్నడ, తమిళ, హిందీ వెర్షన్స్ మాత్రమే స్ట్రీమింగ్ చేశారు. దీంతో తెలుగు ఆడియెన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు వారం లేటుగా తెలుగు వెర్షన్ తీసుకొచ్చేశారు. ఈ సినిమా జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది. ఆసక్తి ఉంటే ఓ లుక్కేయండి.'జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ' విషయానికొస్తే.. జానకి విద్యాధరన్(అనుపమ పరమేశ్వరన్) బెంగళూరులో ఐటీ జాబ్ చేస్తుంటుంది. పండగ జరుపుకొనేందుకు కేరళలోని సొంతూరికి వస్తుంది. స్నేహితులతో కలిసి బేకరీకి వెళ్లినప్పుడు ఈమెపై లైంగిక దాడి జరుగుతుంది. దీంతో పోలీసులని ఆశ్రయిస్తుంది. ఈ న్యాయ పోరాటంలో జానకి ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది? ఈ కేసులో అడ్వకేట్ డేవిడ్(సురేశ్ గోపి) ఎవరివైపు నిలిచారు? తన ప్రమేయం లేకుండా కడుపులో పెరుగుతున్న బిడ్డని ప్రభుత్వమే చూడాలనే జానకి విజ్ఞప్తిపై కేరళ హైకోర్ట్ ఎలా స్పందించింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: బాగా చూసుకుంటా.. కిరణ్ అబ్బవరం గురించి భార్య పోస్ట్)JSK – Janaki V/s State of Kerala is now streaming on ZEE5. A powerful courtroom drama where truth takes the spotlight. Watch it now in Telugu! 🎬⚖️Don’t miss it!"#JanakiVsStateOfKeralaOnZEE5@TheSureshGopi @anupamahere @jsujithnair @DreamBig_film_s#PravinNarayanan pic.twitter.com/375xPZL7lm— ZEE5 Telugu (@ZEE5Telugu) August 22, 2025 -
'వార్ 2' చూడలేదు.. 'కూలీ'కి వెళ్దామంటే ఓకే చెప్పాను: నారా రోహిత్
నారా రోహిత్ హీరోగా నటించిన 'సుందరకాండ' చిత్రం ఆగస్టు 27న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తన మూవీ ప్రమోషన్స్ కోసం ఆయన పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కూలీ, వార్2 సినిమాలు చూశారా..? ఎలా ఉన్నాయంటూ ఆయన్ను ప్రశ్నించారు. ఈ సందర్భంలో రోహిత్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఎన్టీఆర్ సినిమా విడుదలైతే తప్పకుండా తన కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ అభిమానులు చూస్తారు. అయితే, కొంత కాలంగా తారక్ను నందమూరి, నారా ఫ్యామిలీలు దూరంగానే ఉంచుతూ వస్తున్నాయి. వార్ 2 మూవీ విడుదల సమయంలో తారక్పై టీడీపీ ఎమ్మెల్యేనే భూతులతో విరుచుకుపడ్డాడు. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో వార్2 సినిమా చూశారా అని 'నారా రోహిత్'ని ప్రశ్నించారు. అందుకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. 'వార్ 2 సినిమా చూడలేదు. మా గ్యాంగ్ అంతా కూలీ సినిమా చూద్దాం అన్నారు. అప్పుడు నేనూ కూడా 'కూలీ' కోసమే వెళ్లాను. సినిమా అక్కడక్కడ నచ్చింది. ఓవరాల్గా పర్వాలేదు. వార్2 చూడలేదు. కానీ, సమయం దొరికితే తప్పకుండా చూస్తాను.' అని అన్నారు. అయితే, ఇక్కడ నారా రోహిత్ను నెటిజన్లు తప్పుబడుతున్నారు. మొదట కుటుంబ సభ్యుల సినిమాకు ప్రాధాన్యత ఇవ్వాలి కదా అంటూ ప్రశ్నిస్తున్నారు.తారక్తో తనకు మంచి స్నేహం ఉందని నారా రోహిత్ (Nara Rohith) అన్నారు. ఎక్కడైనా తాము ఎదురైతే మంచిగానే మాట్లాడాతుమాన్నారు. కానీ, పెద్దగా ఫోన్స్లలో మాట్లాడుకోవడం వంటివి మాత్రం లేవన్నారు. -
బాగా చూసుకుంటా.. కిరణ్ అబ్బవరం గురించి భార్య పోస్ట్
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం 'కె ర్యాంప్', 'చెన్నై లవ్ స్టోరీ' అనే సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్గానే తండ్రిగానూ ప్రమోషన్ పొందాడు. గతేడాది ఆగస్టులో పెళ్లి జరగ్గా.. ఏడాదిలోనే తండ్రి అయిపోయాడు. ఈ క్రమంలోనే పెళ్లిరోజు రావడంతో భార్యకు విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టాడు. అలానే కిరణ్ భార్య రహస్య కూడా పోస్ట్ పెట్టింది. కానీ పెళ్లి నాటి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.(ఇదీ చదవండి: అనుపమ 'పరదా' సినిమా రివ్యూ)కిరణ్-రహస్య ప్రేమ వివాహాం చేసుకున్నారు. 'రాజావారు రాణిగారు' సినిమాతో వీళ్లిద్దరూ టాలీవుడ్కి పరిచమయ్యారు. తర్వాత కిరణ్ వరస చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకోగా.. రహస్య మాత్రం నటన పక్కనబెట్టేసి ఉద్యోగం చేసుకుంది. స్నేహితులుగా మొదలైన వీళ్ల పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్ల పాటు రహస్యంగా ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో గతేడాది ఆగస్టు 22న పెళ్లి చేసుకున్నారు.ఈ క్రమంలోనే తొలి పెళ్లిరోజు సందర్భంగా కిరణ్ భార్య రహస్య పోస్ట్ పెట్టింది. 'పెళ్లికి సరిగ్గా గంటముందు నాకు చాలా ఆందోళనగా ఉంది. నా గుండె గట్టిగా కొట్టుకుంటోంది. అప్పుడు నా దగ్గరికి వచ్చిన కిరణ్ ఈ నోట్ ఇచ్చాడు. దీంతో ప్రశాంతంగా ధైర్యంగా అనిపించింది. ఏం జరిగినా సరే ఇతడు చూసుకుంటాడులే అనిపించింది. ఇదే నాకు దక్కిన బెస్ట్ గిఫ్ట్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ కిరణ్ అబ్బవరం' అని రహస్య రాసుకొచ్చింది. ఈమె షేర్ చేసిన ఫొటోలు.. కిరణ్ 'నన్ను భర్తగా కోరుకున్నందుకు థ్యాంక్యూ. నా జీవితంలోకి స్వాగతం. బాగా చూసుకుంటా' అని రాసిచ్చిన నోట్ చూడొచ్చు.(ఇదీ చదవండి: మంచు విష్ణు డేర్.. రూ. 100 కోట్ల పెట్టుబడితో బిగ్ ప్లాన్) View this post on Instagram A post shared by Rahasya Gorak (@rahasya_kiran) View this post on Instagram A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram) -
చిరంజీవి- అనిల్ రావిపూడి సినిమా టైటిల్ ఇదే (గ్లింప్స్)
చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న చిత్రం టైటిల్ను ప్రకటించారు. నేడు మెగాస్టార్ బర్త్డే సందర్బంగా టైటిల్ గ్లింప్స్ను విడుదల చేశారు. 'మన శంకరవరప్రసాద్ గారు' అనే టైటిల్ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఆపై పండగకి వస్తున్నారు అంటూ ఒక ట్యాగ్లైన్ ఇచ్చారు. చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్తో ఈ చిత్రం పేరు ముడిపడేలా ఉండటంతో అభిమానులో సంతోషిస్తున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతుంది.చిరంజీవికి జంటగా లేడీ సూపర్స్టార్ నయనతార నటిస్తుంది. ఈ సినిమా భార్యాభర్తల రిలేషన్పై ఆధారంగా ఉంటుందని అనిల్ రావిపూడి గతంలో అన్నారు. దీనిలో 70 శాతం కామెడీ, 30 శాతం ఎమోషనల్ డ్రామా ఉంటుందన్నారు. చిరంజీవిని ఇటీవలి కాలంలో ఎవరూ చూపించని కొత్త లుక్లో ప్రజెంట్ చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. -
కారులో కూర్చుని ఏడ్చేశా..: అనుపమ పరమేశ్వరన్
‘‘సినిమా అంటే ఒక సెలబ్రేషన్. కమర్షియాలిటీ కూడా. అయితే ఈ తరహా చిత్రాలతో పాటు ఒక్కొక్కసారి మనల్ని ఆలోచింపజేసే ‘పరదా’లాంటి చిత్రాలు కూడా రావాలి. ‘పరదా’ చాలా కొత్త కథ. నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశాం. ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఫ్యామిలీస్తో కలిసి చూడాల్సిన సినిమా ఇది’’ అని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) అన్నారు. అనుపమ సంగతులుఅనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, సంగీత, దర్శన, రాజేంద్రప్రసాద్, రాగ్ మయూర్ ఇతర కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పరదా’. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ మేకర్స్ రాజ్ అండ్ డీకే సపోర్ట్తో ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకరుల సమావేశంలో అనుపమా పరమేశ్వరన్ చెప్పిన సంగతులు. కనెక్ట్ అయ్యా..‘పరదా’లాంటి కథలు తెలుగులోనే కాదు... భారతీయ సినిమాలోనూ చాలా అరుదు. ఈ తరహా ఫ్రెష్ కాన్సెప్ట్తో కూడిన కథ నా దగ్గరకు రాలేదు. అందుకే దర్శకుడు ప్రవీణ్ కథ చెప్పినప్పుడు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. ఒక అమ్మాయి మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలదు. ‘పరదా’ ఒక బోల్డ్ అటెంప్ట్. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఎవరైనా ఒక్క సెకండ్ ఆలోచించగలిగినా అది సక్సెస్గా భావిస్తాను. సవాల్గా తీసుకున్నా..ఈ చిత్రంలో చాలావరకు నేను పరదా ధరించిన సన్నివేశాల్లోనే కనిపిస్తాను. కొన్ని సీన్స్లో సైలెంట్గానే ఉంటాను. అయితే నా పరదా వెనక నా క్యారెక్టర్ తాలూకు భావోద్వేగం కనిపిస్తుంది. నా కళ్లతో, నా బాడీ లాంగ్వేజ్, నా వాయిస్తో నేను నటించగలిగానని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఓ సవాల్గా తీసుకుని ఈ సినిమా చేశాను. ‘పరదా’ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కారులో కూర్చుని ఏడ్చేశా..నిజానికి నేను స్విచ్చాన్, స్విచ్చాఫ్ యాక్టర్ని. అయితే ‘పరదా’ మాత్రం వెంటాడింది. నా పాత్రకు ఆత్మహుతి సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీన్లో వచ్చే మ్యూజిక్ అవన్నీ నన్ను కదిలించేశాయి. కారులో కూర్చుని ఏడ్చేశాను. సోషల్ మీడియాలో ‘పరదా’ సినిమా పురుషులకు కాస్త వ్యతిరేకంగా ఉందన్నట్లుగా ఎవరో పోస్ట్ చేశారు. అది చూసి బాధగా అనిపించింది. కానీ ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ఏదైనా మనం చూసే దృష్టి కోణాన్ని బట్టి ఉంటుంది. విద్యాబాలన్పై ముద్రఓ హీరోయిన్ నటించిన ఫ్లాప్ అయితే ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తారు. గతంలో మోహన్లాల్గారితో విద్యాబాలన్గారు చేయాల్సిన సినిమా ఒకటి ఇలాంటి కారణం (ఐరన్ లెగ్) వల్లే క్యాన్సిల్ అయ్యిందట. ఆ తర్వాత విద్యాబాలన్ చేయాల్సిన తొమ్మిది సినిమాల నుంచి ఆమెను తప్పించారట. ఇది ఎంతవరకు కరెక్ట్?అదెందుకు పట్టించుకోరు?‘పరదా’లో డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. ‘డీజే టిల్లు 2’ సినిమాలో మరో విభిన్నమైన పాత్ర చేశాను. ‘డీజే టిల్లు 2’లో నేను గ్లామరస్గా కనిపించిన విషయాన్నే మాట్లాడుతున్నారు. కానీ, అందులో నేను గన్ పట్టుకుని, యాక్షన్ చేశాను. కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశాను. ఈ అంశాలు హైలైట్ కావడం లేదు. ఏదైనా మనం ఆలోచించేదాన్ని బట్టి ఉంటుంది.చదవండి: వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్.. చిరుకు అల్లు అర్జున్ బర్త్డే విషెస్ -
వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్.. చిరుకు అల్లు అర్జున్ బర్త్డే విషెస్
మెగాస్టార్ చిరంజీవి (Konidela Chiranjeevi) నేడు (ఆగస్టు 22న) 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తన డ్యాన్స్, స్టైల్, యాక్టింగ్, యాక్షన్తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఏడు పదుల వయసులోనూ తగ్గేదేలే అంటూ యాక్షన్కు సై అంటున్నారు. అలాంటి మెగాస్టార్కు సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు.వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్తాజాగా అల్లు అర్జున్ (Allu Arjun).. తన మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవిగారికి హ్యాపీ బర్త్డే అని ట్వీట్ చేశాడు. దీనికి చిరుతో కలిసి డ్యాన్స్ చేస్తున్న ఫోటో జత చేశాడు. మెగాస్టార్పై తనకున్న అభిమానం, గౌరవాన్ని ఇలా ట్వీట్ రూపంలో వ్యక్తం చేశాడు బన్నీ. వెంకటేశ్, సాయిదుర్గ తేజ్, తేజ సజ్జా, నారా రోహిత్.. ఇలా తదితరులు మెగాస్టార్కు సామాజిక మాధ్యమాల్లో బర్త్డే విషెస్ చెప్పారు. Happy Birthday to our one and only Mega Star Chiranjeevi garu. ⭐️ @KChiruTweets pic.twitter.com/0n9veF0l9X— Allu Arjun (@alluarjun) August 22, 2025 Happy Birthday, dear @KChiruTweets! Wishing you abundant health, happiness, and many more wonderful years ahead✨ pic.twitter.com/5QO1ZKOpgj— Venkatesh Daggubati (@VenkyMama) August 22, 2025 View this post on Instagram A post shared by Teja Sajja (@tejasajja123) Happiest b’day to the one & only Megastar @KChiruTweets garu ❤️🎊 A true crowd-puller & legend who inspires on & off screen 😊 Best wishes for #Vishwambhara, #Mega157 & all upcoming projects 🔥 #HBDMegastarChiranjeevi pic.twitter.com/qj7XBFHSz7— Vijaya Durga Productions (@VijayaDurgaProd) August 22, 2025 చదవండి: నా కూతురి ఆరోగ్యం కోసం రోజూ ఈ ఫుడ్ తప్పనిసరి: ఉపాసన -
మంచు విష్ణు డేర్.. రూ. 100 కోట్ల పెట్టుబడితో బిగ్ ప్లాన్
'కన్నప్ప' (Kannappa) సినిమాను నిర్మించడం కోసం మంచు విష్ణు పెద్ద సాహసమే చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా ఆయన రూ. 100 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కొద్దిరోజుల క్రితమే విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ సాధించలేకపోయింది. ఈ క్రమంలో మంచు విష్ణు మరో అడుగు ముందుకువేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఒక ప్రాజెక్ట్ కోసం ఆయన ఏకంగా రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.కన్నప్ప విజయం తర్వాత నటుడు, నిర్మాత విష్ణు మంచు మళ్ళీ వార్తల్లో నిలుస్తున్నారు. అతను మైక్రోడ్రామాలలో రూ. 100 కోట్లు పెట్టుబడి పెడుతున్నారని ఇండస్ట్రీ వర్గలు చెబుతున్నాయి. విష్ణు తన సొంత డబ్బుతో పాటు కొందరి భాగస్వామ్యంతో వినోద రంగంలో సంచలనానికి తెరలేపనున్నారు. ఈ వార్త టాలీవుడ్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.మైక్రోడ్రామాలు అంటే ఏమిటి?మైక్రోడ్రామాలు అంటే చిన్న పరిమాణంలో, తక్కువ వ్యవధిలో, పరిమిత పాత్రలతో, గాఢమైన భావోద్వేగాలను వ్యక్తపరచే నాటకాలు. ఇవి సాధారణంగా 1 నుంచి 10 నిమిషాల వ్యవధిలో ఉంటాయి. ఒకే సంఘటన లేదా భావన చుట్టూ తిరుగుతాయి. సాధారణ సోషల్ మీడియా రీల్స్ మాదిరిగా కాకుండా.. ఈ కథలు ప్రొఫెషనల్ దర్శకత్వంతో పాటు అధిక-నాణ్యత నిర్మాణం ఆపై బలమైన కథ చెప్పడం వంటి అంశాలతో ఉంటాయి. విష్ణు కొత్త ప్రాజెక్ట్ భారతీయ వినోదంలో అందరి దృష్టిని తనవైపు తిప్పుకునేలా చేయనున్నాడని కొందరు అంటున్నారు. విష్ణు నిర్ణయం వల్ల నటన, రచన, దర్శకత్వం వంటి అంశాల్లో కొత్త వారికి భారీగా ఛాన్సులు దొరుకుతాయి. ఆపై కంటెంట్ కూడా ఎక్కువగా సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు ఉటుందని కొందరు చెబుతున్నారు. ఇది భారతీయ వినోద రంగంలో గేమ్-చేంజర్ అవుతుందని భావిస్తున్నారు. -
బిగ్బాస్ విన్నర్ ఇంటిపై కాల్పులు.. ఎన్కౌంటర్లో నిందితుడు అరెస్ట్
హిందీ బిగ్బాస్ ఓటీటీ సీజన్-2 విజేత ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) ఇంటిపై కొద్దిరోజుల క్రితం గుర్తు తెలియని ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. సుమారు 24 బుల్లెట్లు ఆయన ఇంటిలోకి దూసుకెళ్లాయి. ఆ సమయంలో ఎల్విష్ యాదవ్ ఇంట్లో లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే, తాజాగా ఆ కాల్పులకు తెగబడిన వారిలో ఒకరిపై పోలీసులు ఎన్కౌంటర్ జరిపారు.గురుగ్రామ్లో ఉన్న ఎల్విష్ యాదవ్ ఇంటిపై కాల్పులకు పాల్పడింది ఇషాంత్ అలియాస్ ఇషు గాంధీ (19)గా పోలీసులు గుర్తించారు. ఫరీదాబాద్లోని జవహర్ కాలనీకి చెందిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో అతని సమాచారం అందడంతో అతని కదలికలపై నిఘా పెట్టారు. నీరజ్ ఫరీద్ పురియా ముఠాతో అతనికి సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. ఆ గ్యాంగ్లోని కొందరిని కలిసేందుకు ఇషాంత్ వెళ్తుండగా పోలీసులు వెంబడించారు. దీంతో పోలీసు బృందంపై ఆటోమేటిక్ పిస్టల్తో ఇషాంత్ కాల్పులు జరిపాడు. ఆ సమయంలో పోలీసుల టీమ్ కూడా అతని కాలిపై గన్తో కాల్చడంతో కిందపడిపోయాడు. గాయాలతో ఉన్న ఇషాంత్ను అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు. ఆపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. -
నా కూతురి ఆరోగ్యం కోసం రోజూ ఈ ఫుడ్ తప్పనిసరి: ఉపాసన
రామ్ చరణ్, ఉపాసన ముద్దల కూతురు క్లీంకార ఎలా ఉంటుందో చూడాలని ఇప్పటికీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే, ఆమె ముఖం కనిపించకుండా తీసిన ఫొటోల్ని ఇన్స్టాలో ఉపాసన పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఏదైన పండుగ లేదా ఇంట్లో శుభకార్యం ఉంటే ఆ విశేషాలతో పాటు తమ కూతురి ఫోటోలను అభిమానులతో ఉపాసన షేర్ చేస్తారు. ఈసారి క్లీంకార తీసుకునే ఆహారం గురించి ఉపాసన చెప్పారు. రోజూ తన డైట్లో ఒక పదార్థం తప్పనిసరిగా ఉంటుందని తెలిపారు.క్లీంకార రోజూ తీసుకునే డైట్లో 'రాగులు' తప్పకుండా ఉంటాయని ఉపాసన ఇలా చెప్పారు.' రాగులతో తయారు అయిన ఆహార పదార్థాలు ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నప్పట్నుంచి నాకు చాలా ఇష్టమైన ఆహారం కూడా ఇదే. దీంతో క్లీంకారకు కూడా దీనినే అలవాటు చేశాను. సద్గురు జగ్గీ వాసుదేవ్ కూడా నాతో ఒకసారి మాట్లాడుతూ.. క్లీంకారకు రోజూ రాగుల్ని ఏదో రూపంలో అందించమని సూచించారు. ఆయన కూతరు రాధే జగ్గీ కూడా ఇదే మాట చెప్పింది. తను కూడా చిన్నప్పట్నుంచీ రాగి జావ తాగేదానినని పేర్కొంది. అందికే వారిద్దరూ ఫిట్గా ఉన్నారు. భవిష్యత్లో నా కూతురు కూడా హెల్దీగా ఉండాలని తన రోజువారి డైట్లో రాగుల్ని చేర్చాను' అంటూ ఆమె చెప్పారు. అయితే, వైద్యుల సలహాలు మాత్రం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. మోతాదుకు మించకుండా ఉపయోగించాలని లేదంటే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయిని తెలిపారు. చిన్నపిల్లల వైద్య నిపుణుల సలహా తీసుకున్నాకే రాగుల్ని అలవాటు చేయడం మంచిదని నిపుణులు కూడా సూచిస్తున్నారు. -
సంచలన దర్శకుడు, నటుడితో 'కీర్తి సురేష్' సినిమా
నటి కీర్తి సురేష్ చిన్న బ్రేక్ తర్వాత మళ్లీ నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇంతకుముందు పలు భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన బ్యూటీ, తమిళంలో మంచి విజయాన్ని సాధించిన తెరి చిత్ర హిందీ రీమేక్తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె అక్కడ బేబీ జాన్గా విడుదలైన ఆ చిత్రంతో మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. అయితే హిందీలో మరో అవకాశం మాత్రం రాలేదు. అదే సమయంలో తన చిరకాల మిత్రుడిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత ఏ భాషలోనూ మరో చిత్రంలో నటించలేదు. ఇది ఆమె కావాలని తీసుకున్న బ్రేకా లేక అవకాశాలు రాక అన్నది తెలియదు గానీ, సామాజిక మాధ్యమాల్లో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ప్రత్యేకంగా ఫొటో సెషన్ ఏర్పాటు చేసుకుని మరి అందమైన ఫోటోలను తీయించుకొని వాటిని సామాజిక మాధ్యమాలలో విడుదల చేస్తూ అభిమానుల్ని ఆనంద పరుస్తున్నారు. కాగా తాజాగా తమిళంలో కొత్త చిత్రానికి కమిట్ అయినట్లు సమాచారం. విశేషం ఏమిటంటే సంచలన దర్శకుడు, నటుడు మిష్కిన్తో కలిసి ఈ కొత్త చిత్రంలో నటించడానికి కీర్తి సురేష్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే, ఈ చిత్రానికి ఆయన కథ మాత్రమే అందించడమే కాకుండా కీర్తి సురుష్తో కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది. డిటెక్టివ్, పిశాచి వంటి హిట్ సినిమాలకు దర్శకుడిగా ఆయన పనిచేశారు. రీసెంట్గా వచ్చిన డ్రాగన్ సినిమాలో ప్రోఫెసర్గా మిస్కిన్ నటన తెలుగువారికి కూడా నచ్చింది.ఆపై చాలా సినిమాల్లో నటుడిగా మెప్పించారు. కాగా వారిద్దరి కలిసి నటించనున్న క్రేజీ చిత్రానికి దర్శకుడు ఎవరు ? కథ ఎలా ఉంటుంది? ఏ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించనుంది, ఇతర నటీనటులు సాంకేతిక వర్గం ఎవరు ? వంటి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉందన్నారు. కాగా ఈ భామ ఇంతకుముందే నటించడానికి అంగీకరించిన రివాల్వర్ రీటా, కన్నివెడి చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఈ రెండు ఉమెన్ సెంట్రిక్ కథాచిత్రాలు అన్నది గమనార్హం. -
యాక్షన్ షురూ..రీ ఎంట్రీకి రెడీ అయిన స్టార్స్
‘యాక్టింగ్ అనేది ఎడిక్షన్’లాంటిది అని చాలామంది స్టార్స్ అంటుంటారు. అందుకే లైట్స్ ఆన్, స్టార్ట్ కెమెరా, టేక్... ఈ మాటలకు దూరం కావాలని అనుకోరు. అవకాశాలు వచ్చినంతవరకు, ఓపిక ఉన్నంతవరకు నటించాలనుకుంటారు. అఫ్కోర్స్ కొంతమంది సినిమాలకు దూరంగా వెళ్లిపోతారనుకోండి. అయితే ఆ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఇక వ్యక్తిగత కారణాల వల్ల సిల్వర్ స్క్రీన్కి దూరమై, ఆ తర్వాత పరిస్థితులు అనుకూలించినప్పుడు రీ ఎంట్రీకి రెడీ అయిపోతారు కొందరు స్టార్స్. అలా ఈ ఏడాది ఇప్పటికే ఒకప్పటి కథానాయికలు తెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్లుగా రీ ఎంటర్ అయ్యారు. మరికొందరు స్టార్స్ ‘యాక్షన్ షురూ’ అంటూ రీ ఎంట్రీకి రెడీ అయిపోయారు. ఆ విశేషాలు తెలుసుకుందాం.తొమ్మిదేళ్ల తర్వాత... వడ్డే నవీన్ పేరు తలచుకోగానే 20 ఏళ్ల క్రితం నాటి ప్రేక్షకులకు గుర్తొచ్చే పాట ‘జాబిలమ్మ నీకు అంత కోపమా...’. నవీన్ హీరోగా నటించిన రెండో చిత్రం ‘పెళ్లి’లోని పాట ఇది. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నిజానికి ‘క్రాంతి’ అనే సినిమా ద్వారా నవీన్ హీరోగా పరిచయం కావాల్సింది. అయితే ఆ సినిమా ఆగిపోవడంతో ‘కోరుకున్న ప్రియుడు’ (1996) ద్వారా హీరోగా సిల్వర్ స్క్రీన్కి పరిచయం అయ్యారు. ఆ తర్వాత 2016 వరకూ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు. అది కూడా 2010 తర్వాత ఆరేళ్లకు ‘ఎటాక్’ (2016) చిత్రంలో విలన్గా నటించారు నవీన్. ఇప్పుడు తొమ్మిదేళ్లకు ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చిత్రంతో మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. కాగా గతంలో వడ్డే నవీన్ తండ్రి వడ్డే రమేశ్ నిర్మాతగా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ఇప్పుడు రీ ఎంట్రీలో వడ్డే క్రియేషన్స్ బేనర్ ఆరంభించి, టైటిల్ రోల్ చేయడంతో పాటు ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు వడ్డే నవీన్. కమల్ తేజ నార్ల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ‘ప్రేమ దేశం’ హీరో ఎంట్రీ ‘ప్రేమ దేశం’ (1996) ఎవర్ గ్రీన్ లవ్స్టోరీ మూవీ. ఈ సినిమాలో హీరోలుగా నటించిన వినీత్, అబ్బాస్ కెరీర్స్కి బ్లాక్ బస్టర్ మూవీ ఇదే అని చె΄÷్పచ్చు. ఇక హీరోయిన్ టబుకి ఈ సినిమా స్పెషల్. ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకూ అంటే... ఈ చిత్రం తర్వాత పలు చిత్రాల్లో నటించిన అబ్బాస్ 2014లో ‘అలా జరిగింది ఒక రోజు’ సినిమా తర్వాత తెలుగులో కనిపించలేదు. అటు తమిళ్, మలయాళం వంటి ఇతర భాషల్లోనూ సినిమాలు చేయలేదు. ఇప్పుడు పదకొండేళ్లకు అబ్బాస్ రెండు తమిళ చిత్రాలు అంగీకరించారు. ఒకటి శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ‘పరాశక్తి’, మరొకటి జీవీ ప్రకాశ్కుమార్ హీరోగా రూపొందుతున్న సినిమా. ఇలా రీ ఎంట్రీలో రెండు సినిమాలు అంగీకరించిన అబ్బాస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీ అవుతారని ఊహించవచ్చు. కమ్బ్యాక్లోనూ హీరోయిన్గా... 2002లో ప్రభాస్ హీరోగా పరిచయమైన ‘ఈశ్వర్’ చిత్రం ద్వారానే హీరోయిన్గా పరిచయం అయ్యారు ప్రముఖ క్యారెక్టర్ నటుడు విజయ్కుమార్ కుమార్తె శ్రీదేవి. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన శ్రీదేవి ‘వీర’ (2011) సినిమా తర్వాత టాలీవుడ్లో కనిపించలేదు. వేరే భాషల్లోనూ సినిమాలు చేయలేదు. కన్నడంలో మాత్రం 2016లో ‘లక్ష్మణ’ చిత్రంలో నటించారు. ఇక ఈ ఏడాది ‘సుందరకాండ’ చిత్రంతో శ్రీదేవి తెలుగు తెరపై మళ్లీ కనిపించనున్నారు. నారా రోహిత్ హీరోగా వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. అయితే విశేషం ఏంటంటే... ఈ కమ్బ్యాక్లోనూ ఆమె హీరోయిన్గానే నటించారు. ఇక మధ్యలో సినిమాలకు బ్రేక్ తీసుకోవడానికి కారణం పెళ్లి. 2009లో నిజామాబాద్కి చెందిన వ్యాపారవేత్త రాహుల్తో శ్రీదేవి పెళ్లి జరిగింది. ఆ తర్వాత పాప పుట్టింది. పాపని చూసుకోవడానికి సినిమాలకు బ్రేక్ తీసుకున్న శ్రీదేవి టీవీ షోస్లో మాత్రం కనిపించారు. ఇక వరుసగా సినిమాల్లోనూ నటించాలనుకుంటున్నారు. 28 ఏళ్లకు... ‘బంగారు కోడి పెట్ట వచ్చెనండి’... పాట ఇప్పటికీ పాపులర్. ‘ఘరానా మొగుడు’ (1992) సినిమాలోని ఈ స్పెషల్ సాంగ్కి చిరంజీవితో కలిసి డిస్కో శాంతి వేసిన స్టెప్స్ మాస్ని ఓ రేంజ్లో ఉర్రూతలూగించాయి. స్పెషల్ సాంగ్స్లో శాంతి ఎనర్జిటిక్ డ్యాన్స్ ఆమెకు ‘డిస్కో’ శాంతి అని పేరు తెచ్చింది. డిస్కో డ్యాన్స్ అదరగొట్టిన శాంతి పలు చిత్రాల్లో కొన్ని కీలక పాత్రలు కూడా చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ... ఇలా పలు భాషల్లో దాదాపు 900 చిత్రాలు చేశారు శాంతి. 1996లో నటుడు శ్రీహరిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టారు. 1997 తర్వాత ఆమె తెరపై కనిపించలేదు. ఇద్దరు కుమారుల ఆలనా పాలనా చూసుకుంటూ శ్రీహరితో చక్కని జీవితాన్ని చవి చూశారు శాంతి. 2013లో శ్రీహరి చనిపోయాక బయట కనిపించడం మానేశారామె. ఇప్పుడు 28 ఏళ్లకు మళ్లీ సిల్వర్ స్క్రీన్పై కనిపించనున్నారు శాంతి. లారెన్స్, ఆయన తమ్ముడు ఎల్విన్ లీడ్ రోల్స్లో నటిస్తున్న ‘బుల్లెట్ బండి’ చిత్రంలో శాంతి ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె జోస్యం చెప్పే పాత్రలో కనిపిస్తారని టీజర్ స్పష్టం చేస్తోంది. ఇన్నాసి పాండియన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కదిరేశన్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. పుష్కరకాలం పూర్తయ్యాక... ‘నరసింహుడు, జై చిరంజీవ, అశోక్’ వంటి చిత్రాల్లో కథానాయికగా నటించి, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ (2012)లో స్పెషల్ సాంగ్ చేశారు సమీరా రెడ్డి. ఆ తర్వాత తెలుగులో కనిపించలేదు. ఎక్కువగా హిందీ చిత్రాల్లో నటించిన సమీరా 2013లో చేసిన కన్నడ చిత్రం ‘వరద నాయక’ తర్వాత పూర్తిగా సిల్వర్ స్క్రీన్కి దూరం అయ్యారు. 2014లో అక్షయ్ వర్దేని పెళ్లి చేసుకుని, ఒక బాబు, పాపకి జన్మనిచ్చారామె. కుటుంబం కోసం నటనకు కాస్త బ్రేక్ ఇచ్చారు. పిల్లలు కాస్త పెద్దవాళ్లు కావడం, సమీరా గతంలో నటించిన ‘రేస్’ మూవీ చూసి, ఆమె కుమారుడు ఎందుకు సినిమాలు చేయడంలేదని అడగడంతో ఆమె రీ ఎంట్రీకి రెడీ అయ్యారు. ప్రస్తుతం హిందీలో ‘చిమ్నీ’ అనే హారర్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు సమీరా. పుష్కర కాలం పూర్తయ్యాక కెమెరా ముందుకు రావడం ఏదో కొత్తగా అనిపించిందని, టెక్నాలజీలో, సినిమా టేకింగ్లో వచ్చిన మార్పులు స్పష్టంగా కనిపించాయని సమీరా పేర్కొన్నారు. ‘చిమ్నీ’లో తన కుమార్తెను ఆవహించిన దుష్ట శక్తితో పోరాడి, కాపాడుకునే కాళీ అనే తల్లి పాత్ర చేస్తున్నారు సమీరా. కాగా ఈ చిత్రంలో సమీరా యువ పెళ్లికూతురు, తల్లి, 60 ఏళ్ల వృద్ధురాలు... ఇలా మూడు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారు. కమ్బ్యాక్కి ఇది సరైన పాత్ర అని భావిస్తున్నారామె. గగన్ పురి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే... గత ఏడాది సమీరా రెడ్డి ‘నామ్’ అనే హిందీ చిత్రంలో కనిపించారు. అయితే 2004లో షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రం పలు సమస్యల వల్ల 20 ఏళ్లకు విడుదలైంది. ముందుగా చిన్ని తెరపై... 1990లలో హీరోయిన్గా పరిచయమై దాదాపు పదేళ్లకు పైగా గ్లామరస్ స్టార్గా ఓ వెలుగు వెలిగారు రంభ. ప్రత్యేక పాటల్లోనూ ఆమె ఆకట్టుకున్నారు. 2008 తర్వాత తెలుగులో, 2010 తర్వాత తమిళంలో బ్రేక్ తీసుకున్నారు రంభ. కెనడాలో స్థిరపడ్డ శ్రీలంకన్ తమిళ వ్యాపారవేత్త ఇంద్రకుమరన్ని 2010లో ప్రేమ వివాహం చేసుకున్నారు రంభ. ఆ తర్వాత భర్తతో కలిసి టొరెంటోలో సెటిలయ్యారామె. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. పిల్లల కోసం కెరీర్కి బ్రేక్ ఇచ్చిన రంభ ఇప్పుడు రీ ఎంట్రీకి రెడీ అయ్యారు. అయితే పెద్ద తెరపై కనిపించే ముందు చిన్ని తెరపై గెస్ట్గా కనిపించారామె. జీ తెలుగులో ప్రసారమైన ఓ రియాలిటీ షోలో అతిథిగా మెరిశారు రంభ. ఆ షోలో దక్కిన ఆదరణ చూసి తనకు చాలా ఆనందం అనిపించిందని ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారామె. పిల్లలు పెద్దవాళ్లు కావడంతో మళ్లీ కెమెరా ముందుకు రావాలనుకుంటున్నానని మనసులో మాటని బయటపెట్టారు. కాగా.. రంభకు కొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయట. రీ ఎంట్రీలో తాను చేయనున్న తొలి సినిమా గురించి అధికారికంగా ప్రకటిస్తానని అంటున్నారామె. మరి... తెలుగు అమ్మాయి రంభ ఎంట్రీ తెలుగు చిత్రంతోనా లేక వేరే భాషలోనా? అనేది వేచి చూడాల్సిందే. ఒకప్పటి తారలు కొంత బ్రేక్ తర్వాత మళ్లీ తెరపై కనిపిస్తే వారి అభిమానులకు మాటల్లో చెప్పలేనంత ఆనందం కలగడం సహజం. ఈ స్టార్స్ రీ ఎంట్రీ పట్ల ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ఈ తారలు మాత్రమే కాదు... ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన మరికొందరు స్టార్స్ కూడా రీ – ఎంట్రీకి రెడీ అవుతున్నారు. 2025లో రీ ఎంట్రీ అయిన తారలు వీరే → అర్చన పేరు వినగానే 1980–1990ల ప్రేక్షకులకు తులసి అనే గిరిజన యువతి గుర్తొస్తుంది. ‘నిరీక్షణ’ చిత్రంలో అర్చన ఆ పాత్రలో ఎంతలా ఒదిగిపోయారో చూసినవాళ్లకు తెలుసు. ఈ సహజ నటి తెలుగు తెరపై కనిపించి, 2022కి దాదాపు పాతికేళ్లయింది. ‘చోర్ బజార్’ (2022) చిత్రంతో క్యారెక్టర్ నటిగా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత మూడేళ్లకు ఈ ఏడాది ‘షష్టిపూర్తి’ చిత్రంలో రాజేంద్రప్రసాద్కి జోడీగా నటించారామె. విశేషం ఏంటంటే... 37 ఏళ్ల తర్వాత రాజేంద్రప్రసాద్–అర్చన కలిసి నటించిన చిత్రం ఇది. హిట్ మూవీ ‘లేడీస్ ట్రైలర్’లో జంటగా నటించిన ఈ ఇద్దరూ మళ్లీ ‘షష్టిపూర్తి’లో నటించారు. → దాదాపు పదేళ్లకు ఈ ఏడాది రాశి వెండితెరపై కనిపించిన చిత్రం ‘ఉసురే’. తమిళ్, తెలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఈ సినిమాలో కనిపించక ముందు 2020 నుంచి 2023 వరకూ రాశీ ‘గిరిజా కల్యాణం’, ‘జానకి కలగనలేదు’ సీరియల్స్లో నటించారు. → ‘గుండెల్లో ఏముందో...’ అంటూ ‘మన్మథుడు’ (2002) లో ఓ కథానాయికగా నాగార్జునతో ఆడి పాడిన అన్షు అప్పట్లో చాలా పాపులర్ అయ్యారు. అయితే ఆ తర్వాత రెండు మూడు చిత్రాల్లో నటించి, విదేశాలకు వెళ్లిపోయారు. 23 ఏళ్లకు మళ్లీ ఆమె సిల్వర్ స్క్రీన్పై కనిపించిన చిత్రం ‘మజాకా’. సందీప్ కిషన్ హీరోగా రూపొందిన ఈ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో అన్షు రీ ఎంట్రీ హాట్ టాపిక్ కాలేదు. → హోమ్లీ హీరోయిన్ లయకి కూడా రీ ఎంట్రీ పెద్దగా కలిసి రాలేదు. దాదాపు 20 ఏళ్లకు ‘తమ్ముడు’ సినిమాతో ఆమె రీ ఎంట్రీ జరిగింది. ఈ చిత్రంలో హీరో నితిన్కి అక్కగా నటించారు లయ. ఈ చిత్రం అంచనాలు అందుకోలేపోయింది. → ఇక ‘బొమ్మరిల్లు’ చిత్రంలో చేసిన పాత్ర పేరు (హాసిని)తో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన జెనీలియా ఈ ఏడాది తెలుగులో ‘జూనియర్’ చిత్రంతో పదమూడేళ్లకు మళ్లీ తెరపై కనిపించారు. ఈ సినిమా కూడా అంచనాలు అందుకోలేక పోయింది. అటు బాలీవుడ్లో కీలక పాత్రలు చేస్తున్నారు జెనీలియా. ఇలా రీ ఎంట్రీలో ఒకప్పటి ఈ ఐదుగురు కథానాయికలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కనిపించి, తమ నటనతో ఆకట్టుకున్నారు. అయితే ఈ నలుగురూ చేసిన సినిమాలు ఆశించిన ఫలితాన్నివ్వకపోవడం ఓ చేదు అనుభవంగా చెప్పొచ్చు.– డి.జి.భవాని -
సినీ కార్మికుల సమ్మెకు తెర
సాక్షి, హైదరాబాద్: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కార్మికుల సమ్మెకు ఎట్టకేలకు తెరపడింది. కార్మికుల వేతనాలు 30 శాతం పెంచాలంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 4 నుంచి కార్మికులు సమ్మె చేస్తుండటం తెలిసిందే. కార్మికశాఖ కార్యాలయంలో కార్మికశాఖ అదనపు కమిషనర్ గంగాధర్ ఆధ్వర్యంలో గురువారం ఫిల్మ్ చాంబర్, నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులతో సుదీర్ఘంగా జరిగిన చర్చలు ఫలించాయి. కార్మికులు 30 శాతం వేతనాల పెంపు కోసం డిమాండ్ చేయగా 22.5 శాతం వేతనం పెంపునకు నిర్మాతలు ఓకే అన్నారు. దీంతో 18 రోజులుగా జరుగుతున్న సమ్మెకు ఫుల్స్టాప్ పడింది. దీంతో శుక్రవారం నుంచి యథావిధిగా చిత్రీకరణలు జరగనున్నాయి. సీఎం సూచనతో పరిష్కారం చూపాం: ‘దిల్’రాజు చర్చల అనంతరం తెలంగాణ రాష్ట్ర చలన చిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్, నిర్మాత ‘దిల్’ రాజుతోపాటు పలువురు సినీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ‘నిర్మాతలకు, ఫెడరేషన్కు మధ్య నెలకొన్న సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశంతో గురువారం ఫెడరేషన్, ఫిల్మ్ చాంబర్, ఎఫ్డీసీ ద్వారా పరిష్కారం చూపాం. ఇందుకుగాను చిత్ర పరిశ్రమ తరఫున ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి, కార్మికశాఖ అదనపు కమిషనర్ గంగాధర్కు సినీ పరిశ్రమ, ఫెడరేషన్ తరఫున ధన్యవాదాలు. సినీ పరిశ్రమలో ఎప్పుడూ ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి. భారతీయ చిత్రాలన్నీ హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకునేలా ఉండాలనేది ముఖ్యమంత్రి ఫ్యూచర్ విజన్. తెలుగు సినిమాలతోపాటు అన్ని భాషల సినిమాలూ హైదరాబాద్లో చిత్రీకరణలు జరుపుకునేలా చేయడం మనందరి బాధ్యత. హైదరాబాద్ను ఫిల్మ్ హబ్గా తయారు చేద్దాం’ అని ‘దిల్’రాజు పేర్కొన్నారు. రోజుకు రూ. 2 వేలలోపు ఉంటే తొలి ఏడాది 15 శాతం పెంపు సినీ కార్మికులకు 22.5 శాతం వేతనాలు పెంచేందుకు నిర్మాతలు ముందుకురాగా ఫెడరేషన్ ప్రతినిధులు అందుకు ఒప్పుకున్నారని కార్మికశాఖ అదనపు కమిషనర్ గంగాధర్ తెలిపారు. రోజుకు రూ. 2 వేలలోపు వేతనాలు ఉన్న వారికి తొలి ఏడాది 15 శాతం, రెండో ఏడాది 2.5 శాతం, మూడో ఏడాది 5 శాతం పెంచనున్నారని చెప్పారు. అలాగే రూ. 2 వేల నుంచి రూ. 5 వేలు ఉన్నవారికి తొలి ఏడాది 7.5 శాతం, రెండో ఏడాది 5 శాతం, మూడో ఏడాది 5 శాతం వేతనాలు పెంచుతారని వివరించారు. ఇతర విషయాలపై చర్చించేందుకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. మరోవైపు ఇప్పటివరకు ఆదివారాలు షూటింగ్ చేస్తే డబుల్ కాల్షీట్ లెక్కన వేతనాలు చెల్లిస్తుండగా ఇకపై పెద్ద సినిమాలకు ఒకటిన్నర కాల్షీట్, చిన్న సినిమాలకు మాత్రం రెండు, నాలుగో ఆదివారాలకే ఒకటిన్నర కాల్షీట్ ఉంటుందని గంగాధర్ తెలిపారు. చిన్న సినిమాల నిర్మాతలు సమస్యలపైనా చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో పరిష్కారం: వల్లభనేని అనిల్కుమార్ ‘వేతనాల పెంపుపై లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో పరిష్కారం కుదిరింది. 30 శాతం వేతనాల పెంపు కోసం మేం అడగ్గా నిర్మాతలు 22.5 శాతానికి ఒప్పుకున్నారు. ప్రొడక్షన్ అసిస్టెంట్ యూనియన్, మహిళా వర్కర్స్, స్టూడియో వర్కర్స్, లైట్మెన్ యూనియన్ల కార్మికులకు ఎక్కువ వేతనం కావాలని అడిగాం. దీనిపై ఒక కమిటీ వేసి చర్చిస్తామని చెప్పారు. అంతిమంగా ఫైటర్లకు 7.5 శాతం, డ్యాన్సర్లకు 5.5 శాతం పెంచేందుకు ఒప్పుకున్నారు’ అని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్కుమార్ తెలిపారు. కలిసిమెలిసి ముందుకు సాగాలి‘ఎంతో జటిలమైన ఇండస్ట్రీ సమస్యను సామరస్యంగా, సమన్యాయం జరిగే విధంగా పరిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. తెలుగు చిత్రసీమ అభివృద్ధికి ఆయన తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. హైదరాబాద్ను దేశానికే కాదు, ప్రపంచ చలన చిత్ర రంగానికే ఓ హబ్గా మార్చాలన్న ఆయన ఆలోచనలు, అందుకు చేస్తున్న కృషి హర్షించదగినవి. తెలుగు చిత్రసీమ ఎప్పుడూ ఇలానే కలిసి మెలిసి ముందుకు సాగాలి. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా అండదండలు అందిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ – చిరంజీవి -
టాలీవుడ్ వివాదానికి ఎండ్ కార్డ్.. రేపటి నుంచి షూటింగ్స్ ప్రారంభం!
టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ వర్కర్క్ ఫెడరేషన్ మధ్య జరుగుతున్న వివాదానికి పుల్స్టాప్ పడింది. ఇవాళ జరిగిన చర్చలు సఫలం కావడంతో రేపటి నుంచి యథావిధిగా సినిమా షూటింగ్స్ ప్రారంభం కానున్నాయి. దాదాపు 18 రోజుల తర్వాత టాలీవుడ్లో షూటింగుల సందడి మొదలు కానుంది. లేబర్ కమిషనర్ మధ్యవర్తిత్వంతో చర్చలు ఫలించినట్లు తెలుస్తోంది.కాగా.. కొన్ని రోజులుగా తమ వేతనాలు ముప్పై శాతం పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో గత 16 రోజులుగా తెలుగు సినిమాల షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. ఇప్పటికే ఈ సమస్యల పరిష్కారం కోసం ఫిల్మ్ చాంబర్ అటు నిర్మాతలతో, ఇటు కార్మికులతో చర్చలు జరిపింది. కార్మికులు కోరినట్లుగా 30 శాతం జీతాలు పెంచేందుకు నిర్మాతలు ఒప్పుకోవట్లేదు. కార్మికులు సైతం మొట్టు దిగడం లేదు. పలు దఫాల చర్చల అనంతరం తాము పెట్టిన కండీషన్లకు ఒప్పుకుంటే రూ. 2 వేలలోపు జీతాలు ఉన్న వారికి పర్సంటేజీల ప్రకారం పెంచుతామని నిర్మాతలు ప్రకటించారు. ఇందుకు కార్మికులు విముఖత వ్యక్తం చేశారు. తాజాగా వీటిపై చర్చలు సఫలం కావడంతో రేపటి నుంచి షూటింగ్స్ షురూ కానున్నట్లు తెలుస్తోంది. -
కచ్చా బాదమ్ సాంగ్ ఫేమ్.. ఇప్పుడేంటి ఇలా బార్ డ్యాన్సర్గా!
'కచ్చా బాదామ్' సాంగ్తో అప్పట్లో ఫేమస్ అయిన నటి అంజలి అరోరా. ఆ తర్వాత పలు రియాలిటీ షోలు, సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్లో ది లవ్ ఈజ్ ఫరెవర్, దివాళియాన్, డెలియాన్ చిత్రాల్లో నటించింది. అయితే తాజాగా ఆమె పార్టీలో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల్లో నటించిన అంజలి అరోరా పబ్ డ్యాన్స్లు చేయడమేంటని నోరెళ్లబెడుతున్నారు.తాజాగా అంజలి అరోరా థాయ్లాండ్లోని ఓ పబ్లో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ సినిమా అవకాశాలు తగ్గడంతో ఇలా డ్యాన్స్ ప్రదర్శనలు చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో గౌరవంగా బతకడం కోసం తన వృత్తిని కొనసాగిస్తోందని మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. కాగా... అంజలి అరోరా ఇటీవల ఎంఎంఎస్ లీక్, వీడియో లీక్ వంటి వివాదాలతో మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ పబ్లిసిటీతో ఆమె కోట్లలో డబ్బు సంపాదించిందని కూడా ఆరోపణలొచ్చాయి. ఒకప్పుడు స్టార్గా ఉన్న అంజలి ఇప్పుడు పట్టాయాలో క్లబ్ డ్యాన్సర్గా మారిపోవడంతో ఆమె ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు.Anjali Arora, Insta dancers ki ‘role model’, Pattaya ke club mein apni ‘talent’ dikhate hue dikhin full jhatka thumka mode on. Wah, reel se deal tak ka asli startup model shayad isi ko kehte hain. pic.twitter.com/2FSwGAQ8QV— NoLawForMen (@MenTooRHuman) August 21, 2025Kacha Badam fame Anjali Arora seems to have made dancing in posh clubs her career.Here she is dancing in a club in Pattaya, Thailand.It is better to earn money than to ask for money. pic.twitter.com/6WzMFJUJrd— Param Choudhary (@Param_117_) August 21, 2025Anjali Arora of Kachcha Badam fame has taken up dancing in posh clubs as a career it seems.Here she is dancing at a Club in Pattaya, Thailand. pic.twitter.com/RXgWZit44Z— Sensei Kraken Zero (@YearOfTheKraken) August 21, 2025 -
తమిళంలో హిట్.. బన్ బటర్ జామ్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
బన్ బటర్ జామ్ మూవీ తమిళంలో ఆల్రెడీ సక్సెస్ అయింది. నేటి యువతకు తగ్గట్టుగా, ట్రెండ్ను ఫాలో అవుతూ తీసిన చిత్రంగా ‘బన్ బటర్ జామ్’ మూవీకి మంచి క్రేజ్ అయితే ఏర్పడింది. ఈ మూవీని తెలుగులోకి తీసుకు వచ్చారు. ఈ శుక్రవారమే ఈ మూవీ థియేటర్లోకి వచ్చింది. మరి తెలుగు ఆడియెన్స్ను ఈ మూవీ ఏ మేరకు ఆకట్టుకుంటుందో ఓ సారి చూద్దాం.కథ ఏంటంటే?లలిత (శరణ్య), ఉమ (దేవ దర్శిని) ప్రస్తుతం ప్రేమ పెళ్లిళ్లు, పెద్దలు కుదర్చిన వివాహాలు ఏవీ కూడా నిలబడటం లేదని తెలుసుకుంటారు. ఇంటర్ చదువుతున్న తమ బిడ్డల్ని ఒకటి చేయాలని లలిత, ఉమలు అనుకుంటారు. లలిత తన కొడుకు చంద్రు ((రాజు జయమోహన్)ని, ఉమ తన కూతురు మధుమిత (ఆద్య ప్రసాద్)ని ఒకే దగ్గర ఉంచేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో లలిత ఇంటి పక్కనే ఓ ఇళ్లు అద్దెకు తీసుకుంటుంది ఉమ. అయితే చంద్రు ఏమో నందిని (భవ్య త్రికా)తో, మధు మిత ఏమో ఆకాష్ (వీజే పప్పు)తో ప్రేమలో ఉంటారు. చివరకు వీరి ప్రేమ కథలు ఒడ్డుకు ఎలా చేరతాయి? చంద్రుకి తన ప్రాణ స్నేహితుడు శ్రీనివాస్ (మైఖేల్)కి దూరం ఎందుకు పెరుగుతుంది? చివరకు హీరో హీరోయిన్ల తల్లులు వేసిన ప్లాన్ బెడిసి కొడుతుందా? సక్సెస్ అవుతుందా? అన్నదే కథ.ఎలా తీశారంటే?బన్ బటర్ జామ్ అనే చిత్రం ప్రస్తుతం ఉన్న తరానికి, ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్కు తగ్గట్టుగా ఉన్నట్టు కనిపిస్తోంది. సమాజంలో ప్రేమ పెళ్లిళ్లు, పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్లు అని తేడా లేకుండా అన్నీ విడాకులకే దారి తీస్తున్నాయి. ఇదే పాయింట్ మీద దర్శకుడు కథను రాసుకున్నాడు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? వివాహా బంధం నిలబడాలంటే ఏం చేయాలి? అసలు ప్రేమ ఎలా ఉండాలి? ఎలాంటి ప్రేమను ఇవ్వాలి? ఎలా ప్రేమించాలి? అన్న పాయింట్ల చుట్టూ కథను అల్లుకున్నాడు.ప్రేమలో ఓడిపోతే జీవితం పోయినట్టు కాదు అనే పాయింట్ను చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రేమ, స్నేహం అనే వాటి చుట్టూ కథను చక్కగా అల్లుకున్నాడు. ఇక ఇప్పుడు ఎక్కువగా వినిపించే బెస్టీ అనే ట్రెండ్ను కూడా ఇందులో వాడుకున్నాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కాలేజ్ ఎపిసోడ్స్, ప్రేమ చిగురించే సీన్లు, హీరో హీరోయిన్ల తల్లులు చేసే ఫన్తో నడుస్తుంది. ఇక సెకండాఫ్కు కథ వెళ్లే సరికి కాస్త ఎమోషనల్గా మారుతుంది.ప్రేమంటే ఏంటి? ప్రేమలో ఓడిపోతే అక్కడే ఆగిపోవాలా? ముందుకు ఎలా సాగాలి? నిజమైన ప్రేమకు అర్థం ఏంటి? అని సెకండాఫ్లో చూపిస్తాడు. క్లైమాక్స్ ఊహకందేలానే సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ వరకు కథను సాగదీసినట్టుగా అనిపిస్తుంది. గతం గత: అనే పాయింట్ను చెప్పేందుకు చాలానే ల్యాగ్ చేశాడనిపిస్తుంది. గతాన్ని వదిలి.. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా.. వర్తమానాన్ని ఆస్వాధించాలని చెప్పే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది.సాంకేతికంగా చూసుకుంటే..బన్ బటర్ జామ్ మూవీకి ఇచ్చిన పాటలు తెలుగు వారికి అంతగా ఎక్కకపోవచ్చనిపిస్తుంది. ఆర్ఆర్ సీన్లకు తగ్గట్టుగా ఉంటుంది. ఇక డైలాగ్స్ కొన్ని చోట్ల గుండెను తాకేలా ఉంటాయి. విజువల్స్ చక్కగా కుదిరాయి. ఎడిటింగ్ బాగుంటుంది. ఓ గ్రాండ్ ఫిల్మ్ చూసినట్టుగానే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.ఎవరెలా చేశారంటే..బన్ బటర్ జామ్ సినిమాలో చంద్రు పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. అమ్మాయిలు అంటేనే భయపడిపోయే చంద్రు పాత్ర అందరినీ మెప్పిస్తుంది. చంద్రు పాత్రలో రాజ్ ఎంతో సహజంగా నటించారు. ఇక నందిని పాత్రకు అయితే నేటి యువతులు ఎక్కువగా కనెక్ట్ అవుతారు. రీల్స్, ఇన్ స్టా, ఇన్ ఫ్లూయెన్సర్ అంటూ హల్చల్ చేసే ఆ పాత్ర ఎక్కువగా రిలేట్ అవుతుంది. శరణ్య, దేవ దర్శిని పాత్రలు ట్రెండి మామ్స్ అన్నట్టుగా సాగుతాయి. మధుమిత, శివ, శ్రీనివాస్, ఆకాష్ ఇలా అన్ని పాత్రలు బాగానే కుదిరాయి. -
హృతిక్ రోషన్ ప్రియురాలి మూవీ.. నేరుగా ఓటీటీలో రిలీజ్!
బాలీవుడ్ నటి, హృతిక్ రోషన్ ప్రియురాలు సబా ఆజాద్ నటించిన తాజా చిత్రం సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్. ఈ చిత్రాన్ని కశ్మీర్కు చెందిన ప్రముఖ సింగర్ రాజ్ బేగం జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి డానిష్ రెంజు దర్శకత్వం వహించారు. ఆపిల్ ట్రీ పిక్చర్స్ ప్రొడక్షన్, రెంజు ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు.తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు మేకర్స్. ఆగస్టు 29 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్కు రానున్నట్లు వెల్లడించారు. కాగా.. ఈ చిత్రంలో సోనీ రజ్దాన్ కీలక పాత్రలో కనిపించారు.సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ చిత్రం ద్వారా కాశ్మీర్కు చెందిన దిగ్గజ సింగర్ రాజ్ బేగం జీవిత కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కశ్మీర్ లోయ నుంచి సంగీతంలోకి అడుగుపెట్టిన మొదటి మహిళగా రాజ్ బేగం నిలిచింది. తన కెరీర్లో ఆమెకు ఎదురైన అడ్డంకులు, తను ఎలా విజయం సాధించన్నదే సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ కథ. View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
బిగ్బాస్ షోలో మైక్ టైసన్? పారితోషికంపై చర్చలు!
బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన షో బిగ్బాస్ (Bigg Boss Reality Show). సెలబ్రిటీల ముచ్చట్లు, గొడవలు, జీవిత కథలు, వారి కోపావేశాలు.. ఇలా ప్రతి విషయాన్ని దగ్గరుండి చూడటమంటే జనాలకు భలే సరదా! అందుకే బిగ్బాస్ ఏళ్ల తరబడి విజయవంతంగా రన్ అవుతోంది. ఇకపోతే ఈసారి ఈ రియాలిటీ షోలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ భాగం కానున్నారంటూ ప్రచారం జరుగుతోంది. తెలుగు బిగ్బాస్ అనుకునేరు, కాదు! హిందీ బిగ్బాస్ 19వ సీజన్లో ఆయన్ను వైల్డ్ కార్డ్గా ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్నారట!వైల్డ్ కార్డ్గా..పారితోషికం గురించి చర్చలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. అన్నీ కుదిరితే అక్టోబర్లో బిగ్బాస్ హౌస్లో మైక్ టైసన్ అడుగుపెడతాడట! ఒక వారం లేదా పదిరోజులు మాత్రమే ఆయన హౌస్లో ఉంటాడని సమాచారం. టైసన్ ఎంట్రీ ఇస్తే షోకు మరింత క్రేజ్ వస్తుందని బిగ్బాస్ టీమ్ యోచిస్తోంది. మరి వీరి ప్లాన్ ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి! హిందీ బిగ్బాస్ 19వ సీజన్ ఆగస్టు 24న ప్రారంభం కానుంది.తెలుగు సినిమాలో..కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించాడు. సుదీర్ఘ కెరీర్లో 50 విజయాలు సాధించిన 58 ఏళ్ల టైసన్... అందులో 44 బౌట్లను నాకౌట్ చేశాడు. 2005లో బాక్సింగ్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తర్వాత పలు కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ మూవీలోనూ అతిథి పాత్రలో కనిపించాడు.చదవండి: నటి రెండో పెళ్లి.. తోడుగా నిలబడ్డ 12 ఏళ్ల కూతురు -
థియేటర్లలో పరదా..ఈ శుక్రవారం ఓటీటీల్లో 16 సినిమాలు!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారంలో పెద్ద సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద పోటీలో లేవు. అనుపమ పరమేశ్వరన్ పరదా, సత్యరాజ్, ఉదయభాను ప్రధానపాత్రల్లో వచ్చిన త్రిబాణధారి బార్బరిక్ లాంచి సినిమాలు థియేటర్లలో రిలీజవుతున్నాయి. దీంతో ఈ వారంలో వీకెండ్లో పరదా మూవీ కోసం మాత్రమే సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ సినిమాలు సందడి చేస్తుంటాయి. ఎప్పటిలాగే ఈ వారంలో కూడా ఓటీటీ ప్రియులను అలరించేందుకు చిత్రాలు రెడీ అయిపోయాయి. వాటిలో తమిళ చిత్రం సార్ మేడమ్, బాలీవుడ్ మూవీ మా, మారీషన్ లాంటి డబ్బింగ్ సినిమాలు ఆసక్తి పెంచుతున్నాయి. ఫ్రైడే ఒక్క రోజులోనే దాదాపు 16 చిత్రాలు సందడి చేయనున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి. అమెజాన్ ప్రైమ్సార్ మేడమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 22ఎఫ్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 22నెట్ఫ్లిక్స్అబాండడ్ మ్యాన్ (టర్కిష్ సినిమా) - ఆగస్టు 22ఏయిమా (కొరియన్ సిరీస్) - ఆగస్టు 22లాంగ్ స్టోరీ షార్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 22మా (హిందీ సినిమా) - ఆగస్టు 22మారిషన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 22ద ట్రూత్ అబౌట్ జెస్సీ స్మోలెట్? (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22బాన్ అపెట్టీ, యువర్ మెజస్టీ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 23జియో హాట్స్టార్ఏనీ మేనీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22పీస్ మేకర్ -సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 22జీ5ఆమర్ బాస్ (బెంగాలీ సినిమా) - ఆగస్టు 22ఆపిల్ ప్లస్ టీవీఇన్వేజన్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - ఆగస్టు 22ఆహాకొత్తపల్లిలో ఒకప్పుడు (తెలుగు సినిమా) - ఆగస్టు 22సన్ నెక్ట్స్కపటనాటక సూత్రధారి (కన్నడ సినిమా) - ఆగస్టు 22కోలాహాలం(మలయాళ సినిమా)- ఆగస్టు 22లయన్స్ గేట్ ప్లేఉడ్ వాకర్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22 -
మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఈ ఏడాది కూడా అక్కడేనా?
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చేసింది. ఈనెల 22న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే గ్రాండ్ సెలబ్రేషన్స్ కోసం ఇప్పటికే రెడీ అయిపోయారు. దీంతో ఒక్కరోజు ముందుగానే అభిమానులకు విశ్వంభర బిగ్ అప్డేట్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ చిరు 70వ బర్త్డే మరింత గ్రాండ్గా జరుపుకోనున్నారు.తన 70వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం చిరంజీవి ఇప్పటికే హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లిపోయారు. తన ఫ్యామిలీతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు ఎప్పటిలాగే బెంగళూరుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఎయిర్పోర్ట్లో శ్రీజ కూతురు, తన మనవరాలితో మెగాస్టార్ వెళ్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. చిరువెంట ఆయన భార్య సురేఖతో పాటు చిన్నకూరుతు శ్రీజ సైతం విమానాశ్రయంలో కనిపించారు. ఈ బర్త్ డే వేడుకల్లో రామ్ చరణ్, ఉపాసనతో పాటు.. వీరి కుమార్తె క్లీంకారా కూడా పాల్గొననున్నారు.ప్రస్తుతం చిరంజీవి విశ్వంభరలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా.. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని మెగాస్టార్ స్వయంగా ప్రకటించారు. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) -
చిరంజీవి బర్త్డే ట్రీట్.. విశ్వంభర గ్లింప్స్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela) ప్రధాన పాత్రలో నటిస్తున్న అడ్వెంచర్ మూవీ విశ్వంభర (Vishwambhara Movie). బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించారు. త్రిష కథానాయికగా నటించగా ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. రేపు (ఆగస్టు 22) చిరంజీవి బర్త్డే సందర్భంగా విశ్వంభర గ్లింప్స్ వదిలారు. ఊపిరి పోసేవాడి కోసం ఎదురుచూపులు'ఈ విశ్వంభరలో అసలేం జరిగిందో ఈరోజైనా చెప్తావా?' అన్న పిల్లాడి డైలాగ్తో వీడియో ప్రారంభమైంది. 'ఒక్కడి స్వార్థం యుద్ధంగా మారి అంతులేని భయాన్నిచ్చింది. అంతకుమించిన మరణ శాసనాన్ని రాసింది. కొన ఊపిరితో బతుకున్న ఓ సమూహం తాలూకు నమ్మకం.. అలిసిపోని ఆశయానికి ఊపిరిపోసేవాడు ఒకడొస్తాడని.. ఆగని యుద్ధాన్ని యుగాలపాటు పిడికిలి బిగించి చెప్పుకునేలా చేస్తాడని గొప్పగా ఎదురుచూస్తోంది..' అంటూ మెగాస్టార్ను చూపించారు. విలన్లను చిత్తు చేస్తున్నట్లు యాక్షన్ సీన్స్ జత చేశారు. ఇది చూసిన అభిమానులు.. గ్లింప్స్ బాగున్నాయ్.. అని కామెంట్లు చేస్తున్నారు.వచ్చే ఏడాది రిలీజ్సినిమా విషయానికి వస్తే.. విశ్వంభర ఈ ఏడాది జనవరిలోనే రిలీజవ్వాల్సింది. కానీ, వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా పెండింగ్లో ఉండటంతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాదిలో సినిమా రావడం కష్టమేనని స్వయంగా మెగాస్టారే వెల్లడించారు. 2026 సమ్మర్లో విశ్వంభర ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.చదవండి: కార్తీకదీపం సీరియల్ నటి కూతురి పెళ్లి -
నటి రెండో పెళ్లి.. తోడుగా నిలబడ్డ 12 ఏళ్ల కూతురు
ప్రముఖ మలయాళ యాంకర్, నటి ఆర్య (Arya Babu) రెండో పెళ్లి చేసుకుంది. నటుడు, కొరియోగ్రాఫర్ సిబిన్ బెంజమిన్తో మెడలో మూడు ముళ్లు వేయించుకుంది. అతడికి కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం! ఈ ఏడాది మేలో వీరి నిశ్చితార్థం జరగ్గా.. తాజాగా ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం జరిగింది. 12 ఏళ్ల కూతురితో మండపానికి..తన జీవితంలో అతి ముఖ్యమైన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోను ఆర్య సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఆర్య 12 ఏళ్ల కూతురు రోయా అలియాస్ ఖుషి.. తల్లిని మండపం వరకు తీసుకొచ్చింది. తల్లి మెడలో మూడు ముళ్లు పడుతుంటే సంతోషంతో చిరునవ్వులు చిందించింది. ఈ ఫోటోలు నెట్టింట వైరలవుతుండగా అభిమానులు నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఫ్రెండ్స్ భార్యాభర్తలుగా..కుంజిరమయనం, పవ, ఉల్టా, మెప్పడియాన్, క్వీన్ ఎలిజబెత్ వంటి పలు మలయాళ చిత్రాల్లో ఆర్య నటించింది. అక్కడి బుల్లితెరపై టాప్ యాంకర్గా రాణిస్తోంది. మలయాళ బిగ్బాస్ రెండో సీజన్లోనూ పాల్గొంది. నటి అర్చన సోదరుడు, ఐటీ ఇంజనీర్ రోహిత్ సుశీలన్ను పెళ్లాడింది. వీరికి రోయ అనే కూతురు పుట్టింది. 2019లో భర్త నుంచి విడిపోయినట్లు ఆర్య ప్రకటించింది. డీజే సిబిన్.. మలయాళ బిగ్బాస్ ఆరో సీజన్లో వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చాడు. ఇతడిక్కూడా గతంలో పెళ్లయి పిల్లలున్నట్లు తెలుస్తోంది. చాలాకాలంగా స్నేహితులుగా ఉన్న వీరు ప్రేమలో పడటంతో ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram A post shared by Arya Babu (@arya.badai) View this post on Instagram A post shared by Arya Babu (@arya.badai) చదవండి: సైలెంట్గా కార్తీకదీపం సీరియల్ నటి కూతురి పెళ్లి -
క్యూట్ జాన్వీ కపూర్.. సితార-నమ్రత ఫ్యామ్ జామ్
జాన్వీ కపూర్ క్యూట్ గ్లామరస్ పోజులుఫ్యామిలీ గెట్ టూ గెదర్లో సితార-నమ్రతఅందంగా ముస్తాబైన హీరోయిన్ రష్మికఅద్దాన్ని చూస్తూ అనన్య ఫన్నీ ఎక్స్ప్రెషన్స్చీరలో అందాలన్నీ చూపిస్తూ ప్రియాంక జవాల్కర్ఓరకంట చూస్తూ మైమరిపిస్తున్న కావ్య కల్యాణ్ రామ్ View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) -
రజినీకాంత్ కూలీ.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే?
రజినీకాంత్ హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కూలీ. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఆగస్టు 14న థియేర్లలో విడుదలైన కూలీ తొలి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.151 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. విజయ్ సినిమా లియో రికార్డ్ను కూలీ అధిగమించింది.కూలీ మూవీ రిలీజైన వారం రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.222.5 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ బుధవారం అన్ని భాషల్లో కలిపి రూ.6.50 కోట్లు వసూలు చేసిందని సాక్నిల్క్ సైట్ వెల్లడించింది. ఈ మూవీ ఇండియాలో మొదటి రోజే రూ.65 కోట్ల నెట్ వసూలు చేసింది. అయితే రెండో రోజే రూ. 54.75 కోట్లు మాత్రమే రాబట్టింది. తొలివారంలో రూ.200 కోట్లకు పైగా నికర వసూళ్లు సాధించడంతో మేకర్స్ ఖుషీ అవుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వసూళ్లు పరిశీలిస్తే రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్తో దూసుకెళ్తోంది. ఇదే జోరు కొనసాగితే రెండో వారంలో రూ.500 కోట్ల క్లబ్లో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించి ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, అమీర్ ఖాన్ వంటి స్టార్స్ నటించారు. ఈ సినిమా హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ -2తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతోంది. -
రామ్ 'ఆంధ్ర కింగ్ తాలుకా' రిలీజ్ అప్డేట్
స్కంద, డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో డిజాస్టర్స్ ఎదుర్కొన్న హీరో రామ్.. మాస్ పక్కనబెట్టేశాడు. క్లాస్ సినిమా చేశాడు. అదే 'ఆంధ్ర కింగ్ తాలుకా'. ట్రెండింగ్ బ్యూటీ భాగ్యశ్రీ హీరోయిన్. ఇదివరకే ఓ మెలోడీ పాట రాగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు రిలీజ్ తేదీని ప్రకటించారు.ఈ ఏడాది ఇప్పటికే చాలావరకు సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసేసుకున్నాయి. వచ్చే రెండు నెలల్లో రవితేజ 'మాస్ జాతర', తేజ సజ్జా 'మిరాయ్', అనుష్క 'ఘాటీ', పవన్ కల్యాణ్ 'ఓజీ', రిషభ్ శెట్టి 'కాంతార' తదితర చిత్రాలు రాబోతున్నాయి. డిసెంబరులో 'రాజాసాబ్' లైనులో ఉంది. దీంతో కొత్త సినిమాలొచ్చినా సరే అన్ సీజన్లోనే రావాల్సి ఉంటుంది. ఇప్పుడు రామ్ చిత్రం కూడా నవంబర్ 28న షెడ్యూల్ చేశారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: థూ.. అదీ ఒక సినిమానేనా? నా కొడుకు మూవీ నాకే నచ్చలేదు: డిస్కో శాంతి) అయితే 'ఆంధ్ర కింగ్ తాలుకా' సినిమాకు చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఇదొచ్చిన వారానికి 'రాజాసాబ్' రిలీజ్ కానుంది. ఒకవేళ ఇది సంక్రాంతికి వాయిదా పడినా, అదే తేదీకి 'అఖండ 2' రావొచ్చని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ రెండింటిలో ఏది రిలీజైనా సరే రామ్ చిత్రానికి కలెక్షన్స్ పరంగా ఇబ్బంది ఉండొచ్చు.'ఆంధ్ర కింగ్ తాలుకా' చిత్రం హీరోలని అభిమానించే ఫ్యాన్ బయోపిక్ అని చెప్పారు. ఇందులో భాగ్య శ్రీ హీరోయిన్. అయితే ఈ సినిమా చేస్తున్నప్పుడే రామ్-భాగ్యశ్రీ ప్రేమలో పడ్డారని, ప్రస్తుతం డేటింగ్ కూడా చేస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: కదల్లేని స్థితిలో 'వెంకీ' కమెడియన్)Dear MEGA,LION,KING,VICTORY, POWER,SUPER,REBEL,TIGER,MEGAPOWER,STYLISH,REAL,RAJINI,KH…fans of all the other Stars.& My Dearest Fans,Have you ever watched yourself in a movie? Get Ready to Relive Your Life on the BIG Screen this year! #AndhraKingTaluka on 28-11-25 pic.twitter.com/8Ycscf1vuC— RAm POthineni (@ramsayz) August 21, 2025 -
ఇంట్లోంచి బయటకు వచ్చేసినప్పుడే అనుకున్నా.. దత్తత తీసుకోవాలని!
35 ఏళ్లు వచ్చినా ఇంకా సింగిల్గానే ఉంది బుల్లితెర నటి జాస్మిన్ భాసిన్ (Jasmin Bhasin). పెళ్లి సంగతేమో కానీ కూతురు కావాలంటోందీ ముద్దుగుమ్మ. తప్పకుండా ఓ పాపను దత్తత తీసుకుంటానని గతంలోనే చెప్పింది. సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన జాస్మిన్.. మరోసారి ఆ విషయాన్ని ప్రస్తావించింది. అసలు పాపను దత్తత తీసుకోవాలన్న ఆలోచన ఎప్పుడొచ్చింది? అన్న అభిమాని ప్రశ్నకు ఇలా స్పందించింది.అందుకే దత్తత ఆలోచననేను ఇల్లు వదిలి వచ్చేసినప్పుడు చాలా కష్టాలు అనుభవించాను. అప్పుడే అనుకున్నా.. నాకంటూ మంచి జీవితం సంపాదించుకున్నప్పుడు కచ్చితంగా మరొకరికి లైఫ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నా.. అందుకే ఓ పాపను దత్తత తీసుకుంటాను అని చెప్పుకొచ్చింది. హిందీ బిగ్బాస్ 14వ సీజన్లో ఉన్నప్పుడు కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ.. నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పలేను. అలాంటి పెళ్లయితే చేసుకోనుఒకవేళ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టకపోయినా పర్వాలేదు. మంచి మనిషి దొరికితే పెళ్లి చేసుకుంటా.. లేదంటే ఏదో ఒకర్ని మ్యారేజ్ చేసుకుని తర్వాత విడిపోవాల్సి రావడం నాకైతే ఇష్టం లేదు. ఇకపోతే ఒక చిన్నారిని దత్తత తీసుకుని తనకు మంచి జీవితాన్ని ప్రసాదించాలనుకుంటున్నాను అని తెలిపింది. దిల్సే దిల్ తక్, నాగిన్ 4 వంటి సీరియల్స్తో జాస్మిన్కు పాపులారిటీ వచ్చింది. అర్ధ సర్బత్ దే భలే దీ, వార్నింగ్ 2, బద్నాం వంటి పంజాబీ చిత్రాల్లోనూ నటించింది. ద ట్రేటర్స్ అనే రియాలిటీ షోలోనూ పాల్గొంది.చదవండి: థూ.. అదీ ఒక సినిమానేనా? నా కొడుకు మూవీ నాకే నచ్చలేదు -
హన్సికపై విడాకుల రూమర్స్.. హీరోయిన్ రియాక్షన్ ఇదే!
ఇటీవల హీరోయిన్ హన్సిక మోత్వానిపై వ్యక్తిగత జీవితంపై కొద్ది రోజులుగా చర్చ నడుస్తోంది. ఆమె త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ కథనాలు వస్తున్నాయి. ఈ నెల ఆగస్టు 9న తన పుట్టినరోజు సందర్భంగా చేసిన పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. ఈ ఏడాది తనకు చాలా స్పెషల్ అని..ఎన్నో పాఠాలు నేర్పిందంటూ ఇన్స్టా వేదికగా పోస్ట్ చేసింది. కాగా సోహల్కు ఇది రెండో పెళ్లి కావడంతో మనస్పర్థలు వచ్చాయని సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలైంది. దీంతో ఆమె తన తల్లి వద్దనే ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.(ఇది చదవండి: విడాకుల బాటలో హన్సిక.. కారణం ఇదేనా?)తాజాగా హన్సికి మోత్వానీ ఇండోనేషియాలోని బాలిలో చిల్ అవుతూ కనిపించింది. తన ఫ్రెండ్తో కలిసి వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్పై వస్తున్న వార్తలు చూసి నవ్వుతూ కనిపించింది. తన వ్యక్తిగత జీవితంపై నెటిజన్స్ కామెంట్స్ చూస్తూ నవ్వుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. నా జీవితంపై ప్రజల అభిప్రాయాన్ని నేను చదివినప్పుడు అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ వీడియోతో తనపై వస్తున్న రూమర్స్కు చెక్ పెట్టేసినట్టే కనిపిస్తోంది. అయితే విడాకుల రూమర్స్పై ఇప్పటివరకు హన్సిక కానీ, ఆమె భర్త సోహెల్ కూడా స్పందించలేదు. తన ఇన్స్టా అకౌంట్ నుంచి హన్సిక పెళ్లి ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయడంతో రూమర్స్ మొదలయ్యాయి.కాగా.. 2022 డిసెంబర్లో హన్సిక తన ప్రియుడు సోహైల్ని వివాహం చేసుకుంది. సోహల్కు ఇది రెండో పెళ్లి. హన్సిక స్నేహితురాలితో ఆయనకు ఇంతకుముందే పెళ్లై విడాకులు తీసుకున్నాడు. వీరి వివాహాన్ని ‘లవ్ షాదీ డ్రామా’ అనే పేరుతో డాక్యుమెంటరీ సిరీస్గా కూడా విడుదల చేశారు. -
థూ.. అదీ ఒక సినిమానేనా? నా కొడుకు మూవీ నాకే నచ్చలేదు
'బంగారుకోడిపెట్ట వచ్చెనండి..' వంటి పలు స్పెషల్ సాంగ్స్లో డ్యాన్స్తో అలరించింది డిస్కో శాంతి (Disco Shanti). మొదట్లో సహాయనటిగా యాక్ట్ చేసినా ఐటం సాంగ్స్తోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. 1996లో టాలీవుడ్ హీరో శ్రీహరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పి ఫ్యామిలీకే సమయం కేటాయించింది. బుల్లెట్ మూవీలో..2013లో శ్రీహరి అనారోగ్యంతో కన్నుమూయగా.. ఆ తర్వాత డిస్కో శాంతి ఎన్నో ఇబ్బందులు పడింది. రెండున్నర దశాబ్దాల తర్వాత ఆమె తిరిగి సినిమాల్లో ఎంట్రీ ఇస్తోంది. రాఘవ లారెన్స్ సోదరుడు ఎల్విన్ కథానాయకుడిగా పరిచయమవుతున్న బుల్లెట్ చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఆమె మీడియా ముందుకు వచ్చి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. మద్యానికి బానిసఅందులో డిస్కో శాంతి మాట్లాడుతూ.. బావ(శ్రీహరి) చనిపోయినప్పుడు ఇద్దరు పిల్లలతో ఒంటరిగా మిగిలాను. సరిగా తినకపోయేదాన్ని. తాగుడుకు బానిసయ్యాను. నువ్వు కూడా వదిలేసి వెళ్లిపోతే మమ్మల్ని ఎవరు చూసుకుంటారని పిల్లలు అడిగారు. ఆ మాట నన్ను కదిలించింది, అప్పటినుంచి తాగుడు మానేశాను. ఐదేళ్లుగా దాని జోలికి పోలేదు. నా కొడుకు ఓ సినిమా చేశాడు. యాక్టింగ్ బాగా చేశాడు. కానీ మూవీ అస్సలు బాగోలేదు.డైరెక్టర్ పారిపోయాడుఆ సినిమా చూసినప్పుడు డైరెక్టర్ ఎక్కడ? అని అడిగాను. అప్పటికే అతడు పారిపోయాడు, నా ముందుకు రాలేదు. అదొక సినిమానా? థూ.. నాకు వారం ముందు చెప్పినా ఏవైనా మార్పులుచేర్పులు చేసేదాన్ని. బావ సినిమాలకు కూడా చాలా కరెక్షన్స్ చేశాను అంటూ కుమారుడి సినిమాపై డిస్కో శాంతి అసంతృప్తి వ్యక్తం చేసింది. శ్రీహరి- శాంతి పెద్ద కుమారుడు మేఘాంశ్ రాజ్ధూత్ సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేశాడు. 2019లో రిలీజైన ఈ సినిమా పరాజయం పాలైంది.చదవండి: తెలుగు సీరియల్ నటి కూతురి పెళ్లి.. సెలబ్రిటీల హంగామా -
బిగ్బాస్ గౌతమ్.. బాబాయిగా ప్రమోషన్
త్వరలో బిగ్బాస్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. ఈసారి ఎవరొస్తారా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు గత సీజన్లలో పాల్గొన్న వాళ్లు.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటారు. అలా గత రెండు సీజన్లలోనూ పాల్గొన్న గౌతమ్ కృష్ణ.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ మోడ్లో ఉన్నాడు. తమ కుటుంబంలోకి లిటిల్ ఏంజెల్ వచ్చిందని పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: కదల్లేని స్థితిలో 'వెంకీ' కమెడియన్.. పక్షవాతం రావడంతో)తెలంగాణకు చెందిన గౌతమ్ స్వతహాగా డాక్టర్. కానీ నటనపై ఆసక్తితో ఒకటి రెండు సినిమాలు చేశాడు. కాకపోతే పెద్దగా గుర్తింపు రాలేదు. బిగ్బాస్లో పాల్గొనే అవకాశం రావడంతో కాస్త ఫేమ్ వచ్చింది. 7వ సీజన్లో అశ్వద్ధామ అంటూ సందడి చేసిన గౌతమ్.. మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయాడు. గత సీజన్లో వైల్డ్ కార్డ్గా పాల్గొన్నాడు. రన్నరప్గా నిలిచాడు.కొన్నాళ్ల క్రితమే 'సోలో బాయ్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. రీసెంట్గానే వీరజవాన్ మురళినాయక్ బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించాడు. వీటి సంగతి పక్కనబెడితే తాను బాబాయిగా ప్రమోషన్ పొందినట్లు గౌతమ్ తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. తన అన్నకు కూతురు పుట్టిందని ఈ మేరకు ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీంతో ఫ్రెండ్స్, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: తిరుమల శ్రీవారి సేవలో నాగచైతన్య దంపతులు) View this post on Instagram A post shared by D GAUTHAM KRISHNA (@actorgauthamkrishna) -
చిరకాల స్నేహితుడిని పెళ్లాడిన బుల్లితెర నటి.. పోస్ట్ వైరల్
ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇండస్ట్రీలోనూ చాలామంది ఈ నెలలోనే పెళ్లి పీటలెక్కుతున్నారు. తాజాగా ప్రముఖ బుల్లితెర నటి గియా మానెక్ వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. 'సాత్ నిభాన సాథియా', 'జీనీ ఔర్ జుజు' సీరియల్స్తో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ నటుడు వరుణ్ జైన్ను పెళ్లాడింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నూతన జంటకు అభినందనలు చెబుతున్నారు.గియా తన ఇన్స్టాలో రాస్తూ.. "ఆ దేవుడు, మా గురువుల దయతో, మీరు కురిపించిన ప్రేమతో మేము ఈ రోజు వివాహాబంధంలోకి అడుగుపెట్టాము. మేము ఇద్దరు స్నేహితులం.. కానీ ఈ రోజు చేయి చేయి కలిపి హృదయపూర్వకంగా మేము భార్యాభర్తలం అయ్యాం. ఈ రోజును ఇంత ప్రత్యేకంగా చేసిన మా ప్రియమైన వారందరి ప్రేమ, ఆశీర్వాదాలకు మా కృతజ్ఞతలు. ఎల్లప్పుడు నవ్వుతూ మిస్టర్ అండ్ మిసెస్గా జీవితాంతం కలిసి ఉండటానికి ఇదే మా మొదటి అడుగు." అంటూ పోస్ట్ చేసింది.కాగా.. గియా మానెక్, వరుణ్ జైన్ జంటగా తేరా మేరా సాత్ రహే సీరియల్లో నటించారు. అప్పుడు సహనటులుగా ఉన్న వీరిద్దరు.. ఇప్పుడు భార్యాభర్తలుగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. మరోపైపు గియా మానెక్ సీరియల్స్కతో పాటు సినిమాల్లోనూ నటించింది. కామ్ చాలు హై, నా గర్ కే.. నా ఘాట్ కే లాంటి చిత్రాల్లో కనిపించింది. View this post on Instagram A post shared by Gia Manek (@gia_manek) -
భార్యతో కలిసి డ్యాన్స్ చేసిన దిల్ రాజు... వీడియో వైరల్
టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఒకవైపు తన బ్యానర్లో రాబోతున్న సినిమా పనులు, మరోవైపు ఎఫ్డీసీ చైర్మన్ బాధ్యతలతో నిత్యం బిబీ బిబీగా ఉండే దిల్ రాజు.. ఖాలీ సమయం దొరికితే మాత్రం ఫ్యామిలీతో బయటకు వెళ్తుంటాడు. ఆయనకు దైవభక్తి కాస్త ఎక్కువే. ముఖ్యంగా వెంకటేశ్వరస్వామి అంటే ఆయనను చాలా ఇష్టం. అందుకే సొంతూరిలో గుడిని సైతం నిర్మించాడు. వీలు ఉన్నప్పుడల్లా భార్య,కొడుకుతో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్తుంటాడు. తాజాగా తన కొత్త ఇంట్లో శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహించాడు దిల్ రాజు. పూజ అనంతరం సతీమణి తేజస్వినితో కలిసి సంప్రదాయం ప్రకారం నృత్యం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దిల్ రాజు, తేజస్వినిల వివాహం 2020లో జరిగింది. దిల్రాజుకు ఇది రెండో వివాహం. మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మరణించింది. కొన్నాళ్ల పాటు ఒంటరిగా ఉన్న దిల్ రాజు.. 2020లో తేజస్వీని వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 2022 బాబు పుట్టాడు. పేరు అన్వీరెడ్డి. View this post on Instagram A post shared by IDream Media (@idreammedia) -
తిరుమల శ్రీవారి సేవలో అక్కినేని జంట
అక్కినేని జంట నాగచైతన్య-శోభిత.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో చైతూ-శోభిత.. స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగ నాయకుల మండపంలో నాగచైతన్య దంపతులని పండితులు ఆశీర్వదించారు. ఈ క్రమంలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: కదల్లేని స్థితిలో 'వెంకీ' కమెడియన్.. పక్షవాతం రావడంతో)కెరీర్ విషయానికొస్తే నాగచైతన్య.. ఈ ఏడాది 'తండేల్'తో హిట్ కొట్టాడు. ప్రస్తుతం కార్తిక్ వర్మ దర్శకత్వంలో ఓ సూపర్ నేచురల్ హారర్ మూవీ చేస్తున్నాడు. ఇది కాకుండా కొరటాల శివతోనూ కొత్త సినిమా చేయబోతున్నాడని గత కొన్నిరోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు శోభిత మాత్రం పెళ్లి తర్వాత కొత్త చిత్రాల్లో నటిస్తున్నట్లు లేదు. చాలారోజుల తర్వాత వీళ్లు మరోసారి జంటగా కనిపించడంతో అభిమానులు ఆనందపడిపోతున్నారు.(ఇదీ చదవండి: అనుపమ 'పరదా' సినిమా రివ్యూ) శ్రీవారిని దర్శించుకున్న హీరో నాగచైతన్యతిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని సినీ నటుడు అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల గురువారం ఉదయం దర్శించుకున్నారు. #NagaChaitanya pic.twitter.com/SQTZM6wKde— Milagro Movies (@MilagroMovies) August 21, 2025Yuvasamrat @chay_akkineni garu & our dear Sobhita garu spotted at the sacred Tirumala 🙏#NagaChaitanya #Sobhita pic.twitter.com/4j2THXMQde— Trends NagaChaitanya™ (@TrendsChaitu) August 21, 2025 -
ఆకట్టుకునేలా 'అర్జున్ చక్రవర్తి' ట్రైలర్
అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అలాంటి ఓ సినిమానే 'అర్జున్ చక్రవర్తి'. కొన్నాళ్ల క్రితం టీజర్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఈ క్రమంలోనే మరోవారంలో థియేటర్లలోకి మూవీ రానున్న సందర్భంగా తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: కదల్లేని స్థితిలో 'వెంకీ' కమెడియన్.. పక్షవాతం రావడంతో)విజయ్ రామరాజు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని కబడ్డీ నేపథ్య నిజజీవిత కథతో తెరకెక్కించారు. విక్రాంత్ రుద్ర దర్శకుడు. 'ఖాళీ చేతులతో, కాలే కడుపుతో చేసేదే అసలైన యుద్ధం' అనే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. జాతీయ స్థాయిలో కబడ్డీ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఓ వ్యక్తి.. తర్వాత కాలంలో తాగుబోతుగా ఎందుకు మారాల్సి వచ్చింది. దీనికి దారితీసిన పరిస్థితులేంటి అనేదే స్టోరీలా అనిపిస్తుంది. ఈ నెల 29న థియేటర్లలో మూవీని విడుదల చేయనున్నారు.(ఇదీ చదవండి: అనుపమ 'పరదా' సినిమా రివ్యూ) -
తెలుగు సీరియల్ నటి కూతురి పెళ్లి.. సెలబ్రిటీల హంగామా
బుల్లితెర నటి, కార్తీకదీపం సీరియల్ విలన్ భావనా రెడ్డి ఇంట శుభకార్యం జరిగింది. భావన కూతురు రేష్మ పెళ్లిపీటలెక్కింది. తేజ అనే యువకుడితో రేష్మ వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలు విష్ణు-సిద్ధు, జ్యోతిరెడ్డి, ప్రియతమ్ చరణ్, ప్రీతమ్, ప్రభాకర్.. ఇలా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సైలెంట్గా పెళ్లి చేసిన నటిసోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని పంచుకునే భావన.. కూతురి పెళ్లిని మాత్రం గోప్యంగా ఉంచింది. కూతురి వెడ్డింగ్కు సంబంధించి ఒక్క ఫోటో, వీడియో కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయలేదు. సైలెంట్గా పెళ్లి చేయాలనుకుందో లేక సడన్ సర్ప్రైజ్ ఇద్దామనుకుందో తనకే తెలియాలి. భావనా రెడ్డి.. బుల్లితెరపై ముద్ద మందారం, త్రినయని, మావారు మాస్టారు.. ఇలా పలు సీరియల్స్లో నటించింది. కార్తీకదీపం ఫస్ట్ పార్ట్లో రుద్రాణిగా విలనిజం పండించింది. శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ కనిపించింది.చదవండి: Bigg Boss Agnipariksha: ప్రోమో సూపర్.. కానీ టైమింగే తేడా! -
హోటల్ రూమ్కు రావాల్సిందే.. నటికి రాజకీయ నేత వేధింపులు!
తిరువనంతపురం: కేరళలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మలయాళ నటి తాజాగా.. ఓ యువ రాజకీయ నాయకుడిపై వేధింపుల ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. దీంతో, ఆరోపణలు రాజకీయంగా చర్చకు దారి తీశాయి. బాధితురాలు సదరు వ్యక్తి పేరు చెప్పకపోయినప్పటికీ కాంగ్రెస్ నేతను టార్గెట్ చేసి బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.వివరాల ప్రకారం.. కేరళలో మలయాళ నటి రీనీ ఆన్ జార్జ్ తాజాగా సంaచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఆమె సోషల్ మీడియా పోస్టులో.. ‘కేరళకు చెందిన ఓ యువ రాజకీయ నాయకుడు తనను హోటల్కు రమ్ముంటున్నాడని అన్నారు. తనకు అభ్యంతరకరమైన సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నాడని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. గత మూడేళ్లుగా ఇలా జరుగుతోందన్నారు. అయితే, సదరు నేత వేధింపులకు సంబంధించి.. ఆ పార్టీలోని సీనియర్లకు ఈ విషయంపై ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిపారు. అయినా కూడా ఆయనపై చర్యలు తీసుకోకుండా.. ఉన్నత పదవులు ఇస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. సదరు నేత.. తనను మాత్రమే కాదు.. ఇప్పటి చాలా మంది యువతులను ఇలా వేధించినట్టు తనకు తెలుసంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే, పోస్ట్లో మాత్రం ఆమె ఎక్కడా.. అతడి పేరును, రాజకీయ పార్టీని ప్రస్తావించలేదు. దీంతో, నటి ఆరోపణలపై కేరళలో రాజకీయ దుమారం చెలరేగింది.Malayalam actor Rini Ann George accused Youth Congress state president and Palakkad MLA Rahul Mamkootathil of sending her offensive messages and of harassment. It has created a furore in Kerala politics! pic.twitter.com/puu1FRjOOP— Sreedhar Pillai (@sri50) August 21, 2025బీజేపీ మాత్రం ఆమె ఆరోపణలపై స్పందిస్తూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్ టార్గెట్ చేసింది. ఆయనే వేధింపులకు పాల్పడుతున్నారని కాషాయ నేతలు మండిపడుతున్నారు. రాహుల్ పేరు ప్రస్తావిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. తక్షణమే రాజీనామా చేయాలని బీజేపీ మార్చ్ నిర్వహించింది. కాగా, రాహుల్ మమ్కూటథిల్ ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాడు.ఇదిలా ఉంటే రచయిత్రి హనీ భాస్కరన్ కూడా రాహుల్ మమ్కూటథిల్పై ఆరోపణలు చేశారు. తనను కూడా వేధింపులకు గురి చేశాడని తెలిపింది. సోషల్ మీడియాలో పదే పదే సందేశాలు పంపి వేధించాడని ఆమె ఆరోపించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. యూత్ కాంగ్రెస్లో మహిళలను కూడా ఇలానే వేధించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సదరు కాంగ్రెస్ నేత వేధింపుల వ్యవహారం కేరళలో కొత్త చర్చకు దారి తీసింది. -
Bigg Boss Agnipariksha: ప్రోమో సూపర్.. కానీ టైమింగే తేడా!
బిగ్బాస్ 9 కంటే ముందు వస్తోన్న బిగ్బాస్ అగ్నిపరీక్ష షో (Bigg Boss Agnipariksha)పై మంచి బజ్ ఉంది. ఇప్పటికే ఫస్ట్ ఎపిసోడ్ గురించి రెండు ప్రోమోలు రిలీజ్ చేయగా తాజాగా మూడో ప్రోమో విడుదల చేశారు. ఇందులో ఫేమస్ యూట్యూబర్ గంగవ్వ వయసులో ఉన్న ఓ ముసలమ్మ స్టేజీపై అడుగుపెట్టింది. నెత్తిన బోనంతో పాటలు పాడుకుంటూ జోష్గా వచ్చింది. నల్గొండ దగ్గర కొండతిరుమలగిరి మా ఊరు.. చాలా కష్టాలు పడ్డాను సర్.. నా చిన్నబిడ్డ నన్ను, నా భర్తను పోషిస్తోంది. నా భర్తకు పక్షవాతం వచ్చింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మీ అందరినీ కలిశా.. ఈ జన్మకు ఇంతే చాలు అని ఎమోషనలైంది.మాకు నిద్రుండదుఆయన స్టోరీ విన్న అభిజిత్.. మీ జీవితంలో సగం కూడా నేను చూడలేదు, కానీ లోపల ఆట నేను చూశాను. ఆ గేమ్ మీకు చాలా కష్టంగా ఉంటుందవ్వా.. అన్నాడు. అందుకామె మాత్రం నాకు తోచినంత ఆడతా.. అని తన ఆసక్తిని చూపించింది. తర్వాత దివ్యాంగుడు ప్రసన్నకుమార్ స్టేజీపైకి వచ్చాడు. అతడి స్టోరీ విన్న నవదీప్.. ఈ కథను మేము ప్రపంచానికి చూపించకపోతే మాకు నిద్ర ఉండదు అంటూ గ్రీన్ సిగ్నల్ చూపించాడు.అర్ధరాత్రి షోఇదంతా బాగానే ఉంది కానీ షో టైమింగ్స్ మాత్రమే కాస్త తేడాగా ఉంది. ఎప్పుడూ బిగ్బాస్ రాత్రి 9 లేదా 9.30 గంటల ప్రాంతంలో వచ్చేది. కానీ ఈ అగ్నిపరీక్ష మాత్రం ఎటూ కాకుండా అర్ధరాత్రి 12 గంటలకు రానుంది. ప్రతిరోజు రాత్రి 12 గంటలకు జియో హాట్స్టార్లో కొత్త ఎపిసోడ్ అప్లోడ్ చేస్తారు. ఫలానా సమయం అని లేకుండా రోజులో మీకు నచ్చినప్పుడు దాన్ని చూసుకోవచ్చన్నమాట! ఇది చాలామందికి నచ్చడం లేదు. అగ్నిపరీక్షకు ప్రత్యేక సమయం కేటాయిస్తేనే బాగుంటుంది, ఇలా అర్ధరాత్రి అప్లోడ్ చేయడం అనవసరం అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చదవండి: చెత్త ఎఫైర్లు పెట్టుకున్నా.. మగ తోడు అవసరం లేదు : సీనియర్ నటి -
కదల్లేని స్థితిలో 'వెంకీ' కమెడియన్
టాలీవుడ్లో సినిమాలు చేస్తూ ఎంత గుర్తింపు తెచ్చుకున్నా సరే కొందరు చిన్న నటుల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. అవకాశాలు రాకపోతే రోజు కూడా గడవదు. అలాంటిది ఏదైనా రోగమొచ్చి మంచం పడితే అంతే సంగతులు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే 'వెంకీ' సినిమాలో హీరో రవితేజ ఫ్రెండ్గా నటించి ఆకట్టుకున్న కమెడియన్ రామచంద్ర ఇప్పుడు మంచం పైనుంచి కదల్లేని స్థితిలో ఉన్నాడు. పక్షవాతానికి గురయ్యాడు. ఇంతకీ అసలేమైంది?కమెడియన్ రామచంద్ర అంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ చూస్తే గుర్తుపడతారు. జూ. ఎన్టీఆర్ హీరోగా నటించిన 'నిన్ను చూడాలని' సినిమాతో ఇతడు నటుడిగా మారాడు. తర్వాత ఆనందం, సొంతం, వెంకీ, కింగ్, దుబాయి శీను, లౌక్యం తదితర చిత్రాల్లో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓవరాల్ కెరీర్లో 100కి పైగా చిత్రాల్లో నటించాడు. అలాంటిది ఇప్పుడు ఇతడి ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మారింది.(ఇదీ చదవండి: అనుపమ 'పరదా' సినిమా రివ్యూ)తను పక్షవాతానికి గురైనట్లు తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ వీడియోలో మాట్లాడిన రామచంద్ర.. '15 రోజుల క్రితం ఓ డెమో షూట్ కోసం వెళ్లాను. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాళ్లు లాగేసినట్లు అనిపించాయి. దీంతో డాక్టర్ దగ్గరకెళ్లి పరీక్షలు చేయించుకుంటే బ్రెయిన్లో రెండు క్లాట్స్ ఉన్నట్లు తెలిసింది. దీంతో నా ఎడమ చేయి, కాలు పడిపోయాయి. ప్రస్తుతం మందులు వాడుతున్నాను. కనీసం రెండు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పారు. నా గురించి మొత్తం నా సోదరుడే చూసుకుంటున్నాడు. రెండు నెలల పాటు ఉద్యోగానికి సెలవు కూడా పెట్టేశాడు' అని తన పరిస్థితి గురించి వివరించాడు.తన తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారని, తన తమ్ముడే బాగోగులు చూసుకుంటున్నాడని రామచంద్ర చెప్పాడు. తోటి ఆర్టిస్టులకు తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరించాలని, వాళ్ల ద్వారా ఇండస్ట్రీలోని ప్రముఖులకు ఈ విషయం చేరుతుందనే ఆశతో ఉన్నాడని అన్నాడు. ఇప్పటికైతే టాలీవుడ్ నుంచి ఎవరూ తనకు ఫోన్ చేసి ఎలా ఉందని అడగలేదని తెలిపాడు. అయితే రామచంద్ర పరిస్థితి చూసిన సినీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన వైద్య పరంగా ఎవరైనా సినీ ప్రముఖులు సాయం చేయాలని కోరుతున్నారు.(ఇదీ చదవండి: సినీ కార్మికులు రోడ్డున పడ్డారు) -
నాలో మార్పు వచ్చింది..ఇకపై అలా చేయను : సమంత
ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్లిన సమంత..ఈ మధ్యకాలంలో మాత్రం కాస్త వెనక్కి తగ్గింది. మయోసైటిస్ వ్యాధితో కొన్నాళ్లు ఇబ్బంది పడ్డ సామ్.. దాన్ని నుంచి పూర్తి కోలుకొని మళ్లీ మునుపటి అందంతో కనిపిస్తూ, కెమెరా ముందుకు వచ్చింది. అయితే గతంలో మాదిరి ఒకేసారి ఐదారు చిత్రాలు మాత్రం చేయనని చెబుతోంది ఈ బ్యూటీ. తాజాగా ప్రముఖ మ్యాగజైన్ ‘గ్రాజియా ఇండియా’ (Grazia India) లేటెస్ట్ ఎడిషన్ కవర్ పేజీపై మెరిసిన సామ్.. ఆ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్పై ఆసక్తిక విషయాలను పంచుకుంది.‘ఇకపై సినిమాలతో పాటు అరోగ్యంపై కూడా దృష్టిపెడతాను. గతంలో పోలిస్తే నాలో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. గొప్ప పనులు చేసే స్థాయికి చేరుకున్నాను. ఇకపై సినిమాలతో పాటు ఫిట్నెస్పై కూడా ఎక్కువ దృష్టిపెడతాను. మానసిక ఆరోగ్యానికి ఎక్కువ ప్రధాన్యం ఇవ్వాలనుకుంటున్నాను. గతంలో మాదిరి ఒకేసారి ఐదారు సినిమాలు చేయను. తక్కువ సినిమాలు చేసినా..ప్రేక్షకులకు మనసుకు నచ్చే నచ్చే వాటితోనే పలకరిస్తాను. ప్రాజెక్ట్ల సంఖ్య తగ్గింది.. కానీ, వాటి నాణ్యత కచ్చితంగా పెరుగుతుంది’ అతని సమంత చెప్పుకొచ్చింది.సమంత సినిమాల విషయానికొస్తే.. ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ ఇటీవల ప్రేక్షకుల ముందుక వచ్చి మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ వెబ్ సిరీస్లో నటిస్తూంది. రాజ్-డీజే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్లో ఆదిత్యారాయ్ కపూర్, అలీ ఫజల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. -
అనుపమ 'పరదా' సినిమా రివ్యూ
'రివ్యూలు నచ్చితేనే మా సినిమా చూడండి'.. రీసెంట్గా ప్రమోషన్లలో హీరోయిన్ అనుపమ చెప్పిన మాట ఇది. చాలా నమ్మకంతో ఆగస్టు 22న రిలీజ్ పెట్టుకుని, రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేశారు. ఆ చిత్రమే 'పరదా'. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్తో తీసిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్ర పోషించింది. సంగీత, మలయాళ నటి దర్శన రాజేంద్రన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?పడతి అనే గ్రామంలో ఈడుకొచ్చిన ప్రతి ఆడపిల్ల ముఖానికి పరదా కప్పుకొని తిరుగుతుంటుంది. దానికి ఓ కారణం ఉంటుంది. పొరపాటున ఎవరైనా పరదా తీస్తే వాళ్లు.. గ్రామదేవత జ్వాలమ్మకు ఆత్మాహుతి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇదే ఊరిలో ఉండే సుబ్బు(అనుపమ), రాజేశ్ (రాగ్ మయూర్) ప్రేమలో ఉంటారు. వీళ్లకీ పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయిస్తారు. సరిగ్గా నిశ్చితార్థం రోజున సుబ్బు ఫొటో కారణంగా.. ఈమె ఆత్మాహుతి చేసుకోవాలని ఊరి పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. తన తప్పు లేదని చెబుతున్నా సరే వినరు. దీంతో అనుకోని పరిస్థితుల మధ్య సుబ్బు తన ఊరి దాటి ధర్మశాల వెళ్లాల్సి వస్తుంది. ఈమెకు తోడుగా రత్న(సంగీత), అమిష్ట(దర్శన రాజేంద్రన్) కూడా వెళ్తారు. ఇంతకీ ధర్మశాల ఎందుకు వెళ్లారు? చివరకు సుబ్బు.. పరదా తీసిందా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?గత కొన్నాళ్లలో హీరో సెంట్రిక్ మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి. అయితే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కాస్త తగ్గాయని చెప్పొచ్చు. ఆ లోటుని భర్తీ చేసేందుకు వచ్చిన చిత్రమే 'పరదా'. ఇందులో హీరోహీరోయిన్లు అంటూ ఎవరూ ఉండరు. కథే మెయిన్ హీరో.పడతి గ్రామంలో జ్వాలమ్మ జాతరతో సినిమా మొదలవుతుంది. ఈ ఊరిలోని ఈడొచ్చిన అమ్మాయిలు, మహిళలు ఎందుకు పరదా కప్పుకోవాల్సి వచ్చిందనేది మొదటి పది నిమిషాల్లోనే తోలుబొమ్మలాట కథతో చెప్పేస్తారు. తర్వాత సుబ్బు, రాజేశ్ ప్రేమ.. నిశ్చితార్థం.. అనుకోని అవాంతరం వల్ల అది ఆగిపోవడం.. ఇలా కథలో సంఘర్షణ ఏర్పడుతుంది. తన తప్పు లేదని చెబుతున్నా సరే సుబ్బుని ఆత్మాహుతి చేసుకోవాలని ఊరి పెద్దలు ఆదేశించడం.. తర్వాత అనుకోని పరిస్థితుల్లో సుబ్బు.. మరో ఇద్దరు మహిళలతో కలిసి హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల వెళ్లాల్సి రావడం జరుగుతుంది. తర్వాత ఏమైంది? ఈ ప్రయాణంలో ఏం తెలుసుకున్నారనేది తెలియాలంటే మూవీ చూడాలి.ఒకప్పటితో పోలిస్తే అమ్మాయిల్లో చైతన్యం పెరిగింది. మగాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా భిన్న రంగాల్లో రాణిస్తున్నారు. అయినా సరే కొన్ని ప్రాంతాల్లో మూఢ నమ్మకాల పేరుతో మహిళలని ఇబ్బంది పెడుతున్నారు. ఆచారం, సంప్రదాయం అని చెప్పి బయట ప్రపంచం చూడనీయకుండా చేస్తున్నారు. అలాంటి ఓ ఊరికి చెందిన అమ్మాయి.. తన ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ ఎలాంటి సాహసం చేసింది? మూఢనమ్మకాలపై ఎలా పోరాడింది అనే కల్పిత కథతో తీసిన చిత్రమే ఇది.సినిమా ప్రారంభంలో జెయింట్ వీల్ ఎక్కడానికే సుబ్బు చాలా భయపడుతుంది. కానీ పరిస్థితుల కారణంగా ఎత్తయిన ఎవరెస్ట్ వరకు వెళ్తుంది. తనలో భయాన్ని పోగొట్టుకుంటుంది. మూవీ అంతా సుబ్బు పాత్ర పరదా కప్పుకొని ఉంటుంది. ఆమె పూర్తిగా పరదా తీసేసే సీన్లో సీతాకోక చిలుక రిఫరెన్స్ మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. సుబ్బుతో పాటు జర్నీ చేసే రత్న ఓ గృహిణి, ఆమిష్ట ఓ ఇంజినీర్. ఈ పాత్రల్ని ప్రారంభించిన తీరు, ముగించిన తీరు కూడా మెచ్చుకునేలా ఉంటుంది. సెకండాఫ్ మొదలవగానే రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ వస్తుంది. ఉన్నది కాసేపే అయినా.. ఆయన చెప్పే ఓ స్టోరీ, డైలాగ్స్ మంచి ఎమోషనల్గా అనిపిస్తాయి. క్లైమాక్స్లో సుబ్బు పాత్ర.. దేవుడికి కట్టిన వస్త్రాల్ని తగలబెట్టే సీన్, ఊరి ప్రజల కళ్లు తెరిపించింది అనేలా విజువల్గా చూపించడం బాగుంది.అన్ని ప్లస్సులేనా మైనస్సులు లేవా అంటే ఉన్నాయి. సినిమా అంతా కూడా మహిళలు, వారి చైతన్యం అనేలా సాగుతుంది. రెగ్యులర్ ప్రేక్షకులందరికీ ఇది నచ్చకపోవచ్చు. కానీ అమ్మాయిలు మాత్రం తప్పకుండా ఈ మూవీ చూడాలి. చూస్తున్నంతసేపు కచ్చితంగా ఎమోషనల్ అవుతారు.ఎవరెలా చేశారు?సుబ్బు పాత్రలో అనుపమ అద్భుతంగా నటించింది. ఈ పాత్ర ప్రారంభంలో బిడియం, భయం, ప్రేమ లాంటి అంశాలతో చలాకీగా కనిపిస్తుంది. తర్వాత సీరియస్ టోన్లోకి మారుతుంది. చివరకొచ్చేసరికి ఫియర్లెస్ ఉమన్గా మారడం లాంటి మార్పు కిక్ ఇస్తుంది. రత్నగా చేసిన సంగీత క్యారెక్టర్ కూడా చాలామంది గృహిణులకు కనెక్ట్ అవుతుంది. ఓ సీన్లో ఈమె తన భర్త క్యారెక్టర్తో చేసే కామెడీ భలే నవ్విస్తుంది. పెళ్లి, పిల్లలు వద్దు అంటూ ఇండిపెండెంట్గా ఉండే మహిళలకు దర్శన రాజేంద్రన్ చేసిన అమిష్టా క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. లీడ్ రోల్స్ చేసిన ఈ ముగ్గురు కూడా బాగా చేశారు. రాగ్ మయూర్, 'బలగం' సుధాకర్ రెడ్డి.. ఇలా మిగిలిన వాళ్లు కూడా తమ వంతు న్యాయం చేశారు.టెక్నికల్ టీమ్ కూడా సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నేపథ్య సంగీతం అక్కడక్కడ కాస్త లౌడ్గా అనిపించింది కానీ మిగతా చోట్ల సెట్ అయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్గా డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల గురించి చెప్పుకోవాలి. గతంలో సినిమా బండి, శుభం అని సినిమాలు తీశాడు. అవి మోస్తరుగా అనిపించాయి కానీ ఈ మూవీతో తనలో చాలానే విషయం ఉందని నిరూపించాడు. ఫిమేల్ సెంట్రిక్ తరహా సినిమాలంటే ఇష్టముంటే మాత్రం 'పరదా' మిస్ కావొద్దు.- చందు డొంకాన -
చెత్త ఎఫైర్లు పెట్టుకున్నా.. మగ తోడు అవసరం లేదు : సీనియర్ హీరోయిన్
బాలీవుడ్లో కొన్నేళ్ల పాటు నెం1 అందాల నటిగా యువ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది మనీషా కొయిరాలా(Manisha Koirala ). సుభాష్ ఘయ్ తీసిన 1942 ఎ లవ్ స్టోరీ సినిమా, అందులోని పాటల్లో మనీషా కొయిరాలా అందాన్ని మర్చిపోవడం అంత తేలిక కాదు అంటారు బాలీవుడ్ సినీ ప్రేమికులు. నాగార్జున సరసన క్రిమినల్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది ఈ నేపాలీ సుందరి. అద్భుతమైన విజయాలను చవిచూసినా, విధి ఆమె పట్ల చిన్న చూపు చూడడంతో క్యాన్సర్ బారిన పడింది. దాంతో ఆమె జీవితం పూర్తిగా తల్లకిందులైంది. ప్రస్తుతం క్యాన్సర్ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే తన వయసుకు తగిన పాత్రలతో తిరిగి బాలీవుడ్లో రాణించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మనీషా.. పలు విషయాలను పంచుకుంది. అందాల నటిగా తెరపై గ్లామర్ను గుబాళింపజేసిన మనీషా బాలీవుడ్లో అనేక అఫైర్స్ వార్తలకు కూడా కేరాఫ్గా నిలిచింది. ‘అగ్ని సాక్షి’ (1996) సినిమాలో కలిసి నటించినప్పుడు సహ నటుడైన నానా పటేకర్తో సంబంధం ఏర్పడింది. అప్పటికే పెళ్లయిన నానా పటేకర్ ప్రతీ తెల్లవారుఝామున మనీషా ఇంటి నుంచి తిరిగి రావడం అనేకమార్లు వెలుగులోకి వచ్చింది. అదే విధంగా సౌదాగర్ లో నటించిన వివేక్ ముష్రాన్తోనూ ఆమెకు సంబంధం ఉందని వార్తలు గుప్పుమన్నాయి. ఇక మార్కెట్ సినిమా సమయంలో కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న మనీషా కి ఆర్యన్ వేద్ ప్రేమ ఓదార్చింది.. సినిమా రంగంలో మాత్రమే కాదు సినీయేతర రంగాల వారితో కూడా ఆమె సంబంధాలు అప్పట్లో బాగా వెలుగు చూశాయి. నానా పటేకర్తో బ్రేకప్ బాధలో ఉండగా, హుస్సేన్ బాబాయ్గా పేరొందిన డిజె హుస్సేన్, నేపాల్లోని ఆస్ట్రేలియన్ అంబాసిడర్ క్రిస్పిన్ కొన్రాయ్, లండన్కు చెందిన నైజీరియన్ వ్యాపారి సిసిల్ ఆంథోనీ, అమెరికన్ స్పోర్ట్స్ కౌన్సిలర్ క్రిస్టోఫర్ డోరిస్...ఇలా పలువురితో ఆమె సంబంధాలు పెట్టుకుందని అప్పట్లో వెల్లడైంది. వీటన్నింటినీ వదిలించుకుని నేపాల్కు చెందిన సామ్రాట్ దహాయ్ని 2010లో పెళ్లి చేసుకుని కుటుంబ జీవితం ప్రారంభించినప్పటికీ ఆ బంధం కూడా రెండేళ్లోనే బెడిసి కొట్టింది. క్యాన్సర్తో పోరాడిన తర్వాత మనిషా కోయిరాలా చాలా మారిపోయింది. ‘‘ఆ వ్యాధి నాకు జీవితం విలువ తెలిసివచ్చేలా చేసింది, ఒక్క క్షణాన్ని కూడా వృధా చేసుకోకూడదని నేర్పింది. ఆ ఎదురుదెబ్బకు ముందు నేను అనేక చెత్త పనుల్లో, చెత్త సంబంధాల్లో చాలా సమయాన్ని వృధా చేసుకున్నాను,’’ అని మనీషా ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తాను సింగిల్గా ఉన్నానని ఇలాగే ఉండాలని అనుకుంటున్నానని ఆమె అంటోంది. ‘‘ఇకపై నేను నిరర్థకమైన సంబంధాలేవీ పెట్టుకోను. ఒంటరితనం నుంచి రక్షించడానికి ఎవరైనా మగవాడు రావాలని కూడా ఎదురు చూడను. నేను సింగిల్నే కానీ ఒంటరిగా లేను. ఇప్పుడు నా సహవాసాన్ని నేనే ఆస్వాదించడం మొదలుపెట్టాను. నాకు లాంగ్ ట్రెక్కింగ్లు చేయడం ఇష్టం. దీర్ఘ ధ్యాన విరామాలు తీసుకుంటాను. అయితే నాలాగా జీవనశైలిని మార్చుకోవడానికి ఏదో పెద్ద నష్టం, కష్టం వచ్చే వరకూ ఎదురు చూడవద్దు. ఇప్పుడే మార్చుకోండి’’ అంటూ మనీషా తోటి మహిళలకు సలహా ఇస్తోంది. అనుభవం నేర్పిన పాఠాలతో ఒకనాటి సిల్వర్ స్క్రీన్ బ్యూటీ... భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటోంది. తన జీవితాన్ని ఓ పాఠంగా తీసుకోవాలని యువతులకు సూచిస్తోంది. -
సినీ కార్మికులు రోడ్డున పడ్డారు
బంజారాహిల్స్: వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు చేస్తున్న సమ్మె 18వ రోజుకు చేరింది. ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ మధ్య చర్చలు సఫలం కాకపోవడంతో వేలాది మంది కార్మికులు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. షూటింగ్లు జరగకపోవడంతో పూట గడవడంలేదు. ఇంటి అద్దెలు చెల్లించే పరిస్థితి లేకుండాపోయింది. అప్పు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన దుస్థితి దాపురించిందని కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.30 శాతం వేతనాలు పెంచాలంటూ..నిబంధనల ప్రకారం ప్రతి మూడేళ్లకోసారి సినీ కార్మికుల వేతనాలు 30 శాతం పెంచాల్సి ఉంటుంది. గత జూన్ 30న ఈ గడువు ముగిసింది. జూలై 1 నుంచి పెంచిన 30 శాతం వేతనాలతో సినీ కార్మికులకు వేతనాలు ఇవ్వాల్సి ఉంది. వేతనాల పెంపునకు ఫిలిం ఛాంబర్ వెనుకడుగు వేసింది. తమకు మూడు నెలల గడువు కావాలంటూ కోరింది. నెల గడవకముందే తాము 15 శాతం వేతనాలు పెంచుతామని అది కూడా మూడు విడతలుగా పెంచుతామని ఫైటర్లు, డ్యాన్సర్లు, టెక్నీషియన్లకు మాత్రం పెంచేది లేదంటూ మెలిక పెట్టింది. దీంతో ఫిలిం ఫెడరేషన్ నాయకులు సాధ్యం కాని షరతులకు ఒప్పుకోలేదు. ఫలితంగా రెండు వారాల నుంచి సినీ పెద్దలకు కార్మిక యూనియన్ నాయకులకు చర్చలు జరుగుతున్నా అవి ఫలప్రదం కావడం లేదు. దీంతో కార్మికులు రోడ్డున పడ్డారు. ఇంటి అద్దెలు కట్టాలంటూ కొందరు, పిల్లల ఫీజులు చెల్లించలేక ఇంకొందరు.. ఇలా సినీ కార్మిక లోకం కన్నీరు పెడుతోంది. గత మూడు రోజుల నుంచి కొందరు సినీ పెద్దలు ఫిలిం ఫెడరేషన్ నాయకులతో మాట్లాడినా ఉపయోగం లేకుండా పోయింది. ఫిలిం ఫెడరేషన్ అనుబంధంగా ఉన్న జూనియర్ ఆర్టిస్ట్లు, లైట్మెన్లు, ప్రొడక్షన్ అసిస్టెంట్లు, మేకప్ ఆర్టిస్ట్లు, డ్రైవర్లు.. తదితర కార్మికులంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అద్దె ఇల్లు ఖాళీ చేయాలంటున్నారుషూటింగ్లు ఉంటేనే ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులు చెల్లించగలుగుతాం. ఇప్పుడు ఇంటి అద్దె కూడా కట్టలేక చాలా మంది కార్మికులు చేతులెత్తేశారు. ఇప్పటికై నా సినీ పెద్దలు మా విషయంలో పెద్ద మనసుతో ఆలోచించి మా డిమాండ్లు నెరవేర్చాలి. – లలిత, ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్అన్నీ కొర్రీలేమా డిమాండ్లు నెరవేర్చడంలో కొర్రీలు పెడుతున్నారు. ఆదివారం ప్రభుత్వ సెలవుల్లో ఫుల్ కాల్షీట్లు ఇస్తారు. ఇవి ఇచ్చేది లేదంటూ పెద్దలు చెబుతున్నారు. ఇదెక్కడి అన్యాయం. మా కార్మికుల విషయానికి వచ్చేసరికి ఎందుకింత పట్టుదలగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు. - చంద్రకళ, జనరల్ సెక్రటరీ ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్ -
‘విశ్వంభర’ రిలీజ్పై చిరు అప్డేట్.. వామ్మో అంత లేటా?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రాల్లో విశ్వంభర ఒకటి. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే రిలీజ్ కావాల్సింది కూడా. అయితే వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తకాకపోవడంతో వాయిదా వేశారు. అప్పటి నుంచి రిలీజ్ డేట్పై చిత్రబృందం క్లారిటీ ఇవ్వలేదు. సమ్మర్, దసరా, దీపావళి, సంక్రాంతి అంటూ నెట్టింట చర్చలు జరిగినా..మేకర్స్ మాత్రం విడుదల తేదిపై స్పందించలేదు. తాజాగా ఈ సినిమా రిలీజ్పై మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చాడు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రం విడుదల అవుతుందని చెప్పారు. ఆలస్యానికి గల కారణాన్ని వివరిస్తూ ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేశాడు(Vishwambhara Update) ‘విశ్వంభర ఎందుకు ఆలస్యం అవుతుందని చాలా మందికి అనుమానం ఉంది. ఆ జాప్యం సముచితమని నేను భావిస్తున్నాను. ఈ సినిమా సెకండాఫ్ మొత్తం వీఎఫ్ఎక్స్ మీద ఆధారపడి ఉంది. దీన్ని అత్తుత్తమంగా మీకు అందించాలనే ప్రయత్నమే ఈ జాప్యానికి కారణం. ఎలాంటి విమర్శలకు చోటివ్వకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ సినిమా చందమామ కథలా సాగిపోతుంది. చిన్నాపెద్దా తేడా లేకుండా ఈ సినిమా అందర్నీ అలరిస్తుంది. దీని గ్లింప్స్ను ఆగస్టు 21 సాయంత్రం 6.06కు విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాను అందరూ ఎంజాయ్ చేసేలా దీన్ని ప్రేక్షకుల ముందుకుతీసుకువస్తారు. 2026 సమ్మర్లో ఎంజాయ్ చేయండి’ అని చిరంజీవి తెలిపారు.విశ్వంభర విషయానికొస్తే.. చిరంజీవి హీరోగా నటించిన సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ మూవీ ఇది. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహించారు. త్రిషా కృష్ణన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. MEGASTAR @KChiruTweets shares a personal note to his fans and the audience about #Vishwambhara ❤️Check out the MEGA BLAST ANNOUNCEMENT now ⚡-- https://t.co/RQ9is0OQCcLet us celebrate the MEGA BIRTHDAY with #MEGABLASTTEASER out today at 6.06 PM ❤🔥MEGA MASS BEYOND… pic.twitter.com/dtJ2Jo0l1m— UV Creations (@UV_Creations) August 21, 2025 -
ఏంటి..నన్ను మిస్ అవుతున్నారా? : నాగవంశీ
ఒక సినిమాని ప్రమోట్ చేయాలంటే హీరోహీరోయిన్లు రంగంలోకి దిగాల్సిందే. వాళ్లు ప్రచారం చేస్తేనే సినిమా జనాల్లోకి వెళ్తుంది. అందుకే ఎక్కువగా నటీనటులతోనే మీడియా సమావేశాలు, ఇంటర్వ్యూలు పెడుతుంటారు. వీరితో పాటు నిర్మాతలు, దర్శకులు కూడా ప్రచారంలో పాల్గొంటారు. కానీ వారి ప్రసంగాలు, ఇంటర్వ్యూలు అంతగా వైరల్ కావు. కానీ ఈ నిర్మాత మాత్రం కాస్త స్పెషల్. ఆయన ఏం మాట్లాడినా.. ట్వీట్ చేసిన క్షణాల్లో వైరల్ అయిపోతుంది. హీరోహీరోయిన్లు ఉన్నప్పటికీ.. పక్కన ఆయన ఉంటే మీడియా ఫోకస్ అంతా అటువైపే ఉంటుంది. సినిమా ప్రమోషన్స్లో ఆయన చెప్పే విషయాలు, ఇచ్చే హైప్ మామలుగా ఉండదు. కొన్నిసార్లు అవసరానికి మించిన హైప్ ఇచ్చి.. ట్రోలింగ్కి కూడా గురవుతుండాడు. ఆయనే యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi ).సితారఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వరుస సినిమాలను నిర్మిస్తూ టాలీవుడ్లో దూసుకెళ్తున్నాడు. మొన్నటి వరకు వరుస విజయాలను చూసిన నాగవంశీకి ఇటీవల మాత్రం దెబ్బ మీద దెబ్బలు తాకుతున్నాయి. ఆయన నిర్మించిన చిత్రాలతో పాటు భారీ ధరకు కొనుగోలు చేసిన సినిమాలు సైతం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోతున్నాయి. ఆయన బ్యానర్ నుంచి భారీ అంచనాలతో రిలీజైన ‘కింగ్డమ్’ మూవీకి హిట్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం ఆ స్థాయిలో రాబట్టలేకపోయింది. ఇక భారీ ధరకు కొనుగోలు చేసిన వార్ 2 చిత్రం కూడా నాగవంశీకి నష్టాలనే మిగిల్చింది. అయితే సినిమా ఫలితంతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వంశీ... వార్ 2 రిలీజ్ తర్వాత సైలెంట్ అయిపోయాడు. ఆయనపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతున్నా స్పందించలేదు. ఒకనొక దశలో సోషల్ మీడియాను దూరం పెట్టాడనే పుకార్లు కూడా వచ్చాయి. అయితే అందులో వాస్తవం లేదని వంశీ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు తనను ట్రోలింగ్ చేస్తున్నవారికి కూడా గట్టి కౌంటర్ ఇచ్చాడు. తను ఎక్కడికి వెళ్లడం లేదని, ఇంకో 10-15 ఏళ్లు ఇండస్ట్రీలోనే ఉంటానని క్లారిటీ ఇచ్చాడు. ' ఏంటి.. నన్నుచాలా మిస్ అవుతున్నట్లు ఉన్నారు. వంశీ అది.. వంశీ ఇది అని గ్రిప్పింగ్ తో ఫుల్ల్ హడావిడి నడుస్తుంది. పర్లేదు. ఎక్స్ లో మంచి రైటర్స్ ఉన్నారు. మిమ్మల్ని డిజప్పాయింట్ చేసినందుకు నన్ను క్షమించండి. కానీ, ఇంకా ఆ సమయం రాలేదు. మినిమమ్ 10 నుంచి 15 ఏళ్లు ఉంది. సినిమాలోనే.. సినిమా కోసం ఎల్లప్పుడూ. మాస్ జాతర అప్డేట్ తో త్వరలో మళ్లీ కలుద్దాం ' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.Enti nannu chala miss avthunattu unnaru.. 😂Vamsi adi, Vamsi idi ani gripping narratives tho full hadavidi nadustundi…Parledu, X lo manchi writers unnaru.Sorry to disappoint you all, but inka aa time raaledu… minimum inko 10-15 years undi.At the cinemas… for the cinema,…— Naga Vamsi (@vamsi84) August 20, 2025 -
నాన్న సంపాదించిన డబ్బంతా అటే వెళ్తుంది : శ్రుతీ హాసన్
జయాపజయాలు సహజం. దీనికి ఎవరూ అతీతులు కాదు. ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన నటుడు కమలహాసన్ అయినా, మరచిపోలేని చిత్రాలను అందించిన దర్శకుడు మణిరత్నం అయినా సరే. నటుడు కమలహాసన్ ఇటీవల కథానాయకుడిగా విక్రమ్, నిర్మాతగా అమరన్ వంటి సంచలన విజయాలను సాధించిన విషయం తెలిసిందే. అదే విధంగా ఎంజీఆర్ వంటి ప్రఖ్యాత నటుడు చేయాలని ఆశించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని దర్శకుడు మణిరత్నం తెరకెక్కించి సక్సెస్ను సాధించారు. అలాంటిది ఇటీవల ఈయన దర్శకత్వం వహించిన థగ్లైఫ్ చిత్రం నిరాశ పరిచింది. అదేవిధంగా హీరో కమలహాసన్(Kamal Haasan )కు థగ్లైఫ్తో పాటూ ఇండియన్– 2 చిత్రం పరాజయాలను చవి చూశాయి. అయితే ఇదంతా పట్టించుకోని మణిరత్నం ప్రస్తుతం ఒక యూత్ పుల్ లవ్ స్టోరీని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇక కమలహాసన్ స్టంట్ మాస్టర్స్ అన్భరివ్లను దర్శకులుగా పరిచయం చేస్తూ భారీ చిత్రాన్ని నిర్మిస్తూ , కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కమలహాసన్ వారసురాలు, నటి శృతిహాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి మనస్థత్వం గురించి పేర్కొన్నారు. థగ్లైఫ్ చిత్ర అపజయం అనంతరం కమలహాసన్ మానసిక పరిస్థితి ఎలా ఉందన్న ప్రశ్నకు శ్రుతిహాసన్ బదులిస్తూ ఆ చిత్ర అపజయం తన తండ్రిని ఎలాంటి బాధింపునకూ గురి చేయలేదన్నారు. ఆయన ఎప్పుడూ సంపాదించిన తన డబ్బునంతా మళ్లీ సినిమాల్లోనే పెడతారన్నారు. ఆయన ఆ డబ్బుతో రెండో ఇల్లు కొనడానికో, మూడో కారు కొనడానికో ఇష్టపడరన్నారు. అంతా సినిమాలకే పోతుందన్నారు. ప్రజలు అనుకుంటున్నట్లు ఈ నెంబర్ గేమ్ అనేది తన తండ్రిని బాధించదని శృతిహాసన్ పేర్కొన్నారు. కాగా ఇటీవల నటించిన కూలీ చిత్రంలోని నటనకు గానూ శ్రుతిహాసన్ ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం విజయ్సేతుపతికి జంటగా ట్రెయిన్ చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ తెలుగులో ఒక చిత్రం చేస్తున్నారు. కాగా తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న మరో తెలుగు చిత్రంలో శృతిహాసన్ నటించనున్నట్లు తాజా సమాచారం. -
పదిహేను కోట్ల ఇంట్లో...
‘దేవర’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ వంటి హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ఫిల్మ్నగర్ టాక్. ఇదిలా ఉంటే... ఈ చిత్రానికి సంబంధించిన ప్రతిదీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది.ఇప్పటికే మూడువేల మంది జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరించిన ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్, అలాగే సుమారు 2000 మందితో తెరకెక్కించిన ఓ పాట... ఇలా అన్నీ హైలెట్గా మారాయి. తాజాగా ఈ చిత్రం కోసం హైదరాబాద్ సమీపంలోని ఓ స్టూడియోలో సుమారు పదిహేను కోట్ల రూ పాయలతో ఎన్టీఆర్ ఇంటి సెట్ని నిర్మించారనే వార్తలు వస్తున్నాయి. ఈ భారీ సెట్లో యాక్షన్ సీక్వెన్స్తో కొత్త షెడ్యూల్ని ప్రారంభిస్తారట.సినిమాలో ఈ ఇంటి సెట్ ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలుస్తుందట. కళా ఖండాలు, వాల్ హ్యాంగింగ్... ఇలా ఈ సెట్కి సంబంధించిన ప్రతి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారట మేకర్స్. అందుకే సెట్కే దాదాపు రూ. 15 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. ప్రస్తుతం షూటింగ్కి చిన్న విరామం ఇచ్చిన ఎన్టీఆర్ వినాయక చవితి తర్వాత సెప్టెంబర్ మొదటి వారం నుంచి షూటింగ్లో పాల్గొంటారని టాక్. ఈ కొత్త షెడ్యూల్ నెల పాటు జరగనుందని తెలి సింది. ఈ చిత్రం 2026 జూన్ 25న విడుదల కానుంది. -
చాయ్వాలా ప్రేమకథ
‘‘చాయ్వాలా’ సినిమా చూసిన ప్రేక్షకులు కచ్చితంగా తమ తండ్రితో కాసేపు మాట్లాడతారు. ఈ చిత్రం చూశాక థియేటర్ నుంచి ఓ మంచి భావోద్వేగంతో బయటికొస్తారని మాత్రం కచ్చితంగా చెప్పగలను’’ అని శివ కందుకూరి తెలి పారు. ప్రమోద్ హర్ష రచన, దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చాయ్వాలా’. శివ కందుకూరి, తేజు అశ్విని జోడీగా నటించారు. రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్. పాపుడిప్పు నిర్మించారు. బుధవారం జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో శివ కందుకూరి మాట్లాడుతూ– ‘‘ఈ ప్రయాణంలో నాకు ప్రమోద్ మంచి స్నేహితుడిగా మారిపోయారు.నిర్మాత వెంకట్గారికి సినిమా పట్ల ఎంతో ఫ్యాషన్ ఉంది. మా చిత్రం ప్రేక్షకులందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని చె΄్పారు. ‘‘చాయ్వాలా’ ఎమోషనల్గా అందరికీ కనెక్ట్ అవుతుంది’’ అని నిర్మాత రాజ్ కందుకూరి అన్నారు. ప్రమోద్ హర్ష మాట్లాడుతూ– ‘‘నేను రాసుకున్న పాత్రలు, కథ నుంచే ‘చాయ్వాలా’ టైటిల్ను తీసుకున్నాను. ప్రతి మనిషి జీవితంలో జరిగే ఘటనలే మా చిత్రంలో ఉంటాయి’’ అని చెప్పారు.‘‘మా సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు కన్నీళ్లు వచ్చాయి. ఇదొక సున్నితమైన ప్రేమకథ’’ అని వెంకట్ ఆర్. పాపుడిప్పు పేర్కొన్నారు. ‘‘తెలుగులో ‘చాయ్వాలా’ నా మొదటి చిత్రం. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు తేజు అశ్విని. ‘‘ఈ కథ వినోదాత్మకంగా, అలాగే భావోద్వేగంగా ఉంటుంది. మా ‘చాయ్వాలా’ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని నటుడు రాజీవ్ కనకాల తెలి పారు. నటుడు రాజ్కుమార్ కసిరెడ్డి మాట్లాడారు. -
ప్రభాస్ వింటేజ్ లుక్ లీక్.. ‘ఫౌజి’ టీమ్ హెచ్చరిక!
ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి వింటేజ్ లుక్లో కనిపిస్తున్న ప్రభాస్ లుక్ లీక్ అయింది. విడుదలైన కొద్ది క్షణాల్లోనే ఆ ఫొటో వైరల్ అయింది. పలువురు నెటిజన్లు షేర్ చేశారు. ప్రభాస్ లుక్ ట్రెండింగ్లోకి రావడంతో మూవీ టీమ్ సీరియస్గా స్పందించింది.‘‘మా సినిమా గురించి ఎంతోమంది ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు. మీకు అద్భుతమైన విజువల్స్ అందించేందుకు యూనిట్ ఎంతో కష్టపడుతోంది. చిత్రీకరణ సమయంలో సెట్స్ నుంచి ఓ ఫొటో లీక్ అయిన విషయం మా దృష్టికి వచ్చింది. ఇలాంటి లీక్లు మా విశ్వసనీయత, నైతికతను దెబ్బతీస్తాయి. అనధికారికంగా ఎవరైనా ప్రభాస్ లుక్ లీక్ చేసినా, షేర్ చేసినా వాళ్ల ఐడీలు బ్లాక్ చేయడంతో పాటు సైబర్ క్రైమ్ నేరం కింద పరిగణించి కేసులు పెట్టి, కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్. -
మాల్దీవుస్లో నేహా శెట్టి చిల్.. బాలిలో ఎంజాయ్ చేస్తోన్న హన్సిక!
మాల్దీవుస్లో చిల్ అవుతోన్న నేహా శెట్టి..వైట్ శారీలో మెరిసిపోతున్న బిగ్బాస్ బ్యూటీ సోనియా ఆకుల..బాలిలో ఎంజాయ్ చేస్తోన్న హన్సిక మోత్వాని..బ్లూ డ్రెస్లో ఆండ్రియా జెరెమా బ్యూటీఫుల్ లుక్..మిస్ యూనివర్స్తో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా.. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Soniya Akula (@soniya_akula_official) -
అనుష్క శెట్టి పాన్ ఇండియా మూవీ.. ఆ సాంగ్ వచ్చేసింది!
అనుష్కశెట్టి లీడ్ రోల్లో వస్తోన్న పాన్ ఇండియా చిత్రం ఘాటి. ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ సినిమా నుంచి దస్సోరా అనే లిరికల్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ క్రేజీ సాంగ్కు సాగర్ నాగవెల్లి కంపోజ్ చేయగా.. ఈఎస్ మూర్తి లిరిక్స్ అందించారు. ఈ పాటను గీతా మాధురి, సాకేత్, శ్రుతి రంజని ఆలపించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఆమె అంటే నాకు పిచ్చి.. బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో ఛావా సినిమాపై బాలీవుడ్ నటి స్వర భాస్కర్ చేసిన ట్వీట్స్ వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే స్వరభాస్కర్ తాజాగా అలాంటి కామెంట్లతో మరోసారి చర్చనీయాంశంగా మారింది.తన భర్త ఫహద్ ఆహ్మద్తో కలిసి పతి పత్ని ఔర్ పంగా - జోడియోం కా రియాలిటీ చెక్ అనే రియాలిటీ షోకు హాజరైన బాలీవుడ్ భామ లైంగిక జీవితంపై సంచలన కామెంట్స్ చేసింది. ప్రతి ఒక్కరూ బై సెక్సువల్ అంటూ వ్యాఖ్యానించింది. అంతేకాకుండా తనకు సమాజ్వాది పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ అంటే క్రష్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవలే ఆమెను కలిశానని కూడా తెలిపింది.జెండర్ అనేది వేల ఏళ్లుగా మనపై బలవంతంగా రుద్దబడిన భావజాలమంటూ స్వర భాస్కర్ మాట్లాడింది. ఇవీ కాస్తా నెట్టింట వైరల్ కావడంతో పలువురు ఆమెపై మండిపడుతున్నారు. దీంతో తన మాటలతో మరోసారి వివాదానికి కేరాఫ్ అడ్రస్గా మారింది స్వర భాస్కర్. కాగా.. స్వర భాస్కర్ హిందీలో తను వెడ్స్ మను, రాంఝనా, ప్రేమ్ రతన్ ధన్ పాయో లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది."Everyone is Bisexual. I have a crush on Dimple Yadav"Swara Bhaskar 💀Now I am feeling bad for Akhilesh Yadav and Swara's husband 🤣pic.twitter.com/JVc1z12w7n— Sunanda Roy 👑 (@SaffronSunanda) August 18, 2025 -
రాసుకుపూసుకుని తిరగను, అందుకే నో సక్సెస్..
చాలా సినిమాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయంటోంది నటి దీక్షా పంత్ (Diksha Panth). ఇటీవల వచ్చిన ఓ పెద్ద మూవీలో కూడా తాను నటించాల్సిందని, కానీ చెప్పాపెట్టకుండా సైడ్ చేశారని వాపోయింది. ఇలా తన కెరీర్ జర్నీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకుంది. దీక్షా పంత్ మాట్లాడుతూ.. మాది ఉత్తరాఖండ్. నాన్న రైల్వే ఉద్యోగి కావడంతో ఎప్పుడూ ట్రాన్స్ఫర్స్ అవుతుండేవి. అలా నేను పుట్టింది విజయవాడలో, పెరిగింది కాకినాడలో!మొదట నో చెప్పా..ఎయిర్ హోస్టెస్ అవ్వాలనుకున్నాను. ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. ఓ ఈవెంట్లో కొరియోగ్రాఫర్ నన్ను చూసి మోడలింగ్ ట్రై చేయొచ్చుగా అని చెప్పారు. మా ఇంట్లో చంపేస్తారంటూ నో చెప్పాను. రెండేళ్ల తర్వాత అతడే మళ్లీ కాల్ చేసి అడిగాడు. ఇంతలా అడుగుతున్నాడని ఒకసారి ట్రై చేద్దామని చేశాను. ఇంట్లో ఒప్పించి ఫోటోషూట్, ర్యాంప్ షోస్ చేశాను. అలా మోడలింగ్లో బిజీ అయ్యాను. తర్వాత సినిమాల్లోకి వచ్చాను. పెద్ద మూవీలో ఆఫర్మొదట్లో అవకాశాలిస్తాం కానీ మాకు మరేదో కావాలని అడిగేవారు. నేను ముఖం మీదే నో చెప్పేదాన్ని. నన్ను రిజెక్ట్ చేసేవారు. అవకాశాల కోసం మరీ అందరితో రాసుకుపూసుకు తిరగను. అందుకే సక్సెస్ఫుల్ కాలేదు. గతంలో మంచి హిట్స్ ఇచ్చిన ఒక పెద్ద డైరెక్టర్ ఈ మధ్య ఓ పీరియడ్ డ్రామా సినిమా రిలీజ్ చేశారు. 2017లోనే ఈ మూవీ చేయమని ఆఫర్ చేశారు. అలా ఎన్నో ఆఫర్స్ మిస్అంతా బానే ఉందనుకున్న సమయంలో సడన్గా నన్ను వద్దనుకున్నారు. ఆ విషయం నాకు చెప్పనేలేదు. అంత మంచి ప్రాజెక్ట్ వచ్చినట్లే వచ్చి చేజారడం కాస్త బాధేసింది. అలా చాలా ఆఫర్లు వచ్చినట్లే వచ్చి చేతికందకుండా పోయాయి అని చెప్పుకొచ్చింది. రచ్చ, వరుడు, ఒక లైలా కోసం, గోపాల గోపాల చిత్రాల్లో అలరించింది నటి దీక్షా పంత్. మంగమ్మ అనే ప్రైవేట్ సాంగ్తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తెలుగు బిగ్బాస్ మొదటి సీజన్లో పాల్గొని మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది.చదవండి: ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సారీ చెప్పు, లేదంటే మా తడాఖా చూపిస్తాం -
బుల్లితెర నటి రెండో ప్రెగ్నెన్సీ.. గ్రాండ్గా సీమంతం వేడుక!
బాలీవుడ్ భామ గౌహర్ ఖాన్ త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ ఏడాది ప్రారంభంవో సెకండ్ ప్రెగ్నెన్సీ ప్రకటించిన ముద్దుగుమ్మ.. తాజాగా సీమంతం వేడుక సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వేడుకను కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.కాగా.. గౌహర్ ఖాన్ 2020లో సంగీత స్వరకర్త ఇస్మాయిల్ దర్బార్ కుమారుడు జైద్ను వివాహం చేసుకున్నారు. ఈ జంట మే 2023లో తమ మొదటి బిడ్డను స్వాగతించారు. ఆ తర్వాత ఏప్రిల్ 2025లో సెకండ్ ప్రెగ్నెన్సీని ప్రకటించారు. ఇక కెరీర్ విషయానికొస్తే గౌహర్ ఖాన్ బాలీవుడ్లో పలు సీరియల్స్లో నటించింది. ఆమె ఇటీవల ఇషా మాల్వియాతో కలిసి లవ్లీ లోల్లాలో కూడా కనిపించింది. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
సాఫ్ట్వేర్ అమ్మాయి.. రైతుగా అబ్బాయి.. ఈ ప్రేమకథ ట్రైలర్ చూశారా?
శ్రీచరణ్ రాచకొండ, గీత్ షైని జంటగా నటించిన చిత్రం కన్యాకుమారి. ఈ సినిమాకు సృజన్ అట్టాడ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంలో వస్తోన్న లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు.ట్రైలర్ చూస్తే బాగా చదువుకుని సాఫ్ట్ వేర్ అవ్వాలనుకుంటున్న అమ్మాయి, ఊర్లోనే వ్యవసాయం చేసుకునే అబ్బాయి మధ్య జరిగే ప్రేమకథే ఈ కన్యాకుమారి. ట్రైలర్లో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నాయి. పక్కా గ్రామీణ ప్రేమకథ కావడంతో ప్రేమికులకు ఫుల్గా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి. -
వార్ 2లో కిక్కిచ్చిన 'సలాం అనాలి' ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వార్ 2 (War 2 Movie). అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ లభించింది. ఈ మూవీ నుంచి తాజాగా సలాం అనాలి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ పోటాపోటీగా డ్యాన్స్ చేశారు. ఎనర్జిటిక్ డ్యాన్స్వీరి ఎనర్జిటిక్ డ్యాన్స్ చూసేందుకు అభిమానులకు రెండు కళ్లు చాలవు. సినిమా సంగతేమో కానీ వీళ్ల డ్యాన్స్ మాత్రం అదిరింది అని కామెంట్లు చేస్తున్నారు. ఈ పాటకు ప్రీతమ్ సంగీతం అందించగా నకాశ్ అజీజ్, యాజిన్ నిజర్ ఆలపించారు. కృష్ణ కాంత్ తెలుగులో లిరిక్స్ సమకూర్చారు. వార్ 2 మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటించింది. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మించారు. అక్షయ్ విధాని సహనిర్మాతగా వ్యవహరించారు. -
రజనీతో మంచి పాత్రకి నో..విలన్ పాత్రకి సై
విమర్శలు, ప్రశంసలకు అతీతంగా కూలీ సినిమా కలెక్షన్ల రికార్డ్స్ సృష్టిస్తోంది. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి నాగార్జున(Nagarjuna Akkineni) తొలిసారిగా స్టైలిష్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోపే బ్రేక్ ఈవెన్కు చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అనూహ్యమైన కాంబినేషన్లను సెట్ చేయడం ద్వారా సినిమాపై పెంచిన ఆసక్తి కలెక్షన్ల వర్షంలో ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో సైమన్ అనే కోల్డ్ బ్లడెడ్ విలన్ విలన్ పాత్రలో నాగార్జున కనిపించడం కూడా కలెక్షన్ల జోరుకి బాగా దోహదం చేసినట్టు కనిపిస్తోంది. దక్షిణాదితో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో ఉన్న ప్రతీ చోటా రికార్డు స్థాయిలో కలెక్షన్లు రావడం దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమా మొదటి రోజున రూ. 17 కోట్లకు పైగా వసూలు చేసింది. ఉత్తర అమెరికాలో తెలుగు వెర్షన్ 1.3 మిలియన్ డాలర్లను సంపాదించింది, ఇది జూ.ఎన్టీయార్, హృతిక్ రోషన్ల వార్ 2 తెలుగు వెర్షన్ కంటే దాదాపు రెట్టింపు కావడం గమనార్హం.నాగార్జున విలన్ పాత్రను పోషించడంపై ఆ పాత్రను మలచిన తీరు ఆయన వీరాభిమానులకు అంతగా రుచించనప్పటికీ... మొదటి నుంచీ నాగార్జున వైవిధ్య భరిత పాత్రల ఎంపికను ప్రశంసించే వారికి మాత్రం సంతృప్తినే అందించింది. వీటికి అతీతంగా మరోవైపు నాగార్జున మాత్రం ఈ విజయాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా రజనీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఆయన అనుభవం నుంచి తామెన్నో నేర్చుకున్నామని, సినిమా యూనిట్లో ప్రతీ ఒక్కరితో ఆయన ప్రవర్తించే తీరు, సినిమా పూర్తి అయిన వెంటనే అందరికీ గిఫ్ట్ బాక్స్లు ఇచ్చి వారిని ఆదరించిన విషయాలు నాగార్జున గుర్తు చేసుకుంటూ కొనియాడడం తెలిసిందే. రజనీకాంత్ తో కలిసి నటించాలని తాను ఎంత కోరుకున్నారో తన మాటల ద్వారా చెప్పకనే చెబుతున్నారు నాగ్.అయితే రజనీతో చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న విధానం చూస్తుంటే గతంలోని కొన్ని సంఘటనలు గుర్తుకు వస్తున్నాయని సినీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ సందర్భంగా దాదాపు 35 ఏళ్ల క్రితం నాటి సంఘటనలు గుర్తుకు తెస్తున్నారు. అప్పట్లో రజనీకాంత్ హీరోగా దళపతి అనే సినిమా తీశారు దర్శకుడు మణిరత్నం. ఆ సమయంలోనే సెన్సేషనల్ స్టార్ కాంబినేషన్కి ఆయన ప్లాన్ చేశారు. అందులో భాగంగా మళయాళ మెగాస్టార్ మమ్ముట్టిని కూడా ఆ సినిమాలో తీసుకున్నారు. తెలుగులో సినిమాకి ఊపు తెచ్చేలా మరో పాత్రకి నాగార్జున తీసుకోవాలని ఆయన భావించారు. ఈ విషయంపై కొన్ని రోజుల పాటు సంప్రదింపులు జరిగాయి. అయితే రజనీకాంత్తో, మణిరత్నంతో సినిమా చేయాలని ఎంతో ఇష్టం ఉన్నప్పటికీ నాగార్జున ఎందుకో గాని ఆ పాత్రకి అంగీకరించలేదు. దాంతో ఆ పాత్ర కోసం అప్పట్లో కొత్తగా పరిశ్రమలోకి వచ్చిన అరవింద్ స్వామిని తీసుకున్నారు. నిజానికి ఆ సినిమాలో రజనీ, మమ్ముట్టి పాత్రలకు పూర్తి భిన్నంగా అరవింద్ స్వామిది చాలా పాజిటివ్ పాత్ర. రౌడీయిజం, దాడులు,ప్రతిదాడులను అణచివేయాలనే జిల్లా కలెక్టర్ పాత్ర అరవింద్ స్వామికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటున్న సినీ వర్గాలు...అప్పట్లో రజనీ తో కలిసి మంచి పాత్ర చేయని నాగ్...ఇప్పుడు విలన్ పాత్ర చేయడం విశేషమంటూ గుర్తు చేసుకుంటున్నారు. -
పవన్ కల్యాణ్ మూవీలో సాంగ్.. ఆ కారణంతో చేయనని చెప్పా: ఉదయభాను
టాలీవుడ్లో యాంకర్ గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను.. నటిగానూ రాణించింది. పలు సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్లోనూ మెప్పించిన ఉదయభాను.. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం బార్బరిక్ త్రిబాణధారి మూవీతో మరోసారి అభిమానులను పలకరించేందుకు వస్తోంది. సత్యరాజ్ కీలక పాత్రలో వస్తోన్న ఈ చిత్రం ఆగస్టు 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తన మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారామె.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఉదయభాను కొన్ని సినిమాల్లో పాటలు చేయడానికి నో చెప్పానని తెలిపింది. త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రంలో పార్టీ సాంగ్కు నో చెప్పేశానని వెల్లడించింది. నాకు స్క్రిప్ట్ నచ్చకపోతే డైరెక్టర్తోనే నేరుగా వేరేవాళ్లను తీసుకోమని చెప్పానన్నారు. అందుకే త్రివిక్రమ్ మూవీలోనూ సాంగ్ చేయనని చెప్పానని ఉదయభాను తెలిపారు. అయితే ఆ సాంగ్ చేసేందుకు భయపడ్డానని.. అంత పెద్ద స్టార్స్ మధ్య పార్టీ సాంగ్ కావడంతో చేసేందుకు వెనకడుగు వేశానని ఉదయభాను పేర్కొంది.కాగా.. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీలో సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా 2013లో రిలీజైన సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో నదియా, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. -
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సారీ చెప్పు, లేదంటే మా తడాఖా చూపిస్తాం!
సాక్షి, హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) గురించి నీచంగా మాట్లాడతారా? మా ఫ్యాన్స్ సత్తా ఏంటో చూపిస్తాం అన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ నరేంద్ర చౌదరి. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నరేంద్ర చౌదరి మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ సభ్యసమాజం తలదించుకునేలా నోటికి ఎంతొస్తే అంత వాగారు. మా ఎన్టీఆర్ తల్లిపై దారుణంగా కామెంట్స్ చేశారు.క్షమాపణలు చెప్పాలిఎన్టీఆర్ తల్లినే కాదు, ఏ స్త్రీ మూర్తి గురించి అలా మాట్లాడకూడదు. అలా ఎవరు మాట్లాడినా తప్పే! ఇది సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇది ఇంతటితో ఆపేస్తే బెటర్. ఆయన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అనంతపురం నడిబొడ్డున క్షమాపణలు చెప్పాలి. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతాం. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులందరం ఛలో అనంతపురం అంటూ మీ ఇంటిని ముట్టడిస్తాం అని హెచ్చరించారు.ఏం జరిగింది?వార్ -2 రిలీజ్ సమయంలో అభిమానుల స్పెషల్ షోకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడు ఆహ్వానించారు. దీంతో దగ్గుపాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్పై రెచ్చిపోయారు. వాడి సినిమాలెలా ఆడనిస్తాను? మీరెలా ఆడనిస్తార్రా గాడిదల్లారా.. అంటూ అసభ్య పదజాలంతో హీరో గురించి నీచంగా మాట్లాడారు. ఎన్టీఆర్ తల్లిని సైతం దారుణంగా దూషించారు. వార్ 2 షోలను అనంతపురంలో నిలిపివేయాలని వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యవహారంపై తారక్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
నిశ్చితార్థం తర్వాత రాహుల్ సిప్లిగంజ్ ప్రత్యేక పూజలు
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) సడన్గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశాడు. ఆగస్టు 17న హరిణ్య రెడ్డి అనే యువతికి ఉంగరం తొడిగాడు. ఈ నిశ్చితార్థ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో రాహుల్ జంట డ్యాన్సులు చేస్తూ సంతోషంగా గడిపారు. ఎంగేజ్మెంట్ తర్వాత..కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ వేదికపై రాహుల్.. కాబోయే భార్యకు కాస్ట్లీ హ్యాండ్బ్యాగ్ను బహుమతిగా ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోను హరిణ్య సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇకపోతే తాజాగా రాహుల్ కన్యాకుమారి వెళ్లాడు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశాడు. ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు.సింగర్గా..1989 ఆగస్టు 22న హైదరాబాద్ పాతబస్తీలో రాహుల్ సిప్లిగంజ్ జన్మించాడు. చిన్నప్పటినుంచే అతడికి సంగీతంపై ఉన్న ఆసక్తిని తండ్రి గమనించాడు. గజల్ సింగర్ పండిట్ విఠల్ రావు దగ్గర సంగీతంలో శిక్షణ ఇప్పించాడు. ఓపక్క సంగీతం నేర్చుకుంటూ, మరోపక్క తండ్రికి బార్బర్ షాప్లో సాయం చేసేవాడు. రానురానూ కోరస్ పాడే అవకాశాలొచ్చాయి. జోష్ మూవీలో కాలేజీ బుల్లోడా పాట పాడే అవకాశం వచ్చింది. వాస్తు బాగుందే.. (దమ్ము), ఈగ టైటిల్ సాంగ్, సింగరేణుంది (రచ్చ), రంగా రంగా రంగస్థలానా (రంగస్థలం) ఇలా అనేక సాంగ్స్ పాడాడు. యూట్యూబ్లో మంగమ్మ, పూర్ బాయ్, గల్లీ కా గణేశ్, దావత్.. ఇలా అనేక ప్రైవేట్ సాంగ్స్తో తెగ వైరల్ అయ్యాడు. తెలుగు బిగ్బాస్ మూడో సీజన్ విన్నర్గా నిలిచాడు. ఆర్ఆర్ఆర్లో పాడిన నాటునాటు సాంగ్కు ఆస్కార్ రావడంతో బస్తీ కుర్రాడి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) View this post on Instagram A post shared by Flashoot (@weareflashoot) చదవండి: కోపమొస్తే కొట్టేస్తా.. మీరేమైనా దేవుళ్లా?.. నోరెళ్లబెట్టిన జడ్జిలు -
ప్రభాస్ ఈ రేంజ్కు వెళ్తాడని అస్సలు ఊహించలేదు: హీరోయిన్
టాలీవుడ్లో ప్రభాస్ తొలి సినిమా ఈశ్వర్లో మెప్పించిన కోలీవుడ్ ముద్దుగుమ్మ శ్రీదేవి విజయ్ కుమార్. అంతకుముందే తమిళంలో చాలా చిత్రాలు చేసిన శ్రీదేవి.. రుక్మిణి మూవీతో తెలుగులో అడుగుపెట్టింది. టాలీవుడ్లోనూ చాలా సినిమాల్లో తనదైన నటనతో మెప్పించింది. తెలుగులో చివరిసారిగా వీర చిత్రంలో కనిపించిన శ్రీదేవి.. చాలా ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోంది. నారా రోహిత్ హీరోగా వస్తోన్న సుందరకాండ మూవీలో కనిపించనుంది.ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శ్రీదేవి విజయ్ కుమార్ ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రభాస్ కెరీర్లోనే బెస్ట్ సినిమాల్లో ఒకటని.. తొలి సినిమాతోనే మాస్ హీరోగా మెప్పించారని అన్నారు. ఆ సినిమా సమయంలోనే ప్రభాస్ స్టార్ అవుతాడని మేము అనుకున్నామని తెలిపింది. కానీ ఈ రేంజ్కు వెళ్తాడని ఎవరు కూడా ఊహించలేదని శ్రీదేవి వెల్లడించింది. ప్రభాస్ చాలా మంచి వ్యక్తి అని.. ఒకరికి చెడు జరగాలని అస్సలు అనుకోరని అన్నారు. ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వమని శ్రీదేవి పేర్కొంది.కాగా. సుందరకాండ చిత్రాన్ని వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్టైనర్లో శ్రీదేవి కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో వృతి వాఘాని హీరోయిన్గా నటించారు. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.We all know that #Prabhas is definitely going to be a Big Star but yiii range ki veltharu ani evvaru expect cheyyaledhu 😎💥I think he deserves all this success.. - #SrideviVijayakumar about #PRABHAS pic.twitter.com/3MleMOPE6I— Prabhas RULES (@PrabhasRules) August 19, 2025 -
హిట్టు మూవీ.. నేను హీరోయిన్ ఏంటని అసహ్యకర కామెంట్లు!
దర్శనా.. హృదయం సినిమాలోని ఈ పాట ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. పాటే కాదు సినిమా కూడా సూపర్ హిట్టు. 2022లో వచ్చిన హృదయం మూవీలో ప్రణవ్ మోహన్లాల్ హీరోగా కల్యాణి ప్రియదర్శన్, దర్శనా రాజేంద్రన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కానీ చాలామంది తనను తిట్టుకున్నారంటోంది హీరోయిన్ దర్శనా రాజేంద్రన్ (Darshana Rajendran).హీరోయిన్గా సూటవ్వలేదంటూ..దర్శన కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ పరదా. ఈ సినిమా ప్రమోషన్స్లో దర్శన మాట్లాడుతూ.. హృదయం చూసిన చాలామంది నన్నెలా హీరోయిన్గా తీసుకున్నారని ప్రశ్నించారు. హీరో ప్రణవ్ పక్కన హీరోయిన్గా సెట్ అవలేదని విమర్శించారు. సినిమా చాలా పెద్ద సక్సెస్ అయినప్పటికీ నాపై వచ్చిన నెగెటివిటీ చూసి మొదట్లో భరించలేకపోయాను. నిజానికి సినిమా ఫ్లాప్ అయితే జనాలు కచ్చితంగా తమ ప్రతాపం చూపిస్తారు.లైట్ తీసుకున్నా..అంతా నెగెటివ్గానే మాట్లాడతారు. కానీ హృదయం హిట్టయినా నన్ను మాత్రం అందంగా లేనని తిట్టుకున్నారు. ఇలా నా గురించి ఏం కామెంట్ చేసినా ప్రతీది చదివేదాన్ని. ఆ కామెంట్లు చూసి నేను నా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. నవ్వి లైట్ తీసుకున్నాను. కొందరైతే మరీ అసహ్యంగా కామెంట్లు చేస్తుంటారు. యాక్టర్స్ను దారుణంగా ట్రోల్ చేస్తారు అని చెప్పుకొచ్చింది. కాగా అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన పరదా చిత్రం ఆగస్టు 22న విడుదల కానుంది.చదవండి: ఎటు చూసినా రక్తమే.. భయపడిపోయా: కంగనారనౌత్ -
విజయ్ దేవరకొండ కింగ్డమ్.. మాస్ సాంగ్ వచ్చేసింది!
విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా మెప్పించింది. జూలై 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.తాజాగా ఈ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ మేకర్స్ రిలీజ్ చేశారు. రగిలే రగిలే అంటూ సాగే మాస్ సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాట విజయ్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. -
ఎటు చూసినా రక్తమే.. భయపడిపోయా: కంగనారనౌత్
ప్రతి ఆడపిల్లకు ఓ వయసు రాగానే నెలసరి ప్రారంభమవుతుంది. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే బాలిక కౌమార దశలోకి అడుగుపెడుతుంది. అయితే తన ఫ్రెండ్స్ కంటే తాను ఆలస్యంగా మెచ్యూర్ అయ్యానని, దానికే అమ్మ కోప్పడిందని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ఎంపీ కంగనా రనౌత్ చెప్పుకొచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన ఫస్ట్ పీరియడ్ అనుభవాలను పంచుకున్నారు. ఎటు చూసినా రక్తమే..కంగనా రనౌత్ మాట్లాడుతూ.. నా ఫ్రెండ్స్ అందరికీ ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి మధ్యలోనే పీరియడ్స్ మొదలయ్యాయి. నా ఫ్రెండ్స్ మెచ్యూర్ అవుతుంటే నేనింకా బొమ్మలతో ఆడుకుంటూ ఉండేదాన్ని. అప్పటికే నెలసరి రావట్లేదని కంగారుపడుతూ ఉంటే నేనేమో ఇలా బొమ్మలతో ఆడుకుంటున్నానని అమ్మ కోప్పడింది. ఆ బొమ్మల వల్లే ఇంకా పీరియడ్స్ రావడం లేదేమోనని కోపంతో వాటన్నింటినీ బయట పడేసింది. ఒకరోజు నేను నిద్రలేచేసరికి బెడ్షీట్ అంతా రక్తం.. ఎటు చూసినా రక్తమే కనిపించడంతో భయపడిపోయాను. కానీ, అమ్మ మాత్రం నాకు నెలసరి మొదలైందని సంతోషపడింది అని పేర్కొన్నారు.సినిమాసినిమాల విషయానికి వస్తే.. 2006లో గ్యాంగ్స్టర్ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఏక్ నిరంజన్ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు. చివరగా ఎమర్జెన్సీ మూవీలో నటించారు. ఈ సినిమాలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీగా నటించారు. అంతేకాకుండా ఎమర్జెన్సీకి స్వయంగా కంగనాయే దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది.చదవండి: స్నేహితుడి కోసం నాడు పూజలు.. ఫోటోతో గుడ్న్యూస్.. -
ఒకే వేదికపైకి రానున్న ప్రభాస్, అనుష్క
ప్రభాస్ హీరోగా, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బాహుబలి'. రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన తొలి భాగం 'బాహుబలి: ది బిగినింగ్' విడుదలై ఇప్పటికే పదేళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో ఈ చిత్రాన్ని అక్టోబరు 31న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. రెండు భాగాలుగా వచ్చిన బాహుబలిని ఒకే భాగంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేయాలని ప్లాన్ చేస్తుంది.'బాహుబలి: ది ఎపిక్' విడుదల సందర్భంగా ఇప్పటికే ప్రభాస్, రానాలతో ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూను షూట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, అనుష్క కూడా ఆ టీమ్లో భాగం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అనుష్క్ కూడా హైదరాబాద్లోనే ఉంది. ఆమె నటించిన 'ఘాటి' చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్తో పాటు 'బాహుబలి: ది ఎపిక్'ను కూడా పూర్తి చేయాలనే ప్లాన్లో ఆమె ఉన్నట్లు సమాచారం. తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్లతో పలు ఈవెంట్లు నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.తెలుగు సినిమా 'గ్లోబల్ రేంజ్'కి ఎదిగింది 'బాహుబలి'తోనే. ఒక రకంగా 'పాన్ ఇండియా' ట్రెండ్ ఆరంభమైనదే 'బాహుబలి'తోనే. ఈ సినిమా తర్వాత టాలీవుడ్పై వరల్డ్ సినిమా దృష్టి పడింది. ఇలా 'బాహుబలి' సినిమా గురించి పలు ఆసక్తికరమైన విశేషాలు చాలానే ఉన్నాయి. అవన్నీ త్వరలో చిత్ర యూనిట్ మనకు అందించనుంది. -
కోపమొస్తే కొట్టేస్తా.. మీరేమైనా దేవుళ్లా?.. నోరెళ్లబెట్టిన జడ్జిలు
వచ్చే నెలలో తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss 9 Telugu) ప్రారంభం కానుంది. అయితే అప్పటివరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మరో రెండు రోజుల్లో బిగ్బాస్ అగ్నిపరీక్ష (Bigg Boss 9 Agnipariksha) మొదలుకానుంది. సామాన్యుల ఎంపిక కోసం ఈ షో డిజైన్ చేశారు. వేలాదిమంది అప్లై చేసుకుంటే బిగ్బాస్ టీమ్ వారిని జల్లెడపట్టి 45 మందిని సెలక్ట్ చేశారు. వారి మాట, ఆట తీరు బట్టి తొమ్మిదో సీజన్కు ఎవర్ని సెలక్ట్ చేయాలి? ఎవర్ని రిజెక్ట్ చేయాలన్నది బిందు మాధవి, నవదీప్, అభిజిత్ చేతిలో పెట్టారు.నీకొక్కడికే హృదయం ఉందా?ఈ క్రమంలో తాజాగా ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో ఓ మాస్క్ మ్యాన్ స్టేజీపై ఎంట్రీ ఇచ్చాడు. నీ పేరేంటని జడ్జిలు అడగ్గా.. స్కిన్ నేమ్ మానవ్.. సోల్ నేమ్ హృదయ్ మానవ్ అన్నాడు. హృదయ్ మానవ్ పేరుకు అర్థమేంటన్న ప్రశ్నకు.. హృదయమున్న మానవుడు అని సింపుల్గా రిప్లై ఇచ్చాడు మాస్క్ మ్యాన్. అంటే మా అందరికీ హృదయాలు లేవా? అని నవదీప్ అడగ్గా పోనీ, అలాగే అనుకోండి అని ర్యాష్ ఆన్సరిచ్చాడు. కోపమొస్తే కొట్టేస్తా..చిన్నప్పటి నుంచి కోపిష్టిని, కోపమొస్తే ఆగను.. కొట్టేస్తా! అనడంతో జడ్జిలు షాక్తో నోరెళ్లబెట్టారు. బిగ్బాస్ హౌస్లోకి వెళ్లేది ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి కాదన్న మాటకు అభిజిత్ ఏకీభవించలేదు. ఫ్రెండ్స్ ఎందుకు చేసుకోకూడదు? అని అడిగితు.. ఫ్రెండ్స్కు ట్రోఫీ ఇచ్చేస్తామా? అని మాస్క్ మనిషి సెటైర్ వేశాడు. ఇతడి తీరు నచ్చక అభిజిత్ రెడ్ సిగ్నల్ చూపించాడు. దీంతో అతడు నాకు ఛాన్సివ్వాలని లేకపోతే ఓకే.. కానీ నా క్యారెక్టర్ను డిసైడ్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చాడు.జడ్జి చేయడానికి దేవుళ్లా?జడ్జి చేయడానికే ఇక్కడ కూర్చున్నామని నవదీప్ కౌంటరిచ్చాడు. అప్పటికీ అతడు మీరేమైనా దేవుళ్లా అంటూ.. మాట్లాడుతూనే పోయాడు. ఇక బిందు మాధవి.. అతడి మెడలో లూజర్(ఓటమిపాలు) బోర్డు తగిలించింది. ఈ ప్రోమో చూసిన జనాలు.. మాస్క్ మనిషి ఇలా ఉన్నాడేంట్రా బాబూ.. అని కామెంట్లు చేస్తున్నారు. ఈ అగ్నిపరీక్ష షో హాట్స్టార్లో ఆగస్టు 22 నుంచి ప్రసారం కానుంది. చదవండి: నాగచైతన్యపై సెటైర్లు వేసిన ఈ బుడ్డొడు..ఇలా మారిపోయాడేంటి? -
సినీకార్మికుల సమ్మె.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: సినీకార్మికుల సమ్మె (Tollywood Cinema Workers Strike) విషయంలో తెలంగాణ సర్కార్ జోక్యం చేసుకుంది. 17 రోజులుగా సాగుతున్న కార్మికుల సమ్మె ప్రభావం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సినిమా పాలసీపై పడుతుందని ప్రభుత్వ అభిప్రాయపడుతోంది. ఈ క్రమంలో ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ నాయకులతో చర్చించి సమస్య పరిష్కరించాలని ప్రభుత్వ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు.సమ్మె ఎఫెక్ట్హైదరాబాద్ను సినిమా హబ్గా చేయాలనే తెలంగాణ సర్కార్ ఆలోచనకు సినీ కార్మికుల సమ్మె అడ్డంకిగా మారింది. నగరంలో జరుగుతున్న తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల సినిమా షూటింగ్స్ నిలిచిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో ఇప్పటికే చర్చించిన ఉన్నతాధికారులు ఈరోజు ఫెడరేషన్ నాయకులతో చర్చలు జరపనున్నారు. కాసేపట్లో ఫెడరేషన్ నాయకులతో డీజీపీ సమావేశం కానున్నారు. మరోవైపు ఈరోజు సాయంత్రం మూడు గంటలకు నిర్మాతలతో, నాలుగు గంటలకు ఫెడరేషన్ నాయకులతో ఫిల్మ్ ఛాంబర్ కీలక చర్చలు జరపనుంది.చదవండి: ‘గుంజి గుంజి’ సాంగ్ రిలీజ్.. అదిరిపోయే స్టెప్పులేసిన ఆటిట్యూడ్ స్టార్ -
‘నీలి నీలి ఆకాశం’ పాటకి సీక్వెల్.. బ్లాక్ మెయిల్ చేసి ఒప్పించిన దర్శకుడు!
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాని ‘నీలి నీలి ఆకాశం’ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఆ ఒక్క పాటే సినిమాపై బజ్ని క్రియేట్ చేసింది. యూట్యూబ్లో సంచలనం సృష్టించిన ఆ పాటకు ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది.‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ఫేం మున్నా ధులిపూడి దర్శకత్వంలో వస్తున్న మరో ఎంటర్టైనర్ చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ సినిమా కోసమే ‘నీలి నీలి ఆకాశం’ పాట సీక్వెల్ని రెడీ చేశాడు ఆస్కార్ విన్నర్ లిరిసిస్ట్ చంద్రబోస్. మెలోడీ కింగ్ అనూప్ రూబెన్స్ సంగీత అందించిన ఈ పాటని సిద్ శ్రీరామ్ ఆలపించాడు. 'ఇలా చూసుకుంటానే' అంటూ సాగే ఈ పాటకు సంబంధించి విడుదల అయిన ప్రీ టీజర్ దూసుకుపోతుంది, ఈ ప్రీ టీజర్ లో చంద్ర బోస్ గారు కూడా యాక్టింగ్ అద్భుతంగా చేశారు . త్వరలోనే ఈ పాట విడుదల కాబోతుంది.ఈ సందర్భంగా డైరెక్టర్ మున్నా ధూళిపూడి మాట్లాడుతూ ఇప్పుడు 'ఇలా చూసుకుంటానే' అనే పాట ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం ద్వారా త్వరలో విడుదల చేస్తున్నాం. చంద్ర బోస్ అందించిన లిరిక్స్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ స్వర పరిచిన పాట మరియు సిద్ శ్రీరామ్ పాడిన పాట 'నీలి నీలి ఆకాశం' పాట కంటే గొప్పగా వచ్చింది. త్వరలో విడుదల చేస్తాం. ‘బ్యాడ్ గాళ్స్’ అనేది పూర్తి ఎంటర్టైనర్ చిత్రం. జాతి రత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రం మా ‘బ్యాడ్ గాళ్స్’" అని తెలిపారు. -
'వార్ 2' ఎఫెక్ట్.. నాగవంశీకి బిగ్ ఆఫర్?
రెండు పెద్ద సినిమాలు ఒకేరోజు విడుదల కావడంతో బాక్సాఫీస్ దగ్గర పెద్ద యుద్ధమే జరిగింది. హిందీ బెల్ట్లో ‘వార్ 2’ హవా కనిపించగా.. దక్షిణాదిలో రజనీ ‘కూలీ’ జోరు కనిపించింది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన "వార్ 2" తెలుగు చిత్ర పరిశ్రమలో అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కానీ, హిందీ బెల్ట్లో దుమ్మురేపుతుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు దగ్గరగా వార్2 కలెక్షన్స్ ఉన్నాయి. అయితే, వార్ 2 తెలుగు హక్కులను నిర్మాత నాగవంశీ సుమారు రూ. 80 కోట్ల వరకు కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. టాలీవుడ్లో అనుకున్నంతగా వార్2 కలెక్షన్స్ రాకపోవడంతో యశ్రాజ్ ఫిల్మ్స్ సంస్థ కొంత రిటర్న్ ఇచ్చేందుకు సిద్ధం అవుతుందని వార్తలు వస్తున్నాయి.టాలీవుడ్లో 'సితార ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్పై 'వార్ 2' చిత్రాన్ని నిర్మాత నాగవంశీ విడుదల చేశారు. సుమారు రూ. 80 కోట్లకు కొనుగోలు చేసిన ఆయన సులువుగా రూ. రూ. 100 కోట్లకు పైగానే రాబడుతుందని అంచనా వేశారు. కానీ, ఈ చిత్రం విడుదలైన మొదటిరోజు నుంచే కొందరు కావాలనే ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా ఏపీలో తెలుగు దేశం పార్టీ క్యాడర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు మద్దతు ఇవ్వడం మానేసింది. వారు కూలీ సినిమా చూడాలని పెద్ద ఎత్తున సోషల్మీడియాలో సూచించారు. అదే సమయంలో వార్2 చిత్రంపై తీవ్రమైన ట్రోలింగ్కు దిగారు. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్పై ప్రభావం పడింది.బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ చాలా ప్రొఫెషనల్గానే ఢీల్ సెట్ చేసుకుంటుంది. ఈ సినిమాను కొనుగొలు చేసిన నాగవంశీకి కొంత ఉపశమనం అందించడానికి ఆ సంస్థ ముందుకు వచ్చిందని సమాచారం. నాగ వంశీతో పాటు అతని భాగస్వాములకు రూ. 22 కోట్లు తిరిగి ఇవ్వడానికి యష్ రాజ్ సంస్థ అంగీకరించినట్లు బాలీవుడ్ సమాచారం. నైజాంకు రూ. 10 కోట్లు, ఏపీకి రూ.7 కోట్లు, సీడెడ్కు రూ. 5 కోట్ల వరకు ఇచ్చేందుకు గ్రీన్ లభించిందట. అయితే, హిందీలో ఈ చిత్రానికి ఎలాంటి నష్టం లేదని తెలుస్తోంది. -
‘గుంజి గుంజి’ సాంగ్ రిలీజ్.. అదిరిపోయే స్టెప్పులేసిన ఆటిట్యూడ్ స్టార్
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నూతన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తుండగా.. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్గా నటిస్తున్నారు. అర్జున్ మహీ ("ఇష్టంగా" ఫేమ్) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇది వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.ఆడియో ప్రమోషన్స్లో భాగంగా గతంలో ‘రెడ్డి మామ’ అంటూ ఓ మాస్ బీట్ సాంగ్ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేయడం, అది యూట్యూబ్లో ట్రెండ్ అవ్వడం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ ‘గుంజి గుంజి’ అంటూ సాగే ఓ యూత్ ఫుల్, మాస్, ఎనర్జిటిక్ సాంగ్ను విడుదల చేశారు. ఈ పాటకు రోల్ రైడా సాహిత్యాన్ని అందించగా.. ఆర్ఆర్ ధృవన్ బాణీని సమకూర్చడమే కాకుండా స్వయంగా ఆలపించారు. ఇక ఈ లిరికల్ వీడియో చూస్తుంటే గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో చంద్రహాస్ అదిరిపోయేలా స్టెప్పులు వేసినట్టు కనిపిస్తోంది. -
నాగచైతన్యపై సెటైర్లు వేసిన ఈ బుడ్డొడు..ఇలా మారిపోయాడేంటి?
‘100% లవ్’ సినిమాలో బొద్దుగా ఉండే ఓ బుడ్డొడు గుర్తున్నాడా..? చదువు.. చదువు అంటూ బాలు(నాగచైతన్య) పెట్టే టార్చర్ భరించలేక మహాలక్ష్మీ(తమన్నా)తో చేతులు కలుపుతాడు. మహాలక్ష్మీకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత బాలు ముద్దే చికెన్ తింటూ..‘ఎవడ్రా చికెన్ తింటే బ్రెయిన్ పని చేయదని చెప్పింది?’ అంటూ నాగచైతన్యపై సెటైర్లు వేసి అందరిని కడుపుబ్బా నవ్వించాడు. ఆ బుడ్డొడు ఇప్పుడు చాలా పెద్దవాడైపోయాడు. గడ్డం, మీసాలు పెంచి హీరోలా మారిపోయాడు. అతని పేరు నిఖిల్ అబ్బూరి. #90s సిరీస్ ఫేమ్ మౌళి హీరోగా తెరకెక్కుతున్న లిటిల్ హార్ట్స్ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో మౌళి.. నిఖిల్ని పరిచయం చేశాడు. 100% సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడంటూ మౌళి చెప్పేవరకు ఆ బుడ్డోడే ఈ నిఖిల్ అని ఎవరూ గుర్తుపట్టలేదు. ఆ సినిమా నిర్మాత బన్నీవాసు సైతం నిఖిల్ని గుర్తుపట్టలేకపోయాడు. అంతలా మారిపోయాడు మనోడు. టీజర్ ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన అనిల్ రావిపూడి సైతం నిఖిల్ని చూసి ఆశ్చర్యపోయాడు. ‘100% లవ్ సినిమాలో చికెన్ తిన్నది నువ్వేనా? గుర్తుపట్టలేకపోయాను నాన్న.. ’ అంటూ నిఖిల్ని స్టేజ్పైకి పిలిచి అభినందించాడు. ప్రభాస్ ‘మిర్చి’, రామ్ ‘గణేశ్’తో పాటు పలు సినిమాల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన నిఖిల్..ఇప్పుడు హీరోగా ట్రై చేస్తున్నాడు. లిటిల్ హార్ట్స్ సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రని పోషించాడు. ఈ చిత్రం ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. #100%Love లో చికెన్ తిన్నది నువ్వేనా? గుర్తుపట్టలేదు నాన్న నిన్ను.... pic.twitter.com/AzUhCTxHCh— Rajesh Manne (@rajeshmanne1) August 19, 2025 -
ఎన్టీఆర్ కోసం జపాన్ నుంచి వచ్చిన అభిమాని.. వీడియో వైరల్
జూనియర్ ఎన్టీఆర్ పేరు చెబితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు కాలర్ ఎగరేస్తారు.. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. జపాన్లో ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి భారత సినీ ఇండస్ట్రీనే ఆశ్చర్యపోయింది. ఏకంగా ఆయన పేరుతో అక్కడ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఏర్పాటు అయ్యాయి అంటే ఎవరికైనా అర్థం అయిపోతుంది. తారక్ నటించిన పలు సినిమాల్లోని పాటలకు జపాన్లోని హీరో మునిరు, అశాహి ససాకీలతో పాటు అభిమానులు డ్యాన్సులు చేశారు. వాటికి మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. అయితే, ఇప్పుడు వార్2 సినిమా చూసేందుకు జపాన్ నుంచి తారక్ అభిమాని ఇండియాకు వచ్చింది. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.జపాన్కు చెందిన 'క్రిసో' వార్2 చిత్రాన్ని చూసేందుకు భారత్ వచ్చింది. ఢిల్లీ ఎయిపోర్ట్లో తారక్ ఫోటోతో ఉన్న టీ షర్ట్ ధరించి ఆమె కనిపించింది. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఆమెను పలకరించారు. ఇండియా ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తే.. ఆమె ఇలా చెప్పింది. ' నేను ఎన్టీఆర్కు చాలా పెద్ద అభిమానిని, ఆయన సినిమా చూసేందుకే ఇండియా వచ్చాను. ఆయన నటించిన సినిమా ఏదైనా సరే భారత్లో చూడాలని ఇక్కడికి వస్తుంటాను. గతంలో కూడా వచ్చాను.' అని పంచుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.జపాన్లో జూనియర్ ఎన్టీఆర్కు మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆయన ఎనర్జిటిక్ డ్యాన్స్లు, యాక్షన్ సీన్స్కి అక్కడి ప్రేక్షకులు బాగా ఆకర్షితులవుతున్నారు. ‘బాద్షా’ సినిమాకే జపాన్లో ఫ్యాన్స్ ఉండగా.. ‘ఆర్ఆర్ఆర్’తో ఆయనకు గ్లోబల్ రేంజ్లో గుర్తింపు వచ్చింది. దేవర సినిమా విడుదల సమయంలో ఎన్టీఆర్ కూడా జపాన్ వెళ్లి తన అభిమానులను కలుసుకున్నారు. View this post on Instagram A post shared by ARS CineVerse | ARS ప్రయాణ ప్రపంచం (@arflyerar) -
‘ఆ మాట వినగానే గట్టిగా ఏడ్చేశా.. అతడే ముందుగా వెళ్లిపోయాడు’
టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ (Yuzuvendra Chahal) గత కొన్నాళ్లుగా వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. భార్య ధనశ్రీ వర్మ (Dhanashree Verma)తో విడాకుల నేపథ్యంలో ఆర్జే మహ్వశ్ (RJ Mahvash)తో అతడు తరచూ కలిసి కనిపించడం డేటింగ్ వదంతులకు ఊతమిచ్చింది. ధనశ్రీతో విడిపోయే ముందు నుంచే వీరిద్దరు చెట్టాపట్టాలు వేసుకుని జంటగా కనిపించడంతో చహల్పై ట్రోల్స్ వచ్చాయి.మానసికంగా కుంగిపోయా..ఇటీవల ఈ విషయంపై స్పందిస్తూ.. మహ్వశ్ తనకు స్నేహితురాలు మాత్రమే అని చెప్పిన చహల్.. తన వైవాహిక జీవితం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను మనస్ఫూర్తిగా ధనశ్రీని ప్రేమించానని.. అయినప్పటికీ పరిస్థితి విడాకుల దాకా వచ్చిందని పేర్కొన్నాడు. మానసికంగా తీవ్రంగా కుంగిపోయి ఆత్మహత్య ఆలోచనలు కూడా చేశానని వెల్లడించాడు.ఆ మాట వినగానే ఏడ్చేశాఈ నేపథ్యంలో చహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ తాజాగా విడాకుల అంశంపై స్పందించింది. హ్యూమన్స్ బాంబేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘విడాకుల కోసం మేము మానసికంగా పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాము. కానీ.. ఆరోజు జడ్జిగారు తీర్పు ఇస్తున్నపుడు నేను భావోద్వేగాలను అదుపుచేసుకోలేకపోయాను.అందరి ముందే గట్టిగా ఏడవడం నాకింకా గుర్తుంది. అసలు అప్పుడు నా మనసులో ఎలాంటి అలజడి చెలరేగుతుందో వేరెవరూ అర్థం చేసుకోలేరు. నేను అలా ఏడుస్తూ ఉండిపోయానంతే. అయినా ఇది జరిగిపోయిన విషయం.అతడే వదిలేశాడుఅతడే (చహల్) ముందుగా వైవాహిక జీవితం నుంచి బయటకు వెళ్లిపోయాడు’’ అంటూ ధనశ్రీ వర్మ తన ఆవేదనను పంచుకుంది. ఇక విడాకుల మంజూరు సందర్భంగా చహల్.. ‘బీ యువర్ ఓన్ షుగర్ డాడీ’ అనే కోట్ రాసి ఉన్న టీ షర్టు ధరించడం గురించి ధనశ్రీకి ప్రశ్న ఎదురైంది.డ్రామాలు అవసరమా?ఇందుకు బదులిస్తూ.. ‘‘కచ్చితంగా ఇలాంటి విషయాల్లో ఎదుటి వాళ్లు మనల్ని నిందిస్తారు. ఇలాంటి టీ- షర్టు స్టంట్ ఉంటుందని నాకు ముందుగానే తెలుసు. ఈ విషయంలో తప్పంతా నాదేనని చిత్రీకరించేందుకు వాళ్లు సిద్ధంగా ఉంటారనీ తెలుసు.అయినా.. వాట్సాప్లో నాకు ఆ మెసేజ్ పెట్టి ఉంటే సరిపోయేది కదా!.. ఈ టీ-షర్టు డ్రామా ఎందుకు?’’ అంటూ ధనశ్రీ చహల్కు కౌంటర్ ఇచ్చింది. ఇక తన వైవాహిక జీవితంలో భాగస్వామికి ఎల్లవేళలా మద్దతుగా ఉన్నానని ధనశ్రీ స్పష్టం చేసింది.‘‘నా జీవిత భాగస్వామికి ఎల్లప్పుడూ అండగా ఉన్నాను. ప్రతీ చిన్న, పెద్ద విషయంలో అతడికి తోడుగా ఉన్నాను. మా అన్యోన్యత గురించి అందరికీ తెలుసు. అందుకే విడిపోతున్నామని తెలిసినపుడు నా మనసు అంతగా వేదనకు గురైంది’’ అని ధనశ్రీ తాను చహల్ పట్ల ప్రేమ, అంకితభావంతో మెలిగానని పేర్కొంది.కాగా కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మను 2020లో చహల్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, పెళ్లైన రెండేళ్లకే విభేదాలు తలెత్తగా ఈ ఏడాది మార్చిలో అధికారికంగా విడిపోయారు. భరణంగా రూ. 4 కోట్ల 75 లక్షలుఈ క్రమంలో కోర్టుకు హాజరైన చహల్.. ‘‘ఆర్థికంగా స్వతంత్రంగా ఉండండి.. మీ బాగోగులు మీరే చూసుకోండి.. ఆర్థిక సాయం, బహుమతుల కోసం ఇతరులపై ఆధారపడకండి’’ అన్న కొటేషన్ ఉన్న నలుపు రంగు టీ- షర్టు ధరించాడు. భరణంగా మాజీ భార్యకు రూ. 4 కోట్ల మేర చెల్లించేందుకు అంగీకరించిన చహల్ ఈ చర్య ద్వారా పరోక్షంగా ధనశ్రీకి కౌంటర్ ఇచ్చాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.చదవండి: అక్కకు బెస్ట్ ఫ్రెండ్.. అర్జున్ టెండుల్కర్- సానియా చందోక్ ఏజ్ గ్యాప్ ఎంతంటే? -
స్నేహితుడి కోసం నాడు పూజలు.. ఫోటోతో గుడ్న్యూస్ చెప్పిన 'మోహన్ లాల్'
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty) ఆరోగ్యంపై గతంలో రూమర్స్ వచ్చాయి. ఈ క్రమంలో తన స్నేహితుడు, రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఆ వార్తలు నిజమేనని చెప్పారు. అయితే, ఆందోళన చెందాల్సినంత అనారోగ్య సమస్యలు కాదని చెప్పారు. తాజాగా మమ్ముట్టి పూర్తిగా కోలుకున్నారు. దీంతో మమ్ముట్టి ప్రాణ స్నేహితుడు మోహన్ లాల్ కూడా వారిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటోను పంచుకున్నారు. దానికి లవ్ సింబల్ను ఇచ్చి షేర్ చేయడంతో ఫ్యాన్స్ కూడా సంతోషంలో ఉన్నారు.ఇప్పటికే మమ్ముట్టి పూర్తిగా కోలుకున్నారని త్వరలో మళ్లీ షూటింగ్లో పాల్గొంటారంటూ మలయాళ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ మోహన్ లాల్ ఫోటో షేర్ చేయడంతో ఇండస్ట్రీ మొత్తం ఆనందంలో మునిగిపోయింది. అక్కడి నిర్మాతలతో పాటు నటి మంజు వారియర్ కూడా తన ఇన్స్టాలో ఓ ఫొటో షేర్ చేశారు. వెల్కమ్ బ్యాక్ టైగర్ అంటూ ఆమె ఆనందాన్ని పంచుకున్నారు. ఆయన మేకప్ మ్యాన్ జార్జ్ కూడా మమ్ముట్టి కోలుకున్నట్లు తెలిపారు. అందరి ప్రార్థనలు ఫలించాయని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.మలయాళ ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులు అంటే ఎవరికైనా మోహన్ లాల్, మమ్ముట్టి పేర్లే గుర్తొస్తాయి. మమ్ముట్టి పూర్తిగా కోలుకోవాలని ఈ ఏడాది మార్చిలో శబరిమలలో మోహన్ లాల్ పూజలు జరిపించారు. ఆ సమయంలో మమ్ముట్టి అసలు పేరు మహ్మద్ కుట్టి అని చెప్పడంతో కొంతమంది తప్పుపట్టారు. అలా ఎలా చేస్తారని మోహన్ లాల్ను ప్రశ్నించారు. దీంతో ఆయన కూడా సమాధానం చెప్పారు. 'అతని కోసం పూజలు చేస్తే తప్పేంటి..? ఆయన స్వల్ప అనారోగ్యంతో ఉన్నాడు. అందుకే చేపించాను' అంటూ తెలిపారు. తర్వాత వారి స్నేహం పట్ల ఉన్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అయ్యారు. అందరికీ దేవుడు ఒక్కడే అంటూ నాడు కామెంట్లు చేశారు. ఇప్పుడు మమ్ముట్టి కోలుకోవడంతో అంతా అయ్యప్ప ఆశీస్సులు అంటూ చెబుతున్నారు. -
'కూలీ' సెన్సార్ విషయంలో కోర్టుకు సన్ పిక్చర్స్
రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కూలీ’. ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలైంది. కేవలం నాలుగు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ. 404 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, ఈ సినిమాకు సెన్సార్ నుంచి ‘ఏ’ సర్టిఫికెట్ వచ్చింది. దీంతో కలెక్షన్స్పై కాస్త ప్రభావం చూపుతుంది. ఈ అంశాన్ని గుర్తించిన నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తాజాగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.భారత్లో 'కూలీ' సినిమాకి CBFC నుండి A సర్టిఫికేట్ పొందింది. అయితే, విదేశీ సెన్సార్ మాత్రం భిన్నమైన రిపోర్ట్ను జారీ చేసింది. ఒక్క కట్ కూడా సూచించకుండా ‘యూ/ఏ’ సర్టిఫికేట్ను జారీ చేసింది. సుమారు మూడు దశాబ్దాల తర్వాత రజనీ సినిమాకి A సర్టిఫికేట్ లభించిడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇది మొత్తం కలెక్షన్లపై నిజంగానే ప్రభావం చూపింది. దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్లు పిల్లలను పరిమితం చేశాయి. అయితే, సినిమాలో ఊహించినంతగా హింస లేకపోవడంతో సెన్సార్ వివషయంలో ప్రేక్షకులు తప్పుబట్టారు. ఈ సినిమాకి A సర్టిఫికేట్ ఎందుకు వచ్చిందని చాలామంది ఆశ్చర్యపోయారు.సెన్సార్ ఇచ్చిన ఈ సర్టిఫికేషన్ను సవాలు చేస్తూ సన్ పిక్చర్స్ ఇప్పుడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. సెన్సార్ బోర్డు కూలీ సర్టిఫికేషన్ను ‘U/A’గా ఇచ్చేలా ఆదేశించాలని కోర్టును అభ్యర్థించినట్లు సమాచారం. ఈ విషయంలో మేకర్స్ చాలా ఆలస్యంగా వ్యవహరించడంతో, ఇప్పటికే తగినంత నష్టం జరిగిపోయింది. మద్రాస్ హైకోర్టు మేకర్స్కు అనుకూలంగా తీర్పు ఇస్తుందా..? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో నాగార్జున, ఆమిర్ఖాన్, ఉపేంద్ర, శ్రుతిహాసన్, సత్యరాజ్, సౌబిన్షాహిర్, మహేంద్రన్ తదితరులు నటించారు. -
సుకుమార్ కుమార్తెను సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి
సినీ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి (Sukriti Veni)ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సత్కరించి, అభినందించారు. 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో సుకృతి సత్తా చాటింది. ఆమె నటించిన 'గాంధీ తాత చెట్టు' సినిమాకు ఉత్తమ బాల నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మంగళవారం మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి నివాసంలో సుకుమార్ దంపతులతో పాటు నిర్మాత యలమంచిలి రవిశంకర్ తదితరులు సీఎంను కలిశారు.పర్యావరణ పరిరక్షణ కాన్సెప్ట్తో 'గాంధీ తాత చెట్టు' సినిమాను పద్మావతి మల్లాది తెరకెక్కించారు. సుకుమార్ సతీమణి తబిత సమర్పకురాలిగా వ్యవహరించారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను ఈ చిత్రం అందుకుంది. ఇందులో సుకృతి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రంలోని తన పాత్ర కోసం ఆమె ఏకంగా గుండు కొట్టించుకుని నటించింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. -
సరికొత్త పెద్ది
‘పెద్ది’ సినిమా కోసం రామ్చరణ్ సరికొత్తగా మేకోవర్ అవుతున్నారు. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రంలో రామ్చరణ్ పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ఇప్పటికే ‘పెద్ది’ నుంచి రామ్చరణ్ ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ‘పెద్ది’ సినిమాలోని మరొక లుక్ కోసం రామ్చరణ్ ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు.టాప్ సెలబ్రిటీ స్టైలిస్ట్ అలీం హకీం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, రామ్చరణ్ను సరికొత్త లుక్లో ప్రజెంట్ చేయనున్నారు. ‘‘ఈ లుక్లో రామ్చరణ్ స్టైల్, స్వాగ్ వినూత్నంగా, ఆడియన్స్ను ఆశ్చర్యపరిచేలా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 27న విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్. -
నారాయణ మూర్తి అందమైన హీరో: బ్రహ్మానందం
‘‘యూనివర్సిటీ పేపర్ లీక్’ సినిమాలో కొడుకు కోసం తండ్రి చేసిన త్యాగం, అలాగే తండ్రి కోసం కొడుకు చేసిన త్యాగం... ఇలాంటి భావోద్వేగాలను ఒక చోటకు తీసుకొచ్చి, మానవ భావోద్వేగాలతో ఈ సమాజం ఎలా ఆడుకుంటుందో చెప్పే ప్రయత్నం చేశారు నారాయణ మూర్తి’’ అని ప్రముఖ నటుడు బ్రహ్మానందం అన్నారు. ఆర్. నారాయణ మూర్తి లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘యూనివర్సిటీ పేపర్ లీక్’ ఈ నెల 22న విడుదల కానుంది.ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన అనంతరం బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘మీ దృష్టిలో అందమైన హీరో ఎవరు?’ అని ఎవరైనా నన్ను అడిగితే నారాయణ మూర్తి పేరు చెబుతాను. అందం అంటే... గ్లామర్, 6 ఫీట్స్ హైట్, కర్లింగ్ హెయిర్... వంటి అందం కాదు. మదర్ థెరిస్సాని ‘మీకు అందంగా కనిపిస్తున్న వ్యక్తి ఎవరమ్మా?’ అని అడిగితే.. ఎవరి మనస్సులో సేవాభావం, ఎవరి కళ్లల్లో దయా గుణం ఉంటాయో ఆ వ్యక్తి, ఆ జీవి అందంగా ఉంటుంది’ అని చెప్పారు.నలభై ఏళ్లుగా నారాయణ మూర్తి నిరంతరం ప్రజలు, పేదవాళ్ల పక్షాన ఉంటూ సినిమాలు తీస్తున్నారు. ఇవాళ మన దేశం, మన విద్యా వ్యవస్థ ఎలా ఉంది? అనే అంశాలపై అధ్యయనం చేసి, ‘యూనివర్సిటీ’ తీశారు. డబ్బు కోసం కాకుండా ప్రజల కోసం నిజాయతీగా తీసిన ‘యూనివర్సిటీ’ సినిమాని చూసి, ఆదరిస్తే ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీస్తాడు’’ అన్నారు. ‘‘బ్రహ్మానందంగారు మహానటుడు, మహా జ్ఞాని. అన్నింటినీ మించి మాస్టరు. అందుకే నా ‘యూనివర్సిటీ’ లోగోని ఆయనతో ఆవిష్కరింపజేశాను. మా చిత్రాన్ని చూడండి... ఏమాత్రం బాగున్నా ఆదరించి, మరిన్ని సినిమాలు తీసే శక్తిని ప్రసాదించండి’’ అని కోరారు ఆర్. నారాయణ మూర్తి. -
నలభై ఏళ్లకు...
హీరోలు రజనీకాంత్, కమల్హాసన్ కలిసి ఇరవై సినిమాలకు పైగా నటించారు. కానీ ‘అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్’ (1979) సినిమా తర్వాత రజనీ–కమల్ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. తాజాగా వీరిద్దరినీ కలిపి ఓ భారీ సినిమా చేసేందుకు దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ప్రయత్నాలు మొదలుపెట్టారట. అయితే లోకేశ్ నెక్ట్స్ సినిమాగా కార్తీతో ‘ఖైదీ 2’ తెరకెక్కాల్సి ఉంది.ఈ నేపథ్యంలో రజనీ–కమల్ సినిమాని ఎప్పుడు ఆరంభిస్తారనే చర్చ జరుగుతోంది. మరి... నాలుగు దశాబ్దాల తర్వాత రజనీ–కమల్ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటారా? అనేది వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే... లోకేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన రజనీకాంత్ ‘కూలీ’, కమల్హాసన్ ‘విక్రమ్’ సినిమాలు సూపర్ హిట్స్గా నిలిచిన సంగతి తెలిసిందే. -
ఫరియా అబ్దుల్లా డార్క్ కామెడీ థ్రిల్లర్.. లిరికల్ సాంగ్ రిలీజ్
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'గుర్రం పాపిరెడ్డి'. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. ఈ మూవీని డార్క్ కామెడీ కథగా దర్శకుడు మురళీ మనోహర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.ఈ పాటకు సురేష్ గంగుల లిరిక్స్ అందించగా.. లక్ష్మి మేఘన, ఎంసీ చేతన్ పాడారు. కృష్ణ సౌరభ్ ఈ సాంగ్ను కంపోజ్ చేశారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, యోగి బాబు, ప్రభాస్ శ్రీను, రాజ్ కుమార్ కసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ సినిమకాు కృష్ణ సౌరభ్ సంగీతమందిస్తున్నారు. -
నాగార్జున వందో సినిమా.. ఆ డైరెక్టర్తోనే ఫిక్స్!
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవలే కూలీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రజినీకాంత్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో విలన్ పాత్రలో మెప్పించారు. అంతకుముందే కుబేర మూవీతో హిట్ కొట్టిన నాగ్.. కూలీ మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది.ఈ మూవీ తర్వాత నాగార్జున చేయబోయే ప్రాజెక్ట్పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ సినిమా ఆయన కెరీర్లో ప్రత్యేకంగా నిలవనుంది. తన రాబోయే చిత్రం నాగార్జున వందో చిత్రంగా కానుంది. ఈ ప్రత్యేక మూవీకి సంబంధించిన కింగ్ నాగ్ హింట్ ఇచ్చేశాడు. తాజాగా జగపతిబాబు టాక్ షోకు హాజరైన డైరెక్టర్ పేరును కూడా రివీల్ చేశాడు. ఇంతకీ ఆ వివరాలేంటో చూసేద్దాం.తన వందో సినిమాపై దాదాపు ఆరేడు నెలలుగా వర్క్ జరుగుతోందని టాక్ షోలో నాగార్జున తెలిపారు. ఏడాది క్రితమే డైరెక్టర్ రా కార్తీక్ తనకు కథ చెప్పారని అన్నారు. ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది.. కూలీ రిలీజ్ కాగానే మొదలు పెడదామని చెప్పానని తెలిపారు. యాక్షన్తో పాటు ఫ్యామిలీ డ్రామాగా ఉండనుందని కింగ్ నాగార్జున పంచుకున్నారు. ఈ సినిమాలో నేనే లీడ్ రోల్ చేస్తున్నానని వెల్లడించారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు కింగ్ 100 నాటౌట్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని సమాచారం. కాగా.. తమిళ దర్శకుడు రా కార్తీక్ ఇప్పటికే ఆకాశం, నితమ్ ఓరువానం లాంటి చిత్రాలను తెరకెక్కించారు."#Nagarjuna100 film will be with Ra.Karthik (NithamOruVaanam) who is Tamil Director🤝. It's a very grand film, we are starting this film now, as #Coolie released💥. It's a nice action, Family, Drama film & I'm the protagonist in that😂"- #Nagarjuna pic.twitter.com/Jz0k9EwXQr— AmuthaBharathi (@CinemaWithAB) August 19, 2025 -
బిగ్బాస్ రియాలిటీ షో.. స్పెషల్ గెస్ట్గా స్టార్ హీరోయిన్!
బుల్లితెర ప్రియులను అలరిస్తోన్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్. ఈ షోకు ఫ్యాన్స్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో మరో సీజన్ బుల్లితెర ప్రియులను అలరించేందుకు వస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎవరనేది దాదాపు ఖరారు కాగా.. ఈనెల 24 బిగ్బాస్ సీజన్-19 షురూ కానుంది. ఈ ఏడాది కూడా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు.అయితే ఈ సీజన్లో స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే గెస్ట్గా వస్తారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. తాను హోస్ట్గా వ్యవహరిస్తోన్న కొత్త రియాలిటీ షో 'పతి పత్నీ ఔర్ పంగా' ప్రమోషన్స్ కోసం బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా.. సోనాలి బింద్రే, సల్మాన్ ఖాన్తో 'హమ్ సాత్ సాత్ హై' చిత్రంలో హీరోయిన్గా నటించింది. దాదాపు 26 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలవనున్నారు. దీంతో సల్మాన్ ఖాన్, సోనాలి బింద్రే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా.. 1999లో సూరజ్ బర్జాత్య దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ హమ్ సాత్ సాత్ హై చిత్రంలోలో సోనాలి, సల్మాన్ ఖాన్ జంటగా నటించారు. ఈ చిత్రంలో టబు, సైఫ్ అలీ ఖాన్, కరిష్మా కపూర్, అలోక్ నాథ్, రీమా కీలక పాత్రల్లో నటించారు. మరోవైపు సల్మాన్ ఖాన్ బిగ్బాస్ రియాలిటీ నాలుగో సీజన్ నుంచి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ ఆగస్టు 24 నుంచి జియో హాట్స్టార్, కలర్స్ టీవీలో స్ట్రీమింగ్ కానుంది. -
పెళ్లి కూతురిలా శ్రీలీల.. కాజల్ వన్నె తగ్గని అందం
పెళ్లి కూతురిలా ముస్తాబైన శ్రీలీలవన్నె తగ్గని అందంతో మెరిసిపోతున్న కాజల్బ్లాక్ చుడీదార్లో క్యూట్ అండ్ స్వీటుగా శ్రుతి హాసన్వైట్ ఫ్రాక్లో వయ్యారంగా బిగ్బాస్ దివిఅందమైన కుందనపు బొమ్మలా జ్యోతిరాయ్హెబ్బా పటేల్ బ్లాక్ అండ్ వైట్ లుక్ View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by S H E ♾️ (@anaswara.rajan) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Malavika_Manoj (@malavika_manojj) -
మెగాస్టార్తో అనిల్ రావిపూడి.. టైటిల్ రివీల్ డేట్ ఫిక్స్
మెగాస్టార్- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న చిత్రంపై టాలీవుడ్ ఫ్యాన్స్తో పాటు మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ అప్డేట్ కోసం సినీ ప్రియులు ఎప్పుడెప్పుడొస్తుందా అనుకుంటున్నారు. ఈనెలలోనే మెగాస్టార్ బర్త్ డే రానుండడంతో ఫ్యాన్స్ సైతం ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ సినిమాకు టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తాజాగా దీనిపై దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశారు.అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. మెగాస్టార్ మూవీ టైటిల్ ఈనెల 21 రివీల్ చేయనున్నట్లు వెల్లడించారు. తాజాగా లిటిల్ హార్ట్స్ మూవీ ఈవెంట్కు హాజరైన అనిల్ రావిపూడి మెగా మూవీ టైటిల్ అప్డేట్ గురించి ప్రశ్నించగా.. నిజమేనని స్పష్టం చేశారు. అయితే ఈ మూవీ టైటిల్లో సంక్రాంతి అనే పదం లేదని తెలిపారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా చిరంజీవి కెరీర్లోనే 157వ చిత్రంగా నిలవనుంది. -
సడన్ సర్ప్రైజ్.. ఓటీటీలోకి 'వీరమల్లు'
పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు'.. థియేటర్లలో ఫ్లాప్ అయింది. సోషల్ మీడియాలో సీన్లపై బీభత్సమైన ట్రోలింగ్ నడిచింది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి ట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఓటీటీలో స్ట్రీమింగ్ తేదీని సడన్ సర్ప్రైజ్ అన్నట్లు వదిలారు. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఈ సినిమా రానుంది? ఏంటి సంగతి అనేది ఇప్పుడు చూద్దాం.దాదాపు ఐదేళ్ల పాటు అష్టకష్టాలు పడి థియేటర్లలోకి వచ్చిన సినిమా 'హరిహర వీరమల్లు'. గత నెల 24న థియేటర్లలోకి వచ్చింది. అయితే అప్పుడు కూడా రిలీజ్ అవుతుందా లేదా అనుకున్నారు గానీ ఎలాగోలా విడుదలైంది. తొలి ఆట నుంచి నెగిటివ్ టాక్ రావడంతో నిర్మాతకు భారీ నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓటీటీలోకి రావడంపై గత కొన్నిరోజులుగా పలు రూమర్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చేసింది.'హరిహర వీరమల్లు' సినిమాని 20వ తేదీ అంటే రేపటి(బుధవారం) నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ వదిలారు. మరి థియేటర్లలో వచ్చినప్పుడు అంతలా ట్రోల్ అయింది. ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఇంకెంత ట్రోల్స్కి గురవుతుందో ఏంటో?'హరిహర వీరమల్లు' విషయానికొస్తే.. 16వ శతాబ్దంలో నదిలో కొట్టుకొచ్చిన ఓ పిల్లాడు ఓ అగ్రహారం వాసులకి దొరుకుతాడు. వాళ్లు ఆ బాలుడికి వీరమల్లు అని పేరు పెడతారు. పెద్దయ్యాక వజ్రాల దొంగ అవుతాడు. మచిలీపట్నంలో తాను చేసిన దొంగతనం గురించి విని దొర (శరత్ ఖేదేకర్).. ఓ వజ్రాల దొంగతనం కోసం తనని పిలిపిస్తాడు. ఆ దొర దగ్గర పంచమి (నిధి అగర్వాల్) ఉంటుంది. ఆమె వీరమల్లు ప్రేమలో పడుతుంది. వీరమల్లు కూడా ఆమెని ఇష్టపడతాడు. దొర చెప్పిన వజ్రాలని దొంగిలించడంతో పాటు పంచమిని తీసుకెళ్లిపోయే క్రమంలో గోల్కండ నవాబుకి వీరమల్లు చిక్కుతాడు. ఆ నవాబు (దలిప్ తాహిల్) వీరమల్లుకి ఓ పని అప్పజెబుతాడు. కొల్లూరులో దొరికి అలా అలా చేతులు మారి ఔరంగజేబు దగ్గరకు చేరిన కోహినూర్ వజ్రాన్ని తీసుకురమ్మని. మరి వీరమల్లు ఆ వజ్రాన్ని తీసుకొచ్చాడా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. -
‘లవ్ యూ రా’ కడుపుబ్బా నవ్వించేస్తుంది: హీరో చిన్ను
చిన్ను హీరోగా, గీతికా రతన్ హీరోయిన్గా సముద్రాల మంత్రయ్య బాబు, కొన్నిపాటి శ్రీనాథ్ ప్రజాపతి నిర్మాతలుగా రానున్న చిత్రం ‘లవ్ యూ రా’. ఈ మూవీకి ప్రసాద్ ఏలూరి దర్శకత్వం వహించారు. ఈ మూవీని సెప్టెంబర్ 5న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఈవెంట్ను సోమవారం (ఆగస్ట్ 18) నాడు నిర్వహించారు. ఈ క్రమంలో ‘ఏ మాయ చేశావే పిల్లా’, ‘వాట్సప్ బేబీ’, ‘యూత్ అబ్బా మేము’, ‘దైవాన్నే అడగాలా’ అనే పాటలను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్ మీట్లో..హీరో చిన్ను మాట్లాడుతూ .. ‘‘లవ్ యూ రా’ నాకు మొదటి చిత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ ప్రయాణంలో మా వెన్నంటే నిలిచిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ప్రసాద్ గారు నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చారు. ‘లవ్ యూ రా’ ఆద్యంతం అందరినీ కడుపుబ్బా నవ్వించేలా ఉంటుంది. గీతిక పాత్రకు ప్రాణం పోశారు. కృష్ణ సాయి కారెక్టర్ అందరినీ నవ్విస్తుంది. చంద్ర శేఖర్ గారి పాత్ర చాలా బాగా వచ్చింది. మా చిత్రంలో హారర్, కామెడీ, లవ్ ఇలా అన్ని అంశాలుంటాయి. ఈశ్వర్ గారు మాకు మంచి పాటలు ఇచ్చారు. సెప్టెంబర్ 5న మా చిత్రం రాబోతోంది. మీడియా సపోర్ట్ ఉంటేనే మాలాంటి వాళ్లు ఆడియెన్స్ వరకు చేరుకుంటాం. మా మూవీని అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.చంద్రశేఖర్ మాట్లాడుతూ .. ‘‘లవ్ యూ రా’ చిత్రం సెప్టెంబర్ 5న రాబోతోంది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. శ్రీనాథ్ గారు చెప్పినట్టుగా ఈ మూవీ వందకు రెండొందల శాతం సక్సెస్ అవుతుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.హీరోయిన్ గీతిక మాట్లాడుతూ .. ‘‘లవ్ యూ రా’ టీం అంతా కలిసి ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మా మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. సెప్టెంబర్ 5న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. -
బతకొద్దు అనుకున్నా.. శ్రీముఖి హెల్ప్ చేసింది: తమన్నా సింహాద్రీ
బిగ్బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి. విజయవాడలో పుట్టిపెరిగిన తమన్నా..తెలుగు బిగ్బాస్ సీజన్ 3లో పాల్గొని తనదైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంది. ఆ షో ద్వారానే యాంకర్ శ్రీముఖితో స్నేహం ఏర్పడింది. ఇప్పటికీ వీరిద్దరి మధ్య ఆ స్నేహం కొనసాగుతుంది. శ్రీముఖి ఫ్రెండ్స్ గ్యాంగ్లో తమన్నా కూడా ఉంటుంది. బిగ్బాస్ హౌస్లో రెండు వారాలు మాత్రమే కలిసి ఉన్న వీరిద్దరి మధ్య అంత స్నేహం ఎలా ఏర్పడింది? నా నిజాయితీకీ శ్రీముఖి ఫిదా అయిందని అంటోంది తమన్నా. తన జీవితంలో శ్రీముఖి లాంటి ఫ్రెండ్ని చూడలేదని, ఆమెలో తన కూతురిని చూసుకుంటున్నానని చెబుతోంది. తాజాగా ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీముఖి తనకు చేసిన సహాయం గురించి చెప్పుకొచ్చింది.అందుకే నాతో స్నేహంశ్రీముఖి ఎదుటివాళ్లను చదివేస్తుంది. వాళ్లు ఎలాంటివాళ్లు? పైకి ఎలా మాట్లాడతారు? లోపల ఎలా ఉంటారు? ఇవన్నీ ఈజీగా పసిగట్టగలదు. బిగ్బాస్ హౌస్లో మేం రెండు వారాలే కలిసి ఉన్నాం. నాలో ఉన్న నిజాయితీని మెచ్చి శ్రీముఖి స్నేహం చేసింది. ‘తమన్నా నమ్మితే.. ప్రాణాలను సైతం ఇస్తుంది’ అని తెలుసుకొని నాకు క్లోజ్ అయింది. నేను అంటే ఆమెకు చాలా నమ్మకం. శ్రీముఖి తల్లి నన్ను సొంత చెల్లిలా చూసుకుంటుంది. శ్రీముఖి, ఆమె తమ్ముడు ఇద్దరూ నాకు పిల్లలు లేని లోటు తీర్చారు. వారిద్దరు నా పిల్లలే అనుకుంటాను.శ్రీముఖి దత్తత తీసుకుందినా బంధువులు, రక్త సంబంధీకులు అంతా దూరం పెడితే.. శ్రీముఖి నన్ను తన ఫ్యామిలీ మనిషిలా చూసుకుంది. నేను ఏ టైంలో ఏం ఆలోచిస్తాను? ఎం తినాలనుకుంటాను? ఇవన్నీ తెలుసుకొని తెప్పిస్తుంది. ఇలా ఎవరు అడుగుతారు? ఒకరకంగా చెప్పాలంటే నన్ను శ్రీముఖి దత్తత తీసుకుంది. కరోనా తర్వాత అన్ని షోస్ ఆగిపోయాయి. డబ్లుల్లేవు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చింది. శ్రీముఖి ఫోన్ చేసి..‘విజయవాడలో ఒంటరిగా ఏం చేస్తావు? హైదరాబాద్కి వచ్చేయ్. నేను సంపాదిస్తున్నాను కదా. నిన్ను చూసుకుంటాలే’ అని చెప్పింది. నా బర్త్డేని గ్రాండ్గా సెలెబ్రేట్ చేసింది. ఇల్లు కట్టుకుంటున్నా అంటే ఆర్థిక సహాయం చేసింది. ఈ విషయం బయటకు చెపొద్దు అంటూ ఇంటి కోసం కొంత డబ్బు ఇచ్చింది. నాకే కాదు ఇలాంటి సహాయం చాలా మందికి చేసింది. బయటకు చెప్పుకోవడం ఆమెకు ఇష్టం ఉండదు. దటీజ్ శ్రీముఖి. ఆమె ఏంటో ఫ్రెండ్ సర్కిల్కి మాత్రమే తెలుసు’అంటూ తమన్నా ఎమోషనల్ అయింది. -
'బిగ్బాస్ 9' అగ్నిపరీక్ష ప్రోమో.. నవదీప్కి పెళ్లిచూపులు
ఇప్పటివరకు బిగ్బాస్ తెలుగు షో 8 సీజన్లు పూర్తి చేసుకుంది. వచ్చే నెల 7 నుంచి కొత్త సీజన్ ప్రారంభం కానుంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి సామాన్యులకు ఎక్కువగా తీసుకునే ఉద్దేశంతో అగ్నిపరీక్ష పేరుతో పోటీ పెడుతున్నారు. రెండు వారాల పాటు సాగనున్న ఈ పోటీలో పలు గేమ్స్ పెట్టి చివరగా ముగ్గురు సామాన్యులని ఎంపిక చేయనున్నారు. ఈ క్రమంలోనే తొలి ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ప్రభాస్.. రూ.50 కోట్లు తిరిగిచ్చేశాడు: డిస్ట్రిబ్యూటర్)అగ్నిపరీక్ష షోకి శ్రీముఖి యాంకర్ కాగా.. గత సీజన్లలో పాల్గొన్న అభిజిత్, నవదీప్, బింధుమాధవి జడ్జిలుగా వ్యవహరిస్తారు. మొత్తం 45 మంది సామాన్యులకు పలు పోటలు పెట్టి చివరగా ముగ్గురుని ఎంపిక చేస్తారు. తొలి ఎపిసోడ్ ప్రోమో బట్టి చూస్తుంటే ఇది కూడా ఎంటర్టైనింగ్గానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.సాధారణంగా యాంకర్, జడ్జిలని చూసేసరికి చాలామంది కాస్త మొహమాటపడుతుంటారు. అగ్నిపరీక్షలో మాత్రం జడ్జిలతో మాట్లాడుతూ, యాంకర్ శ్రీముఖికి కౌంటర్స్ ఇస్తూ సామాన్యులు బాగానే ఫన్నీగా ఉన్నారు. ఈ ప్రోమోలో ఇద్దరమ్మాయిలు, ఓ అబ్బాయి వచ్చాడు. వాళ్లతో శ్రీముఖి-నవదీప్-బింధుమాధవి చేసిన సందడి ప్రోమోలో చూడొచ్చు. ఆగస్టు 22 నుంచి సెప్టెంబరు 5 వరకు ఈ అగ్నిపరీక్ష గేమ్ షో ఉండనుంది.(ఇదీ చదవండి: సల్మాన్తో అంత ఈజీ కాదు.. డైరెక్టర్ మురుగదాస్) -
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్.. స్టాలిన్ ట్రైలర్ వచ్చేసింది!
మెగాస్టార్ బర్త్ డే కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనెల 22న చిరంజీవి 70వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ స్టాలిన్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. త్రిష హీరోయిన్గా నటించిన ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా స్టాలిన్ రీ రిలీజ్ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఖుష్బు, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. నాగబాబు నిర్మించిన ఈ మూవీ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది.మరోవైపు ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాల అప్డేట్ వచ్చే అవకాశముంది. ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా అనిల్ రావిపూడితోనూ చిరంజీవి జతకట్టారు. పుట్టినరోజు ఈ సినిమాలకు సంబంధించి అప్డేట్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.Power. Rage. Madness. 💥#Stalin4K Re Release Trailer OUT NOW 🔥▶️https://t.co/so8S9I4W91#StalinOn22Aug #StalinReRelease pic.twitter.com/LDdBimikIj— Anjana Productions (@Anjana_Prod) August 19, 2025 -
కొత్తగా పెళ్లైన జంటలా రష్మిక-విజయ్.. ఆ వీడియోపై క్రేజీ కామెంట్స్!
టాలీవుడ్లో లవ్ బర్డ్స్గా పేరున్న జంట రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ. కొన్నేళ్లుగా వీరిద్దరిపై చాలా సార్లు డేటింగ్ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఎవరూ కూడా రియాక్ట్ అవ్వలేదు. అయినప్పటికీ వీరిద్దరు చాలాసార్లు వేకేషన్స్, ఫెస్టివల్స్లో సందడి చేస్తూ కనిపించారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు, వీడియోలతో నెటిజన్లకు ఈజీగా దొరికిపోవటం వీరిద్దరి స్పెషాలిటీ.తాజాగా ఈ జంట ఓకే వేదికపై అఫీషియల్గా మెరిశారు. అమెరికాలోని న్యూయార్క్లో నిర్వహించిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్లో సందడి చేశారు. అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట తెగ వైరలయ్యాయి. ఇది చూసిన నెటిజన్స్ మరోసారి క్రేజీ కామెంట్స్ చేశారు.అయితే ఈ పరేడ్కు సంబంధించిన మరో వీడియో నెట్టంట వైరల్గా మారింది. రష్మిక ఢిల్లీ ఫ్యాన్స్ షేర్ చేసిన ఈ వీడియోలో విజయ్ దేవరకొండ మరింత సన్నిహితంగా కనిపించారు. పెన్నుతో విజయ్ దేవరకొండను పిలుస్తూ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఇది చూసిన ఫ్యాన్స్ వీరిద్దరిని చూస్తుంటే కొత్తగా పెళ్లైన వధూవరుల మాదిరి కనిపిస్తున్నారంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. ఈ జంటను కెమిస్ట్రీ న్యూ వెడ్డింగ్ కపుల్ వైబ్ను తలపిస్తోందంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.These two giving off some serious newlywed energy. 😍 The chemistry is unreal ❤️☺️They are giving major newly husband-wife vibes. Just saying.😉❤️#RashmikaMandanna ❤️#VijayDeverakonda ❤️ pic.twitter.com/0WsTeobHDZ— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) August 18, 2025 -
సల్మాన్తో అంత ఈజీ కాదు.. డైరెక్టర్ మురుగదాస్
ఏఆర్ మురుగదాస్.. ఈ పేరు చెప్పగానే గజిని, తుపాకీ, కత్తి లాంటి హిట్ సినిమాలు గుర్తొస్తాయి. తెలుగులో చిరంజీవి, మహేశ్ బాబుతో స్టాలిన్, స్పైడర్ తదితర చిత్రాలు చేసిన అనుభవముంది. అప్పట్లో స్టార్ డైరెక్టర్గా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు గానీ గత కొన్నాళ్లలో మాత్రం తీసినవన్నీ ఘోరమైన ఫ్లాప్స్. ఈ ఏడాది బాలీవుడ్లో 'సికిందర్' తీస్తే భారీ డిజాస్టర్ అయింది. ఈ మూవీ వచ్చి చాలా నెలలే అయిపోయింది. కానీ ఇప్పుడు మరోసారి దాని గురించి మాట్లాడాడు. సల్మాన్ ఖాన్ వల్ల ఆ సినిమా రిజల్ట్ అలా జరిగింది అన్నట్లు మురుగదాస్ పరోక్షంగా చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: మహేశ్ బాబు కూతురికి తప్పని 'ఫేక్' కష్టాలు)'ఓ స్టార్ హీరోతో సినిమా చేయడం అంత సులభం కాదు. పగలు తీయాల్సిన సన్నివేశాలు ఉంటాయి. కానీ అతడు మాత్రం రాత్రి 8 గంటల తర్వాతే సెట్స్కి వస్తాడు. కాబట్టి మేం రాత్రి మాత్రమే చిత్రీకరణ చేయాల్సి వచ్చేది. మేం తెల్లవారుజామున షూటింగ్ చేయడానికి అలవాటు పడ్డాం కానీ అక్కడ పరిస్థితులు అలా ఉండవు. ఓ సీన్లో నలుగురు పిల్లలుంటే.. వాళ్లు స్కూల్ నుంచి తిరిగొస్తున్న సీన్ తీయాలన్నా సరే వేకువజామున 2 గంటలకు షూటింగ్ చేయాల్సి వచ్చేది. ఆ టైంకి ఆ పిల్లలు నిద్రపోతారు' అని మురుగదాస్ చెప్పుకొచ్చాడు.అలానే 'సికిందర్' షూటింగ్ టైంలో చాలామంది జోక్యం చేసుకోవడం కూడా సినిమా వైఫల్యానికి కారణమని మురుగదాస్ చెప్పుకొచ్చాడు. గతంలో విజయ్, సూర్య, ఆమిర్ ఖాన్, చిరంజీవి, మహేశ్ బాబు.. ఇలా చాలామంది స్టార్లతో మురుగదాస్ పనిచేశాడు. కానీ ఎవరిపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. మరి ఇప్పుడు సల్మాన్ ఖాన్పై మాత్రమే ఎందుకు కామెంట్స్ చేస్తున్నాడా అనేది సస్పెన్స్. మురుగదాస్ తీసిన 'మదరాసి'.. సెప్టెంబరు 5న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాపై కూడా ఎవరికీ పెద్దగా నమ్మకాల్లేవ్. మరి ఈ మూవీతో హిట్ కొట్టి మురుగదాస్ బౌన్స్ బ్యాక్ అవుతాడా? లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: ప్రభాస్.. రూ.50 కోట్లు తిరిగిచ్చేశాడు: డిస్ట్రిబ్యూటర్) -
థగ్ లైఫ్ డిజాస్టర్.. నాన్న మూవీపై శృతిహాసన్ రియాక్షన్!
కోలీవుడ్ భామ శృతి హాసన్ తాజాగా కూలీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రజినీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ నాగార్జున అక్కినేని కీలక పాత్రలో కనిపించారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శృతి హాసన్ తన తండ్రి మూవీ థగ్ లైఫ్పై స్పందించింది. కమల్ హాసన్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఫెయిల్యూర్ గురించి మాట్లాడింది.తన తండ్రికి డబ్బు ముఖ్యం కాదని శృతి హాసన్ తెలిపింది. సినిమా సక్సెస్ కావడానికి కేవలం కలెక్షన్ నంబర్స్ ప్రామాణికం కాదని వెల్లడించింది. నేను కూడా ఒక నటిగా ఆ విషయం గురించి ఎప్పుడు ఆలోచించలేదు.. ఇది రూ. 200 కోట్ల సినిమానా, రూ.300 కోట్ల సినిమానా అని తాను కూడా పట్టించుకోనని పేర్కొంది. నాకు చివరి విడత చెల్లింపులు వచ్చాయన్నదే మాత్రమే చూస్తానని తెలిపింది.నాన్న సంపాదించిన డబ్బునంతా సినిమాల్లో పెట్టేందుకు వెనకాడని మనస్తత్వం ఉన్న వ్యక్తి అని శృతిహాసన్ అన్నారు. సినిమాల్లో వచ్చిన డబ్బును ఆయన రెండో ఆస్తిగానో.. లేదంటే మూడో కారు కొనేందుకో ఖర్చు చేయలేదని తెలిపారు. తన తండ్రి డబ్బు అంతా తిరిగి సినిమాల్లోనే పెట్టారని వెల్లడించారు. మీరు ఊహించిన విధంగా బాక్సాఫీస్ నంబర్స్ ఆయనను ఎలాంటి ప్రభావితం చేస్తాయని తాను అనుకోవడం లేదన్నారు.కాగా.. దాదాపు 38 ఏళ్ల తర్వాత కమల్ హాసన్- మణిరత్నం కాంబోలో థగ్ లైఫ్ సినిమాను తెరకెక్కించారు. నాయకన్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో అభిమానులు సైతం భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ ఊహించని విధంగా 'థగ్ లైఫ్' బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపర్చింది. ఈ చిత్రంలో శింబు, త్రిష కృష్ణన్, నాజర్, జోజు జార్జ్, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్ కీలక పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల కంటే తక్కువ వసూళ్లు సాధించి డిజాస్టర్గా మిగిలిపోయింది. -
కాంతార ప్రీక్వెల్.. మరో స్టార్ నటుడు అరంగేట్రం!
కాంతార మూవీతో పాన్ ఇండియావ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రిషబ్ శెట్టి. ఈ సినిమాకు ముందు పెద్దగా పరిచయం లేని ఆయన.. ఈ ఒక్క మూవీతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీక్వెల్గా కాంతార చాప్టర్-1 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య నటిస్తున్నట్లు మేకర్స్ రివీల్ చేశారు. తాజాగా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ను పంచుకున్నారు. ఈ మూవీలో కులశేఖర పాత్రలో మెప్పించనున్నారు. దాదాపు ఏడు భాషల్లో గుల్షన్ దేవయ్య పోస్టర్ రిలీజ్ చేశారు. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా గుల్షన్ దేవయ్య శాండల్వుడ్ అరంగేట్రం చేయనున్నారు.ఈ చిత్రంలో మరో నటి రుక్మిణి వసంత్ కనకవతి పాత్రలో కనిపించనుంది. ఇటీవలే ఆమె రోల్ రివీల్ చేస్తూ పోస్టర్ను విడుదల చేశారు. హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్లో విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం అక్టోబర్ 2న కన్నడ, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. View this post on Instagram A post shared by Hombale Films (@hombalefilms) -
మహేశ్ బాబు కూతురికి తప్పని 'ఫేక్' కష్టాలు
ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అన్ని రకాల ఫ్లాట్ఫామ్స్లో కనిపిస్తున్నారు. అయితే సోషల్ మీడియా వల్ల మంచి ఉన్నట్లే చెడు కూడా బోలెడంత ఉంది. ఫేక్ అకౌంట్ల బాధ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. సెలబ్రిటీలు, వాళ్ల పిల్లలు వీటి బారిన పడుతుంటారు. ఇప్పుడు మహేశ్ బాబు కూతురు సితారకు కూడా అలాంటి అనుభవమే ఎదురైనట్లు ఉంది. దీంతో ఓ పోస్ట్ పెట్టింది. క్లారిటీ ఇచ్చింది.(ఇదీ చదవండి: ప్రభాస్.. రూ.50 కోట్లు తిరిగిచ్చేశాడు: డిస్ట్రిబ్యూటర్)'నా పేరు మీద పలు ఫేక్ అకౌంట్స్ ఉన్నట్లు దృష్టికి వచ్చింది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ.. నాకు ఇన్స్టాగ్రామ్లో మాత్రమే అకౌంట్ ఉంది. ఇదే నా అఫీషియల్. ఏదైనా చెప్పాలనుకుంటే దీని ద్వారా చెబుతా. వేరే ఏ సోషల్ మీడియాలోనూ నాకు ఖాతా లేదు' అని సితార ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. మరి సితారకు ఈ మధ్య కాలంలో ఫేక్ అకౌంట్స్ వల్ల ఏదైనా సమస్య ఎదురైందేమోనని అనిపిస్తుంది. లేదంటే సడన్గా ఇప్పుడెందుకు ఈ పోస్ట్ పెడుతుంది?సితార విషయానికొస్తే క్లాసికల్ డ్యాన్స్ లాంటివి నేర్చుకుంటుంది. ప్రస్తుతానికైతే టీనేజర్. నటి అవుతానని గతంలో ఓసారి చెప్పింది. మరి ఎప్పుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందో చూడాలి? మహేశ్ బాబు విషయానికొస్తే రాజమౌళితో సినిమా చేస్తున్నారు. పదిరోజుల క్రితం మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా అప్డేట్ వస్తుందని అభిమానులు ఎదురుచూశారు కానీ నవంబరులోనే అలాంటివి ఉంటాయని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.(ఇదీ చదవండి: దెయ్యంగా రష్మిక.. 'వరల్డ్ ఆఫ్ థామా' చూశారా?) View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) -
‘సంతోషం’ వేడుకలో మంచు ఫ్యామిలీ
హైదరాబాద్ వేదికగా 24వ సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఇటీవల సంతోషం అధినేత సురేశ్ కొండేటి నిర్వహించారు. ఈ వేడుకలో మంచు ఫ్యామిలీకి చెందిన మూడు తరాలు (మోహన్ బాబు, విష్ణు, అవ్రామ్) తో పాటు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాతలు అశ్వనీదత్, మురళీ మోహన్, కాట్రగడ్డ ప్రసాద్, నటీనటులు మాలాశ్రీ, బాబు మోహన్ వంటి పలువురు పాల్గొన్నారు. ఈ వేదికపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు అవ్రామ్తో సహా పలువురు అవార్డులు అందుకున్నారు. వైజయంతి మూవీస్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ గారికి ఘన సన్మానం చేశారు. అనంతరం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా అవార్డ్స్ ప్రదానం చేశారు. కోట శ్రీనివాసరావు స్మారక అవార్డు బాబు మోహన్ అందుకున్నారు. ఇటీవలే పాటల రచయితగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భాస్కర భట్ల రవికుమార్ కు కూడా ఘన సన్మానం జరిగింది., అనంత శ్రీరామ్, (కన్నడ) ఆరాధన రామ్, మాలాశ్రీ గారి కుమార్తె (తమిళం) నిధిలం స్వామినాథన్ గార్లు మురళీ మోహన్ గారి చేతుల మీదుగా అవార్డ్స్ అందుకున్నారు.నటుడు అజయ్ ఘోష్, నటి శరణ్య ప్రదీప్, సింగర్ కీర్తన శర్మ, డాన్స్ మాస్టర్ విజయ్ పొలంకి, హీరో చంద్ర హాస్, సినిమాటోగ్రాఫర్ విశ్వాస్ డేనియల్, సతీష్ రెడ్డి, డైరెక్టర్ యాదు వంశీ, మధుప్రియ, హీరో శివాజీ, డైలాగ్ రైటర్ ఆకెల్ల శివప్రసాద్, 7 హిల్స్ ప్రొడ్యూసర్ సతీష్, రేవు మూవీ ప్రొడ్యూసర్ మురళీ గింజుపల్లి మొదలైన వారు బాబు మోహన్ చేతుల మీదుగా అవార్డ్స్ అందుకున్నారు. -
ఎన్టీఆర్కు మద్ధతుగా నిలిచిన ప్రముఖ సింగర్
టాలీవుడ్ హీరో, నందమూరి వారసుడు ఎన్టీఆర్పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్న వివషయం తెలిసిందే. లోకేశ్ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తానంటూ లం.. భాష ఉపయోగించి రెచ్చిపోయారు. దీంతో తారక్ ఫ్యాన్స్ రంగంలోకి దిగి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేశారు. అయితే, చిత్ర పరిశ్రమ నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్కు మద్ధతుగా ఎవరూ నిలబడలేదు. కనీసం ఎమ్మెల్యే చేసిన మురికి వ్యాఖ్యలను తప్పుబట్టలేదు. ఆపై టీడీపీ కూడా ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ వ్యాఖ్యలు వెనుక నారా లోకేశ్ ఉన్నాడంటూ విమర్శలు వచ్చాయి. అయితే, ఎట్టకేలకు టాలీవుడ్ నుంచి ప్రముఖ సింగర్, సంగీత దర్శకుడు అనుదీప్ దేవరకొండ (అనుదీప్ దేవ్) రియాక్ట్ అయ్యారు. తారక్ సార్తో సంఘీభావంగా నిలబడుతున్నానంటూ తన మద్థతు ఇచ్చాడు.తారక్కు సపోర్ట్గా రండి.. రేపొద్దున మీకూ ఇదే జరగొచ్చుఎన్టీఆర్కు మద్ధతుగా అనుదీప్ ఇలా చెప్పుకొచ్చారు. 'తారక్ సార్తో సంఘీభావంగా నిలబడుతున్నాను. సినిమా మనల్ని ఏకం చేస్తుంది. రాజకీయాలు మనల్ని విభజిస్తాయి. రెండింటినీ వేరుగా ఉంచుదాం. ఈ రోజు ఎన్టీఆర్కు ఎదురైన సందర్భం రేపు మరే ఇతర స్టార్కు ఎదురుకావచ్చు. మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ (TFI) కలిసికట్టుగా నిలబడి మన ప్రియమైన ఎన్టీఆర్కు మద్దతు ఇవ్వాలని అందరినీ అభ్యర్థిస్తున్నాను' అంటూ #StandWithNTR అనే హ్యాష్ట్యాగ్ను జోడించారు.'హనుమాన్' సినిమాతో పాపులర్ ఆంధ్ర ప్రదేశ్లోని కర్నూలుకు చెందిన అనుదీప్ 2011లో 'అహ నా పెళ్ళంటా' సినిమాతో సింగర్గా పరిచయమయ్యారు. అనుదీప్ ఇప్పటికే 70 చలన చిత్రాలలో సుమారుగా 100 పాటలకు పైగా పాడారు. 'హను మాన్' వంటి హిట్ సినిమాకు సంగీతం అందించిన వారిలో ఆయన కూడా ఒకరు. ప్రముఖ సంగీత దర్శకులు కోటి, యువన్ శంకర్ రాజా,మిక్కీ జె. మేయర్,అనూప్ రూబెన్స్, థమన్, సంతోష్ నారాయణన్ వంటి వారితో ఆయన పనిచేశారు.Standing in solidarity with @tarak9999 sir .Cinema unites us, politics divides us. Let’s keep both separate. Today it’s NTR garu and tomorrow it could be any other star.Requesting the entire TFI to stand together and support our beloved NTR garu.#StandWithNTR #TFIUnited— Anudeep Dev (@anudeepdev) August 19, 2025 -
ప్రభాస్.. రూ.50 కోట్లు తిరిగిచ్చేశాడు: డిస్ట్రిబ్యూటర్
మిగతా హీరోలతో పోలిస్తే ప్రభాస్ పెద్దగా బయట కనిపించడు. తన సినిమాలేవో తాను చేసుకుంటూ ఉంటాడు. రిలీజ్ టైంలో, అది కూడా సమయం దొరికితేనే ప్రమోషన్లలో పాల్గొంటూ ఉంటాడు. ప్రభాస్ గురించి రూమర్స్ వస్తుంటాయి గానీ అవి నిజమో కాదో అనేది కూడా పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు ఓ తమిళ డిస్ట్రిబ్యూటర్ చెప్పిన విషయం మాత్రం వైరల్ అవుతోంది. ప్రభాస్.. తమకు రూ.50 కోట్ల తిరిగొచ్చాడని సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు.'బాహుబలి' తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలు.. బాక్సాఫీస్ దగ్గర ఫెయిలవుతూ వచ్చాయి. 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' చిత్రాలకు కలెక్షన్స్తో పాటు కొంతమేర నష్టాలు కూడా వచ్చాయి. ఇప్పుడు అదే విషయాన్ని ఓ తమిళ డిస్ట్రిబ్యూటర్ చెప్పుకొచ్చాడు. 'రాధేశ్యామ్' మూవీకిగానూ ప్రభాస్.. రూ.100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడని, కానీ సినిమా ఆడకపోయేసరికి రూ.50 కోట్లు నిర్మాతకు ఇచ్చాడని, ఈ మొత్తాన్ని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వమని కోరాడని వైరల్ అవుతున్న వీడియోలో సదరు డిస్ట్రిబ్యూటర్ చెప్పాడు.(ఇదీ చదవండి: దెయ్యంగా రష్మిక.. 'వరల్డ్ ఆఫ్ థామా' చూశారా?)మరి ఇది ఎప్పటి వీడియోనో తెలియదు గానీ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రభాస్ చేసిన పనిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇప్పటి జనరేషన్లో చాలామంది హీరోలు.. పారితోషికం ఎక్కువగానే తీసుకుంటున్నారు గానీ ఫ్లాప్ అయిన నష్టాలొస్తే మాత్రం తిరిగి ఇచ్చేందుకు మాత్రం పెద్దగా ఆసక్తి చూపించరు. అలాంటి వాళ్లతో పోలిస్తే ప్రభాస్ డిఫరెంట్ అని చెప్పొచ్చు.ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. 'రాజాసాబ్' చివరిదశ పనుల్లో ఉంది. లెక్క ప్రకారం డిసెంబరు 5న థియేటర్లలోకి రావాలి. కానీ సంక్రాంతికి వాయిదా పడొచ్చనే రూమర్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు 'ఫౌజీ'(వర్కింగ్ టైటిల్) షూటింగ్ సగానికి పైగా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇది వచ్చే వేసవికి రిలీజ్ కావొచ్చని అంటున్నారు. వీటితోపాటు సెప్టెంబరు చివర్లో సందీప్ రెడ్డి వంగా తీయబోయే 'స్పిరిట్' షూటింగ్లోనూ ప్రభాస్ పాల్గొననున్నాడు.(ఇదీ చదవండి: బిగ్బాస్లోకి అనసూయ.. ఇదిగో క్లారిటీ)-#Prabhas remuneration for #Radheshyam was 100 Cr he returned 50 Cr to the producer to compensate for the loss incurred to the distributors as it underperformed. That's the level of integrity Prabhas holds ❤️ pic.twitter.com/XbrMcU4AR4— Ace in Frame-Prabhas (@pubzudarlingye) August 18, 2025 -
కోలీవుడ్ మూవీలో విలన్గా సుహాస్.. లుక్ అదిరింది!
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ‘సెల్ఫీ’ ఫేమ్ మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ‘మండాడి’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో సూరి హీరోగా నటించగా, సుహాస్ తొలిసారి విలన్ పాత్ర పోషించాడు. సుహాస్ బర్త్డే సందర్భంగా నేడు(ఆగస్ట్ 19) కొత్త పోస్టర్ని విడుదల చేశారు. ఈ చిత్రం కోసం సుహాస్ తన లుక్స్ మొత్తాన్ని మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు, కొత్త లుక్ ఇప్పటికే దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బర్త్ డే విషెస్ చెబుతూ వదిలిన ఈ కొత్త పోస్టర్ కూడా అందరినీ మెప్పించేలా ఉంది.సూరి, సుహాస్లతో పాటు మహిమా నంబియార్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ వంటి అనుభవజ్ఞులైన ప్రతిభావంతులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. క్రీడ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మనుగడ, వ్యక్తిగత గుర్తింపు, అజేయమైన మానవ స్ఫూర్తి వంటి అంశాలను ప్రధానంగా చూపించనున్నారు. ఈ మూవీకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. -
దెయ్యంగా రష్మిక.. 'వరల్డ్ ఆఫ్ థామా' చూశారా?
ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్లలో టాప్లో దూసుకుపోతున్న రష్మిక.. వరస సినిమాలతో బిజీగా ఉంది. ఈమె హిందీలో చేసిన లేటెస్ట్ మూవీ 'థామా'. 'స్త్రీ' యూనివర్స్లో భాగంగా వస్తున్న నాలుగో మూవీ ఇది. ఇంతకుముందు భేడియా, స్త్రీ, ముంజ్య చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకుల్ని అలరించాయి. ఇప్పుడు 'థామా' పేరుతో ఈ మూవీలో రష్మిక, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించారు. తాజాగా టీజర్ని 'వరల్డ్ ఆఫ్ థామా' పేరుతో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: బిగ్బాస్లోకి అనసూయ.. ఇదిగో క్లారిటీ)గతంలో రష్మిక చెప్పినట్లు అతీంద్రియ శక్తులతో కూడిన రొమాంటిక్ సినిమాగా 'థామా' తీశారు. టీజర్లో రష్మిక.. ఇదివరకు ఎన్నడూ చూడనటువంటి పాత్రలో కనిపించింది. బోల్డ్గా కనిపిస్తూనే భయపెట్టింది కూడా. ఇందులో రష్మిక, దెయ్యంగానూ యాక్ట్ చేసినట్లు అనిపిస్తుంది. ఈ సినిమాకు ఆదిత్య సర్పోట్దర్ దర్శకుడు. హారర్ స్టోరీ అయినప్పటికీ.. ప్రేమకథని కూడా చూపించబోతున్నారు. ఈ దీపావళికి మూవీ థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న తెలుగు యంగ్ హీరో.. భార్యకు సీమంతం) -
యానిమే మూవీ 'డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్' రిలీజ్కి రెడీ
ప్రపంచవ్యాప్తంగా యానిమే చిత్రాలు, సిరీస్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ జానర్లో లేటెస్ట్గా రాబోతున్న సినిమా 'డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా – ఇన్ఫినిటీ క్యాసిల్'. వచ్చే నెల అంటే సెప్టెంబరు 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ సమ్మె.. ‘మెగా’ ప్రయత్నం ఫలించేనా?)కథ విషయానికి వస్తే.. టాంజిరో కామాడో అనే పిల్లోడి ఫ్యామిలీని ఓ రాక్షసుడు చంపేస్తాడు. అతని చెల్లెలు నెజుకో రాక్షసిగా మారుతుంది. ఆమెను మళ్లీ మాములు మనిషిలా తిరిగి మార్చాలనే సంకల్పంతో టాంజిరో డీమన్ స్లేయర్ కార్ప్స్లో చేరతాడు. ఈ సిరీస్, మనుషులు, రాక్షసుల మధ్య జరిగే విషాదగాథ, కత్తి యుద్ధాలు, ఆకట్టుకునే కారక్టర్స్, కామెడీ సీన్స్తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.ఈ సినిమా మొత్తం మూడు భాగాలుగా రానుంది. ఈ చిత్రాన్ని జపాన్ మరియు కొన్ని ఆసియా దేశాల్లో తప్ప ప్రపంచవ్యాప్తంగా క్రంచిరోల్ మరియు సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్లు రిలీజ్ చేయనున్నారు.(ఇదీ చదవండి: నందమూరి కుటుంబంలో విషాదం) -
ఒక తల్లిగా ఆందోళనగా ఉంది.. ఐశ్వర్య రాయ్ వ్యాఖ్యలపై ప్రశంసలు
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ ప్రముఖ కాస్మెటిక్ బ్రాండ్ కోసం చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అందులో సోషల్ మీడియా గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు యూత్ను ఆలోచింపచేసేలా ఉన్నాయి. ఈమేరకు ఆమెపై నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా చాలామంది గుర్తింపు కోసం సోషల్మీడియా మాయ ప్రపంచంలో చిక్కుకుంటున్నారని.. ఈ అంశం తనకు ఎక్కువ ఆందోళన కలిగిస్తుందంటూ ఐశ్వర్య వ్యాఖ్యలు చేశారు.సోషల్మీడియాలో వచ్చే లైక్స్, కామెంట్స్ మన జీవితాలను నిర్ణయించలేవని ఐశ్వర్య రాయ్ చెప్పుకొచ్చారు. 'నేటి సమాజంలో మన విలువను ఎవరూ నిర్ణయించలేరు. చాలామంది సోషల్మీడియా ట్రాప్లో పడుతున్నారు. వారు చేసే పోస్ట్లకు వచ్చే లైక్స్, కామెంట్లు, షేర్లు చూసుకొని సంబరపడుతుంటారు. వాటిలో ఎవీ కూడా మనలోని ఆత్మవిశ్వాసాన్ని ఈ ప్రపంచానికి చూపలేవు. కానీ, నువ్వు నీలా ఉంటే అసలైన ప్రపంచం కనిపిస్తుంది. మీకు కావాల్సిన ఆత్మగౌరవం కోసం ఇంటర్నెట్లో వెతకొద్దు. ఒక్కసారి దానిని దాటి ముందుకు రండి మీకు దక్కాల్సిన గౌరవం తప్పకుండా దొరుకుతుంది. సోషల్మీడియా అంశంపై ఒక మహిళగా, తల్లిగా నాకు ఆందోళన కలుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ దీనికి బానిసలు అవుతున్నారు.. దయచేసి అందులో నుంచి బయటపడండి.' అంటూ ఐశ్వర్య చెప్పుకొచ్చారు. దీంతో ఐశ్వర్యపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నేటి యూత్కు కావాల్సిన మెసేజ్ను అందించారని కామెంట్లు చేస్తున్నారు. ప్రపంచంలో సగం మంది ఆమె చెప్పేది అర్థం చేసుకుంటే బాగుండు అంటూ అభిప్రాయ పడుతున్నారు. ఈ యుగంలో చాలా అవసరమైన సందేశాన్ని అందించారంటూ చాలామంది ఆమెను ప్రశంసించారు. -
టాలీవుడ్ సమ్మె.. ‘మెగా’ ప్రయత్నం ఫలించేనా?
వేతనాలు పెంచాలంటూ గత కొద్ది రోజులుగా సినీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో గత 16 రోజులుగా తెలుగు సినిమాల షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. ఇప్పటికే ఈ సమస్యల పరిష్కారం కోసం ఫిల్మ్ చాంబర్ అటు నిర్మాతలతో, ఇటు కార్మికులతో చర్చలు జరిపింది. కార్మికులు కోరినట్లుగా 30 శాతం జీతాలు పెంచేందుకు నిర్మాతలు ఒప్పుకోవట్లేదు. కార్మికులు సైతం మొట్టు దిగడం లేదు. పలు దఫాల చర్చల అనంతరం తాము పెట్టిన కండీషన్లకు ఒప్పుకుంటే రూ. 2 వేలలోపు జీతాలు ఉన్న వారికి పర్సంటేజీల ప్రకారం పెంచుతామని నిర్మాతలు ప్రకటించారు. ఇందుకు కార్మికులు విముఖత వ్యక్తం చేశారు. దీంతో ఈ సమస్య చివరకు అగ్రహీరో చిరంజీవి(Chiranjeevi) ఇంటికి చేరింది. (చదవండి: భారీగా రోడ్డెక్కిన సినీ కార్మికులు.. స్తంభించిన టాలీవుడ్)పరిష్కారం చూపాలంటూ అటు నిర్మాతలు, ఇటు ఫెడరేషన్ నాయకులు చిరంజీవిని కలిశారు. ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని, ఫెడరేషన్ కార్యదర్శి అమ్మిరాజు తో పాటు 20 క్రాఫ్ట్స్ నుంచి వచ్చిన 72 మందితో చిరంజీవి భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో అన్ని సమస్యలపై చర్చించారు. యూనియన్ నాయకులు చెప్పిన సమస్యలను ఓపికతో వినడమే కాకుండా స్వయంగా వాటిని నోట్ చేసుకున్నాడు. తన దృష్టికి వచ్చిన విషయాలను ఫెడరేషన్ నాయకులతో చర్చించి, క్లారిటీ తీసుకున్నారు. ఇక త్వరలో మరోసారి చిరంజీవి అటు నిర్మాతలు, ఇటు కార్మిక సంఘాల నాయకులతో కలిసి భేటి కానున్నారు. ఈ సమావేశంతో ఈ సమస్యకు ముగింపు పలకాలని చిరంజీవి భావిస్తున్నారట. ఇండస్ట్రీకి పెద్దన్న కాదని చిరంజీవి చెబుతున్నప్పటికీ.. దాసరి నారాయణ మరణం తర్వాత ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా అందరూ చిరంజీవి దగ్గరకే వెళ్తున్నారు. చిరంజీవి కూడా తాను పెద్దన్నను కాదంటూనే సమస్య వచ్చినప్పుడు మాత్రం ఆ పాత్ర పోషిస్తున్నాడు. టాలీవుడ్ సమ్మె విషయంలోనూ అందరి చూపు చిరంజీవి వైపే వెళ్లాయి. ఆయన రంగంలోకి దిగడంతో అటు నిర్మాతలు, ఇటు కార్మికులు తమకు న్యాయం జరుగుతుందని ఆశతో ఎదురు చూస్తున్నారు. చిరంజీవి ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని ఫెడరేషన్ చెప్పింది. నేడో , రేపో చిరంజీవి ఇరు వర్గాలతో సమావేశం నిర్వహించి, సమ్మెకు ముగింపు పలకాలని భావిస్తున్నాడట. మరి ‘మెగా’ ప్రయత్నం ఫలిస్తుందా? లేదా? చూడాలి. -
నందమూరి కుటుంబంలో విషాదం
నందమూరి ఇంట విషాదం చోటు చేసుకుంది. దివంగత నటుడు నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ (73) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆమె ఈ తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. పద్మజ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు స్వయాన చెల్లెలు ఆపై హీరో నందమూరి చైతన్య కృష్ణకు తల్లి అని తెలిసిందే.సుమారు రెండేళ్ల క్రితం చైతన్యకృష్ణ హీరోగా బ్రీత్ అనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని తన తండ్రి జయకృష్ణ నిర్మిచారు. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా నిలిచింది. కేవలం రూ. 5 లక్షలు కూడా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ మూవీ తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు. -
భారీగా రోడ్డెక్కిన సినీ కార్మికులు.. స్తంభించిన టాలీవుడ్
టాలీవుడ్ సినీ కార్మికులు 16వ రోజు కూడా సమ్మెలో పాల్గొన్నారు. తమ వేతనాలు పెంచాలంటూ ఇందిరానగర్లో పెద్దఎత్తున నిరసన తెలుపుతున్నారు. సినీ కార్మికుల ఐక్యవేదిక పేరుతో 24 క్రాఫ్ట్స్కు సంబంధించిన కార్మికులు నిరసనకు పిలుపునిచ్చారు. ఇప్పటికే తమ వేతనాల పెంపు అంశాన్ని ఫెడరేషన్ నాయకులు చిరంజీవికి వివరించారు. ఈరోజు సాయింత్రం జరిగే ఫిలిం ఛాంబర్, కార్మికుల ఫెడరేషన్ చర్చలతో సమ్మె సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 16వ రోజు సమ్మెతో టాలీవుడ్ ఇప్పటికే స్తంభించింది. షూటింగ్స్ లేక సగటు కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఈ సమావేశం అనంతరం నేడు మరోసారి ఫెడరేషన్ నాయకులతో పాటు నిర్మాతలు కూడా చిరంజీవిని కలవనున్నారు. నిర్మాతలు పెట్టిన మొత్తం నాలుగు కండిషన్స్లలో రెండు కండిషన్స్ దగ్గర మాత్రమే పేచీ ఏర్పడింది. కార్మికులకు ఫ్లెక్సిబుల్ కాల్షీట్స్.. ఆపై రెండో ఆదివారం, ప్రభుత్వ సెలవు రోజుల్లో మాత్రమే డబుల్ పేమెంట్ వంటి అంశాలను కార్మిక సంఘాలు వ్యతిరేఖిస్తున్నాయి. -
బిగ్బాస్లోకి అనసూయ.. దెబ్బలు పడతాయి రాజా అంటూ కామెంట్
బిగ్బాస్ 9 తెలుగు సీజన్ సందడి ఇప్పటికే షోషల్మీడియాలో మొదలైంది. ఇప్పటికే పలు కొత్త పేజీలు పుట్టుకొచ్చాయి. షో గురించి వీడియోలు షేర్ చేస్తున్నారు కూడా.. షోలో పాల్గొనబోతున్న కొందరి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. సెప్టెంబర్ 7న ప్రారంభం కానున్న బిగ్బాస్లోకి స్టార్ యాంకర్, నటి అనసూయ వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ క్రమంలో ఈ అంశం గురించి ఆమె వివరణ ఇచ్చారు.బిగ్బాస్లోకి అనసూయ అంటూ వారం రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. ఈ ప్రచారంపై స్వయంగా అనసూయ స్పందించారు. బిగ్బాస్ హౌస్లోకి తాను వెళ్లడం లేదంటూ క్లారిటీ ఇచ్చేశారు. అందుకు కారణాలు కూడా ఆమె చెప్పారు. గతంలో తాను ఒకట్రెండు సార్లు దెబ్బలు పడతాయి రాజా అన్నందుకే ఫుల్ వైరల్ అయిపోయింది. ఇక అందులో ఎంట్రీ ఇస్తే అంతే సంగతులు అంటూనే నో చెప్పేశారు. కుటుంబాన్ని వదిలేసి అన్నిరోజుల పాటు తాను ఉండలేనని ఆమె తెలిపారు.బిగ్బాస్: సీజన్9 గత సీజన్లకు భిన్నంగా ఈసారి ఉండబోతుంది. ఎక్కువగా సామాన్యులకు ప్రాధాన్యం ఇస్తుండటంతో నెటిజన్లు ఈ షో పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్స్కు ‘అగ్నిపరీక్ష’ పేరుతో ఆడిషన్స్ నిర్వహించారు. ఈ ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ ఆడిషన్స్లో న్యాయ నిర్ణేతలుగా నవదీప్, బిందు మాధవి, అభిజీత్ ఉన్నారు. ఆగస్టు 22వ తేదీ నుంచి ఈ పోటీలకు సంబంధించిన ఎపిసోడ్స్ స్టార్మా ప్రసారం చేయనుంది. -
భార్యతో ఉంటూనే మరో మహిళతో బిడ్డను కన్నాడు.. నటుడిపై సంచలన ఆరోపణ
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్పై తన సోదరుడు ఫైసల్ ఖాన్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కొద్దిరోజులుగా ఆమిర్పై ఆయన పలు వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి 1990 నాటి సంఘటనను తెరపైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఫైసల్ ఖాన్ చేసిన కామెంట్లు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.బ్రిటిష్ జర్నలిస్ట్ జెస్సికా హైన్స్ అనే అమ్మాయితో ఆమిర్ రిలేషన్ షిప్ ఉన్నాడని ఫైసల్ అన్నారు. వారిద్దరికి జన్మించిన ఒక బిడ్డ కూడా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. మొదటి భార్య రీనాతో కలిసి ఉన్నప్పుడే జెస్సికాతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఆమిర్పై సంచలన ఆరోపణ చేశారు. రీనాతో విడాకులు తీసుకున్న ఆమిర్.. ఎక్కువగా జెస్సికాతోనే ఉండేవాడన్నారు. అయితే, వారిద్దరూ పెళ్లి చేసుకోలేదని కేవలం లివింగ్ రిలేషన్లో ఉన్నారని చెప్పారు. అయితే, కొంతకాలం తర్వాత కిరణ్ రావును ఆమిర్ పెళ్లి చేసుకున్నాడని అప్పటికీ కూడా జెస్సికాతో టచ్లో ఉండేవాడని చెప్పుకొచ్చారు.1990లలో, ఆమిర్ ఖాన్, జెస్సికా హైన్స్ కలిసి ఉన్నారని, వారి మధ్య వ్యక్తిగత సంబంధం ఉందని కొన్ని మీడియా కథనాలు చాలారోజుల క్రితమే పేర్కొన్నాయి. జెస్సికా హైన్స్కు ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు జాన్ (Jaan) అని ఆ కథనాలు తెలిపాయి. కానీ, ఆమిర్ ఖాన్ ఈ విషయాన్ని ఎక్కడా కూడా అధికారికంగా ధృవీకరించలేదు. అయితే, జెస్సికా మాత్రం కొన్ని సందర్భాల్లో ఈ విషయాన్ని పరోక్షంగా సూచించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమె కూడా స్పష్టంగా ఈ రిలేషన్ గురించి ఏమీ చెప్పలేదు. View this post on Instagram A post shared by TCX.official (@tellychakkar) -
మిస్ యూనివర్స్ ఇండియాగా రాజస్థాన్ బ్యూటీ
మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని మణిక విశ్వకర్మ గెలుచుకున్నారు. గత ఏడాది విజేత రియా సింఘా ఆమెకు కిరీటం అలంకరించారు. తాజాగా జైపుర్ వేదికగా జరిగిన ఈ పోటీలో ఆమె గెలుపొందారు. ఈ ఏడాదిలో థాయ్లాండ్లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో మణిక విశ్వకర్మ బరిలొకి దిగనున్నారు. భారత్ తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించనున్నారు. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్కు చెందిన మణిక ప్రస్తుతం ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. ఆమె పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఆమె NCC క్యాడెట్ కూడా.. న్యూరోనోవా అనే సంస్థను స్థాపించి ADHD వంటి న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడే వారికి సహాయం అందిస్తున్నారు. మణిక విశ్వకర్మ అందం, ప్రతిభ, సేవా భావనతో మిస్ యూనివర్స్ వేదికపై భారత్కు గర్వకారణంగా నిలవనున్నారు. -
స్టార్ హీరో సినిమా.. ఆసుపత్రి పాలైన 100 మంది
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ (Ranveer Singh) నటిస్తున్న చిత్రం 'ధురంధర్'.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లడఖ్ ప్రాంతంలో జరుగుతుంది. అయితే, తాజాగా ఈ చిత్ర యూనిట్ నుంచి సుమారు 100 మందకి పైగా ఆసుపత్రిపాలయ్యారు. వారందరూ లేహ్లోని సజల్ నర్బు మెమోరియల్ (SNM) ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.లడఖ్లోని లేహ్ జిల్లాలో కొద్దిరోజులుగా ధురంధర్ సినిమా షూటింగ్ జరుగుతుంది. సెట్స్లో పనిచేస్తున్న కార్మికులు ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు. అకస్మాత్తుగా సెట్లోని చాలా మందికి తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, తలనొప్పి వచ్చింది. వారిని లేహ్లోని సజల్ నర్బు మెమోరియల్ (SNM) ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స అందించిన వైద్యులు ఇది సామూహిక ఫుడ్ పాయిజనింగ్ కేసుగా గుర్తించారు. సినిమా సెట్స్లో దాదాపు 600 మంది భోజనం చేశారని అక్కడి వారు చెబుతున్నారు. అయితే, కొందరు మాత్రమే అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు కూడా ఆసుపత్రి వద్దకు చేరుకుని విచారిస్తున్నారు.దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కిస్తున్న ‘ధురంధర్’ సినిమాలో రణ్వీర్ సింగ్తో పాటు సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఇదే ఏడాది డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
జవాన్ మురళీ నాయక్ జీవితంపై సినిమా.. హీరో ఎవరంటే..?
భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ (22) వీర మరణం పొందిన విషయం తెలిసిందే. అయితే, వీర జవాన్ జీవిత కథ ఇప్పుడు సినిమాగా రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటించారు. బిగ్బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ ఈ చిత్రంలో టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత కె.సురేశ్బాబు తెలిపారు.ఈ సినిమా ప్రకటన సందర్భంగా గౌతమ్ కృష్ణ పలు వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ మన దేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక ముఖ్య అధ్యాయమని అన్నారు. దేశ ప్రజల కోసం వీరమరణం పొందిన మురళీ నాయక్ కథను ఈ ప్రపంచానికి చెప్పాలని అందరూ తెలుసుకోవాలని ఈ చిత్రం తీస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ సినిమా నిర్మించేందుకు మురళీ నాయక్ తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన ఈ కార్యక్రమంలో మురళీ నాయక్ తల్లిదండ్రులు ముదావత్ శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయి పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద పని చేస్తూ మరణించారు. -
ఆ ఫోటోలు నాకు మంచి జ్ఞాపకాలు: శ్రీదేవి విజయ్కుమార్
‘‘సుందరకాండ’ మంచి వినోదాత్మక చిత్రం. కథ వినగానే షాక్ అయ్యాను. ఈ చిత్రంలో నేను చాలా మంచి బలమైనపాత్ర చేశాను. అందరూ థియేటర్స్కి వెళ్లిచూడొచ్చు’’ అని హీరోయిన్ శ్రీదేవి విజయ్కుమార్ తెలిపారు. నారా రోహిత్ హీరోగా వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సుందరకాండ’. శ్రీదేవి విజయ్ కుమార్, వృతి వాఘాని హీరోయిన్లుగా నటించారు. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీదేవి విజయ్కుమార్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘కొంత గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరపై నన్ను నేను చూసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను హీరోయిన్ గా చేస్తున్న రోజుల్లోనే పెళ్లి చేసుకుని, ఓపాపకి జన్మనిచ్చాను. ఆ తర్వాత కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ చేశాను. ఇప్పుడు నా కుమర్తె స్కూల్కు వెళుతోంది. సో.. నేను మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలనుకుంటున్నాను.ఈ సినిమాలో నేను స్కూల్ డ్రెస్లో కనిపించే సన్నివేశం ఉంది. ఈ సీన్ కోసం చాలా కష్టపడ్డాను. డైట్ ఫాలో అయ్యాను. నా కుమార్తె, నేను స్కూల్ డ్రెస్లో ఉన్న ఫోటోలు నా దగ్గర ఉన్నాయి.. ఇవి నాకు మంచి జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. ప్రభాస్గారి తొలి సినిమా ‘ఈశ్వర్’లో నేను హీరోయిన్ గా చేశాను.. తను పెద్ద స్టార్ అవుతాడని మేం అప్పుడే ఊహించాం.. మేం ఊహించినదాని కన్నా పెద్ద స్టార్ అయ్యారు’’ అని చెప్పారు. -
దీపావళికి థామా
‘థామా’లో తడ్కాపాత్రలో తన తడాఖా చూపిస్తానంటున్నారు రష్మికా మందన్నా. ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న హారర్, మిస్టరీ అండ్ లవ్స్టోరీ మూవీ ‘థామా’. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్లో భాగంగా ఆదిత్య సర్పోత్థార్ దర్శకత్వంలో దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ ‘థామా’ ఈ దీపావళికి రిలీజ్ కానుంది.కాగా అతీంద్రియ శక్తులతో కూడిన ఈ హారర్ రొమాంటిక్ చిత్రంలోని ప్రధానపాత్రధారుల ఫస్ట్లుక్స్తోపాటుగా, ఈ సినిమాలోని వారిపాత్రల పేర్లను మేకర్స్ రిలీజ్ చేశారు. అలోక్పాత్రలో ఆయుష్మాన్ ఖురానా, తడ్కాపాత్రలో రష్మికా మందన్నా, యాక్షసాన్ గా నవాజుద్దీన్ , రామ్ బజాజ్ గోయెల్గా పరేశ్ రావల్ నటిస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు. కాగా ‘థామా’కి చెందిన తాజా వీడియో ‘థామా వరల్డ్’ పేరుతో నేడు విడుదలవుతోంది. -
తెలుగు యంగ్ హీరోపై కేసు పెట్టిన భార్య
తెలుగులో రెండు సినిమాల్లో హీరోగా నటించిన ధర్మ మహేశ్పై పోలీస్ కేసు నమోదైంది. అదనపు కట్నం కోసం తనని వేధిస్తున్నాడని ఇతడి భార్యనే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఇప్పుడు ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో కాస్త చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అసలేమైంది?(ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న తెలుగు హీరో.. భార్యకు సీమంతం)సింధూరం, డ్రింకర్ సాయి సినిమాల్లో హీరోగా నటించిన ధర్మ మహేశ్.. 2019లో గౌతమి అనే మహిళని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఓ బాబు కూడా ఉన్నాడు. గతంలో ఓసారి ఇతడిపై వరకట్న వేధింపుల ఆరోపణలు రావడంతో.. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరోసారి భార్యని ఇదే విషయమై వేధింపులకు గురిచేస్తుండటంతో వ్యవహారం కేసుల వరకు వెళ్లింది.సినిమా ఛాన్సులు పెరగడంతో తన భర్త జల్సాలకు అలవాటు పడ్డాడని, ఈ క్రమంలోనే అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఇతడి భార్య.. భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులపైన ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒకటి రెండు చిత్రాలతో కాస్తోకూస్తో గుర్తింపు తెచ్చుకుంటున్న క్రమంలో ఇలా పోలీసు కేసుల వరకు వెళ్లడం హాట్ టాపిక్గా మారింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) -
ఆ టాపిక్ తీయకండి.. నేను మీ టాపిక్ తీస్తా: శ్రీలీల
ఈ మధ్య కాలంలో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ అనగానే గుర్తొచ్చే పేరు శ్రీలీల. యాక్టింగ్ పరంగా ఈమెకు ఓ మాదిరి మార్కులు పడతాయి గానీ డ్యాన్సుల్లో మాత్రం ఇరగదీసేస్తోంది. కొన్నిరోజుల క్రితం తెగ హల్చల్ చేసిన 'వైరల్ వయ్యారి' పాటలోనూ శ్రీలీల మాస్ స్టెప్పులతో ఊపుఊపేసిందని చెప్పొచ్చు. అలాంటి ఈమె.. సీనియర్ నటుడు జగపతిబాబు హోస్ట్ చేస్తున్న టాక్ షోలో పాల్గొంది. ఆసక్తికర సంగతుల్ని కొన్ని బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగానే రిలీజైంది.'జయమ్ము నిశ్చయమ్మురా' పేరుతో జగపతిబాబు హోస్ట్ చేస్తున్న ఈ షో.. గత వారమే లాంచ్ అయింది. తొలి ఎపిసోడ్ గెస్ట్గా హీరో నాగార్జున వచ్చారు. తన వ్యక్తిగత విషయాలు బోలెడన్ని పంచుకున్నారు. ఇప్పుడు రెండో ఎపిసోడ్ కోసం యంగ్ సెన్సేషన్ శ్రీలీలని తీసుకొచ్చారు. ఆ ప్రోమోనే ఇప్పుడు విడుదల చేశారు.(ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న తెలుగు హీరో.. భార్యకు సీమంతం)శ్రీలీలని షోకి ఆహ్వానించిన జగపతిబాబు.. 'మేమందరం ఇండస్ట్రీకి వచ్చి యాక్టింగ్ నేర్చుకున్నాం. నువ్వు యాక్టింగ్ నేర్చుకుని ఇండస్ట్రీకి వచ్చావ్' అని అన్నారు. దీంతో గతుక్కుమన్న శ్రీలీల.. సార్ తిట్టారా పొడిగారా అంటూ అమాయకంగా ఫేస్ పెట్టింది. 'గుంటూరు కారం' చేసేటప్పుడు లెఫ్ట్లోనో రైట్లోనో నీ ఫేస్ కొంచెం తేడా ఉండేది అని జగపతిబాబు అనగా.. 'ఆ టాపిక్ తీస్తే నేను మీ టాపిక్ తీసుకొస్తా సర్' అని శ్రీలీల చెప్పింది. 'మీ హీరోయిన్ గారు.. మీరు..' అంటూ వేలు చూపిస్తూ నవ్వేసింది.'ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టేశావ్' అని శ్రీలీలని ఉద్దేశించి జగపతిబాబు అనగానే.. 'దూల తీరిపోతుంది సార్' అంటూ శ్రీలీల తన బాధని నవ్వుతూనే బయటపెట్టింది. 'నీ మీద ఓ కంప్లైంట్ ఉందమ్మా' అంటూ జగ్గూ భాయ్ అనగానే.. శ్రీలీల తల్లి వెనక నుంచి ఈమెని సర్ప్రైజ్ చేసింది. 'మా అమ్మ మీకు పెద్ద ఫ్యాన్ సార్' అని శ్రీలీల చెప్పగానే.. జగపతిబాబు అలా చూశాడు. శ్రీలీల ముసిముసిగా నవ్వింది. దీంతో 'నువ్వెందుకు అంతగా సిగ్గు పడుతున్నావ్' అని జగపతిబాబు అనేసరికి అందరూ నవ్వేశారు. ఈ శుక్రవారం ఓటీటీలో ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) -
మహేశ్బాబు అన్న మూవీలో సెకండ్ హీరోగా.. ఆ సినిమా వల్లే..
ఆర్ నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటించి, స్వీయదర్శకత్వం వహించిన చిత్రం యూనివర్సిటీ. పేపర్ లీక్ అనేది ట్యాగ్లైన్. ఈ మూవీ ఆగస్టు 22న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా నారాయణ మూర్తి (R Narayana Murthy) ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తనకు సినిమాలపై ఆసక్తి ఎలా వచ్చింది? ఏంటనే విషయాలను పంచుకున్నారు.రూ.70తో చెన్నై..ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. మాది కాకినాడలో మల్లంపేట అనే కుగ్రామం. టూరింగ్ టాకీస్కి వెళ్లి సినిమాలు చూసేవాడిని. సినిమా యాక్టర్ అయిపోవాలని రూ.70తో చెన్నై వెళ్లాను. అక్కడికి వెళ్లాక నాలా లక్షలాది మంది ఉన్నారని చూశాను. జూనియర్ వేషాలు వేశాను. అప్పుడు మహానటులను చూశాను. నాకు బొమ్మలు వేసే అలవాటుండేది. నేను వేసిన ఏఎన్నార్ బొమ్మ చూసి డైరెక్టర్, నా గురువు దాసరి నారాయణరావుగారు మెచ్చుకున్నారు. పొంగిపోయాను. డిగ్రీ పూర్తి చూసి వస్తే వేషం ఇస్తానన్నారు. సెకండ్ హీరోగా..డిగ్రీ పూర్తి చేసి చెన్నై వెళ్లి దాసరిగారిని కలిశా.. ఇచ్చిన మాట ప్రకారం మహేశ్బాబు అన్న రమేశ్బాబు నీడ సినిమాలో వేషం ఇచ్చారు. సెకండ్ హీరోగా చేశాను. తర్వాత సంధ్య సినిమాలో నన్నే హీరోగా పెట్టి మూవీ తీశారు. ఆ తర్వాత నాకు వేషాలొచ్చాయి. కానీ, నటుడిగా బిజీ కాలేకపోయాను. హీరో వేషాలు రాలేదు. చిన్న వేషాలే వస్తున్నాయి. చాలా స్ట్రగుల్ అయ్యా.. నేనెప్పుడు హీరో అవుతాను? నా ముఖం నావాళ్లందరికీ ఎలా చూపించుకోగలను? అని మానసిక వేదన చెందాను. ఆ పాటతోనే ధైర్యంఅన్ని రకాల బాధలు పడుతున్న సమయంలో ఘంటసాల పాడిన 'కల కానిది.. విలువైనిది..' పాట నాలో ధైర్యం నింపింది. నాకెవరూ హీరో వేషం ఇవ్వట్లేదు కాబట్టి నేనే హీరో అవ్వాలనుకున్నాను. హీరో కావాలంటే డబ్బులు కావాలి. అప్పుడు నా స్నేహితుల సహకారంతో స్నేహ చిత్ర పిక్చర్స్ పేరిట బ్యానర్ ప్రారంభించాను. నా బ్యానర్లో తీసిన తొలి చిత్రం అర్ధరాత్రి స్వాతంత్ర్యం. సినిమా పిచ్చితో కథ, డైరెక్షన్, స్క్రీన్ప్లే, యాక్షన్.. అన్నీ నేనే చేసుకున్నాను. జనం దగ్గర సక్సెస్ అయ్యాను అని చెప్పుకొచ్చారు.చదవండి: కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం -
తండ్రి కాబోతున్న తెలుగు హీరో.. భార్యకు సీమంతం
మరో తెలుగు హీరో తండ్రి కాబోతున్నాడు. అయితే అతడు ఈ విషయాన్ని బయటపెట్టలేదు. 'బలగం' ఫేమ్ కావ్య కల్యాణ్ రామ్.. ఈ శుభకార్యానికి వెళ్లింది. కాబోయే తల్లిదండ్రులకు విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టింది. అలా ఈ గుడ్ న్యూస్ అందరికీ తెలిసింది. దీంతో సదరు హీరోకి నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)తెలుగు సినిమాల్లో హీరోగా, సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు తిరువీర్. తెలంగాణకు చెందిన ఈ కుర్రాడు.. 'మసూద' మూవీతో మంచి ఫేమ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఒకటి రెండు చిత్రాల్లో హీరోగా చేస్తున్నాడు. 2016 నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఇతడు.. ఘాజీ, మల్లేశం, జార్జ్ రెడ్డి, పలాస, టక్ జగదీష్, మసూద, పరేషాన్, మోక్షపటం సినిమాలు చేశాడు. పర్లేదనిపించేలా గుర్తింపు తెచ్చుకున్నాడు.వ్యక్తిగత విషయానికొస్తే గతేడాది కల్పన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది మార్చిలో సొంతూరిలో కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు. 'రెండు దశాబ్దాల కల, అమ్మ చివరి కోరిక' అని తన ఇంటి ఫొటోలని కూడా షేర్ చేశాడు. ఇప్పుడు తిరువీర్ భార్య కల్పన ప్రెగ్నెన్సీతో ఉంది. సోమవారం నాడు సీమంతం వేడుక చేశారు. ఈ ఫొటోలని కావ్య కల్యాణ్ రామ్ షేర్ చేసింది. అలా తిరువీర్ తండ్రి కాబోతున్న విషయం అందరికీ తెలిసింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'కోర్ట్' దర్శకుడు.. అమ్మాయి ఎవరంటే?) -
చిరంజీవికి మా సమస్యలు చెప్పాం: ఫిలిం ఫెడరేషన్
సాక్షి, హైదరాబాద్: వేతనాలు పెంచాలంటూ సినీకార్మికులు కొద్దిరోజులుగా సమ్మె (Tollywood Film Worker Strikes) చేస్తున్నారు. జీతాలను 30% మేర పెంచేవరకు షూటింగ్స్లో పాల్గొనేదే లేదని ఘంటాపథంగా చెప్తున్నారు. పద్నాలుగు రోజులుగా షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 2 వేల లోపు జీతాలున్నవారికి 25% జీతాలు పెంచుతామని నిర్మాతలు ముందుకొచ్చారు. కానీ కొన్ని కండీషన్లున్నాయంటూ మెలిక పెట్టారు. దీనికి కార్మికులు ఒప్పుకోకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. అటు నిర్మాతలతో, ఇటు యూనియన్స్తో భేటీఈ క్రమంలో ఆదివారం నాడు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్లోని కొందరు నిర్మాతలు చిరంజీవి (Chiranjeevi Konidela)ని కలిసి మాట్లాడారు. ఈ భేటీ అనంతరం నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ.. సమస్య పరిష్కారానికి తనవంతుగా కార్మికులతో మాట్లాడతానని చిరంజీవిగారు చెప్పారు. ఓ పెద్దమనిషిగా ఇరు వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఉన్నారు అని తెలిపారు. సోమవారం (ఆగస్టు 18న) ఫిలిం ఫెడరేషన్ సభ్యులతో చిరంజీవి సమావేశమయ్యారు. త్వరలోనే పరిష్కారంఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని, ఫెడరేషన్ కార్యదర్శి అమ్మిరాజు తదితర యూనియన్ నాయకులు చిరంజీవిని కలిసి తమ సమస్యలను వివరించారు. భేటీ అనంతరం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ.. 24 క్రాఫ్ట్స్ నుంచి 72 మందితో చిరంజీవి మాట్లాడారు. నిర్మాతలు మా మాట వినకుండా మాపై నిందలు వేస్తున్నారు. మాకు కుదరని నిబంధనలు పెడుతున్నారు. మేము బాగుండాలి, అలాగే నిర్మాతలూ బాగుండాలి.చిరంజీవికి అన్నీ చెప్పాంనిర్మాతలు పెట్టిన 2 కండీషన్స్కు ఒప్పుకుంటే మేమేం నష్టపోతామో చిరంజీవిగారికి వివరించాం. ఆదివారం నాడు డబుల్ కాల్ షీట్ గురించి కూడా చెప్పాం. మాకు ఏ సమస్య ఉన్నా తన దగ్గరకు రమ్మని చిరంజీవి గారు చెప్పారు. రేపు మేము జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయనున్నాం. ఛాంబర్తో కూడా సమావేశం కానున్నాం. చర్చలకు పిలిచారు కాబట్టి మేము నిరసన కార్యక్రమం ఆపేశాం. మేం అడిగినట్లుగా మాకు వేతనాలు వస్తాయని భావిస్తున్నాం అన్నారు.నిర్మాతల మీటింగ్మరోపక్క నిర్మాతలు ఫిలిం ఛాంబర్లో సమావేశమై కార్మికుల వేతనాల పెంపు డిమాండ్లపై చర్చించారు. అనంతరం నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ.. నిర్మాతలందరూ సమస్య పరిష్కార బాధ్యతను ఛాంబర్కే అప్పగించారు. ఛాంబర్ త్వరలో తుది నిర్ణయం తీసుకుంటుంది. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది అని పేర్కొన్నారు.చదవండి: కొత్తింట్లో గృహప్రవేశం చేసిన బిగ్బాస్ మానస్ -
సిజ్లింగ్ దిశా పటానీ.. రెడ్ డ్రస్సులో 'దృశ్యం' పాప
రెడ్ హాట్ మిర్చిలా మారిపోయిన దిశా పటానీచీరలో మరింత అందంగా అమలాపాల్పరమ్ సుందరి ప్రమోషన్లలో జాన్వీ బిజీ బిజీరెడ్ డ్రస్సులో వయ్యారంగా దృశ్యం పాప ఎస్తర్మెల్బోర్న్లో ఫారిన్ బ్యూటీలా అదితీ రావు హైదరీకీర్తి సురేశ్ జూలై జ్ఞాపకాలు.. భలే ఫన్నీబీచ్ ఒడ్డున ఎంజాయ్ చేస్తున్న ఇవానా View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Esther (@_estheranil) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) -
కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం
సాక్షి, హైదరాబాద్: దివంగత నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) ఇంట విషాదం నెలకొంది. ఆయన భార్య రుక్మిణి (Kota Rukmini) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం (ఆగస్టు 18న) తుదిశ్వాస విడిచారు. కాగా కోట శ్రీనివాసరావు నెల రోజుల క్రితమే పరమపదించారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో జూలై 13న కన్నుమూశారు. ఆయన మరణించిన నెల రోజులకే భార్య మరణించడం విషాదకరం! కోట రుక్మిణి మృతిపై పలువురు సెలబ్రిటీలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.విలక్షణ నటుడుతెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా కోట శ్రీనివాసరావు తనదైన ముద్ర వేశారు. విలన్గా, తండ్రిగా, కామెడీ విలన్గా, రాజకీయ నాయకుడిగా విభిన్న పాత్రలో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో రంగప్రవేశం చేసిన కోట.. అన్నిరకాల పాత్రలు పోషించి తెలుగు తెరపై ఆల్రౌండర్గా నిలిచారు.చదవండి: అణువణువునా నువ్వే.. చనిపోయిన భార్యకోసం నటుడు ఏం చేశాడంటే? -
మహావతార్ నరసింహ అద్భుతాలు.. సెట్స్పైకి పరశురామ్
మహావతార్ నరసింహ.. వెండితెరపై ఇప్పటికీ అద్భుతాలు సృష్టిస్తూనే ఉంది. ప్రమోషన్లు లేవు, హైప్ లేదు, బడ్జెట్ కూడా తక్కువే.. అందులోనూ భారీ సినిమాలతో పోటీ.. అన్నింటినీ తట్టుకుని నిలబడింది. యానిమేషన్ మూవీ అయినా రికార్డులు భారీ కలెక్షన్లు రాబడుతూ రికార్డులు తిరగరాస్తోంది. జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ గతవారం క్రితమే రూ.200 కోట్ల మైలురాయిని దాటేసింది. హరిహర వీరమల్లు, కింగ్డమ్ చిత్రాల పోటీని తట్టుకుని బలంగా నిలబడింది.నవంబర్లో సెట్స్పైకిఇటీవలే రిలీజైన వార్ 2, కూలీ సినిమాల కాంపిటీషన్ను సైతం తట్టుకుని ఇంకా వెండితెరపై మ్యాజిక్ చేస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రదర్శకుడు తన నెక్స్ట్ మూవీని ప్రకటించాడు. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)లో శ్రీవిష్ణువు దశావతారాల ఆధారంగా సినిమాలు తెరకెక్కనున్నాయని గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే! అందులో భాగంగా తన రెండో సినిమా మహావతార్ పరశురామ్ను నవంబర్లో సెట్స్పైకి తీసుకెళ్తున్నట్లు ప్రకటించాడు. నాకంటూ క్లారిటీ ఉందివ్యవస్థ తప్పుదారిలో వెళ్తున్నప్పుడు దాన్ని సరిదిద్దేందుకు నిలబడ్డ హీరో పరశురామ్. ఇది చాలా శక్తివంతమైన కథ. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ కూడా మొదలైంది. నరసింహ సినిమా సక్సెస్తో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రజల ప్రేమను చూస్తుంటే ఇలాంటి సినిమాలు ఇంకెన్నో చేయాలనిపిస్తోంది. నాపై ఒత్తిడి ఉంది. కాకపోతే ఇంకా ఏడు సినిమాలు తీయాలన్న క్లారిటీ కూడా ఉంది. అయితే అన్నీ యానిమేషన్స్ తీయాలనుకోవడం లేదు. కనీసం రెండు చిత్రాలైనా లైవ్ యాక్షన్ ఫిలింస్గా తీర్చిదిద్దాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.పరశురామ్పై రెండు సినిమాలుఇదిలా ఉంటే పరశురామ జీవితకథపై హిందీలో మహావతార్ టైటిల్ పేరిట ఓ సినిమా తెరకెక్కుతోంది. ఛావాతో ప్రేక్షకుల్ని మెప్పించిన విక్కీ కౌశల్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది క్రిస్మస్కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ రెండు పరశురామ్ చిత్రాల్లో ఏది బాక్సాఫీస్ వద్ద నెగ్గుతుందో చూడాలి! -
రెమ్యునరేషన్ లేకుండానే స్టార్ హీరో కొత్త సినిమా!
తమిళ స్టార్ హీరోల్లో అజిత్ ఒకడు. దళపతి విజయ్, రజినీకాంత్, సూర్య లాంటి వాళ్లతో పోలిస్తే ఇతడి మార్కెట్ చాలావరకు తమిళానికే పరిమితం. అయినా సరే వరస సినిమాలు చేస్తూ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరిస్తుంటాడు. ఈ ఏడాది ఇప్పటికే అజిత్ నటించిన రెండు చిత్రాలు రిలీజ్ కాగా.. అవి రెండు బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించాయి. ఇప్పుడు ఓ కొత్త మూవీని మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. కానీ ఓ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)తనతో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' లాంటి క్రేజీ సినిమా తీసిన దర్శకుడు అధిక్ రవిచంద్రన్తోనే.. అజిత్ తన కొత్త మూవీ చేయబోతున్నాడు. త్వరలో షూటింగ్ మొదలు కానుంది. ఇందులో 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ అని అంటున్నారు. అయితే ఈ సినిమా కోసం తొలుత ఓ నిర్మాణ సంస్థ ముందుకు రాగా.. అజిత్ రూ.200 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేశారని టాక్. దీంతో సదరు సంస్థ స్వచ్ఛందంగా తప్పుకొందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే అజిత్ నటించిన పలు సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేసిన రాహుల్ అనే వ్యక్తి.. ఈ మూవీని నిర్మించేందుకు ముందుకు వచ్చాడని సమాచారం. అయితే రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఓ డీల్ మాట్లాడుకున్నాడని తెలుస్తోంది. రెగ్యులర్గా ఇచ్చే పారితోషికం బదులు ఓటీటీ, శాటిలైట్ హక్కుల్ని హీరో అజిత్ తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారని టాక్. ఇవన్నీ కూడా రీసెంట్గా ఫైనల్ అయ్యాయని.. 'AK64' పేరుతో మొదలయ్యే ఈ ప్రాజెక్ట్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'కోర్ట్' దర్శకుడు.. అమ్మాయి ఎవరంటే?) -
నాన్న చివరి కోరిక నెరవేర్చిన నాగార్జున.. అదేంటంటే?
టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) తాజాగా కూలీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రజినీకాంత్ హీరోగా వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. తొలి రోజు రూ.151 కోట్లు రాబట్టిన కూలీ.. కోలీవుడ్లో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.అయితే తాజాగా ఓ టాక్ షోకు హాజరైన నాగార్జున పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాన్న అక్కినేని నాగేశ్వరరావు చివరి రోజుల్లో అడిగిన కోరికను నెరవేర్చారు. మనం సినిమాలో తన పాత్రకు వేరొకరితో డబ్బింగ్ చెప్పించవద్దని అడిగారని నాగార్జున గుర్తు చేసుకున్నారు. అలా చేస్తే అస్సలు ఊరుకోను అన్నారని వెల్లడించారు. ఆయన కోరిక మేరకే బెడ్ మీద నుంచే డబ్బింగ్ మొత్తం పూర్తి చేశారని తెలిపారు. నా జీవితంలో ఎలాంటి ఒత్తిడి లేదని.. కానీ మనం సినిమా గురించి రాత్రిళ్లు నిద్రలేకుండా ఆలోచించేవాడినని నాగార్జున పేర్కొన్నారు. అప్పటికే ఆయనకు సినిమా చూపిస్తే.. చాలా బాగుందిరా అని అన్నారని నాగ్ పంచుకున్నారు.నాగార్జున మాట్లాడుతూ..'మనం సినిమా మాకు చాలా స్పెషల్. ఫ్యామిలీ అంతా ఒకటే ఫ్రేమ్లో కనిపించాం. ఇది నాన్నగారి చివరి చిత్రమని మాకు షూటింగ్లోనే తెలిసిపోయింది. ఆయనకు క్యాన్సర్ రావడంతో అదే చివరి సినిమా అని మా అందరికీ తెలుసు. నాకు లైఫ్లో ఎలాంటి ఒత్తిడి లేదు.. కానీ రాత్రిళ్లు నిద్రపోకుండా ఆలోచించింది మాత్రం ఈ ఒక్క సినిమానే. డబ్బింగ్ వేరేవాళ్లతో చెప్పిస్తే ఊరుకోను.. నేనే చెప్తా అన్నారు. ఇంట్లో ఏర్పాటు చేసిన ఐసీయూ బెడ్ మీద నుంచే సినిమా డబ్బింగ్ మొత్తం పూర్తి చేశారు. ఆయన పాత్రకు తన సొంత వాయిస్తోనే డబ్బింగ్ చెప్పుకున్నారు. అప్పటికే నాన్నకు సినిమా చూపిస్తే చాలా బాగుందిరా అన్నారని' గుర్తు చేసుకున్నారు. -
అవును.. నాకు ముడతలు ఉన్నాయి: టాలీవుడ్ హీరోయిన్
సోషల్ మీడియా వల్ల ఎంత ఉపయోగం ఉందో అంతే అనర్థాలు కూడా ఉన్నాయి. చాలామంది అదేపనిగా నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటారు. విపరీతంగా ట్రోల్స్ చేస్తుంటారు. సెలబ్రిటీలు వీటి బారిన ఎక్కువగా పడుతుంటారు. కొందరు వీటిని లైట్ తీసుకుంటే మరికొందరు మాత్రం ఘాటుగా స్పందిస్తుంటారు. ఇప్పుడు అలానే 'మన్మథుడు' హీరోయిన్ కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్లకు అదిరిపోయే రిప్లై ఇచ్చింది.'ఇద్దరు పిల్లల తల్లివి, కాస్త పద్ధతిగా ప్రవర్తించు.. 20 ఏళ్ల పిల్లవేం కాదు నువ్వు.. సర్జరీ చేసుకోకముందే బాగుండేదానివి, ఇప్పుడు బక్కపలుచగా ఉన్నావ్. ఇలాంటి కామెంట్స్ పెట్టే బదులు వేరే ఏదైనా పని చూసుకోండి. ఎందుకంటే వీటి వల్ల మీరు ఎలాంటి వాళ్లో అర్ధమవుతోంది. అవును నాకు ముడతలు ఉన్నాయి. ఇప్పటివరకు సర్జరీలు చేసుకోలేదు. ఫిల్లర్స్ కూడా పెట్టించుకోలేదు. బొద్దుగా ఉన్నప్పుడు నాకే ఇబ్బందిగా అనిపించేది. ఇప్పుడు ఓకే కదా? జీవితంలో ఏం చేయడానికైనా టైమ్ అంటూ లేదు. కలలు కనండి. మీకు సంతోషాన్ని కలిగించే పని మాత్రమే చేయండి' అని అన్షు తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)యూకేలో పుట్టి పెరిగిన అన్షు.. 15 ఏళ్లకే ఇండస్ట్రీకి వచ్చింది. నాగార్జున 'మన్మథుడు' సినిమాతో పరిచయమైంది. తొలి మూవీతో హిట్ కొట్టింది. కానీ తర్వాత చేసిన రాఘవేంద్ర, మిస్సమ్మ చిత్రాలు ఫెయిలవడంతో తిరిగి యూకే వెళ్లిపోయింది. సైకాలజీలో మాస్టర్స్ చేసి సొంతంగా క్లినిక్ పెట్టుకుంది. 2011లో 24 ఏళ్ల వయసులోనే సచిన్ సాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే చాన్నాళ్ల తర్వాత తెలుగులో 'మజాకా' మూవీతో అన్షు రీఎంట్రీ ఇచ్చింది.ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్షు రీఎంట్రీ సినిమా రిలీజ్ కాగా హిట్ కాలేదు. దీంతో ఈమె తిరిగి యూకే వెళ్లిపోయింది. అయితే గత కొన్నిరోజులుగా తన ఇన్ స్టా పోస్టుల్లో వస్తున్న నెగిటివ్ కామెంట్స్పై ఇప్పుడు సెటైరికల్గా స్పందిస్తూ పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'కోర్ట్' దర్శకుడు.. అమ్మాయి ఎవరంటే?) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) -
అణువణువునా నువ్వే.. చనిపోయిన భార్యకోసం నటుడు ఏం చేశాడంటే?
'కాంటా లగా..' పాటతో ఫేమస్ అయిన బాలీవుడ్ నటి షెఫాలీ జరివాలా (42) జూన్ 27న మరణించింది. చిన్న వయసులోనే భార్య తనను వదిలి వెళ్లడంతో నటుడు పరాగ్ త్యాగి శోకసంద్రంలో మునిగిపోయాడు. అంత్యక్రియల సమయంలోనూ భార్య మృతదేహాన్ని పట్టుకుని బోరున విలపించాడు. రోజులు గడిచేకొద్దీ భార్య జ్ఞాపకాలతో మరింత కుమిలిపోతున్నాడే తప్ప ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నాడు. ఇంతలోనే వారి పెళ్లి రోజు వచ్చింది. వెడ్డింగ్ యానివర్సరీఇద్దరి ప్రేమ బంధానికి 15 ఏళ్లు. కానీ, ఈసారి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడానికి భార్య లేకుండా పోయింది. అయినా సరే.. పరి (షెఫాలీని ప్రేమగా పిల్చుకునే పేరు) కోసం ఇదే నా గిఫ్ట్ అంటూ ఓ వీడియో షేర్ చేశాడు. తన ఛాతీపై షెఫాలీ ముఖాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాడు. పంటికింద నొప్పిని భరిస్తూ భార్య ఫోటోను ఎదపై భద్రంగా పదిలపర్చుకున్నాడు. ప్రేమకు పదేళ్లు 'తను నా హృదయంలో ఎల్లప్పుడూ ఉంటుంది. నా శరీరంలోని అణువణువునా తనే ఉంది. ఇప్పుడది అందరికీ స్పష్టంగా కనిపిస్తోంది' అని వీడియోకిచ్చిన క్యాప్షన్లో రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు నీ ప్రేమను చూస్తుంటే మా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి అని కామెంట్లు చేస్తున్నారు. షెఫాలీ జరివాలా, పరాగ్ త్యాగి.. 2010 ఆగస్టు 12న తొలిసారి కలుసుకున్నారు. కొద్దిరోజులకే ప్రేమలో పడ్డారు. 2014లో వీరు కలుసుకున్న ఆగస్టు 12వ తేదీనే పెళ్లి చేసుకున్నారు. ఇది షెఫాలీకి రెండో పెళ్లి. గతంలో ఆమె హర్మీత్ సింగ్ను పెళ్లి చేసుకోగా 2009లో విడాకులిచ్చింది. View this post on Instagram A post shared by Pari aur Simba ke Papa (@paragtyagi) చదవండి: కొత్తింట్లో గృహప్రవేశం చేసిన బిగ్బాస్ మానస్ -
అఫీషియల్ ప్రకటన.. ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
ఓటీటీలు వచ్చాక సరికొత్త సినిమాలు, సిరీస్లు సినీ ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ అందిస్తూ ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా క్రైమ్ జోనర్లో వచ్చే సిరీస్లకు ఓటీటీలో విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఇప్పటికే ఆ జోనర్లో వచ్చిన చిత్రాలు, సిరీస్లు చాలా వరకు సూపర్ హిట్గా నిలిచాయి.తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ మిమ్మల్ని అలరించేందుకు వస్తోంది. మీర్జాపూర్ నటుడు అలీ ఫజల్ లీడ్ రోల్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అఫీషియల్గా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది.రాఖ్ (Raakh) పేరుతో ఈ ఆసక్తికర వెబ్ సిరీస్ను ప్రొసిత్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. గతంలో పాతాళ్ లోక్ అనే వెబ్ సిరీస్ను రూపొందించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ వచ్చే ఏడాది ప్రేక్షకులను అలరించనుంది. ఈ ఆసక్తికర వెబ్ సిరీస్లో సోనాలి బింద్రే, ఆమిర్ బషీర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్ను అనూష నందకుమార్, సందీప్ సాకేత్ నిర్మిస్తున్నారు. JUSTICE will rise from the ashes 🔥#RaakhOnPrime, New Original Series, Coming 2026#AliFazal #SonaliBendre @prosit_roy @EndemolShineIND @anusha_nkumar #AyushTrivedi #AamirBashir @sandeepsaket83 @deepak30000 @NegiR @sunandagj @BhaDiPa pic.twitter.com/mLulmaXj8X— prime video IN (@PrimeVideoIN) August 18, 2025 -
పెళ్లి చేసుకున్న 'కోర్ట్' దర్శకుడు.. అమ్మాయి ఎవరంటే?
ఈ ఏడాది తెలుగులో కొన్ని సినిమాలు మాత్రమే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకున్నాయి. అలాంటి వాటిలో హీరో నాని నిర్మించిన 'కోర్ట్' మూవీ ఒకటి. మార్చిలో రిలీజైన ఈ చిత్రం.. హిట్ టాక్తో పాటు అద్భుతమైన కలెక్షన్ కూడా అందుకుంది. ఈ చిత్రంతో వైజాగ్ కుర్రాడు రామ్ జగదీశ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. మూవీ వచ్చిన ఎన్నాళ్లు కాలేదు ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు.(ఇదీ చదవండి: సింగర్ 'రాహుల్ సిప్లిగంజ్' నిశ్చితార్థం)దర్శకుడు రామ్ జగదీశ్ పెళ్లి వైజాగ్లో ఆదివారం రాత్రి జరిగింది. కార్తీక అనే అమ్మాయిని వివాహమాడాడు. ఈ వేడుకకు 'కోర్ట్' మూవీ యాక్టర్స్ రోషన్, శ్రీదేవి, శివాజీతో పాటు నిర్మాత ప్రశాంతి కూడా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.రామ్ జగదీశ్ పెళ్లి.. పెద్దల కుదిర్చినట్లు తెలుస్తోంది. కార్తీక ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయితే కాదు. ప్రస్తుతానికైతే ఆమె పేరు మాత్రమే బయటకొచ్చింది. ఇకపోతే రామ్ జగదీశ్ తన తర్వాతి సినిమాని కూడా నాని నిర్మాణంలో తీయబోతున్నాడనే టాక్ కొన్నిరోజుల క్రితం వచ్చింది. ఈసారి మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ మూవీ తీసే ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం త్వరలో ప్రకటన వచ్చే అవకాశముంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) View this post on Instagram A post shared by Neeha (@cinema_ammayi) -
కొత్తింట్లో గృహప్రవేశం చేసిన బిగ్బాస్ మానస్
చైల్డ్ ఆర్టిస్ట్గా పలు సినిమాలు చేసిన మానస్ (Maanas Nagulapalli) తెలుగు బిగ్బాస్ ఐదో సీజన్తో బాగా పాపులర్ అయ్యాడు. అనవసరంగా ఆవేశానికి పోకుండా కూల్గా ఆడి, నిదానంగా మాట్లాడుతూ పాజిటివ్ యాటిట్యూడ్తో అందరినీ ఆకట్టుకున్నాడు. అతడు షోలో ఉండగా తల్లి పద్మిని హౌస్లోకి వచ్చి అందరితో ఇట్టే కలిసిపోయింది. మానస్కు పూర్తి వ్యతిరేకంగా ఫుల్ చలాకీగా ఉంటూ, డ్యాన్స్ చేస్తూ అదరగొట్టింది. అలా ఈ షోతో మానస్ తల్లి కూడా పాపులర్ అయింది.గృహప్రవేశంతాజాగా మానస్ తల్లి పద్మిని సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. డ్రీమ్ హౌస్ కల నెరవేరిందని తెలిపింది. భర్త ఎన్వీ రావు, కుమారుడు మానస్, కోడలు శ్రీజ, మనవడు ధ్రువతో కలిసి గృహప్రవేశం చేసినట్లు తెలిపింది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఈ ఇల్లు కొన్నట్లు పేర్కొంది. కొద్దిమంది మిత్రుల సమక్షంలోనే ఈ గృహప్రవేశ వేడుక జరిగిందని చెప్పుకొచ్చింది. కాగా మానస్ 2023లో శ్రీజను పెళ్లి చేసుకున్నాడు. వీరికి గతేడాది కుమారుడు ధ్రువ జన్మించాడు.సినిమానరసింహ నాయుడు, వీడే చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మానస్.. 2011లో 'ఝలక్' సినిమాతో హీరోగా మారాడు. గ్రీన్ సిగ్నల్, కాయ్ రాజా కాయ్, గోలీ సోడా, ప్రేమికుడు, క్షీరసాగర మథనం వంటి చిత్రాలు చేశాడు. కొన్నాళ్లకు తెలుగులో బిగ్బాస్ 5వ సీజన్లో పాల్గొనగా ఫైనల్ వరకు వచ్చాడు గానీ విజేత కాలేకపోయాడు. బిగ్బాస్ నుంచి రాగానే కార్తీకదీపం సీరియల్లో నటించాడు. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Padmini Nagulapalli (@padmini.nagulapalli.7) చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించిన తెలుగు సీరియల్ నటి -
రజినీకాంత్ కూలీ.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'కూలీ' బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ కావడంతో తొలిరోజు ఏకంగా రూ.151 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. దీంతో కోలీవుడ్ చరిత్రలోనే ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కాసుల వర్షం కురిపిస్తోంది. కూలీ విడుదలైన నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.410 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా పోస్ట్ చేశారు. దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తొలి మూడు రోజులతో పోలిస్తే నాలుగో రోజు కలెక్షన్స్ కాస్తా తగ్గినట్లు కనిపిస్తోంది.మరోవైపు దేశవ్యాప్తంగా కూలీ మూవీ దూసుకెళ్తోంది. ఇండియాలో నాలుగు రోజుల్లోనే రూ.194.25 కోట్లు నికర వసూళ్లు సాధించింది. తొలి రోజు రూ.65 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టిన కూలీ.. రెండు వందల కోట్ల మార్క్ దిశగా ప్రయాణిస్తోంది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే రూ.200 కోట్ల నికర వసూళ్ల మార్క్ చేరుకోనుంది. ఈ చిత్రంలో నాగార్జున, శృతిహాసన్, అమిర్ ఖాన్, సత్యరాజ్, చార్లీ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు.ఇండియాలో నెట్ కలెక్షన్స్..1వ రోజు: రూ.65 కోట్లు2వ రోజు: రూ.54.75 కోట్లు3వ రోజు: రూ.39.5 కోట్లు4వ రోజు: రూ.35 కోట్లుమొత్తం: రూ.194.25 కోట్లు #Coolie 's 1st extended weekend WW gross will be around 410 Crs.. This is All-time No.1 opening for a Kollywood movie.. 🔥 #SuperstarRajinikanth pic.twitter.com/qBlhtFQZR3— Ramesh Bala (@rameshlaus) August 18, 2025 -
'ఎన్టీఆర్' ఫ్యాన్స్ అరెస్ట్.. పోలీస్ స్టేషన్కు ముజీబ్
అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భగ్గుమంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. నందమూరి వారసుడిపై నీచమైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై టీడీపీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోఘ ఆ పార్టీపై కూడా తారక్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. తమ అభిమాన హీరోను నోటికొచ్చినట్లు తిట్టడాన్ని వారు జీర్ణించుకోలేక పోయారు. దీంతో ఇప్పటికే అనంతపురం శ్రీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపైకి దాడికి దిగారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే భారీ ఫ్లెక్సీలను చింపేసి నిరసన తెలిపారు. అయితే, నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులను పలుచోట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్లపైకి వచ్చి ఎలాంటి విధ్వంసం చేయరాదని హెచ్చరించారు. దీనిని ఫ్యాన్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. మా అభిమాన హీరోను నోటికొచ్చినట్లు తిట్టి మా మీదే కేసులు పెడుతారా..? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే మదనపల్లిలోని ఎన్టీఆర్ అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. అభిమానులు రాష్ట్రం మొత్తం ఎక్కడ ధర్నాలు, ర్యాలీలు ప్రెస్మీట్లు పెట్టకూడదని వారు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్లను పోలీస్స్టేషన్ వద్దకు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదోనిలోని పోలీస్స్టేషన్కు జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం ఏపీ కన్వీనర్ ముజీబ్ అహ్మద్ కూడా వెళ్లారు. కుప్పంలో కూడా పోలీసుల ఒత్తిడి వల్ల ధర్నాలు, ర్యాలీలను ఎన్టీఆర్ అభిమానులు క్యాన్సిల్ చేసుకున్నారు. తప్పు చేసిన వాళ్లను వదిలేసి కేవలం ఎన్టీఆర్ అభిమానులను మాత్రమే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఒక తల్లి గురించి నోటికొచ్చిన మాటలు మాట్లాడిన వారి మీద కేసులు పెట్టరా..? అంటూ ఫైర్ అవుతున్నారు.తారక్ గురించి నీచంగా మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యేఒక ఫోన్ కాల్లో ఎన్టీఆర్ గురించి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇలా మాట్లాడారు. ‘జూనియర్ ఎన్టీఆర్ ఒక బుడ్డా ఫకీర్.. వాడి సినిమాలు ఇక్కడ ఎలా ఆడనిస్తానని అనుకున్నారు.. లోకేశ్ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తాను.. వానెమ్మ.. లం.. కొడుకు.. వాని సినిమాలు ఆడనిస్తానా.. మీరెలా ఆడనిస్తార్రా గాడిదల్లారా.. నా పర్మిషన్ లేకుండా వేయిస్తారా.. ఈ సినిమా ఆడదు..’ అంటూ అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘వార్–2’ సినిమా విడుదల నేపథ్యంలో ఎమ్మెల్యే ఇటీవల ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత ధనుంజయనాయుడుతో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. -
ప్రెగ్నెన్సీ ప్రకటించిన తెలుగు సీరియల్ నటి
బుల్లితెర నటి హర్షిక వెంకటేశ్ (Harshitha Venkatesh) గుడ్న్యూస్ చెప్పింది. త్వరలోనే తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు భర్తతో కలిసి బేబీ ఆన్ ద వే అంటూ ఓ వీడియో షేర్ చేసింది. పెళ్లయిన ఐదేళ్లకు తల్లిదండ్రులు కాబోతున్నాం.. ఇద్దరం కాస్తా ముగ్గురం కాబోతున్నామంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇది చూసిన అభిమానులు నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇస్మార్ట్ జోడీ విన్నర్స్హర్షిక.. లక్ష్మీ కల్యాణం, అమ్మ కోసం సీరియల్స్లో ప్రధాన పాత్రలో నటించింది. భర్త వినయ్ శ్యామ్సుందర్తో కలిసి ఇస్మార్ట్ జోడీ సీజన్ 2లో పాల్గొంది. పలుసార్లు ఎలిమినేషన్ అంచులవరకు వెళ్లొచ్చిన వీరు ఫినాలేలో చోటు దక్కించుకున్నారు. అంతేకాదు జంటగా టాస్కులు గెలిచి ఇస్మార్ట్ జోడీ సీజన్ 2 విన్నర్స్గా నిలిచారు. విజేతలుగా ట్రోఫీ అందుకోవడంతో పాటు రూ.25 లక్షల ప్రైజ్మనీ గెలుచుకున్నారు. ఈ సెలబ్రిటీ జంట కన్నడలో రాజారాణి రీలోడెడ్ అనే షోలోనూ పాల్గొన్నారు. ఈ షోలో ఫైనల్స్వరకు వెళ్లగలిగారు. View this post on Instagram A post shared by Harshitha Venkatesh (@harshitha_venkatesh_actress) చదవండి: బిగ్బాస్ అగ్నిపరీక్ష.. అయ్యో, అతడ్ని ఎలిమినేట్ చేశారా? -
'మా సినిమాకు ఏ అవార్డులు వద్దు.. ఒక్క ట్వీట్ చేయండి ప్లీజ్'
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) లీడ్ రోల్లో నటింంచిన తాజా చిత్రం పరదా. ఈ మూవీకి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. లేడీ ఓరియంటెడ్ చిత్రంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్తో బిజీ అయిపోయారు అనుపమ. తాజాగా ఓ మాల్లో నిర్వహించిన మూవీ ప్రమోషన్స్ డైరెక్టర్ ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆడియన్స్ను ఉద్దేశించి ఎమోషనల్గా మాట్లాడారు.మా సినిమా అవార్డులు అక్కర్లేదని.. డబ్బులు వస్తే చాలని అన్నారు. మలయాళ సినిమాలు ఇక్కడ హిట్ అవ్వడం కాదు.. మన తెలుగు సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ కావాలన్నారు. మా సినిమా బాగుంటే పెద్ద పెద్ద స్టార్స్ ఒక్క ట్వీట్ చేయాలని డైరెక్టర్ ప్రవీణ్ విజ్ఞప్తి చేశారు. మీరు ట్వీట్ చేస్తే కనీసం కొంతమంది ప్రేక్షకులైనా మా మూవీ చూస్తారని దర్శకుడు అన్నారు.ప్రవీణ్ కండ్రేగుల మాట్లాడుతూ..'ప్రతి కథ హీరో చుట్టే తిరగాలని లేదు. అనుపమ కూడా పెద్ద స్టార్. నా సినిమాలో ముగ్గురు స్టార్స్ ఉన్నారు. మా సినిమాకు అవార్డులు వద్దు. డబ్బులు కావాలి. కచ్చితంగా ఈ చిత్రంపై నాకు నమ్మకముంది. ఇక్కడ లేడీ ఓరియంటెడ్ కాదు.. మెన్ ఓరియంటెండ్ కాదు.. ఇది కేవలం సినిమా అంతే. మన దగ్గర మలయాళ చిత్రాలు హిట్ అవ్వడం కాదు.. మన తెలుగు సినిమాలు అక్కడ బ్లాక్బస్టర్ కొట్టాలి. అందుకే మలయాళ నటులను పెట్టాను. సినిమా బాగుంటేనే చూడండి. మా సినిమా బాగుంటే పెద్ద పెద్ద స్టార్స్ ఒక్క ట్వీట్ చేయండి ప్లీజ్. మీవల్ల ఎంతోమంది మా చిత్రం చూస్తారు.' అని ఆడియన్స్ను కోరారు. కాగా.. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 22న థియేటర్లలో సందడి చేయనుంది. -
బిగ్బాస్ అగ్నిపరీక్ష.. అయ్యో, అతడ్ని ఎలిమినేట్ చేశారా?
జనాల దృష్టిని ఆకర్షించేందుకు బిగ్బాస్ అగ్నిపరీక్ష (Bigg Boss Agnipariksha) అంటూ ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నాడు. కామన్ మ్యాన్గా షోలో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ మీదే అంటూ ఊరించడంతో దాదాపు 20 వేల మంది అప్లై చేసుకున్నారు. దశలవారీగా వారిని ఫిల్టర్ చేసి చివరకు 45 మందిని ఎంపిక చేశారు. వీరికి అగ్నిపరీక్ష అనే కార్యక్రమంలో రకరకాల టాస్కులు పెట్టి అందులో కనీసం ఐదుగురిని బిగ్బాస్ 9వ సీజన్ (Bigg Boss 9 Telugu)కు సెలక్ట్ చేయనున్నారు.దివ్యాంగుడి పేరిట రికార్డులుఈ షో ఆగస్టు 22 నుంచి ప్రసారం కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోలో దివ్యాంగుడు ప్రసన్నకుమార్ సహా పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కనిపించారు. అందులో గంగవ్వ వయసులో ఉన్న మహిళ, మాస్క్ మ్యాన్.. ఇలా విభిన్న వ్యక్తులున్నారు. అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించిన వ్యక్తి ప్రసన్నకుమార్. ఇతడు ఫోటోగ్రాఫర్, ట్రావెలర్, బైక్ రైడర్, లెక్చరర్ కూడా! మారథాన్లో పరిగెత్తి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాడు.అగ్నిపరీక్ష నుంచి ఎలిమినేట్ఇలాంటి వ్యక్తి.. షోలో అడుగుపెడితే చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుందని అందరూ భావించారు. అతడు కచ్చితంగా బిగ్బాస్ 9వ సీజన్లో ఉండాల్సిందేనని బలంగా కోరుకున్నారు. కానీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం అతడు ఎలిమినేట్ అయ్యాడట! శ్వేతాశెట్టి అనే అమ్మాయితో పాటు ప్రసన్నకుమార్ ఎలిమినేట్ అయినట్లు ఓ వార్త వైరలవుతోంది. ఇది చూసిన జనాలు నిరాశచెందుతున్నారు. ప్రసన్న కుమార్ను కనీసం బిగ్బాస్ హౌస్ వరకైనా పంపించాల్సిందని అభిప్రాయపడుతున్నారు. మరి ప్రసన్న ఎలిమినేషన్ నిజమేనా? అతడు 9వ సీజన్లో అడుగుపెడతాడా? అనేది రానున్న రోజుల్లో తేలనుంది. View this post on Instagram A post shared by prasanna kumar aliga (@prasanna_kumar_aliga)చదవండి: ఇండస్ట్రీలో మా పరిస్థితి చాలా దారుణం: ప్రముఖ సింగర్ ఆవేదన -
'ప్రతి రోజు చెబుతా'.. ట్రోలర్స్కు జాన్వీకపూర్ స్ట్రాంగ్ కౌంటర్!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన కనిపించనుంది. ఈ సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలన ట్రైలర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో సందడి చేయనుంది.ఇక సినిమా సంగతి పక్కన పెడితే జాన్వీ కపూర్ తాజాగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు హాజరైంది. ఈ సందర్భంగా ఉట్టికొట్టే సమయంలో భారత్ మాతా కీ జై అంటూ నినాదం చేసింది. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోలింగ్ మొదలైంది. ఇదేమీ ఇండిపెండెన్స్ డే కాదంటూ జాన్వీని ట్రోల్ చేశారు.తాజాగా తనపై వస్తున్న ట్రోల్స్కు జాన్వీ కపూర్ స్పందించింది. ఈ మేరకు తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అక్కడ ఉన్నవారంతా నాకంటే ముందు భారత్ మాతాకీ జై అని అన్నారని తెలిపింది. ఆ తర్వాత నేను కూడా చెప్పానని.. వారి వీడియోను కట్ చేసి నా మాటలను మాత్రమే వైరల్ చేస్తున్నారని ట్రోలర్స్కు కౌంటరిచ్చింది. నా దేశాన్ని పొగిడేందుకు ప్రత్యేకంగా రోజంటూ లేదని రాసుకొచ్చింది. శ్రీ కృష్ణా జన్మాష్టమి నాడు మాత్రమే కాదు.. ప్రతిరోజూ భారత్ మాతాకీ జై అని చెబుతా అని ఇన్స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది. అంతేకాకుండా ఈ ఈవెంట్లో మరాఠీలో మాట్లాడిన జాన్వీ కపూర్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ చిత్రంలో కేరళ అమ్మాయిగా జాన్వీ కనిపించనుంది. ఢిల్లీ అబ్బాయితో ప్రేమలో పడిన మలయాళీ అమ్మాయి కథగా పరమ్ సుందరిని తెరకెక్కించారు.. ఈ చిత్రంలో రాజీవ్ ఖండేల్వాల్, ఆకాష్ దహియా కూడా కీలక పాత్రలు పోషించారు. -
మహేశ్బాబు బ్యానర్ సినిమా.. 'రావు బహదూర్' టీజర్
మహేశ్బాబు, నమ్రాతా శిరోద్కర్ సొంత నిర్మాణ సంస్థ GMB ఎంటైర్టెన్మెంట్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ‘రావు బహదూర్’ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్నారు. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన 'కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలు టాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్నాయి.ఈ చిత్ర టీజర్ను అగ్ర దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో ఈ మూవీ రానుంది. ఈ ప్రాజెక్ట్లో సత్యదేవ్ పాత్ర సరికొత్తగా ఉండనుంది. రావు బహదూర్ పాత్ర మేకప్ కోసమే అయిదుగంటల సమయం పట్టేదని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ తదితరులు ఉన్నారు.