breaking news
Movies
-
విన్నారా... విన్నారా?
ప్రతి వారం కొత్త సినిమాలు థియేటర్స్కు వస్తూనే ఉంటాయి. అలాగే హీరోలు కూడా ఎప్పటికప్పుడు తమ కొత్త ప్రాజెక్ట్స్ కోసం కథలు వింటూనే ఉంటారు. అయితే ప్రజెంట్ తమ కొత్త సినిమాల కోసం కథలు వింటున్న తెలుగు హీరోల సంఖ్య ఎక్కువగానే ఉంది. కథలు విన్నారనీ, ఇప్పటికే కొన్ని కొత్త సినిమాలకు సైన్ చేశారనీ కొంతమంది హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. మరి... ఏ హీరో ఏయే దర్శకుల కథ విన్నారు? అనే విషయాలపై మీరూ ఓ లుక్ వేయండి.జెట్ స్పీడ్తో... హీరో రవితేజ జెట్ స్పీడ్తో సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. రవితేజ హీరోగా నటించిన ‘మాస్ జాతర’ సినిమా నేటి (అక్టోబరు 31) నుంచి థియేటర్స్లో ప్రదర్శితమౌతోంది. అలాగే రవితేజ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే ఈ మూవీ తర్వాత ‘మ్యాడ్’ చిత్రాల ఫేమ్ కల్యాణ్ శంకర్తో రవితేజ సినిమా చేయాల్సి ఉంది.ఈ చిత్రాలు ఇలా ఉండగానే... ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్నారని, కథ విన్నారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో తెరపైకి వచ్చింది. అలాగే రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ కూడా రవితేజకు ఓ స్టోరీ లైన్ వినిపించారని, మరోసారి పూర్తి కథ విన్న తర్వాత ఈ సినిమాపై రవితేజ ఓ నిర్ణయానికి వస్తారని సమాచారం. అయితే ఈ విషయాలపై పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.పవన్తో అనిల్ రావిపూడి? హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు అనిల్ రావిపూడిల కాంబినేషన్లో ఓ సినిమాకి సన్నాహాలు మొదలవుతున్నాయనే టాక్ తెరపైకి వచ్చింది. ‘దిల్’ రాజు, ఈ సినిమాను నిర్మించనున్నారట. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సినిమాపై ఓ క్లారిటీ రానుందని టాక్. అలాగే ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రోడక్షన్స్తో పవన్ కల్యాణ్ ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని భోగట్టా.ఈ చిత్రానికి తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ‘రేసుగుర్రం, కిక్’ చిత్రాల ఫేమ్ దర్శకుడు సురేందర్ రెడ్డితో పవన్ కల్యాణ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. మరి... సురేందర్ రెడ్డితో సినిమాను పూర్తి చేసిన తర్వాత పవన్ కల్యాణ్ తన కొత్త సినిమాల చిత్రీకరణలను సెట్స్కు తీసుకువెళ్తారా? లేదా అనే అంశంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్సింగ్’ సినిమా చేస్తున్నారు పవన్ కల్యాణ్. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది.తమిళ దర్శకుడితో...! ‘పెద్ది’ సినిమాతో రామ్చరణ్ బిజీగా ఉన్నారు. ఇటీవల శ్రీలంకలో మొదలైన ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ను పూర్తి చేసి గురువారం రామ్చరణ్ హైదరాబాద్ చేరుకున్నట్లుగా తెలిసింది. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రామ్చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న విడుదల కానుంది. అయితే ఈ చిత్రం తర్వాత దర్శకుడు సుకుమార్తో రామ్చరణ్ సినిమా చేయాల్సి ఉంది.మరోవైపు తమిళ దర్శకుడు ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్, హిందీ దర్శకుడు ‘కిల్’ ఫేమ్ నిఖిల్ నగేశ్ భట్ చెప్పిన స్టోరీలను కూడా రామ్చరణ్ విన్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అలాగే దర్శకులు త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాలతో కూడా రామ్చరణ్ సినిమాలు చేస్తారనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరి... నెల్సన్తో రామ్చరణ్ సినిమా ఎప్పుడు సెట్స్కు వెళ్తుంది? అసలు... ఈ తమిళ దర్శకుడితో రామ్చరణ్ సినిమా ఉంటుందా? అనే అంశాలపై స్పష్టత రావడానికి మరింత సమయం పడుతుంది.నాగచైతన్య 25 నాగచైతన్య హీరోగా ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు ఓ మిథికల్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇది నాగచైతన్య కెరీర్లోని 24వ సినిమా. కాగా, నాగచైతన్య కెరీర్లోని 25వ సినిమాకు సంబంధించిన పనులు కూడా మొదలై పోయాయన్న టాక్ వినిపిస్తోంది. దర్శకులు కొరటాల శివ, బోయపాటి శ్రీను, శివ నిర్వాణ చెప్పిన కథలను హీరో నాగచైతన్య విన్నారని ఫిల్మ్నగర్ సమాచారం. మరి... నాగచైతన్య కెరీర్లోని ఈ 25వ సినిమాకు ఈ ముగ్గురు దర్శకుల్లో ఎవరో ఒకరు ఖరారు అవుతారా? లేక మరో దర్శకుడి పేరు ఏమైనా తెరపైకి వస్తుందా? అనేది వేచి చూడాలి.గ్రీన్ సిగ్నల్ గోపీచంద్తో ‘విశ్వం’ సినిమా చేసి, మళ్లీ సక్సెస్ ట్రాక్లోకి వచ్చారు దర్శకుడు శ్రీను వైట్ల. ఈ సినిమా తర్వాత తనదైన శైలిలో మరో ఎంటర్టైనింగ్ స్టోరీని శ్రీను వైట్ల సిద్ధం చేసుకున్నారని, ఈ కథను ఇటీవల శర్వానంద్కు వినిపించగా, ఈ హీరో ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందట. ఇక ప్రస్తుతం ‘బైకర్’, ‘భోగి’ సినిమాల చిత్రీకరణలతో శర్వానంద్ బిజీగా ఉన్నారు. అలాగే ఆల్రెడీ శర్వానంద్ హీరోగా నటించిన ‘నారి నారి నడుమ మురారి’ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇలా వచ్చే ఏడాది మూడు సినిమాలతో శర్వానంద్ సందడి చేయనున్నారు.స్పోర్ట్స్ డ్రామా ‘రౌడీ జనార్ధన’ (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు హీరో విజయ్ దేవరకొండ. ఈ చిత్రం కోసం హీరోయిన్ కీర్తీ సురేశ్, విజయ్ దేవరకొండలపై మహారాష్ట్ర సరిహద్దుల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఈ చిత్రదర్శకుడు రవికిరణ్ కోలా. అయితే ఈ సినిమా తర్వాత తనకు ‘టాక్సీవాలా’తో సూపర్హిట్ అందించిన రాహుల్ సంకృత్యాన్తో ఓ పీరియాడికల్ వార్ డ్రామా కమిటయ్యారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది.అయితే రీసెంట్గా దర్శకుడు విక్రమ్ కె. కుమార్ ఓ స్పోర్ట్స్ డ్రామా స్టోరీని విజయ్ దేవరకొండకు వినిపించారని, ఈ కథ పట్ల విజయ్ కూడా సుముఖంగా ఉన్నారని, యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్నగర్ సమాచారం. మరి... ‘రౌడీ జనార్ధన’ తర్వాత విజయ్ దేవరకొండ.. రాహుల్ సంకృత్యాన్ సినిమాను స్టార్ట్ చేస్తారా? లేక విక్రమ్ కె. కుమార్ సినిమాను మొదలు పెడతారా? అనే అంశాలపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. దర్శకులు రాహుల్ సంకృత్యాన్, విక్రమ్ కె. కుమార్ల సినిమాలను విజయ్ ఒకేసారి సెట్స్కు తీసుకువెళ్లే అవకాశాలూ లేక పోలేదు.ద్విపాత్రాభినయం ‘తమ్ముడు’ సినిమా తర్వాత నితిన్ కొత్త చిత్రంపై ఇంకా సరైన స్పష్టత లేదు. దర్శకుడు శ్రీను వైట్ల, ‘బలగం’ ఫేమ్ దర్శకుడు వేణు యెల్దండి చెప్పిన కథలను నితిన్ విన్నారన్న వార్తలు వినిపించాయి. కానీ ఈ సినిమాలేవీ ఫైనలైజ్ కాలేదు. కాగా, ఇటీవల దర్శకుడు వీఐ ఆనంద్ ఓ సైన్స్ ఫిక్షన్ కథను సిద్ధం చేసుకుని, నితిన్కు వినిపించారట. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు కాస్త విభిన్నంగా ఉండటంతో ఈ కథ నచ్చి, నితిన్ ఈ సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపారని సమాచారం. ఈ చిత్రంలో నితిన్ ద్విపాత్రాభినయం చేయనున్నారని, ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారని, త్వరలోనే ఈ మూవీ గురించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం.గ్రీన్ సిగ్నల్ ప్రస్తుతం ‘ఫంకీ’ సినిమాతో విశ్వక్ సేన్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ‘జాతి రత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ డిసెంబరు చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్తో ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా సీక్వెల్ను చేయనున్నారట. అలాగే శర్వానంద్తో ‘శ్రీకారం’ సినిమా తీసి, ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు కిశోర్ ఓ కథను సిద్ధం చేసి, విశ్వక్ సేన్కు వినిపించారని, ఈ సినిమాకు విశ్వక్ దాదాపు ఓకే చెప్పారని తెలిసింది. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. సుకుమార్ శిష్యుడితో...! ఇటీవలే ‘కె–ర్యాంప్’ సినిమాతో సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం ప్రజెంట్ ‘చెన్నై లవ్స్టోరీ’ అనే సినిమా చేస్తున్నారు. అలాగే ఇటీవల మరో రెండు మూడు కొత్త సినిమాలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఈ చిత్రాల్లో ఒకటి సుకుమార్ శిష్యుడు వీర అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రానుందని తెలిసింది.జటాయులో..? ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ‘జటాయు’ అనే టైటిల్తో ఓ పవర్ఫుల్ స్టోరీని ఎప్పుడో సిద్ధం చేశారు. కానీ ఈ కథతో ఈ చిత్రం ఇంకా సెట్స్కు వెళ్లలేదు. ఇందులో విజయ్ దేవరకొండ వంటి వారు హీరోలుగా నటిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఈ ‘జటాయు’ స్టోరీని ప్రముఖ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా విన్నారని, ఈ యువ హీరోతో ఈ’ సినిమా ఆల్మోస్ట్ ఖరారై పోయిందని, ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా విషయాలపై అధికారిక ప్రకటన రానుందట. ఇక రోషన్ ప్రజెంట్ ‘చాంపియన్’ అనే ఓ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాతో బిజీగా ఉన్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. ఇలా తమ కొత్త సినిమాల కోసం కథలు వింటున్న హీరోలు మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
‘బాహుబలి: ది ఎపిక్’ మూవీ రివ్యూ
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్ధాయికి తీసుకెళ్లిన చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమా మొదటి భాగం 2015లో రిలీజ్ కాగా..రెండో భాగం 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేసింది. పదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ రెండు సినిమాలు కలిపి ఓకే చిత్రంగా ‘బాహుబలి: ది ఎపిక్’(Bahubali The Epic Review)పేరుతో నేడు (అక్టోబర్ 31) మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్తో పాటు ఇక్కడ కూడా ఈ మూవీ ప్రీమియర్స్ ప్రదర్శించారు. తెలుగు సినిమాను గ్లోబల్ బ్రాండ్గా మార్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..బాహుబలి కథ అందరికి తెలిసిందే. థియేటర్స్తో పాటు టీవీ, ఓటీటీల్లో ఇప్పటికే చాలా సార్లు చూసే ఉంటారు. మాహిష్మతి సామ్రాజ్యపు రాజమాత శివగామి(రమ్యకృష్ణ) ప్రాణత్యాగం చేసి మహేంద్ర బాహుబలి(ప్రభాస్)ని కాపాడుతుంది. ఓ గూడెంలో పెరిగి పెద్దవాడైన మహేంద్ర బాహుబలి.. అవంతిక(తమన్నా)తో ప్రేమలో పడతాడు. ఆమె ఆశయం నెరవేర్చడం కోసం మాహిష్మతి రాజ్యానికి వెళతాడు. అక్కడ బంధీగా ఉన్న దేవసేన(అనుష్క శెట్టి) తీసుకొచ్చి అవంతికకు అప్పజెప్పాలనుకుంటారు. ఈ క్రమంలో అతనికి కొన్ని నిజాలు తెలుస్తాయి. బంధీగా ఉన్న దేవసేన తన తల్లి అని.. భళ్లాలదేవుడు(రానా) కుట్ర చేసి తన తండ్రి అమరేంద్ర బాహుబలిని చంపిచాడనే విషయం తెలుస్తుంది. కట్టప్ప (సత్యరాజ్) సహాయంతో మహేంద్ర బాహుబలి మాహిష్మతి రాజ్యంపై దండయాత్ర చేసి బళ్లాల దేవుడిని అంతం చేస్తాడు. ఇదే ది ఎపిక్ కథ(Bahubali The Epic Review).విశ్లేషణముందుగా చెప్పినట్లుగా ఇదంతా అందరికి తెలిసిన, చూసిన కథే. పార్ట్ 1 చూసినప్పుడు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలియదు. కాబట్టి అంతా పార్ట్ 2 చూశారు. మరి ‘బహుబలి: దిపిక్’ దేని కోసం చూస్తారు? అల్రేడీ చూసి చూసి ఉన్న చిత్రమే కదా అని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే జక్కన మరోసారి మ్యాజిక్ చేశాడు. బోర్ కొట్టకుండా భారీ యాక్షన్ సన్నివేశాలు, ఎలివేషన్స్తో కథను చెప్పుకొచ్చాడు. ఆరున్నర గంటల సినిమాను 3.45 గంటలకు కుదించి ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ అందించేలా సన్నివేశాలను పేర్చాడు. తెరపై చూస్తుంటే కొత్త సినిమాను చూసిన ఫీలింగే కలుగుతుంది. ఫస్టాప్లో పార్ట్ 1 కథని, సెకండాఫ్లో పార్ట్ 2 కథను చూపించాడు. ఈ రెండు భాగాల్లో ప్రేక్షకులకు బాగా నచ్చిన సన్నివేశాలన్నింటిని హైలెట్ చేశాడు. ప్రధాన పాత్రల పరిచయ సన్నివేశాలు.. బళ్లాలదేవుడి పట్టాభిషేకం, కాలకేయులతో యుద్ధం..తల నరికే సీన్..ఇవ్వన్నీ తెరపై చూస్తుంటే గూస్బంప్స్ గ్యారెంటీ. రెండు భాగల్లో ఏదో ఒకటి చూసిన వారికి కూడా ఈ సినిమా అర్థమయ్యేలా సీన్లను పేర్చాడు. అవంతిక లవ్స్టోరీ సీన్లను కట్ చేసినా..కొత్తగా చూసిన వారికి అర్థమయ్యేలా రాజమౌళి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. సుదీప్ కిచ్చతో పాటు కొన్ని కీలకమైన సీన్లను, పాటలను తొలగించినా.. కథలోని ఆత్మను మిస్ కానివ్వకుండా జక్కన్న జాగ్రత్తపడ్డాడు. కీరవాణి రీరికార్డింగ్ కూడా ఈ సినిమాకు ప్రెష్నెస్ని తీసుకొచ్చింది. అయితే నిడివి మాత్రం కాస్త ఇబ్బంది అనే చెప్పాలి. కనీసం ఇంకో 20 నిమిషాల నిడివిని అయినా తగ్గిస్తే బాగుండేదేమో. మొత్తానికి బాహుబలి 1& 2 లాగే ది ఎపిక్ చిత్రాన్ని కూడా థియేటర్ విజువల్ వండర్లా తీర్చిదిద్దడంలో జక్కన్న వందశాతం సక్సెస్ అయ్యాడు.నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది? ప్రభాస్, రానాతో పాటు ఇందులో కీలక పాత్రల్లో నటించిన వారంతా తమ తమ కెరీర్తో ది బెస్ట్ ఇచ్చారు. ప్రభాస్-అనుష్క జోడీని మరోసారి అలా తెరపై చూస్తుంటే.. రెండు కళ్లు చాలవు అన్నట్లుగా ఉంటుంది. యాక్షన్ సీన్లలో రానా, ప్రభాస్ పోటీ పడి నటించారు. రమ్యకృష్ణ, సత్యరాజ్, తమన్నా, సుబ్బరాజుతో పాటు ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా అద్భుతంగా ఉంది. పదేళ్ల క్రితమే కీరవాణి అద్భుతమైన నేపథ్య సంగీతం అందించాడు. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. వీఎఫెక్స్ అదిరిపోయాయి. అంతకు డబుల్ బడ్జెట్ పెడుతున్న సినిమాలకు కూడా ఈ స్థాయిలో సన్నివేశాలను తీర్చిదిద్దలేకపోతున్నారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మొత్తంగా రీరిలీజ్లలో కూడా ‘బహుబలి’ ఓ మైలురాయిగా నిలిచిపోతుందనే చెప్పాలి. -
వజ్రాల మెడతో రష్మిక.. కలర్ఫుల్ శారీలో వితికా శేరు!
దే దే ప్యార్ దే అంటోన్న రకుల్ ప్రీత్ సింగ్.. ఫ్యామిలీతో చిల్ అవుతోన్న ప్రియాంక చోప్రా.. కలర్ఫుల్ శారీలో మెరిసిపోతున్న వితికాశేరు.. బాలీవుడ్ భామ శివాంగి జోషి హోయలు.. వజ్రాల మెడతో మెరిసిపోతున్న రష్మిక మందన్నా.. View this post on Instagram A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
మహేశ్ బాబు మాస్ యాక్షన్ మూవీ.. మళ్లీ వచ్చేస్తోంది
సూర్య భాయ్.. ఎలాగోలా ముంబయిలో బతకాలని రాలేదు.. ఈ ముంబయిని ఏలడానికి వచ్చా.. ఈ డైలాగ్ గుర్తుందా? ప్రిన్స్ ఫ్యాన్స్కు అయితే వెంటనే చెప్పేస్తారు. ఈ డైలాగ్ మూవీ పేరుతో పాటు క్యారెక్టర్ కూడా వెంటనే గుర్తుకొచ్చేస్తుంది. అంతలా ఈ సినిమాలో డైలాగ్స్ గుర్తుండిపోతాయి. అదేనండి.. మన మహేశ్ బాబు నటించిన మాస్ యాక్షన్ మూవీ బిజినెస్మెన్. అదే సూర్యభాయ్ అంటే పేరు కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్ .. ఇలాంటి మళ్లీ వినాలనుకుంటున్నారా? అది థియేటర్లలో మరోసారి వింటే ఎలా ఉంటుంది. అందుకే మీకోసం మళ్లీ వచ్చేస్తున్నాడు సూర్య భాయ్.మరోసారి మిమ్మల్ని అలరించేందుకు సూర్య భాయ్ వస్తున్నాడు. పూరి జగన్నాధ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ మాస్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. 2012లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మాస్ యాక్షన్ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. వచ్చేనెల నవంబర్ 29న ఈ మూవీ రీ రిలీజ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను 4కె వర్షన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 46 years of Superstar @urstrulyMahesh in Telugu Cinema will be celebrated with the re-release of #Businessman💥#Businessman4K - noveMBer 29th, 2025 🦁#BusinessmanReRelease@MsKajalAggarwal #PuriJagannadh @musicthaman #RRMakers @MangoMassMedia #TeluguFilmNagar pic.twitter.com/m0D3yel12t— Telugu FilmNagar (@telugufilmnagar) October 30, 2025 -
'పదేళ్లైనా ఎక్కడా తగ్గలేదు'.. రాజమౌళి స్పీచ్ వైరల్
దర్శకధీరుడు రాజమౌళి హైదరాబాద్లోని ప్రసాద్ ఐమ్యాక్స్లో సందడి చేశారు. బాహుబలి ది ఎపిక్ ప్రీమియర్ షో సందర్భంగా ఆడియన్స్ను ఉద్దేశించి మాట్లాడారు. బాహుబలి రిలీజై పదేళ్లయినా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదన్నారు. ఇదంతా మీవల్లే సాధ్యమైందని కామెంట్స్ చేశారు. మహిస్మతి రాజ్యంలోని ప్రజలంతా బాగున్నారా? అంటూ అభిమానులను పలకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.మీ అందరి ప్రేమ వల్లే మరోసారి మీ ముందుకు తీసుకొస్తున్నామని రాజమౌళి అన్నారు. పదేళ్లుగా మీరు ఆదరించినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. జై మహిస్మతి అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు. కాగా.. బాహుబలి రెండు పార్టులను కలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. బాహుబలి ది ఎపిక్(Baahubali: The Epic) పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 31న థియేటర్లలో సందడి చేయనుంది. THE DIRECTOR addressing the audience at @PrasadsCinemas PCX screen!! It’s SHOW TIME.. #BaahubaliTheEpic #Baahubali pic.twitter.com/1dY6hj7cYE— Baahubali (@BaahubaliMovie) October 30, 2025 -
దుల్కర్ సల్మాన్ కాంత.. మరో సాంగ్ వచ్చేసింది
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), భాగ్యశ్రీ బోర్సో జంటగా నటిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం కాంత. ఈ మూవీకి సెల్వరాజ్ సెల్వమణి దర్శకత్వం వహించారు. 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మరో సాంగ్ను విడుదల చేశారు.తాజాగా రిలీజైన సాంగ్ దుల్కర్ సల్మాన్ అభిమానులను అలరిస్తోంది. ఇంగ్లిష్ లిరిక్స్తోపాటు తమిళం, తెలుగు ర్యాప్తో కూడిన ఈ సాంగ్ తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటను సింగర్ సిద్ధార్థ్ బస్రూర్ ఆలపించారు. ఈ సాంగ్కు జాను చంతర్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ మూవీని స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సముద్రఖని ఓ కీలక పాత్రలో నటించారు. -
రష్మిక ది గర్ల్ఫ్రెండ్.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కాబోతుంది.ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు మేకర్స్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా మరో క్రేజీ సాంగ్ను రిలీజ్ చేశారు. కురిసే వాన తడిపేయాలన్ని భూమే ఏదో.. అంటూ సాగే మూడో లిరికల్ పాటను విడుదల చేశారు. ఈ పాటకు రాకేందు మౌలి లిరిక్స్ అందించగా.. కపిల్ కపిలన్ పాడారు. ఈ సాంగ్కు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతమందించారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు అభిమానులను ఆకట్టుకోగా.. ఈ రొమాంటిక్ లిరికల్ సాంగ్ సినీ ప్రియులను అలరిస్తోంది. కాగా.. హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించనుంది. -
అప్పుడే హీరోగా వద్దనుకున్నా : రాహుల్ రవీంద్రన్
‘నేను అసిట్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న టైమ్ లో హీరోగా అవకాశం వచ్చింది. పరిచయాలు పెరుగుతాయి కదా అని హీరోగా నటించాను. కానీ నా ఆలోచన ఎప్పుడూ డైరెక్షన్ రైటింగ్ సైడే ఉండేది. ఇప్పుడు కూడా హీరోగా అవకాశాలు వస్తున్నాయి. నేను డైరెక్టర్ గా ఫస్ట్ మూవీ చేసినప్పుడే హీరోగా వద్దు అనుకున్నా. నటించడాన్ని ఎంజాయ్ చేస్తాను కానీ డైరెక్షన్ అనేది నా కెరీర్ గా భావిస్తా’ అన్నారు దర్శకుడు రాహుల్ రవీంద్రన్. ఆయన దర్శకత్వంలో రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో రాహుల్ రవీంద్రన్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ నేను కాలేజ్ లో ఉన్నప్పుడు చూసిన ఒక ఇన్సిడెంట్ ఆధారంగా "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా కథ రాశాను. అప్పట్లో వచ్చిన ఓ పాట కూడా నన్ను ఈ కథ రాసేందుకు ఇన్స్ పైర్ చేసింది. ఇలా టైమ్ ఉన్నప్పుడు కొన్ని స్క్రిప్ట్స్ చేసుకున్నాను. ఆహా వాళ్లు మాకొక ప్రాజెక్ట్ చేయండి అని అడిగారు. వారికి "ది గర్ల్ ఫ్రెండ్" కథ పంపాను. నేను, రష్మిక, గీతా ఆర్ట్స్ కాంబినేషన్ లో ఒక సినిమా చేయాల్సిఉండేది. "ది గర్ల్ ఫ్రెండ్" కథను అల్లు అరవింద్ గారు చదివి దీంట్లో సినిమాకు కావాల్సిన కంటెంట్ ఉంది. ఓటీటీకి వద్దు సినిమానే చేద్దామని అన్నారు. రష్మిక, మా కాంబోలో ముందు అనుకున్న కథ పక్కనపెట్టి ఈ కథనే సినిమాగా మొదలుపెట్టాం.→ రష్మికకు స్క్రిప్ట్ పంపినప్పుడు చదివి చెప్తానంది. రెండు రోజుల్లోనే స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ గా చదివి కాల్ చేసింది. ఈ మూవీ మనం వెంటనే చేస్తున్నాం, ఇలాంటి కథ ఆడియెన్స్ కు చెప్పాలి, ఒక అమ్మాయిగా నేను ఈ కథకు చాలా కనెక్ట్ అయ్యాను, బయట ఉన్న అమ్మాయిలు అందరికీ నేను ఇచ్చే బిగ్ హగ్ ఈ సినిమా అని చెప్పింది. నేను ఏ కథ రాసినా నా స్నేహితులు సమంత, వెన్నెల కిషోర్, అడివి శేష్, డైరెక్టర్ సుజీత్..ఇలా కొంతమందికి పంపిస్తుంటా. అలా "ది గర్ల్ ఫ్రెండ్" కథ కూడా పంపాను. సమంతను ఈ సినిమాలో హీరోయిన్ గా అనుకున్నారనే వార్తలూ వచ్చాయి. సమంత ఈ స్క్రిప్ట్ చదివాక, నేను కాదు మరొక హీరోయిన్ అయితేనే ఈ మూవీకి బాగుంటారని సజెషన్ ఇచ్చింది.→ టీజర్, ట్రైలర్ లో ఆడియెన్స్ ను కావాలనే మిస్ డైరెక్ట్ చేశాం. మెయిన్ కంటెంట్ థియేటర్ లో చూస్తేనే ఎంజాయ్ చేస్తారు. మీకు ట్రైలర్ లో ఉన్న హై వోల్టేజ్ ఇంటెన్స్ డ్రామానే సెకండాఫ్ లో ఉంటుంది. ఈ డ్రామా సర్ ప్రైజ్ చేస్తుంది. ఒక జంట లైఫ్ లో ఇలా జరిగింది అనేది నాకు తెలిసిన పద్ధతిలో చూపించాను. అంతే కానీ ఎలాంటి సందేశాలు, నీతులు చెప్పలేదు. సినిమా చూసి ఆడియెన్స్ ఆలోచించుకుంటారనే నమ్మకం ఉంది. నేను ఇవాళ మంచిది అనుకున్నది ఐదేళ్ల తర్వాత కరెక్ట్ కాదు అని నాకే అనిపించవచ్చు. అందుకే ఎవరికీ మెసేజ్ లు ఇచ్చే ధైర్యం చేయను. ఇంటెన్స్ ఎమోషన్ ఉన్న లవ్ స్టోరీని రియలిస్టిక్ అప్రోచ్ లో చేశాం.→ రష్మిక యానిమల్ సినిమా రిలీజై వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తున్నప్పుడు నాకు కొంచెం భయమేసింది. ఆమెను ఇంత రియలిస్టిక్ గా చూపిస్తున్నాం, అక్కడేమో యానిమల్ ఆడియెన్స్ మీద మరో ఇంప్రెషన్ వేస్తోంది అని అనుకున్నా. రష్మికకు నా సందేహం తెలిసి, ఈ కథకు మీరు నన్ను ఇలాగే స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాలి. రియలిస్టిగానే నా క్యారెక్టర్ కనిపించాలి అని సపోర్ట్ చేసింది. మనం వుమెన్ సెంట్రిక్ మూవీస్ అని పిలుస్తుంటాం కానీ ఆ ముద్ర పోయేందుకు ఇంకా చాలా టైమ్ పడుతుంది. ఈ కథలో హీరో హీరోయిన్ ఇద్దరి పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది. హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథను చూపిస్తున్నాం.→ ఈ మూవీలో హీరో హీరోయిన్స్ పీజీ స్టూడెంట్స్. ఒక లెక్టరర్ రోల్ ఉంది. ఆ క్యారెక్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేస్తే బాగుంటుంది అనిపించింది. ఆయనను అప్రోచ్ అయితే వద్దు, నన్ను స్క్రీన్ మీద చూడగానే ఆడియెన్స్ నవ్వుతారు అని రిజెక్ట్ చేశారు. చివరకు ఆ రోల్ నేనే చేయాల్సివచ్చింది. అనూ ఇమ్మాన్యుయేల్ కూడా తన క్యారెక్టర్ కు పర్పెక్ట్ గా సెట్ అయ్యింది.→ నా లైఫ్ లో నేను చూసినవి, చదివినవి, తెలుసుకున్న ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్ పైర్ అయి కథ రాస్తుంటాను. దర్శకుడిగా నాకొక తరహా, ఒక ముద్ర ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదు. నేను కొన్ని మూవీస్ చేశాక అందులో నా తరహా విలువలు, నమ్మకాలు చూసి ఆడియెన్స్ కు రాహుల్ డైరెక్షన్ లో ఇలాంటి సెన్సబిలిటీస్ ఉన్నాయి అనే ఇంప్రెషన్ కలుగుతుందేమో.→ నెక్ట్స్ నేను డైరెక్ట్ చేయబోయో రెండు ప్రాజెక్ట్స్ ఓకే అయ్యాయి. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను. ఈ రెండు సినిమాల తర్వాత రష్మిక నేను కలిసి మరో సినిమా చేయబోతున్నాం. ఆ కథ లైన్ గా రష్మికకు నచ్చింది. ఇంకా స్క్రిప్ట్ చేయాల్సిఉంది. మా కాంబోలో ఆ మూవీ వస్తుంది. -
కేజీఎఫ్ హీరో టాక్సిక్పై రూమర్స్.. నిర్మాతలు ఏమన్నారంటే?
కేజీఎఫ్-2 తర్వాత యశ్ నటిస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ కోసం యశ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్-2 రిలీజై ఇప్పటికే మూడేళ్లు దాటిపోయింది. దీంతో టాక్సిక్ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఆతృతగా ఉన్నారు. అయితే ఈ మూవీపై కొన్ని రోజులుగా నెట్టింట రూమర్స్ వినిపిస్తున్నాయి. టాక్సిక్ రిలీజ్ వాయిదా పడనుందని తెగ టాక్ నడుస్తోంది. దీంతో యశ్ ఫ్యాన్స్ కాస్తా నిరాశకు గురవుతున్నారు.ఈ నేపథ్యంలోనే టాక్సిక్ మేకర్స్ స్పందించారు. తమ సినిమాపై వస్తున్న రూమర్స్కు చెక్ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టాక్సిక్ను వాయిదా వేసే ప్రసక్తే లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇంకా 140 రోజులే.. వచ్చే ఏడాది మార్చి 19న టాక్సిక్ సందడి చేయనుందని వెల్లడించారు. తరణ్ ఈ ప్రకటనతో గత కొద్ది కాలంగా వస్తున్న వాయిదా రూమర్స్కు ఫుల్ స్టాప్ పెట్టేశారు.కాగ.. టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ నుంచే పోస్ట్ ప్రొడక్షన్లో భాగంగా వీఎఫ్ఎక్స్ పనులు ప్రారంభమమైనట్లు తెలుస్తోంది. మరో వైపు యశ్ ప్రస్తుతం ముంబయిలో రామాయణ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. టాక్సిక్ సినిమాకు సంబంధించి వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రమోషన్స్ ప్రారంభించనున్నట్లు టాక్. ఈ సినిమా కన్నడతో పాటు ఇంగ్లీష్లోనూ తెరకెక్కిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు.140 days to go…His Untamed Presence,Is Your Existential Crisis.#ToxicTheMovie releasing worldwide on 19-03-2026 https://t.co/9RC1D6xLyn— KVN Productions (@KvnProductions) October 30, 2025 -
కాంతార చాప్టర్-1.. పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ మూవీ!
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 (Kantara Chapter1) బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా అదిరిపోయే కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికే కన్నడ సినీ ఇండస్ట్రీలో కేజీఎఫ్-2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ మూవీ ఛావాను అధిగమించింది. ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ ప్రీక్వెల్.. ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మొదటి సినిమాగా నిలిచింది.అయితే ఈ మూవీని కేవలం ఇండియన్ భాషల్లో మాత్రమే కాకుండా ఇంగ్లీష్లోనూ రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా మరో దేశానికి చెందిన భాషల్లో కాంతార చాప్టర్-1ను విడుదల చేస్తున్నారు. స్పానిష్ భాషలోనూ ఈ మూవీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా స్పానిష్ భాషలో కాంతార చాప్టర్-1 ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈనెల 31న కాంతార చాప్టర్-1 థియేటర్లలో సందడి చేయనుందని ట్విటర్లో పోస్ట్ చేశారు మేకర్స్. Una saga divina que comenzó en la India… ahora conquista el mundo. Estreno el 31 de octubre en cines de todo el mundo, en español. 🇪🇸❤️🔥 #KantaraChapter1 Spanish (Española) Trailer out now.▶️ https://t.co/AMQ74XYxpf#Kantara @hombalefilms @KantaraFilm @shetty_rishab… pic.twitter.com/Ww5F82BNxF— Hombale Films (@hombalefilms) October 30, 2025 -
మిరాజ్ మూవీ రివ్యూ: ఇది ట్విస్ట్ ల మిస్టరీ!
సినిమా పరంగా ఓ కథను ప్రేక్షకుడికి ఆకట్టుకునేలా చెప్పాలంటే గట్టి పట్టున్న స్క్రీన్ ప్లే ఎంతైనా అవసరం. మామూలు రొటీన్ ఫార్ములాతో వచ్చే సినిమాలు నేటి ప్రేక్షకులకు అంతగా రుచించట్లేదు. చెప్పే కథను ఊహకందని ట్విస్టులతో చూపిస్తే ఆ సినిమా హిట్టే. అదే కోవకు చెందిన సినిమా మిరాజ్(Mirage). ఈ సినిమా మాతృక మళయాళమైనా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా సోనీ లివ్ లో లభ్యమవుతోంది. అపర్ణ రాసిన ఈ కథకు ప్రముఖ మళయాళ దర్శకులు జీతూజోసెఫ్ దర్శకత్వం వహించారు. సుప్రసిద్ధ మళయాళ నటులు ఆసిఫ్ అలీ, అపర్ణా బాలమురళి ఈ సినిమాకు ప్రధాన తారాగణం. ఈ మధ్య కాలంలో ఆసాంతం సూపర్ ట్విస్టులతో సాగిపోయే సినిమా ఇదేనని చెప్పుకోవచ్చు. ప్రారంభంలో చాలా నెమ్మదిగా ప్రారంభమైనా శుభం కార్డు వరకు ట్విస్టులతో ప్రేక్షకుల మతిని పోగొడుతుందీ సినిమా. అయితే ఈ సినిమాలో అక్కడక్కడా కొంచం రీరికార్డింగ్ నిరాశపరుచవచ్చు. కాని సినిమా ట్విస్టుల పరంగా చూస్తే మాత్రం గడిచిన దశాబ్ద కాలంలో ఇటువంటి సినిమా రాలేదనుకోవచ్చు. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓ సారి చూద్దాం. సినిమా ప్రారంభంలోనే ఓ ట్రైన్ యాక్సిడెంతో కథ మొదలవుతుంది. ఈ ట్రైన్ లో కిరణ్ అనే పాత్ర పరిచయమవుతుంది. అభిరామి, కిరణ్ ఒకే ఆఫీసులో పని చేస్తూ ఉంటారు. అంతేకాదు వాళ్ళిద్దరూ ప్రేమించుకుని త్వరలో పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటారు. ఇంతలో కిరణ్ ట్రైన్ యాక్సిడెంట్ గురించి అభిరామికి తెలిసి కుప్పకూలిపోతుంది. అభిరామిని ఓదార్చడానికి తన స్నేహితురాలైన రితిక వస్తుంది. ఆ తరువాత ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన అశ్విన్, పోలీస్ సూపరిండెంట్ ఆరుముగంతో పాటు ఆఫీసులో రాజకుమార్ మనిషి కూడా అభిరామి దగ్గరకు వస్తారు. వీళ్ళంతా అభిరామిని పరమార్శించడానికైతే కాదు, చనిపోయిన కిరణ్ దగ్గరున్న ఓ డేటా డ్రైవ్ కోసం వస్తారు. ఇంతకీ ఆ డేటా డ్రైవ్ లో ఏముంది, ఆఖర్లో అది ఎవరికి దక్కుతుంది అన్నది తెలుసుకోవాలంటే ఈ ట్విస్టుల మిస్టరీ మిరాజ్ ని చూడాల్సిందే. గమ్మత్తేమిటంటే ఈ సినిమాలో కనిపించే ప్రతి పాత్ర ఓ ట్విస్ట్ తోనే ఉంటుంది. అది కూడా ప్రేక్షుకుడి ఊహలకు అంచనాలు మించి ఉంటాయి ఈ ట్విస్టులు. మంచి థ్రిల్లింగ్ జోనర్ ఇష్టపడేవాళ్ళకి ఈ గ్రిప్పింగ్ థ్రిల్లర్ కనువిందనే చెప్పాలి. మస్ట్ వాచ్ మూవీ దిస్ మిరాజ్, సో గెట్ ట్విస్టెడ్ దిస్ వీకెండ్.-హరికృష్ణ ఇంటూరు -
స్మృతి మంధాన పెళ్లి డేట్ ఫిక్స్!.. వరుడు ఎవరంటే?
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana Wedding) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. వచ్చే నెలలోనే ఈ స్టైలిష్ ఓపెనర్ వివాహ బంధంలో అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మహిళా క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్మృతి.. ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించింది.భారత జట్టు ఓపెనర్గా భారత జట్టు ఓపెనర్గా ఇప్పటికే వన్డేల్లో 115 మ్యాచ్లు ఆడి.. 14 శతకాల సాయంతో 5253 పరుగులు సాధించిన స్మృతి.. ఏడు టెస్టుల్లో 629 పరుగులు చేసింది. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో 153 మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 3982 పరుగులు సాధించింది. అంతేకాదు.. మహిళల ప్రీమియర్ లీగ్ (WCL)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్గా ఫ్రాంఛైజీకి తొలి టైటిల్ అందించిన ఘనత ఆమెది.ఆరేళ్లుగా ప్రేమప్రస్తుతం వన్డే వరల్డ్కప్-2025తో బిజీగా ఉన్న స్మృతి మంధాన.. ఈ టోర్నీ ముగిసిన వెంటనే ఆమె పెళ్లి పనుల్లో తలమునకలు కానున్నట్లు సమాచారం. కాగా స్మృతి చాన్నాళ్లుగా.. మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ (Palash Muchhal)తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. 2019 నుంచి డేటింగ్ చేస్తున్న ఈ జంట గతేడాది తమ ఐదో వార్షికోత్సవం అంటూ రిలేషన్షిప్ గురించి అభిమానులతో పంచుకున్నారు.ఇండోర్ కోడలు కాబోతోందిఆ తర్వాత ప్రతి వేడుకలోనూ కలిసి కనిపించారు స్మృతి- పలాష్. స్మృతితో పాటు టీమిండియా టూర్లకు కూడా వెళ్తుంటాడు పలాష్. ఇటీవల.. ‘‘స్మృతి త్వరలోనే ఇండోర్ కోడలు కాబోతోంది’’ అంటూ పలాష్ తమ పెళ్లి గురించి సంకేతాలు ఇచ్చాడు.కాగా 1996లో ముంబైలో జన్మించిన స్మృతి మంధాన.. తనకు రెండేళ్ల వయసు ఉన్నపుడు సాంగ్లీకి వెళ్లింది. మాధవ్నగర్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. మరోవైపు.. పలాష్ 1995లో మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ మరాఠీ కుటుంబంలో జన్మించాడు. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్న అతడు.. బాలీవుడ్లో కంపోజర్గా సిర్థపడ్డాడు. పలాష్ సోదరి పాలక్ ముచ్చల్ కూడా బాలీవుడ్ సింగర్. తనకు కూడా స్మృతితో మంచి అనుబంధం ఉందని పాలక్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.పెళ్లి డేట్ ఫిక్స్!ఇక స్మృతి స్వస్థలం సాంగ్లీలోనే పెళ్లి జరుగనున్నట్లు తెలుస్తోంది. టైమ్స్ ఎంటర్టైన్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. నవంబరు 20న స్మృతి- పలాష్ పెళ్లి తంతు జరుగనున్నట్లు తెలుస్తోంది.చదవండి: ‘అమ్మానాన్నల్ని విడాకులు తీసుకోమని నేనే చెప్పాను’ -
స్కిన్ ఇన్ఫెక్షన్, డయేరియా.. బిగ్బాస్లో ఏం జరిగిందో మీకు తెలీదు!
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో ఆరోగ్యం బాగోలేక వెళ్లిపోయిన ఏకైక కంటెస్టెంట్ ఆయేషా. వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వైల్డ్ ఫైర్లా అగ్గి రాజేస్తుందని అంతా అనుకున్నారు. నామినేషన్స్లో ఆమె ఊపు, అరుపులు, కేకలు కూడా అదే విధంగా ఉన్నాయి. కానీ పనిగట్టుకుని గొడవలు పడటం జనాలకు చిరాకు తెప్పించింది. టైఫాయిడ్, డెంగ్యూ వల్ల పట్టుమని పదిరోజులకే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. నా అవతారంపై మీమ్స్అదే వారం పచ్చళ్ల పాప రమ్య మోక్ష (Ramya Moksha Kancharla) కూడా ఎలిమినేట్ అయింది. అయితే తాను కూడా బిగ్బాస్ హౌస్లో అనారోగ్యంతో బాధపడ్డానని, అవేవీ షోలో చూపించలేదని చెప్తోంది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పలు పోస్టులు పెట్టింది. అందులో రమ్య ఏమందంటే.. నా లుక్పై కామెంట్స్ చేస్తూ మీమ్స్ వేశారు. వాటిలో కొన్ని నేనూ చూశాను. నాకు థైరాయిడ్ ఉంది. బిగ్బాస్ కోసం డైట్ స్కిప్ చేశాను. ఇంతలో టాన్సిల్స్ అయ్యాయి. దానివల్ల గొంతు, కింది దవడ ఉబ్బిపోయింది.బిగ్బాస్ హౌస్లో అనారోగ్యంతో బాధపడ్డా!సడన్గా హైదరాబాద్ వచ్చి ఇక్కడి వాటర్ తాగేసరికి మరింత ఇబ్బందిపడ్డా.. స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. చేతులు, మెడ, మొత్తం శరీరమంతా రాషెస్ వచ్చాయి. కేవలం నీళ్ల వల్లే ఈ ప్రాబ్లమ్ ఎదురైంది. ఇది చాలదన్నట్లు జంక్ ఫుడ్ తిని, సోడా తాగడంతో హౌస్లో విపరీతమైన జ్వరం వచ్చింది. డయేరియా (నీళ్ల విరేచనాలు)తో బాధపడ్డా.. ఇలా నా ఆరోగ్య సమస్యలేవీ టీవీలో చూపించనేలేదు. అసలు బిగ్బాస్ హౌస్లో ఏం జరిగిందో త్వరలోనే ఓ వీడియో చేసి వివరంగా చెప్తాను.మేకప్ కూడా వేసుకోనుఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్నా. నేను ఎలిమినేట్ అయినరోజు నా ముఖం కాస్త సన్నగా కనిపించింది. అదే నిజమైన నేను. టీవీలో చబ్బీగా కనిపించాను. అది చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ, నేను బక్కగానే ఉంటాను. స్నాప్చాట్ వంటి యాప్స్ కూడా ఏవీ నేను వాడను. అసలవి ఎలా వాడాలో కూడా తెలీదు. మేకప్ వేసుకుంటే నా కళ్లు ఎర్రబడి, నీళ్లు కారతాయి. జలుబు, తలనొప్పి వస్తుంది. అందుకే మేకప్ కూడా వేసుకోను. ఇకపోతే నెగెటివిటీ గురించి నేనసలు లెక్కచేయను. వాటిని ఎలా గాలికొదిలేయాలో నాకు బాగా తెలుసు అని రమ్య చెప్పుకొచ్చింది.చదవండి: ఆ హీరో అలాంటివాడే.. ఆడిషన్ అని పిలిచి గదిలో..: హీరోయిన్ -
‘బాహుబలి: ది ఎపిక్’ ట్విటర్ రివ్యూ
ఇండియన్ సినిమా హిస్టరీలో ‘బాహుబలి’ ఒక చరిత్ర. ఈ మూవీ తొలిభాగం 2015లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడమే కాదు.. పాన్ ఇండియా చిత్రాలకు పునాదిని వేసింది. ఇక బాహుబలి 2 సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ రెండు చిత్రాలు కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’(Baahubali: The Epic ) పేరుతో అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక్క రోజు ముందే విదేశాల్లో ఈ చిత్రం సందడి చేస్తోంది. ఓవర్సీస్లో ఈ చిత్రం ఈ రోజే రిలీజైంది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.(చదవండి: ‘బాహుబలి’కి డిజాస్టర్ టాక్..నిర్మాత బలి అన్నారు: రాజమౌళి)బాహుబలి ది ఎపిక్' విజువల్ వండర్ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. రీరిలీజ్ అయినప్పటికీ..తెరపై చూస్తుంటే ఒక కొత్త చిత్రం చూసినట్లుగానే ఉంటుందని చాలా మంది అంటున్నారు. రాజమౌళి చాలా అద్భుతంగా ఎడిట్ చేశారని..క్వాలిటీ అదిరిపోయిందని కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమాలో ప్రధానమైన సన్నివేశాలకు సంబంధించిన వీడియో క్లిప్పులను ఎక్స్లో షేర్ చేస్తూ ‘మిస్ కాకుండా చూడండి’ అని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ సీన్.. తల నరికే సన్నివేశాలను బాగా వైరల్ చేస్తున్నారు. సూపర్స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.#MaheshBabu Son #GauthamGhattamaneni About #BaahubaliTheEpic 🔥#Prabhas pic.twitter.com/91tefgPyit— Karri Mohan (@Karrimohan_MB) October 30, 2025కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపేశాడో తెలుసుకోవడం కోసం ఇప్పుడు రెండేళ్లు వేచిచూడాల్సిన అవసరం లేదని... ఎడిట్ చేసిన తర్వాత ఈ చిత్రం మరింత అద్భుతంగా ఉందని గైతమ్ అన్నారు. ‘ప్రతి సెకనుకు గూస్బంప్స్ వస్తున్నాయి. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. ‘బాహుబలి: ది ఎపిక్’ని చూడడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం’ అని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్ చెప్పుకొచ్చాడు. Legendary stuff Man. Top tier movie experience. Metreon IMAX was screaming. The editing was so fire especially the entire 2nd half was perfect. Loved the new frames and scenes they added especially the Nassar dialogues in Shivudu entry to Mahishmathi🔥🔥 #BaahubaliTheEpic https://t.co/ukIDkWmT1i pic.twitter.com/3yFzmTtlxh— Telugu Smash (@SmashTelug20458) October 30, 2025Watching this scene gives me goosebumps all over my body @ssrajamouli & BB movie is Your best work till now in your movie career.Now I understand why you became no 1 director in Indian cinema.#Prabhas #SSRajamouli #BaahubaliTheEpic #BahubaliTheEpicpic.twitter.com/iMrcxh0X00— Chaitanya (@CallMeChai__) October 30, 2025👇🏻royal entry is reason enough to watch #BaahubaliTheEpic 🥵🔥I still remember when people first started using the term "Majestic Walk", it belonged only to #Baahubali 💥😎Majestic Walk= Baahubali. Always! 🥳#Prabhas absolutely justified that ✅💥🤩pic.twitter.com/9V4OkBAoTE— Manu (@Little_Heartzzz) October 30, 2025A movie that's going to transcend generations 🤙🏻Trimmed very well to make it extremely racy, surreal experience in IMAX, 10 years ayina adhe oopu, adhe high 🥵Every 10 years ilage rerelease chesthu vellandi, memu chusthu untam ❤️#BaahubaliTheEpic #BaahubaliTheEpicOn31stOct pic.twitter.com/Z5bsO7NGjh— LoneBatman (@SampathGNV) October 30, 2025Extraordinary first half #BaahubaliTheEpic Imax version is 🥰❤️ lovable @BaahubaliMovie @ssrajamouli #bahubali #Prabhas pic.twitter.com/95TGBZ0SCE— mfaisall (@Moviesculturee) October 30, 2025Properly optimized for IMAX, no degradation in image or sound quality, doesn't look like a cheap rerelease cash grab. Thank you @ssrajamouli and team for presenting the world of Baahubali for us and the world, AGAIN 🙌🏻🤙🏻🔥#BaahubaliTheEpic #BaahubaliTheEpicOn31stOct pic.twitter.com/y8OxKtkRmw— LoneBatman (@SampathGNV) October 30, 2025 -
ఆ హీరో అలాంటివాడే.. ఆడిషన్ అని పిలిచి గదిలో..: హీరోయిన్
ప్రముఖ హీరో అజ్మల్ అమీర్ (Ajmal Ameer) అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడాడంటూ ఓ వీడియో క్లిప్ నెట్టింట వైరలయింది. హద్దులు దాటి సంభాషించాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఇదంతా ఏఐ మాయ అని.. వాటిని కొట్టిపారేశాడు. ఇలాంటి ఫేక్ వీడియోలతో నా కెరీర్ నాశనం చేయలేరు అని వీడియో రిలీజ్ చేశాడు. ఈ క్రమంలో తమిళ హీరోయిన్ నర్విని దేరి.. అజ్మల్ అలాంటి దుర్మార్గుడే అంటూ మీడియా ముందుకు వచ్చింది. హీరోయిన్ కోసం వెతుకులాటతమిళ యూట్యూబ్ ఛానల్ ట్రెండ్ టాక్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అజ్మల్కు వ్యతిరేకంగా మాట్లాడిన మొదటి వ్యక్తి నేనే! అజ్మల్ అరాచకాల గురించి గతంలో చెప్పాను. అసలేం జరిగిందంటే.. 2018లో చెన్నైలోని ఓ మాల్లో అజ్మల్ను తొలిసారి కలిశాను. అప్పటికే నేనో సినిమా చేస్తున్నాను. అజ్మల్ ఒక యాక్టర్ అని నా ఫ్రెండ్ వల్ల తెలిసింది. అజ్మల్.. తన నెక్స్ట్ సినిమాకు హీరోయిన్ కోసం వెతుకుతున్నట్లు చెప్పాడు. ఆడిషన్కు రమ్మని ఆహ్వానంనన్ను యాక్ట్ చేయమని అడిగాడు. అలా ఇద్దరం మాట్లాడుకుని, ఫోన్ నెంబర్లు తీసుకుని వెళ్లిపోయాం. తర్వాత నాకు వాట్సాప్లో ఆడిషన్కు రమ్మని పిలిచాడు. నేను ఆ మరుసటి రోజే డెన్మార్క్ వెళ్లాల్సి ఉంది, ఇప్పుడు రాలేనని చెప్పాను. నువ్వు వస్తే సినిమా టీమ్ అందరినీ కలుసుకోవచ్చని ఒప్పించాడు. అయినా ఆడిషన్, సెలక్షన్.. ఒకే రోజులో ఎలా పూర్తవుతాయని ప్రశ్నిస్తే తాను చూసుకుంటానన్నాడు. అక్కడికి వెళ్లగానే..సినిమా స్టార్ట్ అవ్వడానికి ఇంకా సమయం ఉందని చెప్పాడు. ఆడిషన్కు వెళ్లేటప్పుడు నా ఫ్రెండ్స్ లేదా బంధువుల్లో ఎవరో ఒకర్ని వెంటపెట్టుకుని వెళ్తాను. కానీ, ఆరోజు సడన్గా వెళ్లాల్సి వచ్చేసరికి ఒంటరిగా వెళ్లాను. అజ్మల్ పంపిన లొకేషన్కు వెళ్లగానే కొంత అసౌకర్యంగా అనిపించింది. ఆయన చెప్పిన రూమ్ దగ్గరికెళ్లి డోర్ కొట్టగా అజ్మల్ తలుపు తీశాడు. మిగతావారేరి? అని అడిగితే అందరూ బయటకు వెళ్లారన్నాడు.రూమ్లో ఒక్కడే..వారు వచ్చేవరకు కింద వెయిట్ చేస్తానంటే ఆయన ఒప్పుకోలేదు. ఏదో తప్పు జరగబోతోంది అని నా మనసు కీడు శంకించింది. తినడానికి ఏదో ఇస్తే వద్దని తిరస్కరించాను. ఇంకో 20 నిమిషాల్లో నా నుంచి మెసేజ్ రాకపోతే వెంటనే ఫోన్ చేయ్ అని నా ఫ్రెండ్కు మెసేజ్ పెట్టాను. మరోవైపు అజ్మల్.. నా బ్యాగు తీసుకుని పక్కనపెట్టాడు. ఏం చేయాలో అర్థం కాక వాష్రూమ్కి వెళ్లి అక్కడే కాసేపు ఉండిపోయాను. బయటకు రాగానే పాటలు పెట్టి నా చేయి పట్టుకున్నాడు. అమ్మాయిలు నా వెంట పడతారుడ్యాన్స్ చేద్దామన్నాడు. వెంటనే అతడిని దూరం నెట్టి.. మీ ఉద్దేశం ఏంటో నాకర్థమైంది. నేను దానికోసమైతే రాలేదు అని ముఖం మీదే చెప్పాను. అందుకు అజ్మల్.. ఏం మాట్లాడుతున్నావ్? నేను హ్యాండ్సమ్.. నా వెనక ఎంతమంది అమ్మాయిలు పడతారో తెలుసా? అంటూ గొప్పలుపోయాడు. అయితే నాకేంటి? నాకిదంతా నచ్చదని కరాఖండి చెప్తూ ఉన్నా.. సడన్గా హత్తుకునేందుకు ప్రయత్నించాడు. నన్ను చంపాకే ముట్టునేను అడ్డు చెప్పాను. నన్నేదైనా చేయాలంటే అది నన్ను చంపాకే చేసుకో అన్నాను. అప్పుడే తనకు ఫోన్కాల్ వచ్చింది. వెంటనే నేను క్యాబ్ డ్రైవర్కు ఫోన్ చేసి రెడీగా ఉండమన్నాను. నాతోపాటు సిస్టర్స్ వచ్చారు, వారు కింద నాకోసం వెయిట్ చేస్తున్నారని అబద్ధం చెప్పాను. నేను వెళ్లకపోతే వారే నన్ను వెతుక్కుంటూ ఇక్కడివరకు వస్తారన్నాను. ఇంతలో రూమ్ బాయ్ కాలింగ్ బెల్ కొట్టాడు. అజ్మల్ డోర్ తలుపు తీయగానే వెంటనే అక్కడి నుంచి పారిపోయి తప్పించుకున్నాను. చాలామందితో ఇలాగేఇంత జరిగాక కూడా నాకు మెసేజ్ చేయడం మానలేదు. మళ్లీ కలుస్తావా? అని అడుగుతూ ఉంటాడు. అజ్మల్ చాలామంది అమ్మాయిలతో ఇలాగే ప్రవర్తించాడు. ఇదంతా జరిగినప్పుడు నా చదువు, జీవితంపైనే ధ్యాస పెట్టాను. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయలేదు అని నర్విని చెప్పుకొచ్చింది. నర్విని.. ఉయిర్వారై ఇనింతాయి, సినంకోల్ అనే తమిళ సినిమాల్లో హీరోయిన్గా చేసింది.చదవండి: శ్రీజకు మళ్లీ అన్యాయం? 'మేమేం పాపం చేశాం? ఎందుకింత వివక్ష' -
'మహాకాళి'గా భూమి శెట్టి.. ఎవరో తెలుసా..?
టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ)తో మరో కన్నడ బ్యూటీ బిగ్ ఛాన్స్ దక్కించుకుంది. పీవీసీయూలో వచ్చిన తొలి సినిమా ‘హనుమాన్’.. ఇదే యూనివర్స్లో ‘మహాకాళి’ మూవీ రానుంది. ఫీమేల్ సూపర్ హీరో సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్కు ప్రశాంత్ వర్మ కథ అందిస్తుండగా.. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. మహాకాళిగా కనిపించనున్న భూమి శెట్టి (27) గురించి తెలుసుకునేందుకు కొందరు నెటిజన్లు సోషల్మీడియాలో వెతుకుతున్నారు.ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి జన్మించిన కుందాపుర గ్రామమే భూమి శెట్టిది కూడా.. భాస్కర్, బేబీ శెట్టి దంపతులకు జన్మించిన భూమి కన్నడ, తెలుగు అనర్గళంగా మాట్లాడుతుంది. ఆమె చదువుకునే రోజుల్లో యక్షగానం (నృత్య, నాటక, సంగీత, వేష, భాష, అలంకారాల కలబోత) నేర్చుకుంది. కుందాపురలోనే తన పాఠశాల విద్యను భూమి పూర్తి చేసింది. దగ్గర్లోనే ఉన్న ఆర్.ఎన్. శెట్టి పి.యు. కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. తరువాత బెంగళూరులోని AMC ఇంజనీరింగ్ కళాశాల నుండి మెకానికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రురాలైంది.చిన్నప్పుడే యక్షగానంలో శిక్షణ పొందడంతో రంగస్థలంపై రాణించాలనే ఆసక్తి ఆమెలో ఉండేది. అలా మొదట కన్నడ సీరియల్ కిన్నరితో కెరీర్ ప్రారంభించిన భూమి... తెలుగు సీరియల్ నిన్నే పెళ్లాడతాలో ప్రధాన పాత్రలో మెరిసింది. అలా వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ కన్నడ సీజన్- 7 టాప్ ఫైవ్లో నిలిచింది. బిగ్బాస్తో వచ్చిన గుర్తింపుతో ఆమెకు సినిమా ఛాన్స్ వచ్చింది. కన్నడ చిత్రం ఇక్కత్ (2021)తో హీరోయిన్గా సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఏడాదిలో విడుదలైన కింగ్డమ్ చిత్రంలో సత్య దేవ్ సతీమణి గౌరి పాత్రలో కనిపించింది. ఇప్పుడు, మహాకాళితో భూమి శెట్టికి బిగ్ ఛాన్స్ వచ్చింది. View this post on Instagram A post shared by ಭೂMee🐚 (@bhoomi_shettyofficial) -
‘బాహుబలి కాదు.. ప్రొడ్యూసర్ బలి’ అన్నారు: రాజమౌళి
టాలీవుడ్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన చిత్రం ‘బాహుబలి’. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రిలీజై ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేసింది. ఈ చిత్రం తర్వాతే వరుసగా పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కించడం ప్రారంభించారు. అంతటి ఘన విజయం సాధించిన ఈ చిత్రానికి తొలుత డిజాస్టర్ టాక్ వచ్చిన సంగతి తెలిసింది. ‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలైన తొలి రోజు సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. ఈవినింగ్ షో నుంచి వరుసగా కలెక్షన్స్ పెరగడం ప్రారంభమైంది. ఆ తర్వాత ఎన్ని రికార్డులను బద్దలు కొటిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం రెండు భాగాలు కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’(Baahubali: The Epic)పేరుతో రేపు(అక్టోబర్ 31) రీరిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్, రానాలతో కలిసి రాజమౌళి( SS Rajamouli ) ఓ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో ఆయన బాహుబలి రిలీజ్ సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి వివరించాడు. 'బాహుబలి: ది బిగినింగ్'(2015) చిత్రాకి మొదట వచ్చిన టాక్ చూసి తాను షాకయ్యానని చెప్పారు.‘బాహుబలి’ రిలీజ్ రోజు ఉదయం 4 గంటల షోకి డిజాస్టర్ టాక్ వచ్చింది. కానీ నాకు ఎక్కడో చిన్న నమ్మకం ఉంది. మరీ అంత బ్యాడ్ సినిమా తీయలేదు. కొన్ని సీన్స్ సరిగ్గా లేవేమో.. అవి జనాలకు నచ్చలేదేమో.. డైరెక్టర్ గా ఫెయిల్ అయ్యానేమో అనుకున్నాను కానీ.. అంత బ్యాడ్ టాక్ వచ్చే సినిమా తీయలేదు అని నాకు లోపల ఒక చిన్న హోప్ ఉండేది. అయితే అది కేవలం 10 శాతం మాత్రమే ఉంది. అప్పట్లో జర్నలిస్టులు, పీఆర్వోలకు కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఉండేది. అందులో వదిన శ్రీవల్లీ నెంబర్ కూడా ఉంది. అందులో బాహుబలి సినిమాపై తీవ్రమైన విమర్శలు చేశారు. సినిమాలో ప్రభాస్ శివ లింగాన్ని ఎత్తుకున్న ప్లేస్లో జండూబాం పెట్టి పోస్టులు పెట్టారు. అసలు వీళ్లు ఏమనుకుంటున్నారు? పెద్ద పుడింగులు అనుకుంటున్నారా? ఒక్కొక్కరికి ఎంత పొగరు.. వీళ్లే పెద్ద గొప్ప సినిమా తీశారని అనుకుంటున్నారా?. ఈ సినిమాతో అయిపోయారు. ఇది బాహుబలి కాదు.. ప్రొడ్యూసర్ బలి.. డిస్ట్రిబ్యూటర్ బలి.. ఎగ్జిబిటర్ బలి' అని గ్రూప్ లో అందరూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆమె మాకు ఎవరికీ చెప్పకుండా ఒక్కతే ఆ కామెంట్స్ చూస్తూం ఉండిపోయింది. తర్వాత మాకు ఈ విషయం చెప్పింది. అయితే నిర్మాత సాయి మాత్రం ‘టాక్ గురించి పట్టించుకోకండి..కలెక్షన్స్ ఉధృతంగా ఉన్నాయి. అంత బ్యాడ్ టాక్ ఉంటే ఫస్ట్షోకి వసూళ్లు పెరగవు కదా’ అన్నారు. శుక్రవారం సాయంత్రం నుంచే కలెక్షన్స్ పెరగడం ప్రారంభమైయ్యాయి. శనివారం మంచి రెస్పాన్స్ వచ్చింది..అయినా శ్రీవల్లి నమ్మలేదు. ఆదివారం వరకు చూద్దాంలే అనుకున్నాం. సండే ఈవినింగ్ అందరం కలిసిన తర్వాత ‘హమ్మయ్యా’ అనుకున్నాం’ అని రాజమౌళి అన్నారు. -
శ్రీజకు మళ్లీ అన్యాయం? 'మేమేం పాపం చేశాం? ఎందుకింత వివక్ష': ప్రియ
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9) మొదలై 50 రోజులవుతోంది. ఇప్పటికీ అసలు సిసలైన విన్నింగ్ క్యాండిడేట్ వీళ్లే.. అనేలా ఒక్కరూ లేరు. అంతో ఇంతో తనూజపై హైప్ ఉంది. కల్యాణ్ కూడా నెగెటివిటీని పాజిటివిటీగా మార్చేసుకున్నాడు. ఇమ్మాన్యుయేల్ ఆల్రౌండర్.. కానీ, అసలు నామినేషన్స్లోకే రాకపోవడం తనకే పెద్ద మైనస్ అవుతోంది. రీఎంట్రీఇంతలో ఆటను మరింత రసవత్తరంగా మార్చేందుకు రీఎంట్రీ అంటూ ఓ హైప్ తీసుకొచ్చాడు బిగ్బాస్. షో మొదలైన తర్వాత ఎన్ని ఎంట్రీలు వచ్చాయి! అగ్నిపరీక్ష నుంచి మూడోవారం దివ్యను హౌస్లోకి పంపారు. తర్వాత సంజనాను మిడ్వీక్లో ఎలిమినేట్ చేసి వీకెండ్లో మళ్లీ లోనికి పంపించారు. ఆ తర్వాత ఆరుగురు వైల్డ్ కార్డ్స్ను తీసుకొచ్చారు. వారు లోనికి వస్తూనే శ్రీజను ఎలిమినేట్ చేశారు. ఆ మరుసటి వారమే భరణి ఎలిమినేషన్ కూడా జరిగింది.భరణికే ఎందుకు ప్రాధాన్యత?అయితే భరణికి నిజంగానే తక్కువ ఓట్లు పడ్డాయా? అని ప్రేక్షకుల్లో కొంత అనుమానం ఉంది. అటు శ్రీజ (Srija Dammu) ఎలిమినేషన్ అన్ఫెయిర్ అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. తను రీఎంట్రీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ బిగ్బాస్ దాకా వెళ్లింది. కానీ, అడగ్గానే పంపితే బిగ్బాస్ ఎందుకవుతాడు. ఇంకేదో కొత్తగా.. కాదు, చెత్తగా ఆలోచించాడు. శ్రీజతో పాటు భరణిని హౌస్కి పంపించాడు. వీళ్లకు హౌస్లో గేమ్స్.. బయటేమో ఓటింగ్ పెట్టాడు. ఇదేం వివక్ష?శ్రీజను ఓటింగ్ ప్రకారం కాకుండా వైల్డ్కార్డులు అన్యాయంగా బయటకు తోసేశారు కాబట్టి తన రీఎంట్రీని పరిగణనలోకి తీసుకోవడం సమంజసం.. మరి భరణిని ప్రత్యేకంగా ఎందుకు తీసుకున్నారన్నదే ప్రశ్న! ఎలిమినేట్ అయిన మిగతా కంటెస్టెంట్లకు కూడా ఓ ఛాన్స్ ఇవ్వొచ్చుగా! ఇదే ప్రశ్న ప్రియ కూడా లేవనెత్తింది. ప్రేక్షకుల ఓట్ల ద్వారా ఎలిమినేట్ అయిన వ్యక్తికి రెండో ఛాన్స్.. మరి మేమేం పాపం చేశాం? మాకు ఆ ఛాన్స్ పొందే అర్హత లేదా? అందరినీ సమానంగా చూడాలి. అంతేకానీ ఇదేం వివక్ష? అని ఆవేదన వ్యక్తం చేసింది. తను బాధపడటంలో తప్పేం లేదు.మళ్లీ అన్యాయం?ఇక భరణి కోసం తనూజ ఫ్యాన్స్ ఓట్లు గుద్దిపడేస్తున్నారు. శ్రీజ హౌస్లోకి వస్తే కల్యాణ్కు ఎక్కడ పోటీ అవుతుందో అని అటు అతడి ఫ్యాన్స్ కూడా భరణికే ఓట్లేస్తున్నారట.. దీంతో ఓటింగ్లో భరణి లీడ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు హౌస్లో జరుగుతున్న గేమ్స్లో కూడా భరణి తన హవా చూపిస్తున్నాడట! ఈ లెక్కన బిగ్బాస్.. భరణిని పర్మినెంట్ హౌస్మేట్గా ప్రకటించాడని తెలుస్తోంది. దీంతో శ్రీజకు మరోసారి అన్యాయం జరిగినట్లయింది. ఓటింగ్ ద్వారా ఈసారి ప్రేక్షకులు కూడా అన్యాయం చేసినట్లే లెక్క!చదవండి: దేవుడికి వేరే ప్లాన్స్ ఉన్నాయ్.. అల్లు శిరీష్ పోస్ట్ వైరల్ -
వివాహేతర సంబంధాలకు జై అన్న హీరోయిన్లు.. నెటిజన్స్ ఫైర్!
ఈ సినిమా తారలకు ఏమైంది? మరీ ముఖ్యంగా బాలీవుడ్ నటీమణులకు ఏమైంది? దశాబ్ధాల తరబడి భారతీయ సినిమాల్లో ప్రముఖంగా ఉంటూ మన ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతూనే మన దేశ సంస్కృతీ సంప్రదాయాల పట్ల బాధ్యతా రహితంగా ఎలా ఉండగలుగుతున్నారు?ఇలాంటి ఆలోచనలు ఇటీవలి కాలంలో చాలా మందికి వస్తున్నాయి. సినిమాల్లో శృంగార సన్నివేశాల విజృంభణతో పాటు ప్రేమ, పెళ్లి, వివాహేతర సంబంధాలు వంటి అనేక సున్నితమైన, యువతను ప్రభావితం చేసే అంశాలపై ఇష్టారాజ్యంగా వీరు వ్యాఖ్యలు, అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండడం విస్తుగొలుపుతోంది. అలాంటి బాధ్యతా రహిత సెలబ్రిటీల జాబితాలో తాజాగా సీనియర్ నటి కాజోల్, బాలీవుడ్ ప్రముఖురాలు ట్వింకిల్ ఖన్నాలు చోటు చేసుకున్నారు. పెళ్లయిన వాళ్లు వివాహేతర సంబంధాలు లేదా తాత్కాలిక శారీరక సంబంధాలు పెట్టుకోవడం తప్పులేదనే విధంగా వీరు వ్యాఖ్యానించడం వివాదాస్పదం అయింది.(చదవండి: ప్రశాంత్ వర్మ సినిమా.. 'మహాకాళి'గా భూమి శెట్టి)వివరాల్లోకి వెళితే... తాజాగా జాన్వీ కపూర్, కరణ్ జోహార్, కాజోల్(Kajol), ట్వింకిల్ ఖన్నా(Twinkle Khanna ) పాల్గొన్న టాక్ షో పెళ్లయిన దంపతులు ఒకరికి ఒకరు విశ్వాసంగా ఉండడం అనే అంశంపై చర్చ నెట్టింట రచ్చను రాజేసింది .ఈ చర్చలో భాగంగా వేరొకరితో శారీరక సంబంధం పెట్టుకోవడం ద్వారా జీవిత భాగస్వామిని మోసం చేయడం క్షమించరానిదని జాన్వీ కపూర్ అభిప్రాయపడగా దీన్ని , కాజోల్ ట్వింకిల్ ఖన్నా లు తోసిపారేశారు. ఇది దాంపత్య ఒప్పందాన్ని ఉల్లంఘించేది కాదని తేల్చేశారు. తద్వారా వీరిద్దరూ నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు.(చదవండి: కొండచిలువను మెడకు చుట్టుకున్న గ్లోబల్ బ్యూటీ..)ఈ సెలబ్రిటీ టాక్ షో లో అతిధులుగా కాజోల్, ట్వింకిల్ ఖన్నా, జాన్వీ కపూర్(Janhvi Kapoor), కరణ్ జోహార్ పాల్గొన్నారు. భాగస్వామిని శారీరకంగా మోసం చేయడం కన్నా మానసికంగా మోసం చేయడం పెద్ద తప్పు అని అంగీకరిస్తున్నారా లేదా అనే చర్చ లేవనెత్తారు. దీంతో దేవర నటి జాన్వి శారీరక మోసాన్ని సహించలేమని అంటూ తన వైఖరిని గట్టిగా చెప్పింది. అయితే కరణ్ జోహార్, ట్వింకిల్ ఖన్నా కాజోల్ ఆ అభిప్రాయం సరైంది కాదని నొక్కి చెప్పారు. ట్వింకిల్ అయితే ‘రాత్ గయీ బాత్ గయీ (రాత్రి పోయింది ఆ విషయమూ అయిపోయింది )’ అంటూ తేలిగ్గా తేల్చి చెప్పింది, కాబట్టి మానసిక వ్యభిచారమే తప్పన్నట్టు మాట్లాడింది.అయితే జాన్వి తన అభిప్రాయం నుంచి వెనక్కి తగ్గలేదు. ఈ క్లిప్ ఇంటర్నెట్ అంతటా వైరల్ అయింది, ఒకవైపు, ‘పరమ సుందరి’ స్టార్ తన అభిప్రాయానికి ప్రశంసలు అందుకుంటుండగా, హోస్ట్లు కాజోల్ ట్వింకిల్ వారి అభిప్రాయానికి ఎదురుదాడిని ఎదుర్కొంటున్నారు. దీనిపై పలువురు మానసిక శాస్త్రవేత్తలు సైతం విశ్లేషణాత్మక విమర్శలు సంధిస్తున్నారు.పైగా జాన్వి చిన్నది, ఆమె 20 ఏళ్లలో ఉందని, కానీ ఆమె 50 ఏళ్ల వయస్సుకు చేరుకున్నప్పుడు, ఆమెకు ఇప్పుడు ఉన్న అభిప్రాయం మారుతుందని ట్వింకిల్ అనడాన్ని ప్రస్తావిస్తూ ఓ మనస్తత్వవేత్త ఇలా అన్నారు, ‘కాదు, ఇది వయస్సు లేదా పరిపక్వత గురించి కాదు, ఇది గౌరవం సరిహద్దుల గురించి.’’అంటూ గుర్తు చేశారు. ‘మోసం అంటే మోసం..అది భావోద్వేగంగా మాత్రమే కాదు శారీరకంగా లేదా సరసాలాడటం కూడా మోసమే. దానికి వేర్వేరు పేర్లు పెట్టి, సరదాగా గడపడానికి లేదా ‘మనస్సును మరల్చడానికి లేదా టైమ్ పాస్?‘ అని పిలవడం తప్పించుకోవడమేనన్నారు.పలువురు నెటిజన్లు జాన్విని అభినందించారు చాలా మంది అక్రమ సంబంధాల్ని సమర్థిస్తున్నారంటూ కాజోల్ ట్వింకిల్లను తీవ్రంగా విమర్శించారు. ‘ బాలీవుడ్ జీవనశైలిలో భాగంగా వారు దానిని సాధారణమైనదిగా చూస్తారు. వేరే విధంగా ఎవరైనా మాట్లాడటం అనేది వారికి వింతగా లేదా అమాయకంగా లేదా తెలివితక్కువగా అనిపిస్తుంది ‘ అని ఓ నెటిజన్ తీవ్రంగా దుయ్యబట్టారు. -
దేవుడికి వేరే ప్లాన్స్ ఉన్నాయ్.. అల్లు శిరీష్ పోస్ట్ వైరల్
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటారు. అందుకే పెళ్లీడు రాగానే వివాహం జరిపించాలని పెద్దలు ముచ్చటపడుతుంటారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా చిన్న కొడుకు విషయంలో అదే ఆశపడ్డాడు. అల్లు శిరీష్ను పెళ్లి చేసుకోమని పదేళ్లుగా బతిమాలాడుతున్నాడు. ఎట్టకేలకు తండ్రి మాటకు తలూపి మ్యారేజ్ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు.ఈ మధ్యే గుడ్న్యూస్ఇటీవలే సోషల్ మీడియా వేదికగా ఆ విషయాన్ని ప్రకటించాడు శిరీష్ (Allu Sirish). తాతయ్య అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా నా మనసులోని మాట మీ అందరికీ చెప్తున్నా.. అక్టోబర్ 31న నయనికతో నా ఎంగేజ్మెంట్ జరుగుతోంది. నా పెళ్లి చూడాలని నానమ్మ ఎంతో ఆశపడింది. కానీ, ఆ కల నెరవేరకుండానే కన్నుమూసింది. తను మా మధ్య లేకపోయినా.. తన దీవెనలు ఎప్పుడూ మాకు అండగా ఉంటాయి అని శుభవార్త చెప్పాడు. దీపావళి సెలబ్రేషన్స్లో..అల్లు అర్జున్ ఇంట్లో జరిగిన దీపావళి సెలబ్రేషన్స్కు నయనిక సైతం హాజరైంది. ఆమె ఫోటోను పొరపాటున అల్లు స్నేహ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే అప్పటికింకా శిరీష్.. తనకు కాబోయే భార్య ఫోటో రివీల్ చేయలేదని తెలిసి వెంటనే దాన్ని డిలీట్ చేసింది. ఫ్యామిలీ ఫోటోలో ఆమెను కట్ చేసి షేర్ చేసింది. రేపే నిశ్చితార్థం కావడంతో శిరీష్ కూడా ఆ పనులు చూసుకుంటున్నాడు.ఎంగేజ్మెంట్కు వర్షం ఆటంకంకానీ తుపాను ప్రభావం వల్ల వాతావరణంలో సడన్గా మార్పులొచ్చాయి. అకస్మాత్తుగా వర్షాలు పడుతున్నాయి. శిరీష్ నిశ్చితార్థపు పనులకు సైతం ఈ వర్షాలు ఆటంకంగా మారాయి. ఈ మేరకు ఓ ఫోటోను షేర్ చేసిన శిరీష్.. బయట ఎంగేజ్మెంట్ చేసుకుందామని ప్లాన్ చేశాం. కానీ, వాతావరణం.. దేవుడి ప్లాన్స్ మరోలా ఉన్నాయి అని రాసుకొచ్చాడు. అందులో నిశ్చితార్థపు వేదిక తడిసిముద్దయినట్లు కనిపిస్తోంది.సినిమాఅల్లు అరవింద్ కొడుకుగా, అల్లు అర్జున్ తమ్ముడిగా శిరీష్.. 'గౌరవం' (2013) మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో, బడ్డీ తదితర చిత్రాలు చేశాడు. ఏడాదిన్నరకాలంగా అతడి నుంచి మరే సినిమా రాలేదు.చదవండి: ప్రియాంక మెడలో కొండచిలువ.. భయమనేదే లేదు! -
ప్రశాంత్ వర్మ సినిమా.. 'మహాకాళి'గా భూమి శెట్టి
టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ)లో భాగంగా వస్తున్న మహాకాళి పోస్టర్ను విడుదల చేశారు. మహాకాళి పాత్రలో కనిపించనున్న కన్నడ నటి ‘భూమి శెట్టి’ ఫస్ట్ లుక్ను తన సోషల్మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో వచ్చిన తొలి సినిమా ‘హనుమాన్’ భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. అయితే, ‘మహాకాళి’ ఫీమేల్ సూపర్ హీరో సినిమాగా రానుంది. ఈ ప్రాజెక్ట్కు ప్రశాంత్ వర్మ కథ అందిస్తున్నారు.పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వస్తున్న మహాకాళి.. బెంగాల్ ప్రాంతంలో జరిగే కథగా ఉంటుంది. పాన్ ఇండియా రేంజ్లో రానున్న ఈ మూవీకి స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా నటించబోతున్నాడు. కన్నడకు చెందిన భూమి శెట్టికి తెలుగులో ఇది రెండో సినిమా.. కింగ్డమ్లో సత్యదేవ్ సతీమణి గౌరి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. సోషల్మీడియాలో పాపులర్ అయిన ఆమెకు ఈ మూవీ ఛాన్స్ రావడానికి ప్రధాన కారణం ఆమె స్కిన్ టోన్ అని తెలుపుతున్నారు. ఈ పాత్రకు సరిగ్గా సరిపోయేలా ఉండటంతో ‘మహాకాళి’ కోసం తీసుకున్నారట.From the cosmic womb of creation awakens the most FEROCIOUS SUPERHERO of the universe!Introducing #BhoomiShetty as MAHA ❤️🔥 #Mahakali 🔱 @RKDStudios #RKDuggal @PujaKolluru #AkshayeKhanna#RiwazRameshDuggal @ThePVCU pic.twitter.com/MSyyW1oUK2— Prasanth Varma (@PrasanthVarma) October 30, 2025 -
ప్రియాంక మెడలో కొండచిలువ.. భయమనేదే లేదు!
తెలుగు సినిమాలు దేశవ్యాప్తంగానే కాదు, ఏకంగా ప్రపంచవ్యాప్తంగా అద్భుతాలు సృష్టించడంతో అందరి కన్ను టాలీవుడ్పై పడింది. అలా దీపికా పదుకొణె కల్కి 2898ఏడీతో తెలుగులో ఎంట్రీ ఇస్తే, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra).. #SSMB29 మూవీతో ఇక్కడి ప్రేక్షకులకు పరిచయం కానుంది. డేర్ అండ్ డాషింగ్గా కనిపించే ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియాలో అరుదైన ఫోటోలు షేర్ చేసింది. అందులో కొండచిలువ సహా మరో భారీ పామును తన భుజాలపై వేసుకుంది. భర్త నిక్ జోనస్ కూడా పక్కనే నిల్చుని చూస్తూ ఉన్నాడు. భయమే లేదువీరి ముఖంలో కంగారు, భయం వంటివి మచ్చుకైనా కనిపించడం లేదు. పైగా.. నీ జ్యువెలరీ బాగుంది బేబ్ అని భార్యకు కాంప్లిమెంట్ ఇచ్చాడు. పాములను మెడలో వేసుకుని దిగిన పలు ఫోటోలను తన పోస్ట్లో జత చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారింది. అదిగో పాము అనగానే అరకిలోమీటర్ దూరం పడిగెతుంటారు జనాలు.. అలాంటిది ప్రియాంక ఏకంగా పామును మెడలో వేసుకుందంటే గుండెధైర్యం చాలానే ఉందని మెచ్చుకుంటున్నారు. రాజమౌళి-మహేశ్బాబు సినిమాలో ఇలాంటి సాహసాలు ఎన్ని చేసిందో చూడాలని కామెంట్లు చేస్తున్నారు.మిస్ వరల్డ్ నుంచి హీరోయిన్గా..జార్ఖండ్కు చెందిన ప్రియాంకచోప్రా.. 2000వ సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటం గెలిచింది. ఆ తర్వాతే బిగ్స్క్రీన్పై తళుక్కుమంది. 2002లో వచ్చిన తమిళన్ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. ద హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై చిత్రంతో హిందీలో ఎంట్రీ ఇచ్చింది. అండాజ్, ముజ్సే షాదీ కరోగి, అయిత్రాజ్ వంటి పలు హిట్స్తో బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా మారింది. క్రిష్, డాన్, ఫ్యాషన్ సినిమాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. రచయిత్రిగానూబర్ఫీ, బాజీరావు మస్తానీ, మేరీ కోమ్, ద స్కై ఈజ్ పింక్ ఇలా అనేక సినిమాలు చేసింది. రామ్లీలా సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. బాలీవుడ్ రాజకీయాలు తట్టుకోలేక హాలీవుడ్కు వెళ్లిపోయింది. సిటాడెల్ వంటి వెబ్ సిరీస్లతో పాటు అనేక ఇంగ్లీష్ చిత్రాల్లో కథానాయికగా నటించింది. ‘అన్ఫినిష్డ్: ఏ మెమోయిర్’ పుస్తకంతో రచయిత్రిగా ఆరంగేట్రం చేసింది ప్రియాంకచోప్రా. తన జీవితంలో ఎదురైన జ్ఞాపకాలను ఈ పుస్తకం ద్వారా పాఠకులతో పంచుకుంది.పెళ్లి- కూతురుహాలీవుడ్ సింగర్,యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ నిక్ జోనస్ని 2018లో పెళ్లి చేసుకుంది. వీరికి సరోగసి ద్వారా కూతురు మాల్తీ మేరి జన్మించింది. భర్త, కూతురితో కలిసి ప్రస్తుతం లాస్ ఏంజిల్స్లోనే ఉంటోంది. పెళ్లయ్యాక ఇండియన్ సినిమాలపై ఫోకస్ తగ్గించేసిన ప్రియాంక.. ఇప్పుడు పూర్తి స్థాయిలో మహేశ్బాబు–రాజమౌళి కాంబినేషన్లోని సినిమాలో నటించడం పట్ల ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఈ చిత్రం 2027 వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra)చదవండి: ప్లేటు తిప్పేసిన మాధురి.. రీతూ తల్లి ఏడుస్తూ ఫోన్ చేసిందా? -
ఈ వారం ఓటీటీలో పండగే.. వరుసగా హిట్ సినిమాలు
ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాల సంఖ్య బాగానే ఉంది. థియేటర్లో ఎటూ బాహుబలి ఎపిక్, మాస్ జాతర చిత్రాలు ఉన్నాయి. అయితే, ఈ ఏడాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిత్రం ‘కొత్తలోక: చాప్టర్ 1’ (kotha lokah chapter 1) ఎట్టకేలకు ఓటీటీలోకి రానుంది. జియో హాట్స్టార్ వేదికగా అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది.ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇడ్లీ కొట్టు.. తిరు వంటి హిట్ సినిమా తర్వాత ధనుష్, నిత్యామేనన్ కలిసి జంటగా నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కోలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం అక్టోబర్ 29 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. కోలీవుడ్లో రూ. 60 కోట్లకు పైగా రాబట్టిన ఈ మూవీలో ధనుష్ పాత్ర చాలా బాగుంటుంది. తన తండ్రి కోరిక మేరకు వారసత్వంగా ఇడ్లీ కొట్టు నడిపే సాధారణ వ్యక్తిలా ధనుష్ మెప్పించారు.‘కాంతార’కు ప్రీక్వెల్గా తెరకెక్కిన ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) కూడా ఓటీటీలోకి వచ్చేస్తుంది. అక్టోబర్ 31న అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. బాక్సాఫీస్ వద్ద రూ. 820 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ హిందీ మినహా దక్షిణాదికి చెందిన అన్ని భాషలలో విడుదల కానుంది. కాంతార సినిమాతో థియేటర్లలో తన సత్తా ఏంటో కన్నడ హీరో రిషబ్ శెట్టి చూపించారు. ఆయన దర్వకత్వం వహించిన ఈ సినిమాలో రుక్మిణీ వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబరు 27 నుంచి నవంబర్ 2 వరకు)నెట్ఫ్లిక్స్ఇడ్లీకొట్టు (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 29బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 29స్టిచ్ హెడ్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 29ఐలీన్: క్వీన్ ఆఫ్ సీరియల్ కిల్లర్స్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 30ద వైట్ హౌస్ ఎఫెక్ట్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరుఅమెజాన్ ప్రైమ్హజ్బిన్ హోటల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 29హెడ్డా (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 29ట్రెమెంబా (పోర్చుగీస్ సిరీస్) - అక్టోబరు 31కాంతార ఛాప్టర్ 1 (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 31హాట్స్టార్ఐటీ వెల్కమ్ టూ డెర్రీ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 27మానా కీ హమ్ యార్ నహీన్ (హిందీ సిరీస్) - అక్టోబరు 29లోక (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబరు 31జీ5డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు (తెలుగు సిరీస్) - అక్టోబరు 31బాయ్ తుజాప్యా (మరాఠీ సిరీస్) - అక్టోబరు 31మారిగళ్లు (కన్నడ సిరీస్) - అక్టోబరు 31గణోసోత్రు (బెంగాలీ సిరీస్) - అక్టోబరు 31రంగ్బాజ్: ది బిహార్ చాప్టర్ (మూవీ) అక్టోబరు 31సన్ నెక్స్ట్బ్లాక్ మెయిల్ (తమిళ సినిమా) - అక్టోబరు 30 -
ప్లేటు తిప్పేసిన మాధురి.. రీతూ తల్లి ఏడుస్తూ ఫోన్ చేసిందా?
సెకండ్ ఛాన్స్ కోసం భరణి, శ్రీజ బిగ్బాస్ హౌస్లో పోటీపడుతున్నారు. వీరిలో ఒక్కరికే స్థానం ఉంటుందన్న బిగ్బాస్.. రకరకాల టాస్కులిచ్చాడు. అందులో భరణి గాయాలపాలై ఆస్పత్రికి కూడా వెళ్లొచ్చాడు. అటు రేషన్ మేనేజర్గా ఉన్న తనూజకు గొడవలు తప్పడం లేదు. ఏకంగా రాజు (మాధురి)తో కూడా గొడవ జరిగింది. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో బుధవారం (అక్టోబర్ 29వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..ఫెయిలైన సంచాలకులుశ్రీజ- భరణి కోసం మొదటగా కట్టు- పడగొట్టు టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. ఇందులో భరణి, ఇమ్మాన్యుయేల్ను ఒక్కటే కట్టడి చేసి శెభాష్ అనిపించుకున్నాడు డిమాన్ పవన్. కానీ, అతడి కష్టాన్ని ప్రేక్షకులకు కనిపించకుండా ఎపిసోడ్లో సరిగా వేయనేలేదు. ఫస్ట్ రౌండ్లో శ్రీజ గెలిచిందని కల్యాణ్.. కాదు, భరణి గెలిచాడని సుమన్ వాదించారు. దీంతో బిగ్బాస్.. ఈ ఇద్దర్నీ సంచాలకులిగా తప్పించాడు. కొత్త సంచాలక్ మాధురి.. శ్రీజ గెలిచినట్లు ప్రకటించింది.మాధురి వర్సెస్ తనూజరెండో రౌండ్లో భరణి (Bharani Shankar) గాయాలపాలవడంతో పాటు ఎవరూ గెలవలేదు. భరణిని ఆస్పత్రికి తీసుకెళ్లి మళ్లీ హౌస్లోకి పంపించారు. ఇక కిచెన్లో గొడవ మొదలైంది. చపాతీలు లావుగా వస్తున్నాయని తనూజ అంది. పక్కనే చపాతీ చేస్తున్న మాధురి.. మేమేమీ హోటల్ సర్వర్లము కాము.. మాకు రాదు అంటూ అక్కడ పడేసి వెళ్లిపోయింది. మేము కూడా హోటల్లో పని చేసి రాలేదు, అయినా పని చేస్తున్నాం. రాకపోతే చెప్పండి, వేరేవాళ్లు చేసుకుంటారని తనూజ కౌంటరిచ్చింది.అన్నంపై అలిగిన సంజనాతగ్గుతుంటే ఏదో అనుకుంటున్నావేమో.. ప్రేమకి తగ్గుతున్నా.. నువ్వు అరుస్తుంటే తగ్గట్లేదు. నేను మాటలు పడటానికి రాలేదు. మీకు సపోర్ట్గా ఉంటే బాగుంటుంది. న్యాయం వైపుంటే నచ్చదు అంటూ మాధురి (Divvala Madhuri) సెటైర్లు వేసింది. మీరు టాపిక్ ఎక్కడికో తీసుకెళ్లకండి.. నాన్నను సేవ్ చేయమని అడిగానా? అంటూ తనూజ వాదించగా కాసేపు గొడవ జరిగింది. అటు అన్నం కొద్దిగానే ఉండటంతో.. అన్నం పెట్టుకునేముందు చెప్పాలిగా అని తనూజ సంజనాను ప్రశ్నించింది. దీంతో ఆమె తినే ప్లేటు మీద నుంచి అలిగి వెళ్లిపోయింది. అందుకే మాధురిపై కోపం లేదుమరోవైపు రీతూ-పవన్ల గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్స్ రోజు మాధురి.. నీకోసం నన్ను అన్ని మాటలు అంటుంటే ఎందుకు స్పందించలేదు? ఎందుకు కోపం రాలేదు? అని గుచ్చిగుచ్చి అడుగుతూనే ఉండేసరికి డిమాన్ పవన్కు తిక్క రేగింది. ఆమెను అక్కా అని పిలుస్తున్నా, అందుకే కోపం రాలేదన్నాడు. దీంతో రీతూ మరింత అరిచింది. ఆవేశంలో పవన్ ఓ మాట జారాడు. ఇక చాలు, గుడ్బై అని రీతూ అక్కడినుంచి వెళ్లబోతుంటే పవన్ తనను తోసేశాడు.మాధురికి రీతూ తల్లి ఫోన్ఈ గొడవలతో పిచ్చెక్కిపోతున్న మాధురి.. పవన్తో ఒక్కమాట అడుగుతా.. మీది హెల్తీ రిలేషన్ అయితే వాళ్ల ఇంట్లో వాళ్లు నాకు ఫోన్ చేస్తారా? నీతో మాట్లాడుతుంటే ఆమె తల్లి ఏడుస్తుందని నాకు చెప్తారా? నేను మాట్లాడినదాంట్లో తప్పుంటే సారీ అనేసింది. ఆ తర్వాత కూడా వీళ్లు గొడవపడటం.. కాసేపటికి రీతూ ఎప్పటిలాగే డిమాన్కు తినిపించడం జరిగిపోయింది. ఇదంతా వాళ్లకెలా ఉందోకానీ, చూసేవారికి మాత్రం తల బొప్పికడుతోంది.చదవండి: కల్కి క్రెడిట్ నుంచి దీపికా పదుకొనే పేరు తొలగింపు -
2 వేలమంది కనుమరుగు... హీరోలే కాపాడాలి: దర్శకుడు
ఆరుపడై ప్రొడక్షన్స్ పతాకంపై శైల్కుమార్ నిర్మించిన చిత్రం వళ్లువన్. శంకర్ సారథి దర్శకత్వం వహించిన ఈ మూవీలో సేతన్ శీను, నటి ఆస్నా జవేరి జంటగా నటించారు. మనోబాలా, సాయిదీనా, దీప, రామచంద్రన్, మీసై రాజేంద్రన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అశ్వత్ సంగీతం, సురేశ్బాల చాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ల్యాబ్లో నిర్వహించారు. డైరెక్టర్ స్పీచ్ఈ కార్యక్రమంలో దర్శకుడు, ఫెఫ్సీ (దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య) అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి, ఆర్వీ ఉదయకుమార్, పేరరసు, కే.రాజన్ తదితర సినీ ప్రముఖలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శంకర్ సారథి మాట్లాడుతూ.. అమాయక ప్రజలను రక్షించేందుకు డా.అంబేడ్కర్ చట్టాలను తీసుకొచ్చారన్నారు. అయితే చట్టాల్లోని మంచి విషయాలను మరచి, అందులోని లొసుగులను అడ్డం పెట్టుకుని దుండగులు తప్పించుకుని తిరిగే పరిస్థితి నెలకొందన్నారు. 10 ఏళ్లలో 2500 సినిమాలుఅలా చట్టాన్ని చేతిలోకి తీసుకుని తప్పులు చేసే వారిని ఎవరు శిక్షిస్తారు? అన్న ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం వళ్లువన్ అని చెప్పారు. ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి మాట్లాడుతూ.. ట్రైలర్ చూస్తే కమర్శియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్గా అనిపించిందన్నారు. గత 10 ఏళ్లలో సుమారు 2,500 చిత్రాలు విడుదలయ్యాయని, వాటిలో 2వేల చిత్రాలను నిర్మిచింది చిన్న నిర్మాతలేనని పేర్కొన్నారు.2 వేల మంది నిర్మాతలు కనుమరుగుఅలా వాళ్లే తమకు అన్నం పెడుతున్నారన్నారు. అయితే ఇన్నేళ్లుగా మొదటి చిత్రాన్ని తీసిన 2 వేల మంది నిర్మాతలు కనిపించకుండాపోయారన్నారు. ఒక్క సంగీత దర్శకుడు కన్నుమూస్తే ఆయనకు కుటుంబానికి రాయల్టీ వస్తుందని, కానీ నిర్మాతలకు ఎలాంటి గ్యారెంటీ లేదన్నారు. అందువల్ల తమ ఉన్నతికి కారణం అయిన నిర్మాతలకు హీరోలు తమ ఆదాయంలో 5 లేదా 10 శాతం చెల్లించేలా ఒక సిస్టం తీసుకువస్తే బాగుంటుందనే అబిప్రాయాన్ని ఆర్కే.సెల్వమణి వ్యక్తం చేశారు.చదవండి: ప్రేక్షకులకు గుర్తుండిపోయే చిత్రం ఇది -
'కల్కి' క్రెడిట్ నుంచి దీపికా పదుకొనే పేరు తొలగింపు
కల్కి సీక్వెల్లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే (Deepika Pdukone) భాగం కావడం లేదని ప్రకటన వచ్చిన సమయం నుంచి పెద్ద చర్చే జరుగుతుంది. ముఖ్యంగా పనిగంటల విషయంలోనే విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరిగింది. ప్రభాస్ స్పిరిట్ ఢీల్ విషయంలో కూడా తను రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తానని చెప్పడం వల్లే వదులుకుందని తెలిసింది. అయితే, ఈ విషయంలో కొందరు నెటిజన్లు వైజయంతీ మూవీస్కు సపోర్ట్గా నిలిస్తే.. మరికొందరు దీపికా పదుకొనేకు అండగా నిలిచారు.ప్రభాస్ , నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). గతేడాది విడుదలైన ఈ చిత్రం రూ. 1000 కోట్ల మార్క్ దాటి భారతీయ సినిమాకు అంతర్జాతీయ రేంజ్లో గుర్తింపు పొందింది. ఓటీటీలో కూడా ట్రెండింగ్లో నిలిచింది. అయితే.. దీపికా పదుకొనే, వైజయంతీ మూవీస్ మధ్య ఏర్పడిన వివాదం వల్ల సినిమా ఎండ్ క్రెడిట్స్లో దీపికా పేరును తాజాగా తొలగించినట్లు తెలుస్తోంది. ఈమేరకు కొన్ని స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.అయితే, దీపికా పదుకొనే పేరు తొలగింపులో వైజయంతీ మూవీస్ పాత్ర లేదని కొందరు చెప్పుకొస్తున్నారు. ఓటీటీ సంస్థ నుంచి వచ్చిన కొన్ని గ్లిచ్స్ వల్ల ఆమె పేరు కనపడకుండా పోయిందని వివరణ ఇస్తున్నారు. ఇది కూడా హిందీ వెర్షన్లో మాత్రమే అలా వస్తుందని క్లారిటీ ఇస్తున్నారు. కానీ, తెలుగులో దీపికా పేరు క్లియర్గా కనిపిస్తుందని కూడా పేర్కొంటున్నారు. అయితే, చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. -
నటుడు ప్రభు ఇంటికి బాంబు బెదిరింపు
తమిళనాడులో ఉన్న అమెరికా రాయబారి కార్యాలయంతో పాటు సినీ నటుడు ప్రభు ఇంటికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈమేరకు డీజీపీ కార్యాలయానికి ఒక ఈ–మెయిల్ వచ్చింది. అందులో అన్నా ఫ్లైఓవర్ సమీపంలోని అమెరికా డిప్యూటీ కాన్సులేట్లో మరికాసేపట్లో బాంబు పేలుతుందని పేర్కొన్నారు. ఆ తర్వాత నటుడు ప్రభు ఇంట్లో ఒక బాంబు పేలుతుందని మెయిల్ ద్వారా హెచ్చరించారు. దీంతో వెంటనే చెన్నై పోలీసులు, బాంబు స్క్వాడ్, జాగిలాలు సహాయంతో అన్నిచోట్లా తనిఖీ చేశారు. తర్వాత అమెరికా కాన్సులేట్లో పనిచేస్తున్న అధికారుల ఇళ్లకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. అయితే, తనిఖీల్లో ఎలాంటి బాంబులు దొరకలేదు. ఇది కేవలం కావాలనే కొందరు ఆకతాయిలు చేసిన పని అని తేలింది. అదేవిధంగా నటుడు ఎస్.వి.శేఖర్ ఇల్లు, మైలాపూర్లో ఉన్న సుబ్రమణ్యస్వామి ఇళ్లలో బాంబులు పెట్టినట్లు తెలిపారు. వెంటనే తనిఖీ బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేసి బాంబు లేదని నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
ప్రేక్షకులకు గుర్తుండిపోయే చిత్రం ఇది
‘‘ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా కథ రాసుకున్నాడు సాయిలు. ప్రేమతో కూడిన విషాద భరితమైన ఈ సంఘటన ఆ ఊర్లోనే జరిగి, అక్కడే సమాధి అయ్యింది. ఎంటర్టైనింగ్గా, మాస్ అప్పీల్ ఉండేలా సాయిలు ఈ స్క్రిప్ట్ రాశాడు. ‘7/జీ బృందావన్ కాలనీ, ప్రేమిస్తే, ఆర్ఎక్స్ 100, బేబీ’ చిత్రాల్లా ‘రాజు వెడ్స్ రాంబాయి’ కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఇక నా దర్శకత్వంలోని సినిమాకు యూవీ క్రియేషన్స్ సంస్థలో ప్రీ ్ర΄÷డక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని దర్శక–నిర్మాత వేణు ఊడుగుల అన్నారు. అఖిల్, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. సాయిలు కంపాటి దర్శకత్వంలో డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని నవంబరు 21న రిలీజ్ చేస్తున్నట్లుగా యూనిట్ ప్రకటించింది. వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ సినిమాను థియేట్రికల్గా రిలీజ్ చేస్తున్నారు. ‘‘ఈ సినిమా చూశాక ప్రేక్షకులు ఓ ఎమోషనల్ ఫీల్తో థియేటర్స్ నుంచి బయటకొస్తారు’’ అని అన్నారు బన్నీ వాసు. ‘‘ఒకే ఒక నరేషన్లో వేణుగారు మా సినిమాను ఓకే చేశారు’’ అన్నారు సాయిలు. ‘‘ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇందులోని నటీనటులను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గుర్తు పెట్టుకుంటుంది’’ అని చెప్పారు వంశీ నందిపాటి. -
ఇదేంటో జేమ్స్ బాండ్
నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చైనా పీస్’. కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేశ్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్పై రూపొందిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. కార్తీక్ రోడ్రిగ్జ్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘ఇదేంటో జేమ్స్ బాండ్...’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. దినేష్ కాకర్ల సాహిత్యం అందించిన ఈ పాటని స్ఫూర్తి జితేందర్, హారిక నారాయణ్ పాడారు. ‘‘యునిక్ స్పై డ్రామాగా రూపొందిన మూవీ ‘చైనా పీస్’. కొత్త కాన్సెప్ట్, యాక్షన్, థ్రిల్, హ్యూమర్తో విడుదలైన టీజర్ మా సినిమాపై అంచనాలు పెంచింది’’ అని యూనిట్ పేర్కొంది. -
హిందీ జేజెమ్మ?
అనుష్కా శెట్టి కెరీర్లోని బ్లాక్బస్టర్ మూవీ ‘అరుంధతి’. కోడి రామకృష్ణ దర్శకత్వంలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం 2009లో విడుదలైంది. ఈ చిత్రంలో అనుష్క చేసిన రెండు పాత్రల్లో ‘జేజెమ్మ’గా ఆమె నటన అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పుడు హిందీ జేజెమ్మగా శ్రీలీల కనిపించనున్నారని టాక్. ‘అరుంధతి’ చిత్రం హిందీలో రీమేక్ కానున్నట్లుగా ఎప్పట్నుంచో వార్తలు వçస్తున్నాయి. ఇప్పుడు ఈ పనులు ఊపందుకున్నాయని, ‘అరుంధతి’ హిందీ రీమేక్ను నిర్మించాలని అల్లు అరవింద్ సన్నాహాలు మొదలుపెట్టారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. అంతేకాదు... ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తారని, తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారనే ప్రచారం సాగుతోంది. మరి... హిందీ తెరపై ‘అరుంధతి’గా శ్రీలీల కనిపిస్తారా? 16 సంవత్సరాల తర్వాత ‘అరుంధతి’ సినిమా హిందీలో రీమేక్ అవుతుందా? అనే విషయాలపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. -
ప్రభాస్తో ఢీ
వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకెళుతున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన మారుతి దర్శకత్వం వహిస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’, హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ వంటి ప్రాజెక్ట్స్కి పచ్చజెండా ఊపారు ప్రభాస్. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న చిత్రం ‘స్పిరిట్’. త్రిప్తీ దిమ్రి హీరోయిన్గా నటించనున్న ఈ మూవీలో కాంచన, ప్రకాశ్రాజ్, వివేక్ ఓబెరాయ్ ఇతర పాత్రలు పోషించనున్నారు. ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో కొరియన్ నటుడు డాన్ లీ విలన్గా నటించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రభాస్కు సమానంగా పోటీ ఇచ్చే శక్తిమంతమైన ప్రతినాయకుడి పాత్రకి డాన్ లీ సరిపోతారంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆన్లైన్లో పోస్టులు పెడుతున్నారు. అయితే ‘స్పిరిట్’లో డాన్లీ విలన్గా నటిస్తున్నారా? లేదా అనే విషయంపై స్పష్టత రావాలంటే యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. కాగా కొరియన్ మీడియాలో మాత్రం ప్రభాస్ సినిమాలో డాన్ లీ ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ‘‘స్పిరిట్’ అనే సినిమాలో డాన్ లీ నటిస్తున్నారు. ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. ‘బాహుబలి’ సినిమాతో ఫేమస్ అయిన ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో డాన్ లీ నెగటివ్ పాత్రలో కనిపిస్తారనే వార్త వినిపిస్తోంది’’ అని కొరియన్ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే ఇక దర్శక–నిర్మాతలు అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం. -
నా పారితోషికాన్ని విరాళంగా ఇచ్చేశాను
హిందీ ‘రామాయణ’ చిత్రంలో తాను నటిస్తున్న విషయాన్ని అధికారికంగా తెలిపారు వివేక్ ఓబెరాయ్. రామాయణం ఆధారంగా నితీష్ తివారి దర్శకత్వంలో హిందీలో రెండు భాగాలుగా ‘రామాయణ’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ చిత్రంలో వివేక్ ఓబెరాయ్ కూడా నటిస్తున్నారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ– ‘‘రామాయణ’ సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్రంతో నిర్మాత నమిత్ మల్హోత్రా భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపైకి తీసుకు వెళ్తున్నారు. ఇది నచ్చి, ఈ సినిమా చేయాలనుకున్నాను. అలాగే ఈ సినిమాకు సంబంధించిన నా పారితోషికం మొత్తాన్ని క్యాన్సర్ బాధిత పిల్లల చికిత్స కోసం విరాళంగా ఇచ్చేశాను. ఇక ‘రామాయణ’ సినిమా కోసం రెండు రోజులు షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. నితీష్, నమిత్, రకుల్లతో వర్క్ చేయడం బాగుంది’’ అని చెప్పుకొచ్చారు వివేక్ ఓబెరాయ్. ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో శూర్పణఖగా రకుల్ప్రీత్ సింగ్ నటిస్తున్నారని, ఆమె భర్త విద్యుజ్జీహ్యుడుగా వివేక్ ఓబెరాయ్ నటిస్తున్నారని సమాచారం. ‘రామాయణ’ తొలి భాగాన్ని 2026 దీపావళికి, ‘రామాయణ: పార్టు 2’ని 2027 దీపావళికి రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
వెండికొండల నడుమ వెండితెర పండగ
హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో చిత్రదర్శకురాలు రీతు సరిన్ నాటిన విత్తనం ఇప్పుడు పెద్ద చెట్టు అయింది. శాఖోపశాఖలుగా విస్తరించింది. ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్గా ప్రపంచ ప్రసిద్ధి పొందింది...ధర్మశాల అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (డిఐఎఫ్ఎఫ్) ఈరోజు నుండి నవంబర్ 2 వరకు జరుగుతుంది. మహిళా దర్శకుల 40 చిత్రాలతో సహా మొత్తం 88 చిత్రాలను ప్రదర్శిస్తారు. ఈ సంవత్సరం ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రముఖ చిత్ర దర్శకురాలు కిరణ్రావుతో ముఖాముఖి ఉంటుంది. తన సినిమా ప్రయాణం నుంచి ఇండిపెండెంట్ సినిమాలలో వస్తున్న మార్పుల వరకు తన అభి్రపాయాలను ఈ ముఖాముఖీలో తెలుసుకోవచ్చు.రీతు కృషి... ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ దిల్లీలో పుట్టి పెరిగిన రీతు సరిన్ కాలిఫోర్నియా కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్(సిసిఏ)లో ఫిల్మ్ అండ్ వీడియో విభాగంలో ఎంఎఫ్ఏ చేసింది. ‘సిసిఏ’లో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు తీసింది. ది సిఖ్స్ ఆఫ్ యూబా సిటీ, టిబెట్, ఫిష్టేల్స్, ఎ స్ట్రేంజర్ ఇన్ మై నేటివ్ ల్యాండ్, ది షాడో సర్కస్....మొదలైన ఎన్నో ప్రయోగాత్మకమైన చిత్రాలను తీసింది. టిబెటన్ చిత్రదర్శకుడు టెన్జింగ్ సోనమ్ను వివాహం చేసుకుంది. 2012లో సోనమ్తో కలిసి వైట్ క్రేన్ ఆర్ట్స్ అండ్ మీడియా అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఆ తరువాత సోనమ్తో కలిసి ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(డిఎఫ్ఎఫ్)కు శ్రీకారం చుట్టింది. టాప్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో డిఐఎఫ్ఎఫ్ ఒకటిగా నిలిచింది.మరచిపోయిన చెట్టు పాట ఒకటిధర్మశాల అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమయ్యే చిత్రాలలో అనుపర్ణ రాయ్ రచన, దర్శకత్వం వహించిన ‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్’ ఒకటి. 82వ వెనిస్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలోని ఒరిజోంటి (హారిజన్స్) విభాగంలో ఈ చిత్రం ప్రదర్శితమైంది. ఈ విభాగంలో ‘బెస్ట్ డైరెక్టర్’ అవార్డ్ గెల్చుకున్న ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్మేకర్గా ప్రత్యేకత నిలుపుకుంది రాయ్. ఈ చిత్రకథ విషయానికి వస్తే...బాలీవుడ్లో అవకాశాలు వెదుక్కుంటూ ఎక్కడినుంచో ముంబైకి వచ్చి ఒక అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటుంది తోయ. శ్వేత అనే మరో యువతి కూడా బతుకుదెరువు కోసం ముంబైకి వస్తుంది. కాల్–సెంటర్లో పనిచేసే శ్వేత, తోయతో పాటు అదే అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటుంది. కాలక్రమేణా వారి మధ్య నిశ్శబ్ద అనుబంధం ఏర్పడుతుంది. అది ఎలాంటి అనుబంధం, ఒకరినొకరు ఎలా అర్థం చేసుకున్నారనేదే సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్ కథ. పశ్చిమ బెంగాల్ పురులియ జిల్లాలోని నారాయణ్పూర్కు చెందిన అనుపర్ణరాయ్ ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ చేసింది. సినిమా రంగంలోకి రావడానికి ముందు దిల్లీలోని ఒక కాల్సెంటర్లో, ముంబైలో ఐటీ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసింది.హైప్ కాదు... సహజంగానే!దేశంలోని ప్రముఖ స్వతంత్ర చలనచిత్రోత్సవాలలో ఒకటిగా ఎదగాలని మేమూ ఎప్పుడూ అనుకోలేదు. అర్థవంతమైన, అద్భుత సినిమాలకు ప్రశాంతమైన పర్వతాలు వేదికగా ఉండాలని మాత్రం గట్టిగా అనుకున్నాం. హైప్ ద్వారా కాకుండా గత 14 సంవత్సరాలుగా డిఐఎఫ్ఎఫ్ సహజంగా అభివృద్ధి చెందింది. చిత్రనిర్మాతల అభిరుచి, ప్రేక్షకుల విశ్వాసం డిఐఎఫ్ఎఫ్ విజయానికి కారణం.– రీతు సరిన్, ఫిల్మ్ మేకర్, డిఐఎఫ్ఎఫ్ ఫౌండర్స్త్రీవాద కోణంలో..రేణుక షహానే మరాఠీ యానిమేటెడ్ లఘుచిత్రం ‘లూప్ లైన్’ డిఐఎఫ్ఎఫ్లో ప్రదర్శితం కానుంది. మధ్యతరగతి మహిళల జీవితాలపై తీసిన చిత్రం ఇది. రకరకాల భావోద్వేగాలతో పాటు, మాటలతో హింసించడం అనేది కుటుంబ వ్యవస్థలో ఎంత సాధారణంగా మారిందో చెబుతుంది లూప్ లైన్. స్త్రీవాద దృక్పథంతో తీసిన ఈ లఘుచిత్రం ఎన్నో చిత్రోత్సవాలలో ప్రదర్శించబడింది. తస్వీర్ ఫిల్మ్ ఫెస్టివల్, ముంబై షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రశంసలతో పాటు అవార్డులు కూడా అందుకుంది.స్త్రీ విముక్తితనిష్ట ఛటర్జీ దర్శకత్వం వహించిన ‘ఫుల్ ప్లేట్’ చిత్రం డిఐఎఫ్ఎఫ్లో ప్రదర్శితం కానుంది. తన దర్శకత్వలో వచ్చిన తొలిచిత్రం ‘రోమ్ రోమ్ మెయిన్’కు మేరీ క్లైర్ ఆసియా స్టార్ అవార్డ్ అందుకుంది. ‘ఫుల్ ప్లేట్’ అనేది స్త్రీ విముక్తికి సంబంధించిన చిత్రం. స్త్రీల సమస్యను సీరియస్గా కాకుండా చమత్కార రీతిలో చెప్పిన చిత్రం. ఈ చిత్రంలో వంటను సామాజిక శాస్త్ర విశ్లేషణ సాధనంగా చూపారు. -
టాలీవుడ్ స్పై డ్రామాగా 'చైనా పీస్'.. జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్
నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా తెరకెక్కిస్తోన్న స్పై డ్రామా చైనా పీస్. ఈ మూవీని అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమాను మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా అభిమానులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో హర్షిత, శ్రీషా హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా జేమ్స్ బాండ్ అనే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు దినేష్ కక్కర్ల లిరిక్స్ అందించగా.. స్పూర్తి జితేందర్, హారిక నారాయణ్ ఆలపించారు. ఈ పాటకు కార్తీక్ రోడ్రిగ్స్ సంగీతమందించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. -
ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్.. సింగారి ఫుల్ వీడియో వచ్చేసింది
డ్రాగన్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటేస్ట్ మూవీ డ్యూడ్. ఈ దీపావళికి థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతో డ్రాగన్ హీరో హ్యాట్రిక్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ను రిలీజ్ చేశారు. సింగారి అనే సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఈ లవ్ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. అక్టోబర్ 17న రిలీజైన ఈ చిత్రంలో శరత్కుమార్ కీలక పాత్ర పోషించారు. #Singari video song from #Dude out now 🤩🤩Tamil ▶️ https://t.co/W6GmIS2HeDTelugu▶️https://t.co/pU5RQH4swgVibe to this beautiful composition ❤️A @SaiAbhyankkar musical 🎼⭐ing 'The Sensational' @pradeeponelife🎬 Written and directed by @Keerthiswaran_Produced by… pic.twitter.com/hf6XMeMwE3— Mythri Movie Makers (@MythriOfficial) October 29, 2025 -
హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఇండియాలోనూ రిలీజ్
హాలీవుడ్ సైంటిఫిక్ హారర్ మూవీ ఇండియన్ అభిమానులను అలరించేందుకు వస్తోంది. డాన్ ట్రాచెన్బర్గ్ (Dan Trachtenberg) దర్శకత్వం వహించిన ప్రెడేటర్: బ్యాడ్లాండ్స్ (Predator: Badlands) ఇండియాలో రిలీజ్కు సిద్ధమైంది. హాలీవుడ్లో సత్తాచాటిన ఈ సినిమా నవంబర్ 7న మన థియేటర్లలో సందడి చేయనుంది. ఇంగ్లీష్తో పాటు హిందీ, తెలుగు, తమిళం భాషల్లో విడుదల కానుంది.దర్శకుడు ట్రాచెన్బర్గ్ ఈసారి ప్రెడేటర్ యూనివర్స్ను మునుపెన్నడూ లేని విధంగా తెరకెక్కించారు. కేవలం సర్వైవల్ గేమ్కు పరిమితం కాకుండా.. ప్రెడేటర్ హంట్ వెనుక ఉన్న లెజెండ్, యాట్జుజా కల్చర్, కోడ్ ఆఫ్ హానర్ లాంటి లోతైన కథాంశాలను డీల్ చేయడం ఫ్యాన్స్కు కొత్త అనుభూతిని ఇస్తోంది. అంతేకాకుండా డిమిట్రియస్ షస్టర్-కొలోమాటాంగీ, ఎల్లె ఫ్యానింగ్ జోడీ కెమిస్ట్రీ ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఏలియన్ హంట్ ఉద్రిక్తత మధ్యలో కూడా వారి మధ్య కనిపించే మానవత్వం, ఫ్రెండ్షిప్, హ్యూమర్ సినిమాకు సరికొత్త ఫీల్ తెచ్చేలా కనిపిస్తోంది. డాన్ ట్రాచెన్బర్గ్ సృష్టించిన ఈ ఎమోషనల్ అడ్వెంచర్ హంట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలంటే నవంబర్ 7 వరకు వేచి చూడాల్సిందే. -
సల్మాన్ ఖాన్కు రూ.200 కోట్లు.. నిర్మాత ఏమన్నారంటే?
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పేరు ఇటీవల తెగ వినిపిస్తోంది. ఆయనపై పాకిస్తాన్ ఉగ్రవాద ముద్ర వేయడంతో మరింత హాట్ టాపిక్గా మారింది. సౌదీ అరేబి యాలోని రియాద్లో జరిగిన కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ బలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా ప్రస్తావించారు. దీంతో పాక్ తన వక్రబుద్ధిని చూపుతూ సల్మాన్పై టెర్రిరిస్ట్ ముద్ర వేసింది.ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ ప్రస్తుతం హిందీ బిగ్బాస్ రియాలిటీ షో సీజన్-19కు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. అత్యంత భద్రతా వలయంలో ఈ షోను హోస్ట్ చేస్తున్నారు. అయితే గతంలో సల్మాన్ రెమ్యునరేషన్పై పెద్దఎత్తున రూమర్స్ వినిపించాయి. ఈ షో కోసం ఏకంగా రూ.200 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని వార్తలొచ్చాయి.(ఇది చదవండి: సల్మాన్పై పాక్ ఉగ్ర ముద్ర)తాజాగా ఈ వార్తలపై బిగ్బాస్ రియాలిటీ షో నిర్మాత రిషి నెగి రియాక్ట్ అయ్యారు. ఆయనకు రెమ్యునరేషన్ ఎంత ఇచ్చినా.. అందుకు అర్హుడని అన్నారు. ఆయనకు జియో హాట్స్టార్తో ఉన్న ఒప్పంద ప్రకారమే పారితోషికం ఉంటుందని తెలిపారు. అయితే అది ఎంత అనేది మాత్రం తాను చెప్పలేనన్నారు. కాగా.. సల్మాన్ ఖాన్.. బిగ్బాస్ హోస్ట్గా రూ.150 నుంచి రూ.200 కోట్లు తీసుకున్నారంటూ రూమర్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. -
అందమే కుళ్లుకునేలా.. శ్రీలీల ఇలా మృణాల్ అలా!
చీరలో అందమే అసూయపడేలా శ్రీలీలజిగేలుమనే చీరలో మెరిసిపోతున్న మృణాల్బర్త్ డే సెలబ్రేషన్స్లో ప్రియా వారియర్అబుదాబి ట్రిప్ ఫొటోలు షేర్ చేసిన ప్రియాంకడిమ్ లైటింగ్ వెలుతురులో మానస వారణాసివంకాయ రంగు చీరలో ఈషా రెబ్బా గ్లామర్ View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) -
స్పిరిట్ మూవీ.. ప్రభాస్ను అలా చూపించనున్నారా?
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘స్పిరిట్’. ఈ ప్రాజెక్ట్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ గురించి టాలీవుడ్లో పలు రకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మూవీలో ప్రభాస్ తండ్రిగా మెగా హీరో నటించబోతున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. స్పిరిట్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారని తెగ టాక్ వినిపించింది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఇటీవలే అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్డేను పురస్కరించుకుని ఆడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. 'సౌండ్ స్టోరీ ఆఫ్ ది ఫిలిం స్పిరిట్' అంటూ 1.31 నిమిషాల ఆడియో గ్లింప్స్ వదిలారు. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ గ్లింప్స్ రిలీజ్ చేశారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఈ చిత్రం కోసం సందీప్ రెడ్డి వంగా బిగ్ ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. యానిమల్తో బోల్డ్ డైరెక్టర్గా ముద్ర వేసుకున్న సందీప్ రెడ్డి.. ప్రభాస్ స్పిరిట్లోనూ అదే పంథాను ఫాలో అవుతున్నట్లు అర్థమవుతోంది. అందుకే స్పిరిట్లోనూ బోల్డ్ సన్నివేశాలు ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో ప్రభాస్ ఓ సీన్లో నగ్నంగా కనిపించనున్నారని వార్తలొస్తున్నాయి.గ్లింప్స్ డైలాగ్ వల్లే రూమర్స్..ఇటీవల విడుదలైన గ్లింప్స్లో ప్రకాశ్ రాజ్ చెప్పిన డైలాగ్.. ఈ వార్తకు బలం చేకూరుతోంది. ఖైదీని బట్టలూడదీసి టెస్టులకు పంపండి అనే చెప్పిన డైలాగ్తోనే టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రభాస్ సినిమాలో నగ్నంగా కనిపించే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగా యానిమల్లో రణ్బీర్ కపూర్ ఓ సీన్లో న్యూడ్గా కనిపించారు. అదే పంథాను స్పిరిట్ విషయంలో ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే స్టార్ హీరోలతో బోల్డ్ సీన్స్ చేయించడం ఒక్క సందీప్ రెడ్డికే సాధ్యమని చెప్పొచ్చు. కాగా.. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీతో బాలీవుడ్ భామ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. -
ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసిన మెమొరీ కార్డ్ పోతే?
ఒకప్పుడు పెళ్లంటే పెళ్లి మాత్రమే. ఇప్పుడు పెళ్లి అంటే అంతకంటే ముందు చాలా ఉంటాయి. అందులో ప్రీ వెడ్డింగ్ షూట్ ఒకటి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్పై తెలుగులో ఓ కామెడీ సినిమా తీశారు. అదే 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. మసూద మూవీ ఫేమ్ తిరువీర్ హీరోగా నటిస్తున్నాడు. టీనా శ్రావ్య హీరోయిన్. రాహుల్ శ్రీనివాస్ దర్శకుడు. నవంబర్ 7న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది బాగానే నవ్విస్తోంది.(ఇదీ చదవండి: మహేశ్ ఫ్యామిలీ నుంచి 'ఏడుగురు' వారసులు)ట్రైలర్ బట్టి చూస్తే.. పల్లెటూరిలో ఉండే హీరో ఓ ఫొటోగ్రాఫర్. ఓసారి ఓ జంటకు ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తాడు. అనుకుని పరిస్థితుల్లో షూట్ చేసిన ఫుటేజీ ఉన్న మెమొరీ కార్డ్ పోతుంది. తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఈ గండం నుంచి హీరో ఎలా బయటపడ్డాడనేదే స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్ అయితే నవ్విస్తోంది. కామెడీ కూడా సహజంగా కుదిరింది. మరి మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి?నవంబర్ 7న రష్మిక 'ద గర్ల్ ఫ్రెండ్', సుధీర్ బాబు 'జటాధర' చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వీటితోపాటు ఈ సినిమా కూడా రానుంది. మరి మూడింటిలో ఏది ప్రేక్షకుల్ని అలరిస్తుందో చూడాలి. ఇదే తేదీన తమిళ డబ్బింగ్ బొమ్మ 'ఆర్యన్' కూడా తెలుగులో విడుదల కానుంది.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
‘బాహుబలి: ది ఎపిక్’లో డిలీట్ చేసిన సీన్స్, పాటలు ఇవే : రాజమౌళి
బాహుబలి పార్ట్1, పార్ట్ 2 కలిసి ‘బాహుబలి: ది ఎపిక్’( Baahubali: The Epic)పేరుతో రీరిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న ఈ చిత్రం థియేటర్స్లో సందడి చేయబోతుంది. ఆరున్నర గంటల నిడివిని 3:45 గంటలకు కుదించి ‘బాహుబలి: ది ఎపిక్’ని తీర్చిదిద్దారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సినిమాలోని యాక్షన్స్ సీన్స్ అన్నింటిని కవర్ చేస్తూ ట్రైలర్ని కట్ చేశారు. అయితే రెండు సినిమాల్లోని సగం సన్నివేశాలను తీసేస్తేనే రన్టైమ్ 3.45 గంటలకు చేరింది. ఓ సినిమాకు ఇంత రన్టైమ్ ఉండడం కూడా ఇదే తొలిసారి. కానీ అంతకు మించి సన్నివేశాలను డిలీట్ చేసే అవకాశం లేదని రాజమౌళి అంటున్నారు. అప్పటికే ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను లేపేశారట. అంతేకాదు సూపర్ హిట్ సాంగ్స్ని కూడా డిలీట్ చేసినట్లు రాజమౌళి చెప్పారు. తాజాగా ఆయన ప్రభాస్(Prabhas), రానా(rana Daggubati)లతో కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో బాహుబలి చిత్రాల షూటింగ్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలాగే బాహుబలి ది ఎపిక్ లో కనిపించని సన్నివేశాలు ఏంటో కూడా రాజమౌళి చెప్పారు. ప్రభాస్-తమన్నాల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలను ‘ది ఎపిక్’లో చూడలేమట. అవంతిక లవ్స్టోరీ మొత్తాన్ని డిలీట్ చేసినట్లు రాజమౌళి చెప్పారు. అంతేకాదు పచ్చబొట్టేసిన, ఇరుక్కుపో, కన్నా నిదురించరా పాటలను కూడా తొలగించినట్లు రాజమౌళి పేర్కొన్నారు. యుద్ధానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా తొలగించామని రాజమౌళి అన్నారు. మొత్తంగా అవంతిక పాత్రకు సంబంధించిన సీన్లే ఎక్కువ డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. పార్ట్ 1లో పచ్చబొట్టు పాటతో పాటు దానికి ముందు వచ్చే సీన్లు బాగా ఆకట్టుకున్నాయి. -
మహారాణి మళ్లీ వస్తోంది.. ట్రైలర్ చూశారా?
బాలీవుడ్ భామ హేమా ఖురేషి(Huma Qureshi) ప్రధాన పాత్రలో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ మహారాణి(Maharani Season 4). ఇప్పటికే రిలీజైన మూడు సీజన్లు ఓటీటీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. క్రైమ్ థ్రిల్లర్స్కు ఆదరణ ఉన్న ఈ రోజుల్లో మహారాణి హిట్గా నిలవడంతో మేకర్స్ మరో సీజన్ను తెరకెక్కించారు. తాజాగా నాలుగో సీజన్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సీజన్ వచ్చేనెల 7 నుంచి స్ట్రీమింగ్కు రానుంది. ప్రముఖ ఓటీటీ సోనీ లివ్లో సందడి చేయనుంది. తాజాగా రిలీజైన ట్రైలర్ ఈ సీజన్పై మరింత ఆసక్తి పెంచుతోంది. మహారాణి తొలి సీజన్ 2021లో రాగా.. ఆ తర్వాత 2022లో రెండో సీజన్, 2024లో మూడో సీజన్ అభిమానులను అలరించాయి. నాలుగో తరగతి పాసైన ఓ సాధారణ గృహిణి సీఎంగా మారి.. రాజకీయంగా అక్రమాలకు పాల్పడే ఎలా చెక్ పెట్టిందనే కోణంలో ఈ సిరీస్ను రూపొందించారు. ఈ వెబ్ సిరీస్లో శ్వేతా బసు ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనుంది. -
మహేశ్ ఫ్యామిలీ నుంచి 'ఏడుగురు' వారసులు
ఇండస్ట్రీలో ఒకే కుటుంబం నుంచి ఎక్కువమంది వారసులు అనగానే మెగా లేదంటే నందమూరి ఫ్యామిలీలే గుర్తొస్తాయి. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల నుంచి హీరోలు ఉన్నప్పటికీ వేళ్లపై లెక్కపెట్టేంత మంది ఉన్నారు. త్వరలో ఈ లిస్టులోకి ఘట్టమేనేని కుటుంబం కూడా చేరనుంది. ఎందుకంటే ఒకరిద్దరు కాదు ఏకంగా ఏడుగురు వరకు వారసులు.. రాబోయే కొన్నేళ్లలో ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. ఇంతకీ వాళ్లెవరు? ఏంటి సంగతి?(ఇదీ చదవండి: 'బాహుబలి', 'మాస్ జాతర' కోసం సైడ్ అయిపోయిన హీరో)సూపర్స్టార్ కృష్ణ వారసుడిగా రమేశ్ బాబు, మహేశ్ బాబు ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే హీరోగా ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికీ రమేశ్ బాబు పెద్దగా నిలదొక్కుకోలేకపోయాడు. మహేశ్ బాబు మాత్రం స్టార్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం రాజమౌళితో మూవీ చేస్తున్నాడు. మహేశ్ అక్క మంజుల పలు చిత్రాల్లో సహాయ పాత్రలు చేశారు తప్పితే హీరోయిన్ కాలేకపోయారు.తర్వాత తరానికి వస్తే.. మహేశ్ బాబు చెల్లి ప్రియదర్శని భర్త సుధీర్ బాబు ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్నాడు. గల్లా జయదేవ్ కొడుకు అంటే మహేశ్కి మేనల్లుడు అశోక గల్లా కూడా హీరోగా రెండు మూడు మూవీస్ చేశాడు. కాకపోతే పెద్దగా గుర్తింపు రాలేదు. వీళ్ల కాకుండా ఇప్పుడు తర్వాత తరం కూడా చాలామంది సిద్ధమైపోయారు. కొందరు అవుతున్నారు.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)ముందుగా మహేశ్ కొడుకు గౌతమ్ విషయానికొస్తే ప్రస్తుతం అమెరికాలో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. త్వరలోనే ఎంట్రీ ఉండొచ్చు. కూతురు సితార ఇప్పటికే తండ్రితో కలిసి పలు యాడ్స్ చేసింది. సినిమాల్లోని పాటల్లోనూ అతిథిగా కనిపించింది. ఈమెది ఇంకా చిన్న వయసే. కాబట్టి హీరోయిన్ కావడానికి ఇంకా చాలా టైమ్ ఉంది.మహేశ్ బాబు అన్న రమేశ్ బాబు కొడుకు జయకృష్ణ ఇప్పటికే హీరోగా తొలి సినిమా చేసేందుకు సిద్ధమైపోతున్నాడు. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి తీయబోయే కొత్త సినిమాతో జయకృష్ణ హీరోగా పరిచయం కానున్నాడని టాక్. రమశ్ బాబు కుమార్తె భారతి కూడా నటి అయ్యేందుకు ఆసక్తి ఉందని తెలుస్తోంది.తాజాగా మహేశ్ సోదరి మంజుల కూడా తన కూతురు జాన్వి.. త్వరలో సినిమాల్లోకి రానుందని చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఈమె కూడా త్వరలోనే హీరోయిన్ అయ్యేలా కనిపిస్తుంది. మరోవైపు సుధీర్ బాబు కూడా తన కొడుకుల్ని ఇండస్ట్రీలోకి తీసుకొస్తానని చాన్నాళ్ల క్రితమే చెప్పాడు. అందుకు తగ్గట్లే పెద్ద కొడుకు చరిత్ మాసస్.. ఇప్పటికే అన్ని రకాల ట్రైనింగ్ తీసుకుంటుండగా.. చిన్న కొడుకు దర్శన్ కూడా 'ఫౌజీ'లో యంగ్ ప్రభాస్గా కనిపించబోతున్నాడని టాక్.పైన చెప్పిన లిస్ట్ చూస్తే ఒకరిద్దరూ కాదు ఏకంగా ఏడుగురు వారసులు.. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి రాబోయే కొన్నేళ్లలో ఇండస్ట్రీలోకి రాబోతున్నారనమాట. మరి వీళ్లలో ఎవరు ఎప్పుడొస్తారు? ఎవరు నిలదొక్కుకుంటారనేది చూడాలి?(ఇదీ చదవండి: నేను కూడా చిరుతో అప్పట్లో అనుకున్నా.. కానీ: మాళవిక మోహనన్) -
కిరణ్ అబ్బవరం కె ర్యాంప్.. క్రేజీ సాంగ్ ఫుల్ వీడియో
కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన తాజా చిత్రం కె-ర్యాంప్. దీపావళి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. జైన్స్ నాని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా మెప్పించింది. ఈ మూవీని రాజేశ్ దండ, శివ బొమ్మ సంయుక్తంగా నిర్మించారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలోని ఓనమ్ అనే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ కిరణ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. యూత్ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ను అలరించింది. ఇంకెందుకు ఆలస్యం ఓనమ్ ఫుల్ సాంగ్ను చూసి ఎంజాయ్ చేయండి. -
రవితేజ ఫ్యాన్స్ సర్ప్రైజ్లు చూడబోతున్నారు
నేను రవితేజకి అభిమానిని. ఆయన ఖాకీ డ్రెస్ వేసిన సినిమాలు ఎంతటి విజయాన్ని సాధించాయో తెలుసు. దానిని దృష్టిలో పెట్టుకొని ‘మాస్ జాతర’ స్క్రిప్ట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. రవితేజ ఫ్యాన్స్ ఆశించే అంశాలన్నీ ఇందులో ఉంటాయి’ అన్నారు దర్శకుడు భాను భోగవరపు. ఆయన దర్శకత్వంలో రవితేజ, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ భాను భోగవరపు తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ మాస్ కథ అంటే మొదట గుర్తుకొచ్చే పేరు రవితేజ . ఆయనను దృష్టిలో పెట్టుకునే ఈ కథ(Mass Jathara Movie) రాశాను. రవితేజ పోలీస్ సినిమాలు కొన్ని చేశారు. అందుకే కొత్తగా ఉండేలా ఈ రైల్వే పోలీస్ కథని రాసుకున్నాను.→ ఇందులో మాస్ అంశాలు ఉంటాయి. అదే సమయంలో ఒక కొత్త పాయింట్ కూడా ఉంటుంది. రైల్వే పోలీస్ నేపథ్యంలో ఈ కథ జరుగుతుంది. ఆ నేపథ్యంలో జరిగే క్రైమ్ కొత్తగా ఉంటుంది. సన్నివేశాలు కూడా కొత్తగా ఉంటాయి.→ 'మాస్ జాతర' అనే టైటిల్ రవితేజ గారే చెప్పారు. కథ విన్న తర్వాత వినోదంతో పాటు అన్ని అంశాలు బాగున్నాయి అంటూ ఆయన ఈ టైటిల్ సూచించారు. ఆ టైటిల్ తర్వాత నాపై బాధ్యత మరింత పెరిగింది. మాస్ అంశాలు మరిన్ని జోడించాను. థియేటర్ లో ప్రేక్షకులు కొన్ని సర్ ప్రైజ్ లు చూడబోతున్నారు.→ ఇది కల్పిత కథే. అయితే ఈ కథ కోసం ఎంతో రీసెర్చ్ చేశాను. పలువురు రైల్వే పోలీస్ అధికారులను కలిసి వారి అధికారాల గురించి, వారు ఎదుర్కొన్న సంఘటల గురించి తెలుసుకున్నాను. వాటి స్ఫూర్తితో ఈ కథకు తగ్గట్టుగా కొన్ని సన్నివేశాలు రాసుకోవడం జరిగింది.→ రవితేజ(Ravi Teja)కు ఇది 75వ చిత్రమని మాకు ముందు తెలియదు. రవితేజకి కథ నచ్చి, సినిమా ఓకే అయిన తర్వాత.. అప్పుడు లెక్కేస్తే 75వ సినిమా అని తెలిసింది. కథ బాగుంది, ఈ నెంబర్ల గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా సినిమా చేయమని రవితేజ నన్ను ఎంతో ప్రోత్సహించారు.→ ఈ కథను రాసుకున్నప్పడే తులసి పాత్రకు శ్రీలీల(Sreeleea)ను తీసుకోవాలనుకున్నాను. , కథ వింటున్నప్పుడు హీరో, నిర్మాతలు మాకు తెలియకుండానే.. హీరోయిన్ శ్రీలీల అని అనుకున్నారు. ధమాకా జోడి కాబట్టి శ్రీలీల తీసుకోవాలనే ఆలోచన మాకు లేదు. తులసి పాత్ర అనగానే మా అందరికీ శ్రీలీల గుర్తుకొచ్చారు. ఆమె పాత్రకు సినిమాలో ఎంతో ప్రాధాన్యముంది. గత చిత్రాలతో పోలిస్తే ఇందులో శ్రీలీల కొత్తగా కనిపిస్తారు. గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి-విజయశాంతి మధ్య సన్నివేశాలు ఎలాగైతే కామెడీ టచ్ తో మాసీగా ఉంటాయో.. ఇందులో రవితేజ గారు-శ్రీలీల మధ్య సన్నివేశాలు అలా ఉంటాయి.→ దర్శకుడిగా నాకిది మొదటి సినిమా అయినప్పటికీ నిర్మాత నాగవంశీ ఎంతో మద్దతుగా నిలిచారు. నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఖర్చుకి ఎక్కడా వెనకాడకుండా ఆరున్నర కోట్లతో స్టేషన్ సెట్ వేయించారు. అలాగే జాతర ఎపిసోడ్ కోసం ఓ భారీ సెటప్ కూడా చేయించారు. ఓ కొత్త దర్శకుడికి ఎక్కడ రాజీపడకుండా ఇంతటి సహకారం అందించడం మామూలు విషయం కాదు.→ ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం రవితేజ ఎంతో కష్టపడ్డారు. ఒకసారి కాలికి, మరోసారి చేతికి గాయాలయ్యాయి. అందుకే చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది. అయినప్ప్పటికీ, రవితేజ సహకారం వల్లనే ఈ సినిమాని ఒత్తిడి లేకుండా పూర్తి చేయగలిగాను.→ రచయితగా కొన్ని సినిమాలు చేస్తున్నాను. అలాగే, దర్శకుడిగా రెండో సినిమా కోసం కథ సిద్ధం చేస్తున్నాను. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తాను. -
'బాహుబలి', 'మాస్ జాతర' కోసం సైడ్ అయిపోయిన హీరో
ఈ వీకెండ్ థియేటర్లలోకి 'బాహుబలి ఎపిక్' రానుంది. రెండు భాగాల్ని కలిపి ఒకే మూవీగా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి, ప్రభాస్, రానా కలిసి స్పెషల్ వీడియో ఒకటి చేశారు. దాన్ని తాజాగా రిలీజ్ కూడా చేశారు. ఇది రిలీజైన ఒకరోజు తర్వాత రవితేజ 'మాస్ జాతర'.. బిగ్ స్క్రీన్పైకి రానుంది. ఇది కాకుండా ఓ తమిళ డబ్బింగ్ మూవీ కూడా రావాల్సింది. కానీ తెలుగు మూవీస్ కోసం సదరు తమిళ హీరో సైడ్ అయిపోయాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)తమిళ హీరో విష్ణు విశాల్ లీడ్ రోల్ చేసి, నిర్మించిన సినిమా 'ఆర్యన్'. మానస చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, సెల్వ రాఘవన్ కీలక పాత్రలు పోషించారు. ప్రవీణ్ కె. దర్శకత్వం వహించారు. లెక్క ప్రకారం ఈ 31వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో విడుదల కావాలి. శ్రేష్ట్ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆర్యన్ని విడుదల చేస్తున్నారు. కానీ బాహుబలి రీ రిలీజ్, మాస్ జాతర కారణంగా తెలుగులో ఈ చిత్రాన్ని వారం ఆలస్యంగా అంటే నవంబరు 7న రిలీజ్ చేయనున్నారు. తమిళంలో మాత్రం యధావిధిగానే థియేటర్లలోకి రానుంది.'మా 'ఆర్యన్' ఈ నెల 31న విడుదల కావాల్సి ఉంది. ఈ ప్రత్యేక తేదీన రవితేజగారి 'మాస్ జాతర'తో పాటు 'బాహుబలి ది ఎపిక్' సినిమాలు తెలుగు ప్రేక్షకులను ముందుకు రావడం మరింత ప్రత్యేకమైనది. ఆ సినిమాలను సెలబ్రేట్ చేసుకోవడం సరైనదని భావిస్తున్నాను. 'ఆర్యన్' నవంబరు 7న తెలుగులోకి వస్తుంది. నా నిర్ణయానికి అండగా నిలిచిన మా డిస్ట్రిబ్యూటర్లు సుధాకర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డికి థ్యాంక్స్' అని విష్ణు విశాల్ ఒక ప్రకటన విడుదల చేశాడు.(ఇదీ చదవండి: నేను కూడా చిరుతో అప్పట్లో అనుకున్నా.. కానీ: మాళవిక మోహనన్) View this post on Instagram A post shared by Vishnu Vishal (@thevishnuvishal) -
రోజుకు 22 గంటలు షూటింగ్లోనే.. నేలపై నిద్రపోయేవాడిని!
కార్పొరేట్ ఆఫీసుల్లో ఎలాగైతే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఉద్యోగాలు చేస్తారో.. సినిమా ఇండస్ట్రీలోనూ అలాంటి టైమింగ్ ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు షూటింగ్స్ అంటే కష్టం.. అందులోనూ లెక్క లేకుండా రోజంతా ఎక్కువ గంటలు పని చేయించుకుంటామంటే కుదరదు, 8 గంటల షిఫ్టే ఉండాలి అని దీపికా పదుకొణె వంటి స్టార్ హీరోయిన్స్ కొత్త కండీషన్స్ పెడుతున్నారు.సరిగా నిద్రుండేది కాదుఈ డిమాండ్లకు కొందరు నిర్మాతలు కుదరదని కరాఖండిగా తేల్చి చెప్తున్నారు. అయితే రోజుకు ఎనిమిది గంటలు కాదు, ఏకంగా 22 గంటలు పని చేసేవాడిని అని చెప్తున్నాడు హిందీ బిగ్బాస్ కంటెస్టెంట్, బుల్లితెర నటుడు హితేన్ తేజ్వాని (Hiten Tejwani). తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. కెరీర్ తొలినాళ్లలో నిద్రపోవడానికి కూడా సమయం ఉండేది కాదు. నెలలో 30 ఎక్స్ట్రా షిఫ్టులు చేసేవాడిని. నా చెక్ నేనే వెళ్లి తెచ్చుకునేవాడిని. రూ.1 లక్ష చెక్ అందుకోగానే సంబరపడిపోయేవాడిని.ఛాన్స్ దొరికితే నేలపై నిద్రపొద్దున 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు షూటింగ్ అనేవారు. తీరా అది ఉదయం ఐదింటివరకు సాగేది. రెండు గంటల గ్యాప్తో నెక్స్ట్ షిఫ్ట్ మొదలయ్యేది. అలా 22 గంటలు పనిచేసేవాడిని. మిగతా రెండుగంటలు నేలపై నిద్రించేవాడిని. నా టైమింగ్స్ నచ్చక చాలామంది డ్రైవర్స్ సడన్గా పని మానేసేవారు. దాంతో నేనే కారు నడిపేవాడిని, ఓసారైతే డివైడర్ను ఢీ కొట్టాను. నిజానికి వేరే ఉద్యోగం చూసుకుంటే పనిగంటలు తక్కువ ఉండేవి, ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదని చాలాసార్లు అనుకున్నాను. అయినా ఇష్టపడి, కష్టపడి ఈ స్థాయికి వచ్చాను అని చెప్పుకొచ్చాడు.సీరియల్స్హితేన్.. సుకన్య, ఘర్ ఏక్ మందిర్, కభీ సౌతన్ కభీ సహేలి సీరియల్స్లో చిన్న పాత్రలు చేసేవాడు. కుటుంబ్ సీరియల్తో బ్రేక్ అందుకున్నాడు. క్యూంకీ సాస్ భీ కభీ బహుతీ, కుసుమ్, బాలికా వధు, కసౌటీ జిందగీ కే వంటి పలు ధారావాహికలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం క్యూంకీ సాస్ భీ కభీ బహు తీ 2 సీరియల్ చేస్తున్నాడు. హిందీ బిగ్బాస్ 11వ సీజన్లోనూ పాల్గొన్నాడు.చదవండి: టాస్కుల్లో పవన్ను కొట్టేవాడే లేడు.. ఆస్పత్రిలో భరణి! -
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు చాన్నాళ్ల క్రితం రిలీజైన చిత్రాల్ని కూడా ఎలాంటి హడావుడి లేకుండా స్ట్రీమింగ్లోకి తీసుకొస్తుంటారు. ఇప్పుడు అలానే గతేడాది రిలీజైన ఓ తెలుగు మూవీ.. ఇప్పుడు సడన్గా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆరు కథల ఆంథాలజీతో తీసిన ఈ చిత్రం.. ఏ ఓటీటీలో చూడొచ్చు? ఇంతకీ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.కొన్నేళ్ల క్రితం ఆంథాలజీ ట్రెండ్ బాగానే నడిచింది. తెలుగులోనూ కేరాఫ్ కంచరపాలెం, చందమామ కథలు, పంచతంత్రం లాంటి ఒకటి రెండు మూవీస్ వచ్చాయి. ఇదే జానర్లో గతేడాది సెప్టెంబరులో థియేటర్లలోకి వచ్చిన మూవీ 'లైఫ్ స్టోరీస్'. ఆరు కథలు, 11 మంది యాక్టర్స్ నటించిన ఈ సినిమాలో స్నేహం, సంతోషం, ఒంటరితనం, పశ్చాత్తపం, యవ్వనపు ప్రేమ, సాంగత్యం అనే కాన్సెప్ట్తో తీశారు. ఈ కథలన్నీ చివరలో లింక్ చేశారు.(ఇదీ చదవండి: నేను కూడా చిరుతో అప్పట్లో అనుకున్నా.. కానీ: మాళవిక మోహనన్)థియేటర్లలో రిలీజైనప్పుడు ఓ మాదిరి రెస్పాన్స్ అందుకున్న 'లైఫ్ స్టోరీస్'.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతానికైతే అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. కొన్నిరోజుల్లో ఉచితంగానూ అందుబాటులోకి రావొచ్చు. ఈ ఆంథాలజీ చిత్రంలో క్యాబ్ క్రానికల్స్, ది మామ్, గ్లాస్ మేట్స్, జిందగీ, బంగారం, ది వైల్డ్ హట్స్ అనే టైటిల్స్తో స్టోరీలని చూపించారు. అన్నీ కూడా డీసెంట్గానే ఉంటాయి. కుదిరితే ఓ లుక్కేయండి.'లైఫ్ స్టోరీస్' విషయానికొస్తే.. ఇంజినీర్గా జాబ్ చేసి మనశ్శాంతి లేకపోవడంతో ఓ వ్యక్తి డ్రైవర్గా మారతాడు. ఓ రోజు సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఈ క్యాబ్ ఎక్కుతాడు. వీళ్ల మధ్య జరిగిన సంభాషణ ఏంటి అనేది ఓ స్టోరీ. తల్లితో(దేవయాని) కలిసి ఆనందంగా గడపాలని ఓ చిన్నారి ఆశపడుతుంటాడు. కానీ ఉద్యోగం కారణంగా కొడుక్కి సదరు తల్లి అస్సలు సమయం ఇవ్వలేకపోతూ ఉంటుంది. కొడుకు ఆనందం కోసం తల్లి తీసుకున్న నిర్ణయం ఏంటనేది ఓ స్టోరీ.(ఇదీ చదవండి: ఎట్టకేలకు రజనీకాంత్ షాకింగ్ నిర్ణయం?)సతీష్.. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేందుకు భార్యతో కలిసి ఓ రిసార్ట్కి వెళ్తాడు. అక్కడ అనుకోకుండా తన చిన్ననాటి స్నేహితుడు మంగేశ్ కనిపిస్తాడు. మాట్లాడుతూ వీళ్లిద్దరూ బాల్యంలోకి వెళ్లిపోతారు. మరోవైపు వీళ్లిద్దరి భార్యల మధ్య సాగిన డిస్కషన్ ఏంటనేది మరో స్టోరీ. ఐటీ ఉద్యోగి పీయూష్.. తన ప్రియురాలితో కలిసి కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్లాన్ రివర్స్ అవుతుంది. దీంతో ఒంటరిగానే వికారాబాద్ వెళ్లాల్సి వస్తుంది. ఇంతకీ ఏమైందనేది ఓ స్టోరీ.మంగమ్మ.. రోడ్ పక్కన ఓ టీ దుకాణం నడుపుతూ ఉంటుంది. ఈమె ఒంటరి జీవితంలోకి ఓ కుక్క వస్తుంది. దీంతో ఆ శునకానికి బంగారం అని పేరు పెట్టి పెంచుకుంటుంది. మరి బంగారంతో మంగమ్మకు ఎలాంటి బాండింగ్ ఏర్పడింది? అనేది ఓ స్టోరీ. శ్రియా.. తన భర్తతో కలిసి న్యూఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటుంది. కానీ బాస్ పనిఅప్పజెప్పడంతో ఆఫీస్లోనే ఉండిపోతుంది. మరి భర్తతో కలిసి పార్టీ చేసుకోవాలనే కోరిక తీరిందా లేదా అనేది మరో స్టోరీ.(ఇదీ చదవండి: హీరోయిన్గా మహేశ్బాబు మేనకోడలు ఎంట్రీ) -
సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ మూవీ
కొన్ని పాత్రలు చేయాలంటే దమ్ముండాలి. అది మలయాళ హీరో అర్జున్ అశోకన్కు కావాల్సినంత ఉంది. అర్జున్ 'తలవర' సినిమా (Thalavara Movie)లో బొల్లి వ్యాధితో బాధపడే యువకుడిగా నటించాడు. ఈ వ్యాధి కారణంగా అనేక అవమానాలను ఎదుర్కొంటాడు. కుటుంబం నుంచి సమాజం వరకు తనకు ఎదురయ్యే అనుభవాల కథే తలవర. ఈ సినిమా మలయాళంలో ఆగస్టు 22న థియేటర్లలో విడుదలైంది. రెండు నెలల తర్వాత ఓటీటీలోవసూళ్లు పెద్దగా రాలేదు కానీ కంటెంట్కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అఖిల్ అనిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీకి వచ్చింది. బుధవారం సడన్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రత్యక్షమైంది. తెలుగు డబ్బింగ్ లేదు, కేవలం మలయాళ భాషలోనే అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్టైటిల్స్ ఉన్నాయి. ఈ సినిమాలో రేవతి శర్మ హీరోయిన్గా నటించింది. సినిమాఅశోకన్, దేవదర్శిని, అభిరామి రాధాకృష్ణన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కిలి, విజయానంద్ సంగీతం అందించారు. ఈ మూవీ రిలీజైన ఐదారు రోజులకే అక్కడ కల్యాణి ప్రియదర్శిని లోక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో తలవర సినిమా వెనకబడిపోయింది. తలవర కంటే ముందు అర్జున్ అశోకన్.. సుమతి వలవు సినిమాతో మెప్పించాడు. ఈ మలయాళ మూవీ దాదాపు రూ.25 కోట్లు రాబట్టింది. #Thalavara (Malayalam)Now streaming on Primevideo 🍿!!#OTT_Trackers pic.twitter.com/kgHjNAjL8h— OTT Trackers (@OTT_Trackers) October 29, 2025 చదవండి: మరోసారి పోలీసులను ఆశ్రయించిన చిరంజీవి -
ప్రశాంత్ వర్మ ‘మహాకాళి’ అప్డేట్.. ఆ రక్తం ఏంటి?
‘హనుమాన్’ తర్వాత ప్రశాంత్ వర్మ(Prasanth Varma) తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి వరుస ప్రాజెక్టులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి ‘మహాకాళి’(Mahakali Movie ). ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ స్టోరీ , స్క్రీన్ప్లే అందిస్తున్నారు. దర్శకురాలు పూజ కొల్లూరు తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా కీలక పాత్ర పోషిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ రాబోతుంది. అక్టోబర్ 30న ఉదయం 10:08 గంటలకు 'మహాకాళి' నుంచి ఏదో పవర్ఫుల్ అప్డేట్ రిలీజ్ చేయనున్నట్లు టీమ్ ప్రకటించింది. ఈ అనౌన్స్మెంట్తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఇందులో రక్తంతో తడిసిన ఓ చేయి, దానికి నిండుగా బంగారు గాజులు ఉన్నాయి. నల్లటి నేలపై ఒక ఆయుధం పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చూపించారు. ఆ పోస్టర్పై అంతం లేని వినాశన జ్వాల మేల్కొంది అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్టర్ చూస్తుంటే.. సినిమాలోని కాళిమాతా లుక్లా కనిపిస్తోంది. ఆమెను చాలా పవర్ఫుల్గా చూపించబోతున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. అయితే టైటిల్ రోల్ ఎవరు చేస్తున్నారనేది ఇంతవరకు రివీల్ చేయలేదు. రేపు ఇచ్చే అప్డేట్లో ఈ విషయం తెలియజేస్తారా? లేదా? అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. కాగా, ఈ చిత్రంలో శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా నటించబోతున్నాడు. ఆయన ఫస్ట్లుక్ని కూడా రిలీజ్ చేశారు. ఇండియాలోనే తొలి లేడీ సూపర్ హీరో మూవీగా మహాకాళి రానుంది. #Mahakali 🔱@RKDStudios #RKDuggal @PujaKolluru #AkshayeKhanna#RiwazRameshDuggal @ThePVCU pic.twitter.com/CALH4jdCqV— Prasanth Varma (@PrasanthVarma) October 29, 2025 -
నేను కూడా అప్పట్లో అనుకున్నా.. కానీ అది అబద్ధం
చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకరవరప్రసాద్ గారు' అనే సినిమా చేస్తున్నారు. ఇది కాకుండా 'విశ్వంభర' కూడా లైన్లో ఉంది. లెక్క ప్రకారం విశ్వంభర ఈ పాటికే థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా చాలా ఆలస్యం చేసేశారు. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు కాకుండా మరో రెండు ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి.చిరు.. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. కొన్ని నెలల క్రితం దీని గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. వచ్చే ఏడాది ప్రారంభమయ్యే ఈ చిత్రంలో తమిళ హీరో కార్తీ నటించనున్నాడని, ఏకంగా రూ.23 కోట్ల రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేశాడనే రూమర్స్. సరే ఇదంతా పక్కనబెడితే ఈ ప్రాజెక్టులో చిరంజీవి సరసన మాళవిక మోహనన్ నటిస్తుందనే టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు ఈ విషయమై స్వయంగా మాళవికనే స్పందించింది. క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేసింది.(ఇదీ చదవండి: ఎట్టకేలకు రజనీకాంత్ షాకింగ్ నిర్ణయం?)'డైరెక్టర్ బాబీ తీయబోయే 'మెగా 158' ప్రాజెక్టులో నేను ఉన్నానని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. నేను కూడా చిరంజీవి సర్తో నటించాలని ఓ దశలో అనుకున్నా. కానీ ఇప్పుడు క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను. ఈ ప్రాజెక్టులో నేను లేను. వినిపిస్తున్న రూమర్స్ నిజం కాదు' అని మాళవిక మోహనన్ ట్వీట్ చేసింది.మాళవిక చెప్పేసింది కాబట్టి ఈ ప్రాజెక్టులో హీరోయిన్ ఎవరనేది తేలాల్సి ఉంది. బాబీ కాకుండా యువదర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా చిరంజీవితో ఓ మూవీ చేయనున్నాడు. దీని గురించి కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడో వచ్చేసింది. ఇది వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మొదలయ్యే అవకాశముంది.(ఇదీ చదవండి: హీరోయిన్గా మహేశ్బాబు మేనకోడలు ఎంట్రీ) -
మరోసారి పోలీసులను ఆశ్రయించిన చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మరోసారి పోలీసులను ఆశ్రయించారు. తనపై ఎక్స్ (ట్విటర్)లో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారంటూ దయా చౌదరి అనే వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. ఇటీవల హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఇంకా ఇలాంటి పోస్టులు పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.డీప్ ఫేక్ వీడియోలుఇటీవల చిరంజీవి డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలపై పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే! ఏఐ సాయంతో కొందరు ఆయన ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు సృష్టించి.. వాటిని పలు వెబ్సైట్లలో వైరల్ చేశారు. దీనిపై ఆగ్రహించిన చిరు.. సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే కోర్టును సైతం ఆశ్రయించారు. చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటోలు, వాయిస్ను ఎవరూ ఉపయోగించకూడదని సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.చదవండి: టాస్కుల్లో పవన్ను కొట్టేవాడే లేడు.. ఆస్పత్రిలో భరణి! -
ఎట్టకేలకు రజనీకాంత్ షాకింగ్ నిర్ణయం?
సూపర్స్టార్ రజనీకాంత్ షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నారా? అంటే తమిళ మీడియాలో అవుననే సమాధానం వినిపిస్తుంది. ప్రస్తుతం ఈయన 'జైలర్ 2' చేస్తున్నారు. ఇది కాకుండా మరో రెండు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయని, వీటిని పూర్తి చేసిన తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంత? అనేది ఇప్పుడు చూద్దాం.చెప్పాలంటే ఈ పాటికే రజనీకాంత్ రిటైర్మెంట్ ఇచ్చేసేవారేమో! ఎందుకంటే 2010లో 'రోబో' చేసిన తర్వాత సినిమాలైతే చేస్తూ వచ్చారు గానీ ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ కాలేదు. మధ్యలో 'రోబో 2.0' కొంతమేర పర్వాలేదనిపించింది. అయితే 'జైలర్' బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం ఈయనకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్లుంది. దీంతో లాల్ సలాన్, వేట్టయాన్ చిత్రాలు చేశారు. కానీ ఇవి ఫ్లాప్ అయ్యాయి. ఈ ఏడాది 'కూలీ'తో ఏకంగా రూ.1000 కోట్ల మార్క్ కొట్టేస్తారని రిలీజ్కి ముందు అందరికీ అనిపించింది. కానీ రూ.500 కోట్ల దగ్గరకు వచ్చి ఆగిపోయింది.(ఇదీ చదవండి: కుటుంబంతో సహా చనిపోదామనుకున్నా.. ఆ హీరో వల్లే బతికా!)ప్రస్తుతానికైతే నెల్సన్ దర్శకత్వంలో రజనీ.. 'జైలర్ 2' చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత కమల్ హాసన్తో మల్టీస్టారర్ చేయబోతున్నారు. ఈ చిత్రం త్వరలో మొదలు కానుంది. అయితే ఈ మూవీకి కూడా నెల్సన్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. దీనితో పాటు సుందర్.సి దర్శకత్వంలోనూ రజనీ ఓ సినిమా చేయబోతున్నారని సమాచారం. ఈ రెండు ప్రాజెక్టులు అయిపోయిన తర్వతా రజనీ.. రిటైర్మెంట్ ఇచ్చేస్తారట. ప్రస్తుతానికి ఈ రూమర్స్పై అధికారిక సమాచారం లేనప్పటికీ దాదాపు ఇదే కన్ఫర్మ్ అని ఆయన సన్నిహితులు అంటున్నారు.ఈ రెండు సినిమాలే రజనీకాంత్ చేసేటప్పటికీ ఎలా లేదన్నా 2027 అయ్యే అవకాశముంది. అప్పుడు వయసు కూడా కాస్త మీదపడుతుంది. మరి వినిపిస్తున్నట్లు రిటైర్మెంట్ ఇచ్చేస్తారా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: హీరోయిన్గా మహేశ్బాబు మేనకోడలు ఎంట్రీ) -
టాస్కుల్లో పవన్ను కొట్టేవాడే లేడు.. ఆస్పత్రిలో భరణి!
తెలుగు బిగ్బాస్ సీజన్ 9.. ఇది చదరంగం కాదు, రణరంగమే అన్న ట్యాగ్లైన్కు నేటి ఎపిసోడ్ పూర్తిస్థాయిలో న్యాయం చేయనున్నట్లు కనిపిస్తోంది. రీఎంట్రీ కోసం శ్రీజ, భరణి.. ఇద్దరు రెడీ అయ్యారు. ఈ ఇద్దరూ హౌస్మేట్స్లో నుంచి కొందరిని ఎన్నుకుని రెండు టీములుగా విడిపోవాల్సి ఉంటుంది. ఆ టీమ్ మెంబర్స్ ఆయా కంటెస్టెంట్ కోసం గేమ్ ఆడి గెలవాలి.కంటెస్టెంట్స్కి దెబ్బలురీఎంట్రీ అంటే మామూలు విషయం కాదు.. అందుకే ఏదో మామూలు టాస్క్లకు బదులుగా మంచి టాస్కులే ప్లాన్ చేశారు. అలా బిగ్బాస్ (Bigg Boss Telugu 9) పెట్టిన గేమ్లో హౌస్మేట్స్ కిందామీదా పడి ఆడి, దెబ్బలు తగిలించుకుని గాయపడ్డారట! భరణిని అయితే ఏకంగా గాయంతో హౌస్ నుంచి బయటకు తీసుకెళ్లారు. ఏమైనా ఫ్రాక్చర్ అయ్యారా? అని హాస్పిటల్కు తీసుకెళ్లి స్కానింగ్స్ చేయించారు.మట్టికరిపించిన పవన్అక్కడ బానే ఉందని రిపోర్ట్స్ రావడంతో తిరిగి అతడిని హౌస్కు పంపించారు. అయితే అందరి ఆట ఒకెత్తయితే.. డిమాన్ పవన్ ఆట మాత్రం మరో ఎత్తు. చేతులతో నిఖిల్ను కట్టడి చేస్తే కాళ్లతో భరణిని లాక్ చేసి ముందుకెళ్లనివ్వలేదు. ఇద్దరు స్ట్రాంగ్ పర్సనాలిటీలను ఒక్కడే కట్టడి చేయమనేది మామూలు విషయం కాదు. ఇప్పుడనే కాదు, పవన్ తనకు ఏ టాస్క్ ఇచ్చినా సరే గట్టిగా ఆడతాడు. గెలుపు కోసమే ప్రయత్నిస్తాడు. తోపు కంటెస్టెంట్.. కానీ!ఫిజికల్ టాస్క్లో తాండవం చూపిస్తాడు. కానీ, రీతూతో లవ్ ట్రాక్ వల్ల పవన్పై జనాల్లో చిన్నచూపు ఉంది. అటు బిగ్బాస్ టీమ్, నాగార్జున కూడా అతడిని ఎక్కువగా హైలైట్ చేయరు. ఆ ట్రాక్ గనక లేకుంటే పవన్ కూడా టాప్ 3 రేసులో ఉండేవాడే! మరి శ్రీజను గెలిపించడం కోసం దెబ్బలు తగిలించుకుని మరీ ఆడుతున్నాడు. అతడు కోరుకున్నట్లుగా శ్రీజ రీఎంట్రీ ఇస్తుందా? వీకెండ్లో నాగార్జున.. పవన్ ఆటను మెచ్చుకుంటాడా? చూడాలి! చదవండి: హీరోయిన్గా మహేశ్బాబు మేనకోడలు ఎంట్రీ -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 'మేడ్ ఇన్ ఇండియా' సింగర్!
అలీషా చినాయ్.. ఇప్పటి జనరేషన్కి ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. నైంటీస్ బ్యాచ్కి మాత్రం ఈ పేరు చెప్పగానే ‘మేడ్ ఇన్ ఇండియా’ పాటను ఆలపిస్తారు. 1990ల్లో 'మేడ్ ఇన్ ఇండియా', 'లవర్ గర్ల్', 'సెక్సీ సెక్సీ ముఝే లోగ్ బోలే' వంటి హిట్ పాటలతో ఇండిపాప్ రాణిగా రాణించిన పాప్ సింగర్ అలీషా చినాయ్(Alisha Chinai). గతకొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ సింగర్.. సోషల్ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులతో టచ్లోనే ఉంటుంది. తాజాగా అలీషా తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేసిన ఓ ఫోటో అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 60 ఏళ్ల వయసు ఉన్న ఆమె ‘మేడ్ ఇన్ ఇండియా' నాటి గెటప్లో ఉన్న ఫోటోని షేర్ చేసింది. ఈ జనరేషన్ వాళ్లు ఆ ఫోటోని చూస్తే..అస్సలు గుర్తుపట్టలేరు. ఆమె లుక్ ఇప్పుడు మరింత మెచ్యూర్గా మారింది. కానీ వయసు ప్రభాసం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘షాకింగ్.. అలీషా ఇలా మారిపోయిందేంటి? ఏమైంది? ’, ఆమె పాప్ సింగర్ అలీషానేనా?.. ఆమె వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం’ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అలీషా చినాయ్ 1965 మార్చి 18న అహ్మదాబాద్లో గుజరాతీ కుటుంబంలో జన్మించింది. 1985లో 'జాదూ' ఆల్బంతో తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె, బప్పీ లహిరీతో కలిసి 'అడ్వెంచర్స్ ఆఫ్ టార్జన్', 'డాన్స్ డాన్స్' వంటి సినిమాల్లో డిస్కో హిట్లు ఇచ్చింది. 1995లో విడుదలైన 'మేడ్ ఇన్ ఇండియా' ఆల్బం భారీ విజయం సాధించి, ఆమెను 'క్వీన్ ఆఫ్ ఇండిపాప్'గా మార్చింది.బాలీవుడ్లో కూడా ఆమె మార్క్గా ఉంది. 'కజ్రా రే' (బంటీ ఆర్ బాబ్లీ, 2005) పాటకు ఫిల్మ్ఫేర్ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డు అందుకుంది. 'రుక్ రుక్ రుక్', 'ప్యార్ ఆయా', 'టచ్ మీ', 'తింకా తింకా' వంటి హిట్లు ఆమె స్వరానికి గుర్తింపు తెచ్చాయి. అయితే, 1996లో అను మలిక్పై సెక్సువల్ హారస్మెంట్ ఆరోపణలు చేసి వివాదాల్లో చిక్కుకుంది. తర్వాత 2018 మీటూ క్యాంపెయిన్లో ఆమె మాటలు మరోసారి గుర్తుకు వచ్చాయి.వ్యక్తిగత జీవితంలో కూడా ఆమెకు కష్టాలు ఎదురయ్యాయి. మేనేజర్ రాజేష్ ఝవేరీతో 1986లో పెళ్లి చేసుకుని 1994లో విడాకులు తీసుకుంది. తండ్రి క్యాన్సర్తో బాధపడటంతో కెరీర్పై దృష్టి తగ్గింది. 2020 నుంచి తజకిస్తాన్కు చెందిన ఫుర్కత్ అజమోవ్తో రిలేషన్షిప్లో ఉంది.People of my generation will instantly know who she is. pic.twitter.com/Mk4PwRcsc8— Sapna Madan (@sapnamadan) October 28, 2025 -
ఆరేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయి, ద మేకర్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్గా!
పుణేలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్టీఐఐ) గురించి ఇవాళ జాతీయంగానే కాదు... అంతర్జాతీయంగానూ బాగా తెలుసు. కానీ, 1961లో కేవలం రూ. 3 లక్షల వార్షిక బడ్జెట్తో ఆ సంస్థను ఆరంభించినప్పుడు దాన్ని ఇలాంటి ఓ వ్యవస్థగా తీర్చిదిద్దడం వెనుక ఉన్న అరుదైన వ్యక్తి గురించి కొద్దిమందికే తెలుసు. ఆయన... జగత్ మురారి (1922–2007). స్వయంగా ఫిల్మ్మేకరైన ఆయన జీవితకథ, ఆయన సారథ్యంలో సినీ సృజనాత్మక కార్యశాలగా ఎఫ్టీఐఐ అవతరించిన కీలక సమయం, సందర్భాలకు చెరగని అక్షరరూపం... ‘ద మేకర్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్’. భవిష్యత్ సినీ రూపకర్తలను తండ్రి తీర్చిదిద్దుతున్న సమయంలో ఆ సృజనాత్మక ప్రాంగణంలో పెరిగిన రాధ ఇప్పుడు ఆ పురావైభవ చరిత్రను ఆసక్తికరంగా అందించారు. పట్నాలో ఓ మామూలు కుటుంబంలో పుట్టి, ఆరేళ్ళ వయసులోనే తల్లిని కోల్పోయి, ఒంటరి తండ్రి పెంపకంలో పెరిగి, భౌతికశాస్త్రం చదువుకొన్న జగత్ అసలు సైంటిస్ట్ కావాల్సిన వ్యక్తి. అనుకోకుండా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో సినిమా చదువు చదువుకొని, ఆయన కళారంగంలోకి రావడం యాదృచ్ఛికమే అయినా, భారతీయ సినీ రంగానికి బోలెడంత మేలు చేసింది. ఫిల్మ్స్ డివిజన్లో కెరీర్ను మొదలుపెట్టి, 1940లు, 50లలో పలు డాక్యుమెంటరీ లతో భారతీయ ఆత్మను కెమెరాతో కోట్లాది జనం ముందుకు తెచ్చారు. తొలి రాష్ట్రపతి స్వర్ణపతకం (ఇప్పటి పరిభాషలో నేషనల్ అవార్డ్) సాధించిన ఘనత ఆయన తీసిన ‘మహాబలిపురం’ (1952) డాక్యు మెంటరీదే! అందుకే, దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వం ఓ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ను పెట్టాలనుకున్నప్పుడు దాని సారథ్యానికి అన్నివిధాలా ఆయనే అర్హుడయ్యారు. 1947లో ‘మ్యాక్బెత్’ తీస్తున్న సినీ దిగ్గజం ఆర్సన్ వెల్స్ వద్ద పాఠాలు నేర్చుకున్న జగత్ ఆ తరువాత ఎందరికో పాఠాలు చెప్పే గురువయ్యారు. ఎఫ్టీఐఐకి ప్రిన్సిపాల్గా జగత్ దూరదృష్టి అపూర్వ పథనిర్దేశం చేసింది. జయా బచ్చన్, షబానా ఆజ్మీ, సుభాష్ ఘయ్, అదూర్ గోపాలకృష్ణన్, శత్రుఘ్నసిన్హా లాంటి ఎందరో నటులు, దర్శకులు, ఇంకా సినిమా టోగ్రాఫర్లు, ఎడిటర్లు ఆయన వదిలిన బాణాలే. భారతీయ సినీ రంగంలో ‘న్యూ వేవ్ సినిమా’కు వారే కీలక పాత్రధారులు. ముఖ్యమైన వ్యక్తిగా ఉండడం కన్నా మంచి వ్యక్తిగా ఉండడం ప్రధానం – ఇదీ జగత్ జీవన తాత్త్వికత. పుణేలోని ప్రసిద్ధ జయకర్ బంగళా (ఇప్పుడు నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫీసు)లోని నివాసంలో విద్యార్థుల్ని సొంత బిడ్డల్లా చూసిన వైనం, అలాగే ఆయన జీతం పెంపు కోసం అప్పటి సమాచార శాఖ మంత్రి ఇందిరాగాంధీ జోక్యం చేసు కోవడం లాంటివి అబ్బురపరుస్తాయి. అప్పటికే ప్రసిద్ధ సినిమాలు తీసినా, అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందుల్లో వీధిన పడ్డ ముగ్గురు చిన్నపిల్లల తండ్రి రిత్విక్ ఘటక్ను ఎఫ్టీఐఐలో వైస్ ప్రిన్సిపాల్గా తీసు కోవడానికి జగత్ పడ్డ కష్టం, అవస్థలు పడుతూనే రిత్విక్ను కాపాడుకొనేందుకు పడిన శ్రమ చదువుతూ గుండె చిక్కబట్టుకోవడం కష్టం. నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆరంభ, వికాసాలకు జగత్ చేసిన అపార కృషి సహా ఎన్నో సంఘటనలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి.ఇదీ చదవండి: Cyclone Montha.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!జగత్ రాసుకున్న డైరీలు, దాచిపెట్టుకొన్న ఆత్మ కథ నోట్సులు ప్రధాన ఆధారమైనప్పటికీ, ఈ రచన కోసం లోతుగా పరిశోధించి, అనేక అంశాలను గుదిగుచ్చారని అర్థమవుతుంది. అదే సమయంలోఈ పుస్తకం ఒక మంచి నవలలా సాగుతూ, భారత సినీ చరిత్రలో అవిస్మరణీయ అధ్యాయాన్ని పాఠకుల ముందు ఉంచుతుంది. ఇవాళ్టికీ రికార్డు కాని ఇలాంటి తెర వెనుక కథలు, వ్యక్తుల విశేషాలెన్నో తెలుసు కోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. అరుదైన ఫొటోలు, అనుబంధ సమాచారం అదనపు హంగులు. భారతీయ డాక్యుమెంటరీ చిత్రనిర్మాణ చరిత్రలో ప్రత్యేక స్థానమున్న జగత్తో పాటు ఎఫ్టీఐఐ తొలి నాళ్ళను తెలుసుకోవడానికి ఈ రచన సినీ ప్రియులకు ఓ అపురూప సమాచార విందు! -రెంటాల జయదేవ(‘ద మేకర్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్’ : హౌ జగత్ మురారి అండ్ ఎఫ్.టి.ఐ.ఐ. ఛేంజ్డ్ ఇండియన్ సినిమా ఫరెవర్ రచయిత్రి – కాలమిస్ట్ : రాధా చడ్ఢా) -
హీరోయిన్గా మహేశ్బాబు మేనకోడలు ఎంట్రీ
తెలుగు సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరొకరు వెండితెరపై అడుగుపెట్టబోతున్నారు. మహేశ్ మేనకోడలు జాన్వీ స్వరూప్ (Jaanvi Swarup Ghattamaneni) త్వరలోనే బిగ్స్క్రీన్పై కనిపించనుంది. మహేశ్బాబు అక్క మంజుల ఘట్టమనేని (Manjula Ghattamaneni)- సంజయ్ స్వరూప్ దంపతుల కూతురే జాన్వీ స్వరూప్. తన సినీఎంట్రీని మంజుల సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.ప్రపంచం ఎదురుచూస్తోంది'నా చిన్నారి జాన్వీ ఎంత ఎదిగిపోయిందో! ఇప్పుడు రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. తనకు మంచి మనసుతో పాటు అద్భుతమైన టాలెంట్ ఉంది. అవన్నీ త్వరలోనే ప్రపంచం చూడబోతోంది. నీకోసం వెండితెర ఎదురుచూస్తోంది మై డార్లింగ్.. ఐ లవ్యూ సో మచ్. హ్యాపీ బర్త్డే మై జాను' అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. కాగా జాన్వి చిన్నవయసులో ఓ సినిమా చేసింది. తల్లి మంజుల ఘట్టమనేని దర్శకత్వం వహించిన మనసుకు నచ్చింది (2018) సినిమాలో తొలిసారి కెమెరా ముందుకు వచ్చింది. ఈ మూవీకి మహేశ్బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు.పేరెంట్స్ కూడా యాక్టర్సే!జాన్వీ పేరెంట్స్ మంజుల- సంజయ్ స్వరూప్ కూడా యాక్టర్సే! మంజుల.. షో, కావ్యాస్ డైరీ, ఆరెంజ్, సేవకుడు, మళ్లీ మొదలైంది, హంట్, మంత్ ఆఫ్ మధు చిత్రాల్లో నటించింది. దర్శకురాలిగా మనసుకు నచ్చింది అని ఒకే ఒక్క మూవీ చేసింది. షో, నాని, పోకిరి, ఏ మాయ చేసావె వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించింది. సంజయ్ స్వరూప్.. అర్జున్ రెడ్డి, చల్ మోహనరంగ వంటి పలు చిత్రాల్లో సహాయ నటుడిగా మెప్పించాడు. View this post on Instagram A post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni)చదవండి: కుటుంబంతో సహా చనిపోదామనుకున్నా.. ఆ హీరో వల్లే బతికా! -
థియేటర్స్లోకి వచ్చేస్తున్న ‘కర్మణ్యే వాధికారస్తే’
బ్రహ్మాజీ, శత్రు, 'మాస్టర్' మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కర్మణ్యే వాధికారస్తే. బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, మరియు శ్రీ సుధా ముఖ్య పాత్రల్లో నటించారు. అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ ప్రోమోని విడుదల చేశారు మేకర్స్.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ "ఈరోజు మా చిత్రం 'కర్మణ్యే వాధికారస్తే' నుంచి రిలీజ్ ప్రోమో ను విడుదల చేసాం. రిలీజ్ ప్రోమో అదిరిపోయింది, చూసిన వాళ్లంతా ప్రోమో అద్భుతంగా ఉంది అని కొనియాడారు.ఇది ఒక సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్, స్టూడెంట్ హత్యలు, మిస్సింగ్ కేసులు, కిడ్నాప్ ఇలా మనం ప్రతిరోజూ టీవిలో పేపర్స్ లో చూసే సంఘటనల ఆధారంగా నిర్మించాం. ఇటీవలే సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని చూసి అద్భుతంగా ఉంది అని కొనియాడారు. ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. మా చిత్రం అక్టోబర్ 31న భారీగా విడుదల అవుతుంది" అని తెలిపారు. -
‘నాకోసం ఆ వెన్నెల’ బాగుంది : జేడీ చక్రవర్తి
‘‘ఓ.. చెలియా’(O Cheliya) సినిమా నుంచి ‘నాకోసం ఆ వెన్నెల...’ అనే ప్రేమ గీతాన్ని విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ పాట చాలా బాగుంది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ చక్కగా ఉంది. సినిమా కూడా బాగుంటుందని, పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’’ అని హీరో జేడీ చక్రవర్తి తెలిపారు. నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ.. చెలియా’. ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఎస్ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవి ప్రొడక్షన్స్పై రూపశ్రీ కోపూరు నిర్మించారు. ఎంఎం కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘నాకోసం ఆ వెన్నెల...’ అంటూ సాగే లవ్, మెలోడీ వీడియో సాంగ్ని జేడీ చక్రవర్తి రిలీజ్ చేశారు. ఈ పాటకి శివ సాహిత్యం అందించగా, మేఘన, మనోజ్ పాడారు. ‘‘అందమైన ప్రేమ కథగా రూపొందిన చిత్రం ‘ఓ.. చెలియా’. హీరో, హీరోయిన్ల మధ్య ఉన్న ప్రేమను చాటేలా ఈ పాట ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నాం’’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సురేష్ బాలా. -
వదిలించుకుందామన్నా వదలరుగా! హౌస్లో శ్రీజ, భరణి రీఎంట్రీ!
ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు హౌస్లోకి వచ్చి ఒకర్ని నామినేట్ చేస్తున్న సంగతి తెలిసిందే! అలాగే తమకు నచ్చిన కంటెస్టెంట్కు నామినేషన్ చేసే పవర్ కూడా ఇస్తున్నారు. మరి ఎవరు నామినేషన్స్లో ఉన్నారు? రీఎంట్రీ కోసం ఎవరు రేసులో ఉన్నారో మంగళవారం (అక్టోబర్ 29వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..భరణి రాకతో ఆనందభాష్పాలుభరణి (Bharani Shankar) హౌస్లో అడుగుపెట్టగానే దివ్య పరుగెత్తుకుంటూ వెళ్లి హత్తుకుంది. మిస్ అయ్యా నాన్నా అంటూ తనూజ కన్నీళ్లు పెట్టుకుంది. వాళ్లను కాస్త పక్కకు వదిలించుకున్న భరణి.. బాడీ షేమింగ్ చేయడం తప్పంటూ సంజనాకు ఓ కత్తి పొడిచాడు. రెండో కత్తి నాక్కావాలి, మీ ముందే చెప్పాలని మీరొచ్చే వరకు వెయిట్ చేశా.. అని దివ్య డిమాండ్ చేసింది. కానీ భరణి తనను పట్టించుకోకుండా నిఖిల్కు ఇవ్వడంతో దివ్య ముఖం మాడ్చుకుంది.దివ్యను పట్టించుకోని భరణినిఖిల్.. కెప్టెన్సీ టాస్క్లో ఇమ్మాన్యుయేల్ను గేమ్ మీకోసం వదిలేయమని అడుక్కోవడం నచ్చలేదని తనూజను నామినేట్ చేశాడు. భరణి వెళ్లిపోతూ తనూజతో.. బాండ్స్ వల్లే ఇప్పుడిలా బాధపడుతున్నావ్, బాండ్స్ కలుపుకోకు అని సలహా ఇచ్చింది. నా వల్లే మీరు వెళ్లానంటున్నారని తనూజ ఏడవడంతో ఛ, అలా ఏం కాదని సముదాయించి వెళ్లిపోయాడు. ఈ బంధాల జోలికి వెళ్లకూడదనుకున్నాడో, ఏమో కానీ.. దివ్యను అస్సలు పట్టించుకోలేదు. దీంతో ఆమె బాగానే హర్ట్ అయింది.నామినేషన్స్లో ఎనిమిది మందిశ్రష్టి.. డిమాన్ పవన్ (Demon Pavan)ను నామినేట్ చేసి, ఎనిమిదోవారం కల్యాణ్, డిమాన్ పవన్, రీతూ చౌదరి, సంజన, మాధురి, తనూజ, గౌరవ్, రాము నామినేషన్స్లో ఉన్నట్లు బిగ్బాస్ ప్రకటించాడు. తనవైపు కన్నెత్తి కూడా చూడటం లేదని భరణిని తల్చుకుని దివ్య ఏడ్చేసింది. తర్వాతి రోజు భరణి, శ్రీజ హౌస్లో అడుగుపెట్టారు. వీరిలో ఒకరు మాత్రమే హౌస్లో ఉంటారన్నాడు బిగ్బాస్.రీఎంట్రీ.. ఒక్కరికే ఛాన్స్ఇక దివ్య.. భరణిని పక్కకు తీసుకెళ్లి.. నా నామినేషన్ ఎవరనుకుంటున్నారు? తనూజ అని బాంబు పేల్చింది. మొత్తానికి భరణి.. బంధాలకు దూరంగా ఉందామనుకున్నా అటు వాళ్లు వదిలేరా లేరు. ఇక శ్రీజ, భరణి కోసం హౌస్మేట్స్ గేమ్ ఆడనున్నారు. అలాగే వీరిలో ఎవరు హౌస్లో ఉండాలనేది ప్రేక్షకులు ఓటింగ్ ద్వారా డిసైడ్ చేయనున్నారు. మరెవరు రీఎంట్రీ ఇస్తారో చూడాలి!చదవండి: సినిమా చూసి షాకవ్వకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా: రాజేంద్రప్రసాద్ -
కుటుంబంతో సహా చనిపోదామనుకున్నా.. ఆ హీరో వల్లే బతికా!
ఒక్క ఛాన్స్ అంటూ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవితేజ నేడు ఎంతోమందికి ఛాన్సులిచ్చే స్థాయికి చేరుకున్నాడు. టాలెంట్ను ఎప్పుడూ ప్రోత్సహించే మాస్ మహారాజ తన 75వ సినిమాను కొత్త దర్శకుడితో చేశాడు. సామజవరగమన మూవీకి రచయితగా పని చేసిన భాను భోగవరపును డైరెక్టర్గా పరిచయం చేస్తున్నాడు. తన జీవితం ముగిసిపోయిందనుకున్న సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోను ధమాకాతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా మలిచాడు. అందుకే రవితేజ అంటే భీమ్స్కు ప్రాణం. అదే విషయాన్ని ఆయన మరోసారి వెల్లడించాడు.నా వెనక ఓ ధైర్యంరవితేజ ప్రధాన పాత్రలో నటించిన మాస్ జాతర అక్టోబర్ 31న విడుదల కాబోతోంది. మంగళవారం (అక్టోబర్ 28న) ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భీమ్స్ స్టేజీపై మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. ధమాకా తర్వాత నుంచి శివశంకర వరప్రసాద్ మూవీ చేసేవరకు నా వెనక ఓ ధైర్యం ఉంది. ఆయన గురించి మీ అందరికీ చెప్పాలి. ఎట్ల నేను సేద్దునో.. ఎట్ల పడి నేను సద్దునో.. అంటూ సెల్ఫోన్లో ఓ వీడియో తీసుకున్నాను. కుటుంబంతో కలిసి పైకి..అప్పుడు నా భార్యాపిల్లల్ని కూడా వీడియో తీశాను. నేనెందుకు వీడియో తీస్తున్నానో వాళ్లకు తెలియదు. ఇంటి అద్దె ఎలా కట్టాలి? పిల్లల్ని ఎలా చదివించాలి? ఎలా బతకాలి? రేపు ఎలా గడుస్తుంది? అని బిక్కుబిక్కుమంటూ బతుకు వెళ్లదీస్తున్న రోజుల్లో నాకో ఫోన్ కాల్ వచ్చింది. పీపుల్స్ మీడియా ఆఫీస్కు రమ్మని ఆహ్వానం వచ్చింది. నమ్మలేకపోయాను. ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయి, నాకు జీవితం లేదు. నా భార్యాపిల్లలతో కలిసి కట్టకట్టుకుని పైకి వెళ్లిపోదామనుకున్నాను. దేవుడిలా కాపాడాడుఅలాంటి సమయంలో దేవుడిలా ఒక మనిషి ప్రత్యక్షమయ్యాడు. ఆ శక్తి పేరు, వ్యక్తి పేరు, వ్యవస్థ పేరు రవితేజ సర్. మాటల్లో చెప్పాలంటే ప్రేమ.. పాటల్లో చెప్పాలంటే భక్తి. ఈరోజు నోట్లోకి ఐదువేళ్లు వెళ్తున్నాయంటే కారణం ఆయనే! అమ్మానాన్న, నీ కొడుకు సజీవంగా ఉండటానికి రవితేజ సర్ కారణం. అవకాశాల కోసం చాలామంది కథలు, కహానీలు చెప్తారనుకుంటారు. సిసిరోలియో ఎప్పుడూ కహానీలు చెప్పడు. ఉన్నదే చెప్తాడు. అందుకే సర్కు నేనంటే ఇష్టం, నాకు ఆయనంటే ఇష్టం (దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రిగారి వాయిస్ని ఏఐ రూపంలో మీ ముందుకు తీసుకువచ్చినందుకు గర్వపడుతున్నాను (తూ మేరా లవర్ పాటని ఉద్దేశించి) అని భీమ్స్ సిసిరోలియో భావోద్వేగానికి లోనయ్యాడు.ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.comచదవండి: ఆ సినిమా రిలీజయ్యాక ట్రోలింగ్.. తట్టుకోలేకపోయా! -
సినిమా చూసి షాకవ్వకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా: రాజేంద్రప్రసాద్
‘‘రవితేజ (Raviteja)గారికి నేను అభిమానిని. సూపర్ ఎనర్జీ మనిషి రూపంలో ఉంటే అది మాస్మహారాజ రవితేజ. ఓ మామూలు మనిషిని స్క్రీన్పైకి తీసుకువచ్చి కింగ్ సైజ్లో సహజంగా చూపించే పాత్రలు చేస్తుంటారు. మన జీవితంలో కలలు నిజమౌతాయని ఆయన గుర్తు చేస్తుంటారు. ‘మాస్ జాతర’ బ్లాక్బస్టర్ కావాలి’’ అని హీరో సూర్య అన్నారు. రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’. శ్రీలీల హీరోయిన్గా నటించగా, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటించారు. రవితేజపై సూర్య పొగడ్తల వర్షంభాను భోగవరపు దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన సూర్య మాట్లాడుతూ.. ‘‘ప్రేక్షకులను నవ్వించడం కష్టమైన పని. ఎన్నో సంవత్సరాలుగా ప్రేక్షకులను రవితేజ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ తరహా నైపుణ్యం తక్కువమందికి ఉంటుంది.ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటాంఅమితాబ్ బచ్చన్, రజనీకాంత్ గార్లు మంచి కామిక్ టైమింగ్తో యాక్ట్ చేస్తుంటారు. రవితేజ గురించి కార్తీ, నేను, జ్యోతిక మాట్లాడుకుంటూ ఉంటాం. ‘విక్రమార్కుడు, కిక్’ సినిమాలు చూశాను. తమిళంలో కూడా రవితేజకి అభిమానులు ఉన్నారు. అక్టోబరు 31న థియేటర్స్లో రవితేజ జాతర’’అని అన్నారు. రవితేజ మాట్లాడుతూ–‘‘సూర్యగారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి వ్యక్తి. ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. అభిమానులను నిరాశపర్చదు: రవితేజ‘మాస్ జాతర’ సినిమా చూశాను. హ్యాపీగా ఉంది. ఈ సినిమాతో నవీన్ నెక్ట్స్ లెవల్కి వెళ్తాడనిపిస్తోంది. రాజేంద్రప్రసాద్గారితో నా కాంబినేషన్ సీన్స్ అలరిస్తాయి. ఇందులో మాస్ క్యారెక్టర్ చేశారు శ్రీలీల. భానురూపంలో మన ఇండస్ట్రీకి ఓ మంచి దర్శకుడు వస్తున్నాడు. ఈ సినిమాలోని పాటలను, ముఖ్యంగా ఆర్ఆర్ను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా నా అభిమానులను నిరాశపరచదు’’ అని చెప్పారు. శ్రీలీల మాట్లాడుతూ–‘‘ఈ చిత్రంలో తులసి అనే మాస్ క్యారెక్టర్ చేశాను. ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా!: రాజేంద్రప్రసాద్రవితేజగారిని చూసి చాలా నేర్చుకున్నాను. సూర్యగారికి నేను పెద్ద అభిమానిని’’ అన్నారు. ‘‘మాస్ జాతర’ సినిమా ఆడియన్స్ను అలరిస్తుంది’’ అని పేర్కొన్నారు నిర్మాత నాగవంశీ. ‘‘అరవిందసమేత వీరరాఘవ’ చిత్రంలో నేను చేసిన బాల్ రెడ్డి పాత్ర తర్వాత ‘మాస్ జాతర’లో నేను చేసిన శివుడు క్యారెక్టర్ను ఆడియన్స్ గుర్తు పెట్టుకుంటారు’’ అని చెప్పారు నవీన్ చంద్ర. ‘‘రవితేజగారు నా కథ విని, సితార వంటి ఓ పెద్ద నిర్మాణ సంస్థలో అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు’’ అని భాను భోగవరపు పేర్కొన్నారు. ‘‘మాస్ జాతర’ చూసి ప్రేక్షకులు షాక్ అవ్వకపోతే సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతాను. నా క్యారెక్టర్ ఏంటో థియేటర్స్లో చూడండి’’ అని తెలిపారు రాజేంద్ర ప్రసాద్.చదవండి: ఆ సినిమా రిలీజయ్యాక ట్రోలింగ్.. తట్టుకోలేకపోయా! -
ఆ సినిమా రిలీజయ్యాక ట్రోలింగ్.. తట్టుకోలేకపోయా!
దక్షిణాది చిత్ర పరిశ్రమలో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ఈ బ్యూటీ హీరోయిన్గా తన పదేళ్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకుంది. 2015లో ప్రేమమ్ అనే మలయాళం చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత తమిళం, తెలుగు భాషల్లో ఎంట్రీ ఇచ్చి ఈ రెండు భాషల్లోనూ మంచి అవకాశాలు పొందుతూ పేరు తెచ్చుకుంది. మొదట్లో పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సంపాదించుకున్న ఈమె ఇటీవల కొన్ని చిత్రాల్లో మితిమీరిన అందాలారబోత, లిప్లాక్ సన్నివేశాల్లో నటించి విమర్శలను ఎదుర్కొంది. రెండు ఫ్లాప్స్.. వెంటనే సక్సెస్ఇకపోతే జయాపజయాలు ఎవరికైనా సహజమే. ఈ అమ్ముడు కూడా కొన్ని అపజయాలను చవిచూసింది. ముఖ్యంగా ఆ మధ్య తమిళంలో రవిమోహన్కు జంటగా నటించిన సైరన్, ఇటీవల తెలుగులో నటించిన పరదా చిత్రాలు అనుపమపరమేశ్వరన్ను తీవ్ర నిరాశకు గురిచేశాయి. అలాంటిది తాజాగా ఈమె నటించిన తెలుగుచిత్రం కిష్కింధపురి సక్సెస్ అందుకుంది. అదేవిధంగా తమిళంలో నటించిన బైసన్ విజయం ఈమెకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది అనే చెప్పాలి. ఇందులో అనుపమ పరమేశ్వరన్ పాత్ర పరిమితమే అయినా, ఉన్నంతవరకు ఆ పాత్రకు న్యాయం చేసిందంటూ ప్రశంసలు అందుకుంటోంది. యాక్టింగే రాదన్నారుఅలా మళ్లీ హిట్ట్రాక్లో పడ్డ ఈ బ్యూటీ ప్రస్తుతం లాక్డౌన్ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈసందర్భంగా ఒక ఇంటర్వ్యూలో అనుపవమా పరమేశ్వరన్ మాట్లాడుతూ.. తన తొలిచిత్రం ప్రేమమ్ విడుదల తర్వాత తనపై జరిగిన ట్రోలింగ్స్తో చాలా భయపడ్డానంది. ముఖ్యంగా తనకు నటనే రాదని మలయాళ చిత్ర పరిశ్రమలో విమర్శించారంది. అయినా తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపింది. ఇప్పుడు తనను చూసి తానే గర్వపడుతున్నానని పేర్కొంది. నట జీవితంలో ఒక కొత్త చాప్టర్లో ప్రవేశించినట్లు చెప్పుకొచ్చింది.చదవండి: యానిమేటెడ్ బాహుబలి -
కమల్హాసన్ దర్శకత్వంలో..?
హీరోలు కమల్హాసన్ , రజనీకాంత్ కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ మూవీకి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కమల్తో కలిసి సినిమా చేస్తున్నట్లు రజనీ కూడా ఖరారు చేశారు. నాలుగు దశాబ్దాల తర్వాత వీరిద్దరూ కలిసి చేయనున్న ఈ మల్టీస్టారర్ మూవీపై ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాకి ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తొలుత దర్శకుడు లోకేష్ కనగరాజ్, ఆ తర్వాత మరికొందరి దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి.తాజాగా ఈ చిత్రానికి కమల్హాసన్ దర్శకత్వం వహించనున్నారని కోలీవుడ్ టాక్. రజనీకాంత్తో పాటు తాను నటిస్తున్న చిత్రం కనుక క్యారెక్టరైజేషన్స్ , పాత్రల నడివి, సన్నివేశాలు.. వంటి అంశాల్లో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కమల్ భావిస్తున్నారట. ఇందుకోసం తానే దర్శకుడిగా రంగంలోకి దిగాలని కమల్ ఆలోచన అని కోలీవుడ్ భోగట్టా.ఈ చిత్రాన్ని కమల్హాసన్ తో కలిసి ఉదయనిధి స్టాలిన్ నిర్మించనున్నారనే టాక్ గతంలో తెరపైకి వచ్చింది. కానీ, తాజాగా రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, కమల్హాసన్ కుమార్తె శ్రుతీహాసన్ నిర్మించనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ప్రచారంలో ఉన్నట్లు ఈ విషయాలపై స్పష్టమైన సమాచారం రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. -
యానిమేటెడ్ బాహుబలి
‘బాహుబలి 3’ సినిమా కోసం దర్శకుడు రాజమౌళి సన్నాహాలు మొదలుపెట్టనున్నారనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. అయితే ఈ చిత్రం లైవ్ యాక్షన్ ఫిల్మ్ కాదట. యానిమేటెడ్ వెర్షన్ లో ఉండబోతుందని, ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అలాగే ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించరట. కానీ, ఆయన పర్యవేక్షణలోనే ‘బాహుబలి 3’ యానిమేటెడ్ వెర్షన్ వస్తుందని ఫిల్మ్నగర్ భోగట్టా. ఈ విషయాలపై పూర్తిస్థాయి అధికారిక సమాచారం అందాల్సి ఉంది.ఇదిలా ఉంటే.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ రెండు భాగాలు (బాహుబలి:ది బిగినింగ్, బాహుబలి: ది కన్ క్లూజన్ ) కలిపి ఒకే భాగంగా ‘బాహుబలి: ది ఎపిక్’గా ఈ నెల 31న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటించగా రానా, అనుష్కా శెట్టి, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి’ సినిమాని శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి: ది ఎపిక్’ ట్రైలర్కి మంచి స్పందన వస్తోంది. -
'రవితేజ మూవీ నా తమ్ముడికి టర్నింగ్ పాయింట్'.. కోలీవుడ్ హీరో సూర్య
మాస్ మహారాజా రవితేజ మరో ఫుల్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన నటించిన మాస్ జాతర ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. రవితేజ యాక్షన్, డైలాగ్ మాస్ ఆడియన్స్ను అలరిస్తున్నాయి. ఈ మూవీని భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కించారు. ధమాకా లాంటి బ్లాక్బస్టర్ తర్వాత శ్రీలీల మరోసారి రవితేజ సరసన కనిపించనుంది. ఈ మూవీ కోసం మాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో నవీన్ చంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు.రిలీజ్కు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈవెంట్లో పాల్గొన్న హీరోయిన్ శ్రీలీల తన డ్యాన్స్తో మరోసారి ఆడియన్స్ను అలరించింది. రవితేజతో కలిపి స్టెప్పులతో అదరగొట్టేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు.హీరో సూర్య మాట్లాడుతూ..' రవితేజకు నేను కూడా అభిమానినే. ఇది నాకు ఫ్యాన్ భాయ్ మూమెంట్. ఆయన ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రవితేజ నటనకు బిగ్ ఫ్యాన్ నేను. తమిళంలోనూ రవితేజ సినిమాలకు అద్భుతమైన క్రేజ్ ఉంది. విక్రమార్కుడు మూవీ కార్తీ కెరీర్లో బిగ్ టర్నింగ్ పాయింట్. ఈ మాస్ జాతర సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. ఈ మూవీలో నటించిన అందరికీ ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ భాను కల నిజం కావాలి. ఈనెల 31 మరో బ్లాక్ బస్టర్ చూడబోతున్నాం' అని అన్నారు. కాగా.. రవితేజ, శ్రీలీల జంటగా వస్తోన్న మాస్ జాతర అక్టోబర్ 31 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. The joy, the excitement, and the MASS vibe all in one frame! 🔥Pics from the Grand Pre Release event of #MassJathara ❤️🔥Premieres Worldwide on Oct 31st from 6 PM Omwards! 😎🤘Mass Maharaja @RaviTeja_offl @Sreeleela14 @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo… pic.twitter.com/bAqv31Lym8— Sithara Entertainments (@SitharaEnts) October 28, 2025 -
వంట నేర్చుకుంటోన్న కేజీఎఫ్ బ్యూటీ.. చాహల్ గర్ల్ఫ్రెండ్ బర్త్ డే సెలబ్రేషన్స్!
వంట నేర్చుకుంటోన్న కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి..బైసన్ మూవీ లుక్లో అనుపమ పరమేశ్వరన్..బర్త్ డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్న చాహల్ గర్ల్ఫ్రెండ్...డిఫరెంట్ డ్రెస్లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్..రెడ్ డ్రెస్లో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ.. View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Anshu Reddy❤ (@_anshureddy) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
కాంతార చాప్టర్ 1 ఓటీటీపై షాకింగ్ నిర్ణయం.. అసలు కారణమదే!
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా అదిరిపోయే కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికే కన్నడ సినీ ఇండస్ట్రీలో కేజీఎఫ్-2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. అంతేకాకుండా ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మొదటి సినిమాగా నిలిచింది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ మూవీ ఛావాను అధిగమించింది. ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ ప్రీక్వెల్.. త్వరలోనే వెయ్యి కోట్ల మార్క్ చేరుకుంటుందని అంతా భావించారు.ప్రస్తుతం థియేటర్లలో కాంతారకు పోటీగా పెద్ద చిత్రాలు కూడా లేకపోవడం కలిసొస్తుందని అనుకున్నారు. కానీ సక్సెస్ఫుల్గా రన్ అవుతోన్న టైమ్లో ఓటీటీ రిలీజ్ విషయంలో మేకర్స్ ట్విస్ట్ ఇచ్చారు. రిలీజైన నాలుగు వారాల్లోనే ఓటీటీకి తీసుకు రావడంపై ఫ్యాన్స్ సైతం షాకవుతున్నారు. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్గా దూసుకెళ్తోన్న సమయంలోనే ఓటీటీ డేట్ను అఫీషియల్గా ప్రకటించడం కాంతార అభిమానులను డైలామాలో పడేసింది. ఈ ప్రకటనతో మూవీ వసూళ్లపై ప్రభావం పడుతుందని చాలా మంది ఆడియన్స్ ప్రశ్నించారు. దీంతో తాజాగా ఓటీటీ రిలీజ్పై హోంబాలే ఫిల్మ్స్ నిర్మాతల్లో ఒకరైన చలువే గౌడ స్పందించారు. త్వరగానే ఓటీటీకి తీసుకురావడంపై క్లారిటీ ఇచ్చారు.చలువే గౌడ మాట్లాడుతూ..'ఈ సినిమా తమిళం, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం వర్షన్లు మాత్రమే ప్రస్తుతం ఓటీటీలో విడుదలవుంది. అయితే హిందీ వర్షన్ వచ్చేది ఇప్పుడు కాదు. ఎనిమిది వారాల తర్వాత మాత్రమే ఓటీటీకి వస్తుంది. ఎందుకంటే ఈ ఒప్పందం మూడేళ్ల క్రితమే జరిగింది. అందుకే ఇది మా వంతు బాధ్యత. అప్పట్లో పరిస్థితులు భిన్నంగా ఉండేది. కొవిడ్కు ముందు అన్ని సినిమాలకు ఎనిమిది వారాల సమయం ఉండేది. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓటీటీకి వచ్చినప్పటికీ థియేట్రికల్ రన్ ఇంకా కొనసాగుతుంది. డిజిటల్ రిలీజ్ తర్వాత కూడా కలెక్షన్స్ సాధిస్తుందని నమ్మకముంది. ఓటీటీకి రావడం 10 నుంచి 15 శాతం వరకు మాత్రమే కలెక్షన్లపై ప్రభావం ఉంటుందని ఆశిస్తున్నాం' అని తెలిపారు.కాగా.. ఈ దీపావళికి థియేటర్లలో థామా, ఏక్ దీవానే కి దేవానియాత్ లాంటి బాలీవుడ్ సినిమాలు ఉన్నప్పటికీ కాంతార చాప్టర్ 1 హిందీ వర్షన్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అక్టోబర్ 2న దసరా కానుకగా విడుదలైంది. -
సినీ టికెట్ ధరల పెంపుపై సీఎం రేవంత్
హైదరాబాద్: సినిమా టికెట్ ధరల పెంపుపై సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ ధరలు పెంచితే మాత్రం అందులో కార్మికులకు 20 శాతం వాటా ఉండాలన్నారు. కార్మికులకు ఆరోగ్య బధ్రత చూసుకోవాల్సిన బాధ్యత నిర్మాతలదేనని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో సీఎం రేవంత్కు సినీ కార్మికులచే అభినందన సభ ఏర్పాటు చేశారు. తెలుగు సిని పరిశ్రమ 24 క్రాఫ్ట్ సంఘాల ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, వివేక్, పొన్నం, ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ చిన్న సినిమాలను తక్కువ చేసి చూసే ప్రసక్తే లేదు. కార్మిక కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పిస్తాం. కార్మికులకు రాజీవ్ ఆరోగ్య పథకం అమలు చేస్తాం. కార్మికుల్ని కుటుంబాలుగా చూసుకోవాలని నిర్మాతకు చెప్పా. సినిమా టికెట్లు పెంచితే వచ్చే ఆదాయంతో 20 శాతం కార్మికులకు ఇవ్వాలి. 20 శాతం కార్మికుల వెల్ఫేర్ ఫండ్కు బదిలీ అవ్వాలి. ఆ రకంగా అయితే ిటికెట్ ధరలు ెపెంచుకునేందుకు జీవో ఇస్తాం. నా శక్తి మేర సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేస్తా. గత పదేళ్లుగా నంది అవార్డులు ఇవ్వలేదు.. ఇప్పుడు ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరుతో ఆ అవార్డులు ఇస్తున్నాం. మహా భారతం లో నాకు నచ్చిన క్యారెక్టర్ కర్ణుడు. ప్రాణం పోతుంది అని తెలిసిన స్నేహితుల వైపు ఉన్నాడు. అందుకే మిత్ర ధర్మాన్ని పాటించడంలో నేను కర్ణుడు లాంటి వాడిని. నిర్ణయం తీసుకున్నాక నేను ఆలోచించను. ఎన్ని అడ్డంకులు వచ్చిన కార్మికుల క్షేమం కోసం మిత్ర ధర్మం పాటిస్తాను. డిసెంబర్ 9 నాడు సినీ కార్మికుల కోసం దిశా నిర్దేశం చేసి ప్రణాళిక ఇస్తాము. కార్మికులు బాగుంటేనే దర్శక నిర్మాతలు బాగుంటారు అని చెప్పిన. కార్మికుల వెల్ఫేర్ కోసం 10 కోట్ల ఫండ్ కేటాయిస్తాము. టికెట్ ధరలు పెంచాలి అంటే అందులో కార్మికులకు వాటా ఇవ్వాలి. టికెట్ ధరలు పెంచితే హీరోలకు నిర్మాతలకు లాభం. మరి కార్మికులకు ఎం ఒరిగింది. కార్మికులకు అదనంగా ఒక్క రూపాయి రావట్లేదు. పెంచిన టికెట్ ధర లో 20 శాతం సినీ కార్మికులకు ఇస్తేనే ప్రభుత్వం జీవో ఇస్తాము. మీ శ్రమతో సంపాదించే ప్రతి దానిలో మీకు వాటా ఉండాలి. ఎంత పెద్ద నిర్మాత అయినా కార్మికులకు వెల్ఫేర్ ఫండ్ జమ చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తది. నేను ఈ విధంగా చేయాలనీ ఆదేశలు ఇస్తున్న’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. -
వర్కింగ్ అవర్స్పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
సినీ నటీనటుల పని గంటలపై గతకొంత కాలంగా ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna) స్పందించారు. నిర్దిష్ట పనివేళలు ఉండాలని తాను కూడా కోరుకుంటున్నానని చెప్పారు. ‘ది గర్ల్ప్రెండ్’ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. ‘నటీనటులకే కాదు దర్శకుల నుంచి లైట్మ్యాన్ వరకు అందరికీ నిర్దిష్ట పనివేళలు ఉంటే బాగుంటుంది. దాని వల్ల కుటుంబంతో గడిపే సమయం దొరుకుతుంది. ఇకపై నేను ఫ్యామిలీపై మరింత దృష్టి పెట్టాలనుకుంటున్నా. భవిష్యత్తు గురించే నా ఆలోచనంతా. తల్లిని అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో కూడా నేను ఇప్పుడే ఊహిస్తుంటా’ అని రష్మిక అన్నారు.ఎనిమిది గంటలే పని చేస్తానని డిమాండ్ చేయడంతో దీపికా పదుకొణెను స్పిరిట్ చిత్రం నుంచి తొలగించినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలువురు సినీ ప్రముఖులు వర్కింగ్ అవర్స్పై స్పందించారు. ది గర్ల్ఫ్రెండ్ విషయానికొస్తే.. ఇదొక ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీ. దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 7న రిలీజ్ కానుంది. -
బాహుబలితో సీరియస్గా తీసుకోవడం మానేశా: తమన్నా
రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రాలు తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు..ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను అలరించాయి. ఈ సినిమాలతో తెలుగు ఖ్యాతిని విశ్వవాప్తం చేశాడు మన దర్శకధీరుడు. ప్రభాస్, రానా ప్రధాన పాత్రల్లో వచ్చిన బాహుబలి-1, బాహుబలి-2 బాక్సాఫీస్ను షేక్ చేశాయి. ఈ చిత్రాల్లో తమన్నా భాటియా హీరోయిన్గా మెప్పించింది. అయితే బాహుబలి మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. ఈ రెండు చిత్రాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 31న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన హీరోయిన్ తమన్నా.. బాహుబలి మూవీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సినిమా నాలో ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంచిందని గుర్తు చేసుకుంది. ఈ ప్రాంచైజీలో నటించడం ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపింది. ఒక సినిమాకు మెరుగులు దిద్దేందుకు వీఎఫ్ఎక్స్ను ఎలా ఉపయోగిస్తారో నేర్చుకున్నానని పేర్కొంది.తమన్నా మాట్లాడుతూ.. 'నా కెరీర్లో ఎక్కువగా నేర్చుకున్న సినిమా బాహుబలి. ఈ మూవీ షూటింగ్లో చాలా విషయాలు ఊహించుకోవాల్సి వచ్చింది. అందువల్ల వీఎఫ్ఎక్స్ను ఎలా ఉపయోగిస్తారో చాలా నేర్చుకున్నా. ఇది నాకు ప్రయోగాత్మకంగా ఉండేందుకు అత్మవిశ్వాసాన్నిచ్చింది. అప్పటి నుంచి ప్రజల అభిప్రాయాలను సీరియస్గా తీసుకోవడం మానేశా. నన్ను నేను చాలా ఎక్కువగా విశ్వసించడం ప్రారంభించా. ఇది నాపై నాకున్న నమ్మకాన్ని మరింత పెంచిందని' తెలిపింది. కాగా..తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల విడుదలైన బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ చిత్రంలో ప్రత్యేక సాంగ్లో మెరిసింది. -
టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ పెళ్లి.. నిర్మాత ఖరీదైన గిఫ్ట్!
చిన్న సినిమా అయినా సరే కంటెంట్ ఉంటే చాలు.. ఆడియన్స్ బ్రహ్మరథం పట్టేస్తారు. పెద్ద స్టార్స్ లేకపోయినా బాక్సాఫీస్ హిట్ చేసేస్తారు. అలాంటి సినిమా ఈ ఏడాది అలరించిన టూరిస్ట్ ఫ్యామిలీ. సింపుల్ స్టోరీతో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది.ఈ ఏడాది మే 1న తమిళంలో రిలీజైన ఈ చిత్రం.. దాదాపు నెలరోజుల పాటు హౌస్ఫుల్ కలెక్షన్స్ సాధించింది . కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ పెడితే ఏకంగా రూ.75 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. ఈ మూవీతో అభిషన్ జీవింత్ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి సినిమాతో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు. అభిషన్ జీవింత్ యూట్యూబర్ కావడం మరో విశేషం.అయితే తాజాగా టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషన్కు సంబంధించి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆయన ఈనెల 31న పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ సందర్భంగా టూరిస్ట్ ఫ్యామిలీ నిర్మాత మాగేశ్ రాజ్ ఖరీదైన బహుమతిచ్చారు. పెళ్లి చేసుకోబోతున్న అభిషన్కు బీఎండబ్ల్యూ కారును మ్యారేజ్ గిఫ్ట్గా ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రముఖ సినీ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు డైరెక్టర్కు విషెస్ చెబుతున్నారు.Producer of #TouristFamily, #GoodNight, & #Lover, @mageshraj of @MRP_ENTERTAIN, has gifted a BMW SUV to Tourist Family director @Abishanjeevinth as a wedding gift.The young filmmaker, who has also turned hero, is all set to tie the knot on October 31 this year.… pic.twitter.com/fuJg1uTW5Z— Ramesh Bala (@rameshlaus) October 28, 2025 -
తల్లి చనిపోయిన విషయం దాచి షూటింగ్ చేశాడు.. తిరువీర్పై దర్శకుడు ప్రశంసలు!
తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన తాజా చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’(The Great Pre Wedding Show ). సందీప్ అగరం, అశ్మితా రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 7న ఈ మూవీని గ్రాండ్గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్కి దర్శకులు కరుణ కుమార్, యదు వంశీ, ఆదిత్య హాసన్, రామ్ అబ్బరాజు, సన్నీ, దుశ్యంత్, ఉదయ్ గుర్రాల, రూపక్, తేజ, నంద కిషోర్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ .. ‘తిరువీర్ను నేను ఓ నాటకంలో చూశాను. నేను మూవీ తీస్తే తిరువీర్కి పాత్ర ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. ‘పలాస’లో మూడు పాత్రలు అనుకున్నప్పుడు అందులో తిరువీర్ ఉండాలని అనుకున్నాను. ‘పలాస’ కోసం మేం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. తల్లి చనిపోయినా కూడా తిరువీర్ ఆ విషయాన్ని మాకు చెప్పకుండా షూటింగ్లో సీన్ చేశాడు. అలా తిరువీర్ మాకు ఎంతో సహకరించారు. డెబ్యూగా సినిమాలు తీసేటప్పుడు మేకర్లకు ఉండే కష్టాలు మా అందరికీ తెలుసు. ఈ చిత్రం వంద శాతం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. రూటెడ్ కథల్నే ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నవంబర్ 7న ఈ చిత్రం రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.హీరో తిరువీర్ మాట్లాడుతూ .. దర్శకుడు రాహుల్ ఈ కథ చెప్పినప్పుడు కంటిన్యూగా నవ్వుతూనే ఉన్నాను. ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. ఫ్యామిలీ అంతా కలిసి టూర్కు వెళ్లినట్టుగా షూటింగ్ చేశాం. మంచి కంటెంట్తో మా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ నవంబర్ 7న రాబోతోంది. మా చిత్రం అందరికీ నచ్చుతుంది. మా సినిమాను ఆడియెన్స్ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మాకు అండగా నిలిచిన జీ సంస్థకు థాంక్స్. ’ అని అన్నారు.చిత్ర దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాకి ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్లో హీరో తిరువీర్. మా ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ట్రైలర్కు వంద రెట్లు అనేట్టుగా సినిమా ఉంటుంది. అందరినీ ఎంటర్టైన్ చేసేలా మా చిత్రం ఉంటుంది. నవంబర్ 7న మా సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.అనగనగా దర్శకుడు సన్నీ మాట్లాడుతూ .. ‘‘పరేషాన్’లో తిరువీర్ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. అన్ని రకాల ఎమోషన్స్ను తిరు అద్భుతంగా పలికిస్తారు. తనకంటూ ఓ మార్క్ను తిరు క్రియేట్ చేసుకున్నారు. అందరికీ కనెక్ట్ అయ్యే కథతో తీసిన ఈ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు. ‘దర్శకుడు రాహుల్ ఈ మూవీని అద్భుతంగా తీశారు. నవంబర్ 7న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని చిత్ర నిర్మాత సందీప్ అగరం అన్నారు. -
సమంత 'బంగారం'లో కాంతార విలన్
కొన్నిరోజుల క్రితం థియేటర్లలోకి వచ్చిన 'కాంతార 1'.. ఇప్పటికీ థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ శుక్రవారం ఓటీటీలోకి కూడా రానుంది. అయితే ఈ మూవీలో విలన్గా చేసిన గుల్షన్ దేవయ్య తన నటనతో బాగానే ఆకట్టుకున్నాడు. గతంలో హిందీలో పలు చిత్రాలు, వెబ్ సిరీసులు చేసిన ఇతడు.. ఇప్పుడు తెలుగులో నటించేందుకు రెడీ అయిపోయాడు.(ఇదీ చదవండి: 'సలార్' కాటేరమ్మ ఫైట్లో నేనే చేయాలి.. కానీ: టాలీవుడ్ హీరో)మయాసైటిస్ కారణంగా చాన్నాళ్లుగా యాక్టింగ్ పక్కనబెట్టేసిన సమంత.. ఈ ఏడాది నిర్మాతగా 'శుభం' అనే మూవీని రిలీజ్ చేసింది. ఇప్పుడు తనే నిర్మాత కమ్ హీరోయిన్గా 'మా ఇంటి బంగారం' అనే చిత్రంలో నటిస్తోంది. దసరాకు పూజతో లాంఛనంగా మొదలైన ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కూడా ఇప్పుడు షురా అయిపోయింది. ఆ విషయాన్ని వెల్లడిస్తూ ఇన్ స్టాలో పోస్ట్ కూడా పెట్టారు.నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత.. గృహిణిగా ఉంటూనే గన్ పట్టి యాక్షన్ కూడా చేయబోతుంది. ఇదే మూవీలో 'కాంతార 1' ఫేమ్ గుల్షన్ దేవయ్య కూడా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ఇతడే స్వయంగా బయటపెట్టాడు. సమంత పోస్ట్ని తన ఇన్ స్టా స్టోరీలో రీ పోస్ట్ చేసిన ఇతడు.. 'నేను కూడా ఇందులో ఉన్నాను' అని చెప్పుకొచ్చాడు. ఇదే ఇతడికి తెలుగులో మొదటి సినిమా. మరి సమంత పక్కన నటిస్తాడా లేదంటే విలన్గా చేయబోతున్నాడా అనేది చూడాలి?(ఇదీ చదవండి: కొందరు నటులు అసలు సెట్కే రారు.. 'ఓజీ' విలన్ కామెంట్స్) -
అల్లు అర్జున్-అట్లీ కాంబో.. ఆ స్టార్ హీరోయిన్ ఫిక్స్!
పుష్ప -2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) మరో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఆయన జతకట్టారు. వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తోన్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై కొన్ని నెలలుగా చర్చ నడుస్తూనే ఉంది. ఇప్పటికే ఈ మూవీలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణెను ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి. అంతే కాకుండా మరో ముగ్గురు రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తున్నారని టాక్ నడిచింది.ఈ నేపథ్యంలోనే తాజాగా హీరోయిన్కు సంబంధించిన మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్లో సీతారామం బ్యూటీ హీరోయిన్గా కన్ఫామ్ అయినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మృణాల్ షూట్లో కూడా పాల్గొన్నారని లేటేస్ట్ అప్డేట్. అంతేకాకుండా అల్లు అర్జున్తో కీలక సన్నివేశాలు షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కాంబోలో మృణాల్ ఎంట్రీలో మూవీపై మరింత బజ్ ఏర్పడింది. కాగా.. ప్రస్తుతం ఈ సినిమాను AA22xA6 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు హాలీవుడ్ టచ్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ మూవీలో హాలీవుడ్ హీరో విల్ స్మిత్ సైతం నటిస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ను టార్గెట్ చేస్తూ మరికొందరిని హాలీవుడ్ పరిశ్రమకు చెందిన నటీనటులను ఈ మూవీ కోసం తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ సినిమాను దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్తో సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.Buzz is that actress Mrunal Thakur has joined Allu Arjun in Atlee’s upcoming sci-fi action spectacle “AA22xA6”. Backed by Sun Pictures, the film is said to be a high-octane futuristic thriller packed with massive action sequences, time-travel elements, and cutting-edge VFX. The… pic.twitter.com/xqnzdR7DlJ— SIIMA (@siima) October 28, 2025 -
రోడ్డుపై వెళ్తుంటే..బాబాయ్ లాంటివాడే అలా వేధించాడు: హీరోయిన్
సామాన్యులకే కాదు సెలెబ్రెటీలకు కూడా లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్నవారిలో చాలా మంది ఒకప్పుడు లైంగిక వేధింపులకు గురైనవారే ఉన్నారు. కొంతమందికి ఇండస్ట్రీ నుంచి ఎదురైతే..మరికొంతమందికి బయట నుంచే ఇలాంటి వేధింపులు వస్తుంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొని ఉండడం వల్లే ఇప్పుడు ఉన్నత స్థానంలో కొనసాగుతున్నారు. హీరోయిన్ అయేషా ఖాన్(Ayesha Khan) కూడా చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురైయ్యారట. బాబాయ్ లాంటివాడే తనతో అసభ్యకరంగా మాట్లాడి హింసించాడట. ఇప్పటికే ఆ సంఘటన గుర్తుకు వస్తే.. కళ్ల వెంట నీళ్లు ఆగవని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఆయేషా.ముంబైకి చెందిన ఈ బ్యూటీ..బుల్లితెర నటిగా ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు వెండితెరపై రాణిస్తుంది. కసాటి జిందగీ కే అనే సీరియల్లో ఆమె ఓ చిన్న పాత్ర పోషించింది. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు అయితే రాలేదు. హిందీ బిగ్బాస్ షో ఆమెను పాపులర్ చేసింది. సీజన్ 17లో పాల్గొన్న ఆమె..11 వారాల పాటు హౌస్లో ఉండి తనదైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ముఖచిత్రం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో విశ్వక్సేన్ సరసన నటించి, మెప్పించింది. ఓ భీమ్ బుష్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం బెంగాలీతో పాటు పలు హిందీ చిత్రాల్లోనూ నటిస్తోంది.సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆయేషా.. ఎప్పటికప్పడు తన సినిమా అప్డేట్స్తో పాటు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ని అలరిస్తోంది. కొన్నాళ్ల క్రితం ఆమె ఓ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిన్నప్పుడు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది.‘ఒకప్పుడు మాది చాలా పేద కుటుంబం. తినడానికి తిండి కూడా సరిగా ఉండేది కాదు. చిన్న వయసులోనే లైగింక వేధింపులు ఎదుర్కొనాల్సి వచ్చింది. ఓసారి రోడ్డుపై ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే.. మా నాన్న స్నేహితుడు ఒకరు పిలిచారు. నేను ఆయనను బాబాయ్ అని పిలిచేదాన్ని. నా దగ్గరకు వచ్చి ప్రైవేట్ పార్ట్స్ గురించి అసభ్యకరంగా మాట్లాడాడు. బాబాయ్ లాంటివాడు అలా మాట్లాడేసరికి షాకయ్యారు. ఆ వెంటనే మళ్లీ నావైపుగా వచ్చి అసభ్యకరమైన సంజ్ఞలు చేశాడు. అప్పుడు నా వయసు 9 ఏళ్లు మాత్రమే. ఆయన ఎందుకు అలా అన్నాడో, ఏం చేయాలో తెలియదు. ఇంటికి వెళ్లి ఏడ్చేశా. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుకు వస్తే.. కళ్లల్లోనుంచి నీళ్లు వచ్చేస్తాయి’ అని ఆయేషా ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
దాదాసాహెబ్ ఫాల్కే సలహా బోర్డ్ సభ్యురాలిగా సుధారెడ్డి
దాదా సాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సలహా బోర్డ్ సభ్యురాలిగా ప్రముఖ వ్యాపారవేత్త, సాంస్కృతిక రాయబారి సుధారెడ్డిని నియమితులయ్యారు. ఈమె కాకుండా బోర్డ్లో హిందూజా గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ కల్నల్ పి.సి. సూద్, బరోడా మహారాణి హెచ్.హెచ్. రాధికరాజే గైక్వాడ్, వి.ఎం. సల్గావ్కార్ కార్పొరేషన్ చైర్మన్ దత్తరాజ్ సల్గావ్కార్, ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, ఇండియన్ కొరియోగ్రాఫర్ షియామక్ దావర్, దాదాసాహెబ్ ఫాల్కే ముని మనవరాలు గిరిజా ఫాల్కే మరాఠే, ఇన్ఫర్మేషన్ & బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖలో గౌరవనీయ సాంస్కృతిక నిపుణుడు & మాజీ సెన్సార్ బోర్డు జ్యూరీ భావనా మర్చంట్, సినీపోలిస్ ఇండియా ఫిల్మ్ ప్రోగ్రామింగ్ &డిస్ట్రిబ్యూషన్ హెడ్ మయాంక్ ష్రాఫ్ మరియు భారత ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ & బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ & మాజీ సెన్సార్ బోర్డు జ్యూరీ జ్యోతి బధేకా తదితరులు ఉన్నారు.భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే వారసత్వంలో డీపీఐఎఫ్ఎఫ్(DPIFF) సలహా బోర్డ్.. సాంస్కృతిక ప్రతిష్టకు నిలయంగా ఉద్భవించింది. కళాకారులు, చిత్రనిర్మాతలు, పరిశ్రమ నాయకులను నిరంతరం గౌరవిస్తూనే సినిమా రంగంలో ప్రపంచ కేంద్రంగా భారతదేశం యొక్క స్థాయిని బలోపేతం చేస్తుంది. ఇకపోతే అక్టోబరు 29-30వ తేదీల్లో ముంబై వేదికగా దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలనచిత్రోత్సవ అవార్డులు-2025 కార్యక్రమం జరగనుంది. -
మలయాళ చిత్రాలే కాదు.. మేము సైతం అంటోన్న మృణాల్ ఠాకూర్!
ఇటీవల సౌత్లో మలయాళ సినిమాలకు డిమాండ్ పెరిగింది. అక్కడ సూపర్ హిట్ అయితే చాలు.. డబ్ చేసి ఇతర భాషల్లోకి వదులుతున్నారు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ మలయాళ చిత్రాలను విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇప్పటికే మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ లాంటి సినిమాలు టాలీవుడ్లోనూ సత్తాచాటాయి. తాజాగా మోహన్ లాల్ తనయుడు నటించిన మరో చిత్రం వచ్చేనెలలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.మలయాళ సినిమాలు ఇతర భాషల్లో సత్తాచాడటం కామనైపోయింది. కానీ ఇప్పుడు దీనికి భిన్నంగా ఇతర భాషకు చెందిన సూపర్ హిట్ మూవీ.. ప్రస్తుతం మలయాళంలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ విషయాన్ని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. ఒక ఉద్యమం అంటూ పోస్టర్ను పంచుకుంది. మరాఠీ సినిమా మరో భాషలో రిలీజ్ కావడం చూస్తుంటే చాలా గర్వంగా ఉందని తెలిపింది. మరాఠీ సినీ చరిత్రలోనే ఇలా జరగడం ఇదే మొదటిసారి అని పోస్టర్లో వెల్లడించారు.మరాఠీలో తెరకెక్కించిన దశవతార్ మూవీ బ్లాక్బస్టర్గా నిలిచింది. సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మరాఠీలో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఈ మూవీకి సుబోధ్ కనోల్కర్ దర్శకత్వం వహించారు. ప్రియదర్శిని ఇందల్కర్, సిద్ధార్థ్ మీనన్ జంటగా కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని నవంబర్ 21 మలయాళంలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. మలయాళ చిత్రాలు ఇతర భాషల్లో సత్తా చాటుతుంటే.. తొలిసారి మరాఠీ మూవీ మాలీవుడ్లో హిట్ కొడుతుందా? లేదా? అన్నది తెలియాలంటే నవంబర్ 21 వరకు ఆగాల్సిందే.Watched Dashavatar today and oh my god! It isn't just a film, it's a movement. The first Marathi blockbuster to reach Malayalam audiences. how amazing is that! So proud to see Marathi cinema crossing new screens and hearts💖#dashavatar #marathicinema pic.twitter.com/b43qKRcKkt— Mrunal Thakur (@mrunal0801) October 27, 2025 -
కొందరు నటులు అసలు సెట్కే రారు.. 'ఓజీ' విలన్ కామెంట్స్
రీసెంట్ టైంలో నటీనటుల పనివేళలు, సెట్కి సమయానికి రావడం అనే విషయాలు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. అడపాదడపా నటీనటులు, సినీ ప్రముఖులు ఈ టాపిక్ గురించి నేరుగానో, పరోక్షంగానో మాట్లాడుతున్నారు. ఇప్పుడు 'ఓజీ'లో విలన్గా చేసిన ఇమ్రాన్ హష్మీ కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు. కొందరు నటులు అస్సలు సెట్కి రారనే ఆశ్చర్యకర విషయాన్ని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: 'సలార్' కాటేరమ్మ ఫైట్లో నేనే చేయాలి.. కానీ: టాలీవుడ్ హీరో)అసలు విషయానికొస్తే.. 'హక్'(HAQ) అనే హిందీ సినిమా చేసిన ఇమ్రాన్ హష్మీ దాని ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. అలా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సహనటి యామీ గౌతమ్ని ప్రశంసించాడు. సెట్కి సమయానికి వచ్చేస్తుందని చెప్పుకొచ్చాడు. మరి ఈ కాలంలో కూడా టైమ్కి రాని యాక్టర్స్ ఉంటారా? అని యాంకర్ అడగ్గా.. 'కొందరు నటులు అసలు సెట్కే రారు' అని కామెంట్స్ చేశాడు.అయితే ఇమ్రాన్ హష్మీ వ్యాఖ్యల్ని ఒక్కొక్కరు ఒక్కోలా తీసుకుంటున్నారు. పలువురు నార్త్ నెటిజన్లు సల్మాన్ ఖాన్ గురించి అన్నాడని అంటుండగా.. మరికొందరు మాత్రం పవన్ కల్యాణ్ గురించి ఈ కామెంట్స్ చేశాడా అనే సందేహపడుతున్నారు. ఎందుకంటే 'ఓజీ'లో పవన్ కొన్నిరోజులే షూటింగ్కి రాగా మిగిలిన చోట్ల పవన్ డూప్ని పెట్టి మేనేజ్ చేశారు. ఇమ్రాన్ గతంలో సల్మాన్తో కలిసి 'టైగర్ 3' చేశాడు. అప్పుడేమైనా సల్మాన్ సెట్కి రాలేదా అని అనిపిస్తుంది. ఏదేమైనా ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అయిపోతోంది.(ఇదీ చదవండి: అఫీషియల్.. ఎట్టకేలకు ఓటీటీలోకి 'ఫ్యామిలీ మ్యాన్ 3')About whom Emraan Hashmi talking ????Recently he worked in #TheyCallHimOG #EmraanHashmi pic.twitter.com/MncfXvbTG2— TFI Movie Buzz (@TFIMovieBuzz) October 27, 2025 -
రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు
తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు(Bomb Threat ) కలకలం సృష్టిస్తున్నాయి. పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ తారల ఇళ్లకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరోలు రజనీకాంత్(Rajinikanth), ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి.చెన్నైలోని డీజీపీ కార్యాలయానికి సోమవారం(అక్టోబర్ 27) సాయంత్రం ఓ ఈ మెయిల్ వచ్చింది. పోయస్ గార్డెన్లో ఉన్న రజనీకాంత్, ధనుష్ ఇళ్లతో పాటు.. కీల్పాక్కంలో ఉన్న టీఎన్ సీసీ అధ్యక్షుడు సెల్వపెరుతంగై ఇంటిని పేల్చివేస్తామని ఆ ఈమెయిల్లో పేర్కొన్నారు. దీంతో అధికారులు వెంటనే బాంబు స్క్వాడ్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ని రంగంలోకి దించి బెదిరింపులు వచ్చినవారి ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.బాంబు బెదిరింపుల నేపథ్యంలో చెన్నైలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ మెయిల్ పంపినవారిని గుర్తించేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ నెల 3న సీఎం స్టాలిన్తో పాటు హీరోయిన్ త్రిష, బీజేపీ కార్యాలయం, డీజీపీ ఆఫీసుకు బాంబు బెదిరింపులు రావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్టోబర్ 13న కూడా సీఎం స్టాలిన్, హీరో రజనీకాంత్ ఇళ్లకు ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. -
'ఈ సారి మామూలుగా ఉండదు'.. డకాయిట్ కొత్త రిలీజ్ డేట్
టాలీవుడ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న ఇంటెన్స్ యాక్షన్ ప్రేమకథా చిత్రం డకాయిట్(Dacoit). ఇప్పటికే రిలీజ్ తేదీ ప్రకటించినా అనివార్య కారణాలతో వాయిదా పడుతూనే వస్తోంది. గతంలో ఈ ప్రాజెక్ట్ నుంచి కోలీవుడ్ భామ శృతిహాసన్ అనూహ్యంగా తప్పుకుంది. ఇది కూడా సినిమా ఆలస్యానికి కారణం కావొచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ మూవీలో హీరోయిన్గా చేస్తోంది. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.కానీ వారు అనుకున్న తేదీ ప్రకారం కుదరకపోవడంతో తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు డకాయిట్ మేకర్స్. వచ్చే ఏడాది ఉగాది కానుకగా డకాయిట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. 'ఈ సారి మామూలుగా ఉండదు.. వెనక్కి తిరిగి చూసేదే లేదు' అంటూ అడివి శేష్ మూవీ పోస్టర్ను పంచుకున్నారు. వచ్చే ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో డకాయిట్ సందడి చేయనుందని ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో అడివి శేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. (ఇది చదవండి: 'డకాయిట్' ఫైర్ గ్లింప్స్ విడుదల)ఈ మూవీని షానీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. అడివి శేష్ నటించిన ‘క్షణం’, గూఢచారితో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామేన్గా చేసిన షానీల్ డియో ఈ మూవీతో డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. కాగా.. ఇప్పటికే ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేయగా ఆడియన్స్ను ఆకట్టుకుంది. Ee Saari Mamulga undadhu ❤️🔥There’s NO LOOKING BACK#DACOIT This UGADI MARCH 19th 2026in Theaters WORLDWIDE pic.twitter.com/KaxruBidTN— Adivi Sesh (@AdiviSesh) October 28, 2025 -
'సలార్' కాటేరమ్మ ఫైట్లో నేనే చేయాలి.. కానీ
పాన్ ఇండియా ట్రెండ్ పెరిగిన తర్వాత ప్రభాస్ నుంచి వరస సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈయన చేసిన సలార్, ఫౌజీ చిత్రాల్లో తనకు అవకాశాలొచ్చినా కొన్ని కారణాల వల్ల మిస్ అయ్యాయని తెలుగు యంగ్ హీరో తిరువీరు చెబుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.(ఇదీ చదవండి: అఫీషియల్.. ఎట్టకేలకు ఓటీటీలోకి 'ఫ్యామిలీ మ్యాన్ 3')'ప్రభాస్ 'సలార్' కాటేరమ్మ ఫైట్లో విలన్గా నేనే చేయాలి. కానీ డేట్స్ సమస్య కారణంగా అది మిస్ అయింది. అలానే 'ఫౌజీ'లోనూ మంచి ఆఫర్ వచ్చింది. కానీ వేరే సినిమాలు, లుక్ కంటిన్యూటీ కారణంగా వాటిని వదులుకోవాల్సి వచ్చింది' అని తిరువీర్ చెప్పుకొచ్చాడు.టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన తిరువీర్.. 'మసూద', 'పరేషాన్' చిత్రాలతో లీడ్ రోల్స్ చేశాడు. జార్జ్ రెడ్డి, టక్ జగదీష్ సినిమాల్లో విలన్గా ఆకట్టుకున్నాడు. త్వరలో 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' అనే మూవీతో రాబోతున్నాడు. దీని ప్రమోషన్లలో భాగంగానే మాట్లాడుతూ తను చేస్తున్న సినిమాలు వల్ల ప్రభాస్ సలార్, ఫౌజీలో అవకాశాలు మిస్ అయ్యాయని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: టాలీవుడ్పై 'మోంథా' ప్రభావం ఎంతవరకు?) -
బైసన్ కలెక్షన్స్.. బిగ్ మార్క్ అందుకున్న ధ్రువ్
విక్రమ్ కుమారుడు ధ్రువ్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించిన చిత్రం బైసన్(Bison). మొదట తమిళ్లో విడుదలైన ఈ చిత్రం అక్టోబర్ 24న తెలుగులో కూడా రిలీజ్ అయింది. దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. పా.రంజిత్కు చెందిన నీలం ప్రొడక్షన్స్, అప్లాజ్ ఎంటర్టెయిన్మెంట్, శాంతి సినిమా సంస్థలు కలిసి ఈ మూవీని నిర్మించాయి. ధ్రువ్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా బైసన్ రికార్డ్ క్రియేట్ చేసింది.బైసన్ చిత్రం కేవలం పదిరోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 55 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు దర్శకుడు మారి సెల్వరాజ్ పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు. రెండో వారంలో ఈ చిత్రానికి భారీగా స్క్రీన్స్ పెరిగాయి. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, కేరళలో అత్యధికంగా థియేటర్స్ పెరగడం విశేషం. అయితే, తెలుగులో మాత్రం కాస్త పర్వాలేదు అనిపించేలా బైసన్ ఉంది.ఈచిత్రంలో హీరో అక్కగా రజిషా విజయన్, ఆయన తండ్రిగా పశుపతి, హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించారు. వీరితో పాటు దర్శకుడు అమీర్, లాల్ ముఖ్యపాత్రలు పోషించారు. నివాస్ కే.ప్రసన్న సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ధ్రువ్ నటన గురించే. ఆయన సహజత్వంగా తన పాత్రలో అంకితమై నటించారు. Ecstatic beyond measure and thankful beyond words!! #BisonKaalamaadan is unstoppable as he's breaking those barriers right away!!💥🦬55 Crores Worldwide in 10 days!! #Blockbuster Raid in the Theatres Near You! 💥💥💥@applausesocial @NeelamStudios_ @nairsameer @deepaksegal… pic.twitter.com/ozbbqRLl7S— Mari Selvaraj (@mari_selvaraj) October 27, 2025 -
ఆ విషయంలో ఎప్పుడూ బాధపడలేదు : ప్రియమణి
పారితోషికం విషయంలో ఎప్పుడూ డిమాండ్ చేయలేదని.. చాలా సినిమాలకు తనతో కలిసి నటించిన వారికంటే తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నానని అన్నారు నటి ప్రియమణి. ఈ విషయంలో తాను ఎప్పుడూ బాధ పడలేదని చెప్పారు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పారితోషికం, షూటింట్ టైమింగ్స్ ఇష్యూపై స్పందించారు. మనకు ఉన్న స్టార్డమ్ ఆధారంగా నిర్మాతలు రెమ్యునరేషన్ ఇస్తారని...ఎక్కువ, తక్కువ అనేది తాను ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు.‘నేనెప్పుడు రెమ్యునరేషన్కి ప్రాధాన్యత ఇవ్వలేదు. నాకున్న మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని దర్శకనిర్మాతలను అడుగుతాను. చాలా సందర్భాలలతో నాతోటి నటించిన వారికంటే తక్కువ పారితోషికం తీసుకున్నాను. నా పాత్ర, నిడివి చూసుకొని సినిమాలను అంగీకరిస్తాను కానీ.. డబ్బులు ఎంత ఇస్తున్నారనేది నేను పట్టించుకోను. నేను అర్హురాలిని భావిస్తే.. పారితోషికం పెంచమని డిమాండ్ చేస్తా. అంతేకానీ.. అనవసరంగా ప్రతిసారి పారితోషికం పెంచమని కోరను’అని ప్రియమణి చెప్పుకొచ్చారు.సౌత్కి బాలీవుడ్కి తేడా అదే..ఇక షూటింగ్ టైమింగ్స్ గురించి మాట్లాడుతూ.. ఈ విషయంలో సౌత్కి నార్త్కి చాలా తేడా ఉందన్నారు. ‘సౌత్ ఇండస్ట్రీలో చెప్పిన టైమ్కి షూటింగ్ని ప్రారంభిస్తారు. ఉదయం 8 గంటకు షూటింగ్ ప్రారంభిస్తామని షెడ్యూల్ ఇస్తే... కచ్చితంగా ఆ సమయానికి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ బాలీవుడ్లో అలా కాదు. ఉదయం 8 గంటలకు షూటింగ్ అంటే.. నటీనటులు అప్పుడే ఇంట్లో నుంచి బయలుదేరుతారు. అక్కడ చెప్పిన సమయానికి షూటింగ్ స్టార్ట్ కాదు’ అని ప్రియమణి అన్నారు. ప్రియమణి సినిమాల విషయానికొస్తే..ఇటీవల ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’, అమెరికన్ షో ‘ది గుడ్ వైఫ్’ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం దళపతి విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’తో పాటు ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మూడో సీజన్లోనూ నటిస్తోంది. -
అఫీషియల్.. ఎట్టకేలకు ఓటీటీలోకి 'ఫ్యామిలీ మ్యాన్ 3'
కరోనా టైంలో ఓటీటీలు జనాలకు బాగా అలవాటైపోయాయి. సరిగ్గా ఆ టైంలో మంచి క్రేజ్ తెచ్చుకున్న వెబ్ సిరీస్ 'ద ఫ్యామిలీ మ్యాన్'. మనోజ్ బాజ్పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ నుంచి ఇప్పటివరకు రెండు సీజన్లు వచ్చాయి. అయితే మూడో సీజన్ ఎప్పుడొస్తుందా మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బోల్డ్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)2019లో 'ద ఫ్యామిలీ మ్యాన్' తొలి సీజన్ రాగా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. కామెడీకి కామెడీ, మరోవైపు థ్రిల్లింగ్ అంశాలు ఆకట్టుకున్నాయి. 2021లో వచ్చిన రెండో సీజన్లో సమంత విలన్గా చేయడం ఆశ్చర్యపరిచింది. అయితే మూడో సీజన్ రావడానికి ఏకంగా నాలుగేళ్లు పట్టేసింది. మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలపై చైనా ఎటాక్, దీనికోసం కొవిడ్ వైరస్ని ఉపయోగించడం తదితర అంశాలు మూడో సీజన్ కాన్సెప్ట్.రాజ్, డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ మూడో సీజన్.. నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుందని తాజాగా ప్రకటించారు. ప్రధాన పాత్రలైన శ్రీకాంత్, సుచితో పాటు వీళ్ల పిల్లలిద్దరినీ చూపిస్తూ ఓ కామెడీ వీడియోతో అనౌన్స్మెంట్ ఇచ్చారు. తొలి రెండు సీజన్లలానే ఈ సీజన్ కూడా ఆకట్టుకునేలా కనిపిస్తుంది. తెలుగు, తమిళ, హిందీతో పాటు ఇంగ్లీష్లో ఈ సీజన్ స్ట్రీమింగ్ కానుంది. మరి ఇక్కడితో ముగిస్తారా లేదంటే నాలుగో సీజన్ కూడా ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
టాలీవుడ్పై 'మోంథా' ప్రభావం ఎంతవరకు?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలపై మోంథా తుపాన్ గట్టిగానే ప్రభావం చూపిస్తోంది. తెలంగాణలో అక్కడక్కడ ఓ మాదిరిగా వర్షాలు పడుతున్నాయి కానీ ఆంధ్రాలో మాత్రం ఎక్కడచూసినా సరే వానలు దంచికొడుతున్నాయి. తీరమంతా అల్లకల్లోలంగా ఉంది. ప్రభుత్వం కూడా ప్రజలు ఎవరినీ బయటకు రావొద్దని హెచ్చరిస్తోంది. అయితే మోంథా తుపాన్ ప్రభావం.. టాలీవుడ్పై ఎలా ఉండనుంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బోల్డ్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)మోంథా తుపాన్.. ఈ రోజు(అక్టోబరు 28) రాత్రికి కాకినాడ దగ్గర తీరదాటనుంది. దీంతో బుధవారం కూడా కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్ష ప్రభావం గట్టిగానే ఉండగా.. కొన్ని ప్రాంతాలు నీటమునిగే అవకాశం కూడా లేకపోలేదు. శుక్రవారానికి గానీ తుపాన్ ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.అయితే ఈ శుక్రవారం 'బాహుబలి' రీ రిలీజ్తో పాటు 'మాస్ జాతర' సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటిపై ఇప్పటికైతే ఓ మాదిరి బజ్ మాత్రమే ఉంది. ఇప్పుడు తుపాన్ ప్రభావం వల్ల జనాలు ఈ వీకెండ్.. మూవీస్ చూసేందుకు ఆంధ్రాలో థియేటర్లకు వస్తారా అంటే సందేహమే. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం రవితేజ, ప్రభాస్ చిత్రాలకు కలెక్షన్స్ పెద్దగా రాకపోవచ్చనే మాట వినిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి? (ఇదీ చదవండి: 'సౌందర్య'ను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్న రమ్యకృష్ణ (వీడియో))'బాహుబలి' రీ రిలీజ్ విషయానికొస్తే.. గతంలో విడుదలైన రెండు భాగాల్ని కలిపి ఇప్పుడు 'ఎపిక్' పేరుతో ఒకే పార్ట్గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాడు. 3 గంటల 44 నిమిషాల నిడివితో ఇది ఉండనుంది. ఇప్పటికే బుకింగ్స్ కూడా మొదలుపెట్టారు. అయితే కొత్తగా ఓ సీన్ కూడా జోడిస్తున్నామని సినిమాటోగ్రాఫర్ సెంథిల్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.'మాస్ జాతర' విషయానికొస్తే.. రవితేజ చేసిన రెగ్యులర్ కమర్షియల్ మూవీ. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆయన గత చిత్రాల మాదిరిగా రొటీన్లానే అనిపించింది. ట్రైలర్ ఓకే ఓకే అనిపించుకున్నప్పటికీ.. మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి? రవితేజకు ఇది 75వ మూవీ కావడం విశేషం. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించగా.. భాను భోగవరపు దర్శకత్వం వహించాడు.శ్రీలీల హీరోయిన్. -
తప్పు చేసి సారీ చెప్తే ఎలా.. బిగ్బాస్లో భరణి ఫైర్
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ చాలా ఆసక్తిగా కొనసాగుతుంది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఒక్కోక్కరిగా వచ్చి హౌస్లో ఉండే సభ్యులను నామినేట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రియా శెట్టి, మర్యాద మనీష్, దమ్ము శ్రీజ, ఫ్లోరా షైనీ తమ ప్రక్రియను సోమవారం ఎపిసోడ్లో ముగించారు. అయితే, మంగళవారం ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. భరణితో పాటు శ్రేష్టి వర్మ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు.భరణి ఎంట్రీ ఇవ్వగానే దివ్య చాలా సంతోషంగా వెళ్లి హగ్ చేసుకుని తన అభిమానాన్ని చూపింది. ఇంతలో ఇమ్మాన్యేయల్ దగ్గరికి వెళ్లిన భరణి.. కట్టప్ప చంపేశావ్ కదరా అంటూ సరదాగా పలకరిస్తాడు. అయితే, ఫైనల్గా సంజనాను భరణి నామినేట్ చేశారు. దీంతో వారిద్దరి మధ్య వాదన గట్టిగానే జరిగింది. 'భరణి అన్నయ్య అంటూ నువ్వు పిలిచిన ప్రతిసారి ఒక సిస్టర్గానే నేను చూశాను. ఏరోజు కూడా ఫేక్ రిలేషన్ కొనసాగించలేదు. తప్పు చేసి సారీ అని చెప్పితే సరిపోతుందా.. 'అంటూ సంజనపై భరణి ఫైర్ అవుతారు. అయితే, దివ్యను రోడ్ రోలర్ అని కామెంట్ చేయడం వల్లనే భరణి ఫైర్ అయ్యారని తెలుస్తోంది. ఇలా వారిద్దరి మధ్య జరిగిన ఫైట్ ఈ మంగళవారం ఎపిసోడ్లో హైలైట్ కానుంది.శ్రేష్టి వర్మ కూడా సరైన పాయింట్లతోనే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. పవన్ ఆటపై అభ్యంతరం తెలిపింది. రీతూ ట్రాప్లోనే ఉన్నావ్ అంటూ చెప్పింది. గేమ్ పట్ల రీతూకు ఉన్న క్లారిటీ కూడా లేదంటూ పవన్ను శ్రేష్టి నామినేట్ చేసింది. -
'ఫౌజీ'లో జూనియర్ ప్రభాస్గా ప్రముఖ హీరో కుమారుడు ఎంట్రీ
ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న 'ఫౌజీ' (Fauji) సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) తెరకెక్కిస్తున్నా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ 'చైత్ర జె ఆచార్' (Chaithra J Achar)కు ఛాన్స్ దక్కినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇదే సమయంలో నటుడు సుధీర్ బాబు రెండో కుమారుడు దర్శన్ ఫౌజీ మూవీతో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.సుధీర్ బాబు కుమారుడు, మహేష్ బాబు మేనల్లుడు దర్శన్కు ఫౌజీలో ఛాన్స్ వచ్చినట్లు టాక్. ఇందులో ప్రభాస్ చిన్నప్పటి పాత్రలో అతను కనపించనున్నట్లు తెలుస్తోంది. అయితే, అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు మహేష్ బాబు నిర్మిస్తున్న గూఢచారి-2లో కూడా దర్శన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్ ఉంది. అయితే, ఈ వార్తల గురించి ఫౌజీ యూనిట్, సుధీర్ బాబు కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. ఈ వార్తలు నిజమేనా అని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే సుధీర్ బాబు తన పెద్ద కొడుకు చరిత్ మానస్ను వెండితెరకు పరిచయం చేశారు. ఆయన హీరోగా నటించిన చిత్రం 'మోసగాళ్లకు మోసగాడు'లో కూడా ఓ చిన్న పాత్రలో చరిత్ నటించారు. గతంలో తను పలు సినిమాల్లో మెరిశాడు. భలే మగాడివోయ్ సినిమాలో జూనియర్ నానిగా కనిపించి మెప్పించాడు. ఆ తర్వాత విన్నర్ సినిమాలో జూనియర్ సాయిధరమ్ తేజ్గా కనిపించాడు. కాగా మహేష్ బాబు తనయుడు గౌతమ్ కూడా '1 నేనొక్కడినే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు సుదీర్ బాబు రెండో కుమారుడు దర్శన్ ఏకంగా ప్రభాస్ పాన్ ఇండియా చిత్రంతో ఎంట్రీ ఇవ్వనున్నాడు. -
కన్నీళ్లు పెట్టుకున్న రమ్యకృష్ణ (వీడియో)
ప్రముఖ నటులు జగపతి బాబు హోస్ట్గా చేస్తున్న టాక్ షోలో తాజాగా నటి రమ్యకృష్ణ(Ramya Krishnan) పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె తన స్నేహితురాలు, దివంగత నటి సౌందర్య(Soundarya)ను గుర్తు చేసుకున్నారు. తనతో ఉన్న అనుబంధం గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వారిద్దరూ కలిసి గతంలో అమ్మోరు, నరసింహ, హలో బ్రదర్ లాంటి బ్లాక్బస్టర్ చిత్రాలలో పనిచేశారు. ఆ షో మొత్తం చాలా ఎనర్జీగా కనిపించిన రమ్యకృష్ణను సౌందర్య గురించి చెప్పాలని జగపతి బాబు అడిగిన క్షణం నుంచి రమ్య కాస్త బాధగానే కనిపించారు.సౌందర్య, రమ్యకృష్ణ ఇద్దరూ కలిసి నటించిన నరసింహ సినిమా నుంచి కొన్ని సీన్స్ను జగపతి బాబు చూపించారు. స్క్రీన్ మీద వీడియో రన్ అయ్యేంత వరకు రమ్య కళ్లలో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సౌందర్యతో తన జ్ఞాపకాలను రమ్యకృష్ణ ఇలా పంచుకున్నారు. ' 1995లో అమ్మోరు షూటింగ్ సమయంలోనే సౌందర్యను మొదటిసారి చూశాను. అప్పుడే ఆమె గురించి తెలుసుకున్నాను. చిన్న తనం నుంచే తనను తాను తీర్చిదిద్దుకుంటూ ఎదిగింది. ఆమెకు ఎంత పేరు ప్రతిష్ట వచ్చినా సరే.. ఎవరినీ తక్కువగా చేసి మాట్లాడదు. ఆమె ఒక అద్భుతమైన వ్యక్తిగానే కాకుండా మాకు మంచి స్నేహితురాలిగా అనుబంధం ఉంది. ఆమెను ఎవరూ కూడా రీప్లేస్ చేయలేరు.' అని రమ్యకృష్ణ తెలిపారు. ఈ క్రమంలో ఆమె కంట కన్నీళ్లు మాత్రం ఆగలేదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.సౌందర్య ముఖంపై రమ్యకృష్ణ కాలునరసింహ సినిమా విడుదల సమయానికి రమ్యకృష్ణకు సమానంగా సౌందర్యకు పాపులారిటీ ఉంది. ఈ మూవీ వరకు కేవలం నటిగా ఓ వెలుగు వెలిగిన రమ్యకృష్ణకు ‘నరసింహ’ సినిమాతో తన స్టార్డమ్ మరింత పెరిగింది. ఈ చిత్రంలో రజనీకాంత్కు విలన్గా నీలాంబరి పాత్రలో ఆమె కనబర్చిన నటనకు చాలామంది ఫిదా అయ్యారు. అయితే, ఇదే మూవీలో తాను సౌందర్య ముఖంపై కాలు పెట్టే సన్నివేశంలో నటిస్తున్నప్పుడు చాలా ఇబ్బందిపడ్డానని కూడా ఆమె చెప్పారు. కానీ, ఆ సీన్ చేసేందుకు సౌందర్య ఒప్పుకోవడం చాలా గొప్ప విషయమని రమ్య గుర్తు చేసుకుంది. 2004 ఏప్రిల్ 17న సౌందర్య తన సోదరుడు అమర్నాథ్తో కలిసి వెళ్తుండగా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు.దేవుళ్లందరినీ తలుచుకున్నాకే ఆ సీన్ చేశారమ్యకృష్ణ మాట్లాడుతూ..' ఆ చిత్రంలో నా రోల్ సౌందర్యపై పగ తీర్చుకోవడం. అందుకే అలాంటి అహంకారం ప్రదర్శించే సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. కానీ మొదట ఆ సీన్ చేయలేకపోయా. కానీ ఆ సీన్ సినిమాకు చాలా అవసరం. చివరికి ఆ షాట్ నాకు ఇష్టం లేదు. సినిమా తప్పకుండా చేయాల్సి వచ్చింది. ఆ సీన్ చేసేటప్పుడు దేవుళ్లందరినీ మనసులో స్మరించుకున్నా. ఆ తర్వాతే సౌందర్యపై చెంపపై కాలు పెట్టా. ఆ సీన్లో నటించిన కొన్ని రోజుల తర్వాత అదే మూడ్లో ఉన్నా.' అని చెప్పుకొచ్చింది. -
శ్రీజ ప్లాన్ ఇదే.. అందుకే కల్యాణ్, తనూజలపై ఫైర్
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఇప్పటికే అర్ధ సెంచరీ కొట్టేసింది. అక్టోబర్ 27న సోమవారం నామినేషన్ ప్రక్రియ మంచి బజ్తోనే మొదలైంది. సాధారణంగా హౌస్మేట్స్ ఒకరినొకరు నామినేట్ చేసుకునే విధానానికి బిగ్బాస్ ఫుల్స్టాప్ పెట్టేశాడు. ఈసారి నామినేట్ చేసే హక్కును ఎలిమినేట్ అయిన సభ్యులకు బిగ్బాస్ ఇచ్చారు. దీంతో ప్రియా శెట్టి, మర్యాద మనీష్, దమ్ము శ్రీజ, ఫ్లోరా షైనీ ఒక్కొక్కరుగా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుత హౌస్మేట్స్ను నామినేట్ చేశారు. వీరిలో దమ్ము శ్రీజ ప్రధానంగా హైలైట్ అయింది. కల్యాణ్, తనూజ, మాధురిని టార్గెట్ చేసి హౌస్లోకి దిగింది.సంజనపై ప్రియ ఫైర్నామినేషన్ ప్రక్రియ ప్రియాశెట్టితో మొదలైంది. దివ్యను రోడ్డు రోలర్ అని కామెంట్ చేసిన సంజనపై ఆమె భగ్గుమంది. సీజన్ ప్రారంభంలో కనిపించనంత నిజాయితీగా ఇప్పుడు లేరంటూనే కాస్త మాటలు అదుపులో పెట్టుకోవాలని సలహా ఇచ్చింది. తర్వాత హౌస్లోకి మర్యాద మనీష్ ఎంట్రీ ఇచ్చాడు. తనూజను నామినేట్ చేస్తానని చెప్పి ఇమ్మాన్యుయేల్ను్ మోసం చేశావ్ అంటూ కల్యాణ్ను నామినేట్ చేశాడు. కల్యాణ్ చేసిన పని ఒక నమ్మకద్రోహంగా మిగిలిపోయిందని మండిపడ్డారు.ఫ్లోరా షైనీ ఎంట్రీతోనే రీతూ చౌదరిని నామినేట్ చేస్తూ.. ఎదురుదాడికి దిగింది. రీతూ కేవలం ఫేక్ లవ్ ట్రాక్ రన్ చేస్తున్నావ్ అంటూ మొదట కల్యాణ్ ఆ తర్వాత పవన్లతో గేమ్ ఆడుతుందని తెలిపింది. కనీసం పవన్తో కూడా రీతూ నిజాయితీగా లేదని కామెంట్ చేసింది. రీతూ ఎపిసోడ్ కాగానే సుమన్ శెట్టికి నామినేట్ చేసే అవకాశం ఇచ్చింది. సంజనను నామినేట్ చేస్తూ సుమన్ శెట్టి తన పాయింట్స్ చెప్పాడు. కెప్టెన్ని కూడా సంజన గౌరవించదు. తన మాట తీరు బాగాలేదు అంటూ నామినేట్ చేస్తాడు. దీంతో ఈ హౌస్లోనే చెత్త కెప్టెన్ సుమన్ శెట్టి అని ఆమె ఫైర్ అయింది.మాధురిని టార్గెట్ చేసిన శ్రీజబిగ్బాస్లోకి శ్రీజ ఎంట్రీనే పక్కా ప్లాన్తో వెళ్లింది. మొదట కావాలనే మాధురిని గెలికింది. ఏంటి మాధురి గారు ఎలా ఉన్నారు అంటూ మీ పేరు మాధురినా.. మాస్ మాధురినా లేదా రాజు గారా అంటూ ఎటకారం మొదలుపెట్టింది. మిమ్మల్ని ఏమని పిలవాలో కూడా తెలియడం లేదని పంచ్లు వేసింది. మళ్లీ పేరు తెలీదని అంటారు కదా అని పాత గొడవని గుర్తుచేసింది. బయటికెళ్లిన తర్వాత మీ గురించి చాలా మందిని అడిగాను ఎవరూ కూడా చెప్పలేదు. ఆమె నాకు కూడా ఆమె తెలీదు నీకెలా తెలుస్తుందని చాలామంది చెప్పారని ఎటకారం మొదలపెట్టింది. అయితే, అదే సమయంలో మాధురి కూడా తగ్గలేదు. నువ్వు కూడా ఎవరో నాకు ఇంత వరకూ తెలీదు అంటూ చెప్పింది.కల్యాణ్, తనూజలపై టార్గెట్..పక్కా ప్లాన్తో శ్రీజశ్రీజ నామినేట్ చేసింది కల్యాణ్ను మాత్రమే.. కానీ, ఆమె రీ ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో పక్కాగా తన స్ట్రాటజీతో ఆట మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఫస్ట్ మాధురిని ఆ తర్వాత తనూజపై ఎదురుదాడికి దిగింది. శ్రీజ రీఎంట్రీ ఇచ్చాక తనకు కల్యాణ్ పోటీ రావచ్చని ఇలా తన ఇమేజ్ను తగ్గించేలా స్కెచ్ వేసి దెబ్బ కొట్టింది. అలా ప్రస్తుతం టాప్లో ఉన్న కల్యాణ్, తనూజలను టార్గెట్ చేసి బరిలోకి దిగేందుకు తను ప్లాన్ అమలు చేసింది. ఇదే సమయంలో మాధురి పట్ల సోషల్మీడియాలో నెగటివిటీతో పాటు ఎక్కువగా ట్రోల్స్ కూడా జరుగుతుంటాయి. అలా ఆమెను ద్వేషించే వారి ఓట్లను కూడా తనవైపు తిప్పుకునే ప్లాన్ వేసినట్లు అర్థం అవుతుంది. ఇలా గట్టిగానే తన రీఎంట్రీకి శ్రీజ ప్లాన్ చేసుకుందని తెలుస్తోంది. అయితే, ఇక్కడ శ్రీజ నామినేషన్ పాయింట్లు ప్రతీది కూడా ఒక బుల్లెట్లా దూసుకుపోయాయి. వాటిలో ఒక్కదానికి కూడా కల్యాణ్ సమాధానం చెప్పలేకపోయాడు. తనూజ, మాధురి కూడా శ్రీజ వేసిన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో ఆమె ప్లాన్ విజయవంతమైంది.కల్యాణ్,తనూజలను ఇరికించిన శ్రీజనువ్వు అమ్మాయిల పిచ్చోడివా..? అంటూ కల్యాణ్ను శ్రీజ నామినేట్ చేసింది. ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నా సరిగ్గా ఎదిరించలేకపోయావ్.. అలాంటి కామెంట్లు చేసినా సరే లైట్ ఎందుకు తీసుకున్నావ్ కల్యాణ్.. ఎందుకు నోరుమూసుకొని కూర్చున్నావ్ అంటూ సరైన పాయింట్లే పట్టింది. వాటికి కల్యాణ్ సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు. మరోవైపు తనూజను కూడా శ్రీజ గట్టిగానే టార్గెట్ చేసింది. ఇక్కడికి ఒక పర్సన్ వచ్చి మిమ్మల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేశారు. ఇంత పెద్ద పబ్లిక్ ప్లాట్ఫామ్లో మీ గురించి తప్పుగా మాట్లాడారు. రెండుడు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటూ ఎవరైతే కామెంట్ చేశారో అదే పర్సన్తో మీరు తిరుగుతున్నారు. మీరు ఆ పర్సన్ దగ్గరికే వెళ్లి రాజు రాజు అంటూ బాండింగ్ పెంచుకున్నారు. ఏంటో నాకు నిజంగా అర్థం కాలేదని శ్రీజ పేర్కొంది. ఇలా కల్యాణ్, తనూజల ఇమేజ్ను తగ్గించాలనే పక్కా ప్లాన్తో ఇరికించేసింది. తన రీ ఎంట్రీ ఆట బలంగా ఉండాలంటే ఇలాంటి స్ట్రాటజీ వేయడంలో తప్పులేదు. -
హన్సిక ట్రిప్.. ఎవరితో తెలుసా..?
దక్షణాదిన ఒకప్పుడు క్రేజీ కథానాయకిగా వెలిగిన నటి హన్సిక. తెలుగు, తమిళం, హిందీ ఇలా పలు భాషల్లో 50 చిత్రాలకు పైగా నటించిన ఈ ముంబయి భామ ఆ మధ్య సోహైల్ కతూరియా అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఇప్పటి వరకూ ఏ ఒక్క కొత్త చిత్రంలోనూ నటించలేదు. అయినప్పటికీ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఇటీవల భర్తతో వివాదాలు అంటూ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దానికి బలం చేకూర్చే విధంగా నటి హన్సిక ఇటీవల దీపావళి పండగను ఒంటరిగానే జరుపుకోవడం, వివాహం అయిన రెండేళ్లలోనే భర్తను విడిచి తల్లితోనే ఉంటున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారంపై హన్సిక ఇప్పటి వరకూ నోరు మెదపలేదు. కాగా తాజాగా ఈ అమ్మడు రాజస్థాన్లోని రంతంబోర్ జాతీయ పార్క్ను తిలకించడానికి వెళ్లారు. అయితే ఆమె ఎవరితో కలిసి వెళ్లారో తెలుసా అమ్మ, సోదరుడితో కలిసి ఆ పార్క్కు వెళ్లారు. అక్కడ పులి, కుందేలు, ఎలుగుబంటులతో ఫొటోలు దిగారు. వాటిని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ విషయం అదికాదు. ఆ పార్క్కు హన్సిక తన తల్లి, సోదరుడితో కలిసి వెళ్లడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కారణం ఈసారి కూడా భర్త ఆమెతో లేకపోవడమే. దీంతో హన్సిక, సోహైల్ కతూరియా మధ్య వివేధాలు అనే ప్రచారం నిజమేనని అర్థమవుతోందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అదే విధంగా హన్సిక తన సోదరుడి భార్యను గృహ హింసకు గురి చేసిందే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఓ టాప్ హీరోయిన్ ఇలాంటి వివాదాలకు తావు ఇవ్వడంతో హన్సిక పేరు వార్తల్లో నానుతోంది. అయితే ఇలాంటివన్నీ లెక్క చేయని ఈ అమ్మడు విహార యాత్రలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Hansika Motwanni (@ihansika) -
మహేశ్బాబు స్వాగతం చెప్పడం ఆనందం: శిల్పా శిరోద్కర్
‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘జటాధర’. ఇందులో స్టన్నింగ్ విజువల్స్, అద్భుతమైన సంగీతం, బలమైన భావోద్వేగాలు ఉన్నాయి. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది’’ అని నటి శిల్పా శిరోద్కర్ చెప్పారు. సుధీర్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘జటాధర’. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. సోనాక్షీ సిన్హా, శిల్పా శిరోద్కర్ కీలకపాత్రలు పోషించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేశ్ కుమార్ బన్సల్, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్ నంద నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో నవంబరు 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా శిల్పా శిరోద్కర్ పంచుకున్న విశేషాలు...⇒ తెలుగులో నేను నటించిన తొలి చిత్రం ‘బ్రహ్మ’ (1992). ఆ తర్వాత తెలుగు సినిమా చేయలేదు. ఇన్నేళ్ల తర్వాత ‘జటాధర’ చిత్రంతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఇందులో శోభ అనే ప్రాధాన్యం ఉన్నపాత్ర చేశాను. తనకి డబ్బంటే అత్యాశ. ఎలాగైనా సరే అనుకున్నది చేరుకోవాలి అనుకునేపాత్ర. ఈ క్యారెక్టర్ చేయడం సవాల్గా అనిపించింది. ఎందుకంటే ఇలాంటిపాత్ర నేనెప్పుడూ చేయలేదు. అయితే మా డైరెక్టర్స్ వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ క్లియర్ విజన్, సపోర్ట్తో ఈపాత్రని చేయగలిగా.⇒ మహేశ్బాబుగారు మా ‘జటాధర’ ట్రైలర్ లాంచ్ చేయడం, ట్రైలర్ బాగుందని ఆయన కితాబివ్వడంతోపాటు టాలీవుడ్కి నాకు స్వాగతం చెప్పడం సంతోషాన్నిచ్చింది. నమ్రత శిరోద్కర్ (శిల్ప సోదరి)కి కూడా ట్రైలర్, నాపాత్ర నచ్చాయి. సుధీర్బాబుగారు మాకు బంధువే అయినప్పటికీ సెట్లో మేం కేవలం ఆర్టిస్టులం మాత్రమే. సుధీర్గారితో కలిసి పని చేయడం మంచి ఎక్స్పీరియన్స్. సోనాక్షీ సిన్హా చేసిన ధన పిశాచిపాత్ర చాలా బాగుంటుంది. నిర్మాతలు రాజీ పడకుండా ఈ సినిమా నిర్మించారు.⇒ చిత్ర పరిశ్రమలో తెలుగు, హిందీ వంటి సరిహద్దులు ఇప్పుడు లేవు. ప్రస్తుతం తెలుగు సినిమా బెస్ట్ ఫేజ్లో ఉంది. కంటెంట్ పరంగా, టెక్నికల్గా అడ్వాన్స్ అయ్యాం. ‘జటాధర’ సినిమా కోసం తెలుగు, హిందీ... ఇలా అన్ని చోట్ల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నవంబరు 7న ప్రేక్షకులు అద్భుతమైన సినిమాని చూడబోతున్నారు. నాకు రొమాంటిక్ కామెడీపాత్రలంటే ఇష్టం. ఇన్నేళ్ల నా సినీ ప్రయాణం పట్ల హ్యాపీగా ఉన్నాను. మంచిపాత్రలు, సినిమాలు చేసి, ప్రేక్షకులను అలరించాలన్నదే నా కల. ఇకపై తెలుగులోనూ వరుసగా సినిమాలు చేస్తాను. -
బంగారం ఆన్ సెట్
‘‘సన్నిహితులు, స్నేహితుల ప్రేమ, ఆశీర్వాదాల నడుమ ‘మా ఇంటి బంగారం’ ముహూర్తంతో మా ప్రయాణాన్ని ప్రారంభించాం. ఈ స్పెషల్ మూవీ ఆరంభించిన సందర్భంగా అందరి ప్రేమ, సహకారం మాకు కావాలి’’ అని సమంత పేర్కొన్నారు. ఆమె లీడ్ రోల్లో ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని ప్రకటించి కొన్ని నెలలైంది. ఫైనల్గా సోమవారం ఈ చిత్రం సెట్స్కి వెళ్లింది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ‘శుభం’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత సమంత నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దిగంత్, గుల్షన్ దేవయ్య తదితరులు ప్రధానపాత్రల్లో, గౌతమి, మంజుషా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. సమంత, రాజ్ నిడుమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మిస్తున్నారు. ‘ఓ బేబి’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా ఇది. ఈ యాక్షన్ మూవీకి సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: ఓం ప్రకాశ్. -
రైల్వే కాలనీ డేట్ ఫిక్స్
‘అల్లరి’ నరేశ్ హీరోగా రూపొందిన ‘12ఎ రైల్వే కాలనీ’ థియేటర్లో కనిపించే తేదీ ఖరారైపోయింది. నాని కాసరగడ్డని దర్శకుడిగా పరిచయం చేస్తూ, పవన్కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘పొలిమేర, పొలిమేర 2’ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచుకున్న డా. అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రా నికి షో రన్నర్గా వ్యవహరించి, స్క్రీన్ప్లే, డైలాగ్స్ అందించారు.ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేసిన విషయాన్ని ప్రకటించి, స్పెషల్ వీడియోను, ΄పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘నవంబరు 21న ప్రపంచవ్యాప్తంగా మా ‘12ఎ రైల్వే కాలనీ’ని విడుదల చేయనున్నాం. ఆ వారంలో వేరే పెద్ద రిలీజులు లేకపోవడం బాక్సాఫీస్ వద్ద మా సినిమాకి అనుకూలంగా ఉంటుంది. ఈ చిత్రంలో ‘అల్లరి’ నరేశ్ చేసినపాత్రలో పలు కోణాలున్నాయి’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ‘పొలిమేర’ సిరీస్లో ఆకట్టుకున్న డా. కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో. కెమెరా: కుశేంద్ర రమేశ్ రెడ్డి. ’ -
అందమైన ఫిగరు నువ్వా...
నాగశౌర్య, విధి జోడీగా నటించిన చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. నూతన దర్శకుడు రామ్ దేసినా (రమేశ్) దర్శకత్వంలో శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్పై శ్రీనివాసరావు చింతలపూడి ఈ సినిమా నిర్మించారు. హ్యారిస్ జైరాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘అందమైన ఫిగరు నువ్వా...’ అంటూ సాగే వీడియో సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ పాటని శ్రీధర్ సేన, ప్రియా జెర్సన్పాడారు. ‘‘కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. పవర్ఫుల్ పాత్రలో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నాగశౌర్య. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైనపాటలు సూపర్ హిట్ అయ్యాయి. టీజర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా రిలీజైన ‘అందమైన ఫిగరు నువ్వా...’పాటలో నాగశౌర్య, విధి మధ్య కెమిస్ట్రీ అదిరి΄ోతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
ఫుల్ ఎమోషనల్ లవ్ స్టోరీ.. గ్లింప్స్ రిలీజ్
లక్ష్మణ్ టేకుముడి , రాధికా జోషి హీరో, హీరోయిన్లుగా వస్తోన్న తాజా చిత్రం 'ప్రేమ లేదని'. ఈ మూవీకి జీడీ నరసింహ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని జీడీఆర్ మోషన్ పిక్చర్ బ్యానర్లో శ్రీని ఇన్ఫ్రా నిర్మిస్తున్నారు. హార్ట్ ఫుల్ లవ్ స్టోరీగా వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.తాజాగా ఈ మూవీ గ్లింప్స్ మేకర్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ చూస్తుంటే ఫుల్ ఎమోషనల్ ప్రేమకథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. వైజాగ్ బ్యాక్డ్రాప్లో ఈ మూవీని రూపొందించినట్లు గ్లింప్స్లో సీన్స్ చూస్తేనే అర్థమవుతోంది. మందు, సిగరెట్ కాదు.. అబ్బాయిలకు హానికరం అమ్మాయిలు అనే చివర్లో వచ్చే డైలాగ్ యూత్కు కనెక్ట్ అయ్యేలా ఉంది. ఈ రోజుల్లో ట్రెండ్కు తగినట్లుగానే ప్రేమలేదని మూవీని ప్రేక్షకుల ముందుకొస్తున్నట్లు గ్లింప్స్లో చూపించారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి ఎస్ సుహాస్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాలో సురేశ్ గురు, గాయత్రి కీలక పాత్రల్లో నటించారు. -
స్టార్ హీరో తనయుడి మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ రిలీజ్
మలయాళ స్టార్ మోహన్ లాల్ తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రణవ్. హృదయం మూవీతో భాషలకు అతీతంగా ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు. తాజాగా డియాస్ ఇరాయ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మిస్టరీ హారర్ థ్రిల్లర్ మూవీని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ డియాస్ ఇరాయ్ని విడుదల చేస్తోంది.మలయాళ సినిమాలకు టాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ ఉంది. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ మూవీ కావడంతో తెలుగు ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భూత కాలం', మమ్ముట్టి 'భ్రమ యుగం' చిత్రాలకు దర్శకత్వం వహించిన రాహుల్ సదాశివన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ బ్యానర్లపై చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్ నిర్మించారు.ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం అందించారు. ఈ సినిమా మలయాళ, తమిళ భాషల్లో అక్టోబర్ 31న విడుదల కానుంది. తెలుగు వర్షన్ను నవంబర్ తొలి వారంలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. కాగా.. గతంలో రిలీజైన ప్రేమలు', '2018', 'మంజుమ్మెల్ బాయ్స్', 'కొత్త లోక' లాంటి మలయాళ సినిమాలు తెలుగులో సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. -
మాస్ మహారాజా మాస్ జాతర.. యాక్షన్ ట్రైలర్ వచ్చేసింది
మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న ఫుల్ యాక్షన్ మూవీ మాస్ జాతర. ఈ మూవీని భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కించారు. ధమాకా లాంటి బ్లాక్బస్టర్ తర్వాత శ్రీలీల మరోసారి రవితేజ సరసన కనిపించనుంది. ఈ మూవీ కోసం మాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల రిలీజైన సూపర్ డూపర్ ఆనే సాంగ్ను రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.రిలీజ్ తేదీ మరో మూడు రోజులే ఉండడంతో ప్రమోషన్స్తో దూసుకెళ్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే మాస్ జాతర ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రైల్వే పోలీస్ లక్ష్మణ్ భేరి పాత్రలో మాస్ మహారాజా కనిపించనున్నారు. ఈ మూవీలో రవితేజకు ప్రతినాయకుని పాత్రలో నవీన చంద్ర నటించారు. ఈ భారీ యాక్షన్ మూవీని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా అక్టోబరు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ చూస్తుంటే రవితేజ మరోసారి మాస్ హీరోగా ఆడియన్స్ను అలరించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో రైల్వే ఎస్సైగా మాస్ మహారాజా సరికొత్తగా కనిపించనున్నారు. ట్రైలర్ రైల్వేస్టేషన్ బ్యాక్డ్రాప్లో వచ్చే ఫైట్స్, విజువల్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రైల్వేలో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సౌత్ జోన్, నార్త్ జోన్ ఉంటాయి.. నేను వచ్చాక ఒకటే జోన్.. వార్ జోన్ అనే డైలాగ్ మాస్ ఆడియన్స్ను అలరిస్తోంది. Ikkada antha okkate zone… adhi MASS MAHARAJ WAR ZONE! 👊⚔️🔥#MassJatharaTrailer Out Now – https://t.co/EsvmFE7ie0#MassJathara is set to deliver a full-on feast of action, fun & entertainment 💣This Oct 31st, theaters turn into a celebration! 🔥🔥#MassJatharaOnOct31st… pic.twitter.com/Ftd4xhug1r— Sithara Entertainments (@SitharaEnts) October 27, 2025 -
శర్వా వరస సినిమాలు.. కానీ హిట్ కొట్టెదెప్పుడు?
ఒకప్పుడు అంటే ఎలాంటి కమర్షియల్ సినిమాలు తీసినా సరే ఎలాగోలా హీరోల బండి నడిచేది. కానీ గత కొన్నాళ్లలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాల్ని చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మిడ్ రేంజ్ హీరోల పరిస్థితి దారుణంగా తయారైంది. దానికి తోడు పలువురు హీరోల మూవీస్ కూడా పెద్దగా వర్కౌట్ కావట్లేదు. అలాంటి వాళ్లలో శర్వానంద్ ఒకడు. ఇంతకీ ప్రస్తుతం ఈ హీరో ఏం చేస్తున్నాడు? కొత్త మూవీస్ సంగతేంటి?గమ్యం, ప్రస్థానం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్.. సోలో హీరోగా నిలదొక్కుకోవడానికి బాగానే కష్టపడ్డాడు. కానీ అదృష్టం త్వరగా కలిసి రాలేదు. మంచి నటుడే అని ప్రూవ్ చేసుకున్నప్పటికీ 2014లో 'రన్ రాజా రన్' హిట్ కొట్టి ట్రాక్లోకి వచ్చాడు. అలా 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', ఎక్స్ప్రెస్ రాజా, మహానుభావుడు లాంటి సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. కానీ తర్వాత చేసిన రణరంగం, జాను, శ్రీకారం, మహాసముద్రం.. ఇలా ఒకదాన్ని మించి మరొకటి ఫ్లాప్ అయ్యాయి. చివరగా 2022లో 'ఒకే ఒక జీవితం' చిత్రంతో పర్వాలేదనిపించుకున్నాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బోల్డ్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)యంగ్ హీరోలు అంటే ఎలా ఉండాలి? పెద్ద హీరోల్లా కాకుండా ఏడాది కనీసం ఒకటి రెండు సినిమాలైనా చేస్తూ ప్రేక్షకుల దృష్టిలో ఉండాలి. లేదంటే ఆడియెన్స్ వీళ్లని మర్చిపోయే అవకాశముంది. అలాంటి శర్వానంద్ నుంచి గత మూడేళ్లలో ఒక్కటే సినిమా వచ్చింది. అది గతేడాది రిలీజైన 'మనమే'. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయింది. ఈ ఏడాది ఏవైనా కొత్త చిత్రాలు తీసుకొస్తాడా అని చూస్తే ప్రస్తుతానికైతే ఆ సూచనలు కనిపించట్లేదు.2026లో శర్వానంద్ నుంచి ఏకంగా మూడు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. వాటిలో 'నారీ నారీ నడుమ మురారి' చిత్రం సంక్రాంతిని టార్గెట్ చేశారు. కొన్ని రోజుల క్రితమే పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ పండకు చిరంజీవి, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల మూవీస్ ఉన్నాయి. మరి వాళ్లతో పోటీపడి శర్వా బరిలోకి దిగుతాడా అనేది చూడాలి? మరోవైపు బైకర్ అనే స్పోర్ట్స్ డ్రామా మూవీ, భోగీ అనే యాక్షన్ మూవీ కూడా ఈ హీరో చేస్తున్నాడు. వీటితో హిట్ కొట్టి కమ్ బ్యాక్ అయితే సరేసరి. లేదంటే మాత్రం ప్రస్తుత జనరేషన్లో వెనకబడిపోయే ప్రమాదముంది? మరి 2026 అయినా శర్వాకు కలిసొస్తుందేమో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
సమంత కొత్త సినిమా.. పూజ కార్యక్రమంలో రాజ్ నిడిమోరు!
టాలీవుడ్ హీరోయిన్ సమంత(Samantha Ruth Prabhu) ఇటీవల దీపావళి పండుగను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. తన బాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి ఈ వేడుకల్లో సందడి చేసింది. అఫీషియల్గా బయటికి చెప్పకపోయినా వీరిద్దరి రిలేషన్పై గత కొన్ని నెలలుగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఎక్కడా కూడా వీరిద్దరు నోరు విప్పలేదు. ఇదంతా పక్కనపెడితే సామ్ తెలుగులో మరో సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. నందిని రెడ్డి దర్శకత్వంలో ఆమె మరోసారి జతకట్టింది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మా ఇంటి బంగారం(Maa Inti Bangaram) మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ దసరా సందర్భంగా సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం నిర్వహించారు. ముహుర్తం షాట్తో ఈ మూవీ షూటింగ్ను ప్రారంభించారు. ఈ పూజకు సంబంధించిన వీడియోను సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు.కాగా.. ఓ బేబీ మూవీ తర్వాత దర్శకురాలు నందిని రెడ్డితో సమంత చేస్తోన్న రెండో చిత్రం కావడం విశేషం. ఈ మూవీని తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సామ్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గతంలో ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ని స్థాపించిన సామ్.. శుభం అనే తొలి సినిమా నిర్మించింది. ఇందులో అతిథి పాత్రలో కనిపించింది. ప్రస్తుతం మా ఇంటి బంగారంతో పాటు ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే హిందీ వెబ్ సిరీస్లో నటిస్తోంది. Started our journey with the Muhurtham of #MaaIntiBangaram, surrounded by love & blessings. ✨We can’t wait to share with you what we’re creating… need all your love and support as we begin this special film. ❤️#MIB #Samantha #TralalaMovingPictures @TralalaPictures… pic.twitter.com/PwICPNsP8R— Samantha (@Samanthaprabhu2) October 27, 2025 -
ఓటీటీలోకి తమిళ బోల్డ్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
కొన్నాళ్ల క్రితం తమిళంలో ఓ సినిమా తీశారు. టీజర్ రిలీజైన దగ్గర నుంచి టాక్ ఆఫ్ ద టౌన్గా ఈ మూవీ నిలిచింది. బ్రహ్మణులని కించపరిచే సీన్స్ ఉన్నాయని, యువతని పెడదోవ పట్టించేలా ఉందని చెప్పి రచ్చ రచ్చ చేశారు. సెన్సార్లోనూ ఇబ్బందులు తప్పలేదు. తర్వాత ఎలాగోలా థియేటర్లలోకి వచ్చిన ఈమూవీ.. ఇప్పుడు ఓటీటీలోనూ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. తెలుగులోనూ అందుబాటులోకి రానుండటం విశేషం. ఇంతకీ దీని సంగతేంటి?(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి 'చిరంజీవ'.. ట్రైలర్ రిలీజ్)ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ సమర్పణలో వచ్చిన బోల్డ్ మూవీ 'బ్యాడ్ గర్ల్'. అంజలి శివరామన్ లీడ్ రోల్ చేయగా.. వర్ష భరత్ దర్శకురాలు. సమాజంలో అమ్మాయి స్వతంత్రంగా ఉంటే.. కొందరు వ్యక్తులు దాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఆ అమ్మాయిని 'బ్యాడ్ గర్ల్'గా ఎలా ముద్ర వేస్తారు అనే పాయింట్తో తీసిన సినిమా ఇది. సెప్టెంబరు 5న థియేటర్లలో తమిళ వెర్షన్ రిలీజ్ కాగా ఇప్పుడు నవంబర్ 4 నుంచి హాట్స్టార్లోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.'బ్యాడ్ గర్ల్' విషయానికొస్తే.. టీనేజీలోకి వచ్చిన మిడిల్ క్లాస్ అమ్మాయి రమ్య (అంజలి శివరామన్). అందరూ ఆడపిల్లల్లానే తనకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉండాలని అనుకుంటుంది. అలా స్కూల్ చదువుతున్నప్పుడు నలన్, కాలేజీలో ఉన్నప్పుడు అర్జున్, ఉద్యోగం చేస్తూ ఇర్ఫాన్ని ప్రేమిస్తుంది. కానీ కొన్ని కారణాలతో వీళ్లతో బ్రేకప్ కూడా అయిపోతుంది. కానీ ఒకానొక సందర్భంలో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితికి వెళ్తుంది. దాన్నుంచి ఎలా బయటపడింది? రమ్యని బ్యాడ్ గర్ల్ అని సమాజం ఎందుకు ముద్ర వేసింది అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
మొకాళ్లపై తిరుమల కొండపైకి టాలీవుడ్ నటి కూతురు.. వీడియో వైరల్!
టాలీవుడ్ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో అభిమానులతో టచ్లోనే ఉంటోంది. తన కూతురు సుప్రీతతో కలిసి ఎక్కడికెళ్లినా ఫోటోలను షేర్ చేస్తోంది.ఇటీవల సురేఖ వాణి తన కూతురు సుప్రీతతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాజాగా తిరుమలను సందర్శించిన ఫోటోలు, వీడియోలను సుప్రీత మరోసారి ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇందులో తన తల్లితో కలిసి మొకాళ్లపై తిరుమల కొండను ఎక్కుతున్న వీడియోను కూడా పంచుకుంది. ఇది చూసిన అభిమానులు తల్లీకూతుళ్ల దైవభక్తికి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) -
రుక్మిణి 'కాంతార 1' జ్ఞాపకాలు.. 'లిటిల్ హార్ట్స్' శివానీ ఇలా
'కాంతార 1' షూటింగ్ జ్ఞాపకాలతో రుక్మిణి వసంత్'లిటిల్ హార్ట్స్' ఫేమ్ శివానీ గ్లామరస్ పోజులువర్కౌట్ చేస్తూ పెట్ డాగ్తో కీర్తి సురేశ్ సరదాజిమ్ ఫొటో పోస్ట్ చేసిన ముద్దుగుమ్మ సమంతఅందాల హరివిల్లులా జాన్వీ కపూర్ స్టిల్స్జిమ్ వీడియో పోస్ట్ చేసిన నభా నటేశ్ View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Namrata Purohit (@namratapurohit) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) -
ఇండస్ట్రీలో విషాదం మిగిల్చిన అక్టోబరు
వయసు పెరిగిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు తుదిశ్వాస విడువక తప్పదు. అయితే ఇండస్ట్రీలో గత కొన్నిరోజులుగా సంభవిస్తున్న సెలబ్రిటీల వరస మరణాలు మాత్రం చాలా విషాదాన్ని నింపాయని చెప్పొచ్చు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు వరకు రోజుల వ్యవధిలో మరణించారు. ఇప్పుడీ విషయం చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ ఆయా నటీనటులు ఎవరు?నటి డ్యాన్సర్ మధుమతి.. అనారోగ్య సమస్యల కారణంగా 87 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. 1960, 70ల్లో పలు సినిమాలు చేసిన ఈమె.. అక్షయ్ కుమార్, గోవింద లాంటి స్టార్స్కి డ్యాన్స్ నేర్పించింది. ఈమె అక్టోబరు 15న చనిపోయింది.మధుమతి చనిపోయిన రోజునే పంకజ్ ధీర్ అనే సీనియర్ నటుడు కూడా మృతి చెందారు. 'మహాభారతం'లో కర్ణుడిగా చేసిన ఈయన.. చాన్నాళ్లుగా క్యాన్సర్తో బాధపడుతూ కన్నుమూశారు. 'చంద్రకాంత'లో ఈయన యాక్టింగ్ చాలా పాపులర్.నటుడు, కమెడియన్ గోవర్ధన్ అశ్రానీ(84).. ఈ అక్టోబరు 20న చనిపోయారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరడం ఈయన మరణానికి కారణం. ఈయన షోలే సినిమాలో జైలర్ పాత్ర పోషించి ఫేమ్ సొంతం చేసుకున్నారు. ఈయన యాక్టర్, కమెడియన్, దర్శకుడిగా పలు విభాగాల్లో పనిచేశారు.సింగర్ రిషభ్ టండన్.. దీపావళి పండగని కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకొనేందుకు ఢిల్లీ వెళ్లారు. కానీ అక్టోబరు 21న గుండెపోటుతో మరణించారు. ఈయన వయసు అయితే 35 ఏళ్లే. మరీ చిన్న వయసులో చనిపోవడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.మనం చూసిన ఎన్నో యాడ్స్ సృష్టించిన పీయూష్ పాండే.. అక్టోబరు 24న కన్నుమూశారు. గత కొన్ని వారాలుగా న్యూమోనియాతో పోరాడిన ఈయన 70 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ప్రధాని మోదీ, సచిన్ టెండూల్కర్ తదితరులు ఈయనకు సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.ప్రముఖ నటుడు-కమెడియన్ సతీష్ షా.. 74 ఏళ్ల వయసులో ముత్రపిండాల సమస్యతో ఇబ్బంది పడుతూ అక్టోబరు 25న మరణించారు. సరాభాయ్ vs సరాభాయ్, దిల్ వాలియా దుల్హానియా లే జాయేంగే తదితర చిత్రాలతో ఈయన చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా ఈ నెల 15-25వ తేదీల్లో ఏకంగా ఆరుగురు బాలీవుడ్ సెలబ్రిటీలు చనిపోవడం బాధాకరమైన విషయం. -
నేరుగా ఓటీటీలోకి 'చిరంజీవ'.. ట్రైలర్ రిలీజ్
ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. తర్వాత మూవీస్ అయితే తీశాడు గానీ ఒక్కటంటే ఒక్క హిట్ లేక దాదాపు కనుమరుగైపోయాడు. గతేడాది 'తిరగబడరా సామీ' అనే చిత్రంతో వచ్చాడు గానీ ఫలితం మారలేదు. ప్రస్తుతం 'చిరంజీవ' అనే ఓటీటీ మూవీ చేస్తున్నాడు. నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ చిత్ర ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)'జబర్దస్త్' ఫేమ్ అభి ఈ సినిమాకు దర్శకుడు. ట్రైలర్ బట్టి చూస్తే ఓ ప్రమాదంలో గాయపడ్డ హీరోకు.. ఎవరెన్ని ఏళ్లు బతుకుతారనే విషయం కనిపిస్తూ ఉంటుంది. మరోవైపు వ్యక్తిగత సమస్యలు ఇతడిని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు? ఏంటనేదే స్టోరీలా అనిపిస్తుంది. మరి నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాతోనైనా రాజ్ తరుణ్ ఆకట్టుకుంటాడేమో చూడాలి?(ఇదీ చదవండి: ఒక్క సినిమాతో తెలుగు, తమిళంలో విలన్గా క్రేజ్.. గుర్తుపట్టారా?) -
'సంతాన ప్రాప్తిరస్తు' నుంచి 'తెలుసా నీ కోసమే' సాంగ్ లాంచ్
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా 'సంతాన ప్రాప్తిరస్తు'. మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంజీవ్ రెడ్డి దర్శకుడు. నవంబర్ 14న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సోమవారం సినిమాలోని ఓ పాట లాంచ్ చేశారు. తెలుసా నీ కోసమే అంటూ సాగే లిరికల్ గీతాన్ని అతిథిగా హాజరైన ప్రొడ్యూసర్ సురేష్ బాబు రిలీజ్ చేశారు. 'ఆయ్', 'సేవ్ ది టైగర్స్' లాంటి సక్సెస్ ఫుల్ ప్రాజెక్టులకు పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ.. ఈ గీతాన్ని కంపోజ్ చేశారు. శ్రీమణి ఆకట్టుకునే లిరిక్స్ అందించగా.. అర్మాన్ మాలిక్ మనసుకు హత్తుకునే పాడారు. -
ఓటీటీకి కాంతార చాప్టర్ 1.. అఫీషియల్ డేట్ వచ్చేసింది
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద రికార్డుల ప్రభంజనం సృష్టిస్తోంది. దసరా కానుకగా థియేటర్లలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ సినిమా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కేవలం మూడు వారాల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ మూవీ ఛావాను దాటేసింది.ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కాంతార మూవీ మేకర్స్ ఉత్కంఠకు తెరదించారు. అంతా ఊహించినట్లుగానే అక్టోబర్ 31 నుంచే అమెజాన్ ప్రైమ్లో అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుందని వీడియోను షేర్ చేసింది. హిందీ భాషలో స్ట్రీమింగ్కు సంబంధించి ఎలాంటి ప్రకటనైతే రాలేదు.చాప్టర్ 1 కథేంటంటే?'కాంతార 1' విషయానికొస్తే.. తొలిభాగం ప్రస్తుతంలో జరిగితే ఈసారి మాత్రం శతబ్దాల వెనక్కి వెళ్తుంది. విజయేంద్ర (జయరామ్) బాంగ్రా రాజ్యాన్ని పాలిస్తుంటాడు. ఇతడికి కులశేఖరుడు (గుల్షన్ దేవయ్య) అనే కొడుకు. అతనికి మహారాజ పట్టాభిషేకం చేసి విశ్రాంతి తీసుకుంటాడు తండ్రి. మందుకొట్టడం తప్ప అసలు పాలన ఏం చెయ్యడు. యువరాజు చెల్లెలు కనకవతి (రుక్మిణి వసంత్). ఈ రాజ్యానికి దగ్గరలోని కాంతార అనే ప్రాంతంలో కొన్ని తెగలు ఉంటాయి.కాంతార తెగకు ప్రత్యర్థులు కడపటి దిక్కువాళ్లు. వాళ్ల మధ్యలో పోరు ఎలా ఉన్నా, ఈ కాంతార తెగలో కొందరు బాంగ్రా రాజ్యానికి వస్తారు. వారి నౌకాతీరాన్ని ఆక్రమించుకుంటారు. ఈ గొడవ వల్ల బాంగ్రా రాజుకి, కాంతార నాయకుడు బెర్మే (రిషబ్)కి గొడవ అవుతుంది. ఈ క్రమంలో కులశేఖరుడు బెర్మే తల్లిని చంపేసి, అతని ఊరిని తగలబెట్టేస్తాడు. తర్వాత ఏమైంది? అసలు విలన్ ఎవరనేది మిగతా స్టోరీ. get ready to witness the LEGENDary adventure of BERME 🔥#KantaraALegendChapter1OnPrime, October 31@hombalefilms @KantaraFilm @shetty_rishab @VKiragandur @ChaluveG @rukminitweets @gulshandevaiah #ArvindKashyap @AJANEESHB @HombaleGroup pic.twitter.com/ZnYz3uBIQ2— prime video IN (@PrimeVideoIN) October 27, 2025 -
జాబ్ చేస్తూ యాక్టింగ్.. కానీ 25 ఏళ్లకే తనువు చాలించి
ఈనెలలో బాలీవుడ్లో పలువురు సెలబ్రిటీల మరణాలు కలిచివేశాయి. వీటి నుంచి తేరుకోకముందే ఇండస్ట్రీలో మరో విషాదం. 'జమత్ర' అనే వెబ్ సిరీస్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నమరాఠీ నటుడు సచిన్ చంద్వాడే (25) తనువు చాలించాడు. ఇంట్లోనే ఊరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ప్రస్తుతం జమత్ర 2, అసురవన్ అనే సిరీస్లు చేస్తున్న సచిన్.. మరోవైపు విప్రో పుణె బ్రాంచ్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం కూడా చేస్తున్నాడు. కారణం ఏంటో తెలీదు గానీ ఈనెల 23వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో ఇంట్లోనే ఊరి వేసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఇది తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు.. సచిన్ని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ధులే సిటీకి తీసుకెళ్లారు. అలా దాదాపు 24 గంటల పాటు మృత్యువుతో పోరాడి 24వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో తుదిశ్వాస విడిచాడు.చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టమున్న సచిన్.. అందుకు తగ్గట్లే ఓ వైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు సినిమాలు, సిరీస్ల్లో నటిస్తున్నాడు. ఐదు రోజుల క్రితం కూడా 'జమత్ర 2'లో తన పాత్ర గురించి పోస్ట్ పెట్టాడు. ఇంతలోనే ఇలా ప్రాణాలు తీసుకోవడంతో సన్నిహితులు, సహ నటీనటులు షాక్ అవుతున్నారు. -
'కన్నడ హీరో దర్శన్ కేసు.. మరణ శిక్ష వేసినా ఓకే'
శాండల్వుడ్ హీరో దర్శన్(Darshan Thoogudeepa) కేసు కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ కేసులో రెండోసారి అరెస్టైన దర్శన్ ప్రస్తుతం జైలులోనే మగ్గుతున్నారు. ఈ నేపథ్యంలోనే తనకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని చాలాసార్లు విచారణ సందర్భంగా న్యాయస్థానాన్ని వేడుకున్నారు. కానీ దర్శన్ అడిగిన సౌకర్యాలు ఇవ్వడం సాధ్య కాదని.. అందులో కొన్ని మాత్రమే ఇవ్వగలమని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో బెయిల్ కోసం ఇప్పటికే పిటిషన్పై వేయగా.. తాజాగా న్యాయస్థానం విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా దర్శన్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. జైలులో దర్శన్కు కనీస సదుపాయాలు కల్పించడం లేదని వివరించారు. ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కనీసం పట్టించుకోవడం లేదని కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణ త్వరగా పూర్తి చేసి.. ఏ శిక్ష విధించినా దర్శన్ సిద్ధంగా ఉన్నాడని చెప్పారు. త్వరగా విచారణ జరిపి.. మరణశిక్ష విధించినా సరే తమకు సమ్మతమేనని దర్శన్ తరఫు న్యాయవాది వాదించారు. వెన్నునొప్పి సమస్య మళ్లీ తిరగబెట్టిందని.. గతంలో తనకు విషమిస్తే ఆత్మహత్య చేసుకుంటానని దర్శన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా న్యాయవాది గుర్తు చేశారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసి తదుపరి విచారణను అక్టోబర్ 29వ తేదీకి వాయిదా వేసింది.కాగా.. చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి అనే అభిమాని హత్య కేసులో బెంగళూరు పరప్పన జైల్లో ఉన్న దర్శన్కు కనీస సౌకర్యాలు కల్పించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఆయన ఆరోపణలతో వాస్తవాలను పరిశీలించేందుకు ఉన్నత న్యాయస్థానం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. బెంగళూరు 57వ సీసీహెచ్ కోర్టుకు న్యాయసేవ ప్రాధికార కార్యదర్శి వరదరాజ నివేదికను అందించారు. ఆయనకు నిబంధనల ప్రకారం అందాల్సిన సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. తనకు ఫంగస్ సోకిందని దర్శన్ అబద్ధం చెబుతున్నారంటూ చర్మవ్యాధుల చికిత్స నిపుణురాలు జ్యోతిబాయితో చేయించిన పరీక్ష నివేదికను కూడా న్యాయస్థానంలో అందజేశారు. రేణుకాస్వామి హత్య కేసులో తమకు బెయిలు మంజూరు చేయాలని దర్శన్, పవిత్రాగౌడ పిటిషన్ దాఖలు చేశారు. -
'బాహుబలిని కట్టప్ప ఎప్పుడు చంపాడనేది కాదు.. రాజమౌళి ఆసక్తికర కామెంట్స్'
దర్శకధీరుడు రాజమౌళి మరోసారి తన మ్యాజిక్తో మరోసారి ప్రేక్షకుల ముందుకుకొస్తున్నారు. బాహుబలి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి.. మరోసారి వెండితెరపై ఆవిష్కరించనున్నారు. ఈ రెండు చిత్రాలను ఓకేసారి వీక్షించేలా బాహుబలి ది ఎపిక్(Baahubali : The Epic) పేరుతో రానున్నారు. ఈ మూవీని అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజమౌళితో హీరోలు ప్రభాస్, రానా కలిసి సరదాగా ఇంటర్వ్యూకు హాజరయ్యారు. తాజాగా ఈ ముగ్గురితో స్పెషల్ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో బాహుబలి చిత్రాల షూటింగ్ అనుభవాలను గుర్తు చేసుకున్నారు.ఈ లేటేస్ట్ ప్రోమోలో ఈ పదేళ్లలో మీ అనుభవం ఏంటి? అని రాజమౌళిని ప్రభాస్ అడిగారు. దీనికి బదులిస్తూ.. బాహుబలిని కట్టప్ప ఎప్పుడు చంపాడనేది కాదు.. అతన్ని చంపేందుకు కట్టప్ప సిద్ధపడటమే నన్ను ఎక్కువగా ప్రభావితం చేసిందన్నాడు. అంతేకాకుండా ఈ సినిమాల్లోని సీన్స్ను గుర్తు చేసుకుంటూ చాలా సరదాగా కనిపించారు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి. The reunion we've all been waiting for ❤️https://t.co/SdR0HOUXQc @ssrajamouli, #Prabhas and @RanaDaggubati come together to talk about #BaahubaliTheEpic and much beyond! Out very soon! Stay tuned. 😉#BaahubaliTheEpicOn31stOct pic.twitter.com/57ueklNXJa— Baahubali (@BaahubaliMovie) October 27, 2025 -
ఎలక్ట్రిక్ కారు కొన్న శంకర్ మహదేవన్.. ధర ఎంతంటే?
సంగీత దిగ్గజం శంకర్ మహదేవన్ (Shankar Mahadevan) లగ్జరీ కారు కొన్నాడు. ఎంజీ ఎమ్ 9 ఎలక్ట్రిక్ కారును తన గ్యారేజీకి తీసుకొచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో శంకర్ మహదేవన్.. కొత్త కారును ఇంటికి తీసుకొచ్చి హారతిచ్చాడు. అనంతరం కారు ముందు దర్జాగా నిలబడి ఫోటోలకు పోజిచ్చాడు.కారుఎంజీ ఎమ్9 మోడల్లో సీట్ మసాజ్, డ్యుయెల్ సన్రూఫ్, హీటింగ్, వైర్లెస్ చార్జింగ్ వంటి అనేక సదుపాయాలున్నాయి. సౌండ్ సిస్టమ్ కూడా అదిరిపోతుంది. కేవలం 30 నిమిషాల్లోనే దాదాపు 80 శాతం చార్జ్ అవుతుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 548 కి.మీ ప్రయాణించవచ్చు. ఈ కారు ధర రూ.80 లక్షల పైనే ఉంటుందని తెలుస్తోంది.సింగర్గా, సంగీత దర్శకుడిగా..శంకర్ మహదేవన్ 1967లో జన్మించాడు. బాల్యంలోనే హిందూస్థానీ శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడు. చదువు పూర్తవగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేశాడు. కొంతకాలానికి ఉద్యోగానికి రాజీనామా చేసి సంగీత ప్రపంచంలో అడుగుపెట్టాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠి, తుళు, పంజాబీ, హిందీ భాషల్లో అనేక పాటలు ఆలపించాడు. ఉట్టిమీద కూడు, ఏమి చేయమందువే.., ఒకటే జననం ఒకటే మరణం.., స్నేహమంటే ఇదేరా, ఓం మహాప్రాణ దీపం.., భం భం బోలే.., చంద్రుల్లో ఉండే కుందేలు.. అఖండ టైటిల్ సాంగ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పాడిన పాటలు చాలానే ఉన్నాయి. అలాగే ఎన్నో సినిమాలకు ఆయన మ్యూజిక్ కూడా అందించాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: కల్యాణ్ను పొడిచేసిన శ్రీజ.. నామినేషన్స్లో ఎవరున్నారంటే? -
ఒక్క సినిమాతో తెలుగు, తమిళంలో విలన్గా క్రేజ్.. గుర్తుపట్టారా?
భారతీయ సినిమాల్లో పరాయి దేశ నటీనటులు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. అయితే వాళ్లలో క్రేజ్ తెచ్చుకున్న వాళ్లు మాత్రం చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి వారిలో ఇతడు ఒకడు. చేసింది ఒక్కటే సౌత్ మూవీ అయినప్పటికీ. తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఇతడి ఫొటోలు వైరల్ అయ్యేసరికి సినీ ప్రేమికులు ఆశ్చర్యపోతున్నారు. ఇతడెవరో గుర్తుపట్టారా?(ఇదీ చదవండి: తెలుగు ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గకి తమిళంలో హీరోయిన్ ఛాన్స్)పైన ఫొటోలో కనిపిస్తున్న నటుడి పేరు జానీ ట్రింగ్యుయెన్. ఇలా చెబితే మీకు గుర్తురాకపోవచ్చు. డాంగ్లీ అని చెబితే ఇచ్చే కనిపెట్టేస్తారు. సూర్య హీరోగా చేసిన '7th సెన్స్' చిత్రంలో విలన్ ఇతడే. వియత్నాంలో పుట్టిన ఇతడు.. సొంత భాషతో పాటు హాలీవుడ్లోనూ పలు చిత్రాలు చేశాడు. మార్షల్ ఆర్ట్స్ గురువుగానూ మంచి పేరు తెచ్చుకున్నాడు. 2017 వరకు పలు భాషల్లో నటించాడు. తర్వాత మాత్రం యాక్టింగ్ పక్కనబెట్టేశాడు.రీసెంట్గా సోషల్ మీడియాలో ఇతడు మాట్లాడుతున్న వీడియో ఒకటి వైరల్ అయ్యేసరికి.. డాంగ్లీ ఇంతలా మారిపోయాడేంటి అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. సూర్య సినిమా వచ్చి దాదాపు 14 ఏళ్లు అయిపోయింది. వయసు కూడా 50 ఏళ్లు దాటేసింది. దీంతో కాస్త వృద్ధాప్య ఛాయలు కూడా డాంగ్లీ ముఖంలో కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఒక్క సినిమాతో అటు తెలుగు, ఇటు తమిళంలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడనే చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్) View this post on Instagram A post shared by trippy[FX] (@trippy__reels) -
AI Film Hackathon: ఏఐ సినిమాలకు పోటీ..
యాక్టింగ్, షూటింగ్, మ్యూజిక్, ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్.. ఇలా అన్నీ ఏఐ (Artificial Intelligence) చూసుకుంటోంది. అవును, హీరోహీరోయిన్లతో పనే లేకుండా కేవలం ఏఐను వాడుకుని సినిమాలు తీస్తున్నారు. అలాంటి సినిమాలకు ఓ పోటీ కూడా పెట్టారు. అదే ఏఐ హాకథాన్. దేశంలో తొలిసారి ఈ ఏఐ హాకథాన్ జరుగుతోంది. ముంబైలో అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ హాకథాన్లో 50 మంది క్రియేటర్స్ పాల్గొననున్నారు. వీరు విడివిడిగా లేదా జట్లుగా తయారై ఏఐ టూల్స్ ఉపయోగించి షార్ట్ ఫిలింస్ రూపొందించాల్సి ఉంటుంది. పోటీ చివరిరోజు ఈ సినిమాలను ప్రదర్శించి విజేతలను ప్రకటిస్తారు. విజేతలకు రూ.10 లక్షల ప్రైజ్మనీ ఉంటుంది. అమెరికా వంటి దేశాల్లో ఇలాంటి ఏఐ ఈవెంట్స్ తరచూ జరుగుతూ ఉంటాయి.చదవండి: 14 ఏళ్ల బంధానికి స్వస్తి! భర్తకు టాలీవుడ్ హీరోయిన్ విడాకులు! -
'అలాంటి సీన్స్కు నో.. అయినా కూడా'.. హీరోయిన్ ధన్య బాలకృష్ణన్
తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ధన్య బాలకృష్ణన్ (Dhanya Balakrishnan). హీరోయిన్గా మాత్రమే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు డిఫరెంట్ రోల్స్తో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం ధన్య హీరోయిన్గా కృష్ణ లీల అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవన్ హీరోగా వస్తోన్న ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన ధన్య బాలకృష్ణన్ తన కెరీర్, అవకాశాలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన కెరీర్ ప్రారంభంలో చాలా ఫీలయ్యేదాన్ని ధన్య బాలకృష్ణన్ తెలిపింది. నేను తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల చాలా అవకాశాలు కోల్పోయానని పేర్కొంది. గ్లామరస్ రోల్స్కు నేను పెట్టుకున్న నిబంధనలే కారణమని తెలిపింది. ఇంటిమేట్ సీన్స్ చేయాల్సిన రోల్స్ ఉంటే కూడా నో చెప్పేదాన్ని అని వెల్లడించింది. ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నానంటే చాలా గర్వంగా ఉందన్నారు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ నాకు హీరోయిన్ ఛాన్సులు వచ్చాయంటే నా సక్సెస్ కారణమన్నారు. నా ఫ్యామిలీని ఒప్పించి మరి ఇండస్ట్రీలోకి వచ్చానని ధన్య బాలకృష్ణన్ వెల్లడించారు. కాగా.. ధన్య బాలకృష్ణన్ తాజాగా నటించిన చిత్రం కృష్ణ లీల. దేవన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తిరిగొచ్చిన కాలం.. అనేది ఈ మూవీకి ట్యాగ్లైన్. ఈ సినిమాను మహాసేన్ విజువల్స్ బ్యానర్లో జ్యోత్స్న నిర్మిస్తున్నారు. -
ధన్య బాలకృష్ణన్ కొత్త సినిమా.. ట్రైలర్ చూశారా?
దేవన్, ధన్య బాలకృష్ణన్ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం కృష్ణ లీలా . దేవన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తిరిగొచ్చిన కాలం.. అనేది ఈ మూవీకి ట్యాగ్లైన్. ఈ సినిమాను మహాసేన్ విజువల్స్ బ్యానర్లో జ్యోత్స్న నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్.కృష్ణలీల ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీని లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ఈ ప్రేమకథా చిత్రానికి మైథలాజికల్ టచ్ ఇచ్చినట్లు అర్థమవుతోంది. తన ప్రేమ కోసం హీరో చేసిన ప్రయత్నాలు చూస్తే ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి కోర్టుకు వచ్చాడా? ఎవరీ క్రేజీ మ్యాన్ అనే డైలాగ్ ఈ చిత్రంపై అంచనాలు పెంచేసింది. ఈ మూవీలో వినోద్ కుమార్, పృధ్వి (పెళ్లి), రవి కాలే , తులసి, 7ఆర్ట్ సరయు , ఆనంద్ భరత్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. -
తెలుగు ఫోక్ డ్యాన్సర్కి తమిళంలో హీరోయిన్ ఛాన్స్
ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాలు మాత్రమే. ఇప్పుడు టెక్నాలజీ చాలా మారిపోయింది. యూట్యూబ్లోనూ పలు ఆల్బమ్ సాంగ్స్ మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. అందులో యాక్ట్ చేసిన వాళ్లు మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాంటి వాళ్లలో నాగదుర్గ ఒకరు. గత కొన్నేళ్లలో ఫోక్ సాంగ్స్ చేస్తూ పేరు తెచ్చుకున్న ఈమె ఇప్పుడు ఏకంగా తమిళంలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది.(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి 'కాంతార-1')దారిపొంటత్తుండు, నా పేరు ఎల్లమ్మ, ఎర్ర రుమాల్, కాపోళ ఇంటికాడ తదితర సాంగ్స్తో ఈమె బోలెడంతమంది అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే 'కలివనం' అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా చేసినప్పటికీ ఇది రిలీజైందో, ఎప్పుడో రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. కొన్నిరోజుల క్రితం ఈమె.. తెలుగు బిగ్బాస్ 9వ సీజన్లోనూ పాల్గొంటుందని అన్నారు. కానీ అవి రూమర్స్ మాత్రమే అని తేలిపోయింది.అలాంటిది ఇప్పుడు తమిళ సినిమాలో నాగదుర్గకు అవకాశం దక్కింది. ప్రముఖ హీరో ధనుష్ మేనల్లుడు పవీష్.. గతేడాది 'జాబిలమ్మ నీకు అంత కోపమా' అనే డబ్బింగ్ చిత్రంతో హీరోగా మారాడు. ఇప్పుడు ఈ కుర్రాడు కొత్త సినిమాలోనే నాగదుర్గ హీరోయిన్గా చేయనుంది. ఒకవేళ ఇది క్లిక్ అయితే తమిళంలో మరిన్ని అవకాశాలు రావొచ్చు. ఈమె కంటే ముందు శాన్వి మేఘన, గౌరీప్రియ లాంటి పలువురు తెలుగమ్మాయిలు తమిళ సినిమాల్లో ఛాన్సులు దక్కించుకున్నారు. బాగానే పేరు సంపాదించారు. ఎటొచ్చి టాలీవుడ్లోనే తెలుగమ్మాయిలు హీరోయిన్స్గా కనిపించట్లేదు!(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్) -
14 ఏళ్ల బంధానికి స్వస్తి! భర్తకు టాలీవుడ్ హీరోయిన్ విడాకులు!
పెళ్లి అనేది మూణ్నాళ్ల ముచ్చటగానే మారుతోంది. భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా కనిపించే జంటలు కూడా చివరకు విడాకుల బాటలో పయనిస్తుండటం కొంత షాకింగ్గానే ఉంది. తాజాగా బుల్లితెర జంట జే భానుషాలి (Jay Bhanushali)- మహి విజ్ (Mahhi Vij) విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. 14 ఏళ్ల దాంపత్యానికి ముగింపు పలకాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.మీకెందుకు చెప్పాలి?ఈ మేరకు కొద్ది నెలల క్రితమే విడాకులకు దరఖాస్తు చేశారట! ముగ్గురు పిల్లల్ని పంచుకోనున్నారట! గతంలోనూ ఈ దంపతులు విడిపోతున్నట్లు ప్రచారం జరిగింది. అప్పుడు మహి స్పందిస్తూ.. ఒకవేళ నిజంగా విడిపోయినా మీకెందుకు చెప్పాలి? మీరేమైనా నా చుట్టాలా? లాయర్ ఫీజు కడతారా? ఛాన్స్ దొరికిందని ఎవరినో ఒకర్ని నిందించడం తప్ప ఏమీ చేయరు అని సీరియస్ అయింది. బుల్లితెర జంటమహి.. 2004లో వచ్చిన తెలుగు మూవీ తపనలో హీరోయిన్గా నటించింది. మలయాళం, కన్నడ భాషల్లో ఒక్కో సినిమా చేసింది. వెండితెరను నమ్ముకోకుండా బుల్లితెరపైనే సెటిల్ అయిపోయింది. హిందీలో అనేక సీరియల్స్ చేసింది. జే భానుషాలి హేట్ స్టోరీ 2ల, దేసి కట్టే, ఏక్ పహేలీ లీలా సినిమాలు చేశాడు. బుల్లితెరపై పలు సీరియల్స్ చేశాడు. జే భానుషాలి, మహి 2011లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ జంటగా నాచ్ బలియే సీజన్ 5లో పాల్గొని ట్రోఫీ గెలిచారు.ఐవీఎఫ్ ప్రయత్నాలుజే.. హిందీ బిగ్బాస్ 15వ సీజన్లోనూ పాల్గొన్నాడు. సింగింగ్, డ్యాన్సింగ్ షోలకు యాంకరింగ్ చేస్తుంటాడు. జే- మహిలకు పెళ్లయిన తర్వాత చాలా ఏళ్లవరకు సంతానం కలగలేదు. దీంతో బాబు రాజ్వీర్, పాప ఖుషిలను 2017లో దత్తత తీసుకున్నారు. అప్పటికీ సంతానం కోసం ప్రయత్నించే క్రమంలో మూడుసార్లు ఐవీఎఫ్ ఫెయిలవగా నాలుగోసారికి సక్సెస్ అయింది. 2019లో ఐవీఎఫ్ ద్వారా కూతురు తార జన్మించింది. View this post on Instagram A post shared by Mahhi Vinod Vij (@mahhivij) చదవండి: మీసాల పిల్ల.. 13 రోజులుగా ట్రెండింగ్.. ఏకంగా ఎన్ని వ్యూస్ అంటే? -
'మిరాకిల్ మ్యాన్' జి.డి.నాయుడు.. మూడో తరగతితోనే ఎన్నో అద్భుతాలు
ఆర్. మాధవన్(R. Madhavan) హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ‘జి.డి.ఎన్’ అనే టైటిల్ ఖరారైంది. ‘ఎడిసన్ ఆఫ్ ఇండియా, మిరాకిల్ మేన్, వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూరు’ వంటి పేర్లను గడించిన గోపాల స్వామి దొరైస్వామి నాయుడు(Gopala Swamy Doraiswamy Naidu) (జీడీఎన్) జీవితం ఆధారంగా ‘జి.డి.ఎన్’(GDN) మూవీ తెరకెక్కుతోంది. ఈ బయోపిక్కు కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ఈ దేశానికి జి.డి.నాయుడు చేసిన సేవా ఎలాంటిదో తెలుసుకుందాం.1983లో కోయంబత్తూర్కు చెందిన ఒక వ్యవసాయ కుటుంబంలో జి.డి.నాయుడు జన్మించారు. ఆయనొక బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రయోగాలపై ఆసక్తితో పలు రంగాల్లో ఎన్నో ఆవిష్కరణలు చేశారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ రంగంలో ఒక విప్లవం సృష్టించారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ మోటార్ను రూపొందించి ఎంతో కీర్తి సంపాదించారు. దీంతో ఆయన్ను మిరాకిల్ మ్యాన్గా ఈ దేశం గుర్తించింది. జి.డి.నాయుడు వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరంగా ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి.. ఆపై ఆయన సాధించిన విజయాల ఎలాంటివి అనేది ఈ సినిమాలో చూపించనున్నారు.చదివింది మూడో తరగతి మాత్రమేజి. డి. నాయుడు మూడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. కానీ, భారతదేశపు మొట్టమొదటి విద్యుత్ మోటారును తయారు చేశారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరుగానే కాకుండా నిరంతర అన్వేషకుడిగా గుర్తింపు పొందారు. ఆటోమొబైల్, అగ్రికల్చర్, టెక్స్టైల్, ఫొటోగ్రఫీ వంటి సెక్టార్స్లో ఎన్నో పరికరాల ఆవిష్కరణలు చేశారు. దక్షిణ భారత్లో పారిశ్రామిక విప్లవానికి కారణభూతుడై భారతదేశపు ఎడిసన్ అని పేరు తెచ్చుకున్నారు. 1920లో ఒక చిన్న మోటారు వాహనాన్ని కొనుగోలు చేసి పొల్లాచి, పళనిల మధ్య నడిపారు. తర్వాత వెంటనే యునైటెడ్ మోటార్ సర్వీస్ (UMS) సంస్థను స్థాపించి దాని ద్వారా ద్వారా 1937లో భారత దేశపు మొదటి మోటారు వాహనాన్ని తయారు చేశారు.జి. డి. నాయుడు తనే సొంతంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి ఒక కెమెరాను తయారు చేశారు. ఆ కెమెరాతో అడాల్ఫ్ హిట్లర్, లండన్లో జార్జి రాజు అంత్యక్రియలు (1936), గాంధీ, నెహ్రు, సుభాష్ బోస్ వంటి గొప్ప వ్యక్తుల ఫొటోలు తీశారు. ఆయన తయారు చేసిన పరికరాలు, పనిముట్లు, కోయంబత్తూరులోని 'జి.డి. నాయుడు ప్రదర్శనశాల'లో ఇప్పటికీ ఉన్నాయి. తొలి ఇంజనీరింగ్ కళాశాల1944లో పారిశ్రామిక రంగానికి స్వస్తి చెప్పి నాయుడు.. సంఘసేవ వైపు అడుగులు వేశారు. బడుగు ప్రజల సేవకు అంకితమయ్యారు. పేద విద్యార్ఠులకు పలు ఉపకారవేతనాలు, సంక్షేమ కార్యక్రమాలు, కళాశాలకు దానధర్మాలు చేశారు. 1945లో కోయంబత్తూరులో తొలి ఇంజనీరింగ్ కళాశాలకు నాంది పలికారు. ఈ క్రమంలోనే ఆర్థర్ హోప్ పాలిటెక్నిక్, ఆర్థర్ హోప్ ఇంజినీరింగ్ కళాశాలలు స్థాపించారు. 1974లో అనారోగ్యంతో ఆయన మరణించారు.ఈ మధ్యకాలంలో మాధవన్ నటిస్తున్న రెండో బయోపిక్ ఇది. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమా (2022)లో నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేసి మెప్పించారు మాధవన్. ఈ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. ఇప్పుడు మళ్లీ మరో బయోపిక్లో మాధవన్ నటిస్తుండటం విశేషం. వెండితెరపై మిరాకిల్ మేన్గా మాధవన్ ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి. -
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి 'కాంతార-1'
ఈ నెల ప్రారంభంలో రిలీజై బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన సినిమా 'కాంతార 1'. ఇదొచ్చిన తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం థియేటర్లలోకి రాలేదు. దీంతో పలు భాషల్లో ఇప్పటికీ బాగానే ప్రదర్శితమవుతోంది. రెండు మూడు రోజుల క్రితం రూ.800 కోట్ల కలెక్షన్స్ దాటినట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో రూ.1000 కోట్ల మార్క్ త్వరలోనే అందుకుంటుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఓటీటీ గురించి అప్డేట్ వచ్చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)2022లో రిలీజైన మూవీ అమెజాన్ ప్రైమ్లో ఉండగా.. ఈ సినిమా కూడా దీనిలోనే రానుందని సదరు ఓటీటీ సంస్థ క్లారిటీ ఇచ్చింది. 'లెజెండ్ కంటిన్యూస్' అని ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. దీనిబట్టి చూస్తే 'కాంతార ఛాప్టర్ 1' కూడా వేగంగానే ఓటీటీలోకి వచ్చేయబోతుందనమాట. అభిమానులు మాత్రం థియేటర్లలో ఉండగానే వచ్చేయడమేంటి? ఇంకొన్నిరోజులు ఆగి వస్తే బాగుంటుంది కదా అని అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం ఈ వీకెండ్లోనే అంటే అక్టోబరు 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్స్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని.. హిందీ వెర్షన్ మాత్రం కొన్ని వారాల తర్వాత అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం మూవీ లవర్స్కి పండగే అని చెప్పొచ్చు. చూడాలి మరి ఎప్పుడు స్ట్రీమింగ్లోకి వస్తుందో?(ఇదీ చదవండి: మహాభారతాన్ని అద్భుతంగా చూపించిన సిరీస్.. ఓటీటీ రివ్యూ)'కాంతార 1' విషయానికొస్తే.. తొలిభాగం ప్రస్తుతంలో జరిగితే ఈసారి మాత్రం శతబ్దాల వెనక్కి వెళ్తుంది. విజయేంద్ర (జయరామ్) బాంగ్రా రాజ్యాన్ని పాలిస్తుంటాడు. ఇతడికి కులశేఖరుడు (గుల్షన్ దేవయ్య) అనే కొడుకు. అతనికి మహారాజ పట్టాభిషేకం చేసి విశ్రాంతి తీసుకుంటాడు తండ్రి. మందుకొట్టడం తప్ప అసలు పాలన ఏం చెయ్యడు. యువరాజు చెల్లెలు కనకవతి (రుక్మిణి వసంత్). ఈ రాజ్యానికి దగ్గరలోని కాంతార అనే ప్రాంతంలో కొన్ని తెగలు ఉంటాయి.కాంతార తెగకు ప్రత్యర్థులు కడపటి దిక్కువాళ్లు. వాళ్ల మధ్యలో పోరు ఎలా ఉన్నా, ఈ కాంతార తెగలో కొందరు బాంగ్రా రాజ్యానికి వస్తారు. వారి నౌకాతీరాన్ని ఆక్రమించుకుంటారు. ఈ గొడవ వల్ల బాంగ్రా రాజుకి, కాంతార నాయకుడు బెర్మే (రిషబ్)కి గొడవ అవుతుంది. ఈ క్రమంలో కులశేఖరుడు బెర్మే తల్లిని చంపేసి, అతని ఊరిని తగలబెట్టేస్తాడు. తర్వాత ఏమైంది? అసలు విలన్ ఎవరనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: కల్యాణ్ను పొడిచేసిన శ్రీజ.. బిగ్ బాస్ 8వ వారం నామినేషన్స్ లిస్ట్)...to become LEGENDARY 🔥 pic.twitter.com/xRh6zFJkS1— prime video IN (@PrimeVideoIN) October 26, 2025 -
మీసాల పిల్ల.. 13 రోజులుగా ట్రెండింగ్.. ఏకంగా ఎన్ని వ్యూస్ అంటే?
హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ఏడాది పొంగల్కు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయం అందుకున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి మన శంకరవరప్రసాద్గారు మూవీతో బ్లాక్బస్టర్ అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదారి గట్టు మీద రామచిలకవే.. పాట ఎంత వైరలయిందో ఇప్పుడు చిరంజీవి మూవీ (Mana Shankaravaraprasad Garu Movie)లోని మీసాల పిల్ల కూడా అంతే వైరలవుతోంది.36 మిలియన్ల వ్యూస్(Meesaala Pilla Song) యూట్యూబ్లో టాప్లో దూసుకుపోతోంది. 13 రోజులుగా ఫస్ట్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటివరకు 36 మిలియన్ల వ్యూస్ అందుకుంది. ఈ సాంగ్లో చిరు వేసే స్టెప్పులు సింపుల్గా కనిపిస్తూనే చాలా స్టైలిష్గా ఉంటాయి. లిరికల్ సాంగ్కే ఈ రేంజ్లో రెస్పాన్స్ వస్తే ఇక వీడియో సాంగ్ రిలీజ్ చేస్తే ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో!సినిమాభీమ్స్ సంగీతం అందించిన మీసాల పిల్ల పాటను ఉదిత్ నారాయణ్, శ్వేత మోహన్ ఆలపించారు. భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ రాశాడు. పోలకి మాస్టర్ కొరియోగ్రాఫీ చేశాడు. మన శంకరవరప్రసాద్గారు సినిమా విషయానికి వస్తే.. చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. The unanimous chartbuster continues to be the audience’s favourite song of the season ❤️🔥#MeesaalaPilla Trending #1 on YouTube for 13 days with 36MILLION + views 🔥🔥🔥-- https://t.co/4dgILT40kG #ManaShankaraVaraPrasadGaru Sankranthi 2026 RELEASE Megastar @KChiruTweets… pic.twitter.com/8sbxhs7BrY— Shine Screens (@Shine_Screens) October 27, 2025 చదవండి: కల్యాణ్ను పొడిచేసిన శ్రీజ.. నామినేషన్స్లో ఎవరున్నారంటే? -
ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి బాహుబలి ఎపిక్, మాస్ జాతర, ఆర్యన్, కర్మణ్యే వాధికరస్తే, ఆపరేషన్ పద్మ, ఎర్రచీర తదితర తెలుగు సినిమాలు రాబోతున్నాయి. వీటిలో బాహుబలి రీ రిలీజ్, మాస్ జాతర చిత్రాలపైనే కాస్తోకూస్తో బజ్ ఉంది. మరోవైపు ఓటీటీల్లోనూ హిట్ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. పలు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ లిస్టులో ఉండటం విశేషం.(ఇదీ చదవండి: మహాభారతాన్ని అద్భుతంగా చూపించిన సిరీస్.. ఓటీటీ రివ్యూ)ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. లోక, ఇడ్లీ కొట్టు, కాంతార ఛాప్టర్ 1 సినిమాలతో పాటు డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు అనే తెలుగు సిరీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. వీటితో పాటు ఏయే ఓటీటీల్లోకి ఏ మూవీస్ రానున్నాయనేది ఇప్పుడు చూద్దాం.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబరు 27 నుంచి నవంబర్ 2 వరకు)నెట్ఫ్లిక్స్ద అస్సెట్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 27ఇడ్లీకొట్టు (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 29బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 29స్టిచ్ హెడ్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 29ఐలీన్: క్వీన్ ఆఫ్ సీరియల్ కిల్లర్స్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 30ద వైట్ హౌస్ ఎఫెక్ట్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 31అమెజాన్ ప్రైమ్హజ్బిన్ హోటల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 29హెడ్డా (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 29ట్రెమెంబా (పోర్చుగీస్ సిరీస్) - అక్టోబరు 31కాంతార ఛాప్టర్ 1 (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 31హాట్స్టార్ఐటీ వెల్కమ్ టూ డెర్రీ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 27మెగా 2.0 (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 27మానా కీ హమ్ యార్ నహీన్ (హిందీ సిరీస్) - అక్టోబరు 29లోక (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబరు 31జీ5డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు (తెలుగు సిరీస్) - అక్టోబరు 31బాయ్ తుజాప్యా (మరాఠీ సిరీస్) - అక్టోబరు 31మారిగళ్లు (కన్నడ సిరీస్) - అక్టోబరు 31గణోసోత్రు (బెంగాలీ సిరీస్) - అక్టోబరు 31సన్ నెక్స్ట్బ్లాక్ మెయిల్ (తమిళ సినిమా) - అక్టోబరు 30ఆపిల్ టీవీ ప్లస్డౌన్ సిమిట్రీ రోడ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 29సైనా ప్లేమధురం జీవామృతబిందు (మలయాళ సినిమా) - అక్టోబరు 31(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమాలు) -
కల్యాణ్ను పొడిచేసిన శ్రీజ.. నామినేషన్స్లో ఎవరున్నారంటే?
గత సీజన్లో జరిగిన నామినేషన్స్ ఇప్పుడు తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్లో (Bigg Boss Telugu 9) రిపీట్ కాబోతున్నాయి. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు హౌస్లో ఎంట్రీ ఇచ్చి నామినేట్ చేయనున్నారు. అయితే కాస్త డిఫరెంట్గా ఈ ప్రక్రియ జరగనుంది. కత్తితో పొడిచి నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఎలిమినేట్ అయినవాళ్లు ఒక కత్తితో వారే స్వయంగా నామినేట్ చేస్తారు. వాళ్లు ఎవరికైతే మరో కత్తిస్తారో.. వారు ఇంకొకర్ని నామినేట్ చేయాలన్నమాట!సంజనాకు క్లాస్ పీకిన ప్రియఈ మేరకు తాజాగా ఓ ప్రోమో వదిలారు. అందులో మనీష్, శ్రీజ, ప్రియ, ఫ్లోరా.. హౌస్లో అడుగుపెట్టారు. బాడీ షేమింగ్ చేసిన సంజనాను ప్రియ నామినేట్ చేస్తూ ఆమెకు కత్తి గుచ్చింది. క్లాస్ అనే పదం వాడటం కూడా తప్పేనని క్లాస్ పీకింది. మనీష్.. కల్యాణ్కు కత్తి గుచ్చాడు. సర్ప్రైజ్ ఏంటంటే శ్రీజ కూడా కల్యాణ్నే నామినేట్ చేసిందట! ఇక ఇమ్మాన్యుయేల్.. తనూజను నామినేట్ చేసినట్లు తెలుస్తోంది.నామినేషన్స్లో ఎనిమిదిమందిసోషల్ మీడియాలో వైరలవుతున్న లీక్స్ ప్రకారం ఎనిమిదోవారం మాధురి, తనూజ, గౌరవ్, రీతూ, రాము, సంజనా, డిమాన్ పవన్, కల్యాణ్ నామినేషన్స్లో ఉన్నారు. అయితే ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది. ఎలిమినేట్ అయినవారిలో కొద్దిమంది బిగ్బాస్ ట్రోఫీ కోసం మీతో పోటీపడి, మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారంటూ రీఎంట్రీ గురించి హింట్ ఇచ్చాడు బిగ్బాస్. అందులో శ్రీజ పేరు ముందునుంచి వినిపిస్తున్నదే! మరి తనతో పాటు ఇంకెవరైనా హౌస్లో అడుగుపెడతారా? చూడాలి! చదవండి: అక్కడ ఫోకస్ చేయడం వల్లే రమ్య ఎలిమినేట్.. సంపాదన ఎంతంటే? -
రవితేజ 'మాస్ జాతర' కోసం వస్తున్న సూర్య
'మాస్ జాతర'(Mass Jathara) కోసం కోలీవుడ్ నటుడు 'సూర్య' వచ్చేస్తున్నారు. ధమాకా లాంటి భారీ విజయం తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల జోడీగా నటిస్తున్న చిత్రం మాస్ జాతర.. ఈ చిత్రంలో రైల్వే పోలీస్ లక్ష్మణ్ భేరి పాత్ర చేస్తున్నారు రవితేజ. విలన్గా నవీన్ చంద్ర కనిపిస్తారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ నెల28న ప్రీ-రిలీజ్ ఈవెంట్ను చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.రవితేజ మాస్ జాతర ప్రీ- రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా నటుడు సూర్య వస్తున్నట్లు ఒక పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. అక్టోబర్ 28న సాయంత్రం 5:30గంటలకు హైదరాబాద్లోని జేఆర్సీ (JRC) వేదికగా ఈ కార్యక్రమం జరగనుందని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. సినిమా రన్టైమ్ 160 నిమిషాలుగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకు ఒకరోజు ముందే ప్రీమియర్స్ వేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.సూర్య 46వ సినిమాను కూడా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. దీంతో నాగవంశీతో సూర్యకు అనుబంధం ఏర్పడింది. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్నంలో మమితా బైజు, రవీనా టాండన్, రాధిక శరత్కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.The celebration just got BIGGER! 💥🔥The one and only @Suriya_offl garu to grace the grand pre-release event of #MassJathara 😍📍TOMORROW from 5:30 PM Onwards at JRC CONVENTIONS, HYD!In cinemas worldwide #MassJatharaOnOct31st Mass Maharaaj @RaviTeja_offl @Sreeleela14… pic.twitter.com/IUkt8NgMbM— Sithara Entertainments (@SitharaEnts) October 27, 2025 -
అక్కడ ఫోకస్ చేయడం వల్లే రమ్య ఎలిమినేట్.. సంపాదన ఎంతంటే?
పచ్చళ్ల వ్యాపారంతో అక్క అలేఖ్య ఫేమస్ అయితే.. ఫిట్నెస్ వీడియోలతో చెల్లి రమ్య పాపులర్ అయింది. పైగా వర్కవుట్స్ అంటూ గ్లామర్ వీడియోలు షేర్ చేయడంతో ఓ పక్క తిడుతూనే ఆమెను ఫాలో అయ్యారు చాలామంది. సోషల్ మీడియాలో విపరీతైమన నెగిటివిటీ తెచ్చుకున్న రమ్యకు బిగ్బాస్ ఛాన్స్ వచ్చింది. కెరీర్ మీద ఫోకస్ పెట్టమన్నారుగా.. వచ్చేస్తున్నా అంటూ వైల్డ్కార్డ్గా ఎంట్రీ ఇచ్చింది. కానీ రెండువారాల్లోనే ఎలిమినేట్ అయింది. అందుకు గల కారణాలేంటో చూసేద్దాం..నో ట్రాక్స్బిగ్బాస్ హౌస్లో బంధాలు పెట్టుకోవడానికి రాలేదంది రమ్య. అన్నట్లుగానే ఫేక్ రిలేషన్స్, లవ్ ట్రాకుల జోలికి వెళ్లలేదు. కానీ ఇది ఒకరకంగా ఆమెకు మైనసే అయింది. ఎందుకంటే ఈ వారం నామినేషన్స్లో ఉన్న సంజనా సేవ్ అవడానికి కారణం.. ఇమ్మాన్యుయేల్తో తనకున్న బంధమే! ఇమ్మూ నామినేషన్స్లో లేడు కాబట్టి అతడి ఓట్లన్నీ ఆమెకు వేశారు. అలా సంజనా సేవ్ అయింది.అదే ముఖ్య కారణంరమ్య (Ramya Moksha) ఎలిమినేషన్కు ఆమె స్వయంకృతాపరాధం ముఖ్య కారణం. తను వచ్చీరావడంతో కుంభస్థలాన్ని కొట్టాలనుకుంది. తనూజ, కల్యాణ్లపై నోటికొచ్చినట్లు మాట్లాడింది. తనపై కల్యాణ్ చెయ్యేస్తే కిందపడేసి తొక్కుతానంది. తనూజను స్ట్రాంగ్ పాయింట్స్తో నామినేట్ చేసింది. కానీ చెప్పే విధానం సరిగా లేదు, హద్దులు దాటి మాట్లాడటంతో అది తనూజకే ప్లస్ అయింది. పైగా ఓసారి.. పక్కకెళ్లి ఆడుకోపో అని తనూజకు టిష్యూ పేపర్పై రాసివ్వడం చూసేవారికి కాస్త ఓవర్గా అనిపించింది.అది మర్చిపోతే ఎలా?తనూజ (Thanuja Puttaswamy) ఎలిమినేషనే టార్గెట్గా పెట్టుకుంది. కానీ, తనూజను కిందకు లాగాలంటే ముందు తాను హౌస్లో ఉండాలన్న విషయం మర్చిపోయింది. ఇప్పటికే బయటున్న నెగెటివిటీ చాలదన్నట్లు తనూజ- కల్యాణ్లపై నోరు జారడం.. దాన్ని నాగార్జున తప్పుపట్టినా మరేం పర్లేదన్నట్లుగా ప్రవర్తించడం, హైపర్ ఆది వచ్చినప్పుడు కూడా కాస్త యాటిట్యూడ్ చూపించడంతో విపరీతమైన నెగెటివిటీ మూటగట్టుకుంది. గేమ్పై కన్నా తనూజపైనే ఎక్కువ ఫోకస్ చేసి.. ఆమెను ఢీ కొట్టాలని చూసి బొక్కబోర్లాపడింది. రెమ్యునరేషన్ఇలా పదేపదే తనూజను టార్గెట్ చేయడం ఆమె అభిమానులకు అస్సలు నచ్చలేదు. ఇంకేముంది, నామినేషన్స్లో ఎవరు బలహీనంగా ఉంటారో వారికి ఓట్లు గుద్ది.. రమ్యను డేంజర్ జోన్లో పడేశారు. నామినేషన్స్లో తప్ప గేమ్లో పెద్దగా కనిపించలేదు. దీంతో రమ్య మోక్ష ఎలిమినేట్ అయింది. ఆమెకు వారానికి రూ.1.50 -2 లక్షల మేర పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రెండువారాలకుగానూ దాదాపు రూ.4 లక్షల మేర రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం.చదవండి: కల్యాణ్ను అంతమాట అనేసిందేంటి? ఆ ఐదుగుర్ని చెత్తబుట్టలో పడేసిన రమ్య -
ఓటీటీలో మెప్పిస్తున్న 'సన్ ఆఫ్ సర్దార్ 2'
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. సునీల్ హీరోగా రాజమౌళి తీసిన ‘మర్యాద రామన్న’ (2010) సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాని ‘సన్ ఆఫ్ సర్దార్’గా అజయ్ దేవగన్(Ajay Devgn) హీరోగా హిందీలో రీమేక్ చేశారు. అయితే ఇప్పటివరకు ‘మర్యాద రామన్న’కు సీక్వెల్ రాలేదు కానీ ‘సన్ ఆఫ్ సర్దార్’కు మాత్రం మళ్ళీ అజయ్ దేవగన్ హీరోగా ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈసారి టైటిల్ మాత్రమే సీక్వెల్గా తీసుకున్నా కథను మాత్రం తమ పంథాలో తీసుకున్నారు మేకర్స్. ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా. దీనికి అజయ్ దేవగన్ నిర్మాతగా కూడా వ్యవహరించారు. కథ దాదాపుగా స్కాట్ల్యాండ్లోనే జరుగుతుంది. ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్విస్తుందీ చిత్రం. ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ కథాంశానికొస్తే... జస్సీ సింగ్ రాండ్వా పెళ్లయినా పరిస్థితుల ప్రభావం వల్ల తన భార్య విదేశాలలో ఉంటుంది. జస్సీ మాత్రం తన తల్లితో భారత్లో ఉంటాడు. సినిమా ప్రారంభంలోనే జస్సీ భార్య డింపుల్ ఫోన్ చేసి, జస్సీకి వీసా అప్రూవ్ అయిందని, వెంటనే తను కూడా తన దగ్గరకు రావచ్చని చెబుతుంది. ఎంతో ఆనందంతో భార్యను కలవడానికి విదేశాలలో అడుగు పెట్టిన జస్సీతో విడాకులు కావాలని షాకిస్తుంది డింపుల్. ఖంగుతిన్న జస్సీ ఏం చేయాలో తోచని స్థితిలో ఫ్రెండ్ ఇంటికి వెళతాడు... అనుకోకుండా పాకిస్థాన్కి చెందిన రబియాని కలుస్తాడు జస్సీ. రబియాకి సాబా అనే కూతురు ఉంటుంది. భర్త వదిలేసి వెళ్ళిపోతాడు. రబియా కూతురు సాబా గ్యాంగ్స్టర్ రాజా సంధు కొడుకైన రాజాతో ప్రేమలో ఉంటుంది. రాజా సంధుకు భారత దేశమంటే ఎంత ప్రేమో అంతకు మించి పాకిస్థానీయులంటే ద్వేషం. అటువంటి అతని కొడుకు ఓ పాకిస్థానీ ప్రేమలో పడతాడు. జస్సీని తన భర్తగా ఉండమని చెప్పి తామిద్దరూ పంజాబీ దంపతులుగా నటించి, రాజా సంధుతో సంబంధం ఖాయం చేసుకోవాలని చూస్తుంటుంది రబియా. ఇదే సమయంలో రాజా సంధు ఓ పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేస్తాడు. ఆ ఫంక్షన్లో రబియా, జస్సీ తల్లిదండ్రులుగా సంబంధం ఖాయం చేసుకునే సమయంలో అటు రబియా అసలు భర్త రావడంతో పాటు ఇటు జస్సీ భార్య డింపుల్ కూడా తారసపడుతుంది. ఈ గందరగోళంలో రబియా తన కూతురు పెళ్ళి చేయగలుగుతుందా? లేదా అన్నది సినిమాలోనే చూడాలి. ఈ సినిమా మంచి కామెడీ కాలక్షేపం. ఎందుకంటే ఇది కామెడీ ఆఫ్ సర్దార్ కాబట్టి. వర్త్ టు వాచ్. – హరికృష్ణ ఇంటూరు -
కల్యాణ్ను అంతమాట అనేసిందేంటి? ఆ ఐదుగుర్ని చెత్తబుట్టలో పడేసిన రమ్య
జనాలకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నట్లే బిగ్బాస్కు కూడా ఎవరో ఒకరు నచ్చుతారు. వారికి హైప్ ఇవ్వడానికి, చేసిన తప్పులను కవర్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆదివారం (అక్టోబర్ 26వ) ఎపిసోడ్ చూసిన అందరికీ ఈ విషయం మరోసారి అర్థమై ఉంటుంది. ఇంతకీ ఏం జరిగింది? రమ్య వెళ్లిపోయే ముందు ఏం చెప్పింది? అనేవి చూసేద్దాం..తప్పు చేసినా తనూజయే విన్నర్గోల్డెన్ బజర్ కోసం డిమాన్ పవన్, తనూజ, సుమన్, రీతూ పోటీపడ్డారు. ఈ గేమ్కు మాధురిని సంచాలకురాలిగా పెట్టారు. పజిల్ గేమ్ తనూజ పైపైనే పూర్తి చేసి, వెళ్లి బజర్ గెల్చుకుంది. నిజానికి ఆమె పజిల్ సరిగా అమర్చలేదు. అదే విషయాన్ని డిమాన్ పవన్ చెప్పాడు. తనూజ పజిల్ సరిగా పెట్టలేదని చెప్తుంటే.. సంచాలక్ నిర్ణయమే ఫైనల్ అంటూ నాగార్జున డిక్లేర్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. తనూజకు ఫేవరిజం చేస్తున్నారని క్లియర్గా తెలిసిపోయింది.రమ్య ఎలిమినేట్ఇక నాగ్ అందర్నీ సేవ్ చేసుకుంటూ పోగా చివరకు సంజనా, రమ్య (Ramya Moksha) మిగిలారు. వీళ్లిద్దరిలో రమ్య ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. రమ్య వెళ్లిపోతుంటే మాధురి.. ఆమెను పట్టుకుని ఏడ్చేసింది. తనపై ముద్దుల వర్షం కురిపించింది. ఇక స్టేజీపైకి వచ్చిన రమ్య.. ప్రతివారం నామినేషన్లో ఉంటానని ఫిక్సయి వచ్చాను, కానీ, ఇంత త్వరగా వెళ్తాననుకోలేదని కాస్త నిరాశచెందింది. చివరగా ఆమెకు నాగ్ ఓ టాస్క్ ఇచ్చాడు. హౌస్లో ఉన్న 13 మంది ఫోటోలు బోర్డ్పై ఉన్నాయి.. అందులో ఐదుగుర్ని చెత్తబుట్టలో వేయాలన్నాడు. కల్యాణ్ పరువు తీసిన రమ్యముందుగా కల్యాణ్ (Pawan Kalyan Padala) ఫోటో చెత్తబుట్టలో వేస్తూ.. తనకు మెచ్యూరిటీ లేదు, నిబ్బానిబ్బీలా ప్రవర్తిస్తాడు. కాలేజీలో ఫస్ట్ టైమ్ లవ్లో పడినట్లుగా ఉంటాడు. తనకి సరిగా మాట్లాడటం కూడా రాదు అని చెప్పింది. దివ్య ఫోటోను డస్ట్బిన్లో పడేస్తూ.. భరణి వెళ్లిపోయాక దివ్య ప్రవర్తనలో చాలా మార్పొచ్చింది. ఊరికే కోప్పడటం, అవసరం లేకపోయినా వాదించడం చేస్తోంది. అవి కంట్రోల్ చేసుకుంటే మంచిది అని సలహా ఇచ్చింది.రీతూపై బిగ్బాంబ్తనూజ, గౌరవ్ ఫోటోలను కూడా చెత్తబుట్టలో పడేసింది. తనూజ.. వేరేవాళ్లు చెప్పిన మాటల్ని పట్టుకుని నన్ను మానిప్యులేటర్ అనుకుంటోంది. గౌరవ్ రాక్షసుడు.. చెప్పిన మాట వినడు. మనం మాట్లాడేందుకు 5 సెకన్ల గ్యాప్ కూడా ఇవ్వడు అంది. చివరగా డిమాన్ ఫోటో పడేస్తూ.. నువ్వు నీ గురించే ఆడు.. ఎక్కువ ఎమోషనల్ అవకు, గేమ్ మీద ఫోకస్ చేయ్.. కొన్నిసార్లు ఓవర్ హెల్ప్ చేస్తున్నావ్ అంటూ హెచ్చరించింది. చివరగా రమ్య చేతికి ఓ బిగ్బాంబ్ ఇచ్చాడు నాగ్. నీ వాష్ రూమ్ డ్యూటీని హౌస్లో ఒకరికి అప్పగించమన్నాడు. అందుకామె వెంటనే రీతూ పేరు చెప్పి.. ఏం చేసినా నీ మంచి కోసమేరా.. అని బిస్కెట్ వేసి వెళ్లిపోయింది.చదవండి: బైసన్ మూవీ టీమ్పై సీఎం ప్రశంసలు -
'మాయకర'గా రిషబ్ శెట్టి.. మేకప్ కోసం అన్ని గంటలా! (మేకింగ్ వీడియో)
‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. కాంతార మూవీకి ప్రీక్వెల్గా స్వీయ దర్శకత్వంలో రిషబ్శెట్టి (Rishab Shetty) ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. ఈ మూవీలోని యాక్షన్ సీన్స్ కోసం డూప్ ఉపయోగించకుండా రిషబ్ రిస్క్ చేశారని తెలిసిందే. ఈ మూవీకి ఎంతో కీలకమైన పాత్ర 'మాయకర'గా కూడా రిషబ్నే నటించారని ఒక మేకింగ్ వీడియోతో చిత్ర యూనిట్ పంచుకుంది. 'మాయకర' పాత్ర మేకప్ కోసం ఆయన పడిన శ్రమ ఎలాంటిదో చూపించారు. కేవలం మేకప్ కోసమే ఆరు గంటల పాటు శ్రమ పడాల్సి వచ్చిందని తెలిపారు. ఉదయం షూటింగ్ ఉందంటే అర్ధరాత్రి 12:30 నుంచే రిషబ్ మేకప్ పనులు మొదలౌతాయని పేర్కొన్నారు. మాయకర పాత్ర కోసం ఆయన చాలా శ్రమించడం వల్లనే తెరపై గుర్తించలేనంతగా మనకు కనిపించారని చెప్పొచ్చు. -
బైసన్ మూవీ టీమ్పై సీఎం ప్రశంసలు
మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధ్రువ్విక్రమ్ (Dhruv Vikram) కథానాయకుడిగా నటించిన చిత్రం బైసన్ (Bison Movie). అనుపమ పరమేశ్వరన్, రజీషా విజయన్, పశుపతి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అప్లాస్ సంస్థతో కలిసి నీలం ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకుడు పా.రంజిత్ నిర్మించారు. నివాస్ కే ప్రసన్న సంగీతాన్ని అందించిన ఈ చిత్రం తమిళనాడులో అక్టోబర్ 17న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.బైసన్ టీమ్ను అభినందించిన సీఎంబైసన్ మూవీ చూసిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్.. ఆఫీసుకు పిలిచి మరీ మారిసెల్వరాజ్, ధ్రువ్విక్రమ్లను అభినందించారు. బైసన్ చిత్రం గురించి ఎక్స్లో ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ.. మారిసెల్వరాజ్ సినీమకుటంలో ఇది మరో వజ్రం. ప్రతిభను మాత్రమే నమ్ముకున్న ఒక యువకుడు అటు కబడ్డీ కోర్టులో, ఇటు బయట ఎదురైన సమస్యలను ఎదుర్కొని విజయం సాధించిన కథను చాలా గొప్పగా తీర్చిదిద్దారు. చక్కగా చూపించారుక్రీడలు నేపథ్యంగా చేసుకుని ఒక యువకుడు చేరుకోవాల్సిన మార్గాన్ని దర్శకుడు మారిసెల్వరాజ్ చక్కగా చూపించారన్నారు. అద్భుతమైన నటనతో మారిసెల్వరాజ్ కథకి ప్రాణం పోసిన నటుడు ధ్రువ్విక్రమ్, పశుపతి, అనుపమ పరమేశ్వరన్, రెజీషా విజయన్.. ఇతర నటినటులు, తెర వెనుక శ్రమించిన సాంకేతిక వర్గానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. సీఎం రివ్యూతో పొంగిపోయిన మారి సెల్వరాజ్ ఎక్స్ మీడియా ద్వారా స్టాలిన్కు కృతజ్ఞతలు తెలిపారు. #BisonKaalamaadan: மாரி செல்வராஜின் திரைமகுடத்தில் மற்றுமொரு வைரக்கல்!தன் திறமையை மட்டுமே நம்பி, கிராமத்தில் இருந்து சாதிக்கக் கிளம்பிய ஓர் இளைஞன், கபடிக் கோட்டுக்கு உள்ளேயும் வெளியேயும் சந்திக்கும் போராட்டங்களை எதிர்கொண்டு வெற்றி பெற்ற கதையை மிகச் சிறப்பான திரை அனுபவமாக… pic.twitter.com/q345pPYkxl— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) October 25, 2025 చదవండి: హిట్ మూవీలో వేశ్యగా నటించిన బ్యూటీ.. 'ప్రభాస్' ఫౌజీలో ఛాన్స్ -
చిరంజీవి ప్రతిష్ఠ దెబ్బతీసేలా 'డీప్ఫేక్' ఫోటోలు.. కేసు నమోదు
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటోలు, వాయిస్లను ఎవరూ ఉపయోగించకూడదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా క్రియేట్ చేశారు. వాటిని పలు వెబ్సైట్లు, సోషల్ మీడియాలలో కొందరు వైరల్ చేశారు. ఈ విషయం చిరు దృష్టికి చేరడంతో ఆయన వెంటనే సీపీ వీసీ సజ్జనార్కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. ముఖ్యంగా AI మార్ఫింగ్ ద్వారా డీప్ఫేక్ వీడియోలు రూపొందించి తన పేరు, ప్రతిష్ట దెబ్బతీసేలా పనిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చిరు కోరారు.డీప్ ఫేక్ ఫోటోల వల్ల ఇబ్బంది ఎదుర్కొన్న చిరంజీవి కొద్దిరోజుల క్రితమే సివిల్ కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా చిరుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. చిరంజీవి అనుమతి లేకుండా ఆయన ఫోటోలను తమ వాణిజ్య ప్రయోజనాల కోసం ఎవరూ వినియోగించవద్దని హెచ్చరించింది. ఈ క్రమంలోనే AI ద్యారా మార్ఫింగ్ చేసిన డిజిటల్ వేదికలపై ఆంక్షలు విధిస్తూ సైబర్క్రైమ్ పోలీసులుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే చిరుపై తప్పుడు పోస్టులు, వీడియోలను క్రియేట్ చేసిన 30 మందికి పైగానే నోటీసులు జారీ చేసింది. కోర్టు సూచనతో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
హిట్ మూవీలో వేశ్యగా నటించిన బ్యూటీ.. 'ప్రభాస్' ఫౌజీలో ఛాన్స్
దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi), ప్రభాస్ (Prabhas) కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఫౌజీ' (Fauji)లో కన్నడ బ్యూటీ 'చైత్ర జె ఆచార్' (Chaithra J Achar)కు ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. గతంలో సప్త సాగరాలు దాటి: సైడ్ బి, 3బీహెచ్కే వంటి హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఆమె దగ్గరైంది. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ సినిమాలో ఛాన్స్ దక్కించినుకున్నట్లు సమచారం. ఫౌజీలో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తుండగా చైత్ర ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఇందులో అనుపమ్ ఖేర్, రాహుల్ రవీంద్రన్ కూడా భాగం కానున్నారు.పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్తో ఫౌజీ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారు. 1940లో జరిగిన కథగా ఈ చిత్రం రానుంది. ప్రజలకు న్యాయాన్ని అందించడానికి ఒంటరిగా ఒక యోధుడు చేసే పోరాటం ఈ చిత్రంలో కనిపించనుంది. వాస్తవ సంఘటనలకు కొంత ఫిక్షన్ జోడించి హను రాఘవపూడి ఈ కథను రెడీ చేశారు.చైత్ర జె. ఆచార్ నటి మాత్రమే కాదు ఒక గాయని కూడా.. బెంగళూరులో పుట్టిన ఆమె మొదట మహీరా (2019)లో నటించింది. కన్నడ చిత్రం 'గరుడ గమన వృషభ వాహనం'లో ఆమె పాడిన 'సోజుగడా సూజు మల్లిగే' అనే పాట ఇంటర్నెట్లో అత్యధిక వీక్షణలతో సంచలనం సృష్టించింది. దీనికి గాను 2022లో ఆమెకు సైమా పురస్కారం కూడా దక్కింది. చైత్ర ప్రస్తుతం ఉత్తరకాండ, మై లార్డ్, స్ట్రాబెర్రీ, మర్ణామి వంటి చిత్రాల్లో నటిస్తోంది. సప్త సాగరాలు దాటి: సైడ్ బి సినిమాలో చైత్ర ఒక వేశ్యగా నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Chaithra J Achar (@chaithra.j.achar) -
'డ్యూడ్' హీరోయిన్ మమితా బైజుకు బిగ్ ఛాన్స్
ధనుష్తో నటి మమితా బైజుకు(Mamitha Baiju) జత కుదిరింది. రీసెంట్గా డ్యూడ్తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. మొదట మలయాళం మూవీతో తెరపైకి వచ్చిన ఈ బ్యూటీ తమిళం, తెలుగు అంటూ చుట్టేస్తోంది. ప్రేమలుతో దక్షిణాది చిత్ర పరిశ్రమనే తన వైపు తిప్పుకున్న ఈ అమ్మడు కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం రెబెల్ నిరాశపరచడంతో అక్కడ ఈ భామ పప్పులు ఉడకవు అనే విమర్శలను ఎదుర్కొంది. బాలా దర్శకత్వంలో వణంగాన్ చిత్రంలో కొన్ని రోజులు నటించి వైదొలగింది. దీంతో కోలీవుడ్లో చిన్న గ్యాప్ కూడా వచ్చింది. అలాంటిది ఇప్పుడు తమిళంలో బిజీ హీరోయిన్ అయిపోయింది. ప్రదీప్ రంగనాథన్తో జతకట్టిన ద్విభాషా ( తమిళం, తెలుగు) చిత్రం డ్యూడ్ దీపావళి సందర్భంగా తెరపైకి వచ్చి ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ప్రస్తుతం విజయ్ హీరోగా నటించిన జననాయకన్ చిత్రంలో ఆయనకు చెల్లెలిగా కీలక పాత్రను పోషించింది. ఈచిత్రం వచ్చే ఏడాది జనవరి 9న తెరపైకి రానుంది. తాజాగా సూర్య కథానాయకుడిగా నటిస్తున్న ద్విభాషా చిత్రంలో కథానాయికిగా నటిస్తోంది. అదేవిధంగా ఇరెండు వారమ్ అనే మరో చిత్రంలో నటించిన మమితబైజు మలయాళంలోనూ ఒక చిత్రంలో నటిస్తోంది. కాగా తాజాగా మరో లక్కీచాన్స్ ఈ అమ్మడిని వరించింది. ధనుష్ సరసన నటించడానికి మలయాళీ బ్యూటీ రెడీ అవుతోంది. నటుడు ధనుష్ ప్రస్తుతం తేరే ఇష్క్మేన్ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి కే.గణేశ్ నిర్మించనున్న చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇది ఈయన నటించే 54వ చిత్రం అవుతుంది. దీనికి పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించనున్నారు. దీనికి జీవీ.ప్రకాష్కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. దీని గురించిన అధికారిక పోస్టర్ను నిర్మాతల వర్గం విడుదల చేసింది. వచ్చే నెలలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో మమితబైజు నాయకిగా నటించనుందని సినీ వర్గాల సమాచారం. -
సల్మాన్పై పాక్ ఉగ్ర ముద్ర
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను పాకిస్తాన్ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇటీవల సౌదీ అరేబి యాలోని రియాద్లో జరిగిన కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ బలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా ప్రస్తావించిన దగ్గర్నుంచి ఆ దేశం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన్ను ఉగ్రవాదిగా పేర్కొంటూ ఆదివారం ఒక ఉత్తర్వు విడుదల చేసింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం–1997లోని నాలుగో షెడ్యూల్ ప్రకారం ఉగ్రవాదంతో సంబంధాలున్నట్లుగా అనుమానం ఉన్న వ్యక్తులను ఉగ్రవాదులుగా పేర్కొనవచ్చు. ఈ చట్టం ప్రకారం సల్మాన్ను పాక్ ఉగ్రవాదిగా పేర్కొంది. ఈ మేరకు అక్టోబర్ 16వ తేదీన బలూచిస్తాన్ ప్రభుత్వ హోం శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ను తాజాగా పాక్ ప్రభుత్వం ధ్రువీకరించింది. ఆయన్ను స్వతంత్ర బలూచిస్తాన్ దోహదకారి (ఆజాద్ బలూస్తాన్ ఫెసిలిటేటర్)గా అందులో పేర్కొంది. దీని ప్రకారం ఆయనపై నిఘా, కదలికలపై నియంత్రణ. చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు అవకాశముంటుందని చెబుతున్నారు. మధ్యప్రాచ్యం భారతీయ సినిమాకు పెరుగుతున్న ఆదరణపై చర్చించేందుకు జోయ్ ఫోరం–2025 అక్టోబర్ 17న రియాద్లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. బాలీవుడ్ ఖాన్ త్రయం సల్మాన్, షారూక్, ఆమిర్ ఖాన్ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడారు. ‘హిందీ సినిమాను సౌదీ అరేబియాలో విడుదల చేస్తే సూపర్ హిట్టవడం ఖాయం. తమిళం, తెలుగు, మలయాళ సినిమాలతో ఇక్కడ కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది. బలూచిస్తాన్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్.. ఇంకా ఈ ప్రాంతంలోని చాలా దేశాల వారు ఇక్కడ పని చేస్తున్నారు’అంటూ చేసిన ప్రసంగం సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్గా మారింది. -
సూపర్ షీ మూవీ రెడీ
‘శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పూర్వాజ్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘కిల్లర్’. ఉర్వీష్ పూర్వాజ్ సమర్పణలో పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి నిర్మించిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో జ్యోతి పూర్వాజ్ లీడ్ రోల్ చేశారు. విశాల్ రాజ్, దశరథ, చందు, గౌతమ్ కీలక పాత్రల్లో నటించారు.‘‘ఈ సూపర్ షీ మూవీని త్వరలో రిలీజ్కి రెడీ చేస్తున్నాం. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్కు మంచి స్పందన లభించింది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్... ఇలాంటి ఎలిమెంట్స్తో ఈ సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగు తున్నాయి’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు. -
పరిచయమే పదనిసలా...
విష్ణు విశాల్ హీరోగా సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానసా చౌదరి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్యన్’. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఆదివారం ఈ చిత్రం నుంచి ‘పరిచయమే పదనిసలా...’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. విష్ణు విశాల్, మానసా చౌదరి మధ్య ఈ పాట సాగుతుంది. వీరి పరిచయం ప్రేమకు దారి తీయడం నుంచి పెళ్లి చేసుకునే వరకూ... అంతా ఈ పాటలో కనిపించింది.ప్రవీణ్ .కె దర్శకత్వంలో శుభ్రా, ఆర్యన్ రమేశ్, విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతదర్శకుడు. లవ్ మెలోడీ సాంగ్ ‘పరిచయమే...’కు సామ్రాట్ సాహిత్యం అందించగా, అభి .వి, భృత్త ఆలపించారు. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శ్రేష్ట్ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డి విడుదల చేయనున్నారు. -
ఓ యోధుడి పోరాటం
యోధుడిగా శత్రువులతో వీరోచిత పోరాటం చేస్తున్నారు గోపీచంద్. ఈ యోధుడి శూరత్వం ఏ రేంజ్లో ఉంటుందనేది సిల్వర్ స్క్రీన్పై చూడాలి. గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ హిస్టారికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ కెరీర్లోని ఈ 33వ సినిమాను పవన్కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నారు.‘‘విభిన్నమైన కథతో భారతదేశ చరిత్రలోని ఓ ప్రముఖ అధ్యాయాన్ని వెండితెరపైకి తీసుకువస్తున్నాం. గోపీచంద్ తన కెరీర్లో ఇప్పటివరకు చేయని ఓ విభిన్నమైన పాత్రను ఈ సినిమాలో చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన నాలుగు షెడ్యూల్స్లో 55 రోజుల షూటింగ్ను పూర్తి చేశాం. ప్రస్తుతం వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ భారీ ఇంట్రవెల్ యాక్షన్ సీక్వెన్స్ను షూట్ చేస్తున్నాం. ఈ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్గా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమా కథ 7వ శతాబ్దం నేపథ్యంలో సాగుతుందని, ఈ చిత్రానికి ‘శూల’ అనే టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ సినిమాకు సంగీతం: అనుదీప్ దేవ్, కెమెరా: సౌందర్ రాజన్. -
డ్రాగన్ చూపు... ఆఫ్రికా వైపు
‘డ్రాగన్’ చూపు నార్త్ ఆఫ్రికాపై పడిందట. హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న పీరియాడికల్ గ్యాంగ్స్టర్ డ్రామా ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఓ యాడ్ షూటింగ్లో భాగంగా ఎన్టీఆర్కు స్వల్ప గాయాలైన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరణకు తాత్కాలిక బ్రేక్ పడింది.కాగా ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ నార్త్ ఆఫ్రికా లొకేషన్స్లో... ముఖ్యంగా ట్యూనిషియా దేశంలో జరగనుందని సమాచారం. అక్కడి లొకేషన్స్ను ఫైనలైజ్ చేసేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ నెలాఖర్లో నార్త్ ఆఫ్రికాకు వెళ్తున్నారని, నవంబరు నెలలో ట్యూనిషియా లొకేషన్స్లో ‘డ్రాగన్’ చిత్రీకరణ జరగనుందనే టాక్ వినిపిస్తోంది. నవంబరు మొదటి వారంలో హైదరాబాద్లో కొంత చిత్రీకరణ జరిపి, ఆ తర్వాత అదే నెల చివర్లో ఆఫ్రికా వెళ్లే ఆలోచనలో ఉన్నారని భోగట్టా. టీ–సిరీస్ ఫిల్మ్స్, గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ల సమర్పణలో నందమూరి కల్యాణ్ రామ్, నవీన్ యెర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
అదే ఫార్ములా ఫాలో అవుతున్న చిరు?
రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి వరస సినిమాలైతే చేస్తున్నారు గానీ ఎందుకో అనుకున్నంతగా వర్కౌట్ కావట్లేదు. చాన్నాళ్ల క్రితం రూట్ మార్చిన చిరు.. వీలైనంత వరకు యువ దర్శకులతోనే కలిసి పనిచేస్తున్నారు. అలా ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు మూవీస్ ఉన్నాయి. సెట్స్ పైన మాత్రం రెండింటి పనినడుస్తోంది. ఇప్పుడు ఓ క్రేజీ రూమర్ బయటకొచ్చింది.(ఇదీ చదవండి: మహాభారతాన్ని అద్భుతంగా చూపించిన సిరీస్.. ఓటీటీ రివ్యూ)ప్రస్తుతం 'విశ్వంభర'తో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకరవరప్రసాద్ గారు' అనే మూవీ చేస్తున్నారు. ఇది సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. ఇందులో చిరుతో పాటు వెంకటేశ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ మేరకు కొన్నిరోజుల క్రితమే వెంకీ షూటింగ్లోనూ పాల్గొన్నారు. ఇది పూర్తయిన తర్వాత బాబీ దర్శకత్వంలో చిరు మరో మూవీ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఓ రూమర్ వినిపిస్తుంది.చిరు-బాబీ కాంబో ప్రాజెక్ట్ గురించి కొన్నాళ్ల క్రితం అనౌన్స్మెంట్ వచ్చింది. వచ్చే ఏడాది ఇది సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ మూవీలో తమిళ హీరో కార్తీ.. కీలక పాత్రలో నటించబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఇది నిజమే కావొచ్చు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా చిరు సినిమాల్లో ఎవరో ఓ హీరో అతిథి పాత్రల్లో కనిపిస్తూనే ఉన్నారు. 'ఆచార్య'లో రామ్ చరణ్, 'గాడ్ ఫాదర్'లో సల్మాన్ ఖాన్, 'వాల్తేరు వీరయ్య'లో రవితేజ.. ప్రస్తుతం చేస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు'లో వెంకటేశ్తో ఇలా ఫార్ములా ఫాలో అయిపోతున్నట్లు కనిపిస్తుంది. అలా కార్తీతో త్వరలో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారట. మరి ఇది నిజమా కాదా అనేది కొన్నాళ్లు ఆగితే తెలుస్తుంది.(ఇదీ చదవండి: ఈ పాన్ ఇండియా నటుడిని గుర్తుపట్టారా? బయోపిక్ కోసం ఇలా) -
ఈ పాన్ ఇండియా నటుడిని గుర్తుపట్టారా? బయోపిక్ కోసం ఇలా
ఇతడు అప్పట్లో హీరోగా పలు హిట్ సినిమాలు చేశాడు. అమ్మాయిలకు ఫేవరెట్ అయిపోయాడు. వయసు పెరిగి 50 ఏళ్లు దాటినా సరే కుర్రహీరోలు అసూయ పడేలా ఫిజిక్ మెంటైన్ చేస్తుంటాడు. తెలుగు, తమిళ, హిందీ.. ఇలా దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అలాంటిది ఇప్పుడు ఓ మూవీ కోసం గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించాడు. ఎవరో కనిపెట్టారా? చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న నటుడి పేరు మాధవన్. అవును మీరు విన్నది నిజమే. 'సఖి' సినిమాతో అప్పట్లోనే తెలుగులోనూ అద్భుతమైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న ఇతడు.. ఇప్పటికీ చకచకా మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. నంబీ నారాయణన్ అనే శాస్త్రవేత్త బయోపిక్లో నటించి మెప్పించిన ఈ నటుడు.. ఇప్పుడు మరో క్రేజీ బయోపిక్ చేస్తున్నాడు. ఆ మూవీ ఫస్ట్ లుక్కే ఇది.మాధవన్ చేస్తున్న లేటెస్ట్ బయోపిక్ మూవీ 'జీడీ నాయుడు'. బల్బ్ కనిపెట్టింది థామస్ అల్వా ఎడిసన్. జీడీ నాయుడుని.. ఎడిసన్ ఆఫ్ ఇండియా అని ముద్దుగా పిలుస్తారు. ఈయన పూర్తిపేరు గోపాలస్వామి దొరైస్వామి నాయుడు. తమిళనాడులోని కోయంబత్తూర్ ఈయన స్వస్థలం. మనం రోజూ ఉపయోగిస్తున్న ఎన్నో ఆవిష్కరణలు ఈయనుంచి వచ్చినవే. ఓటు రికార్డింగ్ మెషీన్, జ్యూస్ పిండే మెషీన్, కాయిన్తో పనిచేసే ఫొనోగ్రాఫ్, ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్, 16 ఎమ్ఎమ్ ప్రొజెక్టర్ లాంటివి రావడంలో ఈయన పాత్ర మరువలేనిది. అలానే దేశంలో తొలి పాలిటెక్నిక్ కాలేజీ పెట్టింది కూడా ఈయనే కావడం విశేషం.ఇలాంటి వ్యక్తి బయోపిక్లో మాధవన్ లీడ్ రోల్ చేస్తున్నాడంటే కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది. ఎలా చూపిస్తారనేది తెలియాలంటే వచ్చే ఏడాది వేసవి వరకు ఆగాల్సిందే. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ చూస్తే ఫొటోలో ఉన్నది మాధవన్యేనా అనిపిస్తుంది. అంతలా మారిపోయి కనిపిస్తున్నాడు. మాధవన్ మూవీస్ విషయానికొస్తే.. తెలుగులో నిశ్శబ్దం, సవ్యసాచి అనే మూవీస్ మాత్రమే చేశాడు. ఇవి రెండు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. -
రకుల్ అందం.. కృతిశెట్టి గ్లామర్.. చీరలో మంచు లక్ష్మీ
అందంగా మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్గ్లామర్ అంతా చూపించేస్తున్న కృతి శెట్టితెల్లని చీరలో మంచు లక్ష్మీ దీపావళి సెలబ్రేషన్స్హీరోయిన్ పూజా హెగ్డే ఫన్నీ రెగ్యులర్ ఫొటోలుతెగ నవ్వేస్తూ ఎంజాయ్ చేస్తున్న రెజీనాభర్తతో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్లో అమలాపాల్వైల్డ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్న హన్సిక View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) ే View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Hansika Motwanni (@ihansika) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Laxmi Raibagi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Amala Paul 🩷 (@amalapaul) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
మళ్లీ ప్రాణం పోసుకున్న పునీత్ రాజ్కుమార్.. ఫ్యాన్స్తో మాట్లాడతాడు!
కన్నడ సినిమా పరిశ్రమకు మాత్రమే కాకుండా, కర్ణాటక ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న లెజెండరీ నటుడు డాక్టర్ పునీత్ రాజ్కుమార్(Puneeth Rajkumar). ఆయన మరణించి నాలుగేళ్లు(2021లో గుండెపోటుతో మరణించాడు) అవుతున్నా.. అభిమానులు ఇప్పటికీ మర్చిపోవడం లేదు. ఏదో రకంగా ఆయనను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఆ మధ్య ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ని ఉపయోగించి ఓ వెబ్ సిరీస్లో పునీత్ రాజ్ కుమార్ని చూపించారు. ఇప్పుడు అదే టెక్నాలజీతో ఏకంగా ఫ్యాన్స్తో మాట్లాడేలా ఓ యాప్ని తీసుకొచ్చారు స్టార్ ఫ్యాండమ్ LLP సంస్థ. తాజాగా ఈ యాప్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లాంచ్ చేశారు. పునీత్ భార్య అశ్విని పునీత్ రాజ్కుమార్ సహకారంతో, స్టార్ ఫ్యాండమ్ LLP వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ సమర్థ రాఘవ నాగభూషణం నాయకత్వంలో అభివృద్ధి చేయబడిన ఈ యాప్, భారతదేశంలో మొదటి ఫ్యాన్డమ్ ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్గా చరిత్ర సృష్టించింది.పునీత్ రాజ్కుమార్ వర్ధంతి(అక్టోబర్ 29)కి మూడు రోజుల ముందే ఈ యాప్ని విడుదల చేశారు. 'అప్పు ఫ్యాండమ్ యాప్' (Appu Fandom App) అని కూడా పిలువబడే ఈ అప్లికేషన్, ఏఐ టెక్నాలజీ ద్వారా పునీత్ యొక్క ఆకర్షణ, క్రమశిక్షణ, సానుకూలత, మానవత్వ గుణాలను డైనమిక్గా ప్రతిబింబించడానికి రూపొందించబడింది. ఇది కేవలం ఒక ట్రిబ్యూట్ మాత్రమే కాకుండా, ఫ్యాన్స్తో పునీత్ ఆత్మను డిజిటల్గా కనెక్ట్ చేసే జీవంతమైన అనుభవంగా మారుతుంది.ఈ యాప్ పునీత్ రాజ్కుమార్ యొక్క 'పవర్ స్టార్' ఇమేజ్ను కొత్త తరాలకు అందించడమే కాకుండా, కన్నడ సినిమా పరిశ్రమకు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. PRK ప్రొడక్షన్స్ ద్వారా అశ్విని నిర్వహించబడుతున్న ప్రాజెక్ట్గా, ఇది పునీత్ యొక్క సినిమాలు, గ్రామీణ సేవలు, యువత ప్రేరణలను కలిగి ఉంటుంది. ఫ్యాన్స్ ఇప్పటికే యాప్ను డౌన్లోడ్ చేసి, పవర్ స్టార్తో 'కనెక్ట్' అవుతున్నారు. -
మహాభారతాన్ని అద్భుతంగా చూపించిన సిరీస్.. ఓటీటీ రివ్యూ
ఇప్పటి జనరేషన్లో ఎంతమందికి 'మహాభారతం' గురించి తెలుసు? కచ్చితంగా చాలామందికి తెలిసి ఉండదు. ఎందుకంటే రీసెంట్ టైంలో దీని ఆధారంగా వచ్చిన సినిమాలు పెద్దగా లేవని చెప్పొచ్చు. ప్రభాస్ 'కల్కి'లో కర్ణుడు, అశ్వద్ధామ పాత్రల్నిచూపించినా సరే మహాభారతంని పెద్దగా టచ్ చేయలేదు. అలాంటిది మహాభారతంలో జరిగిన యుద్దం ఆధారంగా 'కురుక్షేత్ర' అనే యానిమేటెడ్ సిరీస్ తీశారు. అక్టోబరు 10న తొమ్మిది ఎపిసోడ్స్తో తొలి సీజన్ రిలీజ్ కాగా ఇప్పుడు మిగిలిన తొమ్మిది ఎపిసోడ్స్ని రెండో సీజన్గా స్ట్రీమింగ్లోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఇది ఎలా ఉంది? ప్రేక్షకుల్ని మెప్పించిందా అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ సర్వైవల్ థ్రిల్లర్.. డోంట్ మిస్)కథేంటి?'కురుక్షేత్ర' సంగ్రామంలో కౌరవ పక్షానికి సైన్యాధ్యక్షుడిగా ఉన్న ద్రోణుడిని పాండవులు సంహరించడంతో తొలి సీజన్ ముగించారు. అక్కడి నుంచే రెండో సీజన్ మొదలైంది. మరి కౌరవుల కొత్త సైన్యాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? కౌరవులు పక్షాన ఉన్న ధుర్యోధనుడు, కర్ణుడు, అశ్వద్ధామ, దుశ్శాసన.. పాండవుల పక్షాన ఉన్న అర్జునుడు, ధర్మరాజు, భీముడు తదితరుల మధ్య ఎలాంటి భీకర పోరాటం జరిగింది? అసలు ఈ కురుక్షేత్రం ఎలా మొదలైంది? ఎలా అంతమైంది? శ్రీకృష్ణుడు బోధించిన ధర్మ మార్గం, కర్మ ఫలితం ఏంటి? యుద్ధం ముగిసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?18 రోజుల పాటు సాగిన కురుక్షేత్ర యుద్ధాన్ని.. ఈ సిరీస్ మేకర్స్ 18 ఎపిసోడ్స్గా తీశారు. తొలుత తొమ్మిది ఎపిసోడ్స్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ సీన్స్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇలా ప్రతిదీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తొలి సీజన్లో దాదాపు 15 రోజుల పాటు సాగిన యుద్ధాన్ని చూపించేశారు. రెండో సీజన్లో ఏం చూపిస్తారా అనే సందేహం వచ్చింది. కానీ మిగిలిన తొమ్మిది ఎపిసోడ్స్లో ఓవైపు యాక్షన్ చూపిస్తూనే మరోవైపు డ్రామాని కూడా అద్భుతంగా ఆవిష్కరించారు.కుంతి, కర్ణుడు, దుశ్శాసన, భీమ, అశ్వత్థామ, దుర్యోధన.. ఇలా ఒక్కో పాత్రకు ఒక్కో ఎపిసోడ్ డిజైన్ చేశారు. అసలు వీళ్లు ఎవరు? ఈ యుద్ధంలో ఎందుకు పాల్గొనాల్సి వచ్చింది? 'కురుక్షేత్ర'లో వీళ్ల పాత్ర ఏంటి? అనేది చక్కగా చూపించారు. పేరుకే యానిమేటెట్ సిరీస్ గానీ చూస్తున్నంతసేపు మహాభారతం కళ్లముందు కనిపిస్తుంది. నేరుగా యుద్ధాన్ని చూపించేసి సిరీస్ ముగించేస్తే పెద్దగా డ్రామా పండదు. 16వ ఎపిసోడ్లోనే యుద్ధం పూర్తయిపోతుంది. చివరి రెండు ఎపిసోడ్స్లో యుద్ధం తర్వాత పరిస్థితుల్ని ఆకట్టుకునేలా చూపించారు. 'స్త్రీ పర్వ' ఎపిసోడ్, అందులో వచ్చే డ్రామా, డైలాగ్స్ బాగుంటాయి. చివరి ఎపిసోడ్లో శ్రీ కృష్ణుడి పాత్రపై వచ్చే విజువల్స్.. సగటు సినీ ప్రేక్షకుడికి మంచి కిక్ ఇస్తాయి.ఇదివరకే మహాభారతం చూసినవాళ్లకు, తెలిసినవాళ్లకు ఈ సిరీస్ ఓకే అనిపించొచ్చు. కానీ మహాభారతం, కురుక్షేత్రం గురించి ఏ మాత్రం తెలియనవాళ్లకు మాత్రం బోలెడంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎందుకంటే కృష్ణుడు, అర్జునుడు, భీముడు, ధర్మరాజు, కర్ణుడు, అశ్వత్థామ, దృతరాష్ట్రుడు, కుంతి, గాంధారి, ద్రౌపతి, దుర్యోధనుడు, దుశ్శానస.. ఇలా లెక్కలేనన్ని పాత్రలు ఉన్నాసరే అన్నింటి మధ్య కనెక్షన్స్, ఆయా విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తాయి.రీసెంట్ టైంలో 'మహావతార్ నరసింహా' అనే యానిమేటెడ్ సినిమా.. దేశవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. ఒకవేళ ఈ మూవీ గనక నచ్చితే 'కురుక్షేత్ర' సిరీస్ని అస్సలు మిస్ చేయొద్దు. పేరుకే 18 ఎపిసోడ్స్ గానీ ఒక్కొక్కటి 25-30 నిమిషాల నిడివితోనే ఉంటాయి. ఇలా మొదలుపెడితే అలా పూర్తయిపోతాయి. నెట్ఫ్లిక్స్లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. వీలైతే పిల్లలకు కూడా చూపిస్తే 'మహాభారతం' గురించి వాళ్లకు కూడా బోలెడంత జ్ఞానం వస్తుంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: బిగ్బాస్ 9 నుంచి పచ్చళ్ల పాప ఎలిమినేట్!) -
'కాంతార' హిట్.. మమ్నల్నే అంటారెందుకు?: 'కబాలి' డైరెక్టర్
రీసెంట్ టైంలో పాన్ ఇండియా రేంజులో 'కాంతార 1' సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇంకా వస్తూనే ఉంది. తమిళనాడులోనూ ఈ చిత్రాన్ని బాగానే ఆదరించారు. అయితే ఇలాంటి మూవీస్ హిట్ అయిన ప్రతిసారి మా ముగ్గురు దర్శకుల్నే కొందరు తమిళ ఫ్యాన్స్ ఎందుకు తిడుతున్నారో అర్థం కావట్లేదని ప్రముఖ డైరెక్టర్ పా. రంజిత్ అసహనం వ్యక్తం చేశాడు. 'బైసన్' సక్సెస్ మీట్లో ఈ వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్ హీరోల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)ఇంతకీ అసలేమైంది?''కాంతార' లాంటి సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నప్పుడు.. కొందరు కోలీవుడ్ ఫ్యాన్స్ ముగ్గురు తమిళ దర్శకుల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. మేమే తమిళ ఇండస్ట్రీని చెడగొట్టామని విమర్శిస్తుంటారు. గత రెండేళ్లలో కోలీవుడ్లో 600కి పైగా మూవీస్ రిలీజ్ అయ్యాయి. మరి వీళ్లలో ఎంతమంది తమిళ సినిమా స్థాయిని పెంచగలిగారు?' అని పా. రంజిత్ ఫైర్ అయిపోయాడు.తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో కమర్షియల్, రూటెడ్ సినిమాలు వస్తున్నాయి. వందల వేల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి. తమిళంలో మాత్రం ఏ దర్శకులు కూడా ఆ ఫీట్ సాధించలేకపోతున్నారు. దీంతో రీసెంట్ టైంలో కొందరు తమిళ నెటిజన్లు, రివ్యూయర్స్.. డైరెక్టర్స్ పా. రంజిత్, వెట్రిమారన్, మారి సెల్వరాజ్పై పడ్డారు. కులం, అణిచివేత సబ్జెక్ట్స్తో మాత్రమే వీళ్లు సినిమాలు తీస్తున్నారని, అందువల్లే తమిళ ఇండస్ట్రీ నాశనమైపోతుందని విమర్శించారు. ఆ కామెంట్స్కి హర్ట్ అయిన పా.రంజిత్.. ఇప్పుడు కౌంటర్ ఇచ్చాడు.ఇదే ఈవెంట్లో పా.రంజిత్ మాట్లాడుతూ.. 'సోషల్ మెసేజ్ ఉండే సినిమాలని అర్థం చేసుకోకుండా వాటిపై కులం అనే ముద్ర వేయొద్దు. ప్రేక్షకులు ప్రేమతో సినిమాల్ని చూస్తారు. కానీ ట్రోల్స్.. ఓ మూవీని చూడకముందే చాలామందికి ఓ అభిప్రాయాన్ని కలుగజేస్తున్నాయి' అని చెప్పుకొచ్చాడు.పా.రంజిత్ విషయానికొస్తే.. రజినీకాంత్తో కబాలి, కాలా లాంటి మూవీస్ తీశాడు. తమిళంలో వీటికి ఓ మాదిరి ఆదరణ వచ్చింది. తెలుగులో మాత్రం రెండు ఫ్లాప్ అయ్యాయి. గతేడాది 'తంగలాన్' అనే మూవీతో వచ్చాడు. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది.(ఇదీ చదవండి: 9 నెలల పిల్లాడు.. దెయ్యమై పగ తీర్చుకుంటే?) -
సెట్కు ఆలస్యం.. షాలిని తండ్రిని చితకబాది అవమానించారా?
'హీరోయిన్ షాలిని తండ్రి హోటల్లో గిన్నెలు కడిగేవాడు.. కూతురిని లేటుగా సెట్కు తీసుకెళ్లినందుకు ఓ డైరెక్టర్ చేతిలో తన్నులు తిన్నాడు.. ఒకప్పుడు పేదవాడిగా ఉండి ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు తమిళ దర్శకుడు అలెప్పీ అష్రఫ్. మీడియాకు దూరంగా ఉండే షాలిని తండ్రి బాబు... ఈ వ్యాఖ్యాలపై స్పందించాడు. అవన్నీ నిజం కాదని కొట్టిపారేస్తున్నాడు. నన్ను కొడుతుంటే షాలిని ఏడుస్తూ ఉందా?మనోరమ ఆన్లైన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబు మాట్లాడుతూ.. అలెప్పీ అష్రఫ్ (Alleppey Ashraf) నాకు చాలా ఏళ్లుగా తెలుసు. మా కుటుంబానికి చాలా క్లోజ్. మేమెలాంటివాళ్లమో తనకు బాగా తెలుసు. అయినప్పటికీ మా గురించి అలాంటి వీడియో ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు. పోనీ, చేసేముందు మాకో మాటైనా చెప్పలేదు. తను చెప్పినదాంట్లో దాదాపు అన్నీ అబద్ధాలే.. మలయాళ నటుడు కుంచకొ తండ్రి, దర్శకనటుడు బొబన్ నన్ను చెంపదెబ్బ కొట్టి.. చితకబాదుతుంటే నా కూతురు చూసి ఏడ్చిందట! అది పూర్తిగా అసత్యం. ఒకటి నిజంబొబన్ అలాంటివారు కానే కాదు. అయితే ఒకటి మాత్రం నిజం. Aazhi (1985) మూవీ సెట్కు సమయానికి వెళ్లలేకపోయాం. ఎందుకంటే బొబన్ సినిమాకు సంతకం చేయడానికి ముందే నా కూతురు షాలిని (Shalini) మరో సినిమా చేస్తోంది. ఆ మూవీ షూటింగ్ నిమిత్తం మేము విదేశాల్లో ఉన్నాం. దానివల్ల ఒకరోజు ఆలస్యంగా సెట్కు వచ్చాం. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది మాకంటే సినీ ఫ్యామిలీలో పుట్టిన బొబన్కే బాగా తెలుసు. అయినప్పటికీ మాపై కాస్త కోప్పడ్డాడు. షాలిని కుటుంబంఇది మరీ కామెడీ!పరిస్థితి ఇదీ.. అని మేము వివరించేసరికి తను కాస్త శాంతించాడు. అంతే తప్ప ఆయన నాపై చేయి ఎత్తలేదు. ఆయనే కాదు, ఎవరూ నన్ను కొట్టే పరిస్థితి నేను తెచ్చుకోలేదు. మేమెప్పుడూ ప్రేమగానే మసులుకునేవాళ్లం. అలాంటిది బొబన్ కొడితే ఆ దెబ్బకు నేను చెరువులో పడ్డానని, దెబ్బలు తగిలాయని, వేరేవాళ్లు నన్ను కాపాడారని చెప్తుంటే హాస్యాస్పదంగా ఉంది. పైగా నాకు ఈత వచ్చు. చెరువులోనే కాదు, సముద్రంలోనూ ఈత కొట్టగలను.అదేమైనా చేయకూడని పనా?అష్రఫ్ ఇంకా ఏమన్నారు.. షాలిని సినిమాల్లోకి రాకముందు హోటల్లో పని చేశానా? మురికివాడలో నివసించానా? నేను గిన్నెలు కడగడం, టేబుల్ క్లీన్ చేయడం అష్రఫ్ చూశాడా? ఎందుకీ అబద్ధాలో అర్థం కావడం లేదు. ముందుగా.. హోటల్లో పని చేయడం చిన్నతనమేమీకాదు. పొట్టకూటికోసం ఏదైనా చేసుకోవచ్చు. దేవుడి దయవల్ల నాకలాంటి అవసరం రాలేదు. నేను ఓ ఫ్యాన్సీ షాప్ రన్ చేసేవాడిని. మరో విషయం ఏమన్నాడు? నా భార్య జూనియర్ ఆర్టిస్టా? తనకసలు సినిమాలంటేనే ఆసక్తి లేదు. ఇల్లు వదిలి బయటకు రాదు. నా పిల్లలిద్దరికీ సినిమా ఛాన్సులు వచ్చినప్పుడు నేనే వాళ్లను పట్టుకుని తిరిగానే తప్ప తనెప్పుడూ మాతో రాలేదు. రమ్మని అడిగితే ఇంట్లోనే ఉంటాననేది. రూ.100 కోట్ల ఆస్తి?ఒకప్పుడు కటిక పేదరికం అనుభవించానని, ఇప్పుడు రూ.100 కోట్ల ఆస్తి ఉందన్నాడు. అంత కరెక్ట్గా ఎలా చెప్పగలడో మరి? దేవుడి దయవల్ల మేము మంచి స్థాయిలోనే ఉన్నాం. ఇంకోటి.. అజిత్ (Ajith Kumar) రూ.180 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అవును, తన రేంజ్ను బట్టి ఎంతైనా తీసుకుంటాడు. దాని ప్రకారమే ట్యాక్స్ కూడా కరెక్ట్గా కడతాడు. మరింకేంటి సమస్య? అష్రఫ్ మీద నాకెలాంటి కోపం లేదు. మేమిద్దరం గల్ఫ్ దేశంలో ఓ స్కిట్ కూడా చేశాం. అదిప్పటికీ నాకు బాగా గుర్తు. మరి తనెందుకు ఇలా అనుచిత వ్యాఖ్యలు చేశాడో అంతు చిక్కడం లేదు అని బాబు చెప్పుకొచ్చాడు.సినిమాఎలైస్-బాబు దంపతులకు కూతుర్లు షాలిని, షామిలి, కొడుకు రిచర్డ్ సంతానం. ఈ ముగ్గురూ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. చైల్డ్ ఆర్టిస్ట్గా, హీరోయిన్గా అనేక సినిమాలు చేసిన షాలిని.. 2000వ సంవత్సరంలో అజిత్ను పెళ్లాడింది. వీరికి ఓ కూతురు, కుమారుడు సంతానం. వివాహం తర్వాత షాలిని మూవీస్కు గుడ్బై చెప్పింది.చదవండి: పసిబిడ్డను చంపేయమని అడిగా.. నాపై ఉమ్మేశారు!: కస్తూరి


