Parvathipuram Manyam
-
పోలీస్ కస్టడీలో గంజాయి డాన్..!
రామభద్రపురం: గంజాయి అక్రమరవాణా చేస్తున్న వ్యక్తులపై సీఐ కె నారాయణరావు, ఎస్సై వి.ప్రసాదరావు ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ డాన్గా పేరున్న వ్యక్తి, కొట్టక్కి పోలీస్ చెక్ పోస్టు వద్ద కారులో అక్రమంగా గంజాయి తరలింపునకు కారకుడైన ప్రధాన నిందితుడు రామభద్రపురం పోలీసుల కస్టడీలో ఉన్నట్లు తెలిసింది. ఈ నిందితుడు గంజాయి అక్రమరవాణాలో పట్టుబడడంతో రామభద్రపురంతో పాటు ఎస్కోట, సాలూరు, కొత్తవలస, పాచిపెంట తదితర పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు సమాచారం ఉంది.అయితే విశాఖ సెట్రల్ జైల్లో ఉన్న ప్రధాన నిందితుడిని హుకుంపేట పోలీస్స్టేషన్కు తరలించి అక్కడి నుంచి పీపీ వారెంట్పై రామభద్రపురం పోలీస్ కస్టడీకి తీసుకొచ్చి పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రథమ నిందితుడు అనంతగిరి చెందిన వ్యక్తిగా తెలిసింది. కొట్టక్కి వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టులో ఫిబ్రవరి 10 వతేదీ రాత్రి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో వాహనాలు చెక్ చేస్తున్నారు. ఇంతలో వాహనాల వెనుకన ఒడిశా నుంచి అక్రమంగా ఒడిశా నుంచి 150 కిలోల గంజాయిని తరలిస్తున్న డస్టర్ కారు డ్రైవర్ కారును జాతీయ రహదారి పక్కన చిన్న రూట్లో తప్పించి స్పీడ్గా లాగించేశాడు. దీంతో అప్రమత్తమైన ఏఎస్సై అప్పారావు, పోలీస్ సిబ్బంది వెంటాడారు. సరిగ్గా కొట్టక్కి దుర్గమ్మ గుడి వద్దకు వెళ్లేసరికి సరిగా దారి కనిపించకపోవడంతో కారు వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. ఈ నేపథ్యంలో కారును, అందులో ఉన్న 150 కిలోల గంజాయి(74 ప్యాకెట్లు)ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తొమ్మిది మంది నిందితులు ఉన్నట్లు విచారణలో తేలగా ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేశారు. వివరాలు సేకరిస్తున్న పోలీసులు -
ఈశ్వరమ్మ కంటకన్నీరు
సాలూరు: మున్సిపాలిటీ మీ తాతగారిదా? మేము అధికార పార్టీలో ఉన్నాం అంటూ వయస్సు పైబడిన మహిళా మున్సిపల్ చైర్పర్సన్ పువ్వల ఈశ్వరమ్మపై టీడీపీ పట్టణాధ్యక్షుడు నిమ్మాది చిట్టి ఆగ్రహంతో ఊగిపోయాడు, బుధవారం మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం పూర్తయిన తరువాత, మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఉన్న వార్డుల్లో నీటి సరఫరా కోసం నూతనంగా ఏర్పాటుచేసిన ట్రాక్టర్ వాటర్ట్యాంకర్ను చైర్పర్సన్, కౌన్సిలర్లు, అధికారులు ప్రారంభించారు. అక్కడి నుంచి ఆమె వస్తున్న సమయంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు నిమ్మాది చిట్టి పండగ పనులపై ఆరోపణలు చేస్తూ చైర్పర్సన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ మీ తాతగారిదా? మేము అధికార పార్టీలో ఉన్నాం అంటూ కనీసం ఆమె వయస్సుకు విలువ ఇవ్వకుండా విరుచుకుపడ్డాడు, టీడీపీ పట్టణాధ్యక్షుడితో పాటు పలువురు టీడీపీ నాయకులు ఆమైపె విరుచుకుపడడంతో శ్యామలాంబ తల్లి అంతా చూస్తుందని, ఎవరు తప్పు చేస్తే వారికి ఆ పాపం తగులుతుందని అంటూ చైర్పర్సన్ కంటనీరు పెట్టుకుంటూ చీర కొంగుతో తుడుచుకుంటూ నిస్సహాయత వ్యక్తం చేశారు. ఈ విషయం గుర్తించిన మున్సిపల్ వైస్ చైర్మన్ సంఘటనా స్థలానికి వచ్చి చైర్పర్సన్పై ఇలా మాట్లాడడం సమంజసం కాదని, పండగ పనుల నేపథ్యంలో అధికారులు అజెండాలో పెట్టిన అన్ని అంశాలను కౌన్సిల్లో ఆమోదించామని తామెప్పుడూ పండగ పనులకు ఎటువంటి అడ్డంకులు సృష్టించలేదని, సహకరించామన్నారు. టీడీపీ కూటమి పెద్దలు ఈ పండగకు ప్రత్యేక గ్రాంట్లు తెస్తామని హామీలు ఇచ్చి తేలేక, చివరకు అప్పు (రియింబర్స్మెంట్)గా వచ్చిన రూ.2 కోట్లతో పండగ ముందు పనులు చేయించుకోలేక వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి రాజకీయాలకు దిగుతున్నారంటూ పలువురు పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. -
వెటర్నరీ కళాశాలలో వీసీఐ బృందం పర్యవేక్షణ
చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ కళాశాలలో వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(వీసీఐ) బృందం సభ్యులు బుధవారం పర్యవేక్షించారు. గుజరాత్ రాష్ట్రంలోని కామధేను యూనివర్సిటీ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ డా.పి.యమ్.లునగారియా, ఒడిశా వెటర్నరీ కళాశాల నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ డా.అంబికాప్రసాద్ కె.మహాపాత్ర, మహారాష్ట్ర వెటర్నరీ కళాశాల నుంచి డా.ప్రతిభా జండేతో కూడిన బృందం కళాశాలను సందర్శించింది. ఈ సందర్శనలో భాగంగా కళాశాలలో నిర్మించిన భవన సముదాయాన్ని బృందంసభ్యులు పర్యవేక్షించారు. విద్యార్థులకు సరిపడా తరగతి భవనాలు సక్రమంగా అందుబాటులో ఉన్నదీ లేనిదీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు.ఈ భవనాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు సక్రమంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించారు. కళాశాలలో మరో రెండు రోజుల పాటు పర్యవేక్షణ చేయనున్నారు. పర్యవేక్షణలో కళాశాల అసోసియేట్ డీన్ మక్కేన శ్రీను పాల్గొన్నారు. డీఈఓకు ఎస్టీయూ జిల్లా కమిటీ వినతివిజయనగరం అర్బన్: ప్రభుత్వం తాజాగా ప్రకటించిన టీచర్ల బదిలీ ప్రక్రియలోని అసంబద్ధ నిబంధనలను సడలించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం ప్రతినిధులు బుధవారం డీఈఓ యూ.మాణిక్యంనాయుడిని కలిసి వినతిపత్రం అందజేశారు. 2021, 2023వ సంవత్సరంలో రేషనలైజేషన్కు గురైన పీఎస్హెచ్ఎంలకు 2021వ సంవత్సరం ముందు పనిచేసిన ‘ఓల్డ్ స్టేషన్ పాయింట్’ను మంజూరు చేయాలని కోరారు. గత నెల 24, 25, 26 తేదీన వైద్య ధ్రువీకరణ పత్రాలను పొందేందుకు హాజరుకాలేకపోయిన ఉపాధ్యాయులకు మరో అవకాశం ఇవ్వాలని కోరారు. టిస్లో ఉన్న తప్పుల సవరణకు ఎంఈఓలకు అవకాశం కల్పించాలని సూచించారు. ప్రిఫరెన్స్ కేటగిరి ఉన్న ఉపాధ్యాయులకు వారికి ఇష్టమైన మోడల్ ప్రైమరీ పాఠశాలకు వెళ్లే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మోడల్ ప్రైమరీ పాఠశాలల హెచ్ఎంగా ఎస్జీటీలకు పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. డీఈఓను కలిసిన వారిలో సంఘం జిల్లా అధ్యక్షుడు కె.జోగారావు, ప్రధాన కార్యదర్శి చిప్పాడ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. శుభం చిత్రయూనిట్ సందడివిజయనగరం టౌన్: ప్రముఖ హీరోయిన్ సమంత నిర్మించిన శుభం చిత్రయూనిట్ విజయనగరంలో బుధవారం సందడి చేసింది. ఈ మేరకు స్థానిక సప్తగిరి మల్టీప్లెక్స్లో సెకెండ్ షోలో ప్రేక్షకులను సినీ హీరోలు, హీరోయిన్లు షాలిని, షరియా, హర్షిత్, చరణ్, శార్వాణి, శ్రీనివాస్లు అలరించారు. దర్శకుడు కె.ప్రవీణ్, హాస్యనటుడు వంశీ ఇతర నటులు సందడి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయనగరం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. జిల్లావాసుల ఆదరణ ఎనలేనిదన్నారు. తమ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమంత తన సొంత నిర్మాణ సంస్థ ఏర్పాటుచేసి తమలాంటి వారికి అవకాశమిచ్చి బాగా ప్రోత్సహించారన్నారు. సినిమా మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ను దృష్టిలో పెట్టుకుని తీశారన్నారు. ఫ్యామిలీస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పడం మర్చిపోలేని అనుభూతి ఇచ్చిందన్నారు. త్వరలోనే మరిన్ని చిత్రాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటామన్నారు. కార్యక్రమంలో థియేటర్ మేనేజర్ నాయుడు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
పిడుగుపాటుకు ఎనిమిది గొర్రెల మృతి
నెల్లిమర్ల రూరల్: మండలంలోని పెద్ద బూరాడపేట సమీపంలో సోమవారం మధ్యాహ్నం పిడుగులు బీభత్సం సృష్టించాయి. పిడుగుపాటుకు గ్రామానికి చెందిన డొప్ప త్రినాఽథ్ అనే రైతుకు చెందిన ఎనిమిది గొర్రెలు మృత్యువాత పడ్డాయి. సమీప పొలాల్లో గొర్రెలు మేత మేస్తుండగా ఆకస్మాత్తుగా పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. గొర్రెలు మేత మేస్తున్న సమయంలో పిడుగు పడడంతో ఎనిమిది గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. సుమారు రూ.80వేల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు త్రినాఽథ్ వాపోయాడు. రైతును వెంటాడుతున్న దురదృష్టంబూరాడపేటకు చెందిన రైతు డొప్ప త్రినాఽథ్ను దురదృష్టం వెంటాడుతోంది. సుమారు ఐదు నెలల క్రితం ఖరీఫ్ సీజన్లో కురిసిన వర్షానికి పొలంలో రాలిన ధాన్యం గింజలను మేయడంతో సుమారు 100కు పైగా గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ధాన్యాన్ని జీర్ణించుకోలేకపోవడంతో గొర్రెలు మృతి చెందాయి. అప్పట్లో సుమారు రూ.10లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. ఆ బాధ నుంచి తేరుకోకుండానే మళ్లీ పిడుగు రూపంలో ఎనిమిది గొర్రెలు మృతి చెందాయి. దీంతో బాధిత కుటుంబసభ్యులు తీవ్రంగా రోదించారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ కన్నీటి పర్యంతమయ్యారు. -
ప్రతి నెలా అనీమియా కమిటీ సమావేశం
పార్వతీపురం టౌన్: జిల్లాలోని ప్రతి సచివాలయం పరిధిలో అనీమియా యాక్షన్ కమిటీ సమావేశాన్ని ఇకపై ప్రతి నెలా మొదటి బుధవారం నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ వైద్యాధికారులకు స్పష్టం చేశారు. కమిటీ సమావేశంలో తీసుకున్న చర్యలు, తద్వారా వచ్చిన ఫలితాలపై ఇక నుంచి సమీక్షిస్తానని తేల్చిచెప్పారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్యాధికారులు, ఇతర జిల్లా అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్షించారు. జిల్లాలో కొత్తగా నిర్మించి అసంపూర్తిగా ఉన్న సీహెచ్సీలు, పీహెచ్సీలు, బీహెచ్పీయులను వినియోగంలోకి తీసుకురావాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. ప్రధానంగా సీతానగరం, మామిడిపల్లి, శంబర పీహెచ్సీలో పనులను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని, మిగిలిన భవనాలను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. చిన్న చిన్న పనులు జరగక భవనాలు నిరుపయోగంగా ఉండడం సబబు కాదని, ప్రభుత్వం తప్పక నిధులు విడుదల చేస్తుందనే భరోసా కల్పించి ఆయా కాంట్రాక్టర్లతో పనులు త్వరగా చేయించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో మలేరియా కేసులు ఉండకూడదు జిల్లాలో మలేరియా కేసులు ఉండడానికి వీల్లేదని, పోలియో, ఎయిడ్స్ మాదిరిగా ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించి మలేరియా నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం గ్రామ, మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. మండల స్థాయి కమిటీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి మలేరియా కేసులు లేకుండా చూడాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతి వారం తాగునీటి ట్యాంకులను పరిశీలించాలని, ప్రతి శుక్రవారం డ్రైడే కచ్చితంగా పాటించాలని కలెక్టర్ అన్నారు. రోగుల పట్ల వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎస్.భాస్కరరావు, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డా.ఎం.వినోద్ కుమార్, జిల్లా ప్రోగ్రాం అధికారి డా.టి.జగన్మోహనరావు, డీసీహెచ్ఎస్ డా.బి.వాగ్దేవి, డిప్యూటీ డీఎంహెచ్ఓలు డా.కె.విజయపార్వతి, డా.పద్మావతి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి, ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ కె.చలపతిరావు, యూపీహెచ్సీ, పీహెచ్సీ, ఏరియా ఆస్పత్రుల వైద్యాధికారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
సుఖీభవ లేక.. దుఃఖం దిగమింగలేక..!
సుఖీభవ సాయం తక్షణమే వేయాలిఖరీఫ్ సీజన్ మరో 15 రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో అన్నదాత సుఖీభవ సాయం తక్షణమే రైతుల అకౌంట్లలో జమచేయాలి. గతంలో మాదిరి సాగు పెట్టుబడికి సాయం అందజేయాలి. రైతుల ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం స్పందించాలి. సీహెచ్.అప్పలనాయుడు, రైతు రెల్లివలస● డోలాయమానంలో అన్నదాతలు ● పథకం మంజూరుకు పూర్తికాని వెరిఫికేషన్ ● మరో 15 రోజుల్లో ఖరీఫ్సాగు ప్రారంభం ● సాగుకు అప్పుకోసం రైతన్న వెతుకులాట పూసపాటిరేగ: రైతు సంక్షేమానికి పెద్దపీటవేస్తామని హామీలు గుప్పించిన కూటమి ప్రభుత్వం ఏడాదవుతున్నా ఇచ్చిన హామీని నెలబెట్టుకోవడంలో విఫలమమైంది. కేంద్రం నుంచి మంజూరు కావాల్సిన పీఎం కిసాన్ నిధులు రైతుల అకౌంట్లలో ఇప్పటికే జమకాగా, రాష్ట్రం నుంచి అందజేయాల్సిన అన్నదాత సుఖీభవ మంజూరుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ పథకంలో ప్రతి రైతుకు రూ.20 వేలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకోలేదు. రెవెన్యూ రికార్డుల ప్రకారం జిల్లాలో 4,85,158 మంది రైతులు ఉండగా ఇప్పటివరకు 1,42,222 మంది రైతుల రికార్డులు మాత్రమే తనిఖీ అయ్యాయి. ఇంకా 3,42,936 మంది రికార్డుల వెరిఫికేషన్ పూర్తి చేసిన తరువాత వ్యవసాయ అధికారి లాగిన్లో వెరిఫికేషన్ పూర్తి చేశాక తుది జాబితా సిద్ధం కానుంది. ఈనెల 20 వతేదీ లోపు రికార్డుల వెరిఫికేషన్ పూర్తి చేయడానికి గడువు ఇచ్చినట్లు సమాచారం. రబీ సీజన్ దాదాపు పూర్తవడంతోమరో 15 రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటికే చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. ఈసమయానికి గతంలో రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లలో జమఅయ్యేవి. నేటి పరిస్థితి చూస్తే భిన్నంగా ఉంది. అన్నదాత సుఖీభవ కోసం జిల్లాలోని రైతులు ఎదురు చూస్తున్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో ఐదేళ్లు వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే మార్గదర్శకాలను అనుసరించి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసి రైతులకు అవసరమైన పెట్టుబడి సాయం అకౌంట్లలో జమచేసి, ఎరువులు, విత్తనాలు రైతులకు రైతుభరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉండేవి. వీటితో పాటు వైఎస్సార్ పంటల బీమా, పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ రైతులకు అందించే వారని, నేడు ఆ పరిస్థితి లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయం ఎప్పుడు వేస్తారు..? ప్రతి ఏడాది మే నెలలో వేయాల్సిన పెట్టుబడి సాయం రైతులకు ఎప్పడు వేస్తారు? అధికారంలోకి వచ్చి 11 నెలలవుతున్నా రైతులను పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. పెట్టుబడి సాయం కోసం ఇంకా వెరిఫికేషన్లు పూర్తికాని పరిస్థితి. అధికారులు సర్వేలు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించి అన్నదాత సుఖీభవ ఖరీఫ్ సీజన్కు ముందే అందేవిధంగా చర్యలు తీసుకోవాలి. కోరాడ వెంకటరమణ, రైతు పూసపాటిరేగ -
గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవాలి
విజయనగరం క్రైమ్: జిల్లాలో గిరిజన, మైదాన ప్రాంతాల పోలీస్స్టేషన్లలో నమోదైన గంజాయి కేసులను పరిశోధించాలి.. మూలాలను వెలికితీసి గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఎస్పీ వకుల్జిందల్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం జరిగిన మాసాంతర నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గంజాయి రవాణా జరగకుండా కొత్తగా ఏర్పాటుచేసిన నాలుగు చెక్పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా నెల రోజుల్లో నమోదైన కేసుల పురోగతిపై సమీక్షించారు. శక్తియాప్ ఫిర్యాదులు 112, బీఎన్ఎస్, ఎస్టీ, ఎస్పీ, పోక్సో, ఎన్డీపీఎస్, మిస్సింగ్, మహిళలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన కేసుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రాత్రి 11 గంటల తర్వాత అకారణంగా ఎవరైనా రోడ్ల మీద తిరిగితే కేసులు నమోదు చేయాలన్నారు. హిస్టరీ షీట్ల వివరాలను సీసీటీఎన్ఎస్ పోర్టల్లో నిక్షిప్తం చేయాలన్నారు. వేసవి కాలంలో దొంగతనాలు జరగకుండా నిఘా పెంచాలని సూచించారు. -
రోడ్లపై వదిలేస్తున్నారు
పశువులను రోడ్లపైనే వదిలి వేయడంతో అవి రోడ్లపై అడ్డంగా తిష్ఠ వేస్తున్నాయి. ఈ కారణంగా పట్టణంలో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. దీనికి తోడు వాటికి సరైన మేత లేక సమీపంలో ఉన్న వ్యర్థాలను, చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను తింటున్నాయి. పశువుల పోషణ సంరక్షణ యజమానులే బాధ్యతగా తీసుకోవాలి. వీధుల్లోకి రహదారుల పైకి యజ మానులు ఈ విధంగా విడిచిపెట్టడం సరికాదు. యజమానులకు కుదరకపోతే వాటిని సంబంధించిన అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు అప్పగించాలి. –వంగల దాలినాయుడు, జాతీయ మానవహక్కుల కమిటీ జిల్లా అధ్యక్షుడు -
పాలిసెట్లో ప్రతిభ
విజయనగరం అర్బన్: పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలో ఉమ్మడి విజయనగరం జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. అధికమంది ఉత్తీర్ణత సాధించారు. పరీక్ష రాసిన 8,097 మందిలో 7,705 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో విజయనగరం జిల్లాలో 6,938 మందిలో 95.36 శాతంతో 6,616 మంది, పార్వతీపురం మన్యంలో 1,159 మందిలో 93.96 శాతంతో 1,089 మంది ఉత్తీర్ణలయ్యారు. విజయనగరం జిల్లాలో బాలికలు 97.44 శాతం, బాలురు 93.9 శాతం, మన్యంలో బాలికలు 96.59 శాతం, బాలురు 92.35 శాతం పాసయ్యారు. 117 మార్కులు సాధించిన షేట్ అబ్దుల్ ముజీర్, చిల్లా పూర్ణ సంజయ్, మండల వాగ్దేవిలు విజయనగరం జిల్లా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయి ర్యాంకర్లగా నమోదయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 113 మార్కులతో పప్పల చక్రి (ప్రథమ), 112 మార్కులతో పొడుగు యోగిభద్రినాథ్ (ద్వితీయ), 111 మార్కులతో ఇప్పిలి వెంకటరమణ తృతీయ స్థానంలో నిలచారు. వంద మార్కులు పైబడి.. పాలిసెట్లో 120కు 100 మార్కుల పైబడి అధికమంది విద్యార్థులు సాధించారు. వెయ్యిలోపు ర్యాంకులు తెచ్చుకున్నారు. ఉప్పు లాస్య మాధురి (116/120), ఎల్.భాషిణి (114/120), పూసపాటిరేగ మండలం కొప్పెర్లకు చెందిన పల్లా హేమశ్రీ (112/120), మత్స వెంకటలక్ష్మి (111/120), బి.జ్యోత్స్న (110/120), గరివిడి మండలం ఆర్తమూరుకు చెందిన పెద్దపోలు తేజా (106/120) ఉన్నారు. విజయనగరంలో 95.36 శాతం, మన్యంలో 93.96 శాతం మంది ఉత్తీర్ణత -
నిబద్ధతతో స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర
పార్వతీపురం టౌన్: జిల్లాలో ఈ నెల 17న చేపట్టనున్న స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిబద్ధతతో చేపట్టాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్రలో జిల్లాను ముందంజలో నిల పాలని సూచించారు. జిల్లాలో 80 పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్టు వెల్లడించారు. 248 మలేరియా ప్రభావిత గ్రామాలుగా గుర్తించి 50 వేల మందికి రక్త పరీక్షలు నిర్వహించామన్నారు. కార్యక్రమంలో డీఆర్వో హేమలత, డీపీఓ పి.వీరరాజు, డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు, వివిధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పోక్సో కేసు నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష విజయనగరం క్రైమ్: జిల్లాలో మూడేళ్ల కిందట నమోదైన పోక్సో కేసులో 72 ఏళ్ల వృద్ధుడు కింతాడ అంజిబాబుకు మూడేళ్ల జైలు శిక్ష, రూ. 1000 జరిమానా విధిస్తూ మహిళా, పోక్సో కో ర్టు జడ్జి నాగమణి తీర్పు ఇచ్చినట్టు ఎస్పీ వకు ల్ జిందల్ బుధవారం తెలిపారు. 2023లో ఇంటి మేడపై ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను అంజిబాబు లైంగికంగా వేధించినట్టు చిన్నారి తల్లి అప్పటి దిశ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ లక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తుచేపట్టారు. కోర్టుకు అభియోగపత్రాలు దాఖలు చేశారు. మహిళా స్టేషన్ డీఎస్పీ గోవిందరావు సాక్షలను కోర్టులో ప్రవేశ పెట్టారు. నేరం నిరూపణ కావడంతో జడ్జి నాగమణి తీర్పు వెలువ రించినట్టు ఎస్పీ తెలిపారు. పోలిపల్లి పైడితల్లి హుండీల ఆదాయం రూ.3.24 లక్షలు రాజాం సిటీ: బొబ్బిలి రోడ్డులోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారి హుండీల ఆదాయం బుధవారం లెక్కించారు. రెండు నెలలకు గాను రూ.3,24,800లు ఆదాయం వచ్చినట్టు ఈఓ బీవీ మాధవరావు తెలిపారు. కార్యక్రమంలో చీపురుపల్లి కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ ఈఓ శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్త వాకచర్ల దుర్గాప్రసాద్, సిబ్బంది, పర్యవేక్షకులు పాల్గొన్నారు. కియోస్క్లపై కూటమి నిర్లక్ష్యం విజయనగరం ఫోర్ట్: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి సచివాలయంలో రైతులకు సేవలందించిన కియోస్క్ యంత్రాలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, యంత్రాల కోసం ఇండెంట్ పెట్టేందుకు ఉపయోగపడే యంత్రాలు ఇప్పుడు వినియోగంలేక మూలకు చేరుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రైతుసేవా కేంద్రాల్లో ఉన్న 505 కియోస్క్ యంత్రాల్లో 125 మరమ్మతులకు గురైనా పట్టించుకునేవారే కరువయ్యారు. ఇదే విషయాన్ని జిల్లా వ్యవసాయాధికారి వి.తారకరామారావు వద్ద ప్రస్తావించగా రైతు సేవా కేంద్రాల్లో పాడైన కియోస్క్ల విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. బాగుచేయించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉష్ణతాపం నుంచి ఉపశమనం కల్పిద్దాం విజయనగరం అర్బన్: వేసవిని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 17వ తేదీ మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఉష్ణతాపం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మండల, జిల్లా అధికారులను ఆదేశించారు. వచ్చేనెల రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో వేసవి నుంచి ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల మూడో శనివారం ‘బీట్ ద హీట్’ పేరుతో స్వచ్ఛాంద్ర కార్యక్రమం నిర్వహించాలన్నారు. జన సమూహాలు ఉండే ప్రదేశాల్లో తాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి, సీపీఓ పి.బాలాజీ, జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ, పంచాయతీ అధికారి టి.వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ పి.నల్లనయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
శ్యామలాంబ జాతరను విజయవంతం చేయాలి
● అధికారులను ఆదేశించిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పార్వతీపురం టౌన్: సాలూరులో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న శ్యామలాంబ అమ్మవారి జాతరను విజయవంతం చేసేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ స్పష్టం చేశారు. జాతర నిర్వహణపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో బుధవారం మాట్లాడారు. 15 ఏళ్ల తరువాత జరుగుతున్న అమ్మవారి జాతరకు భక్తులు పెద్దఎత్తున హాజరయ్యే అవకాశం ఉందన్నారు. జాతర జరిగే మూడు రోజులూ ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జాతరకు విచ్చేసే భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పన ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. ●జాతర జరిగే నాలుగు రోజుల్లో నాలుగు జిల్లాలకు చెందిన 1240 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు కలెక్టర్కు వివరించారు. ●సిరిమాను తిరిగే ప్రాంతాలతో పాటు అన్ని ముఖ్య ప్రాంతాల్లో గట్టి పోలీసు బందోబస్తుతో పా టు 30 రోప్ పార్టీలను సంసిద్ధం చేయాలని పోలీస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భక్తులందరూ ఒకే ప్రాంతంలో గుమిగూడకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సాలూరు పట్టణ రహదారుల్లో గుర్తించిన 22 పాట్ హోల్స్ను తక్షణమే పూడ్చివేయాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు. ●విద్యుత్ లోఓల్టేజీ సమస్య తలెత్తకుండా అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుచేశామని, సిరిమాను తిరిగే సమయంలో విద్యుత్ను నిలిపివేస్తున్నామని, ఆ సమయంలో విద్యుత్కు అంతరాయం కలగకుండా కమిటీ సహకారంతో జనరేటర్లను ఏర్పాటుచేయనున్నట్లు ఎస్ఈ కలెక్టర్కు వివరించారు. ●14 వైద్య బృందాల ద్వారా 378 మంది వైద్య సిబ్బంది జాతర ముగిసే వరకు నిత్యం సేవలు అందించాలని, అంబులెన్సులు, మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశా రు. దేవాలయానికి అలంకరణ, క్యూలైన్లు, భక్తుల కు, చిన్నారులకు తాగునీరు, పాలు, మజ్జిగ వంటి ఏర్పాట్లతో పాటు మరుగుదొడ్ల సదుపాయం కల్పించాలని ఆలయ ఈఓను ఆదేశించారు. అధికారులందరూ వారికి అప్పగించిన విధులను బాధ్యతగా నిర్వర్తించి జాతరను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జేసీ ఎస్.ఎస్.శోభిక, ఎస్డీసీ డా.పి.ధర్మ చంద్రారెడ్ది, ఆలయ ఈఓ టి.రమేష్, మండల ప్రత్యేక అధికారి శివన్నరాయణ, మున్సిప ల్ కమిషనర్ డి.టి.వి.కష్ణారావు, మండల తహసీల్దార్ ఎన్.వి.రమణ, ఎంపీడీఓ జి.పార్వతి, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ కె.చలపతిరావు, డీపీఓ టి.కొండలరావు, జిల్లా ఎకై ్సజ్ అధికారి ఎం.రవిప్రసాద్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారి బి.చంద్రశేఖర్, జిల్లా విపత్తు ల స్పందన అధికారి కె.శ్రీనుబాబు, డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు. -
దక్షిణ భారతదేశ యాత్రకు ఐఆర్ సీటీసీ ఏర్పాట్లు
పార్వతీపురం టౌన్: ఐఆర్ సీటీసీ ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశ యాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి ‘భారత్ గౌరవ్‘ పేరుతో ప్రత్యేక రైలును ఏర్పాటు చేసిందన్నారు. ప్యాకేజీ వివరాలు ఇలా... అరుణాచలం–మధురై రామేశ్వరం యాత్ర: ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు 8 రాత్రులు, 9 పగలు ప్రయాణంలో అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరులలో ఉన్న పుణ్యక్షేత్రాల దర్శనం కల్పిస్తారు. దీనికోసం ఒక్కో పర్యాటకుడు రూ.14,700 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. హరిద్వార్–రిషికేశ్ వైష్ణోదేవి యాత్ర: జూన్ 3 నుంచి 12వ తేదీ వరకు 9 రాత్రులు, 10 పగలు ప్రయాణంలో హరిద్వార్, రిషికేశ్, ఆనందపూర్, నైనా దేవి ఆలయం, అమృతసర్, మాతా వైష్ణోదేవి ఆలయాల సందర్శన ఉంటుంది. దీని కోసం రూ.18,510 చెల్లించాలి. కాశి–అయోధ్య–ప్రయాగరాజ్ యాత్ర: జూన్ 14 నుంచి 22వ తేదీ వరకు 8 రాత్రులు, 9 పగలతో కూడిన కాశి, అయోధ్య, నైమిశారణ్య, ప్రయాగ్రాజ్, శ్రీంగవేరపురం ఆలయాలను దర్శించుకునే అవకాశం ఉంటుంది. దీని కోసం టికెట్ ధర రూ.16,200. ఉజ్జయిని, త్రయంబకేశ్వర్–భీమశంకర్ ఘృష్టేశ్వర్: జూలై 5 నుంచి 23వ తేదీ వరకు 8 రాత్రులు, 9 పగలు ప్రయాణంలో మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, త్రయంబకేశ్వర్, భీంశంకర్, ఘృష్టేశ్వర్, ఎల్లోరా, మోవ్, నాగ్పూర్తో యాత్ర కోసం పర్యాటకులు రూ:14,700 వరకు చెల్లించాలి. దక్షిణ భారతదేశ యాత్రలో రైలు, బస్సు, హోటల్ ఐఆర్ సీటీసీ ఏర్పాటు చేస్తుంది. ఉదయం అల్పాహారం, మధ్యా హ్నం, రాత్రి భోజనం, మంచి నీళ్ల బాటిల్స్, పర్యా టకుల ఆలయాల సందర్శన సమయంలో గైడ్ సేవలను ఐఆర్ సీటీసీ ఏర్పాటు చేస్తుంది. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ప్రయాణికులకు ప్రయాణ సమయంలో బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది. పూర్తి వివరాలకు 040–27702407, 97013 60701, 92814 95845, 92814 95843, 92810 30712, 92810 30740 నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. -
రైతుకు నష్టం
–8లోఅకాలవర్షం.. ఉక్కపోతతో ‘షాక్’ వేసవి తీవ్రత దృష్ట్యా రోజురోజుకు ఎండలు ముదురుతున్నాయి. రోజువారీ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. బుధవారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2025జిల్లాలో సుమారు 70 వేల ఎకరాల్లో జీడి తోటలు ఉన్నాయి. దాదాపు 30 వేల కుటుంబాలకు పైగా వీటిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. మన్యం ప్రాంతంలో విరివిగా పండే వాణిజ్య పంట ఇది. ఒకవైపు తెగుళ్లు, మరోవైపు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏటా నష్టపోతున్నామని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. భామిని తదితర మండలాల్లో మొక్కజొన్న రైతులు కూడా వర్షాలకు నష్టపోతున్నారు. గింజలను ఆరబెడుతున్న సమయంలో ఒక్కసారిగా వర్షం వల్ల తడిచిపోతున్నాయని చెబుతున్నారు. కురుపాం నియోజకవర్గంలోని గరుగుబిల్లి, జియ్యమ్మవలస మండలాల్లో నువ్వులు, మొక్కజొన్న, అరటి పంటలకు నష్టం వాటిల్లుతోంది. కోసిన నువ్వు పంట ఆరబెట్టే సమయంలో వర్షాలు కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గాలులు, వర్షాలతో జిల్లా రైతాంగం నష్టపోతున్నా ప్రభుత్వం నుంచి స్పందన ఉండడం లేదు. 33 శాతం నష్టం వాటిల్లితేనే పరిహారం అందుతుందన్న ప్రభుత్వం నిబంధనలు శరాఘాతంగా మారుతున్నాయి. సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ఓవైపు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వడగాల్పులు బెంబేలెత్తిస్తున్నాయి. మరోవైపు వాతావరణం ఒక్కసారిగా మారుతూ.. గాలులతోపాటు వర్షం కురుస్తోంది. మండు వేసవిలో వర్షం కాస్త ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ.. జోరుగా వీస్తున్న గాలులు ఉద్యాన, వాణిజ్య పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి రైతులను కలవరపెడుతోంది. సోమవారం సాయంత్రం గాలులతో పాటు కురిసిన వర్షానికి పాలకొండ మండలంలోని పాలకొండ, బుక్కూరు, రుద్రిపేట, అట్టలి, వెలగవాడ తదితర ప్రాంతాల్లో జీడి, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. బొప్పాయి, అరటి తదితర చెట్లు నేలకొరిగాయి. తుమరాడ, గరుగుబిల్లి గ్రామాల్లో కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. సీతంపేట మండలంలోనూ అరటి, జీడి, మామిడి పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అటు భామిని, బలిజిపేట, సీతానగరం మండలాల్లోనూ గాలులతో పాటు కురుస్తున్న వర్షం వల్ల జీడి, మామిడి పంటలు దెబ్బతిని కాయలు నేలరాలాయి. నేల రాలిన జీడిపిక్కలు రంగు మారడంతో నష్టపోతున్నట్లు రైతులు చెబుతున్నారు. నాణ్యత లేకపోవడంతో దళారులు కిలో రూ.100 చొప్పున కొనుగోలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యూస్రీల్ఆందోళనలో రైతాంగం గాలులకు నేలకొరుగుతున్న మామిడి, అరటి ఆదుకోని యంత్రాంగం పిడుగులతో ప్రాణ నష్టం వర్షంతో పాటు.. పిడుగులు పడటం వల్ల అటు ప్రాణా నష్టం కూడా సంభవిస్తోంది. మెంటాడ మండలంలోని కుంటినవలస గ్రామానికి చెందిన కొల్లి రాంబాబు (45) పిడుగుపాటుకు గురై మృతి చెందగా.. సీతానగరం మండలం సుభద్ర సీతారాంపురం గ్రామ సమీపంలో 11 జీవాలు ప్రాణాలు వదిలాయి. దీంతో ఆయా కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. -
అత్యవసర రక్షణపై మాక్డ్రిల్
పార్వతీపురం టౌన్: అత్యవసర పరిస్థితు ల్లో పౌరుల సురక్షిత సంసిద్ధతకు వీలుగా బుధవారం ఉదయం 9 గంటలకు పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్లో మాక్డ్రిల్ నిర్వహించనున్నట్టు జేసీ ఎస్ఎస్ శోభిక తెలిపారు. మాక్ డ్రిల్ సన్నాహక చర్యలపై కలెక్ట్ర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షించారు. పోలీసులు, ఫైర్, వైద్య విభాగాలు సంయుక్తంగా నిర్వహించే మాక్డ్రిల్కు ప్రజలు సహకరించాలని కోరారు. జిల్లా ముఖ్య అగ్ని మాపక అధికారి కె.శ్రీనుబాబు మాట్లాడుతూ అణుబాంబు విస్పోటన జరిగితే మూడు నుంచి 5 కిలోమీటర్ల మేర తీవ్ర ప్రభావం ఉంటుందని, దట్టమైన గోడలతో ఉండే ఇళ్లలో ఉండడం వల్ల రేడియేషన్ ప్రభా వం నుంచి సురక్షితంగా బయటపడవచ్చన్నారు. యుద్ధ సమయాల్లో లైట్లు పూర్తిగా ఆపివేయాలన్నారు. 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం సైరన్ మోగితే పరిస్థితిలో తీవ్రత ఉందని గ్రహించాలని, అందుకు తగిన విధంగా సురక్షిత చర్యలకు అధికార యంత్రాంగానికి సహకరించాలన్నారు. సమావేశంలో డీఆర్వో కె.హేమలత, కేఆర్సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, ఇంజినీరింగ్ అధికారులు కోడా చలపతిరావు, ఒ.ప్రభాకరరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.టి.జగన్మోహన్రావు, పౌర సరఫరాల సంస్థ జిల్లామేనేజర్ ఐ.రాజేశ్వరి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం.శికుమార్, డీఎస్పీ థామస్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఇసుక సరఫరాకు రీచ్లు సిద్ధం పార్వతీపురం టౌన్: జిల్లాలోని భామిని మండలం నేరడి, పాలకొండ మండలం చినమంగళాపురం ఇసుక రీచ్ల నుంచి ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ సంబంధిత అధికారులను వీడియో కాన్ఫరెన్స్ లో మంగళవారం ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వులు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఇసుక సరఫరా కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు, బారికేడ్లు, చెక్పోస్టు, ఆన్లైన్ వే బిల్లు, రికార్డులన్నీ పక్కాగా ఉండాలన్నారు. సమావేశంలో జేసీ ఎస్.ఎస్.శోభిక, పాలకొండ సబ్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డి, జిల్లా గనులు, భూగర్భ వనరుల శాఖాధికారి జి.జయప్రసాద్, పోలీస్, భామిని, పాలకొండ తహసీల్దార్లు పాల్గొన్నారు. బిత్రపాడులో ఏనుగుల గుంపు జియ్యమ్మవలస: మండలంలోని నిమ్మలపాడు, బిత్రపాడు పంట పొలాల్లో మంగళవారం సాయంత్రం ఏనుగులు దర్శనమిచ్చాయి. నిమ్మలపాడు దగ్గర నాగావళి నదిలో ఉన్న ఏనుగులు సాయంత్రానికి బిత్రపాడు పొలిమేరలోకి చొచ్చుకురావడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. పామాయిల్ తోటలో ఉంటూ అరటి పంట ధ్వంసం చేయడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికై నా వాటిని తరలించే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
పర్యాటకాభివృద్ధి పనులు పూర్తిచేయండి
పార్వతీపురంటౌన్: జిల్లాలోని తోటపల్లి, ఏనుగుకొండ, పెద్దగెడ్డ, వీరఘట్టం, కూర్మసాగరం ప్రాంతాలు బోటింగ్కు అనుకూలమని, వాటి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. తన చాంబర్లో అటవీ, పర్యాటక శాఖ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదు ప్రాంతాల్లో స్పీడ్ బోటింగ్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఒక్కో ప్రాంతంలో ఆరు నుంచి పది మంది ఆసక్తి కలిగిన గిరిజన యువతకు స్పీడ్ బోటింగ్పై శిక్షణ ఇప్పిస్తామని, యువతను ఎంపికచేయాలన్నారు. బోటింగ్ నిర్వహణ ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు నిర్వహించుకునే అవకాశం ఉందన్నారు. సీతంపేట మండలం పనుకుపేటలో గిరి గ్రామదర్శిని పనులు వీలైనంత త్వరగా ప్రారంభం కావాలన్నారు. గ్రామదర్శినిలో గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా మట్టితో నిర్మించిన గృహాలు, ప్రవేశ ద్వారం, గిరిజనులు వినియోగించే సామగ్రి, థింసా నృత్యం, గిరిజన వస్తువుల విక్రయ దుకాణాలు, కల్యాణమండపం వంటి ఏర్పాట్లు ఉండాలన్నారు. జగతిపల్లి రీసార్ట్స్ ప్రాంత అభివృద్ధికి ఆలోచన చేయాలని సూచించారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా పర్యాటక అధికారి ఎన్.నారాయణరావు, జిల్లా అటవీ శాఖాధికారి జీఏపీ ప్రసూన, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎల్.రమేష్, జిల్లా దేవదాయశాఖ అధికారి ఎస్.రాజారావు, తదితరులు పాల్గొన్నారు. రక్త నిల్వలు పెంచాలి రక్తహీనత నివారణతో పాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తాన్ని తక్షణమే అందించేందుకు వీలుగా రక్త నిల్వలు పెంచాలని వైద్యాధికారులను కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఆదేశించారు. జిల్లా ఆస్పత్రిని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలో జనరల్ వార్డు, బ్లడ్బ్యాంక్, సదరం, కంటి తనిఖీ కేంద్రం, ఓపీతో పాటు ప్రతీ విభాగాన్ని ఆయన పరిశీలించారు. అత్యవసర కేసుల వివరా లు ఏ అంశంపై వస్తున్నాయని ఆరా తీశారు. వైద్యసిబ్బంది సమయపాలన పాటించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. రోగులకు అందిస్తున్న భోజన వంటకాలను పరిశీలించి మరింత శుచి, రుచిగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ నాగ శివజ్యోతి, ఆస్పత్రి వైద్యులు డాక్టర్ బి.వాగ్దేవి, ఏపీఎంఐడీసీ ఇంజినీరింగ్ అధికారి బి.ప్రసన్నకుమార్, వివిధ విభా గాల వైద్యులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
శ్యామలాంబకు ప్రత్యేక పూజలు
సాలూరు: సాలూరు పట్టణంలో వెలసిన శ్యామలాంబ అమ్మవారికి వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి పండగ నేపథ్యంలో జన్నివీధిలో ఉన్న అమ్మవారి ఘటాలను రాజన్నదొర, సతీమణి రోజమ్మలు దర్శించారు. అమ్మవారి ఘటాలను తలపై పెట్టి మోసారు. అక్కడ నుంచి కాలినడకన శివాజీ సెంటర్లోని సిరిమాను చెట్టువద్దకు వెళ్లి పూజలు చేశారు. చివరిగా శ్యామలాంబ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు వంగపండు అప్పలనాయుడు, గిరి రఘు, గొర్లె మాధవరావు, గొర్లె విజయకుమారి, మండల ఈశు, చొక్కాపు రమణమ్మ, గులిపల్లి నాగ, పిరిడి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
ప్రాథమిక వైద్యమే కీలకం
పార్వతీపురం రూరల్: అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక వైద్య చికిత్స అందించడం వల్ల ప్రాణాపాయస్థితి నుంచి తప్పించవచ్చని ఆరోగ్యశాఖ జిల్లా ప్రొగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు అన్నారు. పెదబొండపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆయన మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. అత్యవసర సమయంలో ప్రాథమిక వైద్యానికి అందుబాటులో ఉన్న పరికరాలు, నిర్వహణ తీరు పరిశీలించారు. ఆక్సిజన్ కాన్సెంట్రేటర్, ఆక్సిజన్ ఫ్లో మీటర్, అంబుబ్యాగ్, ఈసీజీ యంత్రం, సీబీసీ, యూరిన్ అలైజర్స్, అగ్నిమాపక యంత్రం, కోల్డ్ చైన్ సిస్టమ్ వంటివి పనిచేస్తున్నదీ లేనిదీ ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు జి.ధరణి, జి.గోపాలకృష్ణ, ఎపిడమిక్ సత్తిబాబు, సూపర్వైజర్లు వెంకటనాయుడు, జయలక్ష్మి పాల్గొన్నారు. -
ఆదర్శనీయులు... ఆ దంపతులు
చీపురుపల్లి: ఆదర్శం అంటే అదేదో మాటల్లో చెప్పేది కాదు చేతల్లో చూపించాలి. అందులోనూ నేత్రదానం అంటేనే భయపడిపోతున్న ఈ రోజుల్లో ఏకంగా అవయవదానం అంటే మరి ఎంత కాదనుకున్నా కాస్త భయం లేకపోలేదు. అయినప్పటికీ ప్రతీ మనిషి మరణానంతరం మిగిలేది బూడిదే కదా.. అయినా ఎందుకు అవయవ దానం చేయడానికి భయం అంటూ ప్రతీ ఒక్కరూ మాట్లాడుతుంటారు. కానీ అవయవదానం చేసేందుకు ముందుకు రావడానికి మాత్రం అడుగులు వేయరు. ఇలాంటి నేపథ్యంలో ఆ దంపతులు ఇద్దరూ ఒకే ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చారు. తమ మరణానంతరం అవయవ దానం చేసేందుకు సిద్ధం అంటూ ముందుకొచ్చారు. అంతేకాకుండా తమ మరణానంతరం అవయవ దానం చేయడానికి తాము సిద్ధమే అంటూ మానవీయత స్వచ్ఛంద సంస్థ సిద్దం చేసిన అంగీకార పత్రాలపై సంతకాలు చేసి అందజేసి సమాజానికి ఆదర్శప్రాయులుగా నిలిచారు. వారే నెలిమర్ల మండలంలోని తంగుడుబిల్లికి చెందిన శివుకు బంగారయ్య, రామలక్ష్మి దంపతులు. బంగారయ్య తంగుడుబిల్లి గ్రామంలో గణిత ఉపాధ్యాయుడుగా పని చేస్తుండగా, రామలక్ష్మి విజయనగరం కంటోన్మెంట్ వీఆర్వోగా పని చేస్తున్నారు. బంగారయ్య ఆయన భార్యతో కలిసి ఎంతో గొప్పగా ఆలోచన చేసి తమ మరణానంతరం శరీరం మట్టిలో కలిసిపోకుండా మరికొంత మందికి ఉపయోగపడాలనే గొప్ప ఆలోచనతో అవయవదానం చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో పట్టణానికి చెందిన మానవీయత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు బివి.గోవిందరాజులు, ప్రతినిధి విజయతో బాటు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.పి.సుధీర్కు మంగళవారం అంగీకార పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతటి గొప్ప వారి శరీరమైనా మట్టిలో కలిసిపోవాల్సిందేనని అలా కాకుండా అవయవదానం చేయడం ద్వారా మరికొంత మందికి ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. అతడు ఉపాధ్యాయుడు.. ఆమె వీఆర్వో అవయవ దానానికి అంగీకార పత్రాల అందజేత -
డీజే దాబాపై విజిలెన్స్ దాడులు
డెంకాడ: మండలంలోని పెదతాడివాడ జంక్షన్ సమీపంలో ఉన్న డీజే దాబాపై మంగళవారం విజిలెన్స్ దాడులు జరిగాయి. ఇంటి అవసరాలకు వాడాల్సిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను వ్యాపార అవసరమైన డీజే దాబాలో వినియోగించుతుండడంతో విజిలెన్స్ సీఐ బి.సింహాచలం, సిబ్బంది తనిఖీ చేసి పట్టుకున్నారు. దీంతో డీజే దాబాపై 6ఏ కేసు నమోదు చేశామని వివరించారు. పట్టుకున్న 5 గ్యాస్ సిలిండర్లను విజయనగరం ఆదిత్య గ్యాస్ ఏజెన్సీకి అప్పగించామన్నారు. విజిలెన్స్ దాడిలో సీఎస్డీటీ ఆర్.శంకరరావు, వీఆర్వోలు డి.కృష్ణబాబు, మధుసూధనరావు తదితరులు పాల్గొన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలి ● ఐటీడీఏ పీవో అశుతోష్ శ్రీవాస్తవ పార్వతీపురం: జీడి ప్రాసెసింగ్ యూనిట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజినీరింగ్ సిబ్బందికి పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. పట్టణ పరిధిలోని మార్కెట్ యార్డ్లో నిర్మిస్తున్న జీడి ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన జరుగుతున్న పనులపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జీడి తోటలను సాగు చేసే రైతులకు జీడి పంటకు విలువ ఆధారితను కల్పించేందుకు జీడి ప్రాసెసింగ్ యూనిట్ ఎంతో దోహదం చేస్తుందన్నారు. జీడి రైతులకు, గిరిజనులకు ఈ యూనిట్ ఎంతో లాభదాయకంగా ఉంటుందన్నారు. త్వరితగతిన పనులను పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ పరిశీలనలో ఇంజినీరింగ్ అధికారి మణిరాజ్, ఏపీవో మురళీధర్ తదితరులున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ తీరుపై ఎంపీడీవో విచారణ పూసపాటిరేగ: మండలంలోని బత్తివలస గ్రామ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ తీరుపై ఎంపీడీవో ఎం.రాధిక మంగళవారం విచారణ చేపట్టారు.ఆయనపై బినామీ మస్తర్లు వేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయనను కార్యాలయానికి పిలిపించి మరీ విచారణ చేశారు. పలువురు వేతనదారులను కూడా కార్యాలయానికి రప్పించి ఫీల్డ్ అసిస్టెంట్ బినామీ మస్తర్లు వేయడంపై ఆరాతీశారు. గతంలో జరిగిన ఉపాధి పనుల సోషల్ ఆడిట్లోనూ అవకతవకలు జరిగినట్లు బయపడిందని గుర్తు చేశారు. తదుపరి చర్యలు ఏం తీసుకుంటారన్నది తెలియాల్సి ఉంది. ఆమె వెంట ఏపీవో తిరుపతిరావు తదితరులు ఉన్నారు. అరటి పంటకు నష్టం చీపురుపల్లి: మండలంలో సోమవారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు అరటి పంటకు నష్టం వాటిల్లినట్టు ఉద్యానవన శాఖాధికారి సీహెచ్ చంద్రశేఖర్ తెలిపారు. మండలంలోని పీకే పాలవలస, పేరిపి, గొల్లలములగాం, గొల్లలపాలెం తదితర గ్రామాల్లో ఎనిమిది ఎకరాల్లో అరటి పంట, మూడు ఎకరాల్లో బొప్పాయి పంట నేలకొరిగినట్టు ఆయన తెలిపారు. భూముల వివరాల పరిశీలన లక్కవరపుకోట : అన్నధాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకాల వర్తింపుకై రైతులకు సంబంధించి భూముల వివరాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీ చేస్తున్నట్టు ఏవో స్వాతికుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీ రైతు తన భూమికి సంబంధించిన 1 బీ, ఆధార్, రేషన్ కార్డు, ఫోన్ నంబరుతో సమీప రైతు సేవా కేంద్రాలకు వెళ్తే.. అక్కడ సిబ్బంది సంబంధిత పత్రాలను పరిశీలన చేసి నమోదు చేస్తారని తెలిపారు. ఈ ప్రక్రియ ఈ నెల 20వ తేదీ వరకు జరుగుతుందన్నారు. అలాగే పచ్చి రొట్ట విత్తనాలైన జీలుగా, కట్టి జనుము, పిల్లి పెసర విత్తనాలు 50 శాతం రాయితీపై రైతులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. విత్తనాల కావల్సిన రైతులు 1బీ, ఆధార్ కార్డుతో సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు. -
వైభవంగా పైడితల్లమ్మ దేవర మహోత్సవం
● వేపాడ, వల్లంపూడి గ్రామాల్లో భక్తజనం ● 19న తొలేళ్లు, 20 అమ్మవారి పండగవేపాడ: మండలంలోని వల్లంపూడి గ్రామదేవత పైడితల్లమ్మ పండగ సందర్భంగా మంగళవారం దేవర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం గ్రామానికి చెందిన పెద్దవీధి చేనేత కార్మికులు 42 అడుగులు, చిన్నవీధివారు 40 అడుగుల ఎత్తులో ప్రభలను ఊలుతో అలంకరించారు. వేపాడ, వల్లంపూడి జంటగ్రామాల్లో ప్రభలను ఊరేగింపు చేశారు. అనంతరం అమ్మవారి ఆలయం ప్రాంగణ సమీపంలో రెండు ప్రభలను నిలిపారు. 19న తొలేళ్ల ఉత్సవం రోజు ఊలు అలంకరణ మార్పుచేసి నిలపనున్నారు. 20న అమ్మవారి పెద్దపండగ జరగనుంది. -
విజయలక్ష్మికి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు
చీపురుపల్లి: మండలంలోని కర్లాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్నర్స్గా విధులు నిర్వహిస్తున్న ఎం.విజయలక్ష్మికి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు దక్కింది. విజయవాడకు చెందిన హెల్త్ కేర్ ట్రస్టు ప్రతీ ఏటా ఉత్తమ సేవలు అందిస్తున్న స్టాఫ్నర్స్ల కోసం నిర్వహిస్తున్న అవార్డులు ఎంపికలో భాగంగా ఈ ఏడాది జిల్లా నుంచి కర్లాం స్టాఫ్ నర్స్ విజయలక్ష్మికి అవకాశం లభించింది. ఈ మేరకు త్వరలో విజయవాడలో జరగనున్న కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకోనున్నారు. దీంతో ఆమెను పీహెచ్సీలో ఉన్న సిబ్బంది అభినందించారు. -
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు
● ఎన్ఎంయూ రాష్ట్ర కార్యదర్శి అప్పారావు విజయనగరం క్రైమ్ : ఆర్టీసీలో కార్మికుల డిమాండ్లు గడువులోగా పరిష్కరించకుంటే సమ్మె తప్పదని నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్ఎంయూ) రాష్ట్ర కార్యదర్శి వి.అప్పారావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు విజయనగరం ఆర్టీసీ డిపో వద్ద మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము కోరుతున్న 38 డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పందన రాలేదన్నారు. తమ డిమాండ్లపై ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే వినతిపత్రాలు అందజేశామన్నారు. తక్షణమే తమ డిమాండ్లపై స్పందించాలన్నారు. లేకుంటే సమ్మె నోటీసు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. ధర్నాకు రాహుల్ అధ్యక్షత వహించగా దుర్గరాజు, విజయనగరం, ఎస్.కోట సంఘ కార్యదర్శులు రామారావు, చంద్రమౌళి, మహిళ ప్రతినిధులు సరిత, సుజాత, భాను, కుమారి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ క్రెడయ్ చాప్టర్లో చంద్రబోస్కి కీలక బాధ్యతలు
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రెడయ్ చాప్టర్ నూతన కార్యవర్గ ఎన్నికలో విజయనగరం జిల్లాకు చెందిన కట్టూరు సుభాష్ చంద్రబోస్ కీలక బాధ్యత లు చేపట్టారు. మంగళవారం విజయవాడలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమక్షంలో 2025–27 సంవత్సరాలకు సంబంధించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా విజయనగరానికి చెందిన సుభాష్ చంద్రబోస్ క్రెడయ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అదేవిధంగా క్రెడయ్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కన్వీనర్గా, జీఎస్టీ కన్వీనర్గా, సెంటర్ జోన్ ఇంచార్జ్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరానికి చెందిన తనకి క్రెడయ్ ఏపీ చాప్టర్లో కీలక బాధ్యతలు అప్పగించటం సవాల్గా స్వీకరిస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్లో నిర్మా ణ రంగం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొ న్నారు. వ్యవసాయం తరువాత అధికంగా ఉపాధి పొందే నిర్మాణ రంగంలో పూర్తి స్థాయిలో సేవలందిస్తానని చెప్పారు. నిర్మాణ రంగ కార్మికుల నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేలా ముందుకు వెళతానన్నారు. కార్మి కులకు గుర్తింపు కార్డులు మంజూరు చేస్తామన్నారు. -
జీవనోపాధికి విస్తృతంగా రుణాలు
బొబ్బిలి రూరల్: పొదుపు సంఘాల్లోని సభ్యులకు జీవనోపాధిని కల్పించేందుకు విస్తృతంగా బ్యాంకర్ల సహకారంతో లింకేజీ రుణాలందిస్తున్నామని, ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని చేరుకుంటామని మెప్మా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ గంటా వెంకట చిట్టిరాజు తెలియజేశారు. ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో మెప్మా పరిధిలో 2వేల 602 సంఘాలుండగా వాటికి రూ.275 కోట్లను రుణాలుగా అందించేందుకు లక్ష్యంగా నిర్ణయించుకోగా ఇప్పటికే 244 సంఘాల సభ్యులకు దాదాపు 25 కోట్ల రూపాయిలను రుణాలుగా అందించామన్నారు. ప్రతి సభ్యునికి రెండు లక్షల వరకు వ్యక్తిగత రుణాలందిస్తున్నామని, చిన్నతరహా వాణిజ్య, వ్యాపారాలకు అవసరమైన మొత్తాలను పూర్తి స్థాయిలో అందించేందకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సంఘంలోని ప్రతి సభ్యురాలి వివరాలు ఆన్లైన్ చేశామని ఈ విధానం వల్ల నిధులు దుర్వినియోగం కావన్నారు. కొత్తగా 160 సంఘాలను తయారు చేయగా 304 పాత సంఘాలను అప్గ్రేడ్ చేశామని వివరించారు. రిక్షా, ఆటో, ఇతర రంగాల్లో ఉన్న కార్మికులను, పురుషులు, ప్రత్యేక అవసరాలు కలిగిన వారితో ఐదుగురు చొప్పున సంఘాలను ఏర్పాటు చేస్తున్న వారి జీవనోపాధికి అవసరమైన రుణాలనందించేందుకు బ్యాంకర్లతో సమావేశాలు జరుపుతున్నామని తెలియజేశారు. సమావేశంలో ఎంపీడీవో పి.రవికుమార్ తదితరులున్నారు. మెప్మా పీడి చిట్టిరాజు -
రీసర్వేలో పక్కాగా సరిహద్దులు నిర్ణయించాలి
● రీసర్వే ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పార్వతీపురం రూరల్: ప్రభుత్వం చేపడుతున్న రీ సర్వేతో భూ సమస్యలు తొలగి రైతులకు, భూ యజమానులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నారు. రెండవ విడత రీ సర్వే కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మండలంలోని తాళ్లబురిడి గ్రామంలో నిర్వహిస్తున్న రీ సర్వే ప్రక్రియను మంగళవారం ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ భూ సర్వే జరిపే ముందు రైతులకు నోటీసులు జారీ చేసి, గ్రామంలో రైతుల భూములతో పాటు గ్రామ సరిహద్దులు, నీటి వనరుల భూములు, పోరంబోకు భూములకు కొలతలు వేసి కచ్చితమైన సరిహద్దులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. తద్వారా రైతులకు, భూ యజమానులకు శాశ్వత మేలు జరుగుతుందని పేర్కొన్నారు. రైతుల సమక్షంలోనే భూమి కొలతలు వేసి తమ భూమికి సంబంధించిన హద్దులు నిర్ణయిస్తారని తెలిపారు. రైతులతో ముఖాముఖి నిర్వహించి రీ సర్వే జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. తప్పులు దొర్లకుండా పక్కగా నిర్వహించాలన్నారు. రైతులకు నోటీసులు జారీ చేస్తున్నది లేనిది అడిగి ఆరా తీశారు. ఇప్పటివరకు ఎంత మేర సర్వే నిర్వహించిన విషయమై తహసీల్దార్ వై.జయలక్ష్మిని ప్రశ్నించగా 1147 ఎకరాల గ్రౌండ్ ట్రూటింగ్ పూర్తి కాగా మిగతా 31 ఎకరాలు సర్వే నిర్వహించాల్సి ఉందని ఆమె తెలిపారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తహసీల్దార్తో మాట్లాడుతూ మరణించిన భూ యజమానుల వారసులకు మార్పు చేసే విధంగా ఎఫ్ఎంసీ విచారణ పూర్తి చేసి మ్యుటేషన్లను పరిష్కరించాలని ఆదేశించారు. భూ సమస్యలు తలెత్తకూడదనేది ప్రధానమైన రీ సర్వే ఉద్దేశమని, రైతులు పక్కా భూ రిజిస్ట్రేషన్లు చేసుకొనేలా ప్రోత్సహించాలని సూచించారు. రోడ్లుకు కేటాయించిన భూములలో హద్దులు నిర్ణయించి రక్షణ కల్పించాలన్నారు. చెరువులు, వాగులలోని ఆక్రమణలు ఉంటే తొలగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సర్వే, భూ రికార్డుల నిర్వహణ శాఖ సహాయ సంచాలకులు లక్ష్మణరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ జి.రవి తేజ, మండల సర్వేయర్ స్వామి, గ్రామ సర్వేయర్ నాయుడు, గ్రామ సచివాలయ సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు. -
మన క్రీడా విధానం దేశానికే ఆదర్శం
● చదువుతో పాటు ఆటలకూ ప్రాధాన్యత ● రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్విజయనగరం: క్రీడా విధానంలో మనం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఒక్క మన రాష్ట్రంలోనే ఉద్యోగాల భర్తీలో క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్లు కల్పించామని, క్రీడల కోసం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నామని చెప్పారు. చదువుతో పాటు ఆటలకు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో జరుగుతున్న 3వ జాతీయ తైక్వాండో శిక్షణా సెమినార్కు మంత్రి శ్రీనివాస్ మంగళవారం హాజరయ్యారు. క్రీడాకారులకు ఇస్తున్న శిక్షణను తిలకించారు. ఒడిశా, ఛత్తీస్ఘడ్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన కోచ్లు, క్రీడాకారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, మానవ వనరులే మన దేశానికి ఆస్తి అని పేర్కొన్నారు. ప్రతీ విద్యార్థి చదువుతో పాటు, ఆటల్లో కూడా రాణించి మన రాష్ట్రానికి, ప్రాంతానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో క్రీడా విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని గొప్ప క్రీడాకారులుగా ఎదగాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో తైక్వాండో జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, రాష్ట్ర కార్యదర్శి సిహెచ్.వేణుగోపాల్, అంతర్జాతీయ క్రీడాకారుడు, తైక్వాండో కోచ్ అబ్బాస్ షేకీ, తెలంగాణ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి కె.శ్రీహరి, మక్కువ శ్రీధర్ తదితర ప్రముఖులు, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
చదురుగుడికి.. సిరుల తల్లి
విజయనగరం టౌన్: మంగళవాయిద్యాలు.. భక్తుల జయజయ ధ్వానాలు.. సాంస్కృతిక ప్రదర్శనల నడుమ పైడితల్లి దేవరమహోత్సవం సోమవారం శోభాయమా నంగా సాగింది. రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వనంగుడి నుంచి సిరులతల్లి చదురుగుడికి చేరుకున్నారు. ముందుగా వనంగుడి స్తపన మందిరంలో సాయంత్రం 4.30 గంటలకు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఆలయ వేదపండితులు, భక్తులు, పూజారులు శా స్త్రోక్తంగా పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరణ చేశారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు అమ్మవారి ఉత్సవ విగ్రహంతో ఆలయం చుట్టూ జై పైడిమాంబనామ స్మరణతో మూడుసార్లు ప్రదక్షణ చేశారు. అనంతరం అప్పటికే ఆలయం బయట సిద్ధంగా ఉంచిన ఉత్సవ రథంపై అమ్మవారిని ఆశీనులు చేసి హారతిచ్చారు. మంగళ వాయిద్యాలు, విచిత్ర వేషధారణలు, భక్తుల జయజయ ధ్వానాల నడుమ అమ్మ రథం ముందుకు కదిలింది. దారిపొడవునా పూజలు సిరులతల్లి వనంగుడి నుంచి చదురుగుడికి బయలుదేరిన వేళ... విద్యల నగరంలో ఆద్యంతం భక్తిభావం ఉప్పొంగింది. రైల్వేస్టేషన్ వద్ద నుంచి ప్రారంభమైన రథం.. గాడీఖానా, సీఎంఆర్ కూడలి, వైఎస్సార్ సర్కిల్, ఎన్సీఎస్, కన్యకాపరమేశ్వరి ఆలయం, గంటస్తంభం, మున్సిపల్ ఆఫీస్, కమ్మవీధి, తెలకలవీధి రామమందిరం మీదుగా హుకుంపేటకు చేరుకుంది. అక్కడ చదురు వద్ద ఉత్సవ విగ్రహాన్ని, పూజారి ఇంటివద్ద ఇత్తడి ఘటాలను పెట్టారు. రాత్రి 7 నుంచి 10 గంటల వరకూ భక్తులు దర్శించుకున్నారు. తాడేపల్లి గూడెం కళాకారులు ప్రదర్శించిన నవదుర్గలు, కాళికామాత వేషధారణలు భక్తిభావాన్ని పెంపొందించాయి. తప్పెటగుళ్లు, కోలాటం, భజనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయ ఇన్చార్జి ఈఓ ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. సంప్రదాయబద్ధంగా.. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు ఇంటి వద్ద రాత్రి 7 గంటల సమయంలో అమ్మవారి ఘటాలకు హుకుంపేట ప్రజలు పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. మొక్కుబడులు చెల్లించారు. ఈ ఏడాది సిరిమానోత్సవ పండగను అంగరంగ వైభవంగా నిర్వహించుకునేలా చూడాలని, ఎటువంటి అవాంతరాలు లేకుండా కాపాడాలంటూ పైడితల్లిని ప్రార్థించారు. హుకుంపేట నుంచి రాత్రి 10 గంటలకు ఘటాలతో ఊరేగింపు ప్రారంభమైంది. మండపం వీధి, శివాలయం మీదుగా సుమారు 2 గంటల ప్రాంతంలో ఊరేగింపు మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడికి చేరుకుంది. అక్కడ ఆలయంలో ఘటాలు, అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయంలో ఉంచారు. వేకువజామున 3 గంటల ప్రాంతంలో ఆలయ తలయారీ రామవరపు చినపైడి రాజు బృందం సాయంతో జంగిడి మీద దీపం పెట్టుకుని, చదురుగుడి నుంచి డప్పు వాయిద్యాలతో మంగళవీధి మీదుగా తలయారి, పూజారి, కొందరు భక్తులు చెరువు వద్దకు వెళ్లి అమ్మవారికి మనవి చెప్పారు. అక్కడి మట్టిని అమ్మవారి బొమ్మగా మలచి పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. ఈ రోజు నుంచి అమ్మవారు చదురుగుడిలో దర్శనమిస్తారని సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు తెలిపారు. శోభాయమానం.. పైడితల్లి దేవర మహోత్సవం ఉత్సవ రథంపై ఊరేగిన అమ్మవారు హుకుంపేటలో ఘటాలకు పసుపు, కుంకుమలతో అభిషేకాలు అడుగడుగునా అమ్మకు పూజలు చేసిన భక్తజనం చదురుగుడికి చేరిన సిరులతల్లి -
● ఆస్పత్రులకు రోగుల తాకిడి
ప్రస్తుత వాతావరణం విభిన్నంగా ఉంది. ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పల్లెల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల కలుషిత నీటిని తాగుతూ అస్వస్థతకు గురవుతున్నారు. మరికొన్నిచోట్ల పారిశుద్ధ్య నిర్వహణ లోపించి దోమకాట్లతో జ్వరాల బారిన పడుతున్నారు. వైద్యం కోసం ఆస్పత్రులకు వెళ్తున్నారు. సీతంపేట ఏరియా ఆస్పత్రిలో సోమవారం 306 ఓపీ నమోదైంది. రక్త పరీక్షలు చేసి వైద్యులు సేవలందించారు. అన్నిరకాల మందులు అందుబాటులో ఉన్నట్టు సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు తెలిపారు. – సీతంపేట -
ముగిసిన ఆహ్వాన నాటిక పోటీలు
● ఉత్తమ ప్రదర్శనగా చీకటి పువ్వు నాటిక ● ద్వితీయ, తృతీయ ప్రదర్శనలుగా కొత్త పరిమళం, రైతేరాజు చీపురుపల్లిరూరల్(గరివిడి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు మూడు రోజుల పాటు వైభవంగా జరిగి ఆదివారం ముగిశాయి. గరివిడి కల్చరల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో శ్రీరాం హైస్కూల్ ఆవరణంలో జరిగిన నాటిక పోటీల ప్రదర్శనలో..కరీంనగర్కు చెందిన చైతన్య కళాభారతి ఆధ్వర్యంలో ప్రదర్శించిన చీకటిపువ్వు నాటిక ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది. అదేవిధంగా బొరివంకకు చెందిన శర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శించిన కొత్త పరిమళం నాటిక ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా నిలవగా హైదారాబాద్కు చెందిన కళాంజలి ఆధ్వర్యంలో ప్రదర్శించిన రైతేరాజు నాటిక తృతీయ ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది. నగదు బహుమతుల అందజేత.. ఈ నాటికల ప్రదర్శనలో ఉత్తమ ప్రదర్శనగా నిలిచిన చీకటిపువ్వు బృందానికి రూ.15వేలు, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా నిలిచిన కొత్త పరిమళం నాటిక బృందానికి రూ.12,500, తృతీయ ఉత్తమ ప్రదర్శనగా నిలిచిన నాటిక బృందానికి రూ.10వేలు నగదు బహుమతిని నిర్వాహకులు అందజేశారు. అలాగే ప్రతి నాటిక ప్రదర్శనకు రూ.25వేలు ప్రోత్సాహంగా అందజేశారు. అదే విధంగా కొత్త పరిమళం రచయిత కేకే.ఎల్ స్వామికి రూ.5వేలు, చీకటిపువ్వు నాటిక దర్శకుడు రమేష్ మంచాలకు రూ.5వేల నగదు బహుమతిని కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధుల చేతుల మీదుగా అందజేశారు. -
వెంకటరాజపురంలో ఏనుగులు
జియ్యమ్మవలస: మండలంలోని బాసంగి, బాసంగి గదబవలస, వెంకటరాజపురం పంట పొలాల్లో సోమవారం సాయంత్రం ఏనుగులు దర్శనమిచ్చాయి. వరి, అరటి పంటలను ధ్వంసం చేస్తుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.పిడుగు పాటుకు 11 గొర్రెలు మృతిసీతానగరం: మండలంలోని సుభద్రదరి సీతారాంపురంలో సోమవారం సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగు పాటుకు సీతారాంపురం గ్రామానికి చెందిన పాల్లె నీలయ్యకు చెందిన 11 గొర్రెలు మృతిచెందాయి. కాసేపట్లో ఇంటికి చేరుకునే సమయంలో పిడుగు రూపంలో నష్టం సమకూరిందంటూ పెంపకందారు లబోదిబోమంటున్నాడు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.ముగిసిన వార్షిక కల్యాణ మహోత్సవంగరుగుబిల్లి: తోటపల్లి కోదండరామస్వామి ఆలయంలో ఈ నెల 8 నుంచి జరిగిన సీతారామస్వామివారి వార్షిక కల్యా ణ మహోత్సవం సోమవారంతో ముగిసింది. ఉదయం సుప్రభాతసేవ, ఆరాధన, మంగళాశాసనం, పుణ్యాహ వచనం, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దాతల సాయంతో కల్యాణోత్సవం నిర్వహించినట్టు అర్చకులు తెలిపారు.జీతం విడుదల చేయండివిజయనగరం ఫోర్ట్: సీహెచ్ఓ (కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల)లకు వెంటనే ఏప్రిల్ నెల జీతం విడుదల చేయాలని జీహెచ్ఓలు మౌనిక, కనకదుర్గ కోరారు. తమ సమస్యలు పరిష్కరించాల ని కోరుతూ కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ సీహెచ్ఓల సర్వీసును క్రమబద్ధీకరించాలని, ప్రతీనెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లించా లని డిమాండ్ చేశారు. 30 శాతం జీతం పెంచా లని కోరారు. కార్యక్రమంలో సీహెచ్ఓలు శ్రీను, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.పాలకుల వైఖరిలో మార్పుతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధిబొబ్బిలి: పాలకుల వైఖరిలో పూర్తిస్థాయి మార్పు వస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్య మని ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు రౌతు రామమూర్తినాయుడు అన్నారు. బొబ్బిలిలోని ఎన్జీఓ హోంలో ఉత్తరాంధ్ర సాధన సమితి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సాధన సమితి వ్యవస్థాపక కన్వీనర్ వేమిరెడ్డి లక్ష్మునాయుడు అధ్యక్షతన జరిగిన సదస్సులో రామమూర్తినాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఉన్న అపారమైన ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకుంటేనే అభివృద్ధి చెందుతాం తప్ప రాజకీయల వల్ల కాదన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ, వ్యవసాయాధారిత పరిశ్రమల స్థాపన వంటి చర్యలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇఫ్టూ జిల్లా అధ్యక్షుడు మెరిగాని గోపాలం మాట్లాడుతూ స్థానిక గ్రోత్ సెంటర్లో స్థానికులకు ఉద్యోగాలు లేవన్నారు. కార్యక్రమంలో వెంకటనాయుడు, అప్పలరాజు, డి. సత్యంనాయుడు, రెడ్డి దామోదరరావు, చింతల శ్రీనివాసరావు, బొత్స గణేష్ పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్కు 136 అర్జీలు
విజయనగరం క్రైమ్: జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం 136 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా అర్జీదారులు పూర్తిగా సంతృప్తి చెందే విధంగా వినతులను పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అర్జీలను కలెక్టర్ అంబేడ్కర్, జేసీ సేతు మాధవన్, డీఆర్ఓ ఎస్. శ్రీనివాసమూర్తి, కేఆర్సీ ఎస్డీసీ మురళి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, నూకరాజు పరిశీలించారు. ఆయా సమస్యలను వీలైనంత వేగంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమస్యలకు చట్టపరిధిలో పరిష్కారం విజయనగరం క్రైమ్: జిల్లాపోలీస్ కార్యాలంయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల వేదికకు వచ్చిన ఫిర్యాదులను చట్టపరిధిలో పరిష్కరించాలని ఎస్పీ పకుల్జిందాల్ సిబ్బందిని ఆదేశించారు. డీపీవోలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని ఏడు రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. పీజీడీఆర్ఎస్ లో మొత్తం 46 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సౌమ్యలత, ఎస్బీ సీఐలు లీలారావు, చౌదరి, డీసీఆర్బీ సీఐ సుధాకర్, ఎస్సై రాజేష్లు పాల్గొన్నారు.కూలికి వెళ్లి.. విగతజీవుడై..●● విద్యుత్ షాక్కు గురై యువకుడి మృతితెర్లాం: కుటుంబ పోషణ నిమిత్తం కూలి పనికోసం వెళ్లిన ఓ యువకుడు విగతజీవుడయ్యాడు. పెళ్లిలో టెంట్లు, లైటింగ్ పనులు చేసేందుకు వెళ్లిన యువకుడికి విద్యుత్ షాక్ తగలడంతో మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి సోమవారం తెర్లాం ఎస్సై సాగర్బాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సింగిరెడ్డివలస పంచాయతీ పరిధి ఆమిటి సీతారాంపురం గ్రామానికి చెందిన కొత్తకోట చిరంజీవి(20) ఆదివారం కొల్లివలసలో జరిగిన ఓ వివాహానికి టెంట్లు, లైటింగ్ పనులు చేసేందుకు కూలికోసం వెళ్లాడు. పెళ్లి అయిన తరువాత టెంట్లు విప్పుతుండగా విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. చిరంజీవికి తండ్రి, ఇద్దరు అక్కచెల్లెళ్లు ఉన్నారు. వారిని పోషించేందుకు పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాల్లో టెంట్లు, లైటింగ్ పనులు చేసేందుకు కూలికి వెళ్తుంటాడు. విద్యుత్ షాక్కు గురై యువకుడు మృతిచెందిన సమాచారం తెలియడంతో తెర్లాం ఎస్సై సాగర్బాబు సిబ్బందితో వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతిపాచిపెంట: మండలంలో ని పద్మాపురం పంచా యతీ బడ్నాయక వలస గ్రామానికి చెందిన అంగర బోయిన లక్ష్మణరావు(31) బైక్ అదుపుతప్పి మృతి చెందాడు. ఈ ఘ టనపై ఎస్సై వెంకట సురేష్ సోమవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లక్ష్మణరావు మద్యానికి బానిసై తరచూ భార్య ఉషారాణితో తగాదా పడుతూ ఉండేవాడు. రోజులాగానే ఆదివారం మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో తగాదాపడ్డాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన భార్య ఇంట్లో ఉన్న ఏవో మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను స్థానికులు సాలూరు సీహెచ్సీకి తరలించారు. సాలూరులో చికిత్స పొందుతున్న భార్యను చూడడానికి లక్ష్మణరావు, ఆదివారం రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై సాలూరు వెళ్తుండగా పి.కోనవలస సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో లక్ష్మణరావుకు తీవ్ర గాయాలు కాగా 108 సహాయంతో విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. బైక్ ఢీ కొని వ్యక్తికి గాయాలుకొమరాడ: మండలంలోని కంబవలస సచివాలయంలో డిజిటల్ సహాయకుడిగా పనిచేస్తున్న పి.శంకరరావు బైక్ ఢీకొని గాయాల పాలయ్యారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో లక్ష్మీపేట గ్రామానికి డిజిట్ అసిస్టెంట్ శంకరారావు వెళ్తుండగా జంఝావతి డ్యాం దాటిన వెంటనే గుర్తు తెలియని వ్యక్తి సారా కేన్లు బైక్తో తీసుకు వెళ్తూ మద్యం మత్తులో డిజటల్ సహాయకడు శంకరరావును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఆయన హెల్మెట్ పెట్టుకున్నందున ముఖం, చేతికి చిన్నపాటి గాయాలయ్యయి. యువకుడి ఆత్మహత్యసాలూరు: పట్టణంలోని డబ్బివీధికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లారీ క్లీనర్గా పనిచేస్తున్న గంట దినేష్(29) మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో సోమవారం మద్యానికి డబ్బులు ఇవ్వమని తల్లిని అడగగా, ఇంట్లో డ బ్బులు లేవని తెలిపింది. దీంతో మనస్తాపానికి గురైన దినేష్ ఇంటిలో సీలింగ్ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. మృతుడి తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. -
ప్రతి వారం పురోగతి కనిపించాలి
ఆదర్శ గ్రామంగా ‘మనుమకొండ’ పార్వతీపురంటౌన్: భామిని మండలం మనుమకొండ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో సోమవారం వీడియోకాన్ఫరెన్స్లో మాట్లాడారు. వివిధ రంగాల్లో యంత్రాల వినియోగం పెంపుపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి రంగంలో కనీసం 15 శాతం సుస్థిర అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక, మత్స్య శాఖలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు, వంట గ్యాస్, గృహం, ఎన్టీఆర్ వైద్యసేవ కార్డు, తాగు నీరు, విద్యుత్, మరుగుదొడ్లు ఉండాలని, వాటి విని యోగం పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామంలో ఫోన్ సేవలు, బ్రాడ్బ్యాండ్ సేవలు, విద్యా సంస్థ, వైద్య సేవలు అందుబాటులో ఉండాలని ఆయన పేర్కొన్నారు. పసుపు, చింతపండు, అడ్డాకులు తదితర ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్తుల్లో ఆర్థిక అక్షరాస్యత పెంచాలన్నారు. కార్యక్రమంలో సీతంపేట ఐటీడీఏ పీఓ, పాలకొండ సబ్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా ప్రణాళిక అధికారి పి.వీరరాజు, బ్లాక్ కోఆర్డినేటర్ మహేశ్వరరావు పాల్గొన్నారు. పార్వతీపురంటౌన్: కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన ఉపాధి హామీ పథకం నిధులతో జిల్లాలో చేపట్టే క్యాస్కెడింగ్, చెక్ డ్యామ్లు, కోకోనట్ ప్లాంటేషన్ పనుల్లో ప్రతివారం పురోగతి కనిపించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నీటి పారుదలశాఖ ఈఈలు, డీఈఈలు, ఏఈఈలతో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. చెరువులు, చెక్డ్యామ్ల పనులను పంచాయతీ సర్పంచ్ల తీర్మానంతో వెంటనే ప్రారంభించాలన్నారు. ఏఈఈల వారీగా లక్ష్యాలు నిర్దేశించాలన్నారు. ఇకపై ప్రతి సోమవారం వీటిపై సమీక్షిస్తామన్నారు. ఇచ్చిన లక్ష్యాలు నాలుగు వారాల్లో పూర్తిచేసిన అధికారులకు ప్రత్యేక ప్రోత్సాహక బహుమతిని అందజేస్తామని తెలిపారు. ఎకరాకు 60 కొబ్బరి మొక్కల చొప్పున 5వేల ఎకరాల్లో కొబ్బరి తోటల పెంపకానికి ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. కార్యక్రమంలో డ్వామా పీడీ కె.రామచంద్రరావు, నీటిపారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ ఆర్.అప్పల నాయుడు, ఇతర ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
సీతం కళాశాలలో ‘ఇ–గేమ్’ పుస్తకావిష్కరణ
విజయనగరం అర్బన్: సీతం కళాశాలలో ‘ఈ–గేమ్ (ఎ డిఫరెంట్ అప్రోచ్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ ఫన్) అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. పెహల్గాం ఉగ్రదాడిలో మరణించిన పౌరులు, వీరమరణం పొందిన సైనికులకు తొలుత ఘనంగా నివాళులర్పించి వారి ఆత్మ శాంతి కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎంపీ, సత్య సంస్థల కరస్పాండెంట్ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ ఇ–గేమ్ (ఇంగ్లీష్ గ్రామర్ ఆక్సిస్ మేడ్ ఈజీ) పుస్తకం ద్వారా విద్యార్థులు సులభంగా, తర్కబద్ధంగా, సరదాగా ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోగలుగుతారన్నారు. ఇందులో స్వప్టిప్స్ అనే 7 ప్రధాన అంశాల (వాక్యాలు, క్రియలు, ఆర్టికల్స్, స్పీచ్ భాగాలు, కాలాలు, ప్రశ్నార్థకాలు–ఆదేశాలు, పొజిషన్ మార్కులు)తో పాటు అడ్వాన్స్డ్ గ్రామర్, ప్రశ్నా బ్యాంకులు, రిడిల్స్, పాల్ప్స్ వంటి వర్డ్ గేమ్లు, ఎక్సలునీమ్, వెర్సనీమ్, ఫ్యాక్టనీమ్, స్లింగ్, ఐథెర్, స్పెల్ స్ప్రెడ్స్ వంటి వినూత్న అంశాలు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ భాష అనివార్యమని, ఈ పుస్తకం ద్వారా అలవోకగా నేర్చుకోవచ్చని తెలిపారు. మేన్ ఆఫ్ విజ్డం సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ ఈ పుస్తకం విద్యార్థులలో ఇంగ్లీష్ భాషాపరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసి, ప్రపంచ స్థాయిలో పోటీతత్వం కలిగించగలదన్నారు. రచయిత ఆర్యూ నరసింహాన్ని ‘మేన్ ఆఫ్ విజ్డం’ అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ–జీవీ రిజిస్ట్రార్ డాక్టర్ జయసుమ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రచయిత ఆర్యూ నరసింహం పుస్తక విశేషాలను వివరించి, గ్రామర్ నేర్చే పద్ధతిని సరదాగా మార్చేందుకు ఈ పుస్తకం సహాయపడుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్. మజి శశిభూషణరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామమూర్తి, విశాఖ సాంస్కృతిక పత్రిక ఎడిటర్–పబ్లిషర్ శ్రీ సిరెలా సన్యాసిరావు, ఇతర కళాశాలల ఇంగ్లీష్ అధ్యాపకులు, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నీరుపేద రైతుల ఆందోళన
● సాగునీటి కష్టాలు తీర్చండంటూ వేడుకోలు ● ఇబ్బందులు పడుతున్న ఐదుగ్రామాల రైతులు ● సమస్య పరిష్కరించాలని కలెక్టరేట్ ఆవరణలో నిరసనపార్వతీపురంటౌన్: కొమరాడ మండలం కోటిపాం గ్రామ ప్రజలు వనకాబడి గెడ్డ ఆయకట్టు ద్వారా వచ్చే సాగు నీటి ద్వారా వ్యవసాయపనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. గెడ్డపై కొత్త చెక్ డ్యాం నిర్మాణం చేపట్టడంతో తమకు సాగునీరు అందడం లేదని అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురం కలెక్టరేట్ వద్ద గ్రామస్తులు నిరసన తెలియజేశారు. అనంతరం కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కోటిపాం గ్రామలో 500 కుటుంబాలున్నాయని వనకాబడి గెడ్డ ఆయకట్టు నుంచి వచ్చిన నీటి ద్వారా వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నామన్నారు. వనకాబడి గెడ్డ నుంచి వనకాబడి, బట్టిమాగవలస, చినఖేర్జల, లింగందొర వలస, బూర్జి వలస మీదుగా వచ్చి కోటిపాం కొత్తచెరువులో గెడ్డ నీరు కలుస్తుందని, చెరువు నిండిన తర్వాత ఈ చెరువు నుంచి సుమారు పది చెరువులు, బందలు నిండుతాయని, ఈ నీటి వనరుల మీదే తాము సాగుచేసుకుంటూ బతుకుతున్నామని తెలిపారు. వెయ్యి ఎకరాలకు ఈ సాగు నీరే ఆధారం వెయ్యి ఎకరాల సాగు ఈనీటి మీదే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నామన్నారు. వనకాబడి ఆయకట్టు నీరు ప్రధానంగా కోటిపాం గ్రామానికి వస్తుంది. కావున గత 28న వనకాబడి గెడ్డపై చెక్డ్యామ్ నిర్మించేందుకు పరిశీలించారని, దీనికి సంబంధించిన చెక్ డ్యాం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పాత నిర్మాణం అలాగే ఉంటే తమ గ్రామానికి రావాల్సిన ఆయకట్టు నీటికి ఇబ్బంది ఉండదన్నారు. కానీ కొత్తగా చెడ్డ్యామ్ నిర్మించడం వల్ల మా గ్రామానికి రావాల్సిన నీరు ఆగిపోతుంది. దీంతో చాలామంది రైతులు ఇబ్బందికి గురవుతారని తెలియజేస్తున్నారు. తమ గ్రామ రైతులకు వ్యవసాయానికి ఈ చెక్డ్యాం ద్వారా వచ్చే నీరు మాత్రమే ఆధారమని, పరిశీలించి ఎవరికీ ఇబ్బంది కలగకుండా చేసి తమకు సాగునీరు అందించాలని కోరుతున్నారు. కొత్త చెడ్డ్యామ్ నిర్మాణం వద్దు గ్రామంలో 500మంది కుటుంబాలకు సంబంధించిన సుమారు 1000 ఎకరాలకు వనకాబడి గెడ్డ ఆయకట్టు ద్వారా వచ్చే సాగు నీటి ద్వారా పంటలు పండుతున్నాయి. ప్రస్తుతం ఉన్న చెక్డ్యాం ప్రాంతంలో కొత్తగా మరో చెక్డ్యాం నిర్మాణం చేపట్టనున్నారు. దీనివల్ల రైతులకు తీవ్రనష్టం చేకూరుతుంది. అధికారులు ఈ విషయంపై పునరాలోచించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. – ఎజ్జు గుంపస్వామి, రైతు, కోటిపాంరైతులను ఆదుకోండి ఎన్నోఏళ్లుగా వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న రైతులను ఆధికారులు ఆదుకోవాలి. వనకాబడి ఆయకట్టు గెడ్డపై నిర్మించనున్న చెక్డ్యాం పనులను ప్రారంభించరాదు. సుమారు వెయ్యి ఎకరాలకు పైబడి సాగునీరు అందిస్తున్న గెడ్డపై ప్రస్తుతం ఉన్న చెక్డ్యాంను యథావిదిగా ఉంచి రైతులకు సాగునీటిని అందజేయాలి. – పాండ్రంకి రామకృష్ణ, రైతు, కోటిపాం500 కుటుంబాల జీవనాధారం పోతుంది నూతన చెక్డ్యాం నిర్మాణం వల్ల గ్రామంలో గల 500మంది కుటుంబాలకు జీవనాధారం పోతుంది. ఐదు గ్రామాలకు సాగునీటి కష్టాలు ఏర్పడతాయి. ప్రభుత్వం, అధికారులు పునరాలోచించి చెక్డ్యాం నిర్మాణం చేపట్టకుండా చూడాలి. ప్రస్తుతం ఉన్న చెక్డ్యాం ద్వారానే నీటిని సరఫరా చేయాలి. – పప్పల సోమేశ్వరరావు, రైతు, కోటిపాం -
ఫీల్డ్ అసిస్టెంట్పై ఎంపీడీఓకు ఫిర్యాదు
● పని కల్పించాలంటూ వేతనదారుల ధర్నాగంట్యాడ: జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనికి వెళ్లే వేతనదారులకు పనికల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఫీల్డ్ అసిస్టెంట్పై గ్రామసర్పంచ్, వేతనదారులు సోమవారం ఫిర్యాదు చేశారు. పెదవేమలి గ్రామంలో గత వారం 160 మంది వేతనదారులకు పనికల్పించకుండా ఫీల్డ్ అసిస్టెంట్ అలసత్వం వహించారని, ఈవారం కూడా 30 నుంచి 40 మందివరకు వేతనదారులకు పనిలేకుండాచేశారని పెదవేమలి గ్రామ సర్పంచ్ వర్రి పాపునాయుడు ఎంపీడీఓ ఆర్వీ రమణమూర్తికి ఫిర్యాదు చేశారు. దీనివల్ల వేతనదారులు నష్టపోతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పని కావాలని వేతనదారులు డిమాండ్ చేస్తున్నప్పటికీ వారికి పని కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సదరు ఫీల్డ్ అసిస్టెంట్పై తగిన చర్యలు తీసుకుని వేతనదారులకు పనికల్పించాలని కోరారు. పనికల్పించాలని ధర్నా అలాగే మండలంలోని నరవ గ్రామానికి చెందిన వేతనదారులు సోమవారం ఎంపీడీఓకార్యాలయం ఎదుట తమకు పని కల్పించాలని ధర్నా నిర్వహించారు. ఉపాధి సిబ్బంది తీరు వల్ల తాము ఉపాధి కోల్పోయామని వాపోయారు. ఫీల్డ్ అసిస్టెంట్గా చలామణి అవుతున్న మహిళపై ఫిర్యాదు నరవ గ్రామంలో డ్వామా శాఖ నుంచి ఎటువంటి అపాయింట్ మెంట్ ఆర్డర్ లేకుండా షాడో ఫీల్డ్ అసిస్టెంట్గా చలామణి అవుతున్న మహిళపై చర్యలు తీసుకోవాలని అదేగ్రామానికి చెందిన నరవ సన్యాసిరావు సోమవారం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై రెండు సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, పైగా సదరు మహిళకు ఉపాధి హామీ అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్ మాదిరి మస్తర్లు పరిశీలించడం, పనులు పురమాయించడం చేస్తున్నారని ఆరోపించారు. -
చలో కలెక్టరేట్ రేపు
● డీఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ విజయనగరం గంటస్తంభం: డీఎస్సీ అభ్యర్థులకు పరీక్ష సమయం 90 రోజులు గడువు ఇవ్వాలని, వయోపరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని కోరుతూ ఈ నెల 14న తలపెట్టిన చలో కలెక్టరేట్ను జయప్రదం చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమైఖ్య (డీవైఎఫ్ఐ) సభ్యులు పిలుపుని చ్చారు. కోట కూడలిలో సోమవారం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సీహెచ్.హరీష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగులు పోరాడి డీఎస్సీ నోటిఫికేషన్ సాధించుకున్నారన్నారు. ఓపెన్ డిగ్రీలో పాస్ అయిన వారికి, రెగ్యులర్ డిగ్రీ పాస్ అయిన వారికి సమాన అవకాశం కల్పించాలని కోరారు. జిల్లాకు ఒకే పేపర్తో పరీక్ష నిర్వహించాలన్నారు. 14న కోట కూడలి నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించే ర్యాలీలో డీఎస్సీ అఽభ్యర్థులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో భాను, ఈశ్వరరావు, శ్రీను, కిషోర్, రవి తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మరక్షణ విద్యలో ప్రావీణ్యం సాధించాలి
విజయనగరం: ఆత్మరక్షణ విద్య తైక్వాండోలో క్రీడాకారులు మరింత ప్రావీణ్యం సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని ఒలింపిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కె.పురుషోత్తం ఆకాంక్షించారు. ఈ మేరకు న్యూ ఆంధ్ర తైక్వాండో అసోసియేషన్ సారథ్యంలో జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు విజయనగరంలోని రాజీవ్ స్టేడియంలో తలపెట్టిన మూడవ నేషనల్ తైక్వాండో సెమినార్ సోమవారం ప్రారంభమైంది. ఈ సెమినార్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 120 మంది క్రీడాకారులు పాల్గొనగా..క్రీడాకారులకు ఇరాన్ దేశానికి చెందిన అబ్బాస్ షేక్ నూతన మెలకువలను నేర్పించారు. నాలుగు రోజుల పాటు జరిగే శిక్షణను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని పురుషోత్తం సూచించారు. అంతర్జాతీయ యవనికపై తలపడే క్రీడాకారులకు ఈ సెమినార్ దోహపడుతుందని పేర్కొన్నారు. సెమినార్లో నేర్చుకున్న అంశాలను నిరంతరం సాధన చేయడం ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం సెమినార్లో శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన అబ్బాస్ షేక్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి కె.శ్రీహరి, జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, కార్యదర్శి సీహెచ్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. -
అగచాట్లు
మంగళవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2025పింఛన్ కోసం.. ఈ చిత్రంలో కనిపిస్తున్న దివ్యాంగురాలి పేరు గంగమ్మ. మక్కువ మండలం డి.శిర్లాం గ్రామం. వయస్సు 65 సంవత్సరాలు. అనారోగ్యం కారణంగా నడవలేని పరిస్థితి. గతంలో అందే పింఛన్ కొన్నినెలలుగా ఆగిపోయింది. జీవనానికి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. కుటుంబ సభ్యుల తోడుతో కలెక్టరేట్కు వచ్చింది. పింఛన్ మంజూరు చేసి జీవన భరోసా కల్పించాలంటూ కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ను వేడుకుంది. ●పార్వతీపురంటౌన్: కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలవుతోంది. గతేడాది నవంబర్ నెల తర్వాత పింఛన్లు పొందుతూ భర్తలు కోల్పోయిన వితంతువులకు మినహా.. కొత్త పింఛన్ ఒక్కటీ మంజూరుకాని పరిస్థితి. వివిధ కారణాలతో పింఛన్ రద్దయినవారు, కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించేవారికి పింఛన్ ఎండమావిగానే కనిపిస్తోంది. పింఛన్ కోసం దివ్యాంగుల కష్టాలకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం కనిపించిన ఈ చిత్రాలే సజీవసాక్ష్యం. పింఛన్ కోసం అగచాట్లు పడుతూ పలువురు దివ్యాంగులు కలెక్టరేట్కు చేరుకున్నారు. కలెక్టర్ శ్యామ్ ప్రసాద్కు తమ గోడు వినిపించారు. పింఛన్ కోసం దరఖాస్తు చేసేందుకు వెబ్సైట్ ఓపెన్ కావడంలేదంటూ సమస్యను తెలియజేశారు. పింఛన్ మంజూరుచేసి ఆదుకోవాలని వేడుకున్నారు. ● 10 నెలలుగా మంజూరుకాని కొత్త పింఛన్లు ● పింఛన్లకోసం దివ్యాంగుల అవస్థలు ● కలెక్టరేట్కు వచ్చి కలెక్టర్కు విన్నపాలు న్యూస్రీల్ -
తలసరి ఆదాయం పెంపునకు చర్యలు
విజయనగరం క్రైమ్: విజన్–2047లో భాగంగా జిల్లా ప్రజల తలసరి ఆదాయం పెంపునకు చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా ఇన్చార్జి మంత్రి, హోమ్శాఖమంత్రి వంగలపూడి అనిత కోరారు. దీనికోసం అందుబాటులో ఉన్న సహజవనరులను వినియోగించుకోవాలన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన డీఆర్సీ సమావేశంలో ఆమె మాట్లాడారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి సూచనల మేరకు భూగర్భజలాల పెంపునకు చర్యలు తీసుకోవాలన్నారు. తమ నియోజకవర్గాల్లో రోడ్ల మరమ్మతు పనులు పూర్తికాలేదంటూ రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన మంత్రి దృష్టికి తెచ్చారు. బోర్ల మరమ్మతుల పనులు వేగంగా జరగడంలేదని ఎమ్మెల్సీ సురేష్బాబు తెలియజేశారు. కొత్తవలసలో చెరువులో అక్రమ రోడ్డు నిర్మాణం, రేగ, పుణ్యగిరి, ధారపర్తి తదితర గిరిజన ప్రాంతాలకు రోడ్డు నిర్మాణం ఆగిపోయిన విషయాన్ని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు సమావేశంలో ప్రస్తావించారు. ఉపాధి హామీ ఏపీఓ శ్రీనివాసరావుపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, అతనిని సరెండ్ చేయాలని మంత్రి ఆదేశించారు. సంకిలి చక్కెర కర్మాగారాన్ని మూసివేస్తారన్న ప్రచారం జరుగుతోందని, దీనిపై వివరణ ఇచ్చి రైతులకు భరోసా కల్పించాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కోరారు. విజయనగరంలో మూడవ పట్టణ పోలీస్స్టేషన్ను, డిగ్రీ కళాశాల నిర్మాణాన్ని ప్రారంభించాలని ఎమ్మెల్యే అదితి కోరారు. సివిల్ సప్లయ్ డీఎంగా పనిచేసి ఇటీవలే బదిలీపై వెళ్లిన మీనాకుమారిపై విజలెన్స్ విచారణకు ఆదేశించినట్టు మంత్రి ప్రకటించారు. సమావేశంలో కలెక్టర్ అంబేడ్కర్, మంత్రి కలిశెట్టి అప్పలనాయుడు, ఎస్పీ వకుల్ జిందల్, జేసీ సేతుమాధవన్, డీఆర్వో శ్రీనివాసమూర్తి, సీపీఓ బాలాజీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి అనిత సంకిలి చక్కెర కర్మాగారంపై స్పష్టత ఇవ్వండి: జెడ్పీచైర్మన్ -
అంతర్రాష్ట్ర సమన్వయంతో దాడులు
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో అక్రమ మద్యం తయారీ యూనిట్లపై అంతర్రాష్ట్ర సమన్వయంతో పెద్ద ఎత్తున దాడి నిర్వహించినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆఫీసర్ బి.శ్రీనాథుడు తెలిపారు. అక్రమ మద్యం తయారీకి వ్యతిరేకంగా నిరంతరం చర్యలు తీసుకుంటున్న ఎకై ్సజ్ శాఖ, ఒడిశా ఎకై ్సజ్ అధికారులతో కలిసి సోమవారం ఒడిశాలోని రాయగడ జిల్లా గుణుపూర్ బ్లాక్ కొత్తగూడ, కంగమానుగూడ, సరిహద్దు వెంబడి ఉన్న చీడివలస, కర్లి గ్రామాల అటవీ ప్రాంతాల్లోని అధిక సాంద్రత కలిగిన అక్రమ మద్యం తయారీ యూనిట్లపై పెద్ద ఎత్తున దాడి చేసినట్లు చెప్పారు. ఈ దాడిలో 23,000 లీటర్ల పులియబెట్టిన బెల్లం ఊటలను స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేసినట్లు చెప్పారు. అలాగే 440 లీటర్ల ఐడీ మద్యాన్ని పట్టుకుని ధ్వంసం చేశామన్నారు. దీనికి సబంధించి ఇద్దరిపై రెండు కేసులు నమోదు చేశామని, పలువురు అనుమానితులను కూడా దాడిలో గుర్తించామని ప్రస్తుతం తదుపరి విచారణ కొనసాగుతోందని వివరించారు. ఆంధ్రప్రదేశ్–ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ మద్యం తయారీ, స్మగ్లింగ్ను అరికట్టడానికి ఉద్దేశించిన విజయవంతమైన ఈ ఉమ్మడి ఆపరేషన్న్లో, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రెండు రాష్ట్రాల ఎకై ్సజ్ శాఖల సమన్వయంతో దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆఫీసర్ బి.శ్రీనాథుడు -
రామతీర్థంలో వైభవంగా పూర్ణాహుతి
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో శ్రీ వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవాలు సోమవారం వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా అర్చకస్వాములు చక్రతీర్థ స్నానం, పూర్ణాహుతి కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో పూర్ణాహుతి హోమం జరిపించారు. అనంతరం శ్రీ సుదర్శన స్వామి పెరుమాళ్లను రామపుష్కరిణి వద్దకు పల్లకిలో ఊరేగింపుగా తీసుకువెళ్లి మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ స్వామికి చక్రస్నానం చేయించారు. తరువాత గ్రామ బలిహరణ, బాలభోగం జరిపించి యాగశాలలో సుందరకాండ హవనం నిర్వహించారు. సాయంత్రం ధ్వజా రోహణం చేపట్టి వేణుగోపాలుడి కల్యాణ మహోత్సవాలకు ముగింపు పలికారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, కిరణ్, రామగోపాల్, భక్తులు పాల్గొన్నారు. -
చిత్తశుద్ధితో అర్జీలు పరిష్కరించండి
● కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ● పీజీఆర్ఎస్కు అందిన 92 వినతులుపార్వతీపురంటౌన్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో 92 మంది అర్జీదారుల నుంచి వినతులను కలెక్టర్ స్వీకరించగా, జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ,జిల్లా రెవెన్యూ అధికారి కె. హేమలత, ఎస్డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి భాగస్వామ్యమై వినతులను అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, కావున అర్జీలను చిత్త శుద్ధితో త్వరితగతిన పరిష్కారం చేఆయలని అధికారులను ఆదేశించారు. అర్జీలు కొన్ని ఇలా.. ● పాలకొండ నగర పంచాయతీలో పొరుగు సేవల కింద శానిటేషన్ వర్కర్గా పనిచేస్తూ ఏసీబీకి పట్టుబడగా హైకోర్టులో కేసు ఉంది. దానిపై తుది తీర్పు రాకముండే ఆ పోస్టును భర్తీ చేస్తున్నారని, కావున తీర్పు వచ్చేంతవరకు దాన్ని నిలుపుదల చేయాలని పాలకొండకు చెందిన కొనపల వీరభద్రపురం వినతి పత్రాన్ని అందజేశాడు. ● గుమ్మలక్ష్మీపురం మండలం పాముల గీసాడ జంక్షన్ నుంచి చిన్న రావికోన గ్రామం వరకు తారు రోడ్డు వేయాలని చిన్న రావికోన గ్రామానికి చెందిన తోయక జమ్మన్న విజ్ఞప్తి చేశాడు. ● బలిజిపేట మండలం పెద్దింపేట నుంచి ముదిలి జనార్దన్ అర్జీని ఇస్తూ తమ గ్రామంలో జరిగిన ఉపాధి పనులకు సంబంధించి సుమారు 200 మంది వేతనదారులకు జనవరి మూడవ వారం నుంచి నేటివరకు వేతనాలు చెల్లించలేదని, వాటిని మంజూరు చేయాలని కోరారు. ● పార్వతీపురం మండలం డి.ములగ నుంచి చౌదరి రాణి వినతి పత్రాన్ని అందజేస్తూ, తాము పెయింటింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తమకు ఆధార్, రేషన్ కార్డులు లేనందున వాటిని మంజూరుచేయాలని కోరారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు. చట్టపరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలి పార్వతీపురం రూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి సకాలంలో చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికాారులు చొరవ చూపాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే చట్టపరిధిలో నాణ్యమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు శాఖ కార్యాలయానికి జిల్లాలో ఉన్న పలు పోలీసు స్టేషన్ల పరిధిలలో నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి చూసి ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదుల్లో ముఖ్యంగా కుటుంబ కలహాలు, భర్త, అత్తారింటి వేదింపులు, భూ ఆస్తి వివాదాలు, సైబర్ మోసాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీల వసూళ్లు, ప్రేమ పేరుతో మోసాలపై ఎస్పీ 12 ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ గ్రీవెన్స్సెల్కు 22 వినతులు సీతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 22 వినతులు వచ్చాయి. విద్యుత్ట్రాన్స్ఫార్మర్ వేయించాలని భామిని మండలం సన్నాయిగూడ రైతులు కోరారు. వరదగోడ మంజూరు చేయాలని టిటుకుపాయిగూడకు చెందిన ఆరిక శ్యామల రావు, మల్లి గ్రామానికి చెందిన బూగన్న తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఏపీవో జి.చిన్నబాబు, ఈఈ రమాదేవి, పీహెచ్వో ఎస్వీ గణేష్, ఏటీడబ్ల్యూవో మంగవేణి, ఇన్చార్జ్ డిప్యూటీఈవో చంద్రరావు, ఏఎంవో కోటిబాబు, స్పోర్ట్స్ ఇన్చార్జ్ జాకాబ్ దయానంద్, ఏపీడీ సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. -
రైతులను నష్టపరిచే చర్యలను అరికట్టాలి
కంపెనీలు సిండికేట్గా మారి కోకో కిలో ధరను రూ.370 ధరకు దించేశా యి. ఈ చర్యలు రైతులను తీవ్రంగా నష్ట పరుస్తున్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని అరికట్టాలి. అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా రైతుల వద్ద ఉన్న కోకో గింజలను కొనుగోలు చేయాలి. రూ.900కు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. జిల్లాలో ప్రోసెసింగ్ యూనిట్లు ఏర్పాట్లు చేసి రైతులను ఆదుకోవాలి. – ఎస్.సత్యనారాయణ, సుంకి గ్రామం, గరుగుబిల్లి మండలం -
అనధికార మద్యం దుకాణాలపై దాడి
పూసపాటిరేగ: మండలంలోని చోడమ్మ అగ్రహారంలో అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న బెల్టుషాపులపై భోగాపురం ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ వి.రవికుమార్ ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ దాడుల్లో చోడమ్మ అగ్రహారానికి చెందిన వ్యక్తి పట్టుబడడంతో 10 మద్యం బాటిల్స్తో అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరూ అనధికారికంగా మద్యం దుకాణాలు (బెల్ట్ షాపులు) నిర్వహించరాదని, ప్రోత్సహించరాదని స్పష్టం చేశారు. ఈ దాడుల్లో ఎస్సై చంద్రమోహన్ హెచ్సీ రామారావు, కానిస్టేబుల్ మహేష్లు పాల్గొన్నారు.ఎండవేడికి కాలిపోయిన ట్రాక్టర్ ఇంజిన్శృంగవరపుకోట: మండలంలోని పోతనాపల్లి పంచాయతీ పరిధి ఎరుకులపేట హోలీ స్పిరిట్ పాఠశాల సమీపంలో గల ఇటుకల బట్టీ వద్ద ఉంచిన ట్రాక్టర్ ఇంజిన్లో ఎండవేడికి ఒక్కసారిగా మంటలు వచ్చి ఆదివారం కాలిపోయింది. దీనిపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పొట్నూరు శివ తన ట్రాక్టర్ను ఇటుకల బట్టీ వద్ద ఉదయం 11 గంటల ప్రాంతంలో ఉంచి పక్కనే సేదతీరాడు. అంతలోనే ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చి వెంటనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆ మంటలను ఆదుపు చేయడానికి స్థానికులు సాహసించినా నిలువరించ లేకపోయారు. దీంతో ఎస్.కోట అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అప్పటికే ట్రాక్టర్ పూర్తిగా కాలిపోయిందని శివ తెలిపాడు.బైక్ ఢీకొని వ్యక్తి మృతికొత్తవలస: కొత్తవలస–దేవరాపల్లి రోడ్డులో దేవాడ జంక్షన్ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో లక్కవరపుకోట మండలం కోనమసివానిపాలెం గ్రామానికి చెందిన గాడి తాత (63) మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గాడి తాత దేవాడ జంక్షన్ నుంచి నడుచుకుంటూ వస్తుండగా తుమ్మికాపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బైక్పై వేగంగా వచ్చి వెనుకనుంచి వచ్చి తాతాను ఢీకొట్టారు. దీంతో తీవ్ర గాయాలపాలైన తాతను స్థానికుల సహాయంతో 108 వాహనంలో విశాఖపట్నం తరలించే క్రమంలో పెందుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో చూపించగా అప్రటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా మృతుడుకి భార్య సన్యాసమ్మతో పాటూ ఒక కూతురు ఉంది. ఫిర్యాదు మేరకు కొత్తవలస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. .లారీ ఢీకొని యువకుడు..బొండపల్లి: మండలంలోని బోడసింగిపేట గ్రామ పెట్రోల్ బంకు సమీపంలో జాతీయ రహదారి26పై లారీ ఢీకొనగా ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందాడు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి ఎస్సై యు.మహేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సాలూరు నియోజకవర్గంలోని మక్కువ మండలం, మక్కువ గ్రామంలోని శ్రీదేవి కాలనీకి చెందిన యువకుడు తుమరాడ జానకీరాం (22) ద్విచక్రవాహనంపై విశాఖపట్నం నుంచి స్వగ్రామం ఆదివారం వస్తుండగా విజయనగరం నుంచి గజపతినగరం వైపు వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో జానకీ రాం అక్కడిక్కడే మృతిచెందాడు. మృతేదేహాన్ని పంచనామా నిమిత్తం విజయనగరంలోని సర్వజన కేంద్రాస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. -
ఇంటర్లో కొత్తపాఠాలు
● సీబీఎస్ఈ అమలుకు సిద్ధం ● అధ్యాపకులకు శిక్షణ పూర్తి ● విద్యార్థులకు అదనపు ప్రయోజనంవిజయనగరం అర్బన్: ఇంటర్మీడియట్ విద్యాబోధనలో నూతన సంస్కరణలను ప్రభుత్వం ఈ ఏడాది చేపడుతోంది. జూనియర్ కళాశాలల్లో సీబీఎస్ఈ అమలుకు ఇప్పటికే అడుగులు పడ్డాయి. కొత్తగా ఎంబైపీసీ కోర్సును అమలుచేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు అధ్యాపకులకు శిక్షణ సైతం ఇచ్చారు. మిగిలిన గ్రూపుల్లో ఎన్సీఈఆర్టీ సిలబస్ ప్రకారం పరీక్షల విధానం, మార్కుల కేటాయింపునకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని 18 ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫాకల్టీ అధ్యాపకులకు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూడు స్పెల్లలో ఇటీవల శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశారు. కోర్సుల నూతన విధానం ఒకే సబ్జెక్టుగా గణితం–ఎ, ఎ, వృక్ష శాస్త్రం, జంతుశాస్త్రం కలిపి బయాలజీగా రూపొందించారు. ఇందుకు తగ్గట్లు మార్కుల విభజన చేశారు. పార్ట్–1 సబ్జెక్టు కింద ఆంగ్లమే ఉంటుంది. పార్ట్–2 కింద జాతీయ భాషలతోపాటు మరికొన్ని సబ్జెక్టులు ఉంటాయి. విద్యార్థి అభీష్టం మేరకు దేనినైనా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. పార్ట్–3లో ఎంపీసీ, బైపీసీ సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ గ్రూపులుంటాయి. సెకెండ్ లాంగ్వేజీకి సంబంధించి తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూకు బదులు గణితం, ఎంపీసీలో చేరిన వారు తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూకు బదులుగా బయాలజీని తీసుకోవచ్చు. విద్యార్థులకు అదనపు ప్రయోజనం నూతన విధానంలో భాగంగా ఎంపీసీ తీసుకున్న విద్యార్థి అదనంగా బయాలజీ, బైపీసీ తీసుకున్నవారు గణితం తీసుకునే అవకాశం కల్పించారు. పార్ట్–1, 2, 3 సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులనే పరిగణిస్తారు. అదనంగా తీసుకున్న సబ్జెక్టుల మార్కులను ఇందులో కలపరు. కనీసం 35 మార్కులొస్తేనే ఉత్తీర్ణత సాధించినట్లు. ఉత్తీర్ణులు కాకపోయినా ధ్రువీకరణ పత్రం ఇస్దారు. అదనపు సబ్జెక్టులో ఉత్తీర్ణులైతే భవిష్యత్తులో మెడికల్, ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్ తదితర కోర్సులు అభ్యసించేందుకు అవకాశం ఉంటుంది. సదరు విద్యార్థి నీట్, ఏపీఈఏపీ సెట్కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కొత్త సిలబస్ ఆధారంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించి పరీక్షలకు ప్రశ్రపత్రాలు మారుతాయి. ఒక్క మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టనున్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సిలబస్లో గానీ, పరీక్ష ప్రశ్నపత్రంలో గానీ ఎటువంటి మార్పు ఉండదు.విద్యార్థులకు మంచి అవకాశం ఇంటర్లో ఎంబైపీసీ కోర్సులు విద్యార్థులకు విభిన్న రంగాలలో చదువుకోవడానికి మంచి అవకాశం. జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో పోటీపడే అవకాశాలు లభిస్తాయి. సీబీఎస్ఈ సిలబస్ పాఠ్యాంశాల మార్పులతో పాటు కొత్తకోర్సులు ఈ విద్యాసంవత్సరం నుంచి అమలులోకి వస్తున్నాయి. విద్యార్ధులు సద్వినియోగం చేసుకుంటే ఉన్నతవిద్యలో మరిన్ని అవకాశాలు సాధ్యం. శివ్వాల తవిటినాయుడు, జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి (డీఐఈఓ) -
భారత సైన్యానికి క్రీడాభివందనాలు
శృంగవరపుకోట: భారత్ మాతా కీ జై అంటూ నినాదాలతో ఆదివారం బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరం క్రీడాకారులు ర్యాలీ నిర్వహించారు. భారత దేశ ప్రజల ధన,మాన ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడుతున్న మన భారత ప్రభుత్వానికి, భారత సైన్యానికి మద్దతుగా కీడ్రాకారులు ర్యాలీ నిర్వహించారు. శిక్షణ శిబిరం కోచ్, ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టరు పొట్నూరు శ్రీరాములు ఆధ్వర్యంలో కేంబ్రిడ్జి స్కూల్ నుంచి దేవీ బొమ్మ, వన్వే ట్రాఫిక్ పెద్దవీధి, కాపువీధి మీదుగా భారత్ మాతాకి జై అంటూ ర్యాలీలో నినాదాలు చేశారు. -
దేవర మహోత్సవానికి సర్వం సిద్ధం
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు దేవర మహోత్సవ ఘట్టం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడి నుంచి చదురుగుడికి అమ్మవారిని తీసుకువచ్చే అద్భుతమైన అపురూప ఘట్టానికి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి వనంగుడిలో స్తపన మందిరంలో అమ్మ ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు. వేదపండితుల వేదమంత్రోచ్చారణలతో పూజారి బంటుపల్లి వెంకటరావు, భక్తుల చేతుల మీదుగా అమ్మవారిని అప్పటికే ఆలయం బయట పుష్పాలతో సిద్ధం చేసిన ఉత్సవరథంపై ఆశీనులను చేస్తారు. జయజయ ధ్వానాల మధ్య బాజాభజంత్రీలు, విచిత్ర వేషధారణలు, కోలాటం బృందాలు, డముకు వాయిద్యాలతో రైల్వేస్టేషన్ నుంచి గాడీకానా, సీఎంఆర్ జంక్షన్, వైఎస్సార్ సర్కిల్, ఎన్సీఎస్ రోడ్, కన్యకపరమేశ్వరి ఆలయం, గంటస్తంభం, శివాలయం వీధి మీదుగా హుకుంపేటలో ఉన్న పూజారి ఇంటికి తీసుకువెళ్తారు. అక్కడ రాత్రి 10 గంటల సమయంలో ఘటాలతో అమ్మవారికి నివేదన చేస్తారు. అమ్మవారికి మనవి చెప్పిన అనంతరం కోటలో కొలువైన కోటశక్తికి పూజలు చేస్తారు. వేకువజామున 3 గంటల ప్రాంతంలో అమ్మవారు సాక్షాత్కరించిన పెద్దచెరువు పశ్చిమభాగానికి ఘటాలతో చేరుకుని మనవి చెప్పి పసుపు, కుంకుమలతో పూజలు చేసి, ఘటాల్లో పసుపు, కుంకుమలతో పాటు పూజ చేసిన అక్షింతలను తీసుకుని మంగళవారం వేకువజామున 5 గంటలకు చదురుగుడికి చేరుకుంటారు. ఇన్చార్జ్ ఈఓ ఆధ్వర్యంలో ఏర్పాట్లు అనంతరం ఆలయంలో అమ్మవారికి డప్పువాయిద్యాలు, సన్నాయి మేళంతో పూజలు చేసి, ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తరువాత 6 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఈ అపురూప ఘట్టాలను తనివితీరా చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ నేత్రత్వంలో అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతర చివరి ఘట్టమైన ఉయ్యాల కంబాల మహోత్సవం తర్వాత రోజున బుధవారం మళ్లీ అమ్మవారు చదురుగుడి నుంచి వనంగుడికి చేరుకుంటారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించి, తరించాలని ఆలయ ఈఓ ప్రసాద్ కోరారు. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి ఊరేగింపు మంగళవారం నుంచి చదురుగుడిలో అమ్మవారి దర్శనం -
పోలీసుల తీరు అభ్యంతరకరం
● అధికారం శాశ్వతం కాదు.. ● మాజీ మహిళా మంత్రి రజని పట్ల ఇలానే వ్యవహరిస్తారా..! ● రెడ్ బుక్ రాజ్యాంగంలో పోలీసులు నిబంధనలు అతిక్రమిస్తున్నారు.. ● భవిష్యత్లో చట్టం ముందు దోషులుగా నిలబడక తప్పదు ● మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర సాలూరు: అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఎప్పుడూ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండిపోదనే వాస్తవాన్ని గుర్తుంచుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. మాజీ మహిళా మంత్రి విడదల రజని పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత ఆక్షేపనీయంగా ఉందని తీవ్రంగా ఖండించారు. పట్టణంలోని తన స్వగృహంలో స్థానిక విలేకరులతో ఆయన ఆదివారం మాట్లాడారు. ఓ మహిళ, మాజీ మంత్రి అయిన విడదల రజని పట్ల పోలీసులు అత్యంత అభ్యంతరకరంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్న కూటమి ప్రభుత్వ పాలనలో కొందరు పోలీసులు తీరు చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు. పోలీసులు తమ నిబంధనలను అతిక్రమిస్తున్నారని హైకోర్టు కూడా ఆగ్రహించిన సంఘటనలు రాష్ట్రంలో నేటి పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. ఎన్టీ రామారావు వంటి వ్యక్తే అధికారాన్ని కోల్పోయారని గుర్తు చేశారు. పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒకప్పుడు ఓడిపోయిన పవన్కల్యాణ్ నేడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని పేర్కొన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తించాలని సూచించారు. భవిష్యత్లో కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందనే భ్రమలో కొందరు పోలీసులు నిబంధనలను అతిక్రమిస్తున్నారని మండిపడ్డారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా.. ఉప ముఖ్యమంత్రిగా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా తాను పని చేసిన కాలంలో ఏనాడూ నిబంధనలకు విరుద్ధంగా వెళ్లమని పోలీసులకు చెప్పలేదని గుర్తు చేశారు. నేటి రెడ్ బుక్ రాజ్యాంగంలో నిబంధనలు అతిక్రమిస్తున్న అధికారులు, పోలీసులు భవిష్యత్లో చట్టం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని చెప్పారు. సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. -
హృదయాలను తాకిన నాటికలు
చీపురుపల్లి రూరల్(గరివిడి): ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీల్లో భాగంగా గరివిడిలోని శ్రీరామ్ హైస్కూల్ ఆవరణంలో గరివిడి కల్చరల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో జరిగిన నాటికల పోటీలు ఆదివారం ముగిశాయి. ముగింపు రోజున ప్రదర్శించిన కొత్త పరిమళం, చీకటిపువ్వు, దేవరాగం నాటికలు చక్కటి కథా సారాంశాన్ని అందించి ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్నాయి. బొరివంకకు చెందిన శర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవాసంఘం ఆధ్వర్యంలో ప్రదర్శించిన కొత్త పరిమళం నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. జాతి,మత,కుల,ప్రాంతాల పేరుతో విధ్వంసాలు రేగుతున్న భూమండలంలో ప్రేమ, అభిమానం, అనురాగం అనువణువునా నింపుకుని మనిషిని మనిషి ప్రేమిస్తే ఈ భూమండలం శాంతివనంగా మారుతుందన్న కథా సందేశంతో కొత్త పరిమళం నాటిక ముగుస్తుంది. అదే విధంగా కరీంనగర్కు చెందిన చైతన్య కళాబారతి ఆధ్వర్యంలో ప్రదర్శించిన చీకటిపువ్వు నాటిక సమాజంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురైన విలువైన సారాంశాన్ని అందించింది. పరిస్థితులకు ఏ మనిషి అతీతం కాదని, అవసరం ఏర్పడో, అవకాశం లేకనో ప్రతి ఒక్కరూ జీవితంలో తప్పులు చేయడం సహజం. చేసిన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపం చెందిన వారిని దూరం పెట్టొద్దని, క్షమించడంలోనే నిజమైన ప్రేమ ఉందని, ప్రాణం పోయిన తరువాత బాధపడే కంటే ఉన్నప్పుడే బాధ్యతగా వ్యవహరించాలంటూ తెలియజెప్పే కథాంశంతో చీకటిపువ్వు నాటిక ముగుస్తుంది. అదేవిధంగా విశాఖపట్నానికి చెందిన సౌజన్య కళాస్రవంతి ఆధ్వర్యంలో ప్రదర్శించిన దేవరాగం నాటిక బలమైన బందాన్ని తెలియజెబుతుంది. రక్త సంబంధాలు, పేగు బంధాలు, అనుబంధాల కంటే మనిషి సహజ లక్షణాలు అనేవి వాటన్నింటినీ మించిన బందం పేగుబంధం. ఈ బంధం విచ్ఛిన్నమైతే తల్లిదండ్రులకు వృద్ధాప్యం శాపమవుతుందని, ఈ బంధం బలంగా ఉంటే వృద్ధాప్యమే ఆ తల్లిదండ్రులకు మధురమైన మలి దశలోని బాల్యం అవుతుందని తెలియజెప్పే కథా సారాంశంతో దేవరాగం నాటిక సమాప్తమైంది. -
వారానికి రూ.వంద కొట్టు..
సోమవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2025● ఎన్ఆర్ఈజీఎస్లో అవినీతి మేత ● వేతనదారుల నుంచి అక్రమ వసూళ్లు ● డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నట్టు? జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు 108లో ప్రసవం సీతంపేట: మండలంలోని లాడ జలుబుగూడ గ్రామానికి చెందిన సవర గయ్యారమ్మ 108లో శనివారం రాత్రి ప్రసవించింది. పురిటినొప్పు లు రావడంతో కుటుంబ సభ్యులు 108కి ఫోన్ చేశారు. ఈఎంటీ రాములు, పైలెట్ అనంతరా వు గ్రామానికి చేరుకుని స్థానిక ఏరియా ఆసుపత్రికి తీసుకువస్తుండగా మార్గమద్యలో పురిటినొప్పులు ఎక్కువ కావడంతో ప్రసవం చేశారు. పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. వారికి ఫ్లూయిడ్స్ ఎక్కించి తదుపరి వైద్య సాయం కోసం సీతంపేట ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. 108 సిబ్బందిని గ్రామస్తులు అభినందించారు. పెండింగ్ నీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి పార్వతీపురం టౌన్: జిల్లాలో పెండింగ్ నీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి డిమాండ్ చేశా రు. స్థానిక ఎన్జీవో హోంలో రైతు సంఘం ఆధ్వర్యంలో పెండింగ్ నీటి ప్రాజెక్టులపై ఆదివారం జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నీటి ప్రాజెక్టులపై రైతుల ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తి చూపారు. ఈ ఏడాది బడ్జెట్లో కూడా జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణంలో ఉన్న జంఝావతి, అడారుగెడ్డ, కారిగెడ్డ, వనకబడి, పెద్దగెడ్డ ప్రాజెక్టులకు నిధులు నిల్గానే ఉన్నాయని దుయ్యబట్టారు. తోటపల్లి ప్రాజెక్టు పూర్తికి అధికారులు రూ.590 కోట్లు ప్రతిపాదించగా ఉద్యోగుల భత్యం కోసం రూ.47 కోట్లు విడుదల చేసిందని ఇది చాలా అన్యాయమని దుయ్యబ ట్టారు. జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని పోరాడి తిప్పికొట్టాలని అందుకు తోటపల్లి, పెద్దగెడ్డ నిర్వాసితుల, రైతుల పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అందులో భాగమే ముందుగా రైతులు సంతకాలు చేసి గ్రామ సచివాలయాల వద్ద మే 21 నుంచి 24 వరకు నిరసనలు తెలియజేసి వినతులు అందిస్తామని, అనంతరం ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. సదస్సులో రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి లక్ష్మీనాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు బంటు దాసు, కరణం రవీంద్ర, రైతులు పాల్గొన్నారు. నేడు ఉత్త్తరాంధ్ర సాధన సమితి సదస్సు బొబ్బిలి: పట్టణంలోని ఎన్జీవో హోంలో సోమవారం ఉదయం 10 గంటలకు ఉత్తరాంధ్ర సాధన సమితి ఆధ్వర్యంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, రైతులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులతో సదస్సు నిర్వహిస్తున్నట్టు ఆ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు వేమిరెడ్డి లక్ష్మునాయుడు తెలిపారు. ఆదివారం సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాక్షి, పార్వతీపురం మన్యం : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. వేతనదారులకే కాదు, ఆ శాఖలోని అధికారులకు, సిబ్బందికీ ఉపాధి చూపుతోంది. గ్రామీణ ప్రాంత పేదలకు పని కల్పించి, వలసలను నివారించాలన్న ఉద్దేశంతో ఈ పథకం అమలు చేస్తే.. చట్టంలో లొసుగులు అధికారుల జేబులు నింపుతున్నాయి. జిల్లాలో 1.92 లక్షల మేర జాబ్కార్డులుంటే.. 1.68 లక్షల మంది వరకు ఉపాధిహామీ పనుల్లో పాల్గొంటున్నారు. 46 వేల కుటుంబాలకు పైగా ఈ ఏడాది వంద రోజుల పనిదినాలు పూర్తి చేశాయి. ఉపాధి హామీ ద్వారా భూమి అభివృద్ధి, నీటి కుండీలు, ఫాం పాండ్లు, చెరువులు, పంట కాలువలు, కందకాలు తదితర పనులు చేపడుతున్నారు. వేతనదారులకు సగటున రోజువారీ వేతనం జిల్లాలో రూ.260 వరకు వస్తోంది. పథకం అమలు, జరుగుతున్న పనులు, వేతనదారులకు ఉపాధి చూపించడంలో జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అవార్డును కూడా అందజేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. అవినీతిలోనూ జిల్లా యంత్రాంగానికి అవార్డు ఇవ్వాల్సిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వేతనదారులకే కాదు.. ఆ శాఖలోని సిబ్బంది, అధికారులకూ రూ.లక్షల్లో ఆదాయాన్ని పథకం చేకూరుస్తోంది. టార్గెట్.. నెలకు రూ.4 కోట్లు! సాధారణంగా ఉపాధి పనుల కల్పనలో లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. ఉపాధి పథకం సిబ్బంది వసూళ్లలోనూ టార్గెట్ పెట్టుకున్నారు. ఒక్కో వేతనదారు నుంచి వారానికి రూ.వంద చొప్పున ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. వేతన చెల్లింపుల బకాయిలతో సంబంధం లేకుండా పనికి వచ్చిన వారు ఎవరైనా సరే.. వారానికి రూ.వంద చొప్పున చెల్లించాల్సిందేనని వేతనదారులే చెబుతున్నారు. వీరి నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లు వసూలు చేస్తే.. ఆ మొత్తం అలా టెక్నికల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, ఏపీవో, పీడీ వరకూ చేరుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి గత జనవరి నుంచి వేతనదారులకు సక్రమంగా చెల్లింపులు చేయడం లేదు. రూ.కోట్లలో బకాయిలు ఉండిపోయాయి. చెల్లింపులతో సంబంధం లేకుండా.. వేతనదారుల నుంచి అక్రమంగా వారానికి రూ.100 చొప్పున మాత్రం వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. ఒక జట్టులో 20 నుంచి 40 మంది వరకు వేతనదారులు ఉంటున్నారు. ఒక పంచాయతీలో వారానికి 800 మందికి పని కల్పిస్తే.. వారి నుంచి వసూలైన మొత్తమే రూ.80 వేలు. మండలానికి 30 పంచాయతీలుంటే.. కేవలం నాలుగైదు పంచాయతీల్లోనే వసూళ్లు కాస్త అటూఇటుగా ఉంటున్నాయని తెలుస్తోంది. ఇలా జిల్లా వ్యాప్తంగా సగటున వారానికి లక్ష మందికి ఉపాధి పనులు చూపుతున్నారని అనుకున్నా.. ఒక్కొక్కరి నుంచి వసూలు చేసిన ఆ మొత్తం రూ.కోటి వరకు అవుతోంది. ఈ విధంగా జిల్లాలో దాదాపు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకూ వేతనదారుల నుంచి అక్రమంగా వసూలవుతోంది. ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయ్.. ఇదే విషయమై వేతనదారులను ప్రశ్నిస్తే.. ‘ఆ పేర్లన్నీ ఎందుకులే బాబూ.. మీరొచ్చారని తెలిస్తేనే మమ్మల్ని వేధిస్తారు. ఇంక మా పేర్లు, ఫొటోలు పేపర్లో వేస్తే మరుసటి రోజు నుంచి మాకు పనులివ్వరు. ఉన్న పనిని పోగొట్టుకోవాలి. వారడిగిన రూ.వంద ఇచ్చుకుంటూ వెళ్లిపోతున్నాం.’ అని పేరు చెప్పేందుకు భయపడిన ఓ వేతనదారు వాపోయారు. జిల్లాలోని కొంత మంది ఫీల్డ్ అసిస్టెంట్ల వద్ద ఆరా తీస్తే.. ‘తిలాపాపం.. తలా పిడికెడు అన్న చందాన కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకూ ఆ మొత్తం వెళ్తుందంటూ..’ బదులిచ్చారు. సోషల్ ఆడిట్లో ఏమైనా జరిగితే ఆ ఖర్చులన్నీ ఫీల్డ్ అసిస్టెంట్నే భరించుకోవాల్సి వస్తోందని, లబ్ధి పొందిన అధికారులెవరూ ఇవ్వరని వాపోయారు. పనుల కల్పనే.. వారికి ‘ఉపాధి’ 60 శాతం వరకు వేతనదారులకు పనులు చూపిస్తేనే.. 40 శాతం మెటీరియల్ కాంపొనెంట్ నిధులు విడుదలవుతాయి. ఆ మొత్తం ఒక్క జిల్లాలోనే రూ.కోట్లలో ఉంటుంది. ఆ నిధుల కోసం అధిక శాతం మందికి పనులు చూపిస్తున్నట్టు అధికారులు లెక్కలు రాసేసుకుంటున్నారు. గ్రామాల్లో లేని వారి పేర్లు సైతం రాసేసి, ఆ సొమ్మునూ స్వాహా చేస్తున్నారు. దొంగ మస్తర్లు కూడా ఉంటున్నాయి. మరోవైపు వేతనదారులకు ఎండ నుంచి రక్షణ కోసం పని చేసే చోట టెంట్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లు ఉంచాలి. ఆ సౌకర్యాలేవీ ఉండటం లేదు. ఎండలోనే వేతనదారులు పనులు చేసుకుంటున్నారు. కాస్త నీరసంగా అనిపిస్తే సమీపంలోని చెట్ల వద్దకు నీడ కోసం పరుగులు తీస్తున్నారు. చెరువుల్లో నీరే తాగుతూ దాహార్తి తీర్చుకుంటున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో వేసవిలో పని చేసే చోట టెంట్లు సరఫరా చేసేది. కూలీలకు మజ్జిగ అందుబాటులో ఉంచేది. దీంతో పాటు వేతనదారులు సామగ్రి తెచ్చుకుంటే.. తట్టకు రూ.5, గునపాంనకు రూ.5, పారకు రూ.3, మజ్జిగకు రూ.5 చొప్పున ప్రతి రోజూ లెక్కకట్టి ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ సౌకర్యాలేవీ లేవు. ప్రభుత్వం నుంచి ఆ డబ్బులొస్తున్నాయో, లేదో.. ఆ నిధులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో అధికారులకే తెలియాలి. ప్రభుత్వ నిర్ణయం సరికాదు ● ఎస్జీటీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రరావు గజపతినగరం : రాష్ట్రంలో మోడల్ ప్రైమరీ స్కూళ్ల ప్రధానోపాధ్యాయులుగా స్కూల్ అసిస్టెంట్ల నియామకం సరికాదని, ఈ పద్ధతిని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనకల చంద్రరావు అన్నారు. మండల కేంద్రంలో ఆయన విలేకరులతో ఆదివారం మాట్లాడారు. జీవో నంబరు 117 ద్వారా అనేక మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పదోన్నతులు కల్పించిందని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రమోషన్లు పొందిన వారిని వెనక్కి తీసుకువచ్చి మోడల్ ప్రైమరీ స్కూళ్ల హెడ్ మాస్టర్లుగా నియమించడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. ఇప్పటికే కనీసం ప్రమోషన్లు రాక ఎస్జీటీలు ఎంతో వేదన చెందుతున్నారని, ఈ వేదనను ప్రభుత్వం మరింత పెద్దది చేసిందన్నారు. అసలు డీఎస్సీలో బీఎడ్ అనేది ప్రైమరీ ఉపాధ్యాయుడికి అర్హత కాదన్నప్పుడు స్కూల్ అసిస్టెంట్ ప్రైమరీ పాఠశాలలో పని చేయడానికి అర్హత ఎలా ఉంటుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం తన పద్ధతిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.పార్వతీపురం రూరల్ : జిల్లా వ్యాప్తంగా ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా బాంబు డిస్పోజబుల్ టీం, డాగ్ స్వ్కాడ్తో కలిసి సంయుక్తంగా పోలీసులు తనిఖీలు చేసినట్టు ఎస్పీ మాధవ్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం పోలీసు అధికారులు వారి స్టేషన్ల పరిధిలోని ముఖ్య కూడళ్లు, రైల్వేస్టేషన్, బస్స్టేషన్, లాడ్జీలలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ ఉత్తర్వుల మేరకు ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్టు ఎస్పీ స్పష్టం చేశారు. న్యూస్రీల్ -
నీలి కిరణాలతో అంధత్వం
నేత్ర తనిఖీలు నిర్వహిస్తున్న దృశ్యంచికిత్స, నివారణ..కళ్లకు తేమను కలిగించేలా కృత్రిమంగా కన్నీళ్లు తరచుగా వాడడం ● కళ్ల రెప్పలను తరచుగా మూయడం ● దృష్టిలోపాలకు వాడే అద్దాలు బ్లూఫిల్టర్ ఉండేలా చూడడం ● స్క్రీన్ టైం తగ్గించుకోవడం ● 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను 20 సెకెన్లపాటు వీక్షించడం. ● కంప్యూటర్, సెల్ఫోన్ స్క్రీన్ బ్రైట్నెస్, కాంట్రాస్ట్ను సర్దుబాటు చేసుకోవడం ● కంప్యూటర్, సెల్ఫోన్లో అక్షరాలను పెద్దవిగా చేసుకోవడం. ● సంవత్సరానికి ఒకటి, రెండు సార్లు డ్రై ఐ గురించి కంటి వైద్యులను సంప్రదించడం● సెల్ఫోన్, కంప్యూటర్ అతిగా వాడకంతో ఇబ్బందులు ● చిన్న వయసులోనే దృష్టిలోపాలు ● పెరుగుతున్న దూరదృష్టి సమస్యలు ● కంటివైద్యుల వద్దకు క్యూకడుతున్న బాధితులు కంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు.. ● ప్రతి అరగంటకు ఒకసారి మొబైల్, కంప్యూటర్, లాప్టాప్ నుంచి రెండు మూడు నిమిషాలైనా దృష్టిని మరల్చాలి. ● కంటికి స్క్రీన్ను 25 నుంచి 40 అంగుళాల దూరం ఉంచాలి. ● యాంటీగ్లేర్, యాంటీ రిఫ్లెక్టివ్ అద్దాలను వాడితే కంటికి రక్షణగా ఉంటుంది. ఇవి అధిక కాంతిని కళ్లపై పడకుండా అడ్డుకుంటాయి. ● కళ్ల మంటలు, నీరు కారడం వంటి సమస్యలుంటే కాసేపు మానిటర్లు చూడడం ఆపేయాలి. ● తరచూ చల్లని నీటితో కళ్లను కడుక్కోవాలి. రాత్రి నిద్రించే సమయంలో కళ్లపై కాసేపు తడి వస్త్రాన్ని కప్పి ఉంచాలి. ● కంటికి కసరత్తులు సైతం అవసరం. ఇందుకోసం కళ్లను కుడిఎడమలకు నిమిషంపాటు తిప్పాలి. రెండు అరచేతులు రుద్దకుని వేడెక్కిన తరువాత కళ్లపై కాసేపు ఉంచి కసరత్తు చేయాలి. -
కళలకు ఆదర్శం నాటికలు
● ఆహ్వాన నాటిక పోటీల్లో సినీనటి జయలలిత, నరసింహారాజు ● పాల్గొన్న పలువురు సినీ ఆర్టిస్టులు చీపురుపల్లి రూరల్(గరివిడి): నాటికలు కళలకు ఆదర్శమని సినీ నటి జయలలిత అన్నారు. గరివిడిలోని శ్రీరాం హైస్కూల్ ఆవరణలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సినిమాలు కంటే నాటికల్లో నటించేవారు గొప్ప కళాకారులు అని అభివర్ణించారు. సినిమాల్లో కటింగులు, టేక్ ఆఫ్లు ఉంటాయని, నాటికల్లో ప్రదర్శనంతా ఒకే వేదికపై ఇవ్వాల్సి ఉంటుందని, నాటికల్లో నటించే వారే అసలైన కళాకారులని అన్నారు. కళలు బతికుండాలంటే నాటికలను ప్రోత్సహించాలన్నారు. ఉభయ రాష్ట్రాల స్థాయిలో జరుగుతున్న ఈ ఆహ్వాన నాటిక పోటీలకు తనను ఆహ్వానించినందుకుగాను కృతజ్ఞతలు తెలిపారు. సినీ నటుడు నరసింహారాజు మాట్లాడుతూ ఇలాంటి మంచి నాటిక రంగాన్ని ప్రోత్సహించాలని, ప్రతీ ఏడాది గరివిడిలో ఇలాంటి సాంస్కృతిక నాటిక కార్యక్రమాలు అలరించాలన్నారు. గరివిడి ప్రాంతానికి ఈ కార్యక్రమాలు మంచి గుర్తింపును తీసుకువస్తాయన్నారు. గరివిడి కల్చరల్ అసోషియేషన్ ప్రతినిధులు వాకాడ గోపి, రవిరాజ్, బమ్మిడి కార్తీక్, కంబాల శివ, వాకాడ శ్రీనివాసరావు, ఉప్పు శ్రీను తదితరుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆహ్వాన నాటిక పోటీల కార్యక్రమంలో చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులుతో పాటుగా అతిథులుగా జాలాది విజయ, బలివాడ రమేష్, సినీ ఆర్టిస్ట్ రవితేజ, అరుణ తదితరులు హాజరయ్యారు. సందేశాత్మక నాటికలుచీపురుపల్లి రూరల్(గరివిడి): ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీల్లో భాగంగా గరివిడి శ్రీరాం హైస్కూల్ ఆవరణంలో గరివిడి కల్చరల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో రెండో రోజు శనివారం ప్రదర్శించిన నాటికలు సందేశాత్మక వివరణతో ఎంతగానో ఆకట్టుకున్నాయి. గుంటూరుకు చెందిన అమరావతి ఆర్ట్స్ వారు ప్రదర్శించిన చిగురు మేఘం నాటిక ప్రేక్షకులను కట్టిపడేసింది. ఉన్నత చదువులైన మెడిసిన్ పూర్తి చేసి డాక్టర్లుగా ఎదిగి పట్టణాల్లో సూపర్స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ధనార్జన ధ్యేయం కాకుండా గ్రామాల్లో ప్రజలకు వైద్యసేవలు అందించి ప్రజలను కాపాడటమే వైద్యుడి ప్రధాన కర్తవ్యం అన్న సారాంశంతో చిగురు మేఘం నాటిక ముగుస్తుంది. హైదరాబాద్ కళాంజలి ఆధ్వర్యంలో ప్రదర్శించిన రైతేరాజు నాటిక మంచి సారాంశాన్ని అందించింది. గుండెసూది నుంచి విమానం వరుకు ఏ వస్తువు తయారీ చేసిన వస్తువు రేటు నిర్ణయిస్తున్నారు. రైతే రాజు, దేశానికి వెన్నెముకగా ఉన్న రైతు పండించిన పంటకు రేటు నిర్ణయించుకునే హక్కు లేదు. రైతుకు గుండె మండి వ్యవసాయానికి సెలవు ప్రకటిస్తే ఏమి తిని బ్రతుకుతారు, రైతుల గోడు పట్టించుకోమని చెప్పే సారాంశంతో నాటిక సమాప్తం అవుతుంది. అదే విధంగా పాలకొల్లుకు చెందిన నటీనట సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో ప్రదర్శించిన అనూహ్యం నాటిక ఆకట్టుకుంది. కొడుకులు వారసత్వ సంపదను అనుభవించటం కోసం ఎదురు చూడకుండా స్వయంకృషితో జీవించాలనే సందేశశంతో అనూహ్యం నాటిక ముగుస్తుంది. -
ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్
● తొమ్మిది బైక్ల స్వాధీనం ● నెల్లిమర్లలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాసరావునెల్లిమర్ల రూరల్: వాళ్ల కన్నుపడితే చాలు ఏ బండైనా క్షణాల్లో మాయమవ్వాల్సిందే. బైకు చోరీలకు పాల్పడడం.. మీ సేవ సహకారంతో ఆన్లైన్లో లేని నంబర్లను వెతికి నంబరు ప్లేట్లను మార్చడం.. వీళ్లకి వెన్నతో పెట్టిన విద్య. అలా నంబరు ప్లేట్లను మార్పు చేసి అతి తెలివిగా బంధువులకు, స్నేహితులకు తక్కువ సొమ్ముకే తనఖాకు పెట్టి జల్సాలు చేయడం వాళ్లకి నిత్యకృత్యం. జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు విజయవాడ, కశింకోట ప్రాంతాల్లో కూడా ఇదే తరహాలో బైక్ చోరీలకు పాల్పడ్డారు. అనుమానం రాకుండా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును నెల్లిమర్ల పోలీసులు ఎట్టకేలకు రట్టు చేశారు. చోరీలకు పాల్పడుతున్న నెల్లిమర్ల మండలం పెద్ద బూరాడపేట, చిన్న బూరాడపేట గ్రామాలకు చెందిన ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి తొమ్మిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లిమర్ల ఎస్ఐ గణేష్ తన సిబ్బందితో కలిసి బూరాడపేట జంక్షన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అదే సమయంలో పెద, చిన బూరాడపేట గ్రామాలకు చెందిన బెల్లాన చంద్రశేఖర్, దన్నాన సూరిబాబు ద్విచక్ర వాహనంపై వస్తూ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిపై అనుమానంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తొలుత రెండు బైకులను చోరీ చేసినట్లు అంగీకరించారు. ఇటీవల ద్విచక్ర వాహనాలు మాయమవుతున్నట్టు ఎక్కువగా ఫిర్యాదులు రావడంతో తమదైన శైలిలో పోలీసులు విచారణ చేయగా నెల్లిమర్ల మండల పరిధిలో 2, గజపతినగరం పరిధిలో 1, విజయవాడ సిటీ పరిధిలో 4, గుర్ల పరిధిలో 1, కశింకోట పరిధిలో ఒకటి చొప్పన మొత్తం 9 బైకులను చోరీ చేసినట్లు అంగీకరించారు. వారి నుంచి తొమ్మిది ద్విచక్ర వాహనాలను రికవరీ చేసి ఇద్దరి నిందితులను రిమాండ్కు తరలించినట్టు డీఎస్పీ తెలిపారు. ఆయా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను పరిశీలించి నిబంధనల ప్రకారం బాధితులకు వాహనాలు అప్పగిస్తామన్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన సిబ్బందిని ఆయన అభినందించారు. సీఐ జి.రామకృష్ణ పాల్గొన్నారు. -
20న దేశ వ్యాప్త సమ్మె
● కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్ల ఐక్య వేదిక పిలుపు విజయనగరం గంటంస్తంభం: లేబర్ కోడ్ల రద్దు, ఎనిమిది గంటల పని దినం, కనీస వేతనం రూ.26,000, సమాన పనికి సమాన వేతనం, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ తదితర డిమాండ్లపై ఈ నెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయపద్రం చేయాలని కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్ల వేదిక నాయకులు పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా కార్యదర్మి ఎ.జగన్మోహన్ అధ్యక్షతన స్థానిక జెడ్పీ మినిస్టీరియల్ భవనంలో జిల్లా సదస్సు శనివారం జరిగింది. సదస్సు ప్రారంభానికి ముందు ఇటీవల పహల్గాం ఉగ్ర దాడిలో మరణించిన వారికి, భారత ప్రభుత్వం తలపెట్టిన ఆపరేషన్ సిందూర్లో మరణించిన వీర జవాన్లకు రెండు నిమిషాలు మౌని పాటించి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... కేంద్రంలో మోదీ ప్రభుత్వం కార్మిక వర్గం మీద బహుముఖ దాడి చేపట్టిందన్నారు. 95 శాతంగా ఉన్న కార్మికులకు తీవ్ర నష్టం చేకూర్చే విధంగా కార్మిక చట్టాలు, హక్కులపై దాడి జరుగుతుందన్నారు. కార్మికులకు ప్రశ్నించే హక్కు లేకుండా, పని గంటలతో సంబంధం లేకుండా బానిసలుగా చేసే పరిస్థితి నేడు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో పోరాడి సాధించుకున్న చట్టాలను, హక్కులను, సమ్మె చేసే హక్కును, కనీస వేతనాలు సాధన కోసం, ప్రభుత్వ రంగాన్ని కాపాడేందుకు ఈ నెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సదస్సులో ప్రజా సంఘాల, కార్మిక సంఘాల నాయకులు తమ్మనేని సూర్యనారాయణ, వెంకటేశ్వరావు, శంకరరావు, ఈశ్వరరావు, రవికుమార్, గీత, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
మూడవ నేషనల్ తైక్వాండో సెమినార్ రేపు
విజయనగరం : జిల్లా తైక్వాండో అసోసియేషన్ సారథ్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు విజయనగరం రాజీవ్ స్టేడియంలో మూడవ నేషనల్ తైక్వాండో సెమినార్ జరగనుందని అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గురాన అయ్యలు, సిహెచ్.వేణుగోపాలరావు తెలిపారు. శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. నాలుగు రోజుల పాటు విదేశాల నుంచి వచ్చే శిక్షకులచే అతిథ్య ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, పాండిచ్చేరి తదితర రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. సెమినార్లో ఇరాన్ దేశానికి చెందిన అబ్బాస్ షేక్ ట్రైనర్గా వ్యవహరించనున్నట్టు పేర్కొన్నారు. ఈ సెమినార్ మొదటి రోజు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుందని వివరించారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు ఈ సెమినార్ల పాల్గొనవచ్చని తెలిపారు. -
యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం
రామభద్రపురం: యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. మండలంలోని కొట్టక్కి రెవెన్యూ పరిధిలోని మిర్తివలస మధుర గ్రామం కాకర్లవలస వద్ద ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు కోసం ఎమ్మెల్యే బేబీనాయన, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడులతో కలిసి శనివారం ఆయన శంకుస్థాపన చేసి, శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 ఎకరాలలో రూ.7 కోట్లతో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగు కోసం రాష్ట్రంలో రానున్న రెండేళ్లలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయనున్నమన్నారు. ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పారిశ్రామిక రంగంలో కొత్త విధానమని, తక్కువ మొత్తానికే చిన్న పారిశ్రామిక వేత్తలకు లీజుకు ఇస్తామని తెలిపారు. దీని కోసం 95 శాతం రుణాలు ఎటువంటి ఆస్తుల గ్యారంటీ చూపకుండా మంజూరు చేసేలా బ్యాంకర్లకు ప్రభుత్వం సుమారు రూ.150 వేల కోట్లు అందజేసిందన్నారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రతి కుటుంబ నుంచి ఒక వ్యాపారవేత్త రావాలని పిలుపునిచ్చారు. రామభద్రపురం అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెట్ కోసం శీతల గోదాం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. బుడాచైర్మన్ తెంటు లక్ష్మునాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, జెడ్పీటీసీ సభ్యులు అప్పికొండ సరస్వతి, ఆర్డీవో రామ్మోహనరావు, తహసీల్దార్ సులోచనరాణి, ఎంపీడీవో రత్నం తదితరులు పాల్గొన్నారు.ట్రేడింగ్ పేరిట నయా మోసం ● సైబర్ పోర్టల్లో ఫిర్యాదు చేసిన బాధిత మహిళ పార్వతీపురం రూరల్: మండలంలోని పుట్టూరు గ్రామానికి చెందిన సచివాలయ ఉద్యోగి ట్రేడింగ్ పేరిట సైబర్ మోసానికి గురైనట్లు శనివారం పార్వతీపురం రూరల్ ఎస్ఐ బి.సంతోషికుమారి పేర్కొన్నారు. గతేడాది ఏప్రిల్ నెలలో బాధిత మహిళ ఫోన్కు వచ్చిన మెసేజ్ మేరకు అరోరా ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట పెట్టుబడులు పెడితే ప్రోత్సాహకాలు నగదు రూపంలో వస్తాయని నమ్మించారు. బాధిత మహిళ ఆశపడి ఏడాది కాలంలో రూ.67,500లు పెట్టుబడి పెట్టగా నెలలు గడుస్తున్నా తనకు చెప్పిన ప్రకారం ప్రోత్సాహక నగదు చెల్లించకపోవడంతో ట్రేడింగ్ సిబ్బందిని ప్రశ్నించారు. వారు తప్పించుకొనే ప్రయత్నంలో భాగంగా సంబంధించిన గ్రూపుల నుంచి బాధిత మహిళను తొలగించడంతో మోసానికి గురైనట్టు గమనించిన బాధితురాలు సైబర్ పోర్టల్ 1930 నంబరుకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ సంతోషి మాట్లాడుతూ అవగాహన లేకుండా గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చిన మెసేజ్లకు, లింక్లకు స్పందించవద్దని, స్పందించిన కారణంగా సైబర్ మోసానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆమె అన్నారు. గంజాయి సేవిస్తున్న ఐదుగురు అరెస్ట్ నెల్లిమర్ల రూరల్: మండలంలోని మొయిద విజయరామపురం గ్రామ సమీపంలోని ఉన్న చంపావతి నదీ తీరంలో గంజాయి సేవిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. గంజాయి సేవిస్తున్నట్టు అందిన ముందస్తు సమాచారంతో రెవెన్యూ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామని ఎస్ఐ గణేష్ తెలిపారు. నదీ తీరంలో తుప్పల చాటున గంజాయి సేవిస్తున్న ఐదుగురు యువకులను అరెస్ట్ చేసి వారి నుంచి 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అందరూ చదువుకున్న వారేనని, ఒడిశా రాష్ట్రంలోని రాయఘడ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నట్టు విచారణలో తేలిందన్నారు. కాలేజీ చదువుతున్న సమయంలో చెడు అలవాట్లకు లోనై గంజాయి సేవించడం అలవాటు చేసుకున్నారని తెలిపారు. వారిపై కేసు నమోదు చేశామన్నారు. రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
నెల్లిమర్లలో టీడీపీ x బీజేపీ
● చిచ్చు రేపిన అన్న క్యాంటీన్ వ్యవహారం ● ఇటీవల లోపాలు ఎత్తిచూపిన బీజేపీ నేతలు ● మండిపడ్డ టీడీపీ శ్రేణులు ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్నెల్లిమర్ల రూరల్: నెల్లిమర్ల కూటమిలో ఊహించని రీతిలో చిత్ర విన్యాసాలు జరుగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ–జనసేన మధ్య విబేధాలు తారా స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. తాము అనుకున్నట్టు ఏదీ జరగడం లేదని టీడీపీ నేతలు తీవ్ర నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఈ మధ్యనే బీజేపీ నేతలు కూడా టీడీపీపై యుద్ధం ప్రకటించడంతో టీడీపీ శ్రేణుల కోపం కట్టలు తెంచుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఇటీవల నెల్లిమర్ల మండల కేంద్రంలో ఉన్న అన్న క్యాంటీన్లో నిర్వహణ సక్రమంగా లేదంటూ వైఎస్సార్సీపీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన కౌన్సిలర్ మైపాడ ప్రసాద్ ఆరోపిస్తూ కొంతమంది జనసేన, బీజేపీ నేతలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో అన్న క్యాంటీన్లో అవకతవకలు జరుగుతున్నాయని, పేదలకు అందాల్సిన ఆహారం పక్కదారి పడుతోందని ఆరోపించారు. అయితే ప్రజా సమస్యలపై ఇలానే పోరాడాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ కౌన్సిలర్ ప్రసాద్ను ప్రోత్సహించడంపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. పొత్తు ధర్మాన్ని విస్మరిస్తున్నారని, వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పాలి.. నెల్లిమర్లలో అరాచక శక్తులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ ప్రోత్సహించడం సరికాదని టీడీపీ రాష్ట్ర పరిశీలకుడు సువ్వాడ రవిశేఖర్, జిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు అన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో బీజేపీ నేతలకు వ్యతిరేకంగా శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిరుపేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్న క్యాంటీన్లను నిర్వహిస్తోందని బీజేపీ నేతల ఆరోపణలు అవాస్తవమన్నారు. ఆరోపణలు చేసిన నాయకుడి పూర్వపరాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు తెలుసుకోవాలని హితవు పలికారు. రాజకీయ లబ్ధి కోసం పొత్తు ధర్మాన్ని విస్మరిస్తూ అవాకులు, చెవాకులు మాట్లాడడం సరికాదని, క్షేత్ర స్థాయిలో నిజాలు తెలుసుకోకుండా సదరు నాయకుడిని ఎలా ప్రోత్సహిస్తారని ప్రశ్నించారు. ఆరోపణలు చేసిన బీజేపీ నాయకుడిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, ప్రోత్సహించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు అవనాపు సత్యన్నారాయణ, కింతాడ కళావతి, బైరెడ్డి నాగేశ్వరరావు, రెడ్డి వేణు, కాళ్ల రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
నాయకమ్మగూడలో మలేరియా
సీతంపేట: మండలంలోని నాయకమ్మగూడలో ఆరు మలేరియా పాజిటివ్ కేసులు నమోదైనట్టు దోనుబాయి పీహెచ్సీ వైద్యాధికారి భానుప్రతాప్ తెలిపారు. ఇటీవల గ్రామానికి చెందిన బాలుడు జ్వరంతో అస్వస్థతకు గురై మృతిచెందడంతో వైద్య సిబ్బంది శనివారం వైద్యశిబిరం నిర్వహించారు. 129 మందికి రక్తపూత పరీక్షలు చేశారు. మలేరియా పాజిటివ్ వచ్చినవారికి అవసరమైన మందులు అందజేసినట్టు వైద్యాధికారి తెలిపారు.ఏనుగుల గుంపు విధ్వంసంజియ్యమ్మవలస రూరల్: గరుగుబిల్లి మండలం నందివానివలస, సుంకి, తోటపల్లి గ్రామాల మధ్య నాలుగురోజులుగా సంచరిస్తున్న అటవీ ఏనుగుల గుంపు ఆదివారం రాత్రి కుదమ పంచాయతీ గౌరీపురం చెరకు, వరి పంట పొలాల్లో విధ్వంసం సృష్టించాయి. పంటను మొత్తం నాశనం చేయడంతో రైతులు యోగి రెడ్డి కై లాసరావు, శంబంగి లక్ష్మనాయుడు, అంబటి రాంబాబు, దత్తి వెంకటనాయుడు, రమేష్, తదితర రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు పంటను పరిశీలించి పరిహారం అందజేయాలని కోరారు. ఏనుగుల సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.13న సీజీఆర్ఎఫ్విజయనగరం ఫోర్ట్: విజయనగరంలోని దోమల మందిరం వద్ద ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయంలో ఈ నెల 13న విద్యుత్ వినియోగదారుల సమస్య పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్) నిర్వహించనున్నట్టు ఎస్ఈ మువ్వలక్ష్మణరావు తెలిపారు. సరఫరాలో అంతరాయాలు, ఓల్టేజ్ హెచ్చుతగ్గులు, కొత్త కనెక్షన్ జారీలో అలసత్వం, మీటరు, సర్వీస్ లోపాలు, రీ కనెక్షన్ సమ స్యలు, కాలిపోయిన మీటరు, బిల్లుల్లో తప్పులు, కనెక్షన్ మార్పు వంటి అంశాలపై సమావేశం ఉంటుందని తెలిపారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని వినియోగదారులు సీజీఆర్ఎఫ్ కార్యాలయానికి లఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. -
పుర సమస్యలు పక్కనపెట్టి.. ఏలికల మాటే వేదమనీ!
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం మున్సిపల్ అధికారులు.. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ప్రజలతో ఎన్నికై న పాలకవర్గాన్ని పక్కనపెట్టి, కూటమి ప్రభుత్వానికి వీర విధేయులుగా పని చేస్తున్నారు. స్థానిక సమస్యలను గాలికొదిలి.. ‘రాజకీయాలు’ చేసుకుంటున్నారు. ప్రధానంగా మున్సిపల్ కమిషనర్ తీరుపై పాలకవర్గ ప్రతినిధులే ఆరోపణలు గుప్పించడం గమనార్హం. 30 వార్డులున్న పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలో గత స్థానిక ఎన్నికల్లో 22 వార్డులను వైఎస్సార్సీపీ కై వసం చేసుకుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించిన విషయం విదితమే. అనంతరం కాలంలో ‘అధికారం’ కోసం పలువురు కౌన్సిలర్లు కూటమి చెంతకు చేరారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్పర్సన్ పీఠంపై కన్నేసిన కూటమి నేతలు కొద్దిరోజుల కిందట సంయుక్త కలెక్టర్ శోభికకు అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు. ఆ నోటీసు కాస్త రివర్స్ అయి తుస్సుమనడంతో భంగపాటుకు గురయ్యారు. ఇప్పుడు అధికారులను అడ్డం పెట్టుకుని మరో వ్యూహానికి పదును పెడుతున్నారన్న గుసగుసలు పట్టణ వాసుల్లో వినిపిస్తున్నాయి. పాలకవర్గాన్ని రద్దు చేసే యోచన? మున్సిపాలిటీలో కొన్ని నెలలుగా పాలకవర్గ సమావేశాలు నిర్వహించడం లేదు. సమావేశాలు జరిపితేనే.. ప్రజాసమస్యలపై చర్చించి, పరిష్కరించడానికి అవకాశం కలుగుతుంది. గత డిసెంబర్ వరకు సమావేశాలు సక్రమంగా సాగినా.. ఆ తర్వాత ఒక్కసారి కూడా చేపట్టిన దాఖలాలు లేవు. గత జనవరి 29న ఎన్నికల కోడ్ తర్వాత పూర్తిగా విస్మరించారు. కోడ్ అమల్లో ఉన్నప్పటికీ.. సమావేశాల నిర్వహణకు ఎటువంటి అభ్యంతరమూ ఉండదు. ఆ విషయాన్నీ పక్కనపెట్టి, మున్సిపల్ అధికారులు పూర్తిగా అధికార కూటమి కనుసన్నల్లో నడుస్తూ.. పాలకవర్గ భేటీకి సమయం ఇవ్వకుండా కాల యాపన చేస్తూ వస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈలోగా కొంతమంది సభ్యులు కూటమి పార్టీల కండువా కప్పుకున్నారు. చైర్పర్సన్, వైస్ చైర్మన్లతోపాటు.. మిగిలిన వైఎస్సార్సీపీ సభ్యులు పాలకవర్గ సమావేశాలు నిర్వహించాలని చాలా రోజులుగా మున్సిపల్ కమిషనర్ను కోరుతున్నారు. ఆయన నుంచి ఎటువంటి స్పందనా రావడం లేదు. దీంతో ఇటీవలే చైర్పర్సన్ మీడియా ఎదుట తన ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదు సరికదా.. సాధారణ, బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కోరుతున్నా కమిషనర్ వినడం లేదని వాపోయారు. విధి నిర్వహణలో భాగంగా పాలకవర్గ సమావేశాలు నిర్వహించాల్సిన బాధ్యత కమిషనర్పై ఉంది. అధికార పార్టీ ఆదేశాలు లేకపోవడం వల్లే ఆయన ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవిశ్వాసం డ్రామాలో ఎలాగో నెగ్గలేకపోయిన కూటమి నాయకులు.. పాలకవర్గాన్ని రద్దు చేసే యోచనలో అధికారులను అడ్డం పెట్టుకుని, ఈ విధమైన ప్రణాళిక అమలు చేస్తున్నట్లు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు చెబుతున్నారు. నెలల తరబడి సమావేశాలు నిర్వహించకపోతే పాలకవర్గం రద్దయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. సమస్యలను పక్కనపెట్టి.. ప్రజాసమస్యలను పక్కనపెట్టి, పార్వతీపురం మున్సిపల్ అధికారులు పూర్తిగా రాజకీయాలకే పరిమితమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ సమావేశాలు నిర్వహించకపోవడం వల్ల ఆర్థికపరమైన అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతోంది. దాదాపు 62 వేల జనాభా ఉన్న పార్వతీపురం మున్సిపాలిటీలో వేసవిలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకుంది. కొన్ని ప్రాంతాల్లో మూడు నాలుగు రోజులకోసారి కూడా కుళాయిల నుంచి నీరు సరఫరాకావడం కష్టంగా మారుతోంది. రోజుకు 8.5 ఎంఎల్డీలు అవసరం కాగా.. ప్రస్తుతం 5.5 ఎంఎల్డీలు సరఫరా అవుతోంది. అధ్వాన పారిశుద్ధ్య స్థితి కారణంగా ఏ వీధి చూసినా డంపింగ్యార్డులా దర్శనమిస్తోంది. పట్టణంతోపాటు, సమీప ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు, చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయి. కొన్ని చెరువులు వ్యర్థాలతో నిండిపోతున్నాయి. డంపింగ్యార్డు తరలింపు సమస్య అలానే ఉండిపోయింది. అభివృద్ధి పనులకు మోక్షం కలగడం లేదు. పన్నుల వసూళ్లపై చూపుతున్న శ్రద్ధ.. ప్రజా సమస్యల పరిష్కారంలో మున్సిపల్ అధికారులు చూపడం లేదు. కేవలం కూటమి నాయకుల కనుసన్నల్లోనే నడుస్తున్నారన్న విమర్శలను మూటగట్టుకున్నారు. ఏ సమస్యౖపైనెనా చర్చించి, పరిష్కరించాలన్నా పాలకవర్గం ఆమోదం ఉండాలి. అందుకే వైఎస్సార్సీపీ సభ్యులు సాధారణ, బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కోరుతున్నా.. మున్సిపల్ యంత్రాంగం నుంచి సహకారం కొరవడుతోంది. ఆ ప్రభావం పుర ప్రజలపై పడుతోంది. అధికార పార్టీకి తొత్తులుగా మున్సిపల్ అధికారులు! పాలకవర్గాన్ని విస్మరిస్తున్న వైనం ప్రజా సమస్యలు గాలికి.. సమావేశాలు నిర్వహించకుండా కాలయాపన -
‘తోటపల్లి’ పనులు పునఃప్రారంభిస్తాం
పాలకొండ రూరల్: తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులు ప్రభుత్వ అనుమతులతో పునఃప్రారంభిస్తామని నీటి పారుదల శాఖ సహాయ కార్యనిర్వాహక ఇంజినీరు జి.కార్తీక్ తెలిపారు. ఇటీవల ‘తోటపల్లి ఆయకట్టుకు నీరేది’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. 2018లో తోటపల్లి కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. 2025 నాటికి 23 శాతం పనులు జరిగిట్లు వెల్లడించారు. 2024 ఏప్రిల్ 1 నాటికి జరిగిన పనులు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆధునీకరణ పనులు తాత్కాలికంగా నిలిచినట్టు వివరించారు. పాలకొండ సెక్షన్ పరిధిలో డిస్ట్రిబ్యూటరీ కాలువలకు సంబంధించిన మూడు పనులు పూర్తిచేశామన్నారు. కొన్నిచోట్ల షట్టర్లు మరమ్మతులకు గురైనట్లు గుర్తించామని, వాటిని కూడా సరిచేసి రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
చిరుద్యోగులపై అక్కసు ఎందుకు?
పార్వతీపురంటౌన్: ఎన్నికల సమయంలో ఉద్యోగ భద్రత కల్పిస్తామని, వేతన సమస్యలు పరిష్కరిస్తామని, అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.. తీరా అధికారం చేపట్టాక కనీసం ఒక్కటంటే ఒక్కహామీని నెరవేర్చలేదు.. చిరుద్యోగులంటే ఎందుకంత అక్కసు అంటూ నేతలను ప్రశ్నిస్తున్నారు. సమస్యలు, డిమాండ్లు, హామీలు నెరవేర్చాలంటూ పలు సార్లు ఆందోళనలు చేసినా స్పందించకపోవడంతో ఈ నెల 20న సమ్మెకు సిద్ధమవుతున్నారు. అధికారులకు నోటీసులు అందజేస్తున్నారు. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసేందుకు రాష్ట్రంలోనే ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమైన చర్యగా పేర్కొంటున్నారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికుల నియామకాల్లో రాజకీయ నాయకుల ఆధీనంలోని ప్రైవేట్ ఏజన్సీల ప్రభావం పెరుగుతుందని వాపోతున్నారు. ఇది ఒక రకంగా అర్హత కలిగిన వారికి ఉద్యోలు పొందే అవకాశం కోల్పోయేలా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ప్రతినెలా జీతాలు సకాలంలో పొందే అవకాశం పోతుందని చెబుతున్నారు. ప్రస్తుతం అమలవుతున్న ఆప్కాస్ విధానాన్ని కొనసాగించాలని, రెగ్యులర్ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆశ వర్కర్ల తీవ్రమైన అన్యాయం జిల్లా వ్యాప్తంగా 2,163 మంది ఆశవర్కర్లు ఉద్యోగ భద్రత కల్పించాలని పదినెలలుగా నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నా ఫలితం లేదు. కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశలుగా మార్పుచేసేలా జీఓ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ల సాధనకు కార్మిక సంఘాల పిలుపుమేరకు పీహెచ్సీలలో వైద్యాధికారులకు సమ్మెకు సంబంధించిన నోటీసులు అందజేస్తున్నారు. పోరుబాటలో సీహెచ్డబ్ల్యూఓలు జిల్లా వ్యాప్తంగా 1676 మంది సీహెచ్డబ్ల్యూలు ఉన్నారు. న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని కొన్నాళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. పీహెచ్సీల్లో జరిగే సమావేశాలకు హాజరైనప్పుడు కనీసం టీఏ, డీఏలు ఇవ్వడంలేదని ఆరోపిస్తున్నారు. సమస్యల పరిష్కారానికై ఈనెల 20న సమ్మెబాట పట్టనున్నారు. ఎండీఎం కార్మికులపై రాజకీయ ఒత్తిళ్లు జిల్లా వ్యాప్తంగా 2,300మంది మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్నారు. సకాలంలో భోజన బిల్లులు విడుదల చేయకపోయినా అప్పుచేసి విద్యార్థులకు రుచికరమైన భోజనాలు వడ్డిస్తున్నారు. ఇటీవల రాజకీయ నాయకులు కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఉద్యోగానికి భరోసా కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే పలు పాఠశాలల్లో టీడీపీ నాయకులు సిఫార్సులు చేసిన వారిని నియమించి ఏళ్ల తరబడి పనిచేస్తున్నవారిని తొలగిస్తున్నారని మండిపడుతున్నారు. సమ్మెకు సిద్ధమవుతున్నారు. లేబర్ కోడ్లు రద్దుచేయాలి కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు అమలు చేసిన లేబర్ కోడ్లను తక్షణమే రద్దుచేయాలి. సమాన పనికి సమాన వేతనం కల్పించి వారికి ఉద్యోగభద్రత కల్పించాలి. ఒప్పంద జీఓలు తక్షణమే విడుదల చేయాలి. ఆప్కాస్ విధానాన్ని కొనసాగిస్తూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగభద్రత కల్పించాలి. కార్మికుల, చిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈనెల 20న సమ్మెబాట పట్టనున్నారు. సమ్మెను పెద్ద ఎత్తున నిర్వహిస్తాం. ఉద్యోగులు, చిరుద్యోగు లు, కార్మికులందరూ సహకరించాలి. – గొర్లి వెంకటరమణ, సీఐటీయూ జిల్లా నాయకుడు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న చిరుద్యోగులు సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు సమ్మెబాటలో ఆశ, సీహెచ్డబ్ల్యూ, ఎండీఎం వర్కర్లు అధికారులకు సమ్మెనోటీసులు -
అవాస్తవాలు పోస్టుచేస్తే చర్యలు
–10లోనెల్లిమర్లలో టీడీపీ x బీజేపీ నెల్లిమర్ల కూటమిలో విభేదాలు భగ్గుమంటున్నాయి. నిన్న టీడీపీ–జనసేన, నేడు టీడీపీ– బీజేపీ నాయకులు ఢీ అంటే ఢీ అంటున్నారు. రాజకీయ ఆధిపత్యం కోసం పోటీపడుతున్నారు. పార్వతీపురం రూరల్: సామాజిక మాధ్యమాల్లో ప్రతిఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని, ఏదైనా సందేశం ఫార్వర్డ్, పోస్టుచేసే ముందు వాస్తవమైనదా? కాదా? అన్నది నిర్ధారణ చేసుకున్నాకే షేర్ చేయాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి సూచించారు. అలజడులు సృష్టించేలా, మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. తన కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ర్ట్రాగాం, టెలిగ్రామ్, యూట్యూబ్, ఎక్స్(ట్విట్టర్) తదితర సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టే వారిపై శాఖాపరంగా ప్రత్యేక దృష్టిని సారించామన్నారు. తప్పుడు సమాచారం పోస్టుచేస్తే ఆయా గ్రూపులకు సంబంధించిన అడ్మిన్లు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అత్యవసర సమయాల్లో సమన్వయంతో వ్యవహరించాలన్నారు. మతపరమైన సున్నిత అంశాల్లో వచ్చిన వదంతులు, అవాస్తవాలను సామాజిక మాధ్య మాల ద్వారా శాంతిభద్రతలకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టరాదన్నారు. యువత సహకారం అందించాలి భారత్–పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో యువత బాధ్యతగా వ్యవహరిస్తూ త్రివిధ దళాలకు, కేంద్ర బలగాలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలకు సహకరించే విధంగా సహాయ సహకారాలు అందించాలని ఎస్పీ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీపౌరుడు ఒక సైనికుడిలా వ్యవహరించాలన్నారు. ఇలాంటి సమయాల్లో ర్యాలీలు, ఆందోళనలు, ధర్నాలు వంటి కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు. పోలీస్ ఆదేశాలను మీరితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలి కుల, మత, ప్రాంతాల పట్ల అలజడులు సృష్టించే పోస్టులు పెట్టొద్దు ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి -
గ్రంథాలయాలు... విజ్ఞాన సోపానాలు
ఎన్నో నేర్చుకుంటున్నాం.. వేమన, సుమతి, తెలుగుబాల పద్యాలు నేర్పుతున్నారు. ఎన్నో అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. కథలు చెబుతున్నారు. ఆటలు ఆడిస్తున్నారు. చాలా బాగుంది. – బి.పవిత్ర, విద్యార్థిని పఠనాసక్తి పెరుగుతుంది ప్రస్తుత తరానికి పుస్తక పఠనం అలవాటు తగ్గిపోతోంది. అధునాతన సాంకేతిక విప్లవంలో భాగంగా సెల్ఫోన్లు, వాట్సాప్, ఫేస్బుక్ అందుబాటులోకి రావడంతో పిల్లలు వాటికి ప్రభావితమవుతున్నారు. దీంతో వారిలోని సహజమైన విజ్ఞానం పెంపొందించుకొనే గుణం తగ్గిపోతుంది. వారికి పుస్తకపఠనాన్ని అలవాటుగా మార్చుతున్నాం. విజ్ఞానం పెంపొందించే అంశాలను బోధిస్తున్నాం. –ఎన్.మధుసూధనరావు, శాఖాగ్రంధాలయ నిర్వాహకులు, గరుగుబిల్లి. గరుగుబిల్లి: గ్రంథాలయాలు.. విద్యార్థుల భవితకు చక్కని విజ్ఞాన పునాదులు. వేసవి సెలవుల్లో పిల్లలకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తున్నాయి. ఆట పాటలతో పాటు పుస్తక పఠనాసక్తిని పెంపొందిస్తున్నా యి. నైతిక, మానసిక వికాసం పెంపొందించేలా వివిధ కృత్యాలను నిర్వహిస్తున్నాయి. ‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో ఒక మంచి పుస్తకంను మాత్రం కొనుక్కో’అన్న మాటకు అర్థం చెబుతూ పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలను చిన్నారులకు వివరిస్తున్నాయి. విద్యార్థుల భవితకు ఉపయోగపడేలా వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులను కొనసాగిస్తున్నాయి. గ్రంథాలయాల బాటలో చిన్నారులు.. వేసవి సెలవులు వచ్చాయంటే చాలు నెలన్నరపాటు పిల్లల అల్లరి మిన్నంటుతుంది. ఇల్లు పీకి పందిరేస్తున్నారని పెద్దలు అనడం పరిపాటే. ఇందుకు భిన్నంగా ఆ సెలవులే చిన్నారుల విజ్ఞాన, వినోదాలకు నెలవు కావాలన్నదే గ్రంథాలయాల్లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ తరగతుల ఉద్దేశం. 45 రోజుల పఠనాభ్యసన దీక్షతో పాటు పిల్లల్లో సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసం పెంపొందించేలా గ్రంథాలయ అధికారులు శిక్షణ తరగతులు కొనసాగిస్తున్నారు. గ్రంథాలయాలకు పిల్లలను పంపించడం వల్ల కలిగే ప్రయోజనాలివీ.. ● పిల్లలు వివిధ రకాల పుస్తకాలు చదువుకునే అవకాశం కలుగుతుంది. ● కొత్త విషయాలు తెలుసుకుంటారు. పిల్లలతో కలిసి ఉండడం వల్ల స్నేహభావం పెంపొందుతుంది. ● పిల్లలు కథలు చదవడం వల్ల పఠనాసక్తి పెరుగుతుంది. ఏ అంశాన్నైనా వివరించగల నైపుణ్యాలు పెంపొందుతాయి. ● చిత్రలేఖనం, పేపర్ ఆర్ట్, థియేటర్ఆర్ట్ వంటి సృజనాత్మక కార్యక్రమాల్లో తర్ఫీదు పొందుతారు. జూన్ 6 తేదీ వరకు శిక్షణ తరగతులు రాష్ట్రపౌర గ్రంథాలయ సంచాలకుడు కృష్ణమోహన్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 28 నుంచి జూన్ 6వ తేదీ వరకు ఐదు నుంచి 15 ఏళ్లలోపు వయస్సు ఉన్న విద్యార్థులకు గ్రంథాలయాల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పుస్తకపఠనం, సమీక్షలు, కథలు చెప్పడం, రాయడం, చిత్రలేఖనం, నాటికలు, నీతిపద్యాలు, స్పోకెన్ ఇంగ్లిష్, చేతితో వివిధ ఆకృతుల తయారీ తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులకు నిష్ణాతులైన ఉపాధ్యాయులతో తెలుగు, గణితం, విజ్ఞాన శాస్త్ర పాఠ్యాంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. పిల్లల్లో పుస్తక పఠన జిజ్ఞాసను పెంపొందించేలా శిక్షణ గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన తరగతులు -
సంస్కృతీ, సంప్రదాయాలు చాటి చెప్పేలా తీర్థాలు..
లక్కవరపుకోట: గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న అమ్మవారి పండగలు, తీర్థాలు, జాతరలు మన పల్లె సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పేలా నిర్వహించాలని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని తలారి గ్రామంలో వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు గుమ్మడి సత్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సత్యవమ్మ పేరంటాల అమ్మవారి తీర్థం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ఇటువంటి తీర్థాలు సందర్భంగా నిర్వహిస్తున్న వివిధ పోటీలు మన సాంప్రదాయ క్రీడలను గుర్తుకు తెస్తున్నాయని కొనియాడారు. ముందుగా జిల్లా స్థాయి సీనియర్, జూనియర్ విభాగాల్లో ప్రతిభ పరీక్షలు నిర్వహించారు. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. జిల్లా స్థాయి కోలాటం పోటీలు నిర్వహించి మహిళలకు నగదు బహుమతులు అందజేశారు. అనంతరం రాష్ట్ర స్థాయి గుర్రాలు, ఎడ్లు పరుగు పందెం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 20 గుర్రాలు, 12 జతల ఎడ్ల బళ్లు పాల్గొన్నాయి. విజేతలకు జెడ్పీ చైర్మన్ నగదు బహుమతులు అందజేశారు. ఈ పోటీలకు రిఫరీగా డీసీసీబీ మాజీ చైర్మన్ వేచలపు చిన్నరామునాయుడు వ్యవహరించారు. వేల మందికి అన్న సమారాధాన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ శ్రీనురాజు, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ డైరెక్టర్లు వాకాడ రాంబాబు, గుమ్మడి స్వాతికుమారి పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు -
బళ్ల కృష్ణాపురం కేసు దర్యాప్తు వేగవంతం
సీతానగరం: మండలంలోని బళ్లకృష్ణాపురం గ్రామంలో అనుమానాస్పదంగా మృతి చెందిన బొత్స రమణమ్మ కేసుపై వచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యామని పార్వతీపురం సీఐ గోవిందరావు అన్నారు. మండలంలో ఆదివారం రాత్రి బళ్లకృష్ణాపురం గ్రామానికి చెందిన బొత్స రమణమ్మ(78)ను ఆమె ఇంట్లోని బీరువాలో నగదు, బంగారం చోరీ చేయడానికి హత్యచేసి ఉంటారని అనుమానం ఉందని కుమార్తె లక్ష్మి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయమై స్థానిక పోలీస్ స్టేషన్కు వచ్చిన సీఐ ఎస్.గోవిందరావు మాట్లాడుతూ ఉన్నతాధికారుల సూచనల మేరకు నేరానికి పాల్పడిన వారిని గుర్తించడానికి ఇన్చార్జి ఎస్సై నీలకంఠం, బలిజిపేట ఎస్సై సింహాచలంతో కలిసి చర్యలు తీసుకుంటున్నామని.ఇప్పటికే క్లూస్ టీమ్ సహకారంతో నిందితులను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఏఎస్సై ఎల్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
సమ్మె విచ్ఛిన్నానికి కుట్ర
సాక్షి, పార్వతీపురం మన్యం: తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ సబ్ సెంటర్లలో పని చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు(సీహెచ్వో) చేస్తున్న సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు కూటమి ప్రభుత్వం యత్నిస్తోంది. ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేసేలా.. సమ్మెలో ఉన్న సీహెచ్వోలందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేస్తోంది. అది కూడా నేరుగా ఇవ్వకుండా.. వారికి సంబంధించిన సీహెచ్వో యాప్లో నోటీసులను అప్లోడు చేస్తూ, మూడు రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని చెబుతోంది. కాంట్రాక్టు విభాగంలో ఉన్నందున సమ్మెకు అనుమతి లేదని.. తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మెను విరమించబోమని స్పష్టం చేస్తున్నారు. గ్రామీణ ప్రజలకు వైద్యాన్ని చేరువ చేసేందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన విలేజ్ హెల్త్ క్లినిక్(సబ్సెంటర్లు)ల్లో పని చేస్తున్న సీహెచ్వోలు తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ కొద్ది రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మన్యం జిల్లాలోని 282 సబ్సెంటర్లలో విధులను బహిష్కరించి, నిరవధిక సమ్మెలోకి దిగారు. వీరి ఆందోళనలతో గ్రామాల్లో వైద్యసేవలు నిలిచిపోయాయి. సీహెచ్వోల డిమాండ్లపై సానుకూలంగా స్పందించాల్సింది పోయి, మరింత రెచ్చగొట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వీరి పట్ల దురుసు వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. తాజాగా ప్రభుత్వం వీరందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేస్తోంది. తక్షణమే విధుల్లో చేరకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని చెబుతోంది. ఇన్సెంటివ్ ఇస్తామంటూనే మెలిక.. సీహెచ్వోల ప్రధాన డిమాండ్లలో ఇన్సెంటివ్ ఒకటి. గతంలో ఇచ్చిన రూ.15 వేలు ఇన్సెంటివ్ను ప్రస్తుతం తగ్గించడంతో పాటు.. నెలల తరబడి ప్రభుత్వం బకాయిలు ఉంచుతోంది. సమ్మెను విరమించుకోవాలని, ఆరు నెలల ఇన్సెంటివ్ బకాయిలు చెల్లిస్తామని తాజాగా చెబుతోంది. ఇక్కడే మరో మెలిక పెట్టింది. ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు విధుల్లో ఉండాలని అంటోంది. 8 గంటలకు పని చేసే కేంద్రంలోనే ఎఫ్ఆర్ఎస్ వేయాలని మరో నోటీసు పంపింది. దీనిపై సీహెచ్వోలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 282 సబ్ సెంటర్లలో 80 కేంద్రాలకు సొంత భవనాలు లేవు. 40 సెంటర్లకే కొత్త భవనాలు ఉన్నాయి. మిగతావి ప్రభుత్వ భవనాలైనప్పటికీ అరకొర సదుపాయాలే. సచివాలయాలు, గ్రంథాలయాల్లో ఉంటున్నారు. కనీస మౌలిక సదుపాయాలు లేవు. దాదాపు అన్ని చోట్లా ఊరి చివర, శ్మశానాలకు దగ్గరలో ఉన్నవే. అక్కడ ఆడపిల్లలు ఎలా ఉండగలరని ప్రశ్నిస్తున్నారు. చాలా మంది మద్యం తాగి వస్తుంటారని.. ఇప్పటికే కొన్నిచోట్ల దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 8 గంటలకు ఎఫ్ఆర్ఎస్ వేసే వెళ్లాలంటున్నారని.. గిరిజన ప్రాంతాల్లో అసలు సిగ్నల్సే రావని చెబుతున్నారు. అలా ఉంటేనే రూ.5 వేలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. జీతాల పెంపు, ఇన్సెంటివ్, పీఎఫ్ పునరుద్ధరణ, అద్దె, ఇతర బిల్లుల బకాయిల చెల్లింపు, జాబ్ చార్ట్ వంటి డిమాండ్లపై స్పందించకుండా.. మొత్తం 11 గంటలు కచ్చితంగా డ్యూటీ చేయాలని చెప్పడం ఎంత వరకు సమంజసమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సమ్మె ఆపేది లేదు.. మా డిమాండ్లపై స్పందించాల్సింది పోయి, నోటీసులు ఇస్తున్నారు. దానికి మేం వివరణ కూడా ఇచ్చాం. సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సమ్మె విరమించేది లేదు. ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు విధుల్లో ఉండాలంటున్నారు. ఇది సమంజసమేనా? కార్మిక చట్టాలు మాకు వర్తించవా? – ఎం.ఇంద్రాణి, సీహెచ్వో, ఏపీఎంసీఏ జిల్లా సంయుక్త కార్యదర్శి నోటీసులిస్తున్నారు.. మా సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదు. దీనికి తోడు నోటీసులిచ్చి, ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మా డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి, కేవలం ఆరు నెలల బకాయి ఇన్సెంటివ్ను మాత్రమే చెల్లిస్తామని చెబుతున్నారు. 11 గంటల పాటు విధుల్లో ఉండాలని, హెడ్ క్వార్టర్స్లో రాత్రి 8 గంటలప్పుడు ఎఫ్ఆర్ఎస్ వేయాలని కొత్తగా మెలిక పెట్టారు. మాలో చాలామంది మహిళలే. అంతవరకు ఊరి చివర కేంద్రాల వద్ద ఎలా ఉండగలం? – ఎస్.రాజేశ్వరి, సీహెచ్వో, ఏపీఎంసీఏ జిల్లా కోశాధికారి తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమ్మె బాట పట్టిన సీహెచ్వోలకు కూటమి ప్రభుత్వం కొత్త వేధింపులు మొదలు పెట్టింది. సమ్మెకు వెళ్లిన వారితో సామరస్య పూర్వకంగా చర్చలకు పిలిచి పరిష్కరించాల్సింది పోయి అడ్డదారిలో కొత్తగా మెలికలు పెడుతూ వేధిస్తోంది. షోకాజ్ నోటీసులు జారీ చేస్తోంది. ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేయాలని మెలిక పెట్టింది. విధుల నుంచి వెళ్లే సమయంలో పని చేసే కేంద్రంలోనే ఎఫ్ఆర్ఎస్ వేసే వెళ్లాలని నోటీసులు పంపింది. దీంతో ఇది సాధ్యమేనా.. అని సీహెచ్వోలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పలువురు సీహెచ్వోలకు షోకాజ్ నోటీసులు రాత్రి 8 గంటల వరకు విధుల్లో ఉండాలని మెలిక -
స్వప్న హైందవికి మాతృదేవోభవ పురస్కారం
విజయనగరం టౌన్: శ్రీశ్రీ కళావేదిక సాహితీ పట్టాభిషేక మహోత్సవాల్లో భాగంగా పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ నెల 10, 11 తేదీల్లో ఏలూరులోని మహాలక్ష్మి గోపాలస్వామి కల్యాణ మంటపంలో నిర్వహించనున్న కార్యక్రమంలో పురస్కారాలను అందజేయనున్నారు. ఈ మేరకు జిల్లాకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, సేవాతత్పరురాలు రాజాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవికి మాతృదేవోభవ పురస్కారం అందజేయనున్నట్లు సంస్ధ జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదుగుమ్మలక్ష్మీపురం(కురుపాం): సారాను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు కురుపాం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ పి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన దాడిలో స్వాధీనం చేసుకున్న సారా, ద్విచక్రవాహనాన్ని కురుపాంలోని తన కార్యాలయంలో చూపించారు. సారా అక్రమ అమ్మకాలు నిరోధించే కార్యక్రమంలో భాగంగా జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన దాడుల్లో ద్విచక్ర వాహనంపై సారాను అక్రమంగా తరలిస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుబడగా వారి దగ్గర 80 లీటర్ల సారాతో పాటు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్షల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానంపార్వతీపురంటౌన్: సెకెండరీ గ్రేడ్ టీచర్ పరీక్షలు రాసే అభ్యర్థుల నుంచి ఆన్లైన్ శిక్షణకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారత అధికారి ఇ.అప్పన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెట్ పరీక్ష ఉత్తీర్ణులై, సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ పరీక్షకు అర్హులైన స్థానికులైన వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిగ్రీ మార్కుల లిస్ట్, కుల, ఆదాయ, స్థానికత తెలిపే ధ్రువీకరణ పత్రాలు, డీఎస్సీకి ఎంపికై న అభ్యర్థులు టెట్ మార్కుల లిస్టు జిరాక్స్, పాస్పోర్ట్ ఫొటోలు 2, దరఖాస్తులతో జత చేయాలని సూచించారు. నల్లబెల్లం పట్టివేతసీతంపేట: మండల కేంద్రంలో ఎస్టీఎఫ్ మొబైల్ టీమ్ మురళీధర్, ఎస్సై హనుమాన్నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం సీతంపేటలో సారాకు వినియోగిస్తున్న నల్లం బెల్లాన్ని పట్టుకున్నారు. స్థానికంగా ఓ గోదాంలో నిల్వ ఉంచిన వందకు పైగా బెల్లం చక్కీలను సీజ్ చేసినట్లు సమాచారం. బెల్లం వ్యాపారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. జ్వరంతో బాలుడి మృతిసీతంపేట: మండలంలోని నాయకమ్మగూడ గ్రామానికి చెందిన ఆరిక మోహిత్ (7) అనే బాలుడు జ్వరంతో బాధపడుతూ గురువారం సాయంత్రం మృతిచెందాడు. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న బాలుడికి మందులు వాడినప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో తల్లిదండ్రులు దోనుబాయి పీహెచ్సీకి గురువారం తీసుకువెళ్లారు.అక్కడ వైద్యసేవలందించారు. మెరుగైన వైద్యం కోసం వైద్యాధికారి భానుప్రతాప్ స్థానిక ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేయగా ఇక్కడికి తీసుకువచ్చేసరికే మృతిచెందినట్లు సూపరెంటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. పుస్తక హుండీకి విశేష స్పందనవిజయనగరం టౌన్: జిల్లా గ్రంథాలయ సేవా సంఘం నిర్వహిస్తున్న పుస్తక హుండీ కార్యక్రమానికి దాతల నుంచి విశేష స్పందన లభిస్తోందని సంఘం వ్యవస్ధాపకుడు అబ్దుల్ రవూఫ్, ఉపాధ్యక్షుడు కె.దయానంద్లు తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్ దిమిలి అచ్యుతరావు తన ఇంట్లో ఉన్న వివిధ రకాల పుస్తకాలు ఇతరులకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో తమను సంప్రదించగా ఆయన ఇంటికి వెళ్లి పుస్తకాలను స్వీకరించామ న్నారు. పుస్తక హుండీ నిరంతర ప్రక్రియ అని, ఇలా సేకరించిన పుస్తకాలను వివిధ గ్రంథాలయాలు, విద్యార్థులకు అందజేస్త్నునామన్నారు. సెల్ ప్రభావంతో అన్ని వయసుల వారు పుస్తక పఠనానికి దూరమవుతున్న నేపథ్యంలో మళ్లీ పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించి గ్రంథాలయాలవైపు నడిపించేలా సంఘం నిరంతరం కృషిచేస్తుందని చెప్పారు. -
ప్రజాస్వామ్యానికి విలువ ఏముంది?
● లోపాలను, తప్పులను ఎత్తి చూపడమే మీడియా విధి ● పత్రికా స్వేచ్ఛపై దాడి సమంజసం కాదు.. సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్ : ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి ఇంటి మీద దాడి చేయడం.. ప్రజాస్వామ్యంపైన, పత్రికా స్వేచ్ఛపైన దాడి చేయడమేనని... ఇది మంచి పరిణామం కాదని సీపీఎం మాజీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కృష్ణమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లోపాలను, తప్పులను ఎత్తిచూపడం మీడియా విధి అని.. అభ్యంతరాలుంటే ఖండించాలే గానీ, ఇటువంటి సంస్కృతిని ఏ ఒక్కరూ హర్షించరని తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలపై దాడులు పెరుగుతాయి.. ప్రజాస్వామ్య దేశంలో ఇదే సంస్కృతి కొనసాగితే పాలకులకు కూడా భయం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. పాలకులు యథేచ్ఛగా ప్రజలపై దాడులకు పాల్పడతారని తెలిపారు. ఇంక దేనికీ భయపడరని.. తాము ఏం చేసినా చెల్లుతుందన్న ఉద్దేశంతో మరింతగా దాడులు పెరగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పారు. ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాల్సిందే.. ‘సాక్షి’ ఎడిటర్ ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్క సాక్షినే కాదు.. మొత్తం పత్రికా స్వేచ్ఛ మీద జరుగుతున్న దాడిని ప్రజాస్వామ్య వాదులంతా, పత్రికా స్వేచ్ఛను కోరుకునే వారంతా ఖండించాలి. ఎం.కృష్ణమూర్తి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న జర్నలిస్టులపై దాడులు, అక్రమ కేసులు వంటి విష సంస్కృతికి చెక్ పడాలి. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛ హక్కులను కాలరాయడం సిగ్గు చేటు. ఎటువంటి నోటీసులూ లేకుండా సాక్షి ఎడిటర్ ఇంట్లో సోదాలు చేయడం సరికాదు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. నియంత హిట్లర్ రాజ్యాన్ని నడుపుతున్న చంద్రబాబు.. కలం స్వేచ్ఛపై కత్తి పెట్టడం... వాస్తవాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లే మీడియా వారిపై అధికార దుర్వినియోగం సరైంది కాదు. సుపరిపాలన అంటే వాస్తవాలు చెప్పే వారి గొంతు నొక్కడం కాదు... – బి.రవికుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ●లోపాలు బయట ప్రపంచానికి తెలియకూడదనేనా? పత్రికల మీద దాడి చేసి, భయపెట్టి తమ లోపాలను, తప్పులను బయట ప్రపంచానికి తెలియజేయకుండా ఉండాలన్న దురద్దేశమే దీని వెనుక ఉన్న ఆలోచనగా అర్థమవుతోందని కృష్ణమూర్తి అన్నారు. అభిప్రాయాలు తెలియజేయనీయకుండా చేస్తే ప్రజాస్వామ్యానికి విలువ ఏముంటుందని ప్రశ్నించారు. -
ప్రాథమిక పాఠశాలలను కొనసాగించాలి
ప్రాథమిక పాఠశాలలైన 1–5 తరగతుల్లో మోడల్ ప్రాథమిక పాఠశాల లేదా బేసిక్ ప్రాథమిక పాఠశాలలుగానే కొనసాగించాలి. ప్రాథమిక పాఠశాలలకు పూర్వ ప్రాథమిక విద్యను అనుసంధానం చేయాలి. గ్రామాల్లో అదనంగా ఫౌండేషన్ పాఠశాలల పేరుతో 1,2తరగతుల కోసం ప్రత్యేక బడిని కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. ఇది పూర్తిగా అశాసీ్త్రయమైన ధోరణి. ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయాలను పూర్తిగా ఏపీటీఎఫ్ తరఫున ఖండిస్తున్నాం. – ఎన్. బాలకృష్ణ, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
మే నెలాఖరు నాటికి గృహ లక్ష్యాలు పూర్తి కావాలి
పార్వతీపురం టౌన్: మే నెలాఖరు నాటికి గృహ నిర్మాణ లక్ష్యాలు పూర్తి కావాలని ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ ఎస్ఎస్ శోభిక స్పష్టం చేశారు. వివిధ శాఖల పనుల ప్రగతిని శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లక్ష్యాల మేరకు గృహ నిర్మాణాలు పూర్తి కావాలన్నారు. గృహ నిర్మాణ దశలు త్వరగా మారేందుకు సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదనపు ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారుల గృహాల్లోను అనుకున్నంత వేగంగా పనులు జరగడం లేదని, వాటి పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. జన్మాన్ పథకంలో ఇంకా 3098 గృహాలు ప్రారంభం కావలసి ఉండటాన్ని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయని, ఉపాధి హామీ పథకం కింద పంట గుంతలు తవ్వడం పట్ల దృష్టి సారించాలని ఆమె ఆదేశించారు. జిల్లాలో 11450 ఫాం పాండ్స్ తవ్వకాలు లక్ష్యం నిర్దేశించామని, ఇప్పటికే 9087 మంజూరు చేయగా, 2900 పూర్తయ్యాయని తెలిపారు. వేతన శ్రామికుల్లో 15 నుంచి 20శాతం మందిని పంట గుంతల తవ్వకాలకు మళ్లించాలని ఆమె సూచించారు. ఇప్పటి వరకు 2146 ఎకరాలు గుర్తించడం జరిగిందని, మిగిలిన భూమిని వెంటనే గుర్తించాలని ఆదేశించారు. వాటికి అంచనాలు తయారు చేయాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్లో గృహ నిర్మాణ సంస్థ ఇంచార్జ్ ప్రాజెక్టు డైరెక్టర్ డా. పి.ధర్మచంద్రారెడ్డి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కె.రామచంద్రరావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ శోభిక -
నానాటిక అభివృద్ధి చెందాలి
కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు మరో ముఖ్యఅతిథి, సినీనటుడు నరసింగరావు మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతంలో మంచి సాంస్కృతిక నాటిక కార్యక్రమాలు జరిగేవని, అలాంటి గత వైభవాన్ని తీసుకువచ్చేందుకు మంచి ఆలోచన చేసి, ఈ సాంస్కృతిక నాటిక కార్యక్రమాన్ని తలపెట్టిన కమిటీ సభ్యులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామన్నారు. గరివిడి కల్చరల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు వాకాడ గోపి, అధ్యక్షుడు రవిరాజ్, ఉపాధ్యక్షుడు బమ్మిడి కార్తీక్, ప్రధాన కార్యదర్శి కంబాల శివ, జెడ్పీటీసీ వాకాడ శ్రీనివాసరావు, ఉప్పు శ్రీను తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆహ్వానపు నాటిక పోటీల కార్యక్రమంలో అతిథులుగా జాలాది విజయ, బలివాడ రమేష్, సినీ ఆర్టిస్ట్ రవితేజ, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జునతో పాటు పలువురు మండలస్థాయి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ● దేశం నలుమూలలా గరివిడికి పేరు ప్రఖ్యాతులు ● సినీనటుడు ఆర్.నారాయణమూర్తిచీపురుపల్లిరూరల్(గరివిడి): అన్ని రంగాల మాదిరిగానే నాటిక రంగానికి కోటా ఉండాలని, నాటిక రంగం మరింతగా అభివృద్ధి చెందాలని సినీనటుడు ఆర్.నారాయణమూర్తి ఆకాంక్షించారు. ఈ మేరకు గరివిడిలోని శ్రీరామ్ హైస్కూల్ ఆవరణలో శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ రాష్ట్రాల ఆహ్వానపు నాటిక పోటీల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భగా మాట్లాడుతూ రంగస్థలం కళాకారులకు అమ్మఒడి అని, రంగస్థలం పుణ్యస్థలమన్నారు. నాటిక రంగం బతకాలని, నాటిక రంగం ఒక జీవం లాంటిదని అభిప్రాయ పడ్డారు. కళలు బతికుండాలని, కళలతోనే సమాజం ముడిపడి ఉందన్నారు. గరివిడి ప్రాంతంలో జరుగుతున్న సాంస్కృతిక పునరుజ్జీవం కార్యక్రమంలో ప్రథమంగా కీర్తిశేషులు దుర్గాప్రసాద్ షరాఫ్ను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యాసంస్థలతో పాటు ఉక్కు కర్మాగారాలు నెలకొల్పి భారతదేశంలోనే గరివిడికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారని కొనియాడారు. గరివిడికి మంచి ఎదుగుదల 1975లో దుర్గాప్రసాద్ షరాఫ్ హయాంలో నాటి సాంస్కృతిక కార్యక్రమాలను 29 ఏళ్ల తరువాత నేడు గరివిడిలో మరోసారి సాంస్కృతిక పునరుజ్జీవం చేస్తామని నడుం బిగించి కార్యక్రమానికి నాంది పలికిన గరివిడి కల్చరల్ అసోసియేషన్ కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కల్చరల్ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమైన సాంస్కృతిక నాటిక పోటీలు గరివిడి ప్రాంతాన్ని మంచి ఎదుగుదలకు తీసుకువెళ్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గరివిడి పట్టణానికి చెందిన గరివిడి లక్ష్మి (బుర్రకథ) ఉభయ రాష్ట్రాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిందని గుర్తు చేశారు. గురజాడ అప్పారావు, ఆదిభట్ల నారాయణదాసు, ద్వారం వెంకటస్వామినాయుడు, ఘంటసాల, సుశీలమ్మ ఇలా ఎంతో మంది కళాకారులను కళామతల్లికి అందించిన విజయనగరం కళల కాణాచి అని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన ఓ సినిమాలో సాంగ్ పాడి సందడి చేశారు. -
పెరుమాళి పీఏసీఎస్లో దర్యాప్తు
తెర్లాం: పెరుమాళి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(పీఏసీఎస్)పై వచ్చిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించామని, నివేదికను జిల్లా కలెక్టర్కు, తమ శాఖ ఉన్నతాధికారులకు అందజేస్తామని జిల్లా కో ఆపరేటివ్ అధికారి రమేష్ వెల్లడించారు. పెరుమాళి పీఏసీఎస్లో పలు అంశాలలో అవకతవకలు జరిగాయని శివరామరాజు అనే వ్యక్తి ఇటీవల జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై కొద్ది రోజుల క్రితం బొబ్బిలి సబ్ డివిజనల్ కో ఆపరేటివ్ అధికారి, పెరుమాళి పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జ్ పద్మజ దర్యాప్తు జరిపారు. ఆ దర్యాప్తు సక్రమంగా జరగలేదని శివరామరాజు మళ్లీ ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం జిల్లా కో ఆపరేటివ్ అధికారి రమేష్తో పాటు పలువురు అధికారులు పెరుమాళి పీఏసీఎస్కు వచ్చి బోర్డు సభ్యులు, రైతులు, ఫిర్యాదుదారుని సమక్షంలో దర్యాప్తు జరిపారు. ఫిర్యాదుదారుడు లేవనెత్తిన ప్రతీ అంశంపై వివరణ ఇచ్చారు. ఎటువంటి అనుమతులు లేకుండా పీఏసీఎస్ సీఈవో జీతం ఎందుకు పెంచారని, పెట్రోల్ బంక్లో పలు అవకతవకలు జరుగుతున్నాయని, రైతులకు ఇన్సెంటివ్లు ఇవ్వడం లేదని, ధాన్యం కొనుగోలు సమయంలో హమాలీలకు చార్జీలు ఇవ్వడం లేదని, రుణాలు మంజూరు చేసినప్పుడు కమీషన్లు తీసుకుంటున్నారని ఫిర్యాదుదారుడు ఆరోపించాడు. పలువురు బోర్డు సభ్యులు మాట్లాడుతూ పీఏసీఎస్లో రైతులకు ఎటువంటి సమస్యలు లేవని, రుణాలు సక్రమంగానే ఇస్తున్నారని, సీఈవో బాగానే పని చేస్తున్నారని దర్యాప్తులో తెలిపారు. అలాగే మరికొంత మంది సభ్యులు మాట్లాడుతూ పెరుమాళి పీఏసీఎస్లో క్షత్రియులకు తప్ప మిగిలిన కులాలకు ఎటువంటి పోస్టులు ఇవ్వడం లేదని వారంతా ఆరోపించారు. ఫిర్యాదుదారుడు, బోర్డు సభ్యులు తెలిపిన అంశాలన్నింటిపై సమగ్రంగా నివేదికను తయారు చేసి తదుపరి చర్యల నిమిత్తం జిల్లా కలెక్టర్కు అందజేస్తామని ఈ సందర్భంగా డీసీవో తెలిపారు. దర్యాప్తులో డీఆర్ రమణమూర్తి, అకౌంట్స్ అధికారులు పద్మ, పి.పద్మ, పెరుమాళి పీఏసీఎస్ సీఈవో రమాదేవి, సూపర్వైజర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆరోపణలపై జిల్లా కో ఆపరేటివ్ అధికారుల విచారణ జిల్లా కలెక్టర్కు నివేదిక అందజేస్తాం.. జిల్లా కో ఆపరేటివ్ అధికారి రమేష్ -
పోలీసుల అదుపులో హత్యకేసు నిందితుడు
శృంగవరపుకోట: మండలంలోని చామలాపల్లి గ్రామంలో సంచలనం రేకెత్తించిన హత్య కేసులో నిందితుడిని ఎస్.కోట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఎస్.కోట సీఐ వి.నారాయణమూర్తి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చామలాపల్లిలో ఈనెల 7వ తేదీ సాయంత్రం నడుపూరు మురళి అనే వ్యక్తి గ్రామానికి చెందిన తొత్తడి ప్రసాద్పై దాడి చేసి తల నరికేసి హత్యకు వినియోగించిన కత్తి పట్టుకుని పరారయ్యాడన్నారు. నిందితుడి కోసం గాలిస్తుండగా బైక్పై విశాఖపట్నం వెళ్తున్నట్టు అందిన సమాచారంతో పోతనాపల్లి వద్ద అదుపులోకి తీసుకుని, హత్యాయుధాన్ని, బైక్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. తన తమ్ముడు ప్రసాద్ను మురళి హత్య చేసినట్లు మృతుడి అన్న బాలకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. నిందితుడు మురళి భార్యకు మృతుడు ప్రసాద్కు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో మురళి హత్యకు పాల్పడినట్లు సీఐ చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామన్నారు. -
నేడు పార్వతీపురంలో రైతుల సమావేశం
పార్వతీపురం: మన్యం జిల్లాలో ఉన్న జంఝావతి, అడారు గెడ్డ, పెద్దగెడ్డ, తోటపల్లి, వెంగళరాయ, ఒట్టిగెడ్డ, జంపరకోట, కారిగెడ్డ, గుమ్మిడిగెడ్డ తదితర సాగునీటి ప్రాజెక్టులకు రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించని నేపథ్యంలో కార్యాచరణ రూపొందించనున్నట్టు జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తినాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందు కోసం శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని ఎన్జీవో హోంలో నీటి పారుదల ప్రాజెక్టులపై సదస్సు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. రైతులంతా హాజరు కావాలని ఆయన కోరారు.తివ్వా కొండల్లో ఏనుగులుభామిని: మండల సరిహద్దులోని తివ్వా కొండల్లోకి ఏనుగులు శుక్రవారం వెళ్లాయి. మండలంలో కురుస్తున్న అకాల వర్షాలకు నాలుగు ఏనుగులు తాటిమానుగూడ – ఇప్పమానుగూడ మీదుగా కొండల పైకి చేరుకున్నాయి. వర్షాకాలంలో బురద ప్రాంతాల్లో ఏనుగులు ఉండలేవని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. కురుపాం – గుమ్మలక్ష్మీపురం మండలాల సరిహద్దులోని చీడిగూడ నుంచి తిత్తిరి వైపు వెళ్లిన ఏనుగులు తాజాగా తివ్వా కొండల్లోకి చేరుకున్నాయి. దీంతో పల్లం ప్రాంత రైతులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.ఖైదీల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలిపాలకొండ రూరల్: రిమాండ్ ఖైధీల ఆరోగ్య రక్షణపై జైలు సిబ్బంది దృష్టి పెట్టాలని జిల్లా జైళ్ల శాఖ అధికారి మోహనరావు అన్నారు. పాలకొండ సబ్ జైలును ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ క్రమంలో అక్కడి పరిసరాలు, వసతులు, రికార్డుల నిర్వహణపై సూపరింటెండెంట్ బి.జోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వేసవి నేపఽథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. అనంతరం నిరుపయోగంగా ఉన్న పాత సామగ్రిని వేలం వేయించారు.పైడితల్లి అమ్మవారికి స్వర్ణ పుష్పార్చనవిజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు శుక్రవారం స్వర్ణ పుష్పార్చనలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజాము నుంచి అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు ఏడిద రమణ ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు అచ్యుతశర్మ, దూసి శివప్రసాద్ శాస్త్రోక్తంగా అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన సేవను నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఇంచార్జ్ ఈవో కెఎన్విడివి.ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు.అందరి సమన్వయంతోనే అభివృద్ధి● మున్సిపల్ ఆర్డీ రవీంద్రవిజయనగరం గంటస్తంభం: అన్ని శాఖల సమన్వయంతో నగరపాలక సంస్థ మరింత అభివృద్ధి చెందే దిశగా కృషి చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ వి.రవీంద్ర అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయానికి శుక్రవారం విచ్చేసిన ఆయన వివిధ విభాగాల అధిపతులు, సిబ్బందితో వేర్వేరుగా సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. విభాగాల వారీగా ప్రగతి నివేదికలను పరిశీలించి, వాటి ఆధారంగా పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. -
విద్యారంగంలో తీవ్ర సంక్షోభం
● ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ఉద్యమం ● కూటమి ప్రభుత్వంలో పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకం ● జిల్లా కేంద్రంలో ఏపీటీఎఫ్ నిరసనపార్వతీపురంటౌన్: రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ ఒక ప్రయోగశాలగా మారిందని, ప్రస్తుత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా విఫల ప్రయోగాలు చేపడుతోందని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు అశాసీ్త్రయమైన తొమ్మిది రకాల పాఠశాలలను బలవంతంగా ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తున్నామని ఏపీటీఎఫ్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిరసన చేపట్టారు. ప్రతి గ్రామంలో ఒకటి నుంచి ఐదు తరగతులతో కూడిన మోడల్ ప్రాథమిక పాఠశాల లేదా బేసిక్ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలని, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున నియమించాలని, ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 55ప్రకారం ఉన్నత పాఠశాలలో 45 మంది విద్యార్థులు దాటితే మరో సెక్షన్ మంజూరు చేయాలని కోరుతున్నారు. ఆ తరువాత ప్రతి 35 మందికి ఒక్కొక్కరు చొప్పున పాఠశాల సహాయకులను నియమించాలని, పూర్వ ప్రాథమిక విద్యాకేంద్రాలను ప్రాథమిక పాఠశాలలతో అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో తెలుగు మీడియం తప్పనిసరిగా కొనసాగించాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి పడిన మూడు డీఏలు గత పీఆర్సీ ఎరియర్స్ వెంటనే చెల్లించాలని, నూతన పే రివిజన్ కమిటీని నియమించి కనీసం 30 శాతానికి తగ్గకుండా మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 14న విజయవాడలో రాష్ట్రస్థాయి ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఈ ధర్నా శిబిరంలో వివిధ మండలాల ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జిల్లా సబ్ కమిటీ సభ్యులు, జిల్లా కౌన్సిలర్లు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ఒక్క సిలిండర్తో సరి..!
విజయనగరం ఫోర్ట్: అధికారం కోసం కూటమి సర్కార్ అనేక హామీలను ప్రజలకు ఇచ్చింది. అలవికాని హామీలు అయినప్పటికీ ప్రజలను బాగా నమ్మించింది. అందులో మహిళలను ప్రభావితం చేసింది ఉచిత గ్యాస్ పథకం. ప్రతి ఏడాదీ మహిళలకు ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని ఊరూరా గొప్పగా ప్రచారం చేశారు. కానీ ఇప్పడు పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. 2024–25లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల్లో చెప్పిన విధంగా 2024–25 సంవత్సరంలోనే మూడు సిలిండర్లు ఇవ్వాలి. కానీ 2024–25 మార్చి నెల లోపు ఒక సిలిండర్ మాత్రమే ఇచ్చి సరిపెట్టేశారు. అంటే ఒక ఏడాదిలో ఇవ్వాల్సిన మూడు సిలిండర్లకు గాను రెండు సిలిండర్లకు ఎగనామం పెట్టారనే ఆరోపణులు వినిపిస్తున్నాయి. ఇది కోట్లాది రుపాయల భారం తగ్గించుకునే ఎత్తుగడ అనే విమర్శలు సర్వత్రా వినినిస్తున్నాయి. గుర్తించిన లబ్ధిదారులు 5.02 లక్షలమంది జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు 7 లక్షలకు పైగా ఉన్నాయి. ప్రభుత్వం అందించే ఉచిత గ్యాస్కోసం గుర్తించిన లబ్ధిదారులు 5,02,654 మంది. ఇందులో 2024–25 సంవత్సరానికి సంబంధించి 4,46,846 మంది గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసుకున్నారు. 55,808 మంది గ్యాస్ బుక్ చేసుకోలేదు. జిల్లాలో గ్యాస్ కనెక్షన్ల వివరాలు: జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు 7,04,273 ఉన్నాయి. అందులో జనరల్ గ్యాస్ కనెక్షన్లు 3,46,455. అదేవిధంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు 1,29,277, సీఎస్ఆర్ కనెక్షన్లు 34,287 ఉన్నాయి. దీపం కనెక్షన్లు 1,85,254 ఉన్నాయి. ఉచిత గ్యాస్పై కొత్త భాష్యం ఉచిత గ్యాస్పై ప్రభుత్వం కొత్త భాష్యం చెబుతోంది. ఏడాదికి మూడు సిలిండర్లపై ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలు పొంతన లేకుండా ఉంటున్నాయి. 2024–25 లో ఇవ్వాల్సిన మూడు సిలిండర్లకు ఆ ఏడాదిలో ఒక్క సిలిండర్ మాత్రమే ఇచ్చారు. కానీ నవంబర్ 2024 నుంచి నవంబర్ 2025 లోగా మూడు సిలిండర్లు ఇస్తామని కూటమి సర్కార్ చెబుతుంది. ఇలా అయితే 2024వ సంవత్సరానికి సంబంధించి రెండు సిలిండర్లు ఎగనామం పెట్టినట్లేననే లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. లబ్ధిదారుల్లో కోత వివిధ కారణాలతో కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ రాయితీని తగ్గించుకోవాలనే చూస్తోందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ బిల్లు ఎక్కువగా వచ్చిందని కొందరికి, ఇంట్లో అంగన్వాడీ కార్యకర్త, ఆశ కార్యకర్త వంటి చిరుద్యోగులు ఉన్నారని మరి కొందరికి ఇలా అనేక కారణాలతో లబ్ధిదారులకు అందించాల్సిన ఉచిత రాయితీని ప్రభుత్వం ఎగ్గొంటేందుకు ప్రయత్నిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏడాదికి మూడు ఇస్తామని ఎన్నికల్లో హామీ జిల్లాలో ఉచిత గ్యాస్ లబ్ధిదారులు 5,02,654 మంది మొదటి విడత వినియోగించుకున్న వారు 4,43,334 మంది మూడు సిలిండర్లుగా పరిగణన 2024–25 నవంబర్ నుంచి 2025–26 నవంబర్ నాటికి మూడు సిలిండర్లుగా పరిగణిస్తున్నాం. 2024–25 నవంబర్ నుంచి మార్చి 2025 నాటికి ఒక సిలిండర్ అందజేశాం. కె.మధుసూదన రావు,జిల్లా పౌరసరఫరాల అధికారి -
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
గుర్ల: భార్య తరచూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో మానసిక అవేదన చెందిన భర్త రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్ల మండలంలోని వల్లాపురంలో గురువారం ఈ ఘటన జరిగింది. గుర్ల మండలంలోని వల్లాపురం గ్రామానికి చెందిన రుంకాన రాంబాబు (29)కు రెండు నెలల క్రితం అదే మండలంలోని కెల్ల గ్రామానికి చెందిన వాణిశ్రీతో వివాహం జరిగింది. వివాహం జరిగినప్పటి నుంచి భార్య అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో రాంబాబు మానసికంగా అవేదన చెందుతుండేవాడేని కుటుంబసభ్యులు తెలిపారు. భార్య వాణిశ్రీని తీసుకువెళ్లడానికి కెల్ల బయలుదేరిన రాంబాబు జమ్ముపేట రైల్వేట్రాక్పై గుర్తు తెలియని రైలు కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధతో యువకుడు.. బలిజిపేట: మండలంలోని గౌరీపురం సమీపతోటలో కె.ఫణీంద్ర (27) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై మృతుడి తమ్ముడు సిద్ధార్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సింహాచలం కేసు నమోదు చేశారు. ఫిర్యాదు మేరకు రాజాం మండలం పెనుబాక గ్రామానికి చెందిన కె.ఫణీంద్రకు వ్యక్తిగతంగా ఉన్న అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. -
జల్ జీవన్ మిషన్ మార్గదర్శకాలను అమలు చేయాలి
విజయనగరం ఫోర్ట్: జల్జీవన్ మిషన్ ఇచ్చిన మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అన్నారు. జాతీయ జల్జీవన్ మిషన్ సభ్యుల సూచనల మేరకు కార్యక్రమం అమలులో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులను సరిచేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. జాతీయ జేజేఎం అడిషనల్ సెక్రటరీ, మిషన్ డైరెక్టర్లు జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ. కవిత పాల్గొన్నారు. ఇన్చార్జ్ కలెక్టర్ సేతు మాధవన్ -
హెచ్ఐవీ రోగుల పట్ల వివక్ష తగదు
● జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ కె. రాణివిజయనగరం ఫోర్ట్: హెచ్ఐవీ రోగుల పట్ల వివక్ష తగదని జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ కె.రాణి అన్నారు. ఈ మేరకు స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం హెచ్ఐవీ, ఎయిడ్స్పై వీధి నాటకం ద్వారా అవగాహన కల్పించే కార్యక్రమాన్ని జెండా ఊపి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెచ్ఐవీ ఏవిధంగా వ్యాప్తి చెందుతుంది, వ్యాధి సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వీధి నాటకం ద్వారా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటే హెచ్ఐవీ బారిన పడకుండా ఉండవచ్చాన్నారు. హెచ్ఐవీ సోకిన తర్వాత బాధపడేకంటే రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో డాక్టర్ వెంకటేష్, ఐసీటీసీ సూపర్ వైజర్ సాక్షి గోపాల్రావు తదితరులు పాల్గొన్నారు. -
హోంగార్డు కుటుంబానికి చేయూత
విజయనగరం క్రైమ్: హోంగార్డుగా పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన బి.సుందర్ రావుకు చేయూత కింద రూ.3,25,180 చెక్కును ఎస్పీ వకుల్ జిందల్ గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమష్టిగా పోలీస్ శాఖలోని ప్రతి ఒక్క సిబ్బంది డ్యూటీ అలవెన్స్ కింద పోగు చేసిన సొమ్మును చేయూత కింద ఇవ్వడం అభినందనీయమన్నారు. ఇది ఒక రకంగా పోలీస్ శాఖలో స్ఫూర్తిని నింపినట్లేనని ఎస్పీ అభిప్రాయ పడ్డారు. చేయూత పథకాన్ని, దాన్ని సిబ్బంది అమలు చేస్తున్న తీరును ప్రశంసించారు. కార్యక్రమంలో హోంగార్డు కమాండెంట్ టి.ఆనందబాబు, ఆర్ఎస్సై రమేష్ కుమార్, సూపరింటెండెంట్ రామకృష్ట, పీఆర్ఓ కోటేశ్వరరావు, ఫొటోగ్రాఫర్ కృష్ట, శ్రీనివాస్, వెంకటేష్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు. రూ.3 లక్షల చెక్ అందజేసిన ఎస్పీ -
పట్టుబడిన ట్రాన్స్ఫార్మర్ల దొంగలు
● ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు ● సుమారు రూ.5లక్షల సొత్తు స్వాధీనంలక్కవరపుకోట: ఎస్.కోట నియోజకవర్గం పరిధిలోని వేపాడ, ఎల్.కోట, కొత్తవలస, జామి మండలాలతో పాటు విజయనగరం రూరల్ పరిధిలో గల పలు గ్రామాల్లో గడిచిన మూడు నెలల నుంచి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు (16 కేవీ సామర్థ్యం) చోరీకి గురవుతున్న అంశం పోలీసులకు సవాల్గా మారింది.దీంతో పోలీసులు ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ట్రాన్స్ఫార్మర్ దొంగలు వేపాడ మండలంలోని అరకు–విశాఖ రోడ్డులో పాటూరు జంక్షన్ వద్ద ఆటోలో చోరీ సొత్తును తరలిస్తుండగా గురువారం పట్టుబడ్డారు. ఈ విషయమై సీఐ ఎల్.అప్పలనాయుడు ఆధ్వర్యంలో పోలీసులు నిందితులను, చోరీ సొత్తును విలేకరల సమావేశంలో ప్రదర్శించారు. ఈ కేసులకు సంబంధించి సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాల మేరకు గడిచిన మూడు నెలల వ్యవధిలో ఎస్.కోట రూరల్, సర్కిల్ పరిధిలో వేపాడ మండలంలో–2, లక్కవరపుకోట మండలంలో–3, జామి మండలంలో–4, కొత్తవలస మండలంలో –2, విజయనగరం రూరల్ పరిధిలో ఒకటి మొత్తంగా 15 ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయి, ఈ మేరకు అప్పట్లో కేసులు నమోదు చేయగా దర్యాప్తు చేయగా వేపాడ మండలం పాటూరు గ్రామానికి చెందిన రుద్ర బంగారునాయుడు, కర్రి యుగేంద్ర, షేక్ సలీం, ముమ్మన ఆదిత్య, బొద్దాం గ్రామానికి చెందిన మహమ్మద్ అమీద్లతో పాటు పాటూరు గ్రామానికి చెందిన 15 సంవత్సరాల బాలుడు ముఠాగా ఏర్పడి ట్రాన్స్ఫార్మర్లు దొంగిలిస్తున్నట్లు తెలిసిందన్నారు. ముందస్తు సమాచారంతో మాటు వేసి.. ముఠా సభ్యులు చోరీ చేసిన సొత్తును విశాఖపట్నంలో అమ్మేందుకు ఆటోలో తరలించేందుకు పాటూరు జంక్షన్లో సిద్ధంగా ఉన్నట్లు అందిన సమాచారం మేరకు వేపాడ, ఎల్.కోట ఎస్సైలు సుదర్శన్, నవీన్పడాల్లు తమ సిబ్బందితో మాటువేసి పట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం విచారణలో నిందితులు నేరం అంగీకరించడంతో వారి నుంచి సుమారు రూ.5 లక్షల విలువైన ట్రాన్స్ఫార్మర్లలో గల కాపర్ వైర్లు, బ్యాటరీలు, సబ్మెర్సిబుల్ మోటార్లు, అల్యూమిలియం విద్యుత్ తీగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి కొత్తవలస కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎల్.కోట, వేపాడ, జామి ఎస్సైలు నవీన్పడాల్, సుదర్శన్, వీరజనార్దన్, పలువురు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. -
మద్యం దుకాణంలో చోరీ నిందితుల ఆరెస్టు
కొత్తవలస: మండలంలోని రాజా సినిమాహాల్ సమీపంలో గల 202 కాలనీ వద్ద ఉన్న మద్యం దుకాణంలో గత నెల 28వ తేదీన దొంగలు చొరబ డి తాళాలు విరగ్గొట్టి 240 మద్యం సీసాలను ఎత్తు కు పోయారు. కాగా అప్పట్లో సీఐ సీహెచ్.షణ్ముఖరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్ర మంలో కొత్తవలస ఆర్చి వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న 202 కాలనీకి చెందిన ఇద్దరు పాత నేరస్తులను గురువారం అదుపులోకి తీసుకుని విచారణ చేయగా నేరం అంగీకరించినట్లు సీఐ తెలిపారు.ఈ మేరకు పి.యోహాను, పి.దర్శన్బాబు, పి.యేసులుగా నిందితులను గుర్తించినట్లు చెప్పారు. ప్రస్తుతం యేసు పరారీలో ఉన్నాడని మిగిలిన ఇద్దరు నిందితుల దగ్గర కొన్ని మద్యం సీసీలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అనంతరం కొత్తవలస కోర్టులో నిందితులను హాజరు పరచగా రిమాండ్ విధించారన్నారు. కార్యక్రమంలో ఎస్సై మన్మథరావు, ఏఎస్సై యువరాజు, పలువురు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. -
డివైడర్ను ఢీకొన్న ఆటో: ఒకరికి గాయాలు
రాజాం సిటీ: స్థానిక బొబ్బిలి జంక్షన్లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒమ్మి గ్రామానికి చెందిన పడాల సూర్యవంశీ గాయాలపాలయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఒమ్మి గ్రామం నుంచి శ్రీకాకుళం ఆటోలో మామిడిపళ్లు తీసుకువెళ్తున్నారు. బొబ్బిలి జంక్షన్కు వచ్చేసరికి డివైడర్ను ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న సూర్యవంశీ రోడ్డుపై పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే 108కు సమాచారం అందించగా హుటాహుటిన వచ్చి క్షతగాత్రుడికి ఈఎంటీ ఆలుగుబిల్లి శ్రీనివాసరావు, పైలెట్ శంకరరావులు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన చికిత్సకోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. పీహెచ్సీ సీనియర్ అసిస్టెంట్కు గాయాలు మండల పరిధి శ్రీకాకుళం రోడ్డులోని రెండో మైలు రాయి వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో పొగిరి గ్రామానికి చెందిన పొగిరి గంగారాం తీవ్రగాయాలపాలయ్యాడు. గంగారాం రాజాం నుంచి స్వగ్రామం పొగిరి ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. ఒక్కసారిగా బైక్ అదుపు తప్పగా రోడ్డుపై పడిపోయాడు. పొగిరి గ్రామానికి చెందిన గంగారాం బొద్దాం పీహెచ్సీ సీనియర్లో అసిస్టెంట్గా పని చేస్తున్నారు. వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించడంతో ఈఎంటీ ఎ.శ్రీనివాసరావు, పైలెట్ శంకరరావులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్సకోసం శ్రీకాకుళం తరలించారు. -
అన్నా క్యాంటీన్ నిర్వహణ సక్రమంగా ఉండాలి
● బీజేపీ, జనసేన నాయకుల డిమాండ్ నెల్లిమర్ల: నెల్లిమర్లలోని అన్నా క్యాంటీన్ సిబ్బంది నిర్వాకం వల్ల పేదలకు అందాల్సిన ఆహార పదార్థాలు పక్కదారి పడుతున్నాయని బీజేపీ మండల అధ్యక్షుడు మైపాడ ప్రసాద్ ఆరోపించారు. ఈ మేరకు స్థానిక బీజేపీ కార్యాలయంలో గురువారం ఆయన జనసేన మండల అధ్యక్షుడు పతివాడ అచ్చింనాయుడు, జనసేన నాయకుడు మజ్జి రాంబాబు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నడిపేన నారాయణమూర్తితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నెల్లిమర్లలోని అన్నాక్యాంటీన్లో టిఫిన్, భోజనం పేదలకు అందకుండా పక్కదారి పడుతోందని విమర్శించారు. అన్నా క్యాంటీన్లో పార్శిల్ కట్టే నిబంధన లేకున్నా సిబ్బంది కొంతమందికి పార్శిల్ చేస్తున్నారని, దీంతో పేదలకు ఆహారం అందడం లేదన్నారు. ఉదయం టిఫిన్ 9 గంటలకు వరకూ ఉండాల్సి ఉన్నా పార్శిల్స్ కట్టడం వల్ల 7.30 గంటలకే పూర్తవుతోందన్నారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు ఆహార పదార్థాలు అందేవిధంగా చూడాలని కోరారు. సాక్షిపై అక్కసు తగదు నెల్లిమర్ల రూరల్: వాస్తవ పరిస్థితులు తెలియజేస్తున్న సాక్షి పత్రికపై కూటమి ప్రభుత్వం అ క్కసు పెంచుకోవడం తగదని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగాన శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపా రు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తనిఖీలు చేయడం సరికాదన్నారు. ప్రజా స మస్యలను నిత్యం వెలుగులోకి తెస్తున్న పత్రికల పై, సాక్షిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చ ర్యలకు పాల్పడుతోందన్నారు. ఇటీవల ఏలూరులో కూడా సాక్షి కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారన్నారు. పత్రికా స్వేచ్ఛ కు భంగం కలిగించరాదని హితవు పలికారు. -
హైరిస్క్ గ్రామాల్లో ఫీవర్ సర్వే చేయాలి
సీతంపేట: హైరిస్క్ మలేరియా ప్రభావిత గ్రామాల్లో ఫీవర్ సర్వే పకడ్బందీగా చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఎస్.భాస్కరరావు అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన స్థానిక ఐటీడీఏలోని సీతంపేట, కుశిమి, దోనుబాయి, మర్రిపాడు, బత్తిలి, భామిని తదితర పీహెచ్సీ వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జ్వరం, ఇతర వ్యాదులు ఉన్న వారికి వెంటనే తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో ఇంటింటికీ ఐఆర్ఎస్ 5 శాతం ఏసీఎం ద్రావణాన్ని స్ప్రేయింగ్ చేయాలని చెప్పారు. ఫాగింగ్ వంటి యాక్టివిటీస్ చేయాలని కోరారు. దోమకాటు వ్యాధులపై ప్రజలకు విస్త్రతంగా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏసీటీ, క్లోరోక్విన్, ప్రైమాక్విన్ వంటి యాంటీ మలేరియా మందులు సమృద్ధిగా అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఉపవైద్యాశాఖాధికారి కె.విజయపార్వతి, డీఎంవో సత్యనారాయణ, సబ్యూనిట్ ఆఫీసర్ మోహన్రావు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్వో భాస్కరరావు -
పని కల్పించాలంటూ వేతనదారుల ఆందోళన
జియ్యమ్మవలస రూరల్: ఉపాధిహామీ పనులు కల్పించాలంటూ జియ్యమ్మవలస ఎంపీడీఓ కార్యాలయం ఎదుట వేతనదారులు గురువారం నిరసన తెలిపారు. చెరువు, కాలువ పనులు కల్పించడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే 14 వరకు ఫారంపాండ్స్ పనులు చేశామని, సంబంధిత రైతులు పనులకు ముందుకు రాకపోవడంతో సమస్య ఎదురైందన్నారు. చెరువు, కాలువల అభివృద్ధి పనులు కల్పించకుంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. 184 కేజీల గంజాయి స్వాధీనం సాలూరు రూరల్: మండలంలోని దుగ్దిసాగరం గ్రామం వద్ద గరువారం సాయంత్రం 184 కేజీల గంజాయి పట్టుకున్నట్టు రూరల్ సీఐ రామకృష్ణ తెలిపారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇద్దరు వ్యక్తులు కారులో గంజాయి రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు దాడిచేశామని, నిందితులు తప్పించుకున్నారన్నారు. కారుతో పాటు గంజాయిని సీజ్ చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ నరసింహమూర్తి, పోలీసులు పాల్గొన్నారు. వేతన బకాయిలు చెల్లించండి జియ్యమ్మవలస రూరల్: ఎన్ఆర్ఈజీఎస్(జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు లావణ్యకుమార్ దృష్టికి వేతనదారులు తమ సమస్యలు తీసుకువెళ్లారు. మండలంలోని బిత్రపాడులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనకు వేతనదారులు ఎదుర్కొంటున్న సమస్యలను వినిపించారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఇప్పటివరకు ఉపాధి బిల్లులు చెల్లించలేదని, పనిముట్లు లేవని, ఎండల తీవ్రత దృష్ట్యా పని ప్రదేశంలో తాగునీరు, టెంట్లు ఉండేలా చూడాలని, అధికారులే రైతులతో నేరుగా మాట్లాడి ఫారంపాండ్ల పనులు కల్పించాలని కోరారు. సమస్యలను స్టేట్ కౌన్సిల్ సమావేశం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. నందివానివలస పరిసరాల్లో ఏనుగుల గుంపు గరుగుబిల్లి: మండలంలోని సుంకి, తోటపల్లి, సంతోషపురం, నందివానివలస గ్రామ పరిసరాల్లో గత నాలుగు రోజుల నుంచి ఏనుగులు గుంపు సంచరిస్తున్నాయి. తోటపల్లి పంచాయతీ నందివానివలస తోటల్లో గురువారం సంచరించాయి. ఏనుగులు ప్రధాన రహదారి పక్కనే ఉన్న తోటల్లో సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
శుక్రవారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2025
సాక్షి, పార్వతీపురం మన్యం: సాక్షి ఎడిటర్పై దాడి.. జర్నలిస్టుల గొంతు నొక్కి, దౌర్జన్య పాలన సాగించడమేనని పలువురు పాత్రికేయులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నియంత ప్రభుత్వంలో.. దౌర్జన్య పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలను వెలుగులోకి తెస్తూ, నిర్భయంగా వార్తలు రాసే పాత్రికేయుల గొంతు నొక్కాలని చూడటం.. పత్రికా స్వేచ్ఛను హరించడమేనని, ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి చర్యలు మంచివి కాదని హితవు పలికారు. గురువారం ఉదయం విజయవాడలో ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి నివాసం ఉంటున్న అపార్టుమెంటుపై పోలీసులు దాడులు, తనిఖీలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు వివిధ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో పాత్రికేయులు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ర్యాలీగా ఆస్పత్రి కూడలి వద్దనున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు వెళ్లారు. అక్కడ నినాదాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరుతూ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ‘సాక్షి ఎడిటర్పై దాడి.. పత్రికా స్వేచ్ఛపై దాడి.. నియంత ప్రభుత్వమా! సిగ్గు సిగ్గు!!.. జర్నలిస్టుల గొంతునొక్కి దౌర్జన్య పాలనా?.. ప్రజాస్వామ్యమా? పోలీసు రాజ్యమా?..’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఎటువంటి ముందస్తు నోటీసులూ ఇవ్వకుండా ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లోకి పోలీసులు అక్రమంగా ప్రవేశించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సెర్చ్ వారెంట్ అడిగినా చూపకుండా దురుసుగా ప్రవర్తించారన్నారు. ఇతర కేసుల్లో ముద్దాయిలు ఈ అపార్టుమెంటులో ఉన్నారంటూ, ఈ ప్రాంతంలో చేస్తున్న తనిఖీలలో భాగంగా వచ్చామని పొంతనలేని సమాధానాలు చెబుతూ.. దాదాపు గంటకుపైగా భయానక వాతావరణం సృష్టించారని చెప్పారు. గౌరవప్రదమైన పత్రిక ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆర్.ధనుంజయరెడ్డి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడంతో పాటు, సమాజంలో పరువు ప్రతిష్టలకు విఘాతం కలిగే రీతిలో పోలీసులు వ్యవహరించారన్నారు. అవినీతి, అక్రమాలను వెలికితీయడంతో పాటు, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే ప్రక్రియలో భాగస్వాములవుతున్న పత్రికారంగంపై దాడిచేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా భావిస్తున్నామని తెలిపారు. కార్యక్రమానికి ఏపీయూడబ్ల్యూజే, పీజేఎఫ్ సంఘాలు మద్దతు పలికాయి. గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్కుమార్ సంఘీభావం తెలిపారు. పాత్రికేయులు కె.ఎన్.రామకృష్ణ, ఆశపు జయంత్కుమార్, మహందాతనాయుడు, సుధీర్, వి.దాలినాయుడు, ఎద్దు చిన్నారావు, సీహెచ్ ప్రసాద్, నవీన్, జనార్దన, ఆర్.సుధాకరరావు, దివానీ, ఉపేంద్ర, పిన్నింటి చిన్న, బసవ ధర్మారావు, తదితరులు పాల్గొన్నారు. న్యూస్రీల్ పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు సిగ్గుచేటు ‘సాక్షి’ ఎడిటర్ ఇంటిపై దాడి.. ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేయడమే.. నినదించిన పాత్రికేయులు -
మీడియాను అణగదొక్కే ప్రక్రియ ఇది
ఎలాంటి కేసులూ లేకపోయిన కేవలం కక్షగట్టి, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూడటం తగదు. సాక్షి మీడియాను అణగదొక్కే ప్రక్రియలో భాగంగా ఈ దాడిని పరిగణిస్తున్నాం. ప్రభుత్వం తీసుకునే ప్రజావ్యతిరేక చర్యలను ఎవరు ప్రశ్నించరాదనే నిరంకుశ ధోరణితో కుట్రపూరితంగా ఈ దాడిని చేయించారని అర్థమవుతోంది. ఇది కేవలం సాక్షి ఎడిటర్పై మాత్రమే జరిగిన దాడికాదు.. భవిష్యత్తులో మొత్తం మీడియాపై ఇవేదాడులు, ఇవే ఆంక్షలు, ఇలాంటి బెదిరింపులు కొనసాగే పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం అయిన మీడియా పరిరక్షణకు, పత్రికా స్వేచ్ఛకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం. – వంగల దాలినాయుడు, పార్వతీపురం జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్షుడు ● -
నేటి నుంచి రాష్ట్రస్థాయి ఆహ్వానపు నాటిక పోటీలు
చీపురుపల్లిరూరల్ (గరివిడి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన పు నాటిక పోటీల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. గరివిడి శ్రీరాం హైస్కూల్ వేదికగా నేటి నుంచి మూడు రోజుల పాటు నాటిక పోటీల ప్రదర్శన సాగనుంది. ఈ మేరకు గరివిడి కల్చరల్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిరోజు శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు హైద రాబాద్కు చెందిన విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ వారు ’స్వేచ్ఛ’, హైదరాబాద్కు చెంది న మిత్ర క్రియేషన్స్ వారు ‘ఇది రహదారి కా దు’ అనే నాటికలు ప్రదర్శిస్తారు. మొదటిరోజు జరగనున్న కార్యక్రమంలో సినీనటుడు నారాయణమూర్తి, నరసింహరాజుపాల్గొననున్నారు. -
రైతులను ఆదుకోవడంలో.. కూటమి ప్రభుత్వం విఫలం
భామిని: అకాల వర్షాలు, ఈదురు గాలులకు పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం విఫలమైందని పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. భామిని మండలం కోసలి, కీసర గ్రామా ల్లో ఈదురు గాలులకు దెబ్బతిన్న పంటలను వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి తోట సింహాచలం, వైస్ ఎంపీపీ బోనగడ్డి ధర్మారావు, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు మజ్జి మోహనబాబుతో కలిసి గురువారం పరిశీలించారు. తక్షణమే పంట నష్టాలను అంచనా వేసి పరిహారం చెల్లించాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతిరైతుకు రూ.20 వేలు అందజేయాలని కోరారు. రైతుల సంక్షేమాన్ని చంద్రబాబు ప్రభు త్వం విస్మరించడంపై మండిపడ్డారు. రైతులు ఆరుగాలం శ్రమించి సాగుచేసిన మొక్కజొన్న, రబీ వరి ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోకపోవడం తగదన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు కిల్లారి ఫల్గుణరావు, గెల్లంకి రమేష్, బోడ్డేపల్లి ప్రసాద్, కాగితాపల్లి కృష్ణారావు, కొత్తకోట ఆంజనేయులు, చెంగల ఫల్గుణ, కొరికాన నరశింహం, కార్యకర్తలు పాల్గొన్నారు. కీసర, కోసలిలో పంట నష్టాలు పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కళావతి -
డీఎస్సీ అభ్యర్థుల నిరసన
విజయనగరం గంటస్తంభం: డీఎస్సీ అభ్యర్థులకు వయో పరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని, జిల్లాకు ఒకే పేపర్ విధానం ఉండాలని కోరుతూ డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సీహెచ్ హరీష్ ఆధ్వర్యంలో విజయనగరం కోట కూడలి వద్ద గురువారం ఆందోళన చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం సంవత్సరాల తరబడి నిరుద్యోగులు ఎదురుచూశారన్నారు. పరీక్షకు సిద్ధమయ్యేందుకు కనీసం 90 రోజులు సమయం లేకపోవడం ఆందోళనకు గురవుతున్నామన్నారు. వయోపరిమితి 44 సంవత్సరా లే కావడంతో చాలామంది వయో భారంతో అర్హత కోల్పోతున్నట్టు వెల్లడించారు. ఓపెన్ డిగ్రీలో పాస్ అయిన వారికి కూడా అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో రాము, భాను, ఈశ్వరరావు, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు. -
మీడియాపై నిర్బంధాలు తగవు..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని, పత్రికా స్వేచ్ఛను, భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించని సందర్భాలు ఉత్పన్నమవుతున్నాయి. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిని పోలీసులు చుట్టముట్టడం భావ్యం కాదు. ఇది పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే. ఏదైనా ఉంటే ప్రజాస్వామ్య యుతంగా స్పందించాలి. తమ వైఖరిని పాలకులు, అధికారులు తెలియజేయవచ్చు. అంతేగానీ గృహ నిర్బంధాలు, దాడులు తగవు. రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా పాలకులు, అధికారులు చర్యలు తీసుకోవాలి. – పాలక రంజిత్కుమార్, గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి● -
పత్రికా స్వేచ్ఛపై దాడి అమానుషం
పాలకొండ/ పాలకొండ రూరల్: కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన నాటి నుంచి పలు రకాలుగా పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని పాలకొండ ప్రస్క్లబ్ సభ్యులు ఆరోపించారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై పోలీసుల దాడికి నిరసనగా గురువారం సాయంత్రం పాలకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ బాలమురళీకృష్ణ, గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సభ్యులు యామల ఈశ్వరరావు, రాకోటి కోటి, రాజాన చంటి, వంశీ, కళ్యాణ్, సుబ్బు, తదితరులు పాల్గొన్నారు. హేయమైన చర్య ప్రజల కోసం నిరంతంరం పనిచేసే పత్రికలపై కక్షసాధింపు చర్యలు సమంజసం కాదు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై పోలీసులు ఎటువంటి నోటీసులు లేకుండా దాడి చేయడం సరికాదు. – బత్తుల వెంకటరమణ, పాలకొండ ప్రెస్ క్లబ్ గౌవర సలహాదారు● సాక్షి ఎడిటర్ ఇంటిపై దాడిని ఖండించిన పాలకొండ ప్రెస్ క్లబ్ -
మద్యం మత్తులో ఓ పోలీస్..!
● కారు నడిపి ఆటోను ఢీకొట్టి.. ● ఒకరి మృతికి కారణమై.. ● వాహనం నంబర్ ప్లేట్ మార్చి.. ● నిందితుడిని కాపాడే ప్రయత్నంలో పోలీసులు ● బాధితులకు అండగా సీపీఎం గరుగుబిల్లి/పార్వతీపురం రూరల్: గరుగుబిల్లి మండల పరిధిలోని సీతారాంపురం జంక్షన్లో మంగళవారం సాయంత్రం పోలీస్వాహనం ముందు వెళ్తున్న ఆటోను వెనుకనుంచి ఢీకొట్టడంతో ఉల్లిభద్ర గ్రామానికి చెందిన బి.గణేష్ (42)కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు పార్వతీపురం జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. అయితే ప్రమాదం జరిగిన విషయం బయటకు రాకుండా నిందితుడు తనవంతు ప్రయత్నాలు చేశాడు. సంఘటనలో తీవ్ర గాయాలపాలైన గణేష్ చికిత్సపొందుతూ మృతి చెందడంతో పోలీసులకు బుధవారం సమాచారం అందించగా స్థానిక ఎస్సై కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో వాహనం నడిపిన పోలీసు ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన పోలీసులే నిబంధనలకు విరుద్ధంగా మద్యం తాగి వాహనం నడిపి ఒకరి మృతికి కారణమయ్యారు. జియ్యమ్మవలస మండల పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఎ.ప్రసాద్ డ్యూటీ డ్రెస్లో ఉండి మద్యం తాగి కారు నడిపి ముందు వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టాడు. ఈ విషయమై చినమేరంగి సీఐ టీవీ తిరుపతిరావు వద్ద ప్రస్తావించగా ప్రమాదం జరిగిన సమయంలో కానిస్టేబుల్ ప్రసాద్ మద్యం తాగి ఉన్నాడా? లేదా? అని మెడికల్ టెస్టులు, రక్తపరీక్షలు చేయించామని, తదుపరి చర్యల నిమిత్తం పార్వతీపురం ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డికి నివేదించినట్లు తెలిపారు. నంబర్ ప్లేట్ను మార్చిన పోలీసులు ప్రమాదం జరిగినప్పుడు కారుకు ఓన్బోర్డు ఉన్న నంబర్ ప్లేట్ను బుధవారం ఉదయానికి ట్యాక్సీ నంబర్ ప్లేట్గా (ఎల్లోబోర్డు) మార్చివేశారు. మార్చిన నంబర్ ప్లేటుతోనే కారును గరుగుబిల్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసులు ఇలా నంబర్ ప్లేట్లను మార్చి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని బాధితులకు అన్యాయం చేయడంతో పాటు చట్టాన్ని పక్కదోవ పట్టించేలా వ్యవహరించడంపై ఔరా అంటూ పలువురు ముక్కున వేలు వేసుకుంటున్నారు. బాధితులకు అండగా సీపీఎం మంగళవారం సాయంత్రం ప్రమాదం జరిగినప్పటికీ బుధవారం ఉదయం వరకు కేసు నమోదు చేయకపోవడంపై సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బీవీ రమణ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ మేరకు బుధవారం కేసు నమోదుపై ఎందుకు తాత్సారం చేస్తున్నారని పోలీస్స్టేషన్లో సిబ్బందిని ప్రశ్నించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిందితుడైన కానిస్టేబుల్ను రక్షించేందుకు పోలీసు సిబ్బంది తమ వంతు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆటో డ్రైవర్ మృతి చెందడంతో తప్పనిసరి పరిస్థితిలో కేసును నమోదు చేశారు తప్ప బాధితులకు న్యాయం చేద్దామని కాదన్నారు. ప్రమాదంపై తక్షణం విచారణ నిర్వహించి కానిస్టేబుల్పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, మరణించిన గణేష్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నంబర్ ప్లేట్లు మార్చడం పట్ల, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, రహదారి నిబంధనలు పోలీసులకు వర్తించవని ఈఘటనతో తెలుస్తోందన్నారు. ఈ నిరసనలో సీపీఎం నాయకులు కె. రవీంద్ర, డి.వెంకటనాయుడు, వై.మన్మథరావుతోపాటు పలువురు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బుధవారం సాయంత్రం ఉల్లిభద్ర జంక్షన్ వద్ద ప్రమాదంలో మృతిచెందిన గణేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ మహిళలు, పెద్దలు, యువత పెద్ద ఎత్తున ఆందోళన చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో ట్రాఫిక్కు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. స్థానిక ఎస్సై రమేష్ నాయుడు ధర్నా స్థలానికి వచ్చి బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
ఆరోగ్యంపై కాలుష్యం కాటు..!
సమస్యలివే.. ● మెదడు కుచించుకుపోయి మతిమరుపు వస్తుంది ● రక్తంలో కలిసిన రసాయనాలు మెదడులోని కీలక భాగాలపై ప్రభావం చూపుతాయి. ఫలితంగా నరాలసమస్యతో కాళ్లు, చేతులు పనిచేయని పరిస్థితి ఎదురవుతుంది. కొందరికి పక్షవాతం కూడా రావచ్చు. ● వాసన గ్రహించలేకపోతారు. ● పార్కిన్సన్ (వణుకుడు రోగం) వ్యాధి రావచ్చు ● డిప్రెషన్కు గురవుతుంటారు ● హార్మోన్స్ సక్రమంగా రిలీజ్ కావు ● పిల్లల్లో ఎదుగుదల సమస్య తలెత్తవచ్చు ● ఫిట్స్, మైగ్రేన్, తలనొప్పి రావచ్చు జన్యుపరమైన లోపాలే కాకుండా సమతుల్య ఆహార విధానలేమి, శ్రమలేని జీవన విధానాల వంటి వాటితో పాటు పర్యావరణ సంబంధిత వాహన కాలుష్యం వంటివి కూడా మధుమేహవ్యాధి సంక్రమించడానికి ముఖ్యభూమిక పోషిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.● మెదడుపై తీవ్ర ప్రభావం ● డిప్రెషన్, మతిమరుపు సమస్యలు ● పార్కిన్సన్స్ వచ్చే ఆస్కారం ● జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులురాజాం సిటీ: వాహనాల వినియోగం పెరగడంతో పాటు కాలం చెల్లినవి రోడ్లపై పరుగులు తీస్తుండడంతో అధికంగా కాలుష్యం వెలువడుతోంది. నిత్యం ద్విచక్రవాహనాలపై తిరిగే వారికి వాహన కాలుష్యంతో పాటు మానసిక, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కాలుష్యం కారణంగా రసాయనాలు రక్తంలో కలిసి మెదడుపై ప్రభావం చూపుతాయని పేర్కొంటున్నారు. ఇవి దీర్ఘకాలంలో అనేక దుష్పరిణామాలకు దారి తీస్తాయని వెల్లడిస్తున్నారు. కాలుష్యం కారణంగా సమస్యలకు గురవుతున్న వారిని తరచూ చూస్తున్నామని వైద్యులు తెలియజేస్తున్నారు. అదుపులో ఉండని దీర్ఘకాలిక వ్యాధులు.. కాలుష్య ప్రభావానికి గురయ్యే వ్యక్తుల్లో దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉండవు. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలి. వ్యాధులు అదుపులో లేకపోవడంతో కీలక అవయవాలపై ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు, కిడ్నీల ఫెయిల్యూర్, రక్త ప్రసరణ తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయని వివరిస్తున్నారు.ఏం చేయాలంటే.. ప్రజలు కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను వినియోగిస్తే కాలుష్యం బారిన పడకుండా తగ్గించుకోవచ్చు. ద్విచక్రవాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్తోపాటు సర్జికల్ మాస్క్లాంటిది పెట్టుకుంటే మంచిది కాలం చెల్లిన వాహనాల వినియోగాన్ని నివారించాలి ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై దృష్టి సారించాలి. అలాగే రోడ్ల వెంట విరివిగా మొక్కలు నాటితే కాలుష్య ప్రభావాన్ని కొంతవరకు తగ్గిస్తాయి.మెదడుపై ప్రభావం.. కాలుష్యం మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మెదడులో కీలక భాగాలపై కాలుష్యంలోని రసాయనాలు ప్రభావంచూపి న్యూరోలాజికల్ సమస్యలు తలెత్తవచ్చు. కాలు చేయి పట్టు తప్పడం, బ్రెయిన్స్ట్రోక్, వణుకుడు రోగం వంటివి రావచ్చు. కాలుష్యం బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పట్టణంలో తిరిగేవారు మాస్క్ధరించడం మంచిది. డాక్టర్ కరణం హరిబాబు, సూపరింటెండెంట్, ప్రాంతీయ ఆస్పత్రి, రాజాంమధుమేహం వచ్చే ప్రమాదం..నైట్రోజన్ డయాకై ్సడ్ అధికంగా ఉన్న గాలిని పీల్చేవారు మధుమేహం బారిన పడతారు. గాలిలో 2.5 మైక్రో మీటర్లకన్నా తక్కువ పరిమాణం ఉన్న కాలుష్య పదార్థాలు ఊపిరితిత్తుల ద్వారా శరీరంలో చేరి అక్సిడేటివ్ స్ట్రెస్ను పెంచడమే కాకుండా ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను ప్రేరేపించడం ద్వారా ఇన్సులిన్ నిరోధకతకు కారణమై మధుమేహానికి దారితీస్తాయి. వాహనాల శబ్దకాలుష్యంతో నిద్రలేమి, తీవ్రమైన ఒత్తిడితో హార్మోన్లు, మెటబాలిజం అసమతుల్యతతో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. ఫలితంగా మధుమేహం రావచ్చు. డాక్టర్ ఎం.కోటేశ్వరరావు, ప్రాంతీయ ఆస్పత్రి, రాజాం -
పోలీసుల అదుపులో జ్యూయలరీస్ షాపు యజమాని
విజయనగరం క్రైమ్: స్థానిక గంటస్తంభం వద్ద ఎన్వీఆర్ జ్యూయలరీ షాపును రన్ చేస్తున్న యజమానికి వన్టౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఆ షాపు యజమాని నాగుల కొండ వెంకట కిశోర్పై రెండు ఎన్బీబ్ల్యూ కేసులతో పాటు ఒక ఎన్ఐఏ కేసు నమోదు చేశామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. నిందితుడు గతంలో ఒక మహిళను వేధించాడని అప్పుడే కేసు నమోదైందన్నారు. అలాగే ఒక చెక్బౌన్స్ కేసులో కూడా నిందితుడని చెప్పారు. షాపుకు వచ్చిన కొనుగోలుదారులకు నకిలీ బంగారం ఆశ చూపి డబ్బులు కాజేసేవాడన్న ఫిర్యాదులు కూడా వచ్చాయని సీఐ చెప్పారు. ఈ మేరకు షాపు యజమాని కిశోర్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించినట్లు చెప్పారు. ప్రతిభకు పురస్కారంపార్వతీపురం: సాంఘిక సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సంక్షేమ వసతి గృహాల్లో పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలలో అత్యున్నత ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ మేరకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజేయస్వామి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిలు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పార్వతీపురం సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహంలో 600 మార్కులకుగాను 558 మార్కులు సాధించిన జి.అనితను సన్మానించి ఘనంగా సత్కరించారు. దీనిపై సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారి మహమ్మద్ గయాజుద్దీన్ హర్షం వ్యక్తం చేశారు. గుర్తు తెలియని వ్యక్తి మృతితెర్లాం: తెర్లాం జంక్షన్లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ మేరకు బుధవారం తెర్లాం ఎస్సై సాగర్బాబు మాట్లాడుతూ మృతి చెందిన వ్యక్తి ఆచూకీ తెలియరాలేదన్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని బాడంగి సీహెచ్సీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని తెలిపారు. మాసిపోయిన గడ్డం, గళ్ల లుంగీ కట్టుకుని ఉన్నాడని, సుమారు 65 నుంచి 70ఏళ్ల వయస్సు ఉంటుందని తెలియజేశారు. ఫొటోలో చూసి ఎవరైనా గుర్తుపడితే బాడంగి సీహెచ్సీకి వచ్చి వివరాలు తెలియజేయాలని కోరారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు. కిలో గంజాయితో ఇద్దరి అరెస్టురాజాం సిటీ: మండల పరిధి శ్యాంపురం రోడ్డులో కిలో గంజాయితో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని సీఐ ఉపేంద్రరావు తెలిపారు. బుధవారం శ్యాంపురం రోడ్డులోని అగ్రహారం జంక్షన్ వద్ద ఎస్సై వై.రవికిరణ్కు వచ్చిన సమాచారం మేరకు వాహన తనిఖీలు చేపట్టారు. స్కూటీపై వెళ్తున్న కొఠారిపురం గ్రామానికి చెందిన పంచిరెడ్డి వెంకటరమణ, డోలపేటకు చెందిన పూతిక హరిశంకర్లను తనిఖీ చేయగా వారి స్కూటీలో గంజాయి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదుచేసి రిమాండ్కు తరలించామని రూరల్ సీఐ ఉపేంద్రరావు తెలిపారు. కుక్కకాటుతో లేగదూడ మృతిపాలకొండ రూరల్: మండలంలోని రుద్రిపేటలో కుక్కకాటు కారణంగా లేగదూడ మరణించిందని రైతు ప్రసాదరావు బుధవారం తెలిపాడు. కొద్దిరోజుల క్రితం కుక్కకాటుకు గురైన దూడను వెలగవాడ పశువుల ఆస్పత్రికి తీసుకువెళ్లగా రేబిస్ వ్యాక్సిన్ లేదని వైద్యులు పేర్కొన్నట్లు రైతు వాపోయాడు. రూ.1200 వెచ్చించి బహిరంగ మార్కెట్లో వ్యాక్సిన్ కొనుగోలు చేయాల్సివచ్చిందని, అయినప్పటికీ దూడ మరణించిందన్నాడు. పశువైద్య కేంద్రాల్లో రేబిస్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచడంతో పాటు కుక్కలను నియంత్రించాలని కోరాడు. -
దర్యాప్తు నైపుణ్యం మెరుగుపరచడమే లక్ష్యం
పార్వతీపురం రూరల్: వివిధ కేసులకు సంబంధించిన దర్యాప్తులలో నైపుణ్యాలను మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా పోలీసుశాఖ పనిచేస్తుందని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన పర్యవేక్షణలో ఫోరెన్సిక్ నిపుణులతో వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్లో ఫోరెన్సిక్ నిపుణులతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రభుత్వ వైద్యులు పాల్గొని పలు అంశాలపై వివరించి శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ నేరస్థలం పరిశోధనలో దర్యాప్తు అధికారులు ఆధారాలు సేకరించాల్సిన సమయంలో అందుకు అనుగుణంగా నేరం జరిగిన చోటుకు పోలీసులు ఏవిధంగా రక్షణ కల్పించాలో, అలాగే డీఎన్ఏ, రక్తనమూనాలు, అవయవాలు, వెంట్రుకలు, నార్కోటిక్స్, మత్తు పదార్థాలు, వివిధ రకాల విషపదార్థాలు, ఆడియో, వీడియో, ప్రధానమైన పలు నేరాలు రుజువు చేసేందుకు అవసరమయ్యే అన్ని సాక్ష్యాధారాలను భౌతికంగా ఏ విధంగా సేకరించాలి? అలాగే ప్యాకింగ్, నిల్వ భద్రపరచడం, ల్యాబ్ నుంచి వచ్చే నివేదికను వారంలోనే పొందే విధానం, కోర్టుకు తీసుకువెళ్లే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు వంటి ప్రధానమైన అంశాలపై వర్క్షాప్ జరిగినట్లు ఎస్పీ తెలిపారు. అనంతరం వర్క్షాప్లో పాల్గొన్న ఫోరెన్సిక్ నిపుణులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ వర్క్షాపులో పాలకొండ డీఎస్పీ రాంబాబు, డీసీఆర్బీ సీఐ ఆదాం, సీఐ అప్పారావు, ఫోరెన్సిక్ నిపుణులు ఎం.రాంబాబు, ఎస్.నళిని, వి.ప్రశాంతి, గోపాలకృష్ణతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రభుత్వ వైద్యులు అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న సీఐలు, ఎస్సైలు తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
మలేరియా నిర్మూలనకు ఏసీఎం స్ప్రేచేయాలి
విజయనగరం ఫోర్ట్: మలేరియా నిర్మూలనకు ఇంటిలోపల గోడల మీద ఏసీఎం 5శాతం 9 ఆల్ఫా సైఫర్ మెత్రిన్ స్ప్రే చేయాలని ఇన్చార్జి కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అన్నారు. దీని కోసం జిల్లావ్యాప్తంగా 157 గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. జిల్లాలో అమలు చేయనున్న మలేరియా నిర్మూలన కార్యక్రమంపై వ్యాధి ఎక్కువగా ఉన్న 18 మండలాలకు చెందిన ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, వైద్యాధికారులు, మలేరియా సబ్యూనిట్ అధికారులతో ఆయన బుధవారం తన చాంబర్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మలేరియా వ్యాప్తిని నిరోధించడానికి మొత్తం 22 పీహెచ్సీల పరిధిలోని 157 గ్రామాల్లో రెండు విడతలుగా ఏసీఎం మందును పిచికారీ చేయనున్నట్లు తెలిపారు. గడిచిన నాలుగేళ్ల నివేదికల అధారంగా ప్రతి వెయ్యిమంది జనాభాకు రెండు లేదా అంతకన్నా ఎక్కువ మలేరియా కేసులు నమోదైన గ్రామాలను మలేరియా ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి ఈ కార్యక్రమానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. దీనిలో భాగంగా మే 1నుంచి జూన్ 15 వరకు మొదటి విడత, జూలై ఒకటి నుంచి ఆగస్టు 15 వరకు రెండో విడత ఏసీఎం మందులను పిచికారీ చేయనున్నట్లు తెలిపారు. దీని వల్ల గోడలపై వాలే దోమలు శక్తిని కోల్పోయి క్రమంగా నశించిపోతాయన్నారు. ఇలా మందు పిచికారీ చేసినప్పడు ఆ ఇంటి గోడలపై 10 నుంచి 12 వారాల పాటు ఆ మందు ప్రభావం ఉంటుందని, ఆలోగా గోడలను కడగడం గాని సున్నం వేయడం గాని చేయకూడదని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి సంపూర్ణ సహకారం అవసరమని కోరారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి, డీఎంఓ వై.మణి తదితరులు పాల్గొన్నారు. ఇన్చార్జ్ కలెక్టర్ సేతు మాధవన్ -
చామలాపల్లిలో దారుణ హత్య
శృంగవరపుకోట: భార్య దూరం అయ్యేందుకు కారణమైన వ్యక్తిపై పగబట్టాడు. చివరకు ఆ వ్యక్తిని హత్యచేసి పోలీసులకు లొంగిపోయిన ఘటన ఎస్.కోట మండలం చామలాపల్లిలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్.కోట సీఐ వి.నారాయణమూర్తి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తొత్తడి ప్రసాద్(38), నడుపూరి మురళీకి మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. మురళీ భార్య రెండేళ్లుగా భర్తకు దూరంగా ఇద్దరి కుమార్తెలతో కలిసి పుట్టింట్లో ఉంటోంది. ఇంటికి రావాలని ఇటీవల మురళీ పిలిచినా ఆమె రాలేదు. భార్య తన నుంచి విడిపోవడానికి ప్రసాద్ కారణమని మురళీ భావించాడు. పలుసార్లు ప్రసాద్ను చంపేస్తానంటూ గ్రామస్తుల వద్ద హెచ్చరికలు చేశాడు. అదును కోసం ఎదురు చూశాడు. గ్రామంలోని ఓ ఇంటి వద్ద పెళ్లి సామాన్లు దించుతున్న ప్రసాద్పై కత్తితో దాడిచేశాడు. తల, మెడపై నరకడంతో ప్రసాద్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య చేసిన మురళి ఎస్.కోట పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. హత్యకు కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతుడు తొత్తడి ప్రసాద్ పోలీసులకు లొంగిపోయిన నిందితుడు ప్రాణం తీసిన వివాహేతర సంబంధం! -
నీరేదీ
గురువారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2025అల్లూరి పోరాటం చిరస్మరణీయం తోటపల్ల్లి.. ఆయకట్టుకు తోటపల్లి ప్రాజెక్టు.. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లా రైతులకు సాగునీటి ఆదరువు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పెద్ద ప్రాజెక్టుల్లో ఒకటి. సుమారు రెండు లక్షల ఎకరాల పైబడి ఆయకట్టు ఉంది. ఇంత ప్రాధాన్యమున్న ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం కినుక వహిస్తోంది. గత ప్రభుత్వం తలపెట్టిన కాలువల ఆధునికీకరణ పనుల కొనసాగింపునకు అవసరమైన నిధులు విదల్చకుండా రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఖరీఫ్ సమయం దగ్గరపడుతున్నా కాలువలు, షట్టర్ల పనులు చేసేవారే లేరు. వచ్చే ఖరీఫ్కు 64ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందే పరిస్థితి కనిపించడం లేదు. సాక్షి, పార్వతీపురం మన్యం/పాలకొండ రూరల్: నాగావళి నదిపై నిర్మించిన తోటపల్లి ప్రాజెక్టు ద్వారా 2.13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. మిగులు పనులు, నిర్వహణ లేకపోవడం కారణంగా ఇంకా 64 వేల ఎకరాల వరకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. ప్రధానంగా ఆయకట్టుకు నీరు అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి 34 డిస్ట్రిబ్యూషన్ కాలువలకు 26 పూర్తయ్యాయి. మైనర్, సబ్మైనర్ కాలువల పనులు 73 శాతం అయ్యాయి. మిగులు పనులకు రూ.123 కోట్ల వరకు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం గత వార్షిక బడ్జెట్లో కేవలం రూ.47.80 కోట్లు కేయించింది. గజపతినగరం బ్రాంచి కెనాల్ 44 శాతం పనులే అయ్యాయి. ఆ కాలువ మిగులు పనులు పూర్తి చేయాలంటే కనీసం రూ.211 కోట్లు అవసరం. ఈ నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేస్తేనే శివారు ఆయకట్టుకు నీరందే పరిస్థితి ఉంటుంది. ఆయకట్టుకు అందని సాగునీరు పాలకొండ నియోజకవర్గంలో సాగుకు ప్రధాన నీటి వనరు తోటపల్లి రిజర్వాయర్. దీని పరిధిలో ఎడమ కాలువకు సంబంఽధించి 7, 8 బ్రాంచిల ద్వారా దాదాపు 10 వేలపై చిలుకు ఎకరాలకు సాగునీటి లభ్యత అందించాల్సి ఉందని రైతులు చెబుతున్నారు. ఈ కాలువల పనులు గత ప్రభుత్వంలో యుద్ధ ప్రాతిపదికన జరిగాయి. ముఖ్యంగా వీరఘట్టం, పాలకొండ మండలాల పరిధిలోని 25 గ్రామాల్లో 8,500 ఎకరాల మేర సేద్యం చేపడుతున్న 15వేల మంది రైతులు వరుణుడి కరుణపైనే ఏటా ఆధారపడుతున్నారు. పాలకొండ మండలంలోని పాలకొండ, ఎన్కే రాజపురం, సింగన్నవలస, రుద్రుడుపేట, పరశురాంపురం, వెలగవాడ, లంబూరు, ఓని, వీపీ రాజుపేట, బాసూరు, అర్దలి, పద్మాపురం, వీరఘట్టం మండలంలోని నీలాపురం, తెట్టంగి, వండవ, అడారి, వీరఘట్టం, నడుకూరు.. జియ్యమ్మవలస మండలంలోని పెదబుడ్డిడి, చినబుడ్డిడి తదితర సుమారు 25 గ్రామాలకు సంబంధించి వేలాది ఎకరాల తోటపల్లి ఆయకట్టు భూములకు కొంతకాలంగా సాగునీరు అందడం లేదు. చీపురుపల్లి నియోజకవర్గంలోని ఆయకట్టుదీ ఇదే పరిస్థితి. కాలువల అభివృద్ధి పనులకు నిధులు లేకపోవడంతో పనులు చేయలేకపోతున్నామని అధికారులు సమాధానం ఇస్తున్నారు. వాస్తవానికి ప్రాజెక్టు కాలువల పూర్తి, నిర్వహణ, నిర్వాసితుల పునరావాసం వంటివి పూర్తి కావాలంటే సుమారు రూ.590 కోట్లు కావాలని చెబుతున్నారు. ప్రభుత్వం కేటాయించిన రూ.47 కోట్లు ఉద్యోగులు జీతాలకే సరిపోవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు క్షేత్రస్థాయిలో సేవలందించే లష్కర్ల కొరత ఉంది. 15 మందికి ఇద్దరే సేవలందిస్తున్నారు. న్యూస్రీల్ ఖరీఫ్ సమయం దగ్గరపడుతున్నా ముందుకు సాగని కాలువల ఆధునికీకరణ పనులు పూడుకుపోయిన కాలువలు తవ్వకానికి మిగిలి ఉన్న పిల్లకాలువలు రైతన్నకు తప్పని సాగునీటి తిప్పలు నిధులు విదల్చని కూటమి ప్రభుత్వం ఆవేదనలో రైతాంగం -
నిష్పక్షపాతంగా విచారణ చేపట్టండి
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్: వంగర మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ కరణం సుదర్శనరావుపై హత్యాయత్నం ఘటనకు సంబంధించి లోతైన విచారణ జరిపి, నిందితులను కఠినంగా శిక్షించాలని విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎస్వీ మాధవరెడ్డిని ఆయన బుధవారం కలిశారు. సుదర్శనరావుపై హత్యాయత్నం కేసులో దర్యాప్తు నిర్వహించి బాధ్యులను శిక్షించాలని వినతిపత్రాన్ని అందజేశారు. దాడికి తెర వెనుక ఉన్నవారిని గుర్తించి శిక్షించాలన్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలో ఇటువంటి ఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు గ్రామాల్లో నిరభ్యంతరంగా ప్రజల పక్షాన నిలిచేందుకు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, ప్రజాస్వామ్య బద్ధంగా ప్రభుత్వం నడవాలనే ఉద్దేశంతోనే ఈ ఘటనకు సంబంధించి లోతైన విచారణ జరపాలని ఎస్పీకి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, విజయనగరం ఎస్పీతో కూడా ఫోన్లో మాట్లాడి చర్చించినట్లు చెప్పారు. నిందితులెవరైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. ఎస్పీని కలిసిన వారిలో కరణం సుదుర్శనరావు, అచ్చంనాయుడు, జగన్మోహన్రావు, పార్వతీపురం పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ తదితరులున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దర్యాప్తును త్వరితగతిన చేపట్టి, నిందితులెవరైనా సరే కఠినంగా శిక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేవిధంగా పోలీసుశాఖ సమర్థవంతంగా పనిచేయాలి. ఇప్పటికే రాజాంలోని సుదర్శనరావును కలసి పార్టీ తరఫున మేమంతా ఉన్నామని భరోసాు ఇచ్చాం. – టి.రాజేష్, వైఎస్సార్సీపీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జ్ వంగర వైఎస్సార్సీపీ నేత సుదర్శనరావుపై హత్యాయత్నం దురదృష్టకరం తెరవెనుక ఎవరున్నా సరే.. నిందితులను కఠినంగా శిక్షించాల్సిందే.. జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీకి వినతి -
పీఏసీఎస్ రుణాల్లో.. బినామీల బాగోతం!
వీరఘట్టం పీఏసీఎస్లో ఖాతాదారుల సంఖ్య: 3,014 మంది వీరికి ఇచ్చిన రుణాలు: రూ.29.25 కోట్లు ఇంత వరకు రెన్యువల్స్ అయిన రుణాలు: రూ.15.75 కోట్లు ఓ రైతుకు రుణం వాడినట్టు తెలియదు.. ఆసలు ఆయన రుణం కోసం ఏనాడూ పీఏసీఎస్ మెట్లు ఎక్కలేదు. ఖాతా ఉన్నట్టు కూడా తెలియదు. కానీ ఆయన పేరిట రూ.లక్షపైబడి రుణం తీసుకున్నట్టు రికార్డుల్లో ఉంది. మరో రైతు చనిపోయి మూడేళ్లవుతోంది. ఆయన పేరిట రుణం వాడేశారు. ఇంకో వ్యక్తికి సెంటు భూమికూడా లేదు. ఆయన పేరిట రుణం తీసుకున్నట్టు రికార్డుల్లో ఉంది. వీరఘట్టం పీఏసీఎస్ లావాదేవీలన్నీ కంప్యూటరీకరణ కావడంతో బినామీల బాగోతం వెలుగులోకి వస్తున్నాయి. వీరఘట్టం: ● వీరఘట్టం పీఏసీఎస్లో వ్యవసాయ రుణం తీసుకున్న మాణిక్యం సాంబమూర్తి మూడేళ్ల కిందట చనిపోయారు. గతంలో ఈయన తీసుకున్న రుణం ఇప్పుడు వడ్డీతో కలిపి రూ.43,445లు తీర్చాలని పీఏసీఎస్ అధికారులు వారికి ఇటీవల నోటీసు ఇచ్చారు. ● శంకరాపు నర్సమ్మ రెండేళ్ల కిందట చనిపోయింది. ఆమె పేరిట రూ.89,247 రుణం మంజూరైనట్టు ఉంది. ● గుమ్మడి పకీరు నాయుడు ఐదేళ్ల కిందట చనిపోయారు. ఆయన పేరిట రూ.14,900 రుణ బకాయి ఉంది. ● గొర్లె వరాలమ్మ రెండేళ్ల కిందట చనిపోయింది. ఆమె పేరిట రూ.1,19,878 రుణం ఉంది. ఇలా సుమారు 300కు పైగా మృతి చెందిన వారి పేరిట రుణాలు తీసుకున్నట్టు ఆధారాలు ఉన్నాయి. మరి ఈ రుణాలు ఎవరు తీసుకున్నారు, వీటిని ఎవరు చెల్లిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రుణాలు తీసుకున్నట్టే తెలియదట... వీరఘట్టం పీఏసీఎస్లో కొప్పర అప్పలస్వామి పేరిట రూ.1,10,414 రుణం తీసుకున్నట్టు రికార్డుల్లో ఉంది. వాస్తవానికి ఆయన రుణం తీసుకోలేదని చెబుతున్నాడు. అలాగే, ఉదయాన వెంకటరావు పేరిట రూ.91,733లు, డర్రు నర్మమ్మ– రూ.17,944లు, వడంకి గోపి రూ.1,18,989లు, నల్ల రమణ రూ.90,397లు, వాన నాగభూషణరావు రూ.37,346లు, అల్లు వెంకటనాయుడు రూ.38,124లు, అల్లు లక్ష్మునాయుడు రూ.44,913లు, అలజంగి శ్రీనివాసరావు రూ.1,08,091లు, తాండ్రోతు నారంనాయుడు రూ.1,21,752లు, శంకరాపు లక్ష్మి రూ.1,23,024లు రుణం తీసుకున్నట్టు రికార్డుల్లో నమోదై ఉంది. పీఏసీఎస్లో తాము రుణాలు తీసుకోలేదని, తమ పేరిట ఎవరు తీసుకున్నారని ఎదురు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి వందల సంఖ్యలో రైతుల పేరిట బినామీలు రుణాలు వాడినట్టు సమాచారం. రుణాలు చెల్లించాలంటూ పీఏసీఎస్ సిబ్బంది నోటీసులు ఇస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ ప్రమేయం లేకుండా రుణాలు ఎలా మంజూరు చేశారని ఎదురు ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక పీఏసీఎస్లో పనిచేసిన వ్యక్తి హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఆయనే బినామీల పేరిట రుణాలు తీసుకున్నట్టు సమాచారం. పీఏసీఎస్ల లావాదేవీలన్నీ కంప్యూటరీకరణ చేస్తుండడంతో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఇదీ పరిస్థితి.... వీరఘట్టం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో 5,100 మంది రైతులు హక్కుదారులుగా ఉన్నారు. వీరిలో 3,104 మంది రైతులు సుమారు రూ.29.25 కోట్లు రుణాలు పొందినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఈ ఏడాది ఇంత వరకు రూ.15.75 కోట్లు రుణాలు రెన్యువల్ అయ్యాయి. 1250 మంది రైతులపేరిట ఉన్న రూ.13.50 కోట్ల రుణాలు రెన్యువల్కావాల్సి ఉంది. రుణాలు తీసుకున్న రైతుల్లో చాలామంది చనిపోవడం, కొందరికి తమ పేరిట రుణం ఉందన్న విషయం తెలియకపోవడం సమస్యగా మారింది. రూ.13.50 కోట్లు రుణాల ఎవరి పేరిట ఉన్నాయో వారిని కట్టమని అధికారులు నోటీసులు ఇస్తున్నారు. ఈ విషయం బయటకు రానీయకుండా రైతుల పేరిట రుణాలు తీసుకున్న బినామీలు ఆపసోపాలు పడుతున్నారు. అధికారులు ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేపడితే బినామీల బాగోతం బయటపడుతుందని రైతులు చెబుతున్నారు. వడ్డీ చెల్లించాలని నోటీసులు ఇస్తున్నాం ఏపీసీఎల్లో రుణాలు తీసుకుని వడ్డీలు కట్టని రైతులకు నోటీసులు ఇస్తున్నాం. నోటీసులు ఇస్తుంటే అసలు విషయం బయట పడుతోంది. ఏపీసీఎస్లో కంప్యూటరీకరణ కావడంతో అసలైన రైతులు ఎవరనేది స్పష్టమైంది. రుణాల వసూళ్లకు చర్యలు తీసుకుంటాం. – జి.మధుసూదనరావు,స్పెషల్ ఆఫీసర్,పి.ఎ.సి.ఎస్,వీరఘట్టం. వీరఘట్టం పీఏసీఎస్లో చనిపోయిన వారి పేరిట వ్యవసాయరుణాలు భూములు లేని వారికి వ్యవసాయ రుణాలు కంప్యూటరీకరణతో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు రుణాలు కట్టనివారికి నోటీసులు -
ఇచ్చిన హామీని నెరవేర్చాలి
సాలూరు: అధికారంలోకి వస్తే జీఓ 3ను పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు సంధ్యారాణి, నారా లోకేశ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర డిమాండ్ చేశారు. పట్టణంలోని తన స్వగృహంలో స్థానిక విలేకరులతో బుధవారం మాట్లాడారు. గతంలో సాలూరు మండలం జగ్గుదొరవలసలో షెడ్యూల్ గ్రామాల ప్రకటన కోసం గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టిన సమయంలో సంధ్యారాణి, భంజ్దేవ్లు షెడ్యూల్ గ్రామాల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ మేరకు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ దినోత్సవం రోజున జీఓ 3 పునరుద్ధరిస్తామని సీఎం, మంత్రి చెప్పిన విషయం గిరిజనులందరికీ గుర్తుందన్నారు. ఇటీవల జీఓ 3 రద్దుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే కారణమంటూ సంధ్యారాణి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. 2014–2019 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జీఓ 3 రద్దు కోరుతూ చేబ్రోలు లీలాప్రసాద్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని గుర్తుచేశారు. అప్పటి ప్రభుత్వం సరైన న్యాయవాదులను ఏర్పాటుచేసి జీఓపై పర్యవేక్షించకపోవడంతో తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసిందన్నారు. కోవిడ్ సమయంలో ఆ తీర్పును సుప్రీంకోర్టు వెలువరించిందని, వెంటనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసినట్టు వెల్లడించారు. ఈ నెల 8న క్యాబినెట్లో చర్చించి జీఓ 3ను పునరుద్ధరణకు ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేయాలని కోరారు. మంత్రి అబద్ధాలను ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. జీఓ3ను పునరుద్ధరించాలి మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర -
మలేరియా నివారణ మందులు లేవా ?
గుమ్మలక్ష్మీపురం: మలేరియా జ్వరం బారిన పడినవారికి అవసరమైన మందులు ప్రభుత్వాస్పత్రుల్లో లేకపోవడం రోగులను ఆవేదనకు గురిచేస్తోంది. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది. ప్రజారోగ్యాన్ని ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జ్వరంతో బాధపడుతున్న ఓ చిన్నారిని వైద్యం కోసం గుమ్మలక్ష్మీపురం మండలంలోని దుడ్డుఖల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఈ నెల 5న కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించి మలేరియా జ్వరంగా గుర్తించారు. జ్వరం తగ్గేందుకు అవసరమైన మందులు ఆస్పత్రిలో లేవని చెబుతూ ఓపీ చీటీ వెనుక మందులు రాసి మెడికల్ స్టోర్కు వెళ్లి కొనుక్కోవాలంటూ తిప్పిపంపించారు. సమాచారం తెలుసుకున్న వైస్ ఎంపీపీ నిమ్మక లక్ష్మణరావు స్పందిస్తూ.. జబ్బు చేస్తే మందులు ప్రైవేటు మెడికల్ సోర్కు వెళ్లి కొనుక్కుంటే ప్రభుత్వాస్పత్రి ఉండేది ఎందుకని.. గిరిజన ప్రజలకు ఇలాగేనా వైద్య సేవలు అందించేదంటూ మండిపడ్డారు. అవసరమైన మందుల సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పుబట్టారు. ప్రజలపై విద్యుత్ చార్జీల భారం అన్యాయం ● మాజీ ఎమ్మెల్యే కళావతి వీరఘట్టం: అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని కళ్లబొల్లి మాటలతో ప్రజలను మోసగించిన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రజలపై విద్యుత్చార్జీల భారం మోపడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. వండువ గ్రామంలో మీడియాతో ఆమె మంగళవారం మాట్లాడారు. రాష్ట్ర ప్రజల విద్యుత్ అవసరాల కోసం గత వైఎస్సార్సీపీ ప్రభు త్వం యూనిట్ రూ.2.49 చొప్పున ఏడువేల మెగావాట్ల విద్యుత్ను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసిందన్నారు. నేటి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యూనిట్ విద్యుత్ను రూ.4.60లు చొప్పున కొనుగోలు చేసేందుకు యాక్సెస్తో చేసుకున్న ఒప్పందంతో ప్రజలపై అదనంగా రూ.400 కోట్ల భారం పడుతోందన్నారు. గత ప్రభుత్వం సెకీతో యూనిట్ ధర రూ.2.49కు ఒప్పందం చేసుకుంటే కూటమి నాయకులు గగ్గోలు పెట్టారని, రాష్ట్రం దివాలా తీస్తోందంటూ నానా యాగీ చేశారని, ఇప్పుడు చంద్రబాబునాయుడు అదే విద్యుత్ను యూనిట్కు రూ. 4.60లు చెల్లించేలా 25 ఏళ్ల ఒప్పందం చేసుకుంటే... రాష్ట్రాన్ని ఉద్దరించినట్లా అని ప్రశ్నించారు. సీఎం అనాలోచిత చర్యల వల్ల ప్రజలపై మరో పాతికేళ్లు విద్యుత్ భారం పడుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రజలు అడుగుతుంటే రాష్ట్ర ఖజానా ఖాళీ అంటూ ప్రతిసభలో సమాధానం చెబుతున్న ముఖ్యమంత్రి ఎవరిని ఉద్దరించడానికి ఇంత ప్రజాధనాన్ని విద్యుత్ కొనుగోలు పేరిట దుబారా చేస్తున్నారో చెప్పాలన్నారు. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాడుతుందన్నారు. పోలమ్మ తల్లిని దర్శించిన రాజన్నదొరమక్కువ: మండలంలోని గోపాలపురం గ్రామదేవత కోన పోలమ్మ తల్లిని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర మంగళవారం దర్శించుకున్నారు. గ్రామదేవత పండగను పురస్కరించుకుని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర, జెడ్పీటీసీ మావుడి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మావుడి రంగునాయుడు గ్రామానికి చేరుకోవడంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. కోనపోలమ్మ తల్లిని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దండి శ్రీనివాసరావు, తదితర నాయకులు పాల్గొన్నారు. -
పార్వతీపురంలో తాగునీటి కష్టాలు
పార్వతీపురం పట్టణంలో తాగునీటి కష్టాలకు గూడ్స్షెడ్ రోడ్డులో మంగళవారం కనిపించిన ఈ చిత్రమే నిలువెత్తు సాక్ష్యం. పట్టణంలోని పలు ప్రాంతాలకు నాలుగు రోజులకు ఒకసారి తాగునీరు విడిచిపెడుతున్నారు. శివారు కాలనీల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. తాగునీటి సమస్యను పరిష్కరిస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నేతలను నిలదీద్దామంటే కనిపించడంలేదని మహిళలు చెబుతున్నారు. బిందెడు నీటికోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నామంటూ వాపోతున్నారు. – పార్వతీపురం టౌన్ -
‘తోటపల్లి’ నీరిచ్చేది ఎప్పుడు ‘బాబూ’?
పాలకొండ: తోటపల్లి ప్రాజెక్టు నుంచి పాలకొండ, వీరఘట్టం, జియ్యమ్మవలస మండలాల్లో 8,550 ఎకరాలకు సాగునీరు అందడం లేదు.. బుడ్డిడి వద్ద సైఫూన్ పాడైపోయినా పట్టించుకోవడం లేదు.. కాలువల అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించాలన్న రైతుల విన్నపాన్ని ప్రభుత్వం విస్మరించింది.. పైసా నిధులు విదల్చలేదు.. ఈ ఏడాది ఖరీఫ్కు కూడా వరి పంటకు సాగునీరు అందే పరిస్థితి లేదంటూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. ప్రభుత్వం స్పందించి తోటపల్లి కాలువలను బాగుచేయాలని కోరుతూ పాలకొండ కోటదుర్గమ్మ ఆలయం నుంచి సబ్కలెక్టర్ కార్యాలయం వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయం ఏవో సావిత్రికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బంటు దాస్, సంఘ ప్రతినిధులు కండాపు ప్రసాదరావు, ఇ.సింహద్రి, గంగుల శ్రీనివాసరావు, సోమశేఖర్, రవి, గౌరినాయుడు, రౌతు సోముబాబు, సింహాచలం, తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు ధర్నాకు మద్దతు తెలిపారు. కాలువలను బాగుచేయాలంటూ రైతుల ధర్నా -
సమ్మెబాటలో చిరుద్యోగులు
డీఐఓ కార్యాలయంలో సమ్మెనోటీసు అందజేస్తున్న ఆశ వర్కర్లు పార్వతీపురంటౌన్: కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేయాలని, చిరుద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని, ఆప్కాస్ విధానం రద్దు చేస్తామన్న ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కార్మిక, కర్షక వర్గాలు మండిపడుతున్నాయి. మున్సిపల్, ఆశ వర్కర్లు సైతం సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 20న దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా అధికారులకు మంగళవారం నోటీసులు అందజేశారు. -
బుధవారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2025
–8లోడిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన.. గ్రామీణ ప్రజలకు వైద్యసేవలు అందించడంలో సీహెచ్వోలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత నెల 28వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదు. మా డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం చేస్తాం. – సీహెచ్ జగదీష్కుమార్, సీహెచ్వో, బాలగుడబ, పార్వతీపురం మండలం బకాయిలు విడుదల చేయాలి ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని అడుగుతున్నాం. ప్రతి నెలా జీతంతో పాటు ఇన్సెంటివ్ అందజేయాలి. పెండింగ్ ఇన్సెంటివ్, ఇతర బిల్లుల బకాయిలు వెంటనే చెల్లించాలి. అద్దెలు కూడా ఇవ్వకపోవడంతో మా సొంత డబ్బులు చెల్లిస్తున్నాం. – ఎస్.పవిత్ర, సీహెచ్వో, చిట్టిపూడివలస, వీరఘట్టం మండలం గత్యంతరం లేకనే... జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాలనే ప్రధానమైన డిమాండ్లతో సమ్మెకుదిగాం. తొలుత శాంతియుతంగానే నిరసన చేపట్టాం. ఫలితం లేకపోవడంతో నిరవధిక సమ్మె చేపట్టాం. – కె.కోటి, సీహెచ్వో, దోనుబాయి, సీతంపేట మండలం మా పట్ల నిర్లక్ష్యం ఎందుకు? మారుమూల గ్రామ ప్రజలకు వైద్య సేవలందిస్తున్న మా పట్ల ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం ఎందుకు?. ప్రభుత్వపరంగా ఏ సర్వే చేపట్టాలన్నా సమయంతో సంబంధం లేకుండా పని చేస్తున్నాం. రోగులను గుర్తిస్తున్నాం. గ్రామాల్లో వైద్యసేవలుపరంగా కీలకంగా ఉంటున్నాం. ప్రభుత్వం మా సేవలను గుర్తించి, న్యాయం చేయాలి. – జె.శాంతి, సీహెచ్వో, బందలుప్పి, పార్వతీపురం మండలం సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్: గ్రామీణ పేదల వైద్యం పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. సకాలంలో వైద్యసేవలందకుండా ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తోంది. వైద్య సిబ్బంది న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. గ్రామీణులకు వైద్యాన్ని చేరువ చేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు.. నేడు ఎండనక, వాననక హక్కుల సాధన కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. ఫలితం.. వీరు ప్రతిరోజూ అందించే వైద్యసేవలు మరుగన పడ్డాయి. పల్లె ముంగిటకు వైద్యం అందని పరిస్థితి నెలకొంది. వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 10 రోజులుగా సమ్మె బాట.. గత ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్ (సబ్సెంటర్లు)లలో 14 రకాల వైద్య సేవలతో పాటు 105 రకాల మందులు అందుబాటులో తెచ్చింది. స్థానికంగానే నాణ్యమైన వైద్యం అందించాలన్న సంకల్పంతో విలేజ్ హెల్త్ క్లినిక్లకు పురుడుపోసింది. ధనవంతులకే పరిమితమైన ఫ్యామిలీ డాక్టర్ సేవలను పల్లె ప్రజలకు చేరువచేసింది. హెల్త్ క్లినిక్లకు ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పేదలకు అందిస్తున్న వైద్య వ్యవస్థలను సర్వనాశనం చేసింది. ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే.. విజయనగరంలో 456 మంది, పార్వతీపురం మన్యంలో 280 మంది సీహెచ్ఓలుగా పని చేస్తున్నారు. ఎన్హెచ్ఎం పథకం కింద 2018లో వీరు కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకమయ్యారు. అందరూ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసినవారే. మొదట్లో వీరికి రూ.24,800 వేతనంతో పాటు.. ఇన్సెంటివ్ రూ.15 వేల వరకు వచ్చేది. పీఎఫ్ కూడా అమలయ్యేది. కూటమి ప్రభుత్వం వచ్చాక.. ఇన్సెంటివ్ను రూ.7,500కు పరిమితం చేశారు. ఇది ఏ ప్రాతిపదికన ఇస్తున్నారో కూడా తెలియదు. పీఎఫ్ కూడా అమలు చేయడం మానేశారు. ఎన్హెచ్ఎంలో పని చేసే అన్ని విభాగాలకూ జీతం పెరిగినా.. వీరికి నేటికీ విధుల్లో తీసుకున్నప్పుడు ఇచ్చిన మొత్తమే అందుతోంది. సబ్ సెంటర్లలో వీరితోపాటు ఏఎన్ఎం, ఆశ, సీహెచ్డబ్ల్యూ ఉంటారు. చాలాచోట్ల కనీస వసతులు లేని గదుల్లోనే కేంద్రాలను నడుపుతున్నారు. భవనాల అద్దెకు కూడా ప్రభుత్వం కొంతకాలంగా నిధులు విడుదల చేయకపోవడంతో సీహెచ్వోలే తమ జేబుల్లో నుంచి తీసిస్తున్నారు. కేంద్రం నిర్వహణకు కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదు. సీహెచ్వోల మానవహారం పార్వతీపురంటౌన్: పంచాయతీ పరిధిలో ప్రజలకు ఆరోగ్యసేవలందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఆర్థిక, ఆర్థికేత సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఆందోళన చేశారు. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలో మానవహారం నిర్వహించారు. సీహెచ్వోలందరూ కాంట్రాక్టు ఉద్యోగులని, విధుల నుంచి తొలగిస్తామంటూ ఏపీ ఆరోగ్యశాఖమంత్రి సత్యకుమార్ యాదవ్ బెదిరింపులను ఖండించారు. వెంటనే వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని సీహెచ్వోల సంఘం జనరల్ సెక్రటరీ టి.ఇంద్రాణి హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు జగదీష్, సెక్రెటరీ కె.శిరీష, కోశాధికారి రాజేశ్వరి, జాకబ్ మెంబర్స్ యువకాంత్ యశ్వంత్, 250 మంది సీహెచ్వోలు పాల్గొన్నారు. మానహారంగా ఏర్పడిన సీహెచ్వోలు న్యూస్రీల్వీరి డిమాండ్లు ఏంటంటే... వీరికిస్తున్న వేతనం పెంచాలని అడుగుతున్నారు. పీఎఫ్ను పునరుద్ధరించాలని కోరుతున్నారు. ఆరేళ్లు దాటి సర్వీసు ఉన్న వారి సేవలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్ ఇన్సెంటివ్, అద్దెలు, బిల్లుల బకాయిలు చెల్లించాలి. బదిలీలకు అవకాశం కల్పించాలి. తమ జాబ్ చార్ట్ ఏమిటో స్పష్టం చేయాలన్న ప్రధాన డిమాండ్లతో గత నెల 28 నుంచి విధులను బహిష్కరించి, కలెక్టరేట్ వద్ద నిరసనలు చేపడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. డిమాండ్ల సాధన కోసం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల నిరసన గ్రామాల్లో స్తంభించిన వైద్యసేవలు పట్టించుకోని ప్రభుత్వం వైద్యసేవలపై ప్రభావం.. సీహెచ్వోలు సబ్ సెంటర్లలో ఓపీ చూస్తారు. వైద్యసేవలపరంగా ప్రభుత్వం నుంచి ఏ సర్వే చేపట్టాలన్నా వీరే ముందుండాలి. యాంటినేటల్ సర్వీసెస్ నిర్వహిస్తారు. గర్భిణులకు మూడో నెల నుంచి ప్రసవం అయ్యే వరకు.. ఆ తర్వాత కూడా నిరంతర పర్యవేక్షణ చేస్తారు. ఇటీవల కాలంలో మాతాశిశు మరణాలు తగ్గుముఖం పట్టాయంటే కారణం వీరు అందిస్తున్న సేవలే. మంచాలకే పరిమితమైన రోగులకు ఇళ్ల వద్దకే వెళ్లి వైద్యం అందిస్తారు. టీబీ, హెచ్ఐవీ రోగులకు కూడా సేవలందిస్తున్నారు. ప్రతి నెలా వైద్యశిబిరాల నిర్వహణతోపాటు, 104 వాహనాలతోనూ వెళ్లి గ్రామీణులకు సేవలు. టెలీ మెడిసన్ సర్వీసెస్ అందిస్తారు. ఫోన్లోనే రోగులకు ట్రీట్మెంట్కు సంబంధించిన సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల సందర్శన చేసి పిల్లలను పరీక్షిస్తారు. ఎత్తుకు తగ్గ బరువు, రక్తహీనత, ఇతర ఆరోగ్య రుగ్మతలను గుర్తించి, అవసరమైన వారికి మెడికల్ ఆఫీసరు వద్దకు రిఫర్ చేస్తారు. గ్రామాల్లోని ఇంటింటికీ వెళ్లి వృద్ధులకు, రోగులకు టీబీ, మధుమేహం పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించి, అవసరమైన మందులు ఇవ్వడం కేన్సర్ పేషెంట్లను, యుక్త వయస్సు గర్భిణులను గుర్తించడం, ఎన్సీడీ సర్వే, సికిల్సెల్ పరీక్షల నిర్వహణ ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించడం, వారు వడదెబ్బ బారిన పడకుండా తగిన సలహాలు ఇవ్వడం గ్రామాల్లో అపరిశుభ్ర వాతావరణం ఉంటే ఫొటోలు తీసి, సచివాలయ సిబ్బందికి పంపించడం ఇలా వివిధ రకాల సేవలందిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలపరంగా సీహెచ్వోలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. పేరుకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకే విధులైనప్పటికీ.. సమయంలో సంబంధం లేకుండా ఒక్కోసారి 24 గంటలూ పని చేయాల్సి వస్తోంది. వీరి సమ్మెతో ప్రస్తుతం ఈ సేవలన్నీ నిలిచిపోయాయి. -
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
● డీఆర్ఓ హేమలత ● పీజీఆర్ఎస్కు 98 వినతులుపార్వతీపురంటౌన్: ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ఆర్జీల పరిష్కారమే ధ్యేయంగా జిల్లా అధికారులు పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, పరిష్కారంలో అర్జీలు రీ ఓపెన్ కారాదని అధికారులను కోరారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ డా.పి.ధర్మచంద్రారెడ్డి భాగస్వామ్యమై 98 మంది అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని, నాణ్యత గల ఎండార్స్ మెంట్ అందజేయాలని అధికారులకు సూచించారు. చట్టపరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలి పార్వతీపురం రూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులపై చట్టపరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఫిర్యాదులకు సంబంధించి పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ శాఖ కార్యాలయానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి స్వయంగా స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఫిర్యాదులు వాస్తవాలైతే చట్టపరమైన చర్యలతో పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ సిబ్బందికి ఎస్పీ ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదులలో ప్రధానంగా కుటుంబ కలహాలు, భర్త, అత్తారింటి వేధింపులు, భూ ఆస్తి వివాదాలు, సైబర్ మోసాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీల వసూలు, ప్రేమ పేరుతో మోసాలపై పలు ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించి అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు మొత్తం 14 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో డీసీఆర్బీ ఎస్సైలు ఫకృద్దీన్, జగదీష్నాయుడు తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 26 వినతులు సీతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 26 వినతులు వచ్చాయి. దబర పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని ప్రసాదరావు తదితరులు కోరారు. మేడఒబ్బంగి, కొండాడ గ్రామాలకు తాగునీటి సమస్య పరిష్కరించాలని అక్కడి గిరిజనులు అర్జీ ఇచ్చారు. సెల్టవర్ నిర్మించాలని లాడ గ్రామస్తులు కోరారు. ఆర్ఓఎఫ్ ఆర్ భూములు సర్వే చేసి పట్టాలు ఇప్పించాలని పొగడవెల్లి గ్రామస్తులు విన్నవించారు. అంబలిగండి నుంచి కుంబి గ్రామానికి రహదారి నిర్మించాలని ఆయా ప్రాంతాల గిరిజనులు కోరారు. కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. -
23.400 కేజీల గంజాయి పట్టివేత
కొత్తవలస: ఒడిశా రాష్ట్రం నుంచి అరకు, విశాఖపట్నం మీదుగా హైదరాబాద్కు కారులో 23 కేజీల,400 గ్రాముల గంజాయి తరలిస్తుండగా కొత్తవలస పోలీసులు మండలంలోని మంగళపాలెం జంక్షన్ సమీపంలో సోమవారం పట్టుకున్నారు. దీనికి సంబంధించి సీఐ షణ్ముఖరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గంజాయి కారులో తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఎస్సై మన్మథరావు తన సిబ్బందితో మంగళపాలెం జంక్షన్ వద్ద మాటు వేశారు. దీంతో ముందుగా పల్సర్ బండిపై ఒక వ్యక్తి వెళ్తుండగా పోలీసులు అనుమానం వచ్చి ఆపగా బైక్ అక్కడే వదిలేసి తప్పించుకుని పారిపోయాడు. ఈ దృశ్యాన్ని వెనుక ఫిఫ్ట్ డిజైర్ కారులో వస్తున్న వారు గమనించి కారు ఆపి పారిపోయేందుకు ప్రయత్నించగా అనుమానం వచ్చిన పోలీసులు కారులో గల ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేసి గంజాయి ఉన్నట్లు గుర్తించారు. కారు నాలుగు డోర్ల పై కవర్లు విప్పి అందులో 23 కేజీల,4వందల గ్రాముల గంజాయిని 48 ప్యాకెట్లుగా విభజించి దాచి యథావిధిగా డోర్స్ కవర్లు వేసి ఉండడం గమనించారు. దీంతో నిందితులను, కారును పోలీస్స్టేషన్కు తరలించి తహసీల్దార్ బి.నీలకంఠరావు సమక్షంలో కారు డోర్లు తెరిచి అందులో గల గంజాయిని వెలుపలకు తీశారు. శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆముధాలవలస మండలం పెద్దచెర్ల గ్రామానికి చెందిన పాలవలస జనార్దన్, పాలవలస రాంబాబులుగా నిందితులను గుర్తించారు. వారిని విచారణ చేయగా ఒడిశా రాష్ట్రంలో కొనుగోలు చేసి హైద్రాబాద్కు కారులో తరలిస్తున్నట్లు అంగీకరించారు. నిందితులను అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు సీఐ వివరించారు. పాచిపెంటలో 127 కేజీలు.. పాచిపెంట: కారులో అక్రమంగా తరలిస్తున్న 127 కేజీల గంజాయిని పాచిపెంట పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సాలూరు రూరల్ సీఐ రామ కృష్ణ సోమవారం పాచిపెంట పోలీస్స్టేషన్లో విలేకరులకు వెల్లడించారు. మండలంలోని పద్మాపురం జంక్షన్లో సోమవారం మధ్యాహ్నం అనుమానస్పదంగా ఓ కారు ఆగి ఉండడాన్ని గమనించిన స్థానిక వీఆర్వో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై వెంకట సురేష్ సిబ్బందితో వెళ్లి కారును పరిశీలించి, అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించి స్థానిక రెవెన్యూ అధికారుల సమక్షంలో తూనిక వేసి స్వాధీనం చేసకుని కేసు నమోదు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. -
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లుండాలి
విజయనగరం అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు సరిపడే విధంగా ఉపాధ్యాయ పోస్టులను క్రమబద్ధీకరించాలని ఏపీటీఎఫ్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మండల కేంద్రాల్లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా సోమవారం విజయనగరం మండల కేంద్రం ఎదుట సంఘం క్యార్యకర్తలు ధర్నా చేపట్టారు. ప్రతి ప్రాథమిక పాఠశాలకు రెండు టీచర్ పోస్టులకు తప్పనిసరి చేయాలని కోరారు. ప్రతి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు, పీడీ పోస్టులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్నత పాఠశాలల్లో 45 మంది విద్యార్ధులు దాటిన చోట రెండవ సెక్షన్ ఇవ్వాలని కోరారు. 12వ పీఆర్సీ వేసి ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న మూడు డీఏలు తక్షణమే విడుదల చేయాలని పేర్కొన్నారు. అనంతరం వినతిపత్రాన్ని మండల అధికారికి అందజేశారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్తేరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు బంకురు జోగినాయుడు, రాష్ట్ర కౌన్సిల్ కర్రి రవి, పీవీప్రసాద్, మజ్జి రమేష్, గురుమూర్తి, మర్రాపు శ్రీనివాసరావు, తిరుమలరెడ్డి శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, సంపూర్ణలత, పి.లత, కె.శ్రీనివాసన్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా కమిటీ డిమాండ్ -
సంతృప్తి చెందేలా వినతుల పరిష్కారం
విజయనగరం అర్బన్: ప్రజావినతుల పరిష్కార వేదికకు వచ్చే వినతులకు అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ సేతు మాధవన్ అన్నారు. ప్రధానంగా ఆడిట్ టీమ్ రిమార్కుల్లో సంతృప్తి చెందినట్లు రాయాలన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఅర్ఎస్లో ఇన్చార్జ్ కలెక్టర్ ప్రజల నుంచి వినతుల స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ పెండింగ్ వినతులు లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 177 వినతులు అందాయి. ఇన్చార్జ్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్వో శ్రీనివాసమూర్తి, ఆర్డీవో కీర్తి, డిప్యూటీ కలెక్టర్లు మురళి, ప్రమీల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వర్షాల పట్ల అప్రమత్తం రెండు రోజుల పాటు జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక, మున్సిపల్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇన్చార్జ్ కలెక్టర్ ఆదేశించారు. తగు జాగ్రత్తలు తీసుకుంటూ నష్టాలు సంభవిస్తే వెంటనే తెలియజేయాలని సూచించారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 32 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: స్థానిక డీపీఓలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 32 ఫిర్యాదులను ఎస్పీ వకుల్ జిందల్, ఏఎస్పీ సౌమ్యలత స్వీకరించారు. ఫిర్యాదుల్లో భూ తగాదాలు 15,, కుటుంబ కలహాలు3, మోసాలు3 ఇతర సమస్యలకు సంబంధించి 11 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులపై ఫిర్యాదు దారుల ముందే సంబంధిత స్టేషన్ హౌస్ఆఫీసర్లతో ఎస్పీ చర్చించారు. ఫిర్యాదుల పట్ల సానుకూలంగా సిబ్బంది స్పందించాలని సూచించారు. ఫిర్యాదులోని అంశాలను నిశితంగా పరిశీలించి అందులో వాస్తవాలను అవసరమైతే క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించాలని సిబ్బందిని ఆదేవించారు. ఫిర్యాదులను వారం రోజుల్లో పరిష్కరించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు లీలారావు, చౌదరి, డీసీఆర్బీ సీఐ సుధాకర్, ఎస్సై రాజేష్ పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ సేతు మాధవన్ పీజీఆర్ఎస్కు 177 వినతులు -
అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి
సీతానగరం: మండలంలోని బల్లకృష్ణాపురం గ్రామంలో సోమవారం ఉదయం బొత్స రమణమ్మ (75) అనే వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. దీనిపై పార్వతీపురం సీఐ గోవిందరావు తెలిపిన వివరాల ప్రకారం రమణమ్మ గ్రామంలోని తన నివాసంలో గెడ్డలుప్పి గ్రామానికి చెందిన తన కుమార్తు సొంగల లక్ష్మితో కలిసి ఉంటోంది. ఆదివారం రాత్రి ఎలుకలు, చిన్న ఇల్లు అని వేరొకరి ఇంట్లో నిద్రించడానికి మృతురాలి కుమార్తె వెళ్లింది. ఆ రాత్రి ఇంట్లో ఒంటరిగా రమణమ్మ నిద్రించింది. సోమవారం తెల్లవారుజామున లక్ష్మి ఇంటికి వచ్చి తల్లి రమణమ్మను లేపేందుకు చూడగా విగతజీవిగా పడి ఉండడం గమనించి భోరున కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి గ్రహించారు. రమణమ్మకు మెడనొప్పి నివారణ కోసం మెడకు బెల్టు కట్టుకుని నిద్రించే అలవాటు ఉంది. తన తల్లిది సాధారణ మరణం అని కుమార్తె లక్ష్మి తొలుత భావించింది. అయితే మృతురాలిపై చీర వేయడం నిమిత్తం ఇంట్లో ఉన్న బీరువా దగ్గరికి వెళ్లి తెరవగానే అందులో ఉండాల్సిన బంగారు ఆభరణాలు, డబ్బులు కనిపించక పోవడంతో ఆందోళన చెందింది. తమ ఇంట్లో దొంగలు పడి బంగారం ఆభరణాలు డబ్బులు చోరీ చేసి తల్లిని హత్య చేసి ఉంటారనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సంఘటనాస్థలానికి సీఐ గోవిందరావు ఆధ్వర్యంలో ఇన్చార్జ్ ఎస్సై నీలకంఠం, సిబ్బంది చేరుకుని క్లూస్టీమ్, గాగ్స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించి కేసునమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. రమణమ్మ మృతదేహాన్ని పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి ఇద్దరు కుమారులు విశాఖపట్నం, హైదరాబాద్లో ఉంటారు. -
కొఠియా సమస్యపై ముఖ్యమంత్రి,గవర్నర్లతో మాట్లాడాలి
విజయనగరం గంటస్తంభం: ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు గ్రామాలైన వివాదాస్పద కొఠియా గిరిజనులను ఒడిశా అధికారులు, పోలీసులు ఇబ్బందులు పెడుతున్న తీరుపై ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల గవర్నర్లతోను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో మాట్లాడి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకర్రావును విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ కోరారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా పరిషత్ అతిథిగృహంలో చైర్మన్తో సమావేశమై కొఠియా వివాదాస్పద గ్రామాల్లో జరుగుతున్న పరి ణామాలపై చర్చించారు. గడిచిన 55 సంవత్సరా లుగా రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో 21గ్రామాల్లో 6 పంచాయతీల్లో వివాదం ఉందని వివరించారు. కార్యక్రమంలో పౌరవేదిక ప్రతినిధులు పిడకల ప్రభాకరరావు, తాడేపల్లి నాగేశ్వరరావు, తుమ్మగంటి రామ్మోహన్ రావు, థాట్రాజు రాజారావు, తి రుపతిరావు, గోపాలరావు, ప్రధాన కార్యదర్శి జ లంత్రి రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్కు వినతిపత్రం -
మూగజీవాల సంరక్షణకు సమష్టిగా కృషి చేయాలి
చీపురుపల్లి: మూగజీవాల సంరక్షణకు సమష్టిగా కృషి చేయాలని ఆర్డీఓ జీవీ.సత్యవాణి అన్నారు. ఈ మేరకు స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం సాయంత్రం డివిజిన్ స్థాయి జంతు సంక్షేమ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జంతు సంక్షేమ చట్టం ప్రకారం పశువుల అక్రమ రవాణా చేయకూడదని హితవు పలికారు. అక్రమ రవాణా, జంతుబలులు తదితర సంఘటనలు జరగకుండా సంబంధిత శాఖల నేతృత్వంలో పర్యవేక్షణ పెంచాలని స్పష్టం చేశారు. దేవాలయాలకు రెండు వందల మీటర్ల సమీపంలో ఎలాంటి జంతుబలులు జరగకూడదని చెప్పారు. పశువుల అక్రమ రవాణాపై పోలీస్ శాఖ పటిష్ట నిఘా అమలు చేయాలని సూచించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమాఖ్య ముద్రించిన క్యాలెండర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎస్.రాఘవులు, సీఐ జి.శంకరరావు, పశుసంవర్థకశాఖ డిప్యూటీ డైరెక్టర్ దామోదరరావు, ఎ.డి ఆర్.శారద, రాజాం మున్సిపల్ కమిషనర్ జె.రాములప్పనాయుడు, ఆర్డీఓ కార్యాలయం ఏఓ ఈశ్వరమ్మ, అన్ని మండలాల అధికారులు పాల్గొన్నారు. ఆర్డీఓ సత్యవాణి -
9న పార్వతీపురంలో జాబ్మేళా
● జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య పార్వతీపురం టౌన్: పార్వతీపురం భాస్కర్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 9వ తేదీ ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, ఏదైనా డిగ్రీ చదువుకొని 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు గల నిరుద్యోగ యువతీ యువకులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. 12 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై అర్హత కలిగిన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారన్నారు. ఆసక్తి కలిగిన యువతీయువకులు తమ వివరాలను హెచ్టీటీపీఎస్://నైపుణ్యం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో నమోదుచేసుకుని, రిఫరెన్స్ నంబర్తోపాటు బయోడేటా, ఆధార్కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్, జెరాక్స్, ఒక పాస్ఫొటోతో ఉదయం 9 గంటలకు డ్రైవ్ జరిగే ప్రదేశంలో హాజరుకావాలని కోరారు. ఇతర వివరాలకు సెల్: 91772 97528, 94947 77553 నంబర్లను సంప్రదించాలన్నారు. -
నేడు ఈసెట్, ఐసెట్ రేపు
విజయనగరం అర్బన్: జిల్లాలో ఏపీ ఈసెట్–2025 ప్రవేశ పరీక్ష మంగళవారం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 2,184 మంది అధ్యర్థుల కోసం ఐదు కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. రాజాం జీఎంఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల, సీతం ఇంజినీరింగ్ కళాశాల, లెండి ఇంజినీరింగ్ కళాశాల, అంతి ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. అలాగే ఈ నెల 7వ తేదీన ఏపీ ఐసెట్–2025 ప్రవేశ పరీక్షను నిర్వహించడానికి జిల్లాలోని మూడు కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఈ పరీక్ష రాస్తున్న 1,548 మంది అభ్యర్థుల కోసం రాజాం జీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల, గాజులరేగ ఐయాన్ డిజిటల్ జోన్, ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం, మధ్యాహ్నం షిఫ్టులుగా ఈ పరీక్ష జరుగుతుంది.విద్యార్థికి ల్యాప్టాప్ అందజేతపార్వతీపురంటౌన్: సాలూరు మండలం, శివరాంపురం గ్రామానికి చెందిన విభిన్న ప్రతిభావంతుడు అల్లు.ఉదయ్ కిరణ్కు వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా సుమారు రూ: 33 వేల విలువైన ల్యాప్టాప్ను ప్రత్యేక ఉప కలెక్టర్ డా.పి.ధర్మారెడ్డి సోమవారం పీజీఆర్ఎస్. సమావేశ మందిరంలో అందజేశారు. కడప జిల్లా డా.వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్, ఫైన్ఆర్ట్స్ యూనివర్సిటీలో మూడవ సంవత్సరం పెయింటింగ్లో డిగ్రీ చదువుతున్న ఉదయ్కిరణ్ మూగ, చెవుడుతో బాధపడుతూ విద్యనభ్యసిస్తున్నాడు. తన చదువుకు, ఉపాధికి ల్యాప్ టాప్ మంజూరు చేయాలని కోరగా, ఆ విద్యార్థికి సోమవారం ల్యాప్టాప్ను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీరామమూర్తి, వికలాంగుల సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్ రమణ తదితరులు పాల్గొన్నారు.గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిభోగాపురం: భోగాపురం జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని సోమవారం ఉదయం ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భోగాపురం గ్రామానికి చెందిన దుబ్బక సంతోష్ (37) వ్యవసాయ పనులు చేసుకుంటు కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం వేకువజామున జాతీయ రహదారి పక్కనే ఉన్న పొలానికి వెళ్లాడు. బహిర్భూమికని చెప్పి పొలంలో నుంచి జాతీయ రహదారికి అవతలి వైపు వెళ్లెందుకు రోడ్డు దాటుతుండగా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో డివైడర్పై ఉన్న మొక్కల పొదల్లో పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి తండ్రి అప్పన్న, తల్లి ఈశ్వరమ్మ ఉన్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సుందరపేట సీహెచ్సీకి తరలించారు. మృతుని తండ్రి అప్పన్న ఫిర్యాదు మేరకు కేసు నమాదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సూర్యకుమారి తెలిపారు. రెండు పూరిళ్లు దగ్ధంగరుగుబిల్లి: మండలంలోని ఉల్లిభద్రలో సోమవారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన జక్కువ కంచమ్మ, ముడుదాపు నాగభూషణకు చెందిన పూరిళ్లు కాలిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న విలువైన సామగ్రి అగ్నికి ఆహుతైంది. కట్టుబట్టలతో బాధితులు అగ్నిప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ మేరకు సమాచారం తెలుసుకున్న వీఆర్ఓ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకుని నివేదికను తహసీల్దార్కు సమర్పించారు. -
సతి పదవి.. పతికి దండన!
సాక్షి, పార్వతీపురం మన్యం: ●మక్కువ మండలం మక్కువ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఒంటి రామలక్ష్మి.. రెండు రోజుల కిందట సామాజిక మాధ్యమాల వేదికగా పెట్టిన ఓ సంక్షిప్త సందేశం చర్చనీయాంశంగా మారింది. ఆమె వల్ల మక్కువ గ్రామ పంచాయతీ అభివృద్ధి ఆగిపోయిందంటూ కూటమి నాయకులు దుష్ప్రచారానికి దిగా రు. పనులకు పంచాయతీ తీర్మానం ఇవ్వడం లేదంటూ ఊరంతా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. దీంతోపాటు.. ఆమె భర్త ఒంటి మోహనరావునూ ఇబ్బందులు పెట్టడం ప్రారంభించారు. ‘సర్పంచ్ను నేను. నా భర్త కాదు. అభివృద్ధి పనులను ఎవరూ అడ్డుకోరు. ఏదైనా సమస్య ఉంటే తనతో చర్చించాలి. మా గ్రామం, పంచాయతీ అభివృద్ధి చెందాలని నేనూ కోరుకుంటున్నా. రాజకీయాలను రాజకీయాల్లానే చూడాల’ని ఆమె వివరణ ఇచ్చుకోవడం కూటమి నాయకుల వేధింపులకు అద్దం పడుతోంది. ●పాచిపెంట మండలం మోసూరు ఎస్సీ సర్పంచ్ గండిపల్లి చంటిపై కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయి. ఆమెతోపాటు.. భర్త రామును కూడా మాససికంగా హింసించడం ప్రారంభించారు. ఇటీవల దాదాపు 25 సంవత్సరాలుగా వారి సాగులో ఉన్న భూమిని స్వాధీనం చేసుకోవాలని.. మరో వ్యక్తితో సర్పంచ్ భర్తపై అధికారులకు ఫిర్యాదు చేయించారు. దీనిపై రెవెన్యూ అధికారులు సర్వేకు రాగా.. సర్పంచ్ భర్త రాము అడ్డుకున్నారని.. స్థానిక వీఆర్వోతో పోలీసు కేసు నమోదు చేయించారు. ఇదంతా ఒక దళిత సర్పంచ్ను వేధించాలన్న ఉద్దేశంతో పథకం ప్రకారమే జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రజలతో ఎన్నికై న గ్రామ ప్రథమ పౌరులకు కూటమి పాలనలో అవమానాలు, వేధింపులు తప్పడం లేదు. జిల్లాలోని 450 పంచాయతీల్లో అధిక శాతం సర్పంచ్లు వైఎస్సార్సీపీ వారే కావడం.. అందులోనూ మహిళలదే అగ్రభాగం అవ్వడంతో అధికార పార్టీ నాయకులు విషం చిమ్ముతున్నారు. మహిళా సర్పంచ్లే లక్ష్యంగా వేధింపులు పాల్పడుతున్నారు. నయానో భయానో కూటమి పార్టీలోకి కలిపేసేందామన్న వ్యూహంతో సర్పంచ్ల భర్తలను టార్గెట్ చేశారు. వారిపై అక్రమంగా కేసులు పెట్టడం.. వేధించడం.. చిరుద్యోగులైతే విధుల నుంచి తప్పించడం... దాదాపు పది నెలలుగా జిల్లాలో సాగుతున్న తంతు.. కూటమి నేతల కర్ర పెత్తనమిదీ! చేసేది.. చేస్తున్నది వారే అయినా! ప్రభుత్వపరంగా చేపట్టిన ఏ పనికై నా పంచాయతీలో సర్పంచ్ తీర్మానం ఉండాలి. ప్రస్తుతం కూటమి పాలనలో అందుకు భిన్నంగా సాగుతోంది. మెజారిటీ ప్రజాప్రతినిధులు వైఎస్సార్సీపీ వారే కావడంతో కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. పంచాయతీలపై పెత్తనం కోసం అర్రులు చాచుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు వారిని పిలవడం సరికదా.. సర్పంచ్లకు తెలియకుండానే వివిధ అభివృద్ధి పనులు చేయించేసుకుంటున్నారు. కొద్దిరోజుల కిందట చేపట్టిన పల్లె పండగ పనులకు వైఎస్సార్సీపీ సర్పంచ్లను పిలవకపోవడం ఇందులో భాగమే. దీనికితోడు గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులను సైతం రద్దు చేయిస్తున్నారు. సాలూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో 29 గిరిశిఖర పంచాయతీలకు రహదారులు మంజూరైతే.. ఆ పనులన్నింటినీ రద్దు చేయించారు. సాలూరు మండలం బోరబందలోనూ, పురోహితునివలసలోనూ మంజూరైన అభివృద్ధి పనులను రద్దు చేయించారు. ఏమీ ఎరగనట్లు గ్రామాల అభివృద్ధికి వైఎస్సార్సీపీ సర్పంచ్లు అడ్డు తగులుతున్నారని ప్రచారం చేయిస్తున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ప్రధానంగా మహిళా సర్పంచ్ల భర్తలను కూడా లాగుతూ మానసికంగా వేధిస్తున్నారు. పంచాయతీ ప్రథమ పౌరులపై ‘పచ్చ’ పెత్తనం కూటమి ప్రభుత్వంలో మహిళా సర్పంచ్లకు వేధింపులు వారి భర్తలకూ శిక్ష.. చిరుద్యోగాల నుంచి నిర్థ్ధాక్షిణ్యంగా తొలగింపు పంచాయతీ తీర్మానాలు లేకుండానే పనులు ప్రజాస్వామ్యం ఖూనీ పాచిపెంట మండలం కేసలి పంచాయతీ మహిళా సర్పంచ్ భర్త ఉపాధిహామీ క్షేత్ర సహాయకునిగా చాలా ఏళ్ల నుంచి పని చేస్తున్నారు. ఈ పంచాయతీని ఎలాగైనా కై వసం చేసుకుందామన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సర్పంచ్పై వేధింపులు ఆరంభమయ్యాయి. వారి దారిలోకి రాలేదన్న అక్కసుతో సర్పంచ్ భర్తను క్షేత్ర సహాయకుని విధుల నుంచి తొలగించారు. కొమరాడ మండలం కోటిపాం పంచాయతీలో గోశాల కోసం ఓ మహిళా సర్పంచ్ సంతకాన్నే టీడీపీ నాయకుడు ఫోర్జరీ చేశాడు. దీనిపై ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. -
పట్టాలు ఇప్పించండి సారూ..!
పార్వతీపురంటౌన్: గడిచిన 60ఏళ్లుగా చేస్తున్న వ్యవసాయ భూములకు సంబంఽధించి పట్టాలు ఇప్పించాలని వీరఘట్టం మండలం శాంతిగూడ, గదబవలస, జడగూడ, సింధునగరం, పెద్దూరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఆవరణలో నిరసన తెలియజేసి డీఆర్ఓ హేమలతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ పూర్వీకులనుంచి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని, ఫారెస్టు అధికారులు తమ భూములు ఖాళీ చేయాలని చెబుతున్నారని వాపోయారు. ప్రభుత్వం తమపై దయఉంచి ఈ భూములకు సంబంధించి పోడు పట్టాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఆస్తమా..అలక్ష్యం..అంతే..!
విజయనగరం ఫోర్ట్: ఆస్తమా (ఉబ్బసం) వ్యాధి పిల్లలతో పాటు పెద్దలకు వ్యాప్తి చెందుతుంది. వ్యాధి పట్ల అలసత్వం వహిస్తే మృత్యువాత పడే ప్రమాదం ఉంది. జన్యుపరంగా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అయితే పొగతాగేవారికి ఆస్తమా ఉంటే వ్యాధి మరింత తీవ్రమవుతుంది. మంగళవారం ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆస్తమా బాల్యదశలో కూడా చిన్నారులకు వ్యాప్తి చెందుతుంది. దీన్ని వాడుక భాషలో పాల ఉబ్బస అంటారు. ఈ వ్యాధి సోకితే మనిషిని కుదురుగా ఉండనీయదు. ముఖ్యంగా చలికాలంలో ఈవ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వేసవిలో కాస్త ప్రశాంతంగా ఉంటారు. వేసవిలో కూడా ఆస్తమా ఉన్నవారు చల్లటి నీరు తాగితే వ్యాధి తీవ్రం అవుతుంది. సైన్సైటిస్, ఇస్నోఫిలీయో ఆస్తమాగా మార్పు సైనసైటిస్, ఇస్నోఫిలియో, ఫుడ్ఎలర్జీ, డస్ట్ఎలర్జీ క్రమేణా ఆస్తమాగా మారుతాయి. ఈ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు పాటిస్తే ఆస్తమా బారిన పడకుండా ఉంటారు. నిర్లక్ష్యం చేస్తే వ్యాధి బారిన పడతారు. చలికాలంలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చలికాలంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. జిల్లాలో 800 నుంచి 1000 కేసుల నమోదు జిల్లా వ్యాప్తంగా నెలలో 800 నుంచి 1000 వరకు కేసులు నమోదవుతున్నాయి. సర్వజన ఆస్పత్రిలో నెలకు 200 నుంచి 300 మంది ఆస్తమా రోగులు చికిత్స కోసం వస్తున్నారు.సొంతంగా మందులు వాడకూడదు ఆస్తమా లక్షణాలు ఉన్న వారు మెడికల్ షాపుల్లోను, ఆర్ఎంపీల వద్ద మందులు కొనుగోలు చేసి వేసుకుంటారు. ఇలా చేయడం వల్ల తాత్కాలికంగా తగ్గినప్పటికీ వ్యాధి తీవ్రమవుతుంది. ఆస్తమా లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలో ఉన్న పలమనాలజిస్ట్ను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. ఇన్హేలర్స్ వాడడం ద్వారా వ్యాధి అదుపులోకి వస్తుంది. – డాక్టర్ బొత్స సంతోష్కుమార్, పలమనాలజిస్ట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి జిల్లాలో నెలకు 800 నుంచి 1000 వరకు కేసుల నమోదు సకాలంలో చికిత్స చేసుకోకపోతే మృత్యువాత పడే ప్రమాదం నేడు ప్రపంచ ఆస్తమా దినోత్సవంవ్యాధి లక్షణాలు ఆయాసంగా ఉండడం పిల్లికూతలు రావడం చాతీ భారంగా ఉండడం కఫం ఎక్కువగా ఊరుతుండడం ఊబకాయం వల్ల కూడా అస్తమా వస్తుంది గర్భిణుల్లోనూ ఆస్తమా వచ్చే అవకాశం వ్యాధి తీవ్రమైతే మృత్యువాతపడే ఆస్కారం వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పలమనాలజిస్ట్ను కలిసి చికిత్స చేయించుకోవాలి. వ్యాధి తీవ్రమైతే శ్వాసవ్యవస్థ ఆగిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాల ప్రకారం రోజుకు 100మంది ఆస్తమాతో ప్రాణాలు వదులుతున్నారు. -
ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి
మక్కువ: మండలంలోని ఎ.వెంకంపేట గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం వేతనదారులు సోమవారం ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. గ్రామం నుంచి ఆటోలు, ట్రాక్టర్లతో ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకొని ఏపీఓ ఈశ్వరమ్మను నిలదీశారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న మేట్లను కాదని, కొత్తగా పనికి వస్తున్న 60 ఏళ్లు పైబడిన వ్యక్తితో పాటు మరికొంతమందికి మెట్లుగా లాగిన్ ఇవ్వడంపై అభ్యంతరం తెలిపారు. ఏకగ్రీవ తీర్మానంతో ఎన్నుకున్న మేట్లను కాదని కొత్తవారికి మస్తర్లు వేసేందుకు లాగిన్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటని ఏపీఓను ప్రశ్నించారు. అవగాహన లేని వారికి లాగిన్ ఇవ్వడంతో నష్టపో తున్నామన్నారు. కష్టపడి పని చేసినప్పటికీ మస్తర్లు సక్రమంగా వేయడంలేదన్నారు. తనే స్వయంగా వచ్చి మస్తర్లు వేస్తానని ఏపీఓ తెలిపినా వేతనదారులు ససేమిరా అన్నారు. ఎంపీడీఓ డి.డి.స్వరూపరాణిను కలిసి సమస్యను వివరించారు. ఏపీఓ కావాలని తాము ఎంపిక చేసిన మేట్లను కాదని కొత్తవారికి లాగిన్ ఇచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు తెలిపారు. దీనిపై ఎంపీడీఓ స్పందిస్తూ తీర్మాన పత్రాలు పరిశీలించి, నిబంధనల ప్రకారం రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వేతనదారులు వెనుదిరిగారు. పాత మేట్లకు బదులు కొత్త మేట్లకు లాగిన్ ఇవ్వడంపై ఉపాధి హామీ వేతనదారుల ఆందోళన ఏపీఓ ఈశ్వరమ్మను నిలదీత సమస్య పరిష్కరిస్తామన్న ఎంపీడీఓ హామీతో ఆందోళన విరమణ -
ప్రైవేటు పాఠశాలల సమస్యలపై వినతి
బొండపల్లి: ప్రైవేటు పాఠశాలల సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరుతూ ఏపీ ప్రైవే టు స్కూళ్ల యాజమాన్యం సంఘం (అప్సా) ఆధ్వర్యంలో గజపతినగరం నియోజకవర్గ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్య ప్రతినిధులు ఎంఈఓ శోభారాణి, ఎంఈఓ–2 అల్లు వెంకటరమణకి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫారం– 1 లో ప్రైవేటు స్కూళ్లకు సంబంధించిన అన్ని వివరాలను ఆన్లైన్ చేయాలని ప్రభుత్వం నిబంధన విధించిందని, ఈ నిర్ణయం వల్ల స్కూళ్ల యాజమాన్యానికి తీవ్ర సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ఈనిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఇప్పటికే విద్యాశాఖ మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశామని గుర్తు చేశారు. ప్రభుత్వంతో చర్చలు కూడా జరుగుతున్నాయ ని తెలిపారు. పకడ్బందీగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పార్వతీపురంటౌన్: జిల్లాలో ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత సంబంధిత అధికారులను కోరారు. పరీక్షల నిర్వహణపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి డి.మంజులవీణతో కలిసి సోమవారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఒకేషనల్, జనరల్ గ్రూపుల నుంచి 4,914 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్టు చెప్పారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకెండియర్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. డి.మంజులవీణ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఇంటర్ పరీక్షల్లో జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారని, దీనికి కృషిచేసిన ప్రతి అధికారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజన విద్యార్థులకే అధిక సీట్లు
● కోర్సులపై అవగాహన సదస్సులు నిర్వహించాలి ● ఎస్టీ కమిషనర్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు విజయనగరం అర్బన్: కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయంలో అందుబాటులో ఉన్న వివిధ కోర్సుల్లో గిరిజన విద్యార్థులకు అధిక సీట్లు కేటాయించాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు అన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సంబంధిత చట్టంలో మార్పులు తీసుకురావాల్సి ఉందన్నారు. ఈ విషయమై ఎస్టీ కమిషన్ తరఫున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పారు. అలాగే యూనివర్సిటీలో అందిస్తున్న కోర్సులపై గిరిజన యువతకు అవగాహన కల్పించాలని సూచించారు. విజయనగరంలోని గాజులరేగ ప్రాంతంలో ఉన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వైస్ చాన్స్లర్ టీవీ కట్టిమణి, ఇతర అధికారులు, అధ్యాపకులతో సమావేశమై గిరిజనుల అభివృద్ధిలో యూనివర్సిటీ నిర్వహిస్తున్న పాత్ర, అందిస్తున్న కోర్సులపై సమీక్షించారు. యూనివర్సిటీ నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. అంతకుముందు వీసీ, తదితరులు శంకరరావును సత్కరించారు. పనుల పురోగతిపై ఆరా.. దత్తిరాజేరు/విజయనగరం అర్బన్: మెంటాడ మండలం కుంటినవలస వద్ద చేపడుతున్న గిరిజన విశ్వవిద్యాలయం శాశ్వత క్యాంపస్ నిర్మాణ పనులను ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడుతూ.. పనుల పురోగతిపై ఆరా తీశారు. 561 ఎకరాలలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని.. భూములు ఇచ్చిన రైతులకు రూ. 61.06 కోట్లు, అప్రోచ్ రోడ్డుకు రూ. 16 కోట్లు.. సబ్స్టేషన్ నిర్మాణానికి రూ. 48.61 కోట్లు కేటాయించినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. జాతీయ రహదారి నుంచి విశ్వవిద్యాలయ క్యాంపస్కు చేరుకునేందుకు అనుసంధాన రోడ్డు పూర్తి కావాల్సి ఉందని చెప్పారు. భవన నిర్మాణాలు త్వరతిగతిన పూర్తిచేసి వీలైనంత త్వరగా శాశ్వత భవనాలను అందుబాటులోకి తీసుకువస్తామని చైర్మన్కు వివరించారు. పరిశీలనలో బొబ్బిలి ఆర్డీఓ రామ్మోహనరావు, యూనివర్సిటీ ఏఓ సూర్యనారాయణ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జెడ్పీ అతిథి గృహంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, విజయనగరం ఆర్డీఓ కీర్తి, తదితరులు ఎస్టీ కమిషన్ చైర్మన్ను కలసి గిరిజన విశ్వవిద్యాలయంలో వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేపడుతున్న చర్యలను వివరించారు. -
బొబ్బిలిలో జిల్లా స్థాయి టేబుల్టెన్నిస్ పోటీలు
బొబ్బిలి: పట్టణంలోని సంస్థానం ఉన్నత పాఠశాల ఏవీ హాలులో సోమవారం జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో జూనియర్ విభాగంలో బి.హర్షిత్, బి.అభినయ కార్తీక్లు విన్నర్, రన్నర్లుగా, సీనియర్ విభాగంలో బి.ధనుంజయ్, టి.సత్యనారాయణలు విన్నర్, రన్నర్లుగా నిలిచా రని పీడీ వెంకటనాయుడు తెలిపారు. సాఫ్ట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ విజయ్, బాల్బ్యాడ్మింటన్ సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఏబీసీ నాయుడు, రాజీవ్, అరుణ్కుమార్, జలగం శ్రీనివాస్ ప్రభాకర్, హెచ్ఎం సునీత తదితరులు పాల్గొని విజేతలకు మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. -
కార్మికుల కంటకన్నీరు..!
● జ్యూట్ ఫ్యాక్టరీ తెరిపించరా అంటూ వేడుకోలు ● ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరిన కార్మికులపై మంత్రి ఆగ్రహం ● అపాయింట్మెంట్ లేకుండా ఎలా వస్తారంటూ మండిపాటు ● విస్తుపోయిన కార్మికులు, నాయకులుసాలూరు: పట్టణంలో శ్యామలాంబ పండుగ 15 ఏళ్ల తరువాత జరుగుతున్న నేపధ్యంలో ప్రజలందరూ పండగను ఘనంగా జరుపుకునేందుకు బంధువులకు పిలుపులు పెడుతూ సరదాగా పండగను చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాగా పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న జీగిరాం జ్యూట్ ఫ్యాక్టరీలో పనిచేసి, ఫ్యాక్టరీ మూతపడిన నేపథ్యంలో పట్టణంలో, మండలంలోని జీగిరాంతో పాటు పలు గ్రామాల్లో కార్మికుల పరిస్థితి దారుణంగా మారిన చిత్రాలు హృదయాలను కలిచివేస్తున్నాయి.నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చిన ప్రస్తుత మంత్రి సంధ్యారాణి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఆ దిశగా అడుగులు వేస్తున్న దాఖలాలు లేకపోవడంతో కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టికున్న కార్మికుల కలలు కల్లలుగా మారిపోయాయి. అంతేకాదు ఇటీవల తమ గోడును వెళ్లబుచ్చుకుని ఫ్యాక్టరీ తెరిపిస్తామని నాడు ఎన్నికల సమయంలో హామీలిచ్చిన ప్రస్తుత మంత్రులు నారా లోకేష్, సంధ్యారాణిలకు ఆ హామీని అమలుచేయాలని కోరేందుకు ఇటీవల పలువురు జీగిరాం జ్యూట్ ఫ్యాక్టరీ కార్మికులు, నాయకులు మంత్రి సంధ్యారాణి ఇంటికి వెళ్లగా ,మంత్రి నుంచి వచ్చిన స్పందన చూసి కంగుతిన్నారు. అసలు అపాయింట్మెంట్ లేకుండా ఎలా వస్తారంటూ మంత్రి ఎదురు ప్రశ్నించడంతో సదరు కార్మిక సంఘం నాయకులకు గొంతులో పచ్చివెలక్కాయ పడిన పరిస్థితి ఎదురైంది. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా నేడు మంత్రిగా మరోలా మారిన ఆమె తీరుపై కార్మికులు,నాయకులు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. ఫ్యాక్టరీ తెరిపించేందుకు కృషిచేసిన రాజన్నదొర ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందంటూ గత ప్రభుత్వం హయాంలో ఫ్యాక్టరీ యజమానులు లాకౌట్ విధించగా, నాడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాజన్నదొర ఫ్యాక్టరీని తెరిపించి కార్మికులకు మేలు చేసేందుకు శతవిధాలుగా కృషిచేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఫ్యాక్టరీ యజమానులు, కార్మిక నాయకులతో కలిసి చర్చలు జరిపించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి. తరువాత ఎన్నికలు వచ్చిన క్రమంలో ఫ్యాక్టరీ తెరవాలంటూ కార్మికులు వద్ద ధర్నా చేపట్టగా నాడు సంధ్యారాణి వెళ్లి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చారు. నారా లోకేష్ సాలూరు పట్టణంలో ఎన్నికల సమయంలో నిర్వహించిన యువగళం సమావేశంలోను ఈ ఫ్యాక్టరీ తెరిపించి కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. హామిలిచ్చిన ఇద్దరు నేతలు నేడు మంత్రులుగా ఉండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు సంవత్సరం సమీపిస్తున్నా ఆ దిశగా అడుగులు పడకపోవడంతో కార్మికులు ఉసూరుమంటున్నారు. వలసబాట పట్టిన కార్మికులు 1986లో ప్రారంభించిన ఈ ఫ్యాక్టరీలో వేలాది మంది కార్మికులు పనిచే శారు. ఫ్యాక్టరీ మూతబడడంతో వారంతా రోడ్డునపడ్డారు. కుటుంబపోషణ కష్టంగా మారడంతో కార్మికులు పొట్టకూటి కోసం వలసబాట పట్టారు. పలువురు ఏలూరు, రాజాంలతో పాటు వేరే రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారు. కొందరు పట్టణంలో పండ్ల దుకాణాలు, టిఫిన్ దుకాణాల్లో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శ్యామలాంబ పండుగ జరగనుందని దూరప్రాంతాలకు పనులకు వెళ్లిన కార్మికులకు తెలియడంతో, ఫ్యాక్టరీ తెరిచి ఉండి ఉంటే అక్కడే పనిచేసుకుంటూ, కుటుంబాలతో ఘనంగా పండుగ చేసుకునే పరిస్థితి ఉండేదని బాధపడుతున్నారు. ఎన్నికల ముందు, ఎన్నికల్లోను ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చిన నేతలు, పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న ఏకై క ఈ జూట్ ఫ్యాక్టరీని తెరిపించాలని కోరుతున్నారు. కాగా పక్కనున్న విజయనగరం జిల్లాలో ఫ్యాక్టరీలు పునఃప్రారంభమవుతుండగా ఈ జిల్లాలో ఆ దిశగా అడుగులు పడకపోవడం గమనార్హం.ఇచ్చిన హామీని మంత్రి నిలబెట్టుకోవాలి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీగిరాం జ్యూట్ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చిన మంత్రి సంధ్యారాణి ఆ హామీని నిలబెట్టుకుని ఫ్యాక్టరీని తెరిపించాలి. ఈ ఫ్యాక్టరీపై ఆధారపడిన వేలాది మంది కార్మికులు నేడు పొట్ట చేతపట్టుకుని వేర్వేరు రాష్ట్రాలకు వలసవెళ్లిపోయారు. ఫ్యాక్టరీ తెరిపించేందుకు మంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. –ఎన్వైనాయుడు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి -
పోలీసు శాఖలో.. ఇష్టారీతిన బదిలీలు
సోమవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2025అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పోలీసు సిబ్బంది సాక్షి, పార్వతీపురం మన్యం : జిల్లా పోలీస్ శాఖలో జరిగిన బదిలీలపై సొంత సిబ్బంది నుంచే అసంతృప్తి వ్యక్తమవుతోంది. బదిలీలు పారదర్శకంగా నిర్వహించలేదని.. కనీసం ఎవరికి ఏ స్థానం కావాలో అనే ఆప్షన్ కూడా ఇవ్వలేదని చెబుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 74 మంది పోలీసు సిబ్బందికి ఈ నెల 3వ తేదీన సాధారణ బదిలీల్లో భాగంగా స్థాన చలనం కలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో నలుగురు ఏఎస్సైలు, 24 మంది హెచ్సీలు, 46 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. మన్యం జిల్లాలో వివిధ పోలీస్స్టేషన్లలో పని చేస్తూ, నాలుగేళ్లు సర్వీసు దాటి ఉన్న వారికి కచ్చితంగా బదిలీ చేశారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. మొత్తం ప్రక్రియపైనే పోలీస్ సిబ్బంది నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఎటువంటి కౌన్సెలింగ్ నిర్వహించలేదు సరికదా.. కనీసం ఆప్షన్లు ఇవ్వకుండానే నేరుగా ఉత్తర్వులు ఇచ్చేశారని వాపోతున్నారు. ప్రధానంగా పాచిపెంట నుంచి సీతంపేట.. సాలూరు నుంచి గుమ్మలక్ష్మీపురం ఇలా ఇష్టారీతిన బదిలీలు చేసేశారని చెబుతున్నారు. మరోవైపు జిల్లా ఆవిర్భావం తర్వాత శ్రీకాకుళం నుంచి వచ్చిన చాలా మంది పోలీస్ ఉద్యోగులు పాలకొండలో పని చేస్తున్నారు. వీరంతా శ్రీకాకుళంలో స్థిరపడటంతో అక్కడ నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పుడు వీరికి కూడా పాచిపెంట, సాలూరు వంటి ప్రాంతాలకు స్థాన చలనం కలిగించడంతో ఆందోళన చెందుతున్నారు. బదిలీలకు తాము వ్యతిరేకం కాదని.. కనీసం తమ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టారీతిన చేయడం సరికాదని చెబుతున్నారు. ఎస్పీ ఆలోచన మంచిగానే ఉన్నప్పటికీ... మరోవైపు చాలా మంది పోలీస్ సిబ్బంది ఎక్కువ సంవత్సరాలుగా మైదాన ప్రాంతాల్లోనే తిష్ట వేశారు. ఇదే సందర్భంలో అప్పట్లో ఏజెన్సీకి బదిలీపై వెళ్లిన వారు బదిలీలకు అవకాశం లేక, అక్కడే చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని గుర్తించే ఎస్పీ మాధవరెడ్డి ఈసారి బదిలీల్లో ఏళ్ల తరబడి మైదాన ప్రాంతాల్లో తిష్ట వేసిన ఉద్యోగులను కదిలించారని తెలుస్తోంది. ఎస్పీ ఆలోచన మంచిదే అయినప్పటికీ.. జిల్లా పోలీస్ కార్యాలయంలో కీలకంగా వ్యవహరించే ఓ ఉద్యోగి.. మధ్యలో తలదూర్చి, మధ్యవర్తిత్వం వహించి, బదిలీల ప్రక్రియను తన అనుకున్న వారికి ‘అనుకూలంగా’ మార్చేశారన్న ఆరోపణలు పలువురి నుంచి వినిపిస్తున్నాయి. ఎస్పీ వద్ద తనకున్న పరిచయాన్ని దుర్వినియోగం చేస్తూ, జాబితాను సిద్ధం చేశారని చెబుతున్నారు. న్యూస్రీల్ఎమ్మెల్యేల వద్దకు పరుగులు మరోవైపు కొన్ని ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టం లేని ఉద్యోగులు ఎమ్మెల్యేల వద్దకు పరుగులు తీస్తున్నారని తెలిసింది. సిఫారసు లేఖలో.. ఒక ఫోన్ కాల్తోనో తమ బదిలీ ఉత్తర్వులను నిలుపు చేసుకునేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అదీ కుదరకుంటే కోరుకున్న చోటకు పంపించేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజాప్రతినిధులతో పెద్దగా పరిచయం లేని ఉద్యోగులు మాత్రం మిన్నుకుండిపోయి, ఇష్టం లేకున్నా కొత్త స్థానానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. -
జగనన్న పాలనలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. తొలి విడతలో చేపట్టిన నాడు – నేడు పనుల్లో కార్పొరేట్ను తలదన్నేలా సకల సదుపాయాలు కల్పించారు. పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ఆసక్తి చూపించారు. టాయిలెట్ల దగ్గర నుంచి తరగతి గదుల వరకు ఏ బడి చూసినా
గత ప్రభుత్వంపై కక్షతోనే.. గత ప్రభుత్వంపై కక్షతోనే నాడు – నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన పనులను కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. గత ప్రభుత్వంలో జిల్లా వ్యాప్తంగా 535 ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు రూ.144.51కోట్లను మంజూరు చేశారు. కూటమి ప్రభుత్వం నిధుల విడుదల చేయడంలో చతికిలపడింది. నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీలు పనులు నిలిపివేశాయి. ● పాఠశాలల నాడు – నేడు పనుల పూర్తిపై ప్రభుత్వంలో కొరవడిన స్పష్టత ● నిధుల కొరతతో నిలిచిన పనులు ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 486 పాఠశాలలకు రూ.130.14 కోట్లతో పనులు ● కూటమి ప్రభుత్వంలో 535 పాఠశాలల్లో నిలిచిపోయిన పనులు పార్వతీపురం టౌన్: మనబడి నాడు – నేడు 2.0 కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేసింది. గతంలో దాదాపు 50 శాతం పనులు శరవేగంగా పూర్తి చేశారు. తొలివిడత నాడు – నేడు కింద జిల్లాలో 486 పాఠశాలలకు రూ.130.14కోట్లతో కార్పొరేట్కు మించిన వసతులను ప్రభుత్వ పాఠశాలల్లో సమకూర్చారు. రెండో విడత నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా గతంలో జిల్లా వ్యాప్తంగా 535 ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు రూ.144.51కోట్లను గత ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పాఠశాలల్లో పది రకాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు పూర్తి ప్రణాళికలు గతంలోనే చేపట్టారు. రెండో విడత నాడు – నేడు అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర పాఠశాలల విద్యా శాఖాఽధికారులు ఆదేశించారు. అప్పటికే ఎన్నికల కోడ్ రావడంతో జిల్లాలో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత నాడు – నేడు పనులు, పాఠశాలల అభివృద్ధి పనులను పూర్తిగా గాలికొదిలేసింది. అభివృద్ధి పనులు సాగక అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక పాఠశాలల్లోని తరగతి గదులు నాడు – నేడు పనులపై ప్రభుత్వంలో స్పష్టత లేకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని రెండో విడత పాఠశాలల్లో చేపట్టిన పనులు అర్థాంతరంగా నిలిచిపోగా ఆయా పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. రానున్న విద్యా సంవత్సరానికి తరగతి గదుల పనులు పూర్తి చేసి వాటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం స్పందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వంలో నిరాశే... కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా ఏ ఒక్క బడిలోనూ ప్రగతి పనులు ముండడుగు పడలేదు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన మాటేమో..కానీ ఏడాదంతా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండో విడతలో పాఠశాలల్లో చేపట్టిన పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఆశ పడిన ఉపాధ్యాయులు, విద్యార్థులకు నిరాశే మిగిలింది. నిధులు విడుదలైన వెంటనే పనులు చేపడతాం రెండవ విడత నాడు – నేడు పనులకు సంబంధించి నిధులు విడుదలైన వెంటనే పనులు ప్రారంభిస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్ఎంసీ కమిటీల ఆధ్వర్యంలో పనులు చేపడతాం. జిల్లాలో 535 పాఠశాలల్లో పనులు పెండింగ్లో ఉన్నాయి. – తేజేశ్వరరావు, సమగ్రశిక్ష ఏపీసీ, పార్వతీపురం మన్యం పార్వతీపురం కొండా వీధిలో నిలిచిపోయిన ఎంపీపీఎస్ పాఠశాల పనులు -
పండగ ఇంకా పది రోజులే.. పనులు జరిగేనా...!
సాలూరు: శ్యామలాంబ పండగ నిర్వహణ కోసం అప్పు రూపేనా రూ.2కోట్లు మంజూరైనా ఎటువంటి పనులు ఇప్పటికీ చేపట్టకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. మున్సిపాలిటీలో శ్యామలాంబ పండగ ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరగనుంది. 15 ఏళ్ల తరువాత జరగనున్న అమ్మవారి పండగకు లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో పండగ ఏర్పాట్లకు సంబంధించి తగు ఏర్పాట్లు చేయడంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై చర్చ జరుగుతోంది. రెండు శాఖలకు మంత్రిగా ఉన్న సంధ్యారాణి ప్రభుత్వం నుంచిగానీ.. తన సొంత శాఖలగానీ ప్రత్యేక గ్రాంట్లు తీసుకువస్తారని అంతా భావించారు. అయితే ఆ గ్రాంట్లు రాలేదు. మున్సిపాలిటీకి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2019, 2020 సంవత్సరాలకు సంబంధించి బీపీఎస్, ఎల్ఆర్ఎస్ 2020 గ్రాంట్లకు సంబంధించి రూ.2 కోట్లు అప్పు రూపేనా ఈ ప్రభుత్వంలో మంజూరైందని అధికారులు తెలిపారు. ఈ రెండు కోట్లు అప్పు కావడంతో మున్సిపాలిటీలో నిధులు ఉన్నప్పుడు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. పది రోజుల్లో 76 పనులు జరిగేనా? పండగ ఏర్పాట్లకు సంబంధించి సుమారు రూ.కోటి 30 లక్షలతో చేపట్టాల్సిన 76 పనులకు అధికారులు టెండర్లు పిలిచారు. ఈ నెల 9న టెండర్లు ఖరారు కానున్నాయి. 10, 11 తేదీలు సెలవులు కావడంతో టెండర్లు ఆమోదించి, ఒప్పందం వంటి ప్రక్రియలు పూర్తయి పనులు ప్రారంభించేందుకు ఈ నెల 12 అవుతుంది. 18వ తేదీన పండగ ప్రారంభం కానున్న నేపథ్యంలో 17వ తేదీకే పనులు పూర్తి చేయాల్సి ఉంది. అంటే కేవలం వారం రోజుల్లోనే పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. పనుల్లో ఎక్కువగా సీసీ రోడ్లు, కల్వర్టులు, పైలట్ వాటర్ స్కీంలు ఉన్నాయి. వారం రోజుల్లో ఈ పనులు జరిగేనా.. అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతా హడావుడే.. ఇదిలా ఉండగా పండగ కోసం ఈ ఏడాది జనవరిలో రూ.1.50 కోట్లు బుడా నుంచి నిధులు వస్తున్నాయని, ప్రతిపాదనలు సిద్ధం చేయమని మంత్రి సంధ్యారాణి తెలపడంతో అప్పట్లో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తరువాత నిధులు తగ్గాయని రూ.1.05 కోట్లతో ప్రతిపాదనలు చేయమనడంతో అధికారులు ప్రతిపాదనలు మార్చారు. అయితే ఈ నిధులు రాని పరిస్థితుల్లో ఏప్రిల్ నెలలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2019, 2020 సంవత్సరాల ఎల్ఆర్ఎస్, బీపీఎస్ గ్రాంట్లకు సంబంధించి నిధులు రూ.2కోట్లు అప్పు రూపేనా ఈ ప్రభుత్వంలో మంజూరు కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వీటితో అధికారులు మళ్లీ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొత్తం 81 పనులకు ప్రతిపాదనలు చేయగా కోటి 30 లక్షల రూపాయిలతో 76 పనులకు ఈ నెల 9న టెండర్లు ఖరారు కానున్నాయి. అయితే కూటమి ప్రభుత్వంలో బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతుండడంతో ఈ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఎంత వరకు ముందుకు వస్తారో వేచి చూడాల్సి ఉంది. టెండర్లు ఖరారైనా.. వారం రోజుల్లో ఎలా పనులు చేస్తారన్న సందేహాలు లేకపోలేదు. ఈ క్రమంలో తాజాగా సింహాచలంలో వారం రోజుల్లో గోడ కట్టిన సంఘటనలను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. ఏం జరుగుతుందో.. వేచి చూడాలి. శ్యామలాంబ పండగ పనులకు ఈ నెల 9న టెండర్ల ఖరారు -
గోపాలకృష్ణ మాస్టారుకు పురస్కారం
రేగిడి: మండలంలోని అంబకండి గ్రామానికి చెందిన పుర్లి గోపాలకృష్ణ మాస్టారును తెలుగువెలుగు సాహితీవేదిక ఘనంగా సత్కరించింది. ఈ మేరకు శనివారం రాత్రి విశాఖపట్నంలో జరిగిన ఈ కార్యక్రమంలో గోపాలకృష్ణ సాంస్కృతిక సేవా రంగంలో విశిష్టమైన కృషిచేసినందుకు గుర్తించి పురష్కారాన్ని అందించి సత్కరించారు. ఈ పురస్కారం అందించిన తెలుగువెలుగు కార్యనిర్వాహక కమిటీకి ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నామనన్నారు. గోపాలకృష్ణ మాస్టారుకు పురష్కారం రావడంపట్ల అంబకండి గ్రామస్తులతో పాటు మండల విద్యాశాఖాధికారులు ఎంవీ ప్రసాదరావు, బి.ఎరకయ్య, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఎంపీపీ దార అప్పలనర్సమ్మ, వైస్ఎంపీపీలు టంకాల అచ్చెన్నాయుడు, వావిలపల్లి జగన్మోహనరావు తదితరులు అభినందించారు. పెండింగ్ ఈ చలానాలపై ఎస్పీ సీరియస్● చెల్లించని వాహనాలను సీజ్ చేయాలని ఆదేశాలు విజయనగరం క్రైమ్: జిల్లావ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఈ–చలానాల వసూళ్లపై అధికారులు, సిబ్బంది సీరియస్గా దృష్టి పెట్టాలని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. జిల్లావ్యాప్తంగా పోలీస్ సిబ్బంది, అధికారులతో ఆదివారం ఆయన సెట్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వాహనాల పెండింగ్ చలానాలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వాహనాల తనిఖీలు నిర్వహించి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఆయా వాహనాలపై పెండింగ్ చలానాలు ఉన్నట్లయితే వాటిని వాహనదారులు చెల్లించేంతవరకు వెంటాడాలని ఎస్పీ ఈ సందర్భంగా సిబ్బందిని ఆదేశించారు. మోటార్ వాహనాల నిబంధనలు ఉల్లంఽఘిస్తున్న వారిపై ఈ చలానాలు విధిస్తున్నా చెల్లించడంలో నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ చలానాలు కుప్పలు, కుప్పలుగా పెండింగ్లో ఉంటున్నాయన్నారు. సిబ్బంది పెండింగ్ ఈ చలానాలపై దృష్టి పెట్టాలని ఆ చలానాలు చెల్లించకపోతే వెంటనే వాహనాన్ని సీజ్ చేయాలని స్పష్టం చేశారు. అలాగే వాహనాల తనిఖీ సమయంలో మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు.ఇక ఎంవీ నిబంధనలను ఉల్లంఽఘించిన వారిపై కూడా కేసులు నమోదు చేయాలని ఎస్పీ వకుల్ జిందల్ సిబ్బందిని ఆదేశించారు. మహిళ దుర్మరణంరామభద్రపురం: మండలకేంద్రంలోని సాలూరు వెళ్లే రూట్లో కర్రల మిషన్ సమీపాన జాతీయ రహదారిపై ఆదివారం వేకువజామున గుర్తుతెలియని వాహనం ఢీ కొని ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ సంఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..స్థానిక శ్రీరాంనగర్ కాలనీకి చెందిన చలమల సత్యవతి(64) కొన్నేళ్లుగా అంతరరాష్ట్ర కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొనుక్కుని చిరువ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. రోజూలాగానే ఆదివారం కూడా వేకువజామున 5 గంటల సమయంలో కూరగాయల మార్కెట్కు వెళ్తుండగా జాతీయ రహదారి నుంచి రెండు నిమిషాల్లో మార్కెట్కు వెళ్లే లింకు రోడ్డు దిగుతుందన్న సమయంలో సాలూరు నుంచి రామభద్రపురం వైపు వస్తున్న గుర్తుతెలియని వాహనం మితిమీరిన వేగంతో వచ్చి సత్యవతిని బలంగా ఢీ కొట్టి సుమారు 50 అడుగుల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో ఆమె అక్కిడికక్కడే మృతిచెందింది. పోలీసులు దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఢీ కొట్టిన వాహనాన్ని కనిపెడుతున్నారు. మృతురాలి కుమారుడు ఈశ్వరరావు, కుటుంబ సభ్యులు మృతదేహం వద్ద భోరున విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్సీకి మృతదేహాన్ని తరలించారు. కుమారుడు ఈశ్వరరావు ఫిర్యాదు మేరకు ఏఎస్సై రమణ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విదేశీ అతిథులకు స్వాగతం
● సైబీరియా వలస పక్షుల రాక ● మే నెల నుంచి నవంబరు నెల వరకు విహారం ● నవంబరు తర్వాత స్వదేశానికి పిల్లలతో ప్రయాణంబొండపల్లి: ఏటా క్రమం తప్పకుండా వచ్చే విదేశీ వలస పక్షులు సైబీరియా దేశం నుంచి వచ్చి చెరువుల్లో విహరిస్తూ ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి. గడిచిన కొన్ని సంవత్సరాలుగా వేలాది కిలోమీటర్ల దూరంలో గల సైబీరియా దేశం నుంచి ప్రయాణం చేస్తూ ఏటా వచ్చి బొండపల్లి మండలంలో విడిది చేసి ఆహారం సంపాదించుకునే ప్రాంతాలను గుర్తించేందుకు వచ్చే ఈ పక్షులు ఈ ఏడాది కూడా మండలానికి వచ్చాయి. మండల కేంద్రాన్ని ఆనుకుని ఉన్న రాజు చెరువులో సంవత్సరం పొడవునా నీరు ఉండడంతో పాటు చెరువు గట్ల చుట్టూ దట్టమైన చెట్లు ఉండడం, పక్షులకు కావాల్సిన ఆహారం పీతలు, పురుగులు, ఇతర ఆహారం పుష్కలంగా దొరికే అవకాశం ఉండడంతో క్రమం తప్పకుండా ఇక్కడికి పొడవైన కాళ్లు, పొడవైన ముక్కు, తెల్లని రెక్కలు, మెడ కింద ఎర్రని వెంట్రుకలతో కూడిన ఈ పక్షులు దేశం కాని దేశం నుంచి వస్తుంటాయి. నవంబర్ వరకూ ఇక్కడే బస ఈ పక్షులు ఏటా మే నెలలో వచ్చి నవంబరు నెల వరకు చెరువుల్లో దొరికే ఆహారాన్ని పగలంతా సేకరించి తిని రాత్రయ్యే సరికి గజపతినగరం మండలంలోని లోగిస గ్రామంలో గల చింత చెట్లుపై విశ్రాంతి తీసుకుంటాయి. గడిచిన కొన్ని సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఈ పక్రియ సాగుతోంది. వాటికి ఏ ఒక్కరూ హాని చేయడం, వేటాడడం వంటి పనులు చేయరు. ఆ పక్షులకు హాని చేయకూడదని గ్రామస్తులు వారికి వారే అంక్షలు విధించుకుని..ఈ పక్షులు వస్తే తమకు మంచి జరుగుతుందని భావిస్తారు. మే నెలలో ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టి, పొదిగి పిల్లలను కన్న తర్వాత ఆ పిల్లలు ఎగిరి వాటికి అవే ఆహారం సంపాదించుకునే పరిస్థితి వచ్చాక పిల్లలతో సహా ఈ పక్షులు స్వదేశానికి తిరుగు ప్రయాణమవుతుంటాయి. ఈ ప్రక్రియ ఏటా క్రమం తప్పకుండా కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా ఈ పక్షులు వచ్చి చెరువులో ప్రసుత్తం కనువిందు చేస్తున్నాయి. -
వేసక్ 2025కు సురవరం వ్యక్తి ఎంపిక
సంతకవిటి: మండలంలోని సురవరం గ్రామానికి చెందిన బాసా మురళి వియత్నాంలో ఈ నెల 5 నుంచి 14 వరకు జరగనున్న వేసక్ ఫెస్టివల్– 2025కు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన సిల్చర్లోని అస్సాం యూనివర్సిటీలో కళల ప్రదర్శన విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా 2017 నుంచి పనిచేస్తున్నారు. భారత్ నుంచి ఐసీసీఆర్(ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్) నుంచి ఢిల్లీకి చెందిన పూర్ణిమా రాయ్ కథక్ గ్రూప్ ఈ ఫెస్టివల్లో నృత్య ప్రదర్శన ఇవ్వనుంది. ఈ గ్రూపునకు మురళి సాంకేతిక సహకారం కోసం ఎంపికయ్యారు. పూర్ణిమా రాయ్ కథక్ గ్రూప్ గౌతమ బుద్ధుడి జీవితంలో వివిధ ప్రధాన ఘట్టాల ఆధారంగా, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా నృత్యరూపకాన్ని రూపొందించగా, ఆ నృత్య రూపకాన్ని మురళి సాంకేతిక సహకారంతో క్రియాత్మకంగా తీర్చిదిద్దారు. మొత్తం 14 మంది సభ్యులతో ఆయన ఆదివారం ఢిల్లీ నుంచి వియత్నాం బయలు దేరి వెళ్లారు. -
పీహెచ్సీల్లో ప్రసవాల మెరుగుకు కృషి చేయాలి
పార్వతీపురం టౌన్: మాతా, శిశు వైద్య సేవలు, పీహచ్సీలో ప్రసవాల మెరుగు కోసం స్టాఫ్నర్సులకు శిక్షణ ఇచ్చామని ఆ దిశగా వారంతా కృషి చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు స్పష్టం చేశారు. ఈ మేరకు శిక్షణ పూర్తి చేసుకున్న పీహెచ్సీ స్టాఫ్ నర్సులకు ధ్రువీకరణ పత్రాలను శనివారం సాయంత్రం ఆరోగ్య కార్యాలయంలో ఆయన అందజేశారు. శిక్షణ నైపుణ్యాన్ని సద్వినియోగం చేయాలని డీఎంహెచ్ఓ ఈ సందర్భంగా వారికి సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణులకు వైద్య సేవలను మరింతగా మెరుగు పరిచే లక్ష్యంగా, పీహెచ్సీలలో సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా కృషి చేసే దిశగా స్టాఫ్నర్సులకు ఎస్బీఏ (స్కిల్డ్ బర్త్ అటెండెంట్) రీఓరియంటేషన్ శిక్షణ నిర్వహించామని ఫిబ్రవరిలో ప్రారంభించి బ్యాచ్ల వారీగా ఏప్రిల్ నెలాఖరు వరకు కొనసాగించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఐఓ డా. ఎం.నారాయణరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.కేవీఎస్ పద్మావతి, ప్రోగ్రాం అధికారులు డా.టి.జగన్మోహనరావు, డా.పీఎల్. రఘుకుమార్, డీపీహెచ్ఎన్ఓ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ భాస్కరరావు -
18 కిలోల గంజాయి పట్టివేత
శృంగవరపుకోట: శృంగవరపుకోట సమీపంలో పందిరప్ప జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా 18 కిలోల గంజాయి పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఎస్.కోట పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోలీసులకు అందిన సమాచారం మేరకు పందిరప్ప జంక్షన్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా రెడ్ కలర్ మాక్సిమో ప్లస్ హౌస్హోల్డ్ ఫర్నిచర్ కలిగిన వాహనాన్ని తనిఖీ చేయగా 18 కిలోల గంజాయి పట్టుబడింది. వాహనాన్ని డ్రైవ్ చేస్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఒడిశా నుంచి గంజాయి రవాణా చేస్తున్నట్లు చెప్పడంతో ఆ వ్యక్తిని అరెస్టుచేసి వ్యాన్, గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. -
వందేళ్ల మర్రి చెట్టు
జియ్యమ్మవలస మండలం గంగరాజుపురం గదబవలస గిరిజన గ్రామంలో వందేళ్ల మర్రి చెట్టు గ్రామస్తులకు నీడనిస్తూ ఆరోగ్యవంతమైన గాలినిస్తూ చల్లగా నిద్రపుచ్చుతోంది. ఎప్పుడో వందేళ్ల నాటి మర్రి మొక్క నేడు మహా వృక్షంగా ఎదిగి పరిసర గ్రామాల ప్రజలను కూడా తన చెంతకు చేర్చుకుంటూ చుట్టూ ఉన్న రచ్చబండపై కొంతసేపు బడలిక తీర్చుకునేలా చేస్తోంది. తోటపల్లి, నందివానివలస, సింగనాపురం గ్రామాల రైతులు తమ పంట పొలాల్లోకి పనులకు వెళ్లి తిరిగి వచ్చేటపుడు ఈ చెట్టు కింద కాసేపు సేద తీరుతున్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడే సమావేశాలు నిర్వహిస్తున్నారు. – జియ్యమ్మవలస రూరల్ -
రైతులను తిప్పించుకోవద్దు..
● తహసీల్దార్కు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సూచన ● పార్టీ సమావేశంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన మెరకముడిదాం: రైతులను మీ చుట్టూ తిప్పించుకోవద్దు, వారు పనులు మాని మీ చుట్టూ తిరగాలంటే కుదరదు కదా..మీరు వాళ్ల వ్యవసాయ బోర్లకు అవసరమైన సర్టిఫికెట్లను త్వరితగతిన అందజేయండి. అంటూ మెరకముడిదాం తహసీల్దారు అజూరఫీజాన్కు మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సూచించారు. ఆదివారం ఆయన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్లతో కలిసి మండలంలోని చినబంటుపల్లి మిల్లు వద్ద మెరకముడిదాం మండలానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. సమావేశంలో ఆయన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఏవైనా సమస్యలున్నాయా? అని అడిగారు. దానికి మండలంలో చాలా మంది రైతులు వ్యవసాయ బోరు బావులకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్ కోసం అవసరమైన ఫారం–3 సర్టిఫికెట్లను జారీ చేయడంలో స్థానిక తహసీల్దారు అజూరఫీజాన్ నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. దీనికి స్పందించిన ఎమ్మెల్సీ బొత్స వెంటనే సర్టిఫికెట్లను జారీ చేయాలని తహసీల్దారు అజూరఫీజాన్కు ఫోన్ ద్వారా సూచించారు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పింఛన్ల మంజూరులో మార్పులు తీసుకురావడంతో చాలా మంది వితంతువులకు పింఛన్లు మంజూరు కావడం లేదని పలువురు నాయకులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు ఎస్.వి.రమణరాజు, తాడ్డి వేణుగోపాల్రావు, కోట్ల విశ్వేశ్వరరావు, కె.ఎస్.ఆర్.కె.ప్రసాద్, బూర్లె నరేష్కుమార్, పప్పల కృష్ణమూర్తి, సత్తారు జగన్మోహన్రావు, చీపురుపల్లి మండల నాయకులు ఇప్పిలి అనంతం, మీసాల వరహాలనాయుడు, గరివిడి మండల నాయకులు మీసాల విశ్వేశ్వరరావు, కడుముల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఆధిపత్యం చెలాయిస్తున్నారు...!
నెల్లిమర్ల: కూటమి పార్టీకి చెందిన ఓ నాయకుడు తనపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు సరోజిని తెలిపారు. స్థానిక బైరెడ్డి సూర్యనారాయణ కల్యాణ మండపంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నాలుగేళ్ల పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన ఒక నాయకుడు పాలనా విషయాల్లో తలదూర్చి తనను పూర్తిగా నియంత్రించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను జనసేన పార్టీలోకి మారిన తర్వాత కూటమి పార్టీకి చెందిన ఇంకో వ్యక్తి తనపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని చెప్పారు. కౌన్సిల్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అంశాలను సభ్యుల సూచనల మేరకే తాను ఆమోదిస్తానని చైర్పర్సన్ స్పష్టం చేశారు. తాజాగా జరిగిన సమావేశంలో ప్రవేశపెట్టిన కల్యాణ మండపం విస్తరణ, పార్కు ప్రహారీ నిర్మాణం వంటి అంశాలను మెజారిటీ సభ్యులు వ్యతిరేకించడంతో తాను కూడా తిరస్కరించినట్లు వివరించారు. వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యులు కలిసి తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారని ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోందని, కూటమి ప్రభుత్వంలోని తనపై కూటమిలోని వేరే పార్టీ ఎలా అవిశ్వాసం పెడుతుందని సరోజిని ప్రశ్నించారు. పలు విషయాల్లో కమిషనర్తో తాను కుమ్మక్కయ్యానన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. జనసేన పార్టీ నాయకులు అప్పికొండ రవికుమార్, రవ్వా నాని, పాండ్రంకి సత్యనారాయణ మాట్లాడుతూ చైర్పర్సన్కు సంబంధించి ఏవైనా లోపాలుంటే టీడీపీ నాయకులు, సభ్యులు జనసేన పార్టీ దృష్టికి తీసుకు రావాలని, అంతేగాని కౌన్సిల్ సమావేశాల్లో ఎలా ప్రస్తావిస్తారని ప్రశ్నించారు. అలాగే చైర్పర్సన్ పిలుపునిచ్చిన సమావేశానికి ఎలా గైర్హాజరు అవుతారని ప్రశ్నించారు. కాలువలపై అక్రమణలు తొలగించి పట్టణాన్ని అభివృద్ధి చేసే చర్యలను అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. పట్టణాభివృద్ధికి అన్ని పార్టీల సభ్యులు సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆదేశాలతో కూటమి పార్టీలకు చెందిన నాయకులతో కలసి నడవాలని తాము భావిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో జనసేన పార్టీ నాయకులు మజ్జి రాంబాబు, బంగారు భానుప్రకాష్, బంగారు శంకరరావు, పలిశెట్టి దొరబాబు, సారిపల్లి శంకరరావు, పళని తదితరులు పాల్గొన్నారు. నగర పంచాయతీ చైర్పర్సన్ సరోజిని -
సేవల్లో వెనుకబడిన.. ఏపీవీపీ ఆసుపత్రులు..!
● బీ గ్రేడ్లో ఆరు ఆసుపత్రులు ● సీ గ్రేడ్లో చీపురుపల్లి ఆసుపత్రి ● ఓపీ, ఐపీ సేవల్లోనూ వెనుకబాటే.. ● జిల్లాలో ఏడు ఏపీవీపీ ఆసుపత్రులు ● అన్ని ఆసుపత్రుల్లో తగ్గిన సేవలు ● డెప్యూటేషన్పై కాలయాపన చేస్తున్న కొందరు వైద్యులు విజయనగరం ఫోర్ట్: వైద్య విధాన్ పరిషత్ ఆసుపత్రులు సేవల్లో వెనుకబడ్డాయి. ప్రభుత్వం ప్రతీ నెల ప్రకటించే గ్రేడ్ల్లో ఈ విషయం తేటతెల్లమైంది. అన్నీ ఆసుపత్రుల్లోనూ సేవలు తగ్గాయి. కూటమి ప్రభుత్వం వైద్య శాఖను పట్టించుకోకపోవడం వల్ల ఆసుపత్రులు గాడి తప్పాయని విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది వైద్య సిబ్బంది డెప్యూటేషన్ల పేరుతో కాలయాపన చేయడం వల్ల కూడా సంబంధిత ఆసుపత్రుల్లో సేవలు పూర్తి స్థాయిలో అందకపోవడం వల్ల సేవల్లో వెనుకంజలో ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓపీ, ఐపీ సేవల్లో కూడా ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో సేవలు అందడం లేదు. జిల్లాలో వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులు ఏడు ఉన్నాయి. వాటిలో ఎస్.కోట ఏరియా ఆసుపత్రి, గజపతినగరం ఏరియా ఆసుపత్రి, బాడంగి, బొబ్బిలి, చీపురుపల్లి, భోగాపురం, నెల్లిమర్ల సీహెచ్సీలు ఉన్నాయి. బీ గ్రేడ్లో ఆరు ఆసుపత్రులు 2025 మార్చి నెలలో ప్రభుత్వం ఆసుపత్రులకు గ్రేడ్లను ప్రకటించింది. ఆసుపత్రులు అందించే సేవలు అధారంగా ఏ, బీ, సీ గ్రేడ్లు ప్రకటిస్తారు. జిల్లాలో ఆరు ఆసుపత్రులకు బీ గ్రేడ్ ఇవ్వగా, ఒక ఆసుపత్రికి సీ గ్రేడ్ ఇచ్చారు. చీపురుపల్లి ఆసుపత్రికి సీ గ్రేడ్ ఇవ్వగా.. ఎస్.కోట, గజపతినగరం, భోగాపురం, నెల్లిమర్ల, భోగాపురం, బొబ్బిలి ఆసుపత్రులకు బీ గ్రేడ్ ఇచ్చారు. ఏరియా ఆసుపత్రి, సీహెచ్సీల్లో అందించే సేవలు ఏరియా ఆసుపత్రి, సీహెచ్సీల్లో గైనిక్, పిడియాట్రిక్, ఎముకలు, కంటి, దంత, జనరల్ సర్జరీ తదితర విభాగాలకు చెందిన రోగులను పరీక్షించి ఓపీ సేవలు అవసరమైన ఓపీ సేవలు అందిస్తారు. ఇన్పేషేంట్ సేవలు అవసరమైన ఇన్పేషేంట్గా ఆస్పత్రిలో చేర్పించి సేవలు అందిస్తారు. అదే విధంగా గర్భిణులకు వైద్య తనిఖీలతో పాటు ప్రసవాలు, సిజేరియన్లు చేస్తారు. రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు, ఈసీజీ, ఎక్సరే వంటి సేవలు అందిస్తారు. డెప్యూటేషన్లతో కాలయాపన వైద్య విధాన్ పరిషత్లోని కొంత మంది వైద్యులు డెప్యూటేషన్లపై కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యవిధాన పరిషత్కు సంబంధించి ఇద్దరు వైద్యులు డెప్యూటేషన్పై డీసీహెచ్ఎస్ కార్యాలయంలో పని చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఆయా ఆసుపత్రుల్లో సంబంధిత వైద్యులు అందించాల్సిన సేవలు రోగులకు పూర్తి స్థాయిలో అందడం లేదని రోగులు వాపోతున్నారు. -
రీసర్వే పక్కాగా నిర్వహించాలి : ఆర్డీవో
చీపురుపల్లి: భూములు రీసర్వే ప్రణాళికాబద్దంగా నిర్వహించాలని ఆర్డీవో జివి.సత్యవాణి అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఎనిమిది మండలాల్లో పని చేస్తున్న తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, వీఆర్వో, విలేజ్ సర్వేయర్లకు రీసర్వే కార్యక్రమంపై శనివారం వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ఆమె మాట్లాడుతూ రీసర్వే నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వర్క్షాప్లో ప్రతీ అంశాన్ని అవగాహన చేసుకోవాలన్నారు. వర్క్షాప్లో నిర్దేశించిన విధంగా గ్రామాల్లో రీసర్వే నిర్వహించాలన్నారు. ప్రధానంగా వీఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లు రీసర్వేపై పూర్తి అవగాహన కల్పించుకోవాలన్నారు. రీసర్వేకు సంబంధించి ఇప్పటికే మండలాల్లో ఉన్న డిప్యూటీ తహసీల్దార్లు వారిని సమన్వయం చేసుకోవాలన్నారు. జూన్ నుంచి మొక్కల పంపిణీ● డీఎఫ్ఓ కొండలరావు బొండపల్లి: వనమిత్ర కేంద్రాలతో పాటు, అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీల్లో జూన్ నుంచి మొక్కల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు డీఎఫ్ఓ ఆర్. కొండలరావు తెలిపారు. స్థానిక వనమిత్ర కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. కేంద్రంలో ఏయే రకాల మొక్కల పెంపకం చేపడుతున్నా రో అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాదం, కానుగ, వేప, తదితర మొక్కలు ఉచితంగా కావాల్సిన చిన్న, సన్నకారు రైతులు తమ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, భూమి పాసు పుస్తకాల జెరాక్స్లతో దరఖాస్తులను నర్సరీ అధికారులకు అందజేయాలని సూచించారు. అలాగే ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు, పెద్ద రైతులు తమకు కావాల్సిన మొక్కల వివరాలను సమర్పిస్తే తక్కువ ధరకు మొక్కలు అందిస్తామని చెప్పారు. వనమిత్ర కేంద్రాల అభివృద్ధికి ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని స్పష్టం చేశారు. ఆయన వెంట ఎఫ్ఆర్ఓ ఎల్.సింధూ, ఫారెస్టు రేంజ్ అధికారి బి.అప్పలరాజు ,వనమిత్ర కేంద్రం సహాయకుడు పి.అప్పలనాయుడు తదితరులు ఉన్నారు. అపస్మారక స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి రాజాం సిటీ: మండల పరిధి బొద్దాం కనకమహాలక్ష్మి కాలనీ వద్ద గుర్తు తెలియని వ్యక్తి పడిఉండడాన్ని స్థానికులు శనివారం గుర్తించారు. ఈ విషయాన్ని రాజాం పోలీసులకు తెలియజేయడంతో సంబంధిత ప్రాంతానికి చేరుకున్నారు. వెంటనే రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం కేజీహెచ్కు తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి సుమారు 60 ఏళ్ల వయసు ఉంటుందని, పచ్చ, నలుపు చారలతో టీ షర్ట్ ధరించాడని పోలీసులు తెలిపారు. ఎవరైనా సంబంధిత బంధువులు గుర్తిస్తే రాజాం పోలీసుస్టేషన్ను సంప్రదించాలని సూచించారు. కాశీలో బొద్దూరు వాసి మృతి సంతకవిటి: మండలంలోని బొద్దూరుకు చెందిన గేదెల దామోదరరావు(55) గుండెపోటుతో కాశీలో శుక్రవారం మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనానికి కాశీకి వెళ్లిన ఆయన గురువారం తిరుగుపయనమయ్యారు. రైలు మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుందనగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. రైలు దిగి అక్కడి ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అక్కడే చికిత్స పొందుతూ మరణించారు. సాయంత్రం కాశీలోనే దహన సంస్కారాలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
గిరిజనుల పొట్ట కొట్టొద్దు
వేపాడ: హైడ్రో పవర్ప్లాంట్ ఏర్పాటుకు అదానీ కంపెనీకి భూములు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ మండలంలోని కరకవలస పంచాయతీ గిరిశిఖర మారిక గ్రామంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్య క్షుడు చల్లా జగన్ ఆధ్వర్యంలో గిరిజనులు ఆందోళన కొనసాగిస్తున్నారు. శనివారం నిర్వహించిన నిరసన కార్యక్రమానికి సీపీఎం ఆల్ ఇండియా కమిటీ సభ్యుడు లోకనాథం, సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ తాతల, తండ్రుల నుంచి కొండలను నమ్ముకుని జీవిస్తున్న గిరిజనుల పొట్టకొట్టొద్దని ప్రభుత్వాన్ని కోరారు. సర్పంచ్తో కాని, ఇక్కడి ప్రజలతో కాని ప్రభుత్వం మాట్లాడకుండా గిరిజనులు నివసిస్తున్న కొండలు, గుట్టల్లో దాదాపు 213 ఎకరాలు అదానీకి ఇస్తున్నట్లు ఉత్తర్వులు ఇవ్వడం సరికాదన్నారు. గిరిశిఖర గ్రామాలకు రోడ్లు వేయాలన్న, అక్కడి గిరిజనులకు పట్టాలు ఇవ్వాలన్నా అటవీశాఖ అనుమతులు ఉండాల ని చెబుతున్న ప్రభుత్వం.... ఇప్పుడు మరి ఏ అనుమతులు తీసుకుని అదానీకి ఇస్తున్నారని ప్రశ్నించారు. తమ్మినేని సూర్యనారా యణ మాట్లాడుతూ అధికారులు ముందుగా గ్రామసభ నిర్వహించి, 70శాతం మంది ప్రజలు అనుమతిస్తేనే భూసేకరణ చేయాలని చట్టం చెబుతున్నప్పటికీ ప్రభుత్వం అవేమీ పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వమే చట్టాన్ని అతిక్రమించి గిరిజనులను ఇబ్బంది పెట్టేందుకు సిద్ధమయ్యిందని మండిపడ్డారు. 125 గిరిజన కుటుంబాలకు అన్యాయం చేస్తుంటే సహించేది లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఉత్తర్వులను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కరకవలస సర్పంచ్ పాతబోయిన పెంటమ్మ, సీపీఎం, ఏపీ రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు, గిరిజన నాయకులు పాల్గొన్నారు. -
ఏపీ శాక్స్ నిధులపై ఆడిట్
విజయనగరం ఫోర్ట్: రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ శాఖ (ఏపీ శాక్స్) ద్వారా జిల్లాలో ఉన్న ఐసీటీసీలకు 2023–24 సంవత్సరంలో విడుదలైన నిధులపై జిల్లా ఎయిడ్స్ నియంత్రణ శాఖ కార్యాలయంలో శనివారం ఆడిట్ నిర్వహించారు. ఏపీ శాక్స్ నుంచి వచ్చిన ఆడిట్ ఉద్యోగి శ్యామ్కుమార్ ఐసీటీసీ సెంటర్స్, ఎస్టీఐ క్లినిక్స్ సిబ్బంది నుంచి రికార్డులు తెప్పించుకుని ఆడిట్ నిర్వహించారు. నిధులు ఎంత విడుదల అయ్యాయి... వాటిని సక్రమంగా వినియోగించారా.. లేదా..., వినియోగించిన దానికి బిల్లులు ఉన్నాయా.. లేదా.., రికార్డుల్లో నమోదు చేసిందీ.. లేనిదీ... ఆడిట్లో పరిశీలించారు. -
ఏపీ కబడ్డీ జట్టు కోచ్గా చైతన్య
విజయనగరం: జాతీయ స్థాయిలో జరగనున్న ఖేలో ఇండియా కబడ్డీ పోటీల్లో పాల్గొనబోయే ఆంధ్రప్రదేశ్ జట్టు కోచ్గా విజయనగరానికి చెందిన పాలూరి చైతన్య నియామకమయ్యారు. ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు బిహార్లోని రాజ్గిరిలో 7వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు కోచ్గా చీపురుపల్లి మండలానికి చెందిన పాలూరి చైతన్య ఎంపికయ్యారు. చైతన్య ప్రస్తుతం శాప్ కబడ్డీ కోచ్గా విశాఖ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో విధులు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జట్టుకు కోచ్గా బాధ్యతలు చేపట్టిన చైతన్యను ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎలమంచలి శ్రీకాంత్, విజయనగరం కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కోరాడ ప్రభావతి అభినందించారు. -
సమ్మర్ బూట్ క్యాంప్ను సందర్శించిన డీఈవో
శృంగవరపుకోట : మండలంలోని ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిసున్న ఏటీఎల్ సమ్మర్ బూట్ క్యాంప్ను డీఈవో యు.మాణిక్యాలనాయుడు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా రెండు రోజులుగా విద్యార్థులు నేర్చుకున్న నైపుణ్యాలను అడిగి తెలుసుకున్నారు. పేపర్ట్రోనిక్స్, రొబోటిక్స్పై విద్యార్థుల స్థాయిని పరిశీలించారు. విద్యార్థులు డవలప్ చేసిన కంప్యూటర్ గేమ్ను చూసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ చిన్నతనంలో ఆటోమేటిక్ కార్ల బొమ్మలు బజారులో కొనుక్కునే వారమని, ఇప్పుడు మీరే తయారు చేయటం ఆశ్యర్యం, అద్భుతం అన్నారు. ఇలాంటి వసతులు సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తోందని, వాటిని వాడుకోవాలన్నారు. సమ్మర్ బూట్ క్యాంప్లో కోడింగ్, ఆటోమేషన్, పేపర్ట్రోనిక్స్, పిక్టోబ్లాక్ నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఇప్పటివరకూ ల్యాబ్ సాధించిన విజయాలను జిల్లా సైన్స్ అధికారి టి.రాజేష్, హెచ్.ఎం ఉమామహేశ్వరరావు, ల్యాబ్ ఇంచార్జ్ వి.రమేష్లు డీఈవోకు వివరించారు. 2019లో ప్రారంభమైన ల్యాబ్ జాతీయ స్థాయిలో హబ్ అటల్ ల్యాబ్గా గుర్తింపు సాధించిందన్నారు. రమేష్ మాట్లాడుతూ ఫ్రాన్స్కు చెందిన లా పౌండేషన్ డస్సాల్సిస్టమ్స్ సహకారంతో యూరిన్ రెగ్యులేటరీ డివైస్, బనానాకాటన్ ప్రొడక్ట్స్ అభివృద్ధి చేశామని, సి.డి.పి.ఎం.డి ప్రోడక్ట్స్ పేటెంట్ కోసం రిజిస్టర్ చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష ఏఎంవో ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
సంకిలి చక్కెర ఫ్యాక్టరీ మూతపడకుండా చూడాలి
బొబ్బిలి: సంకిలి చక్కెర ఫ్యాక్టరీని మూత వేసి బీర్ల కంపెనీ పెట్టే యోచనలో యాజమాన్యం ఉందని, ఆ దిశగా యాజమాన్యాన్ని వెళ్లనీయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.గోపాలం అన్నారు. బొబ్బిలిలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న లచ్చయ్యపేట, భీమసింగి చక్కెర పరిశ్రమలు మూతపడటంతో చెరకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. చెరకును పండించేందుకు అవస్థలు పడుతున్నారన్నారు. ఇప్పటికే సాగు విస్తీర్ణం తగ్గిందన్నారు. చెరకు సాగు విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు ఫ్యాక్టరీని మూత పడనీయకుండా చర్యలు తీసుకోకపోతే చెరకు రైతు కనుమరుగు కావడం ఖాయమన్నారు. జిల్లాలో విమానాశ్రయాలు, ఆయుధ బాండాగారాల వలన రైతులకు, ప్రజలకు వచ్చిన ప్రయోజనాలు లేవని, రైతు సంబంధ ప్రయోజనాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పొట్నూరు శంకరరావు, రెడ్డి త్రినాధ తదితరులు పాల్గొన్నారు. ఏపీ రైతు సంఘం డిమాండ్ -
ఆర్అండ్ఆర్ కాలనీలో పోలీసు పికెట్
● వైఎస్సార్సీపీ మండల కన్వీనర్పై దాడి నేపథ్యంలో గ్రామంలో పర్యటించిన సీఐ, ఎస్ఐ ● దాడులకు పాల్పడితే కఠిన చర్యలువంగర: నాయకులు, వ్యక్తులపై దాడులకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజాం రూరల్ సీఐ హెచ్.ఉపేంద్రరావు హెచ్చరించారు. ఈ నెల 2వ తేదీ రాత్రి వైఎస్సార్సీపీ వంగర మండల కన్వీనర్ కరణం సుదర్శనరావుపై దాడి కేసు నమోదైన నేపథ్యంలో ఎస్ఐ షేక్శంకర్తో కలిసి గ్రామంలో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడారు. ప్రజలు కక్షపూరితంగా వ్యవహరించొద్దని, గుంపులుగా తిరగవద్దని, అవాంఛనీయ ఘటనలకు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఎటువంటి వివాదాలకు పాల్పడొద్దని, శాంతియుతంగా మెలగాలని సూచించారు. శ్రీహరిపురం ఆర్అండ్ఆర్ కాలనీలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సుదర్శనరావుపై దాడికి పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్థానిక సర్పంచ్ శనపతి సత్యారావు, ప్రజలు పోలీసులను కోరారు. -
జానపద కళలను ఆదరించాలి
విజయనగరం టౌన్: అంతరించిపోతున్న జానపద కళలను ఆదరించి కళాకారులకు ప్రదర్శనలు కల్పించి ఉపాధి అవకాశాలు కల్పించాలని గిడుగు రామూర్తి తెలుగు భాష, జానపద కళాపీఠం అధ్యక్షుడు బద్రి కూర్మారావు కోరారు. కోట ప్రాంగణంలో ఉత్తరాంధ్ర నవచైతన్య నాట్య కళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కళాకారులు, కార్యవర్గ సమావేశం కార్యదర్శి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. సమావేశంలో వక్తలు మాట్లాడుతూ ఇటీవల కాలంలో హైదరాబాద్, అరకు, భోపాల్ వంటి చోట్ల జిల్లా జముకులు, తూర్పు భాగవతం, చెక్కభజన కళాకారులకు అవకాశం రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు, దేవదాయ, ధర్మాదాయ శాఖ, సాంస్కృతిక శాఖ అంతరించిపోతున్న జానపద కళలను ఆదరించాలని కోరారు. ప్రజలు కూడా వీటిని ఆదరించి మన సంస్కృతిని కాపాడాలని కోరారు. 50 ఏళ్లు దాటిన కళాకారులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని కోరారు. ఉత్తరాంధ్రలోని అతివేగంగా అంతరించిపోనున్న తూర్పు భాగవతం, రుంజ వాయిద్యం, జముకుల పాట, తప్పెటగుళ్లు, బుడగ జంగాల పాటలు, దాసర్ల పాటలు, చెక్క భజనలు, సాముగరిడీలు, పులివేషాలు వంటి కళలను ఆదరించి భావితరాలకు అందించాలన్నారు. సమావేశంలో జిల్లాలోని జముకుల పాట, చెక్కభజన, సాముగరిడి తదితర బృంద గురువులైన అట్టాడ లక్ష్మీనాయుడు, మత్స తవిటినాయుడు, మక్కువ మారినాయుడు, సింహాచలం, మిరియాల జగన్, పోలిరాజు, పి.సురేష్, రెడ్డి శంకరరావు, తౌడు, యువ కళాకారులు పాల్గొన్నారు. -
గిరిజన సంక్షేమ మంత్రికి అవగాహన లోపం
సీతంపేట: జీవో నంబర్ 3పై వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే సుప్రీంకోర్టులో రివిజన్ పిటీషన్ వేసినట్టు పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి శనివారం ఓ ప్రకటనలో స్పష్టంచేశారు. గిరిజనుల ఓట్ల కోసం జీవో 3ని పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి దానిని నెరవేర్చడంలో కూటమి నేతలు వైఫల్యం చెందారన్నారు. కనీస అవగాహన లేని గిరిజన మంత్రి రకరకాలుగా అబద్ధాలు ఆడుతున్నారన్నారు. జీవో 3కి బదులు ఇంకొక జీవో, ఆర్డినెన్స్ గాని తీసుకువస్తామని 11 నెలలుగా కాలయాపన చేయడం తగదన్నారు. ఇంకా ఎంతకాలం గిరిజనులను మోసం చేస్తారని ప్రశ్నించారు. గిరిజనులు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ తప్పును గత ప్రభుత్వంపై నెట్టడం అలవాటైపోయిందన్నారు. గిరిజన విద్యావంతులు అన్నీ గమనిస్తున్నారని, తగిన సమయంలో గట్టిగా బుద్ధిచెబుతారన్నారు. ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయ పోస్టులను మెగా డీఎస్సీ నుంచి మినహాయించి, గిరిజన నిరుద్యోగుల కోసం ప్రత్యేక డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన గిరిజన గురుకులాల్లో ఏళ్ల తరబడి పీజీటీ, టీజీటీ, పీఈటీ, పీడీలుగా పనిచేస్తున్నారని, వారి పోస్టులు మినహాయించకుండా నోటిఫికేషన్ ఇవ్వడంతో 1143 కుటుంబాలు వీధిన పడతాయన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, సీఆర్టీగా మార్పు చేయాలని వారంతా 45 రోజులు ధర్నా చేస్తే న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన గిరిజన మంత్రి వారిని ఇప్పుడు వెళ్లగొట్టే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇది గిరిజనులకు అన్యాయం చేయడం కాదా అని ప్రశ్నించారు. జీవో 3పై రివిజన్ పిటిషన్ వేసినది అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే.. గత ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలి గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలి -
ఒడిశా సరుకులు మాకొద్దు
సాలూరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా గ్రూప్ గ్రామాల ప్రజల్లో ఒడిశా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. వాస్తవంగా ఈ ప్రాంత ప్రజలకు రెండు రాష్ట్రాల నుంచి రేషన్ సరుకులు, సంక్షేమ పథకాలు అందుతాయి. ఇటీవల ఒడిశా ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తూ ఆంధ్రా పథకాలు అందకుండా అడ్డుకుంటోంది. అభివృద్ధి పనులకు అభ్యంతరం తెలుపుతోంది. గిరిజనులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఒడిశా చర్యలను కొటియా గ్రూపులోని పలు గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగా ఒడిశా ప్రభుత్వం నేరెళ్ల వలసలో శనివారం ఇచ్చిన రేషన్ సరుకులు తీసుకునేందుకు ఎగువశెంబి, దిగువశెంబి,ఽ దూళిభద్ర, పనుకులోవ తదితర గ్రామాల గిరిజనులు నిరాకరించారు. అక్కడ ఆంధ్రా ప్రభుత్వం ఇస్తున్న రేషన్ సరుకులను తీసుకున్నారు. ఆంధ్రా ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులకు ఆటంకం కల్పించమని ఒడిశా అధికారులు హామీ ఇస్తేనే రేషన్ తీసుకుంటామని తేల్చిచెప్పారు. రేషన్ సరుకులను నిరాకరించిన కొటియా గ్రూపులోని నాలుగు గ్రామాల ప్రజలు -
వైఎస్సార్సీపీలో నూతనోత్సాహం
పార్వతీపురంటౌన్: వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ వింగ్ జనరల్ సెక్రటరీగా కురుపాంకు చెందిన ఆర్.చైతన్య శ్రవంతి, రాష్ట్ర ఎంప్లాయీస్ అండ్ పింఛనర్ల విభాగం వైస్ ప్రెసిడెంట్గా పీవీఎస్ఎస్ సోమయాజులు (కురుపాం), సెక్రటరీగా కాగాన ప్రకాశం (పార్వతీపురం)ను నియమించింది. వీరికి పార్టీ శ్రేణులు అభినందనలు తెలిపాయి. ఈదురు గాలులు పార్వతీపురం రూరల్: పార్వతీపురంలో శనివారం సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములు జనాన్ని వణికించాయి. నర్సిపురం మీదుగా చినబొండపల్లి, రంగంవలస, ఎంఆర్ నగరంతో పాటు మరో ఐదు గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసే తీగెలపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. విద్యుత్ సరఫరా పనులను పునరుద్ధరిస్తున్నట్టు ఏఈ రామారావు తెలిపారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించే పనిలో ట్రాన్స్కో సిబ్బంది -
రాష్ట్రంలో బీహార్ సంస్కృతి
మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, పాల్గొన్న నేతలు రాజాం సిటీ: రాష్ట్రంలో బీహార్ సంస్కృతి కనిపిస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ వంగర మండల కన్వీనర్ కరణం సుదర్శనరావుపై టీడీపీ గూండాల దాడిని ఖండించారు. సుదర్శనరావును రాజాంలో శనివారం పరామర్శించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇటువంటి దాడులు చేసి భయపెట్టాలనుకోవడం హేయమైనచర్యగా పేర్కొన్నారు. ప్రజల మన్ననలు పొంది రాజకీయంగా ఎదుగుతున్నవారిపై దాడులుచేసి, భయపెట్టి లొంగదీసుకోలేరన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అరాచకాలు అధికమయ్యాయన్నారు. దాడులు, తప్పులు చేసిన వారిని శిక్షించాల్సిన పోలీస్ వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. దోషులను కఠినంగా శిక్షిస్తే ఇటువంటి దాడులు పునరావృతం కావన్నారు. ఇప్పటికీ తమకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం ఉందని పేర్కొన్నారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరిపైనా ఎటువంటి దాడులు, ఇబ్బందులకు గురిచేసే పరిస్థితి లేదన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి శాంతియుత పరిపాలన చేశారని, సంక్షేమ పథకాలతో ప్రజలను ఆదుకున్నారన్నారు. పార్టీ అధికారంలో ఉందని ఇష్టానుసారం దాడులు చేయడం, చట్టాలను అనుకూలంగా మార్చుకోవాలని చూస్తే ప్రజా కోర్టులో ఫలితం వేరేగా ఉంటుందన్నారు. సుదర్శనరావుకు మేమంతా భరోసాగా ఉంటామని హామీ ఇచ్చారు. దాడులకు భవిష్యత్లో టీడీపీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. ● వైఎస్సార్ సీపీ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ టీడీపీ అధినాయకత్వం రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పునకు అనుకూలంగా పాలన చేయాలే తప్ప ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం తగదన్నారు. అధికారం శాశ్వతం కాదని, మళ్లీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుందని, ఇప్పుడు చేస్తున్న హేయమైన ఘటనలకు చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. ప్రజల తరఫున పోరాడే వ్యక్తులపై దాడులు చేస్తే తగ్గేదేలేదని, న్యాయపోరాటం చేస్తామని అన్నారు. ● వైఎస్సార్ సీపీ రాజాం ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్ మాట్లాడుతూ టీడీపీ నేతలు అభివృద్ధిని పక్కనపెట్టి పగ, ప్రతీకారాలతో రగలిపోతున్నారన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రంలో దౌర్జన్యాలు, దోపిడీలు, దాడులు జరుగుతుండడం విచారకరమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, తలే భద్రయ్య, జెడ్పీ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహనరావు, పార్టీ పట్టణ, మండలాల అధ్యక్షులు పాలవలస శ్రీనివాసరావు, లావేటి రాజగోపాలనాయుడు, కరణం సుదర్శనరావు, ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్ముఖర్జీ, జెడ్పీటీసీ సభ్యుడు బండి నర్సింహులు, వైస్ ఎంపీపీలు యాలాల వెంకటేష్, టంకాల అచ్చెన్నాయుడు, వావిలపల్లి జగన్మోహనరావు, కిమిడి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీడీపీ వైఎస్సార్సీపీ వంగర మండలాధ్యక్షునిపై దాడి హేయం వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ -
నూతన విద్యావిధానంలో వింత పోకడలు..!
పార్వతీపురంటౌన్: విద్యారంగంలో కూటమి ప్రభుత్వ నిర్ణయాలు ఉపాధ్యాయ వర్గాలను కలవరపెడుతున్నాయి. విద్యావ్యవస్థ గాడి తప్పుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాఠశాలల విలీన ప్రక్రియ, ఉపాధ్యాయుల నియామకం, బోధన ప్రక్రియల్లో ప్రభుత్వ నిర్ణయాలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఉన్నత పాఠశాలల్లో బోధన కుంటుపడుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నూతన విద్యావిధానంలో ప్రాథమికోన్నత పాఠశాలలు హైస్కూళ్లలో విలీనం చేస్తే కొన్నిచోట్ల 6 వ తరగతి నుంచి సబ్జెట్ టీచర్లకు బదులు సెకెండ్ గ్రెడ్టీచర్లు చదువు చెప్పే పరిస్థితి వస్తుంది. ఈ విధానం వల్ల విద్యార్థులు పూర్తిగా నష్టపోయే ప్రమాదముందని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ఇదీ పరిస్థితి... వాస్తవంగా 6వ తరగతి నుంచి విద్యార్థులకు సబ్జెక్టు టీచర్లే బోధించాలి. కూటమి ప్రభుత్వం నూతన విద్యావిధానం అమలులోకి వస్తే వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రాథమికోన్నత పాఠశాలలు హైస్కూళ్లలో విలీనం అవుతాయి. జిల్లాలో 324 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా అందులో 10 పాఠశాలలను హైస్కూళ్లుగా మార్చారు. 80 పాఠశాలల్లో విద్యార్థులు తగినంత సంఖ్య ఉండడంతో ఎలాంటి మార్పులు చేయకుండా వాటిని అక్కడే హైస్కూల్స్గా ఉన్నతీకరించారు. మిగిలిన పాఠశాలల్లో 6, 7, 8 తరగతులు చదివే విద్యార్థులు 60 లోపు ఉన్నట్లు విద్యాశాఖాధికారులు గుర్తించారు. 60 మంది లోపు విద్యార్థులను కూడా సమీపంలోని హైస్కూల్స్లో చేర్పించాలని వారి తల్లిదండులకు ఉపాధ్యాయులతో ప్రభుత్వం చెప్పించింది. హైస్కూల్కు 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్నాయంటూ పలు చోట్ల విద్యార్థుల తల్లిదండ్రులు విలీనప్రక్రియకు అభ్యంతరం తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లతోనే బోధించాలి ఉన్నత పాఠశాలల విద్యార్థులకు తప్పనిసరిగా స్కూల్ అసిస్టెంట్లతోనే బోధించాలి. అప్పర్ ప్రైమరీ పాఠశాలలను తొలగించడంతో ఈ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. హైస్కూల్స్ దూరంగా ఉండడం కూడా ఒక కారణం. 6, 7, 8 తరగతి విద్యార్థులకు ఎస్జీటీలతో బోధించడం మంచిది కాదు. – ఎన్.బాలకృష్ణ, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, పార్వతీపురం మన్యం విలీన ప్రక్రియ ఆలోచన విరమించుకోవాలి ఉన్నత పాఠశాల్లో ప్రాథమిక తరగతులను విలీనం చేయాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి. ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జీటీలతో చదువు చెప్పించడం సమంజసం కాదు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. – ఎం.మహేష్, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, పార్వతీపురం మన్యం విద్యాప్రమాణాలు దెబ్బతింటాయన్న ఆందోళన.. 10 మంది విద్యార్థులున్న చోట ఇద్దరు ఎస్జీటీలు, 11–30 మంది విద్యార్థులున్నచోట ముగ్గురు, 31–40 మంది విద్యార్థులు దాటి ఉంటే ఐదుగురు ఎస్జీటీలను కేటాయించారు. 6 నుంచి 8 వరకు చదువుతున్న విద్యార్థులకు ఎస్జీటీలతో బోధన సాగించడంపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం తెలుపుతున్నాయి. హైస్కూల్ విద్యార్థుల బోధనకు స్కూల్ అసిస్టెంట్లనే నియమించాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే అర్హత ఉన్న ఎస్జీటీలకు ఉద్యోగోన్నతి కల్పించి శిక్షణ ఇవ్వాలని కోరుతున్నాయి. గందరగోళంలో 6, 7, 8 తరగతుల విద్యార్థుల చదువు ఎస్జీటీలతో ఉన్నత పాఠశాలల విద్యార్థులకు బోధన సరికాదంటున్న మేధావులు పదోన్నతులు కల్పించాలి ఉన్నత పాఠశాలల విద్యార్థులకు తప్పనిసరిగా సబ్జెక్టు టీచర్సే బోధించాలి. లేదంటే ఎస్జీటీలకు శిక్షణ ఇచ్చి ఎస్ఏలుగా ఉద్యోగోన్నతి కల్పించాలి. శిక్షణ ఇచ్చాక వారితో చదువు చెప్పించాలి. – కె.భాస్కరరావు, యూటీఎఫ్, జిల్లా ప్రధాన కార్యదర్శి, పార్వతీపురం మన్యం అశాసీ్త్రయమైన చర్య ఒకే తరగతి విద్యార్థులకు ఎస్ఏలు, ఎస్జీటీలతో బోధించడం అశాసీ్త్రయమైన చర్య. ప్రభుత్వం పునరాలోచించాలి. 70 మంది కంటే తక్కవ విద్యార్థులు ఉన్నచోట ప్రధానోపాధ్యాయులు, పీఈటీ అవసరం లేదంటే పర్యవేక్షణ లోపిస్తుంది. – ఎస్.మురళీమోహన్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి