Parvathipuram Manyam
-
హెచ్ఎంకు షోకాజ్ నోటీస్
సీతంపేట: మండలంలోని చిన్నబగ్గ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల హెచ్ఎం కె.శ్రీనివాసరావుకు షోకాజ్ నోటీస్ ఇవ్వనున్నట్టు పాలకొండ సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ తెలిపారు. గురువారం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముస్తాబు గది అందంగా తీర్చిదిద్దకపోవడం, వసతిగృహ గదులు పరిశుభ్రంగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల పరిసరాలు పరిశీలించారు. విద్యార్థుల తరగతి గదులను సందర్శించి చదువులు పరిశీలించారు. బాగా చదువుకోవాలని సూచించారు. ఇప్పటి నుంచే ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కన్నవారి చెంతకు బాలుడు విజయనగరం క్రైమ్: విజయనగరం కోట జంక్షన్ వద్ద ఆరేళ్ల బాలుడు నరేంద్ర నానిని క్రైమ్ పార్టీ పోలీసులు గుర్తించి గురువారం స్టేషన్కు తీసుకువచ్చారు. విజయనగరం కొనిసి వీధికి చెందిన కోదాడ రాము, ఈశ్వరిల బిడ్డ నాని ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. పిల్లాడి కోసం కన్నవారు వెతుకుతున్న క్రమంలో కోట జంక్షన్ వద్ద అయోమయంగా, భయపడుతూ బిత్రచూపులు చూస్తున్న నానిని స్థానికులు గుర్తించారు. వెంటనే వన్టౌన్ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో క్రైమ్ పార్టీ హెచ్సీ రమణ హుటాహుటిన కోట జంక్షన్ వద్దకు వెళ్లి పిల్లాడిని తీసుకుని స్టేషన్కు వచ్చారు. ఇదే విషయంపై స్థానికుల నుంచి సమాచారాన్ని అందుకున్న నాని కన్నవారు రాము, ఈశ్వరి వన్టౌన్ స్టేషన్కు రావడంతో ఆరేళ్ల బాలుడిని హెచ్సీ రమణ అప్పగించారు. పోలీసులకు నాని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. టేకు తోట దగ్ధం గజపతినగరం రూరల్: మండలంలోని మధుపాడ గ్రామ సమీపంలోని టేకు తోటలో గురువారం సంభవించిన అగ్ని ప్రమాదంలో సుమారు రెండు ఎకరాల తోట దగ్ధమైంది. గ్రామంలోని బూర్ల నాయుడు, బూర్ల అప్పలనాయుడు, బూర్ల కృష్ణలకు చెందిన రెండెకరాల విస్తీర్ణంలోని టేకు తోటలో ఎవరో పొగ తాగిన సిగరెట్, బీడీ పడేయడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్టు గుర్తించారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.లక్ష వరకు నష్టం సంభవించినట్టు అంచనా వేశారు. అగ్ని ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి వచ్చి మంటలను అదుపు చేసింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. గ్యాస్ సిలిండర్ల సీజ్ పూసపాటిరేగ : మండలంలోని స్వీటు షాపులు, హోటల్లో అనుమతి లేకుండా వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 12 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసినట్టు విజిలెన్సు సీఐ సతీష్కుమార్ తెలిపారు. ఆయా షాపులు, హోటల్లు యజమానులుపై 6 ఏ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. దాడులలో సీఎస్డీటీ మురళితో పాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
ఉపాధి కొందరికేనా...
విజయనగరం ఫోర్ట్: ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే వలసలను తగ్గించడం కోసం ప్రవేశ పెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యం అమలు కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అధికశాతం మంది పేద, మధ్యతరగతి వర్గాల వారే వేతనదారులుగా ఉన్నారు. ముఖ్యంగా పేదలకు వేసవిలో ఎటువంటి పనులు ఉండవు. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. పనికి వెళ్లకపోతే వారి జీవనం కష్టతరం అవుతుంది. ఉపాధి హామీ పథకం పనికి వచ్చే వేతనదారులకు 100 రోజులు పని కల్పించాలి. కానీ 100 రోజుల పని కల్పించడంతో టీడీపీ సర్కార్ అలసత్వం వహిస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. లక్షల్లో వేతనదారులు ఉంటే వారిలో 30 శాతం మందికి కూడా 100 రోజులు పని కల్పించడం లేదనే విమర్శలున్నాయి. ఉత్తి ప్రకటనలే.. అడిగిన ప్రతీ ఒక్కరికి పని కల్పిస్తామని చంద్రబాబు సర్కార్ గొప్పలు చెబుతుంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటుంది. అడిగిన వారందరికి కాకుండా కొంతమందికే పని కల్పిస్తున్నారని వేతనదారులు ఆరోపిస్తున్నారు. ఉపాధి హామీ పథకానికి ముందు గ్రామీణ ప్రాంత ప్రజలు చైన్నె, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాలకు పనుల కోసం వెళ్లేవారు. ఇటువంటి వారికి పని కల్పించాలన్న లక్ష్యంతో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు. పథకం లక్ష్యం మంచిదే అయినా అనుకున్న ఫలితాలు సాధించడం లేదన్న వాదన వినిపిస్తోంది. 17,571మందికే 100 రోజులు పని జిల్లాలో ఉపాధి హామీ పథకంలో 3.86 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. అందులో యాక్టివ్ (పనికి వెళ్లే కుటుంబాలు) 3.45 లక్షలు ఉన్నాయి. ఇందులో కేవలం 17,571 మందికి మాత్రమే 2025–26 ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల పనిదినాలు కల్పించారు. జిల్లాలో వేతనదారులు 6.88 లక్షల మంది ఉన్నారు. వీరిలో 6.26 లక్షల మంది వేతనదారులు పనికి వెళ్లేవారు ఉన్నారు. లక్షల్లో కుటుంబాలు ఉంటే వేలల్లో మాత్రమే 100 రోజులు పని కల్పించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సకాలంలో జమకాని వేతనాలు ఉపాధి హామీ పథకంలో పనిచేసే వేతనదారులకు సకాలంలో వేతనాలు అందడం లేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వేతనదారులకు పని చేసిన వారం రోజుల్లో వేతనాలు వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యేవి. చంద్రబాబు సర్కార్ పాలనలో నెలలు తరబడి వేతనాలు పడడం లేదని వేతనదారులు రావడం లేదని వేతనదారులు ఆరోపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదవారు ఉపాధి పనికి వెళితే వచ్చే ఆదాయం ద్వారా జీవిస్తారు. అయితే పనికే వెళ్లే వేతనం డబ్బులు సకాలంలో రాకపోవడం వల్ల వారి కుటంబ పోషణ భారంగా మారుతుంది. దీంతో వేతనదారులకు తిప్పలు తప్పడం లేదు. 100 రోజుల పని కల్పించడంలో అలసత్వం జిల్లాలో 3.45 లక్షల ఉపాధి జాబ్ కార్డులు 6.26 లక్షల మంది వేతనదారులు 17,571మందికే 100 రోజులు పని సకాలంలో జమకాని వేతనాలుఅడిగిన వారందరికీ పని 2025 – 26 సంవత్సరంలో 17,571 మందికి వంద రోజుల పనిదినాలు కల్పించాం. ఉపాధి పని అడిగిన వారందరికీ పని కల్పిస్తున్నాం. – ఎస్. శారదాదేవి, పీడీ, డ్వామా -
టెన్త్ మూల్యాంకన కేంద్రం వద్ద ఉపాధ్యాయుల నిరసన
విజయనగరం అర్బన్: ఫ్యాప్టో పిలుపు మేరకు దశల వారీ పోరాటంలో భాగంగా విజయనగరం పట్టణంలోని పీఎస్ఆర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి స్పాట్ మూల్యాంకన కేంద్రంలో గురువారం ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఫ్యాప్టో చైర్మన్ పాల్తేరు శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ సిహెచ్.భాస్కరరావు, ఆర్థిక కార్యదర్శి డి.శ్యామ్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు 12వ పీఆర్సీ కమిషన్ను తక్షణమే నియమించాలని, ఇప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. 12వ పీఆర్సీ మూడు సంవత్సరాలుగా ఆలస్యమైందని, కనీసం కమిషన్ను కూడా నియమించకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. దీని వల్ల ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని, వెంటనే 30 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయాలని కోరారు. సుమారు రూ.30 వేల కోట్ల బకాయిల చెల్లింపులకు స్పష్టమైన రోడ్మ్యాప్ ప్రకటించి విడతల వారీగా చెల్లించాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల నేపథ్యంలో నాలుగు డీఏలు పెండింగ్లో ఉంచడం అన్యాయమని, వెంటనే వాటిని విడుదల చేయాలని కోరారు. సీపీఎస్, జీపీఎస్ విధానాలను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, మెమో 57 అమలు చేసి 2003 డీఎస్సీ ఉపాధ్యాయులను పాత పెన్షన్ కిందికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి సర్వీసుల సమస్యలను పరిష్కరించడంతో పాటు కారుణ్య నియామకాలను ఆలస్యం చేయకుండా చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. మున్సిపల్ ఉపాధ్యాయుల పీఎఫ్ సమస్యను పరిష్కరించడంతో పాటు అర్బన్ ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని, పాఠశాలల్లో బోధనేతర పనులను రద్దు చేసి ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని సూచించారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు కె.విజయ్గౌరి, డి.ఈశ్వరరావు, జోగినాయుడు, ఎల్.శివప్రసాద్, జి.సూర్యనారాయణ, ఎమ్.బలరామునాయుడు, ఎన్.వెంకట్నాయుడు, వై.అప్పారావు, కె.శ్రీనివాసరావు, ఎన్.వి.పైడిరాజు, వి.రమణ, టి.సన్యాసిరాజు, యం.మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
● తవ్వేస్తున్నారు..
ఈ చిత్రం చూశారా... కొమరాడ మండలం కళ్లికోట గ్రామ సమీపంలోని నాగవళి నదీతీరంలో సాగుతున్న ఇసుక తవ్వకాలు ఇవి. ఇక్కడ ఇసుక తవ్వేందుకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవు. అధికారికంగా ఇసుక ర్యాంపు కూడా లేదు. రాత్రీపగలు తేడా లేకుండా ఇసుకను తవ్వేసి ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. ఒక్కోట్రాక్టర్ రూ.4వేల నుంచి రూ.5వేలకు పట్టణాల్లో విక్రయిస్తున్నారు. తీరాన్ని తవ్వేస్తుండడంతో వరదలు వచ్చే సమయంలో ముంపు అవకాశం ఉందంటూ కళ్లికోట గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్టవేయాలని కోరుతున్నారు. – కొమరాడ -
గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్చొద్దు
ప్రతి విద్యా సంస్థ ప్రభుత్వం నుంచి కచ్చితంగా గుర్తింపు పొంది ఉండాలి. గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లోనే తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలి. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలో పిల్లలను చేర్చకూడదు. ఒక వేళ చేర్చితే భవిష్యత్లో ఇబ్బందులు తెలెత్తుతాయి. చైల్డ్ ఇన్ఫో ఆధారంగా విద్యార్థులు ప్రగతి పత్రాలు, టీసీలు జారీ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ అనుమతి లేని వాటిలో ఈ నమోదు ఉండదు. ఆయా విద్యార్థులను బడిబయట ఉన్నవారిగా పరిగణించాల్సి వస్తుంది. అడ్మిషన్ విషయంలో జాగ్రత్తలు అవసరం. – యు.మాణిక్యంనాయుడు, డీఈఓ, విజయనగరం -
బెట్టింగ్రాయుళ్లకు పోలీసుల హెచ్చరిక
విజయనగరం క్రైమ్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న వేళ విజయనగరం వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిఽధిలో బెట్టింగ్రాయుళ్లపై సీఐ చౌదరి తన బృందంతో గురువారం దాడులు చేశారు. రామానాయుడు రోడ్డు బిక్కవోలు వీధిలో బెట్టింగులు కడుతున్న యువత వాడుతున్న సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు పది మంది యువత వీధిలో సెల్ఫోన్ ద్వారా బెట్టింగులు ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్ఐ ప్రసన్నకుమార్, కానిస్టేబుళ్లు నాయుడు, రమణలతో గుర్తించారు. క్రికెట్ బెట్టింగులు చట్టవిరుద్ధమని, బెట్టింగ్లతో డబ్బులు పోగొట్టుకోవద్దని హెచ్చరించి పంపించారు. -
● మా తర‘గతి’ ఇదే..
గుమ్మలక్ష్మీపురం మండలం చినగీసాడ పంచాయతీ శంబుగూడ గ్రామంలోని పాఠశాల భవనం పైకప్పు రేకులు ఇటీవల వీచిన ఈదురుగాలులకు ఎగిరిపోయాయి. వాటిని తిరిగి అమర్చేవారే కరువయ్యారు. ప్రభుత్వ యంత్రాంగం ఊరిబడిని కనీసం పట్టించుకోవడం లేదు. చేసేదిలేక ఇదిగో ఇలా చెట్టునీడన విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తూ ఉపాధ్యాయులు పాఠ్యాంశ బోధన చేస్తున్నారు. వర్షం కురిస్తే బడికి సెలవు ఇస్తున్నారు. ఇంటి గడపన, చెట్టు నీడన సక్రమంగా చదువులు సాగడం లేదని, తక్షణమే భవన సదుపాయం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. – గుమ్మలక్ష్మీపురం -
మన్యం కలెక్టర్ వివక్ష చూపుతున్నారు
● స్పందించకపోతే స్పీకర్కు ఫిర్యాదు చేస్తా ● అరకు ఎంపీ డాక్టర్ తనూజారాణి ఆవేదన పార్వతీపురం మన్యం జిల్లాలో ఎంపీ ల్యాడ్స్ నుంచి 2024 సెప్టెంబర్ నుంచి 40 అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నా కలెక్టర్ ప్రభాకరరెడ్డి అనుమతులు ఇవ్వడం లేదని, దీంతో ఒక్క పని ముందుకు సాగడం లేదని, ఆయన ఎమ్మెల్యేల ఒత్తిడికి తలొగ్గి నాపై వివక్ష చూపుతున్నారని ఎంపీ డాక్టర్ తనూజారాణి సభలో ప్రస్తావించారు. అధికారపార్టీ ఎమ్మెల్యేల ఒత్తిడికి తలొగ్గి అభివృద్ధిని అడ్డుకోవడం తగదన్నారు. ఒక గిరిజన మహిళా ప్రజాప్రతినిధిని చిన్నచూపు చూస్తే, సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు. ఇదే ఒరవడి కొనసాగితే కలెక్టర్పై స్పీకర్కు ప్రివిలైజ్మోషన్ అందిస్తానని స్పష్టంచేశారు. దీనిపై జెడ్పీ చైర్మన్ మన్యం కలెక్టర్ ప్రభాకర్రెడ్డిని అడగ్గా వివక్ష అంటూ ఏమీ లేదని, ఎంపీ సూచించిన పనులను కొద్దిరోజుల్లో ప్రారంబిస్తామని తెలిపారు. పనుల ప్రారంభానికి కచ్చితమైన సమయం, తేదీ చెప్పాలని, ఆ రోజున తనతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, జెడ్పీ సీఈఓ హాజరవుతామని జెడ్పీ చైర్మన్ తెలిపారు. అనంతరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మీడియాతో సభలో చర్చించిన అంశాలను, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జేసీ సేతుమాధవన్, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు. -
విద్యుత్ వైర్లు తెగిపడి మేకల మృతి
చీపురుపల్లి రూరల్ (గరివిడి): గరివిడి మండలం కొండపాలేంలో గల హడ్కో కాలనీ సమీపంలో విద్యుత్ వైర్లు తెగిపడిన ఘటనలో ఏడు మేకలు మృతి చెందాయి. మరికొన్ని మేకలు తప్పించుకుని పారిపోవటంతో బతికి బయటపడ్డాయి. అదే సమయంలో మేకల యజమాని కాని, ఇతరులు ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. ఏది ఏమైనా మూగజీవాలు విద్యుత్షాక్ గురై మృతి చెందాయి. కొండపాలేంలోని హడ్కో కాలనీ సమీపంలో గడపర్తి అసిన్నదొర అనే మేకల పెంపకందారుడు మేకలు, గొర్రెలు ఫారమ్ని నిర్వహిస్తున్నాడు. తన ఇంటి వెనుకవైపున ఈ ఫారమ్ నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఈ మేకల షెడ్డుపై విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. మేకల కోసం వేసిన షెడ్డుకు సంబంధించిన ఇనుప ఫెన్సింగుకు విద్యుత్ వైర్లు తాకడటంతో ఏడు మేకలతో పాటుగా కోళ్లు మృతి చెందాయి. ఇదే సమయంలో విద్యుత్ షాక్కు గురైన మేకల అరుపులకు భయపడిన మిగిలిన మేకలు అక్కడ నుంచి పారిపోవటంతో మిగిలిన మేకలు ప్రాణాలతో బయటపడ్డాయి. అదే షెడ్డులో సుమారుగా 40 మేకలు ఉన్నట్టు చెబుతున్నారు. ఎప్పుడూ మేకల షెడ్డులో ఉండే అసిన్నదొర ఆ సమయానికి షెడ్డులో లేకపోవటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. తనకు జీవనోపాధిని కల్పిస్తున్న మేకలు విద్యుత్ షాక్కు గురై మృతి చెందటంతో ఆర్థికంగా నష్టపోయాయని బాధితుడు వాపోతున్నాడు. విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక రెవెన్యూ సిబ్బంది, సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి అధికారులకు నివేదికలు అందజేశారు. -
భార్యను మరువలేక భర్త మృతి
నెల్లిమర్ల రూరల్: జీవితాంతం తోడుగా ఉన్న భార్యను కోల్పోయిన తర్వాత ఆ జ్ఞాపకాల మదిలో జీవించిన ఓ వృద్ధుడి కథ చివరికి విషాదాంతంగా మారింది. మతిమరుపు బాధిస్తున్నా.. తన భార్య ఫోన్ నంబరు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా ఉంచుకున్న వృద్ధుడు చివరికి అదే జ్ఞాపకాల నడుమ తుది శ్వాస విడిచాడు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం పట్టణంలోని కేఎల్ పురానికి చెందిన కె.సత్యనారాయణ(72) అనే వృద్ధుడు మతిమరుపుతో బాధపడుతుండేవాడు. గతంలో ఎప్పుడైనా దారి తప్పినా తనే వేరే వారితో తన భార్య ఫోన్ నంబరుకు ఫోన్ చేయించుకుని సురక్షితంగా ఇంటికి చేరుకునేవాడు. అయితే నాలుగు నెలల క్రితం ఆయనకు జీవితాంతం తోడుగా నిలిచిన భార్య అనారోగ్యంతో మరణించింది. ఆమె మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన సత్యనారాయణ ఇటీవల ఇల్లు వదిలి బయటకి వచ్చాడు. మతిమరుపుతో దారి తప్పినా తనకు గుర్తున్న అదే ఫోన్ నంబరుకు కాల్ చేసినా స్పందించే తోడు ఇక లేదని గ్రహించారో ఏమో..? చివరికి కొండవెలగాడ సమీపంలో ఓ లేఅవుట్ వద్ద తనువు చాలించాడు. ఎప్పుడు చనిపోయాడో.. ఏమోగానీ శరీరం మొత్తం పాడైపోయి అచేతనంగా పడి ఉన్నాడు. అటుగా వెళ్లిన కొంతమంది మృతదేహాన్ని బుధవారం గుర్తించి నెల్లిమర్ల పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ గణేష్ ఘటనాస్థలిని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యులు గురువారం మృతదేహాన్ని తమకి చెందిన వారిగా గుర్తించి పోలీస్స్టేషన్ను ఆశ్రయించారు. ఆకలితో నీరసించి వడదెబ్బకు గురై చనిపోయి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. నాలుగు నెలల కిందట భార్య మృతి మతి మరుపు సమస్యతో తనువు చాలించిన వృద్ధుడు కొండవెలగాడ సమీపంలో అచేతనంగా మృతదేహం -
అనుమానాస్పదంగా లారీ డ్రైవర్ మృతి
రామభద్రపురం: మండలంలోని ముచ్చర్లవలస సాయికృష్ణ కోల్డ్ స్టోరేజ్ వద్ద గురువారం ఛత్తీస్ఘడ్కు చెందిన లారీ డ్రైవర్ అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఛత్తీస్ఘడ్ కాశిరిది గ్రామానికి చెందిన వినయ్ మిశ్రా (32) దంతారి గ్రామంలోని విజయపురి రైస్ మిల్లులో లారీలో బియ్యం లోడు చేసుకొని విశాఖపట్టణం వెళ్తున్నాడు. మండలంలోని ముచ్చర్లవలస వద్ద ఉన్న సాయికృష్ణ కోల్డ్ స్టోరేజ్ ఎదురుగా జాతీయ రహదారి 26 పక్కన బుధవారం రాత్రి ఒంటి గంట సమయంలో లారీ నిలుపుదల చేసి మద్యం సేవించి రోడ్డు పైకి నడుచుకుంటూ వెళ్తుండగా ఇంతలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. అదే వరుసలో మరికొన్ని బియ్యం లోడులతో లారీలు ఆపిన డ్రైవర్లు కింద పడి ఉన్న వినయ్ మిశ్రాను చూసి అతడి లారీలోనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు లారీ ఎక్కించారు. అప్పటికే చనిపోయి ఉన్నట్లు వారు చెబుతున్నారు. మృతదేహాన్ని లారీ క్యాబిన్లో వదిలేశారు. దీంతో మరో లారీ డ్రైవర్ మహేష్ దమన్ మందీప్ రోడ్స్ లైన్స్కు చెందిన మేనేజర్కు ఫోన్ ద్వారా వినయ్ మిశ్రా మృతి చెందిన విషయం చెప్పాడు. మేనేజర్ ఆ రోడ్డు లైన్స్ కంపెనీకి చెందిన ముఖేష్ త్రిపాఠిని ఇక్కడకు పంపించారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు చేరుకుని కొంత మంది లారీ డ్రైవర్లను ఆరా తీయగా వారు పొంతన లేని సమాధానం చెబుతున్నారు. మృతదేహంపై దెబ్బలు ఉండడం, రక్తపు మరకలు ఉండడం గుర్తించిన పోలీసులు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి మృతి చెందాడా.. లేక ఎవరైనా కొట్టి చంపారా.. అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖేష్ త్రిపాఠి కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ ఎస్.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించారు. -
శాశ్వత లోక్ అదాలత్ను వినియోగించుకోవాలి
విజయనగరం లీగల్: జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు గురువారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శాశ్వత ప్రజా న్యాయ పీఠంపై న్యాయ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. శాశ్వత ప్రజా న్యాయ పీఠం సేవలను అందరూ వినియోగించుకోవాలన్నారు. ఈ శాశ్వత ప్రజా న్యాయ పీఠం ఏఏ సేవలను అందిస్తుందో వారికి తెలిపారు. ఈ శాశ్వత న్యాయ పీఠంలో బీమా రంగానికి సంబంధించిన సేవలు, బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల సేవలు, విద్యా లేక విద్యాసంస్థలకు సంబంధించిన తగాదాలు, నివాసం, వాస్తవ ఆస్తికి సంబంధించిన సేవలు, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించిన తగాదాలు, ప్రయాణికులు లేక వస్తువుల చేరవేసే రోడ్డు రవాణా, వాయు రవాణా, జల రవాణా సేవలు, పోస్టల్, టెలిఫోన్ టెలిగ్రాఫ్ సేవలు, విద్యుత్ సరఫరా, కాంతి సరఫరా, నీటి సరఫరా సేవలు, ప్రజారక్షణ వ్యవస్థ, పారిశుధ్య సేవలు, ఆస్పత్రి లేక నర్సింగ్ హోమ్ సేవలపై వాటన్నిటికీ సంబంధించిన తగాదాలను రాజీమార్గం ద్వారా కానీ లేదా తుది తీర్పు ద్వారా పరిష్కరించుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ దుర్గయ్య జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత -
21 స్కాలర్షిప్లు రావడం జిల్లాకే గర్వకారణం
విజయనగరం టౌన్: ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ విజయవాడకు కేటాయించిన 40 స్కాలర్షిప్లలో 21 స్కాలర్షిప్లు విజయనగరం డివిజన్కు రావడం గర్వకారణమని పోస్టల్ సూపరింటెండెంట్ కె.శ్రీనివాసు పేర్కొన్నారు. గతేడాది అక్టోబరు 12న తపాలా శాఖ నిర్వహించిన దీన్ దయాల్ స్పర్శ యోజన ఫిలాటలీ ప్రతిభా పరీక్షలో విజయనగరం విద్యార్థులు సత్తా చాటారు. గురువారం హెడ్పోస్టాఫీస్ సూపరింటెండెంట్ కార్యాలయంలో రూ.6వేలు నగదు స్కాలర్షిప్, మెరిట్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల అభ్యున్నతికి తపాలా శాఖ అందిస్తున్న సేవలు ఎనలేనివన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ జివి.రమణారావు, సిబ్బంది పాల్గొన్నారు. పోస్టల్ సూపరింటెండెంట్ కె.శ్రీనివాసు -
బాధ్యత లేదు... ప్రజలంటే లెక్కలేదు..
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పంట సీజన్కు అనుకూలంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యేవి. ఆర్బీకే సిబ్బందితో మద్దతు ధరకు రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు సాగేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మొక్కజొన్న పంట రైతు చేతికందినా కొనుగోలు కేంద్రాల జాడ కనిపించడం లేదు. పంటను నిల్వచేయలేక దళారులకు తక్కువ ధరకే విక్రయించి రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలి. – పెనుమత్స సురేష్బాబు, ఎమ్మెల్సీ విజయనగరం రూరల్: జిల్లాలో ఎటుచూసినా సమస్యలే... వేసవిలో పల్లెలు, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి... మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు... దళారుల పాలవుతున్న మొక్కజొన్న పంట... కొత్త పింఛన్లు, ఇళ్లు మంజూరుకాక లబ్ధిదారుల్లో ఆందోళన.. సున్నావడ్డీ మంజూరుకాక డ్వాక్రా మహిళల్లో నిరాశ.. సంక్షేమ పథకాలు అందక అన్నివర్గాల ప్రజల్లో ఆవేదన.. ఇలా.. ఎటుచూసిన సమస్యలే కనిపిస్తున్నాయి. ఇవేవీ అధికార పార్టీ నేతలకు పట్టడం లేదు.. వీటిపై చర్చించి పరిష్కరించేందుకు అనువైన జెడ్పీ సమావేశానికి ఎమ్మెల్యేలు ఒక్కరూ హాజరుకాలేదు.. ఇలాంటి వాళ్లు కాబట్టే వీరందరనీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిచి మరీ చీవాట్లు పెట్టారు. ఇలాంటి ఎమ్మెల్యేలను పెట్టుకుని ఏం చర్చిస్తాం... ప్రజలకు ఏం సమాధానం చెబుతాం... అంటూ జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ కార్యాలయంలో గురువారం జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తొలుత వ్యవసాయశాఖపై సమీక్ష నిర్వహించగా కొనుగోలు కేంద్రాలు లేక, ప్రభుత్వ మద్ధతు ధర లభించక మొక్కజొన్న రైతులు తమపంటను దళారులకు తక్కువ ధరకే విక్రయించి, నష్టాల పాలవుతున్నారని సభ్యులు సభలో ప్రస్తావించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధర లభించక రైతులు టన్నుకు సుమారు రూ.23 వేల వరకు నష్టపోతున్నారని తెలిపారు. వేతనదారులకు కనీస వేతనం అందాలి ఉపాధిహామీ చట్టం మార్పుపై క్షేత్రస్థాయిలో అపోహాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జడ్పీ చైర్మన్ అధికారులకు సూచించారు. వేతనదారులకు నిర్దేశించిన పనిదినాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు మాట్లాడుతూ విజయనగరం మండలంలో 2025–2026 సంవత్సరానికి సంబంధించి రూ.2.50 కోట్లకు పైగా అవినీతి జరిగిందని, దీనిపై విచారణ లోతుగా చేపట్టాలని సభ దృష్టికి తీసుకువచ్చారు. సామాజిక తనిఖీల్లో భాగంగా గుర్తించిన రూ.45 లక్షలు అవకతవకలు రికవరీ ఏమైందని అధికారులను ప్రశ్నించారు. విజయనగరం ఎంపీడీవో గంటా వెంకటరావు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, మండల పాలకవర్గం చేసిన తీర్మానాలను బుట్టదాఖలు చేస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. పావలా వడ్డీ పథకం అటకెక్కించారు డీఆర్డీఏ శాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులు ప్రగతిని వివరించగా, పావలా వడ్డీ పథకం మహిళలకు అందుతుందా అని జెడ్పీ చైర్మన్ అధికారులను అడిగారు. అటువంటి పథకం ఏదీ అమలు కావడం లేదని, మహిళా సభ్యులే తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించాల్సిందేనని అధికారులు తేల్చిచెప్పారు. దీంతో పావలా వడ్డీ పథకాన్ని అటకెక్కించారని సభ్యులు మండిపడ్డారు. జెడ్పీ సర్వసభ్య సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేల గైర్హాజరుపై జెడ్పీ చైర్మన్ ఆగ్రహం మొక్కజొన్నకు మద్ధతు ధర లేక దళారుల వలలో రైతులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి రైతులను ఆదుకోవాలి రెండేళ్లుగా ఒక్క కొత్త పింఛన్ మంజూరు చేయని ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అందని పావలా వడ్డీ రాయితీ కూటమి ప్రభుత్వంలో మంజూరుకాని ఇళ్లు జెడ్పీ సర్వసభ్య సమావేశంలో సభ్యుల నిలదీత చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా కొత్త పింఛన్లు మంజూరు చేయలేదని సభ్యులు తెలపగా, అధికారులు అది నిజమేనని తెలుపుతూ, కొత్త పింఛన్లు మంజూరుకు వచ్చిన దరఖాస్తులు పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదించామన్నారు. పింఛన్ల పంపిణీలో కొంతమంది సిబ్బంది రాజకీయ కారణాలతో లబ్ధిదారులకు పింఛన్లు అందించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దీనికి సంబంధించి తగిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని జెడ్పీ చైర్మన్ అధికారులను నిలదీశారు. నెలకు సుమారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 వేలకు పైగా పింఛన్లు రీబాక్ అవుతుండడం విచారకరమన్నారు. ఉద్దేశపూర్వకంగా పింఛన్లు అందించని సిబ్బందిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని జేసీని కోరారు. రాష్ట్ర తూర్పుకాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పి.యశస్వి పలు అంశాలను సభ దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని జెడ్పీ చైర్మన్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గతంలో చేపట్టిన భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని సభ్యులు సభ దృష్టికి తీసుకురాగా వాటి వివరాలు అందిస్తే జెడ్పీ నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. -
రోత రాతలు.. చెత్త పలుకులు
● మహిళలను కించపరిచేలా ఆంధ్రజ్యోతిలో తప్పుడు వార్తలు ● ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై పోలీసులకు వైఎస్సార్సీపీ నాయకుల ఫిర్యాదు సాక్షి, పార్వతీపురం మన్యం: ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకులు పేరిట.. చెత్త పలుకులు పలుకుతున్నారని.. ఆ సంస్థ ఎండీ రాధాకృష్ణ తన పైత్యాన్ని పత్రికలో వదిలి పాఠకులపై రుద్దుతున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ అభిమానుల మనోభావాలను దెబ్బతీసేలా, మహిళలను కించపరిచేలా.. సభ్య సమాజం తలదించుకునేలా అసభ్యకర వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాజంలో విద్వేషాలను రెచ్చగొడుతున్న రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో గురువారం ఫిర్యాదు చేశారు. -
రాత్రికి రాత్రే శిలాఫలకం మాయం..
పార్వతీపురం నియోజకవర్గం అడ్డాపుశీల పంచాయతీ పిన్నింటి రామినాయుడువలసలో ఎన్టీఆర్ విగ్రహాన్ని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్ గురువారం ఆవిష్కరించేందుకు వచ్చారు. ఆయనతోపాటు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, ఇతర టీడీపీ నాయకులు ఉన్నారు. గ్రామానికి చెందిన పార్టీ క్రియాశీలక కార్యకర్త సింగిరెడ్డి జయపాల్.. సొంత స్థలంలో, వ్యక్తిగత నిధులు సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తొలుత ఆయన ప్రారంభోత్సవానికి నియోజకవర్గ ఎమ్మెల్యే బోనెల విజయ్చంద్రను కూడా ఆహ్వానించారు. ఆయన సమాధానం బాగోలేకపోవడంతో ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులును ఆహ్వానించారు. గురువారం ఉదయం పండగ వాతావరణంలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ముందురోజు బుధవారం రాత్రి విగ్రహ శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు మాయం చేశారు. అక్కడితో ఆగకుండా విగ్రహదాత జయపాల్పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. వారి నుంచి జయపాల్ తప్పించుకుని పారిపోయాడు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడనున్నాయన్న సమాచారంతో పోలీసులు గురువారం ఉదయం భారీగా అక్కడకు చేరుకున్నారు. ఈలోగా మాజీ ఎమ్మెల్సీ జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, ఇతర నాయకులు అక్కడికి చేరుకున్నారు. విగ్రహావిష్కరణ జరగనీయకుండా టీడీపీకి చెందిన మరో వర్గం వారు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకున్నారు. వారి సూచనల మేరకు విగ్రహాన్ని ఆవిష్కరించకుండానే నాయకులు వెనుదిరిగారు. -
జిల్లా కేంద్రానికి ఆర్టీసీ ఎక్స్ప్రెస్ సర్వీసులు
పాలకొండ: పాలకొండ పట్టణం నుంచి పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రానికి ఆర్టీసీ ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుపుతామని జిల్లా ప్రజారవాణాధికారి కె. శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 5 గంటలకు నుంచి ఎక్స్ప్రెస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. పాలకొండ నుంచి ఉదయం 5గంటలకు, 6.40కు, 7.20కు, 11.10కు, మధ్యాహ్నం 2.25కు, 5.40కు, రాత్రి 8.40 గంటలకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మూల్యాంకనంలో పొరపాట్లకు తావివ్వొద్దు ● స్పాట్ కేంద్రాన్ని తనిఖీచేసిన జేసీ యశ్వంత్కుమార్రెడ్డి పార్వతీపురం రూరల్: పదోతరగతి సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియలో ఎక్కడా చిన్నపాటి పొరపాట్లకు కూడా తావివ్వొద్దని జేసీ సి.యశ్వంత్కుమార్ రెడ్డి అధికారులు, ఉపాధ్యాయులకు సూచించారు. పార్వతీపురం పట్టణంలోని చర్చివీధిలో గల డీవీఎం ఉన్నత పాఠశాలలో జరుగుతున్న స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రతిగదిని సందర్శించిన ఆయన, ఉపాధ్యాయులు జవాబు పత్రాల దిద్దుతున్న తీరును, కోడింగ్, డీకోడింగ్ విభాగాలను నిశితంగా పరిశీలించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ.. ప్రతిమార్కు విద్యార్థి భవిష్యత్తుకు కీలకమని, పారదర్శకంగా, నిర్దేశిత గడువులోగా మూల్యాంకనాన్ని పూర్తిచేయాలని స్పష్టం చేశారు. నిబంధనల ఉల్లంఘన జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎండల తీవ్రత దృష్ట్యా విధుల్లో ఉన్న వారికి అసౌకర్యం కలగకుండా చల్లని తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, గదుల్లో గాలి, వెలుతురు ధారాళంగా ఉండేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ తనిఖీలో విద్యాశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లిమర్ల రూరల్/తెర్లాం: పోటీ పరీక్షలకు పట్టుదలతో చదివారు. పుస్తకాలతో స్నేహం చేశారు. విజేతలుగా నిలిచి ఉద్యోగాలు సాధించారు. తల్లిదండ్రుల్లో ఆనందం నింపారు. బుధవారం విడుదలైన ఎస్ఎస్సీ సీజీఎల్ తుది ఫలితాల్లో నెల్లిమర్ల మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన కొంగరాపు శ్రీను ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యాడు. మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగానికి ఎంపిక కావడంతో తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. అలాగే, తెర్లాం మండలం డి.గదబవలవస గ్రామానికి చెందిన వావిలపల్లి వినయ్కుమార్ ఇన్కమ్టాక్స్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ ఉద్యోగానికి అర్హత సాధించాడు. బీటెక్ పూర్తిచేసిన వినయ్కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి ప్రభుత్వ ఉద్యోగ సాధనే లక్ష్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమై విజయం సాధించాడు. కుమారుడు మంచి ఉద్యోగానికి ఎంపిక కావడంతో తల్లిదండ్రులు యశోద, ఆదినారాయణ మురిసిపోతున్నారు. విజయనగరం అర్బన్: అమెరికా, ఇజ్రాయిల్ తక్షణమే ఇరాన్పై చేస్తున్న దాడులు నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ఏపీటీఎఫ్–1938 జిల్లా శాఖ గురువారం విజయనగరం పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించింది. కోట వద్ద సాయంత్రం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి ప్రపంచంలో శాంతి నెలకొనాలని ఆకాంక్షించింది. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. ఈశ్వరరావు, ఎ.సదాశివరావు మాట్లాడుతూ ప్రపంచంలో పెరుగుతున్న యుద్ధ వాతావరణం మానవ సమాజానికి అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాలు ఎప్పటికీ సమస్యలకు పరిష్కారం కాదని, అవి అమాయక ప్రజల ప్రాణనష్టం, ఆర్థిక సంక్షోభం, ప్రపంచ అస్థిరతకు దారితీస్తాయని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు శాంతి, సామరస్యాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ స్థాయిలో శాంతి పరిరక్షణ బాధ్యత కలిగిన ఐక్యరాజ్యసమితి సమస్యను పరిష్కరించాలని కోరారు.వావిలపల్లి వినయ్కుమార్ కొంగరాపు శ్రీను -
పౌడర్ అద్దితేనే ఫేస్ పడుద్ది
పార్వతీపురం మన్యం: ఉపాధిహామీ వేతనదారుల మస్తర్ నమోదుకు యాప్లో ఫేస్ రీడింగ్ కీలకం. ఇందులో తలెత్తిన సాంకేతిక ఇబ్బందులు వేతనదారులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. పలుసార్లు మేట్లు యాప్లో ఫేస్ రీడింగ్ చేస్తున్నా నమోదుకావడంలేదు. దీంతో పనిచేసినా వేతనాలు వస్తాయోలేదోనన్న బెంగ వెంటాడుతోంది. దీనిని అధిగమించేందుకు అక్కన్నగూడకు చెందిన వేతనదారు సవర సుంబురుకు వినూత్నమైన ఆలోచన వచ్చింది. సోమవారం నుంచి ఉపాధిహామీ పనికి వెళ్తున్న ఆయన ఫేస్ నమోదు కాకపోవడంతో బుధవారం ముఖానికి ఒత్తుగా పౌడర్ అద్దుకుని వెళ్లాడు. మేట్ ముఖఆధారిత యాప్లో ఫేస్ను రీడింగ్ చేయగానే అప్లోడ్ అయింది. దీంతో వేతనదారులంతా అవాక్కయ్యారు. పౌడరు రాసుకుని వస్తే మీ ముఖం కూడా నమోదవుతుందంటూ ఆయన ఉచిత సలహా ఇచ్చాడు. భలేభలే అంటూ వేతనదారులందరూ నవ్వుకున్నారు. -
చుక్చుక్ బండి.. వేళకు రాదండీ..!
–8లోగంజాయి కొనుగోలు చేసి విక్రయించేందుకు తీసుకువస్తున్న నలుగురు యువకులను, ఓ జువై నల్(మైనర్ బాలుడు)ను తెర్లాం పోలీసులు అరెస్టు చేశారు. వేసవి ఎండల తీవ్రత పెరిగింది. వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. ఓఆర్ఎస్ కార్నర్స్ లేక కొందరు ఇబ్బంది పడుతున్నారు. సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం మన్యం జిల్లాకు రైలు ప్రయా ణం ఇప్పటికీ అందీ అందనట్లే ఉంది. విశాఖ–విజయనగరం–బొబ్బిలి– ఒడిశా(రాయగడ) వైపు ప్రధాన మార్గమైనప్పటికీ.. రైల్వే శాఖ ఎందుకనో ఇటు చిన్నచూపు చూస్తోంది. నిత్యం వేలాది మంది ప్రయాణించే ఈ మార్గంలో నడిచే రైళ్లు రోజులో 10 కంటే తక్కువగానే ఉంటాయి. సరిపడా సర్వీసులు ఉండవు.. అవీ సమయానికి రావు. రద్దీకి తగ్గ బోగీ లూ వేయరు. దీంతో నిత్యం ప్రయాణించే ఉద్యోగు లు, విద్యార్థులు, వ్యాపారులు అవస్థలు పడి, కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోంది. వేలాది మందికి రైలు మార్గమే ఆధారం.. జిల్లా విభజన తర్వాత విజయనగరం, విశాఖప ట్నం ప్రాంతాల నుంచి బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు వైపు ప్రయాణించే ఉద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. తప్పనిసరి బదిలీలు కావడం వల్ల పిల్లల చదువు, ఇతర ఇబ్బందులతో కుటుంబాలను వదిలి ఇక్కడకు రాలేక.. మరో మార్గం దొరకక వందలాది మంది నిత్యం రాకపోకలు సాగి స్తున్నారు. బస్సుల్లో ప్రయాణం అధిక సమయం కావడంతో పాటు.. చార్జీల భారం కూడా మోయలేనంతగా పడుతుంది. దీనివల్ల రైలు ప్రయాణమే శరణ్యం అవుతోంది. విశాఖ నుంచి ఉదయం 4 గంటలకే విశాఖపట్నం–రాయపూర్ పాసింజర్ బయలుదేరుతుంది. ఇది ఎవరికీ అనుకూల సమయం కాదు. దీంతో ఉదయం 6.30 గంటల సమయంలో బయలుదేరే విశాఖపట్నం–కోరాపుట్ డీఎంయూ రైలునే ఆధారమవుతోంది. ఈ మార్గంలో విశాఖపట్నం–కొత్తవలస–విజయనగరం–బొబ్బిలి– పార్వతీపురం–రాయగడ వెళ్లే ప్రయాణికులు నిత్యం వేలాదిగా ఉంటారు. విద్య, ఉపాధి, వ్యాపార వర్గా లకు ఇదే ఆధారం. దీంతో పాటు రాయగడ అమ్మ వారి దర్శనానికి వెళ్లే వారు ప్రతిరోజూ వందల సంఖ్యలో ఉంటారు. అంతటి కీలకమైన మార్గంలో.. అత్యంత ప్రాధాన్యం గల డీఎంయూను ఏనాడూ సమయానికి నడిపిన సందర్భాలు లేవు. పాసింజర్ రైలు కావడంతో ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ సర్వీసులకు మార్గం ఇచ్చేయాల్సి వస్తోంది. హౌరా వైపు వెళ్లే అన్ని సర్వీసుల కోసం దీనిని పక్కన పెట్టేస్తున్నారని.. దీనికితోడు, ఒక గూడ్స్ రైలు వెళ్లాలన్నా ఈ బండినే నిలుపు చేస్తున్నారని ఉద్యోగులు, విద్యార్థులు వాపోతున్నారు. ఫలితంగా వచ్చే సమయం.. వెళ్లే సమయం కచ్చితంగా ఉండడం లేదు. గంటల తరబడి ఆలస్యం కావడం వల్ల ఉద్యోగులు సమయానికి చేరుకోలేకపోతున్నారు. దీనివల్ల ఉన్నతాధికారుల నుంచి చీవాట్లు తినాల్సి వస్తోందని వారంతా వాపోతున్నారు. మొత్తంగా ఈ మార్గంలో మూ డే పాసింజర్ రైళ్లు నడవడం గమనార్హం. నిత్యం నడిచే ఎక్స్ప్రెస్ సర్వీసులు రెండు, మూడే ఉన్నా యి. వీక్లీ బళ్లు ఉన్నా.. దూర ప్రాంతం నుంచి రావ డం వల్ల ఒక్క రోజు కూడా సమయానికి నడిచిన సందర్భాలు ఉండవు. దీనికితోడు సరిపడా బోగీలు వేయకపోవడం వల్ల కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. జిల్లా పరిధిలోని పార్వతీపురం, పార్వతీపురం టౌన్లను రెండు జంట స్టేషన్లుగా పిలుస్తుంటారు. ఆదా యం బాగున్నా సదుపాయాలు లేక ప్రయాణికుల కు అవస్థలు తప్పడం లేదు. జిల్లా పరిధిలో రూ. 460 కోట్ల వ్యయంతో 44 కిలోమీటర్ల మేర రైల్వే ఆధునికీకరణ పనులు చేపట్టారు. నిత్యం పనులు జరుగుతుండడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందు లు ఎదురవుతున్నాయి. స్టేషన్లలోనూ సదుపాయా లు ఉండడం లేదు. పార్వతీపురం టౌన్స్టేషన్ పరిధి లో రోజూ 1,200 మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. పార్వతీపురం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి, కురుపాం, వీరఘట్టం మండలాల ప్రయాణికులు ఈ స్టేషన్ను ఆశ్రయిస్తుంటా రు. ఇక్కడ తాగునీటి కుళాయిలు, మరుగుదొడ్లు పనిచేయవు. రిజర్వేషన్ కోచ్ల డిస్ప్లే పని చేయ దు. తమ బోగీ కోసం ప్రయాణికులు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ●నిత్యం వెయ్యి నుంచి 1,500 మంది ప్రయాణించే పార్వతీపురం(బెలగాం) స్టేషన్లో ఆధునికీకరణ పనులు 365 రోజులూ జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ నడక వంతెన చిన్నది కావడంతో రాకపోకలకు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. 2, 3 నంబర్ ప్లాట్ ఫారం మెట్లు మరీ చిన్నవి కావడంతో అటుగా వెళ్లలేక, చాలా మంది ప్రమాదకరంగా పట్టాలు దాటుతున్నారు. వృద్ధులు, దివ్యాంగులు కూడా పట్టాలు దాటి ప్లాట్ఫాం పైకి రావాల్సిన దుస్థితి. ఈ స్టేషన్ల నుంచి నిత్యం సుమారు రూ.2 లక్షల వరకూ ఆదాయం వస్తున్నా ఆ స్థాయిలో సదుపాయాలు ఉండడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ●సీతానగరం, మక్కువ, బలిజిపేట మండలాల్లో ని పలు గ్రామాల ప్రయాణికులకు సీతానగరం రైల్వేస్టేషనే ఆధారం. ఇక్కడ ప్లాట్ఫాంపై షెడ్లు కూడా పూర్తి స్థాయిలో లేవు. నర్సిపురంలోనూ ఇదే పరిస్థితి. ●దీంతో ప్రయాణికులు ఎండావానకు ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా సాలూరుకు రైలు బండి.. అదిగో, ఇదిగో అని ఊరిస్తూనే ఉంది. పలుమార్లు ట్రయ ల్ రన్ కూడా నిర్వహించారు. మంత్రి సంధ్యారా ణి అట్టహాసంగా ట్రయల్ రన్ ప్రక్రియను జెండా ఊపి కూడా ప్రారంభించారు. ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ బండి కూత ఈ ప్రాంత వాసులకు వినిపించడం లేదు. విశాఖ–విజయనగరం ప్యాసింజ ర్ రైలు(మెము)ను సాలూరు వరకు పొడిగిస్తున్న ట్లు పలుమార్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఎవరికీ అనుకూలం కాని సమయం ప్రకటించడంతో స్థానికుల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ఆ బండి మాత్రం పట్టాలెక్కలేదు. సాలూరు విషయంలో రైల్వే శాఖ నిర్లక్ష్యం చేయడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో సాలూరు–బొబ్బిలి మధ్య నడుస్తున్న రైలు బస్సును రైల్వే శాఖ ఆపేసింది. తరువాత కరోనా తగ్గినా ఈ రైలు బస్సును మాత్రం నడపడం లేదు. రైలు బస్సు లేక, విశాఖ–విజయనగరం ప్యాసింజర్ రైలు రాక సాలూరు వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ●సాలూరు రైల్వే స్టేషన్ను రెండోప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీష్ పాలకులు నిర్మించారు. ఒడిశాకు సరుకు రవాణాకు ప్రధానంగా ఈ స్టేషన్ను వినియోగించారు. సాలూరు–బొబ్బి లి మధ్య తొలుత బొగ్గు తో నడిచే రైలు, తదుపరి డీజిల్ ఇంజిన్తో నడిచేది. నష్టాలు వస్తున్నాయని 1998లో ఈ స్టేషన్ ను ఎత్తివేశారు. ప్రయాణికుల దృష్ట్యా రైలు బస్సు ను నడిపారు. ఇది బొబ్బిలి–సాలూరు మధ్య ఐదు ట్రిప్పులు నడిచేది. దండిగాం రోడ్డులో స్టేజ్ ఏర్పాటు చేశారు. ఈ రైలు బస్సు సైతం కరోనా కాలం నుంచి నడవడం లేదు. సాలూరుకు రైలు నడపాలని కొన్నేళ్లుగా రైల్వే ఉన్నతాధికారులకు వినతులు ఇస్తూనే ఉన్నారు. ఉద్యోగ నిర్వహణ కోసం విజయనగరం నుంచి పార్వతీపురానికి రోజూ వెళ్లాల్సి వస్తోంది. ఉదయం నడిచే డీఎంయూ రైలు మాకు ఆధారం. అది ఏ రోజూ సమయానికి రాదు.. వెళ్లదు. దీనివల్ల నిత్యం ఇబ్బందులు పడుతున్నాం. సాయంత్రం సమయంలోనూ నిత్యం నడిచే పాసింజర్ రైళ్లు లేవు. ఈ మార్గం పట్ల రైల్వే శాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రయాణికుల పరిస్థితిని అర్థం చేసుకుని వేళకు నడపడంతో పాటు.. ఉద్యోగులు, విద్యార్థులకు ఉపయోగ పడేలా అదనపు సర్వీసులను నడపాలి. – శ్రీనివాస్, ప్రభుత్వ ఉద్యోగి, పార్వతీపురం నిత్యం వ్యాపారం నిమిత్తం ఈ మార్గంలో బొబ్బిలి, సీతానగరం, పార్వతీపురం వైపు ప్రయాణిస్తాం. బస్సులకు వెళ్లలేని పరిస్థితి. రైలు ప్రయాణం కష్టంగా మారుతోంది. సమయానికి నడవవు. పాసింజర్ సర్వీసులు కూడా చాలా తక్కువ. ఎవరికీ ఉపయోగం లేని సమయంలో కొన్ని బళ్లు వెళ్లిపోతున్నాయి. ఉన్నవే తక్కువ.. అందులోనూ నిర్లక్ష్యం. చాలా ఇబ్బందులు పడుతున్నాం. – రమణ, మార్కెటింగ్ ఉద్యోగి, విజయనగరం -
ఖాతాలను పునరుద్ధరించాలి
పార్వతీపురం: జిల్లాలోని బ్యాంకుల్లో స్తంభించిన ప్రభుత్వ ఖాతాలను వెంటనే పునరుద్ధరించాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో బ్యాంక్ మేనేజర్లతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వినియోగంలో లేని ఖాతాలను గుర్తించి పునరుద్ధరించడంతో ప్రభుత్వ నిధుల వినియోగం వేగవంతం అవు తుందన్నారు. డీఆర్వో కె.హేమలత మాట్లాడు తూ ఖాతాల పునరుద్ధరణలో ఎదురయ్యే సమస్యలకు తగిన మార్గదర్శకాలు అందించి సహ కారం అందిస్తామన్నారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ ప్రతినిధులు, సబ్ట్రెజరీ అధికారులు పాల్గొన్నారు. విజయనగరం: మావిగన్ రాజధాని ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానల్లో రాధాకృష్ణ రాసిన, ప్రసారం చేసిన బూ తు రాతలు, రోత వాఖ్యలపై అంబేడ్కర్ రైట్స్ ఫోరం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయం కూడలిలో ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రతులను బుధవారం దహనం చేశారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ రైట్స్ ఫో రం ప్రతినిధులు బుంగ భానుమూర్తి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ కుటుంబాలకు చెందిన మహిళలపై రాధాకృష్ణ రాతలు, వాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయంటూ మండిపడ్డారు. ఆ పత్రిక, చానల్ యజమాని తీరును ఖండిస్తున్నామమన్నారు. సంస్థపై ప్రెస్కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామన్నారు. దళిత క్రైస్తవుల అంశంపై సుప్రీంకో ర్టు తీర్పును కూడా వక్రీకరిస్తూ, వారిని భయపెట్టే పదాలను వినియోగించడం దారుణమన్నారు. కార్యక్రమంలో అంబేడ్కర్ రైట్స్ ఫోర మ్ ప్రతినిధులు దారాన వెంకటేష్, లోపింటి రామకృష్ణ, నిమ్మకాయల సుగుణాకర్, జై భీమ్ భారత్ పార్టీ జిల్లా ఇన్చార్జి చింతపల్లి దుర్గారా వు, బుక అంజిబాబు పాల్గొన్నారు. విజయనగరం గంటస్తంభం: విజయనగరం పట్టణం జొన్నగుడ్డిలో పనిచేస్తున్న ఆర్పీ జయలక్ష్మి పనిఒత్తిడి వల్లే గుండెపోటుతో మృతి చెందిందిందని, దీనికి ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపిస్తూ ఆర్పీల యూనియన్, సీఐటీయు ఆధ్వర్యంలో మెప్మా కార్యాలయం వద్ద బుధవారం ధర్నా చేశారు. మృతురాలి ఫొటోలను చేతబట్టి న్యాయం చేయాలంటూ నినదించారు. అనంతరం పని ఒత్తిడి తగ్గించాలంటూ మెప్మా పీడీ చిట్టిరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్పీల రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సీహెచ్ ఝూన్సీ, సీఐటీయూ నాయకులు పి.మణి, జిల్లా ఉపాధ్యక్షురాలు వి.లక్ష్మి మాట్లాడుతూ... జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఆర్పీలపై అధిక పని భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కొత్త యాప్లను తీసుకువచ్చి రెండు రోజుల్లో లక్ష్యాలు పూర్తి చేయాలని ఒత్తిడి తేవడం వల్లే జయలక్ష్మి గుండెపోటుకు గురైందని ఆరోపించారు. సరైన శిక్షణ లేకుండా ఇంజినీర్లు చేయాల్సిన పనులను ఆర్పీలకు అప్పగించడం అన్యాయమన్నారు. జయలక్ష్మి మృతి సహజం కాదని, ప్రభుత్వ విధానాల వల్లే జరిగిందని ఆరోపించారు. మరో ఆర్పీ రూప కూడా పని ఒత్తిడితో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని తెలిపారు. ఆర్పీలపై పెరుగుతున్న ఒత్తిడిని ప్రభుత్వం తక్షణమే గుర్తించాలని కోరారు. జీతాలు చెల్లించకుండా బతికేదెలా? నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడాన్ని ఆర్పీల యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర ధరలతో జీతాలు అందకపోతే జీవనం ఎలా సాగించాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలు జయలక్ష్మి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, ఆర్పీలపై యాప్ల భారం తగ్గించాలని, బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని, ఎస్హెచ్జీ మీటింగ్ లొకేషన్ యాప్ తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు ఎం.లత, కార్యదర్మి జి.రేణుక, ఉపాధ్యక్షురాలు బి.అప్పలనరసమ్మ, స్వాతి, డి.రమ, తదితరులు పాల్గొన్నారు. -
ఏబీఎన్ రాధాకృష్ణవి దిగజారుడు వ్యాఖ్యలు
● మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ● మహిళలను అగౌరవపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు పార్వతీపురం రూరల్: మహిళల వ్యక్తిత్వాన్ని, వారి సామాజిక హోదాను దిగజార్చేలా వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానల్ అధినేత వేమూరి రాధాకృష్ణపై పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి పట్టణ పోలీస్ స్టేషన్ సీఐను బుధవారం కలిసి మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెల 4వ తేదీన ప్రసారమైన ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి అత్యంత అవమానకరమైన వ్యాఖ్యలు చేశార ని ఫిర్యాదులో పేర్కొన్నారు. జర్నలిజం విలువలకు విరుద్ధంగా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈ కార్యక్రమం సాగిందని, పార్టీ కార్యకర్తలను ‘వెన్నెముక లేని వారు’ అని సంబోధించడంతో పాటు, కుటుంబ సంబంధాలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు సామాజికంగా అంగీకరించలేనివన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, దురుద్దేశపూర్వకంగా అసత్య ప్రచారాలు చేస్తున్న ఏబీఎన్ యాజమాన్యంపై, సంబంధిత ఎడిటర్, మేనేజ్మెంట్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. తక్షణమే వేమూరి రాధాకృష్ణ వైఎస్సార్సీపీ శ్రేణులకు, మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్వతీపురం పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మువ్వల సత్యం నాయుడు, వైస్ ఎంపీపీలు సిద్ధా జగన్నాథం, బి.రవికుమార్, రాష్ట్ర అనుబంధ విభాగాల మహిళా సభ్యులు గండి భాగ్యవతి,గండిలక్ష్మి, ప్రభావతి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఎస్.శ్రీనివా సరావు, సీనియర్ నాయకులు వై.ప్రతాప్, పాత గౌరీశంకరరావు, గొర్లి మాధవరావు, కాగాన ప్రకా ష్, గురురాజు, శేఖర్, కోల సుధాకరరావు, బి.వాసుదేవరావు, గండి శంకరరావు, శ్రీనివాసరావు, వై.త్రినాథ, తేళ్ల శివున్నాయుడు, బడే నిరంజన్, రాజు, వి.నేతాజీ, జితేంద్ర, రాజేష్, ప్రభావతి, లక్ష్మి, రమ, ఆనంద్, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
పీహెచ్సీల్లో కానరాని ఓఆర్ఎస్ కార్నర్స్..!
విజయనగరం ఫోర్ట్: వేసవి తీవ్రత ప్రారంభమైంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచే ఎండలు ఎక్కువగా ఉండడంతో జనం చాలా వరకు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఎండకు భయపడి చాలా మంది ఇంటి నుంచి బయటకు రావడం లేదు. అయితే అనారోగ్యంతో ఉన్న వారు వైద్యం కోసం ఆస్పత్రులకు వెళ్తుండగా.. అత్యవసర పనుల మీద సాధారణ ప్రజలు కూడా బయటకు రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)వెళ్తుంటారు. ఎండ తీవ్రతకు డీహైడ్రేషన్కు రోగులు గురి కాకుండా ఓఆర్ఎస్ ద్రావణం తాగించినట్టయితే వారికి ఎంతో ఉపశమనంగా ఉంటుంది. ప్రతీ పీహెచ్సీల్లో ఓఆర్ఎస్ కార్నర్ (ఓఆర్ఎస్ ద్రావణం) ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ పీహెచ్సీల్లో ఓఆర్ఎస్ కార్నర్స్ ఏర్పాటు చేసిన దాఖలాలు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని పీహెచ్సీల్లో అయితే తాగునీరు కూడా పూర్తి స్థాయిలో ఉండడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్ఓ ప్లాంట్లు కూడా కొన్ని చోట్ల పనిచేయని పరిస్థితి. దీంతో వాటర్ కేన్లను పెడుతున్నారు. ఇవి రోగులకు పూర్తి స్థాయిలో చాలని పరిస్థితి. జిల్లాలో 48 పీహెచ్సీలు జిల్లాలో 48 పీహెచ్సీలు ఉన్నాయి. 18 పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో ఓఆర్ఎస్ ద్రావణం ఏర్పాటు చేసిన దాఖలాలు కనిపించడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎండలో ప్రయాణం చేస్తే వారు డిహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉంది. వారు ఓఆర్ఎస్ ద్రావణం తాగకపోతే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఓఆర్ఎస్ ద్రావణం రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంతటి ప్రాధాన్యత గల ఓఆర్ఎస్ కార్నర్ ఏర్పాటులో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేతనదారులదీ అదే పరిస్థితి జిల్లాలో ఉపాధి హామీ పథకంలో పనిచేసే వేతనదారులదీ అదే పరిస్థితి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల వేతనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి వేతనదారులు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు పని చేస్తున్నారు. ఎండలో పని చేయడం వల్ల వారు ఎక్కువగా డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉంది. వీరికి ఓఆర్ఎస్ ద్రావణం తాగితే వడదెబ్బ బారిన పడకుండా రక్షించబడతారు. ఉపాధి హామీ పథకంలో పని చేసి వడదెబ్బకు గురై వేతనదారులు మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. జిల్లాలో 3.45 లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 6.26 లక్షల మంది వేతనదారులు ఉన్నారు. వీరిలో వేలాది మంది వేతనదారులు ప్రతీ రోజు పనికి వెళతారు. వీరికి ఓఆర్ఎస్ ద్రావణం అందుబాటులో ఉంచాలి. లేకుంటే వీరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టే. ఉపాధి పనుల్లోనూ అదే పరిస్థితి ఎండ తీవ్రతకు అల్లాడుతున్న రోగులు, వేతనదారులు జిల్లాలో 48 పీహెచ్సీలు 6.26 లక్షల మంది వేతనదారులు ఓఆర్ఎస్ ద్రావణంతో డిహైడ్రేషన్కు అడ్డుకట్టఆదేశించాం.. పీహెచ్సీల్లో ఓఆర్ఎస్ కార్నర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించాం. ఉపాధి వేతనదారులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని వైద్య సిబ్బందికి ఇప్పటికే ఆదేశించాం. – డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్ఓ -
ప్రభుత్వ ఆస్పత్రులకు నాణ్యత లేని మందులు..!
● ముద్దలా అయిపోయిన మాత్రలువిజయనగరం ఫోర్ట్: ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తామని గొప్పలు చెబుతున్న చంద్రబాబు సర్కార్ మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన మందులు కూడా ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేద ప్రజలకు ఏ జబ్బు చేసినా ప్రభుత్వ ఆస్పత్రికి వస్తారు. అలాంటి పేదలకు టీడీపీ ప్రభుత్వం నాణ్యత లేని మందులు ఇస్తుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బీపీ రోగులకు ఇచ్చే టెల్మా, ఎమ్లాడోఫిన్ మాత్రలు నాణ్యత లేనివిగా ఉన్నట్టు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. స్ట్రిప్ తీయగానే అందులో మాత్రలు ముద్దలా కావడంతో అవాక్కవ్వడం రోగుల వంతైంది. వాటి కాలపరిమితి డిసెంబర్ 2027 వరకు ఉంది. అయినప్పటకీ మాత్రలు ముద్దలా కావడం గమనర్హాం. -
పల్లె ప్రగతికి శుభ్రత నాంది
పార్వతీపురం రూరల్: జిల్లాలోని గ్రామాల రూపురేఖలను మార్చాలన్న లక్ష్యంతో ‘శుభ్రత’ అనే వినూ త్న ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి వెల్లడించారు. కలెక్టరేట్ సమీపంలోని సామాజిక భవనంలో మండల, గ్రామ స్థాయి అధికారులతో బుధవారం నిర్వహించిన అవగాహ న సదస్సులో ఆయన దిశానిర్దేశం చేశారు. గ్రామా ల్లో ఎక్కడా చెత్త, మురుగునీరు కనిపించకుండా ఐదు, ఆరు గ్రామాలను ఒక క్లస్టర్గా విభజించి వా రం రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్లు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఇంటికీ సోక్పిట్ల నిర్మాణం లక్ష్యంగా పనిచేయాలన్నారు. సీసీ రోడ్ల నిర్వహణపై మాట్లాడుతూ 30 ఏళ్ల కాలపరిమితి లోపు రోడ్లు పాడైతే సంబంధిత కాంట్రాక్టర్లతోనే ప్యాచ్ వర్కులు చేయించాలని, లేనిపక్షంలో వారిని బ్లాక్ లిస్టులో పెట్టాలని సూచించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగా బోర్లు, రీచార్జ్ పిట్లను సిద్ధం చేయాలని, ‘జలధార–జలహారతి’ కింద చెరువులను పునరుద్ధరించి ఆక్రమణల నుంచి కాపాడాలని ఆదేశించారు. ప్రజల సమస్య లు గ్రామ స్థాయిలో పరిష్కారమయ్యేలా ప్రతి గురువారం ప్రత్యేకంగా గ్రీవెన్స్ డే నిర్వహించాలని, ఏ ఒక్క సమస్యా జిల్లా కేంద్రం వరకు రాకూడద ని స్పష్టం చేశారు. అవసరమైతే తానే స్వయంగా వీడియో కాల్లో బాధితులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. సమావేశంలో జేసీ యశ్వంత్కుమార్రెడ్డి, సబ్ కలెక్టర్ వైశాలి, డీపీఓ కొండలరావు, తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేయాలి పార్వతీపురం: జిల్లాలోని మహిళా సంఘాలను బలోపేతం చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మెప్మా ఆర్పీలు, జీఓలతో బుధవారం నిర్వహించి న సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘాల సభ్యుల సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలన్నారు. సభ్యులకు రుణాల మంజూరు, చెల్లింపుల వివరాలను క్రమబద్ధీకరించాలని, ఈ ఏడాది వృద్ధికోసం ప్రత్యేక మైక్రోప్లాన్ను రూపొందించాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచి వ్యాధుల నివారణకు మహి ళా సంఘాలు మందుండాలని పిలుపునిచ్చారు. వన్ ఫ్యామిలీ–వన్ ఎంటర్ ప్రెన్యూర్ లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో మెప్మా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎండలతో జాగ్రత్త
పార్వతీపురం: రాబోయే రోజుల్లో జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంద ని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి సూచించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ఆయన మాట్లాడుతూ వడగాల్పుల ప్రభావం దృష్ట్యా అత్యవసరమై తే తప్ప బయటకు వెళ్లకుండా, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయ టపనులను వాయిదా వేసుకోవాలన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆరో గ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్, మందులు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. -
● పౌడర్ అద్దితేనే ఫేస్ పడుద్ది
ఉపాధిహామీ వేతనదారుల మస్తర్ నమోదుకు యాప్లో ఫేస్ రీడింగ్ కీలకం. ఇందులో తలెత్తిన సాంకేతిక ఇబ్బందులు వేతనదారులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. పలుసార్లు మేట్లు యాప్లో ఫేస్ రీడింగ్ చేస్తున్నా నమోదుకావడంలేదు. దీంతో పనిచేసినా వేతనాలు వస్తాయోలేదోనన్న బెంగ వెంటాడుతోంది. దీనిని అధిగమించేందుకు అక్కన్నగూడకు చెందిన వేతనదారు సవర సుంబురుకు వినూత్నమైన ఆలోచన వచ్చింది. సోమవారం నుంచి ఉపాధిహామీ పనికి వెళ్తున్న ఆయన ఫేస్ నమోదు కాకపోవడంతో బుధవారం ముఖానికి ఒత్తుగా పౌడర్ అద్దుకుని వెళ్లాడు. మేట్ ముఖఆధారిత యాప్లో ఫేస్ను రీడింగ్ చేయగానే అప్లోడ్ అయింది. దీంతో వేతనదారులంతా అవాక్కయ్యారు. పౌడరు రాసుకుని వస్తే మీ ముఖం కూడా నమోదవుతుందంటూ ఆయన ఉచిత సలహా ఇచ్చాడు. భలేభలే అంటూ వేతనదారులందరూ నవ్వుకున్నారు. – సీతంపేట -
రాష్ట్ర స్థాయి పోటీలకు బాలికోన్నత పాఠశాల ప్రాజెక్టు
చీపురుపల్లి: జిల్లా స్థాయిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎంట్రప్రెన్యూరల్ మైండ్సెట్ డవలప్మెంట్ ప్రోగ్రామ్(ఏపీ ఈఎమ్డీపీ) ఎక్స్పో–2026లో చీపురుపల్లి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థినిలు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. విజయనగరంలోని కస్పా హైస్కూల్లో మంగళవారం జరిగిన ఏపీ ఈఎమ్డీపీ ఎక్స్పోలో చీపురుపల్లి బాలికోన్నత పాఠశాల విద్యార్థినిలు ప్రదర్శించిన ప్రాజెక్టు జిల్లా స్థాయిలో ప్రధమ స్థానంలో నిలిచింది. దీంతో రాష్ట్ర స్థాయిలో జరగనున్న ఎక్స్పోకు ఎంపికై ంది. దీంతో ప్రాజెక్టు తయారు చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థినిలను పాఠశాల హెచ్ఎం రెహేనా బేగం బుధవారం అభినందించారు. జిల్లా స్థాయిలో ప్రధమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయికు ఎంపికై న ప్రాజెక్టు ప్రదర్శనలో విద్యార్థినిలు కె.లిఖిత స్వరాజ్, సీహెచ్ మనశ్విని, వి.అమృత వర్షిణి ఉండగా గైడ్ టీచర్లుగా రమాదేవి, అనూరాధ, స్వర్ణకుమారి వ్యవహరించారు. -
బంగారు గొలుసు ఎత్తుకెళ్లేందుకు యత్నం
● ప్రతిఘటించిన మహిళపై కర్రతో దాడి ● అడ్డుకోబోయిన మరో మహిళపై కూడా అగంతుకుడి దాడిబొండపల్లి: ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యం చేసి బంగారు ఆభరణాలను దోచుకోని వెళ్లేందుకు ప్రయత్నించి మహిళ ప్రతిఘటించడంతో తలపై కర్రతో బలంగా కొట్టి గుర్తు తెలియని అగంతుకుడు ఉడాయించిన సంఘటన మండల కేంద్రమైన బొండపల్లిలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబందించి ఎస్ఐ తెలిపిన వివరాలు... బొండపల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారి 26కు అనుకోని పెట్రోలు బంకుకు ఎదురుగా ఉన్న ఇంట్లో మంగళవారం రాత్రి తొమ్మిదిన్నర సమయంలో గుర్తు తెలియని ఒక అంగతుకుడు మాస్క్ వేసుకోని వచ్చి బాత్రూంకు వెళ్లడానికి వచ్చిన కిలపర్తి రామలక్ష్మిపై కర్రతో తలపై బలంగా కొట్టి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కోని వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించి కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న చలుమూరి సత్యవతి బయటకు రాగా ఆమె అగంతుకుడుని చీపురుతో కోట్టే ప్రయత్నం చేయగా సత్యవ తి చేతులు, కాళ్లుపై కర్రతో దాడి చేసి అక్కడ నుంచి గోడ దూకి పరారయ్యాడు. రామలక్ష్మి మెడలో బంగారు చైనును లాక్కోనే ప్రయత్నంలో తెగి పడి చైను ఆమె జాకెట్టులో పడటంతో పాటు సత్యవతి కూడా పెనుగులాటలో అంగతుకుడు అక్కడ నుంచి గోడ దూకి పరారీ అయినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన రామలక్ష్మిని 108 వాహనంలో గజపతినగరంలోని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా ప్రసుత్తం ఆమె పరిస్థితి బాగానే ఉంది. ఎస్ఐతో పాటు పోలీసు సిబ్బంది, క్లూస్ టీం సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. -
జీఓ 60ని రద్దు చేయాలి
విజయనగరం రూరల్: గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులకు జీఓ నంబరు 91 ప్రకారం ఇవ్వాల్సిన పే స్కేల్ ను అమలు చేయాలని లేకుంటే ప్రభుత్వంపై తమ పోరాటం ఉధృతం చేస్తామని పంచాయతీ అభివృద్ధి అధికారులు తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు జీఓ 91ను యథాతథంగా అమలు చేసి, పే స్కేలును తగ్గిస్తూ జారీ చేసిన 60 జీఓను వెంటనే రద్దు చేయాలని కోరుతూ పంచాయతీ అభివృద్ధి అధికారుల జిల్లా సంఘం నాయకులు, సభ్యులు డీపీఓ కార్యాలయం వద్ద బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం జిల్లా పంచాయతీ అభివృద్ధి అధికారి మల్లికార్జున్కు జీఓ 60ని రద్దు చేసి జీఓ నంబరు 91ని తక్షణమే అమలు చేయాలని కోరుతూ జిల్లా పంచాయతీ అభివృద్ధి అధికారుల సంఘం నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జీపీడీఓ సంఘం అధ్యక్షులు మంత్రి రమణ, ప్రధాన కార్యదర్శి కంబాల శ్రీకాంత్, గౌరవ అధ్యక్షులు ఎర్ర రమణ, కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
వెంకంపేటలో క్రీడా పోటీలు
● బ్యాట్ పట్టిన కలెక్టర్, జేసీపార్వతీపురం రూరల్: జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మండలం వెంకంపేటలో బుధవారం క్రీడా పోటీలు నిర్వహించారు. కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రికెట్, పరుగు పందెం పోటీలను ప్రారంభించారు. మైదానంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్వయంగా క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిత్యం విధి నిర్వహణలో ఒత్తిడికి గురయ్యే ఉద్యోగులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. గ్రామంలో సీనియర్లు, జూనియర్లకు విడివిడిగా క్రికెట్ మ్యాచ్లు, యువతకు పరుగు పందెం నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు, ఉత్తమ ఉద్యోగులకు ఈ నెల 10న జరగనున్న జాతీయ సర్వే దినోత్సవం వేడుకల్లో బహుమతులు అందజేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా సర్వే అధికారి ఎం.శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు. -
గంజాయితో యువకుల అరెస్ట్
తెర్లాం: గంజాయి కొనుగోలు చేసి విక్రయించేందుకు తీసుకువస్తున్న నలుగురు యువకులను, ఓ జువైనల్(మైనర్ బాలుడు)ను తెర్లాం ఎస్ఐ సాగర్బాబు పట్టుకొని అరెస్ట్ చేసిన సంఘటన ఇది. దీనికి సంబంధించి కేసు దర్యాప్తు అధికారి బొబ్బిలి రూరల్ సీఐ శ్రీనివాస్ బుధవారం తెలిపిన వివరాలు... ఒడిశా రాష్ట్రంలోని సుంకి కొండ ప్రాంతాల్లో పండిస్తున్న గంజాయిని రమేష్ అనే వ్యక్తి వద్ద మండలానికి చెందిన నలుగురు యువకులు కొనుగోలు చేశారు. తెర్లాం తీసుకువచ్చి మండలంలోని ఓ గ్రామానికి చెందిన జువైనల్ ద్వారా విక్రయించేందుకు లావాదేవీలు జరుపుతున్న సమయంలో తెర్లాం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్ఐ తన సిబ్బందితో దాడి చేసి వారి నుంచి 2.600కేజీల గంజాయిని, లావాదేవీలు జరుపుతున్న నలుగురు యువకులను, ఒక జువైనల్ను పట్టుకున్నారు. యువకుల వద్ద పట్టుకున్న గంజాయిని తెర్లాం ఉప తహసీల్దార్ సమక్షంలో పరిశీలించి తూకం వేసి సీజ్ చేశారు. గంజాయి కొనుగోలు చేసి, విక్రయించేందుకు లావాదేవీలు జరుపుతున్న ముగ్గురు యువకులను, ఓ జువైనల్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ నేరంతో సంబంధం ఉన్న ఇద్దరు యువకుల్లో జరజాన శ్రీరామ్పై గతంలో రెండు గంజాయి కేసులు నమోదు చేయడం జైలుకు వెళ్లడం జరిగిందన్నారు. అలాగే లోపింటి నాగరాజుపై గతంలో ఒకసారి గంజాయి కేసు నమోదు కాబడి గతంలో జైలుకు వెళ్లి వచ్చారన్నారు. వీరితో పాటు చౌడువాడ దిలీప్కుమార్, కుప్పిలి బెన్సన్, సుమంత్రెడ్డిని, పోలీసుల అదుపులో ఉన్న జువైనల్ను అరెస్ట్ చేసి బొబ్బిలి కోర్టులో హాజరు పరిచామని తెలిపారు. గతంలో రెండుసార్లు గంజాయి కేసులో పట్టుబడి జైలుకు వెళ్లి మూడోసారి పట్టుబడి గంజాయి కేసులో అరెస్ట్ అయిన జరజాన శ్రీరామ్పై త్వరలో పీఐటీ ఎన్డీపీఎస్ కేసును నమోదు చేస్తామని తెలిపారు. నలుగురు నుంచి నాలుగు సెల్ఫోన్లు, రూ.350లు నగదు సీజ్ చేశామన్నారు. ఆయనతో పాటు తెర్లాం ఎస్ఐ సాగర్బాబు, హెచ్సీ నాగేశ్వరరావు, కానిస్టేబుల్ శ్రీరామ్ ఉన్నారు. -
రెవెన్యూ పనుల్లో జాప్యం
విజయనగరం అర్బన్: జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, రీ సర్వే, మ్యుటేషన్ల ప్రక్రియలు మందగమనంలోనే కొనసాగుతున్నాయని సమస్యలు పేరుకుపోతున్న నేపథ్యంలో వేగవంతం చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహంచిన సమీక్ష సమావేశంలో ఈ అంశాలపై చర్చ జరిగింది. జిల్లాలో పాసుపుస్తకాల పంపిణీలో ఇంకా లోపాలు కొనసాగుతుండటం, రీ సర్వే పనులు పూర్తి స్థాయిలో జరగకపోవడం రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు గుర్తించారు. మ్యుటేషన్లు కూడా ఆలస్యంగా పూర్తవుతున్నాయిని, పలుచోట్ల ఫిర్యాదులు పెరుగుతున్న దృష్ట్యా సంబంధిత ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఒక్క తప్పు కూడా లేకుండా పాసుపుస్తకాలు ఇవ్వాలని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా నత్తనడకన సాగుతుండడంపై జేసీ సమీక్షించారు. గ్యాస్ సరఫరాపై కూడా సమీక్షించారు. జిల్లాలోనే గ్యాస్ వినియోగదారులకు సకాలంలో గ్యాస్ సరఫరా జరిగేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ సత్తిబాబు, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. 13న అప్రెంటీస్ మేళా విజయనగరం అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ఈ నెల 13వ తేదీన ప్రధానిమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ టీవీ గిరి తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ మేళాలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. మేళాకు మ్యాట్రిక్స్ లేబొరేటరీ, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, జయభేరి ఆటోమోటివ్ లిమిటెడ్, శ్యాంసంగ్ అథరైజ్డ్ సర్వీస్ సెంటర్, ఐఎఫ్బీ సర్వీస్ సెంటర్, వోల్టాస్ ఆథరైజ్జ్ సర్వీస్ సెంటర్, ఎల్జీ, రేడియంట్ ఎలక్ట్రానిక్స్ క్యుసివ్ టెక్సాలజి హైదరాబాద్ వంటి ప్రముఖ సంస్థలను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. మేళాలో పాల్గొన్న అభ్యర్థులను ఆయా కంపెనీలు ఎంపిక చేసి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టైపెండ్తో అప్రెంటిస్ అవకాశాలు కల్పించనున్నట్టు జిల్లా కన్వీనర్ వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, రెండు ఫొటోలతో హాజరు కావాలని ప్రిన్సిపాల్ సూచించారు. వివరాల కోసం 9441518355, 9703179119 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. ఉపాధి పనుల పరిశీలన ● వేగవంతం చేయండి..: జేసీ నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొత్తపేట పంచాయతీ పరిధిలో చేపడుతున్న ఉపాధి హా మీ పనులను డ్వామా పీడీ ఎస్.శారదాదేవి బుధవారం పరిశీలించారు.ఈసందర్భంగా వేతనదారులకు ఆమె పలుసూచనలు చేశారు.రోజూ రెండు పూటలా పనులకు హాజరు కావాలని, 125 రోజుల పనిదినాలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు.ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చిన కొలతల ప్రకారం పనులు చేస్తే ప్రభుత్వం నిర్ణయించిన దినసరి గరిష్ట వేతనం రూ.307 అందుతుందన్నారు.పని ప్రదేశాల్లో వేతనదారులకు నీడ, తాగునీరు, ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశించారు. ఆమె వెంట ఏపీఓ రామారావు ఉన్నారు. -
17న 104 పాత వాహనాల ఇ–వేలం
విజయనగరం ఫోర్ట్: పనికి రాని 104 వాహనాలను ఈ నెల 17న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇ.కొనుగోలు పోర్టల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఇ వేలంలో విక్రయించేందుకు నిర్ణయించినట్టు డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలం నియమ నిబంధనలు, మిగిలిన వివరాలను కొనుగోలు.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో పొందుపరచినట్టు తెలిపారు. యువకుడి దుర్మరణంచీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి మండలంలోని తాటిగూడ గ్రామానికి చెందిన బుద్దిమాంద్యం గల జి.ఈశ్వరరావు(31 గెడ్డపువలస సమీపంలో ఉన్న మైనింగు బంటాలో పడి మృతి చెందాడు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. మృతుడు ఈశ్వరరావు ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. కుటుంబ సభ్యులు ఈశ్వరరావు కోసం ఆరా తీస్తుండగా బుధవారం గెడ్డపువలస గ్రామానికి సమీపంలో ఉన్న మైనింగు బంటాలో మృతదేహం తేలి ఉన్న విషయం తెలుసుకున్నారు. మృతదేహాన్ని ఈశ్వరరావుగా గుర్తించారు. ఎస్ఐ బి.లోకేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మూడు గడ్డివాములు దగ్ధం దత్తిరాజేరు: మండలంలోని ఎం.లింగాలవలస గ్రామంలో విద్యుత్ వైర్లు తగిలి మూడు గడ్డివాములు దగ్ధమైనట్లు గజపతినగరం అగ్నిమాపక అధికారి రవిప్రసాద్ బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రైతులు కిలారి నాగ, కిలారి రామారావు, సింగారపు కన్నయ్యకు చెందిన గడ్డి కుప్పలు దగ్ధం కావడంతో సుమారు రూ.80 వేల వరకు నష్టం జరిగినట్టు గుర్తించారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని ఎంపీటీసీ అన్నజింగా అప్పలనాయుడు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ప్రజా అప్పలనాయుడు, మాజ్జి శ్రీను పరిశీలించి పాడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. బంగారు గొలుసు చోరీ కొత్తవలస : మండలంలోని కొత్తవలస – కోటపాడు రోడ్డులో ప్రగతి కళాశాల సమీపంలో ఫ్యాన్సీ షాపు నిర్వాహకురాలు తలపై గుర్తు తెలియని మహిళ సుత్తితో కొట్టి మెడలో బంగారు గొలుసును దోచుకుపోయిన ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి సీఐ షణ్ముఖరావు తెలిపిన వివరాలు.. సీతంపేట గ్రామానికి చెందిన పొలమరశెట్టి పుష్ప ప్రగతి కళాశాల సమీపంలో ఫ్యాన్సీ సాపు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గుర్తు తెలియని మహిళ సోమవారం వచ్చి షాపులో గాజులను కొనుగోలు చేసి వెళ్లింది. మళ్లీ హ్యాండ్బ్యాగ్ కోసమని మంగళవారం వచ్చి చూపించమని కోరింది. షాపు నిర్వాహకురాలు పుష్ప హ్యాండ్బ్యాగ్లను చూపించే సమయంలో ఇనుప సుత్తితో తలపై బలంగా కొట్టి మెడలో ఉన్న సుమారు రెండు తులా బంగారు గొలుసును లాక్కోని పారిపోయిందని బాధితురాలు ఫిర్యాదు చేసినట్టు బుధవారం తెలిపారు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మద్యం బాటిళ్ల ధ్వంసం సాలూరు: పాత కేసుల్లో పట్టుకున్న 95 మద్యం బాటిళ్లను ఏఈఎస్ సంతోష్కుమార్ సమక్షంలో ధ్వంసం చేసినట్టు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ దాసు బుధవారం తెలిపారు. ఎరుకుల వీధిలో దాడులు నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పట్టణంలోని 37 మంది పాత సారా ముద్దాయిలను బైండోవర్ చేసినట్టు ఆయన తెలిపారు. వీరిని తహసీల్దార్ సురేష్ వద్ద హాజరుపరచి బైండోవర్ చేసినట్టు చెప్పారు. పైడితల్లి ఆలయంలో చండీయాగంవిజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో వేదపండితులు బుధవారం చండీయాగం నిర్వహించారు. ఆలయ అర్చకులు నేతేటి ప్రశాంత్, వేదపండితులు సాయికిరణ్ శర్మ, వెలువలపల్లి నరసింహమూర్తి యాగప్రక్రియను భక్తిశ్రద్ధలతో చేశారు. అనంతరం అమ్మవారి శేషవస్త్రాలను, ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఆలయ ఈఓ కె.శిరీష కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి : డీఎంహెచ్ఓ
విజయనగరం ఫోర్ట్: ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద మంగళవారం నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ పోషకాహారం తీసుకుంటూ ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య తనిఖీలు చేయించుకోవాలన్నారు. ప్రతి రోజు వ్యాయమం, సరైన ఆహారం, సరైన నిద్ర తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎల్ఓ డాక్టర్ రాణి, డీపీహెచ్ఎన్ఓ వి.శాంతి, డెమో వి.చిన్నతల్లి, ఎస్ఓ గిరిగణేష్ తదితరులు పాల్గొన్నారు. జీవనశైలి ఆరోగ్య సమస్యలకు కారణం జీవనశైలి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమని సుఖీభవ ఆస్పత్రి ఎం.డి డాక్టర్ పి.ఎస్.వి.రామారా వు అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆస్పత్రిలో నిర్వహించిన సదస్సు లో ఆయన మాట్లాడుతూ ప్రతీ రోజు ధ్యానం, యో గ, వ్యాయమం ఏదో ఒకటి చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శివరామ్ తదితరులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాలను అరికట్టాలి
● జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ సాధికారిత అధికారిణి బాలామణి విజయనగరం ఫోర్ట్: బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ సాధికారిత అధికారిణి కె.వి.బాలామణి అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం బేటీబచావో, బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ చిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల బాలికల ఆరోగ్యం, విద్య, వారి భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడతాయన్నారు. దీనివల్ల బాలికలు తీవ్రమైన మానసిక, శారీరక సమస్యలకు గురవుతారన్నారు. సమాజంలో ఎక్కడైనా బాల్య వివా హాలు జరిగినా.. అసాంఘిక కార్యక్రమాలు జరిగినా అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో నోడల్ అధికారి తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు. నిమ్మలపాడు పరిసరాల్లో ఏనుగుల సంచారం జియ్యమ్మవలస రూరల్: మండలంలోని పాత నిమ్మలపాడు నిర్వాసిత గ్రామం సమీపంలో ఏనుగుల గుంపు సంచరించడంతో అటువైపుగా వెళ్లాల్సిన తొడుము, రాయిపురం, మాదలంగి గ్రామాలకు వెళ్లే వాహన చోదకులు భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం ఉదయం గిజబ, బాసంగి గ్రామాల పంట పొలాల్లో సంచరించిన గజరాజులు సాయంత్రానికి నిమ్మలపాడుకు చేరుకున్నాయి. రాత్రికి ఎటు వెళ్తాయో తెలియని పరిస్థితి. ట్రాకర్సు మాత్రం ఆయా గ్రామాల్లో రైతులకు ఏనుగులు సంచారంపై అవగాహన కల్పిస్తూ సమాచారం అందిస్తున్నారు. అయితే ఏనుగుల తరలింపుపై శాస్వత పరిష్కారం చూపకుండా ప్రభుత్వం తాత్సారం చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. నిందితుడికి జైలుశిక్ష విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ ఇంట్లో దొంగతనం చేసిన కాగిత అర్జున్కు అడిషనల్ జ్యుడిషియల్ ఫ్యామిలీ కోర్ట్ మెజిస్ట్రేట్ చక్రవర్తి 3 నెలలు జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారని ఎస్ఐ అశోక్కుమార్ మంగళవారం తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీన కంది శ్రీనివాసరావు ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఉదయం తలుపులు పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశారన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆ మరుసటి రోజు ఇందిరానగర్కు చెందిన కాగిత అర్జున్ను అదుపులో తీసుకుని విచారించగా నేరం అంగీకరించడంతో చార్జ్షీట్ దాఖలు చేసి కోర్ోట్ల ప్రవేశ పెట్టామన్నారు. కేసు విచారణ చేసి పై విధంగా తీర్పునిచ్చారని ఎస్ఐ తెలిపారు. భర్తతో గొడవపడి వివాహిత ఆత్మహత్య భువనగిరి టౌన్: భర్తతో గొడవపడి క్షణికావేశంలో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘట న యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని హౌసింగ్బోర్డు కాలనీలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం నాయుడువలస గ్రామానికి చెందిన లచ్చుపాత్రుని లక్ష్మునాయుడు, లలిత(30) దంపతులకు 2018లో వివాహమైంది. జీవనోపాధి నిమిత్తం వారు ఎనిమిదేళ్ల కిందట హైదరాబాద్కు వలస వెళ్లారు. 2025లో భువనగిరి శివారు లోని ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీలో లక్ష్మునాయుడుకు ఉద్యోగం రావడంతో భువనగిరి పట్టణంలోని హౌసింగ్బోర్డు కాలనీలో స్థిరపడ్డారు. వీరికి ఆరేళ్ల కుమారుడు అయినేంద్ర నాయుడు, ఒకటిన్నర ఏళ్ల కుమార్తె జోషిత ఉన్నారు. సోమవారం రాత్రి భోజనం చేసే సమయంలో భర్తతో లలిత గొడవపడింది. దీంతో మనస్తాపానికి గురైన లలిత భర్త పిలుస్తున్నా వినకుండా బెడ్రూంలోకి వెళ్లి తలుపు వేసుకుంది. కాసేపటి తర్వాత లక్ష్మునాయుడు తలుపు తట్టగా లలిత స్పందించకపోవడంతో కిటికీలోంచి చూడగా.. ఆమె కబోర్డు హ్యాంగర్కు ఉరి వేసుకుని కనిపించింది. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పట్టణ ఎస్ఐ నరేష్ తెలిపారు. పోలీసుల అదుపులో ఒడిశా వాసి విజయనగరం క్రైమ్: విజయనగరం వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిఽధిలో క్రైమ్ పార్టీ బృందం సెల్ ఫోన్లను దొంగతనం చేస్తున్న ఒడిశాకు చెందిన వ్యక్తిని మంగళవారం అదుపులోకి తీసుకుంది. దాదాపు 80సెల్ఫోన్లను అపహరించినట్టు క్రైమ్ పార్టీ బృందానికి వచ్చిన సమాచారంతో ఎస్ఐ సురేంద్రనాయుడు అదుపులోకి తీసుకున్నారు. -
తీర్థయాత్రల పేరుతో యాత్రికులకు బురిడీ
వీరఘట్టం: తీర్థయాత్రల పేరుతో వీరఘట్టం కూరాకుల వీధికి చెందిన 40 మంది యాత్రికులను ఓ ట్రావెల్ బస్సు నిర్వాహకుడు బురిడీ కొట్టించిన ఉదంతం మంగళవారం వెలుగుచూసింది. ఈ నెల 5న వీరఘట్టం నుంచి 40 మంది యాత్రికులతో బయలుదేరిన బస్సు తిరిగి మంగళవారం తెల్లారేసరికి వీరఘట్టం చేరుకోవడంపై అంతా ఆశ్చర్యంగా ఏం జరిగిందని యాత్రికులను ఆరా తీశారు. వివరాలు ఇలా ఉన్నాయి. వీరఘట్టం కూరాకులవీధికి చెందిన 40 మంది యాత్రికులు శ్రీశైలం, షిర్డీ, మహానంది, అరుణాచలం, రామేశ్వరం, మధురై ఇలా పలు రకాల తీర్థయాత్రలకు 22 రోజులలో వెళ్లేందుకు కొమరాడ మండలం గుణానపురానికి చెందిన అచ్చుతరావు అనే వ్యక్తి వద్ద ఓ ట్రావెల్ బస్సును బుక్ చేశారు. ప్రతీ యాత్రికుడికు టికెట్ ధరను రూ.13 వేలుగా నిర్ణయించారు. దీంతో ఈ యాత్రికుల్లో ఉండే ఓ వ్యక్తి అందరి వద్ద రూ.5.20 లక్షలను కలెక్షన్ చేశాడు. ఇందులో రూ.1.20 లక్షలను బస్సు నిర్వాహకుడు అచ్చుతరావుకు అడ్వాన్స్గా ఇచ్చారు. ఈ నెల 5న తీర్థయాత్రలకు వెళ్లేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఇంతలోనే బుక్చేసిన బస్సుకు ఫైనాన్స్ ఇబ్బందులు ఉన్నందున మార్గమద్యలో కంపెనీ వాళ్లు బస్సును ఆపేయవచ్చని, యాత్రికులకు పలాసకు చెందిన మరో ట్రావెల్ బస్సును ఏర్పాటు చేస్తానని అచ్చుతరావు చెప్పడంతో యాత్రికులు సమ్మతించారు. ఈ నెల 5న పలాస నుంచి వచ్చిన ట్రావెల్ బస్సుకు రూ.30 వేల డీజిల్ కొట్టించారు. రూ.60 వేలు ఖర్చు చేసి టూర్లో భోజన వసతికి కావాల్సిన సామగ్రిని యాత్రికులు కొనుగోలు చేశారు. ఈ నెల 5న సాయంత్రం వీరఘట్టం నుంచి పార్వతీపురం మీదుగా యాత్రకు బయలుదేరారు. బస్సు బొబ్బిలి వద్ద బ్రేక్డౌన్ కావడంతో రూ.4 వేలు ఖర్చు చేసి బస్సుకు రిపేర్ చేశారు. ఇంతలో ఫైనాన్స్ కంపెనీ వారు బొబ్బిలి చేరుకుని అచ్చుతరావును తమ వెంటనే తీసుకుపోయారు. తిరుగు ప్రయాణం ఫైనాన్స్ కంపెనీ వారితో వెళ్లిన బస్సు నిర్వాహకుడు అచ్చుతరావు వెంటనే వచ్చేస్తాను.. మిమ్మల్ని విజయగనరంలో కలుసుకుంటానని చెప్పడంతో బస్సులో ఉన్న యాత్రికులు విజయనగరంలోని రామబాణం వద్దకు ఈ నెల 6న తెల్లవారుజామున చేరుకున్నారు. అక్కడ చాలా సేపు అచ్చుతరావు కోసం వేచి చూశారు. అచ్చుతరావు ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో రోజంతా ఎదురుచూశారు. తామంతా మోసపోయామని గమనించి పలాసకు చెందిన ట్రావెల్ బస్సులో వీరఘట్టం చేరుకున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని వీరఘట్టం ఎస్.ఐకు తెలియజేశారు. స్పందించిన ఎస్.ఐ షణ్ముఖరావు బస్సు నిర్వాహకుడితో మాట్లాడారు. వెంటనే వీరఘట్టం వచ్చి యాత్రికులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేయాలని చెప్పడంతో ఆయన వస్తానని చెప్పాడు. అయితే మంగళవారం ఎంత సేపటికి రాలేదు. అచ్చుతరావు వచ్చే వరకు బస్సును వీరఘట్టంలోనే ఉంచుతామన్నారు. ఏం జరుగుతుందో చూద్దామని యాత్రికులు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. మార్గమద్యలో యాత్రికులను వదిలేసిన ట్రావెల్స్ బస్సు నిర్వాహకుడు చేసేదేమీ లేక ఇంటికి తిరుగు ప్రయాణం వీరఘట్టం పోలీసులను ఆశ్రయించిన బాధితులు -
డ్రోన్లతో నేరాలకు చెక్
విజయనగరం క్రైమ్: డ్రోన్లతో నేరాలను కట్టడి చేస్తున్నామని ఎస్పీ దామోదర్ స్పష్టం చేశారు. జిల్లాలో నేరాలను నియంత్రించేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నామని ఎస్పీ మంగళవారం తెలిపారు. నేరాలు జరిగే ఆస్కారం ఉన్న శివారు, రద్దీ ప్రాంతాల్లోను, పండగల్లో నిఘా పెట్టేందుకు, దాంతో పాటు ఈవ్ టీజింగ్, ఓపెన్ డ్రింకింగ్, పేకాటలు, కోడి పందాలను, చైన్ స్నాచింగ్లు నియంత్రించేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నామని తెలిపారు. ప్రతీ పోలీసుస్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్లు, ఈవ్ టీజింగ్, దొంగతనాలను అరికట్టేందుకు డ్రోన్ ఉపయోగిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులపై నిఘా పెట్టేందుకుఈ డ్రోన్స్ వినియోగించి, నేరాలను కట్టడి చేస్తున్నామని పేర్కొన్నారు. విజయనగరంలోని జేఎన్టీయూ, కలెక్టరేట్ జంక్షన్, కేఎల్ పురం, మయూరి కూడలి, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వేస్టేషన్ తోటపాలెం, బాలాజీ జంక్షన్ వంటి ప్రాంతాలను డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. కళాశాలల వద్ద పోలీసుల ఆధ్వర్యంలో డ్రోన్లను పంపి, ఆయా ప్రాంతాలపై నిఘా ఏర్పాటు చేశామని ఈవ్ టీజింగు, చైన్ స్నాచింగ్స్, ఇతర నేరాలు, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. గడిచిన ఆరు మాసాల్లో డ్రోన్ల ద్వారా ఓపెన్ డ్రింకింగ్కు పాల్పడ్డ వారిపై 180 కేసులు, పేకాట, కోడి పందాలు ఆడుతున్న 51మందిపై, గంజాయి సేవిస్తున్న ముగ్గురిపై కేసులు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. -
చింతపండుకు మద్దతు ధర
గుమ్మలక్ష్మీపురం: పార్వతీపురం ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీ వాస్తవ చొరవతో జీసీసీ డీఎం కిలో చింతపండును రూ.55లు మద్దతు ధర కల్పించి కొనుగోలు చేస్తున్నట్టు గుమ్మలక్ష్మీపురం జీసీఎంఎస్ బ్రాంచ్ మేనేజర్ ఎస్.రాము పేర్కొన్నారు. మండలంలోని గుల్లలంక గ్రామంలోని గిరిజనుల నుంచి పెంచిన ధరతో చింతపండును జీసీఎంఎస్ మేనేజర్ సహా, సీసీపీఏలు మంగళవారం కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రారంభంలో కిలో చింత పండు రూ.36 ఉండేదని, మధ్యలో ఆ ధరను రూ.45కు పెంచామని, ఈ ఏడాది చింతపండు దిగుబడి తగ్గటంతో గిరిజనులకు మద్దతు ధర కల్పించేందుకు రూ.55కు పెంచామన్నారు. జీసీఎంఎస్ కల్పిస్తున్న ధరను సద్వినియోగం చేసుకుంటూనే.. జీసీసీ వ్యాపారాభివృధ్ధికి తోడ్పాటునందించేందుకు చింతపండును తమకే విక్రయించాలని మేనేజర్ రాము గిరిజనులను కోరారు. -
విధి నిర్వహణలో అలసత్వం వద్దు : కలెక్టర్
సాలూరు: విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి స్పష్టం చేశారు. పట్టణంలో పెదకోమటిపేట సచివాలయాన్ని్, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేకాధికారి యశ్వంత్కుమార్రెడ్డితో కలిసి ఆయన ఆకస్మికంగా మంగళవారం తనిఖీ చేశారు. ఉద్యోగులు అటెండెన్స్, రిజిస్టర్ల నిర్వహణ, అందిస్తున్న సర్వీసులు, సర్వేల ప్రగతి తదితర అంశాలపై ఆరా తీశారు. ఉద్యోగులు నిబద్దతతో పని చేయాలని సూచించారు. వాట్సాప్ మనమిత్రపై ప్రజలకు అవగాహన పెంపొదించాలన్నారు. వాట్సాప్ మనమిత్ర ద్వారా సర్వీసులను రిజిస్టర్ నేరుగా చేసుకునేలా ప్రజలను చైతన్యపరచాలన్నారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. సచివాలయానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. సచివాలయ ఉద్యోగులు నిబద్దతతో పని చేయాలని అన్నారు. -
పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కాంస్య పతకం
చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి పట్టణానికి చెందిన క్రీడాకారిణి గణపతిరాజు శ్వేత పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించింది. ఈ నెల 4,5 తేదీల్లో విజయనగరం జిల్లాలోని రాజాం జీఎంఆర్ ఐటీఓలో ఏపీ 13వ పవర్ లిఫ్టింగ్ 2026 చాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో క్రీడాకారిణి శ్వేత మాస్టర్ వన్ విభాగంలో 76 కిలోల కేటగిరిలో 230 కిలోల బరువును ఎత్తి కాంస్య పతకం కై వసం చేసుకున్నారు. ఘాట్ రోడ్లో బియ్యం లారీ బోల్తా పాచిపెంట: ఒడిశా నుంచి ఆంధ్రాకు బియ్యం లోడుతో వస్తున్న లారీ మండలంలో కంకణాపల్లి సమీపంలో ఘాట్ రోడ్పై మంగళవారం ఉదయం బోల్తా పడింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొన్ని గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న సీఐ రామకృష్ణ, ఎస్ఐ అర్జున్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి క్రేన్తో లారీని పక్కకు నెట్టించారు. చెల్లాచెదురుగా ఉన్న బియ్యం బస్తాలను స్థానికుల సహాయంతో రోడ్డు పక్కకు వేసి ట్రాఫిక్ అంతరాయం తొలగించారు. దీంతో రాకపోకలు యధావిధిగా కొనసాగాయి. బైకులు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలుభామిని: సింగిడి నుంచి పసుకుడి వైపు బైక్పై వస్తున్న మండలంలోని పసుకుడికి చెందిన గౌడో ప్రసాద్, సోమనాథ్ సాహు మంగళవారం రాత్రి పసుకుడి వద్ద జరిగిన ప్రమాదంలో తీవ్రం గా గాయపడ్డారు. బైక్పై వస్తున్న వీరు ఎదురుగా భామిని వైపు నుంచి వస్తున్న మరో బైక్ వెనుకభాగంలో ఉన్న బస్తాను చీకట్లో ఢీకొని పడిపోయారు. దీంతో వీరిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108లో భామిని పీహెచ్సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఐజీబీసీ స్టూడెంట్స్ చాప్టర్ ప్రారంభం
విజయనగరం అర్బన్: సీతం ఇంజినీరింగ్ కళాశాలలో ‘గ్రీన్ బిల్డింగ్ ఇనిషియేటివ్’ అంశంతో ఐజీబీసీ స్టూడెంట్స్ చాప్టర్ను విశాఖపట్నం ఐజీబీసీ చాప్టర్ చైర్మన్ డాక్టర్ కె.కుమార్రాజా మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్స్ బిల్టింగ్స్, సుస్థిరత సూత్రాలు, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ పాత్ర కీలకమని అన్నారు. కో–చైర్మన్ పీలా కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యా సంస్థల్లో ఐజీబీసీ స్టూడెంట్స్ చాప్టర్ స్థాపన వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. పర్యావరణ హిత నిర్మాణ పద్దతులను ప్రోత్సహించడం, ఇంజినీరింగ్ విద్యార్థుల్లో సుస్థిర అభివృద్ధి పట్ల అవగాహన పెంపొందించడం లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కళాశా ల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు అన్నారు. అనంతరం అసోసియేట్ కౌన్సిలర్ కేవీ శ్రీదత్త, మేనేజర్ పీవీ సత్యమూర్తి బృందం నిర్వహించిన ప్రజెంటేషన్లో ఎనర్జీ ఎఫిషియెన్సీ, నీటి సంరక్షణ, పర్యావరణ హిత పదార్ధాల వినియోగం వంటి అంశాలను వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామమూర్తి, సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ జి.రవికిశోర్, కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
సర్వజన ఆస్పత్రి అల్ట్రాసౌండ్ విభాగంలో మంటలు
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని అల్ట్రాసౌండ్ స్కాన్ గదిలో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనతో అక్కడ వైద్య సిబ్బంది బయటకు పరుగులు తీశారు. అక్కడ సిబ్బంది సకాలంలో విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అల్ట్రాసౌండ్ స్కాన్ గదిలోని స్విచ్ బోర్డు వద్ద షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించాయి. విద్యుత్ నిలిపివేయడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా చీకటి అలుముకుంది. అదే వరుసలో ఉన్న సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఎక్సరే విభాగాలకు సేవలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. -
అపోహలు వీడాలి..
పార్వతీపురం రూరల్: అపోహలు వీడి శాసీ్త్రయ వైద్యాన్ని నమ్మినప్పుడే ప్రజారోగ్యం సాధ్యమవుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కరరావు పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి జిల్లా ఆస్పత్రి జంక్షన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన ‘ఆరోగ్యం కోసం కలిసి.. విజ్ఞానంతో అడుగులు’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ ర్యాలీ ఉద్దేశమని తెలిపారు. ప్రజలు రసాయనాలతో మాగబెట్టిన పండ్లకు దూరంగా ఉండి, సహజ సిద్ధమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రతి రోజూ 30 నుంచి 60 నిమిషాల వ్యాయామం, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం అలవాటు చేసుకోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని గుర్తుచేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు జగన్మోహనరావు, సూర్యనారాయణ, వినోద్ కుమార్, సూర్య కౌశిక్, నేత్ర వైద్య అధికారి నగేష్ రెడ్డి, డెమోలు, ప్రసాద్, గిరి, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
● రూ.2 లక్షల నగదు అపహరణపాచిపెంట: తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రెండు లక్షల నగదు అపహరించారు. ఈ ఘటన మండల కేంద్రం స్థానిక పాచిపెంట బీసీ కాలనీలో మంగళవారం జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన అనపర్తి రామారావు తన భార్య సత్యవతి మంగళవారం ఉదయం ఇంటికి తాళం వేసి ఉపాధి హామీ పనికి వెళ్లారు. అదే అదునుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తులు కిటికీ తలుపులు విరగొట్టి ఇంటి లోపలికి వెళ్లి బీరువాలో ఉన్న రెండు లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. ఉపాధి హామీ పని నుంచి 12 గంటల సమయంలో ఇంటికి వచ్చి రామారావు భార్య సత్యవతి చీర కోసం బీరువా తెరిచి చూడగా బీరువా లోపల తలుపులు తెరిచి చీరలు, కాగితాలు చిందరవందరగా ఉన్నాయి. దీంతో తన ఇంట్లో దొంగతనం జరిగినట్టు గుర్తించిన సత్యవతి స్థానికుల సహాయంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పార్వతీపురం నుంచి క్లూస్ టీమ్ని పిలిపించి ఆధారాలు సేకరిస్తున్నారు. -
మందులు కరువు..!
మూగజీవాలకు● సొంతంగా మందులు కొనుగోలు చేస్తున్న పాడి రైతులువిజయనగరం ఫోర్ట్: జిల్లాలో పాడి రైతులు తమ పశువులకు జబ్బు చేస్తే మందులు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జబ్బు చేసిన పశువులను వైద్యశాలలకు తీసుకు వెళ్తే వైద్యం చేసి ఫలానా మందులు కొనుగోలు చేసి తీసుకురమ్మని పశువైద్య అధికారులతో పాటు సిబ్బంది సూచిస్తున్నారు. ఇది రైతులకు ఆర్థిక భారంగా మారింది. పాడి రైతుల సంక్షేమానికి పాటు పడతామని టీడీపీ సర్కార్ ఎన్నికల సమయంలో గొప్పలు చెప్పింది. అయితే మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదు. కనీసం మూగజీవాలకు పూర్తి స్థాయిలో మందులు కూడా అందించలేని పరిస్థితిలో సర్కార్ ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పశు వైద్యశాలల్లో మందులు లేకపోవడంతో పాడి రైతులు మూగజీవాల వైద్యానికి ప్రైవేటు పశు మందుల దుకాణాల్లో కొనుగోలు చేసి చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది కాస్త పాడి రైతులకు ఇబ్బంది అయినా తప్పని పరిస్థితి. జిల్లాలో పశువైద్యశాలలు జిల్లాలో ప్రాంతీయ పశు ఆస్పత్రులు 13 ఉన్నాయి. గ్రామీణ పశు వైద్యశాలలు 40 ఉన్నాయి. జిల్లా ఆస్పత్రి ఒకటి ఉంది. పశు వైద్యశాలలు 64 ఉన్నాయి. సంచార పశు వైద్యశాలలు 13 ఉన్నాయి. పశువులు వివరాలు జిల్లాలో ఆవులు 3,77,960 ఉన్నాయి. గేదెలు 97,845 ఉన్నాయి. గొర్రెలు 4,48,154, మేకలు 1,56,511 ఉన్నాయి. పందులు 2585 ఉన్నాయి. కోళ్లు 51,26,764 ఉన్నాయి. 150 రకాల మందులు అందుబాటులో ఉండాలి పశు వైద్యశాలల్లో 150 రకాల మందులు అందుబాటులో ఉండాలి. కానీ చాలా వరకు మందులు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామీణ పశు వైద్యశాలల పశు వైద్య సిబ్బందే మందులు పూర్తి స్థాయిలో లేవని, పాడి రైతులను మందులు కొనుగోలు చేసుకుని తెచ్చుకోమని చెబుతున్నట్టు తెలిసింది. పశువులు ఎదకు రావడానికి అవసరమైన మందులు, పశువులు జీర్ణకోశ వ్యాధులకు ఉపయోగించే పౌడర్లు, పలు రకాల గాయాలకు, పుండ్లుకు ఉపయోగించే ఆయింట్మెంట్స్ తదితర పలు రకాల మందులు అందుబాటులో లేనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని రకాల మందుల కొరత వాస్తవమే.. పశు వైద్యశాలలన్నింటిలోనూ మందులు ఉన్నాయి. అయితే కొన్ని రకాల మందులు కొరత ఉంది. ప్రస్తుతం స్టాక్ వచ్చింది. ఆస్పత్రులకు పంపిణీ చేస్తాం. – డాక్టర్ ఎన్.దామోదరరావు, జేడీ, జిల్లా పశుసంవర్ధక శాఖ -
విధులకు వెళ్తుండగా విషాదం
● బైకర్ మృతి, పాదచారునికి తీవ్ర గాయాలు పెందుర్తి: బీఆర్టీఎస్ రహదారిలోని పెందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల తెలిపిన విరాల ప్రకారం... సాలూరుకు చెందిన ఎం.పోలిరాజు (45) చినముషిడివాడలో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయన పెందుర్తిలోని ఒక బైక్ షోరూమ్లో ఆడిట్ విభాగంలో పనిచేస్తున్నారు. మంగళవారం ఉద యం విధులకు హాజరయ్యేందుకు తన ద్విచక్ర వాహనంపై చినముషిడివాడ నుంచి పెందుర్తి బయలుదేరారు. ప్రభుత్వ కళాశాల దాటిన తర్వాత చర్చి సమీపంలోకి వచ్చేసరికి బైక్ అదుపుతప్పి రోడ్డు దాటుతున్న లక్ష్మణ్ అనే వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పోలిరాజు వాహనంపై నుంచి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికులు వెంటనే స్పందించి ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలిరాజుకు భార్య కృష్ణవేణి, పిల్లలు ఉన్నారు. పెందుర్తి సీఐ కె.వి.సతీష్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్ శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించారు. ఆలయ ఈఓ కె.శిరీష కార్యక్రమాలను పర్యవేక్షించారు. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ... చీపురుపల్లి : యుద్ధం వద్దు.. శాంతి ముద్దు, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి అంటూ చీపురుపల్లి, గరివిడి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చీపురుపల్లి పట్టణంలో మంగళవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రపంచంపై డాలర్ ఆదిపత్యం తగ్గుతుందన్న భయంతో అమెరికా ప్రపంచ దేశాలపై దాడులకు తెగబడుతుందని విమ ర్శించారు. వెనిజులా దేశాధ్యక్షుడిని కిడ్నాప్ చేయడం, ఇరాన్పై యుద్ధం ప్రకటించి ఆదేశ సుప్రీం లీడర్ను హతమార్చడం తగదన్నారు. ఇరాన్లోని పాఠశాలపై బాంబు దాడి కారణంగా 170 మంది పసి పిల్లలు మరణానికి అమెరికా బాధ్యతవహించాలన్నారు. ప్రస్తుతం క్యూబా దేశంలో ఆర్థిక ఆంక్షలు పెడుతోందని, దీనిని ప్రజా సంఘాల తరఫున ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఇవి చేయొద్దు..
● వర్షం కురిసేటప్పుడు చెట్ల కింద నిలబడకూడదు. ● ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తే రైతులు పొలాల్లో ఉండకూడదు. మెరుపు కనిపించిన తర్వాత 30 సెకెన్లు, అంత కన్నా తక్కువ సమయంలో ఉరుము వినిపిస్తే మనకు 10 కిలోమీటర్ల దూరంలోపు పిడుగు పడే అవకాశం ఉంది. ● మెరుపు కనబడిన తర్వాత 30 నిమిషాల పాటు బయటకు వెళ్లే ప్రయత్నం చేయరాదు. ● గొడుగులపై లోహపు బోల్టులు, చేతుల్లో సెల్ఫోనులు లేకుండా చూసుకోవాలి. సెల్ఫోన్ ఉంటే స్విచ్ఆఫ్ చేయాలి. వర్షం కురిసే సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్ఫార్మర్ల సమీపంలో ఉండకూడదు. – డాక్టర్ బి.ప్రదీప్కుమార్, మెడికల్ ఆఫీసర్, వీరఘట్టం -
పిడుగంటే అత్యధిక విద్యుత్ ప్రవాహకం
మెరుపుతో ఏర్పడే అత్యధిక విద్యుత్ ప్రవాహకమే పిడుగు. ఒక్కోసారి విద్యుదావేశం పేరుకుపోయిన మేఘాలకు సమీపంలో వ్యతిరేక విద్యుదావేశం మేఘాలు ఉన్నప్పుడు స్థిరంగా విద్యుత్ భూమి వైపు ప్రవహిస్తుంది. ఒక మిల్లీ సెకను కాలంలో మెరుపులతో కూడిన పిడుగు 20 వేల ఆంపియర్లు విద్యుత్ ప్రవాహాన్ని విడుదల చేస్తుంది. అప్పుడు ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రత మీటరుకు 2లక్షల ఓల్టులతో సమానం. మెరుపులు భూమి మీద పడినప్పుడు వస్తువులను బట్టి నష్టతీవ్రత ఉంటుంది. పిడుగులు ఎక్కువగా క్యుములోనింబస్ మేఘాల వల్ల ఏర్పడతాయి. మేఘాల్లో మంచు, నీరు ఏర్పడినప్పుడు స్ట్రాటోస్పియర్లో చల్లని వాతావరణంలో విరుద్ధవిద్యుదావేశాలు ఏర్పడి స్ధిర విద్యుత్ ప్రవాహంగా మారతాయి. ఆ సమయంలో పిడుగులు ఏర్పడతాయి. – పొట్నూరు రాజీవ్, ఇస్త్రో శాస్త్రవేత్త, విక్రమపురం, వీరఘట్టం మండలం -
పాలకొండలో వడగళ్ల వాన
● ఈదురుగాలుల బీభత్సం ● నెలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు పాలకొండ రూరల్: పాలకొండలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. విద్యుత్ స్తంభాలు, చెట్లు నూలకూలాయి. రాకపోకలకు అంతరాయం కలిగింది. పాలకొండ మండలంలోని గొట్ట మంగళాపురం, చిన మంగళాపురం, యరకారాయపురం, తుమరాడ తదితర గ్రామాలకు వెళ్లే రహదారులపై చెట్లు కూలిపోయాయి. పాలకొండ–వీరఘట్టం ప్రధాన రోడ్డు, సీతంపేట, శ్రీకాకుళం మార్గాల్లోనూ చెట్లు రోడ్డుపై కూలిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. పాలకొండ గ్యాస్ ఏజెన్సీ, రాజుపేట సమీపంలోని పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. 33 కేవీ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. నవగాం, వంగర మండలాలకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తాయి. రోడ్ల పక్కన ఉన్న చిన్నచిన్న గుడిసెలు, రేకుల షెడ్లు, పశువుల పాకలతో పాటు హోర్డింగ్లు ఎగిరిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో డీఈ కె.విష్ణుమూర్తి పర్యవేక్షణలో ఏఈ యోగి, సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టారు. సరఫరాలో అంతరాయం అధిగమించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. మరోవైపు వడగళ్లు పడడంతో మామిడి, బొన్నపంటలకు నష్టంవాటిల్లిందని రైతులు వాపోతున్నారు. -
గ్యాస్ ఏజెన్సీని తనిఖీ చేసిన జేసీ
విజయనగరం ఫోర్ట్: స్థానిక స్వామి గ్యాస్ ఏజెన్సీని జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్ట్రర్ను పరిశీలించి అందుబాటులో ఉన్న సిలిండర్లను భౌతికంగా సరిచూశారు. గత నెల 2 నుంచి 9వ తేదీవరకు కొన్ని కారణాల వల్ల డీలర్ షాపు తెరవకపోవడం వల్ల సరఫరా వ్యవస్థలో అంతరాయం ఏర్పడినట్టు జేసీ గుర్తించారు. సమస్య పునరావృతం కాకుండా చూడాలని పౌరసరఫరా అధికారులను ఆదేశించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులతో సంప్రదించి అదనపు గ్యాస్ సిలిండర్లు తక్షణం అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన నిధులను చెల్లించాలని డీలర్ను ఆదేశించారు. గ్యాస్ కోసం వినియోగదారుడు ఏజెన్సీకి రాకుండా ప్రతి వినియోగదారుడి ఇంటికి డోర్ డెలివరీ వ్యవస్థను కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఈ తనిఖీలో సీఎస్డీటీ రామరావు పాల్గొన్నారు. -
ఎండ ప్రచండం.. పిడుగుల వాన
సాక్షి, పార్వతీపురం మన్యం/వీరఘట్టం: ఉదయమంతా భరించలేని ఎండ, ఉక్కపోత, వేడి గాలులు.. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పు. ఈదురుగాలులతో మొదలై.. పిడుగుల వాన కురుస్తోంది. కొద్దిరోజులుగా జిల్లాలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఎండ తీవ్రతతో ప్రజలు ఓవైపు ఉక్కిరిబిక్కిరి అవుతూనే.. సాయంత్రం కురుస్తున్న వర్షాలతో సేద తీరుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. ఒకట్రెండు మండలాలు మినహా.. అన్ని చోట్లా తీవ్ర వేడి గాలులు ఉంటున్నాయి. ఇదే సమయంలో పిడుగుల వాన.. నిరుపేద రైతు కూలీలను బలి తీసుకుంటున్నాయి. పంటలకు కష్టకాలం.. వేసవి దుక్కులకు ఈ వర్షాలు అనుకూలంగా ఉంటాయని ఓ వైపు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. మరోవైపు మొక్క జొన్న, మామిడి, జీడి, అరటి పంటలకు నష్టం వాటిల్లుతోంది. గాలులు, వర్షానికి పంట నేలరాలి, దెబ్బ తింటోంది. మరికొన్ని రోజుల్లో కోత దశకు వచ్చే మామిడి కాయలు నేలరాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సుమారు 25 వేల ఎకరాల్లో జీడి సాగవుతోంది. జీడి, మామిడి పిందె దశలో రాలిపోవడంతో దిగుబడిపై ప్రభావం పడుతుందని రైతులు చెబుతున్నారు. లక్ష మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలుకు సిద్ధంగా ఉంది. కొనుగోలు కేంద్రాలు లేక, రైతులు దళారులనే ఆశ్రయిస్తున్నారు. ఈ సమయంలో గింజలు తడిచిపోతే, కాస్త ధర కూడా రావడం కష్టం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాల్లో ఆదివారం కురిసిన వర్షానికి జొన్న గింజలు తడిసిపోయాయి. సోమవారం ఉదయం వరకు వాటిని రైతులు ఆరబెట్టారు. మధ్యాహ్నం తర్వాత వర్షం కురవడంతో మళ్లీ అవన్నీ తడిసిముద్దయ్యాయి. మరోవైపు వర్షానికి తోడు పిడుగులు పడడంతో శ్రమ జీవులు ప్రాణాలు కోల్పోతున్నారు. సోమవారం బలిజిపేట మండలం శ్రీరంగరాజపురంలో సింహాచలం.. పొలంలో మొక్కజొన్నపై టార్పాలిన్లు కప్పుతుండగా పిడుగు పాటుకు గురై మృతి చెందింది. వంతరాం గ్రామానికి చెందిన పార్వతి.. పొలం పనుల్లో నిమగ్నమై ఉండగా.. పిడుగు పడటంతో ప్రాణాలు వదిలింది. మూడు రోజుల కిందట వీరఘట్టం మండలం తెట్టంగి గ్రామంలో పిడుగుపాటుతో వ్యవసాయ కూలీ పైల అనసూయమ్మ అనే వృద్ధురాలు తనువు చాలించింది. గతేడాది ఉమ్మడి విజయనగరం జిల్లాలో పిడుగుపాటుకు 20 మంది మృతిచెందగా, ఈ ఏడాది ఇంతవరకు నలుగురు మృతిచెందారు. జిల్లాలో భిన్న వాతావరణం భరించలేని వేడి.. కొద్ది సేపటికే గాలులు, వర్షం పంటలకు నష్టం.. -
22న ఆరువేల మందితో కోలాట ప్రదర్శన
● మన్యం జిల్లా కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తాం ● కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి సాలూరు: రాష్ట్రంలో పార్వతీపురం మన్యం జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా, ప్రత్యేకంగా నిలిపేందుకు కృషిచేస్తున్నామని, జిల్లా కీర్తిని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యమని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. సాలూరు పట్టణంలోని డబ్బివీధి జెడ్పీహెచ్ పాఠశాలను జాయింట్ కలెక్టర్, మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి యశ్వంత్కుమార్రెడ్డితో కలిసి మంగళవారం పరిశీలించారు. పాఠశాలలో విద్యాసౌకర్యాలు, మధ్యాహ్నభోజన పథకం అమలుతీరు, ముస్తాబు కార్యక్రమ పురోగతిని నేరుగా పరిశీలించారు. మెనూ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని భోజన నిర్వాహకులకు హెచ్చరించారు. ప్రతి శనివారం పాఠశాలల్లో మన్యం డ్యాన్స్పేరుతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఆనందలహరి కార్యక్రమం దోహదపడుతుందని, దీనిని నీతి ఆయోగ్ సైతం గుర్తించడం జిల్లాకు గర్వకారణమన్నారు. ఈ నెల 22 జిల్లా వ్యాప్తంగా సుమారు 6 వేల మంది విద్యార్థులు, మహిళలు, యువతతో భారీ స్థాయిలో కోలాట ప్రదర్శన నిర్వహించి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనకు అనుగుణంగా ఔత్సాహికులందరినీ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నట్టు వెల్లడించారు. అంతకుముందు మంత్రి సంధ్యారాణితో కలిసి డంపింగ్యార్డును పరిశీలించి, లెగసీ వ్యర్థాల ప్రాసెసింగ్ పనులను ప్రారంభించారు. చెత్తసేకరించే డబ్బాలను కార్మికులకు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రత్నకుమార్, తహసీల్దార్ సురేష్, తదితరులు పాల్గొన్నారు. -
రాజధాని పేరుతో భూ దోపిడీ
● చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే కళావతి ● మావిగన్తో రాష్ట్ర అభివృద్ధి భామిని: రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం భూ దోపిడీకి తెరతీసింది. రైతుల నుంచి అన్యాయంగా భూములు లాక్కొని వేల ఎకరాలను తమ డొల్ల కంపెనీలు, బినామీలకు కట్టబెట్టింది. వాటికి విలువ రావాలనే ఉద్దేశంతో అమరావతిని గ్రాఫిక్స్ రూపంలో చూపుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకే డబ్బులు లేవని చెబుతున్న సీఎం చంద్రబాబు... రూ.2లక్షల కోట్లు వెచ్చించి రాజధానిని ఎప్పటికి అభివృద్ధి చేస్తారో చెప్పాలన్నారు. భామిని మండలం ఘనసరలో కార్యకర్తలతో మంగళవారం సమావేశమయ్యారు. ప్రస్తుతం రాజధాని భూము ల్లో ఫాంహౌస్ల కేటాయింపుల్లో కూటమి నేతలు తలమునకలయ్యారని ఆరోపించారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి, ప్రజల దృష్టి మళ్లించేందుకు రాజధాని నాటకానికి తెరతీశారన్నారు. కేవలం రూ.20వేల కోట్లతో అభివృద్ధి చెందే అవకాశం ఉందంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ (మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు) మధ్య రాజధాని ఏర్పాటు ప్రతిపాదనకు రాష్ట్ర ప్రజలు మద్దతు తెలుపుతున్నారన్నారు. దీనిని చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. రైతులు శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇచ్చే ప్రయత్నాలు చేయకపోవడం ప్రభుత్వానికి తగదన్నారు. మొక్కజొన్నకు మద్దతు ధర లభించక రైతులు నష్టపోతున్నారని వాపోయారు. మరోవైపు ఏనుగుల సమస్య రైతులను వెంటాడుతోందన్నారు. ప్రజాసమస్యలు పట్టించుకోని చంద్రబాబు సర్కారుపై ప్రజావ్యతిరేకత మొదలైందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు బి.ధర్మారావు, బి.శ్రీనివాసరావు, ఎం.మోహన్బాబు, కె.చంద్రశేఖర్, జి.రమేష్, ఎ.రామినాయుడు, గిరిబాబు, ఎం.చలపతి, అగత ముడి రఘు, రాంప్రసాద్ సాహూ, రొక్కం ధర్మారావు, తదితరులు పాల్గొన్నారు. -
గృహగణనకు సిద్ధం
సాక్షి, పార్వతీపురం మన్యం: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జనగణన ప్రక్రియలో భాగంగా.. కీలకమైన గృహ గణనకు జిల్లా యంత్రాంగం సిద్ధం అవుతోంది. మే నెల ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా హౌసింగ్ సెన్సెస్ (గృహ గణన) కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు.. స్వచ్ఛందంగా నమోదు చేసుకునేలా ‘స్వీయ’ సదుపాయాన్ని ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు అందుబాటులోకి తీసుకువచ్చారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 910 గ్రామాలు ఉన్నాయి. 9.25 లక్షల మంది జనాభా ఉండగా.. సుమారు 2.50 లక్షల కుటుంబాలు ఉంటాయని అంచనా. ప్రస్తుతం ఏళ్ల కిందటి నాటి లెక్కలే ఇంకా ఆధారమవుతున్నాయి. జన, గృహగణన పూర్తయ్యాక కచ్చితమైన లెక్కలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. 15 రోజులపాటు స్వీయ నమోదు స్వీయ నమోదు ద్వారా ప్రజలు తమ ఇంటి వివరాలను స్వయంగా ఆన్లైన్లో ఎస్ఈ.సెన్సెస్.జీఓవీ.ఇన్ అనే పోర్టల్లో మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ఈ నెల 16 నుంచి.. 15 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో ప్రతి కుటుంబం తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. మొబైల్ నంబర్ ఆధారంగా లాగిన్ అయ్యి అవసరమైన సమాచారాన్ని సులభంగా నమోదు చేయవచ్చు. పోర్టల్లో ఇంగ్లిష్, హిందీతో పాటు అనేక ప్రాంతీయ భాషలు అందుబాటులో ఉంటాయి. ప్రజలు తమకు సౌకర్యమైన భాషలో వివరాలు నమోదు చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసిన తర్వాత ఒక రిఫరెన్స్ ఐడీ వస్తుంది. దీనిని భవిష్యత్తులో అవసరమైనప్పుడు ఎన్యూమరేటర్కు చూపించవచ్చు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయని కుటుంబాలను ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి నమోదు చేస్తారు. జనగణనలో ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. దీనివల్ల సమాచారం మరింత కచ్చితంగా ఉండడమే కాకుండా, సమయం ఆదా అవుతుంది. ప్రతి కుటుంబం స్వచ్ఛందంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్లో సరైన వివరాలు నమోదు చేసి జనగణన కార్యక్రమానికి సహకరించాలి. జనగణన దేశాభివృద్ధికి ముఖ్యమైన ఆధారం. ప్రతి పౌరుడు బాధ్యతగా పాల్గొనాలి. – డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి, జిల్లా కలెక్టర్ మే 1 నుంచి ప్రారంభం కానున్న గృహగణన ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు స్వీయ నమోదుకు అవకాశం జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ -
జీఎంఆర్లో ఫీజుల పంచాయితీ
రాజాం: రాజాంలోని జీఎంఆర్ డీమ్డ్ యూనివర్సిటీలో ఫీజుల ‘పంచాయితీ’ విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. పరీక్షల వేళ కలవరపెడుతోంది. గత ఏడాదికాలంగా చంద్రబాబు ప్రభుత్వం ఐటీ, డిగ్రీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదలచేయలేదు. ఫీజులు చెల్లించకపోవడంతో జీఎంఆర్ ఐటీలో చదువుతున్న విద్యార్థుల ఇయర్ ఎండ్ సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు హాల్ టికెట్లు ఇచ్చేందుకు యాజమాన్యం నిరాకరించింది. ఈ హఠాత్పరిణామంతో విద్యార్థులు ఆందోళన చెందారు. తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం ఇచ్చా రు. కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించి హాల్ టిక్కెట్లు తీసుకోగా, మరికొంతమంది తమకు తెలిసిన పెద్దలతో గడువుతీసుకుని యాజమాన్యాన్ని ఒప్పించారు. ఇంకొంతమంది కళాశాల వద్ద సోమ వారం నిరసన తెలిపారు. రోడ్డెక్కేందుకు సిద్ధంకాగా, కళాశాల ప్రొపెషర్లు కలుగుచేసుకుని రెండురోజులు గడువు ఇచ్చి వివాదాన్ని తాత్కాలికంగా సద్దుమనిగించారు. విద్యార్థులకు తప్పని తిప్పలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు జమచేసేది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యేవి కాదు. ప్రస్తుత చంద్రబాబు ప్రభు త్వం కళాశాలల ఖాతాల్లోకి ఫీజులు చెల్లించే జీఓ తెచ్చినా సకాలంలో జమచేయడం లేదు. దీంతో కళాశాల యాజమాన్యం విద్యార్థులు వద్ద ముక్కుపిండి వసూలు చేస్తోంది. ఫీజులు చెల్లించనివారికి హాల్టికెట్లు ఇవ్వడంలేదు. ఆందోళనకు దిగితే ప్రాక్టికల్స్ మార్కులు తగ్గిస్తామంటూ బెదిరిస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. జీఎంఆర్ఐటీలో ఒక ఏడాదికి 4500 మంది విద్యార్థులు చదువుతుండగా, జీసీఎస్ఆర్ కళాశాలలో మరో 1500మంది చదువుతున్నారు. గత రెండేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ నిధులు విడుదల చేయకపోవడం చదువులకు శాపంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల ఫీజులు చెల్లించకపోవడం దారుణం. ఫీజురీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. రాజాం జీఎంఆర్ఐటీలో చదువుతున్న ఐటీ విద్యార్థులకు ఇయర్ ఎండింగ్ సెమిస్టర్ పరీక్షల హాల్ టికెట్లు ఇవ్వకుండా యాజమాన్యం నానారభస చేసింది. బలవంతంగా ఫీజులు వసూలు చేస్తోంది. అటు ప్రభుత్వం రాయితీ ఫీజులు ఇవ్వకపోగా, కళాశాలల మొండివైఖరిని పట్టించుకోకపోవడం శోచనీయం. వెంటనే ఫీజురీయింబర్స్మెంట్ నిధులు ప్రభుత్వం విడుదలచేయాలి. లేకుంటే పోరాటం చేస్తాం. – పి.రమేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, రాజాం విడుదలకాని ఫీజురీయింబర్స్మెంట్ నిధులు ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులపై వర్సిటీ అధికారుల ఒత్తిడి హాల్టికెట్లు ఇచ్చేందుకు నిరాకరణ ఆందోళనకు దిగిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు -
విశాఖలో గుణుపూరుపేట వాసుల ఆందోళన
డెంకాడ: వీఎంఆర్డీఏ రోడ్డు అలైన్మెంట్ను డెంకాడ మండలం గుణుపూరుపేట గ్రామ పరిధిలోని నివాస గృహాలకు ఇబ్బంది లేకుండా ఇవ్వాలంటూ విశాఖలోని వీఎంఆర్డీఏ కార్యాలయం వద్ద గ్రామస్తులు సోమవారం ఆందోళన చేశారు. గ్రామంలోని యాతపేట, బీసీ కాలనీ మీదుగా మొదటి అలైన్మెంట్ రోడ్డు వెళ్తే పేద కుటుంబాలు నిరాశ్రయులుగా మారుతారన్నారు. కొందరు రియల్ వ్యాపారులు తమ భూములను కాపాడుకునేందుకు పేదల ఇళ్లపై నుంచి రోడ్డు నిర్మించేందుకు పట్టుబడుతు న్నారని ఆరోపించారు. పేదల నివాసాలను కూల్చేసే అలైన్మెంట్ వద్దంటూ గ్రామ ప్రజలు, రైతులు వీఎంఆర్డీఏ చైర్మన్ వి.ప్రణవ్గోపాల్, అధికారులకు గోడు వినిపించారు. -
వినియోగదారుడికి న్యాయరక్షణ
పార్వతీపురం రూరల్: వివిధ వస్తువుల కొనుగోలు, సేవలు పొందడంలో మోసపోయిన వారికి న్యాయం చేసేందుకు రాష్ట్రంలోనే తొలగిసారిగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్లో ‘వినియోగదారుని క్లినిక్’ను కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి సోమవారం ప్రారంభించారు. నకిలీ వస్తువులు, నాణ్యత లేని సేవలు, అధిక ధరలతో నష్టపోయే సామాన్య వినియోగదారులకు ఈ క్లినిక్ న్యాయం అందిస్తుంది. ఉచిత న్యాయ సేవలతో పాటు బాధితుల తరఫున వినియోగదారుల ఫోరమ్లో పోరాడేందుకు ఈ క్లినిక్ సహకరిస్తుంది. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. వినియోగదారుల చట్టాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. డీసీఐసీ ఇన్చార్జి పి.నాగమణి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో.. మోసాల్లేని వ్యాపారానికి, పారదర్శక సేవలకు ఈ క్లినిక్ వేదిక కావాలని ఆకాంక్షించారు. -
అక్కడ చేసేశారు.. ఇక్కడ చూస్తున్నారు!
సాక్షి, పార్వతీపురం మన్యం: టీడీఏ పరిధిలోని భాషా పండితులు (తెలుగు, హిందీ), పీఈటీలను పాఠశాల సహాయకులుగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం కొద్ది రోజుల కిందట జీఓ 27 జారీ చేసింది. సీఆర్టీలుగా ఉద్యోగంలో చేరి, రెగ్యులర్ అయిన వారికి నెల రోజుల కిందటే అప్గ్రేడ్ చేస్తూ, ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని పాడేరు, రంపచోడవరం ఐటీడీఏల్లో ఈ నెల ఒకటినే ఉత్తర్వులు అందజేశారు. పార్వతీపురం ఐటీడీఏలో ధ్రువపత్రాల పరిశీలన ఇది వరకే పూర్తయ్యింది. ఒకటో తేదీ దాటిపోయినా.. భాషా పండితులకు, పీఈటీల కు పాఠశాల సహాయకులుగా నేటికీ అప్గ్రేడ్ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఫలితంగా ఐటీడీఏ పరిధిలో 34 మందికి ఎదురుచూపులు, నిరుత్సాహం తప్పడం లేదు. దీంతో వారు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సోమవా రం కూడా కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు వచ్చి వినతిపత్రం అందజేశారు. పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని డీవీఎంఎం హైస్కూల్, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి సమాధానపత్రాల మూల్యాంకన ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. మొత్తం ఐదు సబ్జెక్టులకు సంబంధించి జిల్లాకు 98,377 జవాబు పత్రా లు రాగా.. తొలిరోజు 4,982 జవాబు పత్రాల ను మూల్యాంకనం చేసినట్టు డీఈఓ పి.బ్రహ్మాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విధుల్లో చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లు కలిపి మొత్తం 418 మంది సిబ్బంది పాల్గొంటారని చెప్పారు. పార్వతీపురం: జిల్లాలో జలధార కార్యక్రమాన్ని వందరోజుల లక్ష్యంతో వేగంగా అమలు చేయాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నీటి భద్రత, సాగునీటి సంఘ బాధ్యత, వందరోజుల ప్రణాళిక పోస్టర్ను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో నీటి నిల్వ సామర్ాధ్యన్ని పెంచడం, వృథాను అరికట్టడం ప్రధాన లక్ష్యమన్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణ, పూడిక తొలగింపు, కాల్వల మర మ్మతులు చేపట్టాలని సూచించారు. రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకునేందుకు ఆధునిక పద్ధతులు అవలంబించాలని కోరా రు. జిల్లాలో సుమారు 2,900 చెరువులను గుర్తించి ఫెన్సింగ్, మొక్కలు నాటే పనులు చేప డతామని చెప్పారు. ఎమ్మెల్యేలు టి.జగదీశ్వరి, బి.విజయచంద్ర, జేసీ సి.యశ్వంత్కుమార్రెడ్డి, నీటి సంఘాల నాయకులు, పాల్గొన్నారు. విజయనగరం రూరల్: జిల్లాలో గ్రేడ్–3 పంచాయతీ అభివృద్ధి అధికారులు(పీడీఓ) వేతనాల చెల్లింపులో గందరగోళం నెలకొంది. జీఓ నెం.91 ప్రకారం అమలు కావాల్సిన జీతాలను పక్కనబెట్టి, జీఓ 60 ప్రకారం తక్కువగా చెల్లింపులు చేస్తున్నారని సంఘ ప్రతినిధులు తెలిపా రు. గ్రేడ్–3 పీడీఓలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. -
పిడుగు పడి మహిళ మృతి
వంగర: మండల కేంద్రమైన వంగర గ్రామానికి చెందిన ఇనమల నరసమ్మ (48) పిడుగుపాటుతో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. సహచర మహిళా కూలీలతో కలిసి నరసమ్మ వ్యవసాయ పనులకు సోమవారం ఉదయం వెళ్లింది. ఆ సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అప్పటికే కూలీలు సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుండగా.. ఒక్కసారిగా నరసమ్మపై పిడుగు పడింది. దీంతో మహిళా కూలీలు, రైతులు ఆమెను గ్రామంలోని పీహెచ్సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో రాజాం సీహెచ్సీకి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలికి భర్త రాము, కొడుకు సన్యాసినాయుడు ఉన్నారు. నెల రోజుల కిందటే కుమారుడు సన్యాసినాయుడుకు వివాహం జరిగింది. ఇంతలో ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎస్సై షేక్ శంకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయరాంపురంలో ఎద్దు .. తెర్లాం: మండలంలోని విజయరాంపురంలో పిడుగుపాటుకు ఓ ఎద్దు మృతి చెందింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కాబోతుల రాము అనే రైతు తన రెండు ఎద్దులను మేత కోసం సోమవారం సాయంత్రం పొలానికి తోలుకొని వెళ్లాడు. పొలంలో ఎద్దులు మేత మేస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో ఒక ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. బాధిత రైతును ఆదుకోవాలని మాజీ సర్పంచ్ బూరి మధుసూదనరావు కోరారు. -
అడిగింది ఒకటి.. ఇస్తుంది ఇంకొకటి!
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం ఐటీడీఏ ద్వారా అందజేస్తున్న రాయితీ ట్రాక్టర్లపై లబ్ధిదారు లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు ఉపయో గం లేని వాహనాలను తీసుకుని ఏం చేసుకుంటా మని ప్రశ్నిస్తున్నారు. 2023లో పలువురు ఎస్టీ రైతు లు ట్రాక్టర్ల కోసం పార్వతీపురం ఐటీడీఏకు దరఖా స్తు చేసుకున్నారు. ఇటీవల సుమారు 20 మందికి వాహనాలు మంజూరు అయినట్లు సమాచారం అందింది. సుమారు రూ.6.50 లక్షలు ఫైనాన్స్ చేసుకోవాలని.. రూ.1.50 లక్షలు రాయితీ లభిస్తుందని ఐటీడీఏ అధికారులు చెప్పారు. ఇక్కడే ఒక కొర్రీ పెట్టారని రైతులు అంటున్నారు. తాము ప్రముఖ సంస్థకు చెందిన ట్రాక్టర్లు అడిగామని.. ఇప్పుడు మరో సంస్థ వాహనాలు ఇస్తామంటున్నారని చెబుతున్నారు. ఆ సంస్థకు సంబంధించిన పరికరాలు, సర్వీసు సెంటర్ ఏదీ ఇక్కడ లేదని.. ఇదే విషయం చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. పైగా ఆ వాహనాల మన్నిక కూడా తక్కువని.. వాటివల్ల తమకు ప్రయోజనం కంటే నష్టమే ఎక్కు వ ఉంటుందని చెబుతున్నారు. రాయితీ మొత్తం కూడా తక్కువ ఇస్తున్నారని.. దీనిపై అధికారులు పునఃపరిశీలన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
మట్టి పరీక్ష.. రైతుకు రక్ష
పోషక లోపాలను భర్తీ చేయాలి భూమిలో పోషక లోపాలను భర్తీ చేయాలి. మట్టి నమూనా పరీక్ష ఫలితాలను రైతులకు తెలియజేస్తున్నాం. ఈ ఏడాది 30,265 మట్టి పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటివరకు 2500 పరీక్షలు చేశాం. ఖరీఫ్ సీజన్ ఆరంభమయ్యే లోపు పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించి వాటి ఫలితాలను రైతులకు అందజేస్తాం. జిల్లాలో నత్రజని, సేంద్రియ కర్బనం, జింక్ లోపం అధికంగా ఉంది. దీనిని నివారించుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చు. – జి. శ్రీనివాస్, ఎ.డి, భూసార పరీక్ష కేంద్రంవిజయనగరం ఫోర్ట్: మట్టి పరీక్ష (భూసార పరీక్ష) ఫలితం ప్రకారం ఎరువులు వినియోగించడం వల్ల రైతుపై ఆర్థిక భారం తగ్గుతుంది. దీంతో మట్టి పరీక్ష రైతుకు రక్షగా మారిందనే చెప్పాలి. భూసార ఫలితాల ప్రకారం ఏయే భూములకు ఏయే ఎరువులు వేయాలో అధికారులు వివరిస్తారు. దీంతో అదనపు ఎరువుల వినియోగం ఉండదు. ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 30,265 మట్టి నమూనాలు ( శాంపిల్స్) సేకరించి, పరీక్షించాలన్నది వ్యవసాయ శాఖ లక్ష్యం కాగా ఇప్పటికే నమూనాలు సేకరించారు. ఇందులో 2,500 పరీక్షలు కూడా పూర్తి చేశారు. భూసార పరీక్ష కోసం 15 సెం.మీ లోతులో వి షేప్ ఆకారంలో మట్టి నమూనాలు సేకరించారు. 13 రకాల పరీక్షలు.. సేకరించిన ప్రతి మట్టి నమూనాకు 13 రకాల పరీక్షలు నిర్వహిస్తారు. నేల స్వభావం, ఉదజని సూచిక (పీహెచ్), లవణ సూచిక (ఈసీ), సేంద్రియ కర్బనం ( ఓసీ) లభ్య నత్రజని (ఎన్), లభ్య భాస్వరం’, లభ్య పొటాష్, లభ్య గంధకం, లభ్య జింకు, లభ్య ఇనుము, లభ్య మాంగనీసు, లభ్య రాగి, బోరాన్ పరీక్షలు చేపడతారు. వీటిల్లో ఏ లోపం ఉన్నా సంబంధిత రైతుకు తెలియజేసి, లోప నివారణకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తారు. గతేడాదిలో 28, 392 పరీక్షలు.. భూసార పరీక్ష కేంద్రం సిబ్బంది 2025 – 26లో జిల్లా వ్యాప్తంగా 28, 392 పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ద్వారా జిల్లా వ్యాప్తంగా భూముల్లో నత్రజని లోపం 92 శాతం, సేంద్రియ కర్బనం 86 శాతం, జింక్ లోపం 36 శాతం ఉన్నట్టు గుర్తించారు. నత్రజని లోపం పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పంట ఎదుగుదల లోపించడంతో పాటు దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. నత్రజని, సేంద్రియ కర్బన పోషకాల భర్తీకి పశువులు గత్తం, వర్మీకంపోస్టు పొలాల్లో వేసుకోవాలి. లేదంటే జీలుగ, కట్టి జనుము, పిల్లిపెసర వంటి పచ్చి రొట్ట ఎరువులు సాగుచేసి భూముల్లో కలియ దున్నాలి. సేంద్రియ కర్బనం లోప నివారణకు ఏడాది పొడవునా ఏదో ఒక పంట సాగు చేయాలి. జింక్ లోపం నివారణకు ప్రతి మూడేళ్లకోసారి ఎకరానికి 20 కిలోల జింక్ వేసుకోవాలి. జిల్లాలోని అన్ని మండలాల్లో నత్రజని, సేంద్రియ కర్బనం, జింక్ లోపం ఉంది. జిల్లా వ్యాప్తంగా చేయాల్సిన పరీక్షల లక్ష్యం 30,265 ఇప్పటికే మట్టి నమూనాల సేకరణ పూర్తి ప్రస్తుతానికి 2500 నమూనాల పరిశీలన గతేడాది 28,392 భూసార పరీక్షలు చేసిన అధికారులు -
నేనున్నానని...
పీజీఆర్ఎస్లో కలెక్టర్ ఎస్. రాంసుందర్రెడ్డి స్పందించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. కొత్తవలస మండలం ఉత్తరాపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు సబ్బవరపు పోతురాజు తన సమస్యను తెలియజేయాడానికి కలెక్టరేట్కు చేరుకున్నాడు. కార్యాలయంలోకి వచ్చేందుకు అవస్థలు పడుతున్న పోతురాజును గుర్తించిన కలెక్టర్ నేరుగా అతని వద్దకే వెళ్లి వినతిపత్రం స్వీకరించి, సమస్యను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడుతూ..ఆరు వేల రూపాయలున్న అతని పెన్షన్ను రూ. 15 వేలకు పెంచాలని ఆదేశించారు. -
పరిష్కరిస్తే అదే పదివేలు!
ప్రతి వారం కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు.. ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి అధిక సంఖ్యలో అర్జీదారులు వస్తున్నారు. ఇందులో స్వల్ప వినతులకే పరిష్కారం లభిస్తోంది. పింఛన్ల విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడం.. కొత్తవి మంజూరు కాకపోవడంతో అన్ని అర్హతలూ ఉన్న లబ్ధిదారులు వందలాది మంది అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్న.. మంచానికే పరిమితం అయిన వారు సైతం మరొకరి సాయంతో వచ్చి, న్యాయం కోసం ఆరాట పడుతున్నారు. సోమవారం కలెక్టరేట్కు వచ్చిన కొంతమంది పింఛన్ బాధితుల ఆవేదనకు అక్షర రూపం. – సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్ మక్కువ మండలం శంబర గ్రామానికి చెందిన తేలు రఘు, సంతోషి కుమారి దంపతుల కుమారుడు మోక్షిత్.. పుట్టుకతోనే వంద శాతం మానసిక, శారీరక దివ్యాంగుడు. మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఉన్న మోక్షిత్కు.. వైద్యాధికారులు సదరం ధ్రువపత్రం కూడా జారీ చేశారు. అన్ని అర్హతలూ ఉన్నా నేటికీ పింఛన్ మంజూరు కాలేదు. తమ బిడ్డ అవస్థను చూపిస్తూ, ఆ తల్లిదండ్రులు అధికారుల చుట్టూ రెండేళ్లుగా తిరుగుతూనే ఉన్నారు. ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వకపోవడంతో వీరు లబ్ధి పొందలేకపోతున్నారు.. ఆ చిన్నారికి న్యాయం జరగడం లేదు. ఈ చిత్రంలోని యువకుని పేరు వండన సురేంద్ర. వంద శాతం దివ్యాంగత్వంతో బాధ పడుతున్నాడు. కూర్చోలేడు.. తోడు లేకుండా స్వతహాగా నిల్చోలేడు. ప్రస్తుతం రూ.6 వేలు పింఛన్ వస్తోంది. అతని పరిస్థితి అర్థం చేసుకుని, ఆ మొత్తం పెంచాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
ఉపాధ్యాయుల నిరసన ప్రదర్శన
పార్వతీపురం రూరల్: ఉపాధ్యాయుల న్యాయమైన 18 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఉపా ధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పిలుపు మేర కు సోమవారం పార్వతీపురం మన్యం జిల్లాలో నిరసనలు తెలిపారు. పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకన కేంద్రాలకు (స్పాట్ వాల్యుయేషన్) ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో హాజరై నిరసన తెలిపారు. 12వ పీఆర్సీని నియమించాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, సీపీఎస్ రద్దుచేసి పా త పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏల మంజూ రు, రిటైర్మెంట్ ప్రయోజనాల తక్షణ చెల్లింపుపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. స్పాట్ కేంద్రాలను సందర్శించిన ఫ్యాప్టో జిల్లా ప్రతినిధి బాలకృష్ణ, అధ్యక్షుడు కూర్మినాయుడు, కార్యద ర్శి భాస్కరరావు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కా రం కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ నెల 9న స్పాట్ కేంద్రాల వద్ద ధర్నా నిర్వహిస్తామ ని, ఏప్రిల్ 25 నుంచి 27వ తేదీ వరకు విజయవాడ లో రిలే నిరాహార దీక్షలు చేపడతామని వెల్లడించా రు. జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు. -
తమ్మన్నశెట్టికి నివాళులు..
విజయనగరం: ప్రముఖ న్యాయవాది, వైఎస్సార్సీపీ నాయకుడు కోలగట్ల వెంకట నాగ తమ్మన్నశెట్టి సంస్మరణ సభలో పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్ర శాసనసభ మాజీ ఉపసభాపతి, వైఎస్సార్సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నయ్య అయిన తమ్మన్నశెట్టి ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. సోమవారం స్థానిక ఎస్వీఎన్ నగర్లో గల సుజాత కన్వెన్షన్ హాల్లో తమ్మన్నశెట్టి సంస్మరణ సభ నిర్వహించారు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, మాజీ ఎంపీ బి. చంద్రశేఖర్, పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, జిల్లా యువజన విభాగం నాయకుడు జి. ఈశ్వర్కౌశిక్, మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, తదితరులు తమ్మన్నశెట్టి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమ్మన్న శెట్టి లేని లోటు తీర్చలేనిదని నాయకులు అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, న్యాయవాదులు , ఉమ్మడి విజయనగరం జిల్లాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్కు స్పందన
● 228 వినతుల స్వీకరణ..విజయనగరం అర్బన్: జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి తమ సమస్యలపై వినతిపత్రాలు, ఫిర్యాదులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న వినతులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆలస్యం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యంగా రెవెన్యూ, సర్వే సమస్యలపై వేగంగా స్పందించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ వినతులపై డిజిటల్ పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు. 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వచ్చే ఫిర్యాదులను కూడా బాధ్యతగా పరిష్కరించాలని సూచించారు. అర్జీదారులను ప్రత్యక్షంగా కలిసిన తర్వాతే ఎండార్స్మెంట్ ఇవ్వాలని.. మాట్లాడిన తేదీ, సమయం నమోదు చేయాలని సూచించారు. మొత్తం 228 వినతులు అందగా అందులో 89 రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉండడం విశేషం. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్.సత్తిబాబు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
యువకుడి అదృశ్యం
విజయనగరం క్రైమ్: కొద్ది రోజులుగా తమ కుమారుడు నారంశెట్టి గణపతి (16) కనిపించడం లేదని తండ్రి వెంకటరమణ సోమవారం స్థానిక రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. విజయనగరం పాలిటెక్నికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న గణపతి 20 రోజుల నుంచి కాలేజీకి వెళ్లడం లేదు. ఇదే విషయమై కొడుకును తండ్రి వెంకటరమణ మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన గణపతి ఈ నెల 2వ తేదీన కళాశాలకు వెళ్తున్నానని చెప్పి వెళ్లి ఇంతవరకు ఇంటికి చేరుకోలేదు. బంధువుల ఇళ్లల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా... ఎస్సై అశోక్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఉపాధ్యాయుడి సత్తా..
కొమరాడ: మండలంలోని గుణదతీలేస్ పంచాయతీ బిన్నిడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రెడ్డి శ్రీనివాసరావు రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించాడు. రెండు రోజులుగా రాజాం జీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఆయన పాల్గొన్నారు. మాస్టర్స్ విభాగంలో ప్రథమ స్థానం సాధించడంతో పలువురు ఆయన్ను అభినందించారు. సుందరపేట సీహెచ్సీలో అరుదైన శస్త్రచికిత్సపూసపాటిరేగ: భోగాపురం మండలం సుందరపేట సీహెచ్సీలో సోమవారం అరుదైన శస్త్రచికిత్స చేశారు. వివరాల్లోకి వెళితే.. చోడిపిల్లిపేటకు చెందిన చోడిపిల్లి దేవి ప్రసవం కోసం సుందరపేట ఆస్పత్రిలో చేరింది. పురిటినొప్పులు రావడంతో వైద్యులు ప్రసవం జరిపించగా.. బిడ్డ సగం వచ్చి నిలిచిపోవడంతో వెంటనే వైద్యులు అలేఖ్య, సునీల్ స్పందించి అతి కష్టంమీద శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. తంపటాపల్లిలో అగ్ని ప్రమాదం ● రెండు పూరిళ్లు దగ్ధంపాలకొండ రూరల్: మండలంలోని తంపటాపల్లిలో ఆదివారం ఆర్ధరాత్రి చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో వారాడ రమణమ్మ, బెజ్జిపురపు అప్పలనాయు డుకు చెందిన పూరిళ్లు కాలిబూడిదయ్యాయి. దేవుడి పటం ముందు పెట్టిన దీపాన్ని ఎలుకలు పడేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నా రు. ఒక్కసారిగా మంటలు రావడంతో గ్రామస్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.ఈ ప్రమాదంలో సుమారు 3 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా. -
సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ మంచి వేదిక
పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ మంచి వేదికని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అన్నారు. కలెక్టరేట్లో డీఆర్ఓ కె. హేమలత, ఎస్డీసీ కల్యాణ్చక్రవర్తితో కలసి 113 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలన్నారు. ఎక్కువ కాలంగా పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను గుర్తించి వాటిపై సమగ్ర పరిశీలన చేసి పరిష్కరించాలని సూచించారు. వినతుల్లో కొన్ని.. ● రహదారి సౌకర్యం లేక రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని కురుపాం మండలం నాయుడుగూడ గ్రామానికి చెందిన వి. మన్మధరావు, తదితరులు వినతిపత్రం అందజేశారు. ● శ్మశానవాటికలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించిన సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పార్వతీపురం మండలం పెదబొండపల్లి పంచాయతీ గదబవలస గ్రామానికి చెందిన పలువురు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ● సైనికుల కోటా కింద అలమండ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 177లో ఉన్న బంజరభూమిని ఇప్పించాలని కోరుతూ జియ్యమ్మవలస మండలం శిఖబడి గ్రామానికి చెందిన జి. మన్మధరావు వినతిపత్రాన్ని అందజేశారు. -
కూలీల కుటుంబాలపై మృత్యు పిడుగు
● పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి ● వ్యవసాయ కూలీల ఇళ్లలో విషాదం బలిజిపేట: వారు నిరుపేద వ్యవసాయ కూలి కుటుంబాలకు చెందిన మహిళలు. ఉన్న కొద్దిపాటి భూమిలో పంటలు సాగుచేస్తూ, మరోవైపు వ్యవసాయ కూలిపనులు చేస్తూ భర్తకు తోడుగా, కుటుంబానికి చేదోడుగా ఉంటున్నారు. వారిపై మృత్యువు పగబట్టింది. సొంత భూమిలో సాగుచేసిన మొక్కజొన్న కండెలను విరుస్తుండగా సోమవారం సాయంత్రం పిడుగు రూపంలో కబళించింది. వారి కుటుంబాల్లో విషాదం నింపింది. మృతిచెందిన ఇద్దరు మహిళలకు భర్తతో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక్కో కుమారుడు ఉన్నారు. శ్రీరంగరాజపురంలో పిడుగుపాటుకు మృతిచెందిన డి.సింహాచలం (38) భర్త శివుడు ఇద్దరూ వ్యవసాయ కూలీలే. వీరి పెద్దకుమార్తె స్వాతి ఇంటర్ చదువుతుండగా, రెండో కుమార్తె రాజేశ్వరి వంతరాం కేజీబీవీలో 8వ తరగతి, కుమారుడు సాయికుమార్ బొబ్బిలిలో ఒక ప్రైవేటు పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. తల్లి మృతితో కన్నీరు పెట్టారు. ● వంతరాంలో పిడుగుపాటుకు మృతిచెందిన పార్వతి(40( భర్త వేణు వ్యవసాయ కూలీగా పనిచేస్తూ, మరోవైపు దర్జీ పని చేస్తుంటాడు. వీరి పెద్దపిల్ల సంధ్య పైడిభీమవరంలో ఒక ల్యాబ్లో పనిచేస్తోంది. రెండో కుమార్తె పోటీపరీక్షలకు విజవాడలో శిక్షణ పొందుతోంది. కుమారుడు రాజ మౌళి తల్లిదండ్రులకు సాయంగా ఉంటూ వ్యవసాయ పనులు చేస్తున్నాడు. వీరికి 50 సెంట్లలోపు సొంతభూమి ఉంది. మొక్కజొన్న కండెలను విరుస్తున్న పార్వతిపై పిడుగుపడి మృతిచెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. గ్రామంలో విషాదం అలుముకుంది. మృతురాలు సింహాచలం, పార్వతి -
‘చంద్రన్న బీమా’కు మంగళం!
● అయోమయంలో కాల్ సెంటర్ సిబ్బంది ..! ● సిబ్బందిని జెడ్పీకి పంపిన అధికారులు ● మళ్లీ వెనక్కి వచ్చేసిన వైనం విజయనగరం ఫోర్ట్: అధికారంలోకి వస్తే చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం చంద్రబాబుతో పాటు కూటమి నేతలు అంతా ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. చంద్ర న్న బీమాకు టీడీపీ సర్కార్ పూర్తిగా మంగళం పాడేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో చంద్రన్న బీమా పథకం అమలు కోసం ఏర్పాటు చేసిన చంద్రన్న కాల్ సెంటర్ సిబ్బంది అయోమయంలో కొట్టుమిట్టుడుతున్నారు. చంద్రన్న బీమా పథ కం అమలులో లేకపోవడంతో వారిలో టెన్షన్ నెలకొంది. ఈ పథకంలో పని చేసే నలుగురు ఉద్యోగులను డీఆర్డీఏ అధికారులు జిల్లా పరిషత్కు పంపించారు. అక్కడ ఆరు నెలలు పాటు పని చేసిన మీదట తిరిగి డీఆర్డీఏకు ఇటీవల వచ్చేశారు. అధికారులు కూడా వారిని ఏ విధంగా వినియోగించుకోవాలని మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలియవచ్చింది. చంద్రన్న బీమా పథకం అమలులో కాల్ సెంటర్ సిబ్బందికి పని ఉంటుంది. బీమా ఉన్న వ్యక్తి చనిపోతే వారి కుటుంబ సభ్యులు నుంచి వచ్చిన ఫోన్లు స్వీకరించడం, వారికి బీమా వర్తింపజేయడానికి అవసరమైన పత్రాలు స్వీకరించడం, వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఇప్పడు బీమా అమల్లో లేకపోవడంతో అక్కడ వారికి పని లేక పోయింది. వేరే విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి. చంద్రన్న బీమా కాల్ సెంటర్లో పని చేసే నలుగురిని జెడ్పీకి ఆరు నెలలు కిందట పంపించాం. తిరిగి వారు ఇటీవల తిరిగి వచ్చేశారు. వారు డీఆర్డీఏలో పని చేస్తున్నారు. – శ్రీనివాసపాణి, పీడీ, డీఆర్డీఏ -
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోండి
విజయనగరం టౌన్: అన్నమాచార్య సంకీర్తనలపై అందజేస్తున్న వేసవి ఉచిత శిక్షణను ఐదేళ్ల వయసు నుంచి చిన్నా, పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఘంటసాల స్మారక కళాపీఠం వ్యవస్థాపకుడు ఎం.భీష్మారావు కోరారు. ఈమేరకు కళాపీఠం ఆవరణలో వేసవి ఉచిత సంగీత శిక్షణ కరపత్రాలను ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 45 రోజుల పాటు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. ఈ నెల 25 నుంచి తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేపట్టామన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 11 వరకు తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కళాపీఠం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. -
కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించేందుకే..?
రామభద్రపురం: కూటమి ప్రభుత్వం కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించేందుకే కొత్త కొత్త సంస్కరణలు తీసుకొస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఇంటర్మీడియట్ అకడమిక్ క్యాలెండర్ విడుదల చేస్తూ జూన్ నెలలో ప్రారంభమయ్యే అకడమిక్ విద్యా సంవత్సరాన్ని మార్పు చేస్తూ, ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇంటర్ సెకెండియర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభించేందుకు గతేడాది నుంచి చర్యలు చేపట్టింది. దీనికి సంస్కరణలు అనే సాకు చూపుతుండడం గమనార్హం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించలేకపోతుండడంతో ప్రభుత్వ పాఠశాల విద్యలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం అలా కాకుండా విద్యా వ్యవస్థలో మార్పులు కంటే కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించడం కోసమే సెలవుల్లో తరగతులను ప్రారంభించిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 18, కేజీబీవీలు 26, ఏపీ మోడల్ జూనియర్ కాలేజీలు 13, సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలు 8, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు 99 ఉన్నాయి. వీటిల్లో చదువుతున్న విద్యార్థులు ఇటీవలే ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాశారు. ఈ విద్యార్థులకు 2026–27 అకడమిక్ ఇయర్కు సంబంధించి సెకెండియర్ తరగతులు నిర్వహించేందుకు షెడ్యూల్ను జారీ చేశారు. వాస్తవానికి ఈ నెల 6వ తేదీ వరకు ఇంటర్మీడియట్ థియరీ పరీక్షల మూల్యాంకనం జరుగుతుంది. ఇలాంటి సమయంలో బోర్డు జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఒకటో తేదీ నుంచే తరగతులను ప్రారంభించి, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం సైతం అమలు చేస్తున్నారు. అధ్యాపకులు లేకుండా అకడమిక్ ఇయర్ను ఎలా ప్రారంభిస్తారు? వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో విద్యార్థుల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పాఠ్య పుస్తకాల్లేకుండా తరగతులు.. ఇంటర్మీడియట్ విద్యలో కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణలలో భాగంగా ఈ నెల 1వ తేదీ నుంచి 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభించారు. ఈ నెల 23వ తేదీ వరకు తరగతులు నిర్వహించి, 24వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి జూన్ 1వ తేదీ నుంచి కాలేజీలు తెరవనున్నారు. అయితే ఏప్రిల్ 1 నాటికే విద్యార్థుల చేతికి నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటివరకు జిల్లాకు ఒక్క నోటుబుక్కు గాని, పాఠ్యపుస్తకం గానీ చేరలేదు. పాఠ్యపుస్తకాలు లేకుండా విద్యార్థులకు తరగతులు నిర్వహించడం గమనార్హం. వారికి మేలు చేసేందుకే ముందస్తు అనుమతులు.. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు ఏప్రిల్ 6 నుంచి ప్రారంభిస్తూ ప్రభుత్వం షెడ్యూల్ జారీచేసింది. పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి మూల్యాంకనం ఈ నెల 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగనుంది. ఆ తర్వాత సుమారు 20 రోజులకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఫలితాలు రాకముందే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలకు అనుమతులు ఇవ్వడం వల్ల కార్పొరేట్ కళాశాలల వారికి ఎక్కువ సమయం లభిస్తోంది. దీంతో వారు క్యాంపెయిన్లు చేసుకుంటూ విద్యార్థులను లాక్కెళ్లిపోతున్నారు. అలాగే ప్రభుత్వ కళాశాలల్లో సెలవుల్లో తరగతులు నిర్వహిస్తుండడం వల్ల ప్రైవేట్ కళాశాలల వారు కూడా విద్యాహక్కు చట్టాన్ని పట్టించుకోకుండా దర్జాగా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ కాలేజ్లకు మేలు చేసేందుకే ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. సంస్కరణల పేరుతో ఇంటర్మీడియట్ అకడమిక్ క్యాలెండర్ విడుదల ఈ నెల 1 నుంచి 23వ తేదీ వరకు బ్రిడ్జ్ కోర్సు పేరిట తరగతులు పాఠ్య పుస్తకాల్లేకుండా తరగతులు నిర్వహిస్తున్న వైనం నేటి నుంచి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు ప్రారంభం పది పరీక్ష ఫలితాలు రాకముందే అడ్మిషన్లు విద్యార్థికి నష్టం లేదు.. ఈ నెల ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. పాఠ్యపుస్తకం లేనంత మాత్రాన విద్యార్థికి నష్టం లేదు. ఏదో ఒక అంశం మాత్రమే బోధిస్తారు. మొత్తం సిలబస్ మారలేదు. 20 శాతం మాత్రమే సిలబస్ మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రతి సబ్జెక్ట్లో రెండు పాఠాలు మాత్రమే బోధిస్తారు. ఈ నెల ఒకటో తేదీ నాటికే పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంది. కాని ఇంతవరకు పుస్తకాలు రాలేదు. ఈ నెల 19 నాటికి పుస్తకాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే పదో తరగతి ఫలితాలు రాకపోయినా పర్వాలేదు. ప్రవేశాలు పొందవచ్చు. విద్యార్థులు ఈ 23 రోజుల పాటు సబ్జెక్ట్లు వింటే తర్వాత ఏ గ్రూపు ఎంపిక చేసుకోవాలో ఉపయోగపడుతుంది. – ఎస్. తవిటినాయుడు,ఆర్ఐఓ, విజయనగరం -
మూల్యాంకన వేళ.. నిరసన గోల
కొన్నేళ్లుగా ఎన్నిసార్లు విజ్ఞాపనలు చేసినా టీచర్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదు. తాజాగా ఉపాధ్యాయులు చేపడుతున్న మూల్యాంకన విధులను నల్ల బ్యాడ్జీలతో చేపట్టి నిరసనలు తెలపాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా నల్ల బ్యాడ్జీలతో విధుల నిర్వహించి తొలిత ఈ రూపంలో నిరసనలు తెలుపుతాం. పెండింగ్ డీఏలు వంటి ఆర్థిక బకాయిల చెల్లించకపోవడం వల్ల ఉపాధ్యాయులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. – పాలతేరు శ్రీనివాస్, జిల్లా చైర్మన్, ఫ్యాప్టో జిల్లా కమిటీ బోధనేతర పనులతో నిత్యం బిజీగా ఉంటూ బోధన తరగతులను నిర్వహించలేని పరిస్థితి ప్రభుత్వ పాఠశాల వ్యవస్థలో ఏర్పడింది. హైస్కూళ్లలో ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజ న పథకం పరిశీలన, డేటా ఎంట్రీ, సర్వే తదిత ర పనులతో బిజీగా ఉండటంతో తరగతులు సమగ్రమంగా నిర్వహించలేకపోతున్నాం. దీని వల్ల విద్యార్థుల హాజరు తగ్గినట్టు గుర్తించారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. – డి.శ్యాం, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ విజయనగరం అర్బన్: రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉపాధ్యాయుల సమస్యలు సంవత్సరాలుగా పెండింగ్లో ఉండటంతో బోధనకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞాపనలు చేసినా ఫలి తం లేకపోవడంతో తాడోపేడే తేల్చుకునేందుకు ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. గతేడా ది అక్టోబర్లో విజయవాడ ధర్నా చౌక్లో ఐక్య పో రాటానికి ప్రభుత్వం దిగొచ్చి ఒక డీఏను విడుదల చేసి చేతులు దులిపేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకే మలిదశ ఉద్యమంగో భాగంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగ తి మూల్యాంకనానికి నల్ల బ్యాడ్జీలతో హాజరు కావాలని నిర్ణయించింది. ఈ నెల 9న స్పాట్ కేంద్రంలో, ఈ నెల 25, 26, 27న విజయవాడలోని ధర్నాచౌక్లో చేపట్టనున్న మూడు రోజుల రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ప్రభు త్వానికి అల్టిమేటం జారీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ బహిరంగ లేఖ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆ కార్యాచరణ నిరసనలు జిల్లా స్థాయిలో నిర్వహించనున్నట్టు ఫ్యాప్టో జిల్లా కమిటీ ప్రకటించింది. టీచర్లకు ఇవ్వాల్సిన డీఏలు, ఇతర ఆర్థిక బకాయిల తో పాటు 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయకపోవడం. 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించకపోవడం. సీపీఎస్ రద్దుపై స్పష్టత లేపోవ డం. ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారం పెరగడం. ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడం. రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోవడం. బదిలీల వ్యవస్థలో గందరగోళం. ఈహెచ్ఎస్, మెడికల్ బిల్లుల సమస్యలు, పాఠశాలల్లో నాన్ టీచింగ్ సిబ్బంది లేకపోవడం. ఫ్యాప్టో పిలుపుతో ఆందోళనలు ఉధృతం ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం స్థానిక సంస్కృత ఉన్నత పాఠశాలలో జిల్లా కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించింది. జిల్లా చైర్మన్ పాలతేరు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరి ష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ ప్రకటించిన దశలవారీ ఆందోళన కార్యక్రమాలను జిల్లాలో విజయవంతం చేయాలని సమావేశంలో తీర్మానించారు. అనంతరం కార్యాచరణ నోటీసును డీఈఓ యు.మాణిక్యంనాయుడుకి అందజేశారు. సమావేశంలో ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ సీహెచ్ భాస్కరరావు, ఆర్థిక కార్యదర్శి డి.శ్యామ్, శివప్రసాద్, ఎన్వీ పైడిరాజు, జి.సూర్యనారాయణ, అప్పారావు, సీహెచ్ తిరుపతిరావు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
కూటమి నాయకుల ‘గయ్యాళి’ అవతారం
● భూములను ఆక్రమించుకున్న నాయకులు ● ఆన్లైన్ చేయాలంటూ తహసీల్దార్పై ఒత్తిడి ● ససేమిరా అనడంతో కబ్జా, ఆపై లీజుకు.. బొబ్బిలి రూరల్: కూటమి నాయకులు బరి తెగిస్తున్నారు. ప్రభుత్వ భూములపై కన్నేసి కబ్జాలకు పాల్పడుతున్నారు. ఏకంగా ఇతరులకు లీజుకిచ్చి చేతులు దులుపుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని గోపాలరాయుడుపేట పంచాయతీ వెంకటరాయుడుపేట రెవెన్యూలో గిరిజనులైన గేదెల జోగులు తండ్రి సన్యాసి పేరిట సర్వే నంబర్ 43–2, 47–30, 47–4లో దాదాపు ఐదెకరాల పట్టా భూమి (గయ్యళి భూమి) ఉంది. ఆ భూమిని గతంలో వారు సాగు చేయగా ప్రభుత్వ పట్టా మంజూరు చేసింది. అయితే సన్యాసికి జోగులు ఒకడే కుమారుడు. జోగులుకు కూడా ఒక్క కుమార్తె ఉంది. సన్యాసి, జోగులు మరణానంతరం జోగులు కుమార్తె వారసత్వ సర్టిఫికెట్ తీసుకోలేదు. దీంతో కొన్నాళ్ల తర్వాత ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొందరి కళ్లు ఆ భూమిపై పడ్డాయి. తహసీల్దార్కు తాయిళాల ఆశ జూపి ఆ భూమిని తమ పేరుమీద ఆన్లైన్ చేయాలంటూ ఒత్తిడి తీసుకువచ్చారు. ఆయన ససేమిరా అంటూ ఇది ప్రభుత్వ భూమని బోర్డు ఏర్పాటు చేశారు. ఇదంతా జరిగి ఏడాదైంది. తాజాగా వారం రోజుల కిందట ఆ భూమిని కొందరు కూటమి చోటా నాయకులు ఆక్రమించారు. జేసీబీ, ట్రాక్టర్లతో చదును చేసి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒకరికి ఏకంగా లీజుకు ఇచ్చేశారు. దీంతో లీజుకు తీసుకున్న వ్యక్తి కొద్ది రోజులుగా ఆ భూమిలో పనులు చేపడుతున్నారు. తోటల పెంపకానికి అనువుగా భూమిని తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఆ భూమి విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇదే విషయాన్ని తహసీల్దార్ ఎం. శ్రీను వద్ద ప్రస్తావించగా.. ఆ భూమి ప్రభుత్వానికి చెందిన గయ్యాళి భూమి అని, ఇప్పటికే బోర్డు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎవరు ఆక్రమించుకున్నా చర్యలు తప్పవన్నారు. -
విశేష సత్కారం
● ఒకే వేదికపై 30 మంది ఉపాధ్యాయులకు సన్మానం చీపురుపల్లి: సాధారణంగా బదిలీ జరిగిన వారినో.. ఉద్యోగోన్నతి పొందిన వారినో సత్కరించుకోవడం ఆనవాయితీ. అలాగే ఇటీవల కాలంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరిట విద్యార్థులు ఒక్కటై తమకు విద్య బోధించిన ఉపాధ్యాయులను సన్మానిస్తున్నారు. తాజాగా వీటికి భిన్నంగా మండలంలోని బైరెడ్డిపేట వాసులు మాత్రం తమ పాఠశాలలో నాలుగు దశాబ్దాలుగా బోధించిన ఉపాధ్యాయులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సత్కరించడం విశేషం. బైరెడ్డిపేటలో 1986లో ప్రాథమిక పాఠశాల ఏర్పాటైంది. ఈ పాఠశాలలో చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. ఇంతటి విశేషమున్న ఈ పాఠశాలలో అప్పటి నుంచి పని చేసిన ఉపాధ్యాయులను సత్కరించాలని ప్రస్తుత హెచ్ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యాయుడు గోపి సంకల్పించారు. ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు కూడా తెలియజేయడంతో వారు కూడా సహకరించారు. దీంతో పాఠశాల ఏర్పాటు నుంచి నేటి వరకు పని చేసిన ఉపాధ్యాయుల వివరాలు సేకరించారు. కొంతమంది వివరాలు తెలియకపోయినప్పటికీ, దాదాపు 30 మంది ఉపాధ్యాయులను గ్రామానికి తీసుకువచ్చి ఘనంగా సత్కరించారు. అలాగే ఈ పాఠశాలలో చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడిన పలువురు విద్యార్థులను సైతం సన్మానించారు. కార్యక్రమంలో గ్రామస్తులంతా ఒక్కటై పాల్గొన్నారు. -
లోక రక్షకుడు క్రీస్తు
వాడవాడలా ఈస్టర్ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. శిలువ మరణం పొందిన మూడో రోజున సమాధి నుంచి పునరుత్థానుడై(మళ్లీ జన్మించి రావడం) జీసస్ తిరిగి రావడాన్ని పురస్కరించుకుని, ఏటా ఈస్టర్ పండుగ జరుపుకుంటుండడం తెలిసిందే. ఏసుప్రభువు రాకను స్వాగతిస్తూ క్రైస్తవ విశ్వాసులంతా చర్చిల్లో సామూహిక ప్రార్థనలు చేశారు. అనంతరం ర్యాలీలు చేపట్టి, క్రీస్తు పునరుత్థాన సందేశాన్ని ప్రజలకు తెలియజేశారు. లోక రక్షకుడు ఏసుక్రీస్తు ఒక్కరేనని, ఆయన బోధనలు అనుసరణీయమని ఫాదర్లు, పాస్టర్లు అన్నారు. మన పాపాల నుంచి మనల్ని రక్షించేందుకు క్రీస్తు తన రక్తాన్ని అర్పించారని, ఇప్పుడు మళ్లీ మనల్ని పాపాల బారినపడకుండా చేయడానికి మరణాన్ని జయించి వచ్చారన్నారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల దయ, శత్రువుల పట్ల క్షమాపణ గుణం కలిగి ఉండాలని ప్రభువు సూచించారని, ఆయన మార్గాన్ని అనుసరించి ప్రపంచ శాంతికి దోహదపడాలని కోరారు. –విజయనగరం టౌన్ -
ముగిసిన హ్యాక్థాన్ పోటీలు
రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ ఐటీలో రెండు రోజు లుగా నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ హ్యాక్థాన్ పోటీల విజేతలకు ఆదివారం బహుమతులు అందజేశారు. మొత్తం 290 మంది పాల్గొన్న ఈ పోటీల్లో ఏకధాటిగా 18 గంటలు శ్రమించి వ్యాపారం, ప్లేస్మెంట్, ఆరోగ్యం, సామాజిక సంక్షే మ రంగాలకు సంబంధించి వినూత్న ఏఐ ఆధారిత పరిష్కారాలను రూపొందించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఐదు జట్లుకు రూ.2లక్షల నగదు బహుమతి ప్రధానం చేశారు. ఇటువంటి హ్యాక్థాన్లు విద్యార్థుల నైపుణ్యంతో పాటు పరిశ్ర మస్థాయి అనుభవాలను అందిస్తాయని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో జీఎంఆర్ ఐటీడీయూ వీసీ డాక్టర్ జె.గిరీష్, మైక్రోసాఫ్ట్ ఏఐ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రవితేజ, బి.సౌమ్య, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంవీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
పవర్ లిఫ్టింగ్ పోటీల చాంపియన్ విజయనగరం
రాజాం సిటీ: జీఎంఆర్ ఐటీ డీమ్డ్ యూనివర్సిటీలో రెండు రోజులుగా నిర్వహించిన ఏపీ స్టేట్ జూనియర్, సబ్ జూనియర్, మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ పోటీల్లో ఎనిమిది కేటగిరీల్లో మహిళలు, పురుషులు వేర్వేరుగా తలపడ్డారు. మహిళల సబ్ జూనియర్, జూనియర్ పోటీల్లో...అలాగే పురుషుల జూనియర్ విభాగంలో విజయనగరం క్రీడాకారులు విజేతలుగా నిలిచి ఓవరాల్ చాంపియన్షిప్ దక్కించుకున్నారని వీసీ డాక్టర్ జె.గిరీష్ తెలిపారు. ఈ ఎనిమిది కేటగిరీల్లో ప్రథమ స్థానం పొందిన క్రీడాకారులు వచ్చే నెల 15 నుంచి 20 వరకు అమలాపురంలో జరగనున్న జాతీయస్థాయి క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విజేతలు .. జూనియర్ విభాగంలో.. రెండో రోజు వివిధ కేటగిరీల్లో నిర్వహించిన పోటీల్లో పురుషులు తమ పవర్ చూపించారు. 53 కిలోల విభాగంలో వి.శరత్ (విజయనగరం), టి.అభిశంకర్ (శ్రీకాకుళం), ఎం.రేవంత్ (కృష్ణా ) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. అలాగే 59 కిలోల విభాగంలో వై.భరత్ (విశాఖ), ఎ.యశోధర్ (బాపట్ల), సీహెచ్. శ్రీరామ్ (కోనసీమ) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందారు. 66 కిలోల విభాగంలో ఎన్.కార్తికేయ (విశాఖ), పి.అఖిల్ (పార్వతీపురం మన్యం), ఐ.ప్రవీణ్కుమార్ (అనకాపల్లి).. 74 కిలోల విభాగంలో జె.లవకుమార్ ( అనకాపల్లి), బి.అంజినా సంపత్ (శ్రీకాకుళం), బి.శ్రీమనోజ్ (కోనసీమ).. 83 కిలోల విభాగంలో ఎం.కౌశిక్ (విజయనగరం), పి.భానుచంద్ర (కోనసీమ), కె.దుర్గాశివ (కోనసీమ) విజేతలుగా నిలిచారు. సబ్ జూనియర్ విభాగంలో.. సబ్ జూనియర్ విభాగానికి సంబంధించి వివిధ కేటగిరీల్లో పోటాపోటీగా తలపడిన పోటీల్లో 53 కిలోలకు సంబంధించి ఎస్.జీవన్కుమార్ (విశాఖ), బి.నాగహర్ష (కోనసీమ), కె.కార్తీక్ (పల్నాడు) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. అలాగే 59 కిలోల విభాగంలో డీజీ వర్థన్ (కృష్ణ), బి.ఆర్యన్రావు (విశాఖ), బి.దీపిక (ప్రకాశం).. 66 కిలోల విభాగంలో జె.జితేంద్రదొర (కోనసీమ), ఎస్.సింయోను (కోనసీమ), ఎ.జగదీష్ (విజయనగరం).. 74 కిలోల విభాగంలో ఎంఎస్ఎస్డీ ప్రసాద్ (తూర్పు గోదావరి), కేబీఎస్ మణికంఠ ( కోనసీమ), జి.దినేష్ప్రసాద్ (కోనసీమ).. 83 కిలోల విభాగంలో కె.వరుణ్ (కాకినాడ), కె.నాని(కోనసీమ), ఎం.ధనుష్ (అనకాపల్లి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. -
పిడుగుపాటుకు మహిళ మృతి
వీరఘట్టం: పిడుగు పాటుకు మండలంలోని తెట్టంగి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ పైల అనసూయమ్మ(60) ఆదివారం మృతి చెందారు. గ్రామ శివారులో ఓ రైతు పొలంలో మొక్కజొన్న పంటలో కంకెలు కోసేందుకు వెళ్లిన ఆమె సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఒక్కసారిగా పిడుగు పడడంతో కుప్పకూలిపోయింది. ఆమె ముక్కు, చెవి నుంచి రక్తం రావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఎస్సై షణ్ముకరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎం.సీతారాంపురంలో పిడుగు.. వంగర: మండల పరిధి ఎం.సీతారాంపురం గ్రామంలో బొద్దాన ఆదినారాయణ ఇంటిపై పిడుగు పడింది. ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆ సమయంలో ఇంటి ముందు భాగంలో పిడుగు పడడంతో గచ్చుకు రంధ్రం ఏర్పడింది. ఆ ఇంట్లో శుభకార్యం కారణంగా బంధువులంతా ఒకేచోట కూర్చుని ఉన్నారు. వారి కళ్ల ముందరే పిడుగు పడడంతో ఓ వ్యక్తి కొద్దిసేపు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే సపర్యలు చేయడంతో కోలుకున్నాడు. -
జగ్జీవన్రామ్ మహనీయుడు
విజయనగరం క్రైమ్: అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబూ జగ్జీవన్రామ్ అని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ఆదివారం స్థానిక మహిళా పోలీస్స్టేషన్లో బాబూ జగ్జీవన్రామ్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ... దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకురావడంతో పాటు హరిత విప్లవం విజయవంతం కావడంలో జగ్జీవన్రామ్ ముఖ్యపాత్ర పోషించారని కొనియాడారు. కేంద్రంలో కమ్యునికేషన్, రవాణా, రైల్వే, రక్షణ, వ్యవసాయ మంత్రిగా సమర్థవంతంగా పనిచేసి, దేశ ప్రగతికి బాటలు వేశారన్నారు. దేశ చరిత్రలో 28 ఏళ్లు కేంద్రమంత్రిగా పనిచేసి, ఉత్తమ పార్లమెంటేరియన్గా చరిత్ర సృష్టించారని తెలిపారు. ఆనాటి కాలంలో చదువుకు దూరమై దుర్భర జీవితం గడుపుతున్న దళితుల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని తెలిపారు. అక్టోబర్ 19, 1935లో దళితుల ఓటుహక్కు కోసం హమ్మండ్ కమిషన్ ముందు వాదనలు వినిపించారని, రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా కూడా సేవలందించారని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్ డీఎస్పీ ఈ.కోటిరెడ్డి, సీఐలు ఈ నర్సింహమూర్తి, ఏవీ లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, సీహెచ్. సూరినాయుడు, ఆర్ఐ పి. శ్రీనివాసరావు, ఎస్సై శిరీష, సిబ్బంది లక్ష్మణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ -
వరల్డ్ స్కిల్ చీఫ్ ఎక్స్పెర్ట్గా శ్రీహరి
బాడంగి: మండలంలోని ముగడ కాలనీకి చెందిన రుత్తల శ్రీహరి వరల్డ్ చీఫ్ ఎక్స్పెర్ట్గా ఎంపికయ్యాడు. ఈ నెల 2,3 తేదీల్లో ఢిల్లీలో నాస్కమ్ ప్రతినిధులు నిర్వహించిన ఇండియా స్కిల్ పోటీల్లో శ్రీహరి ఇండియా తరఫున సైబర్ సెక్యూరిటీ విభాగంలో చీఫ్ ఎక్స్పెర్ట్గా వ్యవహరించారు. ఈ పోటీల్లో కర్ణాటకకు చెందిన వారిని గెలిపించి వరల్డ్ చీఫ్ ఎక్స్పెర్ట్గా ఎంపికయ్యాడు. రానున్న సెప్టెంబర్లో చైనాలోని షాంఘైలో జరగనున్న సైబర్ సెక్యూరిటీ పోటీలకు భారత్ బృందానికి తర్ఫీ దు ఇవ్వనున్నట్లు శ్రీహరి తెలిపారు. కాశీపేటలో అగ్ని ప్రమాదం సీతానగరం: మండలంలోని కాశీపేటలో ఆదివారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు పశువుల శాలలు దగ్ధమయ్యాయి. దీంతో బాధితులు వెన్నెల అప్పలస్వామి, వెన్నెల పరిశినాయుడు లబోదిబోమంటున్నారు. పశువులు లేని సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం జరగలేదు. పశువుల శాలల మీదుగా వెళ్తున్న ఎల్టీ విద్యుత్ తీగల రాపిడి వల్ల నిప్పులు పడి ప్రమాదం జరిగినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రెండు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా. రైలు పట్టాలపై మృతదేహం చీపురుపల్లి: చీపురుపల్లి – బాతువ గ్రామాల మధ్య రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని ఆదివారం గుర్తించినట్లు శ్రీకాకుళం జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ ఎస్.మధుసూదనరావు తెలిపారు. పట్టాలు దాటే సమయంలో రైలు ఢీకొని ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుని వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని.. నీలం రంగు జీన్స్, సర్ఫ్ కలర్ టీ షర్ట్ ధరించాడని తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు 91103 05494 నంబర్ను సంప్రదించాలన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి రేగిడి: మండల పరిధిలోని కాగితాపల్లి గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఎస్సై వి.బాలకృష్ణ అందించిన వివరాల మేరకు.. బలిజిపేట మండలం గళావల్లి గ్రామానికి చెందిన కోండ్రు గోవింద (29) ద్విచక్ర వాహనంపై రాజాం నుంచి గళావల్లి వైపు వెళ్తున్నాడు. కాగితాపల్లి సమీపంలోకి వచ్చే సరికి రాజాం వైపు వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో గోవింద అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏడుగురుపై కేసు నమోదు కొత్తవలస: మండలంలోని తాడివానిపాలెం గ్రామానికి చెందిన కుడిత కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేశుపాత్రునిపాలెం గ్రామానికి చెందిన డి.గాయత్రి ఆమె కుటుంబ సభ్యులు ఆరుగురుపై కేసు నమోదు చేసినట్లు సీఐ షణ్ముకరావు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కార్తీక్, గాయత్రి కొద్ది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి గాయత్రి తల్లిదండ్రులు గతంలో ఒప్పుకోవడంతో ఆమె చదువు, ఇతర అవసరాలకు సుమారు ఏడెనిమిది లక్షల రూపాయలను కార్తీక్ ఖర్చు చేశాడు. తీరా పెళ్లి సమయం వచ్చే సరికి గాయత్రి తల్లిదండ్రులు ప్లేటు ఫిరాయించి, వేరొక వ్యక్తితో కుమార్తెకు వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై కార్తీక్ ప్రశ్నించగా.. గాయత్రి, ఆమె కుటుంబ సభ్యులు కులంపేరుతో దూషించారు. దీంతో కార్తీక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహనీయుడు జగ్జీవన్రామ్
పార్వతీపురం రూరల్: సామాజిక సమానత్వం కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు జగ్జీవన్రామ్ అని అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జగ్జీవన్రామ్ జయంతిని ఆదివారం నిర్వహించారు. ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి ముందుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడిగా, దేశ తొలి కార్మిక శాఖ మంత్రిగా, రక్షణ మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. దళితుల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని వివరించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్ఐలు నాయుడు, రాంబాబు, ఆర్ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆండ్ర జలాశయం నుంచి అదనపు జలాలు
విజయనగరం: నగరంలో తాగునీటి ఎద్దడి నివారణకు ఆండ్ర జలాశయం నుంచి అదనపు జలాలు తెప్పిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి ఆదివారం తెలిపారు. వేసవి నేపథ్యంలో నగరవాసులకు తాగునీటి కష్టాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నాయకులు, కలెక్టర్ ఆదేశాలతో ఇరిగేషన్ అధికారులు స్పందించి, ఆండ్ర నుంచి జలాలు విడుదల చేశారన్నారు. అక్కడి నుంచి నీరు నెల్లిమర్ల హెడ్ వాటర్ వర్క్స్, చంపావతి, కుదిపి రిజర్వాయర్లకు అక్కడి నుంచి పిట్టాడ, లక్ష్మీపురం, సాలిపేట గజపతినగరం, డోలపేట గంగచోలవలస, తమ్మిరాజుపేట, గరివిడి, మొయిద ప్రాంతాల మీదుగా మూలస్టేషన్కు అక్కడి నుంచి నెల్లిమర్ల పంప్హౌస్కు నీరు వస్తుందన్నారు. మరో వారం రోజుల్లో ఆండ్ర నుంచి నెల్లిమర్ల రిజర్వాయర్కు అదనపు జలాలు వచ్చే అవకాశం ఉందన్నారు. -
సోమవారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
విజయనగరం ఫోర్ట్: ఏప్రిల్ తొలి వారంలోనే ఎండలు మండుతున్నాయి. రోజురోజుకూ ఎండ తీవ్రత పెరగడంతో జనం అవస్థలు పడుతున్నారు. ఎండ వేడిమికి వేడుగాలులు వీస్తుండడంతో ప్రజలు ఆపసోపాలు పడుతున్నారు. ఎండల తీవ్రతకు ప్రజలు దాదాపు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. గత మూడు రోజులుగా ఎండ తీవ్రత మరి ఎక్కువగా ఉంది. పొట్టకూటి కోసం కూలి పనులు చేసుకునే వారు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో మొండి ధైర్యంతో ఎండలోనే పనులు చేస్తున్నారు. ఆదివారం కొన్ని ప్రాంతాల్లో 39 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కాగా మరికొన్ని ప్రాంతాల్లో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 6 గంటలకే.. ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఉపాధి హామీ పథకం వేతనదారులు ఉదయం 6 గంటలకే పనికి వెళ్లి 10 గంటలకు తిరిగి ఇంటి ముఖం పడుతున్నారు. పని ప్రదేశంలో తాటి కమ్మలతో టెంట్లు వేసుకున్నా.. భానుడి ప్రతాపం ముందు నిలబడటం లేదు. గీత కార్మికులు సాధారణంగా కళ్లు గీయడానికి మధ్యాహ్నాం వెళ్లేవారు. ఎండ తీవ్రతకు భయపడి వారు వెళ్లడం లేదు. జిందాల్, మహామాయ వంటి పరిశ్రమలలో వేడి ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు ఎండ వేడి తోడవ్వడంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఇటుక బట్టీ కార్మికులు, తోపుడు బండ్ల కార్మికులు పరిస్థితి చెప్పనక్కర్లేదు. జనం అవస్థలు ఉదయం 8 గంటలకే ఎండ సెగలు కక్కుతుండడ తో ఉండడంతో జనం అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, చర్మ సంబంధిత వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు అవస్థలు పడుతున్నారు. ఉద యం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఒకే విధంగా ఉండడంతో జనం అల్లాడుతున్నారు. ఓ వైపు భగభగలు.. మరోవైపు ఉక్కపోత ఏప్రిల్ మొదటి వారంలోనే సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపుతుండడంతో ఎండ వేడిమికి జనం అల్లాడిపోతున్నారు. రోజువారి కూలీల పరిస్థి తి మరింత ఇబ్బందికరంగా ఉంది. ఇంకోవైపు ఉక్కపోత కూడా ఎక్కువైంది. దీంతో ఓ వైపు ఎండ తీవ్రత.. మరోవైపు ఉక్కపోతతో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అల్లాడిపోతున్నారు. శీతల పానీయాలను డిమాండ్ ఎండ వేడిమి నుంచి ఉపశమనానికి జనం శీతల పానీయాలకు ఆశ్రయిస్తున్నారు. సరబత్, జ్యూస్లు ఎక్కువగా తీసుకుంటున్నారు. అదే విధంగా మంచినీళ్లు, ఓఆర్ఎస్ ద్రావణం, మజ్జిగ వంటివి తీసుకుంటున్నారు. గొడుగు నీడలో ఇలా... ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఎండలో తిరిగితే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఎండలో తిరగకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నా రు. ఎండలో తిరగడం వల్ల డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉంది. చెమట పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరుగుదల, వణుకు పుట్ట డం, మగతనిద్ర, కలవరింతలు, ఫిట్స్, పాక్షికంగా అపస్మాకర స్థితి వడదెబ్బ లక్షణాలు గా ఉంటాయని ఈ లక్షణాలు కనపడితే వెంట నే వైద్యుడిని సంప్రదించాలని చెబుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉదయం 11 గంటలలోపు పనులు ముగించుకోవాలి. 11 గంటల తర్వాత ఎండలో తిరగరాదు. తప్పనిసరి పరిస్థితుల్లో టోపీ ధరించాలి, గొడుగు పట్టుకుని వెళ్లాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు మంచినీళ్లు తాగాలి. వడదెబ్బ నీళ్లు లక్షణాలు కనిపిస్తే సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలి. – డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్ఓ -
దళిత క్రైస్తవుల హక్కులు కాపాడాలి
విజయనగరం గంటస్తంభం: దళితుల్లోని క్రైస్తవుల హక్కులను కాపాడాలని అంబేడ్కర్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు భానుమూర్తి డిమాండ్ చేశారు. ఇదే విషయమై రూపొందించిన కరపత్రాలను జిల్లా కేంద్రంలోని బాలాజీ జంక్షన్లో ఉన్న అంబేడ్కర్ సామాజిక భవనంలో ఆదివారం ఆవిష్కరించారు. క్రైస్తవ మతం స్వీకరించిన దళితులు రిజర్వేషన్లు కోల్పోతారని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగం కల్పించిన లౌకిక స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఆర్టికల్ 15, 17, 25, 26ల ప్రకారం సమానత్వం, మతస్వేచ్ఛ హక్కులు ఉన్నప్పటికీ ఈ తీర్పుతో దళిత క్రిస్టియన్లకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దళిత క్రిస్టియన్ల పరిస్థితులపై అధ్యయనం చేసిన జస్టిస్ కేజీ బాలకృష్ణ కమిషన్ నివేదికను బహిర్గతం చేయాలని పట్టుబట్టారు.కార్యక్రమంలో డి.వెంకటేష్, వి.వంశీ, సయ్యద్ ఇఫ్రాన్ అలీ పాల్గొన్నారు. -
ఫీజు చెల్లించలేదని ఎండలో నిలబెట్టారు..?
● తల్లిదండ్రుల ఫిర్యాదుతో విచారణకు ఆదేశించిన డీఈఓ బొండపల్లి: మండలంలోని బోడసింగిపేట గ్రామ రెవెన్యూ పరిధిలో గల సురేష్ స్కూల్ యాజమాన్యం తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. బస్సు ఫీజు చెల్లించలేదని కొంతమంది విద్యార్థులను మూడు రోజులుగా ఎండలో నిలబెట్టారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను ప్రశ్నించారు. అన్ని ఫీజులు చెల్లించామని.. బస్సు ఫీజు కొంత బకాయి ఉంటే విద్యార్థులను ఎండలో ఎలా నిలబెడతారని ప్రశ్నించారు. విద్యార్థులు వడదెబ్బకు గురైతే ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. అయితే యాజమాన్యం నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తల్లిదండ్రులు డీఈఓ యు. మాణిక్యంనాయుడుకు ఫిర్యాదు చేయగా.. ఆయన సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఎంఈఓ – 2 అల్లు వెంకటరమణను ఆదేశించారు. ఎడ్ల బండిని ఢీ కొట్టిన లారీ ● ఎద్దు మృతి ● ఒకరికి గాయాలు సీతానగరం: మండలంలోని జాతీయ రహదారిపై కాశీపేట – చినబోగిలి గ్రామాల మధ్య పెట్రోల్బంక్ సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎద్దు మృతి చెందగా.. రైతుకు గాయాలయ్యాయి. స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని ఆర్ వెంకంపేట గ్రామానికి చెందిన రైతులు సువర్ణముఖీనది నుంచి ఇసుక తరలించడానికి ఆరు నాటుబళ్లతో సీతానగరం వస్తున్నారు. సరిగ్గా పెట్రోల్ బంక్ సమీపానికి వచ్చే సమయానికి బొబ్బిలి వైపు నుంచి వస్తున్న లారీ ఓ నాటుబండిని ఢీ కొట్టడంతో సంఘటనా స్థలంలోనే ఎద్దు మృతి చెందగా.. బండి యజమాని కర్రి రాముకు గాయాలయ్యాయి. వెంటనే సహచరులు స్పందించి క్షతగాత్రుడ్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ప్రమాదస్థలానికి స్థానిక పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. కుక్కల దాడిలో లేగదూడ మృతి రాజాం సిటీ: పట్టణ పరిధి బుచ్చెంపేట గ్రామంలో శుక్రవారం రాత్రి వీధి కుక్కలు దాడిలో ముద్దాడ అప్పన్నకు చెందిన లేగ దూడ మృతి చెందింది. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువుగా ఉందని, గతంలో కూడా పశువులు మృత్యువాతపడ్డాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులను వీధుల్లోకి తీసుకురావాలంటేనే భయపడుతున్నామని వాపోయారు. కుక్కల బారి నుంచి పశువులు, మనుషులను రక్షించాలని అధికారులను కోరారు. ఉపాధిహామీలో అవకతవకలు ● రూ. 6.08 లక్షల రికవరీకి ఆదేశం వంగర: మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో జరిగిన ఉపాధిహామీ పనుల్లో అవకతవకలు బయటపడ్డాయి. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో 2024–25లో చేసిన పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. మండలంలోని 30 పంచాయతీల్లో 1031 పనులకు గాను ఉపాధి వేతనదారుల ద్వారా రూ. 8 కోట్ల 88 లక్షల 39 వేల 282 రూపాయలు ఖర్చుచేయగా, మెటీరియల్ రూపంలో రెండు కోట్ల 59 లక్షల 40 వేల 690 రూపాయలతో కలిపి మొత్తం 11 కోట్ల 49 లక్షల 79 వేల 972 రూపాయలు ఖర్చుచేశారు. ఎస్ఆర్పీ కె.చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఐదు సామాజిక తనిఖీ బృందాలు సోషల్ ఆడిట్ నిర్వహించారు. కొన్ని పంచాయతీల్లో చూపుతున్న పనులకు, చేసిన ఖర్చుకు తేడా ఉండడంతో రికవరీలకు ఆదేశించినట్లు ఏపీడీ రమామణి తెలిపారు. మొత్తం 29 పంచాయతీల్లో రూ. 24 లక్షల అవకతవకలను తనిఖీ బృందాలు గుర్తించగా 6,08,701 రూపాయల రికవరీకి అధికారులు ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్ముఖర్జీ, మండల ప్రత్యేకాధికారి చంద్రకుమారి, ఎంపీడీఓ తులా రాజారావు, డీఆర్డీఏ సిబ్బంది, ఏపీఓ ఎస్.హరినాథ్, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
కులాలను మార్చేస్తున్నారు..
జియ్యమ్మవలస రూరల్: రెవెన్యూ శాఖలో గ్రామస్థాయి వీఆర్ఓలు రైతుల పొలాలనే కాకుండా కులాలను కూడా ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా ఇటీవల మండలంలోని చింతలబెలగాం పంచాయతీ సింగనాపురం గ్రామానికి చెందిన వాండ్రాసి అన్వేష్కు (తండ్రి గౌరు) మంజూరైన కులధ్రువీకరణ పత్రాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అన్వేష్ కులధ్రువీకరణ పత్రం కోసం సచివాలయానికి వెళితే బలిజ (బీసీ డీ) సర్టిఫికెట్ మంజూరైంది. కుల ధ్రువీకరణ పత్రం చూసిన అన్వేష్ ఒక్కసారి ఆశ్చర్యానికి లోనయ్యాడు. వాస్తవానికి అతడు రజక (బీసీ ఏ) కులానికి చెందిన వాడు. అలాగే తురకనాయుడువలస గ్రామానికి చెందిన 25 ఎర్ర గొల్లల కుటుంబాలకు వీఆర్ఓలు తప్పుడు కులధ్రువీకరణ పత్రాలు మంజూరు చేశారు. దీంతో వారంతా మూడేళ్లుగా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. తమ కుటుంబాల్లో 25 మంది వరకు విద్యార్థులు ఉన్నారని.. వీరికి తమ కులానికి సంబంధించిన కులధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని వారంతా కోరుతున్నారు. ఇదే విషయమై తహసీల్దార్ ఎం. అప్పారావు వద్ద ప్రస్తావించగా.. విచారణ చేపట్టి సరైన కులధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తామన్నారు. -
భూములు సిద్ధం చేయండి
విజయనగరం ఫోర్ట్: మొక్కలు నాటేందుకు అవసరమైన భూములను సిద్ధం చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఉద్యాన, వ్యవసాయాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. మిషన్ హార్టివిజన్ కార్యక్రమంలో భాగంగా రెండో విడతలో 7,260 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కూరగాయలు, ఆకుకూరలు, డ్రాగన్ ఫ్రూట్, తదితర ఉద్యాన పంటలతో పాటు అంతర పంటలను సాగు చేయడమే ప్రధాన లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. 7,260 ఎకరాల్లో ఉద్యాన సాగు లక్ష్యం కాగా.. ప్రస్తుతానికి 2,714 మంది రైతులకు చెందిన 6,037 ఎకరాల భూమిని గుర్తించినట్లు చెప్పారు. మిగిలిన భూమిని కూడా గుర్తించి సిద్ధం చేయాలన్నారు. ఇప్పటివరకు 275 బ్లాక్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి బ్లాక్లో కనీసం ఐదు ఎకరాలకు తక్కువ లేకుండా భూమి ఉండాలన్నారు. కాన్ఫరెన్స్లో జిల్లా ఉద్యానశాఖ అధికారి చిట్టిబాబు, జిల్లా వ్యవసాయ అధికారి వీటీ రామారావు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస పాణి, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాంసుందర్ రెడ్డి -
వచ్చేది జగనన్న పాలన
కురుపాం: ప్రస్తుత టీడీపీ పాలనపై ప్రజలు విసుగుచెందారని, వచ్చేది జగనన్న పాలనేనని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి స్పష్టంచేశారు. ప్రతీ వైఎస్సార్సీపీ కార్యకర్త పార్టీ గుర్తింపు కార్డును కలిగిఉండాలని.. ఆ కార్డే పార్టీ కోసం కార్యకర్త చేసిన కృషికి ప్రామాణికంగా నిలుస్తుందని, భవిష్యత్లో భరోసా లభిస్తుందన్నారు. కురుపాం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో కురుపాం మండల కేంద్రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు అధ్యక్షతన శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీ కార్యకర్తలకు మొదటి ప్రాధన్యమిచ్చేందుకు వీలుగా ప్రతీకార్యకర్త గుర్తుంపు కార్డు పొందేలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు చేపట్టారన్నారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తకు భవిష్యత్ బాగుంటుందని, ప్రతీ కార్యకర్త విధిగా ఐడీ కార్డులు పొందాలన్నారు. ప్రతీ వైఎస్సార్సీపీ కార్యకర్త గుర్తింపు కార్డును కలిగి ఉండాలి కార్యకర్తలందరికీ సముచిత స్థానం మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి -
చదువుతో పాటు క్రీడలపై శ్రద్ధ..
రాజాం సిటీ: విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై శ్రద్ధ కనబరచాలని జీఎంఆర్ ఐటీ డీమ్డ్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ జె.గిరీష్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక యూనివర్సిటీలో 13వ ఏపీ స్టేట్ మెన్ అండ్ ఉమెన్ సబ్ జూనియర్, జూనియర్, మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఎదుగుదల ఉంటుందన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించినప్పుడే ఉత్తమమైన క్రీడాకారులుగా గుర్తింపు పొందుతారని తెలిపారు. మొదటి రోజు మహిళా క్రీడాకారులకు పోటీలు నిర్వహించగా 80 మంది పాల్గొన్నారు. కార్యక్రమంలో సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.కోటేశ్వరరావు, జాతీయ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎం.ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.వెంకటేశ్వరరావు, డాక్టర్ ఎంవీ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే.... జూనియర్ స్ట్రాంగ్ గర్ల్ విభాగంలో ఎం.షానూన్ (గుంటూరు), యు.నాగప్రగతి (విశాఖపట్నం), ఎన్.జ్ఞానదివ్య (గుంటూరు) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. అలాగే సబ్ జూనియర్ విభాగంలో జి.షరోన్ (కోనసీమ), వి.సువర్ణ (ఎన్టీఆర్), ఇ.లక్ష్మీవినయ్శ్రీ (గుంటూరు) విజేతలుగా నిలిచారు. జీఎంఆర్ ఐటీ డీయూ వీసీ డాక్టర్ జె.గిరీష్. -
టీఏ, డీఏలపై నీలినీడలు..!
విజయనగరం ఫోర్ట్: ఏరు దాటేవరకు ఏటి మల్లన్న.. ఏరుదాటాక బోడి మల్లన్న.. అన్న సామెత చందంగా తయారైంది చంద్రబాబు సర్కారు తీరు. వైద్యులతో పనిచేయించుకున్న చంద్రబాబు సర్కారు వారికి ఇవ్వాల్సిన టీఏ, డీఏలు మాత్రం ఇవ్వకుండా తీవ్ర జాప్యం చేస్తోంది. వైద్యులతో పనిచేయించుకుని ఏడాదికి పైగా అవుతున్నా వారికి ఇవ్వాల్సిన టీఏ, డీఏలు ఇవ్వకుండా తీవ్ర నిర్లక్ష్యం చేయడంపై వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టిన తర్వాత దివ్యాంగులకు పింఛన్ వెరిఫికేషన్ పేరిట టీడీపీ సర్కారు సదరం రీ వెరిఫికేసన్ పేరిట సదరం క్యాంపులు నిర్వహించింది. అయితే ఈ క్యాంపులకు సర్టిఫికెట్ ఇచ్చిన వైద్యులను కాకుండా ఇతర జిల్లాల నుంచి, ఇతర ఆస్పత్రులనుంచి వైద్యులను రప్పించి సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్ చేయించారు. ఇందుకోసం శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలతో పాటు రాజాం, పార్వతీపురం, గజపతినగరం, చీపురుపల్లి ఆస్పత్రులకు చెందిన వైద్యులు హాజరయ్యారు. వివిధ ఆస్పత్రుల్లో సదరం క్యాంపులు.. జిల్లాలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, చీపురపల్లి, ఎస్. కోట, రాజాం, సాలురు ఏరియా ఆస్పత్రులతో పాటు పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో క్యాంపులు నిర్వహించి వైద్యులు రీ వెరిఫికేషన్ చేయించారు. 2025 జనవరిలో ప్రారంభం.. 2025 జనవరి నెలలో సదరం రీ అసెస్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బుధ, గురు, శుక్రవారరాల్లో ఆయా ఆస్పత్రుల్లో వైద్యులు రీ అసెస్మెంట్ నిర్వహించారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసినప్పటికీ.. ఇంతవరకు వారికి ఇవ్వాల్సిన టీఏ,డీఏలు మంజూరు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 30 వేల మందికి పైగా.. జిల్లాలో వేలాది మంది దివ్యాంగులకు వైద్యులు రీ అసెస్మెంట్ చేశారు. అవసరమైన పరీక్షలు నిర్వహించి రీ అసెస్మెంట్ సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఎముకులు, ఈఎన్టీ, మానసిక, న్యూరో విభాగాలకు సంబంధించి సుమారు 30 వేల మందికి పైగా దివ్యాంగులకు వైద్యులు పరీక్షించారు. ఈ క్యాంపుల్లో పాల్గొన్న వైద్యులకు సుమారు రూ. 1.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. సదరం క్యాంప్లకు వెళ్లిన వైద్యులకు అందని టీఏ, డీఏలు 16 నెలలైనా పట్టించుకోని ఉన్నతాధికారులు వైద్యులకు చెల్లించాల్సిన బకాయిలు రూ. 1.50 కోట్లు బిల్లుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు అధికారులకు తెలియజేశాం.. దివ్యాంగులకు రీ అసెస్మెంట్ నిర్వహించడానికి వచ్చిన వైద్యులకు టీఏ, డీఏలు చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. నిధులు త్వరలోనే వైద్యుల ఖాతాల్లోకి జమయ్యే అవకాశం ఉంది. – డాక్టర్ పద్మశ్రీ రాణి, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి -
శాస్త్ర, సాంకేతిక రంగాలపై అవగాహన
పార్వతీపురం: సైన్స్ ఎక్స్పోజర్ టూర్–2026 వల్ల విద్యార్థుల్లో శాస్త్ర,సాంకేతిక రంగాలపై ఆసక్తి పెంపొందుతుందని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో సైన్స్ ఎక్స్పోజర్టూర్–2026 పోస్టర్ను కలెక్టర్తో పాటు జేసీ సి.యశ్వంత్కుమార్ రెడ్డి, సీతంపేట ఐటీడీఏ పీఓ పవర్స్వప్నిల్ జగన్నాథ్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వ ర్యంలో సైన్స్ ఎక్స్పోజర్ టూర్ ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులకు ప్రయోగాత్మక అనుభవాన్ని అందించడంతోపాటు ఆధునిక పరికరాలు, సాంకేతికతపై అవగాహన కల్పిస్తారన్నారు. కార్యక్రమంలో ఏపీఓ పి.మురళీధర్, డీఈఓ పి.బ్రహ్మాజీరావు, డీడీఓ ఎ. విజయశాంతి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన అందించాలని అధికారులను కలెక్టర్ అదేశించారు. కలెక్టరేట్లో ఐటీడీఏ అధికారులతో విద్యాసంబంధిత అంశాలపై సమీక్షించారు. ప్రతి విద్యార్థి తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో ప్రావీణ్యం సాధించడంతోపాటు గణితంలో పట్టు సాధించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మ విశ్వాసం పెంపొందించడంపై దృష్టిపెట్టాలన్నారు. -
విద్యుదాఘాతంతో గిరిజన విద్యార్థి మృతి
● రోధిస్తున్న తల్లిదండ్రులు, బంధువులుసాలూరు రూరల్: మండలంలోని కరకవలస గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి కర్రా దిలీప్ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మామిడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కర్రా దిలీప్ శనివారం పాఠశాలకు వచ్చి తరగతులు పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల సమయంలో పక్కనే ఉన్న అరటి తోటలోకి పాఠశాల గోడ దూకి వెళ్లాడు. తిరిగి పాఠశాలకు వచ్చేందుకు గోడ దూకేందుకు ప్రయత్నించాడు. అయితే గోడ ఎత్తుగా ఉండడంతో పక్కనే ఉన్న వ్యవసాయ పంపుసెట్ బాక్సు మీద నుంచి గోడ ఎక్కేందుకు ప్రయత్నించగా.. విద్యుత్ తీగ తగిలి పడిపోయాడు. వెంటనే ఉపాధ్యాయులు గమనించి విద్యార్థిని మామిడిపల్లి పీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడ నుంచి సాలూరు కేంద్రాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సీఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరిహారం ఇవ్వాలి: మాజీ డిప్యూటీ సీఎం విద్యుదాఘాతంతో మృతి చెందిన గిరిజన విద్యార్థి కర్రా దిలీప్ కుటుంబానికి ప్రభుత్వం రూ. ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర డిమాండ్ చేశారు. ఈ విషయంలో గిరిజన శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పందించి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్ విద్యార్థి మృతి చెందిన సంఘటనా స్థలాన్ని సబ్ కలెక్టర్ వైశాలి శనివారం సాయంత్రం పరిశీలించారు. విద్యుత్ తీగలను పరిశీలించి, పూర్తి నివేదిక అందజేయాలని రెవెన్యూ, విద్యుత్ శాఖాధికారులను ఆదేశించారు. -
పరామర్శ
విజయనగరం లీగల్: రాష్ట్ర శాసన సభ మాజీ ఉప సభావతి,సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కోలగట్ల వీరభధ్రస్వామి చిన్న అన్నయ్య, న్యాయవాది కోలగట్లతమ్మన్నశెట్టి ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలు కె.మన్మథరావు, ఎం.బాలాజీ , బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన, బార్ కౌన్సిల్ సభ్యుడు బెల్లాన రవి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నళితం రమేష్కుమార్ శనివారం పరామర్శించారు. మృతికి కారణాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. -
కృత్రిమ మేధస్సుతో భవిష్యత్
● గూగుల్ సంస్థ మెషీన్ లెర్నింగ్ ఇంజినీర్ సౌమ్య రాజాం సిటీ: కృత్రిమ మేధస్సు, మెషీన్ లెర్నింగ్ భవిష్యత్ ఉద్యోగాలపై ప్రభావం చూపుతాయని బెంగుళూరుకు చెందిన గూగుల్ సంస్థ మెషీన్ లెర్నింగ్ ఇంజినీర్–2 బి.సౌమ్య అన్నారు. జీఎంఆర్ ఐటీ డీమ్డ్ యూనివర్సిటీలో శనివారం నిర్వహించిన ప్లేస్మెంట్ సక్సెస్ డే కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఏఐ ఉద్యోగాలను తగ్గించదని, వాటి స్వభావాన్ని మార్చుతూ కొత్త అవకాశాలను సృష్టిస్తుందన్నారు. విద్యార్థులు అవకాశాలను వినియోగించుకుని ఉద్యోగార్థులుగా కాకుండా క్రియేటర్స్గా రాణించాలని ఆకాంక్షించారు. యూనివర్సిటీ వీసీ డాక్టర్ జె.గిరీష్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రొగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్, గణితం వంటి మౌలిక అంశాలలో పట్టు సాధించాలన్నారు. అలాగే సాంకేతిక నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్ కూడా అవసరమేనని చెప్పారు. రిజిస్ట్రార్ డాక్టర్ ఎంవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని నైపుణ్య శిక్షణ కార్యక్రమాలపై దృష్టి సారిస్తామన్నారు. 1100 మందికి ఆఫర్లు రాగా 850 మంది వివిధ ఉద్యోగాల్లో నియమితులయ్యారని కెరీర్ డవలప్మెంట్ సెంటర్ సభ్యుడు కిరణ్కుమార్ వెల్లడించారు. కార్యక్రమంలో డాక్టర్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్, డాక్టర్ ఏవీ రమణ, డాక్టర్ పి.రమణ, డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ శశికుమార్, డాక్టర్ గణేష్ ప్రభు, డాక్టర్ ఆర్ఎల్ నాయుడు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
టీటీడీని అపవిత్రం చేయొద్దు
సాక్షి, పార్వతీపురం మన్యం: రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు కళంకం తీసుకొస్తున్నారని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి, పీఏసీ సభ్యుడు పీడిక రాజన్నదొర, మాజీ ఉప ముఖ్యమంత్రి, కురుపాం నియోజకవర్గ ఇన్చార్జి పాముల పుష్ప శ్రీవాణి, మాజీ ఎమ్మెల్యేలు, పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గాల ఇన్చార్జిలు అలజంగి జోగారావు, విశ్వాసరాయి కళావతి అన్నారు. టీటీడీలాంటి పవిత్ర స్థలానికి.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే బీఆర్ నాయుడు వంటి వ్యక్తిని చైర్మన్గా కొనసాగించడం సిగ్గుచేటన్నారు. బీఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసిన అఘాయిత్యాలు, రాసలీలలను ఖండిస్తూ.. జిల్లాలోని నాలుగు నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు.. ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిల ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు. బీఆర్ నాయుడు లాంటి కామాంధుడిని వెనకేసుకు రావడానికి చంద్రబాబుకు సిగ్గు లేదా? అంటూ ప్రశ్నించారు. లడ్డూ ప్రసాదంలో ఓ వైపు కల్తీ నెయ్యి వినియోగించారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. మరోవైపు రాసలీలలకు తెగబడిన టీటీడీ చైర్మన్ను విధులనుంచి తొలగించాలని సామాన్య భక్తులు సైతం కోరుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చీమకుట్టినట్టైనా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవికి కళంకం తెచ్చిన బీఆర్ నాయుడు అలాంటి వారిని వెనుకేసుకుని రావడానికి సిగ్గు లేదా? తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలి వైఎస్సార్ సీపీ నాయకుల డిమాండ్ జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు పార్వతీపురం జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో వందలాది మంది పార్టీ శ్రేణులతో కలిసి బెలగాం ప్రధాన రహదారి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తిరుమల పవిత్రతను కాపాడేలా చూడాలని స్వామివారిని వేడుకున్నారు. చంద్రబాబు తీరుకు నిరసనగా నినదించారు. -
నేడు రోడ్లు, భవనాలశాఖ మంత్రి పర్యటన
పార్వతీపురం: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి బీసీ జనార్దన్రెడ్డి ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించనున్నట్టు కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు మంత్రి పార్వతీపురానికి చేరుకుని, 10.30 గంటలకు సీతానగరం బ్రిడ్జి, మక్కువ–అజ్జాడ రహదారి ప్రారంభోత్సం, 11.15 గంటలకు సీతానగరం–అరసాడ, 11.45కు అరసాడ రోడ్డు, 12 గంటలకు చిలకలపల్లి వయా బలిజిపేట రోడ్డు, 12.10కు పార్వతీపురం వయా కలవరాయి, టీపీ ఇంజనీరింగ్ కళాశాల రోడ్డు ప్రారంభోత్సవంలో పాల్గొంటారన్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు పార్వతీపురం చేరుకొని, 1.30 గంటలకు అధికారులతో సమీక్షిస్తారన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పార్వతీపురం నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు బయలుదేరి వెళతారని తెలిపారు. డీఈఈ సెట్కు దరఖాస్తుల ఆహ్వానం నెల్లిమర్ల: డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెట్–2026కు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని విజయనగరం వేణుగోపాలపురం ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామకష్ణారావు పిలుపునిచ్చారు. జిల్లా లోని ప్రభుత్వ, ప్రైవేటు డైట్ కళాశాలల్లో రెండేళ్ల వ్యవధి కలిగిన డిప్లమా కోర్సులో చేరడానికి ప్రవేశ పరీక్ష రాసేందుకు ఆన్లైన్లో ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సీఎస్ఈ.ఏపీ.జీవోవి.ఇన్ లేదా ఏపీడీఈఈసెట్.ఏపీసీఎఫ్ఎస్ఎస్. ఇన్ అనే వెబ్ సైట్లో సమాచారం పొందవచ్చన్నారు. శిక్షణలో చేరేసమయానికి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. నేడు జగ్జీవన్రామ్ జయంతి పార్వతీపురం: మాజీ ఉప ప్రధాని, స్వాంత్య్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ 119వ జయంతిని పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహిస్తామని కలెక్టర్ ప్రభాకరరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆ రోజు ఉదయం పార్వతీపురం మెయిన్ రోడ్డులోని సౌందర్య థియేటర్ కూడలి వద్ద ఉన్న బాబు జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తామన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్లో జయంతిని నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పీఎఫ్ ఖాతాల నిర్వహణపై నిర్లక్ష్యం తగదు ● జెడ్పీ సీఈఓకు పీఆర్టీయూ జిల్లా కమిటీ ఫిర్యాదు విజయనగరం అర్బన్: జిల్లాల పునర్విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నా రాజాం ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయులకు పీఎఫ్ ఖాతాలు ప్రారంభించకపోవడం తగదని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. పీఎఫ్ ఖాతాలు జిల్లాలో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓ బీఏ సత్యనారాయణకు శనివారం విజ్ఞప్తి చేశారు. కొత్తవలస: మండలంలోని మంగళపాలెం ప్రాథమిక పాఠశాలను ఆ గ్రామ సచివాలయంలో నిర్వహిస్తున్నారు. పాఠశాలను రెండేళ్ల కిందటి వరకు స్థానికంగా ఉన్న మిషనరీ సంస్థ నడిపేది. పాఠశాల నిర్వహణ భారం కావడంతో ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదివే 36 మంది విద్యార్థులతో ప్రభుత్వానికి అప్పగించింది. ప్రభుత్వం ఇక్కడి చిన్నారులకు చదువుచెప్పేందుకు ఇద్దరు ఉపాధ్యాయులను నియమించింది. అయితే, పాఠశాలకు వసతి లేకపోవడంతో సచివాలయంలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఒకే గదిలో ఐదు తరగతుల బోధ నకు ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు సచివాలయానికి వివిధ పనులపై వచ్చేవారివల్ల బోధనకు ఆటంకం కలుగుతోంది. అధికారులు స్పందించి తక్షణమే పాఠశాల భవనాలు నిర్మించి వసతి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
‘రన్ ఫర్ జీసస్’ ర్యాలీ
విజయనగరం టౌన్: రన్ ఫర్ జీసస్ పేరిట క్రైస్తవ విశ్వాసులు నగరంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఈ ర్యాలీని వైఎస్సార్ సీపీ నాయకులు దేవుపల్లి చిట్టిబాబు, 47వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పట్నాన పైడిరాజు కలిసి ప్రారంభించారు. లోక రక్షకుడు క్రీస్తు అని, ఆయన మరణాన్ని సైతం జయించి నిజమైన దేవుడిగా గుర్తింపు పొందారని ఆలిండియా క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పి.ప్రేమానందం తెలిపారు. ప్రపంచ శాంతికి, మానవాళి శ్రేయస్సుకు జీసస్ బోధనలు దోహదపడతాయని, ప్రతిఒక్కరూ ఆయన మార్గాన్ని అనుసరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు బిషప్ ఎం.పాల్సన్, యూపీఎఫ్ వైస్ ప్రెసిడెంట్ జి.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
55 కిలోల గంజాయి స్వాధీనం
విజయనగరం క్రైమ్/ఎల్.కోట: అరకు–విశాఖపట్నం జాతీయరహదారిపై కారులో శుక్రవారం తరలిస్తున్న 55 కిలోల గంజాయిని ఎల్.కోట మండలం రంగరాయపురం గ్రామ కూడలిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ శనివారం మీడియాకు వెల్లడించారు. ఒడిశా నుంచి విశాఖపట్నానికి కారులో గంజాయిని తరలిస్తున్నట్టు ఎల్.కోట పోలీసులకు అందిన పక్కా సమాచారంతో రంగరాయపురం కూడలిలో తనిఖీలు చేపట్టారు. కారును నిలిపి అందులోని 22 ప్యాకెట్లలో ఉన్న 55 కిలోల గంజాయిని స్వాధీనం చేసు కున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా, అరుకు మండలం, బోసుబెడ్డకి చెందిన సోనై రాజబాబు, కారుకు పైలట్గా స్కూటీపై వెళ్తున్న ఒడిశా రాష్ట్రం, కోరాపుట్ జిల్లా, పాడువ మండలం, హట్టగూడకి చెందిన నంజయ్ హంతల్, ఒడిశా రాష్ట్రం, పూరి జిల్లా, తలజంగాలోని మధుబనబాలియకి చెందిన సంజీబ్ కుమార్ మహంతి (40) ఉన్నారు. వారి నుంచి గంజాయితో పాటు కారు, మూడు సెల్ ఫోన్లు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఒడిశాకు చెందిన పింకూ, దాదా అనే మరో ఇద్దరు పరారిలో ఉన్నారని, వారిని కూడా అరెస్టు చేస్తామని చెప్పారు. సమావేశంలో ఎస్.కోట రూరల్ సర్కిల్ సీఐ ఎల్.అప్పలనాయుడు, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, ఎల్.కోట ఎస్ఐ సీహెచ్ నవీన్ పడాల్ పాల్గొన్నారు. పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు పరారీలో మరో ఇద్దరు నిందితులు ఒడిశా నుంచి విశాఖకు గంజాయి తరలింపు వివరాలు వెల్లడించిన ఎస్పీ దామోదర్ -
క్రికెట్ టోర్నీ విజేత ‘పార్వతీపురం’
పార్వతీపురం రూరల్: విజయనగరం జేఎన్టీయూ – జీవీ మైదానంలో శనివారం నిర్వహించిన ఏపీ స్టేట్ ఆడిట్ విభాగం అంతర్ జిల్లా క్రికెట్ మ్యాచ్లో పార్వతీపురం జట్టు విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన విజయనగరం జట్టు 20 ఓవర్లలో 154 పరుగులు చేసింది. అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పార్వతీపురం జట్టు 18.2 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. కార్యక్రమంలో జిల్లా ఆడిట్ అధికారి కమల, రిలీఫ్ అకౌంట్స్ ఆడిట్ అధికారి హిమబిందు, మున్సిపల్ కార్పొరేషన్ అకౌంట్స్ ఆఫీసర్ కర్రి ఆదినారాయణ, జేఎన్టీయూ అకౌంట్ ఆఫీసర్ కొనపల గంగరాజు, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ సీతారామమూర్తి పాల్గొన్నారు. -
ఉద్యమబాటలో సమగ్రశిక్ష ఉద్యోగులు
విజయనగరం అర్బన్: సమగ్రశిక్ష ఉద్యోగులు ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. సమస్యల పరిష్కారంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపేందుకు ఏపీ సమగ్రశిక్ష కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 15న విజయవాడలో వినూత్నరీతిలో నిరసనలు చేపట్టనున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి విద్యాశాఖ మంత్రి లోకేశ్ నివాసం వరకు కుటుంబ సభ్యులతో కలిసి మహా పాదయాత్ర చేపడతామని ఎన్పీఆర్ భవన్లో శుక్రవారం జరిగిన సమావేశంలో జేఏసీ రాష్ట్ర చైర్మన్ బి.కాంతారావు ప్రకటించారు. న్యాయమైన డిమాండ్ల సాధనలో ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. సమగ్ర శిక్షా ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, హెచ్ఆర్పాలసీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం, వేతనాల పెంపు, ఈపీఎఫ్, ఈఎస్ఈ, గ్రాట్యుటీ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఉద్యోగ విరమ ణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలన్నా రు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఐక్యంగా పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. అనంతరం మహాపాదయాత్రకు సంబంధించిన పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామకృష్ణ, జిల్లా జేఏసీ వైస్ ప్రెసిడెంట్ తేజేశ్వరి, జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు జయగణేష్, కృష్ణమూర్తి, అశోక్, తదితరులు పాల్గొన్నారు. -
111
–8లోశనివారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026● ఉత్కంఠ రేపుతున్న ఐపీఎల్ మ్యాచ్లు ● యువతను బెట్టింగ్ ఉచ్చులోకి దించుతున్న బుకీలు ● ‘యాప్’లతో వల ● డబ్బుపోగొట్టుకుని విలవిల్లాడుతున్న బాధితులు ● ఉచ్చులో చిక్కుకోవద్దంటూ హెచ్చరిస్తున్న పోలీసులు తెలుగు తమ్ముళ్లకు దోచిపెట్టేందుకే..!వడ్డించే వాడు మనవాడైతే కడబంతిలో కూర్చున్నా మంచి భోజనం అందుతుందనే సామెత చందాన తయారైంది టీడీపీ సర్కారు తీరు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం బెట్టింగ్లకు పాల్పడినా.. ఇతరులను ప్రోత్సహించినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే నిఘా పెట్టాం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వలలో చిక్కుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దు. – ఎ.ఆర్.దామోదర్, ఎస్.వి.మాధవ్రెడ్డి, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీలువిజయనగరం/పార్వతీపురం రూరల్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ ఇటీవల ఆరంభమైంది. రెండు నెలలపాటు సాగే క్రికెట్ మ్యాచ్లు యువతలో ఉత్కంఠ రేపుతున్నాయి. మ్యాచ్లను ఆసక్తిగా తిలకిస్తూ.. తమ అభిమాన జట్టు గెలుస్తుందన్న ధీమాతో బెట్టింగ్లు కాసేందుకు కొందరు ఉత్సుకత చూపుతున్నారు. దీనినే ఆసరాగా తీసుకుని పలువురు బుకీలు రంగంలోకి దిగారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన యువతకు ఆన్లైన్, ‘యాప్’లతో వల విసురుతున్నారు. టాస్ నుంచి బంతిబంతికీ బెట్టింగ్ కట్టేలా ఉచ్చులోకి దించుతున్నారు. నిలువునా దోచుకుంటున్నారు. బెట్టింగ్ వ్యవహారం ఇప్పుడు పట్టణాల నుంచి మారుమూల పల్లెలకు పాకడం ఆందోళన కలిగిస్తోంది. ఆ మ్యాచ్లపైనే అధిక బెట్టింగ్లు ఐపీఎల్ 75 మ్యాచ్ల టోర్నీలో హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, ముంబయి జట్లపైనే అధికమంది బెట్టింగ్లు వేస్తున్నారు. బుకీలు కూడా ఇదే అదునుగా చేసుకుని క్రీడాభిమానులను ఊరిస్తున్నారు. బెట్టింగ్ కాసేవారిని ముంచేస్తున్నారు. కొన్నిసార్లు గెలిచినా డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు. అంతా అన్లైన్ కావడం, బెట్టింగ్ విషయం బయటకు తెలిస్తే ఇబ్బందులు ఎదురవుతాయన్న భావనతో చాలామంది డబ్బులు గెలిచి నష్టపోయిన సమయంలోనూ మిన్నకుండిపోతున్నారు. కొందరు బెట్టింగ్లకు ఇళ్లు, వాహనాలను, ఆభరణాలను తాకట్టుపెడుతున్నారు. అంతా గుప్చప్గా... చైన్సె, బెంగళూరు, విశాఖపట్నం నుంచి బెట్టింగ్ మాఫియా విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు వచ్చి హోటళ్లలో బస చేస్తున్నారు. బెట్టింగ్ల కోసం యువతతో పల్లెలు, వార్డుల వారీగా ప్రత్యేక టీమ్లు ఏర్పాటుచేస్తున్నారు. రూ.100కు గెలిస్తూ రూ.1000, రూ.2000 ఇస్తామని ప్రత్యేక టీమ్లతో ఊరిస్తున్నారు. వాట్సాప్, వివిధ రకాల యాప్లలో బెట్టింగ్ మాఫియాను నడుపుతూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. పోలీసులు ప్రత్యేక దృష్టిసారించినా వ్యవహారం గుప్చప్గా సాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పోలీస్ శాఖ హెచ్చరికలు ఇలా... క్రికెట్ అభిమానులు ఆటను ఆస్వాదించాలే తప్ప బెట్టింగ్లకు పోరాదు. ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్లతో జీవితాలను నాశనం చేసుకోవద్దు. బెట్టింగ్లు కాస్తున్న వారిలో యువతే అధికంగా ఉంటున్నారు. కొందరు స్వార్థపరులు, చెడు నడత కలిగిన వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్లకు తెరలేపే అవకాశం ఉంది. వారి మాటలు వినరాదు. బెట్టింగ్లో ఒకసారి ఆదాయం వచ్చినా ఎక్కువసార్లు నష్టపోవడం జరుగుతుంది. ఆ నష్టాలను భర్తీ చేసుకోవడానికి, చేసిన అప్పులను తీర్చడానికి యువత దొంగతనాలకు, ఇతర నేరాలకు పాల్పడుతూ తమ భవిష్యత్తుని అంధకారం చేసుకుంటున్నారన్నారు. బెట్టింగ్ అనేది పెనుభూతం లాంటిది. ఆశ చూపి అథ:పాతాళానికి నెట్టేస్తుంది. కుటుంబాలను రోడ్డుపాలుచేస్తుంది. కొందరి ప్రాణాలను సైతం తీస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను గమనిస్తూ ఉండాలి. బెట్టింగులకు పాల్పడుతుంటే వారికి నచ్చచెప్పి ఆ ఊబిలో నుంచి బయటకు తీసుకురావాలి. బెట్టింగ్ నిర్వాహకులపై సస్పెక్ట్ షీట్లు తెరుస్తాం. జిల్లాలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్లు జరుగుతున్నట్టు తెలిస్తే డయల్ 112/100 కు (లేదా) సంబంధిత పోలీస్ అధికారులకు కాల్చేసి సమాచారం అందించాలి. సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. అంతా ఫోన్లోనే... క్రికెట్ మ్యాచ్లను తిలకిస్తూనే బెట్టింగ్లో పాల్గొనేలా బుకీలు సెట్ చేస్తున్నారు. అంతా ఫోన్లోనే ప్రత్యేక కోడ్ భాషతో పందాలు కాయిస్తున్నాయి. ఎస్.. నో.. ఓకే..డన్..రిపీట్ వంటి పదాలు వాడుతున్నారు. యువత, ఉద్యోగులు, క్రికెట్ అభిమానులను ఊరిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. ఏ క్రికెటర్ ఎన్ని పరుగులు చేస్తారు.. ఆ ఓవర్లో ఎన్ని సిక్స్లు కొడతారు.. ఎన్ని వికెట్లు తీస్తారు.. ఎన్ని పరుగులకు జట్టు అవుట్ అవుతుందన్న అంచనాలపై బెట్టింగ్లు సాగుతున్నాయి. బంతిబంతికీ ఉత్కంఠ రేపుతూ పందెం కాయిస్తున్నారు. వాస్తవంగా టీవీల్లో మ్యాచ్లు చూసేవారికి కనీసం 10 నుంచి 30 సెకెన్ల తేడాతో లైవ్ వస్తుంది. ఒక్కో సారి రెండు బంతుల సమయం తేడా ఉంటుంది. అది తెలుసుకోకుండా బెట్టింగ్ కాసేవారి జేబులకు బుకీలు కన్నంవేస్తున్నారు. రూ.100 కడితే రూ.1000 ఇస్తామంటూ నమ్మించి పెద్ద మొత్తంలో సొమ్మును దోచుకుని నిలువునా ముంచేస్తున్నారు. విజయనగరానికి చెందిన ఓ ఆటో డ్రైవర్కు క్రికెట్ అంటే పిచ్చి. ఆ విషయాన్ని బెట్టింగ్ మాఫియా నియమించిన ఏజెంట్ గుర్తించాడు. ఆయనలో బెట్టింగ్పై ఆసక్తి రేపాడు. రూ.100 కడితే రూ.1000 ఇస్తారని నమ్మించాడు. ఆయన ఏకంగా తన అభిమాన టీమ్ గెలుస్తుందని రూ.1,50,000 బెట్టింగ్ కాశారు. టీమ్ గెలవకపోవడంతో అప్పటికప్పుడు ఆటో విక్రయించి సొమ్ముచెల్లించాడు. పార్వతీపురంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఓ యువ ఉద్యోగి క్రికెట్ అభిమాని. విషయం తెలుసుకున్న బెట్టింగ్ మాఫియా ప్రత్యేక యాప్లో వలవేసింది. బంతిబంతికీ బెట్టింగ్ కట్టేలా ఉచ్చులో దించింది. ఆయన నుంచి రూ.లక్ష వరకు లాగేసింది. పాలకొండకు చెందిన ఓ యువకుడు తన అభిమాన జట్టుపై ఆన్లైన్లో బెట్టింగ్ కాశాడు. తను పందెం కాసిన జట్టు గెలిచింది. రూ.50,000 వస్తుందని ఆశపడ్డాడు. తీరా ఆ యువకుడికి రూపాయి ఇవ్వకుండానే బుకీలు మోసం చేయడంతో తన స్నేహితుల వద్ద గగ్గోలు పెట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సాహసించలేకపోయాడు. -
దాడితల్లికి సహస్ర ఘటాభిషేకం
బొబ్బిలి: పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న దాడితల్లి అమ్మవారికి శుక్రవారం సహస్రఘటాభిషేకం నిర్వహించారు. అర్చకులు పిండిప్రో లు మణికుమార్ శర్మ ఆధ్వర్యంలో వేదపండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. స్టీల్ ప్లాంట్ భూముల పరిశీలన గుర్ల: మండలంలోని కెల్ల, వల్లాపురం, మన్యపురిపేట గ్రామాల్లో ఏర్పాటుకానున్న స్టీల్ ప్లాంట్ భూములను రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి యువరాజు, జేసీ సేతుమాధవన్, ఆర్డీఓ సుధారాణి శుక్రవారం పరిశీలించారు. స్టీల్ ప్లాంట్కు ప్రభుత్వం ఇటీవల 1085 ఎకరాలు కేటాయించిన సంగతి తేలిసిందే. భూముల వివరాలను పూర్తి స్థాయిలో అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. భూములను పరిశీలించిన వారిలో తహసీల్దార్ ఆదిలక్ష్మి, సర్వేయర్ శివ ఉన్నారు. -
విపత్తులపై అవగాహనే ప్రధానం
డెంకాడ: విపత్తుల సమయాల్లో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహనతో ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చని విపత్తు నిర్వహణ 5వ ఏపీఎస్పీ బెటాలియన్ విపత్తు ప్రతిస్పందన దళం ఇన్స్పెక్టర్ ఎస్.చంద్రశేఖర్ అన్నారు. చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడుకునే పద్ధతులను చంద్రశేఖర్ వివరించారు. 25 మంది దళం సభ్యులు తుఫాన్, వరదలు వంటి విపత్తు సమయాల్లో ఉపయోగించే వివిధ పరికరాలు, పద్ధతులను ప్రయోగాత్మకంగా వివరించారు. నదులు, సముద్రాల్లో చిక్కుకునేవారిని రక్షించే పద్ధతులను తెలియజేశారు. ఉరుములు, మెరుపులు, అగ్నిప్రమాదాలు, భూకంపాలు, రైలు ప్రమాదాల సమయాల్లో భద్రతా చర్యలను వివరించారు. కార్యక్రమంలో ఆర్ఎస్లు జి.శివప్రసాద్, కె.భాస్కరరావు, ఎన్ఎస్ఎస్ పీఓ ఎన్.షణ్ముఖరావు, జి.ఆంజనేయులు, వలంటీర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రాజధాని పేరుతో డైవర్షన్ రాజకీయం..
బొబ్బిలి: అమరావతిని రాజధానిగా చట్టబద్ధం చేశామని చెబుతున్న కూటమి నాయకులు.. మరి ఇన్నాళ్లూ ప్రజలను మోసం చేశారా అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని బొబ్బిలి, రామభద్రపురం, తెర్లాం, బాడంగి మండలాలకు చెందిన చేసిన సర్పంచ్లను శుక్రవారం స్థానిక శ్రీసూర్య రెసిడెన్సీలో ఘనంగా సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో నోటికొచ్చిన హామీలిచ్చి వేటినీ అమలు చేయలేదన్నారు. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో అమరావతికి చట్టబద్ధత అంటూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడంతో కూటమి నాయకులు ప్రజలను మభ్యపెట్టడానికి కుట్రలు పన్నుతారన్నారు. రాజధానిలో భవనాలు నిర్మించామన్నారు.. రంగులేశామన్నారు..ఇప్పుడేమో పార్లమెంట్లో చట్టబద్ధత చేశామంటున్నారని ఎద్దేవా చేశారు. రాజధానికి ఇప్పుడు చట్టబద్ధత చేశారంటే..మరి ఇన్నాళ్లూ ప్రజలను మోసం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. రాజధాని పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. మొక్కజొన్న కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రూ. 2,400 మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం మొక్కజొన్న దిగుబడిని కొనుగోలు చేయకపోవడం అన్యాయమన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మొక్కజొన్నకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల కష్టాలను తీర్చలేని దద్దమ్మలని ఎద్దేవా చేశారు. గ్యాస్ లేక మహిళలు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం ఎక్కడబడితే అక్కడ గ్యాస్ దొరుకుంతుందని చెప్పడం విచారకరమన్నారు. అలాగే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని తెలిపారు. ప్రజా సంక్షేమం లేక పల్లెలు డీలా పడ్డాయన్నారు. వీటన్నింటినీ తిప్పికొట్టాలంటే మళ్లీ వైఎస్ జగన్ మోహన్రెడ్డి హయాంలోని ప్రభుత్వం రావాలన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. ఇప్పుడు చట్టబద్ధత అంటే.. ఇన్నాళ్లూ ప్రజలను మోసం చేశారా..? ఎన్నికల హామీలు అమలు చేయని కూటమి నాయకులు జిల్లాలోని ఎమ్మెల్యేలు రైతుల కష్టాలు తీర్చలేని దద్దమ్మలు జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావుజగన్ మోహన్రెడ్డి ధైర్యశీలి.. : పరిశీలకుడు జగన్నాథంవైఎస్సార్సీపీ బొబ్బిలి పరిశీలకుడు రొంగలి జగన్నాథం మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కరోనాను ధైర్యంగా ఎదుర్కొని సమర్థ పరిపాలన సాగించిన ధైర్యశీలి జగన్ మోహన్రెడ్డి అని కొనియాడారు. సచివాలయాలు, వలంటీర్లతో గాంధీ కలలుగన్న సుపరిపాలన తీసుకువచ్చాడన్నారు. అటువంటి వ్యక్తిని మరోసారి సీఎంగా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని సర్పంచ్లను సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యుడు ఇంటి గోపాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శంబంగి వేణుగోపాలనాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎస్వీ మురళీ కృష్ణారావు, ఎంపీపీలు చొక్కాపు లక్ష్మణరావు, నర్సుపల్లి ఉమాలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యులు పెద్దింటి రామారావు, శాంతకుమారి, సరస్వతి, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు చోడిగంజి రమేష్నాయుడు, బొబ్బిలి, బాడంగి మండల పార్టీ అధ్యక్షులు తమ్మిరెడ్డి దామోదరరావు, యామలి శివప్రసాద్, సీనియర్ నాయకులు మర్రాపు జగన్నాథం, నర్పుపల్లి బాబ్జీ, తెర్లాం మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు తెంటు సత్యం నాయుడు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జి. చంద్రవదన, డబ్ల్యూవీఎల్ఎన్ రాయలు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.మీరే మళ్లీ సర్పంచ్లు: మాజీ ఎంపీ బెల్లాన మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపరిపాలనలో భాగస్వామ్యులైన సర్పంచ్లందరూ మళ్లీ ఎన్నికల్లో గెలవాలని ఆకాంక్షించారు. పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాలని మాజీ సర్పంచ్లకు సూచించారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఏమైంది..? : మాజీ ఎమ్మెల్యే శంబంగి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మాట్లాడుతూ.. నలబైభె ఏళ్ల చరిత్ర ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు.. రేపో మాపో పదవీకాలం పూర్తయ్యే సర్పంచ్లకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. కొత్తగా వచ్చిన సర్పంచ్లకు ఇవ్వాల్సిన శిక్షణను రెండు నెలల్లో పదవీ విరమణ చేసే వారికి ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. -
వైభవంగా కాశీ విశ్వేశ్వరాలయ పునఃప్రారంభోత్సవం
సంతకవిటి: మండలంలోని కొత్తూరు రామచంద్రాపురంలో పునర్నిర్మించిన కాశీ విశ్వేశ్వరాలయం పునఃప్రారంభోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా శాంతి హోమాలు, శిఖర ప్రతిష్ఠ, కళావికర్షణ, పునఃకళాకర్షణ, శాంతి కల్యాణం, విగ్రహ ఆవిష్కరణతో పాటు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం స్వామి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జెడ్పీ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహనరావు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. -
అల్యూమినియం యూనిట్ ఏర్పాటుకు స్థల పరిశీలన
పాచిపెంట: మండలంలోని పెద కంచూరు గ్రామ సమీపంలో అల్యూమినియం యూనిట్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ యువరాజ్, జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్కుమార్ రెడ్డితో కలిసి శుక్రవారం స్థల పరిశీలన చేపట్టారు. రెవెన్యూ సర్వేయర్, అటవీశాఖ అధికారులతో మాట్లాడి భూమికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అప్రోచ్ రోడ్ల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై గల అవకాశాలపై ఆరా తీశారు. వీరి వెంట పరిశ్రమల అధికారి సీతారామ్, పాచిపెంట మండల తహసీల్దార్ రవి, పరిశ్రమల ప్రోత్సాహక అధికారి బ్రహ్మాజీ, ఏపీఐఐసీ అధికారులు, సర్వేయర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
తెలుగు తమ్ముళ్లకు దోచిపెట్టేందుకే..!
విజయనగరం ఫోర్ట్: వడ్డించే వాడు మనవాడైతే కడబంతిలో కూర్చున్నా మంచి భోజనం అందుతుందనే సామెత చందాన తయారైంది టీడీపీ సర్కారు తీరు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి పోస్టుల నియామక విషయంలో టీటీపీ ప్రభుత్వం వ్యవహారించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అధికారంలోకి వస్తే లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తాం.. పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడతామంటూ ప్రస్తుత సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు ఉద్యోగాలకు ఎంపికై న వారికే ఎసరు పెట్టేవిధంగా చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. 2024 డిసెంబర్లో నోటిఫికేషన్.. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిల్లో ఖాళీల భర్తీకి సంబంధించి 2024 డిసెంబర్లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 17 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 17 జనరల్ డ్యూటీ అటెండెంట్ (జీడీఏ), స్టోర్ అటెండర్ పోస్టులు –2, ఒక ఎలక్ట్రికల్ హెల్పర్ పోస్టుకు నోటిఫికేషన్ ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో 12 పోస్టులకు కూడా 2024 డిసెంబర్లో జాయింట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టులను ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. అయితే కొద్ది రోజుల కిందట ప్రభుత్వ వైద్య కళాశాలలో 12 పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేశారు. కాని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయినా ఇంతవరకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు. దీంతో ఆయా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భర్తీ పక్రియలో తీవ్ర జాప్యం.. సర్వజన ఆస్పత్రిలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన 16 నెలల వరకు భర్తీ పక్రియ చేపట్టలేదు. ఎట్టకేలకు భర్తీ పక్రియ చేపట్టారంటే నియామక ఉత్తర్వులు (అపాయింట్మెంట్ ఆర్డర్స్) ఇవ్వకుండా జాప్యం చేయడం పట్ల ఎంపికై న అభ్యర్థులు మండిపడుతున్నారు. నోటిఫికేషన్ రద్దు చేస్తారనే గుసగుసలు.. సర్వజన ఆస్పత్రిలో పోస్టుల భర్తీకి సంబంధించి 2024లో ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేస్తారనే గుసగుసలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తే ఎంపికై న అభ్యర్థులకు అన్యాయం జరగనుంది. ఏజెన్సీకి కట్టబెట్టేందుకే.. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి పోస్టులను ఔట్పోర్సింగ్ పద్ధతిలో కాకుండా ఏజెన్సీకి కట్టబెట్టేందకు టీడీపీ సర్కార్ ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణులు వినిపిస్తున్నాయి. అందుకోసమే ఎంపికై న అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ నాయకులు నిర్వహిస్తున్న ఏజెన్సీలకు పోస్టుల భర్తీ పక్రియను అప్పజెప్పేందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నట్లు గుసుగుసలు వినిపిస్తున్నాయి. ఇలా ఏజెన్సీల ద్వారా పోస్టులు భర్తీ చేపడితే పోస్టుల కోసం పెద్ద ఎత్తున డబ్బులు దండుకోవచ్చుననే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సర్వజన ఆస్పత్రి పోస్టుల భర్తీ బాధ్యత ఏజెన్సీలకు కట్టబెట్టే యత్నం నియామక పక్రియ పూర్తయినా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వని వైనం నోటిఫికేషన్ రద్దు చేస్తారనే గుసగుసలు ఆందోళనలో ఎంపికై న అభ్యర్థులు వైద్య కళాశాల పోస్టులకు ఎంపికై న వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేతఆర్డర్స్ ఇవ్వొద్దనే ఆదేశాలు వచ్చాయి.. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి పోస్టులకు ఎంపికై న వారికి ప్లేస్మెంట్ ఇంటిమేషన్ ఆర్డర్స్ వచ్చేవరకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వొద్దని ఆప్కోస్ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. అందుకే ఆర్డర్లు ఇవ్వలేదు. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటిండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
మామిడి చెట్ల నరికివేతపై దర్యాప్తు
సంతకవిటి: మండలంలోని పుల్లిట గ్రామానికి చెందిన పిన్నింటి స్వప్న మామిడితోటలో చెట్ల నరికివేతపై చీపురుపల్లి డీఎస్పీ ఎస్. రాఘవులు శుక్రవారం దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు డీఎస్పీ,తదితరులు తోటను పరిశీలించి, చెట్ల నరికివేతపై ఆరా తీశారు. ఆయనతో పాటు రాజాం టౌన్ సీఐ, ఎస్సై ఆర్.గోపాలరావు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. క్లూస్టీమ్ పరిశీలన సీతంపేట: మండల పరిధిలోని వేంకటేశ్వర ఆలయం పక్కన జల్జీవన్ మిషన్ పైపులు గురువారం దగ్ధం కావడంతో క్లూస్ టీమ్ సభ్యులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారని ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. పిచ్చికుక్క స్వైర విహారం ● ముగ్గురికి గాయాలు పార్వతీపురం రూరల్: గరుగుబిల్లి మండలంలోని నాగురు గ్రామంలో శుక్రవారం ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసి ముగ్గురిని గాయపరిచింది. గుడ్ఫ్రైడే ప్రార్థనల నేపథ్యంలో తల్లిదండ్రులతో కలిసి స్థానిక చర్చికి వచ్చిన రెండేళ్ల మండంగి లిఖిత అనే చిన్నారి బయట ఆడుకుంటుండగా, కుక్క ఒక్కసారిగా ఆమె తలపై తీవ్రంగా గాయపరిచింది. చిన్నారిని కాపాడే ప్రయత్నంలో చింతల అప్పలనాయుడు, అక్కేన చంద్రశేఖర నాయుడు (చినబాబు) కూడా కుక్క కాటుకు బలయ్యారు. అనంతరం వీధుల్లోకి పరుగు తీసిన ఆ శునకం అక్కేన సింహచలం సహా మరొకరికి చెందిన దూడలను గాయపరిచింది. క్షతగాత్రులు జిల్లా కేంద్రాస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 50 కిలోల గంజాయితో ముగ్గురి అరెస్ట్ లక్కవరపుకోట: అరకు – విశాఖ జాతీయ రహదారిపై రంగరాయపురం జంక్షన్ సమీపంలో కారులో గంజాయి తరలిస్తున్న ముగ్గురిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. స్థానికులు, టాస్క్ఫోర్స్ పోలీసులు తెలియజేసిన వివరాల మేరకు.. ఒడిశా ప్రాంతానికి చెందిన ఇద్దరు.. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఒకరు 50 కిలోల గంజాయిని తరలిస్తున్నారు. ఒకరు ద్విచక్ర వాహనంపై ముందు వెళ్తుండగా.. కారులో ఉన్న వారు గంజాయితో వెనుక వెళ్తున్నారు. అయితే టాస్క్ఫోర్స్ పోలీసులు రంగరాయపురం జంక్షన్ వద్ద తనిఖీలు చేపట్టి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని.. కారు, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. గంజాయిని ఎక్కడ నుంచి తీసుకువస్తున్నారు.. ఎక్కడకు తరలిస్తున్నారు..అన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మోసగాడి అరెస్ట్ విజయనగరం క్రైమ్: ఆన్లైన్ ద్వారా మోసాలకు పాల్పడే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విజయనగరం ఉడా కాలనీకి చెందిన దాసరి ఉత్తేజ్ ఆర్సీ 200 మోడల్ ద్విచక్ర వాహనాన్ని ఓఎల్ఎక్స్లో చూసి గుర్తు తెలియని వ్యక్తి ఖాతాలో రూ. 60 వేలు జమ చేసి మోసపోయాడని తెలిపారు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా గురుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన సాయిరామ్ అనే వ్యక్తి కూడా ఓఎల్ఎక్స్లో పల్సర్ 150 సీసీ వాహనాన్ని చూసి గుర్తు తెలియని వ్యక్తికి రూ. 75 వేలు పంపించి మోసపోయాడని చెప్పారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాంకేతిక ఆధారాలతో నిందితుడు చల్లా శంకర్ను వన్టౌన్ సీఐ ఆర్వీఆర్కే చౌదరి అరెస్ట్ చేశారన్నారు. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం సీవీ కండ్రిగకు చెందిన నిందితుడిపై ఇప్పటికే తిరుపతి జిల్లా వెంకటగిరి పోలీస్స్టేషన్ పరిధిలో ఒక హత్య.. కృష్ణా జిల్లా పెనములూరు పీఎస్ పరిధిలో ఇంటి దొంగతనం కేసు నమోదైందని తెలిపారు. -
పీహెచ్ఛీ..!
● వేపాడ పీహెచ్సీలో ఫిబ్రవరి నెలలో 28 రోజులకు 1400 మందికి సేవలు అందించాల్సి ఉంది. ఇక్కడ 504 మందికి మాత్రమే వైద్యులు ఓపీ సేవలందించారు. లక్ష్యం ఆమడ దూరంలో ఉండిపోయింది. ● కోరపుకొత్తవలస పీహెచ్సీలో ఫిబ్రవరి నెల 28 రోజులకు ఓపీ 1400 నమోదుకావాలి. ఇక్కడ కేవలం 345 ఓపీ నమోదైంది. వైద్యసేవల కోసం ఆస్పత్రికి వచ్చేవారి సంఖ్య అమాంతం పడిపోయింది. ● గంట్యాడ పీహెచ్సీలో 1400 మందికి ఓపీ సేవలు అందించాల్సి ఉండగా కేవలం 668 మందికి మాత్రమే అందించారు. ఇక్కడ కూడా లక్ష్యం నెరవేరని పరిస్థితి. ఆస్పత్రికి వస్తే మెరుగైన వైద్యసేవలు అందుతాయోలేదోనన్న బెంగతో అధికమంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నట్టు మండల వాసులు చెబుతున్నారు. 24 గంటలూ సేవలందించాల్సి ఉన్నా... జిల్లాలో 48 పీహెచ్సీలు, 18 పట్టణ పీహెచ్సీలు ఉన్నాయి. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మినహా మిగిలిన పీహెచ్సీల్లో 24 గంటలపాటు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి. సాధారణ సేవలతో పాటు ప్రసవ సేవలు అందించాలి. ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు స్టాఫ్నర్సులు, ఎఫ్ఎన్ఓ, ఇతర సిబ్బంది సేవలందిస్తారు. కొన్నిచోట్ల నిపుణులైన వైద్యులు ఉన్నా సౌకర్యాలు లేకపోవడం, మరికొన్ని చోట్ల విధులకు సిబ్బంది డుమ్మా కొట్టడం వంటివి వైద్యసేవలపై ప్రభావం చూపుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కొంతమంది వైద్యులు ఆస్పత్రుల నుంచి వెళ్లి పోతున్నారని రోగులు చెబుతున్నారు. రాత్రివేళల్లో కొన్ని పీహెచ్సీల్లో ఎఫ్ఎన్ఓలను ఉంచి వైద్య సిబ్బంది ఇంటికి వెళ్లి పోతున్నారు. దీనివల్ల అత్యవసర వేళ ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య వైద్యకేంద్రాలకు సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విఫలం ప్రభుత్వ వైద్యంపై సన్నగిల్లుతోన్న నమ్మకం తగ్గుతున్న ఓపీ నమోదు అధికమంది ప్రైవేటు ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్న వైనం -
జల్జీవన్ పైపులు దగ్ధం
సీతంపేట: స్థానిక శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం పక్కన పడి ఉన్న జల్జీవన్ మిషన్ పైపులు దగ్ధమయ్యాయి. ఇంటింటికి కుళాయి కనెక్షన్లు వేయడానికి సంబంధిత కాంట్రాక్టర్ 37 కిలోమీటర్ల పొడవు గల పైపులు గత కొన్ని సంవత్సరాలుగా టీటీడీ ఆలయానికి కొద్ది దూరంలో ఉంచేశారు. గురువారం అకస్మాతుగా మంటలు వ్యాపించడంతో స్థానికులు అగ్నిమాపక కార్యాలయానికి ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక శాఖాధికారి జామి సర్వేశ్వరరావు అగ్నిమాపక శకటంతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంపై ఆరా తీశారు. గవరమ్మపేటలో గజరాజులు జియ్యమ్మవలస: మండలంలోని గవరమ్మపేట, రామినాయుడువలస పంట పొలాల్లో గజరాజులు గురువారం దర్శనమిచ్చాయి. ఉదయం గవరమ్మపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న గజరాజులు మధ్యాహ్నానానికి రామినాయుడువలస, పెదమేరంగి చెరువులోకి చేరుకున్నాయి. రాత్రి సమయంలో గ్రామంలోకి చొచ్చుకువస్తాయని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రబీ వరి పంట పొట్ట దశలో ఉండడంతో పంటలను పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెల్ప్ డెస్క్ను ప్రారంభించిన ఎస్పీ గుర్ల: స్థానిక పోలీస్స్టేషన్లో నిర్మించిన ఉమెన్ హెల్ప్ డెస్క్, పార్కింగ్ షెడ్, ఫిర్యాదుదారులు వేచి ఉండే గదిని ఎస్పీ దామోదర్ గురువారం ప్రారంభించారు. పోలీస్స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులపై దురుసుగా ప్రవర్తించవద్దని సూచించారు. మహిళల కోసం ప్రత్యేకంగా గదిని నిర్మించడంతో సంతోషం వ్యక్తం చేశారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డీఎస్పీ రాఘవులు, సీఐ శంకరరావు, ఎస్ఐ నారాయణరావు పాల్గొన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం మెంటాడ: మండలంలోని మెంటాడ గ్రామంలో మండలవారి వీధిలో మండల సత్యవతి పెంకుటిల్లు గురువారం దగ్ధమైంది. సత్యవతి ఇంట్లో నుంచి పొగలు రావడం గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడం వలన ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. పెంకుటిల్లు కావడంతో కలపకు మంటలు అంటుకొని భారీగా మంటలు చెలరేగి కాలిపోయింది. ప్రమాదంలో తమ రేషన్ కార్డు, ఆధార్ కార్డులు, బట్టలు, నిత్యావసర సరుకులతో పాటు రూ.76 వేల నగదు, మూడు తులాల బంగారు ఆభరణాలు పూర్తిగా కాలిపోయాయని బాధితురాలు సత్యవతి తెలిపారు. విజయనగరం అర్బన్: డీఎల్ఎడ్ కోర్సులకు సంబంధించిన పరీక్ష ఫీజుల చెల్లింపుల షెడ్యూల్ను డీఈఓ యు.మాణిక్యంనాయుడు గురువారం విడుదల చేశారు. 2024 – 26 బ్యాచ్తో పాటు ఒకసారి ఫెయిల్ అయిన 2022 – 24, 2023 – 25 బ్యాచ్ల విద్యార్థులకు ఈ షెడ్యూల్ వర్తిస్తుంది. పరీక్ష ఫీజులను నిర్ణీత గడువులోపు ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లింపులు వెబ్సైట్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. ఫీజు చెల్లింపునకు రూ.50 అపరాధ రుసుంతో ఈ నెల 5వ తేదీ వరకు విద్యార్థులకు అవకాశం ఉంది. అదే ప్రిన్సిపాల్ ద్వారా చెల్లించవలసిన వారికి మాత్రం ఈ నెల 9వ తేదీ వరకు గడువు ఉంది. విద్యార్థులు ముందుగా ఫీజులను ఆన్లైన్ పేమెంట్ గేట్వే ద్వారా చెల్లించి, అనంతరం అవసరమైన వివరాలను సంబంధిత కళాశాలలకు సమర్పించాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజులు నాలుగు సబ్జెక్టులకు రూ.250, మూడు సబ్జెక్టులకు రూ.175, రెండు సబ్జెక్టులకు రూ.150, ఒక సబ్జెక్టుకు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. -
● గ్యాస్ కోసం పడిగాపులు
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని బైపాస్ కాలనీలో భారత్ గ్యాస్ వినియోగదారులు సిలిండర్ల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. స్థానిక భారత్ పెట్రోల్ బంకు వద్ద ఉదయం 11 గంటల నుంచే వినియోగదారులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. సాయంత్రం వరకు వాహనం రాకపోవడంతో ఎండలోనే పడిగాపులు కాశారు. చివరకు సాయంత్రం వేళ సాలూరు నుంచి ఒక బొలెరో, ఆటోలో అరకొరగా సిలిండర్లు చేరుకున్నాయి. వినియోగదారులు ఒక్కసారిగా ఎగబడటంతో పోలీసులు రంగప్రవేశం చేసి పంపిణీని క్రమబద్ధీకరించారు. భారీ క్యూ ఉండటం, స్టాక్ తక్కువగా రావడంతో తమ వరకు గ్యాస్ అందుతుందో లేదోనని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. -
సుస్థిర ఆర్థికాభివృద్ధే లక్ష్యం
ఐటీడీఏ ఏపీఓ పి.మురళీధర్, డీఆర్డీఏ ఏపీడీ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. 5న రోడ్లు, భవనాల శాఖామంత్రి పర్యటన రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖామంత్రి బీసీ జనార్దన్రెడ్డి ఈ నెల 5న జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు మంత్రి పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. 5న జగ్జీవన్రామ్ జయంతి మాజీ ఉప ప్రధాని, స్వాంత్య్ర సమరయోథుడు డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ 119వ జయంతిని ఈ నెల 5న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్టు కలెక్ట ర్ తెలిపారు. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పార్వతీపురం మెయిన్ రోడ్డులోని సౌందర్య థియేటర్ వద్ద ఉన్న బాబూ జగ్జీవన్రామ్ విగ్ర హానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తామన్నారు. పార్వతీపురం: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, సుస్థిర ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి సూచించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డీఆర్డీఏ– వెలుగు అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది కాలంలో సాధించిన లక్ష్యాలు, ఎదురైన సవాళ్లు, క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను విశ్లేషించి తదుపరి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ప్రతీ మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని అక్కడ ఉన్న వ్యాపార అవకాశాలు, ప్రజల నైపుణ్యా లు తదితర అంశాలపై సమగ్ర విశ్లేషణ చేయాలన్నా రు. రుణాల మంజూరు, ఉపాధి కల్పనలో కేవలం మహిళలకే కాకుండా పురుషులకు సైతం అవకాశా లు కల్పిస్తూ సమగ్రమైన డేటాను సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో సబ్కలెక్టర్ ఆర్.వైశాలి, -
పుట్టెడు దుఃఖంతో పరీక్షకు..
జామి: తల్లి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉంటూ పదో తరగతి పరీక్షలకు హాజరు కావాల్సి వచ్చింది ఓ విద్యార్థికి. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని భీమసింగి పంచాయతీ పీతలపాలెం గ్రామానికి చెందిన బొట్ట వెంకటేష్ జామి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం రాత్రి వెంకటేష్ తల్లి దేముడమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఏం చేయాలో తెలియని పుట్టెడు దుఃఖంలో కూడా వెంకటేష్ గురువారం జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు హాజరయ్యాడు. -
● గ్యాస్ కష్టాలు
పశ్చిమాసియాలో యుద్ధవాతావరణం వల్ల జిల్లాలో గ్యాస్ వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. సిలిండర్ బుక్ చేసినా సకాలంలో అందడం లేదు. ఫలితం... గ్యాస్ గొడౌన్లు, ఆఫీస్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. గ్యాస్ లారీ వచ్చిన వెంటనే క్యూ కడుతున్నారు. గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. సిలిండర్ ఇచ్చాక నెత్తిన, బైక్లపై అష్టకష్టాలు పడుతూ ఇంటికి చేర్చుతున్నారు. దీనికి విజయనగరంలోని చింతలవలస గ్యాస్ గౌడౌన్ వద్ద గురువారం కనిపించిన ఈ చిత్రాలే నిలువెత్తు సాక్ష్యం. గ్యాస్ కష్టాలు లేవంటూ పాలకులు చెబుతున్న మాటలు ఉత్తుత్తివే అనేందుకు వినియోగదారుల పాట్లే నిదర్శనం. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం తప్పని ఇక్కట్లు భుజాన సిలిండర్తో..చిన్నారికీ తప్పని సిలిండర్ కష్టాలు -
ఫలితాలివ్వని పీ–4
విజయనగరం అర్బన్: పేద కుటుంబాల జీవన ప్రమాణాల మెరుగుకు దాతల నుంచి నేరుగా సహకారం అందించి పేదరికాన్ని నిర్మూలిస్తామని ప్రకటించి అమలు చేస్తున్న పీ 4 (జీరో పావర్టీ) కార్యక్రమం ఫలితాలు క్షేత్ర స్థాయిలో భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వం చూపుతున్న దిశ, వాస్తవ ఫలితాలు మధ్య భారీ అంతరం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పీ 4 ద్వారా వచ్చిన దాతల ఆర్థిక సహాయాన్ని వినియోగిస్తూ పథకం లక్ష్యాన్ని దారి మళ్లిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన పీ 4 వార్షికోత్సవంలో అలాంటి దాతలను ఉత్తమ మార్గదర్శకులుగా మంత్రి వంగలపూడి అనిత ప్రశంసించి సత్కరించడం కనిపించింది. జిల్లా, నియోజకవర్గ స్థాయి అవార్డుల వివరాలు చూస్తే ఈ కార్యక్రమం ప్రధానంగా విరాళాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంపై ఆధారపడుతున్నదన్న విషయం స్పష్టమవుతోంది. స్వచ్ఛంద సంస్థ విరాళాలే అధికం గజపతినగరం నియోజకవర్గంలో రౌండ్ టేబుల్ ఇండియా ఫౌండేషన్ రూ.71.61 లక్షలతో పాఠశాల, ఆస్పత్రికి సదుపాయాలు కల్పించగా, మరో సంస్థ రూ.39.10 లక్షలతో మార్కెట్, పాఠశాలలు, గ్రామాలకు సహాయం చేసింది. ఐడీబీఐ బ్యాంక్ రూ.12.64 లక్షలు, పుష్పగిరి ఫౌండేషన్ రూ.4లక్షలతో సేవలు అందించాయి. ఇవి చూస్తే ప్రభుత్వం బాధ్యతగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు దాతల ఆర్థిక సహాయాన్ని వినియోగించి పేదరిక నిర్మూలన లక్ష్యాన్ని పక్కన పెట్టిందని విశ్లేషకులు ఆక్షేపిస్తున్నారు. లక్ష్యానికి తగ్గ విస్తృతి లేకపోవడం పీ–4 లక్ష్యం రాష్ట్ర వ్యాప్తంగా పేదరిక నిర్మూలనే అయినప్పటికీ అమలు మాత్రం కొన్ని నియోజనవర్గాలు, కొన్ని సంస్థలకే పరిమితమవుతోంది. జిల్లాలో 82,426 బంగారు కుటుంబాలను గుర్తించగా కేవలం 19,410 కుటుంబాలు మాత్రమే దత్తత పొందాయి. అంటే దాదాపు 75 శాతం కుటుంబాలు ఇంకా సహాయానికి దూరంగానే ఉన్నాయి. వీళ్లలో కొంతమంది 27 గ్రామాలను దత్తత తీసుకున్నట్టు ప్రకటించినా వాటి సహాయ కార్యక్రమాలు ఆయా గ్రామాలకు అంతంత మాత్రంగానే ఉన్నాయి. జిల్లాలో లక్షలాది మంది పేదలు ఉన్న నేపథ్యంలో లక్షల్లో విరాళాలు ఇవ్వడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. పైగా 2,897 మార్గదర్శులు మాత్రమే ముందుకు రావడం, కార్యక్రమంపై దాతలకు నమ్మకం లేదనే విషయం స్పష్టమవుతోంది. పీ–4తో బాధ్యతల నుంచి దూరంగా ప్రభుత్వం లక్షల్లో బంగారు కుటుంబాలు.. ప్రకటించింది 82,426 27 గ్రామాలను దత్తత తీసుకున్నా.. కనిపించని సహాయక పనులుప్రభుత్వ పాత్రపై ప్రశ్నలు – ప్రచారం – వాస్తవం పీ–4లో ప్రభుత్వం మార్గదర్శక పాత్రలో మాత్రమే ఉండి అమలు బాధ్యతను స్వచ్ఛంద సంస్థలు, దాతలపై మళ్లిస్తున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పేదరిక నిర్మూలన వంటి కీలక అంశంలో ప్రభుత్వ ప్రత్యక్ష పెట్టుబడి పర్యవేక్షణ లేకపోవడం మేధావుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేస్తున్నప్పటికీ అందులో భాగంగా అందిస్తున్న సహాయం పరిమిత స్థాయిలోనే ఉండటమే కాకుండా పేదరిక నిర్మూలనకు వినియోగించడం లేదని విమర్శలు వస్తున్నాయి. చివరకు ఇది ఒక ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోయేలా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
122 మందితో.. ప్రత్యేక పాలన
వీరఘట్టం: పంచాయతీ సర్పంచ్ల పాలన గురువారంతో ముగిసింది. 2021 ఏప్రిల్ 3న ప్రారంభమైన సర్పంచ్ల పాలనకు ఐదేళ్లు పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా 451 మంది సర్పంచ్లు పదవీ విరమణ పొందారు. దీంతో ఆయా పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ కలెక్టర్ ప్రభాకరరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 15 మండలా ల్లోని 451 పంచాయతీలకు 122 మంది ప్రత్యేకాధికారులను నియమించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొ న్నా రు. అయితే, ఇప్పటికే పనిభారంతో సతమతమవుతుంటే పంచాయతీలకు ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ తమపై అదనపు భారం వేయడం తగదంటూ కొందరు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక పాలనలో ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని భయపడుతున్నారు. అదనపు భారం జిల్లాలో ఉన్న 451 పంచాయతీలకు మండల స్థాయిలోని రెవెన్యూ, విద్య, ఐసీడీఎస్, మండల పరిషత్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, హార్టికల్చరల్, వ్యవసాయశాఖలలో పనిచేస్తు న్న 122 మందిని ప్రత్యేకాధికారులుగా నియమించారు. వీరిలో ఒక్కొక్కరికి కనీసం 2 నుంచి అత్యధికంగా 6 పంచాయతీల బాధ్యతలను అప్పగించారు. తమ సొంత శాఖలలోనే పనుల ను సకాంలో పూర్తిచేయలేక సతమతమవుతుంటే పుండుమీద కారం చల్లినట్లు పంచాయతీలకు తమను ప్రత్యేకాధికారులుగా నియమించడం తగదని, ఈ పాలనలో ఇంకా ఎన్ని ఇబ్బందులు పడాలో తెలియడంలేదంటూ కొందరు అధికారు లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జోరుగా పైరవీలు.... జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుండి ప్రత్యేక పాలన ప్రారంభం కానుండడంతో తమకు అనుకూలంగా ఉన్న అధికారులను తమ పంచాయతీలకు ప్రత్యేకాధికారులుగా నియమించుకునేందుకు జోరుగా రాజ కీయ పైరవీలు జరిగినట్టు సమాచారం. మండల స్థాయి నుంచి వచ్చిన అధికారుల జాబితాలను జిల్లా కార్యాలయంలో పరిశీలించి రాజకీయ నాయకులు సూచించిన వారికి తమకు అనుకూలంగా ఉన్న పంచాయతీల్లో ప్రత్యేకాధికారులుగా నియ మించారనే ఆరోపణలు ఉన్నాయి. -
‘సీతం’లో పాలిసెట్ ఉచిత శిక్షణ
విజయనగరం అర్బన్: గాజులరేగ పరిధిలోని సీతం కళాశాలలో పాలిసెట్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత శిక్షణను ప్రారంభిస్తున్నట్టు సత్య విద్యా సంస్థల కరెస్పాండెంట్, మాజీ ఎంపీ డాక్టర్ బొత్స ఝాన్సీలక్ష్మి అన్నారు. ఈ నెల 4 నుంచి 24వ తేదీ వరకు ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. ఇటీవల 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్ధులకు ఈ కోచింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఉచిత కోచింగ్తో పాటు స్టడీ మెటీరియల్స్, బాలురు, బాలికలకు హాస్టల్ సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి రోజూ ప్రాక్టీస్ టెస్ట్ల ద్వారా విద్యార్థులకు మెరుగైన సన్నద్దత కల్పించనున్నట్లు చెప్పారు. అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో శిక్షణ అందిస్తామని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పాలిసెట్ కోచింగ్కు సంబంధించిన బ్రోచర్ను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం 9533545689, 7989040214 నంబర్లను సంప్రదించాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామమూర్తి సూచించారు. -
రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని మృతదేహం
విజయనగరం క్రైమ్ : ఎల్.కోట – మళ్లివీడు రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని మృతదేహాన్ని జీఆర్పీ పోలీసులు గురువారం గుర్తించారు. దీనికి సంబంధించి జీఆర్పీ హెచ్సీ ప్రసాద్ ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. సుమారు 50 నుంచీ 55ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి మృతదేహాన్ని మళ్లివీడు రైల్వేస్టేషన్ వద్ద గుర్తించామన్నారు. సదరు మృతదేహం సుమారు 5 అడుగుల 6 అంగుళాల పొడవు, చామన ఛాయ రంగుతో ఉందన్నారు. సదరు మృతదేహంపై లేత వైలెట్ రంగు ఫుల్ హాండ్స్ షర్టు, కాఖీ కలర్ ప్యాంటు ధరించి ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఆచూకీ తెలిస్తే 9247585742, 9440170317 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
నిప్పుల కొలిమి
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడం.. వేడి గాల్పులు తోడు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలో గురువారం అత్యధికంగా మక్కువ మండలంలో 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన మండలాల్లోనూ 38 నుంచి 39.8 డిగ్రీ ల వరకూ నమోదయ్యింది. ఎండ, గాల్పుల తీవ్రత రానున్న రెండు రోజులూ ఉంటుందని విపత్తుల, వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నా యి. జిల్లాలోని 11 మండలాల్లో శుక్రవారం తీవ్రమైన వడగాలులు ఉంటాయని అంచనా. 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చ ని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారు లు కోరారు. కురుపాం: మండలంలోని పూతికవలస గ్రామ సమీపంలో గురువారం సాయంత్రం ఏనుగుల గుంపు సంచరించింది. పామాయిల్, చెరకు, అరటి, కర్బుజా తోటల్లో ఏనుగులు సంచరిస్తుండడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఏనుగులను కవ్వించవద్దని, అవసరమైతే పొలాలకు రైతులు గుంపుగా వెళ్లాలని అటవీశాఖ అధికారులు తెలిపారు. పాలకొండ రూరల్: సనాతన హైందవ ధర్మం ఎంతో గొప్పదని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 8వ తరం కుటుంబీకుడు వీరభద్రస్వామి అన్నారు. గురువారం రాత్రి పాలకొండ వచ్చిన ఆయన తొలుత ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం కోటదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు లక్ష్మీప్రసాద్ శర్మ ఆమ్మవారి చరిత్రను ఆయనకు వివరించారు. అనంతరం కోమటిపేటలో స్వయంభూగా కొలువుదీరిన సనారీ విశ్వేశ్వర అన్నపూర్ణమాంబ స్వామి మఠాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు జరిపారు. వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రబోధించిన కాలజ్ఞాన విశిష్టతను వివరించారు. యేసు క్రీస్తు త్యాగం విశ్వశాంతికి చిహ్నం విజయనగరం: యేసు క్రీస్తు ప్రాణత్యాగం విశ్వశాంతికి చిహ్నమని, సర్వ మానవాళి పాప విమో చనం కోసం తన ప్రాణాల ను బలిదానంగా అర్పించి న కరుణామయుడు యేసు అని ఉమ్మడి విజయనగరం జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పేర్కొన్నారు. క్రీస్తు ఆరాధకుల కు గుడ్ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు చూపిన త్యాగం, క్షమాగుణం, సహనం, నిస్వార్థ ప్రేమ ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమ ని కొనియాడారు. శత్రువులను సైతం ప్రేమించాలని, పీడిత ప్రజల పట్ల కరుణ చూపాలనే క్రీస్తు బోధించిన సందేశం, ఆచరించిన జీవితం విశ్వమానవాళికి మార్గదర్శకమని పేర్కొన్నా రు. సమాజంలో కూడా అటువంటి శాంతి, సోదరభావం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. క్రీస్తు చూపిన సేవా మార్గంలోనే ప్రస్తుత ప్రభుత్వాలు కూడా నిరుపేదల సంక్షేమంకోసం కృషిచేయాలన్నారు. ప్రజలందరిపైనా క్రీస్తు దీవెనలు ఉండాలన్నారు. గజపతినగరం: విధుల్లో అలసత్వం వహించిన ఉద్యోగులపై చర్యలు తప్పవని కలెక్టర్ ఎస్. రాంసుందర్రెడ్డి హెచ్చరించారు. గజపతినగరం–2 గ్రామ సచివాలయాన్ని, పురిటి పెంట –1 అంగన్వాడీ సెంటర్ను ఆయన గురువా రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బందితో మాట్లాడారు. సేవలపై ఆరా తీశా రు. అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్త పి.సత్య వతి విధుల్లో లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనికి బాధ్యులుగా సీడీపీఓ, సూపర్ వైజర్కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఐసీడీఎస్ పీడీను ఆదేశించారు. అనంతరం చిన్నారులతో ముచ్చటించారు. -
అయినవారికే ఉపాధి
శుక్రవారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సాక్షి, పార్వతీపురం మన్యం: గ్రామాల్లో పంచాయతీ సర్పంచ్ల పదవీ కాలం ముగిసిపోయింది. మరోవైపు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పాత ఉపాధిహామీ పథకం స్థానంలో కొత్త చట్టం (వీబీజీ రామ్జీ)రానుందని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు, వాటికి సంబంధించిన బిల్లులు చాలా వరకు పెండింగ్లో ఉండిపో యాయి. ఈ నేపథ్యంలో మరోనెల వరకు గడువు పొడిగించారు. పదవీకాలం ముగియడం.. 2025– 26లో చేపట్టిన పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అధిక శాతం పంచాయతీల్లో సర్పంచ్లే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తారు. ఇప్పుడు వారిలో ఆందోళన నెలకొంది. ఇదే సమయంలో గోకులం షెడ్లకు బిల్లులు మంజూరయ్యాయి. ఈ షెడ్ల పనులన్నీ దాదాపు టీడీపీకి చెందిన వారే చేయించడం గమనార్హం. ఉపాధి పనులు చేసిన వేతనదారులకు సైతం బకాయిలు రూ.కోట్లలో చెల్లించాల్సి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా పనులు మరోవైపు ఆర్థిక సంవత్సరం ముగుస్తుందని, చట్టంలో మార్పుల వల్ల నిధులు మురిగిపోతాయన్న ఉద్దేశంతో హడావిడిగా ఉపాధిహామీ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో చేపట్టిన పనులపై పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో జరిగిన ఉపాధి పనుల్లో దాదాపు రూ.120 కోట్ల మేర రహదారుల పనులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని, ప్రజాధనం దుర్వినియోగమైనా పట్టించుకోవడం లేదని సీపీఎం నాయకులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో మంజూరైన ఉపాధిహామీ నిధులతో బీటీ రోడ్లకు సుమారు రూ.70 కోట్లు, సీసీ రహదారులకు సుమారు రూ.50 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనుల్లో నిబంధనలకు విరుద్ధంగా అధికార యంత్రాంగం పనులు చేయించినట్లు ఆరోపణలున్నాయి. టెండర్ ప్రక్రియ ద్వారా జరిపించాల్సి ఉన్నప్పటికీ.. జిల్లా అంతా నామినేషన్ ద్వారా కూటమి ప్రభుత్వం తన అనుయాయులకు కట్టబెట్టింది. ●మక్కువ మండలం వెంకట భైరిపురం నుంచి తూరుమామిడి వరకు సుమారు రూ.3.60 కోట్లతో బీటీ రోడ్డు మంజూరైతే.. వాటిని ఏడు ముక్కలుగా విడగొట్టి, నామినేషన్ పద్ధతిలో ఇచ్చారు. అర్హత లేని వారికి పనులు అప్పగిస్తుండడంతో పూర్తిస్థాయి లో జరగడం లేదు సరికదా.. నాణ్యత కూడా ఉండడం లేదు. ●జియ్యమ్మవలస మండలంలో టెండర్ ఆధారంగా పనులు జరిపించాలని పట్టుబడితే.. జిల్లా స్థా యి అధికారి ఒకరు కూటమి నాయకులను కూర్చోబెట్టి, పరిష్కారం చేసినట్లు ఆరోపణలొచ్చాయి. మరోవైపు అధికార పార్టీ నాయకులు తమ అనుచరులు ఉన్న గ్రామాలకే కోట్లాది రూపాయల పనులు కేటాయించారు. ●సాలూరు మండలం కూర్మరాజుపేటకు సుమా రు రూ.కోటి వ్యయంతో సీసీ రోడ్డు మంజూరు చేశారు. మక్కువ మండలం కాశీపట్నంకు దాదాపు రూ.1.30 కోట్లు నిధులు మంజూరు చేశారు. పనుల కేటాయింపుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. -
వ్యక్తిపై కేసు నమోదు
వేపాడ: మండలంలోని శింగరాయి గ్రామానికి చెందిన గొల్ల సాయికుమార్పై అదే గ్రామానికి చెందిన కొరువాడ లక్ష్మణ్ సెలూన్ షాపులో ఉన్న కత్తితో దాడి చేయడంపై వల్లంపూడి ఎస్ఐ ఎస్.సుదర్శన్ కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి వల్లంపూడి పోలీసులు అందించిన వివరాలు.. శింగరాయి గ్రామానికి చెందిన కొరువాడ లక్ష్మణ వేపాడలో సెలూన్ షాపు నడుపుతున్నాడు. అదే గ్రామానికి చెందిన గొల్ల సాయికుమార్, లక్ష్మణ్ గతంలో అండమాన్లో బాగానే ఉండేవారు. లక్ష్మణ్ కాస్త డబ్బులు సంపాదించి సాయికుమార్కు చెప్పకుండా శింగరాయి వచ్చేసి వేపాడలో రెండు నెలల కిందట సెలూన్ షాపు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఏప్రిల్ ఒకటో తేదీ మధ్యాహ్నం వేపాడలో సెలూన్ షాపు నడుపుతున్న లక్ష్మణ్ వద్దకు సాయికుమార్ వచ్చి అండమాన్లో ఉన్నప్పుడు లక్ష్మణ్ కోసం ఖర్చు చేసిన సొమ్ము ఇమ్మని అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో లక్ష్మణ్ తన షాపులో ఉన్న షేవింగ్ కత్తితో సాయి మెడపై గాయపర్చినట్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. గాయపడిన సాయికుమార్ను 108లో ఎస్.కోట తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం తరలించారు. దీనిపై విజయనగరం ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ ఎం.వీరాకుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. వీఆర్ఓ కొండమ్మ, సిబ్బంది ఉన్నారు. -
మామిడి చెట్లు నరికివేత
సంతకవిటి: అనుమానమే పెనుభూతమై మామిడి చెట్లు నరికివేతకు దారితీసిన పరిస్థితి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మామిడిపల్లి గ్రామానికి చెందిన సవలాపురపు జోగులు(65) ఇటీవల కాలిన గాయాలతో మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. జోగులు మృతి విషయంలో ఆయన పొలం పక్కన ఉన్న మామిడి తోట యజమాని.. పుల్లిట గ్రామానికి చెందిన వ్యక్తే కారణమని భావించి మామిడి తోటను మృతుడు కుటుంబీకులు కొందరు నరికేసినట్టు తోట యజమాని భార్య పిన్నింటి స్వప్న బుధవారం రాత్రి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ఆర్.గోపాలరావు తెలిపారు. ఇదిలా ఉండగా పుల్లిటలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
సిబ్బంది క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లాలి
● ఉపాధిలో సమయపాలన పాటించేలా చూడాలి ● ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి ● డ్వామా పీడీ రామచంద్రరావుసీతానగరం: ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రాంతాల్లో సాంకేతిక సహాయకులు తరచూ క్షేత్ర స్థాయిలో సందర్శించాలని, వేతనదారులు చేస్తున్న పనులు పరిశీలించి నివేదికలు తయారు చేయాలని డ్వామా పీడీ కె.రామచంద్రరావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఎంఎల్ఎన్ ప్రసాద్ అధ్యక్షతన ఉపాధి హామీ అధికార సిబ్బందితో ఉపాధి పనుల నిర్వహణపై గురువారం సమీక్షించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉన్నందున వేతనదారులు వడదెబ్బకు గురికాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. పని ప్రదేశాల వద్ద సదుపాయాల నిమిత్తం సంబంధత ఏఎన్ఎం నుంచి ఓఆర్ఎస్ ప్యాకెట్లు తీసుకుని పని వద్ద ఉంచాలన్నారు. ఎన్ఎంఎంఎస్ పంపించే సమయంలో వచ్చే సమస్యలను పరిష్కరించడానికి ఏపీపీలో ఎప్పటికప్పుడు అప్డేట్ జరుగుతుందన్నారు. ఉపాధి హామీ పథకంలో ఉత్పన్నమైన సమస్యలను దశలవారీగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఏపీఓ ఊణ్ణ బాలకృష్ణ, జేఈ సోమేశ్వరరావు, సాంకేతిక సహాయకులు పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్లలో పారదర్శకత పాటించాలి : జేసీ
పార్వతీపురం రూరల్: రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేగంగా సేవలు అందించాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పార్వతీపురం పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని ఇండెక్స్ రిజిస్టర్లు, పెండింగ్లో ఉన్న దస్తావేజులను నిశితంగా పరిశీలించి, రికార్డుల నిర్వహణపై సిబ్బందిని ఆరా తీశారు. అనంతరం కార్యాలయానికి వచ్చిన క్రయ విక్రయదారులతో నేరుగా మాట్లాడి, సేవలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్లలో అనవసర జాప్యానికి తావుండకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల వసూలు లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని సూచించారు. వేసవి దృష్ట్యా కార్యాలయానికి వచ్చే ప్రజల కోసం తాగునీరు, నీడ వంటి కనీస వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. తనిఖీలో సబ్ రిజిస్ట్రార్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
బాధ్యతల స్వీకరణ
విజయనగరం లీగల్: విజయనగరం న్యాయవాదుల సంఘ అధ్యక్షుడిగా నళితం రమేష్కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక బార్ అసోసియేషన్ హాల్లో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఉపాధ్యక్షులుగా పి. బ్రహ్మాజీ, ప్రధాన కార్యదర్శిగా గడి మురళి, సంయుక్త కార్యదర్శిగా పి. వరలక్ష్మి, కోశాధికారిగా పి. రామచంద్రరావు, స్పోర్ట్స్ కార్యదర్శిగా జేవీఎస్ఎన్ మూర్తి, సీనియర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా చంద్రశేఖర్, వి. రత్నకుమారి, ఎస్. రమేష్, బి.పార్వతి, వి. శ్రీదేవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమానికి రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు బెల్లాన రవి, ఇతర సీనియర్, జూనియర్ న్యాయవాదులు హాజరయ్యారు. డివిజన్లు పెరిగాయ్.. విజయనగరం: నగర పరిధిలో ఉన్న 50 డివిజన్ల సంఖ్యను 62కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కమిషనర్ బాలస్వామి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్ల పెంపు నేపథ్యంలో అవసరమైన కసరత్తును తక్షణమే ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్ట్ బొండపల్లి: ఆస్తి వివాదంలో ఇద్దరు అన్నలపై దాడి చేసిన తమ్ముడు, అతని భార్యను బుధ వారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై యు.మహేష్ తెలిపారు. వివరాల్లోకి వెళి తే.. మండలంలోని కొండకిండాంలో గత నెల 30న జరిగిన ఆస్తి తగాదాలో కలిశెట్టి గౌరునాయుడు తన ఇద్దరు అన్నలైన సత్యనారాయణ, బంగారునాయుడుపై కత్తితో దాడి చేశాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు గౌరునాయుడు, అతనికి సహకరించిన భార్య జయశ్రీలను అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. నెలివాడలో దొంగతనంబొండపల్లి: మండలంలోని నెలివాడలో ఓ ఇంటిలో బుధవారం వేకువజామున దొంగతనం జరిగింది. ఎస్సై యు.మహేష్ తెలియజేసిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన షేక్ రసూల్ దొంగలు ప్రవేశించి, పావు తక్కువ రెండు తులాల బంగారు ఆభరణాలతో పాటు ల్యాప్ట్యాప్ను అపహరించుకుపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం విజయనగరం క్రైమ్: పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని టూటౌన్ పోలీసులు బుధవారం గుర్తించారు. మృతుని వయసు సుమారు 50 ఏళ్లు ఉంటాయని ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు. నలుపు రంగు ఫ్యాంట్, బిస్కెట్ కలర్ షర్ట్తో ధరించి ఉన్నాడని, ఆచూకీ తెలిసిన వారు టూటౌన్ పోలీసులను సంప్రదించాలని కోరారు. వ్యర్థాల నుంచి సంపదనెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండగుంపాం ఉన్నత పాఠశాలలో నేషనల్ గ్రీన్ కార్డ్స్ కార్యక్రమంలో భాగంగా వ్యర్థాల నుంచి సంపద సృష్టి అనే అంశంపై బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు సత్యప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భూమిలో కరగని ప్లాస్టిక్ వస్తువులు, సంచులు వంటి వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ చేసి తిరిగి ఉపయోగించుకునే విధానాలపై అవగాహన కల్పించారు. హెచ్ఎం వేణుగోపాలరావు మాట్లాడుతూ.. ప్రపంచంలో ఏదీ వ్యర్థం కాదని.. సరైన విధంగా వినియోగిస్తే వాటి నుంచి ఉపయోగపడే వస్తువులు తయారు చేయవచ్చన్నారు. పర్యావరణ పరిరక్షణలో రీసైక్లింగ్ ఎంతో ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా వ్యర్థాలతో విద్యార్థులు వివిధ రకాల వస్తువులు తయారు చేసి ప్రదర్శించారు. అమరావతిపై అనిశ్చితి తొలిగింది విజయనగరం అర్బన్: అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధం చేసే బిల్లుకు ఆమోదం లభించడం ఆనందంగా ఉందని.. ఇకపై రాజధానిపై ఉన్న అనిశ్చితి తొలిగిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆయన క్యాంప్ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. అమరావతి ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని పార్టీలు కలిసి అమరావతి అభివృద్దికి సహకరించాలని పిలుపునిచ్చారు. -
రెవెన్యూ సేవల్లో వేగం పెంచండి
● కలెక్టర్ రాంసుందర్రెడ్డి వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలో అర్హులైన ప్రతిఒక్కరికీ పాస్ పుస్తకాలు అందేలా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్ఓ సీహెచ్ సత్తిబాబు, కేఆర్సీ ఎస్డీసీ ఈ.మురళి పాల్గొన్నారు. మెరుగైన ర్యాంకులు సాధించాలి స్వచ్ఛ సర్వేక్షణ్లో జిల్లాకు చెందిన మున్సిపాలిటీలు మెరుగైన ర్యాంకులు సాధించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదేశించారు. దేశవ్యాప్తంగా టాప్–100లో స్థానం దక్కేలా ప్రత్యేకంగా విజయనగరం, బొబ్బిలి మున్సిపాలిటీల కృషి చేయాలని దిశానిర్ధేశం చేశారు. ఇతర మున్సిపాలిటీలు కూడా తమ ర్యాంకులను మెరుగుపర్చుకోవాలని సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, అన్న క్యాంటీన్లు, పన్నుల వసూళ్లు, ఎల్ఆర్ఎస్, బీపీఎస్, తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో విజయనగరం, బొబ్బిలి, రాజాం, నెల్లిమర్ల మున్సిపల్ కమిషనర్లు, పబ్లిక్ హెల్త్ ఈఈ, తదితరులు పాల్గొన్నారు.విజయనగరం అర్బన్: జిల్లాలో రెవెన్యూ సంబంధిత సేవలు, భూసర్వే ప్రక్రియ, ప్రజల అర్జీల పరిష్కారంలో అధికారులు మరింత వేగంగా స్పందించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ నుంచి రెవెన్యూ అధికారులతో ఆన్లైన్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన మ్యుటేషన్లలో ఐదు రకాల సవరణలను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం వాస్తవ స్థితిగతుల ఆధారంగా కరెక్షన్స్ చేయాలని స్పష్టం చేశారు. మార్చి 31 నాటికి జిల్లాలో అందిన 22ఏ దరఖాస్తులపై సమీక్ష నిర్వహించి, పెండింగ్లో ఉన్న వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఫారం–8 జారీని రెండు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఐవీఆర్ఎస్ సర్వేపై కూడా సమీక్ష నిర్వహించిన కలెక్టర్, ప్రజలు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేలా సేవలు అందించాలన్నారు. అన్ని సేవలపైనా 90 శాతం కంటే ఎక్కువ సంతృప్తి స్థాయిని సాధించేలా పనితీరు ఉండాలని చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ మాట్లాడుతూ.. వెబ్ల్యాండ్ పోర్టింగ్ పనులు గడువులోగా పూర్తి చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ముఖ్యంగా ఫేజ్–4 పరిధిలోని 126 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూథింగ్ ప్రక్రియ 96,779.71 ఎకరాల వరకు పూర్తయిందని.. మిగిలిన పనులు -
రామతీర్థంలో పౌర్ణమి పూజలు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థాన క్షేత్ర పాలకుడిగా విరాజిల్లుతున్న ఉమా సదాశివాలయంలో పౌర్ణమి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మల్లికార్జునశర్మ ఆధ్వర్యంలో ముందుగా గణపతి పూజ నిర్వహించి శివుడికి ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు. అనంతరం కామాక్షి అమ్మవారి సన్నిధిలో హోమం, కుంకుమ పూజలు జరిపించారు. ● గ్యాస్ ఏజెన్సీ ముట్టడి విజయనగరం రూరల్: పట్టణంలోని స్వామి గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాన్ని వినియోగదారులు బుధవారం ముట్టడించారు. గ్యాస్ సరఫరాలో తీవ్ర జాప్యం నెలకొనడంతో వినియోగదారులు మండిపడుతున్నారు. ముఖ్యంగా స్వామి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు కొద్ది రోజులుగా వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇళ్ల వద్ద సిలిండర్లు ఇవ్వాల్సి ఉండగా.. 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొడౌన్ వద్ద సిలిండర్లు తీసుకోవాలని చెబుతుండడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే నిర్వాహాకులు గ్యాస్ కంపెనీకి సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో సిలిండర్ల సరఫరా ఆగిపోయిందని గుర్తించిన తహసీల్దార్, రెవెన్యూ, పౌర సరఫరాల అధికారులు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహాకులతో మాట్లాడి డబ్బులు చెల్లింపజేశారు. దీంతో రెండు, మూడు రోజుల్లో వినియోగదారులకు గ్యాస్ సరఫరా అయ్యేలా చూస్తానని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో వినియోగదారులు వెనుదిరిగారు. -
కాలుష్య కోరల్లో ఉత్తరాంధ్ర
చికెన్● లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీవిజయనగరం గంటస్తంభం: ఉత్తరాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరుగుతున్నప్పటికీ, అదే స్థాయిలో కాలుష్యం పెరుగుతూ ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం పట్టణాలు క్రమంగా కాలుష్య ప్రభావానికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రతీర ప్రాంతాల్లో స్థాపితమైన ఫార్మా కంపెనీలు స్థానికులకు ఉపాధి కల్పించడం కంటే ఎక్కువగా కాలుష్యాన్ని అందిస్తున్నాయని ఆరోపించారు. డబ్బులు కంపెనీలకు జబ్బులు ప్రజలకు అనే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైతే ట్రాఫిక్ రద్దీతో పాటు కాలుష్య సమస్యలు మరింత పెరిగే అవకాశముందని.. ఇప్పటికే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జాతీయ రహదారిపై రద్దీ అధికమైందని తెలిపారు. ట్రాఫిక్, కాలుష్యం సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయనున్నట్లు చెప్పారు. అనంతరం డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ రచించిన పుస్తకాన్ని విడుదల చేశారు. సమావేశంలో లోక్సత్తా నాయకులు మూర్తి, నాగభాస్కరం, తదితరులు పాల్గొన్నారు. -
పల్లెల్లోనూ..ప్రత్యేకమే..
సాక్షి, పార్వతీపురం మన్యం: పంచాయతీల పాలక వర్గం గడువు గురువా రంతో ముగుస్తోంది. రేపటి నుంచి పల్లెలు కూడా ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్తున్నాయి. ఇప్పటికే మున్సిపల్ పాలక వర్గాల గడువు ముగియడంతో పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించిన విషయం విదితమే. ఈ నెల రెండో తేదీతో సర్పంచుల పదవీ కాలం కూడా ముగియనుంది. చట్టబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభు త్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో.. ఎన్నికలకు వెనకడుగు వేస్తున్నారన్న చర్చ నడుస్తోంది. జిల్లాలో 15 మండలాలకు సంబంధించి 451 గ్రామ పంచాయతీలున్నాయి. సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలనను చంద్రబాబు ప్రభుత్వం తీసుకొస్తోంది. ప్రత్యేకాధికారులుగా ఎంపీడీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ ఎంపీడీఓలు, ఎంఈఓలు, అంతే సమాన, అంతకంటే ఎక్కువ హోదా కలిగిన వారిని ప్రత్యేక అధికారులుగా నియమించాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జాబితాకు కలెక్టర్ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. కొత్త పాలకవర్గం ఏర్పడే వరకు అధికారుల పాలన సాగనుంది. 2021 ఫిబ్రవరిలో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. అదే ఏడాది ఏప్రిల్ మూడో తేదీ నుంచి సర్పంచ్లు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం నగర పాలక సంస్థ, పురపాలక సంఘాలు, పంచాయతీలన్నీ ప్రత్యేక పాలనపైన ఆధారపడి ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించలేనట్లు సూచనప్రాయంగా తెలుస్తోంది. అదే బాటలో పంచాయతీలు కూడా వెళ్లనున్నాయి. డీపీఓ కార్యాలయం ఈ నెల 15వ తేదీ తర్వాత గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను విడుదల చేయాల్సి ఉంది. దీనిపై ఇంకా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే రెండుసార్లు జాబితా ప్రచురణను ప్రభుత్వం వాయిదా వేసింది. ఎన్నికల నిర్వహణ ఇష్టం లేకనే ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలో మరో 17 కొత్త పంచాయతీలకు ప్రతిపాదనలు కూడా వెళ్లాయి. వాటికీ అనుమతులు రావాల్సి ఉంది. ఇప్పటికే నిధులు లేక పంచాయతీలు అభివృద్ధికి దూరమయ్యాయి. కేంద్రం నుంచి 16వ ఆర్థిక సంఘం నిధులు రావాలంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాల్సిందే. అప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పంచాయతీల ఖాతాల్లోకి జమవ్వదు. 2024–25కు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు గత డిసెంబర్లో వచ్చాయి. వీటితో టైడ్, అన్ టైడ్ పనులు చేయాల్సి ఉంటుంది. మంచినీరు, పారిశుధ్యం, హరిత రాయబారులకు గౌరవ వేతనం, విద్యుత్తు బిల్లుల చెల్లింపు, అభివృద్ధి పనులు ఈ నిధులపైనే ఆధారపడి ఉంటాయి. జిల్లాలో 15వ ఆర్థిక సంఘం నిధులే ఇంకా రూ.30 కోట్ల వరకూ రావాల్సి ఉంది. ఇంటి పన్నుల వసూళ్ల డిమాండ్ రూ.6.18 కోట్లు కాగా.. ఇప్పటి వరకు రూ.5.36 కోట్లు వసూలు అయ్యింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన సెస్ మొత్తం రూ.లక్షల్లో పెండింగు ఉంది. ఈ నిధులన్నీ పూర్తి స్థాయిలో సమకూరితేనే పారిశుధ్యం, వీధి దీపాలు, తాగునీరు, స్టేషనరీ, ఇతర అభివృద్ధి, నిర్వహణ ఖర్చులకు వినియోగించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. సర్పంచ్ల నుంచి చెక్ పవర్ ప్రత్యేకాధికారులకే వెళ్లనుంది. ఇక ఏ పనులు చేయాలన్నా వారి అనుమతి ఉండాల్సిందే. సర్పంచ్లు నిత్యం గ్రామాల్లో, ప్రజల మధ్య ఉంటారు. ప్రత్యేకాధికారులు అందుబాటులో ఉండటం అరుదు. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత చంద్రబాబు ప్రభుత్వం.. వైఎస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్లపై కక్ష గట్టింది. అభివృద్ధి పనులకు మోకాలడ్డింది. చేసిన పనులకు సంబంధించి బిల్లులు ఆపేశారు. గ్రామాభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్న విమర్శలు ఉన్నాయి. -
పైడితల్లిని దర్శించుకున్న ప్రముఖ గాయని జానకమ్మ
విజయనగరం టౌన్: ప్రముఖ నేపథ్యగాయని ఎస్.జానకమ్మ ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లిని బుధవారం దర్శించుకున్నారు. మూ డులాంతర్లు జంక్షన్ వద్దనున్న బాలాలయంలో అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించిన అనంతరం జానకమ్మకు వేదాశీస్సులు, అమ్మవారి తీర్థ, ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో గురునారాయణ కళాపీఠం వ్యవస్థాపకుడు బీఏ నారాయణ, డాక్టర్ జి.సన్యాసమ్మ, గాయనీ, గాయకులు పాల్గొన్నారు.తల్లిదండ్రుల చెంతకు బాలికవిజయనగరం క్రైమ్: వన్టౌన్ స్టేషన్ పరిధి తోటపాలెంలో అదృశ్యమైన బాలిక కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఎస్సై లీలావతి తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 31న తోటపాలెంనకు చెందిన ఓ బాలిక అదృశ్యమైందంటూ తండ్రి వన్టౌన్లో ఫిర్యాదు చేశారు. సీఐ చౌదరి ఆదేశాలతో ఎస్సై లీలావతి పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక ఫోన్ నంబర్ను ట్రేస్ చేయగా విశాఖపట్నం వెళ్లినట్లు గుర్తించారు. దీంతో హుటాహుటిన ఎస్సై లీలావతి తన బృందంతో విశాఖ వెళ్లి బాలికను తీసుకొచ్చి కన్నవారికి బుధవారం అప్పగించారు. బాలిక ప్రేమికుడితో వెళ్లినట్లు తేలడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో హెచ్సీ రామారావు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి సాగు.. ప్రగతికి బాట
● ఖరీఫ్పై యంత్రాంగం కసరత్తు ● పంట మార్పిడితోనే మేలు: కలెక్టర్ పార్వతీపురం రూరల్ : ఖరీఫ్ సాగులో ముందస్తు ప్రణాళికలు, ప్రకృతి వ్యవసాయ విధానాల ద్వారా రైతులకు మేలు చేకూర్చాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర్రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక ఎన్జీఓ భవనంలో వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరి శ్రమ, డీఆర్డీఏ, ప్రకృతి వ్యవసాయ విభాగాల సిబ్బందికి నిర్వహిస్తున్న రెండో రోజు శిక్షణ కార్యక్ర మంలో బుధవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎలోనినో ప్రభావం వల్ల సాగులో తలెత్తే ఇబ్బందులను అధిగమించేలా రైతులను సన్నద్ధం చేయాలన్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, దేశీ విత్తనాలు, ప్రకృతి సాగు వైపు మళ్లించాలని సూచించారు. పంట మార్పిడి, మార్కెటింగ్ అంశాలపై క్షేత్ర స్థాయి సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని, రాబోయే ఏడాదికి సంబంధించి పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు. రైతుల నమ్మకాన్ని పొందేలా అధికారులు తమ వృత్తి పట్ల నిబద్ధతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యవసాయ అధికారి జి.సత్యవతి మాట్లాడుతూ వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని సాగు చేపట్టాలన్నారు. ఉద్యాన అధికారి సత్యం నారాయణరెడ్డి శాఖాపరమైన సబ్సిడీల గురించి వివరించారు. ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎం.శ్రావణ్కుమార్నాయుడు మాట్లాడుతూ.. బయోరిసోర్స్ సెంటర్ల వినియోగం, వరి సాగు లో రైజ్డ్ బెడ్స్ పద్ధతి, అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం పొందే మార్గాలను వివరించారు. కార్యక్రమంలో ఏడీఏలు, ఎంఏఓలు, హార్టీకల్చర్ అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. మందుల చీటీలు తెలుగులోనే రాయాలి పట్టణ ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు ఇచ్చే మందుల చీటీలను సామాన్యులకు అర్థమయ్యేలా స్పష్టంగా తెలుగులోనే రాయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి వైద్యులను ఆదేశించారు. చాకల బెలగంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి రికార్డులను పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం సిబ్బంది తో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది సమన్వయంతో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ఆస్పత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పి ంచాలని సూచించారు. డీఎంహెచ్ఓ భాస్కరరావు, మున్సిపల్ కమిషనర్ డి.పావని, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. -
పదవుల కోసమే కళా తాపత్రయం
● వ్యక్తిగత దూషణలు చేస్తే ఊరుకోం ● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు రాజాం: గతంలో మంత్రిగా చేసిన చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావుకు ఇప్పుడు ఏ పదవి లేకపోవడంతో ఏమి చేయాలో అర్ధం కావడం లేదని, పదవులు పొందేందుకు ప్రతిపక్ష పార్టీపైన, నాయకులపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. రాజాంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణపై కళా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వ్యక్తిగతంగా దూషించిన వీటిని వెనక్కు తీసుకోకుంటే మేం కూడా కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత దూషణలకు దిగాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎదుటివారిపై దూషణలు చేసేటప్పుడు తమ పరిస్థితి వెనక్కు తిరిగి చూసుకోవాలని హితవు పలికారు. మరోవైపు మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టులపై కళాకు పూర్తిగా అవగాహన లేదని పేర్కొన్నారు. గతంలో ఎమ్మెల్యేగా చేసిన ఉణుకూరు, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో కళా చేసిన అభివృద్ధి శూన్యమని, ఆయా నియోజకవర్గాలకు వెళ్తే కళా పనితనం తెలిసిపోతుందని ఎద్దేవా చేశారు. ఎయిర్పోర్టు నిర్మాణ ఘనత వైఎస్సార్ కుటుంబానికే దక్కుతుందని తెలిపారు. మూలపేట పోర్టు 70 శాతం పనులు పూర్తి చేయించిందని వైఎస్ జగన్మోహన్రెడ్డేనని, ఇది ముమ్మాటికి సత్యమని అన్నారు. తోటపల్లి ప్రాజెక్ట్ను మేమే తెచ్చామని చంద్రబాబునాయుడు గొప్పలు చెప్పుకున్నారని, ఆ ప్రాజెక్ట్ వైఎస్సార్సీపీ హయాంలో పూర్తవుతుందని అన్నారు. రాష్ట్ర రాజధాని అక్కడి ప్రభుత్వ ఇష్టమేనని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే ఇప్పు డు అమరావతిని రాజధానిని చేస్తున్నామంటూ కూటమి తీర్మానాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని వెల్లడించారు. అంటే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడూ అమరావతి తీర్మానాలు చేయలే దా? అని ప్రశ్నించారు. అమరావతి చుట్టుపక్కల ఉన్న రైతులను ఆదుకోవాలని జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేస్తుంటే తప్పుదోవ పట్టించే పని కూట మి చేస్తుందని మండిపడ్డారు. రూ.లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి ప్రజా సంక్షేమం చేయకుండా కూటమి దోచుకుంటుందని ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారన్న సంగతి కూటమి నేతలకు తెలుసని అన్నారు. భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలిసిన కూటమి ఎమ్మెల్యేలు... టీవీలు ముందు మాట్లాడే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, లేకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడా ల్సి ఉంటుందని అన్నారు. పార్టీ రాజాం ఇన్చార్జ్ డాక్టర్ తలే రాజేష్, జెడ్పీ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
బెట్టింగ్ల మాయాజాలంలో చిక్కుకోవద్దు..
● ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డిపార్వతీపురం రూరల్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల నేపథ్యంలో యువత ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగుల మాయాజాలంలో చిక్కుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే స్వార్థపరుల ఆశల వలలో పడి బంగారు భవితను అంధకారం చేసుకోవద్దన్నారు. వినోదం పంచాల్సిన ఆటలు.. కుటుంబాల్లో విషాదం నింపేలా మారకూడదని హితవు పలికారు. బెట్టింగుల వ్యసనానికి బానిసలై అప్పులపాలవుతున్నారని, ఆ నష్టాలను భర్తీ చేసుకునే క్రమంలో కొందరు దొంగతనాలు, ఇతర నేరాల బాట పడుతుంటే.. మరికొందరు తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకోవాల్సిన వయసులో విద్యార్థులు తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని, తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారిని సన్మార్గంలో పెట్టాలని కోరారు. క్రికెట్ బెట్టింగులకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా బెట్టింగ్లు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే డయల్ 112 లేదా 100 నంబర్లకు గానీ, స్థానిక పోలీసులకు గాని ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు. -
మూడోసారి సమ్మె బాట
● బకాయిలు చెల్లించకపోవడంతో సమ్మె బాట పట్టిన నెట్వర్క్ ఆస్పత్రులు ● ఫలితంగా రోగులకు అందని వైద్య సేవలు ● జిల్లాలో 28 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ● ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.40 కోట్లు విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ) నెట్ వర్క్ ఆస్పత్రులు సమ్మె బాట పట్టాయి. చంద్రబాబు సర్కార్ ఆరోగ్యశ్రీ ఽపథకం ద్వారా రోగులకు చికిత్స అందించిన ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకుండా అలసత్వం వహించడం వల్ల ఈ సేవలు నిలిచిపోయాయి. టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన సుమారు రెండేళ్ల కాలంలో మూడుసార్లు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మె చేపట్టాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న గతంలో కూడా ఇటువంటి నిర్లక్ష్య ధోరణి అవలింబించేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ సర్కార్ నిర్లక్ష్యం ఆరోగ్యశ్రీ రోగుల పాలిట శాపంగా మారిందనే విమర్శలున్నాయి. నెట్వర్క్ ఆస్పత్రుల్లో సేవలు నిలిచిపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ● గొప్పలు కుప్ప చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం చంద్రబాబు, ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పారు. కానీ.. అధికారం చేపట్టిన తర్వాత అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. ప్రజలకు పునర్జన్మ ప్రసాదించే ఆరోగ్యశ్రీ పథకం పట్ల టీడీపీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● బకాయిలు సుమారు రూ.40 కోట్లు జిల్లాలో 28 ఆరోగ్యశ్రీ ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రులు ఉన్నాయి. వీటికి సుమారు రూ.40 కోట్లు వరకు చంద్రబాబు ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది. బకాయిలు పెరిగిపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మె చేపట్టాయి. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందే ఆరోగ్యశ్రీ పథకం పట్ల చంద్రబాబు ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ● జిల్లాలో ప్రైవేటు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు సాయి పీవీఆర్ ఆస్పత్రి, వెంకటరామ, శ్రీసాయి సూపర్ స్పెషాలటీ, మువ్వ గోపాల ఆస్పత్రి, వెంకట పద్మ, గాయిత్రి, కాశ్వి, కొలపర్తి ఆస్పత్రి, మారుతి ఆస్పత్రి, అభినవ్, స్వామి కంటి ఆస్పత్రి, శ్రీనివాస్ నర్సింగ్ హోమ్, బాబూజీ తదితర ఆస్పత్రులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు తమకు చెల్లించాల్సిన బకాయిల కోసం వారం రోజుల ముందే సమ్మె నోటీస్ ఇచ్చాయి. అయినప్పటకీ చంద్రబాబు సర్కార్ పట్టించుకోకపోవడంతో సేవలను నిలిపివేశారు. చంద్రబాబు సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటికే రెండు సార్లు సమ్మె చేపట్టాయి. తాజాగా మూడోసారి కూడా సమ్మె చేపట్టారు. రెండోసారి సమ్మె చేపట్టినప్పడు విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నెట్వర్క్ ఆస్పత్రుల యజమానులు ధర్నా చేపట్టారు. ఆరోగ్యశ్రీ పేదల కల్పతరువుగా ఉండేది. పేద, మధ్య తరగతి ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు కార్పొరేట్ ఆస్పత్రులు సైతం పిలిచి మరి ఉచితంగా సేవలు అందించేవారు. గుండె జబ్బులు, కేన్సర్ వంటి పెద్ద వ్యాధులకు కూడా ఉచితంగా వైద్య సేవలు అందించేవారు. -
వీబీ జీ రామ్జీ మరింత ఆలస్యం..
విజయనగరం ఫోర్ట్: వీబీ జీ రామ్జీ (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ – గ్రామీణ ) పథకం అమలు మరింత జాప్యం కానుంది. వాస్తవానికి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే ఈ పథకం (ఉపాధి హామీ పథకం) అమలు కావాల్సి ఉంది. అయితే పథకం నిర్వహణకు సంబంధించిన గైడ్లైన్స్ నేటికీ జిల్లాకు చేరకపోవడంతో పథకం నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలల కిందట మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని వీబీ జీ రామ్జీ పథకంగా మార్పు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త పేరుతో పథకాన్ని అమలు చేస్తామని జిల్లా నీటియాజమన్య సంస్థ ( డ్వామా) అధికారులు కూడా నిన్న, మొన్నటి వరకు తెలిపారు. కొత్తగా పని దినాలు పెరుగుతాయని.. గ్రామాల్లో అవగాహన సదస్సులు సైతం నిర్వహించారు. 125 రోజుల పనిదినాలు.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో జాబ్కార్డు కలిగిన కుటుంబానికి 100 రోజులు పనిదినాలు కల్పించేవారు. కొత్తగా పథకం పేరు మార్చిన తర్వాత పనిదినాల సంఖ్య పెంచారు. ఒక్కో కుటుంబానికి 125 రోజుల పాటు పని కల్పించనున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా ఉన్నప్పుడు కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం వాటా చొప్పున నిధులు కేటాయించేవి. అయితే పథకం పేరు మార్చిన తర్వాత కేంద్రం తన వాటాను 60 శాతానికి తగ్గించుకోవడంతో రాష్ట్రంపై భారం పడనుంది. జిల్లాలో 3.45 లక్షల జాబ్ కార్డులు.. జిల్లాలో ఉపాధిహామి పథకానికి సంబంధించి 3.45 లక్షల జాబ్ కార్డులు ఉండగా.. వేతనదారులు 6.26 లక్షల మంది ఉన్నారు. ఇదిలా ఉంటే 2026 – 27 సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ నెలకు మాత్రమే లక్ష్యాన్ని నిర్ణయించారు. ఏప్రిల్ నెలకు సంబంధించి వేతనదారులకు 44.44 లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉంది. ఉపాధి హామీ పథకంలో చెరువులు, గుంతలు, కాలువల్లో పూడికతీతలు, జంగిల్ క్లియరెన్స్, చెరువు గట్టు ఎత్తు పెంచడం, చెరువు లోతు చేయడం వంటి పనులు చేపట్టనున్నారు. వాస్తవానికి ఏప్రిల్ 1న ప్రారంభం కావాల్సి ఉంది కాని నేటికీ రాని గైడ్లైన్స్ పనుల కోసం ఎదురుచూస్తున్న వేతనదారులుగైడ్లైన్స్ రాలేదు.. ఏప్రిల్ నెల కూడా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంగానే అమలు కానుంది. ఏప్రిల్ నెలకు పనిదినాల సంఖ్య 44.44 లక్షలుగా నిర్దేశించారు. వీబీజీ రామ్జీ పథకానికి సంబంధించిన గైడ్లైన్స్ ఇంకా రాలేదు. – ఎస్. శారదా దేవి, పీడీ, డ్వామా -
సమన్వయం చేసుకుంటూ హద్దులు నిర్ణయించండి : జేసీ
పాచిపెంట : రీసర్వేలో రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో పనిచేసి భూ హద్దులు నిర్ణయించాలని పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ యశ్వంత్కుమార్ రెడ్డి అన్నా రు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అట వీ, రెవెన్యూ శాఖల అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. కొండమోసూరు, మిలియా కంచూరు ప్రాంతాల్లో మాన్సస్ ట్రస్ట్ భూములకు సంబంధించి భూములు ప్రస్తుతం ఎవరి ఆధీనంలో వున్నాయి, ఎవరు సాగు చేస్తున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఫారెస్ట్ భూములకు సంబంధించి రికార్డుల ప్రకారం హద్దులు నిర్ణయించాలన్నా రు. సమస్యలు తలెత్తకుండా పక్కాగా రీ సర్వే చేపట్టాలన్నారు. అనంతరం పాంచాలి జిల్లా పరిషత్ పాఠశాలను, గురువు నాయుడుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. పాఠశాలలో ముస్తాబు కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. రోగులకు అందుతు న్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆయన వెంట డీఆర్ఓ వైశాలి, డీఎఫ్ఓ ప్రసూన, మైన్స్ ఏడీ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. డెంకాడ: నీట్, ఈఏపీసెట్లలో ఉత్తమ ఫలితా ల సాధన కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని డీఈఓ యు.మాణిక్యంనాయుడు అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వంద మంది విద్యార్థినిలను ఎంపిక చేసి నీట్, ఈఏపీసెట్ ఉత్తమ ఫలితాల కోసం అక్కివరం పరిధిలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్లో నెల రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను డీఈఓ మాణిక్యంనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక తరగతుల్లో నిష్ణాతులైన అధ్యాపకులచే, పీజీటీలచే తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు వసతి, భోజన సదుపాయం కూడా ఇక్కడే కల్పించామన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమ ఫలితాల సాధన కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని వివరించారు. ఇది చాలా విలువైన సమయమని, దీనిని విద్యార్థులు పూర్తిగా సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో ఉన్నత స్థానాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు కంది చంద్రశేఖరరావు, సర్పంచ్ కంది కిరణ్కుమార్, ప్రిన్సిపాల్ సీహెచ్ సంధ్య, ఎస్ఎంసీ చైర్మన్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు వనంగుడి నుంచి చదురుగుడికి చేరుకునే బృహత్తర ఘట్టమైన దేవర మహోత్సవం ఈ నెల 27న సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి నిర్వహించనున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారిణి కె.శిరీషా పేర్కొన్నారు. స్థానిక కార్యాలయ ఆవరణలో బుధవారం నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ముందుగా మహోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. పసిడికాంతుల పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవానికి సంబంధించి 27న సోమవారం సాయంత్రం వనంగుడి వద్ద అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజాధికాలను నిర్వహించి వనంగుడి నుంచి భారీ ఊరేగింపు, మేళతాళాలు, భాజా భజంత్రీలతో అమ్మవారిని గంటస్తంభం మీదుగా హుకుంపేటకు తీసుకువెళ్తామన్నారు. అదేరోజు రాత్రి 10 గంటలకు హుకుంపేటలో ఉన్న అమ్మవారి చదురు వద్ద ప్రత్యేక పూజలు అనంతరం మరుసటి రోజు మంగళవారం వేకువజామున మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడి బాలాలయానికి అమ్మవారిని తీసుకువస్తామన్నారు. నాటి నుంచి ఉయ్యాల కంబాల మహోత్సవం వరకూ అమ్మవారు చదురుగుడిలోనే భక్తులకు దర్శనమిస్తారన్నారు. -
ప్రజలకు సురక్షిత నీరు
● కలెక్టర్ రాంసుందర్రెడ్డివిజయనగరం ఫోర్ట్: ప్రజలందరికీ సురక్షిత నీరు అందించాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్రెడ్డి ఆదేశించారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ఓ ప్లాంట్ లేని పాఠశాలలు, వసతిగృహాల జాబితాను సిద్ధం చేయాలన్నారు. గ్రామాల్లో సరఫరా చేస్తున్న నీరు కలుషితం కాకుండా చూడాలని ఆదేశించారు. ఈ ఏడాది సుధీర్ఘ ఎల్నినో ప్రభావం వల్ల ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో నీటి సమస్యల్లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, డీఎంహెచ్ఓ జీవనరాణి, డీపీఓ మల్లికార్జునరావు, విద్యుత్శాఖ ఎస్ఈ లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలు పరిష్కరించాలి : యూటీఎఫ్
పార్వతీపురం రూరల్ : ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) ఆధ్వర్యంలో పార్వతీపురం కలెక్టరేట్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షలు బుధవారం నిర్వ హించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహనరావు, జిల్లా అధ్యక్ష ప్రధా న కార్యదర్శులు కె.కృష్ణారావు, కె.భాస్కరరావు మాట్లాడుతూ.. 12వ పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలని, 29 శాతం మధ్యంతర భృతి చెల్లించాలని కోరారు. పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేయడంతో పాటు, ఇతర ఆర్థిక బకాయి ల చెల్లింపునకు స్పష్టమైన రోడ్డు మ్యాప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు, మెమో 57 అమలు, హెల్త్ స్కీమ్ సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో ఈ నెల 28న రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని పేర్కొ న్నారు. జేఏసీ జిల్లా చైర్మన్ జి.వి.ఆర్.కె.కిషోర్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు దీక్షకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు పి.మధుసూదనరావు, కోశాధికారి కె.మురళి, జిల్లా కార్యదర్శులు ఎం.శ్రీనివాసరావు, ఎం.పైడిరాజు, బి.రామకృష్ణ, కె.సిద్ధేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఎంఎస్పీ సేవలు వినియోగించుకోండి..
● ఎస్పీ ఏఆర్ దామోదర్ విజయనగరం క్రైమ్: పోలీస్స్టేషన్ల పరిధిలో పని చేస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శుల సేవలను క్షేత్ర స్థాయిలో వినియోగించుకోవాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక పోలీస్ కార్యాలయంలో ఎస్హెచ్ఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సమస్యలను మహిళా సంరక్షణ కార్యదర్శుల సహకారంతో గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ, వార్డు పరిధిలోకి కొత్తగా వచ్చే వ్యక్తులను గుర్తించాలని.. వారు ఏ ప్రాంతం వారు, ఎందుకు, ఎక్కడ నుంచి వచ్చిందీ తెలుసుకోవాలన్నారు. గ్రామల్లో ప్రజలకు సైబర్ మోసాలు, మహిళల రక్షణకు అండగా ఉండే చట్టాలు, రహదారి భద్రత, మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, శక్తి యాప్ పట్ల అవగాహన కల్పించాలని చెప్పారు. వారంలో ఒక రోజు ఎంఎస్పీలతో సంబంధిత ఎస్హెచ్ఓలు సమావేశం నిర్వహించాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా ముందస్తు సమాచారం లభ్యమయ్యే విధంగా సమాచార వ్యవస్థను మెరుగుపరుచుకోవాలన్నారు. గ్రామాలు, వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. -
పాత్రికేయులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
● కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డివిజయనగరం అర్బన్: జిల్లాలోని పాత్రికేయులంతా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సూచించారు. జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తిరుమల మెడికవర్ ఆస్పత్రిలో అక్రిడేటెడ్ జర్నలిస్టుల కోసం ఐదు రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ.. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో సమాచార శాఖ ఎ.డి పి.గోవిందరాజులు, తిరుమల మెడికవర్ ఎం.డి డాక్టర్ తిరుమల ప్రసాద్, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఎస్.జీవనరాణి, ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ సాయిరాం, తిరుమల మెడికల్ సెంటర్ హెడ్ పవన్కుమార్, ఐఈయూ ఇన్చార్జ్ డాక్టర్ ఎ.జగదీష్, కార్డియాలజిస్ట్ శ్రీకిరణ్, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు పీఎస్ఎస్వీ ప్రసాదరావు, బూరాడ శ్రీనివాసరావు, డివిజన్ పీఆర్ఓ ఎస్.జానకమ్మ, పీఆర్ఓ మజ్జి వాసుదేవరావు, తదితరులు పాల్గొన్నారు. -
12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలి
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయుల ఆర్థిక డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) జిల్లా శాఖ బుధవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష శిబిరం నిర్వహించింది. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ను వెంటనే నియమించాలని.. అంతవరకు 29 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న డీఏలను మంజూరు చేయాలని, హెల్త్ కార్డులను అన్ని కార్పొరేట్ ఆస్పత్రులు ఆమోదించేలా అవసరమైన నిధులు విడుదల చేయాలని కోరారు. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు బకాయిలను వెంటనే చెల్లించాలని.. జీఓ 57 అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని కోరారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు, అధ్యక్షుడు సీహెచ్ భాస్కరరావు ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో రాష్ట్ర కార్యదర్శి మురళీమోహన్, సీనియర్ నాయకులు కె.విజయగౌరి, డి.రాము, సహాధ్యక్షురాలు జి.పార్వతి, కోశాధికారి సీహెచ్ తిరుపతినాయుడు, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు రమేష్ చంద్రపట్నాయక్, ఈశ్వరరావు, కె..శ్రీదేవి, ఎన్.సత్యనారాయణ, ఎస్.వెంకటరావు, కిల్లాడ అప్పారావు, గంట సుశీల, నిర్మల, శశికళతో పాటు మండల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
ఇన్నాళ్లు ఏం చేశారు?
సాక్షి, పార్వతీపురం మన్యం: టిడ్కో ఇళ్ల మిగులు పనులను పూర్తి చేసి, లబ్ధిదారులకు అప్పగించడంలో చంద్రబాబు ప్రభుత్వం చొరవ చూపడం లేదు. చాలా వరకూ నిర్మాణాలు పూర్తయ్యాయి. నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల అప్పుడే బీటలు వారుతున్నాయి. దీంతో ఏళ్లుగా సొంతింటి కోసం ఆశగా ఎదురుచూస్తున్న పేదలకు నిరాశా మిగులుతోంది. 2017లో ఈ పథకాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది. నిర్మాణాలు చేయకుండానే వదిలేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ఈ నిర్మాణాలను చాలా వరకూ పూర్తి చేసింది. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. మిగులు పనులను పూర్తి చేసి, లబ్ధిదారులకు గృహాలు అందజేయాల్సి ఉన్నా.. కాలయాపన చేస్తున్నారు. ● పార్వతీపురంలో 1,104, సాలూరులో 1,440 గృహాలు మంజూరయ్యాయి. వీటికోసం లబ్ధిదారుల వాటాగా వారి నుంచి కొంత మొత్తం డీడీల రూపంలో వసూలు చేశారు. మంజూరుచేసిన ఇళ్లలో కొన్ని రద్దు చేశారు. వారికి ఇప్పటివరకూ డీడీలు చెల్లించలేదు. ● పార్వతీపురంలో టిడ్కో గృహాల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. డ్రైన్లు, రక్షణ గోడలు, పైప్లైన్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. ● సాలూరులో గృహాల సముదాయం ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు నిర్మాణాలు పూర్తయ్యాయి. సుమారు వెయ్యికి పైగా ఇళ్లను పూర్తి చేసి, అట్టహాసంగా లబ్ధిదారులతో ప్రారంభోత్సవాలు కూడా చేశారు. మిగిలి ఉన్న నిర్మాణాలు, కొద్దిపాటి మౌలిక సదుపాయాల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. ఫలితంగా టిడ్కో గృహాల వద్ద వైర్లు, పరికరాలు చోరీకి గురవుతున్నాయి. మున్సిపల్ కార్యాలయం ముట్టడి టిడ్కో ఇళ్ల అప్పగింతలో ప్రభుత్వం, అధికారపక్ష నేతలు చేస్తున్న అలసత్వానికి నిరసనగా సీపీఎం ఆధ్వర్యంలో లబ్ధిదారులు మంగళవారం ఉదయం పార్వతీపురం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్ట డించారు. ఇక్కడ 1,402 మందిని లబ్ధిదారులుగా గుర్తించి, 768 ఇళ్ల నిర్మాణం 90 శాతానికి పైగా పూర్తిచేసినా వాటిని లబ్ధిదారులకు అప్పగించలేకపోతున్నారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారుల వద్ద నుంచి వసూలు చేసిన షేర్ కాపిటల్ డబ్బులు కోటి 36 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వా లని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనకు స్పందించిన మున్సిపల్ కమిషనర్.. ధర్నా చేస్తున్న బాదితుల వద్దకు వచ్చి సమస్యలను వి న్నారు. జూన్ నెలాఖరులోగా పార్వతీపురం పట్టణ ప్రజలకు టిడ్కో గృహాలు అప్పగిస్తామని, మిగిలిన వారికి షేర్ క్యాపిటల్ను చెల్లించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ధర్నా సమయంలో కొంత మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి వచ్చి, అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ.. లబ్ధిదారులకు సంబంధించిన నగదు రూ. 2.25 కోట్లు పురపాలక సంఘ ఖాతాకు జమయ్యాయని, త్వరలోనే చెల్లింపులు చేస్తామని చెప్పారు. -
ఆస్పత్రుల భవన నిర్మాణాలు పూర్తి చేయాలి : కలెక్టర్
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఆస్పత్రుల భవనాలను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ, ఇంజినీరింగ్ అధికారులతో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం, ఎస్.కోట, నెల్లిమర్ల, బాడంగి, బొబ్బిలి, రాజాం ఆస్పత్రుల భవనాల పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలన్నారు. మెడికల్ ఎక్విప్మెంట్, అగ్నిమాపక పరికరాలు, ఏసీలు ఏర్పాటు, అంతర్గత రోడ్లు, జనరేటర్లు ఏర్పాటు, పేషేంట్లు వేచి ఉండే గదులు, ఫర్నిచర్, ప్రహరీ, పెయింటింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జేసే సేతుమాధవన్, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మశ్రీరాణి తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ బాక్సింగ్ పోటీలకు సచిన్
విజయనగరం: జాతీయ స్థాయిలో జరగనున్న బాక్సింగ్ పోటీలకు విజయనగరానికి చెందిన బి.సచిన్ ఎంపికయ్యాడు. ఇటీవల విశాఖలో జరగిన జూనియర్స్ బాక్సింగ్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన సచిన్ 70–75 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించాడు. అంతేకాకుండా ఏప్రిల్ 4 నుంచి 10వ తేదీ వరకు నాగపూర్లో జరగనున్న జాతీయ స్థాయి జూనియర్స్ బాక్సింగ్ పోటీలకు అర్హత సాధించాడు. క్రీడాకారుడు సచిన్కు సీనియర్ బాక్సర్, ఎల్ఐసీ డెవెలప్మెంట్ ఆఫీసర్ బి.దివాకర్ రూ.5000 ఆర్థిక సాయం అందజేశారు.కోమటిపల్లిలో అగ్నిప్రమాదం బొబ్బిలి రూరల్: మండలంలోని కోమటిపల్లి జంగాల వీధిలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మొతి గౌరికి చెందిన పూరిల్లు పూర్తిగా కాలిపోగా పక్కనే ఉన్న మొతి సాంబయ్యకు చెందిన పెంకిటిల్లు ముందుభాగాన ఉన్న రేకులు కాలిపోయాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టారు. గౌరి ఇంటి వద్ద కట్టెల వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు అగ్నికీలలు చెలరేగి ప్రమాదం సంభవించిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలియజేశారు. ప్రమాదంలో గౌరికి చెందిన ఇంట్లోని సామాన్లు పూర్తిగా కాలిపోగా సుమారు లక్ష రూపాయిల ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అఽధికారులు అంచనా వేస్తున్నారు. ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదుగజపతినగరం: మండలంలోని తుమికాపల్లి గ్రామానికి చెందిన ఆకుల ఏడుకొండలు అధికారుల నిర్లక్ష్యంతోనే సోమవారం మృతి చెందాడని మృతుడి తండ్రి గౌరినాయుడు మంగళవారం ఫిర్యాదు చేసినట్టు ఎస్ఐ కె.కిరణ్కుమార్నాయుడు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుపడుతూ ఫిర్యాదు అందిందని చెప్పారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడతామని తెలిపారు. ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలకు అవకాశం విజయనగరం అర్బన్: పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియకు సంబంధించిన సీనియారిటీ జాబితాను విడుదల చేసినట్టు డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ సమాన పదోన్నతుల కోసం సంబంధిత స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్టు వెల్లడించారు. జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉన్న ఉపా ధ్యాయులు సరైన ఆధారాలతో ఈ నెల 1 నుంచి 6వ తేదీ వరకు పనిదినాల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి వ్యక్తిగతంగా సమర్పించాలని సూచించారు. రూ.46 కోట్ల పన్ను వసూలు విజయనగరం: 2025–26 ఆర్థిక సంవత్సరానికిగాను వివిధ పన్నుల రూపేణా రూ.46 కోట్ల 16లక్షల 59,248లు మంగళవారం సాయంత్రానికి నగర పాలక సంస్థకు సమకూరిందని కమిషనల్ బాలస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం పన్నులపై వడ్డీని 50 శాతం వరకు తగ్గించడంతో పన్ను చెల్లింపులు ఈసారి అధికంగా జరిగాయన్నారు. గత సంవత్సరం రూ.40కోట్ల 89లక్షల 97వేల, 281లు వసూలు కాగా ఈ సంవత్సరం ఆరు కోట్లు అదనంగా వసూలైందన్నారు. దీర్ఘకాల బకాయిలు, అధిక మొత్తం పన్నులు రాబట్టేందుకు కృషి చేసిన రెవెన్యూ సిబ్బందిని అభినందించారు. సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు నేతృత్వంలో బృందం పన్ను వసూలను, ప్రచారాన్ని ముమ్మరం చేయడం అభినందనీయమన్నారు. ఈ సంవత్సరం ఆస్తి పన్నులు రూ.37 కోట్ల 23లక్షల 65వేల 479లు ఈ సాయంత్రానికి వసూలు అయ్యాయన్నారు. ఖాళీ పన్నుల రూపేణా రూ.6కోట్ల53లక్షల 65వేల,103లు, నీటి చార్జీలు రూ.2కోట్ల 39లక్షల 28వేల 666లు వసూలు అయ్యాయన్నారు. -
ఏడుకొండలు మృతికి అధికారులదే బాధ్యత
గజపతినగరం: మండలంలోని తుమికాపల్లి గ్రామానికి చెందిన ఆకుల ఏడుకొండలు అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు కోల్పోయాడని జెడ్పీటీసీ గార తవుడు, సర్పంచ్ బెల్లాన త్రినాధరావు ధ్వజమెత్తారు. స్థానికంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఏడుకొండలు జాతీయ రహదారి మెయిన్రోడ్డులో ఉన్న డివైడర్ను దాటుకుంటూ వెళ్తున్న సమయంలో హైవే పోల్స్, లైటింగ్కు సంబంధించిన కంట్రోలింగ్ బాక్స్ తెరిచి ఉండడం వల్లే విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడని ఆరోపించారు. సెట్బాక్స్ మూసి ఉంటే విద్యుత్ తీగలు బయటకు వచ్చేవి కాదని, బాక్స్ తెరిచి ఉండడం వల్లే ఏడుకొండలు విద్యుత్ షాక్కు గురయ్యాడని, ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యమేనని వారు మండిపడ్డారు. ఏడుకొండలు మృతిపై సంఘటనా స్థలం నుంచే విద్యుత్, పంచాయతీ శాఖలు, నేషనల్ హైవే అధికారులకు సమాచారమివ్వగా తమకు సంబంధం లేదంటే తమకు లేదని ఒకరిపై ఒకరు నెట్టుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రెక్కాడితేగాని పొట్ట నింపలేని ఏడుకొండలు కుటుంబాన్ని అధికారులు, ప్రభుత్వమే బాధ్యత వహించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
సమస్యలను గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు
శృంగవరపుకోట: చంద్రబాబు సర్కారు సమస్యలను గాలికొదిలేసింది. డీఆర్సీ సమావేశానికి చట్టబద్ధత ఉందో లేదో తెలియదు. తేదీ నిర్ణయిస్తారు. మళ్లీ కాదంటారు. డీఆర్సీ సమావేశాల్ని మొక్కుబడి తంతుగా మార్చేశారని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. ఎస్.కోటలో మీడియాతో ఆయన మంగళవారం మాట్లాడుతూ రైతు సమస్యలను పట్టించుకునేవారే కరువయ్యారన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవాలని మొత్తుకున్నా దిక్కులేదని, క్వింటాకు రూ.2,400 మద్దతుధర రైతుకు అందడం లేదని, దళారులకు రూ.1500లకే పంటను విక్రయించుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. నిన్నటిదాకా ఎరువుల కొరత ఉంటే నేడు జిల్లాలో గ్యాస్ కొరత. గ్యాస్ కొనలేక అవస్థ పడుతున్నా ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదని విమర్శించారు. జిల్లా బడ్జెట్ ఒట్టి డొల్ల, సాగునీరు, పరిశ్రమలకు ఒక్కరూపాయి ఇవ్వలేదు, తాగునీరు, సాగునీటికి, ట్రైబల్యూనివర్సిటీలకు ఒక్క రూపాయి కేటాయింపుల్లేక పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. సర్పంచ్ల పదవీకాలం ముగుస్తున్న తరుణంలో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపకల్పన చేస్తున్నట్టు చెప్పారు. -
పుచ్చ...
ఆరోగ్యానికి భలే రక్షసీజనల్ వ్యాపారం మూడు నెలలు పాటు ఈ పుచ్చకాయల వ్యాపారం ఉంటుంది. ఈ ప్రాంతంతో పాటు ఇతర జిల్లాల నుంచి పుచ్చకాయలను దిగుమతి చేసుకొంటున్నాం. ధర అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎండ సమయంలో ఇవి ముక్కలుగా కోసి ఉంచితే అమ్ముడైపోతాయి. – పి.శ్రీనివాసరావు, వ్యాపారి, పార్వతీపురంపార్వతీపురం: ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది దాటితే చాలు వేడి గాలులు. అత్యవసర ప్రయాణాలు చేసే ప్రయాణికులతో పాటు విద్యార్థులు, ఉద్యోగులకు తప్పని పాట్లు. ఈ సమయంలో దారి పొడవునా నేనున్నానంటూ అటు దాహార్తిని, ఇటు ఆకలిని తీర్చేస్తుంది పుచ్చకాయ. సాధారణ వ్యక్తి కూడా కొనుగోలు చేసి తినగలిగే దివ్య ఫలంగా పుచ్చకాయ అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. ప్రధానంగా ఈ వేసవిలో పుచ్చకాయ కనిపిస్తే చాలు తినని మనిషి, రుచి చూడని జిహ్వ ఉండదు. జిల్లాలోని కొమరాడ, జియ్యమ్మవలస, పాలకొండ, సీతంపేట, గరుగుబిల్లి, వీరఘట్టం, భామిని తదితర మండలాలలో సుమారు 300 ఎకరాలలో కర్బూజా పంటను రైతులు సాగు చేస్తున్నారు. గతంలో పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి తదితర జిల్లాలకే పరిమితమైన ఈ పంట ఇప్పుడు అన్ని ప్రాంతాలలో సాగు చేస్తున్నారు. అయితే ఈ పంట సాగు చేసిన రైతులకంటే వ్యాపారులకే లాభసాటిగా ఉంటుందని రైతులంటున్నారు. శుభ కార్యక్రమాలలో.. పుచ్చకాయ అంటే ఇష్టపడని వారుండరు. చిన్నవారి నుంచి వృద్ధుల వరకూ ప్రతీ ఒక్కరు పుచ్చకాయని తింటారు. ఇప్పుడు కొత్తగా వివాహాలు, శుభ కార్యక్రమాలు జరిగిన సందర్భంలోనూ, తమ ఇండ్ల వద్ద నిర్వహించే ఫంక్షన్లలో పుచ్చకాయలను ముక్కలుగా కోసి వచ్చేవారికి ఇస్తున్నారు. ప్రతీ ఒక్కరి ఇళ్లలో ఈ వేసవిలో పుచ్చకాయలు నిల్వ ఉంచుకుంటున్నారు. వేసవిలో దాహార్తి తీర్చే దివ్య ఫలం కిలో రూ.25లు ధరలో లభ్యం దారి పొడవునా విక్రయాలు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతులు


