Parvathipuram Manyam
-
సమయపాలన తప్పనిసరి
● రాష్ట్ర ఆస్పత్రుల విభాగం విజిలెన్స్ జాయింట్ కమిషనర్పాలకొండ రూరల్: ప్రభుత్వ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రుల విభాగం విజిలెన్స్ జాయింట్ కమిషనర్ నాయక్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన స్థానిక ఏరియా ఆస్పత్రిని తన బృంద సభ్యులతో కలిసి ఆకశ్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో ప్రతి వార్డు నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్యసేవలు, ఇతర మౌలిక వసతులు, అందిస్తున్న భోజనంపై ఆరా తీశారు. ఈ క్రమంలో ముఖ ఆధారిత హాజరుపై కచ్చితత్వం అవసరమన్నారు. సకాలంలో విధులకు హాజరు లేకుంటే సేవలు సక్రమంగా అందించడంలో ఏర్పడే అవరోధాలను ఎలా అధిగమిస్తారని ప్రశ్నించారు. మూడు సార్లు ముఖ హాజరులో అలస్యం గుర్తిస్తే ఓ రోజు సెలవుగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. ఇటీవల మంజూరైన నిధులతో జరుగుతున్న పనుల తాజా స్థితిగతులు, రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట డీసీహెచ్ఎస్ డాక్టర్ జి.నాగభూషణరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కడియం చిరంజీవి, ఆర్ఎంఓ కె.రవికుమార్, సహ వైద్యులు, పలు విభాగాల సిబ్బంది ఉన్నారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి
జామి: స్నేహితుడిని స్కూటీపై దించడానికి వెళ్తున్న సమయంలో ట్రాక్టర్ మృత్యువు రూపంలో వెంటాడి ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎల్.కోట మండలం ఖాసాపేట గ్రామానికి చెందిన యువకుడు కొటాన ఎర్నాయుడు (24) బీటెక్ పూర్తిచేశాడు. విశాఖ పట్నంలో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. స్వగ్రామం అయిన ఖాసాపేటలో పండగకు వచ్చాడు. స్నేహితుడిని బుధవారం పెంట శ్రీరాంపురం స్కూటీపై దించడానికి తీసుకువెళ్లాడు. తాండ్రంగి గ్రామం సమీపంలో జామి నుంచి పిక్క లోడ్తో రేవళ్ల పాలెం వెళ్తున్న ట్రాక్టర్ వెనుకనుంచి స్కూటీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఎర్నాయుడు మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న జామి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి జరిగిన ఘటనపై ఆరా తీశారు. ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసిదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీర జనార్దన్ తెలిపారు. వెంకటరావు, చినతల్లి దంపతులకు ఎర్నాయుడు ఒక్కడే కుమారుడు.ఇద్దరు అక్కలు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో లైన్మన్..సీతంపేట: మండలంలోని గొయిది గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నబగ్గ సచివాలయ పరిదిలో లైన్మన్గా పనిచేస్తున్న కీసరజోడుకు చెందిన బిడ్డిక శంకరరావు (36) బుధవారం మృతి చెందాడు. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన సోమగండి వీఆర్వో తులసిరావుకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై ఎస్సై వై.అమ్మన్నరావు అందించిన వివరాల ప్రకారం పాలకొండలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి ఇద్దరూ వెళ్లి ద్విచక్రవాహనంపై వస్తున్నారు. డ్రైవింగ్ చేస్తున్న శంకరరావు ముందున్న బైక్ను ఓవర్టేక్ చేయబోయే క్రమంలో వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరూ అదుపు తప్పి కిందపడిపోయారు. తలపై శంకరరావుకు తీవ్రగాయలవడంతో వెంటనే 108 సాయంతో స్థానిక ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య శిరీష, ఏడాది కుమారుడు నివేది ఉన్నాడు. కుటుంబ పెద్ద మృతిచెందడంతో కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
చల్లబడిన వాతావరణం
పాలకొండ రూరల్: ఎట్టకేలకు వరుణుడు కరుణించడంతో పాలకొండ, పరిసర ప్రాంత ప్రజలు ఊరట చెందారు. కొద్ది రోజులుగా తీవ్ర ఎండల ధాటికి ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు బుధవారం రాత్రి కురిసిన ఓ మోస్తరు వర్షం ఆహ్లాదాన్ని, చల్లదనాన్ని అందించింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఊపిరి పీల్చుకున్నారు. పగటి పూట ఉదయం 9 గంటల నుంచి ఎండలు తీవ్రరూపం దాల్చుతుండడంతో ఇళ్లకు పరిమితమైన స్థానికులు తాజా వర్షంతో వేడి నుంచి కొంతమేర ఉపశమనం పొందారు. మరోవైపు వేసవి దుక్కులు చేపడుతున్న తమకు ఈ వర్షం మేలు చేకూర్చనుందని రైతులు పేర్కొంటున్నారు. -
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
పార్వతీపురం రూరల్: విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై జరిగిన భౌతిక దాడిని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (ఏపీయూడబ్ల్యూజే) తీవ్రంగా ఖండించింది. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని పేర్కొంది. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ వెంకటేశ్వరరావుకు యూనియన్ నాయకులు వినతిపత్రం అందజేశారు. పోలీస్ స్టేషన్ సాక్షిగా ఇంతటి దుస్సాహసానికి ఒడిగట్టారంటే జిల్లాలో విలేకరుల రక్షణ ప్రశ్నార్థకంగా మారిందని ధ్వజమెత్తారు. ముందస్తు పథకం ప్రకారమే ఈ దాడి జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో జాప్యం జరిగితే జిల్లావ్యాప్తంగా ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు గంగి శ్రీనివాసరావు, ఆర్.సుధాకర్, గోపాల్, దుర్గా, అనంతరావు, సాక్షి స్టాఫర్ రామకృష్ణ, నవీన్, దివానీ, సోమశేఖర్, కాకిముక్కల నాగు, శేఖర్, శాస్త్రి, శంకరరావు, నాయుడు, కృష్ణ, సుధీర్, తదితరులు పాల్గొన్నారు. -
యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు
బొండపల్లి: మండల కేంద్రం బొండపల్లిలో కొద్ది రోజులుగా చెరువులో గ్రావెల్ను అభివృద్ధి పనుల ముసుగులో అక్రమంగా తరలించుకుపోతున్నారు. గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొత్త చెరువులో రెవెన్యూ అధికారుల అనుమతులు లేకుండానే వందలాది ట్రాక్టర్ల గ్రావెల్ను రాత్రి పూట యథేచ్ఛగా తరలిస్తున్నారు. గ్రావెల్ను ఇళ్ల నిర్మాణంలో ఖాళీ స్థలాలను ఎత్తు చేసుకునేందుకు, పశువుల శాలలు ఖాళీ స్థలాలను ఎత్తు చేసేందుకు అక్రమంగా తరలించుకుపోతున్నారు. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వదిలేయడంతో వారి అక్రమాలకు అంతు లేకుండా పోతోంది. చెరువుల్లో గ్రావెల్ తవ్వాలంటే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు, మైన్స్ అధికారుల అనుమతులు తీసుకున్న తర్వాత వారు సూచించిన మోత్తాన్ని ప్రభుత్వానికి జమ చేసి తరలించాల్సి ఉంది. మరో వైపు వాల్టా చట్టం నిబంధనలకు లోబడి తరలించాలి. ఈ నిబంధనలు అన్ని గాలికి వదిలేసి ప్రభుత్వ రోడ్డు పనులు, అభివృద్ధి పనుల పేరుతో గ్రావెల్ను తరలిస్తూ పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రావెల్ అక్రమ తవ్వకాలపై ఇటీవల బొండపల్లిలో జరిగిన గ్రామ సభలో పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అధికారుల ముందు బాహాటంగానే నిలదీసినప్పటికీ చర్యలు మాత్రం శూన్యం. అభివృద్ధి పనుల ముసుగులో తరలింపు -
అంతర్జాతీయ వేదికపై అక్కాచెల్లెళ్లు
నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండవెలగాడ గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు బెల్లాన హారిక, బెల్లాన భార్గవి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఓషియానియా ఖండంలో ఉన్న సమోవాలో జరుగుతున్న యూత్ అండ్ జూనియర్ కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీల్లో ఇటీవల బెల్లాన భార్గవి ఒకే రోజు బంగారు, వెండి పతకాలను కై వసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే వేదికపై భార్గవికి స్వయాన అక్క హారిక కూడా బుధవారం పాల్గొని బంగారు పతకాన్ని సాధించింది. అంతర్జాతీయ వేదికపై హారిక అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది. స్నాచ్లో 86 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్లో 110 కిలోలు..మొత్తంగా 197 కిలోల బరువును లిఫ్ట్ చేసి విజేతగా నిలిచింది. ఒకే వేదికపై అక్కా చెల్లెళ్ల డబుల్ విజయం జిల్లాలో క్రీడా వాతావరణాన్ని మరింత ఉత్సాహపరిచింది. తల్లిదండ్రులు బెల్లాన శ్రీనివాసరావు, గౌరి ప్రోత్సాహం, కోచ్ వల్లూరి శ్రీనివాసరావు మార్గదర్శకత్వంతో విజయాన్ని సాధించినట్లు అక్కాచెల్లెళ్లు తెలిపా రు. వారిద్దరికీ జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు, సీనియర్ కోచ్ చల్లా రాము, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలంటూ ప్రోత్సహించారు. వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లో పతకాల పంట ఇటీవల బంగారు, వెండి పతకాలు సాధించిన చెల్లి తాజాగా బంగారు పతకాన్ని కై వసం చేసుకున్న అక్క -
మామిడి రైతు కుదేలు..!
● కళ తప్పిన మ్యాంగో మార్కెట్ ● తెగుళ్లతో నేలరాలుతున్న మామిడిపంట ● తగ్గిపోతున్న సాగు విస్తీర్ణంమెరకముడిదాం: ఏటా వేసవికాలంలో మామిడిపంట ఎగుమతులు, దిగుమతులతో కళకళలాడిన విజయనగరం జిల్లా మార్కెట్ ఈ ఏడాది దిగుబడిలేక వెలవెల బోతోంది. దీర్ఘకాలంగా మామిడిపంట సాగుతో జీవనం సాగించే రైతాంగానికి వాతావరణ ప్రతికూలతతో పంట పాడై పోగా ఉన్న పంట కాస్తా తెగుళ్లతో పూత, పిందెరాలిపోవడంతో మిగిలిన పంటను కొనేవారు ముందుకు రాక మామిడిరైతులు కుదేలవుతున్నారు. విజయనగరం జిల్లావ్యాప్తంగా 30,940 ఎకరాల్లో మామిడిపంటను రైతులు సాగుచేస్తున్నారు. అయితే మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న బంగినపల్లి, సువర్ణరేఖ రకాల మామిడిపంట దిగుబడి పూర్తిస్థాయిలో తగ్గిపోవడంతో ఢిల్లీ, హైదరాబాద్, కోల్కత్తా, చైన్నై, తదితర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు ఈ ఏడాది ముఖం చాటేసే పరిస్థితి నెలకొంది. మామిడి సీజన్లో ఎగుమతి, దిగుమతులపై కూలీలు, దళారులు, లారీలు, ట్రాక్టర్లు, వ్యాన్ల డ్రైవర్లు వందలాదిమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిపొందుతుండగా, మార్కెట్ ప్రతికూలతతో వారంతా రోడ్డునపడే పరిస్థితి నెలకొంది. తెగుళ్లతో నష్టాలు: ఏటా పూతదశలోనే ప్రారంభమవుతున్న తెగుళ్లు పిందెదశలో ఉధృతమై కాపు నేలరాలిపోయి రైతులు తీవ్రనష్టాలు చవిచూస్తున్నారు. ఈ ఏడాది సైతం నల్లతామర, తేనెమంచు తెగుళ్లతో పాటు ఇతర తెగుళ్ల కారణంగా చాలా వరకూ మామిడిపంట నేలరాలిపోయింది. దీనికి తోడు ఇటీవల వచ్చిన ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా చాలావరకూ పంట నేలరాలిపోగా, ఉన్న కాస్త పంట వర్షం కారణంగా పురుగు పట్టిపోతుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. అయితే ప్రస్తుతం పనుకులు రకం సీజన్ ప్రారంభంలో ఆశాజనకంగా ఉన్నప్పటికీ మార్కెట్లో గిరాకీ లేకపోవడంతో తక్కువధరకే అమ్మకోవలసిన పరిస్థితి నెలకొంది. వాతావరణ ప్రభావంతో రైతులు భయపడి సీజన్ ప్రారంభం నుంచే ఎదుగుదల రాకపోయినా కాయలు కోసి అమ్మేసుకోవడంతో ధర గిట్టుబాటు కావడంలేదు. సీజన్ మొదటిలో పనుకులు రకం టన్ను రూ.35 వేలు పలకగా, ప్రస్తుతం సగం ధర కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు. బంగినపల్లిలో నంబర్ వన్ రకం– టన్ను రూ.60 వేలకు పైగా ధర పలుకుతున్నప్పటికీ మార్కెట్లో ఈ రకం పెద్దగా కనిపించడంలేదు. మామిడి రుచి చూద్దామని ఆశించేవారికి డజను కాయలు వందలాదిరూపాయల ధర పలుకుతుండడంతో కొనేందుకు వెనక్కి తగ్గుతున్నారు.పూర్తిగా నష్టపోయాం..మామిడితోటలు సాగు చేస్తే గతంలో మంచి దిగుబడి వస్తుండడంతో మంచి రాబడి వచ్చేది, దానికి తగిన లభాలు వచ్చేవి. గత నాలుగేళ్లుగా దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది, కాస్తో, కూస్తో దిగుబడి వస్తుందంటే ఆపంట ప్రకృతి కన్నెర్రకు నేలపాలవుతోంది. ప్రతి ఏడాది లక్షల్లో మదుపులు పెట్టినప్పటికీ తగిన దిగుబడి రాకపోవడంతో పూర్తిగా నష్టపోతున్నాం. గత ప్రభుత్వ హయాంలో మామిడిపంటపై బీమా ఉండేది. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా..భయం ఉండేది కాదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల నుంచి రైతులు బీమా కడుతున్నప్పటికీ విపత్కరపరిస్థితుల్లో ఆ బీమా రావడంలేదు, ఎందుకో అర్థం కావడంలేదు. మామిడిపంటతో నష్టపోయిన మమ్మల్ని ప్రభుత్వమే అన్ని విధాలా ఆదుకోవాలి. శిరువూరు నారాయణమూర్తిరాజు, సువర్ణరేఖ మామిడిరైతుల సంఘం అధ్యక్షుడు, సోమలింగపురం -
చుక్కానిలా డీవీజీ కథలు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్ర జిల్లాలు కథలకు పుట్టినిల్లు అని మరోసారి రుజువైందని, డాక్టర్ డీవీజీ శంకరరావు కథలు చుక్కానిలా ఉన్నాయని సాహితీవేత్త అట్టాడ అప్పలనాయుడు అన్నారు. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో చీకటి దివాకర్ అధ్యక్షతన మహాకవి శ్రీశ్రీ జయంతి, మేడే పురస్కరించుకుని డాక్టర్ డీవీజీ శంకరరావు కథల సంపుటి పుస్తకావిష్కరణను జెడ్పీ మీటింగ్ హాల్లో బుధవారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ ఎం.జై చంద్రనాయుడు అధ్యక్ష ఉపన్యాసం చేశారు. అణగారిన వర్గాల కోసం, స్వేచ్ఛాజీవనం కోసం, కార్మికుల హక్కుల కోసం, ప్రజాస్వామ్య విలువలు కాపాడడం కోసం శ్రీశ్రీ రచనలు చేశారన్నారు. డాక్టర్ ఎం.రమాగీతాదేవి, పాయల మురళీకృష్ణ పుస్తక సమీక్ష చేశారు. డీవీజీ రచనలు మానవత్వాన్ని మృదువుగా తాకే స్పర్శ రేఖలని, వైద్యునిగా పొందిన అనుభవాలు, జీవిత సత్యాలు వారి కలంలో జీవం పోసుకుని మన ముందుకు వచ్చాయన్నారు. అనంతరం ఇటీవల మృతిచెందిన షేక్ భాషా, కె.వి.శేషారావు, ఎల్.ఆర్.స్వామిలకు సభ నివాళులర్పించింది. ఎస్.శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు. -
కార్మికుల స్వీయగణన నమోదు తప్పనిసరి
● జిల్లా కార్మికశాఖ ఉప కమిషనర్ ఎస్డీవీ.ప్రసాదరావువిజయనగరం గంటస్తంభం: జిల్లాలోని దుకాణాలు,వాణిజ్య సంస్థలు, ఇతర ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులంతా స్వీయగణన నమోదు చేసుకోవాలని కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎస్డీవీ.ప్రసాదరావు బుధవారం ఒక ప్రకటనలో తెలపారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ పథకాల సక్రమ అమలుకు ఈ నమోదు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రతి కార్మికుడు తన వ్యక్తిగత వివరాలు, ఉద్యోగానికి సంబంధించిన సమాచారం సరైన విధంగా నమోదు చేసుకోవాలని సూచించారు. స్వీయగణన ద్వారా కార్మికుల పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందుబాటులోకి వచ్చి, భవిష్యత్తులో సంక్షేమ పథకాల అమలు మరింత సులభతరం అవుతుందని తెలిపారు. జిల్లాలోని కార్మిక సంఘాల నాయకులు, యాజమాన్యాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించాలని కోరారు. ముఖ్యంగా తమ సంఘాలకు చెందిన కార్మికులు తప్పనిసరిగా స్వీయగణనలో నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. కార్మికుల భద్రత, హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డెంకాడ: మండలంలోని చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్లో ఉన్న ఎస్వీఎస్ ఏపీఎస్పీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బెటాలియన్ కమాండెంట్ వై.రవిశంకర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నర్సరీ, యూకేజీ తరగతులకు ఒక పోస్టు, 1నుంచి 5వ తరగతి బోధించేందుకు ఇంటర్, బీఏ, బీఎస్సీలతో పాటు టీపీటీ, హెచ్పీటీ, డీఈడీల అర్హత కలిగిన వారితో 4 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని వివరించారు. 6నుంచి 10వ తరగతి వరకూ హిందీ బోధించేందుకు బీఏతో పాటు హిందీ పండిట్ విద్యార్హత అని తెలిపారు. కంప్యూటర్ తరగతులు బోధించేందుకు 1 ఉపాధ్యాయ పోస్టు ఉందని, దీనికి బీసీఏ, బీఎస్సీ, బీఈ, బిటెక్ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. దరఖాస్తులను rvremschool @gmail.com గాని, వాట్సాప్ నంబర్ 73282234573కు గానీ పంపగలరన్నారు. అడ్మినిస్ట్రేషన్ 9573184185, స్కూల్ కాంటాక్ట్ నంబర్ 7382234573, బీడబ్ల్యూ అధికారి ఎన్.గణేష్ 9440906345కు ఫోన్ చేసి మరింత సమాచారం కోసం సంప్రదించాలని సూచించారు. -
ఏనుగుల సంచారంతో భయాందోళన
గరుగుబిల్లి: ఏనుగుల సంచారంతో మండలంలోని ప్రజలు భీతిల్లుతున్నారు. నందివానివలసలోని తామరచెరువు, పంటపొలాల్లో సంచరించిన ఏనుగులు బుధవారం సాయంత్రానికి తోటపల్లి గ్రామ పరి సరాల్లో సంచరిస్తున్నాయి. కొద్ది రోజులనుంచి ఈ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తుండంతో ఎప్పుడు ఏ గ్రామంలో ఎవరికి హాని చేస్తాయోనని రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వేసవి పంటలు ఉండడంతో రైతులు పొలం పనులు చేపట్టేటప్పుడు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భీతిల్లుతున్నారు. ఏనుగులను తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఏనుగులను తరలించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
జిల్లా కేంద్రంలో చాగంటి ప్రవచనం
● హాజరైన హైకోర్టు జడ్జి దంపతులుపార్వతీపురం: ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన వక్త, ప్రభుత్వ ఆధ్యాత్మిక సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం భక్తులను ఆకట్టుకుంది. బెలగాంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి శతాబ్ది ప్రయుక్త నవాహ్నిక కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన సభలో ఆయన ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పారు. ధర్మం, నైతిక విలువలు, కుటుంబ జీవన విధానం, భక్తిమార్గం తదితర అంశాలపై ఆయన చేసిన ప్రవచనాలు అన్ని వర్గాలవారిని ఆకర్షించాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న చాగంటి పార్వతీపురం పట్టణం రావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. కార్యక్రమంలో హైకోర్టు జడ్జి సీహెచ్.మానవేంద్రనాఽథ్ రాయ్ దంపతులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
పాలకొండ: విద్యార్థులు క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేపట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రిన్సిపాల్ శ్యామ్బాబు అన్నారు. పాలకొండ డిగ్రీ కళాశాలలో బుధవారం రసాయన శాస్త్రంపై అంతర్జాతీయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల వర్సిటీల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు రసాయన శాస్త్రం ప్రాధాన్యత, ప్రాముఖ్యతను వివరించారు. ఆదికవి నన్నయ్య వర్సిటీ ప్రొఫెషర్ బి.జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యం, శక్తి, పర్యావరణ స్థితి స్థాపకత, సుస్థిరతకు రసాయన శాస్త్రం ఎంతగా దోహదపడుతుందని వివరించారు. ఐఐటీ పట్నా ప్రొఫెషర్ టి.రాజగోపాల్, ఐఐటీ తిరుపతి ప్రొఫెషర్ ఎస్.సోమేశ్వరరావు, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ ఎస్.శర్మ, ఆర్కేసీ యమజాల, పాలకొండ కళాశాల అధ్యాపకుడు ఎస్.రామకృష్ణ వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ బి.జయమని, అధ్యాపకులు బి.రాజు, ఎం.శాంతి, కె.శ్రీనివాసరావు, పి.రాజ్యలక్ష్మి, ఎ.శ్రీనివాసరావు, ఎస్.జగన్మోహనరావు పాల్గొన్నారు. -
గడువులోగా రీ సర్వే
విజయనగరం అర్బన్: జనవరి నెల నుంచి ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్న రీ సర్వే, పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ కార్యక్రమాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన తన కార్యాలయం నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వే సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రీ సర్వే, పాస్పుస్తకాల ముద్రణ ప్రక్రియలను సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. జనవరి నుంచి కొనసాగుతున్న రీసర్వే పనులను మండల, గ్రామాల వారీగా సమీక్షించారు. సర్వే పూర్తయ్యాక సర్టిఫికెట్లు అందడం లేదని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో.. సర్వే అనంతరం తప్పనిసరిగా సర్టిఫికెట్లు ఇవ్వాలని సూచించారు. 2026 జనవరి వరకు పంపిణీ చేసిన పాస్పుస్తకాలలో ఉన్న తప్పులను సరిచేసిర ఇవ్వాలని ఆదేశించారు. కాన్ఫరెన్స్లో డీఆర్ఓ సీహెచ్.సత్తిబాబు, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. జేసీ సేతు మాధవన్ -
అసంతృప్తిదారులు x తహసీల్దార్లు
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్: మండల స్థాయిలో రెవెన్యూ సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. చాలావరకు సమస్యలకు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, అశ్రద్ధ, అవినీతి కారణమవుతోంది. ప్రతి సోమవారం పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ వంటివి నిర్వహిస్తున్నా.. ఆ దరఖాస్తులు మళ్లీ మండల కార్యాలయాలకే వెళ్లడం.. యథాస్థితిలో సమస్య ఉండిపోవడం పరిపాటిగా మారింది. ఇందువల్లే అర్జీదారులు పదేపదే అవే వినతులను తిప్పుతున్నారు. ఈ సమస్యను గుర్తించే కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి ప్రత్యేక కార్యక్రమం అమలుకు సిద్ధమయ్యారు. రెవెన్యూ సమస్యలపై అసంతృప్తి అర్జీదారులతో ముఖాముఖి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. గతంలో ప్రజావాణి, స్పందన, పీజీఆర్ఎస్ వేదికల ద్వారా అందిన వినతులపై ఇంకా పరిష్కారం లభించలేదని పేర్కొన్న అర్జీదారులను ప్రత్యేకంగా పిలిపించి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. భూ వివాదాలు, పట్టాదారు పాస్పుస్తకాలు, ఆర్ఓఆర్ నమోదు, వారసత్వ మార్పులు, సరిహద్దు వివాదాలు, ఆక్రమణల తొలగింపు, భూమి రికార్డుల సవరణలు తదితర అంశాలపై సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం 50 అర్జీలు అందాయి. ఇవన్నీ గతంలో వచ్చినవే. ఇప్పుటికే వీటిపై పలుమార్లు దరఖాస్తులు అందించారు. తహసీల్దార్ల వద్దే సమస్య పరిష్కారం కావడం లేదని గుర్తించిన కలెక్టర్.. అన్ని మండలాల నుంచీ వారిని పిలిపించారు. కలెక్టర్ దగ్గరికి వెళ్లేలోపే సంబంధిత అర్జీదారులను ఆయా మండలాల తహసీల్దార్లు అడ్డుకోవడం గమనార్హం. ఇన్నాళ్లూ చేయలేనిది.. ‘రేపు ఉదయం మండల కార్యాలయానికి రండి.. మీ పని అయిపోతుంది.. కాగితం ఇచ్చేస్తాం’ అంటూ పంపించే ప్రయత్నం చేశారు. కొంతమంది చేసేది లేక.. అక్కడి నుంచి వెనుదిరగగా.. మరికొందరు అధికారులపై కోపంతో ఎన్నిసార్లు తిరిగినా తమ పని అవ్వడం లేదని కలెక్టర్ ప్రభాకర రెడ్డి, జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి, పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ సప్నిల్ జగన్నాథ్, జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలతల వద్ద మొర పెట్టుకున్నారు. ● పాలకొండ పరిధి వాటపాగు గ్రామానికి చెందిన శిల్లా భాస్కరరావుకు చెందిన భూముల్లో కొంతభాగం ఆన్లైన్ లో వేరొకరి పేరున చూపిస్తోంది. పత్రాలు పరిశీలించి, రీ సర్వే జరిపి తమ పేరిట వెబ్ ల్యాండ్లో నమోదు చేయాలని ఇప్పటికే పలు దఫాలు వారు విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో కలెక్టర్ ఎదుట నేరుగా చెప్పుకుందామని వచ్చారు. ● పార్వతీపురం మండలం సంగంవలస పంచాయతీ మడకవానివలసకు చెందిన రాయల రాములు.. తన తండ్రి పేరున పార్వతీపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో క్రమంగా దాఖలు పడిన భూములు ఉన్నాయని, ఇప్పుడు ఆ భూములను వంగపండు భాస్కరరావు, వంగపండు జయమ్మ, సుశీలమ్మ తదితరులు అక్రమంగా ఆక్రమించుకుని దున్నుతున్నారని తెలిపారు. పార్వతీపురం తహసీల్దార్, గ్రామ రెవెన్యూ అధికారికి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ కలెక్టర్కు దరఖాస్తు అందజేశారు. అసంతృప్తి అర్జీదారులతో కలెక్టర్ ముఖాముఖి అవే సమస్యలు పునరావృతం అర్జీలు ఇవ్వనీయకుండా అడ్డుపడిన తహసీల్దార్లు!సాలూరు మండలం కొదమ పంచాయతీ సిరివర గ్రామానికి చెందిన అన్నదమ్ములు సీదిరపు శ్రీరాం, శోభన్ కుమార్ అనే గిరిజనులు తమ తాతల కాలం నుంచి 4.15 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నామని తెలిపారు. భూమి హక్కుకు సంబంధించిన అన్ని కాగితాలూ వారి వద్ద ఉన్నాయి. సుమారు రెండేళ్ల నుంచి ఆ భూమికి వేరొకరు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. గతంలో వీరు పలుమార్లు అధికారులను కలిశారు. ఎక్కడా న్యాయం జరగడం లేదని చెబుతున్నారు. -
‘బెట్టింగ్ మాయాజాలం‘ షార్ట్ ఫిల్మ్ ఆవిష్కరణ
విజయనగరం క్రైమ్: క్రికెట్ బెట్టింగ్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ జిల్లా పోలీసుశాఖ ప్రత్యేకంగా రూపొందించిన ‘బెట్టింగ్ మాయాజాలం‘ అనే షార్ట్ ఫిల్మ్ ను ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ డీపీఓలోని తన చాంబర్లో బుధవారం ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ యువత క్రికెట్ బెట్టింగులకు పాల్పడి పెద్ద మొత్తంలో డబ్బులు నష్టపోవడంతో పాటు, చదువులను నిర్లక్ష్యం చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. క్రికెట్ బెట్టింగులు, ఇతర ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వల్ల యువత ఏవిధంగా ప్రభావానికి గురవుతున్నది, వారి జీవితాలను ఏవిధంగా నాశనం చేసుకుంటున్నది, డబ్బులను ఎలా నష్టపోతున్నది అన్న విషయాల పట్ల అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ‘బెట్టింగ్ మాయాజాలం‘ అనే షార్ట్ ఫిల్మ్ ను రూపొందించామన్నారు. ఈ షార్టు ఫిల్మ్ ను పోలీసు అధికారులు, సిబ్బంది గ్రామ సందర్శన, కళాశాలల్లో నిర్వహించే అవగాహన సదస్సుల్లోను ప్రదర్శించి, బెట్టింగుల వలన కలిగే అనర్థాలను వివరిస్తారని ఎస్పీ తెలిపారు. అంతేకాకుండా, సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది ప్రజలకు చేరే విధంగా చర్యలు చేపడతామన్నారు. బెట్టింగులను నియంత్రించేందుకు పోలీసు అధికారులు తమ స్టేషన్ పరిధిలోని లాడ్జిలు, హాస్టల్స్, విద్యార్థులు, యువత ఎక్కువగా గుమిగూడే కళాశాలలు, శివారు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. తనిఖీలు చేపట్టే సమయంలో యువత మొబైల్ ఫోన్లను పరిశీలించి, వారి మొబైల్స్ లోని బెట్టింగ్ యాప్లు తొలగిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సిఐ కె.కుమారస్వామి పాల్గొన్నారు. -
ఫిన్సంజీవితో జేఎన్టీయూ జీవీ ఎంఓయూ
విజయనగరం రూరల్: విద్యార్థుల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడమే లక్ష్యంగా జేఎన్టీయూ–జీవీ ఫిన్సంజీవి ఎడ్యువెల్త్ సర్వీసెస్తో బుధవారం అవగాహన (ఎంవోయూ) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా జేఎన్టీయూ–జీవీ ప్రిన్సిపాల్ కేసీబీ రావు, ఫిన్సంజీవి సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్రీను మాడెం అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసి అందిపుచ్చుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఒప్పందంతో విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత, సంపద నిర్వహణపై అవగాహన, వృత్తి మార్గదర్శకత్వాన్ని ప్రోత్సహించడం, పెట్టుబడి వ్యూహాలు, ఉద్యోగ అవకాశాలు, వర్క్షాపులు, సెమినార్ల నిర్వహణ వంటి కార్యకలాపాలు అందించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఉచితంగా అనేక శిక్షణ కార్యక్రమాలు అందించనుందన్నారు. ● ఆగి ఉన్న లారీని వ్యాన్ ఢీకొట్టడంతో ప్రమాదం గజపతినగరం: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో జాతీయ రహదారి వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వ్యాన్ ఢీ కొట్టడంతో ఒవ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. రామభద్రపురం నుంచి విజయనగరం వస్తున్న వ్యాన్ ఎదురుగా వస్తున్న మరో భారీ వాహనం లైటింగ్ వల్ల ఆగి ఉన్న లారీ కనిపించక పోవడంతో లారీ వెనుక బాగాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో జరిగిన ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ పక్క సీట్లో ఉన్న విజయనగరానికి చెందిన పి.ప్రశాంత్ (36)అనే వ్యక్తి ఎడమకాలికి రెండు చోట్ల ఫ్రాక్చర్ అయింది. దీంతో108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించి వైద్య సేవలు అందించారు. గజపతినగరం ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రుడు ప్రశాంత్ను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యులు తరలించారు.అక్కడి నుంచి కుటుంబసభ్యులు ఓప్రై వేట్ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. లారీని ఢీకొట్టిన వ్యాన్ ముందు భాగం అంతా నుజ్జునుజ్జయింది. ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు సంఘనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బుధవారం తెలిపారు. గంజాయి ధ్వంసం విజయనగరం రూరల్: ఎకై ్సజ్ శాఖాధికారులు గతంలో స్వాధీనం చేసుకున్న 841.962 కిలోల గంజాయిని బుధవారం ధ్వంసం చేసినట్లు డిప్యూటీ కమిషనర్ వై.శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలో వివిధ కేసుల్లో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయిని విశాఖ జిల్లా భీమిలి మండలం కాపులుప్పాడలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ వద్ద ధ్వంసం చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎ.సి పైడి రామచంద్రరావు, ఈఎస్ బమ్మిడి శ్రీనాథుడు, విజయనగరం ఎకై ్సజ్స్టేషన్ సీఐ కె.మన్మధకుమార్, ఎస్.కోట సీఐ, జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. పరిశ్రమల స్థాపనకు త్వరితగతిన అనుమతులు విజయనగరం గంటస్తంభం: పరిశ్రమల స్థాపన, నిర్వహణకు అవసరమైన అనుమతులను వేగవంతంగా జారీ చేస్తూనే కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీపీసీబీ ఈఈ సరిత తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సూత్రాలకు అనుగణంగా సీటీఈ, సీటీఓ దరఖాస్తులను ఏపీఓసీఎంఎంఎస్ ద్వారా సులభంగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్ కేటగిరీల పరిశ్రమలకు గడువులోపు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ పరిశ్రమల తనిఖీలు క్రమంతప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల యాజమాన్యాలు నిబంధనలు పాటిస్తూ ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించి సేవలను వినియోగించుకోవాలని కోరారు. -
హత్యాయత్నం వెనుక ఎవరున్నారు?
అమానుషం సాలూరు రూరల్: సాక్షి సాలూరు టీవీ రిపోర్టర్ శ్రీనివాస్పై బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేయడాన్ని ఎస్ఎఫ్ఐ పార్వతీపురం మన్యం జిల్లా నాయకులు హెచ్.సింహాచలం, బి.అనిల్ ఖండంచారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విలేకర్ల పైదాడి మీడియా స్వేచ్ఛను హరించడమేనన్నారు. వారి వెంట ఎస్ఎఫ్ఐ నాయకులు సురేష్, ఎ.గంగారావు ఉన్నారు. మోహన్పై దాడి జరిగిన సంఘటలను గుర్తుచేశారు. ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యానికి మాయనిమచ్చగా పేర్కొన్నారు. నిందితులను పట్టుకోకుంటే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్పై హత్యాయత్నం దుండగుల దాడితో తీవ్ర గాయాలు నిందితులను తక్షణమే అరెస్టు చేయాలంటూ జర్నలిస్టు సంఘాల ఆందోళన బాధితుడిని పరామర్శించిన జెడ్పీ చైర్మన్, మాజీ డిప్యూటీ సీఎం -
సాక్షి టీవీ రిపోర్టర్పై దుండగుల దాడి
సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: సాలూరులో సాక్షి టీవీ రిపోర్టర్ నల్లి శ్రీనివాసరావుపై గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు దాడికి తెగబడటం తీవ్ర సంచలనం రేపుతోంది. పట్టపగలు, అదీ సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగానే దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఎంపీడీవో కార్యాలయం నుంచి మరో రిపోర్టర్తో కలిసి బైక్పై వస్తున్న శ్రీనివాసరావును ముగ్గురు దుండగులు బైక్పై వెంబడించి, పోలీస్ స్టేషన్ సమీపంలో అడ్డగించి విచక్షణారహితంగా దాడి చేశారు.నిందితులు పిడిగుద్దులతో విరుచుకుపడటంతో శ్రీనివాస్ తలకు తీవ్ర గాయమై రక్తస్రావం జరిగి అక్కడికక్కడే స్పృహ కోల్పోయారు. గమనించిన స్థానికులు వెంటనే ఆయన్ను సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించగా, విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై పోలీస్ స్టేషన్ ముందే దాడి జరగడంపై విలేకరుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.సాలూరులో దాడికి గురైన శ్రీనివాసరావును మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర పరామర్శించారు. సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన ఆయన, బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. ప్రశాంతమైన సాలూరులో ఇలాంటి దారుణ ఘటన జరగడాన్ని రాజన్నదొర తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం వల్లే ఇలాంటి దురాగతాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జర్నలిస్టులపై దాడులు జరగడం దురదృష్టకరమన్న ఆయన, శ్రీనివాసరావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
మద్యం ఫుల్.. పెట్రోల్ నిల్..!
పాలకొండ: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో మద్యం ఊరూరా దొరుకుతోందని, ఆయిల్ కొరత ఉన్నా పట్టించుకునేవారే కరువయ్యారని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతిలు ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ పాలకొండ పట్టణంలోని ప్రధాన రహదారిలో ఉన్న పెట్రోల్ బంకు వద్ద మంగళవారం ధర్నా చేశారు. దేశంలో ఎక్కడా లేని ఆయిల్ కొరత ఒక్క ఏపీలోనే వెంటాడుతుందన్నారు. ఆయిల్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. డీజిల్, పెట్రోల్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పెట్రోల్, డీజిల్ కోసం బంకుల్లో గంటల తరబడి వేచి ఉన్న వాహనచోదకులకు మజ్జిగ పంపిణీ చేశారు. వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేస్తున్న ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి -
సరైన పరిహారం ఇవ్వకుండానే భూసేకరణ
● హ్యాపీ హోం లేఅవుట్ బాధితుల అందోళనకొత్తవలస: రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం గ్రామం సమీపంలో గల హ్యాపీ హోం లేఅవుట్లో గల ప్లాట్ల యజమానులకు సరైన పరిహారం ఇవ్వకుండానే అదికారులు భూసేకరణ చేసేశారని సంబంధిత లేఅవుట్ ప్లాట్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేసుకున్న యజమానులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంబంధిత లేఅవుట్లో సుమారు 30 సంవత్సరాల క్రితం నివాస అవసరాలకు ప్లాట్లను కొనుగోలు చేసుకున్నామని అప్పట్లో గజాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నామని, పరిహారం మాత్రం సెంట్లలో ఇచ్చారని ఈ ప్రక్రియ వల్ల తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. ప్రభుత్వానికి గజాల్లో చలానాలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అధికారులు మాత్ర సెంట్లలో పరిహారం అందజేశారని ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. నేషనల్ హైవే అధికారులు, రెవెన్యూ అధికారులకు ఎన్ని మార్లు మొరపెట్టుకున్నా కనీసం పట్టించుకోలేదని వాపోయారు.ఇప్పటికై నా జిల్లా మెజిస్ట్రేట్ అయిన కలెక్టర్ స్పందించి తగు న్యాయం చేయాలని కోరారు.కార్యక్రమంలో పలువురు ప్లాట్లు కోల్పోయిన యజమానులు పాల్గొన్నారు. -
వైభవంగా రామాయణ పారాయణం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో భగవత్ రామానుజదాస బృందం ఆధ్వర్యంలో సహస్ర శ్లోక రామాయణ పారాయణం మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. 24వేల శ్లోకాలతో ఉన్న వాల్మీకి రామాయణాన్ని వెయ్యి శ్లోకాలుగా తయారు చేయించి ఆ గ్రంథాన్ని మొదటిగా భధ్రాచలం క్షేత్రంలో పారాయణం చేసినట్లు బృంద ప్రతినిధి శ్రీమాన్ కందాల రాజగోపాలాచార్యులు తెలిపారు. అనంతరం శ్రీరంగం, శ్రీకూర్మం, సింహాచలం, పద్మనాభం వంటి దివ్య క్షేత్రాల్లో పారాయణం చేసినట్లు వివరించారు. ఈ మేరకు రామతీర్థంలో 108వ సహస్ర శ్లోక రామాయణ పారాయణం చేసి పట్టాభిషేకం జరిపించామని చెప్పారు. కార్యక్రమంలో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
తీర్థాల్లో గ్రామీణ సంస్కృతి ఉట్టిపడాలి
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావులక్కవరపుకోట: గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న అమ్మవారి పండగలు, తీర్థాలు, జాతరలు పల్లె సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉండాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిష్త్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు మండలంలోని తలారి గ్రామంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు గుమ్మడి సత్యనారాయణ (సింగపూర్) ఆధ్వర్యంలో సోమవారం సత్యవమ్మ పేరంటాలు అమ్మవారి తీర్థం అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు హాజరయ్యారు. ముందుగా గ్రామం సమీపంలో గల సత్యవమ్మ పేరంటాలు అమ్మవారి ప్రాంగణంలో జిల్లా స్థాయి సీనియర్, జూనియర్ స్థాయిల్లో ప్రతిభా పరీక్షలను నిర్వహించారు.ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు భారీఎత్తున నగదు బహుమతులను అందజేశారు. అలాగే జిల్లా స్థాయి కోలాటం పోటీలను నిర్వహించి మహిళలకు నగదు బహుమతి అందజేశారు. అనంతరం రాష్ట్రస్థాయి గుర్రాలు, ఎడ్ల పరుగు ప్రదర్శన పోటీలను నిర్వహించారు. ఈ పోటీలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగాయి. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన గుర్రాలు, ఎడ్ల బళ్ల యజమానులకు రూ.30 వేలు, రూ.25వేలు చొప్పున జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చేతులమీదుగా నిర్వాహకులు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాసరావు, కేఏ నాయుడు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడుబాబు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొరపల్లి జయప్రకాష్ స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ గుమ్మడి స్వాతికుమారి, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
వ్యక్తి అదృశ్యం
విజయనగరం క్రైమ్: తన తండ్రి నడిపల్లి రమణ(58) కనిపించడం లేదంటూ కూతురు పావని విజయనగరం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేసింది. మతిస్థిమితం లేని కారణంగా రమణ ఈనెల 15వ తేదీన రాత్రి 8.30 గంటలకు ఇంటినుంచి బయటకు వెళ్లి నేటి వరకు తిరిగి రాలేదని కూతురు పావని ఫిర్యాదులో పేర్కొంది. సీఐ చౌదరి ఆదేశాలతో ఆవాల రమణ విచారణాధికారిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హెచ్సీకి తీవ్ర గాయాలు● బైక్ను కారు ఢీకొట్టడంతో ప్రమాదం గజపతినగరం రూరల్: మండలంలోని మధుపాడ 26వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గంట్యాడ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఎ. శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం, హెడ్కానిస్టేబుల్ శ్రీనివాసరావుకు బొబ్బిలి దాడి తల్లి అమ్మవారి బందోబస్తుకు డ్యూటీ పడింది. ఇందులో భాగంగా విధుల నిమిత్తం శ్రీనివాసరావు తన మోటార్ సైకిల్ పై మంగళవారం సాయంత్రం బొబ్బిలి వెళ్తుండగా మండలంలోని పాలధార చెరువు వద్దకు వచ్చేసరికి బొబ్బిలి నుంచి వస్తున్న కారు బలంగా ఢీకొంది. దీంతో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కు బలంగా గాయాలయ్యాయి. అదే సమయంలో అటువైపు వెళ్తున్న ఆటో డ్రైవర్ బి.బలరాం తన ఆటోలో క్షతగాత్రుడు శ్రీనివాస రావును ఎక్కించి గజపతినగరం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేర్పించాడు. ఇక్కడ ప్రథమ చికిత్స అందించిన వైద్యులు వెంటనే మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్లో విజయనగరం కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ మితిమీరిన వేగంతో అజాగ్రత్తగా నడపడమే ప్రమాదానికి కారణమని ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. రెండు బైక్లు ఢీకొని ఇద్దరు యువకుల మృతిపార్వతీపురం రూరల్/గుమ్మలక్ష్మీపురం: ఇద్దరు యువకులు శుభకార్యానికి ఆహ్వానించేందుకు వెళ్తుండగా, మరో ఇద్దరు అశుభకార్యానికి వెళ్లి వస్తున్నారు. విధి ఆడిన వింత నాటకంలో ఎదురెదురుగా వచ్చిన రెండు బైక్లు ఢీకొని ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన మంగళవారం గుమ్మలక్ష్మీపురం మండలం బెల్లిడి గ్రామ సమీపంలో జరిగింది. కురుపాం మండలం తియ్యలవలస గ్రామానికి చెందిన ఊయక గణేష్, సింహాచలం ఒక శుభకార్యానికి సంబంధించి కార్డులు పంచేందుకు స్కూటీపై గొరడ వైపు వెళ్తున్నారు. అదే సమయంలో బొడ్లగూడ గ్రామానికి చెందిన కొండగొర్రి మన్మథరావు (25), కిల్లక కార్తీక్ రేగిడిలో జరిగిన ఓ పెదకర్మ కార్యక్రమానికి హాజరై బైక్పై తిరిగి వస్తున్నారు. బెల్లిడి మలుపు వద్దకు వచ్చేసరికి రెండు వాహనాలు వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో మన్మథరావు అక్కడిక్కడే మృతి చెందగా, గణేష్ను పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు. గాయపడిన కార్తీక్, సింహాచలం ప్రస్తుతం జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రకృతి కరుణించక...
గతేడాది డిసెంబర్ నెలలో మంచు, ఎండ కారణంగా జీడి పూత తక్కువగా వచ్చింది. ఇటీవల కురిసిన ఆకాల వర్షాలు, ఈదురుగాలుల వల్ల చాలా వరకు పూత దెబ్బతింది. ప్రకృతి సహకారం లేక ఈ ఏడాది జీడి పంట దిగుబడి తగ్గింది. సాలూరు నియోజకవర్గం మక్కువ మండలంలో సుమారు 2 వేల ఎకరాలు, సాలూరు మండలంలో 3,400, పాచిపెంట 600 ఎకరాలు.. మొత్తం 6 వేల ఎకరాల్లో దాదాపు 5 వేల మంది రైతులు జీడి పంటను సాగు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కొనుగోలుకు జీడి ప్రొసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేయలేదు. ఫలితంగా రైతులు దళారుల చేతిలో దగా పడుతున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్సు కూడా లేకపోవడంతో రైతులు మరింత దారుణంగా నష్టపోతున్నారు. ఇదే సమయంలో ప్రైవేట్ జీడి పరిశ్రమ వారు.. పిక్కలు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు లాభపడడం గమనార్హం. -
ప్రమాద స్థలంలో విచారణ
● రవాణా శాఖ ఉపకమిషనర్ పరిశీలనపూసపాటిరేగ: మండలంలోని పూసపాటిరేగ పెట్రోల్ బంకు సమీపంలో సోమవారం జరిగిన ప్రమాదంపై విజయనగరం రవాణా శాఖ ఉపకమిషనర్ మణికుమార్ మంగళవారం విచారణ చేశారు. ప్రమాదం జరిగిన తీరుపై పరిసర ప్రాంతాల్లో ఉన్న దుకాణాల యజమానులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పలువురు తెలియజేశారు. పెట్రోల్ బంకు సమీపంలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన విశాఖపట్నానికి చెందిన కరుణాకరన్ శ్రీనివాసరావు(57),బొబ్బిలి మండలం జోగిపేటకు చెందిన కళ్లంపూడి సింహాచలం(50), శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం గంగుపేటకు చెందిన సదనపల్లి రాము, అదే గ్రామానికి చెందిన సదనపల్లి ఈశ్వరరావు మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన వ్యక్తికి విజయనగరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పూసపాటిరేగ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరన వేగమే ప్రమాదానికి కారణం పూసపాటిరేగ పెట్రోల్ బంకు సమీపంలో జరిగిన ప్రమాదంలో కారు మితిమీరిన వేగంతో వెళ్లూ అదుపు తప్పడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. భోగాపురం మండలం రాజాపులోవ జంక్షన్ నుంచి పూసపాటిరేగ మండలం కందివలస వరకు రాత్రి వేళల్లో జాతీయ రహదారిపైనే నో పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు నిలుపుదల చేయడంతోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడాదిగా జరిగిన ప్రమాదాల్లో ఎక్కువగా ఆగి ఉన్న లారీలను ఢీకొన్న సంఘటనల్లోనే ఎక్కువ ప్రమాదాలు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
ప్రభుత్వ ప్రోత్సాహం.. ఏజెన్సీ రైతులకు దూరం
ఏజెన్సీ మిళితమై ఉన్న పాలకొండ నియోజకవర్గంలో ప్రస్తుత సీజన్లో 34వేల ఎకరాలకు పైగా జీడిసాగుపై రైతులు ఆధార పడుతున్నారు. గిరిజన ఆవాసితమైన సీతంపేట మండల పరిధిలో సుమారు 10వేల మంది వరకూ గిరిజనులు 25 వేల ఎకరాల వరకు జీడి సేద్యం చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత సీజన్లో ప్రభుత్వం ద్వారా అందాల్సిన ప్రోత్సాహం గిరిజనులకు లేదు. హెక్టారుకు 600 కేజీల మేర దిగుబడి వస్తుండడంతో సంబంధిత రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. ప్రభుత్వం ద్వారా సరైన మద్దతు ధర కల్పించాల్సిన యంత్రాంగం.. ఆ దిశగా ఆడగులు వేయడం లేదు. దీంతో గిరిజన రైతులు దళారులు, వ్యాపారుల బారిన పడి నష్టపోతున్నారు. జీసీసీ – ఐటీడీఏ వన్ ధన్ (వీడీవీకెఎస్) వికాస్ కేంద్రాల ద్వారా కొనుగోలుకు పూర్తిస్థాయి చర్యలు చేపట్టలేదు. గతేడాది కిలో జీడిపిక్కలు రూ.155 వరకు కొనుగోలు చేసిన ప్రభుత్వం.. ఈ ఏడాది రూ.200లకు పైబడి మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాల్సి ఉండగా.. ఆ దిశగా చర్యలు లేవు. ప్రస్తుత సీజన్లో సేకరణ చేపట్టి ప్రాసెసింగ్ కేంద్రాల ద్వారా పిక్కల నుంచి పప్పును వేరుచేసి విక్రయించి, సరైన ధర అందించాల్సిన కేంద్రాలు తెరుచుకోలేదు. సీతంపేట మండల పరిధిలో జిల్లేడుపాడు శంభాం, సీతంపేటలో గల జీడి ప్రాసెసింగ్ కేంద్రాలు మరింత చురుగ్గా పనిచేయాల్సి ఉంది. -
మేడే ఉత్సవాలకు సన్నాహాలు పూర్తి
● వాల్పోస్టర్లు, కరప్రతాల ఆవిష్కరణవిజయనగరం గంటస్తంభం: ప్రపంచ కార్మిక హక్కుల దినోత్సవమైన మేడే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏఐసీసీటీయూ ఆధ్వర్యంలో సన్నాహాలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా మేడే ఉత్సవాలకు సంబంధించిన వాల్పోస్టర్లు, కరపత్రాలను మంగళవారం కొత్తదేవరవీధిలో గల కార్యాలయంలో ఆవిష్కరించారు. మే1వ తేదీ ఉదయం 10 గంటలకు కుప్పిలి వీధిలోని పైడిరాజమ్మ సామాజిక భవనంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు కామ్రేడ్ బొడ్డు వాసుదేవరావు ముఖ్య అతిఽథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐసీసీటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.రాజు పిలుపునిచ్చారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం మేడే పోరాటస్ఫూర్తిని కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో గిరిప్రసాద్, సన్యాసిరాజు, అప్పారావు, సత్యారావు, గోవింద్, అచ్చన్న, పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమల స్థాపనకు విస్తృత అవకాశాలు
పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు జిల్లాలో విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించాలని అధికారులకు సూచించారు. సీతంపేట మండలం పనుకు వలసలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో పరిశ్రమల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. యువత స్వయం ఉపాధి పథకాలను వినియోగించుకోవాలని, బ్యాంకులు రుణాల మంజూరులో సహకరించాలని సూచించారు. పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి జిల్లా ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. రుణాల మంజూరులో అలసత్వం వద్దు లబ్ధిదారులకు రుణాల మంజూరులో అలసత్వం చూపరాదని బ్యాంకు అధికారులను కలెక్టర్ ప్రభాకరరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ డేలో పెండింగ్ రుణాలపై సమీక్ష నిర్వహించారు. రుణ దరఖాస్తుల పరిశీలనలో ఆలస్యం, పత్రాల లోపాలు, సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో ఇంధన కొరత లేదు● జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి పార్వతీపురం: జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఇంధన కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం పట్టణంలోని పలు పెట్రోల్ బంకుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిల్వల వివరాలను పరిశీలించారు. ఎక్కడా స్టాక్ కొరత లేకుండా అవసరం అయినపుడు వెంటనే ఇండెంట్ పెట్టి సరఫరాను పునరుద్ధరించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగిన నిల్వలు ఉంచాలని యాజమాన్యాలను ఆదేశించారు. పుకార్లను నమ్మవద్దని ప్రజలను కోరారు. మే 2న బీసీ డెడికేటెడ్ కమిషన్ అధ్యక్షుడి రాకపార్వతీపురం: బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ మిశ్రా మే 2న విజయనగరం రానున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా వెనుకబడిన సంక్షేమ సాధికారి అధికారి ఇ.అప్పన్న మంగళవారం తెలిపారు. ఆరోజు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టర్ కార్యాలయంలో బీసీ సంఘాలు, కుల సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారన్నారు. పార్వతీపురం మన్యంజిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. బాలల హక్కుల పరిరక్షణ సామాజిక బాధ్యతసీతంపేట: బాలల హక్కుల పరిరక్షణను అందరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు చల్లా మధుసూదనరావు అన్నారు. ఈ మేరకు సీతంపేటలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో అంగన్వాడీలు, వీఆర్ఓలు, ప్రజలతో బాలల హక్కుల పరిరక్షణ, భద్రత, విద్య, ఆరోగ్య సమగ్ర వికాసంపై ఆయన మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలల సంరక్షణ అనేది కమిషన్, ఐసీడీఎస్తోపాటు ప్రజలందరి సమష్టి బాధ్యత అన్నారు. బాల్యవివాహాలను అంతా కలిసి సమూలంగా నిర్మూలించాలని కోరారు. పిల్లలను పనిలో పెట్టడం నేరమన్నారు. పాఠశాలల్లో డ్రాపౌట్లు లేకుండా ప్రతి చిన్నారిని బడికి పంపించేలా వారి తల్లిదండ్రులను చైతన్యం చేయాలంటూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన పాలకొండ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులను సన్మానించారు. -
మద్దతు కరువు.. దళారుల దరువు..!
సాక్షి, పార్వతీపురం మన్యం/పాలకొండ రూరల్/సాలూరు/గుమ్మలక్ష్మీపురం/పార్వతీపురం రూరల్: గిరిజన రైతులకు కల్పవృక్షంగా నిలవాల్సిన ‘తెల్ల బంగారం’ (జీడి) ఇప్పుడు వారి కళ్లల్లో కన్నీరు మిగులుస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కకపోవడం, ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో మన్యం రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జిల్లాలో సుమారు 99 వేల ఎకరాల్లో సాగువుతున్న జీడి పంటపైనే వేలాది గిరిజన కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. మార్కెట్లో గిరాకీ ఉన్నా.. ప్రభుత్వం నుంచి కొనుగోలుకు సహకారం లేకపోవడంతో రైతులు దళారుల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. పార్వతీపురం ఏజెన్సీలో 65 వేల ఎకరాలు, పాలకొండ ప్రాంతంలో 34 వేల ఎకరాల్లో జీడి సాగవుతోంది. హెక్టారుకు 600 కేజీల దిగుబడి వస్తున్నా, రైతుకు మాత్రం నష్టాలే మిగులుతున్నాయి. పంట ఆరంభం నుంచి తెగుళ్ల బెడద వేధిస్తున్నా.. అధికారుల నుంచి కనీస సలహాలు లేవు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన గిరిజనులు.. పంటను ఇళ్లలో నిల్వ చేసుకోలేక తెచ్చిన అప్పులు తీర్చలేక దళారులు నిర్ణయించిన ధరకే తెగనమ్ముకుంటున్నారు. మూలనపడిన ‘ప్రాసెసింగ్’ చక్రం.. గిరిజనులకు అండగా ఉండాల్సిన ప్రాసెసింగ్ యూనిట్లు పాలకుల నిర్లక్ష్యంతో మూలకు చేరాయి. గుమ్మలక్ష్మీపురం, కురుపాం, మక్కువ, సాలూరు ప్రాంతాల్లో లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన యూనిట్లు నిరుపయోగంగా మారాయి. ఎల్విన్ పేటలో భవనాల పరిశీలనతోనే కాలక్షేపం చేయగా.. పార్వతీపురంలోని కేంద్రం ముడిసరకు లేక మూతపడింది. సీతంపేట మండలం జిల్లేడుపాడు, శంభాం కేంద్రాలు కూడా అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. ఫలితంగా విలువైన యంత్రాలు తుప్పు పడుతున్నాయి. గతేడాది కిలో జీడిపిక్కలకు రూ.155 వరకు ధర పలికింది. ఈ ఏడాది పెట్టుబడి వ్యయం పెరగడంతో రూ.200 పైబడి మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. జీసీసీ, ఐటీడీఏ (వీడీవీకేఎస్) కేంద్రాలు కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో ప్రైవేటు వర్తకులు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తున్నారు. పప్పు వేరుచేసే ప్రక్రియ సరిగ్గా లేకపోవడంతో పంట విలువ పడిపోతోందని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆదుకోవాలని గిరిజన రైతులు కోరుతున్నారు. ముడి సరకుకూ డబ్బులు లేవాయే.. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని పార్వతీపురంలో వీడీవీకే గ్రూపు సభ్యులతో జీడి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు. దాదాపు రూ.కోటి వరకూ యూనిట్, ఇతర ఏర్పాట్లకు వ్యయం అయ్యింది. రోజుకు ఒక టన్ను చొప్పున.. ఏడాదికి సుమారు 300 టన్నుల వరకు ప్రాసెసింగ్ చేయాలని భావించారు. గత ఏడాది 48 మెట్రిక్ టన్నులు రైతుల నుంచి కొనుగోలు చేశారు. సుమారు రూ.75 లక్షల మేర పిక్కల కొనుగోలుకే ఖర్చు చేశారు. సరకు అయిపోయింది. ప్రాసెసింగ్ ఆగిపోయింది. ఇందుకు కారణం జీడిపిక్కల కొనుగోలుకు డబ్బులు లేకపోవడమే. నిధుల సేకరణ ఐటీడీఏకు భారంగా మారింది. పిక్క పచ్చిగా ఉండడం వల్ల కూడా కొనుగోలుకు ముందుకు రాలేకపోతున్నారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఎనిమిది మండలాల్లో రైతులకు ఎక్కడా మద్దతు దొరకడం లేదు. పార్వతీపురం వచ్చి వ్యాపారులకు విక్రయిస్తే.. కిలో రూ.145 నుంచి రూ.155 మధ్యలోనే కొనుగోలు చేస్తున్నారు. అది కూడా ఒక ధర స్థిరంగా ఉండడం లేదు. దిగుబడి తగ్గినా.. పెరగని ధర కురుపాం నియోజకవర్గంలోని కురుపాం, కొమరాడ, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో ఎక్కువ శాతం మంది గిరిజనులు జీడి సాగుపైనే ఆధారపడుతుంటారు. ఏటా జీడికి మార్కెట్లో మంచి గిరాకీ ఉండేది. ఒకానొక సమయంలో కేజీ జీడి రూ. 200 వరకు ధర పలకగా.. ఈ ఏడాది మాత్రం కేజీ ధర రూ.145కి పడిపోయింది. దీంతో జీడిరైతు లబోదిబోమంటున్నాడు. ధర పడిపోవడానికి ముఖ్య కారణం పూర్తిస్థాయిలో జీడిలో నాణ్యత లేక పోవడమేనని వ్యాపారులు చెబుతున్నారు. పూర్తి స్థాయిలో జీడి పిక్కలు ఎండినవి వస్తే మార్కెట్లో డిమాండ్ ఉంటుందని.. పచ్చిగా ఉండటంతో ప్రస్తుతం మార్కెట్లో ధర తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి దిగుబడి తక్కువగా ఉంటే మార్కెట్లో ధర పెరగాలి. ఇప్పుడు దిగుబడి తక్కువగా ఉన్నా.. ధర లేదని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీడీపిక్కలను గ్రేడింగ్ చేస్తున్న సిబ్బంది విలవిల్లాడుతున్న జీడి రైతులు ప్రాసెసింగ్ లేదు.. ప్రోత్సాహం దొరకదు తెల్లబంగారానికి కొరవడిన ఆదరణ లక్షలు వెచ్చించినా మూలకే ప్రాసెసింగ్ యూనిట్లు -
పెట్రోల్..కష్టాల్..!
● బారులు తీరిన వాహనాలు ● వినియోగదారులకు తప్పని అవస్థలు ● బంకుల నుంచి బ్లాక్ మార్కెట్కు తరలింపు ● బంకుల వద్ద పోలీసుల పహారాపాలకొండ: పాలకొండ డివిజన్ కేంద్రంలో పెట్రోల్, డీజిల్ కొరతతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. పట్టణంలో ఎనిమిది పెట్రోల్ బంకులు ఉన్నా ఆయిల్ కొరత తీవ్రంగా వెంటాడుతోంది. సోమవారం రాత్రి నుంచి బంకుల వద్ద వందల సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. డీజిల్ అమ్మకాలు పూర్తిగా నిలిపివేయడంతో రవాణా వాహనాలు నిలిచిపోయాయి. అత్యవసర వాహనాలకు మాత్రమే ఆయిల్ అందించాలని ఆదేశాలు ఉన్నాయని బంకుల యజమానులు డీజిల్ వేయడానికి నిరాకరిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు కొన్ని బంకుల్లో అధిక ధరలకు డీజిల్ అమ్మకాలు చేపట్టారని వినియోగదారులు చెబుతున్నారు. క్యాన్ల ద్వారా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. డీఎస్పీ రాంబాబు, సీఐ ప్రసాద్ల ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం బంకుల వద్ద పహారా కాసి వాహనానికి ఒక లీటరు చొప్పున పెట్రోల్ వేయించేలా ఏర్పాట్లు చేశారు. సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ బంకులను పరిశీలించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వినియోగదారులకు ఆయిల్ పోయాలని స్పష్టం చేశారు. -
హెల్ప్లెస్ హ్యాండ్స్!
● మూణ్ణాళ్ల ముచ్చటగా ‘హెల్పింగ్ హ్యాండ్స్’ ● రోగులకు అందని సహాయం ● జిల్లా ఆసుపత్రి సిబ్బంది తీరు.. ‘తెలియదు, మర్చిపోయాం!’ సాక్షి, పార్వతీపురం మన్యం: ● పార్వతీపురం మండలం వెంకంపేట గ్రామంలో మంగళవారం ఉదయం తేనెటీగల దాడిలో పలువురు ఉపాధి హామీ వేతనదారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరి గురించి ఆరా తీసేందుకు పలువురు గ్రామస్తులు ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రారంభం మొదలు.. చివరి వరకు వీరి ప్రశ్నకు సమాధానం ఇచ్చే వారే కరువయ్యారు. ఆస్పత్రి కింద భాగంలో అడిగితే.. రెండో అంతస్తుకు వెళ్లాలని! పైకి వెళ్లి అడిగితే.. కుడి వైపు వెళ్లాలని ఒకరు.. అక్కడికి వెళ్తే, ఇటు కాదు.. ఎడమ వైపు పోవాలని మరొకరు! ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు బదులిచ్చారు. కనీసం అక్కడే విధుల్లో ఉన్న నర్సులు, వైద్యులు, సిబ్బందికి కూడా వీరి సమాచారం తెలియక పోవడం గమనార్హం. తమ వారు ఎక్కడున్నారో తెలుసుకునేందుకు ఆ గ్రామస్తులకు సుమారు అరగంట సమయం పట్టింది. వీరికి వివరాలు చెప్పేందుకు ‘హెల్పింగ్ హ్యాండ్స్’ వలంటీర్లు ఎవరూ కనిపించలేదు. ● ఆస్పత్రిలో సిబ్బంది పనితీరు ఎలా ఉందంటే.. తేనెటీగల దాడిలో గాయపడిన వారు 15 మందని ఒకరు.. ఆరుగురే ఉన్నారని ఇంకొకరు.. లేదు ఇద్దరే చికిత్స పొందుతున్నారని మరొకరు... ఇలా ఒక్కొక్కరూ ఒక్కోలా పొంతన లేని సమాధానాలు చెప్పడం విశేషం. జిల్లా సర్వజన ఆస్పత్రిలో రోగులకు.. వారి బంధువులకు సరైన సేవలు అందని పరిస్థితి నెలకొంది. వైద్యం మాట దేవుడెరుగు.. కనీస సమాచారం ఇచ్చే వారే కరువయ్యారు. వైద్యులు, లెక్కకు మించి నర్సులు, సిబ్బంది ఉన్నా.. వైద్యం కోసం వెళ్లిన రోగులకు, వారి బంధువులకు ఏ ఒక్కరి నుంచీ స్పష్టమైన సమాధానం, సమాచారం దొరకడం లేదు. ఆస్పత్రిలో రోజుకు 300కు పైగా ఓపీ నమోదవుతుంది. నిత్యం ఇన్ పేషెంట్లు 100కు పైగానే ఉంటున్నారు. వలంటీర్లు లేని హెల్పింగ్ హ్యాండ్స్.. ఇటీవల ఆస్పత్రిలో హెల్పింగ్ హ్యాండ్స్ అనే వినూత్న కార్యక్రమానికి కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి శ్రీకారం చుట్టారు. గిరిజనులు, దూర ప్రాంతాల ప్రజలు, వృద్ధులు, దివ్యాంగులకు ఆస్పత్రుల్లో సేవలు సులభతరం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఓపీ, ల్యాబ్, మందులు ఇచ్చే వద్ద, ఇతర ఏ సహాయం కావాలన్నా హెల్పింగ్ హాండ్స్ వలంటీర్ చేదోడుగా ఉంటారని కార్యక్రమం ప్రారంభం సమయంలో కలెక్టర్ తెలిపారు. ఆయన ఆలోచన మంచిదే అయినప్పటికీ.. ఆచరణలో మూడు రోజులు ముచ్చటగానే మిగిలిపోయింది. ఆస్పత్రిలో ఎక్కడా వలంటీర్లు కానరాని పరిస్థితి నెలకొంది. కనీసం ఆస్పత్రి సిబ్బంది అయినా మానవతా దృక్పథంతో సహాయం చేసే పరిస్థితి ఉండటం లేదని రోగుల బంధువులు అంటున్నారు. సిబ్బందిని ఎవరైనా అడిగినా.. ‘తెలియదు.. మర్చిపోయాం’ అన్న రీతిలోనే వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. హెల్పింగ్ హాండ్స్ కాస్త.. హెల్ప్లెస్గా మారిపోయిందని చెబుతున్నారు. -
కొఠియా గ్రామాలకు స్వాతంత్య్రం ఎప్పుడు?
● గిరిజనులను విడిపించేందుకు ఆంధ్రాప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి? ● మంత్రి సంధ్యారాణి సమాధానం చెప్పాలి ● మాజీ డిప్యూటీ సీఎ పీడిక రాజన్నదొరసాలూరు: వివాదాస్పద ఆంద్రా ఒడిశా సరిహద్దు కొఠియా గ్రూప్ గ్రామాల్లోని గిరిజనులకు స్వాతంత్య్రం ఇంకా రాలేదని, భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్చేచ్ఛా హక్కుకూడా వారికి లేకుండా పోయిందని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర వాపోయారు. ఈ మేరకు మంగళవారం ఆయన పట్టణంలోని తన స్వగృహంలో స్థానిక విలేకరులతో మాట్లాడారు. జనగణనను తాము ఆంధ్రాలో చేసుకుంటామని చెప్పినందుకు ఒడిశా అధికారులు తప్పుడు కేసులు పెట్టి ఇద్దరు ఎగువశెంబి గిరిజనులను ఆంధ్రాలో అరెస్ట్ చేసి తీసుకువెళ్లిపోయారని అక్కడ గిరిజనులు, నాయకులు వాపోయారని పేర్కొన్నారు. మంత్రి సంధ్యారాణి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న భూభాగంలోకి ఒడిశా పోలీసులు వచ్చి ఇద్దరు గిరిజనులను అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్తే మంత్రి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఇక్కడి నుంచి ప్రైవేట్ లాయర్లు ఒడిశా వెళ్లి వారిని విడిపించడం కాదని, ఆంధ్రా ప్రభుత్వం తరఫున ఎవరైనా వెళ్లి వారిని విడిపించారా? అలా ఎందుకు ఆంధ్రా ప్రభుత్వం చేయలేదని ప్రశ్నించారు. పైగా వారిని విడిపించామంటూ మీ సొంత మీడియాలో చేస్తున్న ప్రచారానికి క్షేత్రస్థాయిలో జరిగిన వాస్తవాలకు ఏమైనా పొంతన ఉందా అన్నది ఆత్మపరిశీలన చేసుకోవాలని మంత్రికి సూచించారు. దేశంలో, ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల్లో ఒకే కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్న నేపథ్యంలో దశాబ్దాల కొటియా వివాదానికి శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం ఉందన్నారు. కొఠియా సమస్యను పలుమార్లు తాను అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి తెలపగా అప్పటి ఒడిశా సీఎం నవీన్పట్నాయక్ను జగన్మోహన్ రెడ్డి కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ పాపం..ప్రజలకు శాపం పెట్రోల్, డీజిల్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్య పాపం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతోందని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తగు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల కేవలం ఆంధ్రా రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందన్నారు. పక్కనున్న మిగిలిన ఏ రాష్ట్రంలోను ఈ కొరత లేదన్నారు. ఆంధ్రాలో చాలావరకు బంక్లు నో స్టాక్ బోర్డుతో దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఇంధన కొరత ప్రభావం చివరకు పడేది ప్రజలపైనే నన్నారు. దీనివల్ల ఽ ప్రజలపై ధరల భారం పడుతుందని పేర్కొన్నారు.ప్రభుత్వం చేసిన తప్పులకు రాష్ట్ర ప్రజలు ఆ భారాన్ని మోయాల్సిన దుస్థితి నెలకొంటుందన్నారు. -
ఆటగాళ్లకు ఆహ్వానం..!
పాలకొండ రూరల్: ప్రస్తుత వేసవిలో క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహించేందుకు శాప్(స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) నిర్ణయించింది. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో 65 పాఠశాలలకు చెందిన క్రీడా ప్రాంగణాల్లో పలు రకాల ఆటలపై ఔత్సాహిక క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ఈ మేరకు జిల్లా క్రీడా అధికారి సంబంధిత ఉపాధ్యాయులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. 8 నుంచి 16 ఏళ్ల మధ్య గల ఔత్సాహికులకు శిక్షణ అందించేలా చర్యలు చేపట్టారు. మే నెల 1 నుంచి 30 వరకూ ఈ శిబిరాలు నిర్దేశిత పాఠశాలల్లో కొనసాగనున్నాయి. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య క్రీడాకారులకు శిక్షణ అందిస్తారు. జిల్లాలో శిబిరాల నిర్వహణ ఇలా.. పార్వతీపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సీతంపేట ఏపీటీడబ్ల్యూ ఆర్ఎస్, జీఎల్.పురం పి.ఆమిటి క్రీడాప్రాంగణం, ఇదే మండలం తాడికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో (ఆర్చరీ), సీతానగరం మండలం బూర్జ జెడ్పీహెచ్ఎస్, పాలకొండ పట్టణం పరిధిలో గల ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో, సీతంపేట కేవీకే, జీఎల్.పురం హెచ్ గ్రౌండ్స్, సీతానగరం మండలం గాజులవలస, వీరఘట్టం జెడ్పీహెచ్ఎస్లో (అథ్లెటిక్స్), పార్వతీపురం ఆఫీసర్స్ క్లబ్ ఇండోర్ స్టేడియం, చర్చివీధిలో గల మున్సిపల్ పార్కు, సాలూరు ఇన్డోర్ స్టేడియం, సీతంపేట మండలం కేవీకే ఇండోర్ స్టేడియం, మక్కువ మండలం వెంకటబైరిపురం జెడ్పీహెచ్ఎస్, కురుపాం మండలం గుమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం (బాడ్మింటన్), వీరఘట్టం మండలం తెట్టంగి జెడ్పీ ఉన్నత పాఠశాలలో (బాల్ బాడ్మింటన్), గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర జెడ్పీహెచ్ఎస్ (బేస్ బాల్), సీతంపేట కేవీకే (బాస్కెట్ బాల్), పార్వతీపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల బ్రాంచ్, స్థానిక ఇందిరాకాలనీ ప్రాథమిక పాఠశాల, భామిని మండల పరిధిలో ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణం(బాక్సింగ్), పార్వతీపురం జట్టు ఆశ్రమం, ఇదే మండలం నర్సిపురం జెడ్పీ హెచ్ఎస్, రిషీ స్కూల్, కొమరాడ మార్కొండపుట్టి జెడ్పీహెచ్ఎస్లో (చెస్), కొమరాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం(క్రికెట్), పార్వతీపురం ఓల్డ్ బస్టాండ్ పార్కు ఏరియాలో (ఫెన్సింగ్), ఇదే మండలం నర్సిపురం జెడ్పీహెచ్ఎస్, కొమరాడ మండలం కోటిపాం జెడ్పీహెచ్ఎస్, జియ్యమ్మవలస మండలం కొత్తగూడ జెడ్పీ హెచ్ఎస్లో(హ్యాండ్బాల్), సీతంపేట కేవీకేలో (హాకీ), పార్వతీపురం జీయాన్ష్ ఇంటర్నేషల్ స్కూల్(జూడో), ఇదే పరిధిలో చాకలిబెలగాం ప్రైవేట్ గ్రౌండ్స్, పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సీతంపేట మండలం కేవీకే, పాచిపెంట మండలం పాంచాలి జెడ్పీ హెచ్ఎస్ఓ క్రీడా ప్రాంగణాల్లో (కబడ్డీ), పార్వతీపురం విద్యుత్ కేంద్రం, నోబెల్ స్కూల్, సాలూరు మండలం మామిడిపల్లి జెడ్పీహెచ్ఎస్, ఇదే మండలం టోనం జెడ్పీహెచ్ఎస్, కురుపాం మండలం రస్తకుంటుబాయి ఏఈ స్కూల్ క్రీడా ప్రాంగణం(కరాటే), పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో (ఖోఖో), పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళశాల, పాలకొండ ప్రైవేట్ గ్రౌండ్స్లో (తైక్వాండో), పార్వతీపురం ప్రకాశం క్లబ్లో (టెన్నిస్), పార్వతీపురం పరిధిలో వెంకంపేట, ఎంఆర్నగర్ జెడ్పీహెచ్ఎస్, పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సాలూరు జెడ్పీ హెచ్ఎస్, సీతంపేట మండలం కేవీకే, జీఎల్.పురం మండలం ఉదయపురం జెడ్పీహెచ్ఎస్, కొమరాడ మండలం బెన్నిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బలిజిపేట జెడ్పీహెచ్ఎస్ క్రీడా ప్రాంగణాల్లో (వాలీబాల్), పార్వతీపురం జీటీడబ్ల్యూ ఏహెచ్ఎస్లక్ష (వెయిట్లిఫ్టింగ్), పార్వతీపురం కేఎంహెచ్ రోడ్డు యోగా సెంటర్, జగన్నాథపురం, 5వ లైన్ గణేష్ నగర్, పాలకొండ ప్రభ్వు డిగ్రీ కళాశాల, ఇదే ప్రాంత పరిధి వడమ ఎంపీయూపీ స్కూల్, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సాలూరు శ్రీరామా యోగా సేవాసమితిలో యోగాపై శిక్షణలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఔత్సాహికులు వారికి నచ్చిన క్రీడల్లో తర్ఫీదు పొందేందుకు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. శాప్ నేతృత్వంలో వేసవి క్రీడా శిక్షణ మే 1 నుంచి ప్రారంభం జిల్లా వ్యాప్తంగా 65 పాఠశాలల ఎంపిక ఔత్సాహిక క్రీడాకారులకు ఉపయుక్తంనిపుణులతో పర్యవేక్షణ వేసవి శిక్షణ శిబిరాలను సముచిత లక్ష్యంతో ఏర్పాటు చేశాం. బాధ్యతలను నేరుగా పర్యవేక్షిస్తాం. ఔత్సాహిక క్రీడాకారులకు నిపుణులు, అణుభవజ్ఞులైన ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన, సీనియర్ క్రీడాకారులతో తర్ఫీదు అందించనున్నాం. తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లల ఉత్సుకతను గ్రహించి శిక్షణ శిబిరాలకు పంపించాలి. మరిన్ని వివరాలకు స్థానిక పాఠశాలల్లో సంప్రదించాల్సి ఉంటుంది. – డాక్టర్ కె.శ్రీధర్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి, పార్వతీపురం మన్యం -
పెండింగ్ ఇంక్రిమెంట్స్ విడుదల చేయాలి
● కంటెంజెంట్ వర్కర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గారావువిజయనగరం ఫోర్ట్: వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ఎన్హెచ్ఎం (నేషనల్ హెల్త్ మిషన్)లో పనిచేస్తున్న ఉద్యోగులకు 3 సంవత్సరాల పెండింగ్ వార్షిక ఇంక్రిమెంట్స్ వెంటనే విడుదల చేయాలని కంటిజెంట్ వర్కర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.దుర్గారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. జీవనరాణికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. హెచ్ఆర్ సెల్ను వెంటనే ఏర్పాటు చేసి, కేంద్ర గైడ్లైన్స్ ప్రకారం హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. యూపీహెచ్సీ స్టాఫ్ నర్సులకు గతంలో లాగానే 35 రోజుల సాధారణ సెలవులు అమలు చేయాలన్నారు. క్లియర్ వేకెన్సీ, పరస్పర బదిలీలు అమలు చేయాలన్నారు. ఉద్యోగ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని, రేషనలైజేషన్ పేరుతో ఎన్హెచ్ఎం ఉద్యోగులకు నష్టం కలిగించే నిర్ణయాలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎంల సంఘం జిల్లా అధ్యక్షురాలు కళావతి, జిల్లా కార్యదర్శి గౌరీశ్వరి, బి. శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్టులపై దాడులను ఐక్యంగా ఎదుర్కొందాం
విజయనగరం అర్బన్: జర్నలిస్టులపై దాడులను ఐక్యంగా ఎదుర్కొందామని, ఆ దిశగా సంఘం పటిష్టత కోసం ప్రతిఒక్కరు అవగాహనతో ఉండాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ పీఎస్వీప్రసాద్ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా పరిషత్ మినిస్టీరిల్ సిబ్బంది సమావేశ భవనంలో సంఘ జిల్లా కమిటీ మంగళవారం నిర్వహించిన ఒక రోజు జర్నలిస్టుల శిక్షణ తరగతులకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ ఇటీవల సాక్షి మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులుపెడుతున్న నేపథ్యంలో సంఘం రాష్ట్రవ్యాప్తంగా ఖండించి ఐక్యపోరాటం చేశామన్నారు. శిక్షణ కార్యక్రమంలో జర్నలిస్టుల విధు లు, సంఘం ఐక్యత అంశాలను సీనియర్ జర్న లిస్టులు వివరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సంఘ జిల్లా కమిటీ త్వరలో నిర్వహించనున్న మహాసభ నిర్వహణపై సమీక్షించారు. సీనియర్ జర్నలిస్టు ఎలిశెట్టి సురేష్ కమిటీ చైర్మన్గా, మహాపాత్రో కో–చైర్మన్గా ఉన్న అడహాక్ కమిటీని జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన సీనియర్ జర్నలిస్టులు 11 మందితో ఏర్పాటు చేశారు. హైపవర్ కమిటీగా పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టులు అల్లు యుగంధర్, టి.రాధాకృష్ణ, పంచాది అప్పారావు, హిందూ శ్రీనివాస్, కొప్పర గాంధీతో పాటు మరో పది మంది సభ్యులను ఎంపిక చేశారు. -
అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
పార్వతీపురం రూరల్: రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం మొదటి దశలో 2,646 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఖాళీగా ఉన్న 263 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కలెక్టర్ అధ్యక్షతన గల కమిటీ నియామకాలు చేపడుతుంది. జిల్లాలో ఖాళీల వివరాలు: మొత్తం 263 పోస్టుల్లో 5 అంగన్వాడీ కార్యకర్తలు, 258 సహాయకురాళ్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐటీడీఏ పార్వతీపురం పరిధిలో అత్యధికంగా 175 పోస్టులు, సీతంపేట పరిధిలో 57, పార్వతీ పురం డివిజన్ పరిధిలో 31 పోస్టులు భర్తీ చేయనున్నారు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా సంబంధిత గ్రామం/ వార్డులో నివసించే వివా హిత మహిళలై ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్హత, వయోపరిమితి కలిగి ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో సమర్పించాలని అధికారులు సూచించారు. పార్వతీపురం: జిల్లాలో జరుగుతున్న భూ రీ– సర్వే పనులను వేగవంతం చేసి గడువులోగా పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో తహసీల్దార్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూ రీసర్వే ద్వారా భూ రికార్డు ల ప్రక్షాళన జరిగి రైతులకు శాశ్వత హక్కులు లభిస్తాయని పేర్కొన్నారు. సర్వే పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ జాప్యం లేకుండా పూర్తి చేయాలని, వివాదాలను పారదర్శకంగా పరిష్కరించాలని సూచించారు. ఆధునిక పరికరాలు, డ్రోన్ల ద్వారా సేకరించిన డేటాను కచ్చి తంగా నమోదు చేయాలని పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఆయన పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించా రు. సమావేశంలో రెవెన్యూ అధికారులు, వివిధ మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. సాలూరు: మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరను పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి పరామర్శించారు. ఇటీవల రాజన్నదొర నేత్ర శస్త్ర చికిత్స చేసుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ మేరకు సోమవారం రాజన్నదొరను సాలూరు పట్టణంలోని ఆయన స్వగృహంలో కళావతి కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సీతంపేట: ఉప్పరజమ్మి నుంచి రేగుమానుగూడ వరకు రూ.50 లక్షలతో చేపట్టిన రోడ్డు పనుల్లో నాణ్యత పాటించడం లేదని హడ్డుబంగి మాజీ సర్పంచ్ సూర్యారావు, మంగయ్య తదితరులు ఆరోపించారు. ఈ మేరకు ఫొటోల తో ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబుకు సోమ వారం ఫిర్యాదు చేశారు. వాటరింగ్ సక్రమంగా చేయడం లేదని, రోడ్డు లెవెలింగ్ సరిలేదన్నా రు. సిమెంట్ మోతాదు పాటించడం లేదని, అస్తవ్యస్తంగా రోడ్డు పనులు చేస్తున్నా ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షించడం లేదన్నారు. ఇలా నిర్మిస్తే రోడ్డువేసిన కొద్ది రోజులకే పాడ య్యే ప్రమాదం ఉందన్నారు. అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల గిరిజనులు కోరుతున్నారు. -
మంగళవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
సాక్షి, పార్వతీపురం మన్యం: మహిళలను కించపరిచేలా, వైఎస్సార్సీపీ నాయకులను అవమానించేలా తన పత్రికలో జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై చర్య లు తీసుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఉప ముఖ్యమంత్రి, పార్టీ పీఏసీ సభ్యురా లు పాముల పుష్పశ్రీవాణి, పార్వతీపురం, పాల కొండ నియోజక వర్గ సమన్వయకర్తలు అలజంగి జోగారావు, విశ్వాసరాయి కళావతి డిమాండ్ చేశా రు. ఇదివరకే నియోజకవర్గాల సీఐలకు ఫిర్యాదులు చేశామని గుర్తు చేశారు. ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో జిల్లా ఎస్పీ కార్యాలయంలో మరోసారి ఫిర్యాదులు అందించామని చెప్పారు. జిల్లాలోని నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నాయకులు కలిసి ఎస్పీ కార్యాలయానికి సోమవారం చేరుకున్నారు. ఎస్పీ మాధవ్రెడ్డి అందుబాటులో లేకపోవడంతో.. అదనపు ఎస్పీకి నియోజకవర్గాల వారీ ఫిర్యాదు కాపీలు అందజేశా రు. పోలీసు వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని.. ఇప్పటికై నా ఏబీఎన్ రాధాకృష్ణపై కేసులు నమోదుచేయాలని కోరారు. అనంతరం మీడియాతో ఆ పార్టీ నాయకులు మాట్లాడారు. ఏబీఎన్ రాధాకృష్ణ కొత్త పలుకు పేరిట, రోత రాతలు రాస్తున్నారని.. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యు లు, మహిళలనే లక్ష్యంగా చేసుకొని వాడలేని భాష ను ఉపయోగించి సభ్య సమాజం తలదించుకునే లా చేశారని తెలిపారు. జర్నలిజం ముసుగులో చంద్రబాబు ప్రభుత్వానికి జాకీలు లేపుతూ, గౌరవ ప్రదమైన పాత్రికేయ వృత్తి పరువు తీస్తున్నారని చెప్పా రు. నియోజకవర్గాల్లో ఫిర్యాదులు అందించినా చర్యలు లేకపోవడం వల్లే ఎస్పీ కార్యాలయ పీజీఆర్ఎస్కు వచ్చామని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ ఉపాధ్యక్షుడు బాపూజీ నాయుడు, పార్వతీపురం నియోజకవర్గం పరిశీలకులు మావుడి శ్రీనివాసరావు, సాలూరు నియోజకవర్గం నుంచి వంగపండు అప్పలనాయుడు, గిరి రఘు, దండి శ్రీను, రఘుపాత్రుని సాంబ, మువ్వల ఆదయ్య, మజ్జి అప్పారావు, నాలుగు నియోజకవర్గాల ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవడం దారుణం. మహిళల పట్ల అభ్యంతరకరంగా ఏబీఎన్ రాధాకృష్ణ కొత్త పలుకులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగం మీద మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే కచ్చితంగా రాధాకృష్ణ మీద కేసు పెట్టి, ఆయనను అరెస్టు చేయాలి. రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు, నాయకులకు, వారి కుటుంబ సభ్యులకు ఆయన క్షమాపణ చెప్పాలి. రాధాకృష్ణ చేసింది తప్పు అని తెలిసినా కూడా సమర్థించే ఎమ్మెల్యేలు, మంత్రులు, మహిళా నాయకులు ఈ ప్రభుత్వంలో ఉండటం సిగ్గుచేటు. ఆయన చేసిన వ్యాఖ్యలు మీకు కూడా వర్తించేలా లేవా? మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు మిమ్మల్ని అడగలేదా? రాధాకృష్ణకు ఒకటే అడుగుతున్నా.. చంద్రబాబు నాయుడు మోదీని తిడితే మీరు ఏం రాశారు? చంద్రబాబు నాయుడు మోదీని పొగిడితే మీరు జాకీలు వేయలేదా? చంద్రబాబు నాయుడు అమిత్ షా మీద రాళ్లు విసిరినప్పుడు ఆ నిర్ణయాన్ని మీరు సమర్థించలేదా? చంద్రబాబు నాయుడు అమిత్ షాను ఈరోజు జాకీలు వేస్తే మీరు ఎత్తట్లేదా? చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అని అంటే ఆ రోజు మీరు సమర్థించలేదా? తర్వాత ప్యాకేజీ వద్దు.. హోదా ముద్దు అని చంద్రబాబు అంటే ?మీరు సమర్థించలేదా? ఆయన అవునంటే అవును.. కాదంటే కాదు. మీరే వెన్నెముక లేనటువంటి పరిస్థితిలో ఉన్నారా? మేము ఉన్నామా? – పాముల పుష్ప శ్రీవాణి, పీఏసీ సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి పోలీస్ వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉంది. ఆ నమ్మకంతోనే శాంతియుతంగా ఎస్పీ కార్యాలయానికి వచ్చాం. ఫిర్యాదు ఇచ్చాం. కచ్చితంగా ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మాట తప్పింది. రాజధాని విషయంలో ప్రజలను మభ్యపెడుతోంది. వారి లోపాలను ఎత్తి చూపే, ప్రశ్నించే వైఎస్సార్ సీపీ, జగన్ మోహన్ రెడ్డి మీద ఏదో విధంగా దాడి చేయాలి. పార్టీ క్యాడర్ ను కించపరిచి బలహీనం చేసే కుతంత్రమే ఇది. రాధాకృష్ణ, ఆ తప్పులను సమర్థించే చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ వంటివారంతా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. – పాలవలస విక్రాంత్, ఎమ్మెల్సీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లలో అభివృద్ధి ఎలా ఉంది? పాలన ఎలా ఉంది? సంక్షేమం ఎలా ఉంది? ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం రాధాకృష్ణకు లేదు. అందుకే ప్రభుత్వానికి వత్తాసు పాడుతున్నారు. మా పార్టీలో ఉన్న టువంటి నాయకులను, మహిళలను కించపరిచేలా మాట్లాడటం దురదృష్టకరం. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నారు? జగన్మోహన్రెడ్డిని ఇలా వ్యక్తిగతంగా దూషిస్తూ వ్యక్తిత్వ హననానికి ఎందుకు పాల్పడుతున్నారు? ఈరోజు ప్రజలకు న్యాయం చేసేటువంటి పరి స్థితి ఉందా? వీటన్నిటిని ప్రశ్నించే దమ్ము ధైర్యం మీకు ఉందా? వీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు గానీ, వీరి చర్యలు గానీ ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారు. ప్రతి ఒక్క మహిళ కూ రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి. – విశ్వాసరాయి కళావతి, మాజీ ఎమ్మెల్యే, పాలకొండ నియోజకవర్గం -
గాయపడిన విద్యార్థికి ఆర్థిక సాయం
పాలకొండ రూరల్: స్థానిక ముదునూరువారి వీధికి చెందిన లక్ష్మీకాంత్ అనే విద్యార్ధి కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు మేడపై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో చలించిపోయిన వివేకానంద హైస్కూల్ పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. దాదాపు రూ.2,20,000 మొత్తాన్ని విరాళంగా సేకరించి లక్ష్మీకాంత్ కుటుంబానికి అందించారు. ఈ సహాయాన్ని వివేకానంద హైస్కూల్ ప్రిన్సిపాల్ గవర పారినాయుడు, డైరెక్టర్లు, ప్రముఖ వ్యాపారవేత్త తుమ్మగుంట శంకరరావు, ఉపాధ్యాయులు కలిసి లక్ష్మీకాంత్ తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల ఔదార్యం, సేవాభావాన్ని స్థానికులు ప్రశంసించారు. -
దేవర మహోత్సవం
శోభాయమానం.. విజయనగరం టౌన్: సిరులతల్లి.. పైడితల్లి దేవర మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా సాగింది. వనంగుడి నుంచి చదురుగుడికి అమ్మవారిని తీసుకెళ్లే ఘట్టాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వనంగుడి స్తపన మందిరంలో సోమవారం సాయంత్రం 4.30 గంటలకు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఆలయ వేదపండితులు శాస్త్రోక్తంగా పంచామృతాలతో అభిషేకాలు చేశారు. సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ ఈఓ కె.శిరీష నేతృత్వంలో సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పట్టుకుని ఆలయం చుట్టూ జై పైడిమాంబ .. జైజై పైడిమాంబ నామస్మరణతో మూడుసార్లు ప్రదక్షణ చేశారు. అనంతరం ఉత్సవ రథంపై అమ్మవారిని ఆశీనులు చేసి హారతులిచ్చారు. భాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాలు, విచిత్ర వేషధారణలు, భక్తుల జయజయ ధ్వానాలతో అమ్మరథం కదిలింది. రైల్వేస్టేషన్ వద్ద నుంచి ప్రారంభమైన రథం.. గాడీఖానా, సీఎంఆర్ కూడలి, వైఎస్ఆర్ సర్కిల్, ఎన్సీఎస్, కన్యకపరమేశ్వరి ఆలయం, గంటస్తంభం, మున్సిపల్ ఆఫీస్, కమ్మవీధి, తెలకలవీధి రామమందిరం మీదుగా హుకుంపేటకు చేరుకుంది. అక్కడ చదురు వద్ద ఉత్సవ విగ్రహాన్ని, పూజారి ఇంటివద్ద ఇత్తడి ఘటాలను ఉంచి రాత్రి 7 నుంచి 10 గంటల వరకు పూజలు చేశారు. రాత్రి 10 గంటలకు ఘటాలతో ఊరేగింపు ప్రారంభమైంది. మేళతాళాలు, సాముగరిడీ, పులివేషధారణలు, కోలాటం, కాళికామాత వేషధారణలు, పెద్దపెద్ద బొమ్మల ప్రదర్శన, డప్పు వాయిద్యాల నడుమ ఘటాలను ఊరేగింపుగా మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడికి తీసుకెళ్లారు. అక్కడ ఘటాలు, అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి పూజలు చేశారు. వేకువజామున 3 గంటల ప్రాంతంలో ఆలయ తలయారి రామవరపు చినపైడిరాజు బృందం జంగిడి మీద దీపం పెట్టుకుని, చదురుగుడి నుంచి డప్పు వాయిద్యాలతో మంగళవీధి మీదుగా చెరువులోకి వెళ్లి అమ్మవారి మనవి చెప్పారు. అక్కడి మట్టిని పసుపు, కుంకుమగా మార్చి పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి ఊరేగింపుగా మంగళవీధి నుంచి గంటస్తంభం మీదుగా తిరిగి చదురుగుడికి అమ్మవారిని తీసుకువచ్చి ఆశీనులు చేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారి సిరిమానోత్సవంలో జరిగే ఉయ్యాల కంబాల మహోత్సవం వరకు అమ్మవారు చదురుగుడిలోనే భక్తులకు దర్శనమిస్తారని అర్చకులు తెలిపారు. -
చంద్రబాబుకు బాకాలు
●పాత్రికేయ ముసుగులో ఏబీఎన్ రాధాకృష్ణ పాత్రికేయ ముసుగులో చంద్రబాబు ప్రభుత్వాని కి బాకాలు ఊదుతున్నా రు. ఆయనకు నచ్చితే తప్పులు చేసినా జాకీలు పెట్టుకొని లేపుతారు. లేకుంటే బురద జల్లు తూ, విషం చిమ్ముతారు. పాత్రికేయ వృత్తి అంటే మాకు గౌరవం. రాధాకృష్ణ లాంటివారు జర్నలిజం పరువు తీస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి మేలు చేయడానికే ఆయన ఛాన ల్, పత్రిక ఉంది. వైఎస్సార్సీపీ నేతలు, మహిళ లు లక్ష్యంగా ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. ఇంత జుగుప్సాకర రీతిలో ఆయన పత్రిక ద్వారా మహిళల పట్ల విషం చిమ్ముతున్నా ప్రభుత్వంలోని ఏ ఒక్కరూ స్పందించకపోవడం శోచనీయం. దీనికి రాధాకృష్ణ కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. – శత్రుచర్ల పరీక్షిత్ రాజు, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ. పార్టీలో ఉన్న మహిళలు, మా కుటుంబ సభ్యుల పట్ల ఏబీఎన్ రాధాకృష్ణ చాలా అనుచిత వ్యాఖ్య లు చేశారు. ఓ వైపు మహిళలకు ఏదైనా జరిగితే తక్షణమే వస్తామని పవన్ కల్యాణ్ అంటారు.. మహిళల పక్షపాతి ప్రభుత్వమని చంద్రబాబు చెబుతారు. చర్యలైతే ఎక్కడా లేవు. మహిళా హోం మినిస్టర్ అనిత కూడా ఎక్కడా స్పందించిన సందర్భం లేదు. ఈ రాష్ట్రంలో అరాచక పాలన కాక ఇంకేంటి? పోలీస్ యంత్రాంగం పట్ల మాకు గౌరవం ఉంది. అందువల్లే మరో సారి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి విన్నవించుకుంటున్నాం. ఎస్పీ చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో వీధి పోరాటం చేసినా సరే.. కచ్చితంగా ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకునేటట్టుగా చేస్తాం. – అలజంగి జోగారావు, మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం నియోజకవర్గం. -
ఆటో డ్రైవర్ ఆత్మహత్య
కొత్తవలస: మండలంలోని అడ్డూరువానిపాలెం సమీపంలో గల తోటలో రామలింగాపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సీముసిరి నర్సునాయుడు(38)ఆదివారం రాత్రి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ప్రసాదరావుతెలిపారు. నర్సునాయుడు రోజూ ఆటోలో లేబర్ను విశాఖపట్నం తీసుకుని వెళ్లి సాయంత్రం వారిని పికప్ చేసుకుని తీసుకొచ్ఛేవాడు.ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం రాకపోవడంతో అనుమానం వచ్చి సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా వెతకగా అడ్డూరువానిపాలెం సమీపంలో గల మామిడితోటలో చెట్టుకు వేలాడుతూ కనిపించాడు.మృతుడి భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.మృతుడికి 6,4 సంవత్సరాలు వయస్సుగల పాప,బాబు ఉన్నారు. -
పీజీఆర్ఎస్కు 181 అర్జీలు
విజయనగరం అర్బన్: కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎల్) మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు జిల్లా వ్యాప్తంగా స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై 181 వినతిపత్రాలు, ఫిర్యాదులు సమర్పించారు. కార్యక్రమంలో మొత్తం 181 వినతులు అందగా, అందులో అత్యధికంగా 69 రెవెన్యూ శాఖకు సంబంధించినవి ఉన్నాయి. మిగిలిన వాటిలో డీఆర్డీఏ–17, పంచాయతీరాజ్–16, విద్యుత్శాఖ–7, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ–4, గ్రామ సచివాలయ శాఖకు 4, విద్యాశాఖకు 3, మున్సిపల్, హౌసింగ్ శాఖలకు చెరో రెండు, ఇతర శాఖలకు 56 అర్జీలు నమోదయ్యాయి. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ వినతుల పరిష్కారంలో ఆలస్యం అసలు సహించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. పెండింగ్ వినతులను వెంటనే పరిష్కరించి డిస్పోజ్ చేయాలని ఆధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రెవెన్యూ, సర్వే సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరించాలని సూచించారు. పీజీఆర్ఎస్ వినతులను ఆన్లైన్లో నిరంతరం పరిశీలిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ పేర్కొన్నారు. 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై బాధ్యతగా స్పందించాలని అధికారులకు సూచించారు. అర్జీదారులను ప్రత్యక్షంగా కలిసి మాట్లాడిన తరువాతే నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్.సత్తి బాబు, స్పెష్ల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవోలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. అర్జీలపై స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలి పీజీఆర్ఎస్లో అందిన అర్జీలకు స్పీకింగ్ ఆర్డర్లో స్పష్టమైన ఎండార్స్మెంట్ ఉండాలని సరైన సమాధానం ఇవ్వని అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి హెచ్చరించారు. అర్జీలపై తోచిన విధంగా రాయకుండా అర్జీదారుతో తప్పనిసరిగా మాట్లాడి సంతృప్తి చెందేలా సమాధానం ఇవ్వాలని సూచించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఓస్ సమీక్షలో భాగంగా వినతుల పరిష్కారం, రీ–సర్వే, వాట్సాప్ గవర్నెన్స్, స్వీయ గణన, ఫ్యామిలీ సర్వే, సచివాలయాల తనిఖీ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఫిర్యాదుదారులకు చట్టపరిధిలో న్యాయం విజయనగరం క్రైమ్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టం) కార్యక్రమాన్ని ఎస్పీ ఏఆర్.దామోదర్ సోమవారం విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ వారి సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశించారు. పీజీఆర్ఎస్లో 36 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదు అంశాల్లో వాస్తవాలను గుర్తించి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సంబంధిత సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్బీ సీఐ కె.కుమారస్వామి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఎస్సైలు రాజేష్, ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు. ఉపాధి వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి: వైఎస్సార్సీపీ నేతల వినతి విజయనగరం: జిల్లాలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జాతీయ ఉపాధి హామీ పథకం కింద వేతనదారులకు చెల్లించాల్సిన కోట్లాది రూపాయల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్కు వినతిపత్రం అందచేశారు. అనంతరం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు గొర్లె రవికుమార్, ఇప్పిలి అనంత్ మాట్లాడుతూ వేతన బకాయిలు వల్ల రోజువారీ కూలీపై ఆధారపడ్డ వేతనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నడూ ఈ పరిస్థితి తలెత్తలేదన్నారు. తక్షణమే ప్రభుత్వం బకాయిలు విడుదల చేయాలని కోరారు. అదేవిదంగా అధికారంలో ఉన్న నేతలు గ్రామాల్లో ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు నకిలీ మస్తర్లు వేసి, పనులు చేపట్టకుండా వారిని తమ రాజకీయ కార్యక్రమాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి నకిలీ మస్తర్ల పై తగు విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పని అడిగిన వేతనదారులకి సకాలంలో పని కల్పించాలని సూచించారు. తమ వినతిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, వేతన బకాయిలు కోసం ప్రభుత్వానికి మరోమారు నివేదించనున్నట్లు కలెక్టర్ చెప్పినట్లు పేర్కొన్నారు. -
సబ్ జైలు సందర్శన
చీపురుపల్లి: పట్టణంలోని సబ్ జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణ ప్రసాద్ సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సబ్ జైల్లో ఖైదీలకు ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు. అలాగే సబ్ జైల్లో రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం ఖైదీలతో మాట్లాడుతూ చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు ఖైదీల పట్ల గౌరవంగా మెలగాలని సూచించారు. ఖైదీలకు న్యాయస్థానం కల్పించిన న్యాయ సేవ హక్కులను వివరించారు. ఖైదీల పట్ల వివక్ష చూపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం సబ్ జైల్లోనే లీగల్ ఎయిడ్ క్లినిక్ను పరిశీలించారు. కామన్వెల్త్ వేదికపై మెరిసిన భార్గవి● యూత్లో గోల్డ్, జూనియర్లో సిల్వర్ మెడల్ నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండవెలగాడ గ్రామానికి చెందిన బెల్లాన భార్గవి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతూ మరోసారి జిల్లాకు గర్వకారణమైంది. దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఓషియానియా ఖండంలో ఉన్న సమోవాలో జరుగుతున్న యూత్ అండ్్ జూనియర్ కామన్వెల్త్ వెయిట్లిప్టింగ్ చాంపియన్షిప్లో ఆమె అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈ పోటీల్లో భార్గవి యూత్ విభాగంలో బంగారు పతకం సాధించగా, జూనియర్ విభాగంలో వెండి పతకం అందుకుంది. స్నాచ్లో 78 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్లో 102 కిలోలు ఎత్తి మొత్తం 180 కిలోలతో మెరుగైన స్కోరు నమోదు చేసింది. కఠినమైన పోటీని ఎదుర్కొంటూ ధైర్యంగా పోరాడి ఈ విజయాలను అందుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. తండ్రి బెల్లాన శ్రీనివాసరావు, తల్లి గౌరి ప్రేరణతో ఈ విజయాన్ని సాధించినట్లు భార్గవి తెలిపింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణికి జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు, సీనియర్ కోచ్లు చల్లా రాము, వల్లూరి శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. విశాఖలో జామి నివాసి ఆత్మహత్యఆనందపురం (విశాఖ): విజయనగరం జిల్లా జామి మండలానికి చెందిన సారిపిల్లి వినోద్ (27) సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని తర్లువాడ వద్ద నిర్మిస్తున్న గూగుల్ డేటా సెంటర్ పనుల కోసం వినోద్ ఇక్కడికి వచ్చారు. అయితే తీవ్రమైన అప్పుల బాధతో సతమతమవుతున్న వినోద్ మనస్తాపానికి గురై తర్లువాడ సమీపంలోని ఒక మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మరణించే ముందు తన తమ్ముడికి ఫోన్ చేసి, తన భార్యాపిల్ల లను జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరి ఫోన్ కట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఆనందపురం పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతివిజయనగరం క్రైమ్: విజయనగరం వన్టౌన్ స్టేషన్ పరిధిలోని బొగ్గులదిబ్బకు చెందిన తెరండి గోవింద(46) ఇంట్లోనే అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గోవింద్కు 15 ఏళ్ల క్రితం సంతోషికుమారితో పెళ్లయ్యింది. వారి దాంపత్య జీవితానికి గుర్తుగా ఒకబాబు ఉన్నాడు. అయితే వ్యసనాలకు బానిసైన గోవింద్ తరచూ ఇంటికి వస్తూ గొడవ పడేవాడు. ఈ బాధ భరించలేకే భార్య సంతోషికుమారి కొడుకును తీసుకుని కన్నవారింటికి వెళ్లిపోయింది. ఘోషాఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్లో స్వీపర్గా పనిచేస్తున్న గోవింద్ మృతదేహమై కనిపించాడు.భార్య సంతోషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్సీ అంజిబాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అర్జీల సంపూర్ణ పరిష్కారమే లక్ష్యం
● జేఈ యశ్వంత్ కుమార్ రెడ్డిపార్వతీపురం: పీజీఆర్ఎస్కు వచ్చే ప్రతి దరఖాస్తుకు సంపూర్ణ పరిష్కారం అందించాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ సమావేశంలో ఎస్డీసీ దిలీప్ కల్యాణ్ చక్రవర్తి, డీఆర్ఓ కె.హేమలతతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీ దారుల నుంచి 56 వినతులను జేసీ స్వీకరించారు. కార్యక్రమంలో పీజీఆర్ఎస్కు 39, రెవెన్యూ క్లినిక్కు 17 అర్జీలు వచ్చాయి. పెండింగ్ సమస్యలను శాఖల వారీగా సమీక్షించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు జేసీ సూచించారు. ఫీల్డ్ పర్యటనల ద్వారా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలన్నారు. అర్జీ దారులతో సానుభూతితో వ్యవహరించాలని హితవు పలికారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదులపై సత్వర చర్యలు చేపట్టాలి పార్వతీపురం రూరల్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, పరిష్కరించాలని ఎస్పీ ఎస్వీ మాధవ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులతో ఆయన ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భూ వివాదాలు, వేధింపులు, ఆన్న్లైన్ మోసాలు వంటి అంశాలపై బాధితులు ఎస్పీకి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫోన్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడి, ఫిర్యాదుల పూర్వాపరాలను విచారించి చట్టపరిధిలో తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తీసుకున్న చర్యలపై నివేదికను జిల్లా కార్యాలయానికి పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 17 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం, సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 15 వినతులు సీతంపేట: ఐటీడీఏలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశంలో ఏపీఓ చిన్నబాబు సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 15 వినతులు వచ్చాయి. మర్రిపాడుకు చెందిన పాత్రో మినీ ట్రాక్టర్ మంజూరు చేయాలని అర్జీ అందజేశాడు. సర్వే చేసి కొండపోడు పట్టాలు ఇప్పించాలని వెంకటాపురానికి చెందిన గిరిజనులు వినతి ఇచ్చారు. అలాగే తాగునీటి బోరు గ్రామానికి వేయాలని, తాగునీటి బోరుకు మోటార్ వేయించాలని తుప్పలగూడ గ్రామస్తుడు రజినీకుమార్ కోరారు. భూ సమస్య పరిష్కరించాలని దొండమానుగూడ గ్రామస్తుడు సరవ కృష్ణారావు విన్నవించాడు. పవర్ వీడర్లు ఇప్పించాలని వెంకటాపురం, జంతూరు, బెండకాయలపేట తదితర గ్రామాలకు చెందిన లక్ష్మమ్మ తదితరులు కోరారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర, డిప్యూటీఈఓ నారాయుడు తదితరులు పాల్గొన్నారు. -
కొటియా గిరిజనులను విడుదల చేయాలి
● కలెక్టరేట్ వద్ద సీపీఎం నిరసనపార్వతీపురం రూరల్: ఒడిశా ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన కొటియా సరిహద్దు గ్రామ గిరిజనులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు మాట్లాడుతూ.. సరిహద్దు గ్రామాల్లో గిరిజనులను ఒడిశా పోలీసులు ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. అరెస్టయిన తాడంగి పిలుపు, చిరంజీవిలను వెంటనే విడిపించేలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒడిశా ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు. కొటియా సరిహద్దు సమస్యకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చల ద్వారా శాశ్వత పరిష్కారం చూపాలని, గిరిజనులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పరిష్కారం లభించని పక్షంలో ప్రజా సంఘాలతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఈ మేరకు జాయింట్ కలెక్టరుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కొటియా గ్రామస్తులు తాడంగి సన్నం, కేసు, సీపీఎం నేతలు మర్రి శ్రీనివాసరావు, బి.వెంకటరమణ, గేదెల సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకుడు బత్తిన మోహనన్ రావు, గిరిజన సంఘాల ప్రతినిధులు పాలక రంజిత్ కుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులకు అందించండి చాలు..
సాక్షి, పార్వతీపురం మన్యం: పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతికి అన్నదాత–సుఖీభవ నిధులు రూ.14 వేలు ఇటీవల జమయ్యాయి. తాను పథకం పొందేందుకు అనర్హురాలినని.. ఆ నిధులను ఆమె తిరిగి ఇచ్చేందుకు సిద్ధం అయ్యా రు. తాను దరఖాస్తు చేయనప్పటికీ.. ఆ మొత్తం జమ కావడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఏదో కుట్ర పూరితం ఇందులో ఉందని సందేహం వ్యక్తం చేశారు. తనకు జమ అయిన డబ్బులు తిరిగి తీసు కోవాలని కలెక్టరేట్లో సోమవారం సంయుక్త కలెక్ట ర్ యశ్వంత్ కుమార్ రెడ్డిని కలిసి కోరారు. రూ.14 వేలు నగదు అందజేశారు. ఆయన తీసుకునేందుకు నిరాకరించారు. పరిశీలించి, ఆ మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. నగదు తీసుకోకుంటే డీడీ, చెక్కు రూపంలోనైనా తాను అందజేయడానికి సిద్ధంగా ఉన్నానని కళావతి చెప్పారు. అర్హులకు అన్యాయం చేస్తూ... అర్హులకు అన్యాయం చేస్తూ అన్హులకు పథకాలు అందించడం సరికాదని మాజీ ఎమ్మెల్యే కళావతి అన్నారు. అర్హులను, అనర్హులను కచ్చితంగా వేరు చేసి, కేవలం నిజమైన రైతు లబ్ధిదారులకే పెట్టుబడి నిధులు సక్రమంగా, సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని జేసీను కోరారు. వండువ గ్రామంలో 1,435 ఎకరాల ఇనాం భూములకు సంబంధించి గత ప్రభుత్వ కాలంలో సుమారు 700 మంది రైతు లకు మూడు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయ లు అయిదు సంవత్సరాల కాలంలో రైతు భరోసా ద్వారా అందించామని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక.. చాలామంది అర్హులకు పథకం అందలేద న్నారు. వారందరికీ న్యాయం చేయాలని.. తనకు పడిన అన్నదాత సుఖీభవ డబ్బులు వెనక్కి తీసుకోవాలని కోరారు. వాస్తవంగా మాజీ ఎమ్మెల్యే కళావతికి స్వగ్రామం వీరఘట్టం మండలం వండువలో కొంత భూములు ఉన్నాయి. ఆమె గతంలో బ్యాంక్ ఉద్యోగి.. పాలకొండ నియోజకవర్గం నుంచి పదేళ్లపాటు శాసన సభ్యురాలిగా ప్రజలకు సేవలందించారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారుగానూ ఉన్నా రు. ఆర్థికంగా స్వావలంబన కలిగిన ఒక మాజీ శాసన సభ్యురాలిగా, ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తిగా, పేద రైతులకు అందవలసిన ఈ సంక్షేమ నిధులు తన ఖాతాలో పడడం అత్యంత హేయమైన, అమర్యాదకరమైన పరిణామంగా ఆమె భావించారు. ఈ డబ్బులు స్వీకరించడం సమ్మతం కాదని భావించి.. ఆ నిధులను ప్రభుత్వానికి తిరిగి అప్పగించడానికి సిద్ధపడి, సంయుక్త కలెక్టర్ను కలిశారు. -
కారు బొలెరో..ఢీ : ఇద్దరికి గాయాలు
గజపతినగరం: మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న కారు, బొలెరో వాహనాలు అదుపుతప్పి సోమవారం ఢీకొన్నాయి. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలి నుంచి విజయనగరం వైపు వెళ్తున్న కారు ఎరువుల లోడుతో ఎదురుగా వస్తున్న బొలెరో వ్యాన్ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఎం.సూర్యనారా యణ రాజు(44),కె.ప్రకాష్ రావు(48)లకు స్పల్పగాయాలయ్యాయి. వారిని స్థానికులు గజపతినగరం ప్రభుత్వ కేంద్రాస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ఈ ఘటనలో వాహనాలకు డ్యామేజ్ తప్ప ప్రాణాపాయం లేదని స్థానికులు తెలిపారు. -
బంకుల్లో బారులు
వీరఘట్టం/పాలకొండరూరల్: రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరత వీరఘట్టం మండలాన్ని సోమవారం తాకింది.బంకుల వద్ద డీజిల్ నో–స్టాక్ బోర్డులు పెట్టడంతో డీజిల్తో నడుపుతున్న ఆటోలు, పలువురు వాహనదారులు అవస్థలు పడ్డారు. అయితే డీజిల్ నిల్వలు ఆదివారానికి ఉన్నప్పటికీ వీరఘట్టంలోని బంకుల యాజమాన్యం రాత్రికి రాత్రే తమకు తెలిసిన వారందరికీ క్యాన్లలో పట్టేసి ఇచ్చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారత్ పెట్రోల్ బంకు వద్ద పలువురు ఆటో డ్రైవర్లు సోమవారం ఆందోళనకు దిగారు. స్టాకు ఉంచుకునే ఎందుకు మీరు ఇవ్వడం లేదని అక్కడి సిబ్బందిని నిలదీశారు. అనంతరం రెవెన్యూ డీటీ ప్రసాదరావు, ఎస్సై షణ్ముఖరావు బంకు వద్దకు వచ్చి స్టాకు వివరాలను పరిశీలించారు. మంగళవారం నాటికి పూర్తి స్థాయిలో డీజిల్ ఉంటుందని వాహనదారులకు నచ్చజెప్పారు. వాహనాలు తీసుకువచ్చేవారికి మాత్రమే పెట్రోల్ గాని, డీజిల్ గాని ఇవ్వాలని క్యాన్లకు ఇంధనం ఇవ్వవద్దని బంకు సిబ్బందికి సూచించారు. అయితే డీజిల్ కొరత వల్ల చాలా ఆటోలు స్టాండ్లకు మాత్రమే పరిమితమయ్యాయి. -
తోటపల్లి ఆలయ నిర్వహణలో అక్రమాలు
పార్వతీపురం రూరల్: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తోటపల్లి దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరపాలని కోరుతూ జియ్యమ్మవల స గ్రామానికి చెందిన ప్రశాంతి సోమవారం పీజీ ఆర్ఎస్ కార్యక్రమంలో డీఆర్ఓకు ఫిర్యాదు చేశారు. ఆలయం దేవదాయ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఒక ప్రైవేట్ ట్రస్టు పెత్తనం సాగిస్తోందని ఆమె ఫిర్యాదు చేశారు. ఆలయానికి వచ్చే విరా ళాలు ప్రభుత్వ ఖజానాకు చేరాల్సింది పోయి, ప్రైవే ట్ వ్యక్తుల ఖాతాల్లో జమ అవుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. లడ్డూ ప్రసాదాల తయారీలో టెండర్ల ప్రక్రియను పక్కనపెట్టి, పారదర్శకత లేకుండా తమకు నచ్చిన వారికి పనులు కట్టబెడుతున్నారన్నారు. ఆలయ అధికారుల సమక్షంలోనే నిధుల మళ్లింపు జరుగుతున్నా స్పందించకపోవడంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. దేవస్థానంలో ఆగమ శాస్త్ర నియమాలకు విరుద్ధంగా పూజలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కలెక్టర్ స్పందించి ఈ వ్యవహారంపై విచారణ జరిపి ఆలయాన్ని పూర్తిగా ప్రభుత్వ పర్యవేక్షణలోకి తీసుకురావాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. -
రైతు కంటకన్నీరు
గరుగుబిల్లి: మండలంలోని తోటపల్లి పంచాయతీ పరిధి నందివానివలస గ్రామంలో ఆదివారం ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేసింది. మజ్జి సింహాచలం అరటి తోటపై దాడి చేయడంతోసుమారు రూ.50 వేల నష్టం వాటిల్లింది. చౌడాడ శ్రీను భూముల్లో పైపులు, బెండులు పాడవడంతో నీరు వృథా అయింది. గోళ్ల అన్నపూర్ణ అరటి తోట కూడా దెబ్బతింది. పంట కోత సమయంలో ఇలాంటి నష్టాలతో ఆర్థికంగా కుంగిపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఏనుగులను తరలించి, నష్టపోయిన రైతులకు సహాయం చేయాలని కోరుతున్నారు. గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. -
నిరుద్యోగులతో బంతాట..!
సోమవారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026విజయనగరం ఫోర్ట్: టీడీపీ సర్కార్ అరాచకానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. మాదారి అడ్డదారి అన్న విధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తుందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నిబంధనలను సైతం తుంగలో తొక్కే విధంగా వ్యవహరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తున్న తీరు చూసి నిరుద్యోగ అభ్యర్థులు విస్తుపోతున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల పోస్టుల విషయంలో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. వైద్య శాఖ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తుందని వైద్య ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. నియామక ఆదేశాలిచ్చి... ప్రభుత్వ వైద్య కళాశాలలో నాలుగు కేడర్ పోస్టులకు 2024 డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు – 09, ఎలక్ట్రికల్ హెల్పర్ పోస్టు – 01, ఆఫీస్ సబార్డినేట్ పోస్టు – 01, జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టు – 01కి నోటిఫికేషన్ ఇచ్చారు. 16 నెలల తర్వాత కొద్ది రోజులు క్రితం పోస్టుల భర్తీ పక్రియ చేపట్టారు. వీరందరికి కొద్ది రోజులు క్రితం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. వారం రోజుల్లో విధుల్లో చేరాలని అందులో పేర్కొన్నారు. దీంతో ఎంపికై న అభ్యర్థులు ఆర్డర్స్ పట్టుకుని ఉద్యోగాల్లో చేరేందుకు ప్రభుత్వ వైద్య కళాశాలకు వెళ్లారు. తీరా అక్కడ అధికారులు ఇప్పుడు మిమ్మల్ని విధుల్లోకి తీసుకోం... మళ్లీ ఎప్పుడు చేరాలనేది తామే చెబుతామని చెప్పి వెనక్కి పంపినట్టు తెలిసింది. దీంతో ఎంపికై న అభ్యర్థులు చేసేదిలేక నిరాశతో వెనుదిరిగారు. అసలు తమ నియామక విషయంలో ఏం జరుగుతుందని వారు మదనపడుతున్నారు. నియామక ఆదేశాలిచ్చిన తరువాత ఈ నిర్లక్ష్యమేమిటని వారు వాపోతున్నారు. అభ్యర్థుల్లో ఆందోళన పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు ఈ నెల 7వ తేదీలోగా విధుల్లో చేరాలని వైద్య కళాశాల అధికారులు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్లో పేర్కొన్నారు. అయితే అపాయింట్మెంట్ ఆర్డర్ గడువు 7వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగాలు తమకు వస్తాయా? లేక టీడీపీ సర్కార్ మార్చేస్తుందోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆర్డర్స్ ఇచ్చేది మేమే కదా తేదీలు మార్చి మళ్లీ ఆర్డర్స్ ఇవ్వవచ్చని చావు కబురు చల్లగా వైద్య కళాశాల అధికారులు చెబుతున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఎప్పుడు ఇలా లేదు.. పోస్టుల భర్తీ విషయంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ సర్కార్ వ్యవహరిస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నోటిఫికేషన్ ఇచ్చిన ఒకటి రెండు నెలల్లో భర్తీ చేసి విధుల్లోకి తీసుకుంటారు. కానీ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి పోస్టుల భర్తీ ప్రక్రియ విషయంలో చంద్రబాబు సర్కార్ తీరును సర్వత్రా తప్పుబడుతున్నారు. ఇదేమి విడ్డూరమని ప్రశ్నిస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్, ఎలక్ట్రికల్ హెల్పర్, జీడీఏ, ఆఫీస్ సబార్డినేటర్ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన మాట వాస్తవమే. వారిని విధుల్లోకి తీసుకోలేదు. క్లారిఫికేషన్ కోసం డీఎంఈకి లెటర్ రాశాం. అక్కడ నుంచి క్లారిఫికేషన్ రాగానే విధుల్లోకి తీసుకుంటాం. అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన వారినే విధుల్లోకి తీసుకుంటాం. – డాక్టర్ దేవీమాధవి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ వైద్య కళాశాల -
నిద్రిస్తున్న మహిళ మెడలో గొలుసు చోరీ
కురుపాం/గుమ్మలక్ష్మీపురం: నిద్రలో ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకున్న దుండగులు ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించారు. గుమ్మలక్ష్మీపురం గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. స్థానిక సంత వీధిలో శనివారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో ఈ దోపిడీ జరిగింది. ఓ ఇంటి వరండాలో మహిళ నిద్రిస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా ఆమె మెడలోని సుమారు రెండు తులాల బంగారు గొలుసును బలవంతంగా లాక్కుని పరారయ్యారు. బాధితురాలు తేరుకుని కేకలు వేసేలోపే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నేరస్థలం వద్ద లభించిన ఆధారాల ప్రకారం ఒక అనుమానిత వ్యక్తి ఛాయాచిత్రాన్ని సేకరించారు. చిత్రంలో ఉన్న వ్యక్తి వివరాలు గానీ, ఈ నేరానికి సంబంధించిన సమాచారం గానీ తెలిసిన వారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించదలచిన వారు ఎల్విన్ పేట సర్కిల్ ఇన్న్స్పెక్టర్ 92487 01917, ఎల్విన్ పేట సబ్ ఇన్స్పెక్టర్ 7981296171 లేదా నీలకంఠాపురం సబ్ ఇన్న్స్పెక్టర్ 6281897578 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం అందజేయనున్నామని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసు యంత్రాంగం వెల్లడించింది. -
రెచ్చిపోతున్న దొంగలు..!
నెల్లిమర్ల రూరల్: మండలంలో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఆలయాలు, ఇంటి ముందు పార్క్ చేసిన బైక్లనే టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల రామతీర్థం పంచాయతీ దేవుని నెలివాడలో ఉన్న అమ్మవారి ఆలయంలో తాళాలు విరగ్గొట్టి హుండీలోని డబ్బులతో పాటు అమ్మవారి బంగారు ఆభరణాలను ఎత్తుకువెళ్లారు. ఆ ఘటన మరువక ముందే శనివారం అర్ధరాత్రి గొర్లిపేట జగనన్న కాలనీలో ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్రవాహనాన్ని దొంగిలించుకుపోయారు. గతంలో కూడా నెల్లిమర్ల–రణస్థలం రహదారిలో బైక్ చోరీలు ఎన్నో జరిగాయి. రాత్రి వేళ రహదారి మొత్తం నిర్మానుష్యంగా ఉండడం..జాతీయ రహదారికి అత్యంత దగ్గరగా ఉండడంతో ఈ రహదారిని చోరీలకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ప్రజలు చెబుతున్నారు. పోలీసులు స్పందించి రాత్రి వేళల్లో నిఘా పెంచాలని కోరుతున్నారు. -
నేడు పీజీఆర్ఎస్
పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)లో అర్జీల వివరాలు మీ కోసం వెబ్సైట్లో నమోదు చేయవచ్చని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని కలెక్టర్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతి రోజూ ప్రజల నుంచి వినతులు స్వీకరించుటకు సెల్లార్లో ప్రత్యేకంగా సెల్ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి, దానికి సంబంధించి సమాచారం తెలుసుకునేందుకు 1100 నంబరుకు నేరుగా కాల్ చేయవచ్చని తెలిపారు. విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవం సోమవా రం సాయంత్రం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ ఈఓ కె.శిరీష ఆదివారం తెలిపారు. స్థానిక రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడిలో కొలువుదీరిన పైడితల్లి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి సోమవారం సాయంత్రం 4 గంటలకు విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తామన్నారు. అనంతరం మేళతాళాలు, భాజాభజంత్రీలు, విచిత్ర వేషధారణలతో అమ్మవారిని వనంగుడి నుంచి గాడీఖానా, కన్యకపరమేశ్వరీ ఆలయం, గంటస్తంభం మీదుగా హుకుంపేటలో ఉన్న పూజారి ఇంటి వద్దనున్న చదురువద్దకు తీసుకువెళ్తారన్నారు. అక్కడ ఘటాలకు పూజలు, ఊరేగింపు అనంత రం మంగళవారం వేకువజాము నుంచి అమ్మవారు మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడి బాలాలయంలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. మళ్లీ పైడితల్లి అమ్మవారు జాతర చివరి ఘట్టమైన ఉయ్యాలకంబాల మహోత్స వం తర్వాత అమ్మవారిని వనంగుడికి తీసుకువస్తామన్నారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించి, తరించాలని కోరారు. విజయనగరం టౌన్: విజయభావన సాహిత్య సదస్సులో భాగంగా స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం శ్రీభాష్యం హరిచంద న్ రచించిన ‘శబలత’ గ్రంథావిష్కరణను సాహితీ విజయసారథి డాక్టర్ ఎ.గోపాలరావు ఆదివారం ఆవిష్కరించారు. ప్రముఖ కవి మానాపురం రాజాచంద్రశేఖర్ సమీక్షించారు. సమ్మానకర్తగా కొంకెపూడి అనూరాధ వ్యవహ రించారు. ఈ సందర్భంగా చిరకాలం సేవలందించిన తూట బాబాజీని సంస్థ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. భావుకత సామాజిక వాస్తవికత ముప్పేట అల్లికగా గ్రాంథిక వ్యవహార భాషలలో సాగిన చిక్కని కవిత్వం ఈ శబలత అన్నారు. గ్రంథ రచయిత డాక్టర్ హరిచందన్ మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న వివి ధ అంశాలపై స్పందనగా వచ్చిన కవిత్వమన్నా రు. డాక్టర్ భైరవభట్ల విజయాదిత్య ఆహ్వానం పలకగా, పార్ధన, పద్యపఠనం చేశారు. కార్యక్రమంలో దశగ్రంథాల సుబ్రహ్మణ్యం, సోమే శ్వరరావు, బాబూజీ, హరిప్రియ, ఆముక్తమా ల్యద, చీకటి దివాకర్, మానాప్రగడ సాహితీ, తదితరులు పాల్గొన్నారు. బొబ్బిలి: పట్టణం పండగ సందడిలో మునిగి తేలుతోంది. దాడితల్లి, సరేపోలమ్మ అమ్మవార్ల తొలేళ్ల ఉత్సవాల ముందు రోజు జరుపుకునే దేశమ్మతల్లి వారోత్సవాలు సందడిగా సాగా యి. పాత బొబ్బిలి సరేపోలమ్మ ఆలయ ధర్మకర్త చోడిగంజి రమేష్నాయుడు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ప్రభల ఊరేగింపు ఆకట్టుకుంది. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన ఈ ప్రభల ఊరేగింపు క్రతువు సరేపోలమ్మ ఉత్సవాల్లో ఏటా ఆనవాయితీగా వస్తోంది. అలాగే దిమిలి పొడుగు మనుషుల విచిత్ర వేషధారణలూ ఆకట్టుకున్నాయి. మరో పక్క దేశమ్మ తల్లి ఆలయం వద్ద భక్తులను ఆశీర్వదించడానికా అన్నట్టు శివపార్వతులు, ఇతర దేవతామూర్తు లు, రుషుల అలంకరణలతో ప్రదర్శనలు భక్తులను ఆధ్యాత్మిక వాతావరణంలోకి నెట్టాయి. జంట సిరిమానులు తిలకించేందుకు ఇతర భక్తులు ఆయా బంధువుల ఇళ్లకు చేరుకుంటున్నారు. -
నిండుకున్న మందులు
విజయనగరం ఫోర్ట్: మెరకముడిదాం మండలానికి చెందిన ఓ ఫైలేరియా రోగి విజయనగరంలోని ఫైలేరియా యూనిట్కు వెళ్లి వ్యాధి నివారణకు ఉపయోగించే డీఈసీ మాత్రలు అడగ్గా మందులు లేవనిచెప్పి పంపించేశారు.● గంట్యాడ మండలానికి చెందిన ఓరోగి కూడా విజయనగరంలో ఉన్న ఫైలేరియా యూనిట్కు డీఈసీ మాత్రల కోసం వెళ్లగా అక్కడి సిబ్బంది మందులు లేవని చెప్పి పంపించేశారు. ఇలా వీరిద్దరే ఫైలేరియా వ్యాధితో బాధపడుతున్న అనేక మంది రోగులకు ఎదురువుతున్న పరిస్థితి ఇది. ఫైలేరియా (బోద) వ్యాధి నివారణలో డీఈసీ మాత్రలు బాగా పనిచేస్తాయి. వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయి. దీంతో వ్యాధిగ్రస్తులు ఈ మాత్రలు వేసుకోవడానికి అసక్తి చూపుతారు. వేలాది మంది బోదవ్యాధిగ్రస్తులు జిల్లాలో ఉన్నారు. బోధవ్యాధిగ్రస్తుల పట్ల సమాజంలో వివక్ష ఉంది. బోధవ్యాధి సోకినవారిలో చాలా మంది అవివాహితులుగా ఉండిపోతున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే రోగులు మరింత ఇబ్బంది పడతారు. ఈ వ్యాధిగ్రస్తులకు చిన్న రాయి గుచ్చుకున్నా పెద్దపెద్ద గాయాలై పోతాయి. అంతేకాకుండా సెల్యూలైటిస్ వ్యాధి త్వరగా వీరికి సోకుతుంది. దీంతో వారు మందులు వాడుతూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలో 3,238 మంది రోగులు జిల్లాలో 3,238 మంది ఫైలేరియా వ్యాధిగ్రస్తులు ఉన్నారు. గుర్ల, బలిజిపేట మండలాల్లో ఎక్కువగా ఈ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఈ వ్యాధిసోకడం వల్ల వారంతా నిత్యం ఇబ్బంది పడుతూ ఉంటారు. మందుల సరఫరా నిలిపివేసిన సర్కార్ ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు అందించే డీఈసీ మాత్రల సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో ప్రస్తుతం వ్యాధితో బాధపడుతున్నవారికి డీఈసీ మాత్రలు అందడం లేదు. మందులు అవసరమైన రోగులు ప్రైవేట్ మందుల దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. ఉచితంగా అందాల్సిన మందులకు చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫైలేరియా రోగులు జ్వరం, కాలువాపు, ఇన్ఫెక్షన్స్కు గురవుతారు. అటువంటప్పుడు డీఈసీ మాత్రలు వాడితే అవి తగ్గుతాయి. క్యూలెక్స్ దోమ కుట్టడంతో వ్యాధి వ్యాప్తి క్యూలెక్స్ అనే దోమ కుట్టడం వల్ల బోద వ్యాధి వ్యాప్తి చెందుతుంది. బోధవ్యాధి అంతత్వరగా బయట పడదు. వ్యాధి బయట పడడానికి 10, 15 ఏళ్లు పడుతుంది. కొద్దిపాటి జ్వరానికి తరచూ గురవుతారు. చంకల్లో, గజ్జల్లో బిళ్ల కట్టడం, కాళ్లు చేతులపై ఎర్రని చారలు కనబడతాయి. కొంత కాలం తార్వాత కాళ్లు, చేతులు, వృషణాలు , ఇతర జన నేంద్రియములకు సంబంధించిన వాపులు కూడా బోద వ్యాధి లక్షణాలే. బోధ వ్యాధిసోకిన వ్యక్తికి 21 రోజుల పాటు తొలుత చికిత్స అందిస్తారు. ఆ తర్వాత ప్రతి మూడు నెలలకు ఒకసారి 12 రోజుల పాటు మందులు వాడాల్సి ఉంటుంది. ఫైలేరియాకు మందుల సరఫరా నిలిపివేసిన ప్రభుత్వం జిల్లాలో 3,238 మంది వరకు ఫైలేరియా వ్యాధిగ్రస్తులు ప్రైవేటుగా మందులు కొనుగోలు చేస్తున్న రోగులుకొత్త కేసులకు మాత్రమే ! ప్రస్తుతం వ్యాధిబారిన వారికి మందుల సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. సంబంధిత పీహెచ్సీలకు వెళితే వారికి డీఈసీ మాత్రలు ఇస్తారు. కొత్తగా నమోదైన కేసులకు మాత్రమే మందులు ఇస్తున్నాం. ఎం.సింహాచలం, జిల్లా మలేరియా నివారణ అధికారి -
జనగణనతోనే ప్రగతి : జేసీ
పార్వతీపురం రూరల్: రాబోయే దేశ వ్యాప్త జనగణన ప్రక్రియపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు పార్వతీపురంలో నిర్వహించిన 5కే రన్ ఉత్సాహంగా సాగింది. ఆదివారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి పరుగును ప్రారంభించి, స్వయంగా పాల్గొని సిబ్బందిని ఉత్సాహపరిచారు. ఈ పరుగు పట్టణ ప్రధాన వీధుల మీదుగా సాగుతూ కలెక్టరేట్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జనగణన కేవలం అంకెల సేకరణ మాత్రమే కాదని, అది దేశ సౌధానికి బలమైన పునాది అని పేర్కొన్నారు. పౌరులు అందించే కచ్చితమైన సమాచారం ఆధారంగానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, భవిష్యత్తు ప్రణాళికలు రూపొందుతాయని వివరించారు. ప్రతి ఇంటికీ గణన ప్రాముఖ్యతను చేరవేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. పౌరులంతా బాధ్యతాయుతంగా గణన అధికారులకు సరైన వివరాలు అందించి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, మున్సిపల్ కమిషనర్ డి.పావని, డీఈఓ పి.బ్రహ్మజీరావు, వివిధ శాఖల అధికారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ఆటోను ఢీకొట్టిన కారు: 13 మందికి గాయాలు
పూసపాటిరేగ: భోగాపురం మండలం నారుపేట వద్ద జాతీయరహదారిపై ఆదివారం సాయంత్రం నెమ్మదిగా వెళ్తున్న లగేజీ ఆటోను వెనక నుంచి కారు బలంగా ఢీకొట్టడంతో 13 మందికి గాయాలయ్యాయి. శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న కారు అదే దిశగా ప్రయాణికులతో వెళ్తున్న లగేజీ ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో గాయపడిన వ్యక్తులను సుందరపేట ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న డి.దేవి, కె.సావిత్రి, డి.నాగమణి, డి. లావణ్య, డి.లక్ష్మీదేవి, డి.నిహారిక, డి.మీనాక్షి, డి.రోహిణి, డి. శశాంక్కు గాయాలయ్యాయి. వారిలో ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలు అవడంతో సంఘటనా స్థలం నుంచి విజయనగరంలోని ఓ పైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తులు రాజాం మండలం శ్యాంపురం గ్రామస్తులు కాగా వారు జీవనోపాధి నిమిత్తం విశాఖ సుజాత నగర్లో నివాసం ఉంటున్నారు, శ్రీకాకుళం సమీపంలో రాజులమ్మ ఆమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో సుజాతనగర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.కారులో ప్రయాణిస్తున్న రణస్థలం మండలం జీరుపాలెంకు చెందిన డి. సుశీల, డి.రాముడుకు గాయాలయ్యాయి. వారికి సుందరపేట ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. ఈ మేరకు భోగాపురం సీఐ కె. దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురి పరిస్థితి విషమం -
డా. నీలిమకు ‘పీపుల్స్ చాయిస్ అవార్డు’
విజయనగరం అర్బన్: వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ నిర్వహించిన అంతర్జాతీయ వీడియో పోటీలో విశాఖపట్నానికి చెందిన డా. నీలిమ ‘పీపుల్స్ చాయిస్ అవార్డు’ను అందుకున్నారు. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డే సందర్భంగా స్థానిక సీతం కళాశాలలో ఆదివారం ఆమెను ప్రత్యేకంగా సన్మానించారు. ‘ఐపీ అండ్ స్పోర్ట్స్’ అనే థీమ్పై డా. నీలిమ రూపొందించిన ‘కలరిపయట్టు’ వీడియో విశేష ప్రజాదరణ పొందింది. ప్రపంచవ్యాప్తంగా 43 దేశాల నుంచి వచ్చిన 182 వీడియోల్లో ఆమె వీడియో టాప్–20లో స్థానం సంపాదించడం విశేషం. భారతదేశం నుంచి ఎంపికై న ఏకై క ప్రతినిధిగా ఆమె నిలిచారు. ఏప్రిల్ 6 నుంచి 19 వరకు నిర్వహించిన ఆన్లైన్ ఓటింగ్లో అత్యధిక మద్దతు సాధించి డా.నీలిమ ‘పీపుల్స్ చాయిస్ అవార్డు’ను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యురాలు, సత్య విద్యా సంస్థల సెక్రటరీ–కరెస్పాండెంట్ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ, డా. నీలిమ సాధించిన ఈ అంతర్జాతీయ గుర్తింపు దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో సత్య విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణ్ రావు పాల్గొన్నారు. అభినందించిన మాజీ ఎంపీ డా. బొత్స ఝాన్సీ -
కాదంటే కారాగారమే..?
సాలూరు: వివాదాస్పద ఆంధ్రా – ఒడిశా సరిహద్దు కొటియా గ్రూపు గ్రామాల్లో గిరిజనులకు చంద్రబాబు ప్రభుత్వంలో రక్షణ కరువైంది. ఇటీవల చేపట్టిన జనగణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ కొటియా గ్రామాల్లోని ఇద్దరి గిరిజనుల అరెస్టుకు కారణమైంది. కొటియా గ్రామాల గిరిజనులు తెలిపిన వివరాలు ప్రకారం.. కొటియా గ్రూపు గ్రామాల్లో ఒకటైన ఎగువశెంబి గ్రామంలో ఈ నెల 22, 23 తేదీల్లో ఒడిశా అధికారులు పర్యటించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని వారికి సూచించారు. దీనికి గిరిజనులు స్పందిస్తూ తాము ఆంధ్రాలో ఉంటామని, ఇక్కడే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుంటామని గ్రామానికి చెందిన తాడంగి పిళ్లు, తాడంగి చిరంజీవి తదితరులు చెప్పారు. దీనికి గ్రామస్తులంతా ఒక్కటై ఒడిశా చేపడుతున్న సెల్ఫ్ ఎన్యూమరేషన్ను తిరస్కరించడంతో అధికారులు వెనుదిరిగారు. సంబంధిత అధికారులు తమ విధులకు ఆటంకం కలిగించారని అభియోగాలతో ఒడిశాలోని కొటియా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఒడిశా పోలీసులు శనివారం సాయంత్రం పిళ్లు, చిరంజీవిని తోణాం సమీపంలో అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. కొరాపుట్ కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో బాధిత కుటుంబాలు, గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఆంధ్రాలో ఉంటామని చెప్పడమే చేసిన నేరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై పలు గిరిజన సంఘాలు, సీపీఎం తదితర ప్రజా సంఘాల నాయకులు గిరిజనుల అక్రమ అరెస్టులను ఖండించారు. చోద్యం చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఇకనైనా స్పందించి గిరిజనులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. స్పందించిన జేసీ గిరిజనుల అరెస్టు విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ యశ్వంత్కుమార్రెడ్డి స్పందించారు. జేసీ ఆదేశాలతో తహసీల్దార్ సురేష్ ఎగువశెంబి గ్రామానికి వెళ్లారు. బాధిత కుటుంబాలతో, స్థానికులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో... కొటియాలో గిరిజనులకు రక్షణ కరువు ఇద్దరు గిరిజనులను అరెస్ట్ చేసిన ఒడిశా పోలీసులు జనగణనను కాదన్నందుకే... చోద్యం చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం -
ఏపీటీఎఫ్ జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవం
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938) విజయనగరం జిల్లా కౌన్సిల్ సమావేశం స్థానిక రింగ్ రోడ్డులోని పీఎస్ఆర్ స్కూల్లో ఆదివారం జరిగింది. తొలుత జిల్లా శాఖకు ఎన్నికలు నిర్వహించారు. గౌరవ అధ్యక్షుడిగా ఆర్.కష్ణ, అధ్యక్షుడిగా ఎన్.వి. పైడిరాజు, ప్రధాన కార్యదర్శిగా గంట సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఏవీ శ్రీనివాసరావు, సీహెచ్. రామారావు, బి.శరత్కుమార్, గుమ్మడి శ్రీనివాసరావు, కార్యదర్శులుగా పి.దామోదర్ నాయుడు, కేవీ రమణ, కె.శ్రీనివాసులు, ఎన్. సూర్యనారాయణ, పి.రమేష్ నాయుడు, జి.వెంకటరమణ, ఎన్. చిన్నాదేవి, కె. త్రినాథరావు ఎన్నికయ్యారు. రాష్ట్ర కౌన్సిలర్లుగా ఎ. సదాశివరావు, డి.ఈశ్వరరావు, వై.సత్యం, ఎం.బలరాం నాయుడు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎం.బలరాం నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.వి.పైడిరాజుల ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సమస్యలపై పలు కీలక తీర్మానాలు ఆమోదించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు కె.సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షుడు డి. ఈశ్వరరావు హాజరయ్యారు. జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
ఏడీఏపై వీఏఏల ఫిర్యాదు
దత్తిరాజేరు: గజపతినగరం వ్యవసాయ శాఖ సహయ సంచాలకురాలి (ఏడీఏ)పై కొద్ది రోజుల క్రితం వీఏఏలు ఆంద్రప్రదేశ్ వ్యవసాయ శాఖ డైరెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. గజపతినగరం నియోజకవర్గంలోని గజపతినగరం దత్తిరాజేరు, బొండపల్లి, సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ మండలంలో రైతు సేవా కేంద్రాలు ఇబ్బందులకు గురవుతున్నట్లు ఇక్కడికి ఆమె వచ్చినప్పటి నుంచి సిబ్బంది పర్సనాలిటీ, జీవనశైలి గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నట్లు, ఆమె కుమార్తె పాకెట్ మనీ అంత తమ జీతం ఉండదని, ఆమె ప్లైట్ టిక్కెట్ ఖరీదు మాజీతాలు చేయవని, ఆమె కాళ్లకు వేసుకున్న చెప్పుల పాటి విలువ మా జీతాలు ఉండవని చాలా హీనంగా.అసభ్యకరంగా మాట్లాడుతున్నారని, ఫిర్యాదులో పేర్కొన్నారు. మాతో నిర్వహించిన మీటింగ్లకు ఆమె భర్త హాజరై లేనిపోని మాటలు ఆడుతున్నారని ఆమె భర్తతో కాలం చెల్లిన మందులు అమ్మించి రైతులను మోసం చేస్తున్నారని రైతు సేవా కేంద్రాలలో పని చేస్తున్న సిబ్బందిపై లేని పోని అభాండాలు వేసి అక్రమ సంబంధాలు కూడా అంటగడుతున్నారని ఫిర్యాదు చేశారు. గత ఖరీఫ్(2025)మందులకు 2026 జూన్లో తయారైనట్లు స్టిక్కర్లు తగించి మందులు అమ్ముతున్నారని సహకరించక పోతే లేనిపోని మాటలు అడుతున్నారని పేర్కొన్నారు. సాక్షాత్తు మంత్రి నియోజకవర్గంలో ఇలా జరగడం వల్ల ఈవిషయంపై గతంలో అధికారులు విచారణ చేపట్టినా తూతూమంత్రంగానే చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
దర్శకుడు ఆదిత్యకు ఇండోనేషియా పురస్కారం
వేపాడ: గత 30 ఏళ్లుగా ప్రయోగాలు చేస్తూ ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దిన మండలంలోని కుమ్మపల్లి గ్రామానికి చెందిన డా.పి.సి.ఆదిత్య(దర్శకుడు)ను 2026 ఇండోనేషియా 2026 ఎక్స్లెంట్ అవార్డు వరించింది. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారతదేశానికి చెందిన గ్రీన్ ఇండియా పరివార్తో కలిసి పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్న ఇండోనేషియా కు చెందిన ఎన్జీఐపీఫౌండేషన్ డైరెక్టర్ పీసీ ఆదిత్యసేవలను గుర్తించి అవార్డు అందజేయడం అభినందనీయమని ఇండియా ప్రతినిధి నీరజ్ గుప్తా అభినందించినట్లు ఆదిత్య తెలిపారు. మనదేశానికి మిత్రదేశమైన ఇండోనేషియా నుంచి అంతర్జాతీయఅవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. -
యువకుడిపై పొక్సో కేసు నమోదు
విజయనగరం క్రైమ్ : విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి సీఐ నరసింహమూర్తి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. చెల్లూరు చెందిన 19 ఏళ్ల యువకుడు, 15 ఏళ్ల బాలిక ఏడాదిగా ప్రేమించు కుంటున్నారు.బాలికతో తరచూ మాట్లాడడం కోసం యువకుడు బాలికకు సెల్ఫోన్ కూడా కొని ఇచ్చాడు. ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని షికార్లు తిరిగారు. రెండు రోజుల క్రితం వీటీ అగ్రహారంలో ఉంటున్న బాలికకు వాంతులు కావడంతో తల్లికి చెప్పింది. ఆపై భరించలేనంత కడుపు నొప్పి రావడంతో పరీక్ష చేయగా గర్భిణిగా తేలింది. వెంటనే కన్న వారు స్థానిక ఘోషా ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్ నుంచి మహిళా పోలీస్ స్టేషన్కు బాలిక తల్లి వచ్చి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు విజయనగరం ఇన్చార్జ్ డీఎస్పీ రాఘవులు స్థానిక ఘోషా హాస్పిటల్కు వెళ్లి బాలిక నుంచి వివరాలు తెలుసుకుని చెల్లూరు కు చెందిన కేశవ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. దర్యాప్తులో బాలిక పై చేసిన ఘోరం రుజువు కావడంతో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కామేశ్వరరావుకు లాస్యప్రియ ఉగాది ప్రతిభా పురస్కారంవిజయనగరం టౌన్: ప్రముఖ కూచిపూడి నృత్య దర్శకుడు, ధర్మాస్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు పీఎస్వీ.కామేశ్వరరావుకు ఇండియన్ కల్చరల్ ఆర్ట్ ఫెస్టివల్లో భాగంగా రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో ఆదివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో లాస్యప్రియ ఉగాది ప్రతిభా ఆచార్య పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాస్యప్రియ కూచిపూడి నృత్యనికేతన్ వ్యవస్థాపకుడు మేడిది నాగేశ్వరరావు చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన కూచిపూడి సంస్థల ప్రతినిధులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. -
శ్యామలాంబకు పాలస్నానం రేపు
చీపురుపల్లి: గరివిడి మండలంలోని అర్తమూరు గ్రామంలో వెలసిన గ్రామదేవత శ్యామలాంబకు ఏటా నిర్వహించే పాలస్నానం మంగళవారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మమారికి సామూహిక కుంకుమార్చన నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో గ్రామస్తులు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి పాలస్నానం చేయనున్నారు. పాలస్నానం సందర్భంగా రాత్రి సాంస్కృతిక కార్యమాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ అభివృద్ధి ధర్మకర్త(ఆశాది) పొన్నాడ సూర్యనారాయణ, గ్రామ ప్రజలు తెలియజేశారు. గ్రావెల్ తరలిస్తున్న లారీ, జేసీబీ అడ్డగింతబొండపల్లి: మండలంలోని కనిమెరక గ్రామ పంచాయతీ పరిధిలో గల మంగలి చెరువులో అక్రమంగా గ్రావెల్ తవ్వి తరలిస్తున్న జేసీబీతో పాటు, లారీని పట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించినట్లు తహసీల్దార్ డోలా రాజేశ్వర్రావు తెలిపారు. వాల్టా చట్టం నిబంధనలు ఉల్లఘించి గ్రావెల్ను చెరువు నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు రూ.15 వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. అక్రమంగా గ్రావెల్ను తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్ఐ హరిప్రసాద్ వీఆర్ఓలు పాల్గొన్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్లో ప్రవేశాల ప్రారంభంచీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడిలో గల ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్లో చెవిటి,మూగ,దృష్టి లోపం ఉన్న చిన్నారులకు ప్రవేశాలు ప్రారంభమయ్యాయని వెల్ఫేర్ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ జీవీఎన్.రామకృష్ణ తెలిపారు. 6 సంవత్సరాలు దాటిన పిల్లలకు ఉచిత విద్యతో పాటు ఉచిత వసతి,ఉచిత భోజనం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగ చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆసక్తి గల వారు ఫోన్ 9494777905 నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఆకస్మికంగా ఉపాధ్యాయుడి మృతివేపాడ: మండలంలోని పాటూరు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు కాపు సత్యనారాయణ (40) ఆదివారం ఆకస్మికంగా మృతిచెందారు. ఇందుకు సంబంధించి స్దానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో జరిగిన ఫంక్షన్లో పాల్గొన్న ఆయనకు ఆకస్మికంగా ఆరోగ్యం బాగోకపోవడంతో ఎస్కోటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. కాపు సత్యనారాయణ ప్రస్తుతం మెంటాడ మండలం బిరసాడవలస ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య జయ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉపాధ్యాయుడి మృతిపట్ల వేపాడ మండల ఉపాధ్యాయులు దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
పనితీరు ఆధారంగా గౌరవ వేతనం
విజయనగరం ఫోర్ట్: పనితీరు ఆధారంగా గ్రామ సంఘం అసిస్టెంట్ల గౌరవ వేతనాలను ప్రతీ నెల సమయానికి జనరేట్ చేయాలని డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి అన్నారు. స్థానిక డీఆర్డీఏ సమావేశ మందిరంలో ఎంఎస్ అకౌంట్స్, కంప్యూటర్ ఆపరేటర్లతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి 31 నాటికి మండల సమాఖ్యలలో ఉన్న బ్యాంకు ఖాతాలు, బ్యాంకు బ్యాలెన్స్లు కన్ఫర్మేషన్ ఆన్లైన్ పూర్తి చేయాలన్నారు. రుణాల రికవరీపై దృష్టి పెట్టాలన్నారు. ఇంటర్నల్ ఆడిట్లో గమనించిన అంశాలను, గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలన్నారు. గ్రామ సంఘాల, మండల సమాఖ్యలు నిధుల స్థితిని ప్రతి ఆరు నెలలకు ఒకసారి సంస్థాగత నిర్మాణం వెబ్సైట్లో అప్డేట్ చేయాలన్నారు. మండల సమాఖ్య నిర్వాహణ ఖర్చులు మొత్తం ఆదాయానికి 30 శాతంకు లోపే ఉండేలా వ్యయ నియంత్రణ చేయాలన్నారు. గ్రామ సంఘాల్లో ఉన్న సొంత నిధుల స్థితిని తెలుసుకుని అంతర్గత అప్పులు ఇవ్వడం, తిరిగి రికవరీకి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు సంచాలకులు కె.సావిత్రి, డీపీఎంలు ఎ.చిరంజీవి, సీతారామయ్య, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. డీఆర్డీఏ పీడీ శ్రీనివాస పాణి -
కష్టాలు బారెడు
–8లోబండ ● భారత్ గ్యాస్ అందక వినియోగదారుల అవస్థలు ● ఖాళీ సిలిండర్లతో గంటలకొద్దీ ఎండలో నిరీక్షణ ఆదివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026గత సంక్రాంతి నుంచి మాకు సిలిండర్లు రా వడం లేదు. వంట కోసం కట్టెలు ఏరుకుంటున్నాం. ఎన్నిసార్లు ఇక్కడ ఆఫీసుకు వచ్చినా బండ ఇవ్వడం లేదు. బయట తెచ్చుకున్నా.. రూ. 1,100 వరకూ తీసుకుంటున్నారు. భారత్ గ్యాస్ ఏజెన్సీ పరిస్థితి బాలేదు. అధికారులు దృష్టి సారించాలి. – సుజాత, బంటువానివలస మాకు కొద్ది రోజుల కిందటే సిలిండర్ బుక్ అయినట్లు చూపింది. ఇప్పటివరకూ బండ ఇవ్వడం లేదు. సాలూరు ఏజెన్సీ వారు చూసుకుంటారు అని నంబర్ ఇచ్చారు. ఎన్నిసార్లు చేసినా అవ్వడం లేదు. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి ఇక్కడే ఉన్నా.. ఈ రోజు అయినా బండ ఇంటికి తీసుకు వెళ్తామో, లేదో..! అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. – చంటి, శివిని సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న భారత్ గ్యాస్ ఏజెన్సీ సరఫరా కేంద్రం కొన్నాళ్లుగా తెరుచుకోవడం లేదు. ఇప్పటికే అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్లో వంట గ్యాస్కు కష్టాలు తప్పడం లేదు. దీనికి తోడు.. ఈ కేంద్రం చుట్టూ అల్లుకున్న రాజకీయ వివాదాలు వినియోగదారులకు చుక్కలు చూపెడుతున్నాయి. కొన్ని నెలలుగా ఏజెన్సీ యాజమాన్యం విషయంలో వివాదాలు ఉన్నాయి. దీంతో అప్పటి నుంచి కేంద్రం మూతపడే ఉంది. గతంలో పలుమార్లు ఇక్కడ వినియోగదారులు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం సాలూరు ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఈ గ్యాస్ ఏజెన్సీ నిర్వహణ బాధ్యతలు అప్పగించినా పరిస్థితిలో మార్పులేదు. వినియోగదారుల కష్టాలు తీరలేదు. ఇదే ఆధారం.. కొమరాడ మండలంలోని కందివలస, కుమ్మరిగుంట, కంభవలస, రాజ్యలక్ష్మిపురం, రావికర్ర వలస, సుందరాపురం, అంకుళ్లవలస, కోనవలస, డంగభద్ర, బొడ్డవలస, లక్ష్మీపేట, పార్వతీపురం, మండల పరిధిలోని పలు గ్రామాలు, బలిజిపేట, సీతానగరం తదితర ప్రాంతాల భారత్ గ్యాస్ వినియోగదారులు ఈ ఏజెన్సీపైనే ఆధారపడి ఉన్నారు. వీరందరూ ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు చవిచూస్తున్నారు. సాంకేతిక కారణాలతో గ్యాస్ ఏజెన్సీ కోడ్ను మార్చకపోవడం వల్ల వినియోగదారులు గ్యాస్ కోసం ప్రయత్నించినా బుకింగ్ అవ్వడం లేదు. ఓటీపీలు రావట్లేదు. కొంతమందికి బుక్ అయినట్లు సంక్షిప్త సందేశాలు వస్తున్నా.. సిలిండర్లు మాత్రం ఇవ్వడం లేదు. అంతర్జాతీయ సంక్షోభం నేపథ్యంలో వినియోగదారుల కష్టాలు మరింత రెట్టింపు అయ్యాయి. దాదాపు గత సంక్రాంతి నుంచి తమకు సిలిండర్లు రావడం లేదని వినియోగదారులు గగ్గోలుపడెతున్నారు. ఇటీవల ఆందోళన నేపథ్యంలో 125 గ్యాస్ సిలిండర్లను తెప్పించి వేచి ఉన్న వారికి పంపిణీ చేశారు. శనివారం కూడా గ్యాస్ సిలిండర్ లారీ లోడు రావడంతో సమాచారం అందుకున్న వందలాదిమంది బైపాస్ రోడ్డుకు చేరుకున్నారు. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం వరకు ఎండలో పడిగాపులు కాశారు. తమ వంతు కోసం ఖాళీ సిలిండర్లను వరుసలో పెట్టారు. రోజంతా పడిగాపులు కాసినా.. వీరికి సమాధానం ఇచ్చేవారు కూడా లేకపోవడం గమనార్హం. ఫోన్లు చేస్తే సంబంధిత భారత్ గ్యాస్ ప్రతినిధులు స్పందించడం లేదని వారంతా వాపోతున్నారు. ఫోన్ చేస్తే.. సాలూరులో సంప్రదించాలని ఒకసారి, రామభద్రపురం అని మరోసారి చెబుతూ తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఐటీడీఏలో ఏం జరుగుతోంది?
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం ఐటీడీఏలో ఏం జరుగుతోంది? ఎవరికి వారు పై చేయి సాధించడానికి.. పంతాలకు పోయి, పరిపాలనను గాలికి వదిలేశారన్న విమర్శలు గిరిజన సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇన్చార్జి పీవోగా ఉన్న యశ్వంత్ కుమార్ రెడ్డి.. ఇంకా ఆ పోస్టు నుంచి రిలీవ్ కాలేదు. కొన్ని ఫైళ్లు, బిల్లులు క్లియర్ చేసేందుకే ఆయన బాధ్యతలు అట్టిపెట్టుకుని ఉన్నట్టు సమాచారం. ఇక్కడి పీవోగా నియమితులైన సబ్ కలెక్టర్ వైశాలి.. బాధ్యతలు స్వీకరించలేదు. ఆమె ఇక్కడే కూతవేటు దూరంలోని కార్యాలయంలో ఉన్నా బాధ్యతలు స్వీకరించడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారన్న ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చి వారం గడుస్తోంది. ప్రభుత్వ ఆదేశాలను కూడా లెక్క చేయలేని పరిస్థితి ఇక్కడ ఉంది. వాస్తవంగా వైశాలికి పీవోగా ఉద్యో గోన్నతి కల్పించారు. నిర్ణీత కాలంలో బాధ్యతలు స్వీకరించకపోతే శాఖాపరంగా ఇబ్బందులు ఎదుర య్యే అవకాశం ఉందని అధికారిక సమాచారం. ● మరోవైపు ప్రచ్ఛన్న యుద్ధంలో భాగంగా.. గిరిజన సంక్షేమ శాఖ డీడీగా ఉన్న విజయశాంతిని ఒంటరిని చేసే ప్రక్రియ సాగుతోందని ఆ విభాగ సిబ్బంది అంటున్నారు. మొదటి నుంచి ఆమె పట్ల అయిష్టంగా ఉన్న కొంతమంది.. నిర్ణయాల్లో ‘అధికారం’ ఇవ్వడం లేదని.. డీడీకి సంబంధం లేకుండానే.. ఈ శాఖపై పరిజ్ఞానం లేని కొంతమంది ఉద్యోగులను కొద్దిరోజుల కిందట ఆకస్మాత్తుగా ఇక్కడికి బదిలీ చేశారని ప్రచారం నడుస్తోంది. కొన్ని నిర్ణయాల్లో కీలకంగా, అప్రమత్తంగా ఉండాల్సిన గిరిజన సంక్షేమ విభాగంలో అటువంటి వారిని విధుల్లోకి తీసుకోవడానికి డీడీ అయిష్టత చూపుతున్నారు. ఈ నెపంతో డీడీకి మెమో, చార్జిమోమోను ఇన్చార్జి పీవో యశ్వంత్కుమార్ రెడ్డి జారీచేశారు. ఈ ప్రచ్ఛన్నయుద్ధం నేపథ్యంలో డీడీని సరెండర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ● మొత్తంగా ఏటీడబ్ల్యూఓలు, మరో విభాగ అధికారి సంబంధం లేని విషయాల్లో తలదూర్చి కార్యాలయాల్లో రాజకీయాలకు కారణమవుతున్నారని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. ● తప్పు చేసిన వార్డెన్లకు రాజకీయ ఒత్తిళ్లతో తిరిగి పోస్టింగ్లు ఇస్తున్నారు. నీలకంఠాపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సమక్షంలోనే అశ్లీల నృత్యాలు చేయించి.. సస్పెండ్ అయిన వార్డెన్ను రెండు నెలల్లోనే రీవోక్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. స్థానిక ఎమ్మెల్యే బంధువు కావడమే కారణమని గిరిజన సంఘాలు పేర్కొంటున్నాయి. వారమైనా రిలీవ్ కాని పీవో బాధ్యతలు స్వీకరించని సబ్కలెక్టర్ వైశాలి తప్పుచేసిన వార్డెన్పై కఠిన చర్యలేవీ? డీడీని సరెండర్ చేసే యోచనలో ఇన్చార్జి పీవో? -
ఇక్కడో ఆట!
ఆడ బిడ్డలతో అక్కడో మాట.. ● చంద్రబాబు ప్రభుత్వ ద్వంద్వ వైఖరి ● న్యాయం కోసం మండుటెండలో మహిళల పోరాటం సాక్షి, పార్వతీపురం మన్యం: చెప్పేవి మహిళా పక్షపాతి మాటలు.. చేసేవి మహిళలను రోడ్డుకీడ్చే చేష్టలు! చంద్రబాబు ప్రభుత్వంలో ఓ మహిళా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో న్యాయం కోసం అయిదుగురు అబలలు మండుటెండలో గత బుధవారం నుంచి పార్వతీపురంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. రాజకీయ చదరంగంలో అన్యాయంగా ఉద్యోగాలు పోగొట్టుకుని, పొట్టచేత పట్టుకుని ఆకలి కేకలు పెడుతున్నారు. ఒకవైపు లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు, ‘ఆమె’కు సమాన హక్కులు అంటూ డ్రామాలు చేస్తున్న పాలకులు... తమ సొంత రాష్ట్రంలో.. సాక్షాత్తు సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇలాకాలో ఆడ బిడ్డలు.. అందునా చిరుద్యోగులు బలైపోతే... వారి ఆవేదన మన్యం గడప దాటకపోవడం గమనార్హం. గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఒత్తిడి వల్లే కలెక్టర్, విద్యాశాఖ అధికారులు సాలూరు మండలం కరాసువలస కేజీబీవీ ప్రిన్సిపాల్ సహా ఇతర సిబ్బందిని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించారని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ.. ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే సహించబోమన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గానీ నేటికీ స్పందించలేదు. ప్రభుత్వ పెద్దలు స్పందించి న్యాయం చేయాలని ఆ ఆడబిడ్డలు వేడుకుంటున్నారు. -
ఇల్లే.. క్రీడా లోకం...
అనుబంధం.. ఆప్యాయత.. ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేసేందుకు వివిధ రకాల ఆట వస్తువులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. తక్కువ ఖర్చులో ఇంట్లోనే కొన్ని రకాల ఆటలను రూపొందించుకోవచ్చు. పాత తరం నుంచి వచ్చే వాటిని అమ్మమ్మ, నానమ్మ, తాతల నుంచి నేర్చుకోవచ్చు. ఇదే క్రమంలో పిల్లల ముందు అవసరానికి మించి ఫోన్ వినియోగించడం ద్వారా వారి మనసు మళ్లే అవకాశం ఉందని గుర్తించాలి. వారితో పాటు కొన్ని రకాల వాటిల్లో భాగస్వాములైతే.. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరగనుంది. అందుకు రోజులో కొంత సమయాన్ని తప్పక కేటాయించాలని మానసిక నిపుణులు సైతం చెబుతున్నారు. ఇదే క్రమంలో ఆటల ద్వారా గెలుపోటములు సమానంగా స్వీకరించే సామర్థ్యం సొంతమవుతుంది. బ్యాడ్మింటన్, వాలీబాల్, క్రికెట్ ఇంటి ఆవరణలో కాస్త ఖాళీ స్థలం ఉంటే.. బ్యాడ్మింటన్, వాలీబాల్, క్రికెట్(మినీ సెట్) ఆడుకోవచ్చు. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఒక్కో సెట్ రూ.500 నుంచి రూ.1000 వరకు ఉంటుంది. ఇద్దరు లేదా నలుగురు ఒకేసారి రంగంలో దిగొచ్చు. వాటి ద్వారా దూరదృష్టి, మెదడు చురుకుదనం పెరుగుతుంది. కండరాలను బలంగా మార్చుతుంది. రోగ నిరోధకశక్తిని పెంచుతుంది.. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. బిజినెస్, లూడో రూ.100 – రూ.300 వరకు ధర పలుకుతున్నాయి. బిజినెస్ గేమ్లో నలుగురు ఆడవచ్చు. పాచికలతో కూడిన ఆట. వ్యాపార మెలకువలు తెలుస్తాయి. లూడో గేమ్తో కుటుంబం, స్నేహితుల మధ్య అనుబంధం పెరుగుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. పిల్లల్లో లెక్కలు, సంఖ్యల గుర్తింపు సామర్థ్యం పెంచుతాయి. వైకుంఠపాళి, అష్టాచెమ్మ.. ఒక్కో క్రీడా సెట్ రూ.300 వరకు పలుకుతుంది. వైకుంఠపాళి, అష్టాచెమ్మ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. గెలుపోటములు, హెచ్చుతగ్గులను ఈ ఆటలు బోధిస్తాయి. మెదడుకు చక్కటి వ్యాయామం లభిస్తుంది. వ్యూహాలు నేర్చుకోవచ్చు. రోజంతా వినోదాన్ని పంచుతాయి. చదరంగం.. చెస్ బోర్డు రూ.200 నుంచి రూ.300ల లోపే లభిస్తుంది. ఇద్దరు సరదాగా ఆడుకోవచ్చు. మెదడుకు పదును పెట్టే చురుకై న ఆట. మేధో, వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది. ప్రత్యర్థులకు అందకుండా వ్యూహాలు రచించడం, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు పెంపొందుతాయి. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. -
యువకుడి అదృశ్యంపై కేసు నమోదు
విజయనగరం క్రైమ్: స్థానిక రౌతు వీధికి చెందిన రాంబల్పు మనోజ్కుమార్ అనే యువకుడి అదృశ్యంపై కేసు నమోదైనట్లు పోలీసులు శనివారం తెలిపారు. తన కొడుకు కనిపించడం లేదని తల్లి దేవి ఫిర్యాదు ఇచ్చిన మేరకు కేసు నమోదు చేసి, వెతుకులాట ప్రారంభించామని దర్యాప్తు అధికారి చిన్నయ్య చెప్పారు. విజయనగరం క్రైమ్: వివాహితుడి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన భర్త రేగిడి శ్రీకాంత్ ఇంతవరకు ఇంటికి రాలేదని ఆయన భార్య రూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఐవో రవి తెలిపారు. -
మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ
గుమ్మలక్ష్మీపురం: ఇంటి బయట నిద్రిస్తున్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు, తాడును గుర్తు తెలియని వ్యక్తి లాక్కొని పారిపోయిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంతవీధికి చెందిన సుజాత ఉక్కపోత కారణంగా ఇంటి బయట నిద్రించింది. శనివారం వేకువజామున 4.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి సుజాత మెడలోని బంగారు గొలుసు లాక్కొని, మళ్లీ మెడలోని బంగారు తాడును కూడా లాక్కొనేందుకు ప్రయత్నించగా మెలకువ వచ్చి ప్రతిఘటించింది. బంగారు తాడు తెగిపోవడంతో సదరు వ్యక్తి అక్కడ నుంచి పరారయ్యాడు. సుజాత తేరుకుని చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసింది. గుర్తు తెలియని వ్యక్తి కోసం వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఆమె ఎల్విన్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో సీఐ బి.హరి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. అపహరణకు గురైన ఆభరణాలు సుమారు మూడు తులాల వరకు ఉంటుందని తెలిపింది. -
మలేరియా రహిత సమాజమే లక్ష్యం
పార్వతీపురం రూరల్ : మలేరియా నిర్మూలనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ ఎస్.భాస్కరరావు పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా ఆరోగ్య కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, ప్రతి వారం డ్రై–డే పాటించాలని సూచించారు. దోమ తెరలు వాడటం, లార్వా వృద్ధిని అరికట్టడం ద్వారానే వ్యాధిని నియంత్రించగలమన్నారు. మా ఊరికి మలేరియా వచ్చింది కార్యక్రమంతో శాఖల మధ్య సమన్వయం పెరిగిందని, ఇది మలేరియా నివారణకు తోడ్పడుతోందని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది క్షేత్ర స్థాయిలో జ్వర సర్వే నిర్వహించి బాధితులను త్వరగా గుర్తించాలని ఆదేశించారు. అనంతరం సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి సూర్యనారాయణ, వైద్యులు విజయమోహన్, జగన్మోహనరావు, సూర్యకౌశిక్, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ భాస్కరరావు -
తప్పిన ప్రమాదం
● గ్యాస్ బండ పైపు నుంచి చెలరేగిన మంటలు లక్కవరపుకోట : మండలంలోని బీసీ కాలనీలో ఒక ఇంట్లో వంట చేస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగిసి పడడంతో ఆ మహిళ తన ఇద్దరు పిల్లలను తీసుకొని వీధిలోకి పరుగులు తీసింది. ఏం జరుగుంతుందో తెలియకపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని బీసీ కాలనీలో పొలమరశెట్టి వెంకటరావు భార్య శనివారం మధ్యాహ్నం వంట చేస్తుండగా గ్యాస్ పైపు నుంచి మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో ఆమె ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంటి బయటకు పరుగులు తీసి ఇరుగు పొరుగు వారికి చెప్పింది. దీంతో స్థానికులు ఇంటిలోకి వచ్చి చూడగా మంటలు రేగి వంటింట్లో గల సామాన్లు కాలిపోయాయి. మంటలు మాత్రం అదుపులోకి రాలేదు. స్థానిక యువత పోలీసులకు సమాచారం అందించి మంటలను అదుపు చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. -
గూడ్స్ రైలులో మంటలు
బొండపల్లి: బొగ్గుతో రవాణా అవుతున్న గూడ్సు రైలులో మంటలు వ్యాపించిన సంఘటన మండలంలోని గరుడుబిల్లి రైల్వేస్టేషన్ వద్ద చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు.. రాయగడ నుంచి విశాఖపట్నం బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో ఒక భోగిలో మంటలు శుక్రవారం అర్ధరాత్రి రావడంతో స్టేషన్మాస్టర్ కిషోర్కుమార్ గమనించి స్టేషన్ వద్ద రైలును నిలిపివేశారు. ఈ విషయాన్ని గజపతినగరం అగ్ని మాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో వాహనంతో వచ్చి అగ్ని మాపక అధికారి రవి ప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపు చేయడంతో మిగతా భోగీలకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. తర్వాత రైలును యాధావిధిగా విశాఖపట్నం తరలించారు. -
మే 1నుంచి జనగణన : కలెక్టర్
● స్వీయ గణనకు ఈ నెల 30 వరకు అవకాశం పార్వతీపురం: జిల్లాలోని 15 మండలాలు, మూడు మున్సిపాల్టీల్లో మే 1వ తేదీ నుంచి జనగణన ప్రారంభమవుతుందని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి శనివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,744మంది ఎన్యూమరేటర్లు, 302 మంది సూపర్వైజర్లను నియమించామన్నారు. ఇందులో భాగంగా స్వీయ గణనను ఏప్రిల్ 16నుంచి 30 తేదీ వరకు ప్రతీ ఒక్కరు తమ వివరాలను స్వయంగా ఆన్లైన్ పోర్టల్ ఎస్ఈ.సెన్సెస్.జీఓవీ.ఇన్లో నమోదు చేసుకోవచ్చన్నారు. దేశ జనగణన చరిత్రలో తొలిసారిగా స్వీయగణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్)కు అవకాశం కల్పించారన్నారు. ఈ అవకా శాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేత్ర వైద్య సేవలపై నిశిత పర్యవేక్షణ పార్వతీపురం రూరల్: జిల్లాలో నేత్ర వైద్య సేవల తీరుతెన్నులపై జిల్లా అంధత్వ నివారణ సంస్థ కార్యాలయంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అంధత్వ నివారణ సంయుక్త సంచాలకులు డాక్టర్ సునీల్కుమార్ నాయక్ ఆదేశాల మేరకు జిల్లా అధికారి డాక్టర్ సూర్యకౌశిక్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో సేవలందిస్తున్న స్వచ్ఛంద కంటి ఆస్పత్రుల ప్రతినిధులతో వైద్య శిబిరాల నిర్వహణ, శస్త్రచికిత్సల నాణ్యతపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా నేత్ర వైద్య అధికారి జీరు నగేష్రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమ పోర్టల్లో నెలవారీ నివేదికలు, ఫాలో–అప్ వివరాలను ఎప్పటికప్పుడు నిక్షిప్తం చేయాలని సూచించారు. కేటరాక్ట్ శస్త్రచికిత్సల నమోదులో పాటించాల్సిన మెలకువలను వివరించారు. సేవలలో పారదర్శకత, నమోదులో కచ్చితత్వం ఉండాలని స్పష్టం చేశారు. సమావేశంలో పుష్పగిరి, శంకర్ ఫౌండేషన్, జెమ్స్, మిమ్స్, అనిల్ నీరుకొండ ఆస్పత్రుల ప్రతినిధులు, జిల్లా ఆస్పత్రి వైద్యులు కృష్ణారావు పాల్గొన్నారు. రీ సర్వేను వేగవంతం చేయాలి పార్వతీపురం: జిల్లాలో రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో వీఆర్వోలు, మండల, గ్రామ సర్వేయర్లతో రీసర్వే పురోగతిపై శనివారం సమీక్షించారు. దశలవారీగా సర్వే నిర్వహిస్తూ ఈకేవైసీని తప్పనిసరి చేయాలన్నారు. డ్రాప్ట్ దశకు ముందే అవసరమైన సవరణలు పూర్తిచేయాలని సూచించారు. 95 శాతం ఈకేవైసీ లక్ష్యం సాధించాలన్నారు. ప్రతి వీఆర్వో రోజుకు కనీసం 50 ఖాతాలు పూర్తి చేయాలన్నారు. ఫీల్డ్ వెర్ఫికేషన్లో ఫొటోలు అందుబాటులో లేకపోతే వాట్సాప్ ద్వారా సేకరించాలని తెలిపారు. జిరాయితీ ఖాతాల ఆమోదాన్ని ఆర్డీఓ స్థాయికి అప్పగించడంతో ప్రక్రియ వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. మరణించిన వారి ఖాతాలను వారసులకు బదిలీ విషయంలో స్పష్టతతో పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో కె.హేమలత, జిల్లా సర్వే, భూ రికార్డుల అధికారి ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు. మలేరియా రోగులు సత్వర చికిత్స తీసుకోవాలి ● డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి విజయనగరం ఫోర్ట్: మలేరియా వ్యాధి సోకిన వారు సకాలంలో చికిత్సతీసుకోవాలని డీఎంహెచ్ఓ ఎస్.జీవనరాణి అన్నారు. విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మలేరియా వ్యాధిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. దోమల నియంత్రణ కోసం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జ్వరలక్షణాలు కనిపించిన వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. మలేరియా నిర్మూలనకోసం అందరూ కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. జిల్లా మలేరియా అధికారి సింహాచలం, డీఎల్ఓ కె.రాణి, డిప్యూటీ డీఎంహెచ్ఓ సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
పనులు అడ్డుకుంటే అరెస్టు చేయండి
● మంత్రి సంధ్యారాణి మక్కువ: మక్కువ ప్రధాన రహదారి విస్తరణ పనులకు ఆటంకం కలిగించిన వారిని అరెస్టు చేయాలని మంత్రి సంధ్యారాణి పోలీసులను ఆదేశించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాదర్బార్ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మక్కువ ప్రధాన రహదారి విస్తరణ పనులను ఎవరు అడ్డుకున్నా... రోడ్డు విస్తరణ పనులకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చినా అరెస్డు చేయాలని సాలూరు సీఐ రామకృష్ణను ఆదేశించారు. రహదారిపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీసేయాలన్నారు. సొంత పార్టీ నుంచే ఫిర్యాదులు ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆ పార్టీ నుంచే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. మక్కువ మండలానికి చెందిన అధికార పార్టీ నాయకులే ఎక్కువ మంది కనిపించారు. వీరిలో చాలా మంది రోడ్లు, భూ సమస్యలపై, పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. మంత్రి మాటలకు ఉపాధి వేతనదారులు షాక్ ఉచిత బస్సులో ఉపాధి వేతనదారులు పని ప్రదేశం నుంచి ఆర్టీసీ బస్సులో శనివారం మక్కువ ప్రధాన రహదారి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో మంత్రి సంధ్యారాణి వేతనదారులతో మాట్లాడుతుండగా ఉపాధి బిల్లులు అందడం లేదని వేతనదారులు సమస్యని తీసుకువచ్చారు. దీంతో మంత్రి మాట్లాడుతూ ఉపాధి బకాయిలు బ్యాంకులో ఉంటే.. మీ వద్ద ఉన్నట్టే అంటూ మాట్లాడటంతో వేతనదారులు షాకయ్యారు. ఎంపీడీఓ అర్జునరావు, తహసీల్దార్ కె.భరత్కుమార్తో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి
–8లో● ఎన్సీడీ జిల్లా అధికారి జగన్మోహనరావు పార్వతీపురం: వేసవి కాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రజల్లో అవగాహన పెంపొందించుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్సీడీ జిల్లా అధికారి డా.టి జగన్మోహన్రావు సిబ్బందికి సూచించారు. మండలంలోని పెదగుడబ పంచాయతీ ఎస్ఆర్పేటను శనివారం ఆయన సందర్శించారు. గ్రామంలో నిర్వహిస్తున్న సంచార వైద్య శిబిరంలో నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలు, రికార్డులను పరిశీలించారు. కేంద్రంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందుల లభ్యతను పరిశీలించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు మందులు క్రమంగా తీసుకునేలా పర్యవేక్షణ చేయాలని, ఆరోగ్య పరిస్థితిని నిరంతరం గమనించాలని సిబ్బందికి సూచించారు. వేసవి నేపథ్యంలో వాతావరణ మార్పులు–మానవ ఆరోగ్యం కార్యక్రమం ద్వారా గ్రామంలో పోస్టర్లతో అవగాహన కల్పించారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం నీటిని కోల్పోతుందని, దాహం లేకపోయినా తరుచుగా నీరు, మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్ఎస్ వంటి ద్రావణాలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు ఎండలో ఎక్కువ సేపు తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శిబిరంలో వైద్యాధికారిణి ఎం.చాందిని, సీహెచ్ఓ ఇంద్రాణి తదితరులు పాల్గొన్నారు. -
ఏషియన్ బాక్సింగ్ పోటీలకు కోచ్గా సీతారామాంజనేయులు
విజయనగరం: విజయనగరం ఖేలో ఇండియా బాక్సింగ్ కోచ్ పి.సీతారామాంజనేయులు ఏషియన్ బాక్సింగ్ పోటీలకు ఇండియా జట్టు కు కోచ్గా ఎంపికయ్యారు. ఏషియన్ అండర్ – 15 బాల, బాలికల బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు పంజాబ్లో శిక్షణ ఇస్తున్నారు. విజయనగరం నుంచి తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో వచ్చే నెల 1 నుంచి 16వ తేదీ వరకు జరిగే అండర్–15 విభాగంలో ఉజ్బెకిస్తాన్లో బాక్సింగ్ పోటీలకు కోచ్గా వ్యవహరించనున్నారు. ఈయన ఎంపిక పట్ల క్రీడాకారులు, కోచ్లు, క్రీడా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. బైక్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు బొండపల్లి: మండల కేంద్రమైన బొండపల్లిలోని పెట్రోలు బంకు సమీపంలో జాతీయ రహదారి 26పై బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు.. గ్రామానికి చెందిన కోరాడ మనోజ్ తన ద్విచక్ర వాహనాన్ని తీసుకొని పెట్రోలు బంకుకు వస్తుండగా విజయనగరం నుంచి సాలూరు వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలైన యువకుడిని 108 వాహనంలో గజనతినగరంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ ప్రధమ చిక్సిత అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని మహరాజా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వ్యక్తి అరెస్టు కొత్తవలస : వివిధ బ్యాంకులకు చెందిన ఏటీఎంల వద్ద అమాయకులను గుర్తించి వారిని బురిడీ కొట్టి మోసాలకు పాల్పడుతున్న తెర్లాం మండలం సతివాడకు చెందిన ఎ.శ్యాంసుందరరావుని సీఐ ఎస్.షణ్ముఖరావు శనివారం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. దీనికి సంబంధించి సీఐ తెలిపిన వివరాలు... నిందితుడు శ్యాంసుందరరావు ఏటీఎంల వద్ద అనుమానంగా తిరుగుతూ ఏటీఎంలు వినియోగించే అమాయకులకు సహకరిస్తున్నట్టు నటించి వారి ఏటిఎంను మార్చి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 12వ తేదీన కొత్తవలస ఎస్బీఐ ఏటీఎం వద్ద ఎస్.శ్రీనును మోసం చేసి రూ.13వేలు కాజేసినట్టు సీఐ తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏటీఎంల వద్ద సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని గుర్తించినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు శ్యాంసుందరరావును అరెస్టు చేసి కొత్తవలస కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్టు తెలిపారు. బ్యాంకు ఖాతాదారులు గుర్తు తెలియని వ్యక్తులకు ఏటీఎం కార్డులిచ్చి మోసపోవద్దని సూచించారు. ఆయన వెంట ఎస్ఐలు జోగారావు, ప్రసాద్ ఉన్నారు. -
ఏడాదంతా గజరాజుల బెడదేనా..!
జియ్యమ్మవలస రూరల్: మండలంలో గజరాజుల సంచారంతో ఏడాది పొడవునా పంటలు నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం సింగనాపురం గ్రామ సమీపాన పంట పొలాల్లో ఏనుగులు సంచరిస్తున్నాయి. వ్యవసాయం, బోర్లు నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల సమస్యను పరిష్కరించలేకపోవడంతో కూటమి ప్రభుత్వం మాట నీటి మూటేనని రైతులు విమర్శిస్తున్నారు. పరిహారం కోసం రైతుల ధర్నా నెల్లిమర్ల: తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు 1లో భాగంగా నిర్మిస్తున్న కాలువలో ముంపునకు గురవుతున్న తమ భూములకు పరిహారం వెంటనే చెల్లించాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సారిపల్లి గ్రామానికి చెందిన రైతులు తమకు న్యాయం చేయాలని శనివారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు పరిహారం చెల్లించిన తర్వాతే భూముల్లోని చెట్ల వేలం పాట వేయాలన్నారు. భూ సేకరణకు సంబంధించి అవార్డు ఎంక్వయిరీ కూడా సక్రమంగా చేయలేదని తహసీల్దారు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే 1200 ఎకరాల భూములు కోల్పోయి, పూర్తిగా నిరాధారమైన తమ గ్రామానికి పీఏఎఫ్ ప్యాకేజీ మంజూరు చేయాలని కోరారు. అనంతరం తహసీల్దార్ శ్రీకాంత్, ఇరిగేషన్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు మజ్జి రామారావు, సారిపల్లి గురునాధరావు, మజ్జి నాగరాజు, పాలూరి భానోజి తదితరులు పాల్గొన్నారు. -
వడదెబ్బకు వస్త్ర వ్యాపారి మృతి
రాజాం సిటీ: కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని నిశ్చయించుకున్నాడు ఆ యువకుడు. తన తండ్రి శ్రీనివాసరావు చేస్తున్న బట్టల వ్యాపారాన్నే వృత్తిగా ఎంచుకుని కొంతకాలం తండ్రితో వ్యాపారం చేస్తూ మెలకువలు నేర్చుకున్నాడు. తరువాత వేరుగా వ్యాపారం చేయడం మొదలు పెట్టి కుటుంబానికి పెద్దదిక్కుగా మారాడు. వ్యాపారంలో నిమగ్నమైన ఆ యువకుడిని వడదెబ్బ రూపంలో మృత్యువు కబళిస్తుందని తెలుసుకోలేకపోయాడు. మండల పరిధి దోసరి గ్రామానికి చెందిన కత్తిరి బాబి (23) వడదెబ్బకు గురై మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కత్తిరి బాబి వస్త్ర వ్యాపారం చేస్తూ ఇతర ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నాడు. గుమ్మలక్ష్మీపురంలో నివాసం ఉన్న బాబి ఎప్పటిలాగే ఈ నెల 24న కూడా వ్యాపారానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి చేరుకున్న తరువాత ఎండ తీవ్రతతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే స్థానికులు గమనించి కురుపాం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా తను కష్టపడుతూ తన అన్నయ్య అభిని డిగ్రీ చదివించడంతో పాటు ఉద్యోగం సాధించేందుకు అవసరమయ్యే కోచింగ్కు అయ్యే ఖర్చు భరిస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. తాను ఎలాగూ చదువుకోలేకపోయానని, తన అన్నయ్యను అయినా మంచి ఉద్యోగిగా చూడాలని ఆశపడేవాడని పేర్కొన్నారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న బాబి మృతితో తల్లిదండ్రులు కత్తిరి శ్రీనివాసరావు, మల్లీశ్వరితో పాటు కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. వడదెబ్బ కారణంగానే బాబి మృతి చెందాడని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కురుపాం : మండలంలోని మర్రిమానుగూడ గ్రామానికి చెందిన బిడ్డిక రాహుల్(9) అనారోగ్యంతో శనివారం సొంతూరులోనే మృతి చెందాడు. రాహుల్ నీలకంఠాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాడని, పాఠశాలలో ఉండగానే అనారోగ్యంతో బాధపడేవాడని, సంబంధిత సిబ్బంది పట్టించుకోలేదని.. పాఠశాల ఉన్న సమయంలో తమ వెంట పంపించాలని కోరినా పంపలేదని రాహుల్ తల్లి శాంతి కన్నీరుమున్నీరైంది. రాహుల్ కుటుంబానికి పది లక్షలు రూపాయిలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బిడ్డిక అనిల్ డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థి గ్రామానికి వెళ్లి మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. రాహుల్ మృతికి పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దోసరిలో విషాదం -
పక్కాగా ఎన్నికల రోల్స్ మ్యాపింగ్
పార్వతీపురం: జిల్లాలో ఎన్నికల రోల్స్ మ్యాపింగ్, ఫారంల పరిశీలన పారదర్శకంగా జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత తెలిపారు. తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం నిర్వహించిన సమావేశంలో వాటి వివరాలను వెల్లడించారు. 2002 రోల్స్ డేటాను 2025 డేటాతో బీఎల్ఓల యాప్లో మ్యాపింగ్ చేస్తూ 68.53 శాతం పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. గతేడాది జనవరి 6 నుంచి ఇప్పటి వరకు మొత్తం 16,799 దరఖాస్తులు స్వీకరించినట్లు వివరించారు. వాటిలో 273 పెండింగ్లో ఉన్నాయన్నారు. ఫారం–6 కింద 7,437 దరఖాస్తుల్లో 6,358 కొత్త ఓటర్లు చేరారన్నారు. ఫారం–7 కింద 2,046 ఓట్లు తొలగించగా, నాలుగు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఫారం–8 కింద 6,934 సవరణలు పూర్తి చేశామని తెలిపారు. ఓటర్ల జాబితా కచ్చితత్వం కోసం రాజకీయ పార్టీల సహకారం అవసరమని ఆమె పేర్కొన్నారు. -
అంగన్వేడిలో చిన్నారులు
● భగ్గుమంటున్న ఎండలు ● ఉక్కపోతతో అంగన్వాడీ చిన్నారులు విలవిల ● గొడుగు నీడలో ఇంటికి పయనంముఖ్యంగా నీడలోనే పిల్లలు ఉండేలా చూసుకోవాలి. డీహైడ్రేషన్కు గురైతే వెంటనే ప్రథమ చికిత్సలో భాగంగా ఆస్పత్రుల్లో లభించే ఓఆర్ఎస్ ప్యాకెట్లను మాత్రమే అందించాలి. డబ్బా ఓఆర్ఎస్లను పట్టరాదు. అవి పడితే యూరిన్ మరింత అధికమై ప్రమాదకరంగా మారుతుంది. వైద్యులను సంప్రదించి తగు చికిత్స అందించాలి. – బంకురు అప్పలనాయుడు, చిన్నపిల్లల వైద్యనిపుణుడు, సాలూరు గత ప్రభుత్వాలు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు 15 రోజులు సెలవులను మే 1వ తేదీ నుంచి అమలు చేసేవి. ఆ మేరకు ఏపీ అంగన్వాడీవర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మే నెలంతా సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం గరిష్టంగా 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనివల్ల బాలింతలు, గర్భిణులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి ఆరోగ్యంను దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – ఎన్.వై.నాయుడు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి,సాలూరు పార్వతీపురం రూరల్/సాలూరు: భానుడి భగభగలు అంగన్వాడీ చిన్నారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేసవి తాపానికి విలవిల్లాడుతున్నారు. కొన్నిచోట్ల వేడిని తట్టుకోలేక డీ హైడ్రేషన్కు గురవుతున్నారు. జిల్లాలో 41 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ఇరుకు గదుల్లో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కేంద్రాల్లో ఫ్యాన్లు కూడా లేకపోవడం చిన్నారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొన్ని కేంద్రాల్లో ఒకే గదిలో ఒకవైపు అంగన్వాడీ సామగ్రి, మరోవైపు వంటా వార్పు సాగుతుండటంతో వేడి మరింత రెట్టింపవుతోంది. గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పురిపాకలు, రేకుల షెడ్లలోనే కేంద్రాలు నడుస్తుండడంతో నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఎండలో ‘గొడుగు’ ప్రయాణం మధ్యాహ్నం 12 గంటలకు కేంద్రం విడిచిపెట్టే సమయానికి సూర్యుడు నడినెత్తిన నిప్పులు కురిపిస్తున్నాడు. ఆ తీవ్రమైన ఎండలో చిన్నారులు ఇళ్లకు చేరుకోవడం ప్రాణాంతకంగా మారుతోంది. కలెక్టర్ సూచనల మేరకు చిన్నారులను గొడుగుల నీడలో ఇంటికి సాగనంపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 1,496 ప్రధాన, 163 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. కేవలం అద్దె భవనాలే దికై ్కనచోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో, చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్న డిమాండ్ తల్లిదండ్రుల నుంచి వినిపిస్తోంది. -
దోమ చిన్నదే..వ్యాధి పెద్దది..!
● ఇంటి లోపల, బయట నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. ● ఇంటి వాతావరణం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ● దోమ తెరలు వినియోగించాలి. ● ఇంటి కిటికీలకు మెస్లు బిగించాలి. ● తాగిపడేసిన కొబ్బరి బొండాలు, వాడిన టైర్లు ఇంటి పరిసరాల్లో ఉండకూడదు. ● వాటర్ ట్యాంకులకు మూతలు వేయాలి. ● మలాథియన్ స్ప్రేయింగ్ ఇంటి లోపల, బయట చేయించుకోవాలి.విజయనగరం ఫోర్ట్: మలేరియా పేరు వినగానే జనం భయపడేవారు. ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలు ఎక్కువగా భయపడేవారు. మలేరియా బారిన పడి అస్వస్థతకు గురయ్యేవారు కొందరు..వ్యాధితో పోరాటం చేయలేక మృత్యువాత పడేవారు మరికొందరు. వ్యాధి లక్షణాలు కనిపించగానే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి పట్ల అలసత్వం వహిస్తే మృత్యువాత పడే ఆస్కారం ఉంది. శనివారం ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. అప్పుడే మొదలైన మలేరియా వ్యాప్తి సాధారణంగా వర్షాకాలంలో మలేరియా వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా గిరిజన ప్రాంతంలో అధికంగా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అయితే ప్రస్తుతం మైదానం, గిరిజన ప్రాంతం తేడా లేకుండా వ్యాధి వ్యాప్తి చెందుతోంది. అంతేకాకుండా వర్షాకాలం రాకముందే వ్యాధి వ్యాప్తి మొదలైంది. మలేరియా వ్యాప్తికి దోమలే కారణం అనాఫిలిస్ అనే దోమ కుట్టడం వల్ల మలేరియా సోకుతుంది. జూన్ నుంచి ఆక్టోబర్ మధ్య కాలంలో ఎక్కువగా మలేరియా కారక దోమలు వ్యాప్తి చెందుతాయి. అనాఫిలిస్ దోమ మలేరియా వ్యాధి క్రిములను రోగి నుంచి ఆరోగ్యవంతులకు కూడా చేరవేస్తుంది. వర్షాకాలం సీజన్లో తరచూ వచ్చే వ్యాధి మలేరియా. దీని లక్షణాలు ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్షలు చేయించుకోవాలి. మలేరియా కారక సూక్ష్మక్రిములు, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం పాల్సిఫారమ్, ప్లాస్మోడియం బవెల్ రూపంలో ఉంటాయి. వ్యాధి లక్షణాలు: మలేరియా సోకితే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. కొన్ని సార్లు చలికూడా వేస్తుంది. పాల్సిఫారమ్ మలేరియా తీవ్రంగా ఉంటుంది. జ్వరం వచ్చిన రెండుగంటలలోపు ఆస్పత్రిలో చేర్పించాలి. తలనొప్పి, ఒంటినొప్పులు, వణుకుతో కూడిన చలిజ్వరం, చెమటలు పట్టడం వంటి లక్షణాలతో బాధపడుతున్నవారికి రక్తపరీక్షలు చేయించాలి. రోజు విడిచి రోజు జ్వరం రావచ్చు. మలేరియా క్రిములున్న దోమ ఆరోగ్యవంతులకు కుట్టిన 10 నుంచి14 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయట పడతాయి. జ్వరంతో పాటు వాంతులు కూడా అవుతుంటాయి. జిల్లాలో 56 కేసులు నమోదు జిల్లాలో జనవరి ఒకటో తేది నుంచి ఏప్రిల్ 23 వతేదీవరకు 56 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా 2025లో 390 మలేరియా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొదలైన మలేరియా వ్యాప్తి ఇప్పటివరకు 56 కేసుల నమోదు మలేరియా పట్ల నిర్లక్ష్యం తగదు.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి 2025– 26 లో 390 కేసులు నమోదు నేడు ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవంవ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:చర్యలు తీసుకుంటున్నాం: మలేరియా నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. వ్యాధి సోకే ప్రాంతాల్లో దోమల నివారణ మందును మేఒకటో తేదీనుంచి మొదటి విడత స్ప్రేయింగ్ చేయించనున్నాం. జిల్లాలోని 19 మండలాల్లో గల 26 పీహెచ్సీల పరిధిలో 165 హైరిస్క్ గ్రామాల్లో స్ప్రేయింగ్ చేయించనున్నాం. ఎం.సింహాచలం, జిల్లా మలేరియా నివారణ అధికారి -
విద్యుత్ షాక్తో వెల్డర్ మృతి
శృంగవరపుకోట: వెల్డింగ్ పనులు చేస్తుండగా విద్యుత్షాక్కు గురై ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్.కోట మండలంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. మండలంలోని గవరపాలెం గ్రామానికి చెందిన కాండ్రేగుల ఈశ్వరరావు(48) కొంత కాలం పాటు దుబాయ్లో వెల్డర్గా పనిచేసి ఆరేళ్ల క్రితం స్వంత గ్రామానికి వచ్చి భవానీనగర్ వద్ద వెల్డింగ్ దుకాణం పెట్టుకుని పని చేస్తున్నాడు. శుక్రవారం గంట్యాడ మండలంలోని మధుపాడ పంప్హౌస్ వెనుక ఉన్న షెడ్ నిర్మాణ పనులకు వెళ్లాడు. అక్కడ వెల్డింగ్ చేస్తుండగా విద్యుత్షాక్కు గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతుడు ఈశ్వరరావు భార్య వ్యవసాయ పనులు చేస్తుండగా, ఇద్దరు కుమారులు షిప్లో పని చేస్తారని తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉంది. నేల బావిలో పడి వృద్ధుడు..రామభద్రపురం: మండలంలోని తారాపురంలో శుక్రవారం ప్రమాదవశాత్తు నేల బావిలో పడి ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తారాపురం గ్రామానికి చెందిన పిల్లా లక్ష్మణరావు(77) శుక్రవారం ఉదయం పొలం పనికి వెళ్లాడు. అయితే దాహం వేయడంతో గ్రామం సమీపంలో ఉన్న చాకిరేవు పొలంలో సామంతుల కొత్తయ్య మాస్టారుకు చెందిన నేలబావిలో నీరు తాగడానికి దిగాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతిచెందాడు.కుమారుడు వెంకటరమణ ఫిర్యాదు మేరకు హెచ్సీ ఎం.సత్యనారాయణ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్సీకి తరలించారు. -
మన్యంలో పొంచి ఉన్న ప్రమాదం
సీతంపేట: మన్యం అంటనే మలేరియా పాజిటివ్ కేసులకు పెట్టింది పేరనే నానుడి ఉంది. ఇప్పుడు మన్యంతో పాటు మైదాన ప్రాంతాల్లో కూడా మలేరియా విలయతాండవం చేస్తోంది. గిరిజనగ్రామాల్లో మలేరియా జ్వరాలు ఎక్కువగా విజృంభిస్తున్నాయి. ఏటా జనవరి నుంచి డిసెంబర్ వరకు 700కు పైగా మలేరియా కేసులు నమోదవుతున్నట్లు అధికారిక లెక్కలు. కానీ ఆ సంఖ్య వెయ్యికి పైగానే ఉండొచ్చనేది అంచనా. ఈ ఏడాది ఇప్పటివరకు పార్వతీపురం మన్యం జిల్లాలో మలేరియా కేసులు 110 వరకు నమోదయ్యాయి. అధికారులు 233 గిరిజన గ్రామాలను హైరిస్క్ మలేరియా గ్రామాలుగా గుర్తించి మలేరియా నిర్మూలనా కార్యక్రమాలు చేపడుతున్నారు. జ్వరం వచ్చి రక్తపరీక్షలు చేయించుకుంటే మలేరియా,టైఫాయిడ్ ఈ రెండింటిలో ఏదో ఒకటి రావడం పరిపాటిగా మారింది. 3లక్షల దోమతెరలకు 23 వేలే వచ్చాయి... మలేరియా నిర్మూలన కార్యక్రమంలో భాగంగా 3లక్షల దోమతెరలు అవసరం కాగా కేవలం 23వేల 339 వందల దోమతెరలు మాత్రమే ఈ సంవత్సరం వచ్చాయి. వాటిని 8 పీహెచ్సీల పరిధిలో మలేరియా పాజిటివ్ కేసులు ఎక్కడ నమోదవుతున్నాయో అక్కడ పంపిణీకి చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే 12 వేల దోమ తెరలు పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. -
వాడవాడలా ఆవకాయ ఘుమఘుమలు
విజయనగరం గంటస్తంభం: వేసవి ఎండలు మండుతుంటే పల్లెల్లో మాత్రం మరో రకమైన సందడి మొదలవుతుంది. చెట్ల మీద పచ్చగా వేలాడే మామిడికాయలు కంటికి హాయిగా కనిపిస్తే, ఇంటింటా ఆవపిండి కాలం వచ్చింది అనగానే గ్రామాల్లో మహిళల కళ్లల్లో ప్రత్యేక మెరుపు కనిపిస్తుంది. మామిడికాయలు ఇంటికి చేరగానే అసలు పని మొదలవుతుంది. ముక్కలు కోసి,ఆవపిండి కలిపి,నూనె పోసి..చివరికి పెద్ద జాడీల్లో నింపే సమయం వస్తుంది. ఆ సమయంలో ఇంట్లో అందరూ ఉంటారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం వాడవాడలా ఆవకాయ సందడి కనిపిస్తోంది. గ్రామాల్లో మాత్రమే కాదు..పట్ట ణాల్లో కూడా ఇంటింటా ఆవకాయ సీజన్ మొదలైంది. మార్కెట్లలో మామిడికాయలకు డిమాండ్ పెరిగింది. -
వీడిన మర్డర్ మిస్టరీ
● రౌడీషీటర్ హరనాథ్గా హతుడి గుర్తింపు ● ఐదుగురు కలిసి హత్యవిజయనగరం క్రైమ్: స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసుగా నమోదైన పావాడ హరనాథ్ను అదే బస్తీలో ఉంటున్న స్నేహితులే గంజాయి మత్తులో హత్య చేసినట్లు ఎస్పీ శుక్రవారం తెలిపారు. ఆధిపత్యం కోసమే తోటి మిత్రుడిని ప్లాన్ చేసి అంతమొందించారన్నారు. ఈ కేసుకు సంబంధించి వన్ టౌన్ సీఐ ఆర్వేఆర్కే చౌదరి, క్రైమ్ ఎస్సై సురేంద్ర నాయుడు బృందం మిస్టరీని ఛేదించినట్లు తెలిపారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. నగరంలోని జొన్నగుడ్డికి చెందిన పావాడ సంతోషి అనే మహిళ తన కొడుకు పావాడ హరనాథ్ మార్చి 27 వ తేదీ రాత్రి నుంచి కనిపించడం లేదని వన్ టౌన్ పోలీసులకు ఈ నెల10వ తేదీన ఫిర్యాదు చేయగా వన్ టౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో విజయనగరం మండలం నారాయణ పురం గ్రామ శివారులోని నూతిలో ఒక వ్యక్తి.. మృతదేహం ఉన్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు పరిశీలించి మిస్సింగ్ అయిన పావాడ హరనాథ్గా గుర్తించారు. ఈ నేపథ్యంలో మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్పుచేసి, వన్ టౌన్ సీఐ దర్యాప్తు చేపట్టారు. విచారణలో మృతి చెందిన పావాడ హరనాథ్ పై రౌడీషీటు ఉన్నట్లు, ఇప్పటికే 15 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిసింది. హత్య నేపథ్యం.. జొన్నగుడ్డిలో ఉంటున్న పావాడ హరనాథ్కు అదే ప్రాంతంలో ఉంటున్న బాక్సర్ (ఎ1) సొంటేన లక్ష్మణరావు అలియాస్ లక్ష్మణకు ఇటీవల గొడవ జరగ్గా ఇద్దరూ కొట్టుకున్నారు. అనంతరం తాను బాక్సర్ లక్ష్మణరావును కొట్టినట్లు పావాడ హరనాథ్ ఎక్కువగా ప్రచారం చేయడంతో ప్రతీకారం తీర్చుకోవాలని బాక్సర్ సొంటేన లక్ష్మణరావు భావించి, అవకాశం కోసం ఎదురు చూశాడు. ఇదే క్రమంలో బార్లో మద్యం తాగి మత్తులో బార్ బయట పడిపోయిన హరనాథ్ను గమనించిన సొంటేన లక్ష్మణరావు (30) అతని వర్గానికి చెందిన కుప్పిలి భార్గవ కుమార్ అలియాస్ భార్గవ్ (20), మచ్చ తేజ (20), రేగిడి వాసుదేవ్ అలియాస్ వాసు (26) ఆటోలో హరనాథ్ను పట్టణ శివార్లలోకి తరలించి, అక్కడ రాళ్లతో కొట్టి హత్య చేసి, మృతదేహాన్ని సిమెంట్ పోల్కు తాళ్లతో కట్టి, ఫ్లెక్సీ కప్పేసి పరారయ్యారు. ఇదే కేవలం ఇరు వర్గాల మధ్య జరిగిన ఆధిపత్య పోరుతో జరిగిన హత్య అని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో పావాడ హరనాథ్ను హత్య చేసిన నలుగురు నిందితులను అరెస్టు చేసి, రిమాండుకు తరలించామన్నారు. అంతేకాకుండా, నిందితులకు సహకరించిన మరో జువైనల్ను అదువులోకి తీసుకున్నామని చెప్పారు. సమావేశంలో విజయనగరం ఇన్చార్జ్ డీఎస్పీ ఎస్.రాఘవులు పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యం
పూసపాటిరేగ: ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని విశాఖ రీజియన్ ప్రకృతి వ్యవసాయం టెక్నికల్ మేనేజర్ కె.ప్రకాష్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం పూసపాటిరేగ మండలంలోని గోవిందపురం గ్రామంలో ప్రకృతి వ్యవసాయం సాగుపై రైతులకు ముగింపు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి సాగులో అవలంబించాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. నిరంతర ప్రకృతి వ్యవసాయం ఏవిధంగా అందుబాటులోకి తీసుకోవాలి అనే అంశంపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయశాఖ సిబ్బంది ఇన్పుట్ ప్రిపరేషన్, ఉపయోగాలపై పూర్తిస్థాయిలో తెలియజేశారు. తొలకరికి 15 కేజీల విత్తనాల కిట్లు అందజేస్తామన్నారు. తొలకరి సాగుకు 30 రకాల విత్తనాల ద్వారా పచ్చిరొట్ట ఎరువులు తయారు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల ఇన్చార్జ్ వ్యవసాయ అధికారి అడ్డూరి శ్రీని వాసరావు, విస్తరణాధికారి ఎస్.భాను, ప్రకృతివ్యవసా యం సిబ్బంది కమల, అశ్వని తదితరులు పాల్గొన్నారు. టెక్నికల్ మేనేజరు ప్రకాష్ -
నాలుగు కంకర ట్రాక్టర్ల సీజ్
వీరఘట్టం: వంగర మండలం రుషింగి నుంచి వీరఘట్టం మండలం చిట్టపులివలస గ్రామానికి కంకరను అక్రమంగా తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను జిల్లాకు చెందిన మైనింగ్ అధికారులు శుక్రవారం అడ్డుకున్నారు. వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు ఏఎస్సై సత్యనారాయణ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలుబొబ్బిలి: పట్టణ సమీపంలోని సరేపోలమ్మ ఆలయం వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస పట్నాయక్ అనే వ్యక్తి గాయాల పాలయ్యాడు. ఓ పత్రికలో రిపోర్టర్గా పనిచేస్తున్న శ్రీనివాస పట్నాయక్ తన స్వగ్రామం జగన్నాథపురం నుంచి పట్టణంలోకి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వెనుకవైపు నుంచి బైక్తో ఢీ కొని పరారయ్యాడు. వెంటనే స్థానికులు క్షతగాత్రుడిని బొబ్బిలి సీహెచ్సీకి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడి దగ్గరకు ఏఎస్సై కొండల రావు వెళ్లి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. 8 పోక్సో కేసుల్లో నిందితులకు జీవిత ఖైదువిజయనగరం క్రైమ్: ఈ ఏడాది ఎనిమిది పోక్సో కేసులలో నిందితులందరికీ యావజ్జీవ ఖైదు విధించినట్లు చిన్నారులు, మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ పని చేస్తోందని ఎస్పీ దామోదర్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడేళ్లలో 46 పోక్సో కేసుల్లోను, 33 క్రైం ఎగినిస్ట్ వుమన్ కేసుల్లోను నిందితులకు కఠినమైన శిక్షలు విధించారన్నారు. పోక్సో కేసుల్లో ప్రాసిక్యూషన్ ఎప్పటికప్పుడు గమనిస్తూ, చర్యలు చేపట్టడం సత్ఫలితాలనిస్తోందన్నారు. 2024లో 10, 2025లో 28, ఈ ఏడాదిలో 8 పోక్సో కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు లేదా 20ఏళ్లు కఠిన కారాగార శిక్షలు విధించారన్నారు. మహిళల భద్రతకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని, అందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. త్రుటిలో తప్పిన పెను ప్రమాదంభామిని: మండలంలోని బత్తిలి సమీపంలో శుక్రవారం ఓ ఆర్టీసీ బస్సు పెనప్రమాదం నుంచి త్రుటిలో బయటపడింది. శ్రీకాకుళం నుంచి బత్తిలి వస్తున్న ఆర్టీసీ బస్సు బత్తిలి వెర్రిగెడ్డ బ్రిడ్జి ప్రవేశంలో పక్కకు తిప్పి ఘోర ప్రమాదం నుంచి ప్రయాణికులను తప్పించింది. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. బ్రిడ్జి అంచు నుంచి గెడ్డలోకి దిగిపోవలసిన ఆర్టీసీ బస్సు వెనుక చాసీ గట్టుకు తగిలి గెడ్డలోకి పడకుండా బస్సు నిలిచి పోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.ప్రమాదం జరిగిన వెంటనే బత్తిలి గ్రామస్తుల సహకారంతో ప్రయాణికులను దించి వేశారు. డ్రైవర్, కండక్టర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 13 కేజీల గంజాయి పట్టివేతవిజయనగరం క్రైమ్: కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీకి 66 వేలు విలువ చేసే 13 కేజీల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా శుక్రవారం అడ్డుకున్నామని గవర్నమెంట్ రైల్వే ఎస్సై బాలాజీ రావు తెలిపారు. విజయనగరం రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేస్తుండగా కర్ణాటక రాష్ట్రం షిమోగాకు చెందిన వి.వరుణ ఒడిశా రాష్ట్రంలోని టికిరి నుంచి గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించామని జీఆర్పీ ఎస్సై బాలాజీ రావు తెలిపారు. ఆర్పీఎఫ్ సిబ్బంది రైడ్ చేయగా వరుణ్ అడ్డంగా దొరికాడని, గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విశాఖ రైల్వే కోర్టుకు తరలించామన్నారు. -
వైఎస్సార్సీపీలో చేరిన గొల్లుపాలెం మాజీ సర్పంచ్
బొండపల్లి: మండలంలోని గొల్లుపాలెం గ్రామ మాజీ సర్పంచ్ పల్లి రామునాయుడు తన అనుచరులతో కలిసి గురువారం బోడసింగిపేటలో జరిగిన పార్టీ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో ఆయన టీడీపీలో క్రీయాశీలకంగా వ్యవహరించగా, తర్వాత వైఎస్సార్సీపీలో చేరి ఇటీవల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీలో విభేదాల కారణంగా తన అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీలో చేరగా అయనకు పార్టీ కండువా కప్పి జెడ్పీ చైర్మన్ సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణతో పాటు, వైఎస్సార్సీపీ నియోజకవర్గం ఇన్చార్జ్ బొత్స అప్పలనరసయ్య, గ్రామ నాయకులు గొల్లు సతీష్, మూకల చలం నాయుడు, పల్లి రఘు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా వేదగాయత్రీమాత ఆలయ వార్షికోత్సవం
విజయనగరం టౌన్: సనాతన గురుకులాశ్రమ గాయత్రి శ్రీ విద్యాపీఠం 33వ వార్షిక బ్రహ్మోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక పూల్బాగ్లోని ఉన్న విద్యాపీఠం ఆవరణలో కొలువైన అమ్మవారికి యనమండ్ర సుబ్రహ్మణ్యశాస్త్రి విమలానందనాథ గురువర్యులు విశేష పూజలు నిర్వహించారు. శ్రీ విద్యాపీఠంలో కొలువైన గాయత్రి, సావిత్రి, సరస్వతి స్వరూప సంధ్యామూర్తులకు అష్టోత్తరశత కలశాభిషేకం, పంచామృతాభిషేకాలు, శ్రీ చక్ర కుంకుమార్చన, గాయత్రి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించి, తరించారు. -
వసతులు కరువు
పాలకొండ మండలం తుమరాడ గ్రామంలో కామినాయుడు చెరువు వద్ద 160 మంది వేతనదారులు ఎండలోనే పనులు చేపడుతున్నారు. ఇక్కడ పనులు జరుగుతున్న చోట కనీసం టెంట్లు, షెడ్డులు ఏర్పాటు లేదు. తాగునీరు, పనిముట్లు అందుబాటులో లేవు. రూ.9 లక్షలతో చేపడుతున్న ఈ చెరువు అభివృద్ధి పనుల్లో.. వేతనదారులకు కనీస వసతులు కల్పించడం లేదు. దీనికి తోడు మూడు నెలలుగా వేతన బకాయిలు కొనసాగుతున్నట్లు ఉపాధి వేతనదారులు వాపోతున్నారు. ● మైదాన ప్రాంతంలో ఫేస్యాప్తో ఓ రకమైన సమస్యలు ఉంటే.. సీతంపేట వంటి ఏజెన్సీ ప్రాంతంలో సిగ్నల్ దొరక్క యాప్ నమోదు ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఈ మండలంలో 53 పంచాయతీలు, 431 గూడల పరిధిలో, 13వేల పై చిలుకు జాబ్ కార్డుదారులు ఉన్నారు. ప్రస్తుతం 12 వేల మంది వరకు ఉపాధి పనులకు వెళ్తున్నారు. వీరికి సంబంధించి పనులు జరిగే చోట ఫేస్ యాప్లో వేతనదారుని వివరాలు నమోదు చేసేందుకు 436మంది మేట్లు పని చేస్తున్నారు. వీరంతా ఉపాధి పని జరిగే చోట సెల్ సిగ్నల్ ఉండకపోవడంతో సిగ్నల్ వచ్చే ప్రాంతానికి చేరుకొని యాప్ ఇన్స్టాల్చేసి, తిరిగి పని జరిగే ప్రాంతానికి వెళ్లి వస్తూ అవస్థలు పడుతున్నారు. ఎండలు మండిపోతున్నాయి. తలదాచుకొనేందుకు నీడ లేదు. గతంలో టెంట్లు అందించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తాగునీరు కూడా తెచ్చుకుంటున్నాం. పైగా వేతనాలకు మూడు నెలలుగా ఇబ్బందులు పడుతున్నాం. సమస్యలు పరిష్కరించడం లేదు. సాంకేతిక పేరిట ఇక్కట్లు తప్పడం లేదు. వేతన బకాయిలతో పాటు ఎండలో పనిచేస్తున్నందుకు ప్రత్యేక అలవెన్సులు అందించాలి. – గుమ్మిడి తవిటినాయుడు, ఉపాధి వేతన దారు, తుమరాడ ● -
శనివారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
ఓ వైపు ఎండలు మండుతున్నా ఉపాధిహామీ పనుల వద్ద ఎక్కడా టెంట్లు కానరావడం లేదు.. తాగునీరు, మజ్జిగ సరఫరా మాటే లేదు.. రెండుపూటలా పనికి వెళ్లినా మస్తర్ పడుతుందోలేదోనన్న బెంగ.. యాప్లో ఫేస్ పడేవరకు వీడని ఉత్కంఠ.. ఫేస్ నమోదైతే హమ్మయ్య ఈ రోజుకు గండం గట్టెక్కిపోయామన్నంత ఉపశమనం.. ఎంత పైనినైనా చేసేందుకు సిద్ధపడే వేతనదారులు.. కనీస సదుపాయాలు లేక నీరసించిపోతున్నారు. మస్తర్ నమోదులో ఇబ్బందులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సకాలంలో వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని ఉపాధిహామీ వేతనదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్. -
స ● వి ● వి ● వి
మలేరియా పేరు వినగానే జనం భయపడేవారు. ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలు ఎక్కువగా భయపడేవారు. –8లోత్రుటిలో తప్పిన పెను ప్రమాదం భామిని మండలంలోని బత్తిలి సమీపంలో శుక్రవారం ఓ ఆర్టీసీ బస్సు పెనప్రమాదం నుంచి త్రుటిలో బయటపడింది. –8లోపనిప్రదేశంలో సదుపాయాలు లేవు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. టెంట్లు, మెడికల్ కిట్లు వంటివి లేవు. నెలల తరబడి బిల్లులు చెల్లింపులు జరగడం లేదు. ఫేస్ యాప్ వల్ల ఇబ్బంది అవుతోంది. – గమ్మెల పెంటయ్య, వేతనదారుడు, గంగందొరవలస, పాచిపెంట మండలం గతంలో పని ప్రదేశంలో టెంట్లు, మజ్జిగ, ప్రథమ చికిత్స కిట్లు, పరికరాలు ఉండేవి. ప్రస్తుతం అవేవీ లేవు. నీడ కోసం చెట్ల కింద కూర్చోవాల్సి వస్తోంది. పైగా ఫేస్యాప్ వల్ల పని ఆలస్యం కావడంతోపాటు.. కొన్ని సార్లు నమోదు కాకపోవడంతో పని చేయకుండానే మండుటెండలో వేచి ఉండి, ఇళ్లకు తిరిగి వెళ్లిపోవాల్సి వస్తోంది. – మోర్చ భాస్కరరావు, వేతనదారుడు, చెరుకుపల్లి గ్రామం, పాచిపెంట మండలం -
రాష్ట్రంలో అరాచక పాలన
జియ్యమ్మ వలస రూరల్: రాష్ట్రంలో అరాచకం, అక్రమాలు, అవినీతి రాజ్యమేలుతోందని మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి విమర్శించారు. తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పనీపాటాలేని ముగ్గురు మహిళా మంత్రులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై కారు కూతలు కూడయడంపై మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయమని జనం ప్రశ్నిస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్తో కాలంగడిపేస్తున్నారని దుయ్యబట్టారు. రాజధానిపేరుతో భూదందాలు చేసి అమరావతి రైతులకు తీవ్ర అన్యాయం చేశారని, ఆ పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేస్తున్నారని ప్రశ్నించినందుకు మహిళా మంత్రులతో కారుకూతలు కూయిస్తున్నారని, వీరి వాగుడు నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. మంత్రులు మీడియా ముందు గట్టిగా మాట్లాడితే అబద్ధాలు నిజాలైపోవన్నారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నారని ప్రశ్నిస్తే తల్లి, చెల్లి, గొడ్డలి అంటూ తప్పుడు ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్లు కుంభకోణం, హనీ ట్రాప్చేసిన సవిత వేదాలను వళ్లించడం హాస్యాస్పదమన్నారు. జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. వైఎస్సార్సీపీ గొడ్డలి పార్టీ అయితే మీ సైకిల్లో ‘కిల్’ఉంది కదా.. మీది కిల్ (హత్యలు)పార్టీయా అని విమర్శించారు. గిరిజన చిరుద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించడంలో మంత్రి సంధ్యారాణి హస్తం ఉందని ఆరోపించారు. అన్నం ఉడకలేదనే కారణంతో ఐదుగురు కేజీబీవి సిబ్బందిని తొలగించి వారి కుటుంబాలను రోడ్డున పడేయడం గిరిజన సంక్షేమ మంత్రికి తగదన్నారు. కురుపాం నియోజకవర్గంలో విద్యార్థుల విషయంలో తప్పులు చేసిన వారిపై నాలుగు నెలలో సస్పెన్షన్లు ఎత్తి వేయడం, ఎమ్మెల్యే చుట్టమని క్రమశిక్షణ రాహిత్యంగా పనిచేసిన ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ ఎత్తివేయడం, ఏకలవ్య గురుకుల పాఠశాలలో శిక్షణ పేరుతో రూ.10 కోట్లు దోచుకోవడం ఇవన్నీ అబద్ధాలా ? అని మండిపడ్డారు. 2024–25 విద్యా సంవత్సరంలో ఐ విల్ లెర్నింగ్ సొల్యూషన్న్స్ కంపెనీ వారు ఎటువంటి తరగతులు నిర్వహించకుండా రూ.5 కోట్లు స్కామ్ చేయడం అబద్ధమా? నిజమా అన్నది మంత్రి చెప్పాలన్నారు. అభివృద్ధిపై దృష్టిపెట్టకుండా అబద్ధాలు చెబుతూ కాలంగడిపేస్తున్న నేతలకు ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు ఎం.శెశికళ, ఎంపీపీ శెట్టి పద్మావతి, బంకురు శంకరజోగినాయుడు, బలగ వెంకటరమణ, నారాయణరావు, మురళి, కృష్ణ, రమణమ్మ, ఉషారాణి, ఈశ్వరరావు, మన్మథరావు, తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు. మంత్రులు చెప్పేవన్నీ అబద్ధాలే.. అభివృద్ధి, ప్రజాసంక్షేమాన్ని విస్మరించి డైవర్షన్ పాలిటిక్స్కు ప్రాధాన్యం మంత్రుల తీరును విమర్శించిన పుష్పశ్రీవాణి -
బూజు దులపండి
పాలకొండ: తహసీల్దార్ కార్యాలయంలో ఎక్కడిపడితే అక్కడే చెత్త ఉంది.. నిర్వహణ తీరు బాగులేదు.. గోడలకు ఉన్న బూజును వెంటనే దులపండి.. కార్యాలయం శుభ్రం చేసిన ఫొటోలను పంపించాలంటూ కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి పాలకొండ డిప్యూటీ తహసీల్దార్ వెంకటరావును ఆదేశించారు. సీతంపేట పర్యటనకు వెళ్లి తిరుగు ప్రయాణంలో పాలకొండ తహసీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సేవలపై ఆరా తీశారు. అర్జీలు వెంటనే పరిష్కరించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తహసీల్దార్ రాధాకృష్ణను ఆదేశించారు. పకడ్బందీగా గురుకుల ప్రవేశ పరీక్షలు● కేంద్రాలను తనిఖీ చేసిన జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి పార్వతీపురం రూరల్: ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సర ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీఆర్ఎస్ క్యాట్ ప్రవేశ పరీక్షలు శుక్రవారం జిల్లాలో పారదర్శకంగా జరిగాయి. పార్వతీపురం మండలం వెంకంపేట, విద్యానగర్లోని సురేష్ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను జిల్లా జాయింట్ కలెక్టర్, ఇన్చార్జ్ ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదో తరగతిలో కొత్త ప్రవేశాలతో పాటు 6, 7, 8 తరగతుల్లోని బ్యాక్లాగ్ ఖాళీల భర్తీకి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా తాగునీరు, విద్యుత్ దీపాలు, గాలి వంటి మౌలిక వసతులను పర్యవేక్షించారు. నిబంధనల మేరకు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో పరీక్షా కేంద్రాల ఇన్చార్జ్ అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అంధ విద్యార్థులకు బ్రెయిలీ పుస్తకాలుపార్వతీపురం రూరల్: జిల్లాలోని అంధ విద్యార్థులకు ఉచితంగా బ్రెయిలీ పాఠ్యపుస్తకాలను సరఫరా చేయనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు బి.దేవరాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ మరియు ఎన్జీఓ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు (ఓపీడీఏఎస్సీఏసీ.ఏపీ.జీవోవీ.ఇన్) వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువపత్రాలను జతపరచాలని, అర్హులైన ప్రతి విద్యార్థికీ త్వరలోనే పుస్తకాలు అందజేస్తామని వివరించారు. జిల్లాలోని అంధ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు బాధ్యత వహించాలన్నారు. 32 మందిపై విరిగిన లాఠీ విజయనగరం క్రైమ్: ఇటీవల విజయనగరం పట్టణంలో జొన్నగుడ్డికి చెందిన పావాడ హరనాథ్ మృతదేహం తీసుకెళ్లే సమయంలో అలజడి సృష్టించిన 32 మందిపై ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం లాఠీ ఝుళిపించారు. పోస్టుమార్టం పూర్తయిన వెంటనే మృతదేహాన్ని తీసుకెళ్లే సమయంలో ఆర్అండ్బీ నుంచి బాలాజీ కూడలి వరకు ర్యాలీగా హడావిడి చేయడం, బాణసంచా కాల్చడం, రోడ్డుపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించడం నగరంలో చర్చనీయాంశమైంది. పోలీసుల తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని ఎస్పీ సీరియస్గా తీసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు మృతదేహాన్ని తరలించే సమయంలో అలజడి సృష్టించిన వారిని పోలీసులు గుర్తించారు. విజయనగరం వన్టౌన్, టు టౌన్ పోలీసులు జొన్నగుడ్డి, లంకాపట్నం తదితర ప్రాంతాలకు చెందిన దాదాపు 32 మందిని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎదుట శుక్రవారం హాజరుపర్చారు. తొలుత వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ సమయంలో దురుసుగా ఉన్నవారిపై లాఠీలు ఝుళిపించారు. ఇకపై నగరంలో ఎలాంటి అల్లర్లు, విధ్వంసకాండ సృష్టించినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అందరి వివరాలను నమోదు చేసి విడిచిపెట్టారు. -
నీడా లేదు.. నీరూ ఉండదు!
సాక్షి, పార్వతీపురం మన్యం/సాలూరు/గుమ్మలక్ష్మీపురం/పాలకొండ రూరల్/పార్వతీపురం రూరల్: జిల్లాలో ఉపాధి హామీ పథకం వేతనదారులు ఆపసోపాలు పడుతున్నారు. ఓ వైపు ఎండలు.. మరోవైపు ఫేస్ యాప్ కష్టాలు.. వారికి పరీక్ష పెడుతున్నాయి. వేతనదారులకు పని దొరకడం.. గిట్టుబాటు వేతనం దక్కడం సంగతి పక్కనపెడితే.. అసలు రోజంతా ఎండల్లో నిరీక్షణకే సరిపోతోంది. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 451 పంచాయతీలు ఉన్నాయి. 2.11 లక్షల జాబ్ కార్డులు ఉండగా.. ఇందులో సుమారు 1.90 లక్షల కార్డులు యాక్టివ్లో ఉన్నాయి. 3.80 లక్షల మంది వేతనదారులు ఉన్నారు. ఏప్రిల్లో 1.70 లక్షల మందికి పనుల లక్ష్యం కాగా.. సగం మంది కూడా నమోదు కావడం లేదు. ఎంఎంఎస్(మొబైల్ మానిటరింగు సిస్టం) యాప్లో సాంకేతిక ఇబ్బందుల వల్ల సగం మందికిపైగా పనికి దూరం అవుతున్నారు. ముఖ ఆధారిత హాజరు నమోదు వల్ల.. చాలా మందికి తీసుకోవడం లేదు. దీంతో వారికి మస్తర్లు పడడం లేదు. హాజరుకోసం గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. టెంట్లు ఉండవు.. ప్రథమ చికిత్స కిట్లు కానరావు ఎండల వల్ల ఉదయం 10 గంటలలోపు.. మరలా సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకూ పనులు నిర్వహిస్తున్నారు. ఉపాధి హామీ పథకం నిబంధనలు క్షేత్రస్థాయిలో కాగితాలకే పరిమితం అవుతున్నాయి. పనిచేసే చోట కనీస సదుపాయాలు కల్పించడం లేదు. వేతనదారులు ఎండలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడా టెంట్లు, మజ్జిగ, తాగునీరు, ప్రథమ చికిత్స పెట్టెలు కానరావడం లేదు. గతంలో పనికి వచ్చే వేతనదారులకు పనిముట్లు ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. దీనికి తోడు నెలల తరబడి వేతనాల బకాయి ఉంటోంది. పార్వతీపురం మండలంలోని నర్సిపురం, అడ్డాపుశీల, చిన్నబొండపల్లి, కృష్ణపల్లి తదితర పంచాయతీల్లో పనులు చేస్తున్న వేతనదారులు ఎండ తీవ్రతకు తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. పని విరామ సమయంలో సేదతీరడానికి కనీసం టెంట్లు కూడా ఎక్కడా లేవు. గట్ల మీద, చెట్ల నీడలో ఆశ్రయం పొందుతున్నారు. మండుతున్న ఎండకు తాళలేక, వడదెబ్బకు గురవుతామని భయపడుతూనే వారు పనులను కొనసాగిస్తున్నారు. పాచిపెంట మండలం పి.కోనవలస పంచాయతీలో జరుగుతున్న ఉపాధి పనుల్లో వేతనదారులకు నీడకోసం టెంట్లు లేవు. దాహార్తిని తీర్చేందుకు నీరు, మజ్జిగ సదుపాయం కల్పన లేదు. ప్రథమ చికిత్స కోసం మెడికల్ కిట్లు ఊసేలేదు. వేతనదారులంతా నీడ కోసం సమీప గట్టు వద్ద ఉన్న చెట్లను ఆశ్రయించడం కనిపించింది. గతంలో గునపం, పార వంటి పనిముట్లు ఇచ్చేవారని.. ఇప్పుడు అవి కూడా లేవని వేతనదారులు వాపోతున్నారు. ఫేస్ యాప్లో సాంకేతిక సమస్యలు అదనం. కొన్నిసార్లు ఫేస్ యాప్లో నమోదు కాకపోవడం వల్ల పనికి వచ్చినా ఉసూరుమంటూ వెనుదిరగాల్సి వస్తోందని వేతనదారులు వాపోతున్నారు. ఉపాధి పనికి వసతుల లేమి.. ఓవైపు ‘యాస్’సోపాలు.. మరోవైపు ఎండలతో ఇక్కట్లు పని చేసే చోట కానరాని టెంట్లు, మజ్జిగ ఉపాధి వడదెబ్బ రోజులో అధిక సమయం నిరీక్షణే.. -
గంజాయి నియంత్రణలో ఐవీఆర్ఎస్
పార్వతీపురం: జిల్లాలో గంజాయి నియంత్రణలో ఐవీఆర్ఎస్ ద్వారా చేపట్టే ప్రజా స్పందనలో రాష్ట్రంలోనే మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. పోలీసు శాఖతోపాటు సమన్వయ శాఖలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ, రహదారి భద్రత, బాల్య వివాహాల నిర్మూలన కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థలు, వసతిగృహాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టాలని, 500మీటర్ల పరిధిలో మత్తు పదార్ధాల విక్రయాలను అరికట్టాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక డ్రైవ్లను నిర్వహించి, బ్లాక్ స్పాట్ వద్ద హెచ్చరిక బోర్డులు, త్రీడీ పెయింటింగ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచాలని సూచించారు. బాల్య వివాహాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, ప్రింటింగ్ ప్రెస్లు, కల్యాణ మంటపాల యాజమాన్యాలపై కూడా కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ నియంత్రణకు పోలీస్ శాఖ పరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ వి.మనీషారెడ్డి, సబ్కలెక్టర్ ఆర్. వైశాలితోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సేదతీరేదెలా?
గుమ్మలక్ష్మీపురం మండలం పరిధిలోని 27 పంచాయతీల్లో 12,808 జాబ్ కార్డులు ఉన్నాయి. శుక్రవారం 8,790 మంది వేతనదారులు ఉపాధి హామీ పథకం పనుల్లో పాల్గొన్నారు. పనులు చేపడుతున్న ప్రదేశాల్లో సేదదీరేందుకు ఎక్కడా టెంట్లు గానీ.. తాగునీరు, పనిముట్లు, ప్రథమ చికిత్స పెట్టెల సదుపాయాలు గానీ కానరావడం లేదు. గతంలో పని ప్రదేశాల వద్ద మెడికల్ కిట్లతో పాటు టెంట్లు, తాగునీరు, పిల్లల్ని చూసుకునేందుకు ఆయాల వంటి సదుపాయాలు ఉండేవని.. ఇప్పుడవేమీ కానరావడం లేదంటూ వేతనదారులు ఆవేదన చెందుతున్నారు. రోజూ ఫేస్ యాప్ నమోదు చేసుకోవాల్సి ఉండడం, సకాలంలో యాప్లో హాజరు నమోదు కాకపోవడం వల్ల వేతనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఎస్.కే పాడులో ఎండలోనే పనులు చేపడుతున్న వేతనదారులు ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తే ఫేస్ యాప్ ద్వారా హాజరును ఉదయం, సాయంత్రం వేళల్లో వేసుకోవాల్సి వస్తోంది. ముఖ హాజరు సక్రమంగా నమోదు కాకపోవడంతో ఎక్కువ సమయం హాజరు కోసం వెచ్చించాల్సి వస్తోంది. దీనికి తోడు ఎండ ప్రభావం కూడా ఎక్కువగా ఉండడంతో పనులు చేయలేకపోతున్నాం. పాత విధానంలోనే హాజరును నమోదు చేయాలి. – కడ్రక సీతారాం, వేతనదారుడు, నోండ్రుకోన గ్రామం, చినగీసాడ పంచాయతీ -
మూడో రోజుకు చేరిన కేజీబీవీ సిబ్బంది దీక్ష
పార్వతీపురం రూరల్: సాలూరు మండలం కరాసువలస కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ (కేజీబీవీ) ప్రిన్సిపాల్ సహా ఇతర సిబ్బందిని విధుల్లో నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారానికి మూడో రోజుకు చేరుకున్నాయి. తొలగింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు శిబిరం వద్ద గళమెత్తారు. చిన్నపాటి కారణాలతో మహిళా ఉద్యోగులను విధుల నుంచి తొలగించడం సరికాదని, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి తన నిర్ణయాన్ని పునఃసమీక్షించు కోవాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు. బాధితుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు పి.శ్రీను నాయుడు, ఎం.భాస్కర రావు, పీడీఎస్ఓ కార్యదర్శి కె.సోమేష్, కాంగ్రెస్ నాయకులు తీళ్ల గౌరీ శంకర్ రావు, చొక్కాపు వెంకట రమణ, పట్లా సింగ్ రవికుమార్ పాల్గొన్నారు. వారితో పాటు ఏఐటీయూసీ నేత ఆర్వీఎస్ కుమార్, సీపీఐ (లిబరేషన్న్) సభ్యులు పి.సంగం, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మథ రావు, పౌర సంక్షేమ సంఘం నాయకులు పాకల సన్యాసి రావు, బంకురు సూరిబాబు, గిరిజన సంక్షేమ సంఘం నాయకుడు రంజిత్ కుమార్ తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు. -
మోసకారి కూటమికిబుద్ధి చెప్పండి
గజపతినగరం రూరల్: రాష్ట్రంలో చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేసింది.. పంటను మద్దతు ధరకు కొనుగోలుచేసేవారు లేక మొక్కజొన్న రైతు కన్నీరు పెడుతున్నా కనీసం పట్టించుకోవడంలేదు.. ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పేర్కొ న్నారు. గజపతినగరంలోని బెల్లాన కన్వెన్షన్లో నియోజకవర్గ గ్రామ కమిటీల విస్తతస్థాయి సమావేశం, నూతనంగా నియామకమైన పార్టీ మండలాధ్యక్షుడు పల్లి సంజీవరావు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ కో–ఆర్డినేటర్ బూడి వెంకటరావు బాధ్యతల స్వీకరణకు బొత్స ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నది లేనిట్లు.. లేనిది ఉన్నట్లు సష్టించడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. ఆచరణ సాధ్యంకాని హామీలతో అందలమెక్కి... ప్రజలను నయవంచనకు గురిచేశారన్నారు. ఎన్నికల సమయంలో తమకున్న పచ్చమీడియాతో ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారం చేజిక్కించుకున్నారని ఆరోపించారు. తల్లికి వందనం పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను సైతం చంద్రబాబు మోసంచేశారని విమర్శించారు. పథకం లబ్ధిదారులందరికీ అందడంలేదన్నారు. ఉపాధిహామీ పథకాన్ని డొల్ల చేశారని, వంతుల వారీగా కూలీలకు పని కల్పించడం సిగ్గుచేటన్నారు. అన్నదాతను విత్తు నుంచి ఎరువుల వరకు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ● తమ ప్రభుత్వ హయాంలో డ్వాక్రా మహిళలకు పావలా/సున్నా వడ్డీకే రుణాలు అందజేశామని, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో పావలా వడ్డీ రుణాలు అందని పరిస్థితి నెలకొందని బొత్స విమర్శించారు. రూ.3,60,000 కోట్లు అప్పులుచేసి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. దోచుకోవడం, దాచుకోవడం పనిలో తెలుగుదేశం నేతలు నిమగ్నమయ్యారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ధారాదత్తం చేయడం బాధాకరమన్నారు. గీతం యూనివర్సిటీకి ఐదువేల కోట్ల విలువచేసే ప్రభుత్వ భూములను కట్టబెట్టడం ప్రభుత్వ దోపిడీకి నిదర్శనమని పేర్కొన్నారు.కొత్తగా ఒక వితంతుకు పింఛన్ ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం, రెండేళ్లు తర్వాత వితంతు పింఛన్లు కానుక అంటూ సిగ్గులేని మాటలు ఆడుతుందన్నారు. క్షేత్రస్థాయిలో అవినీతి, దోపిడీ, హత్యరాజకీయాలు ఎక్కువయ్యాయని, వీటిని వైఎస్సార్సీపీ శ్రేణులు సమర్థవంతంగా ఎదుర్కోవాలని కోరారు. ఇదే తరహాలో మిగిలిన నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ● మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మాట్లాడుతూ, గత ఎన్నికల్లో పార్టీ నాయకుల నిర్లక్ష్యం, మితిమీరిన ధీమా కారణంగానే ఓడిపోయమన్నారు. రాబోయే ఏ ఎన్నికల్లోనైనా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతులు ఈ ప్రభుత్వంలో కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. ఎరువులు, విత్తనాలు దగ్గర నుంచి రైతు కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం సిగ్గుచేటన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగభృతి ఎక్కడ అన్నారు. సమావేశంలో విజయనగరం పార్లమెంట్ పరిశీలకులు కిల్లి సత్యనారాయణ, నియోజకవర్గ పరిశీలకులు సిరిపురపు జగన్మోహనరావు, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్ కుమార్, బొత్స సందీప్, జడ్పిటిసిలు గార తౌడు, వర్రి నరసింహమూర్తి, రౌతు రాజేశ్వరి, ఎంపీపీలు బెల్లాన జ్ఞాన దీపిక , పిరుబండి హైమావతి,గేదెల సింహాద్రి అప్పలనాయుడు, సీహెచ్ చిన్నమనాయుడు, ఏఎంసీ మాజీ చైర్మన్ వేమిలి ముత్యాలనాయుడు, జిల్లా క్రికెట్ సంఘం మాజీ కార్యదర్శి నారాయణమూర్తిరాజు, పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జాక్పాట్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొండపల్లి శ్రీనివాస్ అవినీతిలో ముందంజలో ఉన్నారని, ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడే పరోక్షంగా పేర్కొన్నారని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. తండ్రి, కొడుకులు ఇద్దరూ అవినీతి కార్యక్రమాలు చేయడంలో ఆరితేరాని విమర్శించారు. అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా నియోజకవర్గంలో అభివద్ధి జాడలు మచ్చుకై నా కనిపించడం లేదన్నారు. ఎంఎస్ఎంఈ మంత్రిని... జిల్లాకు పరిశ్రమలు తెస్తానంటూ గొప్పలు చెప్పుకోవడం మినహా నియోజవర్గానికి ఒక్క పరిశ్రమ అయినా తేగలిగారా అని ప్రశ్నించారు. రాబోయే 2029 ఎన్నికల్లో ఓడిపోతామని భయంతోనే కలెక్షన్లు మొదలుపెట్టారని ఆరోపించారు. తమ ప్రభుత్వం హయంలో నియమించిన తాత్కాలిక ఉద్యోగులను కక్ష సాధింపుగా తొలగించడం అన్యాయమన్నారు. 2024 ఎన్నికల్లో మాయమాటలు చెప్పి, పచ్చ మీడియాతో జనాల్లో విష బీజాలు నాటి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ప్రజలకు రెండేళ్లలో చంద్రబాబు మోసకారి పాలన అర్థమైందని, రాబోయే ఎన్నికల్లో ఓటమి ఖాయమన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఏ ఒక్కరూ అధైర్య పడవద్దని.. మీ వెన్నంటే మేము ఉంటామని.. భయం మా బ్లడ్లో లేదని, ఖబడ్దార్ అంటూ సవాల్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా జలధార–జలహారతి పేరుతో మరో దోపిడీకి శ్రీకారం చుట్టిందని మాజీ ఎమ్మెల్యే, గజపతినగరం నియోజకవర్గ ఇన్చార్జి బొత్స అప్పలనరసయ్య విమర్శించారు. దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ, అభివద్ధిపై లేదన్నారు. ఈ రెండేళ్లలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నియోజకవర్గ అభివద్ధికి ఏం చేశారని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్న హామీని మరిచిపోయారన్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి అనుకూల ఓట్లు తొలగించమని మంత్రి స్వయంగా రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తేవడం సిగ్గుచేటన్నారు. గత ఎన్నికల్లో ఈవీఎంల వల్లే తాము ఓడిపోయామన్నారు. నియోజకవర్గంలో ప్రజాబలం తమకే ఉందని, వైఎస్సార్సీపీ కార్యకర్తలందరూ సైనికుల వలే పనిచేయాలని, ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. మొక్కజొన్న రైతు కన్నీరు కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం పింఛన్ల మంజూరులో నిర్లక్ష్యం ప్రజాసంక్షేమ పథకాలు అందని వైనం చంద్రబాబు ప్రభుత్వం తీరును ఎండగట్టిన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ -
నేడు గురుకుల ప్రవేశపరీక్ష
పార్వతీపురం: గురుకుల పాఠశాలల్లో ప్రవేశాని కి ప్రవేశపరీక్ష శుక్రవారం నిర్వహిస్తున్నట్లు బొబ్బిలి గురుకుల కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కోఆర్డినేటర్ ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. 5, 6, 7, 8 తరగతులకు సంబంధించి 386 మంది విద్యార్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు పరీక్ష ఉంటుందన్నారు. అలాగే ఏపీఆర్జేసీలో ప్రవేశానికి 931 మంది విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. జిల్లా కేంద్రం పార్వతీపురంలోని సురేష్ హైస్కూల్, కేపీఎం హైస్కూల్, శ్రీజన్ గ్లోబల్ పాఠశాల, శ్రీచైతన్య పాఠశాలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలి పారు. ఆయా కేంద్రాలకు విద్యార్థులు అరగంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. పార్వతీపురం రూరల్: స్థానిక బైపాస్ రోడ్డులోని శ్రీ సాయిరాం డిగ్రీ కళాశాలలో ఈ నెల 24న శుక్రవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల కరస్పాండెంట్ రెడ్డి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. టాటా ఎలక్ట్రానిక్స్, టాటా టయో రేడియేటర్స్, అపోలో టై ర్స్, బ్లూ స్టార్ ఎలక్ట్రిక్, ఎజాకి ఇండియా లిమి టెడ్ వంటి ప్రముఖ కంపెనీలు ఈ మేళాలో పా ల్గొని అభ్యర్థులను ఎంపిక చేస్తాయి. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లమో పూర్తి చేసి న యువతీ యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎంపికైన వారికి వేతనంతో పాటు ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లతో శుక్రవారం ఉద యం 10 గంటలకు కళాశాల ప్రాంగణానికి హాజరుకావాలని కళాశాల కరస్పాండెంట్ కోరారు. పార్వతీపురం: భగీరథ మహర్షి జయంతి వేడుకలను కలెక్టరేట్లో గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమల త జ్యోతి ప్రజ్వలన చేసి, భగీరథుని చిత్రపటా నికి నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ లక్ష్యం, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమ ని, భగీరథుని కృషి యువతకు ఎంతో ఆదర్శమని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధికి అంద రూ బాధ్యతగా పనిచేయాలని, నీటి సంరక్షణ పై ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టాలని పిలుపునిచ్చా రు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధి కారి ఇ.అప్పన్న, డీపీఆర్ఓ కె.బాలమాన్సింగ్, కొప్పల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ జి. వెంకట నాయుడు, నాగవంశం డైరెక్టర్ హనుమంత్ శంకరరావు, శాలివాహన సంఘ జిల్లా అధ్యక్షుడు ఉరిటి యాదవ్ తదితరులు ఉన్నారు. హెచ్ఐవీ నిర్మూలనపై శ్రద్ధ అవసరం ● రాష్ట్ర ఏపీశాక్స్ పీడీ రోణంకి గోపాలకృష్ణ విజయనగరం ఫోర్ట్: వైద్యారోగ్యశాఖ చేపట్టే కార్యక్రమాలతో పాటు హెచ్ఐవీ నిర్మూలనపై దృష్టిసారించాలని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణశాఖ (ఏపీ శాక్స్) ప్రాజెక్టు డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. వైద్యారోగ్యశాఖ, వైద్యవిద్య, ఎయిడ్స్ నియంత్రణ శాఖ అధికారుల తో గురువారం జూమ్కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎయిడ్స్ నియంత్రణపై పనిచేస్తున్న సిబ్బంది పని తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. రోగులకు రోగనిరోధక శక్తి పెంచే మందులు అందజేయాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ, డీఎంహెచ్ఓ ఎస్.జీవనరాణి, తదితరులు పాల్గొన్నారు. -
10 కేజీల గంజాయితో ఇద్దరి అరెస్ట్..
విజయనగరం క్రైమ్: 10 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా ఇద్దరు నిందితులను విజయనగరం జీఆర్పీ సిబ్బంది గురువారం పట్టుకున్నారు. విజయనగరం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్లపై తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లాకు చెందిన బుడు బరిక, హరీష్ బరికలు ఒడిశా రాష్ట్రంలోని దమన్ జోడి నుంచి కేరళ రాష్ట్రం పాలక్కడ్కు సుమారు రూ. యాభై వేల విలువ చేసే 10 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడ్డారని జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తెలిపారు. వారిద్దరిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు చెప్పారు. 8కిలోల గంజాయితో మరో ఇద్దరు.. 8 కేజీల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ మరో ఇద్దరు నిందితులు విజయనగరం జీఆర్పీ సిబ్బందికి గురువారం పట్టుబడ్డారు. ఇందుకు సంబంధించి జీఆర్పీ ఎస్సై బాలాజీ రావు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. జీఆర్పీ, ఆర్పీఎఫ్ సంయుక్తంగా విజయనగరం రైల్వే ప్లాట్ఫాంలపై తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు రెండు బ్యాగ్లతో అనుమానంగా ఉండడాన్ని గుర్తించి ప్రశ్నించడంతో తడబడుతూ సమాధానం చెప్పారు. వెంటనే వారివద్ద ఉన్న బ్యాగ్లను తనిఖీ చేయగా రూ.40 వేల విలువ చేసే 8 కేజీల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తేలింది. పట్టుబడిన నిందితులు ఒడిశాలోని భద్రక్కు చెందిన ఆకాష్ కుమార్ బరిక్, రాయగడ జిల్లాకు చెందిన సునీల్ నాయక్లని రాయగడ నుంచి సికింద్రాబాద్కు గంజాయిని తరలిస్తున్నారని ఈ మేరకు కేసు నమోదు చేసి విశాఖ కోర్టులో ప్రవేశ పెట్టగా రిమాండ్ విధించారని జీఆర్పీ ఎస్సై బాలాజీ రావు చెప్పారు. -
వైఎస్సార్పీలో చేరికలు
● పార్టీలో చేరిన 50 కుటుంబాలకు చెందిన గజపతినగరం యువకులుగజపతినగరం రూరల్: స్థానిక బెల్లాన కన్వెన్షన్లో గురువారం జరిగిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత సమావేశంలో గజపతినగరం మేజర్ పంచాయతీకి చెందిన 50 కుటుంబాల యువకులు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, నియోజకవర్గ ఇన్చార్జ్ బొత్స అప్పలనరసయ్య, బొత్స సందీప్ వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ ఉప సర్పంచ్ కర్రి రామునాయుడు, రుంకాన భాస్కరరావు, వైస్ ఎంపీపీ కర్రి శ్రీదేవి, కర్రి నానాజీ, ఆల్తి రామనాయుడు ఆధ్వర్యంలో గజపతినగరం పట్టణంలో ఈ చేరికల వల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య అన్నారు. -
మలేరియా వ్యాధిపై అవగాహన ఉండాలి
విజయనగరం ఫోర్ట్: ప్రతి ఒక్కరికీ మలేరియా వ్యాధిపై అవగాహన ఉండాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో ఈనెల 25న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని వాల్ పోస్టర్లు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దోమల నియంత్రణకు స్ప్రేయింగ్ చేసేందుకు 165 హైరిస్క్ గ్రామాలను గుర్తించామన్నారు. మే ఒకటో తేదీ నుంచి మొదటి విడత, జూలై 15 నుంచి రెండో విడతగా స్ప్రేయింగ్ చేయనున్నామన్నారు. ఇంటి లోపల, ఇంటి పరిసరాల్లో ప్రజలు స్ప్రేయింగ్ ప్రజలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంఓ ఎం.సింహాచలం, ఎస్ఓ మూర్తి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి -
విద్యార్థులను ప్రోత్సహించేలా
గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించేలా సైన్స్ ఎక్స్పోజర్ టూర్ నిర్వహించాం. ఇటీవల 84 మంది విద్యార్థులు భువనేశ్వర్ వెళ్లి వచ్చారు. నేరుగా వారికి అనేక అంశాలపై క్షేత్రస్థాయిలో దృశ్యరూప అవగాహన కల్పించేందుకు ఈ పర్యటన చేయించాం. విద్యార్థులు వారు తిలకించిన ప్రదేశాలు, అక్కడి శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, విద్యార్థుల ద్వారా తెలుసుకున్న ఎంతో విలువైన సమాచారాన్ని నివేదికలుగా రూపొందించనున్నారు. సహ విద్యార్ధులకు ఆ విషయాలను తెలియచేయడం, ఆ అంశాలపై చర్చరించడం ద్వారా వారిలో దాగి ఉన్న అంతర్గత ప్రతిభను వెలికితీసేయత్నం ఈ పర్యటన. పాటోజు బ్రహ్మాజీరావు, డీఈఓ, పార్వతీపురం మన్యం. -
ఆర్థిక సహాయం చెక్కు అందజేసిన జెడ్పీ చైర్మన్
విజయనగరం రూరల్: అరబిందో ఫార్మా కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన నెల్లిమర్ల మండలం జరజాపుపేటకు చెందిన ఎం.లక్ష్మునాయుడు కుటుంబానికి అరబిందో ఫార్మా కంపెనీ అందించిన రూ. 30 లక్షల చెక్కును జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గురువారం తన కార్యాలయంలో అందజేశారు. జెడ్పీ చైర్మన్ కార్యాలయానికి విచ్చేసిన అరబిందో ఫార్మా కంపెనీ ప్రతినిధులు బాధిత కుటుంబానికి కంపెనీ యాజమాన్యం తరఫున ప్రకటించిన రూ.30 లక్షల చెక్కును జెడ్పీ చైర్మన్కు అందించగా ఆయన మృతుడి భార్య రమణమ్మకు అందజేశారు. అలాగే ఆమెకు అరబిందో కంపెనీలో ఉద్యోగంతో పాటు పిల్లల విద్యాభ్యాసం బాధ్యతలు కంపెనీయే చూసుకుంటుందని ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్, బాధిత కుటుంబసభ్యులకు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అనంతరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు బాధిత కుటుంబసభ్యులకు ధైర్యం చెబుతూ ఇలాంటి క్లిష్ట సమయంలో అండగా నిలిచిన అరబిందో కంపెనీ యాజమాన్యానికి కతజ్ఞతలు తెలిపారు. -
హెచ్చరిక..!
● మరో ఐదు రోజులు తీవ్ర ఎండల ముప్పు ● 41 డిగ్రీలు నుంచి 54 డిగ్రీలు హీట్ ఇండెక్స్ నమోదయ్యే అవకాశం ● జిల్లా ప్రజలకు ముందస్తు సూచనపార్వతీపురం: జిల్లాలో రాబోయే ఐదు రోజులపాటు తీవ్ర ఎండలు, వడగాడ్పులు ఉండనున్నాయని రియల్ టైం గవర్నెన్స్ (ఆర్టీజీ) విభాగం హెచ్చరికలు జారీ చేసింది. తాజా వాతావరణ అంచనాల ప్రకారం, జిల్లాలోని పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా జిల్లాలోని 15 మండలాల్లో హీట్ ఇండెక్స్ 41 డిగ్రీల నుంచి 54 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ స్థాయిని వాతావరణశాఖ ‘ప్రమాదకర స్థాయి’గా గుర్తించింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మండలాలు: జిల్లాలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సీతానగరం, సాలూరు, పాచిపెంట, మక్కువ, సీతంపేట, భామిని, కొమరాడ, వీరఘట్టం, బలిజిపేట, జియ్యమ్మవలస, పార్వతీపురం, గరుగుబిల్లి, పాలకొండ తదితర మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితులు రాబోయే ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశంలేదు. వాతావరణం పొడిగా, వేడిగా ఉండే అవకాశం ఉంది. ప్రజలకు సూచనలు ఉదయం 11 గంటలనుంచి సాయంత్రం 4 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. రోజంతా తగినంత నీరు తాగాలి. వృద్ధులు, పిల్లపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తేలికపాటి దుస్తులు ధరించి, సూర్యరశ్మి నుంచి రక్షణ తీసుకోవాలి. అధికారుల హెచ్చరిక ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటేనే హీట్వేవ్ ప్రభావం నుంచి రక్షణ పొందగలరని అధికారులు స్పష్టం చేశారు. -
కేపీఐ అమలులో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి
విజయనగరం అర్బన్: ప్రభుత్వ ప్రాధాన్యత సూచికల(కీ ఫెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్(కేపీఐ) అమలులో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ శాఖల పనితీరును సమీక్షించిన కలెక్టర్ నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ కావడంలో కేపీఐ కీలకమని పేర్కొంటూ వెనుకబడిన శాఖలు తక్షణమే పురోగతి సాధించాలని సూచించారు. అంతకుముందు ప్రణాళికాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రాంసుందర్రెడ్డి జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2026–27 సంవత్సరానికి సంబంధించిన 396 ఇండికేటర్లలో అత్యుత్తమ గ్రేడ్లు సాధించేందుకు శాఖల ఉన్నతాధికారులు కృషి చేయాలని కోరారు. మండలాలకు నిర్దేశించిన 199 ఇండికేటర్లలో మెరుగైన పనితీరును ప్రదర్శించాలని సూచిస్తూ ఈ నెల 29వ తేదీ నాటికి అన్ని నివేదికలను సమగ్రంగా సమర్పించాలని ఆదేశించారు. జీఎస్డీపీ లక్ష్యాలను వివరిస్తూ సవరించిన అంచనాలకు అనుగుణంగా మండలాల వారీగా ఎన్డీపీ అంచనాలు రూపొందించాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో సీపీఓ పి.బాలాజీ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి -
జీడి రైతు.. లబో దిబో
● మార్కెట్లో తగ్గిన ధర ● గత ఏడాదితో పోల్చితే పడిపోయిన ధర ● కేజీ జీడి మార్కెట్లో రూ.145 కురుపాం: ప్రతి ఏడాది జీడికి మార్కెట్లో మంచి గిరాకీ ఉండేది. ఒకానొక సమయంలో కేజీ జీడి రూ. 200 వరకు ధర పలకగా..ఈ ఏడాది మాత్రం కేజీ ధర 145కి పడిపోయింది. దీంతో జీడిరైతు లబోది బోమంటున్నాడు. అయితే ధర పడిపోవడానికి ముఖ్య కారణం పూర్తిస్థాయిలో జీడిలో నాణ్యత లేక పోవడమేనని వ్యాపారులు చెబుతున్నారు. పూర్తి స్థాయిలో జీడి పిక్కలు ఎండినవి వస్తే మార్కెట్లో డిమాండ్ ఉంటుందని పచ్చిగా ఉండడడంతో ప్రస్తు తం మార్కెట్లో ధర తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. దిగుబడి తక్కువ ఉన్నా పెరగని మార్కెట్ ధర వాస్తవానికి దిగుబడి తక్కువగా ఉంటే మార్కెట్లో ధర పెరగాలి. కానీ దిగుబడి తక్కువగా ఉన్నా ధర లేదని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల కిందట మార్కెట్లో కేజీ జీడి పిక్కల ధర రూ.165 ఉండగా ప్రస్తుతం రూ.145కు పడిపోయింది. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న గిరిజన రైతులు డీలా పడిపోయారు. మరోదారి లేక కొంతమంది రైతులు వ్యాపారులకు విక్రయించేస్తుండగా మరి కొంతమంది భవిష్యత్లో ధర పెరిగే అవకాశం ఉందని తమ వద్దనే నిల్వ ఉంచుకుంటున్నారు. జీడిపై వేలాదిమంది రైతుల ఆధారం.. కురుపాం నియోజకవర్గంలోని కురుపాం, కొమరా డ, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో ఎక్కువ శాతం మంది గిరిజనులు జీడి సాగు పైనే ఆధారపడుతుంటారు. మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతుందని ఆశతో నిరీక్షిస్తుంటారు అటువంటి ది ఈ ఏడాది ధర తగ్గిపోవడంతో దిగాలుగా ఉన్నారు. -
‘ఫ్లోటింగ్ జెట్టీ’పై నిర్లక్ష్యం
పూసపాటిరేగ: తీరప్రాంతమైన మండలంలోని చింతపల్లిలో మంజూరైన జెట్టీ నిర్మాణంపై సర్కారు నిర్లక్ష్యం వహిస్తోంది. అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రెండేళ్లుగా ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణ ప్రక్రియపై నోరు మెదపలేదు. గత ప్రభుత్వంలో రూ.23 కోట్లతో మత్స్యకారుల సంక్షేమానికి ఫ్లోటింగ్ జెట్టీ మంజూరు చేయించారు. అన్ని అడ్డంకులు తొలిగి ఆర్థికశాఖ అనుమతులు వచ్చిన తరువాత అప్పటి సీఎంవైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్ విధానంలో ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి సుమారు 2ఏళ్లయిన తర్వాత ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణాన్ని రూ.16 కోట్లకు కుదిస్తూ ఆదేశాలు వచ్చినట్లు సమాచారం అందడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారులు అంటే ప్రభుత్వానికి ఎందుకు అంత చులకన భావమంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో తీరప్రాంత మత్స్యకారులకు ప్రధాన అవసరమైన చింతపల్లిలో ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణంపై తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తున్నారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు మత్స్యకారుల వలస జిల్లాలో తీరప్రాంతమైన పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో ఉన్న 27 కిలోమీటర్ల తీరంలో సుమారు 21 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. వారిలో 6 వేల మంది చేపల వేటే ప్రధాన వృత్తిగా జీవిస్తున్నారు. వారిపై పరోక్షంగా 15 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. రెండు మండలాల్లో 885 బోట్లలో సుమారు 4 వేల మంది మత్స్యకారులు నిత్యం వేట సాగిస్తుంటారు. జెట్టీ లేకపోవడంతో వేట సాగకపోవడం తదితర కారణాలతో జీవనోపాధి కోసం విశాఖపట్నం, గుజరాత్, హీరావల్, సూరత్ తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి వలస బాట పడుతున్నారు. కాలుష్యంతో మత్స్యసంపద నాశనం జెట్టీ నిర్మాణంలో అలసత్వం, పరిశ్రమల వ్యర్థ రసాయనాలు తమపొట్ట కొడుతున్నాయని పలువురు మత్స్యకారులు వాపోతున్నారు. రసాయన పరిశ్రమల వ్యర్థ జలాలు సముద్రంలో కలవడంతో మత్స్య సంపదకు తీవ్ర నష్టం జరుగుతోంది. కొంత కాలం క్రితం వరకు వేటకు భారీగా మత్స్య సంపద దొరికేది. నేటి పరిస్థితి చూస్తే భిన్నంగా ఉందని మత్స్యకారులు వాపోతున్నారు. చేపలవేట సాగకపోవడంతో వలస బాట పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి చింతపల్లి తీరంలో ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణంపై అడుగులు వేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. గత ప్రభుత్వంలో జెట్టీ నిర్మాణానికి రూ.23 కోట్లు మంజూరు పట్టించుకోని కూటమి సర్కారు తాజాగా నిర్మాణానికి రూ.16 కోట్లకు కుదిస్తున్నట్లు సమాచారం ప్రకృతి వైపరీత్యాల్లో వేట సాగక ఇబ్బంది పడుతున్న గంగపుత్రులుజెట్టీ మంజూరు చేయించినా ఫలితం లేదు..జిల్లా తీరప్రాంత మత్స్యకారులకు సుమారు రూ.23 కోట్లతో ఫ్లోటింగ్ జెట్టీ మంజూరు చేయించాం. మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని జెట్టీ నిర్మిస్తే జీవనపరిస్థితులు మెరుగుపడతాయని మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఆలోచన చేసి మంజూరు చేసి శంకుస్థాపన చేశారు. అయితే తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు సుమారు రెండేళ్లు అవుతున్నా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. మత్స్యకారుల సంక్షేమాన్ని గాలికి వదిలేయడాన్ని గంగపుత్రులు గమనిస్తున్నారు. జెట్టీ నిర్మాణానికి అడుగులు ముందుకు వేసి గతంలో మంజూరు చేయించిన నిధులుతోనే నిర్మాణాలు జరిపి మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేయాలి. బడ్డుకొండ అప్పలనాయుడు, నెల్లిమర్ల మాజీ ఎంఎల్ఏ ఉపాధికోసం ఎదురు చూపులు.. చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు జెట్టీ లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. జెట్టీ లేకపోవడంతో పాటు పరిశ్రమల కాలుష్యంతో వేట సాగక చాలా ఇబ్బంది పడుతున్నారు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న మత్స్యకారుల కలను సాకారం చేయాలి. బర్రి చినఅప్పన్న, జిల్లా మత్స్యకార సహకార సొసైటీ మాజీ అధ్యక్షుడు విజయనగరం -
శాసీ్త్రయ అవగాహన పెంచేలా.. సైన్స్ ఎక్స్పోజర్ టూర్
● జిల్లా నుంచి భువనేశ్వర్ వెళ్లివచ్చిన 84 మంది విద్యార్థులుపాలకొండ రూరల్: ఏదైనా ఓ దృశ్యం చూస్తే దానిని మరిచిపోవడం దాదాపు అసాధ్యం..తరగతి గదిలో అందించే బోధనతో పోల్చుకుంటే నేరుగా ఓ అంశం పనితీరును చూపిస్తే ఆసక్తి మరింత పెరుగుతుంది. చూసిన విషయాలపై పలువురిలో చర్చ సాగుతుంది. దీనినే అసరాగా చేసుకుని విద్యాశాఖ విద్యార్థులకు బోధనతోపాటు వారిలో శాసీ్త్రయ అవగాహన కల్పించే చర్యలు చేపట్టింది. వివిధ పాఠశాలల నుంచి ఈ ఏడాది సైన్స్ ఎగ్జిబిషన్, నేషనల్ సైన్స్డే, వికసిత్ భారత్ తదితర కార్యక్రమాల్లో ప్రతిభ కనబర్చిన 84 మంది విద్యార్థులను సైన్స్ ఎక్స్పోజర్ టూర్కు ఎంపిక చేశారు. సదరు విద్యార్థులను జిల్లా సైన్స్ అధికారి గిరడ లక్ష్మణరావు సారథ్యంలో 16 మంది ఉపాధ్యాయులు మెంటర్స్గా వ్యవహరిస్తూ అంతరాష్ట్ర పర్యటనకు ఒడిశా రాజధాని భువనేశ్వర్కు తీసుకువెళ్లారు. భువనేశ్వర్లో పలు ప్రాంతాల సందర్శన పాఠశాల స్థాయిలో శాసీ్త్రయ విజ్ఙానంపై దృశ్య రూపంలో అవగాహన పెంచుకునేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో భువనేశ్వర్ వెళ్లిన విద్యార్థులు అక్కడి ప్రముఖ ఐఐటీ కేంద్రం, అడ్వాన్స్ రోబోటిక్స్ ల్యాబ్, మెషిన్ టూల్స్ ల్యాబ్, ఫ్లూయిడ్ డైనమిక్స్ ల్యాబ్తోపాటు మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్, స్కూల్ ఆఫ్ బేసిక్ సైన్స్ ల్యాబ్ నిర్వహణను నేరుగా సందర్శించి, అక్కడి విద్యార్థులు, నిర్వాహకులతో మమేకమయ్యారు. ఒడిశాకు చెందిన శాస్త్రవేత్తలు, అధ్యాపకులతో చర్చించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై విలువైన సమాచారం సేకరించారు. ప్రపంచ ప్రఖ్యాత యునెస్కో వారసత్వ ప్రదేశమైన కోణార్క్ సూర్యదేవాలయం సందర్శనలో దేవాలయ నిర్మాణంలో దాగి ఉన్న ఆర్కిటెక్చర్, విశిష్ట, ఖగోళ విజ్ఞానంపై అవగాహన పొందారు. సూర్యకిరణాల స్థానానుసారం కచ్ఛితమైన సమయ నిర్ధారణ ఏ విధంగా చేశారో వీక్షించారు. నందన్ కానన్ గల జూలాజికల్ పార్కు సందర్శనలో జీవ వైవిధ్యం, ప్రకృతితో మమేకమై జీవాల మనుగడపై విఫులంగా తెలుసుకున్నారు. లింగరాజ్ ఆలయంలో పొందుపర్చిన భారతీయ శిల్పకళ, రీజనల్ సైన్స్ సెంటర్, సైన్స్పార్కు, డైనోసార్ పార్కు, త్రీడీ షో వంటి ఆసక్తి అంశాలను వీక్షించారు. తద్వారా సృజనాత్మకత, శాసీ్త్రయత, పరిశోధనాత్మక దృక్పథంపై విద్యార్థులు మక్కువ పెంచుకునేలా ఆసక్తి కనబరిచారు. అంతరాష్ట్ర పర్యటనలో తెలుసుకున్న అంశాలపై సదరు విద్యార్థులు సహ విద్యార్థులకు తమ అనుభవాలను పంచనున్నారు. -
రాష్ట్రస్థాయి బీచ్ కబడ్డీ పోటీలకు జిల్లా జట్లు సిద్ధం
● వచ్చే నెల 7 నుంచి నెల్లూరు జిల్లాలో జరగనున్న పోటీలు విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న సీ్త్ర, పురుషుల బీచ్ కబడ్డీ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్లు సిద్ధమయ్యాయి. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఎంపిక పోటీల్లో బాలుర విభాగంలో 8 మంది, బాలికల విభాగంలో 8 మందిని ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు వచ్చే నెల 7 నుంచి 10వ తేదీ వరకు నెల్లూరు జిల్లా దువ్వూరులో జరగబోయే 13వ ఆంధ్ర అంతర్ జిల్లాల బీచ్ కబడ్డీ పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇదిలా ఉండగా జిల్లా స్థాయిలో ఎంపికై న బాలుర క్రీడాకారులకు నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామంలో, బాలికలకు విజయనగరంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి కేవీ ప్రభావతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి నడిపేన లక్ష్మణరావులు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించి జిల్లా పేరు ప్రఖ్యాతులు చాటి చెప్పాలని ప్రోత్సహించారు. రోడ్డు పక్కన వ్యక్తి మృతిసాలూరు రూరల్: మండలంలోని నార్లవలస పంచాయతీ బొర్రపలుకువలస గ్రామానికి చెందిన చిక్కుడుసరువు(50) గురువారం ఉదయం మామిడిపల్లి గ్రామసమీపంలో రోడ్డుపక్కన మృతిచెంది పడి ఉన్నాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆయన మంగళవారం ఒడిశాలోని తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చి మామిడిపల్లి సమీపంలో మృతిచెందినట్లు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని రూరల్ ఎస్సై రవీంద్రరాజు తెలిపారు. విద్యుత్ షాక్తో వ్యక్తికి గాయాలుచీపురుపల్లిరూరల్(గరివిడి): మండలంలోని పెదనడిపల్లి గ్రామంలో విద్యుత్ షాక్తో పొట్నూరు తౌడు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం జరిగిన ఈ సంఘటనలో గాయాలపాలైన తౌడును చీపురుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. గ్రామస్తుల సమాచారం మేరకు పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా ఓ ఏజెన్సీ పెదనడిపల్లిలో సోలార్ విద్యుత్ అమర్చే పనులు చేపడుతోంది. దీంతో స్థానికంగా విద్యుత్ పనులు తెలిసిన తౌడును తాత్కాలికంగా పనుల కోసం పెట్టుకున్నారు. అయితే సోలార్ పనులు జరుగుతున్న సమయంలో ఇంటిపైన ఉన్న హైటెన్షన్ వైర్లు తౌడుకు తగలడంతో గాయాలయ్యాయి. వచ్చే నెల 8 నుంచి సర్ విజ్జీ టీ–20 టోర్నీ● జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పి.సీతారామరాజు విజయనగరం: జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెల 8 నుంచి జిల్లా స్థాయిలో పురుషులకు సర్ విజ్జీ టీ–20 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి పి.సీతారామరాజు గురువారం తెలిపారు. జిల్లాలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం నుంచి ఉద్యోగం చేస్తున్న తల్లిదండ్రుల పిల్లలు, స్థానికంగా చదువుతున్న క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులుగా పేర్కొన్నారు. పూర్తిగా నాకౌట్ పద్ధతిలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు ఎటువంటి ప్రవేశ రుసుం లేదని వెల్లడించారు. జట్టు నమోదు సమయంలో క్రీడాకారులు ఆధార్కార్డులు తప్పని సరిగా పొందుపరచాలని సూచించారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈనెల 30వ తేదీలోగా తమ జట్టు పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాకలు ఫోన్70135 08010, 7382482535 నంబర్లను సంప్రదించాలని పిలుపునిచ్చారు. వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం విజయనగరం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రమైన రామనారాయణంలో సీతారాముల కల్యాణ మహోత్సవం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పునర్వసు నక్షత్రం పురస్కరించుకుని, ఆలయ అర్చకులు చాణక్య, హర్ష, కృష్ణతేజలు స్వామి కల్యాణం జరిపించారు. భక్తులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని, కల్యాణ వైభోగాన్ని కనులారా తిలకించారు. -
లిఫ్ట్లో ఇరుక్కుపోయిన వృద్ధుడు
విజయనగరం క్రైమ్: స్థానిక దాసన్నపేట వసంత విహార్ సమీప వైష్ణవి నిలయం అపార్ట్మెంట్ లిఫ్ట్లో ఓ పెద్దాయన గురువారం ఇరుక్కుపోయాడు. వైష్ణవి నిలయంలో ఉంటున్న ఓ పెద్దాయన తన అపార్టెమెంట్లోకి వెళ్లేందుకు లిప్ట్ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో లిఫ్ట్ పైభాగం ఒక్కసారిగా విరిగి కింద జారి పడిపొయంది. దీంతో లిఫ్ట్ ఎక్కబోతున్న పెద్దాయనపై లిప్ట్ రూఫ్ ఒక్కసారిగా పడడంతో కాలు బయట ఉండిపోయే విధంగా అదే లిఫ్ట్లో ఇరుక్కుపోయాడు. వెంటనే వైష్ణవి నిలయంలో ఉన్న వారు కరెంట్ నిలిపివేసి లిఫ్ట్ను ఆపారు.అందులో ఇరుక్కుపోయిన పెద్దాయనను తక్షణమే సర్వజన ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ఈ సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ శ్రీనివాస్ వివరాలు కనుక్కుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
చిన్నారికి పెద్ద కష్టం..!
ప్రభుత్వం ఆదుకోవాలి బాబు పుట్టిన నెల రోజులు వరకు బాగానే ఉన్నాడు. నెల తర్వాత కాళ్లు, చేతుల మూమెంట్ ఆగిపోయింది. బెంగళూరులోని న్యూరాలజిస్ట్కు చూపిస్తే రూ.16 కోట్లు వైద్యానికి అవుతుందని చెప్పారు. అంత పెద్ద మొత్తం సమకూర్చడం మాకు సాధ్యం కాని పని. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు స్పందించి మా బాబుకు అవసరమైన వైద్యం చేయించాలి. అనూష, వెంకటేష్, చిన్నారి తల్లిదండ్రులు విజయనగరం ఫోర్ట్: కొడుకు పుట్టాడని అ తల్లిదండ్రులు ఎంతో సంబర పడ్డారు. కొడుకు భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. బాగా చదివించి డాక్టర్నో, ఇంజినీర్నో చేయాలని భావించారు. కానీ ప్రాణంతకమైన వ్యాధి ఆ చిన్నారికి పెద్ద కష్టాన్ని తెచ్చి పెట్టింది. పుట్టిన నెలరోజులకే అ చిన్నారికి వ్యాధి బయట పడడంతో తల్లిదండ్రుల సంతోషం ఆవిరిపోయింది. చిన్నారి వైద్యానికి కోట్లాది రుపాయలు అవసరమని వైద్యులు చెప్పడంతో అంత పెద్ద మొత్తం ఏ విధంగా సమకూర్చాలో తెలియక దాతల సాయాన్ని అర్థిస్తున్నారు. విజయనగరం పట్టణంలోని పూల్బాగ్ ప్రాంతానికి చెందిన అనూష, వెంకటేష్ దంపతులకు ఈ ఏడాది ఫిబ్రవరి 4న మగ శిశువు జన్మించాడు. బాబుకు కాళీకృష్ణ అనే పేరు పెట్టారు. బాబు పుట్టిన నెల రోజులు వరకు బాగానే ఉన్నాడు. తరువాత కాళ్లూచేతుల కదలికలు ఆగిపోయాయి. దీంతో బాబును బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించగా బాబుకు ప్రాణంతకమైన ఎస్ఎంఏ టైప్–1 వ్యాధి సోకినట్టు నిర్ధారించారు. బాబుకు 6 నెలల లోపు రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ చేయాలని వైద్యులు తెలిపారు. దీంతో చిన్నారి వైద్యానికి దాతలు సహాయం చేయాలని తల్లిదండ్రులు అర్థిస్తున్నారు. రెండున్నర నెలల చిన్నారికి సోకిన ఎస్ఎంఏటైఫ్1 వ్యాధి నెలరోజుల నుంచి కదలిక ఆగిపోయిన కాళ్లూచేతులు వైద్యానికి అవనున్న ఖర్చు రూ.16 కోట్లు ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్న చిన్నారి తల్లిదండ్రులు -
చేపల మృతిపై విచారణ
సంతకవిటి: మండలంలోని బొద్దూరు గ్రామంలో అప్పమ్మ చెరువులో ఇటీవల చేపలు మృతి చెందిన విషయమై కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, జిల్లా డిప్యూటి డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ విజయకృష్ణ ఆదేశాలతో రాజాం ఫిషరీస్ ఇన్న్పెక్టర్ సీహెచ్.ప్రసాదరావు బుధవారం విచారణ చేపట్టారు. అప్పమ్మ చెరువుకు చేరుకుని అక్కడి పరిస్థితులపై మత్స్యకారులతో మాట్లాడారు. చెరువునుంచి నీరు తీయకుండా అడ్డుపడ్డారనే రైతులతో మాట్లాడారు. మత్స్యకారులు పలుమార్లు చెరువునుంచి నీరు తీయవద్దని తెలిపిన రాజాం ఇరిగేషన్ ఆఫీస్ సబార్డినేట్ ముఖలింగంను చెరువు వద్దకు పిలిపించుకుని నివేదిక తీసుకున్నట్లు తెలిపారు. చెరువులో ఎంత విలువ చేసే చేపలు విడిచి పెట్టారు తదితర అంశాలను మత్స్యకారులను అడిగి తెలుసుకున్నారు. పూర్తి నివేదికను జిల్లా మత్స్యశాఖ అధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు. -
ఎవరి టెంటు వారే వేసుకోవాలి..!
విజయనగరం ఫోర్ట్: అగ్నిగోళాన్ని తలపించేలా ఎండలు ఉన్నాయి. దీంతో ఇళ్లలోసైతం ఉండలేని పరిస్థితి. పొట్టకూటి కోసం ఎండతీవ్రతను సైతం భరిస్తూ ఉపాధి హామీ వేతనదారులు పనిచేస్తున్నారు. అయితే ఉపాధి హామీ వేతనదారులకు రక్షణ కల్పించడంలో టీడీపీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎండవేడమి నుంచి ఉపశమనం పొందేందుకు అవసరమైన టెంట్లు సరఫరా చేయకుండా టీడీపీ సర్కార్ అలసత్వం వహించడం పట్ల వేతనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భానుడి ప్రతాపం ఎక్కువగా ఉండడం వల్ల ఉపాధి హామీ వేతనదారులు అల్లాడుతున్నారు. డ్వామా అధికారుల ఉచిత సలహా ఉపాధి హామీ పథకంలో పనిచేసే వేతనదారులకు ప్రభుత్వం నీడనిచ్చే టెంట్లు సరఫరా చేయలేదు. ఎవరి టెంట్లు వారే వేసుకోవాలని డ్వామా అధికారులు ఉచిత సలహా ఇస్తున్నారు. దీంతో గత్యంతరం లేక వేతనదారులు తాటి, కొబ్బరి కమ్మలతో టెంట్లు వేసుకుంటున్నారు. అయితే అవి వారికి పెద్దగా రక్షణ ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెంటు నీడలో కాసేపు విశ్రాంతి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే వేతనదారులు ఎటువంటి నీడలేని చెరువులు, కాలువులు వంటి ప్రదేశాల్లో పనిచేస్తారు. ఎండలో పనిచేయడం వల్ల త్వరగా అలసట చెందుతారు. అటువంటి వారికి కాసేపు విశ్రాంతి తీసుకోవడం కోసం టెంట్లు అవసరం. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత వేతనదారులు పనులు చేయడానికి మళ్లీ వెళ్లుంటారు. అంతేకాకుండా టెంట్ల కింద మంచినీరు కూడా పెడతారు. అంతటి అత్యవసరమైన టెంట్లు సరఫరా చేయకుండా టీడీపీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వడదెబ్బతో ఉపాధి వేతనదారు మృతి గంట్యాడ మండలం కొత్త వెలగాడ గ్రామంలో అదేగ్రామానికి చెందిన చౌడువాడ కన్నయ్యతాత అనే ఉపాధి వేతనదారు మంగళవారం చెరువులో పనిచేస్తూ ఎండ వేడమికి అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తీసుకుని వెళ్లేందుకు సన్నద్ధయ్యేలోగా మృతిచెందాడు. అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్న ప్రస్తుతం తరుణంలో ఉపాధిహామీ వేతనదారులకు అన్ని విధాలా రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. విశ్రాంతి లేకుండా పనులు గతంలో ఉపాధి హామీ వేతనదారులకు వారంలో ఒక రోజు సెలవు ఉండేది. సోమవారం నుంచి శనివారం వరకు పనులు పెడితే ఆదివారం సెలవు ఉండేది. అయితే టీడీపీ సర్కార్ వేతనదారులకు ఒక్క రోజు కూడ విశ్రాంతి లేకుండా ఆదివారం కూడా పనులు పెడుతోంది. ఇది కూడా వేతనదారులకు కాస్త ఇబ్బంది కరమైన పరిస్థితే. జిల్లాలో సగటున రోజుకు 1.50 లక్షల మంది వరకు వేతనదారులు పనికి వెళ్తున్నారు. ఓఆర్ఎస్ వినియోగంపై అవగాహన కరువు వడదెబ్బకు గురికాకుండా రక్షణ ఇచ్చే ఓఆర్ఎస్ ద్రావణం ఏవిధంగా వినియోగించుకోవాలి అన్నదానిపై వేతనదారులకు అవగాహన కల్పించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఓఆర్ఎస్ ప్యాకెట్లు పెడుతున్నారు. కానీ ఆ ద్రావణం ఏవిధంగా నీళ్లలో కలిపి తాగాలి అనే దానిపై అవగాహన కల్పించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి కొన్ని చోట్ల ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందించడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేతనదారులకు టెంట్లు సరఫరా చేయని టీడీపీ సర్కార్ తాటి, కొబ్బరి కమ్మలతో వేసుకుంటున్న వేతనదారులు వేతనదారులకు రక్షణ ఇవ్వడం లేదనే ఆరోపణలు గంట్యాడ మండలంలో పనిచేస్తూ ఓ వేతనదారు మృతివేతనదారులే టెంట్లు వేసుకోవాలిప్రభుత్వం నుంచి టెంట్లు సరఫరా లేదు. వేతనదారులే వారికి అవసరమైన టెంట్లు ఏర్పాటు చేసుకోవాలి. వైద్యసిబ్బంది ఓఆర్ఎస్ ప్యాకెట్లు వేతనదారులకు అందిస్తున్నారు. – ఎస్.శారదదేవి, పీడీ, డ్వామా -
మలుపు తిరుగుతున్న అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు
విజయనగరం క్రైమ్: విజయనగరం వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి పోర్ట్ సిటీ స్కూల్ సమీపంలో రెండు రోజుల క్రితం గుర్తించిన మృతదేహం ఎవరిది అన్నకోణంలో పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని జొన్నగుడ్డికి చెందిన పావాడ హరనాథ్ (24)గా గుర్తించిన పోలీసులు హరనాథ్ రౌడీషీటర్ అని విజయనగరం వన్ టౌన్, టూటౌన్ పీఎస్లలో పలు హత్య కేసులు ఉన్నాయని చెబుతున్నారు. కాగా బావిలో మృతదేహం ఉందని తెలుసుకున్న పోలీసులు బయటకు తీసి పోస్ట్ మార్టానికి తరలించగా హత్యగా తేలింది. ఈ మేరకు హత్య కేసు నమోదు చేసి విజయనగరం వన్ టౌన్ సీఐ చౌదరి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా తొలి రోజు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.వారు ఇచ్చిన సమాచారంతో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు. ఈ కేసుపై సీఐఆర్వీకే చౌదరి మాట్లాడుతూ పావాడ సంతోషి ఇచ్చిన ఫిర్యాదుతో తొలుత అదృశ్యం కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా బావిలో మృతదేహాన్ని గుర్తించామని పొస్ట్ మార్గం నివేదికలో హత్యగా తేలిందన్నారు. ఎస్పీ ఆదేశాలతో కేసు దర్యాప్తులో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని సీఐ తెలిపారు. ఈ కేసును డీఎస్పీ దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఎనిమిది మంది -
అశ్రునయనాలతో యువకుడి అంత్యక్రియలు
బొబ్బిలి రూరల్: అమెరికాలోని మెరమెక్స్టేట్పార్కు వద్ద ఈనెల 11న ప్రమాదవశాత్తు నదిలో పడి మృతిచెందిన పిరిడి గ్రామానికి చెందిన సింగిరెడ్డి సాయిశ్రీహరికృష్ణ(26)మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరుకుంది. ప్రమాదం జరిగిన 12 రోజుల తరువాత హరికృష్ణ మృతదేహం తల్లిదండ్రుల వద్దకు చేరగా తల్లిదండ్రులు రమ, శ్రీనివాసరావులు భోరుమన్నారు. చేతికి అందికొచ్చిన కొడుకు అకాల మరణంతో గుండెలవిసేలా విలపించారు. గ్రామస్తులు,పెద్దలు, బంధువులు హరికృష్ణ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.తల్లిదండ్రులను ఓదార్చారు.అనంతరం అశ్రునయనాలతో హరికృష్ణ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
ఎట్టకేలకు పంచాయతీ కార్యదర్శిపై వేటు...
వేపాడ: అధికార దుధుర్వినియోగానికి పాల్ప డుతూ, రాజకీయాలకు వత్తాసు పలుకుతున్న పంచాయతీ కార్యదర్శిపై ఎట్టకేలకు వేటు పడింది. కార్యదర్శిపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించిన కలెక్టర్ రాంసుందర్రెడ్డి ఆరోపణలు వాస్తవాలు అని తేలడంతో కార్యదర్శి సస్పెన్షన్కు ఆదేశాలు జారీచేశారు. వేపాడ మండలంలోని బానాది పంచాయతీ కార్యదర్శి ఏఎస్ఎస్ఎన్ మూర్తి సస్పెన్షన్ ఉత్తర్వులు మంగళవారమే స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి అందినా ఎంపీడీవో మాత్రం విషయం బయట పెట్టకపోవటం విశేషం. వేపాడ మండలంలో బానాది పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏఎస్ఎస్ఎన్ మూర్తి తీరు వివాదాస్పదమైంది. సకాలంలో గ్రామసభలు జరపకపోవడంవ, విధుల పట్ల నిర్లక్ష్యం, బాధ్యతగా వ్యవహరించకపోడడం, పారిశుధ్యపనులు నిర్వహించకపోవడం, రికార్డులు తారుమారు చేయడం, పంచాయతీ రికార్డులు తన ఇంటికి తీసుకుపోవడం, మహిళా సర్పంచ్ పట్ల దురుసుగా వ్యవహరించడం వంటి పలు అంశాలపై సర్పంచ్ కర్రి యశోద జిల్లా అధికారులు, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలతో మార్చి 20న డీఎల్పీఓ విచారణ నిర్వహించి, నివేదికను జిల్లా అధికారులకు అందజేయడంతో స్పందించిన కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి పంచాయతీ కార్యదర్శిపై సస్పెన్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ఎంపీడీఓ సీహెచ్ సూర్యనారాయణ తెలిపారు. -
మామిడి, టేకు తోటలు దగ్ధం
వేపాడ: మండలంలోని కొండగంగుబూడి పంచాయతీ ఎస్.కె.ఎస్.ఆర్.పురానికి చెందిన జగన్నాథసాగర్ పక్కన ఉన్న మామిడి, టేకు తోటలు దగ్ధమయ్యాయి. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో తోట కాలిపోతుండడాన్ని గుర్తించిన పరవాడ జగదీష్ తక్షణమే వాటర్ ట్యాంక్తో నీరు తీసుకెళ్లి లగుడు అప్పలకొండ సహాయంతో మంటలను అదుపుచేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో పెద్దనష్టం జరగకుండా కాపాడుకోగలిగామని స్థానికులు చెబుతున్నారు. కంచిరెడ్డి పాలెంలో జీడితోట బొండపల్లి: మండంలోని కంచిరెడ్డి పాలెం గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో 10 ఎకరాల్లో జీడితోట దగ్ధమైనట్లు గజపతినగరం అగ్నిమాపక కేంద్రం అధికారి ఎంఎస్వీ.రవిప్రసాద్ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బర్ల లక్ష్మమ్మ జీడితోటలో మంటలు చేలరేగి క్రమంగా పక్కనే ఉన్న తోటలకు వ్యాపించి 10 ఎకరాల్లో చెట్లు కాలిపోయినట్లు తెలిపారు. సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్ని మాపక వాహనంతో వెళ్లి మంటలు చుట్టుపక్కల ఉన్న తోటలకు అంటుకోకుండా అర్పివేసినట్లు చెప్పారు. మహిళా రోగి పట్ల అసభ్యకర ప్రవర్తనవిజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఓ మహిళా రోగి పట్ల శానిటేషన్ వర్కర్ (మేల్) అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలిసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల20 వతేదీన ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్ ఒకరు రోగికి సహాయం చేస్తానని చెప్పి ఆమె పట్ల అసభ్యకరంగా వ్యవహరించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్కు సిబ్బంది తెలిపారు. ఇదేవిషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ వద్ద సాక్షి ప్రస్తావించగా ఓ మహిళా రోగి పట్ల మేల్ శానిటేషన్ వర్కర్ అసభ్యకరంగా ప్రవర్తించినట్టు తెలిసిందని, వెంటనే శానిటేషన్ సూపర్ వైజర్ను పిలిపించి వర్కర్ను అక్కడి నుంచి మార్చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. అనుచిత పోస్టులు పెడితే కఠిన చర్యలువిజయనగరం క్రైమ్ : సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చట్టపరంగా చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ బుధవారం హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎలాంటి అనుచితమైన పోస్టులు పెట్టినా, విద్వేషాలు రెచ్చగొట్టే వారిపైన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ మరో మారు హెచ్చరించారు. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగాం, యూట్యూబ్, టెలిగ్రాం, వాట్సాప్, లింకిడిన్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో ఎవరికి తోచిన విధంగా వారు పోస్టులు పెట్టి మతాలు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై జిల్లా పోలీసు శాఖ ప్రత్యేకం నిఘా పెట్టిందన్నారు. ఒక బృందాన్ని ప్రత్యేకంగా నియమించి, సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వ్యక్తుల వివరాలను రాబట్టి, వారికి నోటీసులు జారీ చేస్తామన్నారు. కుటుంబ సభ్యుల సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు సీజ్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నామని ఇతరులతో గుర్తింపు పొందేందుకు విద్వేషాలు రెచ్చగొడుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపైనా, వారిని ప్రోత్సహించే వారిపైనా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రజలను హెచ్చరించారు. -
బెర్రీ కంపెనీలో కార్మికుడి మృతి
బొబ్బిలి: పట్టణ పరిధిలోని బెర్రీ ఫెర్రో ఎల్లాయీస్ కంపెనీలో డైలీ లేబర్గా పనిచేస్తున్న కొరికాని కృష్ణ(40)కంపెనీలో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో ఆస్పత్రిలో మంగళవారం రాత్రి చేరి చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. సంతకవిటి మండలం కొండగూడెం గ్రామానికి చెందిన కృష్ణ పండగ నిమిత్తం స్వగ్రామం వెళ్లాడు. తిరిగి వచ్చాక మంగళవారం రాత్రి విధుల్లో చేరాడు. విధులు నిర్వర్తిస్తుండగా ఆకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లగా కార్మికులు, తండ్రి పెంటయ్య,బంధువు స్వామినాయుడులు స్థానిక అభయ ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందిన కృష్ణకు భార్య, పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కుమార్తెలున్నారు. రూ.50లక్షల పరిహారమివ్వాలి గ్రోత్ సెంటర్లోని బెర్రీ పరిశ్రమలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, గతంలో ఈ కంపెనీలో పనిచేసిన వారు ఎంతోమంది అకస్మాత్తుగా మృతి చెందిన సంఘటనలున్నాయని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పొట్నూరు శంకర రావు, నాయకులు సింగిరెడ్డి గోపాలం, బల శ్రీనులు అన్నారు. బుధవారం స్థానిక అభయ ఆస్పత్రిలో కృష్ణ మృతదేహం వద్ద వారు మాట్లాడుతూ ఇద్దరు ఆడపిల్లలున్న మృతుడి కుటుంబానికి రూ.50లక్షల పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. కంపెనీలో కార్మికులకు తాగేందుకు నీరు, రక్షణ పరికరాలు, రెస్ట్ హాలు లేవన్నారు. కంపెనీలన్నీ ఒకటై కార్మికుల కడుపు కొడుతున్నాయని విమర్శించారు. స్థానికులకు ఉద్యోగాలివ్వకుండా ఇతర ప్రాంతాల నుంచి కార్మికులను తీసుకువస్తున్నారన్నారు. వారితో రోజుకు 12 గంటలు పనిచేయించుకుంటున్నారని ఆరోపించారు. లేబర్ అధికారులు, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేయడం లేదని, దీంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. మృతి చెందిన కార్మికుడికి రూ.50లక్షల పరిహారమివ్వాల్సిందేనని పట్టుబట్టారు. చికిత్స పొందుతూ యువకుడు.. భామిని: మండలంలోని సతివాడకు చెందిన యువకుడు పొట్నూరు మనోజ్ కుమార్(24) బుధవారం విశాఖ కేజీహెచ్లో వైద్య సేవలు పొందుతూ మృతి చెందాడు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మనోజ్ కుమార్ ఒంటిపై పెట్రోలు పోసుకుని కాల్చుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.కాలిన మంటలతో వీధిలో పరుగెడుతున్న మనోజ్కుమార్ను స్థానికులు వీధిలోని పెంటగుమ్మిలో తోసి ప్రమాదం నుంచి రక్షించారు. వెంటనే కొత్తూరు ప్రభుత్వాస్పత్రికి అనంతం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలించగా వైద్యసేవలు పొందుతూ మృత్యువాత పడినట్లు పోలీసులు తెలిపారు. మనోజ్కుమార్కు మతిస్థిమితం లేక పోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని మృతుడి తల్లిదండ్రులు తెలిపారు. బత్తిలి ఎస్సై రవీంద్ర ఆధ్వర్యంలో హెచ్సీ సంగమేస్ కేసు నమోదు చేసి కేజీహెచ్కు వెళ్లి పోస్టుమార్టం నిర్వహించారు. -
మలేరియాపై అప్రమత్తంగా ఉండాలి
● జిల్లా మలేరియా అధికారి డి.సూర్యనారాయణకొమరాడ: ఏజెన్సీ గ్రామల్లో ప్రజలు మలేరియాపై అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా మలేరియా అధికారి డి.సూర్యనారాయణ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన కొమరాడ మండలంలోని చినఖేర్జిల పంచాయతీ బంజుకుప్ప గ్రామంలో ‘మా ఊరికి మలేరియా’ అనే కార్యక్రమానికి హాజర య్యారు. ఆనంతరం అక్కడ ఉన్న మలేరియా జర్వపీడితులతో మాట్లాడి చిక్సిత అందించి వారి కుటుంబ సభ్యులకు రక్తపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామల్లో మురుగునీరు నిల్వలేకుండా చేసుకోవాలని సూచించారు. ఖాళీ కొబ్బరిబొండాలు ఎక్కడపడితే అక్కడ ఉండకూడదన్నారు. గ్రామంలో పారిశుధ్య పనులు నిర్వహించాలని కాచి చల్ల ర్చిన నీటి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్, ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఫిడే ఆర్బిటర్ టైటిల్ సాధించిన ప్రసాద్
చీపురుపల్లి: ప్రపంచంలో ప్రతిష్టత్మకంగా బావించే ఫిడే ఆర్బిటర్ టైటిల్ను చీపురుపల్లి పట్టణంలోని శ్రీనివాస జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఏడీఎన్ఎస్వీ. ప్రసాద్ సాధించారు. ఇంతవరకు సీనియర్ నేషనల్ ఆర్బిటర్గా ఉన్న ప్రసాద్ను అంతర్జాతీయ స్థాయిలో చదరంగం టోర్నమెంట్లు నిర్వహించే ఫిడే సంస్థ ఫిడే ఆర్బిటర్గా గుర్తించిన మేరకు ఫిడే అధ్యక్షుడు ధురవీకరణ పత్రం పంపించారు. ఇటీవల గుంటూరులో జరిగిన ఫిడే కౌన్సిల్ సెమినార్ లో దేశవ్యాప్తంగా 35 మంది పోటీ పడగా అందులో 12 మందిని ఫిడే ఆర్బిటర్లుగా ఎంపిక చేశారు. అందులో ప్రసాద్ ఉన్నారు. ప్రసాద్ ప్రస్తుతం విజయనగరం జిల్లా చదరంగం అసోసియేషన్ కార్యదర్శిగా, రాష్ట్ర ఆర్బిటర్ కమిటీ కన్వీనర్గా, ఫెయిర్ ప్లే కమిటీ మెంబర్గా, మన్యం జిల్లా కన్వీనర్గా వ్యవహరిస్తునారు. ఈ టైటిల్ను ఆయన సాధించినందుకు పలువురు చదరంగం క్రీడాకారులు రాష్ట్రవ్యాప్తంగా చదరంగం అసోసియేషన్ అధికారులు అభినందనలు తెలియజేశారు. -
గడువులోగా పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలి
విజయనగరం అర్బన్: జిల్లాలో జనవరి నెల నుంచి ప్రణాళికాబద్ధంగా కొనసాగుతున్న రీ సర్వే, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వే సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. రూపొందించిన ప్రణాళిక ప్రకారం మ్యుటేషన్లు, సబ్డివిజన్లు, రైతు ముంగిటకే 1 బీ పంపిణీ, పాస్ పుస్తకాల ముద్రణ వంటి ప్రక్రియలను క్రమబద్ధంగా పూర్తి చేయాలని సూచించారు. మండల, గ్రామాల వారీగా రీ సర్వే పనుల పురోగతిని సమీక్షించారు. సర్వే పూర్తయ్యాక సర్టిఫికెట్ అందడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సర్వే అనంతరం తప్పనిసరిగా సర్టిఫికెట్ అందించాలని స్పష్టం చేశా రు. వంటగ్యాస్ సరఫరాలో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారనే అరోపణలపై గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లైస్ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ మాట్లాడుతూ ఇప్పటికే పంపణీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలలోని తప్పులను సరిదిద్ది, మ్యుటేషన్లు, సబ్డివిజన్లు, ఫారం–8, జాయింట్ ఎల్బీఎం సమస్యలను పరిష్కరించి జూన్ నాటికి తప్పుల్లేని పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. ఐదు విడతలుగా చేపట్టిన రీ సర్వే ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, 2027 మార్చి నాటికి మొత్తం సర్వే పూర్తి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్ఓ సీహెచ్ సత్తిబాబు, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి -
ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో సాలూరువాసికి సన్మానం
సాలూరు: ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో సాలూరు వాసి డా.రేగాన షణ్ముఖరావును బుధవారం సన్మానించారు. అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో పీఆర్ఓగా పనిచేస్తున్న రేగాన షణ్ముఖరావు జర్నలిజం విభాగంలో పూర్వ పరిశోధక విద్యార్థిగా, సమాచార పౌర సంబంధాల శాఖ, షెడ్యూల్ కులాల స్థితిగతులపై అధ్యయనాలు, పరిశోధనల్లో ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రముఖులు ఆయనను సన్మానించి శతాబ్ది ఉత్సవాల జ్ఞాపికను అందజేశారు. ఈ మేరకు ఆయనకు సాలూరుకు చెందిన పలువురు అభినందనలు తెలిపారు.మొక్కజొన్నల లారీ బోల్తాగజపతినగరం రూరల్: మండలంలోని మరుపల్లి గ్రామ శివారులో బుధవారం మొక్కజొన్నల లోడ్ తీసుకువెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సమయంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. పెదకాద, ఎం.గుమడాం, మరుపల్లి రైతుల వద్ద కొనుగోలు చేసిన మొక్కజొన్నలను లోడ్ చేసి విజయనగరం తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 3803 కిలోల పీడీఎస్ బియ్యం పట్టివేతసీతంపేట: సీతంపేటలోని రెండు వేర్వేరు కిరాణా దుకాణాల్లో అక్రమంగా విక్రయిస్తున్న 3803 కిలోల పీడీఎస్ బియ్యాన్ని పార్వతీపురం డీఎస్వో ఆశోక్ ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసి స్థానిక ఎంఎల్ఎస్ పాయింట్లో ఉంచినట్లు ఆర్ఎస్డీటీ శ్రీ విద్య తెలిపారు. -
బడి పిలుస్తోంది పోస్టర్ ఆవిష్కరణ
పార్వతీపురం: విద్యాశాఖ ఆధ్వర్యంలో బడి పిలుస్తోంది పోస్టర్ను కలెక్టరేట్లో కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపడానికి ప్రత్యేక విద్యాప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఆత్మవిశ్వా సం పెంపునకు మన్యం డాన్స్, సృజనాత్మకత కు, బొమ్మరిల్లు కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. గణితం, ఇంగ్లీష్, తెలుగు ప్రాథమి క నైపుణ్యాలపై దృష్టి సారించాలని, వెనుకబడి న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూ చించారు. బడి బయట ఉన్న పిల్లలను తిరిగి చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.సమావేశంలో జేసీ యశ్వంత్కుమార్రెడ్డి, సబ్కలెక్టర్ ఆర్.వైశాలి, డీఈఓ పి.బ్రహ్మజీరావు పాల్గొన్నారు. పార్వతీపురం: రెవెన్యూ సమస్యల పరిష్కారం విషయంలో అసంతృప్తిదారులతో ఈనెల 29న ముఖాముఖి సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ముఖాముఖిలో పార్వతీ పురం, పాలకొండ సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉంటా రన్నారు. ముఖాముఖికి విచ్చేసే అర్జీదారులు గ్రీవెన్స్ రశీదు, ఎండార్స్మెంట్ కాపీని తీసుకు ని రావాలని సూచించారు. నేడు భగీరథ మహర్షి జయంతి భగీరథ మహర్షి జయంతి వేడుకలను గురువా రం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలమేరకు జిల్లా యంత్రాంగం ఈ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుందన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, కార్యక్ర మం విజయవంతం చేయాలని కోరారు. పార్వతీపురం: రానున్న ఖరీఫ్కు రైతులకు ఎరువుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఎరువుల కంపెనీ ప్రతినిధు లు, డీలర్లు, మండల వ్యవసాయాధికారులతో బుధవారం మాట్లాడారు. రైతులపై అదనపు భారం వేసినా, నిబంధనలు ఉల్లంఘించినా డీలర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎరువుల సరఫరా, స్టాక్ వివరాలు పారదర్శ కంగా నిర్వహించాలని, బలవంతపు అమ్మకా లు, అదనపు వసూళ్లు చేయరాదన్నారు. ఉల్లంఘనలపై లైసెన్స్లను రద్దు చేయడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి నానో యూరియా, సేంద్రియ ఎరువులను ప్రోత్సహించాలన్నారు. ఎరువుల పంపిణీపై పర్యవేక్ష ణ కొనసాగుతుందని, సమస్యల పరష్కారం కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తామన్నారు. సమీక్షలో జిల్లా వ్యవసాయాధికారి ఆర్.అన్నపూర్ణ పాల్గొన్నారు. -
అప్పుల కుప్పలు.. అభివృద్ధికి తిప్పలు
సాలూరు: చంద్రబాబు ప్రభుత్వం తీరు ‘అప్పుల కుప్పలు.. అభివృద్ధికి తిప్పలు’ అన్న చందంగా మారిందని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. సాలూరు పట్టణంలో వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఇటీవల పదవీ విరమణ పొందిన సర్పంచ్లను బుధవారం సన్మానించారు. కార్యక్రమానికి అరకు ఎంపీ గుమ్మ తనూజారాణి, వైఎస్సార్సీపీ జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ బూడి ముత్యాలునాయడులతో పాటు మజ్జి శ్రీనువాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో అప్పులు చేసి అవినీతికి పాల్పడడమే తప్ప అభివృద్ధి లేదని విమర్శించారు. సాలూరు నియోజకవర్గంలో రాజన్నదొర హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. గిరిజనుల ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ, గిరిజనులను మంత్రి సంధ్యారాణి మోసం చేస్తున్నారని ఆరోపించారు. దోచుకుందామన్న రీతిలో మంత్రి వ్యవహార శైలి ఉందని విమర్శించారు. ప్రజల కష్టాలు గురించి మాట్లాడితే, తిరిగి నాకు జ్వరం వచ్చింది.. నన్నెవరు చూస్తారని బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం మంత్రికి తగదన్నారు. గత ప్రభుత్వంలో నిర్మించిన రోడ్లు, సచివాలయాల భవనాలు, ఆస్పత్రులు వంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయడం తప్ప మంత్రి ఈ రెండేళ్ల పాలనలో కొత్తగా చేసిన అభివృద్ధి పనులు శూన్యమన్నారు. ఎంపీ గుమ్మ తనూజారాణి అరకు పార్లమెంట్ పరిధిలోని గిరిజనుల సమస్యలపై పార్లమెంట్లో ప్రస్తావిస్తూ, గిరిజనులకు మేలుచేసేందుకు కృషిచేస్తున్నారన్నారు. గిరిజన మంత్రి ఇక్కడి సమస్యలపై ఏనాడైనా అసెంబ్లీలో ప్రస్తావించారా అని ప్రశ్నించారు. రెండేళ్ల పాలనలో మంత్రి, ఆమె కుటుంబంపై వచ్చి న ఆరోపణలు అందరికీ తెలిసినవేనన్నారు. ప్ర జ్యావతిరేక పాలన సాగిస్తున్న మంత్రిపై త్వరలో నే కూటమి నేతలే తిరుగుబాటు చేస్తారన్నారు. ●మొక్కజొన్న రైతులను చంద్రబాబు ప్రభు త్వం పట్టించుకోవడం లేదని జెడ్పీ చైర్మన్ మండిపడ్డారు. యూరియా కోసం రైతులు పడిన అగచాట్లు ఇంకా ఎవ్వరూ మరిచిపోలేదన్నారు. ప్రజా సమస్యలను లెవనెత్తుతామనే భయంతో టీడీపీ ప్రజాప్రతినిధులు జెడ్పీ సమావేశాలకు రావడం లేదని విమర్శించారు. అధికారం కోల్పోయిన తరువాత పార్టీలోని పెద్ద నాయకులు పార్టీని వీడినా జగనన్న, రాజన్నదొర వెంట స్థానిక ప్రజాప్రతినిధులు ఉండడం గర్వంగా ఉందన్నారు. పదవీ విరమణ చేసినా ప్రజాసేవలో తరించాలని, ప్రజల సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ●వైఎస్సార్సీపీ జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ బూడి ముత్యాలునాయడు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, 2029 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయదుందుభి మోగించి జగన్మోహన్రెడ్డిను ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా పనిచేద్దామన్నారు. కార్యక్రమంలో తాజామాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయ కక్షతో ఉద్యోగుల తొలగింపునకు పూనుకోవడం మంత్రి సంధ్యారాణికి తగదని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర అన్నారు. పీటీజీకి చెందిన కరాసవలస కేజీబీవీ ప్రత్యేకాధికారి, బోధనేతర సిబ్బందితో పాటు నియోజకవర్గంలో పలువురు ఉద్యోగులను కక్ష పూరితంగా తొలగించారని పేర్కొన్నారు. ఎన్నేళ్లు పాలించినా తనెప్పుడూ ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పూనుకోలేదన్నారు. జీఓ 3 పునరుద్ధరణ, ఆశ్రమపాఠశాలల్లో ఏఎన్ఎంల నియామకం, పట్టణంలో సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం తదితర హామీలను ఇచ్చిన మంత్రి నేటికీ అమలుచేయకపోవడం విచారకరమన్నారు. గిరిజనులను మంత్రి సంధ్యారాణి మోసం చేస్తున్నారని విమర్శించారు. యువతకు నిరుద్యోగ భృతి, మహిళలకు అడబిడ్డ నిధి అందని ద్రాక్షగా మారిందన్నారు. రెండేళ్లలోనే లక్షల కోట్ల రూపాయల అప్పులతో రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారుస్తున్న చంద్రబాబు ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనను ప్రజలకు వివరించాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో నియోజకవర్గంలోని ప్రతిగ్రామాన్ని సందర్శిస్తానని చెప్పారు. వైఎస్సార్సీపీతో ఉంటూ.. జగనన్న, రాజన్న దొరల నాయకత్వంలో నడుస్తూ.. క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా నిలుస్తూ.. ప్రజలు ఆశీస్సులు చూరగొంటున్న సర్పంచ్ల సేవలు అభినందనీయమని ఎంపీ గుమ్మ తనూజరాణి అన్నారు. సర్పంచ్ కుటుంబం నుంచి ఎంపీగా ఎదిగినట్టు పేర్కొన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో అందరూ మళ్లీ విజేతలుగా నిలిచి విజయోత్సవ సభ నిర్వహించుకుందామన్నారు. -
50 ఏళ్ల వారిని.. ఏడిపింఛెన్..!
వీరఘట్టం: తమ్ముళ్లూ... ఊరూరా, ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయండి.. ప్రజలందరికీ తెలియజేయండి.. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 50 ఏళ్ల వయస్సునిండిన బడుగుబలహీన వర్గాలవారందరికీ రూ.4వేలు పింఛన్ అందిస్తాం. – ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23 నెలలు అవుతున్నా 50 ఏళ్ల వయస్సు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లో అర్హులైన ఒక్కరికీ కొత్త పింఛన్ మంజూరు కాలేదు. కనీసం దరఖాస్తులు స్వీకరించడం లేదు. చంద్రబాబు హామీ ఇచ్చారని, పింఛన్లు ఎప్పుడు ఇస్తారంటూ లబ్ధిదారులు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం శూన్యం. వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులకూ పింఛన్లు మంజూరుకాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఎలా బతికేదంటూ గగ్గోలు పెడుతున్నా ఓట్లు వేయించుకున్న పాలకులు కనీసం స్పందించడం లేదు. వారి ఆవేదన వినడం లేదు. హామీలతో నమ్మించి చంద్రబాబు నిలువునా ముంచేశారంటూ కన్నీరుపెడుతున్నారు. మరోవైపు కొందరి పింఛన్లు రద్దు చేస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఇదీ పరిస్థితి... పార్వతీపురం మన్యం జిల్లాలో 50 ఏళ్ల వయస్సు దాటిన వారు 1,32,512 మంది ఉండగా 60 ఏళ్లు దాటిన వారు 87 వేల మందికి పైబడి ఉన్నారు. వీరిలో సుమారు 40 వేల మంది కొత్త పింఛన్లు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నా ఫలితం లేకపోతోంది. చంద్రబాబునాయుడు ఉత్తుత్తి హామీలిచ్చి మోసం చేశారని వాపోతున్నారు. గతంలో ప్రతీ ఆరు నెలలకు... గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే లబ్ధిదారులను ఎంపిక చేసి కొత్తగా అర్హులైన వారికి పింఛన్లు అందజేసింది. మొదటి మూడేళ్ల పాటు ప్రతి మూడు నెలలకోసారి చొప్పున అర్హులను ఎంపిక చేసి నూతన పింఛన్లు మంజూరు చేసేది. ఆ తర్వాత 2022–23లో ప్రతీ ఆరు నెలలకు అర్హులైన వారు నష్టపోకుండా వలంటీర్లతో ఎంపికచేసి పింఛన్లు అందజేసేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటూ లబ్ధిదారులు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో సాధ్యమైనది ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నిస్తున్నారు. భర్తలు చనిపోయి వితంతువులుగా ఉన్న చాలా మంది పింఛ న్ల కోసం ఎదురుచూస్తున్నారు. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆడ బిడ్డలను ఆదుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోంది, అర్హులందరికీ ప్రభుత్వం నూతన పింఛన్లు అందజేయాలి. ఎన్నికల హామీ మేరకు 50 ఏళ్ల నిండిన వారికి పింఛన్లు మంజూరు చేయాలి. ఆరునెలలకోసారైనా కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – జంపు కన్నతల్లి, జెట్పీటీసీ సభ్యురాలు, వీరఘట్టం -
అహమే... అడ్డొచ్చిందా?
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లా కేంద్రంలో 6 వేల మంది విద్యార్థులతో ఈ నెల 22న మెగా కోలాటం నిర్వహించ తలపెట్టి న విషయం విదితమే. ఊరంతా ప్రచారం చేసి, అంతా సిద్ధమై.. చివరి గంటల్లో కార్యక్రమం రద్దు కావ డం చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగ వర్గాల్లో చర్చగా మిగిలింది. ఎండల వల్ల కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు ప్రకటించినా.. అది వాస్తవం కాదని, దీని వెనుక ఒక ప్రజా ప్రతినిధి ‘అహం’అడ్డు పడిందన్న వాదన వినిపిస్తోంది. తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం.. తన ప్రమేయం లేకుండా అధికారులు కార్యక్రమాన్ని చేసుకుని వెళ్లిపోతుండడం నచ్చకనే ఇదంతా చేశారని సమాచారం. కలెక్టర్ ప్రభాకర రెడ్డి మెగా కోలాటాన్ని ప్రతిష్టా త్మకంగా తీసుకున్నారు. పండగ వాతావరణంలో నిర్వహించాలని భావించారు. లిమ్కాబుక్లో మ న్యం జిల్లాకు స్థానం తెచ్చి పెట్టాలని కలలుగన్నా రు. అందుకోసం తీవ్రంగా శ్రమించారు. ఆరు వేల మంది పిల్లలను సంసిద్ధులను చేశారు. రోజుల తరబడి వారికి కోలాటంలో శిక్షణ ఇప్పించారు. కొన్ని రోజులుగా ఉపాధ్యాయులు, వివిధ విభాగాల సిబ్బంది ఇదే పనిలో ఉన్నారు. హోర్డింగులతో విస్తృత ప్రచారం కల్పించారు. ఆ రోజున విద్యార్థులను తరలించేందుకు బస్సులను కూడా సిద్ధం చేశారు. విద్యార్థులు సజావుగా నృత్యం చేసేలా రహదారులపై మార్కింగ్ కూడా చేశారు. ఇందుకోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు అయిపోయాయి. ఆ ప్రజా ప్రతినిధి పంతం ముందు.. ఆ కష్టం, ఈ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. వాస్తవానికి కొద్ది రోజులుగా ఎండల తీవ్రత అధికంగానే ఉంది. మున్ముందు మరింతగా పెరగవచ్చని వాతావరణశాఖ హెచ్చరిస్తూనే ఉంది. ఎండలతో కార్యక్రమం చేపడితే ఇబ్బందులు ఎదురుకావచ్చని ముందుగానే యంత్రాంగం కార్యక్రమాన్ని రద్దు చేయవచ్చు గాక! నిజంగా వాయిదా వేయాలని అనుకుంటే.. ముందురోజు వరకూ తెచ్చి ఉండక్కర్లేదు. భారీ తుఫాన్లు, వర్షాల సమయంలోనే అకస్మాత్తుగా కార్యక్రమాలు రద్దు చేస్తారు. అంతకుమించి అవాంతరం ఆ ప్రజాప్రతినిధి నుంచి వచ్చిందని ఉద్యోగ వర్గాల్లో చర్చసాగుతోంది. ఒక రికార్డు కోసం ఇటు అధికారులతో పాటు.. అటు పిల్లలు, వారి తల్లిదండ్రులు ఎంతో కలలుగన్నారు. ఆరు వేల మంది కలలను కాలరాసిన ఓ నిర్ణయం... క్షమించరాని మచ్చగా మిగిలిపోతుందని తల్లిదండ్రులు అంటున్నారు. -
గ్యాస్ కష్టాలపై పోరు
● ఖాళీ సిలిండర్లతో వినియోగదారుల నిరసన పార్వతీపురం రూరల్: భారత్ గ్యాస్ సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను నిరసిస్తూ బుధవారం పట్టణంలోని బైపాస్ రోడ్డులో గల ఏజెన్సీ కార్యాలయం వద్ద వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో ఆందోళన చేపట్టారు. సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో బాధితులు ఏజెన్సీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు బి.వి.రమణ, బి.సూరిబాబు మాట్లాడుతూ.. ఏజెన్సీ నిర్వహణలో వచ్చిన మార్పులు, సాంకేతిక కారణాల వల్ల గ్యాస్ బుకింగ్లు కావడం లేదని, ఓటీపీలు రాక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యపై అధికారులకు విన్నవించినా ఫలితం లేదని, తక్షణమే సాంకేతిక సమస్యలను పరిష్కరించి గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వచ్చే సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతామని హెచ్చరించారు. ఆందోళనపై స్పందించిన జిల్లా పౌరసరఫరాల అధికారులు తక్షణమే 125 గ్యాస్ సిలిండర్లను తెప్పించి వేచి ఉన్న వినియోగదారులకు పంపిణీ చేశారు. ఈ నిరసనలో లబ్ధిదారులు రాజు, వెంకట నాయుడు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
భర్త గంగులు ఏడాదిన్నర కింద ట అనారోగ్యంతో మృతి చెందారు. పలువురు ఇళ్ల వద్ద పనిచేసి ఇద్దరు పిల్లలతో కుటుంబా న్ని నెట్టుకొస్తున్నాను. సచివాల యానికి కాళ్లరిగేలా తిరుగుతున్నా పింఛన్కు దరఖా స్తు తీసుకోవడం లేదు. కుటుంబ పోషణ కష్టమవు తోంది. దీన స్థితిలో ఉన్నా ప్రభుత్వానికి కనికరం లేదు. – కోరాడ బుజ్జి, గొల్లవీధి, వీరఘట్టం రెండేళ్ల కిందట భర్త చనిపోయా డు. కూటమి ప్రభుత్వం వస్తే తనలాంటి వితంతువులకు వెంటనే పింఛన్ ఇస్తామన్నారు. రెండేళ్లుగా సచివాలయానికి తిరుగుతున్నా కొత్త పింఛన్ల మంజూరు ఉత్తర్వులు రాలేదని సిబ్బంది చెబుతున్నారు. బట్టలు ఉతుకు తూ జీవనం సాగిస్తున్న తనలాంటి వారికి పింఛన్ మంజూరుకాకపోవడంతో జీవనానికి ఇబ్బందులు పడుతున్నాం. – వెంపడాపు లక్ష్మి, వీరఘట్టం -
న్యాయం చేసేవరకు పోరాటం
జిందాల్ నిర్వాసితులు సుమారు రెండు వందల రోజుల పాటు నిరాహార దీక్షలు చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వానికి తమ గోడు వినిపించారు. సమస్యల పరిష్కారంపై అటు కేంద్రం, ఇటు రాష్ట్రప్రభుత్వం స్పందించకపోవడంతో బుధవారం మళ్లీ నిరాహార దీక్షలు ప్రారంభించారు. మేమంతా ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారమని, తమ బతుకులుతో ఆడుకోవద్దని, తమ భూములు తమకు అప్పగించాలంటూ నినదించారు. న్యాయం చేసేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. – శృంగవరపుకోట -
రైతులకు పంట నష్టం
గజరాజుల బీభత్సంగరుగుబిల్లి: జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా సంచరిస్తున్న గజరాజులు అటు పంటలను నష్టపరచడంతోపాటు ప్రజల ప్రాణాలనుకూడా తీస్తున్నాయి. కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కురుపాం, సీతానగరం, పార్వతీపురం మండలాలల్లో ఏనుగులు సంచరిస్తున్నప్పటికీ వాటిని తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. పంటలకు, ప్రాణాలకు ఏనుగులు నష్టం కలిగిస్తున్నా అధికారుల్లో ఎలాంటి చలనం ఉండడం లేదు. దీంతో ప్రజలకు కష్టం, నష్టం తప్పడంలేదు. తాజాగా గడిచిన వారం రోజులనుంచి గరుగుబిల్లి మండలంలోని మరుపెంట, సంతోషపురం, నందివానివలస, గొట్టివలస తదితర గ్రామాల పరిసరాల్లో సంచరించిన ఏనుగులు మంగళవారం ఉదయం నాటికి నాగూరులో సంచరించి మొక్కజొన్న, అరటి, వరిపంటలను ధ్వంసం చేసి రైతులను నష్ట పరిచి బీభత్సం సృష్టించాయి. గ్రామానికి చెందిన కేతిరెడ్డి భార్గవరావు నాయుడు, కేతిరెడ్డి చంద్రమౌళి, కేతిరెడ్డి జానకమ్మ, వెంకటనాయుడు, అల్లు కృష్ణమూర్తినాయుడు, బర్ణికల పోలిశెట్టిలకు చెందిన పంటలను నాశనం చేశాయి. సుమారు ఒక ఎకరం వేరుశనగ, మూడు ఎకరాల మొక్కజొన్న, ఐదు ఎకరాల వరిపంట, అరటి పంటలను, ఒక విద్యుత్ మోటార్ను ఏనుగులు నాశనం చేశాయి. చేతికి అందిన పంట ఇలా గజరాజుల పాలవడంతో రైతులు తీవ్రంగా వాపోతున్నారు. భారీ పంటల నష్టంవల్ల ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన నష్టపరిహారం అందించాలంటూ బాధిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏనుగుల తరలింపునకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు. -
బ్రేక్
మరోవైపు కార్యక్రమం వాయిదా పడడానికి కూడా ఒక కారణం ఉందన్న చర్చ నడుస్తోంది. ఓ ఎమ్మెల్యేకు కనీస ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం.. తనకు తెలియకుండానే ఏర్పాట్లు చేసుకోవడం వల్ల సదరు ఎమ్మెల్యే అసంతృప్తికి లోనైనట్లు తెలిసింది. పైగా, ఆహ్వాన పత్రికలో సైతం తన పేరుకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై అలిగారని సమాచారం. ఈ నేపథ్యంలోనే కార్యక్రమం చేపడితే ఎటువంటి పరిణామాలు ఎదురుకానున్నాయో.. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేశ్ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం విదితమే. ఎండల వల్ల విద్యార్థులకు ఏమైనా జరిగితే.. సంబంధిత శాఖ మంత్రిగా నారా లోకేశ్ బాధ్యత పడాల్సి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం. పైనుంచి వచ్చిన ఆదేశాలతోనే కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. సాక్షి, పార్వతీపురం మన్యం: కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని తలపెట్టిన భారీ మెగా కోలాటం ప్రదర్శన వాయిదా పడింది. జిల్లా కేంద్రంలో వేల మంది విద్యార్థులతో బుధవారం నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని ఎండల తీవ్రత కారణంగా వాయిదా వేస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఎండలతో నలువైపుల నుంచి విమర్శలు దాదాపు 6 వేల మంది విద్యార్థులతో 18 నిమిషాల పాటు 22వ తేదీ ఉదయం 7 గంటల నుంచి కోలాట ప్రదర్శన చేపట్టాలని కలెక్టర్ ప్రభాకర రెడ్డి నిర్ణయించారు. ఉదయం 10 గంటల వరకూ కార్యక్రమం ఉంటుందని ఆహ్వాన పత్రికలు కూడా ముద్రించారు. జిల్లా ప్రజా ప్రతినిధులకు, ముఖ్యులకు కూడా వీటిని పంపించారు. కార్యక్రమ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేశారు. ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు కొద్దిరోజులుగా జిల్లా కేంద్రంలోనే ఉండి.. రహదారిపై ప్రదర్శనకు వీలుగా మార్కింగ్ ఇతర ఏర్పాట్లు చూసుకుంటున్నారు. జిల్లా అధికారులకు సైతం కొన్ని బాధ్యతలు అప్పగించారు. ఈ ప్రదర్శన కోసం విద్యార్థులు ఇప్పటికే శిక్షణ పొందారు. ప్రత్యేక డ్రెస్ కోడ్తో సిద్ధమయ్యారు. మంగళవారం ఉదయం వరకు కార్యక్రమం ఉంటుందనే అంతా భావించారు. ఉదయం కలెక్టరేట్లో మంత్రి సంధ్యారాణి ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష తర్వాత.. వాయిదా నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి కొద్దిరోజులుగా జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉంటోంది. 40 డిగ్రీలకుపైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత కనిపిస్తోంది. ఇటువంటి సమయంలో కోలాట ప్రదర్శన కోసమని.. గంటల కొద్దీ విద్యార్థులను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదన్న వాదన అధికార వర్గాల నుంచి కూడా వ్యక్తమైంది. ఎండల వల్ల పిల్లలు డీ – హైడ్రేషన్కు లోనై పడిపోతే, కార్యక్రమం ఉద్దేశం పక్కకువెళ్లిపోతుందని ఆందోళన సైతం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టిలో పెట్టేందుకు ఎవరూ సాహసం చేయలేకపోయారు. జిల్లాలో కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో, ప్రదర్శనలో పాల్గొనే సుమారు 6 వేల మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వాయిదా నిర్ణయం తీసుకున్నాం. పిల్లల క్షేమమే ముఖ్యం.ఇటీవల నిర్వహించిన ‘డ్రగ్స్ వద్దు బ్రో’ కార్యక్రమంలో కూడా ఎండవల్ల కొందరు విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని ఉష్ణోగ్రతలు తగ్గిన తర్వాత తిరిగి నిర్వహించే తేదీ త్వరలోనే ప్రకటిస్తాం. – గుమ్మిడి సంధ్యారాణి, రాష్ట్ర మంత్రి -
వలస కార్మికుల కోసం టోల్ ఫ్రీ నంబర్
విజయనగరం గంటస్తంభం: అంతర్రాష్ట్ర వలస కార్మికులు తమ సమస్యలను నేరుగా అధికారులకు ఫిర్యాదు చేసేందుకు విజయవాడలో 24 గంటల పాటు పనిచేసే టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేసినట్లు విజయనగరం కార్మికశాఖ ఉప కమిషనర్ ఎస్డీవీ ప్రసాదరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వలస కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం 1800–425–8587 నంబర్కు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. కార్మికులు ఎదుర్కొనే ఇబ్బందులను తక్షణమే పరిష్కరించే ఉద్దేశంతో కార్మికశాఖ ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిందని వివరించారు. -
విద్యుత్ షాక్తో హోటల్ యజమాని మృతి
పూసపాటిరేగ: మండలంలోని కందివలస సమీపంలో దేవి హోటల్ నిర్వహిస్తున్న చిక్కాల అనిల్కుమార్(29) విద్యుత్షాక్తో దుర్మరణం చెందాడు. హోటల్ వెనకభాగంలో నీటిపైపుతో ఇంటిని శుభ్రం చేస్తుండగా షాక్ తగిలి అపస్మారక స్థితిలో చేరుకున్నాడు. ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. ఆయనకు భార్య అనురాధ ఉన్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పూసపాటిరేగ ఎస్ఐ ఐ.దుర్గాప్రసాద్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉపాధ్యాయుల పోరుబాట
పార్వతీపురం రూరల్: రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పార్వతీపురం మన్యం కలెక్టరేట్ ఎదుట పీఆర్టీయూ మంగళవారం ఆందోళన చేసింది. సమస్యలు పరిష్కరించాలంటూ నినదించింది. పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అమరాపు సూర్యనారాయణ, సంఘ రాష్ట్ర మహిళా అసోసియేట్ అధ్యక్షురాలు కర్రి రోజా రమణి, జిల్లా ప్రధాన కార్యదర్శి కాగాన విజయ, రాష్ట్ర కార్యదర్శి జక్కు రామినాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ గంట శశికుమార్, శ్రీరామ్ తదితరులు మాట్లాడుతూ తక్షణమే ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలని, పీఆర్సీ కమిటీని ఏర్పాటుచేయాలని, సీపీఎస్ను రద్దుచేసి పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, ఎర్నల్లీవ్ ఎన్క్యాష్మెంట్ అంశాలను అమలు చేయాలని, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల నియామకం చేపట్టాలని కోరారు. జెడ్పీ పరిధిలో కారుణ్య నియామకాలను కలెక్టర్ పరిధిలో నిర్వహించాలని, జీఓ 302ను పునరుద్ధరించి జూనియర్ లెక్చరర్లకు పదోన్నతులు కల్పించాలని, మున్సిపల్ కార్పొరేషన్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ ఖాతాలు ప్రారంభించాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, టెట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
వీఆర్ఎస్లో నిల్వ నీటిని చెరువులకు విడిచిపెట్టాలి
● సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు మక్కువ: వెంగళరాయ సాగర్ ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటిని కాలువల ద్వారా చెరువులకు విడిచిపెట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ వెంగళరాయసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని ఈ ఏడాది జనవరి నెల నుంచి ఇరిగేషన్ అధికారులు ఇష్టానుసారం సువర్ణముఖి, గోముఖి రెగ్యులేటర్ల ద్వారా నదుల్లోకి విడిచి పెట్టారన్నారు. నీటిని వృథాగా ఎందుకు విడిచిపెడుతున్నారని ప్రశ్నిస్తే జైకా నిధులతో కాలువల్లో పనులు చేస్తామని చెప్పినప్పటికీ, ఇంతవరకు కాలువల పరిధిలో జైకా నిధులతో పని జరిపించలేదన్నారు. ప్రాజెక్టు నీరు వృథాగా దిగువకు విడిచిపెడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. రానున్న సీజన్లో ఎల్నినో ఏర్పడి భారతదేశం అంతా కరువు వస్తుందని పత్రికల్లో ప్రకటనలు చేస్తుంటే, ఇరిగేషన్ అధికారులు మాత్రం వెంగళరాయసాగర్ ప్రాజెక్టులో ఉన్న నీటిని వృధాగా విడిచి పెడుతున్నారన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రాజెక్టులో ఉన్న నీటిని ఆయికట్టు చెరువులకు విడిచిపెడితే మూగ జీవాల దాహార్తిని అరికట్టడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గసభ్యుడు ఎన్వై నాయుడు, మండల నాయకుడు తాడంగి ప్రభాకర్ పాల్గొన్నారు. -
స్వీయగణనను వినియోగించుకోవాలి
పార్వతీపురం: జనగణన–2027లో భాగంగా స్వీయగణ ప్రక్రియను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి కోరారు. ఈనెల 16 నుంచి ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ సదుపాయం అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రజలు హెచ్టీటీపీఎస్://ఎస్ఈ.సెన్సెస్.జీఓవీ.ఇన్ పోర్టల్లో మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయి తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని కోరారు. ● భగీరథ మహర్షి జయంతిని కలెక్టరేట్లో గురువారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ● కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే పద్మ అవార్డులకు జూలై 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. భారత హోం మంత్రిత్వశాఖ ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు (పద్మ విభూషణ్, పద్మ భూషన్, పద్మశ్రీ)లను ప్రకటిస్తుందన్నారు. వివిధ రంగాల్లో విశేష కృషిచేసిన వారు హెచ్టీటీపీ://అవార్డ్సు.జీఓవీ.ఇన్లో దరఖాస్తు సమర్పించాలన్నారు. మృత్యు‘ధార’.. శృంగవరపుకోట: మృత్యువు ఏ రూపంలో.. ఎవరిని ఎలా కాటేస్తోందో తెలియదు. దీనికి ఎస్.కోటలో మంగళవారం జరిగిన విద్యుత్ ప్రమాదమే నిలువెత్తునిదర్శనం. కొత్తూరు గ్రామానికి చెందిన కక్కల రాము (48) అదే గ్రామంలో బైక్ మెకానిక్ షాపులో పనిచేస్తున్నాడు. ఏళ్ల తరబడి చేస్తున్న అలవాటైన పని. ఎప్పటివలే బైక్కు వాటర్ సర్వీసింగ్ చేస్తున్న ప్రయత్నంలో గన్ను పైకిలేపాడు. అంతే.. నీటిధారపైన ఉన్న విద్యుత్ లైన్ను తాకింది. దానిగుండా విద్యుత్ ప్రవహించడంతో వెంటనే రాము షాక్కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కొనఊపిరితో ఉన్న రామును ఎస్.కోటలోని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్.కోట సీఐ నారాయణమూర్తి తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వీరిలో ఒక కుమార్తె, కుమారునికి వివాహాలు అయ్యాయి. బైక్ సర్వీసింగ్ కార్మికుడి మృతితో కొత్తూరులో విషాదం అలుముకుంది. ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు సర్కారు రేగిడి: చంద్రబాబు ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించి, రెండేళ్లుగా రెడ్బుక్ పాలన సాగిస్తోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ విమర్శించారు. రేగిడిలో స్థానిక విలేకరులతో ఆయన మంగళవారం మాట్లాడారు. అధికార దాహంకోసం సూపర్సిక్స్ హామీలిచ్చి అమలులో చేతులెత్తేయడం విచారకరమన్నారు. గ్రామ పంచాయతీల్లో వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య పనులు చేయలేని దుస్థితి నెలకొందన్నారు. ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువ కావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు బనాయిస్తున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు, వైఎస్సార్ సీపీ రాజాం నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు కరణం శ్రీనివాసరావు, ఎంపీటీసీ కింజరాపు సురేష్, పాడి లక్ష్మునాయుడు, కెంబూరు వెంకటేశ్వరరావు, గార రమణ, టంకాల బుచ్చెన్నాయుడు, రామారావు, తదితరులు పాల్గొన్నారు. దేవదాయ భూముల వేలంలో ఉద్రిక్తత గజపతినగరం రూరల్: మండలంలోని పీ.ఎస్.ఆర్ పురం గ్రామంలోని 47 ఎకరాల దేవదాయశాఖ భూములకు మంగళవారం నిర్వహించిన కౌలు వేలంటపాట ఉద్రిక్తతగా మారింది. భూములను సాగుచేస్తున్న 19 మంది కౌలు రైతులు వేలంపాట నిర్వహించిన సచివాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. 70 ఏళ్లుగా భూములు సాగుచేస్తున్నామని, ఏటా ఠంచన్గా దేవదాయ శాఖకు కౌలు చెల్లిస్తున్నామని, వేలంపాట లేకుండా తమకే కౌలుకు ఇవ్వా లని డిమాండ్ చేశారు. దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ జి.శ్యామ్ప్రసాద్, శ్రీరామ్లు మాట్లాడుతూ ఇన్చార్జి ఈఓలు ఉండడం వల్ల ప్రతి మూడేళ్లకు నిర్వహించాల్సిన వేలంపాట 12 ఏళ్లుగా నిర్వ హించలేదని, వేలంపాటకు రైతులు సహకరించాలని కోరారు. ఎస్ఐ కిరణ్కుమార్నాయుడు సైతం సర్దిచెప్పారు. వేలంపాటలో పాల్గొని భూ ములను కౌలుకు తీసుకోవాలని సూచించారు. దీనికి రైతులు ససేమిరా అనడంతో మరో పది రోజులు గడువు ఇస్తామని, వేలంపాట పాడిన వారికే భూములను కౌలుకు ఇస్తామని చెబుతూ దేవదాయ శాఖ అధికారులు వెనుదిరిగారు. -
సన్మార్గంతో జీవితానికి సార్థకత
● రామానుజ చిన జియర్స్వామి పార్వతీపురం: సకల జీవరాశులను కాపాడేది శ్రీలక్ష్మీనారాయణుడే... సన్మార్గంలో వెళ్లినప్పుడు జీవితానికి సార్ధకత ఉంటుందని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జియర్స్వామి అన్నారు. బెలగాంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ శతాబ్ది ప్రయుక్త నవాహ్నిక కల్యాణ బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. శ్రీమత్తిరుమల రంగనాథాచార్యస్వామి పర్యవేక్షణలో సాగిన కార్యక్రమంలో మంగళవారం ఉదయం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వేంకటేశ్వరస్వామి దేవాలయం వరకు మంగళ వాయిద్యాల నడుమ మహిళల శోభాయాత్ర భక్తిభావంతో సాగింది. ఆధ్యాత్మిక చింతన వెల్లివిరిసింది. ఆలయంలోని శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి చినజీయర్ స్వామి సాలిగ్రామ మాల అలంకరణ చేసి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం జానియర్ కళాశాల మైదానంలో ఆధ్యాత్మిక ఉపన్యాసం చేశారు. ఆలయం నిర్మించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఎంతో వైభవంగా పూజలను చేయడం ఈ ప్రాంత ప్రజలకున్న భక్తిభావాన్ని చాటుతుందన్నారు. ప్రతి ఒక్కరిలో దేవుడు కొలువై ఉంటారని, ఆధ్యాత్మిక చింతనతో ఆనందమయ జీవనం కొనసాగించాలన్నారు. సన్మార్గాన్ని వీడరాదన్నారు. ఇందులో భాగంగా పలువురు చిన్నారులు వేంకటేశ్వరస్వామి, పద్మావతి, లక్ష్మీదేవి వేషధారణలో ఆకర్షించారు. కోలాట ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన, ఆలయ అర్చకులు వరహ వెంకటగిరి ఆచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు చీకటి బాలగంగాధర్ తిలక్ రాయ్, యిండుపూరు గున్నేశ్వరరావు, లక్ష్మణరావు, పైడాన అప్పారావు, తాడ్డి అప్పారావు, చెల్లారపు సాంబ, దొగ్గ జగన్నాథం, తదితరులు పాల్గొన్నారు. -
స్వామి వారికి అపచారం..
● తోటపల్లి విగ్రహ ఘటనపై చినజీయర్ స్వామి ఆశ్చర్యంసాక్షి, పార్వతీపురం మన్యం: గరుగుబిల్లి మండలం తోటపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో 52 సంవత్సరాలుగా నిత్య పూజలు అందుకుంటున్న స్వామివారి విగ్రహాన్ని వెలుపల పడేయడంపై బీజేపీ నాయకులు, విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు త్రిదండి చినజియర్ స్వామి దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాకు మంగళవారం వచ్చిన చినజియర్ స్వామిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారావురెడ్డి శ్రీనివాసరావు, నాయకులు సురేష్, బాలు, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చింతా భాస్కరనాయుడు, రామకృష్ణ, మూడు జిల్లాల కార్యదర్శి సత్యనారాయణ తదితరులు కలిశారు. స్వామికి జరిగిన అపచారాన్ని, తోటపల్లి ఆలయంలో ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. చరిత్ర ఉన్న విగ్రహాన్ని పూజలు లేకుండా పడేయడంపై చినజియర్ స్వామి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై వినతిపత్రాన్ని ఈవోకు కూడా ఇవ్వాలని ఆయన చెప్పారు. ఆలయ కమిటీ నిర్వాకం వల్లే ఈ విగ్రహం బయటపెట్టాల్సి వచ్చిందని దేవదాయశాఖ చెబుతోందని బీజేపీ నాయకులు వివరించారు. అనంతరం చినజియర్స్వామి సూచన మేరకు తోటపల్లి ఆలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. -
రెడ్ జోన్లో మన్యం
సాక్షి, పార్వతీపురం మన్యం: పచ్చని మన్యంపై భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. తీవ్రమైన ఎండలు, వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే వాతావరణం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఉదయం 11 గంటల తర్వాత బయట తిరిగే సాహసం ఏ ఒక్కరూ చేయలేకపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటిపోతున్నాయి. రాష్ట్ర రియల్ టైమ్ గవర్నెన్స్ తాజా నివేదిక ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లాలో రానున్న ఐదు రోజుల పాటు తీవ్రమైన ఎండలు, వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా జిల్లాలోని 15 మండలాలు ‘డేంజర్ కేటగిరీ’ (ప్రమాదకర స్థాయి)లో ఉన్నట్లు హెచ్చరికలు జారీ అయ్యాయని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి వెల్లడించారు. మధ్యాహ్నం వేళల్లో ప్రజలు బయటకు రాకపోవడం మంచిదని.. వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 45 డిగ్రీలకు చేరువ.. పలు మండలాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు నుంచి 45–50 డిగ్రీలు వరకూ నమోదయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సీతానగరం, సాలూరు, పాచిపెంట, మక్కువ, సీతంపేట, భామిని, కొమరాడ, వీరఘట్టం, బలిజిపేట, జియ్యమ్మవలస, పార్వతీపురం, గరుగుబిల్లి, పాలకొండ మండలాలలో ఎండ ప్రభావం ఉండనుంది. చల్లగా మారిన వాతావరణం.. మంగళవారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ.. తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారింది. పార్వతీపురంతో పాటు పలు మండలాల్లో గాలులు వీచి, వర్షం కురవడంతో ప్రజలు ఊరట చెందారు. జిల్లాకు వడగాల్పుల ముప్పు 15 మండలాల్లోనూ 41 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరిక -
నాలుగు కిలోల కణితి తొలగింపు
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో క్లిష్టతరమైన శస్తత్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలను ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్ట ర్ అల్లు పద్మజ సోమవారం వెల్లడించారు. చీపురుపల్లి ప్రాంతానికి చెందిన రైతు పెంటమ్మ అనే వృద్ధురాలు కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి కడుపు నొప్పితో వచ్చింది. జనరల్ సర్జరీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ పీఏ రమణ, ఇతర వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు, స్కానింగ్ నిర్వహించి కడుపు లోపలి భాగంలో రెట్రోపెరిటోనియల్ ట్యూ మర్ ఉన్నట్లు నిర్ధారించారు. కడుపులో ఉన్న కణితిని రెట్రోపెరిటోనియల్ ప్రాంతంలో అన్ని వైపులా విస్తరించి, సమీపంలోని కిడ్నీ, ముఖ్యమైన రక్తనాళాలకు అంటుకుని ఉన్నట్లు గుర్తించారు. ఈ కణితి వల్ల రక్తనాళాలకు, ఇతర అవయవాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుమారు 4 కిలోల కణితిని శస్త్రచికిత్స చేసి తొలగించారు. కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. ఈ శస్త్రచికిత్సలో డాక్టర్లు పీఏ రమణతో పాటు, చైతన్య బాబు, జగదీష్, వెంకటనాయుడు, ధర్మ కిషోర్, శశిధర్, అక్షిత, హేమసుందర్ నాయుడు పాల్గొన్నారు. వారిని సూపరింటెండెంట్ అభినందించారు. -
చేపలు మృత్యువాత
● దాదాపు రూ.20 లక్షలు నష్టంసంతకవిటి: మండలంలోని బొద్దూరు గ్రామంలో దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో ఉండే అప్పమ్మ చెరువులో టన్నుల కొద్దీ చేపలు మృత్యువాత పడ్డాయి. చెరువులో ముళ్ల నాచు అధికంగా పేరుకు పోవడంతో చేపలు ఊపిరాడక మృత్యువాత పడ్డాయని దాదాపు రూ.20లక్షలు నష్టం వాటిల్లిందని సొసైటీ సభ్యులు వాపోతున్నారు. దాదాపు దశాబ్దాలనుంచి ఈ చెరువునే నమ్ముకుని శ్రీ గణేష స్వదేశీ పారిశ్రామిక సహకార సంఘ సభ్యులం బతుకుతున్నామని చేపలు మృత్యువాత పడడంతో వీధిన పడ్డామని సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ సంఘంలో దాదాపు 65 మంది సభ్యులున్నారు. చెరువులోని నీరు బయటకు వెళ్లకుండా ఓ రైతు అడ్డుపడడంతో చెరువులో నీరు అధికంగా ఉండడంతో నాచును చెరువునుంచి తీసేందుకు వీలు కాలేదు. ఎండలకు నీరు తగ్గడంతో చేపలు తిరుగాడేందుకు వీలుకాక ఊపిరాడక చనిపోయాయాని గ్రామానికి చెందిన సభ్యుడు దువ్వారపు శ్రీను వాపోయాడు. -
పీజీఆర్ఎస్కు వినతుల వెల్లువ
● 215 వినతుల స్వీకరణవిజయనగరం అర్బన్: కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’(పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అర్జీదారులు హాజరై తమ సమస్యలపై వినతిపత్రాలు, ఫిర్యాదులు సమర్పించారు. కలెక్టర్ ఎం.రాంసుందర్రెడ్డి నేతృత్వంలో జిల్లా యంత్రాంగం వినతుల పరిష్కానికి ప్రత్యేక చర్యలు చేపడుతూ అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు సత్వర పరిష్కారం అయ్యేలా కృషి చేస్నున్నారు. అర్జీదారుల సౌకర్యార్థం కలెక్టరేట్ వద్ద ప్రత్యేక రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు కూర్చుని సమస్యలు వివరించేందుకు కుర్చీలు ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి తాగునీరు వంటి వసతులు కల్పించారు. విభిన్న ప్రతిభావంతుల కోసం మూడు చక్రాల సైకిళ్ల ద్వారా లోపలికి వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మొత్తం 215 వినతులు స్వీకరించగా అందులో 89 రెవెన్యూ శాఖకు సంబంధించినవి ఉన్నాయి. పంచాయతీ రాజ్–24, మున్సిపల్–8, విద్యుత్–9, హౌసింగ్–2, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ–3, గ్రామ సచివాలయ శాఖ–2, విద్యాశాఖ–1 ఇతర శాఖలకు మరో 62 వినతులూ అందాయి. వినతుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని పెండింగ్ కేసులను వెంటనే డిస్పోజ్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ టోల్ఫ్రీ నంబర్ 1100 ద్వారా అందిన ఫిర్యాదులపై కూడా బాధ్యతగా స్పందించాలని సూచించారు,. ప్రతి వారం పురోగతిపై సమీక్ష నిర్వహిస్తూ అర్జీదారులతో మాట్లాడిన వివరాలను రికార్డు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్ఓ సీహెచ్.సత్తిబాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. వినతుల పెండింగ్పై ప్రజల్లో అసంతృప్తి పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లకు పెద్ద ఎత్తున తరలివస్తున్న ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో మాత్రం అసంతృప్తి కొనసాగుతోంది. జిల్లా నలుమూలల నుంచి వచ్చి అర్జీదారులు తమ వినతులు సమర్పించినప్పటికీ చాలా సమస్యలు వెంటనే పరిష్కారం కాలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. భూ వివాదాలు, సర్వే సమస్యలు, పట్టాదారు పాస్ పుస్తకాల జాప్యం వంటి అంశాలు ఎక్కువగా రావడం, రెవెన్యూ వ్యవస్థలో లోపాలను వెలుగులోకి తెస్తున్నాయి. ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సి రావడం, అధికారులతో నేరుగా మాట్లాడే అవకాశం పరిమితంగా ఉండడం వంటి అంశాలపై అసంతృప్తి వ్యక్తమైంది. అర్జీలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలి పార్వతీపురం: పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చిన వినతులను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్, జేసీ సి.యశ్వంత్ కుమార్రెడ్డి, డీఆర్ఓ కె. హేమలత. ఎస్ఈసీ దిలీప్ చక్రవర్తి కలిసి 93 వినతులను స్వీకరించారు. ఇందులో రెవెన్యూకు సంబంధించి 24, ఇతర వినతులు 69 వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్దిష్ట గడువులోగా క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలను పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. ఎక్కువ కాలం పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను గుర్తించి వాటిపై సమగ్ర పరిశీలన చేసి పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 27 వినతులు సీతంపేట: ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 27 వినతులు వచ్చాయి. ఐటీడీఏ ఏవో సునీల్ ఆధ్వర్యంలో అర్జీలు స్వీకరించారు. భామిని మండలం పాలవలస గ్రామానికి చెందిన కడ్రక గోపాలం, పీఎల్పురానికి చెందిన లక్ష్మీనారాయణలు పవర్ టిల్లర్ మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు. రాజమానుగూడ గ్రామానికి చెందిన సవర శివకుమార్ తాగునీటి ట్యాంకు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశాడు. కొత్తబర్న గ్రామానికి చెందిన ఆరిక వెంకటరావు రచ్చబండ నిర్మించాలని వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో నారాయుడు, వ్యవసాయాధికారి వాహిని, స్పోర్ట్స్ ఇన్చార్జ్ జాకాబ్ దయానంద్, డీఈ రాధారాణి, ఎ.డి శ్రీనివాసరావు, డీడీ సెక్షన్ సూపరింటెండెంట్ అప్పారావు, జీసీడీవో రాములమ్మ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. -
చికిత్సపొందుతూ డ్రైవర్ మృతి
రాజాం సిటీ: మండల పరిధి అంతకాపల్లి బ్రిడ్జి సమీపంలో ఈ నెల 13న జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పార్సిల్ వ్యాన్ డ్రైవర్ ఆదివారం రాత్రి మృతి చెందాడు. అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం పోరుపు గ్రామానికి చెందిన పోరుపోలు వీరబాబు (28) కొరియర్ వ్యాన్తో శ్రీకాకుళం వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో శ్రీకాకుళం నుంచి రాజాం వస్తున్న లారీ అతివేగంగా వస్తూ వ్యాన్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ వీరబాబును రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడని పోలీసులు తెలిపారు.బాల్య వివాహం చేస్తున్నారంటూ ఫిర్యాదుసీతంపేట: తనకు బాల్య వివాహం చేస్తున్నారంటూ పాలకొండ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన ఓ మైనర్ సోమవారం ఐటీడీఏను ఆశ్రయించింది. తనకు 17 ఏళ్లు అని, వరుడికి 40 ఏళ్లు ఉంటాయని పేర్కొంది. అతనితో నాకు వివాహం చేయడానికి తల్లిదండ్రులతోపా టు బంధువులు అందరూ అంగీకరించారని బా లిక తెలిపింది. ఈ విషయమై జీసీడీవో రాములమ్మ బాలికతో మాట్లాడి, పరిపాలన అధికారి సునీల్ సూచన మేరకు పాలకొండ డీఎస్పీ కార్యాలయానికి పంపించారు. తల్లిదండ్రులు, బంధువులకు అక్కడ కౌన్సెలింగ్ ఇప్పించారు. పోక్సో కేసులో ముద్దాయికి 20 ఏళ్ల జైలువిజయనగరం క్రైమ్/తెర్లాం: గతేడాది తెర్లాం పీఎస్ లో నమోదైన పోక్సో కేసులో ముద్దాయి హరికృష్ణ(19)కు విజయనగరం పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.3,000 జరిమానా విధించడంతోపాటు, బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షలను మంజూరు చేయాలని తీర్పు వెల్లడించారు. ఈ మేరకు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సోమవారం కేసు వివరాలు తెలిపారు. తెర్లాంకు చెందిన ఒక మైనర్తో అదే ఊరికి చెందిన ముడిదాన హరికృష్ణ పరిచయం పెంచుకుని ప్రేమ, పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి బాలికపై తన ఇంట్లో పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను విజయవాడ తీసుకువెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉంచి తిరిగి ఆ బాలికను ఆమె ఇంటి వద్ద విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఈ విషయమై బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెర్లాం ఎస్సై బి.సాగర్ బాబు 2025 మార్చి 5న పో క్సో కేసు నమోదు చేశారు. నిందితుడు ముడిదానా హరికృష్ణపై నేరారోపణలు రుజువు కావడంతో పోక్సో కోర్టు జడ్జి కె.నాగమణి పై విధంగా తీర్పు వెల్లడించారని ఎస్పీ వివరించారు. కలకలం రేపిన మృతదేహంవిజయనగరం క్రైమ్: వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మృతదేహం సోమవారం కలకలం రేపింది. స్థానికుల నుంచి వచ్చిన సమాచారంతో వన్టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రింగ్రోడ్డు ఫోర్ట్సిటీ స్కూల్ ప్రాంతంలో పాడుబడిన నూతిలో మృతదేహం పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 15 రోజుల క్రితం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో జొన్నగుడ్డికి చెందిన పావాడ హరినాథ్(26) కనిపించడం లేదంటూ తల్లి సంతోషి ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి వన్టౌన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే హరినాథ్ బంధువులు పాడుబడిన బావిలో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చి బావిలోంచి మృతదేహాన్ని తీశారు. మృతదేహమంతా తాళ్లతో కట్టేసి రక్తంతో ఉన్నట్లు గుర్తించారు. -
శతాబ్ది బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
● నేడు చినజియర్ స్వామి రాక ● 29న స్వామివారి కల్యాణంపార్వతీపురం: ఈనెల 22నుంచి జరగనున్న కల్యాణ వెంకటేశ్వరస్వామి శతాబ్ది బ్రహ్మోత్సవాలకు అవసరమైన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈమేరకు స్థానిక జూనియర్ కళాశాల మైదానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 21న మంగళవారం మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో మహిళలు కలశాలతో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు ఊరేగింపుగా వచ్చి, శ్రీవారికి సాలగ్రామ మాలను త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినిజియర్ స్వామితో అలంకరణ చేయనున్నారు. అనంతరం చినజియర్ స్వామి ప్రవచనం, భక్తులకు ప్రసాద వితరణ చేయనున్నారు. ఆలయం నిర్మించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవంగా కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నట్లు కమిటీ సభ్యులు, ఆలయ అర్చకుడు వరహా వెంకటగిరి ఆచార్యులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రపారాయణం, తిరువీధులలో కోలాటం భజనలు నిర్వహించనున్నారు. అలాగే కళాశాల మైదాన ప్రాంగణంలో సాయంత్రం ప్రముఖులతో ప్రవచనాలు ఉంటాయి. ఇందులో భాగంగా 27న డా.గజల్ శ్రీనివాస్ గాన కచేరి, 29న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం ఉంటుంది. 29న ఉదయం శ్రీవెంకటేశ్వరస్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. భక్తులు అధికంగా పాల్గొని స్వామి వారి తీర్ధప్రసాదాలను స్వీకరించాలని కమిటీ సభ్యులు కోరుతున్నారు. -
జాబితా విడుదల
టీచర్ల సీనియారిటీ ● ఈ నెల 21 నుంచి 26 వరకు అభ్యంతరాల స్వీకరణ ● డీఈఓ యూ.మాణిక్యం నాయుడువిజయనగరం అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి యూ.మాణిక్యం నాయుడు తెలిపారు. ఈ జాబితా ఆధారంగానే భవిష్యత్తులో బదిలీలు, పదోన్నతులు, ఇతర పరిపాలన చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకుల ఆదేశాల మేరకు స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జీటీలు సమానమైన సిబ్బంది వర్గాలకు సంబంధించిన సీనియారిటీ జాబితాను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఉపాధ్యాయులు తమ వివరాలను పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. పదోన్నతుల జోన్లో ఉన్న ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా, అందరూ తమ సీనియారిటీ వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు తెలిపారు. జీఓ 610 ద్వారా జిల్లాకు బదిలీ అయిన ఉపాధ్యాయులు తమ డీఎస్సీ మార్కులు, ర్యాంక్ వివరాలను సమర్పించి సీనియారిటీ సరిచేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. లేకపోతే వారిని సంబంధిత డీఎస్సీలో జూనియర్గా పరిగణించే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే నోషనల్ సీనియారిటీ పొందిన ఉపాధ్యాయులు తగిన ఆధారాలు సమర్పించి సీనియారిటీ తప్పులు ఉన్నట్లు గుర్తించినందున, వాటిని సరిచేసుకుని అప్డేట్ చేయాలని సూచించారు. -
కలకలం రేపిన లేగ దూడల కళేబరాలు
జామి: మండలంలోని అలమండ, కొవ్వాడ గ్రామాల మధ్యలో ఉన్న పల్లె గెడ్డలో సుమారు 15 లేడదూడల కళేబరాలు తీవ్ర కలకలం రేపాయి. సోమవారం స్థానికులు గెడ్డలో లేడదూడల కళేబరాలను చూసి ఆందోళనకు గురయ్యారు. ఈ కళేబరాలు ఈ గెడ్డలో ఏ విదంగా పడి ఉన్నాయి అని పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి ఇన్ని మృత్యువాత పడిఉండడం గమనార్హం. స్థానికులు లేగ దూడలను, పశువులను సంతలకు పెద్ద పెద్ద లారీలపై తరలిస్తుంటారని సోమవారం అలమండ సంత కావడంతో వాటిని కబేళాకు తరలించడానికి వాహనాల్లో కాళ్లకు తాళ్లు కట్టి చుట్టూ గోనె సంచులు కడుతుంటారని దీంతో గాలి లేక చిన్నవి కావడంతో మృత్యువాత పడి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.పశువులను కబేళాలకు ఏవిధంగా తరలిస్తున్నారో అనడానికి ఇదే నిదర్శనం. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ పశురవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. అధికారులు బృందం సందర్శన విషయం తెలుసుకున్న ఎస్సై వీర జనార్దన్, పశు వైద్యాధికారి నరేష్కుమార్, పంచాయతీ కార్యదర్శి ఎర్నమ్మ ఘటనా స్ధలానికి వెల్లి పరిశీలించి కేసు నమోదు చేశారు.


