breaking news
Parvathipuram Manyam
-
ధరాఘాతం..!
ఆయిల్ పామ్ ధర బాగుంది కదా అని రైతులు సాగుపై ఆసక్తి చూపించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారు 35వేల ఎకరాల్లో సాగు చేపట్టారు. అయితే గతేడాది వరకు నిలకడగా సాగిన ఆయిల్పామ్ ధర ఒక్కసారిగా తిరోగమనం బాట పట్టింది. పదిరోజుల వ్యవధిలోనే ధర పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రెండు వారాల్లోనే రూ.2వేల వరకు ఆయిల్పామ్ ధర తగ్గింది. ఈ తగ్గుదల మరింత ఉండే అవకాశం ఉందని వ్యాపారవర్గాలు పేర్కొంటుండడంతో ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ● ఒక్కసారిగా పడిపోయిన ఆయిల్పామ్ రేటు ● పదిరోజుల వ్యవధిలో టన్నుకు రూ.2వేలు తగ్గింపు ● ఆందోళనలో రైతులు ● జిల్లాలో 35వేల ఎకరాల్లో సాగు ●ధరలను స్థిరీకరించాలి రెతులను ఆదుకునేందుకు ఆయిల్పామ్ ధరలను స్థిరీకరించాలి. రాష్ట్రంలో, కేంద్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆయిల్పామ్ రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలి. సమీక్షల పేరుతో కాలయాపన చేయకుండా ఆయిల్ పామ్ రైతులను ఆదుకునేందుకు కనీస మద్దతు ధరను ప్రకటించాలి. –కెంగువ పోలినాయుడు, రైతు, కంబవలస, కొమరాడ మండలం●దిగుమతి సుంకం పెంచాలి ఆయిల్ పామ్కు గతంలో 27.5 శాతంగా ఉన్న దిగుమతి సుంకం ప్రస్తుతం 10 శాతానికి తగ్గిపోవడంతో పెట్టుబడి పెరిగి ఆయిల్పామ్ ధరలు తగ్గిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ప్రభుత్వం హయాంలో టన్ను రూ.23వేలు ఉన్న ధర ప్రస్తుతం తగ్గిపోయింది. దిగుమతి సుంకం పెంచితే ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం స్పందించి ఆయిల్పామ్ ధరలను పెంచి రైతులను ఆదుకోవాలి. –అంబటి గౌరునాయుడు, రైతు, సంతోషపురం, గరుగుబిల్లి మండలంపార్వతీపురం: ఆయిల్ పామ్ ధరలు రోజురోజుకు పతనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది వరకు నిలకడగా సాగిన ధరలు ప్రస్తుతం తిరోగమన బాట పట్టాయి. పదిరోజుల వ్యవధిలో నే టన్నుకు రూ.2వేల మేర ధర తగ్గడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పదిరోజుల క్రితం వరకు రూ.20,290లున్న టన్ను ధర నేడు రూ.18,650కి పడిపోయింది. అంతర్జాతీయ పరి ణామాలు, ముడిచమురు ధరల ఆధారంగా ఆయిల్పామ్ ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతుంటా యి. అంతర్జాతీయంగా ఆయిల్పామ్కు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. దిగుమతి సుంకం తగ్గింపు ప్రభావం ధరలపై పడడంతో చివరిగా రైతులు నష్టపోతున్నారు. గత ఏడా ది వరకు ఆయిల్పామ్పై దిగుమతి సుంకం 27.50 శాతం ఉండడంతో దేశీయ సాగు విక్రయాలపైనే శతశాతం ఆధారపడి డిమాండ్ బట్టి దిగుమతి చేసుకునే అవకాశం ఉండేది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 27.50 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని 17.50 శాతానికి తగ్గించారు. ఇదే అదునుగా భావించి మార్కెట్లో కంపెనీలు, వ్యాపారులు అమాంతం ధరలు తగ్గించి కొనుగోలుకు తెరతీశారు. రెండు వారాల్లోనే రూ.2వేల వరకు ధర తగ్గింది. ఈ తగ్గుదల మరింత ఉండే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని పార్వతీపురం, కురుపాం, గరుగుబిల్లి, కొమరాడ, సీతానగరం, పాలకొండ, సాలూరు, జియ్యమ్మవలస, మక్కువ మండలాల్లో వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఆయిల్పామ్ సాగును రైతులు ఆశాజనకంగా చేస్తున్నారు. గత 15 ఏళ్లుగా ఏటా జిల్లాలో సాగు విస్తీర్ణం పెరుగుతూనే వస్తోంది. రెండేళ్ల క్రితం వరకు 20వేల ఎకరాల్లో ఉన్న ఆయిల్పామ్ సాగు ప్రస్తుతం 35వేల ఎకరాల వరకు చేరింది. ఆయిల్పామ్ ధరలు తగ్గడం కారణంగా అనుబంధ ఉత్పత్తులు కూడా ధరలు తగ్గితే రైతులపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. -
పురం పరువు గోవిందా!
● గాడి తప్పుతున్న మున్సిపల్ పాలన ● చీలిపోతున్న ఉద్యోగులు ● పెన్డౌన్కు దిగిన సిబ్బంది ● పట్టణ సమస్యలు గాలికి సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం పురపాలక సంఘం పరువు పోతోంది. పుర పాలన గాడి తప్పుతోంది. నిత్యం ఏదో ఒక సమస్యతో వార్తల్లో నిలుస్తోంది. పట్టణ ప్రజల సమస్యలను గాలికి వదిలేసి, ఉద్యోగులు సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వివాదాలతో రచ్చకెక్కుతున్నారు. ఏడాదిగా వివాదాలు.. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో పాలన మారింది. ఇదే సమయంలో మున్సిపల్ పాలక వర్గం మాత్రం.. వైఎస్సార్ సీపీదే. మధ్యలో అడ్డదారిలోనైనా మున్సిపల్ పీఠాన్ని కై వసం చేసుకోవాలని కూటమి నాయకులు విఫలయత్నం చేశారు. అది కుదరలేదు. ఈలోగా కొంతమంది కౌన్సిలర్లు కూటమి పక్షాన చేరారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు రాకతో పరిస్థితి మొత్తం మారిపోయింది. అభివృద్ధి కుంటుపడిందన్నది ప్రధాన ఆరోపణ. సాధారణ సమావేశాలు సైతం చాలా రోజులు నిర్వహించక అభివృద్ధికి మోకాలడ్డారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం కూటమి వార్డులపై ఫోకస్ పెట్టి.. వైఎస్సార్సీపీ వార్డులను, సభ్యులను టార్గెట్ చేశారు. పాలకవర్గం తీసుకునే నిర్ణయాలకు ఏకీభవించకుండా ఏకపక్షంగా వ్యవహరించారు. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన తాత్కాలిక ఉద్యోగులను తొలగిస్తూ కక్ష సాధింపునకు దిగారు. సిబ్బంది మధ్య విభేదాలు కొద్ది రోజులుగా సిబ్బంది మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. చివరికి కుర్చీలు విసురుకోవడం మొదలు.. పెన్డౌన్ చేపట్టి విధులు బహిష్కరించే వరకూ వచ్చింది. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, రెవెన్యూ విభాగం అధికారి రూబిన్ మధ్య చాలా రోజుల నుంచి పొసగడం లేదు. తనకు సంబంధించిన మెడికల్ బిల్లుల విషయమై ఆర్వో రూబిన్.. కమిషనర్ను కొద్ది రోజుల క్రితం నిలదీశారు. ఆ తరువాత తమను ఆర్వో దూషించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కమిషనర్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నల్లబ్యాడ్జీలతో కార్యాలయం ఆవరణలో నిరసన తెలిపారు. ఆ మరుసటి రోజే సెలవు విషయమై ఇద్దరి ఉద్యోగుల మధ్య ఘర్షణ జరిగింది. కార్యాలయంలోనే కేకలు వేసుకోవడంతోపాటు.. కుర్చీలు విసు రుకున్నారు. తాజాగా గురువారం కూడా ఆర్వో రూబిన్ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉద్యోగులు పెన్డౌన్కు దిగారు. మున్సిపల్ చైర్పర్సన్ బి.గౌరీశ్వరికి ఫిర్యాదు చేశారు. ఈ వివాదం ఇప్పటికై నా చల్లారుతుందా, లేదా అన్నది చూడాలి. ప్రధానంగా కమిషనర్ తీరు ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంటోంది. ఆయనపై గతంలోనూ అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విచారణకు వచ్చిన ఆ శాఖ ఆర్డీ ఎదుట కూడా పలువురు నేరుగా ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో మున్సిపల్ సిబ్బంది అవినీతిపైనా ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకూ ఏ ఒక్కరిపైనా తీసుకున్న చర్యలు శూన్యం. కార్యాలయంలో పని చేస్తున్న మరికొంతమంది కూడా కమిషనర్ తీరుపై గుర్రుగా ఉన్నారు. పాలన గాలికి.. సిబ్బంది మధ్య విభేదాలు, రాజకీయ కారణాలతో పుర పాలన పూర్తిగా గాడి తప్పింది. పట్టణంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. మంచినీరు, పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది. మరోవైపు ఉద్యోగులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా రు. కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే వారు తిరిగి.. తిరిగి విసిగిపోవాలే గానీ... ప్రయోజ నం ఉండటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఈఈను నేను.. కాదు నేను..!
● ఇద్దరు ఈఈల మధ్య కుర్చీలాట ● ప్రభుత్వం నియమించిందని ఒకరు, కోర్టు జీఓ సస్పెండ్ చేసిందని మరొకరు.. ● ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ ఈఈ పోస్టుపై నెలకొన్న ఉత్కంఠ సీతంపేట: సీతంపేట ఐటీడీఏ గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖలో ఈఈ (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) పోస్టుపై ఉత్కంఠ నెలకొంది. ఇద్దరు ఈఈల మధ్య గురువారం కుర్చీలాట కొనసాగింది. కార్యాలయంలో వేర్వేరు కుర్చీల్లో ఇద్దరు కూర్చోవడంతో ఎవరు తమ ఈఈ అన్న ప్రశ్న కిందిస్థాయి ఉద్యోగుల్లో తలెత్తింది. కార్యాలయానికి వచ్చేవారు ఎవరికి రిపోర్టు చేయాలో తెలియక సందిగ్దంలో పడ్డారు. వివరాలు పరిశీలిస్తే.. ఏడు నెలల కిందట సీతంపేట ఈఈ పోస్టు ఖాళీగా ఉండడంతో రమాదేవిని నియమించా రు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఈ నెల 9న ఆమె స్థానంలో కె.వి.ఎస్.ఎన్ కుమార్ను ఇక్కడ నియమించి రమాదేవిని నెల్లూరుకు బదిలీ చేశారు. ఈ నెల 11న కుమార్ సీతంపేట ఈఈగా బాధ్యతలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా బాధ్యతలు స్వీకరించిన ఏడు నెలలకే తనను బదిలీ చేశారంటూ రమాదేవి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బదిలీ జీఓను హైకోర్టు ఆరు వారాల పాటు సస్పెండ్ చేసింది. కోర్టు ఆదేశాలతో తను ఇక్కడే ఈఈగా కొనసాగుతున్నట్టు రమాదేవి స్పష్టం చేశారు. ప్రభుత్వ బదిలీ జీఓ ప్రాప్తికి తనుకూడా ఇక్కడే ఈఈగా విధులు నిర్వహిస్తున్నట్టు కుమార్ తెలిపారు. ఈ సమస్యను ఉన్నతాధికారులు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే. -
చిన్నబగ్గ ఆశ్రమ పాఠశాల సమీపంలో ఏనుగులు
సీతంపేట: మండలంలోని చిన్నబగ్గ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల సమీపంలో ఏనుగులు సంచరిస్తున్నట్లు గిరిజనులు తెలిపారు. గోరపాడు కొండల్లో బుధవారం తిష్ఠ వేసిన ఏనుగుల గుంపు కొండ దిగి చిన్నబగ్గవైపు వచ్చి ఆశ్రమపాఠశాలకు కొద్దిదూరంలో ఉన్న జీడితోటల్లో ఘీంకరిస్తున్నాయి. అటువైపు ఎవ్వరూ వెళ్లవద్దని అటవీశాఖ ఎఫ్బీవో కె. దాలినాయుడుతో పాటు ట్రాకర్లు సూచిస్తున్నారు. విద్యార్థుల ప్రవేశాలు మరింత పెరగాలికొమరాడ: గిరిజన సంక్షేమ ప్రభుత్వ ప్రాథమి క పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు గత ఏడా ది కంటే మరింత పెరగాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఉపాధ్యాయులతో అన్నారు. ఈ మేర కు గురువారం ఆయన కొమరాడ మండలంలోని అంకుళ్లవలస, రావి కర్రివలస గ్రామాల్లో గల గిరిజన సంక్షేమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి ఆకస్మికంగా సందర్శించా రు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించి వారితో ముచ్చటించారు. పాఠశాలలో చేరిన విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్యను అందివ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు. పీఎస్ల హేతుబద్ధీకరణకు సలహాలివ్వండిపార్వతీపురం టౌన్: జిల్లాలోని పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణకు తగిన సలహాలు ఇవ్వాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల ప్రతినిధులను కోరా రు. అలాగే ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితాను తయారు చేయడంలో బీఎల్ఓలతో సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువా రం ఆమె తన చాంబర్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నెలా డీఈఓ లేదా ఈఆర్ఓ స్థాయిలో సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించినట్లు తెలిపారు. ఈ విషయమై ఈసీ జారీ చేసే నియమాలు, మార్గదర్శకాలపై తగిన సలహాలను జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల నుంచి కోరుతున్నట్లు ఆమె చెప్పారు. ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితా ను తయారు చేయడంలో బీఎల్ఓలకు సహకరించాలని, ఇందుకు గుర్తింపు పొందిన రాజకీ య పార్టీలు ప్రతి పోలింగ్ స్టేషన్కు బూత్ లెవె ల్ ఏజెంట్ను నియమించాలని సూచించారు. -
డ్రగ్స్ రహిత జిల్లాకు భాగస్వాములు కావాలి
● కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పార్వతీపురంటౌన్: డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల నియంత్రణపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అసుతోష్ శ్రీవాస్తవతో కలిసి కలెక్టర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. ఆర్సీఎం నుంచి బయల్దేరిన ర్యాలీ కలెక్టరేట్ వరకు సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే మత్తు పదార్థాల పట్ల అవగాహన ఉండాలని, దీని నియంత్రణకు విద్యార్థులను చైతన్యవంతులను చేయాలని. అప్పుడే సమాజం నుంచి డ్రగ్స్ను పూర్తిగా రూపుమాపవచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. జిల్లాలో డ్రగ్స్ ను రూపుమాపవలసిన గురుతర బాధ్యత విద్యార్థులపై ఉందని, దానికోసం ఈగల్ క్లబ్బులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా పార్వతీపురంలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామన్నారు. డ్రోన్ టెక్నాలజీ, సీసీ కెమెరాలు, చెక్పోస్టులను ఏర్పాటు చేసి మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ట నిఘా పెట్టినట్లు చెప్పారు. 1,873 కేజీల గంజాయి స్వాధీనం గతేడాది 22 గంజాయి కేసులను నమోదుచేసి 1,873 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 22 వాహనాలను సీజ్ చేశామని కలెక్టర్ చెప్పారు. గంజాయి సరఫరా చేసే వారిపై కూడా కచ్చితంగా కేసులను నమోదు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో సారా కూడా ఉంటుందని, దీనికోసం నవోదయం 2.0 కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. గంజా యి, సారా రహిత గ్రామాలుగా పార్వతీపురం మన్యం మన్యం జిల్లాను తీర్చిదిద్దాలని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయచంద్ర, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాస్తవ, పాలకొండ డీఎస్సీ రాంబాబు, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, జిల్లా వైద్యారోగ్యరోగ్య శాఖాధికారి డా.ఎస్. భాస్కరరావు, యువత పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో యువకుడి మృతి
శృంగవరపుకోట: ఇంటిముందు మావిడాకుల తోరణాలు వాడనేలేదు. పెళ్లింట సందడి ముగియనే లేదు. విధి ఆడిన ఆటలో నవవరుడు ప్రాణాలు చాలించాడు. తాళికట్టిన భర్త తరలిరాని లోకాలకు వెళ్లాడని తెలిసి నవవధువు శోకంతో కుప్పకూలిపోయింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన లగుడు ప్రదీప్(26)కు ఇటీవల పెళ్లయింది. ప్రదీప్ తల్లితో కలిసి గురువారం గడ్డి కోసేందుకు వెళ్లాడు. గడ్డిమోపు పట్టుకుని తిరిగి వస్తున్న సమయంలో తెగి ఉన్న విద్యుత్ తీగ తగిలి షాక్కు గురయ్యాడు. దీంతో తల్లి అరుపులతో పక్క పొలాల్లో ఉన్న గ్రామస్తులు పరుగున వచ్చి చూసేసరికే ప్రదీప్ అనంతలోకాలకు వెళ్లిపోయాడు. భర్త పార్ధివదేహాన్ని చూసి భార్య ఏడుస్తుంటే గ్రామస్తుల కళ్లు చెమర్చాయి. కాగా ఈ ఘటనపై ఇటు విద్యుత్శాఖ అధికారులు కానీ, అటు పోలీస్ ఉద్యోగులు కానీ నోరు మెదపలేదు. ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. -
నేడు జగన్నాథుని రథయాత్ర
విజయనగరం టౌన్: జగన్నాథస్వామి రథయాత్ర మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో స్వామివారికి గురువారం వేకువజామునుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక సంతపేట, దాసన్నపేట, మన్నార్ రాజ గోపాలస్వామి ఆలయం ఆవరణలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కళావాహన, బింబ దర్శనం, నేత్రోత్సవం, ప్రసాద వినియోగం గావించారు. సాయంత్రం స్వామివారి శాంతి కల్యాణోత్సవం, రాత్రి రథోత్సవానికి స్వామివారిని సిద్ధం చేశారు. రక్షాబంధనాలు ధరించారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9.30 గంటలకు మేళతాళాలతో స్వామివారి రథారోహణ కార్యక్రమం చేపట్టనున్నట్లు అధికారులు, కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. భక్తులందరూ స్వామివారిని దర్శించి, తరించాలని కోరారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేతబొబ్బిలిరూరల్: మండలంలోని పారాది గ్రామం వద్ద వేగావతి నదిలో అక్రమంగా ఇసుకను తవ్వి తరలిస్తున్న ట్రాక్టర్ను ఆర్డీఓ జేవీవీ రామ్మోహనరావు గురువారం పట్టుకున్నారు. ట్రాక్టర్ను నిలువరించేందుకు ప్రయత్నించినా డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోవడంతో ఆర్డీఓ ఆదేశాల మేరకు మెట్టవలసలోని యజమాని మీసాల చంద్రశేఖర్ ఇంటి వద్ద ట్రాక్టర్ను ఆర్ఐ రామకుమార్, సిబ్బంది గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇసుక అక్రమ తరలింపు, ఆపకుండా వెళ్లిపోయినందుకుగాను రూ.20వేల జరిమానా విధించామని ఆర్ఐ రామకుమార్ తెలిపారు. బ్యాటరీల చోరీ● ఆందోళన చెందుతున్న వాహన యజమానులు పార్వతీపురం రూరల్: పట్టణంలోని కొత్తవలస ఫ్లైఓవర్ కింద పార్కింగ్ చేసి ఉంచిన మూడు లగేజీ వ్యాన్లు, ఒక లారీకి ఉన్న బ్యాటరీలను గుర్తుతెలియని దుండగులు అపహరించారని వాహన యజమానులు ఆందోళన చెందారు. గతంలో కూడా ఎన్నోమార్లు ఈ విధంగా వాహనాలకు ఉన్న బ్యాటరీలను వైర్లను చిందరవందరంగా కోసి దొంగిలించారని వాపోయారు. ఈ మేరకు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. గురువారం ఉదయం వాహనాల వద్దకు వెళ్లేసరికి వైర్లు కట్చేసి ఉండడంతో బ్యాటరీలు లేకపోవడాన్ని గమనించినట్లు తెలిపారు. దీంతో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దాడికి గురైన వ్యక్తి మృతిబొబ్బిలి: పట్టణ పరిధిలోని గ్రోత్సెంటర్లో రాఘవ కన్స్ట్రక్షన్స్ స్టోర్లో వాచ్మన్గా పనిచేస్తున్న కనిమెరకల వెంకటరమణ(55) పై ఈనెల 20న గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. వెంకట రమణ కుమారుడు పురుషోత్తమరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ కె.సతీష్ కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎప్పటిలాగానే వెంకట రమణ విధులకు హాజరయ్యాడు. సరిగ్గా రాత్రి 12.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కంపెనీలోకి ప్రవేశించి బలమైన ఆయుధంతో వెంకటరమణ ముఖం, తలపై బలంగా దాడి చేశాడు. దీంతో వెంటనే స్థానికులు బొబ్బిలి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స అనంతరం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం వేకువజామున మృతి చెందాడు. దాడి చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు మూడు టీమ్లను నియమించామని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
రామయ్యా..చూడవేమయ్యా..!
● పవిత్ర బోడికొండను తవ్వేస్తున్న అక్రమార్కులు ● మనోభావాలను దెబ్బతీస్తున్నారని భక్తుల ఆగ్రహం ● స్పందించని అధికార యంత్రాంగంనెల్లిమర్ల రూరల్: సాక్షాత్తు శ్రీరాముడే నడయాడిన నేలగా రామతీర్ధాన్ని భక్తులు విశ్వసిస్తుంటారు. నీలాచలం పర్వతంగా పిలుస్తున్న రామతీర్థంలోని బోడికొండపై పాండవులు సంచరించినట్లు చరిత్ర చెబుతోంది. కొండపై శ్రీ కోదండరాముడి ఆలయంతో పాటు అలనాటి చారిత్రక గుర్తులను చూసేందుకు సందర్శకులు నిత్యం కొండపైకి వెళ్తుంటారు. అంతటి సుదీర్ఘ చరిత్ర కలిగిన బోడికొండను సైతం అక్రమార్కులు విడిచిపెట్టడం లేదు. గడిచిన కొద్ది నెలలుగా ధనార్జనే లక్ష్యంగా శ్రీరాముడి కొండనే తవ్వేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. సీతారామునిపేట జంక్షన్ సమీపంలో ఉన్న కొండవద్ద గడిచిన కొన్ని రోజులుగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. సమీప గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతుండడంతో కొందరు అక్రమార్కులు జేసీబీలు, ట్రాక్టర్లను పెట్టి కొండను తవ్వేస్తున్నారు. పట్టపగలే ఈ వ్యవహారం జరుగుతున్నా..ఇటు దేవస్థానం అధికారులు కానీ, అటు రెవెన్యూ యంత్రాంగం కానీ స్పందించకపోవడం బాధాకరం. కొండపై ఉన్న పెద్దపెద్ద బండరాళ్లు సైతం కిందపడుతున్నాయంటే తవ్వకాలు ఏ విధంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ట్రాక్టర్ లోడును పరిధిని బట్టి రూ.600 నుంచి రూ.1000 వరకు అమ్మేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నెల్లిమర్ల–రణస్థలం ప్రధాన రహదారి పక్కనే ఈ అక్రమ తవ్వకాలు జరుగుతుండడం గమనార్హం. ప్రభుత్వ భూములకు ఎలాగూ రక్షణ లేదు సరికదా.. సాక్షాత్తు దేవుడి కొండనైనా అక్రమార్కుల నుంచి కాపాడలేరా..? అంటూ భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి బోడికొండను తవ్వేస్తున్న అక్రమార్కులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
దోమల కాయిల్స్తో అనర్థాలు
● మార్కెట్లో విచ్చలవిడిగా నాశిరకం బ్రాండ్ల విక్రయాలు ● సహజ పద్ధతులే మేలంటున్న వైద్యులుపార్వతీపురం: దోమకాటుతో అనారోగ్యానికి గురవుతామన్న భయంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా మార్కెట్లో లభించే మస్కిటో కాయిల్స్ను వాడడం పరిపాటిగా మారింది. మార్కెట్లో లభించే మస్కిటో కాయిల్స్తో పాటు మస్కిటో అగరబత్తీలను విరివిగా వినియోగిస్తున్నారు. వాటి ద్వారా వచ్చే పొగతో దోమలు రావని భావించి వెలిగిస్తుంటారు. పొగ బయటకు పోకుండా ఇంట్లోని తలుపులన్నీ బిగించి ఈ కాయిల్స్ను వెలిగిస్తారు. ఈ పొగలో కార్సినోజెనిక్ రసాయనాలు కలిగిఉండడం వల్ల ఆస్తమా ఉన్న వారికి, చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులకు శరీరంలో పలు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. నిజానికి మస్కిటో కాయిల్స్ వినియోగం వల్లే కేవలం దోమలు చనిపోవడం లేదు. ఆ పొగ ఉన్నంత సేపు దోమలు సంచరించేందుకు వీలులేక మగతగా ఉండి వాసన తగ్గిన తరువాత అలాగే పొగ ప్రభావం తగ్గిన వెంటనే యథావిధిగా మళ్లీ దోమలు దాడికి పాల్పడతాయి. రోజురోజుకు దోమలు ప్రబలడంతో మార్కెట్లోకి నాశిరకం బ్రాండ్లు కూడా వచ్చి ప్రజల ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. ప్రకటనలతో మరింత ఆకర్షణగా.. గతంలో రీఫిల్స్ను 30, 35, 60 రాత్రులు పనిచేస్తాయంటూ విక్రయించేవారు. ప్రస్తుతం హై, లో ఆప్షన్లతో 45 ఎంఎల్ రీఫిల్స్ను విక్రయిస్తున్నారు. వాటిని హైలో పెట్టుకుంటే 10 నుంచి 15 రోజులు వస్తాయి. లో ఆస్షన్లో పెడితే 20 నుంచి 25రోజుల వరకు వస్తాయన్న ప్రత్యేకమైన ప్రకటనలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఇది తాత్కాలిక ఉపశమనంగా ఉన్నప్పటికీ ముందుముందు ఆరోగ్యానికి ప్రమాదమేనని వైద్యునిపుణులు హెచ్చరిస్తున్నారు, రీఫిల్స్లో ఉండే ప్రాలేత్రిన్, పెర్మేత్రిన్, ట్రాన్స్ఫ్లోత్రిన్ వంటి కృత్రిమ కీటక నాశకాలు వెలువడే పొగతో మన శ్వాసకోస వ్యవస్థ మరింత ప్రభావితం అవుతుంది. ఈ రసాయనాలు వాయువులో చేరి ఊపిరితిత్తులను బాధించి ఆస్తమా, బ్రాంకై టీస్ వంటి శ్వాససంబంధిత వ్యాధులకు దారితీసే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనలు సైతం వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే పార్వతీపురం, పాలకొండ, కురుపాం పరిసరాలలో ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.సహజ మార్గాలను ఉపయోగిస్తే మేలుప్రజలు ఈ దోమల ప్రభావం నుంచి కాపాడుకునేందుకు కాయిల్స్, రీఫిల్స్ వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వాడిన తరువాత గదిని బాగా వెంటిలేట్ చేయాలి. ఈ నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రసాయన రీఫిల్స్కు బదులు సహజ మార్గాలను ఉపయోగించాలి. నిమ్మ, లవంగం, తులసి వంటి సహజ పదార్థాల ద్వారా దోమలను దూరం చేసే ప్రయత్నాలు అనారోగ్యానికి గురిచేయండా మేలుచేస్తాయి. వీలైనంత మేరకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పడుకోవడానికి ఉపయోగించే బెడ్షీట్లు ఎండలో ఉంచుతూ శుభ్రం చేసుకోవాలి. కిటికీలు, వెంటిలేషన్స్కు మెస్ల అమరిక మంచిది. పడుకునే గదిలో గాలి ఆడేలా చూసుకుంటూ అవసరమైతే దోమతెరలు వినియోగించాలి. – డా.ఎన్ఎంకే తిరుమల ప్రసాద్, పీహెచ్సీ వైద్యాధికారి, బందలుప్పి -
గ్రామ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలి
పార్వతీపురం: గ్రామసర్వేయర్లు ఎదుర్కొంటున్న స మస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం కలెక్టరేట్కు ర్యాలీగా వచ్చి కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స ర్వేయర్ల సంఘం నాయకుడు ఉదయ్ కుమార్ మా ట్లాడుతూ ఐదేళ్ల సర్వీసు పూర్తయినప్పటికీ రేషనలైజేషన్లో కానీ, బదిలీ ప్రక్రియనులోకానీ తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. గ్రామ సర్వేయర్లుగా ఉన్న తమకు సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గరుగుబిల్లి, పార్వతీపురం, కొమరాడ, కురుపాం, జియ్యమ్మవలస, పాలకొండ, వీరఘట్టం, సీతంపేట తదితర మండలాల నుంచి సర్వేయర్లు పాల్గొన్నారు. కలెక్టర్కు వినతిపత్రం అందజేత -
వృద్ధిరేటు పెరిగేలా ప్రణాళికలు
పార్వతీపురంటౌన్: వ్యవసాయం, అనుబంధ రంగాలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో వృద్ధిరేటు గణనీయంగా పెరిగేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పేర్కొన్నారు. సుపరిపాలన కార్యక్రమం నేపథ్యంలో ప్రభుత్వ శాఖాధికారులతో సమీక్ష సమావేశాన్ని కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ శ్యామ్ప్రసాద్ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో నిర్దేశించిన లక్ష్య సాధన దిశగా ప్రతి ఏటా 15 శాతం కంటే ఎక్కువ వృద్ధి రేటు సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ముందుకు వెళ్లేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. ముఖ్యంగా వ్యవసాయం, తృణధాన్యాలు, డ్రోన్ల వినియోగం, ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణతో అధిక ఆదాయం పొందాలని అభిప్రాయ పడ్డారు. అదేవిధంగా పాల దిగుబడి గతేడాది కంటే ఈ ఏడాది మరింత పెరిగేలా చర్యలు చేపట్టాలని, పశు సంపదను ప్రోత్సహించడంతో అధిక ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. అలాగే మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖల వారికి నిర్దేశించిన లక్ష్యాల ప్రగతిలో వృద్ధి రేటు గణనీయంగా పెరగాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో జిల్లా ప్రణాళిక, వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, అటవీ, పశుసంవర్థక, వైద్యారోగ్య, ఇంటర్మీడియట్ విద్యశాఖల అధికారులు పి.వీర్రాజు, కె.రాబర్ట్ పాల్, వై.క్రాంతి కుమార్, వై.శ్రీదేవి, జేపీఏ ప్రసూన, డా.ఎస్.మన్మథ రావు, డా.ఎస్.భాస్కరరావు, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డా.ఎం.వినోద్ కుమార్, డీఆర్డీఏ పీడీలు ఎం.సుధారాణి, డా.టి.కనకదుర్గ, వై.నాగేశ్వరరావు, పరిశ్రమల కేంద్రం ఎ.డి పి.సీతారాము, జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఆర్అండ్బీ ఇరిగేషన్ ఈఈలు ఒ.ప్రభాకరరావు, ఎస్.రామచంద్రరావు, డీఎస్.ప్రదీప్, ఎ.ఢిల్లీశ్వర రావు, పంచాయతీ రాజ్ డీఈఈ కె.సంజీవరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
రైతు సమస్యపై రాజకీయం వద్దు
వీరఘట్టం: మండలంలోని పాలమెట్ట గ్రామంలో నాగావళి నదికి అనుసంధానంగా ఉన్న ఓపెన్ హెడ్ చానల్ పనులు చేపట్టేందుకు ఓ రైతుగా తాను వచ్చానని, రైతు సమస్యను రాజకీయం చేయవద్దని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ కోరా రు. బొడ్డగెడ్డ వద్ద పాలమెట్ట–నీలానగరం ఓపెన్ హెడ్ చానల్ పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది రైతు సమస్య. మా పూర్వీకుల నుంచి ఏటా ఖరీఫ్ సమయంలో కాలువ నిర్వహణను ఓ వ్యక్తికి అప్పగిస్తున్నామని అధికార యంత్రాంగానికి, మీడియాకు తెలియజేశారు. ఓపెన్హెడ్ చానల్ కింద బిటివాడ, కుమ్మరిగుంట, నీలానగరం, ఎంవీ పురం, పనసనందివాడ, తలవరం గ్రామాల రైతులకు చెందిన 2,500 ఎకరాల ఆయకట్టు ఉందని, ఏటా రైతులు సంయుక్తంగా ఈ కాలువను బాగుచేసుకుని పంట పొలాలకు సాగునీరు అందేలా చేసుకుంటున్నారన్నారు. కూటమి నేతలు కాలువ పనులు చేపట్టనీయకుండా రెండు రోజులుగా ఈ ప్రాంత రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అరకొరగా పనులు చేపట్టి.. ఇటీవల పాలమెట్ట–నీలానగరం ఓపెన్ హెడ్ చానల్ పనులను రూ.11 లక్షల ఖర్చుతో అరకొరగా చేపట్టి నిధులను పక్కదోవ పట్టించి రైతులను కూటమి నేతలు మోసగిస్తున్నారని ఎమ్మెల్సీ విక్రాంత్ ధ్వజమెత్తారు. ఈ ప్రాంత రైతులు తమ పంట కాలువను తామే బాగు చేసుకుంటామంటే ఎందుకు అభ్యంతరాలు చెబుతున్నారని ప్రశ్నించారు. అంతకు ముందు బిటివాడ, కుమ్మరిగుంట, నీలానగరం, ఎంవీ పురం, పనసనందివాడ, తలవరం గ్రామాల రైతులతో కలిసి టెంకాయలు కొట్టి కాలువ పనులను ఎమ్మెల్సీ విక్రాంత్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ దమలపాటి వెంకటరమణనాయుడు, వీరఘట్టం జెట్పీటీసీ జంపు కన్నతల్లి, వైస్ ఎంపీపీ పర్రి విజయకుమారి, వైఎస్సార్సీపీ నాయకులు నిష్టల సన్యాసిరావు భుక్త, పాలవలస నందకుమార్, పొట్నూరు లక్ష్మ ణరావు, వావిలపల్లి పురుషోత్తమరావునాయుడు, శిష్టు మధుసూదనరావు, బౌరోతు రాజశేఖర్, దేవకివాడ భుజంగరావు, బెవర అప్పలనాయుడు, పన్నింటి శ్రీను, భుగత అమృతరావు, భోగి మణి, ఉత్తరావల్లి వెంకటరమణ, ఆరు గ్రామాల రైతులు పాల్గొన్నారు. భారీగా మోహరించిన పోలీసులు పాలమెట్ట గ్రామంలో గురువారం తెల్లవారేసరికి పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. గామంలోకి వచ్చే ప్రతి ఒక్కరి ఫొటోను సెల్ఫోన్తో తీయడంతో ఏం జరుగుతోందోనని ఆందోళన చెందారు. ఎమ్మెల్సీ విక్రాంత్ రైతులతో కలిసి పాలమెట్ట ఓపెన్ హెడ్ చానల్ పనులు ప్రారంభించేందుకు వస్తున్నారని, బందోబస్తుకు వచ్చామని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. చానల్ పనుల ప్రారంభ కార్యక్రమం ప్రశాంతంగా జరగడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ విజ్ఞప్తి పాలమెట్ట ఓపెన్హెడ్ చానల్ పనులకు శ్రీకారం మద్దతు పలికిన ౖరైతాంగం -
దేవదాయ భూముల పరిరక్షణకు చర్యలు
● జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్విజయనగరం అర్బన్: దేవస్థానం భూముల్ని అన్ని విధాలా పరిరక్షించడానికి చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జిల్లా స్థాయి దేవాదాయ భూముల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ 11 వేల ఎకరాల భూమి దేవదాయ శాఖ పరిధిలో ఉందని అందులో కొంత ఆక్రమిత భూమి ఉందని, ఈ భూమికి వెంటనే సర్వే చేయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అలాగే మాన్సాస్ ట్రస్టుకు చెందిన భూమిలో కూడా ఆక్రమణలు ఉన్నాయని, ఇందులో వ్యవసాయ, నివాస, వాణిజ్య పరంగా ఆక్రమించిన వివిధ సంస్థల ఆక్రమిత భూములకు సంబంధించి రూ.50 లక్షల వరకు యూజర్ చార్జీల కింద ఆక్రమణదారులు చెల్లించారని తెలిపారు. అయితే ఎటువంటి యూజర్ చార్జీలు చెల్లించకుండా కమర్షియల్గా వినియోగిస్తున్న దేవదాయ భూముల్లోని సముదాయాలను తొలగించాలని, అందుకు రెవెన్యూ అధికారులు పోలీస్ వారి సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. భూముల విషయంలో కోర్టు ఆర్డర్స్ను వెంటనే అమలు చేయాలని స్పష్టం చేశారు. మ్యుటేషన్స్ చేయవలసిన వాటి వివరాలను మండలాల వారీగా ఆర్డీఓలకు అందజేయాలని, ఆర్డీఓలు వెంటనే మ్యుటేషన్ జరిగేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, దేవదాయశాఖ ఎ.సి శిరీష, ఆర్డీఓలు సవరమ్మ, రామ్మోహన్ రావు, ఆశయ్య, సర్వే ఎ.డి రమణమూర్తి, జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జున రావు, డీఎస్పీ వీరకుమార్, డిప్యూటీ కమిషనర్, ఏఓలు పాల్గొన్నారు. -
రోడ్డు ఇలా.. బడికెళ్లేదెలా?
చిత్రంలో పెద్దపెద్ద గుంతలతో బురదమయంగా కనిపిస్తున్నది జియ్యమ్మవలస మండలం పరజపాడు– పెదకుదమ రోడ్డు. చినుకుపడితే చాలు చిత్తడిగా మారుతోంది. ఈ రోడ్డుపై రాకపోకలకు పరజపాడు, లక్ష్మీపురం గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు నరకం చూస్తున్నారు. రోడ్డు బాగుచేయాలంటూ కూటమి నేతలను వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. వర్షం కురిస్తే బడికి వెళ్లాలంటేనే భయం వేస్తోందన్నారు. పక్కా రోడ్డు నిర్మించాలని సర్పంచ్ పలు సార్లు మండల సర్వసభ్య సమావేశాల్లో మెరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. – జియ్యమ్మ వలస రూరల్ -
అరెరె.. తమ్ముడి పనేనా!
సాక్షి, పార్వతీపురం మన్యం: కలెక్టరేట్ వద్ద గత సోమవారం బలిజిపేట మండలం పెదపెంకి ఎంపీపీ–1 పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేపట్టిన నిరసనకు కూటమి నాయకులు రాజకీయాలు అద్దేందుకు విఫలయత్నం చేస్తున్నారు. తమ పాఠశాల నుంచి 3, 4, 5 తరగతులను మరోచోటకు విలీనం చేయవద్దని జూన్ 12వ తేదీ నుంచి విద్యార్థులు పోరాటం చేస్తూనే ఉన్నారు. పిల్లలను బడులకు కూడా తల్లిదండ్రులు పంపడం లేదు. వారి సమస్య పరిష్కారంపై ఎవరూ స్పందిలేదు. ఇప్పటికే దఫదఫాలుగా ఆందోళన చేస్తున్న వారు ఈ నెల 23న పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే జోగారావుకు సమస్యను వివరించి, వినతిపత్రం అందజేశారు. తిరుగు ప్రయాణంలో వారు వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. కొంతమంది విద్యార్థులు గాయపడ్డారు. వాస్తవంగా జరిగింది ఇదీ.. దీన్ని రాజకీయం చేసి, మాజీ ఎమ్మెల్యే జోగారావునే పిల్లలను ధర్నాకు తీసుకొచ్చినట్లు కూటమి నాయకులు ప్రచారానికి ఎత్తుకున్నారు. మంత్రి లోకేశ్కు ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది ఎవరు? జరిగిన ఘటనను పూర్తిగా వక్రీకరిస్తూ.. మాజీ ఎమ్మెల్యేనే బాధ్యుడిని చేస్తూ.. పాఠశాల సమయంలో నిర్లక్ష్యంగా వ్యహరించిన హెచ్ఎం, ఎంఈవోలపై చర్యలు తీసుకోవాలని శ్యామ్ అనే వ్యక్తి.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ను ట్యాగ్ చేస్తూ ‘ఎక్స్’లో పోస్టు చేశాడు. ఈ శ్యామ్ అనే వ్యక్తి పక్కా టీడీపీ కార్యకర్త. పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్రకు అనుచరుడు. సోషల్ మీడియా ఖాతాలనూ అతనే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేతో పాటు.. మంత్రి లోకేశ్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోనూ పలు సందర్భాల్లో ఫొటోలు దిగాడు. ఒక టీడీపీ కార్యకర్త.. వాస్తవాలను వక్రీకరిస్తూ, పోస్టులు పెట్టగానే చర్యలకు ఆదేశాలివ్వడం, నిర్ధారణ చేసేయడం గమనార్హం. టీడీపీ వారు ఏది చెబితే అదే రాజ్యాంగమా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ రాజకీయమే అందామా?ఆటో ప్రమాద ఘటనలో గాయపడిన చిన్నారులకు ఆర్థిక సహాయం నిమిత్తం టీడీపీ నాయకులు బుధవారం ఆస్పత్రికి వెళ్లి మరీ ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున నగదు అందించారు. కొద్ది రోజులుగా పిల్లలు పోరాటం చేస్తున్నా, తమకేమీ తెలియదన్నట్లు చెబుతున్న తెలుగుదేశం పార్టీ పెద్దలు.. వారి సమస్య వినే తీరిక లేని నేతలు.. పిల్లలకు ప్రమాదం జరిగితే పరామర్శ చేయడం, ఆర్థిక సాయం అందించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మానవతాదృక్పథంతో ఆ మొత్తం ఇచ్చారా.. లేకుంటే తాము వేసిన స్కెచ్ పారలేదనీ.. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి తల్లిదండ్రులను మభ్యపెట్టడానికే ఇచ్చారా.. దీన్నీ రాజకీయమే అనుకోవాలా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో ఎమ్మెల్యే సొంత గ్రామమైన నర్సిపురంలో ప్రమాదం జరిగితే.. ఏ ఒక్కరైనా ఎందుకు పరామర్శకు వెళ్లలేదని, ఇప్పుడే ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు.దయచేసి రాజకీయాలు చేయొద్దు.. మా పిల్లల భవిష్యత్తు కోసం స్వచ్ఛందంగానే గత సోమవారం ధర్నాకు వచ్చాం. ఇందులో ఎవరి ప్రమేయమూ, ఒత్తిడి లేదు. దయచేసి ఎవరూ ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దు. వీలైతే పాఠశాలను తరలించకుండా చూడండి. – సంతో‹Ù, విద్యార్థి తండ్రిమంత్రిని మభ్యపెట్టిన ఎమ్మెల్యే? తమను ఎవరూ పిలవలేదని.. పిల్లల పాఠశాల సమస్యపై తామే స్వచ్ఛందంగా వచ్చామని ఇప్పటికీ సంబంధిత పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆటో ప్రమాద ఘటన దురదృష్టవశాత్తు జరిగిందే గానీ.. ఇందులో ఎవరి ప్రమేయమూ లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయంలో టీడీపీ నేతలు అత్యుత్సాహానికి పోయి, స్వయానా మంత్రి లోకేశ్ను మభ్యపెట్టి, సామాజిక మాధ్యమాల్లో తమ అనుచరునితో పోస్టులు పెట్టించి, డైవర్షన్ పాలిటిక్స్కు తెర తీయడం విమర్శలకు తావిస్తోంది. తన అనుచరుని నిర్వాకాన్ని దాచిపెట్టి.. హడావిడిగా స్థానిక ఎమ్మెల్యే సైతం.. మాజీ ఎమ్మెల్యేనే నిందిస్తూ, ప్రకటన జారీ చేయడం గమనార్హం.ఏం జరుగుతోంది... ప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత బుధవారం పోలీసులు ఆస్పత్రికి వెళ్లి బాధితులతో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. అంటే.. ఈ ఘటనపై ఇప్పటి వరకూ పోలీసులు వివరాలేవీ సేకరించలేదా, లేకుంటే ఎవరి ఒత్తిడైనా ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు రోజు కూడా పాఠశాలకు వెళ్లిన అధికారులు విచారణ చేపట్టారు. పిల్లల భవిష్యత్తుపైనా రాజకీయాలకు ముడిపెట్టి, తమ స్వప్రయోజనాల కోసం కూటమి నాయ కులు చేస్తున్న ప్రయత్నాలపై తల్లిదండ్రుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
వీఆర్ఏల నిరసన హోరు
పార్వతీపురం టౌన్: ఒకటిరెండు రోజులు కాదు.. ఏకంగా ఏడాదిగా ఆందోళనలు చేస్తున్నాం. వీఆర్ఏలకు ఉద్యోగోన్నతులు లేవు. చాలీచాలని జీతాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారు లేరు. ఖాళీలు భర్తీచేయకపోవడంతో అదనపు పనిభారం పడుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోతోందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా కలెక్టరేట్ వద్ద బుధవారం ఆందోళన చేశారు. నెలకు ఇచ్చే రూ.11,000 వేతనంతో కుటుంబాలను నెట్టుకురాలేకపోతున్నామంటూ అధికారులకు గోడు వినిపించారు. వీరికి మద్దతుగా సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. వీఆర్ఏల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏడాది కాలంగా నిరసనలు తెలిపినా.. వినతి పత్రాలు అందజేస్తున్నా సమస్యలు పరిష్కరించేవారు కనిపించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వలే ఇక్కడా వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అటెండర్, నైట్ వాచ్మన్లుగా వీఆర్ఏలకు ఉద్యోగోన్నతులు కల్పించాలని, అదనపు విధుల నుంచి ఉపశమనం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రెడ్డి వేణు, గొర్లి వెంకటరమణ, వీఆర్ఏలు పాల్గొన్నారు.ఆర్థిక కష్టాలు వీఆర్ఏలకు నెలకు ఇచ్చే వేతనం కేవలం రూ.11,000. జిల్లా వ్యాప్తంగా 338 మంది వీఆర్ఏలు ఆర్థికంగా చితికిపోతున్నారు. మహిళలు అని చూడకుండా నైట్ వాచ్మన్ విధులకు పంపుతున్నారు. ఖాళీగా ఉన్న వాచ్మన్, అటెండర్ పోస్టులు భర్తీ చేయాలి. అదనపు పనిభారం నుంచి విముక్తి కలిగించాలి. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయినా మా సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నిరసనలు మరింత ఉద్ధృతం చేస్తాం. – ఈశ్వరరావు, వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు, పార్వతీపురం మన్యం -
గురువారం శ్రీ 26 శ్రీ జూన్ శ్రీ 2025
● ఏది రాజకీయం.. చేయించిందెవరు? ● పెదపెంకి పిల్లల ప్రమాద ఘటనను ‘డైవర్షన్’ చేసేందుకు ప్రయత్నం ● మంత్రి లోకేశ్కు ‘ఎక్స్’లో పోస్టు చేసింది టీడీపీ కార్యకర్త శ్యామ్ ● ఎమ్మెల్యే విజయచంద్రకు అనుచరుడిగా గుర్తింపు ● వాస్తవాలు బయటకు రావడంతో ‘తప్పు’ను కప్పిపుచ్చే యత్నంన్యూస్రీల్ ఇదీ రాజకీయమే అందామా?ఆటో ప్రమాద ఘటనలో గాయపడిన చిన్నారులకు ఆర్థిక సహాయం నిమిత్తం టీడీపీ నాయకులు బుధవారం ఆస్పత్రికి వెళ్లి మరీ ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున నగదు అందించారు. కొద్ది రోజులుగా పిల్లలు పోరాటం చేస్తున్నా, తమకేమీ తెలియదన్నట్లు చెబుతున్న తెలుగుదేశం పార్టీ పెద్దలు.. వారి సమస్య వినే తీరిక లేని నేతలు.. పిల్లలకు ప్రమాదం జరిగితే పరామర్శ చేయడం, ఆర్థిక సాయం అందించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మానవతాదృక్పథంతో ఆ మొత్తం ఇచ్చారా.. లేకుంటే తాము వేసిన స్కెచ్ పారలేదనీ.. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి తల్లిదండ్రులను మభ్యపెట్టడానికే ఇచ్చారా.. దీన్నీ రాజకీయమే అనుకోవాలా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో ఎమ్మెల్యే సొంత గ్రామమైన నర్సిపురంలో ప్రమాదం జరిగితే.. ఏ ఒక్కరైనా ఎందుకు పరామర్శకు వెళ్లలేదని, ఇప్పుడే ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. -
పిల్లలు లేని ఫౌండేషన్ స్కూల్!
బోధించేందుకు టీచర్ ఉన్నారు. కానీ పాఠాలు వినేందుకు ఒక్క విద్యార్థి కూడా లేరు. ఇది సంతకవిటి మండలం గుజ్జన్నపేట ప్రాథమిక పాఠశాల దుస్థితి. దీనిని కూటమి ప్రభుత్వం ఈ ఏడాది ఫౌండేషన్ స్కూల్గా మార్పుచేసి ఇక్కడ కొనసాగే 3, 4, 5 తరగతులను చిత్తారిపురం యూపీ స్కూల్లో విలీనం చేసింది. ఇప్పటివరకు ఇక్కడ రెండో తరగతి చదుతున్న ఒకే ఒక విద్యార్థి కూడా ప్రస్తుతం పాఠశాలకు రావడం లేదు. కొత్తగా ఒకటి రెండు తరగతుల్లో విద్యార్థులు ఎవరూ చేరలేదు. అంతే... టీచర్ ఎస్.నారాయణమ్మ విధులకు సమయానికి హాజరుకావడం, వెళ్లిపోవడమే జరుగుతోంది. విద్యాశాఖాధికారులు స్పందించి ఫౌండేషన్ స్కూల్ను రద్దుచేసి, ప్రాథమిక పాఠశాలను కొనసాగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఏం చేస్తారో వేచిచూడాల్సిందే. – సంతకవిటి -
కొత్తవలస కేజీబీవీలో అగ్నిప్రమాదం
కొత్తవలస: మండలంలోని తుమ్మికాపల్లి పంచాయతీ శివారు అడ్డూరువానిపాలెం వద్ద గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బుధవారం తెల్లవారు జూమున 3.30 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో విశాఖపట్నానికి చెందిన రోటరీ క్లబ్ సంస్థ వారు బాలికలకు వితరణగా మంగళవారం అందజేసిన 280 పరుపులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు 79 మందికి చెందిన అభ్యసన సామగ్రి కాలిబూడిదయ్యా యి. కాలకృత్యాలు తీర్చుకునేందుకు లేచిన ఇద్దరు బాలికలు ప్రమాదాన్ని గుర్తించి అందరినీ అప్రమత్తం చేశారు. వెంటనే బాలికలందరూ భవనం నుంచి బయటకు పరుగుతీశారు. విద్యాలయం సిబ్బంది అందించిన సమాచారం మేరకు కొత్తవలస, ఎస్.కోట అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. పై అంతస్తులో ప్రమాదం కావడంతో మంటలు అదుపుచేయడం కష్టతరమైంది. ఉదయం 7 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. బాలికలకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఎస్ఓ విజయకుమారితో పాటు బాలికల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. కొందరు తల్లిదండ్రులు పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. విద్యాలయాన్ని సందర్శించిన పీఓ ప్రమాద వార్త తెలిసిన వెంటనే సర్వశిక్షా అభియాన్ పీఓ డాక్టర్ అవగడ్డ రామారావు విద్యాలయానికి చేరుకున్నారు. ప్రమాదం తీరును ఎస్ఓ, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేశారు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, డీఈఓ మాణిక్యంనాయుడు సందర్శించి విద్యార్థినులకు ధైర్యం చెప్పారు. కాలిపోయిన అభ్యసన సామగ్రి, ఇతర వస్తువులు కొనుగోలుకు రూ.2లక్షలు మంజూరు చేసినట్లు పీఓ రామారావు తెలిపారు. సహాయక చర్యలు ప్రమాద స్థలాన్ని కొత్తవలస మండల పరిషత్ మాజీ అధ్యక్షులు గొరపల్లి శివ, మేజర్ పంచాయ తీ సర్పంచ్ మచ్ఛ ఎర్రయ్యరామాస్వామి, వైఎస్సార్సీపీ నాయుకులు చెల్లయ్యలు పరిశీలించా రు. పాఠశాలకు 20 మంది పారిశుద్ధ్య కార్మికులు, ఎలక్ట్రికల్ సిబ్బందిని పంపించి సహాయక చర్యలు అందించారు. కాలిబూడిదైన 280 పరుపులు, 79 మంది విద్యార్థుల అభ్యసన సామగ్రి సురక్షితంగా బయటపడిన 270 మంది బాలికలు విద్యుత్ షార్ట్సర్క్యూట్ వల్ల ప్రమాదం -
డీడీఆర్ఎఫ్ఓగా సింహాచలం
పార్వతీపురంటౌన్: జిల్లా విపత్తు స్పందన మరియు అగ్నిమాపక అధికారిగా పి.సింహాచలం బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ను కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో విపత్తులు, వరదల సమయంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆయనకు సూచించారు. జిల్లాలోని నాలుగు అగ్నిమాపక కేంద్రాల పరిస్థితి, సిబ్బంది, మౌలిక సదుపాయాలను ఆరా తీశారు. సచివాలయ ఉద్యోగుల నిరసన సాక్షి, పార్వతీపురం మన్యం: తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ పార్వతీపురం మున్సిపల్ పరిధిలోని సచివాలయ ఉద్యోగులు పురపాలక సంఘ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన చేపట్టారు. సచివాలయ ఉద్యోగుల జాబ్చార్ట్ను తక్షణమే ప్రకటించాలని, రేషనలైజేషన్కు సంబంధించి మిగులు ఉద్యోగులపై స్పష్టత ఇవ్వాలని, ఉద్యోగోన్నతులు, పెండింగు బకాయిల విడుదల చేయాలని కోరారు. సచివాలయ శాఖకు చట్టబద్ధత కల్పించాలన్నారు. డిమాండ్లన్నీ పరిష్కరించిన తర్వాతే బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ ఆర్టీఐ విభాగ రాష్ట్ర కార్యదర్శుల నియామకంపార్వతీపురం రూరల్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఇద్దరు నాయకులకు వైఎస్సార్సీపీ రాష్ట్ర ఆర్టీఐ విభాగంలో పదవులు దక్కాయి. పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన దేవుపల్లి నాగరాజును జనరల్ సెక్రటరీగా, కురుపాం నియోజకవర్గానికి చెందిన చందక వెంకటేశ్వరరావును సెక్రటరీగా నియమిస్తూ బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలుపడ్డాయి. ఆశ కార్యకర్తల నియామకాలకు నోటిఫికేషన్ జారీ పార్వతీపురం టౌన్: జిల్లా వ్యాప్తంగా 34 మంది ఆశ కార్యకర్తల నియామకానికి నోటిఫికేషన్ జారీచేసినట్టు డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గ్రామీణ, గిరిజన గ్రామ సచివాలయాల పరిధిలో ఆశ కార్యకర్తల నియామకానికి ప్రభు త్వం అనుమతించిందన్నారు. సచివాలయం పరిధికి చెందిన 25–45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వివాహితులు, వితంతువులకు నియామకాల్లో ప్రాధాన్యమిస్తామన్నారు. 10వ తరగతి చదివి, తెలుగు చదవడం, రాయడం వచ్చినవారు దరఖాస్తులను జూలై 5లోగా సంబంధిత పీహెచ్సీల్లో అందజేయాలని కోరారు. -
మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి
పార్వతీపురంటౌన్: జిల్లాలోని మహిళల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడాలని, ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మిషన్మత్స్యశక్తి, జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్, గిరిబజార్ నిర్వహణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు సహాయం అందించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచి, సమాజంలో సమాన భాగస్వాములుగా చేయడానికి ఉద్దేశించిన ఒక సమగ్ర కార్యక్రమమే ‘మిషన్ మత్స్యశక్తి’ అని వివరించారు. జిల్లాలో రూ.479 కోట్లుగా ఉన్న మత్స్య సంపద ద్వారా వస్తున్న జీడీపీని రూ.600 కోట్లకు పెంచాలన్నారు. దర్తీ అభాజన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కింద 90 శాతం రాయితీ రుణాలకు 165 గిరిజన గ్రామాల ప్రజల నుంచి ఈ నెల 30లోగా ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. కనీసం 100 ఫిష్ పాండ్లను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా కోటి చేపపిల్లలు దిగుబడి రావాలని కలెక్టర్ ఉద్బోధించారు. ● జిల్లాలో ఏర్పాటు చేసే జీడిపిక్కల ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణకు అవసరమైన అన్ని అనుమతులు సిద్ధం కావాలని ఐటీడీఏ పీఓను కలెక్టర్ ఆదేశించారు. యూనిట్ నిర్వహణలో భాగంగా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. ● గిరిబజారు వాహనాలను అప్పగించనున్నామని, వాటితో గిరిజన ప్రాంతాల్లో సరుకులను విక్రయించవచ్చన్నారు. నేడు నిషాముక్త్ భారత్ ర్యాలీ నిషాముక్త్ భారత్ కార్యక్రమాన్ని గురువారం జిల్లాలో పెద్ద ఎత్తున చేపట్టాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇందులో యువత, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల జోలికి యువత వెళ్లకుండా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. నిషాముక్త్భారత్ ర్యాలీని మధ్యాహ్నం 3 గంటల నుంచి పార్వతీపురం పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన అనంతరం కార్యాలయ సెల్లార్ సమావేశ మందిరంలో సమావేశం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో పార్వతీపురం ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, ఏపీఓ ఎ.మురళీధర్, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి, పార్వతీపురం మత్స్యకార అధికారి శ్రీదేవి, జిల్లా పశుసంవర్థక అధికారి డా.ఎస్.మన్మథరావు, జిల్లా నైపుణ్యాభివద్ధి అధికారి కె.సాయికష్ణ చైతన్య, ఎల్డిఎం ఎన్.విజయ్స్వరూప్, నాబార్డు ఏజీఎం దినేష్, కేవీకే శాస్త్రవేత్త డా.శ్రీనివాస్రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
పోలీస్ వెల్ఫేర్ పాఠశాలలో టీచర్ పోస్టుల భర్తీ
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పోలీస్ వెల్ఫేర్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం తెలిపారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు తమ విద్యార్హతలతో పాటు, కచ్చితంగా ఆంగ్లంలో విద్యాబోధన చేయగలిగిన సామర్థ్యం ఉండాలని స్పష్టం చేశారు. ఉద్యోగ ఖాళీలు, విద్యార్హత వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయ ఉద్యోగం 1: డీఈడీ లేదా బీఈడీ విద్యార్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి 2వ తరగతి కోసం సింగిల్ మదర్ టీచర్ ఉద్యోగం 1సింగిల్ మదర్ టీచర్గా పని చేసేందుకు డీఈడీ, లేదా బీఈడీ అర్హతతో పాటు అన్ని సబ్జెక్టులను బోధించగలగాలి 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీషు సబ్జెక్టును బోధించేందుకు ఉపాధ్యాయ ఉద్యోగం ఖాళీ 1డీఈడీ లేదా బీఈడీ విద్యార్హత కలిగి ఉండాలి 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గణితం బోధించేందుకు ఉపాధ్యాయ ఉద్యోగం ఖాళీ 1బీఈడీ విద్యార్హత కలిగి ఉండాలి కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఖాళీ 1 కంప్యూటర్ ఆపరేటర్గా పని చేసేందుకు బీఎస్సీ లేదా బీకాం లేదా ఇతర కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన డిగ్రీ లేదా సర్టిఫికెట్ కోర్సులను అర్హతగా కలిగి ఉండాలి. తోటమాలి ఖాళీ 1 పాఠశాలలో తోటమాలిగా పని చేసేందుకు ఆసక్తి కలిగిన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవచ్చు పైన తెలిపిన ఉద్యోగాలను భర్తీ కోసం ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 30వ తేదీన ఉదయం 10గంటలకు విజయనగరం కంటోన్మెంట్ పోలీస్ క్వార్టర్స్ సమీపంలో గల పోలీస్ వెల్ఫేర్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో జరిగే ఇంటర్వ్యూ, డెమో క్లాసులకు నేరుగా హాజరుకావచ్చని ఎస్పీ పేర్కొన్నారు. మరిన్ని వివరాలు, సందేహాల నివృత్తి కోసం స్కూల్ ఆఫీసు నంబర్లు 9441022874, 6305883484 లేదా రిజర్వ్ ఇన్స్పెక్టర్ 9121109485, వెల్ఫేర్ ఆర్ఎస్సై 9121109484 నంబర్లను సంప్రదించ వచ్చని ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం -
ఇన్చార్జ్ తహసీల్దార్గా సంజీవకుమార్
పూసపాటిరేగ: పూసపాటిరేగ ఇన్చార్జ్ తహసీల్దార్గా సంజీవకుమార్ను నియమిస్తూ కలెక్టర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడినట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. సాక్షి దినపత్రికలో ‘తహసీల్దార్ ఎక్కడ?’ శీర్షికన బుధవారం కథనం వెలువడింది. దీనిపై స్పందించిన రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు పూసపాటిరేగ డిప్యూటీ తహసీల్దార్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంజీవకుమార్కు ఇన్చా ర్జ్ బాధ్యతలు అప్పగించారు. పదిరోజులుగా తహసీల్దార్ కార్యాలయంలో ఎటువంటి రెవెన్యూ సేవలు అందకపోవడంతో విద్యార్థులు, వివిధ అవసరా ల నిమిత్తం వచ్చే ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు తహసీల్దార్ బాధ్యతలు ఇన్చార్జికి అప్పగించడంతో రెవెన్యూ సమస్యలు పరిష్కారం కానున్నాయి. -
విబా ద్వారా ఉచిత శిక్షణ
విజయనగరం బ్యూటీ అసోసియేషన్ ద్వారా ఆసక్తి ఉన్న మహిళలకు, యువతకు ఉచిత శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మహిళలకు లబ్ధి చేకూర్చే బ్యూటీషీయన్ కోర్సు నేర్చుకునేందుకు దూరప్రాంతాలకు వెళ్లేవారు. ఇప్పుడు అటువంటి వారందరూ విజయనగరం జిల్లా కేంద్రంలోనే శిక్షణ తీసుకునేందుకు అనువుగా విబా ఏర్పాటుచేశాం. అసోసియేషన్ ఇక్కడ ఉండడం వల్ల పెద్దపెద్ద బ్యూటీ కంపెనీలు ఉచిత తరగతులను అందించేందుకు ముందుకు వస్తుండడం ఆనందంగా ఉంది. –బోని భాగ్యలక్ష్మి, వ్యవస్ధాపక అధ్యక్షురాలు, విజయనగరం బ్యూటీషియన్స్ అసోసియేషన్, విజయనగరం. -
ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రతకు బైక్స్
● అత్యాధునిక టెక్నాలజీతో తయారీ ● జిల్లాకు వచ్చిన 16 బైక్స్ విజయనగరం క్రైమ్: జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణ, రహదారి భద్రత కోసం కొత్తగా 16 మోటార్ సైకిల్స్ జిల్లా కేంద్రానికి వచ్చాయని ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం తెలిపారు. డీజీపీ ఆఫీస్ నుంచి జిల్లాకు వచ్చిన బైక్స్ను ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి భద్రత, ట్రాఫిక్ నియంత్రణ విధులను సమర్థవంతంగా నిర్వహిచేందుకు ఆ బైక్స్ను ఉపయోగిస్తామన్నారు. వాటిలో 15 టీవీఎస్ అపాచీ మోటార్సైకిల్స్, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉన్నాయని తెలిపారు. ఈ మోటార్ సైకిల్స్ను సైరన్, బ్లింకర్స్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం, క్రౌడ్ కంట్రోల్ చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారన్నారు. జిల్లాలో ట్రాఫిక్ అవాంతరాలు తరచూ ఏర్పడుతున్న పోలీస్స్టేషన్లకు అలాగే రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్న స్టేషన్లకు వాటిని కేటాయించనున్నా మని తెలిపారు. ఫోర్వీలర్స్ వెళ్లలేని మారుమూల ప్రాంతాలకు కూడా ఈ మోటార్ సైకిల్స్ వినియోగించి, పోలీస్ సిబ్బంది, అధికారులు చేరుకునే అవకాశముంటుందన్నారు. రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, ప్రమాదాల నియంత్రణలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఎస్పీ వకుల్ జిందల్ పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, ఆర్ఎస్సై(ఎంటీఓ) ఆర్.రమేష్ కుమార్, ఆర్ఎస్సై (అడ్మిన్) ఎన్.గోపాలనాయుడు పాల్గొన్నారు. -
ల్యాప్టాప్స్,సెల్ఫోన్ దొంగల అరెస్ట్
విజయనగరం క్రైమ్ : సెల్ఫోన్, ల్యాప్టాప్లను దొంగిలించిన కేసులో ఇద్దరు నిందితులను టూటౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. తమిళినాడు రాష్ట్రంలోని ఉదయరాజపాల్యంకు చెందిన మురుగన్ వెంకటస్వామి, గణేష్లను ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉదయ రాజ పాల్యంకు చెందిన ఇద్దరు వ్యక్తులు నగరంలోని వీటీ అగ్రహరంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. నగరంలోని స్టూడెంట్స్ రూమ్స్ లక్ష్యంగా చేసుకుని ల్యాప్ టాప్లు, సెల్ఫోన్ల అపహరణకు పాల్ప డేవారు. ఇలా విజయనగరంలోని కోటవీధి, కాటవీధి, విశాఖలోని పీఎంపాలెం వద్ద గల స్టూడెంట్స్ రూమ్ లలో దొంగతనాలకు పాల్ప డ్డారు. అయితే ఈ నెల ఆరవ తేదీన విజయనగరంలోని శివాలయం వీధికి చెందిన ఓ వ్యక్తి ల్యాప్టాప్, రెండు సెల్పోన్లు పోయినట్లు ఫిర్యాదు చేయడంతో క్రైమ్ పార్టీని రంగంలోకి దించామని టూటౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.ఈ క్రమంలోనే స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించగా ఈ ఇద్దరు నిందితులు నేరం చేసినట్లు నిర్థారణ అయిందన్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశామని వివరించారు. విచారణలో మొత్తం 57 సెల్ ఫోన్లు, 16 ల్యాప్టాప్లు, రెండు ఆపిల్ ఐ ప్యాడ్లు దొంగతనం చేసి అమ్మేసినట్లు నిందితులు అంగీకరించారని సీఐ చెప్పారు. 20 లీటర్ల సారా స్వాధీనం పార్వతీపురం రూరల్: మండలంలోని వెలగవలసలో అక్రమంగా సారా విక్రయిస్తున్న చోడిపల్లి రాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విక్రయానికి సిద్ధంగా ఉంచిన 20 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు పార్వతీపురం రూరల్ ఎస్సై బి.సంతోషి కుమారి తెలిపారు. ఈ మేరకు పట్టుబడిన వ్యక్తిని, స్వాధీనం చేసుకున్న సారాను స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
అందమే ఆనందం..!
విజయనగరం టౌన్: పెళ్లికుమార్తె ముస్తాబు చేస్తున్న బ్యూటీషియన్విజయనగరం టౌన్: ఫేషియల్ చేస్తున్న దృశ్యం● సౌందర్యానికి ప్రాధాన్యం ఇస్తున్న మహిళలు ● కాలానికి అనుగుణంగా మారుతున్న మహిళల తీరు ● ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్న సంస్థలు ● స్వయం ఉపాధికి మార్గం అంటున్న శిక్షకులు ● నేడు జాతీయ బ్యూటీషియన్ల దినోత్సవంరాజాం సిటీ:/విజయనగరం టౌన్: అందానికి ఎవరు ఎన్ని అలంకారాలు ఇచ్చినా, ఉపమానాలు చూపినా అందమే ఆనందం అంటున్నారు మహిళలు. ఆ అందం వెనుక మరో మహిళ ఉండి ఆ అందానికే వన్నెతెస్తోంది. ఇంట్లో, వీధిలో, బంధువుల ఇళ్లల్లో జరిగే వేడుకల్లో ప్రత్యేకంగా కనిపించేందుకు మహిళలు శ్రద్ధ తీసుకుంటున్నారు. కిట్టీ పార్టీల నుంచి పెళ్లిళ్ల వరకు ఏ శుభకార్యకమైనా అతివలదే సందడి. వేడుక ఏదైనా మేకప్ అదరాల్సిందే. వారి ఆశలకు అనుగుణంగానే పట్టణాల్లో బ్యూటీ పార్లర్లు కూడా విస్తరిస్తున్నాయి. అవుట్ డోర్ షూట్లు, పుట్టినరోజు, నిశ్చితార్థం ఇలా వేడుక ఏదైనా వనితకు ప్రత్యేకమే. ప్రతి శుభకార్యానికి ముందస్తు వేడుక ఇప్పుడో ట్రెండ్గా మారిపోయింది. అప్పటికప్పుడు పార్టీలకు వెళ్లేందుకు సైతం అభిరుచికి తగ్గట్టు మగువల అందానికి బ్యూటీషియన్లు మరింత వన్నె తెస్తున్నారు. నేడు జాతీయ బ్యూటీషియన్ల దినోత్సవం మహిళలు, విద్యార్థినులు సైతం అందానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఉన్న పాశ్చాత్య ధోరణి ఇప్పుడు పల్లెలకు సైతం పాకింది. పట్టణాల్లో ఏర్పాటుచేసిన బ్యూటీపార్లర్లు కూడా మగువల అభిరుచులకు తగ్గట్లు నిర్వహణ చేపడుతున్నారు. ఇదిలా ఉండగా కొద్దో గొప్పో బ్యూటీషియన్ కోర్సులు నేర్చుకున్న వారికి ఓ ఆదాయ వనరుగా కూడా కలిసొస్తోంది. ఇంటివద్దే ఉంటూ నాలుగు డబ్బులు సంపాదించి కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. పట్టణం నుంచి పల్లెల వరకు నేడు మహిళలు, చిన్నారులు సైతం అందంపైనే మక్కువ చూపుతున్నారు. ఇంట్లో చిన్న చిన్న వేడుకలతో పాటు పెళ్లిళ్ల సీజన్లో నిశ్చితార్థం మొదలుకుని ఫొటోషూట్, పెళ్లి తంతు ముగిసే వరకు మగువలు అందంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వారితో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. బ్రెడల్ మేకప్, శారీ డ్రాపింగ్, కేశాలంకరణ ఇలా ఎక్కడా మేకప్ విషయంలో రాజీపడడంలేదు. ఆదాయ వనరుగా.. బ్యూటీషియన్ కోర్సు చేసిన మహిళలకు ఇంటి వద్దే ఆదాయవనరుగా బ్యూటీ పార్లర్లు కలిసివస్తున్నాయి. ప్రతి నిత్యం ఐ బ్రో అందంగా తీర్చిదిద్దడంలో మెలకువలు పాటిస్తూ ఆదాయమార్గాలను అన్వేషిస్తున్నారు. మహిళల ఆసక్తిని, అభిరుచిని గమనించి బ్యూటీ పార్లర్లలో ప్రత్యేక అలంకరణ చేస్తున్నారు. సింగిల్ ప్యాకేజీ, హోమ్ సర్వీసెస్ ద్వారా మగువలు వారి అందాన్ని మరింత మెరుగు పరుచుకుంటున్నారు. శరీరతత్వం, మనిషిరంగు, వేడుకను బట్టి వారికి అమరేలా మేకప్ చేస్తున్నారు. మేకప్ రకం, వాడే మెటీరియల్ బట్టి పారితోషికం కూడా తీసుకుంటున్నారు. ఒక్కోసారి ఇళ్లకు తీసుకువెళ్లి మేకప్ చేయించుకునేందుకు బ్యూటీషియన్లతో ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇళ్లకు వెళ్లి మేకప్ చేసేందుకు సైతం మెటీరియల్కు అనుగుణంగా రూ.4 వేల నుంచి రూ.10వేల వరకు రేట్లు నిర్ణయించి ఆదాయం సంపాదిస్తున్నారు. శిక్షణతో ప్రోత్సహిస్తున్న సంస్థలు.. మహిళలకు ఉపాధిమార్గాలు చూపేందుకు శిక్షణ సంస్థలు కూడా బ్యూటీషియన్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ అందిస్తున్నాయి. దీంతో మహిళలు కూడా ఆసక్తి కనబరిచి శిక్షణ పొందుతున్నారు. అలాగే బ్యూటీ పార్లర్లలో పనిచేసుకుంటూ చిన్నచిన్న చిట్కాలను, మెలకువలను సైతం నేర్చుకుంటూ సొంతంగా పార్లర్లను ఏర్పాటు చేసుకుంటూ తమ కాళ్లపై తాము నిలబడగలుగుతున్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరగాలి
పార్వతీపురం టౌన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు పెరగాలని, గురువారం జిల్లావ్యాప్తంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. డిజిటల్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ సూపర్ వైజర్లు, వీఆర్ఓలు, ఉపాధ్యాయులు ఎన్రోల్మెంట్ డ్రైవ్లో పాల్గొనాలని అన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 4,132 మంది 1వ తరగతి విద్యార్థులు తక్కువగా ఉన్నారని, అవన్నీ ఈ డ్రైవ్ ద్వారా భర్తీ కావాలని తేల్చిచెప్పారు. ఇప్పటికే పాఠశాలల్లో చేరి ఆన్లైన్లో నమోదు కాని వారి వివరాలను రానున్న రెండు రోజుల్లో పూర్తిచేయాలని పేర్కొన్నారు. ఇందుకు తల్లితండ్రులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించాలని, డ్రాపౌట్ విద్యార్థులను కూడా బడిలో చేర్పించేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో తల్లికి వందనం కార్యక్రమంపై విద్యాశాఖాధికారులు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్తో కలెక్టర్ సమీక్షించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో పాటు అన్ని వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్లు పెరగాలని, ఆ దిశగా తల్లితండ్రులు, విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి బి.రాజ్కుమార్, నోడల్ అధికారి డి.మంజులవాణి, ఐసీడీఎస్ పీడీ డా.టి.కనకదుర్గ, ఎంఈఓలు, కళాశాలల ప్రిన్సిపాల్స్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 27న సుపరిపాలన కార్యక్రమం సుపరిపాలన కార్యక్రమం ఈ నెల 27వ తేదీన నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎ శ్యామ్ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. 27వ తేదీ ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్లో కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు. సమావేశంలో పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.సుధారాణి, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి ఎస్.మన్మథ రావు, జిల్లా ప్రణాళిక అధికారి పి.వీరరాజు, జిల్లా విపత్తు స్పందన/అగ్నిమాపక అధికారి పి.సింహాచలం తదితరులు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టాలి కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ -
ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
రామభద్రపురం: మండలంలోని కొట్టక్కి వట్టిగెడ్డ పాత బ్రిడ్జి సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం జీగిరాం గ్రామానికి చెందిన నూలక ప్రశాంత కుమార్(26) లారీ క్లీనర్గా పనిచేస్తున్నాడు. ఇది వరకే వివాహం జరిగి ఇద్దరు పి ల్లలు ఉండగా భార్యతో విడాకులు తీసుకున్నాడు. తరువాత తల్లిదండ్రుల వద్ద ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ప్రశాంత కుమార్ మరో అమ్మయితో ప్రేమలో పడి ఆమెను ఇంటికి తీసుకొస్తానని తల్లిదండ్రులతో చెప్పగా వద్దని మందలించారు. దీంతో ఈనెల 5వ తేదీన ఇంటి నుంచి బ్యాగ్తో వెళ్లిపోయి కొట్టక్కి బ్రిడ్జి వద్ద తన షర్ట్తో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులు పరిసర ప్రాంతాలతో పాటు బంధువుల గ్రామాల్లో కూడా వాకబు చేశారు. ఎక్కడా ఆచూకీ లేకపోవడంతో సాలూరు రూరల్ పోలీస్స్టేషన్లో తమ కుమారుడు అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బుధవారం కొట్టక్కికి చెందిన పశువుల కాపరి చెట్టు కింద కుళ్లిపోయి దుర్వాసన కొడుతూ కింద పడి ఉన్న మృతదేహాన్ని చూసి గ్రామ వీఆర్వో మహేష్కు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు వీఆర్వో పరిశీలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.వ సమాచారం అందిన వెంటనే సీఐ కె.నారాయణరావు, ఎస్సై వి.ప్రసాదరావు, ఏఎస్సై అప్పారావులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరివీలించారు. మృతదేహం వద్ద పడి ఉన్న సెల్ఫోన్ ఆధారంగా జీగిరాం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి బ్యాగుతో పాటు అందులో ఉన్న బట్టల ఆధారంగా తమ కుమారుడేనని గుర్తించి భోరున విలపించారు. మృతదేహం తీయలేని దుస్థితిలో ఉండడం వల్ల పోలీసు అధికారులు ఘటనా స్థలంలోనే బాడంగి సీహెచ్సీ వైద్యాధికారితో పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబసభ్యుల సమక్షంలో అక్కడే ఖననం చేశారు. ఎస్సై వి.ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. -
జిల్లా వేదికగా జాతీయ చెస్పోటీలు
● ఈనెల 28 వరకు జరగనున్న దివ్యాంగుల జాతీయ చెస్ చాంపియన్షిప్ ● పోటీలకు హాజరైన 16 రాష్ట్రాలకు చెందిన 150 మంది క్రీడాకారులువిజయనగరం: జాతీయస్థాయి చెస్ పోటీలకు విజయనగరం వేదికగా నిలిచింది. ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం సారథ్యంలో నిర్వహించ తలపెట్టిన 5వ జాతీయ స్థాయి దివ్యాంగుల చెస్ చాంపియన్ షిప్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని మెసానిక్ టెంపుల్లో నిర్వహిస్తున్న పోటీలను స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితిగజపతిరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీలు విజయనగరంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి పోటీలకు వచ్చిన క్రీడాకారులను ఆమె అభినందించారు. చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం జిల్లా కార్యదర్శి కేవీ జ్వాలాముఖి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలకు చెందిన 150 మంది దివ్యాంగ క్రీడాకారులు మంగళవారం జిల్లాకు చేరుకున్నారన్నారు. వారందరికీ మంగళవారం అన్ని రకాల మెడికల్ చెకప్ చేశామని చెప్పారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు అంతర్జాతీయ పోటీలకు వెళ్లనున్నారని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
● అంగన్వాడీ కేంద్రం శ్లాబ్కు ఊడిన పెచ్చులు మెంటాడ: మండలంలోని కుంటినవలసలో రెండవ అంగన్వాడీ కేంద్రం శ్లాబ్ పెచ్చులు రాలడం ఆందోళన కలిగించింది. బుధవారం కేంద్రంలో 17 మంది పిల్లలు ఉన్నారు. అప్పుడే వచ్చిన ఆ గ్రామ యువతిపై ఆ పెచ్చులు పడడంతో స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలిసిన అంగన్వాడీ సూపర్వైపర్ హైమావతి వచ్చి ఆ పిల్లలను ఇళ్లకు పంపించారు. పిల్లలకు ఏమీకాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శిథిలావస్థకు చేరిన భవనం శ్లాబ్ కింద పిల్లలను ఉంచి కేంద్రాన్ని నడపడంపై పలువురు విమర్శలు చేసిన పట్టించుకోక పోవడం గమనార్హం.కూలిన వైన్షాపు ముందుభాగంబొబ్బిలి: పట్టణంలోని మేదరి బంద వద్ద గల మద్యం దుకాణ భవనం శ్లాబ్ ముందుభాగం బుధవారం కూలిపోయింది. అదృష్టవశాత్తు మద్యం కొనుగోలుకు ఆ సమయంలో ఎవరూ రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సమాచారం అందుకున్న ఎకై ్సజ్ సీఐ పి.చిన్నం నాయుడు అక్కడికి వెళ్లి దుకాణం మూసివేయించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు మద్యం దుకాణాన్ని మార్పు చేశాక తిరిగి తెరిచేందుకు అనుమతిస్తామని వ్యాపారులకు తెలియజేశారు. గురుదేవాలో చోరీ కేసులో మరో ఇద్దరి అరెస్టు● మిస్టరీగా చోరీ సొత్తు రికవరీ కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గ్రామం సమీపంలో గల గురుదేవా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్బాబు ఇంట్లో గత నెల 28వ తేదీన దొంగలు చొరబడి భారీ ఎత్తున బంగారం, నగదు దోచుకుపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే మహారాష్ట్రకు చెందిన పార్థగ్యాంగ్లో ఒకరిని మహారాష్ట్ర వెళ్లి పట్టుకుని అరెస్టు చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. కాగా ఇదే కేసులో మహారాష్ట్రలోని బుల్దాన్ జిల్లాకు చెందిన ముత్తుపవర్ అక్షయ్, లక్ష్మణ పవర్లను అరెస్టు చేసి కొత్తవలస కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు సీఐ షణ్ముఖరావు బుధవారం తెలిపారు. కాగా ఇప్పటివరకు ఈ కేసులో కేవలం నిందితులను మాత్రమే పట్టుకుంటున్నట్లు పోలీసులు చూపుతున్నారే తప్ప ఎక్కడా చోరీకి గురైన సొత్తును రికవరీ చేస్తున్నట్లు చెప్పకపోవడం కొసమెరుపు. ఈ చోరీలో సుమారు 10కేజీల బంగారం,రూ 50లక్షలకు పైగా నగదు మాయమైనట్లు సమాచారం. నేడు ఫెన్సింగ్ క్రీడాకారుల ఎంపికవిజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా బాల, బాలికల ఎంపిక పోటీలు ఈనెల 26న నిర్వహించనున్నట్లు జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ముఖ్య శిక్షకుడు డీవీ.చారి ప్రసాద్ బుధవారం తెలిపారు. నగరంలోని విజ్జి స్టేడియంలో ఉదయం 9 గంటల నుంచి అండర్ –10, 12 విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపిక పోటీల్లో అండర్–10 విభాగంలో 2016 జనవరి 1వ తేదీ అనంతరం, అండర్–12 విభాగంలో 2014 జనవరి 1వ తేదీ అనంతరం జన్మించిన క్రీడాకారులు మాత్రమే పాల్గొనేందుకు అర్హులుగా స్పష్టం చేశారు. క్రీడాకారులు విధిగా ఫెన్సింగ్ అసోసియేషన్ గుర్తింపు కార్డు వెంట తీసుకురావాలని సూచించారు. జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 29వ తేదీన విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు ఎంపిక పోటీల్లో పాల్గొనవచ్చని మరిన్ని వివరాలకు ఫోన్ 8374737707 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
ఏపీ పీజీ ఈసెట్లో ర్యాంకుల పంట
విజయనగరం అర్బన్: ఆంధ్రయూనివర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీపీజీఈసెట్–2025 ప్రవేశ పరీక్షలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థులు ఉత్తమ ప్రతిభ చూపారు. వివిధ గ్రూప్లలో టాప్ టెన్ ర్యాంక్లు సాధించారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, నానో ఇంజినీరింగ్ పీజీ కోర్సులలో ర్యాంకుల పంట పండించారు. భరత్కు మూడో ర్యాంక్ నెల్లిమర్ల రూరల్: ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీఈసెట్–2025 ఫలితాల్లో నెల్లిమర్ల మండలం అలుగోలు గ్రామానికి చెందిన కురిమినేని భరత్ నాయుడు ప్రతిభ చూపాడు. కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో 76 మార్కులు సాధించి విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలో మూడో ర్యాంక్ను సొంతం చేసుకున్నాడు. ఉత్తమ ర్యాంక్ను సాధించిన విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు. అంపిలి విద్యార్థి ప్రతిభ పాలకొండ రూరల్: మండలంలోని అంపిలి గ్రామానికి చెందిన గేదల లక్ష్మీనారాయణ ఏపీ పీజీఈసెట్లో ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో ఏయూ పరిధిలో రెండవ ర్యాంక్ సాధించాడు. విద్యార్థి తండ్రి అప్పలనాయుడు వ్యవసాయ కూలీకాగా, తల్లి పార్వతి మరణించారు. ఎలక్ట్రికల్ విభాగంలో ఉత్తమ పరిశోధనలు చేయాలన్న తపనతో చదువుసాగిస్తున్నట్టు లక్ష్మీనారాయణ తెలిపాడు. -
గంజాయి వ్యాపారి ఆస్తుల సీజ్
విజయనగరంక్రైమ్: జిల్లాలోని రామభద్రపురం పోలీస్స్టేషన్ పరిధిలో గంజాయి ఆక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితుడైన శెట్టి ఉమామహేశ్వరరావు ఆలియాస్ హుస్సేన్ ఆలియాస్ పుతిన్కు చెందిన సుమారు రూ.2 కోట్ల విలువైన స్తిరాస్తులు సీజ్ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం తెలిపారు. విశాఖలో ఉంటున్న ఉమామహేశ్వరరావు కొంతమంది సహచరులతో కలిసి 147 కేజీల గంజాయిని తరలిస్తూ రామభద్రపురం మండలం కొట్టక్కి చెక్పోస్టు వద్ద పోలీసులకు పట్టుబడ్డాడన్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినప్పటికీ విచారణలో ఉమామహేశ్వరరావును ప్రధాన నిందితుడిగా గుర్తించి ఈ ఏడాది ఏప్రిల్ 25న పీటీ వారెంట్తో అరెస్టు చేశామన్నారు. విచారణలో 2019 నుంచి 2025 మధ్యకాలంలో ఉమామహేశ్వరరావుతో పాటు ఆయన భార్య స్వరూపరాణి, సోదరుడు వెంకటరావు పేరిట రూ.కోటి 89 లక్షల 84,768 ఆస్తులను గుర్తించి సీజ్ చేశామని, ఇంక ఎవరూ కొనుగోలు చేయకుండా చట్టపరమైన నోటీసు జారీ చేశామన్నారు. ఈ కేసు విచారణలో ప్రధాన నింధితుడైన శెట్టి ఉమామహేశ్వరరావుపై అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖ సిటీల్లో 7కు పైగా గంజాయి కేసులు నమోదయ్యా యని తెలిపారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న అదనపు ఎస్పీ సౌమ్యలత, బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు, రామభధ్రపురం ఎస్సై ప్రసాదరావులను ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు. -
డీఏ జుగా కార్యక్రమానికి విశేష స్పందన
పార్వతీపురంటౌన్: ధర్తీ ఆబాజన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కార్యక్రమం జిల్లాలో బాగా జరుగుతోందని, గిరిజన ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన జిల్లా అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెనన్స్ లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 15 నుంచి 30 వరకు డీఏ జుగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతిని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు తమకు కావలసిన అవసరాలను, ధ్రువపత్రాలను, మౌలిక వసతులను ఎక్కువగా కోరుతున్నట్లు చెప్పారు. అలాగే పీఎం జన్మన్ గృహాలను కోరుతున్నట్లు తెలిపారు. కేంద్రప్రభుత్వం అమలుచేసే పథకాలతో గిరిజన ప్రాంతాల్లో సేవలు, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయమన్నారు. గ్రామ, క్లస్టర్ స్థాయి శిబిరాల ద్వారా వివిధ సౌకర్యాలను క్షేత్రస్థాయిలో అందించేలా జిల్లా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గిరిజనులు వినియోగించుకోవాలి ఈ నెల 30 వరకు గిరిజనులకు అవసరమయ్యే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆయుష్మాన్ భారత్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, కిసాన్ క్రెడిట్ కార్డ్, పీఎం కిసాన్ కార్డులు, జన్ధన్ ఖాతా, పీఎం జేజేబీవై, పీఎం ఎస్బీవై బీమా కవరేజ్, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ సామాజిక భద్రత పింఛన్లు, ఉపాధిహామీ, పీఎం విశ్వకర్మ, ముద్ర తదితర జీవనోపాధి పథకాలు, పీఎం ఎంవీవై, ఇమ్యునైజేషన్ తదితర సీ్త్ర శిశు సంక్షేమ ప్రయోజనాలను గిరిజన ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ వివరించారు. పీవీటీజీ గృహాలు, గిరిజన గ్రామాలను గుర్తించడం, గ్రామ, క్లస్టర్ స్థాయి శిబిరాలను నిర్వహించడం, ఆరోగ్యం, ఆహారం, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, సామాజిక న్యాయం, వ్యవసాయం, రెవెన్యూ ఇతర విభాగాల సమన్వయంతో కార్యకలాపాలు చేపట్టాలన్నారు. ఆధార్, ఈ– కేవైసీ డాక్యుమెంటేషన్ సంబంధిత సేవల కోసం సంబంధిత విభాగాలు పనిచేస్తాయని స్పష్టం చేశారు. ఆధార్లో నమోదు కాని వారిని అంగన్వాడీ సిబ్బంది నమోదు చేయించాలని, గ్రామస్థాయిలో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా అధికారులు, మండల ప్రత్యేకాధికారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
క్రీడాకారులకు అండగా ఉంటాం
పాలకొండ: క్రీడాకారులకు అండగా ఉంటామని కబడ్డీ ఆసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు పల్లా కొండలరావు అన్నారు. జాతీయ స్థాయి కబడ్డీ అండర్–18 జట్టుకు ఎంపికై న రాష్ట్ర క్రీడాకారులకు మంగళవారం ఆయన అవసరమైన బ్యాగులు, కిట్లు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన 10 రోజులుగా ఇక్కడ శిక్షణ పొంది, జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాస్ఫూర్తితో వ్యవహరించి విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 27న హరిద్వార్లో జరగనున్న జాతీయస్థాయి అండర్–18 పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు మంగళవారం ఇక్కడి నుంచి బయలు దేరారు. ఈ సందర్భంగా క్రీడాకారులు కొండలరావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కబడ్డీ ఆసోసియేషన్ జిల్లా కార్యదర్శి వెన్నపు చంద్రశేఖర్, మాజీ క్రీడాకారులు దూబ వెంకటరమణ, మాజీ పీఈటీ రెడ్డి మాస్టర్ తదితరులు ఉన్నారు. -
28న సాలూరులో జాబ్ మేళా
పార్వతీపురం టౌన్: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సాలూరు శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాలలో ఈ నెల 28న ఉదయం 9 గంటలకు జాబ్మేళా జరగనుందని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, ఏదైనా డీగ్రీ చదువుకొని 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగ యువతీ యువకులు జాబ్మేళాకు అర్హులని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన యువకులు httpr://nai punyam.ap.gov.in వెబ్సైట్లో పేరు నమోదు చేసుకొని, రిఫరెన్స్నంబర్తో పాటు బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్, జెరాక్స్, ఒక పాస్ఫొటోతో జాబ్మేళాకు హాజరు కావాలని కోరారు. 12 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై అర్హత కలిగిన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 94947 77553, 73825 59022 నంబర్లను సంప్రదించాలని సూచించారు.డాక్టర్ ప్రతిభపాలకొండ రూరల్: పాలకొండ పట్టణానికి చెందిన వినోద్కుమార్ ఎయిమ్స్ సూపర్ స్పెషాలిటీ పరీక్షల్లో సత్తాచాటారు. సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో వినోద్ జాతీయ స్థాయిలో 11వ ర్యాంక్ సాధించడం ఆనందంగా ఉందని తండ్రి గణపతీశ్వరరావు, తల్లి పద్మకుమారి తెలిపారు. పాలకొండలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన వినోద్ ఎంబీబీఎస్ విద్యను శ్రీకాకుళం రిమ్స్లో, ఎంఎస్ జనరల్ సర్జన్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాలలో పూర్తిచేశారు. రాగోలు జెమ్స్లో సీనియర్ రెసిడెంట్గా విధులు నిర్వహించారు.మోహన్కాలనీ కొండల్లో ఏనుగులుసీతంపేట: మోహన్కాలనీ కొండ శిఖర పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. చిన్నబగ్గ టేకు ప్లాంటేషన్ నుంచి అక్కడకు వెళ్లిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ ఎఫ్బీఓ దాలినాయుడుతో పాటు ట్రాకర్లు ఎప్పటికప్పుడు ఏనుగుల గమనాన్ని పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.పక్కి గ్రామానికి గజరాజుల గుంపుబొబ్బిలి రూరల్: మండలంలోని పలు గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న తొమ్మిది ఏనుగుల గుంపు మంగళవారం పక్కి గ్రామ పరిసరాల్లోకి చేరుకున్నాయి. సీతానగరం మండలం నుంచి ముత్తాయివలస, కమ్మవలస, శివడవలస మీదుగా పక్కి గ్రామ పరిసరాల్లోని అరటితోటలకు చేరుకుని ధ్వంసం చేస్తున్నాయి. స్థానిక ప్రజలను అటవీ సిబ్బంది అప్రమత్తం చేశారు.భక్తిశ్రద్ధలతో దీపారాధననెల్లిమర్ల రూరల్: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీసీతారామస్వామి దేవస్థానంలో ఆంజనేయస్వామికి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. స్వామికి తమలపాకులు, సింధూరంతో అర్చనలు చేసినానంతరం హనుమాన్ చాలీషా పఠనం చేశారు. సాయంత్రం స్వామి సన్నిధిలో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో దీపారాధన చేపట్టారు. -
పునరావాస సమస్యలను పరిష్కరించాలి
పార్వతీపురంటౌన్: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ 2013 భూ సేకరణ చట్టప్రకారం సంపూర్ణమైన పునరావాస సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని కొండ మొదలు సర్పంచ్ చేపట్టిన నిరాహార దీక్షకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ వద్ద రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ముందుగా జిల్లా కేంద్రంలో ఉన్న రహదారిపై ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్కు చేరుకుని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకుడు శ్రీనునాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ 2013 భూసేకరణ చట్టప్రకారం సమస్యలు పరిష్కరించాలని, నేటికి 18ఏళ్లు గడుస్తున్నా ఏ ఒక్కరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందలేదని, తక్షణమే అందించాలని, నిర్వాసితులందరికీ పునరావాసం కల్పించి డీపట్టా సాగు చేస్తున్న ఆదివాసీలకు పూర్తి నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్ఓ హేమలతకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా ఉన్న పలు గిరిజన గ్రామాల రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
రైలులోనుంచి జారి పడి వ్యక్తి మృతి
సీతానగరం: మండలంలోని చినభోగిలి వద్ద విజయవాడ పాసింజర్ రైలులో నుంచి జారిపడి మంగళవారం ఓ వ్యక్తి మృతిచెందాడు. దీనిపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చినభోగిలి గ్రామానికి చెందిన సవరపు మనోజ్(18) విశాఖపట్నం నుంచి విజయవాడ పాసింజర్లో వస్తూ సీతానగరం రైల్వేస్టేషన్లో దిగాల్సి ఉంది. అయితే స్వగ్రామానికి వచ్చే సమయానికి ముందుగానే రైలులోనుంచి జారిపడి మనోజ్ మృతి చెందినట్లు గుర్తించామని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించినట్లు రైల్వే పోలీసులు తరలించారు. పురుగు మందు తాగి వ్యక్తి..కొమరాడ: మండలంలోని కళ్లికోట గ్రామానికి చెందిన మక్కా వ్యాపారినాయుడు(49) ఈనెల 3తేదీన మద్యం మత్తులో పురుగు తాగేయడంతో అస్వస్థతకు గురికాగా పార్వతీపురంలోని ఓ ప్రైవేట్ అస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు. అక్కడినుంచి మెరుగైన చిక్సిత కోసం విశాఖ కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడికి భార్య గౌరీశ్వరి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీనిపై కొమరాడ ఎస్సై నీలకంఠం మాట్లాడుతూ పోస్టుమార్టం నిమత్తం మృతదేహాన్ని పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. వ్యాన్ ఢీకొని వ్యక్తి..పార్వతీపురం టౌన్: పార్వతీపురం మున్సిపాలిటీలోని వివేకానంద కాలనీ గణేష్ రామ వీధికి చెందిన పతివాడ శ్రీను (52) వ్యాన్ ఢీకొని మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పతివాడ శ్రీను కొత్తవలస శివారులో నూడిల్స్, చికెన్ అమ్ముతూ ఉంటాడు. మంగళవారం మోటార్ సైకిల్పై ఇంటి నుంచి పార్వతీపురం పట్టణంలోకి వస్తుండగా రాయగడ రోడ్డులోని సాహు హాస్పిటల్ సమీపంలో రాయగడ నుంచి గుడ్లు లోడుతో వస్తున్న వ్యాన్ వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ సంఘటనలో శ్రీనుకు తీవ్ర గాయాలు కాగా గమనించిన స్థానికులు వెంటనే పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై నిమ్మకాయల భాస్కరరావు తెలిపారు.కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్యరాజాం సిటీ: మండల పరిధి గార్రాజుచీపురుపల్లి గ్రామానికి చెందిన కె.అఖిల (23) మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన కంటు చండీ ప్రసాద్కు గరివిడి మండలంలోని మందిరివలస గ్రామానికి చెందిన అఖిలతో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. మంగళవారం ఉదయం ఆమెకు ఒక్కసారిగా భరించలేని కడుపునొప్పి రావడంతో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెకు సపర్యలు చేసినప్పటికీ ఫలితంలేకుండా పోయింది. ఈ ఘటనకు సంబంధించి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
డైవర్షన్ పాలిటిక్స్!
–8లోపిల్లల ప్రమాద ఘటనపైనా.. బుధవారం శ్రీ 25 శ్రీ జూన్ శ్రీ 2025సాక్షి, పార్వతీపురం మన్యం: పాపం.. చిన్నారులు! తమ బడి కోసం ఎంతో దూరం నుంచి కలెక్టరేట్కు వచ్చారు. వారితోపాటు.. తల్లిదండ్రులు, గ్రామ పెద్దలూ ఉన్నారు. నిజమే.. స్వతహాగా ఆలోచించే నిర్ణయం తీసుకునే వయస్సు ఆ చిన్నారులది కాకపోవచ్చు. తమ బిడ్డల భవిష్యత్తుపైన తల్లిదండ్రులకు కచ్చితంగా భయం ఉంటుంది కదా!! ఊరి బడిని దూరం చేస్తామంటే.. తమ పిల్లలు ఎక్కడ తల్లడిల్లిపోతారో అని ఆ తల్లిదండ్రులు ఆలోచించారు. 3, 4, 5 తరగతులకు మరో ప్రాంతం వెళ్లాలంటే.. ఆ వయసులో కష్టమని భావించారు. అందుకే, మూకుమ్మడిగా తమ పిల్లలనే తీసుకుని సోమవారం కలెక్టరేట్కు వచ్చి ధర్నా చేపట్టారు బలిజిపేట మండలం పెదపెంకి ఎంపీపీ–1 పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు. వీరి పోరాటం కొన్ని నెలలుగా సాగుతోంది. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. నాలుగు రోజుల కిందట అక్కడ ఎంఈవో కార్యాలయం ఎదుటా ధర్నా చేశారు. ఆ సమయంలో ఎంఈవో కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాల్సిన విషయాన్ని చెబుతూ, పిల్లలకు చక్కని విద్యాబుద్ధులు నేర్పిద్దామని సర్దిచెప్పారు. అయినప్పటికీ తల్లిదండ్రులు వెనక్కి తగ్గలేదు. ఈ నెల 23న ఓ వామపక్ష నాయకుడి సహకారంతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కలెక్టరేట్ వద్ద పిల్లలతో కలసి ఉదయం 11 నుంచి గంటకుపైగా సమయం ధర్నా చేశారు. అదే సమయంలో ‘యువతపోరు’ కోసం వచ్చిన మాజీ ఎమ్మెల్యే జోగారావు అదే సమయంలో వైఎస్సార్సీపీ తలపెట్టిన ‘యువత పోరు’ కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని వైఎస్సార్ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు తదితరులు భారీ ర్యాలీగా వచ్చారు. కలెక్టరేట్ వెలుపలే పోలీసులు చాలాసేపు వారిని నిలువరించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో జోగారావు, వైఎస్సార్సీపీ నాయకులు కొంతమంది పీజీఆర్ఎస్కు వెళ్లి జిల్లా రెవెన్యూ అధికారిణి హేమలతకు వినతిపత్రం అందజేశారు. అదే సమయంలో అక్కడే ఉన్న పెదపెంకి విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు తమ ఆవేదనను ఆయనకు వినిపించారు. పాఠశాల విషయమై పీజీఆర్ఎస్లోనే ఇన్చార్జి డీఈవోతో జోగారావు మాట్లాడారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ‘యువత పోరు’ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్సీపీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. తమ ఆవేదన కూడా వినాలని మీడియా ఎదుట విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరారు. లోకేశ్ మామా.. తమ బడిని కాపాడాలని నమస్కారాలు పెడుతూ వినూత్నంగా విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు వినతిపత్రం అందించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఆ కార్యక్రమం ముగిసిపోయింది. ఎవరికి వారు వెళ్లిపోయారు. న్యూస్రీల్ప్రమాదాన్నీ రాజకీయం చేసి.. అక్కడ నుంచి డీఈవో కార్యాలయానికి.. కలెక్టరేట్ నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వెళ్లినట్లు తెలుస్తోంది. సాయంత్రం వరకూ అక్కడే ఉన్నారని సమాచారం. అనంతరం సాయంత్రం సమయంలో తాము వచ్చిన ఆటోలపైనే స్వగ్రామానికి పయనమయ్యారు. మార్గమధ్యంలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో కొంతమంది పిల్లలు తీవ్ర గాయాలపాలయ్యారు. విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఘటనా స్థలానికి చేరుకుని, వారిని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల ప్రమాదాన్ని.. మాజీ ఎమ్మెల్యేనే వారిని స్వయంగా ధర్నాకు తీసుకెళ్లారని తప్పుడు ప్రచారంతో ఓ వ్యక్తి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ను ట్యాగ్ చేస్తూ, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఘటనతో ఏ సంబంధమూ లేని ఎంఈవో, హెచ్ఎంలపై చర్యలు తీసుకోవాలని సూచనలు కూడా చేశాడు. ఆ వ్యక్తి చెప్పింది నిజంగా భావించిన మంత్రి లోకేశ్.. ఘటనపై చింతిస్తూ, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను సోషల్ మీడియా వేదికగా ఆదేశించారు. వాస్తవాలు తెలిసి కూడా ఎల్లో మీడియా సైతం మాజీ ఎమ్మెల్యేపైనే నిందలు వేస్తూ దుష్ప్రచారానికి దిగింది. విద్యార్థుల ప్రమాద ఘటన మానవత్వం ఉన్న ఏ ఒక్కరికై నా దిగ్భ్రాంతి కలిగించకమానదు. బహుశా మంత్రి లోకేశ్ కూడా తక్షణం ఆ విధంగానే స్పందించి ఉంటారు. విద్యార్థులతో రాజకీయాలు చేయవద్దంటూ సూచించారు. ఇదే అదునుగా వాస్తవాలను కప్పిపుచ్చి, స్థానిక కూటమి నాయకులు రెచ్చిపోయారు. మాజీ ఎమ్మెల్యేనే విద్యార్థులను ధర్నాకు తీసుకొచ్చారని సోషల్ మీడియాలో విష ప్రచారం మొదలుపెట్టారు. దీనికి పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కూడా జత కలిసి అదే తరహాలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్లే పెదపెంకి–1 పాఠశాలలో 3, 4, 5 తరగతులు మరోచోటకు విలీనం అయ్యాయి. కూటమి ప్రభుత్వ నిర్వాకం వల్లే.. ఆ ఊరి పిల్లలకు, తల్లిదండ్రులకు చదువు బెంగ పట్టుకుంది. కూటమి ప్రభుత్వ నిర్వాకం వల్లే.. విద్యార్థులు పాఠశాలకు వెళ్లే సమయంలో ధర్నాలకు దిగారు. వీరి నిర్వాకాన్ని కప్పిపుచ్చి, ఒక ప్రమాద ఘటనను వైఎస్సార్సీపీపై నెట్టి, డైవర్షన్ పాలిటిక్స్కు కూటమి నేతలు తెర తీశారు. పాఠశాల ఉంచుతారా లేదా అన్న విషయంపై స్పష్టత ఇవ్వకుండా అనవసర విషయాలతో మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కూటమి నేతల కుఠిల రాజకీయాలు శకునికి మించి వ్యూహాలు తమ బడి కోసం కలెక్టరేట్కు స్వచ్ఛందంగా వచ్చిన పెదపెంకి విద్యార్థులు తిరిగి వెళ్తుండగా ప్రమాదం ఘటనకు, మాజీ ఎమ్మెల్యే జోగారావుకు ముడిపెడుతూ దుష్ప్రచారం -
డ్రోన్తో దోమల నివారణ మందు పిచికారీ
గుమ్మలక్ష్మీపురం: జిల్లాలో మలేరియా నియంత్రణలో భాగంగా డ్రోన్లతో దోమల నివారణ మందు పిచికారీకి శ్రీకారం చుట్టామని డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు తెలిపారు. గుమ్మలక్ష్మీపురం మండలం లుంబేసు పంచాయతీ పరిధి గౌడుగూడ గ్రామంలో డ్రోన్తో దోమల నివారణ మందు పిచికారీ ప్రక్రియను మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమాన్ని ప్రోగ్రాం అధికారులతో కలిసి పర్యవేక్షించారు. గ్రామ పరిసరాల్లో ఉన్న నీటినిల్వ కుంటలపై టెమీఫాస్ మిశ్రమాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో దోమల నివారణ చర్యలకు సాంకేతికత దోహదపడుతుందన్నారు. గ్రామాల్లో జ్వరనిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు మందులు అందుబాటులో ఉంచాలని వైద్య సిబ్బందికి సూచించారు. దీనికి ముందు ఆయన టిక్కబాయి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్యంపై ఆరాతీశారు. సిక్ రిజిస్టర్ సక్రమంగా నిర్వహించాలన్నారు. ఆయన వెంట జిల్లా మలేరియా నివారణ అధికారి వై.మణి, ఆర్బీఎస్కే జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్మోహన్రావు, డీఎల్ఏటీఓ డాక్టర్ వినోద్, తాడికొండ పీహెచ్సీ వైద్యులు అభిలాష్, మలేరియా కన్సల్టెంట్ రామచంద్ర, తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు -
పొదుపు సంఘాల లక్ష్యంలో ప్రభుత్వం విఫలం
విజయనగరం గంటస్తంభం: ఏ లక్ష్యంతో పొదుపు సంఘాలు పెట్టారో ఆ లక్ష్యం నేరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సీహెచ్.రమణి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కె.పుణ్యవతి ఆధ్వర్యంలో స్థానిక ఎన్పీఆర్ భవనంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా రమణి మాట్లాడుతూ..డ్వాక్రా సంఘాలను ఏ లక్ష్యంతో ఏర్పాటు చేశారో ఆ లక్ష్యం నెరవేరలేదన్నారు. పొదుపు చేసిన డబ్బులే రూ.లక్ష నుంచి రూ.ఐదు లక్షల వరకు బ్యాంకులో ఇవ్వడం సరికాదన్నారు. సీ్త్ర నిధి రుణాల్లో అనేక లోపాలు ఉన్నాయని ఆరోపించారు. సక్రమంగా కట్టినా అఽధిక వడ్డీలు తీసుకుంటు న్నారని మండిపడ్డారు. విజయనగరం జిల్లాలోని కళ్లేపల్లి గ్రామంలో రూ.18 లక్షల వరకు అవినీతి జరిగితే ఐద్వా పోరాడి డబ్బులు సుమారు రూ.13 లక్షలు వరకు ఇప్పించినట్లు చెప్పారు. పెన్షన్ ఇస్తామని చెప్పి మహిళల దగ్గర వసూలు చేసిన అభయ హస్తం డ బ్బులు ఏమయ్యామని ప్రశ్నించారు. అత్యధిక బ్యాంకులు డ్వాక్రా మహిళాలకు గౌరవం ఇవ్వడం లేదన్నారు. అప్పును సక్రమంగా కట్టిన వారు ఎవరైనా ఉన్నారంటే వారు డ్వాక్రా మహిళలేనన్నారు. పొదుపు మహిళల సమస్యలు పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శులు పుణ్యవతి, లక్ష్మి, సహాధ్యక్షురాలు ఆర్.కృష్ణవేణి, జిల్లా కమిటీ సభ్యులు జి.అరుణ, కరుణ పాల్గొన్నారు. ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి రమణి -
తహసీల్దార్ ఎక్కడ?
● 10 రోజులుగా స్తంభించిన రెవెన్యూ సేవలు ● అయోమయంలో పూసపాటిరేగ మండల ప్రజలుపూసపాటిరేగ: పూసపాటిరేగ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విధుల్లో చేరి రోజు తిరగక ముందే వచ్చిన స్థానానికే మళ్లీ వెనక్కి వెళ్లడంతో పూసపాటిరేగ మండల ప్రజల్లో అయోమయం నెలకొంది. ఈనెల 13వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నుంచి ఎన్వీ రమణ తహసీల్దార్గా పూసపాటిరేగలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన మరుసటి రోజు నుంచే ఏమైందో ఏమో కానీ ఆయన విధులకు హాజరు కావడం లేదు. తహసీల్దార్ కార్యాలయానికి ధ్రువీకరణ పత్రాలతో పాటు వివిధ అవసరాల నిమిత్తం వచ్చిన విద్యార్థులు, ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇంటర్వ్యూలు, విద్యాసంస్థల్లో జాయిన్ అవడానికి ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కనీసం ఇన్చార్జ్ బాధ్యతలు ఎవరికి ఇచ్చినా ఇబ్బందులు ఉండేవి కావని పలువురు వాపోతున్నారు. గంటల వ్యవధిలో ఉద్యోగంలో చేరడం, వెనక్కి వెళ్లడం ఏమిటనేది అంతు చిక్కని ప్రశ్నగా పూసపాటిరేగ మండల ప్రజలకు మిగిలింది. పూసపాటిరేగ తహసీల్దార్గా పనిచేసిన తాడ్డి గోవిందను కలెక్టరేట్లోని ‘సి’ సెక్షన్కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో సాలూరు నుంచి ఎన్వీ రమణ వచ్చి విదుల్లో చేరారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ తహసీల్దార్ను రిలీవ్ చేయకుండానే పూసపాటిరేగలో ఆయన విధుల్లో చేరడంతో ఆగ్రహించిన కలెక్టర్ తహసీల్దార్ను వెనుక్కి పిలిచారని ఓవాదన వినిపిస్తుండగా, మరో వాదన మాత్రం రాజకీయంగానే తహసీల్దార్ను వెనక్కి పంపించారని బలంగా వినిపిస్తోంది. ఏది ఏమైనా పూసపాటిరేగ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నియామకంపై చర్చ జరుగుతోంది. కనీసం ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా కనీసం పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కనీసం ఇన్చార్జ్ తహసీల్దార్ను అయినా నియమించి ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడకుండా సమస్య పరిష్కరించాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
సర్వజన ఆస్పత్రిలో పనిచేయని ఎంఆర్ఐ
విజయనగరం ఫోర్ట్: గంట్యాడ మండలానికి చెందిన ఎన్.సతీష్ తీవ్రమైన నడుం నొప్పితో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఎముకల విభాగానికి వెళ్లాడు. ఎంఆర్ఐ స్కాన్ అవసరమని వైద్యులు నిర్ధారించారు. అయితే ఎంఆర్ఐ స్కాన్ పనిచేయకపోవడంతో స్కాన్ బాగైన తర్వాత ఆస్పత్రికి రావాలని వైద్యులు చెప్పడంతో వెనుదిరిగాడు. ఇలా అనేక మంది రోగులు ఎంఆర్ఐ స్కాన్ కోసం వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఎంఆర్ఐ స్కాన్ ఆస్పత్రిలో కొద్ది రోజులుగా పనిచేయకపోవడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎంఆర్ఐ స్కాన్ పనిచేయకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో ఎంఆర్ఐ స్కాన్ ఉన్నప్పటికీ రోగులు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్కు వెళ్లాల్సిన పరిస్థితి. అధిక మొత్తంలో వెచ్చిస్తున్న రోగులు: ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లో ఎంఆర్ఐ కోసం అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో స్కానింగ్కు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ప్రైవేటు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ గత్యంతరం లేక రోగులు చేయించుకుంటున్నారు. ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్న రోగులు వారం రోజులుగా ఇదే పరిస్థితిత్వరలో బాగు చేయిస్తాం ఎంఆర్ఐ స్కాన్ ప్రస్తుతం పనిచేయడం లేదు. ఎంఆర్ఐ స్కాన్ అత్యవసరమైన వారికి ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లో ఉచితంగా తీయిస్తున్నాం. ఎంఆర్ఐ స్కాన్ను త్వరితగతిన బాగు చేయిస్తాం. డాక్టర్ ఎస్.అప్పలనాయుడు, సూపరింటెండెంట్, ప్రభుత్వసర్వజన ఆస్పత్రి -
జగన్నాథుని రథయాత్రకు సర్వంసిద్ధం
● జిల్లా దేవదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శిరీషవిజయనగరం టౌన్: జగన్నాథస్వామి రథయాత్ర మహోత్సవానికి సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా దేవదాయశాఖ సహాయ కమిషనర్, ఆలయ ఇన్చార్జ్ ఈఓ కె.శిరీష పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక సంతపేటలో ఉన్న జగన్నాథస్వామి ఆలయం ఆవరణలో ఉత్సవ కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి జూలై 5వ తేదీ వరకూ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. 26న గురువారం స్వామివారికి విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కళావాహన, బింబ దర్శనం, నేత్రోత్సవం, ప్రసాద వినియోగం పాణింగిపల్లి వాసుదేవాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. అదేరోజు సాయంత్రం జగన్నాథస్వామి శాంతి కల్యాణం, రాత్రి స్వామివారిని రథోత్సవానికి సిద్ధం చేయడం, రక్షాబంధనాలు ఉంటాయన్నారు. 27న శుక్రవారం ఉదయం 5 గంటలకు స్వామివారికి సుప్రభాతసేవ, విశేష అర్చనలు, నీరాజనం, 9.30 గంటలకు మేళతాళాలతో స్వామివారి రథారోహణ, రక్షాబంధనాలు, అనంతరం స్వామివారి తొలి రథయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. 28న శనివారం నుంచి జూలై 4వ తేదీ శుక్రవారం వరకూ ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, మహిళా మండలి ఆధ్వర్యంలో విష్ణు సహస్ర నామ పారాయణం, జగన్నాథస్వామి వారి చరిత్ర పారాయణం, గోవిందనామస్మరణ ఉంటుందన్నారు. 5న మారు రథయాత్ర జూలై ఒకటో తేదీన మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు శ్రీ మహాలక్ష్మి దేవి తిరువీధి ఉత్సవం, స్వామివారిని దర్శించడం, శ్రీ లక్ష్మీనారాయణ సంవాదం, శీలవిరుపు ఉత్సవం నిర్వహిస్తామని తెలిపారు. జూలై 5న శనివారం మారు రథయాత్ర, అనంతరం దర్శనాలు ఉంటాయన్నారు. జూలై 6న స్వామివారికి ప్రధాన ఆలయంలో సంప్రోక్షణ, శాంతి హోమాలు, ప్రసాద వినియోగం చేస్తామన్నారు. జూలై 10న ఆషాడ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీసత్యనారాయణస్వామివారి సామూహిక వ్రతం నిర్వహిస్తామని, భక్తులందరూ స్వామివారిని దర్శించి, తరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ రమణి, ఆలయ పూజారులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
చేతులెత్తి వేడుకుంటున్నాం.. మా బడి మాకివ్వండి!
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం నియోజ కవర్గం బలిజిపేట మండలం పెదపెంకి గ్రామం దళితవాడలోని పెదపెంకి ఎంపీపీ–1 ప్రాథమిక పాఠశాల 3, 4, 5 తరగతులను వేరే మోడల్ పాఠ శాలలో విలీనం చేస్తూ కూటమి ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజు మొదలు పాఠశా ల పరిధిలో చదువుతున్న విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఆగిపోయింది. చదువు నిలిచిపోయింది. తమ దళితవాడలో 40 ఏళ్లకు పైగా కొనసాగుతూ వస్తున్న ప్రాథమిక పాఠశాలను తొలగించవద్దని ఇప్పటికే పలుమార్లు మండల అధికారులు, జిల్లా అధికారులకు తల్లిదండ్రులు గో డు వినిపించినా.. స్పందన లేకపోయింది. దీంతో గ్రామపెద్దలు, తల్లిదండ్రులు, విద్యార్థులు కలసి సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చి జోరువానలోనూ నిరసన చేపట్టారు. పీజీఆర్ఎస్లో జిల్లా రెవెన్యూ అధికారిణి హేమలతకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాజీ శాసనభ్యులు అలజంగి జోగారావు దృష్టికీ సమస్యను తీసుకెళ్లారు. తమ తరఫున పోరాడి, న్యాయం జరిగేలా చూడాల ని కోరారు. ఈ సందర్భంగా జోగారావు మాట్లాడు తూ.. పేద విద్యార్థులకు చదువును దూరం చేయవద్దని కోరారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్ష ణం స్పందించి వీరి పాఠశాలను యథావిధిగా కొనసాగేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలసి మంత్రి లోకేశ్కు రెండు జోతులూ జోడించి, నమస్కరించి.. పాఠశాలను తరలించవద్దంటూ విజ్ఞప్తి చేశారు. మండల ఎంపీపీ గుడివాడ నాగమణి, సర్పంచ్ నగి రి పాపారావు, స్కూల్ కమిటీ చైర్మన్, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
‘తోటపల్లి’ నిర్వాసితులకు ఇళ్ల బిల్లులు చెల్లించాలి
● రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు బంటు దాసుపార్వతీపురం టౌన్: తోటపల్లి బ్యారేజీ నిర్వాసిత గ్రామాలైన పాతకల్లికోట, దుగ్గి గ్రామాలలో నిర్వాసితులు నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులు వెంటనే చెల్లించాలని ఏపీ రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు బంటు దాసు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద నిర్వాసిత రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్ఓ కె.హేమలతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్వాసితులు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఇళ్లు నిర్మించుకున్నా ఇంతవరకు బిల్లులు చెల్లించలేదన్నారు. రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ.. నిర్వాసిత మహిళలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం మహిళలకు ప్యాకేజీ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో దుగ్గి, పాతకల్లికోట, తోటపల్లి, పెద్దగెడ్డ నిర్వాసిత రైతులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
శాశ్వత పరిష్కారం చూపండి..
● జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి ● పీజీఆర్ఎస్కు 166 వినతులువిజయనగరం అర్బన్: ప్రజా వినతుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే వినతులకు శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు లాగిన్లో ఎప్పటికప్పుడు సమస్యలను చూసుకుంటూ రీ ఓపెన్ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజూ లాగిన్ అయ్యి వినతులను శతశాతం పరిష్కరించాలని ఆదేశించారు. 166 వినతుల స్వీకరణ.. కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్కు 166 వినతులు వచ్చాయి. డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్లు, విజయనగరం ఆర్డీఓ సవరమ్మ, పౌరసరఫరాల డీఎం బి.శాంతి, డీఈఓ యూ.మాణిక్యంనాయుడు హాజరై వినతులు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు అత్యధికంగా 69 వినతులు.. పంచాయతీ శాఖకు 17.. పింఛన్లు మంజూరు చేయాలని, తదితర అంశాలపై డీఆర్డీఏకు 22 వినతులు అందాయి. మున్సిపాలిటీకి 5, విద్యాశాఖకు 15, హౌసింగ్కు 2 అందగా వైద్యశాఖకు 4, విద్యుత్ శాఖకు 4 వినతులు రాగా.. మిగిలినవి ఇతర శాఖలకు చెందిన సమస్యలు.చట్ట పరిధిలో పరిష్కరించాలి ● ఏఎస్పీ సౌమ్యలత విజయనగరం క్రైమ్: అర్జీదారులు తెలియజేసిన సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించాలని ఏఎస్పీ పి. సౌమ్యలత అన్నారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదిక కార్యక్రమంలో 43 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఎస్పీ ఆదేశాల మేరకు ప్రజా సమస్యలు తెలుసుకున్నామన్నారు. సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మొత్తం 43 వినతులు రాగా భూ తగాదాలకు సంబంధించినవి 15.. కుటుంబ కలహాలకు సంబంధించినవి 4.. మోసాలకు సంబంధించినవి 7.. ఇతర అంశాలకు సంబంధించినవి 17 ఉన్నాయన్నారు. ఏడు రోజుల్లో సమస్యలపై స్పందించి, వాటిపై తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, డీసీఆర్డీ సీఐ బి.సుధాకర్, ఎస్సై ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఫ్రాన్సిస్కోలో సెంచూరియన్ విశ్వవిద్యాలయం ప్రదర్శన
భువనేశ్వర్: సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ–మేనేజ్మెంట్ (సీయూటీఎం) అరుదైన ఘనత సాధించింది. శాన్ఫ్రాన్సిస్కోలో ప్రారంభమైన 62వ డిజైన్ ఆటోమేషన్ కాన్ఫరెన్స్ (డీఏసీ)లో పాల్గొనే అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా తన సామర్థ్యాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది. ఈ కాన్ఫరెన్స్ ఈ నెల 22న ప్రారంభమైంది, 25 వరకు కొనసాగనుంది. సెమీకండక్టర్, డిజైన్ ఆటోమేషన్ పరిశ్రమ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కాన్ఫరెన్స్లో సెంచూరియన్ ప్రాతినిధ్యం వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘చిప్స్ టు సిస్టమ్స్’ అనే శీర్షికతో నిర్వహిస్తున్న డీఏసీ కార్యక్రమానికి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ (ఈడీఏ), సెమీకండక్టర్ టెక్నాలజీలు, సిస్టమ్ ఇన్నోవేషన్ రంగంలో దిగ్గజాలు హాజరు కావడం విశేషం. వర్సిటీ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ డీఎన్ రావు ఆధ్వర్యంలో ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ దాస్, లక్ష్మీకాంత్ సుతార్లతో కూడిన బృందం సెంచూరియన్ తరఫున ప్రాతినిధ్యం వహించింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డీఎన్ రావు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి వేదికపై సామర్థ్యాన్ని ప్రదర్శించిన తొలి వర్సిటీగా సెంచూరియన్ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. వర్సిటీలో సెమీకండక్టర్ టెక్నాలజీ పాఠ్యాంశాలు మెరుగుపరచడానికి మార్క్యూ సెమీ కండక్టర్స్తో ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. విద్యతో పాటు సాంకేతిక ఆవిష్కరణల్లోనూ వర్సిటీ గుర్తింపు సాధించడం ఆనందంగా ఉందన్నారు. అధునాతన పారిశ్రామిక రంగానికి అక్కరకు వచ్చే రీతిలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. రానున్న కాలంలో ప్రపంచ స్థాయిలో సెంచూరియన్ తన ఉనికి చాటుకుంటుందని ఆశాభవం వ్యక్తం చేశారు. -
ఓర్వలేకే మాజీ సీఎంపై కేసులు
రేగిడి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాధరణ చూసి ఓర్వలేకే కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ఇటీవల పల్నాడులో పర్యటించిన సమయంలో చీలి సింగయ్య అనే వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణించాడని, దీన్ని సాకుగా చూపి జగన్ మోహన్రెడ్డి, తదితరులపై కేసులు నమోదు చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. మండలంలోని బూరాడ గ్రామంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విషాదకరమైన ప్రమాదాలను కూడా రాజకీయం చేయడం తగదని సూచించారు. ప్రమాదవశాత్తూ జరిగిన మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. బస్సు ప్రమాదాల్లో ఎవరైనా మరణిస్తే డ్రైవర్పై కేసు నమోదు చేయడం పరిపాటని.. అంతేకాకుండా బస్సులో ప్రయాణిస్తున్న వారందరిపై కేసులు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు. పల్నాడు సంఘటనకు సంబంధించి లేనిపోని కథనాలను మీడియాలో చూపించి జగన్ మోహన్రెడ్డిని ఏ–2గా చేర్చడం విడ్డూరంగా ఉందన్నారు. వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డికి భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు, కరణం శ్రీనివాసరావు, కెంబూరు వెంకటేశ్వరరావు, వావిలపల్లి శశిభూషణరావు, బంకి చంద్రశేఖర్, టంకాల ఉమాపాపినాయుడు, రణస్థలం రమాదేవి, రాంబాబు, పిల్లా గౌరునాయుడు, దార గుర్నాథరావు, వైశ్యరాజు గోవిందరాజు, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ -
రోడ్డు ప్రమాదంలో హెచ్సీకి తీవ్ర గాయాలు
డెంకాడ: విజయనగరం – విశాఖ జాతీయ రహదారిపై మండలంలోని చింతలవలస ఐదో ఏపీఎస్పీ బెటాలియన్ మెయిన్ గేట్ వద్ద సోమవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్, ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోరాడ రామునాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్సై ఎ.సన్యాసినాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. హెచ్సీ రామునాయుడు బెటాలియన్ మెయిన్ గేట్కు ఎదురుగా ఉన్న అయినాడ పంచాయతీలోని సత్యనారాయణపురం గ్రామంలో ఉంటున్నారు. సోమవారం 5.30 గంటల ప్రాంతంలో విధులు నిర్వహించేందుకు బెటాలియన్కు ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. విజయనగరం నుంచి విశాఖ వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రామునాయుడు తలకు, కాళ్లు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే సమీపంలో ఉన్న పోలీసులు వచ్చి రామునాయుడును విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ వాహనంతో పరారయ్యాడు. కొద్ది సేపటి తర్వాత కారును గుర్తించినట్లు ఎస్సై సన్యాసినాయుడు తెలిపారు. -
జంఝావతి లిఫ్ట్ పనిచేసేలా చూడండి
పార్వతీపురం టౌన్: కొమరాడ మండలంలో గల జంఝావతి ప్రాజెక్ట్కు సంబంధించి రబ్బర్ డ్యామ్ లిఫ్ట్ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు వి. దాలినాయుడు, తదితరులు కోరారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదికలో డీఆర్ఓ కె. హేమలతను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దాలినాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఖరీఫ్ పనులు ప్రారంభమైన నేపథ్యంలో జంఝావతి సాగునీరు రైతులకు అవసరమవుతాయన్నారు. రబ్బర్డ్యామ్ లిఫ్ట్ను బాగుచేస్తే సుమారు 24,640 ఎకరాలకు సాగునీరు అందించవచ్చని చెప్పారు. ట్రాన్స్ఫార్మర్ పాడవ్వడంతో కొంతకాలంగా లిఫ్ట్ పనిచేయడం లేదని చెప్పారు. రైతులకు జంఝావతి నీరు అందించడంలో కూటమి నాయకులు, అధికారులు ఘోరంగా విఫలమయ్యారని తెలిపారు. కార్యక్రమంలో సిరిసిపల్లి సాయి శ్రీనివాస్, పాలక రంజిత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. రైతులకు న్యాయం చేయండి : కాంగ్రెస్ నాయకులు -
గురుకుల విద్యాలయాలలో మిగులు సీట్లకు రాతపరీక్ష
విజయనగరం అర్బన్: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 7, 8, 9వ తరగతుల్లో మిగులు సీట్లకు ఈ నెల 25న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా గురుకుల సమన్వయకర్త ఎస్.రూపావతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6, 7 తరగతులకు సంబంధించి బాలురకు కొప్పెర్ల గురుకులంలో.. బాలికలకు నెల్లిమర్ల గురుకులలో ఉదయం 10 గంటల నుంచి 11 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా 8, 9 తరగతులకు సంబంధించి బాలురకు కొప్పెర్లలో.. బాలికలకు నెల్లిమర్లలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు గంట ముందు కేంద్రానికి చేరుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 89858 83015, 63038 38657 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఐదో తరగతిలో ఉన్న ఖాళీలను ఎటువంటి ప్రవేశ పరీక్ష నిర్వహించకుండా కేటాయిస్తామని.. ఆసక్తి ఉన్న విద్యార్థులు జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ జంక్షన్లో ఉన్న సమన్వయకర్త అధికారి కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు.లారీ బోల్తా ..జామి: మండలంలోని అలమండ సమీపంలో ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. విశాఖపట్నం నుంచి రాయపూర్ వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్త్రెవర్కు స్పల్పగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రుడ్ని అలమండ పీహెచ్సీకి తరలించారు.ట్రాక్టర్ బోల్తా – డ్రైవర్ మృతిపార్వతీపురం రూరల్: మండలంలోని జిల్లేడువలస సమీపంలో ట్రాక్టర్ బోల్తాపడడంతో డ్రైవర్ మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా సమాచా రం అందుకున్న పోలీసులు మృతుడిని మక్కు వ మండలం ఎర్రసామంతవలస గ్రామానికి చెందిన మండంగి సుబ్బారావు(35) గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.విద్యుదాఘాతంతో యువకుడి మృతితెర్లాం: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని డి.గదబవలస గ్రామం వద్ద సోమవారం సాయంత్రం జరిగింది. దీనికి సంబంధించి ఎస్సై సాగర్బాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గంగన్నపాడు గ్రామానికి చెందిన పోరపు రామకృష్ణ (18) తెర్లాం నుంచి పెరుమాళి వైపు కొత్తగా వేసిన విద్యుత్ లైన్లో కూలి పనికోసం వెళ్తున్నాడు. సోమవారం కూడా విద్యుత్ స్తంభం ఎక్కి పని చేస్తుండగా.. ఒక్కసారిగా విద్యుత్ సరఫరా రావడంతో స్తంభం పైనుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి తల్లిదండ్రులు, చెల్లి ఉన్నారు. మృతిడి తండ్రి సోదన్నదొర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శవపంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్సీకి తరలించారు. -
‘జిందాల్’కు నీరిస్తే రైతులకు నష్టం
విజయనగరం ఫోర్ట్: జిందాల్ పరిశ్రమలకు బుచ్చి అప్పారావు జలాశయం (తాటిపూడి) నుంచి నీరు ఇస్తే రైతులు నష్ట పోతారని ఆయకట్టు పరిరక్షణ కమిటి సభ్యులు తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిందాల్ భూముల్లో పెట్టనున్న చిన్న పరిశ్రమల పార్కుకు బుచ్చి అప్పారావు జలాశయం నుంచి నీరు ఇచ్చేందుకు విడుదల చేసిన జీఓ 14ను రద్దు చేయాలన్నారు. జలాశయం కింద ఉన్న శివారు కాలువలకు సిమెంట్ లైనింగ్, తూములు, షట్టర్ల ఏర్పాటుతో పాటు రాకపోకలకు వీలుగా వంతెనలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రాజెక్ట్ మెయింటినెన్స్కు ఇచ్చే సాధారణ నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. ధర్నాలో జామి మండల జెడ్పీటీసీ మాజీ సభ్యులు గొర్లె రవికుమార్, బండారు పెదబాబు, ఏపీ రైతు సంఘం కార్యదర్శి బి. రాంబాబు, గులిపల్లి జయపాల్, కొత్తలి ఎర్నాయుడు, కోడెల ముత్యాలనాయుడు, కోడెల శ్రీను, బండారు సూర్యారావు, జాగారపు అప్పారావు, కిలపర్తి శ్రీరామ్మూర్తి, గనివాడ సన్యాసినాయుడు, తమటపు పైడినాయుడు, తదితరులు పాల్గొన్నారు. బుచ్చి అప్పారావు జలాశయం ఆయకట్టు పరిరక్షణ కమిటీ సభ్యులు -
● పీజీఆర్ఎస్కు 203 దరఖాస్తులు
పార్వతీపురం టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతులను పారదర్శకంగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. హేమలత అన్నారు. స్థానిక కలెక్టరేట్ పీజీఆర్ఎస్ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకురాలు సుధారాణితో కలిసి అర్జీలు స్వీకరించారు. మొత్తం 203 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఫిర్యాదునూ మానవతాకోణంలో ఆలోచించి శాశ్వత పరిష్కారం చూపించాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో కూడా వినతులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాకారి కె.రాబర్ట్పాల్, డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు, జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్ అధికారి ఓ.ప్రభాకరరావు, ఇన్చార్జ్ జిల్లా విద్యాశాఖధికారి బి.రాజ్కుమార్, పార్వతీపురం కో–ఆపరేటివ్ అధికారి, ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని.. ● వీరఘట్టం మండలం యు.వెంకంపేటలో ప్రస్తుతం ఉన్న పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుందని, వర్షాకాలంలో శ్లాబ్ నుంచి నీరు లీకవడంతో విద్యార్థులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని, అదనపు భవనం మంజూరు చేయాలని గ్రామానికి చెందిన ఎస్. సింహాచలం వినతి అందజేశారు. ● గుమ్మలక్ష్మీపురం మండలం పి.ఆమటి గ్రామంలో ప్రాథమిక పాఠశాల మూసి వేయడం వల్ల విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని, వి ద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని పాఠ శాలను పునఃప్రారంభించాలని తాడంగి దమ యంతమ్మ, తదితరులు వినతి సమర్పించారు. ● సర్వే నంబర్ 85–2లో ఉన్న భూమికి విద్యుత్ కనెక్షన్ పొందడానికి అవసరమైన రుసుం, సర్టిఫికెట్లను విద్యుత్ శాఖకు సమర్పించానని.. అయితే కొంతమంది కావాలనే పనిని అడ్డుకుంటున్నారని పార్వతీపురం మండలం డొంకలకోటపట్నం గ్రామానికి చెందిన డి.లక్ష్మి వినతి సమర్పించారు. ● గరుగుబిల్లి మండలం హిక్కింవలస గ్రామ పాఠశాలలో 3,4,5వ తరగతులు చదువుతున్న విద్యార్థులను గరుగుబిల్లి హైస్కూల్లో విలీనం చేయడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలోని పాఠశాలను మోడల్ ప్రై మరీ పాఠశాలగా మార్చి విద్యార్థులు స్థానికంగా చదువుకునేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. -
సోమవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 2025
పార్వతీపురం టౌన్: కూటమి నేతలు గత ఎన్నికల్లో నిరుద్యోగులు, విద్యార్థులకు అనేక హామీలిచ్చి గెలిచాక వెన్నుపోటు పొడిచారని యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఏడాదిగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా నాటకాలు ఆడుతున్నారని మండిపడుతున్నారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం యువత ఎదురు చూస్తుంది. జాబ్ క్యాలెండర్పై గంపెడాశలు పెట్టుకున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఇంటికో ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా నిరుద్యోగ భృతి గురించి మాట్లాడటం లేదని, ఎప్పటి నుంచి ఇస్తారో స్పష్టంగా చెప్పాలని పార్వతీపురం మన్యం జిల్లాలో గల సుమారు 1.49 లక్షల కుటుంబాల్లోని యువత డిమాండ్ చేస్తోంది. నిరుద్యోగులకు 20లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా ఉన్న ఉద్యోగాలను ఊడదీస్తూ నిరుద్యోగులను నిలువునా మోసం చేస్తున్నారు. అధికారంలోకి వస్తే నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మించి ఇవ్వకుండా ఎగనామం పెట్టారు. ఈ క్రమంలో యువతకు మద్దతుగా నేడు జిల్లా కేంద్రంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఏం చేశారు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసి, మరోసారి అధికారంలోకి వచ్చిన ఈయన పాలనలో ఉద్యోగాల భర్తీ అనేది కనిపించదు. 2009 ఎన్నికల్లో లక్షల్లో ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి అని హామీలు గుప్పిస్తే ప్రజలు విశ్వసించలేదు. రాష్ట్ర విభజన సమయంలో 2014లో 600కు పైగా ఇచ్చిన హామీల్లో నిరుద్యోగ భృతిని చేర్చి అధికారంలోకి వచ్చారు. కానీ, ఐదేళ్లు అధికారం అనుభవించి ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి యువ నేస్తం అంటూ మభ్యపెట్టారు. తాజాగా 2024లోనూ నిరుద్యోగ పల్లవి అందుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అండ్ కో అసలు ఉద్యోగాల ఊసే ఎత్తకపోవడం గమనార్హం. ఆందోళనలో యువత కూటమి ప్రభుత్వంలో యువత ఆందోళనలతో ఉన్నారు. నిరుద్యోగ భృతిపై కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వటం లేదు. యువతకు ఉద్యోగాలు లేవు. ఎన్నికల్లొ ఇచ్చిన హామీల్లొ భాగంగా ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి. యువగళంలో లోకేష్ లక్షల్లో ఉద్యోగాలు ఇస్తారని హామీ నిచ్చారు. నిరుద్యోగ భృతిపై ప్రస్తావన లేదు. ఉద్యోగాలు ఇస్తారన్ని నమ్మకం లేదు. – ముగడ జగన్మోహన్రావు, వైఎస్సార్సీపీ స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ, పార్వతీపురం యువతను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే... నిరుద్యోగులకు 20లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా ఉన్న ఉద్యోగాలు ఊడపీకుతూ నిరుద్యోగులను నిలువునా ముంచారు. అధికారంలోకి వస్తే నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మించి ఇవ్వకుండా ఎగనామం పెట్టారు. ఈ కూటమి ప్రభుత్వం గత ఏడాది కాలంగా విద్యార్థులను, యువతను మోసం చేస్తున్న వైనాన్ని నిలదీస్తున్నాం. తక్షణమే కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయాలని కోరుతూ వైఎస్ఆర్ సీపీ యూత్ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. – అలజంగి జోగారావు, మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం యువతను నట్టేట ముంచారు.. కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను నట్టేట ముంచింది. గతంలో మాదిరి నిరుద్యోగులను మోసం చేయకుండా అందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే. ఉద్యోగాలు కల్పించే వరకు ఆర్థిక సాయంగా భృతి ఇస్తే నిరుద్యోగులకు, వారి కుటుంబాలకు ఎంతో తోడ్పాటు ఇచ్చినట్టు అవుతుంది. యువతను ఆదుకునేంత వరకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. – నంగిరెడ్డి శరత్బాబు, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు నిరుద్యోగుల ప్రస్తావనే లేదు ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా నిరుద్యోగుల ప్రస్తావన లేదు. నిరుద్యోగ భృతి హామీ అయితే ఇచ్చారు గానీ అమలుపై ఆసక్తి చూపడంలేదు. అసలు నిరుద్యోగ భృతి అమలు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా? లేకుంటే ఎప్పటిలానే యూటర్న్ తీసుకుంటారా? యువతకు అండగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నేడు జిల్లా కేంద్రంలో నిరసన తెలుపుతున్నాం. – పల్లా అనంతనాయుడు, వైఎస్సార్సీపీ కురుపాం నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు న్యూస్రీల్మేనిఫెస్టోలో.. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన తమ ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ సిక్స్లో నిరుద్యోగులకు పెద్ద పీట వేస్తున్నట్టు ప్రకటించారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాల కల్పనతో పాటు ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతి ఒక్కరికీ నెలకు రూ.3 వేల భృతి ఇస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినప్పటికీ ఆ ఊసే ఎత్తట్లేదు. ప్రభుత్వం ఈ హామీని అమలు చేయడంలో జాప్యం చేస్తుండటంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.3వేల నిరుద్యోగ భృతి ఊసే లేదు.. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతిపై ఆందోళన ఇంటికో ఉద్యోగం అని మోసం చేశారు.. నేటి యువత పోరుకు వైఎస్సార్సీపీ మద్దతు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన -
నేటి యువత పోరుకు తరలిరండి
ఉప్పెనలా.. ● మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర సాలూరు: యువతకు ఉద్యోగాల కల్పన, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలు తప్పడంతో వైఎస్సార్ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న యువత పోరుకు ఉప్పెనలా తరలి రావాలని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర పిలుపునిచ్చారు. నిరుద్యోగ భృతి రూ.3వేలు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు మోసం చేశారని ధ్వజమెత్తారు. సోమవారం ఉదయం 10 గంటలకు పార్వతీపురంలో హెచ్పీ పెట్రోల్ బంకు నుంచి కలెక్టర్ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేయనున్నట్టు తెలిపారు. ● యువతకు కూటమి వెన్నుపోటు ● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ పాలకొండ రూరల్: అధికారం కోసం కూటమి నాయకులు అమలు కాని హామీలతో అన్నివర్గాల వారిని నమ్మించి మోసం చేస్తున్నారని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ మండిపడ్డారు. ముఖ్యంగా యువత, నిరుద్యోగులను, విద్యార్థులకు కూటమి వెన్నుపోటు పొడిచిందన్నారు. ఈ తీరును నిరసిస్తూ సోమవారం కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ తలపెట్టిన ‘యువత పోరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ యువజన విభాగం, ముఖ్య నాయకులతో కలసి ఆదివారం ఆయన స్వగృహం వద్ద యువత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఏడాది కాలంలో కూటమి నాయకులు, సీఎం చంద్రబాబు హామీల అమలుపై చిత్తశుద్ధితో వ్యవహరించ లేదన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ జరగలేదన్నారు. దీంతో విద్యార్థులు, వారి తల్లితండ్రులను ఈ ప్రభుత్వం మానసిక వేదనకు గురి చేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన చేపడతామని, అంతవరకూ రూ.3వేలు భృతి నిరుద్యోగులకు ఇస్తామని హామీనిచ్చి ఇంత వరకూ ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. లోపాలు సరిదిద్దుకోలేక ప్రశ్నిస్తే వేధిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో యువతకు అండగా వైఎస్సార్ సీపీ సంయుక్తంగా నేడు కలెక్టర్కు వినతిపత్రం అందించనున్నట్టు తెలిపారు. నియోజకవర్గ, మండల యువజన విభాగాల అధ్యక్షులు పొట్నూరు లక్ష్మణరావు, అల్లు సురేష్కుమార్, పాలవలస దవళేశ్వరావు పాల్గొన్నారు. యువత పోరుకు సన్నద్ధం మాజీ ఎమ్మెల్యే కళావతి వీరఘట్టం: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్న కూటమి సర్కారుపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్టు మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి తెలిపారు. ఆదివారం ఆమె స్వగృహం వండువలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 23న సోమవారం జిల్లా కేంద్రంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న యువత పోరు ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పేద కుటుంబాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా ఆర్థిక ఇబ్బందులకు గురి చేయడం కూటమి ప్రభుత్వానికి తగదన్నారు. -
జూలై 26, 27 తేదీల్లో సీపీఐ జిల్లా మహాసభలు
బొబ్బిలి రూరల్: సీపీఐ 14వ జిల్లా మహాసభ లు జూలై 26, 27 తేదీల్లో బొబ్బిలి పట్టణంలో నిర్వహించనున్నట్టు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ వెల్లడించారు. మండలంలోని సీహెచ్ బొడ్డవలస గ్రామంలో సీపీఐ మండల సభను ఆదివారం నిర్వహించారు. మండల కార్యదర్శిగా కాగాన గణేష్ను ఎంపిక చేశారు. అనంతరం జిల్లా మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలక పక్షాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు నిర్వహిస్తూ రైతు, పేద, బడుగు వర్గాల్లో వెలుగులు నింపేందుకు సీపీఐ నిరంతరం కృషి చేస్తుందన్నారు. నిరుపేద, గిరిజనులకు భూ హక్కుల ను కల్పించడమే తమ పోరాటాల లక్ష్యమన్నా రు. జిల్లా మహాసభల్లో భవిష్యత్ కార్యాచరణ ను ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా స భ్యులు కోట అప్పన్న, కార్యదర్శి కాగాన గణేష్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణదాతల ఆకలి కేకలు!
ఆ వాహనాల్లో పని చేసే సిబ్బంది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణదాతలే... ఎందుకంటే అత్యవసర సమయాల్లో కుయ్.. కుయ్... అంటూ పరుగులు పెడుతూ ప్రాణాపాయంలో ఉన్న వారికి వైద్య సేవలు అత్యవసరంగా అందించి తరువాత అవసరమైన ఆసుపత్రులకు తరలిస్తారు. ఇంతటి ప్రాధాన్యత గల ఆ వాహనాల్లో పని చేసే సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు చెల్లించని పరిస్థితి కూటమి పాలనలో నెలకొంది. గత ఎన్నికల సమయంలో వేతనం రూ.4వేలు పెంచుతామని హామీనిచ్చిన కూటమి నేతలు పెంపు మాట దేవుడెరుగు... మా వేతనాలు మాకు సకాలంలో చెల్లించాలని వేడుకొంటున్నారు. వారే 108 వాహన సిబ్బంది. వివరాల్లోకి వెళ్తే... పాలకొండ రూరల్: అత్యవసర సమయంలో ప్రాణాలు నిలిపే 108 వాహనాల సిబ్బందికి మూడు నెలలుగా వేతన చెల్లింపుల్లేక ఆకలి కేకలు పెడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అరబిందో సంస్థ పర్యవేక్షణలో విధులు చేపట్టిన వీరు కూటమి అధికారంలోకి వచ్చాక పర్యవేక్షణ బాధ్యతలను భవ్య సంస్థకు బదలాయించింది. ఈ క్రమంలో గత ఎన్నికల వేళ 108 సిబ్బంది వేతనాల పెంపు విషయమై కూటమి నేతలు హామీ ఇచ్చారు. బకాయిల చెల్లింపుతో పాటు రూ.4వేల వేతనం పెంచుతామని నమ్మబలికారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా జీతం పెరుగుదల లేక సకాలంలో జీతాలు చెల్లించని పరిస్థితి నెలకొంది. దీంతో సిబ్బంది ఆకలి కేకలు పెడుతున్నారు. తమ బకాయిల చెల్లింపులెప్పుడని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. అప్పు చేస్తేనే.. 108 అంబులెన్సులు 15, నియోనాటెల్ (నవజాతి శిశువుల కోసం కేటాయించిన) వాహనాలు రెండు. జిల్లాలో 15 మండలాల్లో 108 వాహనాలు 17 మైదాన, గిరిజన ప్రాంతాల్లో సేవలు కొనసాగిస్తున్నాయి. వీటిలో 108 అంబులెన్సులు 15 కాగా, నియోనిటల్ (నవజాతి శిశువుల కోసం కేటాయించినవి) వాహనాలు రెండు ఉన్నాయి. ప్రతి వాహనానికి నలుగురు చొప్పున సిబ్బంది, మరో రెండు వాహనాల్లో ఇద్దరు చొప్పున 90 మంది వరకు సిబ్బంది పని చేస్తున్నారు. వీరిలో పైలెట్ (వాహన డ్రైవర్లు)కు నెలకు రూ.28 వేల వరకు, ఈఎంటీకి రూ.30 వేలు, కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి రూ.20 వేల వరకు జీతాలు చెల్లించాల్సి ఉంది. అయితే నెలల కొద్ది 108 సిబ్బంది జీతాలు చెల్లించటం లేదు. మూడు నెలలు కావస్తున్నా వేతన చెల్లింపుల్లేవని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతం కోసం ఆందోళన చేసినప్పుడు ఎంతో కొంత చెల్లించి చేతులు దులుపేసుకోవడం పరిపాటిగా మారిందని సిబ్బంది వాపోతున్నారు. జీతాలపై ఆధారపడి కుటుంబాలను నెట్టుకొచ్చే తామంతా కుటుంబ పోషణ, నిర్వహణకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన నాలుగేళ్లగా తమ లీవ్ ఎన్క్యాష్మెంట్లు దాదాపుగా 60 రోజులతో పాటు గ్రాట్యూటీ, ప్రస్తుత వేతన బకాయిలు మొత్తంగా ఒక్కొక్కరికి రూ.లక్షా 50వేల నుంచి 2 లక్షల మేర బకాయిలు ఉన్నట్టు సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రస్తుత నెలలో పిల్లల బడులు, పుస్తకాలు, జీతాలు ఇలా అనేక ఖర్చులు వేధిస్తున్నాయంటున్నారు. పెరుగుతున్న పనిభారం.. ప్రస్తుతం 108 సిబ్బందిపై పనిభారం అధికంగా ఉంటోంది. వర్షాకాలం కావటంతో రోడ్డు ప్రమాదాలు పెరగడం, అత్యవసర కేసులు, పీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రి నుంచి రిఫరల్ కేసులు అధికంగా ఉండటం వల్ల సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. రోడ్డు ప్రమాదాల సమయంలో సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను వీలైనంత త్వరగా ఆసుపత్రులకు చేర్చాల్సి ఉంటుంది. అత్యవసర కేసులకు మెరుగైన చికిత్స, హైరిస్క్ పేషంట్లను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తీసుకువెళ్లాలి. విధి నిర్వహణలో భాగంగా పగలు, రాత్రి తేడా లేకుండా 108 వాహనాలు తిరుగుతూనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా కీలక సేవలు అందిస్తున్న తమకు జీతాలు సక్రమంగా ఇవ్వకపోతే ఎలా పని చేయాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా భవ్య సంస్థ తమ ఇబ్బందులు కూటమి ప్రభుత్వానికి వివరించి బకాయిల చెల్లింపుతో పాటు జీతాల పెంపు హామీ అమలుకు కృషి చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి బిల్లుల రాక.. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే కూటమి ప్రభుత్వం 108 వాహనాల నిర్వహణను అరబిందో సంస్థ నుంచి భవ్య సంస్థకు అప్పజెప్పింది. వాహనాల నిర్వహణతో పాటు సిబ్బంది జీతాలు కూడా ఆ సంస్థ చెల్లించాల్సి ఉంటుంది. దీనికి గాను ఆ సంస్థకు ప్రభుత్వం పాత వాహనమైతే నెలకు సరాసరిన రూ 2.20 లక్షలు, కొత్త వాహనమైతే దాదాపుగా రూ.1.90 లక్షలు పైబడి చెల్లించాల్సి ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు. వీటితోనే వాహనాల నిర్వహణ, సిబ్బంది జీతాలు చెల్లించాలి. ప్రభుత్వం నుంచి బిల్లులు సక్రమంగా రాకపోవటంతో వేతన చెల్లింపులు జరగటం లేదు. ఇదే స్థితి కొనసాగితే వాహనాల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతాయని సమాచారం. 108 సిబ్బందికి మూడు నెలలుగా అందని వేతనాలు 15 మండలాల్లో 17 వాహనాలతో అత్యవసర సేవలు విధుల్లో 90 మంది ఈఎంటీలు, పైలెట్లు అరబిందో నుంచి భవ్య సంస్థకు 108 సేవల బదలాయింపు రూ.4వేల వేతనం పెంపునకు కూటమి ప్రభుత్వం హామీ ఏడాది గడిచినా చర్యలు శూన్యం -
కన్నీటి వేదన!
గిరిజన మహిళ ● భర్త లేరు.. పింఛన్ రాదు.. రేషన్ ఇవ్వరు.. ● ఇద్దరు చిన్నారులతో అష్టకష్టాలు పార్వతీపురం రూరల్: ఆమె ఓ గిరిజన మహిళ.. 19 ఏళ్లకే వివాహం జరిగింది. ఏడాది కిందట భర్త విష జ్వరంతో బాధపడుతూ మృతి చెందాడు. భర్త మృతి చెందే నాటికి సంధ్య మొదటి బిడ్డకు ఏడాది వయసు. అప్పటికే మళ్లీ గర్భిణి కావడంతో తరువాత ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆడ బిడ్డకు నెలల వయసు. అప్పటి నుంచి ఆధారం లేక బిడ్డలతో అవస్థలు పడుతూనే ఉంది. ఆమె కష్టాలు చూసి ఇటు పాలకులకుగాని, అటు అధికారులకుగాని మనసు కరగ లేదు. పింఛన్ మంజూరు కాలేదు. రేషన్ ఇవ్వడం లేదు... ఇది ఓ గిరిజన మహిళ కన్నీటి వేదన. వివరాల్లోకి వెళ్తే.. పార్వతీపురం మండలం గంగాపురం పంచాయతీ కొత్తపాకలు గ్రామంలో ఉంటున్న కొండగొర్రి సంధ్య భర్త రమేష్తో పాటు ఒక బిడ్డతో ఉన్నంతలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. భర్త రమేష్ ఏడాది కిందట విష జ్వరంతో మృతి చెందాడు. అప్పటికే ఒక చిన్నారితో పాటు నెలల గర్భవతిగా ఉన్న సంధ్య ఒంటరిగా తన జీవితాన్ని అతి కష్టంతో నెట్టుకొస్తోంది. అంతలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే భర్త మరణాంతరం తనకు వితంతు పింఛన్తో పాటు రేషన్ కార్డు మంజూరు చేయాలని సంబంధిత పంచాయతీ అధికారుల వద్ద మొర పెట్టుకుంది. అధికారుల చుట్టూ తన ఓపిక ఉన్నంత మేరకు తిరిగింది. అయినా వారి మనసు చలించలేదు. ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో తన ఆవేదనను ప్రజా సంఘాల నాయకుల వద్ద చెప్పుకుంది. సంధ్య బాధను విన్న సీపీఎం నాయకులు కలెక్టర్ దృష్టిలో సోమవారం పెడతామని పింఛన్, రేషన్ కార్డు మంజూరుకు తమ వంతు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. -
విశాఖ యోగాంధ్రలో ఆకలి కేకలు
● 15 వేల మంది విద్యార్థులకు భోజనం కరువు ● విజయనగరానికి మధ్యాహ్నం ఒంటి గంటకు, మన్యం జిల్లాకు 3 గంటలకు చేరిన బస్సులు ● అప్పటివరకు ఆకలితో అలమటించిన విద్యార్థులు విజయనగరం అర్బన్/ విజయనగరం గంటస్తంభం: విశాఖలో యోగా డేకు వెళ్లిన విద్యార్థులు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి దాపురించింది. సమయానికి తిండిలేక అవస్థలు పడ్డారు. తిరుగు ప్రయాణంలో జిల్లా సరిహద్దులో వడ్డించిన జావ మాదిరిగా ఉన్న ఉప్మాను తినలేక పారబోశారు. యోగాంధ్ర పేరుతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడంపై ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదీ పరిస్థితి... యోగాపై ప్రజల్లో అవగాహన పెంచాలని నెలరోజుల పాటు ఉద్యోగులను విధులకు దూరం చేసి కోట్లాది రూపాయలు వెచ్చించించి చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమం జిల్లా విద్యార్థులను అవస్థలకు గురిచేసింది. విజయనగరం జిల్లా నుంచి విశాఖకు వెళ్లే 15 వేల మంది విద్యార్థులకు ఆయా కళాశాలలు, హాస్టల్స్ నుంచి 140 బస్సులు ఏర్పాటు చేశారు. ముందురోజు సాయంత్రానికే సిద్ధంచేసిన బస్సులను తెల్లవారి జామున 3 గంటలకే బయలుదేరి విద్యార్థులను విశాఖకు తీసుకెళ్లారు. జిల్లాకు కేటాయించిన భీమిలి బీచ్కు చేరే సరికి సంబంధిత పార్కింగ్ స్థలంలో పార్కింగ్ సమస్యతో పాటు కంపార్ట్మెంట్లో ఇవ్వాల్సిన స్నాక్స్, మ్యాట్లు అందలేదని విద్యార్థులు వాపోయారు. మ్యాట్లు, టీ షర్ట్లు లేకుండా, అల్పాహారం లేకుండానే యోగాడే పాల్గొన్నామని తెలిపారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ జిల్లా ప్రవేశాల సరిహద్దులైన భోగాపురం, కొత్తవలస, జొన్నాడ రహదారులలో సంబంధిత బస్సులను ఆపించి టిఫిన్, తాగునీరు వంటివి అందించారు. అప్పటికే తిరుగు ప్రయాణం చేసిన పార్వతీపురం మన్యం జిల్లా బస్సుల్లోని యోగా సాధకులకు అల్పాహారం కూడా అందలేదు. వారంతా జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హోటల్లను అశ్రయించారు. తిరుగు ప్రయాణంలో జిల్లా కేంద్రానికి చేరే సరికి ఒంటి గంట, పార్వతీపురం చేరేసరికి మధ్యాహ్నం 3 గంటలు అయ్యింది. తొలుత స్నాక్స్ పంపిణీని బస్సులు బయలుదేరే సమయంలోనే ఇవ్వాలని జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. విశాఖలో స్నాక్స్ ఇస్తున్నామని, జిల్లా కేంద్రంలో ఆ ఖర్చు అవసరం లేదని ఒకరోజు ముందు ఓ మంత్రి జిల్లా కేంద్రానికి ఆదేశాలిచ్చారట. దీంతో తొలిరోజు స్నాక్స్ పంపిణీ ఆపేశామని, ఇబ్బందులు ఎదురయ్యాయని అధికార వర్గాల్లో చర్చసాగుతోంది. యోగాంధ్ర కాదు... ఆకలి రహిత ఆంధ్రా కావాలి యోగాంధ్రకు తీసుకెళ్లిన గిరిజన విద్యార్థులను ఆకలితో అలమటింపజేయడం విచారకరం. కావాల్సింది యోగాంధ్ర కాదు.. ఉద్యోగాంధ్ర, ఆకలి రహిత ఆంధ్రప్రదేశ్. ఒకరోజు ముందు విద్యార్థులందరినీ బస్సుల్లో తరలించడం, వారికి సరైన మరుగుదొడ్లు సదుపాయం కల్పించకపోవడం, సమయానికి తాగునీరు కూడా ఇవ్వకపోవడం దారుణం. ఆకలితో అలమటించిన తీరును చిన్నారులు వివరిస్తుంటే కన్నీళ్లు వచ్చాయి. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం డొల్లతనమే. – ఎన్.నాగభూషణం, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రజా సమస్యలు గాలికి వదిలేసి.. విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన విద్యార్థులు ఆకలితో అలమటించడం చూసి బాధకలిగింది. బస్సుల్లో నిద్రపోయిన విద్యార్థులను పట్టించుకునే నాఽథుడే కరువయ్యారు. రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉందని చెబుతూ నిరుద్యోగ భృతి, రైతు భరోసా, విద్యాదీవెన, వసతి దీవెనను వంటివి సీఎం చంద్రబాబు ఎగ్గొడుతున్నారు. యోగా పేరుతో మోదీ ప్రశంసల కోసం రూ.300 కోట్లు ఖర్చుపెట్టడం దుర్మార్గం. రెండు రోజులు ప్రైవేటు స్కూల్స్కు సెలవులు ఇచ్చి పిల్లలును చదువుకు దూరం చేశారు. గొప్పల యోగా వల్ల ప్రయోజనం శూన్యం. – రెడ్డి శంకరరావు, సీపీఎం నగర కార్యదర్శి గిన్నీస్ రికార్డు కోసం.. గిరిజన విద్యార్థులను పస్తులుంచుతారా? పార్వతీపురం: గొప్పల కోసం, మోదీ మెప్పుకోసం, గిన్నీస్ రికార్డు కోసం గిరిజన విద్యార్థులను ఆకలితో అలమటింపజేయడంపై ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రవికుమార్ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. పార్వతీపురం పట్టణంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్ధరాత్రి 2 గంటలకు వసతిగృహాల విద్యార్థులను బస్సులలో తరలించడం సరికాదన్నారు. సరైన వసతిలేక, పడకునేందుకు సదుపాయంలేక విద్యార్థులు నరకయాతన అనుభవించారన్నారు. ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు, అధికారుల తమ పిల్లలను ఇలాగే తరలిస్తారా అని ప్రశ్నించారు. రక్తహీనతతో బాధపడుతున్న విద్యార్థులను ఎన్నడూ పట్టించుకోని అధికారులు, పాలకులు యోగాకోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసి విద్యార్థు లను తరలించడం దుర్మార్గమన్నారు. గిరిజనులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గిరిజన ప్రాంతంలో స్పోర్ట్స్ స్కూల్ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు పోష్టికాహారం, మెరుగైన వైద్య అందించి ఆదుకోవాలని కోరారు. గిరిజనుల ప్రాణాలతో ఆటలాడుకోవద్దని ప్రభుత్వానికి సూచించారు. రూ.కోట్లు వెచ్చించి నిర్వహించిన యోగాకు బదులుగా గిరిజన ప్రాంతాలలో చిన్న పరిశ్రమలు ఏర్పాటుచేసి ఈ ప్రాంతీయులకు ఉపాధి కల్పించవచ్చన్నారు. జంఝావతి, వట్టిగెడ్డ, పూర్ణపాడులాంటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ప్రజాధనాన్ని ప్రభుత్వం దుబారా చేస్తోందని, దీనిని రైతులు, యువత గమనించాలని కోరారు. కార్యక్రమంలో నాయ కులు హరికృష్ణ, వికాష్, చరణ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
సమ్మెలోకి మున్సిపల్ ఇంజినీరింగ్ సిబ్బంది
బొబ్బిలి: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆదివారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని ఇంజనీరింగ్ సిబ్బంది స్పష్టంచేశారు. ఈ మేరకు శనివారం బొబ్బిలి కమిషనర్ ఎల్.రామలక్ష్మి, చైర్మన్ రాంబార్కి శరత్లకు సమ్మె నోటీసు అందజేశారు. గత కొన్ని నెలలుగా సిబ్బంది సమ్మెలో ఉన్నప్పటికీ బొబ్బిలిలో మాత్రం ప్రజాప్రయోజనార్థం విధులు నిర్వహిస్తున్నామన్నారు. అయినా ప్రభుత్వం, అధికారుల్లో ఏమాత్రం కదలిక లేకపోవడంతో తాము కూడా సమ్మెలోకి వెళ్తున్నట్టు చెప్పారు. మరో మూడు రోజుల వరకూ వాటర్ సప్లై కార్మికులు విధుల్లోనే ఉంటారని, అనంతరం వారు కూడా సమ్మెలో మాతో కలిసి పాల్గొంటారని తెలిపారు. సమ్మెను కొనసాగించకుండా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలన్నారు. లేకుంటే ప్రజల ఇబ్బందులకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
ఈఎస్ఐ డయోగ్నోస్టిక్ సెంటర్లో బదిలీలు
విజయనగరం ఫోర్ట్: ఈఎస్ఐ డయోగ్నోస్టిక్ సెంటర్లో పనిచేస్తున్న పలువురు వైద్యులకు బదిలీఅయింది. కె.నీరజ (జనరల్ మెడిసిన్ విభాగం)కు మల్కాపురం ఈఎస్ఐ ఆస్పత్రికి బదిలీకాగా, ఆమె స్థానంలో డాక్టర్ కిరణ్కుమార్ రాజమండ్రి నుంచి వస్తున్నారు. పి.భాస్కరరావు (జనరల్ సర్జన్)కు తిరుపతి, భవిత ( గైనికాలజీ)కు రాజమండ్రి బదిలీ అయింది. వీరి స్థానంలో ఉమావాణి, ఏవీఎస్ కృష్ణారావు మల్కాపురం ఈఎస్ఐ ఆస్పత్రి నుంచి వస్తున్నారు. డాక్టర్ శ్రీవాణికి కూర్మన్న పాలేం ఈఎస్ఐ డిస్పెన్సరీకి బదిలీ కాగా, ఆమె స్థానంలో విశాఖపట్నం గురుద్వారా ఈఎస్ఐ డిస్పన్సరీ నుంచి డాక్టర్ మాధురిదేవి వస్తున్నారు. డాక్టర్ శిశరామకృష్ణకు విశాఖపట్నం జిల్లా అచ్చుతాపురం ఈఎస్ఐ డిస్పెన్సరీ నుంచి విజయనగరం ఈఎస్ఐ డయోగ్నోస్టిక్ సెంటర్కు వస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో బదిలీలు.. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు బదిలీ అయింది. డీపీహెచ్ఎన్ఓ మామిడి సత్యవతి, డీఎస్ఓ ధర్మారావుకు విశాఖపట్నంకు బదిలీ అయింది. సీనియర్ అసిస్టెంట్ రాజుకు విశాఖపట్నం ప్రాంతీయ ఐ ఆస్పత్రికి బదిలీ అయింది. -
ప్రయాణికుల ప్రయాస
ఆర్టీసీ బస్సుల్లో అధికశాతం విశాఖపట్నంలోని యోగాంధ్ర కార్యక్రమానికి తరలించడంతో విజయనగరం జిల్లా ప్రయాణికులకు కష్టాలు తప్పలేదు. ఆర్టీసీ కాంప్లెక్స్లోనే బస్సుల కోసం పడిగాపులు కాశారు. కొందరు ప్రయాణికులు శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కాంపెక్స్లోనే ఉండిపోయారు. బస్సులన్నీ యోగాంధ్రకు తరలించడంపై అసహనం వ్యక్తం చేశారు. కాంప్లెక్స్కు వచ్చిన అరకొర బస్సుల్లో ఎక్కేందుకు పోటీపడ్డారు. దీనికి ఈ చిత్రాలే సజీవ సాక్ష్యం. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం -
సంగీతంలో సాగరమంత సంగతులు
విజయనగరం: సంగీతంలో సాగరమంత సంగతులు ఉంటాయని, సంగీతం సార్వజనీనమైనదని సంగీత విద్వాంసురాలు, వరలక్ష్మీ త్యాగరాజ సంగీత నృత్య కళాశాల వ్యవస్థాపకురాలు లక్ష్మీరామదాసు అన్నారు. ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకుడు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో కోడకూడలి వద్ద ఉన్న ఓ ప్రైవేటు అతిథిగృహంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సంగీతం మనోల్లాసాన్ని కలిగించే కళగా పేర్కొన్నారు. నిర్దిష్టమైన స్వర లయలతో కూడిన శృతి బద్ధమైన సంగీత ధ్వనులు మనసును సేదతీర్చి ఆనంద డోలికల్లో ఓలలాడిస్తాయన్నారు. సంగీతం శిశువులను, పశువులను, చివరకు పాములను కూడా రంజింపజేస్తుందని తెలిపారు. ఆరు లలిత కళల్లోనూ పండిత పామరులను ఉర్రూతలూగించగల కళ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ రామదాసును సమాఖ్య అధ్యక్షుడు గురు ప్రసాద్, శ్రీ బాలాజీ టెక్స్టైల్స్ మార్కెట్ పూర్వ అధ్యక్షుడు పులిపాటి రామారావు, ఎం.సుభద్రాదేవి, తదితరులు సత్కరించారు. కార్యక్రమంలో విద్యార్థులు ఆలపించిన గీతాలు శ్రోతులను అలరించాయి. సంగీత విద్వాంసురాలు లక్ష్మీరామదాసు -
ఏడు నెలలకే ఏపీఎం బదిలీ!
జియ్యమ్మవలస రూరల్: ఎక్కడైనా ఐదేళ్ల సర్వీసు పైబడిన, రిక్వెస్టు లెటర్ పెట్టుకున్న ఉద్యోగులను బదిలీ చేయడం పరిపాటి. కూటమి ప్రభుత్వంలో అడ్డగోలు బదిలీలతో ఉద్యోగవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. జియ్యమ్మవలస మండలం ఏపీఎంగా పనిచేస్తున్న కె.త్రినాథమ్మ బాధ్యతలు చేపట్టిన ఏడు నెలలకే టీడీపీ నాయకులకు నచ్చలేదట. నియోజకవర్గ టీడీపీ నేతపై ఒత్తిడి తెచ్చి మరీ బదిలీచేయించారన్న చర్చ మండలంలో జోరందుకుంది. దీనిని మండల ప్రజాప్రతినిధి వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. త్రినాథమ్మ స్థానంలో కొత్త ఏపీఎంగా పార్వతీపురం వెలుగు కార్యాలయం నుంచి బొంతాడ శివున్నాయుడు నియమించినట్టు చెబుతుండగా, తనకు సీఈఓ కార్యాలయం నుంచి ఎలాంటి రిలీవింగ్ ఆర్డర్ అందలేదని త్రినాథమ్మ తెలిపారు. రేగులగూడ కొండపై ఏనుగులు సీతంపేట: మండలంలోని వెంపలగూడ–రేగులగూడ మధ్య సంచరించిన నాలుగు ఏనుగుల గుంపు శనివారం రేగులగూడ కొండపైకి చేరుకున్నాయి. కొండపోడు పనులకు వెళ్లిన గిరిజనులంతా భయాందోళనతో పరుగు తీశారు. ఎఫ్బీఓ దాలినాయుడు, ట్రాకర్లు ఏనుగుల సంచారాన్ని తెలుసుకుని ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఏనుగులను కవ్వించవద్దని సూచిస్తున్నారు. విజయనగరం భారీ స్కోర్ విజయనగరం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక విజ్జి క్రికెట్ మైదానంలో శనివారం నుంచి ప్రారంభమైన అంతర్ జిల్లాల మూడు రోజుల క్రికెట్ మ్యాచ్లో విజయనగరం భారీ స్కోర్ సాధించింది. విజయనగరం జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రీరామ్ సచిన్ అద్భుతంగా ఆడి 80 బంతుల్లో 152 పరుగులు సాధించడంతో తొలి రోజే విజయనగరం 411 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విజయనగరం జట్టు తొలి రోజు 83.5 ఓవర్లలో 411 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. టాప్ ఆర్డర్ బ్యాటర్ లోహిత్ రెడ్డి (91 పరుగులు), కార్తికేయ (63 పరుగులు) అర్థ సెంచరీలతో రాణించారు. ఆట ముగిసే సమయానికి శ్రీకాకుళం జట్టు నాలుగు ఓవర్లు వికెట్ నష్టపోకుండా ఐదు పరుగులు సాధించింది. వేగంగా ఆడి సెంచరీ సాధించిన శ్రీరామ్ సచిన్ను జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పి.సీతారామరాజు ట్రెజరర్ పీఎస్ఎన్ వర్మ, సెలెక్టర్ సర్పరాజ్ అభినందించారు. -
యోగాంధ్రకు రైట్ రైట్!
● నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం ● విశాఖ కార్యక్రమానికి బస్సుల్లో తరలింపు ● జిల్లాలోనూ పెద్ద ఎత్తున యోగా ప్రదర్శనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సాక్షి, పార్వతీపురం మన్యం: అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఇందులో పెద్ద ఎత్తున ప్రజలను, విద్యార్థులను భాగస్వామ్యం చేసింది. ప్రధానంగా విశాఖ జిల్లాలో శనివారం నిర్వహించబోయే యోగాంధ్ర కార్యాక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరు కానున్నారు. దాదాపుగా ఐదు లక్షల మందితో అక్కడ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ మేరకు విద్యార్థులను, యోగా సాధకులను పెద్ద ఎత్తున తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. పార్వతీపురం డిపో నుంచి స్థానిక అవసరాలతో పాటు, ఇతర జిల్లాలకూ బస్సులను పంపారు. ఆర్టీసీ, హయ్యర్ బస్సులు కలిపి మొత్తం 56 సర్వీసుల వరకూ వెళ్తున్నాయి. సాలూరు, పాలకొండ డిపోల నుంచీ బస్సులు విశాఖకు శుక్రవారమే తరలివెళ్లాయి. ఇవి కాక.. ప్రైవేట్స్కూల్ బస్సులనూ వినియోగిస్తున్నారు. మొత్తంగా మన్యం జిల్లా నుంచి 175 బస్సుల వరకు వెళ్తున్నాయి. అదే సమయంలో జిల్లాలోనూ... విశాఖలో జరగనున్న యోగా స్ఫూర్తితో అదే సమయంలో జిల్లాలోనూ పెద్ద ఎత్తున యోగాసనాలు వేయించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే నెల రోజులుగా వివిధ ముఖ్య ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తున్న విషయం విదితమే. శనివారం ఒక్కరోజే జిల్లాలో సుమారు 5.40 లక్షల మందితో యోగా చేయించేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. ప్రతి మండల, గ్రామ/వార్డు సచివాలయ పరిధిలో నమోదైన ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయనున్నారు. ఇందుకోసం మొత్తం 3,150 ప్రదేశాలను గుర్తించారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధ్రువపత్రాలు ఇవ్వనున్నారు. ఉదయం 6 గంటలకే వేదిక వద్దకు అందరూ చేరుకునేలా మండల ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించారు. యోగా ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ పార్వతీపురం టౌన్: జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించనున్న యోగా ఏర్పాట్లను కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పరిశీలించారు. రైల్వేస్టేషన్ ప్రక్కన పార్క్, జగన్నాథపురం వీధిలోని స్కూల్, దేవాంగుల వారి వీధి, చర్చి వీధిలో మున్సిపల్ పార్క్ తదితర ప్రదేశాలను శుక్రవారం సందర్శించి యోగా ఏర్పాట్లపై ఆరా తీశారు. యోగా నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
కూటమి నిర్లక్ష్యం.. తోటపల్లికి శాపం
వీరఘట్టం/పాలకొండ/గరుగుబిల్లి: రైతు సంక్షేమాన్ని విస్మరించిన కూటమి ప్రభుత్వం మూడు జిల్లాల రైతులకు సాగునీటి ఆధారమైన తోటపల్లి ప్రాజెక్టుపై కపటప్రేమ చూపుతోందని, కాలువల అభివృద్ధి, షట్టర్ల ఏర్పాటు, ఆధునికీకరణ పనులను నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ధ్వజమెత్తారు. ఖరీఫ్ ఆసన్నమైనా రైతుల సాగునీటి సమస్యను పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. తోటపల్లి జలాశయం ఎడమ ప్రధాన కాలువ రెగ్యులేటర్ను రైతులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మా ట్లాడారు. తోటపల్లి ఆధునికీకరణ పనుల పూర్తిపై పాలకొండ, కురుపాం ఎమ్మెల్యేలు నిమ్మక జయకృష్ణ, తోయక జగదీశ్వరి దృష్టిసారించకపోవడం తగదన్నారు. 25 శాతం పనులు పూర్తికాలేదని ప్రాధాన్యత క్రమంలో ఉన్న తోటపల్లి ప్రాజెక్టును తప్పించి, ఆధునికీకరణ పనులను రద్దుచేయడం పద్ధతి కాదన్నారు. 2014–19 మధ్య కాలంలో టీడీపీ హయాంలో తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులు కేవలం 9 శాతం మాత్రమే జరగగా అప్పటి టీడీపీ ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా బిల్లులు చెల్లించలేదన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2019–24 వరకు 14 శాతం పనులు పూర్తి చేశామన్నారు. రెండు విడతల్లో రూ.23,59,28,652లను బిల్లుల రూపంలో చెల్లించిందన్నారు. ఖరీఫ్కు సాగునీరిస్తారా.... తోటపల్లి జలాశయం వద్ద ఉన్న ఎడమకాలువ రెగ్యులేటర్ తలుపులు మరమ్మతులకు గురికావడంతో ఎడమకాలువ ద్వారా నీరు వృథాగా పోతోందన్నారు. రైతులకు ప్రస్తుతం నీరు అవసరం లేకపోయినప్పటికీ తోటపల్లి నీరు పొలాల్లోకి చేరడంతో రైతులు ఖరీఫ్ పనులు సజావుగా చేపట్టలేకపోతున్నారన్నారు. ఖరీఫ్లో నీటి అవసరం ఉన్నప్పుడు సాగునీరు అందుతుందా లేదా అనే ఆందోళనలో రైతాంగం ఉందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం తోటపల్లి ఆయకట్టు రైతులకు శాపంగా మారిందన్నారు. గత ఎన్నికల ముందు తోటపల్లి అంశాన్ని పదే పదే రైతుల వద్ద ప్రస్తావించి కల్లబొల్లి మాటలతో రైతుల ఓట్లు దండుకున్న కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఆధునికీకరణ పనులను రద్దుచేసి రైతుల నోట్లో మట్టికొట్టిందన్నారు. ఖరీఫ్కు సాగునీరు విడుదల ప్రణాళికను నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు జంపు కన్నతల్లి, వైఎస్సార్సీపీ వీరఘట్టం,పాలకొండ మండలాల కన్వీనర్లు దమలపాటి వెంకటరమణనాయుడు, కనపాక సూర్యప్రకాశరావు, నాయకులు కర్రి లీలాప్రసాదరావు, పిన్నింటి శ్రీను, కళింగ ప్రేమభూషణరావు, శంభాన శ్రీను, ఇ.లిల్లీపుష్పనాథం, రణస్థలం రాంబాబు, దుప్పాడ పాపినాయుడు, పాలవలస ధవళేశ్వరరావు, పొట్నూరు లక్ష్మణరావు, కోరాడ సూర్యనారాయణబాబు, మాచర్ల వెంకటరమణ, డోకల శ్రీను, నల్లబిల్లి విశ్వేశ్వరరావు, బంకి లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కలియుగ భస్మాసురుడు నారా లోకేశ్ రాష్ట్రంలో రెడ్బుక్ పాలనతో మంత్రి నారా లోకేశ్ కళియుగ భస్మాసురుడిగా మారి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, చివరకు కూటమి ప్రభుత్వానికి అదే రెడ్బుక్ భస్మాసుర హస్తంగా మారుతుందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్,మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. ఇటీవల రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించినప్పుడు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండడంతో కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతోందన్నారు. జగన్మోహన్రెడ్డికి సన్నిహితంగా ఉన్నవారిపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. -
ఘాట్ రోడ్డులో వ్యాన్ బోల్తా
ముంచంగిపుట్టు (అల్లూరి సీతారామరాజు జిల్లా): మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ అంటాబొంగు ఘాట్లో శుక్రవారం సాయంత్రం వ్యాన్ బోల్తా పడిన సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం గుమ్మడం గ్రామానికి చెందిన వంగపండు తిరుపతి అనే మేస్త్రి మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ సుత్తిగూడ గ్రామంలో సెంట్రింగ్ సామాన్లు కొనుగోలు చేశాడు. వీటిని తీసుకువెళ్లేందుకు గుమ్మడం గ్రామానికి చెందిన 10 మంది కూలీలతో వ్యాన్లో వచ్చాడు. అక్కడి మెటీరియల్ను తీసుకువెళ్తుండగా అంటాబొంగు ఘాట్ వద్దకు వచ్చే సరికి ప్రమాదానికి గురైంది. ఘాట్ ఎక్కలేక వ్యాన్ వెనక్కి వచ్చేసింది. దీనిని గమనించిన డ్రైవర్ బయటకు దూకేసి పారిపోయాడు. దీంతో వ్యాన్ అదుపు తప్పి లోయలోకి దూసుకుపోయి బోల్తా పడింది. సెంట్రింగ్ సామాన్లు వ్యాన్లో ఉన్న కూలీలపై పడిపోయాయి. ఈ ఘటనను చూసిన స్థానికులు హూటహూటిన వచ్చి గాయపడిన వారిని బయటకు తీశారు. సంఘటన స్థలంలో కూలీల్లో సింగరాపు శివ(39), సింగరాపు రమణ (45) మృతి చెందారు. తీవ్ర గాయాలతో ఉన్న వడ్డ గణపతి (33), దవరసింగి కుమార్ (35), సింగరాపు రమేష్ (34), నారపాటి బాబురావు (45), నారపాటి భాస్కరరావు (42), వంగపండు తిరుపతి (39), సింగరాపు శంకరరావు (38)ను ప్రైవేట్ వాహనంలో స్థానిక సీహెచ్సీకి తీసుకువచ్చారు. స్థానిక వైద్యాధికారి వివేక్, సిబ్బంది వారికి వైద్య సేవలు అందించారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న కొంతమందిని పాడేరు జిల్లా ఆస్పత్రికి పంపిస్తామని వారు తెలిపారు. ప్రమాదం సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ జె.రామకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమాచారాన్ని బాధిత కుటుంబాలకు ఫోన్లో తెలియజేశారు. ఇద్దరు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలిస్తామని ఆయన పేర్కొన్నారు. సంఘటన స్థలంలో ఇద్దరు కూలీల మృతి మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అంటాబొంగు ఘాట్ ఎక్కలేక అదుపుతప్పడంతో ప్రమాదం క్షతుగాత్రులకు ముంచంగిపుట్టు సీహెచ్సీలో వైద్య సేవలు -
సత్య డిగ్రీ కళాశాల క్యాంపస్ డ్రైవ్లో 197 మందికి ఉద్యోగాలు
● యోగాతో సంపూర్ణ ఆరోగ్యం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని లిమ్కాబుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, ప్రముఖ చిత్రకారిణి సిరిపురపు ప్రవల్లికా నారాయణ్ వేసిన చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, వివిధ యోగాసనాలతో ఇంటర్నేషనల్ యోగాడే అని వేసిన చిత్రం అబ్బురపరుస్తోంది. విజయనగరం టౌన్విజయనగరం అర్బన్: పట్టణంలోని సత్య డిగ్రీ/పీజీ కళాశాల ప్రాంగణంలో లెర్నింగ్ ట్రీ ఆర్గనైజేషన్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సంయుక్తంగా శుక్రవారం నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్లో 197 మందికి ఉద్యోగాలు లభించాయి. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సాయిదేవమణి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. డ్రైవ్లో 16 కంపెనీలు పాల్గొని 492 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేసినట్లు తెలిపారు. తొలుత రిటన్ టెస్ట్, తరువాత టెక్నికల్ రౌండ్, ఇంటర్వ్యూలు నిర్వహించగా ప్రతిభ చూపిన 197 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. ఉద్యోగాలకు ఎంపికై న విద్యార్థులను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు అభినందించారు. -
మారిక విద్యార్థుల సమస్యలు తీరవా?
● పాఠశాలకు భవనం లేక చెట్ల కిందనే తరగతులు ● చర్చి వరండాలో మధ్యాహ్న భోజనంవేపాడ: మండలంలోని కరకవలస పంచాయతీలో ఎత్తైన గిరిశిఖరంపై ఉన్న మారిక గిరిజన గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉన్నా భవనం లేకపోవడంతో చెట్టుకిందనే పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉపాధ్యాయుల బదిలీ ప్రకియలో బదిలీపై మారిక పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుల విద్యాబోధనపై గిరిజనులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్తమారిక, పాతమారిక తండాలకు సంబంధించి 27 మంది పిల్లలకు భవనం లేకపోవడంతో ఉపాధ్యాయులు చెట్ల కిందనే పాఠాలు బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చర్చి వరండాలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భోజనాలు పెట్టినట్లు ఉపాధ్యాయుడు రాంబాబు తెలిపారు. అలాగే ఎస్ఎంఎస్ సభ్యులతో కిచెన్ గార్డెన్తయారు చేయించడం ప్రారంభించారు. గిరిజన విద్యార్థులకు మంచి బోధన అందించాలన్న తపనతో కృషి చేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు కనీస సౌకర్యాలైన పాఠశాల పక్కాభవనం, మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
సంగీత, నృత్య కళాశాలలో ప్రవేశాలకు ఆహ్వానం
విజయనగరం టౌన్: మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ కేఏవీఎల్ఎన్. శాస్త్రి శుక్రవారం కళాశాల కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో తెలిపారు. నాలుగేళ్ల సర్టిఫికెట్ కోర్సుతో పాటు రెండేళ్ల డిప్లమో కోర్సులో శిక్షణ ఉంటుందన్నారు. సర్టిఫికెట్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే డిప్లమో కోర్సుల్లో చేరేందుకు అర్హులన్నారు. కళాశాలలో గాత్రం, వీణ, వయోలిన్, నాదస్వరం, మృదంగం, డోలు, భరతనాట్యం కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నామని, అభ్యర్థుల వయస్సు 10 ఏళ్లు నిండి 60 ఏళ్లలోపు ఉండాలన్నారు. దరఖాస్తులను కళాశాల సమయవేళల్లో అందజేయాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు ఫోన్ 08922–223751 నంబర్లో కానీ నేరుగా కళాశాలలో గానీ సంప్రదించాలని కోరారు. -
రెవెన్యూ ప్రతిష్టను పెంపొందించాలి
పార్వతీపురంటౌన్: జిల్లా ప్రజలకు అందిస్తున్న రెవెన్యూ సేవలతో ఆ శాఖ ప్రతిష్ట మరింత పెంపొందాలని, ఆ దిశగా రెవెన్యూ శాఖాధికారులు, ఉద్యోగులు కృషిచేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పిలుపునిచ్చారు. గ్రామ రెవెన్యూ అధికారి నుంచి తహసీల్దార్ వరకు అందరూ నిబద్ధతతో పనిచేసి ప్రజలకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో రెవెన్యూ దినోత్సవాన్ని ఆ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. ప్రభుత్వ శాఖల్లో అన్ని శాఖల కంటే రెవెన్యూ శాఖ చాలా కీలకమైనదని, ఒక్కోసారి 24/7 విధులు నిర్వర్తించవలసి ఉంటుందన్నారు. ఎన్నికలు, ప్రకృతి వైపరీత్యాలు, భూసేకరణ, వివిధ రకాల పత్రాల జారీ, ప్రభుత్వ పథకాల అమలు వంటివి ప్రజలకు అందించాల్సిన అన్ని సేవలు రెవెన్యూ శాఖతో ముడిపడి ఉన్నాయన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులను నిర్వర్తించవలసి ఉంటుందని, తమ క్షేమాన్ని ఆశించకుండా ప్రజల కోసం నిస్వార్థం్గా నిబద్ధతతో పనిచేసే శాఖ రెవెన్యూ మాత్రమేనని కొనియాడారు. పనిచేయడంలో ప్రణాళిక ఉండాలి.. రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు పనిచేయడంలో ప్రణాళిక ఉండాలని, బాధ్యతగా చేస్తే మరింత మెరుగైన సేవలు అందించవచ్చని కలెక్టర్ హితవు పలికారు. రాబోయే రోజుల్లో ప్రతి పని డిజిటలైజేషన్ అవుతుందని, కావున ప్రతి ఉద్యోగి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆన్లైన్ ద్వారా సేవలు అందించడం వల్ల పారదర్శకత ఉంటుందని, అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వివరాలను తెలుసుకునే సౌలభ్యం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులకు దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. కె.చుక్కా అలియాస్ కోనేరు అప్పారావుకు బాండెడ్ లేటర్ చట్టం ప్రకారం చెక్కును అందజేశారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ప్రజలతో మమేకం కావాలి.. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత మాట్లాడుతూ కుటుంబ శ్రేయస్సును వదిలి, విధి నిర్వహణలో పూర్తిగా నిమగ్నమైన ఉద్యోగులు రెవెన్యూ ఉద్యోగులని కొనియాడారు. అన్నిసేవలు అందిస్తున్న రెవెన్యూ శాఖను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అందించే సేవల ద్వారా వారి మన్ననలను పొందాలని హితవు పలికారు. ఉత్తమ సేవలు అందించడం ద్వారా రెవెన్యూ ప్రతిష్ట మరింత పెరుగుతుందని, ఆ దిశగా అధికారులు, సిబ్బంది కృషిచేయాలని కోరారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ ఉపాధ్యకుడు శ్రీరామమూర్తి, జిల్లా గ్రామ రెవెన్యూ సంఘం అధ్యక్షుడు సింహాచలం నాయుడు, కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి సీహెచ్, రాధా కృష్ణమూర్తి తదితరులు రెవెన్యూ శాఖ అందిస్తున్న సేవలను గుర్తుచేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్తులో వేగవంతంగా మరిన్ని సేవలు అందించేలా కృషిచేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఉప కలెక్టర్లు, తహసీల్దార్లు, ఉపతహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగులు, విద్యార్థులకు అండగా నిలవండి
భోగాపురం: కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులు, విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారికి అండగా నిలబడాలని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడులు సూచించారు. ఈ మేరకు భోగాపురానికి చెందిన సుందర హరీష్ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా నియ మితులైన సందర్భంగా శుక్రవారం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడులను వారి నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు విద్యార్ధులు, యువతకు కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక మోసం చేసిందని దుయ్యబట్టారు. ఏడాది అవుతున్నా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేదన్నారు. విద్యార్ధులకు ఫీజు రియింబర్స్మెంట్ విడుదల చేయలేదని విమర్శించారు. జగనన్న ప్రభుత్వంలో విద్యార్థుల అభ్యున్నతికి ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారని గుర్తుచేశారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పాడ సూర్యనారాయణరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో నాయకులు గోపి, బంగార్రాజు, వెంకన్న, ప్రసాద్, శ్రీను, సాయిరాం, భాస్కరరావు, మాధవ, అప్పారావు, గురువులు, తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా రెవెన్యూ దినోత్సవం
విజయనగరం అర్బన్: రెవెన్యూ అధికారులు చట్టాలపై అవగాహన కల్పించుకుని ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. రిటైర్ అయిన ఉద్యోగుల అనుభవాలను తెలుసుకుని సమర్థతను పెంచుకోవాలని సూచించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జరిగిన రెవెన్యూ దినో త్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం సిబ్బంది, అధికారులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. రెవెన్యూ శాఖలో రిటైర్ అయిన అటెండర్ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు పలువురిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించా రు. కార్యక్రమంలో డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, ఆర్డీఓలు ఆశయ్య, రామ్మోహన్రావు, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ బాలాత్రిపుర సుందరి, రిటైర్డ్ డీఆర్ఓ గణపతిరావు, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.గోవింద, సూర్యనారాయణ, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. రిటైర్డ్ అధికారులకు సత్కారం -
22న జాబ్మేళా
నెల్లిమర్ల: పట్టణంలోని సీకేఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 22న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్కుమార్ శుక్రవారం ఒకప్రకటనలో తెలిపారు.జిల్లా నైపుణ్యాభివృద్ధిసంస్థ, ప్రభుత్వ జూనియర్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, డిప్లమో, ఐటీఐ, బీటెక్, పీజీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు జాబ్మేళాకు హాజరుకావాలని సూచించారు.12 బహుళ జాతి కంపెనీలు మేళాలో పాల్గొంటాయన్నారు. అభ్యర్థులు తమ వివరాలను httpr://naipunyam.ap.gov.inఅనే వెబ్సైట్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కోరారు.సారా అమ్మకాలపై దాడులుజియ్యమ్మవలస: మండలంలోని చినమేరంగి పరిసర ప్రాంతాల్లో అక్రమంగా సారా అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో ఎకై ్సజ్ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో 60 లీటర్ల సారాతో చినమేరంగి గ్రామానికి చెందిన వ్యక్తి పట్టుబడడంతో అదుపులోకి తీసుకున్నారు. సారా రవాణాకు ఉపయోగించిన పల్సర్బైక్ను సీజ్ చేసినట్లు సీఐ చెప్పారు. సారా సరఫరా చేస్తున్న రాయగడ జిల్లా కెరడ గ్రామానికి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి ఇద్దరినీ కోర్టులో హాజరు పరిచామన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఎస్సై రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల బదిలీలకు దరఖాస్తులుపార్వతీపురం టౌన్: జిల్లా పరిధిలో సమగ్ర శిక్ష మండల స్థాయిలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న వారు రిక్వెస్ట్ ట్రాన్సఫర్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని సమగ్ర శిక్ష ఏపీసీఎస్ వరల్డ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేజీబీవీ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్, క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మెసెంజర్లు, ఆఫీస్ సబార్డినేట్లు, సైట్ ఇంజినీర్లు తదితర పోస్టులకు రిక్వెస్ట్ ట్రాన్సఫర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. సంబంధిత మండల విద్యాశాఖాధికారి, ప్రధానోపాధ్యాయులతో కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ సిబ్బంది సంబంధిత ప్రిన్సిపాల్తో కౌంటర్ సైన్ చేయించాలని సూచించారు. జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయంలో ఈనెల 21 వరకు కార్యాలయం పని వేళల్లో దరఖాస్తులు అందించాలని స్పష్టం చేశారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతివిజయనగరం క్రైమ్: ఐదు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన విజయనగరంలోని వీటీ అగ్రహారానికి చెందిన బమ్మిడి పైడిరాజు(50) హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు విజయనగరం రూరల్ ఎస్సై అశోక్ చెప్పారు. ఈ నెల 15వ తేదీన పైడిరాజు బైక్పై నాతవలస వెళ్లి తిరిగి వస్తుండగా ధర్మపురి రోడ్డులో సుగర్ డౌన్ అయ్యి కళ్లు తిరిగి పడిపోయాడని ఎస్సై అశోక్ తెలిపారు. స్థానికుల సహాయంతో వైజాగ్లోని మెడికవర్ ఆస్పత్రిలో జాయిన్ చేయగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. పైడిరాజు కుమార్తె కీర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రూరల్ ఎస్సై తెలిపారు. -
కరెంటు కోత!
బిల్లుల వాత.. సాక్షి, పార్వతీపురం మన్యం : ఎండలు మండుతున్నాయి. అంతకుమించి ఉక్కబోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఓవైపు అడపాదడపా వానజల్లులు కురుస్తున్నా.. వాతావరణం మాత్రం అగ్ని గుండాన్ని తలపిస్తోంది. ఈ సమయంలో అనధికార విద్యుత్ కోతలు ప్రజలను విసిగిస్తున్నాయి. పగలూరాత్రీ తేడా లేకుండా కోతలు ఉండటంతో ఇళ్లలో ఉండలేకపోతున్న పరిస్థితి. ఇదే సందర్భంలో విద్యుత్ బిల్లులు మాత్రం గతంతో పోల్చుకుంటే రెండింతలు, మూడింతలు పెరిగాయని వినియోగదారులు వాపోతున్నారు. సమయపాలన లేకుండా నిర్వహణ, ఇతర కారణాలు చెబుతూ కోత విధిస్తున్నారు. కొన్నిచోట్ల రోజులో నాలుగైదు గంటల చొప్పున సరఫరా ఉండటం లేదని విద్యుత్ వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో అన్నీ కలిపి 2.84 లక్షలకుపైగా విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. ప్రస్తుతం వేసవి ప్రభావం ఉండటంతో రోజుకు 1.190 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ వినియోగమవుతోంది. వినియోగం పెరగడం ఒకవైపు.. కొద్దిరోజులుగా అడపాదడపా గాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోంది. చిన్నపాటి గాలి వీచినా కరెంటు నిలుపు చేస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు. ప్రధానంగా నిర్వహణ, మరమ్మతుల పేరిట రోజులో మూడు, నాలుగు గంటలకుపైగా సరఫరా నిలిచిపోతోంది. ● పార్వతీపురం మండలంలోని నర్సిపురం 11కేవీ ద్వారా పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా అవ్వగా.. ఆర్కే బట్టివలస, రంగాలగూడ, అడ్డూరువలస, సంగంవలస, ఎమ్మార్నగరం, సమీప ప్రాంతాలకు తరచూ విద్యుత్ కోతల కారణంగా గ్రామీణ ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఏ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారో తెలియక వాడుక నీరుకు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో కూడా ఇదే పరిస్థితి ఉండటం.. దోమల బెడదతో జ్వరాల బారిన పడుతున్నారు. ● పార్వతీపురం పట్టణంలో నిర్వహణ, మరమ్మతుల పేరిట వారంలో రెండు రోజులు 3 నుంచి 4 గంటల వరకు విద్యుత్ కోత విధిస్తున్నారు. ● బలిజిపేట మండలంలో అప్రకటిత విద్యుత్ కోతలు ఉన్నాయి. ఒక వైపు ఎండల తీవ్రత, ఉక్కబోత విసిగిస్తుండగా.. అప్రకటిత విద్యుత్ కోతలు సహనానికి పరీక్ష పెడుతున్నాయి. రాత్రీపగలు తేడా లేకుండా కోతలు ఉన్నాయి. వర్షాల ప్రభావం వల్ల ఈదురు గాలులు వీచినా, వర్షం పడుతుందనే అనుమానం కలిగినా సరఫరాకు బ్రేక్ ఇస్తున్నారు. సీతానగరం మండలంలో మరమ్మతుల పేరుతో తరచూ సరఫరా నిలిచిపోతోంది. ● సాలూరు మండలంలో అనధికార కోతలు కొనసాగుతున్నాయి. రోజులో దాదాపు 2 నుంచి 3 గంటల వరకు కోత విధిస్తున్నారు. దీంతో వ్యవసాయ పంపుసెట్లు కూడా ఆగిపోయి రైతులకు ఇబ్బంది కలుగుతోంది. ● కొమరాడ మండలంలో ఇష్టారాజ్యంగా విద్యుత్ కోతలున్నాయి. అర్ధరాత్రి సమయంలోనూ సరఫరా నిలిచిపోవడంతో ఫ్యాన్లు తిరగక, ఉక్కబోత భరించలేక వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. జియ్యమ్మవలస మండలంలో ప్రతి శుక్రవారం నిర్వహణ పనుల పేరిట ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు సరఫరా ఆగిపోతోంది. గరుగుబిల్లి మండలంలో ఏ మాత్రం వర్షం కురిసినా, గాలి వీచినా కొన్ని గంటల పాటు సరఫరా నిలిచిపోతోంది. ● పాలకొండ విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో మరమ్మతుల పేరుతో ప్రతిరోజూ ఏదో ఒకచోట ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు సరఫరా ఆగిపోతోంది. దీనికి తోడు గాలులు, వర్షం కారణంగా సాయంత్రం సుమారు 2 గంటల పాటు విద్యుత్ కోతలు ఉంటున్నాయి. ఫలితంగా విద్యుత్ సరఫరా ఆధారిత వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా పిండిమిల్లులు, వైద్య పరీక్ష కేంద్రాలు నడుపుతున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ● వ్యవసాయం చేసుకొనే రైతులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పగటి పూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్ను అందించేది. నేడు పగటి పూట కనీసం 6 గంటల సేపు కూడా సరఫరా చేయకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. ● వీరఘట్టం మండలంలో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇచ్చే త్రీఫేస్ కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. విద్యుత్ కోసం రైతులు పంపుసెట్ల వద్ద కాపలా కాయాల్సి వస్తోంది. భామిని మండలంలోనూ ఇదే స్థితి. సీతంపేట ఏజెన్సీలో విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం ఏర్పడుతోంది. చిన్నపాటి వర్షాలకు సైతం రోజంతా సరఫరా ఆగిపోతోంది. లేకుంటే రోజులో ఏదో సమయాన రెండు, మూడు గంటలపాటు నిలుపు చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది సాలూరు మండలం కురుకుట్టి పంచాయతీ పెదబారిగాం గ్రామంలోని కొండతామర చిన్నప్ప ఇంటికి జూన్ నెలలో వచ్చిన కరెంటు బిల్లు. అక్షరాలా రూ.7,624లు. వినియోగం వంద యూనిట్లే. గిరిజనుడైన ఈయనకు ఎస్సీ, ఎస్టీ రాయితీ కూడా ఉంటుంది. తనకు వచ్చిన బిల్లు చూసి లబోదిబోమంటున్నాడు.u జిల్లాలో అప్రకటిత విద్యుత్ కోతలు రోజుకు మూడు, నాలుగు గంటలపాటు నిలుపుదల మరోవైపు వినియోగదారులకు చార్జీల మోత చార్జీల బాదుడు విద్యుత్ లేకున్నా.. బిల్లుల బాదుడు మాత్రం వినియోగదారులకు తప్పడం లేదు. గతంలో రూ.200లోపు వచ్చిన వారికి ఇప్పుడు రూ.400 నుంచి రూ.600 వరకు బిల్లు వస్తోంది. గిరిజన ఆవాసాలకు సైతం రూ.వేలల్లో బిల్లులు వస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీల రాయితీ కూడా వర్తింపజేయడం లేదని గిరిజనులు వాపోతున్నారు. ట్రూ ఆప్ చార్జీలు, సర్ చార్జీలంటూ ఎప్పుడో వినియోగానికి ఇప్పుడు లెక్క కట్టి వేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. -
కూటమి కక్షపూరిత చర్యలు
బొబ్బిలి: ఇటీవలే కౌన్సిలర్లకు తాయిలాలతో వల వేసి అధికారాన్ని చేజిక్కించుకున్న టీడీపీ నాయకులు వైస్చైర్మన్ పదవికి కూడా అవిశ్వాసం పెట్టిన సంగతి తెలిసిందే. అధికారం కోసం అడ్డడారులు వెతుక్కునే టీడీపీ నాయకులకు అధికార దాహం చల్లారడం లేదు. మున్సిపల్ కార్యాలయం ఎదుట సందర్శకులు, కౌన్సిలర్ల కోసం కుర్చీలు, ఓ టేబుల్ ఉండేవి. అక్కడ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు కూర్చుంటున్నారని సంవత్సరాల తరబడి ఉన్న ఫర్నిచర్ను గురువారం తొలగించారు. అధికారులు, కౌన్సిలర్ల కోసం, సందర్శకులు, అర్జీదారులు కూడా వచ్చి కాసేపు కూర్చుని తమ పనులు చక్కబెట్టుకుని వెళ్లేవారు. నిన్నమొన్నటి వరకూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లే అధిక సంఖ్యలో ఉండడం వల్ల అక్కడ వారు కూడా కూర్చునే వారు. ఆయా వార్డులకు చెందిన ప్రజలు వస్తే వారి యోగక్షేమాలు కనుక్కుని అధికారుల వద్ద ఏమైనా పనులుంటే చేసిపెట్టేవారు. అవిశ్వాసంతో ఈ మధ్యనే అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు అక్కడున్న విజిటర్స్ చాంబర్ను పూర్తిగా తొలగించారు. ఒక్క కూర్చీ కూడా లేకుండా చేశారు. గురువారం యాథాలాపంగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు అక్కడ కూర్చునేందుకు ఒక్క కుర్చీ కూడా లేకపోవడంతో అవాక్కయ్యారు. ఇదేం ఘోరం అంటూ కమిషనర్ రామలక్ష్మిని కలిసి అడ్గగా ఆమె నీళ్లు నమిలారు. ఏం చేస్తాం చెప్పండి నాకు కొద్ది రోజులుగా వాటిని తొలగించాలని బాగా ప్రెజర్ ఉందని కౌన్సిలర్లతో చెప్పారు. దీంతో కౌన్సిలర్లు నేరుగా వచ్చి కిందనే కూర్చున్నారు. కూటమి నాయకుల ఆదేశాలతో ఇలా కుర్చీలు తొలగించడం దారుణమని, ఇదేం చోద్యమని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. కూటమి నాయకుల తీరు పట్ల ఔరా అంటూ నోరెళ్లబెడుతున్నారు. సందర్శకులు, కౌన్సిలర్ల కుర్చీలు తొలగించి రాక్షసానందం -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ103 శ్రీ176 శ్రీ186కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై దృష్టి ● పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విజయనగరం ఫోర్ట్: కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించినట్టు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. దీనికోసం గ్రామ స్థాయిలో ఉన్న ఇబ్బందులను తెలుసుకునేందుకు జిల్లా పర్యటనకు వచ్చినట్టు తెలిపారు. విజయనగరం మెసానిక్ టెంపుల్లో గురువారం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. పార్టీ బలోపేతంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రజల సమస్యలపై పోరాటం చేసినది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనన్నారు. కూటమి ప్రభుత్వం రాజధానిపై పోరాటం చేస్తే హౌస్ అరెస్టు చేశారని, స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేస్తే దీక్ష భగ్నం చేశారని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసినది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్, డాక్టర్ గేదెల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు. హోటళ్లపై 6ఎ కేసు నమోదుడెంకాడ: మండలంలోని రెండు హోటళ్లపై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి 6ఎ కేసు నమోదు చేశారు. ఈ మేరకు చింతలవలస పరిధి ఉన్న 99 ద రాయల్ బిర్యానీ హౌస్, జొన్నాడ వద్ద ఉన్న ద్వారకా హోటల్లో విజిలెన్స్ సీఐ బి.సింహాచలం, సిబ్బంది గురువారం తనిఖీ చేశారు. ఇంటిలో వినియోగించాల్సిన ఎల్పీజీ సిలిండర్లను హోటల్లో వినియోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో 99 ద బిర్యాని హౌస్లో 6 సిలిండర్లు, ద్వారకా హోటల్లో 5 సిలిండర్లను పట్టుకుని 6ఎ కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు. పట్టుకున్న సిలిండర్లను సాయి గ్యాస్ ఏజెన్సీకి అప్పగించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఐ కిరణ్, వీఆర్వోలు కన్నయ్య, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. నేడు రెవెన్యూ దినోత్సవంపార్వతీపురంటౌన్: రెవెన్యూ దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన జారీ చేశారు. జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రెవెన్యూ డే సందర్భంగా ప్రతి రెవెన్యూ కార్యాలయంలో వేడుకలు జరుగుతాయన్నారు. ఈ వేడుకల్లో రెవెన్యూ ఉద్యోగుల బాధ్యతలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్ వివరించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిడెంకాడ: విజయనగరం–నాతవలస ఆర్అండ్బీ రహదారిపై డెంకాడ మండలం పెదతాడివాడ కూడలి సమీపంలో గురువారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో చిత్తూరు జిల్లాకు చెందిన యానాది రవి(36) మృతి చెందాడు. ఎస్సై ఎ.సన్యాసినాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యానాది రవి, బావ కంతలచెరువు గోపి ఈ నెల 13వ తేదీన చిత్తూరు జిల్లా నుంచి ఐషర్వ్యాన్లో టమాటో లోడ్తో విజయనగరం వచ్చారు. 15వ తేదీ ఉదయం 10 గంటల ప్రాంతంలో అన్లోడ్ చేశారు. అక్కడి నుంచి ఐషర్ వాహనం యజమానికి ఫోన్చేయగా పెదతాడివాడ వద్ద ఉన్న న్యూ వెంకట్ మినీ ట్రాన్స్పోర్టు కార్యాలయానికి వెళ్లి చిత్తూరు ఏమైనా కిరాయి ఉంటే చేసుకుని రావాలని చెప్పారు. దీనిలో భాగంగా యానాది రవి, బావ కంతలచెరువు గోపి పెదతాడివాడ వచ్చి ఉన్నారు. 18వ తేదీ రాత్రిభోజనం అనంతరం 11:30 గంటల సమయంలో ఫోన్ పట్టుకుని రవి బయటకు వెళ్లగా, గోపి వాహనంలో సేదదీరుతున్నాడు. ఇంతలో పెద్ద శబ్దం వచ్చింది. చీకటిలో వెళ్లి వెతకగా రవి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే 108 వాహనానికి ఫోన్ చేయగా వారు వచ్చి రక్తపు మడుగులో ఉన్న యానాది రవిని పరీక్షించారు. అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారని మృతుడి బావ కంతలచెరువు గోపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సన్యాసినాయుడు తెలిపారు. ఐషర్ వాహనంలో గోపి డ్రైవర్గా, రవి క్లీనర్గా పని చేస్తున్నారు. మృతుడు యానాది రవి చిత్తూరు జిల్లా బైరెడ్డిపాలెం మండలం నెల్లిపట్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. -
సంతృప్తికరమైన జీవనశైలికి యోగా దోహదం
గంట్యాడ: భారతీయల వారసత్వ సాంస్కృతిక సంపదైన యోగాను యావత్ ప్రపంచం అనుసరిస్తోందని తద్వారా సమగ్రమైన, ప్రశాంతమైన సంతృప్తికరమైన జీవనశైలి వైపు పయనించే అవకాశం ఉందని రాష్ట్ర సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు గురువారం మండలంలోని గొర్రిపాటి బుచ్చి అప్పారావు జలాశయం వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ యోగాను విశ్వవ్యాప్తం చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందన్నారు. యోగా ప్రతిరోజూ చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని జయించవచ్చన్నారు. విద్యార్థులు వారి జీవనంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ మాణిక్యం నాయుడు, డీఎంహెచ్ఓ డాక్టర్ జీవన రాణి, పర్యాటక అధికారి కుమారస్వామి, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఎం.ఆనందరావు, మెప్పా పీడీ చిట్టిరాజు, ఎంపీడీఓ రమణమూర్తి, సీడీపీఓ ఉమాభారతి తదితరులు పాల్గొన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ -
బోర్డులు మార్చండి ప్లీజ్..!
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలో విస్తరించిన అంతర్రాష్ట్ర రహదారిపై ప్రమాదాలు నివారించేందుకు ఏర్పాటు చేసిన సూచిక బోర్డులు సరైన దిశగా లేకపోవడంతో వాహన చోదకులు అత్యంత వేగంగా ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. హార్న్ కొట్టాల్సిన ప్రాంతంలో సూచిక లేక స్కూల్ జోన్ల వద్ద నిర్దిష్ట వేగంతో వెళ్లక, మలుపులను గుర్తించక ప్రమాదాలకు గురవుతున్నారు. నిత్యం ప్రజారవాణాకు సంబంధించిన, అలాగే ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగించే భారీ నుంచి అతిభారీ వాహనాలు వందల సంఖ్యలో ఈ రహదారిపై రాకపోకలు కొనసాగిస్తాయి. ఇప్పటికే రహదారిపై ఉన్న సూచికలు దిశ మార్చుకుని సక్రమంగా లేకపోవడంతో సరైన దిశలో వాటిని ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. అస్తవ్యస్తంగా సూచిక బోర్డులు -
కాలేజీలో సీట్లు హౌస్ఫుల్..!
● ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు పోటెత్తిన అడ్మిషన్లు ● అధ్యాపకుల కృషిఫలితంగా కోలుకున్న కళాశాల రాజాం: నిన్నమొన్నటి వరకూ పదుల సంఖ్యలో మాత్రమే ఆ కళాశాలలో విద్యార్థినులు ఉండేవారు. ఒకగానొక దశలో ఆ కళాశాల ఎత్తివేసే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో గత రెండేళ్లుగా అధ్యాపకులు నిరంతర శ్రమతో అక్కడ చదువుతున్న విద్యార్థుల అభ్యసనకు పదునుపెట్టారు. మంచి ఫలితాలు సాధించారు. ఫలితంగా ఒక్కసారిగా ఆ కళాశాలలో అడ్మిషన్లు సంఖ్య పెరగడం ప్రారంభించింది. కనీవినీ ఎరగని రీతిలో అడ్మిషన్స్ రాజాం పట్టణంలోని సారథిరోడ్డులో గల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఈ విద్యాసంవత్సరంలో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ అయ్యాయి. జిల్లాలో అత్యధికంగా ఇంటర్ అడ్మిషన్లు పూర్తిచేసుకున్న ఘనత ఈ కళాశాల ఇప్పుడు దక్కించుకుంది. ఈ ఏడాది వచ్చిన ఇంటర్ ఫలితాల్లో ఇక్కడ 92 శాతం ఉత్తీర్ణత లభించడంతో పాటు విద్యార్థినులు అధికమార్కులు సాధించారు. దీంతో ఈ విద్యాసంవత్సరం ఇక్కడ ఇంటర్ చేరికలు 163కు పెరిగాయి. కళాశాలలోని ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులకు సంబంధించి ఇంగ్లీషు, తెలుగు మీడియంలో బోధనచేస్తున్నారు. మొత్తం 11 మంది అధ్యాపకులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఎక్కువ చేరికలు కావడంతో అడ్మిషన్లు నిలుపుదల చేశారు. ప్రిన్సిపాల్ నిర్ణయాలతో.. ఏడాదిన్నర క్రితం ఇక్కడికి జనార్దనరావు ప్రిన్సిపాల్గా వచ్చారు. అంతకుముందు ఆయన సంతకవిటి మండలంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా చేసేవారు. అక్కడ కూడా ఆయన అనుసరించిన విఽధానాలు, క్రమశిక్షణ, సమయపాలన, కళాశాల అభివృద్ధి తదితర అంశాల్లో తన పాత్ర చాటుకున్నారు. అక్కడి నుంచి రాజాం ప్రభుత్వ బాలికల కళాశాలకు బదిలీపై వచ్చిన ఆయన ఇక్కడ కూడా విద్యార్థినుల్లో క్రమశిక్షణ అలవాటుచేయడం, నిరంతర శ్రమ, సమయపాలన, విద్యార్థినుల తల్లిదండ్రలుతో సమావేశాలు, పదోతరగతి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో సమావేశాలు నిర్వహించడంతో ఇక్కడి కళాశాలపై అందరి దృష్టిపడింది. వీటికి తోడు అందరు అధ్యాపకులు పోటాపోటీగా బోధన చేయడంతో విద్యార్థినులు రాణించి, మంచి ఫలితాలు సాధించడం, ఫలితంగా ఈ ఏడాది అడ్మిషన్లు పెరిగాయి. -
రాజన్నదొరపై తప్పుడు మాటలు మాట్లాడితే ఖబడ్దార్
సాలూరు: మక్కువ మండల టీడీపీ అధ్యక్షుడు, మంత్రి సంధ్యారాణి సన్నిహిత అనుచరుడు గుల్ల వేణుగోపాల్ నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలని, స్థాయిని మరిచి విమర్శలు చేస్తే సహించేది లేదంటూ గిరిజన ప్రజాప్రతినిధులు, నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు గురువారం సాలూరు పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద ఎంపీపీలు ప్రమీల, రాములమ్మ, సర్పంచ్లు ఆదయ్య, సుదర్శనరావు, ఎంపీటీసీ సుబ్బారావు, సీతారాం, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ నాయకులు పరిమళ, ఉదయ్కుమార్, కల్యాణ్ తదితరులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏఎంసీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి సమక్షంలో టీడీపీ మండలాధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్ మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరను ఉద్దేశించి దగాకోరు అంటూ చేసిన తీవ్ర అభ్యంతరకర పదజాలాన్ని వాడారంటూ అందరూ ముక్త కంఠంతో మండిపడ్డారు. ఓ గిరిజన రైతు కుటుంబం నుంచి నిబద్ధతగల రాజకీయనాయకుడిగా ఉపముఖ్యమంత్రి, మంత్రి స్థాయికి ఎదిగి ఎందరో గిరిజనులకు ఆదర్శంగా రాజన్నదొర నిలిచారన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా సాలూరుకు సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు విరివిగా చేయించి, సంక్షేమం, అభివృద్ధి అంటే ఏమిటో తన పాలనలో చూపించారన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఏనాడూ ఎవరిపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా పార్టీల విధి విధానాలపై రాజకీయ విమర్శలు మాత్రమే చేశారని గుర్తుచేశారు. అటువంటి రాజన్నదొరపై గుల్ల వేణు దగాకోరంటూ మాట్లాడడం దానిని అక్కడే ఉన్న మంత్రి సంధ్యారాణి వారించకపోవడాన్ని గిరిజనసమాజం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఆధారాలు చూపించాలిరాజన్నదొరను దగాకోరు అని వేణుగోపాల్ ఏ ఆధారాలతో మాట్లాడాడో ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. లేకుంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. ఆధారాలు చూపించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంత్రి సంధ్యారాణి సమక్షంలో విలేకరిని చంపుతానని హెచ్చరించిన వేణు, మంత్రి అండదండలతో రెచ్చిపోతున్నాడని విమర్శించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ రెడ్డి సురేష్, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి దండి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ నాయకులు భరత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మక్కువ టీడీపీ మండలాధ్యక్షుడిపై నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ -
జోగిందొరవలసకు ఝలక్..!
● తొలుత మోడల్ ప్రైమరీ పాఠశాలగా గుర్తింపు, తర్వాత రద్దు ● మౌలికవసతులు లేని కారణంగా జాబితా నుంచి తొలగింపు ● నష్టపోతున్న గిరిజన విద్యార్థులుఈ చిత్రంలో కనిపిస్తున్నది రామభద్రపురం మండలకేంద్రలోని పూడివీధి ప్రాథమిక పాఠశాల. ఇక్కడ 54 మంది పిల్లలు చదువుతుండగా ఇద్దరు టీచర్లు మాత్రమే విద్యాబోదన చేస్తున్నారు.ఈ పాఠశాల మోడ్ ప్రైమరీ పాఠశాలకు ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి.ఈ పాఠశాలను కూడా మొదట్లో మోడల్ ప్రైమరీ పాఠశాలగా గుర్తించారు,ఆ తర్వాత పంచాయతీలో ఇప్పటికే మూడు మోడల్ ప్రైమరీ పాఠశాలలను గుర్తించాం. నాలుగోది వద్దు అని రద్దు చేశారు. ప్రభుత్వం నిర్ణయాలతో పిల్లలు నష్టపోతున్నారని తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. -
1998నా.. 2008కా!
● బదిలీల్లో ప్రాధాన్యం ఎవరికి? ● తమ వృద్ధాప్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలంటున్న ఎంటీఎస్లు సాక్షి, పార్వతీపురం మన్యం: ఉపాధ్యాయుల బదిలీ లు ముగిశాయి. ఇక మినిమం టైం స్కేల్(ఎంటీ ఎస్) ఉపాధ్యాయులకు బదిలీలు నిర్వహించాలని పాఠశాల విద్య డైరెక్టర్ నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు సిద్ధమవుతున్నా రు. 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోస్టింగులిచ్చిన విషయం తెలిసిందే. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 480 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులుగా వివిధ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. 1998 బ్యాచ్కు చెందిన వారిలో విధుల్లో చేరిన కొద్దిరోజులకే కొంతమంది ఉద్యోగ విరమణ పొందారు. ఇప్పుడు పని చేస్తున్న వారిలో కొందరు ఒకట్రెండు సంవత్సరాల్లో రిటైర్మెంట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం జరగనున్న బదిలీల్లో తమను దూర ప్రాంతాలకు పంపిస్తే ఎలా చేయగలమని వారంతా వాపోతున్నా రు. ప్రభుత్వం కూడా బదిలీల్లో 2008 డీఎస్సీ వారికి తొలి ప్రాధాన్యమివ్వాలని భావిస్తోంది. అదే జరిగితే తాము అన్యాయమైపోతామని 1998 ఎంటీఎస్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే బదిలీలకు సంబంధించిన సీనియారిటీ జాబితాను ప్రకటించారు. మిగిలి ఉన్న సర్వీసును పరిగణనలోకి తీసుకుని మానవతాదృక్పథంతో స్థాన చలనానికి అవకాశం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. -
‘తోటపల్లి’పై కూటమి కినుక
● సాగునీటి కాలువలను బాగు చేయలేదు ● దీనిపై రైతుల పక్షాన పోరాటం చేస్తాం ● నేటి సాయంత్రం కాలువల పరిశీలన కార్యక్రమం ● ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే కళావతి పాలకొండ: తోటపల్లి కాలువలను ఆధునీకరించి రైతులకు సాగునీరు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ధ్వజమెత్తారు. పాలకొండలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాగునీ టి కాలువల అభివృద్ధిపై ప్రభుత్వం కినుక వహించడాన్ని తప్పుబట్టారు. శిథిలావస్థకు చేరిన నాగావళి కుడి, ఎడమ కాలువల షట్టర్లు బాగుచేయాలని డిమాండ్ చేశారు. షట్టర్లు పాడవ్వడంతో రిజర్వాయర్లోని నీరు సాగునీటి కాలువల్లోకి పెద్దస్థాయి లో చేరి గండ్లు పడే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటి కే నీరు వృథాగా సరఫరా అవుతూ పంటపొలాల్లో చేరి వ్యవసాయ పనులకు ఆటంకం కలుగుతోందన్నారు. 2023–24 సంవత్సరంలో గత జగన్మోహ న్రెడ్డి ప్రభుత్వం కొత్త షట్టర్ల ఏర్పాటుకు రూ.20 లక్షలు మంజూరు చేసిందని, టెండర్ల దశలో ఎన్నిక ల కోడ్తో పనులు నిలిచిపోయినట్టు తెలిపారు. ఎడమ కాలువ ప్రధాన లింక్ కెనాల్ రక్షణ గోడకు సాంకేతి అనుమతులు తీసుకువచ్చామన్నారు. అనంతరం ప్రభుత్వం మారడంతో ఈ పనులు బుట్టదాఖలయ్యాయన్నారు. కాలువల ఆధునికీకర ణ పనులను పట్టించుకోకపోవడం విచారకరమన్నా రు. ప్రభుత్వం స్పందించి వెంటనే కాలువల షట్టర్లు బాగుచేయాలని, కాలువ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలోని బృందం కాలువల పరిశీలన కార్యక్రమాన్ని చేపడుతుందని వివరించారు. రైతులందరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
గురుకులాల్లో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం అర్బన్: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025–26 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఉమ్మడి జిల్లాల గురుకుల సమన్వయకర్త ఎస్.రూపావతి గురువారం తెలిపారు. విజయనగరం జిల్లా పరిధిలోని 8, పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని 5 పాఠశాలల్లో గురు వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించామన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 25న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి తరగతికి సంబంధించిన ప్రశ్నపత్రం ముందు తరగతి గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్ట్స్ సిలబస్ ఆధారంగా రూపొందించి ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వెనుకబడిన వర్గాల విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం సెల్: 89858 83015, 63038 38657 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఉమ్మడి విజయనగ రం జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025–26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి, ఇంటర్మీడియట్ మిగులు సీట్ల ప్రవేశాల కోసం ఈ నెల 22 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని రూపావతి చెప్పారు. బాలికలకు ఈ నెల 22న చీపురుపల్లి బాలికల గురుకుల పాఠశాలలోను, బాలురకు ఈ నెల 23న కొప్పెర్ల గురుకుల పాఠశాలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఇంటర్మీడియట్ మిగులు సీట్లకు బాలికలకు ఈ నెల 26న నెల్లిమర్ల గురుకుల పాఠశాలలోను, బాలురకు 27న కొప్పెర్ల గురుకుల పాఠశాలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. 22 నుంచి 5వ తరగతి, ఇంటర్మీడియట్ మిగులు సీట్లకు కౌన్సెలింగ్ ఉమ్మడి విజయనగరం జిల్లా సమన్వయకర్త ఎస్.రూపావతి -
యోగాంధ్రకు సమాయత్తం కావాలి
● కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పార్వతీపురంటౌన్: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21న జరగనున్న యోగాంధ్ర కార్యక్రమానికి సమాయ త్తం కావాలని మండల ప్రత్యేక అధికారులు, జిల్లా, మండల అధికారులను కలెక్టర్ శ్యామ్ప్రసాద్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో యోగాంధ్ర, స్వర్ణాంధ్ర –స్వచ్ఛాంధ్ర, డీఎ జుగా తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉదయం 7 నుంచి 8 గంటల వరకు విశాఖపట్నంలో జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో భారత ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొననున్నారని, అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 3,150 వేదికల వద్ద యోగా కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 5.42 లక్షల మంది యోగాంధ్రకు రిజిస్టర్ చేసుకున్నారని, వీరంతా ఆ రోజు పాల్గొనేలా అధి కారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతీవేదిక వద్ద బ్యాక్ డ్రాప్ బ్యానర్, సౌండ్ సిస్టం, ప్రత్యక్ష ప్రసారం, గ్రీన్ మ్యాట్ ఇతరత్రా ఏర్పాట్లు ఉండాలని, ఆ రోజు ఉదయం 6 గంటలకే అందరూ సిద్ధంగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారుల ను కోరారు. యోగా చేసే సమయంలో క్వాలిటీతో కూడిన ఫొటోలు, వీడియోలు తీయించాలని, ప్రజాస్పందన కూడా తీసుకోవాలని కలెక్టర్ వివరించా రు. 21న జరగనున్న యోగాంధ్రలో ప్రజలతో పా టు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు భాగస్వా మ్యం కావాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎస్.భాస్కరరావు, ప్రోగ్రాం అధికా రి డాక్టర్ ఎం.వినోద్కుమార్, డాక్టర్ టి.జగన్మోహనరావు, డ్వామా పథక సంచాలకులు కె.రామచంద్రరావు, డీపీఓ టి.కొండలరావు, మున్సిపల్ కమిషన ర్ సీహెచ్.వెంకటేశ్వర్లు, ఐటీడీఏ ఏపీడీ ఎ.మురళీధ ర్, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఆర్.కృష్ణవేణి, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ.ప్రభాకరరావు, జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి ఇ.అప్పన్న, జిల్లా మత్స్య శాఖాధికారి టి.సంతోష్కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2025
● 300 యూనిట్లు వినియోగం లేకున్నా.. ఉన్నట్లు రిమార్కు ● పరిశీలించకుండానే పంపించేస్తున్న సచివాలయ సిబ్బంది ● విద్యుత్ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్న తల్లిదండ్రులు సాక్షి, పార్వతీపురం మన్యం: తల్లికి వందనం పథకంలో కొర్రీలు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. జాబితాలో తప్పులు కూడా చాలా మందిని అనర్హులుగా మిగిల్చాయి. భూమి లేకున్నా అధిక శాతం మందికి ఉన్నట్లు, విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటినట్లు సచివాలయాల వద్ద జాబితాల్లో చూపుతోంది. జిల్లాలో 1,08,951 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద లబ్ధి కలిగిన విషయం విదితమే. వీరికి రూ.13 వేలు చొప్పున నిధులు జమయ్యాయి. ఇంట్లో చదువుకున్న పిల్లలందరికీ పథకం వర్తింపజేస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది. ఈ లెక్కన మరింత మందికి లబ్ధి కలిగే అవకాశం ఉంది. ఇంకా వేలాది మంది ఉంటారని అంచనా. వారంతా సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. విద్యుత్ బిల్లులు ఎక్కువ చూపడంతో.. జాబితాలో తప్పుల వల్ల అధిక శాతం మంది అర్హత కోల్పోయారు. ప్రధానంగా నెలకు వంద యూనిట్లు వినియోగిస్తున్న వారికి కూడా 300 యూనిట్లు వినియోగిస్తున్నట్లు రిమార్కుల్లో చూపుతున్నారు. దీంతో లబ్ధిదారులు సచివాలయాల వద్దకు పరుగులు తీస్తున్నారు. అక్కడి సిబ్బంది కనీసం పరిశీలించకుండానే విద్యుత్ కార్యాలయం వద్దకు వెళ్లాలని చెప్పి పంపించేస్తున్నారు. అక్కడ నుంచి ఏడాది వినియోగపు ధ్రువపత్రం తీసుకురావాలని చెబుతున్నారు. ఏపీ ఈపీడీసీఎల్ సెక్షన్ కార్యాలయాల్లో ఈఆర్వోలు, ఏఈవోలు, ఏఈలు వీటిని జారీ చేస్తారు. 300 యూనిట్లు ఎవరికీ వాడకం లేకున్నా.. సచివాలయ సిబ్బంది అందరితోనూ తెప్పిస్తుండటం వల్ల ప్రతిరోజూ విద్యుత్ సంస్థ కార్యాలయం వద్ద తల్లిదండ్రులు బారులు తీరుతున్నారు. వందలాది మందికి ఒకేసారి సర్టిఫికెట్లు ఇవ్వాల్సి రావడంతో అక్కడి సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కొంతమంది విద్యుత్ శాఖ సిబ్బంది తప్పిదాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. 300 యూనిట్లు దాటి వినియోగిస్తున్న వారికి కూడా తక్కువగా ‘సర్దుబాటు’ చేసి, సర్టిఫికెట్లు ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నిబంధనలు సడలించి, అందరికీ వందనం వర్తింపజేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ● మారికవలస మీదుగా తిమ్మాపురం బీచ్కు బస్సురూట్ ● జిల్లాకు 30 కంపార్ట్మెంట్లు ● 4 చోట్ల పార్కింగ్ స్థలాల కేటాయింపు ● పల్లె వెలుగు బస్సులో ప్రయాణించిన కలెక్టర్, ఎస్పీ న్యూస్రీల్ -
● కమ్మవలసలో ఏనుగుల గుంపు
బొబ్బిలి రూరల్: మండలంలోని కమ్మవలసలో తొమ్మిది ఏనుగుల గుంపు సంచరిస్తోంది. మంగళవారం రాత్రి ముత్తాయివలస నుంచి కమ్మవలసకు చేరుకున్న ఏనుగులు అక్కడే మామిడితోటల్లో తిష్టవేశాయి. దీంతో ఏరోజు ఏ గ్రామానికి చేరుకుని ఏ హాని తలపెడతాయోనని ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏనుగుల గుంపులో ఇటీవల జన్మించిన గున్న ఏనుగు, మరో రెండు చిన్నవి, ఆరు పెద్ద ఎనుగులు ఉన్నాయి. అటవీ శాఖ సిబ్బంది ఏనుగుల జాడను గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. భయాందోళనలో గ్రామస్తులు -
పురం గొంతెండుతోంది!
ఎన్నిసార్లు అడిగినా స్పందించడం లేదు.. మంచినీటి సమస్య తీవ్రంగా ఉంటోంది. ఎన్నిసార్లు అడిగినా అదిగోఇదిగో అంటున్నారు తప్ప ఫలితం నీటి సరఫరా చేయడం లేదు. కొద్దిరోజులుగా కుళాయిల ద్వారా నీరే రావడం లేదు. – లక్ష్మి, నాలుగో వార్డు●సాక్షి, పార్వతీపురం మన్యం: ఒకటి కాదు.. రెండు కాదు.. పది రోజులుగా పార్వతీపురం పట్టణాన్ని నీటి ఎద్దడి వెంటాడుతోంది. తాగేందుకు నీరులేక పుర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ సమ్మె చేస్తుండటం నీటి సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చెంతనే తోటపల్లి జలాశయం అగుపిస్తున్నా.. భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో మున్సిపల్ యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోందంటూ పట్టణ ప్రజలు దుయ్యబడుతున్నారు. మహిళల నిరసనతోనూ దిగిరాని అధికారులు 30 వార్డులున్న పార్వతీపురం పట్టణంలో కుళాయిల ద్వారా నీటి సరఫరా అరకొరగానే లభిస్తోంది. ఐదు రిజర్వాయర్లు ఉన్నా.. కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులకోసారి, మరికొన్ని చోట్ల వారానికోసారి ఇవ్వడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం ఇంజినీరింగ్ వర్కర్ల సమ్మెతో అది కూడా రావడం లేదు. పట్టణంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని నాలుగు రోజుల కిందట పలు వీధుల మహిళలు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. జనసైనికులు కూడా ఇందులో పాల్గొనడం గమనార్హం. ఆ తర్వాత ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా కొన్ని ప్రాంతాలకు నీటిని సరఫరా చేశారు. కొన్ని వార్డులను వదిలేశారు. ఇస్తున్న చోట మహిళలు, పురుషులనే తేడా లేకుండా బిందెలు పట్టుకుని నిరీక్షిస్తున్నారు. దొరికితే మహాభాగ్యమనుకుని.. కొద్ది రోజులపాటు నిల్వ చేసుకుంటున్నారు. ఇక్కడా వివక్షే.. ట్యాంకర్ల ద్వారా కూటమి నేతృత్వం వహిస్తున్న, మద్దతుగా నిలిచిన కౌన్సిలర్లు ఉన్న వార్డులకే సరఫరా చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రాతినిథ్యం వహిస్తున్న వార్డులను వదిలేశారు. ఆయా ప్రాంతాల్లో పాలకవర్గం వైఫల్యం వల్లే నీటి ఎద్దడి ఏర్పడిందని ప్రచారం చేయిస్తున్నారు. దీనికి మున్సిపల్ అధికారులు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజల సమస్యలపైనా రాజకీయాలేమిటని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా నీటి సమస్యను పరిష్కరించి, కుళాయిల ద్వారా సరఫరా చేయాలని కోరుతున్నారు. -
కౌలురైతు కన్నీరు..!
కూటమికి పట్టని...● కౌలు రైతుల కార్డుల జారీలో అంతులేని నిర్లక్ష్యం ● విత్తనాలు రాయితీ లేక ఇబ్బందులు ● అందని పంట రుణాలు ● జిల్లాలో 9వేల మంది కౌలు రైతులు ● ఇప్పటి వరకు అందజేసినవి 940 మాత్రమే..పార్వతీపురం టౌన్: ఖరీఫ్ సీజన్ ఆసన్నమైంది. కొన్నిచోట్ల వరి వెదలు జల్లుతున్నారు. ఇప్పటికీ కౌలురైతుల గుర్తింపు పూర్తికాలేదు. జిల్లా వ్యాప్తంగా 9వేల మంది కౌలురైతులు ఉంటే 940 మందికి మాత్రమే కౌలు రైతు గుర్తింపు కార్డులు అందజేశారు. దీంతో విత్తనాలు, వ్యవసాయ పరికరాలు రాయితీపై అందని పరిస్థితి. అన్నదాత సుఖీభవకు కౌలు రైతులను దూరం చేసిన కూటమి ప్రభుత్వం.. గుర్తింపు కార్డుల జారీలోనూ జాప్యం చేస్తుండడంపై కన్నీరు పెడుతున్నారు. కొందరు రైతులు కాడివిడిచి వలసబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. వ్యవస్థలు నిర్వీర్యం గతంలో విత్తనాల పంపిణీ నుంచి పంట కొనుగోలు వరకు రైతు భరోసా కేంద్రాలు రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచేవి. ఆర్బీకేలను ఇప్పుడు రైతు సేవా కేంద్రాలుగా పేరుమార్చి వాటి సేవలను దూరం చేస్తోందని రైతులు విమర్శిస్తున్నారు. దీనికి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు (సీసీఆర్) జారీలో జాప్యమే నిదర్శనమని చెబుతున్నారు. వరి విత్తనాలు, ఎరువులు, పచ్చిరొట్ట విత్తనాలను పూర్తిధర చెల్లించి బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నామని పేర్కొంటున్నారు. సీసీఆర్ కార్డుతో ప్రయోజనాలు బోలెడు పెట్టుబడి సాయం, పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి, నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ, పంట బీమా, పంట రుణాలు ఇలా ఏది వర్తించాలన్నా సీసీఆర్ కార్డులు తప్పనిసరి. ఈ కార్డులుంటేనే రైతులకు అర్హత ఉంటుంది. కౌలుదారులకు కీలకమైన కార్డుల జారీలో జాప్యం నెలకుంది. జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లో కేవలం 940 మందికి మాత్రమే సీసీఆర్ కార్డులు జారీ చేశారు. వ్యవసాయశాఖ సిబ్బంది కార్డుల జారీకి చర్యలు చేపడుతున్నామని చెబుతున్నారే తప్ప జూన్నెల పూర్తవుతున్నా కౌలు రైతులకు సీసీఆర్ కార్డు అందని పరిస్థితి నెలకుంది.ఎంపిక ప్రక్రియ చేస్తున్నారు.. జిల్లాలో 940 మంది కౌలురైతులకు సీసీఆర్ కార్డులు జారీ చేశాం. మిగిలిన వారిని వీఆర్వోలు ఎంపిక చేస్తున్నారు. సాధ్యమైనంత తొందరగా ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి కార్డుల జారీకి చర్యలు చేపడతాం. ప్రభుత్వ రాయితీలు పొందే అవకాశం కల్పిస్తాం. – రాబర్ట్ పాల్, జిల్లా వ్యవశాయశాఖ అధికారి, పార్వతీపురం మన్యం -
మా బడిని మా ఊరిలోనే ఉంచండి
బలిజిపేట: మా బడి మా దళితపేటలోనే ఉంచాలని, మా వలస కుటుంబాల పిల్లలకు న్యాయం చేయాలని, దళితులమని ఆగ్రహించకుండా ఆలోచించి న్యాయం చేయాలంటూ పెదపెంకి దళితపేటకు చెందిన పాఠశాల–1 విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం రోడ్డెక్కారు. పెదపెంకి దళితపేటలో ఉండే ఒకటో నంబరు పాఠశాలలో 3, 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థులను వేరే పాఠశాలకు పంపించడంతో ఆందోళనకు దిగారు. 50 సంవత్సరాల నుంచి దళితపేటలో ఉండే బడిని గ్రామస్తులు, తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించకుండా, చైర్మన్, ప్రజల అంగీకారం లేకుండా మరో పాఠశాలలో ఎలా విలీనం చేశారని ప్రశ్నిస్తున్నారు. గాలులు, వర్షాలుపడే సమయంలో దూరంగా ఉన్న పాఠశాలలకు పిల్లల ఎలా వెళ్లిరాగలరని నిలదీశారు. బడి ఎత్తేస్తే పిల్లలను నచ్చిన చోట చేర్చుకుంటామని స్పష్టంచేశారు. సమస్యను పరిష్కరించకపోతే జిల్లాస్థాయిలో ధర్నాకు సిద్ధమన్నారు. ఈ మేరకు ఎంఈఓ–1 సామల సింహాచలంకు వినతి పత్రం అందజేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ పాఠశాలను ఎత్తేయలేదని, కేవలం 3, 4, 5 తరగతుల విద్యార్థులను మాత్రమే తరలించినట్టు చెప్పారు. తల్లిదండ్రులు ఇచ్చిన వినతిపత్రాన్ని ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్మథరావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
డయేరియా మరణాలు ఉండరాదు
పార్వతీపురం టౌన్: జిల్లాలో డయేరియా మరణాలు సంభవించకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అతిసార వ్యాధి నివారణపై వాల్పోస్టర్లను జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, వైద్యాధికారులతో కలిసి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ వర్షాకాలం రానున్న నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 16 నుంచి వచ్చేనెల 31వ తేదీ వరకు అతిసారవ్యాధి నివారణపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 0–5 ఏళ్ల లోపు వయస్సు గల చిన్నారులకు డయేరియా మరణాలు జరగకుండా చూడడం కార్యక్రమ ముఖ్యఉద్దేశమని కలెక్టర్ గుర్తుచేశారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక, ప్రాంతీయ మరియు జిల్లా ఆస్పత్రుల వద్ద దీనినివారణ కోసం ఓఆర్ఎస్, జింక్ కార్నర్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని సూచించారు. పిల్లల తల్లులకు అవగాహన కోసం ఆశ, అంగన్వాడీ కార్యకర్తలకు, పారా మెడికల్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఓఆర్ఎస్ ద్రావణం తయారీ, జింక్ మాత్రలు వాడేవిధానం, చేతుల పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, తల్లిపాలు పట్టాల్సిన ఆవశ్యకతపై శిక్షణలో వివరించాలన్నారు. ఇతర శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఆర్వో కె.హేమలత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎస్.భాస్కరరావు, ప్రోగ్రాం అధికారులు డా.టి.జగన్మోహనరావు, డా.ఎం.వినోద్కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి బి.రాజ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
వ్యవసాయ పరికరాలు సద్వినియోగం చేసుకోవాలి
పార్వతీపురంటౌన్: ప్రభుత్వ రాయితీపై వ్యవసాయ పరికరాలు పొందిన రైతులు తమ అవసరాలు పోను మిగిలిన రైతులకు ఉపయోగపడేలా అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ స్పష్టంచేశారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల సరఫరా రాయితీ నిధుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతుల అవసరాలను దష్టిలో ఉంచుకొని జిల్లాలో రూ.514.09 లక్షల విలువ గల పరికరాలను 50 శాతం రాయితీతో రూ.227.72 లక్షలకు మంజూరు చేసినట్టు వెల్లడించారు. వీటిని ఇతర రైతులు లబ్ధిపొందాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రకృతి వ్యవసాయం దిశగా అడుగులు వేయాలని రైతులకు సూచించారు. రబీలో వరికి బదులుగా అధిక ఆదాయం తెచ్చిపెట్టే లాభసాటి పంటలైన మొక్కజొన్న, కందులు, చిరుధాన్యాలను సాగుచేయాలన్నారు. అనంతరం 920 మంది చిన్న, సన్నకారు, గిరిజన రైతులకు రూ.2.27కోట్ల రాయితీ నిధుల చెక్కును, కందులు, ఎంటీయూ 1426 సన్నరకం వరి విత్తనాల మినీకిట్లను రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్వో కె.హేమలత, జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్పాల్, ఏపీ ఆగ్రో సంస్థ జిల్లా మేనేజర్ శంకరబాబు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు పాల్గొన్నారు. -
యోగాంధ్ర విజేతలకు అభినందన
పార్వతీపురం టౌన్: యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన జిల్లా వాసులను కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ బుధవారం అభినందించారు. 13 కేటగిరీలకు 8 కేటగిరీల్లో 10 స్థానాల్లో బహుమతులను గెలుచుకోవడం హర్షణీయమన్నారు. 10 బహుమతుల్లో మూ డు ప్రథమ, రెండు ద్వితీయ, ఐదు తృతీయ బహుమతులు ఉన్నాయి. కార్యక్రమంలో డీఆర్వో హేమలత, డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు, జిల్లా ప్రోగ్రాంఅధికారి డాక్టర్ వినోద్కుమార్, తదితరులు పాల్గొన్నారు. పైడితల్లి ఆలయ అభివృద్ధికి కృషిచేస్తా ● బాధ్యతలు స్వీకరించిన ఇన్చార్జి ఈఓ కె.శిరీష విజయనగరం టౌన్: పైడితల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధికి అందరి సహకారంతో కృషిచేస్తానని ఆలయ ఇన్చార్జి కార్యనిర్వహణాధికారిణి కె.శిరీష తెలిపారు. ఇన్చార్జి ఈఓగా ఆమె బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. చంద్రబాబు అంటేనే మోసం.. రేగిడి: జగన్ అంటే నమ్మకం...చంద్రబాబు అంటేనే మోసం అనే పుస్తకాన్ని రేగిడి మండలం చిన్నశిర్లాం గ్రామంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైఎస్సార్ సీపీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ తలే రాజేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఏడాది కూటమి పాలనలో అంతా మోసమే జరిగిందని, ఈ మోసాన్ని వివరిస్తూ పార్టీ అధిష్టానం చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ప్రచురించిందని వెల్లడించారు. ఈ పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మండలాలు వారీగా ఆవిష్కరణలు జరుగుతున్నా యని వివరించారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి ఏడాది కాలంలోనే ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పాలన అందించా రని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఎన్నికలు ముందు ప్రజలకు సూపర్సిక్స్ హామీలిచ్చి మోసం ఫిక్స్ చేశారని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, నాయకులు పాల్గొన్నారు. -
యథేచ్ఛగా గ్రావెల్ రవాణా
రాజాం: మండలంలోని పొగిరి గ్రామ సమీప ప్రాంతాల నుంచి గ్రావెల్ యథేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతోంది. ఈ ప్రాంతానికి చెందిన పలువురు ట్రాక్టర్లు, పొక్లెయిన్ల యజమానులు గ్రావెల్ రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. పొగిరి చుట్టు పక్కల సాగునీటి చెరువులు, కంకర దిబ్బల నుంచి గ్రావెల్ సేకరించి రాజాం పట్టణంలోని పలు నిర్మాణాలకు విక్రయిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ గ్రావెల్ ధర రూ.800లు దాటి పలుకుతుండడంతో ఈ దందా అధికంగా జరుగుతోంది. ప్రభుత్వభూములు, సాగునీటి వనరుల్లో కంకర గ్రావెల్ మాయమవుతుండడంతో ఆయా గ్రామాల్లోని చెరువుల ఆయకట్టు రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రావెల్ అక్రమ రవాణాను నిలువరించాలని కోరుతున్నారు. పొగిరి గ్రామం నుంచి ఈ అక్రమ రవాణా అధికంగా ఉందని, అధికారులు చర్యలు చేపట్టాలని పొగిరి గ్రామస్తులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఈ గ్రావెల్ అక్రమరవాణాపై రాజాం తహసీల్దార్ రాజశేఖరం వద్ద సాక్షి ప్రస్తావించగా గ్రావెల్ అక్రమ రవాణాపై దృష్టిసారిస్తామని వెల్లడించారు. అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వకాలు జరిపితే తమ కార్యాలయానికి, సంబంధిత వీఆర్ఓకు ఫిర్యాదుచేయాలని సూచించారు. పొగిరి గ్రామ పరిసర ప్రాంతాల్లోని గ్రావెల్ రవాణాపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. -
జిందాల్ బెంబేలు..!
యంత్రాలు అడ్డుకుని జిందాల్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నిర్వాసిత రైతులుకల్లబొల్లి కబుర్లు చెప్పి..భూములు లాక్కుని.. 2008లో అప్పటి జెడ్పీటీసీ, నేటి ఎమ్మెల్సీ రఘురాజులు తమ బతుకులు బాగుపడతాయని చెబితే భూములిచ్చాం. అప్పుడు కంపెనీ మాకు స్కూళ్లు, ఆస్పత్రులులు, పార్కులు కడతాం, ఇంటికో ఉద్యోగం ఇస్తాం. 60యేళ్లు దాటిన వాళ్లకి పెన్షన్ ఇస్తాం. ఇళ్లు పోయిన వాళ్లకి ఇళ్లు కట్టిస్తాం, బోర్లు వేయిస్తాం. షెడ్లు కట్టిస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పారు. వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా, ప్రభుత్వాల్లో పెద్దలకు సూట్కేసులు ఇచ్చి, భూములు అమ్మేసుకుని సొమ్ము చేసుకోవాలని వస్తున్నారు. కోట్లు విలువ చేసే భూమికి ప్రభుత్వ ధర అనిచెప్పి కారు చౌకగా కొట్టేశారని వాపోయారు. ప్రభుత్వాలకు నిర్వాసితుల గోడు పట్టదా? పార్టీల పెద్దలు, ప్రజాసంఘాలు, అధికారులు, మీడియా అందరికీ నాడు జిందాల్ ఇచ్చిన హామీలు తెలియవా? అన్నీ కాగితాలపై ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవ్వరూ మాకు మద్దతు ఎందుకు ఇవ్వరు? డబ్బున్నోళ్లకే వత్తాసు పలుకుతారా? అంటూ నిలదీశారు. తమలో సహనం చచ్చిందని ఇంకా బెదిరించాలని, తొక్కేయాలని చూస్తే తిరుగుబాటుకు సిద్ధమని తేల్చిచెప్పారు. జిందాల్ వ్యవహారంపై రాష్ట్రపతికి లేఖ రాస్తామన్నారు. జిందాల్ యాజమాన్యం మాకు ఇచ్చిన హామీలు తీర్చనప్పుడు మాభూములతో వ్యాపారం చేయాలనుకున్నప్పుడు మాతో మాట్లాడాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. కూటమి పెద్దలకు ముడుపులు జిందాల్ పెద్దలు కేంద్రంలో పెద్దల్ని, కూటమిపెద్దల్ని కలిసి ముడుపులు ఇచ్చేసి భూమిపూజకు వచ్చేయండి అని చెప్పడం..ప్రభుత్వ పెద్దలు తలాడించి సిద్ధమవడానికి సిగ్గు లేదా? అంటూ మండిపడ్డా రు. జిందాల్ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు తమ న్యా యపరమైన డిమాండ్లు తీర్చి, తమకు ఇవ్వాల్సిన రాయితీలు ఇచ్చి, సౌకర్యాలు కల్పించాలని, తమ కు ఎలా ఉపాధి కల్పిస్తారో తేల్చి చెప్పకుండా పనులు అంటూ భూముల్లోకి వస్తే తగిన రీతిలో బుద్ధి చెబుతామంటూ నిర్వాసితులు స్పష్టం చేశారు.● పనులు అడ్డుకున్న నిర్వాసితులు ● భవిష్యత్పై భరోసా ఇవ్వాలని నినాదాలు ● పోలీసులకు ఫిర్యాదు చేసిన జిందాల్ యాజమాన్యం ● వెనక్కి తగ్గని నిర్వాసితులుశృంగవరపుకోట: మా భూములు లాక్కుని మాకు భవిష్యత్ లేకుండా చేశారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూలోళ్లను చేశారు. కంపెనీ పేరుతో భూములు లాక్కుని 18ఏళ్లు ఉంచుకుని ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటే మేము చేతులు ముడుచుకుని కూర్చోవాలా..? మాభూమలు మేము సాగుచేస్తాం..? అవసరమైతే ప్రాణాలు పోయినా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం..అంటూ జిందాల్ నిర్వాసితులు తెగేసి చెప్పారు. ఈ మేరకు బుధవారం మండలంలోని ముషిడిపల్లి పంచాయతీ పరిధి దాసుళ్లపాలెం వద్ద భూముల్లో జిందాల్ యాజమాన్యం పనులు చేసేందుకు జేసీబీలను, కూలీలను పంపింది. ఈ విషయం తెలుసుకున్న జిందాల్ నిర్వాసిత గ్రామాల రైతులు, మహిళలు అక్కడికి చేరుకుని పనులు అడ్డుకున్నారు. యంత్రాలు, మనుషులు అంతా తమ భూములు వదిలి బయటకు వవెళ్లాలని లేకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ధ్వజమెత్తారు. మా బతుకులకు భరోసా ఇవ్వండని అడిగితే మాట్లాడని జిందాల్ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు ఏ హక్కుతో మా భూముల్కోకి వస్తున్నారు. నమ్మించి గొంతు కోసి, బతుకులు బుగ్గి చేసి, ఇప్పుడు వ్యాపారానికి రెడీ అయిపోతున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులు గట్టిగా అడ్డుకోవడంతో జిందాల్ ప్రతినిధులు ఎస్.కోట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో ఏఎస్సై గోవిందరావు సిబ్బంది వచ్చి నిర్వాసిత రైతులతో మాట్లాడుతూ పనులు అడ్డుకోవద్దని, స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని, పోలీస్ బందోబస్తు ఇచ్చైనా పనులు చేయిస్తామని చెప్పడంతో రైతులు భీష్మించి మధ్యాహ్నం 2గంటల వరకూ కూర్చున్నారు. -
రెచ్చిపోతున్న పోకిరీలు
● సతివాడలో పాఠశాలల సముదాయంలో వికృత చేష్టలు ● ఉదయం, సాయంత్రం వేళల్లో మితిమీరుతున్న ఆగడాలు ● అలంకార ప్రాయంగా నిఘానేత్రాలు ● ఆందోళనలో బాలికల తల్లిదండ్రులు ● పోకిరీల ఆట కట్టించాలని పోలీసులకు విజ్ఞప్తినెల్లిమర్ల రూరల్: విద్యాసంస్థలు పునఃప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఎన్నో ఆశలతో సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు ఆయా విద్యాసంస్థల్లో చదువుకునేందుకు కొత్తగా చేరుతున్నారు. అప్పటికే చదువుతున్న విద్యార్ధులు బ్యాగులు చేతబట్టి చదువులో నిమగ్నమయ్యారు. ఈ తరుణంలో కొంతమంది పోకిరీల వికృత చేష్టలు కూడా అధికమయ్యాయి. మండలంలోని సతివాడ గ్రామంలో పక్కపక్కనే ఆదర్శపాఠశాల, ఉన్నత పాఠశాల, బాలికల వసతి గృహంతో పాటు ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల ఉన్నాయి. సమీప 25 గ్రామాలకు చెందిన విద్యార్ధులు పై చదువులు చదివేందుకు సతివాడ అనువైన ప్రదేశం. ఆయా విద్యాసంస్థలకు సుదూర ప్రాంతాల నుంచి వస్తూ వందలాది మంది బాలికలు చదువును సాగిస్తున్నారు. పోకిరీల ఆగడాలు మితిమీరడంతో తమ పిల్లల భద్రతకు ముప్పు పొంచి ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెవులు పగిలేలా సౌండ్లు..గుండెలదిరేలా స్టంట్లు సతివాడలోని విద్యాసంస్థల వద్ద కొన్ని రోజులుగా పోకిరీల వికృత చేష్టలు అధికమయ్యాయని స్థానికులతో పాటు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో అలాగే మధ్యాహ్నం 3;30గంటల నుంచి 4 గంటల సమయం వరకు సమీప గ్రామాలకు చెందిన కొంతమంది యువకులు బైక్లపై నిత్యం రెక్కీ నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. బాలికలు నడిచి వెళ్తున్నప్పుడు బైక్లపై వారిని అనుసరిస్తూ అసౌకర్యానికి గురి చేస్తున్నారని అక్కడి వర్తక వ్యాపారులే స్వయంగా చెబుతుండడం గమనర్హం. అత్యంత వేగంతో బైక్ రైడ్ చేస్తూ చెవులు పగిలేలా సౌండ్ హార్న్లు కొడుతున్నారని, గుండెలదిరేలా బైక్లపై ఫీట్లు చేస్తున్నారని చెబుతున్నారు. ఎవరు ప్రశ్నించినా వినే పరిస్థితిలో ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలంకార ప్రాయంగా నిఘా నేత్రాలు.. సతివాడ ఉన్నత పాఠశాల వద్ద కొన్నేళ్ల క్రితం అధునాతన సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే అప్పట్లో వాటికి స్టోరేజ్ సౌకర్యం కల్పించకపోవడంతో కేవలం లైవ్ కవరేజ్ తప్ప డేటా నిక్షిప్తం కావడం లేదు. ఒకవేళ ఏదైనా ఘటన జరిగితే జరిగిన ఆ ఘ టనను చూసేందుకు ఆస్కారం లేదని పోలీస్ వర్గాలే చెబుతున్నాయి. దీంతో విద్యాసంస్థల సముదాయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు అలంకార ప్రా యంగానే మారాయి. ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో ఇటీవల ఓ దాత సహకారంతో ఉన్నత పాఠశాల వద్ద ఒక సీసీ కెమెరాను స్థానిక పోలీసులు ఏర్పాటు చేశారు. అధునాతన సీసీ కెమెరాలకు కూడా స్టోరేజ్ సౌకర్యాన్ని కల్పిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని, పోకిరీల ఆట కూడా కట్టించవచ్చని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కౌన్సెలింగ్ ఇస్తే మంచి ఫలితాలు విద్యాసంస్థల వద్ద అల్లరి చేష్టలు చేస్తున్న పోకిరీలపై పోలీసులు మఫ్టీలో నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏడాది పోకిరీల చేష్టలు పెరుగుతూ వస్తున్నాయి. నియంత్రణ లేకపోవడంతో జరగకూడని ఘటనలు జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెడ్డ పేరు రాకముందే మేలుకుంటే మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. అటువంటి వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తే అదుపులో ఉండే అవకాశం ఉందని ఆభిప్రాయ పడుతున్నారు. అడ్డూ అదుపు లేకుండా పోతోంది: సతివాడ విద్యా సంస్థల వద్ద కొంతమంది నిత్యం బైక్లపై మితి మీరిన వేగంతో వెళ్తూ హడలెత్తిస్తున్నారు. వారి చర్యలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో కొంతమంది యువత నిత్యం పహారా కాస్తున్నారని మా పిల్లలు చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పోకిరీలను అదుపులో పెట్టాలి. పంచాది శ్రీనివాసరావు, వల్లూరు గ్రామం పూర్తిస్థాయిలో నిఘా పెడతాం: సతివాడలోని విద్యాసంస్థల సముదాయం వద్ద పూర్తిస్థాయిలో నిఘా పెడతాం. మఫ్టీలో విధులు నిర్వహించి అల్లరి చేష్టలకు పాల్పడుతున్న పోకిరీలను గుర్తించి అదుపులోకి తీసుకుంటాం. గతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు స్టోరేజీ సదుపాయం లేకపోవడంతో కొత్తగా ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేశాం. శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నాం. ఇప్పటికే గ్రామాల్లో పర్యటించి ప్రజలు, యువకులకు అవగాహన కల్పిస్తున్నాం. ఎవరైనా బాలికల జోలికి వెళ్తే చర్యలు తీవ్రంగా ఉంటాయి. గణేష్, ఎస్సై, నెల్లిమర్ల -
జీఎస్టీ వసూలు చేసి రెవెన్యూ పెంచాలి
విజయనగరం అర్బన్: జీఎస్టీ, బకాయిలు వసూలు చేయడం ద్వారా జిల్లా రెవెన్యూను పెంచడానికి కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పిలుపునిచ్చారు. జిల్లాలో మొదటి త్రైమాసికంలో 85 శాతం మాత్రమే జీఎస్టీ చెల్లింపులు జరిగాయని ఇది శతశాతానికి చేరాలని కలెక్టర్ సూచించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జీఎస్టీ అధికారులతో పాటు పలు శాఖల అధికారులతో సమన్వయ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం చేరితేనే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అవకాశం ఉంటుందని, జీఎస్టీ, బకాయిల వసూలులో జిల్లా అధికారులు సహకరించాలని కోరారు. సర్వీస్ టాక్స్, గూడ్స్ టాక్స్ చెల్లించలవలసి ఉంటుందని రిజిస్ట్రేషన్లు పెంచడం ద్వారా రెవెన్యూ పెరుగుతుందన్నారు. జిల్లాలో ఉన్న ఎంఎస్ఎంఈల వివరాలను కొత్తగా స్థాపించిన పరిశ్రమల వివరాలను పరిశ్రమల శాఖ వారు జీఎస్టీ కార్యాలయానికి ఇవ్వాలని సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసిన వాణిజ్య సముదాయాల వివరాలను మున్సిసపల్ కమిషనర్ అందజేయాలన్నారు. పాత బకాయిల వివరాలను జీఎస్టీ శాఖ అందించాలని వాటిని బ్యాంకులకు అందజేయడం ద్వారా బకాయిలు వసూలయ్యేలా ఎల్డీఎం చూడాలని స్పష్టం చేశారు. భవన నిర్మాణాలు చేపట్టే బిల్డర్లు ప్లాట్స్ను కట్టి అమ్మేస్తున్నారని జీఎస్టీ చెల్లించడం లేదని వాటి వివరాలను కూడా రిజిస్ట్రేషన్ శాఖ అందజేయాలని కోరారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి, జిల్లా పరిషత్ సీఈఓ సత్యనారాయణ, ఎల్డీఎం రమణమూర్తి, జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ వల్లి, అసిస్టెంట్ కమిషనర్లు అచ్చయ్య, రమేష్ కుమార్, పరిశ్రమల శాఖ జీఎం కరుణాకర్, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
అనధికార దత్తతతో అగచాట్లు..!
● గుట్టుగా జరుగుతున్న దత్తత వ్యవహారం ● రిజిస్ట్రేషన్ చేసుకుని కొంతమంది దత్తత ● చట్టబద్ధంగా తీసుకుంటే శిశువుకు హక్కులువిజయనగరం ఫోర్ట్: డెంకాడ మండలానికి చెందిన దంపతులు మగ శిశువును తెలిసిన వారి దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దత్తత తీసుకున్నారు. అయితే అశిశువుకు జనన ధ్రువీకరణ పత్రం అవసరం పడడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దరఖాస్తు చేస్తే జనన ఽధ్రువీకరణ పత్రం ఇవ్వలేమని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో వారు ఐసీడీఎస్ కార్యాలయంలో సంప్రదించగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వెళ్లి అడగాలని చెప్పడంతో వెనుదిరిగారు. ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చింది. అధికారుల దృష్టికి రాకుండా అనధికారికంగా దత్తత ఇచ్చేస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. అఽనధికారికంగా దత్తత ఇవ్వడం, తీసుకోవడం చట్టరీత్యా నేరమని అధికారులు పదేపదే చెబుతున్నారు. కానీ ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. గుట్టుగా పిల్లలను దత్తత ఇచ్చేస్తున్నారు. కొంతమంది పిల్లలను దత్తత ఇచ్చే తల్లిదండ్రులకు డబ్బులు, బంగారం వంటివి ఇచ్చి పిల్లలను అనధికారికంగా దత్తత తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది గర్భం దాల్చిన వారు వైద్యఖర్చులు భరించిన వారికి పిల్లలను దత్తత ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దత్తత పేరిట విక్రయాలు అభంశుభం పిల్లలను బాహ్య ప్రపంచం తెలియకుండానే కన్నతల్లి ముఖం చూడకుండానే ఇంకొకరికి ఇచ్చేస్తున్నారు. పోనీ అనధికారికంగా దత్తత ఉచితంగా ఇస్తున్నారా? అంటే అదీ లేదు. వేలు, లక్షలు తీసుకుని పిల్ల లను దత్తత ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆడపిల్ల అయితే రూ. లక్ష నుంచి రూ. లక్షన్నర..మగ పిల్లవాడు అయితే రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షలు వరకు విక్రయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అజ్ఞాతవ్యక్తుల సమాచారంతో.. గ్రామీణ ప్రాంతంలో బాల్య వివాహాలు జరిగినా, అనధికారికంగా దత్తత ఇచ్చినా ఐసీడీఎస్ అధికారులకు అంగన్వాడీలు తెలియజేయాలి. కానీ అంగన్వాడీలు ఈ విషయాలను అధికారులకు తెలియజేయడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అజ్ఞాత వ్యక్తులు సమాచారం ఇస్తే అధికారులకు అనధికారిక దత్తత, బాల్య వివాహాల గురించి తెలుస్తోంది. పర్యవేక్షణ కరువు అనధికారికంగా పిల్లలను దత్తత ఇచ్చిన వారిని గుర్తించి తిరిగి ఆ శిశువులను తల్లిదండ్రులకే అప్పజెప్పినప్పుడు 6 నెలల వరకు పర్యవేక్షణ చేయాలి. శిశువును మళ్లీ ఎవరికై నా దత్తత ఇచ్చేశారా? లేదంటే వారే పెంచుతున్నారా? అనేది ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పర్యవేక్షించాలి. కానీ అటువంటి పర్యవేక్షణ చేయడం లేదనే తెలుస్తోంది. చట్టప్రకారం దత్తత తీసుకోవాలి పిల్లలు లేని తల్లిదండ్రులు దత్తత తీసుకోవాలంటే ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశుగృహ కార్యాలయానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అయితే పిల్లలు దత్తత తీసుకోవాలనుకున్న తల్లిదండ్రులు ఆరోగ్యవంతులై ఉండాలి, ఆర్థికస్థితి బాగుండాలి. ఎటువంటి వ్యాధులు ఉండకూడదు. పిల్లలు పుట్టరని వైద్యుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. వయస్సు 45 ఏళ్ల లోపు ఉండాలి. అటువంటి వారు దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి అర్హులు అనుకుంటే అప్పుడు దత్తత ఇస్తారు. అనధికారిక దత్తతతో చిక్కులు అనధికారిక దత్తతతో అనేక చిక్కులు ఉన్నాయి. వారికి జనన ధ్రువీకరణ పత్రం రాదు. అదేవిధంగా దత్తత వెళ్లిన పిల్లలకు హక్కుల కోసం పోరాటం చేయడానికి వీలుండదు. దీని వల్ల నష్టపోవాల్సిన పరిస్థితి.అనధికారిక దత్తత చెల్లదు: అనధికారిక దత్తత తీసుకుంటే అది చెల్లదు. చట్ట ప్రకారమే పిల్లలను దత్తత తీసుకోవాలి. అనధికారికంగా దత్తత తీసుకుంటే చర్యలు తీసుకుంటాం. టి.విమలరాణి, పీడీ, ఐసీడీఎస్ -
సికిల్ సెల్ వ్యాధికి రక్తమార్పిడే చికిత్స
● డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి విజయనగరం ఫోర్ట్: సికిల్ సెల్ వ్యాధికి రక్తమార్పిడే చికిత్స అని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి తెలిపారు. ఈ మేరకు స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం సాయంత్రం పోగ్రాం అధికారులతో సికిల్సెల్, డయేరియా వ్యాధులపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సికిల్సెల్ వ్యాధి ఉన్న వారు హిమటాలజిస్ట్, సాధారణ వైద్యుడి సంరక్షణలో చికిత్స తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సమతుల ఆహారాన్ని తీసుకోవాలని చెప్పారు. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించకపోయినా, సురక్షిత మంచినీరు తీసుకోకపోయినా డయేరియా వ్యాధి వస్తుందన్నారు. సమావేశంలో డీఎల్ఓ డాక్టర్ కె.రాణి, డీఐఓ డాక్టర్ అచ్యుతకుమారి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఎన్. సూర్యనారాయణ, డీపీహెచ్ఎన్ఓ మామిడి సత్యవతి, డెమో చిన్నతల్లి పాల్గొన్నారు. అట్రాసిటి కేసుపై డీఎస్పీ దర్యాప్తువంగర: మండల పరిధి కొప్పరవలస సమీపంలో కొండచాకరాపల్లి ఐటీడీఏ కాలనీకి చెందిన గిరిజన యువకుడిని కులం పేరుతో దూషించి దాడికి పాల్పడిన ఘటనపై చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు బుధవారం దర్యాప్తు నిర్వహించారు. ఐటీడీఏ కాలనీకి చెందిన బంటుపల్లి శంకరదొర శ్రీకాకుళం రిమ్స్లో చికిత్స పొందుతుండడంతో అక్కడికి వెళ్లి వివరాలు సేకరించిన అనంతరం కొప్పరవలస సమీపంలో సంఘటన జరిగిన ప్రదేశంలో డీఎస్పీ దర్యాప్తు చేపట్టారు. ఘటనకు దారి తీసిన అంశాలపై వివరాలు సేకరించారు. సమగ్ర దర్యాప్తు అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై షేక్ శంకర్, పలువురు ఉద్యోగులు ఉన్నారు. 9 మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టుపూసపాటిరేగ: మండలంలోని కనిమెట్ట గ్రామంలో అనధికారంగా మద్యం కలిగి వున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు భోగాపురం ఎకై ్సజ్ సీఐ వి.రవికుమార్ బుధవారం తెలియజేశారు. అనధికారంగా 9 మద్యం సీసాలు కలిగి ఉండడంతో అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా అనధికారికంగా మద్యం అమ్మినట్లయితే సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతా మన్నారు. దాడుల్లో ఎస్సై చంద్రమోహన్, సురేష్, సిబ్బంది సత్యనారాయణ, మహేష్ పాల్గొన్నారు. రెండు కేజీల గంజాయి స్వాధీనంవిజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు గంజాయి నిందితులను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. రూరల్ పీఎస్ పరిధి జమ్ములో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా రూరల్ ఇన్చార్జ్ సీఐ శ్రీనివాస్, ఎస్సై అశోక్ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. పట్టుకున్న ఇద్దరు నిందితులను విజయనగరంలోని సాకేటి వీధికి చెందిన తేజస్వరూప్, సాయిలుగా గుర్తించి వారి దగ్గర నుంచి రెండు కేజీల 310 గ్రాముల గంజాయిని మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నామని సీఐ శ్రీనివాస్ చెప్పారు. -
సుందరయ్యగూడ పరిసరాల్లో ఏనుగులు
సీతంపేట: మండలంలోని సుందరయ్యగూడ గ్రామ పరిసరాల్లో ఏనుగులు సంచరిస్తున్నాయి. గిరిజనులు భయాందోళనలు చెందుతున్నారు. పాలకొండ–హడ్డుబంగి రహదారికి కొద్ది దూరంలోనే నాలుగు ఏనుగులు కదలాడుతుండడంతో ఎప్పుడు రోడ్డు మీదకు వచ్చేస్తాయేమోనని స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. ఎఫ్బీవో దాలినాయుడుతో పాటు అటవీ శాఖ సిబ్బంది ఏనుగుల కదలికలను పరిశీలిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. 21న జాబ్మేళా గుమ్మలక్ష్మీపురం: స్థానిక ప్రభుత్వ ఆర్ఐటీఐ వద్ద ఈ నెల 21న హైదరాబాద్కు చెందిన శ్రీసాయి ఎలక్ట్రికల్ కంపెనీ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహించనున్నట్టు ఇంచార్జ్ ప్రిన్సిపాల్ ఎం.గోపాలకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐలోని ఎలక్ట్రికల్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్, మెకానిక్ మోటర్ వెహికల్ మరియు కోపా ఉత్తీర్ణత పొందిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు జాబ్మేళాకు సంబంధిత విద్యార్హత ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 9491134464 నంబరుకు సంప్రదించాలన్నారు. ప్రత్యేక పుష్పాలంకరణలో పైడితల్లి విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణ లో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజాము నుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆల య సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరా వు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్ శాస్త్రోక్తంగా అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసు పు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయం వెనుక ఉన్న వేప, రావిచెట్ల వద్ద దీపారాధనలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆరు నెలల్లో ‘జల్ జీవన్’ పూర్తి బొబ్బిలి: మరో ఆరు నెలల్లో జిల్లా వ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ పనులను పూర్తి చేయను న్నామని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎస్.కవిత తెలిపారు. మంగళవారం ఆమె బొబ్బిలిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయనను కలసి నియోజకవర్గంలో మంజూరై న పనులు పూర్తయిన పనుల వివరాలను తెలియజేశారు. పెండింగ్ పనులకు సంబంధించి స్థానిక డీఈ, జేఈలకు ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలు విజయనగరం ఫోర్ట్: వైద్య ఆరోగ్య శాఖలో పలువురు ఉద్యోగులకు బదిలీల కోసం మంగ ళవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో డీఎంహెచ్వో డాక్ట ర్ ఎస్.జీవనరాణి, ఏవో ప్రభాజీ, సూపరింటెండెంట్ నాగరాజు కౌన్సెలింగ్ నిర్వహించా రు. జూనియర్ అసిస్టెంట్స్– 4, ఆపీస్ సబార్డినేట్స్ 14 మందికి, తోటీలు–1, డ్రైవర్లు – 7, టైపిస్టులు – 2, ల్యాబ్ టెక్నీషియన్స్ గ్రేడ్ – 2 ఐదుగురికి, ఎఫ్ఎన్వోలు ఇద్దరికి, ఎంఎన్వో ఒకరికి, స్వీపర్ ఇద్దరికి బదిలీ అయింది. ఈ నెల 23వ తేదీలోగా వారికి కేటాయించిన స్థలా ల్లో చేరాలని సూచించారు. -
తల్లికి వందనంతో.. తప్పని అవస్థలు..!
విద్యుత్ బిల్లులు ఎక్కువగా రావడంతో తల్లికి వందనం రాలేదని వీరఘట్టం ట్రాన్స్కో కార్యాలయం వద్ద ఫిర్యాదు చేస్తున్న తల్లిదండ్రులు వీరఘట్టం: తల్లికి వందనం పథకం కింద అరకొరగా ప్రభుత్వం పిల్లల చదువుకు నిధులు మంజూరు చేసింది. ఆన్లైన్లో లబ్ధిదారుల వివరాలు తప్పుల తడకగా ఉండడంతో అర్హులైన తల్లులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చేసిన తప్పులు సరి చేయించేందుకు లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తిప్పలు పడుతున్నారు. మండలంలోని 20 సచివాలయాలకు, విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం, ఎంఈవో కార్యాలయానికి లబ్ధిదారులు మంగళవారం క్యూ కట్టడంతో లబ్ధిదారులతో కిక్కిరిసిపోయాయి. తమకెందుకు తల్లికి వందనం వర్తింపజేయలేదని సంబంధిత లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా సచివాలయాల పరిధిలోని వెల్ఫేర్, అడ్మిన్ తదితర సిబ్బందితో వాగ్వాదాలకు దిగుతున్నారు. గతంలో తమకు వర్తించిన ఈ పథకం ఇప్పుడు ఎందుకు వర్తింపజేయలేదని, జాబితాలో అనర్హులమంటూ చూపిన కారణాలు అన్నీ తప్పుల తడకలుగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేని కారణాలు చూపి ఈ పథకం నుంచి తమబోటి అర్హులను తొలగించడం చాలా అన్యాయమని అధికారులను పలుచోట్ల లబ్ధిదారులు మంగళవారం నిలదీశారు. ఎందుకీ కోతలు.... నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు ఇలా ఇంటిలో ఎంత మంది ఉంటే అందరికీ డబ్బు ఇస్తామని చంద్రబాబునాయుడు అండ్ కో సభ్యులు గత ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు. తీరా అధికారం చేపట్టాక మొదటి ఏడాది తల్లికి వందనం అమలు చేయలేదు. ఏడాది దాటిన తర్వాత కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో ఒక్కొక్కరికీ రూ.13 వేలు అరకొరగా అందిస్తుండడంపై విద్యార్థుల తల్లులు భగ్గుమంటున్నారు. ఇది పద్ధతి కాదంటూ అధికారులను నిలదీస్తున్నారు. ఈ విషయంపై సచివాలయాల్లో ఫిర్యాదులు చేస్తున్నారు. ఒక్కరికే.. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వీరిలో ఒక్కరికి మాత్రమే తల్లికి వందనం పథకం ద్వారా రూ.13 వేలు వచ్చింది. ఇంకో అమ్మాయికి ఎందుకు ఈ పథకం వర్తింపజేయలేదో తెలియడం లేదు. నాలాంటి చాలా మంది తల్లులు డబ్బులు పడక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఇంటిలో ఎంత మంది చదువుకుంటే అందరికీ ఈ పథకం వర్తింపజేయాలి. – బి.రవణమ్మ, విద్యార్థిని తల్లి, వీరఘట్టం అర్హులకు అందని వైనం అధికారుల తప్పులు కార్యాలయాల చుట్టూ లబ్ధిదారుల తిప్పలు -
త్వరలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ
● జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి విజయనగరం అర్బన్: పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను త్వరలో చేపట్టనున్నామని, దీనికి రాజకీయ పార్టీలన్నీ సహకరించాలని జిల్లా రెవె న్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి కోరారు. రాజకీ య పార్టీల ప్రతినిధులతో డీఆర్వో తన చాంబర్ లో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలను హేతుబద్ధీకరించడానికి ఇదే తగిన సమయమని అన్నారు. పాత భవనాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను కొత్త భవనాల్లోకి మార్చడానికి అదనంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు, కేంద్రాల్లో మా ర్పు చేర్పులకు, ఒకచోట నుంచి మరో చోటుకు తరలించడానికి అవకాశం ఉందన్నారు. అదే విధంగా 1200 కంటే ఓటర్లు ఎక్కువగా ఉన్నచోట అదనంగా మరో పోలింగ్ కోంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కూడా అవకాశం ఉందన్నారు. ఈ విధంగా జిల్లాలోని రాజాం నియోజకవర్గంలో 17, బొబ్బిలి లో 26, చీపురుపల్లిలో 4, గజపతినగరంలో 3, నెల్లిమర్లలో 17, విజయనరగం 61, ఎస్.కోట నియోజకవర్గంలో 10 మొత్తం 138 పోలింగ్ కేంద్రా ల్లో 1200 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నారని తెలిపా రు. పోలింగ్ కేంద్రాల మార్పులు, తరలింపులు, కొత్త కేంద్రాల ఏర్పాటుకు ఈ నెల 30వ తేదీలోగా రాజకీయ పార్టీల నుంచి ప్రతిపాదనలను అందజే యాలని కోరారు. సమావేశంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ భాస్కరరా వు, ఇతర సిబ్బంది వివిధ రాజకీయ పార్టీల ప్రతి నిధులు వర్రి నర్సింహమూర్తి, శ్రీనివాసరెడ్డి, సతీష్కుమార్, సీహెచ్ అప్పారావు, సోములు తదితరులు పాల్గొన్నారు. -
జీవన ప్రయాణంలో యోగా దినచర్య కావాలి
మక్కువ: జీవన ప్రయాణంలో యోగా ఒక దిన చర్యగా అలవర్చుకోవాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, కలెక్టర్ ఎం.శ్యాంప్రసాద్ కోరారు. మండలంలో శంబర గ్రామం సమీపంలోని వెంగళరాయ సాగర్ ప్రాజెక్ట్ వద్దనున్న ఏనుగుకొండ ప్రాంతంలో మంత్రి సంధ్యారాణి, కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ యోగాంధ్ర కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఈ నెల 21న జరగనున్న యోగా కార్యక్రమంలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయా లని కోరారు. ఏనుగు కొండ ప్రాంతం చాలా మందికి తెలియదని, ఇటువంటి పర్యాటక ప్రాంతంలో యోగాను నిర్వహించుకోవడం వలన ఈ ప్రాంతంలో ఉండే ప్రకృతి అందాలు, ఆహ్లాదకర వాతావరణం ప్రజలకు తెలిసే అవకాశం ఉందన్నారు. పర్యాటక ప్రాంతంగా ఏనుగులకొండ కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలను నిర్వహించి, వాటిని ప్రమోట్ చేసే దిశగా ఏనుగు కొండ వద్ద యోగా కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ప్రకృతి సోయగాలు, సహజ సిద్ధ అందాలకు నెలవు మన్యం జిల్లా అని, అటువంటి ప్రకతి సోయగాలతో కూడిన ప్రాంతం ఏనుగు కొండ అని కలెక్టర్ తెలిపారు. భవిష్యతులో ఇక్కడ బోటింగ్, ట్రెక్కింగ్ వంటి పలు సదుపాయాలు కల్పిస్తూ, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరిచేందుకు ఈ ప్రాంతం అనుకూలమన్నారు. రోజువారీ కార్యక్రమాల్లో యోగాంధ్ర ఒక భాగం కావాలని కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు. అంతకు ముందు అధికారులతో కలిసి రంగుల బెలూన్లను గాల్లోకి వదలి యోగాంధ్రకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు కె.రామచంద్రరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్. ఎస్.భాస్కరరావు, ప్రోగ్రాం అధికారి డాక్టర్. టి.జగన్మోహనరావు, జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ బి.సుశీల, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారి ఒ.ప్రభాకరరావుతో పాటు అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
అంతర్రాష్ట్ర రహదారిపై వినూత్న నిరసన
పార్వతీపురం నుంచి కూనేరు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి అధ్వానంగా మారింది. చిన్నపాటి వర్షానికే రహదారిపై ఏర్పడిన పెద్ద పెద్ద గోతుల్లో నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. దీని బాగుకు ప్రజలు, ప్రజా సంఘాల నేతలు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. చివరకు వర్షాకాలం రావడంతో ఈ రహదారిపై పాదచారులు సైతం వెళ్లలేని దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో సీపీఎం నాయకులు కొల్లు సాంబమూర్తి ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు చోళ్లపధం గ్రామ సమీపంలో శివాలయం వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై మంగళవారం ఇలా ఈత కొడుతూ వినూత్న నిరసన తెలిపారు. చోళ్లపధం సర్పంచ్ కోలక తిరుపతి, పలువురు వాహనదారులు మద్దతుగా నిలిచారు. – కొమరాడ -
ప్రజలకు ‘కూటమి’ వెన్నుపోటు
పాలకొండ: కూటమి ప్రభుత్వం ప్రజలకు మోసపూరిత పాలనతో ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం కోసం ఇచ్చిన హమీలు అమలు చేయకుండా ప్రజలను మోసగించిన తీరుపై వైఎస్సార్సీపీ తయారు చేసిన పుస్తకాలను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం కోసం కూటమి నాయకులు ప్రజలను మోసగించారని ఆరోపించారు. సూపర్ సిక్స్ పేరుతో హడావుడి చేసి ఏడాది కాలం ఒక్క పథకం కూడా అమలు చేయలేదని తెలిపారు. ఇప్పుడు తల్లికి వందనంలోను అనేక లోపాల కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు భృతి ఎప్పుడు అందిస్తారని ప్రశ్నించారు. ఇంతవరకు రైతులకు కనీసం ఎరువులు అందించలేదని, రైతులకు అవసరమగు వరి విత్తనాలు పంపిణీలోను ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కొత్తగా ఇంతవరకు ఒక్క పింఛన్ కూడా మంజూరు చేయలేదన్నారు. వైఎస్సార్ సీపీ పాలనకు, కూటమి పాలనకు ఉన్న తేడాను ప్రజలు గమనించాలన్నారు. ప్రజలకు సేవలు అందించే సచివాలయ వ్యవస్థపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టి వాటిని నిర్వీర్యం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. ఏడాదిలోనే కూటమి మోసాలు బయటపడ్డాయన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వెలమల మన్మధరావు, కనపాక సూర్యప్రకాష్రావు, కొట అజయ్కుమార్, కడగల రమణ, తుమ్మగుంట శంకరావు, దుప్పాడ పాపినాయుడు, పాలవలస దవళేశ్వరరావు, కొడెం విజయ్కుమార్, బాసూరు కాంతారావు, నీలాపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ విక్రాంత్ వెన్నుపోటు పుస్తకావిష్కరణ -
పైడితల్లికి చండీయాగం
విజయనగరం టౌన్: కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారికి వేదపండితులు మంగళవారం చదురుగుడి ఆవరణలో శాస్త్రోక్తంగా చండీయాగం నిర్వహించారు. దూసి శివప్రసాద్ అమ్మవారికి యాగం చేసి, యాగ విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం అమ్మవారి శేషవస్త్రాలను, ప్రసాదాలను భక్తులకు అందజేశారు. సుమారు 40 మంది దంపతులు యాగంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని, తరించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం● నిందితుడిపై కేసు నమోదు పార్వతీపురం రూరల్: పట్టణంలోని కొత్తవలస ప్రాంతంలో గల నాయుడువీధికి చెందిన రవితేజ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన యువతిని నమ్మించి మోసం చేయడంతో పట్టణ పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ మేరకు సీఐ కె.మురళీధర్ తెలిపిన వివరాల మేరకు బాధిత యువతి, నిందితుడు రవితేజ ఇద్దరు విశాఖలోని ఓ రియల్ఎస్టేట్ కార్యాలయంలో పనిచేసేవారు. ఒకే ప్రాంతానికి, ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికండా వాడుకుని పెళ్లి విషయం వచ్చేసరికి కాదని చెప్పడంతో మోసపోయానని గుర్తించిన యువతి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బట్టల షాపులో అగ్నిప్రమాదంచీపురుపల్లి: పట్టణంలోని మెయిన్రోడ్డులో గల రాధామాధవ ప్లాజాలో ఓ రెడీమేడ్ వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు రూ.25 లక్షల ఆస్తినష్టం జరిగిందని దుకాణం యజమాని చెబుతున్నాడు. మంగళవారం తెల్లవారు జామున 4గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దుకాణంలో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ఈ దుర్ఘటనపై బాధితుడు కలివరపు జగదీష్ మాట్లాడుతూ సోమవారం రాత్రి ఎంతో విలువైన మెటీరియల్ తీసుకువచ్చి దుకాణంలో పెట్టామని, మొత్తం కాలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. క్వారీ లారీ బోల్తావేపాడ: మండలంలోని వావిలపాడు క్వారీ నుంచి విశాఖ వెళ్తున్న లారీ బోల్తా పడింది. వావిలపాడు నుంచి విశాఖ వైపు పెద్దపెద్ద బండరాళ్లను తీసుకెళ్తుతున్న లారీ ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో పోలాల్లోకి వెళ్లి బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. క్రేన్, జేసీబీల సహాయంతో లారీని తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. జూలై 5న జాతీయ లోక్ అదాలత్ విజయనగరం లీగల్: స్థానిక కోర్టు సముదాయంలో జూలై 5వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి ఎం.బబిత తెలిపారు. ఇదే విషయమై ఆమె జిల్లా కేంద్రంలో బ్యాంకులు, చిట్ఫండ్ కంపెనీల మేనేజర్లు, అధికారులతో మంగళవారం సమా వేశమై పలు సూచనలు చేశారు. వారి పరిధిలోని కేసులు రాజీ అయ్యేలా చూడాలని వారిని కోరారు. ప్రతి లోక్ అదాలత్లో పెద్దఎత్తున కేసుల పరిష్కారం జరుగుతోందని, ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవా సంస్థ, కార్యదర్శి కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కొఠియా గ్రామాల్లో కొరాపుట్ కలెక్టర్ పర్యటన
సాలూరు: వివాదాస్పద ఆంధ్రా, ఒడిశా సరిహద్దు కొఠియా గ్రూప్ గ్రామాల్లో ఒడిశాలోని కొరాపుట్ కలెక్టర్ కీర్తి వాసన్ పర్యటించారు. ఈ మేరకు మంగళవారం ఆయన కొఠియా, దొర్లతాడివలస, నేరెళ్లవలస, ధూళిభద్ర, ఎగువశెంబి, డోలియాంబ గ్రామాల్లో పర్యటించి ఆయాగ్రామాల ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఒడిశా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ గ్రామాల్లో అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఒడిశా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. ఈ నెల 27న కొఠియా, నేరెళ్లవలసల్లో జరగనున్న జగన్నాథ స్వామి రథయాత్ర ఏర్పాట్లు, అభివృద్ధి పనులను కలెక్టర్ కీర్తి వాసన్ పర్యవేక్షించారు. -
సచివాలయ సిబ్బంది మెడపై కత్తి
రామభద్రపురం: ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను స్థానికంగా అందించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, ఐదేళ్లపాటు విజయవంతంగా నడిపించింది. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసింది. అయితే ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసేందకు కంకణం కట్టుకుంది.అందులో భాగంగా ఇప్పటికే వలంటీర్లను తొలగించిన కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులపై విషం చిమ్ముతోందని, అలాగే అనేక సర్వేలతో పని ఒత్తిడి పెంచి వారిని వేధిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. తాజాగా ఒకే గ్రామ,వార్డు సచివాలయంలో ఐదేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీచేయాలని, వారి సొంత మండలానికి బదిలీచేయకూడదని, ఐదేళ్లు పూర్తికాని ఉద్యోగులను కూడా రిక్వెస్ట్ మేరకు మాత్రమే బదిలీ చేయొచ్చని స్పష్టం చేస్తూ తాజాగా బదిలీ మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీచేసినట్లు అధికారిక సమాచారం. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగుల ఆవేదన జిల్లాలో 626 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా వాటిలో సుమారు 5,588 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తాజాగా గ్రామ, వార్డు సచివాలయ హేతుబద్ధీకరణ పేరిట ఐదేళ్లుగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాగున్నా..వారి సొంత మండలాల్లో బదిలీ పోస్టింగ్ ఇవ్వకూడదని, ఇతర మండలాలకు బదిలీ చేయాలనే నింబధనతో ఆయా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు నెలకు వస్తున్న రూ.30 వేల అరకొర జీతాలతో ఆర్థికంగా ఇబ్బందులు పడతామని, ఇతర మండలాల్లో ఇంటి అద్దెలు, పిల్లల చదువులతో పాటు కుటుంబ పోషణకు నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల్లో కోరుకున్న వారిని మినహాయించి మిగిలిన వారినందరికీ సొంత మండలాల్లోనే బదిలీలు కల్పించాలని కోరుతున్నారు. అలాగే రిక్వెస్ట్ దరఖాస్తు పెట్టుకున్న ఉద్యోగులను కూడా ఆ మండలం పరిధిలోనే ఉండేలా బదిలీ చేయాలని కోరుతున్నారు. బదిలీ ప్రక్రియలో సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వకూడదనే జీవోను సవరించాలని విజ్ఞప్తిచేస్తున్నారు. బదిలీ ప్రక్రియను ఆఫ్లైన్ విధానంలో కాకుండా ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆఫ్లైన్ విధానంలోనైతే భారీగా పైరవీలు సాగే ప్రమాదం ఉందని, దీని వల్ల ఉద్యోగులు రాజకీయ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని ఆందోళన చెందుతున్నారు. అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం కక్ష ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన వారికి స్థానచలనం ఇతర మండలాలకు బదిలీ చేయాలనే నిబంధన ఆర్థికంగా ఇబ్బందులు పడతామని సిబ్బంది ఆవేదనప్రభుత్వం నిర్ణయం మేరకే బదిలీలు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు మేరకు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ జరుగుతుంది.ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన వారికి తప్పనిసరిగా స్థానచలనం ఉంటుంది. అలాగే సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వరు. ఐదేళ్లు పూర్తికాని ఉద్యోగులకు వారి అభ్యర్థన మేరకు బదిలీ ఉంటుంది.ఆన్లైన్లోనే ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా బదిలీ ప్రక్రియ జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. – ఎం.రాజారాణి, సచివాలయ శాఖ ప్రత్యేకాధికారి విజయనగరం -
ప్రతి మహిళ లక్షాధికారి కావాలి
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రతి మహిళా లక్షాధికారి కావాలని, ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా పారిశ్రామిక వేత్త వచ్చేలా కృషి చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ మెప్మా అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. వివిధ రకాల జీవనోపాధుల ద్వారా డబ్బులు సంపాదించే మార్గాలు అనేకం ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకుని మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మెప్మా ఆధ్వర్యంలో ఏపీఎంలు, సీఓలు, ఆర్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళలకు జీవనోపాధి కల్పించి వారి ఆదాయాన్ని రెట్టింపు చేసేలా చేస్తున్న కృషిని కలెక్టర్ ముందుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మెప్మా అధ్వర్యంలో ఉన్న స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులతో కొత్త వ్యాపార యూనిట్లను స్థాపించి, వారిని లక్షాధికారులుగా తీర్చిదిద్దాలని సూచించారు. మహిళలు లాభాలు ఆర్జించేలా యూనిట్ల స్థాపన ఉండాలన్నారు. అలాగే యూనిట్ల ఏర్పాటుకు అవసరమైతే శిక్షణను ఇప్పించాలని సూచించారు. కొత్త ఆలోచనలతో వ్యాపారాలను విస్తరించవచ్చని, ఆ దిశగా ఆలోచనలు చేయాలని పేర్కొన్నారు. సరుకుల కొనుగోలు, విక్రయాల్లో నాణ్యతను తప్పనిసరిగా పాటించాలని, అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో విక్రయించడం ద్వారా, డోర్ డెలివరీ వంటి సదుపాయాలను కల్పించడం ద్వారా వ్యాపారాలను మరింత విస్తరించేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అలాగే మహిళా మార్టులు, మొబైల్ మార్టులు, కాఫీ షాపులు వంటి కొత్త ఆలోచనల ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని వివరించారు. ఇప్పటికే వస్త్ర వ్యాపారాలు, తినుబండారాలు, ఫ్యాన్సీ పాపుల ద్వారా మహిళలు లాభాలను ఆర్జిస్తున్నారని, అయినప్పటికీ వాటికి భిన్నంగా అందరికీ అవసరమయ్యే వ్యాపారాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు. సూర్యఘర్ ఏర్పాటుకు సబ్సిడీ అనంతరం ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై సమీక్షించిన కలెక్టర్ శ్యామ్ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి సూర్యఘర్ యూనిట్ను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. సూర్యఘర్ యూనిట్ ఏర్పాటుతో 28 ఏళ్ల పాటు ఉచితంగా విద్యుత్ పొందవచ్చని, ఇందుకు అవసరమైన రుణాలను బ్యాంకు మంజూరు చేయడమే కాకుండా దాదాపు 50 శాతం వరకు సబ్సిడీ కూడా ప్రభుత్వం నుంచి లభిస్తుందని వివరించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ముందుగా సొంత ఇల్లు కలిగిన మెప్మా ఉద్యోగులు, సిబ్బంది సూర్యఘర్ యూనిట్లను ఏర్పాటుచేసుకుని, మిగిలిన సభ్యులకు అవగాహన కల్పించి, వారు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. వచ్చే మాసానికి ప్రతి ఉద్యోగి కనీసం 100 యూనిట్లు గ్రౌండింగ్ చేయించాలని, బ్యాంకుల నుంచి సమస్యలు ఉంటే వాటిని తన దష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో మెప్మా పథక సంచాలకుడు జీవీ చిట్టిరాజు, ఏపీఎంలు, సీఓలు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
పక్కాగా రీసర్వే
● జిల్లా సర్వే అధికారి లక్ష్మణరావు గరుగుబిల్లి: భూముల రీసర్వేను పక్కాగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా సర్వే అధికారి పి.లక్ష్మణరావు అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సచి వాలయ సర్వే సిబ్బందితో ప్రత్యేక సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతగా 13 గ్రామాలలో రీసర్వేను నిర్వహించగా, రెండో విడత 30 గ్రామాలలో రీసర్వేను చేపట్టడం జరుగుతుందన్నారు. క్షేత్ర స్థాయిలో సర్వేను పూర్తిగా పరిశీలించి వెబ్ల్యాండ్లో నమోదు చేయాలన్నారు. తప్పిదాలకు తావు లేకుండా సర్వేను చేపట్టాలన్నారు. గతంలో నిర్వహించిన సర్వేలో వచ్చిన తప్పిదాలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. గతంలో నిర్వహించిన సర్వే కారణంగా మ్యుటేషన్లు చేసేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రీసర్వేలో తప్పుగా నమోదైతే అందుకు సరైన ఆధారాలుంటే సవరించడం జరుగుతుందన్నారు. సర్వే నిర్వహించడంలో సిబ్బంది అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. సమావేశంలో డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్ చిరంజీవి, ఉప తహసీల్దార్ ఎం.రాజేంద్ర, మండల సర్వేయర్ పి.గాంధీతో పాటు పలు వురు సచివాలయ సర్వేయర్లు పాల్గొన్నారు. -
సారా స్థావరాలపై దాడి
గుమ్మలక్ష్మీపురం(కురుపాం): పార్వతీపురం మన్యం జిల్లా ఎకై ్సజ్ సూరింటెండెంట్ శ్రీనాథుడు ఆదేశాల మేరకు నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాలైన కెరడ, సుళువ, వలవ గ్రామాల పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న సారా స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు కురుపాం ఎకై ్సజ్ స్టేషన్ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ దాడుల్లో 100 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నామన్నారు. సుమారు 3500 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేసినట్లు చెప్పారు. దాడుల్లో జిల్లా ఏఈఎస్పీ జీవన్ కుమార్, కిశోర్, డీటీఎఫ్ సీఐ వీవీఎస్ శేఖర్ బాబు, సాలూరు, బొబ్బిలి, కురుపాం, రాయగడ ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. ● 6 మద్యం సీసాల పట్టివేత గుర్ల: మండలంలోని సదానందపురంలో బెల్ట్ షాపు ద్వారా మద్యం అమ్ముతున్న వ్యక్తిని ఆరెస్ట్ చేసినట్లు నెల్లిమర్ల ఎకై ్సజ్ ఎస్సై ఎం. వెంకటరావు మంగళవారం తెలిపారు. మద్యం అమ్ముతున్న వ్యక్తి నుంచి ఆరు మద్యం సీసాలు పట్టుకుని సీజ్ చేశామన్నారు. అనుమతులు లేకుండా మద్యం అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
● బొలెరో వాహనం కిందికి బైక్తో భార్యాభర్తలుపాలకొండ రూరల్: మండలంలోని పణుకువలస కూడలిలో గల మలుపు వద్ద మంగళవారం రెప్పపాటులో పెనుప్రమాదం నుంచి భార్యాభర్తలు బయటపడ్డారు. ఈ ఘటనపై స్థానికులు, 108 సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వీరఘట్టం మండలంలోని మొట్ట గ్రామానికి చెందిన లచ్చుభుక్త దుర్గారావు, భార్య రమ్యతో కలిసి ద్విచక్రవాహనంపై పాలకొండ వచ్చారు. వారి గ్రామంలో అమ్మవారి పండగలు, పాఠశాలలు ప్రారంభం కావడంతో అవసరమైన సరుకులు, పిల్లల కోసం పుస్తకాలు, బ్యాగులు కొనుగోలు చేసుకుని తమ ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు. పణుకువలస మలుపు వద్దకు చేరుకునే క్రమంలో వీరఘట్టం నుంచి పాలకొండ వైపు వస్తున్న బొలెరో వాహనం వారి బైక్ను ఢీ కొంది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న భార్యాభర్తలు తమ వాహనంతో సహా ఎదుటి వాహనం కింద ఇరుక్కుపోయారు. బొలెరో కొంత దూరం వెళ్లడంతో ఇద్దరూ మరణించి ఉంటారని స్థానికులు భావించారు. విషయం గమనించిన బొలెరోను డ్రైవర్ నిలుపుదల చేయడంతో రెప్పపాటులో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంలో భర్త దుర్గారావుకు కాలు నుజ్జవగా, భార్య రమ్య తీవ్ర గాయాలతో బయపడ్డారు. అక్కడి వారు అందించిన సమాచారంతో 108 వాహనం ఘటనా స్థలానికి చేరుకుని హుటాహుటిన క్షతగాత్రులను పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించింది. ప్రాథమిక సేవలు అందించిన వైద్యులు మెరుగైన సేవల కోసం రమ్యను రాజాంకు, దుర్గారావును విశాఖపట్నం ఆస్పత్రికి రిఫర్ చేశారు. ప్రమాద సమాచారాన్ని స్థానిక పోలీసులకు ఆస్పత్రి వర్గాలు తెలియజేశాయి. -
రెండు బస్సులు ఢీకొని ఐదుగురికి గాయాలు
డెంకాడ: మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనగా ఐదుగురు గాయపడినట్లు ఎస్సై ఎ.సన్యాసినాయుడు తెలిపారు. విజయనరం–నాతవలస ఆర్అండ్బీ రహదారిపై డెంకాడలో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు డెంకాడ నుంచి విజయనగరం వైపు వస్తుండగా, విజయనగరం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ బస్సు డెంకాడ గ్రామంలో ఎదురెదురుగా ఢీకొన్నాయన్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురికి స్వల్ప గాయాలైనట్లు చెప్పారు. ఈ ప్రమాదం సందర్భంగా ప్రైవేట్ పాఠశాల బస్సులో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారని స్థానికులు తెలిపారు. ఎమ్మెల్యే పరామర్శ ప్రమాద సమయంలో అటుగా వెళ్తున్న నెల్లిమర్ల ఎమ్మెల్యే లోనం నాగ మాధవి ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో పాటు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులతో మాట్లాడి ఓదార్చారు. బస్సుల్లో ప్రయాణిస్తున్న వారికి ఇబ్బందులు లేకుండా అవసరమైన సహాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. -
జిల్లాలో యోగా ప్రదర్శనకు 5555 వేదికలు
● విశాఖకు 30 వేల మంది తరలింపు ● కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేద్కర్విజయనగరం అర్బన్: D ¯ðlÌS 21¯]l {ç³ç³…^èl Äñæ*V> ¨¯ø™èlÞÐ]l… çÜ…§ýl-Æý‡Â…V> hÌêÏ ÐéÅç³¢…V> 5,555 Ðól¨MýS-ÌZÏ Äñæ*V> {ç³§ýl-Æý‡Ø¯]l fÆý‡$-VýS$-™èl$…§ýl° MýSÌñæ-MýStÆŠ‡ yéMýStÆŠ‡ ½BÆŠ‡ A…»ôæ-yýlPÆŠ‡ ^ðl´ëµÆý‡$. D {ç³§ýl-Æý‡Ø-¯]l-ÌSMýS$ ç³sìæçÙt HÆ>µr$Ï ^ólĶæ*-ÌS° A«¨M>Æý‡$-ÌS¯]l$ B§ól-Õ…^éÆý‡$. AÌêVóS BÆøk ÑÔ>Q hÌêÏ-ÌZ fÇVóS {糫§é-¯]l-Ð]l$…-{† M>Æý‡Å-{MýS-Ð]l*-°MìS hÌêÏ ¯]l$…_ çÜ$Ð]l*Æý‡$ 30 ÐólÌS Ð]l$…¨° ç³…í³…^èl-¯]l$-¯]l²r$Ï ™ðlÍ´ëÆý‡$. Äñæ*V> ¨¯ø™èlÞÐ]l °Æý‡Ó-çßæ-׿, ™èlÆý‡-Í…ç³#Oò³ ÒyìlÄñæ* M>¯]l¹-Æð‡¯ŒSÞ §éÓÆ> hÌêÏ, Ð]l$…yýlÌS Ýë¦Æ‡$$ A«¨M>Æý‡$-ÌS-™ø Ð]l$…VýS-âýæ-ÐéÆý‡… BĶæ$¯]l çÜÒ$„> çÜÐ]l*-ÐólÔèæ… °Æý‡Ó-íßæ…^éÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> MýSÌñæ-MýStÆŠ‡ Ð]l*sêÏ-yýl$™èl* hÌêÏ-ÌZ A°² {糿¶æ$™èlÓ, {Oò³ÐólsŒæ ´ëuý‡-Ô>-ÌS-ÌS¯]l$ Äñæ*V> M>Æý‡Å-{MýS-Ð]l*-°MìS ÇhçÜtÆŠ‡ ^ólĶæ*-ÌS° B§ól-Õ…^éÆý‡$. Äñæ*V>…{«§ýl M>Æý‡Å-{MýS-Ð]l*-°MìS hÌêÏ ¯]l$…_ çÜ$Ð]l*Æý‡$ 8.8 ÌS„ýSÌS Ð]l$…¨ ÇhçÜtÆŠ‡ ^ólçÜ$-MýS$-¯é²-Æý‡° ÐéÆý‡…-§ýlÇ ^ól™èl 21¯]l Äñæ*V> {ç³§ýl-Æý‡Ø-¯]l-Ë$ °Æý‡Ó-íßæ-Ýë¢-Ð]l$° ^ðl´ëµÆý‡$. hÌêÏ ¯]l$…_ 30 ÐólÌS Ð]l$…¨° ÑÔ>-Qç³-r²…ÌZ fÇVóS Äñæ*V>…{«§ýl M>Æý‡Å-{MýS-Ð]l*-°MìS ç³…í³…^èl-¯]l$-¯é²-Ð]l$° C…§ýl$-MøçÜ… 650 ºçÜ$Þ-ÌS¯]l$ ѰÄñæ*-WçÜ$¢-¯é²-Ð]l$° ^ðl´ëµÆý‡$. Ðéǰ ™èlÆý‡-Í…^ól »ê«§ýlÅ™èl G…í³-yîl-KÌS-§ól-¯]l° çܵçÙt… ^ólÔ>Æý‡$. ÑfĶæ$-¯]l-VýSÆý‡… hÌêÏ ¯]l$…_ Ð]l^óla ÐéÇMøçÜ… ÁÑ$Í ½^Œl-ÌZ 68&97 MýS…´ëÆý‡-ŠెrÃ…-r-Ï-¯]l$ MóSsêÆ‡$$…^éÆý‡-¯é²Æý‡$. D 30 ÐólÌS Ð]l$…¨ÌZ 15 ÐólÌS Ð]l$…¨ ѧéÅ-Æý‡$¦-Ë$ M>V> Ñ$Wͯ]l ÐéÆý‡$ Ýë«§é-Æý‡-׿ ´ûÆý‡$-ÌS° ^ðl´ëµÆý‡$. 8Ð]l ™èlÆý‡-VýS† ѧéÅ-Æý‡$¦-ÌS¯]l$ Ð]l*{™èlÐól$ D M>Æý‡Å-{MýS-Ð]l*-°MìS ç³…í³…^éÌS-¯é²Æý‡$. ప్రతి బస్సుకు లైజనింగ్ అధికారి విద్యార్ధులు, ప్రజల తరలింపు కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముందుగానే బస్సులను పంపిస్తామని ప్రతి బస్సుకు ఒక లైజనింగ్ అధికారిని ఏర్పాటు చేశామన్నారు. విశాఖకు దగ్గర ప్రాంతాల నుంచి ఉదయం 4 గంటలకు, దూర ప్రాంతాల నుంచి 3 గంటలకే బస్సులు బయలు దేరాలని స్పష్టం చేశారు. ఇప్పటికే రూట్మ్యాప్ల ఖరారు జరిగిందని ఆయా రూట్లలో మరుగుదొడ్లు ఉన్న హోటళ్లు డాబాలు, పాఠశాలలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని బస్సులకు ట్యాగ్ చేయాలని సూచించారు. ప్రతి పాఠశాల లేదా హోటల్ వద్ద ఒక పంచాయతీ కార్యదర్శిని ఇన్చార్జ్గా ఉంచాలని చెప్పారు. అక్కడి మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. మండల ప్రత్యేకాధికారులంతా 20వ తేదీ రాత్రి మండలాల్లోనే ఉండి తరలింపు ఏర్పాట్లను పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కేంద్రం నుంచి డీఆర్డీఏ పీడీ ఎ.కల్యాణ చక్రవర్తి, జెడ్పీ సీఈఓ బీవీ సత్యనారాయణ, డీఈఓ మాణిక్యం నాయుడు, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ ఎ.రామారావు, జీఎస్డబ్ల్యూ నోడల్ అధికారిణి రోజారాణి, డీపీఓ టి.వెంకటేశ్వర్రావు, డీటీఓ కుమారస్వామి, మండలాల నుంచి ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల దాహం కేకలు..!
● పాఠశాలల్లో తాగేందుకు నీరు లేక అవస్థలుపార్వతీపురం రూరల్: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు కార్యక్రమం పేరిట ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది విద్యార్థులకు 11 రకాల నాణ్యమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తే నేడు ఎన్డీఏ ప్రభుత్వంలో విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు తాగునీరు లేకుండా పోయింది. గత ప్రభుత్వం లక్షలు వెచ్చించి ప్రతి పాఠశాలకు ఆర్ఓ ప్లాంట్ల ద్వారా మినరల్ వాటర్ను విద్యార్థులకు ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం వాటి నిర్వహణ సక్రమంగా లేక ప్రతి పాఠశాలలో మూలకు చేరి నిరుపయోగంగా దర్శనమిస్తూ విద్యార్థులకు దాహం తీర్చలేని దుస్థితిలో దర్శనమిస్తున్నాయి. మంచి ఆలోచనతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించకపోవడం అతి తక్కువ వ్యయంతో మరమ్మతులు చేపట్టి విద్యార్థులకు తాగునీరు అందించే ప్రయత్నం కూడా చేయకపోవడం పట్ల విద్యార్ధుల తల్లిదండ్రులు పాలకులు, అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
యువకుడిపై బీర్ బాటిల్తో దాడి
వంగర: మండల పరిధి కొప్పరవలస సమీపంలో మందుబాబులు వీరంగం సృష్టించారు. ఈ ఘటనపై వంగర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కొప్పరవలస–కొండచాకరాపల్లి ఐటీడీఏ కాలనీ సమీపంలో ఉన్న జీడితోటల వద్ద కొంతమంది యువకులు మంగళవారం మద్యం తాగుతున్నారు. అదే సమయంలో వీరఘట్టం నుంచి స్వగ్రామం ఐటీడీఏ కాలనీకి వెళ్లేందుకు అటువైపుగా బంటుపల్లి శంకరదొర వస్తున్నాడు. ఇంతలో అక్కడ మద్యం తాగుతున్న యువకులు శంకరదొరను కులంపేరుతో దూషించి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో శంకరదొర మెడభాగంలో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న ఈఎంటీ ఆలుబిల్లి జగదీష్ బాధితుడికి ప్రథమ చికిత్స అందించి రాజాం సీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్సకోసం శ్రీకాకుళం రిమ్స్కు తీసుకువెళ్లగా చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడి ఫిర్యాదు మేరకు దాడికి కారకులైన కొప్పరవలస గ్రామానికి చెందిన కోట్ల గణేష్, కోట్ల అప్పలరాజు, రేగిడి మండలం తోకలవలస గ్రామానికి చెందిన బుడితి రాంబాబులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై వై.పైడితల్లి తెలిపారు. మద్యం మత్తులో ఆకతాయిల వీరంగం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు -
యోగాంధ్రకు జన సమీకరణ
● వేలల్లో తరలింపునకు సన్నాహాలు ● శాఖల వారీగా లక్ష్యం– ప్రత్యేకంగా బస్సులు ● తలలు పట్టుకుంటున్న అధికారులు సాక్షి, పార్వతీపురం మన్యం : ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ నగరంలో జరగనున్న యోగాంధ్ర వేడుకల నిమిత్తం జన సమీకరణకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానుండటం.. దాదాపు 5 లక్షల మందిని భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించడంతో ఆ మేరకు ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా ప్రజలను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆర్టీసీ, ప్రైవేట్ సర్వీసులను వినియోగిస్తున్నారు. విద్యార్థులతో పాటు.. శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించారు. ఇప్పటికే యోగా మాసోత్సవాల పేరిట కొద్ది రోజులుగా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. జిల్లాకు రూ.50 లక్షల వరకు ఇందుకోసం ఖర్చు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా లక్ష్యం 60 వేల పైమాటే.. 21వ తేదీన విశాఖలో జరిగే ప్రధాని కార్యక్రమానికి ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి కనీసం ప్రజలు, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులతో కలిపి 60 వేల మందికి తక్కువ కాకుండా తరలించాలని అధికారులకు లక్ష్యం విధించారు. ఇందులో విజయనగరం జిల్లాలో విద్యార్థులు 15 వేల మంది, సాధారణ పౌరులు కనీసం మరో 15 వేల మంది ఉండాలని స్పష్టం చేశారు. వీరు కాక.. పోలీసు బలగాలు, రెవెన్యూ, ఇతర శాఖల నుంచీ ఉద్యోగులను పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఇందుకోసం 660 బస్సులను వినియోగిస్తున్నారు. విద్యార్థులు, ప్రజల తరలింపునకు ప్రతి బస్సుకూ ఒక లైజనింగ్ అధికారిని ఏర్పాటు చేశారు. మండల ప్రత్యేకాధికారులంతా ఈ నెల 20వ తేదీన రాత్రి మండలాల్లోనే ఉండి.. అందరినీ తరలించే బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి 28 వేల మంది విద్యార్థులను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. వీరుకాక.. సాధారణ పౌరులు, వివిధ శాఖల నుంచి కనీసం మరో 10 వేల మందినైనా తరలించాలని చూస్తున్నారు. ఉపాధి వేతనదారులు, డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ సిబ్బందినీ తరలించే యోచనలో ఉన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఆర్టీసీ, ప్రైవేట్ సర్వీసులు కలిపి మొత్తం 850 వాహనాలను జనాల తరలింపునకు సిద్ధం చేస్తున్నారు. ఒంటికి యోగా మంచిదేగా... ఇది కాదనలేని నిజం. అయితే దీన్ని ఎవరి వ్యక్తిగతంగా వారు ఆలోచించి చేసుకోవాల్సిన ఒక జీవన యానం. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగమైతే ఆరోగ్యవంతంగా ఉంటారన్న వాస్తవం ఎవరు కాదనరు. కానీ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ విశాఖ రానుండడంతో దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టి ఆయన దృష్టిలో పడి మార్కులు కొట్టేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా యోగా దినోత్సవం పేరిట నెల రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక కార్యక్రమం ప్రతి చోట చేయాలని నిర్దేశించారు. మురికివాడల నుంచి జిల్లా ఉన్నత కార్యాలయాల వరకు రోజూ ఏదో ఒక కార్యక్రమం చేపట్టేలా ప్రణాళిక రచించి అమలు చేస్తున్నారు. అయితే ఇదంతా బలవంతపు కార్యక్రమం కావడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదీ కేవలం ఫొటోలకే పరిమితం కావడం చర్చనీయాంశమైంది. తలలు పట్టుకుంటున్న అధికారులు ఇప్పటికే నెల రోజుల ఉత్సవంలో ప్రతి రోజూ ఏదో చోట కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. వీటికి జనాలను, విద్యార్థులను తీసుకొచ్చి కూర్చోబెట్టడం అధికారులకు తలకు మించిన భారమవుతోంది. చివరికి ఉపాధి వేతనదారులనూ వదలడం లేదు. పనులు చేసిన చోటే వారిని నిల్చోబెట్టి, ఫొటోలు తీసి కార్యక్రమాన్ని మమ అనిపించేస్తున్నారు. ఇప్పుడు యోగా దినోత్సవం రోజున వేలల్లో తరలించాల్సి రావడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రధానంగా ఉపాధి వేతనదారులు, సంఘాల మహిళలపైనే పడ్డారు. ఆ రోజు కార్యక్రమానికి రాలేని వారికి ఉపాధి పనులు కల్పించబోమని హెచ్చరిస్తున్నారు. 8వ తరగతి దాటిన విద్యార్థులందరినీ తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇప్పటికే అన్ని పాఠశాలలకూ ఆదేశాలిచ్చారు. యోగాసనాల కోసం తమను ఎందుకు ఇబ్బంది పెడతారని వివిధ వర్గాల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రధాని రానుండడంతో ఆయన వద్ద మెప్పు పొందేందుకే చంద్రబాబు ఇలా అన్ని వర్గాల వారిని ఇబ్బందులు పాల్జేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫొటో పోజులకే యోగాంధ్ర పరిమితమైందన్న వాస్తవాన్ని ఏ ఒక్కరూ కాదనలేరని సర్వత్రా వాదన వినిపిస్తోంది. -
అక్కసు ఎందుకు బాబూ?
● మున్సిపల్, అంగ్వాడీల మండిపాటు ● చిరుద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ ● కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన అంగన్వాడీ, చిరుద్యోగులపై..పార్వతీపురం టౌన్: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అవు ట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులకు ప్రభుత్వ సంక్షే మ పథకాలు క్రమం తప్పకుండా అందాయి.. పిల్లల చదువులకు ఆర్థిక కష్టాలు ఉండేవి కావు.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత అందజేస్తున్న అరకొర సంక్షేమ పథకాల ను అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు అందజేయకపోవడం విచారకరం.. చాలీచాలని వేతనాల తో ఇబ్బందులు పడుతున్న వారికి సంక్షేమ పథకా లు నిలిపివేయడం అన్యాయం.. చిరుద్యోగులపై ఇంత అక్కసు ఎందుకు ‘బాబూ’ అంటూ అవుట్ సోర్సింగ్, మున్సిపల్, అంగన్వాడీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ఽసీఐటీయూ, అంగన్వాడీ యూనియన్ల ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేశారు. ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. కొందరు ఉద్యోగులు కన్నీరుకార్చారు. న్యాయం చేయాలంటూ డీఆర్వో హేమలతకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న సిబ్బందికి కేవ లం రూ.13వేలు మాత్రమే జీతం చెల్లిస్తున్నారని, ఇంతటి తక్కువ జీతం పొందుతున్న వారికి సంక్షేమ పథకాలు వర్తింపజేయకపోవడం దుర్మార్గమన్నారు. పెరిగిన ధరలకు వచ్చిన అరకొర జీతంతో బతకడం కష్టంగా మారిందన్నారు. అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులా...? అంగన్వాడీ వర్కర్లకు 11,500, మినీ వర్కర్లు, హెల్పర్లకు రూ.7వేలు గౌరవ వేతనమే ఇస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.12వేలు జీతం లోబ డే ఉంది. అయినా అంగన్వాడీ వర్కర్లకు తల్లికి వందనం పథకం వర్తించలేదంటూ ఆందోళన వ్యక్తంచేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా రికార్డుల్లో నమోదు చేసి ఉంటే.. తక్షణమే ఉద్యోగభద్రత కల్పి ంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్ అండ్ హెల్పర్ల యూనియన్ గౌరవా ధ్యక్షురాలు ఎం.ఉమామహేశ్వరి, అవుట్సోర్సింగ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా కన్వీనర్ బీవీ రమణ, కాంట్రాక్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయి స్ యూనియన్ నాయకులు ఎస్.అవినాష్ కుమార్, ఎన్.కమల, వై.శ్రీధర్, బి.కొండలరావు, ఎ.బుజ్జ మ్మ, ఎం.విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం దృష్టి సారించాలి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, అంగన్వాడీలు చాలీచాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. వేతనాలు పెంచకపోగా ఇప్పుడు సంక్షేమ పథకాలను రద్దుచేయడం సరైన విధానం కాదు. అంగన్వాడీలను, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా ఎలా పరిగణిస్తారు? ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించి అందరికీ లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టాలి. – సీహెచ్ రేవతి, అంగన్వాడీ వర్కర్ -
నేడు వీఆర్ సాగర్ వద్ద యోగాంధ్ర
● కలెక్టర్ శ్యామ్ప్రసాద్ మక్కువ: పర్యాటక ప్రదేశాల్లో యోగాంధ్రలో భాగంగా మక్కువ మండలం శంబర గ్రామ సమీపంలోని వెంగళరాయసాగర్ ప్రాజెక్టు ఏనుగుకొండ వద్ద యోగాంధ్ర కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహిస్తామని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు. ఏనుగు కొండ పరిసరాల ను కలెక్టర్ సోమవారం పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయన వెంట జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకుడు కె.రామచంద్రరావు, అధికారులు ఉన్నారు. సీతంపేట వైపు ఏనుగులు భామిని/సీతంపేట: భామిని మండలంలో అల్లకల్లోలం సృష్టించిన ఏనుగుల గుంపు సీతంపేట ఏజెన్సీలోకి సోమవారం ప్రవేశించాయి. భామిని మండలం పోలవరం నుంచి పోలీస్ కోట మీదుగా సీతంపేట మండలం చిన్నబగ్గ, తాబేలవలస గ్రామాలకు చేరుకున్నట్టు అటవీశాఖాధికారులు తెలిపారు. వర్షాలు కురుస్తుండడంతో ఏనుగుల గుంపు పల్లపు ప్రాంతాల నుంచి మెట్ట ప్రాంతాలకు తరలివెళ్తున్నట్టు భావిస్తున్నారు. ఎఫ్బీవో దాలినాయుడుతో పాటు సిబ్బంది ఏనుగులు సంచరించే వైపు ఎవ్వరినీ వెళ్లనీయకుండా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 3,594 మంది టీచర్లకు స్థాన చలనం ● 97 మందికి ఉద్యోగోన్నతులు ● ముగిసిన బదిలీ, ఉద్యోగోన్నతుల తంతు విజయనగరం అర్బన్: జిల్లా విద్యాశాఖలో నెలరోజులుగా సాగిన బోధన సిబ్బంది బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియ తంతు ఎట్టకేలకు ముగిసింది. బదిలీ అయిన, ఉద్యోగోన్నతి పొందిన ఉపాధ్యాయులు సోమవారం నూతన స్థానాల్లో విధులకు హాజరయ్యారు. బదిలీ షెడ్యూల్కు ముందు చేపట్టిన ఉద్యోగోన్నతి ప్రక్రియలో వివిధ కేడర్లకు చెందిన 97 మంది ఉపాధ్యాయులు ఉద్యోగోన్నతి పొందారు. అనంతరం ఏర్పడిన ఖాళీలతో పాటు, క్లియర్ వేకెన్సీ, తప్పనిసరి బదిలీ స్థానాలు, రిక్వెస్ట్ బదిలీ టీచర్లకు చేపట్టిన బదిలీ షెడ్యూల్లో 3,594 మందికి స్థాన చలనం జరిగింది. బదీలీ అయిన వారిలో హెచ్ఎంలు 69 మంది, మోడ ల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలు 275, స్కూల్ అసిస్టెంట్, తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయు లు 1,345 మంది, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయు లు, తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులు 1,816 మంది, భాషా పండితులు 60 మంది, పీఈటీలు 26 మంది, ఆర్ట్, క్రాప్ట్, మ్యూజిక్ మరియు ఇతరులు ముగ్గురు ఉన్నారు. -
గిరిపుత్రుల నుంచి రూ.23 లక్షలు స్వాహా!
●సీసీ నిర్వాకమే.. 2014 నుంచి 2020 వరకు రాయగడ జమ్ము సీసీగా పనిచేసిన వ్యక్తిపైనే మాకు అనుమానాలున్నాయి. ఆయనే నిధులు దుర్విని యోగం చేశారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. గతంలో సదరు సీసీ బదిలీపై వెళ్లారు. మరలా ప్రస్తుతం ఇక్కడే నియమించారు. గిరిజనులను మోసం చేయ డం దారుణం. సదరు సీసీపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలి. – మండంగి శ్రీనివాసరావు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సాక్షి, పార్వతీపురం మన్యం: వారంతా గిరిపుత్రులు. అక్షరం రాని అమాయకులు. ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేయడమే తెలు సు. అటువంటి వారికీ టోకరా పెట్టారు మన ‘వెలు గు’ సిబ్బంది. గిరిజనులకు రుణాల పేరిట ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.23 లక్షలు వాడేశారు. ఆ సొమ్ముల్లో ఒక్క రూపాయి కూడా ఆ అమాయకులకు వెళ్లలేదు. తీరా, ఇప్పుడు వారి పేరి ట రుణాలు కనిపిస్తే లబోదిబోమంటున్నారు. గుమ్మలక్ష్మీపురం మండలం బాలేసు, రాయగడ జమ్ము, చాపరాయిబిన్నిడి పంచాయతీలకు చెందిన సుమారు 14 మహిళా సంఘాల్లో సీ్త్ర నిధి(టీఎస్పీ) రుణాల్లో గోల్మాల్ చోటు చేసుకుంది. రుణాలు పొందకుండానే, దాదాపు 50 మంది గిరిజనులు రుణాలు పొందినట్లు చూపుతున్నారు. ప్రధానంగా అప్పట్లో సీసీగా పని చేసిన ఓ వ్యక్తిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2014 నుంచి 2020 వరకు అతని పని చేసినట్లు గిరిజనులు చెబుతున్నారు. 2016, 2017, 2018 సంవత్సరాల్లో సంఘాల పేరిట సీ్త్రనిధి రుణాలు మంజూరయ్యాయి. రాయగడ జమ్ము ఎస్హెచ్జీలో 27 మంది, చాపరాయి బిన్నిడి ఎస్హెచ్జీలో 12 మంది, బాలేసులో 11 మంది పేరిట రూ.23 లక్షలు దుర్వినియోగమైనట్లు తెలుస్తోంది. ఆ నిధులు గిరిజనులకు ఇవ్వకుండానే.. ఒక్కొక్కరి పేరిట రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు రుణాలు పొందినట్లు చూపుతున్నారు. అధికారులకు మొర.. తమకు తెలియకుండానే రుణాలు తీసుకున్నారని తెలియడంతో వల్లాడ, చాపరాయిబిన్నిడి, రేగిడి, కర్లగూడ, చినరావికోన గిరిజన గ్రామాలకు చెందిన గిరిజనులు సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి తరలివచ్చారు. జిల్లా రెవెన్యూ అధికారి హేమలతను కలిసి వినతిపత్రం అందజేశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రుణాల పేరిట టోకరా వెలుగు సీసీ నిర్వాకమేనా? -
పథకాలు వర్తింపజేయాలి
పార్వతీపురం మున్సిపాలి టీలో అవుట్సోర్సింగ్ వర్కర్గా విధులు నిర్వహిస్తున్నా ను. చాలీచాలని వేతనంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నా. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమ్మఒడి, మా కుటుంబ సభ్యులకు సంక్షేమ పథకా లు అందేవి. గతంలో మాదిరిగానే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. – రాజేష్, అవుట్సోర్సింగ్, ఉద్యోగి, పార్వతీపురం మున్సిపాల్టీ -
తల్లికి వందనం అందలేదు
సాలూరు: సాలూరు మున్సిపల్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ శ్యామ్ప్రశాద్ ప్రజాసమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. కలెక్టర్తో పాటు డ్వామా పీడీ రామచంద్రరావు అర్జీలు స్వీకరించారు. మొత్తం 154 అర్జీలు అందగా, రెవెన్యూ, తల్లికి వందనం పథకం అందలేదన్నవే అధికంగా ఉన్నాయి. తన ముగ్గురు పిల్లలు లలిత, లక్ష్మి, మణికుమార్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని, తల్లికి వందనం పథకం వర్తించలేదంటూ పార్వతీపురం మండలం డోకిశీల సచివాలయం పరిధిలోని జోగిదొరమెట్టవలస 6గామానికి చెందిన జట్టమ్మ తన పిల్లలతో కలిసి కలెక్టర్కు గోడువినిపించింది. భూమి అధికంగా ఉందని, అధిక విద్యుత్ విని యో గం, ఇన్కంట్యాక్స్, తదితర సమస్యలతో తమకు తల్లికి వందనం రాలేదంటూ పలువురు అర్జీలు అందజేశారు. చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదులు చేశారు. -
సైన్ంగ్ చెక్కులు.. స్టార్స్కు చిక్కులు!
సాక్షి, పార్వతీపురం మన్యం: షైనింగ్ స్టార్స్ నగదు పురస్కారం అందుకున్న విద్యార్థులకు.. వారి తల్లిదండ్రులకు చిక్కులు తప్ప డం లేదు. స్వయంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా పంపిణీ చేసిన చెక్కు లు చెల్లుబాటు కావడం లేదు. చెక్కులపై చేసిన సంతకమే ఇందుకు కారణం. దీంతో తల్లిదండ్రులు... తమ పిల్లలను తీసుకుని బ్యాంకులు, డీఈవో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. సోమ వారం జిల్లా విద్యా శాఖ కార్యాలయానికి వచ్చి సదరు చెక్కులను వెనక్కి ఇచ్చారు. అధికారుల నిర్వాకంతో.. పార్వతీపురం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఈ నెల 9న షైనింగ్ స్టార్స్ కార్యక్రమం నిర్వహించిన విషయం విదితమే. పదోతరగతి, ఇంటర్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు రూ.20 వేలు చొప్పున పురస్కారాలు అందించారు. కార్యక్రమానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులకు చెక్కులను అందజేశారు. ఇన్చార్జి డీఈఓగా ఉన్న రాజ్కుమార్కు ఎఫ్ఏసీ ఇవ్వకుండానే చెక్కులపై సంతకాలు చేయించారు. ఇలా పదో తరగతికి సంబంధించి 95 మందికి మూడు రకాల చెక్కులను పంపిణీ చేశారు. అవి తీసుకుని బ్యాంకులకు వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులకు షాక్ తగిలింది. అవి చెల్లవని చెప్పడంతో వారంతా డీఈఓ కార్యాలయం చుట్టూ నాటి నుంచి తిరుగుతున్నారు. సోమవారం పెద్ద ఎత్తున తల్లిదండ్రులు చెక్కులు తీసుకొచ్చి కార్యాలయంలో అందజేశారు. దీంతో కలెక్టర్ సహా, విద్యాశాఖాధికారులు బ్యాంకర్లతో మాట్లాడారు. అయినప్పటికీ కొన్ని బ్యాంకులు తిప్పిపంపాయి. మరో దారి లేక, అప్పటికే విషయం పెద్దది కావడడంతో మళ్లీ కొంతమందిని డీఈఓ కార్యాలయానికి పిలిపించుకుని నేరుగా నగదు అందజేశారు. రెవెన్యూ స్టాంప్పై సంతకం చేయించుకుని మరీ నగదు ఇవ్వడం గమనార్హం. మంత్రి లోకేశ్ వద్ద పరువు పోతోందేమోనన్న భయంతో విద్యాశాఖాధికారులు సొంత డబ్బులు సర్దుబాటు చేశారా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. చెక్కుల్లో సమస్యలు లేవు : కలెక్టర్ షైనింగ్ స్టార్స్ చెక్కుల్లో సమస్యలు లేవని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు. 95 మంది పదో తరగతి విద్యార్థులు షైనింగ్ స్టార్ కార్యక్రమంలో చెక్కులు పొందగా.. వారిలో 73 మందికి ఇప్పటికే సర్దుబాటు చేసినట్లు చెప్పారు. మిగిలిన వారు బ్యాంకుల్లో తమ చెక్కులను డిపాజిట్ చేయాల్సి ఉందన్నారు. బ్యాంకు ఖాతాలు లేని మారుమూల, దూర ప్రాంతాల కు చెందిన విద్యార్థులకు నేరుగా చెల్లించే ఏర్పా టును కూడా చేశామని చెప్పారు. జిల్లా విద్యా శాఖ అధికారి ఇటీవల మారడం వల్ల సమస్య ఏర్పడిందన్నారు. ఈ నెల 11వ తేదీ తర్వాత పరిష్కారమైందన్నారు. ప్రస్తుతం చెక్కుల నగదు జమలో ఎటువంటి సమస్యా లేదని చెప్పారు. బ్యాంకుల్లో సమస్య తలెత్తితే జిల్లా రెవెన్యూ అధికారి (83338 13248), జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ (91213 86194) ఫోన్ నంబర్లకు సంప్రదించవచ్చని సూచించారు. -
నేలపైనే వైద్యం
అమ్మో.. మలేరియా..! ● సీతంపేట ఏరియా ఆస్పత్రికి రోగుల తాకిడి ● ఒకే రోజు 23 మందికి మలేరియా పాజిటివ్ ● 349 ఓపీ నమోదు ● ఇందులో జ్వర పీడితులు 91 మంది గుమ్మలక్ష్మీపురం: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి నాలుగు రోజులుగా రోగుల తాకిడి పెరిగింది. బెడ్లు చాలడం లేదు. ఇద్దరు ముగ్గురికి ఒకే బెడ్పైన, వరండాలో నేలపైనే రోగులను ఉంచి వైద్యులు సేవలందిస్తున్నారు. ఇక్కడ గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తలపెట్టిన ఆస్పత్రి భవ నాన్ని పూర్తిచేసి ఉంటే ఈ కష్టాలు ఉండేవి కావని రోగులు, వారి బంధువులు చెబుతున్నారు. పాలకులు, అధికారులు స్పందించి ఆస్పత్రిలో అద నపు బెడ్లువేసి వైద్యసేవలందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆస్పత్రి వరండాలోనే వైద్యసేవలు పొందుతున్న రోగులు సీతంపేట: ఏజెన్సీలో మలేరియా కేసులు పెరు గుతున్నాయి. గిరిజనుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో ఆస్పత్రులకు జ్వరపీడితుల తాకిడి ఎక్కువైంది. సీతంపేట ఏరియా ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సోమవారం 349 ఓపీ నమోదుకాగా, ఇందులో 91 మంది జ్వరపీడితులే. వీరిలో 23 మందికి మలేరియా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇన్పేషెంట్లుగా 39 మంది చేరారు. రోగులందరికీ మెరుగైన వైద్యసేవలందిస్తు న్నట్టు ఇన్చార్జి సూపరింటెండెంట్ డి.వి. శ్రీనివాస్ తెలిపారు. గిరిజన ప్రజలు కాచిచల్లార్చిన నీటిని తాగాలని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. -
చంద్రబాబు అంటే మోసం
జగన్ అంటే నమ్మకం...చీపురుపల్లి: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో కేసులు, మోసాలు, అవినీతి, అబద్ధాలు, దాడులు, దోపీడీలు తప్ప.. ప్రజలకు చేకూరిన లబ్ధి ఏదీ లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది మోసాలు, అప్రజాస్వామిక పరిపాలనపై వైఎస్సార్సీపీ అధిష్టానం ముద్రించిన ‘జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తకాలను సోమవారం సాయంత్రం చీపురుపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ, రాష్ట్ర పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ మెంబర్ బెల్లాన చంద్రశేఖర్తో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 జూన్ 12 నుంచి 2025 జూన్ 12 వరకు కూటమి ప్రభుత్వ పరిపాలన, 2019 జూన్ నుంచి 2020 జూన్ వరకు వైఎస్సార్సీపీ పరిపాలనలో సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధి సంస్కరణలు బేరీజు వేస్తూ పుస్తకాన్ని ముద్రించడం జరిగిందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో మేనిఫెస్టోలోని అంశాలన్నీ అమలు చేసి ఏడాదిలోనే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన సంగతిని గుర్తుచేశారు. నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని నిరుద్యోగ యువతను మోసం చేశారని, 20 లక్షలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారని అన్నారు. ఏడాది కూటమి పరిపాలనలో పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్లకు రావాల్సిన జనరల్ ఫండ్స్ ఒక్క రూపాయి కూడా జమ కాలేదన్నారు. అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా రాలేదన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు లేఖ రాసినా సమాధానం రాలేదన్నారు. పంచాయతీలు నిర్వీర్యం అయిపోతున్నాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. -
సారా తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
పాలకొండ: సారా నిర్మాలనలో భాగంగా సోమవారం చేపట్టిన దాడుల్లో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని ఎకై ్సజ్ సీఐ సూర్యకుమారి తెలిపారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. సీతంపేట మండలం దిగువ బుడగరాయి వద్ద దారి కాపలా కాయగా పాలకొండ మండలం ఓని గ్రామానికి చెందిన కనపాక నవీన్ 20 లీటర్ల సారా, బుడగరాయి గ్రామానికి చెందిన సవర మంగయ్య 10 లీటర్ల సారా తరలిస్తూ పట్టబడినట్టు తెలిపారు. వారితో పాటు దిగువ బుడగరాయికి చెందిన పాత నేరస్తుడు సవర వెంకయ్యను అరెస్టు చేసి ముగ్గురిని కోర్టులో హజరు పరిచామని తెలిపారు. సారా తయారీకి ఉపయోగించే బెల్లం విక్రయాలు చేపడుతున్న వీరఘట్టం మండలానికి చెందిన ఆరుగురు వ్యక్తులపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. నవోదయం 2 కార్యక్రమంలో భాగంగా సారా అమ్మకాలు చేస్తున్న గ్రామాలపై నిఘా ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. -
ఉచిత సీట్లు ఇవ్వకపోతే ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు
విజయనగరం అర్బన్: ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతిలో పేదలకు ఉచితంగా కేటాయించిన సీట్లను ఇచ్చే చట్టాన్ని అమలు చేయకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ స్పష్టం చేశారు. విద్యా హక్కు చట్టాన్ని అనుసరించి ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 25 శాతం సీట్లను ఉచితంగా పేదలకు కేటాయించాల్సి ఉండగా స్థానికంగా ఉన్న ఫోర్ట్సిటీ, సన్, బీసెంట్, చాణిక్య స్కూల్స్లో సీట్లు కేటాయించడం లేదని పలువురు తల్లిదండ్రులు కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత నాలుగు పాఠశాలల ద్వారా 240 సీట్లు కేటాయించాల్సి ఉందని వాటిని వెంటనే కేటాయించమని ఆదేశాలు జారీ చేయాలని డీఈఓ యూ.మాణిక్యంనాయుడికి సూచించారు. పీజీఆర్ఎస్కు 190 వినతులు ప్రజా వినతుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే వినతులను లాగిన్లో అధికారులు ఎప్పటికప్పుడు చూడాలని ఇంకనూ చూడవలసిన కాలమ్లో ఎప్పుడు చూసినా సున్నా కనపడాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ ఆదేశించారు. సోమవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్ ప్రజల నుంచి 190 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి రోజు లాగిన్ అయి అధికారులు వినతులను చూడాలని అలాగే రీ ఓపెన్ కేసులు కూడా పూర్తిగా విచారణ జరిపి ముగించాలని తెలిపారు. గడువులోపల వినతులకు సమాధానాలు పంపాలని ఆదేశించారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 46 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఏఎస్పీ సౌమ్యలత 46 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ వచ్చిన ఫిర్యాదు అంశాలను పరిశీలించి, పూర్వా పరాలపై విచారణ చేసి, వాస్తవమైతే చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని సంబంధిత పోలీసు అధికారులను అదనపు ఎస్పీ పి.సౌమ్యలత ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ పీజీఆర్ఎస్కు 190 వినతులు -
పీజీఆర్ఎస్కు 118 వినతులు
పార్వతీపురం టౌన్: పార్వతీపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహి ంచిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 118 వినతులు అందాయి. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో వివిద శాఖలకు చెందిన అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 24 ఫిర్యాదులు పార్వతీపురం రూరల్: ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు పార్వతీపురం ఏఎస్పీ అంకిత సురానా అన్నారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీసు శాఖ కార్యాలయంలో ఆమె ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు ఇచ్చిన 24 ఫిర్యాదులను నేరుగా ఆమె స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఫిర్యాదులపై సంబంధిత పోలీస్స్టేషన్లకు ఫోన్ ద్వారా వివరాలను తెలియజేసి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పూర్వాపరాలపై విచారణ చేసి చట్టపరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని, అలాగే ఆ నివేదికను జిల్లా ఎస్పీ కార్యాలయానికి విధిగా పంపాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదామ్ తదితర పోలీసు సిబ్బంది ఉన్నారు. ఐటీడీఏ గ్రీవెన్స్ సెల్కు 60 అర్జీలు సీతంపేట: ఐటీడీఏలోని శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం పరిపాలనాధికారి వి.సునీల్ ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. 60 మంది గిరిజనులు తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ డీఈ సింహాచలం, జీసీసీ మేనేజర్ నరసింహులు, ఏఈ నీలిమ,హెచ్వో జయశ్రీ, ఏఎంవో కోటిబాబు, ఐటీడీఏ స్పోర్ట్స్ ఇన్చార్జ్ ఎన్.జాకాబ్దయానంద్ తదితరులు పాల్గొన్నారు. -
ఏనుగుల సంచారంతో అప్రమత్తంగా ఉండాలి
బొబ్బిలి రూరల్: మండలంలోని ముత్తాయివలస గ్రామ శివారు ప్రాంతంలో తిష్ఠవేసిన అడవి ఏనుగులతో అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ పిల్లా వసుంధర, అటవీశాఖ అధికారులు గ్రామస్తులను హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఏనుగుల సంచార ప్రాంతానికి చేరుకుని ఏనుగుల దాడినుంచి తప్పించుకునే అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. పశువులను, మేకలను ఏనుగులున్న ప్రాంతాలవైపు తరలిపోకుండా చూసుకోవాలని,నిత్యం అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు వివరించారు.అటవీశాఖ అధికార సిబ్బంది ఎప్పకప్పుడు సమాచారం అందిస్తారని అందుకు అనుగుణంగా మెలగాలని సూచించారు. వాటికి హానికలిగించే చర్యలు చేపట్టవద్దని, ఆందోళన చెందవద్దని సూచించారు. -
కొడుకును బడిలో చేర్చడానికి వచ్చి తండ్రి మృతి
పాచిపెంట: కొడుకును పాఠశాలలో చేర్పించడానికి వచ్చిన ఓ తండ్రి అకస్మాత్తుగా మృతి చెందిన సంఘటన పాచిపెంట మండల కేంద్రంలో సోమవారం విషాదం నింపింది. ఈ ఘటనపై వైద్యాధికారి, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రాయిగుడ్డి వలస గ్రామానికి చెందిన చెదల కన్నయ్య కుమారుడు గౌతం మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్నాడు. అయితే పి.కోనవలస రెసిడెన్షియల్ పాఠశాలలో 5వ తరగతికి సీటు రావడంతో సోమవారం ఉదయం రికార్డ్షీట్ తీసుకుని పి.కోనవలస రెసిడెన్షియల్ పాఠశాలలో జాయిన్ చేసేందుకు పాచిపెంట గిరిజన ఆశ్రమ పాఠశాలకు వచ్చాడు. పాఠశాలకు వచ్చిన కొద్దిసేపటికే ఫిట్స్ రావడంతో కింద పడిపోయాడు. వెంటనే పాఠశాల సిబ్బంది, స్థానికులు పాచిపెంట పీహెచ్సీకి హుటాహుటిన తరలించారు. వైద్యాధికారి వెంకటరమణ పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. -
పాఠశాలలో ప్రొజెక్టర్ చోరీ
రామభద్రపురం: మండలకేంద్రంలోని అగురువీధి ప్రాథమిక పాఠశాలలో కయాన్ ప్రొజెక్టర్ చోరీకి గురైంది. ఈ చోరీపై పాఠశాలకు చెందిన ఇద్దరు టీచర్లతో కలిసి హెచ్ఎం బి.తిరుపతిరావు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. హెచ్ఎం తెలిపిన వివరాల ప్రకారం డిజిటల్ తరగతుల నిర్వహణలో భాగంగా 2022లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.1.30 లక్షలు విలువ చేసే కయాన్(ఇంటరాక్టివ్ ప్రాజెక్టర్)అందజేసింది. అయితే పాఠశాలల పునఃప్రారంభం తర్వాత శని,ఆదివారాలు సెలవుల్లో గుర్తు తెలియని దుండగులు తరగతి గది తాళం విరగొట్టి కయాన్ ప్రొజెక్టర్ దొంగతనానికి పాల్పడ్డారు. పాఠశాలకు చెందిన స్కావెంజర్ ఆదివారం ఉదయం తరగతి గదులు పరిశుభ్రం చేయడానికి వెళ్లి తలుపుల తాళం విరగ్గొట్టి ఉండడం ప్రొజెక్టర్ చోరీ జరిగినట్లు గుర్తించి తనకు సమాచారం ఇవ్వగా వెంటనే పాఠశాలకు చేరుకుని పరిశీలించి తోటి టీచర్లతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ప్రసాదరావు పాఠశాలకు చేరుకుని చోరీ జరిగిన తరగతి గదితో పాటు పాఠశాల ఆవరణంతా పరిశీలించారు. ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామని ఎస్సై తెలిపారు.10 మంది జూదరుల అరెస్ట్పూసపాటిరేగ: మండలంలోని కొల్లాయివలస సమీపంలో మామిడి తోటలో పేకాట ఆడుతున్న పదిమందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై ఐ.దుర్గాప్రసాద్ తెలియజేశారు. వారి నుంచి రూ.14,210 నగదు, 4 మోటార్ సైకిల్స్, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులను కోర్టుకు తరలిస్తామ న్నారు.గంజాయి మత్తులో విద్యార్థిపై దాడివిజయనగరం క్రైమ్: నగరంలోని కేఎల్పురానికి చెందిన సాగర్ మరోసారి గంజాయి మత్తులో ఆర్కే కళాశాలకు చెందిన విద్యార్థి మహేంద్ర లక్ష్మణ్ కుమార్పై దాడికి పాల్పడ్డాడు. గతంలో కూడా సాగర్ గంజాయి మత్తులో ఇద్దరు విద్యార్థులపై దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో బాధిత విద్యార్థి, తల్లిదండ్రులు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు వన్టౌన్ సీఐ శ్రీనివాసరావు, క్రైమ్ ఎస్సై సురేంద్రనాయుడు వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నేలబావిలోపడి మతిస్థిమితంలేని వృద్ధుడి మృతిరాజాంసిటీ: నేలబావిలో పడి పట్టణ పరిధిలోని గొల్లవీధికి చెందిన బొబ్బిలి లక్ష్మణ (69) అనే మతిస్థిమితంలేని వ్యక్తి మృతిచెందాడు. దీనికి సంబంధించి ఎస్సై వై.రవికిరణ్ సోమవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లక్ష్మణ కొద్ది సంవత్సరాలుగా మతిస్థిమితం కోల్పోయి అప్పుడప్పుడు ఇంటి నుంచి ఒకటి రెండు రోజులు ఎటో వెళ్లిపోయి మళ్లీ వస్తుంటాడు. ఈ క్రమంలోనే ఈ నెల 15న మధ్యాహ్నం భోజనం అనంతరం ఎటో వెళ్లిపోయాడు. రాత్రి సమయం అయినా రాకపోవడంతో కుటుంబసభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. తన భర్త తెలగవీధిలోని శ్మశాన వాటిక వద్ద బావికి స్నానానికి వెళ్తుండేవాడని వృద్ధుడి భార్య నారాయణమ్మ భావించి సోమవారం తెల్ల వారుజామున కుటుంబసభ్యులతో వెళ్లి చూడగా బావి ఒడ్డున లక్ష్మణ చేతికర్ర ఉండడంతో బావిలోకి చూశారు. బావిలో మృతదేహం తేలియాడడంతో పోలీసులకు మృతుని భార్య ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. సామూహిక కుంకుమార్చనలు విజయనగరం టౌన్: స్థానిక రామానాయుడు రోడ్డులోని శ్రీకోటసత్తెమ్మ ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం సామూహిక కుంకుమార్చనలు చేశారు. అనంతరం లలిత సహస్రనామ పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాల చివరి రోజు అయిన మంగళవారం పెద్దచెరువులో తెప్పోత్సవం, ఘటాల ఊరేగింపు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. -
సామాన్యుల వరకు యోగా చేరువ కావాలి
● కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్పార్వతీపురంటౌన్: జిల్లాలో సామన్య మానవుడి వరకు యోగాను తీసుకు వెళ్లాలనేదే యోగాంధ్ర లక్ష్యమని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో యోగాంధ్ర, డీఏ జుగా, సీఎం సూర్యపవర్, పీఎం జన్మన్ తదితర అంశాలపై జిల్లా, మండల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా లక్ష ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి యోగాను ప్రతి ఒక్కరూ దినచర్యలో భాగం చేయాలనేదే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. అందులో భాగంగా గత 25 రోజులుగా జిల్లాలో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం రూపొందించిన కొన్ని పారామీటర్స్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు కృచేసిన అధికారులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. ఇప్పటివరకు యోగాభ్యాసంలో భాగంగా మాత్రమే కార్యక్రమాలను చేపట్టామని, ఇదేస్ఫూర్తితో ఈ నెల 21వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పిల్లలు, పెద్దలను భాగస్వాములను చేసి జిల్లా ముందంజలో ఉండేలా కృషిచేయాలని అధికారులను కోరారు. ● సీఎం సూర్యఘర్కు మనవాళ్లే ప్రచార కార్యకర్తలు సీఎం సూర్యఘర్ పథకానికి ప్రభుత్వ ఉద్యోగులే ప్రచారకర్తలని కలెక్టర్ పేర్కొన్నారు. సూర్యఘర్ యూనిట్లు ప్రతి ఒక్క కుటుంబం వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని ఏపీఈపీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. ● పీఎం జన్మన్ గృహాలు వేగవంతం కావాలి జిల్లాలో పీఎం జన్మన్ గృహాలు మరింత వేగవంతం కావాలని, ప్రతివారం ప్రగతి కనిపించాలని, లేకుంటే ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. కురుపాం, సీతంపేట, జీఎల్ పురం మండలాల్లో ప్రగతి కనిపించకపోవడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా గృహ నిర్మాణాలు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. -
ఇరువర్గాల కొట్లాట
జియ్యమ్మ వలస రూరల్: మండలంలోని తురకనాయుడు వలస గ్రామంలో హరిజనులు, ఎరగ్రొల్లల మధ్య కొట్లాట జరిగింది. జియ్యమ్మవలస పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆదివారం హరిజనవాడలో ఓ శుభకార్యం జరగడంతో సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో కార్యక్రమం ముగిసిన తరువాత అద్దె సామగ్రిని వ్యాన్పైకి ఎక్కిస్తున్న సమయంలో ఆ మార్గం గుండా ఎర్రగొల్లలకు చెందిన గొర్లి రాజు, గొర్లి చందులు స్కూటీపై వెళ్తూ దారికి అడ్డంగా ఉన్న సామగ్రిని తొలగించమని చెప్పగా, అక్కడే ఉన్న ఎత్తుల హరి కొద్ది నిమిషాలు ఓపిక పట్టమని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి కొట్లాటకు దిగారు. ఈ కొట్లాట హరిజన పేటలో హరిజనులు, ఎర్ర గొల్లల మధ్య తీవ్ర స్థాయిలో జరిగింది. కొట్లాటలో పలువురికి గాయాలు కాగా ఇరువర్గాలు పోలీసులను ఆశ్రయించాయి. ఎర్రగొల్లలు దౌర్జన్యానికి దిగుతూ తమపై కుల దూషణ చేశారంటూ హరిజనులు కేసు పెట్టగా, గొర్లి రాజు గొర్లి చందు, లక్ష్మి, గొర్లి మజ్జి, గొర్ల పాపారావులపై జియ్యమ్మవలస పోలీసులు అట్రాసిటి కేసు నమోదు చేశారు. దీంతో పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు, చినమేరంగి సర్కిల్ ఇన్స్పెక్టర్ టీవీ తిరుపతిరావు సిబ్బందితో తురక నాయుడు వలస గ్రామంలో విచారణ చేపట్టారు. బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించి ఇరువర్గాలను సమన్వయ పరిచారు. కార్యక్రమంలో జియ్యమ్మ వలస ఏఎస్సై ప్రశాంత్ కుమార్, చినమేరంగి ఎస్సై పి.అనీషలు పాల్గొన్నారు. -
చెల్లని చెక్కులు పంచిన మంత్రి లోకేష్!
సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: షైనింగ్ స్టార్స్ పేరిట కూటమి ప్రభుత్వం పంచుతున్న చెక్ల విషయంలో దారుణం జరిగింది. స్వయంగా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) పంచిన చెక్కులు చెల్లకుండా పోయాయి. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురై అధికారులను ఆరాలు తీశారు. వివరాల్లోకి వెళ్తే.. పదవ తరగతి, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్స్(Shinig Stars Cheques) పేరుతో అవార్డులను ప్రదానం చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే.. వారం కిందట పార్వతీపురంలో 90 మంది ప్రతిభా వంతులైన విద్యార్థులకు స్వయంగా మంత్రి లోకేష్ రూ.20 వేల విలువైన చెక్లు అందించారు. అయితే ఆ చెక్లను బ్యాంక్లు వెనక్కి తిప్పి పంపించాయి. దీంతో ఆందోళన చెందిన విద్యార్థులు విద్యా శాఖ కార్యాయాల వద్దకు చేరి ఆరాలు తీశారు. అయితే ఆ చెక్లపై ఉన్న డీఈవో, ఎంఈవోల సంతకాలు సరిపోలేదని చెబుతూ బ్యాంకులు తిప్పి పంపినట్లు తేలింది. దీంతో మంత్రి లోకేష్ చేతుల మీదుగా జరిగిన వ్యవహారం కావడంతో అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఆ చెల్లని చెక్లు తీసుకుని విద్యార్థులను వెనక్కి పంపించేశారు. త్వరలోనే చెల్లే చెక్కులు పంపిణీ చేస్తామని వాళ్లకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఎక్కడి వారు అక్కడే గప్చుప్! -
ముత్తాయివలసలో ఏనుగుల సంచారం
బొబ్బిలి రూరల్: మండలంలోని ముత్తాయివలస, కలవరాయి గ్రామాల మధ్య ఏనుగుల గుంపు సంచరిస్తోంది. శనివారం రాత్రి సీతానగరం మండలం నుంచి తరలివచ్చి ఆదివారం ఉదయానికి ఇక్కడి గ్రామాల్లోని మామిడితోటలో తిష్ట వేశాయి. దీంతో అలర్ట్ అయిన ఫారెస్ట్ సిబ్బంది గ్రామానికి చేరుకుని గ్రామస్తులకు, అటుగా వచ్చే ప్రయాణికులకు పలు సూచనలు చేశారు. ఏనుగుల గుంపు వేరే ప్రాంతానికి తరలి వెళ్లేవరకు ఆయా గ్రామాలమీదుగా ప్రయాణికులు రాకపోకలు చేయకూడదని సూచించారు. కమ్మవలస సర్పంచ్ పిల్లా వసుంధర, ఫారెస్ట్ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పేలిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వీరఘట్టం: మండలంలోని చలివేంద్రి గ్రామంలో శనివారం పడిన పిడుగులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఉన్న ఇనుప రేకులు బద్దలు కావడంతో, లోపలున్న ఆయిల్ లీకై ంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే ట్రాన్స్కో ఏఈ అనిల్కుమార్ స్పందించి ఆదివారం సాయంత్రానికి కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. అలాగే వీరఘట్టంలో పిడుగులు పడడంతో సిటీకేబుల్ వ్యవస్థ దెబ్బతిని, ప్రసారాలు నిలిచిపోయాయి. గృహోపకరణాలు దగ్ధం.. సీతానగరం: మండలంలోని వివిధ గ్రామాల్లో శని, ఆదివారాల్లో కురిసిన ఉరుములు, పిడుగుల వర్షానికి గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. మండల కేంద్రంలో 8 ఇన్వర్టుర్లు, 10 ఫ్యాన్లు, 4 టీవీలు కాలిపోయాయి. పలుచోట్ల వీధి దీపాలు కూడా కాలిపోయాయి. విజయనగరం ఐటీఐలో జాబ్మేళా రేపువిజయనగరం అర్బన్: ఐటీఐ అభ్యర్థుల కోసం ఈ నెల 17న స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జాబ్మేళా నిర్వహిస్తామని ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ టీవీ గిరి తెలిపారు. హైదరాబాద్కు చెందిన రానె మద్రాస్ లిమిటెడ్ అనే సంస్థలో వివిధ కేడర్ పోస్టులకు ఆ రోజు ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. 2024వ విద్యాసంవత్సరంలో ఐటీఐ పాసై, ఈ ఏడాది ఆగస్టులో పరీక్షలకు హాజరు కాబోయే చివరి సంవత్సరం వె ల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్ ట్రేడ్ అభ్యర్థులు ఈ మేళాకు హాజరయ్యే అర్హత ఉందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్ధులు బయోడేటాతో పాటు ఒరిజనల్ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డు, 2 పాస్పోర్టు ఫొటోలతో హాజరు కావాలని తెలియజేశారు. పూర్తి వివరాల కోసం ఫోన్ 8106025022, 9849944654 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. సంస్కృత కళాశాలలో ప్రవేశాలు ప్రారంభం విజయనగరం అర్బన్: పట్టణంలోని మహారాజా సంస్కృత కళాశాలలో 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. దక్షిణ భారతదేశంలో పూర్తిగా ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న ఏకై క సంస్కృత కళాశాల ఇదే. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యార్థులకు ఉత్తమ విద్య అందిస్తోంది. నామమాత్రపు ఫీజుతో కోర్సులు అందిస్తారు. దూర ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వ వసతిగృహంలో సదుపాయాలు.. బ్రాహ్మణ విద్యార్థులకు సింహాచల దేవస్థానం ద్వారా ఉచితి భోజన సదుపాయం కల్పిస్తారు. కోర్సులివే.. పదో తరగతి ఉత్తీర్ణులకు (ఐదు సంవత్సరాల ఇంటర్ కోర్సులు) పీడీసీ – తెలుగు, పీడీసీ – సంస్కృతం.. ఇంటర్మీడియట్ విద్యార్థులకు (ఓఎల్ కోర్సులు) బీఏ – తెలుగు, బీఏ – సంస్కృతం, బీఏ హిస్టరీ, బీఎస్సీ కంప్యూటర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు అన్ని రకాల పోటీ పరీక్షలకు అర్హులవుతారని, ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ జి.జనార్ధననాయుడు సూచించారు. -
బడుగులపై కూలిన గోడ..!
● ఇద్దరి దుర్మరణం ● మృతుల్లో ఒకరు మూగవారు ● మిద్దె ఇల్లు మట్టి తవ్వుతుండగా ప్రమాదం గంట్యాడ: పేదల కుటుంబాల్లో పెను విషాదం సంభచించింది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబసభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు. పేద కుటుంబాలకు పెద్ద కష్టం రావడంతో గ్రామమంతా అయ్యో పాపం అంటోంది. 25 ఏళ్లకు పైబడి కూలి పనులకు వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అ కూలి పనికి వెళ్లే మృత్యువాత పడ్డారు. వయసు మీద పడినా కుటుంబ పోషణ కోసం కూలిపనులకు వెళ్లడం వారికి తప్పలేదు. రోజూ మాదిరిగా ఆదివారం కూలి పనికి వెళ్లారు. అదే వారికి చివరి పని అవుతుందని భావించలేదు. పనిచేస్తుండగా గోడ మీదపడడంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ హృదయ విదారక సంఘటన గంట్యాడ మండలంలోని రామవరం గ్రామంలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామవరం గ్రామానికి చెందిన రీసు సత్యవతికి మిద్దె ఇల్లు ఉంది. ఆ ఇంటిని తొలగించి అందులో పశువులశాల కట్టేందుకు మిద్దె ఇంటిని కూల్చే పనులు చేపట్టారు. దీంతో ఆ పని చేసేందుకు అదే గ్రామానికి చెందిన ఎర్ర చిన్నయ్య(61), మూగవ్యక్తి కొలుసు పైడితల్లి (49) వెళ్తున్నారు. శనివారం చాలావరకు మట్టిని తవ్వి తరలించారు. ఆదివారం ఉదయం 8:30 గంటల సమయంలో మిద్దె ఇంటి గోడను గునపంతో తవ్వుతుండగా ఒక్కసారిగా గోడ కూలి ఇద్దరు కూలీలపై పడిపోయింది. గోడ కింద వారిద్దరూ ఉండిపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మరణించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.సాయికృష్ణ తెలిపారు. మృతుడు చిన్నయ్యకు భార్య సత్యవతి, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. పైడితల్లికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దూరమైన పెద్దదిక్కు మృతుడు చిన్నయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పిల్లలు ముగ్గురికి వివాహాలయ్యాయి. చిన్నయ్య భార్యతో పాటు చిన్న కొడుకు దగ్గర ఉంటున్నాడు. కల్లు గీత సమయంలో కల్లుగీస్తుంటాడు. కల్లుగీత అయిపోయిన తర్వాత కూలి పనులకు వెళ్తారు. కూలిపనులు చేస్తూ వచ్చే ఆదాయం ద్వారా కుమార్తెకు, కుమారులకు పెళ్లిళ్లు చేశాడు. అందరినీ అల్లారు ముద్దుగా పెంచి అందరి యోగ క్షేమాలు చూసిన ఇంటి పెద్ద దిక్కు, తండ్రి అకస్మాత్తుగా మరణించడంతో పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మూగవాడైనా కాయకష్టంతో పోషించాడు కొలుసు పైడి తల్లి మూగవాడు అయినప్పటికీ తన కాయ కష్టంతోనే కుటుంబాన్ని పోషించాడు. తన ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశాడు. ప్రస్తుతం భార్యతో కలిసి ఉంటున్నాడు. పైడితల్లి మృతి చెందడంతో ఇప్పడు ఏవిధంగా బతకాలంటూ భార్య రోదిస్తోంది. తండ్రి ఆకస్మిక మృతితో కుమార్తెలు గుండెలవిసేలా బావురుమంటున్నారు. -
బహిరంగ ప్రదేశాల్లో మందు తాగితే చర్యలు
విజయనగరం క్రైమ్: బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు తప్పవని ఎస్పీ వకుల్జిందల్ హెచ్చరించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజాశాంతికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా దాడులు చేపడుతూ మద్యంబాబులను అరెస్ట్ చేశామన్నారు. నగర శివార్లతో పాటు జిల్లా వ్యాప్తంగా డ్రోన్స్ ద్వారా తనిఖీలు చేపడుతున్నామని చెప్పారు. మందుబాబులతో పాటు వాహన తనిఖీలు, రహదారి భద్రతా నియమాలను ఉల్లఘించిన వారిని గుర్తించి ఈ చలాన్ విధిస్తున్నట్లు తెలిపారు. గడిచిన ఐదు నెలల్లో 2,178 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న 9,095 మందిపై కేసు నమోదు చేశామన్నారు. పోలీసులకు పట్టుబడిన వారికి ముందుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని.. రెండోసారి పట్టుబడితే కేసులు తప్పవని.. మూడోసారి కూడా పట్టుబడితే అరెస్టు ఖాయమని హెచ్చరించారు. ఎస్పీ వకుల్ జిందల్ -
క్రైమ్ కార్నర్..
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి పూసపాటిరేగ: మండల పరిధి గొల్లపేట సమీపంలో సర్వీస్ రోడ్డుపై నిలిపి ఉన్న లారీని ఆటో ఢీ కొనడంతో ఒకరు అక్కడకక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. కిలుగుపేటకు చెందిన జీరు కనకారెడ్డి (41) ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం సీహెచ్ అగ్రహారం ఫ్లై ఓవర్ వద్ద కూరగాయల లోడు దించేసి తిరుగు ప్రయాణంలో పూసపాటిరేగ వెళ్తుండగా గొల్లపేట సమీపంలో నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో కనకారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య తోటమ్మ, కుమారులు రాము, రమణ ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. ఎస్సై ఐ. దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి ఆత్మహత్య డెంకాడ: మండలంలోని అక్కవరం పంచాయతీ పరిధిలో గల ఓ లే అవుట్లోని విద్యుత్ స్తంభానికి ఉరిపోసుకుని బోర సూరిబాబు (35) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై ఎ.సన్యాసినాయుడు అందించిన వివరాలిలా ఉన్నాయి. భోగాపురం మండలంలోని సవరవల్లి పంచాయతీ పరిధి రామదాసుపేట గ్రామానికి చెందిన బోర సూరిబాబు వ్యాన్ డ్రైవర్గా పని చేసేవాడు. కొంతకాలం నుంచి ఎయిర్పోర్టుకు కూలీలను తీసుకువెళ్తున్న బస్సు డ్రైవర్గా పని చేస్తున్నాడు. 15 రోజులుగా ఈ పనికి కూడా వెళ్లకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. ఈనెల 14వ తేదీ రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో మద్యం సేవించి ఇంటికి వచ్చిన భర్త సూరిబాబును భార్య బోర గౌరి ప్రశ్నించింది. భోజనం చేయమని భార్య గౌరి చెప్పినా వినకుండా వెళ్లిపోయాడు. మరుసటి రోజు అక్కివరం పంచాయతీ పరిదిలోని ఒక లే అవుట్లోని విద్యుత్ స్తంభానికి ఉరిపోసుకుని ఉన్న సూరిబాబును స్థానికులు గుర్తించారు. భార్య గౌరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి..పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని బెలగాం రైల్వే స్టేషన్ శివారులో ఈ నెల 8న గాయాలతో పడిఉన్న గుర్తు తెలియని వ్యక్తిని స్టేషన్ మాస్టర్ శ్రీనివాసరావు గుర్తించి జీఆర్పీ పోలీసుల సహాయంతో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు రైల్వే హెచ్సీ రత్నకుమార్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతుడి వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని జీఆర్పీ సిబ్బంది తెలిపారు. -
అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు
విజయనగరం: రాష్ట్ర స్థాయి సీనియర్స్ సీ్త్ర, పురుషుల అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈ నెల 14వ తేదీ నుంచి 15 వరకు గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన పోటీల్లో విజయనగరం జిల్లా నుంచి 8 మంది క్రీడాకారులు ప్రాతినిథ్యం వహించి, ఐదు పతకాలు కై వసం చేసుకున్నారు. లాంగ్జంప్లో ఎ.లక్ష్మి బంగారు పతకం చేజిక్కించుకోగా... పి.వసంత 100 మీటర్ల పరుగు పోటీలో బంగారు పతకం, 200 మీటర్ల పరుగుపోటీలో వెండి పతకం దక్కించుకున్నారు. అదేవిధంగా ట్రిపుల్ జంప్లో ఎం.బాలరాజ్ బంగారు పతకం చేజిక్కించుకోగా... 3000 మీటర్ల పరుగు పోటీలో ఎస్. అశోక్ బంగారు పతకంతో రాణించాడు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం ప్రత్యేకంగా అభినందించారు. -
నేడు ప్రజాసమస్యల పరిష్కార వేదిక
సీతంపేట: ప్రజాసమస్యల పరిష్కార వేదిక సోమవారం జరగనుందని ఐటీడీఏ అధికార వర్గాలు తెలిపాయి. గిరిజనులు తమ సమస్యలపై వినతులు సమర్పించవచ్చని పిలుపునిచ్చారు. సాలూరులో.. పార్వతీపురంటౌన్: సాలూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టరు ఎ.శ్యామ్ప్రసాద్ ఓ ప్రకటనలో ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజాసమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లా స్థాయి అధికారులంతా ఈ కార్యక్రమానికి రావాలని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రూ.10కి పడిపోయిన పైనాపిల్సీతంపేట: స్థానిక మార్కెట్లో ఆదివారం పైనాపిల్ను ఒక్కొక్కటి రూ.10కి విక్రయిస్తున్నారు. గడిచిన వారం రూ.15 పలికిన ధర ఒక్కసారిగా రూ.10కి పడిపోవడంతో గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికంగా పైనాపిల్ దిగుబడి పెరగడం, మార్కెట్కు ఎక్కువగా తీసుకురావడంతో ధర పడిపోయినట్లు గిరిజనులు చెబుతున్నారు. ఉత్తమ ప్రతిభతో గుర్తింపు తీసుకురావాలి● డీఆర్ఓ హేమలత పార్వతీపురంటౌన్: యోగాంధ్ర రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా విజేతలకు ఏర్పాటు చేసిన బస్సు ఆదివారం కలెక్టరేట్ నుంచి బయల్దేరింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత పర్యవేక్షించారు. కార్యక్రమానికి నియమించిన అధికారులు, సిబ్బందికి ఈ సందర్భంగా ఆమె తగు సూచనలు చేశారు. జిల్లా విజేతలు, కేర్టేకర్స్, సిబ్బందికి మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు జిల్లా కేంద్రంలో నిర్వహించిన యోగాంధ్ర పోటీల్లో విజేతలను 16,17 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఎన్టీఆర్ జిల్లాకు పంపిస్తున్నట్లు చెప్పారు. యోగాంధ్ర జిల్లా కన్వీనర్ డా. జగన్మోహన్రావు మాట్లాడుతూ జిల్లా నుంచి 32 మంది విజేతలు రాష్ట్ర స్థాయిలో పాల్గొంటున్నారని, వారంతా సోలో, గ్రూప్ యోగాసనాలు, సాంగ్, క్విజ్, పెయింటింగ్ స్కిట్, ఎస్సే, పోస్టర్, షార్ట్ఫిల్మ్ ఇలా 11 కేటగిరీల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందినవారన్నారు. కార్యక్రమంలో పీఓ, ఆర్బీఎస్కే డా. టి.జగన్మోహన్రావు, ఏఓ సీహెచ్. రాధాకృష్ణ, డీటీ పి.లక్ష్మీకుమార్, తదితరులు పాల్గొన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలి● ఏపీ ఎస్టీ కమిషన్చైర్మన్ డీవీజీ శంకరరావు సాలూరు రూరల్: ప్రభుత్వం మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకరరావు అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన సాలూరు మండలంలోని జీగిరాం గ్రామానికి చెందిన అలేఖ్య ఎంటర్ప్రైజస్ పసుపు ప్రాసెసింగ్ యూనిట్ అధినేత అల్లాడ సునీతకు ఉత్తమ మహిళ పారిశ్రామిక వేత్తగా ఫాప్సి అవార్డు వచ్చిన సందర్భంగా ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పసుపు ప్రాసెసింగ్ యూనిట్ స్థాపించి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని విజయవంతంగా నడిపిస్తున్న సునీతకు అవార్డు రావడం అభినందనీయమన్నారు. -
బియ్యం దొంగలను వదిలేస్తారా..!
● సంఘటన జరిగి పది రోజులవుతున్నా ఎక్కడ నుంచి తరలించారో తేల్చని వైనం ● బొండపల్లి మండలంలో పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం ● కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు విజయనగరం ఫోర్ట్: పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే సహించేది లేదు.. అక్రమార్కులు ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరిస్తామని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ దగ్గర నుంచి మంత్రుల వరకు ప్రగల్భాలు పలికారు. కాని వారి మాటలు ఉత్తుత్తివేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలో పీడీఎస్ బియ్యం పెద్ద ఎత్తున పట్టుబడినప్పటికీ అసలు దొంగలను ఇప్పటకీ పట్టుకోకపోవడంపై అధికారుల తీరుపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేదలకు అందించే పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిపోతున్నా కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తుందనే విమర్శలున్నాయి. పీడీఎస్ బియ్యం తరలించే వ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. జిల్లాలో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించే పెద్ద ముఠా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ముఠాకు కొంతమంది అధికారులు, డీలర్లు సహకరిస్తున్నట్లు ఆరోపణులు వినిపిస్తున్నాయి. ఇందుకోసం వారికి పెద్ద ఎత్తున ముడుపులు ముడుతున్నట్లు సమాచారం. బొండపల్లి మండలంలో పట్టుబడిన పీడీఎస్ బియ్యం.. పేద ప్రజలకు అందించే పీడీఎస్ బియ్యాన్ని కొంతమంది వ్యాపారులు పెద్ద ఎత్తున పక్కదారి పట్టించారు. బియ్యం తరలింపుపై విజిలెన్స్ అధికారులకు సమాచారం రావడంతో కొద్ది రోజుల కిందట బొండపల్లి మండలం కొండకిండాంలోని కోళ్ల ఫారంలో 106 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం.. కిండాం అగ్రహారం మామిడితోటలో 43 క్వింటాళ్ల ిపీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. రేషన్ దుకాణాల్లో ఉండాల్సిన పీడీఎస్ బియ్యం కోళ్ల ఫారంకు, మామిడి తోటల్లోకి తరలించడం సంచలనంగా మారింది. అయినప్పటకీ అధికారులు ఇంతవరకు అసలు దొంగలను పట్టుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఏ డిపో బియ్యమో తేలలేదు.. జూన్ 5వ తేదీన పీడీఎస్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. సంఘటన జరిగి పది రోజులవుతున్నా ఏ రేషన్ దుకాణం నుంచి నేరుగా తరలించారో.. ఎవరు సహకరించారో.. ఇంతవరకు తేలలేదు. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసును నీరుగార్చడానికి అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు అందాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణ చేస్తున్నాం.. పీడీఎస్ బియ్యాన్ని తరలించిన వ్యాపారులపై కేసులు నమోదు చేశాం. వారు ఎక్కడ నుంచి బియ్యం తరలించారో విచారిస్తున్నాం. అసలు దొంగలను పట్టుకుని తగిన చర్యలు తీసుకుంటాం. కె. మధుసూదనరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి -
సచివాలయ ఉద్యోగులకుస్థానచలనం..!
పార్వతీపురంటౌన్: గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా ఆ ఉద్యోగ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. ప్రధానంగా ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన ప్రతి ఒక్కరూ బదిలీ కావాల్సిందేనన్న నిబంధనతో పాటు పలురకాల వైకల్యం, స్పౌజ్, రిక్వెస్ట్ కింద బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో పార్వతీపురం మన్యం జిల్లాలో గల 2,350 మంది సచివాలయ ఉద్యోగుల్లో బదిలీ టెన్షన్ నెలకొంది. ఉద్యోగుల్లో కొందరు తమకు నచ్చిన స్థానాలకు తమదైన శైలిలో ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఏదిఏమైనా పలు శాఖల తరువాత సచివాలయ ఉద్యోగులకు సైతం బదిలీ ఉత్తర్వులు రావడంతో ఆ వర్గాల్లో ఉత్కంఠ రేగుతోంది. కలెక్టర్ల అనుమతితో కౌన్సెలింగ్ ఉమ్మడి విజయనగరం జిల్లాలో పని చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులందరినీ కలిపి బదిలీ చేయలని ప్రభుత్వం షరతు విధించింది. ఉమ్మడి జిల్లా కలెక్టర్ల అనుమతితో త్వరలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించ న్నారు. వీటితో పాటూ ఆయా శాఖల సమన్వయంతో కౌన్సెలింగ్ జరగనుంది. జిల్లా వ్యాప్తంగా 60 శాతం మంది ఉద్యోగులకు బదిలీ అయ్యే అవకాశం ఉందని ఆ శాఖ వర్గాల నుంచి తెలుస్తోంది. గతంలో పారదర్శకంగా బదిలీలు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2023లో జరిగిన బదిలీ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించారు. ఎటువంటి వైరవీలకు తావు లేకుండా బదిలీ ప్రక్రియ సాగింది. ఉద్యోగులందరికీ న్యాయం చేసేవిధంగా బదిలీలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన తరువాత బదిలీలకు చర్యలు చేపట్టడంతో తమకు ఎక్కడికి బదిలీ అవకాశం రానుందోనని ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. ఈ బదిలీల్లో ప్రధానంగా ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులంతా సొంత మండల పరిధిలో ఉండేందుకు అవకాశం లేకుండా నిబంధనలు పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే సోంత మండలానికి బదిలీకి నో చాన్స్ అని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. గతంలో పని చేసిన వారందరికీ ఈ నిబంధన వర్తించనుండడంతో ఆందోళనలో ఉన్నారు. ఈ నెలాఖరుకు పూర్తి చేసే అవకాశం బదిలీ ఉత్తర్వుల ప్రకారం ఈ నెలాఖరుకు ప్రక్రియపూర్తి చేసే అవకాశం ఉంది. ఒకే చోట ఐదేళ్లు దాటిన ఉద్యోగులతో పాటు వైకల్యం ఉన్నవారు, స్పౌజ్ కేటగిరీ కింద ఉన్న ఉద్యోగులు, రిక్వెస్ట్ ఉద్యోగులందరూ తమ సమగ్ర వివరాలను ప్రభుత్వం త్వరలో అందించే హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంది. బదిలీల కౌన్సెలింగ్ మాత్రం ఉమ్మడి జిల్లాకు కలిపే ఉండనుంది. అన్నీ సక్రమంగా జరిగితే ఈ నెలాఖరుకు ప్రక్రియ పూర్తికానుంది. సిఫార్సుల కోసం పరుగులు తమ నివాస ప్రాంతాలకు దగ్గరలో విధులు నిర్వహించే విధంగా సిఫార్సుల కోసం ఎమ్మెల్యేల చుట్టూ ఉద్యోగులు పరుగులు తీస్తున్నారు. తమకు కావాల్సిన ప్రాంతాల్లో పోస్టింగ్ల కోసం ఆయా ప్రాంతాల ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రుల వద్ద సిఫార్సుల కోసం చక్కర్లు కొడుతున్నారు. తాజా బదిలీల్లో తమకు అన్యాయం జరగకుండా జాగ్రత్తలు పడుతున్నట్లు ఆ శాఖ వర్గాల నుంచి తెలుస్తోంది. బదిలీలకు ఉత్తర్వులు విడుదల సచివాలయ ఉద్యోగుల బదీలలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్లు ఒకే సచివాలయంలో పనిచేసిన వారికి బదిలీ తప్పనిసరి అని స్పష్టంగా పేర్కొంది. ఉత్తర్వుల్లో పేర్కొన్న నియమాలకు అనుగుణంగా బదిలీల ప్రక్రియ చేపట్టనున్నాం. రామచంద్రరావు, జీఎస్డబ్ల్యూఎస్ జిల్లా అధికారి, పార్వతీపురం మన్యం స్పౌజ్, వైకల్యం, రిక్వెస్ట్లపై కార్యాచరణ ఒకే చోట ఐదేళ్లు దాటిన వారికి బదిలీ తప్పనిసరి సిఫార్సుల కోసం ఎమ్మెల్యేల చుట్టూ ఉద్యోగుల పరుగులు -
కూటమి వెన్నుపోటు
ఏడాదిలో అరాచకాలు, అక్రమ కేసులు 2024 జూన్ 12న కూటమి ప్రభుత్వం అధికారికంగా పగ్గాలు చేపట్టింది. రాష్ట్రంలో ఏడాది కాలం అవినీతి, అరాచకాలు, అఘాయిత్యాలు, అక్రమ కేసులతో ప్రభుత్వం వేధింపులకు పాల్పడడం మినహా పాలన సాగించలేదన్నారు. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నా నియంత్రించలేకపోయారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ఏక్టివిస్ట్లపై అక్రమ కేసులు బనాయించారు. తమ సొంత ప్రయోజనాల కోసం వ్యవస్థలను నిర్వీ ర్యం చేశారని, విద్య, వైద్య రంగాలను పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపించారు. విజయనగరం: ఎన్నికల సమయంలో అధికారమే లక్ష్యంగా హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో 5 కోట్ల మంది ఆంధ్రులను వెన్నుపోటు పొడిచిందని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సూపర్సిక్స్ సహా 143 హామీలు ప్రకటించి నేడు వాటిని అమలు చేయకుండా ప్రజలను నయవంచనకు గురి చేస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి పేదప్రజలంటే లెక్కలేనితనమని, పేదల ను చిన్నచూపు చూడడం దుర్మార్గమని పేర్కొన్నా రు. మూడు రాజకీయ పార్టీలు కలిసికట్టుగా కూట మి పేరిట పోటీ చేసి గెలిచిన సందర్భంలో ఏడాది ప్రభుత్వ పాలనపై వైఎస్సార్సీపీ ముద్రించిన జగన్ అంటే నమ్మకం..చంద్రబాబు అంటే మోసం పూస్తకాన్ని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ ఇతర పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ మేరకు విజయనగరంలోని ధర్మపురిలో గల సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లడుతూ చెప్పారంటే చేస్తారంతే అన్న నమ్మకం వైఎస్జగన్మోహన్రెడ్డిపై ప్రజల్లో ఉందని, అదే చంద్రబాబు నమ్మించి మోసం చేస్తారన్న నమ్మకం మరోసారి రుజువవుతోందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లుతెరిచి మిగిలిన నాలుగేళ్లలోనైనా ప్రజలకు ఇచ్చిన హమీల అమలుతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే దిశగా అడుగులు వేయాలని హితవు పలికారు. పాలనలో వ్యత్యాసాన్ని గమనించండి 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం మొదటి ఏడాది సాగించిన పరిపాలన, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో వ్యత్యాసాలను పుస్తకంలో పొందుపరిచాం. ఏడాది పాలనలో హామీల అమలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో రెండు ప్రభుత్వాల మధ్య తేడాను వివరించాం. ఈ విషయాలను క్షేత్ర స్థాయిలో ప్రజలందరికీ వివరిస్తాం. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సోమవారం ప్రతి నియోజకవర్గంలో ఆయా సమన్వయకర్తలు ఈ పుస్తకాలను ఆవిష్కరించనుండగా.. అనంతరం మండల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి జిల్లాలో నిర్మిస్తున్న భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం నిర్ణీత సమయానికి జరగకుంటే అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని అనుమతులతో టెండర్లు ఖరారు చేసి నిర్మాణం ప్రారంభించాం. జీఎంఆర్ సంస్థ పనులు శరవేగంగా చేపడుతోంది. కేవలం పనుల పరిశీలన పేరిట హడావుడి చేయడం కాదు. ముందస్తుగా ప్రకటించిన విధంగా 2026వ సంవత్సరంలో ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం జరగకుంటే ప్రభుత్వానిదే బాధ్య త. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, సంగంరెడ్డి బంగారునాయుడు, ఇప్పిలి అనంత్, అల్లాడ సత్యనారాయణ మూర్తి, శంబంగి వేణు, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అల్లు అవినాష్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కేవీ సూర్యనారాయణరాజు, కొప్పల వెలమ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ నెక్కల నాయుడుబాబు తదితరులు పాల్గొన్నారు. ఏడాదిలో నయవంచన, నమ్మకద్రోహం పేదప్రజలంటే ప్రభుత్వానికి చులకన జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు -
విత్తనాల వ్యాన్ బోల్తా..
రేగిడి: పాలకొండ మండలం తుమరాడ గ్రామానికి చెందిన కొంతమంది రైతులు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వ్యాన్పై సంపత్ అనే వరి రకం విత్తనాలను తీసుకువస్తున్నారు. అయితే వ్యాన్ ఉంగరాడమెట్ట వద్దకు వచ్చేసరికి ఆదివారం వేకువజామున బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఇదిలా ఉంటే రైతుసేవా కేంద్రాల్లో విత్తనాలు అందక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. విత్తనాలు దొరక్కపోవడం వల్లే ఇతర జిల్లాల నుంచి విత్తనాలు తెచ్చుకోవాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 9 మద్యం సీసాలు స్వాధీనం పూసపాటిరేగ: మండలంలోని చోడమ్మ అగ్రహారంలో అనధికారికంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు భోగాపురం ఎకై ్సజ్ సీఐ వి.రవికుమార్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిందితుడి నుంచి మొత్తం 9 మద్యంసీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. ఎక్కడైనా ఎవరైనా అనుమతులు లేకుండా మద్యం తరలించినా, విక్రయించినా, మద్యం బెల్టుషాపులు నడుపుతున్నా సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. -
రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం..
● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ● జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం.. పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి సాలూరు: రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి 99 శాతం హామీలను అమలు చేస్తే.. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీల అమలులో విఫలమవుతున్నారని ఆరోపించారు. ‘జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తకాన్ని పట్టణంలోని తన స్వగృహంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ.. 2019 – 20 మధ్య జగన్మోహన్ రెడ్డి నాడు ముఖ్యమంత్రిగా చేసిన పాలనా వివరాలు.. నేడు 2024 – 25 ఏడాది కాలంలో నేటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన పాలనా వివరాలను పుస్తకంలో వివరించడం జరిగిందన్నారు.రెడ్బుక్ రాజ్యాంగం పేరిట రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బాలికలు, మహిళలపై వేధింపులు, అత్యాచారాలు అధికమవుతున్నాయన్నారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఒక్కొక్కరిపై 20కి పైగా కేసులు నమోదు చేశారంటే పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తుందనే అక్కసుతో సాక్షి మీడియాపై ఇటీవల దాడులు చేయించిన ఘనత చంద్రబాబు,లోకేష్కే దక్కుతుందని ఆరోపించారు. అమ్మకు మోసం కాదా..? గత ప్రభుత్వంలో ప్రతి తల్లికీ అమ్మఒడి ఇస్తామని హామీ ఇచ్చి శతశాతం నెరవేర్చిన ఘనత జగన్ మోహన్రెడ్డికి దక్కుతుందని రాజన్నదొర అన్నారు. ఆనాడు పథకం అమలులో నిబంధనలు ఎక్కువగా పెట్టారని గగ్గోలు పెట్టిన టీడీపీ నాయకులు నేడు నిబంధనలు పెట్టలేదా అని ప్రశ్నించారు. తల్లికి వందనంలో రెండు వేల రుపాయలు లోకేష్ ఖాతాలోకి వెళ్లాయని పలువురు వైఎస్సార్సీపీ నేతలు విమర్శించడాన్ని టీడీపీ నాయకులు తప్పు బడుతున్నారని, మరి ఆ టీడీపీ నాయకులే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రెండు వేల రూపాయలు జగన్ ప్యాలెస్కు వెళ్లిపోయాయని విమర్శించలేదా అని ప్రశ్నించారు. 150 పథకాలు అమలు చేయాల్సిందే.. సూపర్ 6తో పాటు 2014 – 19 మధ్య తమ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు జగన్ మోహన్రెడ్డి హయాంలో అమలైన పథకాలను కూడా తాము అమలు చేస్తామని టీడీపీ నాయకులు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని మాజీ మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. ఈ లెక్కన సుమారు 150 సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. -
దళితుల భూముల దురాక్రమణపై విచారణ
లక్కవరపుకోట: మండలంలోని మల్లివీడు దళితులకు సంబంధించిన భూములను టీడీపీ నాయకులు ఆక్రమించుకోవడంతో మండల రెవెన్యూ అధికారి కె. సన్యాసిరావు ఆధ్వర్యంలో సిబ్బంది విచారణ నిర్వహించారు. భూముల ఆక్రమణ వ్యవహారంపై సాక్షి పత్రికలో ‘దళితల భూముల దురాక్రమణ’ శీర్షికన ఆదివారం కథనం ప్రచురితమైంది. దీంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ కొత్తపల్లి సన్యాసిరావు, వీఆర్ఓ పూర్ణిమ, తదితరులు స్పందించి ఆ భూముల వద్దకెళ్లి విచారణ జరిపారు. ఈ భూములు ప్రభుత్వ గెడ్డ వాగుభూమికి సంబంధించినవని అధికారులు తెలిపారు. తహసీల్దార్ కోరాడ శ్రీనివాసరావు విశాఖపట్నంలో జరగనున్న యోగా డే కార్యక్రమానికి వెళ్లారని, ఆయన వచ్చి విచారణ చేపట్టేవరకు ఆ భూముల్లో ఎటువంటి పనులు చేపట్టరాదని ఆర్ఐ సన్యాసిరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం సాగులో ఉన్న దళితల నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. కార్యక్రమంలో గ్రామపెద్ద పెదిరెడ్ల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
శ్రీకాకుళం రూరల్: రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో ఆదివారం గ్రాడ్యుయేషన్ (జెనిత్స్–2020)డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెమ్స్ చీఫ్ మెంటార్ బొల్లినేని భాస్కరరావు బీఎస్సీ పారామెడికల్ విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలన్నారు. పదేళ్లలో బొల్లినేని మెడిస్కిల్స్ ద్వారా పది వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో వారంతా ఉద్యోగంలో రాణిస్తున్నట్లు తెలిపారు. బీవీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజింగ్ డైరెక్టర్ బొల్లినేని శీనయ్య మాట్లాడుతూ విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జెమ్స్ అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ కె.సుధీర్ మాట్లాడుతూ వైద్య రంగంలో పారామెడికల్ టెక్నీషియన్స్ కీలక పాత్ర పోషిస్తారన్నారు. జెమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ ఆర్.అశోక్రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు గర్వపడేలా పిల్లలు నడుచుకోవాలన్నారు. జెమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీలలిత మాట్లాడుతూ అంకితభావంతో పనిచేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి కేంద్రం ద్వారా ఇప్పటివరకూ పదివేల మందికి ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ లక్ష్మీపద్మజ, జెమ్స్ సీఈఓలు ఆద్విక్, రామ్మోహన్ పాల్గోన్నారు. -
పాడుబడినా..!
● గిరిజనుల కష్టాలు పట్టని మంత్రి ● ధ్వజమెత్తిన ఏఐఎస్ఎఫ్ నాయకులుబొబ్బిలిరూరల్: మండలంలోని గోపాలరాయుడుపేట పంచా యతీ పరిధి బట్టివలస ప్రాథమిక పాఠశాల గిరిజన విద్యార్థులు పడుతున్న కష్టాలు ఆశాఖ మంత్రి సంధ్యారాణికి పట్టడం లేదని ఏఐఎస్ఎఫ్ రారష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ బి.రవికుమార్ విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆయన సంఘం సభ్యులతో కలిసి పాఠశాల పరిస్థితిని పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన శాఖ మంత్రి జిల్లాలో ఉన్నా ఇక్కడి గిరిజనుల సమస్యలను పట్టించుకుకోవడం లేదన్నారు. గత విద్యాసంవత్సరంలో ఇక్కడి ప్రాథమిక పాఠశాల దుస్థితిపై పలుమార్లు విన్నవించినా స్పందన కరువైందని, కనీసం ఐటీడీఏ అధికారులు సైతం ఇక్కడి పాఠశాలను సందర్శించి సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఎమ్మెల్యే బేబీనాయన యూటీఎఫ్ ప్రతినిధులకు తాత్కాలిక షెడ్లను నిర్మిస్తామని చెప్పిన మాట మరిచారని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా పాలకులు, ప్రభుత్వయంత్రాంగం ఇక్కడి పాఠశాల దుస్థితిపై స్పందించి గిరిపుత్రుల విద్యాభివృద్ధికి కృషిచేయాలని కోరారు.