breaking news
Parvathipuram Manyam
-
అడవితల్లి ఒడిలో ప్రశాంత జీవనం
● చూడముచ్చటగా కట్టూబొట్టు, ఆచారాలు ● కొండపోడే ఆధారంగా జీవనం ● మౌలికవసతులు అంతంతమాత్రమే ● ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రేపు సీతంపేట: నవ్యసమాజానికి దూరంగా కొండకోనల్లో జీవనం సాగించే వారే గిరిపుత్రులు. కొండకోనల్లో ప్రత్యేక భాష, సంస్కృతి, సంప్రదాయాల నడుమ ఆదివాసీల జీవనం వైవిధ్యంగా సాగుతోంది. కాయకష్టం చేసి జీవించడం వారి జీవన విధానం. భిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలు గిరిజనుల సొంతం. కొండల్లో తమ సంప్రదాయ వ్యవసాయాన్ని చేసుకుంటూ జీవిస్తున్న గిరిజనుల ఆచార వ్యవహారాలు, కట్టుబొట్టుల్లో మార్పులేదు. అటవీఉత్పత్తుల సేకరణ, పోడుపంటలు, వ్యవసాయ పంటల దిగుబడులు వచ్చినప్పుడు గిరిజనులు ప్రత్యేక పండగలు జరుపుకోవడం ఆనవాయితీ. విభిన్నం–వైవిధ్యం.. సంప్రదాయ ఆచార వ్యవహారాల్లో ఎంతో వైవిధ్యం కనబరిచే గిరిజనులు అటవీ సంస్కృతికి ప్రతీకలు. ఘన చరిత్రకు వారసులు. వారి ఆధ్యాత్మిక చింతన వినూత్నం.వారి కట్టూ బొట్టూ చూడముచ్చటగా ఉంటాయి. తెల్లారితే కొండపోడు వ్యవసాయం, అటవీఉత్పత్తుల సేకరణతోనే వారి జీవనం సాగుతుంది. ప్రతి మూడు నెలలకు ఒక్కో అటవీ ఉత్పత్తుల సీజన్ ఆరంభమవుతుంది. పైనాపిల్, సీతాఫలం, పసుపు, జీడి, కందులు, నిమ్మ, బత్తాయి, పెండలం ఇలా అటవీ ఉత్పత్తులతోనే వారి జీవనం ముడిపడి ఉంది. వారం వారం జరిగే వారపు సంతలకు వెళ్లి వారి ఉత్పత్తులు విక్రయించి వారానికి సరిపడా నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకుంటారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 819 కిలోమీటర్ల మేర ఏజెన్సీ విస్తరించి ఉంది. 42 వేల 246 గిరిజన కుటుంబాల్లో 2లక్షల 62వేల మంది కుటుంబ సభ్యులున్నారు. మొత్తం 1187 గిరిజన గూడలుండగా వాటిలో ఆదిమ గిరిజనులు నివసించే గూడలు 467 ఉన్నాయి. గిరిజనుల్లో ప్రధానంగా కొండ సవర, జాతాపు, కాపు సవర తెగలున్నాయి. వివాహాలు, పండగలు, వ్యవసాయం తదితర సందర్భాల్లో ప్రత్యేక పండగలు నిర్వహించుకోవడం ఎంతో వైవిధ్యం. భార్యకు కట్నం ఇచ్చి వివాహం చేసుకునే ‘మొగనాలి’ ఇప్పటికీ కొన్ని చోట్ల అమల్లో ఉంది. అభివృద్ధికి ఆమడదూరంలో.. మన్యంలో గిరిజనుల అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. గిరిజనులకు మౌలికవసతులు లేక అల్లాడుతున్నారు. విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు చాలా గ్రామాలకు లేవు. రక్షిత మంచీనీటి వ్యవస్థ అందుబాటులో లేదు. అనాదిగా గిరిజనులు ప్రకృతి ఆధారంగానే జీవన మనుగడ సాగిస్తున్నారు. సుమారు 120కి పైగా గ్రామాలకు రహదారి సౌకర్యం ఇప్పటికీ లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతంతమాత్రంగా వైద్యసేవలుఎపిడమిక్ సీజన్లో ఏజెన్సీలో మలేరియా విజృంభిస్తుంది. పీహెచ్సీల్లో డాక్టర్ల కొరత వేధిస్తోంది. ఇప్పటి వరకు దోమతెరల పంపిణీ లేదు. ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వైద్యసేవల కోసం ఇంతవరకు హెల్త్ వలంటీర్లను నియమించలేదు. పాఠశాలల్లో కనీస మౌలికవసతులైన మరుగుదొడ్లు, అదనపు తరగతుల గదుల సమస్యలు వేధిస్తున్నాయి. గిరిజనోత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేవు. అన్ని అటవీ ఉత్పత్తులు జీసీసీ కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. ముఖ్యంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటింటికి రేషన్ ఇవ్వడం కోసం ప్రవేశపెట్టిన ఎండీయూ వాహనాలు రద్దు చేయడంతో రేషన్ కొండలపైకి మోసుకుని తీసుకువెళ్తూ గిరిజనులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.అక్షరాలే ఆరాధ్యదేవతలు–లిపివారిప్రాణం.. శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మరో వైవిధ్యముంది. ఇక్కడ అక్షరాలను ఆరాధ్యదేవతలుగా గిరిజనులు పూజిస్తారు. ఏ దేవతకై నా పూజలు చేసినా నైవేద్యంగా సారా పెట్టి పూజ అనంతరం పూటుగా తాగుతారు. జీలుగు సారా వంటివి చెట్టునుంచి దించితే ముందుగా తెడ్డులతో సేవిస్తారు. వారి పండగలు, సంప్రదాయాలను బొమ్మల రూపంలో వేయడంలో వారికి వీరేసాటి. ఏజెన్సీలో అక్షరబ్రహ్మ, మడిబ్రహ్మ వంటి ఆలయాలు వెలిశాయి. అక్కడి గిరిజనులు ప్రతి గురువారం పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆగం పండగ వంటివి చేస్తుంటారు. సవర లిపి ద్వారా కొంతమంది ఆదిమ గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. వారు వేసే లిపికి మైదాన ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇటీవల కాలంలో దీనిని అభివృద్ధి చేస్తున్నారు.ఆదివాసీ దినోత్సవం నిర్వహణ ఎందుకంటే.. ఆదివాసీల జీవన స్థితిగతులను ప్రపంచానికి తెలియజేసేందుకు ఐక్యరాజ్యసమితి 1194 ఆగస్టు 9న జెనీవాలో ప్రపంచ ఆదివాసీ వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ వర్కింగ్ గ్రూప్ ఆదివాసీలపై అధ్యయనం చేసి ప్రపంచ దేశాల్లో ఆదివాసీల సమస్యలన్నీ దాదాపు ఒకేలా ఉన్నాయని గుర్తించింది. దీంతో ఏటా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించాలని యూఎన్వో ప్రకటించింది.కొండపోడే ఆధారం.. పోడు వ్యవసాయం ప్రధాన జీవనాధారంగా కుటుంబాలతో ఆనందంగా జీవిస్తారు. భూ ఉపరితలానికి అత్యంత ఎత్తైన భాగంలో గూడల్లో నివసిస్తూ భయమంటే తెలియదన్నట్లు క్రూరమృగాల నడుమ, విష సర్పాల పడగ నీడలో సాహస జీవితం గడుపుతుంటారు. జిల్లాలోని అటవీ ప్రాంతమంతా ప్రకృతి సోయగాలతో అలరారుతుంది. -
ముర్రుపాలు అమూల్యం
విజయనగరం ఫోర్ట్: బిడ్డ పుట్టిన ఐదు నిమషాల లోపు తల్లి ఇచ్చే ముర్రుపాలు ఎంతో అమూల్యమైనవని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. ఆ పాలలో అద్భుతమైన పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయని, అవి బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడతాయన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిపాల గొప్పదనం గురించి నిత్యం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి మహిళకు దీని గురించి వివరించాలన్నారు. మహిళలు బిడ్డకు పాలు అందించేందుకు బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వేస్టేషన్, కలెక్టరేట్లలో బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటికే ఉన్నట్లయితే వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెస్తామన్నారు. బ్రెస్ట్ కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ తల్లి కావడమే గొప్ప అదృష్టమన్నారు. బిడ్డ పుట్టిన వెంటనే పాలు అందించడం తల్లి బిడ్డలిద్దరికీ శ్రేయస్కరమన్నారు. ఆ తర్వాత గర్భిణులకు సామూహిక సీమంతం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ 5వ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ శాంతికుమారి, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ హిమబిందు, ఐసీడీఎస్ పీడీ విమలారాణి, డీఎల్ఓ డాక్టర్ రాణి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారిణి అన్నపూర్ణ, బీసీ సంక్షేమ శాఖ అధికారిణి జ్యోతి శ్రీ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, నేచర్ సంస్థ డైరెక్టర్ వికాస్ బాలరాజ్, ఘోషా ఆస్పత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ సుజాత పాల్గొన్నారు. కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి
● రహదారులపై అక్రమణలు తొలగించాలి ● జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్విజయనగరం అర్బన్: రహదారులపై ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రహదారులపై అక్రమణలు తొలగించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశం గురువారం జాయింట్ కలెక్టర్ చాంబర్లో నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రహదారిపై ప్రమాదాల నివారణకు చేపట్టవలసిన చర్యలు తీసుకోవడమే కాకుండా నిబంధనలను కఠినంగా అమలు చేయాలన్నారు. రహదారులు, జంక్షన్లు, బ్లాక్ స్పాట్స్, పాఠశాలల వద్ద ఆక్రమణలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఐఆర్ఏడీ యాప్లో రోడ్డు ప్రమాద వివరాలను నమోదు చేయాలని తెలిపారు. ఐఆర్ఏడీ యాప్పై అన్ని శాఖల అవగాహన కోసం జూమ్ మీటింగ్ నిర్వహించాలని సూచించారు. రోడ్లు భవనాలు, పోలీసు, రవాణా, పంచాయతీరాజ్ శాఖల సంయుక్త బృందాలు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైన చోట హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గత సమావేశం నుంచి ఇప్పటివరకు పెండింగ్ ఉన్న కేసులను తక్షణమే క్లియర్ చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, రహదారులు భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ కె.కాంతిమతి, డీసీహెచ్ఎస్ పద్మశ్రీరాణి, విజయనగరం మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి, ఎంవీఐ మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
అర్ధరాత్రి ఈదురుగాలులు
● విద్యుత్ వైర్లపై పడిన చెట్టుకొమ్మలువీరఘట్టం: మండల వ్యాప్తంగా బుధవారం అర్ధరాత్రి భారీగా ఈదురుగాలులు వీచాయి. అయితే వర్షం పడుతుందని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. ఈదురుగాలుల ధాటికి స్థానిక దుర్గగుడి సమీపంలో ఉన్న ఓ భారీ వృక్షం చెట్టుకొమ్మలు బుధవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో విరిగి పడ్డాయి.ఈ చెట్టుకొమ్మలు విరిగి పక్కనే ఉన్న విద్యుత్ వైర్లపై పడడంతో విద్యుత్ వైర్లు చెల్లాచెదురుగా తెగిపడ్డాయి.రెండు విద్యుత్ స్తంభాలు పాక్షికంగా వాలిపోయాయి. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.వెంటనే ఏఈ అనిల్కుమార్, లైన్మెన్ సింహాచలం, రవి, పవన్, సురేష్లు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అనంతరం చెట్టు కొమ్మలు తొలగించి వీరఘట్టం మండలకేంద్రానికి తాత్కాలికంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. అయితే చెట్టుకొమ్మలు పడడంతో విద్యుత్ వైర్లు తెగిపడి వాటి పరిధిలో ఉన్న పోలీసుస్టేషన్, కొత్త బస్టాండ్, దుర్గపేట, మెయిన్రోడ్డులో కొన్ని గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టి రెండు కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి వైర్లు సరిచేసి గురువారం సాయంత్రం 5 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. వీరఘట్టం టౌన్కు విద్యుత్ సరఫరా లేకపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
సహాయక చర్యలందక వ్యక్తి మృతి
రామభద్రపురం: మండలంలోని ఆరికతోట పరిధిలో బుధవారం ప్రమాదవశాత్తు కింద పడిపోయిన వ్యక్తికి సకాలంలో సహాయక చర్యలందకపోవడంతో మృతిచెందాడు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని నాయుడువలస పంచాయతీ మధుర గ్రామం కొండపాలవలసకు చెందిన లెంక ధనుంజయ(33)ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. రోజులాగానే బుధవారం కూడా ట్రాక్టర్ తోలడానికి వెళ్లిపోయి అదే మండలం ఆరికతోట గ్రామ పొలంలో మొక్కజొన్న కంకులు రెండు లోడులు పెరిగాడు. మూడో లోడుకు వెళ్లకుండా పొలంలో ట్రాక్టర్ వదిలేసి చెట్ల నీడకు వెళ్దామన్న ఉద్దేశంతో అక్కడికి కొద్ది దూరంలో ఉన్న నీలగిరి తోటలోకి వెళ్తుండగా తోటలో గతంలో నరికిన చెట్ల మొదళ్లు తన్నుకుని కంకర రోడ్డులో బోర్లా పడిపోయాడు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పాటు ఎండవేడిమి ఎక్కువగా ఉండడంతో వెంటనే సహాయక చర్యలందక మృతిచెందాడు. బుధవారం రాత్రికి కూడా ధనుంజయ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. మద్యం తాగే అలవాటు ఉన్నోడు కదా ఏదో టైమ్లో ఇంటికి వచ్చేస్తాడులే అన్న ఉద్దేశంతో అలా వదిలేశారు. ట్రాక్టర్ ఓనర్ కూడా వెతికి తన ట్రాక్టర్ను తీసుకెళ్లిపోయాడు. గురువారం ఉదయం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ట్రాక్టర్ వదిలేసిన పరిసరాల్లో మళ్లీ వెతికారు. అయినా కనిపించకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోతున్న సమయంలో ఆరికతోట గ్రామానికి చెందిన ఓ రైతు గడ్డిమోపు పట్టుకుని కనిపించి నీలగిరి తోటలో ఎవరో పడి ఉన్నారని చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు వెళ్లి అప్పటికే మృతిచెంది ఉన్న ధనంజయను చూసి అవాక్కయ్యారు. బోర్లా పడి ఉన్న మృతదేహం ముఖంపై రక్తం మరకలు ఉండడం చూసి ఎలా మృతి చెంది ఉంటాడు? ఎవరైనా చంపి పడేశారా? మృతుడికి ఎవరూ శత్రువులు లేరే అని అలోచించి అనుమానాస్పద మృతిగా భావించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్సై వి. ప్రసాదరావు సిబ్బందితో కలిసి ఘటనా చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ను రప్పించి సాధారణ మృతా? లేక హత్యా? అని పరిశీలించి సాధారణ మృతిగా నిర్ధారించారు.కుటుంబ సభ్యుల సమక్షంలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించి అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడి భార్య గౌరీశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య గౌరీశ్వరి, పాప, బాబు ఉన్నారు. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు వెంపడాం విద్యార్థులు
పూసపాటిరేగ: మండలంలోని వెంపడాం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధులు రాష్ట్రస్థాయి అధ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 3 వతేదీన విజయనగరంలోని విజ్జీ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల ఎంపికలలో పాఠశాలకు చెందిన పి.వెంకటలక్ష్మి (లాంగ్జంప్), వి.కల్యాణి (హైజంప్), పి.శ్రీను (100 మీటర్లు, 200 మీటర్లు రన్నింగ్)లు ఎంపికయ్యారు. దీంతో ఈనెల 9,10 తేదీలలో రాష్ట్రస్థాయిలో బాపట్ల జిల్లా చీరాలలో జరగబోయే అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొననున్నారు. పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడంతో పాఠశాల హెచ్ఎం పి.లచ్చన్న, పీడీ గణేష్కుమార్తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. జాతీయ పోటీల్లో దివ్యాంగ విజేతకు అభినందనలువిజయనగరం అర్బన్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్లో మేధోవైకల్యం గల ప్రత్యేక అవసరాల పిల్లలకు ఇటీవల జరిగిన జాతీయ స్థాయి స్పెషల్ ఒలింపిక్ గేమ్స్ బేస్బాల్లో కాంస్యపతక విజేత అయిన తెర్లాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని తోషినిని జిల్లా విద్యాశాఖ అధికారి యూ.మాణిక్యంనాయుడు, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ ఎ.రామారావు అభినందించారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని వారి కార్యాలయాలకు వచ్చి అధికారులను తోషిని కలిసింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సాధారణ విద్యార్థుల మాదిరిగానే ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు కూడా ప్రతిభ చూపడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. అనంతరం విజేతను, కోచ్లుగా వ్యవహరించిన పి.సునీల్, ఎస్.బంగారునాయుడిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా సహిత విద్య సమన్వయకర్త ఎస్.సూర్యారావు, సహ సమన్వయకర్త ఎం.భారతి, తెర్లాం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్ఎస్ఎం రమేష్, కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నాటుతుపాకీతో ఇద్దరి అరెస్ట్వేపాడ: మండలంలోని సోంపురం గ్రామంలో నాటుతుపాకీ ఉన్నట్లు అందిన సమాచారం మేరకు తనిఖీ చేయడంతో నాటుతుపాకీ పట్టుబడినట్లు ఎస్సై సుదర్శన్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన అందించిన వివరాలిలా ఉన్నాయి. సోంపురం గ్రామానికి చెందిన గొర్లె ఈశ్వర్రావు ఇంటిలో తనిఖీలు నిర్వహించగా నాటుతుపాకీ పట్టుబడినట్లు చెప్పారు. తుపాకీపై ఆరాతీయడంతో గుడివాడ గ్రామానికి చెందిన రొంగలి బంగారయ్య వద్ద రూ.4500కు కొనుగోలు చేసినట్లు ఈశ్వర్రావు తెలిపాడని చెప్పారు. ఎటువంటి ప్రభుత్వ అనుమతులులేకుండా తుపాకీ కలిగి ఉన్నందున ఈశ్వర్రావును, నాటు తుపాకీ అమ్మడం చట్ట రీత్యా నేరమైనందున విక్రయించిన బంగారయ్యను ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు అరెస్టు చేసినట్లు ఎస్సై చెప్పారు. ఆర్టీసీ డార్మిటరీలో వ్యక్తి మృతివిజయనగరం క్రైమ్: విజయనగరం ఆర్టీసీ డార్మిటరీలో ఓ వ్యక్తి మృతి చెందాడు. దీనిపై వన్ టౌన్ పోలీసులకు గురువారం అందిన ఫిర్యాదు మేరకు స్టేషన్ హెచ్సీ ఆవాల రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశాఖ జిల్లా తగరపు వలసకు చెందిన సబ్బిశెట్టి కృష్ణమూర్తి(54) శశికాలేజీలో కుక్గా పని చేస్తున్నాడు. మందుల కోసం విజయనగరం వచ్చి రాత్రి కావడంతో ఆర్టీసీ డార్మిటరీలో రూమ్ తీసుకుని ఉండిపోయాడు. నిద్ర సమయంలోనే గుండె పోటు రావడంతో మృతి చెంది ఉండవచ్చని మృతుడి అల్లుడు మక్కడపల్లి శ్రీనివాస్ చేసిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
శాఖాపరంగా సిబ్బంది సమస్యల పరిష్కారం
పార్వతీపురం రూరల్: జిల్లా పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన కార్యాలయంలో జూమ్ సమావేశం ద్వారా పోలీస్ వెల్ఫేర్డే (గ్రీవెన్స్డే)కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పలు పోలీస్శాఖ ప్రధాన కార్యాలయాలు, స్టేషన్ల అధికారులతో ఒక్కొక్కరి జూమ్ సమావేశం ద్వారా సమస్యలను తెలుసుకుని వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం దిశగా ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. సిబ్బంది సమస్యల పరిష్కారానికి అవకాశం ఉన్న వాటిని త్వరితగతిన పరి ష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఎస్బీ సీఐ రంగనాథం, సైబర్ సెల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ రమేష్, ఏఆర్ఐలు నాయుడు, రాంబాబు, ఏఓ సతీష్, సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, శంకరరావు, సీసీ సంతోష్, డీపీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
యువకుడి ఆత్మహత్య
సీతంపేట: స్థానిక సొండివీధికి చెందిన నల్లా శివకుమార్ (34) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాల కారణంగా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. ఒడిశాలోని గజపతి జిల్లా రసూరుకు చెందిన జ్యోతితో ఏడాది కిందట శివకుమార్కు వివాహం జరిగింది. తల్లిదండ్రులు వెంకట్, విజయలక్ష్మితో పాటు శివకుమార్, భార్య జ్యోతి ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. ఫాస్ట్ఫుడ్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న వారింట్లో ఇటీవల కుటుంబ తగాదాలు ఎక్కువవడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. క్షణికావేశంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా ఇంటికి వచ్చి చూసిన తండ్రి వెంకటరావు వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి ఆటోలో తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యసిబ్బంది నిర్ధారించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించారు. పురుగు మందు తాగి వ్యక్తి.. గజపతినగరం రూరల్: మండలంలోని ఎం.వెంకటాపురం గ్రామానికి చెందిన ఎండ.చిరంజీవి పురుగు మందు తాగి జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు గజపతినగరం ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. ఈ మేరకు విలేకరులతో ఆయన మాట్లాడుతూ మృతుడి తండ్రి చంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు తెలిపారు. చిరంజీవి నిత్యం మద్యం తాగుతూ తరచూ ఇంట్లో భార్యతో గొడవపడేవాడన్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి మద్యం తాగి ఇంటికి రాగా భార్యతో గొడవ పడడంతో ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న పురుగు మందును తాగేశాడు. స్థానికుల సాయంతో కుటుంబసభ్యులు జిల్లా కేంద్రాస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
జిల్లాకు 2,13,000 ఆల్బెండజోల్ మాత్రల సరఫరా
పార్వతీపురం టౌన్: జిల్లాకు 2,13,000 ఆల్బెండజోల్ మాత్రలు సరఫరా చేసినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 1,96,612 మంది అంగన్వాడీ, పాఠశాల, కళాశాల పిల్లలు, విద్యార్థుల లక్ష్యంగా ఆల్బెండజోల్400 మి.గ్రా మాత్రలు వేయించనున్నామని తెలిపారు. ఈ నెల 12న జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న డీవార్మింగ్ కార్యక్రమానికి జిల్లాకు సరఫరా చేసిన ఆల్బెండజోల్ మాత్రలను ఆయా వైద్యాధికారులు, సిబ్బందికి పంపిణీ చేశామని తెలిపారు. ఈ నెల 12న మాత్రలు వేసుకోని వారికి ఈనెల 20న మాప్అప్ కార్యక్రమంలో మాత్రలు వేసేలా చర్యలు చేపట్టామన్నారు. జిల్లా ఆస్పత్రిలో ఉచిత కేన్సర్ స్క్రీనింగ్పార్వతీపురం టౌన్: మహాత్మాగాంధీ కేన్సర్ హాస్పిటల్–రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వారి సహకారంతో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాస్పత్రిలో మెగా ఉచిత కేన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు. జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి జి.నాగభూషణ రావు మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా ఆస్పత్రి, పార్వతీపురం మెడికల్ సూపరింటెండెంట్ డా.వై.నాగశివ జ్యోతి పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు. పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న సుమారు 176 మందికి పరీక్షలు నిర్వహించి వారిలో 65 మందికి ఓరల్ కేన్సర్ స్క్రీనింగ్ చేశారు. వారిలో 4 అనుమానిత కేసులుగా, 1 నాలుకకు సంబంధించిన కేన్సర్గా నిర్ధారణ చేశారు. బ్రెస్ట్ కేన్సర్ పరీక్షలను 91 మందికి నిర్వహించి వారిలో 20 మందిని అనుమనితులుగా గుర్తించి డిజిటల్ మెమోగ్రఫీ పరీక్ష చేశారు. దీని ద్వారా వారిలో ఎవరికీ కేన్సర్ లేదని నిర్ధారించారు. 20 మందికి గర్భసంచి ముఖద్వారం కేన్సర్ పరీక్షలు నిర్వహించి వారిలో 10 మందిని అనుమానితులుగా గుర్తించి పరీక్షలు చేశారు. వాటి రిపోర్టులను వారం రోజులలో అందించనున్నారు. కార్యక్రమంలో డా.హారిక, డా.కె.పాల్, మెమోగ్రఫీ టెక్నిషియన్స్ లక్ష్మి, జి.సుమన్, జిల్లా ఆస్పత్రి దంత వైద్యసిబ్బంది డా.ఎం.దినేష్ కుమార్, డా.ఆర్.శ్యామల పాల్గొన్నారు. గాయత్రీమాతకు పసుపు కొమ్ములతో అలంకరణ రాజాం సిటీ: రాజాం గాయత్రికాలనీలో వెలసి న గాయత్రిమాతను పసుపు కొమ్ములతో ఆల య ధర్మకర్త కొండవేటి వివేకానంద, ఆలయ అర్చకులు వాస జగదీశ్వరరావు గురువారం అలంకరించారు. శ్రావణ మాసంలో వచ్చే మూడో శుక్రవారాన్ని పురస్కరించుని అమ్మవారిని అలంకరించినట్టు అర్చకులు తెలిపారు. సీసీ కెమెరాలతో నిఘా విజయనగరం క్రైమ్: విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం కొత్తగా 16 సీసీ కెమెరాలను అమర్చారు. నేర నియంత్రణలో భాగంగా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు వైఎస్సార్ నగర్, మెడికల్ కాలేజ్, కాటవీధి, డబుల్ కాలనీ తదితర చోట్ల సీసీ కెమెరాలు పెట్టామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. వీటి సాయంతో నేర ప్రవృత్తికలిగిన వ్యక్తుల కదలికలపై నిఘావేస్తామన్నారు. -
నాటు తుపాకులు కలిగి ఉండడం చట్టరీత్యా నేరం
పార్వతీపురం రూరల్: నాటు తుపాకులు కలిగి ఉండడం వాటిని వినియోగించడం చట్టరీత్యా నేరమని ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రజల రక్షణ, భద్రత ప్రామాణికంగా, నేరాలు, అక్రమ రవాణా నియంత్రణే లక్ష్యంగా ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ ను సంబంధిత స్టేషన్ల అధికారులు నిర్వహించారు. ఈ క్రమంలో పార్వతీపురం మండలం రావికోన పంచాయతీ కొత్తవలస గ్రామంలో పార్వతీపురం రూరల్ పోలీసులు ఆపరేషన్ నిర్వహిస్తుండగా కొర్ర సీతారాం ఇంటి గడపలో నాటు తుపాకీని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పార్వతీపురం రూరల్ ఎస్సై బి.సంతోషి కుమారి నాటు తుపాకులు కలిగి ఉండడం, లైసెన్స్ లేకుండా తుపాకులు వినియోగించడం చట్టరీత్యా నేరం అన్న విషయాన్ని గ్రామస్తులకు అర్థమయ్యే రీతిలో సిబ్బందితో కలిసి అవగాహన కల్పించారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
వట్టిగెడ్డ నీరు.. ఒట్టిదేనా!
జియ్యమ్మవలస రూరల్: కురుపాం. జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లో దాదాపు 16,500 ఎకరాలకు సాగునీటిని అందించే వట్టిగెడ్డ.. ఇంకా రైతులకు ఎదురు చూపులే మిగులుస్తోంది. జియ్య మ్మవలస మండలంలోని ప్రధాన సాగునీటి వనరు వట్టిగెడ్డ జలాశయం. ఏటా ఖరీఫ్లో సాగునీరు విడుదల చేస్తారు. ఆగస్టు రెండు, మూడు తేదీల్లోనే ఈ ప్రక్రియ జరిగిపోతుంది. కుడి, ఎడమ కాలువలు వరుసగా 9.75, 8.047 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. వట్టిగెడ్డ నుంచి కుడి కాలువ ద్వారా 13,324 ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా 3,360 ఎకరాలకు సాగుకు నీరు అందించాల్సిఉంది. ఆగస్టు 8వ తేదీ వచ్చినా నేటికి నీటి విడుదల జాడ లేదు. నీటి విడుదల లేక ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నాలుగు రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. నాట్లు పడక నారు మడులు, వరి వెదలు ఎండిపోతున్నాయి. వట్టిగెడ్డ రిజర్వాయర్ పరిధిలో ఒకసారే వరి పంట రైతులు పండిస్తున్నారు. ఈ సంవత్సరం సాగునీరు సకాలంలో అందకపోతే రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. ప్రాజెక్టు నిర్వహణ సిబ్బంది కూడా అంతంత మాత్రంగానే ఉన్నారు. కాలువ లకు ప్రతీ 5 కిలోమీటర్లకు, డిస్ట్రిబ్యూటర్ల వద్ద 1500 ఎకరాలకు ఒక్కొక్కరు చొప్పున లస్కర్లు ఉండాలి. మొత్తం 23 మంది అవసరం. కానీ ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. ఈ నెల ఆరో తేదీన స్థానిక కూటమి ఎమ్మెల్యే జగదీశ్వరి వట్టిగెడ్డ నుంచి సాగునీటిని విడుదల చేస్తారని కూటమి నాయకులు ప్రకటించారు. తేదీ గడిచినా సాగునీరు మాత్రం విడుదల చేయలేదు. ఇటు ఎమ్మెల్యే జాడ కూడా కానరావడం లేదు. రైతుల కోసం కనీసం ఆలోచించకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వట్టిగెడ్డ.. జియ్యమ్మవలస మండలంలోని మూడు మండలాల్లోని పంట భూములకు సాగునీటి ఆదరువు. వరినాట్లు ముమ్మరంగా జరిగే ఆశ్లేషకార్తె వచ్చినా జలాశయం నుంచి చుక్కనీరు రావడం లేదు. కనీసం నీరు విడిచిపెట్టాలన్న ధ్యాస స్థానిక ఎమ్మెల్యేకు లేకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. వరి నారుమడులు, వెదలు ఎండిపోతున్నాయని, ఇంకెప్పుడు నీరు విడిచిపెడతారని ప్రశ్నిస్తున్నారు. ఆగస్టు వచ్చినా అందని సాగునీరు ఆయకట్టు రైతుల్లో ఆందోళన ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్లు? సాగునీటిని వెంటనే విడిచిపెట్టాలి రావాడ వట్టిగెడ్డ రిజర్వాయర్ సాగునీటిని వెంటనే కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా విడిచిపెట్టాలని జియ్యమ్మవలస మండల వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. చినమేరంగిలోని శత్రుచర్ల కోటలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఏటా ఈ సమయానికే సాగునీటిని ఇరిగేషన్ శాఖ ఇంజినీరింగ్ అధికారులు విడిచిపెట్టేవారని, నేడు ఏడవ తేదీ అవుతున్నా విడుదల చేయకపోవడం తీవ్ర అన్యాయమన్నారు. నీరు లేక ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలు అధికారులకు కనించడం లేదా? అని ప్రశ్నించారు. తక్షణమే నీరు విడుదల చేయకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇరిగేషన్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ కోట రమేష్, వైస్ ఎంపీపీ గుడివాడ సంపత్ కుమార్, బలగ వెంకటరమణ, లోలుగు నారాయణరావు, పోల గోవిందరావు, తాడేల మన్మధరావు, బెజ్జిపొరపు మురళి పాల్గొన్నారు. -
భక్తులను ఆకర్షించేలా తోటపల్లి ఆలయ నిర్మాణం
గరుగుబిల్లి: తోటపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం భక్తులకు ఆధ్యాత్మిక చింతన మరింత చేరువ చేసి ఆకర్షించేలా ఆలయాల నిర్మాణాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన దేవస్థానంలో నూతనంగా నిర్మించిన వాన ప్రస్త్రాశమం, అన్నప్రసాద సత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తోటపల్లిలో వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రభావం ఈ ప్రాంతంపై ఎంతో ఉందన్నారు.భక్తుల ఇలవేల్పుగా, ఈ ప్రాంతానికి చిన తిరుపతిగా తోటపలి దేవస్థానాన్ని కొనియాడుతున్నారన్నారు. ఆలయ నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకోవడంతో ఈ ప్రాంతంలోని ఆధ్యాత్మిక భావాలు కలిగిన వారంతా ఒక్కటై ఆలయ అభివృద్ధికి ట్రస్ట్ను ఏర్పాటు చేసి ఆలయ పునర్నిర్మాణానికి కంకణం కట్టుకున్నారని చెప్పారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు నిర్మాణాలు జరగడంతో ఆలయానికి కొత్త శోభ వచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణానికి, అభివృద్ధి పనులకు సహకరించిన పలువురు దాతలను కలెక్టర్ అభినందించారు. అనంతరం కలెక్టర్ను దుశ్శాలువతో సన్మానించి, వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని ట్రస్ట్ సభ్యులు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ వీవీ సూర్యనారాయణ, సర్పంచ్ ఆవాల సింహాచలమమ్మ, ఎంపీటీసీ ఎం.సింహాచలం నాయుడు, ట్రస్ట్ సభ్యులు డి. పారినాయుడు, డి.ధనుంజయరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ -
పి.ఆమిటిలో ఆదివాసీ దినోత్సవం
గుమ్మలక్ష్మీపురం: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం (ఈ నెల 9)ను పురస్కరించుకొని గుమ్మలక్ష్మీపురం మండలంలోని పి.ఆమిటి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆదివాసీ ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఆ పాఠశాల హెచ్ఎం బిడ్డిక లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో విద్యార్థినులంతా గిరిజన సంప్రదాయ వేషధారణలతో అలరించారు. సంప్రదాయ పూజలు, నృత్యాలతో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చాటిచెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో టీచర్ ఎం.రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. పి.ఆమిటి పాఠశాలలో ఆదివాసీ దినోత్సవంలో బాలికల సందడి -
సరైన రీతిలో బోధించాలి
పార్వతీపురం రూరల్: జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సరైన రీతిలో ఉపాధ్యాయులు బోధన చేసి నాణ్యమైన విద్యను అందించడం ద్వారా వారిలో జ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంచవచ్చునని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. అందుకు తగిన ప్రణాళికలు జిల్లా విద్యాశాఖ చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన అధ్యక్షతన పాఠశాల విద్య, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా బోధనలో మార్పులు రావాలని, ఈ మేరకు ఉపాధ్యాయులకు శిక్షణ అవసరమన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులకు బోధించేందుకు లాంగ్వేజ్ పండిట్లను నియమించాలని, అలాగే విద్యార్థులకు అందించే విద్యాబోధనతో పాటు వారి ఆరోగ్యంపై కూడా దృష్టిసారించడం ముఖ్యమని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో డీఈఓ రాజ్కుమార్, ఏపీసీ తేజేశ్వరావు, ఎస్జీటీ వనజాక్షి, మరికొంతమంది ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పలు కార్యక్రమాలపై సమీక్ష రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పలు కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ గురువారం తన కార్యాలయంలోని సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎరువుల పర్యవేక్షణ పటిష్టంగా ఉండాలని పీ4, డాక్యుమెంటేషన్ అప్లోడ్, మౌలిక సదుపాయాల కల్పన, ఎరువుల పంపిణీ ప్రక్రియ వంటి కార్యక్రమాపై సమీక్షించాలని, అలాగే ఎరువుల విషయంలో అవసరాలను ముందుగా గుర్తించి చర్యలకు సిద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలియజేసినట్లు కలెక్టర్ తెలిపారు. అన్నదాత సుఖీభవ–పీఎంకిసాన్ యాక్టివ్, ఇన్యాక్టివ్ ఖాతాలను పరిశీలించాలని తెలియజేసినట్లు తెలిపారు. పీ4లో మార్గదర్శి, బంగారు కుటుంబాలు అనుసంధానం సర్వే తదితర అంశాలను పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, డీఆర్ఓ కె. హేమలత, డిప్యూటీ కలెక్టర్ దిలీప్ చక్రవర్తి, డ్వామా పీడీ కె. రామచంద్రరావు, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి, డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు, ఆర్బీఎస్కే జిల్లా అధికారి జగన్మోహన్రావు, జిల్లా సర్వే అధికారి లక్ష్మణరావు, ప్రకృతి వ్యవసాయం డీఎం శ్యామ్ కుమార్, డీపీఓ కొండలరావు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
ఎన్నడైనా చూశామా?
● కలెక్టర్ల పనితీరుపై సర్వే ● కొద్దిరోజులుగా మోత మోగుతున్న ఐవీఆర్ఎస్ కాల్స్ ● అధికారులు, రాజకీయ నాయకులు ఒకటేనా? అని ప్రశ్నిస్తున్న ఉద్యోగ సంఘాలు సాక్షి, పార్వతీపురం మన్యం: గత ఎన్నికలకు ముందు.. ‘మీరు ఏ పార్టీ అభ్యర్థికి ఓటేస్తున్నారు’ అంటూ ఓ సర్వే... వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన.. అనే ఆప్షన్లు! కూటమి అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు.. అంటూ ఇంకో సర్వే.. ఓ మూడు, నాలుగు పేర్లు! ఎన్నికల్లో గెలిచిన తర్వాత, నామినేటెడ్ పదవుల భర్తీ నిమిత్తం.. ‘మీ ప్రాంతంలో పార్టీ కోసం బాగా కష్టపడుతున్న వ్యక్తి ఎవరు?’ అని మరో సర్వే!! అభ్యర్థుల గెలుపోటములు, ఎంపికలు, విజయావకాశాలు... సాంకేతికత అభివృద్ధి చెందిన తర్వాత ఇలా వివిధ సర్వేలను రాజకీయ పార్టీలు నిర్వహించడం సాధారణం అయిపోయింది. ఇందుకు భిన్నంగా.. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం మరో సర్వే చేపడుతోంది. ‘మీ కలెక్టర్ పని తీరు ఎలా ఉందంటూ’.. ఇటీవల జిల్లా వ్యాప్తంగా ఐవీఆర్ఎస్ కాల్స్ మోత మోగుతున్నాయి. మీ కలెక్టర్ పని తీరు పట్ల సంతృప్తిగా ఉన్నారా? అంటూ రికార్డెడ్ కాల్ వాయిస్ వస్తోంది. కొద్దిరోజులుగా కలెక్టర్ల బదిలీలు ఉంటాయన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటువంటి సర్వే నిర్వహిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్లు.. రాజకీయ నాయకులు ఒక్కటేనా? జిల్లా కలెక్టర్గా శ్యామ్ ప్రసాద్ ఇక్కడ బాధ్యతలు స్వీకరించి ఏడాది అయ్యింది. ఇదే సమయంలో ఆయన బదిలీపై త్వరలో వెళ్లిపోనున్నారన్న ప్రచారం ఉంది. సాధారణంగా ఏ జిల్లాలో అయినా కలెక్టర్లు రెండేళ్లు మించి పని చేయరు. ప్రభుత్వాలు మారినప్పుడు తమకు అనుకూలమైన ఐఏఎస్లను తెచ్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అంతేగానీ.. రాజకీయ నాయకుల మాదిరిగా సర్వేల ద్వారా కలెక్టర్ల పనితీరును తెలుసుకోవడం మునుపెన్నడూ లేదు. దేశంలోనే అత్యున్నత సర్వీసు అయిన కలెక్టర్ పోస్టు అంటే అందరికీ గౌరవమే. జిల్లా మేజిస్ట్రేట్గా, ఆ జిల్లాకు ఉన్నత అధికారిగా అన్ని అధికారాలూ ఉంటాయి. అటువంటి వారిని తప్పు పట్టేలా, చిన్నబుచ్చుకునేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటువంటి విధానాన్ని ఎప్పుడూ చూడలేదని ఉద్యోగవర్గాలు అంటున్నాయి. ఏ చదువూ అర్హత లేని రాజకీయ నాయకుడు.. ఉన్నత చదువులు చదివిన కలెక్టర్ ఒక్కటేనా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం తీరుపై ఉద్యోగ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. తమకు ఇస్తామన్న బకాయిలు ఏవీ చెల్లించడం లేదు సరికదా.. వివిధ సర్వేలు, ఇతర పనులు అంటూ పని భారం మోపుతున్నాయన్న ఆవేదనలో ఉన్నారు. దీనికి తోడు బంగారు కుటుంబాలు అని కొన్ని పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ఇలా ఉద్యోగ వ్యతిరేక విధానాలను ఆయా సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం మొండిగానే ముందుకు వెళ్తోంది. కలెక్టర్ల పనితీరుపై సర్వేకు ఈ ఫోన్ నంబర్తోనే వస్తున్న కాల్స్ -
దారిద్య్రం
సీతంపేట: మన్యం ప్రజలను ‘దారి’ద్య్రం వెంటాడుతోంది. సరైన ‘మార్గం’ చూపేవారు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తు లు తరలించేందుకు అగచాట్లు ఎదుర్కొంటున్నారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 1250కు పైగా గిరిజన గ్రామాలున్నాయి. వీటిలో పూర్తిగా రహదారులు లేని గ్రామాలు 120కి పైగా ఉన్నాయి. అలాగే ఛిద్రమైన దారులు 100కు పైగా ఉంటాయ ని అంచనా. అటవీశాఖ అభ్యంతరాలతో కొన్ని గ్రామాలకు రో డ్లు వేయలేని పరిస్థితి. ఏజెన్సీలో ఉన్న రోడ్లు అధ్వా నంగా మారడం, కొత్తరోడ్లు వేసేందుకు కూటమి ప్రభుత్వం చొరవచూపకపోవడంతో రాకపోకలకు గిరిజనులు అవస్థలు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో 108 వాహన సేవలు అందక డోలీలోనే రోగులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. కనీసం గత ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్లనైనా పూర్తిచేయాలని ప్రాథేయపడుతున్నా పట్టించుకోకపోవ డంపై గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడైన రోడ్లపై ప్రయాణ కష్టాలు.. ●కోపువలస నుంచి సందిగూడ వయా వంబరెల్లికు కొత్త రోడ్డు నిర్మాణానికి ఉపాధిహామీ పథకం నిధులు రూ.3 కోట్లు మంజూరైనా పనులు మాత్రం జరగలేదు. ఆ ప్రాంత ప్రజలకు రోడ్డు కష్టాలు తప్పడంలేదు. ●కోదులవీరఘట్టం, దాసుపరం, అంబలగండి గ్రామాలకు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. గుడ్డిమీద గూడ మీదుగా కడగండి వెళ్లే రహదారిపై కొండచరియలు విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ●కొఠారింగు–తాళ్లబద్రకు రహదారిలేకపోవడంతో రెండు రోజుల కిందట ఓ గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు గిరిజనులు అష్టకష్టాలు ఎదుర్కొన్నా రు. గర్భిణులను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు వచ్చి న అంబులెన్స్ బురదలో కూరుకుపోయింది. స్థానికు ల సాయంతో అతికష్టం మీద అంబులెన్స్ను తీశారు. ●తుంబలి, చావిడివలస తదితర గ్రామాలకు వెళ్లే రోడ్డు పూర్తిగా పాడయ్యాయి. ముకుందాపురం రోడ్డు పనులు ప్రారంభించి వదిలేశారు. ఎగువద్వారబంధం గ్రామానికి వేసిన రోడ్డు నాణ్యతలేక వర్షాలకు కొట్టుకుపోయిందని గిరిజనులు వాపోతున్నారు. పొంజాడ–ఆడలి రహదారిదీ ఇదే పరిస్థితి. శిలిగా నుంచి ఈతమానుగూడ రోడ్డుపై రాళ్లుతేలాయి. దబర నుంచి దబరగూడకు రోడ్డు నిర్మాణమే జరగలేదు. రోడ్ల పనుల్లో అలసత్వం తగదు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన రోడ్ల పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా పూర్తిచేయలేదు. సీతంపేట ఏజెన్సీలో 10 రోడ్ల నిర్మాణానికి ఏడాదిన్నర కిందట రూ.13.5 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అంతకముందు మరో 20 రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరైనా వాటి పనులు ఇప్పటికీ పూర్తిచేయలేదు. కొత్త రోడ్లు మంజూరు ఎలాగూలేదు. కనీసం అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తిచేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – విశ్వాసరాయి కళావతి, పాలకొండ మాజీ ఎమ్మెల్యే -
చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలి
పార్వతీపురం రూరల్: జిల్లాలో నూతనంగా ఎన్నికైన రెడ్క్రాస్ కార్యవర్గ సభ్యులు చిత్తశుద్ధితో తమ సేవలను ప్రజలకు అందించాలని రెడ్క్రాస్ అధ్యక్షుడు, కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ సూచించారు. కలెక్టరేట్ ిపీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా రెడ్క్రాస్ నూతన అధ్యక్ష, కార్యదర్శి ఎన్నికలను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్ట ర్ మాట్లాడుతూ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో రెడ్క్రాస్ సేవలు విస్తరింపజేయాలన్నారు. ప్రతి మండలంలోనూ సభ్యత్వ నమోదుచేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాలో మలేరియా, ఎనీమియా, సికిల్సెల్ బాధితుల వివరాలు నమోదు చేయాలని, వారికి అవసరమైన మందులు, బలవర్ధకమైన ఆహారం రెడ్క్రాస్ నుంచి అందేలా చూడాలన్నారు. గర్భిణులకు పౌష్టికాహారం, చదువుకునే పిల్లలకు రెడ్క్రాస్ సంస్థ తరఫున సాయం అందించాలని సూచించారు. జిల్లాలో రక్తం నిల్వలు పెంచేందుకు కృషిచేయాలని కోరారు. రెడ్క్రాస్ సంస్థకు నగరంలో ప్రభుత్వ భవనం ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రతి మండలంలో రెడ్క్రాస్ కమిటీ ఉండాలని, నెల లేదా మూడు నెలలకోసారి సమావేశాలు నిర్వహించాలన్నారు. కార్యవర్గం ఇదే.. రెడ్క్రాస్ చైర్మన్గా డాక్టర్ మంచిపల్లి శ్రీరాములు, కార్యదర్శిగా బి.నాగభూషణరావు, కోశాధికారిగా పెంటపాటి సూర్యారావును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ సేవకులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ కోఆర్డినేటర్ జనార్దనరావు, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ రెడ్ క్రాస్ నూతన కార్యవర్గం ఎన్నిక -
ఇన్స్పైర్ మనక్లో భాగస్వామ్యం కావాలి
పార్వతీపురం టౌన్: ఇన్స్పైర్ మనక్లో జిల్లాలోని అన్ని పాఠశాలలు భాగస్వామ్యం కావాలని జిల్లా విద్యాశాఖధికారి బి.రాజకుమార్ తెలియజేశారు. ఇన్స్పైర్ మనక్ 2025–26కు గాను డివిజనల్ లెవెల్ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం స్థానిక డీవీఎంఎం ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఇన్స్పైర్ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక ఆలోచనలు వెలికితీయవచ్చని, నిజజీవిత సమస్యలకు పరిష్కారం కనుగొనేలా ప్రాజెక్టులు రూపొందించాలన్నారు. జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో ప్రాజెక్టులు నామినేషన్ అయ్యేలా అందరు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. జాతీయస్థాయికి వెళ్లేలా ప్రాజెక్టులు సిద్ధం చేయించాలన్నారు. ఇన్స్పైర్ ప్రాజెక్ట్ల నామినేషన్లకు సెప్టెంబర్ 15 చివరి తేదీ అని అంతకు ముందుగానే ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలని సాంకేతిక సమస్యలు ఉంటే తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.తేజేశ్వరరావు, జిల్లా సైన్స్ అధికారి జి.లక్ష్మణరావు, డివిజన్లో అన్ని మేనేజ్మెంట్ పాఠశాల నుంచి ఉపాధ్యాయులు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు పెంట రామకృష్ణ, స్థానిక పాఠశాల హెచ్ఎం భాస్కర్, ఏఎస్ఓ శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రాస్పత్రిలో గురువారం క్యాన్సర్కు ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసా ద్ తెలిపారు. విశాఖపట్నం మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ సౌజన్యంతో జిల్లా ఆస్పత్రి లో ఉచిత స్క్రీనింగ్ను ఏర్పాటు చేశామని పేర్కొంటూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 7వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉచిత స్క్రీనింగ్ జరుగుతుందని, ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సీ్త్ర, పురుషులకు విభాగాల్లో నిర్వహిస్తారని ముఖ్యంగా, సీ్త్రలకు గైనిక్, రొమ్ము, గర్భాశయ, ఇతర క్యాన్సర్లకు స్క్రీనింగ్ చేయనున్నారని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ భూముల పరిశీలన కొమరాడ: మండలంలోని చోళపదం, ఉలిపిరి గ్రామాల్లోని అగ్రిగోల్డ్ భూములను పార్వతీపు రం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ సంబంధి త కమిటీ సభ్యులతో కలిసి బుధవారం పరిశీలించారు. కొమరాడ తహసీల్దార్ సత్యనారా యణ భూముల పరిస్థితిని వివరించారు. మూ డు ఎల్పీఎంలలో దాదాపు తొమ్మిది వందల చెట్లను లెక్కించామన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మ్యుటేషన్, చెట్లగణన త్వరగా పూర్తిచేయాలని ఈ సందర్భంగా నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక సంబంధిత అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ సరెండర్ సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపు రం మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లుపై ఎట్టకేలకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మేనేజ ర్ హోదా గల ఆయన.. కూటమి నేతలతో ఉన్న సాన్నిహిత్యం కార ణంగా పుర కమిషనర్గా చలామణి అవుతున్న విషయం విదితమే. కూటమి ప్రభుత్వంపై స్వామి భక్తి చాటుకోవడమే కాక.. అవినీతి అధికారిగానూ ముద్ర పడ్డారు. పుర పాలకవర్గం విషయంలో ప్రోటోకాల్ పాటించకుండా, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకూ ఆహ్వానించక, కౌన్సిల్ సమావేశాల్లో కూటమి నేతలకు అనుకూలంగా ఉంటూ, ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు.. ప్రతి పనికీ ఒక రేటు కట్టేశారని, సొంత ఉద్యోగులను సైతం వదలకుండా ఇబ్బంది పెట్టేవారిని బహిరంగంగానే విమర్శలు వచ్చా యి. కొన్నాళ్లుగా కమిషనర్ వెంకటేశ్వర్లుకు.. మున్సిపల్ ఉద్యోగులకు మధ్య యుద్ధమే సాగింది. దీనిపై ఉద్యోగులు స్థానిక ఎమ్మెల్యే తో పాటు, కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేశారు. ఇటీవల కార్యాలయానికి వచ్చిన మున్సిపల్ ఆర్డీకి కూడా పురపాలక సంఘం చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, వైఎస్సార్సీపీ సభ్యులతో పాటు పలువురు పట్టణ వాసులు కమిషనర్ తీరుపై ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఆయనను సరెండర్ చేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. తదుపరి పోస్టింగ్ కోసం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ కార్యాలయానికి నివేదించాలని ఉత్తర్వు ల్లో పేర్కొన్నారు. 133 కేజీల గంజాయి పట్టివేత● ఇద్దరి అరెస్టు సాలూరు రూరల్: గ్రీన్ఫీల్డ్ రహదారిలో బుధవారం ఉదయం అక్రమంగా తరలిస్తున్న 133 కేజీల గంజాయితో పాటు ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్లు ఏఎస్పీ అంకిత సురానా తెలిపారు. ఈ మేరకు ఆమె సాలూరు రూరల్ పోలీస్ స్టేన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. పాచి పెంట మండలం మాతుమూరు సమీపంలో వేటగాని వలస గ్రామం గ్రీన్ఫీల్డ్ జంక్షన్ వద్ద పోలీసులు గంజాయితో పాటు నిందితులను పట్టున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఆటోతోపాటు ఇద్దరు నిందితులు కొర్ర డానియల్, జన్ని దివారకర్లను అరెస్టు చేశామన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో రూరల్ ఎస్సై నరసింహమూర్తి, పాచిపెంట ఎస్సై పాల్గొన్నారు. -
● మద్యం జోరు.. జనం బేజారు!
ఇప్పుడు ఏ పల్లె, పట్టణం, వీధిలో అయినా మద్యం విచ్చలవిడిగా లభిస్తోంది. బహిరంగ మద్యపానం యథేచ్ఛగా సాగుతోంది. ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో చిచ్చుపెడుతోంది. వివాదాలకు కారణంగా మారుతోంది. వీటిని కట్టడిచేసేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. బొబ్బిలి సీఐ కె.సతీష్కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది డ్రోన్ కెమెరాలతో పలు ప్రాంతాలను చిత్రీకరించగా టీబీఆర్ థియేటర్ ప్రాంతంలో కాలువ గట్టుపై బహిరంగంగా మద్యం తాగుతున్న వారిని గుర్తించారు. వెంటనే పోలీసులను పంపించి వారిని పట్టుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, మద్యం సేవించి వాహనాలను నడిపినా కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. – బొబ్బిలి -
మన్యం ప్రజల
గురువారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2025● అధ్వానంగా గిరిజన గ్రామాల రోడ్లు ● రోగులను ఆస్పత్రులకు తీసుకెళ్లాలంటే ఇబ్బందులే.. ● అటవీ ఉత్పత్తులు తరలించేందుకు అగచాట్లు ● సీతంపేట ఐటీడీఏ పరిధిలో సుమారు 120 గ్రామాల ప్రజలకు రోడ్డు కష్టాలు చిత్రంలో కనిపిస్తున్నది ఏదో నీరు ప్రవహించిన తర్వాత ఎండిన గెడ్డ అనుకుంటే పొరపాటే. ఇది సీతంపేట మండలంలోని ఎగువదరబ రోడ్డు. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు రోడ్డుపై ప్రవహించడంతో రాళ్లుతేలిపోయింది. దీనిపై ప్రయాణించేందుకు ఈ ప్రాంత గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం నడిచివెళ్లేందుకు కూడా భయపడుతున్నారు. రోడ్డు బాగుచేయాలని పాలకులు, అధికారులకు విన్నవిస్తున్నా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. న్యూస్రీల్ -
ఉపాధికోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు..!
పాలకొండ రూరల్: నగరపంచాయతీ పరిధి జంగాలవీధిలో నివాసముంటున్న దేవళ్ల శంకరరావు, ఉషారాణి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు సందీప్(24) హైదరాబాద్లో జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. సందీప్ డిగ్రీ వరకూ చదువుకున్నాడు. ఉపాఽధి మార్గంలో భాగంగా తనకు ఇష్టమైన హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం ఉద్యోగ అన్వేషణలో హైదరాబాద్ చేరాడు. అక్కడి జూబ్లీహిల్స్లో గల ఓ కేఫ్లో కొలువు పొందాడు. కొడుకు అందుకొస్తున్నాడని తల్లిదండ్రులు భావిస్తున్న తరుణంలో విధి కన్నుకుట్టింది. కేఫ్ యాజమాన్యం సమకూర్చిన మూడంతస్తుల భవనంలో వసతి పొందుతున్న సందీప్ బుధవారం ఉదయం 5 గంటల సమయంలో భవనం పైనుంచి జారి పడిపోయాడు. ఈ విషయాన్ని సందీప్ సహచరులు పాలకొండలో ఉన్న తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. విషయం తెలుసుకుని ఉలిక్కిపడిన వారు హుటాహుటిన హైదరాబాద్ పయనమయ్యారు. సందీప్ తలకు గాయం కావడంతో గాంధీ ఆస్పత్రికి అంబులెన్స్లో తరలిస్తున్నట్లు సహచరులు తెలియజేయడంతో కంగారు పడ్డారు. ఇంతలో సందీప్ తుదిశ్వాస విడిచాడన్న వార్త తెలియగానే షాక్కు గురైనట్లు తండ్రి శంకరరావు తెలిపాడు. తాను టైలరింగ్ చేస్తూ, తన భార్య మెప్మాలో అత్యంత చిన్న ఉద్యోగం చేస్తూ రెక్కల కష్టంపై పిల్లలను అల్లారు ముద్దుగా పెంచామని, వారి భవిష్యత్తు కోసం కన్న కలలు తీరకుండానే తిరిగిరాని లోకానికి చెయ్యెత్తు కొడుకు వెళ్లిపోయాంటూ తల్లిదండ్రులు రోదించారు. ఈ విషయం తెలియడంతో స్థానిక జంగాల వీధితోపాటు మృతుని బంధువులు, స్నేహితుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మేడపై నుంచి జారిపడి యువకుడి మృతి హైదరాబాద్లో ప్రమాదం -
●రోడ్ల నిర్మాణానికి చర్యలు
రోడ్ల నిర్మాణం పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రోడ్లు లేని పలు గ్రామాలకు కొత్తగా రోడ్లు వేసేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తాం. – కుమార్, ఈఈ, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్శాఖ ●ప్రయాణించేందుకు భయపడుతున్నాం వీలైనంత తొందరగా రోడ్ల నిర్మాణాలు పూర్తిచేయాలి. రాళ్లుతేలిన, గోతులమయమైన రోడ్లపై ప్రయాణానికి ప్రతి నిత్యం భయపడుతున్నాం. కష్టాలు అనుభవిస్తున్నాం. మేడ ఒబ్బంగికి వెళ్లాల న్నా, రావాలన్నా నరకం చూస్తున్నాం. కొండశిఖర గ్రామాలకు రోడ్లు నిర్మించాలి. – ఎస్.ముకుందరావు, సర్పంచ్, కొండాడ -
వృద్ధుడి అదృశ్యం
విజయనగరం క్రైమ్ : నగరంలోని ఇందిరానగర్ లో నివాసముంటున్న పతివాడ కాశయ్య (69) అదృశ్యమైనట్లు బుధవారం విజయనగరం వన్ టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. కాశయ్య కొడుకు తిలక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్టేషన్ హెచ్సీ అప్పలనాయుడు కేసు నమోదు చేయగా సీఐ ఆర్వీకే చౌదరి దర్యాప్తు ప్రారంభించారు.గత నెల 23న ఇంటి నుంచి వెళ్లిపోయిన కాశయ్య ఇప్పటివరకు ఇంటికి తిరిగాలేదని కొడుకు తిలక్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా కాస్త మతిస్థిమితం లేదని ఇంట్లో గొడవపడి గత నెలలోనే ఇంటి నుంచి వెళ్లిపోయాడన్నారు. క్రైమ్ పార్టీ కాశయ్య కోసం వెతుకులాట చేపట్టారని సీఐ చౌదరి ఈ సందర్భంగా చెప్పారు -
పీఏసీఎస్లకు పర్సన్ ఇన్చార్జ్లు
● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ● జిల్లాలో మొత్తం పీఏసీఎస్లు 42 ● 18 సొసైటీలకు గతంలో త్రీమెన్ కమిటీ నియామకం ● మిగిలిన 24 సొసైటీల్లో కొలిక్కిరాని కమిటీలు ● 24 సొసైటీలకు పర్సన్ ఇన్చార్జ్ల నియామకంవీరఘట్టం: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీఏసీఎస్లలో నామినేటెడ్ పదవులు వస్తాయని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు చోట్ల సొసైటీల్లో త్రీమెన్ కమిటీ నియామకాలకు కూటమిలో ఏర్పడిన కుమ్ములాటలతో పీఏసీఎస్లో చైర్మన్ కుర్చీలు ఖాళీగా మిగిలాయి. ముఖ్యంగా జిల్లాలోని పాలకొండ, పార్వతీపురం డివిజన్లలో ఈ నియామకాలు ఆగిపోయాయి. మిగిలిన చోట్ల నెల రోజుల క్రితమే త్రీమెన్ కమిటీలను ఎమ్మెల్యేల సిఫార్సులతో నియమించారు. చైర్మన్ కుర్చీలు ఖాళీగా ఉన్న చోట ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈనెల 1న ప్రభుత్వం పర్సన్ ఇన్చార్జ్లను ఈ సొసైటీలకు నియమించింది. ఆరు నెలల పాటు 2026 జనవరి 30 వరకు పర్సన్ ఇన్చార్జ్లు ఇక్కడ ప్రత్యేకాధికారులుగా వ్యవహరించేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో చాలా రోజులుగా పీఏసీఎస్లలో చైర్మన్ పదవి వస్తుందని ఆశించిన వారికి నిరాశే మిగిలిందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇదీ పరిస్థితి..జిల్లాలో 42 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘా(పీఏసీఎస్)లు ఉన్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పీఏసీఎస్లలో నియమించిన త్రీమెన్ కమిటీలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 జూన్ 28న స్వచ్ఛందంగా తప్పుకున్నారు.దీంతో గత 14 నెలలుగా పీఏసీఎస్లలో త్రీమెన్ కమిటీలు లేక పాలన గాడి తప్పుతోంది. ఈ క్రమంలో గతేడాది అన్ని సొసైటీలకు ఆరు నెలల పాటు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. తొలుత పీఏసీఎస్లకు ఎన్నికలు నిర్వహించాలని ఆలోచన చేసిన ప్రభుత్వం తర్వాత నామినేటెడ్ పద్ధతిలో త్రీమెన్ కమిటీలను నియమించాలని ఆలోచన చేసింది. దీంతో జిల్లాలోని ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సులతో 18 పీఏసీఎస్లకు నెలరోజుల క్రితం త్రీమెన్ కమిటీలు నియమించారు. చైర్మన్ పదవి కోసం అటు టీడీపీ, ఇటు జనసేన నేతల మధ్య పోటీ ఏర్పడడంతో జిల్లాలో 24 పీఏసీఎస్లలో త్రీమెన్ కమిటీ నియామకాల కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు కుస్తీ పడుతున్నారు. ఇంతలో ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ప్రత్యేకాధికారులను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో ఆశావహులు కంగుతిన్నారు. 24 పీఏసీఎస్లకు ప్రత్యేధికారులు..పాలకొండ నియోజకవర్గంలో 8 పీఏసీఎస్లు ఉండగా ఇక్కడ ఏ ఒక్క సొసైటీలో కూడా త్రీమెన్ కమిటీలను నియమించలేకపోయారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణకు, టీడీపీ ఇన్చార్జ్ భూదేవిల మద్య సయోద్య కుదరకపోవడంతో సొసైటీల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయలేకపోయారని అందరూ చర్చించుకుంటున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలోని భామిని, బత్తిలి, అర్ధలి, బాసూరు, పాలకొండ, ఆర్బీఆర్.పేట, తంపటాపల్లి, వీరఘట్టంలో త్రీమెన్ కమిటీలు వేయలేదు. అలాగే పార్వతీపురం డివిజన్లోని గరుగుబిల్లి, చినమేరంగి, కృష్ణపల్లి, పలగర, గలావిల్లి, అజ్జాడ, బూర్జ, సీతానగరం, కాశీపేట, గెడ్డలుప్పి, పార్వతీపురం, తామరఖండి, అంటిపేట, ఆర్.వెంకమ్మపేట, మరిపివలస, పాపమ్మవలస సొసైటీలకు కూటమి నాయకులు త్రీమెన్ కమిటీలను వేయకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది.ప్రత్యేకాధికారులను నియమించారు జిల్లాలో త్రీమెన్ కమిటీలు లేని 24 సొసైటీలకు ప్రభుత్వం పర్సన్ ఇన్చార్జ్లను నియమించింది.వచ్చే ఏడాది జనవరి 30 వరకు ఇన్చార్జ్లు ఉంటారు.ఒక వేళ ఇంతలో త్రీమెన్ కమిటీలు వస్తే పర్సన్ ఇన్చార్జ్లు మరి ఉండరు. పి.శ్రీరామమూర్తి, జిల్లా కోపరేటివ్ అధికారి -
గిరిజన రైతుల హక్కులు కాలరాస్తే సహించం
● సాగుచేసిన భూములు వారి స్వాధీనంలోనే ఉండాలి ● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, ● మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు ● కాకర్లవలస, కారేడువలసలో భూముల పరిశీలనరామభద్రపురం: ఎన్నోఏళ్లుగా సాగులో ఉన్న భూములపై సర్వ హక్కులు గిరిజన రైతులవేనని వారి హక్కులను కాలరాస్తే సహించేది లేదని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు హెచ్చరించారు. ఈ మేరకు రామభద్రపురం మండలంలోని కాకర్లవలస, కారేడువలస గిరిజన రైతులు చాలా రోజులుగా భూసమస్యలపై పోరాడుతున్న సమాచారం తెలుసుకున్న వారు బుధవారం ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావు, పలువురు వైఎస్సార్సీపీ నాయకులతో కలిిసి ఆయా భూములను పరిశీలించారు.ఈ భూముల్లో ఎప్పటి నుంచి సాగులో ఉన్నారు? మీ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు మీకు నోటీసులు ఇచ్చారా లేదా? అని ఆరా తీస్తూ గిరిజన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏపీఐఐసీ అధికారులు, ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు కోసం పేదల పొట్టగొడుతూ మేము ఎన్నో ఏళ్లుగా కష్టపడి సాగుచేసుకుంటున్న పంటలు సైతం దౌర్జన్యంగా నాశనం చేయడంతో పాటు లాక్కుంటున్నారని గిరిజన రైతులు వారి దృష్టికి తీసుకెళ్లారు.అలాగే దశాబ్దాల కాలంగా మేము సాగులో ఉన్న ఇవే భూములకు పట్టాలు ఇవ్వాలని పోరాటాలు చేస్తే రెవెన్యూ అధికారులు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చారని వారి వద్ద గిరిజన రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అధికారం ఉపయోగించి పోలీసుల సహకారంతో దౌర్జన్యంగా చేసి గిరిజనులను భయపెట్టడం సమంజసం కాదన్నారు. ఆరుగాలం కష్టపడి పెంచుకుంటున్న మామిడి తోటలు, జీడి తోటలు, మొక్కజొన్న, పత్తి పంటలు ధ్వంసం చేయడానికి ఏపీఐఐసీ అధికారులకు మనసు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తాము అభివృద్ధికి అడ్డుకాదని, ప్రభుత్వ ప్రయోజనాలు, ప్రజాప్రయోజనాల కోసమో సాగుభూముల్లో పనులు చేస్తే పద్ధతిని పాటిస్తూ ముందుకెళ్లాలన్నారు. పాలన ఇలాగేనా? ఇక్కడ పంచాయతీ సర్పంచ్కు గాని, గిరిజన రైతులకు కానీ కనీస సమాచారం ఇవ్వకుండా ఎలా లాక్కుంటారని ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని,గిరిజన ప్రజలకు మంచి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు ఇలాగేనా పాలించేది అని ప్రశ్నించారు. 2009లో వనసంరక్షణ కింద అప్పటి కలెక్టర్ వీర బ్రహ్మయ్య గిరిజనులకు పట్టాలు ఇచ్చారని,అప్పటికే ఎన్నో ఏళ్ల నుంచి బీడు భూములను బాగు చేసుకుని గిరిజన రైతులు సాగులో ఉంటే ఇప్పుడు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. గిరిజన రైతులేమీ దొంగతనంగా ఆక్రమించుకోలేదన్నారు. దౌర్జన్యంగా ధ్వంసం చేసిన పంటలకు నష్టపరిహారం ఇవ్వడంతో పాటు గిరిజన రైతులకు కొండ ప్రాంతంలో కాకుండా ఈ భూములకే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజన రైతులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావు, గ్రామ సర్పంచ్ మజ్జి రాంబాబు, మండల జేసీఎస్ కన్వీనర్ చింతల సింహాచలం నాయుడు, మండల యూత్ అధ్యక్షుడు పత్తిగుళ్ల ఏక్నాథ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కిర్ల చంద్రశేఖర్ సీఐటీయూ నాయకుడు బలస శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయలోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
విజయనగరం లీగల్: జాతీయ లోక్ అదాలత్ను చిట్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీలు, జాతీయ, ప్రైవేట్ బ్యాంకులు సద్విని యోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కోర్టు సముదాయంలో ప్రముఖ చిట్ఫండ్ కంపెనీల బ్యాంక్ మేనేజర్లు, బ్యాంకులకు సంబంధించిన అధికారులు, కంపెనీ న్యాయవాదులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిట్ కంపెనీలకు, బ్యాంక్కు సంబంధించిన కేసులను సెప్టెంబర్ 13న జరగబోయే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో పరిష్కరించుకోవచ్చన్నారు. పెండింగ్లో ఉన్న బ్యాంకు దావాలను ఎక్కువ కేసులను రాజీ చేయాలని కంపెనీలకు సంబంధించిన బ్రాంచ్ మేనేజర్, బ్యాంక్ మేనేజర్లకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా న్యా య సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, లీడ్ బ్యాంక్ మేనేజర్, మార్గదర్శి చిట్ఫండ్స్, కపిల్ చిట్ఫండ్స్ శ్రీరామ్ చిట్ఫండ్స్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్లు పాల్గొన్నారు. -
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
విజయనగరం క్రైమ్: విజయనగరం రైల్వేస్టేషన్ ఫ్లాట్ ఫాం నంబర్ 5పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని బుధవారం జీఆర్పీ సిబ్బంది గమనించారు. మృతుడి వయస్సు 50 నుంచి 55 ఉంటుందని సుమారు ఆరడుగుల ఎత్తు, సిమెంట్ రంగు షర్ట్ , నీలిరంగు ఫ్యాంట్ ధరించిన వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నామని జీఆర్పీ హెచ్సీ అశోక్ తెలిపారు. మృతుడి కుడి చేతికి ఎర్రటి తాడు ఉందని సదరు వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే ఫోన్ 9490617089, 6301365605 నంబర్లకు కానీ ల్యాండ్ లైన్ 08912883218 నంబర్కు కానీ ఫోన్ చేయాలని హెచ్సీ అశోక్ తెలిపారు. -
పల్లెనిద్రతో ప్రజలకు భరోసా
విజయనగరం క్రైమ్: క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలను భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ‘పల్లె నిద్ర’ కార్యక్రమం చేపట్టామని ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం తెలిపారు. ప్రతి నెలలో రెండు గ్రామాల్లో ’పల్లె నిద్ర’ చేయాలని ఎస్సైలు, సీఐలను ఆదేశించామని ఎస్పీ అన్నారు. ప్రజలతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకుంటూ, వివిధ నేరాలు, చట్టాల మీద అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలోని ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలోగల గ్రామం లేదా వార్డులో ఎస్సై లేదా సీఐ స్థాయి అధికారులు, దత్తత గ్రామాల కానిస్టేబుల్స్ ‘పల్లె నిద్ర’ చేపట్టే విధంగా అధికారులను ఇప్పటికే ఆదేశించామని ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టం చేశారు. ‘పల్లె నిద్ర’ కార్యక్రమంతో ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతున్నామన్నారు. నేరాల నియంత్రణ, ప్రజల సహకారంతో పోలీసింగ్ను మరింత బలోపేతం చేయడమే ‘పల్లె నిద్ర’ ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లాలో ‘వల్లె నిద్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 300 గ్రామాల్లో పోలీసు అధికారులు కార్యక్రమం చేపట్టారని తెలిపారు. ఎస్పీ వకుల్ జిందల్ -
పాము కాటుతో రైతు మృతి
అయిన వారు వదులుకున్నారు,.108 సిబ్బంది ఆదుకున్నారుకొత్తవలస: కష్టపడి పని చేసి కుటుంబాన్ని పోషించిన వ్యక్తి అవసరం తీరిపోవడంతో అయిన వారు వదులుకున్నారు. అయితే ఆ వ్యక్తిని 108 సిబ్బంది ఆదుకున్నారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కొత్తవలస మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో ఒక వ్యక్తి సొమ్మసిల్లి పడిపోయాడని స్థానికులు 108 వాహనం సిబ్బందికి సమాచారం అందించారు.దీంతో 108 వాహసం సిబ్బంది టెక్నీషయన్ సీహెచ్.సన్యాసినాయుడు, పైలెట్ విజయ్కుమార్లు 108 వాహనంలో వచ్చి పరిశీలించగా ఆ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే ప్రథమ చికిత్స నిర్వహించి విశాఖపట్నం కేజీహెచ్కు తరలించారు.అక్కడికి వెళ్లేసరికి సంబంధిత వ్యక్తికి మెలకువ రావడంతో వివరాలు అడగ్గా తాను ఉప్పల వెంకటరావును. కారు డ్రైవర్నని తెలిపాడు. భార్య,ఇద్దరు ఆడపిల్ల లు ఉన్నారని, పిల్లలకు పెళ్లిళ్లు జరిపించినట్లు తెలిపాడు. తాను ఆనారోగ్యం పాలుకావడంతో కుటుంబసభ్యులు చిన్నచూపు చూడడంతో అక్కడక్కడ తింటూ రోడ్డుపైనే కాలక్షాపం చేస్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని ఆయన బంధువులకు సమాచారం అందించామని 108 సిబ్బంది తెలిపారు. -
దేశ రాజధాని పెద్దల దృష్టికి జిందాల్ సమస్య
శృంగవరపుకోట: భూములు కోల్పోయి ఉపాధి కరువై రోడ్డున పడిన జిందాల్ పరిశ్రమ నిర్వాసితుల గోడును దేశరాజధానికి తీసుకెళ్లామని ఎమ్మెల్సీ రఘురాజు చెప్పారు. ఈ మేరకు బుధవారం బొడ్డవరలో ఆయన తన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 45రోజులు రైతులు రోడ్డున పడి ఆందోళన చేస్తుంటే స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, రాష్ట్ర సర్కారులో కనీస స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యకు పరిష్కారం చూపాలని, ఢిల్లీలో జాతీయ మానవహక్కుల సంఘం, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల కమిషన్ల చైర్మన్లను కలిసి జిందాల్ రైతాంగ సమస్యలు వివరించామన్నారు. ఎన్హెచ్ఆర్సీ ఇప్పటికే 15 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించినట్లు చెప్పారు. కలెక్టర్ను కలిసి ఆర్అండ్ఆర్ అమలులో జరిగిన లోపాలు, చెల్లింపుల్లో తప్పిదాలను వివరించామన్నారు. జిందాల్ నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. -
హెచ్సీ కుటుంబానికి ఆర్థిక సహాయం
డెంకాడ: రోడ్డు ప్రమాదంలో మరణించిన చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ కోరాడ రామునాయుడు కుటుంబానికి పోలీస్ వాట్సాప్గ్రూప్ సభ్యులు రూ.లక్షా 50వేల 662ల ఆర్థిక సహాయం చేశారు. ఏపీ పోలీస్ వాట్సాప్ గ్రూపులోని సభ్యులు వితరణగా ఇచ్చిన మొత్తాన్ని మృతుడు హెచ్సీ రామునాయుడు కుటుంబ సభ్యులకు బుధవారం అందజేశారు. కార్యక్రమంలో గ్రూపు సభ్యులు లెంక రాము, మిత్తిరెడ్డి అప్పలనాయుడు, శీర గణేష్, అక్కుపల్లి గోవింద, మజ్జి కూర్మారావు, గొర్లె శ్రావణ్కుమార్, మీసాల చంద్రమౌళి, కల్యాణపు అప్పలనాయుడు, వైస్ ఎంపీపీ పిన్నింటి తమ్మునాయుడు తదితరులు పాల్గొన్నారు.16న రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలుకొత్తవలస: మండలంలోని అప్పన్నపాలెం గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా 16వ తేదీన రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలను నిర్వహించ నున్నట్లు ఉత్తరాంధ్ర క్విజ్ మాస్టర్ కర్రి రాము బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు 16వ తేదీన ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయన్నారు.అన్ని రకాల పోటీ పరీక్షలు రాసేందుకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అర్హులని తెలిపారు . ఆరుగురు అభ్యర్థులు ఒక గ్రూప్గా ఏర్పండి పోటీల్లో పాల్గొన వచ్చన్నారు. హైటెక్ విజయరహస్యం–2025 మ్యాగజైన్, ఇంగ్లీష్, కరెంట్ అఫెర్స్ తదితర అంశాలపై పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో గెలుపొందిన గ్రూప్లకు వరుసగా రూ.5వేలు, రూ.4వేలు, రూ 3వేలు, రూ.2వేలు నగదు బహుమతి ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.ఈ పోటీలు గ్రామ మాజీ సర్పంచ్ తిక్కాన చిన్నదేముడు ఆర్థిక సహాయంతో నిర్వహించనున్నట్లు చెప్పారు. 9న జిల్లా స్థాయి యోగా పోటీలువిజయనగరం: జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 9న జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు అవనాపు విక్రమ్ బుధవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గల తోటపాలెం గాయత్రి టెక్నో స్కూల్లో ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సబ్జూనియర్, జూనియర్, సీనియర్స్ విభాగాల్లో 8 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి ఎంపికలు జరుగుతాయని తెలిపారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు తమ పేర్లను 8వ తేదీ సాయంత్రం లోగా నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెంలో నిర్వహించే రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పాల్గొంటారని, రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారు, మైసూర్ (కర్ణాటక)లో నిర్వహించే జాతీయస్థాయి యోగా పోటీల్లో పాల్గొంటారని వివరించారు. జిల్లా స్థాయి యోగా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు పేర్ల నమోదు, మరిన్ని వివరాలకు ఫోన్ 8374904262,7993696087 నంబర్లను సంప్రదించాలని సూచించారు. చెక్బౌన్స్ కేసులో రెండేళ్ల జైలుశిక్షగజపతినగరం రూరల్: మిహిరా చిట్స్ యజమాని మక్కువ శ్రీధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయనగరం పట్టణానికి చెందిన కింతాడ అప్పారావుకు చెక్బౌన్స్ కేసులో రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ.రెండు లక్షలు నష్టపరిహారం విధిస్తూ గజపతినగరం జుడిషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ విజయ్రాజ్కుమార్ తీర్పునిచ్చారు. మిహిరా చిట్ కంపెనీకి అప్పారావు సకాలంలో చిట్ నగదు చెల్లించకపోవడం వల్ల ముద్దాయికి ఈ శిక్ష వేసినట్లు మెజిస్ట్రేట్ తీర్పులో పేర్కొన్నారు. గిరిజన బాలుడి మృతిగుమ్మలక్ష్మీపురం: మండలంలోని ఎల్విన్పేట పంచాయతీ ఎస్.కోటపాడు గ్రామానికి చెందిన కడ్రక అభిరాం(13)అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతిచెందాడు. కొత్తగూడ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి వరకు చదివిన అభిరాం టీబీ తదితర వ్యాధులతో బాధపడుతూ చికిత్స పొందుతున్న కారణంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే పాఠశాలకు వెళ్లలేదు. తల్లి మాలతి, తండ్రి మహేష్ అభిరాంను వైద్యం నిమిత్తం పలు ఆస్పత్రులకు తీసుకెళ్లి వైద్య సేవలు అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. -
నిందితుడి కోసం తీవ్ర గాలింపు
కొత్తవలస: మండలంలోని ముసిరాం గ్రామంలో నాటు తుపాకీతో తన సమీప బంధువును మంగళవారం సాయంత్రం కాల్చి పరారైన నిందితుడు సిమ్మ అప్పారావు (35) ఆచూకీ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ మేరకు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగినట్లు సీఐ షణ్ముఖరావు తెలిపారు. ముసిరాం గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావును అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం పాతవలసకు చెందిన సిమ్మ అప్పారావు మంగళవారం తుపాకీతో కాల్చి చంపిన విషయం పాఠకులకు విదితమే. నిందితుడు అప్పారావు తుపాకీతో కాల్చి తోటల్లోంచి పరెగెత్తుకుంటూ పోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి పరుగెత్తుకుంటూ అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం గొట్లాం గ్రామం రోడ్డువరకు ద్విచక్రవాహనంపై వెళ్లి అక్కడ బండి దిగి ముసిరాం గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావును తుపాకీతో కాల్చి చంపేశానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడని నిందితుడి చినాన్న తెలిపాడు. కాగా తోటల్లోంచి వచ్చిన సమయంలో నిందితుడి వద్ద తుపాకీ లేదని తెలిపాడు. తుపాకీని తోటలోనే ఎక్కడో పడేశాడని పోలీసులు అంచనాకు వచ్చి వెతికేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించారు. ఉదయం నుంచి గ్రామం సమీపంలో గల జీడి, మామిడితోటల్లో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. పలు గ్రామాల్లో గల నిందితుడి బంధువుల ఇళ్లల్లోను తనిఖీ చేశారు. అయినా ఆచూకీ లభించలేదు. కాగా నిందితుడికి హెవీ వెహికల్ డ్రైవర్గా పని చేసిన అనుభవం ఉండడంతో గొట్లాం జంక్షన్ నుంచి ఇతర ప్రాంతానికి వెళ్లి పోయి ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. పోలీసులకు మాత్రం ఈ కేసు సవాల్గా మారింది. కాగా మృతుడు సిమ్మ అప్పారావు కుమారుడు అంజి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించామని సీఐ షన్ముఖరావు తెలిపారు. సవాల్గా తీసుకున్న పోలీసులు -
జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు
పార్వతీపురం రూరల్: ఈనెల 10వరకు డ్రంకెన్ డ్రైవ్, 11 తేదీ నుంచి 17వ తేదీ వరకు అతివేగం, 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు హెల్మెట్ లేకుండా చేసే ప్రయాణాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎీస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందుకు డీజీపీ ఉత్తర్వుల మేరకు ఈ డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న స్టేషన్ల పరిధిలో ముఖ్య కూడళ్లు, రద్దీ ప్రదేశాల వద్ద, బ్లాక్స్పాట్ల వద్ద రోజూ వాహన తనిఖీలు చేపడుతూ ప్రతి వాహనాన్ని ఆపి డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేసి నిర్ధారణ అయితే కేసులు నమోదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారన్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా మంగళవారం పలు చోట్ల వాహన తనిఖీలు, డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు పోలీసులు నిర్వహించారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
స్మార్ట్ మీటర్లపై.. లోకేష్ నోరు మూగబోయిందా?
● వామపక్ష, ప్రజాసంఘాల ఐక్యవేదిక నేతల ఆగ్రహంవిజయనగరం గంటస్తంభం: ఆంధ్రప్రదేశ్ ప్రజలను విద్యుత్ చార్జీలు, అదానీ స్మార్ట్ మీటర్లతో నిలువు దోపిడీ చేస్తున్న చంద్రబాబు నాయకత్వంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ, సీపీఎం, ప్రజా సంఘాల ప్రజా వేదిక నేతృత్వంలో దశల వారీ పోరాటాలు నిర్వహిస్తామని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, తమ్మినేని సూర్యనారాయణలు తెలిపారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం విజయనగరం కలెక్టర్ కార్యాలయం వెనుక ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ దగ్గర ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ..ప్రతిపక్షంలో చంద్రబాబు ఉండి బాదుడే బాదుడు అనే కార్యక్రమాలు చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చార్జీలు పెంచబోమని ఇప్పటికే భారంగా ఉన్న చార్జీలు తగ్గిస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీలు ఇచ్చి నేడు ఆ హామీని విస్మరించడం అంటే ఒడ్డు చేరాక తెప్ప తగలేసిన చందాన ఉందని విమర్శించారు. స్మార్ట్ మీటర్లు పగలగొట్టండని చంద్రబాబు సుపుత్రుడు లోకేష్ ఆనాడు పిలిపునిచ్చారని నేడు అదే స్మార్ట్ మీటర్లు ఇంటింటికి వచ్చి బిగిస్తుంటే లోకేష్ నోరు మెదపకుండా ప్రజలకు నమ్మకద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలను దోచుకోవడానికి పాలకులు పూనుకుంటున్నారన్నారు. అదానీ స్మార్ట్ మీటర్లు రద్దు చేసే వరకు, ట్రూ అప్ చార్జీల విధానాన్ని తొలగించి, అదనపు భారాలు తగ్గించేవరకు, సెకీ ఒప్పందాలు రద్దు చేసే వరకు దశల వారీ పోరాటం చేస్తామని, ఈ పోరాటంలో ప్రజలందరూ సహకరించి ప్రత్యక్ష భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్.రంగరాజు, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు బాయి రమణమ్మ, బూర వాసు, రెడ్డి శంకరరావు, పి.రమణమ్మ, రాము తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్లను రద్దుచేయాలి పార్వతీపురం: ప్రజాభిప్రాయానికి భిన్నంగా బిగిస్తున్న అదానీ స్మార్ట్మీటర్లను వెంటనే రద్దుచేయాలని వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పార్వతీపురం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలపై విద్యుత్ సుంకాల రూపంలో రూ.12,717కోట్ల బాదుడుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లతో శాశ్వత దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అదానీ స్మార్ట్మీటర్లు, సోలార్, విద్యుత్ ఒప్పందాలతో కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఇప్పటికే పెరిగిన విద్యుత్ చార్జీలతో భారం మోయలేక ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. సూపర్ సిక్స్ హామీలు నత్తనడకన సాగుతుండగా, ప్రజలపై భారాలు వేగంగా మోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదాని స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన టీడీపీ నేడు స్మార్ట్మీటర్లను ఎలా బిగిస్తుందని ప్రశ్నించారు. స్మార్ట్మీటర్లు బిగిస్తే బద్దలు కొట్టండి అని స్వయంగా నారా లోకేష్ పిలుపునిచ్చారని, నేడు అందుకు విరుద్ధంగా బిగిస్తున్నారని దుయ్యబట్టారు. స్మార్ట్మీటర్ల బిగింపు కార్యక్రమాన్ని నిలుపుదల చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు జి.వెంకటరమణ, కె.మన్మథరావు, రైతు కూలీ సంఘ నాయకుడు డి.వర్మ, పి.ఈశ్వరరావు, ఎం.కృష్ణమూర్తి, బి.దాసు, పి.సంగం, పి. శ్రీనునాయుడు, బాషా సూరిబాబు, బి.లక్ష్మి, జి.సర్వేశ్వరరావు, రాము, బలరాం, పి.రంజిత్ కుమార్, ఈవీనాయుడు, జి.తులసి, ఎం. గౌరి, బి.జయమ్మ, పి.సన్యాసిరావు, ఎస్.ఉమ తదితరులు పాల్గొన్నారు. -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ105 శ్రీ180 శ్రీ190పుష్పాలంకరణలో పైడితల్లివిజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్లు శాస్త్రోక్తంగా పూజాదికాలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని పసుపు, కుంకుమలు చెల్లించారు. ఆలయం వెనుక వేప, రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. కార్యక్రమాలను ఆలయ అధికారులు పర్యవేక్షించారు. జాతీయ లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోండివిజయనగరం లీగల్: ఈనెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో మోటారు ప్రమాద బీమా కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించిన అధికారులు మోటారు ప్రమాద బీమా కంపెనీల అధికారులు లోక్ అదాలత్లో పాల్గొని పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవ అఽధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీఓలు కీలకంగా వ్యవహరించాలి● జెడ్పీ సీఈఓ సత్యనారాయణ పార్వతీపురం రూరల్: ప్రభుత్వ పథకాలు సక్రమంగా ప్రజలకు క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు ఎంపీడీఓలు కీలకంగా వ్యవహరించాలని జెడ్పీ సీఈఓ సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మండలంలోని పెదబొండపల్లి గ్రామంలో ఎస్డబ్ల్యూపీసీ(చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం) లో ఒకరోజు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంపీడీఓలతో పాటు ఇన్చార్జ్ ఎంపీడీఓలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాల కార్యాచరణ ప్రతి పంచాయతీలో కచ్చితంగా అమలు కావాలన్నారు. నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలని, ఈ మేరకు నిధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి ఎస్డబ్ల్యూపీసీ ఆవశ్యకతను వివరించాలని కోరారు. ఈ శిక్షణలో డీపీఓ కొండలరావుతో పాటు డీఎల్పీఓ తదితరులు పాల్గొన్నారు. నలుగురికి తీవ్ర గాయాలుపార్వతీపురం రూరల్: పట్టణ ప్రారంభంలో అంతర్రాష్ట్ర రహదారిపై స్వీట్ దుకాణం సమీపంలో ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికుల సాయంతో హుటాహుటిన జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. గాయాలైన వారిలో అనిల్, శిల్లా రవికుమార్, కె. శంకరరావు, డి.రాంబాబు ఉన్నారు. -
శాస్త్రం పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెంచాలి
విజయనగరం అర్బన్: విజ్ఞాన శాస్త్రం పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని పెంచాలని ఆ దిశగా వారిలోని ఆలోచనలతో కూడిన ప్రాజెక్టుల రూపకల్పనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ యు.మాణిక్యం నాయుడు అన్నారు. విద్యార్థుల్లో శాస్త్రచైతన్యాన్ని పెంపొందించడం, సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం లక్ష్యంగా ‘ఇన్స్పైర్–మనక్’ కార్యక్రమం నిర్వహణలో భాగంగా సైన్స్ ఉపాధ్యాయుల కోసం స్థానిక పీఎస్ఆర్ఈఎం స్కూల్లో మంగళవారం చేపట్టిన ఒక రోజు ఓరియంటేషన్ తరగతిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఉన్నత పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులు, ప్రాథమికోన్నత పాఠశాల నుంచి మూడు ప్రాజెక్టులు తప్పనిసరిగా ఆన్లైన్లో ఆప్లోడ్ చేయాలని ఆదేశించారు. డీసీఈబీ సెక్రటరీ టి.సన్యాసిరాజు మాట్లాడుతూ ప్రస్తుత సామాజిక, పరిసరాలకు అనుగుణంగా సైన్స్ ప్రాజెక్టులను విద్యార్థులు రూపకల్పన చేయాలని సూచించారు. అనంతరం ఇన్స్పైర్ పోస్టర్, ఏపీఓఎస్ఎస్ ఓపెన్ స్కూల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. రిసోర్స్ పర్సన్లుగా ఎ.భానుప్రకాష్, అరసాడ సురేంద్రనాథ్, ఎస్.ఉమామహేశ్వరరావు, ఎన్జీసీ కోఆర్డినేటర్ బూరి వేణుగోపాల్రావు వ్యవహరించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ కేవీరమణ, జిల్లా సైన్స్ అధికారి టి.రాజేష్, జిల్లా అకడమిక్ కో ఆర్డినేటర్ జి.సన్యాసినాయుడు, డివిజన్ పరిధిలోని సైన్స్ టీచర్లు పాల్గొన్నారు. డీఈఓ యూ.మాణిక్యంనాయుడు -
పది చోరీ కేసుల్లో నిందితుడి అరెస్ట్
పార్వతీపురం రూరల్: పది చోరీ కేసులకు సంబంధించిన నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు పార్వతీపురం రూరల్ సీఐ గోవిందరావు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన సమావేశలో మాట్లాడుతూ జియ్యమ్మవలస మండలం బట్లభద్ర గ్రామానికి చెందిన తామడ సంతోష్ రాత్రి వేళల్లో బయట పడుకునేవారి ఇళ్లల్లోకి వెళ్లి బంగారు ఆభరణాలు, నగదు చోరీకి పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు నిందితుడ్ని బలిజిపేటలో అదుపులోకి తీసుకున్నట్లు సీఐ చెప్పారు. నిందితుడి నుంచి 10తులాల బంగారు ఆభరణాలు, రూ.13వేల నగదుతో పాటు బొబ్బిలి ప్రాంతానికి చెందిన ద్విచక్ర వాహనదారుడిని మోసం చేసి బైక్తో పరారైన కేసులో ఆ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసు పురోగతికి సహకరించిన పోలీసు అధికారులను ఈ సందర్భంగా సీఐ అభినందించారు. సమావేశంలో సీసీఎస్ పోలీసు అధికారులతో పాటు బలిజిపేట, కొమరాడ, సీతానగరం, పార్వతీపురం రూరల్ ఎస్సైలు, సీసీఎస్ సిబ్బంది ఉన్నారు. వివరాలు తెలిపిన రూరల్ సీఐ గోవిందరావు -
19న పీ4 కార్యక్రమం
పార్వతీపురం రూరల్: ఈనెల 19న పీ4 కార్యక్రమం ప్రారంభానికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లతో ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ శ్యామ్ప్రసాద్ పాల్గొన్నారు. ఈ మేరకు స్వచ్ఛందంగా మార్గదర్శులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ కార్యక్రమంలో కలెక్టర్, అధికారులు చేపట్టాల్సిన బాధ్యతలపై సీఎం దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. 2029 నాటికి బంగారు కుటుంబాలను పీ4 కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసి ఆర్థిక అసమానతలను తొలగించేలా తొలి అడుగు వేయబోతున్నామని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 2047 నాటికి ఆర్థిక సమానత్వం సాధించాలని సీఎం పేర్కొన్నట్లు స్పష్టం చేశారు. ఈ సమీక్షలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, ఉప కలెక్టర్లు పి.ధర్మచంద్రారెడ్డి, ఎస్.దిలీప్ చక్రవర్తి, డ్వామా పీడీ కె. రామచంద్రరావు, జిల్లా ప్రణాళిక అధికారి ఆర్కె పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ -
పోలీసు కుటుంబానికి ‘చేయూత’
● మృతిని భార్యకు రూ.1,48,600 చెక్కు అందజేత విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసుశాఖలో ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పని చేసి, ఇటీవల అనారోగ్య కారణంతో మృతి చెందిన నర్సింహ పట్నాయక్ కుటుంబానికి పోలీస్ సిబ్బంది ‘చేయూత‘ కింద రూ.1,48,600 చెక్కును ఆయన సతీమణి స్వర్ణలత పట్నాయక్కు ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖలో పని చేస్తూ ఎవరైనా ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యంతో మరణించిన ఆయా కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ‘చేయూత ‘పథకం ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. శాఖలో ప్రతి సిబ్బంది కొంత నగదును పోగు చేసి, వారి కుటుంబాలకు చేయూతగా అందజేయడం ఎప్పటినుంచో వస్తోందని ఈ తరహా పని చాలా అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఏఓ పి.శ్రీనివాసరావు, ఆఫీసు సూపరింటెండెంట్ టి.రామకృష్ణ, పోలీసు కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఘనంగా గిరిజన వర్సిటీ 7వ వ్యవస్థాపక దినోత్సవం
విజయనగరం అర్బన్: పట్టణంలోని కేంద్రియ గిరిజనయూనివర్సిటీ 7వ వ్యవస్థాపక దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలను ప్రారంభించిన యూనివర్సిటీ ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ తంత్రవాహి శ్రీనివాసన్ మాట్లాడుతూ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, ఉత్తమ బోధనల కోసం యూనివర్సిటీ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది కృషిని ప్రశంసించారు. యూనివర్సిటీ భవిష్యత్ లక్ష్యాలను వివరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన భువనేశ్వర్కు చెందిన రాజకీయ విశ్లేషకుడు, మాజీ అధ్యాపకుడు డాక్టర్ అభిరాం బిశ్వాల్ మాట్లాడుతూ యూనివర్సిటీ స్థిరమైన అభివృద్ధి కోసం అనుసరించాల్సిన అంశాలు, ప్రగతి శీల విధానాలు, విద్యా ప్రమాణాల పరిరక్షణ, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా మార్గదర్శక సూత్రాలను పాటించాలని సూచించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జితేంద్రమోహన్ మిశ్రా యూనివర్సిటీ గణాంకాలను ప్రస్తావిస్తూ మౌలిక వసతులతో కూడిన శాశ్వత క్యాంపస్కు విద్యార్థులను త్వరలో తరలిస్తామన్నారు. అనంతరం వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను ముఖ్యఅతిథి అందజేశారు. డీన్ ఆఫ్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ బొంతు కోటయ్య సమన్వయకర్తగా వ్యవహరించిన కార్యక్రమంలో డీన్ ఆఫ్ సోషల్ హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్ ప్రొఫెసర్ శరత్చంద్రబాబు, పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ దీపక్ మోహన్రావు షిండే, లైబ్రేరియన్ డాక్టర్ శంకర్రెడ్డి కొల్లే, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
గిరిజన మహిళంటే చిన్నచూపా..?
● సర్పంచ్కు ప్రోటోకాల్ ఉండదా.. ● పింఛన్ల పంపిణీకి హాజరు కావద్దా ● అనారోగ్యమని తెలిసీ అవహేళన ● గిరిజన మహిళా సర్పంచ్ ఆవేదనశృంగవరపుకోట: ప్రజాస్వామ్య వ్యవస్థలో గిరిజన ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ వర్తించదా? గిరిజన మహిళనని చిన్నచూపా? అంటూ మండలంలోని మూలబొడ్డవర గ్రామ గిరిజన మహిళా సర్పంచ్ దేవాపురపు మీనా మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రామసచివాలయంలో పలువురు గ్రామస్తులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త పింఛన్ల పంపిణీని కనీసం తనకు చెప్పకుండా చేశారని, ప్రోటోకాల్ గిరిజన సర్పంచ్లకు ఉండదా? అని ప్రశ్నించారు. పంచాయతీ కార్యదర్శి తనను ఎస్టీ మహిళనని లోకువగా చూస్తున్నారని, ఉద్యోగం వదిలేసి రాజకీయాలు చేస్తున్నారని, దీనివల్ల అభివృద్ధి ఆగిపోయి, గ్రామంలో విభేదాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీకి రెగ్యులర్ కార్యదర్శిని ఏర్పాటు చేయాలి. పాతికకు పైగా గిరిశిఖర గ్రామాలున్న రెండు పెద్ద గిరిజన పంచాయతీలైన ధారపర్తి, బొడ్డవరలకు ఒక్క కార్యదర్శిని ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. గిరిజన పంచాయతీలన్న చిన్నచూపుతోనే అధికారులు ఇలా చేస్తున్నారన్నారు. రెండు పంచాయతీలకు ఒక్కరే కార్యదర్శి కావడంతో అక్కడ, ఇక్కడ ఉన్నామని చెబుతూ కాలక్షేపం చేస్తున్నారన్నారు. సర్పంచ్ ఆచూకీ చెబితే బహుమతి ఇస్తామని వాట్సాప్ గ్రూప్స్లో ఎవరో పంపిన మెసేజ్లు ఎంపీటీసీ ఫార్వర్డ్ చేయడం సరికాదని, తప్పు చేస్తే జనం మధ్యనే నిలదీయాలన్నారు. ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రికి వెళ్లానని తెలిసీ ఎంపీటీసీ తనను హేళన చేయడం అత్యంత బాధాకరమన్నారు. రెగ్యులర్ సెక్రటరీని నియమించాలి ఈ సందర్భంగా సచివాలయం నుంచి కార్యదర్శికి సర్పంచ్ మీనా ఫోన్ చేసి తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని అడిగితే కార్యదర్శి కాల్ కట్ చేయడంతో ఇదీ మా కార్యదర్శి పనితీరు చూశారుగా అన్నారు. ఇదే విషయాన్ని కలెక్టర్ గ్రీవెన్స్సెల్లో ఫిర్యాదు చేశామని, అధికారులు చర్యలు తీసుకుని, బొడ్డవర పంచాయతీకి రెగ్యులర్ సెక్రటరీని నియమించాలని కోరారు. సమావేశంలో గ్రామపెద్ద డి.సన్యాసినాయుడు మాట్లాడుతూ ఆర్నెలలుగా సర్పంచ్ పని చేయకపోతే ఎంపీటీసీ చేశారా? జనం మధ్య తేల్చండి. మేము పనిచేయలేదని, అందుబాటులో లేమని చెబితే ఇప్పుడే సర్పంచ్తో రాజీనామా చేయిస్తానన్నారు. పనులకు సర్పంచ్ కావాలి కానీ పింఛన్లు పంపిణీ చేసినప్పుడు ప్రోటోకాల్ అవసరం లేదా? గిరిజనులం అని చులకన చేస్తున్నారని వాపోయారు. 90శాతం ఓటర్లు గిరిజనులు, దళితులు, బీసీలు ఉన్నా ఇక్కడ రాజరికం చేయాలనుకోవడం, అధికారులను బెదిరించి గిరిజన నేతలను ఇబ్బందులు పెట్టడం సరికాదని గిరిజన సంఘం నేత జె.గౌరీష్ అన్నారు. -
స్పందించిన అధికారులు
జియ్యమ్మవలస రూరల్: ఈ నెల 5న కొండసిరిపి పాఠశాల ఉపాధ్యాయురాలు విధులకు గైర్హాజరు కావడంపై విచారణ జరుపుతామని గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు ఆర్.కృష్ణవేణి తెలిపారు. ‘మా టీచర్ బడికి రాలేదు’ శీర్షికకు మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు జియ్యమ్మవలస ఎంఈఓ, ఆర్ఆర్బీపురం స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం కొండసిరిపి పాఠశాలను సందర్శించారు. కుమారుడి ఆరోగ్యం బాగోలేకపోవడంతో హుటాహుటిన సెలవుపై వెళ్లినట్లు విచారణలో తేలిందన్నారు. ముందస్తు అనుమతి లేకుండా వెళ్లినందుకు ఆమెకు మెమో జారీచేసి సంజాయిషీ కోరగా, ఇకపై ఇటువంటివి పునరావృతం కావని ఆమె తెలియజేసినట్టు వివరించారు. -
ఆదివాసీ దినోత్సవానికి పక్కాఏర్పాట్లు
సీతంపేట: సీతంపేట, పాతపట్నంలలో ఈ నెల 9న నిర్వహించనున్న ఆదివాసీ దినోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి ఆదేశించారు. అధికారులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఉత్సవాలకు వచ్చే గిరిజనులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. భోజన ఏర్పాట్లు బాగుండాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు, సీఐ చంద్రమౌళి, డీడీ అన్నదొర, ఎస్ఐ అమ్మన్నరావు, పీహెచ్ఓ గణేష్, ఐటీడీఏ పరిపాలనాధికారి సునీల్, డిప్యూటీ ఈఓ రామ్మోహనరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయపార్వతి, ఏఎంఓ కోటిబాబు, తదితరులు పాల్గొన్నారు. -
రైతన్నకు సాగు భరోసా ఏదీ?
సాలూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతన్నకు సాగుభరోసా కరువైందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు పీడిక రాజన్నదొర అన్నారు. సాలూరు పట్టణంలో స్థానిక విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడారు. చంద్రబాబునాయుడు 2024 జూన్ నుంచి రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలుచేస్తామని మేనిఫెస్టోలో పేర్కొని 2025లో అమలుచేశారన్నారు. అదికూడా రూ.20 వేలు ఇస్తామని చెప్పి తొలివిడతగా కేవలం రూ.5వేలు మాత్రమే వేశారన్నారు. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ రైతుభరోసా పథకం కింద 53లక్షల58 వేల మందికి లబ్ధి చేకూరితే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో అన్నదాత సుఖీభవ కింద 46.85 లక్షల మంది రైతులకు మాత్రమే ఇస్తున్నట్లు ప్రకటించారన్నారు. మిగిలిన 6.73 లక్షల మంది రైతులు ఏమయ్యారని, సాగు విడిచి వలస వెళ్లిపోయారా అని ప్రశ్నించారు. చాలామంది రైతుల ఖాతాలకు పెట్టుబడి సాయం ఇంకా పడలేదన్నారు. నాడు విమర్శించిన మీరు నేడు ఏం చేస్తున్నారు? గత సీఎం జగన్మోహన్రెడ్డి రైతుభరోసా కింద ఏడాదికి రూ.13,500 అందిస్తే... రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం డబ్బులు ఇవ్వాలని నాడు విమర్శించిన చంద్రబాబు నేడు అన్నదాత సుఖీభవ కింద ఎందుకు రూ. 20 వేలు ఇవ్వడంలేదని రాజన్నదొర ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబుకు సిగ్గులేదని అనాలా అంటూ విమర్శించారు. గత ప్రభుత్వం ఏడాదికి రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తామని చెప్పి మరో రూ.1000 పెంచి రూ.13,500 అందజేసిందన్నారు. ఉచిత పంటల బీమా పథకంతో రైతాంగాన్ని ఆదుకుందన్నారు. డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేసిందన్నారు. యూరియా కోసం రైతులును రోడ్డెక్కించిన ఘనత ఎవరిది? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతులకు ఎరువుల కొరత లేదని, ఆర్బీకేల వద్ద ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉండేవని రాజన్నదొర తెలిపారు. నేటి కూటమి పాలనలో రైతులకు ఎరువుల దొరకక ధర్నాలు చేయాల్సి వస్తోందన్నారు. యూరియా కోసం రైతులను రోడ్డెక్కించిన ఘనత ఎవరిదో రైతులే చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర -
బాబూ.. మేము మోసపోయాం
బాబూ.. నీ మాయ మాటలు నమ్మి మోసపోయాం... సంక్షేమ పథకాలకు దూరమయ్యాం.. ఇక ఎన్నడూ నీ మాటలు నమ్మి మోసపోబోమంటూ జియ్యమ్మవలస మండలం గవరంపేట పంచాయతీ ప్రజలు ప్లకార్డులు ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కోట రమేష్ నాయుడు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమంలో అధికమంది పాల్గొన్నారు. చంద్రబాబు మాటలు నమ్మడం వల్ల ఏ మేరకు నష్టపోయామన్నది తెలియజేశారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడి్డ్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతీ పథకంలోనూ కోతపెడుతూ.. ఇబ్బందులకు గురిచేస్తూ పేదలకు సంక్షేమాన్ని దూరం చేస్తున్నారని వాపోయారు. – జియ్యమ్మవలస రూరల్ -
ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు
● డా.డీవీజీ శంకరరావు పార్వతీపురం రూరల్: ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా తనకు అవకాశం ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి డాక్టర్ డీవీజీ శంకరరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం కలిసి ముచ్చటించారు. ఎస్టీ కమిషన్ చైర్మన్గా అందించిన సేవలపై జగన్మోహన్ రెడ్డి తనను అభినందించినట్లు డీవీజీ శంకరరావు తెలిపారు. సెల్టవర్ల ఏర్పాటుకు ఆదేశం ● కలెక్టర్ శ్యామ్ప్రసాద్ పార్వతీపురం రూరల్: జిల్లాలో సెల్టవర్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జియో, బీఎస్ఎన్ఎల్ టవర్ల ఏర్పాటుపై ఎంపీడీఓలు, సంబంధిత అధికారులతో తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో మంగళవారం సమీక్షించారు. ఇప్పటికే ప్రగతిలో ఉన్న టవర్ల పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రధానమైన రోడ్ల పనులను గుర్తించి నిధులు మంజూరు చేయాలని డ్వామా పీడిని ఆదేశించారు. సమావేశంలో జేసీ ఎస్.ఎస్.శోభిక, ఐటీడీఏ పీఓలు అశుతోష్ శ్రీవాత్సవ, సి.యశ్వంత్కుమార్ రెడ్డి, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, డీఎఫ్ఓ జీఏపీ ప్రసూన, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖల ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఎంపీడీవో కార్యాలయానికి టీడీపీ ఫ్లెక్సీ జియ్యమ్మవలస రూరల్: కూటమి నేతలు బరితెగించారనేందుకు ఈ చిత్రమే నిలువెత్తు సాక్ష్యం. జియ్యమ్మవలస ఎంపీడీఓ కార్యాలయానికి టీడీపీ నేతల చిత్రాలతో కూడిన ఫ్లెక్సీని కట్టడం విమర్శలకు తావిస్తోంది. ఇది ప్రభుత్వ కార్యాలయమా? లేదా టీడీపీ కార్యాలయమా అంటూ వివిధ పనులపై ఎంపీడీఓ కార్యాలయానికి వస్తున్నవారు ప్రశ్నిస్తున్నారు. ఏం కష్టమొచ్చిందో ఏమో..? పార్వతీపురం రూరల్: ఆ కుటుంబానికి ఏం కష్టమొచ్చిందో ఏమో? ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులతో కలిసి దంపతులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. రైలు కింద పడి ప్రాణాలు తీసుకోవాలనుకున్నారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామానికి చెందిన దంపతులు తమ ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు బెలగాం రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలపై మంగళవారం నిలబడ్డారు. వీరిని గమనించిన రైల్వేపోలీసులు వెంటనే అప్రమత్తమై మందలిస్తూ ప్లాట్ఫాంపైకి తీసుకొచ్చారు. కౌన్సెలింగ్ చేశారు. వారి ఆవేదన విన్నారు. జీవితంలో ప్రతీ ఒక్కరికీ కష్టాలు తప్పవని, వాటిని అధిగమిస్తేనే మంచి జీవితం సొంతమవుతుందని నచ్చజెప్పారు. అనంతరం సివిల్ పోలీసులకు అప్పగించారు. సకాలంలో స్పందించి నలుగురి ప్రాణాలు కాపాడిన రైల్వే పోలీసులను ప్రయాణికులు, రైల్వే అధికారులు అభినందించారు. -
క్రీడాకారులతో ఆటలు..!
● జిల్లా క్రికెట్లో చక్రం తిప్పుతున్న సెలక్షన్ కమిటీ సభ్యుడు ● పొరుగు జిల్లాలు, రాష్ట్రాల క్రీడాకారులకు పెద్దపీట ● డమ్మీగా మారిన చైర్మన్, కార్యదర్శులు ● అసోసియేషన్ సభ్యులను ఖాతరు చేయని సెలెక్టర్ ● జిల్లా క్రీడాకారులకు న్యాయం చేయాలంటూ మంత్రికి మొరపెట్టుకున్న తల్లిదండ్రులు ● నిమ్మకునీరెత్తినట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ విజయనగరం: జిల్లా క్రికెట్లో ఉమ్మడి విజయనగరం జిల్లా క్రీడాకారుల ప్రాతినిధ్యం తగ్గిపోతోంది. జిల్లా జట్ల ఎంపికలో సెలక్షన్ కమిటీ సభ్యుడి ఒంటెత్తు పోకడలతో జిల్లా క్రీడాకారులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దశాబ్ద కాలంగా ఇదే తరహా వ్యవహారం నడుస్తున్నప్పటికీ, ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ పెద్దలు జిల్లా క్రీడాకారులకు న్యాయం చేస్తామంటూ ప్రకటనలు చేశారు. సంబంధిత శాఖాధికారులతో పాటు, అసోసియేషన్ ప్రతినిధులతో స్థానిక ఎమ్మెల్యే సమీక్ష చేశారు. అయితే ఏడాది కాలమైనా అదే పరిస్థితి కొనసాగడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా క్రికెట్లో కీలక స్థానంలో ఉన్న కార్యదర్శితో తనకున్న స్నేహాన్ని ఉపయోగించుకుని జట్ల ఎంపికలో తన మాటే చెల్లుబాటయ్యేలా సెలక్షన్ కమిటీ సభ్యుడు వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు తల్లిదండ్రులు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వద్ద ఏకరువు పెట్టినట్లు సమాచారం. ఇప్పటికై నా దేశానికి ప్రాతినిధ్యం వహించిన విజయనగరం క్రికెటర్ సర్ విజ్జి నడయాడిన జిల్లాలో స్థానిక క్రీడాకారులకే చోటు కల్పించాలని, ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కృషి చేయాలని స్థానిక క్రీడాకారులు, క్రీడాభిమానులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. అన్నీ వట్టి మాటలేనా? కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఆరేడు నెలలకు జిల్లా క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. చైర్మన్గా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కార్యదర్శిగా పి.సీతారామరాజు, ఇతర కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. అయితే నూతన కార్యవర్గం ఏర్పడిన సమయంలో సభ్యులు, అసోసియేషన్ పెద్దలు స్థానిక క్రీడాకారులకే ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పిన మాటలు వట్టి మాటలు గానే మిగిలిపోయాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2025లో అన్ని విభాగాల జట్ల ఎంపికలో స్థానికేతర క్రీడాకారులకే తగిన ప్రాధాన్యం దక్కినట్లు తల్లిదండ్రులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇటీవల అండర్–16 జట్టుకు ఎంపికై న 18 మంది జిల్లా జట్టు క్రీడాకారుల్లో సుమారు 13 మంది పొరుగు జిల్లాలకు చెందిన క్రీడాకారులే ఉన్నారంటే ఇతర జిల్లాల క్రీడాకారుల హవా ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అలాగే అండర్ –19, అండర్– 23, సీనియర్ విభాగంలోనూ వారి ప్రాతినిధ్యం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. గుర్రుగా అసోసియేషన్ సభ్యులు జిల్లా సెలక్షన్ కమిటీ సభ్యుల తీరుపై అసోసియేషన్ లోని కొంతమంది సభ్యులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. సెలక్షన్ కమిటీ ఒంటెత్తు పోకడలతో విసుగు చెందిన అసోసియేషన్ సభ్యులు సైతం తల్లిదండ్రులతో పాటు మంత్రి వద్దకు వెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం.విజయనగరం కాదు.. విశాఖ ‘బి’ జట్టు పేరు సార్థకం విజయనగరం జిల్లా జట్టులో ఒకప్పుడు క్రికెట్ ఆడే క్రీడాకారులు లేక పొరుగు జిల్లాల నుంచి క్రీడాకారులు వచ్చి జిల్లా తరఫున ఆడేవారు. నాటి నుంచి క్రికెట్ వర్గాల్లో విజయనగరం జిల్లా జట్టును విశాఖ బి జట్టుగా పిలిచేవారు. అయితే జిల్లా క్రీడాకారులకు క్రికెట్పై అవగాహన పెరగడంతో ఎక్కువ సంఖ్యలో జిల్లా క్రీడాకారులు ఎక్కువమంది క్రికెట్ ను ప్రొఫొషన్గా తీసుకున్నారు. దీంతో ఉమ్మడి విజయనగరం జిల్లాలో అధిక సంఖ్యలో క్రీడాకారులు తయారయ్యారు. అయినా గడిచిన మూడు, నాలుగేళ్లుగా విజయనగరం జిల్లా జట్టులో వలస పక్షుల ప్రాతినిధ్యం భారీ స్థాయిలో పెరిగిపోయింది. ప్రతి ఏటా అండర్–12, అండర్–14, అండర్–16, అండర్–19, అండర్–23, సీనియర్స్ విభాగాల్లో ఎంపికలు జరిగితే ప్రతి విభాగంలో సగానికి పైగా పొరుగు జిల్లా క్రీడాకారులకే ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు.దర్జాగా వస్తారు.. జట్టులో చోటు ఎగరేసుకు పోతారు పొరుగు జిల్లాల క్రీడాకారులు ఇక్కడ వారి సలహాతోనే జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలలో చేరుతారు. వారందించే స్టడీ సర్టిఫికెట్ ఆధారంగా సదరు సెలెక్టర్ వారిని జట్టుకు ఎంపిక చేస్తారు. అయితే వారు పాఠశాలకు వచ్చింది లేదు..వెళ్లిందీ లేదు. ఎందుకంటే ఇక్కడికి ప్రతిరోజు పాఠశాలకు గాని, కళాశాలకు గానీ వస్తే, జిల్లా కేంద్రంలోని విజ్జి స్టేడియంలో ప్రతిరోజు నిర్వహించే ప్రాక్టీస్ సెషనన్కు ఎందుకు రారని స్థానిక క్రీడాకారులు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. స్థానికేతర క్రీడాకారుల తల్లిదండ్రులు ఆధార్ ఇతరత్రా సర్టిఫికెట్లు పొరుగు జిల్లాలోనే ఉంటాయి. వీరివి మాత్రం అన్ని సర్టిఫికెట్లు ఇక్కడే ఉన్నట్లు సెలక్షన్ సమయంలో అందిస్తుంటారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిబంధనలు పాటిస్తున్నాం:జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి జట్టు ఎంపికల్లో నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నాం. మూడేళ్ల పాటు జిల్లా పరిధిలో చదివే వారికి అవకాశం కల్పిస్తున్నాం. క్రీడాకారుడి స్టడీ సర్టిఫికెట్, ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తున్నాం. వాటి ప్రకారమే ఎంపికలకు అనుమతిస్తున్నాం. ఎంపిక ప్రక్రియలో ఎటువంటి అవినీతికి తావులేకుండా చూస్తున్నాం. – పి.సీతారామరాజు, జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి, విజయనగరం. -
ఆనకట్టవద్ద గోతిలో పడి వ్యక్తి మృతి
జామి: మండలంలో జామి ఆనకట్టవద్ద గోతిలో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆనందపురం మండలం బొడ్డుపాలెం గ్రామానికి చెందిన సాడి లక్ష్మణరెడ్డి(38) తన స్నేహితులతో కలిసి స్నేహితుల దినోత్సవం సందర్భంగా జాగరం గెడ్డనీరు జామి గోస్తనినదిలో కలిసే ప్రాంతం వద్దకు ఆదివారం సాయంత్రం వచ్చి సరదాగా గడిపాడు. ఈ క్రమంలో బహిర్భుమికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి ఆనకట్టవద్ద ఉన్న గోతిలో పడిపోయాడు. స్ధానికులు, రెస్క్యూ బృందం గాలించగా సోమవారం ఉదయం లక్ష్మణరెడ్డి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై మృతుడి భార్య అరుణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జామి ఎస్సై వీరజనార్దన్ కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి..భోగాపురం: మండలంలోని రావాడ గ్రామానికి చెందిన బుగత ఈశ్వరరావు(47) తగరపువలసలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించినట్లు ఎస్సై పాపారావు తెలిపారు. దీనిపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రావాడ గ్రామానికి చెందిన ఈశ్వరరావుకు భార్య గోవిందమ్మతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమధ్య కాలంలో తల్లికి వందనం ద్వారా భార్య బ్యాంకు ఖతాలో డబ్బులు పడ్డాయి. అందులో నుంచి కొంత డబ్బులు ఇవ్వమని భర్త ఈశ్వరరావు భార్యపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన ఈశ్వరరావు నెల 2వ తేదీన గ్రామానికి సమీపంలో ఉన్న భాష్యం లేఅవుట్లోకి వెళ్లి పురుగు మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే తగరపువలస ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. భార్య గోవిందమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై పాపారావు కేసు నమోదు చేశారు. -
పరిమళించిన మానవత్వం
రాజాం సిటీ: మానవతా సంస్థ సభ్యుల్లో మానవత్వం పరిమళించింది. రోడ్డు పక్కన గాయాలతో బాధపడుతున్న అనాథ మహిళకు వైద్యసేవలు అందించి మానవత్వం చాటుకున్నారు. స్థానిక బొబ్బిలి రోడ్డులోని ఆర్సీఎం చర్చి సమీపంలో అనాథ మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఓ మూలన ఉన్న మహిళను స్థానికులు గుర్తించి మానవతా సంస్థ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే సభ్యులు ఉల్లాకుల నీలకంఠేశ్వరయాదవ్, రెడ్క్రాస్ ప్రతినిధి పెంకి చైతన్య, కిరణ్లు స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత అనాథ మహిళను ప్రత్యేక వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. అయితే ఆమె తీవ్రంగా గాయపడడంతో శస్త్రచికిత్స పడుతుందని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని వైద్యులు తెలిపారని మానవతా సంస్థ సభ్యులు తెలిపారు. దీంతో పలువురు పట్టణవాసులు వారి సేవలను కొనియాడారు. -
మీరిచ్చిన హామీలు గుర్తు చేయడం తప్పా..?
సాలూరు: టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తుచేయడం తప్పా? మీరిచ్చిన హామీలను గుర్తుచేస్తున్న మాపై తప్పుడు విమర్శలు చేస్తారా? అంటూ మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర మండిపడ్డారు. ఈ మేరకు సాలూరు పట్టణంలోని 2,4,5 వార్డుల్లో వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు మున్సిపల్ వైస్చైర్మన్ వంగపండు అప్పలనాయుడు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటి కార్యక్రమంలో రాజన్నదొర పాల్గొన్నారు. ఈ క్రమంలో వార్డుల్లో తిరిగిన ఆయనకు అడుగడుగునా స్థానిక మహిళలు, ప్రజలు హారతులు పట్టి స్వాగతం పలికారు. ఈ ఏడాది పాలనలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయలేదని వాపోతూ , తమ సమస్యలను ప్రజలు రాజన్నదొర ముందు ఏకరువు పెట్టారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను మీకు ఈ పాంప్లెట్ల ద్వారా ఇస్తున్నామని, క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసినా అవి వస్తాయని ప్రజలకు రాజన్నదొర తెలిపారు. ఆడబిడ్డ నిధి అమలు చేసేదెప్పుడు? 2024 ఎన్నికల్లో సుమారు 2 కోట్ల 10 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారని తెలిసిందని అందులో 60 ఏళ్లు పైబడిన వారు సుమారు 60 వేల మందిని తీసేసినా కనీసం కోటి 50 లక్షల మంది మహిళలకు అడబిడ్డ నిధి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. నేడు ఆ హామీని అమలుచేయకుండా ప్రజలను మోసం చేసే పద్ధతి సరైంది కాదన్నారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పక అమలుచేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఏ అన్యాయం జరిగినా, ఏ కష్టమొచ్చినా, ఓ సోదరుడిగా, మీ ఇంటి పెద్దకొడుకుగా అండగా నేను ఉంటానని రాజన్నదొర పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 5 వ వార్డులో అంబేడ్కర్ విగ్రహానికి రాజన్నదొర పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు గిరిరఘు, సింగారపు ఈశ్వరరావు, గులిపల్లినాగ, నిమ్మకాయల సువర్ణమ్మ, తాడ్డి లక్ష్మి, శంకరరావు, యశోదకృష్ణ, రౌతు చిన్నయ్య, శ్రీను, చిన్నారావు, పిరిడిరామకృష్ణ, మజ్జి అప్పారావు, కాకి పాండురంగారావు, కొల్లి వెంకటరమణ, హరిబాలాజీ తదితరులు పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర -
అర్జీల పరిష్కారానికి శ్రద్ధ తీసుకోవాలి
పార్వతీపురం రూరల్: ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధికారులు పనిచేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం 138 అర్జీలను కలెక్టర్తో పాటు పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, డీఆర్ఓ కె. హేమలత కేఆర్సీ ఎస్డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి స్వీకరించారు. నిర్దేశించిన గడువులోనే పెండింగ్లు లేకుండా అర్జీలను పరిష్కరించాలని అధికారుకు ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లాలోని పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.వేగంగా సమస్యల పరిష్కారం సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రధాన ఉద్దేశమని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న పలు స్టేషన్ల పరిధిలలో నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి 13 ఫిర్యాదులు స్వీకరించి, అర్జీదారులతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు అంశాలను పరిశీలించి, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలు వాస్తవాలైనట్లయితే చట్ట పరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని, తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ సుధాకర్, ఎస్సై ఫకృద్దీన్ తదితర సిబ్బంది ఉన్నారు. ఐవీఆర్ఎస్ సంతృప్తికరంగా ఉండాలిప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలపై అర్జీదారుల సంతృప్తిస్థాయి పెరగాల్సి ఉందని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. సమస్యల పరిష్కార విషయమై ఐవీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం చేసే సర్వేలో శతశాతం సంతృప్తికరంగా ఉన్నట్లు అర్జీదారుల స్పందన ఉండాలని స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఈ సర్వేలో శతశాతం సంతృప్తి చెందకపోతే సంబంధిత అధికారులను బాధ్యులుగా చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్ఎస్, పీ4, పీఎం సూర్యఘర్, ఈపీటీఎస్ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఐటీడీఏ పీఓలు అశుతోష్శ్రీవాత్సవ, సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ కె. హేమలత, ఎస్డీసీలు పి. ధర్మచంద్రారెడ్డి, ఎస్. దిలీప్ చక్రవర్తి, డీఆర్డీఏ పీడీ ఎం. సుధారాణి, డీఈఓ బి. రాజ్కుమార్, డీఐఈఓ వై. నాగేశ్వరరావు, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్. తేజేశ్వరరావు, ఈపీడీసీఎల్ ఎస్ఈకె మల్లికార్జునరావు, డీఎంఅండ్హెచ్ఓ డా. భాస్కరరావు, డీఏ హెచ్ఓ డా. మన్మధరావు, డీబీసీ డబ్ల్యూఓ అప్పన్న, డీఆర్డబ్ల్యూఎస్ఈఓ ప్రభాకరరావు, సీడీపీఓ శాంతి భవాని, వివిధ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
ఏకలవ్య పాఠశాలను సందర్శించిన నోడల్ అధికారి
మక్కువ: మండలంలోని అనసభద్ర గ్రామం సమీపంలోని ఏకలవ్య పాఠశాలను నోడల్ అధికారి, డిప్యూటీ ఎంపీడీవో ఎన్.సూర్యనారాయణ సోమవారం సందర్శించారు. పాఠశాలలోని విద్యార్థులు తరగతి గదులను, విద్యార్థులు హాజరు, భోజనమెనూ, పాఠశాల పరిశుభ్రతను పరిశీలించారు. అలాగే మరుగుదొడ్లు అసంతృప్తికరంగా ఉన్నట్లు గుర్తించారు. పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మించాల్సి ఉందన్నారు. ఆర్వో తాగునీరు అవసరమని, పాఠశాల ఆవరణ చదును చేయాల్సి ఉందని, ఇన్వర్టర్లు, జనరేటర్ అవసరమున్నట్లు డిప్యూటీ ఎంపీడీవో సూర్యనారాయణ గుర్తించారు. పై సమస్యలను ఉన్నతాధికారులకు నివేదిస్తానని ఆయన తెలిపారు.రాష్ట్ర స్థాయి పోటీలకు పార్వతీపురం యోగా సాధకులుపార్వతీపురం రూరల్: జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాస్థాయి యోగా పోటీలు ముగిశాయి. ఈ మేరకు పది నుంచి ఏబై ఏళ్ల వయస్సు గల క్రీడాకారులు ప్రతిభ చూపించారు. ఈ సందర్భంగా వారికి సోమవరం ప్రశంసాపత్రాలు, పతాకాలు అందించారు. ఈ సందర్భంగా పోటీల పరిశీలకుడు భాస్కరరావు మాట్లాడుతూ గెలుపొందిన విజేతలకు ఈ నెల 21నుంచి 24 వరకు తాడేపల్లె గూడెంలో రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయన్నారు. గంజాయి నిందితుడి అరెస్టుశృంగవరపుకోట: గంజాయి రవాణా చేస్తున్న నిందితుడిని కేరళ రాష్ట్రంలో పట్టుకుని కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్.కోట సీఐ వి.నారాయణమూర్తి చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్లో కేరళ రాష్ట్రానికి చెందిన బొలెరో వాహనంలో ఇద్దరు వ్యక్తులు 117కిలోల గంజాయితో పట్టుబడ్డారన్నారు. ఈ కేసులో కేరళ నుంచి వాహనాన్ని పంపి గంజాయి తెమ్మని చెప్పిన కేరళ రాష్ట్రం, త్రిశూర్ జిల్లా కట్టూర్ పట్టణానికి చెందిన శ్రీజిత్ను కేరళ పోలీసుల సహకారంతో పట్టుకుని అరెస్టు చేసి అక్కడి కోర్టులో ప్రవేశపెట్టి, కోర్టు ఆదేశాల మేరకు ఎస్.కోట తీసుకువచ్చి కోర్టులో ప్రవేశపెట్టినట్లు చెప్పారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు సెంట్రల్ జైలుకు తరలించినట్లు సీఐ తెలిపారు. గంజాయి అక్రమ రవాణా కేసుల్లో కేవలం పట్టుబడిన నిందితులపైనే కాకుండా, ప్రోత్సహిస్తున్న మూలాలను వెదికి పట్టుకుని కేసులు పెడుతున్నామన్నారు. మృతుడి ఆచూకీ లభ్యంవేపాడ: మండలంలోని నీలకంఠరాజపురం గ్రామంలో రైవాడ కల్వర్టు వద్ద గుర్తుతెలియని వాహానం ఢీకొనడంతో మృతి చెందిన వ్యక్తి ఆచూకీ తెలిసినట్లు వల్లంపూడి ఎస్సై సుదర్శన్ తెలిపారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శనివారం ఆర్దరాత్రి రైవాడ కాలువ కల్వర్టువద్ద గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన విషయం విదితమే. ఈ సంఘటనపై పలు పత్రికల్లో వచ్చిన వార్తలతో కుటుంబసభ్యులు గుర్తించి వల్లంపూడి స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గజపతినగరానికి చెందిన పీలా శివశంకర్ (41) ప్రమాదంలో మృతిచెందినట్లు చెప్పారు. సమాచారం తెలుసుకున్న శివశంకర్ భార్య పార్వతి స్టేషన్కు వచ్చినట్లు తెలిపారు. మృతిచెందిన శివశంకర్ విశాఖలోని మధురవాడలో ఆయుష్ డిపార్ట్మెంట్లో వాహన డ్రైవర్గా పనిచేస్తున్నాడని చెప్పారు. రెండోతేదీన ఎస్.కోట వివేకానంద కాలేజీలో ఇంటర్ చదువుతున్న కుమార్తెను చూడడానికి వెళ్లి తిరిగి వస్తుండగా నీలకంఠరాజపురం రైవాడ కల్వర్టు వద్ద ప్రమాదంలో మృతిచెందినట్లు తెలిపారు. మృతుడు శివశంకర్కు భార్య పార్వతి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పార్వతి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. ఢీ కొన్న గుర్తుతెలియన వాహనంపై బృందాలను ఏర్పాటుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మా టీచర్ రాలేదు..
చిత్రంలో పాఠశాల గేటు ఎక్కి ప్రమాదకర స్థితిలో ఆడుకుంటున్నది జియ్యమ్మవలస మండలం కొండసిరిపి జీపీఎస్ విద్యార్థులు. పాఠశాల సమయంలో అడుకుంటున్నారేమిటని చిన్నారులను ప్రశ్నిస్తే టీచర్ రాలేదంటూ సమాధానమిచ్చారు. సీఆర్టీ సోమవారం పాఠశాలకు రాకపోవడంతో చిన్నారులు ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలో ఆడుకుంటూ ఇంటిబాట పట్టారు. వాస్తవంగా సీఆర్టీ సెలవు పెడితే ఎంఈఓ మరొక టీచర్ను పాఠశాలకు పంపించాలి. ఇక్కడ ఆ నిబంధన అమలు కావడం లేదు. టీచర్ సెలవుపెట్టినప్పుడు తరగతులు సాగడంలేదని, ఎప్పడు తరగతులు ఉంటాయో లేదో తెలియడంలేదని, చిన్నారుకు బోధన సాగడంలేదని గ్రామస్తులు తెలిపారు. – జియ్యమ్మవలస రూరల్ -
అర్జీదారులకు రుచికర భోజనం
● కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు వచ్చే ప్రజల కోసం ఉచితంగా ఏర్పాటు ● దాతల సహకారంతో నిర్వహణ: కలెక్టర్ పార్వతీపురం రూరల్: ప్రతి సోమవారం జిల్లా నలుమూలల నుంచి తమ సమస్యల పరిష్కారం కోరుతూ వందలాది మంది అర్జీదారులు కలెక్టరేట్ కు వస్తుంటారు. ఉన్నతాధికారులను తమ గోడు వినిపించి, వినతిపత్రాలు అందిస్తారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో కొండకోనలు, మారుమూల పల్లెల నుంచి వేకువ జామునే బయల్దేరి, వందలా ది కిలోమీటర్లు ప్రయాణించి జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. తిరిగి చీకటిపడ్డాకే ఊళ్లకు చేరేది. రాకపో కలకు ప్రయాణ ఖర్చులే కాక.. భోజనానికీ ఒక్కో సారి ఇబ్బందులు పడుతుంటారు. బయట హోటళ్లలో తినాలంటే ఒక్కొక్కరికీ రూ.60 నుంచి రూ. 100 వరకు ఖర్చు పెట్టాల్సిందే. అంత వ్యయం పెట్టుకోలేక ఆకలితోనే ఎంతోమంది తిరుగు ప్రయాణమవుతుంటారు. ఇటువంటి వారి ఇబ్బందులను గుర్తించిన కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్.. దూర ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులకు రుచి, శుచికర ఆహారాన్ని ఉచితంగానే అందించాలని నిర్ణయించారు. కలెక్టరేట్ ఆవరణలో సోమవారం ఉచి త భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐటీడీ ఏ పీవో అశుతోష్ శ్రీవత్సవ, జిల్లా రెవెన్యూ అధికారిణి హేమలలతో కలిసి కాసేపు అర్జీదారులకు భోజ నం వడ్డించారు. పేదల ఆకలి తీర్చాలనే.. ప్రతి సోమవారం కలెక్టరేట్కు దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది పేదలు వినతి పత్రాలు ఇవ్వడానికి వస్తుంటారు. ఆకలితోనే తిరుగు ప్రయాణమై, ఏ రాత్రికో ఇంటికి చేరుకుంటా రు. అటువంటి వారికోసమే ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇక మీదట అర్జీదారులు ఉచితంగానే ఇక్కడ భోజనం చేసి వెళ్లొచ్చు. ప్రతి వారం సుమారు 500 మంది వరకూ తిని, వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకోసం దాతలు ముందుకు రావాలి. ఎవరైనా వారికి తోచిన రీతిలో సహాయం అందిస్తే అన్నదాన కార్యక్రమానికి తోడ్పడినవారవుతారు. – ఎ.శ్యామ్ప్రసాద్, కలెక్టర్ -
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం
సీతంపేట: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఈ నెల 9న ఘనంగా నిర్వహించనున్నట్టు ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో సీతంపేట, భామిని, వీరఘట్టం, పాలకొండ మండలాల ప్రజలతో సీతంపేట అడ్వంచర్ పార్కు లో ఉదయం 10 గంటలకు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మండలాలకు పాతపట్నం మార్కె ట్ యార్డు ఆవరణలో అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆదివాసీ దినోత్సవం నిర్వహిస్తా మని పేర్కొన్నారు. సాగునీటి కోసం రైతుల ఆందోళన పాలకొండ: ఖరీఫ్ సీజన్లో వరి ఉభాలు ఆరభమైనా తోటపల్లి ఎడమ కాలువ నుంచి ఆయకట్టుకు సాగునీరు అందడంలేదంటూ రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. జలవనరు ల శాఖ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బంటు దాసు, రైతులు కండాపు ప్రసా దరావు, వారాడ సుమంత్నాయుడు మాట్లాడు తూ ఈ ఏడాది ఖరీఫ్లో ఇంతవరకు సాగునీరు అందకపోయినా ప్రభుత్వం స్పందించడంలేదన్నారు. జూన్ 4వ తేదీన రైతులతో జాయింట్ సమావేశం ఏర్పాటు చేసి షట్టర్లు బాగుచేస్తామ ని హమీ ఇచ్చి ఇంతవరకు చేపట్టలేదని వాపోయారు. వర్షాభావంతో వరి నాట్లు ఎండిపోతున్నాయని, వెంటనే సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సాగునీరు అందించకుంటే క్రాప్ హలీడే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎస్సై ప్రయోగమూర్తి రైతుల కు సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు. అనంతరం రైతులు జలవనరుల శాఖ అధికా రులకు వినతి పత్రం అందజేశారు. దీనిపై డీఈఈ స్పందిస్తూ రెండు రోజుల్లో పాలకొండ లోని భూములకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో దావాల రమణారావు, ఆయకట్టు రైతులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు. ఎరువుల కోసం నిరసన సాలూరు: ఖరీఫ్ సీజన్లో సాగుచేసిన పంటలకు వేసేందుకు యూరియా దొరకడం లేదు.. బయట మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు.. ఎరువును ఎప్పుడు పంపిణీ చేస్తారో చెప్పాలంటూ కురుకుట్టి రైతుభరోసా కేంద్రం వద్ద సోమవారం గిరిజన రైతులు పెద్ద ఎత్తన ఆందోళన చేశారు. కురుకుట్టి పంచాయతీ పరిధిలోని పుల్లమామిడి, బట్టివలస, దళాయివల స, పుల్లేలవలస, తాడ్డివలస, నందేడవలస తదితర 18 గ్రామాల నుంచి సుమారు 400 మంది ఆందోళనలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ తీరును దుమ్మెత్తిపోయారు. ఎరువు లు అందించలేని ప్రభుత్వ నిస్సహాయతను ఎండగట్టారు. తక్షణమే ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. 12న డీవార్మింగ్ డే ● కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పార్వతీపురం రూరల్: జిల్లాలో ఈనెల 12న నిర్వహించనున్న డీ వార్మింగ్ డేను విజయవంతం చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అందించే ఆల్బెండోజోల్ మాత్రలను పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈ మేరకు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ భాస్కరరావు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 1,96,612 మంది బాలబాలికలకు ఆల్బెండజో ల్ మాత్రలు అందజేస్తామన్నారు. వీటిని భోజ నం అనంతరం మాత్రమే మింగించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. సేవల ధరల పట్టిక పెట్టాలి విజయనగరం ఫోర్ట్: జిల్లాలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్, ల్యాబ్స్, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులందరూ విధిగా వివిధ సేవల ధరల పట్టికను పెట్టాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి ఆదేశించారు. ప్రతీ ఆస్పత్రికి ఫైర్ ఎన్ఓసీ తప్పనిసరన్నారు. -
ఆందోళన.. ఆవేదన
●పాఠశాల ఏర్పాటు చేస్తారా? ఒడిశాకు పంపిస్తారా? కొమరాడ మండలం పూడేసు పంచాయతీ గుమడింగి గ్రామంలో పాఠశాల లేక పిల్లలు చదువుకు దూరమవుతున్నారని గ్రామస్తులు వాపోయారు. సుమారు 45 కుటుంబాలు జీవిస్తున్నామని, 20 మంది వరకు బడిఈడు పిల్లలున్నారని తెలిపారు. అధికారులను అడిగితే 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎండభద్ర పాఠశాలకు వెళ్లాలంటున్నారని.. దానికి బదులు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ఒడిశాలో తమను విలీనం చేస్తే వెళ్లిపోతామని గ్రామానికి చెందిన ఆరిక నాగేశ్వరరావు తదితరులు వాపోయారు. కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. పార్వతీపురం రూరల్: పార్వతీపురంలోని కలెక్టరేట్ వద్ద వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలపై ఆందోళనలు చేశారు. తమకు జరిగిన అన్యాయాలపై ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు వినతులు అందజేశారు. ●మంత్రి గారూ.. వినిపిస్తోందా... గత ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గెలుపుకోసం ఎంతో కష్టపడ్డాం. నాకు ఏ ఆధారమూ లేదు. వితంతువును. ఆశ కార్యకర్త పోస్టు ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పుడు నాకు కాదని ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి భార్యకు అప్పగించారు. మంత్రి సంధ్యారాణిని అడిగితే.. ‘ఆ పోస్టు నీకు ఇవ్వలేం. మా బంధువు లకు ఇవ్వాలి’ అంటూ దాటవేశారు.’ అంటూ సా లూరు మండలం తోణాం పంచాయతీకి చెందిన సుజాత అనే మహిళ వాపోయారు. అధికారులను కలిసి వేడుకుంటున్నా ఫలితం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీజీఆర్ఎస్లో ఉన్నతాధికారులను మరోమారు వినతిపత్రం అందజేశా రు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ●ఆ కంపు భరించలేం.. పార్వతీపురం మండలంలోని డోకిశీల పంచాయతీ చలంవలసలో నివాసాలకు కేవలం 50 మీటర్ల దూరంలో కోళ్ల ఫారాన్ని పెట్టారు. విపరీతమైన దుర్వాసన వస్తోంది... ఆ కంపును భరించలేం.. తక్షణమే కోళ్ల ఫారాన్ని తీసేయాలంటూ చలంవలస గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన చేశారు. అధికారులకు తమ గోడు వినిపించారు. -
కలెక్టర్ వద్దకు మున్సిపల్ పంచాయితీ!
● కమిషనర్ వర్సెస్ ఉద్యోగులు ● చోద్యం చూస్తున్న ‘పెద్దన్న’లు ● రోజురోజుకూ జఠిలమవుతున్న వివాదం సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం పురపాలక సంఘంలో కమిషన ర్ వెంకటేశ్వర్లు, ఉద్యోగుల మధ్య వివాదం రోజురోజుకూ జఠిలమవుతోంది. ఇప్పటికే పలు దఫాలు ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. కమిషనర్ తీరును ఎండగట్టారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్చంద్రను కలిసి వినతిపత్రం అందజేశారు. కమిషనర్ వెంకటేశ్వర్లు తమను ఏవిధంగా ఇబ్బంది పెడుతున్నదీ వివరించారు. ప్రతి పనికీ రే టు కట్టేసి.. ప్రజల నుంచే కాక, స్వయంగా సిబ్బంది వద్ద కూడా వసూలు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చి న మొత్తంలో ఎమ్మెల్యేకు, ఉన్నతాధికారులకు ఇవ్వాలని బహిరంగంగానే కమిషనర్ చెబుతున్న ట్లు సాక్షాత్తు శాసనసభ్యులు విజయ్చంద్ర వద్దే ప్రస్తావించారు. కొన్ని నెలలుగా కమిషనర్ వెంకటేశ్వర్లు తీరుతో ఎంతోమంది విసుగు చెందుతున్నా.. సయోధ్యకు ఏ ఒక్కరూ ప్రయత్నించకపోవడం గమనార్హం. పాలకవర్గానికీ కమిషనర్ తీరుతో ఇబ్బందులు పార్వతీపురం పురపాలక సంఘం కమిషనర్ వెంకటేశ్వర్లు తరచూ వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ పాలకవర్గాన్నీ లెక్క చేయక, ప్రోటోకాల్ పాటించక పక్కా టీడీపీ కార్యకర్త మాదిరి పని చేస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ప్రధానంగా వైఎస్సార్సీపీ చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, సభ్యులే లక్ష్యంగా.. వారికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనిపై పాలకవర్గ సభ్యులు ఉన్నతాధికారులకూ ఫిర్యాదు చేశారు. కొద్దిరోజులు ఆ శాఖ ఆర్డీ కూడా విచారణ జరిపారు. ఆ సమయంలోనూ వివిధ వర్గాల నుంచి కమిషనర్కు వ్యతిరేకంగా ఫిర్యాదులు వెళ్లాయి. నలిగిపోతున్న ఉద్యోగులు మరోవైపు కమిషనర్ తీరుతో కార్యాలయ ఉద్యోగులూ నలిగిపోతున్నారు. కార్యాలయం దగ్గర పలుమార్లు ఆందోళన చేశారు. పెన్డౌన్ చేపట్టారు. చైర్పర్సన్ గౌరీశ్వరికి ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కు మొర పెట్టుకున్నారు. చివరికి సోమవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్ను కలసి వినతిపత్రం అందజేశారు. కమిషనర్ అవినీతిని, తమ పట్ల ఆయన వైఖరిని ఎండగట్టారు. కమిషనర్కు ఎమ్మెల్యే అండ? మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుకు స్థానిక ఎమ్మెల్యే అండ పుష్కలంగా ఉందన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే ప్రోద్భలంతోనే ఆయనను ఇక్కడ నియమించారని చెబుతుంటారు. అందువల్లే ఎవరెన్ని ఫిర్యాదులు చేస్తున్నా ఆయనపై చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కనీసం ఇరువర్గాల మధ్య సయోధ్యకు కూడా ప్రయత్నించకపోవడం గమనార్హం. ఈ ప్రభావం మున్సిపాలిటీ అభివృద్ధి మీద పడుతున్నా.. వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యంగా వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి కలెక్టర్ అయినా జోక్యం చేసుకుని, దీనికి పరిష్కారం చూపుతారో, లేదో చూడాలి. -
దూసుకొచ్చిన మృత్యువు
కొమరాడ: ఓ ఐదు నిమిషాల్లో వారి ప్రయాణం సుఖవంతమయ్యేది. ఇంతలో లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. వెనుక నుంచి వారు వెళ్తున్న స్కూటీని బలంగా ఢీకొట్టింది. అంతే.. ముగ్గురు యువకుల ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోయాయి. ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కొమరాడ మండలం గుణదతీలేస్ పంచాయతీ కొరిశీల గ్రామానికి చెందిన సిగురు కార్తీక్ (21), సిగురు ఉదయ్ కిరణ్ (19 ) అన్నదమ్ములు. వీరి తల్లి మృతిచెందింది. తండ్రి పురుపాలు ఉన్నారు. భవన నిర్మాణ కార్మికుడిగా ఒడిశాకు వలసవెళ్లి పనిచేస్తున్నాడు. కార్తీక్ ఐటీఐ పూర్తిచేసి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నాడు. తమ్ముడిని చూసేందుకు ఇటీవల గ్రామానికి వచ్చాడు. చక్కగా చదువుకోవాలంటూ డిగ్రీ చదువుతున్న ఉదయ్కిరణ్కు హితబోధ చేశాడు. తిరిగి హైదరాబాద్ వెళ్లే క్రమంలో గుమ్మ రైల్వేస్టేషన్కు తమ్ముడితో పాటు ఇంట ర్ చదువుతున్న గ్రామానికి చెందిన దువ్వాన జగన్ (17)తో కలిసి సోమవారం సాయంత్రం బయలుదేరాడు. మరో ఐదు నిమిషాల్లో స్టేషన్కు చేరుకుంటారన్న సమయంలో కేజీబీవీ సమీపంలోని ములుపు వద్ద ఒడిశాకు చెందిన లారీ వెను కనుంచి ఢీకొంది. అంతే.. చెల్లాచెదురుగా పడిపోయారు. వారి కాళ్లు పూర్తిగా విరిగిపోయాయి. రోడ్డంతా రక్తంతో తడిసిపోయింది. వివిధ అవయవాలు నుజ్జయ్యాయి. ఈ ఘటనను చూసి న వారు కన్నీరుపెట్టారు. అయ్యో.. చిన్నవయస్సులోనే మృత్యువు కాటేసిందంటూ రోదించారు. కుటుంబాలను ఆదుకుంటారనుకున్న యువకుల ప్రయాణం అర్ధాంతరంగా ముగి యడంతో గ్రామంలో విషాదం అలముకుంది. -
తరలించుకుపోతున్నారు..
● కూటమి నేతలు దౌర్జన్యంగా వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రైతుల పక్షాన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించాం. రైతులకు భరోసాగా ఉండాల్సిన ప్రభుత్వమే.. నేడు వారిని ఇబ్బంది పెడుతోంది. వ్యవసాయ పనుల కీలక సమయంలో యూరియా, డీఏపీ ఎరువును జిల్లా యంత్రాంగం అందించలేకపోయింది. కురుపాం నియోజకవర్గం పరిధిలోని పెద్దూరు సచివాలయం పరిధిలో 3 వేలు ఎకరాలు ఉంటే.. కేవలం 450 బస్తాలే ఇచ్చారు. ఇది సరిపోతుందా? ఏ పంచాయతీకి వెళ్లినా, ఏ గ్రామానికి వెళ్లినా ఇదే పరిస్థితి ఉంది. ప్రభుత్వం అందించకపోవడం వల్ల నల్లబజారులో రూ.550 నుంచి రూ.600 వరకు కొనుగోలు చేస్తున్నారు. కొరత లేదని జిల్లా కలెక్టర్ ఏ విధంగా ప్రకటన ఇస్తారు? రైతుకు భరోసా ఇవ్వడమంటే విత్తనం దగ్గర నుంచి ఎరువులు, పచ్చరొట్ట విత్తనాలు, వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్లు సబ్సిడీపై గతం ప్రభుత్వంలో అందించడం. నేడు ఏమిచ్చారు? సచివాలయానికి 200 బస్తాలిస్తే.. కూటమి నేతలు ట్రాక్టర్లు తెచ్చి, 50 బస్తాల వరకు దౌర్జన్యంగా తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. – పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఉపముఖ్యమంత్రి, కురుపాం నియోజకవర్గ ఇన్చార్జి -
● ఎరువుల సరఫరాలో ప్రభుత్వం విఫలం
ఆకుమడుల సమయంలో యూరియా సరఫరా చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రైతుకు ఎరువులు, విత్తనాలు కూడా అందించలేని స్థితిలో యంత్రాంగం ఉంది. దళారులు కృత్రిమ కొరత సృష్టించారు. నల్లబజారుకు తరలించారు. రైతుకు గత్యంతరం లేక అధిక ధరకు వ్యాపారుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. యూరియా అంతా ఇచ్చేశామని జిల్లా అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవాన్ని ఒకసారి పరిశీలించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.. రైతులందరికీ ఆయన ద్వారా భరోసా ఉండదని స్వయంగా ఒప్పుకున్నారు. అది నిజం చేస్తున్నారు. ఆయన దారిలోనే అధికారులు కూడా వెళ్తున్నట్లు ఉంది. నేడు దారుణమైన పరిస్థితిలో రైతులు ఉన్నారు. ఎరువులు, యూరియా కొరత నివారించి, వారిని ఆదుకోవాలి. – శత్రుచర్ల పరీక్షిత్రాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు -
దళారులకే ఎరువులు
మంగళవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 2025● రైతాంగానికి యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలం ● ఎరువుల కృత్రిమ కొరతపై చర్యలు తీసుకోవాలి ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, మాజీ ఎమ్మెల్యే జోగారావు ● పీజీఆర్ఎస్లో అధికారులకు వినతి సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో నిజమైన రైతుకు యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువులు అందడం లేదని.. కూటమి నాయకులు, కార్యకర్తలే దళారుల అవతారం ఎత్తి వాటిని బ్లాక్ మార్కెట్కు తరలించి కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరకు విక్రయిస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు. ఎరువులు అందక, బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరలు వెచ్చించి కొనుగోలు చేయలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొరతను నివారించి అన్నదాతలను ఆదుకోవాలని కోరారు. ఎరువుల సమస్య పరిష్కరించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి పిలుపు మేరకు జిల్లా పార్టీఆధ్వర్యంలో నాయకులు సోమవారం కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో డీఆర్వో హేమలత కు వినతిపత్రం అందజేశారు. రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచ ర్ల పరీక్షిత్రాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి, కురు పాం నియోజకవర్గ ఇన్చార్జి పాముల పుష్పశ్రీవా ణి, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి అలజంగి జోగారావు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. లారీ ఢీకొనడంతో మృతి చెందిన కొరిశీల యువకులు ● బైక్ను వెనుక నుంచి ఢీకొట్టిన లారీ ● గాలిలో కలిసిన ముగ్గురు యువకుల ప్రాణాలు ● కొరిశీల గ్రామంలో విషాదం ● మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు ● కన్నీరు మున్నీరు అవుతున్న కుటుంబ సభ్యులు న్యూస్రీల్ రైతులను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రైతన్నలకు పార్టీ రంగు అంటగట్టి, అరకొర ఎరువులను అందించి కూటమి ప్రభుత్వం దగా చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గతంలో ఎన్నడూ లేని పరిస్థితిని నేడు రైతులు ఎదుర్కొంటున్నారు. చివరికి ఎరువులను కూడా కూటమి ప్రభుత్వం వారు వదలడం లేదు. వారి నిర్వాకం వల్లే కృత్రిమ కొరత. పార్టీ జెండాలు, పార్టీ రంగులు చూసి ఇవ్వడం దురదృష్టకరం. కూటమి సిగ్గుమాలిన పాలనకు ఇంతకంటే నిదర్శనం ఇంకేం ఉంటుంది? ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరవాలి. దళారీ వ్యవస్థను అరికట్టి, రైతులకు అవసరమైన ఎరువులను అందించాలి. – అలజంగి జోగారావు, మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం నియోజకవర్గ ఇన్చార్జి -
విజృంభిస్తున్న విష జ్వరాలు
చీపురుపల్లి: పట్టణంతో పాటు పల్లెల్లో కూడా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతీ గ్రామంలోనూ ప్రజలు జ్వరాలతో మంచాన పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. జ్వరాలు బారిన పడుతు న్న వారు సమీపంలోని ఆర్ఎంపీల ద్వారా స్వంత డబ్బులు వెచ్చించి వైద్యం చేయించుకుంటున్నారు. మండలంలోని విశ్వనాథపురంలో ఐదేళ్ల బాలిక జ్వరంతో మృత్యువాత పడడంతో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు కాని, జ్వరాలు వచ్చిన తరువాత పంపిణీ చేయాల్సిన మందులు విషయంలో సైతం ఎక్కడా వారు కనిపించకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అకస్మాత్తుగా... మండలంలోని అలజంగి పంచాయతీ మధురా గ్రామమైన విశ్వనాథపురం గ్రామానికి చెందిన దన్నాన జాస్మిన్(5) అనే బాలిక వింత జ్వరంతో ఆదివారం మృతి చెందింది. రామప్పడు, నాగమణి దంపతులకు చెందిన జాస్మిన్ గత మూడు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతోంది. స్థానికంగా ఆర్ఎంపీలు వద్ద వైద్యం చేయించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమద్యంలో మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ● విశ్వనాథపురంలో ఐదేళ్ల చిన్నారి మృతి ● పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ -
సగమే సెక్యూరిటీ..!
● ఎంఓయూ జరిగి రెండు నెలలైనా పూర్తిస్థాయిలో జరగని గార్డుల నియామకం ● 58 మందిసెక్యూరిటీ గార్డులకు విధుల్లో 23 మంది ● సెక్యూరిటీ పూర్తిస్థాయిలో లేక కానరాని భద్రతవిజయనగరం ఫోర్ట్: జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కావడంతో జిల్లా ఆస్పత్రి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా మారింది. దీంతో ఆస్పత్రిలో వైద్యసిబ్బందితో పాటు, వసతులు కూడా పెరిగాయి. ఈ క్రమంలో ఓపీ సంఖ్య పెరిగింది. అయితే ఆస్పత్రికి, రోగులు, వైద్యసిబ్బందికి భద్రత మాత్రం పూర్తి స్థాయిలో లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వజన ఆస్పత్రికి నిబంధన ప్రకారం ఉండాల్సిన సెక్యూరిటీ గార్డుల్లో సగం సిబ్బంది మాత్రమే ఉన్నారు. దీంతో వారు ఆస్పత్రి అంతటికీ భద్రత కల్పించలేక పోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత సెక్యూరిటీ ఏజెన్సీని కూడా మార్చేసింది. గతంలో కాటలాండ్ సెక్యూరిటీ ఏజెన్సీవారు బాధ్యతలు నిర్వహించేవారు. కూటమి సర్కార్ ఆ ఏజెన్సీని తప్పించి శ్రీ కార్తికేయ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించింది. 58మంది సెక్యూరిటీ గార్డులకు ఎంఓయూ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి నూతన నిబంధన ప్రకారం 58మంది సెక్యూరిటీ గార్డులు ఉండాలని సర్వజన ఆస్పత్రి వైద్యాధికారులు సెక్యూరిటీ ఎజెన్సీతో ఎంఓయూ చేసుకున్నారు. అగ్రిమెంట్ మే నెలలో జరిగింది. జూన్ నెల 1వతేదీ నుంచి 58 మంది సెక్యూరిటీ గార్డులను సెక్యూరిటీ ఏజెన్సీ సరఫరా చేయాల్సి ఉంది. అగ్రిమెంట్ జరిగి రెండు నెలలు కావస్తున్నా ఇంతవరకు పూర్తిస్థాయిలో సెక్యూరిటీ గార్డులను సరఫరా చేయలేదు. ప్రస్తుతం ఆస్పత్రిలో 23 మంది సెక్యూరిటీ గార్డులు, ఇద్దరు సెక్యూరిటీ సూపర్వైజర్స్ విధులు నిర్వర్తిస్తున్నారు. గార్డులను సరఫరా చేయక పోవడం వెనుక.. జూన్ ఒకటో తేదీ నుంచి సెక్యూరిటీ గార్డులు పూర్తిస్థాయిలో ఆస్పత్రిలో పనిచేయాల్సి ఉంది. అయినప్పటికీ సగం మందితో పనిచేయిస్తున్నారు. దీని వెనుక మతలబు ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తక్కువ మందితో పనిచేసినప్పటికీ పూర్తి స్థాయిలో సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నట్లు చూపించి నిధులు కొట్టేయడానికే ప్లాన్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సగం మందితో పనిచేయించడం వల్ల నెలకు రూ.లక్షల్లో మిగులుతుంది. ఈ ఉద్దేశంతో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఒకటి రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో గార్డులు సర్వజన ఆస్పత్రి సెక్యూరిటీ నిర్వహణ శ్రీ కార్తికేయ సెక్యూరిటీ ఏజెన్సీకి వచ్చింది. మే నెలలో ఎంఓయూ జరిగింది. జూన్ ఒకటో తేదీ నుంచి 58 మంది సెక్యూరిటీ గార్డులతో పనిచేయించాలని ఎంఓయూ జరిగింది. ప్రస్తుతం 23 మంది గార్డులు, ఇద్దరు సూపర్వైజర్లు పనిచేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో పూర్తిస్థాయి సెక్యూరిటీ గార్డులను సరఫరా చేస్తామని ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు. డాక్టర్ శంబంగి అప్పలనాయుడు, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
వీఆర్ఎస్ నీరు విడుదల
మక్కువ: వెంగళరాయసాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు సాగునీటిని ఆదివారం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ వీఆర్ఎస్ ప్రాజెక్టు ద్వారా మక్కువ, సీతానగరం, బొబ్బిలి మండలాలకు చెందిన 24,700ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉందన్నారు. వీఆర్ఎస్ ప్రాజెక్టు నీటిమట్టం 1610 మీటర్లు కాగా, ప్రస్తుతం శతశాతం నీరు నిల్వ ఉందన్నారు. రైతులు సక్రమంగా నీటిని వినియోగించుకుంటే, శివారు గ్రామాల పంట పొలాలకు పూర్తి స్థాయిలో నీరు అందుతుందన్నారు. వెంగళరాయసాగర్ ప్రాజెక్టు అభివృద్ధి పనులకు రూ.263.27లక్షలు నిధులు మంజూరయ్యాయన్నారు. పనులు పూర్తయితే ప్రాజెక్టు పరిధిలో 24,700 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, నీటి సంఘాల నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
మంత్రి సంధ్యారాణికి ఎందుకంత ఉలికిపాటు!
మెంటాడ: కూటమి నేతలు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రజా క్షేత్రంలో ప్రశ్నిస్తే మంత్రి గుమ్మడి సంధ్యారాణికి ఎందుకంత ఉలికిపాటు అని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేస్తున్న వారిని చొక్కా పట్టుకొని అడగండి అని మంత్రి సంధ్యారాణి చెబుతున్నారని ఇచ్చిన హామీలపై అడిగితే అంత కోపమెందుకని ప్రశ్నించారు. ఎన్నికల వేళ నారా లోకేష్ ఓ ఇంటర్వ్యూలో సూపర్ సిక్స్ అమలు చేయకుంటే చొక్కా పట్టుకుని అడగండి అని చెప్పారని ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల వేళ 50 సంవత్సరాలు దాటిని వారికి పింఛన్, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఏమయ్యాయని ప్రశ్నించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అర్హులందరికీ నగదు జమ కాలేదని దీనికి ఏం సమాధానం చెబుతారని అన్నారు. వీటిపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు రాయిపల్లి రామారావు, జేసీఎస్ కన్వీనర్ కనిమెరక త్రినాధరెడ్డి, రాజప్పలనాయుడు, బాయి అప్పారావు, లెంక రత్నాకర్ ఉన్నారు. మీరిచ్చిన హామీలనే మేము గుర్తు చేస్తున్నాం.. మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర -
వినియోగదారులకు మేలు
సౌర విద్యుత్తో సాక్షి, పార్వతీపురం మన్యం: కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం సూర్యఘర్పై విస్తృత ప్రచారం చేయడంతో పాటు.. అందరూ వినియోగించుకునేలా చైతన్యం చేస్తున్నామని ఏపీఈపీడీసీఎల్ పార్వతీపురం సర్కిల్ పర్యవేక్షక ఇంజినీరు కె.మల్లికార్జునరావు తెలిపారు. విద్యుత్ వినియోగదారులకు బిల్లుల ఆదాతోపాటు, అంతరాయాలు లేకుండా సరఫరా పొందవచ్చని.. మిగులును విక్రయించుకోవచ్చని చెప్పారు. స్మార్ట్ మీటర్లతో బిల్లుల భారం పడుతుందన్నది కేవలం అపోహేనని ఆయన తెలిపారు. ఇటీవల వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు విద్యుత్తు మీటర్లు, ఆధార్ లింకులో తప్పిదాల వల్ల అర్హత కోల్పోతున్నారని, తమ దృష్టికి వచ్చిన వాటిని వెంటనే పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఆధార్ అనుసంధానంలో తప్పిదాలు ఉంటే.. సంబంధిత సెక్షన్ కార్యాలయాల్లో సిబ్బందిని సంప్రదించవచ్చని సూచించారు. ‘సాక్షి’తో ముఖాముఖిలో సర్కిల్ పరిధిలో శాఖాపరంగా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పీఎం సూర్యఘర్కు రాయితీ అందిస్తున్నాం.. పీఎం సూర్యఘర్ సోలార్ యూనిట్ రూ.2 లక్షల స్కీం. ఇందులో రూ.78 వేలు రాయితీ ఉంటుంది. మిగతా మొత్తం బ్యాంకులు రుణాల రూపంలో అందిస్తాయి. ఈఎంఐ విధానంలో చెల్లించుకోవచ్చు. 3 కిలోవాట్స్ వరకు లోడు పెట్టుకోవచ్చు. సోలార్ ప్యానెల్స్, బ్యాటరీ, ఇన్వర్టర్స్ అందిస్తాం. 25 ఏళ్ల వారంటీ కూడా ఉంటుంది. అధిక బిల్లు భారం నుంచి ఉపశమనం పొందవచ్చు. ఉత్పత్తిలో వినియోగం పోను తిరిగి విక్రయించుకోవచ్చు. యూనిట్కు రూ.2.65 పైసలు చొప్పున మేమే కొనుగోలు చేస్తాం. నెట్ మీటరింగ్ పెడతాం. ఈ ఏడాదిలో సర్కిల్కు 6 వేల యూనిట్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం 422 ఇళ్లకు బిగించాం. 14 గ్రౌండింగ్ దశలో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీల గృహాలను లీజుకు తీసుకుంటాం... పీఎం సూర్యఘర్ కింద సౌర విద్యుత్ ప్యానెల్ ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొచ్చే ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు తిరిగి డబ్బులివ్వనున్నాం. రూఫ్ టాప్ 200 ఎస్ఎఫ్టీ ఉండాలి. అటువంటి ఇళ్లను లీజుకు తీసుకుంటాం. మొత్తం ప్యానెళ్లన్నీ మేమే ఇస్తాం. వారికి అద్దె చొప్పున ఎస్ఎఫ్టీకి రూపాయి చొప్పున నెలకు రూ.200 తిరిగి ఇస్తాం. వారు వినియోగించే విద్యుత్ కూడా ఉచితమే. దీనిపై సర్వే చేసి, ఆసక్తి ఉన్న వినియోగదారులను గుర్తిస్తున్నాం. ప్రతిపాదనలో కొత్త సబ్స్టేషన్లు అడ్డాపుశీలలోని టిడ్కో గృహాల వద్ద 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం తుది దశలో ఉంది. కురుపాంలో 132/33 కేవీ సబ్ స్టేషన్ కోసం స్థలం సిద్ధంగా ఉంది. అక్కడ నిర్మాణం చేపడతాం. మరికొన్ని చోట్ల ప్రతిపాదనల దశలో ఉన్నాయి. ఆర్డీఎస్ఎస్ పథకంతో వివిధ పనులు ఆర్డీఎస్ఎస్ స్కీం ద్వారా జిల్లాలో వివిధ పనులు చేపడుతున్నాం. ఇందులో ప్రధానంగా ప్రత్యామ్నాయ లైన్లు, సబ్ స్టేషన్లలో విద్యుత్ అంతరాయాలు తగ్గించేలా అదనపు ఫీడర్లను ఏర్పాటు చేస్తున్నాం. గ్రామీణ ఫీడర్లు, వ్యవసాయ ఫీడర్లు వేరుచేసే పనులు అవుతున్నాయి. సర్కిల్లో 59 ఫీడర్ల పనులు చేస్తున్నాం. పట్టణంలో ఎనిమిది ఫీడర్లు వేస్తున్నాం. మూడు సర్కిళ్లలో మొత్తం రూ.4 వేల కోట్లతో వివిధ పనులు జరుగుతున్నాయి. అడ్డాపుశీల టిడ్కో వద్ద సబ్స్టేషన్ నిర్మాణంతో పాటు.. గరుగుబిల్లి నుంచి బూర్జ వరకు 12 కిలోమీటర్ల మేర 33 కేవీ ఇంటర్ లింకింగు లైన్లు వేశాం. దీనివల్ల విద్యుత్తు అంతరాయం తగ్గుతుంది. దీంతో పాటు జిల్లాకు కొత్త సర్కిల్ కార్యాలయం భవనం మంజూరైంది. సుమారు రూ.4 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపడుతున్నాం. ఏడాదిలో పూర్తవుతుంది. ఆన్లైన్లోనే వ్యవసాయ కనెక్షన్ల రిజిస్ట్రేషన్ ప్రస్తుతం జిల్లాలో 22,277 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. ఇంకా 908 మంది కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో 156 మంది నగదు కట్టలేదు. 696 మందికి కనెక్షన్ల ఏర్పాటు వివిధ దశల్లో ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు నిరంతర ప్రక్రియ. రైతులు నేరుగా 1912 టోల్ఫ్రీ నంబరుకు కాల్ చేసి, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. విద్యుత్తు కోతలు లేవు.. ప్రస్తుతం జిల్లాలో విద్యుత్తు కోతలు ఎక్కడా లేవు. ప్రతి శుక్రవారం నిర్వహణ, మరమ్మతు పనులు చేపడుతున్నాం. ఆ సమయంలో సంబంధిత ఏరియాలో కొద్డి గంటలు సరఫరా ఆపివేస్తున్నాం. ఆ విషయం ముందుగానే వినియోగదారులకు మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా సమాచారం చేరవేస్తున్నాం. స్మార్ట్ మీటర్లపై సందేహాల నివృత్తి ప్రీపెయిడ్ తరహాలోనే విద్యుత్ బిల్లులు చెల్లించేలా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నాం. వీటి వల్ల అధికంగా బిల్లులు వస్తాయన్నది అపోహే. ప్రస్తుతానికి కేటగిరీ–2(వాణిజ్య), ప్రభుత్వ కార్యాలయాలకు ఈ తరహా మీటర్లు అమర్చుతున్నాం. అధిక వినియోగం ఉన్న గృహాలకూ పెడుతున్నాం. ప్రస్తుతం జిల్లాలో 13,259 సర్వీసులకు మీటర్లు అమర్చాం. బిల్లు సెల్ఫోన్కే వస్తుంది. వినియోగదారులకు ఉండే సందేహాలను మా సిబ్బంది నివృత్తి చేస్తున్నారు. పీఎం సూర్యఘర్ను ప్రతి ఇంటికీ చేరువ చేస్తాం.. ఎస్సీ, ఎస్టీలు సోలార్లు ఏర్పాటు చేసుకుంటే తిరిగి డబ్బులిస్తాం స్మార్ట్ మీటర్లతో బిల్లుల భారం అపోహే ‘సాక్షి’తో ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ మల్లికార్జునరావు -
సోమవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2025
ఉభాలు జరగని వరిపొలాలు వర్షాధారమే.. వరుణుడు కరుణిస్తేనే పంటలు పండుతాయి. లేదంటే కష్టమే. ప్రతీ ఏటా కొండపోడు పంటలు ఎక్కువగా పండేవి. ప్రస్తుతం అవి కూడా లేవు. వర్షాలు పడితే ఖరీఫ్లో వరి, రాగులు వంటివి వేసుకోవాల్సింది. గెడ్డలు అడుగంటడం, చెరువులు, చెక్డ్యాంలలో నీరు నిల్వలు లేకపోవడంతో ఈ ఏడాది ఇబ్బందులు తప్పవు. – ఎన్. అబ్బాస్, కుశిమి ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు ప్రతీ ఏటా ఈ సీజన్ వచ్చేసరికి వర్షాలు పడేవి. పంటలు వేసుకునే వాళ్లం. ఎప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడంతో పంటలు వేయలేదు. ప్రభుత్వ పరంగా మమ్మల్ని ఆదుకోవాలి. – ఎస్.సన్నాయి, చాపరాయిగూడ ● అడుగంటిన చెక్డ్యాంలు, చెరువులు ● నీరు నిల్వలేని గెడ్డలు ● కరుణించని వరుణుడు ● ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా ప్రారంభం కాని ఉభాలు ● ఆందోళనలో ఏజెన్సీ రైతాంగం ఏజెన్సీలో ఖరీఫ్ గట్టేక్కేనా..! సీతంపేట: నైరుతి రుతుపవనాలు మే నెలలోనే వచ్చేశాయని రైతులు ఆనందపడ్డారు. ఆ ఆనందం ఎంత కాలం నిలవలేదు. జూన్ నుంచి వరుణుడి కరుణలేదు. చుక్క చినుకు లేక పొలాలు బీడు వారుతున్నాయి. ఆగస్టు వచ్చినా వర్షాలు లేకపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉభాలు ఇంకా జరగలేదు. దిక్కుతోచని స్థితిలో మన్యం రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా సీతంపేట ఐటీడీఏ పరిధి సబ్ప్లాన్ మండలాల్లో 80 శాతం వర్షాధార పంటలే. వానలు పడితేనే పంటలు పండుతాయి. లేకపోతే గడ్డు పరిస్థితి తప్పదు. వరితో పాటు ఇతర ఖరీఫ్ పంటలు ఎలా పండుతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. అక్కడక్కడా చెక్డ్యాంలు, చెరువులు గతంలో నిర్మించారు. అవి కూడా అడుగంటిపోయి కనిపిస్తున్నాయి. చెక్డ్యాంలు నిర్మించి ఏళ్లు గడిచాయి. ఇవి పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. అప్పుడప్పుడు కురిసిన వర్షాలకు సైతం నీరు లేని పరిస్థితి. ఈ పరిస్థితిలో ఖరీఫ్ గట్టెక్కుతుందా.. లేదా.. అనేది ప్రశ్నార్దకంగా మారింది. వేసవిలోనే చెక్డ్యాంలు, చెరువులు అడుగంటిపోయాయి. రబీ పంటలు సైతం పండక రైతులు ఆశలు ఆవిరయ్యాయి. ప్రస్తుతం వర్షాలు అనుకున్నంతగా కురవకపోవడంతో ఖరీఫ్ పంటలు ఎలా పండించాలని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. గతంలో ఎస్ఎంఐ విభాగం ద్వారా లక్షలాది రూపాయిలు వెచ్చించి నిర్మించిన చెక్డ్యాంలు, చెరువులు వృథాగా పడి ఉంటున్నాయి. కొన్ని మరమ్మతలకు గురయ్యాయి. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని టీపీఎంయూ మండలాల్లో ఖరీఫ్ సీజన్లో భాగంగా 13 వేల హెక్టార్లలో వరి పండుతుంది. మిగతా చిరుధాన్యాల పంటలు మూడు వేల హెక్టార్ల వరకు పండుతున్నాయి. ప్రతీ ఏటా ఈ సీజన్లో ఈ పాటికే వర్షాలు పడేవి. ఉభాలు చేసి వరినాట్లు వేసేవారు. కొద్ది రోజుల కిందట ఆకుమడులు తయారు చేసి వరినారు వేశారు. అవి మొలకలు వచ్చాయి. వర్షాలు లేని కారణంగా 30 శాతం కూడా ఉభాలు జరగని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. మైదాన ప్రాంతాల్లో ఇప్పటికే ఉభాలు ఊపందుకున్నాయి. ఇక్కడ మాత్రం ఆకుమడులే కనిపిస్తున్నాయి తప్ప ఉభాలు లేవు. మెట్టపంటలకు కూడా ఆ మాత్రం వర్షాలు అవసరం ఉంది. ఈ సీజన్లోనే కంది ఇతర చిరుధాన్యాల పంటలు కూడా వేస్తారు. ఈ తరహా పంటలకు సైతం మొదట చిరుజల్లులు అయినా అవసరమౌతాయి. ఆ మాత్రం చినుకులు ప్రస్తుతం పడక పోవడంతో ఏం చేయాలో రైతులకు అర్ధం కావడం లేదు. ఉద్యానవన పంటలకు తప్పని నష్టాలు ఉద్యానవనాల పంటలకూ నష్టాలు తప్పడం లేదు. ఐటీడీఏ కూడా గతంలో సుమారు 15 వేల వరకు ఉద్యాన వనాల పంటలైన జీడి, మామిడి, పనస వంటి పంటలను ప్రోత్సాహించింది. అంతేకాకుండా ఎన్ఆర్ఈజీఎస్లో సైతం ఉద్యానవన మొక్కలు వేశారు. అయితే వీటికి కూడా నీరు లేదు. పసుపు, అల్లం, ఇతర పంటలకు ఈ నెలలో వర్షాలు అవసరమవుతాయి. గెడ్డల్లో నీరు కరువైంది. గిరిజనులకు బోర్లు వంటి సౌకర్యం లేకపోవడంతో నీరెలా పొలాలకు పెడతామని రైతులు వాపోతున్నారు. న్యూస్రీల్ -
ఎంతో ఎదుగుతావనుకుంటే..!
పాలకొండ రూరల్: ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి..తిరిగిరాని లోకానికి వెళ్లిపోయావా నాన్నా..అంటూ మృతుడి తల్లిదండ్రుల రోదనలు గ్రామస్తులను కంటతడి పెట్టించాయి. భవన నిర్మాణ కార్మికుడైన ఆ తండ్రి తన రెక్కల కష్టంతో పిల్లలను, కుటుంబాన్ని సాకాడు. ఎదుగుతున్న పిల్లలు ఉన్నత చదువులు చదవాలకున్నాడు. భార్య భారతి సహకారంతో పిల్లలకు కష్టం తెలియకుండా కుమార్తె యమున డిగ్రీ, కుమారుడు దుర్గాప్రసాద్(18) ఇంటర్ చదువుతుండడంతో కష్టం మరిచి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. విధి చిన్న చూపు చూసి వారి ఏకై క కుమారుడిని నాగావళి నది కబళించి ఆ కుటంబంలో తీరని శోకం నింపింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. పాలకొండ నగరపంచాయతీలోని బల్లంకి వీధిలో నివాసముంటున్న శాసుబిల్లి రాము, భారతి దంపతులకు ఇద్దరు పిల్లలు. భవన నిర్మాణ పనులు చేస్తున్న రాము పిల్లలను చదువులవైపు నడిపించాడు. కుమార్తె డిగ్రీ చదువుతుండగా, కుమారుడు దుర్గాప్రసాద్ స్థానికంగా ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో మిత్రులతో కలిసి దుర్గాప్రసాద్ బయటకు వెళ్లాడు. అప్పటి వరకూ తమతో కలిసి ఉన్న కుమారుడు స్నేహితులతో ఉన్నాడని భావించిన తల్లిదండ్రులకు మధ్యాహ్నానికి వచ్చిన పిడుగులాంటి వార్త వారు ఉన్నచోట కుప్పకూలేలా చేసింది. ఒక్కసారిగా తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ ఒక్కగానొక్క కుమారుడు ఏడుగురు స్నేహితులతో కలిసి సమీప శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం నారాయణపురం ఆనకట్ట సమీపంలో నాగావళి నది వద్దకు వెళ్లాడని, అక్కడ స్నానం చేసే క్రమంలో దుర్గాప్రసాద్ నదిలో చిక్కుపోవడం, రక్షించే యత్నంలో స్నేహితులు విఫలం కావడంతో సమీపంలో ఉన్న లాబాం గ్రామస్తుల సాయం కోరగా గ్రామస్తులు రక్షించే యత్నం చేస్తున్న క్రమంలో విగతజీవిగా దుర్గాప్రసాద్ను నదిలో గుర్తించారని తెలిసి షాక్కు గురయ్యామని మృతుడి తండ్రి రాము వాపోయాడు. రూ.200 ఫోన్పే చేశాను.. నాన్నా..నేను ఫ్రెడ్స్తో కలిసి బయటకు వచ్చానని, బిర్యానీ తినేందుకు రూ.200 కావాలని ఫోన్ చేయడంతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తండ్రి రాము కుమారుడికి ఫోన్ పే చేసి నాన్నా జాగ్రత్త అని చెప్పాడు. త్వరగా ఇంటికి వచ్చేయాలన్నాడు. ఇంతలోనే ఘోరం జరిగిందని మృతుడి తండ్రి రాము చెబుతూ గుండెలవిసేలా రోదించిన తీరు అందరినీ కలిచివేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని మిగిలిన ఏడుగురు స్నేహితులు క్షేమంగా ఉన్నారని బూర్జ ఎస్సై ఎం.ప్రవల్లిక తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు పోలీసులు తరలించారు. తిరిగిరాని లోకానికి వెళ్లిపోయావా నాన్నా.. మిన్నంటిన తల్లిదండ్రుల రోదనలు కంటతడి పెట్టిన గ్రామస్తులు -
జాతీయ రహదారిపై లారీ బీభత్సం
రామభద్రపురం: మండలంలోని ఆరికతోట వద్ద జాతీయ రహదారిపై ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఆదివారం జరిగిన ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం నుంచి ఒడిశా వెళ్తున్న ఓ లారీని ఆరికతోట వద్ద డ్రైవర్ రోడ్డు పక్కన ఆపి టిఫిన్కు వెళ్లాడు. లారీకి బ్రేకులు ఫెయిలయ్యాయో ఏమో గానీ సడన్గా లారీ ముందుకు వెళ్లి ఎదురుగా ఆగి ఉన్న 3 బైకులు, రెండు ఆటోలు, ఒక బొలెరో వ్యాన్ను ఢీ కొట్టుకుంటూ దూసుకెళ్లి రహదారి పక్కన ఉన్న ఓ ఆటోను ఢీ కొట్టి ఆగింది. ముందుగా మొక్కజొన్న కంకుల లోడు కోసం ఆగి ఉన్న బొలెరో వ్యాన్ను ఢీ కొనడంతో ఆ వ్యాన్ పక్కన ఉన్న గోతిలో పడింది. అలాగా టిఫిన్ కొట్టు ముందు ఆగి ఉన్న ఆటోను ఒక్క సారిగా ఢీ కొనడంతో ఆ ఆటో టిఫిన్ కొట్టులోకి వెళ్లి దుకాణంలో ఉన్న సామగ్రి ధ్వంసం చేసింది. తర్వాత మరికొంత దూరంలో ఉన్న మూడు ద్విచక్రవాహనాలను ఢీ కొట్టడంతో ఒక బైక్ నుజ్జు నుజ్జవగా మరో రెండు బైక్లు లారీ కింద చక్రాల మధ్య ఇరుక్కుపోయి పూర్తిగి ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో మండల పరిధిలోని ఆరికతోట యజ్జల భాస్కరరావుకు చెందిన ఆటోతో పాటు టీ దుకాణంలో ఉన్న సామగ్రి పూర్తిగా ధ్వంసమయ్యాయి. అలాగే ఇదే దుప్పలపూడి గ్రామానికి చెందిన చిప్పాడ రవితో పాటు మరో ఇద్దరి ద్విచక్రవాహనాలు నుజ్జు నుజ్జయ్యాయి. అయితే అదృష్టవశాత్తు ఈ రోడ్డు ప్రమాదంలో ఏ విధమైన ప్రాణ నష్టం, ఏ ఒక్కరికీ చిన్న గాయం కూడా జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. లారీ బీభత్సంపై బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై వి.ప్రసాదరావు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 3 బైకులు, రెండు ఆటోలు, ఒక బొలెరో వ్యాన్ ధ్వంసం ప్రాణహాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు -
పట్టుబడిన పీడీఎస్ బియ్యం
వేపాడ: మండలంలోని వల్లంపూడి సమీపంలో ఆటోలో రవాణా చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని వల్లంపూడి పోలీసులు పట్టుకున్నట్లు ఎస్సై సుదర్శన్ ఆదివారం తెలిపారు. పట్టుబడిన బియ్యం, వాహనం స్టేషన్లో ఉంచామని సోమవారం రెవెన్యూ అధికారులకు అప్పగించనున్నట్లు ఎస్సై చెప్పారు. పట్టుబడిన బియ్యం సుమారు 350 కేజీలు ఉంటాయన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటాలి● పారా స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు దయానంద్ విజయనగరం: పారా జూనియర్, సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న జిల్లా క్రీడాకారులు అక్కడ కూడా సత్తా చాటాలని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ అన్నారు. ఈ మేరకు ఆదివారం విజయనగరంలో గల సారథి వెల్ఫేర్ అసోసియేషన్ బ్లైండ్ స్కూల్లో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి 135 మంది పారా క్రీడాకారులు పాల్గొన్నారని, వారిలో 47 మంది అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం అభినందనీయమన్నారు. పాతవారితో పాటు మొదటిసారి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరచడం ఆనందంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో ఈనెల 9 న విశాఖపట్నంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా సత్తా చాటి జిల్లాకు పేరు తీసుకురావాలని, అలాగే హర్యానాలో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని కోరారు. అనంతరం రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో సారథి వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు ప్రదీప్, అమ్మ సేవా సంఘం వ్యవస్థాపకుడు లక్కీ శేఖర్, మహేష్, కిరణ్ కుమార్, శర్మ, వెంకటరావు, పారా క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపికవిజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఆదివారం పూర్తయ్యాయి. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగర శివారులో గల విజ్జి స్టేడియంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వారికి వివిధ విభాగాల్లో పరుగు పోటీలతో పాటు లాంగ్ జంప్, షాట్పుట్, హైజంప్, జావెలిన్ త్రో తదితర అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ ఎంపికలను జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ పి.సీతారామరాజు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఐవీపీ రాజు ప్రారంభించారు. ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభభ కనబరిచిన క్రీడాకారులను ఈనెల 9,10,11 తేదీల్లో బాపట్ల జిల్లా చీరాల జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పి.లీలాకృష్ణ, కార్యదర్శి శ్రీకాంత్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు, టెక్నికల్ ఆఫీషియల్స్, సీనియర్ అథ్లెట్లు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
వేపాడ: వేపాడ–ఆనందపురం ప్రధాన రహదారిలో నీలకంఠరాజపురం వద్ద రైవాడ కాలువ కల్వర్టు సమీపంలో శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నీలకంఠరాజపురం రైవాడ కాలువ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. వ్యక్తిని ఢీకొన్న వాహనం, ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి ఆచూకీ లభ్యం కాలేదని సీఐ అప్పలనాయుడు తెలిపారు. ఆదివారం ఉదయం స్థానికులు అందించిన సమాచారం మేరకు సంఘటనా స్థలాన్ని వల్లంపూడి ఎస్సై సుదర్శన్, సీఐ అప్పలనాయుడు సిబ్బంది సందర్శించి ప్రమాదంపై గ్రామస్తులను ఆరాతీశారు. తెల్లవారుజామున 2గంటల నుంచి 4 గంటల మధ్య ప్రమాదం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతిచెందిన వ్యక్తికి సంబంధించిన స్కూటీ కల్వర్టుగోడ పక్కన ఉందన్నారు. మృతదేహాన్ని ఎస్.కోట ఆస్పత్రికి తరలించామని కుటుంబసభ్యుల ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సీఐ అప్పలనాయుడు తెలిపారు. బైక్తో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని వ్యక్తి..రామభద్రపురం: మండలంలోని కొట్టక్కి, జన్నివలస జంక్షన్ సమీపంలో శనివారం అర్ధరాత్రి ద్విచ్రవాహనంతో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జన్నివలస పంచాయతీ పరిధిలోని నేరళ్లవలస గిరిజన గ్రామానికి చెందిన కుడుమూరు కన్నయ్య దొర (26) పని నిమిత్తం ద్విచక్రవాహనంపై రామభద్రపురం మండలకేంద్రానికి వచ్చాడు. పని ముగించుకుని తిరిగి సొంత గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొని అక్కడిక్కడే మృతిచెందాడు.ఆదివారం ఉదయం అటువైపు వాకింగ్కు వెళ్తున్న కొంతమంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై వి.ప్రసాదరావు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద పరిస్థితిని పరిశీలించారు. మృతుడికి భార్య భవాని, పిల్లలు అజిత్ కుమార్, సోను ఉన్నారు. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ సాగిస్తున్న ఇంటి పెద్ద దిక్కు ను కోల్పోవడంతో తల్లి, భార్యాపిల్లలు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించి మృతుడి భార్య భవాని ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలియరాని మృతుడి వివరాలు -
గంజాయి నియంత్రణే లక్ష్యంగా తనిఖీలు
విజయనగరం క్రైమ్: గంజాయి అక్రమ రవాణా నియంత్రణే లక్ష్యంగా ట్రైన్లో లోకల్ పోలీసులు, జీఆర్పీ, ఈగల్, ఆర్పీఎఫ్ సిబ్బంది డాగ్ స్క్వాడ్తో సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం చెప్పారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాలతో గంజాయి అక్రమ రవాణాను నియంత్రించేందుకు ఐదు పోలీసు బృందాలు సంయుక్తంగా కిరండోల్ పాసింజర్ ట్రైన్లో శనివారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారన్నారు. ఒడిశా రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు గంజాయి అక్రమంగా రవాణా అవుతోందన్న సమాచారంతో ప్రత్యేకంగా రైళ్లలో తనిఖీలు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఎస్.కోట సీఐ వి.నారాయణమూర్తిలు ముందుగా ప్రయాణికులకు చేస్తున్న తనిఖీల గురించి వివరించి, వారు నిర్వర్తించే విధుల గురించి దిశా నిర్దేశం చేశారన్నారు. అన్ని భోగీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి, నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో ఆరు కిలోల గంజాయి, ఒక వ్యక్తి నుంచి కిలోన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగం గురించి సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబరు 1972కుఅందించాలని ఎస్పీ వకుల్ జిందల్ ప్రజలను కోరారు. ఈ తనిఖీల్లో వల్లంపూడి ఎస్సై ఎస్.సుదర్శన్ ఆర్పీఎఫ్ ఎస్సై పి.శ్రీనివాసరావు డాగ్ స్క్వాడ్ సిబ్బంది, ఈగల్ టీమ్ పోలీసులు, 40మంది పోలీసు అధికారులు ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఏడున్నర కేజీల గంజాయి లభ్యం జీఆర్పీకి చిక్కిన పల్నాడు వాసిరైలులో గంజాయి అక్రమ రవాణా విశాఖ నుంచి కిరండోల్ వెళ్తున్న ప్యాసింజర్ ట్రైన్లో గంజాయి అక్రమ రవాణాను గవర్నమెంట్ రైల్వే పోలీసులు ఆదివారం అడ్డుకున్నారు. జీఆర్పీ ఎస్సై బాలాజీ రావు తన సిబ్బందితో కలిసి కిరండోల్ రైలులో సోదాలు చేస్తుండగా ఓ వ్యక్తి కొత్తవలసలో రైలు దిగి పారిపోతూ అడ్డంగా దొరికిపోయాడు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం ముందలమూరివారిపాలానికి చెందిన తన్నేరు ఏసుబాబు ఒడిశాలో కొనుగోలు చేసి బెంగళూరుకు 1.133కేజీల గంజాయిని తరలిస్తూ చిక్కాడని ఎస్సై బాలాజీ రావు తెలిపారు. ఈ మేరకు నిందితుడు ఏసుబాబుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి విశాఖ రైల్వే కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు. -
గిరిజన రైతులకు పట్టాలివ్వాలి
రామభద్రపురం: గిరిజన రైతులు సాగు చేసిన భూములకు పట్టాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు రామభద్రపురం మండలంలోని కాకర్లవలస, కారేడువలస గిరిజన రైతుల సాగు భూములను దౌర్జన్యంగా లాక్కోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కాకర్లవలస గ్రామంలో గిరిజన రైతులతో కలిసి ఆదివారం ఆయన ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేకుండా గిరిజనుల భూములు అక్రమంగా లాక్కోవడం చట్ట విరుద్ధమన్నారు. కాకర్లవలస, కారేడువలస గిరిజన రైతుల సాగు భూములను అక్రమంగా స్వాధీనం చేసుకోవడానికి ఎవరు వచ్చినా సహించేది లేదన్నారు.అధికార బలంతో గిరిజనులపై దౌర్జన్య కాండను ఆపకుంటే వామపక్షాలన్నీ ఏకమై గిరిజనుల పక్షాన పోరాటాలు ఉధృతం చేస్తాయని హెచ్చరించారు. గిరిజన రైతులు ఆరుగాలం కష్టపడి సాగు చేసిన మామిడితోటలు, జీడితోటలు, మొక్కజొన్న పంటలను ధ్వంసం చేసిన ఏపీఐఐసీ అధికారులు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల నాయకుడు బలస శ్రీనివాసరావు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ -
బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలను అందించాలి : కలెక్టర్
విజయనగరం ఫోర్ట్: బిడ్డపుట్టిన గంటలోపు తల్లిపాలు అందించాలని కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అన్నారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో తల్లిపాల వారోత్సవాలు పోస్టర్స్ను శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆగస్టు 1 నుంచి 7వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. తల్లిపాలు అమృతంతో సమానమన్నారు. తల్లిపాలు ప్రాముఖ్యతను వివరించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ జీవనరాణి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దేవి మాధవి, డీఐవో అచ్చుతకుమారి, అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాణి, ఎన్సీడీ పీవో డాక్టర్ సుబ్రమణ్యం, ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డాక్టర్ సాయిరాం, ఐసీడీఎస్ పి.డి డాక్టర్ విమలరాణి తదితరులు పాల్గొన్నారు. తల్లిపాలు బిడ్డకు రక్షణ విజయనగరం ఫోర్ట్: తల్లిపాలు బిడ్డకు రక్షణ అని ఐసీడీఎస్ పి.డి టి.విమలారాణి తెలిపారు. పట్టణంలోని సాలిపేట, బొబ్బాదిపేట, గోకపేట అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా శనివా రం నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. తల్లిపాలలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుందని అది పిల్లలు వ్యాధి బారిన పడకుండా కాపాడుతుందన్నారు. కార్యక్రమంలో సీడీపీవో జి.ప్రసన్న, సూపర్ వైజర్ మేరి వనిత, అంగన్వాడీ కార్యకర్తలు బి.సత్యవేణి, కె.గాయిత్రి, ఆర్.వెంకటరత్న పాల్గొన్నారు. -
పెద్దగెడ్డ నీరు విడుదల
పాచిపెంట: ఖరీఫ్ పంటల సాగుకు మండల కేంద్రంలోని పెద్దగెడ్డ జలాశయం నుంచి 60 క్యూసెక్కుల సాగునీటిని మంత్రి గుమ్మడి సంధ్యారాణి శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెద్దగెడ్డ ఆధునికీరణ నిమిత్తం గత ప్రభుత్వ హయాంలో 22 కోట్ల జైకా నిధులు మంజూరయ్యాయని, అందులో కొంతమేర మాత్రమే లైనింగ్ పనులు జరిగాయన్నారు. మిగతా పనులు పునఃప్రారభమయ్యేలా చర్యలు చేపట్టి చివర ఆయకట్టు వరకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ, పాంచాలి సర్పంచ్ గూడెం యుగంధర్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ పిన్నింటి ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో వ్యభిచార గృహ నిర్వాహకులు
విజయనగరం క్రైమ్ : విజయనగరం టూటౌన్ పోలీస్స్టేషన్ పరిదిలో వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని పూల్బాగ్ కాలనీ సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఇద్దరు మహిళలు వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో సీఐ శ్రీనివాస్ ఆదేశాలతో స్టేషన్ మహిళా కానిస్టేబుల్ సదరు ఇంటికి వెళ్లి నిర్వాహకులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. స్టేషన్కు తీసుకొచ్చి విచారిస్తున్నారు. ఇదే విషయమై టూటౌన్ సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాలతో నగరంలో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఇందులో భాగంగానే వచ్చిన సమాచారంతో ఇద్దరు మహళలను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. గంజాయి పట్టివేత సాలూరు: పట్టణంలో 17.3 కేజీల గంజాయి పట్టుకున్నట్టు పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపారు. పట్టణంలోని పాత బీఎస్ఎన్ఎల్ ఆఫీసు రోడ్డు వద్ద నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు వారిని విచారించినట్టు తెలిపారు. తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వీరి వద్ద ఉన్న బ్యాగులలో 17.3 కేజీల గంజాయిని గుర్తించామన్నారు. కేసు నమోదు చేశామని, నలుగురు నిందితులను రిమాండ్కు తరలించామని తెలిపారు. -
బొడ్డవర చెక్పోస్టు వద్ద.. గంజాయి రవాణాకు చెక్!
● ఒడిశా నుంచి కేరళకు గంజాయి తరలింపు ● ఎల్.కోట పోలీసులకు చిక్కిన ఇద్దరు నిందితులు ● 145 కిలోల గంజాయి, బొలెరో వాహనం స్వాధీనం విజయనగరం క్రైమ్: ఎస్.కోట బొడ్డవర చెక్పోస్టు వద్ద గంజాయి అక్రమ రవాణాకు పోలీసులు చెక్ పెట్టారు. ఎల్.కోట పోలీసులకు అందిన కచ్చితమైన సమాచారంతో ఒడిశా నుంచి కేరళ రాష్ట్రానికి బొలెరో వాహనంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులను బొడ్డవర చెక్పోస్టు వద్ద అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ వకుల్ జిందల్ వెల్లడించారు. డీపీవోలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి 71 ప్యాకెట్లలో గల 145 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. పట్టుబడిన నిందితుల్లో ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా పదువ మండలం కుదుబ్కికి చెందిన డంబు శిరగం అలియాస్ కృష్ణ(21), ఖసర్గాడ్ మంచజెవరం మండలం హూసంగలికి చెందిన మొహమ్మద్ షఫీక్(36)గా విచారణలో గుర్తించామన్నారు. కేరళ రాష్ట్రం ఖసర్గాడ్మంజెవరం మండలం హూసంగలికి చెందిన అబుబాకర్ సిద్ధికి ఆదేశాలతో కలిసి గంజాయిని డంబు శిరగం అలియాస్ కృష్ణ వద్ద కొనుగోలు చేసి బొలెరో వాహనంలో తరలిస్తుండగా ఎల్.కోట పోలీసులు గొల్జాం వద్ద వాహన తనిఖీలు చేపట్టి పట్టుకున్నారన్నారు. నిందితులపై చట్ట ప్రకారం దర్యాప్తు చేస్తామని, పీడీ చట్టం ప్రయోగిస్తామని తెలిపారు. గంజాయిని పట్టుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఎస్.కోట రూరల్ సీఐ ఎల్.అప్పలనాయుడు, ఎల్.కోట ఎస్ఐ నవీన్ పడాల్, ఇతర పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. సమావేశంలో ఆయనతో పాటు విజయనగరం డీఎస్పీ శ్రీనివాస్, సీఐ అప్పలనాయుడు, ఎస్ఐ నవీన్ పడాల్, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు పాల్గొన్నారు. -
కొందరికి రూ.2 వేలు.. ఇంకొందరికి రూ.5 వేలు
సాక్షి, పార్వతీపురం మన్యం: అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ నిధుల జమలో గందరగోళం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ నిధులు రూ.2 వేలతో కలిపి రాష్ట్ర వాటా రూ.5 వేలు మొత్తం రూ.7 వేలను రైతుల బ్యాంకు ఖాతాలో శనివారం జమచేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఈ మేరకు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో చేపట్టారు. పలువురు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. జిల్లాలో 1.22 లక్షల మందికి రూ.84.58 కోట్లు విడుదల కానున్నట్టు అధికారులు ప్రకటించారు. ఏడాదికి రూ.20 వేలు అన్నదాత సుఖీభవ పథకం కింద ఇస్తామన్న ప్రభుత్వం.. ఈ వాటాను కేంద్రం అందించే రూ.6 వేలతో కలిపింది. మొదటి, రెండు విడతల్లో రాష్ట్ర వాటా కింద రూ.5 వేలు చొప్పున, మూడో విడత రూ.4 వేలు చొప్పున మొత్తం రూ.14 వేలు ఇవ్వనుంది. ఈ ప్రకారం కేంద్ర, రాష్ట్ర వాటాలతో కలిపి రైతుల ఖాతాలకు తొలివిడతగా రూ.7 వేలు జమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. తీరా చూస్తే.. రైతుల ఖాతాలకు కొందరికి రూ.2 వేలు జమ కాగా.. మరికొందరి ఖాతాల్లో రూ.5 వేలు పడింది. వారి సెల్ఫోన్లకు వచ్చిన సంక్షిప్త సందేశంలోనూ అదే విధంగా రావడంతో అన్నదాతలు నిర్ఘాంతపోయారు. తోటి వారిని ఆరా తీశారు. ఏ ఒక్కరికీ ఒకేలా పడకపోవడం.. ఏకమొత్తం రూ.7 వేలు చాలామందికి రాకపోవడంతో గందరగోళానికి గురయ్యారు. కొందరు రైతులు వ్యవసాయాధికారులను సంప్రదిస్తే.. ఇంకా సమయం ఉందని, నిధులు జమవుతాయని సెలవిచ్చారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం పథకం నిధుల్లోనూ ఈ విధంగానే కోతలు పడ్డాయి. ఒకరికి రూ.13 వేలు, కొందరికి రూ.9 వేలు, రూ.6 వేలు.. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా నిధులు జమయ్యాయి. ఆ మాదిరిగానే ఇదీ చేస్తారా? అని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కౌలురైతులకు డబ్బులు పడలేదు. వారికి మలివిడత అందిస్తారని అధికారులు అంటున్నారు. అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ నిధుల జమలో గందరగోళం అయోమయంలో రైతాంగం -
బోధనేతర విధులు అంటగట్టొద్దు
పార్వతీపురం: ఉపాధ్యాయులను బోధనకు తప్ప ఏ ఇతర బోధనేతర కార్యక్రమాలకు వినియోగించవద్దని ఫ్యాప్టో నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేశారు. కూటమి ప్రభుత్వ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహన్, రాష్ట్ర పరిశీలకుడు గణపతి, చైర్మన్ పి.కూర్మినాయుడు మాట్లాడుతూ ఏకీకృత సర్వీస్రూల్స్ సమస్యలను పరిష్కరించి విద్యాశాఖలో ఉన్న అసంబద్ధ విధానాలను తొలగించాలన్నారు. పీ–4కు ఉపాధ్యాయులకు నిర్బంధిచరాదన్నారు. ఎంఈఓ–1 పోస్టుల భర్తీ, ఇన్చార్జిల నియామకంలో జీఓ నంబర్ 73 ప్రకారం ఉమ్మడి సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటుచేసి, 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. సీపీఎస్ను రద్దు చేసి పాతపెన్షన్ పథకాన్ని అమలుచేయాలన్నారు. రిటైరైన ఉద్యోగులకు గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్, ఇతర బకాయిలను తక్షణం చెల్లించాలన్నారు. మూడు పెండింగ్ డీఏలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవ్ల బకాయిలను చెల్లించాలన్నారు. అంతర జిల్లాల బదిలీలను చేపట్టాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఆందోళనలను కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కరరావు, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మర్రాపు మహేష్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా -
10న జిల్లా స్థాయి యోగా పోటీలు
విజయనగరం: జిల్లా స్థాయి యోగాసన పోటీలు ఆగస్టు 10న విజయనగరం జిల్లా కేంద్రంలోని మెసానిక్ టెంపుల్లో ఉదయం 9 గంటల నుంచి నిర్వహించనున్నట్టు విజయనగరం జిల్లా యోగాసన స్పోర్ట్స్ అధ్యక్షులు డాక్టర్ మజ్జి శశిభూషణ్రావు తెలిపారు. ఈ మేరకు శనివారం పోటీల నిర్వహణకు సంబందించిన బ్రోచర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ పోటీల్లో 10 నుంచి 55 సంవత్సరాలలోపు వయస్సు గల సీ్త్ర, పురుషులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. మొత్తం 10 కేటగిరీల్లో నిర్వహించే పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను త్వరలో రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక చేయటం జరుగుతుందన్నారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు జనరల్ సెక్రటరీ నరసింహమూర్తి 7702134568 నంబరుకు సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు వడ్లమాని నరసింహమూర్తి, పి.సత్యనారాయణ, డి.శివ తదితరులు పాల్గొన్నారు. -
గురూ.. నాకు చెప్పకుండా పింఛన్లు ఇచ్చేస్తావా?
సాక్షి, పార్వతీపురం మన్యం: ‘గురూ... నేను చెప్పింది విను... మా మేడం గారు తెచ్చిన పెన్షన్లవి. టీడీపీలో ఉన్న ప్రతి కార్యకర్త కష్టం అవి.. నీలాంటి, నాలాంటి వ్యక్తులు పెన్షన్ పంపిణీకి వచ్చేటప్పుడు, ఇక్కడ టీడీపీ నాయకులు ఎవరు? వాళ్ల పేరు ఏంటి ? తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా?..’ అంటూ ఓ టీడీపీ నాయకుడు సచివాలయ సిబ్బందిపై రుబాబు చేసిన ఘటన మక్కువ మండలంలో చోటుచేసుకుంది. కొయ్యానపేట గ్రామానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు నూతన పింఛన్లు మంజూరయ్యాయి. ఈ రెండు పింఛన్ల పంపిణీకి శుక్రవారం వైఎస్సార్సీపీ సర్పంచ్ పోల ఉమామహేశ్వరి, టీడీపీ నాయకుడు కొయ్యాన కాశీవిశ్వనాథంను సచివాలయ సిబ్బంది ఆహ్వానించారు. ఫిషరీస్ అసిస్టెంట్, సర్వే అసిస్టెంట్లు.. ప్రజా ప్రతినిధుల చేతులు మీదుగా పింఛను అందించారు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. అదే గ్రామానికి చెందిన మరో టీడీపీ నాయకుడు ఫిషరీస్ అసిస్టెంట్ కు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడటం గమనార్హం. ‘నీవు ఎవరికి చెప్పావు. నాకు కరెక్ట్ గా చెప్పు... నాకు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే... మేడం గారు టీడీపీ కార్యకర్తలు వెళ్లి, మనం ఇచ్చిన పెన్షన్లు మన ఆధ్వర్యంలో పంచాలంటూ కచ్చితంగా చెప్పారు. మీరు కొయ్యాన్నపేట గ్రామానికి వచ్చిన వెంటనే గ్రామంలో టీడీపీ నాయకులు ఎవరు? అనే వివరాలు మీ అధికారుల నుంచి తీసుకోవాలి.. అలా తీసుకున్నారా? అంటూ అని గదమాయించాడు. దీనికి సచివాలయ ఉద్యోగి బదులిస్తూ.. సెక్రటరీ ఆదేశాల మేరకు సర్పంచ్ ఉమామహేశ్వరి, టీడీపీ నాయకులు కాశీ విశ్వనాథానికి సమాచారం ఇచ్చామన్నారు. తాను వచ్చి నాలుగు రోజులే అయ్యిందని.. సెక్రటరీ, వెల్ఫేర్ అసిస్టెంట్ అంటూ సచివాలయ ఉద్యోగి సమాధానం ఇస్తుండగా.. ‘అవన్నీ మాకు అవసరం లేదు గురు.. నేను చెప్పింది విను.. మా మేడం గారు తెచ్చిన పెన్షన్లవి. కాశీ నాయుడు టీడీపీ నాయకుడని చెప్పి, వైఎస్సార్సీపీ నాయకుల్ని పిలిపించి పింఛన్లు అందివ్వడంలో ఆంతర్యం ఏంటి? కొయ్యాన కాశీనాయుడుకి ఫోన్ చేయడం రైట్, ఆయన ఆ ఇద్దరినీ పిలిపించమని, పెన్షన్ ఇప్పించమన్నాడు రైట్.. అంతే కదా.. ఓకే బాయ్... తర్వాత మాట్లాడదాం’ అంటూ సచివాలయ ఉద్యోగిపై ఆక్రోశం వెళ్లగక్కాడు. పింఛన్లు పంపిణీకి నన్ను పిలవలేదు, నన్ను పిలవలేదంటూ మమ్మల్ని వేధిస్తున్నారే తప్ప.. ఎండలో కష్టపడి పింఛన్లు పంపిణీ కార్యక్రమం చేసినప్పటికీ కనీసం మంచినీళ్లు అందించే నాథుడు కరవవుతున్నారంటూ పలువురు సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మక్కువ మండలంలో సచివాలయ సిబ్బందిపై తమ్ముడి రుబాబు అంతా వారిష్టం.. పార్వతీపురం రూరల్: ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ డబ్బులు అందజేయాలి. అయితే, పార్వతీపురం మన్యం జిల్లా చినబొండపల్లి గ్రామంలో ఓ టీడీపీ నాయకుని ఇంటివద్దకే పింఛన్దారులందరినీ పిలిపించి పింఛన్ డబ్బులను సచివాలయ సిబ్బందితో శుక్రవారం పంపిణీ చేయడం విమర్శలకు తావిచ్చింది. అధికారులు, సచివాలయ సిబ్బంది తీరును సర్పంచ్ గండి శంకరరావు, వైస్ ఎంపీపీ బంకురు రవికుమార్ తప్పుబట్టారు. గత ప్రభుత్వం ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా లబ్ధిదారుల ఇంటివద్దనే వలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయగా, నేడు కూటమి ప్రభుత్వం ప్రజాధనంతో ఇచ్చే పింఛన్లను తమ నాయకుల మోచేతిపై అందించేందుకు పూనుకోవడం దారుణమన్నారు. స్థానికంగా ఉన్న చైర్పర్సన్, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, సర్పంచ్.. ఇలా ప్రజలచే ఎన్నుకోబడిన ఏ ఒక్క నాయకుడికి గౌరవం ఇవ్వకుండా పచ్చకండువాయే పరమావధిగా భావించి టీడీపీ కార్యకర్తలను వెంట బెట్టుకొని పింఛన్లు పంపిణీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్వతీపురం మండలం సూడిగాం గ్రామంలో ఎంపీపీ మజ్జి శోభారాణిని కాదని స్థానిక టీడీపీ కార్యకర్తలు పింఛన్లు పంపిణీ చేయడంపై గ్రామస్తులు భగ్గుమన్నారు. పార్వతీపురం మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి. -
పెట్టుబడి సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
సాలూరు: అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ కింద ప్రభుత్వం అందజేసిన పెట్టుబడి సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు కలెక్టర్ శ్యామ్ప్రసాద్ సూచించారు. సాలూరు పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో శనివారం పెట్టుబడి సాయం నిధుల విడుదలలో ఆయన పాల్గొన్నారు. మంత్రి సంధ్యారాణితో కలిసి రైతులకు అన్నదాత సుఖీభవ నమూనా చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్దేవ్, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, ఏఎంసీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ, డీఏఈ రాబర్ట్పాల్, తదితరులు పాల్గొన్నారు. దురిబిలి సమీపంలో ఏనుగులు గుమ్మలక్ష్మీపురం(కురుపాం): కురుపాం మండలంలోని దురిబిలి గ్రామ సమీపంలోని కొండ వద్ద ఏనుగులు శనివారం సంచరించాయి. ఖరీఫ్ సాగు, కొండపోడు పనులు జరుగుతున్న సమయంలో ఏనుగుల సంచారంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. ఏనుగులను తరలించే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంచదారలో బల్లి గుర్ల: మండలంలోని చిన్ననాగళ్లవలస రేషన్ డిపోలో సరఫరా చేసిన పంచదారలో చనిపోయిన బల్లి ఉండడంతో లబ్ధిదారు పి.పైడితల్లి ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై రెవెన్యూ అధికారులకు శనివారం ఫిర్యాదుచేశారు. ఎస్ఎఫ్ఐ దీక్షలు భగ్నం చేసిన పోలీసులు ● బలవంతంగా దీక్ష శిబిరం ఎత్తివేత ● ఎస్ఎఫ్ఐ నాయకులను స్టేషన్కు తరలింపు పార్వతీపురం రూరల్: విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం గత రెండు రోజులుగా కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు శనివారం రాత్రి భగ్నం చేశారు. విద్యార్థి సంఘ నాయకుల ఆరోగ్యం క్షీణించడం, రాత్రిపూట దీక్షలు చేసేందుకు అనుమతులు లేకపోవడంతో బలవంతంగా ఎత్తివేయించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.అఖిల్, కోశాధికారి కె.డేవిడ్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎ. గంగారాం, సీహెచ్ సింహాచలం, తదితరులను అరెస్టుచేసి పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. జిల్లాలో పీజీ సెంటర్ ఏర్పాటు చేయాలని, గిరిజన ఆశ్రమ, వసతి గృహాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ప్రధాన డిమాండ్లతో విద్యార్థులు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. పోలీసుల తీరుపై జిల్లా విద్యార్థిలోకం భగ్గుమంటోంది. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా కూటమి ప్రభుత్వం పోలీసులతో అక్రమ అరెస్టులు చేయిస్తూ గొంతునొక్కేయాలని చూస్తోందన్నారు. -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ103 శ్రీ176 శ్రీ186ఆటో బోల్తా – యువకుడికి తీవ్రగాయాలు జామి: ఆటో బోల్తాపడి యువకుడు తీవ్ర గాయాల పాలైన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు అందించిన సమచారం ప్రకారం.. శాశనపల్లి గ్రామానికి చెందిన ఐ.హరి భీమసింగి గ్రోమోర్ సెంటర్లో పని చేస్తున్నాడు. శనివారం ఎరువులు నిమిత్తం భీమసింగి నుంచి కొత్తవలస ఆటోలో వెళ్తున్న సమయంలో అలమండ సంత సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న హరి తీవ్ర గాయాల పాలయ్యాడు. గాయాల పాలైన హరిని 108 వాహనంలో విజయనగరం ఆసుపత్రికి తరలించారు. అటుగా వెళ్తున్న ఎంపీపీ సబ్బవరపు అరుణ, అతని భర్త దగ్గరుండి సహయ సహకారాలు అందించారు. ‘ఆపరేషన్ ట్రేస్’తో సత్ఫలితాలు విజయనగరం క్రైమ్ : ‘ఆపరేషను ట్రేస్‘ కార్యక్రమంలో భాగంగా అదృశ్యమైన మహిళలు, బాలబాలికల ఆచూకీని కనుగొనేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నామని ఎస్పీ వకుల్ జిందల్ శనివారం పేర్కొన్నారు. జిల్లాలోని గజపతినగరం పోలీస్స్టేషన్ పరిధి పురిటిపెంటలో అదృశ్యమైన బాలికను గంట వ్యవధిలో కనుగొన్నామని స్పష్టం చేశారు. బాలికను ఆమె తల్లికి ఈ నెల ఒకటవ తేదీని అప్పగించామని తెలిపారు. బాలికలపై అఘాయిత్యాలను నియంత్రించేందుకు జిల్లాలో వివిధ పాఠశాలల్లో విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి, తమను తాము రక్షించుకొనేందుకు అవసరమైన సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ను కూడా నేర్పిస్తున్నామన్నారు. లేబర్ కోడ్లతో కార్మికులకు తీవ్ర నష్టం నెల్లిమర్ల: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన లేబర్కోడ్లతో కార్మిక లోకానికి తీరని అన్యా యం జరుగుతుందని ఇప్టూ రాష్ట్ర కార్య దర్శి వెంకటేశ్వర్లు, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మి, ప్రధాన కార్యదర్శి గీత అన్నారు. నెల్లిమర్ల పట్టణంలోని అమరవీరుల స్మారక భవనంలో ఇప్టూ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. శిక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వివరించారు. కోడ్లు పూర్తిగా యాజమాన్యాలకు కొమ్ముకాసే విధంగా ఉన్నాయని ఆరోపించారు. జిల్లా ఉపాధ్యక్షుడు కాళ్ల అప్పలసూరి, ప్రధాన కార్యదర్శి గీత ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ‘పట్టాలిచ్చిన భూముల్లోనే సాగు చేసుకోవాలి’ ● ఏపీఐఐసీకి ఇచ్చిన భూములు వదిలి వెళ్లిపోవాల్సిందే.. ● గిరిజన రైతులకు అధికారుల హుకుంరామభద్రపురం: గిరిజన రైతులు వారికి పట్టాలిచ్చిన భూముల్లోనే సాగు చేసుకోవాలని, ఏపీఐఐసీకి ఇచ్చిన భూములు వదిలి వెళ్లిపోవాలని సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో శనివారం డీటీ గిరిధర్, ఫారెస్టు సెక్షన్ అధికారి మహింఽద్ర, ఎస్ఐ వి.ప్రసాదరావు సమావేశమయ్యారు. కొద్ది రోజులుగా కాకర్లవలస గిరిజన రైతులు భూ సమస్యలపై చేపడుతున్న ఆందోళనలపై చర్చించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఏపీఐఐసీకి విక్రయించిన భూములు సర్వే నంబర్ 717లో ఉన్నాయని, గిరిజన రైతులకు ఇచ్చిన ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు సాలూరు ఫారెస్ట్ బీట్ కంపార్ట్మెంట్ 179లో ఉన్నాయన్నారు. ఈ భూములు కొండ పక్కన పట్టాలు ఇస్తే ఏపీఐఐసీకి కేటాయించిన భూమిలో ఎలా సాగు చేస్తారని? ఇది డీ పట్టా భూమి అని మీరు సాగు చేస్తే కుదరదని, వదిలి వెళ్లిపోవాల్సిందేనని తేల్చి చెప్పారు. ఫారెస్టు సెక్షన్ అధికారి మహింద్ర మాట్లాడుతూ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు మా అటవీ శాఖాధికారులు ఇచ్చారన్నారు. ఒకసారి ఇచ్చిన పట్టా రద్దు చేయడం కుదరదని, ఇలా రైతులు అభ్యంతరం పెట్టే హక్కు లేదన్నారు. నిబంధనల ప్రకారం భూమి ఖాళీ చేసి ఎక్కడ ఇచ్చారో ఆక్కడకు వెళ్లి సాగు చేసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో సర్వేయర్ వి.సాయికుమార్, వీఆర్వో మహేష్కుమార్, గ్రామ సచివాలయ సర్వేయర్లు పాల్గొన్నారు. -
మహిళా మార్ట్లో డీలాపడిన వ్యాపారం
● డ్వాక్రా మహిళలు తప్ప...ఇతరులు కొనుగోలు చేయని వైనం ● మహిళల ఆర్థిక బలోపేతానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్ మహిళా మార్ట్ ● కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్సార్ పేరును తొలగించిన నిర్వాహకులు ● గతంలో రోజుకు రూ.80 వేల నుంచి రూ.1 లక్ష వరకు జరిగిన వ్యాపారం ● నేడు రూ.15 వేల నుంచి రూ.20 వేలకు పరిమితం ● వ్యాపారాభివృద్ధిపై దృష్టి సారించని యంత్రాంగం ● కష్టంగా మారిన మహిళా మార్ట్ నిర్వహణ వీరఘట్టం: మహిళల ఆర్థిక స్వావలంభనకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టి ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు మార్ట్లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని వీరఘట్టంలో గతేడాది జనవరి 12న వైఎస్సార్ మహిళా మార్ట్ను ఏర్పాటు చేశారు. ఈ మార్ట్ ఏర్పాటుకు వీరఘట్టం మండలంలోని 15 వేల మంది డ్వాక్రా సంఘాల మహిళలు ఒక్కొక్కరూ రూ.200 పెట్టుబడితో రూ.30 లక్షలు పోగు చేసి వ్యాపారం ప్రారంభించారు. దీనికి గత ప్రభుత్వం కూడా కార్పొరేట్ కంపెనీలతో ఈ మార్ట్ను అనుసంధానం చేసి వీరికి కావాల్సిన నిత్యావసర సరుకులు, కాస్మోటిక్స్, వంటనూనెలు ఇలా అనేక వస్తువులను హోల్సేల్ మార్కెట్లో కొనుగోలు చేసి ఈ మార్ట్ ద్వారా విక్రయించడం ప్రారంభించారు. ప్రారంభించిన నాటి నుంచి మే నెల వరకు ఈ ఐదు నెలల్లో సుమారు రూ.1.50 కోట్లు వ్యాపారం చేపట్టారు. గత ఏడాది జూన్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత నేటి వరకు వ్యాపారాలు డీలా పడడంతో బేరాలు సన్నగిల్లి మార్ట్ నిర్వహణ భారంగా మారింది. జోరు తగ్గిన మార్ట్ వ్యాపారం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్సార్ మహిళా మార్ట్ బోర్డులో వైఎస్సార్ పేరును తొలగించారు. అంతేకాకుండా బ్యాంకు మాదిరి ఏసీ రూంలో ఉంటడడంతో మార్ట్ వైపు సామాన్యులు కూడా చూడడం లేదు. డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు తప్ప ఇతరులు ఎవరూ ఇక్కడ సరుకులు కొనుగోలు చేయకపోవడంతో వ్యాపారం పూర్తిగా పడిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో కిరాణాషాపు రోజుకు రూ.1 లక్ష పైబడి అమ్మకాలు చేస్తున్నారు. మహిళా మార్ట్లో మాత్రం గత ఏడాదిగా రోజుకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు మాత్రమే వ్యాపారం జరుగుతున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. వెలవెల బోతున్న మహిళా మార్ట్ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వీరఘట్టం మహిళా మార్ట్ కొనుగోలుదారులతో కళకళలాడేది. నేడు కొనుగోలుదారులు లేక మార్ట్ వెలవెలబోతోంది. సుమారు రూ.13 లక్షల వ్యయంతో మార్ట్ నిర్మాణం చేపట్టారు. ఇందులో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్కు రూ.6 వేలు జీతం, ఇద్దరు సేల్స్ మెన్, ఉమెన్లకు రూ.12 వేలు జీతం, స్వీపర్కు రూ.3 వేలు, ఇంటి అద్దె రూ.25 వేలు, ప్రతీ నెలా కరెంట్ బిల్లు సరాసరిన రూ.6 వేలుతో కలిపి ప్రతీ నెలా నిర్వహణ ఖర్చు రూ.52 వేలు అవుతోంది. లాభం మాత్రం అంతంత మాత్రమే ఉండడంతో మార్ట్లో వ్యాపారం డీలా పడింది. కొరవడిన పర్యవేక్షణ వీరఘట్టం మెయిన్రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ మార్ట్కు విశాలమైన స్థలం ఉంది. ఈ స్థలంలో సరుకులను కొనుగోలుదారులకు కనిపించేటట్టు ఏర్పాట్లు చేయాలి. అయితే అధికారులు వ్యాపారంపై దృష్టి సారించకపోవడంతో కొనుగోలుదారులు ఇటువైపు రావడం మానేశారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మహిళా మార్ట్ వ్యాపారాభివృద్ధికి చర్యలు చేపట్టాలని పలువురు మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారు.వ్యాపారాభివృద్ధికి చర్యలు చేపడతాం మహిళా మార్ట్ అభివృద్ధికి చర్యలు చేపడతాం. మహిళా సంఘాలతో పాటు స్థానికులు కూడా ఇక్కడ సరుకులు కొనుగోలు చేసేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహించి మార్ట్లో వ్యాపారాభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. ప్రచారం పెంచి ప్రజలకు మార్కెట్ కంటే తక్కువ ధరకే నిత్యావసర సరుకులను అందజేసి మార్ట్కు పూర్వవైభవాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు చేపడతాం. ఈ మార్ట్ను ప్రజలందరికీ దగ్గరగా ఉండేలా ఏర్పాటు చేస్తాం. – కె.లలితకుమారి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు -
జిల్లాను ముందంజలో నిలపడమే లక్ష్యం
పార్వతీపురం రూరల్: జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలపడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ మండల స్థాయి అధికారులకు పిలుపునిచ్చారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమరోహ్(సాస్) కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. నీతిఅయోగ్ సూచికలలో సంతృప్తికర ఫలితాలు సాధించిన జిల్లా, మండల స్థాయి అధికారులు, సిబ్బందిని ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవతో కలసి పతాకాలు, ప్రశంసాపత్రాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఏపీఓ మురళీధర్, డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు, డీఈఓ బి.రాజ్కుమార్, డీఎఫ్ఓ జీఏపీ ప్రసూన, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు. భాగస్వామ్యంతోనే అభివృద్ది సాధ్యం వివిధ సంస్థలు, ప్రజల భాగస్వామ్యంతోనే సమాజాభివృద్ధి సాధ్యమని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నారు. ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో కేంద్ర ప్రభుత్వ గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గిరిజన గ్రామాల అభివృద్ధికి అమలు చేస్తున్న ఆది కర్మయోగి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వికసిత్ భారత్ కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించారు. సేవ, సమర్పణ, సంకల్పం అనే సూత్రాల ఆధారంగా పనిచేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఐటీడీఏ పీఓ, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ మాట్లాడుతూ జిల్లాలో 113 గ్రామ సచివాలయ పరిధిలోని 165 గ్రామాలను మొదటి విడతలో ఆది కర్మయోగి కార్యక్రమానికి ఎంపిక చేసినట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ గిరిజన మంత్రిత్వ శాఖ, పీఎం జన్మన్ ప్రాజెక్టు అధికారి రిషబ్ ద్వివేది మాట్లాడుతూ సమగ్రమైన ఆలోచన, సామాజిక అవగాహనతోనే గిరిజనాభివృద్ధి సాధ్యమన్నారు. ● ఆకాంక్ష హత్తో మహిళా సంఘాల ఆర్థిక స్థితి మెరుగు పడనుందని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మహిళా సంఘాలు తయారుచేసిన వస్తువుల ప్రదర్శన, విక్రయాల స్టాల్స్ను ఆయన ప్రారంభించారు. -
బళ్లారి రాఘవతోనే సమాజంలో విప్లవాత్మక మార్పులు
విజయనగరం క్రైమ్ : తన రచనలతో సమాజంలో విప్లవాత్మకమైన మార్పులను దివంగత బళ్లారి రాఘవ తీసుకువచ్చారని ఏఎస్పీ పి.సౌమ్యలత అన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాఘవ జయంతి డీపీవోలు శనివారం నిర్వహించారు. ముందుగా రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఎస్పీ మాట్లాడుతూ బళ్లారి రాఘవ తెలుగు కళా రంగానికి విశేషమైన సేవలందించారన్నారు. ఉపాధ్యాయుడిగా, న్యాయవాదిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, రాజకీయ నాయకునిగా విభిన్నమైన రంగాల్లో తన ప్రతిభను చాటుకున్నారన్నారు. పౌరాణిక నాటకాల్లో పద్యాల వినియోగం తారా స్థాయిలో పెరిగిందని వీటిని తగ్గించి నటనకు ప్రాధాన్యత కల్పించే విధంగా పాత్రలను తీర్చిదిద్దాలన్నారు. నాటక రంగంలో సీ్త్రలను ప్రోత్సహించి నాటక రంగానికి తద్వారా సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి రాఘవ అన్నారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఆర్ఎస్ఐ ఎన్.గోపాలనాయుడు, ఏవో పి.శ్రీనివాసరావు, కార్యాలయ పర్యవేక్షకులు టి.రామకృష్ణ, వెంకటలక్ష్మి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జాతీయ బాక్సింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: జాతీయ స్థాయిలో జరగనున్న బాక్సింగ్ పోటీలకు ఎంపికై న జిల్లా క్రీడాకారులను జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. శనివారం నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇటీవల విశాఖలో జరిగిన 6వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ బాల, బాలికల బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీల్లో క్రీడాకారుడు బి.సచిన్, ఎం.జాహ్నవిలు బంగారు పతకాలు సాధించి జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికై న ఇరువురు క్రీడాకారులు ఈ నెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో జరగనున్న పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డోలా మన్మధకుమార్ తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి ఇందుకూరి అశోక్రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి రాజు, రాకేష్కుమార్, మెహబూబ్ షరీఫ్, శాప్ కోచ్ బి.ఈశ్వర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఏమైందో ఏమో..?
● రైలు కిందపడి విద్యార్థి ఆత్మహత్య ● విలపిస్తున్న తల్లిదండ్రులు ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం వేకువజామున 3 గంటల సమయంలో రైలు కిందపడి పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మందరాడ గ్రామానికి చెందిన దేవళ్ల హేమచంద్(16) ఆమదాలవలస మండలం దన్నానపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రథమ సంవత్సరం మెకానికల్ గ్రూపులో ఈ ఏడాది జాయిన్ అయ్యాడు. రెండో విడత కౌన్సిలింగ్ అనంతరం కాలేజీ మారుదామని ప్రయత్నం చేశాడు. అయితే మరెక్కడా సీటు రాకపోవడంతో ఆమదాలవలస పట్టణంలోని బీసీ బాలుర వసతి గృహంలో కొద్దిరోజులుగా ఉంటూ విద్యనభ్యసిస్తున్నాడు. కన్నీరుమున్నీరు తమ కుమారుడు రైలు కిందపడి మృతి చెందిన విషయాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారికి ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు ఇలా చేయడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన నాగభూషణరావు మందరాడ గ్రామంలోని శివాలయంలో అర్చకత్వం చేస్తూ జీవిస్తున్నారు. రెండో కుమారుడిని శ్రీశైలంలోని వేద పాఠశాలలో చదివిస్తున్నారు. పెద్ద కుమారుడు టెక్నికల్ విద్యనభ్యసిస్తే కుటుంబాన్ని ఆదుకుంటాడని అనుకున్నామని వారు విలపిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టిస్తోంది. మరోవైపు తోటి విద్యార్థి మరణ వార్తలో హాస్టల్ విద్యార్థులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహంలో ఉండలేనని... ఇక్కడ చదవడం ఇష్టం లేదని, వసతి గృహంలో ఉండలేనని మూడు రోజుల క్రితం విద్యార్థి తమ తల్లిదండ్రులకు చెప్పడంతో ఇంటికి తీసుకెళ్లి తండ్రి మణిభూషణరావు, తల్లి కుమారిలు తమ కుమారుడిని నచ్చజెప్పి మరలా వసతి గృహానికి పంపించారు. అయితే మృతుడు మళ్లీ శుక్రవారం తన తల్లిదండ్రులకు ఫోన్చేసి వసతి గృహం తనకు నచ్చలేదని, ఇంటికి వచ్చేస్తానని చెప్పినట్లు సమాచారం. ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ మృతుడు వసతి గృహంలో శుక్రవారం రాత్రి భోజనం చేసి బయటకు వెళ్లిపోయాడు. తెల్లవారుజామున భువనేశ్వర్ వైపు వెళ్తున్న హిరాఖండ్ ఎక్స్ప్రెస్ కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న హేమచంద్ను ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు కలిసి 108 అంబులెన్స్లో శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు జీఆర్పీ ఎస్ఐ మధుసూదనరావు తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందినట్లు వెల్లడించారు. అయితే హాస్టల్లో ఉండాల్సిన విద్యార్థి బయటకు వెళ్లి ఆత్మహత్య చేసుకోవడంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వలనే ఘోరం జరిగిందని వాపోతున్నారు. -
ఎరువు... కృత్రిమ కరువు..!
● అరకొరగా నిల్వలతో రైతన్నలు అవస్థలు ● అదునుకు అందని యూరియా ● ఆవేదనలో రైతన్న పార్వతీపురం/గుమ్మలక్ష్మీపురం/పాలకొండరూరల్: ఖరీఫ్ సీజన్లో రైతన్నకు ఎరువు కొరత వెంటా డుతోంది. పొలం పనులు మానుకుని ఎరువుకోసం ఆర్ఎస్కేలు, పీఏసీఎస్ల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఎరువులు సమృద్ధిగా ఉన్నాయ ని అధికార యంత్రాంగం చెబుతున్నా... పంపిణీలో లోపాలు రైతన్నను వెంటాడుతున్నాయి. ఎరువు దొరికితే గంటల తరబడి ఎందుకు నిరీక్షిస్తామని ప్రశ్నిస్తున్నారు. యూరియాను అధికార పార్టీ నాయకులు ఇళ్లకు తరలించి నిల్వచేయడం, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడంతో ఇబ్బందులు తప్పడంలేదని రైతులు వాపోతున్నారు. ఇదీ పరిస్థితి... జిల్లాలోని 15 మండలాల్లో 245 రైతు సేవా కేంద్రా ల ద్వారా 7,235 మెట్రిక్ టన్నులు, 22 సొసైటీల నుంచి 1,369 మెట్రిక్ టన్నుల ఎరువులు (యూరి యా, డీఏపీ కలిపి) సరఫరా చేసినట్టు కలెక్టర్ శ్యామ్ప్రసాద్ తెలిపారు. యూరియా వినియోగా న్ని తగ్గించేందుకు ప్రత్యమ్నాయ మార్గాలను అన్వే షిస్తున్నట్టు వెల్లడించారు. ద్రవ రూపంలో ఉన్న నానో యూరియా, నానో డీఏపీ ఎరువు రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంచుతామని, వాని వినియోగాన్ని పెంచాలని చెబుతున్నారు. అయితే, ఎరువు కొరత మాత్రం జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఎరువు ఎక్కడికి వెళ్తుందన్నది ప్రశ్నార్థకం. ●పార్వతీపురం మండలానికి 650 మెట్రిక్ టన్నుల యూరియా, సీతానగరం మండలానికి 520 మెట్రిక్ టన్నుల యూరియా, 100 మెట్రిక్ టన్నుల డీఏపీ, బలిజిపేట మండలానికి 550 మెట్రిక్ టన్నుల యూరియా, 200 మెట్రిక్ టన్నుల డీఏపీ సరఫరాచేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ఎరు వు రైతులకు అందడం లేదని, కృత్రిమ నిల్వలపై అధికారులు దృష్టిసారించాలని కోరుతున్నారు. ●గుమ్మలక్ష్మీపురం మండలంలో ఖరీఫ్ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 15వేల ఎకరాలు. ఇప్పటి వరకు వ్యవసాయశాఖ అధికారులు 224 మెట్రిక్ టన్నుల యూరియా, 106 మెట్రిక్ టన్నుల డీఏపీని తీసుకొచ్చి ఆయా రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు సరఫరా చేశారు. మరలా 300 మెట్రిక్ టన్నుల యూరియా, 200 మెట్రిక్ టన్నుల డీఏపీ కోసం ఇండెంట్ పెట్టినా నేటికీ రాలేదు. రైతులు ఎరువుల కోసం ఎదురు చూస్తున్నారు. ●కురుపాం మండలంలో ఈ ఖరీప్లో అన్ని రకాల పంటలు కలిపి సుమారు 12 వేల ఎకరాల్లో సాగుచేయాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం యూరియా, డీఏపీ కలిపి 330 మెట్రిక్ టన్నులు మాత్రమే ఆర్ఎస్కేల ద్వారా సరఫరా చేశారు. రెండు, మూడు రోజుల్లో ప్రతిపాదించిన యూరియా, డీఏపీ వస్తుందని, రైతులకు అందజేస్తామని వ్యవసాయాధికారి నాగేశ్వరరావు తెలిపారు. ●జియ్యమ్మవలస మండలంలో ఈ ఖరీఫ్లో సాధారణ సాగువిస్తీర్ణం 9,320 ఎకరాలు. ఇప్పటి వరకు 140 మెట్రిక్ టన్నుల డీఏపీ, 390 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే రైతులకు అందించా రు. మరో 320 మెట్రిక్ టన్నుల యూరియా, డీఏపీ నిమిత్తం ప్రతిపాదించినా రాలేదు. చేసేది లేక రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ●కొమరాడ మండలానికి ఇప్పటి వరకు 325 మెట్రిక్ టన్నుల యూరియా, 120 మెట్రిక్ టన్నుల డీఏపీని మాత్రమే ఆర్ఎస్కేల ద్వారా పంపిణీ చేశారు. డీఏపీ, యూరియా కొరత ఉంది. ●గరుగుబిల్లి మండలంలో సాధారణ సాగు విస్తీర్ణం 14వేల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 260 మెట్రిక్ టన్నుల యూరియా, 150 మెట్రిక్ టన్నుల డీఏపీని మాత్రమే సరఫరా చేశారు. ●పాలకొండ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 25వేల హెక్టార్లలో వరి పంట సాగుకు రైతు లు ఉపక్రమించగా 60 శాతం యూరియా, డీఏపీని మాత్రమే అందుబాటులో ఉంచినట్టు రైతులు చెబుతున్నారు. ఎరువులను సరఫరా చేయాలి రైతులు సాగు చేస్తున్న విస్తీర్ణం ఆధారంగా యూరి యా, డీఏపీ ఎరువులను సరఫరా చేయాలి. ఎరువు లు పూర్తిస్థాయి అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. గ్రోమోర్ ఎరువుల దుకాణంలో ఎరువుతో పాటు అదనంగా సేంద్రియ ఎరువులను ఇస్తున్నారు. ఎరువులను పూర్తిస్థాయిలో సరఫరా చేయకపోతే ఇబ్బందు లు పడాల్సి వస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వ్యవసాయాన్ని విరమించుకునే పరిస్థితి ఉంటుంది. – ఉరిటి అచ్యుతనాయుడు, కొత్తపట్నం, పార్వతీపురం మండలం ఎరువుల కొరత తీవ్ర స్థాయిలో ఉంది రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో లేవు. ఎప్పుడు వస్తాయో తెలియడంలేదు. ఎరువుల కొరత ఉంది. ప్రభుత్వం స్పందించి అవసరం మేరకు ఎరువులు సరఫరా చేయాలి. – గుడివాడ సంపత్కుమార్, వైస్ ఎంపీపీ, జియ్యమ్మవలస మండలం -
బోధనకు దూరం చేయొద్దు
●గురువుల డిమాండ్ ●12వ పీఆర్సీ అమలు చేసి సీపీఎస్ రద్దు చేయాలి ●12వ వేతన సవరణ అమలుకు డిమాండ్ ●ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నేడు నిరసనకు ఉపాధ్యాయులు సిద్ధం పార్వతీపురం టౌన్: ఉపాధ్యాయులు అంటే చదువు నేర్పేవారు... ఇది ఒకప్పటి సంగతి. ప్రస్తుతం పిల్లలు బడికి వచ్చేది, మధ్యాహ్న భోజనం, దుస్తులు, కోడిగుడ్డు, చిక్కి, రాగి జావ విద్యార్థులకు అందించి ప్రభుత్వానికి లెక్క చెప్పేవారు అన్నట్టుగా మారింది. ప్రభు త్వ ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఒత్తిడి తెచ్చింది. ఇవన్నీ చేయగా సమయం మిగిలితేనే విద్యార్థులకు నాలుగు అక్షరాలు చెప్పే అవకాశం ఉంటుంద ని ఉపాధ్యాయుల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పా ఠాలు చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చే స్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. ఉపాధ్యాయుల డిమాండ్లు ఇవే... ●ఉపాధ్యాయులకు బోధన తప్ప ఏ ఇతర బోధనేతర కార్యక్రమాలు లేకుండా చేయాలి. పీ–4 కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకు నిర్బంధం చేయవద్దు. ●నూతనంగా అప్గ్రేడ్ అయిన స్థానాలను కోరుకు న్న ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలి. ●ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యలు పరిష్కరించి విద్యాశాఖలో ఉన్న ఆసంబద్ధతను తొలగించాలి. 72, 71, 74 జీఓలు అమలు చేయాలి. ●హైస్కూల్ ప్లస్లలో వెంటనే ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి, యథాతథంగా కొనసాగించాలి. ●పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్ ఉన్న కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలి. ●12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేసి, 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలి. ●ఉపాధ్యాయులు, ఉద్యోగులకు 3 పెండింగ్ డీఏలను ప్రకటించాలి. ●డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే చెల్లించాలి. ●సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. – ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా కొనసాగించాలి. పరీక్షలను తెలుగులో రాసే అవకాశం కల్పించాలి. ●పదవీకాలం పూర్తికాని స్కూల్ గేమ్స్ సెక్రటరీలను (ఎస్జీఎఫ్) సెక్రటరీలను తొలగించడం సరైనది కాదు. తిరిగి వారిని కొనసాగించాలి. ●అంతర్ జిల్లాల బదిలీలను చేపట్టాలి. ●సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించి గ్రేడ్–2 పండిట్లు, పీఈటీలకు పదోన్నతులు కల్పించాలి. ●బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలి ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలి. బోధనపైనే దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలి. బదిలీలు జరిగి 45 రోజులు దాటినా కొందరు ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించకపోవడం విచారకరం. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నేడు కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతాం. – పువ్వల కూర్మినాయుడు, ఫ్యాప్టో చైర్మన్, పార్వతీపురం మన్యం -
●బోధనేతర పనులతో ఒత్తిడి
ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగిస్తున్నారు. ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల్లోనూ భాగస్వాములు చేస్తున్నారు. దీనవల్ల సమయం వృథా అవుతోంది. బోధన కుంటుపడుతోంది. హైస్కూల్ ప్లస్లలో వెంటనే ఉపా ధ్యాయుల నియామకాలు చేపట్టి, యథాతథంగా కొనసాగించాలి. ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి. – ఉత్తరావల్లి గోంవిదనాయుడు, ఫ్యాప్టో కో చైర్మన్, పార్వతీపురం మన్యం ●ఇదెక్కడి పర్యవేక్షణ ప్రభుత్వ ప్రచారకార్యక్రమాలను ఉపాధ్యాయులకు అప్పగించడం, వేరేశాఖ ఉ ద్యోగులను పర్యవేక్షణకు ని యమించడం అన్యాయం. పీ–4 కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకు అంటగట్టొద్దు. – ఎస్.మురళీమోహన్రావు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి -
దత్తత స్వచ్ఛందమే..
● కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పార్వతీపురం రూరల్: పీ–4 దత్తత పూర్తిగా స్వచ్ఛందమేనని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ స్పష్టం చేశారు. పీ–4, పీఎం సూర్యఘర్, హర్ఘర్ తిరంగ తదితర అంశాలపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఇష్టపూర్వకంగా ముందుకు వచ్చినవారికి బంగారు కుటుంబాలను బాగుచేసే బాధ్యతలు అప్పగించాలన్నారు. పీఎం సూర్యఘర్ కింద ఎస్టీ, ఎస్సీ గృహాలపైన ఖాళీ స్థలం ఉంటే నెలకు రూ.200 వారికి అద్దె ఇస్తూ సౌరవిద్యుత్ ప్యానె ల్ ఏర్పాటు చేస్తామన్నారు. హర్ఘర్ తిరంగా వేడుకులను ఆగస్టు 15వ తేదీ వరకు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. త్రివర్ణ పతాకాలను గృహాలపై పెట్టడం, పెద్ద ఎత్తున ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఛాయా చిత్రాల ప్రదర్శనలు ఏర్పాటుచేసి ప్రజల్లో భక్తిభావం పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో పార్వతీపురం ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, సీతంపేట ఐటీడీఏ పీఓ యశ్వంత్కు మార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమల త, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పైనాపిల్ పార్క్కు జిల్లా అనుకూలం ● మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్ తేజ్ భరత్ పార్వతీపురం రూరల్: పైనాపిల్ పార్క్ ఏర్పాటుకు జిల్లా అనుకూలమని, ఆ దిశగా ఆలోచనలు చేయాలని మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్.తేజ్భరత్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదరికం నుంచి మహిళలను ఆర్థికాభివృద్ధి దిశగా నడపడమే మెప్మా ఆశయమన్నారు. మహిళలతో కొత్త యూనిట్లను స్థాపించి ఫొటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. చెత్త నుంచి వర్మీకంపోస్టు తయారీ, ఇంటి వద్దనే కూరగాయల తోటల సాగుతో లబ్ధిపొందే అవకాశాలపై అవగాహన కల్పించాలన్నారు. డీజీ లక్ష్మి పథకం కింద డిజిటల్ కియోస్క్ల స్థాపించి 250 ప్రజా సేవలను ప్రజలకు అందించడం ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో మెప్మా పథక సంచాలకులు జీవీ చిట్టిరాజు, సాంకేతిక నిపుణులు సీఎంఎంలు, సీఓలు, డీఈఓలు, సీఎల్ఆర్సీలు, టీఎల్ఎఫ్ఆర్సీలు పాల్గొన్నారు. అరకు–విశాఖ రోడ్డులో 145 కేజీల గంజాయి పట్టివేత లక్కవరపుకోట: ఒడిశా నుంచి నుంచి కేరళ రాష్ట్రానికి అరకు–విశాఖ జాతీయ రహదారిలో బొలెరో వాహనంలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన మహ్మద్ సఫీ, ఒడిశాకు చెందిన దుంబిలను గొల్జాం కూడలి వద్ద పోలీస్లు శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి 145 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సీఐ అప్పలనాయుడు, ఎస్ఐ నవీన్పడాల్ తెలిపారు. -
సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీగా సురేష్
పార్వతీపురం రూరల్: వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వె వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగంలో వివిధ హోదాల్లో పలువురిని నియమిస్తూ శుక్రవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు పార్వతీపురం నియోజకవర్గంలోని సీతానగరం మండలానికి చెందిన ఉపద్రష్ట సురేష్ను సోషల్మీడియా రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తనను సూచించిన స్థానిక మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు సురేష్ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ స్పందిస్తున్న తీరును వివరిస్తూ..సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వాన్ని ఎండగడతామని సురేష్ అన్నారు. -
జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్కు కీలక మార్గదర్శకాలు
విజయనగరం అర్బన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్కు కళాశాలల నిర్వహణకు సంబంధించి కీలకమైన మార్గదర్శకాలను ఇంటర్మీడియట్ విద్య ఆర్జేడీ మజ్జి ఆదినారాయణ విడుదల చేశారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లాకు చెందిన 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్తో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో మార్గదర్శకాలపై వివరించారు. కార్యనిర్వహణ, విద్యాప్రమాణాల బలోపేతానికి సంబంధించిన సూచనలు విధిగా పాటించాలని కోరారు. కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి హాజరు తప్పనిసరిగా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ యాప్లో, భౌతిక హాజరు పుస్తకంలో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రవేశాల దృష్ట్యా మొదటి సంవత్సరం విద్యార్థులను ఈ నెల 11వ తేదీ వరకు చేర్చుకోవాలని స్పష్టం చేశారు. అలాగే విద్యార్థుల విజయశాతాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, ప్రతిభావంతుల కోసం పోటీ పరీక్ష శిక్షణ అందించాలన్న మార్గదర్శకాలు పాటించాలన్నారు. సమావేశంలో ఆర్ఐఓ ఎస్.తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు.మేడపై నుంచి జారిపడి యువకుడి మృతిసాలూరు రూరల్: పట్టణ పరిధిలోని బొడ్డవలస గ్రామానికి చెందిన బండి మనోజ్ (25)తన ఇంటి మేడపై నుంచి జారి పడి మృతి చెందినట్లు పట్టణ సీఐ అప్పల నాయుడు తెలిపారు. ఇంటి మేడపై వడియాలు ఆరపెట్టేందుకు వెళ్లిన ఆయనకు గల శారీరక బలహీనత, అంగవైకల్యం కారణంగా ప్రమాదవశాత్తు జారిపడినట్లు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామన్నారు.జర్మనీభాషలో ఉచిత శిక్షణకు ఆహ్వానంవిజయనగరం టౌన్: జర్మనీలో నర్స్ ఉద్యోగాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ మహిళలకు జర్మనీ భాషపై ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ ఉపసంచాలకురాలు అన్నపూర్ణమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన మహిళలు ఎవరైనా నర్సింగ్, జీఎన్ఎమ్ పట్టభద్రులకు జర్మనీ భాషలో బి2 స్థాయిలో 8 నుంచి 10 నెలల పాటు ఉచిత శిక్షణ, వసతితో కూడిన సదుపాయాలు కలిగిన కేంద్రాలను విశాఖ, గుంటూరు, తిరుపతిలో ఏర్పాటుచేసి, వారికి జర్మనీ దేశంలో ఉపాధి అవకాశం కల్పించే ఉద్దేశంతో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రవేశానికి నైపుణ్యం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉచిత శిక్షణకు సంబంధించి మహిళలకు 35 ఏళ్ల వయసు మించకుండా బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎమ్ నర్సింగ్ పూర్తిచేసి క్లినికల్ అనుభవం కలిగి ఉండాలన్నారు. ఆసక్తి గల మహిళలు ఆగస్టు 7వ తేదీ లోపు అన్ని సర్టిఫికెట్లతో వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తు పత్రాలను కార్యాలయంలో అందజేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9848871436 నంబర్ను సంప్రదించాలని కోరారు. నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంశృంగవరపుకోట: మండలంలోని కిల్తంపాలెం జవహర్ నవోదయ విద్యాలయలో 2025–26 విద్యాసంవత్సరంలో 11వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేసేందుకు 2024–25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పాసై, అర్హత సాధించిన విద్యార్థులు ఆగస్టు 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపాల్ వి.దుర్గాప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు www.navodaya. gov.in వెబ్సైట్ నుంచి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని పూర్తిచేసి నేరుగా నవోదయ స్కూల్ పనివేళల్లో కార్యాలయంలో ఇవ్వాలని లేదా నవోదయ విద్యాలయ మెయిల్లో దాఖలు చేసుకోవచ్చన్నారు. 772 లీటర్ల సారా ధ్వంసంపార్వతీపురం రూరల్: ఇటీవల పట్టుబడిన 17 సారా కేసుల్లో స్వాధీనం చేసుకున్న 772 లీటర్ల సారాను పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఏఎస్పీ అంకితా సురాన ఆధ్వర్యంలో పట్టణ శివారులో శుక్రవారం ధ్వంసం చేశారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ అధికారులు సంతోష్కుమార్, పట్టణ సీఐ కె.మురళీధర్, ఎస్సై ఎం.గోవింద సిబ్బంది పాల్గొన్నారు. -
వినూత్న సాగుతో ఆదర్శంగా..!
ఆయనొక రైతు. వ్యవసాయాన్ని నమ్ముకుని వారసత్వంగా వచ్చిన భూమిలో సరికొత్త పద్ధతిలో సాగుచేయడం ప్రారంభించారు. ఏ ఏడాదికి ఆ ఏడాది కొత్త విధానాలు అవలంబిస్తూ వ్యవసాయంలో పోటీపడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాలోని రైతులకు దీటుగా ఇక్కడ వ్యవసాయం చేస్తూ దిగుబడులు సాధిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నేరుగా ఏపీ సీడ్స్కే ప్రతి ఏడాది విత్తనాలు అందించే ఆ రైతు ఈ ఏడాది కూడా ఖరీఫ్సాగులో మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఖరీఫ్లో సాగుచేసే వరి పంటలో ఉభయగోదావరి జిల్లాల రైతులుఅవలంబిస్తున్న విధానాన్ని ఇక్కడ తన పంట పొలాల్లో ప్రారంభించారు. ఆయన మరెవరో కాదు రేగిడి మండలంలో ఉణుకూరు గ్రామానికి చెందిన గేదెల వెంకటేశ్వర రావు. – రేగిడిలైన్సోయింగ్ పద్ధతిలో నాట్లు వేస్తున్న బెంగాల్ కూలీలు● ఖరీఫ్లో కొత్త తరహా నాట్లు ● లైన్ సోయింగ్ విధానంతో వరినారు ఆదా ● ఎకరాకు 8 కిలోల విత్తనాల వరినారుతో ఉడుపు ● పశ్చిమబెంగాల్ కూలీలతో వరి ఉభాలు ● రైతు గేదెల వెంకటేశ్వర రావు కృషిఇష్టంతోనే.. వ్యవసాయం కష్టంతో కాకుండా ఇష్టంతో చేయాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. విత్తనాల దగ్గర నుంచి ఎరువులు వరకూ ప్రతి పెట్టుబడికి ఇతరులపై ఆధార పడకూడదు. రైతు సొంతంగా విత్తనాలు తయారు చేసుకునే స్థితికి రావాలి. రసాయన ఎరువులు తగ్గించి సాగుచేసే విధానంవైపు రైతులు దృష్టిసారించాలి. మిగిలిన ప్రాంతాల్లోని రైతులతో పోటీపడే ఆలోచన రావాలి. అప్పుడే వ్యవసాయంలో లాభాలు కనిపిస్తాయి. ఈ ఏడాది లైన్సోయింగ్ విధానంలో వరినాట్లు వేశాం. ప్రస్తుతం పంట ఆశాజనకంగా ఉంది. – గేదెల వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి మాజీ అధ్యక్షుడు, ఉణుకూరుజిల్లా వ్యవసాయ సలహా మండలి మాజీ అధ్యక్షుడు గేదెల వెంకటేశ్వరరావు ఉణుకూరు గ్రామంలో 50 ఎకరాలకు పైగా పంటపొలాలు ఉన్న రైతు. ఇంత ఆస్తి ఉన్నా తాను ఆ భూమిని ఎవరికీ కౌలుకు ఇవ్వలేదు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం కోసం అర్రులు చాచలేదు. తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా వచ్చిన భూమినే నమ్ముకున్నారు. వ్యవసాయాన్నే ఉద్యోగంగా మార్చుకుని ఊహతెలిసినప్పటి నుంచి వినూత్న పద్ధతుల్లో పంటలు సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రసాయన ఎరువుల మోతాదు తగ్గించి, సేంద్రియ ఎరువుల వినియోగంతో పాటు యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఆది నుంచి ఆసక్తిగా వ్యవసాయం చేసే వెంకటేశ్వరరావుకు వ్యవసాయంలో వచ్చే కొత్త పద్ధతులు వేగంగా అందుకోవడం వెన్నతో పెట్టిన విద్య. ఇందులో భాగంగానే ఈ ఏడాది లైన్ సోయింగ్ విధానాన్ని అందుకుని, ఇక్కడ తన పంటపొలాల్లో ఈ పద్ధతిని ప్రారంభించారు. 8 కిలోల విత్తనాలతో ఎకరాలో సాగు సాధారణంగా రైతులు ఎకరాసాగులో వరి ఉభాలకు 30 కిలోల వరకూ వరి విత్తనాలతో వరినారు తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ నారు సరిపోని పరిస్థితి ఉంటుంది. వరి ఉభాలు చేసిన సమయంలో ఈ ప్రాంతంలో కనీసం పదిమొక్కలను కలిపి ఒకేచోట వేస్తుంటారు. ఇలా కాకుండా ఒకచోట ఒక వరి నారును మాత్రమే ఉభాలు చేసి, ఒక వరి మొక్కకు మరో మొక్కకు మధ్య కనీసం పది అంగుళాల ఖాళీ ఉంచి ఉభాలు చేయడాన్ని లైన్సోయింగ్ విధానం అంటారు. ఈ విధానాన్ని ఉభయగోదావరి జిల్లాలోని రైతులు అవలంబిస్తున్నారు. ఈ విధానంతో ఆయా ప్రాంతాల్లో వరి పంట అధికంగా దిగుబడి రావడంతో పాటు చీడపీడలు తట్టుకుంటుంది. ఒక వరి మొలక కాస్తా పెరగగానే 30వరకూ పిలకలు వేసి పెద్ద దుబ్బుగా మారుతుంది. పెద్దగింజల కంకి హారం కట్టి, ఎకరాకు 40 బస్తాల వరకూ దిగుబడి వస్తుంది. ఈ విధానం నిమిత్తం వెంకటేశ్వర రావు ఎకరాకు 8కిలోలు చొప్పున విత్తనాలతో నారు పోసి పశ్చిమబెంగాల్ నుంచి కూలీలను తీసుకొచ్చి తనకున్న పొలాల్లో 40 ఎకరాల్లో ఈ విధానంలో వరినాట్లు వేయించారు. వారం రోజుల పాటు ఈ విధానంలో పంటపొలాల్లో వరినాట్లు వేయించారు. ప్రస్తుతం ఈ వరినాట్లు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ విధానాన్ని చూసిన మరో రైతు కూడా తనకున్న పది ఎకరాల్లో వరిసాగుచేస్తున్నారు. దిగుబడి సాధనలో దిట్ట గేదెల వెంకటేశ్వరరావుకు జిల్లాతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో కూడా పేరుంది. వరి పంటలో స్థానిక రకాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సాగుచేసే సన్నాలు, మసూరి పంటలను కూడా సాగుచేస్తుంటారు. ఆయన వద్ద ఉభయగోదావరి జిల్లాలకు చెందిన రైతులు విత్తనాలు కొనుగోలు చేస్తుంటారు. వరితో పాటు మిరప, మొక్కజొన్న పంటల సాగులో కూడా మంచి దిగుబడి సాధించే సత్తా వెంకటేశ్వరరావుకు ఉంది. వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సైతం ఆయన సాగుచేస్తున్న పంటను పరిశీలించేందుకు వస్తుంటారు. ఆయన సాగుచేస్తున్న వరిపంటలో నాణ్యత ఉండడంతో గత 20 సంవత్సరాలుగా ఏపీ సీడ్స్కు విత్తనాలు అందిస్తున్నారు. -
ఫలించిన రన్ మిషన్ కష్టం..
● పోలీస్ ఉద్యోగాలకు 14 మంది ఎంపికచీపురుపల్లి: రక్షణ దళంలో ఒకటైన ఎయిర్ఫోర్స్లో ఆయనొక ఉద్యోగి. అయితే అందరి ఉద్యోగుల్లాగా తన పని తాను చేసుకుంటూ కుటుంబం బాగోగులు చూసుకుంటూ ఆయన ఉండలేదు. తన లాగానే మరెంతో మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత పోలీస్, రక్షణ దళంలో చేరాలని అందుకు అవసరమైన సహకారాన్ని అందజేయాలని తపించారు. అందులో భాగంగానే పుట్టుకొచ్చింది రన్ మిషన్. ఆ రన్ మిషన్ ఎంతో మంది యువత ఉద్యోగాలు సాధనకు వేదికై ంది. తాజాగా విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ఫలితాల్లో రన్ మిషన్ నేతృత్వంలో శిక్షణ పొందిన 14 మందికి ఉద్యోగాలు వచ్చాయి. దీంతో వారంతా రన్ మిషన్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పట్టణానికి చెందిన ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి కంది హేమంత్ రన్ మిషన్ అనే సంస్థను స్థాపించారు. ఆ సంస్థ ద్వారా ఎంతో మంది నిరుద్యోగ యువతీ, యువకులకు పట్టణంలోని జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. అందులో భాగంగా శిక్షణ తీసుకున్న యువతలో తాజాగా విడుదలైన కానిస్టేబుల్ ఫలితాల్లో 14 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సివిల్ విభాగంలో ఐదుగురు, ఏపీఎస్పీ విభాగంలో 9 మంది ఉద్యోగాలు సాధించిన వారిలో ఉన్నారు. రన్మిషన్ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇవ్వడం ద్వారా ఎంతో మందికి ఉద్యోగావకాశాలు లభిస్తుండడంతో వ్యవస్థాపకుడు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
ఆస్తిపై హక్కును రద్దు ఎలా చేస్తారు
పాలకొండ రూరల్: రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పొందుపర్చిన వెసులుబాటులను ఆసరాగా చేసుకుని తనకు దఖలుపడిన ఆస్తిపై ఉన్న హక్కును తన ప్రమేయం లేకుండా ఎలా రద్దు చేస్తారని ఓ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. రిజిస్ట్రేషన్ సమయంలో ఎటువంటి నిబంధనలు ఉండవా? అడ్డగోలుగా వ్యవహరిస్తారా? అంటూ అధికారులను సూటిగా ప్రశ్నించడంతో పాటు తనకు అన్యాయం చేయవద్దంటూ కన్నీరు పెట్టుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..అనకాపల్లి జిల్లా, అదే మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన కట్టుమూరి సుమతి, అప్పారావు దంపతులు శుక్రవారం పాలకొండ సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకున్నారు. నేరుగా రిజిస్ట్రార్ శ్రీరామ్మూర్తిని కలిసి తమ ఆవేదన వెళ్లగక్కారు. ఈ సందర్భంగా బాధితురాలు సుమతి మాట్లాడుతూ తన తల్లి ఓదిరి జయమేరి పసుపు కుంకుమ నిమిత్తం విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో సర్వే నంబర్ 63/3 (డాబాగార్డెన్స్–కప్పరాడ గ్రామం) వద్ద డోర్ నంబర్ 57–28–16/7 అసెస్మెంట్ నంబర్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న రెసిడెన్షియల్ ఫ్లాట్ను గిఫ్ట్ రూపంలో అందించారన్నారు. ఇందుకు సంబంధించి 2021లో ద్వారకానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజు నంబర్ 2757/2021 రిజిస్ట్రేషన్ చేసినట్లు వివరించారు. ఇటీవల తన ప్రమేయం లేకుండా సదరు గిఫ్ట్ దస్తావేజును పాలకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2025 జూన్ 25వ తేదీన ‘ఎనీవేర్’ పద్ధతిలో వేరొకరు రద్దు చేయించడం ఏమిటని ప్రశ్నించారు. తన సోదరుడు ఓదిరి సతీష్, ఆయన భార్య విజేత ఈ చర్యలకు పాల్పడినట్లు వాపోయారు. నోటీసులు ఇవ్వకుండా చేశారు రిజిస్ట్రేషన్ సమయంలో పాలకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులు తనకు ఎటువంటి నోటీసులు, సమచారం ఇవ్వకుండా తన ఆస్తిపై హక్కును రద్దు రిజిస్ట్రేషన్ చేయించడం అన్యాయమని వాపోయారు. రిజిస్ట్రేషన్ విధానంలో గల ఎనీవేర్ పద్ధతిని అడ్డుపెట్టుకుని అధికారం, పలుకుబడి, నగదు చెల్లించి నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రక్రియకు పాల్పడుతున్నట్లు బాధితులు వాపోయారు. ఉన్నతాధికారులు ఈ వ్యవహరంపై లోతైన దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాలని బాధిత దంపతులు సుమతి, అప్పారావు కోరారు. ఫిర్యాదును పరిశీలించిన పాలకొండ సబ్ రిజిస్ట్రార్ శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ తన హయాంలో ఈ దస్తావేజు రద్దు జరగలేదన్నారు. ప్రభుత్వ జీఓ ప్రకారం గిఫ్ట్ రిజిస్ట్రేషన్ పత్రాలు రద్దు చేయాలంటే కచ్చితంగా సంబంఽధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వాలి. వారి సమక్షంలో రద్దు దస్తావేజీలు రూపొందించాల్సి ఉంటుంది. బాధితులు అందించిన ఫిర్యాదును ఉన్నతాఽధికారులకు అందిస్తామని చెప్పారు. సబ్రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కన్నీరుపెట్టుకున్న బాధితులు -
విద్యార్థుల ఆరోగ్యంపట్ల నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం
● ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ ● సాక్షి కథనానికి స్పందనపార్వతీపురం రూరల్: గిరిజన ప్రాంతాల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించినా..ప్రత్యేక శ్రద్ధ చూపించకపోయినా ఉపేక్షించేది లేదని పార్వతీపురం ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ సంబంధిత అధికారులకు తేల్చి చెప్పారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల బాగోగులు చూడాల్సిన బాధ్యత సంక్షేమ, వైద్యాధికారులపై ఉందని హెచ్చరించారు. గురువారం సాక్షి దినపత్రికలో ‘‘ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అనారోగ్యం’’ శీర్షికన వార్త ప్రచురితం కావడంతో శుక్రవారం ఈ మేరకు పీఓ డోకిశీల ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో అనారోగ్యానికి గురైన విద్యార్థులను పరామర్శించి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు, స్థానిక వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సంక్రమించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు కావాల్సిన మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఆశ్రమ పాఠశాల ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అలాగే నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని చెప్పారు. ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, విద్యార్థులను ఎప్పటికప్పుడు పరిశీలించి అనుమానంగా ఉంటే రక్తపరీక్షలు నిర్వహించి వ్యాధులను నిర్ధారించాలని స్పష్టం చేశారు. మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వంటి వ్యాధులు రాకుండా దోమల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ పర్యటనలో గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకురాలు ఆర్.కృష్ణవేణి, మరికొంతమంది అధికారులు పాల్గొన్నారు. -
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
పార్వతీపురం: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సీహెచ్.పావని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం గేటు వద్ద ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరవధిక నిరాహర దీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిగ్రీ పూర్తి అయిన తరువాత పీజీ చేయాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, జిల్లా కేంద్రాల్లో పీజీ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం విద్యారంగాన్ని ఛిన్నాభిన్నం చేస్తోందని, కార్పొరేట్లను ప్రోత్సహించేలా విధానాలను రూపొందిస్తోందని ఆరోపించారు. విద్యార్థులకు ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో ఏఎన్ఎంలను నియమించకపోవడంతో విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నా యన్నారు. ఈ దీక్షలకు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహన్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు టి.అఖిల్, ఎం.సంధ్య, కె.డేవిడ్, ఎ.గంగారావు, ఎం.సురేష్, జి.సంజీవ్, సింహాచలం, రాజేష్, చంటి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ నిరాహార దీక్ష -
దొంగతనానికి దారితీసిన జల్సాలు
● చోరీకేసును ఛేదించిన పోలీసులురాజాం సిటీ: జల్సాలకు అలవాటుపడి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ పాఠశాలలో పనిచేస్తున్న డ్రాయింగ్ టీచర్ స్నేహితుల సహాయంతో దొంగతనానికి పాల్పడ్డాడు. జల్సాలు, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లకు పాల్పడిన ఓ యువకుడు తనకు గతంలో పరిచయమున్న స్నేహితులను ఆశ్రయించి సొంత గ్రామంలో ఏకంగా 18 తులాల బంగారాన్ని చోరీ చేయడంలో సూత్రధారిగా నిలిచాడు. నిందితుల్లో ఒకరు పాత నేరస్తుడుకాగా మరో స్నేహితుడు ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించి రాజాం టౌన్ సర్కిల్ కార్యాలయంలో చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వంగర మండలం బాగెంపేట గ్రామంలో గత నెల 24న పశుమర్తి శంకరరావు ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి 25న కేసు నమోదుచేసిన వంగర పోలీసులు ఈ దొంగతనానికి సూత్రధారిగా అదే గ్రామానికి చెదిన రెడ్డి గోపాలకృష్ణను గుర్తించి ఆరా తీశారు. ఆయన ఓ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అలాగే ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్తోపాటు జల్సాలకు అలవాటుపడి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు. ఈ ఇబ్బందుల నుంచి ఎలాగైనా బయటపడాలని నిర్ణయించి గతంలో వాలీబాల్ క్రీడలో పరిచయమైన పాలకొండ మండలం యరకారాయపురం గ్రామానికి చెందిన శ్రీరామ్ బాలరాజు, టీకే రాజపురం గ్రామానికి చెందిన జాడ దుర్గారావులను ఆశ్రయించాడు. గ్రామానికి చెందిన పశుమర్తి శంకరరావు కుటుంబంతో సహా ఇంటికి తాళంవేసి హైదరాబాద్ వెళ్లారని, వారి ఇంట్లో బంగారం సులభంగా దొంగిలించవచ్చునని వారికి తెలియజేశాడు. 16 తులాలు రికవరీ ఇదే అదునుగా వారు ముగ్గురూ దొంగతనానికి పాల్పడ్డారు. దొంగిలించిన బంగారాన్ని అమ్మకానికి తీసుకువెళ్తున్న నిందితులను బూరాడ జంక్షన్ వద్ద శుక్రవారం అదుపులోకి తీసుకుని వారి నుంచి 18 తులాల బంగారానికి గాను 16 తులాలు రికవరీ చేయగా మిగిలిన రెండు తులాలు బాలరాజు పార్వతీపురంలోని సీఎస్బీ బ్యాంకులో తాకట్టుపెట్టాడని, అదికూడా త్వరలో రికవరీ చేస్తామని వెల్లడించారు. సీఐ కె.అశోక్కుమార్, వంగర ఎస్సై షేక్శంకర్ ఉన్నారు. -
డిజిటల్ బోర్డుల పేరిట దోపిడీ
కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లు తయారైంది కూటమి ప్రభుత్వం తీరు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో శ్రద్ధ తీసుకోవడం లేదు కానీ..ప్రజలను ఏదో రకంగా దోచుకోవడమే లక్ష్యంగా చేసుకుందని చెప్పడానికి డిజిటల్ బోర్డుల ఏర్పాటు పేరుతో చేస్తున్న కలెక్షన్లు ఉదాహరణగా నిలుస్తున్నాయి. –వీరఘట్టం● తప్పుల తడకగా ఇంటి నంబర్ల నమోదు ● ఒక్కో బోర్డుకు రూ.50 చొప్పున వసూలు ఈ పొటో చూశారా? వీరఘట్టంలోని తెలగవీధిలో ఓఇంటికి 5–18 నంబర్ వేస్తూ బోర్డు అతికించారు.అయితే ఈ ఇంటి నంబర్ 6–68 అని పంచాయతీ రికార్డులో ఉంది.తప్పులు తప్పులుగా బోర్డులు అతికించడంపై ప్రజలు విస్తుపోతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయని వారు చెబుతుండడంతో ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తూ వారడిగిన రూ.50 ఇచ్చేస్తున్నామని ప్రజలు చెబుతున్నారు. ప్రతి ఇంటికి డిజిటల్ ఇంటి చిరునామా బోర్డుల ఏర్పాటు పేరుతో ప్రజల నుంచి దోపిడీ జరుగుతోంది. ఈ దోపిడీపై జిల్లా ప్రజలు విస్తుపోతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పంచాయతీ అధికారి ఈ ఏడాది మార్చి 23న ఉత్తర్వులు ఇచ్చినట్లు బోర్డులు అమర్చడానికి వచ్చినవారు చెబుతున్నారు. అధికారులు ఇచ్చిన జీవో కాపీ చూపిస్తున్నారు. అయితే ఈ డిజిటల్ బోర్డుల ఏర్పాటుకు తమకు ఎటువంటి సంబంధం లేదని అధికారులు చెబుతున్నారు.అభ్యంతరాలుంటే బోర్డులు బిగించవద్దని,.పేద, మధ్య తరగతి వారికి ఉచితంగా బోర్డులు ఏర్పాటు చేయాలని ఈ జీవో కాపీలో ఉంది.అయితే అవేవీ కాకుండా ప్రతి ఇంటికి బోర్డు బిగించి డబ్బులు వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారని స్థానికులు అంటున్నారు.అయితే ఈ బోర్డుల ఏర్పాటుకు తమకు ఎటువంటి సంబంధం లేదని అధికారులు చెబుతున్నారే తప్ప ఈ నిలువు దోపిడీని అడ్డుకోకపోవడంపై ప్రజల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇంటింటికీ ఏర్పాటు చేస్తున్న ఇంటి నంబర్లు తప్పుల తడకగా ఉన్నాయి. ఫోన్ కాల్స్ ఒత్తిడితో.. అమరావతి నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ ఒత్తిడితో ఇంటి చిరునామా బోర్డుల ఏర్పాటుకు జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయతీలకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఈ ముఠా నేరుగా గ్రామాల్లో ఇంటి చిరునామా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.పేరుకు వీరు ఒక్కో ఇంటి నుంచి కలెక్షన్ చేస్తున్నది రూ.50 గా కనిపిస్తున్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా చూస్తే రూ.2.25 కోట్లు దోచుకునే కుట్ర జరుగుతోందని జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. కొంత మంది మాత్రం ఈ బోర్డులు వద్దని తిరస్కరిస్తున్నప్పటికీ వారితో వాదిస్తూ ఈ బోర్డులు అందరి ఇళ్లకు వేయాలని మా వద్ద ఆర్డర్ కాపీ ఉందని బలవంతంగా ఈ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.ఈ ఫొటో చూశారా? చిన్న ఇనుప రేకును తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మన్యం జిల్లా, డిజిటల్ ఇంటి చిరునామా అనే అక్షరాలు ఉన్న ప్రతి ఇంటి గుమ్మానికి అతికిస్తున్నారు. ఇలా రేకు బోర్డు పెట్టినందుకు ప్రతి ఇంచి నుంచి రూ.50 వసూలు చేస్తున్నారు. వీరఘట్టం మండలంలో ఇంతవరకు సుమారు 15 వేల ఇళ్లకు ఇటువంటి బోర్డులు పెట్టి గృహవాసుల నుంచి రూ.7.50 లక్షలను వసూలు చేశారు. ఇదే మాదిరి జిల్లాలో ఉన్న 4.50 లక్షల గృహాలకు ఇటువంటి బోర్డులు అమర్చి ఏకంగా రూ.2.25 కోట్లు కొల్లగొట్టేందుకు రంగం సిద్ధం చేశారు. డిజిటల్ బోర్డు పేరుతో ఇంటికి అమర్చుతున్న ఈ రేకు కనీసం రూ.5 కూడా ఉండదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మాకు సంబంధం లేదుజిల్లాలో చాలా చోట్ల ఇంటికి డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది.అయితే ఆ బోర్డుల ఏర్పాటుకు మాకు ఎటువంటి సంబంధం లేదు. నచ్చకపోతే ఎవరూ ఆ బోర్డులు ఏర్పాటు చేసుకోవద్దు. ఎక్కడైనా బోర్డులు ఏర్పాటు చేయాలనుకుంటే గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి, పంచాయతీ అంగీకారంతో పంచాయతీ రికార్డుల ప్రకారం ఇంటి నంబర్లు వేసి బోర్డులు ఏర్పాటు చేయవచ్చు. ఇష్టం లేని వారు బోర్డులు వద్దని చెప్పండి. – పి.కొండలరావు, డీపీఓ, పార్వతీపురం మన్యం జిల్లా -
ముగిసిన హ్యాండ్బాల్ మీట్
శృంగవరపుకోట: మండలంలోని కిల్తంపాలెం పంచాయతీ జవహర్నవోదయ విద్యాలయలో మూడురోజులుగా నిర్వహిస్తున్న హైదరాబాద్ రీజియన్స్థాయి హ్యాండ్బాల్ మీట్ 2025–26 గురువారం ముగిసింది. ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్ పర్యవేక్షణలో నిర్వహించిన హ్యాండ్బాల్ మీట్కు దక్షిణ భారతదేశంలో ఎనిమిది క్లస్టర్లు యానాం, అదిలాబాద్, కన్నూర్, కరైకల్, ఎర్నాకుళం, హవేరి, హాసన్, కలబుర్గిల నుంచి క్రీడాకారులు వచ్చారు. వారంతా మూడు రోజుల పాటు నిర్వహించిన పోటీల్లో హోరాహోరీగా తలపడ్డారు. ఏపీ హ్యాండ్బాల్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్.రాజారావు నేతృత్వంలో నిర్వహించిన పోటీల్లో యానాం క్లస్టర్ అత్యుత్తమ ప్రదర్శనతో 26బహుమతులు సాధించి ఓవరాల్ చాంపియన్ షిప్ కై వసం చేసుకుంది. గురువారం సాయంత్రం ముగింపు వేడుకల్లో ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్ విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. పోటీలను దిగ్విజయంగా పూర్తిచేసిన రిఫరీలు, కోచ్లు, ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు, క్రీడాకారులకు ప్రిన్సిపాల్ ధన్యవాదాలు తెలిపారు. -
మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
పార్వతీపురం రూరల్: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో మిగులు సీట్లకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కన్వీనర్ ఎస్. రూపావతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత విద్య, వసతి సౌకర్యాలతో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఆసక్తిగల విద్యార్థులు ఆధార్ కార్డుతో పాటు విద్యార్హత సర్టిఫికెట్స్తో తమకు కావాల్సిన ప్రాంతంలో ఆయా పాఠశాలలను, కళాశాలను నేరుగా వెళ్లి సంప్రదించాలని కోరారు. బాలురుకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో కొప్పెర్ల, బాడంగి, పాలకొండ, సాలూరు, జోగింపేటలో అదేవిధంగా బాలికలకు సంబంధించి చీపురుపల్లి, నెల్లిమర్ల, వేపాడ, వీఎంపేట, వంగర, గరుగుబిల్లి, కొమరాడ, భామిని పాఠశాలల్లో అలాగే కళాశాలల్లో ఉన్న ఖాళీల మేరకు సంబంధిత ప్రిన్సిపాల్స్ను సంప్రదించాలని సూచించారు. జిల్లా కన్వీనర్ ఎస్ రూపావతి -
నాగుపాము అలజడి
● పట్టుకున్న స్నేక్ క్యాచర్ విజయనగరం గంటస్తంభం: స్థానిక బాబామెట్టలోని రెండవ లైన్లో ఫారెస్ట్రేంజ్ ఆఫీసర్ అయినంపూడి శ్రీనివాసరావు ఇంటి పరిసరాల్లో ఓ నాగుపాము రెండు రోజులుగా తిరుగుతూ భయాందోళన సృష్టిస్తోంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం మళ్లీ ఆ పాము కనబడడంతో ఫారెస్ట్ అధికారుల సమాచారం మేరకు కలెక్టరేట్ ప్రాంతానికి చెందిన స్నేక్ క్యాచర్ సాయికుమార్ వచ్చి పామును పట్టుకుని ఓ డబ్బాలో వేసి మూతవేసి పాముకు గాలి ఆడడానికి డబ్బాకు రంధ్రాలు ఏర్పాటు చేశాడు. పట్టుకున్న పామును పూల్భాగ్ ఫారెస్టులో వదిలిపెట్టనున్నట్లు సాయికుమార్ తెలిపాడు. 3.33 కేజీల గంజాయి స్వాధీనంపాచిపెంట: మండలంలోని పి.కోనవలస చెక్పోస్టు సమీపంలో ఉన్న దుర్గ గుడి వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తి నుంచి 3.33 కేజీల గంజాయిని గురువారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకట సురేష్ తెలియజేశారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన అశిష్ పండిట్(23) ఒడిశాలోని మల్కన్గిరి ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి చైన్నెకి తరలిస్తుండగా పి.కోనవలస చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు జరుగుతున్నాయని గమనించి ఒడిశా నుంచి వస్తున్న వాహనం దిగిపోయి దుర్గగుడి వద్ద అనుమానాస్పదంగా ఉన్నాడు. దీంతో ఆ వ్యక్తిని పట్టుకుని తనిఖీ చేయగా 3.33 కేజీల గంజాయి బయటపడడంతో స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఉద్యోగానికి దరఖాస్తుల ఆహ్వానంపార్వతీపురం: ఐటీడీఏ పరిధిలోని కురుపాం, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీజీటీ(తెలుగు) ఉపాధ్యాయుడి పోస్టుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ బహుదూర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీతోపాటు బీఈడీ పూర్తిచేసి ఉండి, టెట్లో అర్హత సాధించినవారు ఈనెల 9లోగా హెచ్టీటీపీఎస్://ఈంఆర్ఎస్.ట్రైబల్.జీఓవీ.ఇన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 11న ఇంటర్వ్యూ ఉంటుందని, మరిన్ని వివరాలకు పాఠశాల ప్రిన్సిపాల్ ఫోన్ 6200335685 నంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. నాలుగు క్లినిక్ల సీజ్భామిని: మండలంలోని సింగిడి, గురండిలలో ఎటువంటి అనుమతులు లేకుండా ఆర్ఎంపీలు, పీఎంపీలు నడుపుతున్న నాలుగు క్లినిక్లను సీజ్ చేసినట్లు బత్తిలి, భామిని వైద్యాధికారులు పసుపులేటి సోయల్, కొండపల్లి రవీంద్రలు గురువారం తెలిపారు. కలెక్టర్, డీఎంహెచ్ఓల ఆదేశాల మేరకు భామిని తహసీల్దార్ శివన్నారాయణ, బత్తిలి ఎస్సై జి.అప్పారావులతో కలిసి సింగిడి, గురండి గ్రామాల్లో దాడులు చేసినట్లు తెలిపారు. ఎటువంటి అనుమతులు లేకుండా నడుపుతున్న క్లినిక్లను సందర్శించి సీజ్ చేసి నిర్వాహకులకు నోటీసులు అందజేసినట్లు చెప్పారు. క్లినిక్లలో వాడుతున్న మందులు, సర్జికల్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ బృందంలో డీటీ రమేష్ కుమార్, ఎంఆర్ఐ మణి ప్రభాకర్, వీఆర్ఓ ఉన్నారు. -
రహదారి భద్రత నియమాలు పాటించాలి
● జిల్లా రవాణా శాఖాధికారి టి.దుర్గాప్రసాద్ రెడ్డిపార్వతీపురం రూరల్: వాహన దారులు కచ్చితంగా రహదారి భద్రత నియమాలు పాటించాలని పార్వతీపురం మన్యం జిల్లా రవాణా శాఖాధికారి టి.దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ మేరకు రహదారి ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లా సహాయ రవాణా శాఖాధికారులు బి.కాశీరాం నాయక్, స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్ దుర్గతో కలిసి మండలంలోని నర్సిపురం గ్రామం సమీపంలో అంతర్రాష్ట్ర రహదారిపై గురువారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పరిమితికి మించి అధిక ప్రయాణికులతో వెళ్తూ భద్రత నియమాలను అతిక్రమించిన 11 వాహనాలపై కేసులు నమోదు చేశారు. అలాగే మూడు వాహనాలను, 12 ఆటోలతో పాటు ఒక లైట్ గూడ్స్ వాహనాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా రూ.30వేలు జరిమానాను వాహనాలకు విధించారు. అలాగే రహదారి భద్రత, ప్రమాదాల నివారణపై వాహన దారులకు, పాదచారులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా నిబంధనలు పాటిస్తూ ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్ విధిగా ధరించాలని జిల్లా రవాణా శాఖాధికారి దుర్గాప్రసాద్ రెడ్డి సూచించారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణం చేయరాదని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో రవాణాశాఖ కానిస్టేబుల్స్, హోం గార్డులు తదితర సిబ్బంది ఉన్నారు. -
ఆస్తికోసమే హత్య
శృంగవరపుకోట: మండలంలోని పల్లపుదుంగాడలో ఇటీవల సంభవించిన హత్య కేవలం ఆస్తి కోసమే జరిగినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం స్థానిక పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హత్యకేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తన తండ్రి సీదిరి రాములును తన పెదనాన్న కొడుకై న నాగులు నాటుతుపాకీతో 28వ తేదీ సాయంత్రం కాల్చి చంపినట్లు హతుడి కుమార్తె పల్లపుదుంగాడకు చెందిన బడ్నాన నాగమణి ఈనెల 29న మధ్యాహ్నం ఫిర్యాదు చేసిందని చెప్పారు. దీంతో ఎస్కోట సీఐ నారాయణమూర్తి, ఎస్సై చంద్రశేఖర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారన్నారు. మృతుడు సీదిరి రాములుకు నాగులుకు మధ్య ఆస్తి వివాదాలున్నాయి. రాములుకు మగపిల్లలు లేనందున చిట్టంపాడులో రెండెకరాల పొలం తనకు ఇచ్చేయాలని నాగులు కొంత కాలంగా పినతండ్రిని అడుగుతున్నాడు. అ భయంతో రాములు మూడేళ్లుగా పల్లపుదుంగాడలో కుమార్తె వద్ద ఉంటున్నాడు. 28న సాయంత్రం పల్లపుదుంగాడ పొలాల్లో రాములు పని చేస్తుండగా నాగులు తన వద్ద ఉన్న తపంచాతో పినతండ్రి రాములుపై కాల్పులు జరిపాడు. దీంతో రాములు పొలంలోనే చనిపోయాడని డీఎస్పీ చెప్పారు. నిందితుడు నాగులు కోసం గాలిస్తుండగా సీఐకి అందిన సమాచారంతో గురువారం ఉదయం ఐతన్నపాలెం జంక్షన్లో అనుమానాస్పదంగా నడుచుకుంటూ వస్తుండగా అదుపులోకి తీసుకున్నారన్నారు. నిందితుడిని విచారణ చేసి బొడ్డవర రైల్వేస్టేషన్ సమీపంలో తుప్పల్లో దాచిన తపంచా, దుస్తులు పోలీసులు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారని చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని వివరించారు. కేసును త్వరగా ఛేదించిన ఎస్.కోట సీఐ నారాయణమూర్తి, ఎస్సై చంద్రశేఖర్లను డీఎస్పీ అభినందించారు. డీఎస్పీ శ్రీనివాస రావు -
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో విశ్రాంత బ్యాంక్ మేనేజర్
లక్కవరపుకోట: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ గా పని చేసి ఉద్యోగ విరమణ చేసిన ఎస్ఎస్ఎన్ రాజుకు ఆరుదైన కరెన్సీ నోట్లు సేకరించడం అలవాటు. అరుదైన కరెన్సీ నోట్లు సేకరించినందుకు గాను 2025వ సంవత్సరానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో ఆయన స్థానం సాధించారు. అంతేకాకుండా ఒకేసారి ఆయన మూడు లిమ్కా రికార్డులు సాధించడం విశేషం. ప్రతి కరెన్సీ నోటుపై ఒక రకమైన సిరీస్ నంబర్ కలిగిన నోట్లు సుమారు 12 వందలు సేకరించినందుకు ఒక రికార్డు, అలాగే కరెన్సీ ముద్ర సమయంలో పొరపాటు జరిగితే ఆ నోటుకు బదులు వేరే నోటు ముద్రిస్తారు.ఆ విధంగా ముద్రించిన నోట్పై స్టార్ గుర్తు పెడతారు. అలాంటి స్టార్ నోట్లు సుమారు 11వందల నోట్లు సేకరించి మరో రికార్డును నమోదు చేశారు. ఇంకా కరెన్సీ నోట్పై సీరియల్ నంబర్లు ఆరు డిజిట్స్ మాత్రమే ఉంటాయి. ఏడో డిజిట్ ఉన్న నోట్లు చాలా అరుదుగా వస్తాయి. అలా ఏడు డిజిట్స్ ఉన్న నోట్లను సేకరించి మూడో రికార్డు సాధించారు. మొత్తంగా ఒకే సారి మూడు లిమ్కా రికార్డులను సాధించిన ఆయనను పలువురు అభినందించారు. అరుదైన కరెన్సీ నోట్లు సేకరించి రికార్డు -
నేర నియంత్రణే లక్ష్యంగా ‘కార్డన్ సెర్చ్‘
విజయనగరం క్రైమ్: నేరాలను నియంత్రించి, ప్రజలకు భద్రత, రక్షణ కల్పించడంలో భాగంగా ఎస్.కోట పోలీస్ స్టేషన్ పరిధిలోని దారపర్తి, బొడ్డవర పంచాయతీల్లో గల గిరిజన గ్రామాల్లో ’కార్టన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ గురువారం నిర్వహించినట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎటువంటి సారా, గంజాయి లభించలేదన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్, మాట్లాడుతూ నేరాలను నియంత్రించడమే లక్ష్యంగా ఎస్.కోట పోలీస్ స్టేషన్ పరిధిలోని దారపర్తి పంచాయతీ గిరిజన గ్రామాలైన మునుపురాయి, రాయపాలెం, చప్పనిగెడ్డ, పల్లపు దుంగాడ, రంగవలస, పాతశెనగపాడు, కొత్త సెనగపాడు, దబ్బగుంట గ్రామాల్లోను మూల బొడ్డవర పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం, బొడ్డపాడు, చిలకపాడు, చిట్టెంపాడు, గుణపాడు గ్రామాల్లో విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడిన పోలీసులు ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ నిర్వహించారన్నారు. ఈ బృందాలకు ఎస్.కోట సీఐ వి.నారాయణ మూర్తి, కొత్తవలస సీఐ షణ్ముఖరావు, విజయనగరం రూరల్ సీఐ బి.లక్ష్మణరావు నాయకత్వం వహించారన్నారు. ఈ ఆపరేషన్లో 16మంది ఎస్సైలు, 85 మంది పోలీసు సిబ్బంది బృందాలుగా ఏర్పడి, వారికి నిర్దేశించిన గిరిజన గ్రామానికి చేరుకుని, ఇండ్లు, బహిరంగ ప్రదేశాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారని తెలిపారు. అనుమానిత వ్యక్తులు పారిపోయేందుకు అవకాశం ఉన్న మార్గాలను ముందుగా గుర్తించి, ఆయా మార్గాలను పోలీసు బృందాలు ముందుగానే దిగ్బంధం చేసినట్లు చెప్పారు. -
బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను తప్పించండి
పార్వతీపురం టౌన్: ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక ఎన్జీవో హోంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ పీఆర్సీ, మధ్యంతర భృతి, కారుణ్య నియామకాలు, సీపీఎస్ రద్దు వంటివి అమలు చేయాలని ఆగస్టు 2న చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులకు బోధన తప్ప ఇతర కార్యక్రమాలు లేకుండా చేయాలి. పి–4 కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకు నిర్బంధం చేయరాదు. నూతనంగా అప్గ్రేడ్ అయిన స్థానాలను కోరుకున్న ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలి. ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యలు పరిష్కరించి విద్యాశాఖలో ఉన్న అసంబద్ధతను తొలగించాలి. 72, 73, 74 జీవోలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైస్కూల్ ప్లస్లలో వెంటనే ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి, యథాతథంగా కొనసాగించాలని కోరారు. పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలని కోరారు. 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. 30% మధ్యంతర భృతిని ప్రకటించాలి. ఈ సమస్యల పరిష్కారానికి చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫ్యాఫ్టో జనరల్ సెక్రటరీ ఎస్.చిరంజీవి, కో చైర్మన్లు కె.నరహరి, మనోజ్ కుమార్, సీహెచ్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
స్కూల్ ఆటో బోల్తా
● ఐదుగురు విద్యార్థులకు గాయాలు ● మద్యం మత్తులో ఆటో నడిపిన డ్రైవర్కొత్తవలస: మండలంలోని విజయనగరం–కొత్తవలస రోడ్డులో అర్ధాన్న పాలెం జంక్షన్ సమీపంలో గురువారం స్కూల్ ఆటో బోల్తాపడిన ఘటనలో ఐదుగురు విద్యార్థులు గాయాల పాలయ్యారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఏపీ మోడల్ స్కూల్కు చెందిన విద్యార్థులు మంగళపాలెం, రాజాథియేటర్ సమీపంలోని వారిని రోజూ ఆటోలో స్కూల్కు తల్లిదండ్రులు పంపిస్తూ ఉంటారు. అయితే గురువారం విద్యార్థులను యథావిధిగా స్కూల్ వద్ద డ్రైవర్ దింపేశాడు. మళ్లీ స్కూల్ వదిలే సమయంలో తిరిగి పిల్లలను ఆటో ఎక్కించుకుని వస్తుండగా అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో జరిగిన ప్రమాదంలో ఆటోలో ఉన్న ఆరుగురు పి ల్లల్లో 7వ తరగతి చదువుతున్న కె.మహేంద్ర కాలికి తీవ్ర గాయమైంది. అలాగే 9వ తరగతి చదువుతున్న డి.నిరిషా నడుముకు గాయమైంది. స్థానికుల సహాయంతో గాయపడిన చిన్నారులను కొత్తవలసలో గల ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.కాగా ఆటో డ్రైవర్ పూటుగా మద్యం తాగి ఉన్నాడని, ఆటోపై ఫీట్లు చేశాడని అదే సమయంలో ఆటో బోల్తా పడిందని విద్యార్థులు తెలిపారు.ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఆస్పత్రి వద్దకు చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. -
ఘాట్రోడ్డులో ఆటో బోల్తా
● ఒకరి మృతి ● మరో ఆరుగురికి గాయాలుభామిని: మండలంలోని బండ్రసింగి ఘాట్ రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కురుపాం మండలం ఆవిరి గ్రామానికి చెందిన కొండగొర్రి ఎల్లంగో(60) ప్రమాద స్థలంలోనే ప్రాణాలు పొగొట్టుకున్నాడు. ఆవిరి గిరిజన గ్రామం నుంచి భామిని వారపు సంతకు పశువుల కొనుగోలుకు ఆటోలో వస్తున్న తరుణంలో ప్రమాదం జరిగింది. బండ్రసింగి ఘాట్ రోడ్డులో అతివేగంగా వస్తున్న ఆటో బోల్తా కొట్టి లోయలోకి పడిపోయి నుజ్జునుజ్జయింది. ఈ నేపథ్యంలో అటోలో ప్రయాణిస్తున్న కొండగొర్రి ఎల్లంగో(60)తో మృతి చెందడంతో పాటు మరో ఆరుగురికి గాయాలయ్యాయి. కొండగొర్రి గంగారావు, కొండగొర్రి నగేష్, కొండగొర్రి సుమంతోలు తీవ్ర గాయాల పాలు కావడంతో 108 అంబులెన్స్లో తరలించి భామిని పీహెచ్సీలో ప్రాథమిక వైద్యం తరువాత సీతంపేట ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆటో డ్రైవర్ బిడ్డిక కోరాతో పాటు బిడ్డిక కర్ణలు గాయాల పాలయ్యారు. సమాచారం మేరకు ప్రమాద స్థలాన్ని పాలకొండ డీఎస్సీ రాంబాబు, బత్తిలి ఎస్సై జి.అప్పారావులు సందర్శించి ప్రమాదానికి గల కారణాలు తెలసుకుని కేసు నమోదు చేశారు. ఎల్లంగో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. తివ్వాకొండల్లోని ఘాట్ రోడ్లలో రక్షణగా రాతి కట్టలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆదివాసీ గిరిజనులు డీఎస్పీ రాంబాబుకు ఫిర్యాదు చేశారు. -
ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అనారోగ్యం
పార్వతీపురం రూరల్: మండలంలోని డోకిశీలలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు సుమారు 25మంది జ్వరం, తలనొప్పి, వాంతులతో ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వారిని సమీపంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి ఐశ్వర్య విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించి రక్త నమూనాలను సేకరించారు. గురువారం ఒక్కసారిగా ఇంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆశ్రమ పాఠశాలలో మంచాలకే పరిమితమయ్యారు. అయితే విద్యార్థుల పట్ల అధికారులు కానీ, ఆరోగ్య సిబ్బంది కానీ ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి మెరుగైన వైద్యం విద్యార్థులకు అందించాలని విద్యార్థి సంఘాలు, గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
వేధింపుల కత్తి!
ఉద్యోగుల మెడపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారులపై వేధింపులు అధికమయ్యాయి. చిరుద్యోగులను తొలగించాలని, పథకాలు అందకుండా చేయాలని.. పనులు నిలిపివేయాలని.. తాము చెప్పిందే చేయాలంటూ కూటమి నేతలు ఆదేశాలిస్తున్నారు. వినకుంటే బెదిరింపులకు దిగుతున్నారు. వారి మాటే శాసనం అంటున్నారు. కోర్టు తీర్పులు అమలుచేయొద్దంటూ భయపెడుతున్నారు. ఉద్యోగాలు పోతాయని కాళ్లుపట్టుకుని అధికారులు ప్రాథేయపడుతున్నా కనికరించడం లేదు. రెడ్బుక్ రాజ్యాంగంలో వేధింపులే తప్ప క్షమించడాలు ఉండవంటూ స్పష్టంచేస్తున్నారు. ఫలితం.. అధికార, ఉద్యోగవర్గాలు తమ బాధను సహోద్యోగుల వద్ద చెప్పుకుంటూ కన్నీరుపెడుతున్నారు. ఇన్నేళ్ల సర్వీసులో తమకు ఇలాంటి దుస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదంటూ నిట్టూర్చుతున్నారు. సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమి నాయకుల అధికార బలంతో చేసిన వేధింపులకు ఓ దళిత అధికారి కన్నీళ్లు పెట్టుకున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేశ్ చూస్తున్న విద్యాశాఖలోని.. ఓ మండల విద్యాశాఖాధికారికే ఈ దుస్థితి ఏర్పడింది. తనను ఇబ్బంది పెట్టవద్దంటూ ఆ అధికారి.. సదరు ప్రజాప్రతినిధి కాళ్లు మీద పడినా... కనికరం చూపలేదు. ఆ ప్రజాప్రతినిధి పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బోనెల విజయ్చంద్ర కాగా.. ఆ అధికారి బలిజిపేట మండల ఎంఈఓ– 2 శ్రీనివాసరావు. ఎంఈఓ తన సన్నిహితుల వద్ద వాపోయిన మాటలు.. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కొద్ది రోజుల కిందటే పార్వతీపురం తహసీల్దారుగా పని చేసిన జయలక్ష్మిని ఎమ్మెల్యే బెదిరించినట్టు ఓ ఫిర్యాదు కాపీ బయటకు వచ్చిన విషయం విదితమే.. ఇప్పుడు అదే తరహాలో మరో అధికారి బలి కావడం గమనార్హం. కోర్టు తీర్పును అమలుచేయొద్దంటూ.... బలిజిపేట మండలంలోని అరసాడ మండల ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులను, వాచ్మన్ను ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా తొలగించారు. పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్చంద్ర ప్రోత్సాహంతోనే తమను తొలగించారని ఉన్నతాధికారుల వద్ద బాధితులు మొర పెట్టుకుంటున్నా ఫలితం లేకపోయింది. దీనిపై వారు కోర్టు తలుపుతట్టారు. న్యాయపోరాటం చేస్తున్నారు. కోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ తీర్పునూ అమలు చేయనీయకుండా.. ఆ స్థానంలో తమ వారిని నియమించుకునేలా అధికారులపై ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకొస్తున్నారని బాధితుల ఆరోపణ. అందుకు సంతకం చేయాలని ఎంఈఓ–2 శ్రీనివాసరావును కోరుతున్నారు. ఈ విషయంలో ఇది వరకే కోర్టు తనకు జరిమానా విధించిందని.. ఇకపై ఆ తప్పు చేయనని ఆయన తేల్చేయడం కూటమి నాయకుల ఆగ్రహానికి కారణమైంది. రెండు రోజుల కిందట కేజీబీవీ వసతిగృహం ప్రారంభోత్సవానికి మండలానికి వచ్చిన ఎమ్మెల్యే.. ప్రజలు, అధికారులందరి ముందే ఎంఈఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీతో ఏం మాట్లాడినా ఎర్రజెండా వారికి సమాచారం ఇస్తావు. నీపై చర్యలు తీసుకుంటే.. రేపటి నుంచి ఎర్రజెండా పట్టుకుని వారితోపాటే ఆ రోడ్ల మీద తిరగాల్సిందే..’ అంటూ హెచ్చరించారు. అక్కడ నుంచే డీఈఓతో మాట్లాడి.. ఎంఈఓపై చర్యలు తీసుకోవాలని సూచించారు. తనను ఇబ్బంది పెట్టవద్దని.. కాళ్లు పట్టుకుని బతిమలాడుతానని వయస్సులో పెద్ద వారైన ఎంఈఓ ప్రాథేయపడినా ఫలితం లేకపోయింది. జరిగిన పరిణామాలతో తీవ్ర భావోద్వేగానికి గురైన సదరు ఎంఈఓ.. తన సన్నిహితుల వద్ద ఈ విషయాలన్నీ వాపోతూ కన్నీటి పర్యంతమయ్యారు. డీఈఓ కూడా తన విషయంలో దుర్భాషలాడారని వాపోయారు. నేడో, రేపో తన మీద చర్యలు ఖాయమని.. తనను సస్పెండ్ చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సన్నిహితుల వద్ద వాపోయిన మాటలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కూటమి ప్రభుత్వంలో అధికారులు ధైర్యంగా పని చేసే పరిస్థితి లేదని.. మండల అధికారులకే వేధింపులు ఉంటే, ఇంక చిరు ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఉద్యోగులను బెదిరించడం సరికాదు తాను దళితపక్షపాతినని చెప్పుకొనే ఎమ్మెల్యే విజయ్చంద్ర.. దళితులకు అన్యాయం జరిగితే ఎక్కడున్నారు. గిరిజన మధ్యాహ్న భోజన నిర్వాహకులను తొలగించి, గిరిజనేతరులను నియమించడం సరైన పద్ధతి కాదు. మొన్న పార్వతీపురంలో తహసీల్దారు.. నేడు బలిజిపేటలో ఎంఈవోను బెదిరించడం సరికాదు. ఉద్యోగులను, చిరుద్యోగులను బెదిరిస్తూ, తొలగిస్తూ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఎమ్మెల్యే కనుసన్నల్లో డీఈవో పని చేస్తున్నారు. ఎమ్మెల్యే వైఖరి మారకపోతే కార్మిక వర్గాన్ని, ఉద్యోగ సంఘాలను కదిలించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. – మన్మథరావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యేను వేడుకుంటున్నాం... మాపై ఎందుకు ఎంత వివక్ష చూపుతున్నారో అర్థం కావడం లేదు. మాకు అన్యాయం చేయవద్దని ఎమ్మెల్యేను వేడుకున్నాం. కాళ్లు పట్టుకుని బతిమలాడుతున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి పని చేస్తున్నాం. మా స్థానంలో వారి మనుషులను నియమించి, మాకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు మా ఎంఈఓ శ్రీనివాసరావుపై బెదిరింపులకు పాల్పడుతూ ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం. – కె.కళావతి, ఎలిమెంటరీ పాఠశాల మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు/ జి.పార్వతి, స్వీపర్ నిన్న తహసీల్దార్.. నేడు ఎంఈఓ దళిత విద్యాశాఖాధికారికి పార్వతీపురం ఎమ్మెల్యే బెదిరింపులు ఎర్రజెండా పట్టుకుని రోడ్డున పడతావంటూ హెచ్చరిక కన్నీళ్లు పెట్టుకున్న అధికారి ప్రజాప్రతినిధి వేధింపులపై సన్నిహితుల వద్ద వాపోయిన సదరు అధికారి -
ఊరికి ఉపకారి
చిత్రంలో రోడ్డుపై ఏర్పడిన గోతులను కాంక్రీట్తో పూడ్చుతున్న వ్యక్తిపేరు మద్దెల జనార్దన్. రామభద్రపురం మండలం ఇట్లామామిడిపల్లి. లగేజీ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రామభద్రపురం మండల కేంద్రం నుంచి సోంపురం, ఇట్లామామిడిపల్లికి వెళ్లే ప్రధాన రోడ్డు పూర్తిగా పాడవ్వడం, పెద్దపెద్ద గోతులతో దర్శనమివ్వడం, తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో కలత చెందాడు. కూలిచేసిన డబ్బుల్లో రూ.30వేలు వెచ్చించి సిమెంట్, ఇసుక, పిక్కను తన లగేజీ ఆటోపైనే తీసుకెళ్లి.. ఆయనే స్వయంగా కాంక్రీటు మిక్స్చేసి రోడ్లపై ఏర్పడిన గోతులను గత రెండు రోజులుగా పూడ్చుతున్నాడు. ఆయన కృషి, చొరవను చూసిన ఈ ప్రాంతీయులు అభినందిస్తున్నారు. ఊరికి ఉపకారి అంటూ కితాబిస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లెపండగ పేరుతో రోడ్లు మరమ్మతులు చేస్తామంటూ హడావిడి చేసిందే తప్ప రోడ్లను బాగుచేసిన పరిస్థితి లేదంటూ విమర్శిస్తున్నారు. – రామభద్రపురం -
ఆదివాిసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
–8లోడిజిటల్ బోర్డుల పేరిట దోపిడీ ప్రతి ఇంటికి డిజిటల్ ఇంటి చిరునామా బోర్డుల ఏర్పాటు పేరుతో ప్రజల నుంచి దోపిడీ జరుగుతోంది. ఈ దోపిడీపై జిల్లా ప్రజలు విస్తుపోతున్నారు. పార్వతీపురంటౌన్ : ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆగస్టు 9వ తేదీన ఘనంగా నిర్వహించాలని ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. ఆదివాసీ దినోత్సవం నిర్వహణపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశాన్ని ఆయన చాంబర్లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ గిరిజన సంస్కృతికి అద్దం పట్టేలా ఈ ఉత్సవాన్ని నిర్వహించాలని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గిరిజన లబ్ధిదారులకు భూపట్టాలు, గృహ పట్టాలు, వ్యవసాయ పనిముట్లు, ఇతర ఉపకారణాలు, ఆర్థిక లబ్ధిని చేకూర్చే చెక్కుల పంపిణీ ఉండేలా చర్యలు తీసుకోవాల న్నారు. సాంస్కృతిక, ఆర్చరీ పోటీలను నిర్వహించాలని సూచించారు. సంపూర్ణ అభియాన్ కార్యక్రమాన్ని పక్కాగా అమలుచేయాలని, గిరిజనాభివద్ధి కోసం ఆది కర్మయోగి కార్యక్రమం అమలుకానుందని, చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని అమలుచేయాలని అధికారులను పీఓ ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ కె.హేమలత, ప్రత్యేక ఉప కలెక్టర్ ఎస్.దిలీప్ చక్రవర్తి, డ్వామా, డీఆర్డీఏ పీడీలు కె.రామచంద్ర రావు, ఎం.సుధారాణి, ఐటీడీఏ ఏపీఓ ఎ.మురళీధర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ -
వెకిలి నవ్వులు.. వెక్కిరింతలు!
సాక్షి, పార్వతీపురం మన్యం: అంతా ఊహించినట్లే జరిగింది. పార్వతీపురం మున్సిపల్ సమావేశం ఎప్పటిలాగే గురువారం వాడీవేడిగా సాగింది. ప్రథమ పౌరురాలు అన్న గౌరవం ఇవ్వకుండా.. కనీస సభామర్యాద పాటించక..కూటమి కౌన్సిలర్లు, ఫిరాయింపు కౌన్సిలర్లు..మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరిని అగౌరవపరిచారు. వెకిలి నవ్వులు, వెక్కిరింతలతో సభాగౌరవాన్ని మంటగలిపారు. ఎమ్మెల్యే బోనెల విజయ్చంద్ర సమక్షంలోనే ఈ తంతు సాగగా..మరోమారు మున్సిపల్ కమిషనర్ తాను అధికార పార్టీ మనిషినే అని నిరూపించుకున్నారు. పార్వతీపురం పురపాలక సంఘం సాధారణ సమావేశాన్ని చైర్పర్సన్ బోను గౌరీశ్వరి అధ్యక్షతన గురువారం నిర్వహించారు. సమావేశపు అజెండాలోని 1, 2, 12 అంశాలను ఆమోదించాలని టీడీపీ కౌన్సిర్లు పట్టుపట్టారు. ఏకపక్షంగా ఉన్న ఈ అంశాలను ఆమోదించేదిలేదని చైర్పర్సన్ స్పష్టం చేశారు. పట్టణంలోని నైట్షెల్టర్ను రేజేటి దయామణికి కాకుండా, మరొకరికి ఇవ్వాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. గతంలో ఇదే అంశాన్ని ఆమోదించిన కొందరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు..ఇటీవల టీడీపీలోకి ఫిరాయించిన తర్వాత, మాట మార్చి రద్దు చేయాలని పట్టుబట్టడం గమనార్హం. దీంతోపాటు, మున్సిపాలిటీలో 23 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు అంశాన్ని కూడా ఆమోదించాలని ఒత్తిడి తెచ్చారు. పట్టణానికి చెందిన టీడీపీ నాయకుడు జయబాబు నిర్వహిస్తున్న డాక్యుమెంట్ రైటింగ్ స్థలాన్ని మరో 25 ఏళ్లపాటు లీజు రెన్యువల్ చేయాలని అజెండాలో పొందుపరిచారు. ఈ లీజు గడువు ముగిసిపోవడంతో రెన్యువల్ కోసం జయబాబు దరఖాస్తు చేసుకున్నారు. వాటన్నింటినీ అజెండాలో పొందుపరచడంతో చైర్పర్సన్ తిరస్కరించారు. తమకే సభలో మెజారిటీ ఎక్కువ ఉందని.. తామే ఆమోదింపజేసుకుంటామని కూటమి కౌన్సిలర్లు, ఫిరాయింపు కౌన్సిలర్లు తేల్చిచెప్పారు. దీంతో చైర్పర్సన్ సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు. సమావేశం మొత్తం కూటమిలోని కౌన్సిలర్లు..చైర్పర్సన్ను అవహేళన చేస్తూ మాట్లాడడం కనిపించింది. ఆమెను అగౌరవపరిచేలా మాట్లాడుతూ, వెకిలి నవ్వులతో సమావేశాన్ని పక్కదారి పట్టించేందుకు, వివాదం చేసేందుకు ప్రయత్నించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు కూడా అధికార పార్టీ వ్యక్తిలా వ్యవహరించారు. సమావేశం అనంతరం మీడియాతో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ నైట్ షెల్టర్ నిర్వాహకురాలు దయామణి చైర్ పర్సన్ బోను గౌరీశ్వరి బంధువని ఆరోపించారు. అభివృద్ధిని చైర్పర్సన్ అడ్డుకుంటున్నారంటూ విమర్శించారు. ఎమ్మెల్యే సమక్షంలోనే ప్రథమ పౌరురాలికి అవమానం తీరుమారని మున్సిపల్ సమావేశం అధికార పార్టీకి కొమ్ముకాసిన కమిషనర్ప్రతి పనికీ కమిషనర్కు ఓ రేటు..ఎమ్మెల్యేకూ వాటా మరోవైపు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తీరుపై ఫిర్యాదులు వస్తున్నా చర్యలు కానరావడం లేదు. తాజాగా మరోసారి మున్సిపల్ ఉద్యోగులు..ఆయన వైఖరిపై స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. తీవ్ర పదజాలంతో దుర్భాషలాడుతూ అగౌరవ పరుస్తున్నారని పేర్కొన్నారు. సిబ్బంది పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని, సీట్ల కేటాయింపునకు..బదిలీ అయిన సిబ్బందిని రిలీవ్ చేయడానికి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపించారు. అవసరం నిమిత్తం రెండు రోజులు సెలవు కావాలని అడిగినా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఉద్యోగులతో సంబంధం లేకుండా కొన్ని ఫైళ్లను, లావాదేవీలను నేరుగా ఇంటికే పిలిపించుకుని మాట్లాడుకుంటున్నారని.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిపై తమను సంతకం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. కార్యాలయంలో ఏ పని జరగాలన్నా ఒక రేటు నిర్ణయించేశారని..ఎవరైనా అడిగితే, తాను స్థానిక ఎమ్మెల్యేకు కూడా కొంతమొత్తం ఇవ్వాలని బహిరంగంగానే అంటున్నట్లు తెలిపారు. ఆయనను తక్షణమే ఇక్కడ నుంచి బదిలీ చేయాలని కోరారు. -
వైఎస్సార్సీపీలోకి జనసేన నాయకుడు
దత్తిరాజేరు: జనసేన పార్లమెంటరీ కమిటీ సభ్యుడు, గజపతినగరం నియోజకవర్గం నాయకుడు సామిరెడ్డి లక్ష్మణ్ ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో గురువారం చేరారు. ఆయన స్వగ్రామం దత్తిరాజేరు మండలం పెదకాద నుంచి మరో 50 కుటుంబాల వారు వైఎస్సార్సీపీ తీర్థం తీసుకున్నారు. మాజీ ఉప సర్పంచ్ మత్స వెంకన్న, సామిరెడ్డి తవిటినాయుడు, కూర్మినాయుడు, వైకంఠం శ్రీరాం తదితరులను మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య తన ఇంటివద్ద పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా లక్షణ్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలంటే ఒక్క వైఎస్సార్సీపీలోనే సాధ్యమని, బొత్స అప్పలనర్సయ్య నాయకత్వంలో ముందుకు సాగుతామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ గేదెల సింహాద్రిఅప్పలనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు రాపాక కృష్ణార్జున, వైఎస్ ఎంపీపీలు బమ్మిడి అప్పలనాయుడు, మిత్తిరెడ్డి రమేష్, నాయకులు మహదేవ్ ఫణీంద్రుడు, మండల శ్రీను, చుక్క మురళి, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. పెదకాద నుంచి సామిరెడ్డి లక్ష్మణ్తో పాటు 50 కుటుంబాలు చేరిక పార్టీ కండువా వేసి ఆహ్వనించిన మాజీ ఎమ్మెల్యే బొత్స -
వ్యవసాయశాఖ సైంటిస్టుల క్షేత్ర పర్యటన
సీతంపేట: స్థానిక వ్యవసాయపరిశోధన స్థానం సైంటిస్టులు, వ్యవసాయ శాఖాధికారులు గురువారం క్షేత్రపర్యటన చేశారు. ఈ సందర్బంగా ఈ ప్రాంతానికి అనువైన వంగడాలు ఏవి? పండిస్తున్న పంటల్లో తెగుళ్ల నివారణ చర్యలపై చర్చించారు. వరి, రాగులు, ఇతర ముఖ్యమైన ఖరీఫ్ పంటల దిగుబడికి తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో రస్తాకుంటుబాయి కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్.ధ్రువ, శాస్త్రవేత్తలు స్రవంతి, విహారి, స్థానిక శాస్త్రవేత్త పి.సౌజన్య, ఏడీఏలు, వ్యవసాయశాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.4.2 కేజీల బాల భీముడి జననంపార్వతీపురం టౌన్: జిల్లా ఆస్పత్రిలో గురువారం ఓ గర్భిణి 4.2 కేజీల బరువు గల మగశిశువును ప్రసవించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వైద్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మండలం టోంకి గ్రామానికి చెందిన ఎ.లలితకు పురిటి నొప్పులు రావడంతో వెంటనే కుటుంబసభ్యులు జిల్లా ఆస్పత్రిలో చేర్చారు. సీనియర్ గైనకాలజిస్టు డాక్టర్ నాగశివజ్యోతి వైద్య బృందంతో సాధారణ డెలివరీ చేయగా 4.2 కేజీల బరువు ఉన్న మగబిడ్డ జన్మించాడు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండడంతో బంధువులు ఆనందం వ్యక్తం చేశారు.నేడు పింఛన్ల పంపిణీ● కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్పార్వతీపురం రూరల్: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఒక ప్రకటన జారీ చేశారు. జిల్లాలోని 1,40,672 మందికి రూ.60,10,27,500 నిధులను పింఛన్ల కింద పంపిణీ చేయనున్నామన్నారు. ఇందులో కొత్తగా మంజూరైన 1634 మంది వితంతు పింఛన్లు ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఉదయం 6గంటలకే పంపిణీ ప్రారంభమవుతుందని మొదటి రోజే శతశాతం పంపిణీకి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.ఇదెక్కడి అన్యాయం?రాజాం సిటీ: రాజాం బస్టాండ్ ఆవరణలోని నవదుర్గా ఆలయానికి ఏళ్ల తరబడి చైర్మన్గా కొనసాగుతున్న తనను తప్పించి వేరేవారిని నియమించడం ఎంతవరకు న్యాయమని ఫౌండర్ ట్రస్టీ వానపల్లి నర్సింగరావు ఆవేదన వ్యక్తం చేశారు. శాశ్వత ధర్మకర్తను చైర్మన్ స్థానం నుంచి ఎలా తప్పిస్తారని ప్రశ్నించారు. కూటమి కక్షపూరిత రాజకీయాలు ఇప్పుడు ఆలయాల ట్రస్టుబోర్డుల నియామకాల్లో కనిపించడం శోచనీయమన్నారు. స్థానిక విలేరులతో ఆయన గురువారం మాట్లాడుతూ.. తన తండ్రి వానపల్లి సూర్యనారాయణ (తమ్మయ్య గురువు) ఆలయాన్ని నిర్మించారని, అప్పటి నుంచి తామే వంశపారంపర్య ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. దేవాలయాల ట్రస్టుబోర్డు సభ్యుల నియామకంలో రాజికీయాలను ప్రోత్సహించడం దేవదాయశాఖ అధికారులకు తగదన్నారు. ట్రస్టు బోర్డు మెంబరు ఉన్నచోట ఆయనే చైర్మన్గా వ్యవహరిస్తారని గతంలో దేవదాయశాఖ ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు స్పష్టంచేశారు. దేవదాయశాఖ ప్రస్తుతం ఇచ్చిన ఉత్తర్వులు సవరించకుంటే న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. ఈ విషయాన్ని ఆలయ ఈఓ పి.శ్యామలరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్గా వానపల్లి నర్సింగరావే ఉంటారని స్పష్టం చేశారు. దీనిపై గతంలో జీఓ కూడా ఇచ్చారన్నారు. ఆయన ఆధ్వర్యంలో బోర్డు మెంబర్లు ఉంటారని పేర్కొన్నారు. -
పోటా పోటీగా హ్యాండ్బాల్ పోటీలు
శృంగవరపుకోట: మండలంలోని కిల్తంపాలెం జవహర్ నవోదయ విద్యాలయలో హైదరాబాద్ రీజియన్ హ్యాండ్బాల్ మీట్ –2025–26 పోటీలు రెండవ రోజు మంగళవారం హోరాహోరీగా సాగాయి. పోటీల్లో 195 మంది, బాలురు, 183 మంది బాలికలు అండర్–19, అండర్–17, అండర్–14 విభాగాల్లో తలపడుతున్నారు. పోటీలకు వచ్చిన దక్షిణ భారతదేశంలోని నవోదయ విద్యాలయాలైన యానాం, ఆదిలాబాద్, కన్నూర్, కరైకల్, ఎర్నాకుళం, హవేరి, హాసన్, కలబుర్గిల నుంచి వచ్చిన విద్యార్థులు పోటాపోటీగా తలపడుతున్నారు. గురువారం విజేతలను నిర్ణయించి బహుమతి ప్రదానం చేస్తామని, విజేతలు బీహార్లో నలందలో నిర్వహించనున్న జాతీయ పోటీల్లో పాల్గొంటారని హ్యాండ్బాల్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్.రాజారావు చెప్పారు. -
జిల్లాకు జ్వరమొచ్చింది..!
విజయనగరం ఫోర్ట్: జిల్లావ్యాప్తంగా అనేక మంది జ్వరాల బారిన పడి బాధపడుతున్నారు. ప్రస్తుత సీజన్లో వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉంటోంది. ముఖ్యంగా వైరల్ జ్వరాలు, డెంగీ, మలేరియా వంటి వ్యాధులు అధికంగా వ్యాప్తి చెందుతున్నాయి. వ్యాధులను అదుపు చేయాలంటే సకాలంలో వాటిని గుర్తించగలగాలి. డెంగీ, మలేరియా వంటి వ్యాధులకు సకాలంలో చికిత్స అందించగలిగితే ప్రాణాపాయం నుంచి తప్పించడానికి అవకాశం ఉంటుంది. జ్వరపీడితులను త్వరగా గుర్తించాలంటే ఇంటింటా ఫీవర్ సర్వే చేయాలి. కాని కూటమి ప్రభుత్వంలో పీవర్స్ సర్వే ఎక్కడా జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జ్వరపీడితులను గుర్తించడంలో అలసత్వం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రులకు వెళ్తున్న జ్వరపీడితులు రెండు, మూడు రోజుల పాటు జ్వరం ఉన్నవారు ఏజ్వరమో తెలుసుకోవడానికి వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఆస్పత్రులకు వెళ్తున్నారు. కొంతమంది ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తుండగా మరి కొంతమంది ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఆస్పత్రుల్లో టైపాయిడ్, మలేరియా, డెంగీ వంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. కొంతమంది ఆస్పత్రులకు వెళ్లలేక మంచానపడి మూలుగుతున్నారు. గత ప్రభుత్వంలో ఇంటింటా ఫీవర్ సర్వే వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇంటింటా ఫీవర్ సర్వేను ముందుగానే చేపట్టేవారు. జిల్లాలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు సర్వే చేసేవారు. వారికి వలంటీర్లు కూడా సహాయం చేసేవారు. ఇంటిలో ఎవరికై నా జ్వరం, దగ్గు, జలుబు ఉన్నాయా అని రెండు మూడు విడతలుగా సర్వే చేసేవారు. దీని వల్ల జ్వరపీడితులందరినీ గుర్తించి చికిత్స అందించడానికి వీలుండేది. మలేరియా, డెంగీ వంటి లక్షణాలుంటే వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించి, నిర్ధారణ చికిత్స అవసరమైన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించేవారు. జిల్లాలో ఆచూకీ లేని సర్వే గతంలో మాదిరి నేడు జిల్లాలో ఎక్కడా ఫీవర్ సర్వే జరగడం లేదని తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ బాధితులను గుర్తించి సేవలు అందడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో రెండు లక్షలకు పైగా జనం జ్వరాల బారిన పడ్డారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స కోసం అధికంగా జ్వరపీడితులు చేరి చికిత్స పొందుతున్నారు. కొంతమంది ఓపీలో చికిత్స తీసుకుంటుండగా, మరి కొంతమంది ఇన్పేషేంట్లుగా చేరి చికిత్స పొందుతున్నారు. మంచాన పడిన జనం ఎక్కడా కానరాని ఫీవర్ సర్వే పట్టించుకోని అధికారులుఈ ఫొటోలో మంచంపై ఉన్న మహిళ పేరు సింహాచలం. ఈమెది మెంటాడ మండలంలోని లోతుగెడ్డ పంచాయతీ పరిధి జీడికవలస. జ్వరంతో మూడు రోజులుగా మంచంపైన ఉంటోంది. ఈమెతో పాటు మరి కొంత మంది లోతుగెడ్డ పంచాయతీ పరిధిలోని ఏడు గిరిజన గ్రామాల్లో జ్వరాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.జ్వరాల వ్యాప్తి అరికట్టేందుకు చర్యలు జిల్లాలో ఫీవర్ సర్వే చేపట్టాం. అవసరమైతే మరోసారి సర్వే చేయిస్తాం. జ్వరాల వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్ఓ -
దేశం కోసం మధ్యవర్తిత్వం
విజయనగరం లీగల్: మధ్యవర్తిత్వం అనే ప్రక్రియ చాలా సులువైనది, ఖర్చు లేనిదని ప్రజల్లోకి దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని జిల్లా జడ్జి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ అధ్యక్షురాలు ఎం. బబిత అన్నారు. జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ న్యూఢిల్లీ వారి ఆదేశాలతో బుధవారం జిల్లా కోర్టు చాంబర్లో మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారం కోసం కోర్టు కాంప్లెక్స్లో ఉన్న న్యాయమూర్తులంతో భౌతిక సమావేశం, ఇతర ప్రాంతాల్లో ఉన్న న్యాయమూర్తులతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ బృహత్తర కార్యక్రమం దేశవ్యాప్తంగా 90 రోజుల పాటు నిర్వహిస్తున్నారన్నారు. ముఖ్యంగా మనోవర్తి కేసులు ప్రమాద బీమా కేసులు గృహ హింస కేసులు, చెక్ బౌన్స్ కేసులు, వాణిజ్యపరమైన తగాదా కేసులను సులువుగా ఈ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు. విద్యార్థికి పాముకాటుపై విచారణసాలూరు రూరల్: మండలంలోని తోణాం ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి మంగళవారం పాముకాటుకు గురైన విషయమై ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ బుధవారం తోణాం ఆశ్రమ పాఠశాల వార్డెన్ లచ్చయ్యను విచారణ చేశారు. విద్యార్థి బయటకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందన్న విషయంలో పాఠశాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, స్నానానికి నీళ్లు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు బయటకు వెళ్లాల్సి వస్తోందని ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్డెన్ తెలిపారు. డీఏ జుగా నిధులతో పాఠశాలలో అభివృద్ధి పనులు చేపడతామని విచారణ అనంతరం పీఓ తెలిపారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేతనెల్లిమర్ల రూరల్: స్థానిక నగర పంచాయతీ పరిధిలోని చంపావతి నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను వీఆర్ఓ వెంకట్రావు బుధవారం పట్టుకున్నారు. ఇసుక అక్రమ రవాణాపై తహసీల్దార్కు వచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పంప్ హౌస్ సమీపంలో తవ్వకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీకాంత్ మాట్లాడు తూ తవ్వకాలు జరుపుతున్న వ్యక్తికి జరిమానా విధిస్తామన్నారు. సొంత అవసరాలకు మా త్రమే ఎడ్ల బండ్లపై ఇసుకను తరలించే వీలుందని, భారీ వాహనాల్లో అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఐటీడీఏ పీఓ దృష్టికి తాగునీటి సమస్యపాచిపెంట: మండలంలోని కొత్తవలస గ్రామంలో తాగునీటి సమస్యను గ్రామస్తులు సబ్కలెక్టర్, ఇన్చార్జ్ ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ్ దృష్టికి తీసుకువచ్చారు. బుధవారం కొత్తవలస గ్రామానికి వచ్చిన ఐటీడీఏ పీఓ గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ క్రమంలో గతకొన్ని నెలలుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని , ఎన్నిసార్లు అదికారుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు తెలపగా పక్కనే ఉన్న ఎంపీడీఓతో ఆయన మాట్లాడి సమస్య పరిష్కరించాలని సూచించారు. గ్రామ సమీపంలో గల చెరువులో లార్వా దోమలపై డ్రోన్ ప్రయోగాన్ని, స్థానిక పత్తి పంటలో డ్రోన్ ద్వారా ఎరువుల పిచికారీని పరిశీలించారు.కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పరారైన చిట్టీల నిర్వాహకురాలుపార్వతీపురం రూరల్: పట్టణంలోని కొత్తవలస మణికంఠ కాలనీకి చెందిన చిట్టీల నిర్వాహకురాలు వారణాసి జయలక్ష్మి పరారైనట్లు ఆమె వద్ద చిట్టీ కట్టిన బాధితుల ద్వారా బయటపడింది. సుమారు రూ.రెండు కోట్ల వరకు ఆమె టోపీ పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తుండగా 45మందికి రూ.90లక్షల మేర బాకీలు ఉన్నట్లు ఐపీ నోటీసులు పంపించడంతో ఒక్కసారిగా ఆమె పరారైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తన ఆస్తి రూ.రెండు లక్షల వరకు ఉంటుందని, అది తప్ప తన వద్ద ఇంకేమీ లేవని ఐసీ నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిసింది. చిట్టీల నిర్వహణలో ఆమెకు సహకరించిన బంధువులు కూడా ఇటీవల పరారీలో ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు. ఇదే ప్రాంతంలో గత 15 సంవత్సరాలుగా ఆమె చిట్టీల నిర్వహిస్తోంది. అయితే అకస్మాత్తుగా పరారీ కావడంతో కాలనీవాసుల్లో ఆందోళన మొదలైంది. చిట్టీల బాధితులు ఎంతమంది? ఎంతమేరకు నష్టపోయారనేది తేలాల్సి ఉంది. -
ఒక్కరైనా లేరా సారూ!
సాక్షి, పార్వతీపురం మన్యం: గిరిజన, ప్రభుత్వ విద్యపై కూటమి సర్కారు చిన్నచూపు చూస్తోంది. కొండకోనలు, మారుమూల ప్రాంతాల్లో ఉండే ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. టీచర్లు బదిలీపై వెళ్తే.. ఆ స్థానంలో కొత్తగా ఎవరూ భర్తీ కావడం లేదు. దీంతో విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని 350 జీపీఎస్ (ఏకోపాధ్యాయ పాఠశాలలు) ఉండగా.. అందులో 115 పాఠశాలలకు ఉపాధ్యాయులే లేరు. దీంతో విద్యాబోధన కుంటుపడుతోంది. ఉపాధ్యాయుడు వచ్చినప్పుడే చదువు. లేకుంటే విద్యార్థులు ఇంటికే పరిమితమవుతున్నారు. కొన్నిచోట్ల పాఠశాలకు వచ్చి, వెళ్లిపోతున్నారు. ఇటీవల 100 మంది ఉపాధ్యాయులను డిప్యుటేషన్పై జీపీఎస్కు సర్దుబాటుచేశారు. ఇందులో సీఆర్టీలతో పాటు ఆశ్రమ పాఠశాలలకు చెందిన రెగ్యులర్ సిబ్బంది ఉన్నారు. వీరిలో అధిక శాతం మందికి నియోజకవర్గాలు దాటి.. దాదాపు వంద కిలోమీటర్లకుపైగా దూరం ఉన్న పాఠశాలలకు డిప్యుటేషన్ వేశారు. భద్రగిరి ఏహెచ్ఎస్ నుంచి వి.పావని అనే ఎస్జీటీని పాచిపెంట మండలంలో బడ్నాయివలస స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని బొడ్డపాడు జీపీఎస్కు వేశారు. కురుపాం మండలం జి.శివడ నుంచి బి.శోభన అనే ఎస్జీటీని పాచిపెంట మండలంలోని యేటగానివలస స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని కన్నయ్యవలస జీపీఎస్కు డిప్యుటేషన్పై నియమించారు. గుమ్మలక్ష్మీపురం మండలం కొత్తగూడ నుంచి ధర్మారావు అనే ఎస్జీటీని పాచిపెంట మండలం బడ్నాయివలస స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని సరళపాడు జీపీఎస్కు సర్దుబాటుచేశారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. దీనివల్ల అక్కడికి వెళ్లేందుకు వారెవరూ ఇష్టపడడం లేదు. ఫలితంగా అనేక బడులు పూర్తిగా మూతపడుతున్నాయి. పిల్లలకు చదువు, మధ్యాహ్న భోజనం వంటివి అందడం లేదు. బోధకులు లేక.. బోధపడేదెలా? జిల్లాలో పి.కోనవలస, భద్రగిరి, కురుపాం, సీతంపేటలలో పీటీజీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో సబ్జెక్టు అధ్యాపకుల కొరత వెంటాడుతోంది. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావస్తోంది. ఇప్పటికీ పలు సబ్జెక్టులను బోధించే అధ్యాపకులను నియమించకపోవడం గమనార్హం. గుమ్మలక్ష్మీపురం మండలంలోని భద్రగిరి పీటీజీలో జువాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ సబ్జెక్టులు బోధించే ముగ్గురు అధ్యాపకులు లేరు. కురుపాంలో ఫిజిక్స్, ఇంగ్లిష్ వంటి కీలక సబ్జెక్టులను బోధించే వారు లేరు. ఇక్కడే నడుస్తున్న కురుపాం బాలికల గిరిజన పాఠశాలకు ఫిజికల్ సైన్స్, సాంఘిక శాస్త్రం సబ్జెక్టు బోధించే టీచర్లు లేరు. దీంతో విద్యార్థుల విద్యాబోధనకు ఆటంకం ఏర్పడుతోంది. ఇలా అయితే పాఠాలు ఎలా అర్థం చేసుకోగలమని, పరీక్షలకు ఏ విధంగా సిద్ధం కాగలమని విద్యార్థులు వాపోతున్నారు. ఉపాధ్యాయుడు వచ్చినప్పుడే చదువు జీపీఎస్ పాఠశాలల్లో పరిస్థితి మరీ దారుణం పీటీజీ కళాశాలల్లో సబ్జెక్టు అధ్యాపకుల కొరత ఆవేదనలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పేద విద్యార్థులపై చిన్నచూపు కొండకోనలు, మారుమూల ప్రాంతాల్లో ఉండే పాఠశాలలపై ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. టీచర్ల కొరతతో విద్యార్థులకు చదువు అందడం లేదు. మెగా డీఎస్సీ అంటూ ప్రకటనలే చేస్తున్నారు గానీ.. గిరిజన ప్రాంతాలకు ఉపాధ్యాయులను పూర్తిస్థాయిలో భర్తీ చేయడం లేదు. పీటీజీ కళాశాలల్లో సబ్జెక్టు లెక్చరర్లు లేకపోతే విద్యాబోధన ఎలా సాగుతుంది. తక్షణమే సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలి. – పి.రంజిత్కుమార్, గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి -
సీ్త్రనిధి రుణ లక్ష్యం రూ.283 కోట్లు
● సీ్త్రనిధి ఏజీఎం చిట్టిబాబు రామభద్రపురం: జిల్లాలో మహిళా సంఘాల సభ్యుల జీవనోపాధి మెరుగుకోసం సీ్త్రనిధి కింద రూ.283 కోట్ల రుణాలు ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని ఏజీఎం వై.చిట్టిబాబు తెలిపారు. మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వీఓఏల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు సద్వినియోగం చేసుకునేలా రుణాలు మంజూరు చేయాలని, వంద శాతం రికవరీ చేయాలని సూచించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో సుమారు 40 వేల డ్వాక్రా సంఘాలున్నాయన్నారు. ఇప్పటి వరకు సీ్త్రనిధి కింద రూ.89 కోట్లు రుణాలు ఇచ్చామన్నారు. ఒక్కో సభ్యురాలికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రుణం ఇస్తామన్నారు. నూటికి నెలకు 92 పైసలు వడ్డీ పడుతుందన్నారు. సకాలంలో చెల్లిస్తే అధిక వడ్డీభారం ఉండదన్నారు. మహిళలు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే సీ్త్రనిధి ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ మేనేజర్ రమేష్, ఏపీఎం మోహన్, సీసీ సింగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
దొంగలపాలవుతున్న జగనన్న సర్వేరాళ్లు
సాలూరు రూరల్: గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో భూములు రీసర్వే చేసి హద్దులను నిర్ణయించే సర్వేరాళ్లు ప్రతి గ్రామంలోను అందుబాటులో ఉంచారు. అయితే రీసర్వే పేరుతో పూర్తిగా రైతుల భూములు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం లాక్కుంటుందని తప్పుడు ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు అదే సర్వేను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. గ్రామాల్లో రోడ్డు పక్కన నిరైతులకు అందుబాటులో నిల్వ ఉంచిన సర్వేరాళ్లు సాలూరు మండలంలో ఇటీవల చోరీకి గురవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు బుధవారం కొంతమంది దొంగచాటుగా ట్రాక్టర్లో సర్వేరాళ్లు తీసుకుని వెళ్తున్న విషయాన్ని గమనించి కొంతమంది ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడు ఆ ఫొటోలు వైరల్గా మారాయి. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
చెరువులో పడి వ్యక్తి మృతి
గంట్యాడ: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. గంట్యాడ మండలంలోని రామవరం గ్రామానికి చెందిన కొల్లి సూరిదేముడు (41) బుధవారం ఉదయం 8:30 గంటల సమయంలో కాలకృత్యాల కోసం అయ్యన్నబంద చెరువుకు వెళ్లాడు. కాలు జారి చెరువులో పడిపోగా లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోయాడు. అక్కడే ఉన్న రీసు అప్పన్న గ్రామంలోకి పరుగున వెళ్లి జనాలను తీసుకొచ్చి సూరిదేముడిని బయటకు తీయగా అప్పటికే మరణించాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయి కృష్ణ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చెరువులో పడి మరో వ్యక్తి..పార్వతీపురం రూరల్: మండలంలోని ఎమ్మార్నగరం గ్రామ శివారులో గల చిన్న రాయుడు చెరువులో ప్రమాదవశాత్తు పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. బుధవారం మృతదేహం పైకి తేలి కనిపించడంతో స్థానికులు పార్వతీపురం రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామంలోని బజారు వీధికి చెందిన సింగిరెడ్డి రమేష్ (35) పొలం పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ వ్యక్తి పశువులను శుభ్రం చేసేందుకు చెరువులో దిగి ఈత రాక ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు పార్వతీపురం రూరల్ ఎస్సై బి.సంతోషి కుమారి తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ఒక కుమార్తె ఉంది. జరిగిన సంఘటనపై ఎస్సై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. గుర్తు తెలియని వ్యక్తి..పూసపాటిరేగ: మండలంలోని కందివలస సంత సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి బుధవారం మృతి చెందాడు. కందివలస సంత ఏరియాలో భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్న వ్యక్తి మూర్ఛ వ్యాధితో ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు. చికిత్స నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని పూసపాటిరేగ పోలీసులు కోరారు. ఈమేరకు పూసపాటిరేగ ఎస్సై ఐ.దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేయాలి
విజయనగరంఫోర్ట్: స్వచ్ఛభారత్ మిషన్ కార్పొరేషన్ ద్వారా జిల్లాలోని 147 అంగన్వాడీ కేంద్రాల్లో నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లను ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. తన చాంబర్లో మరుగుదొడ్ల నిర్మాణంపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్షించారు. మరో 74 కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కు ప్రతిపాదనలు పంపించామని సూచించారు. ఒకటి రెండు రోజుల్లో వీటికి అనుమతి తెప్పిస్తామని తెలిపారు. 144 అంగన్వాడీ కేంద్రాలకు ఆగస్టు 20వ తేదీలోగా నీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఆగస్టు మొదటి వారానికి 31 అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ టి.విమలారాణి, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ మువ్వ లక్ష్మణరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, తదితరులు పాల్గొన్నారు.ఎన్పీసీఐ తప్పనిసరి ● కలెక్టర్ శ్యామ్ప్రసాద్ పార్వతీపురం రూరల్: అన్నదాత సుఖీభవ పథకం పొందేందుకు రైతులు బ్యాంకుల వద్ద ఎన్పీసీఐ చేయించుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో దాదాపు 14 వందల మంది రైతుల ఎన్పీసీఐ వివరాలు పెండింగ్లో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఎన్పీసీఐ పెండింగ్ ఉన్న రైతుల వివరాలు గ్రామ రైతు సేవా కేంద్రంలో ఉన్నాయని ఆయన తెలిపారు. రైతులకు బ్యాంకు అధికారులు సహకరించాలని సూచించారు. ఈవీఎం గొడౌన్ పరిశీలన జిల్లా కేంద్రంలోని ఈవీఎం గొడౌన్ను కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ బుధవారం తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత ఉన్నారు. బియ్యాలవలస పరిసరాల్లో ఏనుగుల గుంపు గుమ్మలక్ష్మీపురం(కురుపాం): కురుపాం మండలం బియ్యాలవలస గ్రామ పరిసరాల్లో ఏనుగుల గుంపు బుధవారం సంచరించింది. వ్యవసాయ పనుల సీజన్లో పొలాల్లో ఏనుగులు సంచరిస్తుండడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. ఏనుగుల గుంపు తరలింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ఏనుగులు సంచరిస్తున్న బియ్యాలవలస ప్రాంతంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సిబ్బంది హెచ్చరికలు జారీ చేశారు. -
భలే వ్యాపారం!
పారల తయారీలో నిమగ్నమైన కమ్మర్లురేగిడి మండలంలోని వండానపేట... వ్యవసాయ పరికరాలకు ప్రసిద్ధి. గ్రామంలోని ఎనిమిది కమ్మరి వృత్తి కుటుంబాలు దశాబ్దాలుగా పంటల సాగుకు అనువైన, అవసరమైన పరికరాలు తయారుచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఖరీఫ్, రబీ కాలాలు వస్తే చాలు.. వీరికి చేతినిండా పని దొరుకుతుంది. వీరు తయారు చేసే పారలు, కత్తులు, కొడవళ్లు, బొరిగిలు, కొంటె కర్రలకు డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం వరి ఉభాల్లో భాగంగా గట్లు తీతకు ఉపయోగించే పారలకు గిరాకీ నెలకొంది. వ్యా‘పార’ం జోరందుకుంది. ఒక్కో పారను రూ.600 చొప్పున విక్రయిస్తున్నారు. – రేగిడి -
మూలబిన్నిడిలో సీతాఫలం సంత
గుమ్మలక్ష్మీపురం: ఏజెన్సీలో సీతాఫలాల సీజన్ ఆరంభమైంది. కొండల్లో సేకరించిన సీతాఫలా లను గిరిజన రైతులు సంతలు, మార్కెట్లలో విక్రయిస్తున్నారు. గుమ్మలక్ష్మీపురం మండలం చాపరాయి బిన్నిడి పంచాయతీ మూల బిన్నిడి లో బుధవారం నిర్వహించిన సంతకు గిరిజనులు పెద్ద ఎత్తున సీతాఫలాలు తెచ్చారు. చినమేరంగి, కురుపాం, పార్వతీపురం ప్రాంతాలకు చెందిన వ్యాపారులు వచ్చి వాటిని కొనుగోలు చేశారు. 100 సీతాఫలం పండ్లను రూ.300, రూ.400లకు సైజును బట్టి కొనుగోలు చేశారు. ఏజెన్సీ ప్రాంత సీతాఫలాలకు మార్కెట్లో డిమాండ్ ఉండటంతో వీటిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. -
పీ–4 కార్యక్రమం ఓ బూటకం
రేగిడి: పేదరిక నిర్మూలనకోసం కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న పీ–4 కార్యక్రమం ఓ బూటకమని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైఎస్సార్సీపీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్ విమర్శించారు. రేగిడిలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పీ–4 కార్యక్రమంలో బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని, గ్రామస్థాయిలో పూర్తిగా అట్టర్ప్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. మార్గదర్శకులను గుర్తించకుండా బంగారు కుటుంబాలను గుర్తించాలని అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి తేవడం మంచిది కాదన్నారు. గ్రామస్థాయిలో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులు, ఉపాధ్యాయులను బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని వేధించడం తగదన్నారు. అట్టడుగున ఉన్న పేద ప్రజలను బాగుచేయాలనే మంచి ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే కూటమి పార్టీల నాయకులే ఆ కుటుంబాలను దత్తత తీసుకోవాలని డిమాండ్ చేశారు. సూపర్సిక్స్ పథకాలు అమలు కాకపోవడం, ప్రజలు కూటమి నేతలను నిలదీస్తుండడంతో వారి దృష్టిని మరల్చడానికి పీ–4 కార్యక్రమం ముందుకు తెచ్చారన్నారు. గిన్నిస్బుక్ రికార్డు కోసం విశాఖలో ఇటీవల నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం మాదిరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు రికార్డుల కోసం పీ–4 కార్యక్రమం చేపడుతున్నారని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజాం నియోజకవర్గ బీసీసెల్ అధ్యక్షుడు కరణం శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
మానవ అక్రమ రవాణా వ్యవస్థీకృత నేరం
విజయనగరం లీగల్: మానవ అక్రమ రవాణా హేయమైన చర్య అని ఇది వ్యవస్థీకృత నేరమని ఈ దోపిడీని అంతం చేయాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎ.కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు.ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నగరంలోని మహిళా ప్రాంగణంలో బుధవారం న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మహిళలు చిన్నపిల్లలను అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అక్రమ రవాణా బాధితుల హక్కుల రక్షణ వారి భద్రతలే ప్రధాన అంశంగా పోలీస్ యంత్రాంగం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ పనిచేస్తుందని అక్రమ రవాణా బాధితులకు రక్షణ నష్టపరిహారం, పునరావాసంతో పాటు వారికి తగిన న్యాయ సహాయం అందించేందుకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థతో పాటు పోలీసు యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. పిల్లల అక్రమ రవాణాపై పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ మహిళా పోలీస్ స్టేషన్ ఆర్.గోవిందరావు మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ అధికారి టి.విమల కుమారి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎస్డీవీ ప్రసాద రావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ జి హిమబిందు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ బీహెచ్ లక్ష్మి, పోలీస్ అధికారులు, యూత్ క్లబ్ బెజ్జిపురం స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.ప్రసాద రావు పాల్గొన్నారు. సీనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రసాద్ -
ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఏర్పాట్లు
సీతంపేట: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దామని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక ఐటీడీఏలో గిరిజన సంఘాలు, ప్రజా ప్రతినిధులతో ముందస్తు సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గిరిజన సంస్కృతీ, సంప్రదాయా లు ఉట్టిపడేలా వచ్చేనెల 9న సీతంపేటలో ఆదివాసీ దినోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేయనున్న ట్లు చెప్పారు. దూరప్రాంతాల నుంచి వచ్చే గిరిజను ల కోసం రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాల స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు గిరిజన నృత్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ భూదేవి, జేఏసీ నాయకులు బి.తేజేశ్వరరావు, బి.శ్రీనివాసరావు, లక్ష్మీనారాయ ణ, అడవిరాముడు, మార్కెట్ కమిటీ చైర్మన్ సంధ్యారాణి, ఎంపీపీ బి.ఆదినారాయణ, ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు, పాలకొండ డీఎస్పీ ఎం.రాంబా బు, ఎస్సై వై.అమ్మన్నరావు పాల్గొన్నారు. -
హెచ్పీసీఎల్ పైప్లైన్పై రైతుల అభ్యంతరం
లక్కవరపుకోట: ఇప్పటికే విలువైన పంట భూములను ఐఓసీఎల్ పైప్లైన్, హైపవర్ విద్యుత్ లైన్, గ్రీన్ ఫీల్డ్ హైవే తదితర ప్రాజెక్టుల కోసం లాక్కున్నారని పరిహారం మాత్రం తూతూ మంత్రంగా అందించారని మరో ప్రాజెక్టుకు భూములను ఇచ్ఛేందుకు సిద్ధంగా లేమని రైతులు తేల్చి చెప్పారు. ఈ మేరకు లక్కవరపుకోట మండల కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయంలో విశాఖపట్నం నుంచి రాయ్పూర్కు హిందుస్థాన్ పెట్రోల్ కార్పొరేషన్ కు చెందిన పైప్ లైన్ నిర్మాణానికి సంబంధించి శ్రీరాంపురం, కొట్యాడ, కూర్మవరం గ్రామాల రైతులతో అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఎస్.సుధాసాగర్ సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విలువైన పంట భూముల్లో అడ్డుగా పైప్లైన్ వేస్తే భవిష్యత్ అవసరాలకు భూములను అమ్ముకోదలిస్తే కొనేందుకు ఎవరూ ముందుకు రారని వాపోయారు. పైప్లైన్ నిర్మాణానికి సేకరించిన భూమికి మార్కెట్ విలువలో కేవలం 10 శాతం మాత్రమే పరిహారం చెల్లించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పైప్లైన్ నిర్మాణానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు తెగేసి చెప్పారు. కార్యక్రమంలో హెచ్పీసీల్ డిప్యూటీ మేనేజర్ ఎం.లక్ష్మణ్, తహసీల్దార్ కోరాడ శ్రీనివాసరావు, విశ్రాంత తహసీల్దార్ జి.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఎరువుల సరఫరాపై పర్యవేక్షణ
పార్వతీపురం రూరల్: జిల్లాలో ఎరువుల సరఫరాను పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జూలై చివరి నాటికి జిల్లాలో దాదాపు 11,327 టన్నుల యూరియా అవసరమవుతుందని అంచనా వేయగా, ఇప్పటి వరకు 12,944 టన్నులు సరఫరా అయ్యిందన్నారు. రైతు సేవా కేంద్రాల్లో ఎరువుల లభ్యత, పంపిణీ జరుగుతున్న తీరును పరిశీలిస్తున్నామన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అవసరమైన యూరియా వస్తుందని, ఇప్పటి నుంచి నిల్వ చేసుకునేందుకు ప్రయత్నించవద్దని రైతులకు సూచించారు. డీఏపీ, పొటాష్, సూపర్ పాస్పేట్, కాంప్లెక్స్ ఎరువులు జిల్లాలో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 245 రైతు సేవ కేంద్రాల ద్వారా 7,235 టన్నులు, 22 సొసైటీల ద్వారా 1,369 టన్నుల యూరియా, డీఏపీ ఎరువులను పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. యూరియా వినియోగాన్ని తగ్గించేందుకు ఇటీవల అనేక ప్రత్యామ్నాయ మార్గాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ద్రవరూప ఎరువులైన నానో యూరియా, డీఏపీ ఎరువులను రైతు సేవ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచామన్నారు. ఎరువులకు సంబంధించి ఏదైనా సూచనలు, మార్గదర్శకాలు, సమాచారం అవసరమైతే జిల్లా వ్యవసాయ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్: 79894 34766కు కాల్ చేయవచ్చన్నారు. జల్లాలో 12,944 టన్నుల యూరియా పంపిణీ కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
అన్నదాత సుఖీభవలో కోత
విజయనగరం ఫోర్ట్: మెంటాడ మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన దేవర పాదాలమ్మకు వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద సాయం అందింది. కూటమి ప్రభుత్వం సాయం ప్రకటించిన అన్నదాత సుఖీభవ అర్హుల జాబితాలో ఆమె పేరు లేదు. ఆమెకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. ● బొండపల్లి మండలం బిల్లల వలసకు చెందిన ఎన్. శ్రీనుకు గ్రామంలో 65 సెంట్ల పొలం ఉంది. వైఎస్సార్సీపీ హయంలో ఈ రైతుకు రైతు భరోసా సాయం అందింది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ అర్హుల జాబితాలో ఈ రైతు పేరు లేదు. ● దత్తిరాజేరు మండలం వి.కృష్ణాపురం గ్రామానికి చెందిన మార్పిన సురేష్కు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా పథకం కింద ఆర్థిక సాయం అందింది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ అర్హుల జాబితాలో ఆ రైతు పేరు లేదు. ఈ ముగ్గురు రైతులే కాదు. అనేక మంది రైతులకు ఎదురైన సమస్య ఇది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ రైతు భరోసా పథకం అందుకున్న వారికి కూడా కూటమి ప్రభుత్వంలో పథకం అందని పరిస్థితి నెలకొంది. అన్నదాత సుఖీభవ పథకం కోసం ఎంపిక చేసిన జాబితలో వేలాది మందికి కూటమి ప్రభుత్వం కోత పెట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా రైతులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏడాదికి రూ.13,500 చొప్పున ఐదేళ్ల పాటు ఆర్థిక సాయాన్ని అందించింది. కానీ కూటమి సర్కార్ మొదటి ఏడాది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఇస్తానన్న ఆర్థిక సాయం అందించలేదు. రెండో ఏడాది అన్నదాత సుఖీభవ పథకం కూడా ఇంతవరకు అందించిన పాపాన పోలేదు. అన్నదాత సుఖీభవ పథకం ఇవ్వకపోయినప్పటికీ రైతులకు ఆర్థిక సాయం అందించడం కోసం అని చెప్పి గుర్తించిన లబ్ధిదారుల జాబితాలో భారీగా కోత విధించడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమ్మి ఓట్లు వేస్తే ఈ విధంగా కోత పెట్టడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. అప్పడు అర్హులమై ఇప్పడు ఏవిధంగా అనర్హులమ య్యామని రైతులు వాపోతున్నారు. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించాలనే కుట్రతోనే కూటమి సర్కార్ ఈ విధంగా చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో 2.63 లక్షల మంది రైతులకు లబ్ధి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2.63 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. వారికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.13,500 చొప్పన ఆర్ధిక సాయం అందించింది. కూటమి సర్కార్ అన్నదాత సుఖీభవ పథకం కోసం 2.24,356 మంది అర్హులను గుర్తించింది. ఇందులో 2,23,117 మందికి ఈకేవైసీ పూర్తయింది. 1239 మందికి ఈకేవైసీ చేయాల్సి ఉంది. 40 వేలకు పైగా లబ్ధిదారులు గతంలో కంటే తగ్గిపోయారు. ఇంకా అందని సాగు సాయం అధికారంలోకి వస్తే రైతుల సాగు పెట్టుబడికి ఆర్థిక సాయం చేస్తామని కూటమి సర్కార్ గొప్పలు చెప్పింది. గద్దె నెక్కిన మొదటి ఏడాదే రైతులకు ఇచ్చిన హామీని ఎగ్గొట్టింది. రెండో ఏడాది ఇంతవరకు సాయం అందించలేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. అయితే రైతులకు పంట పెట్టుబడికి డబ్బులు లేక పోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అప్పలు చేసి పంటల సాగుకు పెట్టుబడి పెడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో కంటే తగ్గిన లబ్ధిదారులు కూటమి పాలనలో అర్హులుగా గుర్తించింది 2.24 లక్షల మంది తగ్గిన 40 వేల మందికి పైగా లబ్ధిదారులు -
వరినారు చివర్లు తుంచి నాటుకోవాలి
మక్కువ: వరి నాట్లు వేసేటప్పుడు నారు చివర్లు తుంచి వేయాలని వ్యవసాయాధికారి చింతల భారతి రైతులకు సూచించారు. ఈ మేరకు మండలకేంద్రం మక్కువ, దబ్బగెడ్డ గ్రామాల్లో మండల వ్యవసాయఅధికారి చింతల భారతి ఆధ్వర్యంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో రైతులతో నిర్వహించిన సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ ఈ విధంగా నాట్లు వేసుకుంటే కాండం తొలిచే పురుగు నివారించవచ్చునని తెలిపారు. అలాగే వరిపొలాల్లో కాలిబాటలు తీసుకోవాలని సూచించారు. నానో యూరియా, నానో డీఏపీ ద్రవరూపంలో ఉన్నందున, పంటలకు త్వరగా అవసరమైన పోషకాలను అందిస్తాయన్నారు. ఆధునిక ఎరువులు పంటల పెరుగుదలను, దిగుబడిని పెంచడంలో సహాయపడతాయన్నారు. అలాగే సాధారణ ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి దోహదం చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయకుడు ఎం.హేమంత్, రైతులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పెద్ద పీట
సాలూరు: రానున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వేయనున్నట్లు మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. ఈ మేరకు రాజన్నదొరను పట్టణంలోని ఆయన స్వగృహంలో బుధవారం రాత్రి వైఎస్సార్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ ,శ్రీకాకుళం,పార్వతీపురం మన్యం జిల్లాల అనుబంధ విభాగాల ఇన్చార్జ్ వీరరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల కమిటీల నియామకంపై చర్చించారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ, నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జిల్లా, మండల స్థాయి అనుబంధ విభాగాల కమిటీల నియామకం ఇప్పటికే పూర్తయిందన్నారు. గ్రామ, వార్డు స్థాయి కమిటీల నియామకం త్వరలోనే పూర్తిచేస్తామని చెప్పారు. మంగళవారం తాడేపల్లిలో జరిగిన పీఏసీ సమావేశంలో అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా రానున్న జగన్మోహన్రెడ్డి పాలనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించి , వారే రాజు మంత్రి అనే విధంగా కార్యకర్తలను చూసుకుంటామని జగన్మోహన్రెడ్డి తెలిపిన విషయాలను ప్రస్తావించారు. క్షేత్రస్థాయిలో కూటమి పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, సమస్యలపై చర్చించారు. మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర -
ఆగస్టు 3న జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ జట్ల ఎంపిక
విజయనగరం: రాష్ట్రస్థాయిలో ఆగస్టు 9,10,11 తేదీల్లో బాపట్ల జిల్లా చీరాలలో జరగనున్న జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక ఆగస్టు 3న నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం తెలిపారు. నగర శివారులో గల విజ్జి స్టేడియంలో నిర్వహించే ఎంపికల్లో అండర్–14,16,18,20 సంవత్సరాల వయస్సు గల బాల, బాలికలు పాల్గొనేందుకు అర్హులుగా పేర్కొన్నారు. ఎంపిక పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రాన్ని వెంట తీసుకురావాలని సూచించారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గిరిజనులకు రగ్గుల పంపిణీమక్కువ/పార్వతీపురం రూరల్: మక్కువ మండలంలోని ఆరు గిరిజన గ్రామాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రగ్గులను పంపించారు. ఈ మేరకు బుధవారం ఆ 6 గిరిజన గ్రామాల్లో రగ్గుల పంపిణీ జరిగింది. మండలంలోని బాగుజోలలో 24, చిలక మెండంగి, బెండమెడంగి, తాడిపుట్టి, దోయ్ వర, సిరివర, గిరిజన గ్రామాల్లో 222 కుటుంబాలకు, కుటుంబానికి మూడు రగ్గులు చొప్పున పంపిణీ చేశారు. -
అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి పక్కా గృహం
● ఎస్ఎస్ఎల్ఆర్ ఎ.డి గోవిందరావుపార్వతీపురం: జిల్లాలో అర్హత గల ప్రతి ఒక్క కుటుబానికి రానున్న రెండేళ్లలో పక్కా గృహం ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సర్వే, భూ నమోదు విభాగం అదనపు సంచాలకుడు ఆర్. గోవిందరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు భూమిని ఇంటి నిర్మాణానికి కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 2019 కన్నా ముందు అభ్యంతరాలు లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి రెగ్యులైజేషన్ను ఈ ఏడాది డిసెంబర్ లోగా పూర్తి చేయాలన్నారు. ఆక్రమణకు గురైన శ్మశాన వాటికల స్థలాలను గుర్తించి, ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమిని తిరిగి పొందేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని చెప్పారు. జిల్లాలో చేపడుతున్న రీ సర్వే–2 డిసెంబర్ 27 నాటికి పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జేసీ శోబిక రెవెన్యూ శాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాల వివరాలు, లక్ష్యాలు, ప్రగతి నివేదికను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ కె.హేమలత, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పి.ధర్మచంద్రారెడ్డి, ఎస్.దిలీప్ చక్రవర్తి, తదితరులు ఉన్నారు. జిల్లాకు వచ్చిన ఎస్ఎస్ఎల్ఆర్ ఏడీ గోవిందరావు తొలుత జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. -
ఆటో, బైక్ ఢీ: వృద్ధుడి మృతి●
● మరో నలుగురికి తీవ్రగాయాలులక్కవరపుకోట: అరకు–విశాఖపట్నం జాతీయ రహదారిలో మంగళవారం కొత్తవలస నుంచి ప్రయాణికులతో ఆటో వస్తుండగా సోంపురం జంక్షన్ నుంచి మితిమీరిన వేగంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి రంగరాయపురం జంక్షన్ సమీపంలో ఎత్తుబ్రిడ్జి వద్ద ఆటోను బలంగా ఢీకొట్డాడు. దీంతో ఆటో అదుపు తప్పి బొల్తా కొట్టి రోడ్డుపై పడిపోయింది. ఆటోలో ప్రయాణిస్తున్న కిత్తన్నపేట గ్రామానికి చెందిన యడ్ల సింహాచలం(64) అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్ బంగారయ్యతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. బైక్ నడుపుతున్న వ్యక్తి పూర్తిగా మద్యం తాగి ఉన్నాడని ఎల్.కోట జంక్షన్లో వాహనాలను తనిఖీ చేస్తుండగా వారిని చూసి సంబంధిత వ్యక్తి ఆగకుండా బండిపై వెళ్లి ప్రమాదానికి కారణమయ్యాడని స్థానికులు తెలిపారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను 108 వాహనంలో ఎస్.కోట సీహెచ్సీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ పాపారావు తెలిపారు. -
దివ్యాంగులు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరచాలి
పార్వతీపురం టౌన్: దివ్యాంగులు అన్ని రంగాల్లో తమ ప్రతిభను కనబరిచేందుకు పర్పుల్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. కాంపోజిట్ రీజనల్ సెంటర్ ఫర్ స్కిల్ డెవలెప్మెంట్, రీహ్యాబిలిటేషన్ అండ్ ఎంపవర్మెంట్(సీఆర్సీ), నెల్లూరు, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో పర్పుల్ ఫెయిర్ కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, పార్వతీపురం ఎమ్మెల్యే బి.విజయచంద్రలు దివ్యాంగులు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించి వారిలో ఉండే ప్రతిభను గుర్తించి అభినందించారు. విబిన్న ప్రతిభా వంతుల్లో కూడా అసమాన్య ప్రతిభ ఉంటుందని, దాన్ని గుర్తించి ప్రోత్సహిస్తే సామాన్యుల కంటే తీసుపోరని కితాబిచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పర్పుల్ ఫెయిర్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో తొలిసారిగా పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించడం ఎంతో గర్వకారణమన్నారు. బ్రెయిన్ హెల్త్ ఆటిజం మొదలైన బాధితులకు చికిత్స ఇచ్చేందుకు నీతి అయోగ్తో పార్వతీపురంలో ఒక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. భవిత కేంద్రాల్లో దివ్యాంగులకు అవసరమైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల కురుపాం మండల కేంద్రానికి చెందిన విద్యార్థి తనలోని లోపాలను చూసి వెనుకడుగు వేయకుండా ఆత్మవిశ్వాసంతో గ్రాండ్ బ్రిక్స్లో 1500మీటర్లు, 400మీటర్ల పరుగు పందెంలో ఒక గోల్డ్, ఒక బ్రాంజ్ మెడల్ సాధించినట్లు తెలిపారు. దివ్యాంగుల కలల సాకారం ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మాట్లాడుతూ విభిన్న ప్రతిభా వంతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయన్నారు. ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ దివ్యాంగుల కలలను సాకారం చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదం చేస్తుందన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఉపకరణాలను, స్టాల్స్ యాజమానులకు జ్జాపికలను అందజేశారు. కార్యక్రమంలో సీఆర్సీ డైరెక్టర్ మనోజ్ కుమార్, విబిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ ఎ.డి ఎల్ఎన్వీ శ్రీధర్, డీఈఓ బి.రాజ్కుమార్, డీవీఈఓ వై. నాగేశ్వరరావు, ఏపీసీ ఆర్.తేజేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ సుధారాణి, ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ -
అయ్యవార్లకు అందని జీతాలు
ఇదీ పరిస్థితి.. పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే నెపంతో 151 యుపీ పాఠశాలలను ఎత్తివేశారు.1053 ప్రాథమిక పాఠశాలలను 827కు కుదించారు. వాటి స్థానంలో కొత్తగా 91 ఫౌండేషన్ స్కూల్స్, 602 బేసిక్ స్కూల్స్, 221 మోడల్ ప్రైమరీ స్కూల్స్, 35 యూపీ స్కూల్స్, 80 హైస్కూల్స్,10 బేసిక్ ప్రైమరీ హైస్కూల్స్, 9 మోడల్ హైస్కూల్స్ ను తీసుకువచ్చారు. వాటితో పాటు కేజీబీవీలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలతో కలిపి జిల్లా వ్యాప్తంగా 1,504 సర్కారు బడులు ఉన్నాయి. వాటిలో 5,640 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారిలో బదిలీలపై ఒక పాఠశాల నుంచి వేరే పాఠశాలకు వచ్చిన 1,150 మంది ఉపాధ్యాయులకు ఈ విద్యా సంవత్సరంలో నేటి వరకు జీతాలు అందకపోవడంతో కూటమి ప్రభుత్వం తీరుపై ఉపాధ్యాయులు గుర్రుగా ఉన్నారు.● వచ్చే నెల కూడా అందవంటున్న ఉపాధ్యాయులు ● జిల్లాలో మొత్తం పాఠశాలలు: 1,504 ● పనిచేస్తున్న ఉపాధ్యాయులు: 5,640 మంది ● జీతాలు అందని ఉపాధ్యాయులు: 1,150 మందివీరఘట్టం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు ఇస్తామని చెప్పిన కూటమి నేతలు చెప్పిన మాటలన్నీ ఒట్టి అబద్ధాలేనని తేలిపోయింది. 1వ తేదీ కాదుకదా రెండు నెలలవుతున్నా కొందరు ఉపాధ్యాయులకు జీతాలు అందకపోవడంపై కూటమి ప్రభుత్వం తీరుపై అయ్యవార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యావ్యవస్థలో నూతన మార్పులు తెస్తామని పేదవారికి సర్కారు విద్యను దూరం చేసిన కూటమి ప్రభుత్వం అందులో పనిచేస్తున్న కొందరు ఉపాధ్యాయులకు జీతాలు కూడా ఇవ్వకపోవడంపై ప్రభుత్వం తీరుపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటున్నాయి. అంతా హంగామా.. రీ–స్ట్రక్చర్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న పలు ప్రాథమిక, యూపీ పాఠశాలలకు మంగళం పలికారు. వాటి స్థానంలో ఫౌండేషన్ స్కూల్స్, బేసిక్ స్కూల్స్, మోడల్ ప్రైమరీ స్కూల్స్, బేసిక్ ప్రైమరీ హైస్కూల్స్, మోడల్ హైస్కూల్స్ ను తీసుకువచ్చి కూటమి ప్రభుత్వం హంగామా చేసింది. వాటిలో మోడల్ ప్రైమరీ స్కూల్స్లో కొత్తగా హెచ్ఎం పోస్టులను సృష్టించి స్కూల్ అసిస్టెంట్లను హెచ్ఎంలుగా నియమించింది. ఇలా బదిలీ అయినవారితో పాటు ఇటీవల జరిగిన సాధారణ బదిల్లో వచ్చిన వారెవరికీ జూన్ నెల జీతాలు వేయలేదు.జూలై నెల జీతాల బిల్లులు కూడా పెట్టలేదు.దీంతో జూలైలో రెండు నెలల జీతాలు అందుతాయనుకున్న బదిలీ ఉపాధ్యాయలకు నిరాశే మిగిలింది. కొత్తగా ఏర్పడిన పాఠశాలలకు పొజిషన్ ఐడీ లు ఇచ్చి బదిలీ ఉపాధ్యాయులకు జీతాలు విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఆర్థిక అనుమతులు లేకపోవడమే కారణమా? రీ–స్ట్రక్చర్ పేరుతో కొత్తగా ఏర్పాటు చేసిన పాఠశాలలకు ఆర్థిక అనుమతులు లేకపోవడంతోనే బదిలీ ఉపాధ్యాయులకు జీతాలు అందలేదని పలువురు అంటున్నారు. వాస్తవానికి కొత్తగా వచ్చిన విద్యా విధానంపై ముఖ్యమంత్రి సమక్షంలో మంత్రిమండలి సమావేశం నిర్వహించి ఆమోదం తెలపాలి. తర్వాత వాటికి ఆర్థిక అనుమతులు ఇవ్వాలి. అయితే ఇవేవీ పాటించకుండా కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యావిధానంలో కొందరు అయ్యవార్లకు జీతాలు అందక సతమతమవుతున్నారు.జూలై నెలకు సంబంధించిన జీతాల బిల్లులను ట్రెజరీకి పంపించే సమయం కూడా పూర్తి కావడంతో ఇక జూలై నెల జీతం కూడా అందదని నిర్ధారణ కావడంతో ప్రభుత్వం తీరుపై ఉపాధ్యాయులు భగ్గుమంటున్నారు.క్రింది ఫొటోలో ఉన్న వీరఘట్టం మండలం కిమ్మి యూపీ పాఠశాలను ఎత్తివేసి ఈ పాఠశాలను మోడల్ ప్రైమరీ పాఠశాలగా కూటమి ప్రభుత్వం మార్చింది. ఇందులో కొత్తగా వచ్చిన హెచ్ఎంతో కలిపి నలుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఈ పాఠశాలలో ఇదివరకే పనిచేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులకు జూన్ నెల జీతాలు వచ్చాయి.కొత్తగా వచ్చిన హెచ్ఎంకు నేటి వరకు జీతం అందలేదు.పొజిషన్ ఐడీలు ఇవ్వాలి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ గడిచి రెండు నెలలు కావస్తున్నా జీతాలు వేయకపోవడం ఏంటి? కొత్తగా ఏర్పడిన పాఠశాలలకు పొజిషన్ ఐడీలు ఇచ్చి జీతాలు విడుదల చేయాలి. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కోసం 15 రోజుల పాటు ఉపాధ్యాయులకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. యాప్లో పదే పదే ఫొటోలు అప్లోడ్ చేసినా చాలా వరకు తిరస్కరించారు.అయినా సరే విసుగు చెందకుండా పనులను సక్రమంగా పూర్తి చేశాం. అంతేకాక సంబంధం లేని పనులను కూడా చేయాల్సి వస్తోంది. ఇంత చేసినా సకాలంలో జీతాలు వేయకపోతే ఎలా? వెంటనే జీతాలు విడుదల చేయాలి. బంకురు అప్పలనాయుడు, పీఆర్టీయూ జిల్లా కార్యదర్శి, వీరఘట్టంఈ ఫొటోలో ఉన్నది వీరఘట్టం మండలం నడిమికెల్ల యూపీ పాఠశాల. దీన్ని అప్గ్రేడ్ చేసి ఉన్నత పాఠశాలగా మార్చారు. ఇక్కడ ప్రస్తుతం 12 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారిలో నలుగురు ఉపాధ్యాయులకు ఇంత వరకు జీతాలు అందలేదు. ఇలా జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన 1048 పాఠశాలలకు బదిలీపై వచ్చిన 1,150 మంది ఉపాధ్యాయలకు జీతాలు అందక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చాలా దారుణం బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులకు ఇంత వరకు జీతాలు ఇవ్వకపోవడం చాలా దారుణం. జీతాలు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో దారుణ పరిస్థితి ఏర్పడింది. ఉపాధ్యాయులకు బోధనేతర పనులను అప్పగిస్తున్న ప్రభుత్వం వారికి సకాలంలో జీతాలు వేస్తామని ఆలోచించకపోవడం చాలా అన్యాయం. బదిలీపై కొత్తగా ఏర్పడిన పాఠశాలలకు వచ్చిన ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు వేయాలి. మజ్జి పైడిరాజు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి, వీరఘట్టం -
నవోదయలో హ్యాండ్బాల్ మీట్
శృంగవరపుకోట: మండలంలోని కిల్తంపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయలో హైదరాబాద్ రీజియన్ హ్యాండ్బాల్ మీట్ 2025–26ను ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభించారు. ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి, దక్షిణ భారతదేశంలో ఎనిమిది క్లస్టర్ల నుంచి వచ్చిన క్రీడాకారులు, ఆయా విద్యాలయాల కోచ్లను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యానాం, అదిలాబాద్, కన్నూర్, కరైకల్, ఎర్నాకుళం, హవేరి, హాసన్, కలబుర్గి క్లస్టర్ల నుంచి క్రీడాకారులు వచ్చినట్లు చెప్పారు. మూడు రోజుల పాటు జరిగే పోటీలకు ఏపీ హ్యాండ్బాల్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్.రాజారావు నేతృత్వం వహిస్తారని చెప్పారు. కట్టా శ్రీను, ఎన్వీవీ కుమార్లు రిఫరీలుగా బాధ్యతలు నిర్వహిస్తారన్నారు. ఈపోటీల్లో విజేతలుగా నిలిచిన అథ్లెట్లు బీహార్ రాష్ట్రంలోని నలందలో జరిగే జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో హైదరాబాద్ రీజియన్కు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. క్రీడాకారుల కోసం చేసిన ఏర్పాట్లను వివరించారు. -
ఫార్మా, హెల్త్కేర్ రంగాల్లో ఉచిత శిక్షణ
శ్రీకాకుళం రూరల్: ఒడిశాకు చెందిన విద్యార్థులకు ఫార్మా, హెల్త్ కేర్ రంగాల్లో ఉచిత శిక్షణ, ఉద్యోగాలు కల్పించేందుకు శ్రీకాకుళం బొల్లినేని మెడ్స్కిల్స్తో మంగళవారం ఎంవోయూ కుదుర్చుకున్నామని గజపతి జిల్లా డీఎస్డీఈవో సౌభాగ్య స్మృతిరంజన్ త్రిపాఠి తెలిపారు. ఎన్యూవీ ఒడిశా శిబిరంలో భాగంగా 240 మంది విద్యార్థులకు ప్రభుత్వ సహకారంతో శిక్షణ అందించనున్నామని పేర్కొన్నారు. ప్లస్ త్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులకు పేషెంట్ రిలేషన్ అసోసియేట్, ఎస్ఎస్సీ, ప్లస్ టూ, ప్లస్ త్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులకు అసోసియేట్ స్టోర్ ఫార్మా కోర్సులో శిక్షణ ఇస్తామని తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. శిక్షణతో పాటు ఉచిత భోజన వసతి సదుపాయం, యూనిఫామ్ స్టడీ మెటీరియల్ అందిస్తామన్నారు. కోర్సు పూర్తి చేసిన వారికి కార్పోరేట్ ఆస్పత్రుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు 7331118019, 7680945357, 7995013422 నంబర్లను గానీ, శ్రీకాకుళం రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో గానీ సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో బొల్లినేని మెడ్స్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు, గజపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొన్నారు. -
ఆడపిల్లలకు స్వీయ రక్షణలో ప్రత్యేక శిక్షణ
విజయనగరం క్రైమ్: జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినులకు స్వీయ రక్షణ మెలకువలు నేర్పించేందుకు ప్రత్యేకంగా ఒక మహిళా శిక్షకురాలిని నియమించినట్లు ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం తెలిపారు.ఈ మేరకు నగరంలోని కంటోన్మెంట్ శార్వాణి పోలీసు వెల్ఫేర్ ఆంగ్ల పాఠశాలలో నిర్వహించిన శిక్షణ శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థినులపై జరిగే దాడులు, ఈవ్టీజింగ్, ఆకతాయిల వేధింపులు, లైంగిక దాడులను ప్రతిఘటించి, వారి దాడులను తిప్పి కొట్టేందుకు శిక్షణ ఏర్పాట్లు కల్పిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు.జిల్లా వ్యాప్తంగా ప్రతి పాఠశాల, కళాశాలలో చదువుతున్న విద్యార్థినులు తమను తాము రక్షించుకునేందుకు కొన్ని స్వీయ రక్షణ టెక్నిక్స్ ను నేర్పాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా రాధ అనే మహిళా శిక్షకురాలిని జిల్లా పోలీసుశాఖ నియమించిందని చెప్పారు. ఈ శిక్షకురాలు పాఠశాలల్లోని వ్యాయామ ఉపాధ్యాయులకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ను ముందుగా నేర్పించి, వారి సహకారంతో అన్ని పాఠశాలల్లోని విద్యార్థినులకు వాటిని నేర్పించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ శిక్షణ కోసం ఉపాధ్యాయులు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఆర్ఐ ఎన్.గోపాలనాయుడు, పాఠశాల హెచ్ఎం సంధ్య, ఆర్ఎస్సైలు ప్రసాదరావు, రామకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్ధినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
పాముకాటుతో విద్యార్థికి అస్వస్థత
సాలూరు రూరల్: మండలంలోని తోణాం ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి కార్రాసునీల్ పాముకాటుతో అస్వస్థతకు గురయ్యాడు. పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం సంపంగిపాడు పంచాయతీ గాలిపాడు గ్రామానికి చెందిన సునీల్ తోణాం ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజూ ఉదయం బహిర్భూమికి వెళ్లే అలవాటు ప్రకారం మంగళవారం బయటకు వెళ్లే సమయంలో పాముకాటుకు గురయ్యాడు. దీనితో వెంటనే పాఠశాల వార్డెన్ లచ్చయ్య తోణాం ఆస్పత్రికి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం సాలూరు ఏరియా ఆస్పత్రికి అక్కడినుంచి విజయనగరంలోని ఘోషా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వార్డెన్ లచ్చయ్య విద్యార్థిని దగ్గరుండి చూసుకుంటున్నారు. పీఎంశ్రీ పథకంలో బొబ్బిలి గురుకులం ఫస్ట్ బొబ్బిలి: పీఎంశ్రీ పథకంలో బొబ్బిలి గురుకుల పాఠశాల జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్టు ప్రిన్సిపాల్ రఘునాథరావు తెలిపారు. పట్టణంలోని సింహాల తోటలో ఉన్న ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలను పీఎంశ్రీ పథకంలో భాగంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వర్చువల్ విధానంలో మంగళవారం జాతికి అంకితం చేశారన్నారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఏ ఏపీడీ ఎ.రామారావు, ఎంఈఓలు చల్ల లక్ష్మణరావు, గొట్టాపు వాసు, గురుకుల సిబ్బంది, ఎంపిక చేసిన విద్యార్థులు పాల్గొన్నారు. పరిశ్రమల దరఖాస్తులు గడువులోగా పరిష్కరించాలి●● జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ విజయనగరం అర్బన్: జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం అందిన దరఖాస్తులను సింగల్ డెస్క్ పాలసీ కింద 21 రోజుల్లో పరిష్కరించాలని సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. మే నుంచి జూలై వరకు 1652 దరఖాస్తులు అందగా 1634 దరఖాస్తులకు అనుమతి ఇచ్చామని, మిగిలిన వాటిలో 11 దరఖాస్తులు కాలుష్య నియంత్రణ మండలి వద్ద, మిగిలినవి ఫైర్, గ్రౌండ్ వాటర్, ఫ్యాక్టరీస్, లీగల్ మెట్రాలజి శాఖల వద్ద పెండింగ్ ఉన్నాయన్నారు. వాటిని గడువు లోగా పరిష్కరించాలని, తిరస్కరిస్తే తగిన కారణాలతో తిరస్కరించాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల కమిటీ సమావేశం జేసీ ఆధ్వర్యంలో జరిగింది. సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ కరుణాకర్, నాబార్డ్ డీడీఎం నాగార్జున, ఎల్డీఎం రమణమూర్తి, విద్యుత్ శాఖ ఎస్ఈ లక్ష్మణ రావు, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సరిత, జిల్లా ఫైర్ ఆఫీసర్ రామ్కుమార్, జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జున రావు, ఫ్యాక్టరీస్, స్కిల్ డెవలప్మెంట్, శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈవీఎం గొడౌన్ల తనిఖీనెల్లిమర్ల: నెలిల్లమర్లలో ఉన్న ఈవీఎం గోదాములను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మంగళవారం తనిఖీ చేశారు. గోదాము షట్టర్లకు, లోపలి గదులకు వేసిన సీళ్లను, తాళాలను పరిశీలించారు. బందోబస్తుపై సమీక్షించారు. సీసీ కెమెరాల ద్వారా చుట్టుపక్కల, గొదాముల్లోని పరిస్థితులను పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను, పోలీసు సిబ్బందిని ఆదేశించారు. డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ఆర్డీఓ డి.కీర్తి, నెల్లిమర్ల తహసీల్దార్ శ్రీకాంత్, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ భాస్కరరావు, ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
హోంగార్డ్స్ సంక్షేమానికి చర్యలు
● ఎస్పీని కలిసిన విశాఖ రేంజ్ కమాండెంట్ జోషివిజయనగరం క్రైమ్: విశాఖ రీజియన్ హెూంగార్డ్స్ కమాండెంట్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎ.జోషి తొలిసారి జిల్లాకు వచ్చి, ఎస్పీ వకుల్ జిందల్ను మర్యాద పూర్వకంగా మంగళవారం కలిసి, పూల మొక్కను అందజేశారు. హెూంగార్డ్స్ సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ వకుల్ జిందల్ తో ఈ సందర్భంగా చర్చించారు. ఆపై వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు చేపడతానని చెప్పారు. అనంతరం ఆయన హోంగార్డులతో సమావేశమై, విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను హోంగార్డు కుటుంబాలకు వర్తింపజేయాలని, విధి నిర్వహణలో ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ప్రయాణించేందుకు బస్ పాస్ వంటి సౌకర్యాలను కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని హోం గార్డులు కోరగా, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి, పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హోంగార్ుడ్స నిర్వహించిన పరేడ్ ను కమాండెంట్ పరిశీలించారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆర్.రమేష్ కుమార్, ఆర్ఎస్సై ముబారక్ అలీ, హెూంగార్డ్స్ ఇన్చార్జ్ హెచ్సీలు రాజు, శ్రీనివాసరావు, హెూంగార్డులు పాల్గొన్నారు. -
ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లకు నష్టం
విజయనగరం గంటస్తంభం: లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కు వాహన మిత్ర రూ.15,000 తక్షణమే చెల్లించాలని కోరుతూ..విజయనగరం జిల్లా శ్రీ కనకదుర్గ ఆటో మోటార్ ట్రాన్స్ఫోర్ట్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కో–కన్వీనర్ ఎ.జగన్మోహన్రావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు వి.లక్ష్మి, నగర కార్యదర్శి బి.రమణ, ఉపాధ్యక్షుడు రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ..కరోనా తర్వాత ఆటో, టాటా ఏసీ మ్యాక్సీ క్యాబ్ వాహన డ్రైవర్లు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ, తమిళనాడులో అనుభవాలను పరిశీలించి ఇక్కడ నష్టపోతున్న డ్రైవర్లకు ప్రత్యామ్నాయ చూపాలని డిమాండ్ చేశారు. లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కు వాహన మిత్ర రూ.15,000 వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వాహన రెన్యువల్ ఫిట్నెస్, రిజిస్ట్రేషన్, లైసెన్స్ ఆర్టీవో అధికారులు చేయాలని, వేదాంత ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ను రద్దు చేయాలని, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ చాలానా లు, పెట్టి కేసులు ఆపాలని, ఆటోల నిలుపుదలకు పార్కింగ్ స్ధలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆటో ప్రజల జీవన విధానంలో భాగంగా మారిందని అత్యవసర, నిత్యావసర సర్వీసులన్నీ అందిస్తున్నామని ఈ రంగాన్ని ఆదాయ వనరుగా భావించకుండా సర్వీస్ రంగంగా గుర్తించి ఆటోల కొనుగోలుకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కోరారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు బి.పాపారావు, జి.కూర్మారావు, రామారావు, భాస్కరరావు, ప్రసన్న, లక్ష్మణరావు, రాజు, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
లక్కవరపుకోట: మండలంలోని చందులూరు గ్రామం సమీపంలో కిత్తన్నపేట గ్రామానికి వెళ్లే దారిని ఆనుకుని ఉన్న తుప్పల్లో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గమనించారు. ఈ సమాచారం అందడంతో ఎస్సై నవీన్పడాల్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని చంపి మూడు రోజుల క్రితమే ఈ ప్రాంతంలో పడేశారని స్థానికులు చెప్పుకుంటున్నారు. మృతుడి వయస్సు సుమారు 45 సంవత్సరాలు ఉంటాయని పోలీసులు తెలిపారు. గళ్ల లుంగీ, లైట్ నీలంరంగు టీషర్ట్ ధరించి ఉన్నట్లు గుర్తించారు. స్థానికులు, చుట్టు పక్కల గ్రామస్తులను విచారణ చేయగా ఈ వ్యక్తి ఈ ప్రాంతం వాడు కాదని తెలిపారు. ఈ మేరకు గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. లగేజీ వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతిచీపురుపల్లి: పట్టణంలోని శ్రీకనకమహాలక్ష్మి ఆలయ సమీపంలో చిన్న చెరువు వద్ద జరిగిన ప్రమాదంలో పుర్రేయవలస గ్రామానికి చెందిన కుప్పిలి శ్రీనివాసరావు(37) సంఘటన స్థలంలోనే మృతిచెందగా మరో వ్యక్తి కుప్పిలి నీలబాబుకు గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి మృతుని భార్య మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై దామోదరరావు తెలిపారు.ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు పుర్రేయవలస గ్రామానికి చెందిన కుప్పిలి శ్రీనివాసరావు, కుప్పిలి నీలబాబు మధ్యాహ్నం 1:40గంటల సమయంలో పల్సర్ బైక్పై చీపురుపల్లి నుంచి పుర్రేయవలస వెళ్తున్నారు. అదే సమయంలో లావేరు నుంచి చీపురుపల్లి వస్తున్న లగేజ్ వ్యాన్ వారి బైక్ను డీకొట్టింది. ఈ సంఘటనలో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందగా నీలబాబుకు గాయాలయ్యాయి. -
తక్కువ వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు ఇదే
పెదంకలాం ప్రాజెక్టును రూ.1.30 కోట్ల వ్యయంతో 8వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టారు. కాలువల ఆధునికీకరణకు హుద్హుద్ తుఫాన్ సమయంలో జైకా నిధులు మంజూరు చేసినప్పటికీ కాంట్రాక్టర్ పూర్తిస్థాయిలో కాలువల ఆధునీకీకరణ పనులు నిర్వహించని కారణంగా కాలువల ద్వారా సాగునీరు సరఫరా కాని పరిస్థితి నెలకొంది. ప్రతి ఏటా సాగునీటి కోసం ఆందోళనే తప్పా సమస్యకు శాశ్వత పరిష్కారం కావడం లేదు. – సింహాద్రి నాయుడు, రైతు కూలీసంఘం జిల్లా నాయకుడు, పార్వతీపురం●