Parvathipuram Manyam
-
రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి
● అనకాపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడువిజయనగరం ఫోర్ట్: నేలల్లో కర్బన శాతాన్ని పెంచడానికి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలని అనకాపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు డాక్టర్ సీహెచ్. ముకుందరావు అన్నారు. ఈ మేరకు గాజులరేగ వ్యవసాయ పరిశోధన స్థానంలో గిరిజన రైతులకు గిరిజన ఉప ప్రణాళికలో భాగంగా వ్యవసాయ ఉప కరణాలు పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవశ్యకత ఎంతో ఉందన్నారు. జీవన ఎరువులు, పచ్చి రొట్ట ఎరువుల వినియోగాన్ని పెంచాలని కోరారు. సిఫార్సు మేరకు మాత్రమే ఎరువులు వేయాలని సూచించారు. ప్రకృతి సాగు పద్ధతిలో వ్యవసాయం చేయాలని చెప్పారు. కార్యక్రమంలో అఖిల భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ ప్రతినిధి కె. శ్రీనివాసబాబు, వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి. టీఎస్ఎస్కే పాత్రో, జిల్లా వ్యవసాయ అధికారి వీటీ రామారావు, ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ కెల్ల లక్ష్మణ్, శాస్త్రవేత్తలు డాక్టర్ కె.తేజేశ్వరావు, డాక్టర్ ఎంవీవీ శ్రీనివాస రావు, డాక్టర్ ఎన్.అనూరాధ, డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ త్రివేణి, డాక్టర్ స్వాతి తదితరులు పాల్గొన్నారు. -
కార్యకర్త కుటుంబానికి జెడ్పీ చైర్మన్ ఆసరా
● ఇంటర్ విద్యకోసం రూ.లక్షా, 10 వేలు ఆర్థిక సాయంవిజయనగరం: కార్యకర్తలే ఏ పార్టీకై నా పునాదులు. పునాది లాంటి కార్యకర్తల హదయాలు గెలుచుకున్న వారే నేతలుగా, నాయకులుగా నాలుగు కాలాలు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. పార్టీలో ఉండే ప్రతి కార్యకర్తను తన కుటుంబ సభ్యుడిగా భావించిన నాయకుడు మాత్రమే వారిని, వారి కుటుంబాలను కష్టకాలంలో ఆదుకుంటాడు. అలాంటి అరుదైన రాజకీయ నాయకుల్లో ఒకరిగా, తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకునే నాయకుడు విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ భీమిలి నియోజకవర్గం ఇన్చార్జ్ మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను)అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తాజాగా మరోసారి తమ పార్టీ కార్యకర్త కుటుంబం పట్ల తనకున్న వాత్సల్యాన్ని, ఉదారతను ఆయన చాటుకున్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం, పద్మనాభం గ్రామానికి చెందిన వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంటుభుక్త శ్రీను కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు మృతి చెందారు. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని గురించి నియోజకవర్గ నాయకుల ద్వారా తెలుసుకున్న జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మానవతా ధృక్పథంతో ముందుకు వచ్చి ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. మృతి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త కుమార్తె కంటుభుక్త మాధురిని ఇంటర్మీడియట్ విద్యలో చేర్పించడానికి అవసరమైన ఆర్థిక సాయం అందించారు. బోయపాలెం శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఆమెను ఇంటర్ విద్య కోసం చేర్పించి విద్యాభ్యాసానికి అవసరమైన రూ. లక్షా, 10 వేలు ఫీజును చెల్లించి వారి కుటుంబానికి అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో మంగళవారం విద్యార్థిని మాధురి, ఆమె తల్లితో కలిసి వచ్చి క్యాంప్ కార్యాలయంలో చిన్న శ్రీను, సిరిసహ్రలను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని, మాధురి ఉన్నత స్థాయికి ఎదగాలని చిన్నశ్రీను ఆకాంక్షించారు. కార్యక్రమంలో పద్మనాభం ఎంపీపీ కంటుభుక్త రాంబాబు, పద్మనాభం సర్పంచ్ తాలాడ పద్మనాభం ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. -
వెన్నుపోటుపై మండిపాటు
పాలకొండ: రాష్ట్రంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సాలూరు, పాలకొండలో రౌండ్ టేబుల్ సమావేశాలు మంగళవారం నిర్వహించారు. సాలూరులోని పార్టీ కార్యాలయంలో, పాలకొండలోని ఏఎంజీ కన్వర్షన్ హాల్లో ఈ సమావేశాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పాలనలో జరిగిన అక్రమాలు, అవినీతిపై పాలకొండలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ అందరినీ ఆలోచింపజేసింది. దీని ద్వారా ప్రజలకు చంద్రబాబు పాలనలో ఏం జరిగిందో ఇట్టే అర్ధమైంది. సాలూరులో మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాలకొండలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. -
బరితెగింపు
● సీజ్ చేసిన ఇసుక తరలింపు ● అధికారుల ఆగ్రహం ● నడిమికెల్లలో యథేచ్ఛగా ఇసుక దందా వీరఘట్టం: మండలంలోని నడిమికెల్లలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. గత నెల 23న గ్రామంలో నిల్వ చేసిన ఇసుక కుప్పలను అధికారులు సీజ్ చేశారు. అయితే సీజ్ చేసిన ఇసుకను రాత్రి పూట తరలించుకుపోతూ అక్రమ వ్యాపారం చేస్తున్న వ్యక్తులు బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ విషయం రెవెన్యూ, పోలీసులకు మంగళవారం తెలియడంతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే గ్రామంలో ఉన్న ట్రాక్టర్లు, జేసీబీల వివరాలు కావాలని తహసీల్దార్ రాజేశ్వరరావు తమ సిబ్బందికి సూచించారు. అనంతరం ఎస్.ఐ షణ్ముఖరావుతో మాట్లాడారు. ఇసుక దందాకు పాల్పడుతున్న వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని సూచించారు. నడిమికెల్లలో ఏం జరుగుతోంది... మండలంలోని నడిమికెల్ల గ్రామం ఇసుక మాఫియాకు అడ్డాగా మారింది. గ్రామానికి సమీపంలో ఉన్న నాగావళి నది నుంచి ఇసుకను అక్రమంగా తీసుకువచ్చి తమకు అనుకూలంగా ఉన్న చాలా చోట్ల డంపింగ్ చేస్తున్నారు. ఇలా డంపింగ్ చేసిన ఇసుకను లారీలు, ట్రాక్టర్లతో రాత్రి పూట ఇతర ప్రాంతాలకు తరలిస్తూ దర్జాగా అక్రమ వ్యాపారం చేస్తున్నారు. గ్రామానికి చెందిన కొంత మంది ఈ ఇసుక దందా చేస్తూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. మైనింగ్ అధికారులు ఎక్కడున్నారు... నడిమికెల్లలో అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా జరుగుతున్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. బహిరంగంగానే లారీలు, ట్రాక్టర్లతో ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలిస్తూ కొంత మంది అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా మైనింగ్ అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా మైనింగ్ అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. 16 మందిపై బైండోవర్ కేసులు అనుమతులు లేకుండా ఆక్రమంగా ఇసుక పెరుగుతున్నారనే ఆరోపణలు ఉన్న నడిమికెల్ల గ్రామానికి చెందిన 16 మందిపై మంగళవారం సాయంత్రం తహసీల్దార్ రాజేశ్వరరావు సమక్షంలో బైండోవర్ కేసులు నమోదు చేసినట్టు ఎస్ఐ షణ్ముఖరావు తెలిపారు. -
ఇంజినీర్ల వినూత్న ఆలోచనతోనే దేశంలో మార్పు
● కలెక్టర్ ప్రభాకరరెడ్డి పార్వతీపురం: ఇంజినీర్ల వినూత్న ఆలోచనలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమన్వయంతోనే క్షేత్ర స్థాయిలో మార్పు సాధ్యమవుతుందని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న జలధార పనులను జూలై 10వ తేదీ లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. చెరువుల ఆక్రమణలకు గురికాకుండా సంరక్షించాల్సిన బాధ్యత ఇంజనీర్లేదేనన్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నందున రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి మండలంలో ప్రజల సమస్యలను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. రైతులను, సాగునీటి సంఘాలను భాగస్వామ్యం చేస్తూ ఖరీఫ్కు సాగునీటిని సక్రమంగా ఆయకట్టు శివారు వరకు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో జియో కోఆర్డినేటర్ల ఆధారంగా ఇరిగేషన్ స్టార్టింగ్ పాయింట్లను మ్యాప్ చేసుకోవచ్చునని, తద్వారా సమస్యలను ఒక క్లిక్తో విశ్లేషించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో ఇరిగేషన్ ఈఈ డిఎస్.ప్రదీప్తో పాటు వివిధ మండలాల డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాలను సాధించాలి
● దిశానిర్దేశం చేసిన డీఈవోపార్వతీపురం రూరల్: ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి, రెండు తరగతులు చదువుతున్న విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందిస్తూ ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాలను నూరుశాతం సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) పి.బ్రహ్మాజీరావు పేర్కొన్నారు. ఈ మేరకు పార్వతీపురంలోని డీవీఎం మున్సిపల్ హైస్కూల్లో ప్రాథమిక ఉపాధ్యాయులకు ఆరు రోజుల పాటు నిర్వహించిన ఎఫ్ఎల్ఎన్ శిక్షణ కార్యక్రమం మంగళవారం ముగిసింది. కోర్సు డైరెక్టర్, బలిజిపేట ఎంఇఓ–1 సామల సింహాచలం అధ్యక్షతన జరిగిన ముగింపు సభకు డీఈవో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నారుల్లో కనీస విద్యా ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. శిక్షణ విజయవంతానికి సహకరించిన ఉపాధ్యాయులు, సంఘం నాయకులకు కోర్సు డైరెక్టర్ సింహాచలం ధన్యవాదాలు తెలిపారు. అనంతరం శిక్షణకు కీ రిసోర్స్ పర్సనన్స్ (కేఆర్పీలు)గా వ్యవహరించిన వనజాక్షి, జి.రవికుమార్లతో పాటు డీఆర్పీలను ఉపాధ్యాయ సంఘాలు ఉమ్మడిగా శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో బి.రాజకుమార్, ఏఎంవో కోటేశ్వరరావు, ఎంఈఓలు వై.విమలకుమారి, సూరిదేముడు, కర్రి ప్రసాదరావు, మువ్వల వెంకటరమణ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పువ్వుల ధనంజయరావు, గంట శశికుమార్, జగన్నాథం, కూర్మినాయుడు, రెడ్డి రమణ, ప్రసాదరావు, గోపాలకృష్ణ వివిధ మండలాల నుంచి వచ్చిన సుమారు 260 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పిడుగుపాటుతో పాడి గేదె మృతి, పశువుల శాల దగ్ధం
కొత్తవలస: మండలంలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. పెద్ద పెద్ద ఉరుములుతో కూడిన వర్షం కురవగా పిడుగుపడడంతో మండలంలోని చీపురువలస గ్రామానికి చెందిన ఉల్లి అక్కమ్మ పాడిగేదె మృతి చెందింది. గేదె సుమారు రూ 70వేలకు పైగా ఉంటుందని జీవనాధారమైన గేదె మృతి చెందడంతో అక్కమ్మ లబోదిబో మంటూ రోదించింది.అలాగే వర్షం మరికొద్ది సమయంలో కురుస్తుందన్నప్పుడు పడిన భారీ పిడుగుకు తుమ్మికాపల్లి పంచాయతీ సీతంపేట గ్రామం సమీపంలో పొలమరశెట్టి పద్మజ్యోతికి చెందిన పశువుల పాక దగ్ధమైంది. ఆ సమయంలో పాకలో ఎవరూ లేకపోవడంతో అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. -
సర్తో ఓటర్లకు శిరోభారమే..!
విజయనగరం అర్బన్: ప్రభుత్వాల మనుగడ, ప్రజల భవిష్యత్తును శాసించే ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ఇప్పుడు జిల్లాలో పెను సంచలనంగా మారింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ ప్రక్రియ పారదర్శకత పేరుతో సాగుతున్నప్పటికీ తెరవెనుక వేలాది మంది అర్హులైన ఓటర్ల హక్కుకు ముప్పు తెచ్చేలా ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఓటరుగా సజీవంగా ఉన్న సామాన్యుడికి ఈ ప్రక్రియ శాపంగా మారబోతోందా? అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఏజెంట్ల ఇష్టారాజ్యం–రాజకీయ పక్షపాతం? ఈ సర్వేలో బూత్ లెవెల్ ఏజెంట్లదే (బీఎస్ఏ) కీలక పాత్ర కానుంది. ఇంటింటి సర్వేలో వారి సమ్మతి ప్రకారమే మార్పులు జరుగుతాయి. అధి కార పార్టీతో పాటు ప్రతిపక్షాలు తమకు అనుకూలమైన ఓటర్లను ఉంచుకుని, ప్రత్యర్ధి పార్టీల సానుభూతిపరుల ఓట్లను టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఏజెంట్లు లేని ప్రాంతాల్లో ఓటర్ల జాబితా తారుమారయ్యే ప్రమాదం ఉంది. ఏజెంట్ల నియామకంలో ఫారం–2 పూరించడంతో జరుగుతున్న హడావుడి చూస్తుంటే అర్హులైన ఓటర్లు చేజారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. జిల్లాలో 1.5లక్షల మంది ఓట్లు గాల్లో కలిసే ప్రమాదం ఫారం–2 నింపడం సామాన్యుడికి తలనొప్పి ఏజెంట్ల ఇష్టారాజ్యంతో ఓట్ల తొలగింపు -
స్టీల్ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో గాదెలవలస ఉద్యోగి మృతి
సీతానగరం: విశాఖ స్టీల్ ప్లాంట్లో సోమవారం జరిగిన ప్రమాదంలో పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం, గాదెలవలస గ్రామానికి చెందిన గొట్టాపు త్రినాఽథ్ (50) మృతి చెందడంతో కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. మృతుడు త్రినాథ్కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. పెద్దకుమారుడు పవన్ విజయవాడలో బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నాడు. రెండవ కుమారుడు భరత్ చైన్నెలోని కాంగో కంపెనీలో సాఫ్టవేర్ ఉద్యోగం చేస్తున్నాడని కుటుంబసభ్యులు తెలియ జేశారు. సామాన్యరైతుకుటుంబానికి చెందిన త్రినాథ్ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం సంపాదించుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న సమయంలో ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబానికి పెద్ద దిక్కు పోయిందని బోరున విలపిస్తున్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి..పాలకొండ రూరల్: మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన అల్లు సీతారాం(46) శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. దీనిపై పోలీసులు అందించిన వివరాల మేరకు తీవ్ర ఆనారోగ్యం కారణంగా పది రోజుల క్రితం సీతారాం తన ఇంట్లో క్రిమిసంహారక మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అప్పట్లో ఆయనను కుటుంబసభ్యులు మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చగా వైద్య సేవలు పొందుతూ మరణించినట్లు ఎస్సై డోల వెంకన్న తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు. మృతుడికి భార్య భవాని, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో భార్యా పిల్లలు కన్నీటిపర్యంతమయ్యారు.విద్యుత్ షాక్తో ఆవు..తెర్లాం: మండలంలోని లింగాపురం గ్రామంలో మంగళవారం సాయంత్రం విద్యుత్ షాక్కు గురై పాడిఆవు మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు కునుకు వెంకటరావు మేత కోసం గ్రామానికి సమీపంలో ఉన్న ఖాళీ స్థలానికి ఆవును తోలుకుని వెళ్లాడు. అదే స్థలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వైర్లకు ఆవు తగలడంతో వెంటనే విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఎన్నోఏళ్లుగా కష్టపడి పెంచుకున్న ఆవు విద్యుత్ షాక్కు గురై మృతి చెందడంతో రైతు వెంకటరావు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ విషయంపై గ్రామ రెవెన్యూ అధికారి తహసీల్దార్కు సమాచారం ఇచ్చారు. మండల ట్రాన్స్కో ఏఈ తెంటు శ్రీనివాసరావు, మండల పశువైద్యాధికారి డాక్టర్ జె.నరేంద్రకుమార్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి మృతి చెందిన ఆవును పరిశీలించారు. ఏడుగురు గంజాయి నిందితుల అరెస్ట్విజయనగరం క్రైమ్: రెండున్నర కిలోల గంజాయితో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని విజయనగరం రూరల్ ఎస్సై అశోక్ మంగళవారం తెలిపారు. శ్రీకాకుళానికి చెందిన ఎల్.కల్యాణ్ అరకు నుంచి మూడు కిలోల గంజాయిని తెచ్చి నాగరాజు అనే వ్యక్తికి అమ్మినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ మేరకు ఇద్దరినీ పట్టుకుని పూర్తి స్థాయిలో విచారణ చేయగా ఎం,సతీష్ వర్మ(24), ఎం.సాయి వర్మ(22) వై. తిరుపతి దాలయ్య (33), కె.గణేష్ (23),పి.అశోక్ (22) పట్టుబడ్డారన్నారు. ఇందులో కల్యాణ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాడు కాగా విజయనగరంలోని అలకానంద కాలనీలో ఉంటూ స్నేహితులకు అరకు నుంచి తెచ్చిన గంజాయిని కొండకరకాం వద్ద అమ్ముతున్నాడన్న సమాచారంతో అదుపులో తీసుకుని అరెస్ట్ చేశామని ఎస్సై అశోక్ తెలిపారు. వారి దగ్గర నుంచి సుమారు రెండున్నర కేజీల గంజాయి, నాలుగు బైక్ లు, ఏడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై అశోక్ వివరించారు. -
రైతుబజార్లలో పైనాపిల్ విక్రయానికి చర్యలు
సీతంపేట: 82 రైతు బజార్లలో పైనాపిల్ విక్రయాలకు చర్యలు తీసుకుంటున్నట్టు పాలకొండ సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన రైతులు పండించిన నాణ్యమైన పైనాపిల్ పండ్లకు సరైన గిట్టుబాటు ధర లభించేలా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ పరిసరాల్లో రైతు బజార్లలో రైతులు విక్రయించుకోవడానికి అవకాశం లభించనున్నట్టు తెలిపారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాలు పాల్గొని అమ్మకాలు చేపట్టవచ్చన్నారు. ఈ మార్కెటింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి ఆసక్తి గల గిరిజన రైతులు, ఎఫ్పీవో, ఎస్హెచ్జీ సంఘాలు తమ వివరాలతో ఐటీడీఏ సీతంపేట కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 23 నుంచి పైడిమాంబ ఆలయ పునః ప్రతిష్ఠ మహోత్సవాలు విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు చదురుగుడి పునః ప్రతిష్ఠ మహోత్సవాలు ఈ నెల 23 నుంచి 25 వరకూ మూడు రోజుల పాటూ అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని దేవదాయ శాఖ సహాయ కమిషనర్, ఆలయ ఈఓ కె.శిరీషా తెలిపారు. స్థానిక చదురుగుడి ప్రాంగణంలో విజయనగరం ఎమ్మెల్యే అతిధి గజపతిరాజు ఆధ్వర్యంలో ఉత్సవాల కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతేడాది నవంబర్ 10వ తేదీన సోమవారం అమ్మవారి చదురుగుడి విస్తరణ పనుల్లో భాగంగా కళాప్రకర్షణ చేపట్టి, పక్కనే బాలాలయం నిర్మించామని, అప్పటి నుంచి నేటి వరకు బాలాలయంలోనే అమ్మవారి దర్శనం కల్పించామన్నారు. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే చదురుగుడి విస్తరణ పనులు శరవేగంగా చేపట్టగలిగామన్నారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ రూ.కోటీ 80లక్షల వ్యయంతో ఆలయ అభివృద్ధిపనులు ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకిచ్చిన హామీలు అమలు చేయాలి ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు విజయనగరం గంటస్తంభం: విద్యార్థులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల వలరాజు డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలో జూలై 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించనున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యాలయం అమర్ భవన్లో శిక్షణా తరగతుల కరపత్రాలను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీ విద్యార్థులకు ఇబ్బందిగా మారిన జీవో నెం.77ను రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటి మరమ్మతులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసి విద్యా దోపిడిని అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్.నాగభూషణం, ఉపాధ్యక్షుడు సుమన్, సహాయ కార్యదర్మి గౌరీశంకర్, పట్టణ నాయకులు చరణ్, గణేష్ పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి వినతి విజయనగరం క్రైమ్: అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి సాయిరాజేష్ను విజయనగరం ఉమ్మడి జిల్లా అగ్నిమాపక శాఖ ఉద్యోగుల సంఘం నేతలు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అంతకు ముందు విజయనగరం అగ్నిమాపక కేంద్రం ఆవరణలో జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఇటీవల జిల్లాలో పునః ప్రారంభించిన సిబ్బంది ముఖ హాజరు వల్ల తలెత్తే సమస్యలను డీఎఫ్ఓ దృష్టికి తీసుకువెళ్లినట్టు అగ్నిమాపక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అధికారి రమేష్ తెలిపారు. తమ శాఖలో సిబ్బంది కొరత వల్ల 24 గంటలూ విధుల్లో ఉంటున్నామని, అగ్ని ప్రమాదాలు రెస్క్యూ, అవుట్ డ్యూటీలు, బందోబస్తు, వీఐపీ కాన్వాయ్ ఇతర విధుల నిమిత్తం బయటకు వెళ్లే పరిస్థితుల్లో ఉన్నామన్నారు. -
● వాటాల్లో తేడాలా? పంపకాల్లో పేచీలా? ● వెనకుండి నడిపించిన ఎంపీపీ ● మన్యం జిల్లాలో వైరల్ అవుతున్న వీడియోలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రభుత్వ పాలనలో అధికారులు, ప్రజాప్రతినిధులు రెండు చక్రాల్లా? జోడెడ్ల మాదిరి సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రగతి రధాన్ని నడిపించాలి. కానీ మన్యం జిల్లాలోని ఓ మండలంలో మండల స్థాయిలోని ఓ అధికారికి, సదరు ప్రజాప్రతినిధికి ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు కానీ ఏకంగా మండల పరిషత్ కార్యాలయంలోనే రౌడీల మాదిరి బూతులు తిట్టుకుని చిల్లర మనుషుల మాదిరిగా కొట్టుకునే వరకు వచ్చింది పరిస్థితి. దీని వెనుక వాటాల పంపిణీలో తేడాలు వచ్చాయా? ఇద్దరి ఇగోలు గట్టిగా ఢీకొన్నాయా తెలియదు కానీ దరువులు మాత్రం పడ్డాయి. అక్కడే ఉన్న కొందరు ఔత్సాహికులు దీన్ని ఉత్సుకతతో చూడడమే కాకుండా వారి మధ్య సంవాదాన్ని వీడియోలు కూడా తీశారు. దీంతో అవి కాస్తా వీధికెక్కాయి. ● ఎంపీడీవో వస్తూనే నిధులపై కన్ను అల్లూరి సీతారామరాజు జిల్లాలో పని చేస్తూ సస్పెండ్ అయి చాన్నాళ్లుగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న శశిభూషణరావు మూడు నెలల క్రితం జియ్యమ్మవలస ఎంపీడీవోగా వచ్చారు. వస్తూనే ఎంపీడీవో ఖాతాలో ఎంత డబ్బు ఉంది.. దాని లెక్కలేమిటి ? తేల్చేయాలన్న ఆలోచనల్లో పడ్డారు. ఈ క్రమంలోనే వివిధ పథకాలు, పనులకు సంబంధించి తన ఖాతాలో ఉన్న ప్రభుత్వ నిధులు దాదాపు రూ.10 లక్షలను మే 5 నుంచి 21 తేదీ మధ్య డ్రా చేసి సొంతానికి వాడుకున్నారు. ఎందుకు నిధులు తీశారు.. దేనికి ఖర్చు చేశారన్న దానికి సంబంధించి ఆయన ఎవరికీ, కనీసం మండల పరిషత్కు కూడా సమాచారం ఇవ్వకుండా నేరుగా చెక్కులతో నిధులు వాడేశారు. ఈ అవినీతికి సూపరింటెండెంట్ కొండగొర్రె రామారావు, ఆఫీస్ సబార్డినేట్ చొక్కాపు శ్రీనివాసరావు సైతం సహకరించినట్లు తెలుస్తోంది. ఈ డబ్బు డ్రా చేసిన అంశం తనకు తెలియలేదన్న కోపమో, అందులో తనకు వాటా రాలేదన్న ఆగ్రహమో తెలియదు కానీ మండల పరిషత్ అధ్యక్షుడు బొంగు సురేష్ ఈ అంశం మీద ఎంపీడీవోను ప్రశ్నించారు. దీనికి ఆయన సరైన సమాధానం ఇవ్వకపోవడమే కాకుండా నీకెందుకు చెప్పాలి.. ఇదంతా నా ఇష్టం అన్నట్లుగా మాట్లాడినట్లు తెలిసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో ఆఫీస్ సబార్డినేట్ శ్రీనివాస్ కూడా ఇరుక్కోవడంతో ఆయన్ను రెచ్చగొట్టి ఆయనతో ఎంపీడీవోను ఏకంగా ఆఫీసులో కొట్టించినట్లు తెలిసింది. అందులో తనకు వాటా రాకపోగా అవినీతిలో మాత్రమే తనకు భాగం దక్కడాన్ని సహించలేకపోయిన శ్రీనివాస్ ఏకంగా ఎంపీడీవోపై దాడి చేసారని తెలుస్తోంది. అయితే ఈయన వెనుక ఎంపీపీ సురేష్ ఉన్నారని, ఆయన ప్రోద్బలంతోనే శ్రీనివాస్ ఇలా దాడి చేశారని అంటున్నారు. ఈ సందర్భంగా కార్యాలయం మొత్తం గలాటా నెలకొనగా ఈ తంతు చూస్తున్న వాళ్లు వాటికి సంబంధించిన వీడియోలు సైతం రికార్డ్ చేయడంతో ఈ వ్యవహారం కాస్త రచ్చకెక్కింది. సురేష్ అక్కడితో ఆగకుండా నిధుల దుర్వినియోగం మీద ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ టివి.తిరుపతిరావు కేసు నమోదు చేశారు. మరోవైపు నిధులు డ్రా చేసిన ఎంపీడీవో రెండ్రోజులుగా పరారీలో ఉన్నారు. ఫోన్ సైతం స్విచ్ఛాఫ్ వస్తోందని తెలుస్తోంది. ఈ అంశం ఉమ్మడి విజయనగరం జెడ్పీ సీఈవో వరకు చేరడంతో శాఖాపరమైన విచారణ చేపట్టారు. ఎంపీడీవో, ఎంపీపీల మధ్య రగడ ఏమిటి? కొట్లాట ఎందుకు.. డబ్బుల పంపిణీల తేడాలొచ్చి తన్నుకున్నారా? ఆ వ్యవహారం వెనుక ఏం జరిగిందన్న అంశాలను సీఈవో దర్యాప్తు చేసినట్లు తెలిసింది. వాటాల్లో తేడాలే తన్నులాటకు దారి తీసిందా? ఇదిలా ఉండగా ఎంపీపీ, ఎంపీడీవోల మధ్య డబ్బుల పంపకాల్లో వచ్చిన పొరపొచ్చాలు ఏకంగా కొట్లాటకు దారి తీసిందని స్థానికంగా విషయం తెలిసిన ఉద్యోగులు అంటున్నారు. మొత్తం పది లక్షలు ఎంపీడీవో ఒక్కరే మింగేయడంతో ఎంపీపీకి ఆగ్రహం వచ్చి అప్పటికే కేసులో ఇరుక్కున్న ఆఫీస్ సబార్డినేట్ శ్రీనివాస్ను రెచ్చగొట్టి ఎంపీడీవో మీద దాడికి పురిగొల్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి మన్యం ఎంపీడీవో ఆఫీసులో ‘పెది’్ద తరహా కుస్తీ సీన్లు జరుగుతున్నాయని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. -
మహిళా సాధికారత ఎక్కడ?
● ఎమ్మెల్సీ విక్రాంత్రాజాం: రాష్ట్రంలో మహిళా సాధికారత కనిపించడంలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ విమర్శించారు. ఈ మేరకు మంగళవారం రాజాంలో ఓపైవేట్ కార్యక్రమానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇటీవల నాలుగు పార్లమెంట్ స్థానాలు కూటమికి భర్తీచేసే అవకాశం వస్తే నాలుగింటిలో ఒక్కటి కూడా మహిళలకు కేటాయించలేదని ఆరోపించారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 50 శాతం దాటి మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు. గ్రామ వలంటీర్లలో 53 శాతం, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం, స్థానిక సంస్థల్లో 50 శాతం అమలుచేశారని గుర్తుచేశారు. అప్పట్లో మంత్రివర్గంలో ఐదుగురికి మించి మహిళలు మంత్రులుగా ఉన్నారన్నారు. ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేల్లో 14 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మహిళలు కాగా, 7 శాతంగా నమోదైందని వివరించారు. కూటమి క్యాబినెట్లో కేవలం ఇద్దరు మాత్రమే మంత్రులుగా ఉన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు రాజ్యసభ సీట్లలో ఒకటి నుంచి రెండు సీట్లు మహిళలకు ఇస్తే ఎంతో బాగుండేదని, మహిళల అభివృద్ధిని చంద్రబాబునాయుడు ఓర్వలేకనే సీట్లు కేటాయించలేదని ఆరోపించారు. ‘తోటపల్లి’ పునః ప్రారంభించక పోతే రైతులకు తీవ్రనష్టం వంగర: తోటపల్లి ఆధునికీకరణ పనులు పునః ప్రారంభించకపోతే ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతారని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. మంగళవారం మండల పరిధి మగ్గూరు గ్రామంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గడిచిన రెండేళ్లుగా తోటపల్లి ఆధునికీకరణ పనులు చేపట్టకపోవడంతో వంగర మండల రైతాంగం సాగునీటికి ఇబ్బందులు పడతున్నారన్నారు. కుడి ప్రధాన కాలువ ఎగువ భాగంలో కాలువ మరమ్మత్తులకు గురైందని, గడిచిన రెండేళ్లుగా సకాలంలో మరమ్మతులు చేపట్టకపోవడంతో అన్నదాతలు సాగునీటికి అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. రైతు సేవా కేంద్రాల ద్వారా సకాలంలో రైతులకు ఎరువులు విత్తనాలు అందడంలేదని, రైతుల పట్ల ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని హితవు పలికారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు పుష్కలంగా అందించారని గుర్తు చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, షూస్ పాఠశాలలు తెరిచే నాటికి అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్ ముఖర్జీ, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కరణం సుదర్శనరావు, మండల పార్టీ యూత్ అధ్యక్షుడు బొక్కేల వెంకటప్పలనాయుడు, పార్టి నాయకులు గేదెల రామకృష్ణ, పోలిరెడ్డి రమేష్, ఏగిరి ముత్యాలరావు పాల్గొన్నారు. -
నెత్తుటి మడుగులో ఆవు.. తల్లడిల్లిన లేగదూడ
పార్వతీపురం రూరల్: తల్లికి ఏమైందో ఆ లేగ దూడకు తెలియదు.. రక్తపు మడుగులో చలనం లేకుండా పడి ఉన్న తల్లిని చూసి లేగదూడ తల్ల డిల్లిపోయింది. ఎవరైనా వచ్చి తన తల్లికి ప్రాణం పోస్తారేమోనని రోడ్డు వైపు దీనంగా చూసిన ఆ మూగజీవి ఆవేదన పాదచారులను సైతం కంటతడి పెట్టించింది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం పరిధిలోని రాయగడ రహదారిపై ఈ హృదయ విదారక ఘటన మంగళవారం జరిగింది. మితిమీరిన వేగంతో వచ్చిన ఓ గుర్తుతెలియని వాహనం రోడ్డుపై ఉన్న ఆవును బలంగా ఢీకొట్టి, కనీసం ఆపకుండా అక్కడి నుంచి పరారైంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ గోమాత సుమారు మూడు గంటల పాటు ప్రాణాపాయ స్థితిలో రోడ్డుపైనే నరకయాతన అనుభవించింది. తల్లి ఎంతకీ కదలకపోవడంతో ఆవేదనకు గురైన దూడ.. పక్కనే కాపలాగా ఉంటూ తన మూతితో పదేపదే తట్టి లేపేందుకు ప్రయత్నించింది. కళ్లలో నీళ్లు నింపుకుని సాయం కోసం అటుగా వెళ్లే వారి వైపు ఆశగా చూసింది. గుండె బరువెక్కే ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు, పాదచారులు తీవ్రంగా చలించిపోయారు. ప్రమాదానికి కారకుడైన వాహనదారు కర్కశత్వంపై మండిపడుతూనే.. లేగదూడ ఆవేదనను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. -
‘ప్రత్యేక’ విద్యార్థులకు సహాయక పరికరాల పంపిణీ
విజయనగరం అర్బన్: ప్రత్యేక అవసరాలు (దివ్యాంగులు)గల విద్యార్థులను అత్యంత శ్రద్ధతో చూసుకోవాల్సిన బాధ్యత సమాజం మొత్తానిదని కలెక్టర్ ఎం.రాంసుందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉచిత సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి, ఎమ్మెల్యే పి.అదితి గజపతిరాజు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల విద్యార్ధులకు అవసరమైన విద్య, వైద్య, పునరావాస సేవలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పనిచేసి వారి అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. శారీరక పరిమితులు ప్రతిభకు అడ్డంకి కాదని, ప్రతి చిన్నారి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. డీఈఓ, సమగ్ర శిక్ష ఏపీసీ యూ.మాణిక్యం నాయుడు మాట్లాడుతూ జిల్లాలోని 27 మండలాల్లో భవిత కేంద్రాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆర్పీడబ్ల్యూడీ చట్టం–2016 ప్రకారం 1 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల వివిధ రకాల వైకల్యాలున్న పిల్ల లకు ప్రత్యేక విద్య అందిస్తున్నట్లు చెప్పారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రవాణా భత్యం, సహాయక భత్యం, ఇంటి వద్ద విద్యాభత్యం, దివ్యాంగ బాలికల ఉపకార వేతనాలు డీబీటీ విధానంలో వేలాది మంది లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. 518 సహాయ పరికరాల పంపిణీ అనంతరం జిల్లాలోని 474 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు మొత్తం 518 సహాయక పరికరాలను పంపిణీ చేశారు. వాటిలో 56 డిజిటల్ హియరింగ్ ఎయిడ్లు, 41 కమోడ్ వీల్ చైర్లు, 53 వీల్ చైర్లు, 337 టీఎల్ఎం కిట్లు, 17 క్రచ్లు, 12 ట్రైసైకిళ్లు, ఒక స్క్రీన్ రీడర్ సదుపాయం కూడిన స్మార్ట్ఫోన్, ఒక బ్రెయిలీ కిట్ ఉన్నాయి. కార్యక్రమం అనంతరం కలెక్టర్ ప్రత్యేక అవసరాలు గల విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకురాలు జి.చంద్రిక, సమగ్ర శిక్ష అకౌంట్స్ అధికారి ఆర్ఏఎస్కుమార్, కో ఆర్డినేటర్లు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రత్యేక ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
ఎదిరిద్దాం..
● మోసం చేయడం చంద్రబాబు నైజం ● వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు ధ్వజం ● కూటమి పాలనలో జరిగిన అక్రమాలు, అవినీతిపై ఫొటో ఎగ్జిబిషన్ ● స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి ● ఉమ్మడి విజయనగరం జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, పరీక్షిత్రాజు సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు పార్వతీపురం: చంద్రబాబునాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన సాగిస్తూ, అక్రమ కేసులతో ప్రజల ను భయబ్రాంతులకు గురిచేస్తోందని విజయనగ రం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ధ్వజమెత్తా రు. పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత గడిచిన రెండేళ్లలో కూటమి ప్రభుత్వ పాలనలో జరిగిన అక్రమాలు, అవినీతి, కార్యకర్తలు, నాయకులపై జరిగి న దాడులపై నిర్వహించిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తలపై చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తున్నా వెరవకుండా, ప్రజల తరఫున పోరాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్తుండడం అభినందనీయమన్నారు. రానున్నది మన ప్రభుత్వమేనని, వైఎస్సార్సీపీ కార్యకర్తలకు 2.0లో తగిన గుర్తింపు, సముచిత స్థానం కల్పిస్తామని జగన్మోహన్ రెడ్డి స్పష్టంచేశారన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల లో చంద్రబాబు ప్రభుత్వం సుమారు రూ.4లక్షల కోట్లు అప్పుచేసి అనుయాయులకు దోచిపెడుతోందన్నారు. ఆ భారాన్ని ప్రజలపై మోపి మరింత ఆర్థిక సంక్షోభానికి గురిచేస్తోందని తెలిపారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు చెబుతున్నా సీఎం చంద్రబాబు స్పందించకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వ పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. సర్ కార్యక్రమంపై కార్యకర్తలు, నాయకులు, ప్రజ లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓట్ల చేర్పులు, తొలగింపులపై ఓ కన్నేసి ఉంచాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయదుందుబి మోగించేలా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్వతీపురం మండలం, మున్సిపాల్టీ, సీతానగరం, బలిజిపేట మండలాల నుంచి వందలాదిమంది కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మున్సిపల్ మాజీ వైస్చైర్మన్లు యిండుపూరు గున్నేశ్వరరావు, కొండపల్లి రుక్మిణి, ఎంపీపీ మజ్జి శోభారాణి, వైస్ ఎంపీపీలు సిద్దా జగన్నాథం, బి.రవికుమార్, బలిజిపేట, సీతానగరం జెడ్పీటీసీలు అలజంగి రవికుమార్, మామిడి బాబ్జి, పార్వతీపురం, బలిజిపేట మండలాల అధ్యక్షులు బొమ్మి రమేష్, పాలవలస మురళీకృష్ణ, అనుబంధ పార్టీ సభ్యులు పోల సత్యనారాయణ, కొండలల్లి బాలకృష్ణ, బలగ శ్రీరాములనాయుడు, నాగమణి పాల్గొన్నారు. గత రెండేళ్ల పాలనలో ప్రజలు అనేక కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రతీ ఇంటికి వెళ్లి వివరిద్దాం. రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయడం లేదు. మహిళలకు ఆడ బిడ్డ నిధి కింద నెలకు రూ.1500లు ఇస్తామని చెప్పి మోసం చేశారు. నిరుద్యోగులకు జాబ్క్యాలెండర్ లేదు. నిరుద్యోగ భృతి అందించడం లేదు. గ్రామాల్లో టీడీపీ నాయకులు దళారులుగా వ్యవహరిస్తున్నారు. ఉపాధిహామీ పథకం వేతనదారుల నుంచి వారానికి రూ.230 చొప్పున వసూలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు అన్నివర్గాల ప్రజలు సిద్ధమవుతున్నారు. – అలజంగి జోగారావు, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే నమ్మించడం, ఓట్లు దండుకోవడం, మోసం చేయడం చంద్రబాబుకు అలవాటైన విద్య. మాజీ సీఎం వైఎస్ జగన్మో హన్రెడ్డి కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలను ఆపకుండా అమలు చేసి ప్రజలకు అండగా నిలిచారు. పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేశారు. – బోను గౌరీశ్వరి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చి న హామీలు అమలు చేయ కుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. అన్నివర్గాల వారిని మోసంచేశారు. సమస్యలు పరిష్కరించకుండా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. అరాచక పాలనకు వ్యతిరేకంగా జనంతో కలిసి పోరాడదాం. ప్రజలకు అండగా నిలబడదాం. – బలగ రేవతమ్మ, జెడ్పీటీసీ, పార్వతీపురం -
ఇసుక నాటకంలో అడ్డంగా దొరికారు..
సాక్షి, పార్వతీపురం మన్యం: కొమరాడ మండలం కోరిశీల గ్రామం సర్వే నంబర్ 54–2ఏ పరిధిలోని నాగావళి నదీ తీరం నుంచి ఇసుక తవ్వుకోవడానికి గత నెల 20న నిబంధనల ప్రకారం మైనింగ్ కంపెనీకి అనుమతులు ఇచ్చారు. గత నెల 21న కలెక్టరేట్ వద్ద కొంతమంది టీడీపీ వారు.. గిరిజనులను తీసుకొచ్చి నిరసన చేయించారు. ఆ భూమిపై ఏళ్ల నాటి నుంచి ఉన్నామని.. అధికారులు కుమ్మకై ్క ఇసుక రీచ్కు అనుమతులు ఇచ్చారని వారి ఆరోపణ. ఇది వరకే కలెక్టర్కు, జేసీకి, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. దీనిపై ఒక్క రోజులోనే కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నారు. అంతా ఆగమేఘాల మీద జరిగిపోయింది. కోర్టు జోక్యంతో అక్కడ రీచ్కు బ్రేక్ పడింది. ఇదే మండలం కూనేరు–రామభద్రపురం వద్ద మరో రీచ్కు అధికారిక అనుమతి ఇచ్చారు. సీన్ కట్ చేస్తే.. అప్పట్లో నిరసనను ముందుండి నడిపించిన కొంతమంది సోమవారం రాష్ట్ర మంత్రి సంధ్యారాణి హాజరైన కలెక్టర్ కార్యాలయ పీజీఆర్ఎస్కు వచ్చి మరోసారి వినతి పత్రం అందజేశారు. అవే ఆరోపణలు మళ్లీ చేశారు. తహసీల్దార్, మైనింగ్ అధికారులు, కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, న్యాయం జరగడం లేదని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారా? అని మంత్రి అడిగితే.. అవునని వారు బదులిచ్చారు. వెంటనే మంత్రి వారందరినీ పిలిపించారు. కురుపాం ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడారు. ఎవరికీ ఫిర్యాదు అందలేదని అటు నుంచి సమాధానం. వెంటనే సదరు వ్యక్తులు సర్దుకుని.. తాము నేరుగా ఎవరినీ కలవలేదని చెప్పుకొచ్చారు. స్పీడ్ పోస్టులో పంపించామని చెప్పారు. దీంతో మంత్రి, కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ స్థానానికి వెళ్లి చెప్పుకున్నారు గానీ, జిల్లా అధికారుల వద్దకు వచ్చి అభ్యంతరం చెప్పలేకపోయారా? అని ప్రశ్నించారు. వారు ఫిర్యాదు చేసిన వీడియోలు, ఫొటోలు కూడా ఇక్కడివి కావని.. ఎవరో తప్పుడు ఆరోపణలతో వెంట నడిపిస్తున్నారని కలెక్టర్ స్పష్టం చేశారు. ‘మీ వెనుక వైసీపీ వారు ఉన్నారా? ఎందుకు ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు’ అని మంత్రి ప్రశ్నిస్తే.. తాము ఆది నుంచి టీడీపీ వారమని ఓ వ్యక్తి బదులిచ్చాడు. ఆ వ్యక్తి ఫోన్ వెనుక భాగాన ముఖ్యమంత్రి చంద్రబాబు స్టిక్కర్ కూడా అతికించుకోవడం గమనార్హం. ఇసుక వివాదం డ్రామాలో కలెక్టర్ ప్రభాకరరెడ్డిని ఇరికిద్దామని మాఫియా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. జిల్లాలో చాలా వరకు ఇసుక తరలింపు వెనుక అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తల పాత్ర ఉందన్నది తెలిసిందే. కొద్ది రోజు లుగా ఇసుక అక్రమ రవాణాపై అధికారులు దాడి చేయడం.. పెద్దఎత్తున జరిమానాలు విధించడంతో వారంతా గుర్రు మీద ఉన్నారు. దాడుల వెనుక కలెక్టర్ పాత్ర ఉందన్న అనుమానంతో తప్పుడు ప్రచారం, ఫిర్యాదులకు తెగించారు. సోమవారం పీజీఆర్ఎస్కు వచ్చి ఇసుక విషయంలో గగ్గోలు పెట్టిన వారంతా టీడీపీ వారే కావడం గమనార్హం. సమస్య లకు వారే కారణం అవుతూ.. తిరిగి వారే ఫిర్యాదు లు ఇవ్వడం విశేషం. తాము ఇసుక వ్యాపారాన్ని నమ్ముకుని ట్రాక్టర్లు కొనుక్కున్న నిరుపేదలమని.. ఇలా దాడులు చేసి వాహనాలు తీసుకుపోతే ఎలా అని సీతానగరానికి చెందిన ఓ వ్యక్తి ప్రశ్నించాడు. ఆయన వద్ద 20 వరకూ ట్రాక్టర్లు ఇసుక వ్యాపారం మీద ఆధారపడి నడుస్తున్నాయని సమాచారం. ఇలా తరలిస్తున్న బళ్లలో ట్రాక్టరుకు రూ.350 చొప్పు న ఓ ఎమ్మెల్యేకు ముడుపులు ఇస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఒకటవ శ్రేణి నుంచి మూడవ శ్రేణి నదులలో పరిసర ప్రాంత అవసరాలకు ఇసుకను ట్రాక్ట ర్లు లేదా ఎడ్లబండ్ల ద్వారా తీసుకువచ్చన్న నిబంధనలు ఉన్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. దొరికినంత తవ్వేసి, దండిగా వ్యాపారం చేసుకుంటున్నారు. సీతానగరం మండలం లక్ష్మీపురం, బూర్జ, బలిజిపేట మండలంలోని వంతరాం, నారాయణపురం నదీ ప్రవాహ ప్రాంతాలు తవ్వకాలకు ఆమోదయోగ్యంగా లేవు. ప్రమాదకర స్థితిలో ఉన్నా.. ఇసుక అక్రమార్కులు వదలడం లేదు. ఈ క్రమంలోనే కొన్ని ట్రాక్టర్లను పట్టుకుని జరిమానా విధించారు. అవి టీడీపీకి చెందినవి కావడంతో వివాదం రేగింది. మా వాటా ఇస్తేనే రీచ్లు... కొమరాడ మండలంలో ఇసుక రీచ్లపై పెద్ద దుమారమే రేగుతోంది. వాస్తవానికి ఇక్కడ రీచ్ కోసం ఒక మంత్రి ఆశీస్సులున్న ఓ ఏజెన్సీ రూ.40 లక్షల వరకూ ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఇందుకోసం ఎవరి స్థాయిలో వారికి ముడుపులు కూడా అందించినట్లు తెలిసింది. తొలుత ముడుపులకు అంగీకరించిన ఇద్దరు ప్రజా ప్రతినిధులు.. తర్వాత అమ్మకాల్లో వాటాలు డిమాండ్ చేసినట్లు భోగట్టా. అందుకు సదరు ఏజెన్సీ చేతులెత్తేయడంతో తమ భూములు ఉన్నాయని ఓ వర్గాన్ని రెచ్చగొట్టినట్లు తెలుస్తోంది. పదేళ్లుగా ఆ భూమి వైపు వెళ్లలేదని సదరు వ్యక్తులు స్వయంగా కలెక్టర్, మంత్రి ఎదుటే అంగీకరించారు. వీరి మీద విచారణ చేయాలని మంత్రి సూచించారు. ●ఇటీవల కాలంలో కురుపాం, పార్వతీపురం నియోజక వర్గాల్లో భారీగా ఇసుకను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కురుపాంలోని ఓ పాఠశాల ఆవరణలో పెద్ద ఎత్తున అనధికారికంగా పోగు చేసిన ఇసుక నిల్వలను రెండు రోజుల కిందట గుర్తించారు. ఇవన్నీ టీడీపీ వారి కనుసన్నల్లో తరలిస్తున్నవే. నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక మేట వేసిన చోటే, తవ్వుకోవడానికి అనుమతి ఉంటుంది. ఇక్కడ మాత్రం నిబంధనలను కాలారసి, తవ్వేస్తున్నారు. సొంత అవసరాలకు అని అధికారులను ఏమార్చి పెద్ద ఎత్తున వ్యాపారం చేసుకుంటున్నారు. అడ్డు వచ్చిన అధికారుల మీద తప్పుడు ఫిర్యాదులతో దాడి చేయిస్తున్నారు. రెండు రోజుల్లో కలెక్టర్ వెళ్లిపోరా! ‘కలెక్టర్ ఎన్ని రోజులుంటారు.. ఓ రెండు రోజులు. వెళ్లిపోవడం పక్కా. లేదంటే నెల, పోనీ, ఆరు నెలలో, ఏడాదో! అంతకుమించి ఉండరు. ఇసుకను తరలిస్తే, అడ్డుకునేదానికి ఆయనెవరు? ట్రాక్టర్లు కొనుక్కొని మూలన దాచుకుంటామా? ఇసుక ఉచితమే కదా! నా మీద ఆయన సీరియస్ అవ్వాల్సిన అవసరం ఏమిటి? నేను ఎమ్మెల్యే మనిషినే. అయితే.. ఏంటంట?.. ఆయన ఏదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నట్లు ఉంది!’ ●‘ఇసుక తరలిస్తున్నామని ప్రతిసారీ అధికారులు పట్టుకుంటామంటే ఎలా కుదురుతాది? ఎవరితో ఫోన్ చేయించాలి? చంద్రబాబుతో ఫోన్ చేయించాలా.. చెప్పండి!’ ●తమ ట్రాక్టర్లు పట్టుకున్నారని సీతానగరానికి చెందిన ఓ ఇసుక మాఫియా బహిరంగంగానే విసరుతున్న సవాళ్లు ఇవీ.. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు వచ్చి మంత్రి సంధ్యారాణికి వినతిపత్రం అందించారు. అక్కడ అనుమతులు లేనివి అక్రమంగా ఎలా తరలిస్తారు.. మీకు ఎవరైనా తవ్వుకోమని చెప్పారా?’ అని కలెక్టర్ ప్రభాకరరెడ్డి ప్రశ్నించడంతో.. అనంతరం బయటకు వచ్చిన ఇసుక మాఫియా మైనింగ్ అధికారుల వద్దే బెదిరింపులకు దిగారు. ఈ నెల పదో తేదీలోగా కలెక్టర్ను బదిలీ చేయిస్తానని ఓ ప్రజా ప్రతినిధి భరోసా ఇవ్వడంతోనే వారు ఈ విధంగా రెచ్చిపోతున్నారని వినిపిస్తోంది. -
అర్జీదారులకు రాతపూర్వక సమాధానం తప్పనిసరి
● అధికారులకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదేశంపార్వతీపురం రూరల్: జిల్లా ప్రజల నుంచి వచ్చే సమస్యలకు ఇక్కడే పరిష్కారం చూపాలని, ఆయా దరఖాస్తులు ముఖ్యమంత్రి వరకు వెళ్లే పరిస్థితి తీసుకురాకూడదని రాష్ట్ర మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురంలోని కలెక్టరేట్లో సమావేశ మందిరంలో కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆమె ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇకపై ప్రతి సోమవారం జిల్లా కేంద్రాల్లో, ప్రతి శుక్రవారం నియోజకవర్గాల పరిధిలో గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఒకే నియోజకవర్గ కేంద్రంలో నెలలో నాలుగుసార్లు గ్రీవెనన్స్ సెల్ నిర్వహించడం ద్వారా రెవెన్యూ తదితర సమస్యల కోసం బాధితులు పదేపదే తిరిగే అవసరం లేకుండా అక్కడికక్కడే పరిష్కారమవుతాయన్నారు. గ్రీవెన్స్ సెల్కు వచ్చే ప్రజల పట్ల అధికారులు ఓపికగా వ్యవహరించాలని, ఏదైనా సమస్య పరిష్కారం సాధ్యపడకపోతే అందుకు గల కారణాలను వివరిస్తూ అర్జీదారునికి సంబంధిత మండల కార్యాలయం నుంచి రాతపూర్వకంగా లేఖ పంపాలని ఆమె స్పష్టం చేశారు. వెల్లువెత్తిన దరఖాస్తులు ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి మొత్తం 75 అర్జీలు రాగా, వాటిలో 45 సాధారణ, 30 రెవెన్యూ వినతులు ఉన్నాయి. కార్యక్రమంలో పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఉప కలెక్టర్ ధర్మరాజు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ పార్వతీపురం రూరల్: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగుల వద్దకు ఎస్పీ స్వయంగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లా డి, నిర్దేశిత గడువులోగా సమస్యలను పరిష్కరించి కార్యాలయానికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, ఆస్తి వివాదాలు, వేధింపులు, ఆన్న్లైన్ వంచన తదితర అంశాలపై మొత్తం 12 ఫిర్యాదులు అందాయి. ప్రజలు ఎటువంటి భయం లేకుండా తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావచ్చని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ బి.రమణమూర్తి, డీసీఆర్బీ ఎస్సై అశోక్ చక్రవర్తి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్లో 21 వినతుల స్వీకరణ సీతంపేట: ఐటీడీఏలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఐటీడీఏ పరిపాలనాధికారి వి.సునీల్ నిర్వహించి గిరిజన ప్రజల నుంచి 21 వినతులు స్వీకరించారు. మల్లమ్మకొండ గ్రామానికి చెందిన సవర బంబడు తమ గ్రామానికి కరెంటు స్తంభాలు మంజూరు చేయాలని ప్రతిపత్రం సమర్పించాడు. టెక్కలి మండలం కోదండపురం గ్రామానికి చెందిన మల్లేశ్వరరావు గ్రామానికి రోడ్డు, బ్రిడ్జి సదుపాయం కల్పించాలని అర్జీ అందజేశాడు. సారవకోట మండలం సవర శివరాంపురం గ్రామానికి చెందిన అప్పారావు ఆయిల్ ఇంజిన్ మంజూరు చేయాలని, సవరబంగి గూడ గ్రామానికి చెందిన సవర మంగులు టీవీఎస్ బైక్ ఇప్పించాలని కోరారు. సిరికొండ గ్రామానికి చెందిన కొండగొర్రె సోమయ్య మినీ ట్రాక్టర్ మంజూరు చేయాలని, గదబవలస గ్రామానికి చెందిన బాలరాజు తన సస్పెన్షన్ను రద్దు చేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విన్నవించారు. అక్కన్నగూడ గ్రామానికి చెందిన సవర బంబడమ్మ సీసీ రోడ్డు మంజూరు చేయాలని, అంబలగండి గ్రామానికి చెందిన కుష్టయ్య కమ్యూనిటీ హాల్ నిర్మించాలని వినతిపత్రాలు అందజేశారు. గుజ్జి గ్రామానికి చెందిన భాస్కరరావు పవర టిల్లర్ మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించాడు. కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ ఎ.డి శ్రీనివాసరావు, డీడీ సెక్షన్ సూపరింటెండెంట్ అప్పారావు, వెలుగు డీపీఎం రమణ, డిప్యూటీ డీఈఓ నారాయుడు,స్పోర్ట్స్ ఇన్చార్జ్ జాకాబ్ దయానందం, జీసీడీఓ రాములమ్మ, ఏవో వాహిని ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
● హాజరైన హోం మంత్రి వంగల పూడి అనితవేపాడ: భూములపై శాశ్వతమైన హక్కులు ప్రజలకు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర హోంశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ మేరకు సోమవారం వేపాడ మండలంలోని బల్లంకి గ్రామంలో తహసీల్దార్ జె.రాములమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఆర్డీఓ సుధాసాగర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న హోంమంత్రి అనిత మాట్లాడుతూ రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఎటువంటి తప్పులు లేకుండా పారదర్శకంగా పట్టాదారు పాస్పుస్తకాలు అందించేందుకు రీసర్వే నిర్వహించి రాజముద్ర తో పూర్తివివరాలతో చట్టబద్ధమైన భరోసా కల్పించేలా పట్టాదారు పాస్పుస్తకాలు అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 983 గ్రామాలకు గాను 519 గ్రామాల్లో రీ సర్వే పూర్తి అయ్యిందని మరో 464 గ్రామాల్లో చేయాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీసీసీబీ చైర్మన్ గొంప కృష్ణ, తహసీల్దార్ రాములమ్మ, ఎంపీడీఓ సూర్యనారాయణ మండల ప్రత్యేకాధికారి లక్ష్మీనారాయణ, ఎస్కోట రూరల్ సీఐ అప్పలనాయుడు, ఎస్సై సుదర్శన్, ఎంపీటీసీ గొంప తులసి, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. బీజేపీ నాయకుడి మనస్తాపం బల్లంకిలో నిర్వహించిన పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వంలో భాగమైన బీజేపీ వేపాడ మండల అధ్యక్షుడు లట్టాల పవన్ కుమార్ను స్టేజిపైకి ఆహ్వానించకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర మండలాల నుంచి వచ్చిన టీడీపీ మండల అద్యక్షులు, జనసేన నాయకులను ఆహ్వానించి అధికారులు బీజేపీని విస్మరించడం బాధాకరమని పవన్ అన్నారు. ఈ విషయాన్ని జిల్లా, నియోజకవర్గ బీజేపీ నాయకుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు పవన్ తెలిపారు. -
విశాఖ స్టీల్ప్లాంట్ దుర్ఘటనపై చిన్నశ్రీను దిగ్భ్రాంతి
● మృతుల కుటుంబాలకు సంతాపం చీపురుపల్లి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద దుర్ఘటనపై జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ ఇన్చార్జి మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. సోమవారం సాయంత్రం స్టీల్ ప్లాంట్లో స్టీల్ లిక్విడ్ పడి తొమ్మిది మంది కార్మికులు మృతి చెందడం, మరికొంత మంది గాయాల భారిన పడడం విషాదకరమన్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసి క్షతగ్రాతులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, మృతుల కుటుంబాలను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కోరారు. -
కట్టెల పొయ్యే గతి..!
వ్యాధులబారిన నిర్వాహకులు బయట పనులు లేక, ఉపాధి పనులు ఏడాది పొడవునా ఉండకపోవడంతో చాలా మంది మహిళలు వంట నిర్వాహకులుగా ఉండిపోతున్నారు. ఒక్కో నిర్వాహకురాలికి ఇచ్చే జీతాన్ని ఇద్దరు నుంచి ముగ్గురు పంచుకుంటున్నారు. కట్టెల పొయ్యిలతో వంటలు చేయడం కారణంగా చాలా మంది వంటనిర్వాహకులు కళ్ల సమస్య ఎదుర్కొంటున్నారు. వాటితో పాటు ఇప్పుడు కొత్తగా శ్వాసకోస సంబంధిత వ్యాధులు వస్తున్నాయని వాపోతున్నారు. చాలా పాఠశాలల్లో వంట షెడ్డులు ఇరుగ్గా ఉండడంతో ఆయా షెడ్డుల్లో ఈ పొగలోనే మగ్గిపోతున్నారు. కూటమివచ్చి రెండేళ్లు కావస్తున్నా మధ్యాహ్నభోజన పథకానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి ప్రణాళికలు లేవు. శ్రమదోపిడీ కనిపిస్తోంది. – కె.సురేష్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఈ ఏడాది చర్యలు తీసుకుంటాం అన్ని పాఠశాలల్లో గా్యాస్ పొయ్యిలమీదనే వంటలు వండాల్సిఉంది. గతేడాది నిధుల లేమి కారణంగా పెద్దపెద్ద పాఠశాలల్లో ఇబ్బందులు వచ్చాయి. ఈ ఏడాది ఆ కష్టాలకుచెక్ పెట్టే ఆలోచనలో ఉన్నాం. విద్యార్థులు అందరికీ సరిపడేలా వంటలు వండేందుకు గ్యాస్ పొయ్యిల వినియోగంపై ఉన్నతాధికారులతో మాట్లాడాం. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల వరకూ ఎటువంటి ఇబ్బందులులేవు. ఉన్నత పాఠశాలల్లో ఇబ్బందులు ఉన్నాయి. వాటిని అధిగమిస్తాం. – యాగాటి దుర్గారావు, ఎంఈఓ, రాజాంరాజాం: గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రస్తుతం నీరుగారే పరిస్థితి కనిపిస్తోంది. గత ప్రభుత్వం శుచి, రుచికి ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా వంట నిర్వాహకుల కష్టాలకు చెక్పెట్టే దిశగా పలుచర్యలు తీసుకుంది. వంట వండేవారికి నెలకు రూ.3 వేల వేతనంతో పాటు కట్టె పొయ్యిల సమస్యలకు చెక్పెట్టి, గ్యాస్ బండల వినియోగాన్ని తెరమీదికి తీసుకొచ్చింది. ఈ మేరకు పలు పాఠశాలల అభివృద్ధి నిధులతో గ్యాస్ పొయ్యిలు కొనుగోలు చేసి అప్పగించింది. కొన్నిచోట్ల దాతలు, మరికొన్నిచోట్ల కమిటీలు వాటిని కొనుగోలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గ్యాస్ సిలిండర్లకు నిధులు విడుదల తగ్గిస్తూ వచ్చింది. చివరకు చాలీచాలనీ ఆ డబ్బులతో గ్యాస్ సిలిండర్లు విడిపించలేక కట్టెలపొయ్యిలమీదే నిర్వాహకులు వంటలు వండేవారు. ఈ ఏడాది అదే పరిస్థితి కనిపిస్తోంది. నిర్వాహకులను ఆదుకున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం నియోజకవర్గంలో వంట నిర్వాహకులు వివరాలు మండలం – వంట నిర్వాహకులు రాజాం – 145రేగిడి – 178సంతకవిటి – 162వంగర – 142 చాలీచాలని డబ్బులు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో వంట నిర్వాహకులకు చాలీచాలని డబ్బులు అందుతున్నాయి. ప్రాథమిక పాఠశాలకు ఒకరు, ప్రాథమికోన్నత పాఠశాలకు ఇద్దరు, ఉన్నత పాఠశాలలో ముగ్గురు నుంచి నలుగురు వంట నిర్వాహకులు మాత్రమే ఉండాలి.ఉన్నత పాఠశాలల్లో వంటలు వండాలంటే 200 మంది విద్యార్థులు దాటితే కనీసం ఆరుగురు సిబ్బంది ఉండాలి. చాలా పాఠశాలల్లో 500 మంది విద్యార్థులు దాటి ఉన్నారు. ఆయా పాఠశాలల్లో ఎనిమిది మంది నుంచి పదిమంది నిర్వాహకులు ఉంటేగానీ వంటలు జరుగడంలేదు. ఈ ప్రభుత్వం ఇస్తున్న అరాకొర డబ్బులను ఆ పదిమంది సర్దుబాటుచేసుకుని వంటలు వండుతున్నారు. వాటికి తోడు 10 సంవత్సరాల్లోపు విద్యార్థికి రూ.5.88, 10 నుంచి 15 సంవత్సరాల మద్య విద్యార్థులకు రూ. 8.57 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుండడంతో ఈ డబ్బులు ఆయా పాఠశాలల్లో కట్టెలు, ఇతర వంట సామగ్రి కొనుగోలు చేసుకునేందుకు కూడా చాలని పరిస్థితి ఉందని వంట నిర్వాహకులు వాపోతున్నారు. ప్రస్తుతం వంటసామగ్రి ధరలు పెరిగాయని, పప్పుతో పాటు ఉల్లి, అల్లం, వెల్లుల్లి ధరలు అధికంగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నట్లు వంటనిర్వాహకులు వాపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు అందని గ్యాస్ సిలిండర్లు కట్టెల పొయ్యిలమీదే గతేడాది ఎండీఎం వంటలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులబారిన నిర్వాహకులు ఈ ఏడాది అదే పరిస్థితి -
అర్జీల పరిష్కారంలో మతలబు?
విజయనగరం అర్బన్: జిల్లా నలుమూలల నుంచి ఆశతో తరలివచ్చే పేద ప్రజల సమస్యలు తీర్చే ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ’రెవెన్యూ క్లినిక్’లో అర్జీలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సోమవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జనం పోటెత్తారు. ఎండను సైతం లెక్కచేయకుండా, వందల రూపాయలు ఆటో చార్జీలు భరించి, చేతిలో అర్జీలతో క్యూలో నిలబడ్డ బాధితుల ఆవేదన చూస్తే.. క్షేత్రస్థాయిలో పాలన ఎంతగా ’స్తంభించిందో’ అర్థమవుతోంది. తాజా వినతుల వెల్లువను పరిశీలిస్తే ప్రభుత్వ శాఖల పనితీరు, ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థ ఎంతగా నిర్వీర్యమైందో స్పష్టంగా తెలుస్తోంది. శాఖల వారీగా ’సమస్యల’ కుప్ప ఇదే! సోమవారం ఒక్కరోజే పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లలో కలిపి మొత్తం 229 వినతులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా 110 వినతులు కేవలం రెవెన్యూ శాఖకు సంబంధించినవే కావడం గమనార్హం. భూ సమస్యలు, సర్వే వివాదాల చుట్టూ పేదలు ఏళ్ల తరబడి తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. వివిధ శాఖల్లో వచ్చిన వినతుల వివరాలు ఇలా ఉన్నాయి: రెవెన్యూశాఖకు 110, డీఆర్డీఏ 31, పంచాయతీ రాజ్ 16, విద్యాశాఖ 13, మున్సిపల్ శాఖ 11, విద్యుత్ శాఖ 10, గ్రామ సచివాలయ శాఖ 10, జిల్లా వైద్యారోగ్య శాఖ 6, గృహ నిర్మాణ శాఖ 3, డీసీహెచ్ఎస్ 2, ఇతర శాఖలకు 17 వచ్చాయి. ఆన్లైన్లో ’డిస్పోజ్’.. క్షేత్రస్థాయిలో సున్నా.. పెండింగ్ వినతులను పరిష్కరించిన వెంటనే ఆన్న్లైన్లో ’డిస్పోజ్’ చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) సీహెచ్. సత్తిబాబు అధికారులను ఆదేశించాల్సి రావడం చూస్తే.. వెబ్సైట్లలో గణాంకాలను చూపించడానికి అధికారులు ఎంత తహతహలాడుతున్నారో అర్థమవుతోంది. క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారం కాకపోయినా, కేవలం ఆన్లైన్లో ’క్లోజ్’ చేస్తున్నారనే విమర్శలు అర్జీదా రుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఎప్పటికప్పుడు వెబ్సైట్ చూసుకోవడమే తప్ప, బాధితుడి ఇంటికెళ్లి సమస్యను రూపుమాపే నాథుడే కరువయ్యాడు. అర్జీదారును కలవకుండానే ఎండార్స్మెంట్లు ‘ఆర్జీదారులను ప్రత్యక్షంగా కలిసి మాట్లాడిన తర్వాతే ఎండార్స్మెంట్ (ముగింపు నివేదిక) ఇవ్వాలి. మాట్లాడిన తేదీ, సమయాన్ని రిపోర్టులో రాయాలి‘ అంటూ డీఆర్వో ఆదేశాలు జారీ చేయడం ద్వారా, ఇప్పటివరకు అధికారులు అర్జీదారులను కలవకుండానే, ఆఫీసుల్లో కూర్చుని తప్పుడు నివేదికలతో ఫైళ్లను మూసేస్తున్నారనే చేదు నిజం బట్టబయలైంది. 1100 టోల్ ఫ్రీ.. ఒరిగింది శూన్యం! ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ’1100 టోల్ ఫ్రీ’ నంబర్ ద్వారా అందిన కాల్స్ పట్ల అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో డీఆర్వో క్లాస్ పీకిన తీరే చెబుతోంది. టోల్ ఫ్రీ నంబర్ పై ప్రజల్లో అవగాహన లేకపోగా, వచ్చిన కాల్స్కు కూడా అధికారులు బాధ్యతారాహిత్యంగా సమాధానాలు ఇస్తూ కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పీజీఆర్ఎస్ జిల్లా నోడల్ అధికారి ఇ.మురళి, జిల్లా స్పెషల్ డిప్యూటి కలెక్టర్ ఎస్. వెంకటేశ్వరరావు, కళావతి, అరుణ కుమారి, శాంతి, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. ఎస్పీ పీజీఆర్ఎస్కు 36ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ దామోదర్ అన్నారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకార్యక్రమంలోఫిర్యాదు దారులనుంచి ఎస్పీ 36 ఫిర్యాదులు స్వీకరించారు.ప్రజల సమస్యలను ఎస్పీ శ్రద్ధగా విని సంబంధిత పోలీసు అధికారులతో ఫిర్యాదు దారుల ముందే మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదుల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, వారికి న్యాయం చేయాలని అధికారులను ఎస్పీ ఏఆర్దామోదర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్మీ సీఐ కె.కుమారస్వామి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఎస్సై ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు. గుట్టలుగా అర్జీలు..కానరాని పరిష్కారం క్షేత్రస్థాయిలో అంతులేని అలసత్వం కాగితాలకే పరిమితమవుతున్న ’డిస్పోజల్స్’ ఒక్క రోజే 229 వినతులు -
● చంద్రబాబు పాలనపై నమ్మకం పోయింది
చంద్రబాబు ఉచిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. సంక్షేమ పథకాలను ఎగ్గొట్టేశారు. రెండేళ్లలో ఆయన పాలనపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కలిసికట్టుగా పనిచేద్దాం. జగన్ 2.0లో పార్టీ కార్యకర్తలకు సముచిత ప్రాధాన్యం లభిస్తుంది. పార్వతీపురంలో పార్టీ పటిష్టతకు జోగారావు కృషి ఎనలేనిది. – శత్రుచర్ల పరీక్షిత్రాజు, వైఎస్సార్సీపీ పార్వతీపురం మన్యం జిల్లా ఽఅధ్యక్షుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 704 రోజులు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసింది. ఎన్నికల సమయంలో ఆరు హామీల పేరుతో ప్రజలను ఆకర్షించి అధికారంలోకి వచ్చింది. వాటిని అమలుచేయడంలో విఫలమై ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీని రాజకీయంగా ఎలా అడ్డుకోవాలనే అంశంపైనే కూటమి నాయ కులు దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పోరాడినప్పుడే పార్టీ కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుంది. పార్టీ మరింత బలపడుతుంది. – మామిడి శ్రీనివాసరావు, పార్వతీపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ పరిశీలకుడు -
నవ్విపోదురు గాక..!
● శ్మశాన వాటికకు పసుపు రంగువిజయనగరం ఫోర్ట్: గురివింద గింజ తన నలుపు తాను ఎరగనట్లు టీడీపీ నేతలు తాము చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అన్న చందగా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం చంద్రబాబు సహా టీడీపీ నేతలు అంతా సచివాలయాలకు, ప్రభుత్వ భవనాలకు వేసే రంగులపై నానాయాగీ చేశారు. వైఎస్సార్సీపీ రంగులు వేసుకుంటున్నారంటూ తెగ ప్రచారం చేసేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ అభివృద్ధి పనులు చేపట్టేటప్పుడు ఏర్పాటు చేసే శిలాఫపలకాలు, శ్మశాన వాటికలకు కూడా ప్రస్తుతంఅధికార పార్టీ పసుపు రంగు వేస్తున్నారు. -
కోటదుర్మమ్మ ఆలయ ఈఓకు తోటపల్లి దేవస్థానం బాధ్యతలు
గరుగుబిల్లి: పాలకొండలోని కోటదుర్గమ్మ ఆల యం ఈఓ వి.వి.సూర్యనారాయణ గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి వేంకటేశ్వరస్వామి, కోదండరామస్వామి ఆలయాల కార్యనిర్వహణాధికారిగా సోమవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఈఓగా విధులు నిర్వహిస్తున్న బి.శ్రీనివాస్ జూన్ 21 వరకు మెడికల్ లీవ్ పెట్టారు. దీంతో సూర్యనారాయణకు అద నపు బాధ్యతలు అప్పగిస్తూ దేవదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. సీతంపేట: సీతంపేట ఏరియా ఆస్పత్రిలో ఒక్క రోజు 10 మలేరియా కేసులు నమోదు కావడం అటు ప్రజలు, ఇటు వైద్యవర్గాలను ఆందోళన కు గురిచేస్తోంది. తీవ్రమైన ఎండలు, అకాల వర్షాలకు ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. సోమవారం మొత్తం 357 ఓపీలు నమోదయ్యా యి. జ్వరంతో బాధపడుతున్న వారిని పరీక్షించగా.. మలేరియా ఆర్డీటీ కిట్ పాజిటివ్ 7, స్లైడ్ పాజిటివ్– 3 కేసులు నిర్ధారణ అయినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు తెలిపారు. మలేరియా పీడితులకు వెంటనే చికిత్స ప్రారంభించామన్నారు. మిగిలిన వారికి వ్యాధి నిర్ధారణ బట్టి వైద్యసేవలు అందించి మందులు అందజేశామని చెప్పారు. -
నూతన కార్యవర్గం ఎన్నిక
విజయనగరం ఫోర్ట్: ఏపీ విద్యుత్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక విజయనగరంలోని దాసన్నపేటలో సోమవారం జరిగింది. సంఘ రీజనల్ కార్యదర్శిగా సురగాల లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా అధ్యక్షుడిగా గేదెల రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్గా గుమ్మడి దేముడు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి.రామునాయుడు, సెక్రటరీగా డి.శ్రీనివాస్కుమార్, కోశాధికారిగా బి.కూర్మారావు, ఉపాధ్యక్షులుగా బి.రమణమూర్తి, జి.చంద్రరావు, జె.రాజబాబు, కె.ప్రసాదరావు, ఎ.రవి, ఎస్.నాగరాజు, మహిళా ఉద్యోగుల ప్రతినిధిగా బాలకుమారి ఎంపికయ్యారు. పేకాట శిబిరంపై దాడిరామభద్రపురం: మండలంలోని చందాపురం గిరిజన గ్రామం శివారులో సోమవారం పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేసి ఆరుగురు జూదరులను పట్టుకున్నారు. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామ శివారులో కోత ముక్కల పేకాట ఆడుతున్నట్లు అందిన సమాచారం మేరకు దాడి చేసి ఆరుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు.వారి నుంచి రూ.11,500లు నగదు,ఆరు సెల్ఫోన్లు,మూడు బైక్లు,ఒక ఆటో స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఎస్సై జ్ఞానప్రసాద్ కేసునమోదుచేశారు. పెంచిన ‘పెట్రో’ ధరలు తగ్గించాలి పెట్రో ధరల పెంపును నిరసిస్తూ సీపీఐ, సీపీఎంలు పోరుబాట పట్టాయి. విజయనగరం జిల్లా కేంద్రంలోని గంటస్తంభం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ నేత బుగత అశోక్, రామకృష్ణనగర్లో సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ నాయకుడు రెడ్డి శంకరరావు పాల్గొని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ధ్వజమెత్తారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ పదేపదే పెంచుతున్నా ఎన్డీఏ ప్రభుత్వ భాగస్వామి అయిన రాష్ట్రంలోని కూటమి సర్కారు నోరు మెదపడం లేదని విమర్శించారు. పెంచిన పెట్రో ధరలతో పాటు పెరిగిన నిత్యావసరాల ధరలను తగ్గించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జూన్ 9న వామపక్షాలు చేపట్టే దేశవ్యాప్త నిరసనలకు ప్రజలంతా మద్దతు తెలపాలని కోరారు. – విజయనగరం గంటస్తంభం -
సీ్త్ర‘నిధి’ స్వాహా..!
కొత్తవలస: తీసుకున్న సీ్త్రనిధి రుణాలను నిబంధనల ప్రకారం 22నెలల 15 రోజుల్లో చెల్లించాం.. కానీ మరో నెలన్నర డబ్బులను (24 నెలలు కట్టించుకున్నారు) అదనంగా వసూలు చేశారు.. ఆ డబ్బులు ఎవరి ఖాతాలోకి వెళ్లాయో చెప్పాలి.. తక్షణమే తిరిగి చెల్లించాలంటూ కొత్తవలస మండలం పాతసుంకరపాలెంకు చెందిన పొదుపు సంఘాల మహిళలు సోమవారం ఆందోళన చేశారు. గ్రామానికి వెళ్లిన ఏపీఎం ఎ.వెంకటరమణతో పాటు నలుగురు సీసీలు, సీ్త్రనిధి మేనేజర్ పి.ధనలక్ష్మిని నిలదీశారు. ఏళ్లతరబడి అదనంగా వసూలు చేసిన డబ్బులను ఎవరి ఖాతాలోకి వెళ్లాయో చెప్పాలంటూ చుట్టుముట్టారు. 2018 నుంచి సుమారుగా రూ.2 కోట్ల వరకు సీ్త్రనిధి రుణాలు తీసుకుంటూ సకాలంలో వాయిదాల ప్రకారం చెల్లిస్తున్నామన్నారు. ఒక్కో గ్రూపు నుంచి నెలన్నర వాయిదా చొప్పున అదనంగా డబ్బులు వసూలు చేసి రూ.లక్షల్లో కాజేశారంటూ పొదుపు సంఘాల సభ్యులు ధనలక్ష్మి, లెంక కనకేశ్వరి, బెహరా శ్రీదేవి తదితరులు ఆరోపించారు. వెలుగు అధికారులు, బుక్ కీపర్ను ప్రశ్నించినా సమాధానం లేదన్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పొదుపు సంఘాల మహిళలకు ఆర్థిక న్యాయం చేయాలని విజ్ఞప్తిచేశారు. ఆందోళనకు దిగిన పాతసుంకరపాలెం మహిళలు ఏళ్లతరబడి అదనపు వసూళ్లపై ఆందోళన నెలన్నర చొప్పున డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ -
యోగాంధ్ర తెచ్చిన తంటా..!
విజయనగరం క్రైమ్: చంద్రబాబు సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన యోగాంధ్ర కార్యక్రమం ఆదివారం రెండు శాఖల మధ్య తంటా తెచ్చిపెట్టింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద ఉదయం ఆరున్నర గంటలకు యోగాంధ్ర పేరుతో మహిళలతో యోగాసనాలు వేయించారు. ఇందుకోసం ఆ రోడ్డులో ముందుగానే ఎడమవైపు శివాలయం వీధి, కుడిపైపు కోరాడ వీధిని మున్సిపల్ కార్పొరేషన్ శాఖ దిగ్బంధం చేయంచింది. వాస్తవానికి అక్కడే యోగా కార్యక్రమం ఉంటుందని పోలీస్ శాఖకు ముందుగానే చెప్పాలి. పోలీస్ శాఖకు వచ్చే ఆదేశాలతో ట్రాఫిక్ విభాగాన్ని అప్రమత్తం చేస్తుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా కార్యక్రమం జరిగిపోతుంది. అనుకున్న ప్రకారం ఉదయం ఆరున్నర గంటలకు మున్సిపల్ శాఖ యోగా ఇన్ స్ట్రక్టర్స్తో పైడితల్లి దేవాలయం వద్దే మహిళలతో యోగాసనాలు వేయించి యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించింది. ఆదే సమయంలో అటు శివాలయం వీధి నుంచి ఇటు కోరాడ వీధి నుంచి ప్రజలు రాకుండా బారికేడ్స్తో పాటు హర్డిల్స్ పెట్టడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో ఇటు మున్సిపల్ శాఖ, అటు ట్రాఫిక్ పోలీసులకు ప్రజలు అక్షింతలు వేశారు. సరిగ్గా 7.45కు కార్యక్రమం అయిపోయిన వెంటనే అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై సత్యం నాయుడికి ట్రాఫిక్ సీఐ సూరినాయుడు ఫోన్ చేసి మరీ అక్షింతలు వేశారు.యోగాంధ్ర కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రజలు ఇబ్బందులు పడ్డారని కంట్రోల్ రూమ్ కు ఫోన్ ల ద్వారా ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీనికి ఏఎస్సై నాయుడు బదులిస్తూ మున్సిపల్ శాఖ ముందుగా సమాచారం ఇవ్వలేదని, ఎస్సై భాస్కర్, తాను,హెచ్సీ హరి ఉదయం ఆరు గంటలకే యోగాంధ్ర కార్యక్రమం జరిగే స్థలానికి వచ్చి ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టామని వివరణ ఇచ్చారు. ఏదేమైనప్పటికీ నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం ప్రజలను కాస్త ఇబ్బంది పెట్టింది. పైగా అటు మున్సిపల్ శాఖ, ఇటు ట్రాఫిక్ విభాగాల మధ్య తంటా తెచ్చిపెట్టింది. -
731 కిలోల పీడీఎస్ బియ్యం పట్టివేత
గంట్యాడ: మండలంలోని రామభద్రపురం గ్రామం మెయిన్ రోడ్డులో నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 731 కిలోల పీడీఎస్ బియ్యాన్ని అధి కారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. సీఎస్ డీటీ వీవీఎస్ మూర్తి, వీఆర్వోతో కలిసి వాహనాల ను తనిఖీ చేయగా ఓ ఆటోలో 15 ప్లాస్టిక్ సంచుల్లో బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై ఆటో డ్రైవర్తో పాటు బియ్యం కొనుగోలు చేసిన వ్యక్తిపై 6ఎ కేసు నమోదు చేయాలని కలెక్టర్, పౌర సరఫరాల శాఖకు నివేదిక పంపించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని మధ్యవర్తుల సమక్షంలో స్థానిక రేషన్ దుకాణం డీలర్కు, ఆటోను గంట్యాడ పోలీసులకు అప్పగించారు. -
సోమవారం శ్రీ 8 శ్రీ జూన్ శ్రీ 2026
సాక్షి, పార్వతీపురం మన్యం: చమురు సంస్థలు మరోసారి షాక్ ఇచ్చాయి. ఈ సారి మహిళల వంటింటిపై బాంబు పేల్చాయి. గృహవసరాల గ్యాస్ సిలిండర్ల ధరను ఆదివారం రూ.29 చొప్పున పెంచాయి. చివరిగా గత మార్చి నెలలో రూ.60 చొప్పున వడ్డించిన విషయం విదితమే. మూడు నెలల వ్యవధిలోనే రెండోసారి ధరలు పెంచడంపై వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 16 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. తాజాగా పెరిగిన ధరలతో 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రూ.969.50 అయ్యింది. జిల్లాలో సాధారణ, సీఎస్ఆర్, పీఎంయూవై, దీపం, ట్రైబుల్ కలిపి మొత్తం 3.16 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సగటున నెలకు 1.50 లక్షల సిలిండర్లు వినియోగం అవుతాయని అంచనా. దీనివల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజల వంటింటి ఖర్చుపై అదనపు భారం పడనుంది. రాయితీకీ మంగళం ఓ వైపు గతంలో రూ.వందల్లో ఉండే రాయితీ అమాంతం తగ్గిపోయింది. ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న రాయితీ రూ.3 చొప్పునే తిరిగి బ్యాంకు ఖాతాలో జమవుతోంది. దీనివల్ల వినియోగదారులు పూర్తి మొత్తమిచ్చే సిలిండర్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇది కాక.. ఇంటికి తీసుకొచ్చి బండ ఇచ్చినందుకు డెలివరీ బాయ్స్కు అదనంగా రూ.50 ఇవ్వాల్సి వస్తోంది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా రాష్ట్రంలోని మహిళలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తామని ప్రస్తుత సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇది కూడా సగం మందికి అందని పరిస్థితి. గతంలో గ్యాస్ ధరలు పెరిగినప్పుడు, వినియోగదారులపై ఆ భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వాలే ఆ మొత్తం భరించేవి. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేకపోయింది. ధరలతో దడదడ ఓ వైపు పెట్రో ధరలు, మరోవైపు గ్యాస్ ధరలు కొద్ది రోజులుగా పెరుగుతూ పోతుండడంతో సామాన్యు లు విలవిలలాడుతున్నారు. మోయలేని భారాలతో సతమతమవుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు పెరిగిన ధరలను భరించలేకపోతున్నారు. చేసేది లేక మోయలేని భారాలు మోస్తున్నామని పలువురు వాపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో సామాన్యుని జీవనం అతలాకుతలమవుతుందని ఆవేదన చెందుతున్నారు. ఈ ధరలు ఇలా పెరుగుతూ పోతే భవిష్యత్లో మరిన్ని కష్టాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మొదలు.. ఆ సాకును చూపుతూ చమురు సంస్థలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నాయి. మూడు నెలల వ్యవధిలోనే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలు రెండు సార్లు.. నెల రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగు సార్లు పెంచాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.118, డీజిల్ రూ.105 వరకు ఉంది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్ ధర గత ఫిబ్రవరిలో రూ.1,824 ఉండగా... విడతల వారీగా పెంచుతూ ప్రస్తుతం రూ.3,228 అయ్యింది. వాణిజ్య సిలిండర్లపై ఎటువంటి రాయితీ ఉండదు. ఈ ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార ఉత్పత్తుల సంస్థలపై పడుతోంది. ఈ మూడు, నాలుగు నెలల కాలంలోనే ఆహార పదార్థాల ధరలను హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు పెంచేశాయి. గ్యాస్ కొరత బూచిగా చూపుతూ, పెద్ద రెస్టారెంట్లు బిల్లుతో పాటు, గ్యాస్ చార్జీలు అంటూ అదనపు మొత్తం వడ్డిస్తున్నాయి. మొత్తంగా ఈ భారం కూడా ప్రజల మీదే పడుతోంది. ఇలా పెరుగుతున్న చమురు ధరల కారణంగా తమ నెలవారీ బడ్జెట్ తలకిందులు అయ్యిందని సామాన్య, మధ్య తరగతి ప్రజలు వాపోతున్నారు. గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెంపు రూ.29లు పెంపు వంటింటిపై మరింత భారం సామాన్యుల నడ్డి విరుస్తున్న ధరల పెంపు గ్యాస్, పెట్రోల్ ధరల పెంపుతో విలవిల -
ఇంత జాప్యమా..!
గంట్యాడ మండలానికి చెందిన ఆర్.భైరాగి వయసు అరవై ఏళ్లు పైబడి ఉంటుంది. కానీ అతని ఆధార్ కార్డులో వయసు తక్కువగా నమోదైంది. దీంతో వృద్ధాప్య పింఛన్ పొందేందుకు తనకు వయసు నిర్ధారణ పత్రం మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు చేసి రెండేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు అతనికి వయసు నిర్ధారణ పత్రం మంజూరు కాలేదు. విజయనగరం పట్టణంలోని దాసన్నపేటకు చెందిన కె.సూర్యనారాయణ వయసు అరవై ఏళ్లు పైబడి ఉంటుంది. కానీ అతని ఆధార్ కార్డులో వయసు తక్కువగా నమోదైంది. దీంతో వృద్ధాఫ్య పింఛన్ పొందేందుకు తనకు వయసు నిర్ధారణ పత్రం మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు ఇప్పటి వరకు ఈ ధ్రువీకరణ పత్రం మంజూరు చేయలేదు. ఇంతలోనే ఈ వృద్ధుడు ఇటీవల మృతి చెందాడు. విజయనగరం ఫోర్ట్: అది ఎన్నికల సమయం.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నేతలు ఊరూవాడ.. ఒక్కటిగా 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని గొప్పగా ప్రచారం చేశారు. పింఛన్ మంజూరు సంగతి దేవుడెరుగు.. వృద్ధాప్య వయసు నిర్ధారణ పత్రాలకు కూడా ఇప్పుడు ఏళ్ల తరబడి తిప్పుతున్నారు. ఈ పత్రాల మంజూరులో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి కొందరు వృద్ధులకు 60 ఏళ్లు పైబడి వయసు ఉన్నా.. ఆధార్ కార్డులో తక్కువగా వయసు నమోదు కావడంతో వృద్ధాప్య పింఛన్ మంజూరు కాని పరిస్థితి నెలకొంది. ఇంతలోనే కొందరు వృద్ధులు తనువు చాలిస్తున్నారు. ఆధార్ కార్డులో వయసు తక్కువగా నమోదైతే అటువంటి వారు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వయసు నిర్ధారణ ధ్రువీకరణ పత్రాలు ఇప్పిస్తామని అధికారులు చెప్పడంతో జిల్లా వ్యాప్తంగా 3733మంది వృద్ధులు దరఖాస్తు చేసుకున్నారు. రెండేళ్లుగా.. వృద్ధులకు వయసు నిర్ధారణ పత్రాలు మంజూరు చేయడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఆర్డీఏ అధికారులు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అధికారులు ఒకరిపై ఒకరు నెపాన్ని నెట్టుకోవడంతోనే కాలం వెళ్లదీస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గడిచిన రెండేళ్లలో ఒక్కరికి కూడా ఈ ధ్రువీకరణ పత్రం ఇచ్చిన దాఖలాల్లేవు. ఈ విషయమై సర్వజన ఆస్పత్రి అధికారులు అంత మందికి ఒకేసారి వయసు నిర్ధారణ పత్రాలు ఇవ్వలేమని, విడతల వారీగా పంపిస్తే చేస్తామని చెబుతున్నారు. డీఆర్డీఏ అధికారులు మాత్రం విడతల వారీగా పంపిస్తామనిగాని, పంపించమనిగాని ఏదీ చెప్పడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ రెండు శాఖల సమన్వయ లోపం వృద్ధుల పాలిట శాపంగా మారిందనే ఆరోపణలున్నాయి. వయసు నిర్ధారణ పత్రాల కోసం వృద్ధులను ఎందుకు పంపించడం లేదని డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణిని ఫోన్లో అడిగేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. వృద్ధుల వయసు నిర్ధారణ ధ్రువీకరణ పత్రాల కోసం 3733 మంది జాబితాను డీఆర్డీఏ అధి కారులు అందించారు. అయితే అంత మందికి ఒకేసారి ఈ పత్రాలు ఇవ్వలేం. విడతల వారీగా పంపిస్తే పత్రాలు మంజూరు చేస్తామని చెప్పాం. ఇంత వరకు ఎవరినీ పంపించలేదు. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
మలేరియాతో తస్మాత్...!
ప్రాణాలైనా ఇస్తాం.. భూములివ్వం... సీతంపేట: ఎపిడమిక్ సీజన్ ప్రారంభమైంది. జూన్ నుంచి అక్టోబరు వరకు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే జ్వరాలతో స్థానిక ఏరియా ఆస్పత్రి, పీహెచ్సీలు, సీహెచ్సీలతో పాటు ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా చలి, జ్వరంతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు అధికమౌతుంది. జిల్లాలో వందల సంఖ్యలో జ్వర పీడితులు వైద్యం కోసం వస్తుంటే అందులో రోజుకు కనీసం 50 కేసులు వరకు మలేరియా పీవీ, పీఎఫ్ కేసులు నమోదౌతున్నట్టు అధికారిక సమాచారం. కానీ వీటికి రెండింతలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కేసులు నమోదౌతుండడం బట్టి చూస్తే ఈ ఏడాది మలేరియా తీవ్రత ఎంత ఉందో ఇట్టే అవగతమౌతుంది. పలు జాగ్రత్తలతోనే ఈ వ్యాధిని నిర్మూలించుకోవచ్చని వైద్య శాఖ చెబుతుంది. మలేరియా ఎలా వస్తుంది? ప్లాస్మోడియం పరాన్న జీవి ద్వారా ఆడ అనాఫిలిస్ దోమ కుట్టడంతో మలేరియా వస్తుంది. ఈ దోమలు మురుగునీటి నిల్వల్లో పెరుగుతాయి. ప్లోస్మోడియ జాతికి చెందిన నాలుగు రకాల పేరసైట్స్ వలన వస్తుంది. ప్లాస్మోడియం వైవాక్స్, ఫాల్సీఫారం, ఒవెల్ రకాల్లో మొదటి రెండు రకాల వలన మలేరియా జ్వరం వస్తుంది. ఎలా మొదలౌతుంది.. ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టడం వలన ఏడు నుంచి పది రోజుల లోపల మలేరియా వస్తుంది. చలి, వణుకు, ఒళ్లు నొప్పులతో కూడిన విపరీతమైన జ్వరం రోజు మార్చి రోజు వస్తుంది. చెమటలు ఎక్కువగా పట్టడంతో జ్వరం తగ్గుతుంది. ఈ లక్షణాలు ఉన్న వారు వెంటనే మీ దగ్గర్లోని ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలి. ఆర్డీటీ కిట్ ద్వారా రక్తపూత పరీక్షల ద్వారా మలేరియా వ్యాధిని నిర్దారించవచ్చు. ఆర్డీటీ కిట్ ప్రతీ ఆశా, మహిళా ఆరోగ్య కార్యకర్త వద్ద ఉంటుంది. వ్యాధిని బట్టి చికిత్స అందజేస్తారు. చికిత్స రక్తపూత పరీక్షల్లో నిర్ధారించిన ప్లాస్మోడియం రక్తాన్ని బట్టి వైద్యాధికారి చికిత్స అందజేస్తారు. ప్లాస్మోడియం వైవాక్స్ అయితే 14 రోజులు, ప్లాస్మోడియం ఫాల్సిఫారం అయితే మూడు రోజులు సంబంధిత మందులు ఇస్తారు. మందులు క్రమం తప్పకుండా వాడకపోయినా, సరైన సమయంలో వైద్య సిబ్బంది సలహా తీసుకోకపోయినా మలేరియా జ్వరం తీవ్ర స్థాయికి చేరి మెదడుకు వ్యాపించే ప్రమాదం ఉంది. బొండపల్లి: తమకు జీవనాధారంగా ఉన్న భూములను ఎట్టి పరిస్థితుల్లోననూ ఫుడ్ ప్రాసెసింగ్ యూ నిట్కు ఇచ్చేది లేదని మూడు గ్రామాల రైతులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆ భూములను ప్రభు త్వం బలవంతంగా లాక్కోవాలని చూస్తే ప్రాణాలై నా.. ఇస్తామని, భూముల మాత్రం ఇవ్వమని తేల్చి చెప్పారు. మండలంలోని కిండాం అగ్రహరం గ్రా మంలో సీపీఎం, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో బాధిత మూడు గ్రామాలకు చెందిన రైతులు ఆదివా రం సమావేశమయ్యారు. రైతు సంఘం జిల్లా ప్రధా న కార్యదర్శి బుద్దరాజు రాంబాబు, సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ నేతృత్వంలో వీరు ఏకమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన పది రోజులుగా రెవె న్యూ అధికారులు, తహసీల్దార్ మూడు గ్రామాల పరిధిలో తాము సాగు చేసుకుంటున్న భూములను సర్వే చేసి తమను భయభ్రాంతులకు గురి చేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొండకిండాం గ్రామంలో గత ఏడాది ఎంఎస్ఎంఈ పార్కు పేరుతో సుమారు 58 ఎకరాల భూములను లాక్కొన్నారని, అందులో ఎస్సీ, ఎస్టీలు సాగు చేస్తున్న మామిడి, జీడితోటలు 12 ఎకరాల వరకు ఉన్నా.. వారికి న్యాయం చేసి నష్టం పరిహారం అందజేస్తామని చెప్పిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని నేతలు ధ్వజమెత్తారు. ఈ భూ ముల్లో ఒక్క పరిశ్రమ కూడా స్థాపించలేదన్నారు. తాజాగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పేరుతో కొండ కిండాం, కిండాం అగ్రహరం, రాచకిండాం గ్రామా ల పరిధిలో 175 ఎకరాలు రైతులు దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములను రెవెన్యూ అధికారులు లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారని దీన్ని ఖండిస్తున్నామని తెలిపారు. మూడు గ్రామాల పరిధిలో 40 ఎకరాల డి పట్టా భూములతో పాటు 50 ఎకరా ల జిరాయితీ పల్లపు భూములను, 85 ఎకరాల వరకు జిరాయితీ మామిడి తోటలను బలవంతంగా లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారని రైతు సంఘం, సీపీఎం నేతలు ధ్వజమెత్తారు. వీరికి తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూసేకరణను నిరసిస్తూ ఈ నెల 8న సోమవారం మూడు గ్రామాల బాధిత రైతులతో కలెక్టరేట్ వద్ద ధర్నా చేయనున్నట్టు రైతు సంఘం, సీపీఎం నేతలు తెలిపారు. భూసేకరణను నిరసిస్తూ పోరాట కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. పోరాట కమిటీ కన్వీనర్గా చొక్కాకు సన్యాసినాయుడు, కో కన్వీనర్గా బొంగు అప్పారావు, భోపారపు శ్రీను, పెంట శివప్రసాద్, భోపారపు ఈశ్వరరావును ఎన్నుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్లె శ్రీనివాసరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తొత్తడి పైడిపునాయుడు, మూడు గ్రామాల బాధిత రైతులు పాల్గొన్నారు. చేయాల్సినవి... నీరు నిల్వ ఉంచిన తొట్లు, ఇతర పాత్రలు మూసివేయాలి. ఇంటిలో ఉన్న నీటి కుళాయిల వద్ద నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించాలి. వారానికి ఒక సారి నీటి తొట్టెలను, ఇతర పాత్రలను శుభ్రంగా కడిగి, తుడిచి మరల నీరు నింపుకోవాలి. దోమ తెరలను తప్పనిసరిగా వాడుకోవాలి. ఉదయం, సాయంత్రం 5 గంటల నుంచి ఆరు గంటల సమయంలో తలుపులు మూసి ఉంచాలి. మలేరియా సిబ్బందితో సహకరించి ఇంటి లోపల దోమల నివారణా మందును స్ప్రేయింగ్ చేయించుకోవాలి. ఇంటిలోపల పనికిరాని చెత్తను ఉంచరాదు. చేయకూడనవి.. మూతలు పెట్టకుండా నీరు నిల్వ ఉంచడం. ఉదయం, సాయంత్రం సమయంలో తలుపులు తెరచి ఉంచడం. దోమల మందును పిచికారీ చేసిన తరువతా గోడలు, తలుపు మూలలు శుబ్రం చేయడం. వాటర్ ట్యాంకులు మూతలు తెరిచి ఉంచడం. నీరు చేరే చోట పనికిరాని వస్తువులు, ఖాళీ డబ్బాలు ఉంచడం. జాగ్రత్తలతోనే నిర్మూలన ఎపిడమిక్ సీజన్ ప్రారంభం రోజురోజుకు పెరుగుతున్న మలేరియా కేసులు జ్వరపీడితులతో నిండుతున్న ఆస్పత్రులు పరిసరాల పరిశుభ్రత పాటించకుంటే ప్రమాదమే.. ఆస్పత్రిలో వైద్య సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉన్నాం. జ్వరపీడితులు వచ్చిన వెంటనే రక్త పరీక్షలు చేస్తున్నాం. మలేరియా పీవీ, పీఎఫ్లు వస్తే వెంటనే రోగికి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. మందులు అందజేస్తున్నాం. అన్ని వ్యాధులకు మందులు అందుబాటులో ఉన్నాయి. – బి.శ్రీనివాసరావు, సూపరింటెండెంట్, ఏరియా ఆస్పత్రి, సీతంపేట హైరిస్క్ మలేరియా గ్రామాల్లో దోమల నివారణా మందు స్ప్రేయింగ్ చేస్తున్నాం. జ్వరాల వ్యాప్తిని అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. లార్వా వేట కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని గ్రామాలకు దోమ తెరలను కూడా పంపిణీ చేశాం. – జె.మోహన్రావు, సబ్ యూనిట్ ఆఫీసర్, మలేరియా నివారణ శాఖ -
ఇదేం బాదుడు ‘బాబు’
అధికారంలోకి వస్తే సంపద సృష్టించేస్తామన్నారు. సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టారు. మహిళలకు, ఆడబిడ్డలకు రాయితీలు, నిధులు కేటాయిస్తామన్నారు. ఉచితంగా మూడు సిలిండర్లు అంటూ గ్యాస్ కొట్టారు. అంతా బూటకమని ప్రజలు గుర్తించారు. వంట గ్యాస్ ధరలు రూ.వెయ్యికి చేరింది. మూడు నెలల క్రితమే రూ.60 పెంచారు. దీంతో రూ.2 కోట్లు భారం జిల్లా వాసులపై మోపారు. తాజాగా రూ.29 పెంచారు. మళ్లీ రూ.కోటి మేర భారం పెట్టారు. వాణజ్య సిలిండర్ల ధరలు పెరగటంతో చిరు వ్యాపారులు కుదేలయ్యారు. పెరుగుతున్న ధరలతో సాధారణ, పేద, మధ్య తరగతి, గిరిజనులపై భారం పడుతుంటే ప్రభుత్వ పెద్దలు చేష్టలుడిగి చూస్తున్నారు. ప్రజలు నారా వారి పాలనతో ఇదేం బాదుడు బాబు అంటూ మండిపడుతున్నారు. విశ్వాసరాయి కళావతి, మాజీ ఎమ్మెల్యే, పాలకొండ ● -
ధర పెంచుకుంటూ పోతున్నారు..
పేదల బతుకులపై గ్యాస్ బండ గుది బండగా మారుస్తున్నారు. అడ్డూ అదుపు లేకుండా వంట గ్యాస్ ధరలు పెరుగుతుంటే పాలకులు ఏం చేస్తున్నారో అర్ధం కావటం లేదు. కొద్ది రోజుల కిందట గ్యాస్ బండపై ఒకేసారి రూ.60 పెంచారు. ఇప్పుడు మరో రూ.29 పెంచారు. ఇది అన్యాయం. పేద, మధ్య తరగతి కుటుంబాలు రూ.వెయ్యి వరకూ చెల్లించి గ్యాస్ గొనుగోలు చేసే స్థితిలో లేవు. ప్రభుత్వం ప్రజలపై భారం లేకుండా చేయటం మానేసి రోజుకో రకంగా నిత్యవసర సరుకులపై ధరలు పెంచుతూ ప్రజలపై భారం వేయటం అన్యాయం. పి.హైమావతి, డోలమడ, పాలకొండ మండలం ● -
మరింత వాతలు
అధికారంలోకి వస్తే ధరలు అదుపు చేస్తామన్న ప్రభుత్వం మహిళలపై కక్ష కట్టినట్లుంది. గ్యాస్ ధరలు నెలల వ్యవధిలో పెంచుతూ మరింత వాతలు పెడుతుంది. తాజాగా పెరిగిన ధరతో వంట గ్యాస్ బండ ధర నాలుగు నెలల వ్యధిలో దాదాపు వెయ్యికి చేరింది. ఈ భారం ప్రభుత్వమే భరించాలి. పేద, మధ్య తరగతి కుటుంబాలు బతకటమే భారంగా మారుతున్న తరుణంలో గ్యాస్, నిత్యవసర సరుకుల ధరలు పెంచటం ఆందోళనకు గురి చేస్తుంది. ఏడాదికి మూడు బండలు ఉచితమన్నారు. ఎవరికి వర్తిస్తుందో తెలియటం లేదు. చివరికి కట్టెలు ముట్టుకున్నా ధరలు భగ్గుమంటున్నాయి. కె.చిన్నమ్మడు, పాలకొండ మండలం ● -
నకిలీ నియామక ప్రకటనలు నమ్మొద్దు
● కేంద్రీయ గిరిజన వర్సిటీ ఇన్చార్జి వీసీ శ్రీనివాసన్ విజయనగరం రూరల్: కేంద్రీయ విశ్వ విద్యాలయం పేరుతో సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ వేదికల్లో కొన్ని నకిలీ నియామక ప్రకటనలు, ఉద్యోగ అవకాశాల సమాచారంతో తప్పుడు సందేశాలు ప్రచారంలో ఉన్నట్లు విశ్వవిద్యాలయం దృష్టికి వచ్చిందని, నిరుద్యోగులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్సిటీ ఇన్చార్జి వీసీ టి.శ్రీనివాసన్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఇటువంటి సమాచారం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. అభ్యర్థులు నకిలీ ప్రకటనలు నమ్మొద్దని, తమ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలకు సంబంధించి ధ్రువపత్రాలు అందించవద్దని, ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరపొద్దని ఆయన కోరారు. విశ్వవిద్యాలయం పేరు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా వ్యక్తులు, సంస్థలు సంప్రదిస్తే వర్సిటీ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయంలో జరిగే అన్ని నియామకాలు, ఉద్యోగ ప్రకటనల సమాచారం విశ్వ విద్యాలయం వెబ్సైట్లో అధికారికంగా జారీచేస్తామన్నారు. -
ఇదెక్కడి ఘోరమయ్యా...
మేము నిరుపేదలం... మా ఇల్లు చూడండి.. కూలి చేస్తేగానీ కడుపునిండదు.. మేము రాజకీయాలు చేయగలమా?.. మాపై వైఎస్సార్సీపీ సానుభూతిపరులమంటూ రాజకీయ ముద్రవేశారు. రోడ్డు పక్కన చిన్నస్థలంలో పూరిపాక వేసుకుని తొమ్మిదేళ్లుగా ఇద్దరు పిల్లలతో జీవిస్తుంటే ఇప్పుడు అధికారులకు ఫిర్యాదు చేసి ఖాళీ చేయిస్తున్నారు. ఇది న్యాయమేనా.. ఇదెక్కడి ఘోరమయ్యా.. పేదలం ఎలా బతకాలయ్యా.. గూడుకు చోటుకూడా కరువేనా?.. ఇక్కడేమైనా ఆఫీసులు కడతారా?.. అంటూ బాధితురాలు ఎన్నికల సీత విలేకరుల ముందు వాపోయింది. తమ కష్టాల జీవనాన్ని చెబుతూ విలపించింది. నిరుపేద గిరిజన కుటుంబాన్ని గ్రామబహిష్కరణకు పూనుకోవడం సరికాదంటూ వాపోయింది. ఇప్పటికిప్పుడు ఎక్కడకు పోతామంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులు స్పందించి మాకు గూడు చూపాలంటూ వేడుకుంది. -
అమ్మో ఫైలేరియా..!
● చాప కింద నీరులా విస్తరిస్తున్న మహమ్మారి ● 45 గ్రామాల్లో మొత్తం 169 మంది బాధితులు ● ఒక్క ఒమ్మి గ్రామంలోనే 69 కేసులు ● ప్రజల్లో కొరవడిన అవగాహన నెల్లిమర్ల రూరల్: ఒకప్పుడు అరుదుగా కనిపించే ఫైలేరియా వ్యాధి ఇప్పుడు నెల్లిమర్ల మండలంలో ఆందోళన కలిగించే స్థాయిలో కొనసాగుతోంది. వైద్యారోగ్య శాఖ గణాంకాల ప్రకారం మండలంలోని 45 గ్రామాల్లో ప్రస్తుతం 169 మంది ఫైలేరియా బాధితులు ఉన్నారు. ముఖ్యంగా ఒమ్మి గ్రామంలోనే 69 మంది బాధితులు ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రజారోగ్య వ్యవస్థతో పాటు గ్రామీణ పారిశుద్ధ్య పరిస్థితులపై ఈ గణాంకాలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. రెండు పీహెచ్సీల పరిధిలో బాధితులు ఇలా మండలంలో రెండు పీహెచ్సీలు ఉండగా..సతివాడ పీహెచ్సీ పరిధిలోని 31 గ్రామాల్లో 149 ఫైలేరియా కేసులు ప్రస్తుతం ఉన్నాయి. అందులో ఒమ్మిలో అత్యధికంగా 69 మంది బాధితులుండగా, సతివాడలో 21 మంది, మిగిలిన 28 గ్రామాల్లో 59 మంది బాధితులు ఉన్నారు. కొండవెలగాడ పీహెచ్సీ పరిధిలోని 15 గ్రామాల్లో మరో 20 కేసులు ఉన్నాయి. అందులో కొండవెలగాడలోనే 11 మంది బాధితులు ఉండడం గమనార్హం. ప్రజల్లో కొరవడిన అవగాహన ఫైలేరియా దోమల ద్వారా వ్యాపించే వ్యాధి. ఈ వ్యాధి శరీరంలోని లింఫ్ వ్యవస్థను దెబ్బతీస్తుంది. మొదట్లో సాధారణ జ్వరం, వాపు వంటి లక్షణాలు కనిపించినా, క్రమంగా కాళ్లు, చేతులు లేదా ఇతర అవయవాలు అసాధారణంగా వాపుగా మారతాయి. వ్యాధి తీవ్రమైతే బాధితులు జీవితాంతం శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇన్ని కేసులు ఉన్నప్పటికీ ప్రజల్లో మాత్రం అవగాహన కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తూతూమంత్రంగానే పారిశుద్ధ్య పనులు గ్రామాల్లో తూతూమంత్రంగానే పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారనే విమర్శలు ప్రజల నుంచే వినిపించడం గమనార్హం. వాస్తవానికి ఎక్కడా డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదు. ఫాగింగ్ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఎక్కడా కూడా ఆ విధానం అమలు కావడం లేదు. కొన్ని గ్రామాల్లో తాగునీటి పైపు లైన్ల వద్ద లీకులను అరికట్టకపోవడంతో ఆ నీరే మురుగుగా మారే పరిస్థితి ఉంది. ప్రజల సహకారం కూడా లేకపోవడం వ్యాధి వ్యాప్తికి మరో కారణంగా తెలుస్తోంది. ఎక్కడబడితే అక్కడ చెత్త వేయడం, కాలువలను ఆక్రమించి భవనాలు కట్టడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో దోమల సంతతి పెరిగి రోగాలకు కారణమవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ప్రజల నిర్లక్ష్యం కూడా పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోందని అధికారులు చెబుతున్నారు. ఎంపీపీ చొరవతో ప్రైవేట్ కంపెనీ సేవలు: ఒమ్మి గ్రామంలో వ్యాధి తీవ్రత అధికంగా ఉండడంతో ఎంపీపీ అంబళ్ల సుధారాణి, ఏంఎసీ మాజీ చైర్మన్ శ్రీరాములు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. జర్మనీకి చెందిన కంపెనీ ప్రతినిధులను సంప్రదించడంతో వారు మూడేళ్లుగా గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారు కూడా గతంలో వ్యాధి తీవ్రతపై ఎన్నో అధ్యయనాలు చేశారు. దోమ తెరలు, దోమలను ఆకర్షించే అధునాతన బుట్టలు ఇంటింటీకీ పంపిణీ చేశారు. కాలువల వద్ద దోమల నియంత్రణకు ఫాగింగ్ చర్యలు కొంత కాలం పాటు నిర్వహించారు. కలెక్టరేట్లో ఫిర్యాదుతో ఫైలేరియా పరీక్షలు: ఇటీవల ఒమ్మి గ్రామానికి చెందిన పలువురు.. ఫైలేరియా వ్యాధి విజృంభణపై కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉందని, ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ఉన్నతాధికారుల స్పందనతో ఎన్ఎఫ్సీపీ యూనిట్ జిల్లా అర్బన్ రూరల్ బృందాలు ముమ్మరంగా రక్త నమూనాల సేకరణ చేపట్టారు. సుమారు 400 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించగా ఆ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. -
ప్రారంభ దశలో గుర్తిస్తే నియంత్రణ సాధ్యం:
ఫైలేరియా వ్యాధి ఒక రోజులో వచ్చేది కాదు. దీని ప్రభావం కొన్ని సంవత్సరాల తరువాత కనిపిస్తుంది. దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే నియంత్రించడం సాధ్యమవుతుంది. ప్రజలు ఇంటి ముందు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వైద్య సిబ్బంది పంపిణీ చేసే ఫైలేరియా నియంత్రణ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలి. ఒమ్మితో పాటు అన్ని గ్రామాల్లోనూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. –డాక్టర్ అనిల్కుమార్, వైద్యాధికారి, సతివాడ పీహెచ్సీ -
24న ఉపముఖ్యమంత్రి రాక?
సాక్షి, పార్వతీపురం మన్యం: బలిజిపేట మండలంలోని పెదపెంకి గ్రామానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ నెల 24న వచ్చే అవకాశాలున్నాయి. గ్రామంలో నూతనంగా నిర్మించిన మ్యాజిక్ డ్రెయిన్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తానని జిల్లా అధికారులకు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. పెదపెంకి గ్రామంలో అభివృద్ధి పనులపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం సమీక్ష నిర్వహించారు. గ్రామంలో వందకు పైగా ఫైలేరియా కేసులు ఉన్న విషయం విదితమే. తరచూ ప్రజలు ప్రమాదకర జ్వరాల బారిన పడుతుండటంతో గ్రామంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. గ్రామంలో మురుగునీరు వెళ్లే మార్గాలు సరిగ్గా లేకపోవడంతోపాటు, కొన్నిచోట్ల కాలువలు అక్రమణలకు గురవడాన్ని అధికారులు ఆయనకు వివరించారు. ఆయన సూచనలతో ఆక్రమణలు తొలగించి గ్రామంలో మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మిస్తున్నారు. రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా పెదపెంకిని తీర్చిదిద్దాలన్న ఆలోచనలో జిల్లా యంత్రాంగం ఉంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు 24వ తేదీన వస్తానని పవన్ కల్యాణ్ జిల్లా అధికారులతో చెప్పారు. అప్పటికి గ్రామంలో పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. పెదపెంకిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలిపార్వతీపురం: బలిజిపేట మండలంలోని పెదపెంకి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెలలో ఉప ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు మౌలిక వసతులు, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య సేవలకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఈనెల 20లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఫైలేరియా నియంత్రణలో కృషిచేసిన అధికారులను కలెక్టర్ అభినందించారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 12 సబ్ రేషన్ డిపోలు ప్రారంభంసీతంపేట: సీతంపేట ఏజెన్సీలోని మారుమూల గిరిజన గ్రామాలకు 12 సబ్ రేషన్ డిపోలు శనివారం ప్రారంభమైనట్లు డీఎస్వో బి.అశోక్ తెలిపారు. ఈ మేరకు మండలంలోని శిలిగాం గ్రామంలో సబ్ రేషన్డిపోను ఏఎంసీ చైర్పర్సన్ సంధ్యారాణి ప్రారంభించారు. మొత్తం 25 సబ్డిపోలు మంజూరు కాగా వాటిలో 13 డిపోలు ఘాట్రోడ్లలో ఉండడంతో వాటికి ఎటువంటి రవాణా సదుపాయాలు లేవని అందుచేత ప్రారంభించలేదన్నారు. ఇప్పటికే ప్రారంభించిన డిపోలకు మెయిన్ రేషన్ డిపోల నుంచి సరుకులు వ్యాన్లు, ఇతర వాహనాల ద్వారా చేరవేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పవన్, చంద్రరావు, తహసీల్దార్ డి.శ్రీకన్య,ఎంపీడీవో మిశ్రో, జీసీసీ మేనేజర్ డి.కృష్ణ, ఆర్ఎస్డీటీ శ్రీ విద్య తదితరులు పాల్గొన్నారు. టెట్ నిబంధనల్లో మార్పులు చేపట్టాలి పార్వతీపురం రూరల్: రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్, నిబంధనలలో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సంఘ రాష్ట్ర కార్యదర్శి నల్లా బాలకృష్ణ, పార్వతీపురం మన్యం జిల్లా బాధ్యులు మహేష్, అప్పలనాయుడు శనివారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగ అభ్యర్థుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పరీక్ష ఫీజును పూర్తిగా మినహాయించాలని, లేదంటే తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. పరీక్ష నిర్వహణను ప్రభుత్వ బాధ్యతగా పరిగణించాలే తప్ప, అభ్యర్థుల నుంచి నిధులు సమకూర్చుకునే మార్గంగా చూడకూడదన్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు సంబంధించి పలు సవరణలు అవసరమని పేర్కొన్నారు. నూతన అభ్యర్థులకు, ఇన్–సర్వీస్ టీచర్లకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించాలని, అర్హత మార్కులను తగ్గించాలని కోరారు. 50 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష కష్టతరంగా ఉంటుందని, వారికి ఆఫ్లైన్ ఓఎంఆర్ పద్ధతిలో అవకాశం కల్పించాలని విన్నవించారు. స్కూల్ అసిస్టెంట్లను మళ్లీ పరీక్ష రాయమనడం సమంజసం కాదని, వారి సర్టిఫికెట్ల చెల్లుబాటును యథాతథంగా కొనసాగించాలని కోరారు. -
ఫిజియో టీ20 లీగ్ విజేత ’హంగ్రీ చీతాస్’
● మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా పార్వతీపురం వైద్యుడు ఉమాకాంత్ పార్వతీపురం రూరల్: ఆంధ్ర ఫిజియో స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో గుంటూరులోని డీఎస్ఏ, ఎంఎస్కే మైదానాల్లో ఐదు రోజుల పాటు జరిగిన ’ఆంధ్ర ఫిజియో క్రికెట్ లీగ్ టీ20 (సీజన్–1)’లో గుంటూరుకు చెందిన హంగ్రీ చీతాస్ జట్టు విజేతగా నిలిచింది. రెండు రాష్ట్రాలకు చెందిన పది ఫిజియోథెరపీ డాక్టర్ల జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో 33 బంతుల్లో 59 పరుగులు చేసిన హంగ్రీ చీతాస్ ఆటగాడు, పార్వతీపురం వాసి డాక్టర్ జీరు ఉమాకాంత్ రెడ్డి ’మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యారు. ఈయన పార్వతీపురం జిల్లా అంధత్వ నివారణ సంస్థ నేత్ర వైద్యాధికారి డాక్టర్ జీరు నగేష్ రెడ్డి చిన్న కుమారుడు. గతంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పలు క్రికెట్ పోటీల్లో పాల్గొని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సాధించారు. టోర్నీకి స్పాన్సర్లుగా వ్యవహరించిన గుంటూరు చంద్ర హాస్పిటల్స్ అధినేతలు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ రవితేజ చేతుల మీదుగా విజేత జట్టుకు ట్రోఫీ, నగదు బహుమతి అందజేశారు. -
పంట పొలాల్లో ఏనుగులు
● భయాందోళనలో రైతులుసాలూరు రూరల్: మండలంలోని మావుడి పంచాయతీ పురిగానివలస సమీప గ్రామాల పంటపొలాల్లో ఏనుగులు బస చేస్తూ గడిచిన మూడు రోజులుగా ఆయా గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒక వైపు రైతులు మరోవైపు అటవీ శాఖ సిబ్బంది ఏనుగులను తరిమేందుకు కసరత్తు చేస్తున్నప్పటికి అవి అక్కడే పంట పొలాలను ధ్వంసం చేస్తూ పక్కనే ఉన్న గొలుసుల మెట్ట రిజర్వాయర్లో నీళ్లు తాగుతూ జీడి తోటలో బస చేస్తున్నాయి. అయితే శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో పెద్దవలస సమీప కొండలపైకి ఏనుగులను తరిమివేసినట్లు స్థానిక రైతులు తెలిపారు. గ్రామస్తుడు కె.రాజాకు సంబంధించిన చెరుకు తోటను ఏనుగులు శనివారం ధ్వంసం చేశాయి. అలాగే పక్కనే ఉన్న రైతుల అరటి తోటలను నాశనం చేశాయి. మూడురోజులుగా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పంటనష్టాలు ఇస్తారా? ఏనుగుల కారణంగా రైతులకు జరిగిన పంటనష్టాలు ప్రభుత్వం ఇస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం పంట నష్టాలు అంచనా వేసేందుకు ఒక్క అధికారి కూడా రాలేదని వాపోతున్నారు. ఇలాగే ఏనుగులు పంటలు నష్టపరిస్తే రైతుల పరిస్థితి ఏమిటని వాపోతున్నారు. -
సామాజిక సేవకు ఎస్పీ పిలుపు
● ‘గ్లోబల్ స్ఫూర్తి’ సొసైటీ లోగో ఆవిష్కరణ పార్వతీపురం రూరల్: ప్రతి ఒక్కరూ సామాజిక సేవలో భాగస్వాములు కావాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి పిలుపునిచ్చారు. తన కార్యాలయంలో పట్టణానికి చెందిన ’గ్లోబల్ స్ఫూర్తి డెవలప్మెంట్ సొసైటీ’ లోగోను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. యువతను తప్పుదోవ పట్టిస్తున్న మత్తు పదార్థాలు, గంజాయి వినియోగం, గ్రామాల్లోని చిల్లంగి వంటి మూఢనమ్మకాలపై స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. సొసైటీ అధ్యక్షుడు బలగ రాధానాయుడు మాట్లాడుతూ.. బాల్యవివాహాల నివారణ, మూఢనమ్మకాల నిర్మూలన, మత్తు పదార్థాల అనర్థాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు సంస్థను ప్రారంభించినట్లు తెలిపారు. అధికారుల, ప్రజల సహకారంతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం ఎస్పీని సొసైటీ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వానపల్లి శంకరరావు, ఎస్.ఎ.బి. లక్ష్మణరావు, ఎస్. వెంకటమహేష్, బి.బాబ్జి రావు పాల్గొన్నారు. -
మన్యంలో దీనంగా వనం..!
–10లోపరిశ్రమలు ఏర్పాటు చేయని వారికి నోటీసులివ్వండి స్థానిక గ్రోత్సెంటర్లోని భూములను ఏపీఐఐసీ ఎం.డి దినేష్ కుమార్ శనివారం సందర్శించారు. స్కూల్ బస్సులపై కొరడా..! మరికొన్ని రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న వేళ జిల్లాలో వేలాది మంది విద్యార్థులు రోజూ స్కూల్ బస్సులపైనే ఆధారపడనున్నారు. ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2026పచ్చని చెట్టుపై గొడ్డలి వేటు పడుతోంది. మైనింగ్, క్వారీలంటూ అక్రమార్కులు పచ్చని చెట్లను మాయం చేసి రహదారులు వేస్తూ మార్గం సుగమం చేసుకుంటున్నారు. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. ఈ వేసవిలో పలు ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీల వరకూ నమోదవుతున్నాయి. ఎండలు ఠారెత్తిస్తున్నాయి. నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. వేడి గాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇందుకు కారణం భూతాపాన్ని తగ్గించే చెట్లు, అడవుల వాతావరణం తగ్గిపోవడమేనని పర్యావరణ వేత్తలు అంటున్నారు. –సాక్షి, పార్వతీపురం మన్యంమన్యం అంటేనే పచ్చని కొండలు.. ఎటుచూసినా దట్టమైన చెట్లు.. ఆహ్లాదాన్ని పంచే చల్లని ఏజెన్సీ వాతావరణం. ఇది ఒకప్పటి మాటే.. ప్రస్తుతం ఆ వాతావరణమే మన్యంలో ఎక్కడా కానరావడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా భౌగోళిక విస్తీర్ణం 3,659 చదరపు కిలోమీటర్లు కాగా.. 1,077 చదరపు కిలోమీటర్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. మొత్తంగా 29.4 శాతం అడవులే ఉన్నాయి. మన్యంలో ఎటు చూసినా దట్టమైన చెట్లు, ఎత్తయిన కొండలు, నాగావళి, వంశధార, సువర్ణముఖి, వేగావతి నదుల పరవళ్లతో ఆహ్లాదకర వాతావరణం ఉండేది. కొన్నాళ్లుగా అభివృద్ధి పనుల పేరిట అడవుల రూపురేఖలు కోల్పోతున్నాయి. రోడ్లు, టవర్లు, ఆర్వోఎఫ్ఆర్ అంటూ పలు అభివృద్ధి పనులకు మార్గం సుగమం కావడం ఒకటైతే.. ఇదే సందర్భంలో మైనింగ్, క్వారీ తవ్వకాలు అంటూ కొండలను పిండి చేసేస్తున్నారు. వాటిని తరలించేందుకు చెట్లను తొలగించి రహదారులు చేస్తున్నారు. వంట చెరకు పేరిట కలప అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మునుపటితో పోల్చుకుంటే అడవుల విస్తీర్ణం పెంపునకు కసరత్తు జరగడం లేదు. విలువైన చెట్లు తరలించుకుపోతున్నా అటవీ శాఖ పర్యవేక్షణ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. టేకు, ఇతర విలువైన దుంగల తరలింపులో పెద్ద హస్తాలే ఎక్కువ ఉండడంతో ఏమీ చేయలేకపోతున్నారు. వనాలకు నిప్పు.. పోడు వ్యవసాయం పేరుతో గిరిజనులు ఏటా నిప్పు పెట్టి ఆకులను కాల్చి వేస్తున్నారు. వేసవి సీజన్లో జీడి చెట్ల వద్ద ఈ పరిస్థితి మరింతగా ఉంటోంది. నిప్పు పెట్టిన సమయంలో నిర్లక్ష్యంగా రాత్రి అంతా వదిలేయడం వల్ల కార్చిచ్చు వ్యాపిస్తోంది. దీనివల్ల ఎత్తయిన చెట్లు కూడా అగ్నికి ఆహుతవుతున్నాయి. గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకూ జిల్లాలోని నాలుగు అటవీ రేంజ్ల పరిధిలో 342 చోట్ల వనాల వద్ద మంటలు వ్యాపించిన ఘటనలు సంభవించాయి. ఇందులో అత్యధికంగా సాలూరు రేంజ్ పరిధిలో 116, పాలకొండ 111, పార్వతీపురం 81, కురుపాం 34 చొప్పున ఉన్నాయి. 24 గంటలూ మంటలు ఆరని పాయింట్లు కూడా కొన్ని ఉన్నాయని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. జిల్లాలో అటవీ రేంజ్లు: 4 (పాలకొండ, పార్వతీపురం, సాలూరు, కురుపాం) బ్లాక్స్ : 102 అటవీ విస్తీర్ణం : 1,07,721.38 హెక్టార్లు చెట్లు కొట్టివేయడం, అడవుల్లో కూడా కట్టడాలు పెరిగిపోవడం వల్ల వన్య ప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో రెండు ఏనుగుల గుంపులు గ్రామాల్లోకి చొరబడి ఇటు ప్రజలకు, అటు అటవీ శాఖాధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంటలను ధ్వంసం చేస్తున్నాయి. 13 మంది వరకూ మనుషులను పొట్టన పెట్టుకున్నాయి. సుమారు రూ.2.79 కోట్ల మేర పంటలను నష్టపరిచాయి. గ్రామాల్లోకి సమీప కొండల నుంచి ఎలుగు బంట్లు, నక్కలు, అడవి దున్నలు, జింకలు వంటివి వస్తున్నాయి. ప్రమాదకర విష సర్పాలు కూడా ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి. కురుపాం మండలం ఊసకొండ గ్రామంలో ఇళ్లలోకి ప్రవేశించిన కింగ్ కోబ్రా బాబూరావు అనే గిరిజనుడిని కాటు వేసింది. ఈ ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. కొద్దిరోజుల క్రితం సీతంపేట ఐటీడీఏ పీవో కార్యాలయంలోకి నల్ల త్రాచు ప్రవేశించి భయాందోళన కలిగించింది. అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తమై పట్టుకున్నారు. గతంలో రక్త పింజరి కూడా మరో చోట ఆందోళన కలిగించింది. ఇటీవల సాలూరు మండలం బాగువలస సమీపంలో అరుదైన పంట్ల పాము తారసపడింది. అడవుల్లోనే కనిపించే కింగ్ కోబ్రాలు తరుచూ గ్రామాల్లోకి రావడం వెనుక కారణం కూడా.. వాటికంటూ ఒక ఆవాస ప్రాంతాల్ని లేకుండా చేయడమే. అటవీ ప్రాంతాలను నాశనం చేస్తుండడం వల్ల అటు ఉష్ణ తాపం విపరీతంగా పెరగడంతో పాటు.. ఇటు వన్య ప్రాణులు కూడా వనాలను వదిలి జనావాసాల్లోకి వస్తున్నాయి. కరిగిపోతున్న అడవి.. కాలిపోతున్న అవని పచ్చదనం తగ్గితే.. భవిష్యత్తు ప్రశ్నార్థకమే జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పచ్చని చెట్ల మధ్య కార్చిచ్చు జనావాసాల్లోకి వన్యప్రాణులు అటవీ ప్రాంతాలను కాపాడేందుకు అన్ని చర్యలనూ తీసుకుంటున్నాం. కంపా, నరేగా నిధులతో మొక్కలు విరివిగా నాటి సంరక్షిస్తున్నాం. కార్చిచ్చు వల్ల కలిగే నష్టంపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. కొండలపై ఉన్న గిరిజన గ్రామాలకు కూడా అటవీ సిబ్బంది వెళ్లి వివరిస్తున్నారు. ఎవరైనా మంటలు పెట్టినా ఆర్పేశాక వెళ్లండి. – జీఏపీ ప్రసూన, జిల్లా అటవీ శాఖాధికారి -
నవచేతన యాప్పై అవగాహన
విజయనగరం రూరల్: మండలంలోని జొన్నవలస గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు నవచేతన యాప్ వినియోగంపై శనివారం అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ పీడీ బాలామణి ఈ కార్యక్రమంలో పాల్గొని, పలు సూచనలు చేశారు. ఆరేళ్ల వయసు లోపు చిన్నారులకు స్క్రీనింగ్ నిర్వహించి, వారి శారీరక, మానసిక స్థితి వివరాలను యాప్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. ఏ పిల్లల్లో అయినా చిన్నచిన్న లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే డీఈసీఐ రిఫరల్కు పంపించాలన్నారు. మూడేళ్ల వయసు లోపు పిల్లలతో వారి కుటుంబ సభ్యుల్లా వ్యవహరిస్తూ ఆటపాటలతో వారిని అలరిస్తే వారిలో నిమిషానికి 10 లక్షల న్యూరాలస్ వృద్ధి చెందుతాయన్నారు. రాకోడు పీహెచ్సీ వైద్యాధికారిణి కార్తీక..ఆరేళ్ల వయసులోపు పిల్లల ఏడీహెడ్ మైల్డ్ స్టోన్స్, ఆర్బీఎస్కేలపై అవగాహన కల్పించారు. పౌష్టికాహారం లోపంతో పిల్లలు బాధపడకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీవో రేఖావాణి, ఏసీడీపీవో సత్యవతి తదితరులు పాల్గొన్నారు. -
స్కూల్ బస్సులపై కొరడా..!
● జిల్లాలో 518 స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు ● 90 బస్సుల్లో లోపాల గుర్తింపు..నోటీసులు జారీ ● స్కూల్స్ తెరుచుకునేలోపు ప్రతి బస్సుపై నిఘాపిల్లల ప్రాణాలపై ప్రయోగాలు వద్దు స్కూల్ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్టింగ్వషర్, ఎమర్జెన్సీ డోర్, సురక్షిత సీట్లు, సరైన బ్రేక్ వ్యవస్థ, అనుభవజ్ఞులైన డ్రైవర్లు తప్పనిసరిగా ఉండాలని తల్లిదండ్రులు సూచిస్తున్నారు. కేవలం పత్రాల పరిశీలనతో సరిపెట్టకుండా వాహనం రోడ్డుపై ఎలా పనిచేస్తోందో కూడా పరీక్షించాలని కోరుతున్నారు.తూతూ మంత్రం తనిఖీలు వద్దంటున్న తల్లిదండ్రులు: గతంలో కొన్ని సందర్భాల్లో తనిఖీలు కేవలం నామమాత్రంగా జరిగాయనే విమర్శలు వినిపించాయి. ఈసారి మాత్రం ప్రతి బస్సును క్షుణ్ణంగా పరిశీలించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పేపర్ మీద సర్టిఫికెట్ ఇచ్చేయడం కాకుండా బస్సు నిజంగా సురక్షితమా కాదా అనేది చూడాలని పలువురు తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. -
రాజుల పాలనలో పేదలకు కష్టాలు
బొబ్బిలిరూరల్: బొబ్బిలి నియోజకవర్గంలో టీడీపీ నాయకుల పైత్యం పెచ్చుమీరుతోంది. మూడుపూటలూ తిండికి లేక, నిస్సహాయులైన నిరుపేద గిరిజన కుటుంబాలపై జలుం ప్రదర్శిస్తున్నారు. రాజకీయ కక్షతో ఏళ్లతరబడి నివాసముంటున్న పూరిపాకలను ఖాళీ చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇటీవల బొబ్బిలి మండలం అలజంగి గ్రామంలో పూజారి రాపాక జోగినాయుడు కుటుంబాన్ని పంచాయతీ స్థలంలో ఇల్లు ఉందని గెంటే యత్నం చేయగా, ఆ కుటుంబం కోర్టును ఆశ్రయించడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. కాశిందొరవలస పంచాయతీ డొంగురువలసలో అలాంటి దుశ్చర్యకు మళ్లీ పూనుకున్నారు. గ్రామంలో గెడ్డ పోరంబోకు స్థలంలో చిన్న పూరిపాకను వేసుకుని ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్న ఎన్నికల కళ్యాణ్, సీతపై వైఎస్సార్సీపీ సానుభూతిపరులన్న ముద్రవేసి కక్షసాధింపులకు దిగారు. గెడ్డపోరంబోకు స్థలంలో అక్రమంగా పూరిపాక వేసుకున్నారని, దానిని తొలగించాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ నేతతో ఒత్తిడి చేయించారు. దీంతో ఆర్డీఓ ఆక్రమణను సీరియస్గా తీసుకుని వెంటనే ఇల్లు ఖాళీ చేయించాలని, వారికి నోటీసులు పంపాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ఆ మేరకు శనివారం ఆర్ఐ రామకుమార్, వీఆర్వో సుధాకర్, పోలీసులు అక్కడకు చేరుకుని పూరిపాకను తొలగించాలంటూ నిరుపేదకుటుంబానికి నోటీసులిచ్చారు. రెండు రోజుల్లో ఖాళీ చేయకుంటే తామే పూరిల్లును కూల్చేస్తామని, బలవంతంగానైనా ఖాళీ చేయిస్తామని కళ్యాణ్ భార్య సీతకు నోటీసులిచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమయం ఇవ్వలేమని, వెంటనే ఖాళీ చేయాల్సిందేనని ఆదేశించారు. దీంతో బాధిత కుటుంబం గగ్గోలుపెడుతోంది. ఉన్నఫలంగా ఎక్కడ తలదాచుకోవాలో తెలియక తల్లఢిల్లుతోంది. అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇంటి స్థలాలు ఇస్తాం, ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పిన టీడీపీ నేతలు... ఇప్పుడు పేదలపై ప్రతాపం చూపుతున్నారని, సభ్యసమాజం తలదించుకునే పనులకు పూనుకుంటున్నారంటూ గ్రామస్తులు పలువురు విమర్శిస్తున్నారు. రోడ్డుపక్కన చాలా పూరిపాకలు, పశువుల శాలలు ఉండగా కేవలం గిరిజన కుటుంబం పూరిపాకనే ఖాళీ చేయాలని ఆదేశించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బొబ్బిలిలో అరాచక పాలన బొబ్బిలిలో రెండేళ్లుగా అరాచక పాలన సాగుతోంది. అధికార బలంతో పదవులను లాక్కోవడమే కాదు పేద గిరిజనులు సాగుచేస్తున్న భూములను దౌర్జన్యంగా కాజేస్తున్నారు. వారి ఇళ్లను కూలదోస్తున్నారు. పథకాలు అందకుండా చేస్తున్నారు. రాజరికం కాదు మాది రాక్షసపాలన అంటూ చేతల్లో చూపిస్తుండడంపై బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు విస్తుపోతున్నారు. పేదలను ఆదుకోవాల్సిన చేతులు కష్టాలపాలచేస్తుండడంపై జనం మండిపడుతున్నారు. కోటలు చూసి మురిసిపోవడం కాదని... పేదల కష్టాలు చూడాలని, వారిపై కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని హితవుపలుకుతున్నారు. వీరు పూర్వీకుల వలే రాజులు కాదు.. రాక్షసులంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. నిలువ నీడలేకుండా గెంటే యత్నం పూరిపాకను ఖాళీ చేయించేలా అధికారులకు ఫిర్యాదు రెవెన్యూ అధికారుల నోటీసుతో ఆందోళనలో గిరిజన కుటుంబం తిండికి లేనివారం రాజకీయాలు చేయగలమా అంటూ నిట్టూర్పు ఆదుకోవాలంటూ వేడుకోలు -
ప్రణాళిక యుత బోధనతో సత్ఫలితాలు
పార్వతీపురం: ఉపాధ్యాయులు రొటీన్ బోధనకు స్వస్తి చెప్పి, ప్రణాళిక యుత బోధనకు ప్రాధాన్యమివ్వాలని, దీనివల్ల సత్ఫలితాలు వస్తాయని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్స్లో శనివారం మాట్లాడారు. వృత్తిని ప్రేమించి స్వయం తృప్తి కోసం పనిచేయాలని సూచించారు. విద్యార్థుల్లో మంచి అలవాట్లు పెంపొందించేందుకు చెట్లు నాటడం, పరిశుభ్రత పాటించడం వంటి అంశాలను బోధించాలని సూచించారు. విద్యాసంవత్సరం తొలి మూడు నెలలు ఆటలు, పాటలు, నృత్యాలతో బోధన నిర్వహించాలన్నారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించేలా శిక్షణ ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయులు పాఠశాలకు అరగంట ముందుగానే హాజరై శుభ్రతను పర్యవేక్షించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఈఓ పి.బ్రహ్మాజీరావు, ఏపీఓ వై.శంకరరావు, తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమలు ఏర్పాటు చేయని వారికి నోటీసులివ్వండి
● ఏపీఐఐసీ అధికారులకు ఎం.డి దినేష్ కుమార్ ఆదేశాలు బొబ్బిలి: స్థానిక గ్రోత్సెంటర్లోని భూములను ఏపీఐఐసీ ఎం.డి దినేష్ కుమార్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రామమోహన రావు, ఏపీఐఐసీ అధికారులతో ఆయన మాట్లాడుతూ ఎన్ని పరిశ్రమలున్నాయి? ఎంతమందికి భూములు కేటాయించారన్న వివరాలను నోట్ ద్వారా తెలుసుకున్నారు. అనంతరం భూములను తీసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేయని వారికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం ఆర్వీఆర్ పరిశ్రమలో విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఇక్కడ ఏపీఐఐసీకి సంబంధించి ఎవరూ ఉండడం లేదని, సమస్యలు తెలుపుకునేందుకు శ్రీకాకుళం, విజయనగరం వెళ్లాల్సి వస్తోందని పారిశ్రామిక వేత్తలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అలాగే నీరు, విద్యుత్ సమస్య ఉందని వాపోయారు. వెంటనే ఆర్డీఓ రామమోహన రావుతో ఎం.డి మాట్లాడుతూ ఇక్కడ తహసీల్దార్ స్థాయి అధికారిని స్పెషలాఫీసర్గా నియించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలా వచ్చి అలా వెళ్లపోతారా? ఏపీఐఐసీ ఎం.డి లాంటి అధికారి ఎన్నో సమస్యలున్న గ్రోత్ సెంటర్కు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం సరికాదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పొట్నూరు శంకర రావు, మండల కార్యదర్శి సింగిరెడ్డి గోపాలం విమర్శించారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ స్థానిక గ్రోత్సెంటర్లో కార్మికులకు తాగునీరు లేక, పరిశ్రమలకు విద్యుత్, నీటి వసతి, రోడ్లు లేక అవస్థలు పడుతున్నారన్నారు. ఎవరిని కలిసి వినతిపత్రం ఇద్దామన్నా ఎవరూ లేని పరిస్థితుల్లో ఎం.డి వచ్చి వెంటనే వెళ్లిపోవడం, కనీసం మీడియాకు కూడా సమాచారం లేకపోవడం దారుణమన్నారు. -
10 కేజీల గంజాయితో ఇద్దరు నిందితుల అరెస్ట్
విజయనగరం క్రైమ్ : గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని స్థానిక రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంలపై పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. దీనిపై జీఆర్పీ ఎస్ఐ బాలాజీ రావు చెప్పిన వివరాల ప్రకారం...ప్లాట్ ఫాంలపై జీఆర్పీ, ఆర్పీఎఫ్ లు తనిఖీలు చేస్తుండగా కర్ణాటక రాష్ట్రం పాత హుబ్లీ, ధర్వాద్ జిల్లాలకు చెందిన అఖిలేష్ యార్మశల్, షబాజ్ రఫీ అమ్మద్ ఖాతిబ్లు ఒడిశా రాష్ట్రంలోని టికిరి నుంచీ పది కేజీలు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారు. ప్లాట్ ఫాం లపై తనిఖీలు చేస్తున్న పోలీస్ సిబ్బందిని చూసి వారు కంగారు పడటంతో జీఆర్పీ ఎస్సై బాలాజీరావుకు అనుమానం వచ్చి ఆర్పీఎఫ్ సిబ్బందితో ఇద్దరి వద్ద ఉన్న బ్యాగ్ లను తనిఖీ చేయగా గంజాయి అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. దీంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి విశాఖ రైల్వే కోర్ట్ కు తరలించామని జీఆర్పీ ఎస్సై బాలాజీ రావు తెలిపారు.లారీ బోల్తా● త్రుటిలో తప్పిన ప్రమాదం జియ్యమ్మవలస రూరల్: మండలంలోని పెదమేరంగి కూడలి సమీపాన గల గౌరవంపేట మలుపు వద్ద మామిడి పండ్లతో వస్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. శనివారం ఉదయం విజయనగరం నుంచి ఒడిశా మీదుగా ఢిల్లీ వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న స్కూటర్ను తప్పించబోయి అదుపుతప్పింది. దీంతో అటువైపు వస్తున్న ప్రయాణికులు ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ హాని జరగలేదని స్థానికులు తెలిపారు. పిడుగు పడి ఆవు మృతిజామి: మండల కేంద్రమైన జామిలో పిడుగుపడి ఆవు మృతి చెందింది. ఈ ఘటనపై బాధితులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక పెద్ద వర్రి వాని కళ్లాల వద్ద శనివారం మధ్యాహ్నం పిడుగుపడి రైతు కె. పరసన్న ఆవు మృతిచెందింది. పశువైద్యాధికారి సంతోష్కుమమార్ మృతి చెందిన ఆవును పరిశీలించారు. సుమారు రూ. 60వేలు ఖరీదు అయిన ఆవు మృతిచెందిందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు. అప్పు తీసుకున్న వ్యక్తి పరారీబొండపల్లి: మండలంలోని బి.రాజేరు గ్రామానికి చెందిన బండారు వెంకటేష్ తన ఇద్దరు కూతుళ్ల వద్ద నుంచి అప్పుగా తీసుకున్న నగదు ఇవ్వకుండా పరారీ అయినట్లు అంబటివలస గ్రామానికి చెందిన నరవ సత్యం వాపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బి.రాజేరు గ్రామానికి చెందిన వెంకటేష్ అదే గ్రామానికి చెవిన ఇసినిగిరి బంగారమ్మ, ధర్మవరపు పార్వతిల నుంచి నాలుగు లక్షల రుపాయలు అప్పుగా తీసుకుని గ్రామం నుంచి పరారీ అయ్యాడు. వెంకటేష్ మామ గ్రామంలోనే ఉన్నా, తనకు అప్పుకు ఏమీ సంబంధం లేదని చెబుతున్నాడని, పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినా అప్పు తీసుకున్న వ్యక్తి ఆచూకీ కోసం తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారని నరవ సత్యం చెప్పాడు. తన కూతుళ్ల వద్ద తీసుకున్న అప్పుకు గ్రామంలో గానీ, పోలీసుల వద్ద గానీ ఎటువంటి న్యాయం జరగలేదని న్యాయం చేసేలా చూడాలని కోరాడు. -
జర్మన్ సంస్థతో జేఎన్టీయూ జీవీ ఒప్పందం
విజయనగరం రూరల్: ఉన్నత విద్యను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే దిశగా స్థానిక జేఎన్టీయూ జీవీ కీలక ముందడుగు వేసింది. జర్మనీ దేశానికి చెందిన ప్రముఖ విద్యాసంస్థ రోత్లాంగేన్ యూనివర్సిటీ నాలెడ్జ్ ఫౌండేషన్ (కెఎఫ్ఆర్యు)తో శనివారం విద్యా సహకార ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఇరు సంస్థల ప్రతినిధులు జేఎన్టీయూలో నిర్వహించిన కార్యక్రమంలో ఒప్పందపత్రాలు మార్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఈ ఏడాది నుంచే అంతర్జాతీయ సమగ్ర డిగ్రీ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఒప్పందంతో విద్యార్థులు కేవలం ఐదేళ్లలోనే భారతీయ డిగ్రీతోపాటు అంతర్జాతీయ గుర్తింపు పొందిన జర్మన్ ఎంఎస్సీ డిగ్రీని సొంతం చేసుకునే అవకాశం లభిస్తుందని జేఎన్టీయూ జీవీ ప్రతినిధులు తెలి పారు. పలు కోర్సులు అందుబాటులో ఉంటాయ ని, నాణ్యమైన విద్య, తక్కువ ఫీజు, పరిశ్రమలతో అనుసంధానమైన విద్యావిధానం, ప్రపంచ ప్రఖ్యా త పరిశ్రమల్లో భారతీయ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని వారు పేర్కొన్నారు. ఇంటర్మీ డియట్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డుల్లో ఎంపీసీ గ్రూపులో కనీసం 60 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు వాటికి ధరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఏడాది ఈ కోర్సుల్లో ప్రవేశాలకు కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 7288873337 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
సంపూర్ణ పారిశుధ్య విజయనగరానికి సహకరించండి
విజయనగరం: విజయనగరాన్ని సంపూర్ణ పారిశుధ్య నగరంగా తీర్చిదిద్దాలని నగరపాలక సంస్థ కమిషనర్ బి.బాలస్వామి కోరారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా స్థానిక వసంత విహార్లోని బహుళ నివాస సముదాయాల వద్ద పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని శనివారం తొలగించారు. కమిషనరే స్వయంగా చెత్తను ఎత్తి ట్రాక్టరులో పోసి డంపింగ్ యార్డుకు తరలించారు. ప్రజారోగ్యం, స్వచ్ఛ విజయనగరమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం వేయకుండా రోజూ ఉదయం ఇంటి వద్దకు వస్తున్న పారిశుధ్య సిబ్బందికి చెత్తను అందించాలని చెప్పారు. నెల రోజుల పాటు ఎల్లో, రెడ్ స్పాట్లను శుభ్రపరిచే కార్యక్రమం చేపడతామన్నారు. ఈ వారం బహుళ నివాస, వాణిజ్య సముదాయాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టామని, వచ్చేవారం సామాజిక మరుగుదొడ్ల పరిశుభ్రత చేపట్టనున్నామన్నారు. కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
విజయమే ఇంటిపేరు.. విజయదుర్గ మరో ఘనత
నెల్లిమర్ల రూరల్: ఎక్కడో మారుమూల గ్రామం.. సాధారణ రైతు కుటుంబం..ప్రభుత్వ పాఠశాలలోనే చదువు..కానీ అసాధారణమైన లక్ష్యాలు, అచంచలమైన పట్టుదల విజయనగరం జిల్లా యువతి మీసాల విజయదుర్గను తెలంగాణ లా–సెట్లో తొలి ర్యాంక్ సాధించేలా చేశాయి. నెల్లిమర్ల మండలం ఆత్మారాముని అగ్రహారం గ్రామానికి చెందిన విజయదుర్గ గురువారం విడుదలైన తెలంగాణ లా–సెట్ ఫలితాల్లో ప్రథమ ర్యాంకు కైవసం చేసుకుంది. తండ్రి మీసాల వెంకట్రావు రైతు కాగా, తల్లి రామలక్ష్మి గృహిణి. సాధారణ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ కుమార్తె చదువుకు తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహం ఆమె విజయానికి బలమైన పునాది అయింది. ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసంరామతీర్థం ఉన్నత పాఠశాలలో చదివిన విజయదుర్గ చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరుస్తూ వచ్చింది. పదోతరగతిలో 568 మార్కులు సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొంది అక్కడే ఆరేళ్లు బీటెక్ విద్యను పూర్తి చేసింది. చదువు అనంతరం క్యాంపస్ ప్లేస్మెంట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి ఐదేళ్ల పాటు ఆ రంగంలో పనిచేశారు. ఉన్నత లక్ష్యాలే ముఖ్యమని భావించిన విజయదుర్గ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ పోటీ పరీక్షలపై దృష్టి సారించారు. పూర్తిస్థాయిలో సమయాన్ని కేటాయించేందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రూప్–2కు సన్నద్ధమయ్యారు. గ్రూప్–2లో సత్తా..డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం..పట్టుదలతో కష్టపడి చదువుకున్న విజయదుర్గ 2023 ఏపీపీఎస్పీ గ్రూప్–2 నోటిఫికేషన్ పరీక్ష రాశారు. ఇటీవల ఆ ఫలితాలు విడుదల కాగా ఉత్తమ ప్రతిభ కనబరిచి డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తరువాత కూడా చదువును కొనసాగించి న్యాయవృత్తిపై ఉన్న ఆసక్తి కారణంగా తెలంగాణ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2026 పరీక్షకు హాజరై రాష్ట్ర వ్యాప్తంగా ప్రథమ ర్యాంకు సాధించారు. పోటీ తీవ్రంగా ఉన్న పరీక్షలో అగ్రస్థానంలో నిలవడం ద్వారా తన ప్రతిభను మరోసారి చాటుకున్నారు. ఆమె విజయం ఎంతోమంది విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోంది. సరైన లక్ష్యం, కృషి ఉంటే ఏ నేపథ్యం నుంచైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని విజయదుర్గ నిరూపించారు.న్యాయమూర్తిగా సేవలందించడమే లక్ష్యంనా విజయ ప్రస్థానంలో తల్లిదండ్రులు వెంకట్రావు, రామలక్ష్మి ప్రోత్సాహంతో పాటు కాబోయే జీవిత భాగస్వామి శ్రావణ్ కుమార్ పటేల్ కృషి దాగి ఉంది. శిక్షణలో గురువుగా, మార్గదర్శకుడిగా ఆయన కీలకపాత్ర పోషించారు. డిప్యూటీ తహసీల్దార్గా ఎంపిక కావడంతో పాటు టీజీ లాసెట్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ప్రజాసేవతో పాటు న్యాయరంగంలోనూ విశిష్ట స్థానాన్ని సంపాదించి, సమాజానికి ఉపయోగపడే న్యాయమూర్తిగా ఎదిగి ప్రజాసేవకు అంకితమవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతాను. –మీసాల విజయదుర్గ -
రేపటి నుంచి 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం
పార్వతీపురం: జిల్లాలో జూన్ 7 నుంచి 21వ తేదీ వరకు ‘యోగాంధ్ర – 2026’ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి శుక్రవారం తెలిపారు. ‘ఒక జిల్లా–ఒకే ఇతివృత్తం’ నినాదంతో యోగా ప్రదర్శనలు, శిక్షణ కార్యక్రమాలు, పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జూన్ 11న తోటపల్లిలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం, జూన్ 15న సీతంపేటలోని ఎన్టీఆర్ అడ్వెంజర్ పార్క్, జూన్ 20న పాలకొండ, పార్వతీపురం, సాలూ రులలో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వ హిస్తామని పేర్కొన్నారు. జూన్ 21న పార్వతీ పురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లాస్థాయిలో యోగా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. పార్వతీపురం రూరల్: భావితరాలకు సురక్షితమైన భూమిని అందించేందుకు ప్రతి పౌరుడూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి ఎం.మాధురి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పార్వతీపు రం మన్యం జిల్లా కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు, న్యాయవాదులు కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. అనంత రం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, నీటి సంరక్షణ, చెట్ల పెంపకం, వ్యర్థాల సక్రమ నిర్వహణ ద్వారానే పర్యావరణాన్ని కాపాడుకోగలమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణపై సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించి, కోర్టు ప్రాంగణంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శ్రీధర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
డంపింగ్ యార్డు కథ మొదటికి!
–8లోసాధారణ రైతు కుటుంబానికి చెందిన వివాహిత చదువులో రాణిస్తోంది. అటు ఉద్యోగం, ఇటు పోటీ పరీక్షల్లో ‘విజయ’కేతనం ఎగురవేస్తోంది. సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం పట్టణంలో చెత్తశుద్ధి నిర్వహణ అంటూ కొన్నాళ్లు హడావిడి చేసినా.. ’చెత్త’ కథ మళ్లీ మొదటికే వచ్చింది. గుత్తేదారు సంస్థ కాలపరిమితి ముగియడంతో తమ వాహనాలను, యంత్రాలను తీసుకుని వెనుదిరిగింది. పార్వతీపురం పట్టణంలో సుమారు 62 వేల మంది జనాభా నివసిస్తున్నారు. దాదాపు 13 వేల నివాస గృహాలుండగా.. ఆవాసాలు, వ్యాపార సంస్థల నుంచి రోజుకు 25 టన్నుల వరకు చెత్త ఉత్పత్తి అవుతోంది. పట్టణ శివారులో ఉన్న డంపింగ్ యార్డులోనే దీన్ని పారబోస్తున్నారు. డంపింగ్ యార్డు సమస్య పట్టణ వాసులను ఏళ్లుగా వేధిస్తోంది. గతంలో పట్టణంలోని చెత్తశుద్ధి నిర్వహణకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సంస్థ తరుణి ఏజెన్సీకి పనులు అప్పగించింది. ఆ మేరకు కొన్నాళ్ల కిందట యార్డు సమీపంలోనే పనులు ప్రారంభించారు. చెత్తను నాలుగు భాగాలుగా ప్లాస్టిక్, మట్టిరాళ్లు, రబ్బరు, గాజు వ్యర్థాలను వేర్వేరు యంత్రాలతో విభజించాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ను విక్రయానికి తరలించి, మిగిలిన పనికిరాని వ్యర్థాలను తిరిగి భూమిలో కలిపేస్తారు. ఇలా పట్టణంలో 12 వేల టన్నుల వరకు వ్యర్థాలను విభజించాలి. వ్యర్థాలను మళ్లీ పట్టణంలోనే పారబోయడంపై విమర్శలు వ్యక్తమైన విషయం విదితమే. తాజాగా సదరు సంస్థకు అప్పగించిన కాంట్రాక్టు ముగియడంతో పనులు మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తదుపరి మున్సిపల్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. -
నాన్నా.. లే నాన్నా..
గరుగుబిల్లి/బలిజిపేట: నాన్నా.. లే నాన్నా... ఇప్పుడే బస్సు ఎక్కించావు... ఎన్నో జాగ్రత్తలు చెప్పావు.. అప్పుడే మా నుంచి దూరమయ్యావా... దేవుడా.. ఏమిటీ ఘోరం.. అంటూ తండ్రి మృతదేహాన్ని పట్టుకుని కుమార్తె రోదించిన తీరు అక్కడివారిని కన్నీరుపెట్టించింది. బలిజి పేట మండలం వెంగాపురం గ్రామానికి చెంది న బొంగు వెంకటనాయుడు(56) శుక్రవారం ఉదయం తన కుమార్తె లావణ్య పార్వతీపురంలో బీసీస్సీ పరీక్ష రాసేందుకు బైక్పై తీసుకొచ్చి గరుగుబిల్లిలో బస్సు ఎక్కించారు. తిరిగి ఇంటి కి వెళ్తుండగా గరుగుబిల్లి మండలంలోని రావుపల్లి–కొత్తపల్లి గ్రామాల మధ్య ఉన్న వెంకట శివ దుర్గ రైస్మిల్లు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమా దంలో లారీ కింద పడి అక్కడకక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ద్విచ క్ర వాహనం పూర్తి దెబ్బతింది. తండ్రి మృతి వార్త తెలుసుకున్న కుమార్తె, కుటుంబ సభ్యు లు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుపెట్టారు. సమాచారం అందుకున్న గరుగుబిల్లి ఎస్ఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పార్వతీ పు రం జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్గం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ఈశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. మృతుడు వెంకటనాయుడు బలిజిపేట జూనియర్ కళాశాలలో అటెండర్గా (ఎంటీఎస్ పద్ధతిలో) పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకటనాయుడు మృతిపై గ్రామస్తులు, సహోద్యోగులు సంతాపం తెలిపారు. -
ఓణీల ఫంక్షన్కు కలెక్షన్ల తంటా..!
● పాలకురాలి కుమార్తె ఫంక్షన్ కోసం అధికారులపై ఒత్తిడి ● మండలాల వారీగా టార్గెట్లు ● విస్తుపోతున్న ఉద్యోగవర్గాలు సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అంటే ఇదే మరి... మన నాయకురాలి ఇంట్లో ఫంక్షన్ ఉంది.. మనమంతా దారుకోవాలి.. పూనుకోవాలి.. రాసుకోవాలి.. పూసుకోవాలి అని పూనకాలు తెచ్చుకున్న పచ్చపార్టీ నాయకులు అలవిమాలిన స్వామిభక్తిని చాటుకోవడం.. దీనికోసం మండలాల వారీగా అధికారులకు టార్గెట్లు ఇవ్వడం మన్యంలో చర్చనీయాంశంగా మారింది. అసలే గిరిజన ప్రాంతం... ఆపై ప్రైవేటు కార్యక్రమానికి టార్గెట్లు ఇవ్వడం ఉద్యోగ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. అమ్మగారి ఇంటిలో ఓణీల ఫంక్షన్ ధూమ్ధామ్ అయిపోవాలి.. మూడు జిల్లాల్లో హోరెత్తిపోవాలి.. ‘ఈశ్వరి’ని ఆశీస్సులు అందేలా.. రెండు మూడు తరాలు చెప్పుకునేలా ఉండాలి అంటూ వేపకొమ్మలతో కొట్టుకునే రేంజిలో పచ్చపార్టీ నేతలు ఊగిపోవడం... ఆ ఖర్చు భరించాలంటూ ఉద్యోగులపై రుద్దడం విమర్శలకు తావిస్తోంది. ఏకంగా నియోజకవర్గ నేత ఇంటిలో ఐదు మండలాలకు చెందిన అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి మండలానికి రూ.4లక్షల చొప్పున కలెక్షన్ చేయాలంటూ టార్గెట్లు ఇచ్చారన్న ప్రచారం జోరందుకుంది. మండలాధికారులకు టార్గెట్లు అంటే అది వారి పరిధిలోనే ఉపాధి హామీ సిబ్బందితోపాటు సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడిపడుతుంది. మండలాధికారి ఆదేశాల మేరకు ఆయా ఉద్యో గులు చందాలు వేసుకుని ఆ నాలుగు లక్షలు పోగేసి ఇవ్వాల్సిన పరిస్థితి. ఇప్పటికే పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖల ఉద్యోగులు అలవిమాలిన పని ఒత్తిడి.. దండగమారి సర్వేలు, సమీక్షలతో నలిగిపోతున్న తరుణంలో ఓణీల ఫంక్షన్ కోసం ఇప్పు డు ఏకంగా చందా వసూళ్ల బాధ్యతలు పెట్టడంతో వారు అవుననలేక.. కాదనలేక లోలోన కుమిలిపోతున్నారు. మొత్తం మీద అమ్మవారి ఇంట ఫంక్ష న్లో డీజేల ముందు డ్యాన్స్లు చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులను అనివార్యంగా కార్యకర్తలు ముందుకు నెడుతున్నారంటూ కొందరు బహిరంగంగానే మండిపడుతున్నారు. ఇదెక్కడి తీరు.. పచ్చపార్టీ కార్యకర్తలు.. నాయకులకు రోకు ఉంటే వాళ్లువెళ్లి టెంట్లువేయాలి... పందిరి బొంగులు పాతాలి.. గాడి పొయ్యిలు తవ్వాలి... నీళ్ల కావిళ్లు మోయాలి కానీ ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తున్న మేమెందుకు ఈ పాలేరు పనిచేయాలంటూ ఉద్యోగులు లోలోన మదనపడుతున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇలాంటి చందాల సంస్కృతి ఎన్నడూ చూడలేదని చెబుతున్నారు. ఎవరైనా నాయకుల ఇళ్లలో ఫంక్షన్ ఉంటే అధికారులు తమ భక్తికొద్దీ త్రుణమోపణమో సీక్రెట్గా సమర్పించుకుని వచ్చేవారు. ఇప్పటిలా ఏకంగా సిబ్బంది మొత్తం పులివేషాలు వేసుకుని ఆటాడే పరిస్థితి లేదని అంటున్నారు. ఈ గండం నుంచి ఎలా తప్పించుకోవాలా అని మండలాధికారులు ఆలోచనలు చేస్తుండగా, కొత్తగా ఓ మండలానికి వచ్చిన అధికారి ఆ స్థాయిలో కలెక్షన్ చేయలేనని కరాఖండిగా చెప్పడంతో టార్గెట్లో రూ.లక్షన్నర తగ్గించారట. మరికొన్ని శాఖలకు కూడా వేర్వేరుగా టార్గెట్లు ఫిక్స్ చేశారన్న ప్రచారం సాగుతోంది. ఊరి సొమ్ము రాంభజన అన్నట్లుగా ఉద్యోగుల చందాలతో ఫంక్షన్ చేసేందుకు పూనుకున్న నేత ‘ఛీప్’ట్రిక్స్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భోజనం కోసం పిలవాలే గానీ చందాలు పట్టుకుని భోజనానికి రండి అంటూ ఆర్డర్వేయడంపై మండిపడుతున్నారు. మొత్తానికి అమ్మగారింట్లో ఫంక్షన్ అటు నాయకులకు మోదం.. ఉద్యోగులకు ఖేదంగా మారింది. -
దోచేద్దాం..!
శనివారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2026జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. నదులు, వాగులు, గెడ్డల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపుతో సొమ్ము చేసుకుంటోంది. ‘అధికార’ అండతో రాత్రీపగలు తేడాలేకుండా యంత్రాలతో ఇసుకను తవ్వతూ నదులను గుల్లచేస్తోంది. పెద్దపెద్ద గోతులు పెడుతూ నదీతీర గ్రామాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అధికారిక రేవుల వద్ద అనధికార వసూళ్లకు పాల్పడుతూ వినియోగదారుల జేబులకు చిల్లుపెడుతోంది. ●కొమరాడ మండలం నాగావళి నదీ తీరం నుంచి ఇసుక పెద్ద ఎత్తున అక్రమంగా తరలిపోతోంది. రాత్రీపగలు తేడా లేకుండా ఒక్క పాయింటు నుంచి రోజుకు 20–30 లారీల వరకూ జిల్లాతో పాటు సరిహద్దులు దాటి, ఒడిశా వంటి ప్రాంతాలకు తరలించేస్తున్నారు. కొమరాడ మండలం కోరిశీల గ్రామం సర్వే నంబర్ 54– 2ఏ పరిధిలోని నాగావళి నది తీరం నుంచి ఇసుకకు గత నెల 20న నిబంధనల ప్రకా రం మైనింగ్ కంపెనీకి అనుమతులు ఇచ్చా రు. దీనిపై కొంతమంది గిరిజనులు అభ్యంతరం వ్యక్తం చేయడం, వివాదం రేగడంతో తాత్కాలికంగా అక్కడ నిలుపుదల చేశారు. ఉలిపిరి పంచాయతీ రామ భద్రపురం, దేవకోన పంచాయతీ గాంధీనగ రం గ్రామాల మధ్య నాగావళి నది పక్కన ఉన్న రీచ్పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ●పాలకొండ నియోజక వర్గం భామిని మండలం నేరడి–బి సమీపంలో వంశధార నదీ తీరం నుంచి ఇసుక అడ్డూ అదుపు లేకుండా తరలిపోతోంది. అధికారుల ప్రోత్సాహంతోనే తరలిస్తున్నారని స్థానికు లు చెబుతున్నారు. నేరడి–బి ర్యాంపు నిర్వహణకు భూగర్భగనుల శాఖ అనుమతుల మేరకు ఇసుక కుప్పలు వేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు చెప్పుకొస్తున్నారు. ●వీరఘట్టం మండలం నడిమికెల్ల, పాలకొండ మండలం నాగావళి తీరం వెంబడి అన్నవరం తదితర ప్రాంతాల్లో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. నాగావళి నది నుంచి నిత్యం వందల సంఖ్యలో లోడ్లు అక్రమంగా రవాణా అవుతున్నాయి. ●సాలూరు, బలిజిపేట, సీతానగరం మండలా ల్లో సువర్ణముఖి, వేగావతి నదులను అక్రమా ర్కులు తోడేస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా తరలించి ప్రైవేటు స్థలాలు, తోట ల్లో కుప్పలుగా నిల్వ చేస్తున్నారు. అక్కడ నుంచి లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతోంది. వంతరాం, పనుకువలస, లక్ష్మీపురం ప్రాంతాల్లో అధికంగా ఈ పరిస్థితి ఉంది. భామిని మండలంలో వంశధార నదీ తీరంలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆగడం లేదు. అధికారులు దాడులు చేసినప్పుడు కొద్ది రోజులు మౌనంగా ఉంటున్నా.. తర్వాత యథావిధిగా ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ నిబంధనలను, పర్యావరణ చట్టాలను బేఖాతరు చేస్తూ నదులు, వాగులు, వంకల నుంచి పెద్దఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని వంశధార, నాగావళి నదుల పరివాహక ప్రాంతాల తో పాటు పలుచోట్ల ఉన్న వాగులు, చెరువుల పరిసరాలు అక్రమ తవ్వకాల కేంద్రాలుగా మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి వేళల్లో జేసీబీలు, ట్రాక్టర్లు, లారీలతో ఇసుకను వెలికితీసి సమీప ప్రాంతాలకు తరలిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజల నిరసనలు, ఫిర్యాదులు వచ్చినప్పటికీ అక్రమ తవ్వకాలు మాత్రం ఆగడం లేదని విమర్శిస్తున్నారు. అధికారుల తనిఖీలు జరుగుతున్నప్పటికీ, వాటి ప్రభా వం కేవలం తాత్కాలికంగానే ఉంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఇసుక అక్రమ తరలింపు ‘అధికారికంగానే’ సాగుతోంది. ప్రధానంగా కొమరాడ మండలం కూనేరు–రామభద్రపురం తదితర పాయి ంట్ల నుంచి సామాన్య గృహ నిర్మాణదారులు పార్వతీపురం వంటి ప్రాంతాలకు ఇసుక తరలించాలంటే ట్రాక్టరుకు రూ.3,600 వరకూ వెచ్చించాల్సి వస్తోంది. ఇక్కడ రీచ్ దగ్గర ట్రాక్టరుకు రూ.850 అధికారికంగా వసూలు చేస్తున్నారు. ఇంతకుముందు ఉచితం అని చెప్పినప్పుడు రూ.2 వేలు ఇస్తే ట్రాక్టర్ ఇసుకను తరలించేసేవా రు. మొన్నటి వరకు ఎవరైనా ఇంటి నిర్మాణం కోసం తరలిస్తే.. ఆధార్ కార్డు, చిరునామా, ఇతర వివరాలు చూపిస్తే సరిపోయేది. ఇప్పుడు అవేవీ అడగడం లేదు. పైగా, ఇక్కడ అధికారికం చేయడం వల్ల అక్కడ చెల్లించే రూ.850తో కలిపి రూ.3,200 నుంచి రూ.3,600 వరకూ వినియోగదారుల నుంచి తరలింపుదారులు వసూలు చేస్తున్నారు. అధికారికంగా వసూలు చేసే మొత్తానికి రీచ్ వద్ద ఎటువంటి రసీదు ఇవ్వడం లేదు. ఇక్కడ కూలీలను కూడా నిర్వహించడం లేదు. దానివల్ల ఆ మొత్తం భారం కూడా వినియోగదారునిపైనే పడుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమార్కులు ఇసుకను తరలించకపోయినప్పుడే తక్కువ ధరకు వచ్చేదని గృహ నిర్మాణదారులు అంటున్నారు. రానున్నది వర్షాకాలం కావడంతో ఇసుక లభ్యత, తరలింపునకు ఆస్కారం ఉండదన్న ఉద్దేశంతో అక్రమార్కులు దొరికినంత దోచేస్తున్నారు. స్థానికంగా ఉన్న కొందరు ట్రాక్టర్ల యజమానులు ఈ తరలింపులో కీలక పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా లోడ్లు తరలిపోతున్నా అడపాదడపా దాడులతో అధికారులు సరిపెడుతున్నారు. ఇటీవల కాలంలో సీతానగరం, కొమరాడ, నడిమికెల్ల సమీపంలో గుట్టలుగా ఉన్న ఇసుకను, తరలిస్తున్న వాహనాలను అధికారులు సీజ్ చేశారు. ఇందులో ప్రజాప్రతినిధులకు సంబంధించిన సొంత అవసరాల నిమిత్తం కూడా ట్రాక్టర్ల ద్వారానే తరలిస్తుండడం గమనార్హం. అధికారులు పట్టుకున్న వెంటనే ప్రజాప్రతినిధుల నుంచి ఫోన్లు వెళ్తున్నాయి. ట్రాక్టర్లను విడిచిపెట్టాలని హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అధికారులు జరిమానా విధించి వదిలేస్తున్నారు. మరుసటి రోజు నుంచే ఇసుకాసురులు యథావిధిగా ఇసుక దందా మొదలు పెట్టేస్తున్నారు. ఇసుక అక్రమ వ్యాపారం వెనుక ప్రజాప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
‘అనంత అరణ్య’ం ప్రారంభం
● పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత ● కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డిగుమ్మలక్ష్మీపురం: అడవులే మానవాళికి అసలైన జీవనాధారమని, పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి సామాజిక బాధ్యత అని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గుమ్మలక్ష్మీపురం మండలం దొరజమ్ములో జిల్లా నీటియాజమాన్య సంస్థ ఏర్పాటు చేసిన అనంత అరణ్యం మొక్కల పెంపకం కార్యక్రమాన్ని కలెక్టర్ శుక్రవారం ప్రారంభించి స్వయంగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా అంతటా ఈ ‘అనంత అరణ్య’ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా విస్తృతంగా చేపడుతున్నట్లు ప్రకటించారు. నాటి కాలం నుంచి ప్రకృతిని, చెట్లను పూజిస్తూ వస్తున్నామని, అడవి మనకు తల్లితో సమానమని గుర్తుచేశారు. వైద్యం, పండ్లు, కాయలు ఇలా ప్రతిదీ ప్రకృతి మనకు చెట్ల ద్వారానే ఉచితంగా అందుతున్నాయన్నారు. అయితే, మారుతున్న కాలంతో పాటు రకరకాల కారణాల వల్ల అడవులు, చెట్ల సంఖ్య తగ్గిపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. పూర్వం దొరికిన ఎన్నో రకాల పండ్లు ఇప్పుడు లభించడం లేదని, నేటి తరం రోగాల బారిన పడకుండా ఉండాలంటే రంగురంగుల పండ్లు, కూరగాయలను నేరుగా ఆహారంగా తీసుకోవాలని సూచించారు. బహుళ అంచెల సాగు అవలంబించాలి అలాగే రైతులు తమ పొలాల్లో కేవలం ఒకే రకమైన జీడి తోటలు లేదా మామిడి తోటలు వేయడం కంటే, బహుళ అంచెల సాగు విధానాన్ని అవలంబించాలని కలెక్టర్ సూచించారు. ఒకే పొలంలో పెద్ద చెట్లు, వాటికంటే చిన్నవి, ఇంకా చిన్న రకం చెట్లను వివిధ అంచెలుగా నాటుకోవాలని వివరించారు. జూన్ నెలలో వర్షాల కారణంగా దోమల వ్యాప్తి, మలేరియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, కావున ముందస్తుగానే దోమల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే 1,032 గ్రామాల్లో దోమల నియంత్రణ స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని రెండు విడతల్లో చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. జిల్లాలో ఒక్క మలేరియా కేసు నమోదైనా.. వైద్య సిబ్బందితో పాటు అన్ని శాఖల అధికారులు ఆ గ్రామానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టనున్నారన్నారు. కార్యక్రమంలో ఐటీడీఎ ప్రాజెక్ట్ అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి ఎం.శ్యామల, జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి ఎ.విజయశాంతి, ఇతర స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. -
కింగ్ కోబ్రా చేతుల్లో ప్రభుత్వ భూములు..!
చీపురుపల్లి: దాదాపు రూ.25 కోట్ల విలువైన భూములు ప్రభుత్వానికి ఉన్నప్పటికీ రెవెన్యూ యంత్రాంగం అటువైపు చూడడం లేదు. రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా ప్రభుత్వ భూములుగా చూపిస్తున్నప్పటికీ రికార్డులు చూస్తున్నారు తప్ప భూముల పరిరక్షణను పట్టించుకోవడం లేదు. బహుశా రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోవడం లేదనేనేమో భీమిలికి చెందిన ఓ కింగ్ ఆ ప్రభుత్వ భూముల్లో గెస్ట్హౌస్, ప్రహరీ, గేటు ఏర్పాటు చేసి రైతులను పంట పొలాలకు సైతం వెళ్లనీయకుండా అడ్డంగా గోడ నిర్మాణం చేశాడు. కర్లాం రెవెన్యూ పరిధిలో 87.34 ఎకరాల ప్రభుత్వ భూముల్లో ఇంత జరుగుతున్నా గ్రామ స్థాయి రెవెన్యూ అధికారి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ఎవరూ పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు విపిస్తున్నాయి. సదరు కింగ్ వెనుక అధికార టీడీపీలోని ఓ పెద్ద తలకాయ అండదండలు ఉండడంతోనే రెవెన్యూ యంత్రాంగం అటు వైపు చూడడం లేదనే చర్చ బహిరంగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఎంఎస్ఏంఈ పార్కుల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున భూములు సేకరించింది కానీ ఇక్కడ 87.34 ఎకరాలు మాత్రం రెవెన్యూ యంత్రాంగానికి కనిపించకపోవడం వెనుక ఆ పెద్ద తలకాయ అండదండలే కారణమని చర్చ జరుగుతోంది. సర్వే నంబర్ 408లో 87.34 ఎకరాల ప్రభుత్వ భూమి చీపురుపల్లి మండలంలోని కర్లాం రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 408లో 87.34 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం గయాలు భూమిగా పేర్కొన్నారు. ఆ భూములకు సంబంధించి గతంలో ఎలాంటి పట్టాలు మంజూరు చేయలేదు. రికార్డుల్లో 87.34 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ భూములు మాత్రం వేరే వ్యక్తుల చేతుల్లో ఉండడం గమనార్హం. పంట పొలాలకు వెళ్లకుండా గోడ నిర్మాణం మండలంలోని కర్లాం, నిమ్మలవలస, మోదుగులపేట తదితర గ్రామాలు పక్కపక్కనే ఉంటాయి. దీంతో వ్యవసాయ భూములు సైతం కలిసే ఉంటాయి. వ్యవసాయ భూములకు వెళ్లేందుకు ఈ మూడు గ్రామాల రైతులు సర్వే నంబర్ 408 లో నుంచే వెళ్లి వస్తుంటారు. అయితే ఈ భూముల్లో నుంచి రైతులను వెళ్లనివ్వకుండా సదరు కింగ్ అడ్డంగా గోడ నిర్మించారు. దీంతో రైతులు భూములకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. ఇదేంటని రైతులు అడిగితే ఆ భూమి తనదేనని రికార్డుల ప్రకారం ఎలాంటి దారి లేదని సదరు కింగ్ బదులిస్తున్నాడు. గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధం పంట పొలాలకు దారి లేకుండా గోడ నిర్మించడం, ప్రభుత్వ భూములను చేతిలో ఉంచుకోవడంపై గ్రీవెనన్స్ సెల్ ఫిర్యాదు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఎంఎస్ఏంఈ పార్కుల ఏర్పాటు కోసం ఎక్కడా లేని భూములను సేకరించిన ప్రభుత్వం కర్లాంలో 87.34 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ వదిలేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే సదరు కింగ్ మాత్రం ఆ భూములు తనవేనని తాను కొనుగోలు చేశానని చెప్పుకుంటున్నట్లు తెలిసింది. ప్రభుత్వ భూముల్లోనుంచి రైతులు వెళ్లకుండా ‘ఆడ్డుగోడ’..! ఆ భూముల్లో గెస్ట్ హౌస్, ప్రహరీ నిర్మాణం కర్లాంలో 87.34 ఎకరాలు ప్రభుత్వ గయాలు భూములు87.34 ఎకరాలు ప్రభుత్వ భూములే చీపురుపల్లి మండలంలోని కర్లాం రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 408లో 87.34 ఎకరాలు ప్రభుత్వ భూములే. రెవెన్యూ రికార్డుల ప్రకారం 87.34 ఎకరాలు గయాలు భూములుగా నమోదై ఉన్నాయి. అందులో ఎలాంటి పట్టాలు మంజూరు కాలేదు. ఆ భూముల్లో అక్రమ కట్టడాలపై ఇంతవరకు మా దృష్టికి రాలేదు. – డి.ధర్మరాజు, తహసీల్దార్, చీపురుపల్లి -
పీహెచ్సీల్లో ప్రసవాలు ఎక్కువగా జరగాలి
తెర్లాం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్సీ) ప్రసవాలు ఎక్కువగా జరిగేలా వైద్యులు, సిబ్బంది చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి(డీఎంహెచ్ఓ) డాక్టర్ జీవన్రాణి అన్నారు. ఈ మేరకు మండలంలోని తెర్లాం, పెరుమాళి పీహెచ్సీలను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తెర్లాం పీహెచ్సీలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై పలువురు రోగులను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీకి సంబంధించిన రికార్డులను, ల్యాబ్లో అందిస్తున్న సేవలను తనిఖీ చేశారు. ప్రతినెలా ఎంతమంది గర్భిణులకు ప్రసవాలు చేయిస్తున్నారని పీహెచ్సీ డాక్టర్లు రెడ్డి స్వాతి, వంశీలను అడిగారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ పీహెచ్సీలో ప్రతీ గర్భిణి తప్పనిసరిగా ప్రసవం చేయించుకునేలా వారికి వైద్య అధికారులు, సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెరుమాళి పీహెచ్సీకి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. రోగులకు, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. కేన్సర్ వ్యాధి నివారణ వ్యాక్సిన్పై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యులు డాక్టర్ వెంకటేశ్, మనోజ్ఞరమణిలను ఆదేశించారు. యోగా డే విజయంతమైయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టాలని, సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది యోగా డేలో పాల్గొనేలా చూడాలని పెరుమాళి ఆయుర్వేద వైద్యులు డాక్టర్ శ్రీనివాస్కు సూచించారు. పీహెచ్సీలో గల ల్యాబ్ ద్వారా చేస్తున్న పరీక్షలపై ల్యాబ్ టెక్నిషియన్ శివను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ జీవన్ రాణి -
11మందికి గంజాయి పరీక్షలు
● ఏడుగురికి పాజటివ్ ● గంజాయి డిటెక్షన్ కిట్స్ ద్వారా గుర్తింపువిజయనగరం క్రైమ్ : గంజాయి డిటెక్షన్ కిట్స్ ద్వారా గంజాయి వినియోగించే వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నామని ఎస్పీ దామోదర్ శుక్రవారం తెలిపారు. గంజాయి నిర్మూలనకు కఠిన చర్యలు చేపడుతున్నామని యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్న గంజాయి వినియోగం అరికట్టేందుకు ఇటీవల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లకు గంజాయి డిటెక్షన్ కిట్లను పంపిణీ చేశామన్నారు. గంజాయి డిటెక్షణ్ కిట్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారని, మూత్ర పరీక్ష ద్వారా కేవలం ఒక నిమిషంలోనే వ్యక్తి గంజాయి వినియోగించాడో లేదో అని నిర్ధారణ చేయవచ్చన్నారు. గంజాయి వినియోగించే వారిని గుర్తించేందుకు యాంటీ గంజాయి టీమ్, ఈగల్ టీమ్ గంజాయి డిటెక్షన్ కిట్స్తో పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. 11మందికి పరీక్షలు నిర్వహించగా, ఏడుగురికి పాజిటివ్ వచ్చిందని, వాళ్లంతా గంజాయి వినియోగించినట్లు నిర్ధారణ అయిందన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందన్న వివరాలను సేకరించి గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులను గాలిస్తున్నట్లు తెలిపారు. -
అన్నింటా ఆమెదే ‘విజయ’ం
● తెలంగాణ లా–సెట్లో స్టేట్ ఫస్ట్ ● ఇటీవల గ్రూప్–2 పరీక్షలోనూ విజయం ● డిప్యూటీ తహసీల్దార్గా ఉద్యోగం ● నెల్లిమర్ల యువతి అరుదైన ఘనతన్యాయమూర్తిగా సేవలందించడమే లక్ష్యం నా విజయ ప్రస్థానంలో తల్లిదండ్రులు వెంకట్రావు, రామలక్ష్మిల ప్రోత్సాహంతో పాటు కాబోయే జీవిత భాగస్వామి శ్రావణ్ కుమార్ పటేల్ కృషి దాగి ఉంది. శిక్షణలో గురువుగా, మార్గదర్శకుడిగా ఆయన కీలకపాత్ర పోషించారు. డిప్యూటీ తహసీల్దార్గా ఎంపిక కావడంతో పాటు టీజీ లాసెట్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ప్రజాసేవతో పాటు న్యాయరంగంలోనూ విశిష్ట స్థానాన్ని సంపాదించి, సమాజానికి ఉపయోగపడే న్యాయమూర్తిగా ఎదిగి ప్రజాసేవకు అంకితమవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతాను. –మీసాల విజయదుర్గనెల్లిమర్ల రూరల్: ఎక్కడో మారుమూల గ్రామం..సాధారణ రైతు కుటుంబం..ప్రభుత్వ పాఠశాలలోనే చదువు..కానీ అసాధారణమైన లక్ష్యాలు, అచంచలమైన పట్టుదల విజయనగరం జిల్లా యువతి మీసాల విజయదుర్గను తెలంగాణ లా–సెట్లో తొలి ర్యాంక్ సాధించేలా చేశాయి. నెల్లిమర్ల మండలం ఆత్మారాముని అగ్రహారం గ్రామానికి చెందిన విజయదుర్గ గురువారం విడుదలైన తెలంగాణ లా–సెట్ ఫలితాల్లో ప్రథమ ర్యాంకు కై వసం చేసుకుంది. తండ్రి మీసాల వెంకట్రావు రైతు కాగా, తల్లి రామలక్ష్మి గృహిణి. సాధారణ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ కుమార్తె చదువుకు తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహం ఆమె విజయానికి బలమైన పునాది అయింది. ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం రామతీర్థం ఉన్నత పాఠశాలలో చదివిన విజయదుర్గ చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరుస్తూ వచ్చింది. పదోతరగతిలో 568 మార్కులు సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొంది అక్కడే ఆరేళ్లు బీటెక్ విద్యను పూర్తి చేసింది. చదువు అనంతరం క్యాంపస్ ప్లేస్మెంట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి ఐదేళ్ల పాటు ఆ రంగంలో పనిచేశారు. ఉన్నత లక్ష్యాలే ముఖ్యమని భావించిన విజయదుర్గ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ పోటీ పరీక్షలపై దృష్టి సారించారు. పూర్తిస్థాయిలో సమయాన్ని కేటాయించేందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రూప్–2కు సన్నద్ధమయ్యారు. గ్రూప్–2లో సత్తా..డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం.. పట్టుదలతో కష్టపడి చదువుకున్న విజయదుర్గ 2023 ఏపీపీఎస్పీ గ్రూప్–2 నోటిఫికేషన్ పరీక్ష రాశారు. ఇటీవల ఆ ఫలితాలు విడుదల కాగా ఉత్తమ ప్రతిభ కనబరిచి డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తరువాత కూడా చదువును కొనసాగించి న్యాయవృత్తిపై ఉన్న ఆసక్తి కారణంగా తెలంగాణ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2026 పరీక్షకు హాజరై రాష్ట్ర వ్యాప్తంగా ప్రథమ ర్యాంకు సాధించారు. పోటీ తీవ్రంగా ఉన్న పరీక్షలో అగ్రస్థానంలో నిలవడం ద్వారా తన ప్రతిభను మరోసారి చాటుకున్నారు. ఆమె విజయం ఎంతోమంది విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోంది. సరైన లక్ష్యం, కృషి ఉంటే ఏ నేపథ్యం నుంచైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని విజయదుర్గ నిరూపించారు. -
సుపారీ గ్యాంగ్ అరెస్ట్
విజయనగరం క్రైమ్: సుపారీ ఇచ్చి సొంత అన్ననే హత్య చేయాలని తమ్ముడు ఏర్పాటు చేసుకున్న గ్యాంగ్ను విజయనగరం టూటౌన్ పోలీసులు పక్కా ప్రణాళికతో శుక్రవారం పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ మేరకు సీఐ శ్రీనివాస్ చెప్పిన వివరాల ప్రకారం..గుర్లకు చెందిన బుచ్చినాయుడికి విజయనగరంలో కొన్ని భవనాలు ఉన్నాయి. వాటి మరమ్మతుల కోసం ఫోన్ ద్వారా కుమార్, శివ, బాలు అనే ముగ్గురిని సంప్రదించాడు. వారు చెప్పిన స్థలం రింగ్ రోడ్లో గల లెజెండ్ బార్ లైన్ లోకి వచ్చిన బుచ్చినాయుడిని వారు ముగ్గురూ చితక్కొట్టి రూ.15 వేలు లాక్కుని పారిపోయారు. దీంతో హాస్పిటల్ పాలైన బుచ్చినాయుడు ఫిర్యాదుతో సీఐ శ్రీనివాస్, ఎస్సై కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా బుచ్చినాయుడికి తమ్ముడు పిన్నింటి రాముతో ఊరిలో భూ తగాదాల ఉన్న కారణంగా సొంత అన్ననే అంతం చేయాలనుకున్నట్లు విచారణలో తేలిందని సీఐ శ్రీనివాస్ తెలిపారు. కాల్ డేటా ఆధారంగా పిన్నింటి రాముతో పాటు దాడికి పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు చెప్పారు. -
చిల్లంగి నెపంతో హత్య కేసులో మరో ఐదుగురి అరెస్టు
పార్వతీపురం రూరల్: మండలంలోని వెలగవలసలో చిల్లంగి నెపంతో తాడంగి రమేష్ను హత్య చేసిన కేసులో పరారీలో ఉన్న మరో ఐదుగురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు పార్వతీపురం రూరల్ సీఐ రంగనాథం వివరాలు వెల్ల డించారు. ఇదే కేసులో ఈ నెల 16వ తేదీన 16 మందిని అరెస్టు చేయగా.. మిగిలిన ఐదుగురు నిందితులైన కొండ తామర కామేష్, తాడంగి సుజాత, కడ్రక చామంతి, కొండ గొర్రె సున్నమ్మ, కడ్రక రోజాలను తాజాగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గ్రామంలో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసు పికెట్ను కొనసాగిస్తున్నట్లు సీఐ తెలిపారు. ఎస్పీ మాధవ్రెడ్డి ఆదేశాలు, ఏఎస్పీ పర్యవేక్షణలో గ్రామస్తుల్లో మూఢనమ్మకాలపై అవగాహన కల్పించేందుకు ప్రతిరోజూ ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. రైల్వే ట్రాక్పై గుర్తుతెలియని మృతదేహంవిజయనగరం క్రైమ్: విజయనగరం కోరుకొండ రైల్వే స్టేషన్ ల మధ్య, రైల్వే ట్రాక్ మధ్యలో గుర్తు తెలియని మృతదేహాన్ని కనుగొన్నట్లు జీఆర్పీ హెచ్సీ శ్రీనివాస్ ప్రసాద్ శుక్రవారం తెలిపారు. మృతుడు సుమారు 5.6 అడుగుల పొడవు, చామనఛాయ రంగు, ముదురు నీలం రంగు షార్ట్ ధరించి ఉన్నాడన్నారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే ఫోన్ 9247585742, 94401 70317 నంబర్లకు తెలియ పరచాలని హెచ్సీ ప్రసాద్ కోరారు. విద్యుత్ షాక్తో యువకుడి మృతివిజయనగరం క్రైమ్: శ్రీకాకుళం జిల్లా గార మండలం జొన్నలపాడుకు చెందిన యువకుడు రాజాన అశోక్ (18) విద్యుత్ షాక్ తో శుక్రవారం మృతి చెందినట్లు విజయనగరం టూటౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..అంబటి సత్రం వద్ద గల మల్లిక ఎలక్ట్రానిక్ షాప్ లో అశోక్ పని చేస్తున్నాడు. ఇటీవల వీచిన భారీ గాలులకు షాపు బోర్డు ఊడిపోవడంతో మిత్రులతో కలిసి బోర్డును సరిదిద్దే క్రమంలో పక్కనే ట్రాన్స్ఫార్మర్కు తగలడంతో షాక్ కొట్టి మృతిచెందాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ చెప్పారు. సాక్షి, పార్వతీపురం మన్యం: గరుగుబిల్లి మండలం తోటపల్లిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి, కోదండ రామస్వామి ఆలయాల్లో ప్రైవేటు వ్యక్తుల పెత్తనానికి అడ్డుకట్టపడింది. ఆలయంలో ప్రైవేట్ కమిటీ ద్వారా విరాళాలు సేకరించడంపై సమగ్ర నివేదిక అందజేయాలని కలెక్టర్ ప్రభాకరరెడ్డి దేవదాయ శాఖ అధికారులకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ కమిటీ వ్యక్తుల ద్వారా విరాళాల సేకరణ, ప్రసాదాల అమ్మకాన్ని నిలిపివేయాలని ఆలయ కార్యనిర్వహణ అధికారికి జిల్లా దేవదాయ శాఖ అధికారి రాజారావు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఉన్నతాధికారుల నుంచి నిర్దిష్ట అనుమతి లేకుండా ఏ ప్రైవేటు కమిటీని కూడా అనుమతించవద్దని ఆదేశించారు. పద్మ పురస్కారాలకు నామినేషన్ల ఆహ్వానం పార్వతీపురం రూరల్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ప్రకటించను న్న పద్మ పురస్కారాలకు అర్హులైన వారి నుంచి నామినేషన్లు, సిఫార్సులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ, సాధికారిత అధికారిణి డా.టి.కనకదుర్గ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర హోం వ్యవహారాల మంత్రి త్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ ఎంపిక ప్రక్రియకు, జిల్లా పరిధిలో మహిళా సాధికారత, శిశు సంక్షేమ రంగాల్లో విశేష సేవలందించిన వ్యక్తుల పేర్లను ప్రతిపాదించవచ్చని పేర్కొన్నా రు. ఆసక్తి గల అభ్యర్థులు లేదా సిఫార్సుదారులు ‘రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్’ అధికారిక వెబ్సైట్ ద్వారా తమ నామినేషన్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను అప్లోడ్ చేయడానికి జూన్ 15, 2026 వరకు గడువు ఉందని, జిల్లాలోని అర్హులైన వ్యక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకో వాలని ఆమె కోరారు. సీతంపేట: మలేరియా నివారణ చర్యలు చేపడుతున్నట్లు శ్రీకాకుళం డీఎంవో పి.వి.సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు స్థానిక ఏరియా ఆస్పత్రిని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో నమోదువుతున్న జ్వరపీడితుల సంఖ్య, దానిలో మలేరియా పీఎఫ్, పీవీ ఎన్ని అని తెలుసుకున్నారు. ల్యాబ్ను పరిశీలించారు. ఇన్పేషెంట్లుగా వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్లి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, సబ్యూనిట్ ఆఫీసర్ జె.మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
49 బస్తాల పీడీఎస్ బియ్యం పట్టివేత
గజపతినగరం రూరల్: విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారంపై గజపతినగరంలో మెరుపు దాడి చేశారు. ఏకకాలంలో మూడు చోట్ల దాడులు చేసి మూడు ఆటోలతో తరలిస్తున్న 49 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గజపతినగరం నుంచి మూడు ఆటోలతో వేరువేరు ప్రాంతాలకు పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో శుక్రవారం ఉదయమే పకడ్బందీగా ప్లాన్ చేసిన విజిలెన్స్ ఎండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై రామారావు ఆధ్వర్యంలో దాడులు చేసి లింగాలవలస బ్రిడ్జి, గజపతినగరం పీఏసీఎస్, గజపతినగరం రైల్వే స్టేషన్ సమీపంలో మూడు ఆటోలతో తరలిస్తున్న 48 బస్తాలు పట్టుకున్నారు. నిందితులపై 6ఎ కేసు నమోదు చేసి పట్టుబడిన బియ్యాన్ని లింగాలవలస రేషన్ డిపోకు, ఆటోలను గజపతినగరం పోలీసులకు అప్పగించారు. ఈ బియ్యం ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఇదే దాడుల్లో, 10 బస్తాల రాగులు కూడా దొరికినట్లు తెలుస్తోంది. దాడుల్లో గజపతినగరం పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్ చిరంజీవి, రెవెన్యూ సిబ్బంది కూడా పాల్గొన్నారు. రాజాంలో.. రాజాం: పట్టణంలోని చీపురుపల్లిరోడ్డులో ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు సీఎస్డీటీ అనంత్కుమార్ తెలిపారు. మండలంలోని గడిముడిదాం గ్రామం నుంచి గణపతి అనే వ్యక్తి ఈ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్నారు. శుక్రవారం చీపురుపల్లి రోడ్డులో ఆర్ఐ మహేష్తో కలిసి వాహనాలు తనిఖీచేయగా బియ్యం పట్టుబడ్డాయని పేర్కొన్నారు. ఈ దాడుల్లో 5 క్వింటాళ్ల బియ్యం దొరకగా బియ్యాన్ని సీజ్ చేసి, ఎంఎల్ఎస్ గోదాంకు తరలించామని, ఆటోను సీజ్చేసి, పోలీసులకు అప్పగించామని వివరించారు. ఈ మేరకు కేసు నమోదుచేసినట్లు సీఎస్డీటీ పేర్కొన్నారు. -
రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు జిల్లా జట్టు సిద్ధం
పాలకొండ రూరల్/సీతంపేట: జిల్లాలో ప్రతిభావంతులైన హాకీ క్రీడాకారులకు కొదవ లేదని పార్వతీపురం మన్యం జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.రామినాయుడు అన్నారు. ఈ మేరకు సీతంపేటలోని ఐటీడీఏ క్రీడా ప్రాంగణంలో గురువారం నిర్వహించిన జిల్లా జట్టు ఎంపిక పోటీలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 12 నుంచి మూడు రోజులు సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరగనున్న రాష్ట్ర స్థాయి హాకీ పోటలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్న జట్టును సిద్ధం చేశామన్నారు. శిక్షకులు సవర రాజేష్, అసోసియేషన్ కోశాఽధికారి అల్లు సురేష్ నేతృత్వంలో చేపట్టిన ఎంపిక పోటీల్లో సీతంపేట, పాలకొండ, భామిని, పార్వతీపురం మండలాల నుంచి తలపడ్డ 28 మంది సీనియర్ క్రీడాకారుల నుంచి 18 మందిని ఎంపిక చేశామన్నారు. వారికి మరింత తర్ఫీదు అందించి రాష్ట్ర స్థాయి క్రీడల్లో జిల్లా సత్తా చాటేలా కృషి చేస్తామన్నారు. ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జిల్లా అసోసియేషన్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. -
రెండు లారీలు ఢీకొని డ్రైవర్కు గాయాలు
గజపతినగరం రూరల్: మండలంలోని మధుపాడ 26వ నంబర్ జాతీయ రహదారి వద్ద బుధవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్న సంఘటనలో ఓ లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రి సాలూరు నుంచి వస్తున్న లారీ, ఎదురుగా విజయనగరం నుంచి వస్తున్న లారీ మధుపాడ జాతీయరహదారి వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సాలూరు నుంచి వస్తున్న కేరళ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా రోడ్డుకు అడ్డంగా ఉన్న లారీలను పోలీసులు క్రేన్ సహాయంతో పక్కకు తీశారు. -
విద్యుత్ షాక్తో విలేజ్ ఎలక్ట్రికల్ వర్కర్ మృతి
చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి మండలంలోని బొండపల్లి గ్రామానికి చెందిన విలేజ్ ఎలక్ట్రికల్ వర్కర్ (వీఈడబ్ల్యూ) లోచర్ల సాయిబాబు విద్యుత్ షాక్ తగిలి మృతిచెందాడు. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల మేరకు వర్షాల కారణంగా తలెత్తిన విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు సాయిబాబు సిరుగుడుపేట వద్ద గల ఏబీ స్విచ్ను ఆఫ్ చేసేందుకు విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఈ క్రమంలో విద్యుత్ వైర్ పక్కనే ఉన్న హెవీ లైన్కు తగలడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురయ్యాడు. ఈ సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే విద్యుత్శాఖ అధికారులకు సమాచారం అందించి విద్యుత్ ప్రమాదానికి గురైన సాయిబాబును రాజాం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే సాయిబాబు ప్రాణాలు కోల్పోయాడు. సాయిబాబు చీపురుపల్లి ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 20 ఏళ్లుగా సొంత గ్రామంలోనే విలేజ్ ఎలక్ట్రికల్ వర్కర్గా పనిచేస్తున్నాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి మరణంతో భార్య, పిల్లలు అనాథలుగా మిగిలారు. ఇరవై ఏళ్లుగా చీపురుపల్లిలో ఆర్ఈసీఎస్ ఉన్నప్పటి నుంచి విధులు నిర్వహిస్తూ విద్యుత్ షాక్తో మరణించిన సాయిబాబు కుటుంబాన్ని ఆదుకోవాలని ఏపీఈపీడీసీఎల్ పరిధిలో పని చేస్తున్న వీఈడబ్ల్యూలు, జేఎల్ఎమ్, ఎనర్జీ అసిస్టెంట్ల సంఘం ప్రతినిధులు కోరుతున్నారు. -
అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలి
పార్వతీపురం రూరల్: ప్రాథమిక దశలోనే విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) పి.బ్రహ్మాజీరా వు సూచించారు. పార్వతీపురం డీవీఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక ఉపాధ్యాయులకు ఏర్పాటుచేసిన ఆరు రోజుల ’ఎఫ్ఎల్ఎన్’ శిక్షణను గురువారం ఆయన ప్రారంభించారు. ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం ధారాళంగా చదవడం, రాయడంతో పాటు గణితంలోని చతుర్విద ప్రక్రియలపై అవగాహన కల్పించడమే శిక్షణ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారి బి.రాజ్కుమార్, బలిజిపేట ఎంఈఓ, కోర్స్ డైరెక్టర్ సామల సింహాచలం, ఎస్సీఈఆర్టీ పరిశీలకులు సురేష్కు మార్, ఏఎంఓ కోటేశ్వరరావు, ఎంఈఓలు వై.విమలకుమారి, సూరి దేముడు, ప్రసాదరావు, మువ్వల వెంకటరమణ, ప్రథంసంస్థ కో–ఆర్డినేటర్ కిరణ్, కేఆర్పీలు వనజాక్షి, రవికుమార్, డీఆర్పీలతో పాటు 260 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
4.5 కిలోల కణితి తొలగింపు
మహారాణిపేట (విశాఖ): కేజీహెచ్లో వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన టి.రజని ఏడాది కాలంగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ గత నెల 14న కేజీహెచ్ యూరాలజీ విభాగంలో చేరారు. పరీక్షల అనంతరం ఆమె కడుపులోని అడ్రినల్ గ్రంథిలో కుడివైపు 6 సెం.మీ, ఎడమవైపు 28 సెం.మీ మేర కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. లక్ష మందిలో నలుగురికి మాత్రమే వచ్చే ‘బైలాటరల్ అడ్రినల్ మైలోలిపోమా విత్ కంజెనిటల్ అడ్రినల్ హైపర్ప్లాసియా’ అనే అరుదైన వ్యాధిగా దీనిని నిర్ధారించారు. యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ చంద్రశేఖర్ పర్యవేక్షణలో, ఎండోక్రినాలజీ, అనస్తీషియా విభాగాల సహకారంతో గత నెల 19న రజనికి శస్త్రచికిత్స చేసి కడుపులో ఉన్న 4.5 కిలోల భారీ కణితను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో గురువారం డిశ్చార్జ్ చేసినట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తెలిపారు. విజయవంతంగా శస్త్రచికిత్స చేసిన డాక్టర్ చంద్రశేఖర్, అనస్తీషియా వైద్యులు కె.శ్రీలక్ష్మి, శరత్ చంద్ర, అప్పలరాజు, వెంకటకృష్ణ, దత్తాత్రేయ బృందాన్ని సూపరింటెండెంట్ అభినందించారు.జులై 1న డీఈఈ సెట్● ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణారావు నెల్లిమర్ల: డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(డీఈఈ సెట్) జులై 1వ తేదీన జరుగుతుందని వేణుగోపాలపురం ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామకృష్ణారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ నెల 11 నుంచి తమ హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చునని చెప్పారు. జులై 4న ఫలితాలు వెలువడతాయన్నారు. 10 నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షనన్ కోసం అవకాశం ఉంటుందన్నారు. 16న సీట్ల కేటాయింపు, 19 నుంచి 23 వరకు ధ్రువీకరణపత్రాల పరిశీలన ఉంటుందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఫుట్బాల్ ఏపీ జట్టు కెప్టెన్గా నవీన్విజయనగరం అర్బన్: జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు కెప్టెన్గా స్థానిక సత్య డిగ్రీ/ పీజీ కళాశాల విద్యార్ధి పి.నవీన్ ఎంపికయ్యాయడని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీసాయిదేవ మణి తెలిపారు. అనంతపురం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ‘స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లీగ్స్’ రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీల్లో నవీన్ అద్భుతమైన ఆటతీరు కనబరిచి విజేతగా నిలిచాడు. త్వరలో జెంషెడ్పూర్లో జరగబోయే జాతీయ స్థాయి ఫుట్బాల్ చాంపియన్షిప్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో గురువారం జరిగిన కార్యక్రమంలో నవీన్ను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణ్రావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీసాయిదేవ మణి, కళాశాల అధ్యాపక బృందం అభినందించారు. రేపటి నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు విజయనగరం అర్బన్: జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షల కాలపట్టిను ఆర్ఐఓ ఎస్.తవిటినినాయుడు విడుదల చేశారు. ప్రభుత్వ జూనియర్ కాళాశాలలో ప్రధాన పరీక్ష కేంద్రంగా నిర్దేశిస్తూ జనరల్, ఒకేషనల్, ఇతర సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలను ప్రకటించారు. జనరల్ కోర్సుల ప్రాక్టికల్స్ షెడ్యూల్లో ఈ నెల 7న బోటనీ, 8న జువాలజీ, 8, 9 తేదీల్లో ఫిజిక్స్, 9, 10 తేదీల్లో కెమిస్ట్రీ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. వొకేషనల్ కోర్సుల షెడ్యూల్లో ఈ నెల 7, 8 వ తేదీల్లో వొకేషనల్ గ్రూపులు, 10, 11 తేదీలలో వొకేషనల్ బ్రిడ్జి కోర్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వొకేషనల్ ప్రాక్టికల్ పరీక్షల కేంద్రాలు కొత్తవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎస్.కోట ప్రభుత్వ జూనియర్ కళాశాల, గుర్ల కేజీబీవీ, గజపతినగరం శ్రీకృష్ణజూనియర్ కళాశాల ప్రాంతాల్లో నిర్వహిస్తారు. ఈ నెల 6న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, 12న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వేల్యూస్ సబ్జెక్టుల పరీక్ష ఉంటాయని తెలిపారు. విద్యార్ధులందరూ తమ హాల్ టికెట్లలో కేటాయించిన సమయం ప్రకారం, ఆయా పరీక్ష కేంద్రాలకు సకాలంలో హాజరై పరీక్షలు రాసుకోవాలని ఆర్ఐఓ కోరారు. -
8న అంబేడ్కర్ గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
విజయనగరం అర్బన్: ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న డాక్టర్ బీఆర్అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో (జోన్–1 పరిధిలో) వివిధ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి విజయనగరం జిల్లా సమన్వయ అధికారి ఎం.మాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు ఇదొక మంచి అవకాశమని పేర్కొన్నారు. ఈ సీట్ల భర్తీకి సంబంధించి ఈ నెల 8న జిల్లాలోని చీపురుపల్లిలో గల డాక్టర్ బీఆర్అంబేడ్కర్ గురుకుల పాఠశాల ఆవరణలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. తరగతుల వారీగా ఖాళీగా ఉన్న సీట్ల వివరాలు ఇలా.. 5వ తరగతి ప్రవేశాల్లో బాలుర పాఠశాలల్లో 255 సీట్లు, బాలికల పాఠశాలల్లో 341 సీట్లు ఉన్నాయి. ఇంటర్మీడియట్ ప్రవేశాల్లో భాగంగా బాలుర కళాశాలల్లో 224 సీట్లు, బాలికల కళాశాలల్లో 202 సీట్లు ఖాళీగా ఉన్నాయి. బ్యాక్లాగ్ సీట్లుగా 6వ తరగతి బాలుర పాఠశాలల్లో 162, బాలికల పాఠశాలల్లో 169 ఖాళీలు ఉన్నాయి. 7వ తరగతిలో బాలుర పాఠశాలల్లో 47 సీట్లు, బాలికల పాఠశాలల్లో 86, 8వ తరగతి బాలుర పాఠశాలల్లో 19, బాలికల పాఠశాల్లో 84, 9వ తరగతి బాలుర పాఠశాలల్లో 45, బాలికల పాఠశాలల్లో 9 సీట్లు అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. సీట్లు అన్నీ కేవలం ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు మాత్రమే అని, అర్హత ఆసక్తిగల విద్యార్ధులు తమకు సంబంధించిన అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలతో ఈ నెల 8న చీపురుపల్లిలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాల కౌన్సెలింగ్ కేంద్రానికి నేరుగా హాజరుకావాలని ఆమె కోరారు. -
దగాకోరు పాలన మాకొద్దు
హామీలతో ఊరించారు.. నమ్మేలా ప్రచారం చేశారు.. ఓట్లు దండుకున్నాక దగాకోరు పాలనతో నమ్మినవారిని నయవంచనకు గురిచేశారు. ఆడబిడ్డ నిధి లేదు.. జాబ్ క్యాలెండర్ విడుదల లేదు.. నిరుద్యోగ భృతి ఊసేలేదు.. ఫీజురీయింబర్స్మెంట్ పథకాన్ని కాస్త పెండింగ్ పథకంగా మార్చేశారు.. ఉచిత పంటల బీమాకు మంగళం పాడేశారు.. పింఛన్లు, ఇళ్లు, స్థలాల మంజూరు మాటనే మరిచారు.. కార్మిక, కర్షక, ఉద్యోగ, విద్యార్థి, మహిళా సంక్షేమాన్ని విస్మరిస్తూ.. అభివృద్ధిని పక్కనపెట్టి, నిత్యావసర సరుకుల ధరల నియంత్రణను పట్టించుకోకుండా, అమరావతి పేరుతో ప్రజాధనం లూటీ చేస్తూ, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్న మీ రాక్షసపాలనకో దండం. మీ దగాకోరు పాలన మాకొద్దంటూ జనం నినదించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రోడ్లపై నిరసన ర్యాలీలు నిర్వహించారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసన గళం వినిపించారు. సూపర్ సిక్స్ అంటూ మోసం ఫిక్స్చేసిన తీరును ఎండగట్టారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనపై పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీచంద్రబాబు రెండేళ్ల నయవంచక పాలనపై కురు పాం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు, మాజీ ఉపముఖ్యమంత్రి, పార్టీ పీఏసీ సభ్యులు పాముల పుష్పశ్రీ వాణి ఆధ్వర్యంలో ప్రజలు నిరసన తెలిపారు. తొలుత గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ముఖద్వారం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న వైఎస్సార్ విగ్రహం వరకు భారీ సంఖ్యలో హాజరై న నాయకులు, కార్యకర్తలతో కలిసి పుష్పశ్రీవాణి, పరీక్షిత్రాజు ర్యాలీగా వెళ్లారు. అక్కడ చంద్రబాబు అందించిన మోసపూరిత బాండ్లను, మేనిఫెస్టో ప్రతులు, ప్రకటనలను దహనం చేశారు. గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కొమరాడ మండల కేంద్రాల్లోనూ ఆయా మండల నాయకులు, వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. కురుపాం మండల కేంద్రంలో ర్యాలీ అనంతరం మేనిఫెస్టో ప్రతులను నాయకు లు దహనం చేస్తుండగా.. పోలీసులు అడ్డుకున్నా రు. కాసేపు అంతరాయం కలిగించినా పార్టీ శ్రేణులు కార్యక్రమాన్ని విజయవంతం చేశాయి. -
నేటి మొక్క రేపటి ఊపిరి..!
● మొక్కలు నాటుదాం..పుడమి తల్లికి కానుకిద్దాం ● ప్రకృతితో సహజీవనమే పర్యావరణ పరిరక్షణ ● నేడే ప్రపంచ పర్యావరణ దినోత్సవం విజయనగరం గంటస్తంభం: మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అసలు ఒడి మాత్రం ప్రకృతిదే. గాలి, నీరు, నీడనిచ్చేది ప్రకృతి. అలాంటి ప్రకృతినే మనిషి తన చేతులతో నాశనం చేస్తున్నాడు. ఒకప్పుడు ఊరి బయట పెద్ద పెద్ద మర్రిచెట్లు ఉండేవి. వాటి కింద రైతులు సేద తీరేవారు. ప్రయాణికులు కాసేపు విశ్రాంతి తీసుకునేవారు. పక్షులు గూళ్లు కట్టుకునేవి. ఇప్పుడు ఆ చెట్ల స్థానంలో సిమెంట్ కట్టడాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు నిండుగా కళకళలాడిన చెరువులు ఇప్పుడు ఎండిన మైదానాలుగా మారుతున్నాయి. అభివృద్ధి పేరుతో మనిషి ప్రకృతిని దూరం చేసుకుంటున్నాడు. కానీ ప్రకృతిని కోల్పోతే అభివృద్ధి కూడా నిలవదనే విషయాన్ని మరిచిపోతున్నాడు. ప్రకృతి విలాపం వినిపించదా? ఈ వేసవిలో విజయనగరం జిల్లాలో మండిపోయిన ఎండలకు మధ్యాహ్నం పూట రోడ్లపై జనాలు కనిపించలేదు. చెట్టు నీడ కోసం వెతికే పరిస్థితి వచ్చింది. ఇది కేవలం వాతావరణ మార్పు కాదు..ప్రకృతి మనకు ఇస్తున్న హెచ్చరిక. మనిషి అవసరాల కోసం ప్రకృతిని వాడుకోవడం సహజమే. కానీ స్వార్థం కోసం దోచుకోవడం ప్రమాదకరం. చెట్లు నరికేస్తున్నాం. అడవులను మాయం చేస్తున్నాం. ప్లాస్టిక్తో భూమిని నింపేస్తున్నాం. అయినా ప్రకృతి ప్రతీకారం తీర్చుకోవడం లేదు. కానీ తన బాధను ఎండల రూపంలో, తుఫాన్ల రూపంలో, వరదల రూపంలో మనకు చూపిస్తోంది. 2026 థీమ్..ప్రకృతే భవిష్యత్తుకు దారి ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్ ‘ఇన్స్పైర్డ్ బై నేచర్..ఫర్ క్లైమేట్...ఫర్ అవర్ ఫ్యూచర్’’ అంటే ప్రకృతిని ఆదర్శంగా తీసుకుని వాతావరణ మార్పులను ఎదుర్కొని భావితరాలకు సురక్షిత భవిష్యత్తు అందించాలన్నదే ప్రధాన సందేశం. చెట్లు, అడవులు, చెరువులు, జీవవైవిధ్యం రక్షించడమే వాతావరణ సంక్షోభానికి అసలైన పరిష్కారమని ఈ థీమ్ చెబుతోంది. పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అకాల వర్షాలు, కరువు పరిస్థితులు, వేడిగాలులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం, పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్యం గ్లోబల్ వార్మింగ్కు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. దీనిని నియంత్రించకపోతే భవిష్యత్తులో మరిన్ని విపత్తులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విజయనగరం జిల్లాలో పచ్చదన ఉద్యమం: ఉమ్మడి విజయనగరం జిల్లాలో అటవీశాఖ, వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ పరిరక్షణ కోసం విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణాల్లో మొక్కల నాటడం, అవగాహన ర్యాలీలు, పర్యావరణ ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అడవుల విస్తీర్ణం పెంచడం, చెరువులను సంరక్షించడం, ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే పచ్చని భవిష్యత్తు పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. ప్రతి పౌరుడు తనవంతు బాధ్యతగా మొక్కలు నాటడం, నీటిని ఆదా చేయండం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి చర్యలు చేపట్టాలి. అప్పుడే భావితరాలకు పచ్చని భవిష్యత్తు అందించగలం. నాటిన మొక్కను కాపాడితే పర్యావరణానికి మేలు.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలి. జిల్లాలో లక్షలాది మొక్కల పెంపకానికి లక్ష్యాలు నిర్దేశించాం. పచ్చదనం పెరిగితేనే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుంది. ప్రతి ఇంటి ముందూ ఒక మొక్క, ప్రతి గ్రామంలో ఒక పచ్చని ఉద్యమం అవసరం బిర్లంగి రామ్నరేష్, ఫారెస్ట్ రేంజ్ అధికారి, విజయనగరం -
విధులకు హాజరైన వైద్యురాలు
పాలకొండ రూరల్: స్థానిక అర్బన్ హెల్త్ సెంటర్లో రెగ్యులర్ వైద్యులు లేక రోగులు పడుతున్న ఇబ్బందులపై సాక్షిలో ప్రచురితమైన కథనం మేరకు సీతంపేట ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయపార్వతి స్పందించారు. ఈ హెల్త్ సెంటర్ను సందర్శించిన ఆమె ప్రత్యామ్నాయ పద్ధతిలో ప్రస్తుతం మండలంలోని అన్నవరం పీహెచ్సీ వైద్యురాలిని సేవలందించాలని సూచించారు. ఈ క్రమంలో గురువారం వైద్యురాలు బి.అంకిత అర్బన్ హెల్త్ సెంటర్లో సేవలు ప్రారంభించడంతో రోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారిణి గర్భిణులకు పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుత వేసవిలో అనుసరించాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. పాలకొండ రూరల్: స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వేమూరి హరగోపాల్ను డాక్టరేట్ వరించింది. 2002లో భౌతిక శాస్త్ర ఆధ్యాపకుడిగా విధుల్లో చేరిన ఆయన తాను ఎంచుకున్న రంగంలో అనేక పరి శోధనలు నిర్వహించారు. ఈ క్రమంలో ఫెరో మాగ్నెటిక్ నానోస్ట్రక్చర్స్లో యాంటీడాట్ల సహాయంతో 360 డిగ్రీల డెమెయిన్ వాల్ల ఏర్పాటు, వాటి కదలికలు–స్పింట్రానిక్ మెమరీ లాజిక్ పరికరాలపై చేపట్టిన అధ్యయనానికి డాక్టరేట్ను సొంతం చేసుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ గీతం యూనివర్సిటీ క్యాంపస్ గైడ్ డాక్టర్ విజయనందిని కన్నన్ చేతుల మీదుగా ఆయన డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపక బృందం గురువారం హర్షం వ్యక్తం చేసింది. సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారిగా 2023 బ్యాచ్కు చెందిన పీడీసీ కె.మాధురి నియమితులయ్యా రు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డిప్యూటీ కలెక్టర్లకు బదిలీలు, పోస్టింగ్లు కేటాయిస్తూ గురు వారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న మాధురిని పార్వతీపురం ఆర్డీఓగా నియమించారు. డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగోన్నతి పొంది న డి.ధర్మరాజును జిల్లాలోని కేఆర్ఆర్సీ ఎస్డీసీ గా నియమించారు. ఇది వరకూ ఇక్కడ పని చేసిన డిప్యూటీ కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి దీర్ఘకాల సెలవుపై వెళ్లారు. తదుపరి పోస్టింగ్ కో సం ఆయన జీఏడీకి నివేదించాల్సి ఉంటుంది. పార్వతీపురం: నీతి అయోగ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం (ఏడీపీ), ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం (ఏబీపీ) కింద చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు. జిల్లాను దేశంలోనే ముందంజలో నిలిపేందుకు అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భామిని మండలంలోని తాగునీరు, సాగునీరు, రహదారులు, విద్య, వైద్య రంగాల పనుల పురోగతిని పరిశీలించారు. లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యం సహించబోమన్నారు. బస్సు షెల్టర్ల నిర్మాణం పూర్తి చేయాలి ఎంపీ ల్యాడ్స్ నిధులతో జిల్లాలో నిర్మిస్తున్న బస్సుషెల్టర్లు, సామాజిక భవనాలు, రచ్చబండలు, గ్రావెల్ రోడ్ల పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈనెల 10లోగా పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని, కొత్త బస్సుషెల్టర్ల ఏర్పాటు, తాగునీటి సౌకర్యాలు, సుందరీకరణ, మొక్కలు నాటాలని ఆదేశించారు. ఆస్పత్రులు సిద్ధం కావాలి గిరిజన ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు నిర్మాణంలో ఉన్న భద్రగిరి, కురుపాం ఆస్పత్రులను ఈనెల 15 లోగా పూర్తి చేయాల ని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సాలూరు ఏరియా ఆస్పత్రి ప్రహ రీ, ఆక్సిజన్ పైప్లైన్లు, చినమేరంగి, పాలకొండ, సీతంపేట, మల్టీస్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. -
ఇంటింట పింఛన్ల పంపిణీకి మంగళం..!
● అందరికీ ఒకే చోట అందజేస్తున్న పరిస్థితి ● వృద్ధులనూ పంచాయతీ కార్యాలయాలకు రప్పిస్తున్న సిబ్బంది ● సర్కారు తీరుతో విస్తుపోతున్న పింఛన్దారులు ● వైఎస్సార్సీపీ హాయంలో ఉదయం 5 గంటలకే తలుపుతట్టి అందజేతఇంటింటికీ వెళ్లి పింఛన్ ఇవ్వాలి అందరినీ ఒకచోటకు పిలిచి పింఛన్లు పంపిణీ చేయకూడదు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేయాలి అలా ఎక్కడైనా అందజేయకపోతే చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస పాణి, డీఆర్డీఏ పీడీ ఒకేచోటకు రప్పించి అందజేత ప్రస్తుత టీడీపీ సర్కార్ పింఛన్దారులను రచ్చబండ వద్దకు, పంచాయతీ కార్యాలయం వద్దకు, లేదా వీధిలో ఒకచోట కూర్చుని వారి వీధిలో ఉన్న పింఛన్ దారులందరినీ పిలిపించి అక్కడ ఇస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులను సైతం రప్పించుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఇబ్బందికరమైనా పింఛన్దారులకు తప్పని పరిస్థితి. జిల్లాలో 2,68,072 ఫించన్లు జిల్లాలో వివిధ కేటగిరిలకు చెందిన పింఛన్లు 2,68,072 ఉన్నాయి. వాటిలో వృద్ధాప్య 1,28,623, వితంతు 73,727, దివ్యాంగ 35, 538, అభయహస్తం 10,044, ఒంటరి మహిళలు 5,117, డప్పు కళాకారులు 4,005, చేనేత 2,844, గీతకార్మికులు 2,876, మత్య్సకారులు 2,129, చర్మకారులు 1548, డీఎంహెచ్ఓ 870, డయాలసిస్ 469,కళాకారుల 253, టాన్స్జెండర్స్ 26, సైనిక్ వేల్ఫేర్ పింఛన్లు 3 ఉన్నాయి. -
వ్యసనాలకు అలవాటు పడి.. దొంగలుగా మారి
నరసన్నపేట: ఉత్తరాంధ్రలో పలు చోరీ కేసుల్లో నిందితులైన విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన మండూరి సంతోష్ కుమార్, బూర అశోక్ ఎట్టకేల కు నరసన్నపేట పోలీసులకు చిక్కారు. సత్యవరం సర్వీసు రోడ్డుపై అనుమానాస్పదంగా ఉన్న వీరిని పోలీసులు పట్టుకుని తమదైన శైలిలో ఆరా తీయగా పలు కేసుల్లో నిందితులుగా తేలింది. వీరి నుంచి రూ.23.64 లక్షల విలువైన 157 గ్రాముల బంగారం ఆభరణాలు, ఒక బజాజ్ పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావులు నరసన్న పేట సర్కిల్ స్టేషన్లో గురువారం విలేకరుల కు వివరాలు వెల్లడించారు. ఈ ఇద్దరు యువకులు కార్పెంటర్ వృత్తి చేసుకుంటూ కాలం గడుపుతూ వ్యసనాలకు బానిసలుగా మారారు. కార్పెంటర్ వృత్తిలో అంతగా డబ్బులు రాకపోవడంతో సులువుగా డబ్బులు సంపాదించాలనే ప్రయత్నాల్లో భాగంగా దొంగతనాలకు పాల్పడ్డారు. ముఖానికి మాస్క్లు పెట్టుకొని రోడ్డుపై ఒంటరి మహిళలను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడ్డారని వివరించారు. వారిపై నరసన్నపేట, శ్రీకాకుళం రూరల్, పోలాకి, రామభద్రపురం, పెందుర్తి, గోపాలపట్నం పోలీసు స్టేషన్లలో 7 చోట్ల చోరీలకు పాల్పడగా కేసులు నమోదయ్యాయని అన్నారు. వీరిని గురువారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. వీరిని అరెస్టు చేయ డంలో కృషి చేసిన నరసన్నపేట ఎస్ఐ బలివాడ గణేష్తో పాటు పలువురు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారని అన్నారు. సమావేశంలో నరసన్న పేట సీఐ మరడాన శ్రీనివాసరావులతో పాటు పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు. -
పిడుగుపాటుతో మూగజీవాలు..
వేపాడ: మండలంలోని కొండగంగుబూడి గ్రామం సమీపంలో గురువారం సాయంత్రం వర్షం కురుస్తున్న సమయంలో పిడుగుపడి తొమ్మిది మేకలు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రామస్వామిపేట గ్రామానికి చెందిన పత్రి శ్రీను మేకలను మేతకోసం కొండగంగుబూడి గ్రామం సమీపంలో విజయరామసాగరం చెరువు వద్దకు తోలుకెళ్లాడు. మధ్యాహ్నం వర్షం కురిసిన సమయంలో పిడుగు పడి రెండు మేకపోతులు, ఏడు మేకలు చనిపోయాయి. కె.జి.పూడి గ్రామానికి చెందిన చలుమూరి వెంకటరావుకు చెందిన ఒక మేక పిడుగుపాటుతో చనిపోయింది. జీవాల మరణంతో సుమారు రూ.3లక్షల మేర నష్టం వాటిల్లినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
ఎంపీడీఓ, కార్యాలయ సిబ్బంది చేతివాటం
జియ్యమ్మవలస రూరల్: మండలాభివృద్ధి అధికారి కార్యాలయంలో సుమారు 10 లక్షల నిధులను ఎంపీడీవో హనుమంతు శశిభూణరావు, ఏఓ రామారా వు, సీనియర్ అసిస్టెంట్ ఎం.వి.డి.ప్రసాద్, ఆఫీస్ సబార్డినేటర్ శ్రీనివాసరావు కలిసి అక్రమంగా డ్రాచేసి కాజేశారని ఎంపీపీ బొంగు సురేష్ జియ్యమ్మవలస పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. వివిధ ఖాతాల నుంచి ఎటువంటి నోట్ ఫైల్స్ లేకుండా సొంతగా ఓఎస్ శ్రీనివాసరావు పేరుతో నిధులు విత్ డ్రాచేసి సొంతానికి వాడుకున్నాడని ఎంపీపీ ఫిర్యాదులో పేర్కొన్నారు. కురు పాం ఎస్బీఐ బ్యాంకులోని కరెంట్ ఖాతా నుంచి గత నెల 5వ తేదీన రూ.50వేలు, అదే బ్రాంచిలో ఉన్న సేవింగ్ ఖాతా నుంచి గతనెల 15 తేదీన రూ. 1,62,770లు, గతనెల 16వ తేదీన రూ.1,77,770, 21వ తేదీన రూ. 4,77,777లు ఇలా మొత్తం రూ. 9,18,317ల ప్రజాధనాన్ని డ్రాచేసి సొంతానికి వాడుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వివిధ అభివృద్ధి పనులు, రికవరీలు, ట్రైనింగ్, ఇతర కార్యక్రమాల నిర్వహణకు జెడ్పీ నుంచి మంజూరైన అభివృద్ధి పనుల డిపాజిట్లు, అంగన్వాడీ కేంద్రాల మరమ్మత్తులు, సీజీఎస్టీ, జీఎస్టీ ఇలాంటి పలు రకాలైన నిధులను ఎంపీపీ అనుమతి లేకుండా డ్రాచేసి దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. ఎంపీడీఓ శశిభూషణరావు కార్యాలయ పనివేళల్లో మద్యం సేవించి విధులకు హాజరవుతున్నారని, పై అధికారులను కూడా లెక్కచేయకుండా వికృత చేష్టలు చేసి తోటి ఉద్యోగులకు ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నా రు. ఫిర్యాదు అంశాన్ని సంబంధిత సీఈఓ (విజయనగరం)కు తెలియజేశామని, ఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ టీవీ తిరుపతి, ఎస్సై ఎన్.ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఎంపీడీఓగా బాధ్యతలు తీసుకుని రెండు నెలలే అయ్యింది. ఇటీవల రూ.50వేల చెక్కు డ్రా చేసి ఆఫీ సు, ఇతర మెయింట్నెన్స్కు ఖర్చుచేశాం. తనకు మద్యం సేవించే మానసిక బలహీనత ఉంది. ఆ పరిస్థితుల్లో చెక్కులపై ఆఫీస్ సబార్టనేట్ శ్రీనివాసరావు సంతకాలు చేయించి ఆ నిధులను వారే డ్రా చేశారేమో తనకు తెలియదు. ప్రస్తుతం అనారోగ్య స్థితిలో ఉన్నాను. చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నాను. డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఆదేశానుసారం జియ్యమ్మవలస ఎంపీడీఓగా వచ్చాను. ఎంపీపీ బొంగు సురేష్ ఏం చేస్తారో చేసుకోమనండి. తనపై రూ.10 లక్షలు డ్రా చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు ప్రైవేట్గా పరువు నష్టం కేసు వేస్తాను. రెండు సంవత్సరాలుగా జీతం లేక అవస్థలు పడుతున్నాను. అవసరమైతే తనకు రావాల్సిన జీతభత్యాలు నుంచి చెల్లిస్తాను. – హెచ్. శశిభూషణరావు, ఎంపీడీఓ -
రెండు బైక్లు ఢీకొని వ్యక్తి..
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని ఇరిడి సెంటర్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్నా ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని జోళ్ల గూడ గ్రామానికి చెందిన ఎన్. జగన్, మరో వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇరిడి వెళ్తుండగా.. తోలుఖర్జ గ్రామానికి చెందిన పాలక సహదేవుడు గుమ్మలక్ష్మీపురం వస్తుండగా మార్గమధ్యంలో ఇరిడి గ్రామం దాటాక ఇరిడి సెంటర్ సమీపంలో రెండు వాహానాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో సహదేవుడు (46) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ద్విచక్ర వాహన చోడకుడు జగన్కు తీవ్ర గాయాలవడంతో భద్రగిరి ఆస్పత్రిలో చేర్చారు. ప్రథమ చికిత్స అనంతరం జగన్ను పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్కు తరలించారు. కాగా సహదేవుడు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం భద్రగిరి ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్విన్ పేట పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరొకరికి గాయాలు -
●బాబూ.. మీ పాలనకో దండం
చంద్రబాబు ప్రజావ్యతిరేక పాలనపై సాలూరు నియోజకవర్గంలో నిరసన పెల్లుబికింది. మాజీ ఉప ముఖ్యమంత్రి, పార్టీ పీఏసీ సభ్యులు పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలో సాలూరు మండలం మామిడిపల్లి, పాచిపెంట, మెంటాడ మండల కేంద్రాల్లో వందలాది మంది నిరసన ర్యాలీలు నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మీ పాలనకో దండం అంటూ నినదించారు. మెంటాడలో జరిగిన కార్యక్రమంలో రాజన్నదొర పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అనంతరం చంద్రబాబు ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను, బాండ్లను మంటల్లో వేసి తగలబెట్టారు. -
వెన్నుపోటుకు చిరునామా చంద్రబాబు
● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ రేగిడి: వెన్నుపోటు పదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చిరునామాగా నిలిచారని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ విమర్శించారు. చంద్రబాబు ప్రభు త్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటుపొడిచారన్నారు. రేగిడి మండలం లక్ష్మీపురంలో ఓ కార్యక్రమానికి బుధవారం హాజరైన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. సూపర్సిక్స్లో ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని, రాష్ట్రంలో ప్రజలను మోసగించారని ఆరోపించారు. ఆడబిడ్డ నిధి రాలేదని, యువతకు ఉద్యోగాలు లేవని, నిరుద్యోగ భృతిని ఎగ్గొట్టారని, రైతులకు రూ.20 వేలు పెట్టుబడి సాయం అటకెక్కిందని, ఫీజు రీయింబర్స్మెంట్ను అందజేయడంలేదని, 50 సంవత్సరాలకే పింఛన్ హామీ ఎండమావిగా మారిందని, కార్పొరేషన్ రుణాల మంజూరు జాడ కనిపించడంలేదని ఆరోపించారు. మహానాడు పేరుతో చంద్రబాబు సభలు పెట్టుకోవడమే తప్ప రెండేళ్లలో రాష్ట్రానికి, ప్రజలకు చేసిన మేలు శూన్యమన్నారు. అమరావతి పేరుతో అప్పులుచేసి కమీషన్ల రూపంలో లూటీ చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబునాయుడు రెండేళ్ల మోసకారి పాలనపై వైఎస్సార్సీపీ పోరుబాట సాగిస్తుందన్నారు. -
వెన్నుపోటుకు రెండేళ్లు..
● నేటి నుంచి వైఎస్సార్ సీపీ నిరసనలు సాక్షి, పార్వతీపురం మన్యం: ఎన్నికలకు ముందు కూటమిగా జత కట్టారు. లెక్కలేనన్ని హామీలు గుప్పించారు. నమ్మి ఓటేసిన ప్రజలకు.. గెలిచిన తర్వాత ముఖం చాటేశారు. ఇదీ.. రాష్ట్రంలో కూటమి సర్కారు తీరు. చంద్రబాబు ప్రభుత్వ వెన్నుపోటుకు రెండేళ్లు అయిన నేపథ్యంలో.. ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయిన ప్రభుత్వ తీరును ఎండగడుతూ వైఎస్సార్సీపీ మరో ప్రజా పోరాటానికి సిద్ధమయ్యింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు శ్రేణులు సిద్ధమయ్యాయి. గురువారం నుంచి ఈ నెల 12వ తేదీ వరకు వివిధ రూపాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ నెల 4న అన్ని మండల కేంద్రాల్లో.. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో, పత్రికల్లో ఎన్నికల ముందు ప్రచురించిన మేనిఫెస్టో ప్రకటనలు.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలతో సంతకాలు చేసిన బాండ్లను మంటల్లో వేసి తగలబెట్టనున్నారు. ఈ నెల 8, 9వ తేదీల్లో నియోజకవర్గ కేంద్రంలో టౌన్ హాల్స్ సదస్సు నిర్వహించనున్నారు. యువకులు, రైతులు, మహిళల సమక్షంలో ‘చంద్ర బాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పుస్తకం చూపిస్తూ అందులో ఉన్న అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల 12న అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేస్తూ, చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల నయవంచన పాలనను ఎండగట్టేందుకు వైఎస్సార్సీపీ నాయకులు సిద్ధమవుతున్నారు. -
32 కిలోల గంజాయి స్వాధీనం
శృంగవరపుకోట: కారులో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని ఎస్.కోట పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు సీఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 2వ తేదీ మధ్యాహ్నం 3.30గంటల సమయంలో ఓ కారులో గంజాయితో వస్తున్నారన్న సమాచారంతో ఎస్సై చంద్రశేఖర్ తన సిబ్బందితో పాటు నిఘా వేసి కారును నిలువరించి కారులో ఉన్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని సోదా చేయగా గంజాయి ప్యాకెట్లు పట్టుబడ్డాయి.దీంతో గంజాయి తూకం వేయించి, ఉద్యోగుల సమక్షంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 32,485కిలోల గంజాయి కారులో ఉన్నట్లు నిర్ధారించారు. నిందితులు కేరళ రాష్ట్రానికి చెందిన 53యేళ్ల ముస్తఫా, 33యేళ్ల శరత్లాలాగా గుర్తించారు. రిమాండ్ నిమిత్తం నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ నారాయణమూర్తి చెప్పారు. -
ప్రజలకు, పంటలకు నష్టం జరగనీయొద్దు
మక్కువ: ఏనుగుల గుంపు సంచారంతో ప్రజల కు, పంటలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని డీఎఫ్ఓ ప్రసూన అటవీశాఖ సిబ్బందిని ఆదేశించారు. మక్కువ మండలం మార్కొండపుట్టి పంచాయతీ వీరాడవలస గ్రామ సమీపంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును ఆమె బుధవారం పరిశీలించారు. ఇంతవరకు పంటలు, ప్రజలకు కలిగిన నష్టం వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఏనుగుల గుంపు దిశ మార్చిన తర్వాత పంటల నష్టం వివరాలను సేకరిస్తున్నామని డీఎఫ్ఓకు వివరించారు. కార్యక్రమంలో ఎలిఫెంట్ మానిటరింగ్ యూనిట్ అధికారి కె.మణికంటేష్, అ టవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వీరఘట్టం: ప్రాథమిక స్థాయిలో విద్యాప్రమాణాల పెంపులో భాగంగా రాష్ట్ర సమగ్రశిక్ష జ్ఞాన ప్రకాష్ ఎల్.ఎల్.ఎన్ ప్రొగ్రాంకు మూడేళ్ల కిందట శ్రీకారం చుట్టింది. 2020 జాతీ య విద్యాహక్కు చట్టం ప్రకారం ఒకటి, రెండు తరగతులు చదువుతున్న విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలను పెంపొందించేందుకు ఎస్జీటీలకు బోధనా నైపుణ్యాలపై శిక్షణ ఇస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా జ్ఞాన ప్రకాష్ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లాలో ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. పాలకొండలోని జిల్లా పరిషత్ హైస్కూల్, కురుపాంలో ని ఏపీఎంఎస్ స్కూల్, సాలూరులోని బాలికోన్నత పాఠశాల, పార్వతీపురంలోని డీవీఎంఎం హైస్కూల్తో పాటు ఉల్లిభద్రలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఆయా నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎస్జీటీలు శిక్షణ తరగతుల్లో పాల్గొంటారు. పార్వతీపురం రూరల్: జిల్లా ఈపీడీసీఎల్ ఆపరేషన్ సర్కిల్ నూతన ఎస్ఈగా పి.త్రినాథరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. విజయనగరం సర్కిల్ డీఈగా పనిచేసి న ఆయన పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. పార్వతీపురం ఈఈగా ఆర్.రామునాయుడు సైతం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ.. ‘సూర్య ఘర్’ను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. విద్యుత్ సమస్యలు, అంతరాయాలు ఏర్పడితే వినియోగదారులు 1912 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, సిబ్బంది వాటిని పరిష్కరిస్తారని తెలిపారు. ఆర్కే టౌన్షిప్ గ్రూప్ 34 ఏళ్ల విజయోత్సవంవిశాఖపట్నం: రియల్ ఎస్టేట్ రంగంలో 34 సంవత్సరాలుగా విశ్వసనీయ సేవలు అందిస్తూ వేలాది కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసిన ఆర్కే టౌన్షిప్ గ్రూప్ తన 34వ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.జి.అమర్నాథ్ మాట్లాడుతూ 1992లో స్థాపితమైన ఆర్కే టౌన్షిప్ గ్రూప్ పారదర్శకత, నాణ్యత, నిబద్ధత అనే విలువలను పాటిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థగా గుర్తింపు పొందిందన్నారు. విశాఖపట్నం, గాజువాక, హైదరాబాద్, విజయవాడ, రాజమహేంద్రవరం కేంద్రాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తూ అనేక విజయవంతమైన వెంచర్లను అభివృద్ధి చేసిందన్నారు. ప్రస్తుతం ఐశ్వర్య గార్డెన్స్, గౌతమి గార్డెన్స్, ఆర్కేస్ గ్రాండ్యూర్ సిటీ, గ్రీన్ వ్యాలీ 5డి, నారాయణి గార్డెన్స్ వంటి ప్రాజెక్టులు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, గూగుల్ డేటా సెంటర్ పరిసర ప్రాంతాల్లో త్వరలోనే మరిన్ని ప్రతిష్టాత్మక వెంచర్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సంస్థ సీనియర్ మేనేజర్లు పి.ఆర్.కె.వెంకటేష్, బి.అప్పారావు, మేనేజర్లు బి.బాలాజీ, పి.వేణుగోపాల్, సీనియర్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్లు, మార్కెటింగ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి
పార్వతీపురం రూరల్: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని, జనాభా పెంపుదలపై ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని అఖిలపక్ష మహిళా, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్.శ్రీదేవి అధ్యక్షతన బుధవా రం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.సుబ్బరావమ్మ, ఐద్వా జిల్లా కార్యదర్శి బి.లక్ష్మి తదితరులు మాట్లాడారు. 2023 నాటి మహిళా బిల్లును నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టకుండా ప్రత్యేక ఆర్డినెన్స్తో వెంటనే అమలు చేయాలన్నారు. మూడు, నాలుగు సంతానానికి నగదు ప్రోత్సాహకాలు ఇస్తా మన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు మహిళల ఆరోగ్యం, స్వేచ్ఛను దెబ్బతీసేలా ఉన్నాయని ఆక్షేపించారు. స్థానాల పెంపు కోసం కాకుండా, సంతానోత్పత్తిని తల్లిదండ్రుల వ్యక్తిగత నిర్ణయానికే వదిలేయాలని పేర్కొన్నారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు వి.ఇందిర, గౌరీమణి, గౌరి, కె.గంగునాయుడు, బి.వి.రమణ, జి.వెంకటరమణ, సుందర మ్మ, భాస్కరరావు, ఆర్.వి.ఎస్.కుమార్, బి.సూరిబాబు, పి.సంఘం, తదితరులు పాల్గొన్నారు. -
సోమేష్కు కన్నీటి వీడ్కోలు
● అవయవ దానం చేసిన జూనియర్ లైన్మన్ ● కుటుంబసభ్యులను అభినందించిన వైద్యులు,ట్రాన్స్కో అధికారులువీరఘట్టం: విధి నిర్వహణలో భాగంగా విద్యుత్ పనులు చేస్తూ ఆదివారం విద్యుత్స్తంభంపైనుంచి ప్రమాదవశాత్తు జారిపడిన వీరఘట్టం మండలం తెట్టంగి జూనియర్ లైన్మన్ సవర సోమేశ్వరరావు(31) బ్రెయిన్ డెడ్ అయిన విషయం విదితమే. ఆయన అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకారం తెలపడంతో బుధవారం శ్రీకాకుళంలోని కిమ్స్ ఆస్పత్రిలో గుండె, కిడ్నీలు,కార్నియాను జీవన్దాన్ బృందం స్వీకరించింది. స్వీకరించిన అవయవాలను గ్రీన్ చానల్ ద్వారా ప్రత్యేక అంబులెన్స్లో విశాఖపట్నం తరలించారు. జీవన్దాన్ ప్రొటోకాల్ ప్రకారం సీనియార్టీ లిస్టును అనుసరించి అవయవాలను వివిధ ఆస్పత్రులకు కేటాయించారు. అవయవదానం అనంతరం సోమేశ్వరరావు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కిమ్స్ ఆస్పత్రి వద్ద సోమేశ్వరరావుకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపినందుకు గర్వంగా ఉందని సోమేశ్వరరావు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ట్రాన్స్కో అధికారులు, స్థానిక ప్రజలు మృతుడి కుటుంబసభ్యులను అభినందించారు. అవయవదానం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులు స్వగ్రామం చాకలిగూడకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో పనిచేస్తున్న గ్రామం తెట్టంగి, స్వగ్రామం చాకలిగూడలో విషాదచాయలు అలముకున్నాయి. -
అక్రమ రిజిస్ట్రేషన్కు బ్రేక్
సాక్షి, పార్వతీపురం మన్యం: సాలూరులోని డగ్లస్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్కు చెందినట్లు చెబుతున్న 3.14 ఎకరాల భూమి అక్రమ రిజిస్ట్రేషన్కు జిల్లా యంత్రాంగం చెక్ పెట్టింది. రూ.కోట్ల విలువైన భూమిని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ నిబంధనలను ఉల్లంఘించి ప్రైవేటు వ్యక్తుల పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్లు నిర్వహించారనే ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టారు. వ్యవహారంపై తుది నిర్ణయం వెలువడే వరకు భూమిని వెబ్ల్యాండ్ వివాదాల రిజిస్టర్లో నమోదు చేయడంతో పాటు ఎలాంటి రిజిస్ట్రేషన్లు, ఉపవిభజనలు, మార్పులు, ఇతర లావాదేవీలు జరగకుండా యథాతథ స్థితి కొనసాగించాలని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. రూ.కోట్ల విలువైన భూమి స్వాహాకు యత్నం సాలూరు రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 175/1లో ఉన్న 3.14 ఎకరాల భూమి స్వాహాకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరిగిన విషయం విదితమే. తప్పుడు పత్రాలతో రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ చేశారని.. దానిననుసరించి ఆగమేఘాల మీద సాలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని పట్టణానికి చెందిన న్యాయవాది రేగు మహేష్ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. రెవెన్యూ రికార్డులను సరిచేసి, అక్రమ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లను రద్దు చేయాలని కోరారు. అక్రమ మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ వ్యవహారంపై పత్రికల్లోనూ కథనాలు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. జిల్లా సబ్ రిజిస్ట్రార్ కూడా దీనిపై విచారణ నిర్వహించి నివేదిక సమర్పించారు. రూ.కోట్ల విలువైన ఆ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో రెవెన్యూ, రిజిస్ట్రార్ అధికారుల సంపూర్ణ సహకారం ఉందన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. స్థానిక టీడీపీ నేతల ప్రోత్సాహంతోనే ఇదంతా సాగిందని వినిపించింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో కదిలిన రెవెన్యూ యంత్రాంగం ఉన్నతాధికారుల ఆదేశాలతో సాలూరు రెవెన్యూ యంత్రాంగం కదిలింది. విచారణ జరిపి నివేదికను సమర్పించారు. సాలూరు తహసీల్దార్ సమర్పించిన నివేదిక ప్రకారం.. సర్వే నంబర్ 175/1లోని 3.14 ఎకరాల రైత్వారీ డ్రై భూమి మొదట ఎస్ఎఫ్ఏ రికార్డుల ప్రకారం పడాల రామయ్య పేరుతో నమోదై ఉంది. అనంతరం 1978లో నమోదైన డాక్యుమెంట్ నంబర్ 1035 ఆధారంగా ‘ది డగ్లస్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్’ భూమిని కొనుగోలు చేసినట్లు సంబంధిత వ్యక్తులు చెబుతున్నారు. 2024లో అసోసియేషన్ అధ్యక్షుడి పేరు మీద, ఆ తర్వాత జోసెఫ్ డేనియల్ గోడే వ్యక్తిగత పేరు మీద మ్యుటేషన్ ప్రక్రియ చేపట్టినట్లు తహసీల్దార్ నివేదికలో వెల్లడైంది. ఈ సమయంలో చెల్లుబాటు అయ్యే సొసైటీ రికార్డులు, ఇతర ఆధార పత్రాలు సమర్పించలేదని, రిజిస్టర్డ్ సొసైటీ పేరిట ఉన్న భూమిని వ్యక్తిగత పేరుకు మ్యుటేషన్ చేయడం నిబంధనలకు విరుద్ధమని అప్పటి అధికారులు అభిప్రాయపడినట్లు నివేదికలో పేర్కొన్నారు. దీంతో ప్రారంభ దశలో డిజిటల్ సంతకం నిలిపివేసినట్లు సమాచారం. తదనంతరం అసోసియేషన్ పేరు మీద మ్యుటేషన్ పూర్తయ్యాక మరిన్ని లావాదేవీలకు అనుమతులు లభించినట్లు గుర్తించారు. 2026 మే 16న సర్వే నంబర్ 175/1తో పాటు దాని ఉపవిభాగాల్లోని 1.655 ఎకరాల భూమికి సంబంధించి ప్రైవేట్ వ్యక్తుల పేరిట అమ్మకపు లావాదేవీలు జరిగాయని, వాటి ఆధారంగా రెవెన్యూ రికార్డుల్లో ఆటో మ్యుటేషన్లు నమోదైనట్లు ఆరోపణలు వచ్చాయి. ●ఈ నేపథ్యంలో భూమి యాజమాన్యంపై వివాదం నెలకొనడంతో పాటు రెవెన్యూ రికార్డుల్లో పరస్పర విరుద్ధ నమోదులు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ప్రాథమికంగా జరిగిన మ్యుటేషన్లు, రిజిస్ట్రేషన్ల చట్టబద్ధతపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వ్యవహారంపై సవివర విచారణ అవసరమని భావించారు. ●దీంతో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదేశాల మేరకు.. సర్వే నంబర్ 175/1లోని 3.14 ఎకరాల భూమిని వెబ్ల్యాండ్ వివాదాల రిజిస్టర్లో నమోదు చేయాలని నిర్ణయించారు. తుది ఉత్తర్వులు వెలువడే వరకు సంబంధిత భూములపై ఎలాంటి రిజిస్ట్రేషన్లు, ఉపవిభజనలు, మార్పులు, ఇతర లావాదేవీలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సాలూరు తహసీల్దార్, సబ్–రిజిస్ట్రార్లకు సూచించారు. తుది నిర్ణయం వచ్చే వరకు అన్ని రెవెన్యూ రికార్డుల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. -
చమురు సెగ!
గురువారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2026ప్రజారవాణాకు.. సాక్షి, పార్వతీపురం మన్యం: మూలిగే నక్కపై తాటిపండు పడిన చందాన ఉంది ఆర్టీసీ తీరు. ఇప్పటికే బస్సులు ఫుల్ అవుతున్నా.. ఆదాయం లేక, అవస్థలు పడుతున్న ప్రజా రవాణా వ్యవస్థకు చమురు ధరల సెగ తాకుతోంది. 15 రోజుల వ్యవధిలోనే డీజిల్ ధర నాలుగు సార్లు పెరిగింది. సుమా రు రూ.8 మేర అదనపు భారం పడటంతో ఆర్టీసీ కుదేలవుతోంది. ప్రస్తుతం జిల్లాలో డీజిల్ ధర లీట రు రూ.105.90 పైసలు ఉంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా ఇప్పటికే డీజిల్ సక్రమంగా లభించడం లేదు. దీనికి తోడు క్రూడ్ ఆయిల్ ధర రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఆయిల్ కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపై మోపుతున్నాయి. గతనెల 16వ తేదీ వరకూ డీజిల్ లీటరు రూ.98.01 ఉండేది. రెండు వారాల కాలంలోనే రూ.8 పెరిగింది. రానున్న రోజుల్లో చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ధరల తగ్గింపునకు ప్రభుత్వ చర్యలు శూన్యంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ టో, ఇతర రవాణా వాహనాలకు సంబంధించి చార్జీ లు పెంచేశారు. పెరిగిన డీజిల్ ధరలను సాకుగా చూపుతూ అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రస్తు తానికి ఆర్టీసీ చార్జీలు పెరగనప్పటికీ.. రానున్న రో జుల్లో సంస్థకు గడ్డు కాలం తప్పదని.. ఈ నేపథ్యంలో చార్జీల భారం మోయాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదని ఆర్టీసీ సిబ్బంది అంటున్నారు. కిలోమీటరుకు రూ.4 నుంచి రూ.5 వరకూ పెంచే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. అరకొర బస్సులతో తప్పని అవస్థలు ఉచిత బస్సు ప్రభావంతో ఆర్టీసీ సర్వీసులు కిక్కిరిసిపోతున్నాయి. సరిపడినన్ని బస్సులను వేయకపోవడం, పలు సర్వీసులను రద్దు చేయడంతో ఆర్టీసీలో ప్రయాణం ప్రహసనంగా మారింది. పురుష ప్రయాణికులు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లకే మొగ్గుచూపుతున్నారు. బస్సులు ఎక్కేందుకు ఇష్టపడడంలేదు. దీనికి తోడు రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసులకు బ్రేక్ వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ప్రజారవాణాపై ఆధారపడిన వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. రోజుకు 92 వేల కిలోమీటర్ల ప్రయాణం జిల్లాలో పార్వతీపురం, సాలూరు, పాలకొండ ఆర్టీసీ డిపోలున్నాయి. వీటి పరిధిలో 240 బస్సులు నడుస్తున్నాయి. రోజూ 92 వేల కిలోమీటర్ల మేర రాకపోకలు సాగిస్తున్నాయి. దాదాపు 1.25 లక్షల మంది ప్రయాణం సాగిస్తున్నారు. ఆర్టీసీ బస్సుకు సగటున అయిదు నుంచి ఆరు కిలోమీటర్లలోపు మైలేజీ వస్తుంది. ఈ లెక్కన రోజుకు రూ.1.50 లక్షల మేర సంస్థపై అదనపు భారం పడుతోంది. ఆర్టీసీపై డీజిల్ రూపంలో పడిన అదనపు భారం మోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం సమస్యగా మారింది. ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు ప్రభుత్వం టికెట్ల ధర పెంచేందుకు మొగ్గుచూపుతోందన్న వార్తలతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. చాలా గ్రామాలకు ఇప్పటికీ పల్లెవెలుగు డొక్కు బస్సులు మాత్రమే వెళ్తున్నాయి. చార్జీలు పెంచితే సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయమన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. చమురు ధరలు పెరగడం వల్ల ఆ ప్రభావం మార్కెట్లపైనా ఉంటుంది. సరుకు రవాణా చేసే వాహనాలు ఛార్జీల భారం వేస్తే వివిధ వస్తువులు, నిత్యవసర ధరలు కూడా పెరుగుతాయని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. సరుకులు రవాణా చేసే లారీ పరిశ్రమకు జిల్లాలోని సాలూరు ప్రసిద్ధి. ఇక్కడ సుమారు 2 వేల లారీల వరకు సరకు రవాణాపైనే ఆధారపడి ఉన్నాయి. ఇప్పటికే చమురు కొరతతో లారీలకు డీజిల్ దొరకడమే కష్టం అవుతోందని యజమానులు చెబుతున్నారు. ధరలు పెరగడం వల్ల మరింత భారం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. -
నా భర్తను కళ్లెదుటే కాల్చి బూడిద చేశారు!
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం మండలం వెలగవలస గ్రామంలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. గడపకో రోగి.. ఇంటికో వ్యథ.. ఎక్కడ చూసినా ఇదే స్థితి. పదుల సంఖ్యలోనే ఇళ్లు ఉండే గిరిజన పల్లెలో రెండు నెలలుగా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అంతుచిక్కని కలవరం.. అంతులేని భయం. జ్వరం, జలుబు, దగ్గుతో పాటు రోగుల్లో వింత ప్రవర్తన. ఒక్కసారిగా పెద్ద అరుపులు.. వెర్రి చూపులు.. కాళ్లు, చేతులు కొట్టుకుంటూ ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేలా చేష్టలు. అసలే మూఢ నమ్మకాలను బలంగా నమ్మే గిరిజనులు. ఆకులు, అందుబాటులో దొరికిన మందులతో వైద్యం చేస్తున్నారు. దెయ్యం పట్టిందని ఒకరు.. చేతబడి చేశారని ఇంకొకరు.. ఆ భయంతోనే గ్రామానికి చెందిన తాడంగి రమేష్ (30) ను సోమవారం సాయంత్రం గ్రామస్తులంతా తీవ్రంగా కొట్టి గాయపరిచారు. చేతబడి చేస్తున్నాడని, అందువల్లే గ్రామంలో ఉన్నవారంతా వింతగా ప్రవర్తిస్తున్నారని అనుమానించారు. అక్కడితో వారి కోపం చల్లారలేదు. మంత్ర శక్తులు ఉన్నాయని కాళ్లు, చేతులు వేరు పడేసినట్లు సమాచారం. చనిపోయాక మృతదేహాన్ని మంటల్లో తగులబెట్టారు. సోమవారం రాత్రితో పాటు, మంగళవారం కూడా పోలీ సులు అక్కడికి చేరుకుని విచారణ జరిపారు. ఊరిలోనే చికిత్స.. గ్రామానికి చెందిన చాలామంది అనారోగ్యంతో బాధ పడుతున్నా.. ఏ ఒక్కరూ ఆస్పత్రిని ఆశ్రయించడం లేదు. పసరమందులు, మంత్రాల వైద్యంతో కాలం వెళ్లదీస్తున్నారు. వింత వ్యాధితో బాధపడుతున్న యువతి కడ్రక బంగారమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. వ్యాధి నిర్ధారణ కావాల్సి ఉంది. వైద్య నిపుణులు, అధికారులు గ్రామాన్ని సందర్శించి ప్రజలకు అవగాహన కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు. 16 మంది నిందితుల అరెస్టు చేతబడి చేస్తున్నాడనే నెపంతో రమేష్ను సజీవ దహనం చేసిన ఘటనలో 16 మందిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆధునిక కాలంలోనూ ఇలాంటి అపోహలతో ప్రాణాలు తీయడం దారుణమని, గుంపుగా దాడి చేసినా ప్రతి ఒక్కరినీ గుర్తించి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ మనీషారెడ్డి స్పష్టంచేశారు. -
ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయం
పార్వతీపురం రూరల్: జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలకు పలు కీలక సూచనలు చేశారు. ప్రతిరోజూ హెల్త్ డైలీ రిపోర్టులు సమర్పించాలని, సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు, అసాధారణ మరణాలు, బాల్య వివాహాలు, టీనేజ్ గర్భాలను వెంటనే గుర్తించి నివేదించాలని సూచించారు. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న వారిని ఉన్నత ఆస్పత్రులకు రిఫర్చేసి సమాచారం అందించాలని ఆదేశించారు. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య అవగాహన పెంపొందించడంతో పాటు మలేరియా, డెంగీ, క్షయ, ఎయిడ్స్ వంటి వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి ఇంటి వద్ద ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తల వివరాలు ప్రదర్శించాలని, హోమియోపతి రోగనిరోధక మందులు పంపిణీ చేయాలని సూచించారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, హైరిస్క్ గర్భిణులను గుర్తించి పర్యవేక్షించాలని, 100 శాతం టీకాలు పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ ఆరోగ్య పరిశుభ్రత, పోషణ కమిటీలతో కలిసి గ్రామ ఆరోగ్య ప్రణాళికలు రూపొందించి, వీహెచ్ఎన్డీఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఎంహెచ్ఓ పి.భాస్కరరావు, వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. పెదగైశిల సమీపంలో ఏనుగులు మక్కువ: మండలంలోని ఏజెన్సీ ప్రాంతమైన పెదగైశిల సమీపంలో నాలుగు రోజులుగా గజరాజుల గుంపు సంచరిస్తోంది. అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఏనుగుల జాడను గమనిస్తూ స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు. ఎస్.పెద్దవలస, కాకువానివలస, వీరాడవలస, కవిరివలస, బట్టివలస గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు దండోరా వేయించారు. ఏకలవ్య ప్రిన్సిపాల్ నియామకంపై వివాదం సాక్షి, పార్వతీపురం మన్యం: కురుపాం ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపాల్గా రాధాకృష్ణ నియామకంపై గిరిజన సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయనను తక్షణమే వెనక్కి పంపాలని డిమాండ్ వినిపిస్తోంది. రాధాకృష్ణ గతంలో కొమరాడ గిరిజన గురుకుల బాలుర పాఠశాల ప్రిన్సిపాల్గా పనిచేసేవారు. అప్పట్లో ఆయన వ్యవహారశైలి పట్ల అనేక ఆరోపణలొచ్చాయి. అధికారులను తప్పుదోవ పట్టించి పాఠశాలలో చదువు వాతావరణాన్ని పోగొట్టారని.. నిబంధనలకు విరుద్ధంగా బాలికల పాఠశాలలో పనిచేసే మహిళా ఉపాధ్యాయులను తాను ఉన్న బాలుర పాఠశాలలో నియమించుకున్నారన్న విమర్శలున్నాయి. గతంలో జోగింపేట ప్రతిభ పాఠశాలలో పనిచేసిన సమయంలోనూ అన్యాయంగా ఒక గిరిజన యువతిని ఉద్యోగం నుంచి తొలగింపునకు కారణమయ్యారని గిరిజన సంఘాలు గుర్తు చేస్తున్నాయి. ఇప్పటికే తీవ్ర వివాదాల్లో ఉన్న కురుపాం గిరిజన ఏకలవ్య పాఠశాలకు ఇటువంటి వివాదాస్పద ఉద్యోగిని ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఇంటర్ వరకు బాలికలే ఉంటారని, అక్కడ అటువంటి వ్యక్తి ప్రిన్సిపాల్గా ఉంటే విద్యా ప్రమాణాలు నాశనం అవుతాయని, చదువుకునే వాతావరణం కలుషితమవుతుందని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కురుపాం ఏకలవ్య పాఠశాలలో జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా ఈ పాఠశాలకు మహిళా ప్రిన్సిపాల్ అవసరం ఉందని.. ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
పగబట్టిన మూఢత్వం.. పల్లెల్లో మరణ శాసనం!
● అనుమానం.. అపోహ.. ప్రాణాలు తీస్తున్న మూఢనమ్మకం ● గిరిజన గ్రామాల్లో వీడని చిల్లంగి, చేతబడుల భయం సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్ : జిల్లాలో చిల్లంగి ఆరోపణల నేపథ్యంలో వ్యక్తిని హత్య చేయడం.. మరోసారి మూఢనమ్మకాల అంశం చర్చనీయాంశంగా మారింది. ఆధునిక సాంకేతికత, విద్య అందుబాటులోకి వచ్చినా.. ఏజెన్సీలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ చేతబడి, క్షుద్రపూజలు, చిల్లంగి వంటి నమ్మకాలు పూర్తిగా అంతరించిపోలేదనే వాస్తవాన్ని ఈ ఘటన గుర్తు చేస్తోంది. గతంలోనూ మక్కువ, పాచిపెంట, కురుపాం ప్రాంతాల్లో చిల్లంగి ఆరోపణలతో అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు సంచలనం సృష్టించాయి. అనారోగ్యం, ఆకస్మిక మరణాలు, పంట నష్టాలు, కుటుంబ సమస్యలకు కొందరిని బాధ్యులుగా చూపుతూ వారిపై దాడులకు దిగిన సందర్భాలు ఉన్నాయి. చట్టాలు కఠినంగా ఉన్నా.. వ్యవస్థలు అవగాహన కల్పిస్తున్నా... ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో విద్యా లోపం, ఆరోగ్య సమస్యలపై అవగాహన లేకపోవడం, సంప్రదాయ నమ్మకాల ప్రభావం వంటి కారణాలతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అనారోగ్యాలు లేదా అనూహ్య మరణాలకు వైద్య కారణాలు తెలుసుకునే బదులు కొందరు వ్యక్తులపై చిల్లంగి ముద్ర వేయడం విషాదాలకు దారి తీస్తోంది. గత ఘటనల్లో కోర్టులు కఠిన శిక్షలు విధించినప్పటికీ, మూఢనమ్మకాల నిర్మూలన కోసం వ్యవస్థలు అవగాహన కల్పిస్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదు. మన్యం ప్రాంతంలో చిల్లంగి నెపంతో జరిగిన ఘటనలు కేవలం నేర సంఘటనలు మాత్రమే కాకుండా, సమాజంలో ఇంకా మిగిలి ఉన్న అజ్ఞానానికి అద్దం పడుతున్నాయని సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇంట్లో ఉన్న మా ఆయనను ఈడ్చుకొని వెళ్లారు. చిల్లంగి చేస్తున్నారని ఆరోపించారు. నిరూపించండి అని అడిగాను. కాళ్లు పట్టుకుని బతిమిలాడాను. ఎక్కడ ఒట్టు వేయాలన్నా వచ్చి వేస్తా అని చెప్పాను. వినలేదు. పిల్లల ముఖం చూసి వదిలేయండని ప్రాథేయపడ్డాను. ఈడ్చుకొని వెళ్లి కొట్టి చంపేసి, కాల్చి వేశారు. – సృజన, వెలగవలస మృతుడు రమేష్ భార్య పార్వతీపురం మండలం వెలగవలస గ్రామంలో చిల్లంగి నెపంతో గ్రామస్తులు రమేష్ అనే యువకుడిని హత్య చేసి, మృతదేహాన్ని తగలబెట్టడం కలకలం రేపింది. గతంలో రమేష్ తండ్రిని కూడా చిల్లంగి నెపంతో గ్రామస్తులు ఊరి నుంచి తరిమివేశారు. దీంతో ఆయన ఎక్కడో దూరంగా తల దాచుకుంటున్నాడు. కొన్నేళ్ల కిందట మక్కువ మండలంలో అప్పన్న అనే వ్యక్తిని ‘చేతబడి’నెపంతో గ్రామస్తులే హత్య చేశారు. మరో సందర్భంలో ఇదే మండలానికి చెందిన దంపతులపై చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో కొంతమంది దాడి చేశారు. సాలూరు ఏజెన్సీ పరిధిలో కూడా చేతబడి నెపంతో ఒకరిపై గొడ్డలితో దాడి చేసిన తీవ్ర ఉదంతం చోటు చేసుకుంది. పాచిపెంట మండలంలో కొర్రు ముగయ్యను చిల్లంగి చేస్తున్నాడనే ఆరోపణలతో ఇద్దరు వ్యక్తులు హత్య చేశారు. కొన్నాళ్ల క్రితం జియ్యమ్మవలస మండలంలోని ఒక గిరిజన గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై గ్రామస్తులు చిల్లంగి నెపంతో దాడి చేశారు. గ్రామంలో వరుసగా కొందరు అనారోగ్యానికి గురికావడానికి ఆ కుటుంబమే కారణమని భావించి, రాత్రి వేళ వారి ఇళ్లపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గ్రామాల్లో ఎవరికై నా వింత జబ్బులు తగ్గకపోయినా, పశువులు చనిపోయినా, వరుసగా కీడు జరిగినా.. దానికి కారణం ఎవరో చేతబడి (చిల్లంగి) చేయడమేనని స్థానికులు నమ్ముతుంటారు. ఈ క్రమంలో అనుమానితులపై భౌతికదాడులు చేయడం, గ్రామ బహిష్కరణలు, కొన్ని తీవ్ర సందర్భాల్లో హత్యలకు కూడా దారితీసిన ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. విద్యావంతుల శాతం తక్కువగా ఉండడం, ఆరోగ్య సమస్యలపై శాసీ్త్రయ అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి నమ్మకాలు బలంగా నాటుకుపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆస్తి తగాదాలు, పాత కక్షలను మనసులో పెట్టుకుని, ప్రత్యర్థులపై ‘చేతబడి’ ముద్రవేసి గ్రామస్తులను వారిపైకి ఉసిగొల్పేలా చేస్తుంటారు. -
స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభం
పార్వతీపురం: జిల్లాలో 0–6 సంవత్సరాల పిల్లల ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ఏఐ ఆధారిత ఈసీడీ స్క్రీనింగ్ పరీక్షలను కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి మంగళవారం ప్రారంభించారు. కలెక్టరేట్ పీజీఆర్ఎస్ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పోషణ్ ట్రాకర్ డేటా విశ్లేషణ, పిల్లల 100 శాతం హాజరు, ఆటలు–వ్యాయామాల నిర్వహణపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెల ‘స్మార్ట్ ముస్తాబ్ – హెల్తీ బాయ్, హెల్తీ గర్ల్’ పోటీలను నిర్వహించి ఆరోగ్యవంతమైన పిల్లలను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, డీఎంహెచ్ఓ భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు. -
అవయవదానానికి అంగీకారం
వీరఘట్టం: పెళ్లయిన నాలుగేళ్లకే భర్త చనిపోయిన దుఃఖాన్ని భార్య, ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న కుమారుడు చనిపోయాడనే బాధను తల్లిదండ్రులు దిగమింగారు. చిరంజీవిగా జీవించాలన్న పెద్దమనసుతో బ్రెయిన్డెడ్ అయిన సోమేశ్వరరావు అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. బుధవారం ఉదయం అవయవదానం చేసేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీతంపేట మండలం చాకలిగూడకు చెందిన సవర సోమేశ్వరరావు(31) వీరఘట్టం మండలం తెట్టంగిలో జూనియర్ లైన్మెన్గా గత రెండేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. గతనెల 31న గ్రామంలో ఓ విద్యుత్ స్తంభంపై పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయిన విషయం తెలిసిందే. ప్రమాదంలో ఆయన తల సీసీరోడ్డుకు బలంగా తగలడంతో వైద్యం కోసం శ్రీకాకుళం కిమ్స్కు తోటి సిబ్బంది తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సోమేశ్వరరావు తలకు ఆదివారం రాత్రి అక్కడి వైద్యులు ఆపరేషన్ చేసినా ఫలితం లేకపోయింది. సోమవారం మధ్యాహ్నానికి సోమేశ్వరరావు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని వైద్యులు తెలపడంతో భార్య ఐశ్యర్య, తల్లిదండ్రులు సుందరయ్య, సరస్వతమ్మ కన్నీటిపర్యంతమయ్యారు. వైద్యుల సూచనల మేరకు అవయవాలను దానం చేసేందుకు అంగీకారం తెలిపారు. అవయవదానం అనంతరం బుధవారం సోమశ్వరరావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారని ట్రాన్స్కో సిబ్బంది తెలిపారు. -
● తాగునీటి కష్టాలు తీర్చండి ‘బాబూ’...
కొద్ది రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదు.. బిందెడు నీటికోసం అష్టకష్టాలు పడుతున్నాం.. సువర్ణముఖి నదికి పరుగుతీస్తున్నా బురదనీరే గతి అవుతోంది... తాగునీటి కష్టాలు తీర్చాలని అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు... ఇదెక్కడి అన్యాయం ‘బాబూ’ అంటూ సీతానగరం మండలంలోని పెదంకలాం గ్రామస్తులు మంగళవారం ఆందోళన చేశారు. ఖాళీ బిందెలతో సచివాలయాన్ని మంగళవారం ముట్టడించారు. అక్కడే కాసేపు నిరసన తెలిపారు. ఈ విషయంపై పంచాయతీ అభివృద్ధి అధికారి గౌరీశ్వరి స్పందిస్తూ వాటర్ స్కీమ్ మోటారు కాలిపోవడంతో తాగునీటి సమస్య తలెత్తిందని, మోటారుకు మరమ్మతులు చేయించామని, టెక్నీషియన్తో అమర్చి రెండు రోజుల్లో తాగునీటి సరఫరాను పునరుద్ధరిస్తామన్నారు. – సీతానగరం -
గడపకో రోగి.. ఇంటికో వ్యథ
రమేష్ను మంటల్లో వేసి తగులబెట్టిన దృశ్యం సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్: పార్వతీపురం మండలం వెలగవలస గ్రామంలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. గడపకో రోగి.. ఇంటికో వ్యథ.. ఎక్కడ చూసినా ఇదే స్థితి. పదుల సంఖ్యలోనే ఇళ్లు ఉండే గిరిజన పల్లెలో రెండు నెలలుగా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అంతుచిక్కని కలవరం.. అంతులేని భయం. జ్వరం, జలుబు, దగ్గుతో పాటు రోగుల్లో వింత ప్రవర్తన. ఒక్కసారిగా పెద్ద అరుపులు.. వెర్రి చూపులు.. కాళ్లు, చేతులు కొట్టుకుంటూ ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేలా చేష్టలు. అసలే మూఢ నమ్మకాలను బలంగా నమ్మే గిరిజనులు. ఆకులు, అందుబాటులో దొరికిన మందులతో వైద్యం చేస్తున్నారు. దెయ్యం పట్టిందని ఒకరు.. చేతబడి చేశారని ఇంకొకరు.. ఆ భయంతోనే గ్రామానికి చెందిన తాడంగి రమేష్(30) ను సోమవారం సాయంత్రం గ్రామస్తులంతా తీవ్రంగా కొట్టి గాయపరిచారు. చేతబడి చేస్తున్నాడని, అందువల్లే గ్రామంలో ఉన్నవారంతా వింతగా ప్రవర్తిస్తున్నారని అనుమానించారు. అక్కడితో వారి కోపం చల్లారలేదు. మంత్ర శక్తులు ఉన్నాయని కాళ్లు, చేతులు వేరు పడేసినట్లు సమాచారం. చనిపోయాక మృతదేహాన్ని మంటల్లో తగులబెట్టారు. సోమవారం రాత్రితో పాటు, మంగళవారం కూడా పోలీ సులు అక్కడికి చేరుకుని విచారణ జరిపారు. ఊరిలోనే చికిత్స.. గ్రామానికి చెందిన చాలామంది అనారోగ్యంతో బాధ పడుతున్నా.. ఏ ఒక్కరూ ఆస్పత్రిని ఆశ్రయించడం లేదు. పసరమందులు, మంత్రాల వైద్యంతో కాలం వెళ్లదీస్తున్నారు. వింత వ్యాధితో బాధపడుతున్న యువతి కడ్రక బంగారమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. వ్యాధి నిర్ధారణ కావాల్సి ఉంది. వైద్య నిపుణులు, అధికారులు గ్రామాన్ని సందర్శించి ప్రజలకు అవగాహన కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు. 16 మంది నిందితుల అరెస్టు చేతబడి చేస్తున్నాడనే నెపంతో రమేష్ను సజీవ దహనం చేసిన ఘటనలో 16 మందిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆధునిక కాలంలోనూ ఇలాంటి అపోహలతో ప్రాణాలు తీయడం దారుణమని, గుంపుగా దాడి చేసినా ప్రతి ఒక్కరినీ గుర్తించి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ మనీషారెడ్డి స్పష్టంచేశారు. వెలగవలసలో ఏం జరుగుతోంది? ప్రతి ఇంటిలోనూ వింత ప్రవర్తనతో గిరిజనులు భయాందోళనలో గ్రామస్తులు చేతబడి నెపంతో వ్యక్తి హత్య -
డీఎస్సీలో అవకతవకలపై నిరుద్యోగుల ఆగ్రహజ్వాల
విజయనగరం గంటస్తంభం: డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో అవకతవకలపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు. స్పోర్ట్స్ కోటాతో సహా పలు విభాగాల్లో అనర్హులకు పోస్టులు కట్టబెట్టడంపై ఆందోళన వ్యక్తంచేశారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి పుస్తకాలతో కుస్తీపట్టి అధిక మార్కులు సాధించిన నిరుద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ మండిపడ్డారు. పోస్టులను డబ్బులకు అమ్మేశారంటూ ఆరోపించారు. డీఎస్సీ అవకతవకలకు నిరసనగా వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం మహాధర్నా నిర్వహించారు. ముందుగా విజయనగరం కంటోన్మెంట్ మున్సిపల్ పార్క్ నుంచి రాజీవ్ యువకేంద్రం మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దారిపొడవునా విద్యాశాఖమంత్రి నారా లోకేశ్ డౌన్డౌన్, తక్షణమే రాజీనామా చేయాలంటూ నినదించారు. మెగా డీఎస్సీ కాదు... ఇది దగా డీఎస్సీ, నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆటలు ఆడొద్దు, మెరిట్ లిస్ట్ ఎందుకు దాచారు?, ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఎవరికిచ్చారు? అంటూ నినాదాలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది యువత, డీఎస్సీ అఽభ్యర్థులు, విద్యార్థులు, నిరుద్యోగుల నినాదాలతో కలెక్టరేట్ పరిసరాలు హోరెత్తాయి. నిరుద్యోగులకు న్యాయం చేసేవరకు పోరుబాట సాగిస్తామని స్పష్టంచేశారు. ర్యాలీ అనంతరం జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్కు వినతిపత్రం అందజేసి డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో కౌశిక్, బొత్స చైతన్య, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, వాకాడ సతీష్, పైడిపునాయుడు, శంకరరావు, వావిలిపల్లి రమణారావు, జిల్లా స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు కరుమజ్జి సాయి, టౌన్ అధ్యక్షుడు చెల్లూరి భార్గవ్, జిల్లా పబ్లిసిటీ వింగ్ అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎస్సీ సెల్ నాయకులు, వివిధ అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువత భవిష్యత్తో చెలగాటం డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో జరిగిన పరిణామాలు చూస్తుంటే నిరుద్యోగ యువతకు న్యాయంచేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి కనిపించడం లేదు. అర్హులైన అభ్యర్థులను పక్కనపెట్టి అనుమానాలకు తావిచ్చేలా నియామకాలు నిర్వహించడం బాధాకరం. వేలాది మంది యువత కష్టపడి చదివి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే వారి ఆశలను ప్రభుత్వం దెబ్బతీసింది. డీఎస్సీ బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేవరకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంది. – బొత్స అనూష, వైఎస్సార్సీపీ యువ నాయకురాలు నకిలీ క్రీడా సర్టిఫికెట్లతో ఉద్యోగాలా? స్పోర్ట్స్ కోటాలో ఎప్పుడూ వినని గేమ్స్ పేర్లతో, అనుమానాస్పద క్రీడా సర్టిఫికెట్ల ఆధారంగా కొందరికి ఉద్యోగాలు కట్టబెట్టారనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నిజమైన క్రీడాకారులకు అన్యాయం చేసి, అర్హతలేని వారికి లబ్ధి చేకూర్చారనే అనుమానాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అర్హులైన క్రీడాకారులకు న్యాయం జరిగేవరకు పోరాటం కొనసాగిస్తాం. – బడ్డుకొండ ప్రదీప్ నాయుడు, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు డీఎస్సీపై వచ్చిన ప్రతి ఆరోపణపై సమగ్ర విచారణ జరగాలి పేపర్ లీకేజీ, డేటా డిలీట్, ఎంపికల ప్రక్రియలో పారదర్మకత లేకపోవడం వంటి అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. డీఎస్సీ ప్రక్రియపై నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం. – అల్లు అవినాష్, యువజన విభాగం అధ్యక్షుడు యువత ఆశలకు గండి డీఎస్సీ నియామకాల ప్రక్రియలో వచ్చిన ఆరోపణలు నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. అర్హులకు అన్యాయం జరగకూడదు. స్వతంత్ర విచారణ జరిపి నిజాలను బయటపెట్టాలి. – శోభా స్వాతిరాణి, చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు చంద్రబాబు ప్రభుత్వ తీరుపై నిరసన విజయనగరంలో మహాధర్నా పాల్గొన్న వేలాదిమంది నిరుద్యోగులు, వైఎస్సార్సీపీ యువజన నాయకులు మెరిట్కు టీడీపీ సమాధి కట్టిందంటూ మండిపాటు మెరిట్లిస్ట్ ఎందుకు దాచారు?.. డేటా ఎందుకు తొలగించారు? ప్రభుత్వాన్ని నిలదీసిన యువత డీఎస్సీ నియామకాలపై సమగ్ర విచారణ కోరుతూ జేసీ సేతు మాథవన్కు వినతిపత్రం -
మన డబ్బులు–మన లెక్కలు ర్యాలీ
బలిజిపేట: మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ నారీ యాప్తో అందరికీ మేలు జరుగుతుందని కలెక్టర్ ప్రభాక రరెడ్డి తెలిపారు. ఈ మేరకు బలిజిపేట మండలంలోని వెంగాపురంలో మన డబ్బులు–మన లెక్కలు అవగాహన ర్యాలీని ఆయన పచ్చజెండా ఊపి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ర్యాలీ చేసి మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీ ల్లో పూర్తి పారదర్శకత ప్రవేశపెట్టి మన డబ్బులు–మన లెక్కలు చూసుకునే విధంగా సూపర్ నారీ యాప్ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. దీని పై అందరికీ అవగాహన కల్పించి దీని ప్రాధాన్యతలను వివరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండలస్థాయి అధికారులు, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.పార్వతీపురం: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే జిల్లా రెండం స్థానంలో నిలిచిందని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి సోమవారం తెలిపారు. జిల్లాలో ఇంకుడు గుంతలు, ఇతర ఉపాధి పనుల్లో 10 లక్షల మార్కును దాటి దేశంలో రెండో స్థానాన్ని సాధించడం గర్వకారణమన్నారు. ఈ విజయానికి కృషి చేసిన పీడీ డ్వామా, క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులను అభినందించారు. అదే సమావేశంలో ఆలయా ల పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించా రు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె. హేమలత, ప్రత్యేక ఉప కలెక్టర్ ఎస్.దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. కొమరాడ: వైఎస్సార్సీపీ పార్వతీపురం మన్యం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు నంగిరెడ్డి శరత్బాబు ఇటీవల గుండెపోటుతో మరణించడం త్రీవ దిగ్భ్రాంతికి గురిచేసిందని పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. కొమరాడ మండలంలోని రాజ్యలక్ష్మిపురం గ్రామానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రచర్ల పరీక్షత్ రాజు, మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి దంపతులతో కలిసి సోమవారం వెళ్లారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. పరామర్శించిన వారిలో పెందుర్తి మాజీ ఎమ్మేల్యేఅన్నమరెడ్డి అదీప్రాజు, పార్టీ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు ఉరుకూటి రామచంద్రరావు, పేల్లేటి వెంకటేష్, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దొడ్డి కిరణ్, పార్టీ మండల కన్వీనర్ ద్వారపురెడ్డి జనర్దనరావు, జిల్లా ఉపాధ్యక్షుడు కళింగి మల్లేశ్వరరావు ఉన్నారు. బలిజిపేట: సారూ మా అబ్బాయి పేరు జి.హితీష్. 13 సంవత్సరాలు. మెదడు, కిడ్నీలు, శరీ ర అవయవాలు సక్రమంగా పనిచేయవు. మంచంపైనే అన్నీ. సేవచేసేందుకు ఓ మనిషి ఉండిపోవాలి. అప్పుడప్పుడు ఫిట్స్ వస్తే కాళ్లు, చేతు లు కొట్టుకుంటాడు. ఇటువంటి వారికి రూ.15 వేల పింఛన్ ఇస్తారని తెలిసింది... ఇప్పించి ఆదుకోవాలంటూ వెంగాపురానికి చెందిన హితీష్ తల్లి జయలక్ష్మి, తండ్రి శంకరరావు కలెక్టర్ ప్రభాకర రెడ్డికి విజ్ఞప్తిచేశారు. వెంగాపురంలో పింఛన్ల పంపిణీలో సోమవారం కలెక్టర్ పా ల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగుడి తల్లి దండ్రులు మాట్లాడుతూ ప్రస్తుతం రూ.6వేలు అందుతోందని, రూ.15 వేలు పింఛన్ ఇచ్చి ఆదుకోవాలంటూ కలెక్టర్ను వేడుకున్నారు. దీనిపై పరిశీలిస్తామని, బాలుడిని దివ్యాంగుల పాఠశాలలో చేర్పించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ప్రభావతి, ఎంపీడీఓ శ్రీవాణి పాల్గొన్నారు. -
సేఫ్జోన్లోకి వచ్చేనా?
సాక్షి, పార్వతీపురం మన్యం: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జో న్ అధికారికంగా సోమవారం నుంచి ప్రారంభమైంది. రైల్వేశాఖ పరంగా ఇప్పటివరకు ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ జోన్ పరిధిలో ఈ ప్రాంతం ఇక మీదట విశాఖ జోన్ పరిధిలోకి వచ్చింది. భువనేశ్వర్ పరిధి లో ఉండడం వల్ల.. జిల్లా మీదుగా పలు రైళ్ల విషయంలో నిర్లక్ష్యం ఉండేదన్న విమర్శలు ఉన్నాయి. ఒడిశా, హౌరా ప్రాంతాల మీద ఉన్న శ్రద్ధ.. ఇటు వైపు కొరవడింది. అరకొర రైళ్లు, పరిమిత పాసింజ ర్ బళ్లు, ఎవరికీ ఉపయోగపడని వేళలు రైల్వే ఉన్నతాధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపాయి. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కావడంతో ఇకమీదనైనా రైలు ప్రయాణ కష్టాలు తీరుతాయా.. అని ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. వేలాది మందికి రైలు ప్రయాణమే దిక్కు.. జిల్లాలో పార్వతీపురం(బెలగాం), పార్వతీపురం టౌన్, సీతానగరం, నర్సిపురం, గుమడ, కూనేరు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. జిల్లా విభజన తర్వాత విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల నుంచి బొబ్బి లి, పార్వతీపురం, సాలూరు వైపు ప్రయాణించే ఉద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. తప్పనిసరి బదిలీలు కావడం వల్ల పిల్లల చదువు, ఇతర ఇబ్బందులతో కుటుంబాలను వదిలి ఇక్కడకు రాలేక.. మరో మార్గం దొరకక వందలాది మంది నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. బస్సుల్లో ప్రయాణం అధిక సమయం కావడంతో పాటు.. చార్జీల భారం కూడా మోయలేనంతగా పడుతుంది. దీనివల్ల రైలు ప్రయాణమే దిక్కు అవుతోంది. వీరితోపాటు వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు, ఆస్పత్రి పని మీద వెళ్లి వచ్చేవారు ఇలా, వేలాదిమంది నిత్యం ప్రయాణాలు సాగిస్తున్నారు. ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ మార్గంలో కేవలం మూడే పాసింజర్ సర్వీసులు నడుస్తున్నాయి. ఇవి కూడా ఏ సమయానికి వస్తాయో.. ఏ సమయానికి గమ్య స్థానం చేర్చుతాయో తెలియని పరిస్థితి. గంటలకొద్దీ ఆలస్యం చేస్తుండడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, ఆస్పత్రి పనిమీద వెళ్లేవారి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. నిత్యం నడిచే ఎక్స్ప్రెస్ సర్వీసులు మూడు, నాలుగే ఉన్నాయి. వీక్లీ బళ్లు ఉన్నా.. దూర ప్రాంతం నుంచి రావడం వల్ల ఒక్క రోజు కూడా సమయానికి నడిచిన సందర్భాలు ఉండవు. దీనికితోడు సరిపడా బోగీలు వేయకపోవడం వల్ల కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నా రు. కొత్త రైల్వే జోన్ కింద కార్యకలాపాలు ప్రారంభమైన నేపథ్యంలో.. ఉత్తరాంధ్ర ప్రజలకు ఉపయోగపడేలా పార్వతీపురం మార్గంలో అదనపు రైలు సర్వీసులు నడపాలని, అన్ని వర్గాలకూ అక్కరకు వచ్చేలా కచ్చితమైన వేళలు పాటించాలని, బోగీల సంఖ్యను పెంచాలన్న డిమాండ్ ప్రయాణికుల నుంచి వినిపిస్తోంది. సాలూరుకు రైలు కూత వినిపించేనా? ఎన్నో ఏళ్లుగా సాలూరుకు రైలు బండి.. అదిగో, ఇదిగో అని ఊరిస్తూనే ఉంది. పలుమార్లు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. గత సారి మంత్రి సంధ్యారాణి అట్టహాసంగా ట్రయల్ రన్ ప్రక్రియను జెండా ఊపి కూడా ప్రారంభించారు. ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ బండి కూత ఈ ప్రాంత వాసులకు వినిపించడం లేదు. విశాఖ–విజయనగరం ప్యాసింజర్ రైలు(మెము)ను సాలూరు వరకు పొడిగిస్తున్న ట్లు పలుమార్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఎవరికీ అనుకూలం కాని సమయం ప్రకటించడంతో స్థానికుల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ఆ బండి మాత్రం పట్టలెక్కలేదు. సాలూరు విషయంలో రైల్వే శాఖ నిర్లక్ష్యం చేయడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో సాలూరు–బొబ్బిలి మధ్య నడుస్తున్న రైలు బస్సు ను రైల్వే శాఖ ఆపేసింది. తరువాత కరోనా తగ్గినా ఈ రైలు బస్సును మాత్రం నడపడం లేదు. కొత్త జో న్లో అయినా సాలూరు రైలు బండికి పచ్చ జెండా ఊపాలని ఆ ప్రాంత వాసులు ఆకాంక్షిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రానికి రైలు ప్రయాణం అంటే చాలా మందికి ఇప్పటికీ భయమే. ఉన్నవే అరకొర రైళ్లు. దాదాపు అన్ని బళ్లూ కిక్కిరిసి ఉంటాయి. విశాఖ–విజయనగరం–బొబ్బిలి–ఒడిశా(రాయగడ) వైపు ప్రధాన మార్గమైనప్పటికీ.. రైల్వే శాఖ ఎందుకనో ఇటు చిన్నచూపు చూస్తోంది. విజయనగరం – శ్రీకా కుళం – హౌరా మార్గంలో ప్రతి అరగంటకూ ఒక రైలు బండి కచ్చితంగా నడుస్తుంది. పాసింజర్/ ఎక్స్ప్రెస్/ సూపర్ఫాస్ట్ సర్వీసులు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇదే సమయంలో నిత్యం వేలాది మంది ప్రయాణించే పార్వతీపురం మార్గంలో నడిచే రైళ్లు రోజులో 10 కంటే తక్కువగానే ఉంటాయి. సరిపడా సర్వీసులు ఉండవు. అవీ సమయానికి రావు. రద్దీకి తగ్గ బోగీలూ వేయరు. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు అవస్థలు పడి, కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోంది. లోపలికి అడుగు పెట్టేందుకు కూడా ఖాళీ లేని విధంగా ప్రయాణికులు ఉంటున్నా.. తగిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో రైల్వే శాఖది ఎందుకనో అంతులేని నిర్లక్ష్యమే కనిపిస్తోంది. -
జేఈఈ అడ్వాన్స్డ్లో మన్యం విద్యార్థుల ప్రతిభ
సీతంపేట/వీరఘట్టం: జేఈఈ అడ్వాన్స్డ్–2026 ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. ఉత్తమ ర్యాంకులు సాధించారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో నిర్వహిస్తున్న ఐఐటీ సూపర్–60 బ్యాచ్లో శిక్షణ పొందిన సవర వెంకట రావు అనే విద్యార్థి ఎస్టీ కేటగిరీలో జాతీయస్థాయి లో 473వ ర్యాంకు సాధించాడు. అలాగే, ఎస్టీ కేటగిరీలో సవర మణి–810, కుంజాం శ్రీలత– 865, సవర బాగ్యలక్ష్మి –1309, సవర దీనా–1793, డి. స్వాతీబాయ్–2012 ర్యాంకులు సాధించారు. విద్యార్థులను పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇంచార్జ్ పీఓ పవార్ స్వప్నిల్, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర అభినందించారు. ●వీరఘట్టంకు చెందిన భోగి శ్రీకర్ జేఈఈ అడ్వాన్స్డ్ ప్రవేశ పరీక్షలో 152 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో 5,446, ఈడబ్ల్యూఎస్లో 644 ర్యాకు సాధించాడు. విద్యార్థిని తల్లిదండ్రులు సుజాత, శ్రీధర్ అభినందించారు. ●గరుగుబిల్లి మండలంలోని హిక్కింవలస గ్రామానికి చెందిన పెంట శ్రీశాంత్ జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఆల్ ఇండియా కేటగిరీలో 651వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 108వ ర్యాంకు సాధించాడు. -
ఈపీడీసీఎల్ ఎస్ఈగా త్రినాథరావు
సాక్షి, పార్వతీపురం మన్యం: ఈపీడీసీఎల్ పార్వతీపురం మన్యం సర్కిల్(ఆపరేషన్) ఎస్ఈగా పి.త్రినాథరావు నియమితులయ్యారు. విజయనగరం సర్కిల్లో టౌన్ డీఈగా పనిచేస్తున్న ఆయన ఉద్యోగోన్నతిపై జిల్లాకు వస్తున్నారు. ప్రస్తుతం ఎస్ఈగా పనిచేస్తున్న కె.మల్లికార్జునరావుకు విశాఖపట్నం బదిలీ అయ్యింది. పార్వతీపురం పట్టణ డీఈ కె.గోపాలరావునాయుడును విజయనగరం రూరల్ డివిజన్ డీఈగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో విశాఖపట్నం నుంచి ఆర్.రామునాయుడు ఉద్యోగోన్నతిపై ఇక్కడికి వస్తున్నారు. పార్వతీపురం ఏడీఈ(కనస్ట్రక్షన్స్)ఎం. లక్ష్మీ నారాయణ ఉద్యోగోన్నతిపై విజయనగరం డీఈగా అదే విభాగానికి వెళ్తున్నారు. ఈయన స్థానంలో విజయనగరం నుంచి రెడ్డి ఈశ్వరరావు నియమితులయ్యారు. -
అయ్యబాబోయ్ జూన్
సీతంపేట/ వీరఘట్టం: జూన్ ఒకటి ఎప్పుడో కాదండోయ్..ఇదిగో ఈ రోజు నుంచే సగటు మధ్యతరగతి కుటుంబాలు అష్టకష్టాలు పడాల్సిన నెల అంటే ఇదేనేమో.. విద్యాసంవత్సరం ఆరంభమవతుంది. ఈనెల 6వ తేదీ నుంచి జూనియర్ కళాశాలలు, 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అలాగే వివిధ డిగ్రీ కళాశాలలు కూడా తరగతులు నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలను చదివించడానికి ఫీజుల బారం, పుస్తకాలు, బ్యాగులు, ఇతర స్టేషనరీ కొనుగోలుకు తల్లిదండ్రులు నానా అవస్థలు పడాల్సిందే. మరో వైపు రైతన్నలకు ఖరీఫ్ సాగుకు తగిన ఆర్థికసాయం లేక ఇబ్బందులు పడుతుంటారు. ఇంకోవైపు పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో పెరిగిన పెట్రోల్, డీజిల్ నిత్యావసర సరుకుల ధరలతో సగటు మధ్యతరగతి కుటుంబీకుడు ఏవీ కొనుగోలు చేయలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. జిల్లాలోని 15 మండలాల్లో 1.12 లక్షల ఎకరాల్లో సుమారు 35 వేల మంది రైతులు ఖరీఫ్లో వరి సాగు చేస్తున్నారు. ఒక ఎకరాలో సాగు చేయాలంటే రూ.15వేల నుంచి 20 వేల వరకు ఖర్చవుతుంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో రైతులు కూరగాయలు, పండ్లతోటలు సాగు చేస్తూ కుటుంబపోషణ చేస్తున్నారు. రైతులు ఖరీఫ్కు తమ పంట పొలాలకు సాగుకు సిద్ధం చేస్తున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేయడానికి సమాయత్తమవుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా అప్పులు చేసైనా పంటలు పండించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదీ పరిస్థితి.. ఇంజినీరింగ్, డిగ్రీ, ఫార్మసీ,ఇతర సాంకేతిక కోర్సులు చదవడానికి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. రోజు పదుల సంఖ్యలో పాఠశాలలకు చెందిన బస్సులు, విద్యార్థులను తీసుకువెళ్లేందుకు గ్రామాలకు వస్తుంటాయి. ఇదేవిధంగా ప్రస్తుతం రైతులు ఖరీఫ్లో సాగుకు సిద్ధమవుతున్నారు. పంట పెట్టుబడికి రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇటు వ్యవసాయ మదుపులు, అటు కళాశాల, పాఠశాలల ఫీజుల భారంతో ఇబ్బందులు పడుతున్నారు. అందని పథకాల సొమ్ము.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ పథకాల రూపంలో దాదాపు ప్రతి నెలా ఏదో ఒక రూపంలో ప్రజలకు డబ్బులు ఖాతాల్లో జమయ్యేవి.అవి స్కూల్,వ్యవసాయం,ఖర్చులకు ఆసరాగా నిలిచేవి.అమ్మ ఒడి,విద్యా దీవెన,వసతి దీవెన,విదేశీ విద్యా దీవెన,పధకాలతో ఠంచనుగా చెప్పిన తేదీకే తల్లిదండ్రుల ఖాతాల్లో సొమ్ము జమ అయ్యేది.దీంతో పేద,మధ్య తరగతికి చెందిన ప్రజలు తమ పిల్లల్ని దర్జాగా చదివించేవారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పథకాలకు పంగనామం పెట్టేసింది.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో జిల్లాలో అమ్మ ఒడి ద్వారా రూ.645 కోట్లు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమచేసింది.1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంటిలో ఎంతమంది చదివితే అందరికీ తల్లికి వందనం రూ.15 వేలు చొప్పున ఇస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది.తల్లికి వందనం కోసం గతేడాది జిల్లాలో 69,600 మంది తల్లులను గుర్తించారు. మొత్తం 1,08,951 మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించారు.అయితే వారిలో 69 వేల మంది మంది తల్లులకు మాత్రమే తల్లికి వందనం ఇచ్చి మిగిలిన సుమారు 40 వేలకు పైబడి తల్లులకు వివిధ కారణాలు సాకుగా చూపి తల్లికి వందనం ఎగ్గొట్టేశారని తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వం తీరును దుయ్యబడుతున్నారు. మధ్య తరగతి కుటుంబాలకు తప్పని ఆర్థిక కష్టాలు పిల్లల చదువుల ఖర్చులకు అవస్థలు ఖరీఫ్ సాగు రైతులకు పెట్టుబడులకు అప్పులు ఫీజుల మోత..ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో పీజులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంటు బకాయిలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. పాతబకాయిలు చెల్లించాలంటూ ఇప్పటికే ఇంజినీరింగ్ కళాశాలలు విద్యార్థులపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో ఫీజులు కట్టకపోతే కళాశాలల్లో చేరనిస్తారో లేదో తెలియని పరిస్థితి ఉందని విద్యార్థులు వాపోతున్నారు. ఎంతోకొంత మొత్తమైనా చెల్లించాలని ఒత్తిడి ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. -
విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సంఘం పటిష్టతకు చర్యలు
నెల్లిమర్ల: జిల్లాలోని విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఉద్యోగుల సంఘం బలోపేతానికి చర్యలు చేపడుతున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ అధ్యక్షుడు కోసూరు రాంబాబు అన్నారు. ఈ మేరకు నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి జరజాపుపేటలోని ఓ కల్యాణ మంటపంలో ఆరిపాక శ్రీనివాసరావు అధ్యక్షతన ఆదివారం జరిగిన ఆ సంఘం నెల్లిమర్ల నియోజకవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సంఘ కార్యకలాపాలు మూడు దశాబ్దాలుగా కేవలం జిల్లా కేంద్రానికి పరిమితమయ్యాయని, ఇకనుంచి ఆ కార్యకలాపాలను జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని జిల్లా కమిటీ నిర్ణయించిందని వెల్లడించారు. తొలుత నియోజకవర్గాల స్థాయిలో కమిటీలు వేసేందుకు జిల్లా వ్యాప్త పర్యటనలు చేస్తున్నామని వివరించారు. విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామన్నారు. ఉద్యోగులందరూ ఏకాభిప్రాయంతో, ఐక్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ జనా ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెదురుపర్తి గీత సత్య ఉమాపతి, కోశాధికారి కెల్ల సోమ శేఖర్, సంఘం జిల్లా నాయకులు కుప్పిలి శ్రీనివాస్, మంతెన అప్పలరాజు, సంభాన లక్ష్మణరావు, కుప్పిలి మోహన్ బాబు, పట్నాల బాలసుబ్రహ్మణ్యం, చంద్రమౌళి, తాతాచారి, నెల్లిమర్ల నాయకులు ఆరిపాక శ్రీనివాసరావు, కృష్ణమాచారి, కడలి ప్రకాశరావు, సత్య సాయి గణేష్,ఆరిపాక రాము, బాబు విశ్వేశ్వరరావు, కడలి రమేష్ కుమార్, కొమ్మోజు సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కోసూరు రాంబాబు -
వ్యసనాలతో జీవితాలు నాశనం
● డీఎస్పీ రాఘవులు ● బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో పొగాకు నిషేధ దినోత్సవ అవగాహన ర్యాలీవిజయనగరం టౌన్: వ్యసనాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దని విజయనగరం డీఎస్పీ ఎస్.రాఘవులు సూచించారు. ప్రపంచ పొగాకు నిషేధ దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో పట్టణంలో ఆదివారం భారీ మోటార్ సైకిల్ అవగాహన ర్యాలీని జిల్లా పోలీస్శాఖ సహకారంతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ మాట్లాడుతూ పొగాకు, డ్రగ్స్, గంజాయి వినియోగంతో కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు దుర్భరంగా తయారవుతున్నాయని వాటన్నంటికీ ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. పొగాకు, డ్రగ్స్, గంజాయితో వచ్చే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బ్రహ్మకుమారీస్ ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పట్టణానికి చెందిన సీఐలు, ఎస్సైలు జిల్లా నలుమూలల నుంచి బ్రహ్మకుమారీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
జలధార – జలహారతితోనైనా.. సాగునీటి కష్టాలు తీరేనా..!
రామభద్రపురం: జిల్లాలో వేలాది ఎకరాల ఆయకట్టు ఆధారమై న చెరువులు, ఫీడర్ చానల్స్, ఫీల్డ్ చానల్స్ పూడికలు, ముళ్ల పొదలతో నిండిపోయాయి. మదుము లు, చెక్డ్యాంలు పూర్తిగా శిథిలావస్థకు చేరి అధ్వానంగా తయారయ్యాయి. దాదాపు దశాబ్ద కాలంగా వాటి నిర్వహణ ఊసే లేకుండా పోయింది. 2014 – 19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం నీరు చెట్టు పథకం కింద ఉపాధి హామీ నిధులతో కొన్ని చోట్ల మదుములు, చప్టాలు, చెక్డ్యాంల పనులు చేయకుండానే చేసినట్టు, మరికొన్ని చోట్ల పనులు నాసిరకంగా చేసి రూ.కోట్ల నిధులు అప్పట్లో ఆయా నాయకులు అక్రమాలకు పాల్పడినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఉపాధి హామీ పథకం కింద చెరువు పనులు చేసినా తూతూ మంత్రంగానే తప్ప రైతులకు ఉపయోగపడేలా చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. మదుముల దుస్థితి చూస్తే సాగునీరు సరఫరా అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. చెరువులలోని సాగునీటిని పంట పొలాలు మీదుగా చెరువులకు చేరుస్తూ నీటితో కళకళలాడాల్సిన పంట కాల్వలు నేడు మురుగు కాల్వలను తలపిస్తున్నాయి. 5–6 అడుగుల లోతులో ఉండాల్సిన సాగునీటి కాల్వలు వ్యర్థాలు, చెత్త చెదారంతో పూ ర్తిగా నిండిపోయాయి. ప్రస్తుతం ఈ కాల్వలు ముళ్లపొదలు, చిన్న చిన్న చెట్లు, వ్యర్థాలతో నిండిపోయి అడవిని తలపిస్తున్నాయి. వ్యర్థాలతో పూర్తిగా పూడి కపోయాయి. కనీసం నీటి చుక్క వెళ్లే మార్గం లేదు. కొద్ది నెలల క్రితం కూటమి ప్రభుత్వంలో అధికారు లు పూర్తిగా పోయిన వాటికి ప్రతిపాదనలు పంపించినా అవి ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. దాంతో ఖరీఫ్ సీజన్లో వర్షాలు పడి చెరువుల నిండి నా చెరువులకు సంబంధించిన ఆయకట్టు పండేలా కనిపించడం లేదు. చెరువుల్లో కళ్ల ముందు నీరు ఉన్నా రైతులు పంటలకు సరఫరా చేసే అవకాశం లేక నానా ఇబ్బందులు పడుతూ పూర్తిగా వరి సాగు వదిలేసి వర్షాధార పంటలు, ఆరు తడి పంటలైన కూరగాయలు, పత్తి సాగు చేసుకుంటున్నారు. జలధార – జలహారతితోనైనా సాగునీటి కష్టాలు తప్పేనా.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం జలవనరుల సంరక్ష ణ, అభివృద్ధి, సాగునీటి వనరుల సమర్ధ వినియో గం లక్ష్యంగా జలధార – జలహారతి కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చింది. అందులో భాగంగా జిల్లాలో ఉపాధి హామీ పథకం నిధులు రూ.659.3 కోట్లతో 7062 చెరువులు, రూ.100.44 కోట్లతో 4801 ఫీడర్ చానల్స్, ఫీల్డ్ చానల్స్ తదితర ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. వాగులు, వంకలు, చెరువులను శుభ్రం చేసి భూగర్భ జల మట్టాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆయకట్టుకు ఉపయోగ పడేలా చెరువులు, ఫీల్డ్ చానల్స్, ఫీడర్ చానల్స్లో పూడికతీత, పనులతో పాటు మదుములు, చెక్ డ్యాంలు నిర్మాణాలు, మరమ్మతులు చేపట్టేందుకు వెసులుబాటు ఉంది. వర్షాలు పడక ముందే కాలువ ల్లో నిండిపోయిన తుప్పలు, డొంకలు, పూడికలు, మదుముల ఆధునీకరణ తదితర పనులు ఉపాధి హామీ ద్వారా చేపడితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నా రు. జలధార – జలహారతితో రైతులకు సాగునీటి కష్టాలు ఎంత మేరకు తీరుతాయో వేచి చూడాలి. మడకవాని చెరువుకు సంబంధించి రెండు, వెంకయ్యబందకు సంబంధించి రెండు మదుములు పూర్తిగా కుంగిపోయి పాడైపోయాయి. ఎనిమిదేళ్లుగా సాగు నీటికి అవస్థలు పడుతున్నాం. అలాగే ఆ చెరువుకు ఆధారంగా ఉన్న పంట కాలువలు పూర్తిగా తుప్పలు, డొంకలు, వ్యర్థాలతో పూడికపోయాయి. అధికారులు వెంటనే బాగు చేయకపోతే ఆయకట్టు పంట పొలాలకు సాగు నీరు అందే పరిస్థితి లేదు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా పరిస్థితిలో మార్పులేదు. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన బాగు చేయించాలి. – చొక్కాపు పైడిపునాయుడు, రైతు, రామభద్రపురం జలవనరుల సంరక్షణ, అభివృద్ధి, సాగునీటి వనరుల సమర్ధ వినియోగమే లక్ష్యం. జలధార–జలహారతి కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ నిధులతో చెరువుల అభివృద్ధ్ది, ఫీడర్ చానల్స్, ఫీల్డ్ చానల్స్, మదుముల ఆధునీకరణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ పనులన్నీ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. – ఎస్.శారదా దేవి, డ్వామా పీడీ -
రెటీనా ప్రవేశ పరీక్షలో జాతీయస్థాయిలో డాక్టర్ ఆశిష్ ప్రథమం
బొబ్బిలి: పట్టణానికి చెందిన సుంకర పల్లి ఆశిష్ చండీగఢ్ యూనివర్సిటీ నిర్వహించిన ఎంసీహెచ్ రెటీనా ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించినట్లు ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ కేవీ అప్పారావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం స్థానిక కంటి ఆస్పత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది అరుదైన విషయమన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన ఈ ప్రవేశ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడం అబ్బుర పరిచిందన్నారు. చండీగఢ్ యూనివర్సిర్శిటీలో గోల్డ్మెడల్ సాధించి బీజేఓ, ఏఏఓ వంటి జర్నల్స్లో 15కు పైగా పరిశోధనా వ్యాసాలు రాసిన ఘనత ఆశిష్ సొంతమన్నారు. దక్షిణభారత దేశం నుంచి ఎంసీహెచ్ రెటీనాలో ఈ ర్యాంకు ద్వారా సీటు సాధించిన అభ్యర్థులలో ఆశిష్ మొదటి వ్యక్తి అని ప్రశంసించారు. ఆగస్టులో జాతీయ స్థాయి నేత్ర వైద్య సంస్థ ప్రారంభం:బొబ్బిలి పట్టణంలోని రైల్వే స్టేషన్ జంక్షన్లో జాతీయ స్థాయి నేత్ర వైద్య సంస్థను ఆగస్టు 13న ప్రారంభించనున్నట్లు డాక్టర్ కేవీ అప్పారావు తెలిపారు. ప్రస్తుతం చివరి నిర్మాణ దశలో ఉన్న ఈ వైద్య సంస్థకు డాక్టర్ ఎస్.ఆశిష్, డాక్టర్ విజయలు సారథ్యం వహిస్తారని తెలిపారు. -
మత్తు బాబులకు ‘మూత్ర’ పరీక్ష!
● నిమిషాల్లోనే గంజాయి గుట్టురట్టు ● చైన్నె నుంచి వచ్చిన ప్రత్యేక కిట్లు ● జిల్లా పోలీసుల సరికొత్త ప్రయోగంపార్వతీపురం రూరల్: గంజాయి మహమ్మారికి కళ్లెం వేసేందుకు, మత్తు రక్కసి కోరల నుంచి యువతను కాపాడేందుకు పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులు సరికొత్త వ్యూహానికి పదునుపెట్టారు. గంజాయి అక్రమ రవాణాదారులను అడ్డుకోవడంతో పాటు, ఆ మత్తులో మునిగితేలుతున్న వారిని సైతం పక్కా ఆధారాలతో పట్టుకునేందుకు వినూత్న శాసీ్త్రయ విధానానికి శ్రీకారం చుట్టారు. ‘రాపిడ్ యూరిన్ టెస్ట్’ (శీఘ్ర మూత్ర పరీక్ష) ద్వారా కేవలం నిమిషాల వ్యవధిలోనే మత్తు బాబుల బండారాన్ని బట్టబయలు చేస్తున్నారు. ఈ పరీక్షల ఆధారంగా ఇప్పటికే కేసులు కూడా నమోదు చేస్తుండడంతో గంజాయి ముఠాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గంజాయిలో ఉండే ‘టెట్రా హైడ్రో కెనాబినాల్’ (టీహెచ్సీ) అనే రసాయన ఆనవాళ్లను పసిగట్టేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కిట్లతో పోలీసులు ఈ తనిఖీలు చేపడుతున్నారు. పట్టణంలో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తుల నుంచి మూత్ర నమూనాలను సేకరించి, ఈ కిట్లో రెండు చుక్కలు వేయగానే ఫలితం కళ్లకు కడుతుంది. కిట్లో ఒకే ఎరుపు గీత కనిపిస్తే గంజాయి పీల్చినట్లు (పాజిటివ్)గా, రెండు గీతలు వస్తే నెగిటివ్గా నిర్ధారిస్తున్నారు. ఎవరైనా వారం రోజుల క్రితం గంజాయి పీల్చినా సరే..ఈ కిట్ ద్వారా దొరికిపోతారని అధికారులు స్పష్టం చేస్తున్నారు. చైన్నె నుంచి ప్రత్యేక కిట్లుఈ సరికొత్త తనిఖీల కోసం రాష్ట్ర పోలీసు శాఖ నేతృత్వంలో ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి తమిళనాడు రాజధాని చైన్నె నుంచి ప్రత్యేక కిట్లను రప్పించారు. సుమారు రూ.450 విలువ చేసే ఒక్కో కిట్లో పది టెస్ట్ స్ట్రిప్స్ అందుబాటులో ఉంటాయి. ఈ నూతన విధానం ద్వారా పరీక్షలు నిర్వహించి, ఇప్పటికే గంజాయి పీల్చిన ఇద్దరిని గుర్తించి కేసులు నమోదు చేసినట్లు పార్వతీపురం సీఐ బెండి వెంకటరావు వెల్లడించారు. అనుమానితులను పరీక్షించి వారు గంజాయి పీల్చారో? లేదో? తేల్చడంతో పాటు, అసలు వారికి ఈ మత్తు పదార్థం ఎక్కడి నుంచి లభ్యమవుతోంది? దీని వెనుక ఉన్న శక్తులెవరు? అనే కోణంలో కూపీ లాగుతున్నట్లు ఆయన వివరించారు. యువత మత్తు వలయంలో చిక్కుకోకుండా నివారించేందుకు పోలీసుల చేతిలోని ఈ శాసీ్త్రయ అస్త్రం ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
మీకోసం వెబ్సైట్లో పీజీఆర్ఎస్ అర్జీలు
పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కారవేదికలో(పీజీఆర్ఎస్) అందజేసే అర్జీల వివరాలు మీకోసం వెబ్సైట్లో నమోదు చేయవచ్చునని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజల అభ్యర్థన మేరకు ఉదయం 9 గంటలనుంచి 12 గంటలవరకు అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అర్జీలను మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చునని, వాటి స్థితిని 1100 టోల్ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చునన్నారు. జేసీకి ఘనంగా వీడ్కోలుపార్వతీపురం: జిల్లా జాయింట్ కలెక్టర్గా సేవలందించిన సి. యశ్వంత్ కుమార్ రెడ్డికి ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బదిలీ కావడంతో కలెక్టరేట్లో ఆదివారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ పదవులు తాత్కాలికమైనవైనా, ప్రజల కోసం చేసిన సేవలు శాశ్వత గుర్తింపును తెస్తాయన్నారు. జిల్లా అభివృద్ధికి యశ్వంత్ కుమార్ రెడ్డి అందించిన సేవలను ప్రశంసిస్తూ, కొత్త బాధ్యతల్లో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పాలకొండ సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్వో కె.హేమలత తదితర అధికారులు ఆయన పరిపాలనా నైపుణ్యాన్ని కొనియాడారు. యశ్వంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పనిచేసిన అనుభవం ఎంతో సంతృప్తినిచ్చిందని, సహకరించిన అధికారులు, ఉద్యోగులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అధికారులు ఆయనను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించి ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాజాం సిటీ: భాష ఏదైనా నాటక రచన గొప్ప ప్రక్రియ అని పద్మశ్రీ యడ్ల గోపాలరావు అన్నారు. నాటకంలోని సాహిత్యం సాహితీవేత్తలను అలరిస్తే, ప్రదర్శన సమయంలో నటుల నటన పండితుల్ని, సామాన్యుల్ని కూడా రంజింపజేస్తుందని కొనియాడారు. ఆదివారం స్థానికంగా రాజాం రచయితల వేదిక 136వ సమావేశం నిర్వహించారు. సమావేశంలో దివంగత కాకినాడ పూజ్యనాథం ఆచారి రచించిన ‘రావణబ్రహ్మ’ పద్య నాటక పుస్తకాన్ని గోపాలరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొప్ప గొప్ప కవులు రాయబట్టే గయోపాఖ్యానం, సత్యహరిశ్చంద్ర వంటి పౌరాణిక నాటకాలు నేటికీ నిలిచి ఉన్నాయన్నారు. రావణబ్రహ్మ నాటకం కూడా వాటి కోవకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం రచయిత భార్య కాకినాడ సర్వలక్ష్మిని రాజాం రచయితల వేదిక సభ్యులు ఘనంగా సత్కరించారు. రంగస్థల నటుడు, సంస్కృత పండితులు బౌరోతు శంకరరావును రంగస్థల నాటక సేవలను గుర్తించి సత్కరించారు. గార రంగనాథం అధ్యక్షతన జరిగిన సమావేశంలో అతిథులుగా ద్విశతావధాని మరడాన శ్రీనివాసరావు, మేడూరి సత్యనారాయణమూర్తి, పాటోజు బ్రహ్మాజీరావు, లంక సూర్యారావు, ప్రముఖ వైద్యులు గార రవిప్రసాద్, కోడ పురుషోత్తం, డాక్టర్ ఆల్తి మోహనరావు, పిల్లా తిరుపతిరావు, గార సీతారత్నం, లంక విజయభాస్కర్, ఒమ్మి రమణమూర్తి, పొట్నూరు కోటిబాబు, రాజాపు శాంతారావు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం అర్బన్: పట్టణంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న ది ఆఫీసర్స్ క్లబ్ నూతన కార్యవర్గ కమిటీ ఎన్నికలను జూన్ 17న నిర్వహించనున్న ట్టు ఎన్నికల అధికారి, సహకార శాఖ జిల్లా అధికారి పి.రమేష్ తెలిపా రు. ఈ ఎన్నికలకు సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన ఆదివారం వెల్లడించారు. ఈ క్లబ్ నిర్మాణంలో భాగంగా కమిటీకి అధ్యక్షుడిగా కలెక్టర్, ఉపాధ్యక్షులుగా ఎస్పీ, జాయింట్ కలెక్టర్ వ్యవహరిస్తారు. కమిటీలో కార్యదర్శి, కోశాధికారి, సంయుక్త కార్యదర్శి పదవులకు ఎన్నికలు జరుగుతాయి. కార్యవర్గ సభ్యులుగా అధికారుల విభాగం నుంచి నలుగురిని, నాన్ అఫీషియల్స్ విభాగం నుంచి ఐదుగురిని ఎన్నుకుంటారు. మొత్తం 12 మంది సభ్యులతో ఈ నూతన కమిటీ ఏర్పాటవుతుంది. -
అంతర్జాతీయ చెస్ పోటీలకు కంచరాం విద్యార్థిని
రాజాం: మండలంలోని కంచరాం జెడ్పీ హైస్కూల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థిని కలిశెట్టి పావని అంతర్జాతీయ చెస్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు టి.దుర్గయ్య ఆదివారం తెలిపారు. జూన్ 1 నుంచి 8 వరకూ అమరావతి విట్లో జరిగే ఇంటర్నేషనల్ పైడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్–2026 క్రీడల్లో ఆమె పాల్గొంటుందని వెల్లడించారు. అండర్ 15 విభాగంలో రాష్ట్ర క్రీడాకారిణిగా ఎంపికై ందని, ఇటీవల రాజాంకు చెందిన పలుశాఖల అధికారులు అందించిన ఆర్థికసాయంతో ఎంట్రీ ఫీజు చెల్లించిందని వెల్లడించారు. ఆమె ఎంపికపట్ల పాఠశాల హెచ్ఎం వై. గౌరునాయుడు, పీఈటీ బీఎన్ నాయుడు, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మజ్జి మదన్మోహన్, ఉపాధ్యాయులు లెంక శ్రీనివాసరావు, పండూరి వేణుగోపాలరావు, పి.మహేష్, వై.భాస్కర్, అరుణ తదితరులతో పాటు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. కేజీన్నర గంజాయితో ఇద్దరు నిందితుల పట్టివేతవిజయనగరం క్రైమ్: గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను గవర్నమెంట్ రైల్వే పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఎస్సై బాలాజీ చెప్పిన వివరాల ప్రకారం విజయనగరం జీఆర్పీ, ఆర్పీఎఫ్లు సంయుక్తంగా విజయనగరం రైల్వేస్టేషన్ ప్లాట్ ఫామ్పై ఆదివారం తనిఖీలు చేస్తుండగా విజయనగరానికి చెందిన మజ్జి కార్తీక్, అమలాపురం జిల్లాకు చెందిన పలివెల దుర్గా ప్రసాద్ నాగరాజులు ఒడిశా రాష్ట్రంలోని రాయగడ ప్రాంతం నుంచి రూ.75,000 విలువైన 1.5 కేజీల గంజాయిని తరలిస్తుండగా పట్టుబడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం రైల్వే కోర్టుకు తరలించామని ఎస్సై బాలాజీ తెలిపారు. ఐదు ఇసుక ట్రాక్టర్ల సీజ్వీరఘట్టం: మండలంలోని నడిమికెల్ల నాగావళి తీరంలో ఇసుక దందా జోరుగా సాగుతోందని పత్రికల్లో వరుస కథనాలు రావడంతో రెవెన్యూ అధికారులు స్పందించారు. తహసీల్దార్ ఏఎస్.కామేశ్వరరావు శనివారం రాత్రి తమ సిబ్బందితో ఇసుక అక్రమ రవాణాపై దాడులు చేశారు. ఈ సందర్భంగా ఇసుక తరలిస్తున్న 5 ట్రాక్టర్లు అదుపులోకి తీసుకుని సీజ్ చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. ఈ ట్రాక్టర్లను వీరఘట్టం పోలీసు స్టేషన్కు అప్పగించినట్లు తహసీల్దార్ చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక లేదా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోండి డెంకాడ: మండలంలోని చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం పాసైన విద్యార్థులకు జూన్ 3వ తేదీ నుంచి సి–ప్రోగ్రామింగ్పై ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు కళాశాల యాజమాన్యం ఓ ప్రకటనలో ఆదివారం తెలిపింది. వారం రోజుల పాటు కొనసాగే ఈ శిక్షణలో కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో సి–ప్రోగ్రామింగ్ బేసిక్స్ నేర్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. థియరీ తరగతులతో పాటు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయని, ఆసక్తి ఉన్న అర్హులైన విద్యార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. శిక్షణకు వస్తున్న వారు ఫోన్ 9441663201ను ఆశ్రయించి, పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పుస్తక పఠనంపై తర్ఫీదు గరుగుబిల్లి: మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయంలో ఆదివారం నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ఉత్సాహంగా జరిగింది. విద్యార్థులలో పఠన అలవాట్లు పెంపొందించేందుకు ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్విజ్ పోటీలు, భక్తి గీతాలు, స్పోకెన్ ఇంగ్లిష్, కథలు చెప్పడం, పద్యాలు, గద్యాల పఠనం వంటి కార్యక్రమాలను నిర్వహించి ప్రతిభను వెలికితీశారు. క్రీడా పోటీలలో భాగంగా క్యారం బోర్డు, బిజినెస్, లూడో, చదరంగం వంటి ఆటలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గరుగుబిల్లి శాఖాగ్రంథాలయ నిర్వాహకులు ఎన్.మధుసూదనరావు పాల్గొని విద్యార్థులకు పుస్తక పఠనం ప్రాముఖ్యతను వివరించారు. -
మహానాడు కాదు దగా నాడు
● అంతా లోకేష్, దేవాన్ష్ల భజనే ● హామీలు అమలు చేయకుండా రెండేళ్లుగా మోసం ● మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్చీపురుపల్లి: టీడీపీ రెండు రోజులు నిర్వహించిన మహానాడు పేరును కాస్త దగానాడు అని పెట్టుకుంటే బాగుంటుందని వైఎస్ఆర్సీపీ పీఏసీ మెంబర్, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీరామారావు ను వెన్నుపోటు పొడిచి, పిల్లను ఇచ్చిన ఆయనపై చెప్పులు వేయించిన చంద్రబాబు దగానాడు అని పేరు పెట్టుకోవాలని హితవు పలికారు. వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చంద్రబాబు ఇప్పుడు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మహానాడులో తీర్మానం చేయడం తరువాత వదిలేయడం బాబుకు అలవాటేనన్నారు. మహానాడు లో లోకేష్, దేవాన్ష్ భజన తప్ప ఇంకేం లేదన్నారు. రెండేళ్లలో రాష్ట్రానికి చేసింది చెప్పలేక రానున్న మూడేళ్లలో ఏం చేస్తామో చెప్పుకోలేక మహానాడు వేదికగా ప్రజలను మరోసారి మోసం చేశారన్నారు. డీఎస్సీలో అర్హులకు అన్యాయం ఇటీవల డీఎస్సీ నియామకాల్లో అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియామకాలు చేపట్టి నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడుకుందని ఆరోపించారు. డీఎస్సీలో అర్హత సాధించడానికి అర్హత పరీక్ష ప్రామాణికం అయినప్పటికీ స్పోర్ట్స్ కోటా పేరుతో గతంలో ఎన్నడు లేని విధంగా, నిబంధనలకు విరుద్ధంగా శాప్ నుంచి ఇచ్చిన బోగస్ ధ్రువీకరణలతో ఉద్యోగ నియామకాలు చేపట్టడం దారుణమని విమర్శించారు. డీఎస్సీ నియామకాలపై జరిగిన అవినీతి నిగ్గు తేల్చేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేశామని చెబుతున్న చంద్రబాబును ప్రజలు చీదరించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. -
కూతురి దగ్గరికి వెళ్లి వస్తూ మృత్యుఒడికి..!
● బస్సు ప్రమాదంలో జె.గుమడాం మహిళ మృతిబొండపల్లి: బాధ్యతలు నెరవేర్చాల్సిన సమయంలో ఇంటి యజమాని మృత్యువాత పడ్డాడు. అనంతరం ఇద్దరు కూతుళ్లకు తల్లే అన్నీ తానై కంటికి రెప్పలా కాపాడుతూ పెళ్లిళ్లు చేసి బాధ్యతలు తీర్చుకుని జీవితం హాయిగా సాగుతున్న సమయంలో బస్సు ప్రమాదం ఆ తల్లిని మృత్యుఒడిలోకి తీసుకువెళ్లిపోయింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. బొండపల్లి మండలంలోని జె.గుమడాం గ్రామానికి చెందిన లెంక ఈఽశ్వరమ్మ(57) ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఆదివారం వేకువ జామున విశాఖపట్నంలోని గాజువాకలో మృతి చెందింది. ఈశ్వరమ్మకు భర్త వెంకటరమణతో పాటు ఇద్దరు కూతుళ్లు లక్ష్మి,దివ్య లు ఉన్నారు. భర్త కొద్ది సంవత్సరాల క్రితం మృతిచెందగా ఇద్దరు కూతుళ్లకు తానే పెళ్లిళ్లు చేసింది. చిన్న కూతురు దివ్యను రాజమండ్రిలో గల యువకుడికి ఇచ్చి పెళ్లి చేసింది. మనుమడు వేసవి సెలవులు కావడంతో అమ్మమ్మ ఇంటికి రాగా మనుమడిని కూతురి ఇంటికీ దిగబెట్టేందుకు ఈశ్వరమ్మ వెళ్లి తిరుగు ప్రయాణంలో పార్వతీపురం డిపోకు చెందిన బస్సులో రాజమండ్రి నుంచి వస్తుండగా టైరు పంక్చర్ అయి నిలిపి ఉంచిన టిప్పర్ను బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఈశ్వరమ్మ అక్కడిక్కడే మృతిచెందింది. మృతదేహాన్ని పోస్ట్మార్టంనిమిత్తం విశాఖపట్నంలోకి కేజీహెచ్కు తరలించారు. మొదట తండ్రి, తర్వాత తల్లి మృతి చెందడంతో వారి ఇద్దరి కూతుళ్ల రోదనలు సంఘటనా స్థలం వద్ద చూపరుల కళ్లు చెమ్మగిల్లేలా చేశాయి. ఇదే ప్రమాదంలో సాలూరుకు చెందిన రాయంపిల్లి రాంబాబు (50) మృతి చెందినట్లు గుర్తించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా గాజువాక శ్రీనగర్ జంక్షన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి ప్రమాద స్థలాన్ని, దెబ్బతిన్న ఆర్టీసీ బస్సును ఆయన పరిశీలించారు. పూసపాటిరేగ : మండలంలోని కందివలస జంక్షన్ సమీపంలో జాతీయరహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. వివరాలలోకి వెళ్తే.. శ్రీకాకుళంలో ఉంటున్న తన చెల్లి ఇంటికి విశాఖ జిల్లా కొమ్మాదికి చెందిన కోన రమ (44) స్కూటీపై వెళ్తుండగా పూసపాటిరేగ మండలం కందివలస సంత సమీపంలో తాను ప్రయాణిస్తున్న స్కూటీకి ప్రమాదం జరగడంతో కిందపడి తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. రమ భర్త కోటేశ్వర్రావు గతంలోనే చనిపోయారు. ఇద్దరు పిల్లలతో తండ్రి వద్దనే చిన్నపాటి ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తోంది. తల్లిదండ్రులు అనుకోని విధంగా మృతి చెందడంతో పిల్లలు అనాథలయ్యారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై స్పష్టత లేదు. సెల్ఫ్ ప్రమాదం జరిగిందా లేదా ఏదైనా వాహనం తగిలి ప్రమాదం జరగడంతో కింద పడి మృతి చెందిందా? అనేది విచారణలో తెలియాల్సి ఉంది. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పూసపాటిరేగ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం క్రైమ్: శ్రీకాకుళానికి చెందిన దుర్గాభవాని విజయనగరంలోని రాజీవ్నగర్ కాలనీలో ఉంటున్న ఓ రూమ్లో ఫ్యాన్కు తన చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. దుర్గాభవాని విజయనగరంలోని రాజీవ్నగర్ కాలనీలో రూమ్ తీసుకుని గ్రూప్–2,పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. రూమ్ పక్కనే ఉన్న రీడింగ్ రూమ్కు చదువుకోవడానికి వెళ్లి తిరిగి రూమ్కు వచ్చి తనకు పని ఉందని సహచర స్నేహితురాలు మౌనికకు చెప్పి పై రూమ్లోకి వెళ్లింది. ఎంతకీ దుర్గాభవాని పై రూమ్లోనుంచి రాకపోవడంతో మౌనిక వెంటనే విజయనగరంలోనే ఉంటున్న దుర్గాభవాని సోదరుడికి ఫోన్లో విషయం తెలియజేసింది. దీంతో సోదరుడు వెంటనే వచ్చి పై రూమ్ తలుపులు పగలగొట్టి లోపల దుర్గాభవాని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించి ఆమెను కిందికి దించి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
రైతులకు తప్పని అవస్థలు
కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత పంటల సాగుకు పెట్టుబడిసాయం కోసం నానా అవస్థలు పడాల్సి వస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో సకాలంలో నిధులు అందేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నిమ్మక కాంతారావు, గిరిజన రైతు, దేవనాపురం మధ్యతరగతికి కష్టమే జూన్నెల వచ్చిందంటే మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికభారం తప్పదు. మరికొద్ది రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పుస్తకాలు, యూనిఫాం, కొనుగోలు చేయక తప్పదు. మిగిలిన నెలలతో పోలిస్తే జూన్ నెల ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇటు చదువులకు, అటు వ్యవసాయానికి ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్.అరుణ, మాజీసర్పంచ్, టిటుకుపాయి -
లైన్మన్కు తీవ్రగాయాలు
● విద్యుత్ స్తంభంపైనుంచి జారిపడి ప్రమాదం వీరఘట్టం: మండలంలోని తెట్టంగిలో జూనియర్ లైన్మన్గా పనిచేస్తున్న సవర సోమేష్ ఆదివారం విద్యుత్ పనులు చేస్తుండగా స్తంభంపై నుంచి జారి పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై స్థానికులు,,,ట్రాన్స్కో సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని ఓ ఇంటికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో స్తంభం పైన ఉన్న సర్వీస్ వైర్ పరిశీలించేందుకు ఎక్కాడని, ఆ సమయంలో ఆ ఇంటిలో ఉన్న ఇన్వర్టర్ సప్లై రిటర్న్ రావడంతో సోమేష్కు స్వల్ప షాక్ తగిలి కింద ఉన్న సీసీ రోడ్డుపై పడిపోయినట్లు స్థానికులు తెలిపారు.ఈ ప్రమాదంలో లైన్మన్ సోమేష్ తల సీసీ రోడ్డుకు బలంగా తగలడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన వీరఘట్టం ఏఈ సోమేశ్వరరావు, సహచర సిబ్బంది శ్రీకాకుళంలోని కిమ్స్ ఆసుపత్రికి వైద్య చికిత్స కోసం లైన్మన్ను తరలించారు.ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆపరేషన్ చేస్తే గానీ ఏమీ చెప్పలేమని వైద్యులు చెబుతున్నట్లు ఏఈ సోమేశ్వరరావు తెలిపారు. సీతంపేట మండలం చాకలిగూడకు చెందిన సోమేష్ రెండేళ్ల క్రితం ఇక్కడికి బదిలీపై వచ్చాడని ఏఈ తెలిపారు. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనవిజయనగరం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణం ప్రాంగణంలో ఆదివారం చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. పౌర్ణమి రోజును పురస్కరించుకుని విజయనగరానికి చెందిన శ్రీ వర్థి నృత్యాలయం బృంద చిన్నారుల ప్రదర్శనలు అందరినీ అలరించాయి. అనంతరం చిన్నారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు, తదితరులు పాల్గొన్నారు. -
పొగాకుతో కేన్సర్ ముప్పు
● డీఎంహెచ్ఓ భాస్కర రావుపార్వతీపురం రూరల్: పొగాకు ఉత్పత్తుల వాడకంతో ప్రాణాంతక కేన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు సంభవించి జీవితాలు దుర్భరమవుతాయని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ ఎస్. భాస్కరరావు, జిల్లా ఎన్సీడీ పీఓ డాక్టర్ టి.జగన్ మోహనరావు తెలిపారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆదివారం పార్వతీపురంలో వైద్యారోగ్యశాఖ, ఈగల్ టీమ్, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించి, స్థానిక యువత, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ.. పొగాకు అలవాటు వల్ల నోరు, గొంతు, అన్నవాహిక, ఊపిరితిత్తుల కేన్సర్లతో పాటు గుండె జబ్బులు, పక్షవాతం, శ్వాసకోశ సమస్యలు, సంతానోత్పత్తి లోపాలు తలెత్తుతాయన్నారు. జిల్లాలో నిర్వహించిన ఎన్న్సీడీ 4.0 సర్వేలో ఇప్పటివరకు 284 మందిలో నోటి కేన్సర్ అనుమానిత లక్షణాలు గుర్తించామని, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా యువత ఈ వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కళాశాలలు, పాఠశాలల పరిసరాల్లో పొగాకు విక్రయాలను అరికట్టేందుకు ’కోట్పా’ చట్టం ప్రకారం ఈగల్ టీమ్ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. పొగాకు మాన్పించేందుకు ప్రభుత్వం ఉచితంగా నికోటిన్ ప్యాచెస్, నికోటిన్ గమ్స్ అందిస్తోందని, డి–అడిక్షన్ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ వై.విజయ్ మోహన్, ఈగల్ టీమ్ ఎస్సై జె. భాస్కరరావు, నేత్ర వైద్యాధికారి జె. నాగేష్ రెడ్డి, ఎన్టీసీపీ కౌన్సిలర్ కె.భవాని, డీఎంహెచ్పీ కౌన్సిలర్ కె.కృష్ణారావు, డిప్యూటీ డెమోలు గిరిబాబు, ప్రసాద్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రవికుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
పోషక రేడు..నేరేడు
నేరేడు పండ్లతో ప్రయోజనాలు నేరేడు పండ్లలో ఐరన్, కాల్షియం, పొటాషియంతో పాటు ఎ.సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధుల బారి నుంచి రక్షణ కల్పిస్తాయి. ● మూత్ర సమస్యల నియంత్రణతో పాటు మధుమేహం అదుపులో ఉంటుంది. కిడ్నీలను శుభ్రపరుస్తుంది. మూత్రాశయంలో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. కాలేయ పనితీరును మెరుగుపర్చడంతో పాటు శుభ్రపరుస్తుంది. ● నేరేడు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు, మెదడుకు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. ● దంతాలు, చిగుళ్లు ఆరోగ్యకరంగా ఉంటాయి. చిగుళ్ల నుంచి రక్తస్రావం తగ్గుతుంది. నోట్లో చెడు బ్యాక్టీరియా నశించి దుర్వాసన రాకుండా చేస్తుంది. ● కడుపులో పేరుకుపోయిన మలినాలు బయటకు పోవడానికి, పేగుల్లో చుట్టుకు పోయిన వెంట్రుకలను కరిగించడానికి ఈ నేరేడు పండు దోహదపడుతుంది. ● నేరేడుపండులో విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల శరీరంలో సంభవించే అనేక రుగ్మతలను నివారిస్తుంది. అన్ని వేళలా ఆరోగ్యానికి భరోసా కల్పిస్తుంది.● ప్రస్తుత సీజన్లో విరివిగా లభ్యం ● ఆరోగ్య ఫల ప్రదాయినిగా గుర్తింపుపాలకొండ రూరల్: ప్రకతి ప్రసాదించే పండ్లజాతుల్లో ఒకటైన ఆరోగ్య ఫల ప్రదానియగా పిలిచే నేరేడు పండును సక్రమంగా వినియోగించుకుంటే ఆరోగ్యానికి సంపూర్ణంగా మేలు చేయడంతో పాటు శరీరంలో ఏర్పడే అనేక అనారోగ్య సమస్యలను, రుగ్మతలను దూరం చేస్తుంది. రుచిలో మేటిగా ఉండే నేరేడు పండు తినడం వల్లే కాదు ఆకులు, చెట్టు బెరడు కూడా శరీరానికి చక్కని మేలు చేకూరుస్తాయి. నేరేడుపండులో అత్యధిక పోషకాలు ఉన్న క్రమంలో పండు రూపంలోనే కాకుండా ఆరోగ్య పానీయాలు, జామ్లు, ఐస్క్రీమ్లు తయారు చేసుకోవచ్చు. నేరేడు కాయలను వెనిగర్, వైన్ తయారీలో ఉపయోగిస్తారు. నేరేడుపండ్లు కోయడం చాలా శ్రమతో కూడుకున్నది కావడంతో ధర కూడా అదే విధంగా ఉంటుంది. రైతు దగ్గర దళారులు కేజీ రూ.90కి కొనుగోలు చేస్తున్న స్థానిక వ్యాపారు లకు రూ.120 వరకూ విక్రయిస్తారు. సంప్రదాయ ఆయుర్వేద వైద్య విధాన పరంగా అనేక ఔషధ లక్షణాలు కలిగి ఉన్న నేరేడుకు అత్యంత ప్రాముఖ్యం ఉంది. నేరేడు పండు తింటే వ్యాధులకు, రోగకారక సమస్యలకు దూరంగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. నేరేడుపండ్లు తినడంలో నియంత్రణ లేకుంటే దుష్ఫలితాలు సంభవించవచ్చు. వగరు రుచి కలిగిన నాణ్యత లేని నేరేడుపండ్లు భుజిస్తే గొంతు నొప్పి సంభవించవచ్చు. సీజన్ మారే సమయంలో ఈ పండ్లను మితంగా తినాలి. ఉబ్బసం రోగం ఉన్నవారు ఈ పండ్లను ఎక్కువగా తినరాదు. దీర్ఘకాలికమైన శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నేరేడుపండ్లలో ఉండే అత్యధిక లవణాలు, పోషకాల వల్ల బలహీనమైన జీర్ణవ్యవస్థ కలిగిన వారికి తరచూ కడుపునొప్పి సంభవించే అవకాశం ఉంది. -
ఘనంగా పైడితల్లి చండీయాగం
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి చండీయాగం ఆదివారం శాస్త్రోక్తంగా జరిగింది. వేదపండితులు వెలువలపల్లి నరసింహమూర్తి, అర్చకుడు నేతేటి ప్రశాంత్లు అమ్మవారికి పూజాదికాలు, యాగప్రక్రియను నిర్వహించారు. యాగ విశిష్టతను భక్తులకు వివరించారు. పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవారికి యాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అర్చకులు తెలిపారు. యాగంలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి శేషవస్త్రాలను, తీర్ధప్రసాదాలను అందజేశారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ కె.శిరీష పర్యవేక్షించారు. -
ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపనకు ఏర్పాట్లు
● కలెక్టర్ను ఆదేశించిన పరిశ్రమలు, వాణిజ్య శాఖ సెక్రటరీ యువరాజ్ విజయనగరం అర్బన్: జిల్లాలోని ఎస్.కోట మండల పరిధిలో నిర్మించనున్న ‘మెసర్స్ జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ లిమిటెడ్’ శంకుస్థాపనకు ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని ఏపీ పరిశ్రమలు, వాణిజ్య శాఖ సెక్రటరీ డాక్టర్ ఎన్.యువరాజ్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్కుకు సంబంధించిన ప్రస్తుత ప్రగతి, భూసేకరణ, మౌలిక వసతుల కల్పనపై ఆరా తీశా రు. ఈ సందర్భంగా పారిశ్రామిక పార్కుకు సంబంధించిన నివేదికను, ఇప్పటివరకు సాధించిన పురోగతిని సెక్రటరీకి వివరించారు. భూసేకరణ ప్రక్రియ, మౌలిక వసతుల కల్పన పనులను మరింత వేగవంతం చేస్తామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
చెరువుల పరిరక్షణే ధ్యేయం
పార్వతీపురం రూరల్: జిల్లాలోని చెరువుల పరిరక్షణ, పారిశుధ్య నిర్వహణే ధ్యేయంగా యంత్రాంగం పనిచేస్తోందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి తెలిపారు. శనివారం ఆయన స్థానిక శివాలయం చెరువు వద్ద సాగుతున్న ‘ఆపరేషన్ క్లీన్స్వీప్’ పనులను, నూతనంగా అందుబాటులోకి వచ్చిన వాకింగ్ ట్రాక్ను పరిశీలించి, ప్రగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు పడనున్న నేపథ్యంలో పట్టణ పరిధిలోని డ్రెయిన్లు, వరద నీటి కాలువల్లో పూడికతీత పనులు చేపడుతున్నట్లు చెప్పారు. భూగర్భ జలాలు అడుగంటిపోకుండా వర్షపు నీటిని సంరక్షించుకోవాలని ప్రజలకు సూచించారు. అనంతరం జల వనరుల సంరక్షణపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో స్థానికులు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పావని, మెప్మా పీడీ నాగభూషణరావు, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడు వానాది శ్రీహరి, మున్సిపల్, సచివాలయ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రభాకర రెడ్డి -
నగుళ్లుదబ్బగడ్డలో ఏనుగుల గుంపు
మక్కువ: మండలంలోని నగుళ్లుదబ్బగడ్డ నీలాటిరేవు సమీపంలో ఏనుగుల గుంపుమ సంచరిస్తోంది. శుక్రవారం సాయంత్రం లోవరకండి సమీపంలో సంచరించిన ఏనుగులు శనివారం ఉదయానికి నగుళ్లుదబ్బగడ్డ సమీపంలోని రామకృష్ణ అనే రైతు పామాయిల్ తోటలోకి ప్రవేశించాయని ఫారెస్ట్ ఆఫీసర్ తవిటినాయుడు తెలిపారు. పామాయిల్ తోటలోని వాటర్ ట్యాంక్ను, పైపులను .. అలాగే నగుళ్ల గ్రామంలో జానకమ్మకు చెందిన మొక్కజొన్న పంటను ఏనుగులు ధ్వంసం చేశాయని చెప్పారు. దీంతో కోన, గోపాలపురం, నగుళ్లుదబ్బగడ్డ, డి.శిర్లాం, లోవరఖండి, తదితర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు ఫారెస్ట్ ఆఫీసర్ తవిటినాయుడు తెలిపారు. వేర్వేరు చోరీ కేసుల్లో ముగ్గురి అరెస్ట్ ● సుమారు 22 తులాల బంగారం రికవరీ విజయనగరం క్రైమ్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన మూడు చోరీలకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు వేర్వేరుగా శనివారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు స్థానిక డీపీఓలోని కాన్ఫరెన్స్ హాల్లో బొబ్బిలి డీఎస్పీ గోవిందరావు, విజయనగరం ఇన్చార్జ్ డీఎస్పీ రాఘవులతో కలిసి ఎస్పీ ఏఆర్ దామోదర్ నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. బొబ్బిలి, రామభద్రపురంలలో ఫ్లిప్కార్డ్ ఉద్యోగిగా పని చేస్తున్న మణికంఠ ఇంటింటికీ వెళుతూ పగలు పూట రెక్కి నిర్వహించి రాత్రి పూట దొంగతనాలకు పాల్పడేవాడని ఎస్పీ తెలిపారు. అతని నుంచి దాదాపు 20 తులాల బంగారం రికవరీ చేశామన్నారు. ఇక ఎస్. కోట పీఎస్ పరిధిలో రవి అనే వ్యక్తి జులాయిగా తిరుగుతూ మధ్యానికి బానిసై డబ్బుల కోసం దొంగతనాలు చేసేవాడని, అతని వద్ద నుంచి సుమారు మూడు తులాల బంగారం రికవరీ చేశామన్నారు. అలాగే భోగాపురం పీఎస్ పరిధిలో ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని చెప్పారు. సమావేశంలో ఎస్. కోట సీఐ నారాయణ, బొబ్బిలి సీఐ మూర్తి, భోగాపురం ఎస్సై అనిల్, తదితరులు పాల్గొన్నారు. -
బడిఈడు పిల్లలంతా ప్రభుత్వ బడిలో ఉండాలి
విజయనగరం అర్బన్: బడిఈడు పిల్లలంతా ప్రభుత్వ బడిలో ఉండాలని ఆ దిశగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని వేణుగోపాలపురం ప్రభుత్వ డైట్(జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ) కళాశాల అధ్యాపకులు వి.చిన్నంనాయుడు, ఐఎస్ఈ శర్మ, బీవీ గోపాలకృష్ణ, కె.అప్పారావు అన్నారు. బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా స్థానిక పట్టణంలోని గాజులరేగ, కాట, మంగళ వీధుల్లో శనివారం పర్యటించిన వారు..ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. ప్రభుత్వ బడుల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యాబోధన చేయడం జరుగుతుందని, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుందన్నారు. 23 మంది విద్యార్థులు దాసన్నపేట, మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో చేరేందుకు ముందుకువచ్చారు. -
గడువులోగా అభివృద్ధి పనులు
పార్వతీపురం: జిల్లాలో కొనసాగుతున్న భవన నిర్మాణాలు, అభివృద్ధి పనులను నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన సంబంధిత శాఖాధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రగతిలో ఉన్న పలు అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు. జూన్ 12 నాటికి పూర్తయిన భవనాలను వెంటనే ప్రారంభించి, సంబంధిత శాఖలకు అప్పగించాలని ఆదేశించారు. వన్స్టాప్ సెంటర్ భవన నిర్మాణం పనులు వేగవంతం చేసి జూన్ 30లోగా అప్పగించాలన్నారు. పనుల పురోగతిపై వారానికి ఒకసారి నివేదికలు సమర్పించాలని సూచించారు. టెట్ తప్పనిసరి తీర్పును పునఃపరిశీలించాలి విజయనగరం అర్బన్: ఇన్సర్వీసు టీచర్లకు టెట్(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) ఉత్తీర్ణత తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.మదన్మోహన్, పి.శ్రీనివాస్లు ఓ ప్రకటనలో శనివారం విజ్ఞప్తి చేశారు. గత 15 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు టెట్ రాయాల్సిన అవసరం లేదని గతంలో ఎన్సీటీఈ(జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి)తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశాయని గుర్తు చేశారు. అయినా సుప్రీం ధర్మాసనం మాత్రం ఇన్సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపును ఇవ్వకపోవడం వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు. మరోసారి తీర్పుపై పునరాలోచన చేయాలని, టెట్ నుంచి ఇన్సర్వీసు టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. కలెక్టర్ ప్రభాకరరెడ్డి -
పొగబారుతున్నారు..
● స్మోకింగ్ ప్రమాదకరం ● వ్యసనానికి బానిసలవుతున్న యువత ● అలవాటు మానుకోవాలంటున్న వైద్యులు ● నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంవిజయనగరం ఫోర్ట్: స్మోకింగ్ (పొగ తాగడం) ప్రస్తుత సమాజంలో ఫ్యాషన్గా మారిపోయింది. పెద్దవాళ్లు చుట్టలు, బీడీలు కాల్చితే, యువత సిగరెట్స్, ఈ సిగరెట్స్ తాగుతున్నారు. పొగ తాగడం, పొగాకు ఉత్పత్తుల తినడం వల్ల ప్రాణాంతకమైన వ్యాధులు వ్యాపిస్తాయి. అయినప్పటకీ పొగ తాగే వారి సంఖ్య రోజురోజుకూ పెరగడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఆదివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం.. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంల్లో పొగే తాగేవారు ఎక్కువుగా ఉన్నారు. చుట్టులు, బీడీలు, సిగరెట్ల రూపంలో తెగ కాల్చేస్తున్నారు. ముఖ్యంగా అడ్డ పొగ (రివర్స్ స్మోకింగ్) తాగేవారు ఎక్కువుగా ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరం. పొగ తాగేవారితో పాటు, వారి పక్కనుండే వారు వ్యాధుల బారిన పడుతున్నారు. పొగ తాగడంవల్ల వచ్చే వ్యాధులు.. పొగ తాగడం వల్ల సీఓపీడీ, నిమోనియా, క్రానిక్ బ్రాంక్టైస్, గొంతు క్యాన్సర్ , ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రబలడంతో పాటు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. గుండె పోటుకు గురైన ప్రతి ముగ్గురిలో ఒకరు ధూమపానం బాధితులేనని నివేదికలు చెబుతున్నాయి. మధమేహం ఉన్న వారు పొగ తాగడం వల్ల వ్యాధి అదుపులో ఉండదు. దీని వల్ల ఆ ప్రభావం కిడ్నీలు, లివర్, కళ్లు వంటి కీలకమైన అవయవాలపై పడుతుంది. యువత అలవాటు పడుతున్నారు.. ఒకరి నుంచి మరొకరు పొగ తాగడం అలవాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా 30 ఏళ్ల లోపు వారు ఎక్కువుగా పొగ తాగుతున్నారు. కొంతమంది సిగరెట్స్ స్థానంలో ఈ సిగరెట్స్ ఎక్కువుగా తాగుతున్నారు. ఇది కూడా చాలా ప్రమాదకరం. ఊపిరిత్తులు పూర్తిగా దెబ్బతింటాయి. గతంలో నిరక్ష్యరాస్యులు, గ్రామీణ, గిరిజన ప్రాంత వాసులు ఎక్కువుగా చుట్టలు, సిగరెట్లు తాగేవారు. కానీ నేడు పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ స్మోకింగ్కు అలవాటు పడుతున్నారు. ఇదిలా ఉంటే అడ్డపొగ మరీ ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.అత్యంత ప్రమాదకరం.. పొగతాగడం అత్యంత ప్రమాదకరం. పొగాకు ఉత్పత్తులు నమలడం వల్ల కూడా జీవితకాలం తగ్గిపోతుంది. సాధారణంగా 70 ఏళ్లు జీవించేవారు 60 నుంచి 65 ఏళ్లకే మరణిస్తారు. ఊపరితిత్తులు, గొంతు క్యాన్సర్తో పాటు మూత్రాశయం, లివర్ వ్యాధులు సోకే అవకాశం ఉంది. పొగ తాగడం వల్ల మధుమేహం, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు చాలా ఇబ్బందులు పడతారు. ప్రతి నెలా 1500 నుంచి రెండు వేల మంది వరకు ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడుతూ ఆస్పత్రికి వస్తున్నారు. వీరంతా పొగాకు బాధితులే. – డాక్టర్ బొత్స సంతోష్కుమార్, పలమనాలజిస్ట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
ధూమపానం ఆరోగ్యానికి హానికరం
నెల్లిమర్ల రూరల్: ధూమపానం(పొగతాగడం) ఆరోగ్యానికి హానికరమని, ప్రతిఒక్కరూ ధూమపానానికి దూరంగా ఉండాలని ఎంఎల్హెచ్వో భాగ్యలక్ష్మి అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం పురస్కరించుకుని, మండలంలోని కొండగుంపాం గ్రామంలో వైద్యారోగ్య సిబ్బంది శనివారం ర్యాలీ నిర్వహించి, పొగాకు వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. పొగాకు తాగడం లేదా పీల్చడం వల్ల, పొగాకు ఉత్పత్తులు తినడం వల్ల ఊపిరితిత్తులు, గుండె కేన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. సిగరెట్లు, ఖైనీ, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులకు ప్రతిఒక్కరూ దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో చోరీ
చికెన్రాజాం సిటీ: పట్టణంలోని పాతబస్టాండ్ ఎదురుగా ఉన్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో శుక్రవారం రాత్రి దొంగతనం జరిగింది. కార్యాలయంలో పనిచేస్తున్న సబ్ డివిజనల్ ఇంజినీరు పంచాది వెంకటప్రసాద్ శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో కార్యాలయానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. యథావిధిగా శనివారం ఉదయం ఆయన విధులకు రాగా తాళాలు బద్దలుగొట్టి ఉండడాన్ని చూసి, ఆఫీస్ గదిలో పరిశీలించారు. ఆ గదిలో 20 బ్యాటరీలు, రాగి వైరు, ఒక మొబైల్ అపహరణకు గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ. 35 వేల విలువగల సామగ్రిని దొంగిలించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. క్లూస్టీమ్ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్కుమార్ తెలిపారు. -
కస్తూరిబా ఉద్యోగిని అక్రమాలపై ఫిర్యాదులు
రాజాం: వంగర మండలంలోని ప్రభుత్వ కస్తూరీబా గాంధీ విద్యాలయంలో అకౌంటెంట్గా పనిచేస్తున్న కెంబూరు సరస్వతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ జిల్లా అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. వివరాల్లోకి వెళ్తే.. రాజాం మున్సిపాలిటీ పరిధి బుచ్చింపేటలో సరస్వతి తాత్కాలికంగా నివసిస్తుండగా, ఈమె స్వగ్రామం రేగిడి మండలం మజ్జిరాముడుపేట గ్రామం. ఈమైపె మజ్జిరాముడుపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కరణం శ్రీనివాసరావు ఆన్లైన్లో ప్రజా ఫిర్యాదుల వేదికకు ఈనెల 28న ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఏడాదికి రూ.2.88 లక్షల జీతం తీసుకుంటున్న ఈమె 2020–21 ఏడాదిలో తప్పుడు వివరాలతో పీఎంఏవై పథకం ద్వారా రాజాం పట్టణంలోని కంచరాం సమీపంలోని లేఅవుట్ –1లో 574 నంబర్తో ఇంటి పట్టా పొందిందని ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాజాం రెవెన్యూ అధికారులు శనివారం ఫిర్యాదుదారుని వద్ద వివరాలు సేకరించడంతో పాటు కేజీబీవీ ఉద్యోగిని కెంబూరు సరస్వతిని కూడా విచారించారు. రాజాం తహసీల్దార్ ఎం.రాజశేఖరం పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోందని, ఈమె మున్సిపాలిటీ పరిధిలో ఉండడంతో ఆ కార్యాలయానికి ఈ ఫిర్యాదులు పంపిస్తున్నామని ఆర్ఐ మహేశ్వరరావు తెలిపారు. ఇదిలా ఉండగా ఉద్యోగినిపై ఫిర్యాదు చేసిన శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తప్పుడు వివరాలతో అటు ప్రభుత్వాన్ని, ఇటు అధికారులను ఉద్యోగిని, ఆమె కుటుంబీకులు మోసగించారని ఆరోపించారు. -
పారిశుధ్య కార్మికులకు.. ఆ మాత్రం రక్షణ ఇవ్వలేరా?
సమాజ ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం, రక్షణపై అటు ప్రభుత్వం, ఇటు అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనునిత్యం మురుగు, చెత్తాచెదారం, దుమ్మూ–ధూళి ఉండే చోట్ల పనిచేసే వీరు..రక్షణ పరికరాలేవీ ధరించకుండా పనిచేయడాన్ని చూసి పారిశుధ్య కార్మికులంటే ఇంత చిన్నచూపా? అని అంటున్నారు. కనీసం తలకు టోపీ, ముఖానికి మాస్క్, చేతికి గ్లౌజులు, కాళ్లకు బూట్లు, శరీరాన్ని కప్పి ఉంచే యాప్రాన్ను అందివ్వలేరా అని ప్రశ్నిస్తున్నారు. వారంతా శ్వాసకోశ, ఊపిరితిత్తులు, చర్మ వ్యాధుల బారినపడితే ఎవరు బాధ్యులని నిలదీస్తున్నారు. సమావేశాల్లో ఆరోగ్య ప్రదాతలుగా వారిని కీర్తించడం కాదని, వారి ఆరోగ్యం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే వారికి రక్షణ పరికరాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం -
బరువెక్కిన పచ్చిరొట్ట ..!
విజయనగరం ఫోర్ట్: రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించిండి.. ప్రకృతి సాగు పద్ధతిలో వ్యవసాయం చేయండంటూ టీడీపీ సర్కార్ పదేపదే గొప్పలు చెబుతోంది. కాని ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదు. ప్రకృతి సాగును ప్రోత్సహించే క్రమంలో భూసారాన్ని పెంచేందుకు అవసరమైన పచ్చిరొట్ట ఎరువుల ధరలను తగ్గించి రైతులకు అందించాలి. అవసరమైతే ఉచితంగానైనా ఇవ్వాలి. కాని కూటమి ప్రభుత్వం పచ్చిరొట్ట ఎరువు ధరలను పెంచేసింది. ఇప్పటికే రసాయన ఎరువుల ధరలు పెరగడం వల్ల రైతుల సాగుకు వెనుకాడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పచ్చిరొట్ట ఎరువుల ధరల పెరగడం రైతులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది. 3409 క్వింటాళ్లు కేటాయింపు.. 2026 ఖరీఫ్ సీజన్కు సంబంఽధించి జిల్లాకు 3,409 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు కేటాయించారు. ఇందులో జీలుగ విత్తనాలు 1,819 క్వింటాళ్లు , జనుము విత్తనాలు 1137 క్వింటాళ్లు, పిల్లిపెసర విత్తనాలు 453 క్వింటాళ్లు ఉన్నాయి. జిల్లాపై రూ. 1.27 కోట్ల భారం.. కూటమి సర్కార్ పచ్చిరొట్ట ఎరువు ధరల విత్తనాలు పెంచడం వల్ల జిల్లాపై కోట్లాది రుపాయల భారం పడనుంది. జిల్లా వ్యాప్తంగా రైతాంగంపై రూ.1.27 కోట్ల భారం పడనుంది. జీలుగ, కట్టిజనుము,పిల్లిపెసర విత్తనాలపై క్వింటకు రూ. 3,700 నుంచి 4,500 రూపాయల వరకు పెంచారు. పచ్చిరొట్ట ఎరువు ధరలు పెంచేసిన టీడీపీ సర్కార్ ఖరీఫ్ సీజన్కు 3,409 క్వింటాళ్ల విత్తనాలు కేటాయింపు విత్తనాల ధరలు రూ. 3700 నుంచి 4,500 రూపాయల వరకు పెంపు పచ్చిరొట్ట ఎరువుతో అనేక ప్రయోజనాలు..పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ, జనుము, పిల్లిపెసరల్లో ఎదో ఒకటి వరి పంట సాగు చేయడానికి 40 రోజులు ముందు పొలంలో సాగు చేయాలి. పంట పెరిగిన తర్వాత పంటను బాగా కలియదున్నాలి. దీని వల్ల భూసారం పెరుగుతుంది. భూమికి కావాల్సిన నత్రజని లభిస్తుంది. దీని వల్ల యూరియా వాడకం తగ్గుతుంది. పంట దిగుబడి కూడా పెరుగుతుంది. – ఎ. శ్రీనివాసరావు, ఏఓ, విజయనగరం -
గంజాయి రవాణాను అడ్డుకుందాం
విజయనగరం క్రైమ్: గంజాయి రవాణాకు చెక్ పెట్టి జిల్లాను గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు రెవెన్యూ, పోలీస్ అధికారులు సమష్టిగా పనిచేయాలని సూచించారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఫనార్కోటిక్ కో ఆర్డినేషన్ కమిటీ (ఎన్సీఓఆర్డీ) సమావేశాన్ని జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయి వినియోగం చాలా వరకు తగ్గిందని.. ఒడిశా, చత్తీస్గఢ్ సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. గంజాయికి బానిసలైన వారిని గుర్తించి డీ అడిక్షన్ సెంటర్కు పంపిస్తున్నట్లు తెలిపారు. సమావేవంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఈగల్ ఎస్సై స్వీటీ పాల్గొన్నారు. బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు విజయనగరం క్రైమ్: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్ ముఠాలపై నిఘాపెట్టామన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. యువత మొబైల్ ఫోన్లను తనిఖీ చేసి బెట్టింగ్ యాప్లను తొలగించాలన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి, చదువుపై దృష్టి సారించాలని సూచించారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ -
జెడ్పీ చైర్మన్ల ఆత్మీయ భేటీ
విజయనగరం: విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)ను చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు శనివారం మర్యా దపూర్వకంగా కలిశారు. విజయనగరంలోని చిన్న శ్రీను క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఈ ఆత్మీయ భేటీలో ఇరు జిల్లాల జెడ్పీ చైర్మన్లు ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. వైఎస్సార్ సీపీ సంస్థాగత కార్యక్రమాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం విజయనగరం జెడ్పీ చైర్మన్ చిన్నశ్రీనును చిత్తూరు జెడ్పీ చైర్మన్ పట్టు శాలువాతో ఘనంగా సత్కరించి, తిరుమల శ్రీవారి ప్రతిమను బహూకరించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య నాయకులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు పాల్గొన్నారు. చిన్న శ్రీనును మర్యాదపూర్వకంగా కలిసిన చిత్తూరు జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు రాష్ట్ర రాజకీయాలు, పార్టీ బలోపేతంపై సుదీర్ఘ చర్చ -
మిల్లర్లకు గడువు గండం..!
● మరపట్టిన బియ్యం ప్రభుత్వానికి ఇచ్చేందుకు నేటితో ముగియనున్న గడువు ● తొలుత బియ్యం సేకరణలో జాప్యం...? ● గడువు ఒకరోజే ఉండడంతో మిల్లర్లలో ఆందోళన వీరఘట్టం/పాలకొండ: వీరఘట్టంలోని ఓ రైస్ మిల్లులో ఉన్న ధాన్యం బస్తాలు ఇవి. గత ఖరీఫ్లో ఈ మిల్లుకు 19,477 క్వింటాళ్ల ధాన్యంను మిల్లింగ్ చేసేందుకు ప్రభుత్వం అప్పగించింది. ఈ ధాన్యంలో 13,050 క్వింటాళ్ల (67 శాతం) బియ్యం తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. ఇంత వరకు ఆ మిల్లరు 10,150 క్వింటాళ్ల బియ్యం ప్రభుత్వానికి ఇచ్చారు. ఇంకా 2,900 క్వింటాళ్లు ఇవ్వాల్సి ఉంది. ఆదివారంలోగా మిగిలిన బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిబంధన పెట్టడంతో ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఖరీఫ్లో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం 2,72,119 మెట్రిక్ టన్నుల ధాన్యంను రైతుల వద్ద కొనుగోలు చేసింది. వీటిని బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చిన జిల్లాలోని 113 మిల్లులకు మరపట్టించేందుకు అప్పగించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందులో 67 శాతం బియ్యం మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించాలి. మిల్లింగ్ చేసినందుకు ప్రభుత్వం మిల్లరుకు చార్జీలు ఇస్తుంది. అయితే, ఈ ఏడాది ప్రభుత్వానికి మిల్లర్లు ఇవ్వాల్సిన బియ్యం 1,82,319 మెట్రిక్ టన్నులు కాగా.. శనివారం నాటికి 1,68,819 మెట్రిక్ టన్నులు బియ్యం ఇచ్చేశారు. ఇంకా 13,500 మెట్రిక్ టన్నులు బియ్యం మే 31లోగా ఇవ్వాల్సిందేనని నిబంధనలు పెట్టడంతో మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకాస్త సమయం ఇస్తే మిగిలిన బియ్యం ఇచ్చేస్తామని మిల్లర్లు చెబుతున్నారు. ఏం జరిగింది.... ఈ ఏడాది జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొంత ఆలస్యంగానే జరిగింది. ఫిబ్రవరి వరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతూనే వచ్చింది. మిల్లరు వద్ద ఉన్న ధాన్యంను మరపట్టించేందుకు ప్రభుత్వం నుంచి సకాలంలో అనుమతులు రాకపోవడంతో మిల్లింగ్ చేయడంలో జాప్యం జరిగిందని మిల్లర్లు చెబుతున్నారు. అందుచే తమ వద్ద ఉన్న ధాన్యంను మరపట్టి ప్రభుత్వానికి ఇచ్చేందుకు మరి కొంత సమయం కావాలని గడువు కోరుతున్నారు. బియ్యం సేకరణలో జాప్యం ఎందుకు.... వాస్తవానికి ఏటా ఖరీఫ్లో మిల్లర్లకు ఇచ్చిన ధాన్యం మరపట్టి, ప్రభుత్వానికి బియ్యం ఇచ్చే ప్రక్రియ మార్చి లేదా ఏప్రిల్ నెలాఖరకు పూర్తయ్యేది. మిల్లరుకు ఫోర్టిఫైడ్ రైస్ను ప్రభుత్వం ఇచ్చేది. ప్రభుత్వానికి మిల్లరు ఇచ్చే బియ్యంలో ప్రతి క్వింటాకు 1 శాతం ఈ ఫోర్టిఫైడ్ రైస్ను కలిపి ప్రభుత్వానికి ఇచ్చేవారు. అయితే, ఫోర్టిఫైడ్ రైస్ ఈ ఏడాది రావడం ఆలస్యం కావడంతో మిల్లింగ్ చేయడం ఆలస్యం అయ్యింది. చివరకు ఫోర్టిఫైడ్ రైస్ కొరత ఉండడంతో చివరికి మిల్లింగ్ చేసిన బియ్యమే ఇవ్వాల్సి వచ్చింది. దీనికి తోడు జిల్లాలోని పౌర సరఫరాల శాఖ గోదాంలలో ఖాళీ లేకపోవడంతో మిల్లింగ్ కొన్ని రోజుల పాటు ఆగిపోయిందని మిల్లర్లు అంటున్నారు. ఇలా అనేక కారణాలతో మిల్లింగ్కు తీవ్ర జాప్యం జరిగిందని, అందుకే బియ్యం సేకరణకు గడువు పొడిగించాలని మిల్లర్లు కోరుతున్నారు. తీవ్ర నష్టం మిల్లింగ్లో జాప్యం జరిగింది. ఎండల తీవ్రత పెరగడంతో ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం పూర్తిగా డ్రై కావడంతో ప్రతి క్వింటాకు నాలుగు కిలోల ధాన్యం తరుగు వచ్చినట్లు మిల్లర్లు చెబుతున్నారు. దీనికి తోడు కళాసీల కొరత వెంటాడుతోందని, అన్ని విధాలా నష్టాలే కనిపిస్తున్నాయని వాపోతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్లో కొనుగోలు చేసిన 2,72,119 మెట్రిక్ టన్నుల ధాన్యంను మిల్లర్లకు ఇచ్చాం. ఈ ఏడాది కొన్ని కారణాల వల్ల బియ్యం సేకరణలో జాప్యం జరిగింది. ఆదివారంతో మరపట్టిన బియ్యం ఇచ్చేందుకు గడువు ముగియనుంది. ఇంకా ఒక్కరోజు సమయం ఉంది కావున మిల్లర్లు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాం. – శ్రీనివాసరావు, పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్, పార్వతీపురం మన్యం ఇవి పాలకొండలోని ఓ రైస్ మిల్లులో ఉన్న ధాన్యం బస్తాలు. గత ఖరీఫ్లో ప్రభుత్వం రైతుల వద్ద కొనుగోలుచేసిన ధాన్యంలో 17,313 క్వింటాళ్ల ధాన్యంను మిల్లింగ్ చేసేందుకు మిల్లర్కు ఇచ్చింది. ధాన్యంలో 11,600 (67 శాతం) క్వింటాళ్ల బియ్యం తిరిగి ప్రభుత్వానికి సకాలంలో ఇవ్వాల్సి ఉంది. ఇంతవరకు ఆ మిల్లరు 10,150 క్వింటాళ్ల బియ్యంను ప్రభుత్వానికి ఇచ్చారు. ఇంకా 1,450 క్వింటాళ్లు ఇవ్వాల్సి ఉంది. -
చుక్కవలసలో సరికొత్త దోపిడీ
● పండ్ల తోట ముసుగులో ఉపాధిహామీ నిధుల మేత చీపురుపల్లిరూరల్(గరివిడి): ఉద్యాన పంటల సాగుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ నిధులను పెద్దమొత్తంలో అందిస్తోంది. దీనినే ఆసరాగా చేసుకుని గరివిడి మండలం చుక్కవలస గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు సాగు ముసుగులో ఉపాధిహామీ నిధులను పెద్దమొత్తంలో కాజేశారు. మొత్తం 11 మంది రైతుల పేర్లతో సమారు 5.5 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు జరిగినట్లు అధికారిక రికార్డుల్లో నమోదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కేవలం 2 నుంచి 3 ఎకరాల మధ్య మాత్రమే డ్రాగన్ఫ్రూట్ తోటలు కనిపిస్తున్నాయి. మరోవైపు సాగుచేసిన ఆ విస్తీర్ణంనే కొత్త రైతుల పేర్లతో ఏటా రికార్డుల్లో నమోదుచేస్తూ ప్రోత్సాహకాలను కై ంకర్యం చేయడం గమనార్హం. మరోవైపు డీ పట్టా భూముల్లో సాగుచేసిన తోటలను జిరాయితీ భూముల్లో సాగుచేసినట్టు పేర్కొని నిబంధనలకు విరుద్ధంగా నిధులు కాజేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా 50 సెంట్ల విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్ తోటలను సాగుచేసే రైతుకు సుమారు రూ.2లక్షల వరకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తోంది. దీనిని టీడీపీ నాయకులు అధికార బలంతో అందిపుచ్చుకున్నారు. పంట సాగుచేయకుండా రికార్డుల్లో చూపుతూ నిధులను కొట్టేశారు. అధికారులు తనిఖీలకు వచ్చే సమయంలో ఇప్పటికే పాత రైతులు సాగుచేసిన తోటలనే చూపించినట్టు సమాచారం. గ్రామానికి కేటాయించిన ఉపాధిహామీ నిధులన్నీ తోటల పేరుతో దొడ్డిదారిని దారిమళ్లిస్తూ, పని కల్పించడంలేదని ఎంపీడీఓ సుబ్రహ్మణ్యంకు మూడురోజుల కిందట వేతనదారులు ఫిర్యాదు చేశారు. నిధుల దోపిడీపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. -
భానుడి భగభగలు
పార్వతీపురం: జిల్లాలో రాబోయే ఐదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా కొనసాగనున్నట్టు రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) విభాగం హెచ్చరికలు జారీచేసినట్టు కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి శనివారం తెలిపారు. జిల్లాలోని 15 మండలాల్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సాలూరు, పార్వతీపురం, గరుగుబిల్లి, పాలకొండ, బలిజిపేట, వీరఘట్టం, కొమరాడ, జియ్యమ్మవలస, పాచిపెంట, భామిని, సీతంపేట, సీతానగరం, సాలూరు, తదితర మండలాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 54 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీహైడ్రేషన్కు గురికాకుండా తరుచూ తగినంత నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని సూచించారు. సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ఇసుక అక్రమ తరలింపు వెనుక అధికార పార్టీ నాయకుల హస్తాలు బయట పడుతున్నాయి. ప్రతి రోజూ ఏదో చోట ట్రాక్టర్లను పట్టుకుంటున్న అధికారులకు ప్రజా ప్రతినిధుల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయి. ఇటీవల పార్వతీపురానికి ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను అధికారులు పట్టుకుని జరిమానా విధించారు. శనివారం కూడా సీతానగరం మండలంలో ఓ రేవు నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తుండగా.. రెండు ట్రాక్టర్లను తహసీల్దారు పట్టుకుని జరిమానా విధించినట్లు సమాచారం. ఓ ప్రజా ప్రతినిధికి సంబంధించిన ఇంటి నిర్మాణానికి ఈ ఇసుక తరలిస్తుండగా.. అధికారులు పట్టుకోవడం గమనార్హం. ఈ రెండు ఘటనల్లోనూ వాటిని విడిచి పెట్టాలని సదరు ప్రజా ప్రతినిధి అధికారుల మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారని భోగట్టా. పలు సందర్భాల్లో ప్రభుత్వ సిబ్బంది పట్టువిడుపుగా ఉంటున్నా.. కొన్ని సార్లు జరిమానాలు వేస్తుండడం నాయకులకు కోపం తెప్పిస్తోంది. ఈ విషయాలను బయట పెట్టేందుకు కూడా అధికారులు భయపడుతున్నారు. సదరు ప్రజా ప్రతినిధుల నుంచి తర్వాత జరిగే పరిణామాలను ఊహించుకుని ఆందోళన చెందుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులే బలయిపోతున్నారని.. ఇంక తాము ఎంత అంటూ మౌనం దాల్చుతున్నారు. 21న ‘రీ–నీట్’ ● జిల్లాలో 7 కేంద్రాలు ● హాజరుకానున్న విద్యార్థులు 1,901 మంది విజయనగరం అర్బన్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 21న నిర్వహించనున్న ‘రీ–నీట్’ ప్రవేశ పరీక్షకు జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అఽధికారి సత్తిబాబు తెలిపారు. తన చాంబర్లో పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో ఆయన శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు జిల్లాలోని 7 పరీక్ష కేంద్రాల్లో నీట్ జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,901 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ప్రశ్నప్రత్రాల భద్రత, గోప్యత విషయంలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని అధికారులకు హెచ్చరికలు జారీచేశారు. సమావేశంలో నీట్ సిటీ కోఆర్డినేటర్, కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ దిలీప్ మోదీతో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రిన్సిపాల్స్, చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. వడదెబ్బతో వేతనదారు మృతి బొండపల్లి: ఉపాధిహామీ పనులకు వెళ్లిన వేతనదారు ఇంటికి వచ్చే క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. కుటుంబ సభ్యులు, వేతనదారులు తెలిపిన వివరాల ప్రకారం.. బొండపల్లి మండలం కనిమెరక గ్రామానికి చెందిన తెలుగు అప్పన్న (53) గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులకు శనివారం వెళ్లారు. ఉదయం పదిన్నర గంటల సమయంలో ఇంటికి చేరే క్రమంలో ఎండకు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి గజపతినగరంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అక్కడ చికిత్స పోందుతూ కొద్ది క్షణాల్లో మృతి చెందారు. ఆయనకు భార్య బంగారమ్మ, కుమారుడు శ్రీనివాసరావు, కుమార్తె ఎర్రయ్యమ్మ ఉన్నారు. ఇంటిపెద్ద వడదెబ్బకు గురై మృతిచెందడంతో కన్నీరుపెడుతున్నారు. -
ఓటర్ల జాబితా సవరణకు రెడీ
● జూన్ 15 నుంచి ఇంటింటికీ బీఎల్ఓలు ● 1,032 మంది సిబ్బందికి కిట్ల పంపిణీ పార్వతీపురం: జిల్లాలో జూన్ 15వ తేదీ నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా శనివారం కలెక్టరేట్ చాంబర్లో కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి బూత్ స్థాయి అధికారులకు (బీఎల్ఓలు) ప్రత్యేక కిట్లను పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి, ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించనున్న 1,032 మంది బీఎల్ఓలకు ఈ కిట్లను అందజేశారు. విధుల్లో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రతీ కిట్లో అవసరమైన స్టేషనరీ సామగ్రితో పాటు ఎండ, వానల నుంచి రక్షణకు గొడుగు, వాటర్ బాటిల్ను కూడా చేర్చారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు నెల రోజుల పాటు సాగే ఈ సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించాలని, ఎలాంటి లోపాలకు తావులేకుండా సమర్థవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. -
ముత్యాలమ్మ కొండను కాపాడండి!
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు పతివాడ, రాయుడుపేట గ్రామస్తుల వినతి విజయనగరం: తమ గ్రామ ప్రజలకు జీవనాధారంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న ముత్యాలమ్మ కొండను అక్రమ తవ్వకాల నుంచి కాపాడాలని పూసపాటిరేగ మండలం పతివాడ, రాయుడుపేట గ్రామస్తులు కోరారు. విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలోని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావును శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సర్వే నంబర్ 77లో ఉన్న ముత్యాలమ్మ కొండపై ఏటా అమ్మవారి పండగను నిర్వహిస్తామన్నారు. పశువులు, జీవాల మేతకు కొండే ఆధారమన్నారు. ఇప్పుడు కొందరు కాంట్రాక్టర్లు కొండను యంత్రాలతో తవ్వేసి కనుమరుగుచేస్తున్నారని, తక్షణమే స్పందించి తవ్వకాలను అడ్డుకునే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తిచేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ.. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
వేతన సహకారం
● జిల్లాలో 270 మంది ఉద్యోగుల భవిష్యత్తుపై అనిశ్చితి విజయనగరం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల ఉద్యోగులకు వర్తింపచేస్తున్న హెచ్ఆర్పాలసీ, జీఓ–322 అమలు నేపథ్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఉమ్మడి జిల్లాలో 94 పీఏసీఎస్లలో వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న 270 మంది ఉద్యోగులు వేతనాల చెల్లింపు, వేతనపెంపు అమలుపై అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వీరిలో పాలసీ వర్తించే రెగ్యులర్ ఉద్యోగులు 170 మంది వరకు ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 20 శాతం ప్రాథమిక వేతన పెంపు, గ్రాట్యుటీ పరిమితి పెంపు, గ్రూప్ మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాలు హెచ్ఆర్ఎంఎస్ కింద మాత్రమే అమలవుతాయని స్పష్టం చేసింది. అయితే, జిల్లాలోని అనేక సహకార సంఘాల్లో ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ల డిజిటలైజేషన్, హెచ్ఆర్ఎంఎస్లో అప్లోడ్ ప్రక్రియ పూర్తి కాలేదని సమాచారం. దీంతో మేనెల జీతాల బిల్లుల ప్రాసెసింగ్, పే స్లిప్ల తయారీ ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సంఘాల్లో జీతాలు ఒకటి, రెండు నెలల ఆలస్యంగా చెల్లిస్తున్న పరిస్థితి ఉండగా కొత్త విధానం అమలుతో మరింత జాప్యం జరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ‘కెపాసిటీ టు పే’ నిబంధనపై అభ్యంతరాలు మరో వైపు జీఓ–322 ప్రకారం లాభాల్లో ఉన్న సహకార సంఘాల ఉద్యోగులకు మాత్రమే వేతన పెంపు వర్తించే అవకాశం ఉండడంపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం తెలుపుతున్నాయి. నాబార్డు నిర్దేశించిన ‘కేపాసిటీ టు పే’ (చెల్లింపు సామర్ధ్యం) నిబంధన ఆధారంగా చేసుకుని వేతన పెంపు అమలు చేయడం అన్యాయమని పేర్కొంటున్నాయి. జిల్లాలోని అన్ని పీఏసీఎస్లు ఒకే ఆర్థిక స్థితిలో లేకపోవడంతో కొందరు ఉద్యోగులకు వేతన పెంపు లభించి, మరికొందరు ఆ ప్రయోజనాలకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని 94 సంఘాలలో కేవలం 10 సంఘాలు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. వీటిలో పనిచేస్తున్న దాదాపు 30 మంది ఉద్యోగులకు మాత్రమే వేతనపెంపు వర్తిస్తుంది. ఉద్యోగుల వివరాల ధ్రువీకరణ, సర్వీస్ రిజిస్టర్ల నవీకరణ, మూడంచెల పరిశీలన, హెచ్ఆర్ఎంఎస్లో డేటా నమోదు వంటి ప్రక్రియలు పూర్తికావాల్సి ఉంది. దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ తాజాగా విడుదలైంది. ఆ సాఫ్ట్వేర్లో ఉద్యోగుల డేటాను అప్లోడ్ చేయడంపై సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. ఈ పనులు వేగంగా పూర్తయిన తర్వాతే జిల్లాలో పాలసీ వర్తించే 170 మంది ఉద్యోగులకు మే నెల జీతాలు విడుదలవుతాయి. ప్రస్తుతం లాభాల్లో లేకపోయినా రానున్న మూడేళ్లలో లాభాలబాటలో తీసుకొస్తామని పీఏసీఎస్లు తీర్మానం చేసి నాబార్డుకు ఇస్తే లాభాల్లోకి రావడానికి అవసరమైన మొత్తం రుణంగా ఇస్తుంది. ఆ రుణాన్ని వాయిదాల పద్ధతిలో సంఘాలు చెల్లించుకోవాలి. – పి.రమేష్, జిల్లా సహకార శాఖ అధికారి జీఓ–322లోని ‘కెపాసిటీ టు పే’ నిబంధనను రద్దు చేసి, లాభనష్టాలతో సంబంధం లేకుండా అన్ని సహకార సంఘాల ఉద్యోగులకు సమానంగా వేతనపెంపు వర్తింపజేయాలి. సహకార రంగ ఉద్యోగుల సేవా భద్రత, వేతన భరోసా కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. జిల్లాలో ఇప్పటికే ఆర్థిక, పరిపాలనా ఒత్తిడిలో పనిచేస్తున్న సహకార ఉద్యోగులు హెచ్ఆర్పాలసీ అమలు ప్రక్రియ పూర్తయ్యే వరకు తమ వేతనాలు, కొత్త ప్రయోజనాలపై స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. – పి.కామేశ్వరరావు, జిల్లా గౌరవాధ్యక్షుడు, పీఏసీఎస్ ఉద్యోగుల సంక్షేమ సంఘం -
హ్యాండ్బాల్ టోర్నీ విజేత విజయనగరం
విజయనగరం: నగరంలోని రాజీవ్ మైదానం వేదికగా మూడు రోజుల పాటు జరిగిన రాష్ట్రస్థాయి పురుషుల హ్యాండ్బాల్ టోర్నమెంట్ శుక్రవారం సాయంత్రం అంగరంగ వైభవంగా ముగిసింది. హోరాహోరీగా జరిగిన తుది పోరులో విజయనగరం జట్టు విజేతగా నిలిచి ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుంది. కృష్ణా, కడప జట్లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. విజేతలకు అతిథులు ట్రోఫీలు అందజేసి అభినందించారు. ముగింపు కార్యక్రమంలో హ్యాండ్బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణరాజు, అధ్యక్ష, కార్యదర్శులు బత్తుల శేఖర్, వి.మల్లేశ్వరరావు, శాయ్ అకాడమీ విశ్రాంత కోచ్ దేవేందర్, ఒలింపిక్ సంఘ నాయకుడు సీహెచ్.వేణుగోపాలరావు, ఎస్జీఎఫ్ సెక్రెటరీ కోరాడ గోపాలరావు, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు కమలనాభరావు, చింతాడ రవికుమార్, సీనియర్ అథ్లెట్ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. స్కాలర్షిప్పులపై అవగాహన కల్పించండి విజయనగరం అర్బన్: కేంద్ర ప్రభుత్వం ఎస్సీ విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ‘ఎస్ఈటీయూ’ ప్రీ–ెమెట్రిక్, పోస్ట్–మెట్రిక్ స్కాలర్షిప్ పథకాలపై జిల్లాలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులను శుక్రవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. అర్హులైన ప్రతి విద్యార్థికీ ఈ స్కాలర్షిప్ అందేలా విద్యాసంస్థలు, సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఉపకార వేతనాలకు విద్యార్థులు నేరుగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. యూఎంఏఎన్జీ యాప్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా వన్టైమ్ రిజిస్ట్రేషన్, ఆధార్ ధ్రువీకరణ ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. స్కాలర్షిప్ డబ్బులు నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకి జమయ్యేందుకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ ప్రక్రియ కోసం బ్యాంక్ ఖాతాను లింక్ చేయాలని సూచించారు. మక్కువ పరిసరాల్లో ఏనుగులు మక్కువ: మండలంలోని ఏనుగుల గుంపు ప్రవేశించిందని ఫారెస్ట్ ఆఫీసర్ తవిటినాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. దబ్బగెడ్డ పంచాయతీ విజయరాంపురం పరిధిలో ఏనుగులు సంచరిస్తున్నాయని, దీంతో సమీప ప్రాంతాలైన కోన, గోపాలపురం, దబ్బగెడ్డ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. ప్రజలు ఆరుబయట నిద్రించరాదని, అలాగే పశువులను ఒంటరిగా కట్టరాదని సూచించారు. భోగాపురంలో దొంగతనం పూసపాటిరేగ: భోగాపురం మండల కేంద్రంలో ఓ ఇంటిలో దొంగలు పడి నాలుగున్నర తులాల బంగారం, 20 తులాల వెండితో పాటు 60 కిలోల ఇత్తడి సామాన్లు దోచుకుపోయారు. సీఐ దుర్గాప్రసాద్ తెలియజేసిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన క్యాసినకుర్తి సత్యనారాయణ ఇంటిలో గురువారం రాత్రి దొంగలు పడి విలువైన సొత్తు పట్టుకుపోయారు. ఇదిలా ఉంటే అదే గ్రామానికి చెందిన బమ్మిడి గురునాథ్ ఇత్తడి సామాన్లతో వెళ్లిపోతుండగా.. సత్యనారాయణ, తదితరులు శుక్రవారం ఉదయం పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై వి. పాపారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పీజీఆర్ఎస్కు వినతుల వెల్లువ
11 అర్జీల స్వీకరణ పార్వతీపురం: పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో గిరిమిత్ర హల్లో శుక్రవారం నిర్వహించిన గిరిజన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 11 అర్జీలు అందినట్లు గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎ.విజయశాంతి తెలిపారు. గిరిజన ప్రాంతాలలో మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు, వ్యక్తిగత సమస్యలపై వచ్చిన అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఓ ఎ.దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. సంతకవిటి: మండల పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ ఎస్.రాంసుందరరెడ్డి శుక్రవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు ఆర్జీదారులు పోటెత్తారు. భూ సమస్యలపై 15, సంక్షేమ పథకాలు, తాగునీరు, కాలువలు, ఉపాధి, తదితర అంశాలపై 63 వినతులు వచ్చాయి. వాసుదేవపట్నం పంచాయతీ పోతుల జగ్గుపేట గ్రామ సమీపంలో కోళ్లఫారం ఏర్పాటు చేస్తున్నారని, వాటివల్ల రోగాలు సంభవించే అవకాశం ఉన్నందున ఫారాన్ని వేరే ప్రాంతానికి మార్చాలని గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. తమ అధీనంలో ఉన్న భూమికి సంబంధించి వన్బీ మంజూరు కావడం లేదని తాలాడ గ్రామానికి చెందిన డోల అప్పలరాము, డోల లక్ష్మున్నాయుడు, డోల చిలకారావు, డోల కృష్ణ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పింఛన్ మంజూరు చేయండి.. గుళ్లసీతారాంపురం గ్రామానికి చెందిన ముగడ లక్ష్మి తనకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని వినతి ఇచ్చింది. ఏడాది కిందట తన భర్త మృతి చెందాడని, అప్పటినుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయిందని అధికారుల దృష్టికి తీసుకువచ్చింది. దివ్యాంగుడి వద్దకు కలెక్టర్.. జావాం గ్రామానికి చెందిన బార్నాన సూర్యనారాయణ అనే దివ్యాంగుడు ట్రై సైకిల్ మంజూరు చేయాలని వినతి ఇచ్చేందుకు రాగా..కలెక్టర్ అతని వద్దకు వచ్చి వినతిపత్రం తీసుకున్నారు. తల్లికి వందనం అందడం లేదు.. తల్లికి వందనం పథకం తమకు అందడం లేదని ముకుందపురం గ్రామానికి చెందిన కోరాడ జ్యోతి, బొద్దూరు గ్రామానికి చెందిన వల్లూరు సంధ్య, వల్లూరు శ్రీనివాసరావు వినతిపత్రాలు అందజేశారు. డీఈఓతో మాటాడి సమస్య పరిష్కరిస్తానన కలెక్టర్ అర్జీదారులకు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోండ్రు మురళీమోమన్, జేసీ సేథుమాధవన్, ఆర్డీఓ సుధారాణి, సంతకవిటి, రాజాం తహసీల్దార్లు బి.సుదర్శనరావు, రాజశేఖర్, ఎంపీడీఓ కె.సురేష్కుమార్, మండల ప్రత్యేకాధికారి విశ్వేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 78 వినతులు స్వీకరించిన అధికారులు -
సీతం అధ్యాపకుడికి జాతీయ స్థాయి గుర్తింపు
విజయనగరం అర్బన్: స్థానిక సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (సీతం) ఇంజినీరింగ్ కళాశాల జాతీయ స్థాయిలో మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. సీఎస్ఈ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వై.దినేష్కుమార్ భాగస్వామ్యంతో రూపొందించిన ఒక వినూత్న ఎమ్మార్ఐ స్కానింగ్ పరికరం డిజైన్కు భారత ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం అధికారికంగా ‘డిజైన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (పేటెంట్) మంజూరు చేసింది. ఈ సందర్భంగా సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు శుక్రవారం మాట్లాడుతూ.. కళాశాలలో పరిశోధన, సరికొత్త ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడానికి ఇటువంటి జాతీయ స్థాయి విజయాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు, పరిశోధనలకు సంస్థ తరఫున మద్దతిస్తామని చెప్పారు. అనంతరం డాక్టర్ దినేష్కుమార్ను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో డీన్ అకాడమిక్ డైరెక్టర్ వై.నరేంద్రకుమార్, చీఫ్ అకడమిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ సాయిరాం పట్నాయక్, ఇంగ్లిష్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎన్.సతీష్కుమార్, సివిల్ హెచ్ఓడీ డాక్టర్ రవికిషోర్, తదితర అధ్యాపక సిబ్బంది పాల్గొని అభినందనలు తెలిపారు. -
పారా అథ్లెటిక్స్లో జిల్లా క్రీడాకారుల సత్తా..
విజయనగరం: కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని కంఠీరవ స్టేడియం వేదికగా ఈ నెల 25వ తేదీ నుంచి 28 వరకు జరిగిన 8వ ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ –2026 పోటీల్లో జిల్లాకు చెందిన పారా క్రీడాకారులు సత్తా చాటినట్లు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె. దయానంద్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్లో జరగబోయే ఏషియన్ గేమ్స్ ఎంపికల కోసం నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాకు చెందిన కిల్లక లలిత (టి–11) 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో గోల్డ్ మెడల్స్.. కరణం గౌతమ్ (టి–12) లాంగ్జంప్లో సిల్వర్, 100 మీటర్ల పరుగులో బ్రాంజ్ మెడల్ సాధించగా.. కొత్తింటి పైడిరాము (ఎఫ్–51) డిస్క్త్రోలో బ్రాంజ్ మెడల్ సాధించారని చెప్పారు. అంతర్జాతీయ ర్యాంక్ల ప్రకారం ఏషియన్ గేమ్స్కు ఎంపికై న వారి వివరాలు త్వరలో తెలుస్తాయని తెలిపారు. జిల్లా కీర్తి ఇనుమడింపజేసిన ముగ్గురు క్రీడాకారులను ఈ సందర్భంగా అభినందించారు. -
రెండేళ్లలో 22 మందికి కఠిన శిక్షలు
● ‘ఆపరేషన్ దండాయన’తో వేగవంతమైన దర్యాప్తు ● మన్యం జిల్లాలో 39 మందిపై హిస్టరీ షీట్లు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ మాధవ్రెడ్డి పార్వతీపురం రూరల్: మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడిన 22 మంది ముద్దాయిలకు రెండేళ్లలో న్యాయస్థానాలు కఠిన శిక్షలు విధించాయని ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ దండాయన’లో భాగంగా సకాలంలో దర్యాప్తు చేపట్టి, కోర్టు ట్రయల్ మానటరింగ్ ద్వారా ఈ ఫలితాలు సాధించినట్లు చెప్పారు. నిర్ణీత గడువులోగా కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసి, సాక్షులకు ధైర్యం కల్పించడం వల్లే నిందితులకు శిక్షలు పడుతున్నాయన్నారు. గడచిన రెండు సంవత్సరాల్లో మొత్తం 19 కేసుల్లో ముద్దాయిలకు శిక్షలు ఖరారయ్యాయని తెలిపారు. మహిళల హత్యకు సంబంధించిన మూడు కేసుల్లో ముగ్గురికి జీవిత ఖైదు పడిందన్నారు. అలాగే అత్యాచారం, పోక్సో చట్టం కింద నమోదైన ఐదు కేసుల్లో ఏడుగురికి శిక్షలు పడగా.. వారిలో నలుగురికి 20 ఏళ్లు, ఒకరికి పదేళ్లు, మరొకరికి మూడేళ్లు, ఇంకొకరికి రెండేళ్ల జైలు శిక్ష పడిందని తెలిపారు. పోక్సో చట్టం కింద నమోదైన నాలుగు కేసుల్లో ఇద్దరికి ఏడేళ్లు, ఇద్దరికి మూడేళ్లు.. అత్యాచారానికి సంబంధించిన ఐదు కేసుల్లో నలుగురికి పదేళ్లు, ఒకరికి ఏడాది జైలు శిక్ష పడిందని చెప్పారు. వరకట్న వేధింపుల కేసుల్లో ఇద్దరికి రెండేళ్లు, మహిళల వేధింపుల కేసులో ఇద్దరికి రెండు రోజుల చొప్పున జైలు శిక్షను న్యాయస్థానాలు విధించాయన్నారు. అలాగే మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడిన 39 మందిపై హిస్టరీ షీట్లు తెరిచి నిరంతర నిఘా ఉంచినట్లు తెలిపారు. నేరస్తులకు శిక్షలు పడినప్పుడే నేరాలు పునరావృతం కావని, అఘాయిత్యాలకు పాల్పడే వారు కోర్టు ట్రయల్ మానిటరింగ్ వ్యవస్థ ద్వారా చట్టం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని ఆయన స్పష్టం చేశారు. -
అల్లాడిపోతున్న మూగజీవాలు
● ఎండ వేడిమికి తగ్గిన పాల దిగుబడి ● పశువులను కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్న పాడి రైతులువిజయనగరం ఫోర్ట్: భానుడి ప్రతాపానికి మానవులతో పాటు మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎండ తీవ్రత అధికంగా ఉంది. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీలను ఎన్నడూ దాటలేదు. అలాంటిది ప్రస్తుతం ప్రతిరోజూ గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు పైబడే నమోదవుతోంది. దీనికి తోడు వడగాల్పులు తోడవ్వడంతో జనంతో పాటు మూగజీవాలు ఆపసోపాలు పడుతున్నాయి. ఇళ్లలో సైతం ఉండలేని పరిస్థితి. ఎండవేడిమికి గుంతలు, చెరువులు సైతం ఎండిపోతున్నాయి. చాలా తక్కువ చెరువుల్లో మాత్రమే కొద్దిపాటి నీరు ఉంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల పాల ఉత్పత్తి కూడా తగ్గిపోతోంది. చెరువుల్లో నీరు లేక పోవడం వల్ల మూగజీవాలకు అవసరమైన తాగునీరు దొరకని పరిస్థితి నెలకొంది. అనారోగ్యం బారిన పశువులు ఎండ తీవ్రత చాలా ఎక్కువుగా ఉండడం వల్ల పాడి పశువులు అనారోగ్యానికి గురవుతున్నాయి. ఆవులు కంటే గేదెలు ఎక్కువుగా వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. గేదెలు నల్లగా ఉండడం వల్ల వాటిపై ఎండ ప్రభావం ఎక్కువుగా ఉంటుంది. పాడి పశువులకు వడదెబ్బ తగలకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి. పాడి పశువులకు 27 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే సౌకర్యవంతంగా ఉంటుంది. ఎండ తీవ్రత ఎక్కువుగా ఉంటే నోట్లో లాలాజలం తగ్గిపోతుంది. దీంతో నెమరవేసుకోవడానికి పశువులు ఇబ్బంది పడతాయి. దాహం ఎక్కువుగా ఉండడం వల్ల నీరు తాగి మేత సరిగ్గా తినవు. దీంతో శరీరంలో గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్ స్థాయిలు తగ్గిపోయి పశువులు నీరసించిపోతాయి. పాల్ప ఉత్పత్తి, వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోతాయి. రక్షణ ఇలా.. వడదెబ్బకు గురైన పశువులు తూలుతూ నడుస్తాయి. ఇటువంటి వాటిని గుర్తించి చల్లటి ప్రదేశానికి తీసుకెళ్లాలి. శరీర ఉష్ణోగ్రత తగ్గించేందుకు నీటితో తడపాలి. ఐస్ ముక్కలను తలపై ఉంచాలి. అప్పటికీ శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే సోడియం సాలిసిలైట్, పారాసిట్మాల్ ఇంజిక్షన్లు చేయాలి. ఎండ తీవ్రతను తగ్గించేందుకు మంచి గాలి, వెలుతురు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. షెడ్ల చుట్టూ అవిసె, సుబాబుల్ చెట్లను వేయడం వల్ల వాతావరణం చల్లగా ఉంటుంది. పశుగ్రాసం కూడా లభిస్తుంది. పాకల పైకప్పులను తాటాకులతో గాని గడ్డితో గాని కప్పాలి. పశువులను రోజుకు రెండు, మూడు సార్లు కడగాలి. సులువుగా అరిగించుకునే జావ, గంజి వంటివి తాగించాలి. పచ్చిగడ్డి ఎక్కువుగా ఇవ్వాలి.ముందుకురాని రైతులు ఉపాధిహామీ పథకం ద్వారా పశుగ్రాస క్షేత్రాల సాగును ప్రోత్సహిస్తున్నట్లు కూటమి సర్కారు చెబుతోంది. అయితే అధికార పార్టీకి చెందిన వారికే వీటిని కేటాయించడం, బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం కారణంతో రైతులు సాగుకు ముందుకు రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాడి పశువుల వివరాలు.. జిల్లాలో 4,75,725 పాడి పశువులు ఉన్నాయి. ఇందులో ఆవులు 3,77,880 కాగా గేదెలు 97, 845 ఉన్నాయి. ఈ పశువుల ద్వారా ఏడాదికి 7.68 లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి జరుగుతోంది. అయితే ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత ఎక్కువుగా ఉండడం, పచ్చిమేత దొరకకపోవడం, తాగునీరు సరిపడా అందివ్వలేకపోవడంతో పాల దిగుబడి తగ్గిపోతోంది. ఒక్కో పాడి పశువు దగ్గర లీటరు నుంచి లీటరున్నర వరకు పాల తగ్గిపోతున్నాయి. పాల ఉత్పత్తి తగ్గింది.. నాకు రెండు గేదెలున్నాయి. రోజుకి 12 లీటర్ల పాలు కేంద్రానికి వేసేవాడిని. ఎండ వల్ల పాలు తగ్గిపోయాయి. రోజుకి 9 లీటర్ల పాలు మాత్రమే ప్రస్తుతం వస్తున్నాయి. ఎండకు ఉండలేక గేదెలు ఇబ్బంది పడుతున్నాయి. పి.రమణ, రైతు, పెదవేమలి, గంట్యాడ మండలం గడ్డి విత్తనాలు సిద్ధం.. పశుగ్రాసం కొరతను తీర్చేందుకు రైతుసేవా కేంద్రాలు, పశు వైద్యశాలల వద్ద 22 టన్నుల గడ్డి విత్తనాలను అందుబాటులో ఉంచాం. అదేవిధంగా 534 టన్నుల పశువుల దాణాను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎన్. దామోదరరావు, పశుసంవర్థకశాఖ జె.డి పచ్చిమేత కొరతే కారణం.. వర్షాకాలం, శీతాకాలాల్లో పచ్చిమేత, నీరు సమృద్ధిగా ఉండడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతోంది. వేసవికాలంలో నీరు, పచ్చిమేత కొరత ఎక్కువగా ఉండడం వల్ల వాటి ప్రభావం పాల దిగుబడిపై పడుతోంది. పచ్చిమేత సాగు చేయడానికి కూడా సరిపడా నీటి సౌకర్యం లేదు. -
రోడ్డు ప్రమాదంలో ఉపాధి వేతనదారు మృతి
పాలకొండ రూరల్/పాలకొండ: మండలంలోని వెలగవాడ సమీపంలో తోటపల్లి సాగునీటి కాలువలో ఉపాధి పనులు చేసుకుని ఇంటికి వస్తున్న వేతనదారు మేదరమెట్ల సావిత్రి (62) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శుక్రవారం ఉదయం పనులు చేసుకుని ఇంటకి వస్తున్న క్రమంలో హెరిటేజ్ పాల లారీ సావిత్రిని ఢీ కొనడంతో ఆమె సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఈమెకు భర్త, పిల్లలు ఎవ్వరూ లేరు. విషయం తెలుసుకున్న సీఐ ఆమిటి ప్రసాద్, ఎస్సై డోల వెంకన్న, తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి సోదరి ఆశాజ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అప్పటివరకు తమతో పనులు చేసిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సహచర వేతనదారులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బస్సు ఢీకొని వ్యక్తి..రామభద్రపురం: మండలంలోని కొట్టక్కి వేగావతి నది బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు ఢీ కొని వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నరసాపురం గ్రామానికి చెందిన తెర్లి సింహాచలం (71) రామభద్రపురంలోని బంధువుల ఇంటికి వెళ్తానని చెప్పి గురువారం (ఈ నెల 28న) ఉదయం ఇంటి నుంచి బయలుదేరాడు. అయితే ఎంతకీ బంధువుల ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకసాగారు. ఇంతలో కొట్టక్కి వేగావతి నది వద్ద ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఒకరు గాయపడ్డారన్న విషయం తెలియడంతో అక్కడకు వెళ్లి చూడగా తీవ్రగాయాలతో ఉన్న సింహాచలం కనిపించాడు. వెంటనే అతడ్ని సాలూరు సీహెచ్సీకి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై జ్ఞానప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంధనభారం మోయలేం
● పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ ఆటోవాలాల ఆందోళన ● విజయనగరంలో భారీ ర్యాలీ విజయనగరం గంటస్తంభం: పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎఫ్టీయూ (న్యూ) అనుబంధ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆందోళన చేశారు. ధరల పెంపునకు నిరసనగా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మయూరి కూడలి మీదుగా మెసానిక్ టెంపుల్ వరకు ర్యాలీ నిర్వహించారు. తాళ్లతో ఆటోను లాగుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అనంతరం ఆర్టీసీ ప్రధాన ద్వారం వద్ద మానవహారం నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు రెడ్డి నారాయణరావు, కార్యదర్మి ఎన్.అప్పలరాజు మాట్లాడు తూ, ఇంధన ధరల పెరుగుదలతో ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటోందన్నారు. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చి ధరలను నియంత్రించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారం మోపకుండా ఇంధన సుంకాలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చెన్నా ధర్మారావు, గేదెల నారాయణరావు, కంది రాము, పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. -
పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యం తగదు
విజయనగరం అర్బన్: పింఛన్ల పంపిణిలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించడం ద్వారా ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని పెంపొందించాలని సూచించారు. జిల్లాలో పింఛన్ల పంపిణీ ప్రతి నెలా సజావుగా జరుగుతున్నప్పటికీ, సానుకూల ప్రజాభిప్రాయం విషయంలో జిల్లా వెనుకబడి ఉండడంపై కలెక్టర్ విశ్లేషించారు. పింఛన్లు ఇళ్ల వద్దకు వెళ్లే ఇవ్వాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజలతో మ ర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. సకాలంలో పారిశ్రామిక ప్రాజెక్ట్లు.. జిల్లాకు మంజూరైన పరిశ్రమలు, పారిశ్రామిక ప్రాజెక్ట్లను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడానికి సంబంధిత శాఖలన్నీ పూర్తి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందింరలో రెవెన్యూ, పరిశ్రమల శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల పెంపు దిశగా చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి -
మహిళలకు గౌరవం ఉన్నచోటే నాగరిక సమాజం
గుమ్మలక్ష్మీపురం: మహిళలకు గౌరవం ఉన్నచోటే నాగరిక సమాజం ఉన్నట్లని ఎస్పీ మాధవ్రెడ్డి అన్నారు. మహిళలను చులకన భావంతో చూడకూడదన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలపై గుమ్మలక్ష్మీపురం బీఎస్సార్ కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి మహిళ తన సెల్ఫోన్లో శక్తియాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. మహిళలు మంచి చదువులు చదువుకొని ఆర్థికంగా ఎదుగాలని సూచించారు. కార్యక్రమంలో పాలకొండ డీఎస్పీ రాంబాబు, ఎల్విన్పేట సీఐ హరి, ఎస్ఐ శివప్రసాద్ నాయుడు పాల్గొన్నారు. -
కొండను కట్టబెడితే ఊరుకోం
శృంగవరపుకోట: ఇప్పటికే అధికార బలంతో కొండ భూములు, ప్రభుత్వ బంజరు, ఢీ పట్టా భూములు, చెరువులు కబ్జాచేశారు.. జీవాల మేతకు ఆధారమైన 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొండను ఇప్పుడు పర్యాటకాభివృద్ధి పేరుతో ఓ వ్యక్తికి కట్టబెట్టేందుకు చూస్తున్నారు.. ఇదెక్కడి అన్యాయం... కొండజోలికొస్తే ఊరుకునేది లేదంటూ ఎస్.కోట మండలంలోని కృష్ణాపురం గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు తేల్చిచెప్పారు. సర్వే నంబర్ 38లో 30ఎకరాల ప్రభుత్వ భూమిని కె.వి.ఎన్.గోవిందరావు అనే వ్యక్తికి ఎకో టూరిజం పేరుతో కట్టబెట్టే చర్యలు మానుకోవాలని, గ్రామసభను నిర్వహించి, గ్రామస్తుల అభిప్రాయం మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు కృష్ణాపురం గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేకాధికారి కె.రవీంధ్ర అధ్యక్షతన తహసీల్దార్ శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది గ్రామంలో శుక్రవారం గ్రామసభ ఏర్పాటు చేశారు. తహసీల్దార్ శ్రీనివాసరావు మాట్లాడే క్రమంలో వేలుచూపి మాట్లాడడంతో గ్రామపెద్దలు ‘బెదిరింపులకు దిగటం సరికాదు. బెదిరించి భూములు లాక్కుని, ఎవరికో వత్తాసు పలకటానికి గ్రామసభ పెట్టారా’ అంటూ ధ్వజమెత్తారు. గ్రామానికి చెందిన న్యాయవాది వారాది ఈశ్వరరావు, మాజీ సర్పంచ్ ఎం.యామినీదేవి, వేండ్రపు శ్రీనివాసరావు, కర్రి తాతారావు, సింగంపల్లి శ్రీను, కె.ఎరుకునాయుడు తదితరులు మాట్లాడుతూ ‘గతంలో గ్రామంలో భూములు కొనుగోలుచేసిన గోవిందరావు బంజరు భూములు, చెరువులు, డీ పట్టా భూములను కబ్జాచేశారు. కొండగెడ్డ నుంచి వర్షపునీరు చెరువులో చేరకుండా చేపల చెరువులు తవ్వా రు. అతని భూములను ఆనుకుని ఉన్న మా భూముల్లోకి వెళ్లనీయకుండా గేటువేసి, కంచె వేశారు. ఎమ్మెల్యేలు, మంత్రుల అండ ఉందంటూ రైతుల నుంచి బెదిరించి భూములు లాక్కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదెక్కడి అన్యాయమంటూ ఆందోళన వ్యక్తంచేశారు. ఇక్కడి జీవాల పెంపకం దారులకు కొండే ఆధారం. అదికూడా లాక్కుంటే ఊరుకునేది లేదు. తరాలుగా ఇక్కడే పుట్టాం, పెరిగాం, చస్తాం.. కాదని కొండ జోలికొస్తే ఉద్యమిస్తాం అంటూ గ్రామస్తులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గ్రామస్తుల ఆందోళనతో ఎకో టూరిజం కోసం దరఖాస్తు చేసిన గోవిందరావు సభ నుంచి జారుకున్నారు. ప్రత్యేకాధికారి కె.రవీంద్ర గ్రామస్తుల నిర్ణయాన్ని తీర్మానంగా రాయించి గ్రామస్తుల సంతకాలు తీసుకున్నారు. దీనిని కలెక్టర్కు అందజేస్తామని చెప్పారు. రెవెన్యూ అధికారులకు తేల్చిచెప్పిన కృష్ణాపురం గ్రామస్తులు పర్యాటకం ముసుగులో కొండను కాజేయొద్దు జీవాల మేతకు కొండే ఆధారం -
ఎన్నికల్లో ప్రతిఓటు కీలకమే
సాలూరు: ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే.. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (సర్)లో బీఎల్ఏల (బూత్ లెవెల్ ఏజెంట్లు) పాత్ర కీలకమైనదని, అర్హుల ఓట్లు జాబితాలో ఉండేలా నిబద్ధతతో పనిచేయాలని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర పిలుపునిచ్చారు. సాలూరు పట్టణం మెంటాడ వీధిలోని కల్యాణ మండపంలో నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ బీఎల్ఏలకు శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి బూత్ పరిధిలోని ఓటరు జాబితాలను బీఎల్ఏలు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఇతర పార్టీలు ఎటువంటి అక్రమాలకు పాల్పడకుండా ప్రత్యేకంగా దృష్టిసారించాలని తెలిపారు. ఓటర్ల చేర్పులు, తొలగింపుల్లో అభ్యంతరాలుంటే తక్షణమే నిబంధనల ప్రకారం సంబంధిత బూత్ లెవెల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. అర్హుల ఓటు తొలగింపు జరగకుండా, అనర్హుల పేర్లు చేర్పులు జరగకుండా చూడాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యతలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతిఓటు ఎంతో విలువైనదని, ఓ గ్రామంలో ఒక్క ఓటు, మండల, నియోజకవర్గ స్థాయికి చేరేసరికి వేలల్లో మార్పు చూపుతుందని, అది గెలుపును ప్రభావితం చేస్తుందన్న విషయం గుర్తించాలన్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగింపునకు ప్రయత్నించే అవకాశం ఉందని, వాటన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుపై ప్రజలకు నమ్మకం పోయింది... ఓ వైపు లక్షలకోట్ల రూపాయలు అప్పులుచేస్తూ.. మరోవైపు ప్రజాసంక్షేమాన్ని, అభివృద్ధిని విస్మరించి న సీఎం చంద్రబాబుపై ప్రజలకు నమ్మకం పోయిందని పీడికరాజన్నదొర పేర్కొన్నారు. చంద్రబాబు ప్ర భుత్వ పాలనపై వ్యతిరేకత మొదలైందన్నారు. క్షేత్రస్దాయిలో ప్రజలకు అండగా నిలిచి, వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేయాలని పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్లు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్) ప్రక్రియపై బూత్ లెవెల్ ఏజెంట్లకు వైఎస్సార్సీపీ విశాఖపట్నం ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు గణేష్ ప్రొజెక్టర్పై శిక్షణ ఇచ్చారు. బీఎల్ఏల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా పరిశీలకుడు శరగడం అప్పలనాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మక్కువ జెడ్పీటీసీ సభ్యుడు మావుడి శ్రీనివాసులనాయుడు, వైఎస్సార్ సీపీ మక్కువ మండలాధ్యక్షుడు మావుడి రంగునాయుడు, వైఎస్సార్సీపీ మండల, పట్టణ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియపై పర్యవేక్షణ అవసరం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు ఉండేలా బీఎల్ఏలు ప్రత్యేక చొరవ చూపాలి బీఎల్ఏ శిక్షణ సమావేశంలో దిశానిర్దేశం చేసిన మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర -
మరో ఎనిమిది శాఖలు ఏర్పాటు చేస్తాం
● వీసీడీఎల్ డైరెక్టర్ కండాపు ప్రసాదరావు రాజాం: తమ బ్యాంక్ కొత్తగా ఎనిమిది శాఖలను ఏర్పాటు చేయనుందని విశాఖపట్నం కోపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ కండాపు ప్రసాదరావు అన్నారు. పట్టణ కేంద్రంలోని సూర్యచంద్ర ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన స్థానిక బ్రాంచ్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ బ్యాంక్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 శాఖలతో సేవలు అందిస్తోందని గుర్తుచేశారు. మరణించిన 1006 మంది ఖాతాదారుల కుటుంబాలకు రూ. 255 లక్షల మొత్తాన్ని పంపిణీ చేశామన్నారు. బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.రామకృష్ణారావు మాట్లాడుతూ.. ప్రైవేట్ రంగంలో ఉన్న కొన్ని మోసపూరిత ఆర్థిక సంస్థలో పెట్టుబడులు పెట్టవద్దని, అలాగే రుణాలు తీసుకోవద్దని సూచించారు. తమ బ్యాంక్ ప్రజల బ్యాంక్గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. అనంతరం ఉత్తమ ఖాతాదారులుగా ఎంపికై న వాండ్రంగి కొండలరావు, తదితరులను సత్కరించారు. కార్యక్రమంలో బ్యాంక్ జోనల్ మేనేజర్ సీహెచ్ శ్రీనివాసరావు, బ్రాంచ్ మేనేజర్ ఎం.దీప్తి, డైరెక్టర్లు పాల్గొన్నారు. -
ధారగంగమ్మ జాతర ఆదాయం రూ.5.80లక్షలు
శృంగవరపుకోట: పట్టణ ప్రజల కొంగుబంగారం ధారగంగమ్మ అమ్మవారి జాతర ఆదాయం రూ.5,80,741లు వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారి జాతర ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. మూడు రోజుల పాటు జరిగిన జాతరలో దర్శన టికెట్ల విక్రయంతో రూ.2,11,511లు, హుండీల నుంచి రూ.3,69,230 సమకూరిందన్నారు. రెండేళ్ల కిందట 2024 నాటి జాతరలో టికెట్ల అమ్మకాల వల్ల రూ.1,99,841, హుండీల ఆదాయం రూ.3,11,767 వచ్చినట్టు చెప్పారు. ఈ సారి టికెట్ల వల్ల రూ.16,670, హుండీల ఆదాయం రూ.57,463 పెరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఈఓ కె.నాగేంద్ర, సీఐ శ్యాంప్రసాద్, అర్చకుడు రాజగోపాలాచార్యులు, శ్రీవారి సేవకులు, దేవదాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు. బీఎల్ఓలకు కిట్ల పంపిణీ విజయనగరం అర్బన్: ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్లిష్ట సవరణ (సర్) కార్యక్రమంలో భాగంగా బూత్ లెవెల్ అధికారులకు (బీఎల్ఓ) అందజేసే ప్రత్యేక కిట్లను కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి శుక్రవారం కలెక్టరేట్లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఓవర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు ప్రతి ఇంటినీ సందర్శించాలన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో వారికి ఉపయోగపడేలా అవసరమైన వస్తువులతో కూడిన కిట్లను సిద్ధం చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,847 మంది బీఎల్ఓలకు ఈ కిట్లను తక్షణమే పంపిణీ చేయాలని కలెక్టర్ డీఆర్ఓకు సూచించారు. కార్యక్రమంలో డీఆర్ఓ సత్తిబాబు, ఎన్నికల విభాగపు సిబ్బంది పాల్గొన్నారు. స్కానింగ్ రిపోర్టులను ఆన్లైన్ చేయాలి విజయనగరం ఫోర్ట్: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు స్కానింగ్ కేంద్రాలు నడుపుతున్న వారు స్కాన్చేసిన ప్రతి కేసు వివరాలను ఆన్లైన్, ఆఫ్లైన్లో పొందుపరచాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిరోధక చట్టం అమలుపై శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేటు స్కాన్ సెంటర్లు ఎవరైనా కొత్తగా మిషన్లు కొనుగోలుచేసినా, తొలగించినా వాటి సమాచారాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి తెలియజేయాలన్నారు. పీసీపీఎన్డీటీ వెబ్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. సమావేశంలో ఇన్చార్జి డీఎంహెచ్ఓ కె.రాణి, ఆర్డీఓ సుధాసాగర్, డీసీహెచ్ఎస్ పద్మశ్రీరాణి, డీఐఓ అచ్చుతకుమారి, తదితరులు పాల్గొన్నారు. మహానాడులో చిందేసిన ఆరోగ్యశ్రీ ఉద్యోగి విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వం నుంచి వేతనం తీసుకుంటూ.. కొందరు ఉద్యోగులు అధికార టీడీపీ సేవలో తరించడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, నాయకులతో కలిసి చిందేయడం వివాదాస్పదంగా మారింది. ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ)లో టీమ్ లీడర్గా పనిచేస్తున్న ఆర్.ఎం.నాయుడు బొండపల్లి మండలం దేవుపల్లిలో గురువారం నిర్వహించిన మహానాడులో పాల్గొన్నారు. తప్పెడుగుళ్లు కళాకారుతో కలిసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్టెప్పువేయగా... టీమ్లీడర్ విజిల్ వేస్తూ చిందేశారు. ట్రస్టు ఉద్యోగిగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొడమే తప్పని, ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. -
సమస్యల పరిష్కారానికి చర్యలు
గరుగుబిల్లి: ప్రజల సమస్యలను గ్రామస్థాయిలోనే తెలుసుకొని త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. ‘ఒక రోజు– ఒక నియోజకవర్గం’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని కొంకడివరం పంచాయతీ సీతారాంపురం గ్రామంలో శుక్రవారం పర్యటించి ప్రజాసమస్యలు తెలుసుకున్నారు. వినతులు స్వీకరించారు. గ్రామంలోని ధర్మ కోనేరుకు రిటైనింగ్వాల్ నిర్మించడంతో పాటు కోనేరు గట్టును వాకింగ్ ట్రాక్గా అభివృద్ధి చేయాలని గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. సీతారాంపురం గ్రామ సమీపంలో డంపింగ్యార్డు నిర్మాణం ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరుతూ తాజా మాజీ సర్పంచ్ అల్లు అప్పలనాయుడు, గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో తాగునీటి సమస్య, ప్రధాన రహదారి నుంచి కొంకడి వరం గ్రామం వరకు రోడ్డు నిర్మాణం, ఇనామ్దారుల భూ సమస్యలు, వయో వృద్ధుల పింఛన్లు, అంత్యోదయ కార్డులు మంజూరు, తదితర సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, ఎస్డీసీ దిలీప్ చక్రవర్తి, ఎంపీపీ ఉరిటి రామారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
బక్రీద్ శుభాకాంక్షలు
పార్వతీపురం: బక్రీద్ పండగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు గురువారం తెలిపారు. బక్రీద్ త్యాగం, భక్తి, సమానత్వానికి ప్రతీక అని పేర్కొంటూ, జిల్లా ప్రజలందరూ ఆనందంగా పండగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని కోరుతూ ‘‘ఈద్ ముబారక్’’ తెలిపారు. శతశాతం అక్షరాస్యత సాధనే లక్ష్యం సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో వయోజన అక్షరాస్యత శతశాతం సాధించడమే లక్ష్యంగా ’అక్షర ఆంధ్ర – ఉల్లాస్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2029 నాటికి వయోజనులందరినీ విద్యావంతులను చేయడమే ఈ పథకం ఉద్దేశం కాగా.. ఈ మేరకు జిల్లా, మండల, మున్సిపల్ స్థాయిలలో పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తూ కలెక్టర్ ప్రభాకరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 2026–27 విద్యా సంవత్సరంలో జిల్లాలో 71,194 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రధానంగా 15 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల మహిళలు, కార్మికులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అధికారులంతా ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వైఎస్సార్సీపీ జిల్లా కమిటీల నియామకంపార్వతీపురం రూరల్: జిల్లా వైఎస్సార్సీపీ ప్రధాన కమిటీతో పాటు అనుబంధ విభాగాల బాధ్యులను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగాయి. రాష్ట్ర రైతు విభాగం సంయుక్త కార్యదర్శిగా తాడేల మన్మథనాయుడు (కురుపాం), జిల్లా అధికార ప్రతినిధిగా గంగుల నాగేశ్వరరావు నియమితులయ్యారు.అలాగే ఇతర అనుబంధ విభాగాల నుంచి జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడిగా యామల అజయ్ (పార్వతీపురం), జిల్లా ప్రచార విభాగం ఉపాధ్యక్షుడిగా శివ్లంకి చిరంజీవి (పార్వతీపురం), జిల్లా యువజన విభాగం కార్యవర్గ సభ్యుడిగా కోట సతీష్ కుమార్ (పార్వతీపురం) ఎంపికయ్యారు. జిల్లా బీసీ సెల్ కార్యవర్గ సభ్యులుగా కురుపాం నియోజకవర్గానికి చెందిన గొర్రెల రవీంద్ర, కందిస వంశీకృష్ణలను నియమించారు. ఎన్టీఆర్కు నివాళులు పార్వతీపురం: మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతిని కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, డీఆర్వో కె.హేమలత పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుజాతి గౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పిన మహానేతగా ఎన్టీఆర్ సేవలను కలెక్టర్ కొనియాడారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సంతకవిటి: మండలంలోని రంగారాయపురం వద్ద ఉన్న నారాయణపురం ఆనకట్ట నుంచి కుడి, ఎడమ ప్రధాన కాలువలకు సాగునీటి మళ్లింపునకు వీలుగా షట్టర్లు ఏర్పాటుచేస్తున్న ట్టు డీఈ వై.రవీంద్రనాయుడు గురువారం తెలిపారు. విజయనగరం జిల్లా సంతకవిటి, శ్రీకాకుళం జిల్లా పొందూరు, ఆమదాలవలస, ఎచ్చెర్ల, బూర్జ మండలాల్లో వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు వీలు గా 118 షట్టర్లలో పూర్తిగా పాడైన 33 షట్టర్లను తొలగించి కొత్తవి ఏర్పాటుచేస్తున్నామన్నారు.


