breaking news
Parvathipuram Manyam
-
● పొలం బాట...
వర్షాలు కురుస్తుండడంతో ఓ వైపు ఉభాలు... మరోవైపు వరి చేలలో కలుపుతీత పనులు ఊపందుకున్నాయి. పల్లె ప్రజలు ఉదయాన్నేలేచి క్యారేజీలు పట్టుకుని పొలంబాట పడుతున్నారు. పొద్దుకుంకేవరకు పొలం పనుల్లో నిమగ్నమవుతున్నారు. మహిళా కూలీలకు డిమాండ్ పెరిగింది. వరి చేలలో కలుపుతీత పనులకు రోజుకు రూ.250 నుంచి రూ.300 వరకు కూలి గిట్టుబాటవుతోంది. గుంపులు గుంపులుగా పొలాలకు చేరుకుంటున్నారు. దీనికి పాలకొండ–వీరఘట్టం రోడ్డులో పొలంబాట పట్టిన మహిళల చిత్రమే సజీవ సాక్ష్యం. – పాలకొండ రూరల్ -
షెడ్యూల్ తెగలు, కులాల హక్కుల పరిరక్షణకు పటిష్ట చట్టాలు
బొబ్బిలి: షెడ్యూల్ తెగలు, కులాలకు చెందిన ప్రజల హక్కుల పరిరక్షణకు రాజ్యాంగం ఏర్పాటు చేసిన చట్టాలు పటిష్టమైనవని స్థానిక ప్రిన్సిపల్ జూనియర్ సివిల్జడ్జి హేమ స్రవంతి జానకిరామ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక కోర్టు ఆవరణ, ఎస్సీ బాలికల వసతిగృహంలో చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పౌర హక్కుల రక్షణచట్టం(1955)షెడ్యూల్ కులాలు, తెగల అత్యాచారాల నివారణ చట్టం(1989)ప్రకారం ఆయా ప్రజల హక్కులు కాపాడడం, అత్యాచారాలు, దురాగతాలను నివారించడం, హక్కుల కల్పన,పునరావాసం వంటివి కల్పించడం జరుగుతుందన్నారు. వారి కోసం ప్రత్యేక న్యాయ విచారణ జరుగుతుందని చెప్పారు. వారిపై జరిగే నేరాలు, దౌర్జన్యాలను అరికట్టేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి ఉపశమన చర్యలు తీసుకునేందుకు పటిష్టంగా చట్టాలున్నాయని చెప్పారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎం.ఆనందకుమార్, రుంకాన ప్రసాద రావు, పలువురు సీనియర్ న్యాయవాదులు, కక్షిదారులు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
వెలుగులో చీకటి కోణం
● పక్కదోవ పట్టిన సీ్త్ర నిధి డబ్బుల కలెక్షన్ ● రేగులపాడు వీఓఏకు నోటీసులు ఇచ్చిన ఏపీఎంవీరఘట్టం: మండలంలోని దశమంతుపురం గ్రామానికి చెందిన గ్రామ సంఘం సహాయకురాలు(వీఓఏ) ఇటీవల గ్రామ సంఘాల సభ్యుల నుంచి కలెక్షన్ చేసిన రూ.2 లక్షలు సీ్త్ర నిధి డబ్బులు బ్యాంకులో జమచేయకుండా సొంత అవసరాలకు వాడుకుని, అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డారు.ఈ డబ్బులు వెంటనే కట్టకపోతే ఆమెను విధుల నుంచి తొలగిస్తామని వెలుగు అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఆమె దారిలోకి వచ్చారు. సొంత అవసరాలకు వాడుకున్న డబ్బులను చెల్లించేందుకు ఒప్పుకున్నారు.ఈ వ్యవహారం మరువక ముందే మరో వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు ఏపీఎం కె.రాము మంగళవారం మీడియాకు తెలిపారు.రేగులపాడు గ్రామానికి చెందిన వీఓఏ తమ గ్రామంలో గ్రామ సంఘాల నుంచి కలెక్షన్ చేసిన సీ్త్రనిధి డబ్బులు సుమారు రూ.1.18 లక్షలు పక్కదోవ పట్టించినట్లు గుర్తించామన్నారు.వెంటనే సీ్త్రనిధి లోన్ డబ్బులు కట్టకపోతే ఆమెను విధుల నుంచి తొలగిస్తామని నోటీసులు పంపించినట్లు ఏపీఎం రాము తెలిపారు. అన్ని గ్రామ సంఘాల అకౌంట్లు కొద్ది రోజుల్లో తనిఖీ చేస్తామన్నారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. కొరవడిన పర్యవేక్షణ.. వీరఘట్టం మండలంలో 50 గ్రామ సంఘాలు ఉన్నాయి. వాటి పరిధిలో 1,752 స్వయం సహాయక సంఘాలు ఉండగా 17,683 మంది మహిళలు డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. వారికి సీ్త్ర నిధి కింద రూ.28.12 కోట్లు రుణాలుగా ఇచ్చారు.ఈ రుణాలను వీఓఏలు డ్వాక్రా సంఘాల నుంచి కలెక్షన్ చేసి సీ్త్రనిధి బ్యాంకు ఖాతాకు జమచేయాల్సి ఉంది. అయితే కొంత మంది డ్వాక్రా సంఘాల సభ్యుల నుంచి కలెక్షన్ చేసిన డబ్బులను బ్యాంకులకు సకాలంలో కడుతుండగా ఇంకొందరు సొంత అవసరాలకు వాడుకుని తర్వాత కడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.అయితే ఇంకొందరు పూర్తిగా చెల్లించకుండా అడ్డంగా దొరికిపోతున్నారు. వెలుగు అధికారులు పర్యవేక్షణ చేసి ఉంటే ఇటువంటి తప్పిదాలు జరగవని పలువురు అంటున్నారు.అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు డ్వాక్రా సంఘాల సభ్యుల నుంచి కలెక్షన్ చేస్తున్న రుణాల రికవరీ డబ్బులను సకాలంలో బ్యాంకులో జమచేయాలి.అంతే తప్ప డ్వాక్రా సంఘాల మహిళల డబ్బులు సొంత అవసరాలకు వాడుకుని అక్రమాలకు పాల్పడితే అట్టివారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విధుల నుంచి తొలగిస్తాం. – కె.లలితకుమారి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు -
ఎంపీఎఫ్సీ గొడౌన్లకు బిల్లుల చెల్లింపు
విజయనగరం అర్బన్: నిర్మాణాలు పూర్తయిన ఎంపీఎఫ్సీ (మల్టీ పర్పస్ ఫెసిలిటేటింగ్ సెంటర్) గొడౌన్లకు బిల్లుల చెల్లింపులకు ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సహకార శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ తన చాంబర్లో సహకార, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన జిల్లాలో నిర్మిస్తున్న ఎంపీఎఫ్సీ గొడౌన్ల పనులపై సమీక్ష చేశారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణాలు పూర్తయిన 11 గొడౌన్లకు ఫైనల్ పేమెంట్, ఒక గొడౌన్కు పార్ట్ ఫైనల్ పేమెంట్ కోసం ప్రతిపాదనలు పంపించాలన్నారు. పనులు మొదలుకాని గొడౌన్లకు అనుమతులు రద్దు చేయాలని తెలిపారు. మిగిలిన వాటి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా సహకార శాఖ అధికారి పి.రమేష్, డీసీసీబీ సీఈవో ఉమామహేశ్వరరావు, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వినాయక పూజకు వేళాయె..
పార్వతీపురంటౌన్: వినాయక పూజకు వేళయింది. పల్లెలు, పట్టణాలు సందడిగా మారాయి. వీధివీధినా వెలసిన మంటపాలు, విద్యుత్ దీపాల అలంకరణలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. పల్లె నుంచి పట్టణం దాకా... మురికివాడల నుంచి ఖరీదైన అపార్ట్మెంట్ల వరకు ఎవరి స్థాయిలో వారు అంబరాన్నంటేలా బుధవారం జరుపుకునే విఘ్నేశ్వర పూజకు సర్వం సిద్ధం చేశారు. వినాయక విగ్రహాలు, ప్రతిమలు, పూజాసామగ్రిని మంగళవారం కొనుగోలు చేసి వాహనాల్లో మంటపాలకు తరలించారు. పర్యావరణ స్పృహతో పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి ప్రతిమలను పంపిణీ చేశాయి. పార్వతీపురం మార్కెట్లో చవితి సందడి కనిపించింది. పత్రి, పండ్లు, పూలు, వినాయక వ్రత పుస్తకాల అమ్మకాలు జోరుగా సాగాయి. -
ప్రభుత్వం బుద్ధి మారేలా చూడవయ్యా..
మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అంటే నమ్మేశాం. అదంతా గ్యాస్ సిలిండర్లు కాదు.. గ్యాస్ అని మెల్లగా అర్థమైంది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే మా మహిళలకు మూడు నామాలు పెట్టేశాడు. ఏడాదికి మూడు ఉచితంగా గ్యాస్ సిలెండర్లు ఇస్తామని చెప్పి కేవలం ఒక్కటంటే ఒక్కటే ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. అవి కూడా కొంతమందికే వచ్చాయట. మిగిలిన వారు మాకు ఎప్పుడు సబ్సిడీ డబ్బులు పడాతాయేనని కళ్లు కాయాలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సులు వేయిస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు ఆర్టీసీలో ఉన్న 20 రకాల సర్వీసుల్లో కేవలం 5 సర్వీసుల్లో మాత్రమే వచ్చి పోవాలని చెప్పకనే చెప్పేశారు. ఆ బస్సుల్లో సీట్లు కోసం మాలో మేమే తన్నులాడుకునే దుస్థితికి దిగజార్చారు. ఇక మేం బతకడమే కష్టంగా ఉంది.. ఇక ఇంకేం పండగ చేస్తాం స్వామీ..! అందరి కష్టాలు తీర్చే నీ పండగ టైముకు జనాలకు కష్టాలు తెచ్చిపెట్టింది ఈ ప్రభుత్వం.. ఏం చేద్దాం వచ్చే ఏడాదికై నా ఈ ప్రభుత్వం బుద్ధి మారేలా చూడవయ్యా.. అప్పటికై నా మా కష్టాలు తీరి.. అన్నీ అనుకున్నట్లు జరిగితే నీకు కొబ్బరి బిళ్లకు బదులుగా ఒరిజినల్ లడ్డూ పెడతాను.. అయినా అదేంటి గణపతీ గతంలో మా ఊళ్లో ఎక్కడా బెల్ట్ షాపే ఉండేది కాదు.. ఈ సారి చూస్తే వీధికొకటి చొప్పున మొత్తం ఐదు బెల్ట్ షాపులున్నాయి. కుర్రోళ్లంతా పొద్దల్లా తాగి తందానాలు ఆడతన్నారు. సాయంత్రం వీధిలోకి వెళదామంటే భయంగా ఉంది. ఈ గణపతి నవరాత్రులు ఎంతలా తాగి ఊగుతారో చూస్తేనే భయంగా ఉంది స్వామి. ఏమో నీ పండగ .. నీ ఇష్టం.. ఎలా చేసుకుంటావో. ఎలా చేయించుకుంటావో నీ దయ... ఉంటాను మరి. .. చల్లగా బతికుంటే వచ్చే ఏడాది కలుద్దాం..! మహిళలకు మూడు నామాలు పెట్టిన చంద్రాలు సార్.... -
బదిలీ కోసం ఎంఈవో1ల నిరీక్షణ
● విద్యాశాఖ డైరెక్టర్కు లేఖ ● అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలంపార్వతీపురం టౌన్: ఎంఈఓ 1లకు సాధారణ బదిలీలు కూడా నిర్వహించినట్లైతే రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఎంఈఓలకు ఉపయోగకరంగా ఉంటుందని ఎంఈఓ 1 అసోసియేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం అన్నారు. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయ్ రామరాజుకు అసోసియేషన్ పక్షాన లేఖ రాసినట్లు ఆయన మంగళవారం తెలిపారు. 2017 నుంచి మెజారిటీ ఎంఈఓ1లు ఎనిమిదేళ్లుగా ఒకే చోట పని చేస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఈఓ1 లు బదిలీల కోసం ఆశతో ఎదురుచూస్తున్న నేపథ్యంలో అంతర్ జిల్లా బదిలీలతో పాటు ఎంఈఓ 1, 2 లకు జీరో సర్వీస్ తో సాధారణ బదిలీలు కూడా నిర్వహించేందుకు తగిన ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా విద్యాశాఖ డైరెక్టర్కు విజ్ఞప్తి చేసినట్లు సామల సింహాచలంతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయక్ బుక్సా రవి నాయక్లు తెలిపారు. -
గిరిజనుల చెంతన విద్యా దీపం
దత్తిరాజేరు: కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయనికి 2023 ఆగస్టు 25వ తేదీన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో కలిసి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేసిన చోటే శాశ్వత క్యాంపస్ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి, గిరిజనుల జీవితాల్లో కాంతులు నింపాలంటే ఈ విద్యాదీపం నిబంధనల ప్రకారం వారి చెంతనే ఉండాలన్న కృత నిశ్చయంతో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మంజూరు చేశారు. ప్రస్తుతం విజయనగరం శివారు గాజులరేగ వద్ద ఏయూ స్టడీ సెంటర్లో తాత్కాలికకంగా కొనసాగుతోంది, ఈ ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థను ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన సాలూరు పరిధిలోని మెంటాడ మండలం, గజపతినగరం నియోజకవర్గం పరిధిలోని దత్తిరాజేరు మండలాల మధ్యలో చినచామలాపల్లి, మర్రివలస రెవెన్యూలో 561.88 ఎకరాల విస్దీర్ణంలో సువిశాలమైన ప్రకృతి రమణీయతతో చక్కని ప్రాంతంలో విద్యా సౌరభాలు విరబూయనున్నాయని ఈ ప్రాంత ప్రజలు, విద్యావేత్తలు ఆనందోత్సాహంలో ఉన్నారు. 120 అడుగుల వెడల్పు రోడ్డు పనులతో పాటు తరగతి భవనాలు(అకడమిక్ బ్లాక్) పరిపాలన భవనం(అడ్మిన్ బిల్డింగ్) బాలికలు, బాలురు వసతి గృహాలు రానున్న విద్యా సంవత్సరానికి పూర్తి చేయడానికి కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తుండడంతో పనులు చక చకా జరుగుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. పూర్తిస్థాయిలో సౌకర్యాల కల్పన కోసం కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయంలో తాగునీరు ఇతరత్రా నీటి అవసరాలను తీర్చేందుకు రూ.7 కోట్లతో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ పనులు గత వైఎస్సార్సీపీ హయాంలో ప్రారంభమై పూర్తయ్యాయి. అలాగే పైప్లైన్ పనులు కూడా కొలిక్కి వస్తున్నాయి, మౌలిక వసతుల కల్పనకు నిధులు, రైతుల నుంచి సేకరించిన భుములకు పరిహారం చెల్లింపునకు గత ప్రభుత్వం హయాంలోనే రూ.61.06 కోట్లు మంజూరై పంపిణీ కూడా జరిగింది. రూ.16 కోట్లు అప్రోచ్ రోడ్డుకు డ్రైయిన్లు, అలాగే విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం మరో రూ.48.61 లక్షలు కేటాయించింది. అప్పటికే ఆ భూముల్లో ఉన్న 220 కేవీ విద్యుత్ టవర్లు తొలగించడానికి రూ.12.43 లక్షలు మంజూరు చేయడంతో పనులు జరుగుతున్నాయి, ఫలిస్తున్న నాయకుల కృషి ఉత్తరాంద్రకు పెద్ద దిక్కయిన రాష్ట శాసన మండలి ప్రతిపక్ష నేత, అప్పటి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెనుకబడిన ప్రాంతంలో గిరిజన నియోజక వర్గానికి విద్యా కుసుమం లాంటి వర్సిటీ రావాలని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని గిరిజన శాఖ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడక రాజన్నదొరతో కలిసి ఒప్పించడంతో నేడు ఉమ్మడి జిల్లా విజయనగరంలో వర్సిటీ నిర్మాణం జరగడం శుభపరిణామమని పులువురు ప్రశంసిస్తున్నారు. వర్సిటీ ముఖద్వారం గజపతినగరం నియోజకవర్గం వైపు రావడంతో జాతీయ రహదారి మీదుగా రాక పోకలు సాగడానికి అప్పటి గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య చేసిన కృషిని నియోజకవర్గ, జిల్లా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. యూనివర్సిటీకి వైజాగ్. భోగాపురం ఎయిర్ పోర్టులు దగ్గరగా ఉండడం, కోమటిపల్లి, బొబ్బిలి రైల్వే స్టేషన్లు కూడా దగ్గరలో ఉండడంతో దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి విద్యను అభ్యసించేందుకు వచ్చే విద్యార్థులకు రవాణా సౌకర్యం చాలా దగ్గరగా ఉండడం గమనార్హం. నెరవేరనున్న జగనన్న ఆశయం కేంద్రియ విశ్వ విద్యాలయానికి సొంత క్యాంపస్ రూ.834 కోట్లతో సువిశాల ప్రాంగణంలో భవన నిర్మాణం ఇప్పటికే సిద్ధమవుతున్న అడ్మిన్, అకడమిక్ బ్లాక్ బిల్డింగ్లు వచ్చే విద్యా సంవత్సరానికి అంతా సిద్ధం -
ఉత్సవాలకు స్వయంభూ వినాయకుడు సిద్ధం
● ఈ ఏడాది ఐదురోజుల పాటు ఉత్సవాలు ● భూమిలో పుట్టిన ‘మంతిన’ శిలావినాయకుడిది ప్రత్యేకతరాజాం/సంతకవిటి: వినాయక చవితి అనగానే మంటపాలు వేయడం, ప్రతిమలు తీసుకురావడం నిమజ్జనం చేయడం షరామామూలే. సంతకవిటి మండలంలోని మంతిన గ్రామంలో నారాయణపురం కుడి కాలువ పక్కనే ప్రతిష్టించిన వినాయకుడికి ఈ చవితి పండగలో విశిష్టత ఉంటుంది. ఇక్కడ వినాయకుడికి గుడి కూడా ఉంది. 1960లో నారాయణపురం కుడికాలువ తవ్వుతున్న సమయంలో భూమిలోంచి రాతి(శిల) వినాయకుడి ప్రతిమ గ్రామస్తులకు లభించింది. అప్పట్లో ఈ ప్రతిమను కాలువ పక్కనే ఓ రావిచెట్టు వద్ద గ్రామస్తులు ప్రతిష్టించారు. అప్పటినుంచి ప్రతి ఏడాది ఇక్కడ వినాయకచవితికి గ్రామస్తులు పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు. ఐదు రోజుల నుంచి తొమ్మిదిరోజులు పాటు ప్రత్యేక పూజలు, దర్శన కార్యక్రమాలు ఉంటాయి. ఈ ఏడాది ఎప్పటిలాగానే ఐదురోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పంచాయతీ సర్పంచ్ ఈశ్వరరావు తెలిపారు. నాలుగు అడుగుల భారీ విగ్రహం అప్పట్లో ఇక్కడ ప్రతిష్టించిన వినాయకుడి ప్రతిమ ప్రస్తుతం పెరిగిందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఏడాది ఈ విగ్రహ పరిమాణంలో మార్పు ఉంటుందని తెలిపారు. భారీ కాయం, బొజ్జతో ఇక్కడి రాతి విగ్రహం ఆకర్షణీయంగా ఉంటుంది. నాలుగు అడుగుల ఈ శిలా విగ్రహాన్ని ఒక్క ఇంచ్ కూడా కదపలేదు. ఇక్కడ ఉత్సవాల సమయంలో మట్టి వినాయకుడి ప్రతిమ తెచ్చి పూజలు చేసి, అనుపు పండగ నిర్వహిస్తారు. మంతిన గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తమ ఇళ్లలో ఏ శుభకార్యక్రమం జరిగినా ముందుగా ఇక్కడే పూజలు చేసి మొక్కులు చెల్లిస్తారు. -
స్మార్ట్ కార్డులు సరే.. సరుకులేవీ?
విజయనగరం ఫోర్ట్: ఓ వైపు రాష్ట్ర ఖజనాలో డబ్బులు లేవని కూటమి ప్రభుత్వం గగ్గోలు పెడుతోంది. మరోవైపు గత ప్రభుత్వ ఆనవాళ్లను దూరం చేసేందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందన్నది జనం మాట. దీనికి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీయే నిలువెత్తు నిదర్శనం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన రైస్ కార్డులు బాగానే ఉన్నా ఇప్పుడు కోట్లాది రూపాయలు ఖర్చుచేసి స్మార్ట్ కార్డుల పంపిణీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 5,73,137 రైస్ కార్డులు ఉన్నాయి. వీరికి కూటమి సర్కారు స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేస్తోంది. దీనికోసం రూ.6 కోట్లకు పైగా నిధులు వెచ్చిస్తున్నట్టు సమాచారం. స్మార్ట్ కార్డులపై ఉన్న శ్రద్ధ పేద ప్రజలకు ఇచ్చే నిత్యావసర వస్తువులపై లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. గత ఏడు నెలలుగా కందిపప్పు సరఫరా నిలివేసి... ఇప్పుడు కార్డులంటూ కొత్త డ్రామాకు తెరతీయడాన్ని దుయ్యబడుతున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు ధర రూ.130 నుంచి రూ.140 వరకు ఉంది. రేషన్ షాపుల్లో రాయితీపై కేజీ రూ.67 చొప్పున అందించేవారు. జిల్లాలో రేషన్ లబ్ధిదారులకు అందజేసేందుకు నెలకు 5,73,137 కిలోల కందిపప్పు అవసరం. ఈ లెక్కన నెలకు రూ.7 కోట్లు వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏడు నెలలుగా కందిపప్పు ఇవ్వక పోవడం వల్ల రూ.35 కోట్లు వరకు కూటమి ప్రభుత్వం భారం తగ్గించుకుంది. పేదలకు పప్పును దూరం చేసింది. బయటమార్కెట్లో కొనుగోలు చేసుకుంటున్న రేషన్ లబ్ధిదారులపై ఆర్థిక భారం పడుతోంది. -
ఉద్యోగం లేదు.. నిరుద్యోగ భృతికి అతిగతీ లేదయ్యా..
చంద్రబాబిచ్చే ఇరవైలచ్చల ఉద్యోగాల్లో వాడికొకటైనా రాకపోతుందా అని మా పెద్దమనవడు ఒకటే ఎదురు చూపులు గణేశా.. పోనీ అందాక నెలకు ఇస్తామన్న మూడువేల రూపాయల నిరుద్యోగ భృతి అయినా వస్తే బాగుణ్ణు.. జేబు ఖర్చులకు వచ్చేదని ఆశపడ్డాడు. అయినా చంద్రబాబును నమ్మితే నిరాశ తప్ప ఇంకేం ఉండదని తెలియని వెర్రి నాగన్న నా మనవడు.. వాణ్ని నువ్వే చూసుకోవాలి గణేశా.. మా యమ్మికి అప్పట్లో జగనన్న ఉన్నప్పుడు ఆసరా డబ్బులొచ్చేవి.. ఇప్పుడు అవన్నీ దుకాణం సర్దేశాడు చంద్రబాబు.. ఇక బాబును నమ్ముకో.. ఉన్నదంతా అమ్ముకో అన్నట్లుగా తయారైంది మా బతుకు. అయినా అన్నీ తెలిసినవాడివి నీకేం చెప్పగలను.. స్వామి! -
29న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్మేళా
సాలూరు: ఈ నెల 29 న సాలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీకళాశాలలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఉషశ్రీ ఓ ప్రకటనలో తెలిపారు. దివిస్ ల్యాబొరేటరీస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మేళా శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని అన్నారు.ఆసక్తిగల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9440537105 నంబర్ను సంప్రదించాలని సూచించారు. జాతీయ స్థాయి పారా త్రోబాల్ పోటీలకు సచివాలయం ఉద్యోగికొత్తవలస: మండలంలోని గనిశెట్టిపాలెం గ్రామ సచివాలయంలో డిజిటల్ సహాయకుడిగా పనిచేస్తున్న పొటిపిరెడ్డి శ్రీను జాతీయ స్థాయి పారా త్రోబాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఒక ప్రకటనలో మంగళవారం ఆయన తెలిపారు.ఈ నెల 8వ తేదీన విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో శ్రీను ఉత్తమ ప్రతిభ కనబర్ఛడంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా శ్రీనును పలువురు అభినందించారు. 4.8 కేజీల గంజాయి స్వాధీనంసంతకవిటి: మండలంలోని పొనుగుటివలస పరిధిలోని జీఎమ్ఆర్ఐటీ కళాశాల ఎదురుగా గల మామిడి తోటలో సోమవారం సాయంత్రం 4.8కేజీల గంజాయిని పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు నలుగురు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. పాలకొండ ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని సోమవారం రాత్రి కేసు నమోదు చేసి మంగళవారం వారిని అంపోలు సబ్జైలుకు రిమాండ్కు తరలించినట్లు ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు. సాలూరులో 5.60 కిలోల గంజాయి.. సాలూరు: పట్టణంలో ఇద్దరు వ్యక్తుల నుంచి గంజాయిని పట్టుకుని అరెస్ట్ చేసినట్లు సీఐ అప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ పాత బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ రోడ్డు వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని అందిన సమాచారం మేరకు వారి వద్దకు వెళ్లి విచారణ చేస్తున్న క్రమంలో తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన ఆ వ్యక్తుల బ్యాగుల్లో 5.60 కేజీల గంజాయిని గుర్తించామని తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేశామని, నిందితులను రిమాండ్కు తరలించామన్నారు. ఏనుగుల గుంపుతో జాగ్రతకొమరాడ: మండలంలోని కోటిపాం పరిసరాల్లో ఉన్న పంట పొలాల్లో తొమ్మిది ఏనుగుల గుంపు సంచరిస్తోంది. అయితే కోటిపాం గ్రామస్తులు సాయత్రం ఆరుగంటల నుంచి తెల్లవారు జామున ఆరు గంటల వరకు బయటకు రావద్దని జిల్లా అటవీశాఖ అధికారి ప్రసూన మంగళవారం ఒక ప్రకటనలో తెలయజేశారు. బయటకు రావాల్సి వస్తే అటవీశాఖ సిబ్బంది సహాయం కోరాలని ఆమె సూచించారు. -
అర్హులకు కారుణ్య నియామకాలు
● హోంగార్డ్స్ కుటుంబాలతో ఎస్పీ మమేకంవిజయనగరం క్రైమ్: మృతిచెందిన పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. పోలీసు ఉద్యోగుల కుటుంబాల్లో అర్హత ఉన్న వారికి కారుణ్య నియామకాల కోసం చర్యలు చేపడతామని, ఎలాంటి సమస్యలున్నా, సందేహాలున్నా, సహాయం కావాలన్నా నేరుగా తనను కలవవచ్చని ఎస్పీ అన్నారు. మరణించిన పోలీసు ఉద్యోగుల కుటుంబాలతో డీపీఓలోని కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ మంగళవారం సమావేశమయ్యారు. ఆయా కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సర్వీసు బెనిఫిట్స్, వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. మృతి చెందిన ఒక్కొక్క పోలీసు కుటుంబానికి పెండింగ్లో ఉన్న సరీ్వ్స్ బెనిఫిట్స్, ప్రస్తుతం వాటి స్థితి, ప్రగతి, కుటుంబంలో అర్హత కలిగిన వ్యక్తులకు కారుణ్య నియామకాలు చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి కార్యాలయ అధికారులను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ఇటీవల మరణించిన పోలీసు ఉద్యోగుల కుటుంబాలకు మినహా మిగిలిన వారికి అన్ని బెనిఫిట్స్ ఇప్పటికే అందజేశామని తెలిపారు. ఇంకనూ కొన్ని కుటుంబాలకు పెండింగ్లో ఏపీజీఎల్ఐ, జీఐఎస్, లీవ్ ఎన్ క్యాష్మెంట్, పెన్షన్, భద్రత ఎక్స్గ్రేషియా వంటి బెనిఫిట్స్ మరణించిన పోలీసు కుటుంబాలకు త్వరితగతిన మంజూరు చేసేందుకు సంబంధిత అధికారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నామని ఎస్పీ తెలిపారు. పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను చేపట్టేందుకు అర్హతలు కలిగిన వ్యక్తులు వెంటనే సర్టిఫికెట్లు జిల్లాపోలీసు కార్యాలయంలో అందజేస్తే, కారుణ్య నియామకాలకు చర్యలు చేపడతామన్నారు. కాగా ఇటీవల ట్రాఫిక్ పోలీసు స్టేషనులో విధులు నిర్వహిస్తూ హోంగార్డ్ పి.శ్రీనివాసరావు మరణించగా, వెల్ఫేర్ గ్రాంట్ కింద మంజూరైన రూ.15 వేల చెక్కును ఆయన సతీమణి పి.లక్ష్మీ ప్రసన్నకు ఎస్పీ వకుల్ జిందల్ అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీపీఓ పరిపాలనాధికారి పి.శ్రీనివాసరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎన్.గోపాల నాయుడు, ఆఫీసు సూపరింటెండెంట్లు టి.రామకృష్ణ, వెంకటలక్ష్మి, ఆర్ఎస్సై ప్రసాదరావు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.శ్రీనివాస రావు, జిల్లా పోలీసు కార్యాలయం ఉద్యోగులు, పోలీసు కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
విఘ్నాలు తొలగిపోవాలి
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం: తెలుగు సంవత్సరంలో వచ్చే తొలి పండగ వినాయక చవితిని ప్రజలంతా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ఆది దేవుడు, విఘ్నాలు తొలగించే వినాయక చతుర్థశి సందర్భంగా ఉమ్మడి జిల్లాల ప్రజలకు మంగళవారం ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ఆ గణనాథుని చల్లని చూపుతో, ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని, రెండు జిల్లాలు అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు. ఆ పార్వతీపుత్రుని అనుగ్రహంతో విఘ్నాలు తొలగి, అంతటా విజయాలు సిద్ధించాలని కోరారు. పర్యావరణ హితంగా పండగను జరుపుకోవాలని, మట్టి విగ్రహాలను పూజించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలు పాటించాల్సిందే.. పార్వతీపురంటౌన్: వినాయక మంటపాల ఏర్పాటులో ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందేనని సబ్ కలెక్టర్ డా.ఆర్ వైశాలి స్పష్టంచేశారు. వినాయక చవితి పండగ నిర్వహణ, పర్యవేక్షణపై సంబంధిత అధికారులతో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏఎస్పీ అంకితా సురానాతో కలిసి మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైశాలి మాట్లాడుతూ మంటపాలను రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేయరాదన్నారు. డీజే సౌండ్ సిస్టం నిషేధమన్నారు. తిరువీధి, అనుపోత్సవాల్లో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పర్యావరణ హితం దృష్ట్యా మట్టి విగ్రహాలను పూజించేలా చూడాలన్నారు. స్థలాలు గుర్తించండి పార్వతీపురం రూరల్: జిల్లాకు 80 పంచాయతీ భవనాలు మంజూరయ్యాయని, వీటిలో స్థలాలున్నచోట 68 భవనాల నిర్మాణానికి పరిపాలనా ఆమోదం మంజూరు చేసినట్టు కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు. మిగిలిన 12 భవ నాల నిర్మాణానికి వెంటనే స్థలాలను గుర్తించి గ్రౌండింగ్ చేయాలని పంచాయతీరాజ్ సహాయ కార్యనిర్వహణ ఇంజనీర్లను ఆదేశించారు. ఒక్కో భవనాన్ని రూ.32 లక్షల నిధులతో పూర్తిచేయాలన్నారు. ఈ నెల 28, 29, వచ్చేనెల 2, 3 తేదీల్లో ఆదికర్మయోగి శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో డ్వామా పీడీ రామచంద్రరావు, ఐటీడీఏ ఏపీఓ మురళీకృష్ణ, ఎంపీడీఓలు పాల్గొన్నారు. యూరియా పంపిణీలో పక్షపాతం కొమరాడ: మండలంలోని కెమిశీల రైతు సేవా కేంద్రంలో యూరియా పంపిణీలో వ్యవసాయ సహాయకురాలు పక్షపాత ధోరణిపై రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఆర్ఎస్కేకు 200 బస్తాల యూరియా వచ్చింది. కూటమి నాయకులు చెప్పినవారికే యూరియా బస్తాలు ఇవ్వడంతో సాధారణ రైతులు నిలదీశారు. గాజులుగూడ, తులసివలస, బంద వలస తదితర గ్రామాల రైతులు కూటమినాయకుల ఒత్తిడితో ఏఏఓ అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. రైతులందరికీ యూరి యా అందజేయాలని డిమాండ్ చేశారు. వంగర: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరిగింది. సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి 2,500 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులో చేరుతోంది. ప్రాజెక్టు వద్ద 64.49 మీటర్ల నీటిమట్టం నమోదైంది. రెండు గేట్లు ఎత్తి 4వేల క్యూసెక్కుల నీటిని నాగావళి నదిలోకి విడిచిపెడుతున్నట్టు ఏఈ నితిన్ తెలిపారు. -
అధ్యక్ష పీఠంపై తమ్ముళ్ల సమరం!
● ‘ప్రాంతాల’ మధ్య పోటీ ● పెరుగుతున్న ఆశావహులు ● తెరపైకి రెండు వేర్వేరు అధ్యక్షులు ● కుదరని ఏకాభిప్రాయం సాక్షి, పార్వతీపురం మన్యం: అరకు పార్లమెంట్ టీడీపీ అధ్యక్ష పీఠంపై ‘తమ్ముళ్ల’ మధ్య ఆసక్తికర సమరం నడుస్తోంది. ప్రధానంగా అటు ఏఎస్ఆర్.. ఇటు పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి పోటీ ఏర్పడింది. ఈ సారి ఎలాగైనా అధ్యక్ష పదవి తమకే ఇవ్వాలని రెండు జిల్లాల నుంచి పలువురు పోటీ పడుతున్నారు. దీనిపై రెండు రోజుల కిందట విశాఖపట్నంలో త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ నిర్వహించారు. జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఎవరికి వారు తమ వాణిని వినిపించారు. వాస్తవానికి అరకు పార్లమెంట్ స్థానం ఎస్టీ సామాజిక వర్గానికి రిజర్వ్ చేశారు. ఈ పార్లమెంట్ ఏర్పడిన తర్వాత ఇక్కడ టీడీపీ ఒక్కసారి కూడా గెలిచిన దాఖలాలు లేవు. కొన్ని దఫాలుగా వైఎస్సార్సీపీ అభ్యర్థులే అరకు పార్లమెంట్ స్థానాన్ని కై వసం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అన్ని విధాలా బలమైన వ్యక్తిని అధ్యక్షునిగా నియమించాలన్న ఆలోచనలో ఉంది. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అధ్యక్ష పీఠం మళ్లీ ఎస్టీకి కేటాయిస్తారా, లేక మరో సామాజిక వర్గానికి అవకాశం కల్పిస్తారా? అన్నది చూడాలి. ఒకవేళ అధ్యక్ష పదవిని ఎస్టీకి ఇస్తే.. ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఎస్టీ లేదా బీసీ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెరపైకి ఇద్దరు వేర్వేరు అధ్యక్షులు? మరోవైపు అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా విభజించి అధ్యక్షులను నియమించాలన్న డిమాండ్ కూడా ఉంది. మన్యం జిల్లా పార్టీ అధ్యక్షునిగా బీసీ నాయకునికి అవకాశం ఇవ్వాలని పలువురు కోరుతుండగా.. ఎస్టీకి ఇవ్వాలని మంత్రి సంధ్యారాణి తదితరులు గట్టిగా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. పార్టీ నాయకత్వంలో కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాలకు ప్రాధాన్యమివ్వాలని విప్, ఎమ్మెల్యే జగదీశ్వరి అడుగుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకే అధ్యక్ష పదవి కేటాయించాలని.. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడినే కొనసాగించాలన్న డిమాండ్లూ అటు నుంచి వినిపిస్తున్నాయి. ప్రస్తుత పార్లమెంట్ అధ్యక్షునిగా కె.శ్రవణ్కుమార్ ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు కూడా అధ్యక్ష పీఠం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ఆశావహుల జాబితా పెద్దదే.. అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధి ఎక్కువ. పార్వతీపురం మన్యం జిల్లాలో కేవలం నాలుగు నియోజకవర్గాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏఎస్ఆర్కు, మన్యం జిల్లాలకు వేర్వేరు అధ్యక్షుల నియామకం తెరపైకి వచ్చింది. అటు ఎస్టీకి ఇచ్చేసినా.. ఇటు బీసీకి ఇవ్వాలని పలువురు పట్టుపడుతున్నారు. మన్యం జిల్లా నుంచి అధ్యక్ష పదవి రేసులో చాలా మంది పోటీ పడుతున్నారు. జిల్లాలో మూడు ఎస్టీ, ఒక్కటి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ రిజర్వేషన్ కారణంగా బీసీ, ఇతర సామాజిక వర్గాలకు ఎటువంటి సముచిత పదవులూ దక్కడం లేదన్న అసంతృప్తి ఉంది. బలమైన సామాజిక వర్గ నాయకులు తెర వెనుక పాత్రకే పరిమితమవుతున్నారు. ఈసారైనా ఆ పరిస్థితిని మార్చాలని పలువురు కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే భంజ్దేవ్ ఈ పదవి చేపట్టేందుకు విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కురుపాం నియోజకవర్గం నుంచి వైరిచర్ల వీరేశ్చంద్రదేవ్, ఉమ్మడి విజయనగరం జిల్లా మాజీ గ్రంథాయల చైర్మన్ దత్తి లక్ష్మణరావు తదితరులు ఆశిస్తున్నారు. వీరేశ్చంద్రదేవ్ 2024 ఎన్నికల్లో కురుపాం టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. చివరి క్షణంలో తోయిక జగదీశ్వరి పేరును అధిష్టానం ఖరారు చేసింది. దీంతో అయిష్టంగానైనా పార్టీ గెలుపునకు ఆయన కృషి చేశారు. గెలిచిన తర్వాత ఎమ్మెల్యే జగదీశ్వరి వర్గం.. ఆయనను పూర్తిగా పక్కన పెట్టేసిందన్న అసంతృప్తి వీరేశ్చంద్రదేవ్ వర్గీయుల్లో ఉంది. గోవా గవర్నర్ ఆశోక్ గజపతిరాజుకు ఈయన బంధువు కూడా. ఆ పరిచయంతోపాటు, వైరిచర్ల కుటుంబం నేపథ్యం ఆయనకు కలిసొస్తుందని సన్నిహితులు అంటున్నారు. ఇదే నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన దత్తి లక్ష్మణరావు కూడా పార్టీలో కీలక పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. పార్వతీపురం నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ జగదీష్, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్చంద్రతో వీరికి బహిరంగంగానే విభేదాలు ఉన్నాయి. జగదీష్కు బలమైన సామాజిక వర్గ నేపథ్యం ఉంది. పార్టీ సీనియర్ నేత అయినప్పటికీ.. గత ఎన్నికలకు ముందు నుంచి బోనెల విజయ్చంద్ర ఏకపక్ష నిర్ణయాలతో ఆయన తెరమరుగయ్యారు. వీరితోపాటు.. మరికొంతమంది కూడా పార్టీలో ముఖ్య పదవుల కోసం పోటీ పడుతున్నారు. -
అర్జీదారుల సమస్యకు తగిన పరిష్కారం చూపండి
● కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ● పీజీఆర్ఎస్కు 107 అర్జీలుపార్వతీపురం రూరల్: అర్జీదారుల సమస్యలకు తగిన పరిష్కారం చూపించి కచ్చితమైన సమాచారాన్ని అందజేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులకు తేల్చి చెప్పారు. పరిష్కారం కాకపోతే అందుకు గల కారణాలతో కచ్చితత్వంతో కూడిన సమాచారాన్ని వారికి అందజేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, సబ్కలెక్టర్ ఆర్.వైశాలి, డీఆర్ఓ కె.హేమలత, ఎస్డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ సుధారాణిలు అర్జీదారుల నుంచి మొత్తం 107 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతి సమస్యను సావధానంగా పరిశీలించి తగిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లాలో ఉన్న పలుశాఖల ఉన్నతాధికారులు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించండి: ఏఎస్పీ ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించి ఫిర్యాదులకు పరిష్కారం చూపాలని ఏఎస్పీ అంకితా సురానా అన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి, అర్జీదారులతో ఏఎస్పీ ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత స్టేషన్ అధికారులకు సిఫార్సు చేశారు. కార్యక్రమంలో 3 ఫిర్యాదులు అందాయి. డీసీఆర్బీ ఎస్సై ఫకృద్దీన్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 21 అర్జీలు సీతంపేట: ఐటీడీఏలో సోమవారం ప్రాజెక్టు అధికారి పవర్ స్వప్నిల్, జగన్నాథ్ నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు 21 అర్జీలు వచ్చాయి. పట్టులోగా ఆశ్రమపాఠశాలలో కుల దూషణపై, ఇతర సంఘటనలపై గ్రూప్వన్ అధికారితో విచారణ చేయించాలని స్కూల్ కమిటీ చైర్మన్ సవర లక్ష్మీనారాయణ, గిరిజన సంఘం నాయకులు సవర ధర్మారావు తదితరులు వినతిపత్రం ఇచ్చారు. లాడ గ్రామంలో అంతర్గత సీసీ రహదారులు నిర్మించాలని గ్రామస్తులు కోరారు. తోరికవలసకు నూతన పాఠశాల భవనం నిర్మించాలని పి.లక్ష్మయ్య అర్జీ ఇచ్చారు. వడ్డంగిగూడకు చెందిన రఘు ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఇప్పించాలని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీవో చిన్నబాబు, డిప్యూటీఈఓ రామ్మోహన్రావు, ఈఈ రమాదేవి, వ్యవసాయాధికారి వాహిని తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించకపోతే చర్యలు
● కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ ● పీజీఆర్ఎస్కు 188 వినతులువిజయనగరం అర్బన్: ప్రజా వినతుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే వినతులను లాగిన్లో నిర్దేశిత సమయంలో పరిష్కరించకపోతే జిల్లా అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ హెచ్చరించారు. అధికారులు ఎప్పటికప్పుడు లాగిన్లో చూడాలని చూడవలసిన కాలమ్లో ఎప్పుడు చూసినా సున్నా పరిష్కారం కనపడాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సమావేశమందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్కు 188 వినతులు అందాయి. కలెక్టర్తోపాటు జేసీ ఎస్.సేతుమాధవన్, డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ఎస్డీసీలు మురళి, ప్రమీలా గాంధీ, వెంకటేశ్వరరావు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 36 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక‘ కార్యక్రమాన్ని ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా ఆలకించారు. సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ 36 ఫిర్యాదులను స్వీకరించారు. అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
నిబంధనలు పాటించకపోగా అవమానం
● మున్సిపల్ కమిషనర్పై చైర్పర్సన్ ఫిర్యాదుపార్వతీపురం రూరల్: తానొక ప్రథమ పౌరురాలు, బీసీ నేత అని చూడకుండా, ప్రోటోకాల్ పాటించకుండా ఉద్దేశ పూర్వకంగా నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ తనను మున్సిపల్ కమిషనర్ జి.శ్రీనివాసరాజు అవమాన పరుస్తున్నారని పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభికకు తనకు జరిగిన అవమానాన్ని వినతిపత్రంలో వివరించారు. ఇటీవల జరిగిన స్వాతంత్య్ర దినం కార్యక్రమంలో ఉదయం 7.30గంటలకు కార్యక్రమానికి రమ్మని కార్యాలయం నుంచి తనకు ఆహ్వానం పంపి మళ్లీ ఫోన్ చేసి 9గంటలకు హాజరు కావాలని సమాచారం అందించారని, తాను 9 గంటలకు వెళ్లగా శాసనసభ్యులు రాలేదని తనతో పాటు తోటి కౌన్సిల్ సభ్యులను నిరీక్షించమని చెప్పి 10 గంటల వరకు కాలయాపన చేశారన్నారు. అనంతరం నిబంధనలకు విరుద్ధంగా పట్టణ ప్రథమ పౌరురాలైన తనతో జాతీయజెండాను ఎగురవే యించాల్సిన నేపథ్యంలో కావాలని ఉద్దేశపూర్వకంగా చైర్పర్సన్ అయిన తనను అవమాన పరుస్తూ శాసనసభ్యుడితో ఎగురవేయించారని తెలిపారు. అలాగే పట్టణ పరిధిలో ఈ నెల 20న బైపాస్ రోడ్డులో జరిగిన సీసీ కాలువ భూమి పూజ కార్యక్రమానికి ప్రోటోకాల్ నిబంధనలు పాటించకుండా కావాలనే తనను అవమానపరుస్తున్నారని చైర్పర్సన్ గౌరీశ్వరి తెలిపారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికై న తనపై కమిషనర్ శ్రీనివాసరాజు ప్రోటోకాల్ ఉల్లంఘన కింద ఈ విధంగా ప్రవర్తించకుండా తగుచర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అలాగే ప్రాంతీయ మున్సిపల్ సంచాలకుడికి ఫిర్యాదు చేస్తున్నట్లు ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. -
పాఠశాల పక్కనే పశువుల అక్రమ రవాణా
కొమరాడ: మండలంలోని చిన మార్కొండపుట్టి గ్రామంలో మండల పరిషత్ పాఠశాల పరిసరాల్లో పరశురాంపురం కేంద్రంగా అక్రమ పశు దందా జరుగుతోంది. కొంతమంది పశువుల అక్రమ రవాణా వ్యాపారులు పాఠశాల పక్కనే వందలాది పశువులు కడుతుండడం వల్ల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశాలోని రాయగడ, అమలబడి తదితర ప్రాంతాల నుంచి కిలోమీటర్ల దూరం వాటిని నడిపించి గ్రామానికి తీసుకు వస్తున్న నేపథ్యంలో అవి నడవలేక రక్తస్రావంతో పాటు నీరసంతో పశువులు మృతి చెందడంతో ఆ పరిసర ప్రాంతంలో పశు కళేబరాల కుళ్లు కంపుతో పాటు దోములు, దుర్వాసన రావడంతో విద్యార్థులు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటారని గ్రామస్తులు ఎంత చెప్పినా అక్రమ వ్యాపారులు పట్టించుకోవడం లేదు. ఎన్నిమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు వాపోతున్నారు. పాఠశాల పరిసరాల్లో అక్రమ పశుదందాను అరికట్టాలని వారంతా కోరుతున్నారు. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
విజయనగరం క్రైమ్: కంటకాపల్లి, కొత్తవలస రైల్వే లైన్లో గుర్తు తెలియని మృతదేహాన్ని కనుగొన్నామని ప్రభుత్వ రైల్వే ఎస్సై బాలాజీరావు సోమవారం తెలిపారు. మృతుడికి సుమారు 30నుచి 35 ఏళ్ల వయస్సు ఉంటుందని సుమారు 5 అడుగుల 6 అంగుళాల పొడవు ఉంటాడన్నారు. చామన ఛాయ రంగుతో ఉన్న మృతుడు ఎరుపు రంగు ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్, లైట్ గ్రే కలర్, నీలం రంగు గల షార్ట్తో ఉన్నాడన్నారు. ఆ వ్యక్తిని గుర్తు పట్టినట్లయితే ఫోన్ 9490617089, 6301365605 నంబర్లకు కానీ జీఆర్పీ ల్యాండ్లైన్ నంబర్ 08912883218కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. చెరువులో పడి వ్యక్తి మృతిగంట్యాడ: మండలంలోని మదనాపురంగ్రామానికి చెందిన లగుడు సురేష్ (40) గ్రామంలోని ముని అక్కమ్మ చెరువులో పడి మృతి చెందాడు. సోమవారం ఉదయం 7:30 గంటల సమయంలో కలువు పువ్వులు తీసుకోవడానికి చెరువులోకి ఈదుకుంటూ వెళ్లాడు. చెరువు మధ్యలోకి వెళ్లిన తర్వాత లోతు ఎక్కువుగా ఉండడంతో నీటిలో మునిగి ప్రమాదవశాత్తు మరణించాడు. ఈ ఘటనపై మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికృష్ణ తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. కూలిన ఇంటి గోడకొమరాడ: అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు కొమరాడ మండలంలోని పరుశురాంపురంలో సోమవారం వేకువజామున ఐదు గంటల ప్రాంతంలో గ్రామానికి చెందిన కొత్తకోట బాలకృష్ణ పాత్రుడు, సత్యనారాయణ పాత్రుడుల పాత ఇంటి గోడ కూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదని స్థానికులు తెలిపారు. అధికారులు తమను ఆదుకోవాలని బాధితులు కోరారు. బహిరంగంగా మందు కొడితే చర్యలు ● ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరికవిజయనగరం క్రైమ్: జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి, ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పనని ఎస్పీ వకుల్ జిందల్ మరోసారి సోమవారం మందుబాబులను హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన మందుబాబులపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్లు చేపట్టినట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ న్యూసెన్స్ చేస్తూ, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై దాడులు చేయాలని, వారిపై కేసులు నమోదు చేయాలని, పట్టుబడిన మైనర్లు, మందుబాబులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని అధికారులకు ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లేఅవుట్లు, గ్రామ శివారు, నగర శివారు ప్రాంతాల్లో, బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై పోలీసు అధికారులు, సిబ్బంది డ్రోన్లతో దాడులు నిర్వహిస్తున్నారని ఎస్పీ తెలిపారు. ఈ నెలలో ఇప్పటివరకు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన వారిపై 1520 కేసులు నమోదు చేశామన్నారు. -
● సమసిన వివాదం
రామభద్రపురం: మండలంలోని జగనన్న కాలనీ సమీపంలో ఉన్న ఆల్ట్రాటెక్ సిమెంట్ గోదాం వద్ద ఆదివారం సాయంత్రం విద్యుత్ షాక్ తగిలి మండలం పరిధిలో గల జన్నివలస గ్రామానికి చెందిన ముచ్చుపల్లి శ్రీనివాసరావు మృతి చెందిన సంఘటన తెలిసిందే. అయితే ఇదే విషయంపై మృతుడి కుటుంబసభ్యులు గోదాం యజమానికి సమాచారం ఇవ్వగా తనకేమీ తెలియదన్నట్లు యాజమాన్యం కనీసం స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించ నివ్వకుండా కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. అలాగే గ్రామపెద్దలతో పాటు ప్రజలు సుమారు 200 మందితో కలిసి జీవనాధారమైన ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబ సభ్యులు సోమవారం పోలీసులను ఆశ్రయించారు. సిమెంట్ గోదాంలో పనిచేస్తూ యాజమాన్యం నిర్లక్ష్యానికి బలైన శ్రీనివాసరావు కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఎస్సై వి. ప్రసాదరావుతో పాటు జన్నివలస గ్రామ పెద్దలు, రామభద్రపురం గ్రామ పెద్దలు, రామభద్రపురం సిమెంట్ వ్యాపారులు సిమెంట్ గోదాం యజమానితో మృతుని కుటుంబానికి పరిహారం చెల్లించి న్యాయం చేయాలని చర్చించారు. యజమాని ససేమిరా అంటూ పరిహారం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో కార్మిక యాక్ట్ ప్రకారం యాజమాన్యంపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవలసి ఉంటుందని హెచ్చరించడంతో దిగొచ్చిన యాజమాన్యం విద్యుదాఘాతంతో మృతిచెందిన శ్రీనివాసరావు కుటుంబానికి సుమారు రూ.4 లక్షల వరకు పరిహారం ఇవ్వడానికి అంగీకరించినట్లు తెలిసింది. దీంతో కుటుంబసభ్యులతో పాటు గ్రామ పెద్దలు, ప్రజలు శాంతించి వివాదం ముగించారు. వెంటనే మృతదేహాన్ని ిపోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్సీకి పోలీసులు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. గోదాం యజమాని నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం మృతుడి కుటుంబ సభ్యుల ఆరోపణ మృతిపై సమాచారం ఇచ్చినా స్పందించని యాజమాన్యం మృతదేహం కదిలించేది లేదని కుటుంబసభ్యుల మొండి పట్టు -
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లాకు పతకాలు
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు పతకాలు సాధించారు. జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని శాప్ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన పోటీల్లో జిల్లా నుంచి పాల్గొన్న క్రీడాకారులు రెండు బంగారు, రెండు వెండి, ఒక కాంస్య పతకం కై వసం చేసుకున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు లీలాకృష్ణ, శ్రీకాంత్లు తెలిపారు. పతకాలు సాధించిన వారిలో పి.వసంత, ఎస్.దివ్యవాణి, ఎస్.శ్రావణి, బి.నీలిమ, పి.పవన్కల్యాణ్లు ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి శ్రీధర్ అభినందించారు. కిమిడి సోదరుడి మృతిరేగిడి: మండల కేంద్రం రేగిడి గ్రామానికి చెందిన కిమిడి నీలంనాయుడు (71) సోమవారం ఉద యం అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు, మాజీ ఎమ్మెల్యే కిమిడి గణపతిరావుకు స్వయానా సోదరుడు. నీలంనాయుడు గతంలో సర్పంచ్గా పనిచేశారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. చిట్టీల పేరుతో టోకరాభోగాపురం: మండలంలోని సిమ్మపేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రూ.22 లక్షలు చిట్టీలు వేసి ఉడాయించేందుకు సిద్ధమవ్వగా చిట్టీలు వేసిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్సై పాపారావు ఇరు వర్గాలను పిలిపించి విచారణ చేపట్టగా చిట్టీలు వేసిన వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్ అడడం వల్ల డబ్బులు పోయి అప్పుల్లో మునిగిపోయానని చెప్పాడు. తాను ఎవరిని మోసం చేయనని, అప్పులు తీర్చేద్దామని సిమ్మపేటలో తనకున్న ఇల్లును ఇతరులకు అమ్మేయగా వచ్చిన ఆ డబ్బులను పెద్దమనుషుల దగ్గర ఉంచానని చెప్పాడు. ఇంతలో బాధితులంతా కలిసి అప్పులు తీర్చమని అడగ్గా వారికి చిట్టీల నిర్వాహకుడు రాసి ఇచ్చిన ప్రాంసరీ నోట్లను పోలీసులకు చూపించి తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
పోస్టల్ బీమా ఏజెంట్ల నియామకానికి ఆహ్వానం
విజయనగరం టౌన్: విజయనగరం డివిజన్ తపాలాశాఖ పరిధిలో తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా ఏజెంట్లుగా పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని విజయనగరం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కొల్లూరు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి 29 వరకూ అభ్యర్థులు తమ బయోడేటా, ఫొటో, ఒరిజినల్ సర్టిఫికెట్స్, జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని కోరారు. నియామకం పూర్తయిన ఏజెంట్లకు పాలసీననుసరించి కమీషన్ ఇవ్వనున్నామని, నెలవారీ జీతం ఉండదని స్పష్టం చేశారు. 5వేల జనాభాకు తక్కువగా ఉన్న ప్రాంతంలో పదోతరగతి, 5వేల జనాభాకు పైన ఉన్న ప్రాంతంలో ఇంటర్ ఉత్తీర్ణులై, మార్కెటింగ్, ఇన్సూరెన్స్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. అభ్యర్థులు కార్యాలయం పనివేళల్లో సంప్రదించాలని సూచించారు. -
మట్టి గణపతి ప్రతిమలనే పూజిద్దాం
పార్వతీపురం రూరల్: వినాయక చవితి సంద ర్భంగా మట్టి ప్రతిమలను పూజించి పర్యావర ణ పరిరక్షణ కోసం పాటుపడాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపుని చ్చారు. మట్టితో తయారుచేసిన గణపతి ప్రతిమలను కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం పంపిణీ చేశారు. గణపతి నవరాత్రుల నేపథ్యంలో ఎక్కడా డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. శబ్ధ కాలుష్యం లేకుండా మైక్ సెట్లను ఏర్పాటుచేసుకోవచ్చన్నారు. మట్టి వినాయక ప్రతిమలు, వ్రతకల్ప పుస్తకాలను కలెక్టర్ శ్యామ్ప్రసాద్ చేతుల మీదుగా జేసీ శోభిక, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి మన్మథరావు, డీఎంహెచ్ఓ భాస్కరరావు అందుకున్నారు. కార్యక్రమంలో సబ్కలెక్టర్ ఆర్.వైశాలి, డీఆర్వో కె.హేమలత, ఎస్డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎన్.సుధారాణి, పలు శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. గరుగుబిల్లి: బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తోటపల్లి ప్రాజెక్టు వద్ద నీటి ప్రవాహం నిలకడగా ఉంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 105 మీటర్లుకాగా, సోమవారం సాయంత్రం నాటికి 104.2 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ప్రస్తు తం ప్రాజెక్టులో 3,622 క్యూసెక్కుల నీరు చేరు తుండగా ఒక గేటును ఎత్తివేసి 3,321 క్యూసెక్కుల నీటిని నాగావళి నదిలోకి విడిచిపెడుతున్నట్టు ఏఈ కిశోర్ తెలిపారు. సీతానగరం: మండలంలోని సహకార సంఘా ల బలోపేతమే లక్ష్యంగా చైర్మన్లు పనిచేయా లని డీసీసీబీ నోడల్ అధికారి కె.జానకి కోరా రు. సీతానగరం డీసీసీబీ బ్రాంచి కార్యాలయంలో పీఏసీఎస్ చైర్మన్లు, సీఈఓలతో బ్రాంచి చీఫ్మేనేజర్ జి.సూర్యనారాయణ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులకు అవసరమైన రుణాల మంజూరుతో పాటు రెన్యువల్పై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో అంటిపేట, గుచ్చిమి, తామరఖండి, గెడ్డలుప్పి, సీతానగ రం, ఆర్.వెంకంపేట, అజ్జాడ, బూర్జ పీఏసీఎస్ చైర్మన్లు పాల్గొన్నారు. విజయనగరం అర్బన్: గిరిజన అధ్యయనాలు, విస్తృత పరిశోధనలు, గ్రంథాలు భద్రపరచడం అంశాలపై విజయనగరం కేంద్రీయ గిరిజన యూనివర్సిటీకి మరో నాలుగు కేంద్ర విశ్వవిద్యాలయాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. వర్సిటీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఒప్పంద పత్రాలపై ఆయా వర్సిటీల ప్రతినిధులు సంతకాలు చేసినట్టు ఇన్చార్జి వీసీ టి.శ్రీనివాసన్ తెలిపారు. ఒడిశాలోని కేంద్ర విశ్వవిద్యాలయం, అమరకంటక్లోని ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం, హైదరాబాద్లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, తెలంగాణలోని సమక్క సరక్క గిరిజన యూనివర్సిటీలు ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. కార్యక్రమంలో వర్సిటీల ప్రతినిధులు ఎన్.నాగరాజు, సౌభాగ్యరంజన్ పాడి, వై.ఎల్.శ్రీనివాస్, నరసింహ చరణ్ పాండా తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాకు రెగ్యులర్ డీఈఓను నియమించేది ఎప్పుడు?
పార్వతీపురం: పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో వరుసగా మూడుసార్లు ప్రథమ స్థానంలో నిలిచిన పార్వతీపురం మన్యం జిల్లాకు రెగ్యులర్ జిల్లా విద్యాశాఖాధికారిని నియమించుకోలేని నిస్సహాయస్థితిలో కూటమి ప్రభుత్వం ఉండడం దౌర్భాగ్యమని గిరిజన సంక్షేమ సంఘ ఉత్తరాంధ్ర ప్రధానకార్యదర్శి పాలక రంజిత్కుమార్ విమర్శించారు. స్థానిక విలేకరులతో ఆయన సోమవారం మాట్లాడుతూ డీఈఓగా ఒక ఎంఈఓకు అదనపు బాధ్యతలను అప్పగించారని, ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్గా ఏటీడబ్ల్యూఓకు బాధ్యతలు అప్పగించడం సరికాదన్నారు. పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏలకు రెగ్యుల ర్ పీఓలను నియమించాలని కోరారు. పాలకొండ రూరల్: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పాలకొండ కోటదుర్గమ్మ దేవస్థానంలోని హుండీల ఆదాయాన్ని దేవదాయ ధర్మాదాయశాఖ అధికారులు సోమవారం లెక్కించారు. మే నెల 31వ తేదీ నుంచి నేటి వరకు హుండీల నుంచి రూ.10,80,781లు ఆదాయం వచ్చినట్టు దేవదాయశాఖ తనిఖీ అధికారి ఎస్.రామారావు ఈఓ సూర్యనారాయణ తెలిపారు. -
దివ్యాంగుల జీవితాలతో ఆడుకోవద్దు
● తొలగించిన పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలి ● మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పార్వతీపురం రూరల్: రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపై ఆధారపడుతున్న వేలాదిమంది దివ్యాంగుల పింఛ న్ల రద్దుకు కూటమి ప్రభుత్వం పూనుకోవడం దుర్మార్గమని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ధ్వజమెత్తారు. రీ సర్వే పేరుతో దివ్యాంగుల పింఛన్ల రద్దును నిరసిస్తూ వైఎస్సార్సీపీ జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు ప్రసాద్, పలువురు దివ్యాంగులతో కలిసి కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన చేశారు. అనర్హత పేరుతో అర్హులైన దివ్యాంగుల పింఛన్లను తొలగించవద్దంటూ జేసీ ఎస్.ఎస్.శోభికకు వినతిపత్రం అందజేశా రు. జిల్లా వ్యాప్తంగా తొలగించిన 2 వేలు పింఛన్లను పునరుద్ధరించాలని విన్నవించారు. అనంతరం జోగారావు విలేకరులతో మాట్లాడుతూ సమాజంలో అనేక సవాళ్లను అధిగమిస్తూ జీవనపోరాటం సాగిస్తున్న దివ్యాంగులపై కూటమి ప్రభుత్వం కక్షకట్టడంపై మండిపడ్డారు. గతంలో ప్రభుత్వమే నిర్ధారించి వైకల్యం శాతాన్ని గుర్తించి జారీచేసిన సదరం ధ్రువీకరణ పత్రాలు నేడు చెల్లవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తొలగించిన పింఛన్లు పునరుద్ధరించకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి, పార్టీ నాయకులు శ్రీరాముల నాయుడు, సత్యంనాయడు, బొమ్మి రమేష్, మురళీకృష్ణ, జెడ్పీటీసీ అలజంగి రవికుమార్, వైస్ ఎంపీపీలు సిద్ధా జగన్నాథం, రవికుమార్, అనుబంధ విభాగాల నాయకులు మాధవరావు, వెంకటేశ్వరులు, నాగేశ్వరరావు, తిరుపతిరావు, విశ్వనాథం, గౌరీశంకరరావు, షేక్సఫీ, వాసుదేవరావు, పీస్ఆర్ నాయుడు, మజ్జి శేఖర్, శంకరరావు, మన్మథరావు, గోపాలనాయుడు, సూర్యనారాయణ, కౌన్సిలర్లు, సర్పంచ్లు లావణ్య, నేతాజీ, శ్రీరంజన్, తిరుపతిరావు, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు. -
కూటమి తీరుపై.. కదంతొక్కిన ఆటోడ్రైవర్లు
కొమరాడ: కూటమి ప్రభుత్వం తీరుకు నిరసనగా ఆటో, క్యాబ్ డ్రైవర్లు కదంతొక్కారు. ఉచిత బస్సు పథకంతో ఉపాధి కోల్పోయిన డ్రైవర్లను ఆదుకోవాలంటూ కొమరాడలో మజ్జిగౌరీ తల్లి ఆటో యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్డార్ సత్యనారాయణకు వినతిప్రతం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం వాహనమిత్ర పథకం కింద ఏడాది రూ.10వేలు అందజేస్తే.. కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం పేరిట మా పొట్టకొట్టిందని వాపోయారు. వాహనమిత్ర పథకం కింద రూ.25 వేలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కొల్లు సాంభమూర్తి, బి.గోపి, కోరాడ చిన్న, బాసింగి శ్రీను, తదితరులు పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 26 శ్రీ ఆగస్టు శ్రీ 2025
ఈ చిత్రంలోని వ్యక్తి పేరు పెద్దింటి శివప్రసాద్. పార్వతీపురం మండలం బాలగుడబ గ్రామనివాసి. ఈయన ఆధార్కార్డు వివరాల్లో వేరేవరిదో 25 ఎకరాల భూమి లింకు అయిపోయింది. ఆ భూమి తనది కాదని, తొలగించాలని సచివాలయం, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఇప్పటికే రెండు సార్లు కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందజేశాడు. తిరగడమే తప్ప ఫలితం ఉండడం లేదు. తాజాగా మరోసారి అధికారులను కలిసి వేడుకున్నాడు. అంత భూమి ఉండటం వల్ల ప్రభుత్వ పథకాలేవీ అందుకోలేకపోతున్నానని చెబుతున్నాడు. ఆ భూమిని తన పేరిట తొలగించాలని కోరుతున్నాడు. లేకుంటే మొత్తంగా తన పేరు మీదే రాయించేసి, సదరు భూమిని అప్పగించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. -
వారి వల్లే కాదంటున్నారు.. మరెవరికి చెప్పుకోవాలి!
బలిజిపేట మండలం పెదపెంకి గ్రామానికి చెందిన ఈయన పేరు గుల్లిపల్లి నారాయణరావు. పెదపెంకి గ్రామ రెవెన్యూ పరిధిలో ఈయనకు 0.98 సెంట్ల భూమి ఉంది. వీరి ఖాతాకు ఇంకెవరిదో ఆధార్ లింకు అయిపోవడం వల్ల ప్రభుత్వ పథకాలు, ఇతర రాయితీలేవీ అందుకోలేకపోతున్నాడు. ఇదే కారణంతో ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన అన్నదాత సుఖీభవ లబ్ధిని కూడా పొందలేకపోయాడు. దీనిపై గ్రామ వ్యవసాయ సహాయకులు, వీఆర్వో, తహసీల్దారులను కలిస్తే.. తొలగించడం తమ చేతుల్లో లేదని చేతులెత్తేస్తున్నారు. దీంతో పీజీఆర్ఎస్కు వచ్చి ఆయన అర్జీ పెట్టుకున్నాడు. -
విసిగి పోవాలే గానీ!
వేరెవరి పేరు మీదనైనా మార్చేయగలరు. క్షణాల్లో వన్బీలు, పాస్ పుస్తకాలు సృష్టించేయగలరు. లంచం లేకుండా నిజాయితీగా పేదలు ఎన్నిసార్లు తిరి గినా అక్కడ పట్టించుకునే వారు కరవు. రెవెన్యూ శాఖపై ఇది ఎప్పటి నుంచో ఉన్న ముద్ర. తరచూ ఏసీబీ అధికారుల దాడిలో దొరికిపోతున్నా అక్కడి సిబ్బందిలో మాత్రం మార్పు రావడం లేదు. ఆదా యం సమకూర్చుకోవడంలో ఉన్న శ్రద్ధ.. వినతుల పరిష్కారంలో చూపడం లేదన్న విమర్శలు వినిపి స్తున్నాయి. ఈ కారణంగానే రెవెన్యూ సంబంధిత భూ సమస్యలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. బాధితులు కలెక్టరేట్ చుట్టూ పదేపదే తిరుగుతున్నా.. అక్కడా వారికి భరోసా దొరకడం లేదు. సాక్షి, పార్వతీపురం మన్యం : ‘ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలకు సరైన పరిష్కారాన్ని చూపాలి. లేకుంటే అందుకు గల కారణాలేమిటో కచ్చితత్వంతో కూడిన సమాచారంతో తెలియజేయాలి.’.. ఇదీ పీజీఆర్ఎస్పై కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులకు చేసిన దిశానిర్దేశం. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఇవే మాటలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిష్కారానికి నోచుకున్న హామీలను వేలిమీద లెక్కపెట్టి చెప్పవచ్చు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమానికి సగటున వంద నుంచి 150 వరకు అర్జీలు వస్తున్నాయి. ఇందులో 60–70 శాతం వరకు రెవెన్యూ, భూ సంబంధిత సమస్యలపైనే ఉంటున్నాయి. తన పేరిట ఉన్న భూమి.. వేరొకరి పేరు మీద ఆన్లైన్లో చూపించడం, పాస్ పుస్తకం మంజూరు చేయాలని.. వన్బీ, అడంగల్లో సవరణలు.. రికార్డుల్లో తప్పుగా నమోదు కావడం, భూ ఆక్రమణలు.. ఇలా వందలాది వినతులు వస్తున్నాయి. గ్రామ, మండల స్థాయిలో అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. పరిష్కారానికి నోచుకోకపోవడంతో కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు క్యూ కడుతున్నారు. ఇక్కడ కూడా అధికారులు వాటిని తీసుకోవడం.. కింది స్థాయి అధికారులకు సమాచారం ఇవ్వడం.. అక్కడితో దానిని వదిలేయడం.. ఇదే తంతు ఎన్నిసార్లయినా సాగుతోంది. ఒకటికి పదిసార్లు వ్యయప్రయాసలకు ఓర్చి, కలెక్టరేట్కు వస్తున్నా.. రెవెన్యూపరమైన సమస్యలకు మోక్షం కలగడం లేదు. ఏదో కారణం సాలూరు మండలం కొట్టిపరువు పంచాయతీ యరగడవలస గ్రామంలోని ఎస్టీ కొండదొర సామాజిక వర్గానికి చెందిన మూదూరు సీతయ్యకు అక్కడి సర్వే నంబరు 142, 149, 40, 41, 38, 37, 139–7పీల్లో మొత్తం 3.59 ఎకరాల భూములు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా వీరి ఆధీనంలోనే ఉండటంతో పాటు.. స్థానిక తహసీల్దార్ నుంచి పట్టాదారుపాస్ పుస్తకం కూడా పొందారు. కొంత భూమి ఆన్లైన్ చేయాల్సి ఉందని, ఇటీవల కాలంలో తమ స్థలంలో కొంతమంది దౌర్జన్యం చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. తమ భూమిలో వేసుకున్న జీడి, మామిడితోటలను నరికేయడమే కాక.. వరినాట్లు వేయనీయకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. అడిగితే భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండటం లేదని.. తాను ఇప్పటి వరకు సమర్పించిన దరఖాస్తులను పట్టుకుని సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు వచ్చాడు. చూపిస్తూ, ఆ వినతిని పెండింగులో లేకుండా అధికారులు క్లియర్ చేసేస్తున్నారు. కనీసం అర్జీదారులు సంతృప్తి చెందేలా సమాధానం కూడా ఇవ్వడం లేదు. ఇటువంటి తరహాలోనే అనేక వినతులు పదేపదే రీఓపెన్ అవుతున్నాయి. ‘రెవెన్యూ’పైనే శ్రద్ధ.. రెవెన్యూలో కాసులిస్తే.. ఎవరి పేరిట భూమిని.. -
శారీరక చురుకుదనం లేకపోతే సమస్యలు
పార్వతీపురం రూరల్: ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవన శైలిలో ద్విచక్ర వాహనాలు, కార్లు భాగమైపోవడంతో శారీరక శ్రమ ఉండడం లేదని ఏఆర్ డీఎస్పీ థామస్రెడ్డి అన్నారు. శారీరక చురుకుదనం లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. క్విట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సండే ఆన్ సైకిల్ పేరిట ఆదివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పోలీస్ శాఖ కార్యాలయం నుంచి పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది ప్రతిరోజూ విధి నిర్వహణలో ఒత్తిడిని ఎదుర్కొంటారన్నారు. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని సూచించారు. సైక్లింగ్ చేయడం వల్ల శారీరక దృఢత్వం వస్తుందని చెప్పా రు. ర్యాలీలో ఏఆర్ఐలు రాంబాబు, నాయుడు, ఆర్ఎస్సైలు, తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి -
అర్హత లేని గ్రామీణ వైద్యులపై చర్యలు
కురుపాం/జియ్యమ్మవలస రూరల్: గ్రామీణ వైద్యులు విచ్చలవిడిగా యాంటీబయాటిక్ మందులు ఇస్తూ రోగుల అనారోగ్యానికి కారణమవుతున్నారని.. అర్హత లేని ఆర్ఎంపీలపై చర్యలు తప్పవని జిల్లా ఔషధ నియంత్రణ అధికారి ఆషా షేక్ అన్నారు. కురుపాం మండల కేంద్రంలోని నీలకంఠేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్లకు ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మందుల షాపుల్లో పెద్ద మొత్తంలో యాంటీబయాటిక్స్, యాంటీ మలేరియా, స్టెరాయిడ్స్ను నిల్వ ఉంచరాదన్నారు. అంతేకాకుండా రికార్డులను సక్రమంగా నిర్వహిస్తూ, తనిఖీ సమయంలో అధికారులకు చూపించాలని సూచించారు. పేషెంట్లను వీలైనంతవరకు ప్రభుత్వ ఆస్పత్రులకు పంపించాలన్నారు. గ్రామాల్లోని ఆర్ఎంపీ, పీఎంపీలకు ఎట్టి పరిస్థితుల్లోను మందులు సరఫరా చేయొద్దని ఆదేశించారు. ప్రభుత్వ నిషేధిత మందులను పేషెంట్లకు డాక్టర్ చీటీ లేకుండా విక్రయిస్తే షాపుల లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. మెడికల్ షాపు యజమానులు తప్పనిసరిగా బిల్లు పుస్తకాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మందుల షాపుల యజమానులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఔషధ నియంత్రణ అధికారి ఆపా షేక్ -
కురుపాం విద్యార్థిని లాత్వికకు ఫ్రీ మెడికల్ సీటు
● మొదటి ప్రయత్నంలోనే గుంటూరులోని కాటూరి కళాశాలలో సీట్కురుపాం: కురుపాం మండల కేంద్రానికి చెందిన కాదా లాత్విక ఎంబీబీఎస్ ఉచిత సీటు సాధించింది.ఇటీవల ప్రకటించిన నీట్ పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలోని బీసీ(బి) కేటగిరిలో మొదటి ప్రయత్నంలోనే 463 మార్కులు సాధించి 3743వ ర్యాంకును కై వసం చేసుకుని గుంటూరు లోని కాటూరి మెడికల్ కళాశాలలో ఫ్రీ సీటు సాధించింది. లాత్విక తండ్రి కాదా చంద్రమౌళి సాక్షి దిన పత్రిక కురుపాం రిపోర్టర్ గా, తల్లి అనూరాధ జియ్యమ్మవలస మండలంలోని రావాడ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయినిగా విధులు నిర్వహిస్తున్నారు. మొదటి ప్రయత్నంలోనే తమ కుమార్తె లాత్విక ఉచిత సీటు సాధించడంతో కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.లాత్విక విశాఖపట్నం లోని శశి కళాశాలలో ఇంటర్ మీడియట్ అభ్యసించింది. శభాష్..సమీర..! నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండగుంపాం గ్రామానికి చెందిన పతివాడ సమీర ఎంబీబీఎస్లో ఉచిత సీటును సాధించింది. ఇటీవల ప్రకటించిన నీట్ పరీక్షలో 2020వ ర్యాంక్ను కై వసం చేసుకున్న సమీరకు గుంటూరులోని కాటూరి వైద్య కళాశాలలో ఉచిత సీటు లభించింది. సమీర తండ్రి పతివాడ త్రినాథ్ ఇదే మండలంలోని కుదిపి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఫ్రీ సీట్ సాధించిన సమీరను పలువురు అభినందించారు. -
నదీ తీరంలో హెచ్చరిక బోర్డులు : సబ్ కలెక్టర్
భామిని: మండలంలోని లివిరి వద్ద వంశధార నదిలో కుమ్మరి లక్ష్మి అనే మహిళ గల్లంతు కాగా ఆ నదీతీరాన్ని పాలకొండ సబ్కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ ఆదివారం పరిశీలించారు. మహిళ గల్లంతు ఘటనపై ఆరాతీశారు. తహసీల్దారు శివన్నారాయణ ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నదిలో జల్లెడ పడుతున్నా మహిళ ఆచూకీ లభ్యం కాలేదని అధికారులు తెలిపారు. ప్రమాదకరంగా ఉండే ఇటువంటి నదీతీరాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని తహసీల్దారును సబ్కలెక్టర్ ఆదేశించారు. ఆదివారమూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేక బోటు వేసుకుని మరీ నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. వేధింపుల వల్లే ఆత్మహత్య గజపతినగరం రూరల్: మండలంలోని పిడిశీలకు చెందిన కర్రోతు సాయిసుధ ఆత్మహత్యకు ప్రియుడి వేధింపులే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సాయిసుధకు అదే గ్రామానికి చెందిన యడ్ల ఈశ్వరరావుతో 11 ఏళ్లుగా పరిచయం ఉందన్నారు. కొద్దిరోజులుగా ఈశ్వరరావు నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో సాయిసుధ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. -
సైబర్ మోసాలపై అప్రమత్తం
విజయనగరం: సైబర్ మోసాల పట్ల ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులకు ఎటువంటి వ్యక్తిగత సమాచారం చేరవేయవద్దని రిజర్వ్ బ్యాంక్ సీజీఎం సుబ్బయ్య సూచించారు. యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ‘బ్యాంకింగ్ సేవలు – సైబర్ మోసాలపై’ ద్వారపూడి గ్రామంలోని ఫంక్షన్ హాల్లో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు, సామాజిక భద్రతా పథకాలను ప్రభుత్వ రంగ బ్యాంక్ల ద్వారా వినియోగించుకోవాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ షాలిని, రిజర్వ్బ్యాంక్ డీజీఎం కల్యాణ చక్రవర్తి, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ జితేంద్ర శర్మ, ద్వారపూడి సర్పంచ్ అదిలక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు మృణాళిని, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట రమణమూర్తి, యూనియన్ బ్యాంక్ డిప్యూటీ రీజినల్ మేనేజర్లు రాజా, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
అల్లర్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత కమిటీ సభ్యులదే..
విజయనగరం క్రైమ్: వినాయక ఉత్సవాల్లో అల్లర్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత కమిటీ సభ్యులదేనని ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఎక్కడైనా అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డ్యాన్స్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మంటపాల ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా పోలీస్, ఎలక్ట్రికల్, ఫైర్ శాఖల అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఉత్సవాలు సాఫీగా సాగేందుకు పోలీస్ సూచనలు పాటించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో మంటపాలు ఏర్పాటు చేయాలనుకుంటే సంబంధిత పంచాయతీ, మున్సిపల్ అధికారుల నుంచి అనుమతులు పొందాలన్నారు. ఉత్సవాల్లో డీజేలను వినియోగించేందుకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. మైక్సెట్లను నిర్ణీత సమయం వరకు మాత్రమే వేయాలని చెప్పారు. అలాగే సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. నిమజ్జనంలో ప్రమాదకర రంగులు చల్లుకోవడం.. బాణసంచా కాల్చడం నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సభ్యులపై చర్యలు తప్పవన్నారు. ఎస్పీ వకుల్ జిందల్ -
దగా పడిన దళితులు
● సాగుదారుల భూముల అన్యాక్రాంతం ● 12 ఎకరాల అసైన్డ్ భూమిపై కూటమి నాయకుడి కన్ను ● నకిలీ పాస్ పుస్తకాల తయారీ ● లోబోదిబోమంటున్న అసలు హక్కుదారులువారంతా దళితులు. ఆర్థిక పరిస్థితులు బాగాలేక గ్రామంలో వారికి ప్రభుత్వం కేటాయించి అసైన్డ్ భూములను పెద్దలకు లీజుకిచ్చారు. లీజు గడువు ముగిసింది. మా భూములు మాకు అప్పగించండంటూ అసలైన హక్కుదారులు అడుగుతుంటే లీజుకు తీసుకున్న యజమానులు మాత్రం ఈ భూములపై మీకు హక్కు లేదని, పాస్ పుస్తకాలు మా పేరున ఉన్నాయంటూ దబాయించి వారిని తరిమి కొట్టారు. జియ్యమ్మవలస రూరల్: మండలంలోని చింతల బెలగాం గ్రామానికి చెందిన మండంగి అప్పలస్వామి బెలగాం బలరాం, లక్ష్మయ్య, పారయ్య, చిన్నయ్య, రెడ్డి బుచ్చయ్య, చంద్రయ్య, గరుగుబిల్లి బైరాగి పారయ్య, పండయ్య గుంపయ్య దొనక బోడయ్య, మండంగి చిన్నమ్మి ఇలా 14 మంది దళితులకు 1982లో ప్రభుత్వం అసైన్డ్ చేసిన డీ పట్టాలను సుమారు 12 ఎకరాలకు పైగా అప్పటి ప్రభుత్వం అందజేసింది. అయితే 1994 వరకు ఈ భూమికి సంబంధించి దళిత రైతులు శిస్తు కట్టి సాగు చేసుకున్నారు. అనంతరం వారి ఆర్థిక పరిస్థితులు బాగులేక ఆ భూమిని గ్రామంలోని కొంతమంది రైతులకు లీజుకు ఇచ్చారు. అయితే లీజు సమయం పూర్తి కావడంతో తమ భూమిని తమకు అప్పగించాలని దళితులు కోరగా, మీకు ఎలాంటి హక్కు లేదని లీజుదారులు చెప్పడంతో దళితులంతా అవాక్కయ్యారు. వెంటనే రెవెన్యూ అధికారులను ఆశ్రయిం చారు. ఇప్పటికే పలుమార్లు పాలకొండ రెవెన్యూ డివిజన్ అధికారి దృష్టికి సమస్యను తెలియజేసినప్పటికీ ఫలితం లేకపోయిందని వారంతా వాపోతున్నారు. ప్రస్తుతం 12 ఎకరాల అసైన్డ్ భూమిపై శంభాన శంకర దొర, తెంటు శ్రీనివాసరావు, మర్రాపు పార్వతమ్మ, ఉడుముల శంకరరావు, తిరుపతి నాయుడు, గుంపస్వామి మూడడ్ల సత్యంనాయుడు, దత్తవలస గ్రామానికి చెందిన మండల అప్పలనాయుడు, శంబంగి అప్పలనాయుడు, జయలక్ష్మి, శివున్నాయుడు, వాసుదేవరావులు ఆ భూమిపై నకిలీ పట్టాలను సృష్టించి పాస్ పుస్తకాలను కూడా తయారు చేసుకున్నారని దళితులు ఆరోపిస్తున్నారు. ప్రధాన సూత్రధారి మాజీ వీర్వో ఈ భూ ఆక్రమణకు ప్రధాన సూత్రధారి మూడడ్ల సత్యం నాయుడేనని ఆయన గతంలో వీఆర్వోగా పనిచేశారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో వట్టిగెడ్డ ప్రాజెక్ట్ చైర్మన్గా ఉన్నారన్నారు. ఆయన అప్పటి రెవెన్యూ అధికారులతో కుమ్మకై ్క పీఓటీ చట్టానికి వ్యతిరేకంగా అసైన్డ్ భూములకు పట్టాలిచ్చి పాస్ పుస్తకాలు తయారు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములు అమ్మడం, కొనడం ఆక్రమణకు పాల్పడడం పీఓటీ చట్టాన్ని అతిక్రమించడమేనన్నారు. తక్షణమే తమ భూమిపై ఉన్న రైతులంతా తమకు భూములను అప్పగించాలని అధికారులకు, కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మా భూములు అప్పగించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ప్రభుత్వం కల్పించిందని వారు హెచ్చరించారు. -
వెదురు కర్రలతో వంతెన
మక్కువ: మండలంలోని కొండరేజేరు, సీతానగరం మండలంలోని బళ్లకృష్ణాపురం గ్రామాలకు చెందిన రైతులు ఆదివారం కాలువపై వెదురు కర్రలతో వంతెన నిర్మించుకున్నారు. కొండరేజేరు గ్రామానికి చెందిన రైతులు పంటపొలాలకు వెళ్లాలన్నా కాలువ దాటి వెళ్లాల్సి వస్తోంది. అంతేకాకుండా గ్రామంలో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే పార్వతీపురం పట్టణంలోని అస్పత్రికి వెళ్లాలన్నా, కాలువలో దిగి, నీటిని దాటుకుని వెళ్లాల్సి వస్తోంది. కాలువ ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు సాగించలేక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. మక్కువ మండలంలోని కొండరేజేరు, సీతానగరం మండలంలోని బళ్లకృష్ణాపురం గ్రామాల మధ్య రహదారి నిర్మాణానికి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.1.60లక్షలు మంజూరయ్యాయి. ఆ నిధులతో రెండు గ్రామాల మధ్య మెటల్రోడ్డు వేసి వదిలివేశారు. రెండు గ్రామాల మధ్యనున్న కాలువపై వంతెన నిర్మాణంకోసం మరో రూ.40లక్షల నిధులు మంజూరై, టెండర్ ప్రక్రియ పూర్తయినప్పటికీ వంతెన పనులు ప్రారంభంకాకపోవడంతో రెండు గ్రామాలకు చెందిన పలువురు రైతులు నడుంబిగించి వెదురు కర్రలతో తాత్కలికంగా వంతెన ఏర్పాటు చేసుకున్నారు. పనులు పూర్తిచేయాలంటూ మంత్రికి విజ్ఞప్తి కొండరేజేరు, బళ్లకృష్ణాపురం గ్రామాల మధ్య రహదారి పనులు నిలిచిపోవడం, వంతెన పనులు ప్రారంభంకాకపోవడంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. కాలువలో నుంచి సాగునీరు ఉధృతంగా ప్రవహిస్తున్నందున రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నామని, సోషల్మీడియా ద్వారా మంత్రి సంధ్యారాణి, మండల టీడీపీ అధ్యక్షుడు గుళ్ల వేణుగోపాలనాయుడు, తెలుగుదేశం నాయకులకు విజ్ఞప్తిచేస్తూ ఆ రెండు గ్రామాల ప్రజలు సందేశాన్ని పంపించారు. -
మీకోసం వెబ్సైట్లో పీజీఆర్ఎస్ వివరాల నమోదు
● కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్వతీపురం రూరల్: మీకోసం వెబ్సైట్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం (పీజీఆర్ఎస్)లోని వివరాలు నమోదు చేసుకోవచ్చునని, అలాగే వచ్చిన అర్జీల వివరాలను టోల్ఫ్రీ నంబర్ 1100కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చునని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల సమస్యలపై ప్రతి సోమవారం వినతులు స్వీకరించనున్నామని పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజల వినతులు స్వీకరించడానికి కలెక్టరేట్లోని సెల్లార్లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. నేడు ఐటీడీఏలో పీజీఆర్ఎస్సీతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్ఆర్శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించనున్నారు. గిరిజనులు తమ సమస్యలపై వినతులు సమర్పించవచ్చని ఐటీడీఏ అధికార వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొననున్నారు. ఒక కట్టకు ఎన్ని కష్టాలో..!బలిజిపేట: ఒక యూరియా కట్ట కావాలంటే రైతులకు అష్టకష్టాలు తప్పడం లేదు. నానా పడిగాపులు పడినప్పటికీ ఎరువు దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితి. అందుకు తార్కాణంగా బలిజిపేట మండలంలోని పలగర సహకార సంఘం వద్ద రైతులు ఆదివారం రైతులు పడిన పడిగాపులు చూస్తుంటే వారి అవస్థలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. 260యూరియా బస్తాలు వచ్చాయని తెలియడమే తరువాయి రైతులు సొసైటీ వద్ద బారులు తీరారు. ఎక్కడికి యూరియా వచ్చిందన్నా అక్కడికి పరుగులు తీస్తున్నారు. కనీసం ఒక్క బస్తా యూరియా అయినా దొరకదా? అనే ఆశతో బారులు తీరుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇలా బారులు తీరి యూరియా కోసం పడిగాపులు పడలేదని, నేరుగా ఆర్బీకేల ద్వారా రైతులకు ఎరువులు అందేవని, ఇంకా అవసరమైతే ప్రైవేట్ డీలర్ల వద్ద సాధారణ రేటుకే కొనుగోలు చేసుకునే వారమని రైతులు చెబుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాతే ఎందుకు ఇంత డిమాండ్ వచ్చిందో ఎవరికీ అర్థం కావడం లేదని వాపోతున్నారు. ఏఓబీలో విస్తృత దాడులుకురుపాం: పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆంధ్రా–ఒడిశా సరిహద్దు(ఏఓబీ) గ్రామాలైన వలవ, కెరడ, వనజ, బోరువలస గ్రామాల్లో ఆదివారం సారా తయారీ కేంద్రాలపై ఆంధ్రా–ఒడిశా ఎకై ్సజ్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 7,600 లీటర్ల పులిసిన బెల్లపు ఊట, రవాణాకు సిద్ధంగా ఉంచిన 150 లీటర్ల సారాను ధ్వంసం చేసినట్లు కురుపాం ఎకై ్సజ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు ఆదేశాల మేరకు సారా స్థావరాలపై దాడులు చేపట్టామన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో సారా తయారీ, అమ్మకాలు జరిగినా ప్రజలు తమకు సమాచారం అందించాలని కోరారు . ఈ దాడుల్లో ఎక్సైజ్ ఏఈఎస్ సంతోష్, కురుపాం ఎకై ్సజ్ సిబ్బంది, ఒడిశా ఎకై ్సజ్ అధికారులు పాల్గోన్నారు. పార్వతీపురం టౌన్: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పర్యావరణ హిత వినాయక విగ్రహాల తయారీపై వర్క్షాప్లు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి.రాజ్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కెమికల్ రంగులతో తయారు చేసిన విగ్రహాల వాడకాన్ని తగ్గించి, మట్టి విగ్రహాల వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. -
త్వరలో అన్ని పోలీస్స్టేషన్లకు డ్రోన్లు
విజయనగరం క్రైమ్ : త్వరలో అన్ని పోలీసుస్టేషన్లకు డ్రోన్లు పంపిణీ చేస్తామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. నేరాల నియంత్రణలో సాంకేతికతను విరివిగా ఉపయోగించాలని అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా విజయనగరం టూటౌన్ పోలీసుస్టేషన్ను శనివారం సందర్శించారు. స్టేషన్ ప్రాంగణాన్ని పరిశీలించారు. స్టేషన్లోని సీసీ టీవీ కమాండ్ కంట్రోల్ రూమును సందర్శించి వాటి పని తీరును చూశారు. స్టేషన్లో పని చేస్తున్న కోర్ట్ కానిస్టేబుళ్లతో మాట్లాడి శిక్షలు పడటానికి అనుసరించాల్సిన పద్ధతుల గురించి వివరించారు. సాక్షులను సకాలంలో కోర్టులో హాజరు పర్చాలని, సమన్లు సకాలంలో సర్వ్ చేయాలని సూచించారు. అనంతరం స్టేషన్లోని రిసెప్షన్, గదులను పరిశీలించి, రికార్డులు, సీడీ ఫైల్స్ తనిఖీ చేసి, పోలీసుస్టేషన్ పరిధిలో శాంతిభద్రతలపై సమీక్షించారు. నేరాల నియంత్రణలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించి అదుపు చేయాలన్నారు. సైబర్ నేరాలను నియంత్రించేందుకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలన్నారు. సైబర్ నేరాల దర్యాప్తులో సాంకేతికతను వినియోగించుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. అనంతరం మహిళా సంరక్షణ పోలీసులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళా సంరక్షణలో పోలీసుల పాత్ర చాలా కీలకం అని, వారు శక్తి యాప్ గురించి క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, గంజాయి సమాచారిన్ని సేకరించి సంబంధిత అధికారులకు చేరవేయాలని ఎం.ఎన్.పి.లను డీఐజీ ఆదేశించారు. అనంతరం సీఐ చాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో గంజాయి నిర్మూలనకు ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు. ఇక ఎంఎస్పీలను బందోబస్తుకు ఉపయోగించబోమని, కేవలం స్టేషన్ వారీగా సమాచారం కొరకు వారి సేవలను వినియోగిస్తున్నామన్నారు. అనంతరం డీఐజీ జెట్టి, ఎస్పీ వకుల్ జిందల్ పోలీసుస్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. వార్షిక తనిఖీల్లో డీఐజీతో పాటు డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఎస్పీ సీఐ ఎ.వి.లీలారావు, టూటౌన్ సీఐ టి.శ్రీనివాసరావు,ఎస్ఐలు కృష్ణమూర్తి, కనకరాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్రపై ప్రతిజ్ఞ
పార్వతీపురం రూరల్: ప్రతీ ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొనేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి అన్నారు. స్వచ్చాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని నర్సిపురం గ్రామంలో స్థానికులతో కలసి శనివారం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె స్థానికులతో మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉండదని ఆమె తెలిపారు. బాధ్యతగా గ్రామాల్లో ఉన్న చెత్త సేకరణ సిబ్బందికి స్పందిస్తూ నిబంధనల మేరకు తడి చెత్త, పొడి చెత్తలను వేర్వేరుగా అందించి ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా చెత్త సేకరణ సిబ్బందికి అప్పగించాలన్నారు. పార్వతీపురం తహసీల్దార్ సురేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. సైబర్ నేరాల పట్ల తస్మాత్.. : ఎస్పీ సీతానగరం: సైబర్ నేరాలకు పాల్పడవద్దని, మాదక ద్రవ్యాల బారిన పడి యువకులు తప్పుదోవ పట్టొద్దని ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి అన్నారు. మండలంలోని జోగింపేట డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయ క్రీడా మైదానంలో సంకల్పం ఆధ్వర్యంలో సైబర్ నేరాల నివారణ, మాదక ద్రవ్యాల నిర్మూలన అంశంపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలు, మహిళా రక్షణ చట్టాలు, మాదక ద్రవ్యాల నిరోధం అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తల్లిదండ్రుల కలలను నిజం చేసే విధంగా విద్యావంతులు కావాలని అన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అదనపు ఎస్పీ అంకిత సురానా, డీవీఈవో నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ రాజారావు, ఎంఈవోలు సూరిదేములు, వెంకటరమణ, సీఐ గోవిందరావు, ఎస్ఐ ఎం.రాజేష్ తదితరులు పాల్గొన్నారు. వంశధారలో వివాహిత గల్లంతు భామిని: మండలంలోని లివిరి గ్రామానికి చెందిన వివాహిత కుమ్మరి లక్ష్మి(38) గ్రామ సమీపాన ఉన్న వంశధార నదిలో శనివారం స్నానానికి దిగి గల్లంతైంది. దీన్ని గుర్తించిన నదిలోని తోటి మహిళలు కేకలు వేయడంతో గ్రామస్తులు వచ్చి అధికారులకు సమాచారం ఇచ్చారు. తహసీల్దార్ శివన్నారాయణ, ఎంఆర్ఐ మణి ప్రభాకర్, బత్తిలి ఎస్ఐ అప్పారావు ఆధ్వర్యంలో కొత్తూరు అగ్నిమాపక సిబ్బంది వచ్చి తెప్పల సాయంతో నదిలో గాలించారు. అయినా లక్ష్మి జాడ కనిపించలేదు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నదీ తీరాన ఆచూకీ కోసం గాలిస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్లు విజయనగరం టౌన్: ప్రభుత్వ రంగ సంస్ధ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ట్రిపుల్ పే ప్లాన్ను ప్రకటించిందని ఆ శాఖ డిప్యూటీ జనరల్ మేనేజర్ డి.దాలినాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నెలకు రూ. 400 చెల్లించడం ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్తో పాటూ 400పైగా టీవీ చానెల్స్, తొమ్మిది ఓటీటీ చానెల్స్, అపరిమిత ఫోన్కాల్స్ సేవలను పొందవచ్చని పేర్కొన్నారు. బీఎస్ఎన్ఎల్ ఎఫ్టీటీహెచ్ వాడుతున్న వినియోగదారులు కూడా రూ.140 చెల్లించి టీవీ, ఓటీటీ చానల్స్ పొందవచ్చన్నారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
బ్యాడ్మింటన్ పోటీల విజేతగా విజయనగరం
అరసవల్లి: జిల్లా కేంద్రంలో మూడు రోజులుగా జరుగుతున్న విద్యుత్ శాఖ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు శనివారంతో ముగిశాయి. తుది ఫలితాల్లో ఓవరాల్ చాంప్గా విజయనగరం సర్కిల్ ఈపీడీసీఎల్ జట్టు నిలిచింది. రెండో స్థానంలో నెల్లూరు ఎస్పీడీసీఎల్, మూడో స్థానంలో జెన్కో ఆర్టీపీఎస్ కృష్ణపట్నం నిలిచాయి. శనివారం శ్రీకాకుళం విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన బహుమతుల ప్రదాన కార్యక్రమంలో తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ డి.చంద్రం, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ టి.వనజ, చీఫ్ జనరల్ మేనేజర్ (ఆర్ఎ) ఎల్.మహేంద్రనాథ్, సీజీఎం (మెటీరియల్స్) పి.శ్రీదేవి, జనరల్ మేనేజర్ కె.సురేఖ తదతరులు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రం మాట్లాడుతూ తొలిసారి రాష్ట్ర స్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ ఆఫీసర్ వడివేలు, స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు, సర్కిల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, జనరల్ సెక్రటరీ, డివిజనల్ ఈఈ పైడి యోగేశ్వరరావు, సెక్రటరీ మహంతి ప్రభాకరరావు, సనపల వెంకటరావు, డిప్యూటీ ఈఈ చల్లా వెంకటేశ్వరరావు, ఎస్ఏఓ ఎ.శ్రీనివాసరావు, డీ–1 ఏఈ జె.సురేష్కుమార్, డీ–2 ఏఈ కింజరాపు జయరాం తదితరులు పాల్గొన్నారు. -
పూడికలు తొలగించిన రైతన్నలు
పట్టించుకోని పాలకులు..కురుపాం: కూటమి పాలకుల పాలనా వైఫల్యం, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వెరసి గుమ్మిడిగెడ్డ అక్విడెక్టు ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. ఒకప్పుడు సస్యశ్యామలంగా పండిన పంట భూములు సాగునీరు అందక బీడు భూములుగా తయారైనా అధికార యంత్రాంగంలో స్పందన కరువైంది. పూడికలు తొలగించి, 350 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేలా చూడాలని పాలకులు, అధికారులకు విన్నవించినా స్పందన కరువైంది. ఖరీఫ్ ఉభాల సమయం దాటిపోతుండడంతో ఆవేదన చెందారు. గోళ్లవలస, కర్లగండ, కుంబుకోట, పాలెం, గుజ్జుపాడు, ఈదలవలస, చెక్కవలస, వన్నాం, సీతంపేట, పూతికవలస గ్రామాల రైతులు చందాలు పోగుచేసి జేసీబీ సాయంతో కాలువల్లో పూడికలు తొలగింపునకు శనివారం నడుంబిగించారు. రైతుల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తోందని, పెట్టుబడి సాయం నుంచి విత్తనాలు, ఎరువులు, కాలువల్లో పూడికల తొలగింపు, పంటకు మద్దతు ధర కల్పన ఇలా అన్నింటిలోనూ రైతన్నకు ఆవేదన మిగుల్చుతోందని వాపోయారు. గుమ్మిడిగెడ్డ అక్విడెక్టు ఆయకట్టు పరిధిలోని 15 గ్రామాల రైతులకు చెందిన భూములు ఉన్నాయి. కాలువలు పూడుకుపోవడంతో సాగునీరు అందని పరిస్థితి. ఎన్నిసార్లు ఇరిగేషన్ అధికారులకు విన్నవించినా స్పందన లేదు. పాలకులూ పట్టించుకోలేదు. రైతులందరూ కలిసి చందాల రూపంలో రూ.50వేలు పోగుచేసి జేసీబీతో ప్రధాన కాలువల్లోని పూడికల తొలగింపు పనులు చేపట్టాం. ప్రజా ప్రతినిధులు స్పందించి గుమ్మిడిగెడ్డ అక్విడెక్టును అభివృద్ధి చేయాలి. – శెట్టి సురేష్, గుమ్మిడిగూడ సర్పంచ్ గుమ్మిడిగెడ్డ అక్విడెక్టు ప్రధాన కాలువలో పేరుకుపోయిన పూడికలు తొలగింపునకు చర్యలు తీసుకోని ప్రభుత్వం 350 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ప్రశ్నార్థకం రైతులే చందాలు పోగుచేసి పూడికల తొలగింపునకు చర్యలు -
ఉత్తరాంధ్ర మంత్రుల పేర్లు మిస్సింగ్
సాక్షి ప్రతినిధి,విజయనగరం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు తాను ఒక కార్పొరేట్ కంపెనీ సీఈఓగా భావించుకుంటూ మంత్రులను సెకెండ్ క్యాడర్ ఉద్యోగులుగా చూస్తూ వారి పనితీరును మదింపు చేస్తూ ర్యాంకింగులు ఇవ్వడం చాన్నాళ్లుగా ఉన్న అలవాటు. ఇదే క్రమంలో ఈసారి కూడా మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. ఇందులో భాగంగా ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అత్యద్భుత పని తీరు కనబరచిన వారు అంటూ ఐదుగురు మంత్రులతో టాప్–5 జాబితా ప్రకటించారు. అందులో జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రెండో స్థానం, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో ఉన్నారు. నాలుగో స్థానంలో హోం మంత్రి అనిత, ఐదో స్థానంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చోటు దక్కించుకున్నారు. దాదాపు పాతికమంది మంత్రులు ఉన్న క్యాబినెట్లో కేవలం ఐదుగురికి మాత్రమే ర్యాంకుల కేటాయించిన సీఎం మిగతా వారిని పక్కనపెట్టినట్లుగా తెలుస్తోంది. పవన్కల్యాణ్ పేరు కూడా ఈ జాబితాలో కనిపించలేదు. ఆయనను పనితీరు విషయంలో పరిగణనలోకి తీసుకోలేదో, ఆయన ర్యాంకులకు అతీతం అనుకున్నారో కానీ పవన్ మాత్రం లిస్టులో లేరు. ఇక విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి ముగ్గురు మంత్రులు ఉన్నా వారెవరూ లిస్ట్లో లేరు.ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉండగా, గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ చిన్న, కుటీర పరిశ్రమలు, ప్రవాస భారతీయుల వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వ్యవసాయమంత్రిగా కొనసాగుతున్నారు. గత ఫిబ్రవరిలో కూడా ర్యాంకులు ప్రకటించగా అందులో కొండపల్లి శ్రీనివాస్ మూడో స్థానంలో నిలిచారు. అసెంబ్లీకి తొలిసారి ఎన్నికై , ఏకంగా మంత్రి పదవి దక్కించుకున్న కొండపల్లి కొత్తవారైనా మంచి పనితీరుతో సీనియర్లను దాటుకుని మూడో స్థానంలో నిలిచారని అప్పట్లో చెప్పుకున్నారు. అప్పట్లో అచ్చెన్నాయుడు 17, సంధ్యారాణి 18 ర్యాంకుల్లో నిలిచారు. అయితే, ఇప్పుడు కేవలం ఐదు ర్యాంకులు మాత్రమే ప్రకటించడంలో ఈ మంత్రులు ఎవరికీ పాపం అందులో స్థానం దక్కలేదు. -
అమ్మోరి ఆగ్రహం.. చిరుద్యోగుల విలాపం!
సాక్షి, పార్వతీపురం మన్యం: ఆ అమ్మవారు ఆగ్రహం వ్యక్తం చేస్తే.. ఎటువంటి వారు అయినా మాడిమసి అయిపోవాల్సిందే. అటువంటిది ఏదో చిన్న ఉద్యోగం.. గ్రామస్థాయిలో అలా పై అధికారులు, చోటా నాయకులు చెప్పింది తలూపుకొంటూ చేసుకొని పోయే వారిపై కన్నెర్ర చేస్తే.. ఇంకేమైనా ఉంటుందా.. ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చినట్లు.. ఆ నియోజకవర్గంలో ఉన్న తమ్ముళ్ల గ్రూపుల గోల.. ఆ ఉద్యోగుల మెడకు చుట్టుకుంటోంది. ఎవరికి చెప్పుకోవాలో తెలియక అక్కడ పని చేస్తున్న ఉద్యోగులు లోలోపల కుమిలిపోతున్నారు. ఉద్యోగులపై ఇదెక్కడి పెత్తనం అంటూ ఆవేదన చెందుతున్నారు. కరవమంటే కప్పకు కోపం.. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపంలా ఉంది ఇక్కడి పరిస్థితి. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం కొలువై ఉన్న ఆ నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ తమ్ముళ్లు గ్రూపులు కట్టేశారు. ఒకరంటే ఒకరికి పడదాయె. ఒకరి పేరు చెబితే.. ఇంకొకరు అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారు. ఇటీవల అమ్మవారి సొంత మండలంలోనే కొత్తగా మంజూరైన పింఛన్లను ఓ ఇద్దరికి సచివాలయ ఉద్యోగి పంపిణీ చేశారు. అనధికార ప్రోటోకాల్ ప్రకారం.. అక్కడ స్థానిక టీడీపీ నాయకుడికి పాపం ఆ ఉద్యోగి చెప్పి.. తన ధర్మం తాను నిర్వర్తించాడు. ఇదే.. అధికార పార్టీలోని మరో వర్గం ‘తమ్ముడికి’ కోపం తెప్పించింది. తనను ఏం పిలవలేదని ఫోన్ చేసి మరీ చెడామెడా ఆ ఉద్యోగికి వాయించేశాడు. తాను ఇక్కడ విధుల్లో చేరి రెండు రోజులే అయ్యిందని సదరు ఉద్యోగి చెప్పినా వినడాయే..! ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తానంటూ బెదిరించాడు. మరోసారి నియోజకవర్గ కేంద్రానికి సమీప మండలంలోని ఓ గ్రామంలో నెలవారీ సరకుల పంపిణీకి తనను పిలవడం లేదని.. అంగన్వాడీ కార్యకర్తపై మరో ‘తమ్ముడు’ చిర్రుబుర్రులాడాడు. నేరుగా ఆ అమ్మవారి పేరు చెప్పే బెదిరించాడు. విషయం బయటకు వచ్చిందని.. ఆమె ఉద్యోగం తీసేసేందుకు అన్ని అస్త్రాలూ ఉపయోగించారు. వీటి అన్నింటి వెనుక.. అమ్మవారి అభయం ఉందనే తేలుతోంది. వారి గ్రూపులు.. వీరి మెడకు చుట్టుకుంటున్నాయి.. అమ్మవారి పుణ్యమానీ.. నియోజకవర్గంలో గ్రూపుల గోల తీవ్ర స్థాయిలో ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రతి మండలంలోనూ తనకంటూ ఓ వర్గాన్ని ఆమె ప్రత్యేకంగా తయారు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొత్త కొత్త వివాదాలు పుట్టుకొస్తున్నాయి. సొంత పార్టీలోనే కుమ్ములాటలు చోటు చేసుకుంటున్నాయి. ఇది కాస్త స్థానిక ఉద్యోగుల మెడకు చుట్టుకుంటోంది. రెండు వర్గాల పెత్తనంతో నలిగిపోతున్నారు. పొరపాటున అమ్మవారి వర్గానికి ఏ విషయంలోనైనా వ్యతిరేకంగా పరిణామాలు జరిగితే.. వీరిపై బదిలీవేటే. ఈ నియోజకవర్గంలో మహ‘రాణి’ పెత్తనం కింద బానిసల్లా బతకలేక ఉద్యోగులు నలిగిపోతున్నారు. బానిస సంకెళ్లు తెంచుకునే రోజుకోసం ఇప్పటినుంచే ఎదురుచూస్తున్నారు. పాపం.. ఆరు నెలల కిందట ఓ ‘పెద్ద’పంచాయతీకి ఆ కార్యదర్శి బదిలీపై వచ్చాడు. అందరితో ఆయన ‘పథం’ బాగానే కలిసి సాగేది. దాదాపు ఉద్యోగుల బదిలీలు అన్నీ అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే జరిగాయి. తాము కోరుకున్న వారినే మరీ తమ్ముళ్లు తెచ్చుకున్నారు. ఒక విషయం మాత్రం ఆ కార్యదర్శితో చెడింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తి అధికారికమైనది. ప్రభుత్వ పరంగా నిర్వహించడం వల్ల అధికారులంతా హాజరయ్యేవారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు.. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం పూర్తిగా పార్టీకి సంబంధించినది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమానికి హాజరైన దాఖలాలు లేవు. ఈ పంచాయతీలో సదర కార్యదర్శి హాజరు కాలేదని అమ్మవారు కోపద్రిక్తులయ్యారు. ఏకంగా సరెండర్ చేసి పడేశారు. ఆ ఉద్యోగి సంజాయిషీ ప్రయత్నిస్తే.. ‘సస్పెండ్ చేయలేదు కదా సంతోషించు’ అంటూ అమ్మవారు సెలవివ్వడం గమనార్హం. ‘కొత్త’గా ఉంటుందని మరో కార్యదర్శి ఆ పంచాయతీకి ‘వలస’ వచ్చాడు. అక్కడ కూడా పెన్షన్లను టీడీపీలోని వేరే వర్గం వారిని పిలిచి పంపిణీ చేశారని.. మరో వర్గానికి చెందిన అదే పార్టీ నాయకుడు సర్పంచ్, కార్యదర్శికి వ్యతిరేకంగా ధర్నా చేశాడు. ఈ పంచాయితీ కాస్త అమ్మవారి దగ్గరికి వెళ్లడంతో.. వచ్చిన ఏడాది కాలంలోనే ఆ పంచాయతీ నుంచి కార్యదర్శిని బదిలీపై పంపించేశారు. ఉద్యోగాలను నమ్మి.. కుటుంబాలను తీసుకొచ్చేస్తున్నామని.. ఎన్ని రోజులు ఉంటామో తెలియని పరిస్థితి ఎదురవుతోందని ఆయన వాపోతున్నాడు. పింఛన్ల పంపిణీకి పిలవలేదని తమ్ముడి ఫిర్యాదు కార్యదర్శిపై బదిలీ వేటు? పార్టీ కార్యక్రమంలో పాల్గొనలేదని మరో కార్యదర్శికి సరెండర్ శిక్ష తమ్ముళ్ల పెత్తనంతో నలిగిపోతున్న ఉద్యోగులు -
రక్త పరీక్ష కేంద్రాల్లో అక్రమ వసూళ్లు!
● జిల్లాలో 47 రక్త పరీక్ష కేంద్రాలు ● మలేరియా, టైఫాయిడ్, డెంగీ స్పెషల్ ప్యాకేజీలంటూ వసూళ్లు ● ప్యాకేజీ కింద రూ.2 వేల నుంచి 2500 వరకు వసూళ్లు పార్వతీపురం టౌన్: పల్లె, పట్టణం అన్న తేడా లేదు.. మంచం పట్టని గ్రామం అంతకన్నా లేదు.. వీధివీధినా.. ఇంటింటిలో జ్వరంతో ప్రజలు అల్లాడుతున్నారు. జ్వర బాధితులను కాళ్లు వాపులు, ఒళ్లు నొప్పులు వేధిస్తున్నాయి. వచ్చింది ఏ జ్వరమో తెలుసుకునేందుకు రక్త పరీక్ష కేంద్రాలకు వెళ్తే మలేరియా, టైఫాయిడ్, డెంగీ ప్యాకేజీ అంటూ రూ.2వేల నుంచి రూ.2500 వరకూ కేంద్రాల నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. నెల రోజులుగా.. నెల రోజులుగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రైవేట్ రక్త పరీక్ష కేంద్రాల నిర్వాహకులు ఒక్కొక్క పరీక్షకు ఒక్కో రేటు అన్న చందంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఏ పరీక్షకు ఎంత ధర అన్న వివరాలు తెలిపే బోర్డులు ఏవీ ఏర్పాటు చేయడం లేదు. జ్వర పీడితులు అధికంగా ఉండటంతో మలేరియా, టైఫాయిడ్, డెంగీ పరీక్షలకు ప్రత్యేక ప్యాకేజీ అంటూ వేల రూపాయిలు వసూలు చేస్తున్నారు. జ్వర పీడితులను తమ వద్దకు పంపించిన ప్రైవేటు వైద్యులు, ఆర్ఎంపీలకు రక్త పరీక్ష కేంద్రాల నిర్వాహకులు కమీషన్లు ముట్టజెబుతున్నారు. సీజనల్ వ్యాధుల ముసుగులో రక్త పరీక్ష కేంద్రాల వారు బాగా దండుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పీహెచ్సీల్లో అంతంతమాత్రంగానే... జిల్లాలొని 37 పీహెచ్సీలతో పాటు ఐదు పట్టణ అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. గతంలో ఆసుపత్రుల్లో నిత్యం ఓపీకి 20 నుంచి 30 వరకు వచ్చేవారు. గత వైఎస్సార్ సీపీ పాలనలో ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది పెరగడమే కాకుండా, అవసరమైన మందులు, రక్త పరీక్షలకు యంత్ర పరికరాలు సమకూరాయి. వైద్య సేవలు మెరుగు కావడంతో రోజుకు వంద మంది ఓపీ సేవలు అందించేవారు. రక్త పరీక్షల సామగ్రి పీహెచ్సీలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో గతంలో పరీక్షలు వేగవంతంగా చేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత పీహెచ్సీల అభివృద్ధి గాలికి వదిలేయడంతో పీహెచ్సీల్లో సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయన్న విమర్శలున్నాయి. డిస్ప్లే బోర్డులు తప్పనిసరి రక్త పరీక్ష కేంద్రాల్లో ధరలకు సంబందించి డిస్ప్లే బోర్డులు తప్పనిసరిగా ప్రదర్శించాలి. అధిక ధరలు వసూలు చేస్తున్న ల్యాబ్లను గుర్తించి ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన ల్యాబ్లలో మాత్రమే రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిది. అన్ని పీహెచ్సీలలో రక్త పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రజలు గమనించాలి. – డాక్టర్ టి.జగన్మోహన్రావు, ఎన్సీడీ జిల్లా ప్రోగ్రాం అధికారి చర్యలు తీసుకుంటాం.. రక్త పరీక్ష కేంద్రాల నిర్వాహకులు అధిక ధరలు వసూలు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అధిక ధరలు వసూలు చేస్తున్న వారి వివరాలు తెలిపితే అక్కడకు వెళ్లి విచారణ చేస్తాం. ల్యాబ్ల్లో తనిఖీలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాం. ఎక్కడ అధికంగా వసూలు చేసినా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ భాస్కరరావు, డీఎంఅండ్హెచ్వో, పార్వతీపురం -
25 నాటికి సమచారం అప్డేట్ కావాలి
● కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పార్వతీపురం రూరల్: అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన ఈ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ (కేపీఐ)లను ఈ నెల 25లోగా ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మాసిక, త్రైమాసిక, వార్షిక లక్ష్యాలు, ప్రగతిని నమోదు చేయాలని వీడియోకాన్ఫరెన్స్లో శనివారం సూచించారు. పొరపాట్లకు తావివ్వకుండా చూడాలన్నారు. సమావేశంలో జేసీ ఎస్ఎస్ శోభిక, డీఆర్వో కె.హేమలత, ఎస్డీసీ ఎస్.దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. బీఎల్ఓలకు సహకరించండి పార్వతీపురం: ఓటరు జాబితా తయారీలో రాజకీయ పక్షాల ప్రతినిధులు, బీఎల్ఓలకు సహకరించాలని కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి ఎన్.చిన్నారావు కోరారు. కలెక్టర్ కార్యాలయంలోని డీఆర్ఓ చాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు ఒక నియోజకవర్గంలోనే నమోదై ఉండాలన్నారు. ఓటరు వేరే ప్రాంతానికి బదిలీ అయితే, తన ఓటుహక్కును కూడా బదిలీ చేసుకోవాలన్నారు. సమావేశంలో వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. చిన్నారులకు మెరుగైన వైద్యం ● డీఎంహెచ్ఓ భాస్కరరావు పార్వతీపురంటౌన్: చిన్నారులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు వైద్యారోగ్యశాఖ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్టు డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు తెలిపారు. ఎన్హెచ్ఎం, ఆర్బీఎస్కేలో భాగంగా జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రంలో శనివారం నిర్వహించిన ఉచిత గుండె వైద్యశిబిరాన్ని ఆయన పరిశీలించారు. విశాఖపట్టణం నుంచి వచ్చిన గుండె వైద్యనిపుణులు ఎ.అశోక్రాజు 18 ఏళ్ల లోపు బాలలు 26 మందికి గుండె పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఏడుగురిని మెరుగైన వైద్యసేవల కోసం ఎన్టీఆర్ వైద్యసేవ కింద మెడికవర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారులు టి. జగన్మోహన్రావు, రఘుకుమార్, పిల్లల వైద్యనిపుణులు భరత్ చంద్ర, ఎపిడిమాలజిస్ట్ కౌశిక్ పాల్గొన్నారు. బొబ్బిలి: రాష్ట్రంలో కొత్తగా వితంతువులు, వృద్ధులు, నిరుపేద వర్గాలవారికి ఒక్క పింఛన్ మంజూరు చేయకుండా, గత ప్రభుత్వం మంజూరు చేసిన దివ్యాంగుల పింఛన్ల తొలగింపుకు కూటమి ప్రభుత్వం పూనుకోవడం దారుణమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. బొబ్బిలిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి పాలనలో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని, కోతలే కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఏడాది పాలనలో 4లక్షల పింఛన్లను నిలివేయగా, జిల్లాలో 80వేల పింఛన్లు తొలగించిన ఘనత కూటమిదేనన్నారు. దివ్యాంగులు దేవుడు బిడ్డలని, వారికి అండగా ఉండి ఆదుకోవాల్సిన ప్రభుత్వం కక్షసాధిస్తోందన్నారు. దివ్యాంగులకు అండగా వైఎస్సార్సీపీ ఉంటుందని స్పష్టంచేశారు. యూరియా కోసం రైతులు నానా పాట్లు పడాల్సి వస్తోందన్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడమే ఎరువు కష్టాలకు ప్రధాన కారణమన్నారు. నిరుద్యోగ భృతి ఏదీ? ఎన్నికల ముందు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్న కూటమి నాయకులు ఇప్పుడు ఏం మాట్లాడడం లేదన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారన్నారు. 16 నెలల్లో ఎంతమందికి నిరుద్యోగ భృతి చెల్లించారో చెప్పాలని డిమాండ్ చేశారు. -
నిందితులను శిక్షించడంలో విజయనగరం టాప్
విజయనగరం క్రైమ్: మహిళలపై దాడులు చేపడుతున్న వారితో పాటు పోక్సో కేసుల్లోని నిందితులను శిక్షించడంలో విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని డీఐజీ గోపీనాథ్ జెట్టీ అన్నారు. శనివారం స్థానిక డీపీఓ అర్ధ సంవత్సరపు నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జిల్లా జడ్జి బబిత హాజరైన ఈ సమీక్షలో డీఐజీ మాట్లాడుతూ..ఎన్డీపీఎస్ కేసుల్లో ఎక్కువగా విద్యార్థులు అరెస్ట్ అవుతున్నారన్నారు. గంజాయికి అలవాటు పడిన వ్యక్తులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి, డీ అడిక్షన్ సెంటర్లకు తరలించి చికిత్స అందించాలని సూచించారు. నేరాల నియంత్రణలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. సమాజానికి కీడు కలిగించే ప్రతీ అంశం తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీస్ సిబ్బందిపై ఉందన్నారు. సైబర్ కేసులను దర్యాప్తు చేసేందుకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని పోలీస్ అధికారులు మెరుగుపరుచుకోవాలని తెలిపారు. అనుమతుల్లేకుండా కలిగి ఉన్న ఆయుధాలను స్వాధీన పరుచుకునేందుకు కార్డన్సెర్చ్ కార్యక్రమాలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. పరిహారం మంజూరయ్యేలా చర్యలు.. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాట్లాడుతూ.. హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు పరిహారం తక్షణమే మంజూరయ్యే విధంగా చర్యలు చేపడతామన్నారు. జాతీయ రహదారిపై 66 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు రూ.5 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రతి పోలీస్స్టేషన్కు ఒక డ్రోన్ అందిస్తామన్నారు. అనంతరం ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ.. గంజాయి నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రతి రోజూ పది ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపడుతుండడంతో పాటు ఐదు చెక్పోస్టులు ఏర్పాటు చేసి గంజాయి రవాణాను అడ్డుకుంటున్నామని తెలిపారు. 25 పోక్సో కేసుల్లోను, మరో 18 కేసుల్లో నిందితులు శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నామన్నారు. అనంతరం శక్తి యాప్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన షార్ట్ఫిల్మ్ను విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆవిష్కరించారు. షార్ట్ ఫిల్మ్ను రూపొందించిన అగ్గిరాజు, రూప, హారికలను అధికారులు అభినందించారు. అదేవిధంగా గంజాయి కేసుల్లో ఇన్విస్టిగేషన్ను సమర్థవంతంగా పూర్తి చేసిన ఎస్.కోట సీఐ వి.నారాయణమూర్తి, బొబ్బిలి రూరల్ సీఐ కె.నారాయణరావులకు డీఐజీ గోపీనాథ్ జెట్టీ ప్రశంసాపత్రాలు అందజేశారు. సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్టు కమిషనర్ డి.మణికుమార్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటిండెంట్ బి.శ్రీనాథుడు, డీఎఫ్ఓ ఆర్. కొండలరావు, డీఎంహెచ్ఓ జీవన్రాణి, డీఈఓ కేవీ రమణ, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కె.అప్పలరాజు, డీఎస్పీలు ఎం.శ్రీనివాసరావు, జి. భవ్యారెడ్డి, డీఎస్పీ ఎస్.రాఘవులు, డీఎస్పీ ఆర్.గోవిందరావు, డీఎస్పీ ఎం.వీరకుమార్, న్యాయ సలహాదారులు వై.పరశురాం, జైళ్ల శాఖ, ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, డ్రగ్స్ అండ్ కంట్రోల్ శాఖాధికారులు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. డీఐజీ గోపీనాథ్ జెట్టీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలి.. న్యాయస్థానాల్లో ప్రాసిక్యూషన్ వేగవంతంగా పూర్తయ్యేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలని జిల్లా జడ్జి బబిత కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను కోరారు. ఎన్డీపీఎన్ కేసుల్లో ఇన్వెంటరీ, సీజర్ చేయడంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. సెప్టెంబర్ 13న నిర్వహించనున్న లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని పోలీస్ అధికారులను కోరారు. -
ఆర్ఎంపీ ఆత్మహత్య
విజయనగరం క్రైమ్: పురుగుల మందు తాగి ఆర్ఎంపీ వైద్యుడు నరసింహరావు(48) ఆత్మహత్య చేసుకున్నట్టు వన్ టౌన్ పోలీసులు శనివారం తెలిపారు. దీనికి సంబంధించి ఏఎస్ఐ జగన్మోహనరావు తెలిపిన వివరాలు.. భోగాపురంలో ఆర్ఎంపీ డాక్టర్గా పని చేస్తున్న నరసింహరావు రెండు రోజుల కిందట భార్య జ్యోతికి విజయనగరంలో పని ఉందని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. నరసింహరావు నగరంలోని సంగీత కళాశాల వద్ద ఉన్న ఎల్లమ్మ గుడి వద్ద పడి ఉండడాన్ని శనివారం గుర్తించిన స్థానికులు ఫోన్ నంబరు ఆధారంగా భార్యకు సమాచారం అందించారు. వెంటనే భోగాపురం నుంచి వచ్చిన జ్యోతి అపస్మారక స్థితిలో ఉన్న భర్తను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేర్పించింది. కాగా, శనివారం మృతి చెందినట్టు ఆసుపత్రి వర్గాలు వన్ టౌన్ పోలీసులకు తెలియజేయడంతో కేసు నమోదు చేశారు. -
‘ఉపాధి’ అవకతవకలపై విచారణ వాయిదా
లక్కవరపుకోట: మండలంలోని కోనమసివానిపాలెం గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని గ్రామానికి చెందిన కాకర శ్రీనివాసరావు గత నెలలో కలెక్టరేట్ గ్రీవెన్స్సెల్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఉపాధిహామీ పథకం అధికారులు విచారణ చేపట్టడానికి శనివారం గ్రామానికి రాగా.. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడంతో అధికారులు వెనుదిరిగారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఉపాధిహామీ పథకం క్షేత్ర సహాయకుడు బండ అప్పారావు (అప్పన్న) మరో 39 మంది వ్యక్తులతో కలిసి ఉపాధి నిధులను దుర్వినియోగం చేసినట్లు కాకర శ్రీనివాసరావు గ్రీవెన్స్సెల్లో ఫిర్యాదు చేశారు. 2011 సంవత్సరం నుంచి 2019 వరకు జరిగిన అవకతవకలపై సోషల్ ఆడిట్ బృందాలు సైతం సక్రమంగా ఆడిట్ నిర్వహించలేదని.. అలాగే 2024 వరకు పనికి వెళ్లని వారి పేరిట దొంగ మస్తర్లు వేసి నిధులు దోచుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గజపతినగరం ఏపీడీ కె.రామామణి ఆధ్వర్యంలో అధికారులు గ్రామంలో గల పంచాయతీ కార్యాలయం వద్దకు శనివారం చేరుకుని విచారణకు సిద్ధపడగా గ్రామస్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. పనులకు సంబంధించి ఎటువంటి అవకతవకలు జరగలేదని ఒకవర్గం.. జరిగాయని మరోవర్గం ఆరోపిస్తూ వాదనకు దిగారు. దీంతో ఓ దశలో తోపులాట జరగడంతో అధికారులు భయంలో సమీపంలో గల రామాలయంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు. అయితే పరిస్థితి అనుకూలంగా లేదని పోలీసులు చెప్పడంతో విచారణను వాయిదా వేస్తున్నట్లు ఏపీడీ రమామణి ప్రకటించి, వెళ్లిపోయారు. కార్యక్రమంలో డీబీటీ మేనేజర్ ఆసీఫ్ హుసేన్, స్థానిక ఎపీఓ విజయలక్ష్మి , తదితరులు పాల్గొన్నారు. -
స్ఫూర్తి ప్రదాత.. టంగుటూరి
● ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పార్వతీపురం రూరల్: రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు స్ఫూర్తి ప్రదాత అని, ఆంధ్ర రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఎనలేని కీర్తిని తీసుకువచ్చారని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి అన్నారు. టంగుటూరి జయంతిని జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. న్యాయవాదిగా, రాజకీయ వేత్తగా, రచయితగా, సంపాదకీయుడిగా, రాజనీతిజ్ఞునిగా ప్రకాశం పంతులు విశేషంగా రాణించారని ఎస్పీ కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, సీఐలు రంగనాథం, ఆదాం, ఆర్ఐలు నాయుడు, రాంబాబు, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో... టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోభిక ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమ పోరాటంలో ఆంగ్లేయులకు ఎదురు నిలిచి గుండె చూపిన ధైర్యశీలి టంగుటూరని ఆమె అన్నారు. -
ఎరువు కోసం గిరిజన రైతుల ఆందోళన
జియ్యమ్మవలస రూరల్: ఎరువు దొరకక గిరిజన రైతులు ఆందోళనకు దిగారు. అలమండ పంచాయతీలో నిడగళ్లుగూడ, చినతోలుమండ, చినతోలుమండ గూడ, రామభద్రపురం, ఎస్సీ మరువాడ, ఎసీ్ట్ మరువాడ, నీలకంఠాపురం తదితర తొమ్మిది గ్రామాలకు చెందిన 600 మంది రైతులు ఎరువుల కోసం ఇబ్బంది పడుతున్నా పట్టించుకునేవారే లేరని వాపోయారు. ప్రస్తుతం 222 బస్తాల యూరియా వచ్చిందని, ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున ఇచ్చినా మరో 400 బస్తాల ఎరువు అవసరమని, పూర్తిస్థాయిలో ఎప్పుడు సరఫరా చేస్తారని కూటమి సర్పంచ్ చంటి అధికారులను ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం రైతుపై చిన్నచూపు చేస్తోందని, విత్తనాలు, ఎరువులు అందించడంలో విఫలమైందటూ రైతులు నగేష్, అన్నపూర్ణ తదితరులు ఆరోపించారు. -
రైతన్నకు కష్టాలే...
కూటమి పాలనలోవిజయనగరం గంటస్తంభం: చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా రైతులు ఎరువులు, విత్తనాల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకుంటుందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు పీడిక రాజన్నదొర అన్నారు. విజయనగరం ప్రదీప్నగర్లో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఇంటి వద్ద విలేకరులతో శనివారం మాట్లాడారు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల వద్ద స్టాక్ ఉంచి రైతులకు అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కూటమి ప్రభుత్వం రైతును వంచించడం సబబు కాదన్నారు. విజయనగరం, సాలూరు నియోజవర్గంలో సుమారుగా 2,500 మంది పింఛన్దారులకు నోటీసు అందజేయడం విచారకరమన్నారు. నోటీసులు ఇచ్చామే తప్ప పింఛన్లు తొలగించమంటూ జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పడం సిగ్గుచేటన్నారు. సూపర్ సిక్స్ హామీలను త్రికరణ శుద్ధితో అమలుచేయడంలో సీఎం చంద్రబాబు చేతులెత్తేశారని విమర్శించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 58,58,000 మందికి రైతు భరోసా అందజేస్తే.. నేడు సుమారు 78 లక్షల మంది రైతులు ఉండగా 50 లక్షల మందికే అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి కలిగిందన్నారు. తల్లికి వందనం పథకంలోనూ కోత పెట్టారన్నారు. అధికారంలోకి వచ్చి 16 నెలలవుతున్నా నిరుద్యోగభృతి ఊసేలేదన్నారు. రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఉత్త గ్యాస్గా మారిందని విమర్శించారు. ఆడబిడ్డ నిధికి సమాధి కట్టేశారని విమర్శించారు. 18 నుంచి 59 ఏళ్లలోపు వయస్సు మహిళందరికీ ఆడబిడ్డ నిధి కింద ప్రతీనెలా రూ.1500 అందజేస్తామని చెప్పి ఉసూరుమనిపించారన్నారు. అబద్ధాల పాలన గిరిజన సంక్షేమ మంత్రి సంధ్యారాణి మాటల్లో నూరుకి తొంభై అబద్ధాలే ఉంటాయని రాజన్నదొర విమర్శించారు. సాలూరు నియోజకవర్గంలోని గిరిశిఖర గ్రామాలకు చంద్రబాబు హయాంలో ఒక్క రోడ్డు కూడా వేయలేదన్నారు. మక్కువ నుంచి మంత్రి స్వగ్రామం కవిరిపలిక్లి, కవిరిపల్లి నుంచి శంబరకు, శంబర నుంచి మామిడిపల్లికి వెళ్లే రోడ్లు అధ్వానంగా మారినా మంత్రి స్పందించకపోవడం విచారకరమన్నారు. మక్కువ నుంచి భోగవలస మెయిన్ రోడ్డును రూ.56 కోట్లతో కొంతమేర పనులు చేసిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదేనన్నారు. మంత్రికి బురద జల్లడం తప్ప పనులు చేయడం చేతకావడంలేదని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలెప్పుడు? ఆడబిడ్డ నిధికి సమాధి నిరుద్యోగ భృతి ఎక్కడ? గ్యాస్ సబ్సిడీ నిల్ మంత్రి ఇలాకాలో రహదారులు అధ్వానం కూటమి సర్కారు వైఫల్యాలపై పీడిక రాజన్నదొర ధ్వజం -
బాల్యంపై బ్యాగుల బరువు
వీరఘట్టం: ప్రతి శనివారం బ్యాగు మోత లేకుండా విద్యార్థులకు ఆట, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిత్రలేఖనంతో పాటు సామాజిక అంశాలపై పట్టు సాధించేలా బోధన చేపట్టి ఒక్క శనివారం మాత్రం నో బ్యాగ్ డే పాటించేలా చర్యలు తీసుకుంటామని ఇటీవల ప్రభుత్వం ప్రకటన చేసింది. అయితే ఈ ప్రకటన ఇంత వరకు అమల్లోకి రాలేదు. నేటి కంప్యూటర్ కాలంలోనూ విద్యార్థులకు బ్యాగుల బరువు మోత తప్పడం లేదు. ఆధునిక బోధన విధానంలోనూ చిన్నారులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడటం లేదన్న విమర్శలున్నాయి. ఉల్లాసాన్ని ఇచ్చే క్రీడలు కనిపించడం లేదు. ఉత్సాహాన్నిచ్చే వాతావరణానికి దూరవుతున్నారు. కేంద్ర విద్యాశాఖ సైతం ఈ వాస్తవాలను ఒప్పుకుంది. చిన్నారులను బరువుల మోత నుంచి బయట పడేయాలని సూచనలు చేసింది. కానీ ఎక్కడా ఇది అమలుకు నోచుకోవడం లేదు. ఆందోళనలో చిన్నారుల పరిస్థితి కేంద్ర విద్యాశాఖ అధ్యయనం ప్రకారం 70 శాతం మంది విద్యార్థులు పుస్తకాల బరువుతో అనారోగ్యం పాలవుతున్నారు. కండరాలు, మోకాళ్లపై ఒత్తిడి పడుతోంది. 22 శాతం మందిని వెన్నెముక నొప్పి వెంటాడుతోంది. అతి చిన్న వయస్సులోనే నీరసం, భుజాలు వంగి పోవడం సర్వ సాధారణమైంది. 90 శాతం మందికి ఏడు గంటల నిద్ర కరువే. దీంతో తరగతి గదిలో చురుకుదనం తగ్గుతోంది. బహుళ అంతస్తుల భవనాల్లో ప్రైవేట్ బడులు ఉంటున్నాయి. బరువు వేసుకుని మెట్లు ఎక్కడంతో అనేక అనారోగ్య సమస్యలొస్తున్నాయి. అమలు కాని నిబంధనలు..పుస్తకాల బరువుపై కేంద్ర విద్యాశాఖ ఐదేళ్ల క్రితమే హెచ్చరించింది. చిన్నపిల్లల బరువులో పది శాతమే పుస్తకాల బరువు ఉండాలని స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్ధితి మరే దేశంలోనూ లేదని బరువుపై అధ్యయనం చేసిన యశ్పాల్ కమిటీ చెప్పింది. అధిక బరువు వల్ల కండరాలపై ఒత్తిడి పడి భవిష్యత్త్లో దీర్ఘకాల సమస్యలు వెంటాడుతున్నాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. డిజిటల్ బోధన మేలని సూచించాయి. అయితే కోవిడ్ తర్వాత ప్రపంచం మొత్తం డిజిటల్ విద్య వైపు మళ్లుతున్నా..మనం ఆ దిశగా అడుగులేయడం లేదు. మార్కుల కోసం గంటల కొద్దీ చదివించే ప్రైవేట్ స్కూళ్లను కట్టడి చేసే దిక్కులేదు. ప్రతి శనివారం అమలు కాని నో–బ్యాగ్ డే కంప్యూటర్ కాలంలోనూ విద్యార్థులకు కష్టాలు బ్యాగు బరువుతో అకెక్కిన ఆటలు చిన్నారుల్లో పెరుగుతున్న అనారోగ్య సమస్యలు పట్టించుకోని విద్యాశాఖ -
తోటపల్లి కాలువలో జారి పడి వ్యక్తి మృతి
తెర్లాం: తోటపల్లి ప్రధాన కుడికాలువలో ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయిన ఓ వ్యక్తి మృతి చెందాడు. తెర్లాం మండలంలోని కవిరాయునివలస గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తులు, తెర్లాం ఎస్సై బి.సాగర్బాబు తెలిపిన వివరాలి లా ఉన్నాయి. సింగిరెడ్డివలస గ్రామానికి చెందిన జమ్మల శంకరరావు(50) శుక్రవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో తోటపల్లి ప్రధాన కుడికాలువ పక్కకు బహిర్భూమికి వెళ్లాడు. కాలువలో దిగి పైకి ఎక్కుతున్న సమయంలో కాలుజారి నీటిలో పడిపోయాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో నీటిలో మునిపోయాడు. కొద్దిసేపటికి గ్రామస్తులు పొలం పనులకు తోటపల్లి కాలువ వైపు వెళ్తూ నీటిలో పడిపోయి ఉన్న వ్యక్తిని చూసి వెంటనే బయటకు తీసి పడిపోయిన వ్యక్తి తమ గ్రామానికి చెందిన జమ్మల శంకరరావుగా గుర్తించారు. అప్పటికే శంకరరావు మృతి చెందడంతో బంధువులు, గ్రామస్తులకు, తెర్లాం పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాలువలో పడి వ్యక్తి మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న తెర్లాం ఎస్సై సిబ్బందితో సహా సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ జి.హేమంత్కుమార్ వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మృతుడికి భార్య అప్పమ్మ, ఇద్దరు వివాహితులైన పిల్లలు ఉన్నారు. వారు ముగ్గురు చైన్నెకి కూలిపనుల నిమిత్తం వెళ్లి ప్రస్తుతం అక్కడే ఉన్నారు. మృతదేహానికి బంధువులు, గ్రామ పెద్దల సమక్షంలో శవ పంచనామా చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్సీకి తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సాగర్బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాముకాటుతో మహిళ..సంతకవిటి: మండలంలోని మల్ల య్యపేట గ్రామానికి చెందిన మూల అమ్మడు(49) పాముకాటుకు గురై మరణించినట్లు ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం ఎప్పటిలాగానే అమ్మడు భర్త వెంకటరావుతో కలిసి వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లగా పొలంలో ఆమెను పాము కాటు వేయడంతో శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మరణించింది. ఈ ఘటనపై మృతురాలి భర్త వెంకటరావు శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేశామని, మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించామని ఎస్సై తెలిపారు.చెరువులో పడి వ్యక్తి ఆత్మహత్య? బొబ్బిలిరూరల్: మండలంలోని ఎం.బూర్జివలస గ్రామ సమీపంలోని చెరువులో గుర్తు తెలియని వ్యక్తి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు చెరువులో గాలింపు చేపట్టారు. గ్రామానికి చెందిన సన్యాసమ్మ అనే మహిళ అదే దారిలో వెళ్తుండగా కొంత దూరంలో ఎవరో చెరువులో దూకినట్లు కనిపించిందని స్థానికులకు తెలియజేయడంతో స్థానికు సమాచారంతో ఎస్సై రమేష్ తన బృందంతో వచ్చి గాలింపు చేపట్టారు. ఈతగాళ్లను చెరువులో దింపి గాలింపు చేపట్టినప్పటికీ ఎవరి మృతదేహం లభ్యం కాలేదు.దీంతో నిజంగా జరిగిందా? లేక అపోహ? అన్న కోణంలో పోలీసులు స్థానికులను విచారణ చేశారు. చూసిన మహిళ వృద్ధురాలు కావడంతో నీటి బాతులను చూసి చెప్పి ఉంటుందని కొంతమంది, నిజంగా జరిగితే పరిస్థితి ఏమిటని మరి కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో శుక్రవారం సాయంత్రం వరకు గాలింపు కొనసాగుతునే ఉంది. చెరువులో ఎటువంటి అచూకీ లభ్యం కాలేదని ఎస్సై రమేష్ తెలిపారు. విజయనగరం క్రైమ్: విజయనగరం వన్టౌన్ స్టేషన్ పరిధి రంగిరీజువీధికి చెందిన తాడి శంకరరావు(68) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు వన్టౌన్ సీఐ చౌదరి శుక్రవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శంకరరావు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. భర్త శంకరరావు ఆత్మహత్యపై భార్య ఆరోపణలు చేయగా పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని సీఐ తెలిపారు. -
పోలీస్ శాఖ ఔన్నత్యాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలి
విజయనగరం క్రైమ్: జిల్లాలో హోంగార్డులుగా పనిచేస్తూ ఇటీవల రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి వెల్లడించిన ఫలితాల్లో కానిస్టేబుల్స్గా ఎంపికై న ఆరుగురు హోంగార్డులు శుక్రవారం ఎస్పీ వకుల్జిందల్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఎస్పీ అభినందిస్తూ పోలీస్శాఖలో హోంగార్డుగా పనిచేసిన మీరు సివిల్ కానిస్టేబుల్గా ఎంపికై న తరుణంలో శాఖను ఉన్నతస్థాయిలో తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా పనిచేయాలని సూచించారు. కానిస్టేబుల్గా ఎంపికై న మీపై మరింత బాధ్యత పెరిగిందని, శాఖపట్ల అవగాహన, అనుభవంతో కర్తవ్యదీక్షతో పనిచేయాలని హితవు పలికారు. కానిస్టేబుల్గా ఎంపికై న హోంగార్డులు నాగరాజు, ఈశ్వరరావు, గౌరినాయుడు, సత్యనారాయణ, దేవి, గౌరినాయుడులు ఎస్పీని అభినందించి దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో హోంగార్డుల ఇన్చార్జి ఆర్ఐ రమేష్కుమార్, హెచ్సీలు శ్రీను, రాజు పాల్గొన్నారు. ఎస్పీ వకుల్ జిందల్ -
ప్రభుత్వ స్థలంలో కూటమి నేత కబ్జా
● అక్రమంగా షెడ్డుల నిర్మాణం ● షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసమని ఆరోపణలుగంట్యాడ: అధికారం ఉందని కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. అధికార దర్పంతో ఎక్కడ స్థలం కనబడినా అక్రమిస్తున్నారు. అంతేకాకుండా ఆక్రమించిన స్థలాల్లో నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. అధికారులు కూడా అఽధికార పార్టీ నేతలు ప్రభుత్వ స్థలాలు అక్రమించుకున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమణ కళ్లెదుట కనిపిస్తున్నా తమకు ఏమీ కనబడడం లేదన్న విధంగా అధికారులు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అందులోనూ మంత్రి సొంత మండలంలో తమను ఎవరు ఏమీ అనరనే ధీమాతో కూటమి నేతలు రెచ్చిపోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఖరీదైన స్థలం కొట్టేసే ప్లాన్.. మండలంలోని నరవ గ్రామం జాతీయ రహదారిని ఆనుకుని ఉంది. దీంతో ఇక్కడ స్థలాలకు రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి నేతలు ప్రభుత్వ స్థలాలపై కన్ను వేశారు. జాతీయ రహదారిని అనుకున్న ప్రభుత్వ స్థలం అక్రమించి ఏకంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం షెడ్డు కూడా వేసేశారు. ఈ రోడ్డు గుండానే తహసీల్దార్ నుంచి వీఆర్వో వరకు అందరూ రాకపోకలు సాగిస్తారు. అయినప్పటికీ అక్రమ నిర్మాణం గురించి తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నరనే విమర్శలు ఉన్నాయి. కూటమి నేత అక్రమించిన స్థలం విలువ సుమారు గా రూ. 12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుంది. దీంతో సదరు నేత సొంత స్థలం మాదిరి షెడ్డులు వేసి షాపులు నిర్మించేసి అద్దెకు ఇచ్చేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కూటమి నేతల మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదు. పారదర్శకంగా పాలన సాగిస్తున్నామని మంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు వరకు గొప్పలు చెబుతున్నారు. కానీ అపార్టీ నేతలు ప్రభుత్వ స్థలాలను అక్రమించుకున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ స్థలంలో షెడ్డు నిర్మించినట్టు నా దృష్టికి వచ్చింది. తక్షణమే చర్యలు తీసుకుంటాం. పి.నీలకంఠేశ్వర రెడ్డి, తహసీల్దార్, గంట్యాడ -
అనాథలైన అమ్మానాన్నలు
లక్కవరపుకోట: అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాలు నాడు బిడ్డలా? అన్నట్లు తయారైంది వృద్ధులైన ఆ దంపతుల పరిస్థితి. ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నా అనాథల్లా రోడ్ల వెంబడి పిచ్చివారిలా తిరుగుతూ ఏవరైనా పెట్టింది తింటూ షాపుల ముందు పడుకుంటూ ఆ దంపతులు పడుతున్న దీనస్థితి కలిచివేస్తోంది. నలుగురు పిల్లలను కని పెంచి ప్రయోజకులుగా చేసిన ఆ తల్లిదండ్రులు అనాథల్లా మిగిలిపోయారు. ఈ దీనగాథ ఇలా ఉంది. లక్కవరపుకోట మండల కేంద్రానికి చెందిన సంఘం అప్పలనారాయణ, చిన్నమ్మలు భార్యాభర్తలు. వారికి ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. కాయగూరల వ్యాపారం చేస్తూ పిల్లలను పెంచి వారికి పెళ్లిళ్లు, పేరంటాలు జరిపించారు. అలాగే చిన్నమ్మలుకు తన కన్నవారి కుటుంబం నుంచి కొంత ఆస్తికూడా కలిసి వచ్చింది. ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయగా వారు అత్తవారిళ్లకు వెళ్లిపోయారు. కొడుకులిద్దరూ తన తల్లి కన్న వారి ఇంటి నుంచి వచ్చిన భూమిని లక్షల్లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. తీరా ప్రస్తుతం ఆదంపతులు వృద్ధాప్యంలోకి చేరడంతో వారి ఆలనా పాలన పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆ దంపతులు మతిస్థిమితం లేక ఇద్దరూ చెరో దారిలో పడి రోడ్లపై తిరుగుతూ భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.. -
సాంకేతిక పరిజ్ఞానంతో కేసులు ఛేదించాలి
● నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డిపార్వతీపురం రూరల్: సాంకేతిక పరిజ్ఞానంతో పెండింగ్ కేసుల పరిష్కారం త్వరితగతిన పూర్తిచేయాలని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేరాల నివారణకు సాంకేతికత వినియోగం, కొత్తక్రిమినల్ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోలీసు అధికారులు విధుల్లో నిబద్ధత పాటిస్తూ ప్రతి కేసులో న్యాయపరమైన ఆధారాలు బలపరిచి బాధ్యులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం విధుల్లో విశేష ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో ఏఎస్పీ అంకితా సురానా, ఏఆర్ డీఎస్పీ థామస్రెడ్డి, ఎస్బీ సీఐ రంగనాథం, డీసీఆర్బీ సీఐ ఆదాం, సైబర్ సెల్ సీఐ శ్రీనివాసరావు, సీపీఎస్ సీఐ అప్పారావు, ఏఆర్ఐలు రాంబాబు, నాయుడు, జిల్లాలో ఉన్న సీఐలు, ఎస్సైలు, జీఆర్పీ ఎస్సైలు, ఎకై ్సజ్ సీఐలు తదితరులు పాల్గొన్నారు. -
వారంలోగా గుంతలకు మరమ్మతులు
● ఆర్అండ్బీ ఏఈ బి.రాజేంద్ర కుమార్ ● సాక్షి కథనానికి స్పందన పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రం నుంచి కొరాపుట్ వైపు వెళ్లేందుకు ఉన్న అంతర్రాష్ట్ర రహదారిపై గుంతలకు వారంలోగా మరమ్మతులు చేపడతామని ఆర్అండ్బీ ఏఈఈ బి. రాజేంద్రకుమార్ అన్నారు. ఈనెల 19న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘‘చెరువులను తలపిస్తున్న రోడ్లు’’ అనే శీర్షికకు ఆయన స్పందిస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ రహదారి విస్తీర్ణం నిమిత్తం రూ.17కోట్లు మంజూరవగా అందులో భాగంగా 4/0 కిలోమీటర్ల నుంచి 12/8 కిలోమీటర్ల వరకు విస్తీర్ణ పనులు పూర్తయ్యాయన్నారు. అయితే 2023 నుంచి బిల్లులు చెల్లింపు నిలిచిపోయాయని, ఇటీవల బకాయి బిల్లులు చెల్లింపులు జరగడంతో త్వరలో పనులు ప్రారంభించి పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. పోలయ్య ఆచూకీ లభ్యంసంతకవిటి: మండలంలోని చిత్తారపురం పంచాయతీ పోడలి గ్రామానికి చెందిన ఉరదండ పోలయ్య(76) గత ఆదివారం ఉదయం నాగావళి నదిలో గల్లంతయ్యాడు. పోలయ్య ఆచూకీ లభించకపోవడంతో గత మంగళవారం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నదిలో గాలింపు చేపట్టగా శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పెద్ద బొడ్డేపల్లి వద్ద ఓ మృతదేహం ఒడ్డుకు రావడంతో స్థానికులు అక్కడి వీఆర్ఓకు సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న పోలయ్య కుటుంబసభ్యులు వెళ్లి మృతదేహం పోలయ్యదేనని గుర్తించినట్లు వీఆర్ఓ అన్నారావు, పోలీస్ సిబ్బంది తెలిపారు. -
సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్
రాజాం సిటీ: వచ్చే నెల 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి కె.శారదాంబ అన్నారు. రాజాం కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ న్యాయవాదులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజీకి అనుకూలమైన క్రిమినల్, సివిల్, ప్రీ లిటిగేషన్ కేసులన్నీ లోక్ అదాలత్తో పరిష్కరించుకోవచ్చన్నారు. న్యాయవాదులు, పోలీసులు లోక్అదాలత్కు సహకరించి వీలైనన్ని కేసులను పరిష్కరించుకునే దిశగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సివిల్ కేసులు పరిష్కారమైతే కోర్టు ఫీజులు కూడా వాపసు ఇవ్వనున్నా మని పేర్కొన్నారు. జూనియర్ డివిజన్ సివిల్ జడ్జి సీహెచ్ హరిప్రియ, బార్ అసోసియేషన్ కార్యదర్శి బి.తిరుపతినాయుడు, ప్రభుత్వ న్యాయ వాది పి.శ్రీనివాస్, కె.రమణమూర్తి, ఆర్.రామమూర్తినాయుడు, జె.అప్పలనాయుడు, వైఎస్ శ్రీనివాస్, ఎస్.జయలక్ష్మి,తదితరులు పాల్గొన్నారు. -
జీవో ఇచ్చారు.. డబ్బులు మరిచారు..!
సీతంపేట: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్న చందంగా ఉంది... కూటమి ప్రభుత్వం తీరు. పీఎం జన్మన్ హౌసింగ్ స్కీమ్కు కేంద్రం నిధులు సమకూర్చుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న అదనపు సాయం చేయడంలో మొండిచేయి చూపుతోంది. లబ్ధిదారులను వేదనకు గురిచేస్తోంది. గృహ నిర్మాణదారులను ఆర్థిక కష్టాల్లోకి నెట్టేస్తోంది. పేదలకు పక్కాఇంటి భాగ్యాన్ని దూరం చేస్తోంది. ఇదీ పరిస్థితి... అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి పక్కా గృహాలు లేని పీవీటీజీ (పర్టికులర్లీ వాలనర్బుల్ ట్రైబ్గ్రూప్)లకు ఇళ్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పీఎం జన్మన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఒక్కో గృహానికి రూ.2.39 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. దీనిని మూడు విడతలుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అదనంగా రూ.లక్ష మంజూరు చేస్తామని ప్రకటించింది. గతేడాది డిసెంబర్ 10వ తేదీన జీఓ కూడా జారీ చేసింది. గిరిజనులు సంతోషించారు. ఇంటి నిర్మాణానికి ఆర్థిక ఊతం లభిస్తుందని ఆశపడ్డారు. 9 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు ఒక్కరూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 1749 ఇళ్లు మంజూరయ్యాయి. కేవలం 42 ఇళ్లు మాత్రమే లబ్ధిదారులు పూర్తి చేశారు. 901 ఇళ్లు పునాద దశలోను, మరో 400 రూఫ్ లెవెల్లో ఉన్నాయి. 94 మంది స్లాబ్లు వేయగా, 452 మంది ఇంకా నిర్మాణాలు ప్రారంభించలేదు. ఒక్కో ఇంటికి పునాదులు వరకు నిర్మిస్తే రూ.70 వేలు, రూఫ్ స్థాయిలో 90 వేలు, స్లాబ్ నిర్మిస్తే 40 వేలు, ఎన్ఆర్ఈజీఎస్ రూ.27 వేలు, మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు చెల్తిస్తారు. బిల్లుల చెల్లింపులో అలసత్వం తగదు. ఇస్తామన్న ఆర్థిక సాయం నెలలు గడుస్తున్నా అందలేదు. ప్రభుత్వం స్పందించి జీవో ప్రాప్తికి నిధులు విడుదల చేయాలి. – నిమ్మక అరుణ, టిటుకుపాయి సర్పంచ్ పీఎం జనమన్ ఇంటి నిర్మాణానికి అష్టకష్టాలు పడుతున్నాం. పునాదులు, రూఫ్, స్లాబ్ స్థాయిలో నిర్మించిన వారికి బిల్లులు ఇచ్చారు. అదనపు సాయం అందిస్తే త్వరితగతిన ఇంటిని నిర్మించుకుంటాం. ఇప్పటి వరకు కొంతమందికి రెండువిడతల్లోని నిధులు జమయ్యాయి. ఆ నిధులు ఎటూ సరిపోవడం లేదు. – ఎస్.లక్ష్మి, హౌసింగ్ లబ్ధిదారు, ద్వారబందం పీఎంజన్మన్ కింద తలపెట్టిన గిరిజనుల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. పెండింగ్ లేకుండా బిల్లులు చెల్లిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అదనపు సాయం కోసం జీవో ఇచ్చింది. నిధులు విడుదల కావాల్సి ఉంది. వచ్చిన వెంటనే లబ్ధిదారుల ఖాతాలకు జమచేస్తాం. – సీహెచ్ వెంకటేష్, హౌసింగ్ ఏఈ, సీతంపేట పీఎం జన్మన్ పథకానికి కూటమి తూట్లు పేదల గూళ్లకు నిధులు విదల్చని వైనం గృహ నిర్మాణ లబ్ధిదారులకు రూ.లక్ష ప్రోత్సాహం ప్రకటించి మిన్నకున్న ప్రభుత్వం జీవో జారీచేసి 9 నెలలైనా విడుదల కాని నిధులు అదనపు సాయం కోసం ఎదురుచూపు ఆర్థిక ఇబ్బందుల్లో గిరిజనులు ముందుకు సాగని ఇళ్ల నిర్మాణాలు -
వీవీఆర్ పేటను పార్వతీపురంలో విలీనం చేయాలి
వంగర: మండలంలోని వి.వి.ఆర్.పేట పంచాయతీని పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనం చేయాలని గ్రామస్తులు కోరారు. గ్రామంలో పార్టీలకు అతీతంగా రామమందిరం వేదికగా శుక్రవారం సమావేశమయ్యారు. తమ గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో పార్వతీపురం జిల్లా కేంద్రం ఉందని, ప్రస్తుతం ఉన్న విజయనగరం 110 కిలోమీటర్లు దూరంలో ఉందని వెల్లడించారు. రానుపోను దూరం 220 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని పేర్కొన్నారు. నిత్యం వైద్యం, వ్యాపార, వాణిజ్య అవసరాలకు పార్వతీపురం వెళ్తుంటామని, పాలన పరంగా తమకు అనుకూలమని వెల్లడించారు. సమస్యను అవసరమైతే అమరావతిలోని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళదామని వారంతా నిర్ణయించారు. -
● కుంకుమార్చన
శ్రావణమాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పాలకొండ కోటదుర్గమ్మ ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. – పాలకొండ ప్రత్యేక అలంకరణలో కోటదుర్గమ్మ కోటదుర్గమ్మ ఆలయం ఆవరణలో సామూహిక కుంకుమ పూజలు చేస్తున్న మహిళలు -
ఆర్థిక ఇబ్బందుల్లో ఆదివాసీలు...
రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష సాయం అందిస్తామని జీవో జారీ చేయడంతో పీఎం జన్మన్ పథకంలో గృహ లబ్దిదారులైన ఆదివాసీలు ఇంటి నిర్మాణాన్ని ఉత్సాహంగా ప్రారంభించారు. ఇప్పుడు ఆ ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. కూటమి సర్కారు మాట నిలుపుకోకపోవడంతో గిరిజనులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. నిర్మాణ సామగ్రి, కూలీల ఖర్చులు పెరగడం, కేంద్రం ఇచ్చే ప్రోత్సాహక నిధులు ఎటూ సరిపోక పోవడంతో ఇంటినిర్మాణాలు మద్యలో నిలిచిపోయే పరిస్థితి ఉందని గిరిజనులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి రూ.లక్షలను తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నారు. -
స్వచ్ఛాంధ్ర ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● జేసీ ఎస్.ఎస్.శోభిక పార్వతీపురం రూరల్: జిల్లా వ్యాప్తంగా ప్రతినెలా నాలుగో శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛ పార్వతీపురం కార్యక్రమం ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోభిక అన్నారు. తన చాంబర్ నుంచి కార్యక్రమం నిర్వహణ, అవార్డుల ప్రదానంపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో శుక్రవారం సమీక్షించారు. పల్లెలు, పట్టణాలు, గృహాలు, బహిరంగ ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండేలా పారిశుద్ధ్య పను లు చేపట్టాలన్నారు. పనులకు సంబంధించిన ఫొటోలు అప్లోడ్ చేయాలని సూచించారు. తాగునీటి పరీక్షలు నిర్వహించి స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని కోరారు. మెరుగైన పనితీరు కనబరిచే వారికి అక్టోబర్ 2న బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. సమావేశంలో డీపీఓ కొండలరావు, డీఈఓ రాజ్కుమార్, ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ, డీఎంహెచ్ఓ డా.భాస్కరరావు, డీఏఓ కె.రాబర్ట్పాల్, ఎంపీడీఓలు, కమిషనర్లు పాల్గొన్నారు. ఇన్చార్జి పీఓగా బాధ్యతల స్వీకరణ సీతంపేట: ఐటీడీఏ ఇన్చార్జి ప్రాజెక్టు అధికారిగా పాలకొండ సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ శుక్రవారం పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టారు. ఆయనకు ఐటీడీఏలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని సమీక్షిస్తానని, క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి చేయాల్సిన వివరాలు తెలియజేస్తానన్నారు. విద్యాసంస్కరణల అమలుతో వికసిత్భారత్ ● ఏబీఆర్ఎస్ఎం జాతీయ సంయుక్త వ్యవస్థాపక కార్యదర్శి జి.లక్ష్మీస్ విజయనగరం అర్బన్: నవ భారత్ నిర్మాణానికి జాతీయ విద్యా విధానం–2020 సంస్కరణల అమలు కీలకమని అఖిల భారత రాష్ట్రీయ శిక్షక్ మహాసంఘ్ (ఏబీఆర్ఎస్ఎం) జాతీయ సంయుక్త వ్యవస్థాపక కార్యదర్శి గుంథ లక్ష్మీస్ అన్నారు. కేంద్రీయ గిరిజన యూనివర్సిటీలో ‘హమారా సంవిధాన్–హమారా స్వాభిమాన్– వికసిత్ భారత్ కోసం జాతీయ విద్యావిధానం–2020 ఆత్మలా ఉంది’ అనే అంశంపై శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. రాజ్యాంగ విలువలు, సాంస్కృతిక గౌరవం, విద్యా సంస్కరణలు వంటి చర్యల అమలు వికసిత్ భారత్ నిర్మాణానికి కీలకమన్నారు. వర్సిటీ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్ మాట్లాడుతూ నూతన విద్యావిధానం అమలుతో విద్యా నైపుణ్యాలు మెరుగుపడతాయన్నారు. అనంతరం ముఖ్య అతిథిని సత్కరించారు. కార్యక్రమంలో వర్సిటీ ఏబీఆర్ఎస్ఎం అధ్యక్షురాలు డాక్టర్ పరికిపాండ్ల శ్రీదేవి, వర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జితేంద్రమోహన్ మిశ్రా, వివిధ విభాగాల అధ్యాపకులు ప్రేమాచటర్జీ, బి.కోటయ్య, కె.సురేష్బాబు, బి.వెంకటేశ్వర్లు, ఎం.గంగునాయుడు, పి.కిశోర్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగోన్నతి తర్వాతే డీఎస్సీ నియామకాలు చేపట్టాలి విజయనగరం అర్బన్: ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతి కోటాను భర్తీ చేసిన తర్వాతే మెగా డీఎస్సీ నియామకాలు చేపట్టాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. కమిటీ సభ్యులు శుక్రవారం డీఈఓ యు.మాణిక్యంనాయుడును కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఉద్యోగోన్నతి కల్పించకుండా డీఎస్సీ నియామకాలు చేపడితే ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాడైన పాఠశాలల భవనాలను బాగుచేయాలని విన్నవించారు. డీఈఓను కలిసిన వారిలో సంఘ నాయకులు కె.జోగారావు, సీహెచ్ సూరిబాబు, ఎస్.చిట్టిబాబు, పి.లక్ష్మణరావు, బి.అడివయ్య, వాసుదేవరావు, వి.మల్లేశ్వరరావు, రవి తదితరులు ఉన్నారు. -
వినేవారే లేరా?
వీఆర్ఏల గోడు.. పార్వతీపురంటౌన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తోంది... వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి కనీసం చొరవ చూపడంలేదు. వినతులు అందజేసినా ఫలితం లేదు. నెలకు ఇచ్చిన రూ.11వేల వేతనంతో కుటుంబాన్ని పోషించేందుక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పదోన్నతుల కల్పనలో కూటమి కినుక వహిస్తోంది. వాచ్మన్ ఉద్యోగం సైతం చేయిస్తోంది. ఖాళీలను భర్తీ చేయకుండా పనిభారం మోపుతోంది. వీఆర్ఏల గోడు వినేవారే లేరు. అందుకే శనివారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలకు సిద్ధమవుతున్నట్టు వీఆర్ఏల సంఘం నాయకులు తెలిపారు. సెప్టెంబరు 2న జిల్లా కేంద్రలో నిరసన తెలియజేస్తామన్నారు. వీఆర్ఏల సమస్యలపై దృష్టి సారించని కూటమి నిబంధనలకు విరుద్ధంగా వాచ్మన్ విధులు చాలీచాలని వేలతనాలతో ఆర్థిక ఇబ్బందులు జిల్లాలో 338 మంది వీఆర్ఏలు సమస్యలు పరిష్కరంచాలంటూ నేటి నుంచి పోరుబాట వీఆర్ఏలకు నెలకు రూ.11వేలు వేతనమే అందజేస్తుండడంతో జిల్లాలో పనిచేస్తున్న 338 మంది వీఆర్ఏలు ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు అని చూడకుండా నైట్ వాచ్మన్ విధులకు పంపుతున్నారు. ఖాళీగా ఉన్న వాచ్మన్, అటెండర్ పోస్టులు భర్తీ చేయాలి. అదనపు పనిభారం నుంచి విముక్తి కలిగించాలి. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయినా మా సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నేటి నుంచి నిరసనలు మరింత ఉద్ధృతం చేస్తాం. – ఈశ్వరరావు, వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు, పార్వతీపురం మన్యం -
వేతన వెతలు..!
పార్వతీపురం రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య పనులు నిర్వహించే గ్రీన్ అంబాసిడర్లను కూటమి ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. గ్రామాల్లో చెత్త సేకరణ, పారిశుధ్య పనులు నిర్వహించే వీరికి సకాలంలో జీతాలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో అర్ధాకలితో అలమటిస్తూ వారి కుటుంబాల పోషణ కష్టంగా మారింది. పంచాయతీల నిధుల నుంచి వీరికి జీతా లు చెల్లించాల్సి ఉండగా... ఆ పంచాయతీల్లో నిధుల్లేక వీరి వేతనాలు చెల్లింపులు జరగడం లేదు. పంచాయతీలకు ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు రాకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా మొట్టమొదటిసారిగా ఈ గ్రీన్ అంబాసిడర్లతోనే పరిశుభ్రత చర్యలు చేపడుతున్నారు. అటువంటి వీరికి సుమారు పది నెలలుగా జీతాలు చెల్లించాల్సి ఉన్నా.. ఆ ఊసే కూటమి నేతలు ఎత్తడం లేదు. వీరికి నెలకు రూ.ఆరు వేలు వేతనంగా ఉంది. పది నెలలుగా జీతాలు చెల్లించకుండా పనులు చేయించుకుంటోంది. ఇదెక్కడి న్యాయం అంటూ స్థానిక పాలకులను, అధికారులను ఆశ్రయించినా రాజకీయ కక్షలతో వేధింపులకు గురి చేస్తూ వారిని ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఈ క్రమంలో చేసేది ఏమీ లేక నమ్ముకున్న ఉపాధిని వదుకోలేక సకాలంలో జీతాలు రాకపోయినా పనులు కొనసాగిస్తున్నారు. కూట మి ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర పేరిట ఏ కార్యక్రమం చేపట్టి నా వాటికి పునాదిగా నిలబడేది ఈ గ్రామీ ణ పారిశుధ్య కార్మికులే. ఇటువంటి చిరు ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయడంపై గ్రామీణ ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొద్దిపాటి మొత్తం చెల్లింపులో ఇంత తాత్సారం చేస్తుండడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.సకాలంలో జీతాలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో జిల్లాలో ఇప్పటికే అక్కడక్కడా అసంతృప్తితో కొంతమంది గ్రీన్ అంబాసిడర్లు స్వచ్ఛందంగా విధుల నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో ఆయా గ్రామాల్లో చెత్తకుప్పల నిల్వలు ఎక్కడికక్కడ దర్శనమిస్తూ పారిశుధ్య లోపాన్ని ఎత్తిచూపే విధంగా పరిస్థితులు నెలకొన్నాయి. పంచాయతీలో నిధులు జీతాలు ఇచ్చేందుకు లేవని, పంచాయతీ కార్యదర్శులు సమాధానమిస్తూ... ఏడాదిగా జీతాలు చెల్లించకుండా ఇబ్బందులు పాల్జేస్తున్నార ని ఇటీవల కలెక్టర్ సమక్షంలోనే ఓ పారిశుధ్య కార్మికుడు తమ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలోనే కన్నీరు పెట్టుకున్నాడు. ఇలా కొందరు బయట పడుతుండగా.. మరికొందరు తమ ఆవేదనను మనసులోనే దాచుకుంటూ కుటుంబ జీవనాన్ని కొనసాగించలేక అవస్థలు పడుతున్నారు. తమ జీతాలు కూటమి ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందా... అని ఆశగా ఎదురు చూస్తున్నారు.గ్రామాల్లో చెత్త, చెదారం, మురికి కుంటలను శుభ్రం చేస్తూ గ్రామాల పరిసర ప్రాంతాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు చెల్లించకపోవడం సరికాదు. మున్సిపల్ కార్మికులు, ఈ గ్రీన్ అంబాసిడర్లు నిర్వహించే విధులు ఒకేలాంటివైనా గ్రీన్ అంబాసిడర్ల జీతాలు 6వేలు మాత్ర మే ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ అరకొర జీతం కూడా సక్రమంగా చెల్లించకపోవడం దారుణం. ఈ మేరకు ఇప్పటికే నిరసన వ్యక్తం చేసేందుకు సీఐటీయూ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. అలాగే జీతాలు పెంపుదల కూడా చేయా లని డిమాండ్ చేస్తున్నాం.– వై.మన్మధరావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిగ్రీన్ అంబాసిడర్లకు ఎప్పటికప్పుడు జీతాలు చెల్లించాలని ఆయా పంచాయతీల కార్యదర్శుల కు ఆదేశించాం. బకాయిలు ఉన్న చోట మా దృష్టికి వచ్చిన వెంటనే చెల్లింపులు చేసేందుకు చర్య లు తీసుకొనేలా కార్యచరణ చేస్తున్నాం.– కొండలరావు, డీపీవో, పార్వతీపురం మన్యం జిల్లా -
డ్వాక్రా రుణాల లెక్కకు లోకోస్
ఒక్కోలా.. రాజాం: మహిళా సంఘాల పనితీరు, నెలవారీ సమావేశాలు, రుణాల మంజూరీ, చెల్లింపులు, లావాదేవీలన్నీ ఐకేపీ ఆధ్వర్యంలో ఆన్లైన్లో ఇప్పటి వరకు నిర్వహిస్తున్నారు. ఇక ముందు పొదుపు సంఘాల లెక్కలన్నీ పక్కాగా ఉండేలా, ఎవరి లావాదేవీలు వారికి తెలిసేలా లోకోస్ యాప్ పని చేస్తుంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, నెలవారీ చెల్లింపులు, బకాయిలు, డిఫాల్ట్ సభ్యుల వివరాలు వంటివి ఈ యాప్లో నమోదు చేయనున్నారు. ఈ పనులన్నీ ఆయా గ్రామాల్లోని వీవో లీడర్లు పర్యవేక్షిస్తారు. మొత్తం సమాచారం కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి విభాగానికి అనుసంధానం చేయబడుతుంది. ఇక్కడ మహిళా సంఘాల మొత్తం డేటా ఢిల్లీలో దర్శనమిస్తోంది. పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ వంటి రుణాలు బినామీలకు వెళ్లకుండా చెక్ పడుతోంది. ఇప్పటికే శిక్షణ లోకోస్ యాప్ వినియోగంపై జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు ఐకేపీ విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. అపోహాలు విడనాడి ఈ యాప్ను వినియోగించుకోవాలని సూచిస్తోంది. అన్ని మండలాల్లో వీవోఏలు, వెలుగు సిబ్బందికి ఈ మేరకు అవగాహన కల్పించారు. గ్రామాల్లోని మహిళా సంఘాల వివరాలన్నీ ఈ యాప్ల్లో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సీసీలు, సీఎఫ్లు, వీవోల ఆండ్రాయిడ్ మొబైల్స్కు ఈ యాప్లు ఇచ్చి ప్లే స్టోర్లో భద్రం చేశారు. ఈ విధానం ద్వారా దేశ వ్యాప్తంగా పొదుపు సంఘాలన్నీ ఒకే గొడుగు కిందకు రానున్నాయనేది డీఆర్డీఏ వాదన. ప్రతీ సంఘంలోని లావాదేవీలు, ప్రతీ సభ్యురాలి ఆర్థిక లావాదేవీలు, సంఘ వినియోగం ఈ యాప్లో నమోదు చేయబడుతోంది. జిల్లాలో 62,850 సంఘాలు ఉమ్మడి విజయనగరం జిల్లాలో 62,850 సంఘాలు ఉన్నాయి. వీటిలో 6,92,155 మంది సభ్యులు ఉన్నారు. వీరందరి వివరాలు లోకోస్ యాప్లో నమోదు చేసేందుకు జిల్లా డీఆర్డీఏ విస్తృతంగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇచ్చిన ఆ శాఖ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మొత్తం వివరాలు నమోదు పూర్తి చేయాలని హుకుం జారీ చేసింది. ఇప్పటి వరకూ 85 శాతం దాటి వివరాలు నమోదైనట్టు డీఆర్డీఏ వెల్లడించింది. అవగాహన లేదు.. లోకోస్ యాప్పై గ్రామాల్లో సంఘాల మహిళలకు అవగాహన లేదు. చాలా మంది మహిళలు భయాందోళనలు చెందుతున్నారు. ఈ యాప్పై సమగ్రంగా అవగాహన కల్పించాల్సి ఉంది. ప్రతీ మహిళా ఆధార్ కార్డు ఈ యాప్లో పొందుపర్చడం ద్వారా సంఘాల పనితీరు, సభ్యులు పనితీరు తెలుస్తుందనేది ఎంత నిజమో.. మహిళల వివరాలు అన్నీ వేరే వారికి తెలుస్తాయన్నది కూడా అంతే వాస్తవం. ఈ విషయంపై గ్రామ స్థాయిలో ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. – లావేటి సులోచన, ఎంపీపీ, రాజాం 85 శాతం పూర్తయింది.. రాజాం నియోజకవర్గంలో లోకోస్ యాప్ వినియోగంపై పక్కాగా అవగాహన కల్పించాం. ఈ యాప్ వినియోగంపై మహిళలకు గ్రామ స్థాయిలో మరింత అవగాహన కల్పిస్తాం. ఎటువంటి అపోహాలు చెందాల్సిన పని లేదు. మహిళా సంఘాల పనితీరు మెరుగుపర్చడంతో పాటు ప్రతీ ఒక్కరికి న్యాయం చేసేందుకు ఈ యాప్ వినియోగపడుతోంది. సాంకేతిక సమస్యలు ఉన్నచోట వాటిని అధిగమిస్తున్నాం. నియోజకవర్గంలో 85 శాతం మేర ఈ యాప్లో వివరాలు నమోదు పూర్తయింది. – ఎ.చిరంజీవి, డీపీఎం, డీఆర్డీఏ, విజయనగరం కొందరికి మోదం.. కొందరికి ఖేదం..! లోకోస్ యాప్పై భిన్నాభిప్రాయాలు ఇక్కడి సమాచారం అంతా ఢిల్లీ చేతికి ఐకేపీ సిబ్బంది స్మార్ట్ ఫోన్లలో సాంకేతిక సమస్యలు డేటా నమోదుకు తంటాలు కొందరికి సహకరిస్తున్న యాప్లు ఇబ్బందిగా ఉంది.. మా ఆధార్ వివరాలు లోకోస్ యాప్లో అప్లోడ్ చేస్తే మంచి జరుగుతుందని అన్నారు. ఆధార్ ఇచ్చి అనుసంధానం చేయమన్నాం. ఐతే మా వివరాలు మొత్తం వేరే వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతాయేమోనన్న భయం కూడా మాకు ఉంది. – సవిరిగాన దమయంతి, వన్నలి, రేగిడి మండలంలోకోస్ యాప్పై కొంతమందికి అపోహాలు ఉన్నాయి. ఇక్కడి సమాచారం అంతా వేరే చోటకు చేరిపోతుందని, వ్యక్తిగత ఆర్థిక వివరాలు మొత్తం ఢిల్లీకి చేరిపోతాయని కొందరు ఆరోపిస్తున్నారు. తమ వద్ద ఆ యాప్లు, మొబైల్స్ లేనప్పుడు అవి తమకు ఎలా తెలుస్తాయని కొందరు మహిళలు వాదిస్తున్నారు. కొందరు వీవోఏలు ఈ యాప్ను వినియోగించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ యాప్ ద్వారా తమ ఉనికికి ముప్పు వాటిల్లుతుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఎంతవరకూ పారదర్శకత ఉంటుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా కనిపిస్తోంది. ఈ యాప్ వాడడం ద్వారా సంఘాలకు, అందులోని మహిళలకు పైసా వేసినా, తీసినా తెలుస్తుందని డీఆర్డీఏ వివరిస్తుంది. లోకోస్ యాప్లో మహిళా సంఘాల వివరాలు నమోదుపై ఒక్కో చోట ఒక్కోలా కనిపిస్తోంది. కొంతమంది వెలుగు సిబ్బంది మొబైల్స్లో ఈ యాప్ ద్వారా సంఘాల వివరాలు నమోదు కావడంలేదని, సాఫ్ట్వేర్ సహకరించడంలేదని వాపోతున్నారు. ఈ విషయాన్ని డీఆర్డీఏ జిల్లా అధికారులకు తెలియజేస్తే ఎలాగైనా యాప్ను డౌన్లోడ్ చేసి ప్రతీ ఒక్కరి వివరాలు నమోదు చేయించాలని ఆదేశిస్తున్నారని వాపోతున్నారు. మరో వైపు ఈ యాప్ వినియోగంపై గ్రామాల్లోని మహిళలు అనాసక్తి చూపుతున్నారని, తమ ఆధార్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని మహిళా సంఘాల గ్రామైఖ్య అధ్యక్షులు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ లోకోస్ యాప్లో వివరాలు నమోదు కొస అంచున నిలిచిపోయింది. -
25లోగా చెరువుల ప్రతిపాదనలు రావాలి : కలెక్టర్
పార్వతీపురం రూరల్: జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ చెరువుల కోసం ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ (మరమ్మతులు, పునఃనిర్మాణం, పునరుద్ధరణ) కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు. దీని ద్వారా చిన్న నీటిపారుదల మౌలిక సదుపాయాల పరిస్థితి, నిర్వహణ మెరుగు పరచడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని పెంచే ప్రయత్నాల్లో కీలకమైన భాగం కానుందన్నారు. గురువారం కలెక్టరేట్లో నీటి పారుదల శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని మైనర్ ఇరిగేషన్ చెరువులకు సంబంధించి ఈ కార్యక్రమం కింద ప్రతిపాదనలన్నీ సిద్ధం చేయాలన్నారు. 25 నాటికి డాక్యుమెంట్లు అప్లోడ్ పూర్తి ప్రభుత్వం సూచించిన విధంగా ప్రతీ శాఖలో గల డాక్యుమెంట్ల అప్లోడ్ ఈ నెల 25 నాటికి పూర్తవుతుందని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్కు వివరించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కలెక్టర్ పలు శాఖాధికారులతో కలసి పాల్గొన్నారు. ఈ సమావేశంలో గ్రౌండ్ వాటర్, సానుకూల ప్రజాదృక్పథం, ఏజెంట్ స్పేస్ కోసం డాక్యుమెంట్ అప్లోడ్, స్వమిత్వ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించినట్టు కలెక్టర్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ప్రత్యేక ఉప కలెక్టర్లు పి.ధర్మచంద్రారెడ్డి, దిలీప్చక్రవర్తి, నీటి పారుదల శాఖ ఈఈ ప్రదీప్, భూగర్భ జలవనరుల శాఖ ఈఈ రామ్మూర్తి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ప్రభాకరరావు, సీపీఓ ఆర్కె.పట్నాయక్, డీపీవో కొండలరావుతో పాటు మరికొందరు అధికారులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో వీఆర్వో
వేపాడ: మండలంలోని శింగరాయి వీఆర్వో కె.సత్యవతి ఏసీబీ వలకు చిక్కారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ ఎన్.రమ్య అందించిన వివరాలు.. తన రెవెన్యూ పరిధిలో ఒక రైతు అనుభవంలో ఉన్న శింగరాయి, గుడివాడ భూములకు ముటేషన్ దరఖాస్తు చేశారు. ఇందుకోసం వీఆర్వో సత్యవతి సంబంధిత రైతు నుంచి రూ.లక్షా 70వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించడంతో ఏసీబీ డీఎస్పీ ఎన్.రమ్య ఆధ్వర్యంలో అధికారులు గురువారం సాయంత్రం వేపాడ సమీపంలో కళ్లాల వద్ద ఫిర్యాదుదారి నుంచి రూ.లక్ష నగదు తీసుకుంటుండగా పట్టుకున్నారు. అక్కడ నుంచి వీఆర్వోను వేపాడ తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చారు. వీఆర్వో సత్యవతి విధులు నిర్వహిస్తున్న గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ రికార్డులను కంప్యూటర్లలో పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దాడుల్లో ఏసీబీ సీఐ ఎం.మహేశ్వరరావు, ఎస్ఐ వాసు నారాయణ, సిబ్బంది, మహిళా పోలీసులు, ఆర్ఐ రామలక్ష్మి పాల్గొన్నారు. -
అనుమానాస్పదంగా మహిళ మృతి
రామభద్రపురం: మండలంలోని తారాపురంలో ఓ మహిళ అనుమానస్పద స్థితిలో గురువారం మృతిచెందింది. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తారాపురం గ్రామానికి చెందిన తుమరాడ శ్యామల(41)కు 20 ఏళ్ల క్రితం ఇదే మండలం జన్నివలస గ్రామానికి చెందిన పత్తిగుళ్ల అప్పలనాయుడుతో వివాహం జరిగింది. అయితే భార్యాభర్తల మధ్య కొద్దిపాటి మనస్పర్థలతో వివాహం జరిగిన రెండేళ్లకే విడాకులు తీసుకుని విడిపోయారు. దీంతో శ్యామల గడిచిన 18 ఏళ్ల నుంచి కన్నవారి ఊరు తారాపురంలో వారు ఇచ్చిన పూరింట్లో ఒంటరిగా నివాసం ఉంటూ కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఇంతలో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. వారిద్దరి మధ్య ఏం జరిగిందో గాని గురువారం తెల్లారేసరికి పురుగు మందు తాగి చనిపోయి ఉంది. పురుగు మందు డబ్బా కూడా మృతదేహం పక్కనే ఉంది. కుటుంబ సభ్యులు పురుగు మందు డబ్బా మురుగు కాల్వలో పారేసి మృతదేహాన్ని దహనం చేసేందుకు శ్మశానానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.అయితే మృతురాలి అన్నయ్య తుమరాడ సింహాచలం తన చెల్లిది మృతికి కారణం ఆత్మహత్య కాదని, అనుమానాస్పదంగా ఉందని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏఎస్సై అప్పారావు సిబ్బందితో కలిసి తారాపురంలోని ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. విజయనగరం నుంచి క్లూస్టీమ్ను రప్పించి వేలిముద్రలు సేకరించారు. అలాగే శ్యామల మృతికి గల కారణాలను గ్రామంలోని చుట్టుపక్కల నివాసాల ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించారు. మృతురాలి అన్నయ్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రహదారుల నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యం
రేగిడి: ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ ప్రాంత రహదారులకు నెల రోజుల్లోనే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని కూటమి ప్రభుత్వం మాట ఇచ్చి నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. గురువారం రేగిడి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్–ఒడిశా రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న పాలకొండ–రాజాం ప్రధాన రహదారి పలు చోట్ల పూర్తిగా పాడవడంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రధానంగా మజ్జిరాముడుపేట, ఉంగరాడమెట్ట, చిన్నయ్యపేట గ్రామాల జంక్షన్ల వద్ద సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.8.82 కోట్ల నిధులు రోడ్ల కోసం మంజూరుచేసిందని, ఆ నిధులుతో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ కొంతమేర పనులను పూర్తిచేశారన్నారు. అప్పట్లో ఎన్నికల కారణంగా నిలిచిపోయిన రూ.4కోట్లు బిల్లులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ మిగిలిన పనులను పూర్తిచేసేందుకు ముందుకురావడంలేదన్నారు. రాజాం జీఎంఆర్ ఐటీ వద్ద 355 మీటర్లు, ఉంగరాడమెట్ట వద్ద 395 మీటర్లు, మజ్జిరాముడుపేట వద్ద 150 మీటర్లు సిమ్మెంట్ కాంక్రీట్ రోడ్డు వేయాల్సి ఉందని, కాంట్రాక్టర్కు బకాయిలు చెల్లిస్తే తప్ప ఈ రోడ్డు పనిపూర్తిచేయలేమని ఇప్పటికే కాంట్రాక్టర్ చేతులెత్తేశాడన్నారు. చెప్పిందొకటి..చేస్తున్నదొకటి ఈ సమస్యను పలుమార్లు ఆర్అండ్బీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఇటీవల కలెక్టర్ అంబేడ్కర్ సంకిలి నాగావళిని చూసేందుకు వచ్చిన సమయంలో ఈ గోతులను స్వయంగా చూశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం చెప్పిందొకటి, చేస్తున్నది ఒకటి, ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ప్రగల్భాలు పలుకుతుండడం వారికి వెన్నతోపెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించకుంటే శానసమండలి సమావేశాల్లో ఈ సమస్యను ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని స్పష్టం చేశారు. సమావేశంలో పోలినాటి వెలమ రాష్ట్ర మాజీ డైరెక్టర్ కింజరాపు సురేష్, వైఎస్సార్సీపీ రాజాం నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు కరణం శ్రీనివాసరావు, లక్ష్మీపురం సర్పంచ్ కెంబూరు వెంకటేశ్వరరావులు ఉన్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ -
పోర్టల్లో నమోదు తప్పనిసరి
పార్వతీపురం టౌన్: జిల్లా పరిధిలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు తమ నోడల్ ఉపాధ్యాయుల ద్వారా మైజీఓవీ.ఐన్ పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని టీఓఎఫ్ఈఐ జిల్లా నోడల్ అధికారి చొక్కాపు శ్రీనివాస రావు తెలిపారు. ఈ మేరకు గురువారం పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో పొగాకు వాడకం లేని కార్యక్రమాలుగా పోస్టర్ ప్రదర్శనలు, వీధి నాటకాలు, నినాదాల ప్రదర్శనలు, ర్యాలీలు కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. వాటి వీడియోలు, ఫొటోలను వెబ్సైట్లో ఈ నెల 31 లోపు అప్లోడ్ చేయాలని సూచించారు. అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు అమలు కావాలని స్పష్టం చేశారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ. 50 వేలు, రూ. 20 వేలు, రూ. 15 వేలు కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం హేమసుందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
నేరాల దర్యాప్తులో డిజిటల్ ఆధారాలు కీలకం
విజయనగరం క్రైమ్: నేరాల దర్యాప్తులో డిజిటల్ ఆధారలే కీలకమని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు. ఈ మేరకు రేంజ్ పరిధిలోని అయిదు జిల్లాలకు చెందిన ఐటీ అనుభవం కలిగిన పోలీస్ సిబ్బందికి గురువారం కై లాసగిరి పోలీస్ గెస్ట్హౌస్ లో ఉబెర్ డేటా డిస్క్లోజర్ పాలసీపై వర్క్ షాప్ జరిగింది. నేర సంఘటనలకు సంబంధించి నమోదైన కేసుల విచారణంలో మొబైల్ లొకేషన్ ఆధారంగా నేరస్థులను గుర్తించడంలో ఉబెర్ డేటా ప్రాముఖ్యం గురించి వివరించారు. లీగల్ ప్రాసెస్, డేటా రిక్వెస్ట్ చేయడం, అందుబాటులో ఉంటే సమాచార రకాలు, ప్రైవసీ పరిరక్షణ వంటి అంశాలపై సదస్సు జరిగింది. రేంజ్ పరిధిలో ఉన్న ఐదు జిల్లాల నుంచి ఐటీ కోర్ టీమ్, సైబర్ సెల్ సిబ్బంది పాల్గొని, సాంకేతికతపై సమగ్రంగా చర్చలు జరిపారు.ఈ సందర్భంగా విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు పోలీసుల సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరిచే దిశగా ఎంతో సహాయపడతాయని అన్నారు. డీఐజీ గోపీనాథ్ జెట్టి -
వణికిస్తున్న వైరల్ జ్వరాలు
పాలకొండ రూరల్/గుమలక్ష్మీపురం: పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. ప్రస్తుత సీజన్లో కురుస్తున్న వర్షాల ప్రభా వంతో కొత్త నీరు సమకూరడంతో పాటు పారిశుధ్య లోపం, డ్రైనేజీల సమస్యలు, నిల్వ ఉండే మురుగు కారణంగా దోమలు విజృంభిస్తున్నాయి. జ్వరప్రభా వంతో తీవ్ర చలి, కీళ్ల నొప్పులు, ఆకలి లేకపోవడం, నోరు పూర్తిగా చేదుగా మారడంతో పాటు అఽధిక ఉష్ణోగ్రతతో కూడిన జ్వరం కనీసం 4–6 రోజులు కొనసాగడంతో జ్వర పీడితులు పూర్తిగా రోగ నిరోధకశక్తిని కోల్పోయే స్థితికి చేరుకుంటున్నారు. ఏజెన్సీ కలబోసి ఉన్న ప్రాంతంలో..ఏజెన్సీ ప్రాంతం అధికంగా మిళితమై ఉన్న పాలకొండ, కురుపాం నియోజకవర్గాల పరిధిలో దాదాపు ప్రతి ఇంటా జర్వ పీడితులు ఇద్దరు లేక ముగ్గురు ఉంటున్నారు. గడిచిన 20 రోజుల వ్యవధిలో పాలకొండ ఏరియా ఆస్పత్రిలో 848 మంది వివిధ రకాల జ్వరాలతో చేరారు. 705 మందికి టైఫాయిడ్ పరీక్షలు చేయగా 141 మందికి పాజిటివ్ వచ్చింది, డెంగీ పరీక్షలు 193 మందికి చేయగా నలుగురికి పాజిటివ్ వచ్చింది, 896 మందికి మలేరియా పరీక్షలు చేపట్టగా ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. దాదాపు 6 వందల మంది వైరల్, సాధారణ జ్వరాల బారిన పడినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఇన్పేషెంట్లుగా వందకుపైబడి బాధితులు చేరినట్లు రికార్డులు చెబుతున్నాయి. సగటున రోజుకు ఆరు వందల మేరకు ఓపీ నమోదవుతున్నట్లు సిబ్బంది పేర్కొంటున్నారు. వారిలో అధిక శాతం జ్వరపీడితులే కావడం విశేషం. చేతి సొమ్ము చెల్లించి.. సీజనల్ జ్వరపీడితులు రోగనిర్ధారణ పరీక్షలకు అధికమొత్తంలో చేతి సొమ్ము చెల్లిస్తున్నారు. సర్కారు దవాఖానాతో పోల్చుకుంటే రోగుల తాకిడి ప్రైవేట్ ల్యాబ్ల వద్ద అధికంగానే ఉంటోంది. గత ప్రభుత్వంలో ఫ్యామిలీ డాక్టర్ విధానంతో పాటు జ్వరాలపై నిరంతర సర్వే కొనసాగడంతో సీజనల్ జ్వరాలు అదుపులో ఉండేవని గ్రామీణులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో అందించే మందులు కూడా ఆశించిన మేర అందుబాటులో ఉండడం లేదన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా బీపీ, గ్యాస్టిక్, రోగనిరోధక శక్తిని అందించే ఐవీ, డైక్లోఫినాక్ ఇంజెక్షన్లు తక్కువగా పీహెచ్సీలకు చేరుతున్నట్లు స్పష్టమవుతోంది. నాలుగు నెలలకు ఓ సారి ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే మందుల్లో నిత్యావసర మందు బిళ్లలు, సూది మందులు తక్కువగా వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో రోగగ్రస్తులు ప్రైవేట్ ల్యాబ్లు, ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. మలేరియా, టైపాయిడ్, సీబీసీ, యూరిన్, ప్లేట్లెట్స్, వైరల్ జ్వర నిర్ధారణకు రు.600 చెల్లించాల్సి ఉంటుంది. డెంగీ, స్క్రాబ్ టైఫస్ వంటి ప్రాణాంతక జ్వరాల నిర్ధారణకు రూ.వెయ్యి వరకూ చెల్లించాల్సి వస్తుందని బాధితులు చెబుతున్నారు. ఈ లెక్కన ఇంట్లో ఇద్దరు ముగ్గురికి జ్వరం వస్తే రూ.వేలల్లో చేతి సొమ్ము చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. పారిశుధ్య లోపం..కలుషిత నీటి ప్రభావం..జర్వరాల విజృంభణకు కలుషిత నీరు, పారిశుధ్య లోపమే ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు. తాజాగా జిల్లాలో నమోదవుత్ను అధిక వర్షాల ప్రభావంతో నీటి వనరుల్లో కొత్తనీరు చేరుతోంది. ఎక్కిడికక్కడ మురుగు పేరకుపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి రెండు విడతలు, తాజాగా 16వ ఆర్ధిక సంఘానికి సంబంధించి ప్రస్తుత ఆగస్టు నెలలో విడుదల కావాల్సిన మొత్తాలు ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో బ్లీచింగ్, ఫినాయిల్ కొనేందుకు కూడా పంచాయతీల ఖాతాల్లో నిధులు లేవని ప్రజా ప్రతినిధులు వాపోతున్నారు. సొంత సొమ్ము చెల్లించి ఎంతోకొంత పనులు చేపడుతున్నా ఫలితం లేకపోతోందని అంటున్నారు. ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితులు రోజుల తరబడి తీవ్ర జ్వరంతో పాటు కీళ్ల నొప్పులు ఏజెన్సీ కలబోసిన రెండు నియోజకవర్గాల్లో మరింత ప్రభావం తీవ్రమైన నొప్పులుగతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన నొప్పులతో కూడిన జ్వరాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏ ఇంట చూసినా చిన్నాపెద్దా తేడా లేకుండా జ్వరాలు వస్తున్నాయి. రోజుల తరబడి ఇబ్బందులు పడుతున్నాం. స్థానికంగా అందిన వైద్యానికి నయంకాకపోవడంతో జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చింది. పి.సులోచన, తాడికొండ, జీఎల్.పురం మండలంజాగ్రత్తలు అవసరంగతంతో పోల్చుకుంటే టైఫాయిడ్, మలేరియా కాకుండా వైరల్, సాధారణ జ్వరాలు నమోదువుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాచిచల్లార్చిన నీటిని తాగాలి. రోగ నిరోధక శక్తిని అందించే పౌష్టికాహారం తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లల విషయంతో మరింత జాగ్రత్తలు పాటించాలి. వర్షంతో తడవనీయ కూడదు. దుమ్ము ధూళిలో ఆటలాడనీయోద్దు. జలుబు, దగ్గు వస్తే అలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. డాక్టర్ రవికుమార్, ఏరియా ఆస్పత్రి, పాలకొండ -
మందులు కొరత లేకుండా చూసుకోవాలి
● బందలుప్పి వైద్యాధికారి డా.శ్రీకాంత్ పార్వతీపురం రూరల్: దీర్ఘకాలిక వ్యాధులు, అధిక రక్తపోటు, మధుమేహం తదితర వ్యాధులు ఉన్నవారికి 104 వైద్యశిబిరం ద్వారా నెలకు సరిపడా మందులు పూర్తిస్థాయిలో అందించి సరఫరా చేసేందుకు మందుల కొరత లేకుండా చూసుకోవాలని బందలుప్పి వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ అన్నారు. ఈ మేరకు బందలుప్పి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలో ఉన్న హెచ్ కారాడ వలసలో 104 వైద్యశిబిరాన్ని ఆయన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 60సంవత్సరాల పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి, గర్భిణులు, బాలింతలకు వైద్య పరీక్షలు చేసి వారికి కావాల్సిన మందులిస్తూ పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని వైద్యసిబ్బందికి సూచించారు. సీజనల్ వ్యాధుల దృష్ట్యా గ్రామాల్లో అనారోగ్యం బారిన పడిన వారికి ప్రతి రోజు వైద్యపరీక్షలు చేస్తూ ఎలాంటి లక్షణాలు గుర్తించినా మెరుగైన వైద్యం అందించాలన్నారు. -
ఎవరు చేశారీ పని?
● కలెక్టరేట్ పేరుతో ఉన్న అక్షరాలను తొలగించే ప్రయత్నం పార్వతీపురం రూరల్: కలెక్టరేట్ ముఖద్వారం వద్ద ఉన్న బోర్డులో కలెక్టర్ కార్యాలయం అని సూచించే పదాల అచ్చులను గుర్తుతెలియని అకతాయిలు బుధవారం రాత్రి తొలగించారు. ఈ క్రమంలో కొన్ని పదాలకు సంబంధించిన అక్షరాలు బోర్డులో గురువారం ఉదయం లేకపోవడాన్ని సిబ్బంది గుర్తించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఈ మేరకు డీఆర్ఓ కె.హేమలత, ఈ చర్యలను తీవ్రంగా పరిగణించి పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చి దర్యాప్తు చేయాలని కోరారు. ఈ మేరకు పార్వతీపురం ఏఎస్పీ అంకితా సురానా, సీఐ కె.మురళీధర్ పరిశీలించి స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అత్తారింటి వేధింపులపై కేసు నమోదుపార్వతీపురం రూరల్: పట్టణంలోని కొత్తవలసలో ఉన్న విజయరామరాజు కాలనీకి చెందిన ఓ వివాహిత భర్తతో పాటు అత్తమామలపై వేధింపుల కేసు పెట్టింది. నిత్యం తనను వేధిస్తూ అధిక కట్నం కోసం డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై గోవింద తెలిపారు. వినాయక మంటపాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి● ఎస్సై ఎం.వెంకటరమణ మక్కువ: ఈనెల 27వతేదీ నుంచి భక్తులు జరుపుకోనున్న వినాయకచవితి పండగ సందర్భంగా గ్రామాల్లో ఏర్పాటుచేయునున్న వినాయక మంటపాలకు పోలీసుల అనుమతి తీసుకోవాలని ఎస్సై ఎం.వెంకటరమణ తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్స్టేషన్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల్లో మంటపాలు ఏర్పాటుచేయనున్న భక్తులు పోలీస్స్టేషన్కు వచ్చి వివరాలు తెలపాలన్నారు. మంటపాల వద్ద డీజేలకు అనుమతిలేదన్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా బాణాసంచా కాల్చరాదని, గ్రామాల్లో ఎటువంటి గొడవలుకు తావులేకుండా ప్రశాంతవాతావరణంలో వినాయకచవితి పండగను భక్తులు జరుపుకోవాలని కోరారు. ఏవిధమైన సంఘటనలకు పాల్పడినా కమిటీసభ్యులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. -
రామతీర్థంలో వైభవంగా పూర్ణాహుతి
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో పుష్యమి నక్షత్రం సందర్భంగా ఆలయ అర్చకులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో రామాయణంలో పట్టాభిషేకం సర్గ హవనం చేసి పూర్ణాహుతి జరిపించారు. ఆలయంలోని వెండి మంటపంలో ఉత్సవమూర్తుల వద్ద నిత్య కల్యాణం జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తి శ్రద్ధలతో తిరువాయ్ మోజి సేవాకాలం: విజయనగరం పట్టణానికి చెందిన పలువురు మహిళా భక్తులు స్వామి సన్నిధిలో తిరువాయ్ మోజి సేవాకాలాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గోష్ఠి ప్రతినిధి రమాదేవి ఆధ్వర్యంలో తిరువాయ్ నామాలను పఠించారు. కార్యక్రమంలో ఈఓ వై శ్రీనివాసరావు, అర్చకులు సాయిరామాచార్యులు, నరిసింహాచార్యులు, కిరణ్, రామగోపాలాచార్యులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. -
గణేష్ మంటపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి
● ఎస్పీ వకుల్ జిందల్ విజయనగరం క్రైమ్: రానున్న వినాయక చవితి సందర్భంగా గణేష్ మంటపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరిగా పొందాలని ఎస్పీ వకుల్ జిందల్ గురువారం స్పష్టం చేశారు. అలాగే మంటపాల ఏర్పాటుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. గణేష్ ఉత్సవాలు నిర్వహించబోయే వ్యక్తులు ముందుగా ఒక కమిటీగా ఏర్పడి, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సింగిల్ విండో విధానంలో జ్ట్టి ఞట://జ్చ ుఽ్ఛటజి ఠ్టట్చఠి. ుఽ్ఛ్ట క్లిక్ చేసి, నిర్దేశించిన అనుమతులు పొందాలని సూచించారు. ఈ విధానం వల్ల సులభంగా గణేష్ ఉత్సవాల నిర్వహణ, మంటపాల ఏర్పాటు, ఊరేగింపులు, నిమజ్జనానికి అనుమతులు పొందవచ్చునని ఎస్పీ తెలిపారు. తెలుగు కీర్తి పురస్కారానికి గురుప్రసాద్ ఎంపికవిజయనగరం: ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షుడు, జిల్లా కేంద్రానికి చెందిన రచయిత, తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తెలుగు భాషా విశిష్ట సేవా పురస్కార గ్రహీత సముద్రాల గురుప్రసాద్ తెలుగు కీర్తి పురస్కారానికి ఎంపికయ్యారు. తెలుగు వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయంలో జరగనున్న తెలుగు భాషా దినోత్సవంలో ప్రతిష్టాత్మక తెలుగు కీర్తి పురస్కారం ఆయనకు ప్రదానం చేయనున్నారు. పరుగు పందెంలో ప్రతిభచీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి మండలంలోని కుమరాం పాలవలసకు చెందిన క్రీడాకారుడు గదుల దుర్గారావు రాష్ట్రస్థాయి పరుగుపందెం పోటీల్లో ప్రతిభ చాటాడు. జిల్లా కేంద్రంలోని విజ్జి స్టేడియంలో జరిగిన 36వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూనియర్ ఇంటర్ చాంపియన్షిప్ 2025 పోటీల్లో 5000 మీటర్ల పరుగు పందెంలో జిల్లాలో ద్వితీయ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఈ నెల 9,10,11 తేదీల్లో బాపట్ల జిల్లా చీరాలలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 5000 మీటర్ల పరుగుపందెంలో తృతీయ స్థానంలో నిలిచాడు. ఈ క్రీడాకారుడిని ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం అభినందించారు. క్రీడల్లో మరింత ఆసక్తిని కనబరచాలని, క్రీడలు ఉన్నత స్థానంలో స్ధిరపడేలా ఎదుగుదలకు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో వార్డు మెంబర్ కింతాడ కిరణ్కుమార్ పాల్గొన్నారు. ఉత్తమ టీటీఐలకు సత్కారంతాటిచెట్లపాలెం(విశాఖ): వాల్తేరు రైల్వే డివిజన్ టికెట్ తనిఖీ సిబ్బంది మే నెలలో రికార్డు స్థాయిలో ఆదాయం సాధించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే, వాల్తేరు డివిజన్ పరిధిలో ఉత్తమ ఫలితాలు సాధించిన సిబ్బందిని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోరా గురువారం సత్కరించారు. మే నెలలో టికెట్ తనిఖీ సిబ్బంది వివిధ రూపాలలో రూ.2,41,20,627 ఆదాయాన్ని ఆర్జించారు. గత సంవత్సరం మే నెలలో సాధించిన రూ. 2,27,34,221 ఆదాయంతో పోలిస్తే, ఈసారి అధిక ఆదాయాన్ని నమోదు చేశారు. ఈ రికార్డు ఆదాయం సాధించడంలో వ్యక్తిగతంగా ఇద్దరు ఉద్యోగులు అద్భుతమైన పనితీరు కనబరిచారు. విజయనగరం, టీటీఐ వై. అప్పలరాజు.. 836 కేసులు నమోదు చేసి రూ. 4,89,320 జరిమానాలు, అదనపు టికెట్ రుసుముగా వసూలు చేశారు. శ్రీకాకుళం రోడ్డు టీటీఐ కె. శ్రీనివాసరావు 815 కేసులు నమోదు చేసి రూ. 4,42,900 వసూలు చేశారు. వారిద్దరిని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ సమక్షంలో సత్కరించారు. -
ఆక్రమణలకు అడ్డేలేదా?
చీపురుపల్లి: ఆక్రమణదారులకు ఎక్కడైతే ఏముంది. అది ప్రభుత్వ కార్యాలయం కావొచ్చు, ప్రైవేట్ స్థలం అవ్వొచ్చు. ఏదైనా సరే అధికార పార్టీ అండ ఉంటే చాలు ఎలాంటి స్థలంలోనైనా సరే చొరబడిపోవడమే. అయితే ఇంతవరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలను ఆక్రమించుకునే ప్రయత్నాలు చూసి ఉంటాం. కానీ ఇక్కడ సాక్షాత్తు మండల పరిషత్ కార్యాలయం వెనుక ప్రహరీని కూల్చి కార్యాలయం ఆవరణలోకి చొరబడి జేసీబీతో మండల పరిషత్ కార్యాలయం ప్రహరీ లోపల ఉన్న స్థలాన్ని చదును చేసిన సంఘటన సంచలనం రేకెత్తిస్తోంది. ఇదే ప్రహరీకి అవతలి వైపు ఉన్న శ్మశాన వాటిక అభివృద్ధి పనులను మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ గద్దే బాబూరావు చేయిస్తున్నారు. ఈ సమయంలో మండల పరిషత్ ప్రహరీని కూల్చి లోపలకు ప్రవేశించి చదును చేయించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మండల పరిషత్ గోడ కూల్చి లోపలికి వచ్చి పనులు చేయిస్తుండడాన్ని తెలుసుకున్న ఇన్చార్జి ఎంపీడీఓ ఐ.సురేష్ పనులను నిలిపివేయించారే తప్ప వారిపై చర్యలకు ముందడుగు వేయకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. మండల పరిషత్ కార్యాలయ ప్రహరీ లోపల ఆక్రమణలకు పాల్పడుతున్న స్థలంలో తాగునీటి పైపులు ఉండగా వాటిని తొలగించి ఓ పక్కన పడేయడంతో పైప్లైన్ సంగతి ఏమైందో ఇంకా తెలియాల్సి ఉంది.సర్వేచేసి చర్యలు తీసుకుంటాం ప్రహరీ కూల్చి లోపలికి వచ్చి చేపడుతున్న పనులను నిలిపివేశాం. పనులు చేస్తున్న వారిని హె చ్చరించాం. మండల పరిషత్ కార్యాలయం స్థలం ఎంత వరకు ఉందో సర్వే నిర్వహించి, త మ కార్యాలయం పరిధిలోకి ఆక్రమణలు వచ్చి నట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – ఐ.సురేష్, ఇన్చార్జి ఎంపీడీఓ, చీపురుపల్లి ప్రభుత్వ కార్యాలయాల్లోకి చొరబడుతున్న ఆక్రమణదారులు మండల పరిషత్ కార్యాలయ ప్రహరీ జేసీబీతో కూల్చివేత కార్యాలయం ఆవరణలో స్థలం యంత్రాలతో చదును అడ్డుకున్న మండల పరిషత్ అధికారులు -
సమాజాభివృద్ధికి ఇంజినీరింగ్ విద్య కీలకం
విజయనగరం అర్బన్: సమాజాభివృద్ధికి ఇంజినీరింగ్ విద్య కీలకంగా నిలుస్తుందని, విద్యార్థులు ఆ దిశగా చదువుకోవాలని జేఎన్టీయూ జీవీ రిస్ట్రార్ జి.జయసుమ పిలుపునిచ్చారు. వర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాలలో నూతనంగా ప్రవేశాలు పొందిన విద్యార్థుల కోసం బుధవారం నిర్వహించిన స్టూడెంట్ ఓరియంటేషన్ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంజినీర్ సమాజంలో కీలక పాత్ర పోషిస్తారని, విద్యార్థులు ఎల్లప్పుడూ ఉత్తేజంతో ఉండి కొత్తకోర్సుల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు మాట్లాడుతూ ఓరియంటేషన్ కార్యక్రమం ఉద్దేశాన్ని నూతనంగా ప్రవేశించిన ఫస్ట్ ఇయర్ బీటెక్ విద్యార్థులకు, హాజరైన తల్లిదండ్రులకు వివరించారు. కళాశాల పూర్వవిద్యార్థులు సాధించిన ఉద్యోగాలు, వర్సిటీలోని వసతులను తెలియజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జీజే నాగరాజు, ప్లేస్మెంట్ ఆఫీసర్ వి.ఎన్.వకుల, లైబ్రరీ ఇన్చార్జ్ బిందుమాధురి పాల్గొన్నారు. -
పడాలవలస గిరిజనుల తాగునీటి కష్టాలు
● పట్టించుకోని కార్యదర్శి ● పంటపొలాల నుంచి తాగునీరు సేకరణ సాలూరు రూరల్: ఎక్కడైనా మండు వేసవిలో గిరిజన గ్రామాల్లో తాగునీటి కోసం అవస్థలు పడుతున్న సందర్భాలు ఎదురవుతుంటాయి. అయితే సాలూరు మండలంలోని మరిపల్లి పంచాయతీ పడాలవలస గిరిజన గ్రామ ప్రజలు వర్షాకాలంలో కూడా గడిచిన 10 రోజులుగా తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని బోరుబావి మరమ్మతులకు గురికావడంతో తాగునీటికి ఇబ్బంది పడాల్సి వస్తోంది. దీంతో పక్కనే ఉన్న పంటపొలాల్లో బోరు బావినుంచి తాగునీరు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్నందున తెల్ల వారేసరికి వ్యవసాయ పనులకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ తాగునీటి కోసం కొంత సమయం కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంటోందని గిరిజన మహిళలు వాపోతున్నారు. ఈ విషయంలో గ్రామ కార్యదర్శికి సమస్యను వివరించినప్పటికీ తాను చేసేది ఏమీ లేదని నాయకులను కలవాలని చెబుతున్నట్లు గ్రామస్తులు వివరించారు. ఈ క్రమంలో ఎలాగోలా బోరు బావికి మరమ్మతులు చేయాలని బుధవారం గ్రామంలోని కొంతమంది యువకులు ప్రయంత్నించి పైపులు బయటకు తీశారు. అయితే బోరు మరమ్మతులకు కొన్ని కొత్త సామగ్రి అవసరమవుతాయని గుర్తించిన యువకులు ఆ డబ్బులు ఎవరు పెడతారని, ఎక్కువ ఖర్చు అయితే అంత సొమ్ము ఎవరు భరిస్తారని చర్చించుకుని తాము పని విషయంలో సహకరిస్తామే తప్ప డబ్బులు పెట్టే స్థోమత తమకు లేదని ఎవరి దారి వారు చూసుకున్నారు. దీంతో గ్రామంలో తాగునీటి సమస్య అలాగే ఉండి పోయింది. వెంటనే గ్రామ కార్యదర్శి బోరు బావికి మరమ్మతులు చేయించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
బోల్తా పడిన లారీ
బొండపల్లి: మండలంలోని నెలివాడ గ్రామం వద్ద జాతీయ రహదారి 26పై మానాపురం నుంచి విజయనగరం వస్తున్న లారీ అదుపుతప్పి పంట పొలాల్లో బుధవారం బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని లారీని బయటకు తీసే చర్యలు చేపట్టారు. 15 లీటర్ల సారాతో వ్యక్తి అరెస్ట్కురుపాం: మండలంలోని నీలకంఠాపురం పోలీస్స్టేషన్ పరిధి జి.శివడ పంచాయతీ పెద్దఅంటిజోల గ్రామసమీపంలో అక్రమంగా సారా విక్రయిస్తున్నట్లు అందిన ముందస్తు సమాచారం మేరకు బుధవారం నీలకంఠాపురం ఎస్సై నీలకంఠారావు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 15 లీటర్ల సారాను ఓ వ్యక్తి కలిగి ఉండడంతో సారా స్వాధీనం చేసుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అక్రమంగా సారా వంటకాలు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజృంభిస్తున్న జ్వరాలు● మంచం పడుతున్న ప్రజలు సాలూరు: వర్షాలు తెరిపిచ్చిన క్రమంలో నియోజకవర్గంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా వైరల్, మలేరియా, టైఫాయిడ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. గిరిశిఖర దొర్లతాడివలస, జాకరవలస, మూలతాడివలస, కుంబిమడ తదితర గ్రామాల్లో ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు. తీవ్రజ్వరాలతో బాధపడుతున్నా మెడికల్ క్యాంపులు నిర్వహించకపోవడంతో ఇంటి వద్దే ఉంటున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న దొర్లతాడివలసకు చెందిన మధుసూదనరావును విజయనగరం ఆస్పత్రికి తరలించారు. గ్రామాల్లో సుమారు ఏడాది కాలానికి పైగా ఏసీఎం ద్రావణం పిచికారీ చేయలేదని గిరిజనులు అంటున్నారు. ఈ కారణంగా గ్రామాల్లో దోమలు అధికమయ్యాయని, ఫలితంగా జ్వరాలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. కలెక్టర్ ఆదేశాలతో వైద్యశిబిరం ఏర్పాటుగిరిజనులు అనారోగ్యాలతో బాధపడుతున్నారని సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ శ్యామ్ప్రసాద్ స్పందించి వెంటనే వైద్యశాఖాధికారులకు ఆదేశాలు జారీచేయడంతో దొర్లతాడివలసలో బుధవారం వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. దొర్లతాడివలస, జాకరవలసకు చెందిన 44 మందికి వైద్యపరీక్షలు చేసి మెరుగైన చికిత్స నిమిత్తం పలువురిని తోణాం పీహెచ్సీకి తరలించారు. శ్రీకాకుళం రూరల్: ఏపీస్టేట్ ఎలైడ్ అండ్ హెల్త్కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్ సెక్రటరీ వారు డిప్లమో ఎలైడ్ హెల్త్ కేర్ కోర్సులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు రాగోలు జెమ్స్ ఆస్పత్రిలోని బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల్లో చేరేందుకు ఇంటర్లో ఏ గ్రూప్లో పాస్ అయిన విద్యార్థులైనా అర్హులేనని పేర్కొన్నారు. సెప్టెంబర్ 8వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 76809 45357, 79950 13422 నంబర్లను సంప్రదించాలని కోరారు. నూతనబార్ పాలసీ విధానంలో ఫీజుల తగ్గింపు విజయనగరం టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన బార్ పాలసీ విధానంలో లైసెన్స్ ఫీజులు భారీగా తగ్గించినట్లు జిల్లా మద్యనిషేధ, అబ్కారీ శాఖ అధికారి బి.శ్రీనాథుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గత బార్ పాలసీ విధానంతో పోల్చితే లైసెన్స్ దారుడికి అనేక రాయితీలు లభిస్తాయన్నారు. లాటరీ పద్ధతిలో దరఖాస్తు విధానంతో పాటు ఒక వ్యక్తికి ఒకటికి మించి బార్లు కేటాయింపు, ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకూ బార్ పనివేళలు ఉంటాయన్నారు. ఆరు వాయిదాల్లో లైసెన్స్ పీజు చెల్లింపు చేసుకోవచ్చని, ఐఎమ్ఎల్, బీర్ అమ్మకాలు జరిగిన తదుపరి రెండు నెలల తర్వాత చెల్లింపులు చేయవచ్చన్నారు. -
రైతు వ్యతిరేకి కూటమి సర్కార్
● ఎరువుల సరఫరాలో ప్రభుత్వం విఫలం ● ఎమ్మెల్సీ పాలవలస మండిపాటువంగర: రాష్ట్రంలో కూటమి సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు సరిపడా ఎరువుల సరఫరాలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఆయన మండల కేంద్రం వంగరలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేశామంటున్న సీఎం చంద్రబాబు చేతల్లో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. ఏ గ్రామంలో చూసినా ఎరువుల కొరత తీవ్రంగా ఉందని, యూరియా, డీఏపీ కొరత రైతన్నలను కలవరపెడుతోందన్నారు. రైతులు అధిక ధరలు చెల్లించి ప్రైవేట్ షాపుల్లో కొనుక్కోవాల్సి వస్తోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఎన్నడూ ఎరువుల కొరత లేదన్నారు. ఖరీఫ్, రబీ సీజన్లకు ముందుగానే రైతు భరోసా కేంద్రాలకు ఎరువులు తరలించి పూర్తిస్థాయిలో అన్నదాతకు ఎరువులను సరఫరా చేసే ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. రైతుల పట్ల జగన్మోహన్రెడ్డి అనుసరించిన విధానాలు దేశానికే ఆదర్శమన్నారు. ఈ ప్రభుత్వం అరకొరగా సరఫరా చేస్తున్న ఎరువుల కోసం రైతులు క్యూలో నిలబడాల్సిన దుర్భర పరిస్థితి నెలకొనడమే కూటమి సర్కారు పనితీరుకు నిదర్శనమన్నారు. గత ప్రభుత్వ హయాంలో పంటల బీమా పథకం ప్రీమియం ప్రభుత్వమే చెల్లించేదని, ఇప్పుడు రైతు చెల్లించుకోవడమేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అన్ని వర్గాలకూ మోసం వంగర మండలంలోని శివారు గ్రామాలకు తోటపల్లి సాగునీరు అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందన్నారు. రైతులు, పింఛన్ లబ్దిదారులు, వికలాంగులు, యువత, విద్యార్ధులు, ఉద్యోగులను చంద్రబాబు సర్కారు మోసం చేస్తోందంటూ కూటమి సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ కేంద్రంలో ప్రగల్భాలు పలుకుతున్న నేతలకు ఆంధ్రప్రదేశ్లో రైతుల కష్టాలు పట్టడం లేదన్నారు. సమావేశంలో ఎంపీపీ ఉత్తారావెల్లి సురేష్ముఖర్జీ, వైఎస్సార్కాంగ్రెస్పార్టీ మండల కన్వీనర్ కరణం సుదర్శనరావు, ఎంపీటీసీ కనగల పద్మ, సర్పంచ్ పోలిరెడ్డి రమేష్, పార్టీ నాయకులు బొక్కేల వెంకటప్పలనాయుడు, కాంబోతుల శ్రీనివాస నాయుడు, పాలవలస ధవళేశ్వరరావు, పెంకి సంపత్కుమార్, కాంబోతుల రాము, గొండేల తవిటయ్య మాస్టారు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
అత్తా,కోడళ్ల ఘర్షణలో అత్త మృతి
జామి: అత్తా,కోడళ్ల మధ్య తలెత్తిన స్వల్ప వివాదం ఘర్షణకు దారి తీయడంతో కోడలు తోసివేయడంతో అత్త మృతిచెందింది. ఈ ఘటనపై సీఐ ఎల్.అప్పలనాయుడు, మృతురాలి కుమారుడు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని జేడీ వలస గ్రామానికి చెందిన గూనురు అప్పల కొండకు ముగ్గురు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు అప్పారావు, కోడలు రాజమండ్రిలో ఉండేవారు. అప్పారావు అనారోగ్యంతో మృతిచెందడంతో భార్య లక్ష్మి అత్తవారిల్లు అయిన జేడీ వలస గ్రామానికి వచ్చి ఉంటోంది. ఇటీవల కొద్దిరోజుల క్రితం పుట్టినిల్లు డెంకాడ వెళ్లి బుధవారం మళ్లీ జేడీ వలస వచ్చింది. వచ్చిన కొంత సమయం తరువాత అత్త గూనురు అప్పలకొండ (72), కోడలు లక్ష్మి మధ్య వివాదం తలెత్తడంతోఘర్షణ పడ్డారు.ఈ ఘర్షణలో అత్తను లక్ష్మి చేతితో తోసివేయడంతో మంచం మీదనుంచి కిందకు పడిపోయి స్తృహ కోల్పోగా కుటుంబసభ్యులు జామి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో తిరిగి మృతదేహన్ని జేడీ వలస గ్రామానికి తీసుకువచ్చారు. ఈ ఘటనపై మృతురాలి రెండవ కుమారుడు రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ ఎల్.అప్పలనాయుడు, ఎస్సై వీర జనార్దన్ ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించి జరిగిన ఘటనపై ఆరా తీశారు. అనంతరం సీఐ మాట్లాడుతూ మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పూర్తి స్ధాయిలో విచారణ చేపడతామని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఎస్.కోట సామాజిక ఆస్పత్రికి పోలీసులు తరలించారు. గజపతినగరం రూరల్: మండలంలోని పిడిశీల గ్రామానికి చెందిన కర్రోతు సాయిసుధ మంగళవారం తన ఇంట్లో ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గజపతినగరం ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు చీర కట్టుకుని ఉరివేసుకున్నట్లు చెప్పారు. కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడిపేదని భర్త, పిల్లలతో సరదాగా ఉన్న ఆమె ఒక్కసారిగా ఇంత పనిచేస్తుందని అనుకోలేదని స్థానికుల సమాచారం మేరకు తెలిసిందన్నారు. మృతురాలి తల్లి పిల్ల వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానా స్పద మృతి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహానికి పోస్ట్మార్టం అనందరం వచ్చిన నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపట్టనున్నామన్నారు. రాజాంలో శతాధిక వృద్ధురాలు..రాజాం సిటీ: పట్టణ పరిధి బుక్కా వీధికి చెందిన శతాధిక వృద్ధురాలు మండా గున్నరాజమ్మ(105) మంగళవారం రాత్రి మృతిచెందారు. ఆమె నిన్న మొన్నటి వరకు ఆరోగ్యంగానే ఉన్నారని, ఆహారం కూడా తీసుకునేదని కుటుంబసభ్యులు తెలిపారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు, కోడళ్లు, ఇద్దరు మనుమలు, ఐదుగురు మునిమనుమలు ఉన్నారు. -
గిరిజనుల డోలీ మోతలు ఇంకెన్నాళ్లు?
బొబ్బిలి రూరల్: గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని, ఇంకా ఎన్నాళ్లు ప్రమాదకరంగా గిరిజనులు ఈ డోలీ మోతలతో ఆస్పత్రుల్లో చేరాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కె పుణ్యవతి పాలకులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొత్త బట్టివలస గిరిజన గ్రామానికి చెందిన నిండు గర్భిణి మంగళవారం డోలీ మోతతో పిరిడి పీహెచ్సీలో చేరిన విషయం విదితమే.బుధవారం పీహెచ్సీలో తల్లీబిడ్డలను పుణ్యవతి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధిలో మైదాన ప్రాంతాలకు పెద్దపీట వేసి గిరిజన గ్రామాలపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, ఆరోగ్యం, విద్యను పాలకులు అందించలేకపోతున్నారని విమర్శించారు. బట్టివలస గిరిజన గ్రామానికి కూతవేటు దూరంలో ఉన్న మంత్రి సంధ్యారాణికి ఇవేమీ పట్టడం లేదన్నారు. పట్టణాలకు సమీపంలో ఉన్న గ్రామాలకే ఇటువంటి దుస్థితి వస్తే గిరి శిఖరాలపై నివసిస్తున్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని, డోలీ మోతల్లో తల్లీబిడ్డలకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. అనుకూలమైన వ్యక్తులకు కోట్లరూపాయల కాంట్రాక్టులను అప్పగించి మైదానప్రాంతాల్లో రోడ్లు వేసుకున్నారని, గిరిజన గ్రామాలపై పూర్తి వివక్షచూపుతున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని లేనిపక్షంలో గిరిజన మహిళలను ఏకం చేసి ఆందోళన బాటపడతామని ప్రభుత్వాన్ని, పాలకులకు హెచ్చరించారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పుణ్యవతి -
అంతరాలను తగ్గించేందుకే ఆది కర్మ యోగి
పార్వతీపురం: గిరిజనుల్లో అంతరాలను తగ్గించేందుకే ఆది కర్మ యోగి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ ఆది కర్మ యోగి కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామాల్లో పాలన, సేవలను అమలు చేసేందుకు శిక్షణ పొందిన కార్యకర్తలను నియమించ నున్నామన్నారు. గిరిజన గ్రామాల్లో కమ్యూనిటీ భాగస్వామ్యంతో సాధికారత కల్పించే లక్ష్యంతో ఆది కర్మ యోగి సిద్ధాంతం అమలు చేయనున్నామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, జీవనోపాధిలో అంతరాలను తగ్గించేందుకు ఆది కర్మ యోగి కార్యక్రమం ద్వారా చర్యలు చేపడతామన్నారు. గిరిజన భాషలు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంలో అభివృద్ధిని ప్రోత్సహించనున్నామని చెప్పారు. రాష్ట్రస్థాయి శిక్షకుడిగా ఎంపికై న ఐటీడీఏ ఏపీఓ మరళీధర్ పర్యవేక్షణలో జిల్లాలో రెండు బ్యాచ్లకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంద్వారా జిల్లాలో 500 మందికిపైగా జనాభా ఉన్న 165 గ్రామాలకు చెందిన 83వేల గిరిజనులు ప్రయోజనం పొందుతారన్నారు. 2047 నాటికి సంతృప్త మోడ్లో గ్రామాల్లోని అంతరాలను తీర్చడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదం చేస్తుందని అభిప్రాయ పడ్డారు. -
గణేష్ ఉత్సవాలకు నిబంధనలు తప్పని సరి
విజయనగరం క్రైమ్: గణేష్ ఉత్సవాల్లో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఇప్పటి నుంచే బందోబస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ వకుల్జిందల్ ఆదేశించారు. గణేష్ మంటపాల ఏర్పాటుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ఉత్సవ కమిటీలకు మాత్రమే అనుమతులు మంజూరు చేయాలని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక డీపీవోలో జరిగిన సమావేశంలో ఎస్పీ అన్ని స్టేషన్ల హౌస్ ఆఫీసర్లతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్గ్రేవ్, పోక్సో, అట్రాసిటి, మిస్సింగ్, సైబర్ క్రైమ్ వంటి అంశాలపై డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో సమీక్ష నిర్వహించారు. కోర్టుల్లో ట్రయల్ రన్ కేసులపై దృష్టి పెట్టాలని ప్రాసిక్యూషన్ జరుగుతున్న తీరుపై కోర్టు కానిస్టేబుల్తో పాటు ఎస్సైలు, సీఐలు దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా పోక్సో కేసుల్లో బాధితురాలి వయస్సు నిర్ధారించాలంటే కచ్చితంగా తహసీల్దార్ లేదా పంచాయతీ అధికారి నుంచి అధికరణ ధ్రువీకరణ పత్రం కచ్చితంగా ఉండాలన్నారు. అలాగే కేసు తీవ్రతను బట్టి ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష విధించిన కేసుల్లో దర్యాప్తును 60 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పారు. ఇక స్కూల్స్, కళాశాలల్లో ఈగల్ క్లబ్స్, శక్తి వారియర్ టీమ్స్ను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఆయా కళాశాలల్లో విద్యార్థినులు ఆత్మ రక్షణ పొందేందుకు స్పెషల్ ఇన్స్ట్రెక్టర్స్ను పెట్టుకోవాలని సూచించారు. రాత్రి పూట గస్తీ తిరిగే సిబ్బంది రెండు షిప్టుల్లో పనిచేయాలన్నారు. టౌన్ న్యూసెన్స్ యాక్టును విధిగా అమలు చేయాలని ఎస్పీ ఆదేశించారు. హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులపై నిఘా ఉంచాలని, ఫైనాన్షియల్ లావాదేవీల కేసుల్లో కూడా సిబ్బంది చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రతిభావంతులకు ప్రశంసాపత్రాలు అనంతరం పోలీసు విధులను సమర్థవంతంగా నిర్వహించి గంజాయి అక్రమాలు అరికట్టడం, చోరీలు నియంత్రించడం, లోక్ అదాలత్లో కేసులను త్వరితంగా పరిష్కరించిన సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో ఏఎస్పీ సౌమ్యలత, డీఎస్పీలు శ్రీనివాసరావు, భవ్యారెడ్డి, రాఘవులు, గోవింద, వీరకుమార్, న్యాయసలహాదారు పరశురామ్, సీఐలు చౌదరి, శ్రీనివాస్, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. డీపీఓలో నేర సమీక్షా సమావేశం -
రైతుకు లేని బీమా ధీమా
విజయనగరం ఫోర్ట్: వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఏవిధంగా ఉంటాయో తెలియని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. నిన్న మొన్నటి వరకు వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటలు ఎండిపోయాయి. గడిచిన నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో అధికశాతం పంటల సాగు వర్షాధారంగానే జరుగుతోంది. ఈ నేపథ్యంలో పంటలు పండేవరకు నమ్మలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో పంటల బీమా రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ కూటమి సర్కార్ రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతు సంక్షేమానికి పాటు పడతామని కూటమి సర్కార్ గొప్పలు చెబుతోంది కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. రైతులకు మేలు చేయడం మాట దేవుడెరుగు. ఉన్న ఉచిత పంటల బీమా పథకానికే కూటమి సర్కార్ చేతులెత్తేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లింపు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో రైతులు చెల్లించాల్సిన పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించింది. రైతు పంటలు సాగు చేసి ఈ–క్రాప్ నమోదు చేసుకుంటే చాలు. ఈక్రాప్ అధారంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించేది. పంటనష్టం జరిగితే బీమా పరిహారాన్ని కూడా సకాలంలో చెల్లించింది. గత ఏడాది రబీనుంచి రైతులదే బీమా చెల్లింపు గత ఏడాది రబీ నుంచి రైతులే పంటల బీమా ప్రీమియం చెల్లించుకోవాలని కూటమి సర్కార్ చెప్పేసింది. దీంతో రైతులు రబీసీజన్లో అపరాలకు, మొక్కజొన్నకు పంటల బీమా ప్రీమియం చెల్లించారు. పంటల బీమాకు రైతులు దూరం ఖరీఫ్ సీజన్లో రైతులు పంటల బీమాకు దూరంగా ఉన్నారు. పంటల బీమా ప్రీమియం చెల్లించాల్సి రావడంతో రైతులు బీమా ప్రీమియం చెల్లించడానికి ముందుకు రావడం లేదు. లక్షలాది మంది రైతులు ఉన్నప్పటికీ కేవలం 295 దరఖాస్తులే పంటల బీమా కోసం వచ్చాయి. వరి పంటకు ఎకరాకి రూ.200, మొక్కజొన్నకు రూ.165 నువ్వు పంటకు రూ.65 చొప్పన ప్రీమియం చెల్లించాలి. ప్రీమియం చెల్లించడానికి ముందుకు రాని రైతులు పంటల బీమాకు కేవలం 295 దరఖాస్తులు ముగిసిన గడువు ఉచిత పంటల బీమాకు కూటమి సర్కార్ మంగళం -
వైభవంగా శ్రీరామ పునర్వసు పట్టాభిషేకం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా ఆలయ అర్చకులు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో సుందరకాండ హవనం జరిపించారు. అనంతరం ఆలయంలోని వెండి మంటపం వద్ద సీతారాముల కల్యాణ వేడుకను కనులపండువగా నిర్వహించారు. ఆస్థాన మంటపంలో ఉత్సవమూర్తుల వద్ద రామాయణంలో పట్టాభిషేక సర్గ విన్నవించి, స్వామికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, వివిధ రకాల ఫల రసాలతో అభిషేకాలు జరిపించి వివిధ రకాల పుష్ఫాలతో సుందరంగా అలంకరించారు. కార్యక్రమంలో ఈఓ వై. శ్రీనివాసరావు, అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, కిరణ్, భక్తులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు జరిపించిన అర్చకులు -
హైకోర్టు ఉత్తర్వులు అమలు చేసి తీరాలి
సీఆర్టీల పోస్టులను డీఎస్సీకి కలపరాదని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 200 మంది సీఆర్టీలకు న్యాయం చేయకపోతే యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసనను మరింత ఉధృతం చేస్తాం. – ఎస్. మురళీమోహన్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న సీఆర్టీలకు జూన్ నెల నుంచి ఇవ్వాల్సిన జీతాల బకాయిలు చెల్లించాలి. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. గిరిజన పోస్టులు గిరిజనులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. – పాలక రంజిత్ కుమార్, గిరిజన సంక్షేమ సంఘం, ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి -
వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన
–8లోజీవి చిన్నదే.. ప్రమాదం పెద్దది పార్వతీపురం మన్యం జిల్లాలో దోమలు విజృంబిస్తున్నాయి. మలేరియా, డెంగీలతో పాటు అక్కడక్కడ చికెన్గున్యా వంటి జ్వరాల వ్యాప్తికి కారణమవుతున్నాయి. మక్కువ/పార్వతీపురం రూరల్: జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ మంగళవారం పరిశీలించారు. మక్కువ మండలం దుగ్గేరు గ్రామ సమీపంలోని అడారుగెడ్డ ఉద్ధృతిని పరిశీలించి గిరిజనులతో మాట్లాడారు. రాకపోకల సమస్యలను తెలుసుకున్నారు. గిరిజనులకు పునరావాసం కల్పించాలని అధికారులను ఆదేశించారు. వైద్యసేవలు అందేలా చూడాలన్నారు. అనంతరం దుగ్గేరు గ్రామంలో ఎరువుల దుకాణాన్ని పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్, నిల్వలపై ఆరా తీశారు. ఎరువులకు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్యామ్ప్రసాద్ హెచ్చరించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ భరత్కుమార్, డిప్యూటీ ఎంపీడీఓ సూర్యనారాయణ, ఏఓ భారతి, తదితరులు ఉన్నారు. సాకిగెడ్డ పరిశీలన పార్వతీపురం మండలంలోని లచ్చరాజుపేట– పుట్టూరు గ్రామాల మధ్య ప్రధాన రహదారికి అనుసరించి ఉన్న సాకిగెడ్డను కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ పరిశీలించారు. సాకిగెడ్డ ఉప్పొంగడం వల్ల కలుగుతున్న పంటనష్టం, రాకపోకల కష్టాలను స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సాకిగెడ్డ ప్రవాహంలో కొట్టుకొచ్చిన కోళ్లు, మేకలు లచ్చిరాజుపేట కూడలి సమీపంలో ఉన్న కాజ్వే వద్ద చిక్కుకున్నాయి. మెరుగైన వైద్యసేవలు అందించాలి పార్వతీపురం రూరల్: ప్రజల ప్రాణాలకు ముప్పువాటిల్లే ప్రమాదకరమైన గుంతలను పూడ్చేందుకు నివేదిక అందించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈనెల 20 నాటికి నివేదిక అందిస్తే తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పలు అంశాలపై జిల్లాస్థాయి అధికారులతో మంగళవారం సమీక్షించారు. ప్రమాదకర గుంతలను తాత్కాలికంగా పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో జన ఔషధి కేంద్రాల(జనరిక్) ఏర్పాటుకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ సముదాయాలను గుర్తించాలన్నారు. సమావేశంలో జేసీ ఎస్.ఎస్.శోభిక, డీఆర్వో కె.హేమలత, ఎస్డీసీ ఎస్.దిలీప్ చక్రవర్తి, డ్వామా, డీఆర్డీఏ, ఐసీడీఎస్ పీడీలు రామచంద్రరావు, సుధారాణి, కనకదుర్గ, డీపీఓ కొండలరావు, జిల్లా వ్యవసాయశాఖాధికారి రాబర్ట్పాల్, జిల్లా ఉద్యానవనశాఖ వై. క్రాంతికుమార్, ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు, డీఎంహెచ్ఓ డా. భాస్కరరావు, సీపీఓ ఆర్.కె.పట్నాయక్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. పంటలు, ఆస్తి నష్టంపై కలెక్టర్ ఆరా -
అర్ధరాత్రి వరకూ తాగుకోండి!
బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025బ్యానర్.... సాక్షి, పార్వతీపురం మన్యం : మందుబాబులు ఇకపై అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లో దర్జాగా కూర్చొని తాగేయవచ్చు. మద్యం అడ్డగోలు దోపిడీకి, సామాన్యుల జేబులు చిల్లు చేసేందుకు ప్రభుత్వమే ‘పర్మిట్’ ఇచ్చేసింది. బార్లు తెరిచే వేళలను మరో రెండు గంటలపాటు పెంచింది. ఉదయం 10 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఇవి తెరిచే ఉంటాయి. గత ప్రభుత్వ హయాంలో ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకే ఈ వేళలు ఉండేవి. నూతన బార్ల కోసం ఎకై ్సజ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. మూడేళ్లపాటు ఉండే లైసెన్సుకు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 26వ వరకు గడువిచ్చారు. 28వ తేదీన లాటరీ విధానంలో లైసెన్సులు కేటాయిస్తారు. నూతన విధానం ద్వారా ఆదాయం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇప్పటికే మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి.. విచ్చలవిడిగా ఏనీటైం మద్యం లభ్యమయ్యేలా చేశారు. సిండికేట్లే ఇక్కడ చక్రం తిప్పి, అధిక దుకాణాలు దక్కించుకున్నారు. కూటమి నాయకులే ఎక్కువగా భాగస్వాములుగా ఉన్నారు. గొలుసు దుకాణాలకు వైన్స్ యాజమానులే తలుపులు తెరిచారు. ఇప్పుడు బార్లతో దొరికినంత దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడ కూడా సిండికేట్లు వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి నూతన పాలసీ అమల్లోకి రానుంది. గతంలో విజయనగరం జిల్లా పరిధిలో 23, పార్వతీపురం మన్యంలో ఏడు చొప్పున బార్లు ఉండేవి. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో 28, పార్వతీపురం మన్యంలో ఎనిమిది ఏర్పాటు కానున్నాయి. నూతన మద్యం పాలసీ ప్రకారం వైన్షాపుల మాదిరి బార్లలోనూ కొన్ని కల్లుగీత కార్మికులకు కేటాయిస్తున్నారు. ఈ ప్రకారం విజయనగరంలో 3, పార్వతీపురంమన్యం జిల్లాలో రెండు కేటాయించారు. విజయనగరం జిల్లాకు సంబంధించి విజయనగరం నగర పాలక సంస్థ పరిధిలో 18, బొబ్బిలి మున్సిపాలిటీలో 4, రాజాం నగర పంచాయతీ 5, భోగాపురం వీఎంఆర్డీఏ పరిధిలో ఒకటితోపాటు.. గీత కార్మికులకు విజయనగరం నగర పాలక సంస్థ పరిధిలో 1, నెల్లిమర్ల 1, రాజాం 1 చొప్పున ఉన్నాయి. మన్యం జిల్లాలో మొత్తం పార్వతీపురం 4, సాలూరు 5, పాలకొండ 1 చొప్పున ఏర్పాటు కానున్నాయి. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు. విజయనగరం కార్పొరేషన్ పరిధిలో ఒక దరఖాస్తుకే రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక బార్ పొందడానికి లైసెన్సు ఫీజు రూ.55 లక్షలుగా నిర్ణయించారు. రోజులో 14 గంటలు బార్లు తెరిచే ఉంటాయ్.. నూతన బార్లకు నోటిఫికేషన్ విడుదల -
సీఆర్టీల ఆందోళన
పార్వతీపురం రూరల్: సీఆర్టీలు ఆందోళన బాటపట్టారు. గిరిజన సంక్షేమశాఖలో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఏడాదిలో 11 నెలలు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన చేశారు. ఐటీడీఏ అధికారుల నిర్వాకం వల్ల ఉద్యోగాలకు భద్రత కరువైందని ఆరోపించారు. డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయని, కొత్తవారికి పోస్టులు కేటాయిస్తే తమ ఉద్యోగాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న సుమారు 200 మంది సీఆర్టీలకు న్యాయం చేయాలంటూ యూటీఎఫ్, సీఆర్టీ, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పోరుబాట సాగించారు. హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని డిమాండ్ -
సీసీరోడ్డు, ఇళ్లు మంజూరు చేయండి
జియ్యమ్మవలస రూరల్: జియ్యమ్మవలస మండలంలోని ఏనుగుల గూడ గ్రామానికి ిసీసీ రోడ్డు వేయడంతో పాటు ిపీఎం జన్దన్ యోజన కింద పక్కా ఇళ్లు మంజూరు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు డిమాండ్ చేశారు. గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వం బాధ్యతని గుర్తు చేశారు. గ్రామ సమస్యలు పరిష్కరించాలంటూ గ్రామస్తులతో కలిసి మంగళవారం నినదించారు. కార్యక్రమంలో సీపీఎం జియ్యమ్మవలస మండల కార్యదర్శి కూరంగి సీతారాం, గిరిజన సంఘం నాయకులు మండంగి రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకుడు గరుగుబిల్లి రాజు, తదితరులు పాల్గొన్నారు. -
డోలీలో ఐదు కిలోమీటర్లు...
బొబ్బిలిరూరల్: బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధి కొత్తబట్టివలస గిరిజన గ్రామానికి చెందిన గర్భిణి సీదరపు గౌరమ్మకు మంగళవారం పురిటినొప్పులు ఆరంభమయ్యాయి. ఆస్పత్రిలో చేర్పించాల్సిని పరిస్థితి. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు డోలీని కట్టి సుమారు 5 కిలోమీటర్ల మేర నిండుగర్భిణిని మోసుకుని గోపాలరాయుడుపేట వద్దకు చేర్చారు. అక్కడ నుంచి 108 వాహనంలో పిరిడి పీహెచ్సీకి తరలించారు. ఆమె సాధారణ ప్రసవంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. వైద్యులు సేవలు అందిస్తున్నారు. పురిటినొప్పులు వేళ వైద్యసేవలు అందకపోవడంతో నిండుగర్భిణి ఆక్రందనలు కూటమి నాయకులకు వినిపించకపోవడం విచారకరమని గిరిజన నాయకులు మండిపడ్డారు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోల రమణి, అఖిలభారత రైతుకూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మణరావు మాట్లాడుతూ గిరిజనుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తున్నామన్న ప్రభుత్వం కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతోందని విమర్శించారు. గిరిజనులకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా డోలీలమోత తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లెపండగ పనులను పప్పు బెల్లాల్లా పంచుకుతిన్న కూటమి నాయకులు గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాన్ని మరిచిపోయారని ఆరోపించారు. కోట్లాది రూపాయల ఉపాధిహామీ నిధులతో సొంత ప్రయోజనకర పనులను చక్కబెడుతూ గిరిజనులకు డోలీ కష్టాలను మిగుల్చుతున్నారన్నారు. తక్షనమే మౌలిక సదుపాయాలు కల్పించకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి: ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డిపార్వతీపుం రూరల్: వినాయక చవితి మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరని, సింగిల్ విండోవిధానంలో అనుమతులు జారీ చేస్తామని ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి మంగళవారం తెలిపారు. అనుమతుల కోసం హెచ్టీటీపీ://గణేష్ఉత్సవ్.నెట్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని మీ సేవలో చలనా చెల్లిస్తే అనుమతులు మంజూరవుతాయన్నారు. వాటిని మండపాల వద్ద అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలన్నారు. మండపాల నిర్వాహకులు పోలీస్ నిబంధనలను పాటించాలని సూచించారు.విద్యార్థుల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలిపార్వతీపురం రూరల్: జిల్లాలో వెనుకబడిన తరగతులు, సాంఘిక సంక్షేమ వసతిగృహాల విద్యార్థుల ఆరోగ్యం, విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వసతిగృహాల్లో పల్లె నిద్ర, మైస్కూల్–మై ఫ్రైడ్ కొనసాగుతుందన్నారు. ఒక్కో వసతిగృహాన్ని ఒక మండల ప్రత్యేకాధికారి దత్తత తీసుకోవడం జరిగిందని, వారు సందర్శన సమయంలో ఎటువంటి లోటుపాట్లు ఉండరాదని స్పష్టం చేశారు. ఆ అధికారులు లోటుపాట్లుపై నివేదిక అందిస్తే సంబంధిత వార్డెన్లపై చర్యలు తప్పవన్నారు. సమావేశంలో జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ, సాధికారిత అధికారి ఇ.అప్పన్న, వసతిగృహ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.జిల్లాలో 17.2 సెంటీమీటర్ల వర్షపాతంపార్వతీపురం రూరల్: అల్పపీడనం కారణంగా జిల్లాలో సగటున 17.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అత్యధికంగా కురుపాంలో 50.8, భామిని 42.4, సీతంపేటలో 25.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం వర్షాల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. -
చీటింగ్ కేసు నమోదు
పార్వతీపురం రూరల్: పట్టణంలో 2017వ సంవత్సరంలో ఒక వ్యాపారి వద్ద ఫిర్యాదు దారులు బంగారం తాకట్టు పెట్టగా సదరు వ్యాపారి మృతిచెందడంతో వ్యాపారి కుమారుడు మాటమార్చేశాడు. తమ వద్ద బంగారం తాకట్టు పెట్టలేదని వాగ్వాదం చేయడంతో ఇటీవల ఎస్పీకి బాధితులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు మంగళవారం చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై గోవింద తెలిపారు. హెచ్చరిస్తున్న వినిపించుకోరా? భారీ వర్షాల సూచనతో జాగ్రత్తలు పాటించాలని..అలాగే ఇప్పటికే నిండిన చెరువులు, ప్రవహిస్తున్న గెడ్డల్లో దిగి స్నానాలు, ఈత వంటివి కొట్టకూడదని చెబుతున్నా యువత పట్టించుకోకపోవడం సరికాదని రూరల్ ఎస్సై బి.సంతోషి అన్నారు. భారీ వర్ష సూచన మేరకు మంగళవారం మండలంలోని పలు ప్రాంతాల్లో పరిశీలించిన ఆమె బందలుప్పి ఊర చెరువులో ప్రమాదకరంగా ఈతకొడుతున్న యువతను పిలిచి మందలించి హెచ్చరికలను విస్మరించడం సరికాదన్నారు. బాధ్యతగా ఉంటూ జాగ్రత్తలు పాటించి తీరాలని యువకులకు అవగాహన కల్పించారు. -
వినాయక ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదు
సాలూరు: వినాయక ఉత్సవాలు జరిగే సమయంలో నిమజ్జన సమయంలో డీజేలకు అనుమతి లేదని సాలూరు పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన పట్టణంలో మాట్లాడుతూ, వినాయక ఉత్సవాల మంటపాల కోసం సంబంధిత కమిటీ సభ్యులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు పూర్తి వివరాలు, మంటపాల ప్రదేశం, ఉత్సవాలు జరిపే తేదీలు, నిమజ్జనం జరిపే తేదీలు పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని పోలీసులకు ముందస్తుగా తెలియపర్చాలని సూచించారు. మంటపాల వద్ద ఏర్పాటుచేసే వినోద కార్యక్రమాలకు, మైకులకు పోలీసు వారి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.కమిటీ సభ్యులు మంటపాల వద్ద నిఘా కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. మంటపాలు, పరిసర ప్రాంతాల్లో అశ్లీల డ్యాన్సులు, అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిషేధమన్నారు. గణేష్ ఊరేగింపు, నిమజ్జనం కార్యక్రమం రాత్రి 11 గంటల్లోపు ముగించాలని కోరారు. నిబంధనలను ఎవరు అతిక్రమించరాదని హితవు పలికారు. సీఐ అప్పలనాయుడు -
జాతీయస్థాయి పోటీలకు క్యాంపస్ చాలెంజ్ విద్యార్థులు
పూసపాటిరేగ: మండలంలోని కోనాడ జంక్షన్లో గల క్యాంపస్ చాలెంజ్ విద్యార్థులు జాతీయస్థాయి పారా అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 9న విశాఖలో పారా రాష్ట్రస్థాయి, జూనియర్, సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో క్యాంపస్ చాలెంజ్కు చెందిన ఓళ్ల రామచరణ్తేజ లాంగ్జంప్, కొణతాల సోములమ్మ షార్ట్పుట్, 100 మీటర్లు, 400 మీటర్లు రన్నింగ్లో జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 29 నుంచి 31 వతేదీ వరకు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరగబోయే జాతీయస్థాయి పోటీలలో వారు పాల్గొనున్నారు. జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై న విద్యార్థులను పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.దయానంద్, క్యాంపస్ చాలెంజ్ డైరెక్టర్ సత్యనారాయణ శర్మ, ప్రిన్సిపాల్ గాయత్రి, కోచ్ గౌరి అభినందించారు. -
జీవి చిన్నదే.. ప్రమాదం పెద్దది
● వణుకు పుట్టిస్తున్న మశకాలు ● రోజురోజుకు పెరుగుతున్న దోమకారక జ్వరాలు ● నేడు ప్రపంచ దోమల నివారణ దినంసీతంపేట: పార్వతీపురం మన్యం జిల్లాలో దోమలు విజృంబిస్తున్నాయి. మలేరియా, డెంగీలతో పాటు అక్కడక్కడ చికెన్గున్యా వంటి జ్వరాలను వ్యాప్తి చేస్తూ నిత్యం వేలాది మంది ప్రజలు ఆస్పత్రుల పాలయ్యేలా చేస్తున్నాయి. వాటి నివారణకు ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా రోజురోజుకు దోమల తీవ్రత పెరుగుతూనే ఉంది. పట్టణాలతో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో దోమల బెడద ఎక్కువగా ఉంది. ఈనెల 20న ప్రపంచ దోమల నివారణ దినం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. దోమల దినంగా ఎందుకంటే.. ప్రపంచానికి కామన్ శత్రువుగా మారిన దోమల ఆట కట్టించడానికి సర్ రోనాల్డ్ రాస్ శతాబ్దం క్రితమే రంగంలోకి దిగి 1897లో దోమల ద్వారానే మలేరియా జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని నిర్ధారించారు. ఈ పరిశోధనకు గాను ఆయనకు నోబెల్ బహుమతి కూడా వచ్చింది. లండన్ స్కూల్ ఆఫ్ హైజెనిక్ అండ్ ట్రాపికల్ మెడిసన్ ఈసందర్బాన్ని పురస్కరించుకుని ఆగస్టు 20న అంతర్జాతీయ దోమల నివారణ దినంగా ప్రకటించింది. అరికట్టేదెలా.. దోమ ఎగురుతున్నపుడు పట్టుకోవడం, చంపడం చాలా కష్టమైన పని. ఒక్క దోమను పట్టుకోవాలంటే ఎంతో శ్రమించాలి. కానీ దోమలు నీటిలో లార్వా, ప్యూపా దశలో పెరుగుతున్నప్పుడు వాటిని నాశనం చేయడం చాలా సులువు. ఇవి ఇంటిలో నీటిని నిల్వ చేసే కుండీల్లో చిన్నచిన్న పురుగుల్లా కనిపిస్తుంటాయి. వాటిని చాలా మంది నీటి పురుగులు, జలగలు అని పిలుస్తుంటారు. ఇలా దోమ పిల్లలు (లార్వా) నిల్వ నీటిలో ఉన్నట్లయితే ఆ నీటిని మట్టి లేదా ఇసుకలో పారబోయాలి. ఇలా చేయడం వల్ల లార్వా, ప్యూపా దశల్లో ఉన్న వాటిని వందల సంఖ్యలో నాశనం చేయవచ్చు. దోమలపై దాడికి లక్షల్లో ఖర్చు.. దోమలు ప్రజారోగ్యాన్ని కాటేస్తున్నాయి. చిన్నా,పెద్దా తేడా లేకుండా రక్తాన్ని పీల్చేస్తున్నాయి. దోమల దాడిని తట్టుకునేందుకు ప్రతి నెలా పచారీ సామగ్రి మాదిరిగానే లిక్విడ్స్, మస్కిటో రీఫిల్స్, కాయిల్స్, మస్కిటో ధూప్ స్టిక్స్ వంటి వాటికి నెలకు రూ.100 నుంచి రూ.500 వరకు ఒక్కో కుటుంబం ఖర్చు చేస్తుంది. ఆడదోమలే ప్రమాదకరం.. మగ దోమలు చెట్ల రసాలను పీల్చి బతుకుతాయి. ఆడ దోమలు మాత్రం సంతానాభివృద్ధిలో భాగంగా గుడ్లు పెట్టడానికి మనిషి రక్తాన్ని పీల్చుతుంటాయి. ఈక్రమంలో వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని కుట్టిన దోమ రక్తాన్ని పీల్చినప్పుడు రక్తంతో పాటు వ్యాధి కారకమైన పారాసైట్ దోమ లాలాజల గ్రంథుల్లోకి చేరుతుంది. అక్కడ పారాసైట్లో కొన్ని మార్పులు జరుగుతాయి. మరో ఆరోగ్యవంతమైన వ్యక్తిని దోమ కుట్టినప్పుడు లాలా జలంతో పాటు పారసైట్ మనిషి రక్తంలో చేరి వ్యాధులకు కారణమవుతాయి. నివారణ ఇలాచేద్దాం... ● దోమలు కుడితే ఎంతటి ప్రాణాంతక విషజ్వరాలు ప్రబలుతాయో అందరికీ తెలిసిందే మలేరియా, డెంగీ వంటి జ్వరాలకు దోమలే కారణం. మస్కిటో రీఫిల్స్, కాయిల్స్ వంటివి మనం దోమల నివారణకు ఇంట్లో వాడతాం. వాటివల్ల కొందరికి శ్వాసకోస వ్యాధులు వస్తాయి. ఈ నివారణ చర్యలు చేపడితే మంచిదే. ● వేపనూనె దోమలను తరిమికొట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని వాసన దోమలు భరించలేవు. వేప, కొబ్బరినూనెలను సమాన భాగాలుగా చేసుకుని బయటకు కనిపించే శరీర బాగాలపై రాసుకుంటే దోమలు దరిచేరవు. ● ఇళ్లల్లోకి దోమలు ప్రవేశించే కిటికీల వంటి ద్వారాల వద్ద తులసి మొక్కలను పెంచాలి. ఇవి దోమలను దూరం చేస్తాయి. దోమల వృద్ధి లేకుండా చూస్తాయి. ● లెమన్ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్ మిశ్రమం దోమలను తరిమికొడుతుంది. ఇది సహజసిద్ధమైన యాంటీ సెప్టిక్గానే కాకుండా ఇన్స్టెక్ రిఫ్లెంట్గాను పనిచేస్తుంది. ● కర్పూరం మెరుగ్గా పనిచేస్తుంది. ఖాళీ ప్రదేశాలను మూసిన తర్వాత కర్పూరాన్ని వెలిగిస్తే దానినుంచి వచ్చే పొగకు దోమలు మాయమవుతాయి.దోమల నివారణకు విస్తృత చర్యలు దోమల నివారణకు విస్తృతంగా చర్యలు చేపట్టాం. ఐఆర్ఎస్ ఏసీఎం 5 శాతం ద్రావణాన్ని ప్రతి ఒక్క ఇంట్లో స్ప్రేయింగ్ చేసుకోవాలని చెబుతున్నాం. గంబూషియా చేపలను కూడా మురికి కుంటల్లో వేస్తున్నాం. – పీవీ సత్యనారాయణ, డీఎంవో, సీతంపేట ఐటీడీఏఅవగాహన కల్పిస్తున్నాం దోమ కారక వ్యాధులు ప్రబలకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. యాంటీలార్వా ఆపరేషన్ చేపడుతున్నాం. మలేరియా, డెంగీ వంటి వ్యాధులకు సంబంధిత పీహెచ్సీల్లో కూడా పూర్తిస్థాయిలో మందులు ఉంటున్నాయి. – జె.మోహన్రావు, మలేరియా సబ్యూనిట్ ఆఫీసర్, సీతంపేట -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడిలో అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైల్వేస్టేషన్ దగ్గర వనంగుడిలో అమ్మవారికి నేతేటి ప్రశాంత్ ప్రత్యేక పూజలు చేశారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్లు శాస్త్రోక్తంగా నిత్య పూజలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించారు. ఆలయం వెనుక ఉన్న వేప,రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. ఆలయ ఈఓ కె.శిరీష కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
అమృత్ భారత్ పనుల్లో జాప్యం తగదు
పార్వతీపురంటౌన్: అమృత్ భారత్ పనుల్లో జావ్యం తగదని రైల్వే డివిజనల్ మేనేజర్ లలిత్ బోరా అన్నారు. ఈ మేరకు మంగళవారం పార్వతీపురం రైల్వేస్టేషన్లో జరుగుతున్న అమృత్ భారత్ నూతన స్టేషన్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ప్రయాణికులకు కొద్ది రోజుల్లోనే అధునాతన రైల్వేస్టేషన్ను అందుబాటులో తీసుకువస్తామన్నారు. అమృత్ భారత్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నూతనంగా ఎఫ్ఓబీ, టికెట్ కౌంటర్, రిజర్వేషన్ కౌంటర్, వెయింటిగ్ హాల్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న స్టేషన్ ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. స్టేషన్ అభివృద్ధికి సిబ్బంది అంకిత భావంతో పని చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ డీసీఎం కె.సాందీప్, సీనియర్ డీఎన్, ఏడీఎన్ తదితరులు పాల్గొన్నారు. పనులు పరిశీలించిన రైల్వే డివిజినల్ మేనేజర్ -
జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన
పార్వతీపురం టౌన్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మంగళవారం జిల్లా కేంద్రంలో పర్యటించారు. చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న సందర్భంగా స్థానిక బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చాయ్ పే చర్చలో అనేక సమస్యల్ని తెలుసుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి తాను అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎరువుల కొరత విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. నామినేటెడ్ పదవుల కేటాయింపులో టీడీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అన్నారు. సుపరి పాలన తొలిఅడుగు కార్యక్రమంలో ప్రభుత్వం తమకు ఆహ్వానించడం లేదన్నారు. అనంతరం పట్టణంలోని శ్రీ విద్యా సర్వమంగళపీఠంలో దక్షిణామూర్తి భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపు రెడ్డి శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
దేవుడి భూములతో రియల్ఎస్టేట్ వ్యాపారమా?
సాలూరు: పట్టణంలో అన్యాక్రాంతమవుతున్న పలు దేవాదాయ ధర్మాధాయశాఖ భూములను పరిరక్షించాలని సామాజిక కార్యకర్త నైన హరిరెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు.పట్టణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ నూతన కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారం గతంలో ఎన్నడూ లేని విధంగా అట్టహాసంగా జరిగిందని, మంత్రి సంధ్యారాణి ఈ కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారని పేర్కొన్నారు. అయితే ప్రమాణ స్వీకారం చేసిన కమిటీలో సభ్యుడైన పేర్ల విశ్వేశ్వరరావుపై సీఎంకు, ఇతర ఉన్నతాదికారులకు తాను ఫిర్యాదు చే సినట్లు తెలిపారు. ఆయన రియల్ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఎక్కువగా దేవదాయధర్మాదాయ శాఖ భూములనే కొనుగోలు చేశారని ఆరోపించారు. అందులో ముఖ్యంగా పట్టణంలో వేణుగోపాలస్వామి, సీతారామస్వామి, ఆంజనేయ స్వామి ఆలయాలకు చెందిన విలువైన భూములను తక్కువ ధరలకు కొనుగోలుచేశారని పేర్కొన్నారు. దేవుని భూములను మోసపూరితంగా దక్కించుకున్న వ్యక్తిని వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ సభ్యుడుగా ఎలా నియమించారని, ఆయన పేరును ఎవరు సిఫారసు చేశారని, అటువంటి వ్యక్తితో మంత్రి ఎలా ప్రమాణస్వీకారం చేయించారని పలు ప్రశ్నలు వేశారు. కమిటీలో ఒక్క బ్రాహ్మణుడు, ఎస్టీ లేరంటూ ఎండోమెంట్ ఈఓ తీరును తప్పుబట్టారు. అధికారులు స్పందించి ఇటువంటి వారిపై తనిఖీలు చేసి, కోట్ల రుపాయల విలువైన దేవాదాయధర్మాదాయ శాఖ భూములను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ సభ్యుడిపై సీఎంకు ఫిర్యాదు సామాజిక కార్యకర్త నైన హరిరెడ్డి -
మాజీ సైనికులకు లీగల్ సర్వీసెస్ క్లినిక్ ప్రారంభం
విజయనగరం లీగల్: మాజీ సైనిక ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు లీగల్ సర్వీసెస్ క్లినిక్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి,, సీనియర్ సివిల్ జడ్జి ఎ.కృష్ణ ప్రసాద్ మంగళవారం ప్రారంభించారు. వీర్ పరివార్ సహాయత యోజన స్కీమ్ 2025ను అనుసరించి ప్రతి జిల్లాలోనూ లీగల్ సర్వీసెస్ క్లినిక్ను ప్రారంభించి మాజీ సైనిక ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు న్యాయ సహాయం అందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి కేవీఎస్ ప్రసాదరావు, న్యాయవాది ధనుంజయరావు, పారా లీగల్ వలంటీర్ జి.రమణ, పెద్దసంఖ్యలో మాజీ సైనికోద్యోగులు పాల్గొన్నారు. 29న స్వయం ఉపాధి శిక్షణకు ఇంటర్వ్యూలురాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ నైరెడ్లో ఈ నెల 29న ఉచిత స్వయం ఉపాధి శిక్షణకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామని డైరెక్టర్ ఎం.రాజేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 19 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసుగల నిరుద్యోగ సీ్త్ర, పురుషులు అర్హులన్నారు. పురుషులకు సెల్ఫోన్ రిపేరింగ్ అండ్ సర్వీసింగ్ (30 రోజులు), జెంట్స్ టైలరింగ్ (31 రోజులు), రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ (75 రోజులు), హౌస్ వైరింగ్ (30 రోజులు), సీసీ టీవీ కెమెరా ఇన్స్టాలేషన్ (13 రోజులు), ప్లంబింగ్ అండ్ శానిటరీ వర్క్స్ (30 రోజులు), అలాగే సీ్త్రలకు హోం నర్సింగ్ (25 రోజులు), లేడీస్ టైలరింగ్ (31 రోజులు), బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ (35 రోజులు), కంప్యూటర్ డీటీీ ప (45 రోజులు)లో శిక్షణ ఉంటుందని అన్నా రు. ఇంటర్వ్యూకు పదో తరగతి మార్కుల లిస్టు, రేషన్ కార్డు, ఆధార్కార్డులతో హాజరు కావాలని సూచించారు. శిక్షణ కాలంలో భోజన, వసతి సదుపాయం కల్పించనున్నామన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9014716255, 9491741129, 9866913371, 9989953145 నంబర్లను సంప్రదించాలని సూచించారు. కేజీబీవీ ప్రిన్సిపాల్పై కక్ష సాధింపు సరికాదు ● వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగాన నెల్లిమర్ల రూరల్: శ్రీకాకుళం జిల్లా పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్పై ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగాన శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రిన్సిపాల్ సౌమ్యను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురి చేయడం క్షమించరాని నేరమన్నారు. రాత్రి 10 గంటలు దాటిన వరకు టీడీపీ కార్యాలయంలో సౌమ్యను ఉంచడం ఏమిటని ప్రశ్నించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆమెను బదిలీ చేశారని ఆరోపించారు. ఆత్మహత్యాయత్నం చేసుకునే పరిస్థితికి ఆమెను తీసుకువచ్చిన ఎమ్మెల్యేపై ప్రభుత్వం విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. -
విద్యార్థుల్లో ప్రతిభాన్వేషణ
వ్యక్తిగతంగా లేదా.. పాఠశాలల నుంచి వరీక్షలు రాయడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు వ్యక్తిగతంగా లేదా పాఠశాల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వీవీఎం.ఓఆర్జీ.ఇన్ వెబ్సైట్లో లాగిన్ అవవచ్చు. ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – జి.లక్ష్మణ రావు, జిల్లా సైస్స్ అధికారిపార్వతీపురంటౌన్: విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనలు పెంపొందించేందుకు, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక ఆలోచనలను ఆవిష్కరణల వైపు ప్రోత్సహించేందుకు, పరిశోధన, ప్రయోగాల్లో రాణించేలా ఏటా కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్న్ మంథన్న్(వీవీఎం) పేరుతో జాతీయస్థాయిలో ప్రతిభాన్వేషణ పరీక్షను నిర్వహిస్తోంది. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న వారికి ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారికి భారతదేశ ప్రముఖ పరిశోధన సంస్థల్లో ఇంటర్న్షిప్, స్కాలర్షిప్లు పొందే అవకాశం ఉంటుంది. అలాగే నెలకు రూ. 2000 వేలు చొప్పున సంవత్సరానికి రూ.24 వేలు స్కాలర్షిప్ అందుకునే అవకాశం ఉంటుంది. జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీ పరీక్షను జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహిస్తారు. 6 నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తరగతులకు విడివిడిగా ఈ పరీక్ష ఉంటుంది. ఇందులో తెలుగు, హిందీ, ఇంగ్లీషు తదితర భారతీయ భాషల్లో పరీక్ష ఉంటుంది. విద్యార్థుల ఆసక్తిని బట్టి వారికి నచ్చిన భాషలో పరీక్ష రాయవచ్చు. రాష్ట్ర స్థాయికి ఎంపిక ఇలా.. పాఠశాల స్థాయి ప్రాథమిక పరీక్ష రాసిన విద్యార్థుల్లో తరగతుల వారిగా ప్రతిభ చూపిన మొదటి 25 మందిని ఎంపిక చేస్తారు. 6–11 తరగతులకు గాను మొత్తం 150 మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. అందులో ప్రతిభ చూపిన ప్రతి తరగతి నుంచి ముగ్గురు వంతున మొత్తం 18 మందిని జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయిలో ప్రతి తరగతి నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేలతో పాటు మెమెంటో, సర్టిఫికెట్ అందజేస్తారు. సృజనాత్మకతను వెలికి తీసేందుకే.. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు విద్యార్థి విజ్ఞాన్ మంథన్ చక్కని వేదికగా నిలుస్తుంది. సైన్స్ పట్ల అభిరుచిని పెంచడం, వారిని శాస్త్రవేత్తలుగా తయారు చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ పరీక్షలో ప్రభుత్వ, ఇతర యాజమాన్య, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొనవచ్చు. – బి.రాజకుమార్, డీఈఓ, పార్వతీపురం మన్యందరఖాస్తుల ఆహ్వానం విద్యార్థి విజ్ఞానన్ మంథన్ ప్రవేశ పరీక్షలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి ఆన్న్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆనన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, సెప్టెంబరు 30వ తేదీలోగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు ముగుస్తుంది. ప్రవేశ పరీక్ష ఆనన్్ లైన్ పద్ధతిలో పాఠశాల స్థాయిలో నిర్వహించనున్నారు. పరీక్ష జరిగే రోజు విద్యార్థులకు వారికి అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్, మొబైల్, ల్యాప్టాప్, డెస్క్టాప్, డిజిటల్ పరికరాలతో ఏదైనా ఒక దాని ద్వారా పరీక్షకు నిర్దేశించిన అప్లికేషన్ను ప్లే స్టోర్ నుంచి డౌన్న్లోడ్ చేసుకుని వారి ఇంటి నుంచే పరీక్షకు హాజరయ్యే అవకాశముంది. విద్యార్థి, విజ్ఞాన్ మంఽథన్కు దరఖాస్తుల ఆహ్వానం సెప్టెంబర్ 30 రిజిస్ట్రేషన్లకు తుదిగడువు మూడు విడతల్లో పరీక్ష -
తీరంలో.. అలెర్ట్
● నాలుగు రోజులుగా నిలిచిన చేపల వేట ● మత్స్యకార గ్రామాలను సందర్శించిన అధికారులుపూసపాటిరేగ: తీరప్రాంత గ్రామాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. గడిచిన నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వలలు, బోట్లు సురక్షిత ప్రాంతాలకు తరలించి మత్స్యకారులు ఇంటికే పరిమితమయ్యారు. రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు తీరంలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేసి సురక్షితంగా ఉండాలని కోరారు. ఎంపీడీఓ ఎం.రాధిక కోనాడ గ్రామంలో పర్యటించారు. కోనాడ సెలయేరు వద్ద చంపావతినది నుంచి నీటి ప్రవాహం ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చింతపల్లి, తిప్పలవలస గ్రామాల్లో తహసీల్దార్ ఎన్వీ రమణ పర్యటించి మత్స్యకారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. -
అప్రమత్తంగా ఉండాలి
పార్వతీపురం రూరల్: జిల్లాలో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎ. శ్యామ్ప్రసాద్ కోరారు. వర్షాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేయాల ని అధికారులను ఆదేశించారు. జిల్లాలో వర్షాల పరిస్థితిపై తన కార్యాలయంలో జిల్లా అధికారులతో సోమవారం సమీక్షించారు. నీటి ప్రవా హం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎలాంటి కార్యకలాపాలు చేయకూడదని తెలిపారు. ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డు లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, డీఆర్వో కె.హేమలత, ప్రత్యేక ఉపకలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీ ఏ పీడీ ఎం.సుధారాణి, ఇతర జిల్లా అధికారు లు పాల్గొన్నారు. పార్వతీపురం రూరల్: జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరక్ష్యరాస్యులైన వారికి అక్షర జ్ఞానం కలిగించి ఫైనాన్సియల్, డిజిటల్ లిటరీసీపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను సోమవారం ఆదేశించారు. జిల్లాలో 57 శాతం అక్షరాస్యత ఉందని, నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ ఏడాది 65,011 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేలా లక్ష్యాన్ని నిర్దేశించినట్టు వెల్లడించారు. వయోజన విద్య కింద సాయంత్రం, లేదంటే రాత్రివేళల్లో ప్రతిరోజు ఒక గంట సమయం వారికి అక్షరజ్ఞానం కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం సవ్యవంగా సాగేలా డీఆర్డీఏ, మెప్మా, డ్వామా, ఐసీడీఎస్ సిబ్బంది బాధ్యత వహించాలన్నారు. పీజీఆర్ఎస్కు వచ్చిన వినతులను సకాలంలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రతీశాఖలో పీజీఆర్ఎస్ కోసం నియమించబడిన వారు రెండు వారాల పాటు కలెక్టరేట్లో శిక్షణ పొందాలన్నారు. సమావేశంలో డీఆర్వో కె. హేమలత, ఎస్డీసీలు పి.ధర్మచంద్రారెడ్డి, ఎస్.దిలీప్చక్రవర్తి, డీఆర్డీఏ డ్వామా, ఐసీడీఎస్ పీడీలు ఎం. సుధారాణి, కె.రామచంద్రరా వు, పి. కనకదుర్గ, తదితరులు పాల్గొన్నారు. గుమ్మలక్ష్మీపురం(కురుపాం): తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు నీటి ముంపునకు గురైన వరి పంటను చిన్నచిన్న జాగ్రత్తలతో కాపాడుకోవచ్చని కురుపాం మండలం రస్తాకుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం (ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం) ప్రోగ్రాం కో ఆర్డినేటర్ ఎస్.కె.ద్రువ అన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎస్.స్రవంతి, ఎస్.శ్రీనివాసరాజు, ఉమాజ్యోతితో కలిసి జియ్యమ్మవలస మండలంలోని తురకనాయుడు వలస, గరుగుబిల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామంలోని ముంపునకు గురైన వరి పంటను పరిశీలించారు. పొలంలో ముంపు నీటిని వీలైనంత త్వరగా మళ్లించాలని, అనంతరం ఎకరాకు 20 కిలోల యూరియా, 10–15 కిలోల పోటాష్ ఎరువును పై పాటుగా వేయా లని సూచించారు. వీరి వెంట గరుగుబిల్లి వ్యవసాయాధికారి విజయభారతి ఉన్నారు. -
చిత్రం చూసి చిత్తరువొందే..!
వేల అక్షరాలు..వందల వాక్యాల్లో తెలియ చేయలేని భావం..ఒక్క చిత్రం స్పష్టంగా తెలియజేస్తుంది. కాల గమనం సాగిపోతున్న క్రమంలో గతంలో జరిగిన ఘట్టాలైన సంతోషం, బాధ, సాధించిన విజయాలు మళ్లీ మళ్లీ గుర్తుకు తెచ్చుకోవడం ఒక్క ఫొటోతోనే సాధ్యం. ప్రకృతిలోని అందాలను, పొట్టకూటి కోసం వలస కూలీల బతుకు ప్రయాణం, కార్ఖానాల్లో కార్మికుల కష్టాలు, పొలాల్లో అన్నదాతల కష్టాల సాగు, మహిళల తాగునీటి ఇబ్బందులు, మూగజీవాల ఆర్తనాదాలు..రోడ్డు ప్రమాదాల వంటి ఎన్నో ఘటనలను ఒక్క ఫొటో విశదీకరిస్తుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం ● నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ డే -
పింఛన్ల కోత
రద్దు చేసిన దివ్యాంగుల పింఛన్లను పునరుద్ధరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎన్నికలకు ముందు ఆర్భాటంగా హామీల వర్షం కురిపించిన కూటమి నాయకులు.. ఇప్పుడు పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలను కుదించేందుకు కుట్రలు చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయు డు, కార్యదర్శివర్గ సభ్యులు ఎన్వై నాయుడు విమ ర్శించారు. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రేగిడి: దివ్యాంగుల పింఛన్లు రద్దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అన్యాయమని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైఎస్సార్సీపీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్లు అన్నారు. రేగిడిలో సోమ వారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దివ్యాంగులకు రూ.6వేలు పింఛన్ అందజేస్తున్నామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇప్పుడు పింఛన్లు రద్దుచేస్తూ నోటీసులు అందజేస్తుండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నా రన్నారు. ఇంతవరకు కొత్తగా ఒక్క దివ్యాంగునికి కూడా పింఛన్ మంజూరుచేయకుండా, ఇప్పుడు ఉన్నవి రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం శోచనీయమన్నారు. దివ్యాంగుల్లో బోగస్ పింఛన్ పొందుతున్నవారు ఉన్నారని చంద్రబాబు చెబు తుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పుడు పింఛన్ రద్దు అయిన వారిలో గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పింఛన్ మంజూరైన వారు ఉన్న విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలోనే ఆధార్ కార్డులు మార్పుచేసుకుని తెలుగుదేశం నాయకులు, జన్మభూమి కమిటీ సభ్యులు లబ్ధిదారులైన విషయం కూటమి నాయకులు గుర్తెరగాలని వివరించారు. మరోసారి విశాఖపట్నం కేజీహెచ్ వైద్యాధికారులతో పింఛన్ రద్దయిన దివ్యాంగుల దివ్యాంగత్వాన్ని పరిశీలించాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల తరఫున పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరా వు, వైఎస్సార్ సీపీ రాజాం నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు కరణం శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
జోరువానలో నిరసన హోరు
పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న సీఆర్టీలకు బకాయిలున్న జీతాలను తక్షణమే చెల్లించాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోతే కాంట్రా క్టు ఉపాధ్యాయులు బతికేది ఎలా అని ప్రశ్నించా రు. ఐటీడీఏ కార్యాలయంలో ఏఈగా పిలవబడే జి.తిరుపతిరావుకు పనిలేకుండా జీతాలు ఎలా చెల్లిస్తున్నారో చెప్పాలన్నారు. పార్వతీపురం రూరల్: ఓ వైపు భారీ వర్షం కురుస్తున్నా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ప్రజల నిరసన హోరు కొనసాగింది. వివిధ సమస్యలపై కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. పీజీఆర్ఎస్లో కలెక్టర్ శ్యామ్ప్రసాద్కు వినతులు అందజేశారు. నా పేరు వావిలిపల్లి శంకరరావు. మాది పార్వతీపురం మున్సిపాల్టీ పరిధిలోని జగన్నాథపురం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అర్హత ఉన్న పథకాలన్నీ అందాయి. పిల్లలకు విద్యాదీవెన, రైతుభరోసా నిధులు బ్యాంకు ఖాతాకు జమయ్యా యి. కూటమి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన అన్నదాత సుఖీభవ పథకం నిధులు ఖాతాకు జమకాలేదు. అధికారులను ఆశ్రయిస్తే తను మరణించినట్టు ఆన్లైన్లో చూపిస్తున్నట్లు తెలిపారు. ఇదెక్కడి అన్యాయమంటూ వాపోయారు. బాసంగి గ్రామానికి చెందిన సింహాచలం కూడా అన్నదాత సుఖీభవతోపాటు ప్రభుత్వం నుంచి ఏ పథకాలు అందడంలేదంటూ కలెక్టర్కు వినతిపత్రా న్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాలు, మండ లాలు ఏర్పాటు, సరిహద్దుల మార్పిడికి ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు కురుపాం మండలంలో తూర్పు ముఠా ప్రాంతానికి చెందిన ఆదివాసీయులకు ప్రత్యేకంగా మొండెంఖల్ను మండల కేంద్రంగా చేయాలని ట్రైబల్రైట్స్ఫారం నాయకులు డిమాండ్ చేశారు. కురుపాం రావాలంటే దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్లు ప్ర యాణించాల్సి వస్తోందన్నారు. 15వేలకు పైగా జనాభా కలిగి ఉన్న ఆదివాసీలకు ప్రత్యేక మండలం కేటాయంచాలని కలెక్టర్కు విజ్ఞప్తిచేశారు. గత ప్రభుత్వం మక్కువ మండలం పనసభద్ర పంచాయతీలో చెక్కవలస గ్రామానికి ఎర్ర సామంతవలస వరకు ఉపాధిహామీ నిధులతో రోడ్డు నిర్మాణం చేపట్టింది. పనులు మధ్యలో నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలవుతున్నా అసంపూర్తి పను లు పూర్తిచేయడంపై దృష్టిపెట్టడం లేదు. రోడ్డు నిర్మాణానికి వేసిన కంకర వర్షాలకు కొట్టుకుపోతోంది. రాకపోకలకు ఇబ్బందులు పడుతు న్నాం. తక్షణమే రోడ్డు నిర్మాణం పూర్తిచేయాలంటూ కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. పార్వతీపురం మున్సిపాల్టీలో ఆప్కాస్ విధానంలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తూ మృతిచెందిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూ నియన్ డిమాండ్ చేసింది. సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన చేశారు. -
భారీ వర్షాలపై అప్రమత్తం
● ఎంపీ తనూజారాణిపాలకొండ: పార్వతీపురం మన్యం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అరకు ఎంపీ గుమ్మ తనూజారాణి ఒక ప్రకటనలో కోరారు. పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న ఆమె సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పూర్తి ఏజెన్సీతో కలిగి ఉన్న ప్రాంతంలో ఎటువంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఇందుకోసం కలెక్టర్ను ఫోన్లో సంప్రదించి చేపట్టవలసి చర్యలు వివరించామని పేర్కొన్నారు. ప్రధానంగా నదీతీర గ్రామాల్లో ప్రజల ను అప్రమత్తం చేయాలని సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రతి మండలంలోను కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. రైతుల పంటలకు, పశు సంపదకు నష్టం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెరువులు, కాలువలకు గండ్లు పడే అవకాశం ఉందని ఈ పరిస్థితుల్లో ముందుగానే వాటిని గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర సమయంలో కలెక్టర్ కమాండ్ కంట్రోల్ రూమ్ నంబర్ 08963293046కు సంప్రదించాలని స్పష్టం చేశారు. -
వీరఘట్టంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
● లైసెన్స్ లేని 10 షాపులకు నోటీసులువీరఘట్టం: ఇటీవల పలు దుకాణాల్లో నాసిరకమైన చిరుతిళ్లు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని, కాలం చెల్లిన స్నాక్స్ తిని చిన్నారులు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారని సోమవారం సాక్షి లో ప్రచురితమైన ‘డేంజర్ స్నాక్స్’ కథనంపై జిల్లా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు స్పందించారు. కలెక్టర్ శ్యామ్ప్రసాద్ ఆదేశాల మేరకు జిల్లా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారి ఎం.వినోద్కుమార్ నాయక్ వీరఘట్టంలోని పలు షాపుల్లో సోమవారం ముమ్మర తనిఖీలు చేశారు. ఓ వైపు జోరు వాన కురుస్తున్నా మరో వైపు షాపుల్లో ఉన్న తినుబండారాల ప్యాకెట్లు పరిశీలించారు.మొత్తం పది షాపుల్లో తనిఖీలు చేయగా అన్ని షాపుల్లో కూడా ఎక్కడా తినుబండారాల ప్యాకెట్లపై తయారీ తేదీ గాని, ఎక్స్పైరీ డేట్ గాని లేకపోవడాన్ని గుర్తించారు.ఈ షాపులన్నింటికీ ఆయన నోటీసులు ఇచ్చారు.కాలం చెల్లిన తినుబండారాల ప్యాకెట్లను సీజ్ చేశారు. అయితే ఊరిలోకి ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు వచ్చారని తెలియడంతో చాలా షాపులు మూసి వేయడంపై ఆయన షాపుల యజమానుల తీరుపై మండిపడ్డారు.ఆహార పదార్థాలు విక్రయించే ప్రతి షాపు లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు.ఇక మీదట ప్రతి వారం వీరఘట్టంలో ఉన్న అన్ని షాపులు తనిఖీ చేస్తానని ఆయన తెలిపారు.వ్యాపారులు సహకరించాలని, నిబంధనలు పాటించని వారిపై శాఖాపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. -
నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ పాఠశాల
చికెన్బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ125 శ్రీ220 శ్రీ230రాజాం: తుఫాన్ వర్షాలకు ప్రభుత్వ, పైవేట్ పాఠశాలలకు కలెక్టర్ సోమవారం సెలవు ప్రకటించారు. రాజాంలోని చీపురుపల్లి రోడ్డులో గల ప్రభాకర్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం మొండిగా వ్యవహరించి, పాఠశాల తెరవడమే కాకుండా తరగతులకు గైర్హాజరైన విద్యార్థులపై చర్యలు ఉంటాయని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం బయటకు తెలియడంతో రాజాం ఎంఈఓ యాగాటి దుర్గారావు పాఠశాలకు సోమవారం చేరుకుని తనిఖీ నిర్వహించారు. ఆ సమయంలో పాఠశాలలో విద్యార్థులు ఉండడం చూసి మండిపడ్డారు. యాజమాన్యాన్ని మందలించడంతో పాటు నోటీసులు అందించారు. వెంటనే తరగతి గదుల్లోని విద్యార్థులను సురక్షితంగా వారి ఇళ్లకు పంపించాలని ఆదేశించడంతో పాటు దగ్గరుండి ఇళ్లకు తరలించారు. అనంతరం నివేదికలు తయారు చేసి జిల్లా అధికారులకు పంపించినట్లు తెలిపారు. మరో ప్రైవేట్ పాఠశాల తెరిచి ఉందని తెలిసి అక్కడికి వెళ్లి తనిఖీచేశామని ఎంఈఓ విలేకరులకు తెలిపారు. అప్పటికే అక్కడి విద్యార్థులు వెళ్లిపోయారన్నారు. -
ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక
లీప్ యాప్ ప్రామాణికంగా..వీరఘట్టం: ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి, వారు చేసిన సేవలకు గాను మండల, జిల్లా, రాష్ట్ర,జాతీయ స్థాయిలో ఉపాధ్యాయులను ప్రభుత్వాలు ప్రతి ఏటా సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం సందర్భంగా సత్కరిస్తుంటాయి. ఈ ఏడాది కూడా రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించేందుకు కూటమి ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉత్తమ టీచర్ల ఎంపికకు ‘లీప్’ యాప్ను ప్రామాణికంగా చేస్తూ తీసుకువచ్చిన నూతన విధానాన్ని టీచర్లతో పాటు ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. లీప్ యాప్ ప్రాధాన్యతపై గుర్రు.. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో ప్రస్తుతం లీప్ యాప్ ఎంతో కీలకం. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, విద్యార్ధుల పురోగతి పర్యవేక్షణ, తల్లిదండ్రులతో సమావేశాలు, విద్యార్థుల వ్యక్తిగత సంరక్షణ, విద్యార్ధుల గ్రీన్ పాస్పోర్టు తదితర కార్యక్రమాలన్నీ ఈ యాప్ ద్వారానే నిర్వహిస్తున్నారు. పాఠశాలలో సాంకేతిక పరిజ్ఞానం కలిగిన టీచర్ లేదా..విద్యార్థులతోనైనా ఈ పనులు చేయిస్తుంటారు. అలాంటప్పుడు ‘లీప్’ యాప్ నిర్వహణను ప్రామాణికంగా తీసుకుని ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు,టీచర్లు గుర్రుగా ఉన్నారు. వారంతా బెస్ట్ టీచర్లా? ప్రతి రోజు స్కూల్ వేళకు వచ్చి ఆన్లైన్లో అటెండెన్స్ వేసిన ఉపాధ్యాయులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.అయితే కొందరు టీచర్లు ఉదయం 8.30 గంటలకు పాఠశాలకు వెళ్లి సాయంత్రం 5 గంటల వరకు ఉండి చదువే చెప్పకుండా యాప్లో మాత్రం కచ్చితంగా అటెండెన్స్ వేసే వారు అక్కడక్కడా ఉన్నారు. ఇంకొందరు పాఠశాలకు ఉదయం వెళ్లి యాప్లో అటెండెన్స్ వేసి బయటకు వెళ్లి సాయంత్రం 5 గంటలకు మళ్లీ వెళ్లి ‘ఔట్’ అటెండెన్స్ వేస్తున్నారు. ఇలాంటి వారు బెస్ట్ టీచర్లు ఎలా అవుతారని ప్రశ్నిస్తున్నారు. లీప్ యాప్ ప్రామాణికంగా తీసుకుని రాష్ట్రస్థాయి సాంకేతిక నిపుణులు ప్రతి జిల్లాకు 16 మంది టీచర్లను ఎంపిక చేసి వారి జాబితాలను పంపినట్లు సమాచారం. వారందరినీ జిల్లాస్థాయి అవార్డుకు ఎంపిక చేసేలా ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. లీప్ యాప్ ప్రామాణికంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేయాలనే నిర్ణయం సరికాదని, ఈ విషయంలో అధికారులు పునరాలోచించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఈనెల 21 నుంచి 23 లోపు గుర్తింపు 25న జాబితా ప్రకటన రాష్ట్రస్థాయికి ఒక్కో జిల్లా నుంచి 8 మంది ఎంపిక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ప్రభుత్వ నిర్ణయం నరైంది కాదంటున్న ఉపాధ్యాయ సంఘాలు విశిష్ట సేవలు అందిస్తున్న టీచర్లను పారదర్శకంగా గుర్తించాలని డిమాండ్ఈ విధానం సరైంది కాదు లీప్ యాప్ ప్రామాణికంగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు టీచర్లను గుర్తిస్తామనడం సరైన విధానం కాదు. గ్రౌండ్ లెవెల్లో చాలా మంది ఉపాధ్యాయులు విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు.అటువంటి వారిని పారదర్శకంగా గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేయాలి. – మండల మురళి, ఏపీటీఎఫ్, మండలశాఖ అధ్యక్షుడు, వీరఘట్టం -
పెళ్లి ముచ్చట తీరకుండానే..!
● రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి రామభద్రపురం: పెళ్లయిన మద్దుముచ్చట తీరకుండానే రెండు నెలలకే రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన సోమవారం రామభద్రపురం మండలలోని శిష్టుసీతారాంపురం రహదారిపై జరిగింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శిష్టుసీతారంపురం గ్రామానికి చెందిన వెన్నెల అప్పారావు(31) పని నిమిత్తం ద్విచక్రవాహనంపై రామభద్రపురం మండలకేంద్రానికి వెళ్లాడు. పనిముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లిపోతుండగా అధికంగా వర్షం కురవడం వల్ల ద్విచక్రవాహనం అదుపు తప్పి సీతారాంపురం గ్రామం రూట్లో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి అక్కడిక్కడే దుర్మణం చెందాడు. వెంటనే స్థానికులు మృతుడి కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్య ప్రశాంతికుమారి, కుటుంబ సభ్యులు భోరున విలపించారు.పెళ్లయి రెండు నెలలే అయిందని, ముద్దు, ముచ్చట తీరకుండా వెళ్లిపోయావా? అంటూ వారి రోదన చూసిన ప్రతి ఒక్కరూ కంటతడిపెట్టారు. మృతుడి భార్య ఫిర్యాదుమేరకు ఎస్సై వి.ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.ఏరియా ఆస్పత్రి కిటకిటసీతంపేట: విస్తృతంగా వర్షాలు కురుస్తుండడంతో వ్యాధులు కూడా విస్తరిస్తున్నాయి. స్థానిక ఏరియా ఆస్పత్రి సోమవారం రోగులతో కిటకిట లాడింది. జ్వరంతో పాటు వివిధ రోగాల బారిన పడిన వారు ఆస్పత్రికి వస్తున్నారు. మొత్తం ఓపీ 345 మంది రాగా వారిలో జ్వరాలతో బాధపడుతున్న వారు 71 మంది ఉన్నారు. ఇన్పేషెంట్లుగా 71 మంది చేరారు. వారందరికీ రక్తపరీక్షలు చేసి వైద్యసేవలు అందిస్తున్నట్లు ఆస్పత్రి సూపరెంటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు.చెరువులో పడి వ్యక్తి మృతిగంట్యాడ: మండలంలోని పెదవేమలి గ్రామానికి చెందిన బోదంకి ఎర్నాయుడు (50) గ్రామంలోని వీర సాగరం చెరువులో పడి మృతిచెందాడు. ఎర్నాయుడు పశువులు మేపుతున్న సమయంలో అవి చెరువులోకి దిగడంతో వాటిని తోలేందుకు చెరువు మధ్యలోకి వెళ్లి మునిగిపోయాడు. ఎర్నాయుడు చెరువులో దిగి ఎంత సేపటికీ రాకపోవడంతో స్థానికులు చెరువులో దిగి వెతికి బయటకు తీశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమత్తం విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి పోలీసులు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.సాయికృష్ణ తెలిపారు. -
పాముకాటుతో అస్వస్థత
సీతంపేట: మండలంలోని పాతపనుకువలసకు చెందిన కుండంగి బలరామ్ ఆదివారం రాత్రి పడుకున్న సమయంలో విషసర్పం కాటువేసింది. దీంతో అస్వస్థతకు గురవగా స్థానిక ఏరియా ఆస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకువచ్చారు. ఇక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు వైద్యులు రిఫర్ చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. యువతిని మోసం చేసిన ముద్దాయికి ఏడాది జైలుశిక్షవిజయనగరం క్రైమ్: రెండేళ్ల క్రితం ఒక బాలికను నమ్మించి మోసం చేసిన కేసులో ముద్దాయికి విజయనగరం విజయనగరం పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి. కె.నాగమణి ఏడాది జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చినట్లు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ గోవిందరావు తెలిపారు. నగరంలోని కొత్తపేటకు చెందిన దశమంతుల లక్ష్మణరావు అనే వ్యక్తి 2023లో ఒక మైనర్ను నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి, అనంతరం లైంగిక దాడికి పాల్పడ్డాడు. అప్పట్లోనే మహిళా పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయగా ఎస్సై లక్ష్మి కేసు నమోదు చేశారు. ఆ కేసులో అప్పటి డీఎస్పీ వెంకటేశ్వర్లు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టి అభియోగ పత్రాలను దాఖలు చేశారు. ఈ కేసులో ప్రస్తుత మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ గోవిందరావు సాక్షులను, ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో నిందితుడిపై మోపిన అభియోగం రుజువు కావడంతో స్పెషల్ ఫర్ పోక్సో కోర్టు నాగమణి ముద్దాయి దశమంతుల లక్ష్మణరావుకు పై విధంగా శిక్ష విధించారని డీఎస్పీ తెలిపారు. అయితే ఈకేసులో బాధితురాలికి రూ.20 వేలు పరిహారంగా ఇవ్వాలంటూ కోర్టు తుది తీర్పు ఇచ్చిందన్నారు. -
ముగ్గురు అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
● సెలవు అనుమతి లేకుండా జిల్లా దాటివెళ్తే చర్యలు ● ప్రజల అర్జీలకు వెంటనే పరిష్కారం చూపాలివిజయనగరం అర్బన్: సెలవు అనుమతి లేకుండా జిల్లా దాటి వెళ్లే జిల్లా అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అధికారులను హెచ్చరించారు. సెలవు మంజూరు చేయకుండా సంక్షేమ శాఖ అధికారిణి పీజీఆర్ఎస్కు గైర్హాజరు అవడంపై సీరియస్ అయ్యారు. అదే విధంగా సమయపాలన పాటించకుండా పీజీఆర్ఎస్కు ఆలస్యంగా హాజరైన డీఎంహెచ్ఓ జీవనరాణిపై కలెక్టర్ ఆగ్రహించారు. బాధ్యతా రాహిత్యంగా విధులు నిర్వహించిన కారణంగా మరో అధికారి ఐసీడీఎస్ పీడీ విమలారాణిపై సీరియస్ అయి సరెండర్ ఉత్తర్వులు ఇవ్వమని డీఆర్ఓను ఆదేశించారు. జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అంగన్వాడీ పిల్లలకు సోమవారం సెలవు ఇవ్వాలని ఆదివారం రాత్రి కలెక్టర్ స్వయంగా ఇచ్చిన సెల్ మెసేజ్ను 24 గంటల వరకు ఐసీడీఎస్ పీడీ చూడలేదు. దీన్ని సీరియస్గా తీసుకుని ఈ ఆదేశాలు జారీచేశారు. ప్రజల అర్జీలకు వెంటనే పరిష్కారం చూపాలి కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్, డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, ప్రమీలాగాంధీ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలకు వెంటనే పరిష్కారం చూపాలని అర్జీలపై తీసుకున్న చర్యలను నిర్ణీత గడువులోగా అర్జీదారులకు తెలియజేయాలని ఆదేశించారు. అర్జీలు రీ ఓపెన్ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పీజీఆర్ఎస్లో ప్రజలు సామాజిక, వ్యక్తిగత అంశాలపై 94 అర్జీలు అందజేశారు. ఎస్పీ పీజీఆర్ఎస్కు 27 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం తన చాంబర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఎస్పీ 27 ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫిర్యాదుదారుల ముందే వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి అక్కడికక్కడే ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, ఏడు రోజుల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను రిపోర్ట్ రూపంలో డీపీఓకు పంపాలని సంబంధిత సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
అర్జీలన్నీ పరిష్కారం కావాలి
● కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్పార్వతీపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సోమవారం వచ్చిన అర్జీలన్నీ పరిష్కారం కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు తేల్చిచెప్పారు. కలెక్టర్తో పాటు అర్జీల స్వీకరణలో సబ్కలెక్టర్ ఆర్.వైశాలి, డీఆర్ఓ కె.హేమలత, ప్రత్యేక ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణిలు వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వినతులను సంబంధిత అధికారులకు అందించి పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలన్నీంటినీ పరిష్కారం చూపాలని, ఎక్కడా పెండింగ్ లేకుండా చేసి అర్జీదారులు సంతృప్తి చెందేలా చూడాలన్నారు. సోమవారం మొత్తం 65 వినతులు పలు సమస్యలపై అర్జీదారులు అందజేశారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు తగ్గిన వినతులు సీతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్ఆర్శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వినతులు తగ్గాయి. ప్రతి సోమవారం 20కు తగ్గకుండా వచ్చే వినతులు ఈ వారం పదిమాత్రమే వచ్చాయి. భారీగా వర్షాలు కురవడం, ఉభాల సీజన్ కావడంతో వినతులు తగ్గాయని అధికారులు తెలియజేస్తున్నారు. ఐటీడీఏ ఏపీఓ జి.చిన్నబాబు వినతులు స్వీకరించారు. టిటుకుపాయికి చెందిన నిమ్మక చిరంజీవితో పాటు పలువురు గ్రామస్తులు కొండచీపుళ్లు కొనుగోలు చేసి, విక్రయించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు.సదరం సర్టిఫికెట్ ఇప్పించాలని పాలిష్కోటకు చెందిన భవాని కోరగా లాడకు చెందిన సుక్కయ్య వృద్ధాప్య పింఛన్ ఇప్పించాలని అర్జీ అందజేశాడు. పాతరేగులగూడకు చెందిన సుక్కమ్మ పవర్ వీడర్ ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది. కార్యక్రమంలో పలువురు ఐటీడీఏ అధికారులు పాల్గొన్నారు. -
పాపం.. ఎవరో ఈమె..!
● వర్షంలో తడుస్తూ అమాయకంగా రోదిస్తూ ● కారు చీకటిలో మూడు రోజులుగా బొప్పడాం జంక్షన్లోనే ● సపర్యలు చేస్తున్న స్థానికులు నెల్లిమర్ల రూరల్: ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలికి సుమారు 80 ఏళ్లు పైనే ఉంటాయి. మూడు రోజుల క్రితం నెల్లిమర్ల మండలంలోని బొప్పడాం జంక్షన్కు వచ్చి..అప్పటి నుంచి అక్కడే ఉన్న బస్టాప్లోనే ఒంటరిగా ఉంటోంది. వర్షానికి తడుస్తూ..అమాయకంగా రోదిస్తూ ఏమీ చెప్పలేని దీనావస్థలో ఉంది. స్థానిక విజయగౌరి యువజన సేవా సంఘం అధ్యక్షుడు పిల్లా సుధాకర్తో పాటు పలువురు స్థానికులు సదరు వృద్ధురాలిని అక్కున చేర్చుకుని మూడు రోజుల నుంచి భోజన సదుపాయం కల్పిస్తున్నారు. అయినప్పటికీ రాత్రి సమయంలో కారు చీకటిలో ఒంటరిగా బస్టాప్లోనే కాలాన్ని వెళ్లదీస్తోంది. స్థానికులు ఆరా తీయగా..తన పేరు శ్రీకాకుళం దుర్గమ్మ అని..భర్త పేరు సత్యం అని చెబుతోంది. పెద్ద కూతురు పేరు గంగమ్మ అని, కుమారుడి పేరు సన్యాసిరావు అని చెబుతోంది. ఊరు పేరు మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతోంది. ఒక సారి జామి వద్ద బంధువులు ఉన్నారని..మరో సారి పొందూరు, రాజాం అంటూ చెబుతోందని స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యుల పేర్లు చెబుతున్నప్పటికీ ఊరి పేరు మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతోందంటున్నారు. మూడు రోజుల క్రితం విజయనగరం నుంచి బస్సులో బొప్పడాం జంక్షన్లో దిగిందని చెబుతున్నారు. బంధువుల ఇంటికి వెళ్లి తప్పిపోయిందా..? లేక మతిస్థిమితం లేక ఇంటి నుంచి వచ్చేసిందా? అనే విషయం తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఆచూకీ తెలిస్తే ఫోన్ 8374273700 నంబర్కు సమాచారం ఇవ్వాలని సామాజిక కార్యకర్త సుధాకర్ కోరారు. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చామని, ఎవరూ స్పందించకపోతే వృద్ధాశ్రమంలో చేర్పిస్తామని ఆయన తెలిపారు. -
మంచి నీళ్లివ్వండయ్యా..!
గుమ్మలక్ష్మీపురం (కురుపాం): తమకు కనీసం తాగేందుకు మంచి నీటిని అందివ్వాలని కురుపాం మండలం వలసబల్లేరు పంచాయతీ చాపరాయిగూడ గ్రామస్తులు పాలకులను కోరుతున్నారు. గ్రామంలో నేటికీ తాగునీటి వసతులు లేకపోవడంతో సుదూరంలో ఉన్న నేలబావి నీటిని తీసుకొస్తూ తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నామని వారు ఆదివారం వాపోయారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో బావి నీరంతా బురదమయంగా మారిందని, ఈ నీటిని ఎలా తాగలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలల కిందట తమ గ్రామానికి వచ్చిన అధికారులు గ్రామంలో బోర్ వేస్తామని హామీలిచ్చి వెళ్లిపోయారని, గ్రామానికి రోడ్డు లేదన్న సాకుతో నేటికీ బోర్ వేయలేదని, తాగునీటి సమస్య పరిష్కారం కాలేదని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో సుమారు వంద మంది వరకు నివాసం ఉంటున్నామని అయినా తమ నీటి కష్టాలు ఎవరికీ పట్టడం లేదని వారు పేర్కొన్నారు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి తమ గ్రామానికి మంచినీరు అందించే చర్యలు చేపట్టాలని వారు కోరారు. -
వేటకు అల్పపీడనం దెబ్బ..!
ప్రతికూల వాతావరణంతో పతివాడబర్రిపేటలో ఉధృతంగా సముద్ర కెరటాలు పూసపాటిరేగ: సముద్రమే సర్వస్వంగా జీవిస్తున్న గంగపుత్రులకు అల్పపీడన ప్రభావంతో ఏర్పడిన ప్రతికూల వాతావరణం వల్ల వేట సాగక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. అల్పపీడనం వల్ల వాతావరణ మార్పులతో సముద్ర అలలు కల్లోలంగా మారడంతో వేట సాగడం లేదు. తాజాగా గడిచిన మూడు రోజులుగా కెరటాలు ఉధృతి పెరగడంతో చేపల వేటకు వెళ్లలేకపోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో 27 కిలోమీటర్ల తీర ప్రాంతం వుంది. 21 మత్స్యకార గ్రామాలు వున్నాయి. ఆయా గ్రామాలలో సుమారు 21 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. వేటపై ప్రత్యక్షంగా ఆరు వేల మంది, పరోక్షంగా 15 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. సాంప్రదాయ బోట్లు, ఇంజన్ బోట్లు రెండు మండలాల్లో 1120 వరకు వున్నాయి. వాటిలో 885 బోట్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిష్టర్ అయి వున్నాయి. ఈ ఏడాది వేట నిషేధం తరువాత వేట ప్రారంభించినప్పటి నుంచి ఆశించిన స్థాయిలో చేపలు వలకు చిక్కడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. నిషేధ సమయంలో కుటుంబాలు ఎలాగో నెట్టుకొచ్చినా.. మళ్లీ అల్పపీడనం రూపంలో కష్టాలు ప్రారంభమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా అలలు ఉధృతి ఎక్కువై బోట్లు తీరానికే పరిమితమయ్యాయని వాపోతున్నారు. వేట సాగకపోవడంతో వలలకు మరమ్మతులు చేసుకుంటున్నామని చెబుతున్నారు. ఏడాదిలో సగం రోజులు ప్రకృతి వైపరీత్యాలు, మరి కొన్ని రోజులు తుఫాన్ హెచ్చరికలు, ప్రతికూల వాతావరణంతో వేట సాగక ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొంటున్నారు. మత్స్యకార జీవన విధానంలో మార్పులకు సర్కారు ప్రత్యామ్నాయం ఆలోచించి వేట లేని సమయంలో ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. పతివాడబర్రిపేటలో తీరానికే పరిమితమైన బోట్లు ప్రతికూల వాతావరణంతో ఇబ్బందులు సముద్రంలో అల్పపీడనం ప్రభావంతో ప్రతికూల వాతావరణం నెలకొంది. సముద్రంలో అలల ఉధృతి పెరిగింది. వాతావరణంలో మార్పులు కారణంగా వేట చేయలేని పరిస్థితి నెలకొంది. వేట సాగకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. తమకు వేట లేని సమయంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించి ఆదుకోవాలి. – బర్రి అమ్మోరు, పతివాడబర్రిపేట ప్రతికూల వాతావరణంతో కొనసాగని చేపల వేట మూడు రోజులుగా తీరంలో కురుస్తున్న భారీ వర్షాలు గంగపుత్రులకు ఆర్థిక కష్టాలు -
డేంజర్ స్నాక్స్..!
వీరఘట్టం: ఇటీవల కాలంలో చిన్న పిల్లల వైద్యుల వద్దకు రెగ్యులర్గా వస్తున్న పలు కేసులను పరిశీలిస్తే.. గ్యాస్ట్రిక్, కడుపులో నొప్పి, వాంతులు... ఇలా బయటపడుతున్నాయి. పిల్లలకు ఎందుకిలా ఈ విధమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని పరిశీలిస్తే.. ఎక్కువగా రసాయనాలు, అధికంగా కారం, సాల్ట్ ఉన్న నాసిరకం చిరుతిళ్లు(స్నాక్స్) తినడం వల్లేనని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఇటువంటి కేసులే చిన్నారుల్లో వెలుగు చూస్తున్నాయి. దీన్ని తల్లిదండ్రులు అంత సీరియస్గా పట్టించుకోకపోవడంతో బాల్యంలోనే చిన్నారుల శారీరక పెరుగుదల మందగిస్తోందని వైద్యులు చెబుతున్నారు. చిన్నారుల పాలిట చిరుతిళ్లు తయారు చేసే కంపెనీలు ప్రమాదకరంగా మారాయి. బ్రాండెట్ వాటి కంటే మెరుగైన ప్యాకింగ్ చేసి అందులో ఉన్న పదర్ధాలను మాత్రం నాసిరకంగా తయారు చేసి మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. నూనె మొదలు మసాలాల వరకు అన్నీ కల్తీ వస్తువులనే ఉపయోగిస్తుండడంతో వాటిని చిన్న చిన్నారులు అనారోగ్యం బారిన పడుతున్నారు. జీరో వ్యాపారం హైదరాబాద్, తూర్పుగోదావరి, అనంతపురం, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి నిత్యం చిరుతిళ్లు(స్నాక్స్) ప్యాకెట్లు జిల్లాకు దిగుమతి అవుతున్నాయి. ఇక్కడ హోల్సేల్ వ్యాపారులు జిల్లాలో ఉన్న వేలాది దుకాణాలకు వీటిని విక్రయిస్తున్నారు. అంతేకాక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు కూడా ఇటువంటి ప్యాకెట్లను ఇక్కడ విక్రయిస్తున్నారు. హోల్సేల్ షాపుల్లో ప్రతీ రోజూ రూ.లక్షల్లో చొప్పున ఏడాదికి రూ.కోట్ల వరకు స్నాక్స్ వ్యాపారం జరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇంతలా వ్యాపారం జరుగుతుండడంతో చిన్నపాటి కంపెనీలు కూడా పోటాపోటీగా ఆహార పదార్ధాలను నాసిరకంగా తయారు చేస్తూ తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. వీటిపై ఇటు ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులుగానీ, అటు జీఎస్టీ అధికారులుగాని తనిఖీలు చేపట్టకపోవడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా నడుస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి నాసిరకం ఆహార పదార్ధాలు విక్రయించే వారిపై చర్యలు చేపట్టి చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. నాసిరకం తినుబండారాల అమ్మకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులు ఆకర్షణీయంగా ఉన్న ఈ ప్యాకెట్లను చూసి కొనుక్కొని ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. చాలా పాఠశాలలు, వీధుల్లో ఉన్న చిరు దుకాణాల వద్ద నాసిరకం పదార్ధాలను విక్రయిస్తున్నారు. తల్లిదండ్రులు సైతం పిల్లల మీద ప్రేమతో వాటిని కొని ఇస్తున్నారు. దీంతో పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. ఇప్పటికై నా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలి. – పర్రి కృష్ణమూర్తి, ఉప విద్యాశాఖాధికారి, పాలకొండ నాసిరకం చిరుతిళ్ల వల్ల చిన్నారులు త్వరగా అనారోగ్యం పాలవుతారు. కడుపు నొప్పితో పాటు ఇన్ఫెక్షన్లు బారిన పడటం ఖాయం. ఒక్కోసారి ఫుడ్ పాయిజన్ జరిగి తీవ్ర స్థాయిలో అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది.త ల్లిదండ్రులు నాసిరకం తినుబండారాలను పిల్లలకు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. – డాక్టర్ జె.రవీంద్రకుమార్, చిన్న పిల్లల వైద్య నిపుణులు పార్వతీపురం మన్యం జిల్లాలో 1504 సర్కారు బడులు, 150 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 95,658 మంది విద్యార్థులు ఉన్నారు. వీరితో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో 3–6 ఏళ్లలోపు చిన్నారులు సుమారు 40 వేల మంది ఉన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలలో ప్రతీ వీధిలో కూడా చిన్నపాటి దుకాణాలలో చిరుతిళ్లను(స్నాక్స్) విక్రయిస్తున్నారు. వీరంతా హోల్సేల్ వ్యాపారుల దగ్గర లోకల్ ప్యాకింగ్లతో నాసిరకంగా తయారైన చిరుతిళ్ల ప్యాకెట్లను తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. నిత్యం పిల్లలు వీధుల్లో ఉండే బడ్డీ కొట్టులలో దొరికే నాసిరకం స్నాక్స్ తింటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అంతేకాకుండా కొందరు వ్యాపారులు కాల పరిమితి ముగిసిన స్నాక్స్ కూడా యఽథేచ్ఛగా విక్రయిస్తూ పిల్లల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. మీ పిల్లలు అడిగిన వెంటనే వారి అల్లరిని చూసి తినుబండారాలు(స్నాక్స్) కొంటున్న తల్లిదండ్రులు ఆ ప్యాకెట్ల పైన ఉన్న వివరాలను పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్యాకెట్లపై ఐఎస్ఓ మార్క్, తయారీ తేదీ, బెస్ట్ బిఫోర్ తేదీలను చూడాలని పేర్కొంటున్నారు. అలాగే ప్యాకెట్పై బ్యాచ్ నంబర్, కంపెనీ వివరాలు పక్కాగా ఉండాలి. ఇటువంటి వివరాలు లేకపోతే ఆ ప్యాకెట్లు కొనుగోలు చేయవద్దని, వెంటనే సమీపంలో ఉన్న రెవెన్యూ అధికారులకు లేదా ఫుడ్ కంట్రోల్ అధికారులకు సమాచారం ఇచ్చి నాసిరకం స్నాక్స్ అమ్మకాలను అరికట్టవచ్చునని అధికారులు చెబుతున్నారు. రోజు వారీ రూ.లక్షల్లో.. ఏడాదిలో రూ.కోట్లలో వ్యాపారం కోరి తెచ్చుకుంటున్న జబ్బులు నాసిరకం వస్తువులతో చిరుతిళ్ల తయారీ ముప్పు తప్పదంటున్న వైద్యులు ఆహార కల్తీ నియంత్రణ అధికారులు దృష్టి సారిస్తే మేలు -
హైకోర్టు న్యాయమూర్తికి సన్మానం
వీరఘట్టం: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి గేదెల తుహిన్కుమార్ను శ్రీకాకుళం జిల్లా బార్ అసోషియేషన్ న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. ఆదివారం ఆయన స్వగ్రామం వీరఘట్టం మండలం కత్తులకవిటిలో కలిసి అభినందనలు తెలిపారు. స్వయంకృషితో ఇంతటి ఉన్నత స్థానానికి ఎదిగిన తుహిన్కుమార్ మన ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం ఎంతో గర్వకారణంగా ఉందని వీరన్నారు. జడ్జిని కలిసిన వారిలో శ్రీకాకుళం బార్ అసోషియేషన్ న్యాయవాదులు వాన కృష్ణచంద్, ఎన్ని సూర్యారావు, కొమరాపు ఆఫీసునాయుడు, మామిడి క్రాంతి తదితరులున్నారు. స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ హైకోర్టు న్యాయమూర్తిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. నేడు పీజీఆర్ఎస్ సీతంపేట: స్థానిక ఐటీడీఏలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించనున్నారు. ఏపీవో చిన్నబాబు వినతులు స్వీకరించనున్నారు. గిరిజనులు తమ సమస్యలపై వినతులు సమర్పించవచ్చని ఐటీడీఏ అధికార వర్గాలు తెలిపాయి. కూటమి పాలనలో మహిళా ఉద్యోగులకు వేధింపులు నెల్లిమర్ల రూరల్: కూటమి ప్రభుత్వంలో మహిళా ఉద్యోగులకు వేధింపులు ఎక్కువయ్యాయని జై భీమ్రావ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు టొంపల నరసయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కనిగిరి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. మండలంలోని గుషిణి గ్రామంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీల నాయకులు, అనుచరుల వేధింపులు రాష్ట్రంలో ఏదో ఒక చోట నిత్యకృత్యమయ్యాయని ఆరోపించారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో గర్భిణి శ్రావణి ఆత్మహత్యే అందుకు ఉదాహరణ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ రాత్రి 10 గంటల తరువాత మహిళ ఉద్యోగులను పార్టీ కార్యాలయానికి రప్పించడమేమిటని ప్రశ్నించారు. రాత్రి 10.30 దాటిన తరువాత వీడియో కాల్స్ చేసి వేధించడం దుర్మార్గమైన చర్య అన్నారు. పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యపై కక్ష సాధింపు చర్యలకు దిగి అన్యాయంగా బదిలీ చేయించారన్నారు. ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉన్న సొంత సామాజిక వర్గానికి చెందిన ఎస్ఎస్ఏ అధికారి శశిభూషణ్ నుంచి తప్పుడు నివేదికలు తెప్పించి దళిత ఉద్యోగి సౌమ్యకు అన్యాయం చేశారని ఆరోపించారు. శశిభూషణ్పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ పార్లమెంట్ ఇన్చార్జ్ చిన్నం అరుణ్కుమార్ పాల్గొన్నారు. -
నేడు, రేపు జిల్లాలో భారీ వర్షాలు
పార్వతీపురం రూరల్: జిల్లాలో సోమ, మంగళవారాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసినట్టు కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో జిల్లా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాల వలన ఎటువంటి ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు జరగరాదని, ఇందుకోసం ముందుగా గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆగస్టు18, 19 తేదీల్లో భారీ వర్షాలు కురిసే సమయంలో ఆరుబయట ఎవరూ తిరగరాదన్నారు. శిథిలావస్థలోని భవనాలు, చెట్ల కింద ఉండరాదని సూచించారు. లోతట్టు, నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను దండోరా, మైక్ ద్వారా ప్రచారం చేస్తూ అప్రమత్తం చేయాలన్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు స్నానాలు చేయడం, బట్టలు ఉతకడం, పశువులను కడగడం, ఇసుకను తవ్వడం వంటి పనులు చేపట్టరాదని సూచించారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
వ్యవసాయంలో మేము సైతం..
మన్యంలోని వ్యవసాయం సాగులో మేము సైతం అంటూ చిన్నారులు తల్లిదండ్రులకు తోడుగా నిలబడుతున్నారనేందుకు ఈ చిత్రం సజీవ సాక్ష్యం. తండ్రికి తోడుగా తనయులు అన్నట్టు ఖరీఫ్ సీజన్లో ఇటీవల వర్షాలు విస్తారంగా ఏజెన్సీలో కురుస్తుండడంతో ఉభాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సాగులో పైపులు వేయడం ద్వారా నీటిని పొలాల్లో నిల్వ చేస్తారు. ఈ క్రమంలో రాయిలంకకు చెందిన ఇద్దరు చిన్నారులు తండ్రిగా సాయంగా పైపులు సుదూరంలో ఉండడంతో వాటిని పొలానికి మోసుకుంటూ ఇలా తీసుకువెళ్తూ... ఆదివారం సాక్షి కెమెరాకు చిక్కారు. వీరిద్దరూ ఓ వైపు చదువుకుంటూనే.. మరోవైపు సాగులో తండ్రికి సాయం చేస్తూ.. ఇలా నిలిచారు. – సీతంపేట -
అదానీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
బొబ్బిలి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అదానీ రాష్ట్రంగా కూటమి ప్రభుత్వం మర్చేస్తుందని ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బి.ధనలక్ష్మి విమర్శించారు. స్థానిక ఓ ప్రైవేటు రెసిడెన్సీలో ఆదివారం ఆశ వర్కర్స్ యూనియన్ 4వ జిల్లా మహాసభలు నిర్వహించారు. ముందుగా సీఐటీయూ జెండాను యూనియన్ నాయకురాలు లంక శాంతి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మహాసభలో ధనలక్ష్మి మాట్లాడుతూ పారిశ్రామికవేత్త అదానీకి దేశాన్ని అప్పగించేందుకు మోదీ, అమిత్షాలు ప్రయత్నిస్తుంటే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందని ఆరోపించారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని, మెటర్నటీ సెలవులను ఆరు నెలలు ఇవ్వాలని, ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని, వయోపరిమితి పెంచాలన్న ఆందోళన చేపడితే కొన్ని డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించిందని, ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్ల సమస్యలపై ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పి.శంకర్రావు, ఎస్.గోపాలం, యూటీఎఫ్ నాయకురాలు కె.విజయగౌరి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఆశ వర్కర్స్ యూనియర్ రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి -
పల్లకిలో పెళ్లికూతురి ఊరేగింపు
● గ్రామాల్లో కొనసాగుతున్న సంప్రదాయం వేపాడ: పూర్వీకుల సంప్రదాయాలను పల్లెల్లో నేటికి ఆచరిస్తూ ఉండడంతో నేటి తరానికి సంప్రదాయాలు, ఆచారాలు తెలుస్తాయని పెద్దలు అంటున్నారు. వేపాడ మండలం వల్లంపూడి గ్రామంలో ఆదివారం జరిగిన వివాహం సందర్భంగా పెళ్లికూతురును వేపాడ, వల్లంపూడి జంట గ్రామాల్లో పల్లకిలో ఊరేగించి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. శ్రావణమాసంలో ఆఖరు ముహుర్తం కావడంతో పెద్దసంఖ్యలో వివాహాలు జరుగుతున్నాయి. మరో 30రోజుల పాటు వివాహాలకు శూన్యమాసం రావడంతో ముహుర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. రెడ్డివానివలసలో కార్డన్సెర్చ్మెంటాడ: నాటుతుపాకుల ఏరివేతలో భాగంగా మెంటాడ మండలం కొండలింగాలవలస పంచాయతీ మధుర గ్రామం రెడ్డివానివలసలో సీఐ జీఏవీ రమణ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ –సెర్చ్ ఆపరేషన్ను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని సోదా చేశారు. సోదాల్లో భాగంగా 70లీటర్ల సారా, 1000 లీటర్ల మడ్డి కల్లు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై కె.సీతారాం తెలిపారు.పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యరామభద్రపురం: మండలకేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన గోర్జి రమేష్(44) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీరాంనగర్ కాలనీకి చెందిన రమేష్ కడుపునొప్పితో బాధపడుతున్నాడు.రోజూలాగానే పొలంలో పనిచేస్తుండగా కడుపులో నొప్పి రావడంతో ఈ నెల 15వ తేదీన గడ్డిమందు తాగేశాడు. ఈ విషయం గమనించిన కుటుంబసభ్యులు బాడంగి సీహెచ్సీలో ప్రథమ చికిత్స అనంతరం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 16న రాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య కృష్ణవేణి ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. నాగావళి నదిలో వ్యక్తి గల్లంతుసంతకవిటి: మండలంలోని పోడలి గ్రామానికి చెందిన ఉరదండం పోలయ్య(76) ఆదివారం నాగావళి నదిలో గల్లంతైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎప్పటిలాగానే ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు నాగావళి నదికి వెళ్లాడు. ఎప్పటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో నది దగ్గరికి వెళ్లి చూడగా నది వద్ద దుప్పటి, చెప్పులు ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఎస్సై ఆర్.గోపాలరావు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. అలాగే సంఘటన స్థలాన్ని తహసీల్దార్ బి.సుదర్శనరావు ఆధ్వర్యంలో ఆర్ఐ కృపారావు, వీఆర్ఓ అన్నారావులు పరిశీలించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు వీలు లేకుండా నదిలో వరద ఉధృతి అధికంగా ఉండడంతో కలెక్టర్ దృష్టిలో పెట్టామని, ఎస్డీఆర్ఎఫ్ బృందం వచ్చిన వెంటనే గాలిస్తామని తెలిపారు. పోలయ్య అల్లుడు ఎ.చిన్నారావు ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. -
గంటేడ పాటల పుస్తక పరిచయం
పార్వతీపురం: ప్రముఖ కవి గంటేడ గౌరునాయుడు రాసిన ‘పాడుదమా స్వేచ్ఛా గీతం’ పుస్తక పరిచయ కార్యక్రమాన్ని ఆదివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరునాయుడు రాసిన పాటల పుస్తకాన్ని పరిచయం చేస్తూ నేటివరకు ఆయన రాసిన పాటలను గుర్తుచేస్తూ వక్తలు ఉపన్యాసాలు ఇచ్చారు. ముందుగా పాయల మురళీకృష్ణ పుస్తక పరిచయం చేయగా పలువురు గంటేడ రాసిన పాటలను ఆలపించారు. కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ప్రజల జీవన శైలిని ప్రజలకు ఉన్న ఆకాంక్షలను తన రచనల ద్వారా ప్రపంచానికి తెలియజేసిన గొప్ప సాహితీవేత్త గంటేడ గౌరునాయుడు అని, ‘స్నేహకళా సాహితి’ పేరుతో సంస్థను స్థాపించి కళింగాంధ్ర ప్రాంతంలో ఎందరో యువ కవులను, రచయితలను ప్రోత్సహిస్తున్నారని వక్తలు ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంవీఆర్ కృష్ణాజీ హాజరు కాగా చీకటి దివాకర్ అధ్యక్షత వహించారు. దేశ గత చరిత్ర నెత్తిటి మరక పాటల సీడీని డాక్టర్ వెంకట్రావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇంటర్ విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు, డాక్టర్ మంచిపల్లి శ్రీరాములు, గజల్ వినోద్, ఉపాధ్యాయులు, సాహితీవేత్తలు, మేధావులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
సమాజం అభివృద్ధికి జర్నలిస్టుల బాధ్యత కీలకం
విజయనగరం గంటస్తంభం: సమాజంలో జరుగుతున్న మంచి, చెడును వెలికి తీసి అభివృద్ధికి దోహదపడే పవిత్ర వృత్తిలో జర్నలిజం కీలకంగా నిలుస్తుందని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) 68వ ఆవిర్భావ దినోత్సవం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కలెక్టర్ డా.బీఆర్ అంబేడ్కర్, ఎస్పీ వకుల్ జిందల్, ఏటీకే వ్యవస్థాపకుడు డా.ఖలీల్బాబా జ్యోతి ప్రజ్వలన చేశారు. తొలుత స్వర్గీయ గురజాడ అప్పారావు, సర్ సీవైచింతామణి, మానుకొండ చలపతిరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇళ్ల స్థలాలు లేని జర్నలిస్టులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే అందరూ ఏక తాటిపై నిలిచి ఒకే జాబితా ఇస్తే అర్హులందరికీ ఇవ్వడానికి అవకాశం ఉందన్నారు. ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ నకిలీ జర్నలిస్టులను నిరోధించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అందులో భాగంగా వృత్తిలో ఉన్న జర్నలిస్టుల వాహనాలకు క్యూఆర్ కోడ్తో ఉన్న స్టిక్కరింగ్ వ్యవస్థను సుమారు 15 నుంచి 20 రోజుల్లో తీసుకొస్తామన్నారు. జర్నలిస్టులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పీఎస్ఎస్వీ శివప్రసాద్ మాట్లాడుతూ కుటుంబ జీవనానికి సరిపడ ఆదాయం లేనప్పటికీ జర్నలిజం వృత్తినే నమ్ముకున్న జర్నలిస్టు కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. సీనియర్ జర్నలిస్టులకు సత్కారం అనంతరం జిల్లాలో 25 ఏళ్లపాటు జర్నలిజం వృత్తిలో ఉన్న 40 మంది సంఘం సభ్యులను సంఘం జ్ఞాపికలు, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మహాపాత్రో అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఎంఎస్ఎన్రాజు, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు పంచాది అప్పారావు, ఆరిపాక రాము, చిన్న పత్రికల సంఘం జిల్లా అధ్యక్షుడు కేజేశర్మ, కార్యదర్శి సముద్రాల నాగరాజు, సీనియర్ జర్నలిస్టులు ఎలిశెట్టి సురేష్, డేవిడ్ రాజు, చక్రవర్తి, వేదుల సత్యనారాయణ, జె.శేషగిరి, జయరాజ్, లింగాల నర్శింగరావు, మంత్రి ప్రగడ రవి, శంకరావు, గోవింద తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 68వ ఆవిర్భావ దినోత్సవం -
చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిరంతర నిఘా
విజయనగరం అర్బన్: జిల్లాలో క్షేత్రస్థాయిలో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా నిరంతరం నిఘా పెడుతూ విస్తృతంగా దాడులు చేస్తున్నామని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చట్ట విరుద్ధ చర్యలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జూదం, కోడి–గొర్రె పందాలు నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తరచూ పట్టుబడుతున్న నిందితులపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా లే–అవుట్లు, గ్రామ శివారు, నగర శివారు, తోటలు, పాడుబడిన భవనాల్లో జూదం ఆడుతున్న వారిపై పోలీసులు విస్తృత దాడులు నిర్వహిస్తున్నారన్నారు. ఈ క్రమంలో డ్రోన్ల సహాయం తీసుకుంటున్నామని వివరించారు. నిఘా వ్యవస్థను బలోపేతం చేసి ముందుగానే సమాచారం సేకరించి దాడులు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఇప్పటి వరకు పేకాట విషయంలో 1,031 మందిపై 141 కేసులు నమోదు చేసి రూ.24,07,398 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కోడి పందాల విషయంలో 174 మందిపై 35 కేసులు, రూ.1,13,679 నగదు, 75 కోళ్లు, 4 పొట్టేళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెపారు. మహిళా పోలీసుల ద్వారా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి చట్టవిరుద్ధ కార్యక్రమాలలో పాల్గొనకూడదని అసాంఘిక కార్యకలాపాలపై ఏమైనా సమాచారం తెలిసినా స్థానిక పోలీసులకు లేదా డయల్ 112/100కు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్పీ వకుల్ జిందల్ -
తమ్ముడిని రక్షించి..అన్న అనంతలోకాలకు..
పాలకొండ రూరల్: బంధువుల ఇంట గృహప్రవేశానికి ఎంతో సంతోషంతో వచ్చిన ఓ కుటుంబంలో నాగావళి నది తీరని శోకం మిగిల్చింది. గ్రామంలో శుభకార్యం కావడంతో అంతా సందడిగా ఉండగా కొద్ది క్షణాల్లో తీవ్రవిషాదం గ్రామాన్ని నిశ్శబ్దంలోనికి నెట్టేసింది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం నవంపాడు గ్రామానికి చెందిన ద్వారంపూడి రవి, వసంత దంపతులకు ఇద్దరు కుమారులు పవన్ (16), భార్గవ్సాయి ఉన్నారు. ఆ కుటుంబం పాలకొండ మండలంలోని అన్నవరం గ్రామాంలో వారి దగ్గర బంధువు పైడితల్లి, రామారావుల నూతన గృహ ప్రవేశానికి శనివారం వచ్చింది. ఆదివారం గృహప్రవేశం కావడంతో పవన్కుమార్ తమ్ముడు భార్గవ్తో పాటు బాబాయి సురేష్తో కలిసి ద్విచక్రవాహనంపై గ్రామ సమీపంలో ఉన్న నాగావళి తీరానికి ఉదయం 6.30గంటల సమయంలో వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ క్రమంలో బాబాయి బహిర్భూమికి వెళ్లగా భార్గవ్సాయి స్నానం చేసేందుకు నదిలో దిగాడు. లోతు ఎక్కువగా ఉండడం, ఇటీవల కురుస్తున్న వర్షాల ప్రభావంతో నదిలో నీటి ప్రవాహం అధికం కావడంతో మునిగి పోయాడు. ఈ విషయం గమనించిన పవన్కుమార్ తన తమ్ముడిని రక్షించేందుకు నదిలోకి దిగాడు. తమ్ముడిని ఒడ్డుకు చేర్చే యత్నం చేశాడు. తమ్ముడు మునిగిపోతున్నట్లు గట్టిగా అరవడంతో సమీపంలో ఉన్న బాబాయి భార్గవ్ సాయి రెక్క పట్టుకుని బడ్డుకు లాగాడు. ఇంతలో పవన్కుమార్ మునిగిపోయాడు. విషయం గుర్తించిన స్థానికులు తక్షణమే స్పందించి మునిగిపోయిన పవన్కుమార్ను బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్న పవన్కుమార్కు సీపీఆర్ చేసి ప్రథమ చికిత్స అందించేందుకు తీసుకు వెళ్లేయత్నం చేస్తుండగా మృతిచెందాడు. విశాఖలో చదువుతున్న అన్నదమ్ములు మృతుడి తండ్రి రవి భవన నిర్మాణ కార్మికుడిగా రెక్కల కష్టంతో కుమారులను విశాఖలో చదివిస్తున్నాడు. పవన్కుమార్ బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతుండగా రెండవ కుమారుడు 10వ తరగతి చదువుతున్నాడు. చేతికి అందివస్తున్న పెద్దకుమారుడు ఇలా ప్రమాదంలో మరణించడంతో భార్య వసంత, రవి గుండెలు పగిలేలా రోదించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రాధాకృష్ణమూర్తి, ఎస్సై కె.ప్రయోగమూర్తి ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిపై ఆరా తీశారు. తల్లితండ్రులు కుమారుడి మృతదేహాన్ని వారి స్వగ్రామం తీసుకువెళ్లారు. నాగావళి నదిలో పడి ఇంటర్ విద్యార్థి మృతి -
ఆటోమేటిక్ కష్టాలు
రాజాం: ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగించే డ్రైవర్లకు కష్టాలు మొదలయ్యాయి. గతంలో ఏడాదికో, రెండేళ్లకు ఒకదఫా ఆటో డ్రైవర్లు, యజమానులు తమ ఆటోలను ఆర్టీఓ కార్యాలయం వద్ద తనిఖీలు చేయించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందేవారు. వాటికి తోడు గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర ద్వారా ప్రతి ఏడాది ఠంచన్గా రూ.10 వేల సాయం అందించేది. వీటితో ఆటో వాలాలు ఇన్సూరెన్స్, ట్యాక్స్ చెల్లించుకునేందుకు అనుకూలంగా ఉండేది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సాయం కట్చేశారు. ఆటో డ్రైవర్లకు గత ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన జీఓలు, హామీలు అమలు కాలేదు. వాటికి తోడు అదనపు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. అధిక ఫైన్లు, కొర్రీలతో ఆటోలు రోడ్డెక్కాలంటే భయపడుతున్నాయి. ఇప్పుడు ఫ్రీ బస్సు వారిలో కొంతమంది పొట్టకొట్టే పరిస్థితి తెచ్చింది. ఆ జీఓ ఎత్తివేత ఉత్తుత్తిదే సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు మహిళలకు ఫ్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు రాకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఆటోలను తనిఖీచేసే జీఓ 21ను ఎత్తివేస్తామని, అవసరమైతే సవరిస్తామన్నారు. దీంతో పాటు ట్యాక్స్, ఇనూరెన్స్ల చెల్లింపుల్లో రాయితీ ఇస్తామని ప్రకటించారు. ఎటువంటి ఫైన్లు ఉండవని ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చారు. ఇప్పుడు ఈ జీఓ ఎత్తివేయకపోగా, కొత్త ఆంక్షలు మొదలయ్యాయి. రవాణా వాహనాల ఫిట్నెస్ టెస్టులకు సంబంధించి గత ప్రభుత్వమే నేరుగా నిర్వహించగా, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆటోమేటిక్ టెస్టింగ్ పేరుతో పైవేట్ వారికి అప్పగించి, డ్రైవర్లపై అధిక భారం మోపడం ప్రారంభించింది. పైవేట్ ఏజెన్సీల చేతిలోకి ఫిట్నెస్ టెస్టింగ్ వెళ్లడం ద్వారా రవాణా వ్యవస్థ తారుమారవుతుందని, ఇప్పటికే అధిక ట్యాక్స్లు, పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరల కారణంగా ఆటోలు నడపలేని పరిస్థితి ఎదురవుతోందని ఆటో కార్మికులు వాపోతున్నారు. గతంలో ఆటోవాలకు ఫైన్ నిమిత్తం రూ. 200లు, రూ.300లు ఉండేది. ఇప్పుడు చిన్నపాటి తప్పులను చూపించి రూ.1000లకు మించి ఫైన్లు వేస్తున్నారని ఆటోవాలా వాపోతున్నాడు. కూటమి వచ్చిన తరువాత తమకు ట్యాక్స్, ఇన్సూరెన్స్ తప్పుతాయని అనుకుంటే ఇప్పుడు డబుల్, త్రిబుల్ అవడమే కాకుండా అదనపు కేసులు పెడుతున్నారని గగ్గోలు పెడుతున్నారు. ఏదో ఒక నెపంగతంలోకంటే ఇప్పుడు ఆటోవాలాకు విధిస్తున్న ఫైన్లు పెనుభారంగా మారాయి, ఆటోలు రోడ్డుమీద కనిపించినా, డ్రైవర్ సీటు పక్కన అదనంగా పాసింజర్లు ఉన్నా ఫైన్ పడుతుంది. ఇవి తనిఖీలు సమయంలో ఆటోవాలాకు తెలియడంలేదు. కొంతసమయం తర్వాత సెల్ఫోన్లకు మెస్సేజ్లు వస్తున్నాయి. దీంతో ఇదెక్కడి పరిస్థితిరా బాబూ అంటూ ఆటోడ్రైవర్లు మండిపడుతున్నారు. ఇటు రవాణా శాఖ అధికారులతో పాటు అటు పోలీసులతో ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు ప్రారంభమ య్యాయి. పార్కింగ్ పేరుతో అధిక ఫైన్లు పడుతుండడం శోచనీయం. మరో వైపు వాహన మిత్ర అందకపోవడం దురదృష్టకరంగా మారింది. రాజాం నియోజకవర్గంలో రాజాం నుంచి రేగిడి, వంగర, సంతకవిటి, చీపురుపల్లి, తెర్లాం, పొందూరు, జి,సిగడాం ఏరియాలకు ప్రతిరోజూ 1400 ఆటోలు తిరుతుంటాయి. వారందరికీ గతంలో వచ్చే వాహన మిత్ర అటకెక్కింది. ఎప్పటికప్పుడే వాహనాల తనిఖీ చేస్తున్న అధికారులు అటు రవాణా, ఇటు సివిల్ పోలీస్ అధికారులతో ఇబ్బందులు అవిలేవు..ఇవి లేవంటూ ఫైన్లు ఆందోళనలో డ్రైవర్లుచాలా ఇబ్బందిగా ఉందిగతంలో కంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రోడ్డు ట్యాక్స్ పెంచారు. ఇన్సూరెన్స్ చార్జీలకు అదనంగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. వాటితో పాటు పొల్యూషన్ చార్జీలు, ఇతర ఫైన్లు ఎక్కువగా ఉన్నాయి. గతంలో కంటే ఎక్కడికక్కడే వాహన చెకింగ్లు పెరిగిపోయాయి. పాత బకాయిలు అంటూ, మత్తు పదార్థాల రవాణా తనిఖీలు, డ్రంకెన్ డ్రైవ్ పేరుతో అధికారులు నిత్యం తనిఖీచేసి, ఆటోకు సంబంధించి ఏ చిన్నకాగితం లేకున్నా, ఎక్కువమంది ప్రయాణికులు ఉన్నా అపరాద రుసుం విధిస్తున్నారు. ఆటోతో రోడ్డు ఎక్కాలంటే భయమేస్తోంది. ప్రభుత్వం జీఓ నంబర్ 21ని సవరిస్తామని చెప్పి, ఇంతవరకూ సవరించలేదు. ఎన్. దుర్గారావు, అమ్మానవదుర్గ ఆటోయూనియన్ నాయకుడు, రాజాం కష్టం ఎక్కువ..ఆదాయం తక్కువ గతంలో ఆటోలు నడిపితే కుటుంబాన్ని అవలీలగా పోషించుకున వారం. ఇప్పుడు పరిస్థితి మారింది. పెద్దగా బేరాలు ఉండడంలేదు. లాంగ్ జర్నీ బేరాలు వస్తే హైవే ఎక్కాలంటే భయమేస్తోంది. ట్యాక్స్, ఇతర కాగితాలు పేరుతో ఫైన్లు పడుతున్నాయి. తనిఖీ అధికారులతో మాట్లాడినసమయంలో ఏమీ ఉండడంలేదు. అనంతరం సెల్ఫోన్లకు మెస్సేజ్లు వస్తున్నాయి. రాంగ్ పార్కింగ్ అని, ఎక్కువ మంది ఉన్నారని ఇలా తప్పులు చూపిస్తున్నారు. వీటికి తోడు ట్యాక్స్, ఇన్సూరెన్స్ చెల్లింపులు పెరిగాయి. జీఓ నంబర్ 21లో సవరణ లేకపోవడంతో ఆటోలకు నిత్యం తనిఖీలు, ఇబ్బందులు పెరిగాయి. వి. మజ్జిగౌరి, ఆటో డ్రైవర్, రాజాం -
దోమకాటు.. ప్రాణాంతకం
పార్వతీపురం రూరల్: ప్రతి వ్యాధికి ప్రస్తుత కాలంలో దోమకాటే మూల కారణమవుతుందని వైద్యులు, పరిశోధకులు చెబుతున్నారు. ఈ మేరకు దోమ ఎంత ప్రమాదకరమైందో, దోమలతో సోకే వ్యాధుల గురించి తెలుసుకుందాం. దోమకాటు చాలా ప్రమాదం. లేనిపోని రోగాలన్నీ దోమల ద్వారానే వస్తున్నాయని అనేక అధ్యయనాలు తెలిపాయి. దోమకాటుతో వచ్చే వ్యాధులు–లక్షణాలు మలేరియా: ఆడ అనాఫిలస్ దోమ కుట్టడంతో మలేరియా వ్యాధి సోకుతుంది. లక్షణాలు: చలి, వణుకుతో జ్వరం రావడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, జ్వరం విడిచి విడిచి వస్తూ ఉంటుంది. డెంగీ: పగటి సమయంలో కుట్టే ఏడిస్ ఆడ దోమల ద్వారా డెంగీ వ్యాధి సంక్రమిస్తుంది. ఇది సాధారణ వైరల్ జ్వరంగా ఎముకలు, కండరాలు, కీళ్లనొప్పులతో మొదలవుతుంది. ప్లేట్లెట్స్ అమాంతం తగ్గిపోతాయి. లక్షణాలు: హఠాత్తుగా తీవ్ర జ్వరం రావడం, కదలలేని స్థితి, ఎముకలు, కండరాలలో భరించలేని నొప్పి, శరీరంపై ఎర్రని దద్దుర్లు, వాంతులు, వికారం, నోరు ఎండిపోవడంతో పాటు చిగుళ్లు, ముక్కు ద్వారా రక్తం వస్తుంది. చికున్ గున్యా: ఏడిస్ ఈజిప్ట్ దోమలతో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. చేతులు, కాళ్లలో, కీళ్లలో వాపు వచ్చి కనీసం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. జ్వరంతో మనిషి బలహీనంగా ఉంటాడు. లక్షణాలు: తలనొప్పి, వాంతులు, వికారంతోపాటు హఠాత్తుగా జ్వరం, కీళ్ల నొప్పులు, సరిగా నిలబడలేకపోవడం. ఫైలేరియా: దీనిని బోదకాలు అని కూడా అంటారు. క్యూలెక్స్ దోమ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. శరీరంలోని ఏ భాగానికై నా బోదకాలు సోకుతుంది. తరచూ జ్వరం, చంకల్లో, గజ్జల్లో బిళ్లలు కట్టడం, వెన్ను పాము దగ్గర నుంచి అన్ని అవయవాలపై ప్రభావం చూపుతుంది. అవయవాలకు వాపు, కాళ్లు, చేతులు, స్తనాలు, వరిబీజం, జ్ఞానేంద్రియాలు పాడవుతాయి. మెదడువాపు క్యూలెక్స్ ఆడదోమ కుట్టడంతో వ్యాధి సంక్రమిస్తుంది. ఎక్కువగా 2 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లల్లో ఈ వ్యాధి వస్తుంది. లక్షణాలు: ఆకస్మిక జ్వరం వచ్చి తీవ్రత ఎక్కువ కావడం, విపరీతమైన తలనొప్పి, వాంతులు రావడం, అపస్మారక స్థితికి లోనుకావడం, శరీరంలో ఏదో ఒకపక్క పక్షవాతానికి గురికావడం, ఫిట్స్ రావడం. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ముప్పునీటి నిల్వలతోనే ప్రమాదం వారం పదిరోజుల వ్యవధిలో పరిసరాల్లో కాని, ఇంట్లో ఉన్న నీటి నిల్వల్లో మలేరియా దోమలు వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో నీరు నిల్వ లేకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఇంట్లో ఉన్న కూలర్లు, చల్లదనం కోసం వాడే ఎలక్ట్రానిక్ వస్తువుల్లో వాటి ద్వారా వచ్చిన నీటి నిల్వల్లో డెంగీదోమ వ్యాప్తి చెందుతుంది. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే 915 మలేరియా ప్రభావిత గ్రామాల్లో మొదటి, రెండవ విడతలో స్ప్రేయింగ్ ప్రక్రియ పూర్తి చేశాం. ప్రజలు జ్వరాలు బారిన పడినపుడు కచ్చితంగా నిర్లక్ష్యం వహించకుండా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. అనంతరం వైద్యుల సూచనలు పాటిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. – డా.తెర్లి జగన్మోహన్రావు, జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారితీసుకోవాల్సిన జాగ్రత్తలుడెంగీ, చికున్ గున్యా, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వ్యాధులను నివారించాలంటే వైద్యం ఇంటి నుంచే ప్రారంభం కావాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే తప్ప దోమల నియంత్రణ పూర్తిగా సాధ్యం కాదు. కాబట్టి ఎవరికి వారు ఇంటి లోపల దోమలు లేకుండా చూసుకోవడమే మంచిమార్గం. దోమతెర: రాత్రిలో పడుకునే ముందు దోమతెర వాడాలి. లేదంటే శరీరం పూర్తిగా కప్పబడేలా దుస్తులు వేసుకోవాలి. వేపనూనె: వేపనూనె, కొబ్బరినూనెను 1:1 నిష్పత్తిలో తీసుకుని చర్మంపై రాసుకోవాలి. వేప వాసన చూసి దోమలు పారిపోతాయి. నిమ్మనూనె: దోమల నివారణకు యూకలిప్టస్, లెమన్ ఆయిల్ను చర్మంపై రాసుకోవాలి. దీనివల్ల మన చర్మానికి ఎలాంటిహాని ఉండదు. కర్పూరం: చీకటి పడుతున్న వేళలో ఇంటి తలుపులు మూసేసి కర్పూరం వెలిగించి 20 నిమిషాల తర్వాత తలుపు తెరిస్తే దోమలు కనిపించవు. కర్పూరం మంచి కీటక నివారిణిగా పనిచేస్తుంది. -
హరే కృష్ణ.. హరే కృష్ణ..
కృష్ణపల్లిలో కృష్ణుడు, గోపిక వేషధారణలో చిన్నారులు శ్రీకృష్ణ జన్మాష్టమి వేళ... ప్రతి ఊరు ద్వారకను తలపించింది. ప్రతి భక్తుడి మది ఓ మందిరంగా మారింది. హరేకృష్ణ, హరేకృష్ణ నామస్మరణలో తరించారు. శనివారం ఉదయం నుంచి ఆధ్యాత్మిక చింతనతో గడిపారు. రాధాకృష్ణల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. చిన్నాపెద్దా తేడాలేకుండా ఉట్టిసంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాధాకృష్ణుల వేషధారణలో చిన్నారులు అలరించారు. – పార్వతీపురం రూరల్/భామిని -
హామీల జోరు.. అమలులో బేజారు
సాలూరు: కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నుంచి మంత్రులు, నాయకులు హామీలు ఇవ్వడంలో జోరుగా, హుషారుగా ఉంటారని, వాటిని అమలు చేయకుండా ప్రజలను బేజారు పెడుతున్నారని వైఎస్సార్సీపీ ఏపీఏ సభ్యులు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర విమర్శించారు. సాలూరు పట్టణంలోని తన స్వగృహంలో శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ● జీఓ 3ను పునరుద్ధరిస్తామని, గిరిజన గ్రామాలను షెడ్యూల్ గ్రామాలుగా మార్చుతామని, ఆదివాసీలకు స్పెషల్ డీఎస్సీ, 5వ షెడ్యూల్డ్, 1/70 కచ్చితంగా అమలు చేస్తామని, కొఠియా గ్రామాలకు పరిష్కారం చూపుతామని, కుడుమూరు భూ వివాదం పరిష్కారం, డోలీ కష్టాలు లేకుండా చూస్తామని చంద్రబాబునాయుడు, లోకేష్, సంధ్యారాణి ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇప్పటివరకు వాటి పరిష్కారం ఊసేలేదు. దీనిపై గిరిజనులు ప్రశ్నిస్తున్నా స్పందన లేదు. ఇది గిరిజనులను మోసం చేయడం కాదా?. అబద్ధాలతో ఎన్నాళ్లు పాలిస్తారని రాజన్నదొర నిలదీశారు. అబద్ధాలు చెప్పడంతో ఆరితేరిన మంత్రి... మంత్రి సంధ్యారాణి ప్రజాదర్బార్, పత్రికా సమావేశాలు, స్వాతంత్య్రదినోత్సవ వేదిక, చివరికి చట్టసభలలోనైనా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. సాలూరు శ్యామలాంబ పండగ కోసం రూ.2 కోట్ల అప్పుడబ్బులతో చేపట్టాల్సిన పనులకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపినప్పటికీ, కౌన్సిల్ ఆమోదం తెలపలేదని ప్రజలు, పత్రికాసమావేశాల్లో మంత్రి సంధ్యారాణి అబద్ధాలు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. మహిళల ఆత్మగౌరవం కోసం సాలూరులో మరుగుదొడ్ల మరమ్మతులకు రూ.20లక్షల నుంచి రూ.30లక్షల వరకు నిధులు తీసుకువస్తానని చెప్పిన మంత్రి ఏడాది గడిచినా పట్టించుకోలేదని, ఆ పనులు ఇప్పటికీ జరగలేదని, మహిళల ఆత్మగౌరవ నినాదం ఏమైందని రాజన్నదొర ప్రశ్నించారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంల నియామకంపై మంత్రి పెట్టిన తొలి సంతకం నేటికీ కార్యరూపం దాల్చలేదని ఎద్దేవా చేశారు. ● 2014–19 మద్య టీడీపీ హయాంలో సంధ్యారాణి ఎమ్మెల్సీగా ఉండగా తను ఎమ్మెల్యేగా ఉన్నానని, 2015లో నాటి కలెక్టర్ ఎం.ఎం.నాయక్ సాలూరు నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి పనులకు ఉపాధిహామీ కింద సుమారు 100 కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు. తరువాత కలెక్టర్గా వచ్చిన వివేక్యాదవ్ తాగునీరు, రోడ్డ పనుల కోసం రూ.4.50 కోట్లు మంజూరు చేస్తే ఎమ్మెల్సీగా ఉన్న సంధ్యారాణి ఆ నిధులు రాకుండా అడ్డుకున్నారని రాజన్నదొర విమర్శించారు. ● సాలూరులో వందపడకల ఆస్పత్రిని 2018లో మంజూరు చేశారని సంధ్యారాణి చెబుతున్నారని, అప్పట్లో ఎందుకు నిర్మాణం ప్రారంభించలేదని రాజన్నదొర ప్రశ్నించారు. నిర్మిస్తామంటే తాము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదన్నారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన ఆస్పత్రికి అన్నిరకాల అనుమతులు తీసుకొచ్చి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆస్పత్రి మిగులు పనులను మూడు నెలల్లో పూర్తిచేయిస్తామని మంత్రి హామీ ఇచ్చి మరచిపోయారన్నారు. అబద్ధాలు చెబుతున్నారనేందుకు ఇదో ఉదాహరణగా పేర్కొన్నారు. ● సంధ్యారాణి సొంత ఊరు కవిరిపల్లికి రోడ్డు వేసిన ఘనత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదేనన్నారు. ఇప్పుడు అదే రోడ్డుపై ప్రయాణిస్తున్న విషయాన్ని మంత్రి మర్చిపోరాదన్నారు. 2006లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి 2024 వరకు మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్టు రాజన్నదొర వివరించారు. సాలూరు–కొట్టక్కి బ్రిడ్జి, రూ.42కోట్లతో సాలూరు బైపాస్ నిర్మాణం, రూ.50లక్షలతో సాలూరు తహసీల్దార్ కార్యాలయ భవనం, రూ.420 లక్షలతో వైటీసీ బిల్డింగ్స్, పట్టణంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలకు అదనపు గదులు, కాకులతోట నుంచి పాంచాలికి బ్రిడ్జి, పలు మున్సిపల్ పాఠశాలలకు అదనపు గదులు, సబ్ ట్రెజరీ కార్యాలయం ఆధునీకరణ, వ్యవసాయ ఎ.డి.కార్యాలయం, ఏటీడబ్ల్యూఓ కార్యాలయం, సీడ్ కార్పొరేషన్ గోదాం, అవసరం ఉన్న ప్రతివార్డుల్లో పైలెట్ వాటర్స్కీం, సీసీ రోడ్లు, కాలువలు, నిర్మాణంలో ఉన్న అర్బన్ ఆరోగ్య కేంద్రం, నూతన ప్రసూతి నిరీక్షణ కేంద్రం, అత్యవసర మాతా శిశు సంరక్షణ కేంద్ర భవనం, నిర్మాణంలో ఉన్న వందపడకల ఆస్పత్రి తదితర అనేక అభివృద్ది పనులు చేపట్టామని పేర్కొన్నారు. ● నేడు మంత్రిగా ఉన్న సంధ్యారాణి, గతంలో కాంగ్రెస్ పార్టీలో మహిళా శిశుసంక్షేమశాఖ రీజనల్ డైరెక్టర్, ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యురాలు, తరువాత టీడీపీలో ఎమ్మెల్సీగా పదవులు చేపట్టి సాలూరు నియోజకవర్గానికి ఎన్ని అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని రాజన్నదొర డిమాండ్ చేశారు. జీతం తీసుకుని ప్రజలకు సేవ చేయకపోవడమంటే ప్రజలకు అన్యాయం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. మాటలు ఆడడం, అబద్ధపు హామీలు ఇవ్వడం సులభమని, మాటకు కట్టుబడడం, ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో నెరవేర్చేవారే నిజమైన పాలకులని గుర్తుచేశారు. వారికి ప్రజాదరణ ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఆయన వెంట పలువురు నాయ కులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. టీడీపీది అబద్ధాల పాలన ఏడాదిన్నరగా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు కనిపించని అభివృద్ధి, సంక్షేమం పథకాల అమలులో కనిపించని చిత్తశుద్ధి మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర -
వాన గండం
సాక్షి, పార్వతీపురం మన్యం: అల్పపీడన ప్రభావంతో జిల్లాలో ఈ నెల 19వ తేదీ వరకు ఉరుములతోపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షం కురుస్తోంది. ఈ నెల 14న 19.0 మి.మీ, 15న 10.4, 16న 18.4 మి.మీ చొప్పున సగటు వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 8.6 మి.మీ. వర్షం కురిసింది. అత్యధికంగా భామినిలో 24.4, గుమ్మలక్ష్మీపురం 33.6, జియ్యమ్మవలస 27.6, వీరఘట్టం 17.4 మి.మీ చొప్పున నమోదైంది. జిల్లాతో పాటు, ఎగువన అడపాదడపా కురుస్తున్న వానలతో నదులు, ప్రాజెక్టులు నిండుతున్నాయి. చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన కలెక్టర్ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు వాటిల్లరాదని, దీనికోసం ముందుగా గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని స్పష్టం చేశారు. సంబంధిత అధికారులతో శనివారం వీడియోకాన్ఫరెన్స్లో మాట్లాడారు. ప్రధానంగా 17, 18వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున లోతట్టు, నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు స్నానాలు చేయడం, దుస్తులు శుభ్రం చేయడం, పశువులను కడగడం, ఇసుకను తవ్వడం వంటి పనులు చేపట్టరాదని తెలిపారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. పంట కాలువలు, గట్లు తెగిపోకుండా ఇసుక బస్తాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో నదులు, వాగులు, వంకలు, చెరువులను ఎవరూ దిగకుండా సూచనలు చేయాలని తెలిపారు. శిథిలావస్థలోని భవనాలు, పాఠశాలల్లో ఎవరూ లేకుండా చూసుకోవాలన్నారు. విద్యుత్ స్తంభాల పట్ల ఆ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ, నిత్యం అందుబాటులో ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య ఆరోగ్యం పట్ల ఆయా శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం నిండుతున్న నదులు, చెరువులు ప్రజలను అప్రమత్తం చేయాలి : కలెక్టర్ గరుగుబిల్లి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తోటపల్లి ప్రాజెక్టుకు నీటిప్రవాహం పెరిగింది. నాగావళినదిలో తోటపల్లి ప్రాజెక్టు వద్ద శనివారం సాయంత్రం నాటికి 105 మీటర్ల లెవిల్కు గాను 104.2 మీటర్ల లెవిల్లో నీరు నిల్వఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 6,448ల క్యూసెక్కుల నీరు చేరుతుండగా అధికారులు రెండు గేట్లును ఎత్తివేసి 6,853 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడిచిపెడుతున్నారు. కాలువలకు మరో 1,300 క్యూసెక్కుల నీరు విడిచిపెట్టారు. ప్రాజెక్టు నీటిసామర్థ్యం 2.53 టీఎంసీలకు 2.08 టీఎంసీలు నీరు నిల్వ ఉంది ప్రాజెక్టు వద్ద నీటి పరిస్థితిని ఏఈ కిశోర్ పర్యవేక్షిస్తున్నారు. -
కనకాంబరాలతో కనక వర్షం
భామిని: పూల సాగులో కనకాంబరాలది ఓ ప్రత్యేకత. గ్రామీణ ప్రాంతాల్లో వాడంబారాలుగా పిలవబడే వీటిని కనకాంబరాలగానే పట్టణ ప్రాంతాల్లో విక్రయిస్తారు. ఏడాది పొడవునా పూలు పూస్తూ సాగుదారులకు మంచి ఆదాయాన్ని తెచ్చి పెడతాయి. వీటిని ఒకసారి నాటితే మూడేళ్ల వరకు దిగుబడినిచ్చి సాగుదారులకు పుష్కలంగా ఆదాయాన్ని అందిస్తాయి. ఈ పూలు వాసన లేకున్నా వివిధ రంగుల్లో మహిళలను ఆకర్షిస్తాయి. అదే సమయంలో వివిధ శుభకార్యాల్లో వీటికున్న ప్రత్యేకత వేరు. వీటిని సీ్త్రల శిరోజాల అలంకరణతో పాటు శుభ కార్యాల్లో వేర్వేరు రూపాల్లో అలంకరించి ఆదాయాన్ని పొందుతారు. ఇవి ఎక్కువగా ఆరంజ్, ఎల్లో, ఎరుపు రంగుల్లో పూస్తాయి. మార్కెట్లో ఈ రకాలకు మంచి డిమాండ్ ఉండడంతో పాటు గిట్టుబాటు ధరలు వస్తుండడంతో రైతులు వీటి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. కొబ్బరి, మామిడి తోటల్లో అంతర పంటలుగా కూడా వీటిని సాగు చేయవచ్చని చెబుతున్నారు. పాలకొండ నియోజకవర్గంలో భామిని, వీరఘట్టం, పాలకొండ మండలాల్లో వీటి సాగు ఎక్కువగా ఉంది. స్థానికంగా వీటిని విక్రయించడంతో పాటు దూర ప్రాంతాలకు ఎగుమతి కూడా చేస్తున్నారు. పాతపట్నం, టెక్కలి, ఒడిశాలోని పర్లాకిమిడి, గుణుపూర్ ప్రాంతాలకు రోజూ రవాణా చేస్తున్నారు. మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఈ సీజన్లోనే... ప్రస్తుతం కనకాంబరాలు నాటుకొనే సమయంగా రైతులు చెబుతున్నారు. ఏటా జూలై – ఆగస్టు నెలల్లో కొత్తగా తోటలు నాటుకుంటారు. రెండు నెలలుగా నారు పోసి సంరక్షించుకుని ఆ నారును మెట్టు భూముల్లో వేస్తారు. నాణ్యమైన నారు కోసం రామభద్రపురం, సాలూరు, రాజమండ్రి నర్సరీల నుంచి దీన్ని తెస్తున్నారు. అధిక తేమ, వేడి కలిగిన నేలల్లో సాగుకు ఇది అనుకూలం. చల్లని వాతావరణ పరిస్థితుల్లో అధిక దిగుబడినిస్తాయి. నీరు నిలువ లేని అన్ని రకాల నేలలు వీటి సాగుకు అనుకూలం. విత్తన తయారీ.. విత్తనం, కాండపు మొక్కల ద్వారా ప్రవర్ధనం చేసుకోవచ్చు. అధిక దిగుబడినిచ్చే రకాలను విత్తనాల ద్వారా తయారు చేస్తారు. ఎకరానికి రెండు కిలోల విత్తనం అవసరం. నిల్వ చేసిన విత్తనం మొలకెత్తే శాతం తక్కువ. అప్పుడే పూల గుత్తిల నుంచి వేరు చేసిన విత్తనాలను సిద్ధం చేసుకోవచ్చు. ఒక మీటరు పొడవు, 15 సెంటీమీటర్ల ఎత్తు గల నారుమడులు సిద్ధం చేసి నారు వేసుకోవాలి. మొక్కలు 4 నుంచి 6 ఆకులు వేసిన 50 నుంచి 60 రోజుల్లో నారును తీసి నాటుకోవచ్చు. నీటి ఎద్దడిని తట్టుకొంటుంది. అయినా అవసరాన్ని బట్టి 10 నుంచి 15 రోజులకు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వారానికి ఒకసారి అందించాలి. డ్రిప్ పద్ధతిలో అయితే 4 లేదా 5 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. సాగుపై పెరుగుతున్న ఆసక్తి -
ఏపీజీఈఏ 6వ వార్షికోత్సవం
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) 6వ వార్షికోత్సవం జిల్లా కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత సంఘ పతాకాన్ని జిల్లా అధ్యక్షుడు కంది వెంకటరమణ ఆధ్వర్యంలో ఏపీజీఈఏ రాష్ట్ర నాయకుడు, డిప్యూటీ డైరెక్టర్ అండ్ విశాఖపట్నం రీజనల్ డైరెక్టర్ (మెడికల్) శ్రీనివాస్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎల్.వి.యుగంధర్, జిల్లా కార్యదర్శి బి.బాలభాస్కరరావు, అసోసియేట్ ప్రెసిడెంట్ పువ్వల శ్రీనివాస రావు, కోశాధికారి వై.శంకరరావు, ఉపాధ్యక్షులు ఎన్.వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి జి.లక్ష్మీనాయుడు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు చింతల వెంకట సతీష్, బియ్యాల చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు రంభ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు. -
ఏకగ్రీవంగా పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఎన్నిక
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ (ఏపీపీఆర్ఎంఈఏ) జిల్లా శాఖ నూతన కమిటీని సభ్యు లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయనగరం జిల్లా పరిషత్ సమావేశమందిరంలో శనివారం జరిగిన ఎన్నికల్లో నూతన కమిటీని ప్రకటించారు. సంఘ అధ్యక్షుడిగా సీహెచ్ మురళి, ప్రధాన కార్యదర్శిగా పి.ఎం.రవికుమార్, అసో సియేట్ అధ్యక్షుడిగా బి.వి.నాగభూషణరావు, ఉపాధ్యక్షుడిగా టి.ప్రవీణ్కుమార్, కోశాధికారిగా వి.రాంబాబు, జాయింట్ సెక్రటరీగా ఎల్.వి.ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కె.రాజ్కుమార్, ఎం.నారాయణరావు, డి.లత, డీహెచ్వీఆర్ ప్రభాకర్, బి.లక్ష్మణ్కుమార్, రాష్ట్ర కౌన్సిలర్లు ఎన్.అర్జునరావు, వి.ఎ.వర్మ, ఎ.రమణమూర్తి, కె.వి.శ్రీనివాసరావు, జేసీసీ మెంబర్గా బి.వి.గోవిందరావు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా విజయనగరం జిల్లా ఏపీఎన్జీజీఓ అధ్యక్షుడు టి.శ్రీధర్బాబు, సహాయ ఎన్నికల అధికారులుగా పట్టణ ఏపీఎన్జీఓ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.గోపాలకృష్ణ, ఎన్నికల పరిశీలకులుగా విశాఖ జిల్లా సంఘం అధ్యక్షుడు ఎస్.సత్తిబాబు, తూర్పుగోదావరి జిల్లా ఏపీఎన్జీజీఓ జాయింట్ సెక్రటరీ ఎన్ ఎంకేజీ ప్రసాద్ వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.వి.వి. రమేష్, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు బండి శ్రీనివాస్ హాజరయ్యారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షు లు గంటా వెంకటరావు, ఆర్.వి.రమణమూ ర్తి, ఏపీఎన్జీజీఓ జిల్లా కార్యదర్శి ఎ.సురేష్, జిల్లా, తాలూకా యూనిట్ల సభ్యులు పాల్గొన్నారు. విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవం విజయనగరం పెన్షన్ సంఘం కార్యాలయంలో శనివారం ఘనంగా జరిగింది. తొలుత అసోసియేషన్ జండాను ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు రామచంద్రపండ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూపీ హైకోర్టు అడిషనల్ రిజిస్ట్రార్ విద్యాసాగర్, ప్రత్యేక అతిథులుగా రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రరావు, రాష్ట్ర కార్యదర్శి ఎల్.వి.యుగంధర్, రాష్ట్ర కోశా ధికారి సొంటి కామేశ్వరరావు, జిల్లా కార్య దర్శి బి.బాలభాస్కర్, జిల్లా కోశాధికారి వై.శంకరరావు, ఆదినారాయణ, రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం సమష్టిగా ముందుకు సాగాలని నిర్ణయించారు. -
వృత్తి వదల్లేరు.. బతుకు చక్రం కదలట్లేదు..!
● వినాయక విగ్రహాలకు డిమాండ్ తగ్గడంతో కుమ్మరుల్లో ఆందోళన ● బతుకు భారమైందంటూ ఆవేదన ● ఆదుకోని కూటమి ప్రభుత్వంసాలూరు: మరో పది రోజుల్లో వినాయకచవితి పండగ రానుంది. ఈ క్రమంలో ఇప్పటికే కుమ్మరి వీధులన్నీ సాధారణంగా వినాయక విగ్రహాల తయారీతో హడావిడిగా ఉండాలి. అయితే ఈ ఏడాది ఆ పరిస్థితి కుమ్మరి వీధుల్లో కనిపించడం లేదు. రథయాత్ర తరువాత ప్రారంభించే ఈ విగ్రహాల తయారీకి రెండు నెలల ముందు నుంచే సాలూరు, ఒడిశా పరిసర ప్రాంతాల నుంచి వినాయక కమిటీ నిర్వాహకులు వచ్చి భారీ పరిమాణంలో, వివిధ ఆకృతుల్లో వినాయక ప్రతిమల తయారీకి ఆర్డర్లు ఇచ్చేవారు. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదని కుమ్మరులు వాపోతున్నారు. పెద్దబొమ్మలు ఆర్డర్లు చాలా వరకు తగ్గాయని, ఆ భయంతో గతంతో పోలిస్తే తక్కువ సంఖ్యలోనే బొమ్మలను తయారు చేస్తున్నట్టు తయారీదారులు తెలిపారు. సాలూరు, పాచిపెంట పండగల ఎఫెక్ట్ ప్రతి ఏడాది వినాయక ఉత్సవాన్ని చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఐక్యంగా స్థాయి కొద్దీ మండపాలు ఏర్పాటు చేసుకుని ఘనంగా పూజలు, అన్న సమారాధనలు, అనుపోత్సవం చేస్తుంటారు. ఈ ఏడాది సాలూరు, పాచిపెంట గ్రామదేవతల పండగలు జరగడంతో ప్రజల వద్ద చాలా వరకు డబ్బుల్లేవని దీనితో ఈ ఏడాది వినాయక ప్రతిమల ఆర్డర్లు తగ్గాయని కుమ్మరులు చెబుతున్నారు. వినాయకుడిని పెట్టిన తరువాత అన్న సమారాధన, అనుపోత్సవాలకు రూ.లక్షల్లో ఖర్చవుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల వద్ద డబ్బులు లేకపోవడంతో నిర్వాహకులు కొంత వెనుకంజ వేస్తున్నారని వారు పేర్కొంటున్నారు. పెరిగిన తయారీ ఖర్చు బొబ్బిలి నుంచి తీసుకువచ్చే ట్రాక్టర్ మట్టికి కుమ్మరులు సుమారు 3500 రుపాయిలు చెల్లిస్తున్నారు. తయారీలో భాగంగా ముడి సరుకులు, రంగులకు అధిక డబ్బులు ఖర్చవుతున్నాయి. ఇంత డబ్బులతో తయారు చేస్తున్న వినాయక విగ్రహాలు కొనుగోలు జరగకపోతే ఇబ్బందులు పడతామని కావున గతంతో పోలిస్తే తక్కువ సంఖ్యలోనే ఈ ఏడాది వినాయక విగ్రహాలు తయారీచేస్తున్నామని కుమ్మరులు చెబుతున్నారు. రూ.లక్షలు పెట్టి తీసుకువచ్చిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసిన పెద్ద విగ్రహాలకు ఇంకా ఆర్డర్లు రాకపోవడంతో ఆందోళన నెలకొందని తయారీదారులు వాపోతున్నారు. కుమ్మరి చక్రం కదలనంటున్నా.... కుమ్మరి వృత్తి తమ పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయమని వారు చెబుతున్నారు. ఒకప్పుడు ఈ వృత్తి తమ కడుపు నింపేదని, నేడు ఆ పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మట్టి పాత్రల వినియోగం తగ్గిపోవడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని చెబుతున్నారు. ఒకప్పుడు ఈ వృత్తే జీవనాధారంగా ఉండేదని, ప్రస్తుతం ఏడాదిలో రెండు నెలలు మాత్రమే ఈ వృత్తి కడుపు నింపుతోందని వారు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా కుమ్మరి చక్రం కదలనంటున్నా.. తమ కుల వృత్తిని వదులుకోలేకపోతున్నామని, ప్రభుత్వం తమకు చేదోడువాదోడుగా నిలవాలని వారు కోరుతున్నారు.పంటల్లేవు.. పథకాల్లేవు..ప్రజలకు గత ప్రభుత్వంలో ప్రతి నెలా ఏదో ఒక పథకం కింద డబ్బులు వారి ఖాతాల్లో జమవ్వడంతో ఆ డబ్బులు వారికి ఇటువంటి పండగలు, ప్రత్యేక కార్యక్రమాలకు ఉపయోగపడేవి. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పథకాలు లేక ప్రజల వద్ద డబ్బులు కొరత నెలకొందని చర్చించుకుంటున్నారు. మరోవైపు పంటల పరిస్థితులు కూడా అనుకున్నంత సానుకూలంగా ఏమీ లేకపోవడంతో ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో పండగ వైపు పెద్దగా దృష్టి సారించడం లేదు. -
భవనం పైనుంచి జారి పడి వ్యక్తి మృతి
మెంటాడ: మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనం పిట్టగోడ నిర్మాణంలో పని చేస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తూ జారిపడి తీవ్రంగా గాయపడి అనంతరం మృతి చెందాడు. ఇందుకు సంబంధించి ఎస్ఐ కె.సీతారాం శనివారం అందించిన వివరాలు.. మెంటాడ మండల కేంద్రంలో నిర్మితమవుతున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణం జరుగుతుంది. దానికి సంబంధించి పిట్టగోడ నిర్మాణం జరిగే సమయంలో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అదపాకకు చెందిన గురజాపు అప్పారావు(32) ప్రమాదవశాత్తూ జారి పడి గాయపడినట్టు ఎస్ఐ తెలిపారు. చికిత్స నిమిత్తం గజపతినగరం ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరంలోని సర్వజన ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. సీతానగరం: మండలంలోని బూర్జ గ్రామానికి చెందిన ఆయకట్టు సంఘం చైర్మన్ ఈదిబిల్లి బలరాంనాయుడు వ్యక్తిగత కారణాలతో మనస్తాపానికి గురై మూడు రోజుల కింద పురుగుల మందు తాగాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం విజయనగరం ఎంఆర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న బలరాంనాయుడు(62) మృతి చెందినట్టు పోలీసులు శనివారం తెలిపారు. మృతుడి భార్య ఈదుబిల్లి అన్నపూర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్టు ఎస్ఐ ఎం.రాజేష్ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. భోగాపురం: వీరాస్వామి అనే లారీ డ్రైవర్ విజయవాడ నుంచి వస్తూ సుందరపేట హైవే జంక్షన్ వద్ద యూ టర్న్ తీసుకుని భోగాపురం అన్నపూర్ణ హోటల్ సమీపంలో శనివారం లారీని కాసేపు ఆపాడు. తరువాత లారీ కింద మృతి చెంది కనిపించాడు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్తున్న కుంభ జోవేష్ అనే వేరే లారీ డ్రైవర్ వీరాస్వామి మృతి చెందినట్టు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై సీఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి డ్రైవర్ వీరాస్వామి గుండెపోటుతో మరణించాడా? వేరే ఏవిధంగానైన మరణించాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం క్రైమ్ : అలమండ రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం జీఆర్పీ పోలీసులు శనివారం గుర్తించారు. 50 సంవత్సరాల వయసు ఉండే ఈ వ్యక్తి తెలుపు రంగు కట్ బనియన్, ఖాకీ రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని, రైలు నుంచి జారి పడి ఉండొచ్చని భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. రాత్రి సమయంలో జారి పడడంతో తలకు తీవ్ర గాయాలై ఉండొచ్చని జీఆర్పీ ఎస్ఐ బాలాజీరావు తెలిపారు. మృతదేహాన్ని గుర్తించిన వారు 9490617089, 830990038, 9491813163 నంబర్లను సంప్రదించాలని సూచించారు. వ్యక్తి ఆత్మహత్య దత్తిరాజేరు: మండలంలోని దాసరిపేట గోపినాధ పట్నాయక్ చెరువు గట్టుపై మెంటాడ మండలం మీసాలపేట గ్రామానికి చెందిన మహంతి రామునాయడు(55) ఉరి వేసుకొని మృతి చెందినట్టు పెదమానాపురం ఎస్ఐ జయంతి శనివారం తెలిపారు. పొలం పనులకు వెళ్తానని ఇంటి వద్ద చెప్పి దాసరిపేట చెరువు గట్టుపై మృతి చెందడంతో బంధువుల ద్వారా సమాచారం తెలియడంతో కుటుంబంలో ఒక్కసారి విషాదం నెలకొంది. భార్య రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు. మృతుడికి వివాహం అయిన కుమార్తెతో పాటు కుమారుడు, మరో కుమార్తె ఉన్నారు. -
కన్యాశుల్కం ప్రదర్శన పూర్వజన్మ సుకృతం
విజయనగరం టౌన్: మహాకవి గురజాడ కలం నుంచి జాలువారిన కన్యాశుల్కం నాటకాన్ని 60 ఏళ్లకు పైబడిన మహిళలతో రవీంద్రభారతిలో ప్రదర్శించడం పూర్వజన్మ సుకృతమని దర్శకులు ఈపు విజయకుమార్ పేర్కొన్నారు. మహాకవి స్వగృహంలో శనివారం సక్సెస్ మీట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయసూర్య ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కన్యాశుల్కంలోని బొంకులదిబ్బ సీన్, మధురవాణి ఇల్లు–మంచం సీన్, అగ్నిహోత్రవధాన్లు ఇళ్లు – తాంబూలాల సీన్, సౌజన్యరావు పంతుల ఇళ్లు (డామిట్ కథ అడ్డం తిరిగింది సీన్)ను కేవలం వయోవృద్ధులైన మహిళలతో విజయవంతంగా నిర్వహించడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. ఈ నెల 12న రవీంద్రభారతిలో అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్–2025లో కన్యాశుల్కం ప్రదర్శించి ఆహుతుల మన్ననలు పొందామన్నారు. గాంధీ జ్ఞానప్రతిష్టాన్ చైర్మన్ డాక్టర్ గున్నా రాజేంద్రరెడ్డి, రిటైర్డ్ తహసీల్దార్ బి.సత్యానందం, సినీన టి, సంఘసేవకురాల కరాటే కల్యాణి, అభినయ శ్రీనివాస్ తదితరుల చేతుల మీదుగా ప్రశంసపత్రాలు, జ్ఞాపికలు అందుకున్నామన్నారు. భోగరాజు సూర్యలక్ష్మి నిర్వహణ బాధ్యతలతో పాటూ గిరీశం పాత్రధారిలో అద్భుతమైన ప్రదర్శన కనబర్చి ఆహుతుల మన్ననలు పొందారన్నారు. వీరితో పాటూ మధురవాణిగా ఎ.సీతామహాలక్ష్మి, కరటకశాస్త్రిగా ముళ్లపూడి సుభద్రాదేవీ, అగ్నిహోత్రవధానులుగా కుమారి సామవేదుల గీతారాణి, వెంకటమ్మగా ఉదయగిరి నీలిమ, రామప్పపంతులుగా సిహెచ్.రాజకుమారి, బుచ్చమ్మగా పూటకూళ్లమ్మ, పోటోగ్రఫీ పంతులు నౌకరుగా సామవేదుల సత్యలత, సౌజన్యరావు పంతులుగా చీకటి చంద్రికారాణిలు పాత్రోచితమైన ప్రదర్శన చేసి ఆహుతుల కరతాళ ధ్వనులందుకున్నారని తెలిపారు. శ్రీకాకుళానికి చెందిన ఎస్.రమణ రంగాలంకరణ, రూపాలంకరణ చేశారన్నారు. ఈ సందర్భంగా కన్యాశుల్కం నాటక ప్రదర్శనకు తోడ్పాటునందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో భోగరాజు సూర్యలక్ష్మి, సుభద్రాదేవీ, కన్యాశుల్కం టీమ్ సభ్యులు పాల్గొన్నారు. -
రెండు ద్విచక్ర వాహనాల దగ్ధం
పాలకొండ రూరల్: మండలంలోని టీకే రాజపురం గ్రామస్తులు శుక్రవారం పాలకొండ పోలీసులను ఆశ్రయించారు. తమ గ్రామానికి చెందిన జాడ దుర్గారావు అలియాస్ చిన్న అనే వ్యక్తి తమను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని వాపోయారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన పెద్దింటి సూరిబాబుకు చెందిన ఎక్సెల్ వాహనంతో పాటు దోర భానుప్రసాద్కు చెందిన డీలక్స్ ద్విచక్ర వాహనం దగ్ధం చేశాడని ఎస్ఐ కె.ప్రయోగమూర్తి వద్ద వాపోయారు. గ్రామస్తుల ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అదుపులోకి తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. -
గురజాడ సాహిత్య సంపద, స్మారక భవనాన్ని కాపాడాలి
విజయనగరం గంటస్తంభం: మహాకవి గురజాడ అప్పారావు స్మారక భవనం గురించి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకూ, మంత్రులకూ పట్టకపోవడం శోచనీయమని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. గురజాడ రచనలను భద్రపరచాల్సిన ఆర్కియాలజీ విభాగం, రాష్ట్ర టూరిజం శాఖ పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా గురజాడ గృహాన్ని, గురజాడ సాహిత్యాన్ని కాపాడటంలో పూర్తిగా విఫలమవుతున్నాన్నారు. గురజాడ గృహాంలో గురజాడకి శనివారం ఘన నివాళులు అర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. గురజాడ అప్పారావు ఇంటిలో తాగుబోతు హాల్ చల్ చేసి, సాహిత్య సంపాదని, వస్తువులను చిందరవందర చేసినా అధికార పార్టీకి చెందిన నాయకులు ఎవరూ స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి అనిత, విజయనగరం జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లాలోని ఎమ్మెల్యేలుగాని గురజాడ ఇంటిని సందర్మించడానికి కూడా తీరిక కల్పించుకోలేని పరిస్థితిలో ఉండడం పట్ల ఆయన మండిపడ్డారు. తెలుగు సాహిత్యాన్ని ప్రపంచం నలుమూలలకి పంపి సుసంపన్నం చేసిన గొప్ప వ్యక్తికి మన నేతలు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గురజాడ అప్పారావు సాహిత్య సంపదకు, గురజాడ స్మారక భవనానికి తగిన రక్షణ కల్పించాలని భీశెట్టి కోరారు. పౌర వేదిక కార్యనిర్వాహక అధ్యక్షుడు పిడకల ప్రభాకరరావు, ప్రధాన కార్యదర్మి జలంత్రి రామచంద్ర రాజు, సహాయ కార్యదర్మి తుమ్మగంటి రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
హైకోర్టు జడ్జి ఇంట సందడి
వీరఘట్టం: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గేదెల తుహిన్కుమార్ ఇంట వద్ద శనివారం సందడి నెలకొంది. ఆయన హైకోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఆయన స్వగ్రామమైన వీరఘట్టం మండల కత్తులకవిటి గ్రామానికి వచ్చారు. దీంతో ఆయనను కలసి శుభాకాంక్షలు తెలిపేందుకు స్థానిక నేతలు, అధికారులు క్యూ కట్టారు. హైకోర్టు జడ్జిగా ఈ ప్రాంతానికి చెందిన మీరు ఉండడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. జడ్జి తుహిన్కుమార్ను కలసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అలాగే వీరఘట్టం, పాలకొండ, రేగిడి మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు కె.సూర్యప్రకాశరావు, డి.వెంకటరమణనాయుడు, కర్రి గోవిందరావు, పొట్నూరు లక్ష్మణరావు తదితరులు కలిశారు. వీరఘట్టం తహసీల్దార్ ఏఎస్ కామేశ్వరరావు తదితరులు జడ్జిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పోలీసుల అదుపులో పొట్టేళ్ల పందెంరాయుళ్లు గరుగుబిల్లి: మండలంలోని ఉల్లిబద్ర గ్రామ శివారులో పొట్టేళ్ల పందెం ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్ఐ పి.రమేష్నాయుడు శనివారం తెలిపారు. ఉల్లిబద్ర గ్రామ శివారులో పొట్టేళ్ల పందెం నిర్వహిస్తున్న ప్రదేశంలో దాడులు చేసి వీరిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. రెండు పొట్టేళ్లను, రూ.1680 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పట్టుబడిన ఆరుగురిపై కేసు నమోదు చేసి పార్వతీపురం మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచనున్నట్టు తెలిపారు. అక్రమంగా పశువుల తరలింపు కొమరాడ: ఒడిశా నుంచి పార్వతీపురం సంతకు కొమరాడ మీదుగా జాతీయ రహదారిపై మూగజీవాల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతుంది. బొలెరా వంటి వాహనాల్లో వందల సంఖ్యలో పశువులను అక్రమంగా తరలించేస్తున్నారు. వీటి రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికార యంత్రాంగం ఏమీ చూడనట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. వీటిని కబేళాలకు తరలిస్తున్నట్టు అధికార యంత్రాంగానికి తెలిసినా ఏమీ పట్టనట్టు వ్యవహరించడంపై దుమారం రేగుతోంది. అంతర్రాష్ట్ర ప్రధాన రహదారిపై వందలాది పశువులను తరలిస్తూ అక్రమ సంపాదనపై అక్రమార్కులు గురి పెట్టినా నిఘా వర్గాలకు ఏమీ పట్టడం లేదు. మరోవైపు వందలాది కిలోమీటర్ల పొడవునా వీటిని నడిపిస్తూ కూడా కబేళాలకు తరలిస్తున్నా ఇటు పోలీసులకుగాని, అటు జంతు సంక్షేమ సంఘాలకు అనుమానం కలగకపోవడం విశేషం. ఇప్పటికై నా అధికార యంత్రాంగం మొద్దు నిద్రను వీగి మూగజీవాల పరిరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. నూతన బార్ పాలసీ విడుదల విజయనగరం టౌన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్లు 275, 276 ప్రకారం 2025–2028 సంవత్సరాలకు సంబంధించి నూతన బార్ పాలసీలను విడుదల చేసినట్టు జిల్లా మద్యనిషేధ, అబ్కారీ శాఖ అధికారి బి.శ్రీనాథుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ, నగర పంచాయతీలలో గల 282బి బార్స్ నోటిఫై చేశామన్నారు. వీటిలో మూడు టూబీ బార్స్ కళ్లు గీత కులాలకు కేటాయించామన్నారు. ఈ వేలం ద్వారా ఎంపిక చేస్తామన్నారు. అదే విధంగా పార్వతీపురం మన్యం జిల్లాలో మున్సిపాలిటీ, నగర పంచాయతీలో ఎనిమిది 2బి బార్స్ను నోటిఫై చేశామన్నారు. వాటిలో రెండు 2బి బార్స్ కళ్లుగీత కులాలకు కేటాయించామన్నారు. ఆసక్తి గలవారు వారి పరిధిలో ఉన్న ఎకై ్సజ్ స్టేషన్లలో సంప్రదించాలని కోరారు. వివరాలకు 9440902360, 9440902362 (విజయనగరం), 8348523855, 9398630486 (పార్వతీపురం మన్యం) నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడి
మొక్కలు పెరిగే దశలో కలుపు లేకుండా చూడాలి. వేసవిలో ఎండ తీవ్రతను తగ్గించడానికి అవిసె మొక్కలు పెంచితే పాక్షిక నీడ ఏర్పడి మొక్కలు బాగా పెరిగి అధిక పూల దిగుబడి వస్తుంది. పూలు కోసిన తరువాత పూల గుత్తిలను, ఎండు కొమ్మలను తొలగిస్తే ఏడాది పొడవునా పూల దిగుబడి పెరుగుతుంది. మొక్కలు నాటిని రెండు లేక మూడు నెలలకు పూత వస్తుంది. జూన్ నుంచి జనవరి వరకు పూత బాగా ఉంటుంది. వర్షాకాలంలో దిగుబడి తగ్గుతుంది. రెండు రోజులకు పూలు విచ్చుకొంటాయి. ఉదయం లేదా సాయంకాలం మాత్రమే పూలు కోయాలి. – కొల్లి తిలక్, వ్యవసాయాధికారి, భామిని -
18 నుంచి ఆలా హజరత్ ఉత్సవాలు
విజయనగరం టౌన్: దేశ వ్యాప్తంగా ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకూ ఆలా హజరత్ ఉత్సవాలను సున్నీ మసీదుల్లో నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్టు పట్టణ శాఖ ముస్లింల ప్రతినిధి మహమ్మద్ గౌస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్.కోట, కురుపాం, సాలూరు, పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న మసీదుల్లో ఉరుసు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఆబాద్ వీధిలో ఉన్న మదరసా ఆల్ జామియాతుల్ హబీబియా అహ్మదీయా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఉత్సవ ఊరేగింపు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రత్యేక ప్రార్ధనల అనంతరం భారీ అన్న సమారాధన ఉంటుందని తెలిపారు. స్పా సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు విజయనగరం క్రైమ్: నగరంలోని ఏడు స్పా(మసాజ్) సెంటర్లలో వన్టౌన్ పోలీసులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మసా జ్ సర్వీసుకు వచ్చే సీ్త్ర, పురుషులను వేర్వేరుగా ఉంచాలని సీఐ ఆర్వీకే చౌదరి నిర్వాహకులకు సూచించారు. డీఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేర కు సీఐ చౌదరి, ఎస్ఐలు రామ్గణేష్, లక్ష్మీప్రసన్నకుమార్, సురేంద్రనాయుడులు మసాజ్ కేంద్రాలకు వెళ్లి, పరిశీలించారు. తప్పనిసరిగా కేంద్రంలో అర్హులైన ఫిజియోథెరపిస్ట్లు ఉండాలన్నారు. రాత్రి వేళల్లో స్పా సెంటర్లకు అను మతి లేదని, ఎవరూ నిర్వహించవద్దన్నారు. -
కొత్తవలసను ముంచెత్తిన వాన
కొత్తవలస : మండలంలోని శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఇంత పెద్ద వర్షం గతంలో ఎన్నడు కురవలేదని స్థానికులు పేర్కొన్నారు. ఏకధాటిగా రెండు గంటలకు పైగా వర్షం కుండపోతగా కురవడంతో రైల్వే అండర్ బ్రిడ్జీలు, కొత్తవలస జంక్షన్ జలమయమమయ్యాయి. ముఖ్యంగా కొత్తవలస జంక్షన్ సమీపంలో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తిగా వర్షం నీటితో నిండిపోయింది. ఈ వరద నీటిని అరికట్టేందుకు ఇటీవల సుమారు రూ 3.కోట్లతో నిర్మించిన పై కప్పు నిరుపయోగంగా మారింది. బ్రిడ్జి నీటితో నిండిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అలాగే కొత్తవలస – విజయనగరం, కొత్తవలస – విశాఖపట్నం రోడ్డు పూర్తిగా వర్షం నీటితో నిండిపోయాయి. కొత్తవలస రైల్వే స్టేషన్ను సైతం వర్షం నీరు ముంచేసింది. జలమయమైన రైల్వే అండర్ బ్రిడ్జీలు కొత్తవలస జంక్షన్ జలమయం